breaking news
SPSR Nellore
-
అనర్హుడికి ‘ఆటోడ్రైవర్ల సేవలో’
● సొంత ఆటో లేకుండానే టీడీపీ కార్యకర్తకు పథకం వర్తింపు ● ఆయన స్వతహాగా వ్యవసాయదారుడు ● అర్హులకు దక్కని వైనం మర్రిపాడు: కూటమి ప్రభుత్వ పాలనలో పథకాలు అర్హత లేకపోయినా తమ్ముళ్లకే దక్కుతున్నాయనేందుకు ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకం దర్పణంగా నిలుస్తోంది. జిల్లాలో సొంత ఆటోలు కలిగిన డ్రైవర్లు సుమారు 40 వేల మంది వరకు ఉన్నారు. వీరందరూ ఈ పథకం లబ్ధి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అనేక కొర్రీలు వేసి చివరకు 17,406 మందికి ఈ పథకాన్ని వర్తింప చేశారు. అనర్హుడైన పక్కా టీడీపీ కార్యకర్తకు ఏ విధంగా లబ్ధి చేకూర్చారో అధికారులే సెలవివ్వాల్సి ఉంది. నిరుపేద ఆటోడ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు అంటూ ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పినా.. అమల్లో మాత్రం రాజకీయ సిఫారసులకు ప్రాధాన్యత లభించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మర్రిపాడు మండలంలోని పల్లవోలు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ముప్పాళ్ల జయవర్ధన్కు అసలు ఆటోనే లేదు. అతను ఆటోడ్రైవర్ కూడా కాదు. జయవర్ధన్ వ్యవసాయం చేస్తుంటాడు. అయినా ‘ఆటోడ్రైవర్ల సేవలో’ లబ్ధిదారుడిగా ఎంపిక కావడం స్థానికుల్లో చర్చనీయాంశమైంది. జయవర్ధన్కు AP39 UX3918 నంబరుతో ఆటో ఉన్నట్లు లబ్ధిదారుల జాబితాలో చూపించారు. రవాణాశాఖ రికార్డుల ప్రకారం ఈ ఆటోకు మర్రిపాడు మండలం వెంగంపల్లి పంచాయతీలోని భీమవరం గ్రామానికి చెందిన గోవిందు కృష్ణారెడ్డి యజమానిగా ఉన్నారు. జయవర్ధన్ ఎవరిదో ఆటోలో కూర్చొని ఫొటో తీసుకుని ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకం దరఖాస్తుతో జతచేసి, ఆటోడ్రైవర్లా చూపించి పథకాన్ని పొందినట్లు తెలుస్తోంది. దీనిపై గ్రామస్తులు సైతం ఎంపీడీఓకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఇదే గ్రామానికి చెందిన అర్హుడైన షేక్ అజామ్ అనే ఆటోడ్రైవర్కు లబ్ధి చేకూరలేదు. అర్హులైన ఆటోడ్రైవర్లకు చేకూరాల్సిన పథకాన్ని టీడీపీ నేతలు తప్పుడు ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకుని లబ్ధిపొందుతున్నారని అర్హులైన లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. విచారించి చర్యలు తీసుకుంటాం ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకం కింద అనర్హులు లబ్ధిపొంది ఉంటే వారిపై చర్యలు తీసుకుంటాం. లబ్ధి చేకూరని అర్హులకు న్యాయం జరిగేలా మరోసారి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తాం. అర్హులందరికీ పథకం ద్వారా నిధులు మంజూరయ్యేలా చూస్తాం. – మనోహర్రాజ్, ఎంపీడీఓ, మర్రిపాడు -
పేదల ఇళ్ల స్థలాల జోలికి వస్తే ఉపేక్షించం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటాచలం: పేదల ఇళ్ల స్థలాలు, ఇళ్ల జోలికి వస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి హెచ్చరించారు. మండలంలోని చవటపాళెంలో ఆదివారం కాకాణి పర్యటించారు. ఈ సందర్భంగా కాకాణి స్థానికులతో కలిసి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు వేసి పారదర్శకంగా ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు చేయించి ఆ స్థలాలను అప్పనంగా టీడీపీకి చెందిన వారికి కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అర్హత కలిగిన పేదలకు చెందిన ఇళ్ల స్థలాల జోలికి వస్తే అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పేదలకు చెందిన ఇళ్ల స్థలాలను కబ్జా చేయాలని ఎవరు ప్రయత్నించినా క్షమించబోమన్నారు. అధికారులు అత్యుత్సాహంతో పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేసేందుకు నోటీసులు ఇస్తే న్యాయ స్థానాన్ని ఆశ్రయించి పేదల పక్షాన పోరాడతామని తెలియజేశారు. దోపిడీపైనే సోమిరెడ్డికి శ్రద్ధ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా దోచుకోవడంపైనే సోమిరెడ్డి, అతని కుమారుడు రాజగోపాల్రెడ్డి శ్రద్ధ చూపుతున్నారని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటినా ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సర్వేపల్లిలో గ్రావెల్, ఇసుక, మట్టి బూడిద మాఫియా రోజు రోజుకు పెరిగిపోతుందని ఆరోపించారు. ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్నీ గ్రామాల్లో బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇరిగేషన్ పనులపై విచారణ జరిపితే సర్వేపల్లిలో జరిగిన దోపిడీ బట్టబయలవుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతాంగం అన్నీ విధాలా ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని, పండించిన పంటకు గిట్టుబాటు లభించక రైతులు ఆగ్రహంతో ఉన్నారని తెలియజేశారు. నకిలీ మద్యం బారిన పడి పేద ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే కూటమి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కాకాణితో చంద్రశేఖర్రెడ్డి భేటీ
నెల్లూరు (స్టోన్హౌస్పేట): నెల్లూరు పొదలకూరురోడ్డులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితో ఆదివారం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాల కార్యాచరణ, భవిష్యత్ రాజకీయ వ్యవహారాలపై చర్చించారు. నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నెల్లూరురూరల్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం కలెక్టరేట్లోని తిక్క న ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హి మాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు తమ అర్జీ స్థితి సమాచారం కోసం నేరుగా 1100 కాల్ సెంటర్ను సంప్రదించాలని కోరారు. అర్జీదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ నిండాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 84,571 మంది స్వామి వారిని దర్శించుకోగా 36, 711 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.70 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
శిక్షణ సరే.. కుట్టు మెషీన్లేవీ..?
దుత్తలూరు: ఉచిత శిక్షణ...పూర్తి చేసుకున్న వారికి కుట్టుమెషీన్లతో పాటు సర్టిఫికెట్లను అందజేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి నేతలు ప్రగల్భాలు పలికారు. దీంతో జిల్లాలోని 31 కేంద్రాల్లో 1250 మంది మహిళలు శిక్షణ పొందారు. ట్రెయినింగ్ పూర్తయినా, మెషీన్లు పంపిణీకి నోచుకోవడంలేదు. మూడు నెలలు గడుస్తున్నా, ఇదే పరిస్థితి. బీసీ కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని బీసీ, ఈబీసీ, కాపు వర్గాలకు చెందిన పేద మహిళలకు శిక్షణ పేరిట హడావుడి చేశారు. మెషీన్లు వస్తాయి.. ఉపాధి పొందొచ్చని ఆశపడిన మహిళలకు నిరాశే ఎదురవుతోంది. వాస్తవానికి శిక్షణకు సంబంధించిన అర్హులు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీటిని మున్సిపల్ కమిషనర్లతో పాటు ఎంపీడీఓలకు పంపారు. నిబంధనల మేరకు 18 నుంచి 60 ఏళ్లలోపు వారిని శిక్షణకు ఎంపిక చేశారు. సిబ్బందికి అందని వేతనాలు ఒక్కో శిక్షణ కేంద్రానికి ఒక టీచర్తో పాటు కంప్యూటర్ ఆపరేటర్ను నియమించారు. టీచర్కు నెలకు రూ.15 వేలు.. కంప్యూటర్ ఆపరేటర్కు రూ.12 వేల చొప్పున వేతనాన్ని మంజూరు చేయాలి. మూడు నెలలకు గానూ ఒక నెలకే వేతనాలను అందజేశారని సమాచారం. మిగిలిన మొత్తం ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 1250 మంది మహిళలకు ట్రెయినింగ్ నేటికీ ఎదురుచూపులు ప్రగల్భాలకే కూటమి నేతల పరిమితం పంపిణీ చేస్తాం జిల్లాలోని 31 కేంద్రాల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఐదు చోట్ల ట్రెయినింగ్ జరుగుతోంది. ఇది పూర్తయిన వెంటనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కుట్టుమెషీన్లను అందజేస్తాం. సిబ్బంది వేతనాలకు సంబంధించిన బిల్లులను అప్లోడ్ చేస్తున్నాం. – నిర్మలాదేవి, బీసీ కార్పొరేషన్ ఈడీ -
ఆర్టీసీ బస్సు ఢీకొని..
ఆత్మకూరు: మలుపు తిరిగే క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వ్యక్తి గాయపడిన ఘటన పట్టణంలోని ఎమ్జీఆర్ మున్సిపల్ బస్టాండ్ వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. ఏఎస్పేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మలుపు తిరిగే సమయంలో గడ్డం నాగరాజును ఢీకొంది. టైరు కింద ఆయన కాలుపడటంతో నుజ్జునుజ్జయింది. వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై జిలానీ ఘటన స్థలాన్ని పరిశీలించారు. నాగరాజు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమ తరలింపును అడ్డుకునేదెవరు..?
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇసుకను రాత్రీ, పగలనే తేడా లేకుండా స్థానిక టీడీపీ నేతల ఆధ్వర్యంలో యథేచ్ఛగా తరలిస్తున్నారు. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను జొన్నవాడ వద్ద ఎస్సై సంతోష్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం వేకువజామున పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. దామరమడుగులోని పెన్నా నుంచి టిప్పర్లు, ట్రాక్టర్ల సాయంతో నిత్యం భారీగా తరలిస్తున్నారు. మామూళ్లు అందుతుండటంతో అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ రూరల్ అధ్యక్షుడు జగదీష్ అనుచరుల ఆధ్వర్యంలో ఈ వ్యవహారం సాగుతోందని సమాచారం. ఇప్పటికై నా అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
లాడ్జిలో అగ్నిప్రమాదం
● నెల్లూరులో అర్ధరాత్రి ఘటన ● 15 మందిని రక్షించిన పోలీస్, ఫైర్ సిబ్బంది ● తప్పిన పెనుముప్పు నెల్లూరు(వీఆర్సీసెంటర్): అందరూ గాఢ నిద్రలో ఉండగా, లాడ్జిలో అగ్నిప్రమాదం శనివారం అర్ధరాత్రి సంభవించింది. ఈ హఠాత్పరిణామంతో గదుల్లో ఉన్న వారు ఆందోళనకు గురయ్యారు. దర్గామిట్ట పోలీసుల కథనం మేరకు.. కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలోని బ్లూ మూన్ లాడ్జి రెండో అంతస్తులో గల 102వ గదిలో ఏసీ షార్ట్ సర్క్యూటైంది. శనివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో జరిగిన ఘటనలో గదిలోని ఫర్నిచర్, పరుపులు, దిండ్లు దగ్ధమయ్యాయి. మంటలతో అదే అంతస్తులోని మిగిలిన గదుల్లోకి పొగ దట్టంగా వ్యాపించింది. ఇదే సమయంలో వివిధ గదుల్లో 15 మంది ఉన్నారు. సెన్సార్ సిస్టమ్ ఉండటంతో తలుపులు తెరుచుకోకపోవడంతో కిటికిల్లోంచి చేతులు ఊపుతూ పెద్దగా కేకలేశారు. గమనించిన కొందరు.. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ వెంటనే చేరుకొని, మంటలు ఆర్పి.. కిటికీ అద్దాలు, తలుపులను పగలగొట్టి 15 మందిని ఎమర్జెన్సీ ద్వారం మీదుగా తీసుకొచ్చారు. ఓ బాలుడ్ని అంబులెన్స్లో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రెస్క్యూ ఆపరేషన్ను ఎస్పీ అజిత స్వయంగా పర్యవేక్షించారు. పొగను పీల్చడంతో ఆస్పత్రుల్లో పలువురు చికిత్స పొందుతున్నారు. కాగా లాడ్జిని విశ్రాంత ఏఎస్పీ పమిడి మధుసూదన్రావుకు చెందిందిగా గుర్తించారు. ఫైర్, రెస్కూ టీమ్ అధికారులు చంద్రశేఖర్, శ్రీనివాసులు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలి
నెల్లూరు(అర్బన్): మహిళల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా డాక్టర్లు కృషి చేయాలని పలువురు వైద్యులు పేర్కొన్నారు. విష్ 2025 ఉమెన్స్ ఇన్ఫెర్టిలిటీ సర్జరీ హార్మోన్ అనే అంశంపై చెముడుగుంట సమీపంలోని స్రిడ్స్ ఫంక్షన్ హాల్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సు ఆదివారంతో ముగిసింది. నెల్లూరు మెనోపాజ్ సొసైటీ, ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లైవ్ ఎండోస్కోపీ వర్క్షాపును నిర్వహించారు. నగరంలోని ఓ ఆస్పత్రిలో సీ్త్రలకు సంబంధించిన అత్యంత క్లిష్టతరమైన ఆపరేషన్లను సదస్సుకు హాజరైన డాక్టర్లు స్క్రీన్ ద్వారా పరిశీలించి పలు అంశాలపై చర్చించారు. జాతీయ స్థాయి డాక్టర్లు పరీక్షిత్ టాంక్, ప్రతాప్, పళని అప్పన్, అర్చనాబేసర్, అంజూసోనీ, అనితాషా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు పల్లంరెడ్డి యశోదర మాట్లాడారు. సీ్త్రల ఆరోగ్య రక్షణ, ఆధునిక చికిత్సలను నాణ్యమైన విధంగా అందించేలా నెల్లూరులో జాతీయ స్థాయి సదస్సును నిర్వహించడాన్ని అభినందించారు. ఆర్గనైజింగ్ టీమ్ డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్లు ఉషా, అపూర్వ, మిథిలశ్రీ, సాయిదీప్తి తదితరులు పాల్గొన్నారు. -
లారీని అధిగమించే క్రమంలో..
మర్రిపాడు: లారీని అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు గాయపడిన ఘటన మర్రిపాడు సమీపంలోని నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలు.. కర్ణాటకలోని బెళగావికి చెందిన స్క్రాప్ వ్యాపారులు ఉమర్ ఫరూఖ్, ముజహర్, ఇర్షాద్ నెల్లూరు బయల్దేరారు. మార్గమధ్యలోని కండ్రిక సమీపంలో లారీని కారు ఢీకొనడంతో ఫరూఖ్, ముజహర్ గాయపడ్డారు. హైవే అంబులెన్స్ సిబ్బంది సమయానికి రాలేదు. దీంతో చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆస్పత్రికి ఆటోలో తరలించారు. కాగా కారుకు సంబంధించిన వస్తువులు రోడ్డుపై పడిపోవడంతో రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. మర్రిపాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘సాక్షి’ ఆఫీసు వద్ద పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంలో ‘సాక్షి’పై(Sakshi) కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై రెడ్బుక్ వికృత చర్యలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం.. సాక్షి ఆఫీసుకు పోలీసులను పంపించింది. ఈ క్రమంలో ఆఫీసుకు వచ్చిన పోలీసులు ఓవరాక్షన్ చేశారు.వివరాల ప్రకారం.. ఏపీలో నకిలీ(AP Liquor Scam) మద్యం వ్యవహారంపై ఎల్లో మీడియా(Yellow Media) సైతం కథనాలు రాస్తున్నా దాన్ని ఏమీ చేయలేని కూటమి సర్కారు ‘సాక్షి’పై మాత్రం కక్ష సాధిస్తోంది. నకిలీ మద్యం అంశంపై ఎలా వ్యవహరించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్న ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ‘సాక్షి’ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సాక్షిని టార్గెట్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను(AP Police) రంగంలోకి దింపింది. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ ఎక్సైజ్ అధికారుల ఫిర్యాదుల మేరకు ‘సాక్షి’ యాజమాన్యంతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, రిపోర్టర్లపై నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసుస్టేషన్లలో రెండు అక్రమ కేసులు నమోదు చేయించింది.ఇది కూడా చదవండి: నకిలీ మద్యం కేసులో మరో బిగ్ ట్విస్ట్..దీంతో, ఆదివారం తెల్లవారుజామునే పోలీసులు.. ఆటోనగర్లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఆఫీసు వద్ద పోలీసులు హల్చల్ చేశారు. కేసుకు సంబంధించి నోటీసులు తీసుకోవాలంటూ సాక్షి సిబ్బందిపై పోలీసులు ఒత్తిడి తెచ్చారు. జర్నలిస్టులను, సాక్షి సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేశారు. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ నిరంకుశ చర్యలకు దిగారు. కాగా, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు సాక్షి కార్యాలయంపైకి పోలీసులను పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పత్రికా స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడిని జర్నలిస్టులు ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలి
● హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్శ్రీనివాసరెడ్డి ● జిల్లాలోని న్యాయమూర్తులకు ఒక రోజు శిక్షణ నెల్లూరు (లీగల్): కోర్టుల్లో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు న్యాయమూర్తులు చొరవ తీసుకోవాలని ఏపీ హైకోర్టు జడ్జి, జిల్లా న్యాయపాలన వ్యవహారాల జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి కోర్టు హల్లో జిల్లా స్థాయి న్యాయమూర్తులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ సీ ప్రవీణ్కుమార్, జి. సీతాపతి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ కోర్టుల్లో పెండింగ్ కేసులు, కేసుల సత్వర పరిష్కారానికి చర్యలపై న్యాయమూర్తులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. న్యాయమూర్తుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు గీత, సరస్వతి, తేజోవతి, శ్రీనివాసరావు, సోమశేఖర్, నికిత వోర, పలు కోర్టుల సీనియర్, జూనియర్ సివిల్ జడ్జిలు పాల్గొన్నారు. న్యాయమూర్తులకు ఘన స్వాగతం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు సీ ప్రవీణ్కుమార్, జి సీతాపతిలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్, కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వై.ఓ నందన్ ఘన స్వాగతం పలికారు. తొలుత జస్టిస్ శ్రీనివాసరెడ్డి కోర్టు ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఆయన మాట్లాడుతూ పర్యవరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యత అని గుర్తు చేశారు. కోర్టు ఆవరణ సుందరీకరణలో నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వైఓ నందన్ చేస్తున్న కృషిని జస్టిస్ శ్రీనివాసరెడ్డి అభినందించి సన్మానించారు. -
అక్రమ నిర్మాణం తొలగింపు షురూ
నెల్లూరు (బృందావనం): నెల్లూ రు నగరపాలక సంస్థ పరిధిలో గుప్తాపార్కు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాన్ని తొలగించే చర్యలు షురూ అయ్యాయి. ఆ భవన యజమాని నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల నిర్మాణం చేశారంటూ స్థానికులు నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఫిర్యాదుదారుడు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో స్పందించిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్తుల నిర్మా ణంపై చర్యలు తీసుకోవాలంటూ నగరపాలక సంస్థ కమిషనర్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించలేదు. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన ‘సాక్షి’ పత్రికలో ‘కట్టుకో.. పైసలిచ్చుకో..! శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలకు ఉపక్రమించారు. దీంతో సదరు భవన యజమాని స్వయంగా తానే తొలగిస్తానని అధికారులకు విజ్ఞప్తి చేసి తన సొంత ఖర్చుతో కూలీలను పెట్టుకొని అక్రమ నిర్మాణాన్ని తొలగించే పనులు ప్రారంభించారు. ఇప్పటికే 50 శాతం పైగా నిర్మాణాన్ని తొలగించారు. -
రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి
● ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి మనుబోలు: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశించారు. స్థానిక పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా శనివారం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. స్థానిక పరిస్థితులపై సిబ్బందిని ఆరాతీసిన అనంతరం ఆయన మాట్లాడారు. హైవేపై ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ధాభాలు , ఇతర చోట్ల జాతీయ రహదారిని ఆనుకొని లారీలను ఆపకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. యూటర్న్లు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న క్రాస్రోడ్లను గుర్తించాలని సూచించారు. మండలంలోని 19 గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని ఎస్సై శివరాకేష్ తెలిపారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శివరామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
● ఎస్పీ అజిత నెల్లూరు (క్రైమ్): బాణసంచా అక్ర మ తయారీ, విక్రయదారులపై కఠి న చర్యలు తప్ప వని ఎస్పీ అజిత వేజెండ్ల ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలు, స్టోరేజ్ గోడౌన్స్, విక్రయ దుకాణాల్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా అనే విషయాలపై క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అక్రమ నిల్వలపై ఇందుకూరుపేటలో రెండు కేసులు, విడవలూరులో ఒకటి, కందుకూరులో ఒక కేసు నమోదు చేశామన్నారు. లైసెన్సులు కలిగిన వారే బాణసంచా తయారీ, విక్రయాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాణసంచా అక్రమ విక్రయాలు, తయారీ, నిల్వలను గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 11కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. -
శుభకార్యానికెళ్తూ.. అనంతలోకాలకు
మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు నుజ్జునుజ్జయిన కారు ఆత్మకూరు: కారు నడుపుతూ ఫోన్లో మాట్లాడే క్రమంలో ఏమరుపాటుగా వ్యవహరించడంతో డివైడర్ను వాహనం ఢీకొని తాత, మనవరాలు మృతి చెందిన ఘటన మండలంలోని కరటంపాడు సమీపంలో గల నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. ఎస్సై జిలానీ వివరాల మేరకు.. నెల్లూరులోని బీవీనగర్కు చెందిన జలసత్రం వేమయ్య (54), తమ సమీప బంధువుల శుభకార్యం నిమిత్తం బద్వేల్కు కుమార్తె మొగిలి మౌనిక, మనవరాలు సహస్ర (2), మనవడు యశ్వంత్తో కలిసి కారులో బయల్దేరారు. ఈ తరుణంలో ఆత్మకూరు మండలం కరటంపాడు సమీపంలోని గిరిజన కాలనీ వద్ద వేమయ్యకు ఫోన్ రావడంతో మాట్లాడే యత్నంలో ఎదురుగా ట్యాంకర్ వస్తుండటంతో దానికి దారిచ్చే క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్ను వేగంగా ఢీకొంది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న వేమయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మౌనిక, చిన్నారి సహస్ర తీవ్రంగా, యశ్వంత్ స్వల్పంగా గాయపడ్డారు. సమీపంలోని గిరిజన కాలనీ వారు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడికెళ్లిన పది నిమిషాలకే సహస్ర మృతి చెందింది. మౌనికకు చికిత్సను అందిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్లో మాట్లాడే క్రమంలో ఏమరుపాటు డివైడర్ను వేగంగా ఢీకొన్న కారు రోడ్డు ప్రమాదంలో తాత, మనవరాలి మృతి -
ఆర్థరైటిస్పై నిర్లక్ష్యం వహిస్తే ముప్పే
నెల్లూరు (టౌన్): ఆర్థరైటిస్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో శరీర వైకల్యాలొచ్చే ప్రమాదం ఉందని బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థరైటిస్ డేను పురస్కరించుకొని వాకథాన్ను అపోలో సూపర్స్పెషాల్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఆర్థరైటిస్కు అపోలోలో తక్కువ ఫీజుతో అందించే స్క్రీనింగ్ పరీక్షల బ్రోచర్లను వైద్యులతో కలిసి డైరెక్టర్ ఆ్ఫ్ మెడికల్ సర్వీసెస్ శ్రీరామ్ సతీష్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రూ.4590 విలువగల తొమ్మిది రకాల ఆర్థరైటిస్ స్క్రీనింగ్ పరీక్షలను రూ.1999కే అందించనున్నామని వివరించారు. రూ.8590 విలువగల మరో స్క్రీనింగ్ పరీక్షను రూ.3999కే చేయనున్నామని, ఈ అవకాశం డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఆర్థోపెడిక్ సీనియర్ సర్జన్లు వివేకానందరెడ్డి, శశిధర్రెడ్డి, విక్రమ్రెడ్డి, యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
బోల్తాపడిన ప్రైవేట్ బస్సు
కోవూరు: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘటన పట్టణంలోని ఆర్కే పెట్రోల్ బంక్ వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు 40 మంది ప్రయాణికులతో నవీన్ ట్రావెల్స్ బస్సు బయల్దేరింది. ఈ తరుణంలో నిద్రమత్తులోకి డ్రైవర్ జారుకోవడంతో వాహనం నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదంలో పది మంది స్వల్పంగా గాయపడగా, తిరుపతికి చెందిన చిన్నారి సమ్విక తీవ్రంగా గాయపడింది. చిన్నారిని నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రాథమిక చికిత్స పొందారు. ఆపై గమ్యస్థానాలకు బయల్దేరారు. ప్రమాదం జరిగే సమయానికి బస్సు అతివేగంతో వస్తోందని సమాచారం. విషయం తెలుసుకున్న కోవూరు ఇన్స్పెక్టర్ సుధాకర్రెడ్డి, ఎస్సై రంగనాథ్గౌడ్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వాహనాన్ని క్రేన్ సాయంతో రోడ్డుపైకి లాగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఘటన చిన్నారికి తీవ్రగాయాలు స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు -
పేదల ఆరోగ్యానికి ఆపద
● రెండో రోజూ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ ● ఇబ్బందుల్లో రోగులు నెల్లూరు (టౌన్): పేదల ఆరోగ్యానికి ఆపద వచ్చి పడింది. ప్రభుత్వం ఏడాది కాలానికి పైగా ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ)లకు బకాయిలు విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు వైద్య సేవలు నిలిపివేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా శనివారం జిల్లాలోని అన్ని నెట్ వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిపివేశారు. ప్రతి ఆస్పత్రి వద్ద ఆరోగ్యశ్రీ కింద వేద్య సేవలు నిలిపివేశామని బ్యానర్లు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి స్పెషాలిటీ ఆస్పత్రులకు వైద్యం చేయించుకునేందుకు వచ్చారు. రోగులు ఎంత బతిమాలాడినా ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించకపోవడంతో నిరాశ, నిస్పృహలతో వెనుతిరిగారు. జిల్లాలోని 35 నెట్వర్క్ ఆస్పత్రులు ఉండగా 30 ఆస్పత్రుల్లో వైద్యసేవలు నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అరవింద్ కిడ్నీ వైద్యశాల అధినేత డాక్టర్ ఎస్వీఎల్ నారాయణరావు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదని, కనీసం చర్చలకు పిలవకపోవడం దారుణమన్నారు. బకాయిలు విడుదల చేసేంత వరకు సేవలు కొనసాగించే ప్రసక్తే లేదన్నారు. -
రాజకీయంగా ఎదుర్కోలేకే తప్పుడు కేసులు
● దర్గామిట్ట పోలీస్స్టేషన్కు ప్రసన్న హాజరు కోవూరు: మాకు న్యాయ వ్యవస్థపై అపార నమ్మకం ఉందని, ప్రజా నాయకుడిగా తానెప్పుడూ చట్టాన్ని ధిక్కరించలేదని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. అయితే తనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక నా ప్రత్యర్థులు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని నాపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. జూలై 31న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసన్నను పరామర్శించేందుకు వచ్చిన సందర్భంలో పోలీసులు ఆయనపై తప్పుడు కేసు బనాయించారు. ఈ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఆయన నెల్లూరులోని దర్గామిట్ట పోలీస్స్టేషన్కు హాజరయ్యారు. సీఐ రోశయ్య, ఎస్ఐ సుబ్బారావు సమక్షంలో సంతకం చేశారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ ఈ కేసులో తనకు హైకోర్టు నుంచి బెయిల్ మంజూరు కావడంతో కోర్టు షరతుల ప్రకారం పోలీస్స్టేషన్కు హాజరైనట్లు తెలిపారు. తనపై రాజకీయ ప్రేరేపిత కేసులు మోపారని, ఈ కేసుల నుంచి కోర్టు ద్వారానే న్యా యం జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. -
‘సాక్షి’పై మరో రెండు అక్రమ కేసులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే ‘సాక్షి’ యాజమాన్యంతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, రిపోర్టర్లపై అనేక అక్రమ కేసులు పెట్టించింది. విచారణ పేరుతో పోలీస్ స్టేషన్లకు పిలిచి వేధిస్తోంది. ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంపై ఎల్లో మీడియా సైతం కథనాలు రాస్తున్నా దాన్ని ఏమీ చేయలేని కూటమి సర్కారు ‘సాక్షి’పై మాత్రం కక్ష సాధిస్తోంది.నకిలీ మద్యం అంశంపై ఎలా వ్యవహరించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్న ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ‘సాక్షి’ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ ఎక్సైజ్ అధికారుల ఫిర్యాదుల మేరకు ‘సాక్షి’ యాజమాన్యంతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, రిపోర్టర్లపై నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసుస్టేషన్లలో రెండు అక్రమ కేసులు నమోదు చేయించింది. నకిలీ మద్యంపై ‘సాక్షి’ రాసిన కథనాలు తమ శాఖ పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ కలిగిరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ షేక్ అబ్దుల్ జలీల్, నెల్లూరు–1 ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.రమేష్ బాబు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదులు చేశారు. వెంటనే పోలీసు అధికారులు ‘సాక్షి’ పత్రిక యాజమాన్యంతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, జిల్లా బ్యూరో ఇన్చార్జి, రిపోర్టర్లపై 353(2), 356(3) ఆర్/డబ్ల్యూ 3(5)బీఎన్ఎస్ కింద అక్రమ కేసులు నమోదు చేశారు. రిపోర్టర్ ఇంట్లో ‘ఎక్సైజ్’ సోదాలు అంతేకాకుండా కలిగిరి ‘సాక్షి’ రిపోర్టర్ ఆర్.రాజగోపాల్రెడ్డి ఇంటిపై దాడి చేశారు. శనివారం ఉదయం సుమారు 10.30 గంటలకు ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి విలేకరి ఇంటికి వెళ్లారు. ‘రాజా అంటే నువ్వేనా? అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నారని నీపై ఫిర్యాదులు అందాయి. మీ ఇంట్లో తనిఖీలు చేయాలి’ అని చెప్పారు. ఇంట్లోకి ప్రవేశించి ఇల్లంతా సోదాలు చేశారు. ఎక్కడా మద్యం దొరక్కపోవడంతో వెనుదిరిగారు. ఎక్సైజ్ సిబ్బంది ఓవర్ యాక్షన్తో రాజగోపాల్రెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కాగా.. ఈ కేసులకు సంబంధించి విచారణకు హాజరు కావాలని శనివారం నెల్లూరు ‘సాక్షి’ బ్యూరో ఇన్చార్జికి నెల్లూరు రూరల్ పోలీసులు బీఎన్ఎస్ 179(1) నోటీసు అందజేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇదే కేసులో ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి కూడా నోటీసులు అందజేసేందుకు పోలీసులు హైదరాబాద్కు వెళ్తున్నట్టు సమాచారం. -
నకిలీ మద్యం వ్యవహారంలో డైవర్షన్ పాలిటిక్స్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నకిలీ మద్యం వ్యవహారంలో పీకల వరకు కూరుకుపోయిన టీడీపీ పెద్దలు దానినుంచి బయటపడేందుకు అరెస్టయిన వారు కోవర్ట్లు అంటూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నకిలీ మద్యం కేసులో అరెస్టయిన టీడీపీ నేత జయచంద్రారెడ్డికి వైఎస్సార్సీపీతో లింకులున్నాయని, కోవర్ట్గా తమ పారీ్టలో చేరాడంటూ సీఎం చంద్రబాబు అనడం ఆయన దివాళాకోరు తనానికి నిదర్శనమన్నారు.దొరికిన దొంగలకు వైఎస్సార్సీపీ కోవర్ట్ అనే ముద్ర వేసి, తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. నకిలీ మద్యం మరణాలపై వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ యాజమాన్యం, విలేకరులపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు ప్రజలకు తెలియకూడదని మీడియా గొంతు నొక్కేందుకు కూడా ఈ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా నకిలీ మద్యం మాఫియా బయటపడిందని, ఇందులో టీడీపీ నాయకుల పాత్ర ఆధారాలతో సహా రుజువైందని చెప్పారు.సీఎం సొంత జిల్లా ములకలచెరువులోనే నకిలీ మద్యం తయారు చేసి అసలు మద్యం మాదిరిగా మార్కెట్లోకి తీసుకువచ్చారన్నారు. ఇంత పెద్ద వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో కీలకపాత్రధారి దాసరిపల్లె జయచంద్రారెడ్డి 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున చంద్రబాబు నుంచి బీఫాం తీసుకుని తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారన్నారు. ఈ నిందితుల్లో జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్రెడ్డి, కట్టా సురేంద్రనాయుడు, జనార్దన్ తదితరులు చంద్రబాబు, లోకేశ్కు అత్యంత సన్నిహితులే అన్నారు.ఈనాడు రామోజీరావు కొడుకు కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ నకిలీ మద్యం వ్యవహారం నుంచి టీడీపీని ఎలా కాపాడాలా అని మధనపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటయ్యాయన్నారు. నెల్లూరు జిల్లా కలిగిరి, నెల్లూరు రూరల్ పోలీస్స్టేషన్లో ‘సాక్షి’ పత్రిక విలేకరులపై, యాజమాన్యంపై రెండు కేసులు పెట్టారన్నారు. ‘సాక్షి’ విలేకరి ఇంట్లోకి వెళ్లిన ఎక్సైజ్ పోలీసులు హంగామా సృష్టించారని, నకిలీ మద్యం తాగి చనిపోయారు అని వార్త రాసినందుకు విలేకరిపై జులుం ప్రదర్శించారని పేర్కొన్నారు. -
సూపర్ సిక్స్ పథకాలు.. డూపర్ మోసాలు
వరికుంటపాడు: చంద్రబాబు చెప్పిన పథకాలు కొన్ని అరకొర మందికి అందితే.. మరి కొన్ని అమలే చేయకుండా.. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అంటూ ప్రచారం చేసుకోవడానికి సిగ్గు లేదా? అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ కాకాణి గోవర్ధన్రెడ్డి దుయ్యబట్టారు. కూటమి సూపర్ సిక్స్ పథకాలు.. డూపర్ మోసాలపై ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి తెలియజేయాలని కోరారు. శుక్రవారం వరికుంటపాడు మండలం ఇరువురులో నిర్వహించిన వైఎస్సార్సీపీ ఆత్మీయ సభలో పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు నిన్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలను జూన్ 2024 నుంచి అమలు చేస్తానని మొదటి ఏడాది ఎగ్గొట్టారన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద చంద్రబాబు రైతులకు శఠగోపం పెట్టారన్నారు. ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకంగా రూ.15 వేలు ఇస్తానని అరకొరగా నిధులు జమ చేశాడన్నారు. నిరుద్యోగ భతి, మహిళలకు ఆడబిడ్డ నిధి పథకాల ఊసేలేకుండా మంగళం పాడేశారన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా, రైతులను నష్టాల ఊబిలోకి నెట్టేశారన్నారు. చంద్రబాబు తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రశ్నించే వారిపై పోలీసులను ఉసిగొల్పి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం, జైలుకు పంపుతున్నారన్నారు. చంద్రబాబు కాపీ కొట్టడం తప్ప, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు సొంత ఆలోచన ఉండదని, జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలు, ఇతర రాష్ట్రాల్లో అమలు చేసిన పథకాలకు పేర్లు మార్చి, అంతా తన గొప్పేనంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చారని, దేశ చరిత్రలో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు రూ.కోట్ల విలువ చేసే భూములను ఎకరా వంద రూపాయలకు ప్రైవేట్ పరం చేస్తున్నాడని ఆరోపించారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టామన్నారు. కూటమి నేతలు కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారన్నారు. చంద్రబాబు అనుచరులే కల్తీ మద్యం తయారీలో ప్రధాన సూత్రధారులుగా నిలిచారని, వీరి అండదండలు లేకపోతే చంద్రబాబు సొంత జిల్లాలో కల్తీ మద్యాన్ని స్వేచ్ఛగా తయారు చేయడం సాధ్యమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీపై మీకున్న ప్రేమాభిమానాలు వెలకట్టలేనివని, కష్టకాలంలో పార్టీ జెండాను మోసిన ప్రతి ఒక్క కార్యకర్తను మా భుజాలపై మోసేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో నెల్లూరు పార్లమెంటరీ పరిశీలకులు జంకె వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకులు ధనుంజయరెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ యువనాయకులు మేకపాటి అభినవ్రెడ్డి, జెడ్పీటీసీలు, గణపం బాలకృష్ణారెడ్డి, మేదరమెట్ల శివ లీల, చెరుకుపల్లి రమణారెడ్డి, మోడీ రామాంజనేయులు, అన్ని మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలి 17 నెలల పాలనలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
అసమర్థ, అబద్ధాల పాలకులు
నెల్లూరు (స్టోన్హౌస్పేట): ఈ రాష్ట్రంలో అసమర్థ, అబద్ధాల పాలకులు రాజ్యమేలుతున్నారని, మెడికల్ కళాశాలల విషయంలో ఇది ప్రస్ఫుటం అవుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి దుయ్యబట్టారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ పోస్టర్ను ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ర్డెడి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టామన్నారు. తొలిరోజు ఉదయగిరి నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించామన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నా రు. ప్రజల సొమ్మును ప్రభుత్వ ఆస్తులను కొల్ల గొట్టే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడన్నారు. జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి తీసుకుని వచ్చిన 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నాడన్నారు. పేద విద్యార్థులు వైద్య విద్య దూరం కావడంతోపాటు, పేదల కోసం ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు కాబోవన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం మెడికల్ కళాశాలకు సంబంధించి అబద్ధాలు మాట్లాడడం దారుణమని, జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం మెడికల్ కళాశాల వద్ద కూటమి నేతలు మాట్లాడే అబద్ధాలను ప్రజలకు తెలిసేలా చేశారన్నారు. కూటమి నేతలు చేస్తున్న తప్పులను ఒప్పుకోకుండా, జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేస్తున్నారన్నారు. ఆయన తెచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను చంద్రబాబు ప్రైవేట్ సంస్థలకు అమ్ముకుంటూ, సొమ్ము చేసుకోవడం దుర్మార్గమన్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను ప్రైవేటు పరం చేయడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని, అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22వ తేదీ వరకు 42 రోజుల పాటు అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సంతకాలు సేకరిస్తామన్నారు. అక్టోబర్ 28వ తేదీన నియోజకవర్గ స్థాయిలో, నవంబర్ 12వ తేదీన జిల్లా స్థాయిలో ర్యాలీ నిర్వహించి, ప్రజలలో అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజల నుంచి 60 వేల సంతకాల సేకరించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, నవంబర్ 26వ తేదీ సేకరించిన కోటి సంతకాలను జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో గవర్నర్కు వినతి పత్రంగా అందజేస్తామన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతాం కోటి సంతకాల ఉద్యమంతో కూటమిని కూకటి వేళ్లతో సహా పెకలిస్తాం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
కూటమి పాలనలో..
