breaking news
SPSR Nellore
-
కొలతలు వేసి.. క్షుణ్ణంగా పరిశీలించి..
● ముగిసిన ఏసీబీ అధికారుల తనిఖీలు ● నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తింపు నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగరంలో ఏసీబీ అధికారుల తనిఖీలు ముగిశాయి. గురువారం కూడా ఆర్అండ్బీ, టౌన్ ప్లానింగ్ అధికారులను వెంట బెట్టుకుని మినీబైపాస్, మాగుంట లేఅవుట్, వనంతోపు సెంటర్ తదితర ప్రాంతాలకు వెళ్లారు. భవనాలను కొలతలు వేసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు ఆదేశాల మేరకు సీఐ వెంకటేష్, విజయ్కుమార్ పర్యవేక్షణలో రెండు బృందాలుగా విడిపోయి పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు క్షేత్రస్థాయిలో 10 భవన నిర్మాణాలను పరిశీలించారు. వాటిలో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఇప్పటికే కార్యాలయంలోని రికార్డులను సీజ్ చేసిన ఏసీబీ అధికారులు, అక్రమాస్తులు, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. మొత్తం వ్యవహారంపై నివేదికలు తయారు చేసి రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపనున్నారు. అనంతరం బాధ్యు లపై కఠిన చర్యలు ఉంటాయని తెలిసింది. -
మాకు కోడిగుడ్లు అందలేదు
● ఆహార కమిషన్ తనిఖీల్లో వెలుగులోకి.. ● వివిధ ప్రాంతాల్లో సభ్యుడు లక్ష్మీరెడ్డి పర్యటన ● కోడిగుడ్ల నిల్వపై ఆగ్రహం ● టీచర్లు, హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులుకోవూరు: రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు ఈ.లక్ష్మీరెడ్డి గురువారం కోవూరు నియోజకవర్గంలో పర్యటించారు. కోవూరు మండలం పాటూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. 147 కాలం చెల్లిన గుడ్లు నిల్వ ఉండటాన్ని ఆయన గుర్తించారు. లబ్ధిదారులకు ఫోన్ చేయగా, తమకు గుడ్లు అందలేదని చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్ సుమిత్రకు షోకాజ్ నోటీసులివ్వాలని ఐసీడీఎస్ నోడల్ ఆఫీసర్ అనురాధను ఆదేశించారు. పాటూరు జెడ్పీ బాలుర హైస్కూల్లో తనిఖీలు చేశారు. మధ్యాహ్న భోజనాన్ని మరోచోట తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి లిఖితపూర్వక అనుమతి లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని, హెచ్ఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని డీఈఓను ఆదేశించారు. అనంతరం దామరమడుగు హైస్కూల్కు వెళ్లారు. ఇక్కడ కూడా గుడ్లు పెద్ద సంఖ్యలో నిల్వ ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత భారీ స్థాయిలో స్టాక్ ఎందుకు తీసుకున్నారో సమాధానం చెప్పలేక సిబ్బంది నీళ్లు నమిలారు. అలాగే, బుచ్చిరెడ్డిపాళెం బాలికల హైస్కూల్లో ఆయన తనిఖీ చేయగా స్టాక్ రిజిస్టర్ ప్రకారం ఉండాల్సిన దానికంటే 760 గుడ్లు తక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ అక్రమాలపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తూ, బాధ్యులైన హెచ్ఎంలకు నోటీసులివ్వాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల్లో.. నెల్లూరు(పొగతోట): ఆహార కమిషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి గురువారం జిల్లాలోని చౌకదుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలు, గురుకుల పాఠశాలను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్లు నిల్వ ఉన్న ట్లు గుర్తించారు. సంబంధిత సిబ్బందికి షోకాజు నోటీసులివ్వాలని అధికారులను ఆదేశించారు. నగరంలో చౌకదుకాణాలను పరిశీలించి కార్డుదారులకు రేషన్ సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్ఓ లీలారాణి, సివిల్ సప్లైస్ డీఎం అర్జున్రావు, ఏఎస్ఓ లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కండలేరులో 50.580 టీ ఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 50.580 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,100, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 240, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
బారులు తీరి.. అమ్మవారిని దర్శించుకుని..
