breaking news
SPSR Nellore
-
టీడీపీ నేతల అరాచకం.. నెల్లూరు 34వ వార్డు కార్పొరేటర్ తండ్రి కిడ్నాప్
చిల్లకూరు: నెల్లూరు జిల్లాలో అధికార టీడీపీ నేతల అరాచకం, దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. సొంత గూటికి వెళ్లారన్న అక్కసుతో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు బెదిరింపులు మితిమీరాయి. టీడీపీలోనే కొనసాగాలంటూ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ 34వ వార్డు కార్పొరేటర్ ఫమీదా గురువారం వైఎస్ జగన్ చేతుల మీదుగా వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్న నేపథ్యంలో కొందరు ఆమె తండ్రి సయ్యద్ నజీర్ను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. తిరుపతి జిల్లా వాకాడు బీసీ కాలనీకి చెందిన సయ్యద్ నజీర్ వైఎస్సార్సీపీలో చురుగ్గా వ్యవహరించడంతో పాటు బతుకుదెరువు కోసం పొట్టేళ్ల వ్యాపారం చేస్తున్నాడు. కుమారుడు బెంగళూరులో ఉండగా, కుమార్తె ఫమీదాకు పెళ్లి చేసి నెల్లూరు పంపారు. అక్కడ ఆమె వైఎస్సార్సీపీ కార్పొరేటర్గా విజయం సాధించింది. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత అక్కడి నాయకుల ఒత్తిడితో ఆమె పార్టీ మారారు. అయితే ఆ పార్టీలో ఇమడలేక రెండు రోజుల క్రితం ఆమె వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో అధికార పార్టీ నాయకులు ఆమెను ఒత్తిడికి గురిచేసే క్రమంలో గురువారం సాయంత్రం మసీద్ నుంచి ఆమె తండ్రి ఇంటికి తిరిగి వస్తుండగా బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. కారులో నలుగురు వచ్చారని, వారిలో ఒకరు పోలీసు దుస్తుల్లో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అంతకు ముందు వారు నజీర్ అనే టీ కొట్టు వ్యక్తిని పట్టుకుని కారులో ఎక్కించుకొని కొన్ని వివరాలు అడిగారు. తాను మీరనుకుంటున్న నజీర్ను కాదని చెప్పడంతో అతడ్ని వదిలేసి.. ఫమీదా తండ్రి నజీర్ ఎక్కడున్నాడో కనుక్కుని బలవంతంగా తీసుకెళ్లారు. చీకటి పడినప్పటికీ నజీర్ ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన శుక్రవారం వాకాడుకు చేరుకుని అన్ని రకాలుగా విచారించాక, నజీర్ కిడ్నాప్నకు గురయ్యారని సీఐ హుస్సేన్బాషాకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి వరకు ఆయన ఆచూకీ తెలియలేదు. -
చెప్పుల దుకాణంలో అగ్నిప్రమాదం
● రూ. 25 లక్షల విలువైన సామగ్రి దగ్ధం ఉదయగిరి: పట్టణంలోని పంచాయ తీ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీబాలాజీ చెప్పుల దుకాణంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మంటల్ని గుర్తించిన స్థానికులు యజమాని కె.వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. వెంటనే అతనొచ్చి షట్టర్ తీసి చూడగా అప్పటికే పూర్తిగా మంటలు వ్యాపించాయి. రూ.25 లక్షల సామ గ్రి దగ్ధమైంది. మంటలు పక్క దుకాణాలకు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దుకాణం వెనుకవైపు ఉన్న కిటికీ ద్వారా నిప్పంటించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా నిప్పంటించారని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
రోడ్డెక్కిన అంగన్వాడీలు
నెల్లూరు(దర్గామిట్ట): హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు రోడ్డెక్కారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీని అంగన్వాడీ వర్క ర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవా రం చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు రెహనాబేగం మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చాక వేతనాలు పెంచుతామని, గ్రాట్యుటీ ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ పేర్కొందని, అయితే నేటికీ అతీగతీ లేదని ఆరోపించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనంగా రూ.24,860ను ఇవ్వాలని గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చిందని, దీని మేరకు అందజేయాలని డిమాండ్ చేశారు. వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమ్మె కాలంలో తమకిచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. నేతలు శేషమ్మ, మల్లెమ్మ, కామాక్షమ్మ, సంపూర్ణమ్మ, రాధ, ప్రమీల, లక్ష్మీ కాంతం, సుగుణమ్మ, మసస్తామ్మ, మారెమ్మ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నాయకులకు పదవులు
నెల్లూరు సిటీ: జిల్లాకు చెందిన పలువురికి వైఎస్సార్సీపీలో రాష్ట్ర స్థాయిలో పదవులు లభించాయి. కోవూరు నియోజకవర్గానికి చెందిన మావులూరు శ్రీనివాసులురెడ్డి రాష్ట్ర రైతు విభాగం జనరల్ సెక్రటరీగా, నెల్లూరు నగరానికి చెందిన మన్నేపల్లి వెంకట సుబ్రహ్మణ్యం పబ్లిసిటీ విభాగం జనరల్ సెక్రటరీగా, రూరల్కు చెందిన పప్పు విజయ్రెడ్డి ఐటీ విభాగం సెక్రటరీగా, సిటీకి చెందిన ఖాజన వెంకటశేషయ్య ఆచారిని రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
డీఎస్పీ జోక్యంతో కేసు నమోదు
ఆత్మకూరు: కులం పేరుతో దూషించడంతోపాటు కర్రతో దాడి చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసి వారమైనా చేజర్ల పోలీసులు పట్టించుకోలేదు. ఆత్మకూరు డీఎస్పీ జోక్యంతో ఎట్టకేలకు కేసు నమోదు చేసిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. చేజర్ల మండలం నడిగడ్డ అగ్రహారం ఎస్సీ కాలనీకి చెందిన గంగయ్య ఈనెల 6వ తేదీన పొలంలో మేకలు మేపుతున్నాడు. పక్క పొలానికి చెందిన నరాల వెంకటేశ్వర్లు తాను సాగుచేస్తున్న జీలుగ పైరులో పశువులు రాకుండా చూడాలని గంగయ్యకు చెప్పి ఇంటికెళ్లాడు. అదే సమయంలో గ్రామంలో అధికార కూటమి పార్టీకి చెందిన సుధాకర్ జీలుగ పైరులో మేకల్ని తోలాడు. గంగయ్య అలా చేయొద్దనగా సుధాకర్ నువ్వు ఎవడ్రా నాకు చెప్పడానికంటూ కులం పేరుతో దూషిస్తూ కర్రతో దాడి చేశాడు. దీంతో గంగయ్య తల, చేతికి గాయాలయ్యాయి. కొద్దిసేపటికి సుధాకర్ వెళ్లిపోయాడు. అదేరోజు బాధితుడు చేజర్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వారు ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకోవాలని చెప్పి పంపారు. వారం రోజులైనా కేసు నమోదు చేయకపోవడంతో ఎస్సైని ఫోన్లో సంప్రదించగా స్టేషన్కు వస్తే రాజీ చేస్తానని, రాకపోతే మీపై కూడా కేసు పెడతానంటూ బెదించాడని బాధితుడు వాపోయాడు. పలువురి సాయంతో డీఎస్పీ కె.వేణుగోపాల్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా ఆయన జోక్యం చేసుకోవడంతో కేసు నమోదు చేశారు. -
లక్షలు మింగేసి లక్షణంగా..!
వింజమూరు (ఉదయగిరి): అధికారం అండతో కొందరు చెలరేగిపోతున్నారు. లక్షలను స్వాహా చేసినా.. లక్షణంగా ఉంటున్నారు. వింజమూరు మండలం కాటేపల్లికి చెందిన సర్పంచ్ విజయలక్ష్మమ్మ అప్పట్లో విధుల్లో ఉన్న పంచాయతీ కార్యదర్శులు కలిసి రూ.లక్షల పంచాయతీ నిధులను కాజేశారు. దీనిపై ఉన్నతాధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి నిధుల దుర్వినియాగం వాస్తవమేనని తేల్చారు. వీటిని పంచాయతీ ఖాతాలో జమ చేయాలని, లేనిపక్షంలో క్రిమినల్ కేసు పెడతామంటూ సర్పంచ్కు నోటీస్ను జారీ చేశారు. అయితే అధికార పార్టీ అండతో ఈ ఆదేశాలను ఏ మాత్రం లెక్కచేయడంలేదు. ఇంత జరుగుతున్నా, క్రిమినల్ కేసును పెట్టకుండా.. నిధులను రికవరీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఇదీ జరిగింది.. మండలంలోని కాటేపల్లికి చెందిన అధికార పార్టీ సర్పంచ్ విజయలక్ష్మమ్మ తన పదవీ కాలంలో రూ.24.13 లక్షలను స్వాహా చేశారని కందుకూరు డివిజనల్ పంచాయతీ అధికారి ఈ ఏడాది ఏప్రిల్లో నివేదిక ఇచ్చారు. దీంతో ఆర్నెల్ల పాటు చెక్ పవర్ను రద్దు చేస్తూ, 15 రోజుల్లో సంజాయిషీని జిల్లా పంచాయతీ అధికారి కోరారు. అయినా సదరు సర్పంచ్ స్పందించకపోవడంతో మరో నోటీస్ను గత నెల్లో జారీ చేశారు. నిధులను వారంలో పంచాయతీ ఖాతాలో జమ చేయాలని, లేకపోతే క్రిమినల్ కేసు నమోదు చేసి నిధులు రాబడతామని తెలిపారు. అయినా సదరు సర్పంచ్ ఖాతరు చేయలేదు. ఇంత జరిగినా ఎలాంటి చర్యలను అధికారులు చేపట్టలేదు. దీనిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులపై ప్రేమెందుకో..? పంచాయతీ నిధుల దుర్వినియోగంలో ముగ్గురు పంచాయతీ కార్యదర్శుల పాత్ర ఉందని విచారణలో కందుకూరు డీఎల్పీఓ తేల్చారు. అయితే వీరిలో కార్యదర్శి ప్రసన్నలక్ష్మినే సస్పెండ్ చేశారు. మిగిలిన విజయమ్మ, శీనయ్యపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అధికార బలం ఉండటంతోనే చర్యలకు అధికారులు వెనుకాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిధుల పక్కదారి.. నేటికీ కొనసాగుతూ.. కాటేపల్లి పంచాయతీలో నిధులు దుర్వినియోగం ఇప్పటికీ జరుగుతూనే ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. తాగునీటి మోటార్ల రిపేర్ల పేరుతో అధిక మొత్తంలో ఎం బుక్లను రికార్డు చేసి నిధులను డ్రా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గరిష్టంగా రూ.12 వేల కంటే ఎక్కువ ఖర్చు కాదని, అయితే రూ.33 వేల వరకు డ్రా చేశారని చెప్తున్నారు. పంచాయతీలో రూ.29 లక్షల నిధులు అందుబాటులో ఉన్నా, ఎలాంటి అభివృద్ధి పనులు చేసేందుకు సర్పంచ్ తీర్మానాలివ్వడంలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.భారీగా నిధుల దుర్వినియోగం రికవరీకి ఆదేశాలిచ్చినా పట్టించుకోని సర్పంచ్ పంచాయతీ కార్యదర్శుల తీరూ ఇంతే అఽధికారం అండతో బేఖాతర్ -
జనవరిలో సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు
నెల్లూరు (టౌన్): డ్రాయింగ్, హ్యాండ్లూమ్, వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుకు సంబంధించిన పరీక్షలను జనవరిలో నిర్వహించనున్నామని డీఈఓ బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే వారు www. bseap.gov.inలో దరఖాస్తు చేసుకొని, ఆపై కాపీని డౌన్లోడ్ చేసి డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఫీజును ఈ నెల 27లోపు చెల్లించాలని కోరారు. డ్రాయింగ్ – లోయర్ గ్రేడ్ రూ.100.. హయ్యర్ గ్రేడ్ రూ.150.. హ్యాండ్లూమ్ వీవింగ్ – లోయర్ గ్రేడ్ రూ.100.. హయ్యర్ గ్రేడ్ రూ.200.. టైలరింగ్, ఎంబ్రాయిడరీ – లోయర్ గ్రేడ్ రూ.150.. హయ్యర్ గ్రేడ్ రూ.200 ఫీజును చెల్లించాలని తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో వచ్చే నెల మూడు వరకు.. రూ.75తో వచ్చే నెల ఆరు అవకాశముందని చెప్పారు. పిన్నెల్లి సోదరులతో అనిల్ ములాఖత్ వెంకటాచలం: కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసులతో నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డితో మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్ శుక్రవారం ములాఖత్ అయ్యారు. పలు విషయాలపై చర్చించారు. మర్యాదపూర్వకంగా..కొడవలూరు: మాజీ మంత్రి, వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన వీరి చలపతిరావు మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఆఫ్కాఫ్ మాజీ చైర్మన్ కొండూరు అనిల్బాబు, పార్టీ ఇందుకూరుపేట మండలాధ్యక్షుడు మావులూరు శ్రీనివాసులురెడ్డి, నేత కలువ బాలశంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లైంగిక దాడి కేసులో తండ్రికి జీవిత ఖైదు నెల్లూరు (లీగల్): కన్న కూతురిపై మద్యం మత్తులో లైంగిక దాడికి పాల్పడ్డారని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడు దశరథ్కు జీవిత ఖైదుతో పాటు రూ.25 వేల జరిమానాను విధిస్తూ నెల్లూరు పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ వివరాల మేరకు.. వింజమూరు బీసీ కాలనీకి చెందిన లారీ డ్రైవర్ దశరథ్కు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. వీరిలో ఇద్దరు హైదరాబాద్లోని మేనమామ ఇంట్లో ఉండేవారు. 12 ఏళ్ల రెండో కుమార్తె ఎనిమిదో తరగతి వరకు చదువుకొని ఇంటి పనుల్లో తల్లికి చేదోడువాదోడుగా ఉండేవారు. నిత్యం మద్యం మత్తులో ఉంటూ ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని ఏర్పర్చుకోవడంతో భార్య విసిగిపోయి తన సోదరుడి ఇంటికెళ్లిపోయారు. ఆపై పెద్దలు రాజీచేయడంతో ఇంటికొచ్చారు. ఈ తరుణంలో దుస్తులు, చెప్పులను కొనిస్తానని చెప్పి కుమార్తెను ఇంటి నుంచి 2020, జూన్ 25వ తేదీ సాయంత్రం ఆరు గంటల సమయంలో వింజమూరు తీసుకెళ్లారు. ఆ సమయంలో దుకాణాల్లేకపోవడంతో కలిగిరిలోని బంధువులు ఇంటికి రాత్రి వెళ్లారు. కొద్దిసేపటికి బయల్దేరగా, మార్గమధ్యలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ సెంటర్లో బాలికను వదిలి వైన్ షాపులో మద్యం సేవించొచ్చారు. ఆపై వింజమూరు బయల్దేరగా, మార్గమధ్యలో నేరేడుపల్లి సమీపంలోని నిమ్మ తోట వద్ద బైక్ను ఆపి కుమార్తెను చెట్ల చాటుకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటనపై తల్లికి బాలిక మరుసటి రోజు చెప్పారు. దీంతో తల్లి తన బంధువులతో కలిసి వింజమూరు పోలీస్స్టేషన్లో అదే ఏడాది జూన్ 27న ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు కావడంతో కావలి డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరిపి దశరథ్ను అరెస్ట్ చేసిన అనంతరం కోర్టులో చార్జిషీట్ను దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో పైమేరకు శిక్ష, జరిమానాను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పీపీ దూబిశెట్టి చంద్రశేఖర్ వాదించారు. -
తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదు
● సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తిన జక్కంపూడి రాజా ● జోగి రమేష్ సోదరులతో ములాఖత్ వెంకటాచలం: సీఎం చంద్రబాబు చేసే తప్పులకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోకతప్పదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం మోపిన అక్రమ కేసులతో నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడితో శుక్రవారం ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు సాగిస్తున్న నకిలీ మద్యం తయారీని జోగి రమేష్కు అంటగట్టారని ఆరోపించారు. రాజకీయంగా ఆయన్ను ఎదుర్కోలేక.. సంబంధం లేని ఈ వ్యవహారంలో కేసులు నమోదు చేయడం రెడ్బుక్ రాజ్యాంగంలో భాగమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు తమ పార్టీ శ్రేణులపై అక్రమంగా కేసులు పెట్టి వేధించడమే లక్ష్యంగా కుట్రలు సాగిస్తున్నారని మండిపడ్డారు. నకిలీ మద్యం కేసులో వాస్తవాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించే యత్నం చేయలేదని విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా జోగి రమేష్ సోదరులు కడిగిన ముత్యంలా బయటకొస్తారని చెప్పారు. గళం విప్పే తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొని అణగదొక్కేందుకు యత్నించడం తగదని హితవు పలికారు. తమ పైశాచికానందం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను జైలుకు పంపినా, అది తాత్కాలికమేననే విషయా న్ని చంద్రబాబు, లోకేశ్ గుర్తుంచుకోవాలని సూచించారు. చంద్రబాబు చేసే తప్పులపై ప్రజలు లెక్కలు కడుతున్నారని, సరైన సమాధానం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. డిస్టిలరీల మొదలుకొని లిక్కర్ షాపులు, బెల్టుషాపులు ఇలా అన్నీ టీడీపీ కార్యకర్తల ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఆర్గనైజ్డ్గా నిర్వహిస్తోందని దుయ్యబట్టారు. పెద్దిరెడ్డి మిథున్రెడ్డి వంటి వారిపైనా అక్రమ కేసులు పెట్టి వేధించారని, వీటికి మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు. -
ఖాకీలా.. కిడ్నాపర్లా!
సాక్షి టాస్క్ఫోర్స్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఖాకీలు అధికారిక కిరాయి గూండాల్లా, కిడ్నాపర్లుగా వ్యవహరిస్తున్నారు. ఖాకీ చొక్కాలు వదిలేసి పసుపు చొక్కాలు తొడిగేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఆదేశాలనే చట్టాలుగా మార్చేసి నెల్లూరు నవాబుపేట పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ బీఫారంపై గెలిచిన కార్పొరేటర్లను టీడీపీ అధికారంలోకి రావడంతో బెదిరించి పచ్చ కండువా కప్పారు.అయితే ఆ పార్టీలో ఇమడలేక.. అధికార పార్టీని ఎదురించి తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధపడిన కార్పొరేటర్లపై మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులను పురమాయించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆ కార్పొరేటర్లు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరుతున్నారనే సమాచారంతో మంత్రి, ఎమ్మెల్యే ఆదేశాలతో ఖాకీలు నెల్లూరు నుంచి తాడేపల్లికి చేరుకున్నారు.వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి వారు బయటకు రాగానే కిరాయి కిడ్నాపర్ల మాదిరిగా ప్రైవేట్ వాహనాలను అడ్డుపెట్టి, బలవంతంగా వారి వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు. వారి వద్ద ఉన్న ఫోన్లను లాక్కొని, ఎక్కడికి తీసుకెళ్తున్నారో వారి కుటుంబ సభ్యులకు సైతం సమాచారం అందకుండా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పోలీస్స్టేషన్లు తిప్పుతూ చిత్ర హింసలకు గురిచేశారు. చివరకు తాము టీడీపీలోనే కొనసాగుతున్నామంటూ వీడియోలు రిలీజ్ చేయించి, వారిని టీడీపీ నేతలకు అప్పగించి వచ్చారు. కేసుల పేరుతో అదుపులోకి..నెల్లూరు పోలీసుల ముందు ప్రొఫెషనల్ కిడ్నాపర్లు, గూండాలు కూడా దిగదుడుపేనని ఈ ఘటన రుజువు చేస్తోంది. అధికార పార్టీ నేతలు చెబితే పోలీసులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీ నేతలను హింసించడంలో కిరాయి గూండాల్లా వ్యవహరిస్తున్నారు. ఎంపీపీలు, మున్సిపాలిటీ చైర్మన్లు, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులను బెదిరించి, అధికార పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఓట్లు వేయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో మాట వినని వారిని కేసుల పేరుతో అదుపులోకి తీసుకోవడం.. గంజాయి కేసులు, నకిలీ మద్యం కేసులు పెడతామని బెదిరింపులకు గురిచేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.తాడేపల్లి నుంచి అదృశ్యంనెల్లూరు కార్పొరేషన్లోని మొత్తం 54 డివిజన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ ఒక్క డివిజన్లో కూడా గెలవలేదు. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే కార్పొరేటర్లను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి పచ్చ కండువాలు కప్పారు. అయినప్పటికీ వారు సాంకేతికంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లుగానే చెలామణి అవుతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతిపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైంది. దీంతో వైఎస్సార్సీపీ బీఫారంతో గెలిచి టీడీపీలోకి జంప్ అయిన ఐదుగురు కార్పొరేటర్లు తాడేపల్లిలోని మాజీ సీఎం వైఎస్ జగన్మెహన్రెడ్డి సమక్షంలో తిరిగి గురువారం వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు.దీంతో మంత్రి నారాయణ ఆదేశాలతో నెల్లూరు నవాబుపేట పోలీసులు తాడేపల్లిలో వైఎస్ జగన్మెహన్రెడ్డి క్యాంప్ కార్యాలయం సమీపంలో మాటు వేసి.. నెల్లూరు 5వ డివిజన్ కార్పొరేటర్ ఓబిలి రవిచంద్ర, 6వ డివిజన్ కార్పొరేటర్ మస్తానమ్మ కుమారుడు శ్రీధర్ను అదుపులోకి తీసుకుని ప్రత్యేక వాహనంలో అదృశ్యమయ్యారు. రాత్రంతా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తిప్పుతూ వారిని మంత్రి నారాయణ అనుచరులు, వేమిరెడ్డి సోదరులకు అప్పగించారు. తద్వారా టీడీపీ నిర్వహిస్తున్న కార్పొరేటర్ల క్యాంప్లోకి తరలించే వరకు కీలక పాత్ర పోషించారు.కేసులు.. అరెస్ట్ అన్నారు.. తీరా టీడీపీ క్యాంప్నకు చేర్చారువైఎస్సార్సీపీకి చెందిన గిరిజన కార్పొరేటర్ రవిచంద్రతోపాటు మరో కార్పొరేటర్ తనయుడు శ్రీధర్ను అదుపులోకి తీసుకున్నది వాస్తమేనని నవాబుపేట పోలీసులు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి సమక్షంలో ఒప్పుకున్నారు. అదుపులో ఉన్న ఆ ఇద్దరిని చూపించాలని గురువారం రాత్రి పోలీస్స్టేషన్కు ఆ ఇద్దరు నేతలు చేరుకుని పోలీసులను ప్రశ్నించడంతో వారిపై కేసులు ఉన్నాయని, అరెస్ట్ చేశామని, శుక్రవారం కోర్టుకు హాజరు పరుస్తామని చెప్పారు. కానీ తెల్లారే సరికి పోలీసులు రూటు మార్చి, నోటీసు ఇచ్చి పంపేశామంటూ చెబుతున్నారు.నోటీసులు ఇచ్చే కేసులో వారిని తాడేపల్లికి వెళ్లి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని, గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం తెల్లారే వరకు రహస్యంగా ఉంచడం ఏమిటని, వారిని టీడీపీ క్యాంప్నకు అప్పగించడం ఏమిటని వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు నిలదీస్తున్నారు. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ ఇద్దరిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అధికార పార్టీ నేతల క్యాంప్లోకి వెళ్లాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఓ కార్పొరేటర్ తనయుడు తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ పోలీసులతోపాటు అధికార పార్టీ నాయకులు కూడా తనపై చేయి చేసున్నారని.. మంత్రి నారాయణ, మరికొందరు పచ్చి బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పోలీసుల తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. -
‘అధికారంలో ఉండి క్యాంపు పాలిటిక్స్.. టీడీపీ నైతికంగా ఓడినట్టే’
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో పోలీసులు నిఘా, భద్రతను పక్కన పెట్టి కార్పొరేటర్లకు డెలివరీ బాయ్ పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలన తారాస్థాయికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నెల్లూరు నగరంలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. టీడీపీ నైతికంగా ఓడిపోయింది. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. గంజాయి బ్యాచ్, రౌడీయిజం పెరిగిపోయింది. నెల్లూరు సిటీ ఐదో డివిజన్ కార్పొరేటర్ రవిచంద్రను కిడ్నాప్ చేశారు. మా కార్పొరేటర్లను తీసుకుంటే మాకు నష్టమేమీ లేదు. మంత్రి నారాయణ దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. నెల్లూరులో దళారి వ్యవస్థ నడుస్తోంది.మా పార్టీకి సంబంధం లేని మేయర్పై అవిశ్వాసం పెట్టి వైఎస్సార్సీపీపై ట్రోల్స్ చేయడం విడ్డూరం ఉంది. కార్పొరేషన్ విషయంలో ఒకసారి వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్లో ఉన్న 54 మంది కార్పొరేటర్స్ వైఎస్సార్సీపీ బీఫాంతో గెలిచిన వారే. నయానో, భయానో వారిని ప్రలోభ పెట్టి టీడీపీలోకి లాక్కున్నారు. ప్రస్తుతం మాకు వున్న కార్పొరేటర్స్ పదకొండు మంది ఉన్నారు. నిన్న ఐదుగురు జగనన్న హయాంలో మా పార్టీలో చేరారు. అలా చేరిన కార్పొరేటర్ ఒక్కరిని అరెస్ట్ పేరుతో డ్రామా క్రియేట్ చేశారు. నెల్లూరులో పోలీసులు నిఘా, భద్రతను పక్కన పెట్టి కార్పొరేటర్లకు డెలివరీ బాయ్ పనులు చేస్తున్నారు. మాకు సంఖ్య బలం లేదు, మేయర్ మా పార్టీ కాదు. ఐదు మంది మా వైపు వచ్చేసరికి భయపడ్డారు. నేడు టీడీపీ అధికారంలో ఉండి, సంఖ్య బలం ఉన్నా కూడా క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. మాకు భయపడి కార్పొరేటర్లను క్యాంపునకు తరలించినప్పుడే మేము నైతికంగా గెలిచాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
గంజాయి డబ్బుతోనే కార్పొరేటర్ల కొనుగోలు
● కోటంరెడ్డి సోదరుల అక్రమాలపై విచారణ జరపాలి ● మేయర్ భర్త జయవర్ధన్ నెల్లూరు రూరల్: గంజాయి డబ్బుతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను కొనుగోలు చేస్తున్నారని మేయర్ స్రవంతి భర్త పొట్లూరి జయవర్ధన్ ఆరోపించారు. నగరంలోని జర్నలిస్ట్ భవన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అక్రమాలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన కార్పొరేటర్లకు ఎన్ని కోట్లిచ్చి టీడీపీలో చేర్చుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక సామాన్య గిరిజన బిడ్డ మేయర్గా ఉంటే, ఆమెను పీఠం నుంచి దింపేందుకు కుట్రలు సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. కొందరు కార్పొరేటర్లను రహస్య స్థావరాలకు తరలించి.. విమానాల్లో తిప్పుతూ రూ.కోట్లను వెచ్చిస్తున్నారని, దీని వెనుక గంజాయి మాఫియా డాన్ ఉన్న విషయం వాస్తవం కాదానని ప్రశ్నించారు. నెల్లూరులో ఓ వ్యక్తి ఇన్చార్జి మేయర్ కుర్చీ కోసం నాలుగేళ్లుగా ఎక్కని గడప.. తిరగని ఇల్లు లేదని విమర్శించారు. ఈ అవకాశం కల్పిస్తామని రూ.రెండు కోట్లను వసూలు చేసింది గంజాయి మాఫియా డాన్ కాదానని ప్రశ్నించారు. రాజకీయ భిక్ష పెట్టిందెవరు..? తన కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది నేనేనంటూ పెద్ద మనిషి పదేపదే చెప్తున్నారని, అయితే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టిందెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతోనే స్రవంతికి మేయర్ పీఠం దక్కిందని చెప్పారు. కష్టకాలంలో ఆదుకున్న స్నేహితులను సైతం మోసం చేసిన ఘనుడు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అని మండిపడ్డారు. ఇన్ని ఆస్తులెక్కడివి..? పాల డబ్బాకు వంద రూపాయల్లేవని చెప్పుకొన్న నువ్వు ఇన్ని వేల కోట్లను ఎలా సంపాదించావో ప్రజలకు చెప్పాలని కోటంరెడ్డిని డిమాండ్ చేశారు. నెల్లూరు రూరల్లో ప్రభుత్వ భూములు, గంజాయితో వచ్చిన డబ్బులతో మాగుంట లేఅవుట్లో రూ.20 కోట్లతో ఇల్లు.. హైదరాబాద్లో రూ.30 కోట్లతో విల్లా.. బెంగళూరులో రూ.100 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ కొనింది వాస్తవం కాదానని ప్రశ్నించారు. ఇసుక మాఫియా ద్వారా వచ్చిన రూ.30 కోట్లతో డైమండ్లు, బంగారం సంపాదించింది నిజం కాదానన్నారు. ఆయన సోదరుడు గిరిధర్రెడ్డి రూ.వందల కోట్లతో ఇల్లు కడుతున్నారని, ఈ డబ్బు ఎక్కడ్నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వీరి అక్రమాలపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని కోరారు. -
కొన్ని ఘటనలు
● ఆగస్ట్ 13వ తేదీన నెల్లూరు – ముత్తుకూరు రోడ్డు మార్గంలో కారు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో వాహనంలో ని నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ సమయంలో ఎదురుగా వాహనాలు ఏమీ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ● 30వ తేదీన నెల్లూరు నుంచి ముత్తుకూరు వైపు వెళ్లే లారీ డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. తెల్లవారుజామున కావడంతో వాహనాల రాకపోకల్లేవు. లేకపోతే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ● నవంబర్ 22వ తేదీన కారు వేగంగా వచ్చి డివైడర్ను ఎక్కింది. అయితే ఆ సమయంలో ఎదురుగా ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. -
స్టార్టప్లపై యువత ఆసక్తి
● వీఎస్యూ వీసీ శ్రీనివాసరావు వెంకటాచలం: స్టార్టప్లపై యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోందని విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని కాకుటూరు వద్దనున్న వీఎస్యూలో గురువారం టూరిజం మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్వంలో కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఆన్ ఇంటర్న్ షిప్ అండ్ స్టార్టప్ డెవలప్మెంట్ ఫ్రమ్ ఐడియా టు ఎగ్జిక్యూషన్ పేరుతో విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు సంప్రదాయ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా, తమ సృజనాత్మకత, నైపుణ్యాలను ఉపయోగించి కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించాలని సూచించారు. స్టార్టప్ల్లో విజయం సాధించాలంటే మార్కెట్పై అవగాహన, స్పష్టమైన ప్రణాళిక, టీమ్ వర్క్, కొత్త ఆలోచనలు కీలకమని వెల్లడించారు. విద్యార్థుల్లో వ్యాపార ధోరణిని పెంపొందించేందుకు యూనివర్సిటీ అన్నివిధాలా సహకరిస్తుందని తెలియజేశారు. మంచి స్టార్టప్ ఐడియా తెచ్చిన వారికి ఆర్థిక సహకారం అందించి ప్రోత్సహిస్తామన్నారు. స్టార్టప్ల ప్రాముఖ్యత, వ్యాపార ఆలోచనలను అమలు దిశగా తీసుకెళ్లే వ్యూహాలు, ప్రస్తుత పారిశ్రామిక రంగంలో ఉన్న అవకాశాల గురించి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ రూసా సీఈఓ వంశీకృష్ణ వివరించారు. కార్యక్రమంలో టూరిజం మేనేజ్మెంట్ విభాగాధిపతి డాక్టర్ సుజాత, అధ్యాపకులు పాల్గొన్నారు. -
విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా ● చాగంటి కోటేశ్వరరావు ప్రవచనలు నెల్లూరు (టౌన్): విద్యతో పాటు విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో ‘విలువల విద్యా సదస్సు’ను పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు హాజరై ప్రవచనలు చేశారు. తొలుత సరస్వతీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం జ్యోతి ప్రజ్వలన, ప్రార్థన గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సనాతన ధర్మాలతో పాటు తల్లిదండ్రులు, గురువులపై నైతిక విలువలు తెలియజేసే అవగాహన విద్యార్థులకు అవసరమని చెప్పారు. అనంతరం ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడారు. చాగంటి కోటేశ్వరరావు ప్రవచనలను నెల్లూరులో నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు. పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు పద్యాలతో పుస్తకాన్ని రూపొందించారని వివరించారు. విద్యార్థుల సందేహాల నివృత్తి సదస్సులో దాదాపు 45 నిమిషాల పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఉద్దేశించి చాగంటి కోటేశ్వరరావు ప్రవచనలు చేశారు. విద్యార్థులు నవ్యశ్రీ, సందీప్, మేఘన, ఆస్మిన్, ధనలక్ష్మి నిఖిల్ అడిగిన ప్రశ్నలు, సందేహాలను అర్థమయ్యేలా నివృత్తి చేశారు. అనంతరం ఆయన్ను సత్కరించారు. సమగ్రశిక్ష ఏఎస్పీడీ రవీంద్రనాథ్రెడ్డి, ఏపీసీ వెంకటసుబ్బయ్య, ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి, డీఈఓ బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా చలపతిరావు
కొడవలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వీరి చలపతిరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులను పార్టీ కార్యాలయం గురువారం విడుదల చేసింది. పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా ప్రస్తుతం ఈయన కొనసాగుతున్నారు. డీసీఎమ్మెస్ చైర్మన్గా గతంలో రెండుసార్లు పనిచేశారు. పారదర్శకంగా పరీక్ష నిర్వహణ నెల్లూరు (టౌన్): జవహర్ నవోదయ విద్యాలయలో ప్రవేశానికి గానూ శనివారం నిర్వహించనున్న పరీక్షను పారదర్శకంగా జరపాలని విద్యాలయ ప్రిన్సిపల్ పార్వతి పేర్కొన్నారు. దర్గామిట్టలోని జెడ్పీ హైస్కూల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, సెంటర్ లెవల్ అబ్జర్వర్లకు గురువారం నిర్వహించిన ఓరియెంటేషన్ ప్రోగ్రామ్లో ఆమె మాట్లాడారు. ఆరో తరగతిలో ప్రవేశానికి గానూ జిల్లా వ్యాప్తంగా 3069 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. హాల్టికెట్, ఆధార్ జెరాక్స్ కాపీ, బ్లూ / బ్లాక్ బాల్ పాయింట్ పెన్, ప్యాడ్ను వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఉదయం 10.30కు రిపోర్ట్ చేయాలన్నారు. తల్లిదండ్రులతో రౌండ్ టేబుల్ సమావేశం నేడు నెల్లూరు (టౌన్): విద్యార్థుల ఆత్మహత్యల నివారణపై టౌన్హాల్ రీడింగ్ రూమ్లో తల్లిదండ్రులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని శుక్రవారం ఉదయం పది గంటలకు నిర్వహించనున్నామని పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరహరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. పారిశ్రామిక పార్క్ భూముల పరిశీలన దగదర్తి: మండలంలోని ఉలవపాళ్ల జాతీయ రహదారి పక్కన పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు సేకరించాల్సిన భూములను జేసీ వెంకటేశ్వర్లు, కావలి ఆర్డిఓ వంశీకృష్ణ గురువారం పరిశీలించారు. సర్వే నంబర్ 47లో సుమారు 21 ఎకరాల్లో భూములను రైతుల నుంచి సేకరించాలని అధికారులు నిర్ణయించారు. వీటిని ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చారని, ఏమైనా అభ్యంతరాలుంటే తమకు తెలియజేయాలని జేసీ కోరారు. ఆర్ఐ ప్రియాంక, మండల సర్వేయర్ రూబియా, వీఆర్వో బాలనాగమ్మ తదితరులు పాల్గొన్నారు. అరుణపై పీడీ యాక్ట్ కోవూరు: జిల్లాలో దొంగతనం, దాడులు, బెదిరింపులు, మోసాలు, గంజాయి కేసులతో పలుమార్లు వివాదాల్లో నిలిచిన లేడీ డాన్ నిడిగుంట అరుణపై పీడీ యాక్ట్ను అమలు చేశారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న ఆమెను కడప సెంట్రల్ జైలుకు కోవూరు పోలీసులు తరలించారు. పెన్నా డౌన్ స్ట్రీమ్ పర్యవేక్షణ సంగం: సంగంలో పెన్నా డౌన్ స్ట్రీమ్ ఎడమవైపు గట్టులో కోతకు గురవుతున్న ప్రాంతాన్ని తెలుగుగంగ ఎస్ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఈఈ అనిల్కుమార్రెడ్డి గురువారం పరిశీలించారు. ఇటీవల వచ్చిన తుఫాన్ల ప్రభావంతో డౌన్న్స్ట్రీమ్ ఎడమ వైపు గట్టు కోతకు గురవుతోంది. దీన్ని పరిశీలించిన అనంతరం గట్టు రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడారు. తాత్కాలిక మరమ్మతు పనులను తక్షణమే చేపడతామని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే శాశ్వత రక్షణ కల్పించేలా పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు. -
బాధితులకు సత్వర న్యాయం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసులను పారదర్శకంగా పరిష్కరించి బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. డివిజన్ల వారీగా నమోదైన అట్రాసిటీ కేసులపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్లో 147 కేసుల్లో రూ.1.74 కోట్లు, నవంబర్లో 48 కేసుల్లో రూ.36.75 లక్షలు నష్టపరిహారంగా బాధితులకు చెల్లించినట్లు చెప్పారు. ఇంకా 65 కేసుల్లో రూ.94 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎస్పీ డాక్టర్ అజిత మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసులను రాజకీయాలు, పార్టీలకతీతంగా పారదర్శకంగా నమోదు చేస్తున్నామని చెప్పారు. అక్రమ కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని స్టేషన్ల పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి మాట్లాడారు. తొలుత కమిటీ సభ్యులు జిల్లాలోని పలు సమస్యలపై ప్రస్తావించారు. సమావేశంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్కుమార్, సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి, కావలి, ఆత్మకూరు ఆర్డీఓలు వంశీకృష్ణ, పావని, డీఎస్పీలు శ్రీనివాసరావు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ● సభ్యులు ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ చాలా వరకు తప్పుడు కేసులు కడుతున్నారన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత పోలీస్ అధికారులు కేసులు కట్టాలన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. సాయిప్రసాద్ మాట్లాడుతూ పోలీసు కేసులు చాలావరకు తప్పులుగా ఉన్నాయని, కావలి, కందుకూరు, విడవ లూరు ఇలా చాలా పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. గంధం శ్రీరాములు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారుల్లో సమన్వయం కొరవడిందని, దానిని సరి చేసుకోవాలని కోరారు. దుంప ఏసోబు మాట్లాడుతూ ఎస్సీలకు సంబంధించి నోటీసులివ్వకుండా మీ ఇల్లు రోడ్ వైండింగ్లో పోతోందని తోటపల్లిగూడూరులో కూల్చారన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు భూ పట్టాలు మంజూరు చేయాలని కోరారు. -
ఇద్దరు రౌడీషీటర్లపై పీడీ యాక్ట్
● కడప కేంద్ర కారాగారానికి తరలింపు నెల్లూరు(క్రైమ్): పదేపదే నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు రౌడీషీటర్లపై పోలీస్ అధికారులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు మూలాపేట రాజీవ్ గృహకల్పకు చెందిన ఎస్.జయప్రకాష్ ప్రస్తుతం నవాబుపేటలో ఉంటున్నాడు. అతడిపై చిన్నబజారు పోలీస్స్టేషన్లో రౌడీషీట్ ఉంది. నెల్లూరు నగరం, బుచ్చి పోలీస్స్టేషన్లలో ఐదు కేసులున్నాయి. బోగోలు మండలం బిట్రగుంటకు చెందిన షేక్ షాహుల్ హమీద్ ప్రస్తుతం జనార్దనరెడ్డి కాలనీ టిడ్కో గృహాల్లో నివాసం ఉంటున్నాడు. చిన్నబజారు పోలీస్స్టేషన్లో రౌడీషీట్ ఉంది. అతడిపై 28 కేసులున్నాయి. పలుమార్లు పోలీసులు ఇరు వురికి కౌన్సెలింగ్ నిర్వహించినా వారితీరులో మా ర్పురాలేదు. పదేపదే నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. వీరిద్దరిపై కలెక్టర్ అనుమతితో పోలీస్ అధికారులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న జయప్రకాష్, షాహుల్ హమీద్కు చిన్నబజారు పోలీసు లు నోటీసులు అందజేశారు. అనంతరం వారిని కడప కేంద్ర కారాగారానికి తరలించినట్లు ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు గురువారం తెలిపారు. బ్యాగ్లు కత్తిరించి నగదు, సెల్ఫోన్ చోరీ నెల్లూరు(క్రైమ్): తల్లీకుమార్తె హ్యాండ్ బ్యాగ్లను కత్తిరించి నగదు, సెల్ఫోన్ను గుర్తుతెలియని దుంగులు అపహరించిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. మనుబోలు మండలం కొలనకుదురు గ్రామంలో సుజాతమ్మ నివాసం ఉంటున్నారు. ఆమె బుధవారం తన కుమార్తెను తీసుకుని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. కుమార్తెకు చికిత్స చేయించి తిరిగి తమ స్వగ్రామం వెళ్లేందుకు ఆర్టీసీ ప్రధాన బస్టాండ్కు వచ్చారు. బస్సు ఎక్కే క్రమంలో సుజాతమ్మ హ్యాండ్ బ్యాగ్ను గుర్తుతెలియని దుండగులు కోసి అందులో ఉన్న రూ.50 వేల నగదు, ఆమె కుమార్తె చేతిలోని సంచిని కోసి రూ.7 వేల నగదు, సెల్ఫోన్ తదితరాలను చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్టీసీ బస్టాండ్లోని సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ.. ● తెలుగుగంగ కార్యాలయం వద్ద బీజేపీ ధర్నా పొదలకూరు: స్థానిక తెలుగుగంగ, సోమశిల డీఈ కార్యాలయాల వద్ద మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కలువాయి, రాపూరు మండలాల్లో సోమశిల, కండలేరు జలాశయాలున్న కారణంగా నీటి పారుదలకు ఇబ్బందులు కలుగుతాయన్నారు. కాలువలు ఒక జిల్లాలో, ప్రాజెక్ట్లు మరో జిల్లాలో ఉంటే రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించిన పైమూడు మండలాలను యథావిధిగా కొనసాగించాల్సిందిగా కోరారు. ధర్నాలో సీహెచ్ చినసుబ్రహ్మణ్యం, సీహెచ్ వెంకటేశ్వర్లు, గురుస్వామి, జనార్ధన్రెడ్డి, ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. కాస్మొటిక్స్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు నెల్లూరు(క్రైమ్): కంపెనీతో సంబంధం లేకుండా నకిలీ ఎమ్మార్పీ ధరలు అతికించి ఫేస్క్రీమ్స్ను అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. ఓ కంపెనీకి చెందిన ఫేస్క్రీమ్ రూ.699 ఉండగా స్టిక్కర్ను తొలగించి రూ.1,699కు విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో గురువారం విజిలెన్స్, లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా చిన్నబజారులోని సావన్ కాస్మొటిక్స్ దుకాణాల్లో తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో తయారీ తేదీ లేకుండా, ఎక్స్పైరీ అయిన వస్తువులు సైతం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దుకాణంలోని సరుకును సీజ్ చేసి నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదుకు సిఫార్సు చేసినట్లు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ నరసింహారావు తెలిపారు. ఈ తనిఖీల్లో డీసీటీఓ విష్ణురావు తదితరులు పాల్గొన్నారు.కండలేరులో నీటి నిల్వ రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 60.460 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 1,750 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 830, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 70, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. -
నవాబుపేట పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఐదో డివిజన్ గిరిజన కార్పొరేటర్ ఓబిలి రవిచంద్ర, ఆరో డివిజన్ కార్పొరేటర్ మస్తానమ్మ తనయుడు మద్దినేని శ్రీధర్ను నవాబుపేట పోలీసులు అరెస్ట్ చేశారనే విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు వేలూరు మహేష్, కామాక్షిదేవి.. స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే భారీగా చేరుకున్న పార్టీ శ్రేణులు అరెస్ట్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీస్స్టేషన్ లోపలికి అనిల్, చంద్రశేఖర్రెడ్డి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులను భారీగా మోహరించారు. ఖాకీలు అదుపులోకి తీసుకున్న ఇద్దరి ఆచూకీ అర్ధరాత్రి వరకు తెలియకపోవడంతో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. వారి కుటుంబసభ్యులు సైతం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పోలీసుల ఫోన్లు స్విచ్ఛాఫ్ తాడేపల్లిలో ఓబిలి రవిచంద్ర, శ్రీధర్ను పోలీసులు గురువారం సాయంత్రం ఐదు గంటలకు అదుపులోకి తీసుకొని నెల్లూరు తరలిస్తున్నామని కుటుంబసభ్యులకు తెలిపారు. అయితే వీరిని ఎక్కడికి తీసుకెళ్లారో అర్ధరాత్రి వరకు తెలియలేదు. పోలీస్ అధికారులకు ఫోన్ చేస్తే అవి స్విచ్ఛాఫ్ అని వస్తున్నాయి. ఏ కేసులు నమోదు చేశారోననే అంశంపైనా స్పష్టతను ఇవ్వలేదు. మరోవైపు పోలీస్స్టేషన్లోనే అనిల్కుమార్యాదవ్, చంద్రశేఖర్రెడ్డి దాదాపు రెండు గంటలకుపైగా ఉన్నారు. తమ పార్టీ నేతల వివరాలు తెలిసేంత వరకు వెళ్లేది లేదని పార్టీ శ్రేణులు భీష్మించుకొని కూర్చున్నారు. పార్టీ శ్రేణులతో మాట్లాడుతున్న అనిల్కుమార్యాదవ్పోలీస్స్టేషన్ వద్దకు చేరుకున్న చంద్రశేఖర్రెడ్డి ఓ కార్పొరేటర్, మరొకరి కుమారుడి అరెస్ట్ నేపథ్యంలో భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా పోలీసుల మోహరింపు ఎప్పుడేమి జరుగుతుందోననే ఉత్కంఠ అర్ధరాత్రి వరకు వివరాలు వెల్లడించని పరిస్థితి కుటుంబసభ్యుల ఆందోళన -
క్యాంపునకు తరలింపు
టీడీపీని వెంటాడుతున్న అవిశ్వాస భయం ● నిన్నటి వరకు గెలుపు ధీమా ● తాజా పరిణామాలతో ముచ్చెమటలు ● మేయర్ స్రవంతికి పెరుగుతున్న మద్దతు ● మిగిలిన వారూ ఆత్మప్రబోధానుసారం ఓటేస్తారనే ప్రచారం ● అధికార పార్టీ ఉచ్చులోంచి బయటపడే యోచనలో మరికొందరు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ టీడీపీ సాగిస్తున్న దుర్మార్గపు వైఖరికి చెక్ పడనుందనే ప్రచారం జోరందుకుంది. నగరపాలక సంస్థలో జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. వాస్తవానికి 2021లో నిర్వహించిన కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లకు గానూ అన్నింటినీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. గిరిజనులకు మేయర్గా అవకాశమివ్వాలనే ఉద్దేశంతో స్రవంతికి ఆ స్థానాన్ని అప్పగించారు. అయితే గతేడాదిలో కొలువుదీరిన టీడీపీ సర్కార్.. ఆ స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే దురుద్దేశంతో కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపింది. అధికార అండతో సంతలో పశువులను కొనుగోలు చేసిన రీతిలో కార్పొరేటర్లకు పచ్చ కండువాలు కప్పి ప్రజాతీర్పును అపహాస్యం చేసింది. అంతటిలో ఆగకుండా మేయర్పై అవిశ్వాసాన్ని ప్రకటించి.. ఇక విజయం తమదేననే ధీమాతో ఉన్న వారికి షాకులమీద షాకులు తగులుతున్నాయి. తాజా పరిణామాలతో వారికి ముచ్చెమటలు పడుతున్నాయి. కార్పొరేటర్లతో జగన్మోహన్రెడ్డి సైకిల్ పార్టీకి షాక్ ● వైఎస్సార్సీపీలో కార్పొరేటర్ల చేరిక సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతిపై ఈ నెల 18న పెట్టిన అవిశ్వాస తీర్మాన వేళ టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. గతంలో పచ్చ కండువా వేసుకున్న ఐదుగురు కార్పొరేటర్లు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి చక్రం తిప్పి వీరిని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో శుక్రవారం చేర్పించారు. నెల్లూరు నగర నియోజకవర్గంలోని ఐదు, ఆరు, 16, 51వ డివిజన్ల కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, మద్దినేని మస్తానమ్మ, వేనాటి శ్రీకాంత్రెడ్డి, సాహితి.. రూరల్ నియోజకవర్గంలోని 34వ డివిజన్ కార్పొరేటర్ ఫమీదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్నారు. మేము వైఎస్సార్సీపీ వెంటే ఉంటాం.. మీకో దండం..!వైఎస్సార్సీపీలోకి ఐదుగురు కార్పొరేటర్లు టీడీపీ పంచన చేరిన ఐదుగురు కార్పొరేటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాను తిరిగి కప్పుకొన్నారు. మరో ఐదుగురు సైతం చేరేందుకు ఆ పార్టీ ముఖ్య నేతలతో టచ్లో ఉన్నారని తెలుస్తోంది. అవిశ్వాస తీర్మాన రోజు నాటికి మరికొందరు సైతం మద్దతిచ్చే యోచనలో ఉన్నారని సమాచారం. మా మద్దతు స్రవంతికే..సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మేయర్ పొట్లూరి స్రవంతిపై ఈ నెల 18న జరపనున్న అవిశ్వాస తీర్మాన సమయం దగ్గరపడే కొద్దీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. వాస్తవానికి నాలుగేళ్ల క్రితం నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న స్థానాలు సున్నా. ఈ తరుణంలో గతేడాదిలో నిర్వహించిన ఎన్నికల్లో కొలువుదీరిన టీడీపీ కన్ను ఈ స్థానంపై పడింది. ఇంకేముంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన కార్పొరేటర్లకు పచ్చ కండువాలను నయానో.. భయానో కప్పారు. హామీలతో పబ్బం కొన్ని నెలల క్రితం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలోనూ ఫిరాయింపు కార్పొరేటర్లకు ఎన్నెన్నో హామీలిచ్చి పబ్బం గడుపుకొన్నారు. తీరా ఇది పూర్తయ్యాక ముఖం చాటేశారు. మేయర్పై ఇదే తరహాలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి కార్పొరేటర్ల మద్దతుపై నమ్మకం సన్నగిల్లిందనే టాక్ నడుస్తోంది. ఈ తరుణంలో గతంలో ఎన్నడూ అపాయింట్మెంట్ను సైతం ఇవ్వని అమాత్యుడు తాజాగా, సిటీ పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశమై.. ఒక్కొక్కరికీ రూ.రెండు కోట్ల మేర కాంట్రాక్ట్ పనులు, రూ.50 లక్షల చొప్పున తాయిలాలిస్తామంటూ హామీలిచ్చారు. మేయర్కు అంతర్లీనంగా మద్దతు టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది కార్పొరేటర్లను తమ పంచన చేర్చుకున్నారు. అవిశ్వాసానికి సన్నద్ధమైన క్రమంలో అధికార పార్టీ, మేయర్ దంపతుల మధ్య ఆరోపణలు.. ప్రత్యారోపణలతో రాజకీయాలు వేడెక్కాయి. మెజార్టీ బలం ఉందనే ధీమాతో ఉన్న టీడీపీ శిబిరంలో లుకలుకలు మొదలయ్యాయి. మంత్రి, ఎమ్మెల్యేల పోకడల నేపథ్యంలో.. తమ రాజకీయ భవిష్యత్తును కాంక్షిస్తున్న కార్పొరేటర్ల వైఖరిలో మార్పు కనిపించింది. తాజాగా మేయర్కు మద్దతు పెరుగుతుండటంతో అధికార పార్టీకి చెమటలు పడుతున్నాయి. అవిశ్వాస వాయిదాకు యత్నాలు అధికార బలంతో కుయుక్తులు పన్ని గిరిజన మహిళను గద్దె దింపేందుకు అవిశ్వాస అస్త్రాన్ని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి బయటకు తీశారు. తమ అస్మదీయులను ఆ పీఠమెక్కించేందుకు కుయుక్తులు పన్నారు. 40 మంది కార్పొరేటర్ల మద్దతుండటంతో విజయం తమదేననే ధీమాతో ఉన్నారు. ఇప్పటికే మేయర్ స్రవంతి తటస్తంగా ఉండటంతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం ఈ విషయాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. తమకెలాంటి సంబంధం లేదనే రీతిలో వ్యవహరిస్తోంది. అయితే టీడీపీకి మద్దతిచ్చే కార్పొరేటర్లకు కాంట్రాక్ట్ వర్కులు, తాయిలాలిస్తామని చెప్పినా.. వారి వైఖరిలో మార్పు కనిపిస్తుండటంతో కాపాడుకునేందుకు ఆ పార్టీ పెద్దలు అష్టకష్టాలు పడుతున్నారు. రంగంలోకి కీలక నేతలు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి ఆనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి వ్యూహాత్మకంగా రంగంలోకి దిగారు. అధికార పక్షానికి చెమటలు పట్టించేలా పచ్చ కండువా కప్పుకొన్న ఐదుగురు కార్పొరేటర్లను తిరిగి సొంతగూటికి వచ్చేలా చేయడంతో టీడీపీ శిబిరం షాక్కు గురైంది. నెల్లూరు నగర నియోజకవర్గంలోని 20 మంది కార్పొరేటర్లలో నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఉన్న వారిని కాపాడుకునేందుకు టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎప్పుడెవరు చేజారుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో పలువుర్ని ప్రత్యేక వాహనాల్లో క్యాంపునకు తరలించారు. టీడీపీ నేత విజయభాస్కర్రెడ్డి, పట్టాభిరామిరెడ్డి రంగంలోకి దిగారు. ముఖ్యనేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ క్యాంపు రాజకీయాలకు తెరదీశారు. -
విశాఖకు నిమ్మ ఎగుమతులు
పొదలకూరు: స్థానిక నిమ్మ మార్కెట్ నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు నిమ్మ కాయలను కలెక్టర్ ఆదేశాల మేరకు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఎగుమతి చేశారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ ఏడీ అనితాకుమారి మాట్లాడారు. 10 టన్నుల కాయలను రైతుల నుంచి సేకరించి పంపుతున్నామని పేర్కొన్నారు. కిలోకు రూ.15 గిట్టుబాటయ్యేలా చర్య లు చేపడుతున్నామని వెల్లడించారు. తిరుపతి, చిత్తూ రు, కోనసీమ, అన్నమయ్య, కాకినాడ జిల్లాలకు మరో 15 టన్నుల కాయలను శుక్రవారం ఎగుమతి చేయనున్నామని వివరించారు. సొసై టీ చైర్మన్ మస్తాన్బాబు, ఏఎంసీ ఉపాధ్యక్షురాలు అరుణమ్మ, సెక్రటరీ ఇలియాజ్ పాల్గొన్నారు. -
అనుమతుల్లేని గ్యాస్ ఏజెన్సీపై కేసు
● 133 ఫుల్, 92 ఖాళీ సిలిండర్లు, రెండు వాహనాల స్వాధీనం నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ మండలంలోని రామ్ గ్యాస్ ఏజెన్సీపై విజిలెన్స్, రెవెన్యూ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. అనుమతి లేకుండా ఏజెన్సీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వారి కథనం మేరకు.. రూరల్ మండలంలోని కొత్తకాలువ సెంటర్ వద్ద ఉన్న గ్యాస్ ఏజెన్సీలో గురువారం తనిఖీలు జరిగాయి. ఏజెన్సీకి ప్రభుత్వం నుంచి అనుమతుల్లేవని విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. అదేవిధంగా పీఈఎస్ఓ లైసెన్స్, ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీ లేకుండా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసి విక్రయాలు చేస్తున్నారని గుర్తించారు. విక్రయాలకు సిద్ధంగా ఉంచిన రూ.6.87 లక్షల విలువైన కమర్షియల్ సిలిండర్లు 133, 92 ఖాళీ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలించే రెండు అశోక్ లేలాండ్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 6ఏ కేసు నమోదు చేశారు. కాగా సిలిండర్లను భద్రంగా ఉంచేందుకు పీఎంకేఆర్ భారత్, శ్రీవెంకయ్య స్వామి, శ్రీకార్తీ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలకు తరలించారు. తనిఖీల్లో విజిలెన్స్ సీఐ శ్రీహరి, రూరల్ తహసీల్దార్ ఎస్.కృష్ణప్రసాద్, సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్ వెంకటరెడ్డి, సహాయ పౌరసరఫరాల అధికారి లక్ష్మీనారాయణరెడ్డి, డీటీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మేత పొరంబోకులో సోలార్ ప్లాంటా..?
