SPSR Nellore
-
స్నాతకోత్సవ సంబరం
అంతా గందరగోళం నెల్లూరు (టౌన్): విద్యార్థులు తమ విద్యను వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. కనుపర్తిపాడు సమీపంలోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన విక్రమ సింహపురి యూనివర్సిటీ 10, 11, 12వ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. నాక్ నుంచి 3.23 సీజీపీతో ఏ గ్రేడ్ను ఇటీవల పొందడం గర్వకారణమన్నారు. ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్ష అభియాన్ కింద రూ.20 కోట్ల గ్రాంట్ మంజూరు కావడం, డీప్ ఓషన్ మిషన్ కార్యక్రమం కింద మైరెన్ బయాలజీ విభాగానికి రూ.4.12 కోట్లు లభించడం వర్సిటీ అభివృద్ధికి దోహదపడుతుందని కాంక్షించారు. వీటి ద్వారా పరిశోధన, డిజిటల్ విద్య, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి మరింత ఊతం లభించనుందని చెప్పారు. జాతీయ సేవా పథకం ద్వారా కార్యక్రమాలు, గ్రామీణాభివృద్ధి, కమ్యూనిటీ డెవలప్మెంట్, కాలేజీ టు విలేజ్, ల్యాబ్ టు ల్యాండ్ లాంటి వాటిని అభినందించారు. సవాళ్లకు సన్నద్ధం చేయాలి ప్రస్తుత కాలంలో ఏఐ ప్రాధన్యం రోజురోజుకూ పెరుగుతోందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉన్నత విద్యాసంస్థలు స్వీకరించి భవిష్యత్తు సవాళ్లకు విద్యార్థులను సంసిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. డిజిటల్ విద్యను విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు తమ వృత్తి జీవితంలో కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. పట్టాలు అందుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం పద్మభూషణ్, శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు వరప్రసాద్రెడ్డి మాట్లాడారు. నెల్లూరు మట్టిలో పుట్టిన బిడ్డగా తనకు దక్కిన ఈ గౌరవం.. తల్లి ఒడిలో దక్కిన ఆశీస్సుగా భావిస్తున్నానని చెప్పారు. విద్య, వైద్యానికి ప్రభుత్వాలు ప్రాధన్యమి వ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలు కేవలం ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా స్వయం సమృద్ధిని సాధించాలని సూచించారు. విద్యార్థులు ఉద్యోగాల వెంటపడకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కాంక్షించారు. డాక్టరేట్లు, గోల్డ్ మెడళ్ల ప్రదానం శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు వరప్రసాద్రెడ్డి, నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రముఖ మాలిక్యులర్ శాస్త్రవేత్త గోవర్ధన్దాస్, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావుకు గౌరవ డాక్టరేట్లను గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం 45 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలు.. 21 మందికి డాక్టరేట్లు.. డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలను అందజేశారు. తొలుత వర్సిటీ పురోగతిని వీసీ శ్రీనివాసరావు వివరించారు. అనంతరం గవర్నర్ను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, సర్వేపల్లి, కోవూరు ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వర్సిటీ మాజీ వీసీలు విశ్వేశ్వరరావు, సుదర్శనరావు, రిజిస్ట్రార్ సునీత తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో ఉల్లాసంగా.. ఉత్సాహంగా ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ముగ్గురికి గౌరవ డాక్టరేట్ల ప్రదానం 45 మందికి స్వర్ణ పతకాలు.. 21 మందికి పీహెచ్డీ పట్టాల అందజేత గవర్నర్ కార్యక్రమం ముగిసిన అనంతరం భోజన సమయంలో అంతా గందరగోళం నెలకొంది. స్నాతకోత్సవానికి విద్యార్థులు, తల్లిదండ్రులే కాకుండా సంబంధం లేని వ్యక్తులు ఎక్కువ మంది వచ్చారు. మరోవైపు పాస్లను ఎవరికి అంటే వారికి వర్సిటీ అధికారులు ఇచ్చారని తెలుస్తోంది. బయట్నుంచి వచ్చిన వ్యక్తులను వీఐపీ లైన్లో అక్కడున్న పోలీసులు, సెక్యూరిటీ పంపారు. మీడియా ప్రతినిధులను మాత్రం లోపలికి అనుమతించలేదు. మధ్యాహ్నం రెండు గంటలు దాటినా భోజనం పెట్టకపోవవడంతో గందరగోళం నెలకొంది. అక్కడ ఏర్పాటు చేసిన పోలీసులు, సెక్యూర్టీ సైతం ఓవరాక్షన్ చేశారు. ఏర్పాట్లూ అంతంతమాత్రంగా ఉండటంతో అందరూ అసహనం వ్యక్తం చేశారు. -
ప్రకృతి వనరులపై తమ్ముళ్ల కన్ను
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు తమ్ముళ్లు ప్రకృతి వనరులను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వీరికి ప్రజాప్రతినిధుల అండ ఉండటంతో ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొందనే ఆరోపణలున్నాయి.ఉదయగిరి: కూటమి ప్రభుత్వంలో ఉదయగిరి నియోజకవర్గంలో పచ్చ నేతలు బరితెగిస్తున్నారు. రూ.కోట్ల విలువ చేసే ప్రకృతి సంపదను అక్రమంగా తరలిస్తున్నారు. నిబంధనలు ఖాతరు చేయకుండా మట్టి, గ్రావెల్, ఇసుక, క్వార్ట్ ్జను స్వాహా చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఒకవేళ ప్రజల నుంచి ఒత్తిడి వచ్చిన సందర్భాల్లో ఎక్కడైనా పట్టుకున్నా జరిమానాలతో సరిపెట్టి వదిలేస్తున్నారు. దీంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రకృతి వనరుల అక్రమ తరలింపు జరుగుతోందనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. ఇరిగేషన్ చెరువులను సైతం వదలకుండా రాత్రింబవళ్లు తేడా లేకుండా జేసీబీలు, ట్రాక్టర్లతో గ్రావెల్, మట్టిని తరలిస్తున్నారు. యథేచ్ఛగా ఇసుక, మట్టి, గ్రావెల్, తెల్లరాయి తరలింపు రూ.కోట్ల విలువైన సంపద లూటీ ఉదయగిరి నియోజకవర్గంలో ఇదీ పరిస్థితిఏం చేశారంటే.. మంగళవారం కలిగిరి మండలం తెల్లపాడు ఇరిగేషన్ చెరువు నుంచి జేసీబీలతో ట్రాక్టర్ల ద్వారా మట్టి, గ్రావెల్ తరలిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. వింజమూరు, ఉదయగిరి, దుత్తలూరు, కలిగిరి మండలాల్లో గ్రావెల్ దోపిడీ కొనసాగుతోంది. దీని వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందనే విమర్శలతో అధికారులు మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వింజమూరు మండలం జనార్ధనపురంలో సోమవారం అక్రమంగా తరలిస్తున్న క్వార్ట్ ్జ లారీని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే నామమాత్రపు కేసు నమోదు చేసి మైనింగ్ అధికారులకు అప్పగించారు. స్వల్ప జరిమానాతో తప్పించుకునే అవకాశం ఏర్పడిందనే ఆరోపణలున్నాయి. పిల్లాపేరు నుంచి నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఆ ప్రాంతం గుల్లగా మారుతోంది. నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లో ఇదే తరహా అక్రమ దోపిడీ జరుగుతున్నా అడ్డుకునే ధైర్యం అధికారులకు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
పట్టపగలు మహిళ దారుణ హత్య
● సన్నిహితుడే హంతకుడు ● ఆపై పోలీస్స్టేషన్లో లొంగిపోయిన వైనం నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలో పట్టపగలు మహిళ దారుణ హత్యకు గురైంది. సన్నిహితంగా ఉంటున్న వ్యక్తే అనుమానంతో ఆమెను కడతేర్చాడు. అనంతరం నిందితుడు పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసుల కథనం మేరకు.. కనుపర్తిపాడుకు చెందిన రేవతి (35)కి సుమారు 18 సంవత్సరాల క్రితం సుమన్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. విభేదాల నేపథ్యంలో ఐదేళ్ల క్రితం రేవతి భర్త నుంచి విడిపోయింది. ఆమె పిల్లలతో కలిసి కనుపర్తిపాడులో తండ్రి వద్ద ఉంటోంది. ఈక్రమంలో అదే ప్రాంతానికి చెందిన కడప శ్రీకాంత్తో ఆమెకు పరిచయమైంది. ఇద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల ఆమె మరొకరితో మాట్లాడుతుందన్న అనుమానంతో శ్రీకాంత్ తరచూ గొడవ పడేవాడు. ఎలాగైనా రేవతిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. కత్తితో పొడిచి.. మంగళవారం రేవతి కొండాయపాళెంలోని ఓ భవనంలో వాచ్మెన్గా పనిచేస్తున్న తన తండ్రికి భోజనం బాక్స్ ఇచ్చి స్కూటీలో పెట్రోల్ పట్టించుకుని వెళ్తానని బయటకు వచ్చింది అక్కడ శ్రీకాంత్ ఆమెను కలిశాడు. ఇద్దరూ పడారుపల్లి చెరువుకట్ట రేవు వద్దకు వెళ్లారు. వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. శ్రీకాంత్ తన వెంట తెచ్చుకున్న కత్తితో రేవతిపై పలుమార్లు పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం నిందితుడు నేరుగా వేదాయపాళెం పోలీస్స్టేషన్కు వెళ్లి తాను ఓ మహిళను హత్య చేశానని జరిగిన విషయం చెప్పాడు. ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడి కాలికి గాయమై ఉండటంతో అతడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్లో చేర్పించినట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు. మద్యానికి బానిసై.. పెట్రోల్ పోసుకుని..● వ్యక్తి ఆత్మహత్యాయత్నం నెల్లూరు సిటీ: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సౌత్మోపూరులో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రూరల్ పరిధిలోని అంబాపురంలో నివాసముంటున్న కార్తీక్ (35), జ్యోతికి ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది. ఆ ప్రాంతంలోని కొలిమిలో పనిచేస్తున్న కార్తీక్ మద్యానికి బానిసై అప్పుల పాలయ్యాడు. భార్య ఎంత చెప్పినా మార్పు రాకపోవడంతో వీరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో భార్య తన బిడ్డతో కలిసి సౌత్మోపూరులోని పుట్టింటికెళ్లింది. ఎన్నిసార్లు అడిగినా ఆమె ఇంటికి రాకపోవడంతో కార్తీక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. భార్య ఇంటికి రాలేదనే కారణంతో ఫూటుగా మద్యం తాగి, అత్తింటికి వెళ్లి వారిని బెదిరించే క్రమంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లో చిక్కుకున్న అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. రూరల్ సీఐ వేణు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఏఎం హైస్కూల్లో అగ్నిప్రమాదంనెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలో కొన్నేళ్లుగా మూతబడిన సీఏఎం హైస్కూల్లో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్లోని కిటికీలు, తలుపులు, పేరుకుపోయిన చెత్తాచెదారాలు తగులబడ్డాయి. దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గతంలోనూ ఇదే తరహాలో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. ఆకతాయిలు పనిగా అందరూ అనుమానిస్తున్నారు. కొన్నేళ్లుగా స్కూల్ మూతపడి ఉండటంతో ఆకతాయిలు, గుర్తుతెలియని వ్యక్తులకు ఈ ప్రాంతం అడ్డాగా మారింది. వంట చేస్తుండగా..● చీరకు నిప్పంటుకుని వృద్ధురాలికి తీవ్ర గాయాలు కోవూరు: మండలంలోని పాటూరు పంచాయతీ పరిధిలోని చెంచమ్మ కాలనీలో ఓ వృద్ధురాలు ఇంటి వద్ద వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుని తీవ్రంగా గాయపడింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తిరువల్లూరు యానాదమ్మ (70) మంగళవారం ఉదయం తన ఇంటి వద్ద పొయ్యిపై వంట చేస్తోంది. ఈ క్రమంలో గాలికి చీర కొంగు పొయ్యిలో పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి చీరకు అంటుకున్నా యి. మంటలను ఆర్పేందుకు ఆమె ప్రయత్నించినప్పటికీ అప్పటికే తీవ్ర గాయాలయ్యాయి. యానాదమ్మ పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు మంటల్ని ఆర్పారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలికి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.50 సన్నవి : రూ.20 పండ్లు : రూ.10 -
సర్టిఫికెట్లు ఇస్తేనే వెళ్తాం
● ప్రభుత్వాస్పత్రిలో బాధితుల ఆందోళన ● దిగొచ్చిన అధికారులునెల్లూరు(అర్బన్): పదిరోజలుగా బర్త్, డెత్ సర్టిఫికెట్లు పంపిణీ నిలిచిపోవడంతో మంగళవారం బాధితులు పెద్దసంఖ్యలో నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. కాళ్లరిగేలా తిరుగుతున్నామని, వీటి కోసం ఇంకెన్ని రోజులు తిప్పుకొంటారని ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ఎదుట పలువురు బైఠాయించారు. మంగళవారం ఇస్తామని ఆపరేటర్ చెప్పారని, ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు ఆపరేటర్ వస్తారని, అప్పుడు సర్టిఫికెట్లు ఇస్తామని ఉద్యోగులు చెప్పడంతో శాంతించారు. అయితే మధ్యాహ్నం దాటినా అతను రాకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లు ఇస్తేనే వెళ్తామని భీష్మించుకున్నారు. ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. దీంతో జీజీహెచ్ సూపరింటెండెంట్ మాధవి, ఏడీ ఏడుకొండలు, అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీనివాసులు, బ్రహ్మారెడ్డి, మల్లికార్జున్లు బాధితులతో మాట్లాడారు. తాత్కాలికంగా ఇద్దరు ఆపరేటర్లను ఏర్పాటు చేసి బర్త్, డెత్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. -
అనర్హులకు అందలం..!
నెల్లూరు(టౌన్): క్రీడా రంగంలో అనర్హులను అందలం ఎక్కిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జాతీయ విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్ కల్పించడంతో క్రీడా సర్టిఫికెట్లకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. తాజాగా నెల్లూరు జిల్లా క్రికెట్ జట్టు ఎంపికల్లోనూ ప్రతిభావంతులైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలను మొక్కుబడిగా నిర్వహించారని సమాచారం. జట్టు ఎంపికలో వయస్సు తక్కువ, ప్రతిభ లేని క్రీడాకారులను ఎంపిక చేశారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. రాజకీయ పలుకుబడి, రూ.లక్షల లావాదేవీల కారణంగా ప్రతిభ లేకున్నా కొందరికి జిల్లా జట్టులో స్థానం కల్పించారని ప్రచారం జరుగుతోంది. క్రికెట్ జట్ల ఎంపికల్లో ఓ అజ్ఞాత వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గత నెలలో జట్టు ఎంపికలు నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వివిధ విభాగాల క్రికెట్ జట్ల ఎంపికలు జరుగుతున్నాయి. గత నెల 10వ తేదీన అండర్ – 16 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించారు. దీనికి సంబంధించి గత నెల 5వ తేదీన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. అందులో 2010 సెప్టెంబర్ ఒకటి నుంచి 2011 సెప్టెంబర్ ఒకటో తేదీ మధ్య జన్మించిన వారే అర్హులని పేర్కొన్నారు. క్రీడాకారులు ఆధార్కార్డు, జనన ధ్రువీకరణ పత్రం (ఫారం 5) తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఎంపికల అనంతరం 16 మంది ప్రధాన జట్టుకు, మరో నలుగురిని స్టాండ్బైగా ఎంపిక చేసి మొత్తం 20 మంది క్రీడాకారులతో జిల్లా జట్టును ఖరారు చేశారు. ఇది బుధవారం నుంచి చిత్తూరు జిల్లా వాయల్పాడులో జరిగే అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొననుంది. వారికి మొండిచేయి జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలను మొక్కుబడిగా నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులను పక్కనపెట్టి, అర్హత లేని వారిని ఎంపిక చేశారన్న విమర్శలున్నాయి. అంతేకాకుండా అర్హత నిబంధనలకు విరుద్ధంగా వయసు తక్కువ ఉన్న క్రీడాకారులను ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా జట్టులో సీహెచ్ వెంకటకార్తి (12–04–2012), బి.సనత్రెడ్డి (29–01–2012), జి.శ్రేయాన్స్రెడ్డి (29–03–2012)ను ఎంపిక చేయడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం అర్హత లేకపోయినా వీరిని అండర్ 16 జట్టుకు ఎలా ఎంపిక చేశారనే అంశంపై క్రీడావర్గాల్లో చర్చ జరుగుతోంది. డబ్బు, రాజకీయ పలుకుబడితో.. వయస్సు తక్కువతోపాటు ప్రతిభ లేని, రాజకీయ పలుకబడి గల క్రీడాకారులను ఎంపిక చేశారన్న విమర్శలున్నాయి. అధికార పార్టీకి చెందిన వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేల ప్రోద్బలం ఉందన్న ప్రచారం జరుగుతోంది. జట్టులోకి తీసుకోవాలని నేరుగా అసోసియేషన్ నేతలకు ఫోన్ చేసినట్లు తెలిసింది. ఎంపికై న కొందరి నుంచి నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జట్టులో కూడా వారికి ప్రాధ్యనత ఇచ్చేలా హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఒకరిద్దరు క్రీడాకారులను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల సిఫార్సుతో జట్టులో తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పలువురు క్రీడాకారుల తల్లిదండ్రులు నేరుగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎన్నో ఏళ్లుగా ఆటనే నమ్ముకుని రేయింబవళ్లు ప్రాక్టీస్ చేసి తీరా జట్టులో ఎంపిక కాకపోవడంతో పలువురు క్రీడాకారులు చేసేదేమీలేక లోలోన మదనపడుతున్న పరిస్థితి ఉంది. ఎంపికలను అసోసియేషన్లకు వదిలిపెట్టకుండా కలెక్టర్ కూడా దృష్టి సారిస్తే ప్రతిభ గల వారికి న్యాంయ జరుగుతుందని చెబుతున్నారు. ఇప్పటికై నా అన్ని రకాల క్రీడా విభాగాల్లో నిజాయితీగా ఎంపికలు నిర్వహించి అర్హులకు అవకాశం కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ● దీనిపై నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి స్పందిస్తూ ఎంపికలు సక్రమంగా నిర్వహించామన్నారు. ● కోచ్ జుల్కర్ మాట్లాడుతూ జిల్లా జట్టు ఎంపికలో వయస్సు ఎక్కువ గలవారు ఉండకూడదని, తక్కువ ఉన్నా ఎంపిక చేసుకోవచ్చన్నారు. అయితే ప్రెస్నోట్లో వయస్సుకు సంబంధిత తేదీలు ప్రకటించారని అడగ్గా ఒకసారి పరిశీలిస్తానని సమాధానమిచ్చారు. గత నెలలో అండర్ – 16 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలు వయసు తక్కువ ఉన్నవారికి అవకాశం డబ్బులు, రాజకీయ ప్రోద్బలంతో ఎంపిక చేశారన్న విమర్శలు ప్రతిభలేని క్రీడాకారుల ఎంపికకు రూ.5 లక్షల వసూలు? ఏసీఏకి తల్లిదండ్రుల ఫిర్యాదు నేటి నుంచి అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు -
రైల్లోంచి జారిపడి..
● గుర్తుతెలియని వ్యక్తి మృత్యువాత వెంకటాచలం: రైల్లోంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని గొలగమూడి రైల్వేగేట్ సమీపంలో మంగళవారం గుర్తించారు. రైల్వే ఎస్సై హరిచందన కథనం మేరకు.. గొలగమూడి రైల్వేగేట్ సమీపంలో అప్లైన్ పక్కన మృతదేహం ఉందని నెల్లూరు రైల్వేస్టేషన్ మాస్టర్ ఫిర్యాదు చేయడంతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. అతని వయస్సు 30 నుంచి 35 ఏళ్లలోపు ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేశారు. -
యూరియా కోసం అన్నదాతల ఆందోళన
కోవూరు: ఖరీఫ్ సాగు కీలక దశలో ఉన్న సమయంలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ క్రమంలో విసిగి వేసారిన రైతులు స్థానిక పడుగుపాడు సొసైటీ కార్యాలయం వద్ద ఆందోళనను మంగళవారం చేపట్టారు. ఒక బస్తా యూరియా కోసం సొసైటీల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన కొత్త యాప్ నిబంధనలు మరింత భారంగా మారాయని తెలిపారు. తమకు అవసరమైనంత మేర అందజేయాలని డిమాండ్ చేశారు. 1న డీసెట్ నెల్లూరు (టౌన్): డీసెట్ను వచ్చే నెల ఒకటిన నిర్వహించనున్నామని డీఈఓ బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లు ఈ నెల పది నుంచి అందుబాటులో ఉంటాయని.. ఫలితాలను వచ్చే నెల నాలుగున విడుదల చేయనున్నారని వివరించారు. అర్హత సాధించిన విద్యార్థులకు వచ్చే నెల పది నుంచి 15లోపు వెబ్ ఆప్షన్లు.. 16న సీట్ల అలాట్మెంట్.. 19 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. 25న తరగతులు ప్రారంభంకానున్నాయని వెల్లడించారు. -
రెండేళ్ల కూటమి పాలనలో విధ్వంసం
● వైఎస్సార్సీపీ సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి నెల్లూరురూరల్: ‘కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో విధ్వంసం తప్ప ఏమీ లేదు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారు’ అని వైఎస్సార్సీపీ సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ జగదీష్ నగర్లో ఉన్న శ్రీకన్వెన్షన్ హాల్లో మంగళవారం ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.1,500, యువతకు నిరుద్యోగ భృతి వంటి పథకాలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎరువులు, పురుగు మందుల సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈనెల 12న రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ● నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకుడు కొండ్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ రెండేళ్ల పాలనలో ప్రజలను నిరాశపరిచే విధానాలను కూటమి అమలు చేసిందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలు, నాడు – నేడు పనులు, గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జిలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
వెన్నుపోటుకు ఆద్యుడు చంద్రబాబు
● హామీలివ్వడం.. గాలికొదిలేయడం ఆయనకు అలవాటే ● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి మనుబోలు: సీఎం చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా మనుబోలులో ర్యాలీని మంగళవారం నిర్వహించారు. అనంతరం పద్మావతి కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు సూపర్సిక్స్ అని, ఆపై మరొకటి కలిపి సూపర్ సెవన్ అని హామిలిచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఒక్క దాన్నీ సక్రమంగా అమలు చేయడంలేదని ధ్వజమెత్తారు. ఆడబిడ్డ నిధి.. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు.. నెలకు రూ.మూడు వేల నిరుద్యోగ భృతిని ఇస్తానని చెప్పి గెలిచాక కుచ్చుటోపీ పెట్టారని విమర్శించారు. దగా డీఎస్సీ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారని మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటా పేరుతో గతంలో 29 క్రీడలుండగా, ఇప్పుడు దాన్ని 65 చేశారని తెలిపారు. ఇందులో పేకాట, టగ్ ఆఫ్ వార్, యోగా లాంటి వాటిని చేర్చారని చెప్పారు. క్రీడా అసోసియేషన్లను అప్పటికప్పుడు పెట్టించి, వాటి ద్వారా నకిలీ సర్టిఫికెట్లను సృష్టించి తమకు అనుకూలమైన వారికి అడ్డదారిలో ఉద్యోగాలను కట్టిబెట్టారని ఆరోపించారు. ఇలా 421 ఉద్యోగాలను చంద్రబాబు, లోకేశ్ అమ్ముకున్న విషయమై వాస్తవాలను చెప్పాలని నిలదీశారు. కేసులు పెడతామని తమను బెదిరించినంత మాత్రాన, డీఎస్సీలో జరిగిన దగా, అవినీతిపై మాట్లాడకుండా ఉండబోమని స్పష్టం చేశారు. ఉచిత బస్సులు అవసరమైన చోట ఆగడంలేదంటూ మహిళలు వాపోతున్నారని తెలిపారు. మూడు గ్యాస్ సిలిండర్లు.. తల్లికి వందనం పేరిట వంచించారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం ధరలు రూ.24 వేల నుంచి రూ.26 వేలుంటే, ఇప్పుడు రూ.20 వేలు సైతం పలకడంలేదని విమర్శించారు. రైతులకు యూరియాను సైతం సక్రమంగా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. కనీసం ఒక్కరికై నా కొత్త పింఛన్ను ఇచ్చారానని ప్రశ్నించారు. గద్దర్కు కారిచ్చా.. భగత్సింగ్కు నేనే తుపాకీ ఇచ్చా నంటూ డబ్బాలు కొట్టుకోవడం తప్ప ప్రజలకు పవన్ కల్యాణ్ చేసిందేమీలేదని ఎద్దేవా చేశారు. గతంలో 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని ఆరోపించి, ఇప్పుడేమి చేస్తున్నారని ప్రశ్నించారు. దెబ్బకు దెబ్బ తప్పదు తమ పార్టీ శ్రేణులపై దాడులకు పాల్పడుతూ.. తప్పుడు కేసులతో ఎవరైతే ఇబ్బందులకు గురిచేస్తున్నారో.. తాము అధికారంలోకి వచ్చాక వారికి దెబ్బకు దెబ్బ తప్పదని హెచ్చరించారు. తనపై ఆరోపణలు చేస్తున్న సోమిరెడ్డి తన సవాల్ను స్వీకరించి బహరంగ చర్చకు రావాలని డిమాండ్ చేస్తే, తోకముడిచి పారిపోతున్నారని విమర్శించారు. మహిళలకు కనీస మర్యాద లేదు ప్రస్తుత ప్రభుత్వంలో మహిళలకు కనీస మర్యాదలేదని పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆరోపించారు. సూపర్సిక్స్ లో నాలుగు హామీలు మహిళలకు అని చెప్పి, వారికి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. నేతలు బొమ్మిరెడ్డి హరగోపాల్రెడ్డి గుండాల ఆదినారాయణ, కడివేటి చంద్రశేఖర్రెడ్డి, ముంగర రవీందర్రెడ్డి, మారంరెడ్డి ప్రదీప్రెడ్డి, చిట్టమూరు అజయ్రెడ్డి, దాసరి భాస్కర్గౌడ్, గుండాల వజ్రమ్మ, చిట్టమూ రు అనితమ్మ, గుమ్మడి వెంకటసుబ్బయ్య, చేడిమా ల బుజ్జిరెడ్డి, ఆవుల తులసీరామ్, గుంజి రమేష్, జానకిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిపై అక్రమ కేసు
కావలి: మంత్రి లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ ఎమ్మె ల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్చార్జి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిపై పట్టణ పోలీస్స్టేషన్లో టీడీపీ నేతలు సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమ కేసును పోలీసులు మంగళవారం నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి కావలి నియోజకవర్గంలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో చెరువులు, గుంటలు, వాగులు, వంకలు ఇలా ఎక్కడపడితే అక్కడ గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులను బనాయించడమే కాకుండా దాడులకు తెగబడుతున్నారు. కూటమి నేతలు కొందరు స్థానిక ఎమ్మెల్యే అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా అక్రమ లేఅవుట్లు వేసి అందులో ఉన్న ప్రభుత్వ భూములు, కాలువలను ఆక్రమిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో సభలు, సమావేశాలను మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కొన్ని రోజులుగా ఏర్పాటు చేసి అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏమి చేయాలో పాలుపోక మంత్రి లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో కేసును నమోదు చేశారు. ఇదే సమయంలో ప్రతాప్కుమార్రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలు, కార్యకర్తలు అసభ్యంగా వ్యవహరిస్తూ పోస్టులు పెడుతున్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. నియోజకవర్గంలోని కావలి, అల్లూరు, దగదర్తి, బోగోలు మండలాల్లో టీడీపీ నేతలపై మంగళవారం ఫిర్యాదు చేసినా, ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయడమేమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు టీడీపీ నేత, ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ డైరెక్టర్ చవల రామకృష్ణ.. విజిలెన్స్ అధికారుల విధులకు ఆటంకం కలిగించి వారిపై దురుసుగా వ్యవహరించడంతో విజిలెన్స్ సీఐ స్వయంగా వెళ్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటన జరిగి వారమైనా, నిందితుడు రామకృష్ణ నిర్భయంగా సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. కూటమి ప్రభుత్వానికో న్యాయం, ప్రతిపక్షానికో న్యాయమా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జెడ్పీ సర్వసభ్య సమావేశం నేడు నెల్లూరు(పొగతోట): జెడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నగరంలోని జెడ్పీ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం 2.30కు నిర్వహించనున్నామని సీఈఓ శ్రీధర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించనున్నామని వివరించారు. జెడ్పీ సభ్యులు, ఆయా శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని కోరారు. డీఆర్సీ మీటింగ్ నేడు నెల్లూరు రూరల్: జిల్లా ఇన్చార్జి మంత్రి ఫరూక్ నెల్లూరులో బుధవారం పర్యటించనున్నారని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. జెడ్పీ కార్యాలయంలో ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు వరకు నిర్వహించనున్న డీఆర్సీ సమావేశానికి మంత్రి హాజరుకానున్నారని చెప్పారు. సంబంధిత శాఖల అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని సూచించారు. విమానంలో మృతదేహాల తరలింపు ఆత్మకూరు: వారణాశితో పాటు పలు పుణ్యక్షేత్రాలకు బస్సులో వెళ్తూ బిహార్లోని ఔరంగాబాద్ వద్ద ఆత్మకూరు, సంగం, తదితర ప్రాంతాలకు చెందిన వారు ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వాధికారులతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి మృతదేహాలు, యాత్రలోని మిగిలిన ప్రయాణికులను స్వస్థలాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. ముగ్గురి మృతదేహాలను విమానాల్లో చైన్నెకు.. ఆపై స్వస్థలాలకు చేరేలా ఏర్పాట్లు చేశారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కార్యాలయం పేర్కొంది. తీవ్రంగా గాయపడిన వారికి పట్నా మెడికల్ కళాశాల ఆస్పత్రిలో మెరుగైన చికిత్సను అందిస్తున్నారని చెప్పారు. చైన్నె విమానాశ్రయానికి అధికారులు సంగం: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగానికి చెందిన వెంకటేశ్వర్లు, హజరత్తయ్య భౌతికకాయాలను స్వగ్రామానికి తీసుకొచ్చేలా చర్యలను వేగవంతం చేశారు. మృతదేహాలను స్వీకరించి సంగం మండలానికి తరలించేందుకు గానూ చైన్నె విమానాశ్రయానికి తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు, ఎస్సై భోజ్యా నాయక్ చేరుకున్నారు. అన్ని ప్రక్రియలు పూర్తయిన అనంతరం ప్రత్యేక వాహనంలో తరలించనున్నారు. -
స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి
నెల్లూరురూరల్: రాష్ట్రంలో బీసీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో 44 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం నెల్లూరులోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2027లో సమగ్ర బీసీ కులాల జనగణన పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించరాదని ఆయన కోరారు. బీసీ కులవృత్తిదారులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బ్యాంక్ లింకేజ్ రుణాల కోసం ప్రభుత్వం రూ.430 కోట్లు విడుదల చేయాలన్నారు. ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాథోడ్ సుజాన్ సింగ్ మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు 50 సంవత్సరాల వయస్సు నిండిన బీసీలకు పింఛన్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓబీసీ విద్యార్థి, యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సుమారు రూ.2,000 కోట్లను ఇవ్వాలన్నారు. లేకపోతే ఈనెల 27న విద్యాశాఖ కమిషనరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నేతలు ఉన్నవ సుబ్బారావు, పేరయ్య, రమాదేవి, ప్రదీప్ యాదవ్, సుధీర్, రవి, హరికష్ణ, సునీల్ పాల్గొన్నారు. -
టీడీపీ సర్కార్ ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వ భూములకు రక్షణ కొరవడుతోంది. ఎక్కడ జాగా కనిపిస్తే.. అక్కడ పాగా వేసేలా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కుంట, డొంకా ఇలా దేన్నీ వదలకుండా స్వాహా చేస్తున్నారు. తాజాగా పొదలకూరు మండలం మరుపూరు సమీపంలో లేఅవుట్ను నిర్మిస్తు
డొంక పొరంబోకు భూమిని ఆక్రమించి నిర్మించిన ఆర్చి పొదలకూరు: అధికారాన్ని అడ్డం పెట్టుకొని పట్టా ల్యాండ్స్తో పాటు కుంట, డొంక పొరంబోకు భూములను కొందరు పెద్ద మనుషులు ఆక్రమించి భారీ లేఅవుట్ను ఏర్పాటు చేస్తున్నారు. భారీ ప్రచారంతో దీని నిర్మాణాన్ని చేపట్టిన నిర్వాహకులు.. సుమారు రూ.పది కోట్ల విలువజేసే పొరంబోకు భూములను కలిపేసుకున్నారు. అధికారం ముసుగులో ఎస్టీలకు చెందిన భూముల నుంచి యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు జరిపి సదరు వెంచర్కు వినియోగించారు. ముందున్న ఆర్ అండ్ బీ మెయిన్ రోడ్డుపై అనుమతుల్లేకుండా రహదారిని విస్తరించారు. పెద్ద ఆర్చిలను డొంక పొరంబోకు భూముల్లో నిర్మించి ఇదే రహదారి అంటూ చూపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. లేఅవుట్లో ఉన్న కుంట పొరంబోకు భూమి సుమారు ఎనిమిదెకరాలను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. గ్రామస్తులు దీనికి ఏ మాత్రం సమ్మతించడం లేదు. రూ.కోట్ల విలువైన ల్యాండ్స్ మాయం సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో గల మరుపూరు రెవెన్యూ పరిధిలో సుమారు 120 ఎకరాల్లో లేఅవుట్ను మనభూమి యాజమాన్యం చేపడుతోంది. నుడా నుంచి పదెకరాల్లోపే అనుమతులను ప్రస్తుతం పొందారు. విడతల వారీగా పర్మిషన్లు పొందేందుకు యత్నిస్తున్నారు. ఇక్కడ విల్లాల నిర్మాణంతో పాటు ప్లాట్ల వ్యాపారాన్నీ చేస్తున్నారు. అయితే మరుపూరు రెవెన్యూ విలేజ్ ఎల్పీఎం నంబర్ 830లో 5.02.. ఎల్పీఎం నంబర్ 83 లో 2.96.. డొంక, కుంట పొరంబోకు రెవెన్యూ భూములను కలిపేసుకున్నారు. డొంక దారికి సంబంధించిన సుమారు 150 అడుగుల స్థలంలో ఆర్చీనీ నిర్మించారు. కుంటలోని నీటిని చుట్టుపక్కల మేతకొచ్చే పశువులు ఎప్పట్నుంచో తాగుతుంటాయి. దీన్ని పూడ్చేసి దేవాలయ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మొత్తం భూముల విలువ సుమారు రూ.10 కోట్లకుపైగానే ఉంటుంది. పక్కనే తూర్పువైపు పాలిచెర్లపాడు రోడ్డుకు ఆనుకుని ఉన్న అసైన్డ్ భూములను సైతం కొనుగోలు చేశారు. లేఅవుట్కు ముందున్న ఆర్ అండ్ బీ మెయిన్ రోడ్డు పక్కనే ఇష్టానుసారం తవ్వేసి అనుమతుల్లేకుండా రోడ్లను విస్తరించారు. రాజకీయ పలుకుబడి, అధికారం వెన్నుదన్నుగా ఉండటంతోనే లేఅవుట్ యజమానులు ఇలా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాలి మరుపూరు వద్ద నిర్మిస్తున్న మనభూమి లేఅవుట్లో కలిపేసుకున్న రూ.కోట్ల విలువైన సుమారు ఎనిమిదెకరాల ప్రభుత్వ భూములను కాపాడాలి. ఈ విషయమై కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశాం. భవిష్యత్తులో పశువులు, రైతులు నడిచేందుకు దారి.. నీరు తాగేందుకు కుంటా ఉండదు. అధికారులు చర్యలు చేపట్టకపోతే ఆందోళనకు సిద్ధంగా ఉన్నాం. – కలిచేటి రామిరెడ్డి, గ్రామస్తుడు, మరుపూరు డొంకదారి కబ్జా పొలాలకు రైతులు దశాబ్దాలుగా వెళ్లే డొంక దారిని కబ్జా చేశారు. ప్రశ్నిస్తే కొత్త రోడ్డుపై వెళ్లొచ్చని బదులిస్తున్నారు. లేఅవుట్ను కలుపుకొన్న దారిలో భవిష్యత్తులో వెళ్లనిస్తారంటే ఎవరూ నమ్మరు. కుంటను కబ్జాను చేసి దేవాలయ నిర్మాణానికి పనులు చేపట్టారు. – ఏనుగు అనిల్రెడ్డి, గ్రామస్తుడు, మరుపూరు సర్వే చేపట్టాం గతంలో విచారణను ఒక సారి జరిపి, కుంటను వదిలేయాలని లేఅవుట్ యజమానులకు సూచించాం. తాజాగా వీఆర్వో, సర్వేయర్ను పంపి భూములను సర్వే చేయిస్తున్నాం. కబ్జాకు గురై ఉంటే చర్యలు చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నాం. – శివకృష్ణయ్య, తహసీల్దార్, పొదలకూరు కుంట, డొంకా.. గుటకాయ స్వాహా అధికారమే అండగా మరుపూరుకు సమీపంలో అతిపెద్ద లేఅవుట్ రూ.పది కోట్ల విలువైన పొరంబోకు ల్యాండ్స్ కబ్జా కలెక్టర్కు వినతిపత్రమిచ్చిన గ్రామస్తులు -
వైఎస్సార్సీపీ హయాంలో మహిళలకు పెద్దపీట
చంద్రబాబు మోసానికి రెండేళ్లుగా నష్టపోయిన మొత్తం రూ.3,128.40 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు అందిన సాయం రూ.8,143.45 కోట్లు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆడబిడ్డలను వంచించి అధికారంలోకి రావడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో పొదుపు రుణాల మాఫీ, తాజా ఎన్నికల్లో ఆడబిడ్డ నిధి వంటి బూటకపు హామీలతో అధికారం దక్కించుకుని వెన్నుపోటు పొడవడం ఆయన నైజం. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను పీఠమెక్కాక తుంగలో తొక్కారు. కుటుంబంలో ఎంత మంది మహిళలు ఉంటే అంత మందికి ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెలా రూ.1,500 చొప్పున అందిస్తానంటూ చంద్రబాబు వేదికలెక్కి ఉపన్యసిస్తూ ఊగిపోయారు. రెండేళ్లు ఒక్క ఆడబిడ్డకు రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబు మోసానికి బ్రాండ్ అంబాసిడర్ అనేది మరోసారి రుజువైంది. గతంలో అధికారంలోకి రాక ముందు ప్రతి పొదుపు మహిళ రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదు. మీ అన్నగా నేనే చెల్లిస్తానంటూ సెంటిమెంట్తో ఓట్లు వేయించుకుని.. ఆ తర్వాత కర్రుకాల్చి వాత పెట్టారు. ఒక్కొక్క మహిళ అప్పట్లో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పొదుపు బకాయిలు ఉంటే పూర్తిగా ఎగ్గొట్టి ఎన్నికల ముందు రూ.10 వేలు పసుపు కుంకుమ అంటూ మోసం చేశారు. రెండేళ్లుగా రూ.3,128.40 కోట్ల బాకీ చంద్రబాబు ఎన్నికల హామీల్లో ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు రూ.1,500 ఇస్తామన్నారు. జిల్లాలో 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలు 8.69 లక్షల మంది ఉన్నారు. ఈ లెక్కన ప్రతి నెలా రూ.130.35 కోట్లు, ఏడాదికి రూ.1564.20 కోట్లు మహిళల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. రెండేళ్లుగా రూ.3,128.40 కోట్లు మహిళలకు చంద్రబాబు బాకీ పడ్డారు. అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ చేయూత, ఆసరా వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2020–21 ఏడాది నుంచి ఈ రెండు పథకాలను అమల్లోకి తెచ్చారు. 45 ఏళ్లు నిండిన 60 ఏళ్లలోపు అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ చేయూత కింది ఏటా రూ.18,750 ఇస్తామని నాలుగేళ్లు క్రమం తప్పకుండా రూ.934.83 కోట్లు అందజేశారు. అలాగే గతంలో పొదుపు రుణాలు తీసుకున్న వారికి పూర్తిగా రుణమాఫీ చేస్తానని, ఈ మొత్తాన్ని నాలుగు దఫాలుగా నాలుగేళ్ల పాటు అందిస్తానని చెప్పిన విధంగా 2020–21 ఏడాది నుంచి అమలు చేశారు. మొత్తం రూ.853.69 కోట్లు పొదుపు మహిళల ఖాతాల్లో జమ చేశారు. వ్యాపారి నుంచి పారిశ్రామికవేత్త వరకు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళలకు అందించిన ఆర్థిక సహకారంతో ఎంతో మంది వ్యాపారి నుంచి పారిశ్రామికవేత్తలుగా మారారు. సుమారు 1.20 లక్షల మంది మహిళలు కుటీర పరిశ్రమలు స్థాపించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందారు. కూటమి సర్కార్ నయవంచన వల్ల మహిళలు తీవ్రంగా నష్టపోయారు. గతంలో ప్రతి నెలా ఏదోక పథకం పేరుతో మహిళల బ్యాంకు ఖాతాల్లో నగదు జమయ్యేది. ప్రస్తుతం కూటమి పాలనలో రెండేళ్లుగా మహిళలకు ఎటువంటి నగదు అందడం లేదు. ఫలితంగా గ్రామీణ ప్రాంత మహిళలు సూక్ష్మ సంస్థల్లో రుణాలు తీసుకుని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. విడత లబ్ధిదారులు నగదు రూ.కోట్లలో మొదటి 16,151 16.15 రెండో 18,052 18.05 మూడో 29,957 29.96 నాల్గో 16,923 16.92 ఐదో 27,007 27.01 ఆరో 15,138 14.42 జగనన్నతోడు (రూ.122.51 కోట్లు) జిల్లాలో ఆడబిడ్డ నిధికి అర్హులైన మహిళలు 8.69 లక్షల మంది నెలకు రూ.1500 సాయం రెండేళ్లుగా ఎగనామం జిల్లాలో 4.30 లక్షల మంది పొదుపు మహిళలు వైఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్లూ అందిన సంక్షేమ పథకాలు పొదుపు, సీ్త్రనిధి, సున్నావడ్డీ, చేయూత, ఆసరా, జగనన్నతోడుతో మహిళల ఆర్థిక స్వావలంబన మహిళల సాధికారతను పట్టించుకోని కూటమి కాగితాలకే పరిమితమైన కోటీశ్వరులను చేసే ప్రచారం జిల్లాలో 4.30 లక్షల మంది స్వయం సహాయక గ్రూపు మహిళలు ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పొదుపు మహిళలే కాదు.. ప్రతి మహిళకు పెద్దపీట వేసింది. ప్రతి నెలా ఏదోక సంక్షేమ కార్యక్రమంతో మహిళలకు గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. జిల్లాలో ప్రతి కార్యక్రమం మహిళల పేరుతో అమలు చేశారు. ఇంటి పట్టాలు, ఇతర రుణాలు, ప్రతి సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు అందజేశారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, వారి అభివృద్ధికి పెద్దపీట వేసింది. స్వయం సహాయక గ్రూపు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వందల కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసింది. తీసు కున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రత్యేక దృష్టి సారించింది. మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి కుటీర పరిశ్రమల స్థాపనకు భారీ స్థాయిలో ప్రోత్సా హాలను ఇచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా మహిళలు బ్యాంకు లింకేజీ, సీ్త్ర నిధి, సున్నా వడ్డీ, చేదోడు, చేయూత, జగనన్న తోడు, తదితర సంక్షేమ పథకాల ద్వారా తీసుకున్న రుణాలు చెల్లించడంతో ప్రతిఫలంగా రూ.8,143.45 కోట్ల అందజేశారు. సున్నా వడ్డీ కింద నాలుగేళ్లలో రూ.202.35 కోట్లు తిరిగి అక్క చెల్లెమ్మలకు చెల్లించారు. ఐదో ఏడాది ఎన్నికలు రావడంతో అప్పటికే సిద్ధం చేసిన సున్నావడ్డీ చెల్లింపులను కూటమి ప్రభుత్వం ఎగనామం పెట్టడడమే కాకుండా.. కూటమి పాలనలో రెండేళ్లుగా సున్నా వడ్డీకి దిక్కులేకుండా పోయింది. -
ప్రజల గోడుకు స్పందనేదీ?
