SPSR Nellore
-
డీఎస్సీ అక్రమాలపై ఆధారాలతోనే ప్రశ్నిస్తున్నాం
సాక్షి, నెల్లూరు: కూటమి సర్కార్ ఆర్బాటంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో ముమ్మాటికీ అక్రమాలు జరిగాయని, గతేడాది క్రీడాకారుల కోటాపై ఇచ్చిన జీవోలు, ఈ ఏడాది వాటిని ఉపసంహరించి, మళ్లీ కొత్త జీవోలు ఇవ్వడమే దీనికి నిదర్శనమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని తాము పదే పదే ప్రశ్నిస్తుంటే అధికారులు ఇచ్చిన ఖండనలోనూ తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకున్నారని కాకాణి ఆక్షేపించారు. అక్రమాలు జరగకపోతే డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్డితో విచారణ చేయించడానికి ఎందుకు భయపడుతున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన ఇంకేమన్నారంటే..డీఎస్సీపై ఆధారాలతోనే ప్రశ్నిస్తున్నాండీఎస్సీలో జరిగిన అక్రమాలపై మేం కేవలం ఆరోపణలు చేయట్లేదు, ఆధారాలతో సహ మీడియా ముందుకు వస్తున్నాం. మెగా డీఎస్సీలో అంతులేని అక్రమాలు జరిగాయి. ఓ పక్క టీచర్ ఉద్యోగాలపై నిరుద్యోగుల్ని ఊరించి, ఎన్నికలకు ముందు నుంచీ మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చి, చివరికి 2025లో నోటిఫికేషన్ ఇచ్చారు. పరీక్ష నిర్వహణపై అనేక అనుమానాలు ఉన్నాయి. దీనిపై మేం చేసిన ఆరోపణల మీద అధికారులు ఖండన కూడా ఇచ్చారు. అయితే ఈ ఖండనలో అంతా మీరు చెప్పినవి కరెక్ట్ కాదని చెప్పారు కానీ, తప్పు జరగలేదని పాయింట్ల వారీగా చెప్పలేకపోయారు. నిరుద్యోగులకు డీఎస్సీలో జరిగిన దగాపై వైఎస్ జగన్ పిలుపు మేరకు ఇప్పటికే ఆందోళనలు చేశాం.జూన్ 1వ తేదీన యువత ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి కూడా చేయబోతున్నాం. మీరు అర్హులుగా ఎంపిక చేసిన అభ్యర్ధుల పేర్లు తుది జాబితాలో ఎందుకు గల్లంతయ్యాయో చెప్పగలరా ? మెరిట్ లిస్ట్ లేదు, సెలక్టెడ్ లిస్ట్ కూడా లేకుండా ఎంపికైన వారికి మెసేజ్ లు మాత్రమే పంపించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా ? ఒక పోస్టుకు ఒక్కరినే పిలిచి, అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు, తిరస్కరించలేదు. అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని హైకోర్టు చెప్పినా, ఆదేశాలు బేఖాతరు చేస్తూ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు.డీఎస్సీ ఫలితాలు ప్రకటించేటప్పుడే రూల్ ఆఫ్ రిజిస్టర్ రోస్టర్ ప్రకారం అభ్యర్ధులకు ఎన్ని మార్కులు వచ్చాయో మెరిట్ లిస్ట్ విడుదల చేయాల్సి ఉంది. కానీ విడుదల చేశాక దాన్ని డిలీట్ చేయాల్సి అవసరం ఎందుకొచ్చింది ? ఎప్పుడూ లేని విధంగా డీఎస్సీని ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది ? సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చే సరికి మరో కొత్త విధానం అమలు చేశారు. తుది ఎంపిక జాబితాకు వచ్చేటప్పటికి వీటన్నింటినీ పక్కనబెట్టి మరో కొత్త విధానం తెచ్చి, మీ అజెండాను అమలు చేసి అర్హులైన నిరుద్యోగుల కడుపు కొట్టే ప్రయత్నం చేశారు.నైతిక విలువల్లేని విద్యామంత్రి లోకేష్ఎప్పుడైనా పరీక్ష రాసిన అభ్యర్ధులకు మెరిట్ లిస్ట్ పరిశీలించుకునే హక్కు ఉంది. మెరిట్ లిస్ట్ లో తాము ఎక్కడ ఉన్నాం, తమకన్నా ముందూ వెనుక ఎవరున్నారనే అంశాల్ని తెలుసుకునే అవకాశం అభ్యర్ధులకు ఇవ్వాలి. మెరిట్ లిస్ట్ తయారు చేశాక పారదర్శకంగా సెలెక్టెడ్ లిస్ట్ ప్రకటిస్తారు. అది చేయలేదు కాబట్టి అక్రమాలు జరిగాయని కచ్చితంగా నమ్ముతున్నాం. అందుకే ఈ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని పదే పదే కోరుతున్నాం.చదువూ, సంధ్యా లేని మొద్దబ్బాయి లోకేష్ ను తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా చేయడం ఈ సమాజానికి తీరని ద్రోహం చేయడమే. అందుకే ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిపై కేసులు పెడతానంటున్నారు తప్ప నా వల్ల పొరబాటు జరిగిందని, కాబట్టి తాను విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పడం లేదు. నైతిక విలువలు లేవు కాబట్టే లోకేష్ ఇలా వ్యవహరిస్తున్నారు. డీఎస్సీలో 16347 పోస్టుల్లో 421 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో నింపారు. అందులో మీరు నింపిన విధానం చూస్తే ఎంత భయంకరమైన వాస్తవాలు వెలుగుచూస్తున్నాయో మేం వివరిస్తాం.స్పోర్ట్ కోటా జీవోల్లో మార్పులతో అక్రమాలుక్రీడల్లో ప్రతిభ చూపిన వారికి 2 శాతం రిజర్వేషన్ ఎప్పటి నుంచో అమలు ఉంది. స్పోర్ట్స్ కోటాపై ఉమ్మడి ఏపీలోనే 2012 ఆగస్టు 9న జీవో ఎంఎస్ నంబర్ 74 విడుదల చేసారు. అప్పుడు ఉన్న జీవోలో క్రీడల్లో రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తెచ్చిన వారికి 29 క్రీడల్లో ఈ రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. దీని ప్రకారం పోటీ పరీక్ష రాసిన తర్వాత క్రీడాకారులకు క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. కానీ చంద్రబాబు తన పుట్టినరోజుకు ఒక్క రోజుకు ముందు ఏప్రిల్ 19న జీవో 47, జీవో 4 కూడా తెచ్చారు. 2025 ఏప్రిల్ 19న విడుదల చేసిన జీవో 4లో 2 శాతంగా ఉన్న క్రీడా రిజర్వేషన్లను 3 శాతానికి పెంచారు. కానీ క్రీడల సంఖ్యను 29 నుంచి 65కు పెంచారు.గతంలో ఉన్న క్రీడల్లో స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు వీల్లేదు కాబట్టి దానికి మార్పులు చేశారు. అందుకే క్యారమ్స్, టెన్నికాయిట్, టగ్ ఆఫ్ వార్, యోగాసనాలు, బీచ్ వాలీవాల్ వంటి క్రీడల్ని చేర్చారు. జీవోడీ ఇచ్చిన మరో జీవో 47లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు పోటీ పడే వారు అసలు పోటీ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని చెప్పేశారు. అంటే క్రీడా ప్రతిభ ఉన్న వారితో పాటు ఉపాధ్యాయ అర్హత ఉన్న వారికీ ద్రోహం జరిగింది. ఈ నెల 26న తిరిగి పోటీ పరీక్ష రాసిన వారికే డీఎస్సీలో ప్రాధాన్యం ఇవ్వాలని మరో జీవో ఇచ్చారు. అంటే గతంలో అర్హులుగా ఉన్న వారికి అవకాశం లేకుండా చేయడానికి, మీకు అనుకూలంగా ఉన్న వారికి ఉద్యోగాలు ఇప్పించేందుకు ఇలాంటి జీవో ఇచ్చారు. అందుకే మళ్లీ జీవోలో మార్పులు చేశారు.జీవో మార్పులతో అర్హులకు తీవ్ర అన్యాయంజీఏడీ ద్వారా గతేడాది ఏప్రిల్ 19న ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ను సవరిస్తూ జీఏడీ ద్వారా రెండు జీవోలు ఇప్పించారు. ఇందులో గతంలో క్రీడాకారులు కూడా పోటీ పరీక్ష రాయాల్సి ఉండగా.. ఈ నిబంధనల్ని మార్చారు. దీంతో భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఈ నెలలో ఆ జీవోల్ని రద్దు చేశారు. గతేడాది ఇచ్చిన జీవోల్లో జాతీయ ఛాంపియన్ షిప్ సాధించిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది, ఆటలో పాల్గొంటున్న వారికి తర్వాత ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. దాన్ని మార్చి తాజాగా ఇచ్చిన జీవోలో జాతీయ స్దాయిలో ఆడిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ఛాంపియన్ షిప్ వస్తే తర్వాతి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.ఇలా ఎందుకు మార్చారో సమాధానం చెప్పగలరా ? ముందుగా ఇచ్చిన జీవో కరెక్ట్ అనుకుంటే, ఆ తర్వాత ఎందుకు ఉపసంహరించారు ? ఈ రెండు పరిణామాల మధ్య నష్టపోయిన వారికి ఎవరు బాధ్య త వహిస్తారు ? డీఎస్సీలో పరీక్ష రాసిన అభ్యర్ధుల పరిస్ధితి ఏంటి ? వీటికి సమాధానాలు చెప్పకుండా ప్రశ్నించిన వారిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. అందుకే సీబీఐ దర్యాప్తు జరగాలని కోరుతున్నాం. ఇది లోకేష్ శాఖలో జరిగిన డార్క్ సీక్రెట్ ఆపరేషన్ అంటున్నాం. మీరు ఎంత మందిని అరెస్టు చేసుకుంటారో చేసుకోండి, దగాపడిన నిరుద్యోగులతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, విద్యార్ధి, యువజన విభాగాలు సిద్దంగా ఉన్నాయి. కానీ దయచేసి ప్రతిభ ఉన్న వారికి మాత్రం అన్యాయం చేసి వారి ఉసురుపోసుకోకండి.డీఎస్సీలో జిల్లా కమిటీల పాత్ర ఉంటే అక్రమాలు సాధ్యం కావు కాబట్టి వీటిని నిర్వీర్యం చేశారు. అందుకే రాష్ట్ర స్దాయిలోనే ఈ పరీక్ష నిర్వహించారు. టెట్, డీఎస్సీకి సంబంధించి ఒకే వ్యక్తికి బాధ్యతలు కూడా అప్పగించారు. ప్రశ్నాపత్రం తయారు చేసిన వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్ అని మీరే ఒప్పుకుంటున్నారు. అతనే తిరిగి పరీక్ష రాసి కృష్ణాజిల్లాలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే అతని వివరాలు డిలీట్ చేశారు. అతను కోర్టుకు వెళ్తే బెదిరించి కేసు వెనక్కి తీసుకోమంటున్నారు. అందుకే డబ్బులు చేతులు మారాయని మీరు ఇచ్చిన జీవోల ద్వారానే అర్థమవుతోంది. మీరు అక్రమార్కులపై చర్యలు తీసుకునే పరిస్ధితుల్లో లేరు.ఒకే కేటగిరీలో ముందు ఉన్న వాళ్లకు, తర్వాత ఉన్న వాళ్లకూ ర్యాంకులు వచ్చాయి, కానీ ఆమ్యామ్యాలు సమర్పించకపోవడం వల్ల మధ్యలో ఉన్న వారికి ర్యాంకులు రాలేదు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా ? టెస్ట్ మెసేజ్ ల పేరుతో ఉద్యోగాల జీవితాలతో ఆడుకున్నారు. మూడు పోస్టులకు అర్హత సాధిస్తే ఒకటే పోస్టుకు కాల్ లెటర్ ఇవ్వడం అన్యాయం కాదా ? ఈ మూడు పోస్టుల్లో హయ్యర్ గ్రేడ్ పోస్టు ఇవ్వాలని హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని అడుగుతుంటే మా మీద క్రిమినల్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మా మీద కాదు అక్రమాలతో యువత భవిష్యత్తును నాశనం చేసిన అధికారులపై ఈ కేసులు పెట్టండి. అలాగే ఎస్సీఈఆర్టీ నుంచే ప్రశ్నాపత్రాల లీక్ జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.ఈ ప్రశ్నాపత్రాలు అప్ లోడ్ చేసిన వ్యక్తి పరీక్ష ఎలా రాస్తాడు ? ఫస్ట్ ర్యాంక్ ఎలా తెచ్చుకుంటాడు, అతన్ని మీరు ఎందుకు తొలగించారో బయటపెట్టాలి. ఓపెన్ కేటగిరీలో రావాల్సిన పోస్టును వేరే వ్యక్తికి ఎలా ఇస్తారు ? అడిగితే వేరే వ్యక్తికి ఇచ్చామని చెప్పారని అధికారులు చెప్పినట్లు అభ్యర్ధులు కూడా బయటపెట్టారు. మీరు బేరసారాలు ఆడిన ఆడియోలు బయటికి వచ్చినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? దీని మీద ముఖ్యమంత్రి, విద్యామంత్రి సమాధానం చెప్పాల్సిందే. దీంతో పాటు అక్రమాలకు బాధ్యత వహించి విద్యామంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. దీంతో పాటు సీబీఐ దర్యాప్తు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాల్సిందేనని కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. -
సమస్యల పరిష్కారమే పల్లె వీక్షణ లక్ష్యం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా వెల్లడి సైదాపురం: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించడమే ‘పల్లె వీక్షణ’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. మండలంలోని కొమ్మిపాడు గ్రామంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారంలో ఒకరోజు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఒక గ్రామానికి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా పరిశీలించి వెంటనే పరిష్కరించే లక్ష్యంతో పల్లె వీక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రం వద్ద సీసీ రోడ్డు నిర్మాణం, ఓహెచ్ఆర్ ట్యాంక్ నుంచి పైపులైన్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారన్నారు. పైపులైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయడం సంతోషకరమని, అలాగే సీసీ రోడ్డు నిర్మాణానికి కూడా వెంటనే నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 80 అర్జీలు అందగా, వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించామని చెప్పారు. మిగిలిన వాటికి 30 రోజుల్లో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. -
నీకు సగం.. నాకు సగం
గూడూరు మున్సిపల్ కమిషనర్ అంతా నా ఇష్టం.. నేను చెప్పిందే వేదం.. నాకు జీఓలు, రూల్స్ వర్తించవు అనేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పట్టణంలోని కూరగాయాల మార్కెట్లో దుకాణాల కోసం చాలామంది పోటీ పడుతుంటారు. కానీ వాటి కేటాయింపులో నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలున్నాయి.సాక్షి టాస్క్ఫోర్స్: గూడూరు మున్సిపాలిటీలో కూరగాయల మార్కెట్ దుకాణాల కేటాయింపు తీవ్ర వివాదాస్పదంగా మారింది. బహిరంగ వేలం నిర్వహించకుండా కేటాయించడంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నీకు సగం.. నాకు సగం అనే విధానంలో భారీగా ముడుపులు చేతులు మారినట్లు చర్చ జరుగుతోంది. ఇటీవల గమ్మళ్లపాళెం వద్ద ఏర్పాటు చేసిన హైమాక్స్ విద్యుత్ దీపాల ప్రారంభో త్సవంలో స్థానిక ఎమ్మెల్యే సునీల్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లును ప్రశంసించిన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో కూరగాయల మార్కెట్ దుకాణాల కేటాయింపుల్లో అధికార దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో, మున్సిపాలిటీలో ప్రభావం కలిగిన మాజీ నాయకుడి సహకారంతో కమిషనర్ను కీలుబొమ్మలా మార్చుకుని కేటాయింపులు చేపట్టినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా.. పట్టణ నడిబొడ్డున నిర్మించిన కూరగాయల మార్కెట్లో మొత్తం 40 దుకాణాలున్నాయి. వీటిని కేటాయించాలంటే బహిరంగ వేలం లేదా టెండర్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉండగా, అలాంటి చేయకుండానే పాత దుకాణదారులకే లీజుకిచ్చినట్లు సమాచారం. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగకుండా దుకాణాలను బహిరంగ వేలం ద్వారానే కేటాయించాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టినట్లు ఆరోపణలున్నాయి. దుకాణాల కేటాయింపుల్లో తమ చేతివాటం ప్రదర్శించి వాటాలు పంచుకున్నట్లు తెలుస్తుంది. రూ.లక్షల్లో వ్యాపారం కూరగాయల మార్కెట్లో నిత్యం వ్యాపారం రూ.లక్షల్లో జరుగుతుంది. పట్టణ జనాభా కనీసం లక్షకు పైగా ఉండగా పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు కాగా అందులో పనిచేసే కార్మికులు అదనంగా మరో 50 వేల వరకు ఉంటారు. వీరంతా నిత్యం వారికి సమీపంలో ఉండే చిన్నపాటి దుకాణాల వద్ద కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు. అలాంటి చిరు వ్యాపారులు మార్కెట్కు వచ్చి ఇక్కడ పెద్ద దుకాణాల్లో కూరగాయలు తీసుకుని వెళుతుంటారు. అలాగే గూడూరు ప్రాంతం నుంచి సైదాపురం, బాలాయపల్లి, కోట, ఓజిలి, చిల్లకూరు మండలాల్లోని పలువురు చిరు వ్యాపారులు ఇక్కడ కొనుగోలు చేస్తారు. అందువల్లే దుకాణాలకు అంతగా పోటీ ఉంటుంది. అంతా నా ఇష్టం మున్సిపాలిటీలో పాలకవర్గం లేకపోవడం, ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ బలహీనంగా ఉండటంతో కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. కొద్దిరోజుల్లో పదవీ విరమణ చేస్తాను.. ప్రజాప్రతినిధి అండ ఉందంటూ నిబంధనలను పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. మార్కెట్ ప్రారంభోత్సవ శిలాఫలకంలో ప్రోటోకాల్ వివాదం కూడా చర్చనీయాంశమైంది. వారికి అవకాశం లేదా? దుకాణాల కేటాయింపుల్లో ఎస్సీ ఎస్టీలు, మహిళలు, దివ్యాంగులతోపాటు చిరు వ్యాపారులకు కనీసం చోటు కల్పించకపోవడంతో వారు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని మదన పడుతున్నారు. పెట్టుబడులు పెట్టుకునే స్థోమత తమ వద్ద ఉంటే ప్రైవేట్ దుకాణాలను అద్దె తీసుకుని వ్యాపారాలు చేసుకునే వాళ్లం కదా అని ప్రశ్నిస్తున్నారు. మహిళా సాధికారత, బలహీన వర్గాల అభివృద్ధి పేరుతో గొప్పలు చెప్పుకునే నేతలు ఇక్కడ మాత్రం నిబంధనలను విస్మరించారని విమర్శలు వినిపిస్తున్నాయి. దుకాణాల కేటాయింపులో కమిషనర్ స్వామి భక్తి వేలం లేకుండానే కేటాయింపులపై ఆరోపణలు మున్సిపాలిటీ ఖజానాకు గండిమున్సిపల్ ఆదాయానికి గండిదుకాణాలను బహిరంగ వేలం వేస్తే మున్సిపాలిటీకి గణనీయమైన ఆదాయం వచ్చేదని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే వేలం లేకుండా కేటాయింపులు జరగడంతో మున్సిపల్ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ ఆదాయం గురించి తరచూ మాట్లాడే కొందరు మాజీ నాయకులు కూడా ఈ వ్యవహారంపై మౌనం పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది.కేటాయింపులు చేస్తాం పాత మార్కెట్లో దుకాణాలను లీజుకు తీసుకున్న వ్యాపారులను ఖాళీ చేయించే సమయంలో కొత్త దుకాణాల్లో అవకాశమిస్తామని మాట ఇవ్వడం జరిగింది. దీంతోనే ప్రస్తుతం వారికే ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేపట్టాం. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు మార్కెట్లో మొదటి అంతస్తులో ఉండే దుకాణాల్లో అవకాశం కల్పిస్తాం. – వెంకటేశ్వర్లు, గూడూరు మున్సిపల్ కమిషనర్ -
పెద్దాస్పత్రి.. నరక కూపం
● కూటమి ప్రభుత్వంలో రోగులకు కష్టాలెన్నో.. ● వీల్ చైర్ దొరకదు ● స్ట్రెచర్ కానరాదు ● అందుబాటులో ఉండని సీనియర్ డాక్టర్లునెల్లూరు(అర్బన్): నెల్లూరులోని పెద్దాస్పత్రి.. ఇక్కడ నెలకొన్న సమస్యలు అన్నీఇన్నీ కావు. సీనియర్ డాక్టర్లు, వైద్య పరీక్షలున్నా రోగులకు కనీస సౌకర్యాలు అందడం లేదు. వైద్యం దైవా దీనంగా మారింది. పలువురు వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎంఆర్ఐ, సీటీ లాంటి ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేశారు. నూతన భవనాలు నిర్మించారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది ఖాళీలు పూర్తిస్థాయిలో భర్తీ చేశారు. అయితే నేటి కూటమి ప్రభుత్వంలో సేవలు అధ్వానంగా మారాయి. ఇలా ఎన్నో.. ఆస్పత్రిలో డాక్టర్లు సమయపాలన ఎందుకు పాటించడం లేదు. సీనియర్లు గంటో, రెండు గంటలు మాత్రమే ఉంటున్నారు. భారమంతా జూనియర్ వైద్యులపై పడుతోంది. వీల్ చైర్, స్ట్రెచర్లు అందుబాటులో ఉండవు. యాక్సిడెంట్ కేసులు వచ్చినా గంటల కొద్దీ వాటి కోసం రోగుల బంధువులే ఎందుకు వెతకాల్సి వస్తోంది. అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయాలంటే రెండు నుంచి నాలుగు రోజులు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలని సిబ్బంది చెబుతున్నారు. ఈ లోపు రోగికి ఏమైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎంఆర్ఐ, సీటీ స్కానింగ్ రిపోర్టులు కావాలంటే మూడు, నాలు గు రోజులు ఆగాల్సిందే. రక్తపరీక్షలు కావాలంటే మిద్దైపెకి ఎక్కాలి. అయితే లిఫ్ట్ కొన్నినెలలుగా పని చేయడం లేదు. వార్డుల్లోని లిఫ్ట్లు కూడా సక్రమంగా పని చేయవు. న్యూరో, యూరాలజీ తదితర సర్జరీలు చేసేందుకు కనీస పరికరాల్లేవు. ఇదే సాకుగా డాక్టర్లు థంబ్ వేసి వెళ్లిపోతున్నారు. ఆపరేషన్లు చేయాలంటే ఏసీలు చాలా కాలంగా పని చేయడం లేదు. మరుగుదొడ్లు కంపు కొడుతుంటాయి. బకెట్లు, మగ్గులు సరిపడా లేవు. ఎమర్జెన్సీలో అవసరమైన పరికరాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. ట్రామా కేర్ సిబ్బందికి నెలలుగా జీతాలు రాలేదు. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు కావాలంటే నెలల తరబడి తిప్పుకొంటున్నారు. సూపరింటెండెంట్ రెగ్యులర్గా రౌండ్స్ వేయడం లేదనే ఆరోపణలున్నాయి. డాక్టర్లు లేకపోతే అడగడం లేదని తెలిసింది. దీంతో పలువురు ఆలస్యంగా వస్తున్నారు. ఓపీ చీటీలు ఉదయం 8 గంటలకు రాయడం ప్రారంభించాలి. కానీ 8:30 గంటలకు కూడా మొదలు పెట్టడం లేదు. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల కోసం ఉద్యోగులతోపాటు విశ్రాంత ఉద్యోగులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరైన రూ.22 కోట్లతో గత ఆగస్టు నాటికే పూర్తయిన సీసీయూ భవన సముదాయాన్ని ఇంకా ప్రారంభించలేదు. -
జామాయిల్తోట దగ్ధం
● రూ.లక్ష నష్టం అనుమసముద్రంపేట: మండలంలోని అనుమసముద్రం గ్రామ పొలిమేరల్లో జామాయిల్ తోట దగ్ధమైంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రైతు ఎండీ యూసఫ్ సుమారు ఐదెకరాల్లో జామాయిల్ తోట సాగుచేస్తున్నాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం తోట దగ్ధమవడాన్ని స్థానికులు గమనించారు. ఈ విషయాన్ని వెంటనే ఆత్మకూరు అగ్నిమాపక శాఖ అధికారులకు తెలపడంతో ఫైర్ అధికారి బాలాజీ గురుప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది ఏఎస్పేటకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే సగభాగం పైగా అగ్నికి ఆహుతైంది. దీంతో రూ.లక్ష పైగా నష్టపోయినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆకతాయిల చేష్టలతో ఇలా జరిగి ఉంటుందేమోనని బాధిత రైతు అనుమానం వ్యక్తం చేశాడు. గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి కోవూరు: పడుగుపాడు రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం గూడ్స్ రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. బిట్రగుంట నుంచి రేణిగుంట వైపు రైలు వెళ్తోంది. ఓ వ్యక్తి పట్టాలు దాటుతున్న సమయంలో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతని వయసు 45 నుంచి 50 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని రైల్వే పోలీసులు తెలిపారు. గోవుల అక్రమ రవాణా అడ్డగింత నెల్లూరు(అర్బన్): రూరల్ మండల పరిధిలోని చింతారెడ్డిపాళెంలో గుర్తుతెలియని వ్యక్తులు గోవులను కసాయి వ్యక్తులకు అమ్మేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే ఆ ప్రాంతంలో కొన్ని గోవులను వధించి మాంసం విక్రయించినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు శుక్రవారం అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్రమార్కులు పరారయ్యారు. 9 గోవులను రక్షించి గోశాలకు తరలించారు. ఈ సందర్భంగా సీఐ వేణు మాట్లాడుతూ దీని వెనుక ఎవరున్నారో విచారణ చేస్తున్నామని తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు. హోటళ్లలో అధికారుల తనిఖీలు ● 19 సిలిండర్ల స్వాధీనం నెల్లూరు(పొగతోట): సివిల్ సప్లయీస్ అధికారులు నెల్లూరు మినీబైపాస్ రోడ్డులోని రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. 8 కేసులు నమోదు చేసి 19 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీ నం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్ఓ పుల్లయ్య మాట్లాడుతూ డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లలో వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఓ లక్ష్మీనారాయణరెడ్డి, సీఎస్ డీటీలు అజీజ్, రవి, రామకృష్ణ పాల్గొన్నారు. కండలేరులో 39.220 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 39.220 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,900, లోలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 15, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
507 మొబైల్ ఫోన్ల రికవరీ
● బాధితులకు అప్పగింత నెల్లూరు(క్రైమ్): జిల్లాలో చోరీకి గురైన, ప్రజలు పోగొట్టుకున్న రూ.1.14 కోట్ల విలువైన 570 మొబైల్ ఫోన్లను సైబర్ క్రైమ్, స్థానిక పోలీస్లు సంయుక్తంగా రికవరీ చేశారు. వాటిని శుక్రవారం నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ అజిత వేజెండ్ల బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో మొబైల్ ఫోన్ అత్యంత కీలకమైందన్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ సేవలు, విద్య, ఉద్యోగాలు, వ్యాపార కార్యకలాపాలు తదితరాలు దాని ద్వారానే జరుగుతున్నాయన్నారు. ఇంతటి ప్రాధాన్యమున్న ఫోన్ చోరీకి గురైనా?, పోగొట్టుకున్నా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ వెంటనే సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటి రిజిస్టర్)పోర్టల్లో లేదా స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. సాంకేతికత ఆధారంగా ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేయడం జరుగుతోందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు తొమ్మిది విడతల్లో రూ.10 కోట్ల విలువైన 5,010 ఫోన్లను రికవరీ చేశామన్నారు. ప్రజలు సీఈఐఆర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫోన్ల రికవరీలో ప్రతిభ చూపిన సైబర్ విభాగం ఇన్స్పెక్టర్ ఎం.పూర్ణచంద్రరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఎన్.రామారావు, సైబర్ సోషల్ మీడియా, జిల్లాలోని పోలీసు అధికారులను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు దశరథరామారావు, బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పారాలీగల్ వలంటీర్ల పాత్ర కీలకం
నెల్లూరు (లీగల్): చట్టపరమైన సాయంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో పారా లీగల్ వలంటీర్ల (న్యాయసేవా సహాయకులు) పాత్ర కీలకమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మశ్రీ పేర్కొన్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా భవన్లో పారా లీగల్ వలంటీర్లతో సమావేశాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ ఆదేశానుసారం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సామాన్యులు.. న్యాయవ్యవస్థకు వారధిగా వ్యవహరిస్తూ బాధ్యతతో మెలగాలని సూచించారు. న్యాయం కోసమొచ్చే పేద మహిళలు, అణగారిన, బలహీన వ ర్గాలకు చెందిన ప్రజలకు న్యాయ, చట్టపరమైన అంశాలపై కౌన్సెలింగ్ ఇచ్చి న్యాయసేవాధికార సంస్థ లను ఆశ్రయించేలా కృషి చేయాలని కోరారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సురేష్, లోక్ అదాలత్ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ గోపాల్రెడ్డి, లోక్ అదాలత్ సభ్యులు శ్రీనివాసరావు, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇదో ఉదాహరణ..
ఆక్రమణదారులకు వత్తాసు భూముల ధరలు భారీగా పెరిగిపోవడంతో ఆక్రమణలూ అదే స్థాయిలో జరుగుతున్నాయి. కబ్జాదారులకు రెవెన్యూ అధికారులు సంపూర్ణంగా సహకరిస్తున్నారు. పేదలకు కేటాయించిన ల్యాండ్స్ను సైతం టీడీపీ నేతలు హస్తగతం చేసుకుంటున్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న వాటినీ కొల్లగొడుతున్నారు. ఒకవేళ అందు లోకి ఎవరైనా ప్రవేశించేందుకు యత్నిస్తే, దౌర్జన్యాలకు సైతం తెగబడుతున్నారు. ఆన్లైన్లో తమ పేర్లున్నాయి.. వీటి జోలికొస్తే సహించేదిలేదంటూ హెచ్చరికలను సైతం జారీ చేస్తున్నారు. -
ఏపీ పీజీ సెట్ ఫలితాల విడుదల
● హిందీ విభాగంలో జిల్లా విద్యార్థినికి ప్రథమ ర్యాంక్ నెల్లూరు (టౌన్): వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ పీజీ సెట్ ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. ఈ నెల ఎనిమిది నుంచి 11 వరకు నిర్వహించిన పరీక్షకు 632 మంది హాజరయ్యారు. వీరిలో 588 మంది అర్హత సాధించారు. 93.04 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. హిందీ విభాగంలో 94 మార్కులను హితశ్రీ సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంక్లో నిలిచారు. స్టాఫ్ నర్సుల తుది మెరిట్ లిస్ట్.. గుంటూరు మెడికల్: పిడుగురాళ్ల జీజీహెచ్లో 150 కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్న వారి ఫైనల్ మెరిట్ లిస్టును విడుదల చేశామని ప్రాంతీయ వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు శోభారాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాలో క్లరికల్, టైపోగ్రాఫికల్, తప్పిదాలు ఏమైనా ఉండి అభ్యంతరాలుంటే లిఖితపూర్వకంగా శనివారం సాయంత్రం ఐదు గంటల్లోపు తెలియజేయాలని కోరారు. జాబితాను cfw. ap.nic.inలో అందుబాటులో ఉంచామని వివరించారు. డీసీపల్లిలో 286 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 286 బేళ్లను శుక్రవారం విక్రయించారని నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. వేలానికి 330 బేళ్లు రాగా, వీటిలో 286ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 39,548.4 కిలోల పొగాకును విక్రయించగా, రూ.89,30,393.10 వ్యాపారం జరిగిందని వివరించారు. గరిష్టంగా కిలోకు రూ.250.. కనిష్టంగా రూ.190.. సగటు ధర రూ.225.81గా నమోదైందని వెల్లడించారు. తొమ్మిది కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారన్నారు. రామలింగేశ్వరస్వామి సేవలో.. విడవలూరు: మండలంలోని రామతీర్థంలో కొలువైన గంగా సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసరావు తన కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం సందర్శించారు. వీరికి ఆలయాధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. జడ్జి దంపతులను శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇంధన పొదుపు బాటలో అమాత్యుడు ఆత్మకూరు: ఇక నుంచి ఫ్రైడే.. నో ట్రావెల్ డేను పాటించేలా నిర్ణయం తీసుకున్నామని, అత్యవసర ప్రయాణ పరిస్థితులు ఏర్పడితే ఎలక్ట్రిక్ వాహనాన్ని వినియోగించేలా రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నిర్ణయించారని ఆయన కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా ప్రధాని మొదలుకొని సీఎంలు ఇంధన పొదుపు చర్యలు చేపట్టిన విషయం విదితమే. అయితే మంత్రి ఆనం గత శుక్రవారం 11 వాహనాలతో ఆత్మకూరులో పర్యటించిన విషయమై ‘మేము చెబుతాం.. ఆచరించం’ అనే శీర్షికన సాక్షిలో కథనం గత శనివారం ప్రచురితమైంది. దీంతో ఆయన తన ప్రయాణ ఏర్పాట్లలో మార్పులు చేసుకున్నారు. వేడుకగా జాతర ఇందుకూరుపేట: మండలంలోని గంగపట్నంలో కొలువైన చాముండేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ధూళి జాతరను అంగరంగ వైభవంగా శుక్రవారం నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం గ్రామోత్సవాన్ని జరిపారు. మేళతాళాలు, విద్యుద్దీపాలంకరణలు, బాణసంచా సందడితో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. దేవస్థాన చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి, ఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
‘డీఎస్సీ’పై సీబీఐతో విచారణ జరపాలి
నెల్లూరు(పొగతోట): ప్రస్తుత టీడీపీ పాలనలో డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్సీలో అవకతవకలు చోటుచేసుకున్న నేపథ్యంలో నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద పార్టీ విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న నేతలను ఖాకీలు అరెస్ట్ చేసి చిన్నబజార్ పోలీస్స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న కాకాణి హుటాహుటిన చేరుకున్నారు. దీంతో విద్యార్థి విభాగ నేతలను పోలీసులు వదిలేసి, త్వరగా వెళ్లిపోవాలని సూచించారు. మెగా కాదు.. దగా డీఎస్సీ మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా టీడీపీ ప్రభుత్వం మార్చేసిందని కాకాణి ఆరోపించారు. చంద్రబాబు నేతృత్వంలోని సర్కార్ అన్ని రంగాల్లో అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులను ఘోరంగా వంచించారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీని తీసుకొస్తామంటూ ఎన్నికలకు ముందు ఊరూరా తిరిగి ఆయన ప్రగల్భాలు పలికారని, అయితే లక్షలాది మందిని మోసం చేశారని ధ్వజమెత్తారు. అనేక అనుమానాలు 2025లో విడుదల చేసిన డీఎస్సీకి సంబంధించిన నియామకాల్లో అనేక అనుమానాలు, అపోహలు నిరుద్యోగుల్లో నెలకొన్నాయని తెలిపారు. డీఎస్సీ అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని, అయితే ఈ ప్రక్రియలో కలెక్టర్, జిల్లా అధికారులు ఎక్కడైనా జోక్యం చేసుకున్నారానని ప్రశ్నించారు. ఈ వ్యవహారమంతా ఓ రిమోట్ కంట్రోల్ పాలనలా సాగుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ పూర్తిగా మారిపోయాయని.. వీఆర్వో మొదలుకొని తహసీల్దార్, కలెక్టర్, చివరికి చీఫ్ సెక్రటరీ ఇలా అందరిపై మంత్రి లోకేశ్ పెత్తనమే నడుస్తోందని ఆరోపించారు. పోలీస్ శాఖలోనూ ఇదే తీరు నెలకొందని విమర్శించారు. అవమానకరంగా ప్రవర్తించారు ఈ విషయమై ప్రశ్నించేందుకు తమ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికెళ్తే, వారితో అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. సమాధానం చెప్పాల్సిన కమిషనర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అన్యాయంపై అభ్యర్థులు, నిరుద్యోగులు కోర్టులను ఆశ్రయిస్తుంటే, బెదిరింపులకు ప్రభుత్వం దిగడాన్ని దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. విద్యార్థి విభాగ నేతలు నిరసన తెలుపుతుంటే అక్రమ కేసులు పెడతామంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి వాటికి భయపడేదిలేదని తేల్చిచెప్పారు. యువత ఆధ్వర్యంలో కలెక్టరేట్ను సోమవారం ముట్టడించనున్నామని వెల్లడించారు. 2025 డీఎస్సీలో జరిగిన అన్యాయంపై అభ్యర్థుల పక్షాన నిలిచి వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని ప్రకటించారు. పార్టీ విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్రెడ్డి, రాష్ట్ర సెక్రటరీ సతీష్బాబు, నెల్లూరు నగర, సర్వేపల్లి, వెంకటగిరి, కందుకూరు, సూళ్లూరుపేట అధ్యక్షులు చంద్రారెడ్డి, జానకిరామ్రెడ్డి, మల్లికార్జున, అశోక్, తేజారెడ్డి, జిల్లా సెక్రటరీ నానీ, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు శ్రీకృష్ణ, చరణ్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న కాకాణి గోవర్ధన్రెడ్డి వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నేతల నిరసన అక్రమాలపై వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై తమ పార్టీ విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసనను తెలియజేస్తుంటే, పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఆరోపించారు. సర్కార్ అణచివేత ధోరణిని చూస్తుంటే నాటి బ్రిటిష్ పాలకుల రోజులు.. ఎమర్జెన్సీ నాటి ఘటనలు గుర్తుకొస్తున్నాయని తెలిపారు. చదువు, సంస్కారం లేని లోకేశ్కు విద్యా, మానవ వనరుల అభివృద్ధి శాఖను అప్పగించారని, సమాజంపై చంద్రబాబుకు ఎంత చులకన భావముందో దీని ద్వారా తెలుస్తోందని వివరించారు. లోకేశ్ చదివిన చదువులేంటో.. ఇతర దేశాల్లో ఆయన వెలగబెట్టిందేంటో అందరికీ తెలుసునని గుర్తుచేశారు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన కన్వీనర్ను అర్ధాంతరంగా ఎందుకు మార్చాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత మంది శాశ్వత ఉద్యోగులుండగా, వారిని పక్కనబెట్టి తాత్కాలిక సిబ్బందితో ప్రక్రియను ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. క్వశ్చన్ పేపర్ను అప్లోడ్ చేసిన తాత్కాలిక ఉద్యోగికి జిల్లాల్లో ప్రథమ స్థానం, రాష్ట్రంలో టాప్ ర్యాంక్ రావడం వెనుకన్న రహస్యమేమిటని నిలదీశారు. మెరిట్ జాబితాను ప్రకటించకుండా అభ్యర్థులకు ఉద్యోగమొచ్చిందంటూ మొదట మెసేజ్ను పంపి, ఆపై టెస్ట్ ఎస్సెమ్మెస్లని, మీకు కొలువు రాలేదని చెప్పడం మోసం కాదానని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉద్యోగులను ఏ విధంగా నియమించుకుంటారో, అదే తరహాలో ఉపాధ్యాయులను అపాయింట్ చేసినట్లు ఉందని విమర్శించారు. అంతా లొసుగులమయం మంత్రి లోకేశ్దే పెత్తనం వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో నిరసన అరెస్ట్ చేసిన పోలీసులు కాకాణి రాకతో వదిలేసిన వైనం ఒకటిన కలెక్టరేట్ ముట్టడి -
మర్యాదపూర్వకంగా..
తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని సూళ్లూరుపేట నియోజకవర్గ నేతలతో కలిసి మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. ఆలయ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు చిల్లకూరు: తీర ప్రాంతంలోని తూర్పుకనుపూరులో వెలసిన ముత్యాలమ్మ ఆలయంలో పనిచేసే సిబ్బందిపై సస్పెన్షన్ వేటేశామని ఈఓ నవీన్కుమార్ తెలిపారు. ఆలయం ప్రాంగణంలో లో గురువారం ఆయన మాట్లాడారు. ఆలయంలో డోలు వాయించే సిబ్బంది మణికంఠ విధి నిర్వహణలో కొంత కాలంగా అలసత్వం వహిస్తున్నారని, అమ్మవారి దర్శనానికి ఆదివారం వచ్చే భక్తులను టికెట్లు కొనుగోలు చేయనీయకుండా నేరుగా దర్శనానికి తీసుకెళ్తూ ఆదాయానికి గండి కొడుతున్నారని తెలిపారు. దీనిపై పలుమార్లు హెచ్చరించినా, ఎలాంటి మార్పు రాలేదన్నారు. మంగళవారం గట్టిగా ప్రశ్నించడంతో, దురుసుగా ప్రవర్తించారని వివరించారు. దీంతో అతడ్ని సస్పెండ్ చేస్తున్నట్లు పోస్ట్ ద్వారా బుధవారం సమాచారమివ్వడంతో పాటు వాట్సాప్ ద్వారా తెలియజేశామని చెప్పారు. కాగా తనను ఈఓ కులం పేరుతో తన కుటుంబసభ్యుల ఎదుట దూషించారంటూ చిల్లకూరు పోలీసులకు మణికంఠ ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆలయ కమిటీ ఏర్పాటయ్యాక ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. లభించని మత్స్యకారుల ఆచూకీ ● విస్తృతంగా గాలింపు చర్యలు బిట్రగుంట: బోగోలు మండలం అలిచెర్లబంగారుపాళెంలో సముద్రంలో చేపల వేటకెళ్లి గల్లంతైన అన్నదమ్ములు గణేష్, రాజా ఆచూకీ గురువారం సాయంత్రానికీ లభ్యం కాలేదు. అలిచెర్లబంగారుపాళేనికి చెందిన తూపిలి బాలమురళి (51), కుమారి గోవిందు (42), సోదరులైన తులసింగారి రాజు, గణేష్ రెండు చెక్క తెప్పలపై వేటకు బుధవారం వేకువజామున వెళ్లి ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. వేకువజామున నాలుగు గంటల ప్రాంతంలో వచ్చిన పెనుగాలులకు పడవ తిరగబడి బాలమురళి, గోవిందు మృతి చెందగా, తులసింగారి రాజు, గణేష్ ఆచూకీ లభ్యం కాలేదు. వీరి కోసం గాలింపు చర్యలను మైరెన్ పోలీసులు, స్థానిక మత్స్యకారులు బుధవారం ఉదయం నుంచే విస్తృతంగా చేపట్టారు. మరో పది ఫైబర్ బోట్లతో గాలింపు చర్యలను గురువారం చేపట్టినా, ఫలితం లేకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. గల్లంతైన రాజు, గణేష్ క్షేమంగా తిరిగి రావాలని తీరమంతా కడలికి కన్నీటితో మొక్కుతోంది. కాగా బాలమురళి, గోవిందు మృతదేహాలకు కావలి ఏరియా ఆస్పత్రిలో పోస్ట్మార్టం పూర్తయిన అనంతరం గ్రామంలో అంత్యక్రియలను నిర్వహించారు. మృతుల కుటుంబాలను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని, సీఎం ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున పరిహారాన్ని అందించి ఆదుకుంటామని తెలిపా రు. గల్లంతైన వారి ఆచూకీ కోసం అదనపు బల గాలను సిద్ధం చేయనున్నామని వివరించారు. విషాద తీరం బోగోలు మండలంలోని తీర ప్రాంత గ్రామాలు విషాదఛాయల్లోనే ఉన్నాయి. సముద్రంలో ఆటుపోట్లు, తుఫాన్ల సమయంలోనూ వేటకెళ్లి క్షేమంగా తిరిగొచ్చిన మత్స్యకారులు ఊహించని రీతిలో పెనుగాలులకు బలైపోవడం ప్రతి ఒక్కర్నీ కలిచివేస్తోంది. సముద్రంలో అలల ఉధృతి, గాలి వేగాన్ని బట్టి వేటకెళ్లాలా.. వద్దా అని నిమిషంలో నిర్ణయించుకునే నేర్పు ఇక్కడి మత్స్యకారుల సొంతం. అలాంటిది ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో వేటకెళ్లడం, గంటలోనే అంతా తారుమారు కావడాన్ని ఇక్కడి వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కంటికి రెప్పలా కాపాడే కడలే తమ జీవితాల్లో కన్నీటిని నింపిందని మృతుల కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి. రాజు, గణేష్ కుటుంబాలు ఏ క్షణంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనని కుమిలిపోతున్నాయి. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ కృష్ణ తేజ అతిథిగృహం వద్దకు చేరుకుంది. స్వామివారిని 87,691 మంది బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 49,958 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.99 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభి స్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది.ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
నేతన్నకు బాబు వెన్నుపోటు
●చేనేతలను ఆదుకోవాలి చేనేత కార్మికులను ఆదుకోవాలి. వేసవి కాలంలో వారు మగ్గం నేసేందుకు అవకాశం లేదు. గత ప్రభుత్వంలో నేతన్న నేస్తం ద్వారా కార్మిక కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలి. ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయినా పట్టించుకోవడం లేదు. చేనేతల కార్పొరేషన్లను పెంపొందించి నిధులను విడుదల చేయాలి. – కోనం చినబ్రహ్మయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి పింఛన్లు మంజూరు చేయడం లేదు నేతన్న నేస్తం కింద ప్రస్తుత ప్రభుత్వం చేనేతలను ఆదుకోవాలి. చంద్రబాబు ఎన్నికల హామీల్లో భాగంగా ఏడాదికి రూ.25 వేలు అందజేస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు పథకాన్ని అమలు చేయలేదు. రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు. కొత్తగా పింఛన్లను కూడా మంజూరు చేయడం లేదు. – పముజుల శంకరయ్య, చేనేత ఐక్యవేదిక నాయకుడు, పొదలకూరు పొదలకూరు: చేనేత కార్మికుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఆ కుటుంబాలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంతోనే సరిపెడుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావొస్తున్నా గత ప్రభుత్వంలో అమలు చేసిన నేతన్న నేస్తం పథకాన్ని తిరిగి ప్రారంభించలేదని వారు విమర్శిస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు కార్మికులను ఆదుకునేందుకు ఏడాదికి రూ.25 వేలు అందజేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని మండిపడుతున్నారు. అలాగే 50 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకున్న వారికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో 17 కులాలకు చెందిన వేలాది మంది చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే వారి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కేవలం రెండు కార్పొరేషన్లను మాత్రమే ఏర్పాటు చేసిందని నాయకులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి పదవులను చేనేత వర్గాలకు కట్టబెట్టినట్లు గుర్తుచేస్తున్నారు. సాయం కోసం.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 80 వేల మగ్గాలు ఉండగా.. ఒక్క నెల్లూరు జిల్లాలోనే దాదాపు 3 వేలు ఉన్నాయి. పనుల్లేని సమయంలో కార్మికులను ఆదుకునేందుకు గత ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం కింద ఐదేళ్లపాటు ప్రతి ఏడాది రూ.24 వేలు చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. కరోనా కష్టకాలంలో కూడా జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఒకే ఏడాదిలో రెండుసార్లు ఆ పథకాన్ని అమలు చేసి చేనేత కుటుంబాలకు ఉపశమనం కల్పించింది. ఈ లెక్కన ఐదేళ్లలో అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి సుమారు రూ.1.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందింది. గతంలో నాలుగు కార్పొరేషన్లు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేనేత వర్గాలకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి పద్మశాలి, తొగట, దేవాంగ, కుర్మి కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన చేనేత వర్గాల నాయకులకు కూడా కార్పొరేషన్ డైరెక్టర్ పదవులిచ్చి రాజకీయంగా గుర్తింపు కల్పించిచారు. దీంతో గ్రామీణ స్థాయిలో చేనేత సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం లభించింది. అయితే కూటమి ప్రభుత్వం కేవలం దేవాంగ, పద్మశాలి కార్పొరేషన్లను మాత్రమే ఏర్పాటు చేసింది. కుర్మి కార్పొరేషన్కు డిమాండ్ పెరగడంతో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కాగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటి ద్వారా కార్మికులకు ఉపయోగపడే పథకాలు అమలు చేసిన దాఖలాల్లేవు. ప్రభుత్వం ఇప్పటికై నా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కార్మికులు కోరుతున్నారు. రెండేళ్లుగా నేతన్న నేస్తం పథకం ఎగనామం గతంలో ఏడాదికి రూ.24 వేలు బ్యాంక్ ఖాతాల్లో జమ కరోనా కష్టకాలంలోనూ అండగా నిలిచిన జగన్ ప్రభుత్వం ఉచిత విద్యుత్తో సరిపెడుతున్న కూటమి సర్కారు కార్పొరేషన్ల ఏర్పాటులోనూ వెనుకబాటుతనం సాయం కోసం ఎదురుచూస్తున్న చేనేత కార్మికులునేడు ఇదీ పరిస్థితి అయితే ప్రస్తుతం చేనేత కార్మికులకు ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదని వారు చెబుతున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబు గత ప్రభుత్వానికి మించిన స్థాయిలో చేనేతలకు ఏడాదికి రూ.25 వేలు అందజేస్తామని, 50 ఏళ్ల వయస్సు నిండిన నేత కార్మికులకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రాజకీయ, సామాజిక పరంగా చేనేత వర్గాలను బలోపేతం చేసేందుకు 17 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శిస్తున్నారు. గత ఏప్రిల్ నెలలో ప్రకటించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తప్ప మిగిలిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదు. -
దమ్ముంటే టచ్ చేసి చూడండి
● జనసేన నేతలకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి సవాల్ కావలి: మార్ఫింగ్ ఆడియో రికార్డింగ్లను వాట్సాప్ గ్రూపుల్లో వ్యాప్తి చేయడంతో పాటు తన ఇంటిని ముట్టడిస్తామంటూ జనసేన నేతలు రెండు రోజులుగా హల్చల్ చేస్తున్నారని, దమ్ముంటే తనను టచ్ చేసి చూడండంటూ ఆ పార్టీ నేతలకు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి సవాల్ విసిరారు. వీరి తీరుపై కావలి డీఎస్పీ రమణకుమార్కు గురువారం ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. జనసేనకు చెందిన చోటా నేతలు ఉద్దేశపూర్వకంగా ఫేక్ ఆడియోలను సృష్టించి తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు తమ పార్టీ నేతలు ఫిర్యాదు చేసినా, ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. అసత్య ప్రచా రాలకు పాల్పడుతున్న వారి పేర్లతో సహా డీఎస్పీకి అందజేసినా చర్యలు చేపట్టకపోవడమేమిటని ప్రశ్నించారు. తన ఇంటిని ముట్టడిస్తామంటూ ఆ పార్టీ నేత లు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని, ఇలాంటి వాటికి తాను భయపడేదిలేదని తేల్చిచెప్పారు. ప్రజల ఆశీస్సులతో తాను ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందానని, వారు తన వెంటే ఉన్నారన్నారు. దమ్ము.. ధైర్యముంటే తేదీ, సమయాన్ని ప్రకటించాలని.. ఎక్కడ్నుంచి వస్తారో రండి.. కార్యకర్తలతో కలిసి తానొస్తానని తెలిపారు. తాను చిరంజీవి, పవన్ కల్యాణ్ను దూషించానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటానని, అలా కాని పక్షంలో మీరేమి చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఇలాంటి ఫేక్ ఆడియో రికార్డింగ్లను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేసే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. జనసేనలోని కొందరు నేతలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ నోటికి ఏదొస్తే ఆది మాట్లాడుతున్నారని, అదుపులో ఉండాలని హితవు పలికారు. అసత్య ప్రచారాలు చేస్తూ.. రాజకీయంగా లబ్ధి పొందాలని చూసే కుహా నా నేతలకు తగిన బుద్ధి చెప్తానని స్పష్టం చేశారు. ఎన్నికలెప్పుడొచ్చినా టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీ పట్టణాధ్యక్షుడు శివకుమార్రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ వెంకటనారాయణ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కామరాజు, జిల్లా కార్యదర్శి ప్రసన్నాంజనేయులు, ప్రసాద్రెడ్డి, శ్రీనివాసులు, రాఘవులు, బీసీ భవన్ అధ్యక్షుడు వెంకటరావు, రాజశేఖర్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
నేడు కొమ్మిపాడుకు కలెక్టర్ రాక
సైదాపురం: మండలంలోని కొమ్మిపాడు గ్రామంలో శుక్రవారం జరిగే పల్లె వీక్షణం కార్యక్రమానికి కలెక్టర్ హిమాన్షు శుక్లా వస్తారని ఎంపీడీఓ ఎంవీ రామ్మోహన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి హామీ పథకం పనులతోపాటు చెత్త నుంచి సంపద తయారీ, అంగన్వాడీ కేంద్రం, ఆరోగ్య కేంద్రం, రైతు సేవా కేంద్రం, స్వర్ణగ్రామ కార్యాలయాల పనితీరును పర్యవేక్షిస్తారన్నారు. స్వయం సహాయక సంఘాలు, ఛాంపియన్ రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారన్నారు. అనంతరం మండల స్థాయిలో పదో తరగతి పరీక్షల్లో టాప్ త్రీ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సత్కరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రైతు విభాగ సంయుక్త కార్యదర్శిగా సుంకరనెల్లూరురూరల్: వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కావలి నియోజకవర్గానికి చెందిన సుంకర వెంకట దయాకర్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. వైద్యం అందక వ్యక్తి మృతి ● నర్రవాడ వైద్య సిబ్బంది నిర్లక్ష్యమని బంధువుల ఆరోపణ దుత్తలూరు: మండలంలోని నర్రవాడకు చెందిన రసూల్ (55) అనే వ్యక్తి వైద్య చికిత్స అందక మృతిచెందాడు. ఈ ఘటనలో స్థానిక పీహెచ్సీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం మేరకు.. రసూల్ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ నెల్లూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంటి బాత్రూంలో పడి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే అతడిని కారులో నర్రవాడ పీహెచ్సీకి తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది సరైన సమయంలో స్పందించలేదని, పట్టించుకోలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో వారు అతడిని వెంటనే దుత్తలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అప్పటికే రసూల్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు. సకాలంలో చికిత్స అందించి ఉంటే రసూల్ బతికే అవకాశం ఉండేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్రవాడ పీహెచ్సీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు ఆరోపిస్తున్నారు. కాగా ఈ ఘటనపై వైద్యాధికారులు, సిబ్బంది స్పందించారు. ఆ సమయంలో రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స అందిస్తున్నామన్నారు. రసూల్ను ఆస్పత్రిలోకి తీసుకురాకుండా రోడ్డుపైనే ఉంచి బీపీ చెక్ చేయాలని మాత్రమే చెప్పారని, అదే సమయంలో అత్యవసర రోగుల చికిత్సలో తాము ఉన్నామని వివరించారు. ఐదు నిమిషాల్లో బీపీ చెక్ చేస్తామని చెప్పినా వారు వినిపించుకోకుండా వెళ్లిపోయారని సిబ్బంది పేర్కొన్నారు. ఈ ఘటనలో తమ తప్పు లేదని వైద్యశాల సిబ్బంది అంటున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం వైద్య నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. జామాయిల్ తోటల దగ్ధం ● భారీగా ఆస్తి నష్టం పొదలకూరు: మండలంలోని నావూరు గ్రామంలో ముగ్గురు రైతులకు చెందిన సుమారు 75 ఎకరాల కోతకు వచ్చిన జామాయిల్ తోటలు గురువారం దగ్ధమయ్యాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు బాధిత రైతులు వెల్లడించారు. గ్రామానికి చెందిన బొడ్డు నరసింహులు 50 ఎకరాలు, మక్కిన వెంకటేశ్వర్లు 15 ఎకరాలు, రామ్మోహన్ 10 ఎకరాల తోటలు తగులబడ్డాయి, గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారా?, లేక ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుందా? తెలియడం లేదంటున్నారు. సుమారు రూ.కోటి వరకు నష్టం వాటిల్లినట్టుగా బాధితులు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న పొదలకూరు అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. జామాయిల్ తోటలు తగులబడటంపై తమకు అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రైతు నరసింహులు వెల్లడించారు. కండలేరులో 39.430 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో గురువారం 39.430 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగకాలువకు 1,900, లోలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 15, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.90 సన్నవి : రూ.50 పండ్లు : రూ.20 -
సాగుపై ఎల్నినో పడగ
నెల్లూరు(వేదాయపాళెం): ఈ ఏడాది ఖరీఫ్ సాగు ఆరంభంలోనే అన్నదాతకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ప్రకృతి విపత్తులు, పెరుగుతున్న సాగు ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సబ్సిడీ ఎరువులు, సాగునీరు సకాలంలో అందక మరింత ఆందోళన నెలకొంది. దీనికితోడు ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని వారు అంచనా వేస్తున్నారు. వాతావరణ నిపుణులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ రైతులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదని జిల్లాకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఇబ్బందులు అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో సుమారు 3.75 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు అవుతోంది. అదనంగా మరో 2 లక్షల ఎకరాల్లో ప్రధానంగా వరి, వేరుశనగ, మిరప పంటలను రైతులు సాగు చేస్తున్నారు. అయితే పలు ఆయకట్టు గ్రామాలకు ఇప్పటికీ సాగునీరు అందడం లేదు. జిల్లా కేంద్రానికి సమీపంలోని అనేక మండలాల్లో అన్నదాతలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగునీరు విడుదల చేయాలని కోరుతూ జలవనరుల శాఖ కార్యాలయాల చుట్టూ రైతులు తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఎరువుల సరఫరా అంతంతమాత్రమే కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరిగిన సమయంలో రైతులకు సబ్సిడీ యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ప్రతి ఎకరాకు 200 నుంచి 250 కిలోల వరకు యూరియా అవసరం ఉండగా, ప్రస్తుతం కేవలం 120 కిలోల వరకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపు కొంటున్నారని విమర్శలున్నాయి. దీంతో మిగతా అవసరమైన యూరియాను ప్రైవేట్ దుకాణాల్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దుకాణదారులు సూచించిన బ్రాండ్లనే వారు చెప్పిన ధరలకు కొనక తప్పడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పంటలకు ముప్పు ఈ ఏడాది ఖరీఫ్ సాగుపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఎండ వేడిమి, వడగాలుల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు. పంటలకు ‘బెట్ట’ తగిలి దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎల్నినో తీవ్రతకు తోడు గాలులు ఎక్కువైతే పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం కూడా ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకృతి ప్రతికూల పరిస్థితులు, ఎరువుల కొరత, సాగునీటి సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అనేక ఆటుపోట్ల మధ్య రైతులు ఈ ఖరీఫ్లో ఎదురీత వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఖరీఫ్పై తీవ్ర ప్రభావం దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఆదుకునేందుకు ప్రభుత్వ సహకారం శూన్యంపంటలను సంరక్షించుకోవాలి ఈ ఏడాది ఖరీఫ్లో రైతులు తగిన జాగ్రత్తలు పాటించి పంటలను సంరక్షించుకోవాలి. ఎల్నినో ప్రభావం ఖచ్చితంగా ఖరీఫ్పై ఉంటుంది. అందువల్ల చిన్నపాటి మెళకువలతో పంటలను సంరక్షించుకుంటూ అధిక దిగుబడులు సాధించేందుకు కృషిచేయాలి. బెట్ట తట్టుకునేందుకు పొటాషియం నైట్రేట్ను వినియోగించాలి. ఎండ సమయంలో కాకుండా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో సాగునీరు అందించాలి. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింకర్ల ద్వారా నీటిని వినియోగిస్తే వేసవిలో నేల పొడిబారి పోకుండా పంటలను కాపాడుకోవచ్చు. – యు.వినీత, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం, నెల్లూరు -
అవినీతి ఉపాధి
● వెంకటగిరి నియోజకవర్గంలో వెలుగుచూస్తున్న అక్రమాలు ● వెంకటరామరాజుపేటలో సీనియర్ మేట్లదే పెత్తనం ● సిబ్బంది చేతివాటం కలువాయి(సైదాపురం):వెంకటగిరి నియోజకవర్గంలో ఉపాధి పథకం అవినీతిమయంగా మారింది. కలువాయి మండలంలో అర్హత కలిగిన నిరుపేద కూలీలు కాకుండా ప్రస్తుతం పనిచేస్తున్న సీనియర్, జూనియర్ మేట్ల పెత్తనమే సాగుతోంది. తమ కుటుంబసభ్యుల పేర్లపై సెపరేటుగా ఫేస్ అటెండెన్స్ తీసుకొని బినామీ మస్తర్లేసి నిధులను దిగమింగుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మండలంలోని చింతలపాళెం పంచాయతీ మజరా గ్రామ మైన వెంకటరామరాజుపేటలో సీనియర్ మేట్గా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి తన కుటుంబసభ్యులు, బంధువులకు మస్తర్లేసి పనిచేసిన విధంగా చూపిస్తున్నారని ఉపాధి కూలీలు ఆరోపిస్తున్నారు. సదరు మేట్ కుమారుడు బీటెక్ చదువుకుంటున్నా, మస్తర్లో పేర్లు నమోదు చేయడం గమనార్హం. గతంలో నాటిన మొక్కలకు నేడు బిల్లులు నిమ్మ, మామిడి తోటల అభివృద్ధిలో భాగంగా ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు నాటేందుకు గుంతలు తీసిన నాటి నుంచి మూడేళ్ల పాటు వాటి సంరక్షణకు నిధులను రైతులకు మంజూరు చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని చేతివాటాన్ని ఉపాధి సిబ్బంది ప్రదర్శించారు. వెంకటరామరాజుపేటకు చెందిన జాబ్కా ర్డు 20087 పొట్టపల్లి చెంచయ్య వర్క్ ఐడీ 02090220010 – ఐఎఫ్ – జీఐఎస్ – 1078645, మరో జాబ్కార్డు నంబర్ 20085 పొట్టపల్లి యానాద య్య వర్క్ ఐడీ 02090220010 – ఐఎఫ్ – జీఐఎస్ – 1078652కు మూడేళ్ల క్రితం నాటిన నిమ్మ మొక్కలకు ఈ ఏడాది నాటిన తరహాలో చూపి బిల్లులు మంజూరు చేశారు. రోజా మొక్కలకూ.. కలువాయి మండలంలో రోజా మొక్కలు నాటిన వారికి సైతం బిల్లులు పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వెంకటరామరాజుపేటలో విరివిరు చిన్నమ్మ జాబ్కార్డు నంబర్ 20126 ఫోర్లికల్చర్ పేరిట వర్క్ ఐడీ నంబర్ 0209022010 – ఐఎఫ్ – 19187012063272కు రోజా మొక్కలు నాటినట్లు చూపి మెటీరియల్ పేమెంట్ కింద గత ఫిబ్రవరి తొమ్మిదిన రూ.60 వేలను కలువాయి ఎమ్సీసీలో నమోదు చేశారు. అసలు రోజా మొక్కలను నాటకుండానే బిల్లులను దిగమింగారు. భయమేదీ..? కలువాయి మండలంలో గతంలో పనిచేసిన ఇద్దరు టీఏలు, ఈసీ, కంప్యూటర్ ఆపరేటర్లు అవినీతికి పాల్పడి టెర్మినేటయ్యారు. వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది ఏ మాత్రం భయపడకుండా ఆడిట్ అధికారులను సైతం మేనేజ్ చేస్తూ అవినీతికి అందలమేస్తున్నారు. -
అధైర్యపడొద్దు.. అందుబాటులో ఉంటా
● కూటమి పాలనలో అన్ని వర్గాలకూ కష్టాలే ● జగన్ పాలనను కోరుకుంటున్న ప్రజలు ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దనీ.. ఎలాంటి సమస్యలొచ్చినా తాను అందుబాటులో ఉంటాననీ.. అభివృద్ధి అంటూ జరిగిందంటే అది తమ ప్రభుత్వ హయాంలోనేనని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు పట్టణం, పొడమేకలకండ్రిక గ్రామంలో గురువారం పర్యటించిన ఆయన్ను గ్రామస్తులు కలిశారు. కూటమి ప్రభుత్వంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జగన్మోహన్రెడ్డి పాలన తిరిగి రావాలని కాకాణితో పేర్కొన్నారు. బక్రీద్ను పురస్కరించుకొని ముస్లింలకు శుభాకాంక్షలను తెలియజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కూటమి పాలనపై ప్రజలకున్న భ్రమలు తొలగిపోయాయని.. డ్రామాలతో చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. మహానాడుకు పట్టుమని పది మంది సైతం హాజరుకాలేదని.. సమావేశాలు వెలవెలబోయాయని ఎద్దేవా చేశారు. కూటమి నేతలు పెత్తందారులుగా వ్యవహరిస్తున్నారని, ప్రజలకు మేలు చేసే ఉద్దేశం వారికి లేదని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ, కనీస వసతులను కూడా కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. సీఎంగా జగన్మోహన్రెడ్డి ఉన్న సమయంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారని గుర్తుచేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యేగా, మంత్రిగా తానున్న సమయంలో జగన్మోహన్రెడ్డి అండదండలతో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టించిన అంశాన్ని ప్రస్తావించారు. ప్రజలకు భూ సమస్యల్లేకుండా చిత్తశుద్ధితో యత్నించామని, అధికార పార్టీ వారు ఇప్పుడు ఎన్ని రకాల ఆరోపణలు చేసినా.. ప్రజలకు ఎవరు మేలు చేశారో అర్థమవుతోందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు సాగునీటిని ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అందించామని, అయితే ప్రస్తుతం కాలువల రిపేర్ల పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. కూటమి పాలనపై విసిగిపోయిన ప్రజలు కూటమి ప్రభుత్వం కొలువుదీరాక పక్కా గృహాల నిర్మాణాలను నిలిపేసిందని, ప్రస్తుత సర్కార్పై ప్రజలు విసిగిపోయారని తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు తమ హయాంలో నివేశన స్థలంతో పాటు పక్కా గృహాలను మంజూరు చేశామని తెలిపారు. అధికారమున్నా.. లేకపోయినా ప్రజలతోనే ఉంటామన్నారు. పొదలకూరులో ఇటీవల మృతి చెందిన పార్టీ నేత పడ్డాల వేమయ్య, పొడమేకలకండ్రికలో మృతి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు రమణయ్య చిత్రపటాలకు నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. వాకాటి శ్రీనివాసులురెడ్డి, కేతు రామిరెడ్డి, వేణుగోపాల్రెడ్డి, అంజద్, ఖాదర్, కండే వాసు, వాకాటి శివారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, వెంకటేశ్వర్లుగౌడ్, శ్రీనివాసులు, కోడూ రు మస్తాన్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి మత్తులో యువకుడి వీరంగం
● వ్యక్తిపై బీరు బాటిల్తో దాడి ఆత్మకూరు: మున్సిపల్ పరిధిలోని ఏసీఎస్ఆర్ కాలనీలో గురువారం సాయంత్రం గంజాయి మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. దుకాణం వద్ద నిలబడి ఉన్న వ్యక్తిపై బీరు బాటిల్తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఏసీఎస్ఆర్ కాలనీకి చెందిన కరిముల్లా చిల్లర దుకాణానికి వెళ్లాడు. అదే ప్రాంతానికి చెందిన సుమంత్ అనే యువకుడు గంజాయి మత్తులో కాస్త దూరంలో ఉన్నాడు. అప్పటికే అతడు పలువురిని భయభ్రాంతులకు గురిచేస్తూ దాడికి యత్నిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వారించేందుకు ప్రయత్నించిన వారిపై దాడికి పాల్పడేందుకు వస్తుండటంతో పలువురు పారిపోయారు. ఈ క్రమంలో కరిముల్లా దుకాణం వద్ద నిలబడి ఉండగా, సుమంత్ ఖాళీ బీరు బాటిల్తో అతడి తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి కరిముల్లాను సమీప ఆస్పత్రికి తరలించారు. మరోవైపు దాడి చేసిన యువకుడు మత్తులోనే అక్కడ్నుంచి నడుచుకుంటూ వెళ్లాడు. సమాచారం అందుకున్న ఆత్మకూరు ఎస్సై జంపనీ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని సుమంత్ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఏసీఎస్ఆర్ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. గంజాయి మత్తులో యువకుల ప్రవర్తనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.దాడికి పాల్పడిన సుమంత్గాయపడిన కరిముల్లా -
తప్పిన పెను ప్రమాదం
● స్వల్పగాయాలతో బయటపడిన టూరిస్టులు ● బాధితులకు ఆర్డీఓ, రూరల్ ఎమ్మెల్యే పరామర్శ బస్సును పరిశీలిస్తున్న ట్రాఫిక్ పోలీసులుఆస్పత్రి బయట ఉన్న టూరిస్టులునెల్లూరు(క్రైమ్): వారంతా బంధువులు. ఏటా వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలోని వేళాంగణి మాతను దర్శించేందుకు వెళ్తుంటారు. ఈసారి పది కుటుంబాలు కలిసి ఏలూరుకు చెందిన టూరిస్టు బస్సులో వేళాంగణి మాత దర్శనం కోసం వెళ్తుండగా డ్రైవర్ నిద్రమత్తులో రైలింగ్ను ఢీకొట్టాడు. దీంతో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 16 మందికి గాయాలు కాగా మిగిలిన అందరూ సురక్షితంగా బయటపడ్డారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. ఏలూరు మండలం ప్రతికోలంక గ్రామానికి చెందిన బి.సాయిసోమేశ్వరరావుకు పెద్దపాడు మండలం గుడిపాడులో బంధువులున్నారు. వారందరూ ప్రతి సంవత్సరం వేసవిలో వేళాంగణిమాతను దర్శించుకునేవారు. ఎప్పటిలాగే ఈసారి పది కుటుంబాలు ఏలూరుకు చెందిన టూరిస్టు బస్సులో బుధవారం సాయంత్రం బయలుదేరారు. డ్రైవర్ అప్పారావు ఒంగోలు వరకు బస్సును నడిపారు. అక్కడ్నుంచి కో డ్రైవర్ దుర్గా బస్సును నడపసాగాడు. గురువారం తెల్లవారుజామున చింతారెడ్డిపాళెం క్రాస్రోడ్డు (మెడికవర్ హాస్పిటల్ దాటగానే) సమీపంలో డ్రైవర్ నిద్రమత్తులో జాతీయ రహదారి వెంబడి ఉన్న రైలింగ్ను ఢీకొన్నాడు. బస్సును అదుపు చేయలేకపోవడంతో రోడ్డుపక్కన మార్జిన్లో బోల్తాపడింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్దశద్దం వచ్చింది. టూరిస్టులు పెద్దగా కేకలు వేశారు. స్పందించిన పోలీసులు కొద్దిదూరంలో విధుల్లో ఉన్న ఎస్సై విజయకుమార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రాత్రి గస్తీ విధుల్లో ఉన్న నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ వేణు, బాలాజీనగర్, నెల్లూరు నార్త్, సౌత్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సాంబశివరావు, రామకృష్ణ, వెంకటరెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు అధికారులు, బస్సులోని యువకులు అద్దాలను పగులగొట్టి అందులోని వారిని బయటకు తీసుకొచ్చారు. 16 మందికి గాయాలు కాగా డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారందరూ సురక్షితంగా ఉన్నారు. క్షతగాత్రుల్లో సాయి సోమేశ్వరరావు, రాజ్ప్రకాష్, విద్యాచరణ్, ప్రవీణ్పాల్, ధర్మావతి, నాగమణి, శ్రీలత, గీతిక, దివ్య, ఆనంది, మురళీమోహన్, శ్రావణి, లక్ష్మి, పావనీని మెడికవర్ హాస్పిటల్కు తరలించారు. డ్రైవర్ అప్పారావు, దుర్గా, వంట మనుషులు సూరిబాబు, నరసమ్మను 108లో జీజీహెచ్కు తీసుకెళ్లారు. హాస్పిటల్లో క్షతగాత్రులు, టూరిస్టులను నెల్లూరు ఆర్డీఓ అనూష, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పరామర్శించారు. కేసు నమోదు బోల్తాపడిన బస్సును క్రేన్ల సాయంతో అక్కడ్నుంచి తీసుకెళ్లారు. సాయిసోమేశ్వరరావు ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ దుర్గాపై నార్త్ ట్రాఫిక్ ఎస్సై సైదులు కేసు నమోదు చేశారు. అతను మద్యం తాగాడా అన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. టూరిస్టులను ప్రత్యేక వాహనంలో స్వగ్రామాలకు తరలించేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. -
లేబూరు గ్రామంలో కలకలం
● చిన్నారి అపహరణ యత్నమంటూ ఆరోపణలు ● అప్రమత్తమైన గ్రామస్తులు ● అనుమానిత మహిళల పట్టివేత ● చిన్నారుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళనఇందుకూరుపేట: మండలంలోని లేబూరులో గురువారం ఆటోలో సంచరిస్తున్న నలుగురు మహిళలు చిన్నారులను అపహరించేందుకు ప్రయత్నించినట్లు ప్రచారం జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు అనుమానితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికుల కథనం మేరకు.. ఉదయం వేళ ఆటోలో నలుగురు మహిళలు వచ్చి వీధుల్లో తిరగసాగారు. ఇసుకలో ఓ పిల్లాడు ఆడుకుంటుండగా పిలిచారు. అతను అరుస్తూ ఇంట్లోకి వెళ్లి చెప్పగా తల్లి వచ్చి వారిని ప్రశ్నించింది. అయితే మహిళలు పొంతన లేని సమాధానమిచ్చారు. విషయం తెలుసుకున్న యువకులు, పెద్దలు వెంటనే అక్కడికి చేరుకుని మహిళలను అడ్డగించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మహిళలను స్టేషన్కు తరలించి విచారణ చేశారు. దార్ల శ్రీదేవి, దార్ల తిరపతమ్మ, దార్ల జయమ్మ, దార్ల లక్ష్మిగా గుర్తించినట్లు సమాచారం. వీరిలో శ్రీదేవి, తిరపతమ్మపై గతంలోనే ఇందుకూరుపేట పోలీస్స్టేషన్లో కేసులు నమోదై ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. స్థానికుల్లో భయం స్థానికుల ఆరోపణల ప్రకారం ఇదే ముఠా గతంలో కూడా చిత్తుకాగితాలు ఏరుకునే గిరిజనులను అపహరించేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అప్పట్లో గ్రామస్తుల అప్రమత్తతతో ఆ యత్నం విఫలమైనట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారుల భద్రతపై తల్లిదండ్రుల్లో భయం నెలకొంది. లేబూరులో ఈ ఘటన తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల విచారణ కొనసాగుతోంది ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. మహిళలు నిజంగా చిన్నారుల అపహరణకు యత్ని ంచారా లేదా ఇతర కారణాలతో గ్రామంలో తిరిగారా అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. వారి గత చరిత్రతోపాటు ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసుల వివరాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
వేళాంగణి మాతే రక్షించింది
రెండేళ్లుగా వేసవి సెలవుల్లో అందరం వేళాంగణి మాతను దర్శించుకుంటున్నాం. ఈ ఏడాది పది కుటుంబాలం బస్సులో బయలుదేరాం. గురువారం తెల్లవారుజామున అందరం నిద్రమత్తులో ఉండగా ఒక్కసారిగా పెద్దశబ్దం వచ్చింది. ఏం జరిగిందోనని నిద్రమత్తు నుంచి తేరుకుని చూడగా బస్సు బోల్తా పడి ఉంది. ఒకరిపై ఒకరు పడి ఉన్నారు. వెంటనే యువకులు, అక్కడికి వచ్చిన పోలీసు అధికారులు బస్సు అద్దాలను పగులగొట్టి మమ్మల్ని బయటకు తీసుకొచ్చారు. మాలోని వారికి స్వల్పగాయాలయ్యాయి. పెనుప్రమాదం తప్పింది. వేళాంగణిమాతే మమ్మల్ని రక్షించింది. అమ్మ దయవల్లే మేమందరం సురక్షితంగా ఉన్నాం. – మేరీలత -
నాకు కోపం వస్తే.. ఎవరికైనా చెంప పగులుద్ది
కావలి టీడీపీ ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి నియంత పాలనకు తెర తీశాడు. ఈ మాట సాక్షాత్తు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు బహిరంగ సభలోనే అంటూ ఎమ్మెల్యే తీరును ఆక్షేపించారు. కాలం కలిసొచ్చి శాసన సభ్యుడైన ఆయన పాలన గాలికి వదిలేశారు. సొంత రాజ్యాంగంతో కక్షల రాజకీయం నెరుపుతూ తరచూ వివాదాస్పదమవుతున్నారు. జర్నలిస్టుల నుంచి.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలనే కాకుండా తన గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పోరాడిన సొంత పార్టీ నేతలపైనే కేసులు కట్టించి వేధించిన చరిత్రను మూటగట్టుకున్నారు. తాజాగా తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించమని గట్టిగా అడగడమే నేరంగా సొంత పార్టీ కార్యకర్త చెంప పగులగొట్టారు.సాక్షి నెల్లూరు: రాజకీయాలకు, శాసనసభలకు వన్నె తెచ్చిన ఎందరో ఉద్దండ పాలకులు ఏలిన కావలిలో ప్రస్తుతం డిక్టేటర్ పాలన సాగుతోంది. ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి) వ్యవహార శైలి తరచూ వివాదాస్పదమవుతోంది. సామాన్య కుటుంబ స్థాయి నుంచి రూ.వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న ఆయన మండల స్థాయి నేతగా ఉంటూ గత ఎన్నికల సమయంలో డబ్బు సంచులతో టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. అడ్డదారిలో అధికారం దక్కడంతో కన్ను మిన్ను కానక అరాచక పాలనకు తెర తీశారు. ఆయన మాటే శాననంగా సాగించే క్రమంలో నిరంకుశత్వ ధోరణితో వ్యవహరిస్తూ చెలరేగిపోతున్నారు. అక్రమ కేసులు, అరెస్ట్లే పాలనగా.. ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి రెండేళ్లుగా పాలన గాలికి వదిలేసిన.. అక్రమ కేసులు, అరెస్ట్లు, విధ్వంసాలు, అరాచకాలే ప్రామాణికంగా సాగుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రావెల్, మట్టి తవ్వకాల్లో మునిగిపోయారు. ఆయన అక్రమాలను ప్రశ్నించిన నలుగురు జర్నలిస్టులతోపాటు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే, ముఖ్యనేతలపై విధ్వంసం కేసును మోపారు. జర్నలిస్టులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టించి తన నియంతృత్వాన్ని ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులతో దౌర్జన్య కాండను సృష్టించారు. రుద్రకోట వద్ద గ్రావెల్ అక్రమ తవ్వకాలను వీడియోలు, ఫొటోలు తీసేందుకు ప్రయత్నించిన జర్నలిస్టులను ఆయన మనుషులు ఓ ఇంట్లో నిర్బంధించి కొట్టి బెదిరించే స్థాయికి వెళ్లారు. ఎమ్మెల్యే పాలనా వైఫల్యాలపై ప్రశ్నిస్తూ సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేసిన జర్నలిస్టులపైనా కేసులు కట్టించారు. వైఎస్సార్సీపీ నేతలపైన అయితే లెక్కలేనన్ని కేసులు పెట్టించారు. బోగోలు మండలం కోళ్లదిన్నెకు చెందిన వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ నేతలు దాడులు చేస్తే వారిపై కేసులు కట్టకుండా బాధితులపైనే కేసు నమోదు చేయించారు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే.. ఏకంగా ఆస్పత్రిలోకి వెళ్లి మరోసారి టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. అయినా టీడీపీ నేతలపై కేసుల్లేవు.మనీ స్కామ్లోనూ వాటాలపై ఆరోపణలు ముసునూరు కేంద్రంగా రూ.వందల కోట్ల మనీస్కామ్లో ఎమ్మెల్యేకు వాటాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో బాధితులకు న్యాయం చేసేందుకు సిద్ధపడిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డిని సైతం తన స్థాయిని మరిచి అసభ్యపదజాలంతో మీడియా ముఖంగా దూషణలకు దిగడంతోపాటు ఓ రేంజ్లో రెచ్చిపోవడం రాజకీయంగా కావ్య కృష్ణారెడ్డి విమర్శలు ఎదుర్కొన్నారు. సొంత పార్టీ నేతలపైనా అరాచకం నియోజకవర్గంలో సొంత పార్టీలో తనకు పోటీ ఉండకూడదని తన గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన మాలేపాటి సుబ్బానాయుడు, ముసునూరుకు చెందిన శ్రీహరినాయుడు వంటి కీలక నేతలపై కేసులు కట్టించారు. సొంత పారీ్టలో వర్గ విభేదాలు సృష్టించి వర్గ రాజకీయాలకు మరింత ఆజ్యం పోశాడన్న ఆరోపణలున్నాయి. ఆది నుంచి రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్న కావ్య ఎన్నికల సమయంలోనే టీడీపీ సీనియర్ నేత మన్నవ రవిచంద్రను అడ్డం వస్తే గొడ్డలితో నరికేస్తానంటూ బెదిరించిన ఘటన అప్పట్లోనే సంచలనం సృష్టించింది. కావలి సీటు ఇప్పించేందుకు సహకరించి ఎమ్మెల్యే విజయానికి సహకరించిన బీద రవిచంద్రతో అమీతుమీకి సిద్ధపడ్డాడు. ఆయన అనుచర వర్గాన్ని టార్గెట్ చేసి వారికి చుక్కలు చూపించాడు. గత ప్రభుత్వ హయాంలో పార్టీ జెండా మోసి డబ్బు సంచుల తూకంలో వెనకబడి సీటు త్యాగం చేసిన మాలేపాటి సుబ్బానాయుడు ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసి ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించాడన్న సంగతి తెలిసిందే. మాలేపాటిపై అక్రమ కేసులు నమోదు చేసి అధిష్టానం వద్ద చీవాట్లు తిన్నట్లు ప్రచారంలో ఉంది. మానసికంగా వేధింపులతో చివరకు మాలేపాటి ప్రాణాలు కోల్పోవడంతో ఎమ్మెల్యేపై సొంత పార్టీలోనే తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో పాటు ఆయన్ను అడ్డుకున్న విషయం తెలిసిందే. ముసునూరు చెందిన శ్రీహరినాయుడు ఓ సమస్య చెప్పుకునేందుకు వెళ్లిన సమయంలో బూతులు తిట్టినట్లుగా ఆయన స్వయంగా మాలేపాటి సంతాపసభలో చెప్పుకున్న సంగతి తెలిసిందే. స్వపక్షంలోనే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన్ను పార్టీ దూరంగా పెట్టింది. కావలి పెత్తనాన్ని బీద చేతుల్లో పెట్టింది.సీఎం చీవాట్లు పెడచెవినఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పనితీరు రాష్ట్ర స్థాయిలో ఆయనకు 107వ స్థానం ఉందని స్వయంగా సీఎం చంద్రబాబు చీవాట్లు పెట్టారు. వారం క్రితం కావలికి వచ్చిన సందర్భంలో చంద్రబాబు పార్టీ కేడర్ అంతర్గత సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో మూడు శాఖల పనితీరు ఆధ్వానంగా ఉంటే.. కావలి నియోజకవర్గంలో 11 శాఖల పనితీరు దారుణంగా ఉందని, ఇదేనా నీ పనితీరు అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఫెయిల్ అంటూ తలంటిపోశారు. ఓ పదిమందితో రాజకీయం చేస్తున్నావంటూ, ఇది మంచి పరిణామం కాదని, పార్టీలో అందరిని కలుపుకుపోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. సీఎం హెచ్చరించి ఐదు రోజులు గడవక ముందే.. మంచినీళ్లు అందించండంటూ కావలి మండలం చలంచర్ల పంచాయతీకి చెందిన కిషోర్ అనే టీడీపీ కార్యకర్త తన గ్రామస్తులతో వెళ్లి ఎమ్మెల్యేకు మొర పెట్టుకుంటే.. చెంపలు వాయించడం ఇప్పుడు ఆ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు టీడీపీలో హాట్టాపిక్ చర్చగా నడుస్తోంది. పార్టీ కేడర్ను కలుపుకుని పోవాలని ఆదేశిస్తే.. చెంపలు పగులగొట్టి కొత్త వివాదానికి తెరతీయడంపై అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. -
నెల్లూరులో టూరిస్టు బస్సు బోల్తా
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద చోటుచేసుకుంది. ఓ టూరిస్టు బస్సు అదుపు తప్పి బోల్తా పడిపోయింది. ఈ క్రమంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడటంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. నెల్లూరు హైవేపై ఏలూరు నుండి చైన్నై వైపు వెళ్తున్న టూరిస్ట్ బస్సు గురువారం ఉదయం బోల్తా పడింది. నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ జంక్షన్ వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ప్రమాదం సమయంలో బస్సులో సుమారు 38 మంది పెద్దలు, ఐదుగురు ప్రయాణిస్తున్నారు. అయితే, డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి పోలీసులు, సహాయక బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
వైఎస్ కుటుంబంపై దుష్ప్రచారాన్ని ఆపాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): దివంగత నేతలు వైఎస్ రాజారెడ్డి, రాజశేఖరరెడ్డిపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, వీటిని ఇప్పటికై నా ఆపాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ఇందిరా భవన్లో విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ప్రజలను కూటమి ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. సీమలో జరిగిన అరాచకాలను ఎదిరించి ప్రజల పక్షాన నిలిచిన వ్యక్తి వైఎస్ రాజారెడ్డి అని.. కడపలో ప్రజల కోసం 70 పడకల ప్రభుత్వాస్పత్రిని 1973లో నిర్మించి ఉచిత వైద్యాన్ని అందించారని గుర్తుచేశారు. పార్టీలకతీతంగా సుపరిపాలనను అందించి.. పేదల కోసం ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలను దివంగత సీఎం వైఎస్సార్ అమలు చేశారని కొనియాడారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వీరిపై దుష్ప్రచారాలు చేయడం తగదని హితవు పలికారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తలారి బాలసుధాకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 89,403 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 44,234 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.14 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనం 3 గంటల్లో, సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తుకు నిర్దిష్ట సమయంలో దర్శనం లభిస్తుంది. పక్కాగా ఓటరు జాబితా సమగ్ర సవరణ నెల్లూరు(అర్బన్): జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను పక్కాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. ఓటరు జాబితాకు సంబంధించిన విధివిధానాలపై కలెక్టరేట్లోని తన చాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘ మార్గదర్శకాల మేరకు ఓటరు జాబితాలను క్షుణ్ణంగా నవీకరించడం, ధ్రువీకరించడం, తప్పులను సరిదిద్దడమే లక్ష్యంగా సవరణ కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. లోపాల్లేని పారదర్శకమైన ఓటరు జాబితాకు రాజకీయ పార్టీలు, బూత్ లెవల్ ఏజెంట్లు సహకరించాలని కోరారు. వచ్చే నెల 15 నుంచి జూలై 14 వరకు బూత్ లెవల్ అధికారులు ఇంటింటి సర్వేను నిర్వహించి ఓటర్ల వివరాలను పరిశీలించనున్నా రని వెల్లడించారు. అదే సమయంలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియనూ పూర్తి చేయనున్నామని తెలిపారు. జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, అదే రోజు నుంచి ఆగస్ట్ 20 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరించనున్నామని ప్రకటించారు. సెప్టెంబర్ 18 వరకు అభ్యంతరాలను పరిష్కరించి.. అదే నెల 22న తుది ఓటరు జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నామన్నారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా చూడటం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, కచ్చితమైన ఓటరు జాబితాను తయారు చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. డీఆర్వో విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బక్రీద్ శుభాకాంక్షలు నెల్లూరు(అర్బన్): జిల్లాలోని ముస్లిం సోదరులకు కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం ఒక ప్రకటనలో బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలకు ప్రతీకగా బక్రీద్ నిలుస్తోందని తెలిపారు. ముస్లింలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఒక్కరిపై అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. -
వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం
తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జీలు, సమన్వయకర్తలతో సమావేశాన్ని పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై దిశానిర్దేశనం చేశారు. సమావేశంలో కాకాణి గోవర్ధన్రెడ్డి, ఆనం విజయకుమార్రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మేకపాటి విక్రమ్రెడ్డి, రాజగోపాల్రెడ్డి -
బోగోలు తీరంలో పెను విషాదం
పడవల్లో వెళ్లి ఉంటే.. బతికేవారు.. ● తెప్పలపై చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృత్యువాత ● మరో ఇద్దరు అన్నదమ్ములు గల్లంతు ● కుప్పకూలిన కుటుంబాలు తెప్ప ఒరిగింది.. తీరం విలపించింది. కడలినే నమ్ముకుని బతికిన కుటుంబాలను ఆ కడలే కబళించింది. ఆకలి వేటలో మృత్యు వలలో చిక్కి ఆశలే కూలిపోయాయి. విరుచుకుపడిన రాకాసి గాలులకు గుండెలు తల్లడిల్లాయి. వేకువ వెలుగులో.. కన్నీటి చీకట్లు అలముకున్నాయి. చేపల కూర కోసం తెప్పలపై వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారుల్లో ఇద్దరు మృత్యు వాత పడగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ దుర్ఘటనతో బోగోలు తీరంలో తీవ్ర విషాదం నెలకొంది. బిట్రగుంట: బోగోలు మండలంలోని తీరప్రాంత గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులు రెండు తెప్పల్లో వేటకు వెళ్లగా ఈదురుగాలుల రూపంలో మృత్యువు సముద్రంలో వీరికి ఎదురొచ్చింది. వేకువన నాలుగు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులకు తెప్ప బోల్తా పడి ఇద్దరు మత్స్యకారులు చనిపోగా, రెండో తెప్పలో అన్నదమ్ములైన మరో ఇద్దరు మత్స్యకారులు కూడా గల్లంతయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే తీరం తల్లడిల్లిపోయింది. వందలాది మంది మత్స్యకారులు తీరానికి చేరుకుని గొల్లుమన్నారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ప్రస్తుతం సముద్రంలో వేట నిషేధం అమల్లో ఉండడంతో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లడం లేదు. వలలు, పడవలు బాగు చేసుకుంటూ కడలి తీరాన సేద తీరుతున్నారు. పిల్లలు చేపల కూర అడిగారని.. దాదాపు నలభై రోజులకు పైగా వేటకు వెళ్లకపోవడం, పిల్లలు, కుటుంబ సభ్యులు చేపల కూర తినాలని అడిగారని అలిచెర్లబంగారుపాళెంకు చెందిన తూపిలి బాలమురళి (51), కుమారి గోవిందు (42)తోపాటు అదే గ్రామానికి చెందిన తులసింగారి రాజు, గణేష్ వేట నిబంధనల మేరకు తీరంలో బుధవారం వేకువన 3 గంటలకు రెండు కొయ్య తెప్పలపై వేటకు వెళ్లారు. తీరం వెంబడి కావడంతో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో బలమైన ఈదురు గాలులు వీయడంతో తెప్పలు తిరగబడడంతో బాలమురళి, గోవిందు మృత్యువాత పడ్డారు. మధ్యాహ్నం సమయానికి పాతపాళెం సమీపంలో తీరానికి వీరి మృతదేహాలు కొట్టుకువచ్చాయి. మరో తెప్పలో ఉన్న రాజు, గణేష్ ఆచూకీ బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు కూడా లభ్యం కాలేదు. ఈదురు గాలల తాకిడికి తెప్ప దూరంగా వెళ్లి ఉంటుందనే ఉద్దేశంతో మైరెన్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. కాగా ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మత్స్యకారులు మృత్యువాత పడడం, మరో ఇద్దరు గల్లంతు కావడంతో అలిచెర్లబంగారుపాళెం కన్నీటి సంద్రంగా మారింది. ఎవరిని కదిలించినా కన్నీరు తప్ప మాటలు రావడం లేదు. కంటికి రెప్పలా కాపాడే సముద్రమే కాటేసిందని కన్నీరు మున్నీర వుతున్నారు. మృతి చెందిన బాలమురళికి భార్య, ఇ ద్దరు పిల్లలు ఉండగా, గోవిందుకు కూడా భార్య ఇ ద్దరు పిల్లలు ఉన్నారు. గల్లంతైన రాజుకు భార్య, ఇ ద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. రాజు సోదరుడైన గణేష్ కు ఇంకా పెళ్లి కాలేదు. ఆయా కుటుంబాలకు వీళ్లే ఆధారం. ప్రస్తుతం వేట నిషేధ సమయం కావడంతో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దుర్ఘటనతో ఆయా కుటుంబాలు కుప్పకూలిపోయాయి. వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. తెల్లారేసరికి వస్తామన్నారు.. ప్రస్తుతం వేట నిషేధం కావడంతో బతుకుతెరువు కోసం కానీ.. ఇంట్లో అవసరాలకు తెప్పలపై వేట చేసే అవకాశం ఉండడంతో నలుగురు మత్స్యకారులు కూర కోసం చేపల వేటకు తెప్పలపై వెళ్లి మృత్యువాత పడ్డారని స్థానికులు విచారం వ్యక్తం చేశారు. పడవల్లో వెళ్లి ఉంటే.. బతికే వారన్నారు. వేట నిషేధ నిబంధనల మేరకే తెప్పలపై వెళ్లి వేట చేసుకోవడం నేరం కాదని మత్స్యశాఖాధికారులు చెప్పారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడ్డారని తెలిసిన వెంటనే మత్స్యశాఖ అధికారులు, బిట్రగుంట పోలీసులు, మైరెన్ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. మృతుల కుటుంబాలకు బీమా పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు మత్స్యశాఖ కావలి ఏడీ చాంద్బాషా తెలిపారు. సముద్రంలో వేట.. ఆటు పోట్లకు ఎదురెళ్లడం మత్స్యకారులకు అలవాటే. వేట నిషేధంతో ఖాళీగా ఉంటున్నా.. అప్పుడప్పుడూ చెక్క పడవలపై సరదాగా సముద్రంలోకి వెళ్లి.. ఇంట్లో కూర కోసం చేపలు తెచ్చుకోవచ్చు. అందులో భాగంగానే వేకువన 3 గంటల ప్రాంతంలో వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండడంతో నలుగురు మత్స్యకారులు రెండు తెప్పలపై వేటకు వెళ్లారు. వీరు వేటకు వెళ్లిన కొద్ది సేపటికే వాతావరణం భీతావాహకంగా మారడంతో కుటుంబ సభ్యులకు క్షణమొక యుగంగా మారింది. తమ వాళ్లు వెనక్కి వచ్చేయాలని వేయి దేవుళ్లకు మొక్కుకుంటూ ఉదయం వరకు ఎదురుచూశారు. ఉదయం ఆరు గంటలు అయినా.. తమ వాళ్లు రాకపోవడంతో తీరానికి వెళ్లి చూసినా.. కనుచూపులో వీరి జాడ కనిపించకపోవడంతో క్షణక్షణానికి ఆందోళన, భయంతో వణికిపోయారు. తీరానికి తెప్పలు కొట్టుకురావడంతో తమ వారు ప్రాణాలతో లేరని తెలిసి నలుగురి కుటుంబాలు తల్లడిల్లిపోయాయి. -
జిల్లాలో గాలీవాన
● పలుచోట్ల విరిగిన చెట్ల కొమ్మలు ● వర్షంతో కాస్త సేదతీరిన ప్రజలు ● మర్రిపాడులో 35.2 మిల్లీమీటర్ల వర్షపాతం నెల్లూరు (అర్బన్): జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 3.30 నుంచి ఈదురుగాలులు వీచాయి. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. అప్పటి వరకు భానుడి భగభగలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. అనేక మండలాల్లో పెద్ద ఎత్తున గాలులు వీయగా, పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షపాతమిలా.. మర్రిపాడు మండలంలో అత్యధికంగా 35.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరికుంటపాడులో 26.4, చేజర్లలో 25.2, ఆత్మకూరులో 22.6, దుత్తలూరులో 20.8, ఉదయగిరిలో 17.4, కలువాయిలో 17.0, వెంకటాచలంలో 14.4, రాపూరులో 12.6, అల్లూరులో 7.4, విడవలూరులో 7.2, బుచ్చిరెడ్డిపాళెంలో 5.8, బోగోలులో 5.6, దగదర్తిలో 5.4, అనంతసాగరంలో 5.2, తోటపల్లిగూడూరులో 4.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరికొన్ని మండలాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. విద్యుత్ శాఖకు రూ.15 లక్షల నష్టం నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు నగరంలో బుధవారం తెల్లవారుజామున వీచిన ఈదురుగాలులతో విద్యుత్ సంస్థకు రూ.15 లక్షల నష్టం వాటిల్లింది. నగరంలోని ఎంజీబీ మాల్ పక్కన వీధిలో ఓ భారీ చెట్టు లైన్లపై పడటంతో రెండు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పునరుద్ధరణ పనులను సిబ్బంది యుద్ధప్రాతిపదికన చేపట్టారు. 11 కేవీ స్తంభాలు 12.. ఎల్టీ స్తంభాలు ఏడు.. ట్రాన్స్ఫార్మర్లు మూడు దెబ్బతిన్నాయి. -
కుటిల యత్నాలను తిప్పికొట్టాలి
● మన పార్టీ ఓట్లను పదిలపరుచుకోవాలి ● కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు(వేదాయపాళెం): అధికార పార్టీ నాయకులు గెలుపే పరమావధిగా సాగించే అన్ని కుటిల యత్నాలను తిప్పికొట్టేందుకు బూత్ లెవల్ ఏజెంట్లు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. నగరంలోని గాంధీనగర్లో ఉన్న కల్యాణ మండపంలో సర్వేపల్లి నియోజకవర్గ బూత్ లెవల్ ఏజెంట్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం మన ప్రాధాన్యాంశంగా ఉండాలన్నారు. అదే సమయంలో అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా తగిన చర్యలు చేపట్టాలని వివరించారు. 2002లో ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించారని, తిరిగి 24 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న ప్రక్రియలో మన పార్టీ ఓట్లను పదిలపరుచుకోవాలని సూచించారు. చంద్రబాబుకు ఎటువంటి ముందుచూపు, పాలనపై పట్టులేవన్నారు. గజకర్ణ, గోకర్ణ విద్యలతో అక్రమంగా లబ్ధిపొందేందుకు ఎంతటి దుర్మార్గపు చర్యలకై నా పాల్పడగలడన్నారు. వైఎస్సార్సీపీ ఓట్లను తొలగించే ప్రయత్నాలు, కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గంలో కూడా దొంగఓట్లను చేర్పించిన ఘనుడు చంద్రబాబు అని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అధికార పార్టీకి కొందరు అధికారులు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని, జాబితాలో మార్పులు, చేర్పుల సమయంలో నిబంధనల మేరకు న్యాయబద్ధంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. సర్పంచ్లుగా చేసిన వారికి క్షేత్రస్థాయిలో ఓటర్ల పట్ల, గ్రామాలపై సమగ్రమైన అవగాహన ఉంటుందని, అటువంటి వారు బీఎల్ఏలుగా ఉండడం పార్టీకి ఎంతో కలిసొచ్చే అంశమని వెల్లడించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సర్పంచ్లను సోమిరెడ్డి అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశాడని, చెక్పవర్ నిలిపివేయడం, సర్పంచ్ పదవులను రద్దుచేయడం, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కలెక్టర్ సర్పంచ్లను తొలగించడం వంటి అనేక దుశ్చర్యలకు సోమిరెడ్డి పాల్పడ్డాడని తెలిపారు. వెంకటాచలం మండలానికి చెందిన రాజేశ్వరి అనే మహిళా సర్పంచ్ను సైతం అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిన ఘనత టీడీపీకి దక్కుతుందని పేర్కొన్నారు. పటిష్ట నాయకత్వం మన సొంతం వైఎస్సార్సీపీ కార్యకర్తలు అధైర్యపడవద్దని, విపత్కర పరిస్థితులలో ఎటువంటి దుర్మార్గపు శక్తులనైనా ఎదుర్కొనే పటిష్ట నాయకత్వం, ధైర్యం మనకు మాత్రమే సొంతమని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత అన్నారు. తన తండ్రి గోవర్ధన్రెడ్డిని అక్రమ కేసులతో జైలుకు పంపారని, అటువంటి కష్టకాలంలో ప్రతి కార్యకర్త, నాయకులు వెనక్కు తగ్గకుండా గుండెనిబ్బరంతో నిలబడ్డారని పేర్కొన్నారు. పార్టీ జెండాను తిరిగి బలంగా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని తెలిపారు. తొలుత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇటీవల పదవీ విరమణ పొందిన సర్పంచ్లను సన్మానించారు. సమావేశంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుట్టా శివశంకర్రెడ్డి, సర్వేపల్లి పరిశీలకుడు వీరి చలపతిరావు, పార్టీ జాయింట్ సెక్రటరీ మహేష్ తదితరులు ప్రసంగించారు. -
సెంబ్కార్ప్ కార్మికులకు కనీస వేతనాలివ్వాలి
నెల్లూరు(అర్బన్): ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామంలో ఉన్న సెంబ్కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ థర్మల్ విద్యుత్ కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆ సంస్థ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో నగరంలోని గాంధీబొమ్మ వద్ద నుంచి కలెక్టరేట్ వరకు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతర కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా పని చేస్తున్నప్పటికీ కార్మికులకు రూ.9 వేల నుంచి రూ.11 వేల వరకు మాత్రమే ఇస్తూ యాజమాన్యం శ్రమ దోపిడీ చేస్తోందన్నారు. అనేక దఫాలుగా జీతాలు పెంచాలని వినతులిచ్చి, చర్చలు జరిపినప్పటికీ యాజమాన్యం పట్టించుకోక పోగా పోలీసులను ఉపయోగించి కార్మికులను బెదిరించడం దుర్మార్గమన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే గత పది రోజులుగా విధులు బహిష్కరించి నిరసనలు చేస్తున్నారన్నారు. భూములు కోల్పోయిన నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి చివరికు కనీస వేతనాలు కూడా ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి ప్రతి కార్మికునికి రూ.26 వేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతి పత్రం ఇచ్చారు. స్పందించిన కలెక్టర్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సీఐటీయూ నాయకులు కె.పెంచలనరసయ్య, అంకయ్య, సుధాకర్, భాస్కర్, మస్తాన్ పాల్గొన్నారు. -
మార్ఫింగ్ ఆడియోలపై చర్యలు తీసుకోవాలి
కావలి: మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఆయన సోదరుడు చిరంజీవిని దుర్భాషలాడినట్లు కొందరు మార్ఫింగ్ ఆడియోలు చేసి ప్రజల్లో తీవ్ర గందరగోళం సృష్టించారని, దీనిపై పూర్తిస్థాయి విచారణ చేసి దోషులను శిక్షించాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కావలి డీఎస్పీ రమణకుమార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే విధంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మార్ఫింగ్ ఆడియోలను నమ్మి కొంతమంది మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరికలు చేయడం అత్యంత ప్రమాదకరమైన విషయమన్నారు. ఇది కేవలం నాయకులపై వ్యక్తిగత దాడి మాత్రమే కాకుండా ప్రతిపక్షాలను అణిచి వేయాలనే కుట్రగా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో ఇలాంటివి జరుగుతున్నా ప్రభుత్వం, పోలీసులు చూస్తూ ఊరుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకులు, ఇళ్లపై, కార్యకర్తలపై దాడులు చేసి బెదిరిస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఎవరి ప్రోత్సాహం ఉందో తెలియాలన్నారు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఆడియోలతో పాటు అసత్య ప్రచారాలతో రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడిస్తామని బెదిరింపులు చేసిన వారిపై కేసులు నమోదు చేసి శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పందిటి కామరాజు, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి నారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు జంపాని రాఘవులు, ప్రసాద్, కనపర్తి రాజా, ఆర్కే కృష్ణారెడ్డి, ముంగమూరు మహేష్రెడ్డి, యూత్ విభాగం నేతలు మహేష్, గనిబాయ్ పాల్గొన్నారు. -
బక్రీద్ను ఆనందంగా జరుపుకోవాలి
● పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నెల్లూరు(పొగతోట): త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండగను ముస్లింలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనలో ఆయన ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ధూ అల్ హిజ్జా అనే ఇస్లామిక్ నెలలో వచ్చే పండగ హజ్ యాత్ర ముగింపును సూచిస్తుందన్నారు. ఈ పండగ ప్రవక్త ఇబ్రహీం గొప్ప త్యాగాన్ని గుర్తు చేస్తుందన్నారు. దేశాన్ని చుట్టి రావడమే ధ్యేయం ● మారథాన్ రన్నర్ సూఫియా మనుబోలు: పరిగెడుతూ భారతదేశాన్ని చుట్టి రావడమే లక్ష్యమని ప్రసిద్ధ అల్ట్రా మారథాన్ రన్నర్ సూఫియా తెలిపారు. కన్యాకుమారి నుంచి కారకోరం పర్వతశ్రేణి వెళ్తూ మంగళవారం రాత్రి మనుబోలుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మనుబోలు హైవే వద్ద కొద్దిసేపు మీడియాతో ముచ్చటించారు. తన సొంత ఊరు రాజస్థాన్లోని అజ్మీర్ అని, మారథాన్ రన్నింగ్లో తాను పలు గిన్నీస్ రికార్డులు నెలకొల్పినట్లు తెలిపారు. 2019లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుమారు 4 వేల కిలోమీటర్ల దూరాన్ని వేగంగా పరిగెత్తిన మహిళా రన్నర్గా రికార్డు సాధించానన్నారు. ముంబై, చైన్నె, కోల్కతా, ఢిల్లీ నగరాలను కలిపే స్వర్ణ చతుర్భుజి రహదారిని 2021లో చుట్టి వచ్చినట్లు తెలిపారు. అలాగే హిమాలయ పర్వతాల్లోని ఐదు ఎత్తయిన పర్వత మార్గాల్లో సుమారు 480 కిలోమీటర్ల దూరాన్ని 98 గంటల 27 నిమిషాల్లో పూర్తి చేసి 2023లో రికార్డు నెలకొల్పినట్లు తెలిపారు. ఇలా ఇప్పటి వరకు ఐదు గిన్నీస్ రికార్డులు సాధించానన్నారు. ప్రస్తుతం కన్యాకుమారి నుంచి చైనా సరిహద్దులో లడఖ్ ప్రాంతంలో ఉన్న కారకోరం వరకు పరుగెడుతున్నట్లు తెలిపారు. రైల్లోంచి జారిపడి వ్యక్తికి తీవ్రగాయాలు కోవూరు: గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని పడుగుపాడు రైల్వేస్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. గూడూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైల్లో ప్రయాణిస్తున్న వ్యక్తి జారిపడి గాయపడడంతో గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రుని వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. న్యాయశాఖ ఉద్యోగులకు ఆత్మీయ సన్మానం నెల్లూరు (లీగల్): న్యాయ శాఖలో విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ చేసిన డి.ఆంజనేయులు, కె.శ్రీనివాసులు, జి.శ్రీరాములు, ఎండీ మహబూబ్బాషాలను న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. సుదీర్ఘకాలం న్యాయ శాఖలో క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందడం సంతోషకరమన్నారు. మరో ముగ్గురు అదనపు జిల్లా జడ్జిలు ఆర్.శరత్బాబు, జి.గీత, కె.శైలజ పాల్గొని, మాట్లాడారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి, సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పీవీ నారాయణరెడ్డి, వెంకటసునీల్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
తెగిన విద్యుత్ తీగలే.. యమపాశాలై..