● అడ్డుకున్న రైతులు అనుమసముద్రంపేట: మండలంలోని శ్రీకొలనులో గల సర్వే నంబర్ 411లో దాదాపు 311 ఎకరాల మేత పొరంబోకులో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సంస్థ యజమానులు సిద్ధం చేస్తుండగా, రైతులు గురువారం అడ్డుకున్నారు. పంచాయతీ తీర్మానం లేకుండా భూములను ఎలా ఇస్తారంటూ రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పశువుల మేత కోసం ఈ భూములు ఏళ్లుగా ఉన్నాయని, ఇప్పుడు హఠాత్తుగా సోలార్ ప్లాంట్కు ఇచ్చేందుకు తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. కాగా తమకు కలెక్టర్ నుంచి అనుమతులున్నాయని, ప్లాంట్ను ఇక్కడే ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. దీనికి రైతులు అంగీకరించకపోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులకు సంస్థ ప్రతినిధులు సమాచారమివ్వగా, వారొచ్చి రైతులకు నచ్చజెప్పారు. -
నెల్లూరు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ కిడ్నాప్
సాక్షి, నెల్లూరు: పార్టీ మారిన గంటల వ్యవధిలోనే.. కార్పొరేటర్ కిడ్నాప్ కావడం నెల్లూరులో కలకలం రేపుతోంది. సిటీ 5వ డివిజన్ కార్పొరేటర్ ఓబుల రవిచంద్ర మరో నలుగురితో కలిసి గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లిలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆయనకు కండువా కప్పారు. అయితే.. నెల్లూరకు తిరిగి వస్తున్న ఆయన్ని పోలీసులమని చెప్పి కొందరు తీసుకెళ్లారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రవిచంద్ర ఆచూకీ కోసం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలనే యోచనలో ఉన్నారు. మరోపక్క.. నెల్లూరులో బలం ఉన్నా టీడీపీ బరి తెగించిందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. మేయర్పై అవిశ్వాసం వేళ.. నెల్లూరులో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. ఐదుగురు కార్పొరేటర్లు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. మద్దినేని మస్తానమ్మ (నెల్లూరు సిటీ 6వ డివిజన్ కార్పొరేటర్), ఓబుల రవిచంద్ర (నెల్లూరు సిటీ 5వ డివిజన్ కార్పొరేటర్), కాయల సాహితి (నెల్లూరు సిటీ 51వ డివిజన్ కార్పొరేటర్), వేనాటి శ్రీకాంత్ రెడ్డి (నెల్లూరు సిటీ 16వ డివిజన్ కార్పొరేటర్), షేక్ ఫమిదా (నెల్లూరు రూరల్ 34వ డివిజన్ కార్పొరేటర్)లను మాజీ మంత్రి అనిల్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ దగ్గరుండి వైఎస్ జగన్ను కలిపించి.. పార్టీలో చేర్పించారు. అయితే మరింత మంది కార్పొరేటర్లు పార్టీ మారే భయంతో ఉన్న టీడీపీ.. ఇలా కిడ్నాప్ల పర్వానికి దిగిందని స్పష్టమవుతోంది. -
నెల్లూరులో టీడీపీకి బిగ్ షాక్
సాక్షి, తాడేపల్లి: నెల్లూరులో టీడీపీకి ఊహించిని షాక్ తగిలింది. టీడీపీని వీడిన ఐదు మంది కార్పొరేటర్లు.. వైఎస్సార్సీపీలోకి చేరారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆ పార్టీలోకి నెల్లూరు టీడీపీ కార్పొరేటర్లు చేరారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో మద్దినేని మస్తానమ్మ (6వ డివిజన్), ఓబుల రవిచంద్ర (5వ డివిజన్), కాయల సాహితి (51వ డివిజన్), వేనాటి శ్రీకాంత్ రెడ్డి (16వ డివిజన్), షేక్ ఫమిదా (34వ డివిజన్) ఉన్నారు.వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు మేయర్పై అవిశ్వాసం నేపథ్యంలో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఐదుగురు పార్టీ వీడటంతో మరెందరు వెళ్తారోనన్న భయం కూటమికి పట్టుకుంది. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ షాక్ ఇచ్చింది. -
బ్లాస్టింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలి
సీతారామపురం: సొరంగ మార్గ పనుల వద్ద బ్లాస్టింగ్ జరిగే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు ఆర్డీఓ పావని పేర్కొన్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే భారతమాల ఆరు లేన్ల జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సీతారామపురం – పోరుమామిళ్ల ఘాట్ రోడ్డు మార్గంలో సొరంగ పనులను బుధవారం ఆమె పరిశీలించారు. రోజూ ఎన్నిసార్లు బ్లాస్టింగ్ చేస్తున్నారనే అంశాన్ని మ్యాక్స్ ఇన్ఫ్రా బృందాన్ని ఆరాతీశారు. పని ప్రదేశంలో ముందుజాగ్రత్తగా అంబులెన్స్ను అందుబాటులో ఉంచాలని కోరారు. నిర్ణీత గడువులోపు టన్నెల్ పనులు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. తహసీల్దార్ ఫాజిహా తదితరులు పాల్గొన్నారు. -
నవోదయలో ప్రవేశానికి 13న పరీక్ష
మర్రిపాడు: నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు పరీక్షను ఈ నెల 13న నిర్వహించనున్నారని కృష్ణాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయ ఇన్చార్జి ప్రిన్సిపల్ పార్వతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించనున్న పరీక్షలకు 4174 మంది హాజరుకానున్నారని చెప్పారు. హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకొని ఆధార్ కార్డుతో గంట ముందే చేరుకోవాలని కోరారు. వివరాలకు 93460 22106 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఫైళ్ల పరిష్కారంలో జిల్లాకు ద్వితీయ స్థానం నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫైళ్లను వేగంగా పరిష్కరించడంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా ద్వితీయ స్థానంలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫైళ్లను త్వరగా పరిష్కరించడంలో కలెక్టర్ల పనితీరుకు ర్యాంకులను సీఎం చంద్రబాబు బుధవారం ప్రకటించారు. గడిచిన మూడు నెలల్లో వివిధ శాఖల నుంచి 682 ఫైళ్లు రాగా, ఇందులో 628ను క్లియర్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. -
కలెక్టరేట్ ఎదుట ధర్నా
నెల్లూరు(దర్గామిట్ట): రైతుల సమస్యలపై కలెక్టరేట్ ఎదుట ధర్నాను సీపీఐ, రైతు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి, రైతు సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షానవాజ్, గంగపట్నం రమణయ్య మాట్లాడారు. తుఫాన్ కారణంగా 14 వేల ఎకరాల్లో నారుమడులు.. 1.5 లక్షల ఎకరాల్లో వరినాట్లు.. దాదాపు 200 ఎకరాల్లో వేరుశనగ దెబ్బతిన్నాయని చెప్పారు. నార్లు పోసుకునేందుకు విత్తనాలు అందుబాటులో లేవని, అవసరమైన మేర సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకూ వర్తింపజేయాలని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, దీనికి గానూ 6.7 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచుతామని చెప్పినా, ఆచరణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా అనేక కొర్రీలు పెడుతున్నారని చెప్పారు. అనంతరం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రాన్ని అందజేశారు. కాగా సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించారు. నేతలు రామరాజు, వినోదమ్మ, సిరాజ్, రాజగోపాల్, దర్గాబాబు, ఏడుకొండలు, మున్నా, మస్తాన్, ఆదినారాయణ, వనజ తదితరులు పాల్గొన్నారు. -
బాబు పాలనపై ప్రజల్లో వ్యతిరేకత
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటాచలం: సీఎం చంద్రబాబు పాలనపై రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. కోటి సంతకాల సేకరణ పత్రాల వాహనాన్ని మండలంలోని సర్వేపల్లిలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత జెండా ఊపి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాకాణి మాట్లాడారు. పేద విద్యార్థులకు వైద్య విద్యనందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కళాశాలలను అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారని వివరించారు. అయితే టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరాక, వీటిని ప్రైవేటీకరించేందుకు నిర్ణయం తీసుకోవడం దారుణమని చెప్పారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూస్తుంటే, చంద్రబాబుపై వారిలో ఎలాంటి వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోందని చెప్పారు. తమ హయాంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందజేస్తే, ప్రస్తుతం దేన్నీ అమలు చేయకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, వలంటీర్లకు రూ.పది వేలిస్తామని చెప్పి అందర్నీ వంచించారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్ ఆర్భాటపు ప్రచారాలు చేసుకోవడం తప్ప ప్రజలకు చేసేందేమీలేదని ఎద్దేవా చేశారు. సంబంధం లేని విషయాన్ని మాట్లాడి రాష్ట్ర పరువును జాతీయ స్థాయిలో మంటగలిపారని విమర్శించారు. -
పర్యావరణ మనుగడకు ఆలివ్ రిడ్లీ తాబేళ్లు కీలకం
నెల్లూరు(అర్బన్): తీర ప్రాంత మనుగడకు ఆలివ్ రిడ్లీ తాబేళ్లు కీలకమని ఫారెస్ట్స్ కన్జర్వేటర్, గుంటూరు ఐకేవీ రాజు పేర్కొన్నారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్ల పరిరక్షణపై వివిధ తీర ప్రాంత జిల్లాల అటవీ శాఖ అధికారులు, మత్స్య, మైరెన్ శాఖలు, గ్రీన్ టీ స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కలిసి ప్రాంతీయ వర్క్షాపును నగరంలోని ఓ కన్వెన్షన్ హాల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. సముద్రంలోని నాచును తిని, పగడపు దిబ్బలను కదిలించి చేపలకు ఆక్సిజన్ సక్రమంగా అందేలా తాబేళ్లు ఉపయోగపడతాయని వివరించారు. ఈ కారణంగా మత్స్య సంపద పెరిగి తీర ప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులకు ఉపాధి లభిస్తోందని వివరించారు. డిసెంబర్ నుంచి మార్చి వరకు ఒడ్డుకొచ్చి గోతులు చేసి గుడ్లు పెడుతాయని.. పౌర్ణమి, అమావాస్య రాత్రుల్లో మెరిసే వెలుగులను చూస్తూ తాబేలు పిల్లలు సముద్రంలోకి వెళ్తాయని తెలిపారు. ఒక్కో తాబేలు 60 నుంచి 120 వరకు గుడ్లు పెడుతాయని, వీటిని కాపాడాలని కోరారు. తమిళనాడుకు చెందిన జాలర్లు 500 హెచ్పీ మోటార్లు కలిగిన హైస్పీడ్ ట్రాలీ బోట్లతో రాష్ట్రంలో వేట సాగిస్తున్నారని, దీని వల్ల మన సంప్రదాయ మత్స్యకారుల వలలు తెగిపోవడమే కాకుండా తాబేళ్లు మృతి చెందుతున్నాయని చెప్పారు. సముద్రంలో ఎనిమిది కిలోమీటర్ల మేర వెళ్లి వేట సాగించాల్సి ఉన్నా, రెండు కిలోమీటర్ల పరిధిలోనే జరుపుతున్నారని తెలిపారు. నిబంధనలు అతిక్రమంచే వారిపై మత్స్య, మైరెన్, అటవీ శాఖలు చర్యలు చేపడతాయని వెల్లడించారు. సముద్ర తాబేళ్లు, ఇతర జంతువుల నమూనా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డీఎఫ్ఓ మహబూబ్బాషా, మత్స్యశాఖ జేడీ శాంతి. గ్రీన్ ట్రీ చైర్పర్సన్ సుప్రజాధరణి, మత్స్యకార సొసైటీ చైర్మన్ కొండూరు పోలిశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
అందరూ ఉన్న అనాథ ‘పెద్దిరెడ్డి’
కన్నబిడ్డల ఆదరణ కరువు ● భార్య మరణంతో కష్టాలు ఆరంభం ● ఇల్లు అమ్ముకున్న కొడుకు.. వీధిన పడిన పెద్దాయన ఉదయగిరి: ఈ పెద్దాయన పేరు బిజ్జం పెద్దిరెడ్డి. వయసు 75 ఏళ్లు. ఒకప్పుడు బాగా బతికాడు. నలుగురు సంతానంలో ఇద్దరు బిడ్డలు చిన్నతనంలోనే చనిపోయారు. ప్రస్తుతం కొడుకు, కూతురున్నారు. భార్య మృతిచెందారు. వృద్ధుడిని బిడ్డలు పట్టించుకోలేదు. దీంతో కలిగిరిలో ఆర్అండ్బీ అతిథి గృహంలో తలదాచుకుంటున్నాడు. బిడ్డలిద్దరూ ఆర్థికంగా ఉన్నవారే. కానీ పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో చలికి వణుకుతూ, వానకు తడుస్తూ, దోమల దెబ్బకు తల్లడిల్లుతూ అనాథగా మారాడు. కలిగిరికి చెందిన పెద్దిరెడ్డి కష్టపడి పనిచేసి బిడ్డలను చదివించాడు. కొడుకు పెళ్లి చేసుకుని ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డాడు. కూతురికి వివాహమైంది. కలిగిరిలో ఉంటున్నారు. భార్య ఉన్నంత కాలం పెద్దిరెడ్డికి ఇబ్బంది లేదు. కానీ ఆరునెలల క్రితం ఆమె చనిపోవడంతో కష్టాలు మొదలైనట్లు చెబుతున్నాడు. ఉన్న ఇంటిని కొడుకు అమ్మేసి వెళ్లిపోయాడు. ఓ అనాథాశ్రమంలో తండ్రిని చేర్చగా అక్కడ ఉండలేక సొంతూరికి వచ్చేశాడు. ఇక్కడ ఉండేందుకు ఆవాసం లేదు. కూతురు చేరదీయలేదు. దీంతో పెద్దిరెడ్డి ఆర్అండ్బీ బంగ్లాలో ఉంటూ నరకయాతన పడుతున్నాడు. తనకు వచ్చే పింఛన్తో కాలం వెళ్లదీస్తున్నాడు. కూతురు అప్పుడప్పుడూ అన్నం పెడుతుందని చెబుతున్నాడు. తనకు దయనీయ పరిస్థితి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. -
పేలిన లారీ టైరు
● ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొని డ్రైవర్ మృతి గుడ్లూరు: జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ టైరు పేలిపోవడంతో అదుపుతప్పి ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ను ఆస్పత్రికి తరలించేలోగా మృతిచెందారు. గుడ్లూరు మండలం మోచర్ల గ్రామ సమీపంలో బుధవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. విజయవాడ వైపు నుంచి చైన్నె వెళ్తున్న కంటైనర్ లారీ మోచర్ల సమీపంలోకి రాగానే టైరు పేలింది. దీంతో లారీని అదుపు చేయలేకపోయిన చైన్నెకి చెందిన డ్రైవర్ పెరుమాళ్(47) ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టాడు. క్యాబిన్లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందారు. పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గుడ్లూరు ఎస్సై వి.వెంకట్రావు తెలిపారు. -
ఎనీటైమ్ తాగుతూ తూగుతూ
● మామూళ్ల మత్తులో ఎకై ్సజ్ మద్యం వ్యాపారులు నిబంధనలకు నీళ్లొదిలి అవకాశం ఉన్నంత మేరకు విక్రయాలు సాగిస్తూ జేబులు నింపుకుంటుండగా, నిబంధనలు పక్కాగా అమలు చేయాల్సిన ఎక్సైజ్శాఖ మామూళ్ల మత్తులో జోగుతోందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. జిల్లాలో 200 మద్యం దుకాణాలు, 36కుపైగా బార్ అండ్ రెస్టారెంట్లున్నాయి. మద్యం అమ్మకాలు పెంచుకుని జేబులు నింపుకునేందుకు కొందరు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. సమయపాలనకు నీళ్లొదిలారు. మద్యం దుకాణాలు ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు, బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్వహించాలి. అయితే అనేక దుకాణాలు, బార్లలో నైట్సేల్స్తో పాటుగా తెల్లవారుజాము నుంచే విక్రయాలు సాగుతున్నాయి. నిత్యం మద్యం అందుబాటులో ఉండటంతో నేరాలు పెరుగుతూ శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. – నెల్లూరు(క్రైమ్) -
నిమ్మ రైతులు నష్టపోకుండా చర్యలు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో నిమ్మ రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులకు సూచించారు. నగరంలోని కలెక్టరేట్లో ఆయన తన చాంబర్లో జేసీ వెంకటేశ్వర్లు, ఉద్యానశాఖ అధికారులతో బుధవారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 35 వేల ఎకరాల్లో నిమ్మసాగు చేపట్టారని, ఇందులో ఈ సీజన్లో 25 వేల ఎకరాలు కాపునకు వస్తున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో నిమ్మ విస్తీర్ణం పెరిగినందున మన ప్రాంతం నుంచి పంపించే నిమ్మకు డిమాండ్ తగ్గడంతో ధరలు కూడా పతనమయ్యాయని వివరించారు. దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్ రాష్ట్రంలో నిమ్మ డిమాండ్ ఉన్న కర్నూలు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసి మాట్లాడారు. జిల్లా నుంచి నిమ్మ పంటను ఆయా జిల్లాల్లో కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరగా, ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా ఇందుకు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు జిల్లా నుంచి నిమ్మ పంటను వెంటనే ఆయా జిల్లాలకు పంపించి రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుబ్బారెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏడీ అనిత తదితరులు పాల్గొన్నారు. కిలో నిమ్మకు రూ.15లైనా ఇవ్వండి ● జేసీ వెంకటేశ్వర్లు పొదలకూరు : ప్రభుత్వ మార్కెట్ వ్యాపారులు కిలో నిమ్మకాయలకు కనీసం రూ.15లైనా అందజేయాలని జేసీ వెంకటేశ్వర్లు సూచించారు. స్థానిక నిమ్మమార్కెట్ యార్డు కార్యాలయంలో బుధవారం వ్యాపారులు, రైతులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాపారులు పెద్ద మనుస్సు చేసుకుని నెలరోజుల పాటు రైతులకు కనీసం రూ.15 అందజేయాల్సిందిగా సూచించారు. దిగుబడి అధికంగా ఉండడం వల్ల డిమాండ్ పడిపోయి ధరలు దిగజారినట్టుగా వ్యాపారులు జేసీ దృష్టికి తీసుకొచ్చారు. ఢిల్లీ మార్కెట్లో కాయలు వద్దంటున్నారని నష్టాలకు వ్యాపారం చేస్తున్నట్టు తెలిపారు. వ్యాపారులు నెలరోజుల పాటు రైతులను ఆదుకుంటే తర్వాత ధరలు పెరుగుతాయని.. నిమ్మ సంక్షోభం నుంచి గట్టెక్కుతుందని జేసీ పేర్కొన్నారు. కొందరు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం తమను ఆదుకోవాలని, పురుగు మందులు, ఎరువులను అందజేస్తే కొంత గట్టెక్కుతామని, ఉపాధి హామీలో కాయలను కోసేందుకు కూలీలను ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. జిల్లా ఉద్యానాధికారి సుబ్బారెడ్డి, మార్కెటింగ్ ఏడీ అనితాకుమారి, హెచ్ఓ ఆనంద్, ఏఎంసీ సెక్రటరీ ఇలియాజ్ పాల్గొన్నారు. -
డీకేడబ్ల్యూలో జాబ్మేళా రేపు
నెల్లూరు (టౌన్): స్థానిక డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో జేకేసీ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన జాబ్మేళాను నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ గిరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023 నుంచి 2025 వరకు డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులతో పాటు ఈ విద్యా సంవత్సరం డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు జాబ్మేళాకు హాజరు కావచ్చన్నారు. చైన్నె, శ్రీసిటీకి చెందిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులు జాబ్మేళాలో పాల్గొంటున్నట్లు చెప్పారు. జాబ్మేళాకు హాజరయ్యే విద్యార్థులు రెజ్యూమ్తో పాటు ఇతర ధ్రువపత్రాలను తీసుకురావాలన్నారు. మరిన్ని వివరాల కోసం 86881 80353, 97036 83455 నంబర్లను సంప్రదించాలన్నారు. బస్సులో నుంచి జారిపడి బెంగాల్ కూలీ మృతి సోమశిల: సొంత ప్రాంతంలో పనుల్లేక రాష్ట్రాలు దాటుకుని వచ్చిన ఓ కూలీ ఆర్టీసీ బస్సు నుంచి ప్రమాదవ శాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోయిన ఘటన బుధవారం చేజర్ల మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పశ్చిమ బెంగాల్కు చెందిన ముజేన్ సంత్ర (37) అనే కూలీ వరినాట్ల పనుల కోసం కలువాయి వచ్చారు. పని నిమిత్తం ఆర్టీసీ బస్సులో నెల్లూరుకు వెళ్తుండగా ఏటూరికండ్రిక వద్ద ప్రమాదవశాత్తు రన్నింగ్ బస్సు నుంచి జారిపడి అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతికి గల కారణాలు తెలుసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ పేరుతో మోసం ● వ్యక్తి అరెస్ట్ నెల్లూరు సిటీ: ఓ యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసగించిన వ్యక్తిని రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. రూరల్ పరిధిలోని నాలుగో మైలులో నివాసం ఉంటున్న ఓ యువతిని అదే ప్రాంతానికి చెందిన షేక్.అకీబ్ కొంతకాలంగా ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. ఈ క్రమంలో యువతి పెళ్లిచేసుకోమని కోరగా ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు రూరల్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో అకీబ్ను బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిని రిమాండ్కు తరలిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య కావలి(అల్లూరు): ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కావలి పట్టణ పరిధిలోని వైకుంఠపురంలో బుధవారం చోటుచేసుకుంది. దిలీప్, అనూష(28)లు పదేళ్ల క్రితం వివాహం చేసుకుని స్థానిక వైకుంఠపురంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దంపతుల మధ్య కలహాల కారణంగా అనూష ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరు స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాల ఏర్పాటు
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆధ్వర్యంలో ఎస్పీ అజిత వేజెండ్ల పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా జిల్లాలో ఆరు స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలను బుధవారం ఏర్పాటు చేశారు. ఒక్కో బృందానికి ఎస్సైను ఇన్చార్జిగా నియమించారు. ఈ క్రమంలో జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయా బృందాలతో ఐజీ సమావేశం నిర్వహించి చేపట్టాల్సిన విధులపై దిశానిర్దేశం చేశారు. ప్రతి బృందం తమకు నిర్దేశించిన ప్రాంతాల్లో నేర నియంత్రణపై దృష్టి సారించాలన్నారు. నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. శివారు ప్రాంతాలు, అనుమానిత ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్లు నిర్వహించాలన్నారు. రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేయాలన్నారు. లాడ్జీలు, హోటల్స్ను తనిఖీలు చేయడంతో పాటుగా వారాంతాలు, పండగ రోజుల్లో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ అజిత వేజెండ్ల, ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, రూరల్ డీఎస్పీ జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
సాయం చేయబోయిన వ్యక్తిపై కత్తితో దాడి
● మద్యం మత్తులో యువకుల వీరంగం నెల్లూరు(క్రైమ్): మద్యం మత్తులో బైక్ నడుపుతూ అదుపుతప్పి రోడ్డుపై పడిన యువకులను లేపేందుకు వెళ్లిన వ్యక్తిపై సదరు యువకులు కత్తితో దాడిచేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన వెంకటేశ్వరపురంలో చోటుచేసుకుంది. పోలీసులు, సేకరించిన సమాచారం మేరకు.. ఫూటుగా మద్యం సేవించిన ఇద్దరు యువకులు బైక్పై వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ చివర(పడుగుపాడు వైపు) నుంచి వెంకటేశ్వరపురం వైపు రాంగ్రూట్లో బయలుదేరారు. రోడ్డుపైనున్న స్పీడ్బ్రేకర్లను ఎక్కించే క్రమంలో బైక్ అదుపుతప్పడంతో యువకులు కిందపడ్డారు. వెనుక బైక్లో వస్తున్న వెంకటేశ్వరపురానికి చెందిన షేక్.బాబు గమనించి తన బైక్ను పక్కనే నిలిపి యువకులను లేపే ప్రయత్నం చేయగా వారు అతనిపై కత్తితో దాడిచేశారు. దీంతో బాబు కాలికి గాయమైంది. స్థానికులు యువకులను అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని సైతం కత్తితో వీరంగం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెప్పినా? కేసులు పెట్టినా చంపేస్తామని బెదిరిస్తూ యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నవాబుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాంకేతికత ఆధారంగా నిందితులు జనార్ధనరెడ్డి కాలనీ వారని తేలడంతో గాలిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరారు. -
టీడీపీ నేతలతో చెప్పించండి
● పైసలిస్తేనే పని ● దళిత రైతును ఇబ్బంది పెడుతున్న ఏపీఓ అనుమసముద్రంపేట: ‘పైసలిస్తేనే పని జరుగుతుంది. కార్యాలయం చుట్టూ తిరగొద్దు. టీడీపీ నాయకుల చేత చెప్పించండి’ ఇది ఎవరో అన్న మాటలు కాదు. ఓ ప్రభుత్వ ఉద్యోగి దళిత రైతుని వేధిస్తున్న వైనమిది. బాధితుడు పిడుగు మాలకొండయ్య వివరాల మేరకు.. ఏఎస్పేట మండలం చిన్నఅబ్బీపురం గ్రామంలో ఆయనకు నాలుగు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల పెంపకానికి నిధులు మంజూరు చేయమని గత నాలుగు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయితే మంజూరు చేయకపోగా ఎకరాకు రూ.7 వేలు డిమాండ్ చేశాడు. అంతేగాక పైఅధికారులు వచ్చినప్పుడు పెట్రోల్ ఖర్చులతో పాటు మధ్యాహ్న భోజనం పెట్టించాలని, దీనికితోడు టీడీపీ నాయకుల చేత సిఫార్సు చేయించుకోవాలని ఆ దళిత రైతుకు ఏఎస్పేట ఏపీఓ శ్రీనివాసరావు తెలిపారు. దీంతో రైతు మాలకొండయ్య 15 రోజుల క్రితం నెల్లూరులోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్కు సైతం అర్జీ ఇచ్చారు. అయినప్పటికీ ఫలితం లేదని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు ఇప్పటికై నా స్పందించి పండ్ల తోటల పెంపకానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. -
జిల్లాల మధ్య జల వివాదం తీసుకురావొద్దు
● సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘జిల్లాల విభజనతో జల వివాదం తీసుకురావొద్దు. ఇక్కడి పలు ప్రాంతాలను తిరుపతి జిల్లాలో కలిపేందుకు చేస్తున్న ప్రక్రియను వెంటనే ఆపివేయాలి’ అని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ డిమాండ్ చేశారు. నెల్లూరులోని బాలాజీ నగర్లో ఉన్న ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని చంద్రబాబు, లోకేశ్ ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. శ్రీహరికోట, శ్రీసిటీ, సిలికా, మైకా గనులు తిరుపతి జిల్లాకు వెళ్లిపోవడం జరిగిందన్నారు. కండలేరు జలాశయాన్ని తిరుపతి జిల్లాలో కలిపితే జల వివాదాలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను గూడూరు రెవెన్యూ డివిజన్లో కలిపే ప్రతిపాదనలను ప్రభుత్వం వెంటనే విరమించాలని డిమాండ్ చేశారు. గూడూరును నెల్లూరు జిల్లాలో ఉంచాలని ఇప్పటికే ఆ ప్రాంత ప్రజలు ఆందోళనలు చేస్తున్నారన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెకంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య, సీఐటీయూ నాయకురాలు రెహానా బేగం పాల్గొన్నారు. -
పొలం పనులకు వెళ్లగా..