చిల్లకూరు: మండలంలోని తీర ప్రాంతమైన తూర్పుకనుపూరులో ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో జరుగుతున్న జాతర సందర్భంగా అమ్మవారికి గురువారం బంగారు చీరను అలంకరించారు. దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తూర్పుకనుపూరుకు చేరుకున్నారు. పలు రాష్ట్రాలకు చెందిన వారు మొక్కుల తీర్చుకునే క్రమంలో పొంగళ్లు పెట్టి చీర, సారె సమర్పించారు. ఆలయంలో క్యూలైన్లు పూర్తిగా నిండిపోవడంతో అమ్మ వారి దర్శనానికి గంటకు పైగా సమయం పట్టింది. దీంతో కొందరు ఇలా ఎప్పుడూ జరగలేదని వాపోయారు. సాయంత్రానికి భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో అధికారులు చర్యలు చేపట్టారు. వైభవంగా గ్రామోత్సవం జాతర సందర్భంగా పోలేరమ్మ గుడికి సమీపంలో కొలువుదీరిన యారా గురునాథస్వామికి గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇసుక తిన్నెలపై ఉన్న గురునాథస్వామి వద్ద ఉన్న అక్క దేవతలు, గంగపెట్టెకు గొల్లలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణాచారి ముందు ఉండగా, గంగపెట్టెను ఎత్తుకుని గొల్లలు నడుస్తుండగా గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా చేశారు. ఈ సందర్భంగా గొల్లలు వేసిన వీరతాళ్లు అందరిని అలరించాయి. పోలీసుల పెత్తనం జాతర సందర్భంగా ఆలయంలో భక్తులకు సౌకర్యాలు కల్పించే బాధ్యత మొత్తం దేవదాయ శాఖ చూసుకోవాల్సి ఉంది. అయితే ఈ ఏడాది పెత్తనం మొత్తం పోలీసులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. తమకు కావాల్సిన వారిని ఇష్టానుసారంగా పంపి అమ్మవారి దర్శనం చేయించారు. దీంతో క్యూలైన్లలో ఉన్న భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆలయ పాలకమండలి కూడా గతంలో ప్రత్యేక పాస్ సౌకర్యం కల్పించేది. అయితే ఈసారి పోలీసులు పాస్లు ఇచ్చే ఆనవాయితీని ఆపేశారు. తాము ప్రత్యేక పాస్లను నచ్చిన వారికి ఇచ్చారని విమర్శలున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా జాతర సందర్భంగా మాతమ్మల చేత చిందులు వేయించడంతో గుర నాథస్వామి గ్రామోత్సవంలో తోపులాట జరిగింది. అయినా పోలీసులు పట్టించుకున్న దాఖలాల్లేవని మహిళా భక్తులు విమర్శించారు. -
ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు
● రూ.5,43,649ల రికవరీకి ఆదేశం సీతారామపురం: మండలంలోని 14 పంచాయతీల్లో జరిగిన ఉపాధి హామీ పనుల్లో అవకతవకలను అధికారులు గుర్తించారు. రూ.5,43,649ల రికవరీకి ఆదేశించారు. సీతారామపురంలోని సీ్త్రశక్తి భవన ప్రాంగణంలో గురువారం 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మండలంలో 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన ఉపాధి హామీ పనులపై నెలరోజులుగా విచారణ చేపట్టిన డీఆర్పీలు నివేదికలను డ్వామా పీడీ గంగా భవాని ముందు వెల్లడించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మండలంలో సుమారు రూ.10 కోట్లతో పనులు జరిగాయన్నారు. వాటిలో రూ.6.65 కోట్లు కూలీలకు చెల్లించినవి కాగా రూ.2.90 కోట్లు ఇతర పనులకు వినియోగించారన్నారు. టెక్నికల్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంతో తప్పులు జరిగాయన్నారు. కొలతల్లో తేడాలున్న ప్రతి పనికి రికవరీ విధించామన్నారు. పలు పంచాయతీల్లో వంద రోజులు పూర్తయినా కూడా అదే కుటుంబానికి