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● వినతులు స్వీకరించిన అధికారులు నెల్లూరురూరల్: నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్కుమార్, తెలుగుగంగ ప్రత్యేక అధికారి మహేశ్వరరెడ్డి, మెప్మా పీడీ కిరణ్ కుమార్, ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్ తదితరులు స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడికి సంతృప్తికరంగా పరిష్కారం చూపాలని జేసీ అధికారులను ఆదేశించారు. భోజన పథకాన్ని ప్రైవేట్కు ఇవ్వొద్దు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. కలెక్టరేట్ వద్ద వారు ప్రదర్శన చేపట్టారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె.విజయమ్మ, జిల్లా కార్యదర్శి షేక్ రెహానా బేగం మాట్లాడుతూ ప్రైవేట్కు ఆ పథకాన్ని అప్పగిస్తే వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలంటే స్థానికంగా వంట చేసే విధానాన్నే కొనసాగించాలని కోరారు. అలాగేకార్మికులకు నెలకు రూ.10 వేల వేతనం చెల్లించాలన్నారు. హామీలు నెరవేర్చాలంటూ.. ఎన్నికల సమయంలో వడ్డెర సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. కలెక్టరేట్ వద్ద ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంజి దయాకర్ మాట్లాడుతూ వడ్డెర కార్పొరేషన్కు తగిన నిధులు కేటాయించి ఆధునిక పనిముట్లు, యంత్రాలను సబ్సిడీపై అందించాలని కోరారు. మైన్స్ అండ్ మినరల్స్ క్వారీల్లో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు సీనరేజ్ చార్జీల్లో రాయితీలివ్వాలని డిమాండ్ చేశారు. వడ్డెరలకు 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల్ని పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోటకొండ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి బెల్లంకొండ బాల వెంకటేశ్వర్లు తదితర నాయకులు పాల్గొన్నారు. -
కూటమి పాలన మోసాల మయం
బాబూ షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ అంటూ అబద్ధపు ప్రచారంతో అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు మహిళలకు తీరని అన్యాయం చేసింది. బాబు బురిడీతో మహిళల భవిష్యత్ ఛిన్నాభిన్నమైంది. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 సాయం అందిస్తానని చెప్పిన హామీలు నెరవేర్చకపోగా, పొదుపు, సీ్త్ర నిధి రుణాలకు కొర్రీలు పెట్టారు. కొత్త రుణాలివ్వడం లేదు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అటకెక్కించారు. సకాలంలో పొదుపు చెల్లించిన మహిళలకు సున్నా వడ్డీ ఊసే లేదు. మహిళలను కోటీశ్వరులను చేస్తానంటూ పీ–4 పథకంతో కొత్త గారడీ చేసిన చంద్రబాబు.. ఇటీవల మహానాడులో లక్ష మంది మహిళలను లక్షాధికారులను చేసినట్లు చెప్పేశారు. వాస్తవానికి పీ–4 పథకానికి ఆశించిన స్థాయిలో ప్రజాస్పందన కరువైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్యాంకర్లు మహిళలకు కొత్త రుణాలిచ్చేందుకు విముఖత చూపుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు అంటూ ఏడాది పాటూ ఊరించి.. ఊరించి గతేడాది ఆగస్టులో ప్రారంభించారు. -
తల్లి ఆశలకు సమాధి
● విద్యుదాఘాతానికి గురై కుమారుడి మృతివింజమూరు(ఉదయగిరి): ఆ పిల్లాడు అప్పటి వరకూ తల్లి ముందు ఎంతో సరదాగా గడిపాడు. అయితే కాసేపటికే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వింజమూరు పట్టణంలోని చల్లావారి వీధిలో సోమవారం విద్యుదాఘాతానికి గురై మహేంద్రరెడ్డి (13) మృత్యువాత పడ్డాడు. పోలీసులు, బంధువుల కథనం మేరకు.. స్థానికంగా పేర్నేటి మమత అనే మహిళ నివాసముంటోంది. భర్త కొన్నేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆమె కూలీ పనులకు వెళ్తూ పెద్ద కుమారుడు మహేంద్రరెడ్డి, కుమార్తెను చదివిస్తోంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మహేంద్రరెడ్డి ఇంటి పక్కనే పాత భవనాన్ని కూల్చివేస్తుండగా కుతూహలంతో వెళ్లి చూస్తున్నాడు. ఆ సమయంలో డ్రిల్లింగ్ మెషీన్కు విద్యుత్ సరఫరా అవుతున్న తీగ నేలపై ఉంది. చెప్పుల్లేకుండా అతను పొరపాటున ఆ తీగను తొక్కడంతో షాక్కు గురై కుప్పకూలాడు. వెంటనే కూలీలు బాలుడిని స్థానిక ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధారించారు. ఊహించని ఈ ఘటనతో మమత గుండెలవిసేలా రోదించడం అక్కడున్న వారిని కలిచివేసింది. కుమారుడు ప్రయోజకుడై కుటుంబానికి అండగా ఉంటాడని కలలుగన్న తల్లిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. ఎస్సై ఉమామమేశ్వరరావు వివరాలు సేకరించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రబాబు అరాచకాలకు రెండేళ్లు
● అన్ని వర్గాలను మోసగించారు ● వెన్నుపోటు పాలనపై ప్రజలు నిరసన ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితోటపల్లిగూడూరు(పొదలకూరు): ‘చంద్రబాబు అరాచక పాలనకు రెండేళ్లు నిండాయి. సూపర్సిక్స్ పేరుతో హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన ఆయన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా తోటపల్లిగూడూరు మండలం నరుకూరులోని రుషి కల్యాణ మండపంలో సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం ఆయన ముఖాముఖి నిర్వహించారు. తొలుత పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితారెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి నరుకూరు సెంటరు నుంచి కల్యాణ మండపం వరకు నల్ల బెలూన్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాయకులు, కార్యకర్తల ముఖాముఖిలో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఎందరో ముఖ్యమంత్రులు ఉన్నా చంద్రబాబు వంటి అబద్ధాల కోరు ఎక్కడా లేరన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే బాబు సొంత మేధస్సుతో ఒక్క ప్రజాసంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టిన దాఖలాలు లేవన్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన పథకాలన్నీ కాపీ కొట్టినవేనన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా పథకం కింద ఏడాదికి రూ.13,500 అందజేస్తే దాన్ని కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ పేరుతో రూ.20 వేలు ఇస్తానని రైతులను ఏ మార్చారని ఆరోపించారు. జగన్ అమ్మఒడి, డీఎంకే ఉచిత బస్సు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాలను కాపీ కొట్టి అమలు చేస్తానని ప్రకటించి ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, తదితర హామీలను పూర్తిగా అమలు నెరవేర్చలేదన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి పేరుతో బీసీ డిక్లరేషన్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టారన్నారు. జగన్మోహన్రెడ్డి జనరంజక పాలనను ప్రజలు గుర్తుచేసుకుని తిరిగి ఆయన అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు నిర్ణయాలు నిరుద్యోగులకు శాపంగా మారాయని ధ్వజమెత్తారు. సర్వేపల్లిలో చంద్రమోహన్రెడ్డి చేసిందేమి లేదని, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరాడని, స్వీకరించి రమ్మంటే పలాయం చిత్తగించాడని విమర్శించారు. సోమిరెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే విసిరిన సవాల్కు కట్టుబడి ఉండాలన్నారు. కాకాణి పూజిత మాట్లాడుతూ చంద్రబాబు అన్ని వర్గాలను మోసగించారన్నారు. కూటమి పాలనలో దాడులు, అరాచకాలు తప్పించి సుపరిపాలన అందించిన దాఖలాలు లేవని విమర్శించారు. కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు చిల్లకూరు సుధీర్రెడ్డి, ఉప్పల శంకరయ్యగౌడ్, ఎం.చిరంజీవిగౌడ్, తలమంచి సురేంద్రబాబు, పద్మనాభరెడ్డి, రమేష్రెడ్డి, శేషమ్మ, సుబ్రహ్మణ్యంరెడ్డి, మల్లికార్జున, గంగాధర్రెడ్డి, మణి, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ పాలన స్వర్ణయుగం
వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలన మహిళలకు స్వర్ణయుగంగా మారింది. సంక్షేమ పథకాలతోపాటు ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎంతో మంది వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా అవతరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అప్పటి వరకు ఉన్న పొదుపు మహిళల రుణాల మొత్తాన్ని నాలుగేళ్లలో తిరిగి వారి ఖాతాల్లోనే జమ చేశారు. గతంలో టీడీపీ చేసిన మోసానికి డీఫాల్టర్లు అయిన పొదుపు గ్రూపులను పునరుద్ధరించి బ్యాంకుల ద్వారా తిరిగి రుణాలిప్పించి.. ఆయా గ్రూపుల్లోని మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా ఎదిగేందుకు దోహదపడ్డారు. విస్తృతంగా పొదుపు రుణాలు, సీ్త్ర నిధి రుణాలు కల్పించి అత్యధిక మంది జీవితాలను మెరుగుపర్చారు. సున్నావడ్డీ, చేయూత, ఆసరా, జగనన్నతోడు వంటి పథకాలతో వారి ఆర్థిక స్వాతంత్య్రానికి దన్నుగా నిలిచారు. అమ్మఒడి వంటి పథకంతోపాటు ప్రతి కుటుంబానికి జగనన్న కాలనీల్లో రూ.లక్షల విలువైన ఆస్తిని సొంతం చేశారు. -
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి
నెల్లూరురూరల్: మెగా డీఎస్సీ–2025 పరీక్షల నిర్వహణలో అవినీతి ఆరోపణలు, లీకేజీలు, అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పందిటి కామరాజు మాట్లాడుతూ డీఎస్సీ 2025 నిరుద్యోగ యువత భవిష్యత్కు సంబంధించి కీలక పరీక్ష డీఎస్సీలో ప్రశ్నపత్రాల భద్రత, పరీక్షల నిర్వహణ, స్పోర్ట్స్ కోటా ఎంపికలు, సర్టిఫికెట్ల పరిశీలన వంటి అంశాలపై నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయ ఉద్యోగులపై పనిభారం నెల్లూరు(పొగతోట): సర్వేలు, ఇంటింటా కార్యక్రమాలు, కేవైసీలు తదితర అదనపు బాధ్యతలతో సచివాలయ ఉద్యోగులపై తీవ్ర పనిభారం పడుతోందని యునైటెడ్ వెల్ఫేర్ జీఎస్డబ్ల్యూఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి తెలిపారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో జేసీ మొగిలి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. సచివాలయ ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్ ప్రమోషన్లు, ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. గతేడాది అక్టోబర్లో ఆరు సంవత్సరాల సర్వీసు పూర్తయిన ఉద్యోగులకు ఇప్పటి వరకు స్పష్టమైన ఆదేశాలు వెలువడలేదని తెలిపారు. పదోన్నతులకు బదులుగా డిప్యుటేషన్లు చూపించడం శాశ్వత పరిష్కారం కాదని, ఉద్యోగుల అభిప్రాయాలను గౌరవిస్తూ పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ దారా సురేష్బాబు, కన్వీనర్ మురళీధర్, శశికిరణ్, అధ్యక్షుడు శ్రీనివాసులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ లోకేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ షాహినా, భానుప్రకాశ్, సంధ్య, పవన్కుమార్, కోటి, బాలరాజు, స్వాతి, దీపిక, సుమన్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 93,230 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 41,754 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో శుక్రవారం రూ.3.83 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
పంచాయతీల సమగ్రాభివృద్ధే లక్ష్యం ● జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ
నెల్లూరు(పొగతోట): గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ సూచించారు. సోమవారం నెల్లూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో జీపీడీపీ (గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక)పై డివిజనల్, మండల స్థాయి అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సభలు నిర్వహించకుండా, ప్రజల అభిప్రాయాలు సేకరించకుండా రూపొందించే ప్రణాళికలు నాణ్యతగా ఉండవన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, యువజన అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ ప్రజలు సూచించిన పనులను ప్రణాళికల్లో పొందుపరచాలని, నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులను గుర్తించాలని సూచించారు. మంగళవారం మండల స్థాయిలో శిక్షణ నిర్వహించి, నెలాఖరులోపు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీపీఓ వసుమతి, డ్వామా పీడీ స్వరూప్, డీడీఓ వాణి, ఎన్ఆర్డీఐ కో ఆర్డినేటర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కాశీ యాత్ర మిగిల్చిన శోకం
వారంతా కాశీ విశ్వనాథుని కనులారా చూసి తరించాలనుకున్నారు. గంగమ్మ ఒడిలో స్నాన మాచరించి పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి జన్మధన్యం చేసుకోవాలని ఆశ పడ్డారు. ప్రత్యేక బస్సులో కాశీయాత్రకు బయల్దేరారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ కాశీ సమీపానికి చేరుకున్నారు. ఆదివారం రాత్రి బిహార్ రాష్ట్రంలో బుద్ధగయాను దర్శించుకుని బయల్దేరారు. సోమవారం ఉదయానికి కాశీకి చేరుకుంటున్నామనే సంతోషంతో శివనామస్మరణ చేసుకుంటూ నిద్రలోకి జారుకున్నారు. కానీ విధి మరోలా తలచింది. లారీ రూపంలో మృత్యువు ముగ్గురిని శాశ్వతంగా శివయ్య వద్దకు చేర్చింది. మరికొందరికి విషాదాన్ని మిగిల్చింది.బంధువులు వెళ్తున్నారని.. ఆత్మకూరు: పట్టణంలోని వీవర్స్కాలనీకి చెందిన తూమా ప్రసాద్, పద్మావతి (43) దంపతులు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వ్యాపారరీత్యా కోవూరులో ఉంటున్నారు. టూర్ నిర్వాహకుడు వెంకటేశ్వర్లు కూడా బాగా తెలిసిన వ్యక్తి కావడం.. బంధువులు వెళ్తున్నామని చెప్పడంతో పద్మావతి భర్తను ఒప్పించి కాశీయాత్రకు బయలుదేరి వెళ్లింది. శివయ్యను దర్శించుకోకుండానే బస్సు ప్రమాదంలో ఆమె మృత్యువాత పడడంతో వీవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న అత్తా, మామలు తమ మనవడు, మనవరాలిని ఎవరు చూసుకోవాలని గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. వంట సహాయకుడిగా వెళ్లి.. సంగానికి చెందిన హజరత్తయ్య, గోవిందమ్మ దంపతులు. వారికి ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహమైంది. కుమారుడికి ఇంకా వివాహం కాలేదు. మృతుడు హజరత్తయ్య వంట సహా యకుడిగా బస్సులో వెళ్లి ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. మృతుడు వంట పనులు లేని సమయంలో బస్టాండ్లో సమోసాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుటుంబానికి పెద్దదిక్కు అయిన హజరత్తయ్య మృత్యువాత పడిన విషయం తెలుసుకుని భార్య గోవిందమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సంగం: సంగంలోని ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి ఈ నెల 1న టూరిస్ట్ బస్సు 15 రోజుల కాశీయాత్రకు బయలుదేరింది. సంగం, ఆత్మకూరు, దుత్తలూరు ప్రాంతాలకు చెందిన 39 మంది యాత్రికులు, యాత్ర నిర్వాహకుడు, ఇద్దరు డ్రైవర్లు, వంట సిబ్బంది కలిపి మొత్తం 43 మందితో బస్సు అన్నవరం, సింహాచలం, పూరి, భువనేశ్వర్ మీదుగా ఆదివారం రాత్రి బిహార్ రాష్ట్రం బుద్ధగయాకు చేరుకుంది. అక్కడ బుద్ధగయా క్షేత్రాన్ని దర్శించుకున్నారు. రాత్రి భోజనాల అనంతరం కాశీకి బయలు దేరారు. అర్ధరాత్రి 12.10 గంటల సమయంలో ఔరంగాబాద్ జిల్లాలో రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని బస్సును అదుపుతప్పి ఢీకొంది. ఈ ఘటనలో ఆత్మకూరు, సంగానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలవగా, మరో 10 మందికి పైగా తీవ్రంగా, మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. మృతుల్లో సంగానికి చెందిన యాత్ర నిర్వాహకుడు, విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ పసుపులేటి వెంకటేశ్వర్లు (64), వంట మాస్టర్ చవడం హజరత్తయ్య (57), ఆత్మకూరుకు చెందిన సోమా పద్మావతి (43) ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో సంగానికి చెందిన బొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, లక్ష్మమ్మ, నీలం శీనయ్య, పద్మ, వింజమూరు శివరంగయ్య, లక్ష్మమ్మ, దంపతులు, కంటాబత్తిన సంపూర్ణమ్మ, కంటాబత్తిన కామాక్షమ్మ, గురవయ్య, డీ రమణ మ్మ, జీ శ్రీదేవి, డీ మల్లేశ్వరి ఉన్నారు. ఆత్మకూరు, దుత్తలూరుకు చెందిన పలువురు యాత్రికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా వెంకటేశ్వర్లు, హజరత్తయ్య, సోమా పద్మావతి మృతదేహాలకు పోస్టుమార్టంను అక్కడి అధికారులు పూర్తి చేశారు. భాష రాక ఇబ్బందులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గయాలోని మగధ మెడికల్ కళాశాలకు తరలించారు. క్షతగాత్రులకు హిందీ భాష రాకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. అయినా వైద్యులు క్షతగాత్రులకు చికిత్స అందించి ప్రాణాలను కాపాడారు. ఆహారం లేక ఇబ్బందులు క్షతగాత్రులను అర్ధరాత్రి ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ సరైన ఆహారం దొరక్క ఆకలితో అలమటించారు. కొందరు పండ్లు తిని ఆకలి తీర్చుకున్నారు. సంగంలో విషాద ఛాయలు కాశీయాత్రకు వెళ్లిన వారిలో సంగం వాసులు 20 మందికి పైగా ఉన్నారు. సోమవారం వేకువజామున బస్సు ప్రమాద విషయం తెలియడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సంగం వాసులు ఇద్దరు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. సంగం నుంచి బయలుదేరిన వారు గాయపడడం కలిచివేసింది. విహారయాత్రలు నిర్వహిస్తూ.. సంగానికి చెందిన పసుపులేటి వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఒక కుమార్తెకు వివాహామైంది. కుమారుడు, కుమార్తెకు వివాహాం కావాల్సి ఉంది. ప్రస్తుతం కుటుంబంతో కలిసి నెల్లూరులోని దర్గామిట్టలో నివాసం ఉంటున్నారు. మృతుడు టూరిస్ట్ బస్సుతో విహార యాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. విక్రమ్రెడ్డి, రాజారెడ్డి దిగ్భ్రాంతి కాశీయాత్రకు బయలుదేరిన టూరిస్ట్ బస్సు బిహార్ రాష్ట్రంలోని ఔరంగబాద్ జిల్లాలో ప్రమాదానికి గురై ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలకు చెందిన ముగ్గురు మృతి చెందడంతో పాటు మరో 15 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి, ఉదయగిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం క్షతగాత్రులకు మెరుగైన వైద్యంతో పాటు మిగిలిన యాత్రికులను క్షేమంగా స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సంగం నుంచి వెళ్లిన 43 మంది యాత్రికులు బిహార్లో ఆగిఉన్న లారీని ఢీకొన్న బస్సు జిల్లా వాసులు ముగ్గురు దుర్మరణం మృతుల్లో సంగం, ఆత్మకూరు వాసులు మరో 15 మందికి తీవ్ర గాయాలు స్వల్ప గాయాలతో బయటపడిన పలువురు స్వల్పగాయాలతో.. దుత్తలూరు: బిహార్లో జరిగిన బస్సు ప్రమాదంలో మండలంలోని రాచవారిపల్లి గ్రామానికి చెందిన 8 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. గ్రామానికి చెందిన చలంచర్ల అలివేలమ్మ, షేక్ కాశింబీ, మోత్కూరు లలితమ్మ, మోత్కూరు కాంతమ్మ, ముసుర్ల జయమ్మ, అండ్రా రాధా, షేక్ ఖాజమ్మ, కొంకల సుబ్బరత్నమ్మకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉంది. బస్సు ప్రమాదం విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఫోన్ ద్వారా సమాచారాన్ని తెలుసుకుని ఊరట చెందారు. -
కాశీయాత్రలో విషాదం
సంగం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం నుంచి కాశీ యాత్రకు 43 మందితో బయలుదేరిన టూరిస్టు బస్సు బిహార్ రాష్ట్రంలోని గయ జిల్లా బుద్ధగయ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి ప్రమాదానికి గురైంది. ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో బస్సులోని ముగ్గురు యాత్రికులు దుర్మరణం చెందారు. 15 మంది తీవ్రంగా గాయపడగా, పలువురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. మృతుల్లో సంగంకు చెందిన టూరిస్టు బస్సు నిర్వాహకుడు, విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ పసుపులేటి వెంకటేశ్వర్లు (64), వంట మాస్టర్ చవడం హజరత్తయ్య (57), ఆత్మకూరుకు చెందిన సోమా పద్మావతి (43) ఉన్నారు.తీవ్రంగా గాయపడిన వారిలో సంగంకు చెందిన బొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, లక్ష్మమ్మ, నీలం శీనయ్య, పద్మ, వింజమూరు శివరంగయ్య, లక్ష్మమ్మ, కంటాబత్తిన సంపూర్ణమ్మ, కంటాబత్తిన కామాక్షమ్మ, గురవయ్య, డి.రమణమ్మ, జి.శ్రీదేవి, డి.మల్లేశ్వరి ఉన్నారు. ఆత్మకూరు, దుత్తలూరుకు చెందిన పలువురు యాత్రికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులకు గయలోని అనుగ్రహ నారాయణ మగధ మెడికల్ కళాశాలలో చికిత్స అందిస్తున్నారు. కాగా క్షతగాత్రులకు హిందీ భాష తెలియక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైద్యులు మాత్రం క్షతగాత్రులకు చికిత్స అందించి కాపాడారు. సరైన ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.బస్సు ప్రమాదం బాధాకరం: వైఎస్ జగన్సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా నుంచి కాశీయాత్రకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు బీహార్లోని ఔరంగాబాద్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు భక్తులు మృతిచెందిన ఘటనపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సంగం మండలానికి చెందిన ఇద్దరు, ఆత్మకూరుకు చెందిన ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఈ తీరని విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు. ప్రమాదంలో గాయపడిన 15 మంది యాత్రికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
వైఎస్సార్సీపీ పాలనలో వ్యవసాయాభివృద్ధి
సంవత్సరం రైతులు నగదు (కోట్లల్లో రూ.) 2020–21 10,495 రూ.1.99 2021–22 1,291 రూ. 2.69 2022–23 25,695 రూ. 5.75 ధాన్యం ధరలు పాతాళానికి పతనం రైతు భరోసా లబ్ధిదారుల రైతులు 9,31,943 మంది ఐదేళ్లలో వైఎస్సార్ రైతు భరోసా సాయం రూ.1,510.70 కోట్లు ఒక్కొక్క భవన నిర్మాణానికి నిధులు రూ. 21.80 లక్షలు రైతు భరోసా కేంద్రాలు 656 చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ధాన్యం ధరలే కాదు.. ఏ పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కాదు కదా.. కనీసం ప్రకటించిన మద్దతు ధర కూడా దక్కే పరిస్థితి లేదు. చంద్రబాబు సీఎంగా దిగిపోయే 2004లో కూడా పుట్టి ధాన్యం రూ.4 వేలు దాటిన చరిత్ర లేదు. ఆ తర్వాత వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లల్లో ధాన్యం ధరలు ఊహించని విధంగా ఏటా పెరిగాయి. వైఎస్సార్ హయాంలో పుట్టి ధాన్యం రూ.13 వేల వరకు ఎగబాకాయి. ఇక ప్రత్యేకించి జిలకర మసూరి రకం అయితే ఏకంగా రూ.17 వేల వరకు అప్పట్లోనే పలికాయి. తిరిగి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2014–19 మధ్య కాలంలో మద్దతు ధరలు బాగా పెరిగినప్పటికీ.. పుట్టి రూ.10 వేల నుంచి రూ.11 వేలకు కొనే పరిస్థితి లేకుండా పోయింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న జిలకర మసూరి రకాన్ని సైతం మిల్లర్లకు మేలు చేకూర్చేందుకు ‘ఏ’గ్రేడ్ రకంగా ముద్ర వేసి ఆ రకం ధాన్యం ధరలను గుట్ట కూల్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లూ మద్దతు ధరలు లభించేలా అనేక చర్యలు తీసుకున్నారు. ఆ ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది పుట్టి మద్దతు ధరకు మించి రూ.25 వేల వరకు రైతులు అమ్ముకున్నారు. తాజాగా పూర్తయిన ఖరీఫ్ సీజన్లో పుట్టి ధాన్యం రూ.15 వేల నుంచి రూ.17 వేల లోపే కొనుగోలు చేసిన పరిస్థితి తెలిసిందే. ఒక్క ధాన్యం ధరలే కాకుండా గతేడాదితో పోల్చితే.. పసుపు రైతు పుట్టి ముంచారు. పొగాకు ధరలు అయితే కేజీకి రూ.100 తగ్గిపోయింది. మిర్చి ధరలు అయితే నేలచూ పులు చూస్తున్నాయి. మామిడి, సపోటా, నిమ్మ, బత్తాయి ధరలు కూడా ఇదే రీతిలో ఉన్నాయి. రైతులకు గిట్టుబాటు కల్పించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. పంటలకు ధరలు లేకపోతే ఎందుకు సాగు చేయడం అని సాక్షాత్తు వ్యవసాయశాఖ మంత్రి అంటారు. అసలు పంటలే సాగు చేయొద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెబుతారు. మరి ప్రభుత్వం ఉండేది ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సింహపురి వ్యవసాయాధారిత జిల్లాగా పేరుగాంచింది. ముక్కారు పంటలతో ధాన్యసిరులతో విలసిల్లిన జిల్లాలో ఇప్పుడు అన్నదాతలు కుమిలి కుమిలి దుఃఖిస్తున్నారు. ‘వ్యవసాయం దండగ అని చిన్న చూపు చూసిన సీఎం చంద్రబాబు.. ఇప్పటికీ అదే పంథాను అనుసరిస్తున్నారు. చంద్రబాబు పాలనలో కరువు కాటకాలు, ధరాఘాతాలతో వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లిపోయింది. కాడిపట్టిన రైతులు.. చివరకు రాళ్లు, మట్టి మోసే కూలీలుగా మారారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంతి అయ్యాక వ్యవసాయాన్ని పండగ చేశారు. ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో నాలుగు అడుగులు ముందుకేసి అంతకు మించి రైతును ఆర్థిక సంక్షోభం నుంచి రారాజుగా చేశారు. ఆదుకుంటానని.. అప్పుల ఊబిలోకి.. జిల్లాలో సుమారు 30 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా అత్యధికంగా దాదాపు 9 లక్షల నుంచి 9.5 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుండగా, మిగతా మెట్ట పంటలు సాగవుతున్నాయి. ఇందులో సన్న, చిన్నకారు రైతులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సుమారు 2.15 లక్షల మంది రైతులకు ఏటా వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద ఏటా రూ.13,500 అందజేసింది. అయితే ఎన్నికల ముందు చంద్రబాబు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా రూ.20 వేల లెక్కన ‘అన్నదాత సుఖీభవ’ ఇస్తామని హామీలిచ్చారు. తొలి ఏడాది ఈ పథకానికి మంగళం పలికారు. రెండో ఏడాదిలో 3.19 లక్షల మంది అర్హులు దరఖాస్తులు చేసుకుంటే.. చివరకు 1,95,866 మందికి ఇచ్చి చేతులు దలుపుకున్నారు. దాదాపు 84,134 మంది దరఖాస్తులను అకారణంగా తిరస్కరించినట్లు సమాచారం. ఈకేవైసీ, ఆధార్లింక్, బ్యాంకు అకౌంట్ లింకు కాలేదంటూ తదితర కారణాలు చూపి మరో 14 వేల దరఖాస్తులు వివిధ రకాల కారణాలతో పెండింగ్ పెట్టినట్లు వ్యవసాయశాఖ అధికారిక తెలుస్తోంది. ‘సూపర్’ మోసం జిల్లాలో అర్హులైన రైతులకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అడ్డదిడ్డంగా.. అలవి కాని హామీలిచ్చారు. గతంలో 9 ఏళ్లు, ఆ తర్వాత ఐదేళ్లు అధికారంలో ఉండీ కూడా ఏ నాడు రైతుల సంక్షేమానికి ఒక్క పథకాన్ని అమలు చేయని చంద్రబాబు సూపర్ సిక్స్లో భాగంగా పీఎం కిసాన్ సాయం కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఏటా ప్రతి రైతుకు రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఇస్తామని హామీలిచ్చారు. తొలి ఏడాది ఎగనామం పెట్టితే.. మలి ఏడాదిలో 1,95,866 మందికే ఇచ్చి సరిపుచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోని లబ్ధిదారులను అనేక కారణాలు చూపించి ఏరివేసింది. అధికారంలోకి రాక ముందు కౌలు రైతులకు పథకాన్ని వర్తింప చేస్తామని చెప్పినా.. అమల్లోకి వచ్చే సరికి కౌలు రైతుల ఊసే ఎత్తకుండా.. అర్హులైన లబ్ధిదారుల సంఖ్యకు కోత పెట్టింది. అర్హత ఉండీ పథకం వర్తించని లబ్ధిదారులకు నెల రోజులు గడువు ఇస్తున్నామని అర్హతులతో తిరిగి దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి తిరిగి సాయం అందిస్తామని నిధుల విడుదల ప్రతిసారి చెబుతోంది. కానీ అర్హత ఉండీ లబ్ధి చేకూరని 84,134 మంది రైతులకు నేటికీ దిక్కులేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆర్బీకేలో రైతుల జాబితాలను నోటీసు బోర్డుల్లో ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికి పారదర్శకతకు పాతరేసింది. సంవత్సరం దరఖాస్తు చేసుకున్న లబ్ధి చేకూరిన ఆర్థిక సాయం రైతులు రైతులు (రూ.కోట్లల్లో) 2024–25 3,19,000 – – 2025–26 3,19,000 1,95,866 289.05 2026–27 (ఈ ఏడాదికి ఇంకా ఎప్పుడు జమ చేసేది స్పష్టత లేదు.) వైఎస్సార్సీపీ పాలనలో సున్నా వడ్డీ అర్హులు తిరిగి దరఖాస్తు చేసుకుంటే సాయమందిస్తామని చెప్పినా.. ఫలితం శూన్యం 84,134 మంది రైతుల దరఖాస్తులు పెండింగ్ కౌలు రైతులకు పంగనామాలు సున్నా వడ్డీ చెల్లింపులకు దిక్కులేదు ఉచిత పంటల బీమాకు చెల్లుచీటి రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ ఊసేలేదు వైఎస్సార్ రైతు భరోసా పథకం టీడీపీ పాలనలో అన్నదాత సుఖీభవ రైతు భరోసా పడేది.. సుఖీభవ పడట్లేదు నాకు ఒక ఎకరం మాగాణి భూమి ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలో నాకు క్రమం తప్పకుండా వైఎస్సార్ రైతు భరోసా జమయ్యేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి ఏడాది అసలు వేయలేదు. రెండో ఏడాదిలో కూడా పడకపోవడంతో వెళ్లి అడిగితే.. సాంకేతిక కారణంతో నగదు జమ కాలేదని అధికారులు చెప్పారు. రెండో సారి వెళ్తే.. ఆధార్ లింక్ కాలేదని చెప్పారు. సరి చేస్తామని చెప్పినా.. ఇంత వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మూడో ఏడాదైనా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ఇస్తుందో లేదో తెలియదు. – పిల్లి బాలమ్మ, బల్లవోలు, చిల్లకూరు మండలం -
నిండా నిర్లక్ష్యం.. తీరని నష్టం
నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో పదిరోజులుగా జనన, మరణ ధ్రువపత్రాల జారీ నిలిచిపోయింది. అదే విధంగా పక్షవాతం బాధితులకు జారీ చేసే దివ్యాంగుల సర్టిఫికెట్ల ప్రక్రియ కూడా మార్చి 31వ తేదీ నుంచి ఆగిపోయింది. దీంతో బాధితులు రోజూ ఆస్పత్రి చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యపై స్పష్టమైన సమాధానం చెప్పే అధికారులు లేకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు ప్రభుత్వ పథకాల లబ్ధిని కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఓటీపీ రాకపోవడంతో.. పెద్దాస్పత్రిలో జనన, మరణ ధ్రువపత్రాల జారీ బాధ్యత అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా ఉన్న డాక్టర్ కళారాణి పర్యవేక్షణలో కొనసాగేది. స ర్టిఫికెట్ల జారీకి అవసరమైన కంప్యూటర్ లాగిన్ ప్రక్రియలో మొదట డాక్టర్ కళారాణి మొబైల్కు ఓటీపీ వచ్చేది. ఆ ఓటీపీని కంప్యూటర్ ఆపరేటర్కు అందజేసిన తర్వాత సర్టిఫికెట్ ప్రాసెస్ చేసేవారు. అయితే ఇటీవల ప్రభుత్వం ఆమెను వేరే జిల్లాకు బదిలీ చేయడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. బదిలీ అనంతరం వెంటనే మరొక అధికారికి బాధ్యతలు అప్పగించి, సంబంధిత ఓటీపీ వ్యవస్థను బదిలీ చేసే చర్యలు చేపట్టాల్సి ఉండగా ఆస్పత్రి యాజమాన్యం అలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా రోజూ 50 మందికి పైగా ధ్రువపత్రాల కోసం ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికీ సమస్య పరిష్కారంపై ఎవరూ స్పందించడం లేదని బాధితులు వాపోతున్నారు. అందని సదరం సర్టిఫికెట్లు పక్షవాతంతో నడవలేని, కదల్లేని రోగులకు జారీ చేసే దివ్యాంగుల సర్టిఫికెట్ల ప్రక్రియ కూడా మార్చి 31వ తేదీ నుంచి నిలిచిపోయింది. ఇప్పటి వరకు ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు రోగులను పరిశీలించి న్యూరో ఫిజీషియన్కు రిఫర్ చేసేవారు. న్యూరో వైద్యుడు తన అభిప్రాయాన్ని నమోదు చేసిన అనంతరం ఆర్థోపెడిక్ విభాగం అధికారులు వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసేవారు. దీంతో సర్టిఫికెట్ వయ్యేది. అయితే ప్రభుత్వం నిబంధనలు మార్చిందంటూ ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు వివరాలను అప్లోడ్ చేయడం నిలిపివేసినట్లు తెలుస్తోంది. మరోవైపు న్యూరో ఫిజీషియన్ మాత్రం తాను నిబంధనల ప్రకారమే పని చేస్తున్నానని పేర్కొంటూ సంబంధిత ఉత్తర్వులను సూపరింటెండెంట్కు అందజేసినట్లు సమాచారం. రెండు విభాగాల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా పక్షవాతం బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు. పరిస్థితిని సూపరింటెండెంట్ ఇప్పటి వరకు సరిచేయకపోవడంతో దివ్యాంగుల సర్టిఫికెట్లు అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్లు వచ్చేనా? మరణించిన వారి కుటుంబ సభ్యులు, పక్షవాతం వంటి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారు ప్రభుత్వ పింఛన్ల కోసం తప్పనిసరిగా వైద్యులు జారీ చేసే ధ్రువపత్రాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. ప్రజల నుంచి వచ్చిన విమర్శల నేపథ్యంలో దాదాపు రెండేళ్ల తర్వాత ఈనెల 12వ తేదీ వరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అవసరమైన ధ్రువపత్రాలు అందకపోతే అర్హులైన లబ్ధిదారులు పింఛన్లకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో అభాగ్యులు తీవ్రంగా నష్టపోతారు. చిన్నారుల ధ్రువపత్రాలకూ ఆటంకం ఆస్పత్రిలో జన్మించిన శిశువులకు జనన ధ్రువపత్రాలు అత్యంత కీలకం. ఆధార్ నమోదు, జనగణన, బీమా పాలసీలు, విద్యా ప్రవేశాలు తదితర అనేక అవసరాలకు జనన ధ్రువపత్రం తప్పనిసరి. ప్రస్తుతం జనన ధ్రువపత్రాల జారీ నిలిచిపోవడంతో కొత్తగా జన్మించిన శిశువుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు వెంటనే జనన, మరణ ధ్రువపత్రాలు, దివ్యాంగుల సర్టిఫికెట్లు జారీ చేయాలని బాధితులు కోరుతున్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పెద్దాస్పత్రిలో ఆగిన జనన, మరణ ధ్రువపత్రాల మంజూరు వితంతు పింఛన్కు భర్త మరణ ధ్రువపత్రం తప్పనిసరి దివ్యాంగుల సర్టిఫికెట్ల మంజూరులో నిర్లక్ష్యం ఈనెల 12తో ముగియనున్న దరఖాస్తుల గడువు పట్టించుకోని అధికారులు -
అడగలేరని.. చిన్నచూపా
గతంలోనూ ఘటనలు● పురిటి బిడ్డలకు రక్షణ కరువు ● ఎలక్ట్రానిక్ ట్యాగ్ను తీసేసిన కూటమి ప్రభుత్వం ● సర్వజన ఆస్పత్రిలో శిశువును విక్రయించిన తండ్రి ● తల్లి కేకలతో బిడ్డను కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది ● నిందితుడిని వదిలేసిన పోలీసులు నెల్లూరు(అర్బన్): కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు పసిబిడ్డల పాలిట శాపంగా మారాయి. అప్పుడే పుట్టిన శిశువులు లేదా కొద్దిరోజుల వయసున్న బిడ్డలను అపహరణల నుంచి రక్షించేందుకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల ప్రసూతి విభాగాల్లో శిశువుల చేతికి లేదా కాలికి ప్రత్యేక ఎలక్ట్రానిక్ ట్యాగ్ను అమర్చేవారు. దీనిని ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) ఆధారిత బేబీ ట్యాగింగ్ సిస్టమ్ లేదా ఎలక్ట్రానిక్ ఇన్ఫాంట్ ప్రొటెక్షన్ సిస్టమ్ అని పిలుస్తారు. ఈ ట్యాగ్ ఆస్పత్రి భద్రతా వ్యవస్థతో అనుసంధానమై ఉంటుంది. అనుమతి లేకుండా శిశువును వార్డు లేదా నిర్దేశిత ప్రాంతం నుంచి బయటకు తీసుకెళ్లేందుకు ప్రయ త్నిస్తే వెంటనే అలారం మోగుతుంది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై శిశువును కాపాడే అవకాశం ఉంటుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని సర్వజన, జిల్లా ఆస్పత్రుల్లో ఈ విధానం అమల్లో ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శిశువులకు ట్యాగ్లు అమర్చే విధానాన్ని నిలిపివేసింది. దీంతో అలారంలు అలంకారప్రాయంగా మారిపోయాయి. పురిటి బిడ్డల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి నిదర్శనంగా 5వ తేదీన నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రసూతి విభాగంలో చోటుచేసుకున్న ఘటన నిలిచింది. రూ.50 వేల కోసం.. అనంతసాగరం ప్రాంతానికి చెందిన ముక్తియార్, లక్ష్మీకాంత దంపతులకు ఇప్పటికే ఇద్దరు కుమారులున్నారు. ఇటీవల లక్ష్మీకాంత ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మూడోసారి మగబిడ్డకు జన్మనిచ్చింది. మద్యానికి బానిసైన భర్త తన భార్యకు తెలియకుండా నవజాత శిశువును విక్రయించేందుకు ప్రయ త్నించాడు. శిశువును రూ.50 వేలకే విక్రయించేందుకు ఓ వ్యక్తితో బేరం కుదుర్చుకున్నాడు. భార్య మరుగుదొడ్డికి వెళ్లిన సమయంలో బురఖా ధరించి బిడ్డను తీసుకుని ఆస్పత్రి బయటకు వచ్చాడు. ఆస్పత్రి ఎదురుగా కారులో వేచి ఉన్న వ్యక్తులకు శిశువును అప్పగించాడు. అయితే మంచంపై బిడ్డ కనిపించకపోవడంతో తల్లి లక్ష్మీకాంత ఆందోళనకు గురై ఏడుస్తూ బయటకు వచ్చింది. ఆమె కేకలు విన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై కారును చుట్టుముట్టి శిశువును సురక్షితంగా తిరిగి తల్లికి అప్పగించారు. ట్యాగ్ ఉంటే ఘటనే జరిగేది కాదు శిశువుకు ఎలక్ట్రానిక్ ట్యాగ్ అమర్చివుంటే, వార్డు పరిధి దాటిన వెంటనే అలారం మోగేది. దీంతో శిశువును బయటకు తీసుకెళ్లడం సాధ్యమయ్యేది కాదు. ఈ ఘటన మరోసారి బేబీ ట్యాగింగ్ విధానం అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. తండ్రే నిందితుడు కావడంతో.. ఘటన అనంతరం సెక్యూరిటీ సిబ్బంది ముక్తియార్ను నాలుగో నగర పోలీసులకు అప్పగించారు. విచారణలో తాను బిడ్డను పోషించలేక విక్రయించేందుకు ప్రయత్నించానని, కొనుగోలు చేసిన వ్యక్తులు దర్గా ప్రాంతంలో పరిచయమైన వారేనని ముక్తియార్ చెప్పినట్లు సమాచారం. అయితే పోలీసులు అతడిపై కేసు నమోదు చేయకుండా హెచ్చరించి వదిలేసినట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. దీంతో 6వ తేదీన ఉదయం ముక్తియార్ తిరిగి ఆస్పత్రికి వచ్చి, మూడో బిడ్డను తాను పోషించలేను, ఎలాగైనా అమ్మేస్తాను అంటూ నిర్భయంగా మాట్లాడినట్లు అక్కడి వారు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడమే అతడికి ధైర్యం ఇచ్చిందని ఆస్పత్రి పరిసరాల్లో చర్చ సాగింది.గతంలో కూడా నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో తల్లితో ఉన్న నాలుగేళ్ల చిన్నారిని అపహరించిన ఘటన చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు చిన్నారిని గుర్తించి రక్షించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు, వైద్యారోగ్య శాఖలపై ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నవజాత శిశువుల భద్రత కోసం తిరిగి బేబీ ట్యాగింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
నాడు స్వర్ణయుగం.. నేడు తిరోగమనం
ఇది పొగాకు రైతుల దుస్థితి వైఎస్సార్సీపీ హయాంలో క్వింటా కూటమి పాలనలో క్వింటా రూ.37,000 రూ.23,900 జిల్లాలో కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల్లో వర్జీనియా పొగాకు పంటను రైతులు విస్తృతంగా సాగు చేస్తున్నారు. వేల మంది పొగాకు పంట సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో పొగాకు రైతులకు స్వర్ణయుగంలా సాగింది. పొగాకు ధరలు పతనమైన సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వెంటనే మార్క్ఫెడ్ను రంగంలోకి దించి నేరుగా వేలం ప్రక్రియలో పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంది. దీంతో పొగాకు వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు లాభాల బాట పట్టారు. ఐదేళ్లూ కాసుల పంటలు పండాయి. 2022–23, 2023–24 సీజన్లు అయితే రికార్డు ధరలు పొగాకు రైతు లకు వచ్చాయి. ఇక బ్రైట్ గ్రేడ్ పొగాకు అయితే ఏకంగా క్వింటా రూ.37 వేల వరకు పలికింది. పొగాకు రైతులకు మరో మేలు చేసే చర్యలు కూడా గత ప్రభు త్వం తీసుకుంది. అప్పటి వరకు అధికంగా పండించిన పొగాకుపై 5 శాతం వరకు జరిమానా విధించి పొగాకు కొనుగోలు చేసేవారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అధిక పొగాకు ఉత్పత్తులపై ఉన్న జరిమానాలు పూర్తిగా రద్దు చేయించారు. దీంతో రైతులు ఎటువంటి జరిమానాలు లేకుండానే అధికంగా పండించిన పొగాకును వేలం కేంద్రాల్లో అమ్ముకునే అవకాశం లభించింది. దీంతోపాటు పొగాకు చూర, ముక్క వంటివి కూడా వేలం కేంద్రాల్లోనే అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. దీంతో రైతులకు అన్ని విధాలా లాభాలు చేకూర్చి ఆదాయాలు రెట్టింపయ్యాయి. కూటమి పాలనలో క్వింటాకు రూ.13,100 నష్టం ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. 2024–25, 2025–26 సీజన్లలో పొగాకు అమ్మకాల ధరలు దారుణంగా ఉన్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో బ్రైట్ గ్రేడ్ కేజీ పొగాకు రూ.365 పలికితే అదే పొగాకు కూటమి పాలనలో రూ.239లకు కొనుగో లు చేస్తున్నారు. అంటే క్వింటా పొగాకు మీద ఒక రైతుకు రూ.13,100 వరకు నష్టపోతున్నారు. -
రాష్ట్ర గవర్నర్ రాక రేపు
నెల్లూరురూరల్: రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్నజీర్ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గవర్నర్ ఉదయం 10.50 గంటలకు హెలికాప్టర్లో నెల్లూరులోని పోలీస్ పరేడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 11.15 గంటలకు కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న 10, 11, 12వ స్నాతకోత్సవాల కార్యక్రమంలో పాల్గొంటారు. గ్రాడ్యుయేట్స్కు పట్టాలు, గౌరవ డాక్టరేట్స్లు ప్రదానం చేయనున్నారు. అనంతరం తిరుపతికి బయలుదేరుతారు. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి వరికుంటపాడు: మండలంలోని పెద్దిరెడ్డిపల్లిలో పిడుగుపాటుకు అరవ రమణయ్య (45) మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. రమణయ్య గ్రామ శివారులో గొర్రెలను మేపుతుండగా ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఈ క్రమంలో సమీపంలో పిడుగు పడడంతో రమణయ్య తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు రమణయ్యకు భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు(వేదాయపాళెం): వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ జీఎల్ శివజ్యోతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో నిర్వహించే సేంద్రియ వ్యవసాయం, మిద్దె తోటల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం కోర్సులకు ఆసక్తి గల యువత, రైతులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఒక్కో కోర్సుకు రూ.1500 రుసుం చెల్లించాల్సి ఉంటుందరు. ఇతర వివరాలకు భక్తవత్సలనగర్లోని కృషి విజ్ఞాన కేంద్ర కార్యాలయంలో సంప్రదించాలన్నారు. పశువుల ప్రాణాంతక వ్యాధులకు ఉచిత టీకాలు నెల్లూరు (వేదాయపాళెం): పశువులు, మూగజీవాలను ప్రాణాంతక సాంక్రమిత వ్యాధుల నుంచి కాపాడేందుకు ఉచిత టీకాల కార్యక్రమం చేపడుతున్నామని పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ చైతన్య కిషోర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జబ్బవాపు నివారణకు ఈ నెల 10 నుంచి 30వ తేదీ వరకు, చిటిక వ్యాధి నివారణకు ఈ నెల 15 నుంచి జూలై 15 వరకు, గొంతువాపు వ్యాధి నివారణకు ఈ నెల 25 నుంచి జూలై 25 వరకు, నీలి నాలుక వ్యాధి నివారణకు జూలై 1 నుంచి 30 వరకు టీకాలు ఉచితంగా వేస్తామని ఆయన తెలిపారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న ప్రస్తుత తరుణంలో పశువులు, మేకలు, గొర్రెల్లో సంక్రమించే వ్యాధులు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని తెలిపారు. ముందస్తు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్దేశిత గడువులోపు మాత్రమే నిర్వహిస్తామన్నారు. అందువల్ల రైతులు పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో టీకాలు వేయించాలని తెలిపారు. శ్రీవారి దర్శనానికి 20 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుతుంది. శనివారం అర్ధరాత్రి వరకు 90,107 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 52,236 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.23 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామి వారిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామివారిని దర్శించుకోగలుగుతున్నారు. -
కొమ్మి సోదరుడి అక్రమ దందా
● కూటమి ప్రభుత్వం వచ్చాక రెచ్చిపోతున్న తెలుగు తమ్ముడు ● పెన్నా పోరంబోకు భూముల్లో ఇసుక దోపిడీ ● ఆయన గుప్పెట్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ● తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులుచేజర్ల: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగు తమ్ముళ్ల అవినీతికి అడ్డు లేకుండా పోయింది. ప్రకృతి వనరులు దోచుకుంటున్నారు. ఓ మాజీ ఎమ్మెల్యే సోదరుడు యథేచ్ఛగా పెన్నా పోరంబోకు భూమిలో ఉన్న ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇప్పటికే వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి నిబంధనలకు విరుద్ధంగా అతడి ఆధీనంలో ఉన్నాయి. అది చాలుదన్నట్టుగా పెన్నా పరివాహక ప్రాంతం నుండి ఇసుకను దోచే కార్యక్రమం చేపట్టాడు. కాగా 6వ తేదీన గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారం ఉందని.. తెలుగుదేశం రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు స్వగ్రామమైన చేజర్ల మండలం, పుల్లనీళ్ల్లపల్లి గ్రామంలో ఆయన సోదరుడు కొమ్మి సిద్ధులు నాయుడు పెన్నా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఇసుకను భారీ యంత్రాల సహాయంతో లోడేస్తున్నాడు. పెల్లేరు రెవెన్యూ గ్రామ పరిధిలోని 235 – 2లో 10 ఎకరాలకు పైగా అనాధీన భూమి ఉండగా దానిని సిద్ధులు నాయుడు ఆక్రమించుకుని ఉన్నాడు. ఈ పొలం చదును చేసేందుకు ఇసుకను తరలిస్తున్నారు. అతను ఆక్రమించిన భూమి నుంచి ఎగువ వైపున పొలాల్లోకి అధికారికంగా రహదారి ఉన్నా దానిని సైతం ఆక్రమించి ఇబ్బందులు పెడుతున్నారని బాధిత రైతులు, గ్రామస్తులు చెబుతున్నారు. తహసీల్దార్ దృష్టికి.. మా ప్రభుత్వం ఇది.. ఏం చేస్తారంటూ రాజకీయ, కుల బలంతో ఇబ్బందులకు గురిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే సోదరుడి చేష్టలకు గ్రామస్తులు విసిగిపోయారు. ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకుని శనివారం చేజర్ల తహసీల్దార్ ఆర్.మస్తానయ్యకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని సిద్ధులు నాయుడు ఆక్రమించుకుని అనుభవిస్తున్నట్లు చెప్పారు. తాజాగా పెన్నా పోరంబోకు భూముల్లోని ఇసుకను సైతం దోచేస్తూ పొలాలకు వెళ్లే దారిని సైతం ఆక్రమించాడన్నారు. రాజకీయ బలంతోనే లక్ష్మయ్య నాయుడి సోదరుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలహీన వర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను దౌర్జన్యంగా ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పెన్నా పరీవాహక ప్రాంతంలోని వందలాది ఎకరాలు ఏటి పోరంబోకు భూముల్లో బోర్ పాయింట్లు, విద్యుత్ సర్వీసులు అక్రమంగా ఏర్పాటు చేసి నెల్లూరుకు చెందిన ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చి ఏటా రూ.లక్షలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాడని తెలిపారు. కలెక్టర్ స్పందించి సదరు మాజీ ఎమ్మెల్యే సోదరుడి ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను వెలికి తీసి బాధ్యులకు అందజేయాలన్నారు. అలాగే కబ్జాకు గురైన భూములను అతని చెర నుంచి విడిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ● ఇసుక అక్రమ దందా విషయంపై తహసీల్దార్ను సాక్షి వివరణ కోరగా ప్రభుత్వ భూముల్లో నుంచి ఇసుకను తరలించడం చట్టరీత్యా నేరమని, విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.పెన్నా ప్రాంతంలో ట్రాక్టర్లో ఇసుక లోడింగ్ట్రాక్టర్ ద్వారా ఇసుక డంప్ చేస్తూ.. -
రెండు సార్లు తిరిగా.. జవాబు లేదు
నా కుమార్తె 11 నెలల క్రితం పెద్దాస్పత్రిలో పురుడు పోసుకుంది. మగబిడ్డ పుట్టాడు. బర్త్ సర్టిఫికెట్ కోసం ఇప్పటికే రెండుసార్లు తిరిగా. సమాధానం లేదు. త్వరగా సర్టిఫికెట్ ఇప్పించాలి. – మొద్దు శోభ, యామాలపాడు, కావలి మండలం అవకాశం కోల్పోతాంనా తండ్రి మహబూబ్జాన్ పెద్దాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెంది నెలరోజులు కావొస్తోంది. డెత్ సర్టిఫికెట్ కోసం మూడు దఫాలుగా తిరుగుతున్నా. మళ్లీ రా అంటున్నారు. ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు. ఈనెల 12వ తేదీలోపు మా అమ్మ విడో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత డెత్ సర్టిఫికెట్ ఇస్తే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతాం. కలెక్టర్ స్పందించి వెంటనే సర్టిఫికెట్ ఇప్పించాలి. – మక్సూద్, గాంధీ నగర్, నెల్లూరు -
‘నేతన్న నేస్తం’ పథకం అమలుకు డిమాండ్
● 22న కలెక్టరేట్ ఎదుట ధర్నా నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘నేతన్న నేస్తం’ పథకం అమలు చేయాలని ఏపీ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు డిమాండ్ చేశారు. నగరంలోని మన హాస్పిటల్లో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ రాష్ట్ర కన్వీనర్లు బండారు ఆనంద్ ప్రసాద్, బాలకృష్ణ, పూర్ణచంద్రరావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చేనేతలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. 50 సంవత్సరాల వయసు నిండిన ప్రతి కార్మికుడికి పింఛన్ ఇవ్వాలన్నారు. చేనేత పరిశ్రమకు విధిస్తున్న జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం చేనేతలపై సవతితల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. న్యాయమైన కోర్కెల సాధన కోసం ఈనెల 22వ తేదీన కలెక్టరేట్ వద్ద శాంతియుత ధర్నా నిర్వహిస్తామన్నారు. జిల్లాకు చెందిన చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, శంకరయ్య, పముజుల దశరథరామయ్య, బూదాటి రాధయ్య, రామసుబ్బయ్య, పడవల వెంకటశేషయ్య, వైఎస్సార్సీపీ చేనేత విభాగం అధ్యక్షుడు రాజా, రవి, హరి తదితరులు పాల్గొన్నారు. -
కొనేశారు.. ఇలా పడేశారు
ఇక ఎందుకూ పనికిరావేమో.. రోడ్లను శుభ్రం చేసే యంత్రాలు దెబ్బతింటున్న వాహనాలు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తుల సంరక్షణలో నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.కోట్ల వ్యయంతో కొన్న వాహనాలు, యంత్రాలు, ఇతర వస్తువులు ప్రస్తుతం పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిరుపయోగంగా పడి ఉన్నాయి. నగరంలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనుల కోసం తెచ్చిన ఈ వాహనాలు నిర్వహణ లేకపోవడంతో తుప్పుపట్టి దెబ్బతింటున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నగరంలోనే ఈ పరిస్థితి నెలకొనడం గమనార్హం. నిరుపయోగంగా ఉన్న వాహనాలపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
దమ్ముంటే విజిలెన్స్ విచారణ జరిపించు
● రియల్టర్లను బెదిరించడం నిజం కాదా? ● ఆక్రమణలు ఉన్నాయని హడావుడి చేయడం నిజం కాదా? ● అవినీతి, దోపిడీ, మనీ స్కామ్లే కావ్య చరిత్ర ● మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి ఆరోపణలుకావలి : కావలి పట్టణం చుట్టు పక్కల ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ లేఅవుట్లలో 126 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించారని హడావుడి చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. దమ్ము, ధైర్యం ఉంటే.. విజిలెన్స్ విచారణ జరిపించి ఆ భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం కావలిలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వెంచర్లలో ప్రభుత్వ భూమి, కాలువ పోరంబోకు భూమి ఉందని పురపాలక సంఘ అధికారులతో తనిఖీ చేయించి రియల్టర్లను బెదిరించడమే కాకుండా వెంచర్లలో గుంటలు తీయించడం నిజం కాదా? అని నిలదీశారు. ఏకంగా విజిలెన్స్ విచారణ చేయాలంటూ లేఖలు రాసి మా పార్టీలో ఉన్న రియల్టర్లు భూముల ఆక్రమణల పేరుతో వేధించి, ముడుపులు దండుకుని విచారణను ఆపడం నిజం కాదా? అని ప్రశ్నించారు. మీ పార్టీలోని ఒక వ్యక్తి ప్రోద్బలంతో విజిలెన్స్ అధికారులు విచారణకు రావడంతో నీకు నచ్చని వారి వెంచర్లను తనిఖీ చేయాలంటూ ఆంక్షలు విధించలేదా అని నిలదీశారు. విచారణను ఎదుర్కోలేక.. అధికారులపై దౌర్జన్యాలా? మీ పార్టీలోని ఒక నాయకుడు గట్టిగా పట్టుబట్టడంతో విజిలెన్స్ అధికారులు కావలిలోని రియల్ ఎస్టేట్లలో భూ ఆక్రమణలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టడంలో భాగంగా వివిధ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తుంటే ఎమ్మెల్యే అనుచరులు విజిలెన్స్ అధికారులపై దౌర్జన్యం చేయించడం వెనుక నీ పాత్ర ఉందని, విచారణను ఎదుర్కోలేకనే ఇలా బరితెగించారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేకు దమ్ము ధైర్యం ఉంటే విజిలెన్స్ విచారణ కాదు సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రియల్టర్ల వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేసుకొని విచారణ అడ్డుకుంటున్న ఘనత నీదన్నారు. మట్టి, గ్రావెల్ కొల్లగొట్టేస్తున్నారు.. నియోజకవర్గంలో అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లోనూ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు యథేచ్ఛగా గ్రావెల్, మట్టి అక్రమంగా తవ్వుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారని ప్రతాప్కుమార్రెడ్డి ఆరోపించారు. తాను గెలుపొందిన ఆరు నెలల్లోనే తుమ్మలపెంట రోడ్డును పూర్తిస్థాయిలో నిర్మించి 2025 జనవరిలో నూతన సంవత్సరం వేడుకలను నిర్వహిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. నేటికి అసంపూర్తిగా ఉందని, చేసిన పనుల్లోనూ అనేక అక్రమాలు ఉన్నాయని వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలన్నారు. ఫిషింగ్ హార్బర్ మా ఘనత తీర ప్రాంత మత్స్యకారుల సంక్షేమం ఆర్ధికాభివృద్ధిని కాంక్షించి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిధులు మంజూరు చేసి 90 శాతానికిపైగా పూర్తి చేసిన ఘనత మాది అన్నారు. హార్బర్ కాంట్రాక్ట్ పనులు చేసిందీ కూడా ఇప్పటి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అని గుర్తు చేశారు. అయితే అదేదో కూటమి ప్రభుత్వం మంజూరు చేసి నిర్మాణం చేసినట్లు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 35 ఎకరాల భూమిని ప్రైవేట్ సంస్థకు ధారాదత్తం చేసిన మీకు మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధిపై చిత్తశుద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు. రూ.600 కోట్ల మనీస్కామ్ కావలి మర్రిచెట్టు కాలనీలో ఒక వ్యక్తి మనీ లాండరింగ్ పేరుతో రూ.వంద కోట్లు మనీస్కామ్కు పాల్పడ్డాడని, రూ.600 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించిన కావ్య కృష్ణారెడ్డి.. ఇందులో ఒక్క రూపాయి అయినా బాధితులకు తిరిగి ఇప్పించగలిగావా? అని ప్రతాప్కుమార్రెడ్డి ప్రశ్నించారు. బాధితులు తమ వద్దకు వస్తే ప్రతి ఒక్కరికి ప్రతి పైసా అందించే బాధ్యత నాది అని చెప్పావే.. ఇప్పుడు ఆ ఊసే లేదంటే.. వారితో లాలూచీ పడ్డావా? అని నిలదీశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ అల్లూరు మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి, బోగోలు కన్వీనర్ మద్దిబోయిన వీర రఘు, నాయకులు గంధం ప్రసన్నాంజనేయులు, పద్మనాభరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
భద్రతా ప్రమాణాలు పాటించాలి
నెల్లూరు (టౌన్): విద్యాసంస్థలకు చెందిన బస్సుల్లో భద్రతా ప్రమాణాలను పాటించాలని నెల్లూరు ఆర్టీఓ మదాని తెలిపారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు చెందిన బస్సులను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్సుల్లో వీఎల్టీడీ, డ్యాష్బోర్డు కెమెరాలు అమర్చడం, 60 ఏళ్ల వయస్సు మించని, అనుభవం కలిగిన డ్రైవర్లను నియమించాలన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలు బ్రీత్ ఎనలైజర్లను ఏర్పాటు చేసుకోవాలని, రవాణాశాఖ చెక్లిస్టులో పేర్కొన్న భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 642 బస్సులను తనిఖీ చేసి ప్రమాణాలు సక్రమంగా లేని 337 బస్సులకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. బస్సులకు ఏటీఎస్ ద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలని, లేకుంటే కేసులు నమోదు చేసి సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నెల్లూరు, కావలి రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. -
తవ్వుకో.. దోచుకో..!