● పాముకాటుకు వ్యక్తి మృతి జలదంకి (కలిగిరి): జలదంకి మండలం జమ్మలపాళెం గ్రామం కొత్త ఎస్సీ కాలనీకి చెందిన మైనంపాటి రాజశేఖర్ (42) మంగళవారం పాముకాటుతో మృతిచెందాడు. మృతుడి బంధువుల కథనం మేరకు.. రాజశేఖర్ కూలీ పనుల నిమిత్తం పొలానికి వెళ్లగా పాము కాటు వేసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రాజశేఖర్ను చికిత్స నిమిత్తం కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. రాజశేఖర్కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. జలదంకి పోలీసులు కేసు నమోదు చేశారు. -
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
● డీఎంహెచ్ఓ సుజాత నెల్లూరు(అర్బన్): జిల్లాలోని స్కానింగ్ సెంటర్ల యాజమాన్యాలు లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ సుజాత హెచ్చరించారు. నెల్లూరు సంతపేటలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో మంగళవారం గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం సలహా సంఘ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. వైద్యుల రెఫరల్ స్లిప్పులు తీసుకుని స్కానింగ్ చేసి వాటి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. గర్భిణులకు కాకుండా ఇతరులకు చేసే స్కానింగ్ వివరాలను వేరొక రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ చైర్మన్ డాక్టర్ సీహెచ్ కిరణ్, సభ్యులు అనాటమీ అసోయేట్ ప్రొఫెసర్ డా.స్వర్ణలతా రెడ్డి, పీడియాట్రిషన్ డా.నానాజిరావు, డీఐఓ డా.ఉమామహేశ్వరి, డెమో అధికారి కనకరత్నం, ఎన్జీఓ నేతలు కవితారెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. జిల్లా జడ్జిగా ఎంపికనెల్లూరు (లీగల్): నెల్లూరు నగరానికి చెందిన తిరువళ్లూరు ప్రతిమ జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఈమె 2003లో న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. 2020లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎంపికై పర్చూరులో విధులు నిర్వర్తించారు. 2023లో నెల్లూరు మొబైల్ ప్రత్యేక కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. ఇటీవల ఏపీ హైకోర్టు నిర్వహించిన జిల్లా జడ్జి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ప్రతిమను పలువురు న్యాయవాదులు అభినందించారు.8 సవర్ల బంగారు నగల మాయంనెల్లూరు(క్రైమ్): బీరువాలోని నగలు మాయమైన ఘటనపై చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. మూలాపేట ఈఎస్ఆర్ఎం స్కూల్ సమీపంలో నిషాద్ కుటుంబం నివాసం ఉంటోంది. గతనెల 15వ తేదీ ఆమె బీరువాలోని ఎనిమిది సవర్ల బంగారు నగలు కనిపించలేదు. జరిగిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వారితో కలిసి మంగళవారం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటికి సమీపంలో నివాసం ఉంటున్న ఓ మహిళపై అనుమానం ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విశ్వంలో ఉచిత నవోదయ మోడల్ టెస్ట్తిరుపతి సిటీ: స్థానిక వరదరాజ నగర్లోని విశ్వం విద్యాసంస్థల్లో గురువారం ఉదయం 10 గంటలకు జవహర్ నవోదయ విద్యాలయ – 2026 పరీక్షకు సంబంధించి ఉచిత మోడల్ టెస్ట్ జరుగుతుందని ఆ విద్యాసంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి మంగళవారం తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఈనెల 13వ తేదీన నిర్వహించే ప్రవేశ పరీక్షకు అనుగుణంగా ఈ నమూనా ఎగ్జామ్ జరుగుతుందన్నారు. ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా పరీక్ష రాయొచ్చన్నారు. విద్యార్థులు హాల్టికెట్ (అడ్మిట్ కార్డు) జెరాక్స్ కాపీని తీసుకురావాలన్నారు. వివరాలకు 86888 88802, 93999 76999 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. డ్రెయిన్లో మృతదేహంముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని బ్రహ్మదేవం గ్రామ బుడ్డీ డ్రెయిన్ శుభ్రం చేస్తుండగా మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. సుమారు 40 నుంచి 45 సంవత్సరాల వయసు ఉంటుందని భావిస్తున్నారు. ఐదురోజుల క్రితం నీటిలో మునిగి మృతిచెందినట్టు భావిస్తున్నారు. పోలీసులు వివరాలు సేకరించారు. -
సమస్యల జాతర
నెల్లూరు (అర్బన్): జిల్లాకే రెఫరల్ ఆస్పత్రిగా ఉన్న దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి పేరు గొప్ప.. ఊరు దిబ్బ అనేలా తయారైంది . 750 పడకలున్న పెద్దాస్పత్రికి అసౌకర్యాల సుస్తీ చేసింది. నిధులున్నా రోగులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. పాలనాధికారి పట్టించుకోకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. స్పెషలిస్టు డాక్టర్లున్నా.. నగరంలో బోధనాస్పత్రిగా ఉన్న ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నైపుణ్యం కలిగిన స్పెషలిస్టు వైద్యులున్నారు. అన్ని రకాల సాధారణ వైద్యసేవలతో పాటు ఈఎన్టీ, పల్మనాలజీ, సైకియాట్రీ, సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థో, గైనిక్, పురిటి పిల్లలు, న్యూరాలజీ, యూరాలజీ, కేన్సర్, గుండె తదితర సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయి. నాణ్యమైన భవనాలు, విశాలమైన వార్డులున్నాయి. ఆధునిక మాడ్యులేటర్ ఆపరేషన్ థియేటర్లున్నాయి. రోజూ సరాసరిన ఓపీ 1,200 నుంచి 1,400 వరకు, ఇన్పేషెంట్లు 500 మంది వరకు ఉంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోక పోవడంతో రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదు. ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉరుస్తున్న ఓపీ గదులు గైనకాలజీ విభాగం వద్ద ఓపీ రోగుల కోసం మూడు నెలల క్రితం రూ.19 లక్షలు ఖర్చు చేసి రేకులతో రెండు గదులు నిర్మించారు. అయితే ఈ నిర్మాణంలో ఎంత కమీషన్లు తిన్నారో తెలియదు గానీ చినుకు పడితే చాలు ఉరుస్తున్నాయి. దీంతో వర్షాలు పడే సమయంలో డాక్టర్లు బయటకు వచ్చేస్తున్నారు. ఉక్కపోతలో ఆపరేషన్లు పెద్దాస్పత్రిలో అధునాతన మాడ్యులేట్ ఆపరేషన్ థియేటర్లు నిర్మించారు. అందులో ఏసీలు చాలా కాలంగా పని చేయడం లేదు. దీంతో డాక్టర్లు ఉక్కపోత మధ్యనే ఆపరేషన్లు చేస్తున్నారు. విద్యుత్ సరఫరా ఆగిపోతే నరకం చూస్తున్నారు. రోగులకు ఇక్కట్లు ఆస్పత్రిలో నడవలేని రోగులు వైద్యం కోసం వస్తే వీల్చైర్ దొరకడం గగనమవుతోంది. ఒక్కోదఫా గంటకు పైగా వెతికి స్టాఫ్ను బతిమాలాడుకుంటే తప్ప వీల్చైర్ దొరకడం లేదు. స్ట్రెచర్లదీ అదే పరిస్థితి. ఓ వైపు వీల్చైర్లు, స్ట్రెచర్ల కొరత వెంటాడుతుంటే ఉన్న వాటిని పలువురు సిబ్బంది ఆస్పత్రి దుప్పట్లు, రికార్డులు, ఇతర పనులకు వినియోగిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది కారణంగా.. ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సీనియర్ స్టాఫ్ను కాదని అవుట్ సోర్సింగ్ విభాగం వారిని నియమించారు. దీంతో పనులు సక్రమంగా జరగడం లేదు. పలు బిల్లులు ఆగిపోతున్నాయి. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు, మెడికల్ బోర్డుకు వచ్చే కేసుల రికార్డులు సకాలంలో పంపాలంటే సదరు సిబ్బంది భారీ స్థాయిలో లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆరునెలల క్రితం ఓ మహిళా చిరుద్యోగి అనారోగ్యంతో తాను ఉద్యోగం చేసే స్థితిలో లేనందున సర్టిఫికెట్ ఇవ్వాలని మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకుంది. అలా సర్టిఫికెట్ ఇస్తే తనను అన్ఫిట్గా భావించి బిడ్డకు ఉద్యోగం వస్తుందని ఆమె ఆశ పడింది. అధికార పార్టీకి చెందిన నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో కూడా సిఫార్సు చేయించింది. అయినప్పటికీ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆ ఫైల్ను కదిలించేందుకు రూ.70 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆమె చేసేదేమీ లేక డబ్బులిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసులురెడ్డి అప్పటి సూపరింటెండెంట్ సిద్ధానాయక్పై ఆగ్రహం వ్యక్తం చేయగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి తిరిగి నగదును బాధితురాలికి ఇచ్చారు. రెగ్యులర్ సిబ్బందిని కాదని అలాంటి వారిని కీలక పోస్టుల్లో నియమించడంతో ఈ పరిస్థితి నెలకొంది. కొత్త సూపరింటెండెంట్ వచ్చినప్పటికీ లోపాలు సరిచేయలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పరిస్థితులు చక్కదిద్దాలని రోగులు కోరుతున్నారు. ఆస్పత్రిలో సమస్యలు తిష్ట వేశాయి. ఒకటో నంబర్ వద్ద వందలాది మంది ఓపీలు తీసుకుంటారు. దాని పక్కనే మరుగుదొడ్డి ఉంది. అందులో మొదట పురుషులు, ఆ తరువాత సీ్త్రలకు గదులున్నాయి. అయితే రెండింటికీ ఒకే ద్వారం ఉండటంతో సీ్త్రలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక రోగి కాపలా ఉంటే మరొకరు లోపలకు వెళ్లాల్సి వస్తోంది. ఒక్క మహిళే వచ్చినప్పుడు వారి బాధ వర్ణనాతీతం. మరోవైపు బాత్రూములను ఉదయం ఒక్కసారే శుభ్రం చేస్తున్నారు. ఆ తరువాత పట్టించుకోవడం లేదు. వందలాది మంది వినియోగిస్తుండడంతో ఓపీ వరకు దుర్గంధం వెదజల్లుతోంది. అలాగే వార్డుల్లోని మరుగుదొడ్లను సక్రమంగా శుభ్రం చేయకపోతుండడంతో దుర్వాసనను భరించలేక రోగులు వైద్యం వద్దు దేవుడా అటూ డిశ్చార్జి చేయించుకుని వెళ్లిపోతున్నారు. ఇలాంటి అనుభవం ఏకంగా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ (హెచ్డీఎస్) సభ్యుడి భార్యకే ఎదురైంది. అయినా హెచ్డీఎస్ కమిటీ సభ్యులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు.సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాం ఆస్పత్రిలో బాత్రూములు, లిఫ్ట్లు, అడ్మినిస్ట్రేషన్లో జరిగే లోపాలను సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి దృష్టికి తీసుకెళ్లాం. ఆమె సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారు. మిగతా వాటిని కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. –మడపర్తి శ్రీనివాసులు, పెద్దాస్పత్రి అభివృద్ధి కమిటీ కో ఆర్డినేటర్ ఓపీ వద్ద సీ్త్ర, పురుషులకు ఒకే బాత్రూమ్ పని చేయని లిఫ్ట్లు ఏసీల్లేక ఉక్కపోతలో ఆపరేషన్లు చేస్తున్న వైద్యులు రూ.19 లక్షలతో ఎంసీహెచ్ మహిళా ఓపీ గదుల నిర్మాణం మూడు నెలలకే ఉరుస్తున్న వైనం పట్టించుకోని అధికారులు -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
నెల్లూరు(స్టోన్హౌస్పేట): చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీలో ఈ నెల 12 నుంచి 15 వరకు నిర్వహించనున్న ఆట్యాపాట్యా నేషనల్స్ జూనియర్స్ చాంపియన్షిప్కు నెల్లూరులోని ఎమ్మెస్సెమ్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ తెలిపారు. పాఠశాలలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రిషిత, వైష్ణవిని అభినందించిన అనంతరం ఆయన మాట్లాడారు. పిడుగురాళ్లలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా బాలికల జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకాన్ని సాధించారని వివరించారు. పీడీ అజయ్కుమార్, పీఈటీ రేష్మా తదితరులను అభినందించారు. -
రెండు కార్ల బోల్తా
● ఐదుగురు టీచర్లకు తీవ్ర గాయాలు వలేటివారిపాళెం: రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని బోల్తా పడి ఐదుగురు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వలేటివారిపాళెంలోని హెరిటేజ్ పాల కేంద్రం సమీపంలో మంగళవారం ఉదయం 9 గంటలకు జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కందుకూరులో నివాసం ఉంటున్న ఐదుగురు టీచర్లు వలేటివారిపాళెం ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. వారు స్కూల్కు కారులో బయలుదేరారు. మండలంలోని నూకవరం గ్రామానికి చెందిన మరో కారు అతివేగంగా వచ్చి టీచర్లు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు రోడ్డు పక్కన ఉన్న మామిడి తోటలో బోల్తా పడ్డాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన టీచర్లను కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. పాఠశాల పీడీ ఐజాక్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై మదిరినాయుడు తెలిపారు. -
కోటి సంతకాల సేకరణ విజయవంతం
నెల్లూరు సిటీ: కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జిల్లాలో విజయవంతమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది, కందుకూరు నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నియోజకవర్గ ఇన్చార్జీల ఆధ్వర్యంలో మహాయజ్ఞంలా సాగిందని చెప్పారు. తాము సేకరించిన సంతకాలను నియోజకవర్గ కేంద్రాల నుంచి పార్టీ జిల్లా కార్యాలయానికి ఊరేగింపుగా బుధవారం తీసుకురానున్నామని వెల్లడించారు. ప్రతులను గాంధీబొమ్మ సెంటర్ నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ముగింపు సభను 15న నిర్వహించనున్నామని చెప్పారు. కోటి సంతకాలను గవర్నర్కు జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో 17న అందజేయనున్నామని ప్రకటించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు సైతం తమతో కలిపి నడిచాయన్నారు. కరుడుగట్టిన టీడీపీ మద్దతుదారులూ ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు తెలిపారని వివరించారు. కార్యక్రమం విజయవంతం కావడంతో చంద్రబాబు, నేతలకు కడుపు మండిపోతోందని చెప్పారు. ఇండిగో వ్యవహారంలో వార్ రూమ్ నిర్వహించామని చెప్పుకొని టీడీపీ నవ్వులపాలైందని ఎద్దేవా చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు. అనుకున్న దానికంటే ఎక్కువ సంతకాలను సేకరించామని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతుల పేరుతో సోమిరెడ్డి దోపిడీ
పొదలకూరు: రైతుల పేరుతో దోపిడీకి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పాల్పడుతున్నారని.. మోంథా, దిత్వా తుఫాన్లను అడ్డుపెట్టుకొని ప్రభుత్వ నిధులను భారీగా స్వాహా చేసేందుకు స్కెచ్ వేశారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. మండలంలోని పులికల్లు సమీపంలో కండలేరు స్పిల్వే కాలువ పనులు, నిమ్మ తోటలను మంగళవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎస్డీఎమ్మెఫ్, ఓ అండ్ ఎం కింద నిధులను ఒకే ఏడాదిలో మంజూరు చేయించుకొని పనులు చేయకుండానే దొంగ బిల్లులు సృష్టించారని ధ్వజమెత్తారు. కొత్తగా అవే పనులకు ఎఫ్డీఆర్ కింద నిధులు మంజూరు చేయించుకొని రూ.16.9 కోట్లను కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం చేశారని ధ్వజమెత్తారు. జిల్లా చరిత్రలో ఇలా ఇరిగేషన్ తాత్కాలిక పనుల కోసం ఇంత పెద్ద మొత్తంలో రూ.93.27 కోట్లను గతంలో మంజూరు చేయలేదని చెప్పారు. కలెక్టర్ను అధికార పార్టీ నేతలు తప్పుదారి పట్టించారో.. లేక ఒత్తిళ్లకు ఆయన లొంగి పనులు మంజూరు చేశారో అర్థంకావడం లేదన్నారు. విచారణ జరిపితే జైలుకెళ్లడం ఖాయం ఇరిగేషన్ పనులపై విచారణ నిర్వహిస్తే సోమిరెడ్డితో పాటు ఆ శాఖ అధికారులు జైలుకెళ్లడం ఖాయమని కాకాణి చెప్పారు. తమ హయాంలో అవినీతి జరిగిందని సోమిరెడ్డి పదేపదే అంటున్నారని, ఇరిగేషన్ పనులపై బహిరంగ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. కండలేరు స్పిల్వే పనుల కోసం తండ్రీకొడుకు హడావుడి చేశారని, కాలువ తవ్వించి 100 క్యూసెక్కులను సైతం విడుదల చేయలేదన్నారు. ప్రభుత్వ సొమ్ముపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని, ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని ఇరిగేషన్ అధికారులివ్వడంలేదని ఆరోపించారు. నష్టాన్ని అంచనా వేయాలి దిత్వా తుఫాన్తో జిల్లాలో రైతులకు జరిగిన నష్టంపై వెంటనే అంచనాలేయాలని డిమాండ్ చేశారు. వీరిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. వరి పండించొద్దంటూ సీఎం మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ప్రాంతంలో నిమ్మ రైతులు నిలువునా నష్టపోయారని, తోటల్లో నీరు చేరి ఇప్పటికీ అలాగే ఉందని తెలిపారు. వర్షాలు తగ్గి వారమవుతున్నా, అంచనాలేసేందుకు అధికారులు రాలేదని చెప్పారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా యూరియాపై చంద్రబాబు సర్కార్ ఆంక్షలు విధించి కార్డులను అందజేస్తోందని ధ్వజమెత్తారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని, విత్తనాలను ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి గోగిరెడ్డి గోపాల్రెడ్డి, నేతలు ఎనిమిరెడ్డి పెంచలరెడ్డి, యాతం పెంచలరెడ్డి, నారాయణరెడ్డి, రామిరెడ్డి, రావుల ఇంద్రసేన్గౌడ్, పోలంరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, శేఖర్రెడ్డి, కోడూరు జనార్దన్రెడ్డి, సుందరయ్య, జనార్దన్, కోటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లిలో రూ.16.9 కోట్ల స్వాహాకు స్కెచ్ ఒకే ఏడాదిలో పలు పద్దుల కింద పనులు దోచుకునేందుకే తుఫాన్ సమయంలో హడావుడి ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి -
నైపుణ్య పెంపుతో ఉపాధి అవకాశాలు
కొడవలూరు: నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలను పొందొచ్చని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మండలంలోని వెంకన్నపురంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని దక్షిణ భాగం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందని, ఉత్తర భాగం అత్యంత వేగంగా డెవలప్ కానుందని వెల్లడించారు. రామాయపట్నం పోర్టు, దగదర్తి ఎయిర్పోర్టు, ఇఫ్కో కిసాన్ సెజ్లో పరిశ్రమలు భారీగా రానున్నాయని, వీటి ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని వెల్లడించారు. వెంకన్నపురంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనున్న క్రమంలో నైపుణ్యాలను పెంచుకొని ఉద్యోగావకాశాలను పొందాలని సూచించారు. వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని గణనీయంగా తగ్గించాలని కోరారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రాష్ట్ర చైర్మన్ కృష్ణయ్య, వ్యవసాయ శాఖ జేడీ సత్యవాణి, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, డీఎల్డీఓ వసుమతి, తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డి, ఎంపీడీఓ వెంకటసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం రేపు నెల్లూరు(దర్గామిట్ట): జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్.. మాన్యువల్ స్కావెంజర్స్ కమిటీల సమావేశాలను కలెక్టర్ అధ్యక్షతన గురువారం ఉదయం నిర్వహించనున్నామని ఎస్సీ సంక్షేమ జిల్లా సాధికారిత అధికారి శోభారాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించనున్న కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. -
కరకట్టల పటిష్టతకు ప్రతిపాదనలు
సంగం: జిల్లాలోని పెన్నా పరీవాహక ప్రాంతాల్లో కరకట్టల పటిష్టత, నిర్మాణం కోసం రూ.530 కోట్లతో ప్రతిపాదనలను పంపామని ఇరిగేషన్ ఎస్ఈ దేశ్నాయక్ తెలిపారు. సంగం బ్యారేజీ సమీపంలోని పొర్లుకట్టలను మంగళవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. సెంట్రల్ డివిజన్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు రూ.50 కోట్ల ఎఫ్డీఆర్ నిధులు మంజూరయ్యాయని, పనులను త్వరలో చేపట్టనున్నామని వెల్లడించారు. లష్కర్లకు జీతాలు ఆగి ఉన్నాయనే విషయం తెలిసిందన్నారు. వరదలతో పొర్లుకట్టతో పాటు ఇసుక దిబ్బ కోతకు గురవుతోందని రైతులు తెలియజేశారని, దీని పటిష్టానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. తహసీల్దార్ సోమ్లానాయక్, డీఈ పెంచలయ్య, ఏఈ వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
తీరుమారాలి.. లేదంటే బడితపూజే
● యువకులకు పోలీసుల కౌన్సెలింగ్ ● ముమ్మరంగా తనిఖీలు నెల్లూరు(క్రైమ్): రాత్రి వేళల్లో అకారణంగా రోడ్లపై ఉండి మాట్లాడుకోవడం, మద్యం మత్తులో వాహనాల్లో చక్కర్లు కొట్టడం, పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం, బహిరంగంగా మద్యం తాగితే సహించేది లేదు. తీరుమారాలి. లేనిపక్షంలో లాఠీ దెబ్బలు తప్పవని పోలీసు అధికారులు యువకులను హెచ్చరిస్తున్నారు. రెండు రోజులుగా పోలీసు అధికారులు రాత్రి వేళల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. అకారణంగా రోడ్లపై తిరుగుతున్న యువకులకు తమదైన శైలిలో కౌన్సెలింగ్ చేశారు. బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై 59 కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్పై 45 కేసులు నమోదు చేశారు. నిబంధనలు పాటించని వాహనదారులపై ఎంవీ యాక్ట్ కింద 231 కేసులు నమోదు చేసి రూ.1,42,035ల జరిమానా విధించారు. పోలీస్ చర్యలతో రాత్రి రోడ్లపై తిరగాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. నెల్లూరు నగరంలో.. నగరంలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు జరిగాయి. బహిరంగంగా మద్యం తాగడంపై నాలుగు, డ్రంక్ అండ్ డ్రైవ్పై ఆరు కేసులు నమోదు చేశారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లను నిర్ణీత వేళల్లో మూయించి వేశారు. డ్రైవ్లో నెల్లూరు నగర ఇన్చార్జి, రూరల్ డీఎస్పీలు ఎం.గిరిధర్, ఘట్టమనేని శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, జి.వేణుగోపాల్రెడ్డి, వైవీ సోమయ్య, బి.కల్యాణరాజు, కె.శ్రీనివాసరావు, కె.సాంబశివరావు, ఏఆర్, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు. -
నూరు శాతం రికవరీలు సాధించాలి
నెల్లూరు(పొగతోట): బ్యాంక్ లింకేజీ, సీ్త్ర నిధి, ఉన్నతి రుణాల రికవరీలను నూరు శాతం సాధించాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి సూచించారు. నగరంలోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జిల్లా సమాఖ్య కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. వివిధ మండలాల్లో రికవరీల శాతం తక్కువగా ఉందని, దీనిపై దృష్టి సారించాలని సూచించారు. సంఘ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ.. తప్పులను సవరించుకుంటూ ముందుకుసాగాలని చెప్పారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బుక్ కీపింగ్ను సక్రమంగా నిర్వహించాలన్నారు. వెంకటాచలంలో మగ్గం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఇక్కడ 30 మందికి శిక్షణిచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. మిల్లెట్స్ వంటకాలపై కావలి మండలంలో శిక్షణ కార్యక్రమాలను త్వరలో నిర్వహించనున్నామని వెల్లడించారు. పండ్ల తోటలు సాగుచేసే సభ్యులు సోలార్ డ్రయర్లను ఉపయోగించుకొని అధిక అదాయాన్ని పొందొచ్చన్నారు. డీపీఎంలు మురళి, మధుసూదన్రావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. టెట్కు పక్కాగా ఏర్పాట్లు నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో బుధవారం నుంచి ఈ నెల 21 వరకు నిర్వహించనున్న టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)కు ఏర్పాట్లను పక్కాగా చేయాలని డీఆర్వో విజయకుమార్ పేర్కొన్నారు. టెట్ నిర్వహణపై కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆర్డీఓ అనూషతో కలిసి మంగళవారం నిర్వహించిన పరీక్షల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఆరు కేంద్రాల్లో నిర్వహించనున్న పరీక్షలకు 10,645 మంది హాజరుకానున్నారని వెల్లడించారు. మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. డీఈఓ బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు. లైంగిక దాడి కేసులో వృద్ధుడికి 20 ఏళ్ల జైలు నెల్లూరు (లీగల్): ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని నమోదైన కేసులో కోవూరు మండలం పాటూరుకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు రాయదుర్గం వెంకటేశ్వర్లుకు ఇరవై ఏళ్ల జైలు, రూ.25 వేల జరిమానాను విధిస్తూ నెల్లూరు ఎనిమిదో అదనపు జిల్లా (పోక్సో) కోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. పాటూరులోని కామాక్షమ్మ కాలనీలో వెంకటేశ్వర్లు.. బాలిక నివాసం ఉంటున్నాడు. ఈ తరుణంలో 2021, ఏప్రిల్ 21న బేల్దారి పనులకు బాలిక తండ్రి వెళ్లారు. ఇంటి పనుల్లో తల్లి ఉండగా, ఉదయం పది గంటల సమయంలో వీధిలో బాలిక ఆడుకోసాగింది. ఈ తరుణంలో రూపాయిచ్చి.. మిఠాయి కొనిస్తానని మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి బాలికపై వెంకటేశ్వర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుడి వికృత చేష్టలకు భయపడిన బాలిక విషయాన్ని తల్లికి చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు నెల్లూరు దిశ పోలీసులు కేసు నమోదు చేసిన అనంతరం వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ను దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో పైమేరకు శిక్ష, జరిమానాను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పీపీ దూబిశెట్టి చంద్రశేఖర్ వాదించారు. సోలార్ ప్లాంట్కు స్టాంప్ డ్యూటీ మినహాయింపు సాక్షి, అమరావతి: జిల్లాలోని కరేడులో ఏర్పాటు చేయనున్న సోలార్ పీవీ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్కు ప్రభుత్వం రూ.14 కోట్లకుపైగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుపై మినహాయింపునిచ్చింది. ఏపీఐఐసీ ద్వారా సూర్యచక్ర డెవలపర్స్కు బదలాయించే భూముల రిజిస్ట్రేషన్ వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఎనిమిది వేల ఎకరాల్లో ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారని తెలిపింది. -
రవాణా వాహన యజమానుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే చందంగా మారింది. డీజిల్, టైర్లు, ఇన్సురెన్స్, విడిభాగాల ధరలు పెరుగుతుండటంతో దిక్కుతోచక విలవిల్లాడుతున్న వీరిపై తాజాగా ఫిట్నెస్ పిడుగు పడింది. ఈ రేట్లను భారీగా పెంచిన కేంద్ర ప్రభుత్వం, ఆ నిర్ణ
నెల్లూరు(టౌన్): రవాణా వాహనాలకు బాడుగలు కరువై యజమానులకు దిక్కుతోచడంలేదు. అరకొరగా లభిస్తున్నా, పోటీతత్వంతో పదేళ్ల క్రితం ఉన్న కిరాయితోనే కాలాన్ని సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవి చాలదన్నట్లు డీజిల్, ఇన్సురెన్స్, టైర్లు, వాహన విడిభాగాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వీటిని మోయలేకే సతమతమవుతున్న ఓనర్లపై ఫిట్నెస్ చార్జీల భారం గుదిబండలా మారింది. వాహన కాలపరిమితి 15 ఏళ్లు దాటితే ఒకలా.. 20 ఏళ్లు దాటితే మరో తరహాలో అనే విధంగా చార్జీలను పెంచేశారు. ఫిట్నెస్ లేకుండా తిరుగుతూ, రవాణా అధికారుల కంటపడితే భారీగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిణామాల క్రమంలో కాలం చెల్లిన వాహనాలను మూలనపడేసే పరిస్ధితి నెలకొనే అవకాశముందని యజమానులు పేర్కొంటున్నారు. తమ బాధలను పరిణగనలోకి తీసుకొని ఆదుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో ఐదు లక్షల వాహనాలు జిల్లాలో వాహనాలు ఐదు లక్షలకుపైగా ఉన్నాయని రవాణా అధికారులు చెప్తున్నారు. వీటిలో ట్రాన్స్పోర్టుకు చెందినవి 1.2 లక్షలు కాగా బైకులు, కార్లు 3.10 లక్షలకుపైగా ఉన్నాయి. ఆటోలు 20,174.. గూడ్స్ క్యారియర్లు 14,500.. వ్యవసాయ ట్రాక్టర్లు 12,284.. వాణిజ్య ట్రాక్టర్లు 3900.. లారీలు 12 వేలు.. మిగిలినవి సీసీ, స్కూల్ బస్సులు, లగ్జరీ క్యాబ్లు, మొబైల్ క్లినిక్లు, మ్యాక్సీ, మోటార్ క్యాబ్లు తదితరాలున్నాయి. కాలం చెల్లిన వాహ నాలపై టెస్టింగ్, సర్టిఫికేషన్ ఫీజులతో పాటు జీఎస్టీ చార్జీలనూ మోపారు. వాహనాలు – ఐదు లక్షలకుపైగా.. ట్రాన్స్పోర్టు వాహనాలు – 1.2 లక్షలు కాలం చెల్లిన వాహనాలపై అధిక భారం గతంతో పోలిస్తే రెండు నుంచి మూడు రెట్ల మోత పెంపు నిర్ణయంపై ప్రభుత్వాల బంతాట ట్రాన్స్పోర్టు వెహికల్స్ను తిప్పలేమంటున్న యజమానులు డీజిల్, టైర్లు, ఇన్సురెన్స్, విడిభాగాల ధరలు ౖపైపెకి సమ్మెకు సన్నద్ధమవుతున్న ఓనర్లు పెరిగిందిలా.. జిల్లాలో ఇలా.. చార్జీలను తగ్గించాలి రవాణా వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్ చార్జీలను భారీగా పెంచారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కలవగా, పెంపు తమ పరిధిలో లేదని చెప్తున్నారు. ప్రస్తుతం రవాణా వాహనాలను తిప్పే పరిస్థితి లేదు. బాడుగలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. కొత్త వెహికల్స్ను కొనుగోలు చేసే అవకాశమూ లేదు. మా బాధలను అర్థం చేసుకోవాలి. – నారాయణ, జిల్లా సెక్రటరీ, లారీ యజమానుల సంఘం -
నేరాల కట్టడికి పటిష్ట చర్యలు
నెల్లూరు(క్రైమ్): నేరాల కట్టడి, శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశించారు. నగరంలోని వేదాయపాళెం, నెల్లూరు రూరల్తో పాటు పొదలకూరు, రాపూరు పోలీస్స్టేషన్లను ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, పాతనేరస్తులు, పెండింగ్ కేసులు, నేర నియంత్రణకు చేపడుతున్న చర్యలు తదితరాలపై ఆరాతీశారు. రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసుల పరిష్కారానికి సూచనలిచ్చారు. ఇటీవల జరిగిన పలు కేసులకు సంబంధించిన వివరాలను ఆరాతీశారు. ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. నేరాలకు తరచూ పాల్పడే యాక్టివ్ రౌడీషీటర్లపై పీడీ యాక్ట్లను నమోదు చేయాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని, అక్రమార్కులపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎస్పీ అజిత వేజెండ్ల తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు రైతులపై కనికరం లేదు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి తోటపల్లిగూడూరు: దిత్వా తుపానుతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయినా చంద్రబాబు ఏ మాత్రం కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నాడని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. మండలంలోని పాపిరెడ్డిపాళెంలో సోమ వారం ఆయన పర్యటించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న నారుమళ్లు, పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ దిత్వా తుపానుతో కురిసిన భారీ వర్షాలకు నాట్లు, నారుమళ్లు దెబ్బతిని జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. అయినా టీడీపీ ప్రభుత్వం రైతులను ఆదుకునే విషయంలో నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందన్నారు. సబ్సిడీ విత్తనాలను అందించే ఆలోచన చేయకపోవడంతో రైతులే నగదు వెచ్చించి కొనుగోలు చేసి మళ్లీ నారుమళ్లను సిద్ధం చేసుకుంటున్నారన్నారు. కనీసం రైతులకు నష్టపరిహారం అందించే దిశగా ఎలాంటి ఆదేశాలు కూడా జారీ చేయకపోవడం దురదృష్టకరమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం రైతులకు యూరియా కార్డులను పంపిణీ చేసి పరిమితి విధించడం దౌర్భాగ్యమన్నారు. రైతులు యూరియా బస్తాను రూ.850 నుంచి రూ.900 వరకు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు, విత్తనాలు, యూరి యా, దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించకుండా టీడీపీ ప్రభుత్వం రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఆర్బీకేల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు ఇంటి ముంగిటకే అందించామన్నారు. వైఎస్సార్ రైతుభరోసా పథకం కింద ఏటా రూ.13,500 వంతున పెట్టుబడి సాయం అందించామని గుర్తుచేశారు. ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తానన్న చంద్రబాబు రెండేళ్లకు గానూ రూ.10వేలు రైతన్న చేతిలో పెట్టి మమ అన్పించాడన్నారు. వర్షాలకు నష్టపోతే సబ్సిడీపై విత్తనాలు, పంటల బీమా సాయాన్ని అందించి జగన్మోహన్రెడ్డి ఆదుకుంటే ప్రచార ఆర్భాటం తప్ప చంద్రబాబు రైతులకు చేసిందేమి లేదన్నారు. రాష్ట్రానికి కోట్ల రూపాయల పెట్టబడులు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఒక్క ఉద్వోగం ఇవ్వలేదన్నారు. నారా లోకే్శ్ రాష్ట్రంలో రైతుల పడుతున్న కష్టాలను పట్టించుకోకుండా విమాన సంస్థ ఇండిగో గురించి మాట్లాడడం చూసి జాతీయ మీడియా ఏకిపారేస్తుందన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డికి అవినీతి సొమ్మును దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ ఓట్లేసి గెలిపించిన ప్రజల మీద లేదన్నారు. అవినీతే పరమావధిగా భావిస్తున్న సోమిరెడ్డిని సర్వేపల్లి ప్రజలు, రైతులు ఎప్పుడో మర్చిపోయారన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు దిత్వా తుపాను నష్టాన్ని అంచనా చేయించి రైతులను ఆదుకోవాలని కాకాణి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యద ర్శి చిల్లకూరు సుఽధీర్రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి ఇసనాక రమేష్రెడ్డి, మండలాధ్యక్షుడు ఉప్పల శంకరయ్యగౌడ్, జెడ్పీటీసీ సభ్యులు ఎంబేటి శేషమ్మ, వైస్ఎంపీపీ చెరుకూరు శ్రీనివాసులనాయుడు పాల్గొన్నారు. -
బొబ్బలపై రౌడీషీట్ను తొలగించాలి
● నగరంలో శాంతిభద్రతలను పరిరక్షించాలి ● ఎస్పీకి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, ఆనం వినతి నెల్లూరు(క్రైమ్): వైఎస్సార్సీపీ నగరాధ్యక్షుడు, కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్యాదవ్పై అన్యాయంగా పెట్టిన రౌడీషీట్ను తొలగించాలని, నెల్లూరు నగరంలో శాంతిభద్రతలను పరిరక్షించాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నగర నియోజకవర్గ సమన్వయకర్త పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి ఎస్పీ అజిత వేజెండ్లను కోరారు. ఈ మేరకు పోలీసు కార్యాలయంలో ఎస్పీకి సోమవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తొలుత ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. నగరంలో పట్టపగలే అల్లరిమూకలు హత్యలకు తెగబడుతున్నారన్నారు. చిన్నచిన్న కారణాలతో క్షణికావేశంలో హత్యలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఆదివారం కొందరు యువకులు సిటీ బస్సుడ్రైవర్, కండక్టర్పై బ్లేడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారన్నారు. నగరంలో శాంతిభద్రతల కోసం వైఎస్సార్సీపీ మొదటి నుంచి పోరాటం చేస్తోందన్నారు. బొబ్బల శ్రీనివాస్యాదవ్పై రాజకీయ కక్షతో రౌడీషీట్ ఓపెన్ చేయడం దారుణమన్నారు. బొబ్బలపై రౌడీషీట్ను తొలగించాలని ఎస్పీని కోరగా స్పందించి న్యాయం చేస్తామన్నారని తెలిపారు. కక్ష పూరితంగా ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఉరుకోబోమన్నారు. ఆనం విజయకుమార్రెడ్డి మాట్లాడుతూ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్గా, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారన్నారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని పరామర్శ నిమిత్తం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరుకు వచ్చిన సందర్భంగా జరిగిన తోపులాటను సాకు గా చూపిస్తూ బొబ్బల శ్రీనివాస్యాదవ్ అక్కడ లేకపోయినా రాజకీయ కక్షతో టీడీపీ నేతలు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రోద్బలంతో దర్గామిట్ట పోలీసుస్టేషన్లో రౌడీషీట్ ఓపెన్ చేశారని ఆరోపించారు. రౌడీషీటర్లను పెంచి పోషిస్తున్న ఆఫీసు, నాయకులెవ్వరన్నది ప్రజలందరికీ తెలిసిన విషయమన్నారు. గతంలో నెల్లూరు రాజకీయాల్లో రౌడీగ్యాంగ్లు, గంజాయి గ్యాంగ్ల ప్రమేయం ఉండేది కాదన్నారు. పదేళ్లుగా దందాలు, సెటిల్మెంట్లు, దౌర్జన్యాలు, కార్యకర్తలను భయపెట్టడం, పార్టీలు మారకుంటే కేసులు పెడుతామని బెదిరించడం ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే జరుగుతున్నాయని ఆరోపించారు. మరే ఇతర నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి లేదన్నారు. పెంచలయ్య హత్యకేసులో నిందితులు ఎవరితో అంటకాగుతున్నారన్న విషయం అందరికీ తెలుసన్నారు. రాజకీయాల్లో గంజాయిబ్యాచ్ లు, రౌడీషీటర్లకు, వారికి సహకరిస్తున్న వ్యక్తులకు తావ్వివొద్దని ప్రజలకు మనవి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్యాదవ్, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వేలూరు ఉమామహేష్, స్టేట్ జాయింట్ సెక్రటరీ బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పునర్విభజనపై నిరసన సెగలు
నెల్లూరు(అర్బన్): జిల్లాల పునర్విభజనపై నిరసన సెగలు రగులుతున్నాయి. కలువాయి, సైదాపురం, రాపూ రు మండలాలను యధాతధంగా నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ ఆయా మండలాల ప్రజలు ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఆందోళనలు చేపడుతున్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్ ఎదుట కలువాయి మండలంతో పాటు కండలేరు పునరావాస కాలనీలకు చెందిన ప్రజలు ప్రజా సంఘాల నేతలతో కలిసి నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కొందరు అర్ధనగ్నంగా కూర్చుని ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ హిమాన్షుశుక్లాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు మిడతల రమేష్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ గూడూరు డివిజన్ను తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. గద్దెనెక్కాక ఆ హామీని మరిచి కలువాయి, సైదాపురం, రాపూరు ప్రాంతాలను కూడా తిరుపతి జిల్లాలో కలుపుతామనడం దుర్మార్గమన్నారు. కండలేరు జలాశయం విభజన మూలంగా నీటి యుద్ధాలు జరుగుతాయన్నారు. సోమశిల ప్రాజెక్టు నీటి వాటా విషయంలో కూడా ఇబ్బందులు వస్తాయన్నారు. కలువాయి నుంచి నెల్లూరుకు 60 కి.మీ దూరం కాగా తిరుపతికి 140 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తుందన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఎవరి కోసమో జిల్లాను విభజిస్తే ఊరుకునేది లేదన్నారు. ఇందుకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. చేనేత ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ బుధవారపు బాలాజీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంటే పవన్కళ్యాణ్ మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. బ్రిటిష్ పాలకుల కన్నా దుర్మార్గంగా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. నాయకులు కందికట్ల రాజేశ్వరి, బైరి శ్రీనివాస్, సుబ్బారెడ్డి, బీసీ సంక్షేమ సంఘ అధ్యక్ష, ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, అనూరాధ, బీసీవై పార్టీ నేతలు హజరత్యాదవ్, గోపాల్, మనోహర్ హింద్, ఆనంద్, నరేష్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు కలువాయి(సైదాపురం): కలువాయి బస్టాండ్ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం రిలే దీక్షలు చేపట్టారు. తొలుత ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతరం ఒంటికాలుపై నిలబడి తమ నిరసనను తెలియజేశారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద దివ్యాంగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోనే కలువాయి మండలాన్ని ఉంచాలని, తిరుపతి జిల్లాలో కలిపితే కలిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. -
నాలుగు కేజీల గంజాయి స్వాధీనం
● నలుగురు రౌడీషీటర్ల అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. మాగుంటలేఅవుట్ రైల్వేట్రాక్ వద్ద, జీజీహెచ్ సమీపంలో గంజాయిని విక్రయించేందుకు తరలిస్తున్న నలుగురు రౌడీషీటర్లను దర్గామిట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు కేజీల గంజాయిని స్వాఽధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం దర్గామిట్ట పోలీసుస్టేషన్లో ఇన్స్పెక్టర్ బీ కళ్యాణరాజు మీడియాకు వెల్లడించారు. టెక్కెమిట్టకు చెందిన ఎం ప్రవీణ్, లేక్వ్యూకాలనీకి చెందిన జే మహేష్, సారాయంగడి సెంటర్కు చెందిన షేక్ ముక్తియార్, షేక్ అబ్దుల్ మజీద్పై దర్గామిట్ట పోలీసుస్టేషన్లో రౌడీషీట్లు ఉన్నాయి. వ్యసనాలకు బానిసైన వీరు ఈజీ మనీకోసం గంజాయి విక్రయాలకు తెరలేపారు. దీనిపై దర్గామిట్ట ఇన్స్పెక్టర్ కళ్యాణరాజుకు పక్కా సమాచారం అందింది. ఆదివారం రాత్రి ఆయన తన సిబ్బందితో కలిసి మాగుంటలేఅవుట్ రైల్వే ట్రాక్ సమీపంలో మహేష్, ప్రవీణ్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జీజీహెచ్ వద్ద ముక్తియార్, అబ్దుల్ మజీద్ను అదుపులోకి తీసుకుని వారి వద్ద మరో రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసి చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయించేందకు వెళ్తున్నామని వెల్లడించారు. దీంతో నిందితులను అరెస్ట్ చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు. ముక్తియార్పై మర్డర్ కేసు ఉందన్నారు. ఎక్కడైనా గంజాయి రవాణా, విక్రయాలు, నిల్వ, సేవనం వంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తిస్తే 94407 96308 లేదా డయల్ 112కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
పునర్విభజన ప్రక్రియపై చర్చ
నెల్లూరు సిటీ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, గూడూ రు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేరిగ మురళీధర్తో నెల్లూరు మాగుంటలేఅవుట్లోని ఆయన నివాసంలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి సోమవారం సమావేశమయ్యారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపే ప్రక్రియపై చర్చించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నాయకులు వీరి చలపతిరావు, కొండూరు అనిల్బాబు, కలువ బాలశంకర్రెడ్డి, తదితరులు ఉన్నారు. రేపట్నుంచి టెట్ పరీక్షలు నెల్లూరు (టౌన్): ఏపీ టెట్–2025 పరీక్షలు బుధవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు జరగనున్నట్లు డీఈఓ బాలాజీరావు సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పొట్టేపాళెం సమీపంలోని ఆయాన్ డిజిటల్ సెంటర్, జై శ్రీరామ్ ఇన్ఫ్రా ఐటీ సొల్యూషన్స్, కావలిలోని విశ్వోదయ, బోగోలులోని ఆర్ఎస్ఆర్, నెల్లూరులోని నారాయణ, కోవూరులోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలల్లో టెట్ పరీక్ష జరుగుతుందని చెప్పారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయని వివరించారు. అభ్యర్థులు గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందవచ్చని తెలిపారు. టెట్ పరీక్షకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్డెస్క్ను 99890 02174, 93910 61007 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 75,343 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,505 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.69 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
పిల్లలు పట్టించుకోవడం లేదు
● వృద్ధుల ఆవేదన ● పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’నెల్లూరు(క్రైమ్): ‘మా పిల్లలు పట్టించుకోవడం లేదు. విచారించి న్యాయం చేయాలి’ అని పలువురు వృద్ధులు కోరారు. నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి 148 మంది తమ సమస్యలపై ఎస్పీ అజితకు వినతిపత్రాలు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె ఆయా ప్రాంత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. చట్టపరిధిలో బాఽధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నెల్లూరు రూరల్ డీఎస్పీ జి.శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ, పీసీఆర్, మహిళా పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్లు డి.వెంకటేశ్వరరావు, బి.శ్రీనివాసరెడ్డి, భక్తవత్సలరెడ్డి, టీవీ సుబ్బారావు, ఫిర్యాదుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● నేను వృద్ధుడిని. ఆస్తి కోసం నా కుమారుడు సునీల్ ఇబ్బంది పెడుతున్నాడు. ఇంట్లోంచి గెంటేసి తాళం వేశాడని కావలికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ● నా జీవనాధారం కోసం ఉన్న పొలాన్ని సాగు చేసుకోనివ్వకుండా కుమారుడు ఏడుకొండలు ఇబ్బంది పెడుతున్నాడు. విచారించి న్యాయం చేయాలని సంగం ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు కోరారు. ● నా కుమారుడు తిరునాళ్లకు వెళ్లి మరణించాడు. టీపీగూడూరు పోలీస్స్టేషన్లో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో నీటిలో మునిగి చనిపోయినట్లు తెలిపారు. నా కుమారుడు చనిపోయిన ప్రాంతాల్లో నీటి గుంతల్లేవు. పూర్తి స్థాయిలో విచారించాలని టీపీగూడూరుకు చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు. ● నెల్లూరు రూరల్ మండలానికి చెందిన హేమంత్ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడు. ఇదేమని ప్రశ్నించినందుకు తన తల్లితో కలిసి నాపై దాడి చేశాడని వేదాయపాళేనికి చెందిన ఓ యువతి ఫిర్యాదు చేశారు. ● అనిల్, మరికొంతమంది నాపై గతంలో దాడి చేశారు. నేనిచ్చిన ఫిర్యాదుపై రాపూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. అయినా వారు నన్ను బెదిరిస్తూ, వేధింపులకు గురిచేస్తున్నారని రాపూరుకు చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. ● నా కుమార్తె గత నెల ఏడో తేదీ నుంచి కనిపించడం లేదు. చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఆమె ఆచూకీ కనుక్కోవాలని చిన్నబజారుకు చెందిన ఓ వ్యక్తి కోరాడు. -
హద్దు మీరితే కఠిన చర్యలు
● రోడ్లపై నిందితులను నడిపించిన పోలీసులు నెల్లూరు(క్రైమ్): శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా హద్దుమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని నగర పోలీసులు హెచ్చరించారు. బస్సు డ్రైవర్ మన్సూర్, సలాంపై బ్లేడ్లతో హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులను సోమవారం రాత్రి సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని గాంధీబొమ్మ నుంచి మద్రాస్ బస్టాండ్ వరకు రోడ్డుపై నడిపించారు. ఇన్స్పెక్టర్ వైవీ సోమయ్య వివరాలను వెల్లడించారు. వేదాయపాళెం గాంధీనగర్కు చెందిన మన్సూర్, ఇందుకూరుపేట మండలం గంగపట్నంకు చెందిన సలాం ఎస్ఎఎస్ ప్రైవేట్ సిటీ బస్సులో డ్రైవర్, కండక్టర్గా పనిచేస్తున్నారు. ఆదివారం సాయంత్రం బస్సు బోసుబొమ్మ వైపు వెళ్తుండగా.. మద్యం మత్తులో యువకులు బాబు ఐస్క్రీమ్ వద్ద రోడ్డుపై అడ్డంగా బైక్ పార్క్ చేసి మాట్లాడుతూ ట్రాఫిక్కు అంతరాయం కల్గించారు. డ్రైవర్ హారన్ కొట్టి అడ్డు తొలగాలని చెప్పారు. దీంతో వారు డ్రైవర్, కండక్టర్లపై దాడి చేయగా వారిద్దరూ బైక్ తాళం తీసుకెళ్లారు. నిందితులు బస్సును వెంబడించి బోసుబొ మ్మ వద్ద అడ్డుకుని బ్లేడ్లతో విచక్షణారహితంగా దాడిచేసి పరారయ్యారు.. బాధితుల ఫిర్యాదుపై సంతపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు సంతపేట గోపిటీ సెంటర్కు చెందిన మదన్ అలియాస్ బాబీ, శ్రీకాంత్, సంతపేట ప్రాంతానికి చెందిన అజయ్, నితిన్, తేజగా గుర్తించి సోమవారం రాత్రి తిక్కనపార్కు సమీపంలోని శివాలయం వద్ద అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, జి.వేణుగోపాల్రెడ్డి, శ్రీనివాసరావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేతల దౌర్జన్యం
● సర్వే చేపట్టిన అధికారులకు బెదిరింపులు ● వెనుదిరిగిన తహసీల్దార్ సాక్షి టాస్క్ఫోర్స్: నగరంలో జరుగుతున్న ఆక్రమణలను గుర్తించి, విచారణ చేపట్టేందుకు వెళ్లిన తహసీల్దార్ను ఆక్రమణదారులు బెదిరించారు. అడ్డగించడంతో చివరకు వెనుదిరిగారు. 54వ డివిజన్ భగత్సింగ్ కాలనీలో కొంతకాలంగా పలువురు టీడీపీ నాయకులు, వారి సానుభూతిపరులు రూ.కోట్ల విలువైన కార్పొరేషన్, ఇరిగేషన్ స్థలాలను ఆక్రమించి కట్టడాలు కట్టి క్రయ, విక్రయాలు చేస్తున్నారని జిల్లా ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులందాయి. దీంతో సోమవారం నెల్లూరు అర్బన్ తహసీల్దార్ షఫీమాలిక్ తన సిబ్బందితో కలిసి కాలనీకి వెళ్లారు. ఆయన, సిబ్బందిని స్థానిక టీడీపీ నాయకులు, వారి సానుభూతిపరులు అడ్డుకున్నారు. గతంలో కూడా సర్వే, విచారణ కోసం వచ్చిన పలు శాఖల అధికారులను కూడా ఇదే విధంగా మహిళల సాయంతో అడ్డగించి బెదిరించిన సందర్భాలున్నాయి. ఈ విషయమై తహసీల్దార్ మాట్లాడుతూ ఆక్రమణలు గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.పొలంలో పడి రైతు మృతిమనుబోలు: రొంపి దుక్కి దున్నిన పొలంలో ప్రమాదవశాత్తూ పడి ఓ రైతు మృతిచెందిన ఘటన మండలంలోని చెరుకుమూడి గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఆలూరు కృష్ణయ్య (60) పొలం గట్టుపై నడిచి వెళ్తూ జారిపడిపోయాడు. ఈ క్రమంలో బోర్లా పడగా ముఖం బురదలో కూరుకుపోయింది. అటుగా వెళుతున్న రైతులు గమనించి చూసేసరికి అప్పటికే ఊపిరి ఆగిపోయింది. -
మా మొర ఆలకించండయ్యా..
● అర్జీదారులతో కలెక్టరేట్ కిటకిట ● వినతులు స్వీకరించిన కలెక్టర్నెల్లూరు(అర్బన్): ‘అయ్యా ఎన్నిసార్లు తిరిగినా మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఇతర అధికారులు సమస్యలను పరిష్కరించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కలెక్టరేట్కు వచ్చాం. మీరైనా మా మొర ఆలకించండయ్యా’ అంటూ పలువురు అర్జీదారులు వేడుకున్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి, డీపీఓ వసుమతి, సర్వేశాఖ ఏడీ రఘురామరాజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.మా స్థలాన్ని పోలీస్ కుటుంబం కబ్జా చేసింది కావలి పట్టణం ట్రంక్ రోడ్డును ఆనుకుని మాకు ఆస్తి ఉంది. మా స్థలానికి, రోడ్డుకు మధ్యలో ఉండే కొంత శివాయి స్థలం ఎప్పట్నుంచో మా స్వాధీనంలో ఉంది. అయితే టు టౌన్ కానిస్టేబుల్ రాజేంద్ర తల్లిదండ్రులు అక్కడ చికెన్ షాపు పెట్టారు. అందువల్ల తమ స్థలానికి దారి, ఇతర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆర్థిక ఇబ్బందులతో పట్టా స్థలాన్ని అమ్ముకుందామని నిర్ణయించుకున్నాం. అయితే అడ్డంగా ఉన్న చికెన్ షాపు వల్ల కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దానిని తీసేయాలని కోరాం. అందుకు విరుద్ధంగా ఇంకా విస్తరించి పెద్ద షాపు పెట్టారు. అడిగితే దౌర్జన్యం చేసి బెదిరిస్తున్నారు. కావలి పోలీసులకు, ఆర్అండ్బీ అధికారులకు ఫిర్యాదు చేశాం. న్యాయం జరగలేదు. చికెన్ షాపు తొలగించి ఆదుకోవాలి. – శోభనాల సాయిసుస్మిత, కుటుంబ సభ్యురాలు, కావలి -
చిన్నా వదిలేసి వెళ్లిపోయావా..