పేదల వైద్య సేవలపై కూటమి ప్రభుత్వ నిర్దయ కొనసాగుతోంది. 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్లక్ష్యం చేసింది. అంతకు ముందుకు 3500పైగా ప్రొసీజర్స్ ఉంటే.. వాటిని సగానికి పైగా తగ్గించడంతోపాటు అత్యంత అవసరమైన ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీ నుంచి తొలగించింది. తాజాగా మరోసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం పేద వైద్య సేవలను నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రభుత్వ వైద్య సేవలతోపాటు ఆరోగ్యశ్రీ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు ఎటువంటి వైద్య సేవలు అందే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుత ప్రభుత్వ వైఖరి చూస్తుంటే.. కరోనా వచ్చినప్పుడు ఈ ప్రభుత్వమే ఉండి ఉంటే.. ఊర్లకు ఊర్లు శ్మశానాలు అయ్యేవంటూ గ్రామీణ ప్రజలు, పేదలు అప్పటి పరిస్థితులు తలుచుకుని ఒక్కసారిగా వణికిపోతున్నారు. -
ఉపాధిలో అక్రమాలకు కళ్లెం పడేనా?
● ఈకేవైసీ ప్రవేశపెట్టిన కేంద్రం ● యాప్లో వివరాల నమోదుఉదయగిరి: జాతీయ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో కూలీలు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కూలీలు తమ జాబ్కార్డుతో ఆధార్కార్డును అనుసంధానం చేసుకుంటేనే పనికి వెళ్లే వెసులుబాటు ఉంటుంది. ఈకేవైసీ నమోదు ప్రక్రియ కోసం కేంద్రం ప్రత్యేక యాప్ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఈ ప్రక్రియ సాగుతోంది. కూలీలు ఉపాధి సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేయించుకోకపోతే పనిచేసే అర్హత కోల్పోతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉపాధి పనుల్లో పారదర్శకత కొరవడటం, అవినీతి ఆరోపణలు, నిధుల దు ర్వినియోగం తదితర అంశాలపై తరచూ ఆరోపణలు వెల్లువెత్తడం, సోషల్ ఆడిట్లో వెలుగు చూస్తుండటంతో కేంద్రం ఈ చర్యకు ఉపక్రమించింది. క్షేత్రస్థాయిలో జరిగే అవినీతికి చెక్ పెట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది.పనులు చేస్తున్న కూలీలు ఈకేవైసీ చేస్తున్న సిబ్బంది -
ఐఎంఏ అధ్యక్షుడిగా మస్తాన్బాషా
నెల్లూరు(అర్బన్): ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ మస్తాన్బాషా, కార్యదర్శిగా నగరంలోని ఎండోక్రైనాలజిస్ట్ రామ్మోహన్రావును ఎన్నుకున్నారు. నెల్లూరు సరస్వతి నగర్లోని ఐఎంఏ హాల్లో గురువారం రాత్రి జరిగిన సభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కోశాధికారిగా డాక్టర్ హర్షవర్ధన్, నెల్లూరు మెడికల్ సొసైటీ చైర్మన్గా డాక్టర్ ఉమామహేశ్వరరెడ్డి, సెక్రటరీగా డాక్టర్ ప్రదీప్ను, కోశాధికారిగా డాక్టర్ వెంకటేశ్వర్లును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు మస్తాన్బాషా మాట్లాడుతూ అందరి సహకారంతో డాక్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తనను ఎన్నుకున్నవారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పూర్వ అధ్యక్షుడు డాక్టర్ అమరేంద్రనాథ్రెడ్డి, గౌరవ కార్యదర్శి డా.రాహుల్బాబు తదితరులు పాల్గొన్నారు.మస్తాన్బాషా రామ్మోహన్రావు -
యూరియా అమ్మకాల నిలిపివేత
మనుబోలు: పిడూరుపాళెంలో శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్లో సరైన అనుమతి పత్రాలు లేకపోవడంతో రూ.75,400 విలువైన యూరియాను విక్రయించడానికి వీల్లేదంటూ (స్టాప్ సేల్) ఆదేశాలు జారీ చేశామని ఏడీఏ కె.కన్నయ్య తెలిపారు. మండలంలోని ఎల్ఎన్పురం, కాగితాలపూరు, మనుబోలు, పిడూరుపాళెం, బద్దెవోలు గ్రామాల్లోని విత్తన, ఎరువుల దుకాణాలను శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, బిల్ పుస్తకాలు, ఎరువుల నిల్వలను పరిశీలించారు. మన్నారు. ఆయన వెంట మనుబోలు మండల వ్యవసాయాధికారి వెంకటకృష్ణ, సిబ్బంది ఉన్నారు. -
ప్రయాణం.. నరకప్రాయం
● అల్లూరు రోడ్డుపై ఇదీ పరిస్థితి ● కొంతమేర వేసి వదిలేసిన వైనం కొడవలూరు: అల్లూరు రోడ్డు ప్రయాణికులకు నరకం చూపుతోంది. కొడవలూరు నుంచి అల్లూరు వెళ్లే రోడ్డుకు ఎంతో ప్రాధాన్యముంది. దీని మీదుగానే విడవలూరు, రామతీర్థం, అల్లూరుకు వెళ్లాల్సి ఉంది. మండల పరిధిలో 5 కి.మీ. మేర విస్తరించి ఉంది. ఇది పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. ఇటీవల నిర్మాణం చేశారు. కానీ కొడవలూరు నుంచి గుండాలమ్మపాళెం వరకూ ఒక కిలోమీటర్ మేర వదిలేశారు. అక్కడి నుంచి పద్మనాభసత్రం వరకూ వేశారు. పద్మనాభసత్రం నుంచి తలమంచి రోడ్డు వరకూ వేయలేదు. ఇరువైపులా కిలోమీటర్ వంతున రోడ్డు వేయకపోవడం వల్ల పెద్దగా ప్రయాజనం కనిపించడం లేదు. ఈ రెండు కిలోమీటర్ల రహదారి బాగా దెబ్బతిని గుంతలమయమై ఉంది. ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో బస్సులు ఎక్కువ సంఖ్యలో తిరుగుతున్నాయి. రాకపోకలు సాగించే ప్రయాణికుల బాధలు వర్ణనాతీతం. రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు గుంతల్లో పడి ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్నారు. నెల క్రితం ఓ వ్యక్తి పడిపోయి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పైగా గుంతలమయంగా ఉన్న ఈ రోడ్డు మలుపులుగా ఉండటంతో మరింత ప్రమాదాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో రోడ్డు బాగు పడుతుందని అందరూ భావించారు. కానీ పూర్తిగా వేయకుండా ఇరువైపులా వదిలేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే స్పందించి రోడ్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు కుట్ర
● మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కావలి(అల్లూరు): ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆయన నివాసంలో వైఎస్సార్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ కావలి నియోజకవర్గం నుంచి 60 వేల సంతకాల సేకరణే లక్ష్యంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. నవంబర్ 25న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో గవర్నర్కు కోటి సంతకాలు అందజేస్తామన్నారు. ఈనెల 28న కావలి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. పేదల కోసం జగన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారన్నారు. ఎక్కడా లేని విధంగా వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ఇది పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమేనన్నారు. ప్రైవేటీకరణ ఆపకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కేతిరెడ్డి శివకుమార్రెడ్డి, దండా కృష్ణారెడ్డి, వాయిల తిరపతి, కనమర్లపూడి నారాయణ, చెన్ను ప్రసాద్రెడ్డి, గుడ్లూరు మాల్రాద్రి, దామిశెట్టి సుధీర్ నాయుడు, కుందుర్తి కామయ్య, గంధం ప్రసన్నాంజనేయులు, వెంకటేశ్వర్ రెడ్డి, షాహుల్ హమీద్, కె.శ్రీనివాసులురెడ్డి, కె.శ్రీనివాసులు, అబ్దుల్లా, మునీర్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రివర్యా.. చూస్తున్నారా?
కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలుఇలా ఉంటే రోగాలు రావా? కాలువ మొత్తం ఇదే దుస్థితినెల్లూరు సిటీ.. ఇది సాక్షాత్తు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇక్కడ పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. నెల్లూరును రాష్ట్రంలోనే రోల్మోడల్గా తీర్చిదిద్దుతానని నిత్యం మంత్రి చెబుతుంటారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు జనం రోగాల బారిన పడేలా ఉన్నాయి. సర్వేపల్లి, జాఫర్సాహెబ్ కాలువల్లో చెత్త పేరుకుపోయింది. ప్లాస్టిక్ వ్యర్థాలు అలాగే ఉన్నాయి. దుర్వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా దీని గురించి పట్టించుకునే వారు లేకుండా పోయారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
పొదల్లో విగతజీవిగా..
● వృద్ధుడిని ఢీకొట్టిన కారు ● డ్రైవర్ నిద్రమత్తే కారణం ● సాయంత్రం గుర్తించే సరికి ప్రాణాలు విడిచి..దుత్తలూరు: కారు ఢీకొట్టడంతో ఓ వృద్ధుడు పొదల్లో పడ్డాడు. ఆయన్ను ఎవరూ గుర్తించలేదు. సాయంత్రం చూసేసరికి చనిపోయి ఉన్నాడు. ఈ ఘటన శుక్రవారం దుత్తలూరు పంచాయతీ చింతలగుంట సమీపంలో 565వ జాతీయ రహదారిపై జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన దుగ్గినబోయిన పెదబాల నరసింహులు (70) రహదారి పక్కన నడిచి వెళ్తున్నాడు. వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ నుంచి పామూరు వైపు కారు వెళ్తుండగా డ్రైవర్ నిద్రమత్తులో నరసింహుల్ని ఢీకొట్టాడు. దీంతో కారు రోడ్డు మార్జిన్ దిగి పొదల్లోకి దూసుకెళ్లింది. స్థానికులు అక్కడికి చేరుకుని కారును ట్రాక్టర్తో బయటకు తీశారు. అయితే నరసింహులును కారు ఢీకొట్టిన విషయం ఎవరూ గమనించలేదు. సాయంత్రమైనా ఆయన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది గ్రామ పరిసర ప్రాంతాల్లో గాలించారు. అనుమానం వచ్చి కారు ప్రమాదం జరిగిన ప్రదేశంలో చూడగా చెప్పులు కనిపించాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో చూశారు. పొదల్లో నరిసింహులు విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే గ్రామస్తులు బయటకు తీయగా చనిపోయి ఉన్నాడు. గ్రామస్తులు సమాచారాన్ని పోలీసులకు అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
మినీ ట్రక్కు ఢీకొని..
● ఉద్యాన శాఖ విస్తరణాధికారిణి మృతి నెల్లూరు(క్రైమ్): జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉద్యాన విస్తరణాధికారిణి మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నవాబుపేట కృష్ణానగర్లో డి.ప్రియాంక (34), బాలవిశ్వనాథ్ దంపతులు నివాసముంటున్నారు. ప్రియాంక కోవూరులో ఉద్యాన విస్తరణాధికారిణిగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం ఆమె వేదాయపాళెంలోని ఆ శాఖ జిల్లా కార్యాలయానికి స్కూటీపై బయలుదేరారు. సౌత్రాజుపాళెం జంక్షన్ వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి మినీ ట్రక్కు స్కూటీని వేగంగా ఢీకొంది. గాయాలపాలైన ఆమెను స్థానికులు సమీపంలోని మెడికవర్ హాస్పిటల్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రియాంక మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు నార్త్ ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందింది. వారు హాస్పిటల్కు చేరుకుని మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. రెండు పెట్రోలు పంపుల సీజ్ పొదలకూరు: పట్టణంలోని సంగం రోడ్డు సెంటర్లో ఉన్న దామోదరం పెట్రోలు బంక్లో గురువారం లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి రెండు పంపులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా మూడు జిల్లాల లీగల్ మెట్రాలజీ అధికారి ఐజాక్ మాట్లాడుతూ పెట్రోలు బంక్లో కొలతలు తేడా ఉన్నట్టు వెల్లడించారు. 5 లీటర్ల పెట్రోలు, డీజిల్ పట్టుకుంటే 100 ఎంఎల్ నుంచి 140 ఎంఎల్ తేడా చూపుతున్నట్టు పేర్కొన్నారు. తనిఖీల్లో జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి రియాజ్బాషా, ఏఎస్ఓ అంకయ్య, సివిల్ సప్లయ్స్ డీటీ ఐ.రవి పాల్గొన్నారు. నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు బ్రాయిలర్: రూ.118 లేయర్ రూ.122 బ్రాయిలర్ చికెన్: రూ.214 స్కిన్లెస్ చికెన్: రూ.236 లేయర్ చికెన్: రూ.207 -
చికిత్స అందిస్తే కోలుకుంటారు
సమాజంలో మానసిక సమస్యలున్న వారి సంఖ్య పెరగడం బాధాకరం. ఇలాంటి వారికి ప్రాథమిక లక్షణాలున్నప్పుడే గుర్తించి తగిన చికిత్స అందిస్తే కోలుకుంటారు. చికిత్సతోపాటు ఒత్తిడిని జయించేలా కౌన్సెలింగ్ ఇప్పించాలి. లేకుంటే చిన్న సమస్యలకే కోపం, ఆత్మన్యూనత, ఆత్మహత్య లాంటి ఆలోచనలు వస్తాయి. ఇలాంటి వారికి హిప్పో థెరపీ, బిహేవియర్ థెరపీ, సైకో థెరపీ చికిత్సలు అవసరం. ప్రస్తుతం ఇతర శారీరక అనారోగ్యాలకు చికిత్స అందిస్తున్నట్టుగానే మానసిక జబ్బులకు చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ లక్ష్మీప్రసూన, మానసిక వైద్య విభాగం హెచ్ఓడీ, సర్వజన ఆస్పత్రి, నెల్లూరు -
28న కోవూరులో భారీ ప్రదర్శన
● నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కోవూరు: ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేస్తాం. ఈనెల 28వ తేదీన కోవూరులో భారీ ప్రదర్శన జరుగుతుంది’ అని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ కోవూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం గురువారం నెల్లూరులోని ప్రసన్న నివాసంలో జరిగింది. దీనికి కోవూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల కన్వీనర్లు, సీనియర్ నాయకులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి పదవుల్లో ఉన్న వారు హాజరయ్యారు. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజా సమస్యలు, రాబోయే కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు చెప్పారు. పేదలు, మధ్య తరగతి కుటుంబాల కోసం విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి వైద్య విద్యను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఆ కాలేజీలను ప్రైవేట్పరం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. పేదలకు వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదన్నారు. ప్రజలు, విద్యార్థులు, భవిష్యత్ తరాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం ముమ్మరం చేస్తామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక పేదలకు ఆనందం కరువైందన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని చెప్పారు. ప్రజలకు ఉపాధి, భద్రత లభించడం లేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం చెరిపేయాలని ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 28వ తేదీన కోవూరు మండలంలో చేపట్టే భారీ ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. -
మానసిక ఆరోగ్యం.. అవగాహన కీలకం
నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం● నిర్లక్ష్యం చేస్తే మతిస్థిమితం కోల్పోవడం ఖాయం ● రోజూ వైద్యం కోసం వెళ్తున్న మూడు వేలమంది ● ఒత్తిడి, అవహేళనతో కుంగుబాటు ● ప్రాథమిక దశలో చికిత్సతో సాధారణ జీవితం జిల్లాలో రోజూ సుమారు 15 వేల మంది వరకు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలల్లో చికిత్స కోసం వస్తున్నారు. వీరిలో మూడు వేల మంది రోగులు మానసిక సమస్యలతో డాక్టర్ల వద్దకు వైద్యం కోసం వెళ్తున్నారు. గతంలో నెల్లూరులో కేవలం ఇద్దరు మానసిక వైద్య నిపుణులుండగా ఇప్పుడు పదిమంది వరకు చికిత్స అందిస్తున్నారు. అలాగే ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రత్యేకంగా పలువురు మానసిక వైద్య నిపుణులతో విభాగం ఉంది. నెల్లూరు(అర్బన్): మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధిస్తాడు. శారీరక ఆరోగ్యమే కాదు. మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమే. చదువు పేరుతో విద్యార్థుల్లో విపరీతమైన ఒత్తిడి పెంచడం, ఉద్యోగులను టార్గెట్ల పేరుతో వేధించడం, సీ్త్రలకు పిల్లలు సకాలంలో పుట్టకపోతే తక్కువ చేసి చూడటం, కొన్ని శారీరక అనారోగ్యాలు, సామాజికంగా తక్కువ చేసి చూడటం.. ఇవన్నీ మనిషి మెదడుపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఏమి చేయలేమనే ఆత్మన్యూనత భావంతో అనేకమంది మానసిక రోగులుగా మారుతున్నారు. వీరికి సకాలంలో కౌన్సెలింగ్ ఇచ్చి ప్రాథమిక దశలోనే వైద్య చికిత్స చేస్తే కోలుకుంటారు. లేకుంటే జీవితం నరకప్రాయంగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో మతిస్థిమితం కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1992 నుంచి అక్టోబర్ 10వ తేదీని ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తోంది. మానసిక ఒత్తిడే ప్రధాన కారణం హడావుడి జీవితం, ఒత్తిడితో బతకడం నేటి సమాజంలో మామూలైంది. ఉమ్మడి కుటుంబాలు చిన్నాభిన్నమై, సమస్య వచ్చినప్పుడు సరిదిద్దే పెద్దలు లేకపోవడంతో చిన్న విషయాలకు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థి దశ నుంచే పోటీతత్వం పెరిగిపోయింది. ర్యాంక్ల పేరుతో ఇంట్లో తల్లిదండ్రులు, విద్యాలయాల్లో అధ్యాపకులు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఆటపాటలు, ఆనందాల్లేవు. చదువు.. చదువు అంటూ ప్రాణాలు తోడేస్తున్నారు. ఇటీవల వనంతోపు సెంటర్లో ఓ కళాశాలలో రెండు నెలల్లోనే ఇద్దరు విద్యార్థులు హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అలాగే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ తొలి సంవత్సరం విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డారు. మరో ప్రైవేట్ మెడికల్ కళాశాలలోనూ ఇలాగే జరిగింది. సామాజికంగా చిన్నచూపు చూస్తూ ఇబ్బంది పెట్టిన ఘటనలో కొందరు మానసిక సమస్యలకు గురవుతున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కౌన్సెలింగ్ తప్పనిసరి. స్వచ్ఛంద సంస్థల సభ్యులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, డాక్టర్లు యువతతోపాటు ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. జిల్లాలో ఇలా.. -
సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు
నెల్లూరు(క్రైమ్): సీఎం చంద్రబాబు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ అజిత 1,250 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ గురువారం నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బందోబస్తు విధులకు హాజరైన పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలిపేలా చూడాలన్నారు. ప్రధాన కూడళ్లలో మూవబుల్ బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. వీవీఐపీ వెళ్లే మార్గంలో వ్యతిరేక దిశలో వాహనాల కదలికల్ని పూర్తిగా నిరోధించాలన్నారు. అనంతరం ఆమె సీఎం పర్యటించే ప్రాంతాల్లో ట్రయల్ కాన్వాయ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు పాల్గొన్నారు. రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణంనెల్లూరు(క్రైమ్): పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరు సౌత్ రైల్వే స్టేషన్ సమీపంలో చైన్నె వైపు వెళ్లే రైలు పట్టాలపై గురువారం చోటుచేసుకుంది. మృతుడి వయసు 55 నుంచి 60 ఏళ్ల లోపు ఉండొచ్చని భావిస్తున్నారు. గోధుమ రంగు ఫుల్ హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. వేట సాగక.. పూట గడవక.. తోటపల్లిగూడూరు: మండలంలోని తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు ఇబ్బందుల్లో ఉన్నారు. కోడూరు పంచాయతీలోని 8 మత్స్యకార గ్రామాలతోపాటు వెంకన్నపాళెం పట్టపుపాళెంలోని సుమారు 3 వేల మంది వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. కొంత కాలంగా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సముద్రంలోని మత్స్య సంపద దరికి చేరడం లేదు. దీంతో ఇప్పటి వరకు అంతంతమాత్రంగా సాగుతున్న వేట పూర్తిగా నిలిచిపోయే పరిసిత్థి ఏర్పడింది. తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. పోటు కారణంగా సముద్రం కాస్త ఉగ్రరూపంగా మారుతోంది. దీంతో వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు భయపడుతున్నారు. ఒకవేళ ధైర్యం చేసి వెళ్లినా చేపలు లభ్యం కాక ఖాళీ పడవులతో తిరిగి రావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అనేకమంది తమ వేట సామగ్రి, పడవులను తీరంలో కట్టేసి ఇతర పనులను చూసుకుంటున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
కండలేరులో 59.206 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 59.206 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 3,400 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. ఇక్కడి నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,200, పిన్నేరు కాలువకు 80, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 150, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.40 సన్నవి : రూ.25 పండ్లు : రూ.15 -
అటవీ ప్రాంతంలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు
సీతారామపురం: మండలంలోని పండ్రంగి బీట్ అటవీ ప్రాంతాన్ని గుంటూరు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం గురువారం తనిఖీ చేసింది. ఈ సందర్భంగా స్క్వాడ్ బృంద ఎఫ్ఆర్వో సుబ్బారావు మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై అటవీ శాఖ సిబ్బంది డేగకన్ను వేయాలని సూచించారు. అడవుల సంరక్షణపై అంకితభావంతో పనిచేయాలని కోరారు. అటవీ సంపదను ఎవరైనా అక్రమంగా నరికి తరలిస్తున్నారనే అంశాలపై క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. డీఆర్వో ప్రసాద్, ఎఫ్ఎస్వో అశోక్, ఎఫ్బీఓలు గౌతమ్, సాయి, ప్రసాద్, రమణ తదితరులు పాల్గొన్నారు. -
పారా లీగల్ వలంటీర్ల పాత్ర కీలకం
నెల్లూరు (లీగల్): పారా లీగల్ వలంటీర్ల పాత్ర కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ పేర్కొన్నారు, ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలు.. ప్రభుత్వ సంస్థలకు వారధిగా ఉంటూ బాధ్యతతో మెలగాలని పేర్కొన్నారు. న్యాయసేవ విధులు, పలు చట్టాలపై అవగాహన కల్పించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వాణి, లోక్అదాలత్ ప్యానల్ న్యాయవాదులు టంగుటూరి గోపాల్రెడ్డి, కోటేశ్వరరావు, లక్ష్మీప్రసాద్, కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పోరాటం ఆగదు
● సంక్షేమ పథకాల అమలు అస్తవ్యస్తం ● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి ముత్తుకూరు(పొదలకూరు): మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పోరాటాన్ని తమ పార్టీ కొనసాగించనుందని, సంక్షేమ పథకాలు పేదలకు అందేంత వరకు ఉద్యమాలను చేస్తూనే ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. ముత్తుకూరులోని పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో గురువారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ అంటూ ప్రచారం చేసిన టీడీపీ శ్రేణులు ఇప్పుడు ప్రజలకు ముఖం చూపలేకపోతున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాలను తొలి ఏడాది ఎగ్గొట్టి.. తర్వాతి ఏడాది అరకొరగా అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సర్వీసులను పెంచకుండా ఉచిత బస్సుల పేరిట ప్రజలకు నరకం చూపుతున్నారని చెప్పారు. నాటి సీఎం జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన 17 మెడికల్ కళాశాలల్లో పదింటిని విక్రయించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని మండిపడ్డారు. దీన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం నుంచి నవంబర్ 22 వరకు కోటి సంతకాలను సేకరించనున్నామని వెల్లడించారు. కల్తీ మద్యంపై సోమిరెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం కల్తీ మద్యం మూలాలు కూటమి ప్రభుత్వంలో బయటపడుతుంటే.. తమపై బురదజల్లేందుకు సోమిరెడ్డి యత్నించడం దారుణంగా ఉందని కాకాణి విమర్శించారు. ఆయనకు డబ్బులిస్తే దేనికై నా సై అంటారని, గతంలో తనపై మోపిన కల్తీ మద్యం కేసుపై సీబీఐ విచారణ వేయించేందుకు సిద్ధమానని ప్రశ్నించారు. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబును ఇదే విషయమై అసెంబ్లీలో తాను కోరానని గుర్తుచేశారు. కల్తీ మద్యం బయటపడిన కేసులో కూటమి నేతలే ప్రధాన సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్కు అత్యంత సన్నిహితులే ప్రధాన పాత్రను పోషించారన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కూటమి నేతలు కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిపై విచారణ జరిపిస్తామని తెలిపారు. కృష్ణపట్నంలో టెర్మినల్ను తెప్పిస్తానన్న సోమిరెడ్డి ఎంత దూరం తీసుకొచ్చారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. పార్టీ మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్రెడ్డి, నెల్లూరు శివప్రసాద్, ఎంపీపీ గండవరపు సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
6.7 కిలోల గంజాయి స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు నగర పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలపై ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ అనిత తన సిబ్బందితో కలిసి దాడులను గురువారం చేపట్టారు. నారాయణ వైద్యకళాశాల సమీపంలో రామును అదుపులోకి తీసుకొని అతని నుంచి 700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాము సమాచారం మేరకు సమీప కాలనీలో ఉంటున్న దండుమారిని అదుపులోకి తీసుకొని ఇంట్లో సోదాలు చేశారు. ఆరు కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి వీరిని తరలించి తమదైన శైలిలో విచారించారు. సూళ్లూరుపేటకు చెందిన ప్రసాద్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నామని నిందితులు చెప్పారు. వీరితో పాటు స్వాధీనం చేసుకున్న గంజాయిని తదుపరి విచారణ నిమిత్తం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నెల్లూరు – 1 స్టేషన్లో అప్పగించారు. ఒడిశా నుంచి తీసుకొచ్చి జిల్లాలోని పలువురికి ప్రసాద్ విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు పూర్ణకుమార్, కాలేషావలీ, హెడ్ కానిస్టేబుళ్లు ప్రసాద్, రమేష్కుమార్, కానిస్టేబుళ్లు మునిరాజ్కుమార్, గిరిబాబు, రమణయ్య పాల్గొన్నారు. -
లైట్స్.. కెమెరా.. యాక్షన్
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఎత్తుగడ ● తన అనుయాయులకు కట్టబెట్టేందుకే స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ● మైపాడు రోడ్డును ఆక్రమించి దుకాణాల ఏర్పాటు ● నేడు ప్రారంభించాల్సి ఉన్నా, చివరి నిమిషంలో వాయిదాచిరు వ్యాపారుల పొట్టగొట్టి తన అనుయాయులకు లబ్ధి చేకూర్చేలా మంత్రి నారాయణ అడుగులేస్తున్నారు. అనుకున్నదే తడవుగా మైపాడు గేట్ సెంటర్లో స్మార్ట్ స్ట్రీట్ పేరుతో కంటైనర్లలో దుకాణాలను ఏర్పాటు చేశారు. స్ట్రీట్ వెండింగ్ పేరుతో మున్సిపల్ నిధులతో అన్ని సౌకర్యాలను కల్పించి షాపులను అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. దీనికి గానూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు నగరాన్ని తొలి దశలో ఎంచుకున్నారు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో వీటిని వ్యాపారులకు అప్పగిస్తామని చెప్తున్నా, టీడీపీ వారికే ఇచ్చేలా చర్యలు చేపడుతున్నారు. ఆయన కలలను సీఎం చంద్రబాబు సాకారం చేస్తూ.. దీన్ని శుక్రవారం ప్రారంభించాల్సి ఉన్నా, వాయిదా పడింది. సాక్షి ప్రతినిఽధి,నెల్లూరు: నగరాభివృద్ధిని విస్మరిస్తూ.. చిరు వ్యాపారుల పొట్టగొట్టి.. తమ్ముళ్ల జేబులు నింపుతూ.. కొత్త పథకాలతో తమ వారికి ఉపాధి కల్పించడంలో మంత్రి నారాయణ నూతన పోకడలను అవలంబిస్తున్నారు. దీనికి చక్కటి ఉదాహరణగా మైపాడు గేట్ సెంటర్లోని స్మార్ట్ స్ట్రీట్ నిలుస్తోంది. ఇంటికి అవసరమైన వస్తువులు ఒకే చోట లభించేలా.. వినియోగదారుల సౌలభ్యం కోసమంటూ దీన్ని తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఈ వ్యాపార సముదాయాలను మున్సి పల్ శాఖ ఆధ్వర్యంలో అప్పగించే యత్నాలను ప్రారంభించారు. చిరు వ్యాపారులను చిదిమేస్తూ.. వాస్తవానికి నగరాల్లో వీధి వ్యాపారులు ఫుట్పాత్లపైనే బిజినెస్ను సాగిస్తుంటారు. అయితే వీరి పొట్టగొట్టేందుకు స్కెచ్ వేశారు. స్ట్రీట్ వెండింగ్ పేరుతో మున్సిపల్ నిధులతో అన్ని సౌకర్యాలను కల్పించి షాపులను అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో వీటిని వ్యాపారులకు అప్పగిస్తామని చెప్తున్నా, అందుకు భిన్నంగా జరుగుతోంది. తమ్ముళ్ల కళ్లలో ఆనందం కోసం.. గత ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నారాయణ గెలుపొందారు. ఆ సమయంలో ఓ టీమ్ను ఏర్పాటు చేసి మూడు నెలల పాటు జీతాలిచ్చారు. డివిజన్ల వారీగా వారితో ఎన్నికల పనులు చేయించుకున్నారు. అధికారంలోకి వస్తే తప్పకుండా జీవనోపాధి కల్పిస్తామంటూ వారికి హామీనీ ఇచ్చారని టాక్. ఇంకేముంది పురపాలక మంత్రిగా బాధ్యతలను స్వీకరించాక స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ను తెరపైకి తెచ్చారు. నెల్లూరులోనే అయితే చెడ్డ పేరొస్తుందని భావించి.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాల్టీల్లో అమలు చేసేందుకు యత్నించారు. టీడీపీ నేతలిచ్చిన జాబితా మేరకే దుకాణాలను కేటాయించేలా అధికారులను ఆదేశించారు. ఫుట్పాత్లపై వ్యాపారాలు చేసేవారు ఖాళీ చేయాలంటూ కమిషనర్ ద్వారా హెచ్చరికలూ జారీ చేయించారు. బతుకుదెరువెలా..? ప్రధాన నగరాల్లో స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ఏర్పాటైతే వేలాది మంది చిరు వ్యాపారులు రోడ్డునపడే అవకాశం ఉంది. ఒక్క నెల్లూరులోనే ఫుట్పాత్లపై నాలుగు వేల మంది బిజినెస్ చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ తరుణంలో తమ పరిస్థితి ఏమిటాననే ఆందోళన వీరిలో వ్యక్తమవుతోంది. నాడు విస్తరిస్తే.. నేడు ఆక్రమిస్తున్నారు..! వాస్తవానికి నగరంలోని పాత చెక్పోస్ట్ నుంచి వేణుగోపాల్నగర్ (చేపల మార్కెట్) వరకు మైపాడు రోడ్డును దాదాపు 2.7 కిలోమీటర్ల మేర రూ.20 కోట్లను వెచ్చించి.. 60 అడుగుల వరకు నాలుగు వరుసల రహదారిగా గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో విస్తరించారు. ఈ దారిలో నిత్యం దాదాపు 15 వేల వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. సిమెంట్ రోడ్లు, డివైడర్లలో పచ్చదనం, సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేసి సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. రహదారికి ఇరువైపులా వాకింగ్ ట్రాక్, పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలనూ సిద్ధం చేశారు. ఈ తరుణంలో ఎన్నికలు రావడంతో వీటికి బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం రహదారికి ఇరువైపులా స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ పేరుతో 30 కంటైనర్లను పెట్టించి 120 మంది తెలుగు మహిళలకు మంత్రి నారాయణ అప్పగించారు. సమర్పయామీ.. నెల్లూరులో స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ తెలుగు మహిళలకు లాభసాటిగా మారింది. ఒక్కో దుకాణానికి రూ.నాలుగు లక్షలను కేటాయించనున్నామని మంత్రి తెలిపారు. ఇందులో మెప్మా, కార్పొరేషన్ నుంచి రూ.రెండు లక్షలు.. మరో రూ.రెండు లక్షల రుణ సదుపాయాన్ని కల్పించనున్నారు. మొత్తమ్మీద ఎన్నికల్లో పనిచేసిన వారికి రూ.8.4 కోట్లను వెచ్చించారు. ఎన్జీటీ నిబంధనలు బేఖాతర్ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ఏర్పాటుకు కొన్ని నిబంధనలను అమలు చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించినా.. మంత్రి, నగరపాలక సంస్థ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ అంశంపై ఎన్జీటీ దృష్టికి ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తీసుకెళ్లడంతో నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. పేరుకుపోయే చెత్త పక్కనే ఉన్న కాలువలో చేరి నీరు కలుషితమవుతుందని.. కాలువ పొరంబోకు స్థలాలు ఆక్రమణకు గురవుతాయనే వాదనతో ఏకీభవించింది. దీంతో పనులను తాత్కాలికంగా నిలిపేసి, నిబంధనలు పాటించాకే ప్రారంభించాలని పేర్కొంది. భూగర్భ డ్రైనేజీని పూర్తి చేసి కాలువకు కంచె వేస్తే, ఆ తర్వాతే షాపుల ఏర్పాటుకు అనుమతిస్తామని తెలిపింది. మరోవైపు ఈ పనులు పూర్తి కావాలంటే మరో పదేళ్లు పట్టే అవకాశం ఉంది. దీంతో ఎన్జీటీ మార్గదర్శకాలను పాటించకుండానే స్ట్రీట్ వెండింగ్ను హడావుడిగా ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతుండటం గమనార్హం. బాబొస్తున్నారు.. సుందరంగా మార్చండి మంత్రి నారాయణ ఆదేశాలు పర్యటనలో హడావుడిగా నెల్లూరును చేర్చినా.. చివరి నిమిషంలో రద్దు నెల్లూరు సిటీ: బాబొస్తున్నారు.. దుకాణ యజమానులు సిద్ధంగా ఉండండి.. సరుకులను సిద్ధం చేయండి.. స్మార్ట్ స్ట్రీట్ను శుభ్రం చేసి సుందరంగా మార్చండంటూ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి వెంకటాచలం మండలంలో పర్యటనకు సీఎం చంద్రబాబు శుక్రవారం రానున్నారు. ఇందులో భాగంగా తొలుత ఖరారు చేసిన రూట్మ్యాప్లో మైపాడు గేట్ సెంటర్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ ప్రారంభోత్సవమే లేదు. అయితే బుధవారం సా యంత్రానికి దీన్ని మంత్రి ఖరారు చేశారు. మరో వైపు దుకాణ నిర్వాహకులు, ఆ ప్రాంతం ప్రారంభానికి సిద్ధంగా లేదు. ఈ తరుణంలో మంత్రి హడావుడిగా నెల్లూరు చేరుకొని ఆదేశాలు జారీ చేశారు. అయితే చివరి నిమిషంలో పర్యటన రద్దవడంతో ఈ ప్రయాస వృథా అయింది. హడావుడిగా శుభ్రం మైపాడు గేట్ సెంటర్లోని స్మార్ట్ స్ట్రీట్ దుకాణాల వెనుక వైపు కాలువ మురికి కూపంలా మారింది. మురుగు నిలిచిపోయి తీవ్ర దుర్గంధం వచ్చేది. అయితే హడావుడిగా శుభ్రపర్చే యత్నాలను అధికారులు ప్రారంభించారు. అయినా అదే పరిస్థితి నెలకొంది. ఆయా దుకాణాల్లో ఫుడ్ కోర్టులున్న తరుణంలో తామక్కడ ఆహారాన్ని ఎలా తీసుకోగలమని పలువురు ప్రశ్నిస్తున్నారు. అప్పటికప్పుడు చెట్లు ప్రత్యక్షం మైపాడు గేట్ సెంటర్లోని డివైడర్ల మధ్యలో అప్ప టికప్పుడు చెట్లు గురువారం మొలిచాయి. ట్రాక్టర్లలో తీసుకొచ్చి నాటడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. నిన్నామొన్నటి వరకు దుమ్ము, ధూళిలో ఉన్న ప్రాంతం ఒక్కసారిగా సుందరవనంగా మారిపోయింది. ఈ శ్రద్ధ రోజూ ఉంటే ఎంతో బాగుండేదనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. అక్కడ నో.. ఇక్కడ మాత్రం సై..! నగరంలో హత్యలు, చోరీలు నానాటికీ ఎక్కువవుతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు.. నిందితులను త్వరితగతిన పట్టుకునే అంశంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఎన్నో చోట్ల ఇవి పనిచేయకపోయినా, వాటిని బాగుచేసే దిశగా చొరవ చూపని పాలకులు.. స్మార్ట్ స్ట్రీట్లో మాత్రం అన్ని దుకాణాలకు ఏర్పాటు చేయడం గమనార్హం. -
చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పాలి
వెంకటాచలం: విద్యాలయాలు చదువుతో పాటు సంస్కారం పెంచే కేంద్రాలుగా పనిచేయాలని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కాంక్షించారు. మాట మంచి కార్యక్రమం ద్వారా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్లో అక్షర విద్యాలయ విద్యార్థులతో బుధవారం సమావేశమైన ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఉదయాన్నే నిద్ర లేవడం, యోగా, నడక వంటి వ్యాయామాలకు అలవాటు పడాలని సూచించా రు. క్రమశిక్షణతో కూడిన చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎస్ఈఐఎల్ ఎనర్జీకి గోల్డెన్ పీకాక్ అవార్డు ముత్తుకూరు (పొదలకూ రు) : దేశంలో అతిపెద్ద స్వతంత్ర విద్యుత్ ఉత్పాదకత సంస్థల్లో ఒకటైన ఎస్ఈఐఎల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్కు 2025 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమై న గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది. ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విజేతగా నిలిచినట్లు సీఈఓ జనమేజయ మహాపాత్ర వెల్లడించారు. ఈ అవార్డు కార్పొరేట్ సంస్థల అత్యుత్తమ పాత్రను వెల్లడిస్తుందన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం, బాధ్యతాయుతమైన వ్యాపార పద్ధతులతోనే అవార్డు లభించిందన్నారు. వాటాదారులతో పాటు దేశ వృద్ధి రేటును సూచిస్తోందని పేర్కొన్నారు. ఈ అవార్డును లండన్లో వచ్చే నెల్లో అందజేయనున్నారని వెల్లడించారు. -
దళితులపై పెరుగుతున్న దాడులు
నెల్లూరు రూరల్: రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువవుతున్నాయని మాజీ ఎంపీ చింతా మోహన్ ఆరోపించారు. నగరంలోని ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. ఇటీవలి కాలంలో సామాజిక న్యాయమంటూ సీఎం చంద్రబాబు తరచూ చెప్తున్నారని, ఇది దళితులను రెండు వర్గాలుగా చీల్చడమానని ప్రశ్నించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా అతి తక్కువ సేకరించి మిల్లర్లకు ప్రభుత్వం మేలు చేసిందని విమర్శించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నించిన ఘటన ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని చెప్పారు. -
ఇరిగేషన్ కతలు ఇంతింత కాదయా..!