మండల పరిధిలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వీచిన బలమైన ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలో చాలాచోట్ల విద్యుత్ తీగలు పంట పొలాలపై పడ్డాయి. వీటి గురించి తెలియకుండా ఎప్పటిలాగే పొలాల వద్దకు వెళ్లి ఓ మహిళ మరణించగా, మేత కోసం వెళ్లిన 13 గేదెలు మృత్యువాత పడ్డాయి. దీంతో ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. ●● తిరునాళ్లకు పుణే నుంచి వచ్చి మృతి సీతారామపురం: మండలంలోని కొయ్యలపాడు గ్రామంలో బుధవారం వేకువజామున చలసాని వెంకట సుబ్బమ్మ (53) అనే మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెంకట సుబ్బమ్మ తన భర్త, ఇద్దరు పిల్లలతో మహారాష్ట్రలోని పుణేలో స్థిరపడ్డారు. ఇటీవల గ్రామంలో తిరునాళ్ల, వివాహ కార్యక్రమాల్లో భాగంగా ఆమె 15 రోజుల క్రితం గ్రామానికి వచ్చారు. మరో రెండు మూడు రోజుల్లో పూణేకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం వీచిన బలమైన ఈదురు గాలులకు బహిరంగ ప్రదేశాల్లో అమర్చిన విద్యుత్ స్తంభాల కరెంటు తీగలు తెగిపడ్డాయి. బుధవారం వేకువజామున బహిర్భూమికి వెళ్లిన వెంకటసుబ్బమ్మ తెగిన తీగను గమనించకుండా కాలును కరెంటు వైరుపై పెట్టడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. వెంకట సుబ్బమ్మ అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అదుపుతప్పి జేసీబీని ఢీకొన్న బస్సు
● తొమ్మిది మందికి తీవ్రగాయాలు ● త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ● డ్రైవర్ నిద్రమత్తే కారణమంటున్న ప్రయాణికులుకోవూరు: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న జేసీబీని ఢీకొన్న ఘటన మండల పరిధిలోని పడుగుపాడు సెంటర్లో బుధవారం మధ్యాహ్నం 2.30 సమయంలో జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మందికి తీవ్రగాయాలు కాగా, 15 మందికి పైగా స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. కావలి నుంచి నెల్లూరుకు సుమారు 40 మంది ప్రయాణికులతో నాన్స్టాప్ ఆర్టీసీ బస్సు బయలుదేరింది. పడుగుపాడు సెంటర్లో రోడ్డు పక్కన పనులు జరుగుతుండగా బిహార్కు చెందిన కూలీలు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పడుగుపాడు సెంటర్కు వచ్చేసరికి బస్సు అదుపుతప్పి పక్కనున్న జేసీబీని ఢీకొట్టింది. ఈ క్రమంలో జేసీబీలో ఉన్న ముగ్గురు బిహార్కు చెందిన కూలీలతో పాటు బస్సులో ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిలో బిహార్కు చెందిన గణేష్కుమార్, అనంతకుమార్, రమేష్కుమార్తో పాటు బస్సులో ఉన్న శ్రీనివాసులు, శ్రీరామ్కుమార్, ఇమ్మానుయేల్, రమ్యశ్రీ, వినీత, మయూరి ఉన్నారు. అలాగే బస్సు డ్రైవర్కు కాలు విరగ్గా అతని పేరు తెలియరాలేదు. కాగా 15 మందికిపైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను నెల్లూరు, కోవూరు వైద్యశాలలకు తరలించారు. రాజుపాళెం నుంచే అదుపుతప్పినట్లుగా.. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని బస్సులోని ప్రయాణికుడు శ్రీనివాసులు తెలిపారు. రాజుపాళెం నుంచి బస్సు అదుపు తప్పినట్లు నడుస్తోందని, డ్రైవర్ అలసటతో ఉన్నట్లు కనిపించాడని తెలియజేశారు. ఎస్సై ముత్యాలరావు సిబ్బందితో కలిసి ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షుల వివరాలు సేకరించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం లేదా సాంకేతిక లోపం కారణమా అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. ప్రమాదంతో కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు రహదారిపై నిలిచిపోయిన బస్సును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. -
మేతకెళ్లి 13 గేదెలు మృత్యువాత
సీతారామపురం: మండలంలోని గంగవరం గ్రామంలో బుధవారం విద్యుదాఘాతానికి గురై ఏకంగా 13 గేదెలు మృతిచెందాయి. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆవుల పెద్ద వెంకటసుబ్బయ్య రోజూ మాదిరిగానే తమ గ్రామానికి చెందిన సుమారు 70 గేదెలను బుధవారం ఉదయాన్నే తోలుకొని మేతకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి వీచిన బలమైన ఈదురు గాలుల ధాటికి పొలంలో 11 కేవీ విద్యుత్ తీగ పడి ఉన్నది. గేదెలు అటువైపుగా వెళ్లి విద్యుత్ తీగను తగిలి ఒకదాని వెంట మరొకటి వరుసగా 13 గేదెలు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. గేదెలు ఉన్నట్టుండి పడిపోవడం ఆ ప్రాంతంలో మంటలు చెలరేగుతుండడాన్ని గమనించిన పశువుల కాపరి వెంటనే మిగిలిన గేదెలను అటువైపు వెళ్లనీయకుండా దారి మళ్లించడంతో మిగిలిన గేదెల ప్రాణాలు కాపాడగలిగాడు. లేకుంటే భారీ సంఖ్యలో గేదెలు మత్యువాత పడేవి. దీనిపై మాజీ సర్పంచ్ దుగ్గయ్యకు తెలపడంతో ఆయన వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించి విద్యుత్ సరఫరాను నిలిపి వేయించారు. ఈ ఘటనలో మేడిబోయిన సుబ్బమ్మ (3 గేదెలు), ఆవుల లక్ష్మి(2 గేదెలు), చిన్నదుగ్గయ్య (2 గేదెలు), రాగి లక్ష్మీదేవి(2 గేదెలు) బాలదుగ్గమ్మ, ఓబులమ్మ, వెంకటమ్మ, కోనమ్మలకు చెందిన 13 గేదెలు మృతి చెందడంతో సుమారు రూ.10 లక్షల మేర నష్టం వాటినట్లు బాధితులు వాపోతున్నారు. పాలకులు అధికారులు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఘటనా స్థలాన్ని విద్యుత్, పశు వైద్య శాఖ అధికారులు సందర్శించి జరిగిన దుర్ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
రేపు కొమ్మిపాడులో కలెక్టర్ పల్లెవీక్షణ
నెల్లూరు(అర్బన్): సైదాపురం మండలంలోని కొమ్మిపాడు గ్రామంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం పల్లె వీక్షణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారని జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ డీడీ వేణుగోపాల్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన స్వయంగా పరిశీలిస్తారన్నారు. నేడూ విద్యుత్ బిల్లులను చెల్లించొచ్చు నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ బిల్లులను నేడు బక్రీద్ సెలవు రోజు అయినప్పటికీ చెల్లించవచ్చని ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు గురువారం యథావిధిగా పనిచేస్తాయని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ఎన్నికల్లో విజయమే లక్ష్యం కావాలి
● బూత్ లెవల్ ఏజెంట్లు సైనికుల్లా పనిచేయాలి ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కావలి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు సైనికుల్లా పనిచేసి స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడమే లక్ష్యంగా కృషి చేయాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై బూత్ లెవల్ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమాన్ని పట్టణంలోని ఆరెస్సార్ కల్యాణ మండపంలో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. దివంగత సీఎం వైఎస్సార్ చిత్రపటానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుట్టా శివశంకర్రెడ్డి, జాయింట్ సెక్రటరీ మహేష్తో కలిసి నివాళులర్పించిన అనంతరం కాకాణి మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ అనేది పార్టీ శ్రేణులకు అత్యంత కీలకమని, ప్రతి ఏజెంట్ శ్రద్ధతో పనిచేయాలని కోరారు. ఈ ప్రక్రియపై పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని, ఈ తరుణంలో బీఎల్ఏలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. అప్రమత్తంగా ఉండి ఏ ఓటూ పోకుండా చూడాల్సిన అవసరం ఉందని వివరించారు. మోసాలు, కుట్రలు బాబుకు అలవాటే మోసం, కుట్ర, దగా చేయడం సీఎం చంద్రబాబుకు కొత్త కాదని, అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని విమర్శించారు. ఆయనకు పరిపాలన చేతకాదన్నారు. రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని మండిపడ్డారు. ప్రత్యర్థులను అనైతిక మార్గాల్లో దెబ్బతీయడం.. తన కుటుంబం రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందడమే చంద్రబాబు ఏకై క లక్ష్యమని ఆరోపించారు. వీటన్నింటినీ ప్రజలు గమనించి రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారీ మెజార్టీతో గెలిపించాలి రానున్న ఎన్నికల్లో కావలి నియోజకవర్గం నుంచి పార్టీ తరఫున రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పోటీ చేయనున్నారని, ఆయన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గతంలో మంత్రిగా తాను.. ఎమ్మెల్యేగా ఆయన ఉన్న సమయంలో కావలిని ఎంతో అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. నియోజకవర్గంలో సమస్యలు సృష్టించే నాయకుడు కావాలా.. లేక వీటిని పరిష్కరించి అభివృద్ధి చేసే నేత కావాలో మీరే నిర్ణయించుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో రామిరెడ్డిని గెలిపించుకోలేకపోయామనే బాధ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. గ్యాస్ స్టౌ ఆపి చేపల కూర వండిన సీఎంను తానెక్కడా చూడలేదని, ఇలాంటి వ్యక్తి మనకు అవసరమానని ప్రశ్నించారు. మత్స్యకారుల ఇళ్లకు జగన్మోహన్రెడ్డి లేదా తామెళ్తే వారు వండిందే తినొస్తామని పేర్కొన్నారు. అయితే వారిళ్లలో అన్నం తినడం ఇష్టం లేక చేపల కూర పెట్టుకొని స్పూన్తో తిన్నట్లు నటించి మెప్పించేందుకు చంద్రబాబు యత్నించారని విమర్శించారు. మత్స్యకారుల సంక్షేమానికి కృషి మత్స్యకారుల సంక్షేమం కోసం మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేశారని శివశంకర్రెడ్డి పేర్కొన్నారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం ఫిషింగ్ హార్బర్ను నిర్మించగా, ప్రస్తుత సీఎం హడావుడిగా వాటిని ప్రారంభించి తామే నిర్మించామని చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం ప్రత్యర్థులు ఆడుతున్న డ్రామాలను నమ్మొద్దని కోరారు. కావలిలో అరాచక పాలన కావలి నియోజకవర్గంలో అరాచక పాలన నడుస్తోందని రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఆరోపించారు. అక్రమ లేఅవుట్లు, దందాలను సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుత ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అశాంతిని నెలకొల్పి, తమ పార్టీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. పగలూ, రాత్రనే తేడా లేకుండా గ్రావెల్ను అక్రమంగా కొల్లగొట్టి, రేషన్ మాఫియాను నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు.దొంగ ఓట్లను చేర్చేందుకు యత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అర్హులైన ఓటర్లను తొలగించి.. దొంగ ఓట్లను చేర్చే యత్నాలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని కాకాణి ధ్వజమెత్తారు. బీఎల్ఏలు, కార్యకర్తలు సమర్థంగా వ్యవహరించి వీటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్రెడ్డి మరోసారి సీఎం అయితే తమ పరిస్థితి ఏమిటనే భయం కూటమి నేతలతో పాటు చంద్రబాబులో నెలకొందని చెప్పారు. అభివృద్ధిని విస్మరించి ప్రజలను పక్కదోవ పట్టిస్తూ పబ్బం గడుపుకొంటున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయ్యాక.. ఆ పార్టీ శ్రేణులకు దూరంగా చంద్రబాబు ఉన్న అంశాన్ని గుర్తుచేశారు. అదే ప్రస్తుతం తమ పార్టీ అధికారంలో లేకపోయినా, పార్టీ నేతలు, కార్యకర్తలకు జగన్మోహన్రెడ్డి అండగా ఉండి.. వారి సమస్యలను పరిష్కరించడమే కాకుండా భరోసా ఇస్తున్నారని వివరించారు. తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించి మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా చంద్రబాబు కుట్రలు చేస్తారని మండిపడ్డారు. ఒకసారి జాబితా నుంచి ఓటును తొలగిస్తే దాన్ని తిరిగి పొందడం ఎంతో శ్రమతో కూడుకున్న పని అని గుర్తుచేశారు. దాదాపు 60 రోజుల పాటు ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం జరగనుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
నిర్లక్ష్యం నీడలో ‘ఉపాధి హామీ’
నెల్లూరు(పొగతోట): జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో ఫీల్డ్ అసిస్టెంట్ల (ఎఫ్ఏ) కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనిచేస్తున్న దాదాపు 90 శాతం మందిని తొలగించడంతో గ్రామీణ ప్రాంతాల్లో పనుల నిర్వహణ దారుణంగా మారింది. కొత్త నియామకాల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో జిల్లా వ్యాప్తంగా సగానికిపైగా గ్రామ పంచాయతీలు ప్రస్తుతం ఎఫ్ఏలు లేకుండానే కొనసాగుతున్నాయి. జిల్లాలో 701 గ్రామ పంచాయతీలున్నాయి. సుమారు 400 పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు లేరు. 2.78 లక్షల జాబ్కార్డులు ఉండగా, 4.58 లక్షల మంది శ్రామికులు నమోదై ఉన్నారు. వీరిలో 3.48 లక్షల మంది యాక్టివ్ శ్రామికులు. అయినా సరిపడా సిబ్బంది లేకపోవడంతో పనుల కల్పనలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గతేడాది ఇదే సీజన్లో రోజుకు 80 నుంచి 85 వేల మంది వరకు శ్రామికులు పనులకు హాజరయ్యేవారు. ఇటీవల ఆ సంఖ్య 20 వేల వరకు పడిపోయింది. డ్వామా కొత్త పీడీ సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. సిబ్బందిపై ఒత్తిడి పెంచి, గ్రామాల వారీగా శ్రామికులను పనులకు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో రోజుకు 45 నుంచి 50 వేల మంది వరకు పనులకు హాజరవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాజకీయ కారణాలతో.. 15 ఏళ్లుగా పనిచేస్తున్న అనేకమంది ఫీల్డ్ అసిస్టెంట్లను వైఎస్సార్సీపీ అనుకూలంగా వ్యవహరించారనే సాకు చూపి తొలగించారు. ఎటువంటి ఆరోపణలు లేకపోయినా రాజకీయ కారణాలతోనే తొలగింపులు జరిగాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కోర్టును ఆశ్రయించి అనుకూల ఉత్తర్వులు తెచ్చుకున్నా.. వాటి అమలులో అధికారులు నిర్లక్ష్యం వహించారనే విమర్శలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో కొత్త ఎఫ్ఏల నియామకాలకు ప్రయత్నాలు జరిగినా, నిబంధనలు అడ్డంకిగా మారడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయినట్లు సమాచారం. ఫలితంగా వందలాది గ్రామ పంచాయతీలు ప్రస్తుతం ఎఫ్ఏలు లేకుండానే నడుస్తున్నాయి. అదనపు భారం ఎఫ్ఏలు లేని ప్రాంతాల్లో మేట్లను ఇన్చార్జిలుగా నియమించాలని భావించారు. అయితే అది పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన నిబంధనల ప్రకారం పనులకు హాజరైన శ్రామికుల ఫొటోలను రోజుకు రెండుసార్లు మొబైల్ యాప్లో అప్లోడ్ చేయాలి. ఒక గ్రామ పంచాయతీలో 150 మంది వరకు పనులకు హాజరవుతుంటే, వారి ఫొటోలను రెండు విడతల్లో అప్లోడ్ చేయడం తీవ్ర ఇబ్బందిగా మారుతోంది. ప్రస్తుతం చాలాచోట్ల ఒక్క ఫొటో మాత్రమే అప్లోడ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఒకసారి ఫొటోలు అప్లోడ్ చేయడానికే రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోందని సిబ్బంది చెబుతున్నారు. ఈ సమస్యను తగ్గించేందుకు ప్రతి 30 మంది శ్రామికులకు ఒక మేట్ను నియమించి, వారి మొబైల్ ఫోన్లను రిజిస్టర్ చేయించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. అయితే గతంలో 30 మంది శ్రామికులను పర్యవేక్షించినందుకు మేట్లకు రూ.60 వరకు చెల్లింపులు ఉండేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో మేట్లు మొబైల్ రిజిస్ట్రేషన్కు ఆసక్తి చూపడం లేదు. వేతనాల మంజూరులో జాప్యం ఫొటో అప్లోడ్ ప్రక్రియ సక్రమంగా పూర్తి కాకపోతే శ్రామికుల వేతనాలు జమ కావడం లేదు. కొన్ని గ్రామాల్లో నెలల తరబడి వేతనాలు పెండింగ్లో ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా రాజకీయ కారణాలతో కొంతమందిని పనులకు రానివ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. గతంలో అనేక పనులను అధికారులు రద్దు చేయడంతో గ్రామాల్లో పనుల కొరత ఏర్పడింది.వేధిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల కొరత సగానికిపైగా పంచాయతీల్లో ఖాళీలు పనుల కల్పనలో జాప్యం మొబైల్ రిజిస్ట్రేషన్తో కొత్త సమస్యలు -
జిల్లాలో మాతాశిశు మరణాల నమోదు
● డీఎంహెచ్ఓ సుజాత నెల్లూరు(అర్బన్): ఏప్రిల్ నెలతోపాటు ప్రస్తుత మే నెలలో జిల్లాలో ఒక మాతృ, ఆరుగురు శిశువుల మరణాలు నమోదయ్యాయని డీఎంహెచ్ఓ సుజాత తెలిపారు. మంగళవారం నెల్లూరులోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో మాతాశిశు మరణాలపై సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఈ మరణాలకు గల కారణాలు, లోపాలపై సంబంధిత వైద్యులు, ఏఎన్ఎంలను ప్రశ్నించి వివరాలు సేకరించారు. గర్భం దాల్చిన ప్రతి మహిళను వెంటనే గుర్తించి రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు. గర్భధారణ ప్రారంభం నుంచి ప్రసవం వరకు ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సూచించారు. గర్భిణులకు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు రక్తహీనత రాకుండా ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు తప్పనిసరిగా అందించాలని తెలిపారు. అధిక రక్తపోటు వంటి హైరిస్క్ కేసులను ముందుగానే గుర్తించి వారికి ప్రత్యేక వైద్యం అందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుఖప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పుట్టిన శిశువులకు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని, షెడ్యూల్ ప్రకారం సమయానికి టీకాలు వేయించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి (డీసీహెచ్ఎస్) డాక్టర్ పరిమళ, జీజీహెచ్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ గీతాలక్ష్మి, డాక్టర్ కళ్యాణ్కుమార్, డాక్టర్ మేరీ స్నిగ్ధ, డాక్టర్ శోభారాణి, పీడియాట్రిక్ వైద్యుడు డాక్టర్ శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పాముకాటుకు మహిళ మృతి
నెల్లూరు సిటీ: పాముకాటుకు గురై మహిళ మృతిచెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలంలోని కొత్త వెల్లంటిలో మనవరపు మమత (42) నివాసం ఉంటోంది. భర్త కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మమత ఇంటి వద్ద టిఫిన్ అంగడి నిర్వహిస్తోంది. ఆమెకు పూజిత, నిఖిత అనే కుమార్తెలున్నారు. పూజిత చైన్నెలో ఉద్యోగం చేస్తుండగా, నిఖిత చదువుకుంటోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 8:30 నిమిషాలకు మమత ఇంట్లో పనిచేస్తోంది. ఆ సమయంలో పాము కాటు వేసింది. దీంతో బయటకు వచ్చి తనను పాము కాటు వేసిందని, జెర్రిపోతై ఉండొచ్చని భావించింది. దీంతో స్థానికంగా ఉండే ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు చికిత్స నిమిత్తం వెళ్లింది. అతను ఇంజెక్షన్ వేశాడు. కొంతసేపటికి ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు సౌత్మోపూరు పీహెచ్సీకి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి పరిస్థితి విషమంగా ఉందని, నెల్లూరులోని పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని తెలిపారు. వెంటనే ఆటోలో నెల్లూరుకు మమతను తరలిస్తుండగా ములుమూడి వద్ద చనిపోయింది. ఘటన జరిగిన రెండు గంటల వ్యవధిలో మృతిచెందింది. స్థానికులు నాగుపాముగా గుర్తించి చంపివేశారు. కాగా కుమార్తెలిద్దరూ ఒంటరి వారయ్యారు. -
పొగాకు కిలోకు రూ.350 చెల్లించాల్సిందే
ఆత్మకూరు: కూటమి పాలనలో వ్యవసాయం నిర్వీర్యమైందని, ప్రస్తుతం పొగాకు రైతుల ఇక్కట్లు దారుణంగా మారాయని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిట్టుబాటు ధరల్లేక బోర్డు ముందే పొగాకు రైతులు ధర్నాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వీరి పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకొని కిలోకు రూ.350 చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేసేలా ఆదేశించాలని డిమాండ్ చేశారు. తేలిక నేలల్లో పండే నాణ్యమైన పొగాకును డీసీపల్లి వేలం కేంద్రం ద్వారా విక్రయానికి రైతులు పెడతారని, అలాంటి దాని ధరలను సైతం బయ్యర్లు సిండికేట్గా మారి తగ్గించేయడం దారుణమన్నారు. సర్కార్ ఇప్పటికై నా ఈ విషయంలో జోక్యం చేసుకొని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. డీసీపల్లిలో 241 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 241 బేళ్లను మంగళవారం విక్రయించారని నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. వేలానికి 320 బేళ్లు రాగా, వీటిలో 241ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 33,753.8 కిలోల పొగాకును విక్రయించగా, రూ.73,55,834 వ్యాపారం జరిగిందని వెల్లడించారు. గరిష్టంగా కిలో రూ.250.. కనిష్టంగా రూ.190.. సగటు ధర రూ.217.93గా నమోదైందని పేర్కొన్నారు. ఎనిమిది కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారని వివరించారు. కేజీబీవీల్లో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు (టౌన్): జిల్లాలోని ఏడు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టులకు సంబంధించి 2026 – 27 విద్యా సంవత్సరంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావలి, నందిపాడులోని కేజీబీవీల్లో పీఈటీ – 2.. నందిపాడులో మ్యాఽథ్స్.. సీతారామపురంలో తెలుగు.. మర్రిపాడులో ఫిజికల్ సైన్స్.. కలిగిరిలో మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్డబ్ల్యూ) పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. kgbvrecruitment.apcfss.in ద్వారా దరఖాస్తులను పంపాలని కోరారు. దరఖాస్తు రుసుముగా రూ.300ను చెల్లించాలన్నారు. ఈ ఏడాది జూలై ఒకటి నాటికి ఓపెన్ కేటగిరీ, ఎక్స్ – సర్వీస్ ఉమెన్ అభ్యర్థుల వయస్సు 18 నుంచి 45.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50 ఏళ్లు.. దివ్యాంగులకు 52 ఏళ్లు ఉండాలని తెలిపారు. జిల్లాలో టెట్, బీఈడీ, పీజీ అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు అర్హులని, ఆసక్తి గల వారు వచ్చే నెల ఐదులోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 70750 39990, 79933 29115 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఫలితాల్లో తక్కువ శాతం తెచ్చిన తంటా ● ఐదుగురు చొప్పున ప్రిన్సిపల్స్, పీజీటీలకు నోటీసులు నెల్లూరు (టౌన్): పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో కందుకూరు నియోజకవర్గంలో తక్కువ పాస్ పర్సంటేజీ వచ్చిన కేజీబీవీల ప్రిన్సిపల్స్, పీజీటీలకు నోటీసులను సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య మంగళవారం జారీ చేశారు. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర యావరేజ్ 85 శాతం కాగా, 79.5 శాతం ఫలితాలు రావడంతో గుడ్లూరులోని మొగళ్లూరు కేజీబీవీ ప్రిన్సిపల్కు నోటీసులు పంపారు. ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర సగటు 81 శాతం కాగా, కందుకూరు నియోజకవర్గంలోని వీవీపాళెంలో 75.. ఉలవపాడులో 77.. కందుకూరులో 45.8.. లింగసముద్రంలో 66.6 శాతం ఉత్తీర్ణత రావడంతో అక్కడి కేజీబీవీల ప్రిన్సిపల్స్కు నోటీసులను జారీ చేశారు. వీరితో పాటు ఆయా సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు రావడంతో ఐదుగురు పీజీటీలకూ నోటీసులు జారీ అయ్యాయి. వీరందరూ వారంలో వివరణ పంపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వీటిని సమగ్రశిక్ష రాష్ట్ర అధికారులకు పంపి, వారి నిర్ణయం మేరకు చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. ఏపీఈడీ సెట్ ఫలితాల విడుదల ● సీతారామపురం వాసికి ద్వితీయ ర్యాంక్ నెల్లూరు (టౌన్): రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఈడీసెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. ఈ నెల ఎనిమిదిన నిర్వహించిన ఈ పరీక్షకు జిల్లాలో 1200 మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇంగ్లిష్ మెథడాలజీలో సీతారామపురానికి చెందిన మామిడి శివ 126 మార్కులతో రాష్ట్రంలో ద్వితీయ ర్యాంక్ను సాధించారు. -
‘నకిలీ కూలీల’పై విచారణ
● ఏపీఓ, ఎఫ్ఏకు షోకాజ్ నోటీసులు ● విచారణ పూర్తయ్యేంత వరకు జీతం నిలిపివేత చేజర్ల: ఉపాధి హామీలో నకిలీ కూలీల ఉదంతంపై చేజర్ల మండలంలోని ఉపాధి కార్యాలయంలో విచారణను డ్వామా ఏపీడీ శంకర్నారాయణ మంగళవారం చేపట్టారు. ఉపాధిలో నకిలీ కూలీలు అనే శీర్షికన సాక్షిలో కథనం సోమవారం ప్రచురితమైన నేపథ్యంలో విచారణకు కలెక్టర్ ఆదేశించారు. ఈ తరుణంలో చేజర్ల ఏపీఓ వెంకటేశ్వర్లు, క్షేత్ర సహాయకుడు వెంకటరమణారెడ్డికి షోకాజ్ నోటీసులను అందజేశారు. విచారణ పూర్తయి నివేదికను ఉన్నతాధికారులకు అందించి తదుపరి చర్యలు చేపట్టేంత వరకు వీరికి సంబంధించిన నెలవారీ జీతాల జారీని నిలిపేయించామని ఏపీడీ తెలిపారు. సమగ్ర ఎంకై ్వరీ చేజర్ల గ్రామ పంచాయతీకి సంబంధించిన మస్తర్లు, కూలీల నమోదు, ముఖ హాజరు లొకేషన్, ఏ సమ యానికి హాజరు తీసుకుంది, నకిలీ కూలీల పేరుతో ఎంత మొత్తాన్ని డ్రా చేశారు తదితర అంశాలను ఏపీడీ పరిశీలించారు. నకిలీ కూలీల మస్తర్ల నమోదు ద్వారా నగదు డ్రా చేసిన విషయాన్ని ప్రాథమికంగా నిర్ధారించారు. ఏపీఓ, క్షేత్ర సహాయకుడి నిర్లక్ష్యం కనిపిస్తోందని, వారిచ్చే వివరణ, విచారణ నివేదికను కలెక్టర్కు సమర్పించనున్నామని వెల్లడించారు. -
ఎరువు.. బరువు
● కాంప్లెక్స్ ఎరువుల ధరలకు రెక్కలు ● ఖరీఫ్ వరి సాగుపై రైతుల ఆందోళన ● ఇప్పటికే పెరిగిన సాగు ఖర్చులు ● సంక్షోభంలో వ్యవసాయ రంగంపొదలకూరు: వ్యవసాయ రంగం ఇప్పటికే సంక్షోభంలో ఉంది. పెరుగుతున్న సాగు ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఒక్కసారిగా పెరగడం రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. యూరియా, డీఏపీ ధరలను యథాతథంగా ఉంచిన కేంద్ర ప్రభుత్వం, పంటల సమతుల్య పోషణకు కీలకమైన కాంప్లెక్స్ ఎరువుల ధరలను మాత్రం పెంచినట్లు తెలుస్తోంది. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో సుమారు 7 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. ఇందులో యూరియాతో పాటు వివిధ కాంప్లెక్స్ ఎరువుల వినియోగం అధికంగా ఉంటుంది. అయితే తాజాగా ధరల పెరుగుదలతో సాగు వ్యయం మరింత పెరిగే పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు ఖర్చులు పెరిగే అవకాశం ఖరీఫ్ ఎడగారు వరిసాగుకు రబీ సీజన్ కంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడం, నాట్లు, కోతల వరకు డీజిల్ ధరలకు రెక్కలు రావడంతో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రబీలో ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.40 వేలు పెట్టిన రైతులు ఖరీఫ్లో మరో రూ.5 వేలు అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. రైతులు అధికంగా వినియోగించే 20:20:0:13 రకం బస్తా ధర భారీగానే పెరిగింది. ఇందులో 13 శాతం గంధకం ఉంటుందని గతేడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది 50 కేజీల బస్తా 133 శాతం ధర ఎగబాకినట్టు తెలుస్తోంది. కొన్ని కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల ధరలను త్వరలో పెంచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు వ్యాపారులు అంటున్నారు. 14:35:14, 10:26:26, 16:20:0:13, 28:28:0 తదితర రకాలను రైతులు వినియోగిస్తుంటారు. వీటి ధరలు బస్తాపై రూ.300 పెరిగినట్టుగా వ్యాపారులు వెల్లడిస్తున్నారు. సమాచారమేదీ? ఎరువుల ధరలు ఎప్పుడు ఎంత పెరుగుతున్నాయో రైతులకు సమాచారం ఉండటం లేదు. రేట్లు పెరిగే సమయంలో వారి నుంచి ప్రకటనలు కూడా ఉండటం లేదని అంటున్నారు. నిబంధనల ప్రకారం వ్యాపారులు ఎమ్మార్పీ కంటే అదనంగా ఎరువుల విక్రయాలు ఉండకూడదు. అయితే కొందరు పెరిగిన ధరలను సాకుగా చూపుతూ పాత ధరల ఎరువులను కూడా కొత్త ఎమ్మార్పీలకు విక్రయిస్తున్నారు. ఇలాంటి సమయంలో వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో వారి సిబ్బంది ద్వారా సమాచారమిచ్చేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.ఎరువు ధర ఫిబ్రవరిలో.. ప్రస్తుతం 20:20:0:13 రూ.1,500 రూ.2,250 14:35:12 రూ.2,150 రూ.2,350 10:26:26 రూ.1,950 రూ.2,250 పొటాష్ రూ.1,850 రూ.1,973 28:28 రూ.1,800 రూ.2,200 ధరలు భరించలేకున్నాం కాంప్లెక్స్ ఎరువుల ధరలను రైతులు భరించలేకపోతున్నారు. ప్రతి ఏడాది ఎంతో కొంత పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు విపరీతంగా పెంచేయడం జరిగింది. రైతులు వ్యవసాయం మానుకునే పరిస్థితి రాబోతున్నట్టు అర్థమవుతోంది. వ్యవసాయ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. – కేతు రామిరెడ్డి, రైతు, కొనగలూరు వ్యవసాయానికి కష్టకాలం వ్యవసాయానికి కష్టకాలం వచ్చింది. ఎడగారు వరిసాగు నాట్లు వేస్తున్నాం. విత్తనం నుంచి విక్రయం వరకు రైతుల బాధలు వర్ణనాతీతం. డీజిల్ ధరలు పెరగడంతో వరి సాగు ఖర్చులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ధాన్యానికి గిట్టుబాటు ధరలు లభించకుంటే కోలుకునే పరిస్థితి ఉండదు. – పి.లచ్చారెడ్డి, రైతు, తాటిపర్తి -
కూటమి ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం
● బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రాధ్యక్షుడు నాగకిషోర్ యాదవ్ నెల్లూరు(వేదాయపాళెం): కూటమి ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరుగుతోందని, ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రాధ్యక్షుడు బొమ్మి నాగకిషోర్ యాదవ్ విమర్శించారు. మంగళవారం నెల్లూరులోని జిల్లా యాదవ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటించిన హామీలు అమలుకాక నీటిమూటలుగా మిగిలిపోయాయని ఆరోపించారు. 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్, రక్షణ చట్టం, సబ్ప్లాన్, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు, కార్పొరేషన్ నిధులు, విదేశీ విద్య పథకం వంటి పథకాలేవీ అమల్లోకి రాలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం బీసీలను కులవృత్తుల పేరుతో విభజించి వారిని అదే వృత్తులకు పరిమితం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 ఎమ్మెల్యే స్థానాల్లో కనీసం ఒక్క సీటు కూడా బీసీలకు కేటాయించకపోవడం టీడీపీ చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో 50 శాతం కంటే ఎక్కువగా ఉన్న బీసీలకు సరైన ప్రాధాన్యత, గుర్తింపు దక్కడం లేదన్నారు. జిల్లాలోని 10 ఏఎంసీల్లో బీసీలకు కేటాయించిన ఏకై క స్థానాన్ని కూడా ఇప్పటి వరకు భర్తీ చేయలేదని దుయ్యబట్టారు. బీసీలకు కేటాయించిన ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ పదవిని వెంటనే కేటాయించాలన్నారు. ప్రభుత్వం కాకుండా బీసీ వ్యతిరేక కూటమిగా మారుతోందనే అనుమానం వ్యక్తమవుతోందన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సమాది శ్రీనివాసులు, వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్యం గౌడ్, రావులపల్లి వెంకటజ్యోతి, గురవయ్య, రాజగోపాల్, గంగుల మధుసూదన్రావు, గోపాల్, సుబ్రహ్మణ్యం, కిషోర్, ఏవీ లక్ష్మి, పాలూరు లక్ష్మి, అన్నంగి రమణయ్య, జెట్టి వేణు పాల్గొన్నారు. -
పేదల గొంతు కోస్తామంటే ఊరుకోం
● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నెల్లూరురూరల్: అభివృద్ధి పేరుతో రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి నారాయణ పేదల గొంతు కోస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఘాటుగా హెచ్చరించారు. నెల్లూరులోని ఐదో డివిజన్ పాత చెక్పోస్టు సెంటర్ జాఫర్సాహెబ్ కాలువ పక్కన నివాసముంటున్న పేదలు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా ఆదేశాలివ్వడంతో ఆయన మంగళవారం వారివద్దకెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ‘ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. మమ్మల్ని అధికారులు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటున్నారు. లేకుంటే జేసీబీతో ఇళ్లను కూల్చి వేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు’ అని స్థానికులు చంద్రశేఖర్రెడ్డికి గోడు వెళ్లబోసుకున్నారు. మరోచోటికి వెళ్తే బతకలేమని, ఈ ప్రాంతంలోనే తమకు నివాసాలు కట్టించి ఇచ్చేలా ప్రభుత్వంతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. అండగా ఉంటాం పేదలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వంతో మాట్లాడతానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఇళ్లు కూలదోస్తామని అధికారులు బాధితులను భయపెట్టడం అత్యంత దుర్మార్గమన్నారు. ఒక్కసారిగా ఖాళీ చేసి వెళ్లాలంటే పెదలు ఎక్కడికి వెళ్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంత్రి నారాయణ నిజంగా ఇక్కడ అభివృద్ధి ఇస్తామంటే దానిని వైఎస్సార్సీపీ స్వాగతిస్తుందన్నారు. మంత్రి తన ఎన్ టీం కోసమే ఈ విధంగా పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాలువ రివిట్మెంట్ పనులు చేపడుతున్నామనే పేరుతో పేదలను మరోచోటుకు పంపాలనుకోవడం సరికాదన్నారు. పనులు చేపట్టాలని నిజంగా భావిస్తే ఎంతవరకు స్థలం కావాలో అంతమేర కొలతలు వేయాలన్నారు. అక్కడి వరకు వదిలేసి మిగిలిన స్థలంలో పేదలకు నివాసాలు కల్పించాలన్నారు. నారాయణ ఇక్కడ రివిట్మెంట్ పనులు చేపట్టి అనంతరం దుకాణాలు ఏర్పాటు చేసి తన ఎన్ టీం సభ్యులకు ఇవ్వాలన్న ఆకాంక్షతోనే ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. అలా దుకాణాలు కేటాయిస్తే మొదట ఇక్కడ స్థానికులకే ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా కాదని నగరపాలక సంస్థ కమిషనర్ ఏకపక్షంగా ముందుకెళ్తే వైఎస్సార్సీపీ పేదల పక్షాన నిలబడి పోరాడుతుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
పరాకాష్టకు పచ్చ పైత్యం
● మహానాడు ప్రచారానికి టీడీపీ నేతల నికృష్టం ● ప్రసిద్ధ చాముండేశ్వరి ఆలయం పసుపు రంగుల మయం ● అమ్మవారి విడిది కార్యక్రమాన్ని నిలిపివేసిన చైర్మన్ ● భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వైనం ఇందుకూరుపేట: టీడీపీ నేతలకు దేవుళ్లన్నా.. దేవాలయాలన్నా.. భక్తి, భయం లేకుండాపోయింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పార్టీ అధినేత ఏకంగా దేవదేవుడైన వేంకటేశ్వరస్వామిని లడ్డూ ప్రసాదాల పేరుతో వాడుకుంటే.. స్థానిక నేతలు ఏకంగా మహిమాన్విత అమ్మవారి ఆలయాన్ని వాడుకోవడాన్ని భక్త జనులు జీర్ణించుకోలేపోతున్నారు. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా, భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతోన్న గంగపట్నం చాముండేశ్వరీ దేవి ఆలయాన్ని పాలక మండలి రాజకీయ ప్రచారానికి వేదికగ్గా మార్చేసింది. ఆలయానికి జిల్లా నుంచే పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి అమ్మ వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటుంటారు. ఇంతటి ప్రాచూర్యం, విశిష్టత కలిగిన ఆలయ ప్రాంగణాన్ని మహానాడు ప్రచార పైత్యంతో పసుపు రంగులతో ముంచెత్తారు. భక్తుల మనోభావాలతో పనిలేదన్నట్లుగా పచ్చ నేతలు నికృష్ట చర్యలు పరాకాష్టకు చేరాయంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయంలో హుండీలు, గోడలతోపాటు అమ్మవారి ఆలయం ప్రాంగణంలోని కల్యాణ మండపానికి సైతం పసుపు రంగులు పులిమేశారు. ఇందు కోసం ఏకంగా అమ్మవారి విడిది కార్యక్రమాన్ని నిలిపివేసి అపచారానికి పాల్పడ్డారు. అధికార మదంతో.. చారిత్రాత్మకమైన ఆలయంలో ఇప్పటి వరకు పలు పార్టీలకు చెందిన నాయకులు చైర్మన్లుగా, ధర్మకర్తలుగా పని చేశారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుత చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి ఆలయాన్ని రాజకీయ ప్రచార వేదికగా మార్చేయడాన్ని చూసి భక్తులు మండి పడుతున్నారు. అధికార మదంతో అమ్మవారి ఆలయానికి పసుపు రంగులేసి వివాదానికి తెర తీశారు. భక్తులు కానుకలు సమర్పించేందుకు ఆలయంలో హుండీలు ఏర్పాటు చేశారు. ఆలయం తీర ప్రాంతంలో ఉండడంతో హుండీలు తుప్పు పట్టకుండా స్టీల్తో తయారు చేసిన హుండీలను ఏర్పాటు చేశారు. ఎన్నడూ లేని విధంగా హుండీలకు పసుపు రంగును పులిమేశారు. సంప్రదాయంగా పవిత్రతగా పసుసు వస్త్రాన్ని చుడుతారు. కానీ హుండీలకు పూర్తిగా పసుపు రంగు పూసేశారు. కల్యాణ మండప భవనానికి పసుపు రంగులు వేయడం చూసిన టీడీపీ వర్గీయులే ఇదెక్కడ పైత్యమంటూ అసహ్యించుకుంటున్నారు. వారి తీరును బహిరంగంగా విమర్శలేక తమలో తాము మదన పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.అమ్మవారి రాకను ఆపేశారు మరో నెల రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగా మంచి రోజును చూసుకొని అమ్మవారిని (ఉత్సవ మూర్తి) ఊరి బయట ఉన్న ఆలయం వద్ద నుంచి గ్రామంలో ఉన్న శివాలయంలోకి తీసుకొచ్చి విడిది చేయిస్తారు. మేళతాళాల నడుమ చిన్న ఊరేగింపుగా తీసుకురావడం ఆనవాయితీ. ఈ తంతును గ్రామస్తులు, ఆలయ అధికారులు నాలుగు రోజుల క్రితం పూర్తి చేసేందుకు అంతా సిద్ధం చేశారు. అయితే పాలక మండలి చైర్మన్ అధికార మదంతో పసుపు రంగుల పైత్యానికి ఇబ్బందులు వస్తాయని, ఆఖరి నిమిషంలో తనకు సమాచారం లేదని, అమ్మవారిని తీసుకెళ్లేది లేదని భీష్మించుకొన్నారు. అంతటితో ఆగక అమ్మ వారిని ఈ రోజు తీసుకెళ్లేందుకు వీల్లేదంటూ నిలిపేశారు. దీంతో చేసేదేమి లేక అమ్మ వారిని ఆలయం నుంచి తీసుకు రాకుండా నిలిపేశారు. ఇది విన్న గ్రామస్తులు, భక్తులు హతాసులయ్యారు. సంస్కృతి, సంప్రదాయం ప్రకారం నడుచుకోవాల్సిన పాలక మండలి చైర్మన్ రాజకీయ ప్రచార యావతో అమ్మవారి వేడుకను వాయిదా వేడయడం ఇప్పటి వరకు జరగలేదని భక్తులు మండిపడ్డారు. చైర్మన్, ఆలయ నిర్వహణాధికారి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి రాజకీయలను ఆలయ విషయంలో ప్రోత్సహిచడం సముచితం కాదని, అమ్మవారి భక్తురాలైన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఇలాంటి నికృష్ట చర్యలకు పాల్పడిన చైర్మన్ను పదవి నుంచి తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
బోర్లలోని నీటిని తోడి అమ్ముకుంటున్నారు
నగర శివారు ప్రాంతంలోని అంబాపురం సమీపంలో అంజనీమోడరన్ సిటీలో అనేక మంది ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకుని నివాసముంటున్నాం. అక్కడి ఓ ప్లాట్దారుడు మస్తాన్ నాయుడు చట్టానికి విరుద్ధంగా బోర్లు వేసి నీటిని రోజూ ట్యాంకర్లకు అమ్ముకుంటున్నాడు. ఫలితంగా చుట్టుపక్కల వారి ప్లాట్లలోని బోర్ వెల్స్లో నీరు అడుగంటి పోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అతడిని ప్రశ్నిస్తే బూతులు తిడుతూ దౌర్జన్యం చేస్తున్నాడు. వాల్టా చట్టం ప్రకారం అనుమతులు తీసుకోకుండా నీటిని తోడి అమ్ముకుంటున్న వ్యక్తిపై చర్యలు చేపట్టాలి. – మాధవి, రబేక, శ్రీకళ, విజయలక్ష్మి, అంజనీ మోడరన్ సిటీ లేఅవుట్, నెల్లూరు -
డివిజన్ల పునర్విభజన అస్తవ్యస్తం
నెల్లూరు(వేదాయపాళెం) : నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందని జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన నెల్లూరు సిటీ, రూరల్ సమన్వయకర్తలు చంద్రశేఖరెడ్డి, విజయకు మార్రెడ్డితో కలిస విలేకరుల సమావేశంలో మాట్లా డారు. ఓటమి భయంతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రస్తుతం ఉన్న 54 డివిజన్లను 72 డివిజన్లుగా విభజించారని తెలిపారు. వైఎస్సార్సీపీకి పట్టు న్న, ఓట్లు అధికంగా ఉన్న ప్రాంతాలను ఇష్టా రీతిన చెల్లాచెదురు చేశారన్నారు. అనాధిగా కొన్ని ప్రాంతాలు సామాజిక, భౌగోళిక పరిస్థితులను అనుసరించి ఒకే డివిజన్లో ఉండేవని, ప్రస్తుతం గెలుపే పరమావధిగా టీడీపీ నాయకులు ప్రతి డివిజన్ను ముక్కలు చేసి వారికి అనుకూలంగా పునర్విభజన చేపట్టారని తెలిపారు. ముస్లింలు అధికంగా ఉండే జెండావీధి ప్రాంతాన్ని పునర్విభజనలో మూడు డివిజన్లలో కలపడమే అందుకు నిదర్శనమన్నారు. కొన్ని ప్రాంతాలను పెన్నానది అవతల, జాకీర్హుస్సేన్నగర్, నేషనల్ హైవేకు అవతల ఉన్న డివిజన్లలో కలపడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక్క కాలనీని అనేక డివిజన్లుగా విభజించడం వల్ల అనేక పాలనా పరమైన సమస్యలు తలెత్తుతాయన్నారు. ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉండే ప్రాంతాలను విభజించి సుదూర డివిజన్లలో కలపడం ద్వారా జనాభా ప్రాతిపదికన వారికి దక్కాల్సిన రిజర్వేషన్లను సైతం అడ్డుకునేందుకు భారీ కుట్ర చేస్తున్నారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న కుల గణన పూర్తికాకుండానే ఆగమేఘాల మీద డివిజన్ల పునర్వినజన ప్రక్రియను చేపట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. సామాజిక, భౌగోళిక అంశాలు, రిజర్వేషన్లు, జనాభాను పరిగణనలోకి తీసుకోకుండా డివిజన్లను విభజించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. డివిజన్ల పునర్విభజనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదోక రకంగా గెలవాలని మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని, దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత కౌన్సిల్ కాలపరిమితికి ముందే ఎన్నికలు నిర్వహించి దొడ్డిదా రిన అక్రమంగా గెలిచేందుకు వారు చేస్తున్న ప్రయ త్నాలు ఫలించబోవన్నారు. ప్రజలు అన్ని అంశాలను సునిశితంగా గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి వైఎస్సార్సీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పునర్విభజనలో నారాయణ రాజ్యాంగం కార్పొరేషన్ పరిధిలో ఒక క్రమ పద్ధతి లేకుండా మంత్రి నారాయణ రాజ్యాంగంతో డివిజన్ల పునర్విభజన చేపట్టడం ప్రభుత్వ విచ్చల విడితనానికి నిదర్శనమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. పెన్నా నదికి ఇవతల ఉన్న బర్మాషెల్గుంట తదితర పాంతాలను అవతలి వైపున ఉన్న డివిజన్లలో కలిపారు. 13వ డివిజన్ను 16వ డివిజన్లో కలిపారు. ముస్లిం మైనార్టీలు అధికంగా ఉండే 43వ డివిజన్ను మూడు ముక్కలు చేసి 44, 47, 48వ డివిజన్లలో కలిపారు. నగరంపై మంత్రి నారాయణకు అవగాహన లేదు. ఆయన 80 వేల ఇళ్లు తిరిగినట్లు అబద్ధాలు చెబుతున్నారు. 22 ఏళ్ల తర్వాత దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయితే భారీగా ఓటర్ల మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఈలోగానే హడావుడిగా పునర్విభజన చేపట్టాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు. సర్వే నంబర్ల ఆధారంగా పునర్విభజన? కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల పునర్విభజనను సర్వే నంబర్ల ఆధారంగా చేపట్టడం హాసాస్పదంగా ఉందని నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి విమర్శించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కాకుండా మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి, టీడీపీ నాయకుల ఇష్టానుసారంగా కమిషనర్ డివిజన్ల విభజన చేపట్టినట్టు ఉంది. ఎన్నో ఏళ్లుగా చింతారెడ్డిపాళెం, సౌత్రాజుపాళెం ఒకటే డివిజన్లో ఉన్నాయని, ప్రస్తుతం వాటిని వేర్వేరుగా ఇతర డివిజన్లలో కలపడం విడ్డూరం. టీడీపీ గెలుపు కోసం దుర్మార్గపు ఆలోచలను అమలు చేయడంతో ఈ దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తప్పు చేసిన టీడీపీ నాయకులు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా కుట్రపూరితంగా విభజన చేపడితే మూల్యం చెలించక తప్పదని హెచ్చరించారు. అడ్డదారిలో గెలుపు కోసం టీడీపీ కుటిల యత్నాలు రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
మా చెల్లి నడవలేదయ్యా..