● బస్సు ఢీకొని బాలుడి మృతి ఇందుకూరుపేట: బాలురిద్దరూ ఉదయం నిద్ర లేచారు. స్కూల్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో అన్న కళ్ల ఎదుటే తమ్ముడు ప్రాణాలు విడిచాడు. ఈ హృదయ విషాదకర ఘటన మండలంలోని గంగప ట్నం గ్రామంలో సోమవారం జరిగింది. గంగప ట్నం పంచాయతీ వేపచెట్టుదిబ్బకు చెందిన పులి మురళి, మనోజకుమారి దంపతులకు ఇద్దరు బాలురు సంతానం. మురళి కూలీ పనులకు వెళ్లేవాడు. సుమారు నాలుగైదు నెలల క్రితం విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. అప్పట్నుంచి పిల్లలు కార్తీక్, కిరణ్ (11)ను తల్లి చూసుకుంటోంది. సైకిల్కు పంక్చర్ కావడంతో కిరణ్.. తన అన్న కార్తీక్తో కలిసి టైరు తీసుకుని మరో సైకిల్పై గంగపట్నం బయలుదేరాడు. ఈ క్రమంలో రాముడుపాళెం నుంచి గంగపట్నం వైపుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి వారిని ఢీకొట్టింది. సైకిల్ తొక్కుతున్న కార్తీక్ పక్కన పడిపోగా కిరణ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై నాగార్జునరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అప్పటి వరకు కళ్లెదుటే ఉన్న కిరణ్ అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లి కన్నీరుమున్నీరుగా రోదించింది. సోదరుడు కార్తీక్ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. కిరణ్ స్థానికంగా ఉన్న గంగపట్నం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. బాలుడి మృతిపట్ల మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి సంతాపం ప్రకటించారు. -
కారుణ్య నియామకాల ఉత్తర్వుల అందజేత
నెల్లూరు(అర్బన్): వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తూ నలుగురు వ్యక్తులు మరణించారు. వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కల్పిస్తూ కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం కలెక్టరేట్లో ఉత్తర్వులు అందజేశారు. షేక్ అమిత్, కె.చందుకు రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్గా, ఎన్.నానీకి పంచాయతీరాజ్ శాఖలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా, యు.హరీష్కుమార్కు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలిచ్చారు. కార్యక్రమంలో కలెక్టరేట్ డీఆర్వో విజయకుమార్, ఏఓ తుమ్మా విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. గొంతుపై కత్తిపెట్టి.. బంగారు నగల చోరీవెంకటాచలం: గుర్తుతెలియని వ్యక్తి ఓ మహిళ గొంతుపై కత్తి పెట్టి చంపేస్తానని బెదిరించి బంగారు నగల్ని చోరీ చేసిన ఘటన మండలంలోని తిక్కవరప్పాడు గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన తమలపాకుల సుగుణమ్మ ఇంటి వద్దకు తెల్లావారుజామున 5 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి స్కూటీపై వచ్చి ఆగాడు. ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించి ఆమె గొంతుపై కత్తిపెట్టి అరిస్తే చంపేస్తానన్నాడు. మెడలోని బంగారు సరుడు, ఇంకా ఉంగరం, కమ్మలు లాక్కొని పరారయ్యాడు. సుగుణమ్మ కేకలు వేసి చుట్టుపక్కల నివాసాల వారికి తెలిపింది అనంతరం నాలుగు సవర్ల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేశారు. -
అక్రమ రీచ్పై తిరగబడ్డ తెలుగు తమ్ముళ్లు
సోమశిల: బడా టీడీపీ నేతలు సాగిస్తున్న ఇసుక అక్రమ రవాణాతో తమ రోడ్డు ధ్వంసమవుతుందంటూ ఆ పార్టీ శ్రేణులే తిరగబడ్డారు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని పడమటి కంభంపాడు పెన్నానది రీచ్ వద్ద సోమవారం జరిగింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించిన ఆ పార్టీ బడా నేతలు కొందరు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అండతో ఎక్కడికక్కడ అనధికారికంగా రీచ్లు ఏర్పాటు చేసుకున్నారు. పెన్నానదిలో మండల పరిధిలోని పడమటి కంభంపాడు రీచ్ ద్వారా నిత్యం వందల టర్బో లారీలు, టిప్పర్లతో ఇసుకను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తున్నారు.వాహనాల్లో సామర్థ్యానికి మించి అధిక లోడ్లతో రవాణా చేస్తున్నందున సోమశిల–ఉప్పలపాడు వరకు సుమారు 8 కిలోమీటర్ల ప్రధాన రహదారి అడుగడుగునా భారీ లోతులో గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మార్గంలో సాఫీగా నడిచిపోయే పరిస్థితి లేదు. దీంతో స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు ఇసుక అక్రమ రవాణాదారులకు చెబితే.. పూడుస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన మోంథా, దిత్వా తుఫాన్లతో కురిసిన భారీ వర్షాలకు రహదారి అంతా చెరువును తలపించింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు సైతం సోమశిలకు వెళ్లకుండా ఉప్పలపాడు వద్ద నుంచి మళ్లించుకుని వెళ్లిపోతున్నాయి. పర్యాటక కేంద్రం సోమశిలకు ప్రయాణికుల రాకపోకలు స్తంభిస్తున్నాయి.ఈ అనధికార రీచ్ మంత్రి ఆనం ఇలాకాలో జరుగుతున్న కారణంగా ధైర్యం చేసి ప్రశ్నించేవారు లేకుండా పోయింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు భారీగా తరలివచ్చి రీచ్ వద్ద ధర్నాకు దిగారు. దెబ్బతిన్న రహదారి గుంతలను పూడ్చండి, లేదంటే రవాణా నిలిపివేయండని నిర్వాహకులను టీడీపీ మండల ఉపాధ్యక్షుడు ఉప్పల విజయకుమార్ హెచ్చరించారు. ఇసుక వాహనాలను కదలనీయకుండా అడ్డుకున్నారు. ఇసుక తవ్వే జేసీబీలను నిలువరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొద్ది సేపటికే పార్టీ ముఖ్య నేతల నుంచి ఒత్తిడి రావడంతో మారు మాట్లాడకుండా ఆందోళనకారులు మౌనంగా వెనుదిరిగారు. -
సోమిరెడ్డి.. అవినీతి అనకొండ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నిత్యం నీతులు వల్లించే సోమిరెడ్డి అవినీతి అనకొండ అని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. సొంత ఆస్తులనే త్యాగం చేశానని చెప్పుకొనే ఆయన ఎవరి కోసం త్యాగం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. దేవుడి భూమిని కాజేసి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడమే కాకుండా అధికారులతో కూడా తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తున్న ఘనుడని ఎద్దేవా చేశారు. పెద్ద మనిషనే ఉద్దేశంతో మధ్యవర్తిగా ఉండి పంచాయితీ చేస్తారని డబ్బులను సోమిరెడ్డి దగ్గర ఇరుపక్షాలిస్తే.. పరిష్కారమయ్యాక వారికివ్వకుండా కొట్టేశారని టీడీపీ కార్యకర్తలే వాపోతున్నారని చెప్పారు. సోమిరెడ్డి గెలుపుపై పందెం కాసిన నేతలు, కార్యకర్తలను పిలిచి ఆ మొత్తంలో వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయడాన్ని చూసి విస్తుపోవడం వారి వంతవుతోందని విమర్శించారు. సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీలో పర్సంటేజీలు వసూలు చేయడం.. బదిలీలకు వచ్చే చిరుద్యోగులను వదలకుండా మామూళ్లను దండుకుంటున్నారని ఆరోపించారు.నగరంలోని శ్రీనివాస మహల్ వద్ద జేబులు కొట్టే అలవాటు సోమిరెడ్డికి గతంలో ఉండేదని, ఇప్పటికీ అదే పంథాను కొనసాగిస్తూ.. ఇంటికెళ్లిన వారి జేబులు తడుముతున్నారంటూ ఆ పార్టీ నేతలే కథలుగా చెప్తున్నారని ఎద్దేవా చేశారు. సోమిరెడ్డి కారెక్కాలంటేనే కాంట్రాక్టర్లు, అధికారులు, వ్యాపారులు భయపడుతున్నారని చెప్పారు. టీడీపీ సర్కార్ కొలువుదీరాక ప్రభుత్వ భూములతో పాటు, దేవుడి మాన్యాలు సైతం దోపిడీకి గురవుతున్నాయని ధ్వజమెత్తారు. కాకుటూరు శివాలయానికి దాత హరిప్రసాద్రెడ్డి ఇచ్చిన 48 సెంట్ల భూమిని రూ.కోటికి లేఅవుట్ యజమానులకు విక్రయించి సొమ్ము చేసుకుంది వాస్తవం కాదానని ప్రశ్నించారు. వీటిని కాపాడాలంటూ దేవదాయ శాఖ కార్యాలయ ఎదుట భక్తులు నిరసన తెలియజేస్తే, వారి మనోభావాలను దెబ్బతీసేలా హేయంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేవస్థానం కోసం రోడ్డు వేశాడని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోమిరెడ్డి నోరుతెరిస్తే అవినీతి కంపును సర్వేపల్లి ప్రజలు భరించలేకపోతున్నారని చెప్పారు. దేవాలయ భూమిని విక్రయించడం అన్యాయమని ప్రశ్నిస్తున్న తనపై కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పిరికిపందలు పెట్టే కేసులకు భయపడేదిలేదని తేల్చిచెప్పారు. సర్వేపల్లిలో ఇసుక, గ్రావెల్, మట్టి, బూడిదను దోచుకుంటూ, బల్కర్ల నుంచి రౌడీ మామూళ్లు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంట్రాక్ట్ల కోసం ప్రభుత్వ రంగ సంస్థలపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. పామాయిల్ అసోసియేషన్ పేరిట డబ్బుల కోసం సోమిరెడ్డి బెదిరిస్తున్నారంటూ ట్యాంకర్ యజమానులు మీడియా ఎదుట వాపోయారంటేనే ఆయన దోపిడీ ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఆయన అవినీతిని ప్రజలకు తెలియజేస్తున్న ‘సాక్షి’పై కక్షగట్టి కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.జైల్లో పెట్టించినా ఆయన అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు. న్యాయస్థానాలను ఆశ్రయించి పోరాటం చేస్తామన్నారు. కోర్టులో ఫైళ్ల అదృశ్యం కేసుపై సీబీఐ క్లీన్చిట్ ఇచ్చినా.. సోమిరెడ్డి తన అనుకూల పత్రికల్లో అసత్యాలు రాయిస్తూ పైశాచికానందాన్ని పొందుతున్నారని మండిపడ్డారు. శివాలయ భూములపై కలెక్టర్ విచారణ జరిపించి, ప్రభుత్వానికి నివేదించి.. వీటిని పరిరక్షించి భక్తుల మనోభావాలను కాపాడాలని డిమాండ్ చేశారు. -
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం.. చుక్కలు చూపిస్తున్న గ్రామీణ రోడ్లు
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మున్సిపాలిటీ పరిధిలో పలుచోట్ల రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మామూలు రోజుల్లోనే రహదారులు గుంతలమయంగా ఉంటాయి. అలాంటిది గతవారం రోజులుగా జోరు వర్షాలు కురవడంతో పట్టణంలోని రోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 16వ వార్డులోని చెన్నూరు రోడ్డు నుంచి రాజుపాళెం రోడ్డు వైపు ఆంజనేయస్వామి ఆలయం వరకు ప్రయాణించాలంటే ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ రహదారి వెంబడి తహసీల్దార్ కార్యాలయం, గ్రంథాలయం, అంబేడ్కర్ భవన్, బెజవాడ గోపాల్రెడ్డి పార్కు, సామాజిక ఆరోగ్యం కేంద్రం, పోలీస్స్టేషన్, ఎస్పీ బాలు వసతి భవనం, డీఎల్ఎన్నార్ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలు ఉన్నాయి. నిత్యం కొడవలూరు మండలం రాజుపాళెం, బుచ్చిలోని రూరల్ ప్రాంతాల నుంచి ఈ రహదారిపై వేల మంది ప్రయాణిస్తుంటారు. అధికారులు ఇదే దారిన వెళ్తుంటారు. అ యినా రోడ్డు నిర్మాణానికి నోచుకోలేదంటే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.మలిదేవి కాలువ నుంచి శివాలయం వరకు.. మరోపక్క చెన్నూరురోడ్డులోని మలిదేవి కాలువ వద్ద నుంచి శివాలయం వరకు రోడ్డుపై అడుగుకో గుంత కనిపిస్తోంది. వాహనదారులు, పాదచారులు ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే నరకప్రాయంగా మారింది. ముఖ్యంగా ఈ రోడ్డుపై వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పర్యటన ఈ ప్రాంతాల వద్ద ఉందంటే మాత్రం స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఆ తర్వాత పరిస్థితి షరామామూలే.తహసీల్దార్కు వినతిపత్రం అందజేత మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో అధ్వానంగా ఉన్న రోడ్లను బాగు చేయాలని ఆ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ బిట్రగుంట ప్రమీలమ్మ, వైఎస్సార్సీపీ నాయకుడు నారాయణ తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాళెం నుంచి రాజుపాళెం వైపు వెళ్లే రోడ్డు, మలిదేవి కాలువ నుంచి శివాలయం వరకు అధ్వానంగా ఉన్న రోడ్లను వెంటనే నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్అండ్బీ ద్వారా గానీ, మున్సిపల్ కమిషనర్ ద్వారా కానీ శాశ్వతంగా రోడ్లు నిర్మించి ప్రజల ఇబ్బందులను తీర్చాలని తహసీల్దార్ను కోరినట్లు వివరించారు. -
చిరుతిండ్లతో రోగాలు.. ప్రజారోగ్యంపై శ్రద్ధేదీ?
నెల్లూరు(బారకాసు): ఆహారానికి సంబంధించి నెల్లూరుకు ప్రత్యేక స్థానం ఉంది. చిరుతిండ్లను ప్రజలు ఎంతో ఇష్టపడి తింటుంటారు. అయితే అవి ఎంత వరకు ఆరోగ్యకరం.. అనేది అటు వ్యాపారులు, ఇటు అధికారులు ఎలాంటి పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. అధిక శాతం చిరుతిండ్ల వ్యాపారాలు రోడ్లుపైనే నడుస్తున్నాయి. నిత్యం వాహనాలతో రేగే దుమ్మూధూళి నుంచి కనీస రక్షణ ఉండటం లేదు. అధికారులు కనీసం అటువైపు కూడా చూడటం లేదు. చివరకు ప్రజలు కూడా రోడ్లపై విక్రయించే చిరుతిండ్లతో రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం వివిధ పట్టణాల్లో డయేరియా లక్షణాలతో జనం ఆస్పత్రి పాలవుతున్న నేపథ్యంలో నెల్లూరులోనూ ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. దుమ్మూధూళి పడేలా.. నగరంలోని ప్రతి ప్రధాన వీధిల్లో ఆహార పదార్థాలు విక్రయించే టిఫిన్ బండ్లు, స్వీట్లు అమ్మే దుకాణాలు కనిపిస్తుంటాయి. రకరకాల స్వీట్లతో పాటు బజ్జీలు, పకోడి, కారంపూస, బూంది, చెకోడీలను విక్రయిస్తుంటారు. నూనెతో చేసిన పదార్థాలు ఆకర్షణీయంగా కనిపిస్తూ రోడ్డు వెంట వెళ్లేవారి నోరూరిస్తుంటాయి. రోడ్డు పక్కన వ్యాపారాలకు ఎవరూ అభ్యంతరం పెట్టరు. అయితే తినుబండారాలను దుమ్మూధూళి పడేలా ఉంచటం కచ్చితంగా వినియోగదారుల ఆరోగ్యానికి మంచింది కాదు. నగరంలోని ఇరుకురోడ్లలో తిరిగే వాహనాల్లోంచి వచ్చే పొగ, టైర్ల నుంచి లేచే దుమ్ము ఎక్కువ. నూనెతో చేసిన ఆహార పదార్థాలకు దుమ్ము తేలికగా అతుక్కుపోతుంది. దీనికితోడు కొందరు మరిగించిన నూనెను పదేపదే వాడుతున్నారు. ఇది హానికరమని తెలిసినా ఎవరూ ఖాతరు చేయడం లేదు. అంతేకాకుండా పలుచోట్ల నూనె ప్యాకెట్లను కట్ చేయకుండా వేడి కడాయ్లో ఉంచడం వల్ల ప్లాస్టిక్ కవరు కరిగిపోయి నూనె బాండీలో పడుతోంది. ఇది ఎంతో హానికరమైనా వ్యాపారులు పట్టించుకోవడం లేదు. హానికరమని తెలిసినా కొనేస్తున్న జనం కేన్సర్ విజృంభిస్తున్న నేటి రోజుల్లో హానికరమైన తినుబండారాలకు దూరంగా ఉండాలనే భావన జనంలో ఉండటం లేదు. రోడ్ల వెంట దుమ్మూధూళి పడేచోటనే కొనుగోలు చేసి తింటున్నారు. స్వీట్లు వంటివి తక్కువ ధరకు వస్తున్నాయనగాని కొనేసి, బంధుమిత్రులకు కానుకగా ఇస్తున్నారు. తినుబండారాలపై తగిన రక్షణ ఏర్పాట్లు ఉండేలా చూడాల్సిన అధికారులు అటుకేసి చూడటం లేదు. ఫుడ్ సేఫ్టీ, నగరపాలక సంస్థ అధికారులకు ఎవరైనా పనిగట్టుకుని ఫిర్యాదు చేస్తే మినహా, పట్టించుకోవటం లేదు. విధిగా తనిఖీలు చేయాల్సిన సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పీకలు తెగుతున్నాయ్.. !
సింహపురిలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమై చేష్టలుడిగి చూస్తుండటంతో అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి. గంజాయి, మద్యం మత్తులో విచక్షణరహితంగా పీకలు కోస్తూ.. హత్యలకూ తెగబడుతున్నారు. జిల్లాలో ఎటు చూసినా నేరప్రవృత్తి పెరిగిపోతోంది. విచ్చలవిడిగా గంజాయి, మద్యం అమ్మకాలు, పేకాట, వ్యభిచార గృహాల నిర్వహణతో అసాంఘిక కార్యకలాపాలు మితిమీరాయి. తమ వ్యాపారాన్ని అడ్డుకుంటున్నారంటూ గంజాయి ముఠాలు ఏకంగా తరిమితరిమి చంపిన ఉదంతం మర్చిపోకముందే.. తాజాగా తమ బైక్కు దారివ్వలేదని సిటీ బస్సు డ్రైవర్ పీక కోశారు. అడ్డుకోబోయిన కండక్టర్పై కత్తులతో దాడి చేశారు. ఇదంతా చూస్తుంటే నెల్లూరుకు ఏమైందనే ఆందోళన వ్యక్తమవుతోంది.సాక్షి టాస్క్ఫోర్స్: జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతోంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో.. ఎవరేమి చేస్తారోననే భయం ప్రజలను వెంటాడుతోంది. గత నెల 28న ఉద్యమకారుడు పెంచలయ్య హత్యను మరువకముందే.. మద్యం మత్తులో కొందరు యువకులు సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్పై బ్లేడ్లతో విచక్షణరహితంగా ఆదివారం పట్టపగలు దాడి చేసిన ఉదంతం నగర వాసులను కలవరపాటుకు గురిచేస్తోంది. అధిక శాతం నేరాలు మత్తులోనే జరుగుతున్నాయి.పోలీసులపైనా దాడులుశాంతిభద్రతల పరిరక్షణ, ప్రజారక్షణ చర్యల్లో భాగంగా నిరంతర తనిఖీలు, నేరస్తుల కదలికలపై నిఘా, రౌడీషీటర్లపై పీడీ యాక్ట్లను పోలీస్ అధికారులు నమోదు చేస్తున్నా, నేరాలు అదుపులోకి రావడం లేదు. ఖాకీలపై దాడులు చేసేందుకు సైతం నిందితులు వెనుకాడటం లేదు. నేరాల కట్టడికి మరింత దూకుడును పెంచాల్సిన అవసరాన్ని వరుస ఘటనలు తెలియజేస్తున్నాయి.నూతన ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచిటీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి నేరాలు పెరుగుతున్నాయి. నేరస్తుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. పాతకక్షలు కత్తులు దూస్తున్నాయి. కిరాయి సంస్కృతి పెచ్చుమీరుతోంది. గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అసాంఘిక శక్తులు, అల్లరిమూకలు మత్తులో వీరంగం చేస్తున్నాయి. మత్తుకు బానిసలైన వారు తమ అవసరాలకు సరిపడా నగదు కోసం హత్యలకూ వెనుకాడటం లేదు. పెన్నా సమీపంలో జరిగిన జంట హత్యలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదంటూ స్థానికులపైనా దాడులు చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదులతో పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. లేడీ డాన్, దేవరకొండ సుధీర్, హసన్ గ్యాంగ్లతో పాటు పలువురు రౌడీషీటర్ల వద్ద పెద్ద ఎత్తున గంజాయిని ఇటీవల స్వాధీనం చేసుకొని జైళ్లకు పంపారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా ఓ ధర్మకాటా దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 117 మద్యం బాటిళ్లను సంతపేట పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. బెల్టుషాపుల్లోనూ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం, గంజాయిని పూర్తిస్థాయిలో కట్టడి చేయడంతో పాటు నేరస్తులపై మరింత కఠినంగా వ్యవహరించాలని నగర వాసులు కోరుతున్నారు.జోరుగా అసాంఘిక కార్యకలాపాలుజిల్లాలోని కొందరు నిర్వాహకులు ఇళ్లు, లాడ్జిలను వేదికగా చేసుకొని పేకాట కేంద్రాలను నిర్వహిస్తున్నారు. కొన్ని లాడ్జిల నిర్వాహకులతో ముందస్తు ఒప్పందాలు కుదర్చుకొని వారాల తరబడి ఆడిస్తున్నారు. నగరంలోని రెండు లాడ్జిలపై పోలీసులు దాడులు చేసి నిర్వాహకులతో పాటు జూదరులను అరెస్ట్ చేసి రూ.లక్షల్లో నగదు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. -
నూడకు భూ సమర్పయామి
ఉదయగిరి నియోజకవర్గంలో విద్య, వైద్య, వ్యాపార, వాణిజ్య కేంద్రంగా ఉన్న వింజమూరులో విలువైన ప్రభుత్వ భూములపై తమ్ముళ్ల కన్ను పడింది. పట్ణణ భవిష్యత్తు అవసరాలను విస్మరించి సుమారు రూ.70 కోట్ల విలువజేసే ల్యాండ్ను నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా)కి అప్పనంగా కట్టబెట్టేందుకు ఫైల్ను రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. నియోజకవర్గ ముఖ్య నేత ఆదేశాల మేరకు కావలి – దుత్తలూరు జాతీయ రహదారి పక్కనే (జగనన్న లేఅవుట్ను ఆనుకొని) ఉన్న దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సమర్పించేందుకు చర్యలు చేపట్టారు. నుడా అని పైకి చెప్తున్నా, ఆ ముసుగులో విలువైన భూములను కొట్టేసే కుట్ర కోణముందనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.వింజమూరు (ఉదయగిరి): పట్టణాభివృద్ధి వద్దు.. తమ స్వలాభమే ముద్దు అనే రీతిలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. వింజమూరులో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దీనికి అద్దం పడుతున్నాయి. ఇక్కడి విలువైన ప్రభుత్వ భూమిపై వీరు కన్నేశారు. వాస్తవానికి వింజమూరు నుంచి దుత్తలూరు వెళ్లే జాతీయ రహదారి మార్గంలో జీబీకేఆర్ ఎస్టీ కాలనీని ఆనుకొని జాగీర్ వనం వరకు ఉన్న భూముల ధరలు ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్నాయి. ఇక్కడ అనేక రియల్ ఎస్టేట్ వెంచర్లను ఏర్పాటు చేయగా, స్తిరాస్థి వ్యాపారం జోరుగా సాగుతోంది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 400 మంది లబ్ధిదారులకు నివేశన స్థలాలను ఉచితంగా ఇచ్చి.. జగనన్న కాలనీ పేరుతో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. దీంతో అనేక మంది లబ్ధిదారులు నివాసం ఉంటున్నారు.సంపద సృష్టంట..!గ్రామ సర్వే నంబర్ 839, 1599, 1602, 1603, 1604, 1605, 1608, 1611, 1614, 1616లో 94.53 ఎకరాలను నుడాకు ఇచ్చే అంశమై జిల్లా అధికారులకు ప్రతిపాదనలను తహసీల్దార్ హమీద్ పంపారు. ఈ తరుణంలో భూములను జేసీ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పది రోజుల క్రితం పరిశీలించారు. ఈ క్రమంలో పలువురు అభ్యంతరం వ్యక్తం చేయగా, సంపద సృష్టి కోసం అంటూ వాటిని తిరస్కరించారు. ఈ పరిణామాల క్రమంలో భూములు నుడాకు అప్పగించే ప్రక్రియ త్వరలో పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.ఏదీ ముందస్తు ప్రణాళిక..?ఉదయగిరి నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్ణణం వింజమూరు. త్వరలో నగర పంచాయతీ హోదా వచ్చే అవకాశం ఉందని సమాచారం. రెవెన్యూ డివిజన్గా మార్చేందుకూ అవకాశాలున్నాయి. ఇక్కడ గురుకుల పాఠశాల, పాలిటెక్నిక్, వ్యవసాయ కళాశాలలు, మోడల్ స్కూల్, పట్ణణ ప్రజల క్రీడా అవసరాల నిమిత్తం మినీ స్టేడియం తదితరాలను కేటాయించే ఛాన్స్ ఉంది. పారిశ్రామికవాడకు ల్యాండ్స్ను కేటాయించాలనే డిమాండ్ సైతం వినిపిస్తోంది. ఈ తరుణంలో పట్టణ ప్రగతికి ఇవెంతో కీలకం. అయితే వీటిన్నింటినీ నుడాకు కేటాయిస్తే భవిష్యత్తులో ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.భూముల ధరలకు రెక్కలు2022లో జాతీయ రహదారి రావడంతో ఈ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో మామిడి తోటలను కొంతమంది ఎస్టీలు సాగు చేస్తున్నారు. భూముల పరిశీలన నిమిత్తం ఇటీవల వచ్చిన ఎమ్మెల్యే, జేసీ ఎదుట తమ సమస్యను వీరు లేవనెత్తారు. భూముల్లో ప్లాట్లేసి విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయంతోనే అభివృద్ధి చేయాలంటూ శాసనసభ్యుడు చెప్పడంతో వీరు అవాక్కయ్యారు. అర్హత ఉన్నవారికి వేరే చోట ఇస్తామని తెలిపారు. విలువైన భూములను లాక్కొని.. ఎక్కడో తమకెందుకని అవేదన వ్యక్తం చేశారు. రూ.కోట్ల విలువజేసే భూములను కాజేసేందుకు నుడా పేరుతో ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.గతంలో ఇలా..నుడాకు ప్రతిపాదించిన సర్వే నంబర్లలో జీబీకేఆర్ కాలనీకి చెందిన 53 మంది ఎస్టీలకు 130 ఎకరాలకు లీజు పట్టాలను సీజేఎఫ్ఎస్ పేరుతో 1978లో అప్పటి ప్రభుత్వం అప్పగించింది. వీటిలో కొంత మేర విక్రయించగా, మరికొన్నింటిని సాగు చేయకుండా వదిలేశారు. ఈ తరుణంలో భూములను అన్యాక్రాంతం చేశారంటూ 2010, జూలైలో లీజు ఉత్తర్వులను రద్దు చేస్తూ అనాధీనంగా అప్పటి కావలి ఆర్డీఓ వెంకటేశ్వర్లు మార్చారు. ఈ తరుణంలో కోర్టును కొందరు ఆశ్రయించగా, భూముల్లేని పేదలకు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో మండలంలోని రావిపాడులో డీ ఫారం పట్టాలను కొందరికి ఇచ్చారు. గతంలో ఇచ్చిన లీజును రద్దు చేసినా, వాటిని కొందరు సాగు చేసుకుంటున్నారు.పరిశీలించి.. తగు నిర్ణయం తీసుకుంటాంవింజమూరులో నుడాకు భూముల కేటాయింపు కోసం ప్రతిపాదనలొచ్చాయి. వీటిని పరిశీలించాం. అన్ని విషయాలను పరిగణించి తగు నిర్ణయం తీసుకుంటాం. – మొగిలి వెంకటేశ్వర్లు, జేసీ -
విత్తనాల కోసం వెతుకులాట
పొదలకూరు: జిల్లాలో దిత్వా తుఫాన్తో నార్లు దెబ్బతిన్న రైతులు విత్తనాల కోసం వెతుకులాడుతూనే ఉన్నారు. డీలర్ల వద్ద ధర అధికంగా పలకడంతోపాటు మొలకెత్తుతాయో లేదో అని సందేహపడుతున్న వారు రైతులు సొంతంగా ప్రాసెసింగ్ చేసిన విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. పొదలకూరు పరిసర ప్రాంత పెన్నార్ డెల్టా అన్నదాతలు బుచ్చిరెడ్డిపాళెం, దామరమడుగు, కోవూరు, బత్తులపల్లిపాడు తదితర ప్రాంతాలకు వెళ్లి వరి విత్తనాలను తెచ్చుకుని నార్లు పోసుకున్నారు. భారీ వర్షాల కారణంగా నార్లు, నాట్లు దెబ్బతినడంతో కొందరు తిరిగి నార్లు పోసుకోవాల్సి వస్తోంది. దిత్వా తుఫాన్తో ముసురుపట్టి వర్షం కురిసిన సమయంలో 20 శాతం మాత్రమే నార్లు పోసుకున్నారు. మరో 20 శాతం మంది ముసురులోనే నార్లు పోసుకోవడంతో భారీ వర్షాలకు నష్టపోయారు. ఎన్నో ఇబ్బందులు రైతులు వరిసాగు కోసం విత్తన సేకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బహిరంగ మార్కెట్లో లభ్యమవుతున్న విత్తనాలు సరిపోవడం లేదు. దీనికితోడు సాగు చేయాలనుకునే రకాలు లభ్యం కాకపోవడంతో కర్షకులు గ్రామాలు తిరగాల్సి వస్తోంది. పొదలకూరు మండలం బత్తులపల్లిపాడులో సౌత్మోపూరుకు చెందిన వారు విత్తన శుద్ధి చేసి (ప్రాసెసింగ్) విక్రయిస్తున్నారు. కేఎన్ఎం 1638, ఆర్ఎన్ఆర్ 15048 (షుగర్ లెస్) రకాలను 25 కిలోల సంచి రూ.1,100కు అమ్ముతున్నారు. ఈ ప్రాంతంలో కొందరు అన్నదాతలు అక్కడే విత్తనాలను తీసుకెళ్తున్నారు. మరికొందరు కేఎన్ఎం 12510, 7715 రకాలను సాగు చేస్తున్నారు. గతేడాదే జిల్లాలో ఈ రకాలను సాగు చేయడంతో పరిమితంగా విత్తనాలు లభ్యమవుతున్నాయి. దీంతో రైతులు 12510, 7715 రకం సాగు చేసిన వారి నుంచి విత్తనాలను సేకరించారు. ఈ రకం విత్తనాలు మంచి దిగుబడినిస్తుందని చెబుతున్నారు. కేఎన్ఎం 12510 రకం ఎకరాకు ఐదు పుట్లు దిగుబడినిస్తుందని సాధారణ రకం కంటే 20 రోజులు పంటకాలం పెరుగుతుందని అంటున్నారు. ప్రభుత్వం నుంచి విత్తనాలపై ఎలాంటి రాయితీ లేకపోవడం, అవసరమైనవి అందుబాటులో ఉంచకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. నార్లు పోసుకోవాలంటే రైతులకు ఇబ్బందులు దిత్వా తుఫాన్కు నీటి మునిగిన నారుమళ్లు విత్తన సేకరణకే రూ.వేలు వెచ్చిస్తున్న వైనం జిల్లాలో 20 శాతమే నార్లు పోసిన కర్షకులు వరి విత్తనాలకు అందని రాయితీలు -
స్పిల్వే నుంచి నీటి విడుదల నిలిపివేత
పొదలకూరు: కండలేరు స్పిల్వే నుంచి నీటి విడుదలను తెలుగు గంగ అధికారులు ఆదివారం నుంచి నిలిపివేశారు. కండలేరు జలాశయంలో ప్రమాదకర స్థాయిలో నీటినిల్వలు ఉన్నాయని, పైతట్టు నుంచి ఊహించని విధంగా నీరు వస్తున్నట్టు ఆందోళన చెందిన అధికారులు స్పిల్వే నుంచి 500 క్యూసెక్కుల నీటిని స్వల్పంగా విడుదల చేశారు. ఇక్కడి నుంచి నీటిని విడుదల చేస్తే ఏటికాలువలో కలిసి మనుబోలు మండలంలోని కొన్ని గ్రామాల మీదుగా సముద్రం వెళ్లాల్సి ఉంటుంది. అయితే మనుబోలు మండలంలోని గ్రామాలకు ఇబ్బందులు కలుగుతాయని, జలాశయానికి పైతట్టు నుంచి నీరు రావడం తగ్గిపోవడంతో స్పిల్వే నుంచి నీటిని నిలిపివేసినట్టు అధికారులు అంటున్నారు.పెన్నానదిలో మృతదేహం ఇందుకూరుపేట: మండలంలోని ముదివర్తిపాళెం వద్ద పెన్నానదిలో ఆదివారం ఉదయం ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. లింగసముద్రం మండలం పెద్దపవని గ్రామానికి చెందిన గుత్తి మల్లికార్జునరావు (52) మృతదేహం నదిలో కొట్టుకురాగా స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై నాగార్జునరెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. మృతుడి జేబులో లభ్యమైన ఆధార్కార్డు ఆధారంగా వివరాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు అధికారులు చెప్పారు.117 మద్యం బాటిళ్ల స్వాధీనం నెల్లూరు(క్రైమ్): పోలీసులు దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 117 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారి కథనం మేరకు.. నెల్లూరు నగరంలోని కామాటివీఽధికి చెందిన సీహెచ్ మల్లికార్జున అదే ప్రాంతంలో గదిని అద్దెకు తీసుకుని చైతన్య ఎలక్ట్రానిక్ ధర్మ కాటా నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం అతను కావలి ముసునూరులో ఉంటూ రోజు దుకాణానికి వచ్చి వెళ్తున్నాడు. ఆదివారం దుకాణంలో మద్యం బాటిళ్లు అక్రమంగా నిల్వ ఉంచారని సంతపేట పోలీసులకు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ వైవీ సోమయ్య నేతృత్వంలో ఎప్సై బాలకృష్ణ దాడి చేశారు. వివిధ కంపెనీలకు చెందిన 117 మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎకై ్సజ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. పట్టుబడిన మద్యం ఎక్కడ? ఎప్పుడు? ఎవరి వద్ద కొనుగోలు చేశారు తదితర వివరాలపై ఎకై ్సజ్ అధికారుల సాయంతో ఆరా తీస్తున్నారు. కసుమూరులో కార్డన్ సెర్చ్ ● 46 వాహనాల స్వాధీనం వెంకటాచలం: నేర నియంత్రణ చర్యల్లో భాగంగా పోలీస్ అధికారులు కసుమూరులోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం కార్డన్ సెర్చ్ చేశారు. వాహనపత్రాల్లేని 46 వాహనాలను స్వాధీనం చేసుకున్నా రు. నెల్లూరు రూరల్ డీఎస్పీ జి.శ్రీనివాసరావు నేతృత్వంలో వెంకటాచలం ఇన్స్పెక్టర్ సుబ్బారావు తన సిబ్బందితో కలిసి కసుమూరులోని తిప్ప, బీసీ కాలనీ, పెద్దూరు తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఇళ్లలోని వారి వివరాలను సేకరించారు. వాహనపత్రాల్లేని 39 ద్విచక్ర వాహనాలు, ఏడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు, రెండు జంటలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల సంచారం, మత్తు పదార్థాల విక్రయాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్న డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
రైలెక్కుతుండగా..
● జారిపడి మహిళ మృతి నెల్లూరు(క్రైమ్): కదిలే రైలు ఎక్కుతూ ఓ మహిళ ప్రమాదవశాత్తు ప్లాట్ఫారం, రైలుకు మధ్యలో పడి మృతిచెందిన ఘటన ఆదివారం నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్లో జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. అసోమ్ రాష్ట్రానికి చెందిన బి.సోనా (35) కుటుంబ సభ్యులతో కలిసి నాగాన్ ఎక్స్ప్రెస్ రైల్లో తాంబరానికి బయలుదేరారు. రైలు స్టేషన్లో మూడోనంబర్ ప్లాట్ఫారంపై ఆగింది. సోనా వాటర్ బాటిల్, స్నాక్స్ కొనుక్కునేందుకు దిగి దుకాణం వద్దకు వెళ్లింది. ఇంతలో రైలు ముందుకు కదలడంతో ఆమె పరుగులు తీస్తూ ఎక్కే ప్రయత్నం చేయగా కాలు జారింది. దీంతో ఆమె రైలు కిందకు వెళ్లిపోయింది. ఫ్లాట్ఫారం, రైలుకు మధ్యలో ఇరుక్కుపోయి తీవ్రగాయమై మృతిచెందింది. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు ఎస్సై హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జూడో జిల్లా క్రీడాకారుల ఎంపిక
ఉలవపాడు: ఉమ్మడి నెల్లూరు జిల్లా జూడో క్రీడాకారుల ఎంపిక ఆదివారం కరేడు గ్రామంలో జరిగింది. జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోటీలు జరిపారు. మొత్తం 25 మంది పాల్గొనగా 14 మంది ఎంపిక చేసినట్లు కార్యదర్శి మురళి తెలిపారు. పి.కావ్య (కావలి), పి.పవిత్ర, సాగర్, బాలాజీ (కొత్తసత్రం), ఎ.సాయిఅక్షిత (వలేటివారిపాళెం), హైమ (లింగసముద్రం), లోకేశ్, ఉదయ్ సందేశ్ (కరేడు), శ్రీను, సందీప్, జె.హర్షిణి (కలిగిరి), ఎం.అల్లూరయ్య, శివప్రసన్నకుమార్ (రంగాపురం), పి.జీవిత (కందుకూరు) ఎంపికయ్యారు. వీరు కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి నెల్లూరు తరఫున పాల్గొంటారని తెలియజేశారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు
సంగం: మండలంలోని తరుణవాయి వద్ద నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అదే విధంగా సంగం నాలుగు రోడ్ల సెంటర్లో నడిచి వెళ్తున్న ఓ వృద్ధుడు కళ్లు తిరిగి పడి తలకు తీవ్ర గాయమైన ఘటన ఆదివారం జరిగాయి. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని జెండా దిబ్బ గ్రామానికి చెందిన షామీర్ అనే యువకుడు తన ఎఫ్ జెడ్ బైక్పై గ్రామం నుంచి సంగానికి బయలుదేరాడు. తరుణవాయి వద్ద నెల్లూరు వైపు వెళ్తున్న కారు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో బైక్ను ఢీకొట్టింది. దీంతో షామీర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంగం 108 అంబులెన్స్లో బుచ్చిరెడ్డిపాళెం తరలించారు. వైద్యుల సూచనల మేరకు షామీర్ను నెల్లూరుకు తీసుకెళ్లారు. ● సంగం నాలుగు రోడ్ల సెంటర్ వద్ద చేజర్ల మండలం పెళ్లేరుకు చెందిన సహదేవుడు అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు కింద పడి గాయపడ్డాడు. అతను ఆలయాల్లో గీతాపారాయణం చేస్తుంటాడు. తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని స్థానికులు సంగం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ స్టాఫ్ నర్సు వైద్యసిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. అనంతరం సంగం 108 అంబులెన్స్లో ఆత్మకూరు వైద్యశాలకు తీసుకెళ్లారు. తలకు తీవ్ర గాయం కావడంతో వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. -
ప్రభుత్వ హామీ.. మాటలకే పరిమితం
కందుకూరు: చంద్రబాబు ప్రభుత్వ మాటలకు చేసే పనులకు అసలు పొంతన ఉండదు. కందుకూరును చెత్త రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించామని, చెత్త లేకుండా చేశామంటూ ఊదరగొట్టారు. అయితే సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. అక్టోబర్ 2వ తేదీ నాటికి చెత్త రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గుట్టలుగా పేరుకుపోతూ.. స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ సీఎం చంద్రబాబు కందుకూరుకు వచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డులో సభ జరిగింది. మున్సిపాలిటీని చెత్త రహితంగా తీర్చిదిద్దుతామని, డంపింగ్ యార్డు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా కనిగిరి రోడ్డులోని దూబగుంట వద్ద నూతన డంపింగ్ యార్డు, చెత్త ప్రాసెస్ మెషినరీని ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకూ ఆ యార్డుకు చెత్తను తరలించలేదు. మెషినరీ పూర్తిగా మూలనపడిపోయింది. అదే సందర్భంలో నాడు పట్టణంలోని గుర్రంవారి పాళెం ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డును స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు పరిశీలించారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి యార్డులో ఉన్న చెత్తను పూర్తిగా తొలగిస్తామని, చెత్త రహిత మున్సిపాలిటీగా మారుస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ అమలు కాలేదు. ఏళ్ల తరబడి కందుకూరు మున్సిపాలిటీని వేధిస్తున్న సమస్య అలాగే ఉంది. కొండంత ఉన్నా.. ఇటీవల కాలంలో డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను ప్రాసెస్ చేసేందుకు తరుణి అసోసియేట్స్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. దీని ప్రకారం కొంత మెషినరీని ఏర్పాటు చేసిన సంస్థ ప్రక్రియను మొదలు పెట్టింది. ఇప్పటి వరకు 26 వేల టన్నుల వరకు చెత్తను ప్రాసెస్ చేసింది. కాంట్రాక్ట్ ముగియడంతో వారు పనిని ఆపేశారు. వాస్తవానికి డంపింగ్ యార్డులో నేటికీ పేరుకుపోయి ఉన్న చెత్త 40 వేల టన్నుల వరకు ఉంది. ఇంకా రోజూ మున్సిపాలిటీలో చేపట్టే సేకరణ ద్వారా 25 టన్నుల వరకు చెత్త వచ్చిపడుతోంది. ఇప్పటికే కొండలా పేరుకుపోయిన చెత్త ఓవైపు కంపు కొడుతుంటే మరోవైపు కొత్తగా వచ్చి చేరుతున్న దాంతో సమస్య మళ్లీ మొదటికొచ్చినట్టు అయ్యింది. కాగా స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం డంపింగ్ యార్డు సమస్యను పూర్తిగా పరిష్కరించామంటూ ప్రచారాన్ని ఊదరగొడుతుండటం గమనార్హం. కానీ ప్రస్తుతం యార్డులో చెత్త ప్రాసెస్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవడంతో సమస్య రోజురోజుకూ పెరుగుతుంది. ఇప్పటికే యార్డు సామర్థ్యాన్ని మించి పూర్తి స్థాయిలో నిండిపోయి కొత్తగా పోగవుతున్న దాంతో ఎక్కడ వేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే ప్రభుత్వం తిరిగి కాంట్రాక్ట్ పునరుద్ధరిస్తే తప్ప డంపింగ్ యార్డులో ప్రాసెస్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మున్సిపల్ అధికారులు కూడా తాము ఏమీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో కందుకూరును పట్టి వేధిస్తున్న చెత్త సమస్య ఇప్పటికే పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డంపింగ్ యార్డులో రోజురోజుకూ పేరుకుపోతున్న చెత్త కుప్పలు కాంట్రాక్ట్ పూర్తి కావడంతో చెత్తశుద్ధిని నిలిపివేసిన సంస్థ 26 వేల టన్నులు ప్రాసెస్ పూర్తి, ఇంకా మిగిలింది 40 వేల టన్నులు అక్టోబర్ 2 నాటికి పూర్తిగా తొలగిస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ హామీ నేటికీ అలాగే సమస్య -
స్పా ముసుగులో వ్యభిచారం
నెల్లూరు(క్రైమ్): నగరంలోని మూడు స్పా సెంటర్లపై ఆకస్మిక దాడులను పోలీసులు శనివారం చేపట్టారు. పది మంది యువతులతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. యువతులను హోమ్కు తరలించారు. పోలీసుల వివరాల మేరకు.. నగరంలోని పలు స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు, క్రాస్ మసాజ్లు జరుగుతున్నాయని ఎస్పీ అజిత వేజెండ్లకు సమాచారమొచ్చింది. ఆమె ఆదేశాల మేరకు నిప్పో సెంటర్లోని ఎవిరీ డే సెలూన్ స్పా సెంటర్పై దాడి చేశారు. ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకొని వేదాయపాళెం పోలీస్స్టేషన్కు తరలించారు. నిర్వాహకుడు మహేష పై కేసు నమోదు చేశారు. ⇒బాలాజీనగర్ సమీపంలోని జగదీష్ నగర్లో గల యూనిక్స్ సెలూన్ స్పాపై దాడి చేసి ముగ్గురు యువతులు, ఒక విటుడ్ని అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. నిర్వాహకుడు సు«దీర్పై కేసు నమోదు చేశామని బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు తెలిపారు. ⇒ రామలింగాపురంలోని వీఐపీ స్పాపై దాడి చేసి ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకొని నిర్వాహకురాలు కృష్ణవేణిపై కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ చెప్పారు. పోలీసుల దాడులతో పలువురు నిర్వాహకులు స్పా సెంటర్లకు తాళాలు వేసి పరారయ్యారు. నగర ఇన్చార్జి డీఎస్పీ గిరిధర్ పాల్గొన్నారు. -
‘నార్కో అనాలిసిస్ టెస్ట్కు నేను సిద్ధం.. సోమిరెడ్డి సిద్ధమా?’