● అంతా ఇష్టారాజ్యం ● ఏ పనైనా.. కాసులిస్తేనే ● యథేచ్ఛగా దందాలునెల్లూరు(స్టోన్హౌస్పేట): ఇరిగేషన్ శాఖలో అవినీతి పరవళ్లు తొక్కుతోంది. కాసులిస్తేనే ఏ పనైనా జరుగుతుంది. ఉద్యోగోన్నతులు రావాలంటే మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సిఫార్సులు చేయాల్సిందే. అలా జరిగినా సీనియర్ అసిస్టెంట్ నుంచి మేనేజర్ వరకు నగదును ముట్టజెప్పాల్సిందే. ఒకవేళ అలా కాని పక్షంలో వ్యవహారం ఎక్కడికక్కడ ఆగిపోతుంది. ఉద్యోగోన్నతులకు ఇంతా..? ఇరిగేషన్ శాఖలో ఉద్యోగోన్నతులకు నిబంధనలను నిర్దేశించారు. అయితే అటెండర్ (ఆఫీస్ సబార్డినేట్) నుంచి జూనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ కావాలంటే రూ.10 వేలు నుంచి రూ.15 వేలు.. జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్కు రూ.15 వేల నుంచి రూ.20 వేలు.. ఆపై వీరు మంచి ప్రాంతానికి వెళ్లాలంటే రూ.20 వేల నుంచి రూ.30 వేలను ముట్టజెప్పాల్సిందే. కారుణ్య నియామకాలకు సైతం నగదును సమర్పించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. చీపుర్లకు రూ.వేలల్లో బిల్లులు చీపుర్లు, నీళ్లకు నెలకు రూ.20 వేల బిల్లులను కార్యాలయంలోని ఒక సూపరింటెండెంట్ పెడుతున్నారని సమాచారం. హెచ్డీలు ఏళ్ల తరబడి ఒకే స్థానంలో పాతుకుపోయారు. అసోసియేషన్ నేతలుగా ప్రకటించుకుంటూ వారి స్థానాలు మారకుండా చూసుకుంటున్నారు. అనుమతుల కోసం ప్రతిపాదనలను పంపేందుకు గానూ పనిని బట్టి వారికి పర్సంటేజీలను సమర్పించాలి. సంబంధిత ఏఈఈ, డీఈఈల ద్వారా వీరికి సదరు కాంట్రాక్టర్ అందించాల్సి వస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా నిరాకరిస్తే ప్రతిపాదనలు టేబుళ్లకే పరిమితమైపోతున్నాయి. ఇరిగేషన్ ప్రధాన కార్యాలయం, సెంట్రల్.. ఆత్మకూరు డివిజన్లు, ఆరు సబ్ డివిజన్లుండగా, ప్రతి చోట ఈ వ్యాపారం ఒకే రకంగా జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రశ్నించేవారేరీ..? రహస్య టెండర్ల ప్రతిపాదనలను కాంట్రాక్టర్లకు అందించడం.. కుమ్మకై ్క వారందించిన డబ్బుతో అర్హత లేని వారికి టెండర్లను ఆమోదించడంలో ఓ మేనేజర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇరిగేషన్ శాఖలో ప్రశ్నించే వారే లేకపోవడంతో ఆయన చెప్పిందే వేదమని కాంట్రాక్టర్లు, ఉద్యోగులు పేర్కొంటున్నారు. డైవర్షన్లలోనూ ఇదే తీరు.. ఈ శాఖలో డిప్యుటేషన్లపై పనిచేయడాన్ని డైవర్షన్ అంటారు. తాము పనిచేస్తున్న ప్రాంతం నుంచి డైవర్షన్ పొందేందుకు సుమారు రూ.మూడు వేల నుంచి రూ.ఐదు వేల వరకు చెల్లించాల్సి ఉంటోంది. డీఈఈ స్థాయి వారూ ఈ పనిచేయాల్సి వస్తోంది. లేఅవుట్లు, కల్వర్టులు, బ్రిడ్జిల అనుమతులకు సంబంధిత వ్యక్తుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తూ సంపాదనను పెంచుకోవచ్చనే ఉద్దేశంతో ఈ శాఖలో అధిక శాతం మంది డైవర్షన్లోనే ఉంటున్నారు. మరికొంత మంది మరో అడుగు ముందుకేసి సదరు లేఅవుట్కు సంబంధించిన వ్యక్తులు బ్రిడ్జిలను నిర్మిస్తే వాటిని ఎం బుక్లో నమోదు చేసి ఇరిగేషన్ శాఖే సొంతంగా కట్టించినట్లూ చూపుతున్నారు. మరోవైపు సాధారణ సమయానికీ ఆఫీసులకు రారు. ఒక ఎన్టీపీఏ వేరే జిల్లా నుంచి మధ్యాహ్నం 12 గంటలకు సైతం వస్తారు. వీరిపై ఎలాంటి చర్యల్లేకపోవడంతో ఇష్టారాజ్యంగా తమ పనులను జరుపుకొంటున్నారు. జిల్లా ఇరిగేషన్ శాఖలో వ్యవహారం అంతా ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఏ పని జరగాలన్నా వారు చెప్పినంత క్యాష్ కొట్టాల్సిందే. కాలువల్లో నీరు పారుతుందో లేదో తెలియదు గానీ డబ్బులిస్తే మాత్రం ఆఫీస్లో అటెండర్ల మొదలుకొని డీఈల వరకు పనులు ఇట్టే జరిగిపోతాయి. ఉద్యోగోన్నతులు, అంచనాలు, ప్లాన్ ప్రతిపాదనలు, ఎల్ఓసీలు, ఉద్యోగుల డిప్యుటేషన్లు ఇలా ఏది కావాలన్నా.. సీనియర్ అసిస్టెంట్లు, సూపరిండెంటెంట్లు, ఎన్టీపీఏలు, హెచ్డీలు, మేనేజర్లకు మొత్తాన్ని కక్కాల్సిందే. ఆ శాఖలో పనులకు నిధులు రాకపోవడంతో ఉద్యోగుల మధ్య ఈ దందా పెరిగిపోతోంది. చర్యలు చేపడతాం ఈ వ్యవహారాలపై ఎలాంటి ఫిర్యాదు అందలేదు. సంబంధిత విభాగాల్లో విచారణ జరిపిస్తాం. బాధితులెవరైనా ఉంటే నేరుగా కలవొచ్చు. విచారణ జరిపి నిబంధనలను అనుసరించి ఆయా ఉద్యోగులపై చర్యలు చేపడతాం. – దేశ్నాయక్, సూపరింటెండెంట్ ఇంజినీర్, ఇరిగేషన్ శాఖ -
ఏయ్.. మీ అంతు చూస్తా
● మా హాస్పిటల్ ముందే చెత్త ట్రాక్టర్లను ఆపుతారా..? ● పారిశుధ్య కార్మికులను దుర్భాషలాడిన టీడీపీ నేత కుమారుడు బుచ్చిరెడ్డిపాళెం రూరల్: అధికారముందనే ధీమాతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా బుచ్చిరెడ్డిపాళెంలోని మున్సిపల్ కార్మికులపై టీడీపీ పట్టణాధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు కుమారుడు శంతన్ హర్ష బూతులతో చెలరేగిపోయారు. మున్సిపల్ కార్మికులు, స్థానికుల వివరాల మేరకు.. పట్టణ పరిధిలోని బస్టాండ్ కూడలి సమీపంలో గల పాత పెట్రోల్ బంక్ పక్కన శ్రీనివాసులు కుమారుడికి ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. ఈ క్రమంలో దాని ఎదురుగా ట్రాక్టర్లను నిలిపి అందులో చెత్తను కార్మి కులు వేయసాగారు. ఈ తరుణంలో అక్కడికి చేరుకున్న శంతన్ హర్ష తమ హాస్పిటల్ ముందు ఎందుకు నిలిపారని ప్రశ్నించారు. పని అయిపోగానే వెళ్లిపోతామని కార్మికులు చెప్పినా వినకుండా.. ట్రాక్టర్లను నిలిపేందుకు ఎంత ధైర్యమంటూ బూతులతో రెచ్చిపోయారు. ట్రాక్టర్లకు గాలి తీసేసి.. దిక్కున్న చోట చెప్పుకోండంటూ జులుం ప్రదర్శించారు. నిరసన చెత్త ట్రాక్టర్లను హాస్పిటల్ ఎదుటే నిలిపి నిరసనను కార్మికులు వ్యక్తం చేశారు. తమను దూషించిన వ్యక్తిపై చర్యలు చేపట్టాలంటూ నినాదాలు చేశారు. మున్సిపాల్టీలోని ఇతర విభాగాల నేతలు సంఘీభావం తెలిపారు. విషయం తెలుసుకున్న కమిషనర్ బాలకృష్ణ, మున్సిపల్ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని కార్మికులు.. టీడీపీ నేత కుమారుడితో మాట్లాడటంతో గొడవ సద్దుమణిగింది. విధులకు ఆటంకం కలిగించడం సరికాదు మున్సిపల్ కార్మికులను దూషించడం, ట్రాక్టర్లకు గాలితీసి విధులకు భంగం కలిగించడం చట్టరీత్యా నేరం. తప్పును శంతన్ అంగీకరించడంతో విధుల్లో కార్మికులు చేరారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు చేపడతాం. – బాలకృష్ణ, కమిషనర్ -
బ్రహ్మోస్ క్షిపణితో పాక్పై విజయం
● సాంకేతిక పురోగాభివృద్ధి అంశాలపై అవగాహన సదస్సు ● డీఆర్డీఓ మాజీ చైర్మన్, ఏపీ ప్రభుత్వ గౌరవ సలహాదారుడు డాక్టర్ జి.సతీష్రెడ్డి నెల్లూరు (బారకాసు): బ్రహ్మోస్ క్షిపణిని రష్యాతో కలిసి తయారు చేశామని, బ్రహ్మోస్లో సొంతంగా రూపొందించిన సాఫ్ట్వేర్ ఉందని, బ్రహ్మోస్ క్షిపణితో పాక్పై విజయం సాధించామని డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్రెడ్డి తెలియజేశారు. భారతదేశంలో క్షిపణులకు అబ్దుల్ కలాం ఆధ్యుడని, ఈ నెల అక్టోబర్ 15న ఆయన జయంతి వేడుకలను అన్ని పాఠశాలలో ఘనంగా నిర్వహించాలని సతీష్రెడ్డి ఆకాంక్షించారు. స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో బుధవారం నగర పాలక సంస్థ పరిధిలోని 23 మున్సిపల్ పాఠశాలల పదో తరగతి విద్యార్థుల శాస్త్ర సాంకేతిక పురోగాభివృద్ధి అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సతీష్రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రామేశ్వరంలోని చిన్న గ్రామంలో ప్రభుత్వ పాఠశాల చదివారని, విద్యతోనే గొప్ప శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతి అయ్యారని తెలిపారు. తాను కూడా గవర్నమెంట్ స్కూల్ మహిమలూరు పాఠశాల, వీఆర్ కాలేజీలో చదివానని, అబ్దుల్ కలాం వేసిన బీజం వల్ల ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిందని విద్యార్థులకు వివరించారు. స్వదేశీ ఆలోచనలతో రూపొందించిన ఆత్మ నిర్భర్ భారత్ ఆయుధాలతో భారత్ వివిధ యుద్ధాలలో గొప్ప విజయం సాధించిందని తెలియజేశారు. ప్రతి విద్యార్థి రాత్రింబవళ్లు కష్టపడి చదవాలని, స్కూల్కు, జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ వైఓ నందన్, డీఈఓ బాలాజీరావు, డిప్యూటీ డైరెక్టర్ మాధురి, డిప్యూటీ డీఈఓ నాయక్, నెల్లూరు అర్బన్ ఎంఈఓలు తిరపాల్, హమీద్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. -
మద్యాంధ్రప్రదేశ్గా మార్చారు
● నకిలీ మద్యంతో రూ.వేల కోట్లు దోచేశారు ● ప్రభుత్వ పెద్దల అండతోనే మద్యం తయారీ కేంద్రాల ఏర్పాటు ● వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ● ఎకై ్సజ్ డీసీ కార్యాలయం ఎదుట మహిళలతో కలిసి నిరసన నెల్లూరు (క్రైమ్): రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేస్తానన్న చంద్రబాబు మద్యాంధ్రప్రదేశ్గా మార్చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత విమర్శించారు. బుధవారం బీవీనగర్లోని ఎకై ్సజ్ డీసీ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. రాష్ట్రంలో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ ఘటనలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి సూత్ర, పాత్రధారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శంకరయ్యకు వినతిపత్రం అందజేశారు. కాకాణి పూజిత మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. 24 గంటలు మద్యం దొరుకుతుండడంతో నేరాలు పెరిగాయని, ప్రధానంగా మహిళలు తీవ్ర వేధింపులకు గురవుతున్నారన్నారు. కల్తీ మద్యం ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోందన్నారు. వైఎస్ జగన్మోన్రెడ్డి ప్రభుత్వం పారదర్శక విధానంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపులు నిర్వహించిందని, జగనన్న ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని అందించిందనీ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసి బెల్టు షాపులు, నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పడకుండా పటిష్ట చర్యలు చేపట్టింద న్నారు. ఇంత పారదర్శకంగా జరిగినా మద్యం విధా నంలో స్కామ్ జరిగిందంటూ చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారానికి తెరలేపిందన్నారు. లేని మద్యం స్కామ్ను సృష్టించిన చంద్రబాబు నేడు రాష్ట్రంలో నకిలీ మద్యం స్కామ్కు తెర తీశారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల అండలేకపోతే.. ఈ స్థాయిలో నకిలీ మద్యం తయారు చేసి యథేచ్ఛగా విక్రయాలు చేసేవా రా? అని ప్రశ్నించారు. నకిలీ మద్యం తయారీ వెనుక ఎకై ్సజ్ అధికారుల పాత్రపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి పాలనలో ప్రతి నాలుగు బాటిళ్లలో ఒక నకిలీ మద్యం బాటిల్ ఉంటోందని ఆరోపించారు. ప్రతి నిత్యం ఎకై ్సజ్ దాడుల్లో వేలకొలది నకిలీ మద్యం బాటిళ్లు గుర్తిస్తున్నారని, మాఫియాకు ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. నకిలీ మద్యం తయా రీపై ఉక్కు పాదం మోపాలని, తయారీదారులు ఎంతటి వారైనా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలోనూ నకిలీ మద్యంతో మరణాలు సంభవించాయని, వీటిపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జోనల్ మహిళా అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఏపీని చంద్రబాబు మద్యాంధ్రప్రదేశ్గా మార్చారు: కాకాణి పూజిత
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ముందు వైఎస్సార్సీపీ నిరసనకు దిగింది. మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆధ్వర్వంలో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో ఎన్ బ్రాండ్ నకిలీ మద్యం తయారీ, అమ్మకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం సీసాలతో మహిళలు నిరసన తెలిపారు. ఏపీని చంద్రబాబు మద్యాంధ్రప్రదేశ్గా మార్చారని కాకాణి పూజిత దుయ్యబట్టారు. యూరియా కోసం క్యూలైన్లో నిల్చొవాలి.. కానీ మద్యం మాత్రం ఎక్కడైనా దొరుకుతుందంటూ మండిపడ్డారు.కర్నూలు: ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కల్తీ మద్యంతో ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యాని విక్రయాలను నిరసిస్తూ మద్యం బాటిళ్లను ధ్వంసం చేసి వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసన వ్యక్తం చేసింది. తక్షణమే కల్తీ లిక్కర్ను అరికట్టాలని.. బెల్టు షాపులు తొలగించాలని మహిళలు డిమాండ్ చేశారు.అనంతపురం: కల్తీ మద్యంపై మహిళలు, యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం ఎక్సైజ్ డీసీ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ మహిళా, యువజన విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మద్యం బాటిళ్లు ధ్వంసం చేసి నిరసన తెలిపారు. కల్తీ మద్యం తయారు చేసే టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యం అరికట్టండి. పేదల ప్రాణాలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. -
నెల్లూరు డబుల్ మర్డర్.. గంజా బ్యాచ్ పనే!
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో గంజాయి వ్యాపారం స్వైర విహారం చేస్తోంది. అక్రమ రవాణా, నిల్వ, వినియోగం వంటి కార్యకలాపాలు వెలుగు చూస్తుండడం.. పోలీసుల నిఘా లోపాలను బయటపెడుతోంది. తాజాగా నెల్లూరు జిల్లా పెన్నా బ్యారేజ్ వద్ద వెలుగు చూసిన డబుల్ మర్డర్ కేసు.. గంజాయి బ్యాచ్ పనేనని నిర్ధారణ అయ్యింది. మంగళవారం ఉదయం.. పెన్నా బ్యారేజీ వద్ద రోడ్డుపై నెత్తురు మరకలు, మూడు జతల చెప్పులు ఉండడం చూసిన స్థానికులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సంతపేట పోలీసులు అనుమానంతో నదిలో గత ఈతగాళ్లను దింపి రెండు మృతదేహాలను వెలికి తీయించారు. అయితే అక్కడి సీసీటీవీ ఫుటేజీలు పని చేయకపోవడంతో నిందితులను పట్టుకోవడం కష్టమనే భావించారంతా. దీంతో.. ఎస్పీ అజితా ఆదేశాలతో నాలుగు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలించాయి.ఈ తరుణంలో.. కందుకూరు వద్ద బుధవారం ఉదయం నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హంతకులిద్దరూ గంజాయ్ బ్యాచ్గా గుర్తించారు. అడిగితే నగదు ఇవ్వలేదని కోపంతో ఇద్దరిని హత్య చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలతో పాటు నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. -
భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తాం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా కందుకూరు: ఇండోసోల్ కంపెనీ కోసం భూమిలిచ్చిన రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. భూములిచ్చిన రైతులతో మంగళవారం స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయంలో సమా వేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇండోసోల్ కంపెనీ భూసేకరణలో భూములు కోల్పోతున్న ఉప్పరపాళెం, రామకృష్ణాపురం, ఉలవపాడు, చేవూరు, రావూరు, కరేడు గ్రామా ల రైతులతో మాట్లాడుతామన్నారు. రైతుల అభిప్రాయాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి నెగోషియేషన్ కమిటీ ద్వారా భూములిచ్చిన రైతులకు ఎంత మేర నగదు చెల్లించాల్సి ఉందో చర్చించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సబ్కలెక్టర్ హిమవంశీ, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ రాజశేఖర్, ఏపీఎంఐపీ జోనల్ మేనేజర్ శివకుమార్ పాల్గొన్నారు. -
రెడ్బుక్ రాజ్యాంగం అమలుపైనే శ్రద్ధ
శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగం అమలులో తలమునకలయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న ప్రతిపక్షనేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో నేరస్తులు, అసాంఘిక శక్తులు విజృంభిస్తున్నారు. దీంతో నేరస్తులు చెలరేగిపోతున్నారు. అయితే పోలీసులు మాత్రం ప్రజల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకున్నామనీ, బీట్లు పెంచామనీ, డ్రోన్లతో నిఘా పెట్టామని చెబుతున్నప్పటికి ఏ మాత్రం తగినంత భరోసా దొరకడం లేదు. ఇప్పటికై నా పోలీసు అధికారులు స్పందించి నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
న్యాయవాదుల నిరసన
నెల్లూరు(లీగల్): సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడికి యత్నించడాన్ని ఖండిస్తూ ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) న్యాయవాదుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరులోని జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ‘ఐలు’ అధ్యక్ష, కార్యదర్శి సత్తు అంకయ్య, చుక్క రమేష్, ఐక్యవేదిక నాయకులు కుడుముల రవికుమార్, బద్దెపూడి రవీంద్ర, స్వర్ణ ప్రసాద్, నెల్లూరు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పద్మాకర్, లేడీ రిప్రజెంటేటివ్ లక్ష్మమ్మ మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థలపై సనాతనం పేరుతో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటం దుర్మార్గమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వ పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వి.ఉపేంద్ర, పచ్చా కిరణ్, దేవరాల వెంకటేశ్వర్లు, సుధీర్, మోబీనా, కుమార్ రాజా, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. -
అదుపు తప్పిన శాంతిభద్రతలు
పచ్చని భూములు. గలగల పారే కాలువలు. పాడి పంటలతో అలరారే చారిత్రత్మాక సింహపురి.. కొత్తగా రక్త చరిత్రను లిఖిస్తోంది. గడిచిన ఏడాది కాలంగా నెల్లూరులో జరిగిన మారణహోమాలు ఇందుకు దర్పణం. శాంతి భద్రతలను పరి రక్షించాల్సిన పోలీసులు తమ విధులను గాలికి వదిలేశారు. సాక్షిప్రతినిధి నెల్లూరు: జిల్లాలో పోలీసు వ్యవస్థ చేవ కోల్పోయింది. జిల్లాలో పనిచేసిన కొందరు పోలీస్ బాస్ల హయాంలో పోలీస్ వ్యవస్థ అత్యంత శక్తి వంతంగా ఉండేది. అప్పట్లో నేరాలకు పాల్పడే వారిని ఉక్కుపాదంలో నలిపేశారు. నేరాలకు పాల్పడాలంటే భయపడి జిల్లానే వదిలేసి వెళ్లిపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అటువంటి ఖాకీలు ఇప్పుడు పచ్చపార్టీ నేతలకు ఊడిగం చేస్తుండడంతో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, దొంగతనాలు నిత్యకృత్యంగా మారాయి. ఈ నెలలో ఐదు రోజుల వ్యవధిలో ఐదు హత్యలు జరిగాయంటే పరిస్థితి తీవ్రత ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. శాంతిభద్రతలు లోపించడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.గస్తీకి సుస్తీ.. నేరస్తులకు హ్యాపీజిల్లాలో ఐదు సబ్డివిజన్లు, 12 సర్కిల్స్ పరిధిలో 52 పోలీసుస్టేషన్లు, 11 అర్బన్ పోలీసుస్టేషన్లు ఉన్నా యి. వాటి పరిధిలో కొద్ది కాలంగా పోలీసు గస్తీ అంతంత మాత్రంగానే మారడంతో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతోంది. పాతనేరస్తులు, అసాంఘిక శక్తుల ఆగడాలు శృతిమించుతున్నాయి. పాత కక్షల నేపథ్యంలో ఒకరు.. కుటుంబ కలహాల నేపధ్యంలో ఇంకొకరు.. ఇతరత్రా కారణాలతో మరొకరు ప్రత్యేర్థులను హత్యచేస్తున్నారు. మానవత్వం, బంధుత్వం, కుటుంబ భవబంధాలు చూడకుండా అడ్డొచ్చిన వారి ని అతి కిరాతకంగా హత్య చేస్తున్నారు. పగలు, ప్రతీకారాలతో భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. జిల్లా లో కిరాయి సంస్కృతి పెరుగుతోంది. సుఫారి తీసుకు ని ప్రత్యర్థులను అతి కిరాతకంగా హత్య చేస్తున్నారు. ఇతర జిల్లాలోనూ నేరాలకు పాల్పడుతున్నారు.మత్తులోనే విశృంఖలంగా నేరాలుజిల్లాలో మద్యం ఎరులై పారుతోంది. గంజాయి విక్రయాలు చాపకింద నీరులా సాగుతోన్నాయి. మత్తు, మాదక ద్రవ్యాలకు బానిసైన యువత విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారు. వ్యసనాలను తీర్చుకునేందుకు సరిపడా నగదు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఒంటరిగా వెళ్లేవారిని కత్తులతో బెదిరరించి అందినకాడికి దోచుకోవడం, ఎదురు తిరిగిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఈ పరిణామాలతో ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. నెల్లూరు నగరంలో పరిస్థితి మరింత ఆందోళన కరంగా మారుతోంది. రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నారు. పది నెలల వ్యవధిలో సుమారు 18కు పైగా హత్యలు జరిగాయంటే శాంతిభద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అవగత మవుతోంది.అక్టోబర్ 3వ తేదీవిడవలూరు మండలం ముదివర్తిలో జరిగింది. గ్రామ బీసీ కాలనీకి చెందిన తాండ్ర రవికుమార్ మద్యం తాగొచ్చి భార్య సుప్రజతో నిత్యం గొడవలు పడుతూ ఉండడంతో కొడుకు ప్రేమ్చంద్ తన తల్లి సుప్రజకు అండగా ఉంటూ తండ్రిని మందలిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో కుమారుడు ప్రేమ్చంద్ ఇంట్లో పడుకొని నిద్ర పోతున్న సమయంలో రవికుమార్ ఇంటికి వచ్చి నిద్రపోతున్న కొడుకు ప్రేమ్చంద్పై రోకలి బండతో కొట్టి హత్య చేశాడు.లింగసముద్రం మండల పరిధిలోని రాళ్లపాడు ప్రాజెక్ట్లో గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేసి శవాన్ని ప్రాజెక్ట్లో పడేశారు. అతను ఎవరనే విషయం కూడా పోలీసులకు ఆధారాలు సేకరించలేకపోయారు. మృతుడి ఒంటిపై గాయాలు ఉండడంతో అతన్ని హత్య చేశారనేది స్పష్టం.ఏడాది కాలంలో జిల్లాలో ఘటనలు మచ్చుకు కొన్ని..నెల్లూరు ప్రగతినగర్లో గంజాయి, మద్యం మత్తులో కొందరు యువకులు కారు డ్రైవర్ను అతి కిరాతకంగా హత్య చేశారు.ముత్తుకూరు బస్టాండ్ వద్ద గంజాయి మత్తులో ఇద్దరు యువకులు ఓ మహిళను చంపుతామని బెదిరించి రెండు సెల్ఫోన్లను దోచుకెళ్లారు.తల్పగిరికాలనీ వద్ద నాగేంద్రను కత్తులతో చంపుతామని బెదిరించి అతని ఫోన్పే నుంచి రూ.5 వేల నగదును దుండగులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.టిఫిన్ విషయంలో మాటామాటా పెరిగి టెంపో ట్రావెల్స్ నిర్వాహకుడు అల్లాభక్షును మత్తులో ఉన్న రంగనాయకులపేటకు చెందిన షేక్ ఇషాక్ హత్య చేశాడు.మద్యం మత్తులో మాటామాటా పెరగడంతో సుల్తాన్ అనే వ్యక్తిని ఇద్దరు హత్య చేశారు.గంజాయి మత్తులో ఉన్న కొందరు నెల్లూరు సుజాతమ్మకాలనీలోని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి విధ్వంసం సృష్టించారు.మత్తులో ఉన్న ముగ్గురు యువకులు రైల్వేస్టేషన్ వద్ద బైక్పై వెళుతున్న బ్యాంకు ఉద్యోగిని చంపుతామని కత్తులతో బెదిరించి నగదు దోచుకున్నారు.ఇటీవల నెల్లూరు నగరంలోని అయ్యప్పగుడి సెంటర్లో ఓ యువకుడు హోటల్ కెళ్లి టిఫన్ ఆర్డర్ ఇచ్చాడు. తనకంటే వెనకున్న ఓ వ్యక్తి ఆర్డర్ ఇచ్చారు. ముందుగా తాను టిఫిన్ ఆర్డర్ ఇచ్చినా వెనకొచ్చిన వ్యక్తికి ఇచ్చాడని కారణంతో ఇద్దరు మధ్య జరిగిన చిన్న వివాదంతో దారుణంగా కత్తితో పొడిచి చంపాడు.నెల్లూరు రామలింగాపురం రైల్వే బ్రిడ్జి సమీపంలో రౌడీషీటర్ కత్తి రవి (32)ని దారుణంగా హత్య చేసిన నిందితులు.ఆర్థిక విభేదాల నేపథ్యంలో ముత్యాలపాళెంలో ఎం.పౌల్ (35)ను దారుణంగా హత్య చేసిన నిందితులు.కొండాపురం మండలంలో తిరుపాల్ (55) అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసి 25 మేకలను అపహరించుకెళ్లారు.ఉదయగిరిలో జనం చూస్తుండగానే వరుసకు బావను బావమరుదులే హత్య చేశారు. ఆస్తి తగాదాలే కారణం.కలువాయి మండలంలోని పల్లంకొండలో గోపి అనే యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు.కొడవలూరు మండలం టపాతోపు వద్ద హిజ్రా నాయకురాలు హాసినీని ప్రత్యర్థులు దారుణంగా చంపారుకొడవలూరు మండలం మిక్కిలింపేట వద్ద బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన స్టీల్వ్యాపారి రమేష్ హత్యకు గురైయ్యాడు.నెల్లూరు ఉడ్హౌస్ సంఘంలో సస్పెక్ట్ షీటర్ కళ్యాణ్ను పాతకక్షల నేపథ్యంలో హత్య చేసిన దుండగులు.ఇందిరాగాంధీనగర్లో రౌడీషీటర్ సుజనకృష్ణ అలియాస్ చింటూను స్నేహితులే కిరాతకంగా హత్య చేశారు.తాజాగా జాకీర్ హుస్సేన్నగర్ న్యూకాలనీలో మద్యం మత్తులో దూషించాడని భర్త శ్రీనివాసకుమార్ను హత్య చేసిన భార్య. -
మహోన్నతుడు మహర్షి వాల్మీకి
● జేసీ మొగిలి వెంకటేశ్వర్లు నెల్లూరురూరల్: భారతీయ సంస్కృతి, నీతి, ధర్మం, సత్యం, కరుణ వంటి విలువలతో కూడిన అత్యద్భుతమైన రామాయణ మహా కావ్యాన్ని ప్రపంచానికి అందించిన మహోన్నతుడు మహర్షి వాల్మీకి అని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత అధికారులు, బీసీ సంఘాల నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి, వాల్మీకి మహర్షి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ వాల్మీకి జీవిత విశేషాలను వివరించారు. జేసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మానవుడి జీవన విధానానికి, ధర్మపాలనకు నిలువెత్తు సాక్షాత్కారం రామాయణమని, 23 వేల శ్లోకాలతో, ఏడు ఖండాలతో రామాయణ పవిత్ర మహాకావ్యాన్ని మనకు అందించిన గొప్ప మహర్షి వాల్మీకి అని కొనియాడారు. వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, సాధారణ మనిషి నుంచి ఒక మహా ఋషిగా ఎదిగి, మనుషులు మహా ఋషులవుతారని నిరూపించిన వాల్మీకి జీవిత చరిత్ర ఒక ఉదాహరణ అన్నారు. బీసీ సంఘాల నాయకుల విజ్ఞప్తి మేరకు నగరంలో బీసీ భవన్ పూర్తి చేసేందుకు కషి చేస్తామని చెప్పారు. నగరంలో వాల్మీకి మహర్షి విగ్రహం, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు మొదలైన బీసీ సంఘాల నేతలు సూచించిన పలు సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విజయ్కుమార్, బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి, సెట్నల్ సీఈఓ నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెంచలబాబు యాదవ్, బీసీ సంక్షేమ సంఘ నాయకులు నల్లబోతుల వెంకటేశ్వర్లు, దేవరాల సుబ్రహ్మణ్యం, బీసీ కోటయ్య, జనార్దన్, కాలేషా, బుధవారపు బాలాజీ, పీఎల్ రావు, మురళీకృష్ణ, వసతిగృహ సంక్షేమ అధికారులు, పలు బీసీ సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మాజీ ఉపరాష్ట్రపతితో కలెక్టర్ మర్యాద పూర్వక భేటీ
వెంకటాచలం: మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు జిల్లా పర్యటనలో భాగంగా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం మర్వాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో పరిస్థితులు, పాలనాంశాలు, ఇతర అంశాలపై కొద్ది సేపు చర్చించారు. జగన్ సమీక్షలో కాకాణి నెల్లూరు (స్టోన్హౌస్పేట): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. నేరాలను కట్టడి చేయాలి ● పోలీసు అఽధికారులను ఆదేశించిన ఐజీ నెల్లూరు (క్రైమ్): నేరాలను కట్టడి చేసి ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలు అందించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఆయన ఎస్పీ అజితతో కలిసి పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. రౌడీషీటర్లను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించరాదని, వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. గంజాయిని పూర్తిగా కట్టడి చేయాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నేర నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయని, వాటి ఆవశ్యకతను ప్రజలకు తెలియజేసి ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చొరవ చూపాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాలను విశ్లేషించి బ్లాక్ స్పాట్ల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. నేడు న్యాయవాదుల కోర్టు విధుల బహిష్కరణ నెల్లూరు (లీగల్): సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై కోర్టు హాల్లో న్యాయవాది షూ విసిరిన ఘటనను ఖండిస్తూ బుధవారం కోర్టు విధులను బహిష్కరిస్తున్నామని బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అయ్యప రెడ్డి, నాగరాజయాదవ్ తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కమిటీ సమావేశంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై జరిగిన అమానవీయ ఘటన పూర్తిగా న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. ఈ ఘటనను ఖండిస్తూ అందుకు నిరసనగా బుధవారం కోర్టు విధులను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు సహకరించాలని కోరారు. శ్రీవారి దర్శనానికి 20 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 76,773 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,100 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.16 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. టైంస్లాట్ దర్శన టికెట్లు లేని వారికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. -
ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని అడ్డుకుంటాం
● ఏపీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నేతలు నెల్లూరు సిటీ: ‘కూటమి ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనిని అడ్డుకుని తీరుతాం’ అని ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యప్పరెడ్డి తెలిపారు. నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఫెడరేషన్ 12వ జిల్లా మహాసభ మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేట్ వైపు తీసుకెళ్తోందన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ వారితో నడపాలని చూస్తున్నారన్నారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రాధ్యక్షుడు సుందరయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించిన ఉద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని, లేకపోతే ఐక్య కార్యాచరణ రూపొందించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని తెలిపారు. అనంతరం 17 మందితో నూతన కమిటీ ఏర్పాటు చేశారు. గౌరవాధ్యక్షుడిగా కృష్ణయ్య, అధ్యక్షుడిగా షేక్ షబ్బీర్, కార్యదర్శగా డి.రమణయ్య కోశాధికారిగా ఎస్కే ఖాజావలీ వ్యవహరిస్తారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కటారి అజయ్కుమార్, కట్టా సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
ప్రైవేట్ ఆస్పత్రిలో చోరీ
● మహిళ బ్యాగ్లోని 10 సవర్ల బంగారం అపహరణ నెల్లూరు(క్రైమ్): నెల్లూరు శ్రీనివాస అగ్రహారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మహిళ బ్యాగ్లోని బంగారు ఆభరణాలు, నగదును దొంగ అపహరించుకెళ్లాడు. పోలీసుల కథనం మేరకు.. శెట్టిగుంటరోడ్డు వెంగమాంబ సెంటర్లో శైలజ, రామయ్య దంపతులు ఉంటున్నారు. శైలజ తల్లి మస్తానమ్మ సర్జరీ నిమిత్తం గతనెల 29వ తేదీన శ్రీనివాస అగ్రహారంలోని జీకే హాస్పిటల్లో చేరారు. ఆమె వద్ద కుమార్తె, అల్లుడు ఉంటున్నారు. ఇంట్లోని 10 సవర్ల బంగారు ఆభరణాలను శైలజ తీసుకొచ్చి ఆస్పత్రిలోని తన బ్యాగ్లో భద్రపరిచింది. మస్తానమ్మ ఆరోగ్యం కుదుటపడటంతో సోమవారం రాత్రి ఆస్పత్రి సిబ్బంది డిశ్చార్జ్ చేశారు. అయితే రాత్రి కావడంతో పక్కరోజు ఉదయం వెళ్లాలని నిర్ణయించుకుని నిద్రపోయారు. మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగుడు వారి గదిలోకి ప్రవేశించి బ్యాగ్ను అపహరించాడు. నిద్ర లేచిన శైలజ బ్యాగ్ కనిపించకపోవడంతో అంతా గాలించింది. మొదటి అంతస్తులో బ్యాగ్ కిందపడి ఉంది. అందులోని 10 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.5 వేలు నగదు కనిపించకపోవడంతో యాజమాన్యానికి చెప్పింది. వారు సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించగా ఓ దుండగుడు శైలజ ఉన్న గదిలోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. బాధితురాలు బాలాజీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై పుల్లారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పేదింట ఉడకని కందిపప్పు
● సరఫరా చేయని కూటమి ప్రభుత్వం ● అంగన్వాడీలకే పంపిణీ ● మిగిలింది చౌక దుకాణాలకు.. ● అక్కడి నుంచి నల్లబజారుకు తరలింపునెల్లూరు(పొగతోట): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదింట కందిపప్పు ఉండకడం లేదు. చౌక దుకాణాలకు సరఫరా చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. కేవలం బియ్యం, చక్కెర మాత్రమే కార్డుదారులకు పంపిణీ చేస్తోంది. బహిరంగ మార్కెట్లో కేజీ కందిపప్పు రూ.160 నుంచి రూ.170 వరకు ఉంది. పేదలు అధిక మొత్తం వెచ్చించి కొనుగోలు చేయలేకపోతున్నారు. ఇటీవల దసరా పండగకు సైతం చంద్రబాబు సర్కారు పంపిణీ విషయాన్ని పట్టించుకోలేదు. మిగిలింది మాత్రమే.. జిల్లాలో 7.21 లక్షల రేషన్ కార్డులున్నాయి. 1,513 చౌకదుకాణాల ద్వారా కార్డుదారులకు రేషన్ పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా కార్డుదారులకు కేజీ కందిపప్పు పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఆయన మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం కందిపప్పు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో 5 నుంచి 10 టన్నులు మిగులుతోంది. ఇది చెడిపోతుందని అతి తక్కువ రేషన్ షాపులకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఇక్కడ కేజీ రూ.67కే విక్రయించాలి. కానీ బయట అధిక ధర ఉండటంతో డీలర్లు కార్డుదారులకు పంపిణీ చేయకుండా నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో ఉన్న అధిక ధరలకు పాలకులు కళ్లెం వేయడం లేదు. నిరాశ చెందుతూ.. చౌక దుకాణాల్లో ఇచ్చే రేషన్పై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కందిపప్పు సరఫరా చేయలేదు. లబ్ధిదారులు ప్రతి నెలా చౌకదుకాణాలకు వెళ్లి కందిపప్పు అడిగి నిరాశ చెందుతున్నారు.సరఫరా చేయడం లేదు చౌకదుకాణాల ద్వారా ప్రస్తుతం బియ్యం, చక్కెర మాత్రమే సరఫరా చేస్తున్నాం. కందిపప్పు పంపిణీ చేయడం లేదు. అంగన్వాడీ కేంద్రాలకు కందిపప్పు సరఫరా చేస్తున్నాం. వాటిలో మిగిలింది పురుగు పట్టకుండా అతి తక్కువ చౌకదుకాణాలకు పంపుతున్నాం. కందిపప్పును కార్డుదారులకు పంపిణీ చేయకుండా బహిరంగ మార్కెట్లో విక్రయించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. – అర్జున్రావు, పౌరసరఫరాల సంస్థ డీఎం -
స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం
● మేకపాటి రాజగోపాల్రెడ్డి ఉదయగిరి: రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ విజయకేతనం ఎగుర వేసేందుకు క్యాడర్ సమాయత్తం కావాలని వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అధికార టీడీపీ కుయుక్తలు, కుతంత్రాలు, కుట్రలతో స్థానిక ఎన్నికల్లో నెగ్గే ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. అధికార కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పుటికే వ్యతిరేకత పెరుగుతున్నందున, మనకు సానుకూలంగా ఓటర్లను మలచుకోవాలన్నారు. నియోజకవర్గంలో మన పార్టీ బలంగా ఉన్నందున అందరూ కలిసి పనిచేస్తే విజయం తథ్యమన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందన్నారు. వైఎస్సార్సీపీ క్యాడర్ను లక్ష్యంగా చేసుకొని తప్పుడు కేసులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. తిరిగి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఇబ్బంది పెట్టిన వారికి అసలు, వడ్డీతో చెల్లిస్తామని స్పష్టం చేశారు. తప్పడు కేసులు పెట్టే పోలీసులు, ఇబ్బంది పెట్టే అధికారులును, టీడీపీ నేతల వివరాలు యూప్లో నమోదు చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్లో ఈ కమిటీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కొండా రాజగోపాల్రెడ్డి, అక్కి భాస్కర్రెడ్ఢి, ఎం.తిరుపతి నాయుడు, చెన్నకేశవులు, తిరుపతిరెడ్డి, సలీమ్, దస్తగిరి అహ్మద్, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. -
ఉపాధిలో అవినీతిపై పునర్విచారణ
కలువాయి(సైదాపురం): కలువాయి మండలంలో జరిగిన ఉపాధి పనుల్లో అవినీతిపై పున ర్విచారణకు ఆదేశిస్తూ కలెక్టర్ హిమాన్హు శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. ఉపాధి పనుల్లో అవినీతిపై ఇటీవల చిన్నగోపవరం పంచాయతీలో చీఫ్ విజిలెన్స్ అధికారి సమగ్ర విచారణ చేశారు. ఎనిమిది మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అయితే డ్వామా అధికారులు మాత్రం ఆరుగురు సిబ్బందిపై కేసులు పెట్టి ఇద్దరు ఏపీఓలను తప్పించారు. ఈ వ్యవహారంలో అధికారులకు ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యుడు రఘు నేరుగా జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మండలంలోని 20 పంచాయతీల్లో జరిగిన అవినీతిపై పునర్విచారణ చేపట్టాలని కమిషన్ ఆదేశించింది. దీంతో కలెక్టర్ సైతం పూర్తి స్థాయిలో పునర్విచారణ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో డ్వామా అధికారులు, ఉపాధి సిబ్బందిలో గుబులు మొదలైంది.యువకుడి ఆత్మహత్యనెల్లూరు(క్రైమ్): ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ క్షణికావేశంలో ఓ యువకుడు శబరి ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెన్నానది ఎల్సీ గేటు సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. మృతుడి వయసు 25 నుంచి 30 ఏళ్ల లోపు ఉండొచ్చని భావిస్తున్నారు. నలుపు రంగు ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు నమోదు చేశారు. మృతుడిని వివరాలు తెలిసిన వారు తెలియజేయాలని ఆమె మంగళవారం విజ్ఞప్తి చేశారు. -
నకిలీ మద్యానికి నలుగురు బలి
నరసరావుపేట టౌన్/తనకల్లు/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి నేతల నకిలీ మద్యం జనం ఉసురు తీస్తోంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఒకరు, శ్రీ సత్యసాయిజిల్లాలో మరొకరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇద్దరు... మొత్తంగా నలుగురు మృతి చెందారు. నరసరావుపేటలోని బరంపేట చాకిరాలమిట్ట ప్రాంతానికి చెందిన పాలెపు కోటేశ్వరరావు (50) లారీ క్లీనర్. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన కోటేశ్వరరావు గుంటూరు రోడ్డులో ఓ దుకాణం ఎదుట అకస్మారక స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న టూటౌన్ ఎస్ఐ అశోక్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. మద్యానికి అలవాటు పడ్డ కోటేశ్వరరావు కొన్ని రోజులుగా ఇంటికి సరిగ్గా రావడం లేదని భార్య వివరించింది. అతిగా మద్యం సేవించడం వల్లే మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.ములకలచెరువులో వ్యక్తి మృతిశ్రీసత్యసాయి జిల్లాలో పూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎర్రబల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు (58) బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ పని నుంచి ఇంటికి రాగానే అన్నమయ్య జిల్లా మొలకలచెరువుకు వెళ్లి మద్యం తాగేవాడు. అక్కడికే ఎందుకు వెళ్తున్నావని కుటుంబసభ్యులు ప్రశ్నిస్తే... అక్కడే మద్యం ‘ఫుల్ కిక్’ ఇస్తుందని చెప్పేవాడు. ఈక్రమంలోనే రెండు రోజుల క్రితం మొలకలచెరువుకు వెళ్లిన శ్రీరాములు రాత్రి ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సమీప ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం మొలకలచెరువులోని ప్రభుత్వాస్పత్రి పక్కన అనుమానాస్పద స్థితిలో శ్రీరాములు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు శ్రీరాములు మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. తన కుమారుడు నకిలీ మద్యం తాగడం వల్లే ప్రాణాలు కోల్పోయాడని తల్లి గంగులమ్మ బోరు విలపించారు. మృతునికి భార్య శాంతమ్మ, కుమార్తె రేణుక ఉన్నారు.నెల్లూరు జిల్లాలో ఇద్దరు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం వెలగపాడు గ్రామ సచివాలయం సమీపంలో బెల్టు షాపు ఉంది. 45 ఏళ్ల వ్యక్తి నాలుగు రోజులుగా అక్కడే తిరుగుతూ డబ్బులు అడుక్కుని బెల్టుషాపులోనే నకిలీ మద్యం తాగేవాడు. పక్కనే ఉన్న బస్షెల్టర్ పడుకునేవాడు. అయితే సోమవారం ఉదయం అతను అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడి చొక్కా కాలర్పై పామూరుకు చెందిన పవన్ మెన్స్వేర్ లేబుల్ను గుర్తించారు. శరీరంపై గాయాల్లేవు. దీంతో నకిలీ మద్యం తాగడం వల్లే తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని ఓ మద్యం దుకాణం సమీపంలో గుర్తుతెలియని 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. తరచూ అక్కడే మద్యం తాగేవాడు. అతడి మృతదేహాన్ని మద్యం షాపునకు సమీపంలోని చెట్ల మధ్య స్థానికులు గుర్తించారు. నకిలీ మద్యం అతిగా తాగడం వల్లే అపస్మారక స్థితిలో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీ ప్రభుత్వంపై వెంకయ్య ఘాటు వ్యాఖ్యలు!