సింగిల్ జాబ్కార్డులను కొత్తగా తయారుచేసి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనులు కల్పించడం వంటివి గుర్తించామన్నారు. అలాంటి వాటికి కూడా రికవరీ రాశామన్నారు. ఎం బుక్ల్లో తేడాలకు టీఏ, ఈసీలు, మస్టర్లలో తేడాలకు ఏపీఓ, ఫీల్డ్ అసిస్టెంట్లు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో డీవీఓ విజయలక్ష్మి, ఎస్సార్పీ భాస్కర్, డీఆర్పీలు నూతన్, నాగరాజు, మల్లికార్జున్, ఏపీఓలు శ్యామల, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. -
వైకల్యం ఓడింది.. సంకల్పం గెలిచింది
● జాతీయ స్థాయిలో పొదలకూరు దివ్యాంగుడి ప్రతిభ ● తల్లి ప్రోత్సాహంతో విజయ తీరాలకు.. దివ్యాంగుడిగా ఎన్నో బాధలు.. అవమానాలు.. కష్టాలు.. కన్నీళ్లు ఉన్నా తన తల్లి అందించిన ప్రోత్సాహం వల్ల జాతీయ స్థాయి దివ్యాంగుల వాలీబాల్ పోటీల్లో రాణించారు పొదలకూరుకు చెందిన వ్యక్తి. తండ్రిని కోల్పోయినా.. క్రీడలపై మక్కువతో ఆత్మ విశ్వాసాన్ని విడవకుండా వృద్ధురాలైన తల్లితో జీవిస్తూ విజయ తీరాలను అందుకునేందుకు ఇంకా శ్రమిస్తూనే ఉన్నాడు. ఉపాధ్యాయుడిగా ఎంపికై తన తల్లిని బాగా చూసుకోవాలనే పట్టుదలతో ముందుకు వెళ్తున్నాడు.పొదలకూరు: పొదలకూరు పట్టణంలో నివసిస్తున్న కంభాపు పెంచలయ్య చిన్న వయస్సు లోనే తండ్రి రామయ్యను కోల్పోయారు. అప్పటి నుంచి తల్లి అంకమ్మ పెంపకంలో పెరిగారు. బిడ్డ భవిష్యత్తే లక్ష్యంగా ఆమె తమ కుల వృత్తి అయిన దుస్తులు ఉతికి ఐరన్ చేస్తూ బిడ్డను ఉన్నతంగా చదివించారు. అయితే పెంచలయ్య 80 శాతం వికలత్వంతో జన్మించినా ఏనాడు ఆ తల్లి నిట్టూర్చలేదు. లేకలేక జన్మించిన పెంచలయ్య తమ గారాలపట్టిగా పెంచుకుంది. దీనికితోడు అంకమ్మకు చెవుడు రావడంతో జీవితం మరింత ఇబ్బందిగా మారింది. అయినా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు. కుమారుడిని పొదలకూరులో ఇంటర్, డిగ్రీ వరకు చదివించారు. ఆ తర్వాత ఎంఏ, బీఈడీ నెల్లూరులో అష్టకష్టాలు పడి చదివించారు. క్రీడలపై ఆసక్తి చదువుల తర్వాత పెంచలయ్య దివ్యాంగుల క్రీడలపై ఆసక్తి పెంపొందించుకున్నారు. దీంతో తనకు ఇష్టమైన క్రీడలపై నిరంతరం శ్రమించి పట్టు సాధించాడు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రతిభ చాటుతూ చివరకు జాతీయ స్థాయికి ఎదిగాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరంలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పారా సిట్టింగ్ వాలీబాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికై ఆడిన పెంచలయ్య అద్భుత ప్రతిభ కనబరిచారు. జట్టు విజయానికి తన వంతు కృషి చేసి రాష్ట్ర జట్టు ప్రథమ స్థానాన్ని సాధించేందుకు ఒకడిగా నిలిచారు. దీంతో జాతీయ స్థాయిలో అభినందనలు అందుకున్న పెంచలయ్య పొదలకూరుకు చేరుకున్నాడు. అమ్మను బాగా చూసుకోవాలి క్రీడల్లో ఎన్ని విజయాలు సాధించినా అమ్మను బాగా చూసుకునేందుకు ఇన్ని కష్టాలు పడుతున్నానంటాడు పెంచలయ్య. వైకల్యం శరీరానికే కాని పట్టుదలకు కాదంటున్నాడు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించేందుకు వీలు కలుగుతుందని, అవకాశాలు తలుపు తట్టవని.. మనమే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లాలని ఇప్పటి యువతకు మార్గదర్శకంగా చెబుతున్నారు. క్రీడా కోటాలో ఉద్యోగం సాధించి ఎనిమిది పదుల వయస్సులో ఉన్న తన తల్లి అంకమ్మను బాగా చూసుకోవడం తన ముందున్న పెద్ద లక్ష్యంగా చెప్పాడు. పారా సిట్టింగ్ వాలీబాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బోడపాటి శివదత్ తనను ఎంతగానో ప్రోత్సహించారని తెలిపారు. అయితే పెంచలయ్య పట్టణంలోని నరసారెడ్డి కాలనీ సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ప్రోత్సహిస్తే క్రీడాకారునిగా మరింత ప్రతిభ చూపేందుకు అవకాశం ఉంటుందంటున్నాడు. -