ఈ చిత్రంలోని వ్యక్తి పేరు రామకృష్ణారెడ్డి. అల్లూరు మండలంలోని సింగపేట గ్రామ వాసి. తన చెల్లెలు శేషమ్మను ఎత్తుకుని కలెక్టరేట్కు వచ్చాడు. ఆమెకు 5వ సంవత్సరంలోనే పోలియో వచ్చి రెండు కాళ్లు చచ్చుబడ్డాయి. నడవలేదు. ఇప్పుడు వృద్ధాప్య దశ వస్తోంది. శేషమ్మకు అన్న తప్ప ఎవరూలేరు. గతంలో పింఛన్ వచ్చేది. అయితే ఆమె పేరు అన్న రేషన్కార్డులో ఉందని రద్దు చేశారు. రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పునరుద్ధరించలేదు. ఏ దిక్కు లేని ఆమెకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్ ఆసరాగా ఉంటుందని, అధికారులు చర్యలు తీసుకోవాలని రామకృష్ణారెడ్డి కోరాడు. -
కాకాణిని కలిసిన మాజీ ఎమ్మెల్యేలు, నేతలు
నెల్లూరు(వేదాయపాళెం): వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు తదితర అంశాలపై భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్సీ, పార్టీ నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి పాల్గొన్నారు. -
చిన్నారిపై లైంగికదాడికి యత్నం
● వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు నెల్లూరు(క్రైమ్): కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వృద్ధుడు వరుసకు మనుమరాలైన చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు దర్గామిట్ట పోలీసుస్టేషన్ పరిధిలో ఓ వివాహిత నివాసం ఉంటున్నారు. ఆమెకు తొమ్మిదేళ్ల కుమార్తె ఉంది. వరుసకు తాత అయిన వెంకటరమణయ్య ఆదివారం రాత్రి బారాషహీద్ దర్గా వద్ద భోజనాల ప్యాకెట్లు ఇస్తారని, తీసుకొద్దామని చిన్నారిని తీసుకెళ్లాడు. స్వర్ణాల చెరువు వద్ద చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు. గమనించిన స్థానికులు వృద్ధుడికి దేహశుద్ధి చేయడంతో పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి దర్గామిట్ట ఇన్స్పెక్టర్ కల్యాణరాజుకు ఫిర్యాదు చేశారు. వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ సోమవారం వెల్లడించారు. బైక్పై వెళ్తూ..● కారు ఢీకొని వ్యక్తి మృతి సంగం: మండలంలోని సంగం – కొరిమెర్ల రహదారిలో మలుపు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోటార్బైక్ను కారు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. బోగోలు మండలం చెన్నారెడ్డిపాళేనికి చెందిన లక్ష్మయ్య (55) మరో వ్యక్తితో కలిసి బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. యువకుల అతివేగం.. గర్భిణికి ప్రమాదంచిల్లకూరు: గూడూరు రెండో పట్టణంలోని కోర్టు సెంటర్లో సోమవారం గుర్తుతెలియని యువకులు దారుణానికి పాల్పడ్డారు. బైక్పై అతివేగంగా వెళ్తూ.. రోడ్డు దాటుతున్న నిండు గర్భిణిని ఢీకొట్టారు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక వ్యాపారాలు స్పందించిన బాధితురాలిని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. రెండో పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలించారు. బ్లూకలర్ పల్సర్ బైక్లో ఇద్దరు యువకులు వేగంగా వెళ్లడాన్ని ఫుటేజీలో గుర్తించారు. వారి కోసం గాలిస్తున్నారు. 9న వీఎస్యూ స్నాతకోత్సవాలు.. వెంకటాచలం: మండలంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ 10, 11, 12వ స్నాతకోత్సవాలు జూన్ 9వ తేదీన నిర్వహించనున్నట్లు వర్సిటీ పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్ ఆర్.మధుమతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకల్లో గత విద్యా సంవత్సరాల్లో వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేయనున్నట్లు తెలియజేశారు. దుస్తుల నియమావళి, అలాగే అర్హులైన విద్యార్థుల పూర్తి వివరాలను త్వరలో త్వరలో ద్వారా వెల్లడిస్తామన్నారు. -
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాలి
● ఏబీఎం కాంపౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ ● పాల్గొన్న చంద్రశేఖర్రెడ్డి, విజయకుమార్రెడ్డినెల్లూరు(అర్బన్): దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి డిమాండ్ చేశారు. మతం మారిన దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా రద్దు చేయడాన్ని నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం పలువురు పాస్టర్లు, క్రైస్తవులు నెల్లూరులోని ఏబీఎం కాంపౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. వారికి చంద్రశేఖర్రెడ్డి, విజయకుమార్రెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. మత ప్రాతిపదికన ప్రజలను విభజించడం సరికాదన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్న బాధ్యత అన్ని పార్టీలపై ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరగాలన్నదే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష అన్నారు. నేటి పాలకులు మతాల మధ్య చిచ్చురేపి ప్రజలను ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సమానంగా చూసి వారి హక్కులను కాపాడిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. దళిత క్రైస్తవులు కోరుకున్న న్యాయబద్ధమైన డిమాండ్కు వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. అలాగే సీపీఎం నాయకులు కత్తి శ్రీనివాసులు, సూర్యనారాయణ, కాంగ్రెస్ నేతలు కూడా మద్దతు ప్రకటించి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం అందజేశారు. -
ఎన్నాళ్లు తిరగాలో.. ఎప్పుడు స్పందిస్తారో..
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అర్జీదారులు నెల్లూరు(అర్బన్): ‘అయ్యా.. మా సమస్యలపై క్షేత్రస్థాయిలో అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం. పలుసార్లు అర్జీలు ఇచ్చాం. అయినా పరిష్కరించలేదు. దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్కు వచ్చాం. మీరైనా విన్నపాలు ఆలకించి సమస్యలు పరిష్కరించండి’ అంటూ పలువురు బాధితులు వేడుకున్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, తెలుగుగంగ ప్రత్యేక కలెక్టర్ మహేశ్వర్రెడ్డి తదితరులు వినతులు స్వీకరించారు. ఫీజులను నియంత్రించాలి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడాన్ని ప్రభుత్వం నియంత్రించాలని బీపీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు బుధవారపు బాలాజీ తదితరులు కోరారు. జూన్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో కలెక్టర్ వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న విద్యాసంస్థలను వెంటనే మూసివేయాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు న్యాయబద్ధమైన జీతాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. -
నీళ్లు నిల్వ లేని చోట డీసిల్టేషన్కు టెండర్
ఎక్కడైనా బ్యారేజ్కు ఎగవ భాగంలో ఇసుక మేట వేస్తే అక్కడ మాత్రమే పూడిక తీత చేపట్టడాన్ని డీసిల్టేషన్ అంటారు. కానీ ఘనత వహించిన ఇరిగేషన్ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సంగం బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో ఇసుక పూడిక తీత పేరుతో బ్యారేజ్కు 50 కి.మీ దూరంలో ఉన్న కలువాయి మండలం రాజుపాళెం వద్ద డీసిల్టేషన్కు అనుమతి ఇవ్వడం విస్మయానికి గురి చేస్తోంది. అదీ.. సోమశిల డ్యామ్కు కి.మీ. దూరంలో 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వడం ఎన్జీటీ నిబంధనలను తుంగలో తొక్కడమే అవుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు నిల్వలేని చోట డీసిల్టేషన్ పేరుతో తమ్ముళ ఇసుక దోపిడీకి అనుమతి ఇవ్వమేనని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. -
చెలరేగుతున్న గ్రావెల్ మాఫియా
● ఉదయగిరి బ్రిడ్జిపై ఐరన్ గ్రిల్ను ఢీకొట్టిన టిప్పర్ ● తప్పిన పెనుప్రమాదం కావలి రూరల్: కూటమి ప్రభుత్వంలో కావలి మండలంలో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. మద్దూరుపాడు, చెన్నాయపాళెం చెరువుల నుంచి రాత్రివేళల్లో అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి గురు రాఘవేంద్ర కంపెనీకి చెందిన టిప్పర్ అక్రమంగా మట్టిని తరలిస్తూ అతివేగంగా ప్రయాణిస్తూ కావలి పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జిపై ఐరన్ గ్రిల్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే పెను ప్రమాదం చోటుచేసుకునేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణం మీదుగా అధిక లోడుతో వెళ్లే టిప్పర్ల ను నియంత్రించాలని, పట్టణంలోకి వాటి ప్రవేశాన్ని నిలిపివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
కఠినంగా జంతు సంక్షేమ చట్టాల అమలు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(అర్బన్): బక్రీద్ పండగ సందర్భంగా జిల్లాలో జంతు సంక్షేమ చట్టాలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరులోని తన కార్యాలయంలో జంతు సంక్షేమ చట్టాలు, జంతు వధ నిషేధం తదితర అంశాలకు చెందిన వాల్పోస్టర్లను ఎస్పీ అజిత, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం పశుసంవర్థక, మున్సిపల్, రవాణా శాఖ అధికారులతో కలిసి ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బక్రీద్ పండగను శాంతియుత వాతావరణంలో నిబంధనలకు లోబడి నిర్వహించుకోవాలన్నారు. పశువైద్యుల ధ్రువీకరణ పొందిన పశువులను పరిశుభ్రత పాటిస్తూ వధశాలల్లో వధించాలని కోరారు. ఒంటెలు, గోవులు, మూడు సంవత్సరాల్లోపు దూడలను వధించడం పూర్తిగా నిషేధమన్నారు. ఎస్పీ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ పరిధిలో వెంకటాచలం టోల్ప్లాజా, బుచ్చి, కావలి పరిధిలోని ముసునూరు టోల్ప్లాజా, పలుచోట్ల చెక్పోస్టులు పెట్టి ప్రత్యేక తనిఖీ బృందాలు పర్యవేక్షిస్తూ వీడియోగ్రఫీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పశుసంవర్థక శాఖాధికారి రమేష్ నాయక్, జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి, నోడల్ అధికారి యశోద తదితరులు పాల్గొన్నారు. -
ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన
కోవూరు: ప్రభుత్వం జిల్లాలోని భారీ పరిశ్రమలకు అనుసంధానంగా ఎంఎస్ఎంఈ పార్కు లను ఏర్పాటు చేస్తోందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు సోమవారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా కోవూరు మండలం పడుగుపాడులో ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్క్లో శిలఫలకాన్ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దుత్తలూరు, కడివేడు, ఉలవపాళ్ల, పడుగుపాడులో ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. దుత్తలూరులో ఏర్పాటవుతున్న రక్షణ రంగానికి చెందిన డ్రోన్లు, మిస్సైల్స్ తయారీ పరిశ్రమలకు అనుసంధానంగా ఎంఎస్ఎంఈ పార్క్ను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. గూడూరు ప్రాంతాన్ని భవిష్యత్తులో ఫర్నీచర్ పరిశ్రమల హబ్గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ పడుగుపాడులో 14.5 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇఫ్కో కిసాన్ సెజ్లో 2,700 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయని వివరించారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ రైతులు, ఉద్యోగులకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు. ఎంఎస్ఎంఈ డైరెక్టర్లు వీరేంద్ర, మాధవి, ఆర్డీఓ అనూష, ఏపీఐఐసీ జెడ్ఎం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. పది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం నెల్లూరు (టౌన్): పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 31 కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు పరీక్షలు జరిగాయి. 1475 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా, 1124 మంది హాజరయ్యారు. 351 మంది గైర్హాజరయ్యారు. ప్రశాంతంగా ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు ఏపీ ఓపెన్ స్కూల్ పదోతరగతి, ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పదో తరగతి పరీక్షలకు 582 మంది అభ్యాసకులకు, 512 మంది హాజరయ్యారు. 70 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షలకు 240 మందికి గాను, 202 మంది హాజరయ్యారు. 38 మంది అభ్యాసకులు గైర్హాజరయ్యారు. డీఈఓ బాలాజీరావు ఆయా పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఎస్ఈఐఎల్ కార్మికులతో చర్చలు విఫలం ముత్తుకూరు(పొదలకూరు) : నేలటూరులోని ఎస్ఈఐఎల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వద్ద 8 రోజులుగా ఆందోళన చేపడుతున్న కార్మికులతో కంపెనీ ప్రతినిధులు సోమవారం జరిపిన చర్యలు విఫలమయ్యాయి. తొలుత తోటపల్లిగూడూరు, ముత్తుకూరు మండలాలకు చెందిన అధికార పార్టీ నాయకులు అత్యుత్సాహంతో కార్మికుల ఆందోళన శిబిరం వద్దకు చేరుకుని చర్చలు జరిపారు. తాము 15 ఏళ్లుగా ప్రాజెక్టులో పనిచేస్తున్నామని, తక్కువ జీతంతో ఎలా జీవించాలని కూటమి నాయకులను కార్మికులు ప్రశ్నించారు. కూటమి నాయకులు గంటసేపటి తర్వాత ప్రాజెక్ట్ అధికారులను కార్మికుల వద్దకు తీసుకొచ్చారు. సీఐటీయూ నాయకులు ప్రసాద్, శ్రీనివాసులు, అంకయ్యతో చర్చలు జరిపారు. కార్మికులు ఆందోళన విరమిస్తే వేతనాలు పెంచే విషయంపైన ఆలోచించి పరిష్కారం చూపుతామని కూటమి నాయకులు ప్రాజెక్ట్ అధికారుల ద్వారా వివరించారు. ఐదు రోజులు గడువు కావాలని ప్రాజెక్ట్ అధికారులు కోరగా, అందుకు కార్మికులు సమ్మతించ లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ కనీస వేతన చట్టాన్ని అమలు చేసి నెలకు రూ.26 వేలు వేతనం ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. కూటమి నాయకులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది. తమ పక్షాన నిలబడి న్యాయం చేయాల్సింది పోయి కూటమి నాయకులు కంపెనీ యాజమాన్యానికి వత్తాసు పలకడం ఏమిటని కార్మికులు ప్రశ్నించారు. తమ శ్రమను దోచుకుంటున్న పెట్టుబడిదారులను నిలదీయాల్సిందిపోయి వారి పక్షాన నిలబడి చర్చలకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. -
పొగాకుకు గిట్టుబాటు ధరలు కల్పించాలి
● కొనుగోళ్లను వేగవంతం చేయాలి ● డీసీపల్లి పొగాకు బోర్డు ఎదుట రైతుల ధర్నా మర్రిపాడు: పొగాకు పంటకు గిట్టుబాటు ధరలు కల్పించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. డీసీపల్లి పొగాకు బోర్డులో పొగాకు రైతుల సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. గిట్టుబాటు ధరలు, వేలం ప్రక్రియలోని సమస్యలపై చర్చించారు. అనంతరం పొగాకు బోర్డు కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ గతేడాది వేలం ప్రక్రియను కిలో పొగాకు గరిష్ట ధర రూ.280తో ప్రారంభించగా, రూ.360 వరకు అమ్ముడు పోయిందని తెలిపారు. ఈ ఏడాది మార్కెట్ పరిస్థితులను కారణంగా చూపుతూ రూ.250తో కొనుగోళ్లను ప్రారంభించి రూ.190కు తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కిలో పొగాకు ధరను రూ.250కు తగ్గించకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పొగాకు బోర్డు ప్రారంభమై దాదాపు నెలన్నర రోజులు గడిచినా కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయన్నారు. ప్రతిరోజూ కేవలం 100 నుంచి 150 బేళ్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఈ విధంగా వేలం సాగితే రైతుల పొగాకు ఉత్పత్తుల అమ్మకాల ప్రక్రియ మళ్లీ సంవత్సరం వరకు సాగుతుందన్నారు. ఇప్పటికే సుమారు 25 శాతం పొగాకు పంట దెబ్బతిందన్నారు. ఫస్ట్ గ్రేడ్ పొగాకు నాణ్యత తగ్గి మూడు, నాలుగు గ్రేడ్లకు పడిపోవడంతో ఒక్కో బేలుపై రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు రైతులు నష్టపోతున్నారని తెలిపారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా పొగాకు రైతులకు నిధులను కేటాయించి ఆదుకుందన్నారు. అలాగే కూటమి ప్రభత్వం కూడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కిలో పొగాకుకు రూ.30, రాష్ట్ర ప్రభుత్వం రూ.20 చొప్పున పరిహారం చెల్లిస్తే రైతులకు కొంత ఊరట లభిస్తుందన్నారు. రైతుల పక్షాన ఉండాల్సిన పొగాకు బోర్డు సూపరింటెండెంట్ కూడా కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు లక్కు ప్రసాద్, పొగాకు బోర్డు రైతు సంఘం అధ్యక్షుడు గాలి నరసపనాయుడు, ఆత్మకూరు ఏఎంసీ చైర్మన్ జనార్దన్, రైతు నాయకుడు చండ్ర రాయణస్వామి, క్లస్టర్ సభ్యులు గంగినేని రవీంద్రబాబు, వెంకటేశ్వర్లురెడ్డి, ఓబులురెడ్డి, శ్రీనాథ్, ఆరికట్ల పుల్లయ్య, గుర్రం నాగేశ్వరరావు, మాలేపాటి సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు. -
కనుల ముందున్నాడు.. అంతలోనే..
● చేపల గుంతలో పడి బాలుడి మృతి సంగం: కుమారుడిని తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఆటలతో, వచ్చీ రానీ మాటలతో కుటుంబానికి ఆనందాన్ని పంచుతున్న బాలుడి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. చేపల గుంతలో పడి ఏడాదిన్నర వయస్సున్న బాలుడు మృతిచెందిన విషాద ఘటన మండలంలోని దువ్వూరు గ్రామంలోని ఎస్టీ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. చెంచయ్య, దీపిక దంపతులకు అభిలాష్ అనే కుమారుడున్నాడు. చెంచయ్య కూలీ పనులు చేస్తుంటాడు. బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సమీపంలోని చేపల గుంతలో పడిపోయాడు. కొంతసేపటికి తల్లిదండ్రులు కుమారుడి కోసం వెతగ్గా కనిపించలేదు. ఆందోళన చెందుతూ గ్రామస్తులతో కలిసి గాలించారు. ఇంతలో చేపల గుంతలో అభిలాష్ మృతదేహం తేలియాడుతూ కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
1.5 మెట్రిక్ టన్నులకే అనుమతి
అక్రమమో.. సక్రమమో పక్కన పెడితే.. కలువాయి మండల రాజుపాళెం వద్ద డీసిల్టేషన్ పేరుతో 1.5 మెట్రిక్ టన్నులకే ఇరిగేషన్ శాఖాధికారులు మిస్టర్ టీఎస్ఆర్ నిర్మన్ కంపెనీ పేరుతో అనుమతి ఇచ్చారు. అయితే ఇక్కడ జరుగుతున్న ఇసుక తవ్వకాలు లెక్కలు తీస్తే.. రోజుకు దాదాపు 150 టిప్పర్ల ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం. ఒక్కో టిప్పర్కు 40 మెట్రిక్ టన్నులు ఇసుకను లోడ్ చేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు సగటున 6 వేల మెట్రిక్ టన్నులు.. ఏడాదిగా ఇప్పటి వరకు 20.10 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుకను లోడేశారు. ఏప్రిల్లో అండర్ ప్రాసెస్ ఉన్పప్పటికి భారీ యంత్రాలు పెట్టి నదీలోనే లోడింగ్ చేస్తున్నారు. ఏకంగా నదిలో పారే నీటికి అడ్డంగా పైప్లు వేసి పక్కాగా గ్రావెల్ రోడ్డును నిర్మించి రేయింబవళ్లు ఇసుకను తరలిస్తున్నారు. ప్రభుత్వానికి మెట్రిక్ టన్నుకు రూ.200 రాయల్టీ చెల్లించాల్సి ఉన్నా కానీ.. ఎక్కడా బిల్లింగ్ ఇవ్వకుండానే అక్రమంగా రవాణా చేస్తున్నారు. తక్కువ టన్నులు చూపించి దోపిడీ చేస్తున్నారు. మూడు నెలలుగా అండర్ ప్రాసెస్ ఉండడంతో అసలు ఇసుక తరలించలేదన్నట్లు రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం. -
అక్రమ నిర్మాణాలపై చర్యలు
నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా, రోడ్డును ఆక్రమించి అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను కమిషనర్ నందన్ సోమవారం పరిశీలించారు. ఈ నెల 23, 24 తేదీల్లో ‘సాక్షి’లో ప్రచురితమైన ‘రూ.2 కోట్ల స్థలం హాంఫట్’, ‘అవినోటు అంతస్తులు’ వరుస కథనాలనూ స్పందించారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న బహుళ అంతస్తుల భవనం, ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని ఉడ్హౌస్ సంఘం ప్రాంతంలో రోడ్డును ఆక్రమించి అక్రమంగా నిర్మించిన దుకాణాలను పరిశీలించారు. వీటిపై ఎందుకు చర్యలు చేపట్టలేదంటూ టౌన్ప్లానింగ్ అధికారులను ప్రశ్నించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. బృందావనంలో అనుమతి లేకుండా నిర్మించిన భవన నిర్మాణ యజమానికి నోటీసు జారీ చేయడంతో పాటు ఆ ప్రాంత సచివాలయ ప్లానింగ్ సెక్రటరీకి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. వైఎస్సార్సీపీ అనుబంధ కమిటీల నియామకం విడవలూరు: వైఎస్సార్సీపీ జిల్లా అనుబంధ విభాగాల్లో కోవూరు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులను వివిధ హోదాల్లో నియమించినట్లు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతు విభాగ ప్రధాన కార్యదర్శిగా వావిళ్ల రమణ య్య, పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శిగా సిగి నం సుబ్రహ్మణ్యం, బీసీ సెల్ కార్యదర్శిగా అంగా ఫకీరయ్య, టీయూసీ విభాగ కార్యదర్శిగా తంబు వెంకటేశ్వర్లు, ఇంటెలెక్చువల్ విభాగ కార్యదర్శిగా వేణుంబాక మహీధర్రెడ్డి, వలంటీర్ విభాగ కార్యదర్శిగా నాయుడు సురేష్, గ్రీవెన్స్ సెల్ కార్యదర్శిగా సిగినం శ్రీనివాసులు, బూత్ కమిటీ కార్యదర్శిగా గోపసాని పెంచలయ్యను నియమించినట్లు వివరించారు. నూతనంగా పార్టీ అనుబంధ విభాగాల్లో నియమితులైన వారు కోవూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. -
జిల్లాకు ఆరు పీహెచ్సీల మంజూరు
నెల్లూరు(అర్బన్): ప్రభుత్వం జిల్లాకు ఆరు పీహెచ్సీలు మంజూరు చేసింది. అందులో అనంతసాగరం మండలంలోని రేవూరు/బొమ్మవరం పీహెచ్సీకి రూ.2.70 కోట్లు మంజూరు చేసి నిర్మాణ ప్రక్రియను ఆర్అండ్బీకి కేటాయించింది. అలాగే బోగోలు మండలం జువ్వలదిన్నె, గుడ్లూరు మండలం చేవూరు, మర్రిపాడు మండలం కృష్ణాపురం, ముత్తుకూరు మండలం తాళ్లపూడి పీహెచ్సీలకు ఒక్కోదానికి రూ.1.93 కోట్ల చొప్పున మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీటి నిర్మాణ ప్రక్రియను ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా చేపట్టనున్నారు. ఈత పండ్ల కోసం వెళ్లి.. ● నీటి మడుగులో పడి బాలుడి మృత్యువాతచేజర్ల: ఈత పండ్లు కోసుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి బాలుడు మృతిచెందిన ఘటన సోమవారం మండలంలోని మడపల్లె గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మడపల్లికి చెందిన గుండుబోయిన సాంబయ్య, వెంగమ్మ దంపతుల కుమారుడు చంద్రశేఖర్ (16) పదో తరగతి పాసయ్యాడు. త్వరలో ఇంటర్మీడియట్లో చేరాల్సి ఉంది. సెలవులు కావడంతో చంద్రశేఖర్ తన చెల్లెలు శ్రావణితో కలిసి గ్రామం సమీపంలో ఉన్న ఈత పండ్ల కోసం వెళ్లాడు. చెట్ల దగ్గరకు వెళ్లే క్రమంలో నీటి మడుగు దాటుతున్నాడు. ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉండటంతో ఈతరాని చంద్రశేఖర్ మునిగిపోయాడు. శ్రావణి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చేలోగా చంద్రశేఖర్ మృత్యువాత పడ్డాడు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. చేపల గుంతల్లో చికెన్ వ్యర్థాలు● పట్టుకున్న పోలీసులు కోవూరు: అక్రమంగా చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని సోమవారం సీజ్ చేశారు. స్థానికుల నుంచి అందిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నుంచి భారీగా వ్యర్థాలను బొలెరో వాహనంలో తీసుకొచ్చి రామన్నపాళెం గేట్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీ వెనుక భాగంలో ఉన్న గుంతల్లో వేస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. ఇటీవల చైన్నె, బెంగళూరు నుంచి వచ్చే వాహనాలపై తనిఖీలు కఠినతరం కావడంతో అక్రమార్కులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ను కేంద్రంగా చేసుకుని నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు చికెన్ వ్యర్థాలను తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రామన్నపాళెం పరిసర ప్రాంతాల్లో కొంతకాలంగా రాత్రి వేళల్లో అనుమానాస్పద వాహనాల రాకపోకలు పెరిగినట్లు చెబుతున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. -
నెల్లూరు నాదే.. ఫిక్స్ అయిపోండి!
రాజకీయాల్లో పదవీ కాంక్ష ఎంతటి వారలనైనా.. ఎంతటికైనా దిగజార్చుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి బ్రదర్స్ శ్రీధర్రెడ్డి, గిరిధర్రెడ్డి రామలక్ష్మణులుగా కలిసి రాజకీయాలను చేస్తున్నారు. తాజాగా శ్రీధర్రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి రాజకీయ అరంగ్రేటం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలకు దారితీసింది. ఈ దఫా ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని నెల్లూరు రూరల్ టికెట్ తన రాజకీయ వారసుడిగా సోదరుడిని రంగంలోకి దింపుతానంటూ గతంలో కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గిరిధర్రెడ్డి సైతం తానే అభ్యర్థినినంటూ రెండేళ్లుగా పార్టీ నాయకులు, కార్యకర్తల వద్ద ప్రకటించుకున్నారు. పార్టీ వ్యవహారాలతో పాటు వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి ఆదేశాలిస్తూ షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్న విషయం విదితమే. కుమార్తె పొలిటికల్ ఎంట్రీతో ప్రకంపనలు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి తాను ఇక నుంచి క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్లు మీడియా సమావేశం పెట్టి ప్రకటించడం నెల్లూరు రూరల్ టీడీపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. తనకు నియోజకవర్గంలోని ప్రతి ఊరుతోనూ, ప్రతి నేతతో ముఖ పరిచయాలే ఉన్నాయంటూనే వారి పేర్లను గుక్క తిప్పకుండా చెప్పుకుంటూ వచ్చారు. పరిస్థితులను బట్టి తన తండ్రి, అధిష్టానం ఆదేశిస్తే తాను నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించడంతో ఒక్కసారిగా రూరల్లోని నాయకులు, కార్యకర్తలు షాక్కు గురయ్యారు. వైష్ణవి విలేకరుల సమావేశం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి కార్యాలయంలోనే ఉండడం, గిరిధర్రెడ్డి లేకపోవడంతో పార్టీ క్యాడర్లో కూడా చర్చకు దారితీసింది. ప్రస్తుతం పార్లమెంట్లో డీలిమిటేషన్, మహిళా బిల్లులు నిలిచిపోగా, 2029 నాటికి అయినా మహిళా బిల్లు అమల్లోకి వస్తుందో లేదో తెలియని పరిస్థితి ఉంది. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తనయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై పార్టీలో వివిధ కోణాల్లో చర్చ జరుగుతోంది. మరో మూడేళ్లు ఎన్నికలకు సమయం ఉండగా ఆమె ఈ సమయంలో పొలిటికల్ ఎంట్రీలోనే తాను పోటీలో ఉన్నట్లు చెప్పడం నెల్లూరు టీడీపీ శ్రేణులను విస్మయానికి గురి చేసింది. కుటుంబంలో విబేధాల కారణంగానే.. కోటంరెడ్డి సోదరుల మధ్య కొంత కాలంగా విభేదాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి నుంచి సోదరుడికి టికెట్ వెళ్లడాన్ని కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే ఎమ్మెల్యే తన కుమార్తెతో ఎంట్రీ ఇచ్చారని సమాచారం. ఇదే సమయంలో తనను రాజకీయంగా వెన్నుపోటు పొడిచారనే బాధతో గిరిధర్రెడ్డి తన వర్గం వద్ద వాపోయినట్లు సమాచారం. గిరిధర్రెడ్డి మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారని పార్టీ వర్గాల ఉవాచ.గిరిధర్రెడ్డి పరిస్థితి ఏంటి? సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ లీడర్ స్థాయి నుంచి నెల్లూరు రూరల్లో రాజకీయంగా ఎదిగి మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరడంతో ఆయన సోదరుడు గిరిధర్రెడ్డి సైతం అన్న బాటలోనే నడిచారు. ఎమ్మెల్యేకు ఇటీవల ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో వచ్చే దఫా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. ఆయన స్థానంలో సోదరుడు గిరిధర్రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీలోని క్యాడర్ మొత్తం అనుకున్నారు. ఈ క్రమంలో పార్టీ పరంగా, పాలనా పరంగా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. గిరిధర్రెడ్డి సైతం షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నారు. అధికారుల సమావేశాల్లో కూడా కొలువు తీరేవారు. పార్టీలోని నాయకులు, కార్యకర్తలు ఆయన్ను ఎమ్మెల్యేగా భావించి రెడ్కార్పెట్ పరిచిన సందర్భాలు ఉన్నాయి. అంతా సాఫీగా జరుగుతున్న క్రమంలో శ్రీధర్రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి పొలిటికల్ ఎంట్రీ ప్రకటన చేయడంతో రాజకీయంగా కలకలం రేపింది. రామలక్ష్మణుల్లా మసులుకునే అన్నదమ్ముల మధ్య విభేదాలు, అంతరాలు పెరిగాయా? లేదా తండ్రి రాజకీయ వారసత్వ రాజకీయాల్లోకి తనకు అవకాశం కల్పించాలని కుమార్తె నుంచి ఒత్తిడి పెరిగిందా? ఇలా.. అనేక రకాలుగా చర్చలు జరుగుతుండగా, అనేకనేక ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోదరుల మధ్య విభేదాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: -
అభివృద్ధికి విఘాతం కలిగేలా పునర్విభజన
● తక్షణమే మార్పులు చేయాలి ● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డినెల్లూరు(బారకాసు): ‘పొంగూరు నారాయణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటూ నెల్లూరు నగరాభివృద్ధికి విఘాతం కలిగించేలా డివిజన్ల పునర్విభజన ప్రక్రియ చేపట్టడం సరికాదు. అస్తవ్యస్తంగా జరిగిన ఈ ప్రక్రియలో తక్షణమే మార్పులు చేయాలి’ అని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన పార్టీ నాయకులతో కలిసి ఆదివారం ఎన్ఎంసీ కార్యాలయంలో కమిషనర్ నందన్ను కలిశారు. డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియలో తలెత్తుతున్న అభ్యంతరాలను తెలియజేసి రాతపూర్వకంగా వినతిపత్రం అందజేశారు. అనంతరం పర్వతరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయా డివిజన్లలో సరిహద్దులను నిర్ణయించడంలో స్పష్టత లోపించిందన్నారు. వైఎస్సార్సీపీ ఇచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని డీలిమిటేషన్ ప్రక్రియలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు చేయాలని కోరారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియను కార్పొరేషన్ అస్తవ్యస్తం చేసిందన్నారు. కొన్ని డివిజన్లలో కొంత ఏరియాను తీసి దూరంగా ఉన్న ఇంకో ప్రాంతంలో కలపడం ద్వారా ప్రజలు గందరగోళానికి గురయ్యే పరిస్థితి తలెత్తిందన్నారు. ఇది ప్రజల్లో ఉన్న ఐక్యతను దెబ్బతీయడమేనన్నారు. అధికార పార్టీ నేతల ప్రోద్బలంతోనే నగర నియోజకవర్గంలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ దారుణంగా జరిగిందన్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి మార్పులు చేసినా ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అందులో సూచించిన విధంగా మార్పులు చేసి నగరపాలక సంస్థ ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని కోరారు. తాము సూచించిన విధంగా సరిహద్దుల మార్పు చేపట్టకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జిలు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు, ఇంకా కార్యకర్తలు పాల్గొన్నారు. -
కల్లు గీస్తుండగా..
● విషపురుగు కాటుతో కార్మికుడి మృతి సంగం: మండలంలోని దువ్వూరు గ్రా మంలో విషపురుగు కాటుతో కల్లుగీత కా ర్మికుడు మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన వెంకటరమణయ్య (47) కల్లు గీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం సాయంత్రం గ్రామ సమీపంలోని తాడిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా అతడిని విషపురుగు కాటేసింది. అయితే చీమ కుట్టిందేమోనని భావించిన వెంకటరమణయ్య పట్టించుకోకుండా ఇంటికి చేరుకుని భోజనం చేసి నిద్రించాడు. ఆదివారం ఉదయం అతను అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బుచ్చిరెడ్డిపాళెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజేష్ వివరాలు సేకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేశారు. వ్యక్తి ఆత్మహత్య నెల్లూరు(క్రైమ్): గూడ్స్ రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరులోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు సమీపంలో మూడో రైల్వేలైన్లో ఆదివారం చోటుచేసుకుంది. మృతుడి వయసు 55 నుంచి 60 ఏళ్లలోపు ఉంటుందని భావిస్తున్నారు. 5.2 అడుగుల ఎత్తు కలిగి బ్రౌన్ రంగుపై తెలుపు గీతల చొక్కా, బులుగు గీతల లుంగీ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు నమోదు చేశారు.చికెన్ వ్యర్థాలు తరలిస్తుండగా.. ● మినీ లారీ స్వాధీనం మనుబోలు: చికెన్ వ్యర్థాలను అక్రమంగా తరలిస్తున్న మినీ లారీని మండల పరిధిలోని జాతీయ రహదారిపై చవటపాళెం క్రాస్రోడ్డు వద్ద ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు గస్తీ నిర్వహిస్తూ చైన్నె నుంచి గుమ్మలదిబ్బకు వెళ్తున్న మినీ లారీని ఆపి పరిశీలించారు. అందులో చికెన్ వ్యర్థాలు ఉండటంతో స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. -
జిల్లా వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్లు
నెల్లూరు(క్రైమ్): నేరాల కట్టడి, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ అధికారులు జిల్లా వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్లు నిర్వహిస్తున్నారు. ఆదివారం వివిధ ప్రాంతాల్లో జరిగాయి. శివారు, నేరాలు జరిగేందుకు అవకాశమున్న ప్రాంతాల్లో అధికారులు బృందాలుగా విడిపోయి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు?, వారు ఏ ప్రాంతానికి చెందిన వారు?, ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు?, ఏం చేస్తున్నారు తదితర వివరాలను సేకరించడంతోపాటుగా వారి ఆధార్కార్డులను పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. వారి వేలిముద్రలను పరిశీలిస్తున్నారు. నేర ప్రవృత్తి లేదని తెలిస్తే విడిచి పెడుతున్నారు. పత్రాలు సక్రమంగా లేని వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్లకు తరలిస్తున్నారు. రౌడీ, సస్పెక్ట్ షీటర్లకు తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. స్థానికులతో మమేకమై అక్కడి సమస్యలను తెలుసుకుంటున్నారు. మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. శక్తి యాప్, ఎల్హెచ్ఎంఎస్ సేవలు తదితరాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఐదురోజుల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా వివిధ స్టేషన్ల పరిధిలో కార్డెన్ సెర్చ్లు నిర్వహించి వాహనపత్రాలు సక్రమంగా లేని 264 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలు, నాలుగుకార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 27 మందికి ఫిన్స్ హాయంతో వేలిముద్రలు సేకరించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అసాంఘిక కార్యక్రమాలు, మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా తదితరాలను గుర్తిస్తే వెంటనే డయల్ 112కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని పోలీసు అధికారులు ప్రజలకు సూచించారు. -
డివిజన్ల సరిహద్దులపై ప్రజల్లో గందరగోళం..
● కమిషనర్కు ఆనం విజయకుమార్రెడ్డి లేఖ నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థ డివిజన్ల పునర్విభజనకు సంబంధించి సరిహద్దులపై అభ్యంతరాలున్నాయని, ప్రజల్లో గందరోగోళం నెలకొందని వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన అభ్యంతరాలు తెలుపుతూ కమిషనర్ వై.నందన్కు ఆదివారం లేఖ ఇచ్చారు. కొత్త డివిజన్ల మ్యాప్లో సరిహద్దులను సాధారణ ప్రాంతాల పేర్లతో కాకుండా సర్వే నంబర్లు ద్వారా చూపించారన్నారు. ప్రజలు తమ ప్రాంతం ఏ డివిజన్లో ఉందో అర్థం చేసుకోలేకపోతున్నారని తెలిపారు. 72 డివిజన్ల సరిహద్దులను గుర్తించడం కష్టంగా మారిందన్నారు. డివిజన్లలో చేర్చిన ప్రాంతాల వివరాలు కూడా స్పష్టంగా లేకపోవడంతో ఏ ఏరియా ఏ డివిజన్లో ఉందో ప్రజలకు అయోమయం కలుగుతోందన్నారు. వార్డులను సరైన కారణం లేకుండా విభజించారని ఆరోపించారు. ఒక ప్రాంతాన్ని ఒక డివిజన్ నుంచి తీసి మరో డివిజన్లో చేర్చారన్నారు. రాజకీయం లేదా పాలనాపరమైన అసమానతలు ఉన్నాయనే సందేహాన్ని వ్యక్తం చేశారు. సరైన కారణాలతో, ప్రజలకు అర్థమయ్యే విధంగా మార్పులు చేయాలని సూచించారు. ప్రాంతాల విభజన పారదర్శకంగా జరగాలన్నారు. -
ఒక బదిలీ.. అనుమానాలెన్నో..
చిల్లకూరు: గూడూరు ఆర్డీఓ సత్యనారాయణ ఆకస్మిక బదిలీ వెనుక భూ వ్యవహారాలే ప్రధాన కారణమనే అనుమానాలు గూడూరు డివిజన్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా కడివేడు ప్రభుత్వ భూములు, క్రిస్సిటీ భూ సేకరణ పరిహారం వ్యవహారాల్లో ఆయన తీసుకున్న చర్యలే బదిలీకి దారితీశాయన్న వాదనలు రెవెన్యూ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆరునెలలపాటు సరైన పర్యవేక్షణ లేని గూడూరు డివిజన్ రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. రెండునెలల క్రితం రామాయపట్నం పోర్టు భూసేకరణ అధికారిగా పనిచేస్తున్న సత్యనారాయణను ఆర్డీఓగా నియమించారు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు బాధ్యతలు చేపట్టిన వెంటనే సత్యనారాయణ పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో చిల్లకూరు, కోట మండలాల్లో ప్రతిపాదిత క్రిస్సిటీ ప్రాజెక్ట్కు సంబంధించి భూ సేకరణ పరిహారం ఆలస్యమవుతోందంటూ బాధిత రైతులు ఆర్డీఓను ఆశ్రయించారు. దీంతో ఆయన భూ రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించి సరైన రీతిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ ప్రక్రియ పూర్తయితే రెవెన్యూ శాఖలోని కొంతమంది సిబ్బంది నుంచి రాజకీయ నాయకుల వరకు ఇబ్బందులు తలెత్తే అవకాశముందని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. క్రిస్సిటీ భూ పరిహార జాబితాలో తమ అనుచరుల పేర్లు చేర్చాలని పలువురు ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందుకు ఆర్డీఓ అంగీకరించకుండా నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తానని స్పష్టం చేసినట్లు తెలిసింది. ‘ఇక్కడ కాకపోతే మరోచోట పని చేసుకుంటాను’ అంటూ స్పష్టంగా చెప్పినట్లు రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. పదిరోజుల క్రితమే బదిలీ ఉత్తర్వులు అందినప్పటికీ, క్రిస్సిటీ భూ పరిహారం అంశాన్ని కొలిక్కి తీసుకొచ్చి బాధితులకు సుమారు రూ.5 కోట్ల వరకు పరిహారం అందేలా చర్యలు తీసుకున్నారని సమాచారం. కడివేడు భూములపై.. చిల్లకూరు మండలం కడివేడు రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూముల వ్యవహారం రాష్ట్రస్థాయిలో చర్చకు రావడంతో ఆర్డీఓ సత్యనారాయణ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆ భూములకు సంబంధించిన పాత రికార్డులను వెలికితీయడానికి ఆయన మూడు రోజుల పాటు రెవెన్యూ సిబ్బందిని తన కార్యాలయంలోనే కూర్చోబెట్టి పరిశీలన చేపట్టినట్లు సమాచారం. పాత రికార్డులు వ్యవహారం బయట పడితే గత తహసీల్దార్ శ్రీనివాసులు హాయంలో అధికార పార్టీ నేతలు చేసిన భూ బాగోతాలు ఎక్కడ బయట పడతాయోనని జిల్లా ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచి బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో గూడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలో ఉన్న సమయంలో కూడా కడివేడు భూములపై పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. అప్పటి జాయింట్ కలెక్టర్ బాలాజీ ప్రత్యేక సర్వే బృందాలతో భూముల సర్వే చేపట్టగా, సగం వరకు ప్రక్రియ పూర్తయ్యాక అకస్మాత్తుగా సర్వే నిలిచిపోయింది. అనంతరం బాలాజీ బదిలీ కావడం చర్చనీయాంశమైంది. అధికారుల కొరత తిరుపతి జిల్లా నుంచి గూడూరును వేరు చేసిన అనంతరం ఇక్కడ డివిజన్ స్థాయి అధికారుల నియామకంలో సమస్యలు నెలకొన్నాయి. రెవెన్యూ, పోలీస్ శాఖల్లో కీలక పోస్టులకు అధికారులు రావడానికి ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఆరు నెలలుగా గూడూరులో డీఎస్పీ స్థాయి అధికారి పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టకపోవడం కూడా పరిస్థితికి నిదర్శనంగా పేర్కొంటున్నారు.అడ్డు చెబితే బదిలీ తప్పదా?గూడూరు నియోజకవర్గంలో అధికార నాయకుల నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించే అధికారులను బదిలీ చేస్తారనే భావన పలు శాఖల్లో వ్యక్తమవుతోంది. తమ నిర్ణయాలకు అడ్డుగా నిలిచే అధికారులను బదిలీ చేయడం, వివాదాల్లోకి లాగడం పరిపాటిగా మారిందన్న విమర్శలున్నాయి. గతంలో గూడూరు రెవెన్యూ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో కింది స్థాయి ఉద్యోగులకు కవర్లు అందజేసిన ఘటనను లంచంగా ప్రచారం చేశారు. దీంతో అప్పట్లో తహసీల్దార్ తన కింద స్థాయి ఉద్యోగులను ఇలా చేయడం తనను కూడా అవినీతిపరుడిగా చూపించడమేనని మనస్తాపం చెంది బదిలీపై వెళ్లిపోయారు. భూ వ్యవహారాలే కారణమని ప్రచారం సత్యనారాయణను బలి చేశారని చర్చ కడివేడు భూములు, క్రిస్ సిటీ భూసేకరణ అంశాలే కారణమా.. పారదర్శకంగా వ్యవహరించడంతో సాగనంపారా? -
కడివేడు భూములపై విచారణ చేపట్టాలి
● ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ డిమాండ్ చిల్లకూరు: కడివేడు రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి భూ అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ డిమాండ్ చేశారు. గూడూరులోని సనత్నగర్లో ఉన్న పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడివేడు రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములపై నెలకొన్న అనిశ్చితిని తొలగించి, పారదర్శకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు ఉన్నతాధికారులు చొరవ చూపి పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలివ్వాలని కోరారు. అధికారిక లెక్కల ప్రకారం సుమారు 2,395 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఇందులో దాదాపు 900 ఎకరాల వరకు ప్రైవేట్ వ్యక్తుల పేరిట నమోదైనట్లు సమాచారం వస్తోందన్నారు. ఆ భూములు రెవెన్యూ రికార్డుల్లో ఏ విధంగా నమోదయ్యాయో, వారికి హక్కులు ఎలా కల్పించారో స్పష్టం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో.. పేదలకు చెందాల్సిన భూములు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దల చేతుల్లోకి వెళుతున్నాయని మురళీధర్ ఆరోపించారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా స్థానిక ప్రజాప్రతినిధులు తమ అనుచరులకు ప్రభుత్వ భూములు కట్టబెట్టిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. ప్రస్తుతం కూడా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న విలువైన ప్రభుత్వ భూములపై కూటమి నాయకులు కన్నేశారని, గత తహసీల్దార్ సహకారంతో రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్లు చేయించుకుని భూములను సొంతం చేసుకుంటున్నట్లు సమాచారం ఉందన్నారు. ఈ అంశంపై ప్రజల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో, అసలు భూ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే 700 ఎకరాల్లో ప్లై ఉడ్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని ప్రకటించారని విమర్శించారు. కడివేడు భూముల వ్యవహారంలో నిజాలను వెలికితీసేందుకు ప్రయత్నించిన ఆర్డీఓ సత్యనారాయణను రికార్డులు బయటకు తీయకముందే బదిలీ చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో కూటమి నాయకుల ప్రమేయం ఉందనే విషయం స్పష్టమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి కడివేడు భూముల వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ అంశంపై కలెక్టర్ను కలిసి ఆధారాలతో కూడిన నివేదిక అందజేస్తామని తెలిపారు. -
ముస్తాపురం సమీపంలో కారు బోల్తా
● ముగ్గురికి గాయాలు ఆత్మకూరు: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ముగ్గురు వ్యక్తులు గాయపడిన ఈ ఘటన ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ముస్తాపురం వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్సై ఎస్కే జిలానీ కథనం మేరకు.. ముగ్గురు వ్యక్తులు వింజమూరు నుంచి ఏఎస్పేట మండలం గుడిపాడుకు కారులో బయలుదేరారు. ఏఎస్పేట రోడ్డులో ప్రయాణిస్తుండగా ముస్తాపురం సమీపంలో కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొని పల్టీలు కొట్టింది. ఇద్దరు తీవ్రంగా, మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. వారి పేర్లు, వివరాలు తెలియా ల్సి ఉందని, కేసు నమోదు చేశామన్నారు. -
నేడు ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన
నెల్లూరురూరల్: జిల్లాలోని నాలుగు ఎంఎస్ఎంఈ పార్కులకు సోమవారం శంకుస్థాపనలు జరగనున్నాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం తెలిపారు. కోవూరు నియోజకవర్గంలోని పడుగుపాడులో 14.47 ఎకరాలు, కావలి నియోజకవర్గం దగదర్తి మండలం ఉలవపాడులో 21 ఎకరాలు, ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలంలో 22.43 ఎకరాలు, గూడూరు నియోజకవర్గం కడివేడులో 20 ఎకరాల విస్తీర్ణంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్కుల ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. అడవిలో అగ్నికీలలు మర్రిపాడు: మండలంలోని కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు వేయడంతో మంటలు చెలరేగాయి. నెల్లూరు– వైఎస్సార్ కడప జిల్లా సరిహద్దు సమీపంలో చెలరేగిన ఈ మంటలు వేగంగా వ్యాపిస్తూ విలువైన అటవీ సంపదను దహనం చేస్తున్నాయి. ఎండల తీవ్రత, గాలుల కారణంగా మంటలు మరింత విస్తరిస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవిలోని చెట్లు, పొదలు, చిన్న మొక్కలు మంటలకు ఆహుతవుతుండగా దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. దీంతో నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై పొగ వ్యాపించడంతో ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించక ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. మంటలు అదుపు తప్పి మరింత విస్తీర్ణానికి వ్యాపించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి అగ్నిమాపక చర్యలు చేపట్టాలని, అడవికి నిప్పంటించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
అదెలాగంటే..