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిగించడం వల్ల కలిగే ప్రయోజం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆయన.. ఉచితాలను అలవాటు చేయకూడదంటూ మాట్లాడారు. ‘‘ప్రభుత్వాలు విద్యా, వైద్యంపై ఖర్చు చేయాలి. అంతేకానీ ఉచితాలు అలవాటు చేయకూడదు. విద్య వల్ల పేదవాడు సంపన్నులయ్యే అవకాశాలు ఉన్నాయి. వైద్యం ప్రతి మనిషికి అవసరమైనది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శ్వేత పత్రం రూపంలో ప్రజలకు తెలియపరచాలి. ఐదేళ్లలో అప్పులు ఎంత చేస్తున్నారు., ఎంత తిరిగి చెల్లిస్తున్నారు అన్నది ప్రకటించాలి. .. అసెంబ్లీలో బూతుల సాంప్రదాయానికి తెర వేయాలి. సభలో లేని వారి పట్ల అమర్యాదగా వ్యవహరించకూడదు. అటువంటి వ్యాఖ్యలు చేసే వారిని సస్పెండ్ చేయాలి. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సభలో ఎలా నడుచుకొవాలో ట్రైనింగ్ ఇవ్వాలి. పార్టీ ఫిరాయిస్తే చర్యలు తీసుకోవాలి.. న్యాయస్థానాలు ప్రజా ప్రతినిధులపై కేసులను రెండు సంవత్సరాలలో తీర్పులు ప్రకటించాలి. కోర్టులు తక్కువైతే, జడ్జిలు తక్కువ సంఖ్యలో ఉంటే వెంటనే ఆ సమస్యను పరిష్కరించుకోవాలి అని నెల్లూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వ్యాఖ్యలు చేశారు. -
పెన్నా బ్యారేజ్: డబుల్ మర్డర్ కలకలం
సాక్షి, నెల్లూరు: పెన్నా నది సమీపంలో డబుల్ మర్డర్ కేసులో నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు టవర్ డంప్ను సంతపేట పోలీసులు సేకరిస్తున్నారు. నిందితులను అతిత్వరలో పట్టుకుంటామని ఎస్పీ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. పెన్నా బ్యారేజీ వద్ద రోడ్డుపై రక్తపు మరకలు ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సాయంతో రెండు మృతదేహాలను పోలీసులు మంగళవారం వెలికి తీశారు. హత్య చేసి నదిలో పడేసి ఉంటారని.. అర్ధరాత్రి సమయంలో ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు మృతుల వివరాల కోసం సమీపంలోని గిరిజన తండాల్లో ఆరా తీస్తున్నారు. -
ప్రభుత్వమా? వ్యాపార సంస్థా?
చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకునేందుకు ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేట్పరం చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని వ్యాపార సంస్థగా మార్చేస్తున్నాడు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదర్శవంతమైన నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వ్యాపార ధోరణికి ఉపయోగిస్తుంది. పేద ప్రజలకు ఉపయోగపడని ప్రైవేట్ ఆస్పత్రుల వల్ల వచ్చే ఇబ్బందులు కూటమి ప్రభుత్వానికి తెలియవా?. కూటమి కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లి అడ్డుకుంటేనే భవిష్యత్ తరాలకు మేలు చేసినవాళ్లమవుతాం. – పేర్నాటి కోటేశ్వరరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ -
ప్రైవేట్ ట్రావెల్స్ల్లో తనిఖీలు
నెల్లూరు (టౌన్)/వెంకటాచలం: దసరా పండగ నేపథ్యంలో సూదూర ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మూడు రోజులుగా జిల్లాలోని వెంకటాచలం, కోవూరు, బోగోలు ప్రాంతాల్లోని జాతీయ రహదారిపై బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్న 115 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఆయా బస్సుల నుంచి రూ.11.41 లక్షల అపరాధ రుసుం వసూలు చేశారు. ఈ సందర్భంగా డీటీసీ చందర్ మాట్లాడుతూ పండగల పేర్లు చెప్పి ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తే బస్సుల యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎంవీఐలు బాలమురళీ, రఫీ, పవన్కార్తీక్, ఏఎంవీఐలు స్వప్నిల్కుమార్రెడ్డి, రఘువర్ధన్రెడ్డి, మల్లికార్జునరెడ్డి, సంధ్య, సిబ్బంది పాల్గొన్నారు.నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు● కలెక్టర్ హిమాన్షు శుక్లానెల్లూరురూరల్: జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులను అరికట్టేందుకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అంతర్గత తనిఖీ బృందాలను నియమించినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, అక్రమ యూరియా నిల్వలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఈ సమస్యలపై ఫిర్యాదులు ఉన్నట్లయితే రైతులు వెంటనే జిల్లా వ్యవసాయ శాఖ టోల్ఫ్రీ నంబర్ 83310 57285కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలు తనిఖీలను ముమ్మరం చేసినట్లు చెప్పారు. డీలర్లు, గోదాములు, స్టాక్ పాయింట్లలో యూరియా సరఫరా, నిల్వలు, వినియోగంపై సమగ్ర స్టాక్ వెరిఫికేషన్న్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు అక్రమ రవాణా, అనధికార వినియోగాన్ని అరికట్టడం, క్రమం తప్పకుండా ఫీల్డ్ స్థాయి తనిఖీలు చేయడం, వ్యవసాయ అధికారులను సమన్వయం చేస్తూ పర్యవేక్షణ చేయడం ఈ ప్రత్యేక బృందాల ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఉల్లంఘనలకు పాల్పడిన డీలర్ల లైసెన్సులు రద్దు చేయడంతోపాటు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నేటి నుంచి అండర్–19 ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి ఎంపికలునెల్లూరు (టౌన్): ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 జిల్లా స్థాయి ఎంపికలు మంగళవారం నుంచి జరగనున్నట్లు డీవీఈఓ కృష్ణారెడ్డి, ఆర్ఐఓ వరప్రసాదరావు, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాటూరు వేణుగోపాల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి ఎంపికలు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం జరుగుతాయన్నారు. 7న అథ్లెటిక్స్, 8న ఖోఖో, 9న కబడ్డీ, 10న వాలీబాల్, సాఫ్ట్బాల్, హాకీ, 11న హ్యాండ్బాల్, 12న షటిల్ బ్యాట్మింటిన్, 13న క్రికెట్ ఎంపికలు ఉంటాయన్నారు. జిల్లా స్థాయి ఎంపికల్లో పాల్గొను విద్యార్థులు 2007 జనరవరి 1వ తేదీ తర్వాత జన్మించిన వారై ఉండాలన్నారు.శ్రీవారి దర్శనానికి 24 గంటలుతిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 83,412 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 33,058 మంది భక్తులు తలనీలాలు అర్పించుకున్నారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.89 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందుగా క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
వైఎస్ జగన్ది దూర ఆలోచన
పేద విద్యార్థుల మెడికల్ కలను సాకారం చేసేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది ‘దూర’ ఆలోచన చేస్తే.. చంద్రబాబు స్వార్థంతో, కుట్రలతో ‘దుర’ ఆలోచన చేస్తున్నాడు. ప్రైవేటీకరణతో పేద విద్యార్థులు చదువుకోలేరు. ప్రైవేట్ వైద్యశాలల్లో పేదలకు మంచి వైద్యం అందే పరిస్థితి ఉండదు. విద్య, వైద్యం పేదలకు అందాలంటే ప్రభుత్వమే నిర్వహించాలని విజనరీ అని చెప్పుకునే చంద్రబాబుకు లేకపోవడం బాధాకరం. కూటమి నిర్ణయాలకు సమయం వచ్చినప్పుడు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. – ఆనం విజయ్కుమార్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ -
భావితరాలకు శాపం
మెడికల కళాశాల విషయంలో బాబు నిర్ణయం భావితరాలకు శాపమం. ప్రైవేటీకరణ వల్ల ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు వైద్యవిద్యను అభ్యసించాలన్న కల కలగానే మిగిలిపోతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేరొస్తందనే తట్టుకోలేక కుట్రలు పన్నుతున్నారు. వైద్య విద్యను ఆర్థికంగా వెనుకబడిన వారికి అందజేసిన ఘనత దివంగత సీఎం డాక్టర్ రాజశేఖర్రెడ్డిది. నా తమ్ముడు, నా కుమారుడు వైద్యవిద్యను పూర్తి చేశారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను మరో స్వాతంత్య్ర ఉద్యమంలా చేయాల్సిన అవసరం ఉంది. – మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ -
మెడికల్ అధికారులకు పదోన్నతులు కల్పించాలి
నెల్లూరు (టౌన్): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేవలందిస్తున్న వైద్యులకు నిర్ణీత కాల వ్యవధిలో పదోన్నతులు కల్పించాలని ఏపీ హంస జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్రావు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట దీక్ష చేస్తున్న వైద్యులకు సంఘీభావం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ పీహెచ్సీ వైద్యులకు 25 ఏళ్లుగా పదోన్నతులు లేవన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక సర్జన్, ఇద్దరు డిప్యూటీ సివిల్ సర్జన్ను నియమించాలన్నారు. సర్వీసు పీజీ కోటా 20 శాతం విధానాన్నే కొనసాగించాలన్నారు. సంచార చికిత్స కార్యక్రమానికి రూ.5 వేలు భత్యం మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ హంస జిల్లా సెక్రటరీ కమల్కిరణ్, కోశాధికారి శేషగిరిరావు, పబ్లిసిటీ సెక్రటరీ మజూర్, నాయకులు రాజయ్య, మురళీ, నాగరాజు, వరప్రసాద్, గౌస్బాషా, సుధాకర్రెడ్డి, లక్ష్మీనరసయ్య, లక్ష్మీకాంతమ్మ, వింధ్యావళి తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక, మట్టి మా సొంతం
కోవూరు: పెన్నానదిలో అసలు ఇసుక తవ్వకాలకు ఎక్కడా అనుమతి లేదు. పెన్నానదిలో ఇసుక తవ్వకాలు చేపట్టాలంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతితోనే జిల్లా మైనింగ్, జలవనరుల శాఖ అనుమతివ్వాల్సి ఉంది. వాస్తవానికి ఈ నెల 15వ తేదీ వరకు నదుల్లోనే కాదు.. వాగుల్లో కూడా ఇసుక తవ్వకాలపై నిషేధం అమల్లో ఉంది. అయినా అధికార పార్టీ నేతలకు ఇవేమి పట్టడం లేదు. పర్యావరణ, వాల్టా చట్టం నిబంధనలు ఉల్లంఘించి టీడీపీ నేతలు పెన్నానదిని కుళ్లబొడిచి విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతుంటే మైనింగ్, జలవనరులు, రెవెన్యూ, పోలీస్ శాఖలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం 100 ట్రాక్టర్ల ఇసుక అక్రమ రవాణా మండలంలోని జమ్మిపాళెం వద్ద పెన్నానది నుంచి నిత్యం 100 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బావుల్లాంటి గోతులు పెట్టి ఇసుక తవ్వేయడంతో ప్రమాదకర స్థాయిలో గుంతలు ఏర్పడుతున్నాయి. పెన్నానదిలో ఇసుక తవ్వకాలపై ప్రశ్నిస్తే మాఫియా బహిరంగంగానే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ‘కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు అధికారులు ఎవరు మా జోలికి రారు, పెన్నానదిలో ఉండే ఇసుక, మట్టి మాకే సొంతం. మాకు అధికార పార్టీ అండదండలు ఉన్నాయి. మా ఇసుక ట్రాక్టర్లు, మట్టి ట్రాక్టర్లకు ఎవరైనా అడ్డొచ్చినా ఒప్పుకోం.. మమ్మల్ని కాదని నదిలో దిగారంటే ట్రాక్టర్లూ సీజ్ అవుతాయి’ అంటూ బాహాటంగా హెచ్చరిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. పర్యావరణంపై ఆందోళన పెన్నానదిలో ఇసుక తవ్వకాల విషయం అటుంచితే.. రేయింబవళ్లు ఇసుక ట్రాక్టర్లు రాకపోకలతో రణగోణ ధ్వనులతో తమకు ప్రశాంతత కొరవడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు దెబ్బతిన్నాయని, వర్షం పడితే బురద, ఎండితే దుమ్ముతో అల్లాడిపోతున్నామంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాలతో తమ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. కప్పం కట్టు.. ఇసుక తోలుకో.. జమ్మిపాళెం పరిధిలో ఉండే ట్రాక్టర్లు మాత్రమే పెన్నానది నుంచి ఇసుకను అక్రమంగా తరలించేందుకు అనుమతి ఇస్తున్నారు. ఎవరైనా బయట వ్యక్తులు ఇసుక కావాలంటే.. ఇసుక విలువ కప్పం కడితేనే అనుమతిస్తామని, లేదంటే సీజ్ చేయిస్తామని అధికార పార్టీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. అధికార పార్టీ నేతలు ఈ స్థాయిలో బరితెగించి వ్యవహరిస్తున్నారంటే అధికార వ్యవస్థలు వీరికి ఏ విధంగా సాగిలపడుతున్నాయో అర్థమవుతోంది. జమ్మిపాళెం నుంచి విచ్చలవిడిగా అక్రమ రవాణా మాఫియాకు అధికారం అండదండలు మామూళ్ల పేరుతో రూ.లక్షల్లో వసూళ్లు చూసీ చూడనట్లుగా అధికారులు ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. మండలంలోని జమ్మిపాళెం ప్రాంతంలో పెన్నానదిని అడ్డాగా చేసుకుని కుళ్లబొడిచేస్తున్నారు. ఏ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. పెన్నానది మాది.. ఇసుక, మట్టి మా సొంతమే.. ఎవరైనా అడ్డొస్తే మీ సంగతి తేలుస్తామంటూ స్థానిక గ్రామస్తులను బహిరంగంగానే బెదిరిస్తున్నారు. స్థానికులు తమ ఇంటి అవసరాలకు కూడా ఇసుక తరలించడానికి వీల్లేదంటూ, తమను కాదని నదిలోకి దిగితే సీజ్ చేయిస్తామంటూ బాహాటంగానే హెచ్చరిస్తున్నారంటే అధికార వ్యవస్థలు అధికార పార్టీ నేతలకు ఏ విధంగా సాగిలపడి ఊడిగం చేస్తున్నాయో అర్థమవుతోంది. -
విక్రమ సింహపురి విద్యార్థికి అవార్డు
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీలో బయో టెక్నాలజీ విభాగానికి చెందిన ఎం.పృథ్వీరాజ్ జాతీయ ఎన్ఎన్ఎస్ ఉత్తమ వలంటీర్ అవార్డును న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సోమవారం ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వీకరించాడు. సామాజిక సేవలో చేసిన విశేష కృషికి ఈ అవార్డు దక్కిందని వీసీ అల్లం శ్రీనివాసరావు, ఇతర అధ్యాపకులు తెలిపారు. రాళ్లపాడు నుంచి మృతదేహం వెలికితీతలింగసముద్రం: రాళ్లపాడు ప్రాజెక్ట్లో ఆదివారం గుర్తించిన మృతదేహాన్ని సోమవారం గజ ఈతగాళ్ల సాయంతో వెలికితీశారు. ఎస్సై నారాయణ కథనం మేరకు.. మృతుడు గుండు చేయించుకుని ఉన్నాడు. ముదురు నీలం రంగు ప్యాంట్ ధరించాడు. మృతదేహాన్ని కందుకూరు ఏరియా వైద్యశాల మార్చురీకి తరలించారు. మృతదేహం ఉన్న తీరు చూసినవారు హత్య చేసి ప్రాజెక్ట్లో పడేసి వెళ్లి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నాగమ్మ కాలనీలో కార్డన్ సెర్చ్
● 13 మోటార్బైక్ల స్వాధీనం నెల్లూరు(క్రైమ్): నెల్లూరు వేదాయపాళెం పోలీస్స్టేషన్ పరిధిలోని బుజబుజనెల్లూరు నాగమ్మ కాలనీలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. యజమానితోపాటు కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను సేకరించారు. వాహనపత్రాల్లేని 13 మోటార్బైక్లను స్వాధీనం చేసుకున్నారు. 13 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి వివరాలను సేకరిస్తున్నారు. ఏడుగురు రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ చేశారు. నేరనియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్లకు ప్రజలు సహకరించాలని ఇన్స్పెక్టర్ కోరారు. అనుమానాస్పద వ్యక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మాదకద్రవ్యాల వినియోగంపై డయల్ 112, స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు విజయకుమార్, శ్రీనివాసరావు, ఏఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వీఎస్యూలో పోటీ పరీక్షల కేంద్రం ఏర్పాటు
వెంకటాచలం: మండలంలోని కాకుటూరు వద్దనున్న విక్రమ సింహపురి యూనివర్సిటీ క్యాంపస్లో పోటీ పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనికి డైరెక్టర్గా వర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జె.విజేతను నియమించారు. సోమవారం వీసీ అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కేంద్రం విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ప్రిన్సిపల్ సీహెచ్ విజయ, ఇతర అధ్యాపకులు డాక్టర్ విజేతను అభినందించారు.బంగారు నగల కోసమే హత్య● సమీప బంధువే నిందితుడు వెంకటాచలం: మండలంలోని చెముడుగుంట పంచాయతీ నక్కలకాలనీ సమీపంలో జరిగిన హత్యకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. వల్లూరు మల్లికార్జున మెడలో ఉన్న బంగారు నగలు కోసమే సమీప బంధువు ఈ దారుణానికి పాల్పడ్డాడు. వెంకటాచలం పోలీసులు సోమవారం వివరాలు వెల్లడించారు. బుజబుజనెల్లూరు పరిధిలోని న్యూకాలనీలో నివాసముంటున్న మల్లికార్జున గత నెల 29 రాత్రి నుంచి కనిపించలేదు. 30 తేదీన నక్కల కాలనీ సమీపంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. న్యూకాలనీలోనే మల్లికార్జున సోదరుడి కుమార్తె భర్త వెలగల పవన్ కల్యాణ్ ఉంటున్నాడు. అతను మల్లికార్జునను నగదు అడగ్గా ఇవ్వకపోవడంతో కోపం పెంచుకున్నాడు. కొంతసేపటి తర్వాత తన వెంట మల్లికార్జునను తీసుకెళ్లి మద్యం తాగించాడు. అనంతరం పక్కా ప్రణాళికతో హత్య చేసి అతని మెడలో ఉన్న బంగారు గొలుసు, ఉంగరం లాక్కొని పరారయ్యాడు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచగా, ఈనెల 17వ తేదీ వరకు రిమాండ్ విధించారు. యువకుడి మృతదేహం లభ్యంనెల్లూరు సిటీ: పెన్నానదిలో ఈతకు వెళ్లి గల్లంతైన యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. ఆదివారం నలుగురు యువకులు రూరల్ పరిధిలోని జొన్నవాడకు సమీపంలో పెన్నానదిలో ఈతకు వెళ్లిన విషయం తెలిసిందే. గణేశన్ నరసింహ అనే యువకుడు చనిపోగా మృతదేహం లభ్యమైంది. దేవరపాళేనికి చెందిన కోటయ్య (24) గల్లంతవగా పోలీసులు గజ ఈతగాళ్లతో గాలించారు. సోమవారం ఉదయం అతని మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతం ● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు రూరల్: ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమం విజయవంతం అవుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో 2025 స్వచ్ఛత అవార్డుల ప్రదానోత్సవం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములైతేనే పరిసరాలు పరిశుభ్రంగా మారుతాయన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ జిల్లాను రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కృషితోనే పట్టణాలు పరిశుభ్రంగా ఉంటున్నాయన్నారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో కమిషనర్ నందన్, డీపీఓ శ్రీధర్రెడ్డి, డీఈఓ బాలాజీరావు, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
భారీగా బాణసంచా ముడిసరుకు స్వాధీనం
ఇందుకూరుపేట: బాణసంచా తయారీకి ఉపయోగించే ముడిసరుకును మండలంలోని నిడుముసలి గ్రామంలో పోలీసులు భారీ స్థాయిలో స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్నట్టు సమాచారం అందడంతో ఎస్సై నాగార్జునరెడ్డి సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. ఏసురత్నం అనే వ్యక్తి నుంచి 120 కిలోల ముడిసరుకు, ఇంకా మూడు వేల టపాసులు (నెల్లూరు గన్లు) స్వాధీనం చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన మురళి వద్ద మరో 7 కిలోల ముడిసరుకు గుర్తించారు. ఎస్సై మాట్లాడుతూ దీనిపై కేసులు నమోదు చేశామన్నారు. షాపు ఖాళీ చేయకపోతే చంపేస్తా● రౌడీషీటర్ బెదిరింపులు నెల్లూరు(క్రైమ్): అన్నావదినను చంపుతామని బెదిరించిన రౌడీషీటర్పై నెల్లూరు బాలాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. ముత్యాలపాళెంలో మహేష్కుమార్, కస్తూరమ్మ దంపతులు నివాసముంటున్నారు. మహేష్కుమార్ దివ్యాంగుడు. భార్య టైలరింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆస్తి విషయంలో మహేష్కుమార్ను కొంతకాలంగా అతని చిన్నతమ్ముడు శరత్బాబు (రౌడీషీటర్) వేధిస్తున్నాడు. శరత్బాబు ఈనెల 3వ తేదీన వదిన షాపులోని కుట్టుమెషీన్కు నిప్పంటించాడు. ఇల్లు, షాపు ఖాళీ చేసి వెళ్లకుంటే చంపేస్తామని బెదిరించాడు. మహేష్కుమార్ సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై పుల్లారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అర్జీలిచ్చాం.. ఆలకించండి
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● పోటెత్తిన అర్జీదారులునెల్లూరు రూరల్: క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని ప్రజలు కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్రెడ్డి, డ్వామా పీడీ గంగా భవాని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. విధుల్లోకి తీసుకోవాలంటూ.. 1207 జీఓలో ఉన్న 920 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అసిస్టెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ 22 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని విధుల్లోకి తీసుకుంటామంటూ కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిందన్నారు. కానీ ఇప్పటివరకు అఫిడవిట్ దాఖలు చేయలేదన్నారు. ఫైనల్ హియరింగ్ జరిగినప్పుడు నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించిందని, అయినా పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణలో విధుల్లోకి తీసుకున్నారని, ఏపీలో అలాగే చేయాలని కోరారు. సర్వే చేయించాలని వినతి ‘వెంకటాచలం మండలం కాకుటూరు పంచాయతీ సర్వే నంబర్ 2 నుంచి 68 వరకు, సర్వే నంబర్ 71 నుంచి 76, 407 వరకు ఉన్న భూమిలో 2,346 ప్లాట్లు వేశారు. చాలా వరకు ఆక్రమణకు గురయ్యాయి. డబుల్ రిజిస్ట్రేషన్లు చేశారు. సర్వే చేయించాలి’ అని రఘువీర్ రియల్ ఎస్టేట్ లేఅవుట్ ప్లాట్ల యజమానుల కమిటీ సభ్యులు వినతిపత్రం సమ ర్పించారు. వారు మాట్లాడుతూ ఆక్రమణకు గురైన కొన్ని ప్లాట్లు బుజబుజనెల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కూడా అయ్యాయన్నారు. సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలని, అందుకు ఖర్చయ్యే మొత్తాన్ని చెల్లిస్తామన్నారు. డెవలపర్ను పిలిపించి లింక్ డాక్యుమెంట్లు పరిశీలించి సాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో కృష్ణారెడ్డి, రవికుమార్, మనోహర్, ఆదిశేషయ్య ప్లాట్ల యజమానులు పాల్గొన్నారు. పిల్లలతో కలిసి నిరసన ‘మా పొలం మాకు కావాలి. కలెక్టర్ గారూ స్పందించి న్యాయం చేయండి’ అంటూ దుత్తలూరు మండలం భైరవరం పంచాయతీ జంగాలపల్లి గ్రామానికి చెందిన ఆర్.వీరరాఘవులు పిల్లలతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ తమకు పూర్వీకుల నుంచి వచ్చిన భూముని దుత్తలూరు మండల రెవెన్యూ కార్యాలయ అధికారులు వేరే వ్యక్తుల పేర్లపై నమోదు చేశారని వాపోయారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు వినతి నెల్లూరులో ఐటీడీఏ కార్యాలయం వద్ద అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య కలెక్టర్కు వినితపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ నెల్లూరు కార్యాలయం పరిధిలో తిరుపతి, చిత్తూరు, కడప, ప్రకాశం, బాపట్ల తదితర జిల్లాలున్నట్లు చెప్పారు. చాలామంది పనుల నిమిత్తం వస్తారన్నారు. తగిన చర్యలు తీసుకోవాలని గత కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారని, ఇప్పటి వరకు స్పందన లేదన్నారు. చెంబెటి ఉష తదితరులు పాల్గొన్నారు. ఈఓకు అండగా నిలవాలి గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమ ఈఓ బాలసుబ్రహ్మణ్యంకు ప్రభుత్వం అండగా నిలవాలని బీజేపీ నాయకుడు మిడతల రమేష్ జేసీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ ఆశ్రమం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా బాలసుబ్రహ్మణ్యం కృషి చేశారన్నారు. కొందరు వ్యక్తులు ఆయనపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏవీఆర్ మోహన్రావు, పొట్లూరి శ్రీనివాసులు, చిట్టిబాబు, బుధవరపు బాలాజీ, సోమగోపాల్, నారాయణ యాదవ్ పాల్గొన్నారు. మా పేరుతో ప్లాట్లు ఇప్పించండి జలదంకి మండలం కేశవరం పంచాయతీ తిమ్మసముద్రం గ్రామ గిరిజనులు అధికారులను కలిశారు. వారు మాట్లాడుతూ 50 కుటుంబాలవారం ఐదేళ్లుగా గుడిసెలు వేసుకుని ఉంటున్నామన్నారు. కొందరు వచ్చి ఖాళీ చేయించి ఆక్రమించాలని చూస్తున్నారని వాపోయారు. పట్టాలు మంజూరు చేసి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని కోరారు. అనుమతి లేకుండా హాస్టళ్ల నిర్వహణ నెల్లూరు నగరంలో విద్యార్థుల ఆత్మహత్యలపై పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నేతలు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ విద్యాశాఖ అనుమతి లేకుండా ప్రైవేట్ విద్యాసంస్థలకు అనుబంధంగా హాస్టళ్లను నిర్వహిస్తున్నారని తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన డీఈఓ, ఆర్ఐఓ, మానసిక నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఒత్తిడితో ఉన్న ప్రతి విద్యార్థికి కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు మలిరెడ్డి కోటారెడ్డి, రాష్ట్రాధ్యక్షుడు నరహరి శిఖరం, జేఏసీ నాయకులు, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఎలా చనిపోయారో?
● వేర్వేరు చోట్ల ఇద్దరి మృతి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మద్యం తాగి అపస్మారక స్థితికి చేరుకుని మృతిచెందినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు సిటీ: రూరల్ పరిధిలో ఓ వైన్ షాపు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. మూడో మైలు వద్ద ఆర్ఆర్ఆర్ మద్యం షాపునకు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని చెట్ల మధ్య స్థానికులు గుర్తించారు. వారి సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుడి వయసు 45 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. మద్యం తాగి అపస్మారక స్థితికి చేరుకుని చనిపోయాడా?, మరేదైనా కారణం ఉందా? అని పోలీసులు విచారణ చేస్తున్నారు. బస్ షెల్టర్లో మృతదేహం కలిగిరి: మండలంలోని వెలగపాడులో గ్రామ సచివాలయం ఎదురుగా ఉన్న బస్ షెల్టర్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని సోమవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. అతను నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలో తిరుగుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. మద్యం తాగి అపస్మారక స్థితికి చేరుకుని చనిపోయి ఉండొచ్చని చెబుతున్నారు. మృతుడి వయసు 45 సంవత్సరాలు ఉండొచ్చంటున్నారు. ఎస్సై ఉమాశంకర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి చొక్కా పామూరుకు చెందిన పవన్ మెన్స్వేర్లో కుట్టించినట్లు గుర్తించారు. శరీరంపై గాయాల్లేవు. మృతదేహాన్ని కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆచూకీ తెలిసిన వాళ్లు 94407 00098 ఫోన్ నంబర్ను సంప్రదించాలని ఎస్సై కోరారు. -
చట్ట పరిధిలో విచారించి న్యాయం చేస్తా
● బాధితులకు ఎస్పీ భరోసా నెల్లూరు(క్రైమ్): సమస్యలను చట్టపరిధిలో విచారించి న్యాయం చేస్తానని ఎస్పీ అజిత బాధితులకు భరోసానిచ్చారు. సోమవారం నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 121 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీకి అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె ఆయా ప్రాంత పోలీసు అఽధికారులతో మాట్లాడి చట్టపరిధిలో పరిష్కారం చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర డీఎస్పీ పి.సింధుప్రియ, నవాబుపేట, ఎస్బీ 2 ఇన్స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, బి.శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● కవిత, సాయి అనే ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.8.30 లక్షలు తీసుకుని మోసగించారు. వారిపై చర్యలు తీసుకోవాలని సైదాపురానికి చెందిన ఓ వ్యక్తి కోరాడు. ● పొలం సాగు చేసుకోనివ్వకుండా కుమారుడు రవిబాబు బెదిరిస్తున్నాడని ఇందుకూరుపేటకు చెందిన ఓ వృద్ధుడు ఫిర్యాదు చేశాడు. ● నా స్థలాన్ని ఆక్రమించి హరిశ్చంద్రారెడ్డి ఇంటిని నిర్మించుకున్నాడు. పొలానికి నీళ్లు వెళ్లకుండా ఇబ్బంది పెడుతున్నాడని రాపూరుకు చెందిన ఓ వృద్ధురాలు అర్జీ ఇచ్చారు. ● నెల్లూరు నగరానికి చెందిన పెంచలరాజు మా ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నాడు. నా భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన సిమ్కార్డును చోరీ చేసి యూపీఐ ద్వారా రూ.13 లక్షలు కాజేశాడు. తగిన చర్యలు తీసుకోవాలని దర్గామిట్టకు చెందిన ఓ మహిళ కోరారు. -
బాలికపై లైంగికదాడి
నెల్లూరు (క్రైమ్): ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి ఆమెపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నెల్లూరు నగరంలోని సంతపేట పోలీస్స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. సంతపేట పోలీసుల కథనం మేరకు.. సంతపేట కామాక్షినగర్కు చెందిన ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. అదే ప్రాంతంలోని ఓ దుకాణంలో శశి అనే యువకుడు పనిచేస్తున్నాడు. కొంతకాలంగా బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.ఈ నెల 3వ తేదీన బాలిక స్కూల్కు వెళుతుండగా మార్గమధ్యంలో యువకుడు అడ్డుకుని ఆమెను బాలాజీనగర్లోని తన పిన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై బలవంతంగా లైంగిక దాడి చేశాడు. అనంతరం ఆమెను బైక్పై మైపాడుబీచ్కు తీసుకెళ్లి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. సాయంత్రం అవుతున్నా బాలిక ఇంటికి రాకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు స్కూల్ వద్దకు వెళ్లి విచారించారు. బాలిక రాలేదని తెలియడంతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు రాత్రి 8 గంటల సమయంలో బాలికను ఆమె ఇంటికి సమీపంలో వదిలి వెళ్లాడు.ఇంటికి చేరుకున్న బాలికను కుటుంబ సభ్యులు నిలదీయగా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాలిక నానమ్మ శనివారం రాత్రి సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. -
సచివాలయ ఉద్యోగుల ‘ఆత్మగౌరవం’ భగ్నం
నెల్లూరు (పొగతోట): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. నెల్లూరు టౌన్హాల్లో ఆదివారం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ఆత్మగౌరవ సభ ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆత్మగౌరవ రొట్టె, ఆత్మగౌరవ సమావేశం, కొవ్వొత్తుల ప్రదర్శన తదితర కార్యక్రమాలకు పోలీసుల అనుమతి కోరారు. ఆత్మగౌరవ రొట్టె, కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతించకపోవడంతో ఆత్మగౌరవ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు టౌన్హాల్కు భారీగా తరలివచ్చారు. అక్కడ పెద్దఎత్తున మోహరించిన పోలీసులు సభ నిర్వహణకు అనుమతిలేదంటూ ఉద్యోగులను బయటకు పంపించేశారు. అనంతరం టౌన్హాల్ గేట్లకు తాళాలు వేశారు. పోలీసుల తీరుకు నిరసనగా జేఏసీ నాయకులు, ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా వీఆర్సీ మైదానం వద్దకు వెళ్లాలంటూ హుకుం జారీ చేయడంతో అక్కడికి చేరుకుని నిరసన కొనసాగించారు.మా డిమాండ్లు నెరవేర్చాలిఉభయ గోదావరి జిల్లాల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఆదివారం రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమావేశం జరిగింది. 1,500 మంది సచివాలయ ఉద్యోగులు హాజరయ్యారు.ఐక్యవేదిక చైర్మన్ జానీ పాషా మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, వలంటీర్ విధుల నుంచి విముక్తి కల్పించాలని కోరారు. స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని, రికార్డ్ అసిస్టెంట్ పే స్కేల్ జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్తో క్యాడర్ అప్గ్రేడ్ చేయాలని కోరారు. సంఘ సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్కృష్ణ, కనీ్వనర్ షేక్ అబ్దుల్ రజాక్, నాయకులు పాల్గొన్నారు. -
కొందరికే ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం
● 38 వేల మంది ఉంటే 17 వేల మందికే.. నెల్లూరు(వీఆర్సీ సెంటర్): కూటమి ప్రభుత్వం ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం పేరుతో మోసం చేసిందని ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సురేష్, రాజా ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్క డ్రైవర్కు రూ.30 వేల వంతున ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం 38 వేల మంది ఆటో డ్రైవర్లుంటే 17,400 మందికి మాత్రమే లబ్ధి చేకూరిందని, 300 విద్యుత్ యూనిట్లు కరెంట్ బిల్లు, వాహనాలపై పెండింగ్లో ఉన్న పాత చలానాలు వంటి చిన్న కారణాలు చూపుతూ ఎగనామం పెట్టారన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఆటో డ్రైవర్లు, ఇతర రవాణా రంగ కార్మికుల కుటుంబాలకు రక్షణ కల్పించే విధంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, అత్యఽధికంగా చలానాలు విధించే జీఓ నంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ఆటో కార్మిక సంఘం నాయకులు పెంచలయ్య, రవీంద్ర, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. కండలేరులో 58.460 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 58.460 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలా శయం నుంచి కండలేరుకు 3,600 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 430, పిన్నేరు కాలువకు 140, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 30, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
వసతుల్లేవు.. అకాడమీలా?