సాక్షి, నెల్లూరు జిల్లా: అక్రమ కేసులకు బెదిరేదే లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అన్నారు. ‘‘సోమిరెడ్డి అక్రమాలపై ధర్మ పోరాటం చేశాను. దేవాలయాల భూములు కాజేస్తున్నాడని ఎమ్మెల్యే సోమిరెడ్డిని ప్రశ్నించడం నేరమా..?. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఏంటి.. కొంచెం అయిన సిగ్గు పడ్డాలి’’ అంటూ కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘టీడీపీ ఎమ్మెల్యే సొమిరెడ్డి నోరు తెరిస్తే అబద్ధాల కంపు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దేవుడి భూమలకు కాపలా కాశాం. టీడీపీ కూటమి పాలకులు దేవుడి భూములను కబ్జా చేస్తున్నారు. దేవుడి ధర్మాన్ని పక్కనపెట్టి దోపిడీ ధర్మాన్ని పాటిస్తున్నారు. సోమిరెడ్డిలాంటి దొంగల మీద కేసు పెట్టకుండా మీద నా మీద పెట్టడమేంటి?’’ అని కాకాణి మండిపడ్డారు.‘‘సోమిరెడ్డి దమ్ముంటే నార్కో అనాలిసిస్ టెస్ట్కి సిద్ధమా?. నువ్వు కోటి రూపాయలు తీసుకుని దేవుని భూమిని అక్రమార్కులకు ఇచ్చావని చెప్పడానికి నేను టెస్ట్కు సిద్ధం’’ అని కాకాణి సవాల్ విసిరారు.దేవుడు భూములు దగ్గరకు పోలీసులు వస్తే నిజాలు బయటకు వస్తాయి. కాకుటూరు శివాలయం భూములు సోమిరెడ్డి కబ్జా చేశారు. 1980లో హరిప్రసాద్రెడ్డి అనే దాత శివాలయానికి భూములిచ్చారు. దేవాదాయ భూమి అని ప్రభుత్వ రికార్డ్ల్లోనే ఉంది. దేవుడి భూములు వేరుచేసి పెన్సింగ్ వేయాల్సిన అవసరం ఏంటి?. దేవుడి భూములు వేరుచేసి రోడ్డు ఎందుకు వేశారు?. సోమిరెడ్డి రూ.కోటి తీసుకుని దేవుడి భూమిని అక్రమార్కులకు కట్టబెట్టారు. కాకుటూరులో సర్వే నెంబర్ 63-ఏ1లోని 0.48 సెంట్ల భూమిని ఆక్రమించారు. భూమిని ఆక్రమించి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు’’ అని కాకాణి ఆరోపించారు. -
కక్ష సాధింపు.. కాకాణిపై మరో అక్రమ కేసు
సాక్షి, నెల్లూరు జిల్లా: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డిపై మరో అక్రమ కేసు నమోదైంది. రాజకీయ విమర్శలు ఎదుర్కొలేక కాకాణిపై సోమిరెడ్డి అనుచరులు ఫిర్యాదు చేశారు. వెంకటాచలం పీఎస్లో సోమిరెడ్డి అనుచరులు ఫిర్యాదు చేశారు. కాకాణిపై కేసు నమోదు చేయాలని సోమిరెడ్డి ఆదేశాలు చేయగా.. కక్ష సాధింపులో భాగంగా కాకాణిపై అక్రమ కేసు నమోదు చేశారు.కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుండటంతో కాకాణిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా సర్కారు పెద్దల బరితెగింపు హద్దులు మీరుతోంది. ప్రశ్నించే వారే ఉండకూడదని హూంకరిస్తూ నిత్యం తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది.ఈ ఏడాది మే నెలలో కాకాణి గోవర్ధన్రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 85 రోజులు జైల్లో ఉన్న ఆయన కాకాణి గోవర్దన్రెడ్డి.. బెయిల్ రావడంతో బయటకువచ్చారు. అక్రమ కేసులు బనాయించడంతో.. కూటమి ప్రభుత్వం ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. -
మార్కెట్లోకి యమహా కొత్త బైక్లు
నెల్లూరు (టౌన్): దర్గామిట్టలోని గోల్డ్ ఫీల్డ్స్ యమహా షోరూంలో శనివారం ఎక్స్ఎస్సార్ 155, ఎఫ్జెడ్ రేవ్ నూతన బైకులను కర్ణాటక బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కె.మధు మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా గోల్డ్ఫీల్డ్స్ ఎండీ హరీష్ మాట్లాడుతూ యమహా ఆర్ఎక్స్ 100 లెగసీని ఈ తరానికి అందించాలన్న ఉద్దేశంతో యమహా న్యూ రెట్రో, మోడల్ యమహా ఎక్స్ఎస్సార్ 155ను నాలుగు రంగుల్లో కొత్త ఫ్యూచర్స్తో తీసుకొచ్చారన్నారు. దీంతో పాటు మరో మోడల్ ఎఫ్జెడ్ రేవ్ న్యూ ఫ్యూచర్స్తో తీసుకొచ్చారన్నారు. ఎక్స్ఎస్ఆర్ 155 లిక్విడ్ కూల్ ఇంజిన్తో పాటు అప్ అండ్ డౌన్ సస్పెన్షన్ కలిగి డ్యూయల్ చానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టంతో వచ్చిందన్నారు. ఈ బైక్ షోరం రూ.1,50,724లుగా ధర కాగా, ఎఫ్జెడ్ రేవ్ షోరూం ధర రూ.1,17,218లుగా నిర్ణయించారన్నారు. కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ రామకృష్ణ, మేనేజర్ సారథి, అడ్మిన్ మేనేజర్ ప్రసాద్ పాల్గొన్నారు. -
టెన్త్ విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు శనివారం నుంచి వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నట్లు డీఈఓ బాలాజీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు రెమిడియల్ క్లాసులు, 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయా సబ్జెక్టులపై అవగాహన ఉంటుందన్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు చిన్నారులకు సూచించిన సబ్జెక్టులపై అసెస్మెంట్ చేయాలన్నారు. పేపర్లను ఆయా రోజు వాల్యుయేషన్ చేసి ఆన్లైన్లో మార్కుల ఎంట్రీతో పాటు విద్యార్థులతో రివ్యూ చేయాలన్నారు. ఏ, బీ గ్రూపు విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్, సీ, డీ గ్రూపు విద్యార్థులకు రైజింగ్ స్టార్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలన్నారు. ఈ వంద రోజుల పాటు విద్యార్థులు సెలవు పెట్టకుండా తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకోవాలన్నారు. పాఠశాల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు త్రికరణ శుద్ధితో కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. -
‘పొదుపు’లో గోల్మాల్
● గ్రూపుల వద్ద వీఓఏల చేతివాటం ● కలెక్టర్కు ఇటీవల ఫిర్యాదు కలువాయి(సైదాపురం): మండలంలోని పొదుపు సంఘాల గ్రూపులకు లోన్లు ఇప్పిస్తూ వీఓఏలు భారీ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కలువాయి మండలంలో ఎన్ఆర్ఎల్ పోర్టల్ ద్వారా లోన్ అఫ్రూవల్ కోసం మోక్రో క్రెడిట్ ప్లాన్ ఇచ్చేందుకు మండల స్థాయి ఏపీఎంలకు వెయ్యి, వీఓఏ, సీసీకి రూ.4 వేలు నుంచి రూ.10 వేలు ఇలా బ్యాంకు దగ్గరకు లోన్ కోసం వచ్చే ప్రతి పొదుపు గ్రూప్ దగ్గర వీఓఏలు నగదు తీసుకుంటున్నారు. సహకరిస్తున్న బ్యాంక్ మేనేజర్లు ఏ బ్యాంక్ అయినా పొదుపు గ్రూపులకు రుణం ఇచ్చేందుకు లోన్ సెట్లను ఉచితంగా ఇచ్చి వివరాలు పొందుపరిచి అప్రూవల్స్ చేయాల్సి ఉంది. ఇయితే అందుకు భిన్నంగా బ్యాంకులో ఉండాల్సిన లోన్ సెట్లను వీఓఏలకు అప్పజెప్పి బ్యాంక్ మేనేజర్ సైతం సహకరిస్తున్నట్లు పొదుపు మహిళలు తెలుపుతున్నారు. ఇటీవల కాలంలో వెంకట్రామరాజుపేట గ్రామానికి చెందిన బాపూజీ, పూజిత గ్రూపులకు లోన్లు ఇచ్చేందుకు వీఓఏకు బ్యాంకు లోన్సెట్ల డబ్బులు చెల్లించి మరీ లోన్కు వెళ్లిన పరిస్థితి. లోన్ అప్రూవల్ కాగానే వెంటనే వారి వ్యక్తిగత ఖాతాలకు నగదు జమ చేసే సమయంలో ఆ సంఘ వీఓఏలకు వారు అడిగిన నగదు చెల్లిస్తేనే మేనేజర్లకు చెప్పి నగదు జమ చేయిస్తున్న సందర్భం కుల్లూరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో నెలకొంది. పీజీఆర్ఎస్లో సైతం కుల్లూరు గ్రూపులలో అవినీతి జరుగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్లాకు సాయిబాబా గ్రూప్ సభ్యుల ఫిర్యాదు మేరకు ఏపీఎం రవి, కుల్లూరు క్లస్టర్ సీసీ ధనమ్మతో గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. కుల్లూరు సంధ్యా గ్రూపులో ఒక సభ్యురాలికి రూ.50 వేల రుణం ఇస్తూ అక్కడికక్కడే వీఓఏ రూ.1500ల నగదు తీసుకున్నట్లు తెలిసింది. వీటిపై చర్యలేవీ గతంలో కలువాయి వీఓఏ బినామీ పేర్లతో వీఓఆర్ఎఫ్ కింద రూ.60 లక్షలు తీసుకుని ఇప్పటి వరకు ఒక్కపైసా కూడా చెల్లించలేదు. దీనిపై మండలాధికారులకు వాటాలు వెళ్తుంటే ఇక రీకవరీలు ఏమీ జరుగుతాయని పొదుపు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాదన్నగారిపల్లి, దాచూరు, తోపుగుంట గ్రామాల్లో పనిచేస్తున్న వీఓఏలను ఇటీవల టీడీపీ నాయకులు తొలగించి అనుకూలమైన వారికి నియమించుకున్నారు. నాయకులకు బినామీ పేర్లతో ఒక కుల్లూరు గ్రామంలోనే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల కింద 20 మందికి అప్రూవల్ పెట్టి రూ.50 వేలు నుంచి రూ.75 వేలు లోన్ తీసుకునే సదుపాయాన్ని రెడీ చేసుకున్నారు. అలాగే గ్రామ నిధి అని పొదుపులో ఉన్న మహిళలకు బినామీ పేర్లతో 15 మందికి రూ.50 వేల చొప్పున తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. గతంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.30 లక్షల మేర అవినీతికి పాల్పడిన సీసీ భవాని సస్పెండ్ అయినా అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. గతంలో వెలుగు సీసీగా పనిచేసిన పుల్లయ్య పెరంకొండలో సంఘం బంధం నుంచి రూ.లక్ష నగదు హెచ్డీ అమౌండ్ స్వాహా చేసినా ఒక్క రూపాయి రికవరీ చేయలేదు. పర్లకొండ, చీపినాపి, వేదనపర్తి, నూకలపల్లి, తెలుగురాయపురం గ్రామాల్లో బినామీ పేర్లతో స్వాహా చేయడమే వీఓఏల ముఖ్య ఉద్దేశం. న్యూట్రీ గార్డెన్ కింద రూ.15 లక్షల గోల్మాల్ జరిగినా అధికారులు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. మండల కేంద్రమైన కలువాయిని వదిలి కేవలం కుల్లూరు క్లస్టర్ పైనే వెలుగు అధికారులు కపట ప్రేమ చూపించడం పట్ల ఉన్నతాధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని పొదుపు మహిళలు కోరుకుంటున్నారు. -
హామీకి టీడీపీ కట్టుబడాలి
● పేర్నాటి శ్యామ్ప్రసాద్రెడ్డి కోట: గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపే విషయమై ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీపై సీఎం చంద్రబాబునాయుడు కట్టుబడి ఉండాలని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు పేర్నాటి శ్యామ్ప్రసాద్రెడ్డి అన్నారు. ఆయన అల్లంపాడులో శనివారం మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని చంద్రబాబు గూడూరులో జరిగిన సభలో హామీ ఇచ్చారన్నారు. అదేవిధంగా కోటలో జరిగిన యువగళం పాదయాత్ర బహిరంగ సభలో లోకేశ్ కూడా హామీ ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నేతలు సైతం గూడూరు సెగ ఢిల్లీకి చేరేలా తమ గళాన్ని వినిపించాలన్నారు. ప్రజల మనోభావాలను ప్రతి పార్టీ గౌరవించాలన్నారు. నాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి పార్లమెంట్ స్థానాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు. అప్పుడు ఎక్కడా సమస్య రాలేదన్నారు. ఇప్పుడు ఇచ్చిన మాట తప్పడం వల్లే గూడూరు ప్రజలు అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారన్నారు. గూడూరుపై తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి తీసుకునే నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటామన్నారు. పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణారెడ్డి, సర్పంచ్ ఈశ్వర్రెడ్డి, ఉప సర్పంచ్ దేవరాల రాంబాబు పాల్గొన్నారు. -
వర్సిటీ స్థాయి అథ్లెటిక్స్ మీట్ ప్రారంభం
కావలి (అల్లూరు): విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ స్థాయి అథ్లెటిక్స్ మీట్ శనివారం కావలి జవహర్ భారతి డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ తొలి నుంచి జవహర్ భారతి కళాశాల క్రీడలకు ఆటపట్టు అని, గెలుపోటములను స్వీకరించే క్రీడా స్ఫూర్తిని క్రీడాకారులు అలవర్చుకోవాలని కోరారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ సీహెచ్ వెంకట్రాయలు మాట్లాడుతూ గెలుపు కోసం పోరాడే నైపుణ్యాలు, పోరాట పటిమలను క్రీడల్లో పాల్గొనడం వల్ల అలవడుతాయని తెలియజేశారు. అథ్లెటిక్ మీట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పి.ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులందరూ పోటీల్లో ఆసక్తిగా, ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ ఎ.ప్రవీణ్కుమార్ అథ్లెటిక్ మీట్ పురుషుల జట్లకు పరిశీలకుడిగా, సూళ్లూరుపేట డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ అమ్మాజీ సీ్త్రల జట్లకు పరిశీలకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో వివిధ డిగ్రీ కళాశాలల వ్యాయామ అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేశారు. -
నాడు.. రైతే.. రారాజు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాపై ఇటీవల తుఫాన్లు చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించగా, పొలాలు చెరువులను తలపించాయి. మోంథాతో అరటి తోటలు, వరి, వేరుశనగ పంటలను రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా దిత్వాతో వేలాది ఎకరాల్లో నారుమడులు, నాట్లు, శనగ పంటలు దెబ్బతిని అన్నదాతలు నిండా మునిగిపోయారు. ఇంత జరుగుతున్నా, కర్షకులను ఆదుకునే అంశంలో ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. పరిహారం మాట అటుంచితే.. రైతులను కనీసం పరామర్శించాలనే ఆలోచన సైతం వీరికి రాలేదు. జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా, ప్రయోజనం శూన్యం. సమీక్ష జరిపి నష్ట నివేదికను రూపొందించాలనే ధ్యాసా కరువైంది. కష్టం నీటిపాలు అక్టోబర్ 27, 28న సంభవించిన మోంథా తుపాన్తో 1320 హెక్టార్లలో కోతకొచ్చిన వరి.. 44.9 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఇవన్నీ అధికారిక లెక్కలే. పంట నష్టపోయిన అన్నదాతలు, పాడి రైతులకు రూపాయి సాయం నేటికీ అందలేదు. ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వకపోవడం.. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేయడంతో కర్షకులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాల తీవ్రతకు 24 పెద్ద పశువులు, ఏడు గొర్రెలు, 600 కోళ్లు మృతి చెందాయి. ప్రజలకూ పంగనామాలే.. మోంథా తుఫాన్ సమయంలో లోతట్టు ప్రాంతాల్లో 11 వేల మంది ప్రజలు కష్టాలు పడగా, వీరిలో 3977 మందిని 117 పునరావాస కేంద్రాలకు తరలించామని మొదట ప్రకటించారు. ఈ తరుణంలో నిత్యావసర సరుకుల పంపిణీపై ప్రభుత్వం ప్రకటన చేయగానే, టీడీపీ నేతల కోసం ఈ సంఖ్యను 8930కు పెంచారు. మొత్తమ్మీద రూ.96.27 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారికంగా ప్రకటించినా, ఈ సంఖ్య వాస్తవంగా ఎక్కువే. రిలీఫ్ క్యాంపులకు తరలించిన వారికి తుఫాన్ తీవ్రత తగ్గిన నాలుగైదు రోజుల తర్వాత 25 కిలోల బియ్యం, కందిపప్పు, చక్కెర, ఎర్రగడ్డలు, బంగాళాదుంపలను కిలో చొప్పున, లీటర్ పామాయిల్ను అరకొరగా అందజేశారు. అధికార పార్టీకి సంబంధించిన స్థానిక నేతల కనుసన్నల్లో ఈ వ్యవహారం జరగడంతో తమ వారికే పంపిణీ చేయించుకున్నారు. అండగా నిలిచిన వైఎస్సార్సీపీ శ్రేణులు దిత్వా సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను కనీసం పునారావాసాలకు తరలించలేదు. దీంతో బాధితులకు భోజన సదుపాయాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మరికొందరు కల్పించారు. ఈ పరిణామాల క్రమంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తోందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలతో అనంతసాగరం మండలంలో పాచిపోయిన నారుమడులు ముంచిన దిత్వా దిత్వా తుఫాన్ నాటికి జిల్లాలో వేలాది ఎకరాల్లో నాట్లేశారు. అధికారిక లెక్కల మేరకు 6970 హెక్టార్లలో నాట్లు, నారుమడులు.. 557.5 హెక్టార్లలో శనగ పంట దెబ్బతినిందని ప్రకటించారు. వాస్తవానికి డెల్టా ప్రాంతంలోనే వేలాది ఎకరాల్లో నాట్లు జరుగుతున్నాయి. సుమారు 25 వేల ఎకరాల్లో వరినాట్లు, నారుమడులు మునిగి కుళ్లిపోతున్నాయి. పొలాల నుంచి వరద నీరు పూర్తిస్థాయిలో ఇప్పటికీ బయటకెళ్లలేదు. దీంతో నాట్లేసిన రైతులు ఎకరాకు రూ.30 వేల చొప్పున.. నారుమడులేసిన వారు ఎకరాకు రూ.ఐదు వేల చొప్పున నష్టపోయారు. ఇంత జరిగినా మంత్రులు నారాయణ, రామనారాయణరెడ్డి ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. నష్టంపై సమీక్షా జరపలేదు. తూతూమంత్రంగా ఎన్యూమరేషన్ చేసి నష్టాన్ని తగ్గించి చూపి కాకి లెక్కలేశారు. మరోవైపు రైతులను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి తాను లేఖ రాశానని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గొప్పలు చెప్పుకొన్నారు. అయితే క్షేత్రస్థాయిలో సాయమందించిన దాఖలాల్లేవు. తుఫాన్ల తాకిడికి కుదేలు పరిహారం లేదు.. పరామర్శపై ధ్యాసేదీ..? మోంథా నష్టంపై మొక్కుబడిగా ఎన్యూమరేషన్ దిత్వాతో సమస్య మరింత తీవ్రం సమీక్షలు సైతం జరపని అధికారులు, మంత్రులు అన్నదాత పరిస్థితి దయనీయం 35 రోజుల వ్యవధిలో జిల్లాపై మోంథా, దిత్వా తుఫాన్లు పంజా విసిరాయి. వీటి ప్రభావానికి కురిసిన భారీ వర్షాలతో అన్నదాతలు కుదేలయ్యారు. పంట నష్టపోయి దయనీయ స్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో వీరికి భరోసానివ్వాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. వ్యవసాయమే దండగ అంటూ గతంలో ప్రకటించిన చంద్రబాబు.. ప్రస్తుతం అదే పోకడను అవలంబిస్తూ రైతులపై నిర్దయ చూపుతున్నారు. దిక్కుతోచక విలవిల్లాడుతున్న కర్షకులకు పరిహారాన్ని అందించే విషయం పాలకులకు ఏ మాత్రం పట్టడంలేదు. గతంలో ఇలాంటి విపత్తులు ఎదురైన సమయాల్లో నాటి సీఎం జగన్మోహన్రెడ్డి ఎంతో ఉదారంగా స్పందించి వీరికి చేయూతనిచ్చేవారు. అప్పటికీ.. ఇప్పటికీ మధ్య వ్యత్యాసాన్ని గమనిస్తున్న రైతులు.. ప్రస్తుత సర్కార్ తీరుపై భగ్గుమంటున్నారు. ప్రకృతి విపత్తులనేవి సర్వ సాధారణం. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనూ ప్రకృతి ప్రకోపానికి ఇవి సంభవించాయి. అయితే ఆ సమయంలో సీఎంగా ఉన్న జగన్మోహన్రెడ్డి రైతులకు అండగా నిలిచారు. సబ్సిడీపై విత్తనాలు.. ఉచిత పంటల బీమా ద్వారా అన్నదాతలకు భరోసానిచ్చారు. అయితే ప్రస్తుతం ఇవేవీ అందించకుండా సర్కార్ నిర్లిప్త ధోరణిని అనుసరిస్తోంది. ఇప్పటి కూటమి సర్కార్ను.. నాటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రైతులు బేరీజేసుకుంటున్నారు. టీడీపీ సర్కార్ తీరుతో తాము తీవ్రంగా నష్టపోయామనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. -
నేత్రపర్వంగా శ్రీవారి కల్యాణం
రాపూరు: మండలంలోని పెంచలకోన క్షేత్రంలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా శనివారం నిర్వహించారు. అభిషేకం, సుప్రభాతం, గోపూజ, పూలంగిసేవను జరిపారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను నిత్య కల్యాణ మండపంలో కొలువుదీర్చి వివిధ రకాల ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ కల్యాణాన్ని నిర్వహించారు. ఊజంల్సేవను సాయంత్రం జరిపారు. నిత్యాన్నదాన పథకానికి రూ.రెండు లక్షల విరాళాన్ని నెల్లూరులోని జెడ్పీ కాలనీకి చెందిన మలిశెట్టి పాపయ్య అందజేశారని దేవస్థాన ఏసీ శ్రీనివాసులు తెలిపారు. చాగంటికి ఘన స్వాగతం నెల్లూరు(బారకాసు): ఆదిశంకరాచార్య కృత జగన్నాథాష్టకంపై ఆధ్యాత్మిక దివ్య ప్రవచనలకు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు శనివారం హాజరయ్యారు. పురమందిర ప్రాంగణంలోని ఓపెన్ ఆడిటోరియంలో భరద్వాజ రుద్రాభిషేక సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. సంఘ కార్యదర్శి యజ్ఞమూర్తి బాలసుబ్రహ్మణ్యం తదితరులు పర్యవేక్షించారు. -
రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి
నెల్లూరు(లీగల్): రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చరిత్ర ఎంతో ఘనమైందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ పేర్కొన్నారు. అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కోర్టు కాంప్లెక్స్లో కార్యక్రమాన్ని నెల్లూరు బార్ అసోసియేషన్, ఎస్సీ, ఎస్టీ అడ్వొకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్.. అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పులిమి అయ్యప్పరెడ్డి, నాగరాజుయాదవ్, అసోసియేషన్ ప్రెసిడెంట్ జల్లి పద్మాకర్, న్యాయవాదులు అబ్బాయిరెడ్డి, విజయకుమార్రెడ్డి, వెంకయ్య, బద్దెపూడి రవీంద్ర, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ‘డీకేడబ్ల్యూ’లో రేపట్నుంచి స్పాట్ అడ్మిషన్లు నెల్లూరు (టౌన్): నగరంలోని డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో ఎమ్మెస్సీ జువాలజీ, ఎంఏ తెలుగు పీజీ కోర్సుల్లో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లను సోమవారం నుంచి నిర్వహించనున్నామని ప్రిన్సిపల్ గిరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ సెట్ అర్హత లేకపోయినా స్పాట్ అడ్మిషన్లను పొందొచ్చని చెప్పారు. కోటాలో చేరే వారికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని పేర్కొన్నారు. అడ్మిషన్లు, సమాచారం కోసం 94913 21150, 94415 40317 నంబర్లను సంప్రదించాలని సూచించారు. 9న జాబ్ మేళా నెల్లూరు (టౌన్): మద్రాస్ బస్టాండ్ సమీపంలోని వీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్లో జాబ్ మేళాను ఏపీఎస్సెస్డీసీ, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, సీడాప్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించనున్నామని కళాశాల డైరెక్టర్ తనూజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 15 కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, ఏదైనా డిగ్రీ చదివిన వారు అర్హులని.. ఆధార్ కార్డు జిరాక్స్, బయోడేటాను తీసుకురావాలని కోరారు. వివరాలకు 63016 28981, 99888 53335 నంబర్లను సంప్రదించాలని సూచించారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం మోస్తరుగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారిని 67,336 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 25,063 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.68 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
నకిలీ డీఏపీ కలకలం
● గతేడాదీ ఇదే తరహాలో ● రైతులను మోసం చేస్తున్న కొందరు వ్యాపారులు మర్రిపాడు: రబీ సీజన్ ప్రారంభమవడంతో రైతుల కష్టాన్ని దోచుకునేందుకు నకిలీ వ్యాపారులు సిద్ధమయ్యారు. తక్కువ ధరకే డీఏపీని అందిస్తామంటూ మాటలు చెప్పి.. నకిలీని అంటగట్టేందుకు యత్నాలను ప్రారంభించారు. జరుగుతోందిలా.. మండలంలోని పలు గ్రామాల్లో రైతులకు డీఏపీని రూ.వెయ్యికే అందిస్తామంటూ నంద్యాలకు చెందిన కొందరు వ్యాపారులు ప్రస్తుతం చెప్తున్నారు. సాయంత్రం వేళ బుక్ చేసుకొని.. మరుసటి రోజు ఉదయం పది గంటల్లోపు అంటగట్టి నగదును తీసుకెళ్తున్నారు. అయితే ఇది నకిలీదని సమాచారం. గతేడాది సైతం ఇదే తరహాలో అందజేశారు. మండలంలోని ఇస్కపల్లికి చెందిన రైతు బత్తల రత్తయ్యకు 20 టన్నుల డీఏపీని ఇచ్చారు. దీని ద్వారా తనకు రూ.ఆరు లక్షల మేర నష్టమొచ్చిందని ఆయన వాపోయారు. మర్రిపాడు మండలంలోని కొత్త అల్లంపాడులో లోడ్ను తాజాగా దించారు. రైతులు జాగ్రత్తగా ఉండాలి మండలంలో గ్రామాల్లో నాణ్యత లేని ఎరువులు, పురుగుమందును కొందరు విక్రయిస్తున్నారని రైతులు చెప్తున్నారు. లైసెన్స్ లేకుండా ఇలా ఎవరైనా అమ్మితే వ్యవసాయాధికారికి తెలియజేయాలి. రైతులు అప్రమత్తంగా ఉంటూ.. సలహాలు సూచనల కోసం గ్రామ వ్యవసాయ సహాయకులు లేదా ఏఓలను సంప్రదించాలి. – కవిత, వ్యవసాయాధికారి, మర్రిపాడు ● -
అంబేడ్కర్ మహనీయుడు
నెల్లూరు(స్టోన్హౌస్పేట): అణగారిన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితకాలం కృషి చేసిన మహనీయుడు అంబేడ్కర్ అని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకొని నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి శనివారం నివాళులర్పించిన అనంతరం కాకాణి మాట్లాడారు. రాష్ట్రంలో నారావారి రాజ్యాంగాన్ని టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆరోపించారు. అరాచక పాలనను సీఎం చంద్రబాబు సాగిస్తూ.. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ.. జైళ్లకు పంపి హింసిస్తున్నారని ధ్వజమెత్తారు. అణగారిన వర్గాలు, మహిళలపై దాడులు చేస్తూ పైశాచికానందాన్ని పొందుతున్నారని విమర్శించారు. పేదలకు వైద్య విద్యను దూరం చేయాలనే కుట్రతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. అంబేడ్కర్ ఆశయసాధన కోసం మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పాటుపడ్డారని గుర్తుచేశారు. -
సిమ్ మార్చేసి రూ.5.21 లక్షలు స్వాహా
చీమకుర్తి: సినీ ఫక్కీలో సిమ్కార్డులను మార్చేసి రూ.5.21 లక్షలు కొట్టేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాలేనికి చెందిన ఆదిపూడి వెంకట శేషయ్య ఇటీవల బక్కిరెడ్డిపాలేనికి బంధువుల వద్దకు వచ్చాడు. అక్కడ 63 ఏళ్ల వయస్సున్న వీరపల్లి వెంకయ్యతో మాట కలిపి బంధువులకు ఫోన్ చేసుకొని ఇస్తాను ఫోన్ ఇవ్వమని తీసుకున్నాడు. వెంకయ్య ఫోన్ సాధారణ బేసిక్ ఫోన్. శేషయ్య ఆ ఫోన్లో ఉన్న సిమ్ తీసి తన వద్ద ఉన్న ఫోన్లో వేసుకుని, తన దగ్గర ఉన్న సిమ్కార్డును వెంకయ్య ఫోన్లో వేశాడు.ఈ పనంతా ఫోన్ తీసుకున్న తర్వాత మాట్లాడుతున్నట్లు నటిస్తూ చేశాడు. ఈలోపు వెంకయ్యకు ఫోన్కాల్స్ రావడానికి ఇబ్బంది లేకుండా కాల్డైవర్షన్ పెట్టాడు. అనంతరం వెంకయ్య సిమ్ నంబర్ యూపీఐ అకౌంట్ క్రియేట్ చేసి అతని అకౌంట్లో ఉన్న రూ.5.21 లక్షలను బెట్టింగ్ యాప్లలో పెట్టాడు. దాని ద్వారా వచ్చిన డబ్బును శేషయ్య తన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేలా చూసుకున్నాడు. ఇదంతా నవంబర్ నెల 4వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరిగింది. తీరా బాధితుడు బ్యాంకుకు వెళ్లి తన అకౌంట్లో ఉన్న డబ్బులు గల్లంతయ్యాయని గమనించి గత నెల 29న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాల మేరకు ఒంగోలు పోలీసులు నిందితుడిని శనివారం గుర్తించి అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.2.60 లక్షల నగదు, సెల్ఫోన్, రెండు సిమ్ కార్డులను స్వా«దీనం చేసుకున్నారు. ఒంగోలు కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ దాసరి ప్రసాదరావు తెలిపారు. రోల్డ్గోల్డ్ను తాకట్టుపెట్టి రూ.1 లక్షతో పరార్ నెల్లూరు జిల్లా జలదంకి మండలం రామవరప్పాడుకి చెందిన కడియాల వెంకటేశ్వరరావు చీమకుర్తికే చెందిన గట్టుపల్లి వెంకటసాయి భరత్ వద్ద బ్రాస్లెట్ పెట్టి రూ.1 లక్ష అప్పుగా తీసుకున్నాడు. సెపె్టంబర్ నెల 19న ఈ సంఘటన జరిగింది. తర్వాత బ్రాస్లెట్ను పరీక్షించగా అది రోల్డ్గోల్డ్ అని తెలియటంతో సీసీ కెమెరాల ఆధారాలతో ఈనెల 3న పోలీసులకు బాధితుడు వెంకట సాయి ఫిర్యాదు చేశాడు. శనివారం నిందితుడు వెంకటేశ్వరరావును చీమకుర్తి తూర్పు బైపాస్లో అదుపులోకి తీసుకొని రూ.5.40 లక్షలు స్వా«దీనం చేసుకున్నట్లు సీఐ ప్రసాదరావు మీడియాకు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు పేర్కొన్నారు. -
సీబీఐ దర్యాప్తునకు టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధమా?.. కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు: వరుస తుపాన్లు, వరదల కారణంగా రైతులు నష్టపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని, కూటమి ప్రభుత్వానికి వ్యవసాయంపై నిర్లక్ష్యం కాగా, సీఎం చంద్రబాబుకు రైతులంట ఏహ్యభావమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్రెడ్డి ఆక్షేపించారు. మొంథా తుపాను, తాజా దిత్వా తుపానుతో నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు పరిహారం, ఇన్ఫుట్ సబ్సిడీ ఏదీ ఇవ్వలేదని ఆయన విమర్శించారు. అధికార పార్టీ నేతలు వరద సాయాన్ని దొంగ బిల్లులు పెట్టి దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప, రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి వారిలో లేదని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి దుయ్యబట్టారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:అసలు ప్రభుత్వం అనేది ఉందా?:రాష్ట్రంలో గత నెల మొంథా తుపాన్, తాజాగా దిత్వా తుపాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా మొత్తం నష్టపోయినా ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారం ప్రకచించలేదు. ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. జిల్లాలో వరినాట్లు పూర్తిగా పాడైపోయాయి. ఎకరాకు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చు పెట్టిన రైతులకు పైసా సహాయం లేదు. పంట నష్టం అంచనా వేసేందుకు అధికారులు గ్రామాలకు వెళ్లలేదు.ఇవన్నీ చూస్తుంటే, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఉందా అన్న సందేహం కలుగుతోంది. తుపాన్ల సమయంలో ప్రభుత్వం పట్టించుకోకపోతే, మా పార్టీ చాలా చోట్ల భోజన వసతి ఏర్పాటు చేసి ప్రజలకు అండగా నిల్చింది. గతంలో మా ప్రభుత్వ హయాంలో 2023లో ఇలాంటి పరిస్థితి తలెత్తితే, చాలా వేగంగా స్పందించాం. రైతులను వెంటనే ఆదుకున్నాం.మా ఎమ్మెల్యే ఆ మాటలు ఫాలో అవుతున్నారు:సీఎం చంద్రబాబు ఎప్పుడూ ఒక మాట అంటారు. ‘సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోండి’ అని ఆయన చెబుతుంటారు. వాటిని మా సర్వేపల్లి ఎమ్మెల్యే గట్టిగా వంట బట్టించుకున్నాడు. అందుకే కష్టనష్టాల్లో ఉన్న రైతులను ఎలా ఆదుకోవాలని ఆలోచించకుండా, ఎక్కడ దొంగ బిల్లులు పెట్టుకోవచ్చని ఆలోచిస్తున్నారు. మా జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఫ్లడ్ డ్యామేజ్ మరమ్మతుల పేరిట కోట్లు దోచుకుంటున్నారు. రైతుల పేరు చెప్పి గతంలో నీరు–చెట్టు కార్యక్రమంలో ఎలా అయితే దోచుకున్నారో.. ఈరోజు మరమ్మతు పేరిట మళ్లీ అదే చేస్తున్నారు.అరాచకంగా మారిన విజిలెన్స్ విభాగం:ఈరోజు విజిలెన్స్ దర్యాప్తు అన్న దానికి అర్థమే పూర్తిగా మారిపోయింది. అధికార పార్టీ నేతల ఆదేశాలను రాసి పెట్టే కార్యాలయంగా ఇక్కడి విజిలెన్స్ విభాగం తయారైంది. ఒకసారి జిల్లా విజిలెన్స్ అధికారుల కాల్ లిస్టులు బయటపెడితే, మంత్రి, ఎమ్మెల్యేలతో ఎలాంటి సంబంధాలు కొనసాగుతున్నాయి.. వారి ఆదేశాలు అధికారులు ఎలా అమలు చేస్తున్నారనేది బయటపడుతుంది. విజిలెన్స్, ఏసీబీ విభాగాలు.. జిల్లాలో అధికార పార్టీ నేతల ఇళ్లకు వెళ్లి, వారితో ఫోన్లలో మాట్లాడి, వారి ఆదేశాలు, సూచనలకు అనుగుణంగా రిపోర్టులు తయారు చేస్తున్నారు. ఇదే అత్యంత దారుణం. అరాచకం.దమ్ముంటే బహిరంగ చర్చకు రండి:మీ ప్రభుత్వంలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోంది. కూటమి ప్రభుత్వం ఏ ఒక్క రైతుకూ మేలు చేయడం లేదు. అదే గత మా వైయస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో రైతుల చేయి పట్టుకుని నడిపించాం. విత్తనం మొదలు, పంటల అమ్మకాల వరకు గ్రామాల్లో ఆర్బీకేలు రైతుల కోసం పని చేశాయి. అందుకే మీకు, దమ్ము, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రండి. మీడియా, రైతుల సమక్షంలో ఎక్కడైనా కూర్చొని మాట్లాడుదాం. జగన్గారి హయాంలో రైతులకు ఎలా సహాయం జరిగింది? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎలా దోపిడీ జరుగుతోంది.. అన్నదానిపై కూలంకషంగా చర్చిద్దాం. నా నియోజకవర్గం సర్వేపల్లిలోనే చర్చ మొదలు పెడదాం. మరి మీరు అందుకు సిద్ధమా?.విజిలెన్స్ రిపోర్టులపై సీబీఐ విచారణకు సిద్ధమా?:వరద సాయాన్ని అధికార పార్టీ నేతలు దొంగ బిల్లులతో దోచుకుంటున్నారు. వీటిని సీబీఐ విచారణ పెడితే ఎంత మంది అధికారులు ఇళ్లకు వెళ్తారో, ఎన్ని అవకతవకలు బయటపడతాయో తెలుస్తుంది. ఈరోజు ఫాల్స్ విజిలెన్స్ రిపోర్టులు తయారు చేసి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. విచారణ సంస్థలు కూడా పూర్తిగా రాజకీయ బానిసలయ్యాయి. ఈ దుస్థితి కొనసాగితే సమాజంపై ప్రమాదకర ప్రభావం ఉంటుంది. అధికారంలో ఉండి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, వ్యవసాయ మంత్రికి లెటర్ రాయడం విడ్డూరంగా ఉంది. ఆయనకు నేరుగా మంత్రితో, ప్రభుత్వంతో మాట్లాడే దమ్ము, ధైర్యం లేదా?. ఏదేమైనా కోట్ల రూపాయల దోపిడిపై సీబీఐ విచారణకు అధికార పార్టీ నేతలు సిద్ధమా?వ్యవసాయ మంత్రి పారిపోతున్నారు:వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడికి అసలు వ్యవసాయం గురించే తెలియదు. ఆయన రైతుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో మేం చర్చకు సిద్ధమైతే అచ్చెన్నాయుడు తోక ముడుచుకుని పారిపోయాడు. ఇప్పుడు కూడా అచ్చెన్నాయుడు వేదిక, సమయం నిర్ణయిస్తే గత ప్రభుత్వ రైతు సంక్షేమం, ఈ ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు మేం సిద్ధం. కానీ, ఆయన పారిపోతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి ఆక్షేపించారు. -
ముందస్తు చర్యలెక్కడ?
● ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) గురవయ్య నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడిన సందర్భాల్లో పునరుద్ధరణ చర్యలు చేస్తున్నారు. కానీ అంతరాయాలు రాకుండా ముందస్తు చర్యలు ఎక్కడ తీసుకుంటున్నారు’ అని ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) గురవయ్య అధికారులను ప్రశ్నించారు. జిల్లాకు శుక్రవారం వచ్చిన ఆయన కోవూరు డివిజన్ విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని వీడాలన్నారు. ప్రతి సెక్షన్ కార్యాలయానికి నిర్దేశించిన సమయానికి సిబ్బంది రావాలని ఆదేశించారు. విద్యుత్ సబ్స్టేషన్లను అధికారులు తనిఖీలు చేస్తుండాలన్నారు. విద్యుత్ చౌర్యాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. పగటి పూట వీధి దీపాలు వెలగకుండా చూడాలన్నారు. అధికారులు, సిబ్బ ంది వారు విధులు నిర్వహిస్తున్న హెడ్క్వార్టర్స్లోనే ఉండాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఎస్ ఈ రాఘవేంద్రం, కోవూరు ఈఈ రమేష్చౌదరి, డీఈఈ మధుసూదనరెడ్డి, సతీష్, సురేంద్ర, వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, రెవె న్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
దారుణంగా జాతీయ రహదారి
నెల్లూరు(అర్బన్): కోవూరు నుంచి నెల్లూరు నగరం మీదుగా చైన్నె వెళ్లే నేషనల్ హైవేపై పలుచోట్ల కొన్నినెలలుగా గుంతలున్నాయి. శాశ్వత రిపేర్లు చేయించాల్సిన హైవే నిర్వాహకులు గోతుల్లో కంకర మట్టి వేసి వదిలేశారు. ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలకు కంకర డస్ట్ కొట్టుకుపోయింది. నిత్యం ఈ మార్గం గుండా వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. నేషనల్ హైవే నిబంధనల ప్రకారం చిన్నగుంత ఏర్పడినా అప్పటికప్పుడు దానిని పక్కాగా తారుతో పునర్నిర్మించాల్సి ఉంది. అయితే పాలకుల నిర్లక్ష్యం వల్ల నిర్వహణ అధ్వానంగా తయారైంది. సుందరయ్య కాలనీ – బుజబుజనెల్లూరు మధ్య పలుచోట్ల భారీగా గోతులున్నాయి. వాహనచోదకులుకు ఈ రోడ్లు నరకం చూపిస్తున్నాయి. కలెక్టర్ జోక్యం చేసుకుని గతుకులు లేని రోడ్లు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
పండ్ల వ్యాపారులపైకి దూసుకెళ్లిన కారు
● ఇద్దరు మహిళలకు గాయాలు నెల్లూరు(క్రైమ్): కారు ఢీకొని ఇద్దరు పండ్ల వ్యాపారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం నెల్లూరులోని ఏసీ కూరగాయల మార్కెట్ వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, ట్రాఫిక్ సిబ్బంది కథనం మేరకు.. నగరానికి చెందిన ఓ వ్యక్తి వీఆర్సీ వైపు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వైపు కారు నడుపుతూ బయలుదేరాడు. కారు మాజీ ప్రధాని నెహ్రూ విగ్రహం వద్దకు వచ్చేసరికి ఆటో అడ్డు వచ్చింది. అతను బ్రేక్కు బదులుగా ఎక్స్లేటర్ తొక్కాడు. దీంతో కారు వేగంగా రోడ్డు పక్కనే ఉన్న తోపుడు బండ్లపైకి దూసుకెళ్లి అక్కడే ఉన్న పోస్టుబాక్స్ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో తోపుడు బండ్లపైకి పండ్లను విక్రయిస్తున్న ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కారు నడుపుతున్న వ్యక్తి, స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. -
వర్షం ఆగింది.. నష్టం మిగిలింది
పొగమంచు వేళలో ప్రకృతి పులకింత రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు● మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి నెల్లూరులో ఫతేఖాన్పేట ప్రాథమిక పాఠశాలలో నిలిచిన వర్షపునీరు ఆర్ఎస్ఆర్ స్కూల్లో ఇదీ పరిస్థితిముగ్గు వేసేందుకు వర్షపునీటిని స్కూల్ బయట పోస్తున్న విద్యార్థిని పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఈ వేళలో అనేక ప్రాంతాలు ప్రకృతి గీసిన చిత్రాల్లా కనిపిస్తున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు విద్యార్థులకు కష్టాలుకండలేరులో 60.280 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 60.280 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 12,585 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
ప్రాణం తీసిన అతివేగం
● లారీ ఢీకొని బేల్దారి మృతి కోవూరు: కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాళెం – చంద్రశేఖరపురం గిరిజన కాలనీ వద్ద నేషనల్ హైవేపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. బుచ్చిరెడ్డిపాళెంలోని రేబాలకు చెందిన ఎస్కే ఇబ్రహీం (45) బేల్దారి పనిచేస్తుంటాడు. శుక్రవారం తెల్లవారుజామున పనికి వెళ్లేందుకు మోటార్బైక్పై నెల్లూరుకు బయలుదేరాడు. ఈ క్రమంలో వెనుక నుంచి లారీ వేగంగా ఢీకొట్టడంతో ఇబ్రహీం అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న కోవూరు ఎస్సై ముత్యాలరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇబ్రహీం మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా పెన్నానది నుంచి ఇసుక లారీలు, టిప్పర్లు ఈ రహదారిపై నిత్యం వేగంగా తిరుగుతుంటాయి. హెచ్చరిక బోర్డులు కూడా లేవు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రోడ్డు ప్రమాదంపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి స్పందించారు. ఈ రహదారిపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీం మృతికి సంతాపం తెలిపారు. -
గర్భిణి మృతిపై అనుమానాలు
ఉదయగిరి: దుత్తలూరు మండలం నందిపాడులో షేక్ కుబ్రా అనే గర్భిణి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెది హత్య లేదా ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అత్తంటి వారు చంపి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కుబ్రా భర్త షేక్ మహ్మమద్ రఫీ, అత్త రసూల్బీని గురువారం అదుపులోకి తీసుకుని విచారించి పంపారు. శుక్రవారం వారిని కావలి డీఎస్పీ కార్యాలయంలో విచారించినట్లు సమాచారం. కుబ్రాకు ఆరునెలల క్రితమే వివాహమైంది. తల్లిదండ్రులు మృతిచెందగా సోదరి మాత్రమే ఉన్నారు. కుబ్రాను హత్య చేశారని, విచారణ జరిపించి న్యాయం చేయాలంటూ బంధువులు శుక్రవారం ఉదయగిరిలో ఎమ్మెల్యే కాకార్ల సురేష్ను కలిసి విన్నవించారు. రెండు రోజులుగా ఉదయగిరి సీహెచ్సీలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో శుక్రవారం మృతదేహనికి శవపరీక్ష నిర్వహంచారు. రిపోర్టు అనంతరం కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సీపీఎం నాయకుల అరెస్ట్ ఉలవపాడు: గుడ్లూరు మండలంలో భూ సేకరణ సమావేశానికి సీపీఎం నాయకులు వస్తారని పోలీసులు ముందస్తుగా అరెస్ట్గా చేసి ఉలవపాడు పోలీస్స్టేషన్కు తరలించారు. కందుకూరులో ఉంటున్న సీపీఎం నాయకులు జీవీబీ కుమార్, గౌస్ను శుక్రవారం ఉదయం ఉలవపాడు స్టేషన్కు తీసుకొచ్చారు. గ్రామసభకు వెళ్తున్న గుడ్లూరు మండల కార్యదర్శి జి.వెంకటేశ్వర్లును చేవూరు వద్ద అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. చేవూరు గ్రామానికి చెందిన ఇరువూరి ఉపేంద్రబాబు, గోచిపాతల జక్రయ్య, రావూరుకు చెందిన కాకు మల్లికార్జున, మిరియం వెంకట్రావును గురువారం అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఉలవపాడు స్టేషన్లో ఉంచారు. సాయంత్రం 3 గంటలకు సమావేశం పూర్తైన తర్వాత వారిని పంపించారు. ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పి అరెస్ట్లు చేయడం దారుణమని నేతలు అన్నారు. పచ్చని భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. కలుజు దాటే ప్రయత్నం చేయొద్దునెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ మండలంలోని పొట్టేపాళెం కలుజు వద్ద వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో కలుజు దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు శుక్రవారం హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చేపల వేట, సెల్ఫీలు దిగే ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
బీపీసీఎల్ ఏర్పాటుతో ఉపాధి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా కందుకూరు: బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థ నెల్లూరు జిల్లాకు రావడం గర్వకారణమని, ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. బీపీసీఎల్ ఏర్పాటు వల్ల ప్రభావితమయ్యే గుడ్లూరు మండలంలోని రావూరు, చేవూరు, కావలి మండలంలోని చెన్నాయపాళెం, రుద్రకోట గ్రామాల ప్రజలతో కంపెనీ ప్రతినిధులు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభను శుక్రవారం రామాయపట్నం పోర్టు వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుడ్లూరు మండలం చేవూరు వద్ద ఐదు వేల ఎకరాల్లో రూ.1.03 లక్షల కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ కంపెంనీ రిఫైనరీని ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రజల అభిప్రాయాలను నివేదిక రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తామన్నారు. స్థానికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కంపెనీ ప్రతినిధులు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా చూడాలన్నారు. బీపీసీఎల్ ప్రతినిధులు మాట్లాడుతూ కంపెనీ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన రోజే యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే సంస్థకు కూడా శంకుస్థాపన ఏర్పాటు చేస్తామన్నారు. 70 శాతం ఉపాధి అవకాశాలను స్థానికులకే కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ హిమవంశీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ అశోక్కుమార్, కావలి ఆర్డీఓ చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఈబీ అంటేనే హడల్
టీడీపీ సర్కార్ కొలువుదీరాక జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. ఎక్కడ చూసిన విక్రయాలు జోరుగా సాగుతూ సింహపురిలో శాంతిభద్రతలనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వాడవాడలా విక్రేతలు పుట్టుకొస్తూ.. యువతను మత్తులో దించుతున్నారు. ఫలితంగా నషాలో జోగుతూ కనిపించిన వారిపై దాడులకు పాల్పడుతూ.. హత్యలకూ తెగబడుతున్నారు. ఇంత జరుగుతున్నా, వీటిపై ఉక్కుపాదం మోపాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తూ.. తమ వైఫల్యాన్ని గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్పై మోపేందుకు కుట్ర పన్నుతోంది. వాస్తవానికి గతంలో ఈ వ్యవహారాలపై అడుగడుగునా నిఘా ఉంచడం.. పీడీ యాక్ట్లు నమోదు చేయడంతో ముఠాల అరాచకాలకు ముకుతాడు పడింది. అయితే ఇవేవీ పట్టించుకోకుండా ప్రస్తుత ప్రభుత్వం సాగిస్తున్న దుష్ప్రచారంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. వాస్తవంగా గంజాయి కేసులు ఎక్కువగా మన ప్రభుత్వంలోనే నమోదవుతున్నాయి. ఇవన్నీ వైఎస్సార్సీపీ ఖాతాలో వేసేద్దాం.గంజాయి ప్యాకెట్లు (ఫైల్) గంజాయిపై కొరడా ఝళిపించేందుకు గానూ గత ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. ఎస్ఈబీ, పోలీస్ అధికారులు ఉక్కుపాదం మోపి.. పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. గంజాయి హాట్ స్పాట్స్, జాతీయ రహదారి వెంబడి, రైళ్లలో నిరంతర దాడులు, తనిఖీలు జరిపి పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసుల నమోదు, అరెస్ట్లతో సరిపెట్టుకోకుండా మూలాల ఏరివేతకు చర్యలు చేపట్టారు. సరఫరాదారుల వివరాలను సేకరించి వారిపైనా కేసులు పెట్టారు. ఇతర రాష్ట్రాల్లోని జైళ్లలో ఉన్న నిందితులను కోర్టు అనుమతితో పీడీ వారెంట్లపై జిల్లాకు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. నిందితులు ఎక్కడున్నా వదిలే ప్రసక్తే లేదనే అంశాన్ని తమ చేతలతో నిరూపించారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గంజాయి.. ఈ పదాన్ని వింటేనే జిల్లా వాసులకు వణుకు పుడుతోంది. సాయంత్రమైతే బయట అడుగుపెట్టాలంటే పురుషులు సైతం జంకే పరిస్థితి నెలకొంటోంది. టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరాక జిల్లాలో వీటి విక్రయాలు మూడు పువ్వులు.. ఆరు కాయలు అనే చందంగా సాగుతున్నాయి. ఒడిశా, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఈ అక్రమ రవాణా దందా జరుగుతోంది. జిల్లాకు చెందిన వ్యాపారులు.. గంజాయి పెంపకదారులు, సరఫరాదారుల నుంచి కిలోను రూ.మూడు వేల నుంచి రూ.నాలుగు వేల వరకు కొనుగోలు చేసి దిగుమతి చేసుకుంటున్నారు. అరెస్ట్లతో సరి.. మూలాలను విస్మరించి చిన్న పొట్లాలుగా మార్చి రూ.100 నుంచి రూ.400 చొప్పున విక్రయించి జేబులు నింపుకొంటున్నారు. పోలీస్, ఎకై ్సజ్ అధికారులు దాడులకే పరిమితమై.. గంజాయి స్వాధీనం, నిందితుల అరెస్ట్లతో సరిపెడుతూ.. మూలాలను మాత్రం విస్మరిస్తున్నారు. ఫలితంగా ఎక్కడపడితే అక్కడ లభ్యమవుతుండటంతో మత్తుకు బానిసలైన కొందరు యువత నేరాలకు పాల్పడుతున్నారు. ఖాకీలపై దాడులకు సైతం వెనుకాడటం లేదు. నూతన ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ఇప్పటి వరకు పోలీసులను వాహనాలతో స్మగర్లు, గంజాయి బ్యాచ్ రెండుసార్లు గుద్దించారు. హెడ్ కానిస్టేబుల్పై కత్తితో దాడికి ఇటీవల తెగబడ్డారు. వారే స్థాయిలో బరితెగిస్తున్నారో దీన్ని ద్వారా స్పష్టమవుతోంది. పాతనేరస్తులపై కొరవడిన నిఘా గంజాయి పాత నేరస్తులపై గతంలో నిశిత నిఘా ఉండేది. దీంతో వారు క్రైమ్ చేయాలంటనే భయపడేవారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితే లేదు. ఆర్డీటీ కాలనీలో ఉద్యమకారుడు పెంచలయ్య హత్య కేసులో లేడీ డాన్, ఆమె తమ్ముడిపై నవాబుపేట పోలీస్స్టేషన్లో సస్పెక్టడ్ షీట్లున్నాయి. వీరిపై ఖాకీల నిఘానే ఉండుంటే పెంచలయ్య హత్య జరిగేదే కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వారు అనుసరించిన ఉదాసీన వైఖరే అరవ కామాక్షి బరితెగింపునకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.టీడీపీ ప్రభుత్వంలో వాడవాడలా.. విచ్చలవిడిగా నాటి వైఎస్సార్సీపీ సర్కార్కు ఆపాదించేందుకు కుట్ర తీరుమారని తొమ్మిది మందిపై గతంలో పీడీ యాక్ట్లు ప్రస్తుతం నామమాత్రపు చర్యలు రవాణా, విక్రయాలపై కొరవడిన నిఘా జిల్లాలో జోరుగా అమ్మకాలు నాడు.. శాంతిభద్రతలే పరమావధిగా యువత జీవితాలను గంజాయి నాశనం చేస్తోందనే విషయాన్ని గమనించిన నాటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ దీన్ని నిర్మూలించేందుకు సమూలంగా అడుగులేసింది. నిఘా వ్యవస్థను పటిష్టం చేసి అక్రమ రవాణా, విక్రయాలపై ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపింది. గంజాయి తాగేవారిపై సైతం కేసులు నమోదు చేసింది. తీరుమారని వ్యాపారులపై పీడీ యాక్ట్లనూ ప్రయోగించింది. దీంతో దానికి జోలికెళ్లాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకొచ్చింది. అయితే టీడీపీ సర్కార్ వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అడపాదడపా దాడులు చేస్తూ.. నిందితులపై కేసుల నమోదుకే పరిమితమవుతున్నారు. పీడీ యాక్ట్లతో కఠినంగా నేరగాళ్లపై కఠిన చర్యలు చేపట్టే అంశంపై పోలీస్ అధికారులకు నాటి సీఎం జగన్మోహన్రెడ్డి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీంతో నేరస్తుల కదలికలపై నిశిత నిఘా ఉంచి, ఎక్కడికక్కడ వారిని అణిచేశారు. నేరాలకు తరచూ పాల్పడేవారిపై పీడీ యాక్ట్లను నమోదు చేశారు. తీరుమారని గంజాయి వ్యాపారులైన కపాడిపాళేనికి చెందిన రాజమ్మ, సిరాజ్, సుభానీ, ముంతాజ్, జమీర్, వెంగళరావునగర్కు చెందిన వెంకటేశ్వర్లు, సలీం, బోడిగాడితోటకు చెందిన అరవ చిన్నరాజా (లేడీడాన్ తమ్ముడు), కందుకూరుకు చెందిన చిన వెంకటేశ్వర్లుపై ఈ యాక్ట్ను ప్రయోగించి కటకటాల వెనక్కి పంపారు. జైలు నుంచి బయటకొచ్చాకా వీరి కదలికలపై నిఘాను కొనసాగించారు. కేసుల్లోని నిందితులను స్టేషన్లకు తరచూ పిలిచి బైండోవర్లు చేశారు. దీంతో విక్రయాలు సాగించాలంటేనే భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు. మరోవైపు మత్తు, మాదకద్రవ్యాల జోలికెళ్లకుండా.. వాటి వినియోగంతో సంభవించే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. అధికారుల చర్యలతో విక్రయాలు, రవాణాను కట్టడి చేశారు. అయితే ప్రస్తుతం జరుగుతోంది దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. గతంలో ప్రశాంతంగా ఉన్న సింహపురి.. నేడు హింసపురిగా మారిందనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
కండలేరు స్పిల్వే నుంచి నీటి విడుదల
పొదలకూరు: కండలేరు స్పిల్వే నుంచి 500 క్యూసెక్కులను తెలుగుగంగ అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలు, వరద కాలువ ద్వారా పది వేల క్యూసెక్కులకుపైగా నీరొచ్చి చేరుతుండటంతో విడుదల చేశారు. తక్కువ సంఖ్యలో వదలడంతో దిగువ గ్రామాలకు ఇబ్బందుల్లేవని పేర్కొన్నారు. పరిస్థితిని సమీక్షించి అవసరమైతే పరిమాణాన్ని పెంచుతామని వెల్లడించారు. ఎస్ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు పర్యవేక్షించారు. పల్స్ పోలియోను విజయవంతం చేద్దాం నెల్లూరు(అర్బన్): జిల్లాలో ఈ నెల 21న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని డాక్టర్లు, వైద్య సిబ్బంది పక్కాగా జరిపి విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ సుజాత సూచించారు. నెల్లూరు డివిజన్ పరిధిలోని పీహెచ్సీలు, యూపీహెచ్సీల మెడికల్ ఆఫీసర్లకు నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. శిశువు నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను వేయాలని కోరారు. ఏడీఎంహెచ్ఓ ఖాదర్వలీ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి ఉమామహేశ్వరి, డీపీఎంఓ సునీల్, డెమో అధికారి కనకరత్నం, ఎస్ఓ సహన, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అశోక్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు కావలి (అల్లూరు): విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. పట్టణంలోని వెంగళరావునగర్లో గల పొట్టి శ్రీరాములు మున్సిపల్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎంకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. మొబైల్ ఫోన్ల నుంచి విద్యార్థులను దూరంగా ఉంచాలని కోరారు. పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి రూ.పది లక్షలను మంజూరు చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, ఆర్డీఓ వంశీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలుతిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 51,082 మంది గురువారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 19,836 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.86 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేని వారికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. స్పోర్ట్స్ అకాడమీ స్థాపనకు ఒప్పందం పొదలకూరు: నెల్లూరులో ఇన్క్లూజివ్ స్పోర్ట్స్ అకాడమీ స్థాపనకు ఎన్ఐఈపీఐడీతో ఎస్ఈఐఎల్ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకుందని సీఈఓ జన్మేజయ మహాపాత్ర పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడారు. కాంపోజిట్ రీజినల్ సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ప్రాంగణంలో అకాడమీని నిర్మించనున్నారని వెల్లడించారు. సీఎస్సార్ నిధులతో ఆధునిక స్టేడియం ద్వారా క్రీడా సౌకర్యాలను కల్పించనున్నామని తెలిపారు. -
పీటీఎం.. పేలవంగా
నెల్లూరు (టౌన్): రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న మెగా పేరెంట్స్.. టీచర్స్ మీట్ జిల్లాలో అట్టర్ ఫ్లాపైంది. జిల్లాలోని 2608 ప్రభుత్వ పాఠశాలలు.. 26 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శుక్రవారం చేపట్టిన కార్యక్రమాలు నామమాత్రంగా జరిగాయి. తల్లిదండ్రులు చాలా తక్కువగానే హాజరయ్యారు. కనీసం టెంట్లు, ఫ్లెక్సీలను సైతం ఎక్కడా ఏర్పాటు చేయలేదు. అల్లీపురంలోని జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ.. ఇతర చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నిధుల విడుదలేదీ..? మెగా పేరెంట్స్.. టీచర్స్ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు పాఠశాలలకు నిధులను విడుదల చేయలేదు. జిల్లాలోని 2608 పాఠశాలలకు రూ.51.43 లక్షలను విడుదల చేస్తామని ప్రకటించినా, పైసాను విదిల్చలేదు. దీన్ని ఎప్పుడిస్తారో సైతం చెప్పకపోవడంతో నిధులను వెచ్చించేందుకు హెచ్ఎంలు విముఖత చూపారు. ఫలితంగా ప్రక్రియ మొక్కుబడి తంతుగా మారింది. వారొస్తేనే ఆర్భాటం మెజార్టీ పాఠశాలల్లో తరగతి గదిలోనే మీటింగ్లను నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యే స్కూళ్లలోని బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించినా.. కుర్చీలు, టెంట్లను సరిపడా ఏర్పాటు చేయలేదు. కొందరు విద్యార్థులు నేలపై కూర్చోగా, మరికొందరు నిలిచే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. స్నాక్ను అందించకుండా.. రోజు తరహాలోనే మధ్యాహ్న భోజనాన్ని వడ్డించి మమ అనిపించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, తల్లిదండ్రులకు ఆటల పోటీల ఊసేలేదు. సమస్యలపై నిలదీత మెగా పేరెంట్స్.. టీచర్స్ సమావేశాల్లో భాగంగా పాఠశాలల్లో పలు సమస్యలపై స్థానిక నేతలు, ఉపాధ్యాయులను తల్లిదండ్రులు నీలదీశారు. మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందంటూ అధిక చోట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గదుల కొరత, సరిపడా ఫ్యాన్లు, బెంచీలు లేకపోవడంపై మండిపడ్డారు. నాడు – నేడు రెండో విడత పనులకు నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో చాలా స్కూళ్లలో చెట్ల కిందే బోధించాల్సిన పరిస్థితి నెలకొనడంపై భగ్గుమన్నారు. నగరంలోని బీవీఎస్ మున్సిపల్ హైస్కూల్లో ఏడో తరగతి పిల్లలను కింద కూర్చోబెడుతున్నారంటూ తల్లిదండ్రులు మండిపడ్డారు. ఫ్యాన్లు సైతం లేవని నిలదీశారు. ఆపై విషయాన్ని కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆర్జీ రూపంలో ఇవ్వాలని ఉచిత సలహా ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన పీటీఎంలలో ఇదే పరిస్థితి నెలకొంది. మద్రాస్ బస్టాండ్ సమీపంలోని సుంకు చెంగన్న.. బీవీనగర్లోని కేఎన్నార్ మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాల్లో నాసిరకం భోజనంపై హెచ్ఎంలు, స్థానిక నేతలను విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు. దీన్ని మీరు లేదా మీ పిల్లలు తింటారానని ప్రశ్నించారు. ఆపై లంచ్ చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొక్కుబడిగా పేరెంట్స్.. టీచర్స్ సమావేశాలు నామమాత్రంగా హాజరైన తల్లిదండ్రులు నిధులు విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం సరిపడా కుర్చీల్లేక కిందే కూర్చున్న విద్యార్థులు నాసిరకం భోజనంపై నిలదీత జూనియర్ కళాశాలల్లోనూ ఇదే తంతు -
నన్ను జైలుకు పంపితే సోమిరెడ్డి అవినీతికి అడ్డుండదు
● వర్షాలొస్తే టీడీపీ నేతలకు పండగ ● మరమ్మతుల పేరిట దొంగ బిల్లులు ● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి ముత్తుకూరు(పొదలకూరు): తనను జైలుకు మళ్లీ పంపితే సోమిరెడ్డి అవినీతిని అడ్డుకునే వారుండరని.. దీంతో పదేపదే అక్రమ కేసులు పెట్టిస్తున్నారని.. ఎన్ని కేసులు పెట్టినా ఆయన అక్రమాలను అడ్డుకుంటూ.. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను ప్రశ్నిస్తూనే ఉంటానని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన ముత్తుకూరు మండలంలోని పోలంరాజుగుంట, డమ్మాయపాళెం గ్రామాల్లో రైతులతో కలిసి శుక్రవారం ఆయన పర్యటించారు. నక్కల కాలువ డ్రెయిన్కు వెళ్లే మార్గం జలమయం కావడంతో రైతులతో కలిసి ట్రాక్టర్లో ప్రయాణించారు. కాలువ పనులను గత ప్రభుత్వంలో మీరు చేయడంతో ఆక్వా గుంతల్లోకి నీరు రాకుండా రక్షించుకోగలిగామంటూ వారు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. వర్షాలు కురిస్తే జనజీవనాన్ని నక్కల కాలువ అతలాకుతలం చేసేదని, అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. కాలువలో పూడికను తొలగించి రైతులను గత ప్రభుత్వంలో ఆదుకుంటే.. ప్రస్తుతం సోమిరెడ్డి నాలుగు గంటలు పనిచేసి గుర్రపు డెక్కను సైతం పూర్తిగా తొలగించలేదని విమర్శించారు. తన రాకను తెలుసుకొని మెషీన్ను హడావుడిగా తెప్పించి గుర్రపు డెక్కను తొలగించారనే అంశాన్ని రైతులే చెప్పారని పేర్కొన్నారు. ప్రభుత్వ సొమ్ము స్వాహా వరదలతో దెబ్బతిన్న కాలువలు, చెరువుల రిపేర్ల పేరుతో పనులు చేయకుండానే దొంగ బిల్లులను సృష్టించి ప్రభుత్వ సొమ్మును సోమిరెడ్డి స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. తుఫాన్తో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పనులపై తండ్రీకొడుకు ప్రణాళికను రూపొందిస్తున్నారని ధ్వజమెత్తారు. బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. నక్కల కాలువ పనులను గతంలో సజావుగా జరగనీయకుండా సోమిరెడ్డి అడ్డంకులు సృష్టించారని తెలిపారు. పనులను తన పర్యవేక్షణలో పూర్తి చేయడంతో రైతులు, ప్రజలు ఇబ్బందుల్లేకుండా ఉన్నారని పేర్కొన్నారు. తమ హయాంలో జరిగిన పనులు.. ఇప్పుడు ఇరిగేషన్ శాఖలో చేస్తున్న పనులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ శాఖలో అవినీతి ఏరులై పారుతోందని.. అధికారులు, ఉద్యోగులు ఎంతమంది శిక్షార్హులవుతారో కాలమే సమాధానం చెప్తుందన్నారు. ప్రజల కష్టాలను సోమిరెడ్డి గాలికొదిలి.. తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నష్టపోయిన రైతులు, ప్రజలను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విత్తనాలను రాయితీపై అందజేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకోని పక్షంలో.. తమ పార్టీ పోరాటం చేస్తుందని వివరించారు. -
టీడీపీ పాలనలో అరాచక రాజ్యం
● గడిచిన ఏడాదిన్నరలో జిల్లాలో 30 హత్యలు ● నేరాలకు పాల్పడే వారిపై కఠిన చట్టాలు అమలు చేయాలి ● ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి, మాజీ మంత్రి ప్రసన్నకుమార్రెడ్డి కోవూరు: రాష్ట్రంలో టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లాలో మాఫియా గ్యాంగ్లు, రౌడీషీటర్లు, గంజాయి గూండాలు చెలరేగిపోతున్నారని.. బెల్టు షాపులు, నకిలీ మద్యం విలయతాండవం చేస్తున్నాయని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆరోపించారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా నియోజకవర్గంలో సేకరించిన 60 వేల సంతకాల పత్రాలను నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయానికి పార్టీ మండలాధ్యక్షుడు అత్తిపల్లి అనూప్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం తరలించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు. రాజకీయ కారణాలతో గంజాయి విక్రేతలపై పోలీసులు చర్యలు చేపట్టడంలేదని చెప్పారు. జిల్లాలో గంజాయి ముఠా సభ్యులు 300 మంది వరకు ఉంటారని, వీరిని అణిచేస్తే సమస్యను పరిష్కరించొచ్చని తెలిపారు. అయితే ఈ విషయాన్ని విస్మరించి.. ప్రతిపక్ష పార్టీ నేతలపై గంజాయి కేసులు పెడుతుండటంతో సమస్య తీవ్రమవుతోందని చెప్పారు. రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుడితే కోటిన్నర మేర పూర్తి చేశామని వెల్లడించారు. ప్రభుత్వంపై ఆగ్రహంతో పార్టీలకతీతంగా పలువురు సంతకాలు చేశారని వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో విఫలం శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రసన్నకుమార్రెడ్డి ఆరోపించారు. హత్యలకు పాల్పడిన వారు జైళ్లలో రాజభోగాలను అనుభవిస్తున్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం కొలువుదీరిన ఏడాదిన్నరలో జిల్లాలో 30 మందిని నిర్దాక్షిణ్యంగా హత్య చేశారని ఆరోపించారు. గంజాయి వ్యాపారం వద్దన్నందుకే సీపీఎం నేత పెంచలయ్యను మాఫియా హతమార్చిందని చెప్పారు. శిక్షలు కఠినంగా ఉన్నప్పుడే నేరాలు అంతమవుతాయని పేర్కొన్నారు. హత్యలు, దారుణమైన నేరాలకు పాల్పడిన వారి తరఫున వాదించకుండా ఉండాలని న్యాయవాదులను కోరారు. డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు, ఆఫ్కాఫ్ మాజీ చైర్మన్ కొండూరు అనిల్బాబు, ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్, జెడ్పీటీసీ శ్రీలత, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, మల్లికార్జునరెడ్డి, రైతు విభాగ జిల్లా అధ్యక్షుడు నరసింహులురెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు నవీన్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, శేషగిరి, సతీష్రెడ్డి, షాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
ఉధృతంగా వాగులు
● జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వెంకటాచలం చెరువు నిండిపోయి నీరు జాతీయ రహదారిపైకి చేరింది. మండలంలో జెర్రిపోతు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ● మనుబోలు మండలం పిడూరు, బద్దెవోలు, కొలనకుదురు గ్రామాల్లోకి వాన నీరు చేరింది. ● పొదలకూరు మండలం ముడిగేడు – ఇనుకుర్తి మధ్య వాగు పొంగి రాకపోకలు స్తంభించాయి. ● చేజర్లలోని నల్లవాగు, నాపూరు పెద్ద వాగు ఉధృతంగా ప్రవిహిస్తున్నాయి. ● సైదాపురం మండలంలో పాలూరు – వేములచేడు మధ్య కుంటి కాలువ పొంగింది. కై వల్య నది ఉధృత రూపం దాల్చింది. బొగ్గేరు, బీరాపేరు, పైడేరు, మలిదేవి డ్రెయిన్లు ప్రవహిస్తున్నాయి. ● ఆత్మకూరు మండలంలోని వెన్నవాడ సమీపంలో ఉత్తర కాలువకు భారీ గండిపడింది. పొలాల్లోని నీరు కాలువ వద్దకు చేరడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ● అనంతసాగరం సమీపంలోని ఓ కాలువకు వరద పెరగడంతో దళితవాడకు రాకపోకలు నిలిచిపోయాయి. ● రాపూరు మండలంలోని గోనుపల్లి బాడవ వాగు పొంగి ప్రవహిస్తోంది. -
సోమిరెడ్డీ.. సీబీఐ విచారణకు సిద్ధమా?
● తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదు ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటాచలం: ‘ఇరిగేషన్ పనుల్లో అవినీతిపై నేను సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నా. సోమిరెడ్డి సిద్ధమా’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రశ్నించారు. మండలంలోని ఇడిమేపల్లి, పలుకూరువారిపాళెం గ్రామాల్లో గురువారం వరద ప్రభావిత ప్రాంతాల్లో కాకాణి పర్యటించారు. నీటమునిగిన నారుమడులను చూపి తాము నష్టపోయామని, అధికారులెవరూ పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. గ్రామ పరిధిలోని చెరువు కట్ట మరమ్మతులను రైతులందరూ కలిసి చేయిస్తే వాటి బిల్లులను టీడీపీ నాయకులు చేసుకున్నారని వాపోయారు. ఈ సందర్భంగా గోవర్ధన్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పాలనలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణమే సాయం అందించినట్లు గుర్తు చేశారు. పంట నష్టం జరిగితే వెంటనే పరిహారం ఇవ్వడం, నారుమళ్లు దెబ్బతింటే సబ్సిడీ విత్తనాలు సరఫరా చేసి అండగా నిలిచినట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం వారిని పట్టించుకునే పరిస్థితి లేకపోవడం దారుణమన్నారు. అవినీతి సంపాదనపైనే ధ్యాస సర్వేపల్లి నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకుని సోమిరెడ్డి ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారని కాకాణి ఆరోపించారు. ఆయనకు అవినీతి సంపాదనపై ఉన్న ధ్యాస, ప్రజల సమస్యలపై లేదని ధ్వజమెత్తారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మొక్కుబడిగా పర్యటించి, ఫొటోలకు పోజులిచ్చి వెళ్లడం తప్ప, ప్రజల సమస్యలను ఎక్కడా పరిష్కరించడం లేదన్నారు. అక్రమంగా గ్రావెల్ తరలింపు, ఇరిగేషన్ పనులు కొన్నిచోట్ల చేయకుండానే బిల్లులు చేసుకుంటున్నారని ఆరోపించారు. సోమిరెడ్డి అవినీతి గురించి ప్రశ్నించినందుకే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కాకుటూరు శివాలయ భూములను లేఅవుట్ యజమానులకు అమ్మే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖలో జరిగిన పనులు, కూటమి పాలనలో జరిగిన పనులు, సోమిరెడ్డి దొంగ బిల్లులపై రైతుల సమక్షంలోనే చర్చించడానికి రావాలని సవాల్ విసిరారు. -
జిల్లాను వీడని వర్షాలు
సాక్షిప్రతినిధి, నెల్లూరు: దిత్వా తుఫాన్ జిల్లాలో బీభత్సాన్ని సృష్టించింది. చైన్నె సమీపంలోని మహాబలిపురం వద్ద తీరం దాటినా, దాని ప్రభావం జిల్లాపై తీవ్రంగా ఉంది. నాలుగు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం గురువారం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోల్కతా – చైన్నె జాతీయ రహదారిపై మనుబోలు, వెంకటాచలం ప్రాంతాల్లో వరద నీరు చేరింది. ఫలితంగా గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్లు ఛిద్రమయ్యాయి. చెరువులు, వాగులు, వంకలు, కాలువలు ఏకమయ్యాయి. పొంగిన వరద నీరు రోడ్డెక్కడంతో పలు చోట్ల గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. మునిగిన నారుమడులు నాట్లకు సిద్ధంగా ఉన్న నారుమడులు.. వేసిన నాట్లు వే లాది ఎకరాల్లో మునిగిపోయాయి. పొలాలు చెరువుల ను తలపిస్తున్నాయి. చిరు వ్యాపారులు, వలస కార్మికులు, దినసరి కూలీలు పనుల్లేక పస్తులతో గడుపుతున్నారు. మగ్గం గుంతల్లోకి నీరు చేరడంతో చేనేత పనులు స్తంభించిపోయాయి. నగరంతో పాటు పలు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నగరంలో బీభత్సం నగరంలో గురువారం మధ్యాహ్నం 12 నుంచి క్లౌడ్బరస్ట్ తరహాలో రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో రోడ్లపై మూడడుగుల మేర నీరు చేరింది. గాంధీబొమ్మ, పొగతోట, చిన్నబజార్, పెద్దబజార్, ఆచారివీధి, రాయాజీవీధి తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ నీటితో కలిసి వర్షపు నీరు రోడ్లపై ప్రవహించింది. ఆత్మకూరు బస్టాండ్, మాగుంట లేఅవుట్, రామలింగాపురం అండర్ బ్రిడ్జిలు నిండిపోయాయి. మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జిలో ఓ కారు మునిగిపోయింది. విజయమహల్ గేట్ సమీపంలోని బాక్స్టైపు బ్రిడ్జి వద్దా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఆదుకోవడంలో మంత్రులు విఫలం మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరులోనే ఉన్నారు. పేదలు, పూట గడవని అభాగ్యులు లోతట్టు ప్రాంతాల్లో పస్తులతో గడుపుతున్నా, వీరు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని మనుమసిద్ధినగర్లో డ్రైనేజీ కాలువలను వారం క్రితమే నిర్మిస్తే అవి కూలిపోయాయి. 7527.5 ఎకరాల్లో పంట నష్టం జిల్లాలో ప్రస్తుతం కురిసిన వర్షాలకు సుమారు 6500 మంది రైతులు నష్టపోయారు. 6970 ఎకరాల్లో వరినార్లు, నాట్లు మునిగిపోయాయి. 557.5 ఎకరాల్లో శనగ పంట దెబ్బతినింది. మొత్తం 7527.5 ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని వ్యవసాయాధికారులు ప్రకటించారు. మరోవైపు పది వేల మందికిపైగానే రైతులు నష్టపోయి ఉంటారని అంచనా. సుమారు 13 వేల ఎకరాల్లో నారుమడులు, నాట్లు మునిగిపోయాయని తెలుస్తోంది. ఐదు రోజుల్లో భారీగా.. గత నెల 30 నుంచి గురువారం వరకు వెంకటాచలం మండలంలో 395.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సైదాపురంలో 351, పొదలకూరులో 340.4, మనుబోలులో 330.2, నెల్లూరు రూరల్లో 329.2, కోవూరులో 312.2, నెల్లూరు అర్బన్లో 300.8, ముత్తుకూరులో 282.6, కొడవలూరులో 273.2, రాపూరులో 248.6, బుచ్చిరెడ్డిపాళెంలో 244.2, విడవలూరులో 243, కలువాయిలో 228.6, ఆత్మకూరులో 217, తోటపల్లిగూడూరులో 210.8, ఇందుకూరుపేటలో 204.8, కావలిలో 201.8, సంగంలో 199.8, అనంతసాగరంలో 196.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెరువును తలపిస్తున్న తల్పగిరి కాలనీ వర్షపాతమిలా.. ఉరుములు, మెరుపులతో వణికించిన వాన జలదిగ్బంధంలో పలు ప్రాంతాలు నెల్లూరులో నీటమునిగిన అండర్ బ్రిడ్జిలు చెరువులను తలపిస్తున్న పొలాలు ఆరు వేల ఎకరాల్లో నీటిలో కుళ్లుతున్న నాట్లు, నారుమడులు జిల్లాలో గురువారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం ఐదులోపు నెల్లూరు రూరల్లో అత్యధికంగా 88.8 మిల్లీమీటర్ల వర్షం పడింది. నెల్లూరు అర్బన్లో 83.4, కోవూరులో 67.2, ముత్తుకూరులో 62.4, పొదలకూరులో 45.8, కొండాపురంలో 43.4, సైదాపురంలో 42, కొడవలూరులో 39, విడవలూరులో 30.8, రాపూరులో 24.4, ఇందుకూరుపేటలో 20.4, తోటపల్లిగూడూరులో 17.6, కలువాయిలో 16.4, బుచ్చిరెడ్డిపాళెంలో 15.8, లింగసముద్రంలో 14.8, మనుబోలులో 12.6, చేజర్లలో 11.2, వెంకటాచలంలో 11, అల్లూరులో 7, సంగంలో 6.6, దగదర్తిలో 6.4, గుడ్లూరులో 4.4, ఉదయగిరిలో 4.2, అనంతసాగరంలో 3, ఆత్మకూరులో 2.8, మర్రిపాడులో 2.4, వలేటివారిపాళెంలో 2.4, వరికుంటపాడులో 2.2, సీతారామపురంలో 2, ఏఎస్పేటలో 1.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
రైతన్నా మీ కోసం.. మరో మోసం
ప్రశ్నిస్తారనే భయం ● జిల్లాలో మొక్కుబడిగా నిర్వహణ ● మద్దతు ధర లేక నష్టపోతున్న కర్షకులు ● పట్టించుకోని ప్రజాప్రతినిధులు ● కొందరికే అన్నదాత సుఖీభవ ● ప్రభుత్వానిదంతా ప్రచారార్భాటమే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎరువులు, విత్తనాలను అందించడంలో వారి వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాల క్రమంలో అన్నదాతలు ప్రశ్నిస్తారనే భయంతో ప్రజాప్రతినిధులు ముఖం చాటేస్తున్నారు. మరోవైపు సర్కార్పై అన్నదాతల్లో వ్యతిరేకత పెరగడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ కార్యక్రమానికి తెరలేపారనే వాదనా లేకపోలేదు. ఆరుగాలం శ్రమించి పంటను పండించే అన్నదాతకు చేయూతనివ్వాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. రైతులను వంచిస్తూ వికటాట్టహాసం చేస్తున్న సర్కార్ వారిని మభ్యపెట్టేందుకు సరికొత్త డ్రామాకు తెరలేపింది. ‘రైతన్నా మీ కోసం’ అంటూ కార్యక్రమాలను మొక్కుబడిగా జరుపుతోంది. జిల్లాలోని 421 చోట్ల నిర్వహిస్తున్నా, వీటి వైపు ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడటంలేదు. ప్రచారార్భాటం కోసమే వీటిని ఏర్పాటు చేశారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులు సంతోషంగా ఉండేవారు. పుట్టి ధాన్యాన్ని రూ.25 వేల నుంచి రూ.28 వేల వరకు విక్రయించారు. పక్క జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి రైస్ మిల్లర్లు, వ్యాపారులను పిలిపించి ధాన్యాన్ని కొనుగోలు చేయించారు. దీంతో పోటీ పెరిగి మద్దతు ధరకు మించి లభించింది. అయితే ప్రస్తుతం అందుకు భిన్నంగా వ్యవహారం నడుస్తోంది. నెల్లూరు(పొగతోట): అన్నదాత వెన్ను విరుస్తున్న టీడీపీ ప్రభుత్వం వారిని మభ్యపెట్టేందుకు ‘రైతన్నా మీ కోసం’ అనే బోగస్ కార్యక్రమానికి తెరలేపింది. జిల్లాలో 421 చోట్ల తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారు. ప్రోగ్రామ్ జరుగుతున్న తీరును చూస్తే ఈ అంశం తేటతెల్లమవుతోంది. ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడకపోవడంతోనే వారికి కర్షకులపై ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో స్పష్టమవుతోంది. ప్రయోజనమేదీ..? ఉదాహరణకు కోవూరులో నిర్వహించిన రైతన్నా మీ కోసం కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు. అన్నదాత సుఖీభవ డబ్బులు జమయ్యాయనే అంశమై మహిళా రైతును ప్రశ్నించగా, తనకు రాలేదని ఆమె సమాధానమిచ్చారు. ఎందుకు జమకాలేదంటూ అధికారులను ప్రశ్నించి, షో చేశారు. జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా, ఎక్కడా హాజరుకాలేదు. అసలీ కార్యక్రమాలతో రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడంలేదు. అక్కడక్కడా ఎమ్మెల్యేలు వస్తూ తూతూమంత్రంగా జరుపుతున్నారు. అన్నింట్లో అలసత్వమే ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నించేందుకు కర్షకులు సిద్ధంగా ఉన్నారు. దీంతో వారిని కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారు. వాస్తవానికి గత సీజన్లో జిల్లాలో ఐదు లక్షలెకరాల్లో వరిని సాగు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు, రైతు సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తూనే వచ్చారు. చివరికి 90 శాతం వరి కోతలు పూర్తయ్యాక మొక్కుబడిగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ తీరు కారణంగా పుట్టి ధాన్యానికి రూ.ఐదు వేల నుంచి రూ.ఆరు వేల వరకు అన్నదాతలు కోల్పోయారు. ఇలా జిల్లాలో సుమారు రూ.250 కోట్లకుపైగా నష్టపోయారు. దళారులకు మాత్రం లాభాలు రైతులు నిలువునా మోసపోతుండగా.. దళారులు, వ్యాపారులు మాత్రం లాభాలను ఆర్జిస్తున్నారు. టమాటోలు కిలోను రూపాయికి కర్షకుల నుంచి కొనుగోలు చేసి, నెల్లూరు మార్కెట్లో రూ.30కు విక్రయిస్తున్నారు. అరటి రైతులకు కిలో రూపాయి కన్నా తక్కువ లభిస్తోంది. మార్కెట్లో అరటి పండ్లను రూ.25 నుంచి రూ.30కు విక్రయిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైనా, రైతులకు చేసింది శూన్యం. గత ప్రభుత్వ హయాంలో ఖుషీఖుషీ -
యువకుడి ప్రాణం తీసిన నీటి సరదా
నెల్లూరు సిటీ: స్నేహితులతో కలిసి సరదాగా నీటి ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తూ వరదలో కొట్టుకుపోయి మృతి చెందిన ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నగరంలోని పొర్లుకట్టకు చెందిన మెహ్రాజ్ మస్తాన్ (18) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. పొట్టేపాళెం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వరద చూడటానికి సుందరంగా ఉందని తెలుసుకుని స్నేహితులతో కలిసి వెళ్లాడు.సరదాగా గడుపుతుండగా ప్రమాదవశాత్తూ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. స్నేహితులు కేకలేయడంతో స్థానికులు వచ్చి ఆరా తీశారు. అప్పటికే యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలించగా.. ఓ తూము వద్ద యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. తండ్రి మహబూబ్బాషా ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా యువకుడు ఫిట్స్కు గురవడంతో ఘటన జరిగిందని సమాచారం. -
జలదిగ్బంధంలో నెల్లూరు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/విడవలూరు: దిత్వా తుపాను అల్పపీడనంగా మారి చెన్నైలోని మహాబలిపురం వద్ద తీరం దాటినా.. దాని ప్రభావంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలోనూ ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి నెల్లూరు నగరం అతలాకుతలమైంది. ఆత్మకూరు బస్టాండ్, మాగుంట లేఅవుట్, రామలింగాపురం అండర్ బ్రిడ్జిల వద్ద పెద్ద ఎత్తున నీరు చేరిపోయింది.విజయమహల్ గేట్ వద్ద ఉన్న బాక్స్టైపు బ్రిడ్జి మునిగిపోయింది. మాగుంటలేఅవుట్ అండర్ బ్రిడ్జి వద్ద కారు నీటిలో చిక్కుకుంది. నగరంలోని తూర్పుప్రాంతాలైన బాలాజీనగర్, స్టోన్హౌస్పేట, హరనాథపురం తదితర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శివారు ప్రాంతాల్లోని కాలనీలను వరదనీరు చుట్టుముట్టింది. నెల్లూరులోని టెక్కేమిట్ట రోడ్డులోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలోకి నీరు చేరింది. నీట మునిగిన పొలాలు.. నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లోని పొలాలు నీటమునిగాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. పెన్నా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. 30 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రాథమిక లెక్కల ప్రకారం 3011 (7527.5 ఎకరాలు) హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. వరినార్లు, నాట్లు 6,970 ఎకరాల్లో, శనగ 557.5 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. 6,321 మంది రైతులు నష్టపోయారు. వరద నీరు చేరడంతో వెంకటాచలం, మనుబోలు జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. నెల్లూరు అతలాకుతలమవుతున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదు. సహాయక చర్యలు చేపట్టడం లేదు. కూలిన పోలీస్ స్టేషన్ సీలింగ్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు పోలీస్స్టేషన్లోని సీలింగ్ గురువారం వేకువజామున ఒక్కసారిగా కూలిపోయింది. సిబ్బంది వేరే గదిలో ఉండటంతో ప్రమాదం తప్పింది. ఫర్నీచర్, సీలింగ్కు ఉన్న ఫ్యాన్లు, లైట్లు పూర్తిగా «ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలాన్ని ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్ పరిశీలించారు. ఈ స్మార్ట్ పోలీస్స్టేషన్ను గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరి్మంచారు. నిర్మాణం చేపట్టిన ఏడేళ్లకే సీలింగ్ కూలిపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
జలదిగ్బంధం
నెల్లూరు నగరాన్ని వర్షం ముంచెత్తింది. ఎటుచూసినా నీరే కనిపించింది. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా పడిన వానకు రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. బుధవారం రోడ్లపై రాకపోకలు సాగించేందుకు వాహనదారులు పడిన కష్టాలు వర్ణనాతీతం. మగ్గం గుంతల్లో నీరు చేరడంతో చేనేత కార్మికులు కన్నీరుమున్నీరవుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు చెరువు కాదు.. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డుకు వెళ్లే ప్రాంతంలో నిలిచిన నీరు నెల్లూరు రూరల్ మండలం సౌత్మోపూరులో నీట మునిగిన పొలాలుమాగుంట లేఅవుట్ ప్రాంతంలో వాహనదారుల కష్టాలుఅయ్యప్ప గుడి సమీపంలో ఇలా.. -
పాత నేరస్తుడి ఇంట్లో తనిఖీలు
● గంజాయి, ఇతర వస్తువుల స్వాధీనం కావలి(అల్లూరు): కావలి పట్టణానికి చెందిన దేవరకొండ సుధీర్బాబు అనే పాత నేరస్తుడిని కావలి టు టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కావలి డీఎస్పీ పి.శ్రీధర్ టు టౌన్ పోలీస్స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్పీ ఆదేశాల మేరకు సుధీర్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. రూ.6.24 లక్షల విలువైన 24.970 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పలు వెండి, రోల్డ్ గోల్డ్ వస్తువులు, హర్డ్డిస్క్లు, బేడీలు, క్యాష్ కౌటింగ్ మెషీన్, ఖాళీ బ్రీఫ్కేసులు, ఒక ట్యాబ్, రెండు ఫోన్లు, రూ.20,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇతడిపై గతంలో40 కేసులున్నాయి. టు టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోనే 28 కేసులున్నట్లు డీఎస్పీ తెలియజేశారు. ఒడిశా, ఆంధ్రా సరిహద్దుల్లో గంజాయిని కేజీ రూ.500కు కోనుగోలు చేస్తున్నాడు. దానిని ఇక్కడికి తీసుకొచ్చి కేజీ రూ.25 వేలకు అమ్ముతున్నట్లు చెప్పారు. సుధీర్పై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి
● కలెక్టర్కు సీపీఎం నేతల వినతి నెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు ఆర్టీడీ కాలనీలో గంజాయి ముఠా చేతిలో హత్యకు గురైన ప్రజానాట్య మండలి కళాకారుడు కె.పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లాను సీపీఎం నేతలు కోరారు. నాయకులు, పెంచలయ్య భార్య, ఇద్దరు కుమారులు బుధవారం కలెక్టర్ను ఆయన ఛాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఉన్నతాశయం కోసం పనిచేసిన పెంచలయ్య కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా, ఆయన భార్య దుర్గకు ప్రభుత్వ ఉద్యోగం, కుమారుల చదువులకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. సాగు భూమి కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి మూలం రమేష్, మాదాల వెంకటేశ్వర్లు, నాయకులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని ట్యాంకర్ డ్రైవర్ మృతి
నెల్లూరు(క్రైమ్): మరమ్మతులకు గురైన పాల ట్యాంకర్ను పరిశీలిస్తున్న డ్రైవర్ను లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొంది. దీంతో ట్యాంకర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన కనుపర్తిపాడు క్రాస్రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన వి.సాంబశివరావు (64) పాల ట్యాంకర్ డ్రైవర్. అతను బుధవారం విజయవాడ నుంచి ట్యాంకర్తో చైన్నెకు బయలుదేరాడు. కనుపర్తిపాడు క్రాస్రోడ్డు సమీపంలోకి వచ్చేసరికి ట్యాంకర్ బ్రేక్డౌన్ అయ్యింది. దీంతో డ్రైవర్ ట్యాంకర్ను ఆపి వెనుక వైపు పరిశీలిస్తుంగా కావలి నుంచి చైన్నె వైపు ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ వేగంగా అతడిని ఢీకొని డివైడర్ మధ్యలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో సాంబశివరావు తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న సౌత్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.వెంకటరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి బాధిత కుటుంబానికి సమాచారం అందించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. -
పలు మండలాల్లో కుంభవృష్టి
వర్షపాతం ఇలా.. నెల్లూరు అర్బన్ 78.6 కోవూరు 79.6నెల్లూరు రూరల్ 107.0 తోటపల్లిగూడూరు 120.8సైదాపురం 98.6 ముత్తుకూరు 160.4మనుబోలు 158.8ఇందుకూరుపేటలో 68.8, పొదలకూరులో 66, విడవలూరులో 64.8, కొడవలూరులో 49.8, అల్లూరులో 40.6, బోగోలులో 42.2, బుచ్చిరెడ్డిపాళెంలో 34.2, దగదర్తిలో 28.4, జలదంకిలో 27.8, రాపూరులో 17.2, ఉలవపాడులో 14.2, గుడ్లూరులో 10.2, చేజర్లలో 8.2, సంగంలో 8.2, కందుకూరులో 6.2, కలువాయిలో 5.4, కావలిలో 7.6, అనంతసాగరంలో 4.4, కలిగిరిలో 3.8, కొండాపురంలో 3.2, ఉదయగిరిలో 2.8, ఆత్మకూరులో 2.6, ఏఎస్పేటలో 2.2, లింగసముద్రం, వలేటివారిపాళెంలో 2, వింజమూరులో 1.8, మర్రిపాడులో 1.6, సీతారామపురంలో 1.2 మిల్లీమీటర్ల వర్షం పడింది. -
కోనలో వైభవంగా హనుమద్వ్రతం
రాపూరు: హనుమద్వ్రతం పురస్కరించుకుని జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో బుధవారం ఆంజనేయస్వామికి అభిషేకం, ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. పెంచలకోన క్షేత్రంలో పెనుశిల లక్ష్మీనరసింహ స్వామికి అభిముఖంగా ఉన్న క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి మూలమూర్తికి ఉదయం పాలు, తేనె, పెరుగు, పంచామృతాలతో అభిషేకం, పూలంగిసేవ నిర్వహించారు. 8 గంటలకు తిరుచ్చిపై స్వామి ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి వివిధ రకాలు ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలకరించారు. వేదపండితులు ఆస్థాన సేవ నిర్వహిచారు. -
ఆటో, మోటార్బైక్ల దొంగ అరెస్ట్
● రూ.5.20 లక్షల విలువైన వాహనాల స్వాధీనం నెల్లూరు(క్రైమ్): రోడ్లపై పార్క్ చేసిన ఆటో, ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు చిన్నబజారు పోలీస్స్టేషన్లో బుధవారం ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు వివరాలను వెల్లడించారు. మనుబోలు మండలం కాగితాలపూరుకు చెందిన మీర్జా జుల్ఫీకర్ అలీ గత నెల 22వ తేదీన తన ఆటోను నెల్లూరు పొగతోటలోని వెంకటరమణ హోటల్ వద్ద పార్క్ చేసి టిఫిన్ చేసేందుకు వెళ్లాడు. తిరిగొచ్చిచూడగా వాహనం కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా నిందితుడు నెల్లూరు రూరల్ మండలం యలమవారిదిన్నెకు చెందిన పి.కల్యాణ్ కుమార్గా గుర్తించారు. బుధవారం నిందితుడు తన ఇంట్లో ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దొంగతనం చేసిన ఆటోలో కల్యాణ్ పారిపోయేందుకు యత్నించగా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి విచారించారు. నెల్లూరు చిన్నబజారు, సంతపేట, తిరుపతి జిల్లా గూడూరు తదితర ప్రాంతాల్లో ఒక ఆటో, 11 మోటార్బైక్లను చోరీ చేసినట్లు అంగీకరించాడు. దొంగతనానికి గురైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కల్యాణ్ వాచ్మెన్గా పనిచేసే సమయంలో వ్యసనాలకు బానిసయ్యాడని, నగదు కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు. కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్, ఎస్సై అబ్దుల్ రజాక్, క్రైమ్ పార్టీ సిబ్బంది జె.సురేష్ బాబు, ఎస్వీ శ్యామ్ప్రసాద్, ఎం.సుబ్బారావు, కె.వర్ధన్, షేక్ రియాజుద్దీన్, కె.దేవనాయుడు, ఎన్.దయాశంకర్, కె..విజయ్కుమార్ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించి రివార్డులను ప్రకటించారు. -
గండిపాళెం జలాశయంలో గాలింపు
ఉదయగిరి రూరల్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్ జిల్లాకు చెందిన సౌరభ్కుమార్ మండలంలోని గండిపాళెం జలాశయంలో మంగళవారం గల్లంతైన విషయం తెలిసిందే. అతని కోసం బుధవారం ఎస్సై శ్రీనివాసులు, ఫైర్ సిబ్బంది మత్స్యకారుల సహకారంతో జలాశయంలో ముమ్మరంగా గాలించారు. గంజాయి స్వాధీనం● పోలీసుల అదుపులో ముగ్గురు ఆత్మకూరు: ముగ్గురు యువకుల వద్ద గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఆత్మకూరు ఎస్సై బి.సాయిప్రసాద్ వివరాలు వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని బట్టేపాడు మార్గంలో ముగ్గురు వ్యక్తులు గంజాయి తాగుతున్నారని పోలీసులకు సమాచారం అందడంతో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద కొంత గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బట్టేపాడుకు చెందిన ముగ్గురిని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. కాకాణిపై పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదునెల్లూరు సిటీ: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిపై నెల్లూరు రూరల్ పోలీస్స్టేషన్లో బుధవారం రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాకాణి కండీషన్ బెయిల్పై ఉన్నాడనే విషయం గుర్తు పెట్టుకోవాలని, ఆయన్ను వదిలిపెట్టేది లేదన్నారు. ఆస్తులను ఉదారంగా వదిలేసిన తాము శివాలయం భూమిని అమ్ముకుంటామా అని ప్రశ్నించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు.డీసీసీ అధ్యక్షుడి మార్పు?నెల్లూరు(వీఆర్సీసెంటర్): కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడ్ని మార్చే అవకాశాలున్నట్టు విశ్వసనీయ సమాచారం. వారంరోజుల నుంచి ఏఐసీసీ పరిశీలకుడు, తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే హసన్ మౌలానా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో డీసీసీ అధ్యక్షుడిని మార్చాలని పలువురు ఆయన దృష్టికి తీసుకురావడం, కొందరు పదవి కోసం దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం తగిన మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 10 సంవత్సరాలుగా డీసీసీ అధ్యక్షుడిగా చేవూరు దేవకుమార్రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆశించిన స్థాయిలో జిల్లాలో పార్టీ బలోపేతం కాకపోవడంతో మరో వ్యక్తిని నియమించే అవకాశముందని సీనియర్ నాయకులు చెబుతున్నారు. కండలేరులో 58.780 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 58.780 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 2,600 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 850, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 100, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
బిడ్డా.. మాకు దిక్కెవరయ్యా..
● అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లు తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య ● గుండెలవిసేలా రోదించిన తల్లిఉదయగిరి: బిడ్డా మమ్మల్ని వదిలిపోయావా.. నీతోటి నన్ను, మీ నాయన్నూ తీసుకుపోవచ్చు కదా.. నీవు లేకపోతే మేమెలా బతకాలి కొడుకా.. రాత్రి ఫోన్ చేసి అమ్మా.. అన్నం తిన్నావా.. మందులేసుకున్నావా.. నాన్న ఎలా ఉన్నారు.. అని అడిగి.. రేపు ఇంటికొస్తానని చెప్పి ఇంతలోనే ఎంత పని చేశావయ్యా అంటూ తల్లి రోదిస్తుండటం చూపరులను కలిచేస్తోంది. సీతారామపురం మండలం రంగనాయుడుపల్లికి చెందిన వల్లెపు ప్రతాప్ (28) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటంతో మృతుడి తల్లి రోదనలు మిన్నంటాయి. ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాల వద్ద ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. రంగనాయుడుపల్లికి చెందిన వల్లెపు పెద్దక్క, వెంకటేశ్వర్లు ఇద్దరు కుమారులు వివాహానంతరం ఉపాధి నిమిత్తం పామూరు, దుత్తలూరులో స్థిరపడ్డారు. బద్వేలులోని అత్తారింటికి కుమార్తె వెళ్లగా, చిన్న కుమారుడు ప్రతాప్ డిగ్రీ వరకు చదువుకొని తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామ వలంటీర్గా పనిచేసి గుర్తింపును తెచ్చుకున్నారు. బెట్టింగులకు బానిసై.. అంధుడైన తండ్రికి.. పక్షవాతంతో బాధపడుతున్న తల్లికి ప్రతాప్ ఒక్కరే ఆసరాగా మిగిలారు. వలంటీర్గా పనిచేస్తూ.. మరోవైపు గేదెలు మేపుకొంటూ వచ్చే మొత్తంతో తల్లిదండ్రులను చూసుకునేవారు. ఈ తరుణంలో స్నేహితులతో కలిసి ఆన్లైన్ బెట్టింగ్లకు గతేడాదిలో బానిసయ్యారు. ఆ విష వలయంలో చిక్కుకొని.. తన వద్ద ఉన్న నగదును పోగొట్టుకొని.. వివిధ అవసరాల నిమిత్తం అంటూ గ్రామస్తుల వద్ద రూ.26 లక్షల వరకు అప్పు చేశారు. సర్వస్వాన్ని బెట్టింగుల్లో పెట్టి నిండా మునిగిపోయారు. దీంతో అప్పిచ్చిన వారు పది నెలలుగా అడుగుతుండటంతో రేపు.. మాపు అంటూ సాగదీశారు. రెండు నెలల నుంచి ఒత్లిళ్లు అధికమవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయారు. తల్లితో ఫోన్లో అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఆరోగ్యంపై ఆరా తీస్తూ జాగ్రత్తలు చెప్పేవారు. ఈ నేపథ్యంలో దుత్తలూరులోని అన్న ఇంటికి రెండు రోజుల క్రితం వచ్చారు. విషయం తెలుసుకున్న కొంతమంది అక్కడికెళ్లి బాకీ డబ్బులివ్వాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ప్రతాప్.. భోజనం చేసి ఒక గదిలో ఒంటరిగా మంగళవారం రాత్రి నిద్రించారు. తన సోదరుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడాన్ని బుధవారం తెల్లవారుజామున గమనించిన సోదరుడు లబోదిబోమంటూ ఇరుగుపొరుగు వారికి చెప్పారు. మృతదేహాన్ని స్వగ్రామం రంగనాయుడుపల్లికి తీసుకెళ్లారు. వివరాలను స్థానిక పోలీసులు ఆరాతీసి కేసు నమోదు చేశారు. పోస్ట్మార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు ఎస్సై ఆదిలక్ష్మి తరలించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఆన్లైన్ బెట్టింగుల్లో చిక్కుకొని దుత్తలూరు మండలం కొత్తపేటలో ఓ యువకుడు రూ.17 లక్షలు పోగొట్టుకున్న ఉదంతం మరువకముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. -
సాయమందించడంలో విఫలం
● తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడంలోనూ వైఫల్యమే ● ప్రభుత్వంపై ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటాచలం: దిత్వా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు సాయమందించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. వెంకటాచలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. భారీ వర్షాలతో జలమయమైన కాలనీలను సందర్శించి, ప్రజల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వరదనీటితో మునిగిన కోల్కతా – చైన్నె జాతీయ రహదారిని పరిశీలించారు. పలు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో వంట చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న వారికి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజన సదుపాయాలను పరిశీలించిన అనంతరం కాకాణి మాట్లాడారు. జిల్లాలో మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నా, ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం, అధికార పార్టీ నేతలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ధ్వజమెత్తారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొన్నా, అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని చెప్పారు. మంత్రులున్నారో లేరో తెలియక జిల్లా అనాథగా మారిందని మండిపడ్డారు. అంతా ప్రచారార్భాటమే.. చంద్రబాబుకు ప్రచారార్భాటం తప్ప, ప్రజలకు మేలు చేసే ఆలోచన రాకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో భారీ వర్షాలొస్తే అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. సోమిరెడ్డికి అవినీతి సంపాదనే తప్ప, ప్రజల కష్టాలను పట్టించుకునేందుకు సమయం వెచ్చించడంలేదని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డిని విమర్శిస్తూ.. ఫొటోలకు పోజులిస్తూ.. కాలయాపన చేస్తున్నారే తప్ప, ప్రజల సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకోవడంలేదని ఎద్దేవా చేశారు. తమ పార్టీ ప్రజాప్రతినిధులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ.. పదవుల నుంచి తొలగిస్తుండటంతో ఆయా గ్రామాల్లో సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్లు మంజూరు చేసి.. నిర్మిస్తే, వాటికి గృహ ప్రవేశాలను ప్రస్తుత ప్రభుత్వం చేయిస్తూ ప్రచారం చేసుకోవడాన్ని విమర్శించారు. తుఫాన్తో ఇబ్బందులు పడుతున్న వారిని ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో.. ఆ బాధ్యతను తమ పార్టీ తీసుకుందని చెప్పారు. ప్రజలకు అవసరమైన ప్రతి చోట వసతి, భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నామని వెల్లడించారు. పంట పొలాల్లో పరిశీలన మండలంలోని కసుమూరులో నీటమునిగిన పంట పొలాలను రైతులతో కలిసి కాకాణి గోవర్ధన్రెడ్డి పరిశీలించారు. నారుమడులు పూర్తిగా మునిగిపోయాయని, ఇటీవల వరినాట్లేసిన పొలాల్లోకి నీరు చేరడంతో తాము నష్టపోయామని వాపోయారు. రైతుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నా ఏ మాత్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. వర్షాలకు దెబ్బతిన్న నారుమడులకు సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. నష్టంపై అధికారులు వెంటనే అంచనా వేసి పరిహారాన్ని అందజేయాలని పేర్కొన్నారు. జెడ్పీటీసీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నేతలు మందల పెంచలయ్య, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. -
నేదురుమల్లితో ప్రసన్న భేటీ
నెల్లూరు(స్టోన్హౌస్పేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డితో నగరంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపే అంశమై చర్చించారు. పార్టీ చిల్లకూరు మండల కన్వీనర్ మధురెడ్డి, మల్లు విజయ్కుమార్రెడ్డి, చిట్టమూరు రాజారెడ్డి, పలగాటి సంపత్కుమార్రెడ్డి, వీరి చలపతిరావు, కొండూరు అనిల్బాబు, నల్లపరెడ్డి రాజేంద్రకుమార్రెడ్డి, కలువ బాలశంకర్రెడ్డి, చిల్లకూరు సాయిప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. కార్గో హ్యాండ్లింగ్లో రికార్డు ముత్తుకూరు(పొదలకూరు): కృష్ణపట్నం పోర్టులో మెకనైజ్డ్ బెర్త్లో ఒక్క రోజులోనే 1,32,800 మెట్రిక్ టన్నుల కార్గోను హ్యాండ్లింగ్ చేశారు. దీంతో సరికొత్త రికార్డును నెలకొల్పామని సీఈఓ జగదీష్ పటేల్ బుధవారం పేర్కొన్నారు. నెలవారీ ఎరువులను 0.43 ఎమ్మెమ్టీలను విజయవంతంగా నిర్వహించి, గతేడాది డిసెంబర్ కంటే అధిక ప్రగతిని సాధించామని వెల్లడించారు. క్షేమంగా ఉన్నా.. ఎవరూ ఆందోళన చెందొద్దు కావలి(అల్లూరు): తాను క్షేమంగా ఉన్నానని.. ఎవరూ ఆందోళన చెందొద్దని.. త్వరలోనే మీ ముందుకొస్తానని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్చార్జి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటనను బుధవారం విడుదల చేశారు. బైపాస్ సర్జరీ విజయవంతంగా జరిగిందని, ఇప్పుడు క్షేమంగా ఉన్నానని చెప్పారు. రక్త పరీక్షలను సకాలంలో చేయాలి నెల్లూరు(అర్బన్): ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు.. రక్త పరీక్షలను సకాలంలో చేయాలని డీఎంహెచ్ఓ సుజాత సూచించారు. సంతపేటలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ల్యాబ్ టెక్నీషియన్లతో బుధ వారం నిర్వహించిన నెలవారీ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. నాణ్యతతో కూడిన రక్త పూతలను సేకరించి మలేరియా, ఫైలేరియా కేసులను నిర్ధారించాలని కోరారు. పరీక్ష ఫలితాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఏడీఎంహెచ్ఓ ఖాదర్వలీ, జిల్లా మలేరియా నివారణాధికారి హుస్సేనమ్మ, సహాయ మలేరియా నివారణాధికారి నాగార్జునరావు పాల్గొన్నారు. -
గర్భిణి ఆత్మహత్య
● అత్తింటి వేధింపులే కారణమని బంధువుల ఆరోపణదుత్తలూరు: ఉరేసుకుని గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని నందిపాడులో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఉదయగిరి మండలం దేవలాలగడ్డకు చెందిన షేక్ కుబ్రా (18) చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. కొన్నేళ్లకు తండ్రి మృతిచెందాడు. దీంతో బంధువులు ఆమెను దుత్తలూరు మండలంలోని నందిపాడు గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ రఫీకిచ్చి గత ఆగస్టులో వివాహం చేశారు. కాగా యువతి ఇటీవల గర్భం దాల్చింది. దీంతో బంధువుల ఇంటికెళ్లి వస్తానని అత్తారింట్లో చెప్పింది. కాగా కుబ్రా బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుంది. అత్త రసూల్బీ ఇంటికొచ్చి చూసి కేకలు వేసింది. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఉదయగిరి సీఐ వెంకట్రావు, తహసీల్దార్ యనమల నాగరాజు, ఎస్సై ఆదిలక్ష్మిలు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా అత్తింటి వేధింపులతోనే కుబ్రా ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి పెద్దమ్మ గౌసియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుంభవృష్టి
సాక్షి, అమరావతి/నెల్లూరు/వెంకటాచలం/తొట్టంబేడు: వాయుగుండం ప్రభావంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. తిరుపతి జిల్లా చిట్టమూరులో మంగళవారం ఉదయం నుంచి బుధవారం వరకు 27.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో 27.2, ఇదగలిలో 24, తిరుపతి జిల్లా అల్లంపాడులో 23.8, విద్యానగర్లో 19.6, నెల్లూరు జిల్లా మనుబోలులో 17.9, మల్లంలో 17.6, అక్కంపేటలో 16.7, నెల్లూరులో 14 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. నెల్లూరు రూరల్, సైదాపురం, నాయుడుపేట, అల్లూరు, మనుబోలు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, తిరుపతి జిల్లా గూడూరు, చింతవరం, సూళ్లూరుపేట, తొట్టంబేడు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం సాయంత్రం వరకు తిరుపతి జిల్లా తొట్టంబేడులో 4.7, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 3.7, తిరుపతి జిల్లా మన్నారు పోలూరులో 3.2, చిత్తూరు జిల్లా నిండ్రలో 3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దిత్వా తుపాను బలహీనపడి రెండు రోజుల క్రితం వాయుగుండంగా మారగా.. బుధవారం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో మరో రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.జలదిగ్బంధంలో నెల్లూరు హైవే వాయుగుండం నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు ఏకధాటిగా కుంభవృష్టి కురిసింది. వాగులు, వంకలు, పంట పొలాలు సముద్రాన్ని తలపించాయి. వెంకటాచలం మండలం చెముడుగుంట, కాకుటూరు, కాగితాలపూరు తదితర ప్రాంతాల్లోని జాతీయ రహదారిపై వరద ప్రవహించింది. బుజబుజ నెల్లూరు, చెముడుగుంట ప్రాంతాల్లో జాతీయ రహదారిపైకి వరద పోటెత్తడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంకటాచలం–మనుబోలు మధ్య జాతీయ రహదారిలో ఒక వరుస రోడ్డు మునిగిపోయింది. ప్రజలు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నెల్లూరు నుంచి వెంకటాచలం చేరుకునేందుకు సుమారు 3 గంటల సమయం పట్టింది. నెల్లూరు అయ్యప్పగుడి నుంచి హైవే రోడ్డు కలిసేచోట రోడ్డుపై మోకాలి లోతు నీరు చేరడంతో ద్విచక్ర వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. పలుచోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంకటాచలంలో 3 వేల ఎకరాల్లో మునిగిన నారు మళ్లు, నాట్లు మునిగినట్లు ప్రాథమిక అంచనా.నీట మునిగిన కాలనీలు భారీ వర్షాలకు నెల్లూరు నగరంలో సగం ప్రాంతాలు నీటమునిగాయి. చంద్రబాబునగర్, వైఎస్సార్ నగర్, మల్లయ్యగుంట, బుజబుజ నెల్లూరులోని ఆర్టీసీ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, తల్పగిరి కాలనీ, శివగిరి కాలనీ, జనార్దన్రెడ్డి నగర్, కృషి విజ్ఞాన కేంద్రం, ఆర్డీటీ కాలనీ, సుందరయ్య కాలనీ డి–బ్లాకులోని కొన్ని ప్రాంతాలు, హరనాథపురం విస్తరిత(ఎక్స్టెర్ననల్) ప్రాంతాల్లో పెద్దఎత్తున వరద నీరు చేరింది. మాగుంట లేఅవుట్, రామలింగాపురం, ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జిలు నీటమునిగాయి.గోడ కూలి వృద్ధురాలి మృతి తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కానవరంలో బుధవారం కురిసిన వర్షానికి పూరి గుడిసె గోడకూలి నిద్రదిస్తున్న రేణుకమ్మ(59)పై పడింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. -
భయం గుప్పెట్లో ఆర్టీడీ కాలనీ
● గంజాయి బ్యాచ్కు చెందిన ఆరు ఇళ్లు ధ్వంసం ● ఓ ఇంట్లో బయటపడిన కత్తి ● కాలనీలో కొనసాగుతున్న పోలీస్ పికెట్నెల్లూరు సిటీ: గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు, ప్రజానాట్య మండలి కళాకారుడు పెంచలయ్య పాశవిక హత్యతో ఆర్టీడీ కాలనీవాసులు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. గంజాయి బ్యాచ్ చేసిన హత్యతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళనలో ఉన్నారు. పోలీసులు కాలనీలో పికెట్ ఏర్పాటు చేశారు. పెంచలయ్య మృతికి కారణమైన అరవ కామాక్షి, అనుచరుల ఇళ్లను సోమవారం రాత్రి స్థానికులు ధ్వంసం చేశారు. ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో తుప్పుపట్టిన పెద్ద కత్తి మంగళవారం బయటపడింది. కామాక్షి, హత్యలో నేరుగా ప్రమేయం ఉన్నవారిని పోలీసులు అరెస్ట్ చేసినా కాలనీ వాసుల్లో ఇంకా భయం పోలేదు. ఉద్యమకారుడు, పార్టీ నేతనే ఇలా మట్టుపెట్టారంటే, సామాన్యులమైన తమ పరిస్థితి ఏమిటని స్థానికులు చర్చించుకుంటున్నారు. మాటలు, పాటలు తలుచుకుంటూ.. ఉద్యమకారుడు, కళాకారుడిగా, సీపీఎం నేతగా ఉంటూ ఆర్టీడీ కాలనీలో గంజాయిని తరిమికొట్టాలని నిరంతర పోరాటం చేసిన పెంచలయ్య మాటలను కాలనీవాసులు గుర్తుతెచ్చుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. అతను కాలనీలో పోలీసులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. అదే విధంగా తన కళతో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఇప్పుడు ఆ మాటలు, పాటలు లేక కాలనీ మూగబోయిందని ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. -
గండిపాళెంలో యూపీ వ్యక్తి గల్లంతు
ఉదయగిరి: ఆ యువకుడిది పేద కుటుంబం.. తల్లిదండ్రులకు అసరాగా ఉండేందుకు ఉపాఽధి నిమిత్తం ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాడు. ఈ క్రమంలో గండిపాళెం జలాశయంలో గల్లంతైన ఘటన మంగళవారం జరిగింది. పోలీసులు, మృతుడి మిత్రుల కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్కు చెందిన సౌరభ్ (24) వారం రోజుల క్రితం మిత్రులతో కలిసి ప్రకాశం జిల్లా పామూరుకు వచ్చాడు. మేసీ్త్ర చెప్పిన ప్రాంతాలకు వెళ్లి పెయింట్ పనులు చేశాడు. మూడు రోజుల నుంచి వరికుంటపాడు మండలం కాంచెరువులో ఓ భవనంలో పని చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం నిత్యావసర సరుకుల కోసం స్నేహితుడితో కలిసి గండిపాళెం వచ్చాడు. తిరిగెళ్తూ జలాశయాన్ని చూసేందుకు వెళ్లారు. లోతట్టు గేటు వద్ద ఉన్న నీటిని సౌరభ్ అందుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయాడు. మిత్రుడు కేకలు వేయడంతో అక్కడున్న వారు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు. రెస్క్యూ టీమ్కు సమాచారం అందించారు. -
గంజాయి కేసులో దంపతుల అరెస్ట్
● 7 కిలోల స్వాధీనం కొడవలూరు: గంజాయి కేసులో భార్యాభర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొడవలూరు పోలీస్స్టేషన్లో మంగళవారం సీఐ ఎ.సురేంద్రబాబు వివరాలు వెల్లడించారు. బక్కి చినరాజా, లక్ష్మీది తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలం సారపాక గ్రామం. వీరు నెల్లూరు డైకస్ రోడ్డులోని చాణక్యపురి కాలనీలో స్థిరపడ్డారు. ఇద్దరూ కొడవలూరు మండలం గండవరం ఫ్లై ఓవర్ వద్ద సోమవారం అనుమానాస్పదంగా తిరుగుతుండగా కొడవలూరు, విడవలూరు ఎస్సైలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం పట్టుకుంది. వారి వద్ద ఏడు కిలోల గంజాయిని గుర్తించారు. డిప్యూటీ ఎంపీడీఓ సమక్షంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకున్న ఎస్సైలు సీహెచ్ కోటిరెడ్డి, పి.నరేష్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అజిత అభినందించి రివార్డులు ప్రకటించారు. -
యువత నాశనం
గంజాయి, డ్రగ్స్ నేరాల్లో ● గాడితప్పుతున్న యువత ● గంజాయికి బానిసలవుతున్న వైనం ● పెంచలయ్య హత్య కేసులో నిందితుల వయసు 18 నుంచి 25 ఏళ్ల లోపే.. నెల్లూరు(క్రైమ్): యువత వ్యసనాల బాటపడుతోంది. మత్తు అనే చెడు సరదా కోసం బంగారు భవిష్యత్ను పణంగా పెట్టి కన్నవారి కలల్ని మరిచి నేరాలకు పాల్పడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటోంది. ఆర్టీడీ కాలనీకి చెందిన ఉద్యమకారుడు, ప్రజానాట్య మండలి కళాకారుడు పెంచలయ్యను గంజాయి బ్యాచ్ పొట్టనబెట్టుకుంది. హత్యలో పోలీసులు అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితుల్లో ఆరుగురి వయసు 18 నుంచి 25 సంవత్సరాల్లోపే. ఇటీవల నెల్లూరు రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలు, నకిలీనోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయిన నిందితుల్లో ముగ్గురి వయసు 25ఏళ్ల లోపే. వారే లక్ష్యంగా.. ప్రధానంగా యువత, విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. తొలుత సరదాగా అలవాటు చేసుకున్న కొందరు మత్తుకు బానిసలవుతున్నారు. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్మనీ, తమ సంపాదనంతా గంజాయికే ఖర్చు పెడుతున్నారు. మత్తుకు సరిపడా నగదు లేని వారు స్మగ్లర్లుగా అవతారమెత్తుతున్నారు. ఇంకొందరు కమీషన్ పద్ధతిపై అక్రమ రవాణాకు, విక్రయాలకు పాల్పడుతున్నారు. బానిసలుగా మార్చి.. కొందరు గంజాయి వ్యాపారులు యువకులను చేరదీసి మత్తును రుచి చూపిస్తున్నారు. క్రమేపీ వారిని బానిసలుగా మార్చి తమ అవసరాలకు వాడుకుంటున్నారు. వారిచే గంజాయి అమ్మించడంతోపాటు నిత్యం మత్తులో జోగేలా చేసి తమకు అడ్డొచ్చిన వారిపై దాడులు, దౌర్జన్యాలతోపాటు హత్యలు చేయించేందుకూ వెనుకాడటం లేదు. ఇటీవల జరిగిన పలు ఘటనల్లో నిందితులు గంజాయి మత్తులోనే నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇదిలా ఉంటే కొందరు వ్యక్తులు తమ రాజకీయ అవసరాలకు యువతకు మత్తు అలవాటు చేసి వెంట తిప్పుకొంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోకపోవడంతో యువత చెడుమార్గం పడుతున్నారు. వారు తమ బిడ్డల నడవడి, స్నేహాలు తదితరాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడూ దిశానిర్దేశం చేయాలి. హద్దు మీరితే దండించాలి. ఇష్టారాజ్యంగా.. జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. చదువుకోవాల్సిన వయసులో యువత పెడదారిపడుతూ మత్తులో జోగుతోంది. ఖాళీ స్థలాలు, శివారు ప్రాంతాలు, పాడుబడిన భవనాల్లో చేరి గంజాయి తాగుతున్నారు. మత్తు వారిని చిత్తు చేస్తోంది. విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో నేరాలకు తెగబడుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని నేరాల్లో గంజాయి వినియోగం తేటతెల్లమవడం పోలీసులు క్షేత్రస్థాయిలో దృష్టిసారించాల్సిన ఆవస్యకతను స్పష్టం చేస్తోంది. -
సకాలంలో చికిత్స అవసరం
నెల్లూరు(అర్బన్): స్క్రబ్ టైఫస్.. ఈ వ్యాధి కలవరపెడుతోంది. రెండు రోజుల క్రితం రాష్ట్రంలో ఓ మహిళ ఈ వ్యాధితో మరణించింది. జిల్లాలో కొన్ని నెలలుగా కేసులు నమోదవుతున్నాయి. పలువురు గాలితీసుకోలేక ఆయాసంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రోగుల కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. ఇంత జరుగుతున్నా వైద్యశాఖ తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తోందని విమర్శలున్నాయి. మైట్ కీటకంతోనే.. ఓరియంటియా సుత్సుగముషి అనే బ్యాక్టీరియాతో స్క్రబ్ టైఫస్ వ్యాధి వస్తుంది. నల్లిని పోలిన మైట్ అనే కీటకం మనిషిని కుట్టినప్పుడు దాని ద్వారా బ్యాక్టీరియా ప్రవేశించి జబ్బు కలిగిస్తోంది. ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్యలో ఎక్కువగా ప్రబలుతోంది. అటవీ ప్రాంతాలు, పొదలు, గడ్డి ఎక్కువగా ఉండే ప్రాంతాలు, పశువుల పాకలు తదితర ప్రదేశాల్లో స్క్రబ్ టైఫస్ వ్యాధిని కలిగించే కీటకాలుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే అధికం. గుర్తు ఆధారంగా.. కీటకం కరిచిన చోట నల్లటి మచ్చ లేదా పుండు (స్కార్) ఉంటుంది. ఈ గుర్తును ఆధారంగా స్క్రబ్ టైఫస్ జబ్బుగా అనుమానించాలి. వారం, పదిరోజులుగా జ్వరం రావడం, కండరాల నొప్పులు, ఒళ్లు నొప్పులు, దద్దుర్లు, వాపు, వణుకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వాంతులు, అలసట తదితర లక్షణాలుంటే ఎలీసా ఐజీజీ, ఐజీఎం, ఆర్టీపీసీఆర్, మైక్రోస్కోపి పరీక్షలు చేయించుకోవాలి. ర్యాపిడ్ పద్ధతిలో కూడా నిర్ధారిస్తున్నారు. పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ పద్ధతిలో చేసే పరీక్షలను వైద్యశాఖ అంగీకరించడం లేదు. అందువల్ల వాస్తవాలు వెలుగు చూడటం లేదు. కేసులు అంతే.. జిల్లాలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇప్పటి వరకు 58 కేసులే నమోదయ్యాయని వైద్యశాఖాధికారులు ప్రకటించడం విశేషం. శంకరాగ్రహారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోనే గత నెలలో 20కి పైగా కేసులు వచ్చాయి. అధికారులు కాకిలెక్కలు చూపుతూ కొన్నింటిని మాత్రమే రికార్డు చేస్తున్నారని విమర్శలున్నాయి. కేసులు నమోదైతే ఐహెచ్ఐపీ (ఇంటర్నేషనల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ పోర్టల్)లో ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు నమోదు చేయాల్సి ఉంది. వైద్యశాఖ నుంచే వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యం ఈ పోర్టల్లో పాజిటివ్ కేసులను సైతం నమోదు చేయడం లేదని తెలుస్తోంది. అనుమానాస్పద కేసులకు పరీక్షలు చేయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలవరం నల్లిని పోలిన కీటకం.. కరిస్తే ప్రాణాంతకం ప్రైవేట్ ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో కేసులు అధికారిక లెక్కల్లో 58 మాత్రమే అంట వైద్యశాఖ కాకిలెక్కలు స్క్రబ్ టైఫస్ వ్యాధి మొదట జ్వరంతోనే ప్రారంభమవుతుంది. అయితే డెంగీ, మలేరియా లాంటి పరీక్షలు చేయించుకుంటున్న రోగులు స్క్రబ్ టైఫస్ పరీక్షలు చేయించుకోవడం లేదు. డాక్టర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. సాధారణ జ్వరంగా భావించి మందులు రాస్తున్నారు. అయితే మొదట్లోనే గుర్తించి యాంటీ బయాటిక్స్ వాడితే తగ్గిపోతోంది. వారం, పదిరోజుల వరకు నిర్లక్ష్యం చేసి తర్వాత పరీక్ష చేయించుకునే లోపు వ్యాధి తీవ్రత పెరిగిపోతుంది. సకాలంలో వైద్యం అందకపోతే తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, మెదడు, వెన్నెముక వాపు, కిడ్నీలు ఫెయిలవడం లాంటివి జరిగి ప్రాణాలు పోయే అవకాశాలున్నాయి. చికిత్స ఉంది స్క్రబ్ టైఫస్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని రకాల యాంటీ బయాటిక్స్, ఇతర మందులున్నాయి. జ్వరం వస్తే ఆర్ఎంపీ వద్దకెళ్లడం, సొంతంగా జ్వరం మాత్రలు వేసుకోవడం చేయొద్దు. అయితే ప్రాథమిక దశలోనే డాక్టర్ల సలహాలు తీసుకోవడం మంచిది. ప్రభుత్వాస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నాం. – సుజాత, జిల్లా వైద్యశాఖాధికారి నిర్లక్ష్యం వద్దు స్క్రబ్ టైఫస్ అనే జబ్బు పరీక్షల్లో మాత్రమే తెలుస్తోంది. అందువల్ల జ్వరం వచ్చినప్పుడు సొంత వైద్యం చేయించుకోకుండా డాక్టర్ను కలిసి సలహాలు తీసుకోవాలి. లక్షణాలను బట్టి పరీక్ష చేసి వైద్యం చేస్తారు. మొదట్లోనే ఈ జబ్బును కనుక్కుంటే నయం చేసుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి తీవ్రమైన సమస్యగా మారుతుంది. – డాక్టర్ గంగాధర్, నెల్లూరు -
మార్కెటింగ్పై రైతులకు శిక్షణ
నెల్లూరు(పొగతోట): ఎఫ్పీఓల్లో ఉన్న రైతులకు పంటల సాగు, మార్కెటింగ్ తదితర అంశాలపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి ఆదేశించారు. మంగళవారం నెల్లూరులోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్పీఓ)లు, ఏపీఎంలు, సీసీలు, బీఓడీలు తదితరులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పీడీ మాట్లాడారు. సంస్థలోని కార్యక్రమాలు అమలు చేయడానికి ఉత్సాహవంతులైన రైతులను డైరెక్టర్లుగా ఎంపిక చేసుకోవాలన్నారు. ఎరువులు, విత్తనాలు ఏర్పాటు చేసుకునేలా లైసెన్సుల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. పండించిన పంటలకు ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ కల్పించాలన్నారు. శిక్షణ, యంత్రాలకు బ్యాంక్ల నుంచి రుణాల మంజూరుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఎన్జీఓ డాక్టర్ ఎన్వీఆర్ గణేష్ మాట్లాడుతూ ఏడు జిల్లాల్లో 72 ఎఫ్పీఓలను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 5న మెగా పీటీఎంనెల్లూరు(టౌన్): జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈనెల 5వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులచే అమలు జరుగుతున్న కార్యక్రమాలు, అసెస్మెంట్ బుక్లెట్లు, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు, స్పోర్ట్స్ కిట్స్, పాఠశాల ప్రగతిని ప్రదర్శించాలన్నారు. , సౌకర్యాలపై చర్చ, ఫీడ్బ్యాక్ సేకరణ, ముగింపు సెషన్లను నిర్వహించాలన్నారు. తల్లిదండ్రులు, సంరక్షకులు మీటింగ్లో తప్పకుండా పాల్గొనాలని కోరారు. కండలేరులో 58.690 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 58.690 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 5,100 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 850, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 100, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.12 సన్నవి : రూ.6 పండ్లు : రూ.3 -
అధికారమే అండ.. భూ కబ్జా కాండ
ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. స్థానికులు ప్రతిఘటించినా అధికార బలంతో లెక్క చేయడం లేదు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా రెడ్బుక్ భయంతో వారు భూ దోపిడీకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా ఉదయగిరి మండలం పప్పువారిపల్లిలోని రూ.2 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఓ టీడీపీ నేత బరితెగించి ఆక్రమించి జామాయిల్ సాగుకు యంత్రాలతో చదును చేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. 40 ఎకరాలకు ఎసరు ఆర్లపడియ పంచాయతీ పప్పులవారిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 47, 49, 53లలో 40 ఎకరాల ప్రభుత్వ అనాధీనం, పశువుల మేత పోరంబోకు భూమి ఉంది. ఈ భూమిపై పక్క గ్రామానికి చెందిన టీడీపీ నేత కన్నేశాడు. గత పదిహేను రోజులుగా జేీసీబీ సాయంతో చెట్లను తొలగించి ట్రాక్టర్లతో చదును చేయిస్తున్నాడు. దీనిపై రెవెన్యూ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేసినా తొలుత పట్టించుకోలేదు. మరోసారి గ్రామస్తులు తహసీల్దార్ షాజియాకు ఫిర్యాదు చేయడంతో తాత్కాలికంగా పనులు నిలిపివేయించారు. కానీ భూ ఆక్రమణదారుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం భూమిలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జామాయిల్ మొక్కలు నాటేందుకు ఆదివారం ఏర్పాట్లు చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగడంతో తాత్కాలికంగా రెవెన్యూ అధికారులు పనులు నిలిపివేయించారు.అంతేతప్ప ఆక్రమణదారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించలేదు. దీంతో రేపుమాపో గుట్టు చప్పడు కాకుండా రాత్రి వేళలో మొక్కలు నాటుతారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పప్పువారిపల్లిలో టీడీపీ నేత కబ్జా పర్వం రూ.2 కోట్ల విలువ చేసే భూమికి ఎసరు గ్రామస్తులు ప్రతిఘటిస్తున్నా లెక్క చేయని వైనం మౌనవ్రతంలో రెవెన్యూ అధికారులు -
వామపక్షాల బంద్ ప్రశాంతం
● పెంచలయ్య హత్యకు నిరసనగా కదం ● గాంధీబొమ్మ సెంటర్లో డ్రగ్స్, గంజాయి దిష్టిబొమ్మల దహనం ● నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు ● సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు అరెస్ట్ నెల్లూరు(వీఆర్సీసెంటర్): సీపీఎం నాయకుడు, ప్రజానాట్యమండలి కళాకారుడు పెంచలయ్య హత్యకు నిరసనగా వామపక్షాలు మంగళవారం చేపట్టిన జిల్లా బంద్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో గంజాయి, డ్రగ్స్, మత్తుపదార్థాల విక్రయాలను నిషేధించాలనే డిమాండ్తో సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, ప్రజానాట్యమండలి, ఐద్వా తో పాటు ప్రజా సంఘాలకు చెందిన నాయకులు బంద్ చేపట్టారు. కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీల నాయకులు తమ మద్దతును ప్రకటించారు. బంద్కు సంఘీభావంగా జిల్లాలోని విద్యాసంస్థలు సెలవు ప్రకటించగా, బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య దుకాణాలను స్వచ్ఛందంగా మాసివేశారు. నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, వామపక్ష కార్యకర్తల నడుమ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్జ్జి చేశారు. కత్తి శ్రీనివాసులును అరెస్ట్ చేసి వాహనంలో స్టేషన్కు తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు గాంధీబొమ్మసెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తామని చెప్పిన రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు పెంచలయ్య హత్య ఘటనపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం దారుణమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి మాట్లాడుతూ జిల్లాలోని గంజాయి ముఠా సమాజానికి, పోలీసులకు సవాల్గా మారిందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వాలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా పోలీసులు గంజాయి బ్యాచ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ పెంచలయ్య గంజాయి బ్యాచ్ చేతిలో హత్యకు గురై మూడ్రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు సీఎం చంద్రబాబునాయడు, డీసీఎం పవన్కళ్యాణ్, హోంశాఖ మంత్రి అనిత ఎలాంటి ప్రకటన చేయకుండా మౌనంగా ఉండడాన్ని చూస్తుంటే గంజాయి విక్రయాలకు పరోక్షంగా మద్దతు ఇస్తూ గంజాయి బ్యాచ్లను బలపరుస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. జిల్లాలో గంజాయిని నిర్మూలించకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
మతిస్థిమితం లేని మహిళ గృహనిర్బంధం
● ఖైదీలకు పెట్టినట్లుగా భోజనం అందజేత ● కొత్తకోడూరులో అమానుషం తోటపల్లిగూడూరు: మతి స్థిమితం బాగా లేదని ఏడాదిగా ఓ మహిళను గృహనిర్బంధం చేసిన ఘటన మండలంలోని కొత్తకోడూరులో వెలుగు చూసింది. స్థానికుల వివరాల మేరకు.. కోడూరు పంచాయతీ కొత్తకోడూరు గ్రామానికి చెందిన 60 ఏళ్ల రత్నమ్మ మతిస్థిమితం సరిలేక ఇబ్బందులు పడుతోంది. అవివాహితురాలైన ఆమె వయస్సులో ఉన్నప్పుడు తోడబుట్టిన అక్కకు చేదోడు వాదోడుగా ఉండేది. ఈ క్రమంలోనే అక్క తన చెల్లి బాగోగులు చూసేది. కొద్ది కాలం తర్వాత అక్క చనిపోగా బావ, ఇతర బంధువులు మానసిక రోగి అయిన రత్నమ్మ బాగోగులను విస్మరించారు. వారందరూ నెల్లూరులో ఉంటూ ఆమెను కొత్తకోడూరులోని ఓ పురాతన ఇంట్లో నిర్బంధం చేశారు. మతిస్థిమితం లేదనే సాకుతో జనంలోకి రాకుండా అమానుషంగా గదిలో కట్టడి చేశారు. రత్నమ్మకు ప్రతి నెలా వచ్చే రూ.6 వేల పింఛన్, 35 కేజీల రేషన్ బియ్యాన్ని ఆమె బావ తీసుకొంటూ ఒక్క పూట మాత్రమే ఆమెకు భోజనం పెట్టేలా ఒకరిని నియమించాడు. అతను ఆ పూట భోజనం కూడా జైల్లో ఖైదీకి మాదిరిగా వరండాలోనే విసిరేసి వెళ్తుంటారు. భోజనంతో పాటు ఇతర కాలకృత్యాలన్నీ ఆ నాలుగు గోడల మధ్య కానించాల్సిన పరిస్థితి ఆమెది. ఒంటరిగా ఉన్న రత్నమ్మ రాత్రి పూట భయానికి ఏడస్తూ, పెద్ద పెద్దగా కేకలు వేస్తుండడంతో స్థానికులకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. ఈ క్రమంలో స్థానికులు మంగళవారం మీడియా దృష్టికి తీసుకొచ్చారు. రత్నమ్మకు సంబంధించిన అన్నీ తీసుకొంటూ ఆమెను ఇలా ఓ పిచ్చిదానిలాగా ఒంటరిగా వదలి వేయడం అమానుషమన్నారు. మానవత్వంతో ఆలోచించి ఇంటికి తీసుకెళ్లడమా లేదా అనాఽథ ఆశ్రమంలో చేర్పించడమో చేయాలని ఆమె బావను కోరారు. -
18న కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం
నెల్లూరు(బారకాసు): నెల్లూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 18న నిర్వహించనున్నారు. ప్రస్తుతం మేయర్గా కొనసాగుతున్న పొట్లూరు స్రవంతిపై కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉదయం 11.30 గంటలకు కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే టీడీపీకి పూర్తిస్థాయిలో 42 మంది కార్పొరేటర్ల మద్దతు ఉంది. 18న జరిగే సర్వసభ్య సమావేశంలో మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. ఆ తరువాత మేయర్ ఎన్నిక ప్రక్రియ ఎన్నికల కమిషనర్ సూచనల మేరకు ఉంటుంది. అప్పటి వరకు ఇన్చార్జి మేయర్గా ఎవరిని ఎన్నుకుంటారో వారే కొనసాగే అవకాశం ఉండొచ్చని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాలి కావలి(అల్లూరు): కలెక్టర్ హిమాన్షుశుక్లా మంగళవారం కావలిలో పర్యటించారు. తుపాను నేపథ్యంలో ఆర్డీఓ వంశీకృష్ణతో కలిసి చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దిత్వా తుపాను ప్రభావంతో కావలిలో వర్షపాతం ఎక్కువగా ఉందన్నారు. చెరువులకు వరద నీరు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇరిగేషన్ అధికారులు చెరువుల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి సహాయక చర్యలు అవసరమైన తెలియజేయాలని అధికారులకు సూచించారు. ఓపెన్ స్కూల్ తాత్కాలిక అడ్మిషన్లకు అవకాశం నెల్లూరు (టౌన్): 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ ఓపెన్ స్కూల్లో తాత్కాలిక అడ్మిషన్లు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ వరకు అవకాశం కల్పించిందని జిల్లా విద్యాశాఖాధికారి బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాత్కాలిక అడ్మిషన్లు పొందేందుకు అభ్యాసకులు ఆన్లైన్ ద్వారా రెగ్యులర్ ఫీజుతో పాటు అదనంగా రూ.600 చెల్లించాల్సి ఉంటుంద న్నారు. ఒరిజనల్ సర్టిఫికెట్లను సంబంధిత కోఆర్డినేటర్కు సమర్పించాలని సూచించారు. జిల్లాలో 69.4 మి.మీ. వర్షపాతం నెల్లూరు(దర్గామిట్ట): దిత్వా తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మంగళవారం 69.4 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అధికంగా కోవూరులో 14.8 మి.మీ. వర్షం పడింది. ముత్తుకూరు 11.6, సైదాపురం 8.4, విడవలూరు 6.0, నెల్లూరురూరల్ 5.8, ఇందుకూరుపేట 3.8, నెలూరు అర్బన్ 3.4, తోటపల్లిగూడూరు 3.0, రాపూరు 2.6, పొదలకూరు 2.2, కొడవలూరు 2, అల్లూరు 1.8, బుచ్చిరెడ్డిపాళెం 1.4, దగదర్తి 1, జలదంకి 1.2 మి.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి పది గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 70,345 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 24,292 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.43 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
మెడికోల ఆత్మహత్యల నివారణకు చర్యలు
నెల్లూరు(అర్బన్): రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల్లో మెడికల్ విద్యార్థులు భవిష్యత్తులో ఆత్మహత్యలకు పాల్పడకుండా తగిన కార్యాచరణను సిద్ధం చేసి అమలు చేయనున్నామని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ రఘునందన్ అన్నారు. నెల్లూరు ప్రభుత్వ వైద్యకళాశాలలో రెండు నెలల కాలంలో ఇద్దరు మెడికోలు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో మంగళవారం ఆయన కళాశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలకు అనుబంధంగా ఉన్న సర్వజన ఆస్పత్రిలోని క్యాజువాలిటీ, ట్రామాకేర్, చిన్నపిల్లల విభాగం, డెలివరీ వార్డు ఇలా పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం వైద్యులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మెడికల్ విద్యార్థులు, హెచ్ఓడీలు, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి, సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవితో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంఈ మాట్లాడుతూ వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్గౌర్, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ ఆదేశాలతో వైద్య కళాశాలలోని పరిస్థితులను పరిశీలించి విద్యార్థులకు అండగా ఉండేందుకు వచ్చామన్నారు. వైద్య విద్యార్థులకు ర్యాగింగ్, అకడమిక్, ఫ్యాకల్టీ, సొసైటీ పరంగా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. అయినప్పటికీ వ్యక్తిగత కారణాలతో కొందరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడడం బాధాకరమన్నారు. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ప్రతి 12 మంది విద్యార్థులను ఒక గ్రూపుగా విభజించి మొదటి, రెండు, మూడు సంవత్సరాలకు సంబంధించి ఇన్చార్జులుగా అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తున్నామని తెలిపారు. నాల్గో, ఐదో సంవత్సరాలకు సంబంధించి అసోసియేట్ ప్రొఫెసర్లను నియమిస్తున్నామన్నారు. వారు విద్యార్థులతో మమేకవుతూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారన్నారు. అలా చేసిన కృషిపై ప్రిన్సిపల్ ప్రతి మూడు నెలలకొకసారి తమకు నివేదిక అందించాల్సి ఉంటుందన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలకు రూ.80 కోట్లతో వైద్యపరికరాలు సూపర్స్పెషాలిటీ వైద్యసేవలను అందించేందుకు పెద్దాస్పత్రిలో రూ.80 కోట్లతో అన్ని రకాల పరికరాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు వచ్చాయని డీఎంఈ తెలిపారు. వాటిని త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల పూర్తయిన క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయు)భవనాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. సీసీయూ భవనాలకు ఇప్పటికే 50 శాతం పరికరాలు వచ్చాయన్నారు. మిగిలిన వాటిని త్వరలోనే పంపిస్తామన్నారు. కాగా పలువురు డాక్టర్లు సమయపాలన పాటించకపోవడం, కొందరు విధులకు డుమ్మాకొట్టి ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేస్తుండడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ అలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవిని ఆదేశించారు. ప్రతిరోజూ రౌండ్స్ వేయాలని సూపరింటెండెంట్కు సూచించారు. విధులకు డుమ్మా కొట్టే వారిని గురించి ఆధారాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి, అడ్మినిస్ట్రేటీవ్ అధికారులు డాక్టర్లు కళారాణి, సుశీల్, అన్ని విభాగాల హెచ్ఓడీలు, ఏడీ ఏడుకొండలు, జూనియర్ వైద్యులు పాల్గొన్నారు. ప్రతి 12 మందికి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్తో పర్యవేక్షణ సూపర్ స్పెషాలిటీ సేవలకు రూ.80కోట్లతో వైద్యపరికరాలు డీఏంఈ డాక్టర్ రఘునందన్ -