పేదల చెమట చుక్కలను అధికార పార్టీ నేతలు నకిలీ హాజరుతో నోట్ల కట్టలుగా మార్చుకుంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదల ఆకలి తీర్చాల్సిన ఉపాధి హామీ పథకాన్ని పందికొక్కుల్లా దిగమింగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పారదర్శకత కోసం తెచ్చిన ముఖ హాజరు వ్యవస్థనే మాయాజాలంగా మార్చేసి, ఏసీ గదుల్లో విలాస జీవితాలు అనుభవిస్తున్న టీడీపీ నేతల కుటుంబాలను కూలీలుగా చూపించి ప్రజాధనాన్ని రూ.లక్షల్లో కాజేస్తున్నారు. సాక్షాత్తు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల పచ్చనేతలు ఈ అక్రమాలకు బరి తెగించారు. పనులు తక్కువ.. కూలీలు ఎక్కువ ఉపాధి హామీ పథకం కింద చేజర్ల మండలంలో చేసే పనులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో కూలీల హాజరు ఉండడంతో ఈ నకిలీ వ్యవహారం బట్టబయలు అవుతుంది. చేజర్ల మండల వ్యాప్తంగా 22 గ్రామ పంచాయతీల్లో 34 పనులు జరుగుతుండగా సుమారు 11 వందల మందికి పైగా కూలీలు నమోదు అవుతున్నారంటే నకిలీ కూలీలు వీళ్లల్లో ఎంతమంది ఉన్నారో అర్థమవుతుంది. గ్రామంలో లేని వారిని దీర్ఘకాలికంగా మంచానికే పరిమితమైన రోగులను సైతం ఉపాధి కూలీలుగా సృష్టించి ముందుగానే సేవ్ చేసి పెట్టుకున్న వారి ఫొటోను ప్రతి రోజు మస్తరులో నమోదు చేసి నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. మండలంలో ఓ టీడీపీ నేత ఇంట్లోని కుటుంబ సభ్యులంతా పనికి వెళ్లినట్లు మస్తరు నమోదైందంటే పని చేయకుండానే ఇలాంటి మస్తర్లతో ఎంత నగదు అక్రమార్కుల ఖాతాల్లోకి వెళుతుందో ఇట్టే అర్థమవుతోంది. చేజర్లలో ముఖ హాజరు మాయాజాలం టీడీపీ జిల్లా స్థాయి నేతలు, వారి కుటుంబ సభ్యులు కూలీలే పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ముఖ హాజరు నమోదు పని ప్రదేశం లొకేషన్ సైతం మార్పు ఆదివారం, సెలవు రోజుల్లోనూ మస్తర్లు -
గిరిధర్రెడ్డి పరిస్థితి ఏంటి?
సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ లీడర్ స్థాయి నుంచి నెల్లూరు రూరల్లో రాజకీయంగా ఎదిగి మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరడంతో ఆయన సోదరుడు గిరిధర్రెడ్డి సైతం అన్న బాటలోనే నడిచారు. ఎమ్మెల్యేకు ఇటీవల ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో వచ్చే దఫా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. ఆయన స్థానంలో సోదరుడు గిరిధర్రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీలోని క్యాడర్ మొత్తం అనుకున్నారు. ఈ క్రమంలో పార్టీ పరంగా, పాలనా పరంగా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. గిరిధర్రెడ్డి సైతం షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్నారు. అధికారుల సమావేశాల్లో కూడా కొలువు తీరేవారు. పార్టీలోని నాయకులు, కార్యకర్తలు ఆయన్ను ఎమ్మెల్యేగా భావించి రెడ్కార్పెట్ పరిచిన సందర్భాలు ఉన్నాయి. అంతా సాఫీగా జరుగుతున్న క్రమంలో శ్రీధర్రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి పొలిటికల్ ఎంట్రీ ప్రకటన చేయడంతో రాజకీయంగా కలకలం రేపింది. రామలక్ష్మణుల్లా మసులుకునే అన్నదమ్ముల మధ్య విభేదాలు, అంతరాలు పెరిగాయా? లేదా తండ్రి రాజకీయ వారసత్వ రాజకీయాల్లోకి తనకు అవకాశం కల్పించాలని కుమార్తె నుంచి ఒత్తిడి పెరిగిందా? ఇలా.. అనేక రకాలుగా చర్చలు జరుగుతుండగా, అనేకనేక ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోదరుల మధ్య విభేదాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. -
ఆదివారం, సెలవు రోజుల్లోనూ సైతం మస్తర్ల నమోదు
సహజంగా సోమవారం నుంచి శనివారం వరకు కూలీలు ఉపాధి పనులు చేసి ఆదివారం, సెలవు రోజుల్లో విశ్రాంతి తీసుకుంటారు. అయితే ఈ అక్రమార్కులు మాత్రం ఆదివారం సైతం పని జరిగినట్లు భారీగా నకిలీ కూలీల ముఖ హాజరు నమోదు చేసుకుని భారీ స్థాయిలో భోంచేస్తున్నట్లు తెలిసింది. ఉపాధి కార్యాలయంలో సిబ్బంది మధ్య వాటాల పంపకంలో తేడా రావడంతో అసలు విషయం కాస్త బయటకు పొక్కింది. చేజర్ల మండలంలో ఉపాధి హామీ పథకం ప్రారంభమైన తొలి సంవత్సరం (2006)లో నిధులు భారీగా భోంచేసి అందుకు బాధ్యులైన ప్రొబిషన్ డిక్లేర్ కానీ అప్పటి ఎంపీడీఓ పర్రె విజయశేఖర్, ఏపీఓ, ఇద్దరు సాంకేతిక సహాయకులు, పదుల సంఖ్యలో క్షేత్ర సహాయకులు సస్పెండ్ అయిన ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. కలెక్టర్ స్పందించి ఉపాధి హామీ పథకం పని తీరును పరిశీలించి కీలకమైన కేంద్ర ప్రభుత్వ ఎన్ఎంఎంఎస్ యాప్ను దుర్వినియోగం చేస్తూ నిధుల గోల్మాల్కు కారణమవుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఉపాధి కూలీలు మండల ప్రజలు కోరుతున్నారు. -
ఎస్ఐఆర్పై అప్రమత్తత అవసరం
● అధికార పార్టీ నేతల కుట్రలను తిప్పికొట్టాలి ● పుట్టా శివశంకర్రెడ్డి, ఆనం విజయకుమార్రెడ్డి నెల్లూరు సిటీ: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ ఓట్లు తొలగించే అవకాశం ఉందని, దీనిపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుట్టా శివశంకర్రెడ్డి, పార్టీ రూరల్ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని జీపీఆర్ గ్రాండ్లో శనివారం వైఎస్సార్సీపీ బూత్ లెవల్ ఏజెంట్స్తో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తొలుత జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మతో కలిసి వారు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శివశంకర్రెడ్డి, విజయకుమార్రెడ్డి మాట్లాడుతూ త్వరలో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయని తెలిపారు. ఈ క్రమంలో అధికార పార్టీ కుట్రపూరితంగా వైఎస్సార్సీపీ అభిమానులు, సానుభూతిపరుల ఓట్లు తొలగించే అవకాఽశం ఉందని తెలిపారు. అక్రమాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, అధికార పార్టీ నేతల కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రూరల్ నాయకులు, కార్పొరేటర్లు, బీఎల్ఏలు, డివిజన్ ఇన్చార్జిలు పాల్గొన్నారు.మాట్లాడుతున్న పుట్టా శివశంకర్రెడ్డి, పక్కనే ఆనం విజయకుమార్రెడ్డి, అరుణమ్మ, పాల్గొన్న బీఎల్ఏలు, పార్టీ నేతలు -
ఇద్దరితో వివాహేతర సంబంధం
● అడ్డొస్తున్నాడని మాజీ ప్రియుడి హత్య వింజమూరు (ఉదయగిరి): ఆమె ఇద్దరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో మాజీ ప్రియుడి అడ్డుతొలగించుకునేందుకు పక్కా ప్లాన్ చేసింది. ప్రస్తుత ప్రియులను పురికొల్పి ఈనెల 16న వింజమూరు వింజేటమ్మ గుడికి వెళ్లే మార్గంలో పాలవాగు వద్ద మాజీ ప్రియుడిని కడతేర్చింది. దీనికి సంబంధించిన వివరాలను వింజమూరు పోలీస్స్టేషన్లో కలిగిరి సీఐ పోతుగంటి సుబ్బారావు శనివారం వెల్లడించారు. కలిగిరి మండలం వీర్నకొల్లుకు చెందిన అవివాహితుడు మేదరమిట్ల శ్రీకాంత్కు, అదే మండలం నాగిరెడ్డిపాళేనికి చెందిన వితంతువు మూలే వెంగమ్మకు కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగింది. ఈ క్రమంలో ఆమె వీర్నకొల్లుకు చెందిన వాకాటి హరిబాబు, అతని మిత్రుడు ఏఎస్పేట మండలం కాకర్లపాడుకు చెందిన ప్రదీప్తో ఇటీవల వివాహేతర బంధం కొనసాగిస్తోంది. హరిబాబు ఓ పార్శిల్ సర్వీస్లో పనిచేస్తుండగా, ప్రదీప్ వింజమూరులో ముఠా పనులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ను వెంగమ్మ నిర్లక్ష్యం చేయడంతో అతను తరచూ గొడవ పడేవాడు. ఈ విషయం ఆ మహిళ హరిబాబు, ప్రదీప్కు చెప్పి అడ్డుతొలగించుకోవాలని పురికొల్పింది. ఈ క్రమంలో ఈనెల 15న ప్రదీప్ తన జన్మదిన వేడుకలు వింజమూరులో ఓ ప్రైవేటు లాడ్జీలో వెంగమ్మ, హరిబాబుతో కలిసి జరుపుకున్నారు. అదేరోజు శ్రీకాంత్ను హత్య చేసేందుకు నిర్ణయించి వెంగమ్మ ఫోన్ నుంచి వింజమూరు రమ్మని పిలిచింది. కానీ శ్రీకాంత్ రాకపోవడంతో ప్లాన్ విఫలమైంది. మరుసటి రోజు శ్రీకాంత్కు ఫోన్ చేసి పిలవడంతో అతను తన బైక్లో వింజమూరు బస్టాండ్ వద్దకు వచ్చి వెంగమ్మను కలిశాడు. ఇద్దరు కలిసి వింజేటమ్మ గుడికి వెళ్లే మార్గంలో పాలవాగు అటవీ ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే ప్లాన్ ప్రకారం హరిబాబు, ప్రదీప్లు వేచి ఉన్నారు. నలుగురు కలిసి మద్యం సేవించారు. అనంతరం గొడవ పడ్డారు. ఈ క్రమంలో హరిబాబు కత్తితో శ్రీకాంత్ను పొడిచాడు. ప్రదీప్, వెంగమ్మ కలిసి ముఖంపై గుడ్డ కప్పి ఊపిరాడకుండా చేసి చంపారు. కాగా శ్రీకాంత్ 16వ తేదీ రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు మరుసటి రోజు కలిగిరి పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. 19న వింజమూరులోని వింజేటమ్మ గుడికి వెళ్లే మార్గంలో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. అక్కడ ఉన్న బైక్ ద్వారా మృతుడిని గుర్తించారు. సాంకేతికత ఆధారంగా నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుచగా జడ్జి రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన కలిగిరి, వింజమూరు ఎస్సైలు ఉమాశంకర్, మాదాల ఉమామహేశ్వరరావులతో పాటు సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. -
రైలు పట్టాలపై మృత్యుఘోష
● వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి, ఒకరికి తీవ్రగాయాలు మనుబోలు: ప్రమాదవశాత్తు రైల్లోంచి పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని కొమ్మలపూడి–వెంకటాచలం రైల్వేస్టేషన్ల మధ్య శనివారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. కొమ్మలపూడి రైల్వేస్టేషన్ సమీపంలో 153/21–23 కిలోమీటరు వద్ద ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహంపై ఉన్న గాయాలను బట్టి ప్రమాదవశాత్తు రైల్లోంచి పడిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడు లైట్ బ్లూకలర్ జీన్స్ఫ్యాంటు, నలుగు, బూడెద రంగు గళ్ల చొక్కా ధరించి ఉన్నారు. వయస్సు సుమారు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. రైల్వే ఎస్సై హరిచందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హెచ్చరించినా మార్పు రాదా
చిల్లకూరు: నిల్వ ఆహార పదార్థాలు, కుళ్లిన మాంసం వినియోగంపై పలుమార్లు పట్టుకుని హెచ్చరించినా మార్పు రాదా అని ఫుడ్ సేఫ్టీ, తూనికలు కొలతల అధికారులు మండిపడ్డారు. గూడూరు బైపాస్ కూడలిలో ఓ హోటల్, దాబాలలో వారు శనివారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. వంటగదిలో బొద్దింకలు, ఈగలు, ఎలుకలు తిరుగుతుండడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా కనీస జాగ్రత్తలు పాటించరా అని ప్రశ్నించారు. అనంతరం తయారు చేసేందుకు సిద్ధం చేసిన ఆహార పదార్థాలను డస్ట్బిన్లో వేశారు. అలాగే దాబాలో కూడా నిల్వ ఉన్న ఆహార పదార్థాలను బయట పారవేశారు. డొమస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాడుతుండడంతో వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే తూనికల మెషీన్లలో కూడా తేడాలు రావాడంతో వాటిని సీజ్ చేస్తున్నామన్నారు. తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్ రమాదేవి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జి.వెంకటేశ్వరరావు, సివిల్ సప్లయ్స్ అధికారి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
చికెన్ వ్యర్థాల వాహనం పట్టివేత
సంగం: మండలంలోని మర్రిపాడు సమీపంలో చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని స్థానికుల సమాచారం మేరకు శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా వ్యర్థాలతో నిండిన 80 డ్రమ్ములు గుర్తించారు. సంబంధిత అధికారుల సమక్షంలో వాటిని నిర్వీర్యం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.జిల్లా వ్యాప్తంగా నాకాబందీ ● డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ మద్య సేవనంపై 49 కేసులు నెల్లూరు(క్రైమ్): నేర నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు నాకాబందీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, హైవే ప్రవేశ, నిష్క్రమణ, శివారు ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేశారు. మద్యం మత్తులో వాహనం నడుపుతున్న వారిపై 19 కేసులు, బహిరంగ మద్య సేవనంపై 30 కేసులు నమోదు చేశారు. నిబంధనలు పాటించని వాహనదారులపై ఎంవీయాక్ట్ కింద 513 కేసులు నమోదు చేసి రూ.1,47,860 జరిమానా విధించారు. జిల్లాలోని 87 లాడ్జీల్లో తనిఖీలు చేశారు. రికార్డులను పరిశీలించి, బసచేసిన వ్యక్తుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మృతురాలి పేరిట పెన్షన్ స్వాహా ● వార్డు వెల్ఫేర్ సెక్రటరీ సస్పెన్షన్ బుచ్చిరెడ్డిపాళెం: సామాజిక పెన్షన్లలో భారీ అక్రమం బుచ్చిరెడ్డిపాళెంలో వెలుగుచూసింది. మృతిచెందిన వృద్ధురాలి పేరిట ప్రతినెలా వస్తున్న ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ను అక్రమంగా డ్రా చేస్తూ ప్రభుత్వ నిధులను స్వాహా చేసిన ఘటన తాజాగా బయటపడింది. పురపాలక సంఘం పరిధిలోని ఇసుకపాళెం–1 సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న జొన్నవాడ రాజశేఖర్ అనే వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ అక్రమాలకు పాల్పడినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. అదే వార్డుకు చెందిన షేక్ ఇమామ్ బీ అనే వృద్ధురాలు కొంతకాలం క్రితమే మరణించినప్పటికీ, ఆమె వివరాలను అధికారిక రికార్డుల్లో నమోదు చేయకుండా గోప్యంగా ఉంచినట్లు సమాచారం. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న సదరు ఉద్యోగి.. మృతి చెందిన మహిళ పేరిట కొనసాగుతున్న పెన్షన్ను నెలనెలా డ్రా చేస్తూ వచ్చాడని అధికారులు గుర్తించారు. జూలై 2023 నుంచి మే 2026 వరకు దాదాపు 35 నెలల పాటు పెన్షన్ నగదును అక్రమంగా విత్డ్రా చేసినట్లు నిర్ధారించారు. ఈ వ్యవధిలో మొత్తం రూ.1,28,000 వరకు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైనట్లు వెల్లడైంది. దీంతో అధికారులు రాజశేఖర్ను సస్పెండ్ చేశారు. బస్సు చక్రాల కింద నలిగిన ప్రాణం నెల్లూరు(క్రైమ్): ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగి వ్యక్తి మృతిచెందిన ఘటన జిల్లా కోర్టు సమీపంలోని చైనాబజార్ వద్ద శనివారం చోటుచేసుకుంది. సౌత్ట్రాఫిక్ పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని సరస్వతీనగర్లో సత్యనారాయణ(62), శ్రీలత దంపతులు నివాసం ఉంటున్నారు. సత్యనారాయణ చిన్నబజారులో బంగారు దుకాణం నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం ఆయన ఏసీ మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేశారు. అనంతరం బైక్పై ఇంటికి బయలుదేరారు. చైనా బజారు వద్దకు వచ్చేసరికి కూరగాయల మార్కెట్ వైపు నుంచి బస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్ హ్యాండిల్కు తగలడంతో అదుపుతప్పి సత్యనారాయణ కిందపడ్డారు. బస్సు వెనుక చక్రం అతని తలపైకి ఎక్కడంతో నుజ్జునుజ్జై అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న సౌత్ ట్రాఫిక్ ఎస్సై మాల్యాద్రి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి బాధిత కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సును పోలీస్స్టేషన్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పొదలకూరు నిమ్మధరలు(కిలో) పెద్దవి: రూ.70 సన్నవి: రూ.25 పండ్లు: రూ.10 -
పట్టాలు దాటుతుండగా..
● గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి నెల్లూరు(క్రైమ్): రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు గూడ్స్ రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్లో కావలివైపు వెళ్లే రైలు పట్టాలపై శనివారం జరిగింది. మృతుడు సుమారు 40 నుంచి 45 ఏళ్లు కలిగి టీషర్టు, బులుగు రంగు జీన్స్ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అర కిలోమీటరు మోసుకెళ్లి రక్షించారు
కొడవలూరు: ప్రమాదవశాత్తు రైల్లో నుంచి ఓ వ్యక్తి పడిపోయి తీవ్రంగా గాయపడగా, ఆర్పీఎఫ్, 108 సిబ్బంది సకాలంలో కాపాడిన ఘటన మండలంలోని రామన్నపాళెం రైల్వేగేట్ సమీపంలో శనివారం జరిగింది. ఆత్మకూరు మండలం దేపూరుకు చెందిన సీహెచ్ నవీన్కుమార్ సొంత పనిపై కావలి వచ్చి అక్కడి నుంచి రైల్లో నెల్లూరు వెళ్తుండగా రామన్నపాళెం గేట్ సమీపంలో ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయారు. తీవ్రగాయాలతో ఉండడాన్ని గుర్తించిన రైల్వే గేట్ సిబ్బంది ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు 108కు సమాచారం అందించారు. రామన్నపాళెం రైల్వేగేట్ వద్ద నుంచి అర కిలోమీటరు దూరంలో ఘటనా స్థలానికి 108 అంబులెన్స్ ఈఎంటీ విజయ్, పైలట్ మహేష్లు, ఆర్పీఎఫ్ సిబ్బంది సాయంతో వెళ్లి క్షతగాత్రుడ్ని స్ట్రెచర్పై మోసుకొచ్చి నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నవీన్కుమార్ పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపినట్లు 108 సిబ్బంది వెల్లడించారు. -
ఆర్టీసీ–2 డిపో ప్రైవేటీకరణను నిలిపివేయాలి
నెల్లూరు సిటీ: విద్యుత్ బస్సుల పేరుతో నగరంలోని ఆర్టీసీ–2 డిపో ప్రైవేటీకరణ పనులను వెంటనే నిలిపివేయాలని సీఐటీయూ నగర, రూరల్ కార్యదర్శి నాగేశ్వరరావు, నరసయ్య డిమాండ్ చేశారు. నగరంలోని ఆర్టీసీ–2 డిపో గ్యారేజీ వద్ద శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ–2 డిపోను ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇచ్చే చర్యలను ఆపాలన్నారు. 105 రోజుల నుంచి ఆర్టీసీ కార్మికులు పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. దాదాపు రూ.300 కోట్ల ప్రజల ఆస్తిని విద్యుత్ బస్సులు పేరుతో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడం దారుణమన్నారు. కార్యక్రమంలో నాయకులు కేవీ శివాజీ, పి.సూర్యనారాయణ, నజీర్, సురేష్, రాంబాబు, సుధాకర్, గిరి, మోహన్, ప్రసాద్, శ్రీను పాల్గొన్నారు. -
అవినీతి మత్తు.. నిద్రావస్థలో నిఘా
నెల్లూరు (బారకాసు): నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కొద్ది రోజులుగా కార్పొరేషన్ స్థలాల ఆక్రమణలు, అక్రమ కట్టడాలు మితిమీరాయి. టౌన్ప్లానింగ్ విభాగంలో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వీరి అండదండలతో జరుగుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. నగర పాలక సంస్థ పరిధిలో పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ భవన నిర్మాణాలు జరుగుతున్నా.. సదరు యజమానుల నుంచి అడిగినంత ముట్టితే చాలు అటు వైపు కన్నెత్తి చూడకుండా మిన్నకుండిపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 150 చ.కి.మీ విస్తీర్ణంలో విస్తరించిన నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 54 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 1,83,643 భవనాలుండగా ఇందులో అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్ దాదాపు 8 వేలకు పైగా ఉన్నాయి. ఇక బహుళ అంతస్తుల భవనాలు దాదాపు 25 వేలకు పైగా ఉన్నాయి. నెలకు కనీసం 20 భవనాలకు ప్లాన్ అప్రూవల్కు దరఖాస్తులు కార్పొషన్కు వస్తుంటాయి. వీటిలో రోజుకు రెండూ లేదా మూడు భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తుంటారు. భవన అనుమతుల ద్వారా కార్పొరేషన్కు వచ్చే ఆదాయం కంటే టౌన్ప్లానింగ్ అధికారులకు రాబడే అధికంగా ఉంటుంది. అక్రమ నిర్మాణాల్లో కొన్ని.. నగరంలోని చిల్డ్రన్స్ పార్కు రోడ్డులో జాతీయ రహదారి కలిసే కూడలిలో దాదాపు ఆరేళ్ల క్రితం ఓ బహుళ అంతస్తుల భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు. ఆ భవన ప్లాన్లో ఒకలా ఉంటే.. నిర్మాణం మరోలా ఉంది. ప్లాన్లో జీప్లస్ 2కు అనుమతి తీసుకుని జీప్లస్ 4గా నిర్మించారు. అదనంగా రెండు ఫోర్లు నిర్మించినా.. దీనిపై సంబంధిత టౌన్ప్లానింగ్ అధికారులు నేటికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ప్లాన్ లేకుండా అదనపు అంతస్తులు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం బీపీఎస్ స్కీం ద్వారా రెగ్యులరైజ్ చేసుకోమని అవకాశం కల్పించినా సదరు యజమాని వినియోగించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ● నగరంలోని బృందావనం ప్రాంతంలో రైల్వేట్రాక్ పక్కన ఉన్న స్థలాలు బఫర్ జోన్ కిందకు వస్తాయి. అటువంటి స్థలంలో నిర్మాణాలు చేపట్టకూడదు. ఒక వేళ ఎవరైనా నిర్మాణాలు చేపట్టాలంటే సంబంధిత రైల్వే అధికారుల నుంచి ఎన్ఓసీ సర్టిఫికెట్ తెచ్చుకుని అప్పుడు ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు ప్లాన్ మంజూరు చేస్తారు. దీంతో సంబంధిత యజమాని భవన నిర్మాణం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటిది ప్రస్తుతం బృందావనంలోని రైల్వే ట్రాక్ సమీపంలోని బఫర్ జోన్లో ఓ భవన నిర్మాణం చేపడుతున్నారు. ఈ భవనానికి టౌన్ ప్లానింగ్ నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. అయినా సంబంధిత యజమాని యథేచ్ఛగా నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు మిన్నకున్నారు. ఇందుకు కారణంగా కింది స్థాయి నుంచి టౌన్ ప్లానింగ్ అధికారుల వరకు ఎవరి వాటా వారికి ముట్టుతుండటమేనన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి ఉదాహరణలు కార?్పరేషన్ పరిధిలో కోకొల్లలున్నాయి. ఇకనైనా సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలపై ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. బృందావనంలోని బఫర్ జోన్లో అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవనంనగరంలో జరుగుతున్న భవన నిర్మాణాలపై నిఘా ఉంచాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతి మత్తుతో నిద్రావస్థలో ఉంటున్నారు. ఎక్కడా కూడా తనిఖీలు చేపడుతున్న దాఖలాలు లేవు. దీంతో అక్రమ నిర్మాణదారులు తమ ఇష్టారాజ్యంగా భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ఒక వేళ ఎవరైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తే వారి ఆదేశాల మేరకు నామమాత్రపు చర్యలు చేపట్టి, సదరు అక్రమ నిర్మాణదారుల నుంచి అందినకాడికి దండుకుని మిన్నకుండి పోతున్నారే తప్ప కఠిన చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు కనిపించడం లేదు. -
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు
● సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య నెల్లూరు (టౌన్): జిల్లా లోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య తెలిపారు. శనివారం ఆయన జిల్లా సమగ్రశిక్ష కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు తొలి విడతలో 642, రెండో విడతలో 85 ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశారని, వాటిల్లో 342 ప్లాంట్లు మరమ్మతులకు గురయ్యాయని, ఈ నెలాఖరుకు మరమ్మతులు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. పాఠశాలల్లో అవసరమైన చోట మేజర్, మైనర్ రిపేర్స్, టాయిలెట్స్, పెయింటింగ్, డ్యూయల్ డెస్కులు, కొత్త ఆర్పో ప్లాంట్లు ఏర్పాటు పనులను ఏడాది లోపు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారన్నారు. ఇందుకు సంబంధించి రూ.55 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ఇప్పటికే పేరెంట్స్ కమిటీ అకౌంట్లలో రూ.9 కోట్లు ఉన్నాయన్నారు. త్వరలో కమిటీల ద్వారా ఆయా మోడల్ ప్రైమరీ స్కూల్స్ల్లో అవసరమైన వసతులపై ఎస్టిమేట్ వేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో నెల్లూరులోని కేఎన్నార్ మున్సిపల్ హైస్కూల్, కావలి మండలం ఒట్టూరులోని మోడల్ హైస్కూల్, బుచ్చిరెడ్డిపాళెంలోని డీఎల్ఎన్ఆర్ గర్ల్స్ హైస్కూల్, వింజమూరులోని జెడ్పీ బాలుర హైస్కూల్, ఆత్మకూరులోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, కందుకూరులోని గర్ల్స్ హైస్కూల్లో అటీజం సెంటర్లను ఏర్పా టు చేస్తున్నామన్నారు. ఒక్కో స్కూల్కు రూ.40 లక్షలు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 87,689 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 44,476 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.29 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రత
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరురూరల్: స్వచ్ఛంద సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రమైన వాతావరణం, పచ్చ దనం శోభిల్లుతోందని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. శనివారం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. స్టేడియం పరిసరాలను చీపురు పట్టి శుభ్రం చేస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో మే 22 నుంచి జూన్ 20 వరకు నాలుగు వారాల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. ప్రతి వారం ప్రత్యేక అంశాలపై దృష్టి సారిస్తూ రెడ్, ఎల్లో స్పాట్ల తొలగింపు, ప్రధాన రహదారులు, కాలువలు, నాలాలు శుభ్రపరిచే పనులు, చెత్త వర్గీకరణ, ప్రజా మరుగుదొడ్ల పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ సుజాత, కమిషనర్ నందన్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
● విద్యాసంస్థల బస్సులకు ముగిసిన ఫిట్నెస్
నెల్లూరు (టౌన్): విద్యా సంస్థల బస్సులకు సంబంధించి ఫిట్నెస్ గడువు ఈ నెల 15వ తేదీతో ముగిసింది. ఫిట్నెస్ ఉంటేనే బస్సులు రోడ్డెక్కాలని ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలకు రాష్ట్ర రవాణాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యా సంస్థల బస్సుల యాజమాన్యాలు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్కు తెస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న టెస్టింగ్ స్టేషన్ నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నారు. కండీషన్ బట్టి ఒక్కో బస్సుకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారని స్కూల్స్ బస్సుల యజమానులే చెబుతున్నారు. అయితే ఈ విషయంలో మంత్రి నారాయణకు మామూళ్ల బెడద తప్పలేదని తెలుస్తోంది. ఫిట్నెస్గా ఉన్నాయా? జిల్లాలో ఆయా విద్యా సంస్థల బస్సులు 1,145 వరకు ఉన్నాయి. జూనియర్ కళాశాలలు జూన్ 1వ తేదీ, పాఠశాలలు జూన్ 12వ తేదీ నుంచి పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా బస్సులన్నింటికి ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంది. జిల్లాలో ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ బాధ్యతను ప్రవీణ్ ఆథరైజ్డ్ టెస్టింగ్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ గతేడాది సెప్టెంబర్ నుంచి తమ కార్యకలాపాలను సాగిస్తోంది. సాధారణంగా వాహనాలను టెస్టింగ్ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ అనంతరం రవాణా అధికారులు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అయితే టెస్టింగ్ ముందుగానే తనిఖీ చేసి బస్సుల్లో ఉన్న లోపాలను ఆయా యాజమాన్యాలకు తెలియజేయాలని రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆయా ప్రాంతాల్లో 455 విద్యా సంస్థల బస్సులను పరిశీలించి లోపాలను సరిచేసుకోవాలని 352 బస్సులకు రవాణా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇంకా 690 బస్సులు ఫిట్నెస్ పరీక్షలకు వెళ్లలేదని తెలుస్తోంది. ఈ ఫిట్నెస్ ప్రక్రియలో బస్సులకు బ్రేక్లు పడేటట్లు ఉన్నాయా? అవినీతికి బ్రేక్లు పడుతాయా? అనే సందేహంగా మారింది. ఫిట్నెస్ నిబంధనలివే విద్యా సంస్థల బస్సులకు సంబంధించి నామ మాత్రంగా టెస్టింగ్ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. సాధారణంగా బస్సు ఎడమ వైపు స్కూల్ పేరు, చిరునామా స్పష్టంగా ఉండాలి. బస్సుకు అత్యవసర ద్వారం ఉండాలి. బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్నిమాపక నిరోధక పరికరం ఉండాలి. తలుపులకు సురక్షిత లాకింగ్ సిస్టం ఉండాలి బస్సులో విద్యార్థులు ఎక్కడం, దిగడం గమనించడానికి కన్వెక్స్ క్రాస్ వ్యూ అద్దాలు అమర్చబడాలి. బస్సులో సీట్లు కింద బ్యాగులు ఉంచేందుకు అరలు ఏర్పటు చేయాలి. సైడ్ విండోలకు మధ్యలో అడ్డంగా 3 లోహపు కడ్డీలు అమర్చాలి. విద్యాసంస్థకు 10 బస్సులు ఉన్నట్లయితే అదనంగా (స్పేర్) బస్సు ఒకటి తప్పనిసరిగా ఉండాలి. బస్సు ఫుడ్ బోర్డుపై తొలిమెట్టు భూమి నుంచి 325 మి.మీ.ఎత్తుకు మించి ఉండరాదు. జిల్లాలో 1145కు గాను 455 బస్సులకు మాత్రమే తనిఖీలు 352 బస్సులకు నోటీసుల జారీ కండీషన్ లేకుండానే రోడ్లపైకి.. ఒక్కో బస్సుకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు వసూలు ఇష్టారాజ్యంగా సర్టిఫికెట్ల జారీ జిల్లాలో ప్రైవేట్ మేనేజ్మెంట్ నేతృత్వంలో నడుస్తున్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ అవినీతికి కేరాఫ్గా మారింది. అడిగినంత ఇస్తే వాహనం ఎట్లా ఉన్నా ఎంచక్కా ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. గతంలో ఫిట్నెస్ టెస్ట్లు జిల్లా రవాణాశాఖాధికారులు చేస్తుండేవారు. ప్రభుత్వ అధికారులు కావడంతో కొంత బాధ్యతగా వ్యవహరించే వారు. అయితే ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ప్రైవేట్ సంస్థకు అప్పగించడంతో వారి ఇష్టారాజ్యంగా మారింది. వాహనం కండీషన్ లేకున్నా నామమాత్రపు ఫిట్నెస్ టెస్టింగ్ చేసి సర్టిఫికెట్లను ఇస్తున్నారు. లోపాలను గుర్తించి నోటీసులు జారీ చేశాం విద్యా సంస్థల బస్సులకు సంబంధించి ఫిట్నెస్కు ముందుగానే తనిఖీలు చేయాలని ఉన్నతాఽధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కావలి, ఆత్మకూరు, గూడూరు పరిసర ప్రాంతాల్లోని స్కూల్స్, కళాశాలలకు చెందిన 455 బస్సులను తనిఖీ చేశాం. వాటిల్లో లోపాలను గుర్తించి వాటిని సరిచేసుకోవాలని 352 బస్సులకు నోటీసులు జారీ చేశాం. ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ అనంతరం తనిఖీలు చేయాలన్న ఆదేశాలు ఇంకా రాలేదు. ప్రతి బస్సు కండీషన్తోనే రోడ్డు ఎక్కాలి. – ఎండీ మదాని, ఆర్టీఓ -
ఇష్టారాజ్యంగా సర్టిఫికెట్లు
విద్యా సంస్థల బస్సులకు సంబంధించి ఇష్టారాజ్యంగా ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. కండీషన్తో సంబంధం లేకుండా ఒక్కో బస్సుకు ఏడాదికి అయితే రూ.5 వేలు, రెండేళ్లు ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీకి అయితే రూ.10 వేలు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీంతో పాటు అక్కడ స్టేషనులో ఉన్న డ్రైవర్కు మరో రూ.500 సమర్పించుకోవాల్సి ఉంది. బస్సులకు సరైన కండీషన్ లేకున్నా డబ్బులు ఇస్తుండటంతో ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. చిన్న పిల్లలను రవాణా చేసే బస్సులు కండీషన్గా లేకుండా ఉంటే ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. పిల్లల భద్రతపై తల్లిదండ్రులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రొయ్యకు సన్ స్ట్రోక్
45 డిగ్రీలకు తగ్గని ఉష్ణోగ్రతలు చిల్లకూరు: డాలర్ల పంట ఆక్వా సాగును కష్టాలు వెంటాడుతున్నాయి. ఒక వైపు ఫీడ్ ధరలు ఇష్టారీతిన పెరగడం, మరో వైపు నాసిరకం సీడ్ అంటకట్టడం, ఇంకో వైపు కూటమి ప్రభుత్వం పలు రకాలుగా భారాలు మోపుతుంటే.. అన్ని వైపుల నుంచి ప్రకృతి పగబడుతోంది. వేసవి సీజన్లో ఆక్వా సాగు చేస్తే వైరస్లు తక్కువగా ఉంటాయని, రొయ్యల ఎదుగుదల (గ్రోత్) బాగా ఉంటుందని, నాణ్యతను బట్టి మంచి ధరలు ఉంటాయని సాగుదారులు ఏప్రిల్లో సాగు చేపట్టి జూన్ నెలాఖరుకు హార్వెస్ట్ చేస్తుంటారు. సాగుకు ప్రతికూల పరిస్థితులు ఈ ఏడాది ఏప్రిల్లో చేపట్టిన ఆ వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక అధిగ ఉష్ణోగ్రతల కారణంగా రొయ్యలకు సన్ స్ట్రోక్ (వడ దెబ్బ) తగులుతుండడంతో సాగుదారులు లబోదిబోమంటున్నారు. మే నెల ఆరంభంలో కూడా వేడి పెద్దగా లేక పోయినా గుంతల్లో 24 గంటలూ ఏయిరేటర్లు తిప్పతూ రొయ్యలకు ఆక్సిజన్తోపాటు చల్లదనం అందిస్తున్నారు. అయితే గత పది రోజుల నుంచి ఎండ తీవ్రత 45 డిగ్రీలకు తగ్గడం లేదు. ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతల దెబ్బకు రొయ్యలు ఎర్రగా మారి పోయి వైరస్ వచ్చిన రీతిలో చనిపోతున్నాయి. పశ్చిమాసియా దేశంలో యుద్ధం నేపథ్యంలో రొయ్యల ఎగుమతిపై ఆంక్షలు విధించడంతో టైగర్, వెనామీ సాగుదారులు దేశీయ మార్కెట్లోనే విక్రయాలు చేసుకుంటున్నారు. దీంతో ఇక్కడ ఎగుమతిదారులు చెప్పిన ధరలకే విక్రయాలు చేస్తుండడంతో నష్టపోతున్నామని ఆక్వా రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనికి తోడు సన్ స్ట్రోక్ కారణంగా 60, 40 కౌంట్ రొయ్యలు చని పోతుండడంతో పెట్టిన పెట్టబడులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. జిల్లాలో 60 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జిల్లాలోని సముద్ర తీర ప్రాంత మండలాల్లో సుమారు 60 వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేపడుతుండగా ఒక్క గూడూరు నియోజకవర్గంలోనే సుమారుగా 20 వేల ఎకరాల్లో సాగు జరుగుతోంది. ఇందులో కండలేరు క్రీక్ (ఉప్పు టేరు) నీటిని ఆధారంగా చేసుకుని ఎక్కువ శాతం మంది రైతులు సాగు చేపడుతున్నారు. కండలేరు క్రీక్కు అటు ఇటుగా రొయ్యల గుంతలు సాగులో ఉండడంతో పట్టుబడి చేసిన వారు గుంతల్లోని నీటిని మరలా క్రీక్లోకే వదలేస్తుండడంతో క్రీక్లో నీరు కలుషితమై ఉప్పు శాతం తగ్గి పోతుంది. దీంతో రొయ్యల ఎదుగుదలపై ప్రభావం పడి రొయ్యలు మధ్యలోనే వైరస్ల బారిన పడి చనిపోతున్నారు. దీంతో ఆక్వా సాగుదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తక్కువ కౌంట్లోనే చనిపోతున్న రొయ్యలు ఉప్పు శాతం పెరిగిపోతున్న వైనం ఆక్వా సాగును ఆదుకోవాలని రైతుల ఆవేదన ఖర్చులు పెరిగిపోతున్నాయి ఈ ఏడాది ఆక్వా సాగులో ఖర్చులు అధికమవుతున్నాయి. ఒక వైపు సీడ్, ఫీడ్ ధరలను అమాంతం పెంచేయడంతో గతేడాది కన్నా ఈ ఏడాది 20 శాతం ఖర్చులు పెరిగాయి. దీనికి తోడు వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఒక వైపు వైరస్లు వ్యాప్తి చెందుతుండగా, మరో వైపు ఎప్పుడు లేని ఎండ తీవ్రత రొయ్యలపై పడుతుండడంతో రొయ్యలకు సన్ స్ట్రోక్ తగి ఎర్రగా మారి చనిపోతున్నాయి. మూలిగే నక్క మీద తాటి పండు పడిన చందంగా ఆక్వా సాగుదారుల పరిస్థితి మారింది. ఆక్వా సాగుదారులకు ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ఆదుకోవాలి. – జయశేఖరరెడ్డి ఆక్వా రైతు, తిక్కవరం, చిల్లకూరు మండలం -
పేదల నివాసాలపై ‘ఎన్ఎంసీ’ ప్రతాపం
నెల్లూరు(బారకాసు): కూటమి ప్రభుత్వంలో నగరపాలక సంస్థ అధికారులు తీసుకుంటున్న చర్యల కారణంగా పేదలు ఇబ్బంది పడుతున్నారు. నెల్లూరులో జాఫర్సాహెబ్ కెనాల్ రివిట్మెంట్ వాల్ నిర్మాణం పేరుతో మైపాడు రోడ్డుకు ఆనుకుని నివసిస్తున్న నిరుపేద కుటుంబాల ఇళ్లను ఖాళీ చేయించాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఖాళీ చేయకపోతే తామే తొలగిస్తామని హెచ్చరించడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మైపాడు రోడ్డులో ఇప్పటికే స్మార్ట్ స్ట్రీట్ బజార్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నివాసాలను తొలగించి అదే ప్రాంతంలో మరో స్మార్ట్ స్ట్రీట్ బజార్ను ఏర్పాటు చేయాలన్న యోచనతోనే ఈ చర్యలు చేపడుతున్నారనే ఆరోపణలున్నాయి. భయాందోళనలో.. రోజువారీ కూలీ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలు ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. పని దొరికితేనే పూట గడిచే పరిస్థితిలో ఉన్న ప్రజలు ఇళ్ల తొలగింపు హెచ్చరికలతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇప్పటికే కార్పొరేషన్ అధికారులు రెండు, మూడుసార్లు సందర్శించి, ఇళ్లు ఖాళీ చేయాలని హెచ్చరించినట్లు తెలిసింది. అక్కడే ఉంటూ.. నగరంలోని పాత చెక్పోస్ట్ నుంచి మైపాడు బీచ్కు వెళ్లే ప్రధాన మార్గమైన మైపాడు రోడ్డును గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాలుగు లేన్లుగా అభివృద్ధి చేశారు. అప్పటి మంత్రి అనిల్కుమార్ యాదవ్ చొరవతో చేపట్టిన ఈ పనుల్లో భాగంగా కొంతమేర ఇళ్లను తొలగించినప్పటికీ, మిగిలిన ప్రాంతాన్ని యథావిధిగా వదిలేశారు. అప్పట్లో అధికారులు, ప్రజాప్రతినిధులు మిగిలిన ఇళ్లను తొలగించే ఉద్దేశం లేదని హామీ ఇవ్వడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. అప్పట్నుంచి దాదాపు 80 కుటుంబాలు అక్కడే ఉంటున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాకే.. పాత చెక్పోస్ట్ నుంచి జాఫర్సాహెబ్ కాలువ, మైపాడు రోడ్డుకు మధ్యనున్న ఇరిగేషన్ స్థలంలో నివసిస్తున్న పేదలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అందిన సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని, ఇప్పుడు ఇళ్ల తొలగింపు భయం వెంటాడుతోందని చెబుతున్నారు. నగరంలో కాలువల స్థలాలను ఆక్రమించి పెద్ద భవనాలు నిర్మించిన వారిపై చర్యలు తీసుకోకుండా, తమలాంటి నిరుపేదలపై మాత్రమే అధికారులు దృష్టి సారించడం అన్యాయమని మండిపడుతున్నారు. 80 ఏళ్లుగా ఇక్కడే జీవనం ఈ ప్రాంతంలో దాదాపు 80 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం సుమారు 80 కుటుంబాలున్నాయి. సుమారు 400 మందికి పైగా ఉంటున్నారు. ఇప్పటికిప్పుడు ఇళ్లు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్లాలి? మా బతుకులు రోడ్డున పడతాయంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాఫర్సాహెబ్ కెనాల్కు రివిట్మెంట్ గోడ నిర్మించాల్సి వస్తే అవసరమైన స్థలం మాత్రమే వినియోగించి, మిగిలిన ప్రాంతాన్ని తమకే అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అందులోనే చిన్న గుడిసెలు వేసుకుని జీవిస్తామంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. జాఫర్సాహెబ్ కాలువ వెంబడి ఇళ్లు తొలగించేందుకు సిద్ధం ఖాళీ చేయకుంటే తామే తొలగిస్తామంటూ బెదిరింపులు ఎట్టి పరిస్థితుల్లో కదిలేది లేదంటున్న ప్రజలు కెనాల్ రివిట్మెంట్ వాల్కు పోను మిగిలిన స్థలం అప్పజెప్పాలని డిమాండ్ ఒక్కసారిగా తొలగిస్తే మా బతుకులు ఏం కావాలని ఆగ్రహం కార్పొరేషన్ అధికారుల చర్యలతో ఆందోళన -
128 పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో శుక్రవారం 128 పొగా కు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. వేలానికి 131 బేళ్లు రాగా 128 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. కిలోకు గరిష్ట ధర రూ.250 కాగా, కనిష్ట ధర రూ.190 లభించింది. సగటున రూ.222.84 ధర నమోదైంది. వేలంలో 8 కంపెనీల వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. పాత వాహనాల కొనుగోలుకు ఈ–వేలం నెల్లూరు (అర్బన్): జిల్లా వైద్యశాఖకు సంబంధించి మరమ్మతులకు గురై వినియోగానికి ఉపయోగపడని వివిధ రకాల 25 వాహనాలను ఈ–వేలం ద్వారా విక్రయించనున్నట్లు డీఎంహెచ్ఓ సుజాత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30న హెచ్టీటీపీఎస్://కొనుగోలు.ఏపీ.జీఓవీ.ఇన్ అనే పోర్టల్ ద్వారా వాహనాల వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బిడ్డర్లు సంబంధిత పోర్టల్ను పరిశీలించి వివరాలు తెలుసుకోవాలని, క్రమం తప్పకుండా వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. జూన్ 5న వాయిదా పడిన ఇంటర్ పరీక్ష నెల్లూరు (టౌన్): బక్రీద్ పండగను పురస్కరించుకుని ఈ నెల 28న జరగాల్సిన ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జూన్ 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ వరప్రసాదరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 5న జరగాల్సిన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూ పరీక్ష 12న జరగనున్నట్లు వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం అర్ధరాత్రి వరకు 79,603 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 45,125 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.35 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. మేం చెబుతాం.. ఆచరించం! ● నో వెహికల్ ప్రైడే అమలెక్కడ? ● ఆర్భాటంగా ఆనం కాన్వాయ్ ఆత్మకూరు: పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాన మంత్రి మొదలు, ముఖ్య మంత్రులు, మంత్రులు తమ కాన్వాయ్లో వాహనాలను కుదించుకున్న విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సైతం వారంలో ఒక రోజు శుక్రవారం ‘నో వెహికల్ ప్రైడే’ గా పాటించాలని నిర్ణయించారు. ప్రతి శుక్రవారం రోజు కాన్వాయ్ లేకుండా, వీలైతే బస్సుల్లో వెళ్లేలా మంత్రులు తమ షెడ్యూల్ మార్చుకోవాలని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆత్మకూరులో శుక్రవారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన నేపథ్యంలో కాన్వాయ్లో 11 వరకు కార్లు మున్సిపల్ పరిధిలో రయ్.. రయ్ అంటూ హడావుడిగా తిరిగాయి. దీన్ని చూసి పట్టణ ప్రజలు నో వెహికల్ ఫ్రైడే అమలు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. కేవలం ప్రజలకు చెప్పేందుకే పొదుపు నియమాలు అని, తమకు అవి వర్తించవని అమాత్యుల భావం కాబోలు. కామాక్షితాయి ఆలయానికి రూ.10.30 లక్షల విరాళం బుచ్చిరెడ్డిపాళెం: జొన్నవాడలోని మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి దేవస్థానానికి నెల్లూరుకు చెందిన కొమ్మి మల్లికార్జుననాయుడు కుటుంబ సభ్యులు రూ.10,30,232 నగదును విరాళంగా శుక్రవారం అందజేశారు. ఎస్ఎస్ మోడరన్ రైస్ ఇండస్ట్రీ, లక్ష్మీవెంకటేశ్వర మోడరన్ రైస్ ఇండస్ట్రీ పేరుతో శాశ్వత నిత్యాన్నదాన పథకానికి ఈ విరాళాన్ని అందజేశారు. దాతలను ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్రెడ్డి, సహాయ కమిషనర్ అర్వభూమి వెంకట శ్రీనివాసులురెడ్డి శేషవస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. -
సారూ.. ఈ సభలెందుకు?