● సర్వేపల్లిలో ఆగని గ్రావెల్ దందా ● నిద్రావస్థలో అధికారులు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ దందా విచ్చలవిడిగా సాగుతోంది. అక్రమ రవాణాకు సంబంధించి సోషల్ మీడియా, పత్రికల్లో నిత్యం కథనాలొస్తున్నా, అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అంతా ఇష్టారాజ్యంగా సాగుతోంది. ప్రభుత్వ, పేదలకు పంచిన అసైన్మెంట్ భూములు, చెరువులు ఇలా దేన్నీ వదలకుండా రూ.కోట్ల విలువజేసే గ్రావెల్ సంపదను కొల్లగొడుతున్నారు. ఎర్ర నేల భూములపై కన్ను సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం, పొదలకూరు, ముత్తుకూరు మండలాల్లో ఎర్ర నేల భూములు అధికంగా ఉన్నాయి. వీటిని తవ్వితే వచ్చే గ్రావెల్, మట్టికి మంచి గిరాకీ ఉంది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రావెల్ మాఫియా ఇక్కడ రెచ్చిపోతోంది. వాస్తవానికి భూగర్భ, గనుల శాఖ అనుమతులతో ప్రభుత్వానికి రాయల్టీని చెల్లించి, తవ్వకాలను జరపాల్సి ఉంది. అయితే సర్వేపల్లి ముఖ్యనేత అండదండలతో ఎలాంటి అనుమతుల్లేకుండానే తవ్వకాలను రేయింబవళ్లూ చేపడుతున్నారు. నిత్యం వందలాది టిప్పర్లలో తరలిస్తున్నారు. వీటిని నెల్లూరు నగరం చుట్టూ వెలిసే లేఅవుట్లకు పంపుతూ భారీ మొత్తంలో దోచుకుంటున్నారు. దందా ఇలా.. ● వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి, నాగంభొట్ల కండ్రిగ, శ్రీకాంత్కాలనీ, రామదాసుకండ్రిగ గ్రామాల్లోని ప్రభుత్వ, అటవీ పొరంబోకు, పేదలకు పంపిణీ చేసిన అసైన్మెంట్ భూముల్లో ఎలాంటి అనుమతుల్లేకపోయినా, గ్రావెల్ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ● పొదలకూరు మండలంలోని మరుపూరు, ప్రభగిరిపట్నం, చిట్టేపల్లి తదితర గ్రామాల్లో టిప్పర్లలో రేయింబవళ్లూ రవాణా చేస్తున్నారు. ● ముత్తుకూరు మండలంలోని పలు గ్రామాల్లోనూ ఇదే పరిస్థతి నెలకొంది. దిక్కున్న చోట చెప్పుకోండి వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగలో పేదలకు పంపిణీ చేసిన అసైన్మెంట్ భూముల్లో తవ్వకాలను శనివారం ప్రారంభించారు. ఈ గుంతుల్లో పడి తమ గేదెలు చనిపోతాయని, తమ గ్రామంలో గ్రావెల్ను తవ్వొద్దని స్థానికులు అడ్డుకునేందుకు యత్నించగా, తమకు అన్ని అనుమతులున్నాయంటూ వాగ్వాదానికి దిగారు. ఆపే ప్రసక్తే లేదని, దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరించడంతో చేసేదేమీలేక గ్రామస్తులు వెనుదిరిగారు. రామదాసుకండ్రిగలో యంత్రంతో తవ్వకాలు ఆఫీసర్ల మొద్దు నిద్ర సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ను అక్రమంగా తవ్వి దోపిడీకి పాల్పడుతున్నా, మొద్దు నిద్రను అధికారులు వీడటంలేదు. అదే సామాన్య రైతులు తమ పొలాల్లోకి మట్టిని తరలించుకోవాలంటే, అనుమతులను ఆఫీసర్లు ఇవ్వడం లేదు. ట్రాక్టర్ల ద్వారా పొలాలు, నివాసాల వద్దకు మట్టిని తరలించేందుకు యత్నిస్తుంటే, ఏఎమ్మార్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని, తమ సంస్థకు నగదు చెల్లించనిదే తవ్వకాలు చేయొద్దంటూ అడ్డుకుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. అయితే సర్వేపల్లి ముఖ్యనేత అండతో ప్రభుత్వ భూముల్లో భారీ యంత్రాలతో గ్రావెల్ను తవ్వి టిప్పర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పగలు, రాత్రనే తేడా లేకుండా దందా కొనసాగుతున్నా, జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
బీఎస్ఎన్ఎల్ శుభవార్త
నెల్లూరురూరల్: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డు వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. కొత్తగా బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకునే వారు రూ.249 విలువైన తొలి రీచార్జ్ను కేవలం రూ.51లకే పొందవచ్చునని జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక ఆఫర్ ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ రీచార్జ్తో వినియోగదారులు ప్రతి రోజు అపరిమిత వాయిస్ కాల్స్తోపాటు రోజుకు 2 జీబీ డేటా ప్రయోజనాన్ని పొందవచ్చునని తెలిపారు. కొత్త సిమ్లను బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్లు, ఫ్రాంచైజీలు, అధీకృత రిటైలర్ల, డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ల వద్ద పొందవచ్చని అధికారులు తెలిపారు. వినియోగదారుల సౌకర్యార్థం ఇంటి వద్దకే సిమ్ డెలివరీ సేవను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా సిమ్ బుకింగ్ చేసుకుని ఈ సేవను పొందవచ్చని సంస్థ వెల్లడించింది. ఈ ప్రత్యేక అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజరాజేశ్వరి అమ్మవారి సేవలో.. నెల్లూరు(బృందావనం): నగరంలో కొలువైన రాజరాజేశ్వరి అమ్మవారిని రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ మురళీమోహన్ కుటుంబసమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ప్రధానార్చకుడు, వేదపండితులు, అర్చకులు ఆహ్వానించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆశీర్వచనాలను అందజేశారు. శేష వస్త్రాలను బహూకరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈఓ కోవూరు జనార్దన్రెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ ఏలూరు శిరీష తదితరులు పాల్గొన్నారు. పదిన జెడ్పీ సర్వసభ్య సమావేశం నెల్లూరు(పొగతోట): డీఆర్సీ మీటింగ్ను ఈ నెల పదో తేదీ ఉదయం పది గంటలకు నిర్వహించనున్న తరుణంలో, జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని జెడ్పీ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 2.30 నుంచి నిర్వహించనున్నామని సీఈఓ శ్రీధర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాత అజెండా మేరకు సమావేశాన్ని నిర్వహించనున్నామని, జెడ్పీ సభ్యులు, ఆయా శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని కోరారు. ఆర్టీసీ బస్సులో గంజాయి అక్రమ రవాణా ● బిహార్ వాసులు ఇద్దరి అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): ఆర్టీసీ బస్సులో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న బిహార్ వాసులు ఇద్దర్ని ఎకై ్స జ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నెల్లూరు – 1 ఇన్స్పెక్టర్ రమేష్బాబు తన సిబ్బందితో కలిసి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం సమీపంలో వాహన తనిఖీలను శనివారం నిర్వహించారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో అనుమానాస్పదంగా ఉన్న బిహార్లోని శరణ్ జిల్లాకు చెందిన అనీష్కుమార్, అమిత్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. వీరి బ్యాగుల్లో 8.798 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుల ను ఎకై ్సజ్ స్టేషన్కు తరలించి విచారించారు. రాజమహేంద్రవరంలో గుర్తుతెలియని వ్యక్తుల వద్ద గంజాయిని కొనుగోలు చేసి తిరుపతిలో అధిక ధరలకు విక్రయించేందుకు తీసుకెళ్తున్నామని నిందితులు వెల్లడించారు. దీంతో వీరిని అరెస్ట్ చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఎకై ్సజ్ ఎస్సై మురళీకృష్ణ, హెచ్సీలు కృష్ణయ్య, కానిస్టేబుళ్లు రఫీ, అజీజ్బాషా తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వద్దకు చేరుకుంది. స్వామివారిని 84,468 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 40,203 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.48 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 15 గంటల సమయం పడుతోంది. -
అవుట్సోర్సింగ్ ద్వారా 12,150 శాశ్వత ఉద్యోగాలు 13,580 ప్రత్యేక కేటగిరీల్లో 2640 వలంటీర్లు 12,793 ప్రైవేట్ రంగాల్లో 8600కుపైగా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఉద్యోగాలను కల్పించకపోగా, ఉన్న కొలువులనూ పీకుతూ టీడీపీ వికటాట్టహాసం చేస్తోంది. నిజానికి యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలను కల్పిస్తామని.. లేకపోతే వచ్చేంత వరకు నెలకు రూ.మూడు వేల నిరుద్యోగ భృతిని అందిస్తామంటూ నాడు ఆర్భాటంగా చంద్రబాబు ప్రకటించారు. అయితే ఇది నెరవేరకపోవడంతో యువత అయోమయానికి గురవుతోంది. సర్కార్ నుంచి స్పష్టమైన ప్రకటన నేటికీ రాకపోవడంతో జిల్లాలోని దాదాపు ఐదు లక్షల మంది ఆవేదనకు గురవుతున్నారు. అందరి ఆశలూ భృతిపైనే.. కూటమి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు రెండేళ్లవుతున్నా, నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడంలేదు. డిగ్రీ, ఇంజినీరింగ్, ఇంటర్, పదో తరగతి అర్హతతో జిల్లాలోని ఎంతో మంది ఉద్యోగావకాశాల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వ కొలువుల కోసం కష్టపడుతూనే.. ఇంటి వద్దే వ్యవసాయం చేసుకుంటున్న వారూ ఉన్నారు. మరికొందరు ఆర్థిక వెసులుబాటు లేక పట్టణాల్లో చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లభించక కాయకష్టంపైనే ఆధారపడిన వారి సంఖ్య కోకొల్లలు. అప్పులు చేస్తూ.. మెగా డీఎస్సీ ద్వారా జిల్లాలో దాదాపు 650 పోస్టులు మాత్రమే వచ్చాయి. ఒకవేళ నోటిఫికేషన్లు ఏమైనా వస్తే శిక్షణ పొందేందుకు రూ.వేలల్లో ఫీజులను చెల్లించాల్సి ఉంది. ఆర్థికంగా భారమైనా అప్పులు చేసి మరీ వీటిని పొందుతున్నారు. ఫీజులతో పాటు ప్రైవేట్ వసతిగృహాల్లో ఉండేందుకు ప్రతి నెలా రూ.ఆరు వేలకుపైగా ఖర్చవుతోంది. నిరుద్యోగ భృతి ఇస్తే వీరికి కొంత మేరకై నా వెసులుబాటు లభించే అవకాశం ఉంటుంది. గతంలో మాదిరిగా మోసం చేస్తారా..? గతంలో తరహాలో ప్రస్తుతం సైతం మోసం చేస్తారాననే అనుమానాలూ లేకపోలేదు. నిజానికి 2014 – 19 మధ్యలోనూ నిరుద్యోగ భృతి అంటూ చంద్రబాబు దగా చేశారు. అప్పట్లో నాలుగేళ్ల పాటు ఈ అంశంపై మౌనవ్రతం వహించారు. చివర్లో సవాలక్ష సాకులు చూపి కొద్ది మందికి కొన్ని నెలల పాటు రూ.రెండు వేలను వేశారు. ఏది ఏమైనా చంద్రబాబు మార్కు రాజకీయాలకు నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. జగనన్న హయాంలో సాఫీగా.. నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా గత సీఎం జగన్మోహన్రెడ్డి అడుగులేశారు. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ (ఆప్కాస్)ను ఏర్పాటు చేసి ఎంతో పారదర్శకంగా ఉద్యోగావశాకాలను కల్పించారు. శాశ్వతంగా.. ప్రత్యేక కేటగిరీల్లో.. ప్రైవేట్ రంగాల్లో.. వలంటీర్లు.. సచివాలయాలు.. ఇలా ఎంతో మందికి ఉపాధి కల్పించి వారి కళ్లల్లో వెలుగులు నింపారు. అయితే ఆయనకు మంచి పేరు రావడాన్ని సహించలేని కూటమి సర్కార్ నాడు ఏర్పాటు చేసిన సంస్కరణలకు చరమగీతం పాడి యువతకు శోకాన్ని మిగిల్చింది. ఉపాధి లేదు.. భృతీ రాదు బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ అంటూ గత ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలను టీడీపీ ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. ఇందులో ప్రథమ వాగ్దానం ఉద్యోగాల కల్పన. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు.. లేకపోతే వచ్చేంత వరకు నెలకు రూ.మూడు వేల నిరుద్యోగ భృతిని అందిస్తామంటూ జిల్లాలోని నెల్లూరు, కావలి ఉదయగిరి సభల్లో అప్పటి ప్రతిపక్ష నేత.. ప్రస్తుత సీఎం చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యానాలు చేశారు. ఆయన వ్యవహార శైలిపై అనేక అపోహలున్నా, ఈసారైనా మారుతారేమోననే భావనతో సైకిల్ పార్టీకి యువత ఓట్లేసి పట్టం కట్టారు. ఇంకేముంది.. విజయం సాధించి ఈ నెల 12తో రెండేళ్లు పూర్తవుతున్నా, నిరుద్యోగులకు ఆయన రిక్తహస్తం చూపుతున్నారు. ఈ క్రమంలో ఉపాధి రాక.. భృతీ అందక జిల్లాలోని ఎంతో మంది అల్లాడుతున్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు రూ.మూడు వేలిస్తామని హామీ నమ్మి ఓట్లేసినందుకు దగా రెండేళ్లవుతున్నా, దీనిపై ప్రకటన చేయని సర్కార్ జిల్లాలో గంపెడాశలతో నిరీక్షిస్తున్న ఎంతో మంది వైఎస్సార్సీపీ హయాంలో లభించిన కొలువులు జిల్లాలో ఇలా.. కుటుంబాలు – దాదాపు 7.2 లక్షలు నిరుద్యోగులు – ఐదు లక్షలకుపైగా -
లారీ రూపంలో కబళించిన మృత్యువు
● ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు కావలి: లారీ ఢీకొట్టి ఓ యువకుడు మృతిచెందగా, మరో యువకుడికి తీవ్రగాయాలైన ఘటన శనివారం ఉదయం పట్టణంలోని ఏరియా వైద్యశాల సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. దగదర్తి మండలం ఉలవపాళ్ల గ్రామానికి చెందిన పొట్లూరి నాగేంద్ర (19), ఎద్దల సాయి గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలో జరిగే తిరునాళ్ల సందర్భంగా కావలిలో దుస్తులను కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనంపై వచ్చారు. పట్టణంలోని ఏరియా వైద్యశాల సమీపంలో వీరి బైక్ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో నాగేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. సాయి తీవ్రంగా గాయపడటంతో ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. నాగేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. తిరునాళ్ల సమయంలో ఇలాంటి ఘటన జరగడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
10న జిల్లాస్థాయి చెస్ ఎంపికలు
నెల్లూరు (టౌన్): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈనెల 10వ తేదీన జిల్లా స్థాయి అండర్–15 బాల, బాలికల చెస్ చాంపియన్షిప్ పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ మస్తాన్బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా చెస్ అసోసియేషన్, రాయ్ చెస్ అకాడమి సంయుక్తంగా జరిపే పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఈనెల 8వ తేదీలోపు 80963 28326, 96033 45326 నంబర్లకు ఫోన్ చేసి పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మొదటి నాలుగు స్థానాలు సాధించిన క్రీడాకారులు విజయవాడలో ఈనెల 13, 14వ తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారన్నారు. ఊరెళ్లారు.. దోచేశారు● 30 సవర్ల బంగారు నగల అపహరణ వెంకటాచలం: ఇంట్లోని వారు బంధువుల ఊరికి వెళ్లగా గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన ఘటన మండలంలోని చెముడుగుంట గ్రామంలో శనివారం గుర్తించారు. వళ్లూరు లతమ్మ మూడు రోజుల క్రితం ఇంటికి తాళాలు వేసి బంధువుల గ్రామానికి వెళ్లింది. శనివారం ఉదయం లతమ్మ నివాసంలో పనిచేసే మహిళ ఇంటి వద్దకు రాగా తాళాలు పగులగొట్టి ఉండటంతో వెంటనే లతమ్మకు సమాచారం ఇవ్వడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంకటాచలం సీఐ సురేంద్రబాబు, ఎస్సై ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సిబ్బందిని రప్పించి వేలు ముద్రలు సేకరించారు. బీరువాలో 30 సవర్ల బంగారు నగలు, రూ.40 వేల నగదు చోరీకి గురైనట్లు లతమ్మ బంధువులు పోలీసులకు తెలియజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నికి ఆహుతైన కారు మర్రిపాడు: మండలంలోని నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై శనివారం కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో ఓ కారు అగ్నికి ఆహుతైంది. ప్రొద్దుటూరు నుంచి పెంచలకోన వెళ్తున్న సమయంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే వాహనాన్ని నిలిపివేసి అందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కొద్ది సేపటికే మంటలు మరింత వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అధిక ఉష్ణోగ్రతలు, సాంకేతిక లోపాల కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని, వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని ఎస్సై బలరాంరెడ్డి సూచించారు. రైలు కిందపడి వృద్ధుడి ఆత్మహత్య నెల్లూరు(క్రైమ్): గూడ్స్ రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కల్లూరుపల్లి హౌసింగ్బోర్డు కాలనీ సమీపంలో చైన్నె వైపు వెళ్లే రైలు పట్టాలపై శనివారం చోటుచేసుకుంది. మృతుడు సుమారు 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండొచ్చు. కాఫీ రంగు హాఫ్ హ్యాండ్స్ షర్ట్, గ్రే రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. జీజీహెచ్ మార్చురీకి మృతదేహాన్ని తరలించి కేసు నమోదు చేశారు. మృతుని వివరాలు తెలిసిన వారు 92475 75628 నంబర్కు తెలియజేయాలని కోరారు. కండలేరులో 37.540 టీఎంసీల నీరు రాపూరు: కండలేరు జలాశయంలో శనివారం నాటికి 37.540 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,900, హైలెవల్ కాలువకు 50, లోలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. -
పీడీఏ నిర్లక్ష్యం.. వృద్ధులకు అగచాట్లు
● 17 మందికి అందని పింఛన్ నగదు వరికుంటపాడు: మండలంలోని యర్రంరెడ్డిపల్లి గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీలో పీడీఏ నిర్లక్ష్యం.. పింఛన్దారులకు అగచాట్లు మిగిల్చింది. దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులకు ప్రభుత్వం ప్రతినెలా 1వ తేదీన అందించే పింఛన్లను పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీఓ) తిరుమల నారాయణ గ్రామంలో కొంతమందికి అందించగా, 17 మందికి అందజేయకుండా వెళ్లిపోయినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిని పలువురు మీడియా దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే ఎంపీడీఓ రమణారెడ్డి స్పందించారు. ఘటనపై సంబంధిత అధికారికి నోటీసులు జారీ చేసి, నగదును రికవరీ చేసి, వచ్చే నెల పింఛన్తో కలిపి అందజేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఈనెల పింఛన్ నగదు కోసం ఆశగా ఎదురుచూస్తున్న వృద్ధులకు నిరాశే ఎదురైంది. -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
నెల్లూరు (టౌన్): విద్యాశాఖలో జరుగుతున్న వరుస వైఫల్యాలపై పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక వీఆర్సీ సెంటర్లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో ఎన్టీయే పూర్తిగా విఫలమైందన్నారు. నీట్ పరీక్ష పత్రం లీకేజీ, యూజీసీ నెట్ దరఖాస్తుల నిర్వహణ, సీబీఎస్ఈ పరీక్షల మూల్యాంకనంలో లోపాలు, సీయూఈటీ యూజీ పరీక్షలను చివరి నిమిషంలో రద్దు చేయడం లాంటి ఘటనలు జరిగాయన్నారు. నీట్ పేపరు లీక్పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన లేదన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్.మస్తాన్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేంద్ర, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహం, విద్యార్థి సంఘాల నాయకులు శివం, యస్దానీ, సోహిల్, మౌళి, నాగేంద్ర, దినేష్, అమర్ తదితరులు పాల్గొన్నారు. -
అ.. గౌరవ డాక్టరేట్
వివాదాస్పద రాజకీయ నేత బీదకు ప్రదానం ● పచ్చ నేతలను ప్రసన్నం చేసుకునేలా దిగజారిన వీఎస్యూనెల్లూరు (టౌన్): వీఎస్యూ స్నాతకోత్సవాన్ని ఈ నెల 9వ తేదీన స్థానిక వీపీఆర్ కన్వెన్షన్లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏడాదికి 15 చొప్పున మూడేళ్లకు 45 గోల్డ్ మెడల్స్, 21 మందికి పీహెచ్డీ పట్టాలు, వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ముగ్గురికి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయనున్నారు. కాగా గౌరవ డాక్టరేట్లకు ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కేఐ వరప్రసాద్రెడ్డి, సైన్స్, ఉన్నత విద్యారంగంలో విశిష్ట పరిశోధనలు చేసిన ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్తోపాటు రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావును ఎంపిక చేశారు. బీద ఎంపికపై విమర్శలు రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావును గౌరవ డాక్టరేట్కు ఎంపిక చేయడంపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆయన వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభకు ఎంపికై ఆ తర్వాత నైతిక విలువలకు పాతరేస్తూ పార్టీ ఫిరాయించి అనైతిక రాజకీయ నేతగా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. ఇటీవల కావలి తీర ప్రాంతానికి అక్రమంగా వచ్చిన పుదుచ్చేరి బోట్లను స్థానికంగా ఉండే మత్స్యకారులు ప్రాణాలు తెగించి పట్టుకున్నారు. అయితే ఆ బోటును మత్స్యకారులకు సమాచారం లేకుండానే సదరు బీద అర్ధరాత్రి కుట్రలకు తెరలేపి వదిలేసి ద్రోహానికి పాల్పడ్డారు. దీని వెనుక బీద మస్తాన్రావు హస్తం ఉందని ఆరోపణలు కాల్ డేటా ఆధారంగా బయటపడన విషయం విదితమే. పెద్ద మొత్తంలో నగదు తీసుకుని బోటును పంపించారన్న ఆరోపణలు వెలువెత్తాయి. అలాంటి వ్యక్తిని గౌరవ డాక్టరేట్కు ఎంపిక చేయడమేమిటని ప్రశ్నించగా ఆక్వా రంగంలో విశేష కృషి చేసినందుకే అని వర్సిటీ అధికారులు సమాధానం చెప్పారు. వివరాలను చెప్పేందుకు వర్సిటీ నిరాకరణ విక్రమ సింహపురి యూనివర్సిటీని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేశారు. ఏడాదికి ఒకసారి నిర్వహించాల్సిన స్నాతకోత్సవాన్ని రెండేళ్లు, లేదా మూడేళ్లకు ఒకసారి వర్సిటీ అధికారులు నిర్వహిస్తున్నారు. ఎన్నేళ్లకు జరిగినా ఒకరికే గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో వర్సిటీ స్నాతకోత్సవాలు, గౌరవ డాక్టరేట్కు ఎంపిక చేసిన వ్యక్తుల వివరాల కోసం వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ను సంప్రదించగా అందరూ చర్చించుకుని చెబుతామని మెసేజ్ పంపించారు. తొలుత వివరాలు చెబుతామని చెప్పిన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి తరువాత మనస్సు మార్చుకున్నారు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా ఉన్నారు. గతంలో జరిగిన స్నాతకోత్సవాలు, గౌరవ డాక్టరేట్లు గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉంది. రాజకీయాలకతీతంగా వ్యవహరించాల్సిన వీఎస్యూ అధికారులు వివాదాస్పద రాజకీయ నేత, టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావుకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు విక్రమ సింహపురి యూనివర్సిటీ దిగజారుడుతనంగా వ్యవహరిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక వర్సిటీలు సైతం రాజకీయాలకు వేదికలుగా మారాయి. ఈ క్రమంలో అర్హత, స్థాయి లేని అధికార పార్టీ నేతకు డాక్టరేట్ కట్టబెడుతోంది. రాజకీయ కోణంలో చూడటం లేదు ఆక్వారంగంలో విప్లవాత్మక మార్పులు, విశేష కృషి చేసినందుకు రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావును గౌరవ డాక్టరేట్కు ఎంపిక చేశాం. ఆయన ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఆయనను రాజకీయ కోణంలో చూడడం లేదు. గౌరవ డాక్టరేట్లకు ఎంతమందినైనా ఎంపిక చేసుకోవచ్చు. ఇంతమంది అనే నిబంధన లేదు. – అల్లం శ్రీనివాసరావు, వైస్ చాన్సలర్, వీఎస్యూ -
హామీలను అమలు చేయాలి
మోసపోయాం నిరుద్యోగ భృతిపై ఆశలు పెట్టుకు న్న యువకులు మోసపోయారు. నెలకు రూ.మూడు వేల చొప్పున ఈ రెండేళ్లలో రూ.72 వేలను ఇవ్వాల్సి ఉంది. అయితే నేటికీ పైసాను సైతం విదిల్చలేదు. హామీలను అమలు చేసి అండగా నిలవాలి. – దేవకుమార్, నిరుద్యోగి, కృష్ణపట్నం ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలి. సర్కార్ కొలువుదీరి రెండేళ్లు పూర్తవుతున్నా, భృతిపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు లభించక యువత నిరాశతో ఉన్నారు. చాలా మంది పక్క రాష్ట్రాలకు వలసెళ్లి జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. నెలకు రూ.మూడు వేలను అందజేస్తే కొంతమేరైనా ఆసరాగా ఉంటుంది. – షంషుద్దీన్, నిరుద్యోగి, ముత్తుకూరు -
ఆక్వా ‘వెల’వెల
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ కూటమి పాలకుల దోపిడీకి ఇప్పటికే అన్ని రంగాలు కుప్పకూలిపోగా, తాజాగా ఆక్వా రంగమూ సంక్షోభంలో కూరుకుపోతోంది. నాసిరకం సీడ్, ఫీడ్ ధరల పెంపుతో కుదేలవుతోంది. ఆక్వా ఉత్పత్తుల అమ్మకాల నుంచి ఎగుమతుల వరకు అడుగడుగునా నష్టాలు వాటిల్లడంతో నిండా మునుగుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. పరిస్థితులు ఇలానే ఉంటే సాగు చేయలేమని తెగేసి చెబుతున్నారు. వచ్చే సీజన్లో క్రాప్ హాలిడే ప్రకటించే యోచనలో ఉన్నారు. దీనికి చంద్రబాబు సర్కారు వైఫల్యమే కారణంగా కనిపిస్తోంది. ముడి సరుకుల ధరలు పెరుగుదల చంద్రబాబు పాలనలో ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది ఐదునెలల కాలలంలోనే రొయ్య ఫీడ్లో వినియోగించే ఫిష్ మీల్, సోయాబీన్, వేరుశనగ కేకు, ఫిష్ ఆయిల్, విటమిన్ ఫ్రీ మిక్స్, మినరల్ ఫ్రీ తదితర మెటీరియల్ ధరలు దాదాపు 50 నుంచి 70 శాతం పెరిగాయి. జనవరిలో ఫిష్ మీల్ కేజీ రూ.155 ఉంటే మే నెలలో కేజీ రూ.260కు పెరిగింది. ఐదు నెలల వ్యవధిలో ఫార్ములా కాస్ట్ దాదాపు రూ.17 పెరగడంతో ఫీడ్ యాజమాన్యాలు ధరలు పెంచాల్సి వచ్చిందని సమాచారం. టన్నుపై రూ.4 వేల నుంచి రూ.పదివేల వరకు ధరలు పెంచారు. రొయ్యల ధరలు పతనం ఇదిలా ఉంటే బాబు సర్కారు నిర్వాకం వల్ల రొయ్యల ధరలు భారీగా పతనమయ్యాయి. వ్యాపారులు సిండికేట్గా మారడంతో రొయ్య రైతులు దోపిడీకి గురవుతున్నారు. ఒక పక్క నాసిరకం సీడ్తోపాటు మరో పక్క పెరిగిన ఫీడ్ ధరలతో తల్లడిల్లుతున్న రైతులు చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో మండిపోతున్నారు. ఆక్వా సాగులో ఒక టన్ను రొయ్యలు ఉత్పత్తి చేయాలంటే రైతులు 90 రోజులు రొయ్య పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అందులో సీడ్ కెమికల్స్, ఏరియేటర్స్, కరెంట్ బిల్లులు, జనరేటర్, ఫీడింగ్ కూలీలు తదితర పరికరాల కొనుగోళ్లు, లీజులతో కలిపి దాదాపు రెండెకరాల చెరువుకు రూ.2.60 లక్షల వరకు ఖర్చు చేయాలి. ప్రస్తుతం ఉన్న రొయ్యల ధరలతో సరిచూసుకుంటే ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టం వాటిల్లుతోంది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కేంద్రం దిగుమతి సుంకాలు తగ్గిస్తే.. రాష్ట్రం దోపిడీ ఆక్వా ఫీడ్ తయారీలో వినియోగించే ముడిసరుకుల దిగుమతికి గతంలో సుంకాలు 30 శాతం ఉండగా, తాజాగా వాటిని ఐదు శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనధికారికంగా ఫీడ్ ఫ్యాక్టరీల్లో తయారయ్యే ఉత్పత్తిలో వాటాలు దండుకోవడంతో యాజమాన్యాలు అనివార్యంగా ధరలు పెంచేశాయి. అందుకే అప్సడా అనుమతి లేకుండా గత ఫిబ్రవరిలో ఫీడ్ ఫ్యాక్టరీలు ధరలు పెంచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల వ్యతిరేకతతో యాజమాన్యాలపై ఒత్తిడి అనూహ్యంగా పెరిగిన ఫీడ్ ధరల నేపథ్యంలో ఆక్వా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో సర్కారు జంకింది. ఫీడ్ ధరలు తగ్గించాలని వ్యాపారులను ప్రాధేయపడుతోంది. పెరిగిన రా మెటీరియల్ ధరలు, ప్రభుత్వ పెద్దల దోపిడీతో తప్పని పరిస్థితుల్లో ధరలు పెంచిన వ్యాపారులు ప్రభుత్వ విన్నపాన్ని తోసిపుచ్చారు. ధరలు తగ్గించలేమని తెగేసిచెప్పారు. అయినా ప్రభుత్వం ఒత్తిడి తెసేన్త ఫ్యాక్టరీలు నాసిరకం ఫీడ్ను మార్కెట్లోకి తెచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఇప్పటికే నాసిరకం సీడ్తో సతమతమవుతున్న రైతులు ఫీడ్ కూడా నాణ్యత లేకపోతే తీవ్రంగా నష్టపోయే ఆస్కారం ఉంది. సాగుకు విముఖత ఇదిలా ఉంటే బాబు పాలనలో వెంటాడుతున్న నష్టాలతో రైతులు ఆక్వా సాగు అంటేనే విముఖత చూపిస్తున్నారు. ఈ కారణంగానే గత రెండేళ్లలో 50 శాతం సాగు విస్తీర్ణం తగ్గిపోయినట్టు సమాచారం. ఈ ఏడాది ఫీడ్ ధరలు తీవ్రంగా పెరిగి, రొయ్యల ధరలు పతనమైన నేపథ్యంలో వచ్చే సీజన్లో సాగుకు విరామం ప్రకటించే యోచనలో రైతులు ఉన్నారు. సర్కారు ఆదుకోకుంటే క్రాప్ హాలిడేనే శరణ్యమని తెగేసి చెబుతున్నట్టు తెలుస్తోంది. రాయితీలతోనే మనుగడ ఆక్వా రంగం మనుగడ సాగించాలంటే.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఫీడ్ ఫ్యాక్టరీలను చేస్తున్న దోపిడీకి కళ్లెం వేయడంతోపాటు రా మెటీరియల్పై రాయితీలు, ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీలు ఇవ్వడం, ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, మార్కెట్ సౌకర్యం కల్పించడం వంటి తక్షణ చర్యలు చేపట్టాలి. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీలు ఇస్తామని వాగ్దానం చేసింది. యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకే ఇస్తామని నమ్మబలికి ఇప్పుడు విస్మరించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఓట్ల చోరీ.. అడ్డదారుల్లో ఎన్నికలు
నెల్లూరు (బారకాసు): దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఎన్నికలు సక్రమంగా జరగడం లేదని, ఓట్లు చోరీకి గురవుతున్నాయని ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఓట్ల చోరీ, అడ్డదారుల్లో ఎన్నికలపై ప్రజలు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా (డబ్ల్యూపీఐ) రాష్ట్ర అధ్యక్షుడు కేఎంఏ సుభాన్ ఆధ్వర్యంలో శనివారం నెల్లూరులో ‘మేలుకో ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో భాగంగా ‘ఎన్నికల సంఘం పనితీరు – సర్పై అవగాహన–శిక్షణ’ అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ అపహాస్యమవుతోందని చెప్పారు. పారదర్శకత లేకుండా చేపడుతున్న ఈ విధానం వల్ల రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కోట్లాది మంది అర్హులు కోల్పోతున్నారని చెప్పారు. సర్ ద్వారా ఇప్పటికే దేశంలో 6.50 కోట్ల మంది ఓట్లను తొలగించారని, రానున్న రోజుల్లో ఈ సంఖ్య 16.50 కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. ఇది ఇంతటితో ఆగదు... వాస్తవానికి 2002లో జరిగిన సర్ ప్రక్రియకు, ప్రస్తుతం కొనసాగుతున్న సర్కు చాలా తేడా ఉందని పరకాల చెప్పారు. అప్పుడు ‘సర్’ అంటే స్పెషల్ రివిజన్ ఆఫ్ ఇంటెన్సీవ్ రివిజన్ అని, ఇప్పుడు ‘సర్’ అంటే స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్(ఉద్దేశపూర్వకంగా రివిజన్) అని ఆయన వివరించారు. దేశంలో సర్ ప్రక్రియ ఇంతటితో ఆగిపోదని, 30 కోట్ల మంది ఓట్లను తొలగించేంత వరకూ మళ్లీ మళ్లీ కొనసాగుతూనే ఉంటుందన్నారు. సర్ ప్రక్రియ చేపట్టిన తర్వాత ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఆయా రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లను తొలగించారని వివరించారు. దాని గురించి ఎవరూ చర్చించడం లేదని, కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారని తెలిపారు. ఎన్నికలను, రాజకీయాలను క్రికెట్ ఆటను చూసిన విధంగా చూస్తున్నారని, ఇది సరికాదన్నారు. ఎవరు ఓటర్లుగా ఉండాలో నిర్ణయిస్తున్న పాలకులు గతంలో ప్రజలు ఎవరిని పాలకులుగా ఎన్నుకోవాలని ఆలోచించేవారని, కానీ ఇప్పుడు ఎవరు ఓటర్లుగా ఉండాలని పాలకులు నిర్ణయిస్తున్నారని పరకాల పేర్కొన్నారు. దేశంలో సర్ ప్రక్రియను నిర్వహించాలని ఎవరు నిర్ణయించారు? ఎందుకు, ఎలా నిర్వహిస్తున్నారన్న విషయాలపై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తే జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉందన్నారు. కేంద్రం చేతిలో భారత ఎన్నికల సంఘం కీలుబొమ్మలా మారిందని విమర్శించారు.ప్రస్తుతం దేశంలో పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. అనంతరం తొలగించిన ఓట్లను తిరిగి ఎలా పొందాలి, ఓటు చోరీకి గురి కాకుండా ఎలా కాపాడుకోవాలి తదితర విషయాలను మసూద్ఖాన్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
గంజాయి మత్తులో యువకుల వీరంగం
సంగం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగంలో గురువారం రాత్రి గంజాయి మత్తులో కొందరు యువకులు బీభత్సం సృష్టించారు. కత్తులు, కర్రలు చేతపట్టి వీధుల్లో వీరంగం సృష్టించి ప్రజలను భయాందోళనకు గురి చేశారు. కర్రలతో పలు వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు ఇద్దరు వ్యక్తులపై దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గంజాయి బ్యాచ్ అరాచకాలు స్థానికంగా సీసీ ఫుటేజీల్లో నిక్షిప్తం అయ్యాయి. స్థానికుల సమాచారంతో యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎస్సై భోజ్యానాయక్ తెలిపారు. సంగంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువయ్యాయని, అసలు గంజాయి వీరికి ఎక్కడి నుంచి లభ్యమవుతోందో తెలుసుకుని పూర్తిస్థాయిలో అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
అధిక దిగుబడికి విత్తన ఎంపిక కీలకం
● వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త వినీత నెల్లూరు(వేదాయపాళెం): రైతులు అధిక దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన విత్తనాల ఎంపికకు ప్రాధాన్యమివ్వాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ యు.వినీత అన్నారు. జాతీయ విత్తన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నెల్లూరులోని పరిశోధన స్థానం సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఏ పంటకై నా నాణ్యమైన విత్తనాలు ఉపయోగించినప్పుడే అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. విత్తనాల నాణ్యతలో లోపాలుంటే రైతులు నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన విత్తనాలను ఉపయోగించడం ద్వారా అధిక దిగుబడులు సాధించడమే కాకుండా సమయం, శ్రమ ఆదా అవుతాయన్నారు. విత్తనాల కొనుగోలు సమయంలో సంబంధిత బిల్లులను భద్రపరచుకోవాలని, భవిష్యత్లో ఏవైనా సమస్యలు ఎదురైతే అవి ఉపయోగపడతాయని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారిణి పి.సత్యవాణి, ఆత్మ పీడీ శారద, తిరుపతి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రతిమ, శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకయ్య, డాక్టర్ కిరణ్కుమార్, విశ్రాంత సీనియర్ శాస్త్రవేత్తలు వై. సూర్యనారాయణ, పి.రమేష్బాబు, రైతులు పాల్గొన్నారు. -
క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య
విడవలూరు: మండలంలోని గాదెలదిన్నె గ్రామం ఎస్టీ కాలనీలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన శుక్రవారం వెలుగు చూసింది. మేనమామ ఇంటికి వెళ్లేందుకు భర్త, కుటుంబ సభ్యులు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన మహిళ పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. గాదెలదిన్నెకు చెందిన రాచగిరి సుబ్బరత్న (29) తన భర్త శివయ్యతో కలిసి నివాసం ఉంటోంది. గురువారం సాయంత్రం ఇసుకపాళెంలో ఉన్న తన మేనమామ ఇంటికి వెళ్లాలని కోరగా, భర్తతోపాటు కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన సుబ్బరత్న ఇంట్లో ఉన్న పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను 108 అంబులెన్స్లో నెల్లూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం చనిపోయింది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు పద్మ, శేషయ్య తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.చక్రాల కింద నలిగిన ప్రాణం● గుర్తుతెలియని వాహనం ఢీకొని వివాహిత మృతి ● భర్తకు గాయాలుచిల్లకూరు: ఓ వ్యక్తి తన భార్యాబిడ్డతో మోటార్బైక్పై ఊరికి బయలుదేరాడు. అయితే గుర్తుతెలియని వాహనం ఢీకొని వివాహిత మృతిచెందిన విషాదకర ఘటన గురువారం అర్ధరాత్రి వరగలి క్రాస్రోడ్డు ప్రాంతంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఏర్పేడు మండలం సరస్వతి కండ్రిగకు చెందిన గోపీ నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్కడే ఇల్లు అద్దెకు తీసుకుని నివాసముంటున్నాడు. అతని కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా ఉందని ఫోన్ రావడంతో శువ్రారం ఉదయం బయల్దేరుదామని అనుకున్నారు. అయితే గోపీ భార్య లాలిత్య (23) వెంటనే వెళ్దామని చెప్పడంతో రెండేళ్ల పాపను తీసుకుని బైక్పై బయలుదేరారు. చిల్లకూరు మండలం వరగలి క్రాస్రోడ్డు వద్ద బ్రిడ్జి పనుల నిమిత్తం మలుపు ఏర్పాటు చేశారు. గోపీ బైక్ను మలుపుతిప్పే సమయంలో వెనుకనుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. లాలిత్య అదే వాహనం వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతిచెందింది. గోపీకి గాయాలయ్యాయి. చంటి బిడ్డకు ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని గూడూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎస్సై సురేష్బాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేశారు.విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిసంగం: మండలంలోని సిద్ధీపురం గ్రామంలో విద్యుదాఘాతానికి గురై రావూరు శీనయ్య (47) అనే వ్యక్తి శుక్రవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. శీనయ్య ఇంట్లో పనిచేస్తూ కమ్ములు ఎత్తుతున్న సమయంలో ప్రమాదవశాత్తు సమీపంలో ఉన్న మెయిన్ విద్యుత్ తీగలను తాకడంతో షాక్కు గురయ్యాడు. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరిశీలించి శీనయ్య మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వారు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. నిబంధనలతో మాకేం పని..సైదాపురం: ఖనిజాన్ని తరలించే టిప్పర్లు, లారీలు నిబంధనలకు విరుద్ధంగా అధిక టన్నేజీతో తరలిపోతున్నాయి. ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు. 18 టన్నులు తరలించాల్సిన టిప్పర్లు అంతకుమించి తరలిస్తుండటం నిత్యం ప్రమాదాలకు కూడా దారితీస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కండలేరులో 37.750 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 37.750 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,900, లోలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
ఆపే దమ్ముందా..?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గంలో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి స్థానిక ముఖ్యనేత కనుసన్నల్లో ఇసుక, గ్రావెల్, బూడిద మాఫియాలు రెచ్చిపోతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో గద్దల్లా వాలి గ్రావెల్ను తవ్వుతున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండానే ఈ తతంగం జరుగుతుండగా, అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతోంది. ఇంత జరుగుతు న్నా, జిల్లా పాలనాధికారి మౌనం వహిస్తుండటం.. అవినీతిని ప్రోత్సహించడమేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు గండి వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి పంచాయతీ పరిధిలో గల నాగంభొట్ల కండ్రిగ, ఈదగాలి పంచాయతీ శ్రీకాంత్ కాలనీ, పొదలకూరు పట్టణానికి సమీపంలోని చిట్టేపల్లి తిప్పలో ఎలాంటి అనుమతుల్లేకుండానే గ్రావెల్ను తవ్వుతూ, ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి గ్రావెల్ అక్రమ రవాణా విచ్చిలవిడిగా సాగుతోంది. రేయింబవళ్లూ.. నాగంభొట్లకండ్రిగలోని నివాసాల చుట్టూ ఉన్న సుమారు 70 ఎకరాల ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ను రేయింబవళ్లూ టిప్పర్లలో నెల్లూరులోని లేఅవుట్లకు రవాణా చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో నిత్యం దాదాపు వందకుపైగా వాహనాలతో గ్రావెల్ అక్రమ రవాణా సాగుతోంది. టిప్పర్ లోడింగ్కు రూ.పది వేల చొప్పున నిత్యం రూ.పది లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఖర్చులు పోనూ మిగిలిన మొత్తాన్ని పంచుకుంటున్నారు. గ్రామస్తులకు బెదిరింపులు నాగంభొట్ల కండ్రిగలో గ్రావెల్ అక్రమ రవాణాతో నివాసాల చుట్టూ భారీ గోతులు ఏర్పడి, ఇళ్లన్నీ ఎర్రమట్టితో నిండిపోయాయి. దీంతో టిప్పర్లను గ్రామస్తులు ఇటీవల అడ్డుకొని తవ్వకాలను నిలిపేయాలని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న నిర్వాహకులు.. పూటుగా మద్యం సేవించి కారులో నలుగురితో కలిసి గ్రామానికి చేరుకొని బెదిరింపులకు గురిచేశారని స్థానికులు ఆరోపించారు. అడ్డుకునేందుకు యత్నిస్తే నాన్ బెయిలబుల్ కేసులు మోపి.. జైల్లో పెట్టిస్తామని బెదిరించారని తెలిపారు. చర్యలేవీ..? సర్వేపల్లి పంచాయతీలో ఏడాదిన్నరగా గ్రావెల్ తవ్వకాలను మాఫియా ఇష్టారాజ్యంగా జరుపుతోంది. అనుమతుల్లేకుండానే రూ.కోట్ల విలువైన గ్రావెల్ను దోచుకుంటున్నారు. విషయం జిల్లా ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదు. సర్వేపల్లి ముఖ్యనేత అండదండలతో మాఫియా రెచ్చిపోతోందని టీడీపీ నేతలే బహిరంగంగా చెప్తున్నారు. ప్రజలు తమ నివాసాల వద్దకు ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తుంటే రెవెన్యూ అధికారులు, పోలీసులు వెంటనే వచ్చి అడ్డుకుంటున్నారు. అయితే సర్వేపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా భారీ గోతులు పెట్టి తరలిస్తున్నా, అటువైపు కన్నెత్తి చూడటంలేదు. నిర్వాహకుల నుంచి నెలనెలా ముడుపులు తీసుకుంటూ పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈదగాలి పంచాయతీ పరిధిలోని శ్రీకాంత్కాలనీలోనూ కొన్ని రోజులుగా గ్రావెల్ను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామంలో ఇటీవల ఓ వ్యక్తి గ్రావెల్ గుంతలో పడి మృతి చెందారు. అయినా లెక్క చేయకుండా తవ్వుతుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని రవాణాను అడ్డుకోవాలని కోరుతున్నారు. సర్వేపల్లిలో రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా ప్రభుత్వ భూముల్లోనూ ఇష్టారాజ్యంగా తవ్వకాలు ముఖ్యనేత అండతో రెచ్చిపోతున్న వైనం పట్టించుకోని అధికారులు జరుగుతోందిలా.. మైనింగ్ అధికారుల లెక్కల మేరకు ఎకరా భూమిలో మీటర్ లోతున తవ్వకాలు జరిపితే నాలుగు వేల ఘనపు మీటర్లలో ఖనిజం (గ్రావెల్) లభిస్తుంది. టిప్పర్లో పూర్తిగా నింపితే 12 క్యూబిక్ మీటర్లు పడుతుంది. అంటే ఎకరాకు 400 టిప్పర్ల మేర వస్తుంది. ఈ తరహాలో ఎకరాకు 4800 క్యూబిక్ మీటర్ల మేర రవాణా అవుతోంది. టిప్పర్కు రూ.పది వేల చొప్పున లెక్క కడితే ఎకరాకు రూ.నాలుగు కోట్ల వరకు వస్తుంది. ఎకరాలో మీటర్ లోతులో తవ్వకాలు జరిపి.. మరీ 15 మీటర్ల లోతు తీస్తే రూ.కోట్లల్లో ఉంటోందని తెలుస్తోంది. ఇలా సర్వేపల్లి నియోజకవర్గంలో దాదాపు వందెకరాల్లో గ్రావెల్ దందా నడుస్తోంది. -
పరిశ్రమల పేరుతో అడవుల నరికివేత
● జనవిజ్ఞాన నేతలు నెల్లూరు(అర్బన్): పరిశ్రమల పేరుతో స్వలాభం కోసం ఇష్టారాజ్యంగా చెట్లు, అడవులను నరికేస్తుండటంతోనే భూతాపం పెరిగిపోతోందని జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) నాయకులు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జేవీవీ ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరులోని హరనాథపురంలో ఉన్న డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో పర్యావరణంపై డాక్టర్ శ్రీనునాయక్ అధ్యక్షతన చర్చాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవేదిక పర్యావరణ సబ్ కమిటీ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎండీ రఫీ మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల పర్యావరణంతోపాటు భూమి కలుషితమైందన్నారు. ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ పెరిగి అతివృష్టి, అనావృష్టి, అంటువ్యాధులు, విషజ్వరాలు, కేన్సర్ లాంటివి నేడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయన్నారు. విద్యుత్, నీటి వృథాను అరికట్టాలన్నారు. పరిశ్రమలు స్థాపించే వారు ముందుగా 30 శాతం భూమిలో మొక్కలు పెంచిన తర్వాతనే లైసెన్సులు ఇవ్వాలన్నారు. కఠిన నిర్ణయాలు అమలు చేస్తేనే భూతాపాన్ని తగ్గించవచ్చన్నారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా అధ్యక్షుడు ఎంవీ చలపతి, మోహన్రెడ్డి, మాదాల రాము, హరిప్రసాద్, రవీంద్రరెడ్డి, బాషా పాల్గొన్నారు. -
గంజాయి మత్తులో కానిస్టేబుల్పై దాడి
● నిందితుల్లో రౌడీషీటర్లు ● పట్టపగలు నడిరోడ్డుపై దారుణం ● ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదుగూడూరు: కూటమి అధికారంలోకి వచ్చాక మద్యం, గంజాయి మత్తులో యువత అరచాకాలు పేట్రేగిపోతున్నాయి. సామాన్యుల నుంచి చివరకు పోలీసులు సైతం ఈ అరాచక శక్తుల చేతుల్లో బాధితులవుతున్నారు. తాజాగా శుక్రవారం ముగ్గురు యువకులు గంజాయి మత్తులో ఓ కానిస్టేబుల్పై మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన శుక్రవారం గుడూరు పట్టణంలోని సంగం సినిమా థియేటర్ సమీపంలో నడిరోడ్డుపై జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గూడూరు రెండో పట్టణానికి చెందిన ముగ్గురు రౌడీషీటర్లు గంజాయి మత్తులో బైక్పై అడ్డదిడ్డంగా తిరుగుతున్నారు. అటు వైపుగా వెళ్తూ గమనించిన గూడూరు రూరల్ హెడ్కానిస్టేబుల్ గోపీ వారిని నిలువరించే ప్రయత్నం చేశాడు. యువకులు ‘నీకు ఎందుకురా.. మాఇష్టం వచ్చినట్లు వెళ్తాం’ అంటూ కానిస్టేబుల్ను చితకబాదారు. స్థానికులు యువకులను యువకుల్ని అడ్డుకుని పంపించి వేశారు. కానిస్టేబుల్ ఒకటో పట్టణ పోలీస్స్టేషన్కు చేరుకుని యువకులపై ఫిర్యాదు చేశాడు. వారు విచారణ చేపట్టారు. గతంలో గూడూరు రూరల్ కానిస్టేబుల్ను బనిగేసాహెబ్పేట ప్రాంతంలో ఓ యువకుడు కర్రతో దాడి చేసిన ఘటన మరువక ముందే మరొకటి జరగడంతో కూటమి ప్రభుత్వంలో పోలీసులకే రక్షణ కరువైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే నిందితులను వదిలేయాలని అధికార పార్టీ నేతలు పోలీసులపై ఒత్తిడి తేవడంతో వారిని స్టేషన్ బెయిల్పై పంపేశారు. ఈ ఘటనతో గూడూరులో కలకలం రేగింది. -
గూడూరు ఆర్డీఓగా అరుణకుమారి
గూడూరురూరల్: గూడూరు నూతన ఆర్డీఓగా ఎం.అరుణకుమారి శుక్రవారం స్థానిక కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆమె మాట్లాడుతూ గతంలో ప్రొ హిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖలో 18 ఏళ్లపాటు సీఐ కేడర్లో పనిచేశారు. అనంతరం రెవెన్యూ విభాగంలో చేరి డీటీ, తహసీల్దార్ బాధ్యతలను చిత్తూరు జిల్లాలో నిర్వర్తించారు. చిత్తూరు కలెక్టరేట్లో పనిచేస్తుండగా పదోన్నతిపై గూడూరు ఆర్డీఓగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. చిల్లకూరు మండలంలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, క్రిస్సిటీ భూ పరిహారం అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి పలు సమస్యలు ఉన్నాయని పలువురు విలేకరులు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లగా పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆర్డీఓను మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషనర్గా మల్లికార్జునరావు చిల్లకూరు: గూడూరు మున్సిపల్ కమిషనర్గా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న మల్లికార్జునరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు అందినట్లు శుక్రవారం మున్సిపల్ అధికారులు తెలిపారు. కమిషనర్గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు గత నెలాఖరులో ఉద్యోగ విరమణ చేశారు. దీంతో కార్యాలయంలో పనిచేస్తున్న సోమశేఖర్ను ఇన్చార్జిగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇంతలోనే ప్రభుత్వం నూతన కమిషనర్గా మల్లికార్జునరావును నియమించింది. -
‘ఎనీ టైమ్ మద్యం’
కూటమి సమర్పించు● అధిక ధరలకు విక్రయాలు ● మద్యంప్రియుల జేబులకు చిల్లు ● వేళలు పాటించని షాపులు ● పల్లె పల్లెకు బెల్ట్ దుకాణాలకు మద్యం సరఫరా ● పెరిగిన నేరాలు ● మామూళ్ల మత్తులో ఎకై ్సజ్ అధికారులు?వింజమూరు(ఉదయగిరి): వింజమూరు ఎకై ్సజ్ పరిధిలోని కొండాపురం, వింజమూరు, కలిగిరి మండలాల్లో అధికారిక మద్యం దుకాణాల్లో అధిక ధరలకు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎవరైనా అధిక రేట్ల గురించి ప్రశ్నిస్తే ప్రభుత్వం ధరలు పెంచిందని సమాధానం ఎదురవుతోంది. ఎలాంటి జంకు లేకుండా ప్రతి బాటిల్పై అదనంగా రూ.10 వరకు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధిక ధరలకు మద్యం విక్రయిస్తే షాపుల నిర్వాహకులపై పెనాల్టీలు విధించి కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యవహారం ఎకై ్సజ్ అధికారులకు తెలిసే జరుగుతున్నా మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. అక్రమ విక్రయాలను అరికట్టాల్సిన అధికారులు నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. వింజమూరు మండల కేంద్రంలో నాలుగు మద్యం దుకాణాలున్నాయి. బంగ్లా సెంటర్లో జాతీయ రహదారి పక్కనే రెండు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం జాతీయ రహదారికి కనీసం 200 మీటర్ల దూరంలో షాపులుండాలి. అయితే ఇక్కడ ఆ నిబంధనలు అమలు కావడం లేదు. అయినా కొనసాగింపు రెండేళ్ల క్రితం జాతీయ రహదారి పనులు పూర్తికాక ముందు నిర్వాహకులు కోర్టు స్టే తెచ్చుకుని దుకాణం నిర్వహించారు. ప్రస్తుతం రహదారి పనులు పూర్తై టోల్ వసూళ్లు కూడా జరుగుతున్నప్పటికీ షాపు కొనసాగుతుండటంపై అధికారులు స్పందించడం లేదు. అలాగే ప్రస్తుతం ఉన్న దాని పక్కనే జల్సా పేరుతో మరొక దుకాణాన్ని పెట్టారు. అది కూడా హైవే పక్కనే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరో షాపు శిరీషా సినీహాల్ సమీపంలో, ఇంకొకటి పాత దేవతా మహాల్ పక్కన నిర్వహిస్తున్నారు. అందరూ సిండికేట్గా మారి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. అంతేకాకుండా విక్రయ సమయాలను కూడా పాటించడం లేదని తెలుస్తోంది. తెల్లవారుజామున 4 గంటల నుంచే విక్రయాలు ప్రారంభించి రాత్రి 11 గంటల వరకు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కొన్ని షాపులు వెనుకవైపు నుంచి కూడా మద్యం విక్రయాలు జరుపుతున్నాయని చెబుతున్నారు. బెల్ట్ షాపుల జోరు అధికారిక మద్యం దుకాణాల నిర్వాహకులు సిండికేట్గా ఏర్పడి వింజమూరు మండలంలోని 12 గ్రామ పంచాయతీల పరిధిలోని పల్లెలకు ఆటోలు, బైక్లు, స్కూటీల ద్వారా మద్యం సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఒక్కో గ్రామంలో మూడు నుంచి నాలుగు చోట్ల వరకు బెల్ట్ దుకాణాలు నడుస్తున్నాయి. గ్రామ జనాభాను బట్టి బెల్ట్ షాపుల సంఖ్య కూడా పెరుగుతోంది. అక్కడ ఒక్కో బాటిల్పై రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. అనేక సమస్యలు గ్రామాల్లో మద్యం సేవనం పెరిగి గొడవలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు అధికమవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొండాపురం, వింజమూరు మండలాల్లో జరిగిన కొన్ని హత్యలు కూడా మద్యం మత్తులో జరిగినవేనని స్థానికులు పేర్కొంటున్నారు. అన్ని వేళల్లో బెల్ట్ షాపులు అందుబాటులో ఉండటంతో కొందరు యువకులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల వరికుంటపాడు మండలంలోని ఓ గ్రామంలో మత్తులో ఉన్న యువకుడు అర్ధరాత్రి సమయంలో ఓ మహిళపై లైంగికదాడికి యత్నించడంతో కేసు నమోదైంది. అనేక గ్రామాల్లో చీకటి పడగానే యువత గుంపులుగా చేరి మద్యం సేవిస్తూ రోడ్లపై హల్చల్ చేస్తున్నారని మహిళలు వాపోతున్నారు. -
రెండేళ్లలో 29 వేల కోత
పింఛన్.. ఈ పదాన్ని వింటేనే ఎంతో మందికి కన్నీరొస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దాదాపు ఈ రెండేళ్లలో దీని కోసం అర్హులు కళ్లు కాయలు కాచేలా నిరీక్షిస్తున్నారు. నూతనంగా మంజూరు చేయకపోగా, ఉన్న వాటిని సైతం తొలగిస్తూ సరికొత్త కుట్రలను సర్కార్ అమలు చేస్తోంది. దాదాపు 60 వేల మందికిపైగా ఎదురుచూస్తున్నారంటే, ప్రభుత్వం ఎంత నిర్దయగా వ్యవహరిస్తోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2024 ఏప్రిల్ నాటికి 3.19 లక్షల మంది దీన్ని పొందుతుండగా, ఈ సంఖ్య ప్రస్తుతానికి 2.9 లక్షలకు పరిమితమైంది. అంటే ఈ రెండేళ్లలో దాదాపు 29 మంది వేల మందిని తొలగించి, వీరి జీవనంపై చంద్రబాబు ఎలా దెబ్బకొట్టారో తెలుసుకోవచ్చు. వంచనకు బ్రాండ్ ఆంబాసిడరైన ఈయన పేదల ఆశలతో ఆడుకుంటున్నారని పలువురు మండిపడుతున్నారు. కొత్తగా ఒక్కటీ ఇవ్వలేదాయే..నెల్లూరు(పొగతోట): కూటమి ప్రభుత్వం కొలువుదీరి మరో ఆరు రోజుల్లో రెండేళ్లు పూర్తి కానుంది. ఈ కాలంలో కొత్తగా ఒక్కరంటే ఒక్కరికీ పింఛన్ను మంజూరు చేయలేదనే వాస్తవం విస్మయానికి గురిచేస్తోంది. భర్త మరణిస్తే భార్యకో.. భార్య మరణిస్తే భర్తకు కేటాయించడం మినహా కొత్త వాటిని ఇచ్చే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. ఫలితంగా వీటిని పొందేందుకు గానూ జిల్లాలో దాదాపు 60 వేల మంది ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. దరఖాస్తు దాఖలుకూ ఆంక్షలే.. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సైతం వీల్లేకుండా ఆంక్షలను సర్కార్ విధించింది. ఫలితంగా అధికారులకు అర్హులు వినతిపత్రాలను సమర్పి ంచి.. ఎప్పుడెప్పుడు వస్తుందాననే గంపెడు ఆశతో నిరీక్షిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే, ఉన్న వాటిని సైతం తొలగించే పనిలో కూటమి ప్రభుత్వం నిమగ్నమైంది. సర్కార్ ఏర్పడిన ఈ రెండేళ్లలో దాదాపు 29 వేలకు పైగా పింఛన్లను తొలగించి వారి కుటుంబాల్లో అంతులేని శోకాన్ని మిగిల్చింది. పరిశీలన పేరుతో దివ్యాంగుల పింఛన్లకు సైతం కోత విధించేందుకు ఉపక్రమించింది. ఇంత వ్యత్యాసమా..? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2024 ఏప్రిల్ నాటికి జిల్లాలో 3.16 లక్షల మంది పింఛన్ను పొందేవారు. అయితే ఈ సంఖ్య ప్రస్తుతం 2,90,009కు పరిమితమైంది. కుట్రలను అమలు చేయడంలో భాగంగా సర్కార్ ఈ రకంగా వ్యవహరిస్తోందనే చర్చా లేకపోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులనే సాకును చూపి వీటికి కోత వేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అధికారులను ప్రశ్నిస్తే, వారి నుంచి వస్తున్న సమాధానం మరీ విడ్డూరంగా ఉంటోంది. పింఛన్లను పొందే వారిలో ప్రతి నెలా 500 నుంచి వెయ్యి మందికిపైగా మరణిస్తున్నారని, అందుకే ఇలా తగ్గుతోందని చెప్తుండటం విస్మయానికి గురిచేస్తోంది. దివ్యాంగులనూ వదల్లేదు.. ప్రభుత్వమిచ్చే పింఛన్తో కొంత మేర ఊరటగా ఉండే దివ్యాంగులపై సైతం ప్రస్తుత సర్కార్ పైశాచికాన్ని ప్రదర్శించింది. గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు మంజూరు చేశారనే సాకును చూపి పరిశీలన ప్రక్రియకు సిద్ధమైంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. మరోవైపు పంపిణీ ప్రక్రియ ప్రస్తుతం లోపభూయిష్టంగా మారిందనే భావన పలువురిలో వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో 2024 ఏప్రిల్ నాటికి – 3.19 లక్షలు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో.. 2.9 లక్షలు జగనన్న హయాంలో ఇంటి ముంగిటకే పేదల కష్టాలను తీర్చాలనే లక్ష్యంతో గత సీఎం జగన్మోహన్రెడ్డి ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేశారు. ఆయన ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ ఎంతో గొప్పగా నిలిచింది. ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే ఠంఛన్గా వీరి ద్వారా ఆవ్వాతాతల ఇంటి తలుపులు తట్టి అందజేసేవారు. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేకుండానే, కొత్త పింఛన్ల కోసం ఇంటి నుంచే దరఖాస్తు చేసుకునే వెసులుబాటును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ కల్పించింది. పూర్తి వివరాలను వలంటీర్ అప్లోడ్ చేసిన మరుసటి నెల నుంచే ఇవి మంజూరయ్యేవి. అయితే ప్రస్తుత టీడీపీ హయాంలో ఇవేవీ మచ్చుకై నా కానరావడంలేదు. బూటకపు హామీలతో పబ్బం చాపకింద నీరులా తొలగిస్తున్న సర్కార్ కొత్తవి ఇవ్వరు.. పాతవీ ఉంచరు రెండేళ్లుగా తప్పని ఎదురుచూపులు ఎవరైనా మరణిస్తేనే ఇస్తారంట..! పరిశీలన పేరుతో దివ్యాంగులపై వేధింపులు జిల్లాలో ఇలా.. విజయమే పరమావధిగా గత ఎన్నికలకు ముందు ఆచరణ సాధ్యం కాని హామీలను చంద్రబాబు గుప్పించారు. ఇదే కోవలో పింఛన్లు సైతం ఉన్నాయి. అయితే ఈ అంశం అమల్లో సర్కార్ ఘోరంగా విఫలమైంది. సంపద సృష్టించి.. సంక్షేమ పథకాలను అమలు చేస్తానంటూ ఇటీవలి కాలంలో ఈయన పదేపదే చెప్తున్నారు. సంపద సృష్టించే అవకాశాల్లేని తరుణంలో.. వీటిని ఎలా నెరవేరుస్తారనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. -
9న వీఎస్యూ స్నాతకోత్సవ వేడుకలు
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ 10, 11, 12వ స్నాతకోత్సవ వేడుకలను నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల తొమ్మిదిన నిర్వహించనున్నామని వీసీ అల్లం శ్రీనివాసరావు చెప్పారు. కాకుటూరు సమీపంలోని వర్సిటీలో విలేకరుల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిఽథిగా హాజరై, విద్యార్థులకు పట్టాలు, స్వర్ణ పతకాలను అందజేయనున్నారని వివరించారు. స్నాతకోత్సవానికి సంబంధించి 6017 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో డిగ్రీ కోర్సుల నుంచి 4921 మంది.. పీజీ అండ్ ప్రొఫెషనల్ కోర్సుల నుంచి 1075 మంది.. 21 మంది పరిశోధక విద్యార్థులు పీహెచ్డీ పట్టాలను అందుకోనున్నారని తెలిపారు. పీజీ విద్యార్థుల్లో సైన్స్ విభాగం నుంచి 331.. ఆర్ట్స్ నుంచి 37.. కామర్స్ అండ్ మేనేజ్మెంట్ నుంచి 67 మంది పట్టాలను స్వీకరించనున్నారని పేర్కొన్నా రు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన క్రీడాకారులు, విద్యార్థులకు కలిపి మొత్తం 45 స్వర్ణ పతకాలను గవర్నర్ చేతుల మీదుగా అందజేయనున్నామని తెలిపారు. దేశానికి సేవలందించిన ముగ్గురు ప్రముఖులకు వీఎస్యూ తరఫున ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ పురస్కారాలను అందజేయనున్నామని వెల్లడించారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ సునీత, వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ విజయ, పరీక్షల విభాగ డీన్ వెంకట్రాయులు, పరీక్షల నిర్వహణాధికారి మధుమతి తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణతోనే మనుగడ
నెల్లూరు(అర్బన్): పర్యావరణాన్ని కాపాడుకుంటేనే జీవరాశుల మనుగడ సజావుగా సాగుతుందని, లేని పక్షంలో అనర్థాలు తప్పవని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వీఆర్సీ గ్రౌండ్స్ నుంచి మద్రాస్ బస్టాండ్ వరకు హరిత ర్యాలీని జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. డప్పుల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడంతో పాటు చెట్లను పెంచాలని పిలుపునిచ్చారు. వివిధ పాఠశాలల విద్యార్థులకు ఇటీవల నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. కాలుష్య నియంత్రణ బోర్డు ఈఈ అశోక్కుమార్, కమిషనర్ నందన్ తదితరులు పాల్గొన్నారు. జూనియర్ కళాశాలల పునఃప్రారంభం నేడు నెల్లూరు (టౌన్): వేసవి సెలవుల అనంతరం జూనియర్ కళాశాలలను శనివారం పునఃప్రారంభించనున్నారు. దీంతో విద్యార్థులు కాలేజీల బాట పట్టనున్నారు. కాగా శని, ఆదివారాలు రావడంతో జిల్లాలోని మెజార్టీ కళాశాలలను సోమవారం ప్రారంభించే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఉచిత ప్రవేశానికి ఫీజులు వసూలు చేస్తే చర్యలు నెల్లూరు (టౌన్): జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో 12 (1సీ) కింద ఒకటో తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని డీఈఓ బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉచిత ప్రవేశం కల్పించిన విద్యార్థులందరికీ ఆయా పాఠశాలల్లో ఆడ్మిషన్ను తప్పక ఇవ్వాలని ఆదేశించారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 75,691 మంది గురువారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 39,050 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.16 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
ఉలవపాళ్లలో శ్మశాన భూమిపై సర్వే
దగదర్తి: ఉలవపాళ్లలో దళితుల శ్మశాన భూమిని కొందరు ఆక్రమించేందుకు యత్నించిన నేపథ్యంలో సర్వేను రెవెన్యూ అధికారులు శుక్రవారం నిర్వహించారు. వివాదాస్పద భూమి హద్దులను పరిశీలించారు. దళితుల శ్మశాన భూమి ఆక్రమణకు యత్నం అనే శీర్షికన సాక్షిలో కథనం గురువారం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా దళితులు మాట్లాడారు. గ్రామంలోని కొందరు వ్యక్తులు తమ స్వలాభం కోసం శ్మశాన భూమిని కబ్జాదారులకు అప్పగించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. తామంతా ఏకమై అడ్డుకోవడంతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. రెవెన్యూ అధికారుల సహకారంతో కొందరు వ్యక్తులు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సర్వే వివరాలను తహసీల్దార్కు నివేదిక రూపంలో అందజేయనున్నామని అధికారులు తెలిపారు. -
వెన్నుపోటు చంద్రబాబుకు కొత్తకాదు
● ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వం ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరు: వెన్నుపోటు పొడవడం సీఎం చంద్రబాబుకు కొత్తకాదని.. ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటి ప్రజల వరకు ఆయన పోటుకు బలైన వారేనని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాన్ని పట్టణంలోని సంగం రోడ్డు సెంటర్లో గల కాకాణి రమణారెడ్డి విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి శుక్రవారం ఆయన నిర్వహించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల ప్రతులను దహనం చేశారు. సంగం రోడ్డు సెంటర్ నుంచి పంచాయతీ బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని జరిపారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. అసెంబ్లీలో మూడు బడ్జెట్లను చంద్రబాబు ప్రవేశపెట్టినా, ఏ హామీనీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. గతంలో ఎన్టీఆర్కు ఏ విధంగా వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారో.. అదే తరహాలో ప్రజలకు అబద్ధపు హామీలిచ్చి పాలనను సాగిస్తున్నారని మండిపడ్డారు. సూపర్ సిక్స్ను పూర్తిగా విస్మరించారని, ఆడబిడ్డ నిధి ద్వారా రెండేళ్లలో ఒక్కో మహిళకు రూ.36 వేల మేర బాకీ పడ్డారని విమర్శించారు. మరోవైపు సూపర్ సిక్స్.. హిట్ అంటూ సభలు, సమావేశాలను పెడుతున్నారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణంలో కొర్రీలు, గ్యాస్ సిలిండర్ల హామీలో నాలుక మడతపెట్టడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. కౌలు రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి, అన్నదాత సుఖీభవలో ఏడు లక్షల మంది అన్నదాతల పేర్లను తొలగించారని ఆరోపించారు. 50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పింఛన్ను ఇస్తానని చెప్పి మోసం చేశారని, మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీగా మార్చారని ధ్వజమెత్తారు. దీనిపై ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టమని చెప్పి హిట్లర్ను తలపిస్తున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధిపై సవాల్కు జవాబేదీ..? పొదలకూరు మండలాభివృద్ధిపై సోమిరెడ్డి చేసిన సవాల్కు ప్రతి సవాల్ చేస్తే ఇప్పటి వరకు జవాబు లేదని విరుచుకుపడ్డారు. తన చోటా నేతలను పంపి ఇరిగేషన్లో జరిగిన అవినీతిని కప్పిపుచ్చేందుకు యత్నిస్తే కుదరదని, సోమిరెడ్డే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. పొదలకూరు బస్టాండ్లో ప్రయాణికులు, బస్సులు నడుస్తున్న రోడ్డు మొదలుకొని గ్రామాల్లో జరిగిన పనులపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇరిగేషన్ అధికారులు త్వరలో అన్ని రకాల విచారణలను ఎదుర్కోక తప్పదని చెప్పారు. సోమిరెడ్డి చెప్పిన విధంగా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు డబ్బుల కట్టలను లెక్క పెట్టుకుంటున్నారని, భవిష్యత్తులో ఊచలు లెక్కపెట్టుకోవాల్సి వస్తుందని తెలిపారు. ప్రతి గ్రామానికీ ఇద్దరం వెళ్లి.. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో తేల్చుకుందామని సవాల్ విసిరారు. సోమిరెడ్డి హయాంలో తిప్పలు కరిగిపోతున్నాయని, లేఅవుట్ల యజమానుల వద్ద వసూలు చేసుకుంటూ ప్రభుత్వ స్థలాలను దోచుకుంటున్నారని ఆరోపించారు. కనుపూరు కాలువ పనులను మనుషులతో చేయించాలని, అయితే సోమిరెడ్డి మాత్రం రూ.పది లక్షల వంతున బిట్లుగా మార్చి మెషీన్లతో చేయించి స్వాహా చేశారని విమర్శించారు. నేతలు గోగిరెడ్డి గోపాల్రెడ్డి, బచ్చల సురేష్కుమార్రెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, తెనాలి నిర్మలమ్మ, లక్ష్మీకల్యాణి, షాకీరాబేగం, వాకాటి శ్రీనివాసులురెడ్డి, చిల్లకూరు వెంకురెడ్డి, వేణుగోపాల్రెడ్డి, రావుల ఇంద్రసేన్గౌడ్, హరిశ్చంద్రారెడ్డి, శ్రీనివాసులు, అంజద్, లచ్చారెడ్డి, దయాకర్రెడ్డి, రామిరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, బాలకొండారెడ్డి, రమణారెడ్డి, పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సంగీతాన్ని ఆస్వాదించాలి
వెంకటాచలం: సంగీతాన్ని వినడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, దీన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కాంక్షించారు. సంకీర్తన సుధాకర గరిమెళ్ల అనిలకుమార్ ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తన సంగీత విభావరిని వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్లో గురువారం నిర్వహించారు. పలు అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడారు. సంగీతం అంటే కేవలం సినిమా సంగీతం మాత్రమే కాదని, శాసీ్త్రయ సంగీత లోతును తెలుసుకోవాలన్నారు. అనంతరం పలువురు విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేశారు. స్వర్ణభారత్ మేనేజింగ్ ట్రస్టీ దీపావెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికను బహిష్కరించిన వైఎస్సార్సీపీ
ప్రలోభాల ఎరతో అధికార మదంతో ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసిన టీడీపీ ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ తీరును నిరసిస్తూ ఎంపీపీ ఎన్నికను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. సభ్యులు అంగట్లో సరుకులా అమ్ముడుబోయి ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ తెచ్చారంటూ మండిపడుతూ బయటకెళ్లారు. దీన్ని బ్లాక్ డేగా మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ, పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్చార్జి మేరిగ మురళీధర్ అభివర్ణించారు. రాజ్యాంగాన్ని అపహస్యం చేసిన టీడీపీ ఎమ్మెల్యే తీరును ఎండగట్టారు. -
డీఎస్సీ పోరాట కమిటీ రాష్ట్ర సభ్యుడిగా పర్వతరెడ్డి
నెల్లూరు రూరల్: డీఎస్సీ పోరాట కమిటీ రాష్ట్ర సభ్యుడిగా ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉత్తర్వులను పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది. 16 మంది డీటీలకు తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతులు నెల్లూరు(అర్బన్): జిల్లాలో 16 మంది డీటీలకు తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతులను కల్పిస్తూ ఉత్తర్వులను సీసీఎల్ఏ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయలక్ష్మి గురువారం జారీ చేశారు. రాష్ట్రంలో మొత్తం 49 మందికి ఉద్యోగోన్నతలు కల్పించగా, ఇందులో జిల్లాలో 16 మందికి లభించాయి. పోతల పద్మజాకుమారి, గుడుగుంట స్వర్ణ, స్వప్న, లక్ష్మీప్రసన్న, ఫజియా, నాగచంద్రకళ, సారంగపాణి, గయాజ్ అహ్మద్, రమేష్కుమార్, మునెమ్మను జిల్లాకే కేటాయించారు. సురేష్బాబు, రామమోహన్, మారుతికృష్ణప్రసాద్, లక్ష్మీనారాయణ, శ్రావణ్కుమార్, కొండా శిరీషను మార్కాపురం జిల్లాకు బదిలీ చేశారు. రోగ నిర్ధారణలో ఎల్టీల పాత్ర కీలకం నెల్లూరు(అర్బన్): రోగ నిర్ధారణలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకమని డీఎంహెచ్ఓ సుజాత పేర్కొన్నారు. పీహెచ్సీల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లతో సంతపేటలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. పరీక్షలు, ఫలితాలు, రికార్డులపై క్షుణ్ణంగా వివరించారు. ప్రతి పరీక్షను జాగ్రత్తగా చేయాలని కోరారు. ఏడీఎంహెచ్ఓ ఖాదర్వలీ, జిల్లా మలేరియా నివారణాధికారి సింహాచలం, డాక్టర్ సునీల్, అసిస్టెంట్ మలేరియాధికారి జయరామ్, గణాంకాధికారి సహన తదితరులు పాల్గొన్నారు. రైతులకు విరివిగా రుణాలివ్వాలి ఉదయగిరి: బ్యాంకర్లు తమ పరిధిలోని రైతులకు రుణాలను విరివిగా మంజూరు చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ మణిశేఖర్ పేర్కొన్నారు. ఉదయగిరి బ్లాక్ పరిధిలోని వివిధ బ్యాంకర్లతో స్థానిక సీ్త్ర శక్తి భవనంలో గురువారం నిర్వహించిన జేఎమ్మెల్బీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులకు రూ.6500 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, దీనికి బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులు సహకరించాలని కోరారు. 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్ని రకాల రుణాల లక్ష్యం రూ.32,445 వేల కోట్లు కాగా, రూ. 41 వేల కోట్లను పంపిణీ చేసి 128 శాతం వృద్ధి సాధించామన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యం కంటే అధికంగా మంజూరు చేసి 110 శాతం వృద్ధి సాధించామని వెల్లడించారు. బీమా పథకాలకు సంబంధించి ఖాతాదారులు రెన్యువల్ చేయించుకునేలా బ్యాంకర్లు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే ఖాతాదారులు ఈ – కేవైసీని విధిగా చేయించుకోవాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కెనరా బ్యాంక్ అందించే సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతా కలిగి ఉండేలా చూడాలని చెప్పారు. బ్యాంక్ అధికారులు డాక్టర్ బాబు, రవిశంకర్, కోటేశ్వరరావు, గురుస్వామి, కాశయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ బాలుకు ఘన నివాళి నెల్లూరు(వీఆర్సీసెంటర్): గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతిని పురస్కరించుకొని నగరంలోని ఆదిత్యనగర్లో గల పార్కులో ఆయన విగ్రహానికి పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసులు, అధ్యక్షుడు రాజేశ్వరరావు, లక్ష్మీలీల, కార్యదర్శులు లలితారెడ్డి, ఉపాధ్యక్షులు రామ్మూర్తి, సుజాత, జ్యోతిర్మయి, శ్రీనివాసరావు, లక్ష్మి, రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాలువలో పడి వ్యక్తి మృతి
సోమశిల: కాలువలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన శంకర్ నగరం కాలు వ కట్ట మార్గాన గురువారం వెలుగుచూసింది. ఎస్సై రాజేష్ కథనం మేరకు.. అనంతసాగరం మండల పరిధిలోని లక్కరాజుపల్లి గ్రామానికి చెందిన దివానపు రవి(51) నాలుగు రోజుల క్రితం ఆత్మకూరు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రధాన రహదారి నుంచి లక్కరాజుపల్లికి వెళ్లేందుకు దగ్గరగా ఉండే శంకర్ నగరం కాలువ కట్ట మార్గాన ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపుతప్పి జారి కాలువలో పడ్డారు. నాలుగు రోజుల నుంచి కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలిస్తుండగా గురువారం కాలువలో మృతదేహాన్ని చూసిన స్థానికులు కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు కన్నీరు మున్నీరయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
రామిరెడ్డికి ఆత్మీయ సన్మానం
కావలి: రెండు దశాబ్దాలకుపైగా టీడీపీలో కీలక నేతగా ఉండడమే కాకుండా యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.. బీద సోదరులకు అత్యంత సన్నిహితుడు, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్కుమార్ సోదరుడు గుండ్లపల్లి మురళి గురువారం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కావలి ఇన్చార్జి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని కలిశారు. ఆయన జన్మదిన వేడుకల్లో పాల్గొని సత్కరించి కార్యకర్తలకు గౌరవం, ప్రేమాభిమానం వైఎస్సార్సీపీలో దక్కుతుందన్నారు. కాగా ఏడాదిన్నరగా టీడీపీలో తగిన గౌరవం లేకపోవడంతో వైఎస్సార్సీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. -
రాజ్యాంగాన్ని గౌరవించడం చేతకాదా..?