ఈ ప్రభుత్వంతో ఒరిగేదేమీలేదు
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పింఛన్లు ఇలా అన్ని పథకాల్లో ప్రభుత్వం కోతలు విధిస్తోంది. దీంతో సర్కార్పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. సన్నకారు రైతులకు ఏ మాత్రం లబ్ధి చేకూరడంలేదు. – బొద్దుకూరు జయమ్మ, నెల్లూరు జిల్లాలోని రైతులకు అందుతుంది జిల్లాలో 1,95,866 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్లో 1,63,125 మంది అర్హులుగా ఉన్నారు. వీరందరికీ నగదు జమవుతుంది. – సత్యవాణి, జిల్లా వ్యవసాయాధికారి -
డైట్లో ముగిసిన శిక్షణ
ఇందుకూరుపేట: మండలంలోని పల్లిపాడు డైట్లో 20 రోజుల పాటు నిర్వహించిన టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం గురువారంతో ముగిసింది. కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి కరికులం, టెక్స్ట్ బుక్ డెవలప్మెంట్ విభాగ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఇన్చార్జి ప్రిన్సిపల్ అక్కిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జెడ్పీలో కారుణ్య నియామకాలు నెల్లూరు(పొగతోట): జెడ్పీ యాజమాన్య పరిధిలో విధులు నిర్వర్తిస్తూ మరణించిన ఐదుగురు ఉద్యోగుల కుటుంబసభ్యులకు ఉద్యోగావకాశాలను కారుణ్య నియామకాల ద్వారా కల్పించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, సీఈఓ శ్రీధర్రెడ్డి, డిప్యూటీ సీఈఓ మోహన్రావు గురువారం అందజేశారు. జూనియర్ అసిస్టెంట్గా ఒకర్ని, ఆఫీస్ సబార్డినేట్లుగా నలుగుర్ని నియమించారు. అదే విధంగా జెడ్పీలో సీనియర్ సహాయకులుగా పనిచేస్తున్న ఇద్దరికి పరిపాలనాధికారులుగా ఉద్యోగోన్నతులు కల్పించారు. అసోసియేషన్ నేతలు లక్కాకుల పెంచలయ్య, బాషా, భీమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 9 నుంచి పొగాకు కొనుగోళ్లు ఆత్మకూరు రూరల్: డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లను వచ్చే నెల తొమ్మిది నుంచి ప్రారంభించనున్నామని నిర్వహణాధికారి సునీల్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని జాలయ్యనగరంలో పొగాకు రైతులతో కలిసి క్షేత్ర దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. పొగాకు తోటల్లో పరిశీలన, కొనుగోళ్ల కంపెనీలతో కలిసి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పొగాకు పంటలో నూతన వంగడాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. క్యూరింగ్ చేసిన బేళ్లనే వేలం కేంద్రానికి తీసుకురావాలని కోరారు. బోర్డు నిబంధనల మేరకు ఒక్కో బేలు 150 కిలోలకు మించకుండా చూడాలని సూచించారు. ఐటీసీ మేనేజర్ వెంకటేశ్వరరావు, జీపీఐ కంపెనీ మేనేజర్ గోపిరెడ్డి, పొగాకు బోర్డు ఫీల్డ్ ఆఫీసర్ ఆదర్శ్ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. -
నిరంతరం ప్రజాసేవలోనే..