● కూటమి ప్రభుత్వంలో క్రీడా రంగం నిర్లక్ష్యం ● సిబ్బందికి జీతాలు ఎప్పుడిస్తారో..నెల్లూరు(స్టోన్హౌస్పేట): కూటమి ప్రభుత్వం క్రీడా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను రూపొందించాల్సిన విధానాన్ని వదిలిపెట్టింది. ఉమ్మడి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందికి 13 నెలలపాటు జీతాలివ్వలేదు. రెండు నెలల క్రితం ఒక్కొక్కరికి నెలలో సగం జీతం మాత్రమే ఇచ్చారు. ఈ మొత్తం తీసుకుని ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. రెండు నెలల క్రితం శాప్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) సమావేశం పెట్టి కాంట్రాక్ట్ సిబ్బందికి పూర్తి జీతాలిస్తామని ప్రకటించింది. అయితే ఆ రెండు నెలల నుంచి ఇంత వరకు ఆ ప్రస్తావనే లేదు. జిల్లా సంస్థలో 26 మంది కోచ్లు, సిబ్బంది పనిచేస్తున్నారు. అంతంతమాత్రంగా.. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహిస్తున్న ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో వసతుల్లేవు. ఆడేందుకు మైదానాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. కనీసం మార్కింగ్ వేసేందుకు సున్నంకు కూడా డబ్బుల్లేవు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి మార్కింగ్, తాగునీటి వసతి, లైట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితితోపాటు జీతాలందని కోచ్లు, సిబ్బంది పనిచేయడమే కష్టంగా ఉంది. క్రీడాకారుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా వేసవి శిక్షణా శిబిరాలు నామమాత్రంగా జరిగాయి. క్రీడాకారులకు పరికరాల్లేవు. నగదు ప్రోత్సాహం సరిపోలేదు. ఇండోర్ స్టేడియంలో ఆడేందుకు వసతులు తక్కువే. ఫ్లోరింగ్ నుంచి స్లాబ్ వరకు అత్యంత ప్రమాదకరంగా ఉంది. స్విమ్మింగ్ పూల్లో నీటిని శుభ్రపరచడానికి కూడా వ్యయం భరించలేని పరిస్థితి నెలకొంది. వాకింగ్ ట్రాక్, హాకీ మైదానం గుంతలమయంగా తయారైంది. సిమెంట్ ఫ్లోరింగ్ ఉన్న బాస్కెట్బాల్ కోర్టు నిండా నెర్రెలు ఏర్పడ్డాయి. వీటిని మరమ్మతులు చేసే ప్రయత్నాలు జరగలేదు. చిన్నచూపు చూస్తూ.. కూటమి ప్రభుత్వం కనీస వసతుల కల్పనపై దృష్టి సారించలేదు. ఇటీవల అకాడమీలను ఏర్పాటు చేస్తామంటూ శాప్ అధికారి, డైరెక్టర్ల బృందం నగరంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ను పరిశీలించి హడావుడి చేశారు. అసలు ప్రభుత్వం క్రీడా రంగాన్ని చిన్నచూపు చూస్తున్న నేపథ్యంలో అకాడమీలు ఎప్పటికి ప్రారంభమవుతాయని సీనియర్ క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. పరికరాలు, కోచింగ్ ఇచ్చే సిబ్బంది బాగోగులు పట్టించుకోకుండా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ప్రతి జిల్లాలో అకాడమీలను ఏర్పాటు చేస్తామని చెప్పడం హాస్యాస్పదమంటున్నారు. కోచ్ల సంఖ్య : 5 డేటా ఎంట్రీ ఆపరేటర్లు : 2 అకౌంటెంట్ : 1 ఆఫీస్ సబార్టినేట్ : 3 గ్రౌండ్ మార్కర్, గ్రౌండ్ మెన్, సెక్యూరిటీ : 3 నైట్ వాచ్మెన్, డే వాచ్మెన్ : 2 ఇండోర్ స్టేడియం అటెండర్ : 2 స్విమ్మింగ్ పూల్ సెంటర్లు : 2 స్విమ్మింగ్ పూల్ వాచ్మెన్లు : 2 ఎలక్ట్రీషియన్ : 1 కేర్టేకర్ వెంకటగిరి సెంటర్ : 1 కేర్టేకర్ గూడూరు సబ్ సెంటర్ : 1 కేర్టేకర్ ఓజిలి సబ్ సెంటర్ : 1 కాంట్రాక్ట్ ఉద్యోగులు -
వేర్వేరు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు
నెల్లూరు(క్రైమ్): విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రెండు వేర్వేరు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. రూ.80 వేల ఆస్తి నష్టం వాటిల్లింది. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరులోని ఇస్కాన్ టెంపుల్ సమీపంలో సుబ్బమ్మ, వెంకయ్య దంపతులు ఉంటున్నారు. ఆదివారం వారు ఇంట్లో ఉండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దంపతులు బయటకు పరుగులు తీశారు. పూరిల్లు కావడంతో మంటలు దట్టంగా వ్యాపించాయి. ఇన్చార్జి ఏడీఎఫ్ఓ శ్రీనాథ్రెడ్డి ఆదేశాలతో లీడింగ్ ఫైర్మెన్ చంద్రశేఖర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పేశారు. రూ.50 వేల ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ● నవాబుపేటలో జగన్మోహన్ నివాసముంటున్నారు. అతని ఇంటి వెనుకున్న గదిలో పాత సామగ్రి, చెక్క వస్తువులున్నాయి. ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పేశారు. రూ.30 వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిసింది. రైలు కిందపడి ఆత్మహత్య నెల్లూరు(క్రైమ్): రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు వేదాయపాళెం రైల్వే గేటు సమీపంలో నెల్లూరు వైపు వచ్చే పట్టాలపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతుడి వయసు 45 నుంచి 50 ఏళ్లలోపు ఉండొచ్చని భావిస్తున్నారు. ఎరుపు రంగు హఫ్ హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడు. సిబ్బంది సమాచారం మేరకు నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి వివరాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఆమె కేసు నమోదు చేశారు.స్నేహితులతో వెళ్లి.. ● అదృశ్యమైన బాలుడు ● ఆచూకీ కనుగొన్న పోలీసులు, గ్రామస్తులు సోమశిల: ఓ బాలుడు అడవిలో అదృశ్యమయ్యాడు. అతని ఆచూకీ కోసం గ్రామస్తులు, పోలీసులు గాలించి గుర్తించిన ఘటన ఆదివారం అనంతసాగరం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండల పరిధిలోని ఆమనిచిరివెళ్ల గ్రామానికి చెందిన కూసుపాటి కొండయ్య కుమారుడైన వెంకటకృష్ణ పదో తరగతి చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లాడు. భోజనాల తయారు చేసేందుకు కట్టెల కోసం వెళ్లి తిరిగిరాలేదు. అక్కడున్న యువకులు గ్రామస్తులు, పోలీసులకు సమాచారం అందించారు. అందరూ ఘటనా స్థలానికి చేరుకుని గాలించారు. పల్లిపాడు గ్రామం వద్ద బాలుడి ఆచూకీ లభ్యమైందని ఎస్సై సూర్యప్రకాష్రెడ్డి తెలిపారు. ఎటువంటి హాని కలగకుండా వెంకటకృష్ణ బయటపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. రాళ్లపాడు ప్రాజెక్ట్లో మృతదేహం లింగసముద్రం: రాళ్లపాడు ప్రాజెక్ట్లో గుర్తుతెలియని మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. కొత్త స్పీల్వే పాత గేట్లకు మధ్యలో ఉన్న జనరేటర్ రూమ్ వద్ద నీటిలో మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న ఎస్సై నారాయణ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రాజెక్ట్లో నీరు లోతుగా ఉన్నందున బోటు సాయంతో మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని బయటకు తీస్తేనే ఇది హత్య, ఆత్యహత్యా అనేది నిర్ధారణ అవుతుందని పోలీసులు వెల్లడించారు. -
విద్యాశాఖలో బదిలీలలు
ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలున్నాయి. కూటమి నాయకుల జోక్యంతో అర్హులకు అన్యాయం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో అఽధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చక్రం తిప్పినట్లు తెలిసింది. కొందరు టీచర్ల నుంచి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున తీసుకుని రికమండ్ చేసినట్లు సమాచారం.నెల్లూరు(టౌన్): ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించారు. పాత నెల్లూరు జిల్లా నుంచి 21 మంది ఇతర జిల్లాలకు వెళ్లారు. వీరిలో 17 మంది ఎస్జీటీలు, నలుగురు స్కూల్ అసిస్టెంట్లున్నారు. అదే విధంగా ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి 23 మంది టీచర్లు వచ్చారు. వీరిలో 18 మంది ఎస్జీటీలు, ఐదుగురు స్కూల్ అసిస్టెంట్లున్నారు. వీరందరూ జిల్లా విద్యాశాఖాధికారికి రిపోర్ట్ చేయగా ఆయా స్థానాలు కేటాయించారు. ఇద్దరికి స్పెషల్ ఆర్డర్లు మ్యూచువల్, స్పౌజ్తో సంబంధం లేకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయుల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీఓ జారీ చేసింది. ఈ విషయంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. కోట మండలం మల్లాం జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో పనిచేస్తున్న ఓ మహిళా టీచర్ను నెల్లూరు నగరం దర్గామిట్టలోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్కు, పెళ్లకూరు మండలం నెలబల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో పనిచేస్తున్న ఓ మహిళా టీచర్ను కోవూరులోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్కు బదిలీ చేశారు. ఈ బదిలీలు అక్రమంగా జరిగినట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వమే నేరుగా ఉత్తర్వులు జారీ చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అంతర్ జిల్లాల ట్రాన్స్ఫర్స్లో అక్రమాలు ఇతర జిల్లాల నుంచి 21 మంది టీచర్ల రాక ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు 23 మంది మరో ఇద్దరి బదిలీకి నేరుగా ప్రభుత్వం ఉత్తర్వులు చక్రం తిప్పిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలుడబ్బులిచ్చి.. మ్యూచువల్, స్పౌజ్ అవకాశమున్న వారికి అంతర్ జిల్లాల బదిలీలు నిర్వహిస్తారు. జిల్లాలో పనిచేస్తున్న టీచర్, మరో జిల్లాలో పనిచేస్తున్న వారు మ్యూచువల్పై బదిలీ చేయించుకునే అవకాశాన్ని కల్పించారు. అయితే ఈ విషయంలో కొందరు అక్రమాలకు తెరలేపారు. కూటమి నేతల జోక్యం ఎక్కువైంది. పలువురు పెద్ద మొత్తంలో డబ్బులిచ్చి బదిలీలు చేయించుకున్నారని ప్రచారం ఉంది. జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి కొందరికి అనుకూలమైన ప్రాంతాల్లో పోస్టింగ్ ఇప్పించారన్న ఆరోపణలున్నాయి. దీనిపై జిల్లా విద్యాశాఖాఽధికారి బాలాజీరావును వివచారణ కోరగా మ్యూచువల్, స్పౌజ్లకు సంబంధించి బదిలీల్లో అక్రమాలు జరగలేదన్నారు. ఇద్దరు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి నేరుగా ఆర్డర్లు వచ్చాయన్నారు. -
నిలిచిన 104 సేవలు
● వైద్యులు సమ్మెలో ఉండటమే కారణం ● హాజరుపట్టికలో మాత్రం సంతకాలు ● ఏఎన్ఎంల ఆన్లైన్ రిపోర్టులు కూడా బంద్సాక్షి టాస్క్ఫోర్స్: గ్రామాల్లో 104 వాహన సేవలు నిలిచిపోయాయి. కందుకూరు మండలంలోని మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వైద్యులు సమ్మెలో ఉన్నారు. దీంతో రోజుకు ఒక గ్రామానికి వెళ్లాల్సిన 104 వాహనం ఆగింది. ఆయా గ్రామాల్లోని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వైద్యసేవల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డాక్టర్లు లేకపోవడంతో ఉన్నతాధికారులు సేవలను పూర్తిగా ఆపేశారు. వైద్యులు లేకపోయినా ప్రతి సచివాలయం పరిధిలో ఒక విలేజ్ క్లినిక్ ఉంటుంది. అందులో ఎంఎల్హెచ్పీ, సచివాలయ ఏఎన్ఎం, 104 వాహన సిబ్బంది ఉంటారు. వారి ద్వారా కూడా మందులిచ్చే అవకాశం ఉంది. కానీ అలా జరగడం లేదు. సంతకాలు మాత్రం పెడుతూ.. ఇదిలా ఉండగా వైద్యులు సమ్మెలో ఉంటూ కూడా విధుల్లో ఉన్నట్టు హాజరుపట్టికలో సంతకాలు చేస్తుండటం విశేషం. గత నెల 26వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లారు. అయితే విధులకు హాజరైనట్లు సంతకాలు చేసి ఉన్నారు. జీతం తీసుకునేందుకు వారే చేశారా? లేదా పీహెచ్సీలోని సిబ్బంది చేశారా? అనే విషయంపై అనుమానాలున్నాయి. సమ్మెలో ఉంటూ విధులకు హాజరైనట్లు సంతకాలు చేయడం నిబంధనలకు విరుద్ధం. డాక్టర్లకు సెప్టెంబర్ నెలలో పూర్తి జీతం వస్తే ఉన్నతాధికారులు కూడా పరిశీలించకుండా ఇచ్చినట్లవుతుంది. గత నెలలో ఓ ఏఎన్ఎం అనారోగ్యం కారణంగా చికిత్స పొందింది. ఆమ్మెకు సంబంధిత జీతంతోపాటు ఎర్న్ లీవ్లకు సంబంధించి బిల్లులు చేయలేదు. ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగికి జీతం పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారు. గ్రామాల్లో పనిచేసే ఏఎన్ఎంలు రోజూ ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలి. వారి చేత డాక్టర్లు నమోదు చేయించడం లేదు. ఇబ్బంది పడుతూ.. ప్రస్తుతం సీజన్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో పీహెచ్సీలోని ఇద్దరు వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కందుకూరు అర్బన్ పీహెచ్సీ నుంచి వైద్యురాలిని ఇన్చార్జిగా వేసినప్పటికి 104 సేవలు గ్రామాల్లో అందడం లేదు. కందుకూరు మండలంలో 19 పంచాయతీలు, 13 సచివాలయాలున్నాయి. రోజూ 104 వాహనం ద్వారా రోగులను పరీక్షించాల్సి ఉంది. కానీ దీనికి ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపట్టలేదు. -
ప్రాణం తీసిన ఈత సరదా
● ఒకరి మృతి, మరొకరు గల్లంతు నెల్లూరు సిటీ: ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని కొత్తూరు శ్రీలంక కాలనీకి చెందిన గణేశన్ నరసింహ అలియాస్ విశాల్ (19) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇటీవల దేవరపాళెంలోని అమ్మమ్మ ఇంటికొచ్చాడు. నరసింహకు అదే ప్రాంతానికి చెందిన బేల్దారి పనులు చేసే కోటయ్య, విజయ్, లోకేశ్లు స్నేహితులు. ఆదివారం నలుగురూ ఈత కొట్టేందుకు జొన్నవాడ సమీపంలోని పెన్నానది వద్దకు వెళ్లారు. విజయ్కు ఈత రాకపోవడంతో దిగలేదు. అయితే లోకేశ్, కోటయ్య, నరసింహ నదిలోకి దిగారు. కోటయ్య, నరసింహకు కూడా ఈత రాదు. నదిలో వారిద్దరూ గల్లంతయ్యారు. ఇది గుర్తించిన లోకేశ్ కేకలు వేశాడు. స్థానికుల సమాచారంతో సీఐ వేణు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈతగాళ్లు వారి కోసం గాలించారు. నరసింహ మృతదేహాన్ని బయటకు తీశారు. కోటయ్య కోసం గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. రాత్రి కావడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు. సోమవారం ఉదయం పరిశీలిస్తామని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఒకరు మృతిచెందడం, మరొకరు గల్లంతు కావడంతో దేవరపాళెంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విర్రవీగే టీడీపీ నేతలు, పోలీసులూ జాగ్రత్త
తోటపల్లిగూడూరు: ‘టీడీపీ నేతల అరాచకాలకు అంతే లేకుండా పోతుంటే.. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసే విధంగా విర్రవీగే టీడీపీ నేతలు, పోలీసులు భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఉంటే మంచిది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏమిటో మీ ఊహకే వదిలేస్తున్నాం. మా పార్టీ కార్యకర్తల జోలికి వస్తే మాత్రం సహించేది లేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి హెచ్చరించారు. ఇటీవల టీడీపీ మూకల దాడిలో గాయపడిన సౌత్ఆములూరు వైఎస్సార్సీపీ నేత వేముల శ్రీనివాసులును ఆదివారం కాకాణి పరామర్శించారు. కాకాణి మాట్లాడుతూ టీడీపీ నేతలు అధికార మదంతో కక్ష సాధింపు, కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నారు. శాంతిభద్రతలను నియంత్రించాల్సిన పోలీస్ యంత్రాంగం అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతూ మరింత దిగజారిపోతున్నారని విమర్శించారు. రౌడీషీటర్లు మితి మీరి ప్రవర్తిస్తూ సామాన్యులపై, ముఖ్యంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులను ముమ్మరం చేశారన్నారు. టీడీపీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడి స్పృహలేని స్థితిలో ఉన్న పార్టీ కార్యకర్త వేముల శ్రీనువాసులు చేత పోలీసులు బలవంతంగా సంతకాలు పెట్టించుకొని దాడి చేసిన వారిపై మొక్కుబడిగా కేసులు నమోదు చేసి, దాడి గురైన వ్యక్తిపై అట్రాసిటీ కేసులు బనాయించడం ఎంత వరకు సబబన్నారు. వైఎస్సార్సీపీలో బలంగా ఉన్న నాయకులు, కార్యకర్తలను పోలీసులతో ఏదో విధంగా భయపెట్టి లొంగదీసుకోవాలనే ప్రయత్నం టీడీపీ నేతలు చేస్తున్నారన్నారు. అధికారం ఉందని విర్రవీగే టీడీపీ నాయకులకు, వారికి కొమ్ముకాస్తున్న అధికారులు, పోలీసులు ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలన్నారు. అధికారం శాశ్వతం కాదని వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు సృష్టించిన టీడీపీ నాయకులు కావచ్చూ, అధికారులు కావచ్చూ పడే పాట్లు ఎంత దారుణంగా ఉంటాయంటే వారి ఊహకు కూడా అందని విధంగా ఉంటాయన్నారు. జగనన్న చెప్పిన విధంగా తప్పు చేసిన అధికారులు, బదిలీ అయినా, పదవీ విరమణ చేసినా, సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కోని వచ్చి శిక్ష విధించడం ఖాయమన్నారు. జగనన్న ముఖ్యమంత్రి కాగానే డిజిటల్ బుక్లో నమోదైన ప్రతి ఒక్కరిపై విచారణ చేసి అన్యాయం చేసిన వారిని, అందుకు సహకరించిన అధికారులకు కచ్చితంగా శిక్షపడేలా చూస్తామన్నారు. ఇప్పటికై నా ఎస్పీ జిల్లాలో అమాయకులపై జరుగుతున్న దాడులపై పక్షపాత వైఖరితో కాకుండా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాకాణి డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైఎస్సార్సీపీ న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ కష్టకాలంలో జెండాను భుజాన మోసిన సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు జిల్లా వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా నిలుస్తామన్నారు. అనంతరం అదే గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న మద్దెన వెంకట సుబ్బానాయుడును పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుఽధీర్రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి ఇసనాక రమేష్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఉప్పల శంకరయ్యగౌడ్, జెడ్పీటీసీ సభ్యులు ఎంబేటి శేషమ్మ, మండల ఉపాధ్యక్షుడు చెరుకూరు శ్రీనివాసులనాయుడు, పార్టీ నాయకులు టంగుటూరు పద్మనాభరెడ్డి, గూడూరు విష్ణుమోహన్రెడ్డి, మన్నెం చిరంజీవులగౌడ్, మన్నెం సుబ్రహ్మణ్యం గౌడ్, మారంరెడ్డి బుజ్జిరెడ్డి, చెరుకూరు సరళమ్మ, టంగుటూరు సురేష్ రెడ్డి, ఉండాల వంశీకృష్ణారెడ్డి, చిల్లకూరు ప్రవీణ్రెడ్డి, తూపిలి ఽఉదయ్రెడ్డి, లేబూరు మల్లి, రంగినేని కిరణ్, కిశోర్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి.. మీ ఊహకే.. మా కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదు కాకాణి గోవర్ధన్రెడ్డి హెచ్చరిక -
రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు
● ఆత్మగౌరవ నిరసన కార్యక్రమాలను అడ్డుకున్న పోలీసులు ● ప్రభుత్వం, పోలీసులకు ఎందుకు ఉలికిపాటు అంటూ నిలదీత నెల్లూరు (పొగతోట): తమ న్యాయమైన డిమాండ్లతోపాటు ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడాలంటూ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం చేపట్టిన ఆత్మగౌరవ నిరసన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ కమిటీ, నెల్లూరు జేఏసీ ఆధ్వర్యంలో పురమందిరంలో (టౌన్హాల్) ఆత్మగౌరవ సభ జరగనీయకుండా భారీగా మోహరించిన పోలీసులు ప్రాంగణం గేట్లకు తాళాలు వేశారు. కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైన ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. ఎస్పీ, కలెక్టర్ బంగ్లాల వద్దకు వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతి కోరినా నిరాకరించారు. ర్యాలీకి అనుమతి లేదని, ఐదుగురు మాత్రమే వెళ్లేందుకు అనుమతిస్తామంటూ స్పష్టం చేశారు. దీంతో ఉద్యోగులు మండుటెండలో మట్టి నేలపై కూర్చొని నిరసన తెలిపారు. గంటల తరబడి ఎండలో ఉండడం, కాలకృత్యాలు తీర్చుకొనేందుకు వీలు లేకపోవడంతో మహిళా ఉద్యోగులు నానా అవస్థలు పడ్డారు. ఉద్యోగులు, నాయకులను ఎటు వైపు కదలనీయకుండా ఉగ్రవాదులను, తీవ్రవాదులను, రౌడీమూకలను, సంఘవిద్రోహ శక్తులను కట్టడి చేసినట్లు కట్టడి చేశారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు నేలపై కూర్చొని నిరసన కొనసాగిస్తూ పోలీసుల వైఖరి, జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ నేతల తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రభుత్వంతోపాటు పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. తమ నిరసన కార్యక్రమాలపై ఎందుకు ఉలికిపడుతుందని నిలదీశారు. ప్రధానంగా ఉద్యోగుల సమస్యలు, ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు, ప్రొబేషన్ కాలంలో రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్స్, ప్రొబేషన్ డిక్లరేషన్, 9 నెలలు ఆలస్యంగా చేసినందున, తొమ్మిది నెలల బకాయిలు, 6 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగోన్నతుల కల్పించాలని, అడ్వాన్స్ ఆటోమేటిక్ స్కీమ్ ద్వారా అదనపు ఇంక్రిమెంట్, సీనియారిటీ జాబితా, నిర్దిష్టమైన జాబ్ చార్ట్, అంతర్ జిల్లాల బదిలీలు, ఇంటింటి సర్వేల నుంచి విముక్తి కల్పించాలంటూ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. తమ ప్రధాన డిమాండ్లు పరిష్కారానికి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలని కోరుతూ జేఏసీ నాయకులు మధుబాబు, జగదీష్, హరీష్, పాండు, సురేంద్ర, బాలాజీనాయక్, శ్రీనివాసులురెడ్డి, సతీష్రెడ్డి, బాలాజీనాయక్, జయశ్రీ, మేఘన, సురేంద్ర, వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ర్యాలీకి అనుమతించకపోవడం శోచనీయం – పాండు, నెల్లూరు జేఏసీ నేతఉద్యోగుల పరిస్థితులు అత్యంత దారుణం – రజని, సచివాలయ ఉద్యోగి ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతింది – బి.మధుబాబు, జేఏసీ చైర్మన్ ఉద్యోగుల ఐక్యత ఏమిటో నిరూపిస్తాం – పిల్లి హరీష్. జేఏసీ ప్లానింగ్ సెక్రటరీ పోలీసుల తీరుతో ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతింది. సభకు అనుమతించి తర్వాత నిరాకరించడం ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినేలా చేశాయి. సచివాలయ ఉద్యోగులందరూ రాష్ట్ర స్థాయిలో ఐక్యంగా ముందుకు సాగుతాం. సచివాలయ ఉద్యోగుల ఐక్యతేమిటే రాష్ట్ర ప్రభుత్వానికి చాటి చెబుతాం. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల సాధన కోసం జేఏసీ నిరంతరం శ్రమిస్తోంది. ఉద్యోగుల సమస్యల సాధన కోసం అన్ని జిల్లాల్లో ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నాం. అన్ని జిల్లాల్లో సభకు అనుమతి ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో పోలీసులు సభను అడ్డుకోవడం దుర్మార్గం. ముందుగా అనుమతి ఇచ్చి సభ నిర్వహణ సమయంలో ఉద్యోగులను టౌన్హాల్ నుంచి బయటకు పంపించి, గేట్లకు తాళాలు వేయడం దుర్మార్గమైన చర్య. ఇటువంటి తీరు ఎక్కడా చూడలేదు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవ సభకు ముందుగా పోలీసుల అనుమతి కోరాం. తొలుత అనుమతిచ్చినప్పటికీ తర్వాత నిరాకరించడం వెనుక ప్రభుత్వ పెద్దల ఆదేశాలు ఉన్నాయని నమ్ముతున్నాం. ఉద్యోగులను మండుటెండలో రోడ్డుపై నిలబెట్టడం దుర్మార్గం. తమ సమస్యలను అధికారులకు చెప్పుకొనేందుకు ర్యాలీ నిర్వహణ కోసం అనుమతి ఇవ్వకపోవడం శోచనీయం. పోలీసుల తీరు దారుణం. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 17 సర్వేలు నిర్వహించాం. ఇంటింటా సర్వే పేరుతో రోజూ ప్రజల ఇళ్ల చుట్టూ తిరుగాల్సివస్తోంది. అతి తక్కువ వేతనాలతో ప్రజలకు సేవలందిస్తున్నాం. -
కొనసాగుతున్న డాక్టర్ల సమ్మె
నెల్లూరు (అర్బన్): పీహెచ్సీల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుల సమ్మె శనివారం ఐదో రోజూ కొనసాగింది. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు సమ్మె ఆపేది లేదని ప్రభుత్వ డాక్టర్ల సంఘం నేత డాక్టర్ బ్రహ్మేశ్వరనాయుడు స్పష్టం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని 52 పీహెచ్సీల్లో పనిచేస్తున్న డాక్టర్లు ఓపీ సేవలను బహిష్కరించారు. జిల్లాకు చెందిన ఎక్కువ మంది డాక్టర్లు విజయవాడలో జరిగే ఆందోళనలో పాల్గొనే దానికి వెళ్లారు. మరికొంత మంది డాక్టర్లు స్థానిక సంతపేటలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖా కార్యాలయం మందు ధర్నా చేశారు. డాక్టర్ బ్రహ్మేశ్వరనాయుడు మాట్లాడుతూ గత సంవత్సరం తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మెకు పోగా ప్రభుత్వం కొంత గడువు కావాలని , ఈ లోపు సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. అయితే ఆ హామీని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఇప్పుడు సమ్మె బాట పట్టామన్నారు. పీహెచ్సీల్లో 20 నుంచి 25 ఏళ్లుగా ఒకే కేడర్లో ఎలాంటి ప్రమోషన్లు లేకుండా డాక్టర్లు పని చేయడం బాధాకరమన్నారు. తక్షణమే నిర్దిష్ట కాలపరిమితితో ప్రమోషన్లు కల్పించాలన్నారు. ఇన్ సర్వీసు పీజీ కోటాను పునరుద్ధరించేందుకు జీఓ నంబర్ 99ను రద్దు చేయాలన్నారు. నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు. ఎలాంటి సౌకర్యాలు లేని అటవీ, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న డాక్టర్లకు 50 శాతం మూలవేతనాన్ని గిరిజన భత్యంగా మంజూరు చేయాలన్నారు. సంచార చికిత్స కార్యక్రమానికి రూ.5 వేలు భత్యం ఇవ్వాలన్నారు. డాక్టర్లు సమ్మెలో ఉండడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు నవీన్కుమార్రెడ్డి, శ్రావణి, జ్యోతిరాణి, విజయలక్ష్మి, సాయిప్రియాంక, రమ్య, మనోజ్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఆటోడ్రైవర్లకు అండగా ఉంటాం
నెల్లూరు సిటీ: ఆటో డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు సాయం పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. లక్ష్మీపురంలోని ఎస్బీఎస్ కల్యాణ మండపంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో శనివారం ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 17,406 మంది డ్రైవర్లకు రూ.26.1 కోట్లు నేరుగా వారి ఖాతాలో జమ చేశామన్నారు. ఎవరికై నా పథకం అందకపోతే సచివాలయాల్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడంతోపాటు హెల్ప్లైన్ కూడా అందుబాటులో ఉంచామన్నారు. తొలుత నగరంలోని మినీబైపాస్ రోడ్డులోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నుంచి స్టోన్హౌస్పేట వరకు ర్యాలీ నిర్వహించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆటోడ్రైవర్ల నుంచి స్పందన కరువైంది. వీరి కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు చాలా వరకు ఖాళీగా కనిపించాయి. ఆటోడ్రైవర్లు అరకొరగా కనిపిస్తే.. టీడీపీకి చెందిన మహిళలతో కల్యాణ మండపాన్ని నింపేయడం విస్మయాన్ని కలిగించింది. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్, డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ చందర్, టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
9వ తేదీ స్కానింగ్కు రమ్మన్నారు
– సుబ్బమ్మ, వెంకటరెడ్డిపల్లి, కలువాయి మండలం నేను వయోభారంతో ఉన్నాను. ఆరోగ్యం బాగలేక శనివారం మరో ఇద్దరిని తోడు తీసుకుని పెద్దాస్పత్రికి వచ్చాను. డాక్టరమ్మ రక్తపరీక్షలతోపాటు పెల్విస్కి స్కానింగ్ రాశారు. అయితే స్కానింగ్ వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలన్నారు. నాకు 9వ తేదీ స్కాన్ చేస్తామని చీటీ మీద రాసిచ్చారు. ముందే నొప్పితో బాధపడుతున్నాను. రిపోర్టును చూసి ఆపరేషన్ చేస్తామని గైనకాలజీ విభాగం డాక్టర్ చెప్పారు. తీరా స్కానింగ్ వద్దకు వస్తే ఐదో రోజులు ఆగి రమ్మని చెప్పడం దారుణం. మా ఊరు నుంచి నెల్లూరుకు వచ్చేదానికి, పోయేదానికి ముగ్గురికి చార్జీలు రూ.600 అయ్యాయి. పైఖర్చులు మరో రూ.200 అయ్యాయి. మళ్లీ ఇంకో రోజు రావాలంటే ఇలాగే ఖర్చులు అవుతాయి. నాలాంటి వాళ్లకు ఇంత స్థాయిలో ఖర్చులు పెట్టుకోవడం, తిరగడం సాధ్యమేనా?. నా పరిస్థితిని, నా వయస్సును పరిగణలోకి తీసుకోవాలి కదా?. ● బుజబుజనెల్లూరు చెందిన హబీబా గత వారంలో గైనకాలజి విభాగంలో వైద్యం కోసం వచ్చారు. డాక్టర్ చెక్ చేసి స్కానింగ్ పరీక్ష రాశారు. స్కానింగ్ వద్దకు వెళ్తే ఆ రోజుకు పేర్లు ఎక్కువగా ఉన్నాయి.. రెండు రోజుల తర్వాత అపాయింట్మెంట్ ఇస్తాం.. ఆ రోజు వచ్చి పరీక్ష చేయించుకోమని సమాధానమిచ్చారు. హబీబా ఎంత బతిమాలిడినా సిబ్బంది ఒప్పుకోలేదు. ఒక్కరే డాక్టర్ ఉన్నారు. సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో ఆమె ఉసూరుమంటూ ఇంటికి వెళ్లిపోయారు. వాస్తవానికి రేడియాలజీ డిపార్ట్మెంట్లో స్టాఫ్ ఫుల్గా ఉంది. ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, మరో ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మరొక సీనియర్ రెసిడెంట్ డాక్టర్ ఉన్నారు. అయినా ఆ రోజు అందరూ లేరని, ఒక్కరే ఉన్నారంటే.. డ్యూటీకి వచ్చి థంబ్ వేసి సొంత, ప్రైవేట్ ప్రాక్టీస్కు వెళ్లిపోయి ఉంటారని ఆరోపణలు వినిస్తున్నాయి. ఈ విభాగాన్ని పర్యవేక్షించాల్సిన రేడియాలజి ప్రొఫెసర్ హెచ్ఓడీ రూమ్కు పరిమతం కావడంతో ఈ దుస్థితి ఏర్పడిందనే విమర్శలు లేకపోలేదు. -
అవినీతి తప్ప.. అభివృద్ధి ఎక్కడ?
● గ్రావెల్తో రూ.100 కోట్ల కొల్లగొట్టిన సోమిరెడ్డి ● కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజం పొదలకూరు : సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతి తప్ప.. అభివృద్ధి బూతద్దంతో వెతికినా కనిపించడం లేదని, తండ్రీకొడుకులు కలిసి అన్ని వనరులను దోచుకుంటున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. పొదలకూరు మండలం దుగ్గుంటరాజుపాళెం, ముదిగేడు, ఇనుకుర్తి గ్రామాల్లో కాకాణి శనివారం పర్యటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. ఆయా గ్రామాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? అని ఆరా తీశారు. సహజ వనరుల దోపిడీ తప్ప, అభివృద్ధి కానరావడం లేదని స్థానికులు స్పష్టం చేశారు. కాకాణి మాట్లాడుతూ సోమిరెడ్డి, ఆయన కుమారుడు ఈ పదహారు నెలల్లోనే రూ.100 కోట్లు గ్రావెల్ కొల్లగొట్టేశారని ఆరోపించారు. ఇక ఇసుకలో అయితే లెక్కేలేదన్నారు. వీరిద్దరి అక్రమార్జన తో పొదలకూరు మండలం విరువూరు, సూరాయపాళెం గ్రామాల ఇసుక రీచ్ల చుట్టు పక్కల గ్రామాల వారు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. నేలటూరు జెన్కో ప్లాంట్ నుంచి ఫ్లైయాష్ అక్రమ తరలింపులో తన వాటా పెంచాలని డిమాండ్ చేస్తూ సోమిరెడ్డి ఏకంగా జెన్కోపై దాడికి తన మనుషులను పంపించారి విమర్శించారు. పొదలకూరులో లేఅవుట్ల యజమానులను బెదిరించి రూ.కోట్లల్లో డబ్బులు దండుకున్నారని, అంగన్వాడీ పోస్టులను అర్హత లేని వారికి అమ్ముకున్నారని ఆరోపించారు. మద్యం దుకాణాలు, బెల్టు షాపులకు సోమిరెడ్డి రేట్లు నిర్ణయించి మామూళ్లు వసూలు చేస్తున్నారన్నారు. సోమిరెడ్డి ముఠా వెంకటాచలం మండలంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమి కాజేసేందుకు పెద్ద స్కెచ్ వేశారన్నారు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారని దుయ్యబట్టారు. పామాయిల్ ట్యాంకర్ల దోపిడీ, ప్రైవేట్ పొలాల్లో చెట్లను నరికివేయడం వంటి పనులకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ ఆగడాలను వైఎస్సార్సీపీ శ్రేణులు డిజిటల్ బుక్లో నమోదు చేయాల్సిందిగా సూచించారు. పార్టీ నాయకులతో అనుచితంగా వ్యవహరించే వారిని ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. దుగ్గుంటరాజుపాళెంలో నూతన గృహప్రవేశం చేసిన మందారపు మోహన్ దంపతులను ఆశీర్వదించిన కాకాణి ఇనుకుర్తిలో శస్త్రచికిత్స చేయించుకున్న ముడి మస్తానయ్యను, భార్యా వియోగానికి గురైన ముదిగేడుకు చెందిన మాలపాటి ఓబుల్రెడ్డి, సంగాపు సుబ్బయ్యలను పరామర్శించారు. కార్యక్రమంలో బచ్చల సురేష్కుమారెడ్డి, ఎం.వెంకటశేషయ్య, పెదమల్లు రమణారెడ్డి, కేతు రామిరెడ్డి, కోనం బ్రహ్మయ్య, ఎం.సుందరయ్య, ఎం.జనార్దన్, మండి శంకర్రెడ్డి, నోటి వెంకటేశ్వర్రెడ్డి, ఓబుల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం
● ఆర్అండ్బీ ఎస్ఈకి వినతిపత్రం నెల్లూరు (అర్బన్): రోడ్లు, భవనాల శాఖ సర్కిల్ పరిధిలోని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమించక తప్పదని ఆ శాఖ ఉద్యోగులు, ఏపీ ఇరిగేషన్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్, అమరావతి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవీఎం శరత్బాబు స్పష్టం చేశారు. శనివారం నగరంలోని ఆర్అండ్బీ కార్యాలయంలో ఎస్ఈ గంగాధరంను కలిసి వినతి పత్రం అందజేశారు. శరత్బాబు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరిస్తామని గత ఏప్రిల్లోనే రాత పూర్వకంగా అధికారులు హామీ ఇచ్చినప్పటికీ నేటికి పరిష్కారానికి నోచుకోలేదన్నారు. తిరుపతి జిల్లాకు బదిలీ చేసిన 17 మందిని తక్షణమే జిల్లాకు తీసుకురావాలన్నారు. అందులో దివ్యాంగురాలైన మహిళను తిరుపతి జిల్లాకు పంపడం బాధాకరమన్నారు. వర్క్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొంది గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉద్యోగులు నాలుగు నెలలు విధులు నిర్వర్తించాక రివర్షన్ పొందిన ఉద్యోగులు పనిచేసిన కాలానికి వేతనాలు ఇవ్వాలని, వారి పదోన్నతులు కొనసాగించాలని కోరారు. సీనియార్టీ ప్రకారం పెండింగ్లో ఉన్న టెక్నికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉద్యోగులకు జేటీఓలుగా పదోన్నతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు మస్తానయ్య, నారాయణ, సురేష్, నాగేశ్వరరావు, షబ్బీర్ అహ్మద్, రత్నం తదితరులు పాల్గొన్నారు. -
రైలు కిందపడి వ్యక్తి బలవన్మరణం
నెల్లూరు(క్రైమ్): రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు సమీపంలోని పట్టాలపై చోటుచేసుకుంది. మృతుడు సుమారు 40 నుంచి 45 ఏళ్లలోపు వయస్సు కలిగి.. తెలుపు రంగు హాఫ్ హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు షార్ట్ను ధరించి ఉన్నారు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై హరిచందన ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాల కోసం కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు సమీపంలో ఆరాతీస్తున్నారు. రైల్లోంచి జారిపడి.. కొడవలూరు: రైల్లోంచి జారిపడటంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని తలమంచి రైల్వేస్టేషన్ వద్ద శనివారం చోటుచేసుకుంది. రైల్వే హెచ్సీ వెంకటేశ్వరరావు వివరాల మేరకు.. తలమంచి రైల్వేస్టేషన్ వద్ద గల 190 – 25ఏ – 27 పోస్టుల మధ్య ఎగువ లైన్లో రైల్లోంచి జారిపడటంతో విజయవాడకు చెందిన కందుకూరి రమేష్ (30) మృతి చెందారు. మృతుడు రెండు చొక్కాలు, రెండు ప్యాంట్లను ధరించి ఉన్నారు. రైల్లో యాచించే వ్యక్తిగా భావిస్తున్నారు. మృతుడి వద్ద ఆధార్ కార్డు లభించిందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మకూరులో అనుమానాస్పద మృతి..? ఆత్మకూరు రూరల్: పట్టణంలోని బీఎస్సార్ సెంటర్ సమీపంలో ఐదు రోజుల క్రితం జరిగిన ఘటన అనుమానాస్పద మృతి అనే ప్రచారం జరుగుతోంది. ఈద్గా ఆవరణలో చోటుచేసుకున్న ఈ ఘటనను ప్రముఖులు, ఇతరుల ఒత్తిడితో సాధారణ మరణంగా పోలీసులు చిత్రీకరిస్తున్నారనే చర్చ సాగుతోంది. మృతుడి కుటుంబసభ్యులు సైతం సాధారణ మరణంగానే పోలీసులకు వాంగ్మూలమిచ్చార ని తెలుస్తోంది. కాగా ఈ విషయమై ఆత్మకూరు సీఐ గంగాధర్ను సంప్రదించగా, అన్ని కోణాల్లో విచారించి దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను తెలియజేస్తామని వెల్లడించారు. -
బాధ్యతాయుతంగా సబ్స్టేషన్ల నిర్వహణ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): సబ్స్టేషన్లను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) గురవయ్య ఆదేశించారు. నగరంలోని 33 / 11 కేవీ వైఎమ్సీఏ సబ్స్టేషన్ను ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. సాంకేతిక విధివిధానాలు, రికార్డుల నిర్వహణ, ఫీడర్లలో లోడ్ తదితరాలను పర్యవేక్షించారు. ఎల్సీ, లాగ్బుక్, ఫీడర్ రీడింగ్ రిజిస్టర్లను తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రికార్డులను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. నోడల్ ఆీఫీసర్ శేషాద్రిబాలచంద్ర, ఈఈ లక్ష్మీనారాయణ, డీఈఈలు కిరణ్, సుప్రియ, ఏఈలు లక్ష్మీబాయి, లక్ష్మి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
బైక్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
సోమశిల: బైక్ ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతసాగరం మండల పరిధిలోని మినగల్లు సమీపంలో గల ప్రధాన రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని కొత్తపల్లికి చెందిన చిలకా కృష్ణారెడ్డి తన బైక్పై ఆత్మకూరువైపు నుంచి వస్తున్నారు. ఇదే సమయంలో కాకూరువారిపల్లికి చెందిన సుబ్బారెడ్డి (65), వెంకటసుబ్బారెడ్డి మినగల్లులో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లి తిరిగి నడుచుకొని బయల్దేరారు. ఈ తరుణంలో మినగల్లు సమీపంలోని సచివాలయం వద్ద బైక్ ఢీకొనడంతో సుబ్బారెడ్డి తలకు బలమైన గాయమైంది. హాస్పిటల్కు తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందారు. వెంకటసుబ్బారెడ్డి స్వల్పంగా గాయపడగా, బైక్పై ఉన్న కృష్ణారెడ్డి పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స నిమిత్తం ఆత్మకూరు హాస్పిటల్కు.. ఆపై మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరులోని వైద్యశాలకు తరలించారు. సుబ్బారెడ్డి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సూర్యప్రకాష్రెడ్డి తెలిపారు. -
ఏమిటయ్యా ఈ పరేషాన్..?