● ఎంపీపీ ఉప ఎన్నికల్లో ప్రలోభాలకు పాల్పడిన అధికార పార్టీ ● ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న నేతలు ● బ్లాక్ డేగా పరిగణిస్తాం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి చిల్లకూరు: రాజ్యాంగాన్ని గౌరవించడం టీడీపీ నేతలకు చేతకాదని.. ఒక పార్టీ తరఫున గెలుపొందిన వారిని ప్రలోభాలకు గురిచేసి.. ఫిరాయింపులకు ప్రోత్సహించి.. కోటలో నిర్వహించిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో విజయం సాధించామని గొప్పలు చెప్పుకొంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. కోటలోని ఓ అతిథి గృహంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, సీఈసీ సభ్యుడు పేర్నాటి శ్యామ్ప్రసాద్రెడ్డి, కొడవలూరు భక్తవత్సలరెడ్డితో కలిసి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాకాణి మాట్లాడారు. కోట ఎంపీపీ ఉప ఎన్నిక జరిగిన ఈ రోజును బ్లాక్డేగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఇక్కడి ఎంపీపీ కాలపరిమితి నాలుగు నెలలుండగా, అధికార దర్పాన్ని ప్రదర్శించేందుకు గానూ తమ పార్టీ తరఫున గెలుపొందిన ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేసి అప్రజాస్వామికంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. తమ పార్టీ ఎంపీపీ అభ్యర్థిని ఎన్నిక జరిగే ప్రాంతానికి రానీయకుండా భయభ్రాంతులకు గురిచేసి.. వారి అభ్యర్థి ఒక్కరే హాజరైనట్లు ప్రకటించుకున్నారని మండిపడ్డారు. రెండేళ్ల క్రితం ఇదే రోజున ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేపట్టారో.. అదే తరహాలో కోటలోనూ అధికార పార్టీ నేతలు వ్యవహరించారని ఆరోపించారు. ఐదేళ్ల క్రితం తమ పార్టీ తరఫున ఎంపీటీసీలుగా 13 మంది.. టీడీపీ నుంచి ముగ్గురు గెలుపొందారని పేర్కొన్నారు. తమ పార్టీ ప్రజాప్రతినిధులకు బలవంతంగా టీడీపీ కండువాలు కప్పి అధికారాన్ని దక్కించుకున్నారని ఎద్దేవా చేశారు. వెన్నుపోటుదారులకు భవిష్యత్తులో ఎక్కడా స్థానం లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. తమ పార్టీ నుంచి గెలిచిన వారిని టీడీపీ వైపు తిప్పకోవడంతోనే గెలుపనుకుంటే పొరపాటని, ఇలాంటి పోకడలు వారి దిగజారుడుతనానికి, సిగ్గుమాలినతనానికి నిదర్శనంగా అభివర్ణించారు. సొంతంగా గెలవలేని వారు ఇలా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడటం దౌర్భాగ్యమని విమర్శించారు. చంద్రబాబు దుష్టపాలన, నియంతృత్వ పోకడలను ప్రజలకు తెలియజేసేందుకే మీడియా ముందుకు రావాల్సి వచ్చిందన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, తమ వెంటే ఉన్న ఎంపీటీసీలను ఆయన అభినందించారు. తీరని మచ్చ కోటలో నిర్వహించిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అవలంబించిన ఫిరాయింపుల పర్వం ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ అని మద్దిల గురుమూర్తి పేర్కొన్నారు. తమ పార్టీ ఎంపీటీసీలకు టీడీపీ కండువాలు కప్పి తమ వారిగా ఆ పార్టీ ప్రకటించడాన్ని చూస్తుంటే ప్రజాస్వామ్యం అభాసుపాలవుతోందనే విషయం అర్థమవుతోందని తెలిపారు. చంద్రబాబు సైతం ఇలాంటి రాజకీయాలు చేయడంతో కింది స్థాయి నేతలూ వీటినే అనుసరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న వారిని గుర్తిస్తామని ప్రకటించారు. ఇలాంటి దుష్ట రాజకీయాలకు ఇప్పటికై నా గూడూరు నియోజకవర్గ ప్రజలు చరమగీతం పాడేందుకు ముందుకురావాలని కోరారు. కోట, చిట్టమూరు మండలాల పార్టీ కన్వీనర్లు పలగాటి సంపత్కుమార్రెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఎంపీటీసీలు సౌజన్యారెడ్డి, శేషయ్య, రాజేశ్వరి, అంకమ్మ, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కార్యాలయాలనూ వదిలేది లేదు
● విద్యుత్ శాఖ మట్టి అక్రమ తరలింపు ● రాత్రికి రాత్రే కొల్లగొట్టిన వైనం ముత్తుకూరు(పొదలకూరు): విద్యుత్ శాఖ భవన నిర్మాణ పునాదుల కోసం తవ్విన మట్టిని బుధవారం రాత్రికి రాత్రే అధికార పార్టీకి చెందిన కొందరు అక్రమంగా తరలించారు. జేసీబీని ఉపయోగించి మట్టిని కొల్లగొట్టారు. ఈ తంతును గమనించిన స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. మండలంలోని బ్రహ్మదేవం గ్రామంలో విద్యుత్ శాఖ భవన నిర్మాణం కోసం తవ్విన పునాదుల మట్టిని కొందరు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచేశారు. మరీ ఇంత దిగజారి అక్రమాలకు పాల్పడడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై విద్యుత్శాఖ కాంట్రాక్టర్లు ఎలా స్పందిస్తారోనని వేచి చూస్తున్నారు. అధికార అండతో ఇలాంటి పనులకు పాల్పడుతున్నా ప్రశ్నించే వారు లేరని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికే అటవీ, రెవెన్యూ, ప్రైవేటు భూములను వదలకుండా మట్టి, గ్రావెల్ను తరలిస్తున్న ముఠాలు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం తవ్విన మట్టిని కూడా వదలడం లేదు. ఈ అక్రమాలను కొందరు యువకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. -
విద్యుత్ మీటర్లో మంటలు
● త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ఆత్మకూరు: షార్ట్సర్క్యూట్ కారణంగా విద్యుత్ మీటరుకు మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా భయపడి ఇంట్లోని వారు రోడ్డుపైకి పరుగులెత్తిన ఘటన ఆత్మకూరు పట్టణంలోని హిల్రోడ్డులో గురువారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. హిల్ రోడ్డులో నివాసం ఉండే విజయలక్ష్మి అనే మహిళ ఇంట్లోని విద్యుత్ మీటరులో ఒక్కసారిగా మంటలు కనిపించాయి. వెంటనే ఇంట్లోని మహిళలు కేకలు వేస్తూ రోడ్డుపైకి వచ్చారు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న షుకూర్ అనే వ్యక్తి ఏఈ జమీలా బేగంకు సమాచారం ఇవ్వడంతో ఆమె సిబ్బందిని పంపి విద్యుత్ సరఫరాను నిలిపివేయించింది. తీవ్రమైన వేసవి కారణంగా ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమై ఉంటుందని విద్యుత్ శాఖ సిబ్బంది పేర్కొన్నారు. గల్లంతైన యువకుడి మృతి దగదర్తి: మండల పరిధిలోని చెన్నూరు సమీపంలో కావలి కాలువలో ఈతకు వెళ్లి గల్లంతైన బొడ్డు కార్తీక్ (32) కోసం గురువారం ఉదయం నుంచి పోలీసులు, స్థానికులు కలిసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గల్లంతైన సమీప ప్రాంతంలోనే కార్తీక్ మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు. కార్తీక్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జెడ్పీ డిప్యూటీ సీఈఓ బాధ్యతల స్వీకరణ నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా బ్రహ్మయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు స్థానిక జెడ్పీ కార్యాలయంలో గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, సీఈఓ శ్రీధర్రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. -
భారతీయుల మదిలో బాలు అమరజీవి
నెల్లూరు(బృందావనం): తన మాట, పాట, భాష, యాస, సంస్కృతి, వ్యక్తిత్వం, హావభావాలు తదితర సద్గుణాల మేళవింపుతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జీవితం సినీ సంగీత చరిత్రలో ఒక మైలురాయి అని, ఎన్ని తరాలైనప్పటికీ ఆయన భారతీయుల మదిలో అమరజీవిగా నిలిచిపోతారని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. మినీబైపాస్రోడ్డులోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఎన్టీఆర్ పార్కులో ఏర్పాటు చేసిన గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన జయంతి సందర్భంగా నెల్లూరులో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మనభాషను, సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని, తెలుగుభాషకు ఎనలేని కీర్తిని తీసుకురావడంలో తన గాత్రమాధుర్యంతో బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన కృషి అనన్య సామాన్యమైందిగా పేర్కొన్నారు. తెలుగు సినిమా సంగీతానికి ‘ఘంటసాల–బాలు’’ ద్వయం స్వర్ణయుగాన్ని తీసుకొచ్చారని శ్లాఘించారు. తెలుగుపాటలకు పట్టాభిషేకం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల హృదయ సింహాసనాలపై ఘంటసాల, బాలూ ద్వయం నిలిచిపోయిందన్నారు. తన దినచర్యలో బాలు గాత్రం ఒక అంతర్భాగమై పోయిందన్నారు. తెలుగు ప్రజల నిత్య జీవితాల్లోనూ, ఆలయాల సుప్రభాత సంగీత నివేదనల్లోనూ బాలు స్వరం నిత్యం ధ్వనిస్తూనే ఉంటుందన్నారు. తనకు బాలగంగాధర్తిలక్ రాసిన కవితా సంపుటి ‘అమృతం కురిసిన రాత్రి’ గుర్తుకొస్తుందంటూ అందులోని పంక్తులను వివరించారు. దేవతలు సైతం కీర్తించేలా ఉండే ఆ వ్యక్తిత్వం బాలుకి అచ్చుగుద్దినట్లు సరిపోతాయన్నారు. ఆ కవితా సంపుటిలో పేర్కొన్న మేరకు బాలసుబ్రహ్మణ్యం అమరుడంటూ భావోద్వేగంగా పేర్కొన్నారు. తన కంటే బాలసుబ్రహ్మణ్యం వయస్సులో కాస్త పెద్దవారైనప్పటికీ తనపై ఎంతో అభిమానం, గౌరవం చూపేవారని గుర్తుచేసుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం తండ్రి సాంబమూర్తి ఎంతో శ్రమకోర్చి వీధివీధి తిరిగి హరికథాగానం చేస్తూ బియ్యం సేకరించి భిక్షాటన పూర్వక త్యాగరాజస్మరణోత్సవాలను నిర్వహించి భక్తిభావం కలిగించారని, తండ్రికి తగ్గ తనయుడిగా బాలు త్యాగరాజ స్మరణోత్సవాలను నిర్వహించిన తీరు అనన్యసామాన్యమన్నారు. బాలు విగ్రహ ఏర్పాటుకు సహకరించిన మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డిలను, కార్యక్రమాన్ని సమన్వయపరిచిన లాయర్ వారపత్రిక సంపాదకుడు తుంగా శివప్రభాత్రెడ్డిని అభినందించారు. శాంత బయోటెక్ వ్యవస్థాపక చైర్మన్, పద్మభూషణ్ డాక్టర్ కేఐ వరప్రసాద్రెడ్డి, అఖిల భారత తెలుగుసమాఖ్య అధ్యక్షుడు, బాలు ఆప్తమిత్రుడు ఆచార్య సీఎంకే రెడ్డి, ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి, మణిశర్మ, ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్, కుటుంబసభ్యుడు శుభలేఖ సుధాకర్, ఆర్కిటెక్ట్ రామిరెడ్డి సాకేత్రెడ్డి, దీపా వెంకట్ తదితరులు మాట్లాడారు. బాలు ఆప్తులు, మిత్రులు, సన్నిహితులు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, వీరిశెట్టి హజరత్బాబు, గ్రోసు సుబ్బారావు, తాటి చలపతిరావులను సైతం సత్కరించారు. అలరించిన స్వరనీరాజనం ఎంఎం కీరవాణి, మణిశర్మ, నాగూరుబాబు(మనో), ఎస్పీ శైలజ, ఎస్పీ వసంత, ఎస్పీ చరణ్, ఎస్పీ అభిషేక్ గానగంధర్వుడికి స్వరనీరాజనం పలికారు. బాలు గళం నుంచి జాలువారిన ఎన్నో అద్భుత గీతాలను ఆలపించారు. బాలు విగ్రహావిష్కరణలో పాల్గొన్న అతిథులు ఆయన పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఘనంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహావిష్కరణ -
అల్పాహారం అందలేదంటూ టీచర్ల నిరసన
వింజమూరు(ఉదయగిరి): ఎఫ్ఎల్ఎన్ శిక్షణకు 420 మంది ఉపాధ్యాయులు రాగా, వారిలో కేవలం 150 మందికే అల్పాహారం అందడంతో మిగితా వారు అందోళనకు దిగిన ఘటన గురువారం వింజమూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఉదయగిరి నియోజకవర్గంలోని ఒకటి, రెండో తరగతుల ఉపాధ్యాయులకు ఆరు రోజుల పాటు స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఫౌండేషన్ లిట్రసీ అండ్ న్యూమరసీ(ఎఫ్ఎల్ఎన్) శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకు హాజరు కాగా 8.30కి అల్పహారం అందించాలి. కాగా మొదటి రోజు అల్పహారం కొద్దిమందికే అందించారు. దీంతో మిగతా వారు ఆందోళనకు దిగారు. దీనివల్ల ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన శిక్షణ తరగతులు రెండు గంటలు ఆలస్యంగా జరిగాయి. మధ్యాహ్న భోజనం కూడా మెనూ ప్రకారం ఇవ్వలేదు. అది కూడా నాణ్యత లేకుండా ఉందని పలువురు ఉపాధ్యాయులు అన్నారు. వీరి భోజనం, అల్పాహారం కోసం ప్రతి టీచర్కు రోజుకు రూ.300 కేటాయించారు. ఆహారం అందించే కాంట్రాక్టు ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఈ క్రమంలో ఇలా చేయడంపై ఉపాధ్యాయులు నిలదీశారు. ఈ అంశంపై ఎంఈఓ మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ మొదటి రోజు చిన్నచిన్న లోపాలు జరిగాయని, రేపు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. -
చంద్రబాబు మోసాలపై దండయాత్ర
● ‘వెన్నుపోటుకు రెండేళ్లు’కు వెల్లువెత్తిన ప్రజాభిమానం ● హోరెత్తిన ర్యాలీలు ● మేనిఫెస్టో ప్రతుల దహనం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమానికి జిల్లాలో ప్రజాభిమానం వెల్లువెత్తింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మండల కేంద్రాల్లో కార్యక్రమాలను పార్టీ శ్రేణులు గురువారం నిర్వహించాయి. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కోవూరు, గూడూరు నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలను చేపట్టారు. చంద్రబాబు మోసపూరిత హామీలను ఎండగట్టారు. హామీల అమల్లో ఘోరంగా విఫలం వెంకటాచలం: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమల్లో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత విమర్శించారు. వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రమైన వెంకటాచలంలో పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో హామీ పత్రాలు, వివిధ పత్రికల ద్వారా విడుదల చేసిన ప్రకటనల ప్రతులను సర్వేపల్లి క్రాస్ రోడ్డు వద్ద దహనం చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీని చేపట్టి.. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బూటకపు హామీలతో చంద్రబాబు గద్దెనెక్కి రెండేళ్లు పూర్తవుతోందని, అయితే నేటికీ మాటను ఆయన నిలబెట్టుకోలేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కూటమి ప్రభుత్వ మోసాలపై రాష్ట్ర ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారానని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రిస్తామని చెప్పిన చంద్రబాబు.. ప్రస్తుతం దేశంలోనే ఎక్కడా లేని విధంగా అధిక ధరలున్న రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నారు. ఎరువుల ధరలు నియంత్రణలో లేకపోవడంతో రైతులు అధిక పెట్టుబడులు పెట్టాల్సిన దుస్థితి ప్రస్తుతం ఏర్పడిందని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పిస్తానన్న చంద్రబాబు.. ఆ ఊసే లేకుండా పాలనను సాగిస్తుండటంతో వారు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని చెప్పారు. జగన్మోహన్రెడ్డి హయాంలో పేదలకు వైద్య విద్యనందించేందుకు 17 మెడికల్ కళాశాలలను తీసుకొస్తే, వీటిని ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేసిందని మండిపడ్డారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దారుణంగా వంచించారని, స్పోర్ట్స్ కోటా భర్తీలో తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. ఎన్నికలెప్పుడు జరిగినా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, వైస్ ఎంపీపీలు కనుపూరు కోదండరామిరెడ్డి, పచ్చబట్ల మస్తానయ్య, మండల కన్వీనర్ కొణిదెన మోహన్నాయుడు, నేతలు ఆరుగుంట ప్రభాకర్రెడ్డి, కొణిదెన విజయభాస్కర్నాయుడు, మందల పెంచలయ్య, వెలిబోయిన వెంకటేశ్వర్లు, ముంగర శ్రీనివాసులు, పామూరు కృష్ణారెడ్డి, మంచు వెంకటేశ్వర్లునాయుడు, డేగా శ్రీనివాసులు, చీకుర్తి నరసయ్య తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి విజయకుమార్రెడ్డి, అరుణమ్మ ఆధ్వర్యంలో నిరసన హామీ ప్రతులను దహనం చేస్తున్న కాకాణి పూజిత తదితరులు మోసపూరిత పాలనను అర్థం చేసుకున్నారు.. నెల్లూరు సిటీ: రెండేళ్ల కూటమి పాలనలో జరిగిన మోసాలను ప్రజలు అర్థం చేసుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన హామీ ప్రతులను రూరల్ మండలంలోని సౌత్మోపూరులో గురువారం దహనం చేసిన అనంతరం వారు మాట్లాడారు. హామీలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. గత సీఎం జగన్మోహన్రెడ్డి 99 శాతం హామీలను అమలు చేసి మాటపై నిలిచారని గుర్తుచేశారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చెవిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మండలాధ్యక్షుడు పుచ్చలపల్లి రామ్ప్రసాద్రెడ్డి, మాజీ కార్పొరేటర్ లక్ష్మీసునంద, నేతలు నెల్లూరు మదన్మోహన్రెడ్డి, శ్యామ్సింగ్, సుబ్బారెడ్డి, ఆదిరెడ్డి నారాయణరెడ్డి, హరిశివారెడ్డి, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.నెల్లూరు రూరల్: ఎన్నికల సమయంలో ప్రత్యేక బాండ్లిచ్చి.. ఇంటింటికీ వెళ్లి ప్రజలను మభ్యపెట్టి టీడీపీ అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా నగరంలోని పాత చెక్పోస్టు సెంటర్లో భారీ నిరసన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే మహిళలకు పింఛన్ వంటి కీలక హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రత్యేక పోస్టర్లను ఆవిష్కరించారు. ఎన్నికలకు ముందు టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. ప్రశ్నిస్తే.. బాధ్యతల నుంచి తప్పుకొంటోంది హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తుంటే, బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకొంటోందని చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. చెప్పింది చేయలేక.. తిరిగి తమ పార్టీ శ్రేణులపై ఆరోపణలు చేస్తున్నారని, ఇంత కంటే దిగజారుడుతనం ఎక్కడైనా ఉందానని ప్రశ్నించారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులను దగా చేశారని మండిపడ్డారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీని ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పటి వరకు కమిషన్ను సైతం ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ప్రజలను మోసం చేసిన టీడీపీ అధికారంలో కొనసాగే అర్హతను కోల్పోయిందని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను ఈ నెల 12న నిర్వహించనున్నామని వెల్లడించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న తమ పార్టీ శ్రేణులపై ఎలాంటి కేసులు పెట్టినా, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఉద్యోగాలను అమ్ముకున్నారు.. మెగా డీఎస్సీ పేరుతో ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేసి ఒక్కో టీచర్ పోస్టును రూ.15 లక్షలకు విక్రయించారని ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై బాధితులకు అండగా నిలిచేందుకు తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్, సిటీ, ఆత్మకూరు పరిశీలకులు కొండ్రెడ్డి రంగారెడ్డి, పేర్నేటి కోటేశ్వర్రెడ్డి, సిటీ మహిళాధ్యక్షురాలు ధనుజారెడ్డి, విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కన్నీటి సుడిలో కాసుల వేట
కమీషన్ల రాజ్యం నెల్లూరు(అర్బన్): నగరంలోని కిసాన్నగర్–మల్లెతోట ప్రాంతానికి చెందిన ఎస్కే ఫయాజ్(54) రెక్కాడితే గాని డొక్కాడని అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. గత ఐదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. వారం క్రితం మళ్లీ స్ట్రోక్ రావడంతో భార్య, బిడ్డలు సోమవారం పెద్దాస్పత్రికి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. శవాన్ని ఇంటికి తరలించేందుకు కూడా మృతుడి భార్య దగ్గర నగదు లేదు. దీంతో తెలిసిన వారు బాడీని తరలించేందుకు నగదు ఏర్పాటు చేశారు. రోగి బంధువులు ఆస్పత్రి బయట ఉండే అంబులెన్స్లలో ఒకరితో మాట్లాడి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఇంటి వద్దకు శవాన్ని చేర్చడానికి బాడుగ మాట్లాడుకున్నారు. రూ.1,500 కావాలని అంబులెన్స్ యజమానిని కోరగా అందుకు అంగీకరించారు. అంబులెన్స్ను ఆస్పత్రిలోనికి తీసుకుని వస్తుండగా గేటు వద్ద జీకే అని రాయబడిన మరో అంబులెన్స్ డ్రైవర్ అడ్డుకున్నాడు. సీరియల్ ప్రకారం నేను మాత్రమే అంబులెన్స్ను తీసుకెళ్లాలి. నీవు ఎలా తీసుకెళ్తావ్ అంటూ మొదటి అంబులెన్స్ వ్యక్తిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. దీంతో రూ.1,500 బాడుగకు ఒప్పుకున్న వ్యక్తి తప్పుకున్నాడు. వెంటనే జీకే అంబులెన్స్ డ్రైవర్ తనకు రూ 2,500 ఇస్తేనే శవాన్ని తరలిస్తానని తేల్చి చెప్పాడు. ఇది అన్యాయమని, మా దగ్గర డబ్బులు లేవు.. పేదవారం.. మొదటి అంబులెన్స్ వ్యక్తి ఒప్పుకున్న విధంగా రూ.1,500 ఇస్తామంటే జీకే అంబులెన్స్ డ్రైవర్ ఒప్పుకోలేదు. ఇలా ఒకటిన్నర గంట సేపు జరిగిపోయింది. శవాన్ని ఆస్పత్రి వద్ద రోడ్డుపై స్ట్రెచర్లోనే ఉంచారు. ఇక చేసేదేమి లేక రెండో అంబులెన్స్ డ్రైవర్ అడిగినంత ఇచ్చుకుని శవాన్ని తీసుకెళ్లారు. అందుబాటులో లేని మహా ప్రస్థానం వాహనాలు పెద్దాస్పత్రిలో ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని ఇంటి వద్దకు ప్రభుత్వ ఆస్పత్రి యాజమాన్యం మహా ప్రస్థానం వాహనాల ద్వారా తరలించాలి. పెద్దాస్పత్రిలో రెండు మహాప్రస్థానం వాహనాలున్నాయి. అవి అందుబాటులో ఉండటం లేదు. వాహనాలు మరమ్మతులకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఒక వేళ మహాప్రస్థానం వాహనాలు అందుబాటులో ఉన్నా.. డ్రైవర్లు అందుబాటులో ఉండరు. దీంతో ప్రైవేటు అంబులెన్స్ల దందా కొనసాగుతోంది. పెద్దాస్పత్రి ప్రధాన గేటుకు ఉత్తర, దక్షిణ దిశలలో కనీసం 40 ప్రైవేటు అంబులెన్సులున్నాయంటే వీరి దందా ఎలా సాగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. పెద్దాస్పత్రిలో ప్రైవేటు రాబందులు మృతదేహాలను తరలించాలంటే అడిగినంత ఇచ్చుకోవాల్సిందే ఆస్పత్రి ముందే 40 వరకు ప్రైవేటు అంబులెన్స్లు బయటి వాటికి అవకావం ఇవ్వరు పెద్దాస్పత్రికి వేలాది మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. ఎవరైనా రోగి మృతిచెందితే కొంత మంది సిబ్బంది ద్వారా అంబులెన్స్ డ్రైవర్లు తెలుసుకుని పెద్ద ఎత్తున గుమిగూడుతారు. బయట అంబులెన్స్ల కన్నా ఆస్పత్రి వద్ద ఉండే అంబులెన్స్లు అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి. రోగి మృతిచెందిన సమాచారాన్ని అందించిన సిబ్బందికి కొంత మొత్తాన్ని కమీషన్ల రూపంలో అంబులెన్స్ల డ్రైవర్లు ఇస్తున్నారని తెలుస్తోంది. అలాగే కొంతమంది డాక్టర్లు తాము చూసే రోగి పరిస్థితి దిగజారిందని, సీరియస్ అని బంధువులకు చెప్పి భయపెడుతున్నారు. పెద్దాస్పత్రిలో అన్నిరకాల పరికరాలు లేవంటున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు తీసుకెళ్తే కోలుకుంటాడని చెప్పి అంబులెన్స్ల ద్వారా కార్పొరేట ఆస్పత్రులకు పంపుతున్నారనే చర్చ జరుగుతోంది. కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి కమీషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో మహా ప్రస్థానం, 108 అంబులెన్స్ వాహనాలున్నా ప్రైవేటు అంబులెన్స్ల దందా ఇక్కడ యథేచ్ఛగా జరిగిపోతోంది. అరికట్టాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. కలెక్టర్ జోక్యం చేసుకుని ప్రైవేటు అంబులెన్స్ల దోపిడీని అరికట్టాలని పేద రోగులు డిమాండ్ చేస్తున్నారు. నగరంలోని జిల్లా పెద్దాస్పత్రి రాబందులకు కేరాఫ్గా మారిపోయింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి మరణిస్తే మృతదేహాన్ని ఇంటి వరకు తరలించేందుకు కూడా ప్రైవేటు అంబులెన్స్ల డ్రైవర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పుట్టెడు దుఃఖంలో కన్నీటి సుడిలో కొట్టుమిట్టాడుతున్న కుటుంబసభ్యులను సైతం కాసుల కోసం వేటాడుతున్నారు. -
నిరుద్యోగ గిరిజన యువతకు ఉచిత శిక్షణ
నెల్లూరు(వేదాయపాళెం): జిల్లాలో ఆసక్తి గల నిరుద్యోగ గిరిజన యువతకు సోలార్ ప్యానల్ ఇన్స్టలేషన్ టెక్నీషియన్ కోర్సులో ఉచిత శిక్షణను నిర్వహించనున్నామని ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు బుధవారం ఒక పకటనలో తెలిపారు. వెంకటాచలంలోని యూత్ ట్రెయినింగ్ సెంటర్లో నెల రోజుల శిక్షణతో పాటు ఉచిత భోజన, వసతి సౌకర్యాలను కల్పించనున్నామని వివరించారు. పది, ఆపై విద్యార్హతలు కలిగి 18 నుంచి 35 ఏళ్లలోపు వారు అర్హులని చెప్పారు. వివరాలకు 81878 99877 నంబర్ను సంప్రదించాలని సూచించారు. దళితుల శ్మశాన భూమి ఆక్రమణకు యత్నం దగదర్తి: మండలంలోని ఉలవపాళ్లలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న దళితుల శ్మశాన భూమిని ఆక్రమించేందుకు జరుగుతున్న యత్నాలతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్మశాన భూమిని స్వాధీనం చేసుకునేందుకు పక్కనే ఉన్న భూమిని కొనుగోలు చేసిన వ్యక్తితో గ్రామానికి చెందిన కొందరు యత్నించడాన్ని దళితులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై సర్వే నిర్వహించేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను అడ్డుకోవడంతో విషయం ఆఫీసర్ల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయంలో ఇరువర్గాలతో సమావేశాన్ని తహసీల్దార్ లాజరస్, సీఐ శివశంకర్, ఎస్సై మహేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. తమ శ్మశాన భూమిని ఆక్రమించేందుకు ఎలాంటి యత్నాలు చేసినా సహించబోమని దళితులు స్పష్టం చేశారు. సర్వే నంబర్ 53లో సుమారు 3.64 ఎకరాల భూమిని శ్మశానానికి కేటాయించారని చెప్పారు. ఇటీవల ఓ వ్యక్తి గ్రామానికి చెందిన కొందరితో కలిసి ఆక్రమిస్తుంటే అడ్డుకున్నామన్నారు. దీన్ని రక్షించుకునేందుకు తామంతా కలిసి భూమి చుట్టూ హద్దు రాళ్లు, కంచెను వేసుకున్నామని అధికారులకు తెలిపారు. త్వరలోనే అధికారికంగా సర్వేను నిర్వహించి, రికార్డుల ప్రకారం భూమి హద్దులను నిర్ధారించి సమస్యను పరిష్కరిస్తామని రెవెన్యూ, పోలీస్ అధికారులు హామీ ఇచ్చారు. -
ఆటో బోల్తా పడి డ్రైవర్ దుర్మరణం
సంగం: మండలంలోని గాంధీజనసంఘం సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో డ్రైవర్ మృతి చెందారు. వివరాలు.. గూడూరు రూరల్ మండలం అయ్యవారిపాళేనికి చెందిన రాము(44) కడప నుంచి నెల్లూరుకు ఆటోలో బయల్దేరారు. గాంధీజనసంఘం సమీపంలోకి చేరుకోగానే ఆటో అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఘటనలో రాము మృతి చెందగా, ఆటోలోని మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సంగం సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై భోజ్యానాయక్ ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద తీరును పరిశీలించారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కావలి కాలువలో యువకుడి గల్లంతు దగదర్తి: ేస్నహితులతో కలిసి సరదాగా ఈతకెళ్లిన ఓ యువకుడు గల్లంతైన ఘటన మండలంలోని చెన్నూరు సమీపంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు.. కావలికి చెందిన బొడ్డు కార్తీక్ (32)కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. దగదర్తిలోని తన చిన్నమ్మ ఇంటికి సరదాగా గడిపేందుకు ఆయన వచ్చారు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి కావలి కాలువలోకి ఈతకు బుధవారం సాయంత్రం వెళ్లారు. కాలువలో దిగి ఈత కొడుతున్న సమయంలో ప్రవాహానికి కార్తీక్ గల్లంతయ్యారు. గమనించిన స్నేహితులు వెంటనే బంధువులు, పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శివశంకర్, ఎస్సై మహేంద్ర తమ సిబ్బందితో కలిసి కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటం..కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలను నిలిపేశారు. ప్రవాహం ఆగిన తర్వాత ఉదయాన్నే గాలింపు చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతానికి మహిళ బలి కలిగిరి: మండలంలోని పెద్దపాడుకు చెందిన గన్నమనేని పద్మ (55) విద్యుదాఘాతానికి గురై బుధవారం మృతి చెందారు. స్థానికులు, బంధువుల వివరాల మేరకు.. ఇంట్లో కూలర్ వేసుకొని కుటుంబసభ్యులతో కలిసి పద్మ మంగళవారం రాత్రి నిద్రించారు. ఉదయాన్నే నిద్రలేచిన పద్మ ప్రమాదవశాత్తూ కూలర్పై పడ్డారు. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలికి కుమారుడున్నారు. కేసు నమోదు చేసి పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు పోలీసులు తరలించారు. నక్కలగండిలో చేపల వేట నిలిపివేత వరికుంటపాడు: మండలంలోని నక్కలగండి రిజర్వాయర్లో చేపల వేట నిలిపివేతకు చర్యలు చేపట్టారు. రిజర్వాయర్లో లోపాలను ఆసరాగా చేసుకొని చేపల వేటను సాగిస్తున్న అంశంపై ఖాకీ అండ.. నక్కలగండి దందా అనే శీర్షికన సాక్షిలో కథనం బుధవారం ప్రచురితమైంది. దీంతో అధికారులు, సంబంధిత వర్గాలు అప్రమత్తమయ్యాయి. చేపల వేటను బుధవారం నిలిపేశారని స్థానికులు తెలిపారు. రిజర్వాయర్ నిర్వహణలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆయకట్టుదారులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 22 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 83,858 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. -
అర్హత ఉన్నా, రాలేదు
నా కుమారులు ఐదు, రెండో తరగతి చదువుతున్నారు. గతంలో చైన్నెలో ఉన్న మేము మూడేళ్ల క్రితం ఇక్కడికొచ్చాం. తల్లికి వందనం పథకానికి అర్హత ఉన్నా, రాలేదు. నిరుపేద ఎస్సీ కుటుంబానికి చెందిన మేము కూలీ పనులు చేసుకుంటూ చిన్న రేకుల షెడ్డు వేసుకొని జీవనం సాగిస్తున్నాం. పూట గడవడం కష్టంగా ఉంది. ఈ ఏడాదైనా ఇది వస్తుందో రాదోననే ఆందోళనగా ఉంది. అధికారులు న్యాయం చేయాలి. – బేబీ షాలిని, వేంపాడు ఎస్సీ కాలనీ, వరికుంటపాడు మండలం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి ఈ ఏడాది కొత్తగా చేరిన విద్యార్థులు, గతేడాది అందని వారు తల్లికి వందనం పథకానికి సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఎంత మంది పిల్లలున్నా, అందరికీ ఇది వర్తిస్తుంది. స్కూల్స్ మెయింటెనెన్స్ పేరుతో కట్ చేసిన రూ.రెండు వేలు ఇంకా జమకాలేదు. స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన, మరమ్మతుల కోసం అంచనాలను రూపొందించి పంపించే పనిలో ఉన్నాం. – వెంకటసుబ్బయ్య, ఏపీసీ, సమగ్రశిక్ష -
పెట్రోల్ మంటల్లో మహిళ
నెల్లూరు సిటీ: నెల్లూరు నుంచి జొన్నవాడకు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఓ గుర్తుతెలియని మహిళ పెట్రోల్ మంటల్లో చిక్కుకొని కనిపించారు. స్థానికులు గమనించి కాపాడేలోపే పూర్తిగా కాలిపోయి మృత్యువాత పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. జొన్నవాడ ఆర్చి సమీపంలోని మలుపు వద్ద రోడ్డు పక్కన ఒక్కసారిగా మంటలు రావడాన్ని స్థానికులు బుధవారం ఉదయం గుర్తించారు. ఎవరో చెత్తను తగలబెట్టి ఉంటారని అటుగా వెళ్తున్న కొందరు భావించి వెళ్లిపోయారు. కొందరు యువకులు మాత్రం సందేహంతో వెళ్లి చూడగా గుర్తుతెలియని మహిళ (40) కాలిపోతూ కనిపించారు. దీంతో వారు వెంటనే మంటలను ఆర్పేందుకు యత్నించారు. అయితే అప్పటికే శరీరం పూర్తిగా కాలిపోయి మహిళ మృత్యువాత పడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ వేణు చేరుకొని విచారించారు. పోస్ట్మార్టం నిమిత్తం జీజీహెచ్కు మృతదేహాన్ని తరలించారు. కాగా ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డారా.. లేక ఎవరైనా పెట్రోల్ పోసి పరారయ్యారాననే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జొన్నవాడ ఆర్చి వద్ద రోడ్డు పక్కన గుర్తించిన స్థానికులు కాపాడేలోపే పూర్తిగా దహనమై.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు -
ఇదీ పరిస్థితి..