వింజమూరు(ఉదయగిరి): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పక్షమని, ప్రజాసేవలో నిరంతరం కృషి చేస్తూ వారి తరఫున పోరాటం చేస్తోందని పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. వింజమూరు మండలంలోని కాటేపల్లిలో గురువారం నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం పార్టీని జగన్మోహన్రెడ్డి స్థాపించారని చెప్పారు. భవిష్యత్తు తమదేనని.. ఎవరూ అధైర్యపడొద్దని తెలిపారు. -
అన్నదాతకు వంచన
అన్నదాత.. నాడు ఖుషీఖుషీగా ● ఫల సాయాన్ని అందించడంలోనూ కక్కుర్తే ● కుంటిసాకులతో పలువురి పేర్ల తొలగింపు ● జగనన్న హయాంలో రైతు సంక్షేమానికి పెద్దపీట ● ప్రస్తుత సర్కార్ తీరుతో అంతా అయోమయం వ్యవసాయమే దండగా అంటూ నాడు ప్రకటించిన చంద్రబాబు.. తాజాగా అదే పోకడను అవలంబిస్తూ అన్నదాత పొట్టగొడుతున్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించి, అధికారంలోకి రావడం.. ఆ తర్వాత తన ఫార్ములా రాజకీయాలను అమలు చేయడంలో ఆయనకెవరూ సాటిరారనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇందులో తాజాగా అన్నదాత సుఖీభవ పథకం చేరింది. కేంద్ర సాయంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకూ రూ.20 వేలను అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ఆయన ప్రస్తుతం దాన్ని తుంగలో తొక్కారు. పైగా వివిధ కొర్రీలు పెట్టి అర్హుల పేర్లను మాయం చేసి వారిని వంచించారు. నెల్లూరు(వేదాయపాళెం): అన్నదాతను టీడీపీ ప్రభుత్వం దగా చేస్తోంది. బూటకపు హామీలతో గద్దెనెక్కిన కూటమి సర్కార్, ప్రస్తుతం రైతులకు అందించే సాయంలోనూ తన కక్కుర్తి బుద్ధిని ప్రదర్శిస్తోంది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నిధులను శుక్రవారం జమ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో రైతుల సంఖ్యకు భారీగా కోత విధించింది. పంగనామాలు.. కేంద్రంతో సంబంధం లేకుండా రైతులకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తానంటూ గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత హోదాలో ప్రస్తుత సీఎం చంద్రబాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇది నిజమేనని నమ్మి ఆయనకు ఓట్లేసిన కర్షకులకు తన నిజస్వరూపాన్ని ఆయన చూపారు. జిల్లాలో 84,134 మంది రైతులను అనర్హులుగా ప్రకటించి వారికి శోకాన్ని మిగిల్చారు. విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు, ఫార్మర్ రిజిస్ట్రేషన్ తదితర కుంటిసాకులతో ఇలా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇలా.. జిల్లాలో 2.8 లక్షల మంది రైతులున్నారు. అయితే వీరిలో 1,95,866 మందే అర్హులంటూ జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో 1,63,125 మందికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వర్తిస్తోంది. వీరికి స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ను విడుదల చేయాల్సిన తరుణంలో అన్నదాత సుఖీభవకు అరకొరగా ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నిధుల విడుదల నేడు అన్నదాత సుఖీభవ మూడో విడత.. పీఎం కిసాన్ 22వ విడత పెట్టుబడి సాయం నిధులు శుక్రవారం సాయంత్రం విడుదల కానున్నాయని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి తెలిపారు. అన్నదాత సుఖీభవ ద్వారా 1,95,866 మందికి రూ.78.35 కోట్లు.. పీఎం కిసాన్ ద్వారా 1,63,125 మందికి రూ.32.63 కోట్లు జమకానున్నాయని వెల్లడించారు. ఉదయగిరికి రూ.25.74 కోట్లు, ఆత్మకూరుకు రూ.19.59 కోట్లు, కావలికి రూ.10.14 కోట్లు, కోవూరుకు రూ.9.3 కోట్లు, సర్వేపల్లికి రూ.15.84 కోట్లు, నెల్లూరుకు రూ.2.97 కోట్లు, వెంకటగిరికి రూ.9.07 కోట్లు, కందుకూరుకు రూ.18.33 కోట్ల మేర నిధులు జమకానున్నాయని పేర్కొన్నారు. పీఎం కిసాన్ సాయం అన్నదాత సుఖీభవ గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి.. రైతుల సంక్షేమానికి పెద్దపీటేశారు. ఆ సమయంలో ఒక కుటుంబంలో ఎంత మంది రైతులుంటే అందరికీ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేశారు. ఎలాంటి ఆంక్షల్లేకుండా.. పార్టీలకతీతంగా అందరికీ అందజేశారు. ఆ సమయంలో పది సెంట్లున్న రైతుకూ సాయమందేది. అయితే ప్రస్తుత ప్రభుత్వం తమను విస్మరిస్తోందనే భావన కర్షకుల్లో వ్యక్తమవుతోంది. -