ఇంకా ఎంతసేపు నిరీక్షించాలో..? వేలిముద్ర వేస్తూ.. పడిగాపులు కాస్తున్న మహిళలు అష్టకష్టాలు పడుతూ వస్తున్న వృద్ధుడు ఎండీయూ వాహనాలను కూటమి ప్రభుత్వం రద్దు చేయడంతో రేషన్ సరుకులను పొందడంలో వృద్ధులకు కష్టాలు ఎదురవుతున్నాయి. దూరంలోని షాపులకెళ్లి సరుకులను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. అక్కడ పడిగాపులు కాయలేక పండుటాకుల కష్టాలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. నెల్లూరులోని జేమ్స్గార్డెన్లో గల చౌక దుకాణం వద్ద ఈ పరిస్థితులు కనిపించాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
ట్రాలీ తెచ్చిన తంటా
● వంతెనపై ఇరుక్కున్న లారీ ● రెండు కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్ దగదర్తి: భారీ లోడుతో వెళ్తున్న ట్రాలీ ఇరుక్కుపోయి ముందుకు కదల్లేకపోవడంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ దాదాపు రెండు గంటల పాటు స్తంభించింది. మండలంలోని అల్లూరు రోడ్డు వద్ద జాతీయ రహదారి రైల్వే వంతెనపై శనివారం జరిగిన ఈ పరిణామంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. వివరాలు.. రైల్వే వంతెనపై రోడ్డు రెండు వరుసలే ఉంటుంది. ఈ క్రమంలో కావలి నుంచి నెల్లూరువైపు భారీ లోడ్తో వెళ్తున్న ట్రాలీ రైల్వే వంతెనపైకి రాగానే మధ్యలో ఇరుక్కుపోయి ముందుకు కదల్లేదు. దీంతో వాహనాన్ని డ్రైవర్ నిలిపేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న దగదర్తి పోలీసులు, హైవే మొబైల్ సిబ్బంది.. మార్జిన్ రాళ్లను తొలగించి ట్రాలీ ముందుకెళ్లేలా చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి ఆరు వరుసలకు గానూ ఇక్కడ రెండే ఉండటంతో ఈ పరిస్థితి నిత్యకృత్యమవుతోంది. -
షార్ట్ సర్క్యూట్తో షాపు దగ్ధం
● రూ.ఐదు లక్షల నష్టం బుచ్చిరెడ్డిపాళెం రూరల్: షార్ట్ సర్క్యూట్తో షాపు దగ్ధమైన ఘటన మండలంలోని మినగల్లు బీసీ కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల వివరాల మేరకు.. బీసీ కాలనీలో నివాసం ఉంటున్న రామయ్య, లక్ష్మమ్మ దంపతులు మెషీన్తో కర్పూరాన్ని తయారు చేసి వాటిని విక్రయించడం ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో షాపులో అర్ధరాత్రి వేళ మంటలు వ్యాపించడాన్ని గమనించిన చుట్టుపక్కల వారు విషయాన్ని బాధితులకు తెలియజేశారు. అక్కడికెళ్లేలోపు మెషీన్తో పాటు గది మొత్తం పూర్తిగా కాలిపోయింది. రూ.ఐదు లక్షల నష్టం సంభవించిందని బాధితులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మతిస్థిమితం లేక కాలువలో దూకి.. కలువాయి(సైదాపురం): తెలుగుగంగ కాలువలో దూకి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని పర్లకొండ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. చింతలాత్మకూరుకు చెందిన నాగిళ్ల రవి (30) తెలుగు గంగ కాలువలో దూకారు. దాచూరు సమీపంలోని కండలేరులో మృతదేహాన్ని స్థానికులు శనివారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి ఎస్సై కోటయ్య చేరుకొని విచారణ చేపట్టారు. నాగిళ్ల రవికి మతిస్థిమితం సక్రమంగా లేదని తల్లిదండ్రులు తెలిపారని పోలీసులు చెప్పారు. చిన్నారిని అక్కున చేర్చుకొని.. నెల్లూరు(పొగతోట): నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఎనిమిదేళ్ల బాలుడ్ని గుర్తుతెలియని వ్యక్తులు శనివారం వదిలి వెళ్లిపోయారు. విషయాన్ని తెలుసుకున్న ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, బాలల సంరక్షణాధికారి సురేష్ అక్కున చేర్చుకున్నారు. చిల్డ్రన్స్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు కాప్ చిల్డ్రన్స్ హోమ్లో చేర్పించారు. పూర్తి వివరాలను సేకరించేందుకు చర్యలు చేపడుతున్నారు. తల్లిదండ్రుల ఆచూకీ తెలిస్తే అప్పగిస్తామని, వివరాలు తెలిసిన వారు 90007 89793 నంబర్ను సంప్రదించాలని అధికారులు కోరారు. కండలేరులో నీటి నిల్వ రాపూరు: కండలేరులో శనివారం నాటికి 58.23 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల నుంచి కండలేరుకు 3600 క్యూసెక్కుల నీరు చేరుతోందని వివరించారు. కండలేరు నుంచి సత్యసాయిగంగకు 430, పిన్నేరుకు 140, లోలెవల్కు 40, హైలెవల్కు 30, మొదటి బ్రాంచ్ కాలువలకు ఐదు క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని చెప్పారు. పొదలకూరు నిమ్మ ధరలు పెద్దవి: రూ.40 సన్నవి: రూ.25 పండ్లు: రూ.15 -
నేరస్తులకు శిక్ష పడేలా సమగ్ర విచారణ
● ఎస్పీ అజిత నెల్లూరు(క్రైమ్): కేసుల్లో సమగ్ర విచారణ జరిపి నేరస్తులకు శిక్ష పడేలా చేయాలని ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశించారు. నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు. స్టేషన్ల వారీగా కేసుల వివరాలను ఆరాతీశారు. పెండింగ్ కేసుల పరిష్కారం, నేర నియంత్రణ చర్యలపై దిశానిర్దేశం చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. నేరాలను కట్టడి చేసి ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలను అందించాలని సూచించారు. మహిళల భద్రత, మత్తు, మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మట్కా, క్రికెట్ బెట్టింగ్, సింగిల్ నంబర్లాట, పేకాట తదితరాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, నేరాలకు తరచూ పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేయాలని, జిల్లాను సీసీ కెమెరాల నిఘా నీడలోకి తీసుకురావాలని ఆదేశించారు. అనుమానిత ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్లను నిర్వహించాలని సూచించారు. స్టేషన్ పరిధిలోని గ్రామాలను ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించి, అక్కడి ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని తెలిపారు. కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్నెస్లో పొందుపర్చడంతో పాటు రాత్రి గస్తీని పెంచి అనుమానితుల వేలిముద్రలను సేకరించాలన్నారు. పోక్సో కేసుల్లో బాధితులకు అందే నష్టపరిహారంపై సఖీ వన్స్టాప్ సెంటర్ సిబ్బంది తెలియజేశారు. ఏఎస్పీ సౌజన్య, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మహత్య కాదు.. హత్యే
● మృతుడి బంధువుల ఆరోపణ ● అంత్యక్రియలను అడ్డుకున్న వైనం కొండాపురం: మండలంలోని సాయిపేట బీసీ కాలనీలో బండారు సుధాకర్ (51) ఉరేసుకొని గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారని కొండాపురం పోలీసులు శుక్రవారం తెలిపారు. అయితే ఇది హత్యేనని ఆరోపిస్తూ గ్రామంలో శనివారం జరగాల్సిన అంత్యక్రియలను మృతుడి బంధువులు అడ్డుకున్నారు. మృతుడి సో దరులు, బంధువులు బండారు ప్రసాద్, రమేష్, శ్రీనివాసులు, కొండయ్య, మల్లె చిన్నయ్య, మరికొందరు గ్రామంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో సానంగుల రవితో సుధాకర్ భార్య మల్లేశ్వరికి వివాహేతర సంబంధం ఉందని, ఈ క్రమంలో ఆమె అన్న తురకా మాధవ, సునీత, లక్ష్మీకాంతమ్మ, వేణు మరికొందరితో కలిసి సుధాకర్పై దాడి చేసి ఉరేసి చంపారని ఆరోపించారు. కొంత మంది అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఆత్మహత్యగా పోలీసులు చిత్రీకరించారని చెప్పారు. రామాలయం వద్ద సుధాకర్పై మల్లేశ్వరి బంధువులు దాడి చేస్తుంటే గ్రామం మొత్తం చూశారని, అదే రోజు రాత్రి హతమార్చారని ఆరోపించారు. వీరిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కొండాపురం ఎస్సై మాల్యాద్రి.. గ్రామానికి చేరుకొని నచ్చజెప్పేందుకు యత్నించారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. -
ముత్యాలపాడులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. కర్రలు, బీరు బాటిళ్లతో దాడి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం ముత్యాలపాడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముత్యాలపాడులోని అరుంధతతీయ పాలెంలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతలకు దారి తీసింది. పాత కక్షల నేపథ్యంలో రెండు వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. సుధా, రాముడు, పెంచలయమ్మ అనే ముగ్గురి పై సుమారు 15 మంది దాడికి దిగారు. కర్రలు, బీరు బాటిళ్లు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు ఈ ఘటనలో రెండు వర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రబాబు రైతు ద్రోహి
పథకాలను నిలిపితే ఊరుకునేదిలేదు ● ధాన్యాన్ని విక్రయించాక కొనుగోలు కేంద్రాలా..? ● ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మనుబోలు: తనకెంతో విజన్ ఉందంటూ సీఎం చంద్రబాబు తరచూ చెప్పుకొంటారని.. వరి కోతలు కోసి ధాన్యాన్ని తక్కువ ధరలకే తెగనమ్ముకున్నాక ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఎద్దేవా చేశారు. మండలంలోని రాజవోలుపాడులో వరి కోతలు పూర్తయిన పొలాలను గురువారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. చంద్రబాబు రైతు ద్రోహి అని ధ్వజమెత్తారు. గతేడాది ఇదే సమయంలో ధాన్యం పుట్టి ధర రూ.24 వేల నుంచి రూ.25 వేల వరకు ఉండిందని, అయితే ప్రస్తుతం రూ.15 వేల్లోపే పలుకుతోందని చెప్పారు. అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తూతూమంత్రంగా ప్రస్తావించి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు. అధికార పక్షంలో ఉన్న ఆయన.. సీఎంకు చెప్పి ధాన్యానికి గిట్టుబాటు ధరను ఎందుకు కల్పించలేకపోయారని ప్రశ్నించారు. దళారులకు లాభం చేకూర్చేందుకే.. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. భారీగా ఎగ్గొట్టారు.. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 54 లక్షల మందికి రైతు భరోసాను అందించారని, అయితే ప్రస్తుత ప్రభుత్వం 47 లక్షల మందికే ఇస్తున్నామని చెప్తూ.. మిగిలిన వారికి ఎగ్గొట్టి రైతు సేవా కేంద్రాల చుట్టూ తిప్పుకొంటోందని ఆరోపించారు. యూరియా లభించక రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారని తెలిపారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ తప్పుడు ప్రచారాన్ని చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా తాను పంటల ధరలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రైతులను అన్ని విధాలా ఆదుకున్న అంశాన్ని ప్రస్తావించారు. నేతలు మోటుపల్లి వెంకటేశ్వర్లు, దాసరి భాస్కర్గౌడ్, జెట్టి సురేంద్రరెడ్డి, మందల వెంకటశేషయ్య, ఈగా సురేష్ తదితరులు పాల్గొన్నారు. పొదలకూరు: రాజకీయ ఒత్తిళ్లతో అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపితే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని మొగళ్లూరు, నావూరుపల్లిలో పర్యటించిన ఆయన మాట్లాడారు. నావూరుపల్లికి చెందిన చొప్పా రాజమ్మకు వృద్ధాప్య పింఛన్ను నిలిపివేయడం దారుణమని, ఈ వ్యవహారమై హైకోర్టును ఆమె ఆశ్రయించడంతో బకాయిలతో సహా పింఛన్ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యాయని వివరించారు. దీంతో ఆమెకు పింఛన్ను ఈ నెల ఒకటినే అందజేశారని వివరించారు. అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి.. టీడీపీ నేతల మాటలను నమ్మి పథకాలను నిలిపేస్తే ప్రభుత్వం మారాక విచారణను జరుపుతామని వివరించారు. అదుపుతప్పిన శాంతిభద్రతలు సర్వేపల్లి నియోజకవర్గంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని కాకాణి ధ్వజమెత్తారు. మండలంలోని కల్యాణపురంలో శుక్రవారం పర్యటించిన ఆయన నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆయన కుమారుడు బరితెగించి విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమార్జనతో రూ.కోట్లు వెనుకేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. హత్యలు, ఆక్రమణలు, బెదిరింపులు, దాడులు, అక్రమ కేసులు, బ్లాక్మెయిలింగ్ తారస్థాయికి చేరాయని విమర్శించారు. అనంతరం గ్రామానికి చెందిన అక్కెం వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మీదేవి గృహ ప్రవేశ కార్య క్రమానికి హాజరయ్యారు. నేతలు బచ్చల సురేష్కుమార్రెడ్డి, పెదమల్లు రమణారెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, వెన్నపూస దయాకర్రెడ్డి, వెన్నపూస కృష్ణారెడ్డి, ఆకుల గంగిరెడ్డి, రావుల ఇంద్రసేన్గౌడ్, ఆకుల గణేష్రెడ్డి, యనమల శ్రీనివాసులురెడ్డి, చెన్నూరు గంగిరెడ్డి, విజయలక్ష్మి, ఆకుల లక్ష్మి, గాలం వెంగయ్య, రమేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
సత్ప్రవర్తనతో మెలగాలి
వెంకటాచలం: తప్పులను మరోసారి చేయకుండా.. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా ఫ్యామిలీ కోర్టు, సెషన్స్ జడ్జి నిఖిత సూచించారు. మండలంలోని చెముడుగుంట వద్ద గల జిల్లా కేంద్ర కారాగారంలో గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆమె మాట్లాడారు. చేసిన తప్పులు గతమని, భవిష్యత్తు అనే దిశగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వాణి మాట్లాడారు. గాంధీ చూపిన అహింస మార్గం జీవితంలో కొత్త అఽధ్యయానికి నాంది కావాలని సూచించారు. మార్పువైపు అడుగులేస్తూ, జైలు నుంచి బయటకొచ్చాక సత్ప్రవర్తనతో మెలగాలని కాంక్షించారు. అనంతరం ఖైదీలకు వివిధ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కేంద్ర కారాగార సూపరింటెండెంట్ సన్యాసిరావు, జైలర్లు రవిబాబు, శివశంకర్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
సమర్థంగా సాగునీటి వ్యవస్థ నిర్వహణ
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు రూరల్: జిల్లాలో సాగునీటి వ్యవస్థను సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువుల్లో సాగునీటి నిల్వలు, ఇరిగేషన్ పనులు, మరమ్మతులపై కలెక్టరేట్లోని తన చాంబర్లో శుక్రవారం సమీక్షించిన అనంతరం ఆయన మాట్లాడారు. సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో అన్ని మేజర్, మైనర్ చెరువులను 50 శాతానికిపైగా నీటితో నింపాలని సూచించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ పనులకు సంబంధించిన నిధులను మంజూరు చేస్తామని వెల్లడించారు. కండలేరు, సర్వేపల్లి రిజర్వాయర్ల వద్ద అత్యవసర పనులకు నిధులను కేటాయిస్తామన్నారు. ఆర్ఆర్ఆర్ స్కీమ్ ద్వారా ఎంపిక చేసిన పనులపై ప్రతిపాదనలను వెంటనే పంపాలని సూచించారు. పంట కాలువలు, చెరువుల్లో గుర్రపు డెక్క, పూడికతీత, రిజర్వాయర్ల వద్ద షట్టర్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చెరువులు, కాలువల బలోపేతానికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఉద్యాన పంటలు, పండ్ల తోటల పెంపకంపై అవగాహన కల్పించాలని కోరారు. ఇరిగేషన్, సోమశిల ప్రాజెక్ట్ ఎస్ఈలు దేశ్నాయక్, వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, డ్వామా పీడీ గంగాభవానీ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు అవార్డులు స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాకు రాష్ట్ర స్థాయిలో రెండు, జిల్లా స్థాయిలో 48 అవార్డులు లభించాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి అవార్డు గ్రహీతలను జిల్లా ఇన్చార్జి మంత్రి, ప్రజాప్రతినిధులు ఈ నెల ఆరున సత్కరించనున్నారని వివరించారు. -
గాంధీ, లాల్బహదూర్ శాస్త్రికి ఘన నివాళి
నెల్లూరు(స్టోన్హౌస్పేట): జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించారు. వారి చిత్రపటాలకు మాజీ మంత్రి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కాకాణి మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధన కోసం పనిచేద్దామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బ్రిటిష్ వలస పాలకుల కంటే దారుణంగా, ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతూ, ఉక్కుపాదంతో అణచి వేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. అక్రమ కేసులు, వేధింపులు సర్వసాధారణమయ్యాయని, ప్రభుత్వ పాలన మహనీయుల సిద్ధాంతాలకు విఘాతం కలిగించే విధంగా ఉండటం దురదృష్టకరమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గాంధీజీ కలలు సాకారం చేసేందుకు కృషి చేశారన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. -
కాలం తీరిన కూల్డ్రింక్పై ప్రశ్నించినందుకు..
● మహిళపై దాడి మనుబోలు: ఓ దుకాణ యజమాని తనపై దాడి చేసి గాయపరిచాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని మండలంలోని మడమనూరు గ్రామానికి చెందిన ఓ మహిళ శుక్రవారం తహసీల్దార్ రమాదేవికి ఫిర్యాదు చేసింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఆశా వర్కర్ పారిచర్ల కోటమ్మ గతనెల 27వ తేదీన తన మనుమడు ధనుష్ను దుకాణానికి వెళ్లి కూల్డ్రింక్ తీసుకురావాలని చెప్పింది. అతను పడాల రాధయ్య దుకాణానికి వెళ్లి మాజా బాటిల్ తెచ్చాడు. దాన్ని తెరవగా వాసన వచ్చింది. పరిశీలించగా కాలం తీరిపోయినట్లు తెలిసింది. కోటమ్మ దుకాణానికి వెళ్లి డబ్బు తిరిగివ్వాలని కోరింది. ఆగ్రహించిన యజమాని రాధయ్య ఆమైపె కర్రతో దాడి చేశాడు. బాధితురాలు అదేరోజు మనుబోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే వారు ఇంత వరకూ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతోపాటు దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోలేదు. దీంతో తహసీల్దార్కు ఫిర్యాదు చేసింది. ఆమె వెంట సీపీఎం నాయకుడు బీసీ భాస్కర్ ఉన్నారు. -
అంగన్వాడీ కేంద్రాలకు మరమ్మతులు
● ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ నెల్లూరు(పొగతోట): ‘జిల్లా పరిషత్ నుంచి 15 శాతం నిధులు అంగన్వాడీ కేంద్రాల మరమ్మతులకు మంజూరయ్యాయి. పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి’ అని ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ ఆదేశించారు. శుక్రవారం నెల్లూరులోని ఐసీడీఎస్ కార్యాలయంలో ఆమె సీడీపీఓలతో సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రాల్లో పౌష్టికాహారం నాణ్యతగా లేకుంటే సమాచారం ఇవ్వాలన్నారు. తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. పిల్లలు బరువు, ఎత్తు పెరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యకర్తలకు సంబంధించి రిటైర్మెంట్, మరణించిన అనంతరం వచ్చే బెనిఫిట్స్ పెండింగ్ ఉంటే సమాచారం ఇవ్వాలన్నారు. ఐసీడీఎస్ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్రాల్లో ఉండే బాలలకు సర్టిఫికెట్లు అందజేయాలన్నారు. ఈనెల 6, 7, 8 తేదీల్లో నీతి ఆయోగ్ ద్వారా ఎంపికై న కేంద్రాల పరిశీలనకు అధికారులు వస్తారన్నారు. -
15 నుంచి నిరవధిక సమ్మె
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 8న చలో తిరుపతి సీఎండీ కార్యాలయం, 15వ తేదీన నిరవధిక సమ్మె చేస్తామని ఏపీ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు జేఏసీ యాక్షన్ కమిటీ నాయకుడు షేక్ అల్తాఫ్ తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని దర్గామిట్టలోని ఏపీఎస్పీడీసీఎల్ అతిథి భవనంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సమస్యల్ని యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. సమ్మెకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, దామోదర్, నజీర్ఖాన్, వెంకటేశ్వర్లు, హజరత్వలీ, కృష్ణ, ప్రసాద్, పతంజలి, తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు
నెల్లూరు(బృందావనం): రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలో గురువారం గుంటబడి మైదానంలో ఆర్ఎస్ఎస్ విజయదశమి మహోత్సవం వేడుకగా సాగింది. దీనికి ముఖ్యఅతిథిగా ఆర్యవైశ్య బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొనగళ్ల శోభన్బాబు విచ్చేసి మాట్లాడారు. దేశ ఐక్యతలో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన పాత్ర ఎనలేనిదిగా వివరించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన ప్రాంత ప్రచార ప్రముఖ్ బయ్యా వాసు మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నగరంలో ప్రదర్శన చేపట్టడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ్ చాలక్ బయ్యా రవికుమార్, చిన్నబజార్ ఉపనగర కార్యవాహ్ పనబాక నరేంద్ర, స్వయంసేవకులు, మాతృమూర్తులు పాల్గొన్నారు. -
న్యాయం చేయాలని వినతి
నెల్లూరు(స్టోన్హౌస్పేట): నెల్లూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న గీతాంజలి మృతిపై విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. సీఐ రోశయ్యకు వినతిపత్రం అందజేశారు. వైద్య విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని, ఆత్మస్థైర్యం పెంపొందించేలా మోటివేషన్ క్లాసులు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంగమూరు ఆశ్రిత్రెడ్డి, నగర అధ్యక్షుడు ఎండీ తౌఫిక్, రూరల్ అధ్యక్షుడు రోహిత్, నాయకులు చంద్ర, శరత్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు బ్రాయిలర్: రూ.133 లేయర్ రూ.110 బ్రాయిలర్ చికెన్: రూ.238 స్కిన్లెస్ చికెన్: రూ.262 లేయర్ చికెన్: రూ.187 -
నెల్లూరు: ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, నెల్లూరు: ఏసీఎస్ఆర్(ACSR) ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మెడిసిన్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థిని గీతాంజలి హాస్టల్ రూమ్లో ఫ్యాన్కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని.. నంద్యాల నుంచి నిన్నే(గురువారం) హాస్టల్కి వచ్చింది. హాస్టల్లోకి మీడియాను యాజమాన్యం అనుమతించలేదు. పోలీసులు విచారణ చేపట్టారు.విద్యార్థిని ఆత్మహత్యపై సీఐ రోశయ్య మాట్లాడుతూ.. గీతాంజలీ హాస్టల్ 3వ అంతస్తులోని రూమ్లో ఉంటుందని.. దసరా సెలవులకు తన స్వగ్రామం వెళ్లి నిన్న రాత్రి తిరిగి వచ్చిందని.. నేటి నుంచి అనాటమీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నారు. ఉదయం స్నేహితురాలతో కలిసి టిఫిన్ చేసి రూమ్కి వెళ్ళిందని.. రూమ్ డోర్ లాక్ చేసుకొని ఆత్మహత్య చేసుకుందని సీఐ తెలిపారు. ఆత్మహత్యకు సంబంధించిన కారణాలపై విచారణ చేపట్టామన్నారు. స్నేహితురాలు, తల్లిదండ్రులను విచారణ చేపట్టిన తరువాత పూర్తి వివరాలు బయటకు వస్తాయని సీఐ పేర్కొన్నారు. -
వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గింపు
రాపూరు: వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గించడంతో రైతులకు మేలు చేకూరిందని నెల్లూరు డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారి షరీనా తెలిపారు. మండలంలోని ఆదురుపల్లిలో బుధవారం రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రం యంత్రాలపై 12 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించిందన్నారు. ట్రాక్టర్ స్పేర్ పార్టులపై 18 నుంచి 5 శాతానికి తగ్గించిందని తెలిపారు. రైతులు తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసి వ్యవసాయం చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఏఓ సోమసుందర్, ఈఓపీఆర్డీ బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
మహాసమాధి మహోత్సవాలు ఆరంభం
నెల్లూరు(బృందావనం): పద్మావతి నగర్లోని శ్రీసాయిదర్బార్ అద్దాల మందిరంలో 107వ మహాసమాధి (ఆరాధన) మహోత్సవాలను బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. భిక్షాటన కార్యక్రమాన్ని ఆ మందిరం మేనేజింగ్ ట్రస్టీ మధుసాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. షిర్డీ సంప్రదాయం ప్రకారం సాయినాథుడి స్వరూపులుగా భక్తులు పద్మావతి నగర్, బాలాజీ నగర్, ఏసీ నగర్, సరస్వతీనగర్ తదితర పురవీధుల్లో భిక్షాటన చేశారు. తొలుత మందిరంలో షిర్డీవాసుడికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సాయిభక్తులకు పాదపూజ నిర్వహించారు. ఉభయకర్తలుగా గునుపూడి వేణుగోపాల్, రాజ్యలక్ష్మి, కోటంరెడ్డి అమర్నాథ్రెడ్డి, శ్రీలత వ్యవహరించారు. కార్యక్రమాలను మధుసాయి, గౌరవ సలహాదారులు పాబోలు రామసుబ్బయ్య తదితరులు పర్యవేక్షించారు. విజయదశమి సందర్భంగా గురువారం వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
దసరా ఉత్సవాల్లో విచ్చలవిడిగా జూదం
● అనికేపల్లిలో డైమండ్ డబ్బా నిర్వహణ ● నిర్వాహకులకు టీడీపీ నాయకుల అండ ● పట్టించుకోని అధికారులు వెంకటాచలం: దసరా పండగ సందర్భంగా మండలంలోని అనికేపల్లి గ్రామదేవత ఆలయంలో మూడు రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. తొలిరోజైన మంగళవారం గ్రూపు డ్యాన్స్లు వేయించారు. అలాగే విచ్చలవిడిగా డైమండ్ డబ్బా నిర్వహించారు. ఉత్సవాలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో యువకులు వచ్చారు. టీడీపీ నాయకుల అండతో నిర్వాహకులు మంగళవారం మధ్యాహ్నం నుంచి డైమండ్ డబ్బా జూదాన్ని నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున వరకు ఇది జరిగింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో గొలగమూడిలోని వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా ఈ జూదం జరిగినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో నిర్వాహకులు అనికేపల్లిలోనూ దర్జాగా జరిపి భారీగా సొమ్ము చేసుకున్నారు. అనికేపల్లి, గొలగమూడి గ్రామాల్లో ప్రతి ఆదివారం డైమండ్ డబ్బా సాగుతుండటంతో తమ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
అన్నదాతపై మొసలి కన్నీరు
పొదలకూరు: రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తూ.. ధాన్యాన్ని విక్రయించాక కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని ప్రకటించడం దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని నేదురుమల్లిలో బుధవారం పర్యటించిన ఆయన రైతులతో ముచ్చటించి వారి సమస్యలను ఆరాతీశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ధాన్యం దిగుబడయ్యాక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అయితే ధాన్యానికి గిట్టుబాటు ధర లభించక మిల్లర్లకు నష్టాలకు విక్రయించాక తాపీగా వీటిని ఏర్పాటు చేస్తామనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పుట్టి ధాన్యాన్ని రూ.12 వేలకు అన్నదాతలు తెగనమ్ముకుంటే.. సోమిరెడ్డి మాత్రం అసెంబ్లీలో మొక్కుబడిగా ప్రస్తావించి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. ప్రజల నుంచి అధిక విద్యుత్ చార్జీలను వసూలు చేసిన చంద్రబాబు నేరం చేశారని ఆరోపించారు. వీటిని 12 వాయిదాల్లో చెల్లిస్తాననడం దారుణమని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను తగ్గిస్తానని హామీ ఇచ్చిన ఆయన.. వీటిని పెంచి ప్రజల నడ్డి విరిచారని మండిపడ్డారు. అవినీతిలో కూరుకుపోయిన సోమిరెడ్డి రైతులను ఆదుకోవడాన్ని అటుంచి కుమారుడితో కలిసి గ్రావెల్, మట్టి, ఇసుక, బూడిదను అక్రమంగా తరలించడంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి బిజీగా ఉన్నారని కాకాణి ఆరోపించారు. ఉద్యోగాలు అమ్ముకోవడం, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం వంటి కార్యక్రమాలతో పాటు అసాంఘిక శక్తులను పెంచి పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయనకు ఓటెందుకు వేశామని రైతులతో పాటు ప్రజలు తమను తాము ప్రశ్నించుకుంటున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రశ్నించడమే కాకుండా సోమిరెడ్డి అవినీతి కార్యకలాపాలను అడ్డుకున్నందుకే తనపై అక్రమ కేసులు బనాయించారని పేర్కొన్నారు. ఆయన అక్రమాలకు సహకరిస్తున్న అధికారులెవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. ప్రజాకోర్టులో వారిని ఎండగట్టడం ఖాయమని స్పష్టం చేశారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న పతకమూరి నాగయ్యను పరామర్శించారు. ఆపై చీర్ల వెంకటేశ్వర్లు కుమార్తె వివాహ వేడుకలకు హాజరయ్యారు. బచ్చల సురేష్కుమార్రెడ్డి, ఎంపీటీసీ పెంచలనాయుడు, సర్పంచ్ ఉడతా రమేష్, వెంకటశేషయ్య, రవి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. నిర్దయగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం ధాన్యాన్ని విక్రయించాక కొనుగోలు కేంద్రాలా..? అసెంబ్లీలో సోమిరెడ్డి మొక్కుబడి ప్రస్తావన ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి -
కొనసాగుతున్న డాక్టర్ల సమ్మె
నెల్లూరు(అర్బన్): తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ డాక్టర్ల సంఘ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె బుధవారంతో మూడో రోజుకు చేరుకుంది. సంతపేటలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద అన్ని పీహెచ్సీల డాక్టర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యుల సంఘ అధ్యక్షుడు అమరేంద్రనాథ్రెడ్డి మాట్లాడారు. న్యాయమైన కోర్కెల కోసం ఆందోళనకు ఏడాది క్రితం శ్రీకారం చుట్టామని, వీటిని నెరవేరుస్తామని.. కొంత సమయం కావాలని అప్పట్లో ప్రభుత్వం కోరిందన్నారు. అయితే నేటికీ పరిష్కరించకపోవడంతో విధిలేక సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. పీహెచ్సీల్లో చేరిన డాక్టర్లు 25 ఏళ్లుగా ఎలాంటి ఉద్యోగోన్నతులకు నోచుకోకుండా ఒకే కేడర్లో పనిచేస్తున్నారని, వీరికి టైమ్ బౌండ్ ప్రమోషన్లను కల్పించాలని కోరారు. డిమాండ్లను పరిష్కరించేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తొలుత వైద్యులు సమావేశమై, ప్రభుత్వం దిగొచ్చేంత వరకు సమ్మె చేయాలని తీర్మానించారు. సంఘ కార్యదర్శి శ్రీనివాసులు, నిర్వహణ కార్యదర్శి బాలచంద్రబాబు, కోశాధికారి రవీంద్రనాథ్రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రావణి, డాక్టర్లు సునీల్కుమార్, వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శులు అహ్మద్బాబు, నవీన్, శివకల్పన తదితరులు పాల్గొన్నారు. రోగుల ఇబ్బందులు ప్రభుత్వ డాక్టర్లు ఆస్పత్రికెళ్లి థంబ్ వేసి ఓపీ చూడకుండా సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో వైద్యమందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లు రావడం లేదని తెలిసిన నిరుపేదలు ప్రైవేట్ ఆస్పత్రులకెళ్లి భారీగా వెచ్చిస్తూ అప్పులపాలవుతున్నారు. -
సచివాలయ ఉద్యోగుల నిరసన
అనుమసముద్రంపేట: సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సచివాలయ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏఎస్పేట ఎంపీడీఓ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనను బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నేత ఖాదర్వలీ మాట్లాడారు. వలంటీర్ విధులైన ఇంటింటి సర్వే నుంచి విముక్తి కల్పించాలని.. నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని.. ఉద్యోగులను వారి మాతృశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. నేతలు రఘు, శేఖర్, షరీఫ్, దేవా, శివ, అస్గర్, ఏడుకొండలు, మస్తాన్, యస్దానీ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ భూములను పరిరక్షిస్తాం బుచ్చిరెడ్డిపాళెం రూరల్: జొన్నవాడలోని కామాక్షితాయి ఆలయానికి సంబంధించిన భూములను పరిరక్షిస్తామని ఈఓ అర్వభూమి వెంకటశ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. కామాక్షితాయి ఆలయానికి చెందిన భూమి ఆక్రమణపై ‘టీడీపీ నేత బరితెగింపు’ అనే శీర్షికన సాక్షిలో గత నెల 27న కథనం ప్రచురితమైన నేపథ్యంలో కార్యాలయంలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న 40 సెంట్ల ఆలయ భూమి ఆక్రమణకు గురైన విషయం తన దృష్టికి వచ్చిందని, తహసీల్దార్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు చేపడతామని వివరించారు. రికార్డుల్లో సదరు భూమి ఆలయానికి చెందినట్లు ఉందని, సంబంధిత ఆధారాలను ఆర్డీఓ, తహసీల్దార్, పోలీస్ అధికారులకు ఇచ్చామని పేర్కొన్నారు. కాగా నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారాన్ని ఈ నెల ఎనిమిదిన నిర్వహించనున్నామని చైర్మన్గా నియమితులైన తిరుమూరు అశోక్రెడ్డి తెలిపారు. -
విజయదశమిని సంతోషంగా జరుపుకోవాలి
నెల్లూరు(స్టోన్హౌస్పేట): విజయదశమిని జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో కాంక్షించారు. ఈ సందర్భంగా పండగ శుభాకాంక్షలను తెలియజేశారు. శుభాకాంక్షలు నెల్లూరు రూరల్: జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలను కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు వేర్వేరు ప్రకటనలను విడుదల చేశారు. పింఛన్ల పంపిణీ నెల్లూరు(పొగతోట) / నెల్లూరు (బారకాసు): ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం పంపిణీ చేశారు. నగరంలోని మూలాపేటలో గల ఈఎస్సార్ఎం స్కూల్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గతంలో ఎలక్ట్రీషియన్గా పనిచేసి మూడేళ్లుగా మంచానికే పరిమితమైన పక్షవాత రోగి సిరివెళ్ల శ్రీనివాస్కు రూ.15 వేలు, ఒంటరి మహిళ శారదకు రూ.నాలుగు వేలను అందజేశారు. వారి ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలను ఆరాతీశారు. శ్రీనివాస్కు సంబంధించిన మెడికల్ రిపోర్టులను పరిశీలించి.. అవసరమైతే ఎమ్మారై స్కాన్ను తీయించాలని సూచించారు. కాగా జిల్లా వ్యాప్తంగా 3,07,543 మందికి గానూ 2,88,308 మందికి తొలి రోజు పంపిణీ చేశారు. కమిషనర్ నందన్,, ఎడ్యుకేషన్ సెక్రటరీ రజని తదితరులు పాల్గొన్నారు. డీసీపల్లిలో 798 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 798 బేళ్లను బుధవారం విక్రయించామని వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ పేర్కొన్నారు. వేలానికి 1063 బేళ్లు రాగా, వీటిలో 798ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 1,00,613 కిలోల పొగాకును విక్రయించగా, రూ.2,16,28,247.70 వ్యాపారం జరిగిందని పేర్కొన్నారు. గరిష్ట ధర రూ.330.. కనిష్ట ధర రూ.80.. సగటు ధర రూ.214.96గా నమోదైందని తెలిపారు. పది కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారన్నారు. -