నెల్లూరు (టౌన్): తల్లికి వందనం పథకానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా తమ ప్రభుత్వం కొలువుదీరాక దీన్ని విస్మరించారు. 2024లోనే దీన్ని అమలు చేయాల్సి ఉన్నా, రకరకాల కారణాలు చెప్పి ఎగనామం పెట్టారు. ఆ తర్వాతి ఏడాది రకరకాల నిబంధనలను పెట్టి వేలాది మంది పేద విద్యార్థులను ఈ పథకానికి దూరం చేశారు. ఒక్కరికే జమ జిల్లాలోని చాలా కుటుంబాల్లో ఇద్దరు పిల్లలు చదువుతున్నా, ఒక్కరికి మాత్రమే నిధులు జమయ్యాయి. రూ.13 వేలనే తల్లి ఖాతాలో వేసి చేతులు దులుపుకొన్నారు. ఫలితంగా పేద స్టూడెంట్స్కు అన్యాయం జరిగింది. ఆయా స్కూళ్లలో చిన్న పనులున్నా, డబ్బుల్లేక వాటిని అలానే వదిలేసిన దుస్థితి నెలకొంది. అదే గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేశారు. కుట్రలు తెరపైకి.. అధికారంలోకి వచ్చాక లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే కుట్రను టీడీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. నెలకు 300 యూనిట్లలోపు విద్యుత్ వినియోగం.. సొంతంగా కారు.. కుటుంబ ఆదాయం.. పట్టణాల్లో రూ.12 వేలు.. పల్లెల్లో రూ.పది వేల నెల ఆదాయం.. మాగాణి మూడు, మెట్ట పదెకరాలు మించకూడదని.. పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగుల స్థలం ఉండకూడదని.. ఆదాయ పన్ను చెల్లించినా.. పాఠశాలల్లో 75 శాతం హాజరు తగ్గినా, ఈ పథకం వర్తించదంటూ ఎవరికీ అంతుపట్టని రీతిలో కొత్త రూల్స్ను తీసుకొచ్చి, ఎంతో మంది తల్లులకు అంతులేని ఆవేదనను మిగిల్చింది. ఒక్కొక్కరికీ ఒక్కో తరహాలో.. ఒక్కో విద్యార్థి తల్లి ఖాతాలో రూ.15 వేల చొప్పున జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఆ మేరకూ వేయలేదు. రూ.ఏడు వేల నుంచి రూ.13 వేల వరకు వేశారు. అధిక శాతం మందికి రూ.పది వేల్లోపే జమ కావడం గమనార్హం. ఇందులోనూ రూ.రెండు వేలకు కోత విధించడంతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఈ మొత్తాన్ని స్కూల్ మెయింటెనెన్స్కు వినియోగిస్తామని చెప్పినా, ఎక్కడా ఇవ్వలేదు. వీటిని తమ సొంత ఖాతాలకు మళ్లించారనే ఆరోపణలూ లేకపోలేదు. మరోవైపు పాఠశాలలకు ఏటా ఇచ్చే సాధారణ గ్రాంట్నూ పూర్తిస్థాయిలో అందించలేదు. ఫలితంగా హెడ్మాస్టర్లే కొంత మేర ఖర్చు చేయాల్సి వస్తోంది. నిధుల్లేక.. చిన్న మరమ్మతులు సైతం నోచుకోక భవనాలు శిథిలావస్థకు చేరుకొని, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తల్లికి వందనం పేరిట ఒక్కో బిడ్డకు రూ.15 వేలిస్తామని చంద్రబాబు హామీ ఖాతాలో రూ.13 వేలే జమ మిగిలిన మొత్తం స్కూల్ మెయింటెనెన్స్కు అంటూ సాకు ఆ నిధులనూ పాఠశాలలకు ఇవ్వని కూటమి ప్రభుత్వం స్కీమ్ కోసం సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు రకరకాల కొర్రీలతో పలువురికి ఎగనామం జిల్లాలో 3221 ప్రభుత్వ, 1050 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ఇందులో దాదాపు 4.02 లక్షల మంది చదువుతున్నారు. అదే విధంగా 185 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 60 వేల మంది విద్యనభ్యసిస్తున్నారు. తల్లికి వందనం పథకాన్ని వీరందరికీ వర్తింపజేస్తామని గత ఎన్నికలకు ముందు టీడీపీ హామీ ఇచ్చింది. దీనికి గానూ సూపర్ సిక్స్ అంటూ కరపత్రాన్ని ఆర్భాటంగా రూపొందించి వాడవాడలా అందజేసింది. -
వెన్నుపోట్లకు ఆద్యుడు చంద్రబాబు
వెంకటాచలం: వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు ఆద్యుడని, ఆయన చేసిన మోసాలను మాటల్లో చెప్పేందుకు సమయం చాలదని.. పుస్తక రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పేర్కొన్నారు. వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, బుక్లెట్లను వెంకటాచలంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక ఏ ముఖ్యమంత్రైనా క నీసం 20 శాతం హామీలనైనా నెరవేర్చేందుకు యత్నిస్తారని, అయితే చంద్రబాబు మాత్రం ఒక్క శాతాన్ని సైతం అమలు చేయలేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఎన్నో హామీలను గుప్పించి కొలువుదీరిన టీడీపీ.. ఆపై వీటిని విస్మరించిందని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలతో ఆవేదన వ్యక్తం చేస్తున్నా, చంద్రబాబు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. యూరియా అందుబాటులో లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో కొని పంటలు పండించుకునే దుస్థితి రైతులకు ఏర్పడిందని విమర్శించారు. మెగా డీఎస్సీ పేరుతో రకరకాల జీఓలను విడుదల చేస్తుండటంతో నిరుద్యోగులు అయోమయానికి గురవుతున్నారని చెప్పారు. ముందు ఒక జీఓను విడుదల చేసి తప్పులు చేయడం, వాటిని కప్పిపుచ్చుకునేందుకు మరొకటి జారీ చేస్తూ ప్రభుత్వం నవ్వులపాలవుతోందని ఎద్దేవా చేశారు. నాడంతా సజావుగా.. జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందజేశారని గుర్తుచేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన ఎరువులు, విత్తనాలను అందించడంతో పంటలను కర్షకులు సంతోషంగా పండించుకున్నారని చెప్పారు. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి ఎక్కడైనా ఉందానని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీల బాండ్ పేపర్లు, కాగితాలు చలి మంటలేసుకోవడానికి తప్ప, దేనికి పనికిరావనే విషయం ప్రజలకు అర్థమైందని తెలిపారు. వెన్నుపోటుకు రెండేళ్ల నిరసన కార్యక్రమాన్ని ప్రతి మండల కేంద్రంలో తమ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించనున్నామని వెల్లడించారు. పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. నేత చిల్లకూరు సుధీర్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, వెంకటాచలం ఎంపీపీ మందా కవిత, వైస్ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, మండల కన్వీనర్లు కొణిదెన మోహన్నాయుడు, మెట్టా విష్ణువర్ధన్రెడ్డి, ఉప్పల శంకరయ్యగౌడ్, ముత్తుకూరు జెడ్పీటీసీ నెల్లూరు శివప్రసాద్, నాయకులు కొణిదెన విజయభాస్కర్నాయుడు, ఈపూరు రజనీకాంత్రెడ్డి, దాసరి భాస్కర్గౌడ్, సాయిమోహన్రెడ్డి పాల్గొన్నారు. -
మా ఊరునే బ్యాంక్లో తాకట్టు పెట్టారు
దశాబ్దాల చరిత్ర కలిగిన ఆ గ్రామం. వందల మంది నివసిస్తున్న పల్లె. ఇంటి పన్నులు చెల్లిస్తున్న ప్రజలు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు. కానీ రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఆ గ్రామమే లేదు. ఈ విస్మయకర పరిస్థితి దగదర్తి మండలం తిమ్మారెడ్డిపాళెంలో వెలుగు చూసింది. నివాసిత భూములను రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూములుగా మార్చేసి, ఏకంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం గమనార్హం. అదే భూములపై బ్యాంకుల్లో రూ.లక్షల్లో రుణాలు పొందారు. నెల్లూరు జిల్లా: మండలంలోని చెన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తిమ్మారెడ్డిపాళెం గత ఆరు దశాబ్దాలుగా నివాస ప్రాంతంగా కొనసాగుతోంది. సుమారు 50 కుటుంబాలు, 200 మందికి పైగా జనాభా అక్కడ స్థిర నివాసాలు ఏర్పరుచుకుని జీవిస్తున్నారు. ఇంటి పన్నులు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నారు. కానీ ఆశ్చర్యకరంగా, వెబ్ల్యాండ్ సహా రెవెన్యూ రికార్డుల్లో ఆ ప్రాంతంలో గ్రామం ఉన్నట్లుగా నమోదు కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవి ఇంటి స్థలాలు కావని, వ్యవసాయ భూములని వెబ్ల్యాండ్లో చూపిస్తోందని సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులు చెబుతుండడంతో గ్రామస్తులు విస్తుపోయారు. భూములు ప్రజలవి.. పేర్లు బడాబాబులవి చెన్నూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 177, 175ల్లో ఉన్న తిమ్మారెడ్డిపాళెం ప్రాంతం రికార్డుల్లో మాత్రం గ్రామస్తుల పేర్లకు బదులుగా ఇతరుల పేర్లతో నమోదై ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కొందరు బడాబాబులు 2005–06 సంవత్సరాల్లో ఈ భూములను తమ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు రెండేళ్ల క్రితం వెలుగుచూసింది. ప్రస్తుతం ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ఆధారంగా చూపిస్తూ సాగులో ఉన్నామని పేర్కొంటున్నారని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి సదరు సర్వేనంబర్ల భూముల్లో నివాసాలు ఉన్నాయి. సాగు భూములుగా చూపించి రుణాలు రికార్డుల్లో నమోదైనట్లు సాగు భూములుగా చూపించి తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి సుమారు రూ.30 లక్షల వరకు రుణాలు తీసుకున్నారనే ఆరోపణలు ఇప్పుడు మరింత సంచలనంగా మారాయి. ఒక వైపు గ్రామస్తులకు తమ ఇళ్లను రిజి్రస్టేషన్ చేసుకునే హక్కు లేకుండా పోతుండగా, మరో వైపు అదే భూములపై రుణాలు మంజూరు చేయడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రామాణికతపై గ్రామస్తులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రుణాల భారం.. అధికారుల మౌనం రికార్డుల్లో పేర్లు ఉన్న వ్యక్తులు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడం వల్లే పేర్ల తొలగింపు ప్రక్రియ ముందుకు సాగడం లేదని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు అధికారులను ప్ర భావితం చేసి వ్యవహారాన్ని అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో ఎంత నిజం ఉందో ఉన్నతాధికారుల సమగ్ర విచారణలోనే తేలాల్సి ఉంది. అయితే గ్రామస్తుల అనుమానాలు మాత్రం రోజు రోజుకు మరింత బలపడుతున్నాయి. ‘విచారణ’ పేరిట రెండేళ్లుగా కాలయాపన..? సమస్యపై పలుమార్లు వినతులు ఇచ్చినా అధికారులు ‘విచారణ చేస్తున్నాం’ అనే ఒకే సమాధానంతో కాలం గడుపుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లు గడిచినా రికార్డుల్లో మార్పులు జరగకపోవడం, ఇటీవల నిర్వహించిన రీ సర్వేలో కూడా సమస్యను పరిష్కరించకపోవడం అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. హక్కు కోసం ఎదురు చూపులు ఇంటి స్థలాలకు రిజి్రస్టేషన్ లేకపోవడంతో కుటుంబ అవసరాల కోసం బ్యాంకుల నుంచి రుణాలు పొందలేకపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. తరతరాలుగా నివసిస్తున్న తమ గ్రామానికి అధికారిక గుర్తింపు లేకపోవడం బాధాకరమని చెబుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తిమ్మారెడ్డిపాళెంను రెవెన్యూ రికార్డుల్లో గ్రామంగా నమోదు చేయాలని, అక్రమ నమోదులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.మాది ఊరు కాదంట.. పొలాలంట మేము 50 ఏళ్లుగా ఈ గ్రామంలోనే నివాసం ఉంటున్నాం. మా ఊరును వ్యవసాయ పొలాలుగా నమోదు చేశారు. రెవెన్యూ రికార్డుల్లో మా ఊరే లేకుండా చేశారు. మేము నివసిస్తున్న ఇల్లు స్థలం కూడా వ్యవసాయ భూమిగా ఇతరుల పేరుతో ఉంది. మాకు రిజి్రస్టేషన్ కాదంటున్నారు. రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి రెవెన్యూ రికార్డుల్లో తమ గ్రామాన్ని నమోదు చేయాలని కోరుతున్నాను. – వనిపెంట కృష్ణారెడ్డి, తిమ్మారెడ్డిపాళెంమా ఊరునే బ్యాంక్లో తాకట్టు పెట్టారు మా ఊరు ఉన్న సర్వే నంబర్ పేరుతో కొందరు వ్యక్తులు వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్నారు. అధికారులకు ఫిర్యాదు చేశాం. అయినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆర్థిక అవసరాలకు ఇల్లు రిజిస్ట్రేషన్ కాక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు మా గ్రామానికి జరిగిన అన్యాయంపై స్పందించాలి. ఎవరెవరో రుణాలు తీసుకుంటే.. దానికి మేము బాధ్యత వహించాలా?. – సాన మహేంద్ర, తిమ్మారెడ్డిపాళెం -
ప్రజలను వంచించిన ప్రభుత్వం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ● ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్ల ఆవిష్కరణ నెల్లూరు రూరల్: హామీలను అమలు చేయకుండా ప్రజలను కూటమి ప్రభుత్వం వంచించిందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, ప్రత్యేక బుక్లెట్లను ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి, పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత తదితరులతో కలిసి మంగళవారం ఆవిష్కరించిన అనంతరం కాకాణి మాట్లాడారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మూడు ముఖ్యమైన కార్యక్రమాలను గురువారం నుంచి నిర్వహించతలపెట్టామని చెప్పారు. ప్రజలు తీర్పునిచ్చిన జూన్ నాలుగును పురస్కరించుకొని, ప్రతి మండల కేంద్రంలో సదస్సులను నిర్వహించనున్నామని వెల్లడించారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు.. ప్రతి కుటుంబానికీ ఇంత మొత్తంలో అందిస్తామంటూ బాండ్ల రూపంలో చేసిన ప్రమాణాలు.. పత్రిక ప్రకటనల ద్వారా ఇచ్చిన వాగ్దానాలను ఈ సదస్సుల్లో ప్రజల ముందుంచనున్నామని ప్రకటించారు. గడిచిన రెండేళ్లలో హామీలను అమలు చేయకుండా.. ప్రజలను ఎలా వంచించారో సమగ్రంగా వివరించనున్నామన్నారు. హామీల ప్రతులను జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో గురువారం దహనం చేయనున్నామని వెల్లడించారు. వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమంలో భాగంగా జూన్ 8, 9న ప్రత్యేక సదస్సులను నిర్వహించనున్నామని తెలిపారు. ఇవన్నీ ఇండోర్ సమావేశాలుగా జరపనున్నామని.. విద్యార్థులు, యువత, మహిళలు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలతో కలిసి ముఖాముఖి చర్చా కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని వివరించారు. ఈ మోసాలను ప్రజల్లోకి ఏ విధంగా బలంగా తీసుకెళ్లాలనే అంశంపై చర్చించనున్నామని పేర్కొన్నారు. 12న ర్యాలీలు, నిరసనలు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అనే పేరుతో భారీ ఎత్తున ర్యాలీలు, నిరసనలను ఈ నెల 12న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో‘ చేపట్టనున్నామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏ విధంగా మోసం చేశారు.. గత సీఎం జగన్మోహన్రెడ్డి అందించిన సంక్షేమ పథకాలపై ఈ బుక్లో వివరించామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రూ.లక్షల కోట్లతో అన్ని వర్గాలకు ఎంతో మేలు చేశామని తెలిపారు. హామీల అమల్లో విఫలం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక వీటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. వీటిపై కనీస బాధ సైతం లేకుండా.. ప్రజలకు మొహం ఎలా చూపాలనే ఆలోచన సైతం చేయకుండా బహిరంగ సభలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అంటూ మహానాడులో ప్రకటించుకోవడం ఆయనకే చెల్లిందని విమర్శించారు. ఇప్పటికే మూడు బడ్జెట్లు దాటిపోయాయని, మిగిలిన రెండు విడతల్లోనూ వీటినిచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ధ్వజ మెత్తారు. మొదట్లో ఒక సిలిండర్ ఇచ్చి, ఆ తర్వాత మూడింటికి సంబంధించిన డబ్బులను ఒకేసారి వేస్తామని రకరకాలుగా మాట మార్చారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఆర్నెల్లకోసారి పింఛన్లను మంజూరు చేస్తూ పేదలను ఆదుకునేవారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం కొత్త పింఛన్లను ఒక్కటి సైతం మంజూరు చేయకపోగా, ఉన్న వాటికి కోత విధిస్తూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కూటమి సర్కార్లో ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకునేవారు లేక విద్యావ్యవస్థ వెలవెలబోతోందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ను సకాలంలో అందించకుండా.. ఉన్నత చదువులను అభ్యసించాలనుకునే పేద విద్యార్థుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లుతోందన్నారు. మోసాలకే ఒక పుస్తకం ప్రజలకు చంద్రబాబు చేసిన మోసాలు ఎంత చెప్పినా సరిపోవని, వీటిని వివరించాలంటే ఒక పుస్తకమే రాయాల్సి వచ్చిందని కాకాణి పూజిత పేర్కొన్నారు. ఆయన ద్రోహాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని, బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన వారు తప్పు లు చేసినా వెనుకేసుకొస్తున్నారని, అదే సా మాన్యులపై దాడులు జరిగితే కనీస శిక్షలూ పడటంలేదని విమర్శించారు. అనంతరం విజయకుమార్రెడ్డి మాట్లాడారు. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మహిళా విభాగ రాష్ట్ర జోనల్ అధ్యక్షురాలు గౌరి, జిల్లా మహిళాధ్యక్షురాలు లక్ష్మీసునంద తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఉపరాష్ట్రపతి రాక రేపు
నెల్లూరు రూరల్: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈనెల 4 నుంచి 6వ తేదీ వరకు జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 4న ఉదయం రోడ్డు మార్గంలో వెంకటాచలం మండలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్కు వెళ్తారన్నారు. సాయంత్రం 5 గంటలకు నెల్లూరులో దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేస్తారన్నారు. 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్వర్ణభారత్ ట్రస్ట్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. 6న ఉదయం హైదరాబాద్కు బయలుదేరనున్నట్లు వెల్లడించారు. మాజీ ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశానన్నారు. మందుబాబుకు మహిళల దేహశుద్ధి చేజర్ల: మండలంలోని ఆదూరుపల్లి కూడలిలో మంగళవారం ఓ మందుబాబు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో వారు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల కథనం మేరకు.. దాచూరు నుంచి బద్వేల్కు వెళ్తున్న మహిళలు ఆదూరుపల్లిలో బస్సు కోసం వేచి చూస్తున్నాడు. ఫూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో మహిళలందరూ కలిసి చితకబాదారు. మందుబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఉసురు తీసిన లారీ కావలి: జలదంకి నుంచి కావలికి మోటార్బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో మృతిచెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. జలదంకికి చెందిన తన్నీరు మాల్యాద్రి (45) తన స్వగ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుంటాడు. అదే విధంగా బేల్దారి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మంగళవారం మాల్యాద్రి పనుల నిమిత్తం కావలికి బైక్పై బయలుదేరాడు. ఈ క్రమంలో ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో వెళ్తున్న మాల్యాద్రిని వెనుక వైపు నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో లారీ చక్రాల కింద పడి అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. నాకు దిక్కెవరు బిడ్డా.. ● సెలవుల నేపథ్యంలో పనికెళ్లిన బాలుడు ● ఏడో అంతస్తు పైనుంచి కిందపడి మృతి ● తల్లడిల్లిన కన్నపేగు నెల్లూరు(క్రైమ్): ఆ బాలుడికి తండ్రి లేడు.. తల్లి కష్టపడి చదివిస్తోంది. వేసవి సెలవులు కావడంతో పనికెళ్లి కుటుంబానికి అండగా ఉండాలని భావించాడు. అయితే విధి మరోలా తలిచింది. ప్రమాదవశాత్తు ఏడో అంతస్తు పైనుంచి కిందపడటంతో బాలుడు తీవ్రగాయాలై మృతిచెందాడు. దీంతో కన్నపేగు విలవిల్లాడిపోయింది. నాకు దిక్కెవరయ్యా అంటూ ఆమె కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. పోలీసుల కథనం మేరకు.. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా గోపీనాథ్పూర్ మండలానికి చెందిన ఎన్.మహాలక్ష్మి తన కుమారుడు రాము (15)తో కలిసి వెంకటాచలం మండలం బురాన్పూర్లో నివాసం ఉంటోంది. ఆమె భర్త పున్నయ్య కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. మహాలక్ష్మి పనులు చేసుకుంటూ కుమారుడిని చదివిస్తోంది. రాము ఇటీవల పదోతరగతి పూర్తి చేశాడు. వేసవి సెలవులు కావడంతో బంధువులతో కలిసి మంగళవారం పొగతోటలో నూతనంగా చేపట్టిన కాసా హాస్పిటల్లో భవన నిర్మాణ పనులకు వెళ్లాడు. రాము ప్రమాదవశాత్తు ఏడో అంతస్తు పైనుంచి కిందపడటంతో తీవ్రగాయాలయ్యాయి. సహచరులు చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించి బాధిత తల్లికి సమాచారం అందించారు. రామును పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. హాస్పిటల్కు చేరుకున్న బాధిత తల్లి విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి కన్నీటి పర్యంతమైంది. మహాలక్ష్మి ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి ఎస్ఐ అబ్దుల్ రజాక్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘విచారణ’ పేరిట రెండేళ్లుగా కాలయాపన..?
దగదర్తి: మండలంలోని చెన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తిమ్మారెడ్డిపాళెం గత ఆరు దశాబ్దాలుగా నివాస ప్రాంతంగా కొనసాగుతోంది. సుమారు 50 కుటుంబాలు, 200 మందికి పైగా జనాభా అక్కడ స్థిర నివాసాలు ఏర్పరుచుకుని జీవిస్తున్నారు. ఇంటి పన్నులు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నారు. కానీ ఆశ్చర్యకరంగా, వెబ్ల్యాండ్ సహా రెవెన్యూ రికార్డుల్లో ఆ ప్రాంతంలో గ్రామం ఉన్నట్లుగా నమోదు కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవి ఇంటి స్థలాలు కావని, వ్యవసాయ భూములని వెబ్ల్యాండ్లో చూపిస్తోందని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు చెబుతుండడంతో గ్రామస్తులు విస్తుపోయారు. భూములు ప్రజలవి.. పేర్లు బడాబాబులవి చెన్నూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 177, 175ల్లో ఉన్న తిమ్మారెడ్డిపాళెం ప్రాంతం రికార్డుల్లో మాత్రం గ్రామస్తుల పేర్లకు బదులుగా ఇతరుల పేర్లతో నమోదై ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కొందరు బడాబాబులు 2005–06 సంవత్సరాల్లో ఈ భూములను తమ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు రెండేళ్ల క్రితం వెలుగుచూసింది. ప్రస్తుతం ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ఆధారంగా చూపిస్తూ సాగులో ఉన్నామని పేర్కొంటున్నారని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి సదరు సర్వేనంబర్ల భూముల్లో నివాసాలు ఉన్నాయి. సాగు భూములుగా చూపించి రుణాలు రికార్డుల్లో నమోదైనట్లు సాగు భూములుగా చూపించి తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి సుమారు రూ.30 లక్షల వరకు రుణాలు తీసుకున్నారనే ఆరోపణలు ఇప్పుడు మరింత సంచలనంగా మారాయి. ఒక వైపు గ్రామస్తులకు తమ ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు లేకుండా పోతుండగా, మరో వైపు అదే భూములపై రుణాలు మంజూరు చేయడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రామాణికతపై గ్రామస్తులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రుణాల భారం.. అధికారుల మౌనం రికార్డుల్లో పేర్లు ఉన్న వ్యక్తులు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడం వల్లే పేర్ల తొలగింపు ప్రక్రియ ముందుకు సాగడం లేదని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు అధికారులను ప్ర భావితం చేసి వ్యవహారాన్ని అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో ఎంత నిజం ఉందో ఉన్నతాధికారుల సమగ్ర విచారణలోనే తేలాల్సి ఉంది. అయితే గ్రామస్తుల అనుమానాలు మాత్రం రోజు రోజుకు మరింత బలపడుతున్నాయి. రామాలయ నమోదు సమయంలో బయటపడిన బాగోతం రెండేళ్ల క్రితం గ్రామంలో నిర్మిస్తున్న శ్రీరామాలయానికి ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టినప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామం పేరుతో రికార్డులు లేకపోవడం, నివాస ప్రాంతం స్థానంలో ఇతరుల పేర్లు నమోదై ఉండడం చూసి షాక్కు గురయ్యామని వారు అంటున్నారు. అప్పటి నుంచి మండల స్థాయి అధికారుల నుంచి కలెక్టర్ వరకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఊరే మాయం ప్రజల పట్టాలపై పరాయి పేర్లు 60 ఏళ్ల చరిత్ర ఉన్న పల్లెకు వెబ్ల్యాండ్లో చోటులేదు గ్రామమని తెలిసీ వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్పై ఆరోపణలు అదే భూములపై రూ.30 లక్షలకుపైగా బ్యాంకు రుణాలు రెండేళ్లుగా విచారణ పేరుతో కాలయాపన హక్కు కోసం ఎదురు చూపులు ఇంటి స్థలాలకు రిజిస్ట్రేషన్ లేకపోవడంతో కుటుంబ అవసరాల కోసం బ్యాంకుల నుంచి రుణాలు పొందలేకపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. తరతరాలుగా నివసిస్తున్న తమ గ్రామానికి అధికారిక గుర్తింపు లేకపోవడం బాధాకరమని చెబుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తిమ్మారెడ్డిపాళెంను రెవెన్యూ రికార్డుల్లో గ్రామంగా నమోదు చేయాలని, అక్రమ నమోదులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యపై పలుమార్లు వినతులు ఇచ్చినా అధికారులు ‘విచారణ చేస్తున్నాం’ అనే ఒకే సమాధానంతో కాలం గడుపుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లు గడిచినా రికార్డుల్లో మార్పులు జరగకపోవడం, ఇటీవల నిర్వహించిన రీ సర్వేలో కూడా సమస్యను పరిష్కరించకపోవడం అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. -
సెల్టవర్ పైనుంచి దూకి..
● వ్యక్తి ఆత్మహత్య కొడవలూరు: సెల్టవర్ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొడవలూరులో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. విడవలూరు మండలం తుమ్మగుంటకు చెందిన ఇంద్రపల్లి కృష్ణ (45)కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రెండేళ్లుగా అతని భార్యపిల్లలతో కలిసి ప్రకాశం జిల్లా చేవూరులోని తన పుట్టింట్లో ఉంటోంది. కృష్ణ తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. బేల్దారి పనులు చేస్తుంటాడు. మద్యానికి బానిసయ్యాడు. పనిచేయగా వచ్చిన డబ్బుతో ఫూటుగా మద్యం తాగి తిరిగేవాడు. ఈ క్రమంలోనే కృష్ణ ఆత్మహత్య చేసుకోవాలని భావించి కొడవలూరులోని సెల్టవర్ ఎక్కుతుండగా టెక్నీషియన్ చూసి ఫొటో తీస్తూ టవర్ దిగాలని కేకలు వేశాడు. అప్పటికే బాగా ఎత్తులోకి చేరుకున్న కృష్ణ కిందకు దూకేశాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నక్కలగండి దందా
ఖాకీ అండ..● రూ.కోట్ల విలువజేసే మత్స్య సంపద స్వాహా ● నియోజకవర్గ ముఖ్య నేత కనుసన్నల్లో వ్యవహారం ● పోలీస్ అధికారి పర్యవేక్షణలో దందా ● రిజర్వాయర్ వద్ద ఖాకీల కాపలా ● రూ.కోట్లు కాజేసేందుకు పక్కాగా స్కెచ్ కొట్టేసేందుకు రంగం సిద్ధం.. నక్కలగండి రిజర్వాయర్లో మత్స్య సంపద భారీగా ఉందనే సమాచారం ముఖ్య నేతకు తెలిసింది. దీంతో వీటిని కొట్టేసేందుకు పక్కాగా స్కెచ్ వేశారు. ఈ వ్యవహారాన్ని నడిపే బాధ్యతను ఓ పోలీస్ అధికారికి అప్పజెప్పారని తెలుస్తోంది. దీంతో సదరు ఆఫీసర్ వెంటనే రంగప్రవేశం చేసి పామూరుకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని తన దారికి తెచ్చుకున్నారనే టాక్ నడుస్తోంది. ప్రక్రియను సజావుగా నడిపేందుకు గానూ స్థానిక పోలీస్స్టేషన్కు సొసైటీ సభ్యులను పిలిపించి మూడ్రోజుల క్రితం మాట్లాడారు. అక్కడేమి జరిగిందో తెలియదు గానీ మొత్తం మత్స్య సంపదలో వాటాను సభ్యులకు ఇచ్చేందుకు ఒప్పందం జరిగిందనే విషయం తెలుస్తోంది. సాక్షి టాస్క్ఫోర్స్: పచ్చ నేతలు బరితెగిస్తున్నారు. ఆదాయమొచ్చే ప్రతి దాన్నీ అడ్డుగోలుగా దోచేస్తున్నారు. ఇప్పటికే ప్రకృతి సంపదైన మట్టి, గ్రావెల్, ఇసుక నుంచి కాసులు పిండి రూ.కోట్లలో జేబులు నింపుకొంటున్నారు. ఇది చాలదనే రీతిలో ఎస్సీ, ఎస్టీల ఆధ్వర్యంలో నిర్వహించే మత్స్యకార సొసైటీలనూ వదలిపెట్టడం లేదు. వీరికి జీవనోపాధి కల్పించే చేపలను సైతం కొల్లగొడుతున్నారు. లోపాలను ఆసరాగా చేసుకొని.. మత్స్యకార సొసైటీల్లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకొని వీరి పొట్టగొడుతున్నారు. తాజాగా వరికుంటపాడు మండలం నక్కలగండి రిజర్వాయర్లో రూ.కోట్ల విలువజేసే మత్స్యసంపదపై కన్నేసిన పచ్చ నేత ఓ పోలీస్ అధికారిని రంగంలోకి దింపారు. ఆయన కనుసన్నల్లో వ్యవహారాన్ని చక్కబెడుతున్నారనే ప్రచారం స్థానికంగా జరుగుతోంది. అసలేమి జరుగుతోంది..? వరికుంటపాడు మండలంలోని నక్కలగండి రిజర్వాయర్ పరిధిలో 12 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే కాలువలు అధ్వానంగా ఉండటంతో నీరు వదల్లేదు. దీంతో రిజర్వాయర్లో మూడేళ్లుగా నీరు పుష్కలంగా ఉండి మత్స్య సంపద భారీగా వృద్ధి చెందింది. రెండేళ్ల నుంచి చేపలను పట్టకపోవడంతో ఒక్కో దాని బరువు ఐదు నుంచి పది కిలోల వరకు చేరింది. దీంతో ఇక్కడ సుమారు రూ.రెండు కోట్ల విలువజేసే చేపలున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఇదీ తీరు.. రిజర్వాయర్ పరిధిలోని తూర్పు రొంపిదొడ్ల, మహ్మదాపురం, కాకొల్లువారిపల్లి, వేంపాడు గ్రామాలకు చెందిన 45 మంది ఎస్టీలు (యానాదులు) సొసైటీ సభ్యులుగా ఉన్నారు. పామూరుకు చెందిన ఓ ప్రైవేట్ వ్యక్తి వద్ద పెట్టుబడి తీసుకొని చేప పిల్లలను వేస్తూ.. వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని తాము తీసుకునేవారు. పదేళ్లుగా ఈ విధానమే కొనసాగుతోంది. అయితే రెండేళ్ల క్రితం సదరు వ్యక్తి.. సొసైటీ సభ్యులకు ఓ మొత్తం (రూ.30 లక్షలు అని కొంత మంది సభ్యులు చెప్తున్నారు) ఇచ్చి తానే చేపలు పట్టుకునేలా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో రిజర్వాయర్లో గతేడాది నీరు ఎక్కువగా ఉండటంతో వీటిని పూర్తి స్థాయిలో పట్టలేకపోయారు. రెండ్రోజులుగా చేపల వేట నక్కలగండిలో చేపల వేట రెండు రోజులుగా కొనసాగుతోంది. పట్టిన వీటిని పెద్ద కంటైనర్ల ద్వారా తరలిస్తున్నారు. పెద్ద సంఖ్యలో బెస్తవారిని పిలిపించి మత్స్య సంపదను దోచేస్తున్నారు. చేపల లెక్కలు పోలీసుల పర్యవేక్షణలో సాగుతోంది. అయితే ఈ విషయంలో తమ పాత్రేమీ లేదని, గొడవలు జరగకుండా ఉండేందుకే తామున్నామంటూ పోలీసులు సెలవిస్తున్నారు. వృథాగా నీరు ప్రాజెక్టులో చేపల వేటను త్వరలో ముగించేందుకు నీటిని కాలువలకు రాత్రి వేళ వదులుతున్నారు. వాస్తవానికి ఇక్కడ నీరుంటే భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండి రైతులకు మేలు జరుగుతుంది. అయితే మత్స్య సంపదను దోచే ఆలోచనలో ఇదేమీ పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.నక్కలగండి రిజర్వాయర్లో చేపల వేట కంటైనర్లో చేపల లోడింగ్ -
చంద్రబాబు, లోకేశ్లకు చిత్తశుద్ధి లేదు
– తిరుపతి ఎంపీ గురుమూర్తి చంద్రబాబు, లోకేశ్కు చిత్త శుద్ధి లేదు. మెగా డీఎస్సీ పేరుతో నిరు ద్యోగుల పాలిట దగా డీఎస్సీగా మార్చిన ఘనత తండ్రీకొడులకే దక్కుతుంది. మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ విడుదల చేయకుండా నిరుద్యోగులను ఈ ప్రభుత్వం నిండా ముంచిందన్నారు. మొదటి ర్యాంక్ వచ్చిన తొలి పోస్టింగ్ ఇస్తారు. కానీ ఆ మొదటి ర్యాంక్ సాధించిన నవీన్ను పక్కన పెట్టడమే డీఎస్సీలో అక్రమాలు జరిగాయని అందరికీ అర్థమవుతోంది. దగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించే వరకు వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తాం. -
ఆత్మకూరు విద్యార్థులకు ర్యాంక్లు
ఆత్మకూరు: పట్టణానికి చెందిన ముగ్గురు విద్యార్థు లు ఉత్తమ ర్యాంక్లు సాధించి సత్తా చాటారు. పువ్వాడ నాగేంద్ర కుమారుడు రామ్ నిఖిల్కు 74వ ర్యాంక్ వచ్చింది. టపాసులు తయారు చేసే షేక్ రఫీ కుమారుడు షేక్ సొహైల్ అక్తర్ 784వ ర్యాంక్తో సత్తా చాటాడు. మోడల్ ఎస్టీ కాలనీకి చెందిన ఎస్.నిశ్చల కుమార్కు 3,419వ ర్యాంక్ వచ్చింది. పేద కుటుంబానికి చెందిన ఇతను కష్టపడి చదివి ప్రతిభ చూపడంపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. మెప్మాలో చిరుద్యోగిగా పనిచేస్తున్న అతని తల్లి సుష్మాను స్థానికులు అభినందించారు. మర్రిపాడు వాసికి 273.. మర్రిపాడు: మండలంలోని ఏపిలిగుంటకు చెందిన నాయు డు హజరత్రెడ్డి కుమారుడు ధనుంజయరెడ్డి సత్తాచాటాడు. ఆల్ ఇండియా స్థాయిలో ఓబీసీ కేటగిరీలో 273వ ర్యాంకు సాధించాడు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగమే లక్ష్యం
మాది నెల్లూరులోని హరనాథపురం. తండ్రి వేనాటి సుధీర్ వ్యాపారం చేస్తుండగా తల్లి శిల్ప గృహిణి. జేఈఈ అడ్వాన్స్డ్లో జాతీయ స్థాయిలో 392వ ర్యాంక్ వచ్చింది. ఐఐటీలో చేరి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడమే నా లక్ష్యం. – కుషాల్రెడ్డి ఐఐటీలో చేరుతా మాది హరనాథపురం. తండ్రి సుబ్రహ్మణ్యం వ్యాపారం చేస్తుండగా తల్లి గాయిత్రీదేవి గృహిణి. జేఈఈ అడ్వాన్స్డ్లో జాతీయ స్థాయిలో 509వ ర్యాంక్ సాధించా. ఉత్తమ ఐఐటీలో ఇంజినీరింగ్ చద వాలని ఉంది. – అక్షయ వశిష్ట 934వ ర్యాంక్ వచ్చింది మాది హరనాథపురం. తండ్రి గురుమూర్తి వ్యాపారం చేస్తుండగా తల్లి నాగమణి గృహిణి. జేఈఈ అడ్వాన్స్డ్లో జాతీయ స్థాయిలో 934వ ర్యాంక్ సాధించా. భవిష్యత్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా స్థిరపడాలని ఉంది. – సాయిలిఖిత్ ఐఐటీలో చదవాలని ఉంది మాది వేదాయపాళెం. తండ్రి జనార్ధన్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా తల్లి ప్రవీణ గృహిణి. జేఈఈ అడ్వాన్స్డ్లో 954వ ర్యాంక్ సాధించా. ఉత్తమ ఐఐటీలో చదవాలన్నదే నా లక్ష్యం. – శివకుష్వంత్ -
పడిగాపుల పంపిణీ
● సర్వర్ సమస్యలతో జాప్యం ● ఎండలకు అవస్థలు పడిన అవ్వా, తాతలు ● 87 శాతం దాటని వైనం నెల్లూరు (పొగతోట): జిల్లాలో సోమవారం సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియలో సర్వర్ల సమస్య కారణంగా తీవ్ర జాప్యం నెలకొంది. ఈ పరిణామంతో పింఛన్లు ఇచ్చేందుకు ఇళ్లకు రాకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. కొందరు వృద్ధులు, మహిళలు సచివాలయాలకు కాళ్లీడ్చుకుంటూ వెళ్లారు. కొన్ని చోట్ల సాయంత్రం వరకు లబ్ధిదారులు సచివాలయాల వద్ద పడిగాపులు పడ్డారు. పంపిణీ ప్రక్రియలో ఏర్పడిన సాంకేతిక ఇబ్బందులతో ఉద్యోగులు సైతం మానసికంగా అవస్థలు పడ్డారు. లబ్ధిదారులకు సమాధానం చెప్పలేక.. అసహనానికి గురయ్యారు. జిల్లాలో 2,90,009 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉండగా, సర్వర్ సమస్య కారణంగా మొదటి రోజు రాత్రి 7 గంటల సమయానికి 2,52,867 మందికి పంపిణీ చేయడంతో 87.17 శాతంగా నమొదైంది. ప్రతి నెలా మొదటి రోజు 95 శాతం మందికి పంపిణీ చేసే వారు. ప్రస్తుతం సర్వర్ సమస్యతో పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొంది. ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకుండా ఒక ప్రాంతంలోకి అందరిని రమ్మని నగదు అందజేశారు. దీంతో అవ్వా, తాతలు నానా అవస్థలు పడ్డారు. వైఎస్సార్సీపీ పాలనలో పింఛన్ లబ్ధిదారులు అవ్వా, తాతలు ఇబ్బందులు పడకుండా వలంటీర్లు తెల్లవారు జామున ఇంటి తలుపులు తట్టి నగదు చేతుల్లో పెట్టిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అటువంటి పరిస్థితులు కనుమరుగయ్యాయి. పింఛన్ల నగదు పంపిణీ చేసే వారు ఒక ప్రాంతంలో ఉంటే లబ్ధిదారులందరూ అక్కడికి వెళ్లి నగదు తీసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఇంటింటికి వెళ్లి నగదు అందిస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందే కానీ వాస్థవ పరిస్థితులు బిన్నంగా ఉన్నాయి. ఈ నెలలో పింఛన్ల నగదు కోసం లబ్ధిదారులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. దివ్యాంగులు వృద్ధులు ఉష్ణోగ్రతలు అఽధికంగా ఉండడంతో నానా ఇబ్బందులు పడ్డారు. -
తొలి సంతకంతోనే మోసం
– ఆనం విజయకుమార్ రెడ్డి చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలి సంతకంతోనే మోసానికి తెర తీశారు. డీఎస్సీ మీద తొలి సంతకమని చెప్పి దాంతోపాటు మరో రెండు సంతకాలు చేశాడన్నారు. రెండో సంతకం స్పోర్ట్స్ కోటా మీద చేసి, తెలివిగా ఎగ్జామ్స్ ఏమీ లేకుండా పోస్టులను అమ్మేసుకున్నాడన్నారు. దీని మీద విచారణ జరగకూడదని రెండో సంతకాన్ని రద్దు చేసి మూడో సంతకం చేశాడన్నారు. డీఎస్సీ –2025 చారిత్రాత్మక దగా డీఎస్సీగా నిలిచిపోతోందన్నారు. రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం ఉంటే.. లోకేశ్ తన శాఖలో జరిగిన అవినీతికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. దోషులను తప్పించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడన్నారు. -
సీబీఐ విచారణ జరపాల్సిందే
ఉపాధ్యాయులు కావాలనే తమ కలలను మెగా డీఎస్సీ పేరుతో పోస్టులను అమ్ముకుని కల్లలు చేశారంటూ దగా పడిన అభ్యర్థులు దండయాత్ర ప్రారంభించారు. అర్హత సాధించి, మెరిట్ జాబితాలో ఉండి ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగులు వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ను ముట్టడించారు. విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ అనర్హుడని, బాధ్యత వహించి రాజీనామా చేయాలని, చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే.. అసమర్థ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మెరిట్ లిస్ట్ ప్రకటించకుండానే, కాల్ లెటర్లు లేకుండానే ఇష్టారీతిన ఎంపికలు చేశారని, స్పోర్ట్స్ కోటా పేరుతో పోస్టులను అమ్ముకున్నారని ఆరోపించారు. డీఎస్సీ పరీక్షల నుంచి పోస్టింగ్ల ప్రక్రియ వరకు జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని పట్టుబట్టారు. ఆధ్యంతం అక్రమాల పుట్ట నెల్లూరు రూరల్: మెగా డీఎస్సీ నిర్వహణలో భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరుద్యోగులు, అర్హత సాధించి, మెరిట్ జాబితాలో ఉండి ఉద్యోగాలు దక్కని డీఎస్సీ అభ్యర్థులు సోమవారం నెల్లూరులో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి నేతృత్వంలో తొలుత వీఆర్సీ సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నాయకులు, యువత, నిరుద్యోగులతో కలిసి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. యువత, డీఎస్సీ అభ్యర్థులను అనుమతించకుండా పోలీసులు అడ్డుకోవడంతో కొద్ది సేపు ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఇది ప్రజాస్వామికమని మండిపడ్డారు. కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా ౖవైఎస్సార్సీపీ నాయకులు భయపడబోరని హెచ్చరించారు. ‘అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ, రూ.15 లక్షలకు స్పోర్ట్స్ కోటాలో పోస్టుల అమ్మకాలు, డీఎస్సీలో పారదర్శకతకు పాతర, డేటా ఎందుకు డిలిట్ చేశారు.. మెరిట్ లిస్ట్ ఎందుకు దాచారు, చంద్రబాబు సుపుత్రుడు శాఖ డార్క్ ఆపరేషన్’ అనే నినాదాల ఫ్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ కలెక్టరేట్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్, ఆత్మకూరు నియోజకవర్గ పరిశీలకుడు పేర్నాటి కోటేశ్వరరెడ్డి, రాష్ట్ర జోనల్ మహిళా అధ్యక్షురాలు మొయిళ్ల గౌరీ, జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీసునంద, సిటీ మహిళా అధ్యక్షురాలు ధనుజారెడ్డి పలువురు కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు, నిరుద్యోగులు, యువజన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తక్షణమే రాజీనామా చేయాలి ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియపై సీబీఐ విచారణ చేసే వరకు పోరాటం ఆగదు మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు మెరిట్ లిస్ట్ లేకుండానే ఎంపికలు, స్పోర్ట్స్ కోటా పేరుతో అమ్ముకున్నారు -
రెండు వారాలుగా కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన
● రెండో ప్లాంట్ వద్ద కూడా నిరసన ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని నేలటూరు ఎస్ఈఐఎల్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం రెండు వారాలుగా ఆందోళన బాట పట్టారు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, కార్మిక సంక్షేమ సదుపాయాల కల్పన తదితర డిమాండ్లతో సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం రెండో పవర్ ప్లాంట్ వద్ద కూడా సోమవారం చేపట్టారు. విద్యుత్ కేంద్రం ప్రధాన గేటు వద్ద కార్మికులు భారీ సంఖ్యలో చేరుకుని ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేకపోవడంతో రెండో ప్లాంట్ వద్ద కూడా ఆందోళనకు దిగాల్సి వచ్చిందని కార్మికులు తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యం గుర్తించి తక్షణమే చర్యలు చేపట్టాలని సీఐటీయూ నాయకులు కోరారు. సమస్యలను పరిష్కరించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అవసరమైతే మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా కారణంగా విద్యుత్ కేంద్రం పరిసర ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీ–కోడింగ్ సెంటర్ నుంచి శాంపిల్స్ నిలిపివేత ● ఏడీఏ శివనాయక్ పొదలకూరు : సర్వేపల్లి నియోజకవర్గం అగ్రి టెస్టింగ్ ల్యాబ్కు అమరావతి రీజనల్ కోడింగ్ సెంటర్ల నుంచి నాన్ పైలట్ ల్యాబ్ కింద శాంపిల్స్ను నిలిపివేశారని పొదలకూరు ఏడీఏ కే శివనాయక్ వెల్లడించారు. సోమవారం ఏడీఏ మాట్లాడుతూ ఇక్కడ రైతులు అందజేసిన విత్తనాలు, ఎరువుల శాంపిళ్లపై పరీక్షలను నిర్వహించామన్నారు. 2025–26 సంవత్సరంలో 104 విత్తనాలు, ఎరువులు 52 శాంపిళ్లకు పరీక్షలను నిర్వహించి రైతులకు నివేదికలు అందజేశామన్నారు. పొదలకూరు నిమ్మ మార్కెట్ యార్డులో ఉన్న అగ్రి ల్యాబ్ను వ్యవసాయశాఖకు అప్పగించారని, భవనంలో ఉన్న లాబ్ పరికరాలను ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇక్కడ పని చేస్తున్న సిబ్బందిని గతంలో వారు నిర్వహిస్తున్న విధులకు తిరిగి బదిలీ చేయడం జరగిందన్నారు. భవనాన్ని వ్యవసాయశాఖ స్వాధీనం చేసుకుని కార్యకలాపాలను నిర్వహిస్తోందన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 21 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 90,826 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 42,747 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.99 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. విద్యుత్ క్రీడాకారుల ఎంపిక నేడు నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఏపీ ట్రాన్స్కో ఉత్తర్వుల మేరకు ఇంటర్ సర్కిల్ వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు ఏపీఈపీడీపీఎల్ ఆధ్వర్యంలో విజయనగరంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా సర్కిల్ స్పోర్ట్స్, గేమ్స్ సెక్రటరీ రామస్వామి వేలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు జరిగే పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా సర్కిల్ పరిధిలోని రెగ్యులర్, జూనియర్ లైన్మెన్ గ్రేడ్ – 2 ఉద్యోగులు అర్హులన్నారు. ఆసక్తి గలవారు మంగళవారం సాయంత్రం 4 గంటలకు విద్యుత్ భవన్లో నిర్వహించే ఎంపికలకు హాజరుకావాలని సూచిచారు. వివరాలకు 90308 02038, 85550 26614 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. ఓపెన్ స్కూల్ ప్రాక్టికల్స్ వాయిదా నెల్లూరు(టౌన్): ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్కు సంబంధించి ఈనెల 2వ తేదీన నిర్వహించాల్సిన ప్రాక్టికల్ పరీక్షను 7వ తేదీకి వాయిదా వేసినట్లు డీఈఓ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలిన ప్రాక్టికల్స్ ఈనెల 3 నుంచి 6వ తేదీ వరకు యథావిధిగా జరుగుతాయని తెలియజేశారు. -
కారుణ్య నియామక ఉత్తర్వుల అందజేత
నెల్లూరురూరల్: వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగులకు సంబంధించి వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక ఉత్తర్వులను ఇచ్చారు. సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా తిక్కన ప్రాంగణంలో ఆరుగురికి నియామకపత్రాలు అందజేశారు. కె.వెంకటవర్మకు పంచాయతీరాజ్ శాఖలో డిజిటల్ అసిస్టెంట్గా, కె.మహేష్కు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ 2), ఆర్.కిరణ్కు సాంఘిక సంక్షేమ శాఖలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా, ప్రమోద్కు పశుసంవర్థక శాఖలో ఆఫీస్ సబార్డినేట్గా ఉద్యోగం కల్పించారు. వై.చంద్రకళకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఆఫీస్ సబార్డినేట్గా, ఎం.మాధురికి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో జూనియర్ అసిస్టెంట్గా నియామకపత్రాలిచ్చారు. -
ఈ ఏడాది వర్షపాతం తగ్గొచ్చు
నెల్లూరు(వేదాయపాళెం): ‘ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా ఉండే అవకాశముంది. భూసారం, నేలలో తేమను సంరక్షించుకునేందుకు అనువైన పంటల సాగుపై రైతులను ప్రోత్సహించాలి’ అని రైతు సాధికార సంస్థ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె. కన్నయ్య సూచించారు. నెల్లూరులోని కార్యాలయంలో సోమవారం ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చన్నారు. ప్రీ–మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంలో ముందుగానే విత్తన గుళికలను సిద్ధం చేసుకుని విత్తడం వల్ల వర్షాలు ప్రారంభమైన వెంటనే పంటలు స్థిరపడే అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. తక్కువ నీటితో సాగయ్యే పశుగ్రాస పంటలను ప్రోత్సహించాలన్నారు. గ్రామ స్థాయిలో పర్యటిస్తూ రైతులకు అందుబాటులో ఉండి, వారి సమస్యలను తెలుసుకుని తగిన సూచనలు అందించాలని ఆదేశించారు. ఇంకా ప్రాంతీయ సాంకేతిక సమన్వయకర్త రవిచంద్ర ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. -
గో వ్యధ..!
గోవును గోమాతగా కొలిచే దేశమిది. గోవుల సంరక్షణ పేరుతో ఉద్యమాలు చేసే సంస్థలు, వేదికలపై సంస్కృతి పరిరక్షణ ప్రసంగాలు చేసే నేతలకు కొదవలేదు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. చట్టాలు కఠినంగా ఉన్నా, నిబంధనలు స్పష్టంగా ఉన్నా, అక్రమ రవాణా నుంచి వధ వరకు వ్యవస్థీకృతంగా సాగుతున్న వ్యవహారాలపై అధికార యంత్రాంగాలు అవినీతి మత్తులో జోగుతూ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా ఘటన వెలుగు చూసినప్పుడు మొక్కుబడిగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు లేకపోలేదు. నెల్లూరు సిటీ: నెల్లూరు కేంద్రంగా గో వధ, మాంసం ఎగుమతులు, గోవుల అక్రమ రవాణా వ్యవస్థీకృతంగా సాగుతోంది. సనాతన ధర్మ పరిరక్షకులమని ప్రచారం చేసుకునే కూటమి పార్టీల నేతలు కాసులకు కక్కుర్తి పడి దేవతామూర్తిగా కొలిచే గోమాతలను నిర్దాక్షిణ్యంగా వధిస్తున్నారు. వెయ్యి.. పదిహేనొందలకు ఆశ పడి పశుసంవర్థకశాఖాధికారులు మరణ శాసనాన్ని లిఖిస్తున్నారు. చట్టాలకు, నిబంధనలకు లోబడి కొన్ని రకాల పశువులను కబేళాల్లోనే వధించాల్సి ఉండగా అధికార పార్టీ నేతల ముసుగులో కొందరు టీడీపీ నేతలు శివారు ప్రాంతాలను అడ్డాగా, మానవ దుర్భేద్య ప్రాంతాలుగా చేసుకుని ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నారు. నెల్లూరు రూరల్ మండలం చింతారెడ్డిపాళెం పరిధిలో వెలుగు చూసిన గోవధ ఘటన మరోసారి అధికారుల పనితీరుపై తీవ్ర అనుమానాలను రేకెత్తి స్తోంది. అధికార పార్టీ నేతలు కొందరు గోవులను అక్రమంగా తరలించి వధిస్తున్న విషయం వెలుగులోకి రా వడం చర్చనీయాంశంగా మారింది. చట్టాన్ని అమలు చేయాల్సిన శాఖలు, పర్యవేక్షించాల్సిన అధికారులు, గోవుల పరిరక్షణ కోసం గొంతెత్తే సంస్థలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గోవధపై కఠిన చట్టాలు.. అమల్లో మాత్రం శూన్యం? గోవధను నిరోధించే ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నా యి. గోవులను వధించడం నిషేధం. ఎద్దులు, దున్నపోతులు వంటి పశువులను కూడా వధించాలంటే పశుసంవర్ధక శాఖతోపాటు సంబంధిత అధికారుల నుంచి ఫిట్నెస్ ధ్రువీకరణ, అనుమతి పత్రాలు తప్పనిసరి. అయితే చట్టాల పుస్తకాల్లో కనిపించే కఠినత్వం, క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదనే విమర్శలున్నాయి. గోవులను రాత్రి వేళ తరలించడం, శివారు ప్రాంతాల్లో వధించడం, మాంసాన్ని రహస్యంగా విక్రయిస్తున్నా సంబంధిత శాఖలు ఎందుకు గుర్తించలేకపోతున్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బోడిగాడితోట ఘటన మరిచిపోయారా..? జిల్లాలో చింతారెడ్డిపాళెం ఘటన మొదటిది కాదు. గతంలో నగర నడిబొడ్డున బోడిగాడితోట ప్రాంతంలో సుమారు నాలుగు టన్నుల పశుమాంసాన్ని స్వాధీనం చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. ఆ సమయంలో గోదాముల్లో నిల్వ ఉంచిన పశువుల చర్మాలు, ఎముకలు బయటపడటంతో అధికారులు సైతం విస్తుపోయిన పరిస్థితి. అయితే అంత పెద్ద ఘటన వెలుగు చూసినా, ఆ తర్వాత ఇలాంటి కార్యకలాపాలపై దృష్టి సారించకపోవడంతోనే చింతారెడ్డిపాళెం ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ సైతం ఇదే ప్రప్రథం కాదు.. ప్రతి వారం భారీ స్థాయిలో గోవధ జరుగుతోందని సమాచారం. శివారు ప్రాంతాలే అడ్డాగా.. నెల్లూరు నగర శివారు ప్రాంతాలు, జనసంచారం తక్కువగా ఉండే లేఅవుట్లు, గోదాములు కొందరికి సురక్షిత కేంద్రాలుగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోవులను తరలించి వధించే ముందు చుట్టు పక్కల ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా రని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారాలకు రా జకీయ అండ ఉందనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. చింతారెడ్డిపాళెం ఘటనలో హడావుడి చర్యలు చింతారెడ్డిపాళెంలోని గజలక్ష్మి లేఅవుట్లో సుమారు 20 గోవులను వధించారంటూ అక్కడి కళేబరాలు స్పష్టం చేస్తుండగా, పోలీసులు మాత్రం కేవలం ఐదు ఎద్దులను మాత్రమే విధించారంటూ కేసు కట్టి చేతులు దులుపుకొన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోవధ జరుగుతోందనే సమాచారం మీడియాల్లో వైరల్ కావడంతో నెల్లూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో అక్కడ వధకు సిద్ధంగా ఉంచిన 9 ఆవులను గుర్తించి గోశాలకు తరలించారు. అయితే ఈ వధలో అధికార పార్టీకి చెందిన ఓ నేతతో పాటు మరో నలుగురి పాత్ర ఉన్నట్లు పోలీసులు పేర్కొంటూ వారిని హడావుడిగా అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. చిన్నపాటి నేరం చేస్తేనే నేరస్తులను మీడియా ముందు ప్రవేశ పెట్టి హడావుడి చేసే పోలీస్ యంత్రాంగం ఈ విషయంలో ఎందుకు రహస్యంగా పనికానిచ్చేశారో అర్థమవుతోంది. నిందితులు టీడీపీ నేతలు కావడంతో కేసు తీవ్రతను తగ్గించేలా వధించినవి గోవులు కాదు.. ఎద్దులంటూ రికార్డు చేయడం వెనుక మతలబును బయటపెట్టాలని హిందుత్వ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే ప్రాంతంలో 9 గోవులను పట్టుకున్నప్పుడు.. వధించినవి గోవులు కాకుండా ఎద్దులని చెప్పడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోరక్షణ పేరుతో గొంతెత్తేవారు ఎక్కడ? దేశ వ్యాప్తంగా గోవుల సంరక్షణ అంశంపై తరచూ ఆందోళనలు చేసే సంస్థలు, హిందుత్వం పేరుతో ప్రచారం చేసే సంఘాలు, గోరక్షణపై ఉపన్యాసాలిచ్చే నేతలు ఇ లాంటి ఘటనల సమయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గోవుల రక్షణ అ నేది కేవలం రాజకీయ నినాదాలకే పరిమిత మా? లేక నిజంగా చట్ట అమలుపై ఒత్తిడి తీసుకురావా లనే బా ధ్యత ఉందాననే చర్చ మొదలైంది. వీటి పరిరక్షణపై చిత్తశుద్ధి ఉంటే అక్రమ రవాణా, వధ, విక్ర యాలపై నిరంతర పర్యవేక్షణ కోసం సర్కార్పై ఒత్తిడి తీసుకురావాలని పలువురు అభిప్రాయపడుతున్నాయి. అక్రమ రవాణా నుంచి వధ వరకు సాగుతున్న వ్యవస్థీకృత దందా గో సంరక్షణ చట్టాలు కాగితాలకే పరిమితం అధికార పార్టీ నేతల ముసుగులో కొందరి దారుణం యథేచ్ఛగా గోవుల అక్రమ రవాణా, మరణశాసనం రాజకీయ అండతో నడుస్తున్న అక్రమ వ్యాపారం మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగాలు మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగాలు అక్రమ రవాణా, వధ, విక్రయాలు అన్నీ ఒకే రోజులో జరిగే ప్రక్రియలు కావు. పశువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించి వధించి.. మాంసంగా విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతుంటే సంబంధిత శాఖలకు సమాచారం లేకపోవడాన్ని చూస్తే నిఘా వ్యవస్థల పని తీరును శంకించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే మామూళ్ల మత్తులో పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలు లేకపోలేదు. కొంత మంది అధికారులు నిర్లక్ష్యం, మరికొందరి మౌనం, ఇంకొందరి పాత్రపై వస్తున్న ఆరోపణలు దర్యాప్తు అవసరాన్ని సూచిస్తున్నాయి. -
అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం
● సర్వేపల్లిలో రైతుల పేరుతో నిధుల దోపిడీ ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరు: అవినీతిపై సోమిరెడ్డితో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని.. సర్వేపల్లి నియోజకవర్గంలో రైతుల పేరుతో నిధుల దోపిడీ ముమ్మాటికీ జరుగుతోందనే అంశాన్ని నిరూపిస్తానని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి సవాల్ విసిరారు. మండలంలోని నావూరు చెరువు కట్ట పనులను ఆదివారం పరిశీలించారు. పనులు నాసిరకంగా జరిగాయంటూ ఇరిగేషన్ శాఖ అధికారులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ పనుల పేరుతో ఆ ప్రాంతంలో జరుగుతున్న దోపిడీని కాకాణికి నావూరు, చెన్నారెడ్డిపల్లి గ్రామస్తులు వివరించారు. సాగునీటి కాలువలు, చెరువుల పనుల్లో నాణ్యత లోపించిందని.. పక్కనే ఉన్న చవుడు మట్టిని కట్టపై పోసి దూరంగా లీడ్ చూపి నిధులను ఆరగించారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల రిపేర్ల పేరుతో సుద్దమట్టిని తోలి బిల్లులు చేసుకుంటున్నారని వివరించారు. గతంలో ఉన్న గ్రావెల్ రోడ్లపై వీటిని పోయడం ద్వారా వర్షమొస్తే రొచ్చుగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. రూ.కోట్లు కొల్లగొడుతున్నారు.. ఈ ప్రాంతంలో చెరువు, పొలాలకు వెళ్లే రోడ్లు ఎంత నాసిరకంగా ఉన్నాయో పరిశీలిస్తే అర్థమవుతుందని కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. రైతుల పేరుతో పనులు చేయిస్తూ రూ.కోట్లను సోమిరెడ్డి కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. నావూరు చెరువు పనులపై తాను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని, సుముఖంగా ఉంటే తేదీని సోమిరెడ్డి ఖరారు చేయాలని.. ఈ కట్టపైనే చర్చా వేదికను సిద్ధం చేస్తామని వెల్లడించారు. ఇరిగేషన్ పనులు ఎంత నాసిరకంగా జరిగాయో.. దొంగ బిల్లులను ఏ విధంగా స్వాహా చేశారో.. సోమిరెడ్డి సిద్ధపడితే తానే స్వయంగా వచ్చి రైతులతో కలిసి పర్యటించి నిజాలను నిగ్గుతేలుస్తానని పేర్కొన్నారు. జీపీఎస్తో పనులకు ముందు.. తర్వాత ఫొటోలు తీసుకొని వీటిని పూర్తి చేస్తున్నామని సోమిరెడ్డి వెల్లడిస్తున్నారని తెలిపారు. నావూరు చెరువు కట్ట పనుల కు సంబంధించి ముందు.. తర్వాత ఫొటోలను విడుదల చేయాలని సవాల్ విసిరారు. అభివృద్ధిని విస్మరించి తీవ్రమైన అవినీతికి పాల్పడుతూ దోచు కుంటున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి పనులపై విచారణ నిర్వహిస్తే సోమిరెడ్డితో పాటు ఆయన కుమారుడు, అధికారులు బలికాక తప్పదన్నారు. ఇరిగేషన్ అధికారులకు కౌంట్ డౌన్ స్టార్టయిందని, విచారణలో అవినీతి బయటపడుతుందని పేర్కొన్నారు. చర్చకొస్తే అన్ని విషయాలు వెలుగుచూస్తాయని.. బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. నేతలు గోగిరెడ్డి గోపాల్రెడ్డి, బచ్చల సురేష్కుమార్రెడ్డి, రావుల ఇంద్రసేన్గౌడ్, వెంకటశేషయ్య, దాసరి భాస్కర్గౌడ్, నోటి బాలకొండారెడ్డి, వెల్మిరెడ్డి సుబ్బారెడ్డి, బొడ్డు నరసింహు లు, రమేష్, గాలం హరి, కోడూరు మాలకొండారెడ్డి, నీలం మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. -
కూటమి విధానాలపై ప్రజల్లో అసంతృప్తి
● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నెల్లూరురూరల్: ‘కూటమి ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్వారానే న్యాయం జరుగుతుందనే నమ్మకం బలపడుతోంది’ అని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. పెద్ద సంఖ్యలో యువత ఆదివారం నగరంలోని సిటీ కార్యాలయంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పర్వతరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 53వ డివిజన్ ఇన్చార్జి వెంగళ్రెడ్డికి వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర కార్యదర్శి పదవి లభించడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఆ డివిజన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఆయన్ను అభినందించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ రోజురోజుకూ బలోపేతం అవుతోందన్నారు. పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీతో కలిసి పనిచేస్తున్న వారికి భవిష్యత్లో సముచిత గుర్తింపు, గౌరవం లభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెంగళ్రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులు, పర్వతరెడ్డి ప్రోత్సాహంతో తనకు రాష్ట్ర స్థాయి పదవి లభించడం ఆనందంగా ఉందన్నారు. -
నెల్లూరులో గొలుసు దొంగల హల్చల్
● మూడుచోట్ల తెంపుకెళ్లిన దుండగులు నెల్లూరు(క్రైమ్): బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో దొంగల కళ్లన్నీ ఆభరణాలపైనే ఉన్నాయి. జన సంచారం తక్కువగా, తప్పించుకునేందుకు వీలుగా ఉండే ప్రాంతాల్లో బైక్లపై తిరుగుతూ చోరీలు చేస్తున్నారు. నెల్లూరు నగరంలో ఆదివారం గొలుసు దొంగలు హల్చల్ చేశారు. మూడు వేర్వేరు ప్రాంతాల్లో మహిళల మెడల్లోని బంగారు గొలుసులను తెంపుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. బస్టాండ్కు వెళ్తున్న సమయంలో.. విజయమహాల్ గేటు సమీపంలో ప్రశాంతి కుటుంబం నివాసం ఉంటోంది. ఆమె తెల్లవారుజామున సుమారు 4:35 గంటల ప్రాంతంలో ఇందుకూరుపేట వెళ్లేందుకు బస్సు కోసం ఆత్మకూరు బస్టాండ్కు నడుచుకుంటూ బయలుదేరారు. ఒంటరిగా వెళ్లడాన్ని ఇద్దరు దుండగులు గమనించారు. ఒకతను నడుచుకుంటూ మరొకడు బైక్పై వెంబడించారు. జేమ్స్ గార్డెన్ వద్ద దుండగుడు ఆమె మెడలోని మూడున్నర సవర్ల బంగారు సరుడును తెంపుకొని వెనుక వస్తున్న బైక్పై ఎక్కి పరారయ్యాడు. బాధితురాలు నవాబుపేట పోలీసుకు ఫిర్యాదు చేశారు. వాకిలి శుభ్రం చేస్తుండగా.. పడారుపల్లి ఆటోనగర్ కాలనీలో పి.కావేరి కుటుంబం నివాసం ఉంటోంది. ఆమె ఉదయం సుమారు 5:10 గంటల ప్రాంతంలో ఇంటిముందు వాకిలి శుభ్రం చేస్తుండగా ఇద్దరు దుండగులు గమనిస్తూ బైక్పై అటుగా వెళ్లారు. కొద్దిదూరంలో వాహనాన్ని ఆపగా ఒకతను ఆమె వద్దకు వచ్చి మెడలోని మూడున్నర సవర్ల బంగారు సరుడు తెంపుకొని పరుగెత్తుకుంటూ వెళ్లి బైక్ ఎక్కి పరారయ్యారు. బాధితురాలు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్నింగ్ వాకింగ్లో ఉండగా.. హరనాథపురంలో సృజన నివాసం ఉంటున్నారు. ఉదయం సుమారు 5:30 గంటల ప్రాంతంలో ఆమె తన భర్తతో కలిసి చిల్డ్రన్స్ పార్కు సాయిబాబా మందిరం సమీపంలో మార్నింగ్ వాకింగ్ చేయసాగారు. ఈక్రమంలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బైక్పై వచ్చి ఆమె మెడలోని రెండు సవర్ల బంగారు గొలుసును తెంపుకెళ్లారు. బాధితురాలు బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తౖమైన పోలీసులు గొలుసు చోరీలపై నవాబుపేట, వేదాయపాళెం, బాలాజీనగర్ ఇన్స్పెక్టర్లు జి.వేణుగోపాల్రెడ్డి, కె.శ్రీనివాసరావు, కె.సాంబశివరావు అప్రమత్తమై సాంకేతికత ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలించారు. చిల్డ్రన్స్ పార్కు వద్ద గొలుసు దొంగతనం అనంతరం నిందితులు జాతీయ రహదారి మీదుగా కావలి వైపు వెళ్లినట్లు గుర్తించి ఆ ప్రాంత పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. నిందితులు యూపీ గ్యాంగ్గా అనుమానిస్తున్నారు. -
అకాల వర్ష బీభత్సం
● తడిచిన పొగాకు బేళ్లు ● నేలరాలిన మామిడి, నిమ్మకాయలు ● విరిగిపడిన విద్యుత్ స్తంభాలు, చెట్లు ఆత్మకూరు: నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులు, మేఘాలు కమ్ముకొని వర్షం బీభత్సం సృష్టించింది. ఆత్మకూరు, సంగం, మర్రిపాడు, చేజర్ల మండలాల్లో ఈదురుగాలుల ధాటికి కోత దశలో ఉన్న మామిడి, నిమ్మకాయలు నేలరాలయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మర్రిపాడు మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు గోడౌన్లో రేకులు దెబ్బతినడంతో బేళ్లు తడిచి దెబ్బతిన్నాయి. దీంతో రైతులు మిగిలిన వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హడావుడిగా చేరుకున్నారు. చేజర్ల మండలంలోని బోడిపాడు, కాకివాయి, కందాపురం, ఆదూరుపల్లి, మడపల్లి గ్రామాల్లోని మామిడి కాయలు ఈదురుగాలులకు నేలరాలాయి. ఆదూరుపల్లి – చేజర్ల మార్గాల్లో చెట్లు, స్తంభాలు విరిగి పడ్డాయి. సంగం మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్లతో కూడిన వర్షం, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలువురి ఇళ్ల రేకులు వడగండ్ల ధాటికి దెబ్బతిన్నాయి. స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
అగ్రిల్యాబ్లకు మంగళం
●కూటమి ప్రభుత్వం రైతుల విషయంలో నిర్లక్ష్యం చూపుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్నదాతలకు ఉపయోగపడే పనులు ఎన్నో చేయగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉన్నత ఆశయంతో నాడు ప్రతి నియోజకవర్గంలో అగ్రిల్యాబ్లు ఏర్పాటు చేయగా చంద్రబాబు సర్కారు వాటికి మంగళం పాడుతోంది.పొదలకూరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒక అగ్రికల్చర్ టెస్టింగ్ ల్యాబ్ను ఏర్పాటు చేసింది. రైతే రాజు అనే భావనతో వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు చెక్ పెట్టేందుకు ఈ ల్యాబ్లను గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. నియోజకవర్గ స్థాయిలో రూ.50 లక్షలు వెచ్చించి భవనాలతోపాటు పరీక్షలకు అవసరమైన సామగ్రిని ఏర్పాటు చేసింది. రైతులు ఉచితంగా విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షలు చేయించుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అగ్రిల్యాబ్ల నిర్వహణ కష్టంగా ఉందని, అవసరమైన నిధులు వెచ్చించలేమనే కారణంతో జిల్లాకు ఒకటి సరిపోతుందనే నిర్ణయానికి వచ్చింది. దీంతో నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన ల్యాబ్లను తొలగించే ప్రక్రియ చేపట్టింది. ప్రస్తుతం పొదలకూరు, కోవూరు ప్రాంతాల్లోని ల్యాబ్లను తొలగించి వ్యవసాయ శాఖకు అప్పగించగా, కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, గూడూరు ప్రాంతాల్లో ఉన్నవాటిని కూడా తొలగించే చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు నెల్లూరులో గత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్ నిర్మాణానికి అదనపు నిధులు కేటాయించి పనులు ప్రారంభించింది. అయితే ఆ నిర్మాణ పనులను ప్రస్తుత ప్రభుత్వం రెండేళ్లుగా పూర్తి చేయకుండా కాలయాపన చేసింది. ఇప్పుడు పూర్తి చేసి త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. రైతులకు ఉపయోగం మార్కెట్లోకి వచ్చే ప్రతి ఇన్పుట్ నమూనాను (శాంపిల్) ఇక్కడ పరీక్షించుకునే అవకాశం ఉండటంతో రైతుల్లో సాగుపై విశ్వాసం పెరిగేది. గతంలో నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు ఉపయోగించి రైతులు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. మార్కెట్లో కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువులను అన్నదాతలు నేరుగా అగ్రి టెస్టింగ్ ల్యాబ్కు తీసుకెళ్లి ఉచితంగా పరీక్షించుకునే సౌకర్యాన్ని అప్పటి ప్రభుత్వం క ల్పించింది. మూడు దశల్లో విత్తనాలు, ఎరువుల పరీక్షలు నిర్వహించేవారు. ఇందుకోసం రాష్ట్రంలో నాలుగు రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేసి, శాంపిళ్లను అక్కడికి పంపించి కోడింగ్ విధానంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించేవారు. దీంతో పరీక్షల్లో పారదర్శకత నెలకొని, కంపెనీలకు అనుకూలంగా నివేదికలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. నాణ్యత లోపాలు తేలితే రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించి సంబంధిత కంపెనీల నుంచి పరిహారం పొందే అవకాశమూ ఉండేది. ప్రతి ల్యాబ్లో ఒక అనలిస్ట్ (ఏఓ), ఇద్దరు అసిస్టెంట్ అనలిస్టులు (ఏఈఓలు) పనిచేసేవారు. వీరిలో ఒకరు విత్తనాలు, మరొకరు ఎరువుల పరీక్షల బాధ్యతలు నిర్వహించేవారు. ఖర్చులు భరించలేమంటూ.. రైతుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం ఎంత ఖర్చయినా వెనుకాడబోమని, వ్యవసాయాన్ని దండగ కాకుండా పండగగా మారుస్తామని ప్రకటించింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక అగ్రి టెస్టింగ్ ల్యాబ్ నిర్వహణ ఖర్చులను కూడా భరించలేక తొలగిస్తోందనే విమర్శలున్నాయి. తమపై పెట్టే ఖర్చులకు కూడా లెక్కలు కడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ను కూడా గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే నిర్మాణ దశకు తీసుకెళ్లగా, ఇప్పుడు దానినే కొనసాగిస్తూ మిగిలిన నియోజకవర్గ స్థాయి ల్యాబ్లను మూసివేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో ల్యాబ్లు ఉంటే గ్రామీణ ప్రాంత రైతులు సులభంగా విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షలు చేయించుకునే అవకాశం ఉండేది. అయితే ప్రభుత్వం అగ్రి ల్యాబ్ వ్యవస్థ వైఫల్యం చెందిందనే భావన కల్పిస్తూ వాటిని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. పొదలకూరు, కోవూరులోని ల్యాబ్లు సరిగా పనిచేయలేదని పేర్కొంటూ వాటిని తొలగించారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు నకిలీ విత్తనాలు, ఎరువులపై పరీక్షలు నేడు జిల్లాకు ఒక్కటే.. ఖర్చు భరించలేమని నియోజకవర్గాల్లో తొలగింపు జగన్ మార్క్ అభివృద్ధికి తూట్లు రైతుల ప్రయోజనాలు పట్టని ప్రభుత్వం -
మహనీయులకు అవమానం
తెలుగుదేశం పార్టీ నాయకులకు రంగుల పిచ్చి ముదిరింది. ఇప్పటికే ప్రభుత్వ భవనాలు, అభివృద్ధి పనులు, ప్రజా ఆస్తులకు పసుపు రంగును పులిమేస్తున్నారు. తాజాగా జాతీయ నాయకులు, రాజకీయ దురంధరుల విగ్రహాలకు కూడా పార్టీ రంగుల కాగితాలు చుట్టారు. దేశానికి, సమాజానికి విశేష సేవలందించిన మహానుభావుల విగ్రహాలను రాజకీయాలకు అతీతంగా గౌరవించాల్సిన అవసరం ఉంది. కానీ నెల్లూరు నగరంలో ఆ పరిస్థితి లేదు. వివిధ ప్రాంతాల్లోని నేతల విగ్రహాలకు టీడీపీ నేతలు పసుపు రంగు చుట్టేశారు. ప్రజలందరికీ చెందిన మహనీయుల ప్రతిష్టకు భంగం కలగకుండా తెలుగుదేశం పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
నిలిపేస్తారా.. వదిలేస్తారా?