● జాయింట్ కలెక్టర్ ఎదుట ప్రజల ఆగ్రహం ● పోలీసులను పిలుస్తానంటూ హెచ్చరికతో గందరగోళం ● ఖాళీ కుర్చీలతో వెలవెలబోయిన సభ వాకాడు: ‘ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు.. మళ్లీ సభలు ఎందుకు నిర్వహిస్తున్నారు?’ అంటూ తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి గోవిందరావును అర్జీదారులు నిలదీశారు. దీంతో సమావేశం ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. వాకాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం వాకాడు, చిట్టమూరు మండలాలకు సంబంధించిన ‘ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు’ కార్యక్రమాన్ని జేసీ, సూళ్లూరుపేట ఆర్డీఓ దేవేందర్రెడ్డి నిర్వహించారు. దీనికి ముందస్తు సమాచారం లేకపోవడంతో అర్జీదారులు పెద్ద సంఖ్యలో హాజరుకాలేదు. ఫలితంగా సభ ఖాళీ కుర్చీలతో వెలవెలబోయింది. గతంలో ఇచ్చిన రెవెన్యూ క్లినిక్ అర్జీలకు ఇప్పటికీ పరిష్కారం రాలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో మళ్లీ సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు. ఓ బీజేపీ నాయకుడు సమావేశ బ్యానర్లో ప్రధాని నరేంద్రమోదీ ఫొటో లేకపోవడంపై ప్రశ్నించగా.. జేసీ పోలీసులను పిలవాలంటూ ఆదేశించడంతో గందరగోళం నెలకొంది. దీనిపై బీజేపీ నాయకులు స్పందిస్తూ.. ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరించడం సరికాదని, రెవెన్యూ సమస్యలు పరిష్కరించకపోవడంపై ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఫిర్యాదులకు అధికారులు స్పందించేవారని, ప్రస్తుతం సమస్యలు పెండింగ్లోనే ఉంటున్నాయని చెప్పారు. కార్యక్రమంలో వాకాడు, చిట్టమూరు తహసీల్దార్లు సయ్యద్ ఇక్బాల్, రామయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
మినీబార్లను తలపిస్తున్న లైసెన్స్ దుకాణాలు
గత ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే విధంగా సర్కారు ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. నిర్ణీత సమయంలో మాత్రమే విక్రయాలు చేపట్టింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం పాలసీని ప్రైవేట్ పరం చేసింది. దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు విచ్చలవిడిగా విక్రయాలకు తెరలేపారు. ప్రతి దుకాణం పక్కనే అనధికారిక పర్మి ట్ రూమ్లు కొనసాగుతున్నాయి. ఇవి మినీబార్లను తలపిస్తున్నాయి. జిల్లాలో సర్వేపల్లి, గూడూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో లైసెన్స్ దుకాణాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘన జరుగుతోంది. వెంకటాచలం, గూడూరు, ఉదయగిరిలో ఎమ్మార్పీ కంటే రూ.10 అదనంగా వసూలు చేసుకుంటున్నారు. ఇటీవల మద్యం ప్రియులే షాపుల ముందు ఎమ్మార్పీ ఉల్లంఘనపై వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టడం సంచలంగా మారింది. ఇంత జరుగుతున్నా అధికారుల్లో మార్పు రాలేదు. -
కడివేడులో భూమాయ
● కూటమి ప్రభుత్వం వచ్చాక పెరిగిన కబ్జాలు ● హెచ్చరిక బోర్డులు మాయం ● రీ సర్వేలో పేర్ల నమోదుకు ప్రయత్నాలు ● ఆక్రమణ చెరలో వందల ఎకరాలు చిల్లకూరు: మండలంలోని అతిపెద్ద రెవెన్యూ గ్రామమైన కడివేడులో ప్రభుత్వ భూముల ఆక్రమణలు రోజురోజుకూ పెరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు భూములను ఆక్రమించుకుని హద్దులు ఏర్పాటు చేసుకోవడం, రీ సర్వే సమయంలో పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రయత్నాలు చేయడం, గతంలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు మాయం కావడం వంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. రెవెన్యూ అధికారుల సహకారంతోనే ఈ వ్యవహారాలు జరుగుతున్నాయని విమర్శలున్నాయి. ఒకవైపు రెవెన్యూ పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుడతామని, భూములను ఏపీఐఐసీకి కేటాయిస్తామని చెప్పడమే ఆలస్యం.. మరోవైపు ప్రభుత్వ భూములపై అక్రమ దందాలు కొనసాగుతున్నాయని ఆరోపణలున్నాయి. అక్రమార్కులకు అవకాశం కడివేడు రెవెన్యూ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకుని విస్తారంగా ప్రభుత్వ భూములున్నాయి. సుమారు 20 ఏళ్ల క్రితం భూ వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులపై అప్పట్లో ఏసీబీ అధికారులు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత సంబంధిత భూముల రికార్డులు తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో అందుబాటులో లేకపోవడం అక్రమార్కులకు వరంగా మారిందని ప్రచారం జరుగుతోంది. దీంతో కొంతమంది బడాబాబులు రెవెన్యూ సిబ్బంది కుమ్మకై ్క ప్రభుత్వ భూములకు నకిలీ పట్టాలు సృష్టించుకుని సాగు చేసుకోవడం, క్రయవిక్రయాలు జరుపుతున్నప్పటికీ ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. బోర్డులు పెడితే.. గతంలో కొందరు తహసీల్దార్లు ప్రభుత్వ భూములపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పలు సర్వే నంబర్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల కింది స్థాయి సిబ్బంది సహకారంతో ఆ బోర్డులు తొలగించబడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆక్రమణదారులకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు. రూ.కోట్ల విలువ మండలంలోని బూదనం టోల్ప్లాజా సమీపంలో ఎకరా భూమి విలువ రూ.3 కోట్ల వరకు పలుకుతోంది. ఈ ప్రాంతంలోని సర్వే నంబర్ 953లో సుమారు 17.24 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే సుమారు 14 ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం మరో మూడు ఎకరాలకు ఫెన్సింగ్ వేసి సాగుకు సిద్ధం చేయగా స్థానికుల ఫిర్యాదుతో అప్పటి తహసీల్దార్ విచారణ జరిపి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల ఆ బోర్డును తొలగించి రీ సర్వే జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం. రెవెన్యూ అధికారుల సహకారంతో సుమారు రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి.సర్వే నంబర్ 954లో ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు (ఫైల్) నేడు హెచ్చరిక బోర్డును తీసేశాక..విచారణ చేపడతాం కడివేడు రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములను పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఐఐసీకి అప్పగించే ప్రక్రియలో భాగంగా రికార్డులు పరిశీలిస్తున్నాం. అలాగే సర్వే నంబర్ 953లో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును ఎవరు తొలగించారు?, వారి పేర్లు రికార్డుల్లో నమోదయ్యాయా అనే అంశాలపై విచారణ చేపడతాం. – గోపీనాథ్రెడ్డి, తహసీల్దార్ -
రూ.2 కోట్ల స్థలం హాంఫట్
నెల్లూరు(బారకాసు): నగరంలో మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇలాకాలో రూ.కోట్ల విలువైన భూములు ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. నగర పాలక సంస్థ అధికారుల అండదండలతో ఇరిగేషన్, దేవదాయ శాఖలతో పాటు కార్పొరేషన్ స్థలాలను సైతం కబ్జా చేస్తున్నారు. ఏకంగా రోడ్డు స్థలాలను ఆక్రమించి దుకాణాల నిర్మాణం చేపడుతున్నా అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ● నగరంలోని మూడో డివిజన్ ప్రశాంతినగర్ సమీ పంలోని చేపల మార్కెట్ పక్కన ఓ బార్అండ్ రెస్టారెంట్ ముందు భాగంలో మైపాడురోడ్డు వరకు దాదాపు 40 అంకణాల ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలాన్ని ఆక్రమించేసి ప్రహరీ నిర్మించారు. ఇదే ప్రాంతంలో ఉన్న దేవదాయ, ఇరిగేషన్ శాఖలకు చెందిన స్థలాలను ఆక్రమించి దుకాణాలు, ఇళ్లు నిర్మించారు. వీటిపై నేటికి ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖాలు లేవు. ● తాజాగా నగర నడిబొడ్డున ఉడ్హౌస్సంఘంలోని రూ.2 కోట్ల విలువైన రోడ్డు స్థలాన్ని కొందరు ఆక్రమించి దుకాణాల నిర్మాణం చేపడుతున్నారు. ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఉన్న స్టోన్హౌస్పేట ప్రాంతం వాణిజ్య ప్రదేశం. ఇక్కడ నిత్యం రూ.కోట్లలో వ్యాపారాలు జరుగుతుంటాయి. స్టోన్హౌస్పేటకు అత్యంత సమీపంలో ఉన్న ఉడ్హౌస్సంఘం ప్రాంతంలో అంకణం దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఇంతటి ఖరీదైన ప్రాంతంలో సుమారు 20 అంకణాలకుపైగా రోడ్డు స్థలాన్ని కొందరు ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో రోడ్డు నిర్మాణం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్టోన్హౌస్పేట ప్రధాన రహదారి నుంచి ఉడ్హౌస్సంఘంలోకి వెళ్లే ప్రధాన మార్గం ప్రారంభంలో రోడ్డు విస్తరణ చేపట్టారు. అక్కడ ఉన్న పలు ఆక్రమణలు తొలగించి వాహనాల రాకపోకలకు అనుకూలంగా ఉండేలా విశాలమైన సిమెంట్ రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం ఈ సిమెంట్ రోడ్డుకు పక్కనే ఉన్న పాతసిమెంట్ రోడ్డును కొందరు ఆక్రమించేసి దుకాణాలు నిర్మించారు. ఈ విషయమై స్థానికులు పలుమార్లు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో స్థానికులు కోర్టును ఆశ్రయించారు. పరిశీలించిన న్యాయస్థానం ప్రభుత్వ రోడ్డులోని ఆక్రమణలను తొలగించేలా చర్యలు చేపట్టాలని కార్పొరేషన్ టౌన్ప్లానింగ్ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు యంత్రాంగం స్పందిస్తూ 2024 జనవరి 20న మూడ్రోజుల్లో చర్యలు తీసుకుంటామని ఎండార్స్మెంట్ సైతం ఇవ్వడం జరిగింది. అయినా నేటికీ ఎలాంటి చర్యలు లేవు. రోడ్డును ఆక్రమించి నిర్మించిన దుకాణాల వెనుక ఉన్న స్థల యజమాని తన భవన నిర్మాణం అనుమతి కోసం ఎన్ఎంసీ టౌన్ప్లానింగ్కు దరఖాస్తు చేసుకున్నారు. అందులో కూడా ప్రస్తుతం నిర్మించిన దుకాణాల స్థలం రోడ్డుగానే ప్లాన్లో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న సిటీ నియోజకవర్గంలో రోజురోజుకు ఇలా ప్రభుత్వానికి చెందిన స్థలాలు, రోడ్లు ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణలను అడ్డుకుని ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంత్రి నారాయణ ఇలాకాలో రోడ్డును కబ్జా చేసి షాపుల నిర్మాణం కోర్టు ఆదేశాలు బేఖాతరు చోద్యం చూస్తున్న కార్పొరేషన్ -
ప్రతి బాటిల్కు ఎమ్మార్పీపై రూ.10 నుంచి రూ.50 వరకు అదనపు వసూలు
జిల్లాలో మద్యం సిండికేట్ బరితెగించింది. ‘పచ్చ’ ముఠాలు మాఫియాలుగా ఏర్పడి మందు బాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. వీరికి ఎకై ్సజ్ శాఖ ముడుపుల మత్తులో సహకరిస్తుండడంతో మద్యం మాఫియా చెలరేగుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ ధరలు కాగితాలకే పరిమితమవుతుండగా, క్షేత్రస్థాయిలో లైసెన్స్ దుకాణాల నుంచి విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన బెల్టు దుకాణాల వరకు ప్రతి క్వార్టర్ బాటిల్పై బహిరంగంగా దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా మద్యం బెల్టు షాపులే లేవంటూ ఎకై ్సజ్ అధికారుల నుంచి ప్రభుత్వ పెద్దల వరకు చెబుతున్నారు. వాస్తవానికి ఊరూరా బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా ఉన్నాయనేది ‘పచ్చ’ నిజం. -
లేబుళ్లు లేకుండానే మద్యం విక్రయాలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ధనార్జనే ధ్యేయంగా టీడీపీ నేతలు మద్యం మాఫియాలుగా అవతరించి మహత్తుగా ‘అదనపు’ దోపిడీకి పాల్పడుతున్నారు. ఊరూరా విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసి అఫిషియల్గా క్యూఆర్ కోడ్ పెట్టి దోచుకుంటున్నారు. అయినా ఎకై ్సజ్ శాఖ అవినీతి మత్తులో జోగుతోంది. జిల్లాలో 190 మద్యం దుకాణాలు, 54 బార్లు ఉండగా సుమారు 2 వేలకు పైచిలుకు బెల్టు షాపుల్లో ఊరూరా మద్యం ఏరులై పారుతోంది. జిల్లాలోని సర్వేపల్లి, ఉదయగిరి, గూడూరు నియోజకవర్గాల్లో అదనపు వడ్డనతో మద్యం సిండికేట్ జేబులు నింపుకుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. లైసెన్స్ దుకాణాల నుంచి బెల్టు షాపుల వరకు అర్ధరాత్రి వేళ వరకు తెరిచి ఉంచి యువతను మద్యం మత్తులో ముంచెత్తుతున్నాయి. స్కూళ్లు, కాలనీలు, ప్రధాన రహదారుల వెంబడి మద్యం విక్రయాలు జరుగుతున్నా.. ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో రోజుకు ఆరు లక్షల మంది మద్యపానం చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రశాంతమైన పల్లెల్లో బెల్టు దుకాణాలు చిచ్చు రేపుతుండగా, నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలను బలి తీసుకుంటున్నాయి. బెల్ట్ షాపుల్లోనూ బ్రాండెడ్ మద్యం జిల్లాలో మద్యం వ్యాపారం అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లడంతో పట్టణాలు, గ్రామాల్లో బెల్టు షాపులను ఏర్పాటు చేశారు. మద్యం అమ్మకాల్లో బెల్టు షాపులు కీలకంగా మారాయి. వీటికి రూ.లక్షల్లో వేలం పాటలు నిర్వహించి మరీ ఏర్పాటు చేయడం విశేషం. లైసెన్స్ దుకాణాల్లో 40 శాతం విక్రయాలు సాగితే బెల్టు దుకాణాల్లో 60 శాతం విక్రయాలు సాగుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నేరుగా మద్యం దుకాణాల నుంచే వాటికి మద్యం సరఫరా అవుతోంది. బెల్టు షాపుల్లో కేవలం చీప్ లిక్కర్ మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం అన్నీ రకాల బ్రాండ్లు, బీర్లూ అందుబాటులో ఉన్నాయి. క్వార్టర్, బీరుపై అదనంగా రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. మద్యం షాపుల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు, బార్లలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు తెరచి ఉంటున్నారు. అయితే బెల్టు షాపుల్లో మాత్రం 24/7 మద్యం విక్రయాలు సాగుతోన్నాయి. ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి సర్కార్ మద్యంను మాత్రం మందు బాబుల చెంతకు చేర్చి వారిని మద్యానికి మరింత బానిసలుగా మార్చి ఇళ్లు, ఒళ్లును గుళ్ల చేస్తోంది. దీంతో ఆయా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. సంపద సృష్టిస్టామని ఎన్నికల ముందు పదేపదే చెప్పిన చంద్రబాబు ఈ తరహాలో జనం జేబుల్లో నుంచి సొమ్ము గుంజు కుంటూ ఖజానాను నింపుకుంటున్నారన్న విమర్శలున్నాయి. మామూళ్లతో మూలాలకు వెళ్లట్లేదా? లైసెన్స్ దుకాణాల నుంచి బెల్టు షాపు వ్యాపారులతో ఇప్పటికే అధికారులు మూమూళ్లు ఫిక్స్ చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. అనధికార మద్యం విక్రయాలు, నిబంధనల ఉల్లంఘనలపై నామమాత్రపు చర్యలకే పరిమితమయ్యారన్న విమర్శలున్నాయి. బెల్టు విక్రయాలపై దాడులు చేసి నిర్వాహకుల అరెస్ట్లతో సరిపెట్టుకుంటున్నారు. అసలు బెల్టు షాపునకు మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు సరఫరా చేశారనే మూలాల్లోకి వెళ్లకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. అనేక దుకాణాల నుంచే బెల్టుకు మద్యం సరఫరా అవుతున్నట్లు సమాచారం. అయితే ఇంత వరకు ఒక్క దుకాణంపైనా కేసు నమోదు కాకపోవడం గమనార్హం. అయితే అధికారులు మాత్రం పట్టుబడిన మద్యం సీసాల లేబుళ్లు లేని కారణంగా అవి ఏ దుకాణం నుంచి సరఫరా అయిందో తెలుసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. సింహపురి అడ్డాలో సిండికేట్ దందా జిల్లాలో విచ్చలవిడిగా బెల్టు షాపులు అఫిషియల్గా క్యూఆర్ కోడ్ పెట్టి వ్యాపారం పట్టించుకునే నాథుడే లేడు అవినీతి మత్తులో ఎకై ్సజ్ ఎమ్మార్పీ ఉల్లంఘిస్తే చర్యలు ఎమ్మార్పీ మేరకే మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఉల్లంఘనపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. మద్యం వ్యాపారులు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవు. – ఎ. శ్రీనివాసులునాయుడు, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి మద్యం బాటిళ్లపై సమగ్ర సమాచారంతో అతికించే లేబుళ్లు లేకుండానే విక్రయాలు చేస్తున్నారు. ఓ వైపు రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ డంప్లు దొరికిన విషయం తెలిసిందే. ఆ డంప్ల ద్వారా రాష్ట్రంలోని నలుమూలలకు నకిలీ మద్యం సరఫరా జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రతి బాటిల్పై లేబుల్ను చెక్ చేసుకోవాలని యాప్ ప్రవేశ పెట్టింది. బెల్టు దుకాణాల్లో బాటిల్పై లేబుళ్లు లేకపోవడంతో అది నకిలీదా? ఒరిజినల్? అనేది పరీక్షించుకునే అవకాశం లేకుండా పోయింది. దాబాల్లోనూ... జిల్లాలో చిన్నా, పెద్ద కలిపి 300కు పైచిలుకు దాబాలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయించాలంటేనే భయపడే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. కూటమి నేతల అండదండలతో అధిక శాతం దాబాల నిర్వాహకులు యథేచ్ఛగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. మద్యం మీరు తెచ్చుకున్నా సరే.. లేదంటే సిబ్బందే సమకూరుస్తారని మందు బాబులకు నిర్వాహకులు ఆఫర్ ఇస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్య సేవనం చేయిస్తున్నారు. -
వైఎస్సార్సీపీలో పలువురికి పదవులు
నెల్లూరురూరల్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని పార్టీలో వివిధ పదవుల్లో నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ టీయూ రాష్ట్ర సెక్రటరీగా నెల్లూరు నగర నియోజకవర్గానికి చెందిన మండేటి వెంగళరెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ ఎంప్లాయీస్, పెన్షనర్ల వింగ్ ప్రెసిడెంట్గా కె.నారాయణరెడ్డి నియమితులయ్యారు.స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంనెల్లూరు(టౌన్): కడపలోని డా.వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్లో 2026 – 27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. జసీమ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 4 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న వారు వచ్చేనెల 2వ తేదీలోపు https://apsports school.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 4వ తరగతిలో 20 మంది బాలురు, 20 మంది బాలికలు, 5వ తరగతిలో ఆరుగురు బాలురు, 17 మంది బాలికలు, 6వ తరగతిలో నలుగురు బాలురు, 8 మంది బాలికలకు ఖాళీలు ఉన్నాయన్నారు. అదే విధంగా 7వ తరగతిలో 8 మంది బాలురు, 15 మంది బాలికలు, 8వ తరగతిలో ముగ్గురు బాలురు, 5 మంది బాలికలు, 9వ తరగతిలో 16 మంది బాలురు, 10 మంది బాలికలకు ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, ఫుట్బాల్, హాకీ క్రీడల్లో శిక్షణ అందిస్తారన్నారు. ఆన్లైన్ దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన విద్యార్థులకు మోటార్ ఎబిలిటీ టెస్టులు నిర్వహించి, రాష్ట్రస్థాయి ఎంపికల్లో వైద్య పరీక్షల ద్వారా శారీరక దృఢత్వాన్ని అంచనా వేస్తారని తెలిపారు. ఇతర వివరాల కోసం 88862 28444 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. దువ్వూరు మరణం పార్టీకి తీరనిలోటుసూళ్లూరుపేట: వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి దువ్వూరు మునిశేఖర్రెడ్డి అకాల మరణం పార్టీకి తీరనిలోటని ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. శుక్రవారం కాకాణితోపాటు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, నియోజకవర్గ కన్వీనర్ కిలివేటి సంజీవయ్య, నాయకులు పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చేరుకున్నారు. మునిశేఖర్రెడ్డి పార్థివ దేహంపై పార్జీ జెండాను కప్పి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాకాణి మీడియాతో మాట్లాడుతూ మునిశేఖర్రెడ్డి పార్టీకి అంకితభావంతో పనిచేశారని చెప్పారు. ఎంపీ మాట్లాడుతూ జగనన్నను మళ్లీ సీఎంగా చూడాలన్నదే తన జీవిత లక్ష్యమని దువ్వూరు చెప్పేవారన్నారు. సంజీవయ్య మాట్లాడుతూ మునిశేఖర్రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తూనే పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వహించారన్నారు. -
సర్వేపల్లిలో 566 బెల్టు దుకాణాలు
2 వేల జనాభా.. 11 మద్యం దుకాణాలు! సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. ఇటీవల ఓ బెల్టు షాపులో మద్యం తాగి ఇసుక టిప్పర్ నడిపి ఏడుగురు దుర్మరణానికి కారణమయ్యారు. కొన్ని నెలల క్రితం ఆత్మకూరు మండలంలో 2 వేల మంది జనాభా ఉన్న బోయలచిరివెళ్లలో ఏకంగా 11 బెల్టు దుకాణాలు ఉన్నాయని, వాటిని తొలగించాంటూ ఆ ఊరు ప్రజలు ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన ఉదంతం జరిగింది. ఇక్కడ బెల్టు షాపుల నిర్వహణ ఎకై ్సజ్ శాఖ పనితీరును, ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తోంది. సర్వేపల్లి నియోజకవర్గంలో విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు ఉన్నాయి. ఎకై ్సజ్ పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. కూటమి పార్టీలకు చెందిన నాయకులు మద్యం షాపులను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామగ్రామాన బెల్ట్ షాపులను ఏర్పాటు చేశారు. దీంతో ఆటోల డ్రైవర్లు, ఇతర వాహన చోదకులు ఇష్టానుసారం మద్యం సేవిస్తూ వాహనాలను నడుపుతుండడంతో ప్రతినిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సుమారు 566 మద్యం బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇక్కడ ఎనీ టైమ్ మద్యం లభిస్తోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న మ్యాన్షన్ హౌస్ క్వార్టర్ బాటిల్. ఉదయగిరి ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలోని డీసీపల్లిలోని విజయ చాముండేశ్వరీ వైన్ షాపు నుంచి కొనుగోలు చేసింది. ఈ బాటిల్ ఎమ్మార్పీ రూ.210. కానీ ఓ మద్యం ప్రియుడు శుక్రవారం ఈ బాటిల్ కొనుగోలు చేయగా, అతని వద్ద నుంచి రూ.220 ఫోన్పే ద్వారా చేయించుకున్నారు. ఎమ్మార్పీ కంటే రూ.10 అదనంగా తీసుకున్నారు. -
ఆర్టీసీకి భవిష్యత్ లేకుండా చేయడమే
● 26న చర్చలు ఉండగా.. ఈలోపే డిపోను పగలకొట్టడం దారుణం ● సీఐటీయూ నాయకుల ఆందోళనను అడ్డుకున్న పోలీసులు నెల్లూరు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టి భవిష్యత్ లేకుండా చేస్తోందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె అజయ్కుమార్ మండి పడ్డారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద డిపో 2 గ్యారేజీ వద్ద శుక్రవారం ఆందోళన చేపట్టారు. గ్యారేజీలోకి దూసుకెళ్లేందుకు సీఐటీయూ నాయకులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అజయ్కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెందిన విలువైన స్థలాలను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టే చర్యలు ఉపసంహరించుకోవాలన్నారు. రాష్ట్రంలో 12 డిపోల స్థలాలను ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నారన్నారు. ప్రస్తుతం విద్యుత్ బస్సు రూ.40 లక్షలుంటే.. కూటమి ప్రభుత్వం రూ.1.70 కోట్లతో ఒక్కో బస్సు కొంటున్నారన్నారు. గుంతలమయమైన రోడ్లులో ఎలక్ట్రిక్ బస్సులు తిప్పే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. ప్రభుత్వం, అధికారులు పంతానికి పోయి ఇటు వంటి చర్యలకు పాల్పడడం దారుణమన్నారు. 103 రోజులుగా ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ఈ నెల 26న చర్చలు ఉండగా డిపోలోని పలు భవనాలను పగలకొట్టేయడం దారుణమన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు కారణంగా సీ్త్ర శక్తి పథకం రద్దవుతుందని, విద్యార్థులకు బస్సు పాస్లు ఉండవన్నారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై రానున్న రోజుల్లో ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నాగేశ్వరరావు, శంకరయ్య, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బడుల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు చర్యలు
నెల్లూరు(టౌన్): జిల్లాలోని వివిధ పాఠశాలల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. గత నెలలోనే వాటిని పంపిణీ చేశారు. సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య శుక్రవారం నెల్లూరులోని కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. 12 కేజీబీవీలు, 11 మోడల్ హైస్కూల్స్, 46 పీఎంశ్రీ స్కూల్స్ ఉన్నాయన్నారు. ప్రతి దాంట్లో రెండు ప్యానెల్స్ను ఏర్పాటు చేస్తారన్నారు. ఒక్కో యూనిట్కు జీఎస్టీతో కలిపి రూ.2.66 లక్షల వ్యయం అవుతుందని తెలిపారు. పీఎంశ్రీ స్కూల్స్కు సంబంధించిన మొత్తం ఖర్చును కేంద్రం, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్కు కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం అందిస్తుందన్నారు. వచ్చే నెలలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి ప్యానెల్స్ను అమర్చి వినియోగంలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇంకా పీఎంశ్రీ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ‘సిక్ రూమ్’లను ఏర్పాటు చేస్తామన్నారు. వాటిల్లో మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రతి కేజీబీవీ, మోడల్ స్కూల్లో 9 చొప్పున, 46 పీఎం శ్రీ స్కూల్స్లో 317 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారన్నారు. -
నిబంధనలు తూచ్.. అధిక టన్నేజీ..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం టిప్పర్, లారీల్లో సుమారు 22 నుంచి 25 టన్నుల వరకు మాత్రమే సిలికాను రవాణా చేయాలి. అయితే గనుల శాఖ అధికారుల ఊదాసీనతతో నిబంధనలను తుంగలో తొక్కి సిండికేట్ సభ్యులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో సిలికా గనుల నుంచి బయటకు వచ్చే లారీ, టిప్పర్లు సుమారు 50 టన్నులకు మించి లోడ్ చేసుకుని వస్తున్నాయి. అధిక టన్నేజీ వాహనాలు గ్రామాల మీదుగా వెళ్తూ ప్రమాదాలు జరుగుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. కాగా రాయల్టీ వసూళ్ల టెండర్లను దక్కించుకున్న ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద టిప్పర్లు, లారీలు లోడింగ్ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. అయితే కాంట్రాక్ట్ సంస్థ సిబ్బంది పరిమితి మించి రవాణాకు సిండికేట్కు అండదండలు అందిస్తున్నారు. -
గాలివాన బీభత్సం
వరికుంటపాడు: మండలంలో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉదయం ఎండ బాగా కాసింది. సాయంత్రం వేళ ఆకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. రహదారులపై చెట్లు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తూ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. కొన్నిచోట్ల వడగళ్ల వాన కురవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. -
రాష్ట్రంలో అరుదుగా లభించే సిలికా ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక టీడీపీ నాయకులు చిల్లకూరు, కోట మండలాల్లోని కాలం చెల్లిన, అనుమతులు పూర్తయిన సిలికా గనులపై కన్నేశారు. సిండికేట్గా మారి సెలవు దినాల్లో, రాత్రి వేళల్లో యంత్రాలతో
చిల్లకూరు: కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు బ్రహ్మ రాక్షసుల్లా మారి ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. గూడూరు నియోజకవర్గంలోని ఖనిజ సంపదను లూటీ చేస్తున్నారు. సిలికా, తెల్లరాయికి మంచి గిరాకీ ఉండడంతో సిండికేట్గా మారి ప్రభుత్వ పెద్దల అండదండలతో అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. ప్రభుత్వ భూముల్లోని సిలికాను పిడికెడు కూడా తరలించడం లేదని చెబుతూనే కాలం చెల్లిన, అనుమతులు పూర్తయిన సిలికా గనులను లక్ష్యంగా చేసుకుని అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. రోజుకో మైన్లో 10 నుంచి 20 లారీల సిలికా (ఒక లారీకి సుమారు 50 టన్నులు)ను అక్రమ మార్గంలో తరలిస్తున్నారు. అయినా గనుల శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి రాష్ట్రంలో అరుదైన సిలికా ఖనిజం చిల్లకూరు, కోట మండలాల్లోని తీర ప్రాంతంలో సుమారు ఆరు వేల హెక్టార్లలో లభిస్తోంది. ఈ ఖనిజానికి పరిశ్రమల్లో మంచి డిమాండ్ ఉంది. ప్రధానంగా గాజు, ఉక్కు పరిశ్రమల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీంతో పలువురు సిలికా గనులను లీజుకు తీసుకుని పరిశ్రమలు అధికంగా ఉండే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర, తెలంగాణకు ఎగుమతి చేస్తుంటారు. ప్రకృతి విధ్వంసం.. భూగర్భ జలాలు పాతాళం గూడూరు నియోజకవర్గంలోని ఖనిజ సంపదపై స్థానిక టీడీపీ నాయకులు దృష్టి పెట్టారు. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని సిండికేట్గా ఏర్పడ్డారు. తెల్లరాయి, సిలికా ఖనిజాలతోపాటు గ్రావెల్, మట్టిని అక్రమంగా తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా అక్రమ తవ్వకాలతో ప్రకృతిని విధ్వంసం చేస్తుండడంతో భారీగా ఏర్పడిన గుంతల్లో పడి పశువులు, మనుషులు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి నెలకొంది. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా సుమారు 30, 40 అడుగుల లోతు మేర తవ్వకాలు చేయడంతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. ఫలితంగా రైతులు, సమీప గ్రామాల ప్రజలు సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అంతా మా ఇష్టం అని సిండికేట్ బెదిరింపులకు పాల్పడుతోందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి సిలికా తవ్వకాలతో ప్రభుత్వానికి వచ్చే రాయల్టీ నేడు తక్కువై పోయింది. రాష్ట్రంలో అన్ని రకాల ఖనిజ సపదకు చెందిన రాయల్టీలను వసూలు చేసి చెల్లించేలా ఒకే కాంట్రాక్ట్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. అయితే గతంలో ప్రభుత్వానికి మైన్ల లీజుదారులు చెల్లించే రాయల్టీ కన్నా నేడు తక్కువగా ఆదాయం వస్తున్నట్లుగా తెలుస్తోంది. చిల్లకూరు, కోట మండలాల్లోని సిలికా గనుల నుంచి గతంలో నెలకు మూడు లక్షల టన్నులకుపైగా సిలికా రవాణా అయ్యేది. దీంతో ప్రభుత్వానికి నెలకు సుమారు రూ.9 కోట్లకు పైగా రాయల్టీ వచ్చేది. ప్రస్తుతం కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థతో పాటు సిండికేట్ ద్వారా అందులో సగం మాత్రమే రాయల్టీ కింద జమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన మొత్తం ప్రభుత్వంలోని పెద్దల జేబుల్లోకి వెళుతుందునే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా కోట్ల రూపాయలు సొమ్ము పరులపరం కావడం కూటమి ప్రభుత్వంలోని మిగిలిన నాయకులకు కూడా మింగుడు పడడం లేదు. కాలం చెల్లిన సిలికా గనుల్లో అక్రమ తవ్వకాలు సిండికేట్గా మారిన టీడీపీ నాయకులు పెద్దల అండదండలతో పరిశ్రమలకు తరలింపు ప్రభుత్వ ఆదాయానికి గండి కన్నెత్తి చూడని గనుల శాఖాధికారులు సరెండర్ చేసిన గనుల్లోనూ.. సుమారు 50 ఏళ్ల క్రితం లీజుకు తీసుకున్న సిలికా గనులు కోట, చిల్లకూరు మండలాల్లో సుమారు పది వరకు ఉన్నాయి. వాటిల్లో తవ్వకాలు పూర్తవడంతో రెన్యూవల్ చేసుకోకుండా యాజమాన్యాలు ప్రభుత్వానికి తిరిగి అప్పగించే క్రమంలో ఐదేళ్ల క్రితం సరెండర్ చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సిలికా సిండికేట్గా ఏర్పడిన అధికార పార్టీ పెద్దలు సరెండర్ చేసిన గనుల్లోని సిలికాపై కన్నేశారు. అనుకున్నదే తడువుగా రాత్రి వేళలు, సెలవు దినాల్లో పెద్ద పెద్ద యంత్రాలతో అక్రమంగా తవ్వకాలు చేపట్టి ఇతర రాష్ట్రాలకు తరలించి లక్షలు గడిస్తున్నారు. -
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు(టౌన్): వెంకటేశ్వరపురంలోని ప్రభు త్వ బాలికల ఐటీఐలో 2026–27 విద్యా సంవత్సరానికి ఆయా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ ఏడుకొండలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఇన్స్ట్రూమెంట్ మెకానిక్, రిఫ్రిజిరేషన్,ఎయిర్కండీషన్ టెక్నీషియస్, డ్రస్మేకింగ్, తదితర ట్రేడ్ల్లో అడ్మిషన్లు ఉన్నాయని చెప్పారు. ఆసక్తి కలిగిన వారు వచ్చే నెల 30వ తేదీలోగా itiadmissions. ap. gov. in/ iti వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల ప్రారంభం నెల్లూరు (టౌన్): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి శాప్ లీగ్ అథ్లెటిక్స్ పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్కే జసీమ్ గురువారం ప్రారంభించారు. అండర్–16, 20 విభాగాల్లో బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 50 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గుంటూరులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేయనున్నారు. 11 మంది నర్సింగ్ విద్యార్థినులకు అస్వస్థత వెంకటాచలం: మండలంలోని సరస్వతీనగర్ వద్ద ఉన్న ఓ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న 11 మంది విద్యార్థినులు గురువారం అస్వస్థతకు గురయ్యారు. ఉదయం 10 గంటలకు ముగ్గురు విద్యార్థినులు వాంతులు, తలనొప్పితో అస్వస్థతకు గురికాగా వెంకటాచలంలోని క్లస్టర్ ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం మరో ముగ్గురు, సాయంత్రం మరి కొందరు మొత్తంగా 11 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై సీహెచ్సీకు రాగా వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీంతో కళాశాలలోని మిగిలిన విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై సీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ షేక్ అబ్దుల్ మొయిన్ మాట్లాడుతూ విద్యార్థినులు డీహైడ్రేషన్తో సీహెచ్సీకు వచ్చారని, చికిత్స అందిస్తున్నామని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొండాపురం ఎస్సైపై సస్పెన్షన్ వేటు కొండాపురం : కొండాపురం ఎస్సై జే మాల్యాద్రిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని కలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు గురువారం తెలిపారు. ఇటీవల కొండాపురంలో ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి టీడీపీ నాయకులు చంపేశారన్న విషయం, నాలుగు రోజుల క్రితం గానుగపెంటకు చెందిన ఇద్దరు దళితులపై కొమ్మి గ్రామానికి చెందిన వ్యక్తులు దాడి చేసి ఓ వ్యక్తిని చంపి బావిలో పడవేసిన కేసుల విషయంలో ఎస్సై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సస్పెన్షన్ విధించారని వివరించారు. ఎస్బీఐ సేవలకు నాలుగు రోజులు అంతరాయం నెల్లూరు(అర్బన్): స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సేవలకు వరుసగా నాలుగు రోజులు అంతరాయం కలుగనుంది. ఈ నెల 23న నాల్గో శనివారం, 25న ఆదివారం సెలవు దినాలు కావడంతో బ్యాంకు ఉండదు. కాగా తమ డిమాండ్ల సాధనకోసం ఎస్బీఐ ఉద్యోగులు సోమ, మంగళవారాల్లో బంద్కు పిలుపునిచ్చి ఉన్నారు. దీంతో ఈ రెండ్రోజుల్లో కూడా బ్యాంకు సేవలకు అంతరాయం కలుగనుంది. బక్రీద్ సందర్భంగా ముందస్తు క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వం ఈ నెల 27న సెలవు దినాన్ని ప్రకటించింది. అయితే ముస్లిం పెద్దలు పండగను ఈ నెల 28న జరుపుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వం కూడా ఈ నెల 28న సెలవు ప్రకటించింది. దీంతో శనివారం నుంచి వరుసగా నాలుగు రోజులు, ఆ తర్వాత గురు వారం మరో రోజు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. అందువల్ల ఖాతా దారులు ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. -
వైఎస్సార్సీపీకి కార్యకర్తలే బలం
● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కోవూరు: వైఎస్సార్సీపీకి కార్యకర్తలే బలమని ఆ పార్టీ పీఏసీ సభ్యులు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. గురువారం ఆయన నెల్లూరులోని తన నివాసంలో విడవలూరు మండల పార్టీ నూతన కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. మండల స్థాయిలో పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికలకు సన్నద్ధత, బూత్ స్థాయిలో పార్టీ పటిష్టత, తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నాయకుడు ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. బూత్లెవల్ ఏజెంట్లు ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలన్నారు. పోలింగ్ బూత్ పరిధిలోని ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. కోవూరు నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం కావడానికి కొత్త కమిటీల సభ్యులు చురుకుగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్బాబు, సీనియర్ నాయకులు కొండూరు వెంకట సుబ్బారెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం రూరల్ మండలాధ్యక్షుడు చెర్లో సతీష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నాయకుల పైశాచికం
బిట్రగుంట: టీడీపీ నాయకులు సామాజిక మాధ్య మాల్లో దిగజారుడు రాతలను పోస్టు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు బతికుండగానే కాలం చేశారని తప్పుడు కథనాలను పోస్టు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. కావలి నియోజకవర్గంలోని పలు వాట్సప్ వార్తా గ్రూపులు, ఇతర వాట్సప్ గ్రూపుల్లో బుధవారం అర్ధరాత్రి సుమారు 12.30 గంటల ప్రాంతంలో ‘వై సాయిరాం’ అనే వాట్సప్ డిస్ప్లే పేరుతో ఉన్న 79950 36322 నంబరు నుంచి వైఎస్సార్పీపీ మండలాధ్యక్షుడు మద్దిబోయిన వీరరఘు కాలం చేశారనే తప్పుడు కథనాలను పోస్టు చేశారు. రఘు ఫొటోతో పాటు ‘జోహార్ రఘు అన్న’ అంటూ వరుసగా కథనాలు పోస్టు చేయడంతో రఘు బంధువులు, మిత్రులు, నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి సమయం కావడంతో అందరూ ఫోన్లు చేసి ఆరా తీయడం ప్రారంభించారు. చివరకు తప్పుడు కథనంగా తేలడం, దురుద్దేశపూర్వకంగా రఘు పేరు, ఫొటోను దుర్వినియోగం చేస్తూ కాలం చేశారనే కథనా న్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసినట్లు గుర్తించారు. దీంతో తీవ్రంగా కలత చెందిన రఘు బంధుమిత్రులు, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, విశ్వనాథరావుపేట బిట్–2 ఎంపీటీసీ సభ్యులు ఏకే సుందర్రాజు గురువారం సాయంత్రం బిట్రగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల్లో భయాందోళనలు కలిగించేలా బతికి ఉన్న వ్యక్తిని చనిపోయినట్లుగా తప్పుడు ఫొటోలతో ప్రచారం చేసిన సదరు వ్యక్తిపై బీఎన్ఎస్, ఐటీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం వీరరఘుపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన ఘటనపై స్థానిక వైఎస్సార్సీపీ నాయకులతో పాటు బోగోలు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావలి కేంద్రంగా అధికార పార్టీని అడ్డం పెట్టుకుని కొన్ని యూట్యూబ్ చానళ్లు, సామాజిక మాధ్యమాల్లో దిగజారుడు కథనాలతో పైశాచిక ఆనందం పొందుతున్న ముఠాలపై కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రఘుపై అనుచిత కథనాలు పోస్టు చేసిన వ్యక్తిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టకుంటే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించనున్నట్లు వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులపై సామాజిక మాధ్యమాల్లో దిగజారుడు రాతలు బోగోలు మండలాధ్యక్షుడు రఘు కాలం చేశారని తప్పుడు కథనాలు పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నాయకులు -
మత్స్యకార మహిళల నిర్బంధం అన్యాయం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటాచలం: తుమ్మలపెంట పర్యటనలో చంద్రబాబును కలవనీయకుండా చెన్నాయపాళేనికి చెందిన మత్స్యకార మహిళలను పోలీసులు నిర్బంధించడం అన్యాయమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. మండలంలోని కాకుటూరు, తాటిపర్తిపాళెం గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన మత్స్యకార మహిళలను పోలీసులు అడ్డుకోవడంపై వారు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. ముందుగా ఎంపిక చేసిన కొందరు మత్స్యకారులను మాత్రమే నిఘా నీడలో, పోలీసు బందోబస్తు మధ్య చంద్రబాబును కలిసేలా ఆంక్షలు విధించడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు తమ భూ సమస్యలను సీఎంకు చెప్పుకుందామని వస్తే పోలీసులు కలవనీయకుండా అడ్డుకోవడం సరైన పద్ధతికాదన్నారు. చంద్రబాబుకు చెప్పుకుంటే తమకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో వచ్చిన మహిళలకు నిరాశే మిగిలిందన్నారు. చంద్రబాబు చేపల కూర వండటం, వడ్డించడం, ఆరగించడంపై జనం సైటెర్లు వేస్తున్నారని విమర్శించారు. ఆయన ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేక, మత్స్యకారులను ఆకట్టుకునే ఆకర్షణీయ పథకాలు ప్రకటించకుండా చేపల వంట పేరుతో డ్రామాలాడి అభాసుపాలయ్యాడన్నారు. ఆయన తన పర్యటన ఆద్యంతం ప్రజల సమస్యల గురించి కాకుండా, వైఎస్ జగన్ని, వైఎస్సార్సీపీని దుమ్మెత్తి పోయడానికే ప్రాధాన్యత ఇచ్చాడన్నారు. చంద్రబాబు మత్స్యకారుల సేవలో పేరుతో తుమ్మలపెంట గ్రామానికి వచ్చి తాను ఏమి చేశాడో చెప్పుకోలేక రకరకాల విన్యాసాలతో నవ్వుల పాలయ్యాడని విమర్శించారు. కొత్త స్టీల్ సామగ్రితో మత్స్యకారుల ఇంట వంటా, వడ్డింపు పేరుతో చంద్రబాబు తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారన్నారు. టీడీపీ విడుదల చేసిన వీడియోలు చూస్తుంటే మత్స్యకారుల ఇంట్లో వాళ్లు వాడే వస్తువులను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడ లేదనే విషయం స్పష్టమవుతుందన్నారు. గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా వైఎస్ జగన్ హయాంలో చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలు చాలా సంతోషంగా చెబుతున్నారన్నారు. కాకుటూరులో టీడీపీ నాయకులు ఆక్రమించుకున్న భూమిని ఖాళీ చేయించి 283 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే గృహ నిర్మాణాలను ప్రారంభించడం జరిగిందని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లబ్ధిదారులకు బిల్లులు చెల్లించక నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి అవినీతిలో మునిగితేలుతోందని ఆరోపించారు. చంద్రబాబు మాటల గారఢీతో రకరకాల డ్రామాలతో తమను మభ్యపెడుతున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబును గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. -
నిమ్మ, మామిడి తోట్ల దగ్ధం
అనుమసముద్రంపేట: మండలంలోని చిరమన గ్రామ సమీపంలో దాదాపు వంద ఎకరాల్లోని నిమ్మ, మామిడి తోటలు గురువారం సాయంత్రం దగ్ధమయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. చిరమనకు చెందిన కోడూరు శృతిరెడ్డి, నెల్లూరుకు చెందిన రామకృష్ణ 110 ఎకరాల్లో నిమ్మ, మామిడి తోటలు పెంచుతున్నారు. ఏమైందో ఏమో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి. ఇది గమనించిన చుట్టు పక్కల వారు తోట యజమానులకు సమాచారం అందించారు. శృతిరెడ్డికి చెందిన 22 ఎకరాలు, రామకృష్ణకు చెందిన దాదాపు 80 ఎకరాలు పూర్తిగా దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పబ్లిక్ హెల్త్ సీఈగా మోహన్ తిరుపతి తుడా: నెల్లూరు పబ్లిక్ హెల్త్ సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న టీ మోహన్కు చీఫ్ ఇంజినీర్గా ఉద్యోగోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చీఫ్ ఇంజినీర్గా కొనసాగనున్నారు. గతంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఆయన సూపరిటెండెంట్ ఇంజినీర్గా పనిచేశారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
నెల్లూరు (టౌన్): ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తెలుగు, సంస్కృతం, హిందీ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 4946 మంది హాజరుకావాల్సి ఉండగా, 4,668 మంది హాజరయ్యారు. 278 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్కు సంబంధించి 98 మందికి గాను, 88 మంది హాజరయ్యారు. 10 మంది గైర్హాజరయ్యారు. మధ్యా హ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తెలుగు, సంస్కృతం, హిందీ పరీక్షలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 2,112 మంది హాజరుకావాల్సి ఉండగా, 1893 మంది హాజరయ్యారు. 219 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్కు సంబంధించి 67 మందికి గాను, 59 మంది హాజరయ్యారు. ఆర్ఐఓ ఏడు కేంద్రాలు, డీవీఈఓ 4, స్క్వాడ్ 30 కేంద్రాలను తనిఖీ చేశారు. గంట ముందుగా పరీక్ష కేంద్రంలోకి ఇంటర్మీడియట్ విద్యార్థులను పరీక్ష సమయానికి గంట ముందుగానే కేంద్రంలోకి పంపించారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కేంద్రాల వద్దకు రావడంతో సందడిగా మారింది. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యార్ధులతో పాటు తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. కేంద్రాల సమీపంలోని చెట్లు కింద సేద తీరారు. పరీక్షలు జరిగే సమయంలో పలు కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో విద్యార్థులు ఉక్కపోతతో అవస్థలు పడ్డారు. 28న పరీక్ష వాయిదా బక్రీద్ సందర్భంగా ఈ నెల 28న జరగాల్సిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షను వాయిదా వేసినట్లు ఆర్ఐఓ వరప్రసాదరావు గురువారం తెలిపారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఎకనామిక్స్, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మ్యాఽథమెటిక్స్ పరీక్ష జరగాల్సి ఉందన్నారు. మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామన్నారు. -
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కోవూరు: మండలంలోని తూర్పు అరుంధతీయవాడలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బ్రహ్మ బుధవారం మధ్యాహ్నం సమయంలో తన ఇంటి సమీపంలో బ్లేడుతో కోసుకుని రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉండగా స్థానికులు గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు, 108కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా వ్యక్తిగత కారణాలు ఉండొచ్చని అనుమానిస్తూ పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. -
ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలి
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఉదయగిరి: కేంద్ర ఎన్నికల కమిషన్ చేపడుతున్న స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) కార్యక్రమంపై బూత్లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి సూచించారు. ఉదయగిరి నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. దుత్తలూరులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఉదయగిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డితో కలిసి కాకాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ ఎస్ఐఆర్ పేరుతో అధికార పార్టీ ఓట్లు తొలగించేందుకు కుట్రలు పన్నే అవకాశం ఉందన్నారు. అందువల్ల బీఎల్ఏలు ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన వారి పేర్లు ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హులను తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఐర్ చేపట్టేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా నియోజకవర్గ ఇన్చార్జిలతో పాటు తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లాలని సూచించారు. అధికారంలోకి వస్తే ఇంధన ధరలు తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు వచ్చాక ఇంకా పెంచడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై వసూలు చేస్తున్న వ్యాట్ను తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించాలన్నారు. పెట్రో ధరలతో ప్రజలు గగ్గోలుపెడుతుంటే కూటమి ప్రభుత్వం మౌనంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జిల్లా పర్యటనలో మత్స్యకార కుటుంబాలకు ఎటువంటి లబ్ధి చేకూర్చకపోగా కేవలం డ్రామాలతో సరిపెట్టారని విమర్శించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణను నిరసిస్తూ మత్స్యకారులకు భరోసాగా జగన్మోహన్రెడ్డి పర్యటిస్తే చంద్రబాబుకు వెన్నులో వణుకు పుట్టిందన్నారు. చంద్రబాబు ప్రసంగంలో తమిళనాడు బోట్ల దొంగతనం ప్రస్తావన లేకపోవడంతో మత్స్యకారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైందన్నారు. సాగర్ డిఫెన్స్తో కుదుర్చుకున్న అగ్రిమెంట్ను రద్దు చేస్తూ చంద్రబాబు ప్రకటన చేస్తారని భావించారని, అలా జరగకపోవడంతో మత్స్యకారులు తీవ్రనిరాశకు గురయ్యారన్నారు. రాష్ట్రంలో కూటమి పాలన అధ్వానంగా ఉందని, దీనిని దించేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. కాగా కొంతమంది పోలీసు అధికారులు ఓవరాక్షన్ చేస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కాకాణి దృష్టికి తీసుకురాగా తప్పుచేసిన అధికారులను, అతిగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని భరోసా ఇచ్చారు. -
నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
నెల్లూరు(టౌన్): ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమవుతాయి. ఇవి వచ్చే నెల 4వ తేదీ వరకు జరుగుతాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 66 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి 19,384 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో 10,630 మంది బాలురు, 8,754 మంది బాలికలున్నారు. 13,291 మంది ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు హాజరవుతుండగా, 5,977 మంది ఫెయిలైనవారు, 116 మంది ఒకేషనల్ విద్యార్థులున్నారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 9,046 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో 5,245 మంది బాలురు, 3,801 మంది బాలికలున్నారు. 3,717 మంది ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు హాజరవుతుండగా, 5,066 మంది ఫెయిలైనవారు, 263 మంది ఒకేషనల్ విద్యార్థులున్నారు. సీసీ కెమెరాల మధ్య.. పరీక్షల నిర్వహణ కోసం 66 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 66 మంది డిపార్ట్మెంట్ అధికారులు, 660 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 6 సిటింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాలను 16 కస్టోడియన్ కేంద్రాల్లో భద్రపరిచి, రోజూ పోలీస్ పహారాలో ఆయా కేంద్రాలకు తరలించనున్నారు. తోటపల్లిగూడూరు, బిట్రగుంట, ఆత్మకూరు, ఉదయగిరి కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ పెట్టారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా విద్యార్థుల సౌకర్యం కోసం 0861 – 2320312 నంబర్తో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు పూర్తి చేశాం పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఆర్ఐఓ వరప్రసాదరావు తెలిపారు. నెల్లూరులోని కార్యాలయంలో బుధవా రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలుంటే కంట్రోల్ రూమ్ నంబర్కు ఫోన్ చేస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. పరీక్షల్లో అవకతవకలకు పా ల్పడిన ఇన్విజిలేటర్లు, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రాల్లో సీసీ కెమె రాలు తప్పనిసరిగా బిగించాలని ఆదేశించారు. జిల్లాలో 66 కేంద్రాల్లో ఏర్పాట్లు 28 వేలమందికి పైగా విద్యార్థుల హాజరు కంట్రోల్ రూమ్ నంబర్ 0861 – 2320312 -
పాత ఎస్టీ హాస్టల్ భవనంలో మృతదేహం
రాపూరు: పట్టణంలోని పాత ఎస్టీ హాస్టల్ భవనం పైఅంతస్తులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం గుర్తించారు. తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు భవనం మిద్దె పైకి వెళ్లి పరిశీలించగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై తిరుమలరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎలాంటి గుర్తింపు ఆధారాలు లభించలేదు. అక్కడ ఖాళీ మద్యం బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లున్నాయి. అతను చనిపోయి ఐదురోజులై ఉండొచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహం లభ్యం సంగం: మండలంలోని చెన్నవరప్పాడు – కావలి కాలువ వద్ద మోటార్ మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి గల్లంతైన వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పి.మాల్యాద్రి (45) ఎలక్ట్రికల్, మోటార్ మరమ్మతుల పనులు చేస్తుంటాడు. మంగళవారం గ్రామ సమీపంలోని కాలువ వద్ద మోటార్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. వెంటనే గ్రామస్తులు, పోలీసులు కలిసి గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. బుధవారం కాలువలో నీటిమట్టం తగ్గిన తర్వాత గాలింపు కొనసాగించగా మాల్యాద్రి మృతదేహాన్ని గుర్తించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. సంగం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
కమీషన్ కొట్టు.. లోన్ పట్టు
నెల్లూరు(పొగతోట): గ్రామీణ ప్రాంతాల్లో పేద మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) రుణ వ్యవస్థలో అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మహిళల అభివృద్ధి కోసం ఉద్దేశించిన బ్యాంక్ లింకేజ్, సీ్త్రనిధి రుణాలు, జీవనోపాధి కార్యక్రమాల అమలులో కొందరు సిబ్బంది కమీషన్ దందా నడుపుతున్నారని తీవ్ర విమర్శలున్నాయి. రుణాల మంజూరుకు 5 నుంచి 10 శాతం వరకు కమీషన్ వసూలు చేస్తున్నట్లు సమాచారం. వీఓఏలు, సీసీలు నుంచి మండల స్థాయి సమాఖ్య సిబ్బంది వరకు ఈ వ్యవహారంలో భాగస్వాములయ్యారన్న ఆరోపణలున్నాయి. కమీషన్ ఇచ్చిన గ్రూపులకు రుణాలు సత్వరంగా మంజూరవుతుండగా, ఇవ్వని గ్రూపులకు అనవసర జాప్యం చేస్తున్నారని బాధిత మహిళలు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో రుణాల మంజూరుకు ముందే డిజిటల్ చెల్లింపుల (ఫోన్పే వంటివి) ద్వారా నగదు వసూలు చేస్తున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులిచ్చిన వారికి పని వేగంగా జరుగుతోందని, ఇవ్వని వారికి నెలల తరబడి ఫైళ్లు ఆగిపోతున్నాయని గ్రూప్ సభ్యులు వాపోతున్నారు. పలు నియోజకవర్గాల్లో.. జిల్లా వ్యాప్తంగా సుమారు 38 వేల స్వయం సహాయక గ్రూపులుండగా, నాలుగు లక్షల మందికి పైగా మహిళలు ఈ వ్యవస్థపై ఆధారపడి పొదుపు చేస్తున్నారు. కొత్త గ్రూపుల ఏర్పాటు, పొదుపు, రుణాలు మంజూరు చేయించం, రికవరీలు, సభ్యులకు శిక్షణలు, పరిశ్రమల ఏర్పాటు తదితర అంశాలను పర్యవేక్షించేందుకు ఉద్యోగులున్నారు. గ్రామ సంఘం బంధాలు, మండల సమాఖ్యలు, జిల్లా సమాఖ్యలున్నాయి. జిల్లా, మండల సమాఖ్యలకు మహిళలు అధ్యక్ష, కార్యదర్శులు, ఇతర సభ్యులున్నారు. ఇంతమంది ఉన్నా కమీషన్లు ఇవ్వనిదే తోటి మహిళలకు రుణాలు మంజూరు కావడం లేదు. ప్రతి సంవత్సరం బ్యాంక్ లింకేజ్ రుణాలుగా రూ.1,400 కోట్లు, సీ్త్రనిధి రుణాలుగా రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు పంపిణీ అవుతున్నాయి. 2026 – 27లో రూ.600 కోట్ల సీ్త్రనిధి రుణాలను లక్ష్యంగా నిర్దేశించారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ప్రవహిస్తున్నా క్షేత్రస్థాయిలో పారదర్శకత లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. జిల్లాలోని సర్వేపల్లి, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కోవూరు నియోజకవర్గాల్లో ఈ కమీషన్ వ్యవహారం ఎక్కువగా ఉందని ఆరోపణలున్నాయి. బ్యాంకు లింకేజ్, పరిశ్రమల ఏర్పాటు, జీవనోపాధి పథకాల పేరుతో కూడా అదనపు వసూళ్లు జరుగుతున్నాయని గ్రామీణ మహిళలు చెబుతున్నారు. స్వాహా చేస్తూ.. రాపూరు మండలంలోని తెగచర్ల గ్రామంలో యానాది సంఘం పేరుతో రూ.7 లక్షలు స్వాహా చేసిన ఘటనపై బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన చర్యల్లేవనే ఆరోపణలున్నాయి. గరిమెనపెంట, తెగచెర్ల, గోనుపల్లి వంటి గ్రామాల్లో కూడా ఇదే తరహా అక్రమాలు జరిగాయని సమాచారం. యానాది గ్రూపుల పేరుతో తీసుకున్న రుణాలను కొందరు వడ్డీ వ్యాపారాలకు మళ్లిస్తున్నారని, నెలకు భారీగా ఆదాయం పొందుతున్నా వ్యవస్థలో గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో నిజాలు బయటపడాలంటే ఉన్నతస్థాయి విచారణ అవసరమని అభిప్రాయపడుతున్నారు. యానాది గ్రూపుల పేరుతో రూ.లక్షల స్వాహా ఎస్హెచ్జీల నుంచి 5 శాతం వసూలు చేస్తున్న సిబ్బంది ప్రతి ఏడాది రూ.వందల కోట్ల లింకేజ్ రుణాలు మండల సిబ్బంది చేతివాటం రికవరీలు స్వాహా చేస్తున్న సిబ్బందికఠిన చర్యలు తీసుకుంటాం గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధే మా ప్రధాన లక్ష్యం. రుణాల మంజూరులో కమీషన్ వసూ లు చేసే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బాధితులు ఫిర్యాదు చేస్తే తక్షణమే విచారణ జరుపుతాం. – నాగరాజకుమారి, డీఆర్డీఏ పీడీ -
వైఎస్సార్సీపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి
● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కోవూరు : క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీ బలోపేతమే లక్ష్యంగా నూతన గ్రామ, వార్డు కమిటీలు పనిచేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాళెం పట్టణ, రూరల్కు సంబంధించిన నూతన వార్డు, గ్రామ కమిటీల సభ్యులతో బుధవారం ఆయన నెల్లూరులోని తన నివాసంలో సమావేశమై పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, వార్డు స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే నాయకులు అందుబాటులో ఉండి సేవాభావంతో పనిచేయాలన్నారు. మండల, నగర కమిటీలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్బాబు, ఏపీఎల్డీఏ మాజీ చైర్మన్ గొల్లపల్లి విజయ్కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వ విధానాలపై పోరాటం
● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నెల్లూరురూరల్: ‘కూటమి ప్రభుత్వ విధానాలపై వైఎస్సార్సీపీ పోరాటాలు చేస్తోంది. దీనికి ప్రజల మద్దతు లభిస్తోంది’ అని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని నాలుగో డివిజన్ జాకీర్హుస్సేన్ నగర్లో వైఎస్సార్సీపీ జెండాను బుధవారం ఆవిష్కరించారు. డివిజన్ ఇన్చార్జి సందాని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీకి ఘన స్వాగతం పలికారు. చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనతో విసిగిపోయి, మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో 4వ డివిజన్లో పార్టీకి భారీ మద్దతు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఎట్టకేలకు శిలాఫలకంలో ఎంపీ పేరును చేర్చారు
చిల్లకూరు: గూడూరు పట్టణంలోని కూరగాయల మార్కెట్, అర్బన్ హెల్త్ సెంటర్లను ఈ నెల 17న ప్రారంభించారు. ఆ సమయంలో ఆవిష్కరించిన శిలాఫలకంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పేరును విస్మరించారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై ‘సాక్షి’లో సోమవారం కథనం రావడంతో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తాను చేసిన పొరపాటును సరిద్దికునేందుకు చర్యలు చేపట్టారు. మంగళవారం రాత్రి రెండు చోట్ల తిరుపతి ఎంపీ పేరుతో కొత్త శిలాఫలకాలను ఏర్పాటు చేయించారు. డీసీపల్లిలో 75 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం 75 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. వేలానికి 108 బేళ్లు రాగా, 75 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు చెప్పారు. వేలంలో కిలో పొగాకు గరిష్టంగా రూ.250, కనిష్టంగా రూ.200, సగటున రూ.222.01 ధర లభించిందని తెలిపారు. వేలంలో 8 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. గోనుపల్లిలో కలెక్టర్ పల్లె వీక్షణ నేడు నెల్లూరురూరల్: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా చేపట్టిన పల్లె వీక్షణ కార్యక్రమాన్ని రాపూరు మండలం గోనుపల్లి గ్రామంలో గురువారం నిర్వహించనున్నారు. జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి ఉపాధి పనులు, అంగన్వాడీ కేంద్రం, గ్రామ సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్, రైతుసేవా కేంద్రాలను సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలపై కలెక్టర్ ఆరా తీయనున్నారు. ఇంటింటి చెత్త సేకరణపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఓహెచ్ఆర్ ట్యాంకును పరిశీలించనున్నారు. గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుని, ఫిర్యాదులను స్వీకరించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. 314 మంది గిరిజనులకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కావలి రూరల్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఇటుక బట్టీల వద్ద వెట్టిచాకిరి చేస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన యానాదులకు అధికారులు విముక్తి కల్పించారు. బుధవారం తెలంగాణ నుంచి జిల్లాకు చెందిన 314 మంది యానాదులను కావలి మండలం తుమ్మలపెంటలోని రెసిడెన్షియల్ స్కూల్ వద్దకు తీసుకొచ్చారు. జిల్లా జడ్జి, రెవెన్యూ అధికారులు, పోలీస్, తదితర శాఖల అధికారులు వచ్చి గిరిజనుల వివరాలను సేకరించారు. అనంతరం వారిని ఐదు బస్సుల్లో స్వగృహాలకు తరలించారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మరి కొంత మంది వలస కార్మికులు ఉన్నారని, వారిని కూడా తీసుకొస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి శ్రీనివాసులు, కావలి జడ్జి ఈ సుధాకర్, కావలి ఆర్డీఓ డీ ఎలీషాకుమార్, డీఎస్పీ డీవీ రమణ తహసీల్దార్ శ్రావణ్కుమార్, లోక్అదాలత్ సభ్యుడు మాలకొండారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలుతిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 84,315 మంది స్వామిని దర్శించుకున్నారు. 43,032 మంది తలనీలాలు అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.74 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో దర్శించుకోగలుగుతున్నారు. -
జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్
నెల్లూరు(అర్బన్): ఆలిండియా సమ్మెలో భాగంగా జిల్లా కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన మెడికల్ షాపుల బంద్ విజయవంతమైంది. నెల్లూరులోని కాపువీధి సమీపంలెపి రెడ్డివారి వీధిలో హోల్సేల్ దుకాణాలు మూతపడటంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. జిల్లా వ్యాప్తంగా హోల్సేల్, రిటైల్ మందుల దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేసి వ్యాపారులు నిరసన తెలిపారు. గాంధీబొమ్మ నుంచి ట్రంక్ రోడ్డు వరకు కెమిస్ట్లు, డ్రగ్గిస్ట్లు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ అసోసియేషన్ అధ్యక్షుడు పేరూరి ప్రదీప్ మాట్లాడుతూ ఫార్మసీ రంగం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. ఏఐ ఆధారిత నకిలీ ప్రిస్క్రిప్షన్లు, అనధికార ఆన్లైన్ మందుల విక్రయాలు, యాంటీ బయోటిక్స్ దుర్వినియోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మసీ చట్టంలోని లోపాలు రోగుల భద్రతకు ముప్పుగా మారాయన్నారు. అక్రమ ఆన్లైన్ విక్రయాలను అరికట్టాలని, కార్పొరేట్ సంస్థల రిబేట్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అత్యవసర సేవల కోసం నగరంలో 11 ప్రాంతాల్లో మెడికల్ షాపులు తెరిచి ఉంచామన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు నరేంద్ర, అశోక్, అయితా భాస్కర్, అనిల్, సుధ తదితరులు పాల్గొన్నారు. -
కాకాణి, మేకపాటి పరామర్శ
ఉదయగిరి: ఉదయగిరి మండలం అప్పసముద్రం పంచాయతీ చౌటపల్లి గ్రామంలో బుధవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం ఉపాధ్యక్షుడు చేజర్ల సుబ్బారెడ్డి తల్లి వెంకటసుబ్బమ్మ ఉత్తరక్రియలు జరిగాయి. దీనికి మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి హాజరై వెంకటసుబ్బమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆడబిడ్డ నిధి ఎప్పుడిస్తారు? ● సీఎం చంద్రబాబుకు మాజీ మేయర్ లేఖ నెల్లూరు(బారకాసు): ఆంధ్రప్రదేశ్లో 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ‘ఆడబిడ్డ నిధి’ పథకం కింద ప్రతినెలా రూ.1,500 అందిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలంటూ మాజీ మేయర్ పొట్లూరి స్రవంతి సీఎం చంద్రబాబుకు బుధవారం లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు పూర్తికావస్తున్నప్పటికీ ఈ పథకం ఇంకా అమల్లోకి రాకపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఈ పథకం అమలుకు తక్షణమే కార్యాచరణ రూపొందించి, 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున అందజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. గిడ్డంగుల్లో వసతుల కల్పనకు చర్యలు నెల్లూరురూరల్: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పరిధిలోని 44 బహుళ ప్రయోజన సహకార గిడ్డంగుల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అధ్యక్షతన బుధవారం నెల్లూరులో జరిగిన సమావేశంలో గిడ్డంగుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై చర్చించారు. జిల్లా సహకార అధికారి బి.గురప్ప కమిటీకి సంబంధిత ప్రతిపాదనలు సమర్పించారు. డ్వామా నిధులతో అప్రోచ్ రోడ్లు, జిల్లా పరిషత్ నిధులతో విద్యుత్ సౌకర్యాలు, బోర్వెల్ల ఏర్పాటు అంశాలను చర్చించారు. అవసరమైన అంచనా వ్యయ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను జేసీ ఆదేశించారు. ముదివర్తి అన్నారెడ్డిపాళెం గిడ్డంగి మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రపంచ ఆహార కార్యక్రమం కింద ఎంపికై న పడుగుపాడు పీఏసీఎస్ ప్రతిపాదించిన డీపీఆర్లను ఆమోదించారు. 44 సహకార గిడ్డంగులను జాతీయ గిడ్డంగుల ప్రాధికార సంస్థకు అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోందని జిల్లా సహకార అధికారి తెలిపారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు నెల్లూరు(బృందావనం): ప్రముఖ చలన చిత్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఫ్యాన్స్ అసోసియేషన్ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ కె.గంగాధర్, జూనియర్ ఎన్టీఆర్ సేవాదళ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ జి.మధుసూదన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి. బాలాజీ నగర్ గీతామయి వృద్ధాశ్రమంలో, మైపాడు రోడ్డు వైకుంఠపురంలోని మున్సిపల్ స్కూల్లో పేదలకు అన్నదానం చేశారు. బాలాజీ నగర్ సెంటర్లో, ఎస్ 2 థియేటర్లో, నర్తకి సెంటర్లో కేక్ కటింగ్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులతో కోలహలం నెలకొంది. కార్యక్రమంలో అసోసియేషన్ సిటీ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే రియాజ్, సేవాదళ్ జిల్లాశాఖ వైస్ ప్రెసిడెంట్ జి.మధుసూదన్, సెక్రటరీ ఎన్.జగన్, ఫ్యాన్స్ జి.శ్రీధర్, తేజ, అశోక్, చంద్ర, సుమన్, గోపి తదితరులు పాల్గొన్నారు. కండలేరులో 41 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 41 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసా యి గంగ కాలువకు 1,050, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 80, పిన్నేరు కాలువకు 15, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
సీఎంను కలవనీయకుండా నిర్బంధించడం న్యాయమా?
కావలి: తమ భూ సమస్యలను సీఎం చంద్రబాబుకు విన్నవించేందుకు సభా ప్రాంగణం వద్దకు వస్తుంటే ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి పోలీసులతో నిర్బంధించారని చెన్నాయపాళేనికి చెందిన మత్స్యకార మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కావలిలోని జర్నలిస్టు క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం తమకు కేటాయించిన భూములను కొంతమంది ఆక్రమించుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా న్యాయం చేయలేదని వాపోయారు. ఈ విషయమై సీఎంను కలిసేందుకు వెళ్తుండగా పోలీసులు బలవంతంగా ఆపి నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంను కలవనీయకపోయిన ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి మాట్లాడుతూ మత్స్యకారులు తమకు జరిగిన అన్యాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో మంచిపద్ధతి కాదన్నారు. -
రూ.వెయ్యి కోట్ల ఇసుక కొల్లగొట్టేశారు!
సంగం వద్ద పెన్నానదిలో ఇసుకను తవ్వి టిప్పర్లలో లోడ్ చేస్తున్న యంత్రంఇసుక తోడేళ్లు పెన్నానదిలో పడి లోడేస్తున్నాయి. రేయింబవళ్లు అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా పర్యావరణానికి తూట్లు పొడుస్తూ భారీ యంత్రాలు పెట్టి ఇసుక దందా చేస్తున్నారు. నదిలో ఇరవై అడుగుల లోతు వరకు యంత్రాలతో తోడేస్తుండడంతో పక్కనే ఉన్న సోమశిల ప్రాజెక్ట్కు ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అధికార పార్టీ నేతల ధనదాహానికి పెన్నమ్మ గర్భం శోకిస్తూ నిత్యం వణికిపోతుంది. జిల్లాలోని పెన్నానదిలో జరిగే ఇసుక దందాతో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు నెలనెలా రూ.కోట్ల ముడుపులు ముట్టుతుండడంతో అధికార యంత్రాంగం సైతం జీ హుజార్ అంటూ మామూళ్లతో తమ కళ్లకు గంతలు కట్టుకున్నారన్న ఆరోపణలున్నాయి. నెల్లూరు బ్యారేజీ–2 : పోతిరెడ్డిపాళెం, కోవూరు సంగం బ్యారేజీ–2 : సంగం మండలం సూరాయపాళెం : సూరాయపాళెం పొదలకూరు మండలం సంగం బ్యారేజీ : కలువాయి మండలం రాజుపాళెం సెమీ మెకనైజ్డ్ ఓపెన్ రీచ్లు అప్పారావుపాళెం– ఆత్మకూరు మినగల్లు – బుచ్చిరెడ్డిపాళెం (వర్కింగ్లో లేదు) విరువూరు : పొదలకూరు మండలం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ నేతల ధన దాహం.. అధికారుల అవినీతి దాహం వెరసి జిల్లాలో పర్యావరణానికి పెనుముప్పు పొంచి ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా పెన్నానదిలో ఊరూరా అనధికార రీచ్లు పెట్టి ఇసుకను కొల్లగొడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దాదాపు రెండేళ్లు నిర్వీరామంగా ఉచిత ఇసుక పేరిట ఆ పార్టీ నేతలు సాగిస్తున్న ఇసుక దోపిడీతో నదీ స్వరూపం కోల్పోగా, జిల్లాకే జలనిధి అయిన సోమశిల ప్రాజెక్ట్ను ప్రమాదపు అంచుకు చేరుతోంది. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగాలు నెలనెలా మామూళ్లు దండుకుంటూ ముఖం చాటేస్తున్నాయి. రెండేళ్లలో రూ.వెయ్యి కోట్ల ఇసుక హాంఫట్ జిల్లాలో కలువాయి మండలం తెలుగురాయపురం నుంచి ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాళెం వరకు అధికారిక డీసిల్టింగ్, అనధికారిక రీచ్లతో కలుపుకుని సుమారు 20 ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఆయా రీచ్ల నుంచి ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీలతో కలుపుకొని వెయ్యికిపైగా వాహనాల్లో ఇసుక తరలిస్తున్నారు. సగటున నిత్యం 50 వేల టన్నుల ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు అంచనా. టన్ను రూ.300 లెక్కన లోడింగ్తో కలుపుకొని విక్రయాలు చేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు రూ.1.50 కోట్ల టర్నోవర్ జరుగుతుంటే.. నెలకు రూ.45 కోట్ల ఇసుక వ్యాపారం జరుగుతోంది. గడిచిన 23 నెలలుగా నిర్వీరామంగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు రూ.వెయ్యి కోట్లకుపైగా టీడీపీ నేతలు దోచుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు బినామీలను పెట్టి చేస్తుంటే.. మరికొందరు టీడీపీ నేతలకు అప్పగించడంతో నెలనెలా మామూళ్లు దండుకుంటూ ఇసుక దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్జీటీ ఆదేశాలు తుస్ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను తమ్ముళ్లు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నేతల ఆదేశాలే చట్టాలుగా మార్చేసి యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు. సాగునీరు కాలువకు వెళ్లే చోట అడ్డంగా గట్టుకట్టి మరీ గ్రావెల్ వేసి రహదారులు నిర్మించి ఇసుక దందా కొనసాగిస్తున్నారు. టీడీపీ నేతలు చేస్తున్న తప్పుతో.. భవిష్యత్లో పెను ముప్పు తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. నిత్యం వేలాది టన్నులు ఇసుకను తోడేస్తూ ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ తమ్ముళ్లు సొమ్ము చేసుకుంటున్నా అధికార యంత్రాంగానికి చీమకుట్టినట్లు లేదు. అటు పోలీస్లు ఇసుక అక్రమ దందాకు రక్షణగా ఉండగా, జిల్లా యంత్రాంగం మాత్రం సాగిల పడి అఽధికారానికి సలామ్ చేస్తూ ప్రకృతిని నాశనం చేస్తున్నారు. జిల్లాలో అధికారిక డీసిల్టింగ్ పాయింట్లు పెన్నానదిలో అడుగడుగునా యంత్రాలు పెట్టి ఇసుక తోడేత కలువాయి మండలం రాజుపాళెంలో బరితెగించిన తమ్ముళ్లు ఏకంగా నదిలోకి పక్కా రోడ్డు నిర్మాణం ఇరవై అడుగుల లోతు వరకు తవ్వకాలు పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులకు నెలనెలా రూ.కోట్లలో మామూళ్లు సోమశిల ప్రాజెక్ట్కు పొంచి ఉన్న ముప్పు మామూళ్ల మత్తులో అధికారుల కళ్లకు గంతలు -
కండలేరులో 41.150 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 41.150 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,050, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 80, పిన్నేరు కాలువకు 15, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రంథాలయాలకు పోటీ పరీక్షల పుస్తకాలు● గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ శాంతకుమారి కొడవలూరు: పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను గ్రంథాలయాల్లో అందుబాటులోకి తెస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతకుమారి తెలిపారు. మండలంలోని యల్లాయపాళెం గ్రంథాలయాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. అందుబాటులో ఉన్న పుస్తకాలు, వేసవి విజ్ఞాన శిబిరం జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అన్ని రకాల పుస్తకాలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. తల్లిదండ్రులు పిల్లలను విజ్ఞాన శిబిరానికి పంపించాలని సూచించారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ జె.సురేంద్రరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వంశీధర్రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
అదృశ్యమై.. ఆపై శవంగా మారి
● వింజమూరులో పాలవాగు వద్ద మృతదేహం గుర్తింపు ● అనుమానాస్పద మృతిగా కేసు నమోదువింజమూరు(ఉదయగిరి): కలిగిరి మండలం వీర్నకల్లు గ్రామానికి చెందిన మేదరమిట్ల శ్రీకాంత్ (32) అదృశ్యమైన కొద్దిరోజులకే శవంగా మారిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బంధువుల కథనం మేరకు.. శ్రీకాంత్ కలిగిరి మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. అతడికి మద్యం తాగే అలవాటు ఉంది. గత శనివారం మధ్యాహ్నం పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే కలవలేదు. దీంతో కుటుంబ సభ్యులు బంధువుల వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. ఆదివారం కలిగిరి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రెండు మృతదేహాలంటూ.. మంగళవారం మధ్యాహ్నం వింజేటమ్మ గుడి మార్గంలో పాలవాగు వద్ద రెండు మృతదేహాలున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిశీలనలో ఒకే మృతదేహంగా తేలింది. సమీపంలో ఉన్న మోటార్బైక్ నంబర్ ఆధారంగా మృతుడిని గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. మృతుడి తండ్రి ఎం.వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. ఉదయగిరి సీఐ పోతుగంటి సుబ్బారావు, ఎస్సై మాదాల ఉమా మహేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనుమానాలకు తావిస్తున్న ఘటన మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉండటంతో అదృశ్యమైన రోజే చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. మద్యం తాగిన ఆనవాళ్లున్నాయి. మరికొద్ది దూరంలో మృతుడికి చెందిన ఒక కాలు చెప్పు, మరొకరికి చెందిన చెప్పులున్నాయి. దీంతో ఇది హత్యా? లేక మద్యం మత్తులో చనిపోయాడా?, లేక ఇతర కారణాలున్నాయా? అనే అంశాలు పోస్టుమార్టం నివేదిక, పోలీసుల విచారణలో వెలుగు చూసే అవకాశం ఉంది. -
చేతిరాతపై ఉచిత శిక్షణ
నెల్లూరు(టౌన్): అచరిత్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలోని కృష్ణచైతన్య జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత లూసిడా హ్యాండ్ రైటింగ్ (ఇంగ్లిష్) శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది మూడురోజులపాటు కొనసాగనుంది. ఫౌండేషన్ అధ్యక్షుడు పీజీడీ కృపాల్ మాట్లాడుతూ ఐదేళ్లుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో రాత నైపుణ్యాన్ని పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో లూసిడా హ్యాండ్ రైటింగ్ మాస్టర్ ట్రైనర్లు రత్నశేఖర్, లక్ష్మణరాజు, శ్రీనివాసులు, పాల్ సుధాకర్, పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఇసుక డంప్ చేసి విక్రయాలుకలువాయి(సైదాపురం): మండలంలోని కుల్లూరు జాతీయ రహదారి సమీపంలో భారీగా అక్రమ ఇసుక డంపింగ్ జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెన్నానది నుంచి వందలాది టిప్పర్లతో ఇసుకను తరలించి హైవే పక్కన నిల్వ చేసి అమ్మకాలు జరుపుతున్నారని సమాచారం. ధనార్జనే లక్ష్యంగా కొంతమంది నాయకుల కనుసన్నల్లో ఈ తంతు జరుగుతోందని ఆరోపణలున్నాయి. రోజుకు వందల సంఖ్యలో లారీలతో ఇసుక తరలిస్తూ, రాత్రివేళల్లో పెద్దఎత్తున డంపింగ్ చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అధికారులకు ముడుపులు అందుతున్న కారణంగానే చర్యల్లేవని స్థానికులు విమర్శిస్తున్నారు. కావలి కాలువలో వ్యక్తి గల్లంతుసంగం: మండలంలోని చెన్నవరప్పాడు వద్ద కావలి కాలువలో ఓ వ్యక్తి పడిపోయి గల్లంతైన ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. చెన్నవరప్పాడు చెందిన పి.మాల్యాద్రి మోటార్ మరమ్మతులు, కరెంట్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం గ్రామానికి చెందిన ఓ రైతు మోటార్ను రిపేర్ చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో మాల్యాద్రి కాలు జారి కాలువలో పడిపోయాడు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో కొట్టుకుపోయారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆచూకీ లభ్యం కాలేదు. మాల్యాద్రికి భార్య, పిల్లలున్నారు. చేపలు విక్రయించి వెళ్తుండగా..● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి రాపూరు: రాపూరు – పెంచలకోన జాతీయ రహదారిలోని ఏపూరు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. మినీలారీ మైదుకూరు వైపు నుంచి రాపూరుకు వస్తోంది. అదే సమయంలో రాపూరు వైపు నుంచి మోటార్బైక్పై గుండవోలు గ్రామానికి లక్ష్మయ్య (28) వెళ్తున్నాడు. వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. అతడిని గుండవోలు గిరిజన కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను రాపూరులో చేపలు విక్రయించి స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రౌడీషీటర్పై పీడీ యాక్ట్బుచ్చిరెడ్డిపాళెం: సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా తరచూ నేరాలకు పాల్పడుతున్న మండలంలోని చల్లాయపాళెం గ్రామానికి చెందిన రవిచంద్రబాబు అలియాస్ నానిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఎస్పీ అజిత ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు బుచ్చిరెడ్డిపాళెం ఎస్సై సంతోష్కుమార్రెడ్డి మంగళవారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. రవిచంద్రబాబు కొంతకాలంగా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడిపై ఇప్పటికే రౌడీషీట్ కూడా ఉంది. ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో పీడీ యాక్ట్ ప్రయోగించారు. నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.75 సన్నవి : రూ.25 పండ్లు : రూ.10 -
పెట్రో బాదుడుపై ఆగ్రహ జ్వాల
● గూడూరులో వైఎస్సార్సీపీ శ్రేణుల భారీ ర్యాలీ ● ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి పెనుభారం మోపుతారా? ● ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్చిల్లకూరు: పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, ఇప్పుడు ధరలు విపరీతంగా పెంచి సామాన్యులపై పెనుభారం మోపుతున్నారని వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడ్డాయి. కేంద్రం ఇంధన ధరలు పెంచుతుండగా రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గూడూరులో ఎమ్మెల్సీ, గూడూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ సత్యనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో పెట్రోలు, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని విమర్శించారన్నారు. ఇప్పుడు కేంద్రం వరుసగా ధరలు పెంచుతున్నా ఎవరూ స్పందించకపోవడం దారుణమన్నారు. ఇంధన ధరల పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. డీజిల్ ధరల పెరుగుదలతో రైతులు, ఆటో కార్మికులు, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని, వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. గూడూరు మున్సిపాలిటీలో ప్రోటోకాల్ అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఎల్లసిరి గోపాల్రెడ్డి మాట్లాడుతూ పశ్చిమాసియా యుద్ధాన్ని కారణంగా చూపుతూ కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతోందని విమర్శించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనతో విద్యార్థుల జీవితాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. అన్ని రంగాల్లో విఫలమవుతున్న కేంద్రాన్ని టీడీపీ ప్రశ్నించకుండా మిన్నకుండిపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు బొమ్మిడి శ్రీనివాసులు, పలగాటి సంపత్కుమార్రెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఎస్ఈసీ సభ్యుడు కొడవలూరు భక్తవత్సలరెడ్డి, జగనన్న సేవా సమితి అధ్యక్షుడు ఊటుకూరు మహేంద్రరెడ్డి, సీనియర్ నాయకులు చేవూరు విజయమోహన్రెడ్డి, దువ్వూరు మధుసూదన్రెడ్డి, పోలుబోయిన చెంగయ్య, నాగిశెట్టి శారదమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలి
● వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు పేర్నాటి ● రాష్ట్రంలో అధిక ధరలపై తీవ్ర విమర్శలు కోట: సామాన్య ప్రజలకు గుదిబండలా మారిన పెట్రోలు, డీజిల్ ధరలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు పేర్నాటి శ్యామ్ప్రసాద్రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని విద్యానగర్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే ధరలు అధికంగా ఉన్నాయని విమర్శించారు. చంద్రబాబుకు సామాన్యుల కష్టాలు తెలియవని మండిపడ్డారు. మహానాడు రద్దు చేశామని చెప్పుకోవడం కాకుండా, పెరుగుతున్న ధరలతో ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని సూచించారు. పెట్రోలు, డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న అదనపు పన్నులను తగ్గించాలన్నారు. రైతులు, ఆటో కార్మికులు, రవాణా రంగంపై ఆధారపడిన కార్మికులకు ఉపశమనం కలిగేలా పెరిగిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కోరారు. -
జోరుగా గ్రావెల్ అక్రమ రవాణా
కలువాయి(సైదాపురం): వెంకటరెడ్డిపల్లి జంక్షన్, కుల్లూరు జాతీయ రహదారి పక్కనున్న భూముల ధరలు భారీగా పెరిగాయి. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం వెంకటరెడ్డిపల్లి వద్ద నుంచి, అలాగే కుల్లూరుపెయ్యాలతిప్ప పరిధిలోని ప్రభుత్వ భూముల నుంచి రాత్రింబవళ్లు వందల సంఖ్యలో ట్రాక్టర్లతో గ్రావెల్ను తరలిస్తున్నారని సమాచారం. హైవే పక్కన ఉన్న భూములకు తరలించి అక్కడే విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. అక్రమ రవాణాకు సంబంధిత అధికారులకు మామూళ్లు అందుతుండటంతో ఎవరూ అడ్డుకునే పరిస్థితి లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇటువంటి స్థాయిలో దోపిడీ ఇంతకుముందెన్నడూ చూడలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు వెంటనే జోక్యం చేసుకుని కలువాయి మండలంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్, ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ఆగని భూ దందా
● కుంట పోరంబోకు భూమిలో పనులు ● పట్టించుకోని అధికార యంత్రాంగం ఉదయగిరి: కలిగిరి మండలం తూర్పుగుడ్లదొన గ్రామంలో సర్వే నంబర్ 1021లో ఉన్న 3.28 ఎకరాల కుంట పోరంబోకు భూమి ఆక్రమణ వ్యవహారం మళ్లీ వివాదాస్పదమైంది. ఇటీవల ’సాక్షి’లో కథనం వెలువడిన అనంతరం అధికారులు పనులు నిలిపి వేయించినా, కొద్దిరోజుల తర్వాత మంగళవారం తిరిగి చదును పనులు ప్రారంభించారు. ఈ కుంటను గ్రామ అవసరాలకు, పశువుల తాగునీటి కోసం ఉపయోగిస్తున్నామని కొత్తపాళెం గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆక్రమణదారుడు మాత్రం 2004లో అప్పటి తహసీల్దార్ నుంచి 34 ఏళ్లకు లీజు పొందినట్లు చెబుతున్నాడు. నిబంధనల ప్రకారం కుంట పోరంబోకు భూములు లీజుకు ఇవ్వకూడదని, ఒకవేళ ఇచ్చినా అవి రద్దు చేయాల్సిందే తప్ప ఆక్రమణదారుడికి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు పంపి ఆక్రమణదారుడికి మద్దతు ఇస్తున్నారని విమర్శలున్నాయి. ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు గ్రామస్తులను బైండోవర్ చేసినట్లు కూడా ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్రమణదారుడు యథేచ్ఛగా పనులు కొనసాగిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమి విలువ సుమారు రూ.70 లక్షల వరకు ఉండటంతోనే ఈ ఆక్రమణలకు అధికారుల వైపు నుంచి ప్రోత్సాహం లభిస్తోందని ప్రచారం జరుగుతోంది. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఆక్రమణ పనులు నిలిపివేసి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
మెడికల్ షాపుల బంద్ నేడు
● డ్రగ్ కంట్రోలర్కు వినతిపత్రం అందజేత నెల్లూరు(అర్బన్): దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లాలో హోల్సేల్, రిటైల్ మెడికల్ షాపులు బంద్ పాటిస్తున్నట్లు జిల్లా కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పేరూరి ప్రదీప్ తెలిపారు. మంగళవారం నగరంలోని పెద్దాస్పత్రి ఆవరణలో ఉన్న జిల్లా ఔషధ నియంత్రణ కార్యాలయంలో డ్రగ్ కంట్రోలర్ రమేష్రెడ్డికి అసోసియేషన్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ అఖిల భారత కెమిస్టుల సమాఖ్య పిలుపు మేరకు సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో మందుల విక్రయాలను నియంత్రించాలని, నకిలీ మందుల అమ్మకాలను అరికట్టాలని, కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్ల పేరుతో వ్యాపారులను నష్టపరచడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ సమయంలో ఇంటి వద్దకే మందుల సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్ఆర్ 220 నిబంధనను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, అందువల్ల ఆ ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. జిల్లాలోని 350 హోల్సేల్ దుకాణాలు, సుమారు 1,850 రిటైల్ మెడికల్ షాపులు సమ్మెలో పాల్గొంటాయని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు నరేంద్ర, అశోక్, ప్రసాద్, అజయ్ పాల్గొన్నారు. అత్యవసర సేవల కోసం.. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా 11 మెడికల్ షాపులను తెరిచి ఉంచుతున్నట్లు ప్రదీప్ తెలిపారు. మైపాడు గేటు, తడికల బజార్ సెంటర్ ప్రజల కోసం జేఎం మెడికల్స్, స్టోన్హౌస్పేటలో సాయిరేఖ, బోసుబొమ్మ సెంటర్లో రుక్మిణి, గాంధీబొమ్మ సెంటర్లో పవన్, దేవిరెడ్డి వారి వీధిలో రేఖ, మద్రాస్ బస్టాండ్లో ఈశ్వర్, రామలింగాపురంలో అజయ్, దర్గామిట్టలో సాయిరేఖ మెడికల్స్, ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం సమీపంలో కీ ఫార్మసీ, వేదాయపాళెంలో శబరీష్ లైఫ్ ఫార్మసీ తెరిచి ఉంటాయన్నారు. -
నిమ్మ ధరలపై లారీల ‘సమ్మె’ట
పొదలకూరు: ఎండల తీవ్రత నేపథ్యంలో డిమాండ్ ఉండే మే నెలలోనే నిమ్మకాయల ధరలు పతనం అవుతున్నాయి. రైతులు ఊహించని విధంగా రోజు రోజుకు కాయల ధరలు దిగజారుతున్నాయి. కాయల దిగుబడి పెరగడం, ఇతర ప్రాంతాల నుంచి కాయల ఎగుమతులు పెరగడంతోపాటు ఢిల్లీలో లారీల సమ్మె సైరన్ మోగించడంతో ధరపై ప్రభావం పడింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.25 నుంచి రూ.75 కాయల అమ్ముడు పోవడమే గగనంగా మారింది. నిమ్మకాయల ఎగుమతులు ఈ సీజన్లో ఢిల్లీ మార్కెట్కే అధికంగా ఉంటాయి. ధరలను సైతం ఢిల్లీ మార్కెట్ వ్యాపారులే నిర్ణయిస్తుంటారు. ఈ నేపథ్యంలో బయట రాష్ట్రాల కాయలతోపాటు ఆ ప్రాంతంలో కాయల దిగుబడి కూడా బాగా పెరగడంతో జిల్లా మార్కెట్ నుంచి డిమాండ్ తగ్గుతున్నట్టుగా తెలుస్తోంది. లారీల సమ్మెకు సైరన్ ఢిల్లీలో లారీల యజమానులు సమ్మెకు పిలుపునిచ్చారు. అక్కడ టోల్ ట్యాక్స్ కింద లారీకు రూ.1,200 వసూలు చేస్తుండగా దాన్ని అమాంతం రూ.6 వేలకు పెంచిన నేపథ్యంలో లారీల యజమానులు ఈ నెల 21 నుంచి సమ్మె బాట పెట్టేందుకు పిలునిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇక్కడి కాయలను ఎగుమతి చేసే వ్యాపారులు సమ్మె నిర్వహిస్తే కాయలు మార్కెట్కు వెళ్లడం కష్టం అవుతుందంటున్నారు. ఎగుమతి చేసిన కాయలను ఢిల్లీ నుంచి బయట ప్రాంతాలకు తీసుకుని వెళ్లి అమ్ముకోవాల్సి వస్తుందని దీంతో కాయలు చెడిపోయి నష్టపోవాల్సిన పరిస్థితి తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామా ల నేపథ్యంలో కాయల ధరలు పతనం కాగా, ఇక్కడి ఎగుమతులను తగ్గించిన్నట్లు వెల్లడించారు. -
కొండల్ని మింగేస్తున్న అనకొండలు
● మైనింగ్ పేరుతో పిండి చేస్తున్నారు ● సహజ సిద్ధంగా ఉన్న కొండలు కనుమరుగు ● నావూరుపల్లి కొండపై మైనింగ్ వివాదం ● పశువుల మేతకు ఇబ్బందంటున్న గ్రామస్తులు పొదలకూరు : సర్వేపల్లి నియోజకవర్గంలో కొందరు బ్రహ్మరాక్షసులు అవతారమెత్తారు. సహజ సంపదలను అనకొండల్లా తయారై మింగేస్తున్నా.. వారి ధనదాహం మాత్రం తీరడం లేదు. సహజ సిద్ధంగా ఏర్పడి ప్రకృతి రమణీయంగా ఉన్న కొండలు పిండి అవుతున్నాయి. మైనింగ్ పేరుతో తిప్పలను కొల్లగొట్టేందుకు టీడీపీ నేతలు బయట జిల్లాలకు చెందిన వ్యక్తులతో ఆయా గ్రామస్తులకు తెలియకుండానే ఎన్ఓసీలను పొందుతున్నారు. దీంతో పశువుల మేతకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, కొండలపై బ్లాస్టింగ్ చేస్తే ప్రాణాపాయం ఏర్పడుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో సహజ సిద్ధంగా ఉన్న కొండలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే పొదలకూరు, మహ్మదాపురం, ఊసపల్లి, నందివాయ, గురవాయపాళెం, బత్తులపల్లి, ప్రభగిరిపట్నం గ్రామాల్లో మైనింగ్ లీజుల పేరుతో కొండలు కరిగిపోయాయి. పొదలకూరు చిట్టేపల్లి తిప్ప వద్ద గ్రావెల్ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. కొత్తగా నావూరుపల్లి గొట్టిగుండాల కొండకు మైనింగ్ అనుమతులు ఉన్నాయని కొందరు బయట వ్యక్తులు వెళ్లి భూమి పూజ నిర్వహించారు. గ్రామస్తులు ఎదురు తిరగడంతో వారు తాత్కాలికంగా భూమి పూజను మానుకున్నారు. ఇక్కడ మైనింగ్ చేస్తే పశువులకు మేతపొరంబోకు లేకుండా పోతుందని గ్రామస్తులు దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నారు. మైనింగ్ లీజుల దరఖాస్తుల వెనక పెద్ద తతంగమే జరుగుతోది. 107 జీఓ ప్రకారం దరఖాస్తులు జీఓ ఎంఎస్ నంబరు 107 మైనింగ్కు దరఖాస్తులు సమర్పించుకున్న నెల రోజుల్లో సంబంధిత శాఖ అధికారులు విచారణ నిర్వహించి ఎన్ఓసీ అందజేయాలి. లేదంటే దరఖాస్తుదారుడికి అనుమతులు లభించినట్టే. గతంలో ఇదే ప్రకారం కొండలను తొలిచి మైనింగ్ చేసుకునేందుకు కొందరు అనుమతులను పొందారు. అయితే ఇక్కడ రెవెన్యూ, మైనింగ్ శాఖలే కాకుండా చివరగా పర్యావరణ పరిరక్షణ మండలి అభిప్రాయ సేకరణ కీలంగా ఉంటుంది. మైనింగ్ లీజులు పొందే వారు గోప్యంగా తమ పని కానిచ్చేస్తున్నారు. అనుమతులు వచ్చేంత వరకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. మైనింగ్ను వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు నావూరుపల్లి గొట్టిగుండాల కొండ అనుమతుల్లో ఇదే జరిగింది. 2012లో అనుమతులు పొందిన మైనింగ్ వారి చేతులు మారుతూ వచ్చింది. ఇప్పుడు కొత్తగా మరేదో కంపెనీ ఇక్కడ మైనింగ్ చేసేందుకు రావడంపై గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఎప్పుడో అనుమతులు లభించినా గ్రామస్తులు మాత్రం తమకు తెలియదని కొత్తగా అభిప్రాయ సేకరణ నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే అనుమతులు ఉన్న వారు కొత్తగా ప్రజాభిప్రాయ సేకరణ ఉండదని, తమకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయంటున్నారు. దీనిపై అధికారులెవరూ జోక్యం చేసుకోవడం లేదు. -
గూడూరా.. మాకొద్దులే..