వైద్య విద్య ప్రైవేటీకరణ తగదు
జగన్మోహన్రెడ్డి ఉన్నతాశయం సాక్షిప్రతినిధి, నెల్లూరు: పేదలు.. బడుగు, బలహీన వర్గాలకు వైద్య విద్యను దూరం చేసేందుకు సీఎం చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించే యత్నాన్ని నిరసిస్తూ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పందిటి కామరాజు ఆధ్వర్యంలో నగరంలోని వీఆర్సీ సెంటర్లో గల అంబేడ్కర్ విగ్రహం వద్ద దళితులు, పేదలు నిరసనను మంగళవారం చేపట్టారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి ఎస్సీ సెల్ నేతలతో కలిసి కాకాణి గోవర్ధన్రెడ్డి, పార్టీ నెల్లూరు సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తలు ఆనం విజయకుమార్రెడ్డి, మేరిగ మురళీధర్ పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విగ్రహానికి వినతిపత్రాన్ని సమర్పించారు. విద్య, వైద్యమనేది అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అని కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు తన హయాంలో రాష్ట్రంలో ఒక్క మెడికల్ కళాశాలనైనా.. ఒక్క సీటైనా అదనంగా తీసుకురాలేదని గుర్తుచేశారు. గతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో ధనవంతులు సైతం సరైన వైద్యాన్ని అందుకోలేకపోయారని చెప్పారు. ప్రభుత్వ వైద్యులే చికిత్స చేసి పలువురి ప్రాణాలను కాపాడిన అంశాన్ని ప్రస్తావించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అంశమై శాసనమండలిలో ప్రభుత్వాన్ని తాను నిలదీస్తే, జవాబు చెప్పలేక పలాయనం చిత్తగించారని మేరిగ మురళీధర్ విమర్శించారు. అధికార, ధనబలంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే వేధిస్తున్నారని.. అధికారం శాశ్వతం కాదనే అంశాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇబ్బంది పెట్టే వారి పేర్లను డిజిటల్ బుక్లో నమోదు చేసి, భవిష్యత్తులో బుద్ధి చెప్పి.. కార్యకర్తలు, ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పిల్లలు ఉన్నత చదువులను అభ్యసిస్తే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని గ్రహించిన జగన్మోహన్రెడ్డి నాడు – నేడు పేరుతో పాఠశాలలు, వైద్య విద్యను బలోపేతం చేశారని ఆనం విజయకుమార్రెడ్డి కొనియాడారు. పేదలకు వైద్య విద్యను దూరం చేసే యత్నాలను మానుకోకపోతే చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తామని స్పష్టం చేశారు. ఏడు మెడికల్ కళాశాలలను ఒకే సంవత్సరంలో జగన్మోహన్రెడ్డి పూర్తి చేశారని పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. అయితే పది కాలేజీలను కంప్లీట్ చేయాలంటే 23 ఏళ్లు పడుతుందని చంద్రబాబు పేర్కొనడం, ఆయన చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. మెడికల్ కళాశాలలను తాము నడపలేమని, సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖను చంద్రబాబు రాయడాన్ని ప్రజలు క్షమించరని కామరాజు పేర్కొన్నారు. ఎస్సీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు బద్దెపూడి రవీంద్ర, స్వర్ణా వెంకయ్య, మందా రవికుమార్, ఎస్సీ సెల్ ఉదయగిరి నియోజకవర్గ అధ్యక్షుడు ఒంగోలు రాఘవేంద్ర, నవకోటి, రాహుల్గాంధీ, రాజేష్కుమార్, పాముల శ్రీనివాసులు, ఎస్సీ సెల్ జిల్లా అధికార ప్రతినిధి యిర్మి యా, నేతలు మొయిళ్ల గౌరి, తనూజరెడ్డి, ఖలీల్ అహ్మద్, వెంకటశేషయ్య, బొబ్బల శ్రీనివాస్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు దూరం చేసేందుకే కుట్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలలను విక్రయించి సొమ్ము చేసుకోవడమే చంద్రబాబు లక్ష్యం దీన్ని అడ్డుకొని తీరుతాం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన జవాబు చెప్పలేక పలాయనం ఒక్క కళాశాలనైనా తీసుకొచ్చారా..? చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం ప్రజలు క్షమించరు బుద్ధి మార్చుకోండి.. పరిస్థితిని స్వయంగా గమనించిన నాటి సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ వైద్యమందాలని.. పేదలు డాక్టర్లవ్వాలనే ఉన్నతాశయంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి 17 మెడికల్ కళాశాలలను ప్రారంభించారని కాకాణి చెప్పారు. వీటిలో ఐదింట్లో అడ్మిషన్లు జరగ్గా, మరో ఐదు పూర్తయ్యాయన్నారు. మిగిలిన చోట్ల పనులు జరుగుతుండగా, అధికారం మారడంతో సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టాక పదింటిని ప్రైవేటీకరిస్తానని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. వీటిని విక్రయించి సొమ్ము చేసుకోవడమే ఆయన లక్ష్యమని ఆరోపించారు. గతంలో మెడికల్ సీట్లు 2360 ఉండేవని, అయితే జగన్మోహన్రెడ్డి కృషితో ఇవి 4910కు పెరిగాయని పేర్కొన్నారు. కళాశాలలు పూర్తయితే మరిన్ని సీట్లొచ్చే అవకాశం ఉందని, ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. -
వైభవం.. అమ్మవారి ఉత్సవం
జిల్లాలో శరన్నరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం నెల్లూరులోని రాజరాజేశ్వరి ఆలయంలో, కన్యకాపరమేశ్వరి ఆలయంలో, మూలాపేటలోని మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో, జొన్నవాడలోని కామాక్షితాయి ఆలయంలో అమ్మవారు దుర్గా అలంకరణలో దర్శనమిచ్చారు. ఇరుకళల పరమేశ్వరి ఆలయంలో లలితాపరమేశ్వరిగా అలంకరించారు. పెంచలకోనలో అమ్మవారు రాజ్యలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. – సాక్షి నెట్వర్క్ ఇరుకళల పరమేశ్వరి ఆలయంలో లలితా పరమేశ్వరి అలంకారం కన్యకాపరమేశ్వరి ఆలయంలో.. -
దివ్యరూపం.. మహాతేజం
తిరుమల: ఏడుకొండల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. మంగళవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన కాంతుల్లో మలయప్ప స్వామి దేదీప్యమానంగా భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం సూర్యకాంతుల మధ్య స్వర్ణకాంతులీనుతూ భక్తులను కటాక్షించారు. అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో బ్రహ్మోత్సవాల్లో మూడో స్నపన తిరు మంజనంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు సేద తీరారు. సాయంత్ర వేళలో ఆలయం వెలుపల సహస్ర దీపాలంకరణ సేవలో స్వామి ఊయలూగుతూ దర్శనమిచ్చారు. ఆ తర్వాత రాత్రి నిర్వహించిన చంద్రప్రభ వాహనసేవలో దివ్య మంగళరూపంలో దర్శనమిచ్చారు. ఏడో రోజు వాహన సేవల్లో కళాకారులు, వివిధ ప్రాజెక్ట్ల ఆధ్వర్యంలో కళాకారులు అభినయం భక్తులను ఆకట్టుకుంది. ఆలయంతోపాటు ఫల, పుష్ప ప్రదర్శన శాలలోని పుష్ప, విద్యుత్ అలంకరణలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక నాదనీరాజనం, ఆస్థాన మండపంలో కళాకారులు భక్తి, సంగీత కార్యక్రమాలు అలరించాయి. పెద్ద జీయర్ స్వామి, చిన్నజీయర్స్వామి, టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. రథోత్సవానికి సర్వం సిద్ధం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం శ్రీవారి రథోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 7.00 గంటల నుంచి ఆలయ మాడ వీధుల్లో స్వామివారు విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. చక్రస్నానం కోసం పుష్కరిణిలో ఏర్పాట్లు పూర్తి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు గురువారం ఉదయం చక్రస్నానం నిర్వహించనున్నారు. వైదికంగా నిర్వహించే ఈ కార్యక్రమం నిర్వహణ కోసం టీటీడీ పుష్కరిణిలో భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులను ఉదయం 4 గంటల నుంచి పుష్కరిణిలోకి అనుమతిస్తారు. భక్తులు రోజంతా పుణ్యస్నానాలు చేయవచ్చని ఆలయ అర్చకులు, అధికారులు తెలిపారు. ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ సేవలో శ్రీనివాసుడి కటాక్షం తిరుమంజనంలో సేదతీరిన శ్రీవారు నేడు రథోత్సవం, రాత్రి అశ్వవాహనం రేపటి చక్రస్నానంతోముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు -
సర్వే రిపోర్ట్ మాయాజాలం
● కొన్ని రిజిస్ట్రేషన్లకు సబ్మిట్ చేయడం తప్పనిసరి ● నకిలీవి సృష్టిస్తున్న కేటుగాళ్లు ● ఓ కార్యాలయంలో ఇచ్చినట్లు వెలుగులోకి.. నెల్లూరు సిటీ: కేటుగాళ్లు నకిలీ సర్వే రిపోర్ట్లను సృష్టించి జేబులు నింపుకొంటున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పదుల సంఖ్యలో సృష్టించి క్రయదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. నెల్లూరు ఆర్ఓ, స్టోన్హౌస్పేట, బుజబుజ నెల్లూరు, కందుకూరు, అల్లూరు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట, కావలి, కోవూరు, ముత్తుకూరు, పొదలకూరు, రాపూరు, ఉదయగిరి, వింజమూరులో ఉన్నాయి. వాటిల్లో కొన్ని రిజిస్ట్రే షన్లకు తప్పనిసరిగా సర్వే రిపోర్ట్ను సబ్మిట్ చేయాలి. గతంలో ప్రభుత్వ, ప్రైవేట్ సర్వేయర్లు ఇచ్చేది సరిపోయేది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ సర్వేయర్లు ఇచ్చే దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వ, కాలువల పక్కనుండే స్థలాలు, సర్వే నంబర్లు భిన్నాలు అయినప్పుడు పలు కారణాలతో సర్వే రిపోర్టును క్రయదారులు పొందుతారు. సర్వేయర్ ఇచ్చిన రిపోర్ట్ను పరిశీలించి సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేస్తారు. నకిలీ కలకలం జిల్లాలో మండల, డిప్యూటీ సర్వేయర్లు కలిపి 80 మంది వరకు ఉన్నారు. వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి డాక్యుమెంట్ సర్వే నంబర్ల ప్రకారం స్థలం హద్దులు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించి రిపోర్టు ఇస్తారు. కాగా బుజబుజనెల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ సర్వే రిపోర్ట్ల వ్యవహారం కలకలం రేపింది. దీనిని గుర్తించిన ఆ సబ్ రిజిస్ట్రార్ సర్వేయర్కు ఫోన్ చేసి ఇది మీరు ఇచ్చిందేనా అని ప్రశ్నిస్తే.. తాను ఇవ్వలేదని, సంతకం ఫోర్జరీ చేశారని చెప్పడం గమనార్హం. నకిలీదిగా గుర్తించి రిజిస్ట్రేషన్ను నిలిపివేశారు. కాగా పదుల సంఖ్యలో నకిలీ సర్వే రిపోర్ట్లను కొందరు కేటుగాళ్లు సృష్టించి జిల్లా వ్యాప్తంగా దొంగ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని తెలిసింది. రూ.10 వేలిస్తే.. ఈ స్థలం తమదేనని ప్రభుత్వం ద్వారా నిర్ధారించేందుకు యజమాని చలానా కట్టాలి. సర్వేయర్లు క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించి రిపోర్ట్ను సిద్ధం చేస్తారు. అయితే కొందరు రిపోర్ట్ ఇవ్వాలంటే రూ.10 వేలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేటుగాళ్లు నకిలీవి సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. పలువురు ప్రభుత్వ సర్వేయర్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు థర్డ్ పార్టీగా బంధువులను ఏర్పాటు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
చెముడుగుంటలో వ్యక్తి దారుణ హత్య
వెంకటాచలం: మండలంలోని చెముడుగుంట పంచాయతీ నక్కల కాలనీకి వెళ్లే మార్గంలో బుజబుజనెల్లూరు పరిధిలోని న్యూకాలనీకి చెందిన వల్లూరు మల్లికార్జున (55) దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. న్యూకాలనీలో నివాసముంటున్న మల్లికార్జున సోమవారం రాత్రి 7 గంటల నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఎక్కడికి వెళ్లాడో తెలియలేదు. మంగళవారం సాయంత్రం చెముడుగుంట పంచాయతీ పరిధిలో నక్కల కాలనీకి వెళ్లే మార్గంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు విచారించగా ఆ మృతదేహం మల్లికార్జునదిగా తేలింది. అతడిని గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఒంటిపై ఉన్న బంగారు నగల కోసం హత్య చేశారా?, లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? తదితర అంశాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మల్లికార్జున చనిపోయాడని సమాచారం తెలియడంతో అతని భార్య వనమ్మ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, సీఐ సుబ్బారావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్టీం వేలుముద్రలు సేకరించింది. కాగా మృతదేహం ఉన్న ప్రాంతానికి మీడియా ప్రతినిధులను పోలీసులు అనుమతించలేదు. ఫొటోలు తీయొద్దని చెప్పడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
తవ్వుకో.. దోచుకో..!
● సర్వేపల్లిలో ఆగని గ్రావెల్ దందా ● పట్టించుకోని అధికారులు వెంకటాచలం: మండలంలో గ్రావెల్ దందా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమ రవాణాపై సోషల్ మీడియా, పత్రికల్లో నిత్యం కథనాలు ప్రచురితమవుతున్నా, అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మండలంలోని సర్వేపల్లి, గుడ్లూరువారిపాళెం, కాకుటూరు, వెంకటాచలం, గొలగమూడి, రామదాసుకండ్రిగ గ్రామాల్లో గల చెరువుల్లో గ్రావెల్ను జేసీబీలతో తవ్వి ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. తాజాగా ఇడిమేపల్లి, పలుకూరువారిపాళెంలోని చెరువుల్లో ఎలాంటి అనుమతుల్లేకుండా గ్రావెల్ను తవ్వుతున్నారు. దీన్ని మనుబోలు మండలం కాగితాలపూరు సమీపంలోని రొయ్యల గుంటల వద్దకు తరలిస్తున్నారు. అధికారుల మొద్దు నిద్ర చెరువుల్లో గ్రావెల్ను అక్రమంగా తవ్వి దోపిడీకి కూటమి నేతలు పాల్పడుతున్నా, అధికారులు మొద్దు నిద్రను వీడటంలేదు. సామాన్యులెక్కడైనా ట్రాక్టర్ మట్టి తోలుతుంటే వెంటనే వాలిపోయే వీరు.. గ్రావెల్ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. అధికారులకు సమాచారమిచ్చినా పట్టించుకోవడంలేదని ఇడిమేపల్లి, పలుకూరువారిపాళెం గ్రామాల రైతులు మండిపడుతున్నారు. గ్రావెల్ గుంతల్లో పడి చిన్నారులు మృతి చెందుతున్నా, అధికారులు ఎందుకు అడ్డుకట్ట వేయడంలేదని ప్రశ్నిస్తున్నారు. దీనిపై కలెక్టర్ స్పందించాలని కోరుతున్నారు. -
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
● జన విజ్ఞాన వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు నెల్లూరు(బృందావనం): ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కు తీసుకోవాలి. ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేయాలి’ అని పలువురు నేతలు డిమాండ్ చేశారు. జన విజ్ఞాన వేదిక నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు పురమందిరం ప్రాంగణంలోని వర్థమాన సమాజం హాల్లో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగిది. జిల్లా హెల్త్ సబ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ శ్రీనునాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, సంస్థలకు చెందిన వారు మాట్లాడారు. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు కాసులు కురిపించేలా ప్రభుత్వ మెడికల్ వైద్య కళాశాలల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు సరికాదన్నారు. పీపీపీ విధానం ద్వారా ప్రజలకు ఆరోగ్యం, పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరంచేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సంస్థలు ప్రజలను ఏ విధంగా కాపాడాయో వెల్లడించారు. ప్రజలకు అవగాహన కలిగించి వారిని చైతన్యపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపాందించాలన్నారు. సమావేశంలో నాయకులు బుజ్జయ్య, గాలి శీనయ్య, నారాయణ, డాక్టర్ ఖాదర్బాషా, డాక్టర్ ఎండీ షఫీ, ఎంవీ చలపతి, ఎ.విజయకుమార్, విద్యాచరణ్, కృష్ణ, ఎన్.శంకరయ్య, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చికెన్ వ్యర్థాలతో కాసులు
ప్రజారోగ్యం ఏమైతేనేం.. తమ జేబులు నిండితే చాలన్నట్లుగా మారింది టీడీపీ నేతలు, పోలీసులు, మత్స్యశాఖ అధికారుల వైఖరి. చేపల గుంతల్లో చికెన్ వ్యర్థాలను డంప్ చేస్తూ.. భారీగా కాసులు గడిస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నెల్లూరు జిల్లాలోని కోవూరు, ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో ఈ తంతు అడ్డూ అదుపులేకుండా సాగుతోంది. వీటిని తరలించే వాహనాలు అడపాదడపా పట్టుబడుతున్నా, కంటపడకుండా తరలుతోంది భారీగానే ఉంటుందని అంచనా. ఇంత జరుగుతున్నా, అధికారులు పట్టించుకోకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో చికెన్ మాఫియా ఆగడాలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. సమీప రాష్ట్రాల నుంచి చికెన్ వ్యర్థాలను జిల్లాకు యథేచ్ఛగా తీసుకొచ్చి.. చేపల చెరువుల్లో డంప్ చేస్తున్నారు. జిల్లాలోని ఆత్మకూరు, సంగం, కోవూరు, ఇందుకూరుపేట, విడవలూరు, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు, బుచ్చిరెడ్డిపాళెం, సంగం మండలల్లో దాదాపు రెండు వేల ఎకరాల్లో చేపలను పెంచుతున్నారు. తక్కువ ధరకే వస్తుండటంతో.. సాధారణంగా చేపలు కిలోపైగా పెరిగేందుకు దాదాపు ఆర్నెల్ల నుంచి ఎనిమిది నెలలు పడుతుంది. రైతుల నుంచి కిలోను రూ.80 నుంచి రూ.90కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో నష్టాలే ఎక్కువగా వస్తున్నాయి. అదే మేతగా బ్రాండెడ్ ఫీడ్కు ప్రత్యామ్నాయంగా అతి తక్కువ ఖర్చుతో కూడిన కోళ్ల వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్నారు. వీటితో నాలుగు నెలలకే కిలో.. అంతకుమించి బరువు పెరుగుతున్నాయి. దీంతో జిల్లాలో దాదాపు 80 శాతం మంది చేపల రైతులు వీటినే వినియోగిస్తున్నారు. ఫలితంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి చికెన్ వ్యర్థాలను జిల్లాకు తీసుకొచ్చి విక్రయించే మాఫియా తయారైంది. అక్కడ కిలోను ఐదారు రూపాయలకు కొనుగోలు చేసి ఇక్కడ రూ.15కు విక్రయిస్తున్నారు. టీడీపీ నేతల కనుసన్నల్లో.. కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం, ముత్తుకూరు, పొదలకూరు, తోటపల్లిగూడూరు, సంగం ప్రాంతాలకు చెందిన కొందరు టీడీపీ నేతలు, పోలీస్ అధికారుల కనుసన్నల్లో మాఫియా బరితెగిస్తోంది. పదుల సంఖ్యలో వర్కర్లు వీరికి అండగా ఉన్నారు. ముందుగా బెంగళూరు, చెన్నై, కేరళ ప్రాంతాల్లో చికెన్ వ్యర్థాల సేకరణ కోసం డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసుకున్నారు. దీని కోసమే రూ.కోట్లను వెచ్చించారు. అక్కడే కొందర్ని చేరదీసి వారి ద్వారా నిత్యం సేకరిస్తున్నారు. ఆపై రాత్రివేళ లోడ్ చేసి నెల్లూరుకు చేరుస్తున్నారు. నెలకు రూ.లక్షల్లో మామూళ్లు ఈ వాహనాలు టో-ల్గేట్లు దాటి జిల్లాలోకి ప్రవేశిస్తున్న సమయంలో కట్టడి చేసే అవకాశం ఉంది. అయినా పోలీసులు, మత్స్యశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక్కో వాహనానికి రూ.పది వేల చొప్పున పోలీస్ శాఖకు నెలవారీ మామూళ్లను ముట్టజెప్తున్నారని తెలుస్తోంది. ఈ రకంగా నెలకు వంద వాహనాలు తిరిగితే స్టేషన్కు రూ.పది లక్షల మేర అందుతోందని సమాచారం. సర్కిల్, డీఎస్పీ స్థాయి అధికారులకు సైతం ఇదే పరిస్థితి నెలకొందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వీటిని ఆపేందుకు ఎవరూ ఉత్సాహం చూపడంలేదు. మత్స్యశాఖ అధికారులకు సైతం నెలకు రూ.లక్షల్లో అందుతోందని తెలుస్తోంది. రోడ్డు ప్రమాదాలు జరిగితేనో.. వాహనం పాడైన సందర్భాల్లోనో ఈ ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ.కోట్లల్లో ఆదాయం కిలోకు రూ.పది మేర వెచ్చించి.. చేపల చెరువు యజమానులకు రూ.20 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. ఈ రకంగా చూస్తే జిల్లాలో నెలకు రూ.పది కోట్ల వ్యాపారం జరుగుతోందని సమాచారం. మాఫియాకు భారీగా ఆదాయం వస్తుండటంతో దీనిపై ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు మాఫియా భారీగా సమర్పి స్తోందనే టాక్ ఉంది. ఆరోగ్యానికి చేటే.. చికెన్ వ్యర్థాలను ఆహారంగా తీసుకునే చేపలను భుజిస్తే ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 80 శాతం మంది మాంసాహార ప్రియులు చెరువుల్లో పెంచే చేపలనే తింటున్నారు. ఈ – కోలి బ్యాక్టీరియా చేరి కేన్సర్, జీర్ణకోశ వ్యాధులొచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతా ఆర్భాటమే..చికెన్ వ్యర్థాల విషయమై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో కఠిన చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాలిచ్చారు. నాలుగు నెలల్లో కట్టడి చేయాలని పేర్కొన్నా, అవేవీ అమలుకు నోచుకోవడంలేదు. ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం, ఆత్మకూరు రూరల్ ప్రాంతాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు.. మాఫియాలో చేరారు. కొందరు పోలీస్ అధికారులు సహకారం అందిస్తుండటంతో వ్యాపారం సజావుగా సాగుతోంది. అడపాదడపా వాహనాలను పట్టుకున్నట్లు చూపుతున్నారు. ఆత్మకూరు మండంలోని వాసిలిలో చికెన్ వ్యర్థాల డంపింగ్ కేంద్రాన్ని జనసేన నేతలు చూపి పోలీసులకు పట్టించారు. ఇంత జరుగుతున్నా, పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. -
సచివాలయ ఉద్యోగుల ఆత్మ గౌరవ ర్యాలీ
● అధికారిక వాట్సాప్ గ్రూపు నుంచి వైదొలిగిన వైనం ● ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు నెల్లూరు(అర్బన్): తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని సచివాలయ ఉద్యోగులు కదం తొక్కారు. నగరంలోని వీఆర్సీ గ్రౌండ్స్ నుంచి కలెక్టరేట్ వరకు ప్లకార్డులు చేతబట్టి భారీ ప్రదర్శనను సోమవారం నిర్వహించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ల జేఏసీ నేతలు సతీష్రెడ్డి, బాలు, పాండురంగ మాట్లాడారు. ఉన్నత చదువులను అభ్యసించి ఎంతో ఆశతో సచివాలయ ఉద్యోగాల్లో చేరామని, తమ సమస్యలను సర్కార్ నెరవేర్చకపోయినా, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేరుస్తున్నామని చెప్పారు. తమ మెడపై కత్తిపెట్టి వలంటీర్ల విధులను చేయిస్తున్నారని ఆరోపించారు. ఇంటింటి సర్వేను చేయాలనడం తగదని, ప్రత్యామ్నాయం చూడకుండా తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు. తమ సమస్యలపై ఉన్నతాధికారులకు వినతిపత్రాలను తరచూ ఇస్తున్నా, ప్రయోజనం లేకపోవడంతో నిరసన బాట పట్టామని వివరించారు. ప్రభుత్వ తీరు మారకపోవడంతో అఽధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలిగామని చెప్పారు. రెండు నోషనల్ ఇంక్రిమెంట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తొమ్మిది నెలల అరియర్స్ను చెల్లించడంతో పాటు వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరారు. తమతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నేతలు చైతన్య, గోపాల్, మురళీకృష్ణ, రాజేశ్, శశి, సురేష్, బాలాజీనాయక్, ఫయాజ్, అబీద్, సుమన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
జగజ్జననీ.. కరుణించు
లోకమాతా కరుణించు అంటూ భక్తుల నామస్మరణతో అమ్మవారి ఆలయాలు మార్మోగాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం జగజ్జనని వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. – సాక్షి నెట్వర్క్ మూలాపేటలోని మూలస్థానేశ్వరాలయంలో.. జొన్నవాడలో.. -
హామీలను విస్మరిస్తున్న ప్రభుత్వం
కోవూరు: కౌలు రైతులకు నూతన చట్టాన్ని తీసుకురావడంతో పాటు అన్నదాత సుఖీభవ పథకాన్ని అందిస్తామని గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన టీడీపీ, అధికారంలోకి వచ్చాక విస్మరించిందని కౌలు రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణయ్య ఆరోపించారు. పడుగుపాడులోని పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘ జిల్లా నాలుగో మహాసభను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా ముత్యాల గురునాథం, కార్యదర్శిగా తుళ్లూరు గోపాల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 27 మంది సభ్యులతో నూతన జిల్లా కమిటీ, తొమ్మిది మంది ఆఫీస్ బేరర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం రాధాకృష్ణయ్య మాట్లాడారు. గుర్తింపు కార్డులను ఇవ్వకపోవడంతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. సమయానికి యూరియాను అందించాలని గురునాథం డిమాండ్ చేశారు. అనంతరం వివిధ అంశాలపై తీర్మానం చేశారు. రైతు సంఘ నేత చండ్ర రాజగోపాల్, సీఐటీయూ నేత ప్రసాద్, రెహనాబేగం తదితరులు పాల్గొన్నారు. -
సోమశిలకు 34,200 క్యూసెక్కుల వరద
● పెన్నాకు 25,650 క్యూసెక్కుల విడుదల సోమశిల: సోమశిల జలాశయం నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ ఈఈ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడారు. ఎగువ ప్రాంతాల నుంచి 34,200 క్యూసెక్కుల ప్రవహం వస్తోందని చెప్పారు. 7, 8 క్రస్ట్ గేట్ల నుంచి పెన్నాకు 25,650.. కండలేరుకు 4000.. ఉత్తర కాలువకు 100 క్యూసెక్కుల వంతున విడుదల చేస్తున్నామని వివరించారు. జలాశయంలో 73.246 టీఎంసీలు నిల్వ ఉన్నాయని పేర్కొన్నారు. 99.932 మీటర్ల నీటిమట్టం నమోదైందన్నారు. వరద తగ్గేంత వరకు ఆప్రాన్ మీదుగా వాహనాలకు అనుమతిలేదని పేర్కొన్నారు. డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ల ఆవిష్కరణ నెల్లూరు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం రూపొందించిన డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ సోమవారం ఆవిష్కరించారు. చింతారెడ్డిపాళెంలోని తన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అన్యాయానికి గురవుతున్న పార్టీ శ్రేణులకు అండగా ఉండాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారని వివరించారు. -
విన్నపాలు వినవలె..
● కలెక్టరేట్కు పోటెత్తిన అర్జీదారులు ● 500కు పైగా వినతులు నెల్లూరు(అర్బన్): ‘అయ్యా.. మండలాధికారుల చుట్టూ తిరిగినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో జిల్లా కేంద్రానికి వచ్చాం. ఇక్కడైనా మా బాధలు విని స్పందించండి’ అని పలువురు అర్జీదారులు కలెక్టర్ హిమాన్షు శుక్లాను కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి జనం పెద్ద సంఖ్యలో వచ్చి అర్జీలు సమర్పించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ అర్జీలు 500కిపైగా వచ్చాయి. కలెక్టర్, జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, జెడ్పీ సీఈఓ మోహన్రావు, డ్వామా పీడీ గంగా భవాని తదితర అధికారులు వినతులు తీసుకున్నారు. ఒక్క రూపాయి ఇవ్వలేదు పెరమన గ్రామం సమీపంలో రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మృతిచెందారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఇద్దరు మంత్రులు పరామర్శకు రాలేదు. విధిలేని పరిస్థితిలో మృతదేహాలతో న్యాయం చేయాలని ధర్నా జరిపాం. దీంతో ఆర్డీఓ రూ.10 లక్షల నష్టపరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. అయితే ఇంకా ఒక్క రూపాయి ఇవ్వలేదు. దళిత కుటుంబాల్లో సర్వం కోల్పోయి వీధిన పడిన బిడ్డలకు ఇంటికొక ఉద్యోగం కల్పించాలి. అలాగే నష్టపరిహారం ఒక్కొక్కరికి రూ.25 లక్షలు అందజేసి ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వం స్పందించాలి. – ధనలక్ష్మి, అశ్విని, సౌందర్య, వెంగమ్మ, వైష్ణవి (మృతుల కుటుంబ సభ్యులు), కాయంపు శ్రీనివాసులు, కత్తి శ్రీనివాసులు (సీపీఎం నాయకులు) ఇంగ్లిష్ మీడియం దూరం గత ప్రభుత్వంలో పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఆంగ్ల మాధ్యమం విద్యను కూటమి ప్రభుత్వం బలహీనపరిచిందని ఇంగ్లిష్ మీడియం విద్యాపరిరక్షణ వేదిక అధ్యక్ష, కార్యదర్శులు దాదినబోయిన ఏడుకొండలు, ఈదర గోపిచంద్ తెలిపారు. ప్రతి జిల్లా తిరుగుతూ గుంటూరు నుంచి వచ్చిన ఏడుకొండలు వినతిపత్రం ఇచ్చి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ట్యాబ్, టోఫెల్ శిక్షణ, బైజుస్ కంటెంట్, సీబీఎస్ఈ సిలబస్ తొలగింపు లాంటి చర్యలు చేపట్టిందన్నారు. పేదలకు ఇంగ్లిష్ విద్య అందకుండా కుట్ర చేస్తున్నారన్నారు. తెలుగు మీడియంకు తాము వ్యతిరేకం కాదన్నారు. తెలుగును ఒక భాషగా ఇంటర్, డిగ్రీ వరకు కూడా ప్రవేశపెట్టవచ్చన్నారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన చేస్తే ప్రపంచ విషయాలు అర్థమవుతాయన్నారు. విద్యాశాఖా మంత్రి లోకేశ్ స్పందించాలని కోరారు. దారి లేకుండా కంచె వేశారు మేము వైఎస్సార్సీపీ మద్దతుదారులమని ఇంటికి దారి లేకుండా మున్సిపల్ కౌన్సిలర్ శివారెడ్డి, ఆయన అనుచరులు కంచె వేశారు. సర్వే నంబర్ 198లో ఉన్న గ్రామ పొరంబోకు స్థలాన్ని శివారెడ్డి ఆక్రమించాడు. దీంతో నాలుగు ఇళ్లకు దారి లేకుండాపోయింది. ప్ర శ్నిస్తే అధికార పార్టీ అండతో దౌర్జన్యం చేస్తున్నారు. ఆర్డీఓ ఒకసారి, కలెక్టర్కు రెండుసార్లు అర్జీలిచ్చాను. వీఆర్వో సర్వే చేయకుండానే చేసినట్టు చూపి అర్జీని ఆన్లైన్లో క్లోజ్ చేసి మాకు అన్యాయం చేశారు. – యనమల రాంబాబు, వెంకట్రావుపల్లి, ఆత్మకూరు మున్సిపాలిటీ -
సమస్యల పరిష్కారానికి చర్యలు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(అర్బన్): అర్జీదారుల సమస్యలకు సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. పలు అంశాలపై సోమవారం కలెక్టరేట్లో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ సమస్యలు, రెవెన్యూ అంశాలకు సంబంధించిన అర్జీలు పదేపదే వస్తున్నాయని, వాటిని పరిష్కరించాలన్నారు. అర్జీదారులకు తాగునీరు, భోజన వసతి కల్పించడం, అదనంగా పందిళ్లు ఏర్పాటు చేయడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబందించి ఈ – ఆఫీసులో ఫైళ్లను నిర్దిష్ట ఫార్మాట్లో పంపాలని సూచించారు. ప్రతి ఫైలుకు ప్రత్యేక క్రమ సంఖ్యను కేటాయించి ఆ నంబర్ మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. ● జీఎస్టీ 2.0 ఫలాలు ప్రజలకు అందేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా రూపొందించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ వెంకటేశ్వర్లు, జీఎస్టీ జాయింట్ కమిషనర్ కిరణ్కుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
న్యాయం చేయాలని వేడుకోలు
నెల్లూరు(క్రైమ్): సమస్యలపై తక్షణమే స్పందించి న్యాయం చేయాలని పలువురు పోలీసు ఉన్నతాధికారులను వేడుకున్నారు. సోమవారం నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 78 మంది తమ సమస్యలను వినతుల రూపంలో నెల్లూరు రూరల్, మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, చెంచురామారావుకు అందజేశారు. వినతులను పరిశీలించిన వారు చట్టపరిధిలో సత్వరమే సమస్యలను పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో లీగల్ సెల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● చిన్నకుమారుడు పెంచలకృష్ణ ఆస్తి కోసం నన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. తీవ్రంగా కొడుతున్నాడు. విచారించి న్యాయం చేయాలని నెల్లూరు దర్గామిట్ట ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు కోరాడు. ● నాపేరుపై ఉన్న ఆస్తిని కుమారుడు తీసుకుని ఇంటి నుంచి గెంటేశాడు. తెలిసిన వారి ఇంట్లో తలదాచుకుంటున్నాను. దీనిపై తగిన చర్యలు తీసుకోవాని జలదంకికి చెందిన ఓ వృద్ధురాలు విన్నవించారు. ● పొదలకూరుకు చెందిన శ్రీనివాసులు, హైదరాబాద్కు చెందిన రవికుమార్ క్రిప్టో కరెన్సీలో నగదు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.8 లక్షలు పెట్టించారు. విచారించగా అదంతా మోసమని తేలింది. నగదు అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని వేదాయపాళేనికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ● రామ్నారాయణ అనే వ్యక్తి కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకుని బెదిరింపులకు దిగడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశా. కేసు నమోదు చేశారు. కేసును ఉపసంహరించుకోవాలని రామ్నారాయణ బెదిరిస్తున్నాడని కలువాయికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. ● నా పెద్ద కుమార్తె ఉదయగిరి ఆనకట్టలో పడిపోయిన ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె మృతిపై అనుమానాలున్నాయి. లోతుగా దర్యాప్తు చేసి ఆమె మరణానికి కారకులపై చర్యలు తీసుకోవాలని ఉదయగిరికి చెందిన ఓ తండ్రి కోరారు. ● నాకు ఆరునెలల క్రితం వివాహమైంది. భర్త, అత్తింటివారు అదనపుకట్నం, బంగారు కోసం వేధిస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోతే విడాకులివ్వాలని ఇబ్బంది పెడుతున్నారు. కౌన్సెలింగ్ చేసి కాపురాన్ని చక్కదిద్దాలని బాలాజీనగర్కు చెందిన ఓ మహిళ కోరారు. రక్షణ కల్పించాలి : బీజేపీ నాయకురాలు తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని బీజేపీ నాయకురాలు కె.రాజేశ్వరి కోరారు. ఆమె శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొదలకూరు మండలం మరుపూరు గ్రామంలోని తన పొలంలో వంద టేకుచెట్లను కొందరు గతనెల 26వ తేదీన నరికి తీసుకెళ్లారన్నారు. చంపుతామని బెదిరిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఈ ఘటనపై పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న తమకే ఇలా ఉంటే సామాన్యు ప్రజల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు. -
అగ్నిప్రమాద బాధితులకు అండగా..