చిల్లకూరు: వాతావరణ, పర్యావరణ శాఖల సూచనలు, ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్షాకాలం నేపథ్యంలో సోమవారం నుంచి అక్టోబర్ 15 వరకు నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు గనుల శాఖ శనివారం ప్రకటించింది. అయితే ఈ ఆదేశాలు స్వర్ణముఖి నది పరీవాహక ప్రాంతాలకు వర్తిస్తాయా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గనుల శాఖ అధికారులు ప్రధానంగా పెన్నానది పరీవాహక ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని ఇసుక తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న స్టాక్ పాయింట్ల నుంచి మాత్రమే ఇసుకను కొనుగోలు చేసుకోవాలని సూచించారు. పెన్నానది ప్రవహించే ప్రాంతాల్లో ఎక్కడా తవ్వకాలు చేపట్టరాదని హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ పరిస్థితి వేరు గూడూరు నియోజకవర్గ పరిధిలో ప్రవహించే స్వర్ణముఖి నది పరీవాహక ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల పరిధిలో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నప్పటికీ, వాటిపై గనుల శాఖ అధికారులు ఎలాంటి ఆంక్షలు విధించకపోవడంతో నిషేధాజ్ఞలు ఇక్కడ వర్తించవన్న భావన వ్యక్తమవుతోంది. కోట మండలం గూడలి ప్రాంతంలో ప్రభుత్వం అధికారిక ఇసుక రీచ్ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి మాత్రమే ఇసుక తవ్వకాలు, రవాణాకు అనుమతులిచ్చింది. అయితే రీచ్ల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు స్వర్ణముఖి నది పరీవాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నారనే ఆరోపణలున్నాయి. లక్షల టన్నుల ఇసుకను తవ్వి తరలిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. తవ్విన ఇసుకను విద్యానగర్ ప్రాంతంలో డంపింగ్ చేస్తున్నారు. కానీ రోజూ కాంట్రాక్టర్లు స్వర్ణముఖి నదిలోకే ట్రాక్టర్లు, టిప్పర్లను నేరుగా తీసుకెళ్లి అక్కడ్నుంచే లోడింగ్ చేసి తరలిస్తున్నారు. ఇతర నగరాలకు.. గూడూరు నియోజకవర్గ అవసరాలకే పరిమితమైతే ఇసుక తవ్వకాల ప్రభావం కొంత మేర తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఇక్కడ తవ్వుతున్న దానిని భారీగా చైన్నె, బెంగళూరు వంటి నగరాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో స్వర్ణముఖి నదిలో ఇసుక నిల్వలు తగ్గిపోవడంతోపాటు భూగర్భ జలాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో నదుల్లో సహజసిద్ధంగా ఇసుక నిల్వలు పెరగడం, భూగర్భ జలాలు పునరుద్ధరించడం కోసం ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలను స్వర్ణముఖి నది పరీవాహక ప్రాంతాల్లో కూడా కచ్చితంగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. గనుల శాఖ అధికారులు ఈ ప్రాంతంలోని కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, వర్షాకాలం ముగిసే వరకు ఇసుక తవ్వకాలను పూర్తిగా నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్వర్ణముఖిలో ఇసుక తవ్వకాలకు బ్రేక్ పడేనా? గనుల శాఖ హెచ్చరికలు వర్తించవా? పెన్నానదిలో తవ్వకాల నిలిపివేత స్వర్ణముఖిలో మాత్రం యథేచ్ఛగా.. -
వైద్య చికిత్సకు ఆర్థిక సాయం
ఉదయగిరి: ఉదయగిరి పంచాయతీ మాజీ ఉప సర్పంచ్, మాజీ ఎంపీటీపీ సభ్యుడు ఉప్పుటూరి హరి కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన వెన్నెముక శస్త్రచిక్సిత్సకు అవసరమైన రూ.4 లక్షలను వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి తన చేజర్ల ట్రస్టు ద్వారా అందజేశారు. ఉదయగిరిలో హరిని ఆదివారం సుబ్బారెడ్డి పరామర్శించారు. ఆయన వెంట నేతలు దస్తగిరి అహ్మద్, సీఎం ఓబులరెడ్డి, సయ్యద్ గౌస్మెయిద్దీన్, కె.నారాయణరెడ్డి, షేక్ జాఫర్ అహ్మద్, ఎంఏ రియాజ్, షావురారి ఎంఏ సలీం, మట్ల హరి, ఉప్పుటూరి రమణ, షాయుక్ తదితరులున్నారు. మతిస్థిమితం లేని మహిళపై లైంగికదాడిమనుబోలు: మతిస్థిమితం లేని మహిళపై ఓ వ్యక్తి దాడి చేసి లైంగికదాడి చేసిన ఘటన మండల పరిధిలోని కాగితాలపూరు క్రాస్రోడ్డు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సుమారు 30 సంవత్సరాల వయసున్న ఓ మహిళ కొంతకాలంగా కాగితాలపూరు క్రాస్రోడ్డు వద్ద భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి ఆమైపె దాడి చేయడమే కాకుండా లైంగికదాడికి పాల్పడినట్లుగా ఓ దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పొదలకూరు సీఐ వెంకట్రావు, మనుబోలు ఎస్సై శివరాకేష్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. నేడు డయల్ యువర్ ఎస్ఈనెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు సోమవారం జిల్లా సర్కిల్ పరిధిలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఎస్ఈ రాఘవేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయాలని కోరారు. ● తిరుపతిలో ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం సోమవారం జరుగుతుంది. 89777 – 16661 నంబర్కు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు. ఈత కొట్టేందుకు వెళ్లి.. ● నేలబావిలో మునిగిపోయి బాలుడి మృతి చిట్టమూరు: సరదాగా స్నేహితులతో కలిసి నేలబావిలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ బాలుడు గల్లంతై మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని యాకసిరి పంచాయతీ మంగళకండ్రిగ గ్రామ సమీపంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఓజిలి మండలంలోని ఓజిలి దళితవాడకు చెందిన కనుపూరు శోభన్బాబు (15) స్నేహితులతో ఈత కొట్టేందుకు శనివారం మంగళకండ్రిగ గ్రామం వద్దకు వచ్చాడు. నేలబావిలో ఈత కొట్టే సమయంలో లోతు ఎక్కువగా ఉండటంతో శోభన్బాబు గల్లంతయ్యాడు. స్నేహితులు అతడి కోసం వెతికినా దొరక్కపోవడంతో ఇంటికి వెళ్లిపోయారు. శోభన్బాబు ఇంటికి రాలేదని ఆందోళన చెందిన తండ్రి శేఖర్బాబు ఆదివారం ఉదయం స్నేహితులను గట్టిగా అడగడంతో జరిగిన విషయాన్ని తెలియజేశారు. శేఖర్ పోలీసులను ఆశ్రయించాడు. నాయుడుపేట అగ్నిమాపక సిబ్బంది వచ్చి నేలబావిలో ఉన్న నీటిని తోడి శోభన్బాబు మృతదేహాన్ని వెలకి తీశారు. చిట్టమూరు ఎస్సై నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేశారు. -
యువకుడిపై కత్తితో దాడి
వరికుంటపాడు: మండలంలోని పెద్దిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడిపై కత్తితో దాడి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కోమటికుంట్ల శివ మార్కాపురం జిల్లా పామూరు మండలం కోడిగుంపల గ్రామానికి వెళ్లి శనివారం రాత్రి తిరిగొస్తున్నాడు. బొట్లగూడూరు ప్రాంతంలోని ఓ జ్యూస్ షాపులో మజ్జిగ తాగుతున్నాడు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ఆవుల వేణుగోపాల్ వచ్చి శివ వైపు చూస్తూ గట్టిగా కేకలు వేశాడు. శివ ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపటికి తోపులాటకు దారితీయగా కొబ్బరి బోండాలు కొట్టేందుకు ఉపయోగించే కత్తిని తీసుకున్న వేణుగోపాల్.. శివ గొంతు భాగంపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శివను స్థానికులు వెంటనే పామూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. -
పాల ట్యాంకర్ రూపంలో వెంటాడిన మృత్యువు
● ఒక్కగానొక్క కుమారుడి మృతితో తీరని విషాదం దగదర్తి: అక్క ఇంటి వద్ద మేనల్లుడిని దింపి, తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన యువకుడిని పాల ట్యాంకర్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన దగదర్తి మండల పరిధిలోని సున్నపుబట్టి జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అల్లూరు మండలం ఇసుకపల్లికి చెందిన దగ్గోలు పృథ్విరాజ్ (22) అక్క వెంకటాచలం మండలం కనుపూరులో ఉంటోంది. వేసవి సెలవులు కావడంతో మేనల్లుడిని ఇసుకపల్లికి తీసుకెళ్లి కొద్దిరోజులు ఉంచాడు. అనంతరం శనివారం తిరిగి బాలుడిని అక్క ఇంటి వద్ద దింపి, స్వగ్రామానికి బయలుదేరాడు. అయితే సున్నపుబట్టి సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన పాల ట్యాంకర్ అతని బైక్ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు పృథ్విరాజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు. అండగా నిలవాల్సిన వయస్సులో అనంతలోకాలకు.. రాఘవులు, సరోజనమ్మ దంపతులు ఇసుకపల్లిలో నివాసం ఉంటున్నారు. వారు కూలి పనులు చేస్తుంటారు. వారికి కుమార్తె, కుమారుడు సంతానం. కుమార్తెకు వివాహం చేశారు. పృథ్విరాజ్ వారికి ఒక్కగానొక్క కుమారుడు. కుటుంబానికి అండగా నిలవాల్సిన వయసులోనే అతను దూరం కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన కుమారుడు సాయంత్రానికి శవంగా మారడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. బంధువులు, గ్రామస్తులు కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు ప్రయత్నించినా వారి రోదనలు ఆగలేదు. కుటుంబానికి భరోసాగా, భవిష్యత్తుకు ఆశాకిరణంగా ఉన్న యువకుడు అకాల మరణం చెందడంతో ఇసుకపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
అది మహానాడు కాదు.. మాయనాడు
నెల్లూరు రూరల్: టీడీపీ ఇటీవల నిర్వహించిన మహానాడు.. ప్రజలను భ్రమల్లో ముంచెత్తే ఓ మాయనాడు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత విమర్శించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శనివారం ఆమె మాట్లాడారు. ప్రజలకు టీడీపీ నేతలేమి చేశారో చెప్పుకోలేక, గత సీఎం జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేసేందుకే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. పబ్లిసిటీ కోసం ప్రజాధనాన్ని టీడీపీ విచ్చలవిడిగా దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అయితే మహానాడు వేదికలపై వీరి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. మహానాడుకు వీఓఏల ద్వారా డ్వాక్రా సభ్యులు, మహిళా సంఘాల సభ్యులను భయపెట్టి బలవంతంగా తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. టీడీపీని మహిళలు ఛీదరిస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతల ముఖాలను చూసేందుకు సైతం మహిళలు ఇష్టపడటం లేదనే విషయం మహానాడు సభ ద్వారా స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొన్నారు. వీరికిచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. అతివల ఓట్ల కోసం టీడీపీ నేతలు మాయమాటలు చెప్తూ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నా, ఆడబిడ్డ నిధి హామీని ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వీటిపై ప్రశ్నిస్తే, డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై అధికార పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. హామీలను నెరవేర్చకుండా మాటలు చెప్పేందుకే సర్కార్ పరిమితమైందని తెలిపారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన దిశ యాప్ను కాపీ కొట్టి.. శక్తి యాప్ను తెచ్చామంటూ చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అత్యవసర సమయాల్లో శక్తి యాప్ సక్రమంగా నిర్వహించడంలేదంటూ కేంద్రం చీవాట్లు పెట్టిన అంశాన్ని మర్చిపోయారానని ప్రశ్నించారు. జగనన్న పాలనలోనే మహిళలకు రక్షణ ఉండేదని గుర్తుచేశారు. అంగన్వాడీ ఆయాలు, ఆశ వర్కర్ల జీతాలను పెంచామంటూ కూటమి నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. పొగడ్తలకే పరిమతం మహానాడులో చంద్రబాబు, లోకేశ్ను పొగడటం.. జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేయడం మినహా రాష్ట్ర ప్రజలకు ఏమి చేశారో చెప్పలేకపోయారని విమర్శించారు. మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చారని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న మోసాలను నిలదీస్తుంటే, తమ పార్టీ శ్రేణులపై కేసులను అక్రమంగా బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. వీటికెవరూ భయపడబోరని తేల్చిచెప్పారు. మహిళల ఆర్థిక స్వావలంబన, సామాజిక సాధికారత జగనన్నతోనే సాధ్యమయ్యాయని తెలిపారు. సమాజ సేవ చేయాలనే తపన ఉన్న మహిళలను ప్రోత్సహిస్తూ వారికి పదవుల్లో అనేక అవకాశాలను తమ పార్టీ అధినేత కల్పించారని వివరించారు. జగనన్న చేసిన మంచి, అభివృద్ధిని చూసి ఓర్వలేక క్రెడిట్ చోరీకి పాల్పడే యత్నాలను మానుకోవాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
ఆర్టీసీ టెండర్ల ప్రక్రియలో గోల్మాల్
● అనుకూలమైన వారికి వచ్చేలా వ్యవహరిస్తున్న వైనం నెల్లూరు సిటీ: ఆర్టీసీ టెండర్ల ప్రక్రియలో కొందరు మాత్రమే లబ్ధిపొందేలా అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తమ వారికి అనుకూలంగా.. కాని వారికి టెండర్లు దక్కకుండా చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. నెల్లూరు ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లో జిల్లా ఓపీఆర్ఎస్(ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్)ను ఏడాదిగా నామినేషన్ కింద ఓ కాంట్రాక్టర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ అధికారులు ఇటీవల ఓపీఆర్ఎస్కు టెండర్లు పిలిచారు. మొత్తం 8 మంది కాంట్రాక్టర్లు ప్రక్రియలో పాల్గొన్నారు. శనివారం ఆ టెండర్ బాక్సులను ఓపెన్ చేశారు. అత్యధికంగా రూ.56 వేలకు అదే కాంట్రాక్టర్ టెండర్ను దక్కించుకున్నారు. కాగా స్కూటర్, సైకిల్ పార్కింగ్కు టెండర్ల ప్రక్రియ జరగ్గా, సదరు కాంట్రాక్టర్ మాత్రమే పాల్గొనడం విశేషం. దీనికి కేవలం రూ.62 వేలకే అతను టెండర్ వేశారు. గతంలో ఇదే కాంట్రాక్ట్ను రూ.1,0,2000లకు పలికింది. ఒక్క సింగిల్ కాంట్రాక్టర్ రావడం వెనుక ఏమైనా అధికార పార్టీ నేత ఒత్తిళ్లు ఉన్నాయా అనేది ప్రశ్నార్థకరంగా మారింది. ఈ కాంట్రాక్టర్ ఆత్మకూరు బస్టాండులో గతంలో కూడా ఒక కాంట్రాక్టర్కు వచ్చిన టెండర్ను రద్దు చేసి క్లీనింగ్, స్వీపింగ్ టెండర్ను పొలిటికల్ ఒత్తిళ్లతో నామినేషన్ మీద ప్రస్తుతం పనిచేస్తున్నట్లు సమాచారం. అధికారులు టెండర్ల ప్రక్రియను అనుకూలమైన వారికే వచ్చేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారమే నిర్వహణ ఆర్టీసీ టెండర్లను నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నాం. సింగిల్ టెండర్తో దక్కించుకున్న వారికి గతంలో వచ్చిన దాని కంటే ఎక్కువ చెల్లిస్తేనే టెండర్ను ఇస్తాం. లేకుంటే రీటెండర్ను నిర్వహిస్తాం. – షేక్ షమీమ్, జిల్లా ప్రజా రవాణా అధికారి -
ఉపాధిలో అవినీతిపై విచారణ
కలువాయి(సైదాపురం): మండలంలోని వెంకటరామరాజుపేటలో ఉపాధి పనుల్లో బినామీ మస్తర్లు, హార్టికల్చర్, ఫెరికల్చర్లో జరుగుతున్న అక్రమాలపై క్షేత్రస్థాయిలో విచారణను ఆత్మకూరు క్లస్టర్ ఏపీడీ శంకర్నారాయణ శనివారం చేపట్టారు. ‘అవినీతి ఉపాధి’ అనే శీర్షికన సాక్షిలో కథనం శుక్రవారం ప్రచురితమైన నేపథ్యంలో ఆయన స్పందించారు. విచారణ నివేదికను పీడీకి అందజేశామని ఆయన తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 563 మంది గైర్హాజరు నెల్లూరు (టౌన్): ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 563 మంది విద్యార్థులు శనివారం గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సర పరీక్షలకు 1123 మందికి గానూ 1008 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సర పరీక్షకు 3333 మందికి గానూ 448 మంది గైర్హాజరయ్యారు. డీసీపల్లిలో 313 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 313 బేళ్లను శనివారం విక్రయించామని నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. వేలానికి 324 బేళ్లు రాగా, వీటిలో 313ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 44,232.4 కిలోల పొగాకును విక్రయించగా, రూ.1,01,64,411 వ్యాపారం జరిగిందని వివరించారు. గరిష్టంగా కిలో రూ.250.. కనిష్టంగా రూ.190.. సగటు ధర రూ.229.80గా నమోదైందని వెల్లడించారు. ఎనిమిది కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శిలాతోరణం వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 78,389 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 45,283 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.15 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. హోరాహోరీగా క్యారమ్స్ పోటీలు నెల్లూరు (టౌన్): నగరంలోని నెల్లూరు క్లబ్లో ఎస్పీఎస్సార్ నెల్లూరు డిస్ట్రిక్ట్ క్యారమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండో రోజు శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి క్యారమ్స్ పోటీలు హోరాహోరీగా సాగాయి. జిల్లా ర్యాంకింగ్ టోర్నీ అండర్ – 19 విభాగంలో జరిగిన ఫైనల్స్లో అభిషేక్, శశిధర్ మొదటి రెండు స్థానాలను సాధించారు. మోజెస్ తృతీయ స్థానంలో నిలిచారు. జిల్లా ర్యాంకింగ్ పురుషుల విభాగంలో సెమీ ఫైనల్స్కు వేణుమాధవ్, మల్లికార్జున చేరారు. ఇజ్రాయెల్లో ఉద్యోగావకాశాలు నెల్లూరు(పొగతోట): ఇజ్రాయెల్లో హోమ్ బేస్ట్ కేర్గివర్ ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 25 నుంచి 45 ఏళ్లలోపు ఉండి జీడీఏ, ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు వీటికి అర్హులని చెప్పారు. నెలకు వేతనంగా రూ.1,99,770 లభించనుందని, రెండేళ్ల ఒప్పంద కాలం ఉంటుందని వివరించారు. పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని.. ఆన్లైన్, వీడియో రికార్డింగ్ ద్వారా ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారని తెలిపారు. వివరాలకు 99888 53335, 87126 55686 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
జెడ్పీలో కారుణ్య నియామకాలు
నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగులకు సంబంధించి వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించారు. ఈ మేరకు శనివారం ఉద్యోగాలకు సంబంధించిన ఉత్తర్వులను జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, డిప్యూటీ సీఈఓ విజయకుమార్ అభ్యర్థులకు అందించారు. ఇద్దరికి ఆఫీస్ సబార్డినేట్లుగా ఉద్యోగాలు కల్పించారు. బల్కర్ అదుపుతప్పి.. లోయలో పడి.. ● రెండు ఆవుల మృతి సీతారామపురం: సీతారామపురం– పోరుమామిళ్ల ఘాట్రోడ్డు మార్గంలో శనివారం వేకువజామున సిమెంట్ బల్కర్ లారీ ఓ మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి సిమెంటు పౌడర్ లోడుతో చిన్నాగంపల్లి గ్రామ సమీపాన జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనుల వద్దకు బయల్దేరిన బల్కర్ మార్గమధ్యలోని ఘాట్రోడ్డులో ఓ మలుపు వద్దకు వచ్చేసరికి డ్రైవర్ కునుకు తీయడంతో అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొని సుమారు 150 అడుగుల లోతులో పడింది. ఈ ఘటనలో రెండు ఆవులు సైతం మృత్యువాత పడ్డాయి. డ్రైవర్ సదానంద స్వల్ప గాయాలపాలై బిగ్గరగా కేకలు వేయడంతో సమీపాన రోడ్డు పనులు చేస్తున్న వ్యక్తులు గమనించి 108కి సమాచారం అందించారు. క్షతగాత్రుడిని ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. నేడూ విద్యుత్ బిల్లులను చెల్లించొచ్చు నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయని, ఈ అవకాశాన్ని జిల్లా విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రేమిస్తున్నాడనే నెపంతో..● తండ్రీ కుమారుడిపై దాడి విడవలూరు: తన సోదరిని ప్రేమిస్తున్నాడనే నెపంతో ఓ యువకుడిపై, అతని తండ్రిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన మండలంలోని ముదివర్తి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. ముదివర్తి గ్రామం దళితవాడకు చెందిన నెల్లూరు శీనయ్య, చిన్న కుమారుడు నెల్లూరు నిరీష్కుమార్ అదే గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నానని చెబుతూ వేధిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈనెల 16వ తేదీ ఆ యువతి కుటుంబ సభ్యులు విజయలక్ష్మి, మోచర్ల పరంధామయ్య, సాయికుమార్, ఇంద్రజ మరికొందరు కలిసి శీనయ్య ఇంటికి వెళ్లారు. అక్కడ నిరీష్కుమార్ను అసభ్య పదజాలంతో దూషస్తూ, చేతులు, కాళ్లతో తీవ్రంగా కొట్టారు. ఆ సమయంలో అడ్డొచ్చిన నిరీష్కుమార్ తండ్రి శీనయ్యను తోసివేయడంతో ఆయన కిందపడిపోయాడు. ఆయన శరీరంలో అంతర్గత గాయాలయ్యాయి. శీనయ్యను అతని భార్య చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొంది కోలుకున్న శీనయ్య శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై నరేష్ తెలియజేశారు. దోపిడీ కేసులో నిందితుడి అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): ఫైనాన్స్ పేరుతో లారీ డ్రైవర్ను బెదిరించి నగదు దోచుకెళ్లిన కేసులో నిందితుడిని బాలాజీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాగయ్య లారీ డ్రైవర్. ఆయన రెండురోజుల కిందట హైదరాబాద్ నుంచి మైదా పిండి లోడ్ను చైన్నెకు తీసుకెళ్లారు. అక్కడ లోడ్ను దింపి శుక్రవారం హైదరాబాద్కు బయలుదేరారు. రాత్రి నెల్లూరు ఎన్టీఆర్ నగర్ జాతీయరహదారిపై భోజనం చేసేందుకు ఆగారు. ఈక్రమంలో నాలుగో మైలుకు చెందిన వినోద్ అతని వద్దకు వెళ్లి ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. ఈఎంఐ చెల్లించనందున లారీని సీజ్ చేస్తామని డ్రైవర్ను బెదిరించి రూ.2 వేల నగదు దోచుకెళ్లాడు. బాధితుడు నాగయ్య ఫిర్యాదు మేరకు బాలాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి శనివారం నిందితుడిని అరెస్ట్ చేశారు. -
సీఐపై రియల్ ఎస్టేట్ బ్రోకర్ దౌర్జన్యం చేయడమా?
రియల్ ఎస్టేట్ బ్రోకర్గా అక్రమ లేఅవుట్ అని తెలిసి కూడా అమాయక ప్రజలను అమ్మించి తాను లబ్ధిపొందాడు. అయితే ఇప్పుడు ఆ అక్రమ లేఅవుట్లపైనా విచారణ జరుగుతుండడంతో కొనుగోలుదారులు రామకృష్ణపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ఆయనకు తెలిసే మాకు కట్టబెట్టారని తమ డబ్బులు తమకు ఇప్పించాలని డిమాండ్ పెరగడంతో అక్రమ వెంచర్ల ప్లాట్లకు సంబంధించి సమస్య ఏర్పడుతుందని భావించిన ఆయన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని విచారణాధికారులపై రౌడీయిజం ప్రదర్శించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రియల్ వెంచర్ల అక్రమాలు, అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ చేపట్టేందుకు విజిలెన్స్ సీఐ నరసింహరావు తన సిబ్బందితో వచ్చారని తెలుసుకున్న సదరు రామకృష్ణ మరో మీడియేటర్ కనక కిరీటితో కలిసి సీఐపై దురుసుగా ప్రవర్తించాడు‘వెంచర్లపైనా, రిజిస్ట్రేషన్లపై విచారణ చేపట్టేందుకు నీకేం అధికారం ఉందో జీఓ చూపించమంటూ దౌర్జన్యం చేశాడు. నేనెవరో తెలుసా.. నా వెనుక ఎవరున్నారో తెలుసా.. నీకెంత ధైర్యం ఉంటే మాపైనే విచారణ చేస్తావా? నాకు అధికార పార్టీ అండదండలు నాకు ఉన్నాయి. నేను ఎమ్మెల్యే మనిషిని, నన్ను ఎవరు ఏమి చేయలేరు. మీరు విచారణ చేయడానికి వీల్లేదంటూ ఏకంగా ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఒకానొక సమయంలో విజిలెన్స్ సిబంది రామకృష్ణ మధ్య తీవ్ర వివాదం నెలకొంది. ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు.. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో విజిలెన్స్ సీఐ నరసింహరావు కావలి ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై ఖాసిం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏఐ యుగానికి అనుగుణంగా ఎంబీఏ విద్య
● నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్సీ–ఆర్ఐఎంఈ 2026 జాతీయ సదస్సు నెల్లూరు టౌన్: కృత్రిమ మేధస్సు, అనలిటిక్స్, ఫిన్టెక్ వంటి ఆధునిక సాంకేతిక పరిణామాలు వ్యాపార రంగాన్ని వేగంగా మార్చుతున్న నేపథ్యంలో మేనేజ్మెంట్ విద్య కూడా కాలానుగుణంగా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. నారాయణ ఇంజినీరింగ్ కళాశాల ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్సీ–ఆర్ఐఎంఈ 2026 జాతీయ సదస్సును నిర్వహించారు. ఏఐ అనలిటిక్స్, ఫిన్టెక్ యుగానికి అనుగుణంగా ఎంబీఐ విద్యను ఎలా పునర్నిర్మించాలనే అంశంపై విస్తృత చర్చలు జరిగాయి. యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ బి. రాజశేఖర్ బెల్లంకొండ మాట్లాడుతూ భవిష్యత్ వ్యాపార ప్రపంచం అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎంబీఏ విద్యలో కృత్రిమ మేధస్సు, డేటా విశ్లేషణ, ఫిన్టెక్ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్వీఆర్ జ్యోతికుమార్ మాట్లాడుతూ సంప్రదాయ బోధనా విధానాలు మారుతున్న నేపథ్యంలో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతోపాటు నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, పరిశోధన, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాల అభివృద్ధి నేటి అవసరమన్నారు. అంతర్జాతీయ స్థాయి పోటీతత్వాన్ని ఎదుర్కొనేలా మేనేజ్మెంట్ విద్యలో నూతన మార్పులు తీసుకురావాలని సూచించారు. మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ ఏఐ, అనలిటిక్స్, ఫిన్టెక్ ఆధారిత విద్య భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దుతుందన్నారు. నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ ఇందిర పొంగూరు మాట్లాడుతూ మేనేజ్మెంట్ విద్య కేవలం వ్యాపార విజ్ఞానానికి పరిమితం కాకుండా ఏఐ, డేటా అనలిటిక్స్, ఫిన్టెక్ వంటి ఆధునిక రంగాలతో అనుసంధానం కావాల్సిన అవసరం ఉందన్నారు. సదస్సు డైరెక్టర్, ఎంబీఏ డీన్ డాక్టర్ గంగినేని ధనంజయ్ మాట్లాడుతూ మేనేజ్మెంట్ విద్యలో వస్తున్న నూతన ధోరణులకు ఎన్సీ–ఆర్ఐఎంఈ 2026 వేదికగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ పరిశోధన పత్రాలు సమర్పించిన విద్యార్థులు, పరిశోధకులకు ‘బెస్ట్ పేపర్ అవార్డులు’ ప్రదానం చేశారు. ఉపకులపతుల సమక్షంలో పరిశోధనా పత్రాల సంకలన గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్తమ అధ్యాపకులకు ‘బెస్ట్ బిజ్ గురు అవార్డులు’ ప్రదానం చేశారు. రాయలసీమ ప్రాంతంలో కామర్స్, ఫైనాన్స్, బిజినెస్ మేనేజ్మెంట్ విద్యాభివృద్ధికి విశేష సేవలందించిన అధ్యాపకులను సత్కరించారు. జనరల్ మేనేజ్మెంట్ విభాగంలో డాక్టర్ ఎంఆర్ఎస్ సూర్యనారాయణరెడ్డి, ఫైనాన్స్ విభాగంలో డాక్టర్ పి. సుబ్రహ్మణ్య చారి, మార్కెటింగ్ విభాగంలో ఆచార్య వి.రమేష్, హెచ్ఆర్ విభాగంలో డాక్టర్ ఎం. నీరజ ఉత్తమ అధ్యాపక అవార్డులు అందుకున్నారు. ప్రముఖ విద్యావేత్త ఆచార్య కె. వేణుగోపాల్రావుకు ‘లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ ప్రదానం చేశారు. -
అతివల భద్రతకు ‘ఆపరేషన్ దండాయన’
నెల్లూరు(క్రైమ్): మహిళలు, బాలికలపై జరిగే నేరాలను అరికట్టడం, బాధితులకు వేగవంతమైన న్యాయం అందించడమే లక్ష్యంగా ఆపరేషన్ దండాయన కార్యక్రమాన్ని జిల్లాలోనూ పటిష్టంగా అమలుచేస్తామని ఎస్పీ అజితా వేజెండ్ల పేర్కొన్నారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఆమె పోలీసు అధికారులతో కలిసి ఆపరేషన్ దండాయన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో గడిచిన రెండేళ్లలో మహిళలపై నేరాలు, పోక్సో కేసులకు సంబంధించి 43 కేసుల్లోని నిందితులకు శిక్షలు పడ్డాయన్నారు. వాటిలో 10 కేసుల్లో యావజ్జీవ, ఏడు కేసుల్లో 20 ఏళ్లకుపైగా, 3 కేసుల్లో పదేళ్లకుపైగా, రెండు కేసుల్లో ఏడేళ్లుకుపైగా, ఐదు కేసుల్లో ఐదేళ్లకుపైగా, మిగిలిన కేసుల్లో ఐదేళ్లలోపు శిక్షలు పడ్డాయన్నారు. ఏడాదిలో మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించి 159 కేసులు నమోదు కాగా 193 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. 72 మందిపై ఎస్ఓఎస్(సెక్సువల్ అఫెండర్ షీట్) తెరిచి వారి కదలికలపై నిఘా ఉంచామన్నారు. ఏఎస్పీలు సీహెచ్ సౌజన్య, దీక్ష, మహిళా పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్ఫార్మర్ల చోరీ ముఠా అరెస్ట్
● రూ.2.31 లక్షల సొత్తు రికవరీ ఆత్మకూరు: పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు పగులగొట్టి అందులోని తాగి తీగలను చోరీ చేసే ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ జి.గంగాధర్ తెలిపారు. డీఎస్పీ వేణుగోపాల్ ఆదేశాల మేరకు సర్కిల్ కార్యాలయంలో శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏఎస్పేట మండలం పొనుగోడు గ్రామానికి చెందిన దేవరకొండ ఫణీంద్రకుమార్, ఆత్మకూరు ఎల్ఆర్పల్లికి చెందిన కటారి శ్రీచరణ్, అనంతసాగరం మండలం అగ్రహారం గ్రామానికి చెందిన చేవూరి వెంకటేశ్వర్లు, ఆత్మకూరు మండలం ఆరవేడు కాలనీకి చెందిన శనగల ముత్యాలు ముఠాగా ఏర్పడి జల్సాల కోసం పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లను పగులగొట్టి అందులోని రాగి తీగలను చోరీ చేసి విక్రయిస్తుంటారు. గతంలో వీరు 19 ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు పగులగొట్టి రూ.2.73 లక్షల విలువైన రాగి తీగలను చోరీ చేశారని, అందులో రూ.2.31 లక్షల విలువైన సొత్తును రికవరీ చేసినట్లు వివరించారు. రెండు రోజుల క్రితం ఆత్మకూరు సమీపంలో ట్రాన్స్ఫార్మర్ పగులగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా, నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ కేసును ఛేదించిన సీఐ గంగాధర్, ఎస్సైలు జంపనికుమార్, కె.శ్రీనివాసులురెడ్డి, కానిస్టేబుళ్లను డీఎస్పీ వేణుగోపాల్, ఎస్పీ అజితా వేజెండ్ల ప్రశంసించి రికార్డులు ప్రకటించారు. -
తక్కువ ఖర్చుతో విదేశీ విద్య
నెల్లూరు(అర్బన్): ఐటీ, వైద్య రంగంలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు విదేశీ విద్య తక్కువ ఖర్చుతోనే అందించేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని గ్లోబల్ డిగ్రీస్ సంస్థ ఎండీ మీనాకుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం హరనాథపుంలోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. 2015లో తమ సంస్థను ప్రారంభించి ఇప్పుడు అనేక రాష్ట్రాలలో 20 బ్రాంచ్లను నెలకొల్పామన్నారు. నెల్లూరులో కూడా రెండేళ్ల క్రితం కిమ్స్ ఆస్పత్రి ఎదురుగా ఎన్వీఆర్ సెంట్రల్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేశామన్నారు. నెల్లూరు నుంచి ఇప్పటికే 200 మందికి పైగా తమ ద్వారా ఫారెన్ వెళ్లారన్నారు. అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, జర్మనీ, జపాన్ దేశాల్లో వేలాది మంది విద్యార్థులకు చదువుకునేందుకు తమ సంస్థ సాయపడిందన్నారు. ప్రతిభ ఉండి చదువుకోలేని పేద విద్యార్థులకు జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో స్కాలర్షిప్ సౌకర్యంతో పాటు ఖర్చులేని పబ్లిక్ విద్య అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తమ సంస్థతో అనేక యూనివర్సిటీలు ఎంఓయూ కుదుర్చుకున్నాయని, విద్యార్థులకు వీసా, మెస్ అన్నీ తామే ఏర్పాటు చేస్తామన్నారు. పూర్తి వివరాలకు నెల్లూరులోని తమ బ్రాంచ్లో కౌన్సిలర్లను కలవాలన్నారు. లేదా 72077 70917 అను నంబర్ను సంప్రదించాలన్నారు. సమావేశంలో సీనియర్ కౌన్సిలర్ యతినేని రామారావు, కన్సల్టెంట్ జేవీ కల్యాణ్ పాల్గొన్నారు. -
హత్యా? ఆత్మహత్యా?