చిల్లకూరు: నెల్లూరు జిల్లాలో అతిపెద్ద పోలీస్ డివిజన్ అయిన గూడూరులో పనిచేసేందుకు గతంలో వివిధ ప్రాంతాల వారు ఆసక్తి చూపేవారు. అయితే జిల్లాల విభజనతో నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డివిజన్ పరిధిలో గూడూరు ఒకటి, రెండో పట్టణ పోలీస్స్టేషన్లు, రూరల్, చిల్లకూరు, కోట మండలాల్లోని మూడు స్టేషన్లు మాత్రమే మిగిలాయి. దీంతో గూడూరులో ఒక డీఎస్పీ, రూరల్, చిల్లకూరు, కోట మండలాలకు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒకటి, రెండో పట్టణాలకు చెందిన ఇద్దరు ఇన్స్పెక్టర్లతో కొనసాగుతోంది. ఐదు స్టేషన్లలో సుమారు 140 మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో ఇక్కడ పనిచేస్తున్న డీఎస్పీ గీతాకుమారి బదిలీపై వెళ్లారు. ఇన్చార్జిగా డీటీసీ డీఎస్పీ గిరిధర్ ఉన్నారు. రెగ్యులర్గా ఇంకా ఎవరినీ నియమించలేదు. పలువురు వచ్చేందుకు ప్రయత్నించారు. నాడు, నేడు పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందని వెనుకడుగు వేస్తున్నారు. డివిజన్లో డీఎస్పీ స్థానం ఇంత కాలంగా ఖాళీగా ఉండడం ఇప్పటివరకు చూడలేదనే చర్చ ఆ శాఖలో జరుగుతోంది. పర్యవేక్షణ లేక.. రెగ్యులర్ డీఎస్పీ లేకపోవడంతో డివిజన్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేవారు లేకుండా పోయారు. అలాగే పోలీస్స్టేషన్లపై పర్యవేక్షణ కొరవడటంతో ఎవరికి వారుగా తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. సీనియర్లుంటే తమ పనులకు అడ్డుగా ఉంటారని స్టేషన్ స్థాయి అధికారులు వారికి బయట పనులు అప్పగిస్తున్నారు. యువ కానిస్టేబుళ్లకు పెత్తనమిచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలను చెప్పుకొనేందుకై నా డివిజన్ స్థాయి అధికారి ఉంటే బాగుంటుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడైనా ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీల పేరుతో హడావుడి చేయడం తప్ప మిగిలిన సమయంలో ఎవరికి వారే యమునా తీరే అనేలా ఉంటున్నారు. బదిలీ కోసం.. కింది స్థాయి వారిపై అధికారులు పెత్తనం చెలాయిస్తుండటంతో నాలుగు నుంచి ఐదేళ్లు పూర్తి చేసుకున్న పలువురు కానిస్టేబుళ్లు బదిలీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా స్థాయి అధికారులను కలిస్తే గూడూరు డివిజన్లోని కానిస్టేబుళ్లా.. తిరుపతి వారిని అడగండని సమాధానం ఇస్తున్నారు. దీంతో పలువురు తిరుపతికి వెళ్లి అధికారులను కలిస్తే జిల్లా మారింది కదా.. బదిలీల విషయం వారే చూసుకుంటారని అంటున్నారు. దీంతో కానిస్టేబుళ్లు తలలు పట్టుకుంటున్నారు. పాఠశాలలు పునః ప్రారంభం కాక మునుపే బదిలీ విషయం తెలిసిపోతే తమ పిల్లలకు అడ్మిషన్లు తీసుకునే వీలుంటుందని వాపోతున్నారు. కింది స్థాయి సిబ్బంది బదిలీలపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సి ఉంది. ఇక్కడ్నుంచి బదిలీ అయ్యేందుకు పోలీసుల యత్నం రెండు జిల్లాల ఉన్నతాధికారుల నుంచి విముఖత ఇక రెగ్యులర్ డీఎస్పీ నియామకం ఎప్పుడో.. -
నల్లపరెడ్డితో కాకాణి భేటీ
కోవూరు: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి మంగళవారం నెల్లూరులోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రానున్న రోజుల్లో పార్టీ శ్రేణులను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే దిశగా కార్యాచరణపై అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతిరావు, బుచ్చిరెడ్డిపాళెం రూరల్ మండల అధ్యక్షుడు చెర్లో సతీష్రెడ్డి పాల్గొన్నారు. ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులకు జూన్ 30 వరకు గడువు నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి itiadmissions. ap. gov. in వెబ్సైట్లో వచ్చే నెల 30వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపల్ కె.శ్రీధర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారి ఒరిజనల్ సర్టిఫికెట్లను సమీపంలోని ప్రభుత్వ ఐటీఐలో జూలై 7వ తేదీలోపు ధ్రువీకరణ చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ జరిగే తేదీలను జూలై 8వ తేదీ నుంచి 15వ తేదీలోపు ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేస్తారన్నారు. ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే స్థానిక వెంకటేశ్వపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో సంప్రదించాలన్నారు. 117 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో మంగళవారం 117 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. వేలానికి 126 బేళ్లు రాగా 117 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. కిలోకు గరిష్ట ధర రూ.250, కనిష్ట ధర రూ.205 లభించింది. సగటున రూ.229.81గా నమోదైంది. వేలంలో 7 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ అరుణ్ రిచర్డ్ బాధ్యతల స్వీకరణ లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): సెంట్రల్ జీఎస్టీ గుంటూరు కమిషనరేట్ నూతన కమిషనర్గా అరుణ్ రిచర్డ్ మంగళవారం స్థానిక కన్నావారితోటలోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2007 సివిల్ సర్వీసెస్ బ్యాచ్కు చెందిన అరుణ్ రిచర్డ్ విశాఖపట్నం జీఎస్టీ, కస్టమ్స్ జోన్లోని ఐదు కమిషనరేట్లకు అప్పిలేట్ అథారిటీగా, సెంట్రల్ ట్యాక్స్, కస్టమ్స్ అప్పీల్స్ కమిషనర్గా పనిచేస్తూ గుంటూరు జీఎస్టీకి బదిలీపై వచ్చారు. కమిషనర్ మాతృభాష తెలుగు అయినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో పనిచేయడం ఆయనకు ఇదే మొదటిసారి. బాధ్యతలు స్వీకరించిన అరుణ్ రిచర్డ్ను అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు కలిసి, పుష్పగుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కమిషనర్కు అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మీనారాయణ, జాయింట్ కమిషనర్ దేవ్కుమార్, పీఆర్ఓ ఆర్పీపీ కుమార్లు ఘనమైన స్వాగతం పలికారు. సిబ్బంది మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 80,455 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 43,309 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.41 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
ఒకవైపు మోసం చేస్తూ.. మరోవైపు మాటలు చెబుతూ..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: క్రెడిట్ చోరీ చేయడంలో ఆరితేరిన.. మోసాలు, వెన్నుపోటు అలవాటుగా మారిన చంద్రబాబు మత్స్యకారుల విషయంలో కూడా మరోసారి ధృతరాష్ట్ర కౌగిలి రాజకీయ విన్యాసం చేశారు. మత్స్యకారుల సేవలో పేరిట మంగళవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో నిర్వహించిన కార్యక్రమంలో యథేచ్ఛగా అబద్ధాలు వల్లెవేశారు. మత్స్యకారుల కోసం తాను ఎంతో, ఎన్నో చేశానని కళ్లార్పకుండా నిర్భీతిగా చెప్పేశారు. వారిని మభ్యపెట్టాలని శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. మత్స్యకారులు మాత్రం చంద్రబాబు చేసిన ద్రోహాలను, మోసాలను చర్చించుకోవడం కనిపించింది. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరంలోకి తమిళనాడు, పాండిచ్చేరి నుంచి హైస్పీడ్ బోట్లతో అక్రమంగా వచ్చి వేటాడి మత్స్యసంపదను దోచుకోవడమే కాకుండా.. ఇక్కడి జాలర్ల వలలను, బోట్లను ధ్వంసం చేస్తున్న తమిళ జాలర్లను, వారి బోట్లను స్థానిక మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు. ఆ బోట్లను మత్స్యకారులకు తెలియకుండా చంద్రబాబు తన కుమారుడు లోకేశ్ను పురమాయించి టీడీపీకి చెందిన ఎంపీ బీద మస్తాన్రావుతో మార్చి 16వ తేదీన వదిలేయించి తీరని ద్రోహానికి పాల్పడ్డారు. దీంతో మత్స్యకారుల్లో, వారి గ్రామాల్లో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తాము ప్రాణాలకు తెగించి పట్టుకున్న బోట్లను మంత్రులు లోకేశ్, కొల్లు రవీంద్ర, ఎంపీ బీద మస్తాన్రావు కుట్రపన్ని విడిపించారని మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ భూములను మార్చి 12న ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ లోకేశ్తో శంకుస్థాపన చేయించారు. ఈ విధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 164 మత్స్యకార గ్రామాలను చంద్రబాబు మోసగించారు. తాము దగా పడుతున్నామన్న విషయాన్ని గ్రహించిన మత్స్యకారులంతా ఏకమయ్యారు. టీడీపీని దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించకుండా దురాయి వేసుకున్నారు. ఇంత పెద్దస్థాయిలో మత్స్యకారుల్లో ఆగ్రహావేశాలు రావడంతో గాయపరిచి వెన్నపూసిన చందంగా చంద్రబాబు అబద్ధాలు వల్లించేందుకు ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమాన్ని వేదికగా చేసుకున్నాడు. పంచ్ డైలాగ్లతో క్రెడిట్ చోరీ చంద్రబాబు ‘బోటు మనదే.. వేట మనదే’ అంటూ పంచ్ డైలాగ్లు కొట్టి జాలర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. 200 హైస్పీడ్ బోట్లను 60 శాతం సబ్సిడీతో ఇస్తానన్నారు. అయితే అవి జువ్వలదిన్నె హార్బర్కా? రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మత్స్యకారులకా? అనేది మాత్రం చెప్పలేదు. వైఎస్సార్సీపీ పాలనలో నిధులు కేటాయించి, 90 శాతానికిపైగా పనులు పూర్తయిన జువ్వలదిన్నె హార్బర్ను ప్రైవేట్పరం చేసేందుకు సాగర్ డిఫెన్స్ కంపెనీకి కట్టబెట్టుతూ కుమారుడు లోకేశ్తో శంకుస్థాపన చేయించిన విషయాన్ని ప్రస్తావించకుండానే.. అత్యాధునిక సాంకేతిక వసతులతో రూ.288 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మించానని, మరో రూ.3,600 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నానని క్రెడిట్ చోరీ చేశారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ భూముల్లో ఏర్పాటు చేస్తున్న సాగర్ డిఫెన్స్ కంపెనీ విషయాన్ని, హార్బర్ను ఎప్పటికి పూర్తిచేస్తారో అనే విషయాన్ని మాత్రం చంద్రబాబు ప్రస్తావించకపోవడం మత్స్యకారుల మనసుల్ని మరింత గాయపరిచింది. ఎంపీ బీదను దూరం పెట్టి.. టీడీపీపై అందులోనూ కావలి నియోజకవర్గానికి చెందిన ఎంపీ బీద మస్తాన్రావుపై మత్స్యకారుల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిన చంద్రబాబు ఈ కార్యక్రమానికి ఆయన్ని దూరంగా ఉంచారు. బీద మస్తాన్రావు వస్తే మత్స్యకారులు తిరగబడతారనే దూరంగా ఉంచినట్లు ఆ పార్టీ వారే చర్చించుకుంటున్నారు. అరకొరగానే మత్స్యకారుల హాజరు చంద్రబాబు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆశించినస్థాయిలో మత్స్యకారులు హాజరు కాలేదు. ముందుగానే నిర్ణయించుకున్న ఒకరిద్దరు మత్స్యకారులకు శిక్షణ ఇచ్చి టీడీపీకి అనుకూలంగా మాట్లాడించారు. మరోవైపు ఆయిల్ సంక్షో భం నేపథ్యంలో ప్రధాని మోది ఇచ్చిన పొదుపు మంత్రాన్ని అమలు చేస్తున్నామంటూనే మంగళవారం తుమ్మలపెంటలో జరిగిన చంద్రబాబు కార్యక్రమానికి వందలాది కార్లలో టీడీపీ నేతలు, అధికారులు రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మూడు ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన వాహనాలను చూసి జనం ఇదేనా పొదుపు.. చంద్రబాబు అందరికీ చెబుతాడు.. ఆయన మాత్రం చేయడు.. అంటూ సెటైర్లు వేశారు. -
కూటమి ప్రభుత్వంలో పెరిగిన అరాచకాలు
● వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి కొండాపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకాలు, దాడులు పెరిగాయని వైఎస్సార్సీపీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి విమర్శించారు. సోమవారం ఉదయగిరిలో ఆయన మాట్లాడుతూ మూడు రోజుల క్రితం గానుగపెంట పంచాయతీలో దళితుడైన జడ రసూల్ను దారుణంగా హత్య చేసి బావిలో పడవేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని విమర్శించారు. ఈ ఘటనలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని, ప్రజలు తగిన సమయంలో తీర్పు ఇస్తారని హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. పార్టీ తరఫున పోరాటం చేసి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కొండాపురం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చిమ్మిలి రవీంద్ర, జిల్లా ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి ఇర్మియా, నాయకులు ఎడ్లపల్లి వెంకటరామయ్య, చేజర్ల సుబ్బారెడ్డి, అహ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
పెట్రో పాపం బాబుదే
రాష్ట్రంలో పెట్రో మంటకు అధికారంలో చంద్రబాబునే కారణం. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ట్యాక్స్లు పెంచిన ఘనత ఆయనకే దక్కుతుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రోడ్ల అభివృద్ధికి కేవలం ఒక్క రూపాయి సెస్ రూపంలో పెంచింది. ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేశ్ పెట్రోల్ ధరలపై పక్క రాష్ట్రాలతో పోల్చి దుష్ప్రచారం చేశారు. లోకేశ్ అయితే పక్క రాష్ట్రాలకు వెళ్లి అక్కడి పెట్రోల్ బంకుల వద్ద సెల్ఫీలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అబద్ధాలు వల్లించారు. తాము అధికారంలోకి వస్తే మిగతా రాష్ట్రాలతో సమానంగా ధరలను తగ్గిస్తామంటూ ఆర్భాటంగా హామీలు ఇచ్చి విస్తృతంగా ప్రచారం చేశారు. రెండేళ్లు అయినా తగ్గించకపోగా, తాజాగా పెరిగిన ధరలపై నోరు మెదపకపోవడం దారుణం. ఎన్నికల హామీ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే వరకు వైఎస్సార్సీపీ పోరాటాలను ఉధృతం చేస్తోందంటూ వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. సర్కారు మెడలు వంచి తీరుతామన్నారు. నెల్లూరు సిటీలో సమన్వయకర్త, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి రిక్షాలు తొక్కుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. వెంకటాచలంలో కాకాణి, ఉదయగిరిలో సమన్వయర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి ఎడ్ల బండిని తోలుతూ నిరసనలో పాల్గొన్నారు. కావలిలో పార్టీ శ్రేణులు ఆటోకు తాళ్లు కట్టి లాగుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. – సాక్షి నెట్వర్క్ ఎన్నికల ముందు ట్యాక్స్లు తగ్గిస్తామని హామీలు పక్క రాష్ట్రం పెట్రోల్ బంకుల దగ్గర సెల్ఫీలతో దుష్ప్రచారం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా తగ్గించని కూటమి సర్కారు తాజాగా పెంచిన ధరలపై నోరుమెదపని తండ్రీకొడుకులు పెంచిన పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గించేంత వరకు పోరాటాలు ఆగవు చంద్రబాబు పొదుపు మంత్రం పేద ప్రజలకేనా? -
అధికార పార్టీ అండతో పేదలపై జులుం
మనుబోలు: అధికార పార్టీ అండతో ఓ వ్యక్తి పెద్దఎత్తున రొయ్యల గుంతలు ఏర్పాటు చేస్తూ సాగు భూములకు ఇబ్బందులు సృష్టిస్తున్నాడని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని పిడూరుపాళెం, బద్దెవోలు, పిడూరు గ్రామాలకు చెందిన పలువురు దళిత రైతులు సోమవారం రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. తహసీల్దార్ రమాదేవికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బద్దెవోలుకు చెందిన టీడీపీ నాయకుడు బత్తల వెంకటరమణయ్య పిడూరుపాళెం పరిధిలో 81, 82, 83, 84 సర్వే నంబర్లలో 150 ఎకరాల సీజేఎఫ్ఎస్ భూములను కొనుగోలు చేసి రొయ్యల గుంతలు ఏర్పాటు చేస్తున్నాడన్నారు. ఆదివారం రాత్రి తాము అడ్డుకోగా కులం పేరుతో దూషిస్తూ దౌర్జన్యం చేశాడని వాపోయారు. గుంతలు ఏర్పాటు చేసే క్రమంలో పంట కాలువను సైతం పూడ్చి వేశారని ఆరోపించారు. అడ్డుగా ఉన్న కాలువలు, డొంకను ఆక్రమించుకోవడంతో ఆ ప్రాంతంలో 600 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. మనుబోలు, పిడూరు, పిడూరుపాళెం, ఎల్ఎన్పురం గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. గుంతల సాగును వెంటనే ఆపకపోతే సామూహిక ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. -
నాడు హామీలు.. నేడు మోసాలు
నెల్లూరు సిటీ: కూటమి అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామంటూ హామీలిచ్చారని, నేడు అధికారంలోకి వచ్చి తగ్గించకుండా చంద్రబాబు, లోకేశ్ మోసాలు చేస్తున్నారంటూ ఆనం విజయకుమార్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ అధిక ధరలకు వీరే కారణమన్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడే అత్యధిక ధర ఉందన్నారు. నెల్లూరు రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం వైఎస్సార్సీపీ నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు. వినూత్నమైన నిరసన నినాదాలతో ఫ్లకార్డులు పట్టుకుని నిరసన ర్యాలీ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నాయి. -
ట్రాక్టర్ను ఢీకొట్టిన స్కూటీ
● వ్యక్తి మృతి ● న్యాయం చేయాలంటూ బంధువుల రాస్తారోకోకలిగిరి: మండలంలోని కలిగిరిలో విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా కావలి – దుత్తలూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్ను స్కూటీ ఢీకొట్టిన ఘటనలో పర్రే హజరత్ (50) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కలిగిరి పంచాయతీ జిర్రావారిపాళెం గ్రామానికి చెందిన హజరత్ కూలీ పనులు చేస్తుంటాడు. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సోమవారం రాత్రి కలిగిరిలో పనులు చూసుకుని తిరిగి తన స్వగ్రామానికి స్కూటీపై బయలుదేరాడు. ఈ క్రమంలో ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్రగాయాలై చనిపోయాడు. హజరత్ మృతి విషయం తెలుసుకున్న జిర్రావారిపాళెం ఎస్సీ కాలనీవాసులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ యజమానులు రావాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్లో కొయ్యలు ఉండటంతో అక్కడే ఉన్న మిల్లుకు వచ్చినట్లు చెబుతున్నారు. ఆగి ఉన్న ట్రాక్టర్ను హజరత్ ఢీకొట్టాడో.. ఒక్కసారిగా ఆగడంతో ఢీకొన్నాడో తేల్చాలన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్లో ఉన్నవారు పరారైనట్లు చెప్పారు. ఆ వాహన సంబంధీకులు వింజమూరుకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. వారు వచ్చే వరకు మృతదేహాన్ని తీసేది లేదని, ట్రాక్టర్ను పోలీస్స్టేషన్కు తీసుకెళ్తే ఒప్పుకోమని తేల్చిచెప్పారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఏఎస్సై రామచంద్రయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. -
అండగా ఉండండి సారూ..
నెల్లూరురూరల్: ‘అయ్యా.. మా వినతులు పరిశీలించి అండగా ఉండండి’ అంటూ ప్రజలు అధికారులను కోరారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, తెలుగుగంగ ప్రత్యేక అధికారులు కేశవర్ధన్రెడ్డి, వంశీకృష్ణ, ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్ అర్జీలను స్వీకరించారు. ● అంగన్వాడీ ఉద్యోగాలను స్థానికులకే కేటాయించాలని గిరిజన సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి కొమరగిరి మహేంద్రబాబు తదితరులు కోరారు. వారు మాట్లాడుతూ ఎస్టీ కాలనీల్లో ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులను స్థానికులకు ఇవ్వకుండా స్థానికేతరులకు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే మండల, జిల్లా స్థాయి అధికారులకు పలుమార్లు వినతులు ఇచ్చినప్పటికీ స్పందన లేదన్నారు. కార్యక్రమంలో యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్, యానాది సంఘం జిల్లా నాయకులు ఇండ్ల రవి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ● జిల్లాలో ఆర్టీఐ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని నెల్లూరుకు చెందిన వి.సురేష్ కోరారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పలు కార్యాలయాల్లో ఆర్టీఐ చట్టం పకడ్బందీగా అమలు కావడం లేదని ఆరోపించారు. అవసరమైన సమాచారాన్ని పూర్తిగా ఇవ్వకుండా అరకొర సమాచారం మాత్రమే అందిస్తున్నారని తెలిపారు. అన్ని కార్యాలయాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ● విద్యార్థుల మార్కులు, ర్యాంకుల పేరుతో కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తున్న విచ్చలవిడి ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పీఏఏపీ) జిల్లా కమిటీ నాయకులు కోరారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 9 ప్రకారం విద్యార్థుల మార్కులు, ర్యాంకులను హోర్డింగులు, పత్రికలు, వెబ్సైట్లు, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం నిషేధమన్నారు. అయినా జిల్లాలో పలు విద్యాసంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తూ భారీ హోర్డింగులు, ప్రకటనల ద్వారా ప్రచారం కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో పీఏఏపీ రాష్ట్ర అధ్యక్షుడు నరహరి శిఖరం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉడుత రాజశేఖర్ యాదవ్, ఉపాధ్యక్షుడు షేక్ మునాఫ్ తదితరులు పాల్గొన్నారు. ● బక్రీద్కు సంబంధించి ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) నాయకులు కోరారు. అధికారులకు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ నమాజ్ నిర్వహణకు ప్రత్యేక స్థలం కేటాయించాలన్నారు. ఇమామ్బాషా తదితరులు పాల్గొన్నారు. ఎస్పీఎంను పునః ప్రారంభించాలి ఆత్మకూరు డివిజన్ పరిధిలో మూతపడిన ఎస్పీఎంను వెంటనే పునఃప్రారంభించాలని సీపీఎం ఆత్మకూరు పట్టణ కమిటీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. డివిజన్ పరిధిలోని 10 మండలాల రైతులు, వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు నెల్లూరుపాళెం వద్ద ట్రాన్స్ఫార్మర్ రిపేర్ మెకానిజం ఏర్పాటు చేశారన్నారు. ఆరు నెలలుగా ఇది మూతపడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మరమ్మతుల కోసం నెల్లూరుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇందుకు భారీ మొత్తంలో ఖర్చవుతుందన్నారు. ఇప్పటికే ధాన్యానికి గిట్టుబాటు ధరల్లేక ఇబ్బందులు పడుతున్న రైతులు, ట్రాన్స్ఫార్మర్ల సమస్యతో మరింత ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ అర్జీలు స్వీకరించిన అధికారులు రైతుల ఇబ్బందులపై ఫిర్యాదు రంగడి ఆలయ చైర్మన్ ఇంటి స్థలం ఆక్రమించాడు ఆవేదన వ్యక్తం చేసిన మహిళస్థలాన్ని టీడీపీ నేత ఆక్రమించాడు తన ఇంటి స్థలాన్ని టీడీపీకి చెందిన లెక్కల వెంకారెడ్డి ఆక్రమించాడని నవాబుపేటకు చెందిన రావిళ్ల సుగుణమ్మ వినతిపత్రం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం అతను రంగనాథ స్వామి ఆలయ చైర్మన్గా కొనసాగుతున్నట్లు తెలిపారు. పలుమార్లు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తనపై దౌర్జన్యానికి పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. తనకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఆర్టీసీ ఉద్యోగుల వినతి ఆర్టీసీ సంస్థ పరిరక్షణతోపాటు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సంఘాల నాయకులు కోరారు. కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు ఓవీ ప్రసాద్, కార్యదర్శులు మాట్లాడుతూ ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే సీ్త్ర శక్తి పథకం రీయింబర్స్మెంట్ను పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. సిబ్బందిపై దాడులు చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందించాలని విజ్ఞప్తి చేశారు. 11వ పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలని, 12వ పీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలని కోరారు. నైట్ హాల్ట్ బస్సులకు అలవెన్స్లు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. -
జిల్లా మలేరియా నివారణ అధికారిగా సింహాచలం
నెల్లూరు(అర్బన్): జిల్లా మలేరియా నివారణ అధికారిగా మైలపల్లి సింహాచలం సోమవారం సంతపేటలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన శ్రీకాకుళం జిల్లా ఫైలేరియా విభాగంలో సీనియర్ ఎంటమాలజిస్ట్గా పనిచేస్తూ పదోన్నతిపై నెల్లూరుకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన సింహాచలం మాట్లాడుతూ జిల్లాలో కీటక జనిత నియంత్రణ వ్యాధులైన ఫైలేరియా, మలేరియా, డెంగీ, చికున్గున్యా, మెదడువాపు లాంటి వ్యాధుల నివారణకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా పలువురు మలేరియా విభాగం అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 91,020 మంది స్వామిని దర్శించుకున్నారు. 35,193 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.54 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 18 గంటలు, ప్రత్యేక టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో దర్శించుకోగలుగుతున్నారు. కండలేరులో 41.3 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 41.3 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1050, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 80, పిన్నేరు కాలువకు 15, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.ఇన్చార్జి డీటీసీగా నిరంజన్రెడ్డి నెల్లూరు(టౌన్): నెల్లూరు జిల్లా రవాణాశాఖ ఇన్చార్జి ఉప రవాణా కమిషనర్గా చిత్తూరు డీటీసీ నిరంజన్రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు డీటీసీగా పనిచేస్తున్న బి.చందర్ వ్యక్తిగత కారణాలతో వచ్చే నెల 10వ తేదీ వరకు సెలవుపై వెళ్లారు. అప్పటి వరకు నిరంజన్రెడ్డి ఇన్చార్జిగా పనిచేయనున్నారు. -
● గంగపుత్రులతో బాబు ‘ధృతరాష్ట్ర కౌగిలి’ రాజకీయం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తమ భవిష్యత్ను ఉజ్వలం చేసే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టి వెన్నుపోటు పొడవడం, రెండు దశాబ్దాలుగా తమ బతుకులను ఛిద్రం చేస్తున్న తమిళనాడు, పాండిచ్చేరి మెకనైజ్డ్ బోట్లను ప్రాణాలకు తెగించి నిర్బంధిస్తే వాటిని వదిలేసి తమ బతుకులపై దెబ్బ కొట్టి టీడీపీ చేసిన ద్రోహానికి మత్స్యకారులు రెండు నెలలుగా రగలిపోతున్నారు. మత్స్యకారుల విషయంలో టీడీపీ పెద్దల తీరుతో ఆ పార్టీ పునాదులే కూలిపోతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకు తాజాగా వారిని బుజ్జగించే రాజకీయానికి చంద్రబాబు తెరతీశారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు వేట నిషేధ కాలానికి ఇచ్చే పరిహారాన్ని ఏ నాడు అదే సమయంలో ఇచ్చిన పాపాన పోలేదు. కానీ అందుకు భిన్నంగా ఈ ఏడాది వేట నిషేధ కాలంలోనే జువ్వలదిన్నెకు పక్కనే తుమ్మలపెంటలో మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభించేందుకు చర్యలు చేపట్టడం అర్థమవుతోంది. ఇప్పటికే తీర గ్రామాల్లో టీడీపీ ఎంపీ బీద మస్తాన్రావు కుటుంబ సభ్యులను నిషేధిస్తూ మత్స్యకారులు ‘దురాయి’ వేశారు. ఈ క్రమంలో మత్స్యకారులపై వల్లమానిన ప్రేమ ఒలకబోసేందుకు చంద్రబాబు ధృతరాష్ట్ర కౌగిలి రాజకీయానికి తెర తీసినట్లు రాజకీయ అభిజ్ఞ వర్గాల బోగట్టా. చంద్రబాబు సర్కార్ చర్యలతో భవిష్యత్కు బీటలు మత్స్యకారుల భవిష్యత్ను కాంక్షించి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.289 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను నిర్మించారు. ఎన్నికల కోడ్తో ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్ను ఆ తర్వాత ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభించారు. ఈ క్రెడిట్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని, మత్స్యకారుల్లో ఆయనకు బలం పెరుగుతుందని భావించిన చంద్రబాబు సర్కారు వినియోగంలోకి తేకుండానే నిర్వీర్యం చేసే కుట్రకు తెగించింది. ఫిషింగ్ హార్బర్ను ప్రైవేట్ పరం చేసేందుకు రహస్యంగా సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఈ విషయం శంకుస్థాపన చేసే వరకు మత్స్యకారులకు కూడా తెలియకుండా చంద్రబాబు ప్రభుత్వం జాగ్రత్త పడింది. ఈ ప్రాజెక్ట్ను నిర్వీర్యం చేసేందుకు దానికి కేటాయించిన 78.6 ఎకరాల్లో ముఖ ద్వార ప్రాంతంలోనే తొలి దశలోనే 29.5 ఎకరాలు గుట్టు చప్పుడు కాకుండా సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టేసి ఒక్క రోజు ముందు వచ్చి శంకుస్థాపన చేసి మత్స్యకారుల భావితరాలకు సైతం ద్రోహం చేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా తీర ప్రాంతంలో తమిళ జాలర్ల అకృత్యాలు ఎక్కువయ్యాయి. మెకనైజ్డ్ బోట్లతో జిల్లా పరిధిలోని తీర ప్రాంతంలోకి చొరబడి స్థానిక మత్స్యకారులు వేటాడిన మత్స్య సంపదను దోచుకెళ్తున్నారు. అడ్డుపడే ఈ ప్రాంత మత్స్యకారులపై దాడులకు తెగబడుతున్నారు. వలలు, పడవలు ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం ప్రాణాలకు తెగించి కావలి మండలం పెద్దపట్టపుపాళెం, బోగోలు మండలం జువ్వలదిన్నె ప్రాంతాల్లో నాలుగు పాండిచ్చేరి బోట్లను పట్టుకున్నారు. ఐదు నెలలుగా పోలీస్, మత్స్యకార, మైరెన్ అధికారుల అధీనంలో ఉన్న బోట్లు మార్చి 16వ తేదీ రాత్రి మాయమయ్యాయి. ఈ ద్రోహం వెనుక టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు పాత్ర ఉందనే విషయం బయటకు రావడంతో వారిలో ఆగ్రహవేశాలు మిన్నంటాయి. బీద వెనుక మంత్రి లోకేశ్, మరో మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారనే విషయంతో మత్స్యకారులు ఇంకా రగిలిపోతున్నారు. ఐదు నెలలుగా స్థానిక మత్స్యకారుల నిర్బంధంలో పాండిచ్చేరి ఉండగా అప్పటి నుంచి ఇటు వైపు కన్నెత్తి చూడడానికి భయపడిన తమిళ జాలర్లు.. బోట్లు విడుదల చేసిన మరుసటి రోజు నుంచే విచ్చలవిడిగా తీరం వైపు దూసుకువచ్చి ఆంధ్రా మత్స్యకారులకు సవాల్ విసిరారు. మత్స్యకారుల భవిష్యత్కు వైఎస్ జగన్ బాటలు తరతరాలుగా సంప్రదాయ వృత్తి వేటనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని, భావితరాల భవిష్యత్ను ఉజ్వలం చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చారిత్రాత్మక అభివృద్ధి చేపట్టారు. ప్రాణాలకు తెగించి కడలిపై వేట సాగిస్తే తప్ప పూట గడవని స్థితిలోని మత్స్యకారులకు మరో బతుకు దెరువు లేదు. ఆంధ్రా మత్స్యకారులకు హైస్పీడ్ మెకనైజ్డ్ బోట్లు లేకపోవడంతో వేట సాగక బతుకు గడవక తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, గుజరాత్ వంటి పక్క రాష్ట్రాలకు వలసల కూలీలుగా వెళ్లి మత్స్యకారులు, యువత జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్రలో మత్స్యకారుల కష్టాలు, తమిళ బోట్ల దాష్టీకాలను గుర్తించి దీనికి చెక్ పెట్టాలంటే.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను నిర్మించడమే ఒక్కటే మార్గమని భావించారు. అధికారంలోకి రాగానే ఏక కాలంలో హైస్పీడ్ మెకనైజ్డ్ 1250 బోట్లు నిలిపే విధంగా సుమారు 78.6 ఎకరాల విస్తీర్ణంలో రూ.289 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కొక్కటి రూ.2 కోట్లు విలువ చేసే మెకనైజ్డ్ బోటుకు స్థానిక మత్స్యకారులను యజమానులుగా చేసే విధంగా 50 శాతం సబ్సిడీతో 1250 బోట్లను ప్రభుత్వం అందించేందుకు ప్రణాళిలు సిద్ధం చేశారు. ఫిషింగ్ హార్బర్కు అనుబంధంగా మత్స్యకార మహిళలకు మత్స్య సంపద ప్యాకింగ్, మార్కెటింగ్, ఫుడ్ కోర్టుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఫిషింగ్ హార్బర్లో కోల్డ్ చైన్, ఐస్ ప్లాంట్, చిల్ రూమ్ వంటి మౌలిక వసతులు, బోట్ రిపేర్ వర్క్ షాపులు, గేర్ షెడ్లు, నెట్ మెండింగ్ షెడ్లు వంటి సౌకర్యాలు కల్పించారు. కరోనా కారణంగా నిర్మాణం ఆలస్యం కావడంతో ఎన్నికల సమయానికి పూర్తయింది. కానీ కోడ్ రావడంతో మత్స్యకారులకు అంకితం చేయలేకపోయారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వినియోగంలోకి వచ్చి ఉంటే.. అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మెకనైజ్డ్ బోట్లతో విస్తృతంగా మత్స్య సంపదను సేకరిస్తూ.. ఆంధ్రా మత్స్యకారుల తరతరాలు ఆర్థికంగా సంపన్నులుగా మారేందుకు అవకాశం ఉండేది. ప్రాణాలకు తెగించి పట్టుకున్న తమిళ బోట్లను వదిలేశారు మత్స్యకారుల భావితరాల భవిష్యత్ జువ్వలదిన్నె హార్బర్ ప్రైవేట్ పరం రెండు నెలలుగా రగిలిపోతున్న తీర గ్రామాలు బోట్లు వదిలేసిన కుట్రధారు బీద మస్తాన్రావు, కుటుంబానికి తీరంలో నిషేధాజ్ఞలు ఇంత జరిగినా.. హార్బర్ విషయంపై స్పష్టత ఇవ్వని టీడీపీ సర్కారు ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు మత్స్యకార జపం జువ్వలదిన్నె హార్బర్పై నోరు మెదపని చంద్రబాబు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మత్స్యకారులను మోసం చేస్తూనే ఉన్నాడు. ఈ దఫా అయితే ‘జీవిత కాలం’ ద్రోహం తలపెట్టారు. తాజాగా గంగపుత్రులతో ధృతరాష్ట్ర కౌగిలి రాజకీయానికి తెర తీశాడు. దశాబ్దాలుగా తమిళబోట్లతో జీవనాధారం కోల్పోతున్న మత్స్యకారులు.. తమ ప్రాణాలకు తెగించి పట్టుకున్న బోట్లను మంత్రి లోకేశ్, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు కుట్రలు చేసి వదిలేసి టీడీపీ చేసిన ద్రోహం రెండు నెలలుగా మానని గాయంగానే ఉంది. మత్స్యకారుల ఉజ్వల భవిష్యత్కు వైఎస్ జగన్మోహన్రెడ్డి జువ్వలదిన్నెల ఫిషింగ్ హార్బర్తో బాటలు వేస్తే.. చంద్రబాబు ఆ భవిష్యత్ను భగ్నం చేస్తూ.. ఆశలను చిదిమేసే కుట్ర పూరిత చర్యలకు తెగించడాన్ని తీర ప్రజలు మరిచిపోలేకున్నారు. టీడీపీ చర్యలతో తీర ప్రాంతంలో ఆ పార్టీ పేరెత్తితేనే మత్స్యకారులు ఉడికిపోతున్నారు. ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు జువ్వలదిన్నెకు పక్కనే ఉన్న తుమ్మలపెంట కేంద్రంగా ‘మత్స్యకారుల సేవలో’ పథకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మండిపడుతున్నారు. మత్స్యకారుల బతుకు దెరువు, భవిష్యత్ అయిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంపై చంద్రబాబు ఇంత వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే ఆ ప్రాంతంలో కొంత భాగాన్ని ప్రైవేట్ సంస్థకు సర్కారు కట్ట బెట్టింది. హార్బర్ను ఎప్పటిలోగా మత్స్యకారులకు అంకితం చేస్తారో చెప్పకపోగా, వీరి కోసం గత ప్రభుత్వం తీసుకున్న ప్రణాళిక అమలు విషయంపైనా ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. గత నెలలో టీడీపీ ప్రభుత్వంపై మత్స్యకారులు మండిపడుతున్న నేపథ్యంలో వారిని బుజ్జగించేందుకు త్వరలోనే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రారంభిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర నెల్లూరులో మీటింగ్లో చెప్పడం గమనార్హం. ఫిషింగ్ హార్బర్ విషయంలో స్థానిక మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. తుమ్మలపెంట వేదికగా చంద్రబాబు నిర్వహించే మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో ఫిషింగ్ హార్బర్ విషయంలో స్పష్టత ఇస్తారా? లేక.. తన మాయ మాటలతో మభ్యపెట్టి ధృతరాష్ట్ర కౌగిలితో నలిపేస్తారా? అనేది తేలనుంది. -
కాలుష్య సమస్యకు పరిష్కారం చూపండి
● తమను రక్షించాలన్న గ్రామస్తులు ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని నేలటూరులో నెలకొన్న కాలుష్య సమస్యపై అధికారులు పరిశీలించి వెళ్లిపోవడం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరారు. ఇటీవల స్థానికులు కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో స్పందించిన అధికారులు సోమవారం గ్రామానికి వచ్చి పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం ప్రభావంతో కొన్నేళ్లలో దాదాపు 20 మందికి పైగా మృతిచెందినట్లు గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా అనేక మంది విచిత్రమైన వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. పశువులు, వ్యవసాయ భూములు కూడా కాలుష్య ప్రభావానికి గురవుతున్నాయని వాపోయారు. గ్రామాల తరలింపుపై గతంలో సర్వేలు నిర్వహించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి గ్రామాన్ని కాలుష్య ముప్పు నుంచి రక్షించాలని కోరారు. -
కదం తొక్కిన వైఎస్సార్సీపీ
● రిక్షా తొక్కుతూ కాకాణి, పర్వతరెడ్డి నిరసన నెల్లూరురూరల్: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరు నగర నియోజకవర్గంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బారకాసు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్త ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి వినూత్నంగా రిక్షా తొక్కుతూ నిరసన తెలియజేశారు. అనంతరం కలెక్టరేట్ చేరుకుని డీఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు వివిధ రూపాల్లో భారం పడుతుందన్నారు. పెరిగిన ఆయిల్ ధరల వల్ల రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన భారం పడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన పొదుపు గురించి మాట్లాడుతూనే ధరలను అమాంతం పెంచి ప్రజలపై భారం మోపుతున్నాయన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాల్సిందే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ తగ్గించేంత వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు. ఇప్పటికే రెండేళ్లుగా కూటమి తన దుష్ట పాలనతో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలను మరింత పెంచిందని ఆరోపించారు. రాష్ట్రంలో పెట్రోల్ రూ.113 దాటగా, డీజిల్ రూ.103కు చేరడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఇంధన ధరల పెరుగుదలతో గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోయాయని, సామాన్యుడి జీవనం కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టిస్తూ ప్రజలను అధిక ధరలకు కొనుగోలు చేసే పరిస్థితికి నెట్టేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలు, బెల్ట్ షాపులు పెరిగిపోయాయని, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వైఎస్సార్సీపీ చేపడుతున్న ప్రజా పోరాటాలకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూస్తే కూటమి పాలనపై ప్రజలు ఎంతగా విసిగిపోయారో అర్థమవుతుందన్నారు. పెట్రో మంట వల్ల సామాన్యుడి జీవనం అతలాకుతలం అవుతందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. -
దేశంలోనే ఏపీలో పెట్రోల్ ధరలు అధికం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటాచలం: దేశంలో రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయని, ప్రజలపై చంద్రబాబు మోపిన అధిక ధరలు తగ్గించేంత వరకు తమ పోరాటాలు ఆగవని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి హెచ్చరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెంకటాచలంలో సోమవారం కాకాణి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక సర్వేపల్లి క్రాస్ రోడ్డు వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఎడ్ల బండిని నడుపుతూ ర్యాలీ నిర్వహించి, అనంతరం ఇన్చార్జి తహసీల్దార్ విజయ్కు వినతిపత్రం అందజేశారు. కాకాణి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్, డీజల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయని, ఒకేసారి రూ.3,391 కోట్ల భారాన్ని మోపిందని ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల ముందు పెట్రోల్ బంక్ల లోకేషన్ల వద్ద సెల్ఫీలు తీసుకున్న లోకేశ్ ఇప్పుడు కూడా సెల్ఫీలు తీసుకోగలడానని ప్రశ్నించారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ట్యాక్స్ తగ్గించాల్సింది పోయి, మరింత పెంచి ప్రజలపై భారం మోపడం దారుణమని మండిపడ్డారు. డీజిల్ ఽలీటరు ధర రూ.97.63 ఉండగా రూ.3.14 పెంచడంతో రూ.100.77లకు, పెట్రోల్ ధర రూ.109.85 ఉండగా, రూ.3.29 పెంచడంతో రూ.113.14లకు పెరిగిందన్నారు. ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచబోమని, అప్పటికే ఉన్న ధరలను తగ్గిస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబు చెబుతున్న పొదుపు మంత్రం పేద ప్రజలకే తప్ప, చంద్రబాబు కుటుంబానికి వర్తించదానని ధ్వజమెత్తారు. కొన్ని అనుకూల మీడియా చానళ్లలో లోకేశ్ కేవలం రెండు కార్ల కాన్వాయ్లోనే వెళ్తున్నట్లు చూపించారని, అయితే లోకేశ్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లాలన్నా ప్రత్యేక విమానాలు వాడుతున్నారని, అది పొదుపు మంత్రం ఎలా అవుతుందన్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో ఉక్రెయిన్ యుద్ధం, కరోనా వంటి తీవ్ర సంక్షోభాలు, విపత్తులు వచ్చినప్పటికి అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలపై భారం మోపకుండా అండగా నిలిచారని గుర్తు చేశారు. పేదలపై భారం పడకుండా సుపరిపాలన అందించాలనే ఆలోచనతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పని చేసిందన్నారు. -
ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
నెల్లూరు (టౌన్): ఐఐటీల్లో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో రెండు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధా్య్హ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షను నిర్వహించారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు 96 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షకు విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు రావడంతో కేంద్రల వద్ద సందడి నెలకొంది. పరీక్ష రాసి బయటకు వచ్చేంత వరకు తల్లిదండ్రులు కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కేంద్రాల సమీపంలోని చెట్లు కింద సేద తీరారు. -
ఏం ముఖం పెట్టుకుని వస్తావు బాబు
● మత్స్యకార నేతల నిలదీత కావలి: మత్స్యకారులను నిలువునా మోసం చేసిన సీఎం చంద్రబాబు మత్స్యకార సేవలో పేరుతో తుమ్మలపెంటకు వస్తున్నాడని, ఏం ముఖం పెట్టుకుని వస్తున్నావంటూ మత్స్యకార కాపు నేతలు నిలదీశారు. ఆదివా రం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి సూచనలతో మత్స్యకారులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకొన్న తమిళనాడు బోట్లను నీ కుమారుడు లోకేశ్, నీ పార్టీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు కలిసి వదిలేసి ద్రోహం చేసిన సంగతి ఏ మత్స్యకారుడు మరిచిపోరన్నారు. గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారులు అభివృద్ధికి, భావితరాల భవిష్యత్కు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కడితే.. దాన్ని మా మత్స్యకారులకు అంకితం చేయకుండా ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధపడ్డారని ధ్వజమెత్తారు. ఇంత జరిగినా.. బోట్లు వదిలేసిన వారిపై చర్యల్లేవని, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రారంభించే విషయాన్ని స్పష్టం చేయకుండా ఇప్పుడు మత్స్యకారుల సేవలో.. పేరుతో మత్స్యకారులను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తీర ప్రాంత ప్రజలకు భరోసా కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటనకు ఎవరు వెళ్లొద్దని గ్రామాల వారీగా ప్రచారం చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇప్పుడు ప్రతి మత్స్యకార గ్రామానికి వెళ్లి కార్యక్రమానికి రావాలని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది మత్స్యకారుల్లో విబేధాలను సృష్టించడమేనని విమర్శించారు. ఈ సమావేశంలో మత్స్యకార నాయకులు కోడూరు రాజయ్య, కొమారి రాజు, వాయిల తిరుపతి, వాయిల రాధాకృష్ణ, గోవిందస్వామి, మత్స్యకార కాపులు, మత్స్యకారులు పాల్గొన్నారు. -
తిరుపతి ఎంపీకి ఘోర అవమానం
● ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులు ● శిలాఫలకాల్లో కానరాని ఎంపీ గురుమూర్తి పేరు చిల్లకూరు: గూడూరు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే సునీల్ ప్రారంభించిన కూరగాయల మార్కెట్, పీహెచ్సీ భవనం శిలాఫలకాల్లో తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి పేరును నమోదు చేయకుండా ప్రోటోకాల్ను ఉల్లంఘించారు. కేంద్ర ప్రభుత్వంలోని ఎన్హెచ్ఎం నిధులతో పాటు మున్సిపాలిటీ నిధులతో ఆస్పత్రి భవనం నిర్మించడం గమనార్హం. ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులను గౌరవిస్తూ పేర్లు నమోదు చేయాల్సిన అధికారుల అత్యుత్సాహమో, బాధ్యతా రాహిత్యమో తెలియదు కానీ గూడూరు నియోజకవర్గానికి ఏ మాత్రం సంబంధం లేని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి పేరును మాత్రం శిలాఫలకంలో వేయించి, తిరుపతి ఎంపీ గురుమూర్తి పేరును వేయకుండా ఘోరంగా అవమానించారంటూ దళిత సంఘాలు మండిపడుతున్నాయి. అయితే ఆయా కార్యక్రమాలకు ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్తోపాటు, తిరుపతి ఎంపీ గురుమూర్తికి ఆహ్వాన పత్రికలు కూడా పంపకపోవడం దళిత ఎమ్మెల్యేగా ఉండి దళిత ప్రజాప్రతినిధులను అవమానించడం దారుణమన్నారు. గూడూరు మున్సిపల్ ప్రత్యేకాధికారిగా వ్యవహరించే గూడూరు ఆర్డీఓ సత్యనారాయణ కూడా శిలాఫలకాల ప్రోటోకాల్పై ప్రశ్నించకపోవడం విమర్శలకు తావిస్తుంది. రేపు సీఎం జిల్లా పర్యటన నెల్లూరురూరల్: సీఎం చంద్రబాబు ఈ నెల 19న జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10 గంటలకు కావలి మండలం తుమ్మలపెంటకు చేరుకుంటారన్నారు. ఇక్కడ మత్స్యకారుల సేవలో కార్యక్ర మం అనంతరం 12.45 గంటలకు మత్స్యకారులతో ముఖాముఖిలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు పార్టీ కేడర్ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.15 గంటలకు హెలికాప్టర్లో చిత్తూరు జిల్లాకు వెళ్తారని కలెక్టర్ వివరించారు. -
పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
● డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర నాయక్ కోవూరు: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ప్రత్యేక తరగతులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఉత్తీర్ణత సాధించాలని డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర నాయక్ సూచించారు. కోవూరులోని పచ్చిపాల రామనాథమ్మ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు – 3 డివిజన్ పరిధిలోని పలు మండలాలకు చెందిన 1,095 మంది విద్యార్థులు ఈనెల 20వ తేదీ నుంచి జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో సంబంధిత సబ్జెక్ట్ ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి నూరుశాతం ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని చెప్పారు. విద్యార్థులు కూడా క్రమశిక్షణతో తరగతులకు హాజరై సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ, హాజరు వివరాలు, విద్యార్థుల పురోగతిని పరిశీలించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని సోఫియా కిరణ్మయి పాల్గొన్నారు. -
అధికారం ఉంది.. మా ఇష్టం
● అర్ధరాత్రి అక్రమంగా మట్టి తరలింపు ● అడ్డుకున్న కృష్ణపట్నం గ్రామస్తులు ● పోలీసుల పంచాయితీముత్తుకూరు(పొదలకూరు): అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు ఎక్కడపడితే అక్కడ మట్టి, గ్రావెల్ తరలిస్తున్నారు. ప్రశ్నించిన వారిని బెదిరించడంతోపాటు అక్రమంగా కేసులు పెడుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నా పట్టించుకునే వారు లేరనే విమర్శలున్నాయి. మండలంలోని కృష్ణపట్నం గ్రామంలో శనివారం అర్ధరాత్రి ట్రాక్టర్లలో మట్టిని అక్రమంగా తరలిస్తుండగా పంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. ముఖ్యనేతల అండదండలతోనే మట్టిని తరలిస్తున్నట్టు గ్రామస్తులు వెల్లడించారు. అయితే మట్టి మాఫియా పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు ఘటనా స్థలానికి వెళ్లి పంచాయితీ చేశారు. అలాగే మాట వినని గ్రామస్తులను బెదరగొట్టి ట్రాక్టర్లను విడిపించి పంపారు. మట్టి తరలింపును అడ్డుకోవాల్సిన పోలీసులే ఇలా చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాక్టర్ మట్టి డిమాండ్ను బట్టి రూ.1,200 నుంచి రూ.1,500 వంతున అమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది. జేసీబీకి ఇందులో ట్రిప్పునకు రూ.200 వంతున చెల్లిస్తున్నారు. ఇందుకోసం ఎవరి వద్ద ఎలాంటి అనుమతులు తీసుకోవడం లేదు. కలెక్టర్, ఎస్పీ చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఏం న్యాయం చేశారు?
● ఉదయగిరి ఎమ్మెల్యేపై ఆగ్రహం కొండాపురం: ‘దళితులపై దాడి చేసి, ఒక వ్యక్తిని హత్య చేసి బావిలో వేసిన వారిపై ఇప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మాకు ఏం న్యాయం చేశారు’ అని గానుగపెంట ఎస్సీ కాలనీకి చెందిన జడ రసూల్, హజరత్ కుటుంబ సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ను నిలదీశారు. రసూల్ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం ఆదివారం కావలి నుంచి గానుగపెంటకు తీసుకొచ్చారు. పరామర్శకు వచ్చిన సురేష్పై కాలనీ వాసులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పార్టీని నమ్మి ఓట్లు వేసి గెలిపించినందునందుకు తగిన శాస్తి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రసూల్ను తమ గ్రామ టీడీపీ నాయకుడు కిలారి నరేంద్ర తీసుకెళ్లి దగ్గరుండి వారి చేతుల్లో పెట్టి హత్య చేయించాడని, అతడిని వెంటనే అరెస్ట్ చేసి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రసూల్, హజరత్పై దాడి చేసిన 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలని కోరారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు దామా మహేశ్వరరావుపై కూడా కాలనీవాసులు ఆగ్రహించారు. ఊరికి ఒక యువ నాయకుడి పేరుతో రౌడీయిజం చేయిస్తున్నావని.. నీ వల్లే మండలం హత్యాకాండలతో మారు మోగిపోతుందని.. మండలంలో కనిపిస్తే నీ అంతు చూస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ రెండు, మూడు రోజుల్లో నిందితులను అరెస్ట్ చేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రసూల్ కుటుంబ సభ్యులకు రూ. 50 వేల ఆర్థిక సహాయం చేశారు.