● నిత్యావసర సరుకులు అందించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి నెల్లూరు(స్టోన్హౌస్పేట): నగరంలోని సంతపేట పాత వస్త్ర మార్కెట్లో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా నష్టపోయిన 30 కుటుంబాలకు వైఎస్సార్సీపీ నెల్లూరు నగర ఇన్చార్జి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి అండగా నిలిచారు. ఆయన సోమవారం బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వస్త్ర దుకాణాల్లో జరిగిన అగ్నిప్రమాదం వల్ల పేదలు ఎంతో నష్టపోయారన్నారు. 30 షాపులు కాలిపోయాయన్నారు. 8 షాపుల వారు సర్వం కోల్పోయారన్నారు. 22 దుకాణాలు దెబ్బతిని వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదన్నారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజులవుతున్నా ప్రభుత్వం ఇంత వరకు బాధితులను ఆదుకోకపోవడం వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందన్నారు. నాడు ఇలాంటి సంఘటనలు జరిగితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులను ఆదుకున్న సందర్భాలను వివరించారు. అధికార పార్టీ నేతలు కంటి తుడుపు మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం స్పందించి బాధితులు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన ఉండి కలెక్టర్కు జరిగిన నష్టాన్ని వివరించి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చమురు నిక్షేపాల కోసం అన్వేషణ
● ఆందోళన చెందుతున్న గ్రామస్తులు ● తహసీల్దార్కు వినతి పొదలకూరు: మండలంలోని తొమ్మిది గ్రామాల్లో ఓఎన్జీసీ సంస్థ చమురు నిక్షేపాల కోసం అన్వేషిస్తోంది. మూడురోజులుగా ఈ ప్రాంతంలో బోరు పాయింట్లు వేసి సర్వే నిర్వహిస్తున్నారు. పార్లపల్లి, పొదలకూరు, మరుపూరు, డేగపూడి, నేదురుమల్లి, తాటిపర్తి, వెలికంటిపాళెం, అమ్మవారిపాళెం, అయ్యగారిపాళెం తదితర గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వంద అడుగుల లోతు వరకు పాయింట్లు వేసి తర్వాత పేలుడు పదార్థాలు లోపలకు పంపి బ్లాస్ట్ చేస్తారని తెలుస్తోంది. బ్లాస్ట్ చేసిన తర్వాత శాటిలైట్ ద్వారా అన్వేషణకు సంబంధించిన నిపుణులకు అనుసంధానించి భూగర్భంలో చమురు నిక్షేపాలు ఉన్నది లేదని తెలుసుకుంటారు. పీఆర్వో సుధీర్ ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అంతేకాక సంబంధిత వీఆర్వోలకు ముందస్తుగా సమాచారం ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. రైతుల ఆందోళన పట్టా భూముల్లో అనుమతి లేకుండా తాము వినియోగిస్తున్న బోర్లకు సమీపంలో వారు బోర్లు వేయడంతో ఇబ్బందులు తలెత్తుతాయని రైతులు అంటున్నారు. తన పొలంలో పది బోర్లు వేసినట్టు ప్రభాకర్ అనే రైతు తహసీల్దార్ బి.శివకృష్ణయ్యకు సోమవారం రాతపూర్వకంగా తెలిపారు. తమ సొంత పొలంలో అనుమతి లేకుండా బోర్లు వేయొద్దని రైతులు వెల్లడించారు. భవిష్యత్లో ఇబ్బందులు ఏర్పడితే తాము నష్టపోవాల్సి వస్తుందన్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ ఇబ్బందులు తలెత్తకుండా తాను మాట్లాడతానని వెల్లడించారు. -
పీహెచ్సీల్లో ఓపీ సేవలు బంద్
అగచాట్లు నెల్లూరు(అర్బన్): రోగులతో పాటు డాక్టర్లపై కూటమి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోవడంతో గతేడాది డాక్టర్లు ఇదే తరహాలో సమ్మెకు పిలుపునివ్వడంతో, చర్చలు జరిపింది. పలు హామీలిచ్చినా, అందులో ఏ ఒక్కటీ నేటికీ పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవలు సోమవారం నుంచి బంద్ అయ్యాయి. ఇదీ పరిస్థితి.. సాధారణంగా కొన్ని పీహెచ్సీల్లో 50 నుంచి 60.. మరికొన్ని చోట్ల 70 మంది వరకు రోగులకు ఓపీ సేవలందేవి. అయితే డాక్టర్లు సమ్మెబాట పట్టడంతో పలు ప్రాంతాల్లో ఇది 20కి పడిపోయింది. తొలి రోజే ఇలా ఉంటే రెండో రోజు నుంచి ఆస్పత్రులు ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఎమర్జెన్సీ సేవలను సైతం నిలిపేస్తామని వైద్యులు స్పష్టం చేశారు. ఇవీ డిమాండ్లు.. ● 20 నుంచి 25 ఏళ్లుగా ఉద్యోగోన్నతుల్లేక ఒకే హోదాలో సేవలందిస్తున్న వైద్యాధికారులకు టైమ్ బౌండ్ ప్రమోషన్లు ఇవ్వాలి. ● ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరించేలా జీఓ నంబర్ 99ను రద్దు చేయాలి. ● నోషనల్ ఇంక్రిమెంట్లను మంజూరు చేయాలి. ● గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు 50 శాతం మూల వేతనాన్ని గిరిజన భత్యంగా మంజూరు చేయాలి ● చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి రూ.ఐదు వేల భత్యాన్ని ఇవ్వాలి. ● స్థానికత్వం, పట్టణ వైద్యాధికారుల సర్వీస్ అర్హత సమస్యలను పరిష్కరించడంతో పాటు పెండింగ్ అంశాలకు పరిష్కారం చూపాలి. వైద్యమందక రోగుల అవస్థలు పలు చోట్ల డాక్లర్ల అవతారమెత్తిన నర్సులు అవసరమైతే ఎమర్జెన్సీ సేవలనూ నిలిపేస్తామని ప్రకటన జిల్లాలోని 52 పీహెచ్సీల్లో ఓపీ సేవలను డాక్టర్లు నిలిపేశారు. కొన్ని చోట్ల డాక్టర్లు హాజరైనా, కుర్చీలు ఖాళీ చేసి పక్కకు వెళ్లిపోయారు. మరికొన్ని చోట్ల అసలు వైద్యులే రాకపోగా.. పలు ప్రాంతాల్లో ఆస్పత్రిలో డాక్టర్లున్నా రోగుల వైపు చూడలేదు. విషయం తెలియక హాస్పిటళ్లకు వచ్చిన పలువురు నిరుపేద రోగులు వైద్యమందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి పరిస్థితిని చూసి కొన్ని చోట్ల నర్సులే డాక్టర్ల అవతారమెత్తారు. ఏదో తూతూమంత్రంగా నాలుగు మాత్రలిచ్చి పంపారు. -
తెలుగుదేశం అడ్రస్ గల్లంతు ఖాయం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి మనుబోలు: వచ్చే ఎన్నికల్లో జిల్లాలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతవడం ఖాయమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న మనుబోలు మండల కేంద్రానికి చెందిన వైఎస్సార్ వీరాభిమాని, విశ్రాంత ఉపాధ్యాయుడు బాలిరెడ్డి, పిడూరుపాళేనికి చెందిన నాయకుడు గోపిరెడ్డిను సోమవారం ఆయన పరామర్శించారు. ఇటీవల బద్దెవోలు గ్రామానికి చెందిన చల్లా రమణయ్య మరణించగా ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాగా ఆయా గ్రామాలకు చెందిన అభిమానులు, నాయకులు కాకాణికి ఘన స్వాగతం పలికారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని అరకొరగా అమలు చేసి అంతా చేసేశానంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నాడని మండిపడ్డారు. విద్యుత్ చార్జీలను పెంచబోనని హామీ ఇచ్చి తొలి ఏడాదిలోనే రూ.19 వేల కోట్ల భారం మోపడంతోపాటు రూ.923 కోట్లు అక్రమంగా ప్రజల నుంచి వసూలు చేశాడన్నారు. ప్రజల నుంచి లాక్కోవడమే తప్ప ఇచ్చే మనసు బాబుకు రాదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు వల్లూరు హర్షవర్ధన్రెడ్డి, కసిరెడ్డి ధనుంజయరెడ్డి, చేడిమాల బుజ్జిరెడ్డి, బొమ్మిరెడ్డి హరగోపాల్రెడ్డి, కడివేటి చంద్రశేఖర్రెడ్డి, ముంగర రవీందర్రెడ్డి, దాసరి భాస్కర్గౌడ్, వెంకటశేషయ్య, జానకిరామిరెడ్డి, రమేష్, గిరి, దయాకర్, నవకోటి తదితరులు పాల్గొన్నారు. -
పక్షపాత అధికారుల భరతం పడుతాం
● కార్యకర్తలకు అండగా నిలిచేందుకు డిజిటల్ బుక్ నెల్లూరు (స్టోన్హౌస్పేట): అధికార మదంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న టీడీపీ నేతలు, వీరి అండ చూసుకుని పక్షపాతంతో వ్యవహరిస్తున్న అధికారుల భరతం పట్టేందుకే డిజిటల్ బుక్ను ప్రారంభించినట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. అన్యాయానికి గురైన వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యూఆర్ కోడ్తో కలిగిన డిజిటల్ బుక్ను ఆవిష్కరించారని తెలిపారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీ, వెంకటగిరి సమన్వయకర్త నేదరుమల్లి రాంకుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పార్టీ ముఖ్య నేతలతో కలిసి డిజిటల్ బుక్ క్యూఆర్ పోస్టర్ను ఆవిష్కరించారు. కాకాణి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని ఇబ్బంది పెట్టిన, పెట్టే వారిపై ఫిర్యాదు చేసేందుకు డిజిటల్ బుక్ ఒక అస్త్రమన్నారు. తమను ఇబ్బంది పెట్టిన వారిపై కార్యకర్తలు, ఈ బుక్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చునన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు ఫిర్యాదు చేసిన వారిపై తప్పకుండా శిక్ష పడేలా చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున, నాయకులు బొబ్బల శ్రీనివాసులు యాదవ్, పేన్నేటి కోటేశ్వరరెడ్డి, మందల వెంకటశేషయ్య తదితరులు ఉన్నారు. -
ఇళ్ల నిర్మాణంపై అబద్ధాల చంద్రబాబు అసత్యాలు
నెల్లూరు (స్టోన్హౌస్పేట): చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 15 ఏళ్లలో పేదల ఇళ్ల నిర్మాణం గురించి ఏమాత్రం ఆలోచన చేశాడో ప్రజలందరికీ తెలుసునని, తాజాగా అసెంబ్లీ వేదికగా ఇళ్ల నిర్మాణంపై పచ్చి అబద్ధాలు వల్లెవేశాడని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం కాకాణి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం 6.15 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామని చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 3 లక్షల ఇళ్లు నిర్మించిందని, అందుకోసం రూ.2200 కోట్లు ఖర్చు చేశామని, దీపావళి కానుకగా మరో 3 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామని నిస్సిగ్గుగా మరో అబద్ధం చెప్పారని ధ్వజమెత్తారు. బీసీ, ఎస్సీలకు రూ.50 వేల, ఎస్టీలకు రూ.70వేల, ఆదివాసీలకు రూ.లక్ష వరకు పెంచి ఇస్తున్నామని మరో అబద్ధాన్ని కళ్లార్పకుండా చెప్పాడన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రెండు లేదా మూడు సెంట్లు ఇంటి స్థలం ఇస్తున్నామని, ప్రజలు ఛీదరించుకుంటారన్న సోయ లేకుండా 2029 నాటికి ఇళ్లు లేని వారు ఎవరూ ఉండరని అబద్ధాలు చెప్పడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో 9.02 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి వైఎస్సార్సీపీ హయాంలో దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఐదేళ్లలో 31.19 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. దాదాపు 22 లక్షల కు టుంబాలకు ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణాలు ప్రారంభించామని, తమ ప్రభుత్వం దిగిపోయే నాటికి 9.02 లక్షల ఇళ్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఒక్కో ఏరియాలో వందల ఎకరాల్లో 10 వేలకు పైగా లేఅవుట్లు వేసి ఊర్లను తలపించేలా కొత్తగా ఇల్లు నిర్మించామన్నారు. మొత్తం 71,811 ఎకరాలు సేకరించామని, ఎకరం ఐదారు కోట్ల విలువ చేసే భూములను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కొని పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చిందన్నారు. ఒక్కో ప్లాటు విలువ రూ. 3.50 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ధర పలుకుతోందని, రూ.76 వేల కోట్ల విలువైన ప్లాట్లను పేదలకు ఇవ్వడం జరిగిందన్నారు. 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలు ఏర్పాటయ్యాయని, చాలా ఇళ్లు అనేక దశల్లో ఉన్నాయన్నారు. దాదాపు 2 లక్షల టిడ్కో ఇళ్లను ఒక్క రూపా యికే పేదలకు వైఎస్ జగన్ అందించారని, కానీ కూట మి ప్రభుత్వం వచ్చాక వాటికి నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు అనే పేరును తీసేసి పీఎంఏవై ఎన్టీఆర్ నగర్లుగా మార్చడం తప్ప చేసిందేమీ లేదన్నారు. 2024 ఎన్నికల నాటికి మరో 2 లక్షల ఇళ్లు పూర్తయ్యే దశలో ఉంటే వాటిని కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నాడన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్నది బాబే వైఎస్ జగన్ పేదలకు ఇళ్లు కట్టిస్తుంటే దాదాపు వెయ్యి కేసులేసి అడ్డుకోవాలని చూశాడని, ఆఖరుకు అమరావతి రాజధానిలో పేద ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీల కు వైఎస్ జగన్ ఇళ్ల పట్టాలిస్తే దాన్ని కూడా కేసులేసి చంద్రబాబు అడ్డుకున్నాడన్నారు. చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ 50,793 ఇళ్లకు ఒకే చోట పట్టాలు పంచిన చరిత్ర జగన్కే దక్కుతుందన్నారు. సెంటు స్థలం సమాధి కట్టుకోవడానికి కూడా పనికిరాదని ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని పేదల ఇళ్లపై విషప్రచారం చేశాడని, ఇంటి స్థలంపై పేద వాడికి సర్వ హక్కులు కలిగేలా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కన్వేయన్స్ డీడ్ పేదల పేరుతో ఇస్తే దాన్ని కూడా చంద్రబాబు ఓర్చుకోలేకపోయాడన్నారు. కరోనా, కోర్టు కేసులు అధిగమించి రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం రూ. 1.80 లక్షలు ఇచ్చిందని, డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నవారిని ఆదుకోవడానికి రూ.35 వేలు పావలా వడ్డీకే ఇచ్చారన్నారు. రూ.15 వేలు విలువ చేసే ఉచిత ఇసుకతో పాటు స్టీల్, సిమెంట్ వంటి 12 రకాల సామగ్రి కొనుగోళ్లలో రూ.40 వేల మేర లబ్ధి చేకూర్చారన్నారు. ఆ విధంగా ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ. 2.70 లక్షల మేర ఖర్చు చేశామని, వైఎస్సార్సీపీ హయాంలో ఇంటి నిర్మాణం కోసం చేసిన ఖర్చు అక్షరాలా రూ.32,909 కోట్లు అని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో కాలక్షేపం అసెంబ్లీ సమావేశాలు కూటమి సభ్యుల కాలక్షేపానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ని నిందించడానికి, చంద్రబాబు, లోకేశ్ గొప్పలు చెప్పి పొగిడించుకోవడానికే వాడుకున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చలు జరిగినట్టే కనిపించలేదన్నారు. సభ్యుల నోటి వెంట నోరు తెరిస్తే అబద్దాలు తప్ప మరోటి వినిపించలేదని, ఎమ్మెల్యే బాలకృష్ణ మాటలకు చిరంజీవి ఇచ్చిన కౌంటరే ఉదాహరణ అన్నారు. 15 ఏళ్లలో పేదల గృహాలను పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వంలో 3 లక్షల ఇళ్లకు రూ.2,200 కోట్లు ఖర్చు చేశామనడం నిస్సిగ్గు వేదిక ఏదైనా సరే కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట గత ప్రభుత్వంలో చేసిన పనులు తన ఖాతాలో వేసుకుంటూ అసత్యాలు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి టిడ్కో ఇళ్ల పేరుతో చంద్రబాబు రూ.2,203 కోట్ల అవినీతి ఇళ్ల నిర్మాణం పేరుతో పేదవాడి మీద భారం మోపిన ఘనుడు చంద్రబాబు అని, 2016–17లో 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, 415 చదరపు అడుగుల్లో మూడు రకాల ఇళ్లను మూడు అంతస్తుల్లో నిర్మిస్తానని హామీ ఇచ్చాడన్నారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగే ప్లాటుకు రూ. 2.60 లక్షల ధర నిర్ణయించి వారికి బ్యాంకు రుణం ఇప్పించి వారు నెల నెలా రూ.3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు దాదాపు రూ. 7.20 లక్షలు చెల్లించేలా ప్రణాళిక రూపొందించాడన్నారు. ఆ విధంగా పేదవాడి మీద బాంబు వేశాడన్నారు. నిర్మాణ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నాడని, ముడుపులు ఎక్కువగా ఇచ్చిన వారికి ఎక్కువ ధరకు, తక్కువగా ఇచ్చిన కంపెనీకి తక్కువ ధరకు కాంట్రాక్ట్లు కట్టబెట్టాడని, 2016–17 మధ్య కాలంలో ఇంటి నిర్మాణం చదరపు అడుగుకి రూ.900 నుంచి రూ. వెయ్యి వరకు ఉంటే చంద్రబాబు మాత్రం రూ. 2,534.75 నుంచి రూ.2,034.50లకు ఇచ్చాడన్నారు. ఆ విధంగా రూ.2,203 కోట్లు దోచుకుతిన్నాడని, పేదవాడి ఇంటి నిర్మాణంలో కూడా చంద్రబాబు భారీగా అవినీతికి పాల్పడ్డాడన్నారు. ఆ రోజు మార్కెట్ ధరతో పోల్చితే పేదల నుంచి రూ.1200 అదనంగా వసూలు చేశాడన్నారు. -
గుండెను కాపాడుకుందాం
నెల్లూరను(అర్బన్): గుండెపోటు.. ఒకప్పుడు 60 సంవత్సరాల వయసు దాటిన వారికి కనిపించేది. అయితే నేటి యాంత్రిక యుగంలో యువత హార్ట్ స్ట్రోక్కు గురవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సెప్టెంబర్ 29వ తేదీని ప్రపంచ గుండె దినోత్సవంగా ప్రకటించింది. ఈ సంవత్సరం థీమ్ డోంట్ మిస్ ఏ బీట్. సోమవారం జిల్లాలో డాక్టర్లు, వైద్యశాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. పెరుగుతూ.. ఒత్తిడితో కూడుకున్న పని, మారిన జీవనశైలి, తగిన వ్యాయామం లేకపోవడంతో గుండెపోటు వస్తుంది. జంక్ ఫుడ్ తినడం, నిద్ర లేకపోవడం, బీపీ, షుగర్ కూడా కారణాలుగా ఉన్నాయి. శీతాకాలంలోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అధ్యయనాల్లో తేలింది. కోవిడ్ తర్వాత రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అనేకమంది దీని బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలుడు తరగతి గదిలోనే కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించే సరికే మృత్యువాత పడ్డాడు. మరో చోట 20 ఏళ్ల యువతికి గుండెపోటు వచ్చింది. జిల్లాలో 15 శాతం మంది అనగా సుమారు 3.5 లక్షల మంది ప్రజలు ఏదో ఒక రకమైన గుండె జబ్బులతో బాధపడుతున్నారు. రోజూ వెయ్యి మందికిపైగా హార్ట్ సమస్యలతో డాక్టర్ల వద్దకు వెళ్తున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే తగిన అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలి. తాజా పండ్లు, కూరగాయలు, విత్తనాలు, పప్పుధాన్యాలు, చిక్కుళ్లు తినాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. బీపీ, షుగర్ను నియంత్రణలో ఉంచుకోవాలి. అధిక కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. జాగ్రత్తలు పాటిస్తే 85 శాతం మరణాలను ఆపొచ్చు. 30 సంవత్సరాల వయసు దాటిన వారు సంవత్సరానికి ఒకసారి వైద్యపరీక్షలు చేయించుకోవాలి. కొన్ని సందర్భాల్లో గ్యాస్ట్రిక్ నొప్పిని కూడా గుండెపోటుగా పొరపడే అవకాశముంది. హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. నిర్లక్ష్యం చేయకుండా ఆస్పత్రికి రోగికి తీసుకెళ్తే కాపాడొచ్చు.జిల్లాలో పెరుగుతున్న వ్యాధిగ్రస్తులు నేడు వరల్డ్ హార్ట్ డే ఈ సంవత్సరం థీమ్ ‘డోన్ట్ మిస్ ఏ బీట్’ -
గ్రావెల్ దోపిడీకి అడ్డేది?
● రామదాసుకండ్రిగ చెరువులో తవ్వకాలు ● పట్టించుకోని అఽధికారులువెంకటాచలం: మండలంలోని రామదాసుకండ్రిగ చెరువులో వారం రోజుల నుంచి గ్రావెల్ అక్రమ తవ్వకాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నా మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదు. రామదాసుకండ్రిగకు వెళ్లే మార్గంలో కృష్ణపట్నం పోర్టు రోడ్డు ఆనుకుని ఉన్న చెరువులో జేసీబీతో అక్రమంగా గ్రావెల్ తవ్వి ట్రాక్టర్లలో సమీపంలోని ఖాళీ ప్లాట్లకు తరలిస్తున్నారు. ఒక ట్రాక్టర్ ట్రిప్పు గ్రావెల్ను రూ.1,500 లెక్కన అమ్ముకుని సొమ్ముచేసుకుంటున్నారు. తవ్వకాల గురించి స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. గ్రామస్తులు తమ ఇళ్ల అవసరాలు, పొలాల చదును కోసం చెరువు నుంచి మట్టి తరలించాలంటే అధికారులు సవాలక్ష ఆంక్షలు విధిస్తుంటారు. కూటమి నేతలు రేయింబవళ్లు ఇష్టారాజ్యంగా చెరువులో గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నా స్పందించకపోవడంపై విమర్శలున్నాయి. గ్రామానికి అతిసమీపాన ఉన్న చెరువులో గ్రావెల్ తవ్వకాల వల్ల భారీ గోతులు ఏర్పడి చిన్నపిల్లలు సరదాగా ఈతకు వెళ్లే సమయంలో ప్రమాదాల బారిన పడే పరిస్థితి వస్తుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
పట్టుకున్నారు.. వదిలేశారు
వెంకటాచలం: అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను వెంకటాచలం పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. వివరాలు.. ముత్తుకూరు మండలం కోళ్లమిట్ట గ్రామంలో ఇసుక అక్రమంగా తవ్వి వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాళేనికి తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. వారు గుడ్లూరువారిపాళెం వెళ్లి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని వెంకటాచలం పోలీస్స్టేషన్కు తరలించారు. కూటమి నేతలు నిత్యం ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. కాగా అయితే ఏం జరిగిందో గానీ ఆదివారం మధ్యాహ్నం ఆ ట్రాక్టర్లను పోలీసులు నిర్వాహకులకు అప్పగించేశారు. కేసులు నమోదు చేయకుండా వదిలేశారని విమర్శలున్నాయి. -
చిన్నారులను మింగేస్తున్న గ్రావెల్ గుంతలు
గ్రావెల్ మాఫియా ధనదాహం కలువాయి మండలం ఉయ్యాలపల్లికి చెందిన ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. సరదాగా ఆడుతూ.. పాడుతూ వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. గ్రామానికి చెందిన నూతేటి ప్రసాద్ లక్ష్మీదేవి దంపతుల కుమారుడు నూతేటి విష్ణుకుమార్ (11), మనబోటి నరసింహులు, సునీత దంపతుల కుమారుడు మనోబోటి నవశ్రావణ్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఎక్కడికైనా ఇద్దరే వెళ్లి సరదాగా ఆడుకుంటూ కలిసి మెలిసి తిరిగేవారు. గ్రామానికి సమీపంలో డ్రాగన్ ప్రూట్ తోట ఉండడంతో ఇద్దరు స్నేహితులు కలిసి డ్రాగన్ ప్రూట్స్, కలేకాయల కోసం ఇంటి నుంచి వెళ్లారు. చీకటిపడినా ఇంటికి రాకపోవడంతో ఇరు కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఉయ్యాలపల్లి గ్రామ సమీపంలోని చెరువు వద్ద గ్రావెల్ మాఫియా తవ్విన గుంతల్లో మృతదేహాలు బయటపడ్డాయి. ఆ ప్రాంతమంతా బురదమయంగా ఉండడంతో యంత్రాల సహాయంతో నీటిని మళ్లీంచారు. మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. ● వెంకటాచలం మండలంలో ఊరూరా నాణ్యమైన గ్రావెల్ ఉండడంతో రాత్రి, పగలు తేడాలేకుండా చెరువుల్లోనూ తవ్వకాలు చేస్తుండటంతో పలు గ్రామాల్లో చెరువులు బావులను తలపిస్తున్నాయి. ఈ బావుల్లో అయాయక ప్రజలు పడి మృత్యువాతకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. 2014–19 మధ్య కాలంలో టీడీపీ నేతలు సాగించిన గ్రావెల్ అక్రమ తవ్వకాలకు ఒక్క సర్వేపల్లి రిజర్వాయర్ పరిసరాల్లోనే 9 మంది పిల్లలు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగిలింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు, అమానవీయ ఘటనలకు లెక్కే లేకుండా పోతోంది. ధనదాహంతో నరమేధ చరిత్ర సృష్టిస్తున్నారు. వీరు చేసే తప్పు వల్ల అమాయక ప్రజల ప్రాణాలు పోతున్నా.. ఏమీ పట్టనట్లుగా అక్రమ సంపాదనే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి రూ.కోట్లు గడిస్తున్నారు. ఇసుక, గ్రావెల్ తవ్వకాల అక్రమాలు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని జరుగుతున్న ఈ దోపిడీ దాష్టీకాలు అమాయక కుటుంబాలపై ఎన్నటికీ నయం కాని గాయాలు మిగులుస్తున్నారు. ఇటీవల ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ఢీకొని ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం, గ్రావెల్ గుంతల్లో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడటం, సూరాయపాళెం వద్ద జరిగిన దుర్ఘటన, సర్వేపల్లిలో గతంలోనే తొమ్మిది మంది చిన్నారుల మరణాలు ఒకే వాస్తవాన్ని చాటుతున్నాయి. 13 మంది ప్రాణాలు తీసిన ఇసుక తవ్వకాలు జిల్లా పరిధిలో పెన్నానదిలో ఇసుక తవ్వకాలకు ఎక్కడా అధికారిక అనుమతి లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 15 నెలలుగా టీడీపీ నేతలు ఊరూరా అడుగడుగునా ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతూనే ఉన్నారు. రూ.వందల కోట్లు విలువైన ఇసుకను జిల్లా సరిహద్దులు దాటించారు. టీడీపీ నేతల ఇసుక తవ్వకాలకు ఇప్పటి వరకు దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండలం పెరుమాళ్లపాడు వద్ద ఇసుక తవ్వకాలకు రీచ్కు ఎలాంటి అనుమతే లేదు. కానీ అక్కడ రీచ్లోకి ఏకంగా పక్కాగా గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అక్కడి నుంచి ఇసుక తవ్వి తీసుకు వస్తున్న టిప్పర్ డ్రైవర్ తప్పతాగిన మైకంలో రాంగ్ రూట్లో ఎదురుగా కారును ఢీకొనడంతో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. టీడీపీ నేతల పాపానికి ఈ దుర్ఘటనలో ఐదు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రెండు కుటుంబాల్లో చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయారు. మరో కుటుంబంలో ఇప్పటికే తండ్రిపోయిన బిడ్డలు.. ఇప్పుడు తల్లిని పోగొట్టుకున్నారు. మరో రెండు కుటుంబాల్లో ఇంటికి మగ దిక్కు లేకుండా చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకుని ఉంటే.. ఆ కుటుంబాలు ఇలా రోడ్డునే పరిస్థితి వచ్చేది కాదు. ఈ దుర్ఘటన జరిగాక అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియాల్లో సానుభూతి ప్రకటనలిచ్చి చేతులు దులుపుకున్నారే కానీ.. వారిని ఆదుకోవాలనే ఆలోచన ఎంత మాత్రం చేయకపోవడం దారుణం. కనీసం ఆ కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామనే భరోసా కల్పించలేకపోయిన రాతి గుండెలని మరోసారి రుజువు చేసుకున్నారు. సంగం మండలం పెరమన వద్ద ఇసుక టిప్పర్ ఢీకొన్న దుర్ఘటనలో కారులోనే మృతదేహాలు (ఫైల్)ఇసుక, గ్రావెల్ మాఫియాల దాష్టీకాలకు అమాయకుల బలి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్ ఢీకొని ఏడుగురి దుర్మరణం గ్రావెల్ గుంతలో పడి ఇద్దరు చిన్నారుల మృత్యువాత సూరాయపాళెం వద్ద ఇద్దరు బలి సర్వేపల్లిలో గతంలోనూ గ్రావెల్ గోతుల్లో పడి 9 మంది పిల్లలు మృతి పెన్నా ఇసుక, గ్రావెల్ గుంతల్లో ప్రాణాలు కోల్పోయిన పలువురు ఈ పాపాలు ఎవరివి? అధికార మదం, ధనదాహంతో అనుమతులు తీసుకోకుండా మైనింగ్ శాఖ ప్రామాణికాలు పాటించకుండా టీడీపీ నేతలు ఇష్టారీతిన చేపడుతున్న ఇసుక, గ్రావెల్ తవ్వకాలకు అమాయక పిల్లలు, ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. అడ్డుకోవాల్సిన అధికారులు టీడీపీ నేతల దగ్గర మామూళ్లు దండుకుంటూ రూ.కోట్లు గడిస్తున్నారు. ప్రాణాలు పోయిన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ పాపాలు అధికారులవా? టీడీపీ నేతలవా?. ఇప్పటికై నా కలెక్టర్, ఎస్పీతోపాటు జిల్లా మైనింగ్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. టీడీపీ నేతల ధన దాహం.. అమాయక పిల్లలు, ప్రజల ప్రాణాలకు సంకటంగా మారింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగిస్తున్న అక్రమాలకు ప్రజల ప్రాణాలు పోతున్నా.. కనీసం వీరిలో ఏ మాత్రం మానవత్వం కనిపించడం లేదు. ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు కూడా ముందుకు రాని పరిస్థితి చూస్తుంటే కసాయితత్వం కనిపిస్తోంది. జిల్లాలో ఇసుక, గ్రావెల్ మాఫియాల దారుణాలకు అనేక కుటుంబాలకు ఎన్నటికీ తీర్చలేని కడుపు కోత, కన్నీటి వేదన మిగిలిపోతున్నాయి. ఇసుక, గ్రావెల్ తవ్వకాలకు ఎక్కడా అనుమతి లేకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా తవ్వి, భారీ వాహనాల్లో తరలిస్తూ ప్రజలను బలి తీసుకుంటున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన ఘటనలు టీడీపీ నేతల స్వార్థపూరిత అరాచక పాలనకు చీకటి సాక్ష్యాలు. -
అప్రమత్తంగా ఉండాలి
వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవగాహన పెంచుకోవాలి. రోజూ కనీసం 45 నిమిషాలు నడవాలి. తగిన విశ్రాంతి ఉండాలి. సకాలంలో నిద్రపోవాలి. జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. ఛాతిలో నొప్పి, మంట, ఆయాసం, చెమటలు పట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి. ఒకవేళ గుండె సమస్య అయినా భయపడొద్దు. డాక్టర్లు వైద్యం ద్వారా నయం చేస్తారు. – డాక్టర్ శ్రీనివాసరాజు, గుండె వ్యాధుల స్పెషలిస్ట్, కిమ్స్ స్పెషాలిటీ ఆస్పత్రి ● -
పెద్దాస్పత్రికెళ్తే రోగాలు ఫ్రీ
●ఓపీ రాసే గది పక్కనే సీ్త్రలు, పురుషులు ఉపయోగించే మరుగుదొడ్డి ఓపీ చీటీల కోసం క్యూలో ఉన్న రోగులు నెల్లూరు (అర్బన్): జిల్లాకు రెఫరల్ ఆస్పత్రి అయిన జీజీహెచ్లో దారుణ పరిస్థితులున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక వైద్యసేవల్లో నిర్లక్ష్యం పెరిగింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కార్పొరేట్ వైద్య స్థాయిలో సేవలందించిన జీజీహెచ్లో గైనకాలజీ, మెడిసిన్, ఐసీయూ, ఎమర్జెన్సీ, కంటి విభాగం, పల్మనాలజీ, చిన్నపిల్లల విభాగం ఇలా వివిధ వార్డుల్లో రోగులు సుమారు 500 మందికి పైగానే రోజూ ఇన్పేషెంట్లుగా ఉంటున్నారు. ఏ వార్డులో చూసినా మరుగుదొడ్లు దుర్గంధంతో నిండిపోయి ఉన్నాయి. శానిటేషన్ పట్టని అధికారులు ఆస్పత్రిలో 150 పారిశుద్ధ్య కార్మికులున్నారు. వీరిలో 20 మంది ఎఫ్ఎన్ఓలు ఉన్నారు. మిగిలిన వారు సక్రమంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం లేదని ఆరోపణలున్నాయి. దీంతో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. దుర్గంధం భరించలేకనే అనేకమంది అడ్మిట్ అయ్యేందుకు ఇష్టపడడం లేదు. సుమారు 40 శాతం మంది అడ్మిట్ కాకపోవడానికి బాత్రూంల కంపు కారణమని రోగులతోపాటు సిబ్బంది పేర్కొంటున్నారు. పేరుకే ముగ్గురు అడ్మినిస్ట్రేషన్ అధికారులు, ఎనిమిది మంది రెగ్యులర్ సూపర్వైజర్లు, 15 మంది అవుట్ సోర్సింగ్ సూపర్ వైజర్లున్నారు. వీరెవరూ రౌండ్స్ వేయకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఒకటే దారి వైద్యం కోసం 1,200 నుంచి 1400 మంది క్యూలో నిలబడి రోజూ ఓపీ చీటీలు తీసుకుంటున్నారు. అయితే ఓపీ తీసుకునే పక్కనే మరుగుదొడ్డి ఉంది. అందులో రెండు గదులుండగా ఒకదానిని బ్లాక్ చేశారు. లోపలికి వెళ్లాలన్నా సీ్త్ర, పురుషులకు ఒకే దారి. బయట పెన్సిల్తో జెంట్స్ టాయిలెట్ అని రాసి ఉంది. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.నెల్లూరులోని కొండాయపాళేనికి చెందిన బత్తల నారాయణమ్మకి బీపీ పెరిగిపోయింది. కాలు, చేయి చచ్చుబడ్డాయి (పెరాలసిస్). పేదరాలైన ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పెద్దాస్పత్రి (సర్వజన ఆస్పత్రికి)కి వైద్యం కోసం ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం వచ్చి జనరల్ మెడిసిన్ విభాగం కింద ఫిమేల్ మెడికల్ వార్డులో అడ్మిట్ అయ్యారు. వైద్యం బాగా చేస్తారని సంబంధిత డాక్టర్కు రాజకీయ నాయకులతో ఫోన్ చేయించుకున్నారు. పక్కరోజు డిశ్చార్జి చేయాలని రోగి డాక్టర్ను అడిగారు. వారు వైద్యం సక్రమంగా అందలేదా అని ప్రశ్నిస్తే అలాంటిదేమి కాదు.. ముందే నేను నడవలేను. టాయ్లెట్కు పోవాలంటే నరకం కనిపిస్తోంది. శుభ్రత లేదు. లైట్లు వెలగవు. కంపు భరించలేకున్నా. కొత్త జబ్బులు వచ్చేలా ఉన్నాయి. ప్రైవేట్ వైద్యశాలకు వెళ్తా అని డిశ్చార్జి అయ్యింది. పారిశుద్ధ్యానికి నెలకు రూ.లక్షల్లో ఖర్చు ఓపీ చీటీలు రాసే చోట సీ్త్ర, పురుషులకు ఒకటే టాయ్లెట్ వార్డుల్లోని మరుగుదొడ్లు కంపు కంపు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కార్పొరేట్ ఆస్పత్రి తరహాలో క్లీనింగ్ కూటమి పాలనలో నిర్లక్ష్యం -
సోమశిలకు 24,833 క్యూసెక్కుల వరద
సోమశిల: జలాశయానికి వరద జలాలు పెరిగినట్లు ప్రాజెక్ట్ ఈఈ శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. పైతట్టు ప్రాంతంలోని ఆదినిమ్మాయపల్లి రెగ్యులేటర్ నుంచి 24,833 క్యూసెక్కుల వరద జలాలు జలాశయానికి చేరుతున్నాయన్నారు. ఈ వరద జలాలను జలాశయంలో నిల్వ ఉంచకుండా దిగువ కు విడుదల చేస్తామన్నారు. పెన్నానదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం జలాశయం నుంచి పెన్నానదికి 2,650, కండలేరుకు 6000, ఉత్తర కాలువకు 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. జలాశయంలో 72.87 టీఎంసీలు ఉన్నాయి. -
కంపు భరించలేం
ఆస్పత్రిలో టాయిలెట్స్ కంపు కొడుతున్నాయి. ఇటీవల నా భార్యను వైద్యం కోసం అడ్మిట్ చేశాను. మరుగుదొడ్డికి వెళ్లే పరిస్థితి లేదని ఆమె బాధపడింది. దీంతో త్వరగా డిశ్చార్జి చేయించాను. – గంగాధర్, సుందరయ్య కాలనీ, నెల్లూరు పరిస్థితిని చక్కదిద్దుతున్నాం టాయ్లెట్స్ శుభ్రతపై సూపరింటెండెంట్తో చర్చించాం. కొంత ఆర్థిక ఇబ్బందులున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపడుతున్నాం. కొత్త టాప్లు ఏర్పాటు చేయబోతున్నాం. – డాక్టర్ శ్రావణ్కుమార్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి, సర్వజన ఆస్పత్రి ● -
కనులారా వీక్షించి.. తరించి..
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఆదివారం లోకమాత వివిధ రూపాల్లో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయాలకు మహిళా భక్తులు పోటెత్తారు. – సాక్షి నెట్వర్క్ దుర్గాలంకారంలో ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు కన్యకాపరమేశ్వరి ఆలయంలో ధనలక్ష్మి అలంకరణ -
ఈఆర్సీ నిర్ణయం సర్కారుకు చెంపపెట్టు
నెల్లూరు (స్టోన్హౌస్పేట): ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) తలంటితే సిగ్గు పడాల్సింది పోయి ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ చార్జీలను తగ్గిస్తున్నట్లు ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం చంద్రబాబు సర్కారు దివాళాకోరుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. ఈఆర్సీ ఆదేశాలతో వినియోగదారులకు తిరిగి చెల్లించాల్సిన రూ.923.55 కోట్లను తాను ఎంతో ఉదారంగా ఇస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గుగా లేదా? అని ప్రశి్నంచారు.అనుమతి లేకుండా విద్యుత్ చార్జీల భారం మోపిన చంద్రబాబు ప్రభుత్వానికి ఈఆర్సీ నిర్ణయం చెంప పెట్టు లాంటిదన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం కాకాణి మీడియాతో మాట్లాడారు. విద్యుత్ చార్జీలు ఇంకా తగ్గిస్తానని నమ్మబలికిన చంద్రబాబు ఏడాదిలోనే ప్రజలపై రూ.19 వేల కోట్ల భారాన్ని మోపారని ధ్వజమెత్తారు. ట్రూ డౌన్ చంద్రబాబు ఘనతగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అనుమతించిన ధరకు మించి కొనుగోలు 2024–25 సంవత్సరానికి రూ.2,758.76 కోట్లు ట్రూ అప్ చార్జీలకు డిస్కంలు ఈ ఏడాది జూలైలో అనుమతి కోరగా ఏపీఈఆర్సీ రూ.1,863.64 కోట్లకు మాత్రమే అనుమతి ఇచి్చందన్నారు. కూటమి సర్కారు ఏపీఈఆర్సీ అనుమతించిన ధరకు మించి విద్యుత్ కొందన్నారు. ఏపీఈఆర్సీ యూనిట్ రూ.5.27కు కొనమని చెబితే.. ఈపీడీసీఎల్ రూ.5.84 చొప్పున, సీపీడీసీఎల్ రూ.5.86 చొప్పున, ఎస్పీడీసీఎల్ యూనిట్ రూ.5.89 చొప్పున వెచి్చంచి విద్యుత్ కొన్నట్లు వెల్లడించాయన్నారు. విద్యుత్ కొనుగోలు ఖర్చు రూ.34,517 కోట్లకు అనుమతి ఉంటే రూ.45,476 కోట్లు వెచి్చంచామని డిస్కంలు చెప్పాయన్నారు. ప్రసార, పంపిణీ నష్టాలు 10.17 శాతమని డిస్కంలు ప్రతిపాదిస్తే ఈఆర్సీ మాత్రం 9.87 శాతానికే అంగీకరించిందన్నారు. 2024–25కి సంబంధించి ప్రతి నెలా యూనిట్కు 0.40 పైసలు చొప్పున డిస్కమ్లు ఇప్పటికే రూ.2,787.18 కోట్లు వసూలు చేశాయన్నారు. అనుమతించిన మొత్తం పోనూ మిగిలిన రూ.923.55 కోట్లను ఈ ఏడాది నవంబర్ నుంచి ట్రూ డౌన్ చేయాలని ఈఆర్సీ ఆదేశించిందన్నారు. కూటమి సర్కారు 2024 నవంబర్ బిల్లు నుంచే రూ.6,072.86 కోట్ల భారాన్ని ప్రజలపై మోపి వసూలు చేస్తుండగా ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల అదనపు భారం మోపిందన్నారు. -
ఓవర్లోడ్ వాహనాలపై రూ.3 కోట్లు వసూలు చేశాం
జిల్లాలో ఓవర్లోడ్ను ప్రోత్సహించం. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు అధిక లోడుతో వెళుతున్న 770 వాహనాలపై కేసులు నమోదు చేశాం. వాటి నుంచి రూ. 3 కోట్లు అపరాధ రుసుం వసూలు చేశాం. ఇప్పటికే జిల్లాలోని అందరూ ఎంవీఐలు, ఏంవీఐలకు ఓవర్లోడ్పై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. ఏ ఒక్క ఓవర్లోడ్ వాహనాన్ని వదిలి పెట్టేది లేదు. రానున్న రోజుల్లో ఓవర్లోడ్పై విస్తృత తనిఖీలు నిర్వహిస్తాం. – బి.చందర్, ఉపరవాణా కమిషనర్ ●