● ఇంటి వెనుక వ్యక్తి అనుమానాస్పద మృతి బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని పోలినాయుడు చెరువు గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పఠాన్ నాగూర్ (48) తన ఇంటి వెనుక పడి ఉండగా స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహంపై గాయాల ఆనవాళ్లు కనిపించడంతో ఎవరైనా హత్య చేసి ఉండొచ్చని మృతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సిబ్బందిని రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు హత్యా, ఆత్మహత్యా అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. -
ముఖద్వారాల్లో ఇసుక మేటలు
● ఎడారిని తలపిస్తున్న పులికాట్ దీవులు ● ఉపాధి కోల్పోయిన గిరిజన మత్స్యకార కుటుంబాలు వాకాడు: మండలంలోని తీర ప్రాంతంలో గల సముద్ర ముఖద్వారాలు కొంతకాలంగా పూడిపోయాయి. దీంతో పులికాట్ సరస్సులోని అంతర్ భాగమైన ఉప్పు పరలు ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నాయి. సరస్సు ఆధారంగా చేపల వేట సాగించే 13 గ్రామాలకు చెందిన గిరిజన మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నాయి. వేట విరామ సమయంలో ఖాళీగా ఉన్న మత్స్యకారులు సైతం ఈ ఉప్పు పరలో వేట చేసి లాభాలు పొందుతారు. రెండు చోట్ల ముఖద్వారాలు మండలంలో రెండు చోట్ల మాత్రమే సముద్ర ముఖద్వారాలున్నాయి. పూడిరాయిదొరువు పంచాయతీలోని నవాబుపేట.. దుగరాజపట్నం పంచాయతీలోని కొండూరుపాళెం వద్ద ఇవి ఉన్నాయి. వీటి ద్వారానే సముద్ర ఆటుపోట్ల సమయంలో పులికాట్లోకి నీరు వచ్చి వెళ్తుంది. తద్వారా మత్స్య సంపద వృద్ధి చెంది ఎంతో మందికి జీవనోపాధి లభిస్తుంది. అయితే ఇవి సముద్రంలో ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటాల కారణంగా ఇసుక మేటలతో పూడిపోయాయి. ఫలితంగా పులికాట్ సరస్సు పరిధిలోని నిడిగుర్తి, పంబలి, బుసపాళెం, గొల్లపాళెం, రెడ్డిపాళెం, మొనపాళెం, నిమ్మవానితిప్ప, మూలపడవ, పంట్రంగం, పామలతేరి, పున్నమానితిప్ప, మాధవాపురం, చినతోట, శ్రీహరిపురం తదితర గ్రామాల మధ్య విస్తరించి ఉన్న ఈ ఉప్పు పరలు ఎండిపోయి ఎండమావులను తలపిస్తున్నాయి. ఉపాధి కరువు చిన్న తెప్పల సాయంతో వేట సాగించే గిరిజన మత్స్యకారులు జీవనాన్ని కోల్పోయారు. పులికాట్ సరస్సు జలాలతో మండలంలోని దాదాపు 970 మత్స్యకారులు, గిరిజనులు తెప్ప ఆధారంగా చేపలు, పీతలు, రొయ్యలను పట్టుకొని గ్రామాల్లో విక్రయించి జీవనం సాగించేవారు. అయితే ప్రస్తుతం వీరంతా రోజువారీ కూలీలుగా మారి అవస్థలు పడుతున్నారు. గతమెంతో ఘనం గతంలో ఏడాది పొడవునా పులికాట్ జలకళతో కనువిందు చేసేది. దీనికి తోడు సముద్ర ఆటుపోట్లకు ఉప్పు నీరు సరస్సులోకి రావడం.. తిరిగి వెళ్లిపోవడం ఒక అనుభూతిగా ఉండేది. అంతేకాకుండా ఈ ఉప్పుకయ్యల్లో విదేశీ వలస పక్షులు ఎంతో ఉత్సహంగా, ఉల్లాసంగా రెండు నెలలపాటు ఉండి సేదదీరి వెళ్లేవి. అయితే కొంత కాలంగా నీరు లేక వీటి రాక కానరావడంలేదు. సముద్రంపై వేట విరామ సమయంలో మత్స్యకారులు, గిరిజన కుటుంబాలు ఈ కాలువలోనే వేట చేసుకుంటూ జీవనం సాగించేవారు. పూడిపోయిన ముఖద్వారాల విషయంలో శాశ్వత పరిష్కారం చూపే వారు లేకపోవడంతో కళావిహీనంగా మారి ఎడారిని తలపిస్తున్నాయి. ఉప్పు పరల్లో సైతం ఆక్రమణలు కొందరు అధికార పార్టీ నేతల అండ చూసుకొని పులికాట్ సరస్సులో ఉప్పు పరలను సైతం వదలకుండా ఆక్రమించుకొని దర్జాగా అనుభవిస్తున్నారు. గతంలో పులికాట్ సరస్సులోకి సముద్ర జలాలు రాకపోతే వెంటనే స్పందించి ముఖద్వార పూడికతీతకు కసరత్తు చేసేవారు. అయితే ప్రస్తుతం కంచె చేను మేసిన చందంగా సముద్ర ముఖద్వారాల పూడిక తీయించే వారే ఉప్పుపరల ఆక్రమణదారులు కావడంతో ఎడారిని తలపిస్తున్నాయి. తీర ప్రాంతంలో పలు పరిశ్రమలొస్తాయనే ముందు చూపుతో కొందరు ఆక్రమణలకు తెరదీస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మలేరియా రహిత జిల్లాగా నెల్లూరు
నెల్లూరు(అర్బన్): మలేరియా రహిత జిల్లాగా నెల్లూరును మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ సుజాత పేర్కొన్నారు. జూన్ను మలేరియా నివారణ మాసోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లను నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో జిల్లా మలేరియా నివారణ విభాగ ఆధ్వర్యంలో శనివారం ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడారు. వైద్యశాఖ చేపడుతున్న చర్యలు, ప్రజల చైతన్యంతో జిల్లాలో మలేరియా కేసులు దాదాపు తగ్గిపోయాయని తెలిపారు. అక్కడక్కడా నమోదవుతున్న ఒకట్రెండు కేసులను సైతం అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణను చేపట్టామని వివరించారు. మలేరియాపై అవగాహన కల్పిస్తూ వైద్యశాఖ కార్యాలయం నుంచి సోమవారం నిర్వహించనున్న భారీ ర్యాలీకి వైద్యశాఖ ఉద్యోగులు హాజరుకావాలని కోరారు. జిల్లా మలేరియా నివారణాధికారి సింహాచలం, అసిస్టెంట్ అధికారి జయరామ్ తదితరులు పాల్గొన్నారు. -
రామకృష్ణ ఆగడాలకు అంతే లేదు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికారాన్ని అడ్డం పెట్టుకుని కావలిలోని కొందరు పచ్చ నేతలు కండ కావరంతో రెచ్చిపోతున్నారు. సామాన్య ప్రజల నుంచి ప్రతిపక్ష నాయకులు, మీడియాపైనా చెలరేగిపోతున్న వీరు.. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపైనా విరుచుకు పడుతున్నారు. తమ స్థాయి మరిచి విజిలెన్స్ సీఐ అధికారాలనే ప్రశ్నించడమే కాకుండా ఆయనపై రౌడీయిజం చేయడం పచ్చ నేతల అరాచకాలకు పరాకాష్టగా నిలుస్తోంది. అసలేం జరిగిందంటే.. కావలి పట్టణం, రూరల్ పరిధిలో ముగ్గురు నేతలు కలిసి గతంలో 325 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు. ఇందులో సుమారు 21.45 ఎకరాలు ఇరిగేషన్కు చెందిన కాలువలను ఆక్రమించారు. ఆయా వెంచర్లలోని ప్లాట్లను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయిన టీడీపీ నేత చవల రామకృష్ణ ఎంతో మందికి విక్రయాలు చేయించారు. అయితే అక్రమ రియల్ వెంచర్లు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధికారంలోకి రాగానే విజిలెన్స్ విచారణ చేపట్టాలని లేఖ రాశారు. ఈ క్రమంలో సదరు వెంచర్ల యజమానులు ఎమ్మెల్యేతో లోపాయికారి ఒప్పందం చేసుకోవడం, అందులో భాగంగా ఆయన బంధువుకు మరో ప్రాంతంలో 18 ఎకరాలు భూములు కొని ఆయన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించడంతో ఈ వ్యవహారం మరుగున పడిపోయింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు ముఖ్య అనుచురుడు అయిన సదరు రామకృష్ణను కావలి ఏరియా వైద్యశాల డైరెక్టర్గా నియమించారు. ఇంకేముంది అధికార మదంతో సదరు నేత చెలరేగిపోతున్నాడు. కావ్యకు.. బీద బ్రదర్స్తో చెడడంతో.. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. ఇటీవల మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకున్న తమిళ బోట్లను బీద మస్తాన్రావు వదిలేయించడంతో తీర గ్రామాలు అట్టుడికిపోతున్న విషయం తెలిసిందే. బీద సోదరులతో సాన్నిహిత్యం చెడిపోయిన క్రమంలో దీనికి ముందు సదరు తమిళ బోట్ల యజమానితో జరిగిన ఫోన్ సంభాషణల కాల్ డేటా బయటకు రావడానికి ఎమ్మెల్యేనే కారణమని భావించిన బీద సోదరులు అక్రమ వెంచర్లపై విజిలెన్స్ విచారణను తెరపైకి తెచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలు దఫాలుగా క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు, తాజాగా గురువారం రాత్రి కావలి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయా వెంచర్లలో జరిగిన రిజిస్ట్రేషన్లపై విచారణకు విజిలెన్స్ సీఐ నరసింహరావు వచ్చారు. విజిలెన్స్ సీఐపై దాడికి యత్నిస్తున్న రామకృష్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేత రామకృష్ణ ఆగడాలకు అంతే లేకుండా పోయింది. ఆయన రియల్ ఎస్టేట్ వెంచర్ల బ్రోకర్గా వ్యవహరించడమే కాకుండా రియల్ ఎస్టేట్ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు పదవులను అడ్డం పెట్టుకొని అధికార పార్టీ అండదండలతో అనేక అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. గతంలో ఏరియా వైద్యశాలలో న్యూస్ కవరేజ్ నిమిత్తం మీడియా ప్రతినిధులు ఉండగా ఆస్పత్రి ప్రాంగణంలో విలేకరులు ఉండకూడదంటూ దౌర్జన్యం చేయడమే కాకుండా పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పట్లో మీడియా అంతా ఏకమై ఏరియా వైద్యశాలలో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేపట్టాలంటూ పట్టు బట్టింది. దీంతో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి స్వయంగా ఆస్పత్రికి చేరుకుని మీడియాకు సర్ది చెప్పడం తెలిసిందే. సదరు రామకృష్ణను ఏ విధంగా వెనకేసుకుని వస్తున్నాడో అర్థమవుతోంది. -
డీఎస్సీ అక్రమాలపై ఆధారాలతోనే ప్రశ్నిస్తున్నాం
సాక్షి, నెల్లూరు: కూటమి సర్కార్ ఆర్బాటంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో ముమ్మాటికీ అక్రమాలు జరిగాయని, గతేడాది క్రీడాకారుల కోటాపై ఇచ్చిన జీవోలు, ఈ ఏడాది వాటిని ఉపసంహరించి, మళ్లీ కొత్త జీవోలు ఇవ్వడమే దీనికి నిదర్శనమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని తాము పదే పదే ప్రశ్నిస్తుంటే అధికారులు ఇచ్చిన ఖండనలోనూ తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకున్నారని కాకాణి ఆక్షేపించారు. అక్రమాలు జరగకపోతే డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్డితో విచారణ చేయించడానికి ఎందుకు భయపడుతున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన ఇంకేమన్నారంటే..డీఎస్సీపై ఆధారాలతోనే ప్రశ్నిస్తున్నాండీఎస్సీలో జరిగిన అక్రమాలపై మేం కేవలం ఆరోపణలు చేయట్లేదు, ఆధారాలతో సహ మీడియా ముందుకు వస్తున్నాం. మెగా డీఎస్సీలో అంతులేని అక్రమాలు జరిగాయి. ఓ పక్క టీచర్ ఉద్యోగాలపై నిరుద్యోగుల్ని ఊరించి, ఎన్నికలకు ముందు నుంచీ మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చి, చివరికి 2025లో నోటిఫికేషన్ ఇచ్చారు. పరీక్ష నిర్వహణపై అనేక అనుమానాలు ఉన్నాయి. దీనిపై మేం చేసిన ఆరోపణల మీద అధికారులు ఖండన కూడా ఇచ్చారు. అయితే ఈ ఖండనలో అంతా మీరు చెప్పినవి కరెక్ట్ కాదని చెప్పారు కానీ, తప్పు జరగలేదని పాయింట్ల వారీగా చెప్పలేకపోయారు. నిరుద్యోగులకు డీఎస్సీలో జరిగిన దగాపై వైఎస్ జగన్ పిలుపు మేరకు ఇప్పటికే ఆందోళనలు చేశాం.జూన్ 1వ తేదీన యువత ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి కూడా చేయబోతున్నాం. మీరు అర్హులుగా ఎంపిక చేసిన అభ్యర్ధుల పేర్లు తుది జాబితాలో ఎందుకు గల్లంతయ్యాయో చెప్పగలరా ? మెరిట్ లిస్ట్ లేదు, సెలక్టెడ్ లిస్ట్ కూడా లేకుండా ఎంపికైన వారికి మెసేజ్ లు మాత్రమే పంపించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా ? ఒక పోస్టుకు ఒక్కరినే పిలిచి, అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు, తిరస్కరించలేదు. అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని హైకోర్టు చెప్పినా, ఆదేశాలు బేఖాతరు చేస్తూ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు.డీఎస్సీ ఫలితాలు ప్రకటించేటప్పుడే రూల్ ఆఫ్ రిజిస్టర్ రోస్టర్ ప్రకారం అభ్యర్ధులకు ఎన్ని మార్కులు వచ్చాయో మెరిట్ లిస్ట్ విడుదల చేయాల్సి ఉంది. కానీ విడుదల చేశాక దాన్ని డిలీట్ చేయాల్సి అవసరం ఎందుకొచ్చింది ? ఎప్పుడూ లేని విధంగా డీఎస్సీని ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది ? సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చే సరికి మరో కొత్త విధానం అమలు చేశారు. తుది ఎంపిక జాబితాకు వచ్చేటప్పటికి వీటన్నింటినీ పక్కనబెట్టి మరో కొత్త విధానం తెచ్చి, మీ అజెండాను అమలు చేసి అర్హులైన నిరుద్యోగుల కడుపు కొట్టే ప్రయత్నం చేశారు.నైతిక విలువల్లేని విద్యామంత్రి లోకేష్ఎప్పుడైనా పరీక్ష రాసిన అభ్యర్ధులకు మెరిట్ లిస్ట్ పరిశీలించుకునే హక్కు ఉంది. మెరిట్ లిస్ట్ లో తాము ఎక్కడ ఉన్నాం, తమకన్నా ముందూ వెనుక ఎవరున్నారనే అంశాల్ని తెలుసుకునే అవకాశం అభ్యర్ధులకు ఇవ్వాలి. మెరిట్ లిస్ట్ తయారు చేశాక పారదర్శకంగా సెలెక్టెడ్ లిస్ట్ ప్రకటిస్తారు. అది చేయలేదు కాబట్టి అక్రమాలు జరిగాయని కచ్చితంగా నమ్ముతున్నాం. అందుకే ఈ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని పదే పదే కోరుతున్నాం.చదువూ, సంధ్యా లేని మొద్దబ్బాయి లోకేష్ ను తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా చేయడం ఈ సమాజానికి తీరని ద్రోహం చేయడమే. అందుకే ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిపై కేసులు పెడతానంటున్నారు తప్ప నా వల్ల పొరబాటు జరిగిందని, కాబట్టి తాను విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పడం లేదు. నైతిక విలువలు లేవు కాబట్టే లోకేష్ ఇలా వ్యవహరిస్తున్నారు. డీఎస్సీలో 16347 పోస్టుల్లో 421 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో నింపారు. అందులో మీరు నింపిన విధానం చూస్తే ఎంత భయంకరమైన వాస్తవాలు వెలుగుచూస్తున్నాయో మేం వివరిస్తాం.స్పోర్ట్ కోటా జీవోల్లో మార్పులతో అక్రమాలుక్రీడల్లో ప్రతిభ చూపిన వారికి 2 శాతం రిజర్వేషన్ ఎప్పటి నుంచో అమలు ఉంది. స్పోర్ట్స్ కోటాపై ఉమ్మడి ఏపీలోనే 2012 ఆగస్టు 9న జీవో ఎంఎస్ నంబర్ 74 విడుదల చేసారు. అప్పుడు ఉన్న జీవోలో క్రీడల్లో రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తెచ్చిన వారికి 29 క్రీడల్లో ఈ రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. దీని ప్రకారం పోటీ పరీక్ష రాసిన తర్వాత క్రీడాకారులకు క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. కానీ చంద్రబాబు తన పుట్టినరోజుకు ఒక్క రోజుకు ముందు ఏప్రిల్ 19న జీవో 47, జీవో 4 కూడా తెచ్చారు. 2025 ఏప్రిల్ 19న విడుదల చేసిన జీవో 4లో 2 శాతంగా ఉన్న క్రీడా రిజర్వేషన్లను 3 శాతానికి పెంచారు. కానీ క్రీడల సంఖ్యను 29 నుంచి 65కు పెంచారు.గతంలో ఉన్న క్రీడల్లో స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు వీల్లేదు కాబట్టి దానికి మార్పులు చేశారు. అందుకే క్యారమ్స్, టెన్నికాయిట్, టగ్ ఆఫ్ వార్, యోగాసనాలు, బీచ్ వాలీవాల్ వంటి క్రీడల్ని చేర్చారు. జీవోడీ ఇచ్చిన మరో జీవో 47లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు పోటీ పడే వారు అసలు పోటీ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని చెప్పేశారు. అంటే క్రీడా ప్రతిభ ఉన్న వారితో పాటు ఉపాధ్యాయ అర్హత ఉన్న వారికీ ద్రోహం జరిగింది. ఈ నెల 26న తిరిగి పోటీ పరీక్ష రాసిన వారికే డీఎస్సీలో ప్రాధాన్యం ఇవ్వాలని మరో జీవో ఇచ్చారు. అంటే గతంలో అర్హులుగా ఉన్న వారికి అవకాశం లేకుండా చేయడానికి, మీకు అనుకూలంగా ఉన్న వారికి ఉద్యోగాలు ఇప్పించేందుకు ఇలాంటి జీవో ఇచ్చారు. అందుకే మళ్లీ జీవోలో మార్పులు చేశారు.జీవో మార్పులతో అర్హులకు తీవ్ర అన్యాయంజీఏడీ ద్వారా గతేడాది ఏప్రిల్ 19న ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ను సవరిస్తూ జీఏడీ ద్వారా రెండు జీవోలు ఇప్పించారు. ఇందులో గతంలో క్రీడాకారులు కూడా పోటీ పరీక్ష రాయాల్సి ఉండగా.. ఈ నిబంధనల్ని మార్చారు. దీంతో భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఈ నెలలో ఆ జీవోల్ని రద్దు చేశారు. గతేడాది ఇచ్చిన జీవోల్లో జాతీయ ఛాంపియన్ షిప్ సాధించిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది, ఆటలో పాల్గొంటున్న వారికి తర్వాత ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. దాన్ని మార్చి తాజాగా ఇచ్చిన జీవోలో జాతీయ స్దాయిలో ఆడిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ఛాంపియన్ షిప్ వస్తే తర్వాతి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.ఇలా ఎందుకు మార్చారో సమాధానం చెప్పగలరా ? ముందుగా ఇచ్చిన జీవో కరెక్ట్ అనుకుంటే, ఆ తర్వాత ఎందుకు ఉపసంహరించారు ? ఈ రెండు పరిణామాల మధ్య నష్టపోయిన వారికి ఎవరు బాధ్య త వహిస్తారు ? డీఎస్సీలో పరీక్ష రాసిన అభ్యర్ధుల పరిస్ధితి ఏంటి ? వీటికి సమాధానాలు చెప్పకుండా ప్రశ్నించిన వారిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. అందుకే సీబీఐ దర్యాప్తు జరగాలని కోరుతున్నాం. ఇది లోకేష్ శాఖలో జరిగిన డార్క్ సీక్రెట్ ఆపరేషన్ అంటున్నాం. మీరు ఎంత మందిని అరెస్టు చేసుకుంటారో చేసుకోండి, దగాపడిన నిరుద్యోగులతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, విద్యార్ధి, యువజన విభాగాలు సిద్దంగా ఉన్నాయి. కానీ దయచేసి ప్రతిభ ఉన్న వారికి మాత్రం అన్యాయం చేసి వారి ఉసురుపోసుకోకండి.డీఎస్సీలో జిల్లా కమిటీల పాత్ర ఉంటే అక్రమాలు సాధ్యం కావు కాబట్టి వీటిని నిర్వీర్యం చేశారు. అందుకే రాష్ట్ర స్దాయిలోనే ఈ పరీక్ష నిర్వహించారు. టెట్, డీఎస్సీకి సంబంధించి ఒకే వ్యక్తికి బాధ్యతలు కూడా అప్పగించారు. ప్రశ్నాపత్రం తయారు చేసిన వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్ అని మీరే ఒప్పుకుంటున్నారు. అతనే తిరిగి పరీక్ష రాసి కృష్ణాజిల్లాలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే అతని వివరాలు డిలీట్ చేశారు. అతను కోర్టుకు వెళ్తే బెదిరించి కేసు వెనక్కి తీసుకోమంటున్నారు. అందుకే డబ్బులు చేతులు మారాయని మీరు ఇచ్చిన జీవోల ద్వారానే అర్థమవుతోంది. మీరు అక్రమార్కులపై చర్యలు తీసుకునే పరిస్ధితుల్లో లేరు.ఒకే కేటగిరీలో ముందు ఉన్న వాళ్లకు, తర్వాత ఉన్న వాళ్లకూ ర్యాంకులు వచ్చాయి, కానీ ఆమ్యామ్యాలు సమర్పించకపోవడం వల్ల మధ్యలో ఉన్న వారికి ర్యాంకులు రాలేదు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా ? టెస్ట్ మెసేజ్ ల పేరుతో ఉద్యోగాల జీవితాలతో ఆడుకున్నారు. మూడు పోస్టులకు అర్హత సాధిస్తే ఒకటే పోస్టుకు కాల్ లెటర్ ఇవ్వడం అన్యాయం కాదా ? ఈ మూడు పోస్టుల్లో హయ్యర్ గ్రేడ్ పోస్టు ఇవ్వాలని హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని అడుగుతుంటే మా మీద క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మా మీద కాదు అక్రమాలతో యువత భవిష్యత్తును నాశనం చేసిన అధికారులపై ఈ కేసులు పెట్టండి. అలాగే ఎస్సీఈఆర్టీ నుంచే ప్రశ్నాపత్రాల లీక్ జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.ఈ ప్రశ్నాపత్రాలు అప్ లోడ్ చేసిన వ్యక్తి పరీక్ష ఎలా రాస్తాడు ? ఫస్ట్ ర్యాంక్ ఎలా తెచ్చుకుంటాడు, అతన్ని మీరు ఎందుకు తొలగించారో బయటపెట్టాలి. ఓపెన్ కేటగిరీలో రావాల్సిన పోస్టును వేరే వ్యక్తికి ఎలా ఇస్తారు ? అడిగితే వేరే వ్యక్తికి ఇచ్చామని చెప్పారని అధికారులు చెప్పినట్లు అభ్యర్ధులు కూడా బయటపెట్టారు. మీరు బేరసారాలు ఆడిన ఆడియోలు బయటికి వచ్చినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? దీని మీద ముఖ్యమంత్రి, విద్యామంత్రి సమాధానం చెప్పాల్సిందే. దీంతో పాటు అక్రమాలకు బాధ్యత వహించి విద్యామంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. దీంతో పాటు సీబీఐ దర్యాప్తు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాల్సిందేనని కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. -
సమస్యల పరిష్కారమే పల్లె వీక్షణ లక్ష్యం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా వెల్లడి సైదాపురం: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించడమే ‘పల్లె వీక్షణ’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. మండలంలోని కొమ్మిపాడు గ్రామంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారంలో ఒకరోజు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒక గ్రామానికి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా పరిశీలించి వెంటనే పరిష్కరించే లక్ష్యంతో పల్లె వీక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రం వద్ద సీసీ రోడ్డు నిర్మాణం, ఓహెచ్ఆర్ ట్యాంక్ నుంచి పైపులైన్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారన్నారు. పైపులైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయడం సంతోషకరమని, అలాగే సీసీ రోడ్డు నిర్మాణానికి కూడా వెంటనే నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 80 అర్జీలు అందగా, వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించామని చెప్పారు. మిగిలిన వాటికి 30 రోజుల్లో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. -
నీకు సగం.. నాకు సగం
గూడూరు మున్సిపల్ కమిషనర్ అంతా నా ఇష్టం.. నేను చెప్పిందే వేదం.. నాకు జీఓలు, రూల్స్ వర్తించవు అనేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పట్టణంలోని కూరగాయాల మార్కెట్లో దుకాణాల కోసం చాలామంది పోటీ పడుతుంటారు. కానీ వాటి కేటాయింపులో నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలున్నాయి.సాక్షి టాస్క్ఫోర్స్: గూడూరు మున్సిపాలిటీలో కూరగాయల మార్కెట్ దుకాణాల కేటాయింపు తీవ్ర వివాదాస్పదంగా మారింది. బహిరంగ వేలం నిర్వహించకుండా కేటాయించడంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నీకు సగం.. నాకు సగం అనే విధానంలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు చర్చ జరుగుతోంది. ఇటీవల గమ్మళ్లపాళెం వద్ద ఏర్పాటు చేసిన హైమాక్స్ విద్యుత్ దీపాల ప్రారంభో త్సవంలో స్థానిక ఎమ్మెల్యే సునీల్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లును ప్రశంసించిన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో కూరగాయల మార్కెట్ దుకాణాల కేటాయింపుల్లో అధికార దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో, మున్సిపాలిటీలో ప్రభావం కలిగిన మాజీ నాయకుడి సహకారంతో కమిషనర్ను కీలుబొమ్మలా మార్చుకుని కేటాయింపులు చేపట్టినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా.. పట్టణ నడిబొడ్డున నిర్మించిన కూరగాయల మార్కెట్లో మొత్తం 40 దుకాణాలున్నాయి. వీటిని కేటాయించాలంటే బహిరంగ వేలం లేదా టెండర్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉండగా, అలాంటి చేయకుండానే పాత దుకాణదారులకే లీజుకిచ్చినట్లు సమాచారం. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగకుండా దుకాణాలను బహిరంగ వేలం ద్వారానే కేటాయించాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టినట్లు ఆరోపణలున్నాయి. దుకాణాల కేటాయింపుల్లో తమ చేతివాటం ప్రదర్శించి వాటాలు పంచుకున్నట్లు తెలుస్తుంది. రూ.లక్షల్లో వ్యాపారం కూరగాయల మార్కెట్లో నిత్యం వ్యాపారం రూ.లక్షల్లో జరుగుతుంది. పట్టణ జనాభా కనీసం లక్షకు పైగా ఉండగా పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు కాగా అందులో పనిచేసే కార్మికులు అదనంగా మరో 50 వేల వరకు ఉంటారు. వీరంతా నిత్యం వారికి సమీపంలో ఉండే చిన్నపాటి దుకాణాల వద్ద కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు. అలాంటి చిరు వ్యాపారులు మార్కెట్కు వచ్చి ఇక్కడ పెద్ద దుకాణాల్లో కూరగాయలు తీసుకుని వెళుతుంటారు. అలాగే గూడూరు ప్రాంతం నుంచి సైదాపురం, బాలాయపల్లి, కోట, ఓజిలి, చిల్లకూరు మండలాల్లోని పలువురు చిరు వ్యాపారులు ఇక్కడ కొనుగోలు చేస్తారు. అందువల్లే దుకాణాలకు అంతగా పోటీ ఉంటుంది. అంతా నా ఇష్టం మున్సిపాలిటీలో పాలకవర్గం లేకపోవడం, ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ బలహీనంగా ఉండటంతో కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. కొద్దిరోజుల్లో పదవీ విరమణ చేస్తాను.. ప్రజాప్రతినిధి అండ ఉందంటూ నిబంధనలను పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. మార్కెట్ ప్రారంభోత్సవ శిలాఫలకంలో ప్రోటోకాల్ వివాదం కూడా చర్చనీయాంశమైంది. వారికి అవకాశం లేదా? దుకాణాల కేటాయింపుల్లో ఎస్సీ ఎస్టీలు, మహిళలు, దివ్యాంగులతోపాటు చిరు వ్యాపారులకు కనీసం చోటు కల్పించకపోవడంతో వారు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని మదన పడుతున్నారు. పెట్టుబడులు పెట్టుకునే స్థోమత తమ వద్ద ఉంటే ప్రైవేట్ దుకాణాలను అద్దె తీసుకుని వ్యాపారాలు చేసుకునే వాళ్లం కదా అని ప్రశ్నిస్తున్నారు. మహిళా సాధికారత, బలహీన వర్గాల అభివృద్ధి పేరుతో గొప్పలు చెప్పుకునే నేతలు ఇక్కడ మాత్రం నిబంధనలను విస్మరించారని విమర్శలు వినిపిస్తున్నాయి. దుకాణాల కేటాయింపులో కమిషనర్ స్వామి భక్తి వేలం లేకుండానే కేటాయింపులపై ఆరోపణలు మున్సిపాలిటీ ఖజానాకు గండిమున్సిపల్ ఆదాయానికి గండిదుకాణాలను బహిరంగ వేలం వేస్తే మున్సిపాలిటీకి గణనీయమైన ఆదాయం వచ్చేదని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే వేలం లేకుండా కేటాయింపులు జరగడంతో మున్సిపల్ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ ఆదాయం గురించి తరచూ మాట్లాడే కొందరు మాజీ నాయకులు కూడా ఈ వ్యవహారంపై మౌనం పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది.కేటాయింపులు చేస్తాం పాత మార్కెట్లో దుకాణాలను లీజుకు తీసుకున్న వ్యాపారులను ఖాళీ చేయించే సమయంలో కొత్త దుకాణాల్లో అవకాశమిస్తామని మాట ఇవ్వడం జరిగింది. దీంతోనే ప్రస్తుతం వారికే ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేపట్టాం. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు మార్కెట్లో మొదటి అంతస్తులో ఉండే దుకాణాల్లో అవకాశం కల్పిస్తాం. – వెంకటేశ్వర్లు, గూడూరు మున్సిపల్ కమిషనర్ -
పెద్దాస్పత్రి.. నరక కూపం
● కూటమి ప్రభుత్వంలో రోగులకు కష్టాలెన్నో.. ● వీల్ చైర్ దొరకదు ● స్ట్రెచర్ కానరాదు ● అందుబాటులో ఉండని సీనియర్ డాక్టర్లునెల్లూరు(అర్బన్): నెల్లూరులోని పెద్దాస్పత్రి.. ఇక్కడ నెలకొన్న సమస్యలు అన్నీఇన్నీ కావు. సీనియర్ డాక్టర్లు, వైద్య పరీక్షలున్నా రోగులకు కనీస సౌకర్యాలు అందడం లేదు. వైద్యం దైవా దీనంగా మారింది. పలువురు వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎంఆర్ఐ, సీటీ లాంటి ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేశారు. నూతన భవనాలు నిర్మించారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది ఖాళీలు పూర్తిస్థాయిలో భర్తీ చేశారు. అయితే నేటి కూటమి ప్రభుత్వంలో సేవలు అధ్వానంగా మారాయి. ఇలా ఎన్నో.. ఆస్పత్రిలో డాక్టర్లు సమయపాలన ఎందుకు పాటించడం లేదు. సీనియర్లు గంటో, రెండు గంటలు మాత్రమే ఉంటున్నారు. భారమంతా జూనియర్ వైద్యులపై పడుతోంది. వీల్ చైర్, స్ట్రెచర్లు అందుబాటులో ఉండవు. యాక్సిడెంట్ కేసులు వచ్చినా గంటల కొద్దీ వాటి కోసం రోగుల బంధువులే ఎందుకు వెతకాల్సి వస్తోంది. అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయాలంటే రెండు నుంచి నాలుగు రోజులు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలని సిబ్బంది చెబుతున్నారు. ఈ లోపు రోగికి ఏమైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎంఆర్ఐ, సీటీ స్కానింగ్ రిపోర్టులు కావాలంటే మూడు, నాలు గు రోజులు ఆగాల్సిందే. రక్తపరీక్షలు కావాలంటే మిద్దైపెకి ఎక్కాలి. అయితే లిఫ్ట్ కొన్నినెలలుగా పని చేయడం లేదు. వార్డుల్లోని లిఫ్ట్లు కూడా సక్రమంగా పని చేయవు. న్యూరో, యూరాలజీ తదితర సర్జరీలు చేసేందుకు కనీస పరికరాల్లేవు. ఇదే సాకుగా డాక్టర్లు థంబ్ వేసి వెళ్లిపోతున్నారు. ఆపరేషన్లు చేయాలంటే ఏసీలు చాలా కాలంగా పని చేయడం లేదు. మరుగుదొడ్లు కంపు కొడుతుంటాయి. బకెట్లు, మగ్గులు సరిపడా లేవు. ఎమర్జెన్సీలో అవసరమైన పరికరాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. ట్రామా కేర్ సిబ్బందికి నెలలుగా జీతాలు రాలేదు. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు కావాలంటే నెలల తరబడి తిప్పుకొంటున్నారు. సూపరింటెండెంట్ రెగ్యులర్గా రౌండ్స్ వేయడం లేదనే ఆరోపణలున్నాయి. డాక్టర్లు లేకపోతే అడగడం లేదని తెలిసింది. దీంతో పలువురు ఆలస్యంగా వస్తున్నారు. ఓపీ చీటీలు ఉదయం 8 గంటలకు రాయడం ప్రారంభించాలి. కానీ 8:30 గంటలకు కూడా మొదలు పెట్టడం లేదు. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల కోసం ఉద్యోగులతోపాటు విశ్రాంత ఉద్యోగులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరైన రూ.22 కోట్లతో గత ఆగస్టు నాటికే పూర్తయిన సీసీయూ భవన సముదాయాన్ని ఇంకా ప్రారంభించలేదు. -
జామాయిల్తోట దగ్ధం
● రూ.లక్ష నష్టం అనుమసముద్రంపేట: మండలంలోని అనుమసముద్రం గ్రామ పొలిమేరల్లో జామాయిల్ తోట దగ్ధమైంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రైతు ఎండీ యూసఫ్ సుమారు ఐదెకరాల్లో జామాయిల్ తోట సాగుచేస్తున్నాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం తోట దగ్ధమవడాన్ని స్థానికులు గమనించారు. ఈ విషయాన్ని వెంటనే ఆత్మకూరు అగ్నిమాపక శాఖ అధికారులకు తెలపడంతో ఫైర్ అధికారి బాలాజీ గురుప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది ఏఎస్పేటకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే సగభాగం పైగా అగ్నికి ఆహుతైంది. దీంతో రూ.లక్ష పైగా నష్టపోయినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆకతాయిల చేష్టలతో ఇలా జరిగి ఉంటుందేమోనని బాధిత రైతు అనుమానం వ్యక్తం చేశాడు. గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి కోవూరు: పడుగుపాడు రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం గూడ్స్ రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. బిట్రగుంట నుంచి రేణిగుంట వైపు రైలు వెళ్తోంది. ఓ వ్యక్తి పట్టాలు దాటుతున్న సమయంలో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతని వయసు 45 నుంచి 50 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని రైల్వే పోలీసులు తెలిపారు. గోవుల అక్రమ రవాణా అడ్డగింత నెల్లూరు(అర్బన్): రూరల్ మండల పరిధిలోని చింతారెడ్డిపాళెంలో గుర్తుతెలియని వ్యక్తులు గోవులను కసాయి వ్యక్తులకు అమ్మేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే ఆ ప్రాంతంలో కొన్ని గోవులను వధించి మాంసం విక్రయించినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు శుక్రవారం అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్రమార్కులు పరారయ్యారు. 9 గోవులను రక్షించి గోశాలకు తరలించారు. ఈ సందర్భంగా సీఐ వేణు మాట్లాడుతూ దీని వెనుక ఎవరున్నారో విచారణ చేస్తున్నామని తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు. హోటళ్లలో అధికారుల తనిఖీలు ● 19 సిలిండర్ల స్వాధీనం నెల్లూరు(పొగతోట): సివిల్ సప్లయీస్ అధికారులు నెల్లూరు మినీబైపాస్ రోడ్డులోని రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. 8 కేసులు నమోదు చేసి 19 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీ నం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్ఓ పుల్లయ్య మాట్లాడుతూ డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లలో వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఓ లక్ష్మీనారాయణరెడ్డి, సీఎస్ డీటీలు అజీజ్, రవి, రామకృష్ణ పాల్గొన్నారు. కండలేరులో 39.220 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 39.220 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,900, లోలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 15, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
507 మొబైల్ ఫోన్ల రికవరీ
● బాధితులకు అప్పగింత నెల్లూరు(క్రైమ్): జిల్లాలో చోరీకి గురైన, ప్రజలు పోగొట్టుకున్న రూ.1.14 కోట్ల విలువైన 570 మొబైల్ ఫోన్లను సైబర్ క్రైమ్, స్థానిక పోలీస్లు సంయుక్తంగా రికవరీ చేశారు. వాటిని శుక్రవారం నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ అజిత వేజెండ్ల బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో మొబైల్ ఫోన్ అత్యంత కీలకమైందన్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ సేవలు, విద్య, ఉద్యోగాలు, వ్యాపార కార్యకలాపాలు తదితరాలు దాని ద్వారానే జరుగుతున్నాయన్నారు. ఇంతటి ప్రాధాన్యమున్న ఫోన్ చోరీకి గురైనా?, పోగొట్టుకున్నా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ వెంటనే సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటి రిజిస్టర్)పోర్టల్లో లేదా స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. సాంకేతికత ఆధారంగా ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేయడం జరుగుతోందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు తొమ్మిది విడతల్లో రూ.10 కోట్ల విలువైన 5,010 ఫోన్లను రికవరీ చేశామన్నారు. ప్రజలు సీఈఐఆర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫోన్ల రికవరీలో ప్రతిభ చూపిన సైబర్ విభాగం ఇన్స్పెక్టర్ ఎం.పూర్ణచంద్రరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఎన్.రామారావు, సైబర్ సోషల్ మీడియా, జిల్లాలోని పోలీసు అధికారులను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు దశరథరామారావు, బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పారాలీగల్ వలంటీర్ల పాత్ర కీలకం
నెల్లూరు (లీగల్): చట్టపరమైన సాయంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో పారా లీగల్ వలంటీర్ల (న్యాయసేవా సహాయకులు) పాత్ర కీలకమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మశ్రీ పేర్కొన్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా భవన్లో పారా లీగల్ వలంటీర్లతో సమావేశాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ ఆదేశానుసారం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సామాన్యులు.. న్యాయవ్యవస్థకు వారధిగా వ్యవహరిస్తూ బాధ్యతతో మెలగాలని సూచించారు. న్యాయం కోసమొచ్చే పేద మహిళలు, అణగారిన, బలహీన వ ర్గాలకు చెందిన ప్రజలకు న్యాయ, చట్టపరమైన అంశాలపై కౌన్సెలింగ్ ఇచ్చి న్యాయసేవాధికార సంస్థ లను ఆశ్రయించేలా కృషి చేయాలని కోరారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సురేష్, లోక్ అదాలత్ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ గోపాల్రెడ్డి, లోక్ అదాలత్ సభ్యులు శ్రీనివాసరావు, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇదో ఉదాహరణ..
ఆక్రమణదారులకు వత్తాసు భూముల ధరలు భారీగా పెరిగిపోవడంతో ఆక్రమణలూ అదే స్థాయిలో జరుగుతున్నాయి. కబ్జాదారులకు రెవెన్యూ అధికారులు సంపూర్ణంగా సహకరిస్తున్నారు. పేదలకు కేటాయించిన ల్యాండ్స్ను సైతం టీడీపీ నేతలు హస్తగతం చేసుకుంటున్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న వాటినీ కొల్లగొడుతున్నారు. ఒకవేళ అందు లోకి ఎవరైనా ప్రవేశించేందుకు యత్నిస్తే, దౌర్జన్యాలకు సైతం తెగబడుతున్నారు. ఆన్లైన్లో తమ పేర్లున్నాయి.. వీటి జోలికొస్తే సహించేదిలేదంటూ హెచ్చరికలను సైతం జారీ చేస్తున్నారు. -
ఏపీ పీజీ సెట్ ఫలితాల విడుదల
● హిందీ విభాగంలో జిల్లా విద్యార్థినికి ప్రథమ ర్యాంక్ నెల్లూరు (టౌన్): వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ పీజీ సెట్ ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. ఈ నెల ఎనిమిది నుంచి 11 వరకు నిర్వహించిన పరీక్షకు 632 మంది హాజరయ్యారు. వీరిలో 588 మంది అర్హత సాధించారు. 93.04 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. హిందీ విభాగంలో 94 మార్కులను హితశ్రీ సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంక్లో నిలిచారు. స్టాఫ్ నర్సుల తుది మెరిట్ లిస్ట్.. గుంటూరు మెడికల్: పిడుగురాళ్ల జీజీహెచ్లో 150 కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్న వారి ఫైనల్ మెరిట్ లిస్టును విడుదల చేశామని ప్రాంతీయ వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు శోభారాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాలో క్లరికల్, టైపోగ్రాఫికల్, తప్పిదాలు ఏమైనా ఉండి అభ్యంతరాలుంటే లిఖితపూర్వకంగా శనివారం సాయంత్రం ఐదు గంటల్లోపు తెలియజేయాలని కోరారు. జాబితాను cfw. ap.nic.inలో అందుబాటులో ఉంచామని వివరించారు. డీసీపల్లిలో 286 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 286 బేళ్లను శుక్రవారం విక్రయించారని నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. వేలానికి 330 బేళ్లు రాగా, వీటిలో 286ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 39,548.4 కిలోల పొగాకును విక్రయించగా, రూ.89,30,393.10 వ్యాపారం జరిగిందని వివరించారు. గరిష్టంగా కిలోకు రూ.250.. కనిష్టంగా రూ.190.. సగటు ధర రూ.225.81గా నమోదైందని వెల్లడించారు. తొమ్మిది కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారన్నారు. రామలింగేశ్వరస్వామి సేవలో.. విడవలూరు: మండలంలోని రామతీర్థంలో కొలువైన గంగా సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసరావు తన కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం సందర్శించారు. వీరికి ఆలయాధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. జడ్జి దంపతులను శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇంధన పొదుపు బాటలో అమాత్యుడు ఆత్మకూరు: ఇక నుంచి ఫ్రైడే.. నో ట్రావెల్ డేను పాటించేలా నిర్ణయం తీసుకున్నామని, అత్యవసర ప్రయాణ పరిస్థితులు ఏర్పడితే ఎలక్ట్రిక్ వాహనాన్ని వినియోగించేలా రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నిర్ణయించారని ఆయన కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా ప్రధాని మొదలుకొని సీఎంలు ఇంధన పొదుపు చర్యలు చేపట్టిన విషయం విదితమే. అయితే మంత్రి ఆనం గత శుక్రవారం 11 వాహనాలతో ఆత్మకూరులో పర్యటించిన విషయమై ‘మేము చెబుతాం.. ఆచరించం’ అనే శీర్షికన సాక్షిలో కథనం గత శనివారం ప్రచురితమైంది. దీంతో ఆయన తన ప్రయాణ ఏర్పాట్లలో మార్పులు చేసుకున్నారు. వేడుకగా జాతర ఇందుకూరుపేట: మండలంలోని గంగపట్నంలో కొలువైన చాముండేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ధూళి జాతరను అంగరంగ వైభవంగా శుక్రవారం నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం గ్రామోత్సవాన్ని జరిపారు. మేళతాళాలు, విద్యుద్దీపాలంకరణలు, బాణసంచా సందడితో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. దేవస్థాన చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి, ఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
‘డీఎస్సీ’పై సీబీఐతో విచారణ జరపాలి
నెల్లూరు(పొగతోట): ప్రస్తుత టీడీపీ పాలనలో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్సీలో అవకతవకలు చోటుచేసుకున్న నేపథ్యంలో నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద పార్టీ విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న నేతలను ఖాకీలు అరెస్ట్ చేసి చిన్నబజార్ పోలీస్స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న కాకాణి హుటాహుటిన చేరుకున్నారు. దీంతో విద్యార్థి విభాగ నేతలను పోలీసులు వదిలేసి, త్వరగా వెళ్లిపోవాలని సూచించారు. మెగా కాదు.. దగా డీఎస్సీ మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా టీడీపీ ప్రభుత్వం మార్చేసిందని కాకాణి ఆరోపించారు. చంద్రబాబు నేతృత్వంలోని సర్కార్ అన్ని రంగాల్లో అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులను ఘోరంగా వంచించారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీని తీసుకొస్తామంటూ ఎన్నికలకు ముందు ఊరూరా తిరిగి ఆయన ప్రగల్భాలు పలికారని, అయితే లక్షలాది మందిని మోసం చేశారని ధ్వజమెత్తారు. అనేక అనుమానాలు 2025లో విడుదల చేసిన డీఎస్సీకి సంబంధించిన నియామకాల్లో అనేక అనుమానాలు, అపోహలు నిరుద్యోగుల్లో నెలకొన్నాయని తెలిపారు. డీఎస్సీ అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని, అయితే ఈ ప్రక్రియలో కలెక్టర్, జిల్లా అధికారులు ఎక్కడైనా జోక్యం చేసుకున్నారానని ప్రశ్నించారు. ఈ వ్యవహారమంతా ఓ రిమోట్ కంట్రోల్ పాలనలా సాగుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ పూర్తిగా మారిపోయాయని.. వీఆర్వో మొదలుకొని తహసీల్దార్, కలెక్టర్, చివరికి చీఫ్ సెక్రటరీ ఇలా అందరిపై మంత్రి లోకేశ్ పెత్తనమే నడుస్తోందని ఆరోపించారు. పోలీస్ శాఖలోనూ ఇదే తీరు నెలకొందని విమర్శించారు. అవమానకరంగా ప్రవర్తించారు ఈ విషయమై ప్రశ్నించేందుకు తమ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికెళ్తే, వారితో అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. సమాధానం చెప్పాల్సిన కమిషనర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అన్యాయంపై అభ్యర్థులు, నిరుద్యోగులు కోర్టులను ఆశ్రయిస్తుంటే, బెదిరింపులకు ప్రభుత్వం దిగడాన్ని దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. విద్యార్థి విభాగ నేతలు నిరసన తెలుపుతుంటే అక్రమ కేసులు పెడతామంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి వాటికి భయపడేదిలేదని తేల్చిచెప్పారు. యువత ఆధ్వర్యంలో కలెక్టరేట్ను సోమవారం ముట్టడించనున్నామని వెల్లడించారు. 2025 డీఎస్సీలో జరిగిన అన్యాయంపై అభ్యర్థుల పక్షాన నిలిచి వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని ప్రకటించారు. పార్టీ విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్రెడ్డి, రాష్ట్ర సెక్రటరీ సతీష్బాబు, నెల్లూరు నగర, సర్వేపల్లి, వెంకటగిరి, కందుకూరు, సూళ్లూరుపేట అధ్యక్షులు చంద్రారెడ్డి, జానకిరామ్రెడ్డి, మల్లికార్జున, అశోక్, తేజారెడ్డి, జిల్లా సెక్రటరీ నానీ, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు శ్రీకృష్ణ, చరణ్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న కాకాణి గోవర్ధన్రెడ్డి వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నేతల నిరసన అక్రమాలపై వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై తమ పార్టీ విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసనను తెలియజేస్తుంటే, పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఆరోపించారు. సర్కార్ అణచివేత ధోరణిని చూస్తుంటే నాటి బ్రిటిష్ పాలకుల రోజులు.. ఎమర్జెన్సీ నాటి ఘటనలు గుర్తుకొస్తున్నాయని తెలిపారు. చదువు, సంస్కారం లేని లోకేశ్కు విద్యా, మానవ వనరుల అభివృద్ధి శాఖను అప్పగించారని, సమాజంపై చంద్రబాబుకు ఎంత చులకన భావముందో దీని ద్వారా తెలుస్తోందని వివరించారు. లోకేశ్ చదివిన చదువులేంటో.. ఇతర దేశాల్లో ఆయన వెలగబెట్టిందేంటో అందరికీ తెలుసునని గుర్తుచేశారు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన కన్వీనర్ను అర్ధాంతరంగా ఎందుకు మార్చాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత మంది శాశ్వత ఉద్యోగులుండగా, వారిని పక్కనబెట్టి తాత్కాలిక సిబ్బందితో ప్రక్రియను ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. క్వశ్చన్ పేపర్ను అప్లోడ్ చేసిన తాత్కాలిక ఉద్యోగికి జిల్లాల్లో ప్రథమ స్థానం, రాష్ట్రంలో టాప్ ర్యాంక్ రావడం వెనుకన్న రహస్యమేమిటని నిలదీశారు. మెరిట్ జాబితాను ప్రకటించకుండా అభ్యర్థులకు ఉద్యోగమొచ్చిందంటూ మొదట మెసేజ్ను పంపి, ఆపై టెస్ట్ ఎస్సెమ్మెస్లని, మీకు కొలువు రాలేదని చెప్పడం మోసం కాదానని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉద్యోగులను ఏ విధంగా నియమించుకుంటారో, అదే తరహాలో ఉపాధ్యాయులను అపాయింట్ చేసినట్లు ఉందని విమర్శించారు. అంతా లొసుగులమయం మంత్రి లోకేశ్దే పెత్తనం వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో నిరసన అరెస్ట్ చేసిన పోలీసులు కాకాణి రాకతో వదిలేసిన వైనం ఒకటిన కలెక్టరేట్ ముట్టడి -
మర్యాదపూర్వకంగా..
తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని సూళ్లూరుపేట నియోజకవర్గ నేతలతో కలిసి మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. ఆలయ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు చిల్లకూరు: తీర ప్రాంతంలోని తూర్పుకనుపూరులో వెలసిన ముత్యాలమ్మ ఆలయంలో పనిచేసే సిబ్బందిపై సస్పెన్షన్ వేటేశామని ఈఓ నవీన్కుమార్ తెలిపారు. ఆలయం ప్రాంగణంలో లో గురువారం ఆయన మాట్లాడారు. ఆలయంలో డోలు వాయించే సిబ్బంది మణికంఠ విధి నిర్వహణలో కొంత కాలంగా అలసత్వం వహిస్తున్నారని, అమ్మవారి దర్శనానికి ఆదివారం వచ్చే భక్తులను టికెట్లు కొనుగోలు చేయనీయకుండా నేరుగా దర్శనానికి తీసుకెళ్తూ ఆదాయానికి గండి కొడుతున్నారని తెలిపారు. దీనిపై పలుమార్లు హెచ్చరించినా, ఎలాంటి మార్పు రాలేదన్నారు. మంగళవారం గట్టిగా ప్రశ్నించడంతో, దురుసుగా ప్రవర్తించారని వివరించారు. దీంతో అతడ్ని సస్పెండ్ చేస్తున్నట్లు పోస్ట్ ద్వారా బుధవారం సమాచారమివ్వడంతో పాటు వాట్సాప్ ద్వారా తెలియజేశామని చెప్పారు. కాగా తనను ఈఓ కులం పేరుతో తన కుటుంబసభ్యుల ఎదుట దూషించారంటూ చిల్లకూరు పోలీసులకు మణికంఠ ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆలయ కమిటీ ఏర్పాటయ్యాక ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. లభించని మత్స్యకారుల ఆచూకీ ● విస్తృతంగా గాలింపు చర్యలు బిట్రగుంట: బోగోలు మండలం అలిచెర్లబంగారుపాళెంలో సముద్రంలో చేపల వేటకెళ్లి గల్లంతైన అన్నదమ్ములు గణేష్, రాజా ఆచూకీ గురువారం సాయంత్రానికీ లభ్యం కాలేదు. అలిచెర్లబంగారుపాళేనికి చెందిన తూపిలి బాలమురళి (51), కుమారి గోవిందు (42), సోదరులైన తులసింగారి రాజు, గణేష్ రెండు చెక్క తెప్పలపై వేటకు బుధవారం వేకువజామున వెళ్లి ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. వేకువజామున నాలుగు గంటల ప్రాంతంలో వచ్చిన పెనుగాలులకు పడవ తిరగబడి బాలమురళి, గోవిందు మృతి చెందగా, తులసింగారి రాజు, గణేష్ ఆచూకీ లభ్యం కాలేదు. వీరి కోసం గాలింపు చర్యలను మైరెన్ పోలీసులు, స్థానిక మత్స్యకారులు బుధవారం ఉదయం నుంచే విస్తృతంగా చేపట్టారు. మరో పది ఫైబర్ బోట్లతో గాలింపు చర్యలను గురువారం చేపట్టినా, ఫలితం లేకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. గల్లంతైన రాజు, గణేష్ క్షేమంగా తిరిగి రావాలని తీరమంతా కడలికి కన్నీటితో మొక్కుతోంది. కాగా బాలమురళి, గోవిందు మృతదేహాలకు కావలి ఏరియా ఆస్పత్రిలో పోస్ట్మార్టం పూర్తయిన అనంతరం గ్రామంలో అంత్యక్రియలను నిర్వహించారు. మృతుల కుటుంబాలను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని, సీఎం ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున పరిహారాన్ని అందించి ఆదుకుంటామని తెలిపా రు. గల్లంతైన వారి ఆచూకీ కోసం అదనపు బల గాలను సిద్ధం చేయనున్నామని వివరించారు. విషాద తీరం బోగోలు మండలంలోని తీర ప్రాంత గ్రామాలు విషాదఛాయల్లోనే ఉన్నాయి. సముద్రంలో ఆటుపోట్లు, తుఫాన్ల సమయంలోనూ వేటకెళ్లి క్షేమంగా తిరిగొచ్చిన మత్స్యకారులు ఊహించని రీతిలో పెనుగాలులకు బలైపోవడం ప్రతి ఒక్కర్నీ కలిచివేస్తోంది. సముద్రంలో అలల ఉధృతి, గాలి వేగాన్ని బట్టి వేటకెళ్లాలా.. వద్దా అని నిమిషంలో నిర్ణయించుకునే నేర్పు ఇక్కడి మత్స్యకారుల సొంతం. అలాంటిది ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో వేటకెళ్లడం, గంటలోనే అంతా తారుమారు కావడాన్ని ఇక్కడి వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కంటికి రెప్పలా కాపాడే కడలే తమ జీవితాల్లో కన్నీటిని నింపిందని మృతుల కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి. రాజు, గణేష్ కుటుంబాలు ఏ క్షణంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనని కుమిలిపోతున్నాయి. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ కృష్ణ తేజ అతిథిగృహం వద్దకు చేరుకుంది. స్వామివారిని 87,691 మంది బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 49,958 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.99 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభి స్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది.ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
నేతన్నకు బాబు వెన్నుపోటు
●చేనేతలను ఆదుకోవాలి చేనేత కార్మికులను ఆదుకోవాలి. వేసవి కాలంలో వారు మగ్గం నేసేందుకు అవకాశం లేదు. గత ప్రభుత్వంలో నేతన్న నేస్తం ద్వారా కార్మిక కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలి. ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయినా పట్టించుకోవడం లేదు. చేనేతల కార్పొరేషన్లను పెంపొందించి నిధులను విడుదల చేయాలి. – కోనం చినబ్రహ్మయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి పింఛన్లు మంజూరు చేయడం లేదు నేతన్న నేస్తం కింద ప్రస్తుత ప్రభుత్వం చేనేతలను ఆదుకోవాలి. చంద్రబాబు ఎన్నికల హామీల్లో భాగంగా ఏడాదికి రూ.25 వేలు అందజేస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు పథకాన్ని అమలు చేయలేదు. రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు. కొత్తగా పింఛన్లను కూడా మంజూరు చేయడం లేదు. – పముజుల శంకరయ్య, చేనేత ఐక్యవేదిక నాయకుడు, పొదలకూరు పొదలకూరు: చేనేత కార్మికుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఆ కుటుంబాలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంతోనే సరిపెడుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావొస్తున్నా గత ప్రభుత్వంలో అమలు చేసిన నేతన్న నేస్తం పథకాన్ని తిరిగి ప్రారంభించలేదని వారు విమర్శిస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు కార్మికులను ఆదుకునేందుకు ఏడాదికి రూ.25 వేలు అందజేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని మండిపడుతున్నారు. అలాగే 50 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకున్న వారికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో 17 కులాలకు చెందిన వేలాది మంది చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే వారి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కేవలం రెండు కార్పొరేషన్లను మాత్రమే ఏర్పాటు చేసిందని నాయకులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి పదవులను చేనేత వర్గాలకు కట్టబెట్టినట్లు గుర్తుచేస్తున్నారు. సాయం కోసం.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 80 వేల మగ్గాలు ఉండగా.. ఒక్క నెల్లూరు జిల్లాలోనే దాదాపు 3 వేలు ఉన్నాయి. పనుల్లేని సమయంలో కార్మికులను ఆదుకునేందుకు గత ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం కింద ఐదేళ్లపాటు ప్రతి ఏడాది రూ.24 వేలు చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. కరోనా కష్టకాలంలో కూడా జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఒకే ఏడాదిలో రెండుసార్లు ఆ పథకాన్ని అమలు చేసి చేనేత కుటుంబాలకు ఉపశమనం కల్పించింది. ఈ లెక్కన ఐదేళ్లలో అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి సుమారు రూ.1.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందింది. గతంలో నాలుగు కార్పొరేషన్లు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేనేత వర్గాలకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి పద్మశాలి, తొగట, దేవాంగ, కుర్మి కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన చేనేత వర్గాల నాయకులకు కూడా కార్పొరేషన్ డైరెక్టర్ పదవులిచ్చి రాజకీయంగా గుర్తింపు కల్పించిచారు. దీంతో గ్రామీణ స్థాయిలో చేనేత సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం లభించింది. అయితే కూటమి ప్రభుత్వం కేవలం దేవాంగ, పద్మశాలి కార్పొరేషన్లను మాత్రమే ఏర్పాటు చేసింది. కుర్మి కార్పొరేషన్కు డిమాండ్ పెరగడంతో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కాగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటి ద్వారా కార్మికులకు ఉపయోగపడే పథకాలు అమలు చేసిన దాఖలాల్లేవు. ప్రభుత్వం ఇప్పటికై నా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కార్మికులు కోరుతున్నారు. రెండేళ్లుగా నేతన్న నేస్తం పథకం ఎగనామం గతంలో ఏడాదికి రూ.24 వేలు బ్యాంక్ ఖాతాల్లో జమ కరోనా కష్టకాలంలోనూ అండగా నిలిచిన జగన్ ప్రభుత్వం ఉచిత విద్యుత్తో సరిపెడుతున్న కూటమి సర్కారు కార్పొరేషన్ల ఏర్పాటులోనూ వెనుకబాటుతనం సాయం కోసం ఎదురుచూస్తున్న చేనేత కార్మికులునేడు ఇదీ పరిస్థితి అయితే ప్రస్తుతం చేనేత కార్మికులకు ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదని వారు చెబుతున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబు గత ప్రభుత్వానికి మించిన స్థాయిలో చేనేతలకు ఏడాదికి రూ.25 వేలు అందజేస్తామని, 50 ఏళ్ల వయస్సు నిండిన నేత కార్మికులకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రాజకీయ, సామాజిక పరంగా చేనేత వర్గాలను బలోపేతం చేసేందుకు 17 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శిస్తున్నారు. గత ఏప్రిల్ నెలలో ప్రకటించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తప్ప మిగిలిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదు. -
దమ్ముంటే టచ్ చేసి చూడండి
● జనసేన నేతలకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి సవాల్ కావలి: మార్ఫింగ్ ఆడియో రికార్డింగ్లను వాట్సాప్ గ్రూపుల్లో వ్యాప్తి చేయడంతో పాటు తన ఇంటిని ముట్టడిస్తామంటూ జనసేన నేతలు రెండు రోజులుగా హల్చల్ చేస్తున్నారని, దమ్ముంటే తనను టచ్ చేసి చూడండంటూ ఆ పార్టీ నేతలకు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి సవాల్ విసిరారు. వీరి తీరుపై కావలి డీఎస్పీ రమణకుమార్కు గురువారం ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. జనసేనకు చెందిన చోటా నేతలు ఉద్దేశపూర్వకంగా ఫేక్ ఆడియోలను సృష్టించి తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు తమ పార్టీ నేతలు ఫిర్యాదు చేసినా, ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. అసత్య ప్రచా రాలకు పాల్పడుతున్న వారి పేర్లతో సహా డీఎస్పీకి అందజేసినా చర్యలు చేపట్టకపోవడమేమిటని ప్రశ్నించారు. తన ఇంటిని ముట్టడిస్తామంటూ ఆ పార్టీ నేత లు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని, ఇలాంటి వాటికి తాను భయపడేదిలేదని తేల్చిచెప్పారు. ప్రజల ఆశీస్సులతో తాను ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందానని, వారు తన వెంటే ఉన్నారన్నారు. దమ్ము.. ధైర్యముంటే తేదీ, సమయాన్ని ప్రకటించాలని.. ఎక్కడ్నుంచి వస్తారో రండి.. కార్యకర్తలతో కలిసి తానొస్తానని తెలిపారు. తాను చిరంజీవి, పవన్ కల్యాణ్ను దూషించానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటానని, అలా కాని పక్షంలో మీరేమి చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఇలాంటి ఫేక్ ఆడియో రికార్డింగ్లను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేసే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. జనసేనలోని కొందరు నేతలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ నోటికి ఏదొస్తే ఆది మాట్లాడుతున్నారని, అదుపులో ఉండాలని హితవు పలికారు. అసత్య ప్రచారాలు చేస్తూ.. రాజకీయంగా లబ్ధి పొందాలని చూసే కుహా నా నేతలకు తగిన బుద్ధి చెప్తానని స్పష్టం చేశారు. ఎన్నికలెప్పుడొచ్చినా టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీ పట్టణాధ్యక్షుడు శివకుమార్రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ వెంకటనారాయణ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కామరాజు, జిల్లా కార్యదర్శి ప్రసన్నాంజనేయులు, ప్రసాద్రెడ్డి, శ్రీనివాసులు, రాఘవులు, బీసీ భవన్ అధ్యక్షుడు వెంకటరావు, రాజశేఖర్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
నేడు కొమ్మిపాడుకు కలెక్టర్ రాక
సైదాపురం: మండలంలోని కొమ్మిపాడు గ్రామంలో శుక్రవారం జరిగే పల్లె వీక్షణం కార్యక్రమానికి కలెక్టర్ హిమాన్షు శుక్లా వస్తారని ఎంపీడీఓ ఎంవీ రామ్మోహన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి హామీ పథకం పనులతోపాటు చెత్త నుంచి సంపద తయారీ, అంగన్వాడీ కేంద్రం, ఆరోగ్య కేంద్రం, రైతు సేవా కేంద్రం, స్వర్ణగ్రామ కార్యాలయాల పనితీరును పర్యవేక్షిస్తారన్నారు. స్వయం సహాయక సంఘాలు, ఛాంపియన్ రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారన్నారు. అనంతరం మండల స్థాయిలో పదో తరగతి పరీక్షల్లో టాప్ త్రీ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సత్కరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రైతు విభాగ సంయుక్త కార్యదర్శిగా సుంకరనెల్లూరురూరల్: వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కావలి నియోజకవర్గానికి చెందిన సుంకర వెంకట దయాకర్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. వైద్యం అందక వ్యక్తి మృతి ● నర్రవాడ వైద్య సిబ్బంది నిర్లక్ష్యమని బంధువుల ఆరోపణ దుత్తలూరు: మండలంలోని నర్రవాడకు చెందిన రసూల్ (55) అనే వ్యక్తి వైద్య చికిత్స అందక మృతిచెందాడు. ఈ ఘటనలో స్థానిక పీహెచ్సీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం మేరకు.. రసూల్ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ నెల్లూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంటి బాత్రూంలో పడి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే అతడిని కారులో నర్రవాడ పీహెచ్సీకి తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది సరైన సమయంలో స్పందించలేదని, పట్టించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో వారు అతడిని వెంటనే దుత్తలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అప్పటికే రసూల్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు. సకాలంలో చికిత్స అందించి ఉంటే రసూల్ బతికే అవకాశం ఉండేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్రవాడ పీహెచ్సీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపిస్తున్నారు. కాగా ఈ ఘటనపై వైద్యాధికారులు, సిబ్బంది స్పందించారు. ఆ సమయంలో రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స అందిస్తున్నామన్నారు. రసూల్ను ఆస్పత్రిలోకి తీసుకురాకుండా రోడ్డుపైనే ఉంచి బీపీ చెక్ చేయాలని మాత్రమే చెప్పారని, అదే సమయంలో అత్యవసర రోగుల చికిత్సలో తాము ఉన్నామని వివరించారు. ఐదు నిమిషాల్లో బీపీ చెక్ చేస్తామని చెప్పినా వారు వినిపించుకోకుండా వెళ్లిపోయారని సిబ్బంది పేర్కొన్నారు. ఈ ఘటనలో తమ తప్పు లేదని వైద్యశాల సిబ్బంది అంటున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం వైద్య నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. జామాయిల్ తోటల దగ్ధం ● భారీగా ఆస్తి నష్టం పొదలకూరు: మండలంలోని నావూరు గ్రామంలో ముగ్గురు రైతులకు చెందిన సుమారు 75 ఎకరాల కోతకు వచ్చిన జామాయిల్ తోటలు గురువారం దగ్ధమయ్యాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు బాధిత రైతులు వెల్లడించారు. గ్రామానికి చెందిన బొడ్డు నరసింహులు 50 ఎకరాలు, మక్కిన వెంకటేశ్వర్లు 15 ఎకరాలు, రామ్మోహన్ 10 ఎకరాల తోటలు తగులబడ్డాయి, గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారా?, లేక ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుందా? తెలియడం లేదంటున్నారు. సుమారు రూ.కోటి వరకు నష్టం వాటిల్లినట్టుగా బాధితులు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న పొదలకూరు అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. జామాయిల్ తోటలు తగులబడటంపై తమకు అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రైతు నరసింహులు వెల్లడించారు. కండలేరులో 39.430 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో గురువారం 39.430 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగకాలువకు 1,900, లోలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 15, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.90 సన్నవి : రూ.50 పండ్లు : రూ.20 -