జగన్ను మరోసారి సీఎం చేద్దాం
నెల్లూరు రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని మరోసారి సీఎంను చేయాలని ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని రామ్జీనగర్లో గల పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి చంద్రశేఖర్రెడ్డి, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకుడు కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి 16 కిలోల కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు. పార్టీని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారని చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలను దివంగత సీఎం వైఎస్సార్ అమలు చేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయసాధనే లక్ష్యంగా ప్రజలకు సుపరిపాలనను గత సీఎం జగన్మోహన్రెడ్డి అందించారని తెలిపారు. సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. రాబోయేది జగనన్న పాలనేనని చెప్పారు. రాష్ట్రానికి మంచి జరగాలంటే అది జగన్మోహన్రెడ్డితోనేననే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. -
దేశ రాజకీయాల్లో ఓ చరిత్ర
చిల్లకూరు: దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ పేర్కొన్నారు. గూడూరులోని సనత్నగర్లో గల పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేక్ను కట్ చేశారు. దివంగత సీఎం వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట ప్రజల ఆకాంక్ష మేరకు పార్టీని జగన్మోహన్రెడ్డి స్థాపించారని గుర్తుచేశారు. సంక్షేమ పథకాలను ప్రజల ఇళ్ల వద్దే అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. పట్టణ, రూరల్ కన్వీనర్లు బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయకుమార్రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఊటుకూరు మహేంద్రరెడ్డి, తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు మెట్టా రాధాకృష్ణారెడ్డి, నందవరం సుబ్బారావు, మహిళా విభాగ నేతలు సృజనారెడ్డి, దీప్తి, షంషీర్, నేతలు వినోద్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు. -
జగనన్నను ప్రజల నుంచి వేరు చేయలేరు
ఇందుకూరుపేట: పేదల గుండెల్లో నుంచి పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని.. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. ఎన్ని కుట్రలు చేసినా జగనన్నను ప్రజల నుంచి వేరు చేయలేరని మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందుకూరుపేటలోని ఆరో మైలు వద్ద గల వైఎస్సార్ విగ్రహానికి గురువారం నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. మహానేత వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక 600 మంది మరణిస్తే, వారి కుటుంబాలను పరామర్శించేందుకు జగనన్న నాడు పూనుకున్నారని చెప్పారు. అయితే దీనికి సోనియాగాంధీ నిరాకరించడంతో ఆమెను ఎదిరించి ఓదార్పు యాత్రను చేపట్టిన అంశాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్, చంద్రబాబు కుమ్మకై ్క ఆయన్ను 16 నెలలు జైల్లో అక్రమంగా నిర్బంధించినా బెదరలేదన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం కుంటుపడ్డాయని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని చెప్పారు. తమ పార్టీ శ్రేణులపై కేసులను అక్రమంగా మోపి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం తథ్యమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతి, రైతు విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మావులూరు శ్రీనివాసులురెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అనిల్బాబు, గొల్లపల్లి విజయకుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టేపాటి నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. . -
పేదల గుండెచప్పుడు వైఎస్సార్సీపీ
కోవూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ కాదని, పేదల గుండె చప్పుడని మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం పురస్కరించుకొని నెల్లూరులోని తన నివాసంలో బుధవారం ఆయన మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్సార్ ఆశయాలను పుణికిపుచ్చుకొని ఆవిర్భవించింది తమ పార్టీ అన్నారు. జగనన్న స్థాపించిన ఈ పార్టీ ప్రతి పేదవాడి గడపకు చేరిందని చెప్పారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన వెన్నంటే ఉండి పార్టీని కాపాడుకున్న ఘనత కార్యకర్తలకే దక్కుతుందని కొనియాడారు. సంక్షేమ రాజ్యాన్ని మరోసారి తీసుకురావడమే తమ లక్ష్యమని వివరించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రజల పక్షాన తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతమవుతుందని కాంక్షించారు. భోజన వసతికి టెండర్ల ఆహ్వానం నెల్లూరు(క్రైమ్): మూలాపేటలోని జైళ్ల శాఖ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందే సిబ్బందికి భోజన సదుపాయాన్ని కల్పించేందుకు గానూ టెండర్లను ఆహ్వానిస్తున్నామని ఏపీ స్టార్స్ ప్రిన్సిపల్ ప్రకాష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి కాంట్రాక్ట్ అమల్లో ఉంటుందని, టెండర్ విలువ రూ.20,16,450 అన్నారు. ఆసక్తి గల కాంట్రాక్టర్లు రూ.112ను చెల్లించి టెండర్ ఫారాన్ని ఏపీ స్టార్స్లో పొందొచ్చని చెప్పారు. పూర్తి చేసిన ఫారాలను సీల్డ్ కవర్లో ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వీకరించనున్నామని, అదే రోజు మధ్యాహ్నం 2.30కు వీటిని తెరవనున్నామని వివరించారు. ధరావతుగా రూ.40,329ను చెల్లించాల్సి ఉంటుందని, వివరాలకు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. -
సోమిరెడ్డి అవినీతికి అంతేలేదు
● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు రూరల్: సర్వేపల్లిలో సోమిరెడ్డి అవినీతికి అంతే లేకుండాపోయిందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన నాటకంలో సర్పంచ్ సుబ్బయ్య పాత్రను సోమిరెడ్డి వేయడంపై ‘సుబ్బయ్య‘ అని సంబోధిస్తూ సైటెర్లు వేశారు. ఆ నాటకం ద్వారా తనకు మంత్రి పదవి కావాలంటూ సీఎం చంద్రబాబుకు ఆయన పరోక్షంగా చెప్పారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు దిగజారాయని ఆరోపించారు. జిల్లాలో బాలికలపై అఘాయిత్యాలు నానాటికీ ఎక్కువవుతున్నాయని ఆరోపించారు. గుమ్మళ్లదిబ్బ ఘటనను మరువకముందే వరిగొండలో మరో బాలికపై అఘాయిత్యం జరిగిందని, వీటిని దాచిపెట్టేందుకు పోలీసులు యత్నించడం దారుణమన్నారు. సస్పెండైన సీఐ, ఎస్సైపై ఉదాసీనతతో వ్యవహరించకుండా విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. కేసును దర్యాప్తు చేసిన ఇన్చార్జి సీఐను సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. కాగితాలపూరు క్రాస్ రోడ్డు వద్ద రూ.100 కోట్ల విలువైన భూమికి సోమిరెడ్డి ఎసరు పెట్టారని విమర్శించారు. గుమ్మళ్లదిబ్బలో బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకెళ్లి, వారి ఇంటికి దూరంలో వివరాలను ప్రస్తావించకుండా మాట్లాడి ప్రభుత్వాన్ని ప్రశ్నించాననే కారణంతో తనపై కేసు నమోదు చేసి, తన కుమార్తెకు నోటీసులిచ్చారని దుయ్యబట్టారు. ప్రశ్నించే వారిపై కేసులు పెడుతూ తమ బాధ్యతలను పోలీసులు విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. వరిగొండలో బాలికపై జరిగిన ఘటనపై పెద్దాస్పత్రికి వెళ్లి తమ పార్టీ మహిళా నేతలు విచారిస్తే, ఆచూకీ తెలియనీయకుండా కప్పిపుచ్చేందుకు పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది యత్నించారని ఆరోపించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ గీతాలక్ష్మి.. బాలిక విషయం తెలియదంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని చెప్పారు. గంజాయి కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి.. బాలికపై మత్తులో అఘాయిత్యానికి పాల్పడితే ఏ చర్యలు చేపట్టారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, సమాధానం చెప్పలేక కొత్త డ్రామాలకు తెరలేపి బాలిక కుటుంబాన్ని అదృశ్యం చేశారని మండిపడ్డారు. ఆ కుటుంబం ఎక్కడికెళ్లింది.. వారు క్షేమంగానే ఉన్నారాననే అనుమానం కలుగుతోందన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే కృష్ణపట్నం పోర్టు సీఐ రవినాయక్, ముత్తుకూరు ఎస్సై ప్రసాద్రెడ్డిని సస్పెండ్ చేశారని ఆరోపించారు. రవినాయక్కు పోలీస్ శాఖలో కొనసాగే అర్హత లేదని