కూటమి సర్కార్పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరులో గంజాయి డాన్ అరవ కామాక్షి పక్కాగా టీడీపీకి చెందిన వ్యక్తి అని, ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఆమెకు అండగా ఉన్నారని, ఆ మేరకు అనేక ఫోటోలు కూడా ఉన్నాయని వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి స్పష్టం చేశారు. అయినా కామాక్షి వైఎస్సార్సీపీకి చెందిందంటున్నారని, అలా తమ పార్టీకి మసి అంటించాలని చూస్తున్నారని ఆయన ఆక్షేపించారు. చివరకు సీఎం చంద్రబాబు సైతం నిస్సిగ్గుగా అవే మాటలు మాట్లాడుతున్నారని కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. ఆయన ఏం మాట్లాడారంటే..:అందుకే కామాక్షి ఇల్లు కూల్చారు:కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. నెల్లూరులో అరవ కామాక్షి ఇల్లు కూల్చివేత ప్రజల అసహనానికి ఒక నిదర్శనం. ఒక హంతకురాలి ఇంట్లో 25 కేజీల గంజాయి దొరికిందంటే, ఆమెకు అధికార పార్టీ అండ ఉన్నట్లు కాదా? ఇంకా అది ఇంటలిజెన్స్ వైఫల్యం కాదా?. అయినా సీఎం చంద్రబాబు వైయస్ఆర్సీపీపై నెపం నెట్టుతున్నారు. కామాక్షి మా పార్టీకి చెందిందని నిస్సిగ్గుగా చెబుతున్నారు. పెంచలయ్య హత్యపై ఇటీవల సీఎం ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇది అత్యంత హేయం.రాష్ట్రంలో చెలరేగుతున్న డ్రగ్స్ మాఫియా:రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోవడం వల్ల ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. నెల్లూరులో మాదకద్రవ్యాల వ్యతిరేకంగా పోరాడిన సామాజిక ఉద్యమకారుడు పెంచలయ్య హత్య ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. చెడు అలవాట్ల నిర్మూలన కోసం పెంచలయ్య అనేక కార్యక్రమాలు నిర్వహించగా, వాటిని సహించలేని గంజాయి, డ్రగ్స్ మాఫియా దారుణంగా హత్య చేసింది. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ నిర్మూలిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు 550 రోజులు పూర్తైనా ఆ పని చేయలేదు. పైగా పరిస్థితి మరింత దయనీయంగా మారింది. డ్రగ్స్ స్మగ్లర్లకు చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలుస్తోంది.ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం:పెంచలయ్య హత్యలో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షిని పోలీసులు అరెస్టు చేసి సోదాలు జరపగా, ఆమె ఇంట్లో 25 కేజీల గంజాయి బయటపడింది. ఆమె టీడీపీ నేతల అండతోనే ఇదంతా చేసిందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ ఈ గంజాయి నిజంగా వైయస్ఆర్సీపీ వాళ్లది అయితే అమ్మే ధైర్యం వారికి ఉంటుందా?.చివరకు ప్రజలు స్వయంగా కామాక్షి ఇల్లు కూల్చివేశారంటే మీ ప్రభుత్వంపై నమ్మకం పోయింది అని సందేశం కాదా? కామాక్షి ఇంట్లో గంజాయి ఉన్నట్లు తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో ఆమె ఇంటిని కూల్చివేయడం ప్రజల్లో పెరిగిన అసహనానికి నిదర్శనం. ఈరోజు కామాక్షి ఇల్లు కూల్చారు. రేపు మీ ప్రభుత్వాన్నే కూల్చేస్తారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి బాబూ.టీడీపీ ద్వంద్వ ప్రమాణాలు:బంద్కు ముందు మద్దతు.. ఆ తర్వాత అడ్డుకోవడం. ఇది టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతం. ద్వంద్వ ప్రమాణాలు. డిసెంబర్ 2న నెల్లూరు బంద్కు టీడీపీ, వైయస్ఆర్సీపీ, సీపీఐ, కాంగ్రెస్లు మద్దతు తెలిపినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటించారు. తీరా బంద్ సందర్భంగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ర్యాలీ నిర్వహిస్తే పోలీసులతో అడ్డుకోవడం ఏమిటి?. ముందుగా మద్దతు ఇచ్చి తరువాత వెనక్కి తగ్గడం టీడీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా?.పోలీసులు ఎందుకు భయపడుతున్నారు?:టీడీపీ ప్రభుత్వం రౌడీషీటర్లకు అండగా ఉండటంతో అరాచకాలు పెరిగిపోతున్నాయి. డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్టు చేస్తే వెంటనే ఎమ్మెల్యేల ఆఫీసుల నుంచి ఫోన్లు వెళ్తు్తన్నాయి. కేసుల తీవ్రత తగ్గించి, నిందితులను వదిలివేయడం, అమాయకులను ఇరికించే పరిస్థితి నెలకొంది. పోలీసులు ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపాల్సిన స్థితి వచ్చింది. ఇది ఎంత దారుణమో పోలీసులే ఆత్మపరిశీలన చేసుకోవాలి. పోలీసులు నిద్ర లేచింది మొదలు ప్రతిపక్షంపై కేసులు పెట్టడానికి మాత్రమే పని చేస్తున్నారు. డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు లేవు.ప్రజలు తిరగబడ్డారు. ఇక మౌనం పాటించరు:పెంచలయ్య హత్యకు నిరసనగా ప్రజలు చేపట్టిన బంద్కు వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. అంతే కాకుండా పెంచలయ్య కుటుంబానికి మా పార్టీ పూర్తి అండగా ఉంటుంది. ఇవాళ్టి (మంగళవారం) బంద్ విజయవంతం కావడం.. ప్రజలు ఈ ప్రభుత్వంపై తిరగబడ్డారని చెప్పడానికి నిదర్శనం. పెంచలయ్య సమాజహితం కోసం పని చేశాడు. అలాంటి వ్యక్తిని హత్య చేయడం అత్యంత దుర్మార్గం. ఇవన్నీ చూస్తుంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజలు తిరగబడ్డారని, వారు ఇక మౌనం వహించరని అర్థమవుతోందని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి స్పష్టం చేశారు. -
నేరస్తులపై ఉక్కుపాదం : ఐజీ
నెల్లూరు(క్రైమ్): ప్రజా జీవనానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై ఉక్కుపాదం మోపాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశించారు. సోమవారం ఆయన ఎస్పీ అజితతో కలిసి నెల్లూరు చిన్నబజారు పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి సూచనలు, సలహాలిచ్చారు. సిబ్బంది యోగక్షేమాలను తెలుసుకున్నారు. శాఖాపరమైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. నేరస్తుల కదలికలపై నిఘా పెంచాలని, వారికి క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో నగర ఇన్చార్జి డీఎస్పీ ఎం.గిరిధర్, ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
సిరుల వరి విత్తనం
నెల్లూరు(పొగతోట): నెల్లూరులోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్తలు నూతన సన్నరకం వరి వంగడం ఎన్ఎల్ఆర్–3648ను సృష్టించారు. దీన్ని అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా రూపొందించారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను ఇచ్చే ఈ రకం 130 నుంచి 135 రోజుల్లో కోతకు వస్తుంది. అగ్గి, దోమపోటు వంటి తెగుళ్లతో పాటు అధిక వర్షాలకు సైతం తట్టుకుని నేలవాలకుండా ఉండడం దీని ప్రత్యేకత. గత ఖరీఫ్లో ప్రయోగాత్మకంగా సాగు జిల్లాలోని రైతులతో గత ఖరీఫ్ సీజన్లో ఎన్ఎల్ఆర్–2648 రకాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా సాగు చేయించారు. సుమారు 200 మంది నూతన వంగడాన్ని సాగు చేశారు. ఎకరాకు మూడున్నర నుంచి నాలుగు పుట్ల వరకు ధాన్యం దిగుబడి వచ్చింది. మొక్క 85 నుంచి 90 సెంటి మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది. ఒక్కో దుబ్బులో 20 నుంచి 25 వెన్నులు వస్తాయి. వెన్నులో 250 నుంచి 300 వరకు గింజలు ఉండడంతో అధిక దిగుబడులు వస్తున్నాయి. నెల్లూరు రైస్ ప్రత్యేకం రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ నెల్లూరు రైస్కు అత్యంత డిమాండ్ ఉంది. నెల్లూరు సన్న బియ్యాన్ని అధిక శాతం మంది ఇష్టపడుతారు. నెల్లూరు ధాన్యం సన్నగా ఉండి వండిన తరువాత అన్నం తినడానికి రుచికరంగా ఉంటుంది. జిల్లాలోని రైతులు వరి వంగడాలు అందుబాటులో లేక తెలంగాణకు సంబంధించిన కేఎన్ఎం వరి రకాలపై ఆధారపడుతున్నారు. కేఎన్ఎం స్థానంలో ఎన్ఎల్ఆర్–3648 రకం నూతన వంగడాన్ని శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. గత ఖరీఫ్ సీజన్లో విడవలూరుకు చెందిన రైతు శ్రీనివాసులరెడ్డి కొత్త రకాన్ని సాగు చేశారు. ఈ రకం గింజ నాణ్యంగా ఉండి బీపీటీల కన్నా బాగుందని, వెన్ను దశలో అధిక వర్షాలు కురిస్తే పంట పడిపోకుండా నిలబడుతుందని ఆయన చెబుతున్నారు. కేఎన్ఎం, ఇతర వరి రకాలను సకాలంలో సాగు చేయాలి. సకాలంలో నాట్లు వేయకపోతే పంట దెబ్బతింటుంది. అయితే ఎన్ఎల్ఆర్ 3648 రకాన్ని ఏ కాలంలో అయినా సాగు చేయొచ్చు. బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన రంగయ్య రెండెకరాల్లో సాగు చేయగా 8 పుట్లకుపైగా దిగుబడి రావడంతో శాస్త్రవేత్తలు నూతన వంగడం సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో రబీ సీజన్లో అధికంగా సాగు చేసేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. అందుకనుగుణంగా రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తుపాన్లు.. తెగుళ్లను తట్టుకునేలా.. నూతన వరి వంగడం ఎన్ఎల్ఆర్–3648 సృష్టి నెల్లూరు శాస్త్రవేత్తల ఘనత అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలం 130 నుంచి 135 రోజుల్లో చేతికి పంట ఎకరాకు నాలుగు పుట్ల వరకు దిగుబడులు ప్రతికూల వాతావరణంలోనూ సాగు చేయొచ్చు నూతనంగా రూపొందించిన ఎన్ఎల్ఆర్–3648 రకాన్ని అన్ని సీజన్లలో సాగు చేయొచ్చు. ఈ రకం ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడులు ఇస్తుంది. గత ఖరీఫ్ సీజన్లో ప్రయోగాత్మకంగా కొందరి రైతులతో సాగు చేయించగా మంచి దిగుబడులు వచ్చాయి. రబీసీజన్లో సాగుచేసేందుకు ఎవరైనా రైతులు ముందుకొస్తే విత్తనాలు అందజేస్తాం. – శ్రీలక్ష్మి, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన క్షేత్రం అధికారిణి -
ప్రజాభీష్టం మేరకే కార్యాచరణ
● మాజీ ఎమ్మెల్యే ప్రసన్న చిల్లకూరు: నెల్లూరు జిల్లాలో గూడూరును విలీనం చేసే విషయంపై ప్రజాభీష్టం మేరకు కార్యాచరణను ప్రకటిస్తామని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి పేర్కొన్నారు. ఈ విష యంపై గూడూరులోని రెండో పట్టణంలోని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్రెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీ నాయకులతో సోమవారం ఆయ న చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సయయంలో గూడూరులో జరిగిన మహిళా సమావేశంలో చంద్రబాబు, యువగళం పాదయాత్రలో లోకేశ్ గూడూరును నెల్లూరులో విలీనం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే నేడు తండ్రీతనయులు ఇద్దరూ హామీని నిలబెట్టుకోకుండా గూడూరు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టా రు. స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ సైతం గూడూరు విలీనంపై అసెంబ్లీలో గళమెత్తిన సమయంలో లోకేశ్ సానుకూలంగా స్పందించారని, ఇప్పు డు మాట మీద నిలబడకుండా గూడూ రు ప్రజలను వంచించారన్నారు. తాను గూడూరును నెల్లూరులో కలిపే విషయంపై ఒక నిర్ణయం ప్రకటించడం జరిగిందని, దీనిపై నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్, గూడూరులోని నాయకులతో చర్చిస్తామన్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గూ డూరు నియోజకవర్గ ప్రజల మనోభీష్టా న్ని తెలియజేసి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. ఈ నెలఖారులోగా ప్రభుత్వం విడుదల చేసే గెజిట్లో గూడూరును నెల్లూరులో కలిపే విషయంపై తుది నిర్ణయం తీసుకోకుంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ గూడూరు పట్ట ణ,రూరల్, కోట మండలాల అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయకుమార్రెడ్డి, పలగాటి సపంత్కుమార్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మెట్టా రాధాకృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు నల్లపరెడ్డి రాజేంద్రకుమార్రెడ్డి, డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ వీరి చలపతి పాల్గొన్నారు. -
కుండపోత వర్షం
నెల్లూరు(అర్బన్): జిల్లాపై మోంథా తుపాను చూపిన ప్రభావానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ ప్రభావం నుంచి తేరుకునేలోపు జిల్లాపై దిత్వా ప్రభావం చూపింది. గత నెల 29 నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే ప్రభావం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. అయితే ఆదివారం నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. సోమవారం తీరప్రాంత మండలాల్లో భారీ వర్షాలు నమోదు కాగా, మెట్టప్రాంత మండలాల్లో మోస్తరుగా కురిశాయి. తుపాను ప్రభావంతో సముద్రం కసురు మీద ఉంది. అలలు ఎగిసి పడుతున్నాయి. పలుచోట్ల సముద్రం నాలుగైదు మీటర్ల వరకు ముందుకు చొచ్చుకొచ్చింది. తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తున్నాయి. చలివాతావరణం ఎక్కువగా ఉంది. సోమవారం తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఫలితంగా తుపాన్ ప్రభావం కొంతమేర తగ్గింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో సోమవారం జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికలను రద్దు చేశారు. రాష్ట్రం నుంచి వచ్చిన జిల్లా ప్రత్యేకాధికారి యువరాజ్ పర్యవేక్షణలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు క్షేత్రస్థాయిఅధికారులతో ఎప్పటికప్పుడు చర్చి స్తూ ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్య లు చేపట్టారు. పొంగుతున్న వాగులు తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు జిల్లాలో పలు చోట్ల వాగులు పొంగాయి. చేజర్ల మండలంలోని నల్లవాగుకు ప్రవాహం పెరగడంతో యనమదల, తూర్పుకంభంపాడు, తూర్పుపల్లి తదితర ఐదు గ్రామాలకు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. పొదలకూరు మండలంలోని నావూరు వద్ద పెద్ద వాగుకు నీటి ప్రవాహం పెరిగింది. బొగ్గేరు, బీరాపేరులకు మోస్తరుగా వరద ప్రవాహం పెరిగింది. విడవలూరు మండలం మలిదేవి డ్రెయిన్, పైడేరులకు నీటి ప్రవాహం పెరిగింది. ఇప్పటికే చెరువులు నిండి ఉండడంతో ఎక్కడ తెగిపోతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు నగరంలోని లోత ట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వ్యవసాయ పనులకు ఆటంకం జిల్లాలోని రైతులు రబీ సాగు పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పొలాల నిండా నీరు చేరడంతో వేసిన నాట్లు, నారుమళ్లు కుళ్లిపోతాయోమోనని ఆందోళన చెందుతున్నారు. ముసురుతో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడడంతో వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. నేడూ వర్షాలు కొనసాగే అవకాశం బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. ఇది నెమ్మదిగా కదులుతూ నెల్లూరుకు దక్షిణ ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 12 గంటల్లో మరింత బలహీన పడి వాయుగుండంగా మారవచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో నెల్లూరు జిల్లాలో మంగళవారం కూడా వర్షాలు కురవనున్నాయి. ఒకటి, రెండు చోట్ల భారీవర్షాలు, మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయి. బలహీనపడి వాయుగుండంగా మారిన దిత్వా తుపాన్ పొంగిన వాగులు, వంకలు పెన్నానదిలో పెరిగిన ప్రవాహం మునిగిన నారుమళ్లు, నాట్లు ఆందోళనలో అన్నదాతలు వ్యవసాయ పనులకు ఆటంకం మూతపడిన పాఠశాలలు, కళాశాలలు కోవూరులో అత్యధికంగా 136.4 మి.మీ. వర్షపాతం జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి సోమవారం సాయంత్రం 5గంటల వరకు పడిన వర్షపాతం వివరాలను పరిశీలించగా కోవూరులో అత్యధికంగా 136.4 మి.మీ. వర్షం నమోదైంది. కావలిలో 135.2, బుచ్చిరెడ్డిపాళెం 131.6, సంగం 129.8, బోగోలు 116.8, జలదంకి 115.0, దగదర్తి 105.6, అల్లూరు 106.2, పొదలకూరు 102.2, నెల్లూరు అర్బన్ 102.2, కొడవలూరు 100.2, ఆత్మకూరు 97.6, ఏఎస్పేట 96.0, రాపూరు 93.6, నెల్లూరు రూరల్ 93.4, విడవలూరు 88.2, చేజర్ల 78.8, కలువాయి 78.2, అనంతసాగరం 67.6, సైదాపురం 65.6, ఇందుకూరుపేట 57.8, కందుకూరు 51.8, ఉలవపాడు 51.6, కలిగిరి 49.6, గుడ్లూరు 43.4, వెంకటాచలం 70.8, తోట పల్లిగూడూరు 43.4, ఉదయగిరి 29.4, మనుబోలు 41.8, వలేటివారిపాళెం 25.6, ముత్తుకూరు 38.8, మర్రిపాడు 22.0, కొండాపురం 20.4, వింజమూరు 21.0, లింగసముద్రం 12.6, దుత్తలూరు 11.6, వరికుంటపాడు 10.4, సీతారామ పురం 5.8 మి.మీ చొప్పున కురిసింది. -
ఆర్అండ్బీ ఎస్ఈగా ప్రసాద్రావు
నెల్లూరు(అర్బన్): బాపట్ల జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ ఈఈగా పనిచేస్తున్న డి.ప్రసాద్రావును పదోన్నతిపై ఆ శాఖ నెల్లూరు సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్గా ప్రభుత్వం నియమించింది. ఆయన సోమవారం దర్గామిట్టలోని ఆ శాఖ సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్అండ్బీ ఉద్యోగుల అసోసియేషన్, అమరావతి జేఏసీ నాయకులు కలిసి పూలబొకేలు అందజేశారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శరత్బాబు మాట్లాడుతూ గత అధికారులు ఉద్యోగుల సమస్యలు పట్టించుకోలేదని అందువల్లే తాము ఇటీవల ఆందోళనలు చేశామని వివరించారు. ప్రసాద్రావు మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తానన్నారు. -
ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యల పరిష్కారానికి కృషి
నెల్లూరు(అర్బన్): ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పలువురు నేతలు అన్నారు. సోమవారం నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఆ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. డీఎంహెచ్ఓ సుజాత, జిల్లా మలేరియా నివారణ అధికారి హుస్సేనమ్మ మాట్లాడుతూ 52 పీహెచ్సీలు, 28 అర్బన్ హెల్త్ సెంటర్లలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్లకు అండగా ఉంటామన్నారు. కాగా ఎన్నికల అధికారిగా పశ్చిమగోదావరి జిల్లా సెక్రటరీ వీఎన్వీఆర్ కిశోర్, సహాయ ఎన్నికల అధికారిగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మహిళా విభాగం నుంచి శ్రీలక్ష్మి సుభద్ర, పరిశీలకులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ఎన్ మూర్తి వ్యవహరించారు. నూతన అధ్యక్షుడిగా బీవీ రాజేష్, సెక్రటరీగా సీహెచ్ రత్నం, అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎస్డీ రసూల్ సాహెబ్, కోశాధికారి మహమ్మద్ షఫీ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మీరామొహిద్దీన్, మహిళా వింగ్ నుంచి జాయింట్ సెక్రటరీగా శాంతి నియమితులయ్యారు. కార్యక్రమంలో ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, ఏపీ ఎన్జీఓ నగర కార్యదర్శి రామకృష్ణ, ఎన్హెచ్ఎం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సునీల్కుమార్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ సందానీబాషా పాల్గొన్నారు. -
గంజాయి గ్యాంగ్ ఇళ్లు ధ్వంసం
నెల్లూరు సిటీ: సీపీఎం నేత పెంచలయ్య హత్యకు కారకులైన గంజాయి గ్యాంగ్ అరవ కామాక్షి, ఆమె అనుచరుల ఇళ్లను సీపీఎం కార్యకర్తలు, స్థానికులు సోమవారం రాత్రి ర్యాలీగా వెళ్లి ధ్వంసం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఆర్టీడీ కాలనీలో కామాక్షి, జేమ్స్, మరికొందరు నివాసం ఉంటున్నారు. అదే కాలనీకి చెందిన పెంచలయ్య పిల్లలతో కలిసి స్కూటీపై వెళ్తుండగా హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద అడ్డుకుని కత్తులతో అతికిరాతకంగా నరికి చంపారు. ఈ నేపథ్యంలో ఆర్టీడీ కాలనీలో ఆలయ అభివృద్ధికి దోహదపడుతూ గంజాయిపై పోరాటం చేస్తున్న మంచివ్యక్తి పెంచలయ్యను గంజాయి గ్యాంగ్ పొట్టన పెట్టుకోవడంపై స్థానికులకు కడుపు మండింది. పెంచలయ్య హత్యకు గురైన రోజే కామాక్షి ఇంటికి నిప్పుపెట్టారు. ఆదివారం నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన నేపథ్యంలో సోమవారం రాత్రి గంజాయి గ్యాంగ్ ఇళ్లను కూల్చివేసి తమ కోపాన్ని తీర్చుకున్నారు. శ్రీవారి దర్శనానికి పది గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
యాక్టివ్ రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
● నగరంలో రోడ్లపై నడిపించిన పోలీసులు నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలోని యాక్టివ్ రౌడీషీటర్లను పోలీసులు రహదారులపై నడిపించారు. నేరాలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో జీవిస్తామని వారిచే ప్రతిజ్ఞ చేయించారు. వరుస ఘటనలతో జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతోంది. దీంతో సోమవారం నగరంలోని చిన్నబజారు, వేదాయపాళెం, బాలాజీ నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలోని 45 మంది యాక్టివ్ రౌడీషీటర్లకు పోలీసు అధికారులు తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. వారిని వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ కూడలి వరకు ప్రధాన రహదారిపై నడిపించారు. నగర ఇన్చార్జి డీఎస్పీ ఎం.గిరిధర్ గాంఽధీబొమ్మ వద్ద ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీషీటర్లు, సస్పెక్ట్లు, ట్రబుల్ మాంగర్స్ కదలికలపై నిఘా ఉంచామన్నారు. వారు పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే పీడీ యాక్ట్లు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, కె.శ్రీనివాసరావు, కె.సాంబశివరావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
యూరియా మాకే.. మీకు లేదు
తెలుగు తమ్ముళ్ల ఇష్టారాజ్యం ● కొత్తవంగల్లులో ఏకపక్షంగా పంపిణీ ● అధికారుల స్థానంలో టీడీపీ నాయకులే పంచిన వైనంకొడవలూరు: మండలంలోని కొత్తవంగల్లులో వ్యవసాయాధికారులు లేకుండానే టీడీపీ నాయకులు రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఈ ప్రక్రియ ఏకపక్షంగా జరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని రైతు సేవా కేంద్రానికి సోమవారం యూరియా లోడు వచ్చింది. సాధారణ రోజుల్లో అయితే నిరుపయోగంగా ఉన్న కమ్యూనిటీ హాల్లో దించి ఆ తర్వాత రైతులకు పంపిణీ చేస్తారు. కానీ ఈసారి యూరియాను లారీలోనే ఉంచి హడావుడిగా పంపిణీ చేశారు. ఇదంతా నిబంధనల ప్రకారం జరిగిందా అంటే అదీ లేదు. గ్రామ వ్యవసాయ సహాయకుడి ద్వారా పంపిణీ చేయాల్సి ఉంది. వీఏఏ పింఛన్ల అందజేతకు వెళ్లారన్న సాకు చూపి స్థానిక టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. మళ్లీ ఇస్తామంటూ..తమ పార్టీ వర్గీయులకే సమాచారాన్ని చేరవేసి వారికే పంపిణీ చేశారు. ప్రతిపక్ష పార్టీ వర్గానికి చెందిన వారు వెళ్లినా ప్రస్తుతానికి ఈ లోడు సరిపోదని, మళ్లీ వస్తే ఇస్తామంటూ తిప్పి పంపారు. వైఎస్సార్సీపీ చెందిన చక్కా రామయ్య అనే రైతుకు ఇదే అనుభవం ఎదురు కావడంతో వాగ్వాదానికి దిగారు. ఏ మాత్రం ఖాతరు చేయకపోవడంతో వ్యవసాయ శాఖ జేడీకి ఫోన్లో ఫిర్యాదు చేశారు. వీఏఏ సమక్షంలోనే పంపిణీ జరగాలని, నాయకుల చేత చేయించడం నిబంధనలకు వ్యతిరేకమని జేడీ తెలిపారు. విచారించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
పెంచలయ్య హత్యకు నిరసనగా ర్యాలీ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): సీపీఎం నాయకుడు, ప్రజా నాట్యమండలి కళాకారుడు పెంచలయ్య హత్యను నిరసిస్తూ నెల్లూరులోని 17, 53, 54 డివిజన్లతోపాటు ఇనమడుగు సెంటర్లో సోమవారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ జరిగింది. పార్టీ కార్యాలయాల్లో పెంచలయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. ఆ పార్టీ నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పెంచలయ్య చేసిన కృషి మరువలేనిదన్నారు. అతడిని ఆదర్శంగా తీసుకుని నగరంలో గంజాయిని నిషేధించేలా యువత కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మంగళవారం నిర్వహించనున్న జిల్లా బంద్లో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కట్టా సతీష్, మూలం ప్రసాద్, గడ్డం శ్రీనివాసులురెడ్డి, కత్తి పద్మ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ మాగుంటకు ఘన నివాళినెల్లూరు(బారకాసు): ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి 30వ వర్ధంతి నగరంలోని పొగతోటలో ఉన్న ఎం1 థియేటర్లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సీవీ శేషారెడ్డి మాట్లాడుతూ సుబ్బరామిరెడ్డికి ఒంగోలు, నెల్లూరు జిల్లాలు రెండు కళ్లు లాంటివన్నారు. ఒంగోలు ఎంపీగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. నెల్లూరు నగరంలో మినీ బైపాస్ రోడ్డు ఏర్పాటుకు అప్పటి కేంద్ర మంత్రితో చర్చించి కృషి చేశారని గుర్తు చేశారు. నెల్లూరులో ఎన్నడూ లేని విధంగా హత్యలు, దోపిడీలు, గంజాయి విక్రయం సిగ్గుచేటని చెప్పారు. ప్రభుత్వం దృష్టి సారించి ప్రజలకు మేలు చేసే విధంగా వ్యవహరించాలని హితవు పలికారు. కార్యక్రమంలో నేతలు కొండ్రెడ్డి రంగారెడ్డి, స్వర్ణా వెంకయ్య, బాల సుధాకర్, ఏసు నాయుడు, రఘురామ్ ముదిరాజ్, మాగుంట మమతమ్మ, మాగుంట సుబ్బరామ్, వరిదిరెడ్డి రవీందర్రెడ్డి, వీఎంవీ సుబ్బారావు, ఎల్లా విజయభాస్కర్రెడ్డి, కె.విజయభాస్కర్రెడ్డి, ప్రమిదల శ్రీనివాసులు, పలువురు సుబ్బరామిరెడ్డి అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
సీఎండీకి ఎనిమిది ఫిర్యాదులు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి నెల్లూరు జిల్లా నుంచి 8 మంది ఫిర్యాదులు అందాయి. కాగా ఇప్పటి వరకు 34 ఫిర్యాదులు రాగా.. 28 ఫిర్యాదులను పరిష్కరించారు. తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంబడాలన్నారు. సరఫరాలో సమస్యలుంటే 1912, 1800 – 425 – 15533, వాట్సాప్ నంబర్ 91333 31912కు సమాచారం ఇవ్వాలని వినియోగదారులకు సూచించారు. డిపాజిట్ల పేరుతో మోసంనెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని ఓ సంస్థ ఫ్రాంచైజీల పేరిట డిపాజిట్లు తీసుకుని మోసగించిందని పలువురు ఆరోపించారు. ఈ మేరకు బాధితులు సోమవారం రాత్రి దర్గామిట్ట ఇన్స్పెక్టర్ కళ్యాణరాజుకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు.కండలేరులో 58.330 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 58.330 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 4,480 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 850, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 100, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
లైసెన్స్డ్ సర్వేయర్లకు ఉద్యోగభద్రత కల్పించాలి
నెల్లూరు(అర్బన్): ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రాష్ట్రంలో ఉన్న లైసెన్స్డ్ సర్వేయర్లను రెన్యూవల్ చేయడంతోపాటు ఉద్యోగభద్రత కల్పించాలని ఏపీ లైసెన్స్డ్ సర్వేయర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలోని ధర్నా చౌక్లో జరిగిన రాష్ట్ర ధర్నాకు సోమవారం నెల్లూరు నుంచి పెద్ద ఎత్తున హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు నడవడి ముత్యంగౌడ్ మాట్లాడుతూ 2003 సంవత్సరంలో ఈ వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. అప్పటి నుంచి అన్ని మండలాల్లో వివిధ సర్వే పనులు చేస్తూ రైతులు, ప్రభుత్వానికి వారధిలా పని చేశామన్నారు. తర్వాత కాలంలో విలేజ్ సర్వేయర్లను నియమించారన్నారు. ఆదుకుంటామన్న కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించి గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న స్థానాల్లో తమను సర్వేయర్లుగా, రిజిస్ట్రార్ ఆఫీసులు, మున్సిపాలిటీ కార్యాలయాల్లోనూ లైసెన్స్డ్ సర్వేయర్లుగా నియమించాలని కోరారు. రాష్ట్ర స్థాయి అధికారులు కూడా తమ వద్ద లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. న్యాయం చేయాలన్నారు. -
నా భర్త దారిలోనే నేనూ వెళ్తా
నెల్లూరు సిటీ: నా భర్త ఏ మార్పును తీసుకుని రావాలని అనుకున్నారో.. అదే దారిలో తానూ నడుస్తానంటూ గంజాయి కిరాతకుల చేతిలో బలైపోయిన పెంచలయ్య భార్య దుర్గా అలియాస్ రమ్య స్పష్టం చేసింది. నగరంలోని ఆర్టీడీ కాలనీలోని ఆమె నివాసంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తన భర్త ఐటీఐ చదివారని, పిల్లలను మంచి చదువులు చదివించాలని అనుకున్నాడు. ఆర్టీడీ కాలనీలో తమ పాటికి తాము ఉన్నామని, ఇక్కడ దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయన్నారు. బోడిగాడితోటలో ఉన్పప్పుడు అక్కడి వాళ్లమని చెప్పుకోలేకపోయామని, ఇప్పుడు ఆర్టీడీ కాలనీకి చెందిన వాళ్లమని కూడా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. స్థానికంగా గంజాయి విక్రయాలపై తన భర్త వారికి వ్యక్తిగతంగా చెప్పారు. కానీ ఆగలేదన్నారు. సీఐ, ఎస్సైల సహకారంతో బోర్డులు కూడా ఏర్పాటు చేశారన్నారు. దీంతో వాళ్ల వ్యాపారం పడిపోయిందని భయం పుట్టిందన్నారు. స్థానికంగా ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి చెందిన డబ్బులు, నగలు కూడా అరవ కామాక్షి తినేశారన్నారు. ఎవరితోనూ తన భర్తకు విభేదాలు లేవన్నారు. కాలనీలో మార్పు తీసుకుని రావాలని ప్రయత్నించి నా భర్త వారిలో చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైనా, వీరమరణం పొందారని భావిస్తున్నట్లు తెలిపారు. -
ఇదీ పరిస్థితి..
ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి● జిల్లాలో 13 వేల మందికిపైగా రోగులు ● తగ్గుముఖం పట్టినా.. అక్కడక్కడా నమోదు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం నేడు మానవత్వంతో ఆదరించాలి హెచ్ఐవీ, ఎయిడ్స్ సోకిన వారిని మానవత్వంతో ప్రజలు ఆదరించాలని ప్రభుత్వం చెప్తోంది. వ్యాధి సోకిన వారు కలిసి తిన్నా.. ఒకే మరుగుదొడ్లను వినియోగించినా.. కలిసి ఉద్యోగాలు చేసినా.. ఒకరి దుస్తులు మరొకరు వేసుకున్నా.., స్విమ్మింగ్ పూల్ ద్వారా గానీ సంక్రమించదు. కేవలం అనైతిక కార్యకలాపాల ద్వారానే సోకుతుంది. నెల్లూరు(అర్బన్): క్షణికావేశంలోనో.. పొరపాటుగానో చేసే తప్పులతో 95 శాతం మందికి.. సురక్షిత పద్ధతి పాటించని సూదులు, రక్త మార్పిడి, మత్తు ఇంజెక్షన్లు తదితరాల ద్వారా మరో ఐదు శాతం మందికి ఎయిడ్స్ వ్యాధి సోకుతోంది. పాతికేళ్ల క్రితం వరకు ఎయిడ్స్ వ్యాధి ఉన్న వ్యక్తిని అంటరానివారిగా చూసేవారు. దహన సంస్కారాలకు బంధుమిత్రులు సైతం హాజరయ్యేవారు కాదు. ఈ అమానవీయ స్థితిని గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా డిసెంబర్ ఒకటిని ఎయిడ్స్ నివారణ దినోత్సవంగా ప్రకటించి.. ప్రజలను చైతన్యం చేస్తోంది. అంతరాయాలను అధగమించడం – ఎయిడ్స్ ప్రతిస్పందనను మార్చడం అనే థీమ్ను ఈ ఏడాది ప్రకటించింది. ఇందులో భాగంగా జిల్లాలో అవగాహన ర్యాలీలు, సదస్సులను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించనున్నారు. జిల్లాలో ఇలా.. నగరంలోని ప్రభుత్వ పెద్దాస్పత్రి ఏఆర్టీ సెంటర్లో 2007 డిసెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకున్న హెచ్ఐవీ రోగులు 18,979 మంది ఉన్నారు. పెద్దాస్పత్రిలో మందులను ప్రతి నెలా క్రమం తప్పకుండా 8676 మంది పొందుతున్నారు. వివిధ ఏఆర్టీ సెంటర్లు, ప్రైవేట్గా మందులను మరో ఐదు వేల మందికిపైగా కొనుగోలు చేస్తున్నారు. కొంత మంది పెద్దలు, ఆర్థికంగా ఉన్న వారు కార్పొరేట్ ఆస్పత్రులతో పాటు చైన్నె వెళ్లి ప్రైవేట్గా వైద్యం చేయించుకుంటున్నారు. ఎయిడ్స్ రోగులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో రాష్ట్రంలో ఎనిమిదో స్థానంలో నెల్లూరు ఉంది. మరోవైపు జిల్లాలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా, ఏటా కొంతమేర నమోదవుతూనే ఉన్నాయి. ఉచితంగా పరీక్షలు గర్భిణుల్లో 2002లో 2.7 శాతం మందికి హెచ్ఐవీ ఉండగా, ఇప్పుడు అది 0.1 శాతంగా ఉంది. ప్రభుత్వం మొదట్లో చేపట్టిన చర్యలు ఇప్పుడు లేకపోవడంతో కేసుల సంఖ్య చాపకిందనీరులా పెరుగుతోంది. కొంతమంది వివరాలు అధికారిక లెక్కల్లో ఉండటంలేదని తెలుస్తోంది. జిల్లాలోని 52 పీహెచ్సీలు, 28 అర్బన్ హెల్త్ సెంటర్లు, ఒక జిల్లా ఆస్పత్రి, రెండు ఏరియా ఆస్పత్రులు, పది ఐసీటీసీ కేంద్రాలు, ఒక బోధానాస్పత్రి (పెద్దాస్పత్రి) ద్వారా రోగులకు ఉచితంగా పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచి వారికి మందులను అందజేస్తున్నారు. పింఛన్ల కోసం ఎదురుచూపులే జిల్లాలోని ప్రభుత్వ పెద్దాస్పత్రి ఏఆర్టీ సెంటర్కు మందుల నిమిత్తం 8676 మంది ప్రతి నెలా వస్తున్నారు. వీరిలో కేవలం 2240 మందికే పింఛన్లను ప్రభుత్వం అందిస్తోంది. టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరాక ఒక్కరికీ సైతం పింఛన్ను మంజూరు చేయలేదు. కొత్తవారికి పింఛన్లు కల్పించకపోవడం శోచనీయమని రోగులు బాధపడుతున్నారు. అధికారిక లెక్కలిలా.. ఏడాది చేసిన నమోదైన శాతం పరీక్షలు పాజిటివ్ కేసులు 2017 – 18 1,33,766 1347 1 2018 – 19 1,34,397 1174 0.9 2019 – 20 1,35,914 1007 0.7 2020 – 21 73,966 577 0.8 2021 – 22 1,50467 710 0.5 2022 – 23 1,91,042 811 0.4 2023 – 24 1,76,515 782 0.4 2024 – 25 1,79,588 730 0.4 2025 1,02,929 358 –– -
రామిరెడ్డికి ఫోన్లో వైఎస్ జగన్ పరామర్శ
అల్లూరు: ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఫోన్లో పరామర్శించారు. రామిరెడ్డి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరగా కోలుకోని ప్రజా సేవలోకి రావాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు నెల్లూరు (దర్గామిట్ట): సోమవారం జరగాల్సిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని దిత్వా తుఫాన్తో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జేసీ మొగిలి వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ప్రజలు సైతం అత్యవసరమైతే తప్ప.. బయటకు రావొద్దని తెలియజేశారు. పోలీస్ పీజీఆర్ఎస్ కూడా.. నెల్లూరు (క్రైమ్): దిత్వా తుఫాను కారణంగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశమున్నందున పోలీసు కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ అజిత వేజెండ్ల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ వినతులను మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేడు పాఠశాలలు, కళాశాలలకు సెలవు నెల్లూరు (టౌన్): దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ సమాచారం మేరకు జేసీ వెంకటేశ్వర్లు ఆదేశాలతో సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈఓ బాలాజీరావు, ఆర్ఐఓ వరప్రసాదరావు ఆది వారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. జిల్లా లోని డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, హెడ్మాస్టర్లు ఈ సమాచారాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులకు తెలియజేయాలన్నారు. 27 లోపు ఓపెన్ డిగ్రీ సెమిస్టర్ ఫీజుకు గడువు ఆత్మకూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ (ఎస్ఆర్జే డిగ్రీ కళాశాల)లో డిగ్రీ చేస్తున్న బీఏ, బీకాం, బీఎస్సీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ కోర్సులకు సెమిస్టర్ విధానంలో 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలకు డిసెంబరు 27వ తేదీలోపు ఫీజులు చెల్లించాలని కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 7382929793, 8125407933 నంబర్లలో సంప్రదించాలన్నారు. కాకాణితో ప్రసన్న భేటీ నెల్లూరు (స్టోన్హౌస్పేట): మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆదివారం జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపే విషయమై చర్చించారు. గూడూరు సమన్వయకర్త మేరిగ మురళీధర్ ఆరోగ్య రీత్యా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూ ఉండడంతో ఆయనతో ఫోన్లో ప్రసన్న, కాకాణి చర్చించారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డితో కూడా మాట్లాడారు. గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపే విషయంపై చంద్రబాబు నిర్ణయంపై మాజీ సీఎం జగన్మోహన్రెడ్డితో చర్చించిన అనంతరం తమ కార్యాచరణ తెలియజేస్తామని తెలిపారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి మాట్లాడుతూ ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వ నిర్ణయం లేకుంటే తాను ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతానని, గూడూరు నియోజకవర్గంలోని అన్ని పార్టీల వారితోనూ, మేధావులతో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళతామన్నారు. ఈ సమావేశంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, కలువ బాలాశంకర్ రెడ్డి పాల్గొన్నారు. -
పెంచలయ్య హత్యకు నిరసనగా బంద్ రేపు
నెల్లూరు సిటీ: గంజాయి మాఫియా, అరాచక శక్తుల చేతుల్లో ప్రజానాట్య మండలి కళాకారుడు పెంచలయ్య హత్యకు గురికావడం బాధాకరమని, దీన్ని నిరసిస్తూ జిల్లా బంద్ను మంగళవారం చేపట్టనున్నామని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మూలం రమేష్, సీపీఐ నేత రామరాజు మాట్లాడారు. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో గంజాయి మాఫియా ఆగడాలకు అడ్డుకట్టేయాలని, దీనికి ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని పేర్కొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు, మోహన్రావు, సీఐటీయూ నేతలు అజయ్కుమార్, ప్రసాద్, పౌర హక్కుల సంఘ నేతలు శివశంకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
నా భర్త దారిలోనే నేనూ వెళ్తా
● ఆర్టీడీ కాలనీలో మార్పు తేవాలని బలయ్యాడు ● పెంచలయ్య భార్య దుర్గా నెల్లూరు సిటీ: నా భర్త ఏ మార్పును తీసుకుని రావాలని అనుకున్నారో.. అదే దారిలో తానూ నడుస్తానంటూ గంజాయి కిరాతకుల చేతిలో బలైపోయిన పెంచల య్య భార్య దుర్గా అలియాస్ రమ్య స్పష్టం చేసింది. నగరంలోని ఆర్టీడీ కాలనీలోని ఆమె నివాసంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తన భర్త ఐటీఐ చదివారని, పిల్లలను మంచి చదువులు చదివించాలని అనుకున్నాడు. ఆర్టీడీ కాలనీలో తమ పాటికి తాము ఉన్నామని, ఇక్కడ దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయన్నారు. బోడిగాడితోటలో ఉన్పప్పుడు అక్కడి వాళ్లమని చెప్పుకోలేకపోయామని, ఇప్పుడు ఆర్టీడీ కాలనీకి చెందిన వాళ్లమని కూడా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. స్థానికంగా గంజాయి విక్రయాలపై తన భర్త వారికి వ్యక్తిగతంగా చెప్పారు. కానీ ఆగలేదన్నారు. సీఐ, ఎస్సైల సహకారంతో బోర్డులు కూడా ఏర్పాటు చేశారన్నారు. దీంతో వాళ్ల వ్యాపారం పడిపోయిందని భయం పుట్టిందన్నారు. స్థానికంగా ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి చెందిన డబ్బులు, నగలు కూడా అరవ కామాక్షి తినేశారన్నారు. ఎవరితోనూ తన భర్తకు విభేదాలు లేవన్నారు. కాలనీలో మార్పు తీసుకుని రావాలని ప్రయత్నించి నా భర్త వారిలో చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైనా, వీరమరణం పొందారని భావిస్తున్నట్లు తెలిపారు. -
నిరసనల జయప్రదానికి పిలుపు
నెల్లూరు సిటీ: రైతుల సమస్యలపై ఈ నెల పదిన.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 18న చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అజయ్కుమార్ పేర్కొన్నారు. నగరంలోని రామకోటయ్య భవన్లో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని చెప్పారు. వీటిపై చేపట్టనున్న నిరసన కార్యక్రమాలకు భారీగా తరలిరావాలని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి, జిల్లా సహాయ కార్యదర్శి నందిపోగు రమణయ్య కార్యవర్గ సభ్యులు మాలకొండయ్య, వినోదమ్మ తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ను సమర్థంగా ఎదుర్కోవాలి నెల్లూరు(దర్గామిట్ట): దిత్వా తుఫాన్ను సమర్థంగా ఎదుర్కొనేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ప్రత్యేకాధికారి యువరాజ్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా అధికారులతో ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలోని అన్ని రిజర్వాయర్లలో నీరు సమృద్ధిగా ఉందని, వర్షాలతో ఎక్కడా గండిపడకుండా చూడాలని సూచించారు. జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. విద్యుత్కు అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు. తీర ప్రాంతాల్లో చౌక దుకాణాల ద్వారా ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఎస్పీ అజిత, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్కుమార్, ఏఎస్పీ సౌజన్య పాల్గొన్నారు. నగరంలో మంత్రి పర్యటన నెల్లూరు సిటీ: దిత్వా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జిని పరిశీలించారు. నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాల్టీల్లో రూ.150 కోట్లతో కాలువల పూడికతీత పనులను చేపట్టామన్నారు. కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్కుమార్యాదవ్, తాళ్లపాక అనూరాధ తదితరులు పాల్గొన్నారు.