సాగుపై ఎల్నినో పడగ
నెల్లూరు(వేదాయపాళెం): ఈ ఏడాది ఖరీఫ్ సాగు ఆరంభంలోనే అన్నదాతకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ప్రకృతి విపత్తులు, పెరుగుతున్న సాగు ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సబ్సిడీ ఎరువులు, సాగునీరు సకాలంలో అందక మరింత ఆందోళన నెలకొంది. దీనికితోడు ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని వారు అంచనా వేస్తున్నారు. వాతావరణ నిపుణులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ రైతులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదని జిల్లాకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఇబ్బందులు అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో సుమారు 3.75 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు అవుతోంది. అదనంగా మరో 2 లక్షల ఎకరాల్లో ప్రధానంగా వరి, వేరుశనగ, మిరప పంటలను రైతులు సాగు చేస్తున్నారు. అయితే పలు ఆయకట్టు గ్రామాలకు ఇప్పటికీ సాగునీరు అందడం లేదు. జిల్లా కేంద్రానికి సమీపంలోని అనేక మండలాల్లో అన్నదాతలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగునీరు విడుదల చేయాలని కోరుతూ జలవనరుల శాఖ కార్యాలయాల చుట్టూ రైతులు తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఎరువుల సరఫరా అంతంతమాత్రమే కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరిగిన సమయంలో రైతులకు సబ్సిడీ యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ప్రతి ఎకరాకు 200 నుంచి 250 కిలోల వరకు యూరియా అవసరం ఉండగా, ప్రస్తుతం కేవలం 120 కిలోల వరకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపు కొంటున్నారని విమర్శలున్నాయి. దీంతో మిగతా అవసరమైన యూరియాను ప్రైవేట్ దుకాణాల్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దుకాణదారులు సూచించిన బ్రాండ్లనే వారు చెప్పిన ధరలకు కొనక తప్పడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పంటలకు ముప్పు ఈ ఏడాది ఖరీఫ్ సాగుపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఎండ వేడిమి, వడగాలుల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు. పంటలకు ‘బెట్ట’ తగిలి దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎల్నినో తీవ్రతకు తోడు గాలులు ఎక్కువైతే పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం కూడా ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకృతి ప్రతికూల పరిస్థితులు, ఎరువుల కొరత, సాగునీటి సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అనేక ఆటుపోట్ల మధ్య రైతులు ఈ ఖరీఫ్లో ఎదురీత వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఖరీఫ్పై తీవ్ర ప్రభావం దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఆదుకునేందుకు ప్రభుత్వ సహకారం శూన్యంపంటలను సంరక్షించుకోవాలి ఈ ఏడాది ఖరీఫ్లో రైతులు తగిన జాగ్రత్తలు పాటించి పంటలను సంరక్షించుకోవాలి. ఎల్నినో ప్రభావం ఖచ్చితంగా ఖరీఫ్పై ఉంటుంది. అందువల్ల చిన్నపాటి మెళకువలతో పంటలను సంరక్షించుకుంటూ అధిక దిగుబడులు సాధించేందుకు కృషిచేయాలి. బెట్ట తట్టుకునేందుకు పొటాషియం నైట్రేట్ను వినియోగించాలి. ఎండ సమయంలో కాకుండా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో సాగునీరు అందించాలి. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింకర్ల ద్వారా నీటిని వినియోగిస్తే వేసవిలో నేల పొడిబారి పోకుండా పంటలను కాపాడుకోవచ్చు. – యు.వినీత, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం, నెల్లూరు -
అవినీతి ఉపాధి
● వెంకటగిరి నియోజకవర్గంలో వెలుగుచూస్తున్న అక్రమాలు ● వెంకటరామరాజుపేటలో సీనియర్ మేట్లదే పెత్తనం ● సిబ్బంది చేతివాటం కలువాయి(సైదాపురం):వెంకటగిరి నియోజకవర్గంలో ఉపాధి పథకం అవినీతిమయంగా మారింది. కలువాయి మండలంలో అర్హత కలిగిన నిరుపేద కూలీలు కాకుండా ప్రస్తుతం పనిచేస్తున్న సీనియర్, జూనియర్ మేట్ల పెత్తనమే సాగుతోంది. తమ కుటుంబసభ్యుల పేర్లపై సెపరేటుగా ఫేస్ అటెండెన్స్ తీసుకొని బినామీ మస్తర్లేసి నిధులను దిగమింగుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మండలంలోని చింతలపాళెం పంచాయతీ మజరా గ్రామ మైన వెంకటరామరాజుపేటలో సీనియర్ మేట్గా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి తన కుటుంబసభ్యులు, బంధువులకు మస్తర్లేసి పనిచేసిన విధంగా చూపిస్తున్నారని ఉపాధి కూలీలు ఆరోపిస్తున్నారు. సదరు మేట్ కుమారుడు బీటెక్ చదువుకుంటున్నా, మస్తర్లో పేర్లు నమోదు చేయడం గమనార్హం. గతంలో నాటిన మొక్కలకు నేడు బిల్లులు నిమ్మ, మామిడి తోటల అభివృద్ధిలో భాగంగా ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు నాటేందుకు గుంతలు తీసిన నాటి నుంచి మూడేళ్ల పాటు వాటి సంరక్షణకు నిధులను రైతులకు మంజూరు చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని చేతివాటాన్ని ఉపాధి సిబ్బంది ప్రదర్శించారు. వెంకటరామరాజుపేటకు చెందిన జాబ్కా ర్డు 20087 పొట్టపల్లి చెంచయ్య వర్క్ ఐడీ 02090220010 – ఐఎఫ్ – జీఐఎస్ – 1078645, మరో జాబ్కార్డు నంబర్ 20085 పొట్టపల్లి యానాద య్య వర్క్ ఐడీ 02090220010 – ఐఎఫ్ – జీఐఎస్ – 1078652కు మూడేళ్ల క్రితం నాటిన నిమ్మ మొక్కలకు ఈ ఏడాది నాటిన తరహాలో చూపి బిల్లులు మంజూరు చేశారు. రోజా మొక్కలకూ.. కలువాయి మండలంలో రోజా మొక్కలు నాటిన వారికి సైతం బిల్లులు పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వెంకటరామరాజుపేటలో విరివిరు చిన్నమ్మ జాబ్కార్డు నంబర్ 20126 ఫోర్లికల్చర్ పేరిట వర్క్ ఐడీ నంబర్ 0209022010 – ఐఎఫ్ – 19187012063272కు రోజా మొక్కలు నాటినట్లు చూపి మెటీరియల్ పేమెంట్ కింద గత ఫిబ్రవరి తొమ్మిదిన రూ.60 వేలను కలువాయి ఎమ్సీసీలో నమోదు చేశారు. అసలు రోజా మొక్కలను నాటకుండానే బిల్లులను దిగమింగారు. భయమేదీ..? కలువాయి మండలంలో గతంలో పనిచేసిన ఇద్దరు టీఏలు, ఈసీ, కంప్యూటర్ ఆపరేటర్లు అవినీతికి పాల్పడి టెర్మినేటయ్యారు. వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది ఏ మాత్రం భయపడకుండా ఆడిట్ అధికారులను సైతం మేనేజ్ చేస్తూ అవినీతికి అందలమేస్తున్నారు. -
అధైర్యపడొద్దు.. అందుబాటులో ఉంటా
● కూటమి పాలనలో అన్ని వర్గాలకూ కష్టాలే ● జగన్ పాలనను కోరుకుంటున్న ప్రజలు ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దనీ.. ఎలాంటి సమస్యలొచ్చినా తాను అందుబాటులో ఉంటాననీ.. అభివృద్ధి అంటూ జరిగిందంటే అది తమ ప్రభుత్వ హయాంలోనేనని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు పట్టణం, పొడమేకలకండ్రిక గ్రామంలో గురువారం పర్యటించిన ఆయన్ను గ్రామస్తులు కలిశారు. కూటమి ప్రభుత్వంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జగన్మోహన్రెడ్డి పాలన తిరిగి రావాలని కాకాణితో పేర్కొన్నారు. బక్రీద్ను పురస్కరించుకొని ముస్లింలకు శుభాకాంక్షలను తెలియజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కూటమి పాలనపై ప్రజలకున్న భ్రమలు తొలగిపోయాయని.. డ్రామాలతో చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. మహానాడుకు పట్టుమని పది మంది సైతం హాజరుకాలేదని.. సమావేశాలు వెలవెలబోయాయని ఎద్దేవా చేశారు. కూటమి నేతలు పెత్తందారులుగా వ్యవహరిస్తున్నారని, ప్రజలకు మేలు చేసే ఉద్దేశం వారికి లేదని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ, కనీస వసతులను కూడా కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. సీఎంగా జగన్మోహన్రెడ్డి ఉన్న సమయంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారని గుర్తుచేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యేగా, మంత్రిగా తానున్న సమయంలో జగన్మోహన్రెడ్డి అండదండలతో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టించిన అంశాన్ని ప్రస్తావించారు. ప్రజలకు భూ సమస్యల్లేకుండా చిత్తశుద్ధితో యత్నించామని, అధికార పార్టీ వారు ఇప్పుడు ఎన్ని రకాల ఆరోపణలు చేసినా.. ప్రజలకు ఎవరు మేలు చేశారో అర్థమవుతోందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు సాగునీటిని ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అందించామని, అయితే ప్రస్తుతం కాలువల రిపేర్ల పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. కూటమి పాలనపై విసిగిపోయిన ప్రజలు కూటమి ప్రభుత్వం కొలువుదీరాక పక్కా గృహాల నిర్మాణాలను నిలిపేసిందని, ప్రస్తుత సర్కార్పై ప్రజలు విసిగిపోయారని తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు తమ హయాంలో నివేశన స్థలంతో పాటు పక్కా గృహాలను మంజూరు చేశామని తెలిపారు. అధికారమున్నా.. లేకపోయినా ప్రజలతోనే ఉంటామన్నారు. పొదలకూరులో ఇటీవల మృతి చెందిన పార్టీ నేత పడ్డాల వేమయ్య, పొడమేకలకండ్రికలో మృతి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు రమణయ్య చిత్రపటాలకు నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. వాకాటి శ్రీనివాసులురెడ్డి, కేతు రామిరెడ్డి, వేణుగోపాల్రెడ్డి, అంజద్, ఖాదర్, కండే వాసు, వాకాటి శివారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, వెంకటేశ్వర్లుగౌడ్, శ్రీనివాసులు, కోడూ రు మస్తాన్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి మత్తులో యువకుడి వీరంగం
● వ్యక్తిపై బీరు బాటిల్తో దాడి ఆత్మకూరు: మున్సిపల్ పరిధిలోని ఏసీఎస్ఆర్ కాలనీలో గురువారం సాయంత్రం గంజాయి మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. దుకాణం వద్ద నిలబడి ఉన్న వ్యక్తిపై బీరు బాటిల్తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఏసీఎస్ఆర్ కాలనీకి చెందిన కరిముల్లా చిల్లర దుకాణానికి వెళ్లాడు. అదే ప్రాంతానికి చెందిన సుమంత్ అనే యువకుడు గంజాయి మత్తులో కాస్త దూరంలో ఉన్నాడు. అప్పటికే అతడు పలువురిని భయభ్రాంతులకు గురిచేస్తూ దాడికి యత్నిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వారించేందుకు ప్రయత్నించిన వారిపై దాడికి పాల్పడేందుకు వస్తుండటంతో పలువురు పారిపోయారు. ఈ క్రమంలో కరిముల్లా దుకాణం వద్ద నిలబడి ఉండగా, సుమంత్ ఖాళీ బీరు బాటిల్తో అతడి తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి కరిముల్లాను సమీప ఆస్పత్రికి తరలించారు. మరోవైపు దాడి చేసిన యువకుడు మత్తులోనే అక్కడ్నుంచి నడుచుకుంటూ వెళ్లాడు. సమాచారం అందుకున్న ఆత్మకూరు ఎస్సై జంపనీ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని సుమంత్ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఏసీఎస్ఆర్ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. గంజాయి మత్తులో యువకుల ప్రవర్తనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.దాడికి పాల్పడిన సుమంత్గాయపడిన కరిముల్లా -
తప్పిన పెను ప్రమాదం
● స్వల్పగాయాలతో బయటపడిన టూరిస్టులు ● బాధితులకు ఆర్డీఓ, రూరల్ ఎమ్మెల్యే పరామర్శ బస్సును పరిశీలిస్తున్న ట్రాఫిక్ పోలీసులుఆస్పత్రి బయట ఉన్న టూరిస్టులునెల్లూరు(క్రైమ్): వారంతా బంధువులు. ఏటా వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలోని వేళాంగణి మాతను దర్శించేందుకు వెళ్తుంటారు. ఈసారి పది కుటుంబాలు కలిసి ఏలూరుకు చెందిన టూరిస్టు బస్సులో వేళాంగణి మాత దర్శనం కోసం వెళ్తుండగా డ్రైవర్ నిద్రమత్తులో రైలింగ్ను ఢీకొట్టాడు. దీంతో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 16 మందికి గాయాలు కాగా మిగిలిన అందరూ సురక్షితంగా బయటపడ్డారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. ఏలూరు మండలం ప్రతికోలంక గ్రామానికి చెందిన బి.సాయిసోమేశ్వరరావుకు పెద్దపాడు మండలం గుడిపాడులో బంధువులున్నారు. వారందరూ ప్రతి సంవత్సరం వేసవిలో వేళాంగణిమాతను దర్శించుకునేవారు. ఎప్పటిలాగే ఈసారి పది కుటుంబాలు ఏలూరుకు చెందిన టూరిస్టు బస్సులో బుధవారం సాయంత్రం బయలుదేరారు. డ్రైవర్ అప్పారావు ఒంగోలు వరకు బస్సును నడిపారు. అక్కడ్నుంచి కో డ్రైవర్ దుర్గా బస్సును నడపసాగాడు. గురువారం తెల్లవారుజామున చింతారెడ్డిపాళెం క్రాస్రోడ్డు (మెడికవర్ హాస్పిటల్ దాటగానే) సమీపంలో డ్రైవర్ నిద్రమత్తులో జాతీయ రహదారి వెంబడి ఉన్న రైలింగ్ను ఢీకొన్నాడు. బస్సును అదుపు చేయలేకపోవడంతో రోడ్డుపక్కన మార్జిన్లో బోల్తాపడింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్దశద్దం వచ్చింది. టూరిస్టులు పెద్దగా కేకలు వేశారు. స్పందించిన పోలీసులు కొద్దిదూరంలో విధుల్లో ఉన్న ఎస్సై విజయకుమార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రాత్రి గస్తీ విధుల్లో ఉన్న నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ వేణు, బాలాజీనగర్, నెల్లూరు నార్త్, సౌత్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సాంబశివరావు, రామకృష్ణ, వెంకటరెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు అధికారులు, బస్సులోని యువకులు అద్దాలను పగులగొట్టి అందులోని వారిని బయటకు తీసుకొచ్చారు. 16 మందికి గాయాలు కాగా డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారందరూ సురక్షితంగా ఉన్నారు. క్షతగాత్రుల్లో సాయి సోమేశ్వరరావు, రాజ్ప్రకాష్, విద్యాచరణ్, ప్రవీణ్పాల్, ధర్మావతి, నాగమణి, శ్రీలత, గీతిక, దివ్య, ఆనంది, మురళీమోహన్, శ్రావణి, లక్ష్మి, పావనీని మెడికవర్ హాస్పిటల్కు తరలించారు. డ్రైవర్ అప్పారావు, దుర్గా, వంట మనుషులు సూరిబాబు, నరసమ్మను 108లో జీజీహెచ్కు తీసుకెళ్లారు. హాస్పిటల్లో క్షతగాత్రులు, టూరిస్టులను నెల్లూరు ఆర్డీఓ అనూష, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పరామర్శించారు. కేసు నమోదు బోల్తాపడిన బస్సును క్రేన్ల సాయంతో అక్కడ్నుంచి తీసుకెళ్లారు. సాయిసోమేశ్వరరావు ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ దుర్గాపై నార్త్ ట్రాఫిక్ ఎస్సై సైదులు కేసు నమోదు చేశారు. అతను మద్యం తాగాడా అన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. టూరిస్టులను ప్రత్యేక వాహనంలో స్వగ్రామాలకు తరలించేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. -
లేబూరు గ్రామంలో కలకలం
● చిన్నారి అపహరణ యత్నమంటూ ఆరోపణలు ● అప్రమత్తమైన గ్రామస్తులు ● అనుమానిత మహిళల పట్టివేత ● చిన్నారుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళనఇందుకూరుపేట: మండలంలోని లేబూరులో గురువారం ఆటోలో సంచరిస్తున్న నలుగురు మహిళలు చిన్నారులను అపహరించేందుకు ప్రయత్నించినట్లు ప్రచారం జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు అనుమానితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికుల కథనం మేరకు.. ఉదయం వేళ ఆటోలో నలుగురు మహిళలు వచ్చి వీధుల్లో తిరగసాగారు. ఇసుకలో ఓ పిల్లాడు ఆడుకుంటుండగా పిలిచారు. అతను అరుస్తూ ఇంట్లోకి వెళ్లి చెప్పగా తల్లి వచ్చి వారిని ప్రశ్నించింది. అయితే మహిళలు పొంతన లేని సమాధానమిచ్చారు. విషయం తెలుసుకున్న యువకులు, పెద్దలు వెంటనే అక్కడికి చేరుకుని మహిళలను అడ్డగించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మహిళలను స్టేషన్కు తరలించి విచారణ చేశారు. దార్ల శ్రీదేవి, దార్ల తిరపతమ్మ, దార్ల జయమ్మ, దార్ల లక్ష్మిగా గుర్తించినట్లు సమాచారం. వీరిలో శ్రీదేవి, తిరపతమ్మపై గతంలోనే ఇందుకూరుపేట పోలీస్స్టేషన్లో కేసులు నమోదై ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. స్థానికుల్లో భయం స్థానికుల ఆరోపణల ప్రకారం ఇదే ముఠా గతంలో కూడా చిత్తుకాగితాలు ఏరుకునే గిరిజనులను అపహరించేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అప్పట్లో గ్రామస్తుల అప్రమత్తతతో ఆ యత్నం విఫలమైనట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారుల భద్రతపై తల్లిదండ్రుల్లో భయం నెలకొంది. లేబూరులో ఈ ఘటన తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల విచారణ కొనసాగుతోంది ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. మహిళలు నిజంగా చిన్నారుల అపహరణకు యత్ని ంచారా లేదా ఇతర కారణాలతో గ్రామంలో తిరిగారా అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. వారి గత చరిత్రతోపాటు ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసుల వివరాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
వేళాంగణి మాతే రక్షించింది
రెండేళ్లుగా వేసవి సెలవుల్లో అందరం వేళాంగణి మాతను దర్శించుకుంటున్నాం. ఈ ఏడాది పది కుటుంబాలం బస్సులో బయలుదేరాం. గురువారం తెల్లవారుజామున అందరం నిద్రమత్తులో ఉండగా ఒక్కసారిగా పెద్దశబ్దం వచ్చింది. ఏం జరిగిందోనని నిద్రమత్తు నుంచి తేరుకుని చూడగా బస్సు బోల్తా పడి ఉంది. ఒకరిపై ఒకరు పడి ఉన్నారు. వెంటనే యువకులు, అక్కడికి వచ్చిన పోలీసు అధికారులు బస్సు అద్దాలను పగులగొట్టి మమ్మల్ని బయటకు తీసుకొచ్చారు. మాలోని వారికి స్వల్పగాయాలయ్యాయి. పెనుప్రమాదం తప్పింది. వేళాంగణిమాతే మమ్మల్ని రక్షించింది. అమ్మ దయవల్లే మేమందరం సురక్షితంగా ఉన్నాం. – మేరీలత -
నాకు కోపం వస్తే.. ఎవరికైనా చెంప పగులుద్ది
కావలి టీడీపీ ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి నియంత పాలనకు తెర తీశాడు. ఈ మాట సాక్షాత్తు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు బహిరంగ సభలోనే అంటూ ఎమ్మెల్యే తీరును ఆక్షేపించారు. కాలం కలిసొచ్చి శాసన సభ్యుడైన ఆయన పాలన గాలికి వదిలేశారు. సొంత రాజ్యాంగంతో కక్షల రాజకీయం నెరుపుతూ తరచూ వివాదాస్పదమవుతున్నారు. జర్నలిస్టుల నుంచి.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలనే కాకుండా తన గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పోరాడిన సొంత పార్టీ నేతలపైనే కేసులు కట్టించి వేధించిన చరిత్రను మూటగట్టుకున్నారు. తాజాగా తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించమని గట్టిగా అడగడమే నేరంగా సొంత పార్టీ కార్యకర్త చెంప పగులగొట్టారు.సాక్షి నెల్లూరు: రాజకీయాలకు, శాసనసభలకు వన్నె తెచ్చిన ఎందరో ఉద్దండ పాలకులు ఏలిన కావలిలో ప్రస్తుతం డిక్టేటర్ పాలన సాగుతోంది. ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి) వ్యవహార శైలి తరచూ వివాదాస్పదమవుతోంది. సామాన్య కుటుంబ స్థాయి నుంచి రూ.వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న ఆయన మండల స్థాయి నేతగా ఉంటూ గత ఎన్నికల సమయంలో డబ్బు సంచులతో టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. అడ్డదారిలో అధికారం దక్కడంతో కన్ను మిన్ను కానక అరాచక పాలనకు తెర తీశారు. ఆయన మాటే శాననంగా సాగించే క్రమంలో నిరంకుశత్వ ధోరణితో వ్యవహరిస్తూ చెలరేగిపోతున్నారు. అక్రమ కేసులు, అరెస్ట్లే పాలనగా.. ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి రెండేళ్లుగా పాలన గాలికి వదిలేసిన.. అక్రమ కేసులు, అరెస్ట్లు, విధ్వంసాలు, అరాచకాలే ప్రామాణికంగా సాగుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రావెల్, మట్టి తవ్వకాల్లో మునిగిపోయారు. ఆయన అక్రమాలను ప్రశ్నించిన నలుగురు జర్నలిస్టులతోపాటు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే, ముఖ్యనేతలపై విధ్వంసం కేసును మోపారు. జర్నలిస్టులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టించి తన నియంతృత్వాన్ని ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులతో దౌర్జన్య కాండను సృష్టించారు. రుద్రకోట వద్ద గ్రావెల్ అక్రమ తవ్వకాలను వీడియోలు, ఫొటోలు తీసేందుకు ప్రయత్నించిన జర్నలిస్టులను ఆయన మనుషులు ఓ ఇంట్లో నిర్బంధించి కొట్టి బెదిరించే స్థాయికి వెళ్లారు. ఎమ్మెల్యే పాలనా వైఫల్యాలపై ప్రశ్నిస్తూ సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేసిన జర్నలిస్టులపైనా కేసులు కట్టించారు. వైఎస్సార్సీపీ నేతలపైన అయితే లెక్కలేనన్ని కేసులు పెట్టించారు. బోగోలు మండలం కోళ్లదిన్నెకు చెందిన వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ నేతలు దాడులు చేస్తే వారిపై కేసులు కట్టకుండా బాధితులపైనే కేసు నమోదు చేయించారు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే.. ఏకంగా ఆస్పత్రిలోకి వెళ్లి మరోసారి టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. అయినా టీడీపీ నేతలపై కేసుల్లేవు.మనీ స్కామ్లోనూ వాటాలపై ఆరోపణలు ముసునూరు కేంద్రంగా రూ.వందల కోట్ల మనీస్కామ్లో ఎమ్మెల్యేకు వాటాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో బాధితులకు న్యాయం చేసేందుకు సిద్ధపడిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డిని సైతం తన స్థాయిని మరిచి అసభ్యపదజాలంతో మీడియా ముఖంగా దూషణలకు దిగడంతోపాటు ఓ రేంజ్లో రెచ్చిపోవడం రాజకీయంగా కావ్య కృష్ణారెడ్డి విమర్శలు ఎదుర్కొన్నారు. సొంత పార్టీ నేతలపైనా అరాచకం నియోజకవర్గంలో సొంత పార్టీలో తనకు పోటీ ఉండకూడదని తన గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన మాలేపాటి సుబ్బానాయుడు, ముసునూరుకు చెందిన శ్రీహరినాయుడు వంటి కీలక నేతలపై కేసులు కట్టించారు. సొంత పారీ్టలో వర్గ విభేదాలు సృష్టించి వర్గ రాజకీయాలకు మరింత ఆజ్యం పోశాడన్న ఆరోపణలున్నాయి. ఆది నుంచి రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్న కావ్య ఎన్నికల సమయంలోనే టీడీపీ సీనియర్ నేత మన్నవ రవిచంద్రను అడ్డం వస్తే గొడ్డలితో నరికేస్తానంటూ బెదిరించిన ఘటన అప్పట్లోనే సంచలనం సృష్టించింది. కావలి సీటు ఇప్పించేందుకు సహకరించి ఎమ్మెల్యే విజయానికి సహకరించిన బీద రవిచంద్రతో అమీతుమీకి సిద్ధపడ్డాడు. ఆయన అనుచర వర్గాన్ని టార్గెట్ చేసి వారికి చుక్కలు చూపించాడు. గత ప్రభుత్వ హయాంలో పార్టీ జెండా మోసి డబ్బు సంచుల తూకంలో వెనకబడి సీటు త్యాగం చేసిన మాలేపాటి సుబ్బానాయుడు ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసి ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించాడన్న సంగతి తెలిసిందే. మాలేపాటిపై అక్రమ కేసులు నమోదు చేసి అధిష్టానం వద్ద చీవాట్లు తిన్నట్లు ప్రచారంలో ఉంది. మానసికంగా వేధింపులతో చివరకు మాలేపాటి ప్రాణాలు కోల్పోవడంతో ఎమ్మెల్యేపై సొంత పార్టీలోనే తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో పాటు ఆయన్ను అడ్డుకున్న విషయం తెలిసిందే. ముసునూరు చెందిన శ్రీహరినాయుడు ఓ సమస్య చెప్పుకునేందుకు వెళ్లిన సమయంలో బూతులు తిట్టినట్లుగా ఆయన స్వయంగా మాలేపాటి సంతాపసభలో చెప్పుకున్న సంగతి తెలిసిందే. స్వపక్షంలోనే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన్ను పార్టీ దూరంగా పెట్టింది. కావలి పెత్తనాన్ని బీద చేతుల్లో పెట్టింది.సీఎం చీవాట్లు పెడచెవినఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పనితీరు రాష్ట్ర స్థాయిలో ఆయనకు 107వ స్థానం ఉందని స్వయంగా సీఎం చంద్రబాబు చీవాట్లు పెట్టారు. వారం క్రితం కావలికి వచ్చిన సందర్భంలో చంద్రబాబు పార్టీ కేడర్ అంతర్గత సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో మూడు శాఖల పనితీరు ఆధ్వానంగా ఉంటే.. కావలి నియోజకవర్గంలో 11 శాఖల పనితీరు దారుణంగా ఉందని, ఇదేనా నీ పనితీరు అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఫెయిల్ అంటూ తలంటిపోశారు. ఓ పదిమందితో రాజకీయం చేస్తున్నావంటూ, ఇది మంచి పరిణామం కాదని, పార్టీలో అందరిని కలుపుకుపోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. సీఎం హెచ్చరించి ఐదు రోజులు గడవక ముందే.. మంచినీళ్లు అందించండంటూ కావలి మండలం చలంచర్ల పంచాయతీకి చెందిన కిషోర్ అనే టీడీపీ కార్యకర్త తన గ్రామస్తులతో వెళ్లి ఎమ్మెల్యేకు మొర పెట్టుకుంటే.. చెంపలు వాయించడం ఇప్పుడు ఆ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు టీడీపీలో హాట్టాపిక్ చర్చగా నడుస్తోంది. పార్టీ కేడర్ను కలుపుకుని పోవాలని ఆదేశిస్తే.. చెంపలు పగులగొట్టి కొత్త వివాదానికి తెరతీయడంపై అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. -
నెల్లూరులో టూరిస్టు బస్సు బోల్తా
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద చోటుచేసుకుంది. ఓ టూరిస్టు బస్సు అదుపు తప్పి బోల్తా పడిపోయింది. ఈ క్రమంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడటంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. నెల్లూరు హైవేపై ఏలూరు నుండి చైన్నై వైపు వెళ్తున్న టూరిస్ట్ బస్సు గురువారం ఉదయం బోల్తా పడింది. నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ జంక్షన్ వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ప్రమాదం సమయంలో బస్సులో సుమారు 38 మంది పెద్దలు, ఐదుగురు ప్రయాణిస్తున్నారు. అయితే, డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి పోలీసులు, సహాయక బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
వైఎస్ కుటుంబంపై దుష్ప్రచారాన్ని ఆపాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): దివంగత నేతలు వైఎస్ రాజారెడ్డి, రాజశేఖరరెడ్డిపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, వీటిని ఇప్పటికై నా ఆపాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ఇందిరా భవన్లో విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ప్రజలను కూటమి ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. సీమలో జరిగిన అరాచకాలను ఎదిరించి ప్రజల పక్షాన నిలిచిన వ్యక్తి వైఎస్ రాజారెడ్డి అని.. కడపలో ప్రజల కోసం 70 పడకల ప్రభుత్వాస్పత్రిని 1973లో నిర్మించి ఉచిత వైద్యాన్ని అందించారని గుర్తుచేశారు. పార్టీలకతీతంగా సుపరిపాలనను అందించి.. పేదల కోసం ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలను దివంగత సీఎం వైఎస్సార్ అమలు చేశారని కొనియాడారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వీరిపై దుష్ప్రచారాలు చేయడం తగదని హితవు పలికారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తలారి బాలసుధాకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 89,403 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 44,234 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.14 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనం 3 గంటల్లో, సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తుకు నిర్దిష్ట సమయంలో దర్శనం లభిస్తుంది. పక్కాగా ఓటరు జాబితా సమగ్ర సవరణ నెల్లూరు(అర్బన్): జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను పక్కాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. ఓటరు జాబితాకు సంబంధించిన విధివిధానాలపై కలెక్టరేట్లోని తన చాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘ మార్గదర్శకాల మేరకు ఓటరు జాబితాలను క్షుణ్ణంగా నవీకరించడం, ధ్రువీకరించడం, తప్పులను సరిదిద్దడమే లక్ష్యంగా సవరణ కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. లోపాల్లేని పారదర్శకమైన ఓటరు జాబితాకు రాజకీయ పార్టీలు, బూత్ లెవల్ ఏజెంట్లు సహకరించాలని కోరారు. వచ్చే నెల 15 నుంచి జూలై 14 వరకు బూత్ లెవల్ అధికారులు ఇంటింటి సర్వేను నిర్వహించి ఓటర్ల వివరాలను పరిశీలించనున్నా రని వెల్లడించారు. అదే సమయంలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియనూ పూర్తి చేయనున్నామని తెలిపారు. జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, అదే రోజు నుంచి ఆగస్ట్ 20 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరించనున్నామని ప్రకటించారు. సెప్టెంబర్ 18 వరకు అభ్యంతరాలను పరిష్కరించి.. అదే నెల 22న తుది ఓటరు జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నామన్నారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా చూడటం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, కచ్చితమైన ఓటరు జాబితాను తయారు చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. డీఆర్వో విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బక్రీద్ శుభాకాంక్షలు నెల్లూరు(అర్బన్): జిల్లాలోని ముస్లిం సోదరులకు కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం ఒక ప్రకటనలో బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలకు ప్రతీకగా బక్రీద్ నిలుస్తోందని తెలిపారు. ముస్లింలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఒక్కరిపై అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. -
వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం
తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జీలు, సమన్వయకర్తలతో సమావేశాన్ని పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై దిశానిర్దేశనం చేశారు. సమావేశంలో కాకాణి గోవర్ధన్రెడ్డి, ఆనం విజయకుమార్రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మేకపాటి విక్రమ్రెడ్డి, రాజగోపాల్రెడ్డి -
బోగోలు తీరంలో పెను విషాదం
పడవల్లో వెళ్లి ఉంటే.. బతికేవారు.. ● తెప్పలపై చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృత్యువాత ● మరో ఇద్దరు అన్నదమ్ములు గల్లంతు ● కుప్పకూలిన కుటుంబాలు తెప్ప ఒరిగింది.. తీరం విలపించింది. కడలినే నమ్ముకుని బతికిన కుటుంబాలను ఆ కడలే కబళించింది. ఆకలి వేటలో మృత్యు వలలో చిక్కి ఆశలే కూలిపోయాయి. విరుచుకుపడిన రాకాసి గాలులకు గుండెలు తల్లడిల్లాయి. వేకువ వెలుగులో.. కన్నీటి చీకట్లు అలముకున్నాయి. చేపల కూర కోసం తెప్పలపై వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారుల్లో ఇద్దరు మృత్యు వాత పడగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ దుర్ఘటనతో బోగోలు తీరంలో తీవ్ర విషాదం నెలకొంది. బిట్రగుంట: బోగోలు మండలంలోని తీరప్రాంత గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులు రెండు తెప్పల్లో వేటకు వెళ్లగా ఈదురుగాలుల రూపంలో మృత్యువు సముద్రంలో వీరికి ఎదురొచ్చింది. వేకువన నాలుగు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులకు తెప్ప బోల్తా పడి ఇద్దరు మత్స్యకారులు చనిపోగా, రెండో తెప్పలో అన్నదమ్ములైన మరో ఇద్దరు మత్స్యకారులు కూడా గల్లంతయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే తీరం తల్లడిల్లిపోయింది. వందలాది మంది మత్స్యకారులు తీరానికి చేరుకుని గొల్లుమన్నారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ప్రస్తుతం సముద్రంలో వేట నిషేధం అమల్లో ఉండడంతో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లడం లేదు. వలలు, పడవలు బాగు చేసుకుంటూ కడలి తీరాన సేద తీరుతున్నారు. పిల్లలు చేపల కూర అడిగారని.. దాదాపు నలభై రోజులకు పైగా వేటకు వెళ్లకపోవడం, పిల్లలు, కుటుంబ సభ్యులు చేపల కూర తినాలని అడిగారని అలిచెర్లబంగారుపాళెంకు చెందిన తూపిలి బాలమురళి (51), కుమారి గోవిందు (42)తోపాటు అదే గ్రామానికి చెందిన తులసింగారి రాజు, గణేష్ వేట నిబంధనల మేరకు తీరంలో బుధవారం వేకువన 3 గంటలకు రెండు కొయ్య తెప్పలపై వేటకు వెళ్లారు. తీరం వెంబడి కావడంతో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో బలమైన ఈదురు గాలులు వీయడంతో తెప్పలు తిరగబడడంతో బాలమురళి, గోవిందు మృత్యువాత పడ్డారు. మధ్యాహ్నం సమయానికి పాతపాళెం సమీపంలో తీరానికి వీరి మృతదేహాలు కొట్టుకువచ్చాయి. మరో తెప్పలో ఉన్న రాజు, గణేష్ ఆచూకీ బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు కూడా లభ్యం కాలేదు. ఈదురు గాలల తాకిడికి తెప్ప దూరంగా వెళ్లి ఉంటుందనే ఉద్దేశంతో మైరెన్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. కాగా ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మత్స్యకారులు మృత్యువాత పడడం, మరో ఇద్దరు గల్లంతు కావడంతో అలిచెర్లబంగారుపాళెం కన్నీటి సంద్రంగా మారింది. ఎవరిని కదిలించినా కన్నీరు తప్ప మాటలు రావడం లేదు. కంటికి రెప్పలా కాపాడే సముద్రమే కాటేసిందని కన్నీరు మున్నీర వుతున్నారు. మృతి చెందిన బాలమురళికి భార్య, ఇ ద్దరు పిల్లలు ఉండగా, గోవిందుకు కూడా భార్య ఇ ద్దరు పిల్లలు ఉన్నారు. గల్లంతైన రాజుకు భార్య, ఇ ద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. రాజు సోదరుడైన గణేష్ కు ఇంకా పెళ్లి కాలేదు. ఆయా కుటుంబాలకు వీళ్లే ఆధారం. ప్రస్తుతం వేట నిషేధ సమయం కావడంతో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దుర్ఘటనతో ఆయా కుటుంబాలు కుప్పకూలిపోయాయి. వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. తెల్లారేసరికి వస్తామన్నారు.. ప్రస్తుతం వేట నిషేధం కావడంతో బతుకుతెరువు కోసం కానీ.. ఇంట్లో అవసరాలకు తెప్పలపై వేట చేసే అవకాశం ఉండడంతో నలుగురు మత్స్యకారులు కూర కోసం చేపల వేటకు తెప్పలపై వెళ్లి మృత్యువాత పడ్డారని స్థానికులు విచారం వ్యక్తం చేశారు. పడవల్లో వెళ్లి ఉంటే.. బతికే వారన్నారు. వేట నిషేధ నిబంధనల మేరకే తెప్పలపై వెళ్లి వేట చేసుకోవడం నేరం కాదని మత్స్యశాఖాధికారులు చెప్పారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడ్డారని తెలిసిన వెంటనే మత్స్యశాఖ అధికారులు, బిట్రగుంట పోలీసులు, మైరెన్ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. మృతుల కుటుంబాలకు బీమా పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు మత్స్యశాఖ కావలి ఏడీ చాంద్బాషా తెలిపారు. సముద్రంలో వేట.. ఆటు పోట్లకు ఎదురెళ్లడం మత్స్యకారులకు అలవాటే. వేట నిషేధంతో ఖాళీగా ఉంటున్నా.. అప్పుడప్పుడూ చెక్క పడవలపై సరదాగా సముద్రంలోకి వెళ్లి.. ఇంట్లో కూర కోసం చేపలు తెచ్చుకోవచ్చు. అందులో భాగంగానే వేకువన 3 గంటల ప్రాంతంలో వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండడంతో నలుగురు మత్స్యకారులు రెండు తెప్పలపై వేటకు వెళ్లారు. వీరు వేటకు వెళ్లిన కొద్ది సేపటికే వాతావరణం భీతావాహకంగా మారడంతో కుటుంబ సభ్యులకు క్షణమొక యుగంగా మారింది. తమ వాళ్లు వెనక్కి వచ్చేయాలని వేయి దేవుళ్లకు మొక్కుకుంటూ ఉదయం వరకు ఎదురుచూశారు. ఉదయం ఆరు గంటలు అయినా.. తమ వాళ్లు రాకపోవడంతో తీరానికి వెళ్లి చూసినా.. కనుచూపులో వీరి జాడ కనిపించకపోవడంతో క్షణక్షణానికి ఆందోళన, భయంతో వణికిపోయారు. తీరానికి తెప్పలు కొట్టుకురావడంతో తమ వారు ప్రాణాలతో లేరని తెలిసి నలుగురి కుటుంబాలు తల్లడిల్లిపోయాయి. -
జిల్లాలో గాలీవాన
● పలుచోట్ల విరిగిన చెట్ల కొమ్మలు ● వర్షంతో కాస్త సేదతీరిన ప్రజలు ● మర్రిపాడులో 35.2 మిల్లీమీటర్ల వర్షపాతం నెల్లూరు (అర్బన్): జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 3.30 నుంచి ఈదురుగాలులు వీచాయి. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. అప్పటి వరకు భానుడి భగభగలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. అనేక మండలాల్లో పెద్ద ఎత్తున గాలులు వీయగా, పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షపాతమిలా.. మర్రిపాడు మండలంలో అత్యధికంగా 35.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరికుంటపాడులో 26.4, చేజర్లలో 25.2, ఆత్మకూరులో 22.6, దుత్తలూరులో 20.8, ఉదయగిరిలో 17.4, కలువాయిలో 17.0, వెంకటాచలంలో 14.4, రాపూరులో 12.6, అల్లూరులో 7.4, విడవలూరులో 7.2, బుచ్చిరెడ్డిపాళెంలో 5.8, బోగోలులో 5.6, దగదర్తిలో 5.4, అనంతసాగరంలో 5.2, తోటపల్లిగూడూరులో 4.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరికొన్ని మండలాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. విద్యుత్ శాఖకు రూ.15 లక్షల నష్టం నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు నగరంలో బుధవారం తెల్లవారుజామున వీచిన ఈదురుగాలులతో విద్యుత్ సంస్థకు రూ.15 లక్షల నష్టం వాటిల్లింది. నగరంలోని ఎంజీబీ మాల్ పక్కన వీధిలో ఓ భారీ చెట్టు లైన్లపై పడటంతో రెండు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పునరుద్ధరణ పనులను సిబ్బంది యుద్ధప్రాతిపదికన చేపట్టారు. 11 కేవీ స్తంభాలు 12.. ఎల్టీ స్తంభాలు ఏడు.. ట్రాన్స్ఫార్మర్లు మూడు దెబ్బతిన్నాయి. -
కుటిల యత్నాలను తిప్పికొట్టాలి
● మన పార్టీ ఓట్లను పదిలపరుచుకోవాలి ● కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు(వేదాయపాళెం): అధికార పార్టీ నాయకులు గెలుపే పరమావధిగా సాగించే అన్ని కుటిల యత్నాలను తిప్పికొట్టేందుకు బూత్ లెవల్ ఏజెంట్లు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. నగరంలోని గాంధీనగర్లో ఉన్న కల్యాణ మండపంలో సర్వేపల్లి నియోజకవర్గ బూత్ లెవల్ ఏజెంట్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం మన ప్రాధాన్యాంశంగా ఉండాలన్నారు. అదే సమయంలో అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా తగిన చర్యలు చేపట్టాలని వివరించారు. 2002లో ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించారని, తిరిగి 24 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న ప్రక్రియలో మన పార్టీ ఓట్లను పదిలపరుచుకోవాలని సూచించారు. చంద్రబాబుకు ఎటువంటి ముందుచూపు, పాలనపై పట్టులేవన్నారు. గజకర్ణ, గోకర్ణ విద్యలతో అక్రమంగా లబ్ధిపొందేందుకు ఎంతటి దుర్మార్గపు చర్యలకై నా పాల్పడగలడన్నారు. వైఎస్సార్సీపీ ఓట్లను తొలగించే ప్రయత్నాలు, కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గంలో కూడా దొంగఓట్లను చేర్పించిన ఘనుడు చంద్రబాబు అని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అధికార పార్టీకి కొందరు అధికారులు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని, జాబితాలో మార్పులు, చేర్పుల సమయంలో నిబంధనల మేరకు న్యాయబద్ధంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. సర్పంచ్లుగా చేసిన వారికి క్షేత్రస్థాయిలో ఓటర్ల పట్ల, గ్రామాలపై సమగ్రమైన అవగాహన ఉంటుందని, అటువంటి వారు బీఎల్ఏలుగా ఉండడం పార్టీకి ఎంతో కలిసొచ్చే అంశమని వెల్లడించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సర్పంచ్లను సోమిరెడ్డి అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశాడని, చెక్పవర్ నిలిపివేయడం, సర్పంచ్ పదవులను రద్దుచేయడం, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కలెక్టర్ సర్పంచ్లను తొలగించడం వంటి అనేక దుశ్చర్యలకు సోమిరెడ్డి పాల్పడ్డాడని తెలిపారు. వెంకటాచలం మండలానికి చెందిన రాజేశ్వరి అనే మహిళా సర్పంచ్ను సైతం అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిన ఘనత టీడీపీకి దక్కుతుందని పేర్కొన్నారు. పటిష్ట నాయకత్వం మన సొంతం వైఎస్సార్సీపీ కార్యకర్తలు అధైర్యపడవద్దని, విపత్కర పరిస్థితులలో ఎటువంటి దుర్మార్గపు శక్తులనైనా ఎదుర్కొనే పటిష్ట నాయకత్వం, ధైర్యం మనకు మాత్రమే సొంతమని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత అన్నారు. తన తండ్రి గోవర్ధన్రెడ్డిని అక్రమ కేసులతో జైలుకు పంపారని, అటువంటి కష్టకాలంలో ప్రతి కార్యకర్త, నాయకులు వెనక్కు తగ్గకుండా గుండెనిబ్బరంతో నిలబడ్డారని పేర్కొన్నారు. పార్టీ జెండాను తిరిగి బలంగా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని తెలిపారు. తొలుత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇటీవల పదవీ విరమణ పొందిన సర్పంచ్లను సన్మానించారు. సమావేశంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుట్టా శివశంకర్రెడ్డి, సర్వేపల్లి పరిశీలకుడు వీరి చలపతిరావు, పార్టీ జాయింట్ సెక్రటరీ మహేష్ తదితరులు ప్రసంగించారు. -
సెంబ్కార్ప్ కార్మికులకు కనీస వేతనాలివ్వాలి
నెల్లూరు(అర్బన్): ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామంలో ఉన్న సెంబ్కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ థర్మల్ విద్యుత్ కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆ సంస్థ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో నగరంలోని గాంధీబొమ్మ వద్ద నుంచి కలెక్టరేట్ వరకు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతర కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా పని చేస్తున్నప్పటికీ కార్మికులకు రూ.9 వేల నుంచి రూ.11 వేల వరకు మాత్రమే ఇస్తూ యాజమాన్యం శ్రమ దోపిడీ చేస్తోందన్నారు. అనేక దఫాలుగా జీతాలు పెంచాలని వినతులిచ్చి, చర్చలు జరిపినప్పటికీ యాజమాన్యం పట్టించుకోక పోగా పోలీసులను ఉపయోగించి కార్మికులను బెదిరించడం దుర్మార్గమన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే గత పది రోజులుగా విధులు బహిష్కరించి నిరసనలు చేస్తున్నారన్నారు. భూములు కోల్పోయిన నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి చివరికు కనీస వేతనాలు కూడా ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి ప్రతి కార్మికునికి రూ.26 వేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతి పత్రం ఇచ్చారు. స్పందించిన కలెక్టర్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సీఐటీయూ నాయకులు కె.పెంచలనరసయ్య, అంకయ్య, సుధాకర్, భాస్కర్, మస్తాన్ పాల్గొన్నారు. -
మార్ఫింగ్ ఆడియోలపై చర్యలు తీసుకోవాలి
కావలి: మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఆయన సోదరుడు చిరంజీవిని దుర్భాషలాడినట్లు కొందరు మార్ఫింగ్ ఆడియోలు చేసి ప్రజల్లో తీవ్ర గందరగోళం సృష్టించారని, దీనిపై పూర్తిస్థాయి విచారణ చేసి దోషులను శిక్షించాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కావలి డీఎస్పీ రమణకుమార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే విధంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మార్ఫింగ్ ఆడియోలను నమ్మి కొంతమంది మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరికలు చేయడం అత్యంత ప్రమాదకరమైన విషయమన్నారు. ఇది కేవలం నాయకులపై వ్యక్తిగత దాడి మాత్రమే కాకుండా ప్రతిపక్షాలను అణిచి వేయాలనే కుట్రగా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో ఇలాంటివి జరుగుతున్నా ప్రభుత్వం, పోలీసులు చూస్తూ ఊరుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకులు, ఇళ్లపై, కార్యకర్తలపై దాడులు చేసి బెదిరిస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఎవరి ప్రోత్సాహం ఉందో తెలియాలన్నారు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఆడియోలతో పాటు అసత్య ప్రచారాలతో రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడిస్తామని బెదిరింపులు చేసిన వారిపై కేసులు నమోదు చేసి శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పందిటి కామరాజు, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి నారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు జంపాని రాఘవులు, ప్రసాద్, కనపర్తి రాజా, ఆర్కే కృష్ణారెడ్డి, ముంగమూరు మహేష్రెడ్డి, యూత్ విభాగం నేతలు మహేష్, గనిబాయ్ పాల్గొన్నారు. -
బక్రీద్ను ఆనందంగా జరుపుకోవాలి
● పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నెల్లూరు(పొగతోట): త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండగను ముస్లింలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనలో ఆయన ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ధూ అల్ హిజ్జా అనే ఇస్లామిక్ నెలలో వచ్చే పండగ హజ్ యాత్ర ముగింపును సూచిస్తుందన్నారు. ఈ పండగ ప్రవక్త ఇబ్రహీం గొప్ప త్యాగాన్ని గుర్తు చేస్తుందన్నారు. దేశాన్ని చుట్టి రావడమే ధ్యేయం ● మారథాన్ రన్నర్ సూఫియా మనుబోలు: పరిగెడుతూ భారతదేశాన్ని చుట్టి రావడమే లక్ష్యమని ప్రసిద్ధ అల్ట్రా మారథాన్ రన్నర్ సూఫియా తెలిపారు. కన్యాకుమారి నుంచి కారకోరం పర్వతశ్రేణి వెళ్తూ మంగళవారం రాత్రి మనుబోలుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మనుబోలు హైవే వద్ద కొద్దిసేపు మీడియాతో ముచ్చటించారు. తన సొంత ఊరు రాజస్థాన్లోని అజ్మీర్ అని, మారథాన్ రన్నింగ్లో తాను పలు గిన్నీస్ రికార్డులు నెలకొల్పినట్లు తెలిపారు. 2019లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుమారు 4 వేల కిలోమీటర్ల దూరాన్ని వేగంగా పరిగెత్తిన మహిళా రన్నర్గా రికార్డు సాధించానన్నారు. ముంబై, చైన్నె, కోల్కతా, ఢిల్లీ నగరాలను కలిపే స్వర్ణ చతుర్భుజి రహదారిని 2021లో చుట్టి వచ్చినట్లు తెలిపారు. అలాగే హిమాలయ పర్వతాల్లోని ఐదు ఎత్తయిన పర్వత మార్గాల్లో సుమారు 480 కిలోమీటర్ల దూరాన్ని 98 గంటల 27 నిమిషాల్లో పూర్తి చేసి 2023లో రికార్డు నెలకొల్పినట్లు తెలిపారు. ఇలా ఇప్పటి వరకు ఐదు గిన్నీస్ రికార్డులు సాధించానన్నారు. ప్రస్తుతం కన్యాకుమారి నుంచి చైనా సరిహద్దులో లడఖ్ ప్రాంతంలో ఉన్న కారకోరం వరకు పరుగెడుతున్నట్లు తెలిపారు. రైల్లోంచి జారిపడి వ్యక్తికి తీవ్రగాయాలు కోవూరు: గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని పడుగుపాడు రైల్వేస్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. గూడూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైల్లో ప్రయాణిస్తున్న వ్యక్తి జారిపడి గాయపడడంతో గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రుని వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. న్యాయశాఖ ఉద్యోగులకు ఆత్మీయ సన్మానం నెల్లూరు (లీగల్): న్యాయ శాఖలో విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ చేసిన డి.ఆంజనేయులు, కె.శ్రీనివాసులు, జి.శ్రీరాములు, ఎండీ మహబూబ్బాషాలను న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. సుదీర్ఘకాలం న్యాయ శాఖలో క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందడం సంతోషకరమన్నారు. మరో ముగ్గురు అదనపు జిల్లా జడ్జిలు ఆర్.శరత్బాబు, జి.గీత, కె.శైలజ పాల్గొని, మాట్లాడారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి, సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పీవీ నారాయణరెడ్డి, వెంకటసునీల్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
తెగిన విద్యుత్ తీగలే.. యమపాశాలై..
మండల పరిధిలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వీచిన బలమైన ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలో చాలాచోట్ల విద్యుత్ తీగలు పంట పొలాలపై పడ్డాయి. వీటి గురించి తెలియకుండా ఎప్పటిలాగే పొలాల వద్దకు వెళ్లి ఓ మహిళ మరణించగా, మేత కోసం వెళ్లిన 13 గేదెలు మృత్యువాత పడ్డాయి. దీంతో ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. ●● తిరునాళ్లకు పుణే నుంచి వచ్చి మృతి సీతారామపురం: మండలంలోని కొయ్యలపాడు గ్రామంలో బుధవారం వేకువజామున చలసాని వెంకట సుబ్బమ్మ (53) అనే మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెంకట సుబ్బమ్మ తన భర్త, ఇద్దరు పిల్లలతో మహారాష్ట్రలోని పుణేలో స్థిరపడ్డారు. ఇటీవల గ్రామంలో తిరునాళ్ల, వివాహ కార్యక్రమాల్లో భాగంగా ఆమె 15 రోజుల క్రితం గ్రామానికి వచ్చారు. మరో రెండు మూడు రోజుల్లో పూణేకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం వీచిన బలమైన ఈదురు గాలులకు బహిరంగ ప్రదేశాల్లో అమర్చిన విద్యుత్ స్తంభాల కరెంటు తీగలు తెగిపడ్డాయి. బుధవారం వేకువజామున బహిర్భూమికి వెళ్లిన వెంకటసుబ్బమ్మ తెగిన తీగను గమనించకుండా కాలును కరెంటు వైరుపై పెట్టడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. వెంకట సుబ్బమ్మ అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అదుపుతప్పి జేసీబీని ఢీకొన్న బస్సు
● తొమ్మిది మందికి తీవ్రగాయాలు ● త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ● డ్రైవర్ నిద్రమత్తే కారణమంటున్న ప్రయాణికులుకోవూరు: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న జేసీబీని ఢీకొన్న ఘటన మండల పరిధిలోని పడుగుపాడు సెంటర్లో బుధవారం మధ్యాహ్నం 2.30 సమయంలో జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మందికి తీవ్రగాయాలు కాగా, 15 మందికి పైగా స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. కావలి నుంచి నెల్లూరుకు సుమారు 40 మంది ప్రయాణికులతో నాన్స్టాప్ ఆర్టీసీ బస్సు బయలుదేరింది. పడుగుపాడు సెంటర్లో రోడ్డు పక్కన పనులు జరుగుతుండగా బిహార్కు చెందిన కూలీలు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పడుగుపాడు సెంటర్కు వచ్చేసరికి బస్సు అదుపుతప్పి పక్కనున్న జేసీబీని ఢీకొట్టింది. ఈ క్రమంలో జేసీబీలో ఉన్న ముగ్గురు బిహార్కు చెందిన కూలీలతో పాటు బస్సులో ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిలో బిహార్కు చెందిన గణేష్కుమార్, అనంతకుమార్, రమేష్కుమార్తో పాటు బస్సులో ఉన్న శ్రీనివాసులు, శ్రీరామ్కుమార్, ఇమ్మానుయేల్, రమ్యశ్రీ, వినీత, మయూరి ఉన్నారు. అలాగే బస్సు డ్రైవర్కు కాలు విరగ్గా అతని పేరు తెలియరాలేదు. కాగా 15 మందికిపైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను నెల్లూరు, కోవూరు వైద్యశాలలకు తరలించారు. రాజుపాళెం నుంచే అదుపుతప్పినట్లుగా.. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని బస్సులోని ప్రయాణికుడు శ్రీనివాసులు తెలిపారు. రాజుపాళెం నుంచి బస్సు అదుపు తప్పినట్లు నడుస్తోందని, డ్రైవర్ అలసటతో ఉన్నట్లు కనిపించాడని తెలియజేశారు. ఎస్సై ముత్యాలరావు సిబ్బందితో కలిసి ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షుల వివరాలు సేకరించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం లేదా సాంకేతిక లోపం కారణమా అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. ప్రమాదంతో కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు రహదారిపై నిలిచిపోయిన బస్సును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. -
మేతకెళ్లి 13 గేదెలు మృత్యువాత
సీతారామపురం: మండలంలోని గంగవరం గ్రామంలో బుధవారం విద్యుదాఘాతానికి గురై ఏకంగా 13 గేదెలు మృతిచెందాయి. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆవుల పెద్ద వెంకటసుబ్బయ్య రోజూ మాదిరిగానే తమ గ్రామానికి చెందిన సుమారు 70 గేదెలను బుధవారం ఉదయాన్నే తోలుకొని మేతకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి వీచిన బలమైన ఈదురు గాలుల ధాటికి పొలంలో 11 కేవీ విద్యుత్ తీగ పడి ఉన్నది. గేదెలు అటువైపుగా వెళ్లి విద్యుత్ తీగను తగిలి ఒకదాని వెంట మరొకటి వరుసగా 13 గేదెలు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. గేదెలు ఉన్నట్టుండి పడిపోవడం ఆ ప్రాంతంలో మంటలు చెలరేగుతుండడాన్ని గమనించిన పశువుల కాపరి వెంటనే మిగిలిన గేదెలను అటువైపు వెళ్లనీయకుండా దారి మళ్లించడంతో మిగిలిన గేదెల ప్రాణాలు కాపాడగలిగాడు. లేకుంటే భారీ సంఖ్యలో గేదెలు మత్యువాత పడేవి. దీనిపై మాజీ సర్పంచ్ దుగ్గయ్యకు తెలపడంతో ఆయన వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించి విద్యుత్ సరఫరాను నిలిపి వేయించారు. ఈ ఘటనలో మేడిబోయిన సుబ్బమ్మ (3 గేదెలు), ఆవుల లక్ష్మి(2 గేదెలు), చిన్నదుగ్గయ్య (2 గేదెలు), రాగి లక్ష్మీదేవి(2 గేదెలు) బాలదుగ్గమ్మ, ఓబులమ్మ, వెంకటమ్మ, కోనమ్మలకు చెందిన 13 గేదెలు మృతి చెందడంతో సుమారు రూ.10 లక్షల మేర నష్టం వాటినట్లు బాధితులు వాపోతున్నారు. పాలకులు అధికారులు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఘటనా స్థలాన్ని విద్యుత్, పశు వైద్య శాఖ అధికారులు సందర్శించి జరిగిన దుర్ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
రేపు కొమ్మిపాడులో కలెక్టర్ పల్లెవీక్షణ
నెల్లూరు(అర్బన్): సైదాపురం మండలంలోని కొమ్మిపాడు గ్రామంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం పల్లె వీక్షణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారని జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ డీడీ వేణుగోపాల్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన స్వయంగా పరిశీలిస్తారన్నారు. నేడూ విద్యుత్ బిల్లులను చెల్లించొచ్చు నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ బిల్లులను నేడు బక్రీద్ సెలవు రోజు అయినప్పటికీ చెల్లించవచ్చని ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు గురువారం యథావిధిగా పనిచేస్తాయని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
పొగాకు కిలోకు రూ.350 చెల్లించాల్సిందే
ఆత్మకూరు: కూటమి పాలనలో వ్యవసాయం నిర్వీర్యమైందని, ప్రస్తుతం పొగాకు రైతుల ఇక్కట్లు దారుణంగా మారాయని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిట్టుబాటు ధరల్లేక బోర్డు ముందే పొగాకు రైతులు ధర్నాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వీరి పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకొని కిలోకు రూ.350 చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేసేలా ఆదేశించాలని డిమాండ్ చేశారు. తేలిక నేలల్లో పండే నాణ్యమైన పొగాకును డీసీపల్లి వేలం కేంద్రం ద్వారా విక్రయానికి రైతులు పెడతారని, అలాంటి దాని ధరలను సైతం బయ్యర్లు సిండికేట్గా మారి తగ్గించేయడం దారుణమన్నారు. సర్కార్ ఇప్పటికై నా ఈ విషయంలో జోక్యం చేసుకొని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. డీసీపల్లిలో 241 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 241 బేళ్లను మంగళవారం విక్రయించారని నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. వేలానికి 320 బేళ్లు రాగా, వీటిలో 241ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 33,753.8 కిలోల పొగాకును విక్రయించగా, రూ.73,55,834 వ్యాపారం జరిగిందని వెల్లడించారు. గరిష్టంగా కిలో రూ.250.. కనిష్టంగా రూ.190.. సగటు ధర రూ.217.93గా నమోదైందని పేర్కొన్నారు. ఎనిమిది కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారని వివరించారు. కేజీబీవీల్లో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు (టౌన్): జిల్లాలోని ఏడు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టులకు సంబంధించి 2026 – 27 విద్యా సంవత్సరంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావలి, నందిపాడులోని కేజీబీవీల్లో పీఈటీ – 2.. నందిపాడులో మ్యాఽథ్స్.. సీతారామపురంలో తెలుగు.. మర్రిపాడులో ఫిజికల్ సైన్స్.. కలిగిరిలో మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్డబ్ల్యూ) పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. kgbvrecruitment.apcfss.in ద్వారా దరఖాస్తులను పంపాలని కోరారు. దరఖాస్తు రుసుముగా రూ.300ను చెల్లించాలన్నారు. ఈ ఏడాది జూలై ఒకటి నాటికి ఓపెన్ కేటగిరీ, ఎక్స్ – సర్వీస్ ఉమెన్ అభ్యర్థుల వయస్సు 18 నుంచి 45.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50 ఏళ్లు.. దివ్యాంగులకు 52 ఏళ్లు ఉండాలని తెలిపారు. జిల్లాలో టెట్, బీఈడీ, పీజీ అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు అర్హులని, ఆసక్తి గల వారు వచ్చే నెల ఐదులోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 70750 39990, 79933 29115 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఫలితాల్లో తక్కువ శాతం తెచ్చిన తంటా ● ఐదుగురు చొప్పున ప్రిన్సిపల్స్, పీజీటీలకు నోటీసులు నెల్లూరు (టౌన్): పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో కందుకూరు నియోజకవర్గంలో తక్కువ పాస్ పర్సంటేజీ వచ్చిన కేజీబీవీల ప్రిన్సిపల్స్, పీజీటీలకు నోటీసులను సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య మంగళవారం జారీ చేశారు. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర యావరేజ్ 85 శాతం కాగా, 79.5 శాతం ఫలితాలు రావడంతో గుడ్లూరులోని మొగళ్లూరు కేజీబీవీ ప్రిన్సిపల్కు నోటీసులు పంపారు. ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర సగటు 81 శాతం కాగా, కందుకూరు నియోజకవర్గంలోని వీవీపాళెంలో 75.. ఉలవపాడులో 77.. కందుకూరులో 45.8.. లింగసముద్రంలో 66.6 శాతం ఉత్తీర్ణత రావడంతో అక్కడి కేజీబీవీల ప్రిన్సిపల్స్కు నోటీసులను జారీ చేశారు. వీరితో పాటు ఆయా సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు రావడంతో ఐదుగురు పీజీటీలకూ నోటీసులు జారీ అయ్యాయి. వీరందరూ వారంలో వివరణ పంపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వీటిని సమగ్రశిక్ష రాష్ట్ర అధికారులకు పంపి, వారి నిర్ణయం మేరకు చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. ఏపీఈడీ సెట్ ఫలితాల విడుదల ● సీతారామపురం వాసికి ద్వితీయ ర్యాంక్ నెల్లూరు (టౌన్): రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఈడీసెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. ఈ నెల ఎనిమిదిన నిర్వహించిన ఈ పరీక్షకు జిల్లాలో 1200 మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇంగ్లిష్ మెథడాలజీలో సీతారామపురానికి చెందిన మామిడి శివ 126 మార్కులతో రాష్ట్రంలో ద్వితీయ ర్యాంక్ను సాధించారు.