తెలిపారు. తమ పార్టీ నేతలపై అనేక అక్రమ కేసులు పెట్టి, జైలు పాల్జేశారని.. చివరికి ఒక తప్పుడు కేసులో జడ్జి చీవాట్లు పెట్టారన్నారు. గతంలో ఎస్పీగా విధులు నిర్వర్తించిన కృష్ణకాంత్ అసమర్థతతో జిల్లా భ్రష్టుపట్టిపోయిందని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. సోమిరెడ్డి మాటలు విని అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురికావొద్దని పోలీసులకు హితవు పలికారు. కాగితాలపూరు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న భూములకు సంబంధించి తహసీల్దార్ సంతకం చేయకపోవడంతో కొత్త వారిని నియమించుకున్నారని చెప్పారు. సోమిరెడ్డి అవినీతిపై బీజేపీ నేతలే మీడియా ఎదుట మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఆయనంత అవినీతిపరుడు మరొకరు లేరని చెప్పారు. ఆయన బెదిరింపులకు తాము భయపడేదిలేదని స్పష్టం చేశారు. -
గంగమిట్టపై కొలువుదీరిన పోలేరమ్మ
● పుష్పాలంకారంలో ముత్యాలమ్మ దర్శనం ● తూర్పుకనుపూరు వైపు భక్తుల అడుగులు చిల్లకూరు: మండలంలోని తూర్పుకనుపూరులో పోలేరమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. రెండో రోజైన బుధవారం మెట్టినింట నుంచి గంగమిట్టపై కొలువుదీరేందుకు వచ్చిన పోలేరమ్మను ఊరేగింపుగా తీసుకొచ్చారు. మార్గమధ్యలో తన సోదరి ముత్యాలమ్మను పలకరించిన అనంతరం తాత్కాలిక తాటాకుల గుడిసెలో కొలువుదీరారు. పంబలోళ్ల వాయిద్యాల మధ్య పోలేరమ్మ తల్లి గంగమిట్ట మీదకు వచ్చే సమయంలో దారిలో భక్తులు మొక్కులు చెల్లించారు. అమ్మవారికి నడకోకల మధ్య స్వాగతం పలికారు. ముందు గణాచారి నడుస్తుండగా పంబలోళ్లు వాయిద్యాలు, కొమ్ము బూరలు ఊదుతుండగా అమ్మవారిని గుడిసెలో కొలువుదీర్చారు. తర్వాత కుంభం పోసి దిష్టి తీర్పు తీర్చిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. యారా గురనాథస్వామి గ్రామోత్సవం గణాచారి ముందు నడుస్తుండగా గొల్లలు వీరతాళ్లు వేస్తూ అక్క దేవతలతో పాటు గురనాథస్వామి గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని కేరింతలు కొట్టారు. అలసత్వం వద్దు జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని, అలసత్వం వహించి ఏదైనా జరిగితే సంబంధిత డ్యూటీ ప్రాంతంలో ఉన్న సిబ్బందిపై చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పీ సౌజన్య తెలిపారు. బందోబస్తును ఆమె పరిశీలించి పలు సూచనలిచ్చారు. అలాగే గూడూరు ఆర్డీఓ సత్యనారాయణ, ముఖ్య నాయకులు, అధికారులు పోలేరమ్మ, ముత్యాలమ్మను దర్శించుకున్నారు. వారికి దేవదాయ శాఖ అధికారులు స్వాగతం పలికి ఆలయ మర్యాదలు చేశారు. తొలిరోజే లక్ష మందికిపైగా.. జాతరలో తొలిరోజు తూర్పుకనుపూరుకు లక్ష మందికి పైగా భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు. దూర ప్రాంతాల నుంచి భక్తులు రాకముందే స్థానికంగా ఉన్నవారు దర్శించుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. వీరు ముత్యాలమ్మతో పాటు పోలేరమ్మను దర్శించుకుని మొక్కలు చెల్లించారు. -
క్రిస్సిటీ పనుల అడ్డగింత
● పొలాల్లోకి వెళ్లేందుకు వీల్లేకుండా రోడ్డు నిర్మాణం చిల్లకూరు: చిల్లకూరు – కోట మండల తీర ప్రాంతంలోని తమ్మినపట్నం, కొత్తపట్నం రెవెన్యూ పరిధిలో ఏర్పాటవుతున్న క్రిస్సిటీకి సంబంధించిన పనులను బుధవారం తీగపాళెం గ్రామానికి చెందిన సన్న, చిన్నకారు రైతులు అడ్డుకున్నారు. భూములు కోల్పోయిన వారికి ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదు. దీనికితోడు కాంట్రాక్ట్ పనులు చేస్తున్న వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ సేకరించిన భూములకు దగ్గరలో ఉన్న వ్యవసాయ భూముల్లోకి వెళ్లేందుకు వీల్లేకుండా 8 అడుగులకు పైగా రోడ్డును ఎత్తు చేస్తున్నారు. దీనిపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పరిహారం ఇచ్చాకే పనులు చేసుకోవాలంటూ అడ్డుకున్నారు. రైతులు మాట్లాడుతూ భూములు సేకరించిన సమయంలో త్వరితగతిన పరిహారం అందించడమే కాకుండా కాంట్రాక్టర్లు చేపట్టే పనుల్లో కూడా స్థానికులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారన్నారు. అయితే నేడు ఇతర రాష్ట్రాల నుంచి మనుషులను తీసుకొచ్చి పనులు చేయించుకుంటున్నారని వాపోయారు. వ్యవసాయం చేసుకోలేక, ఇటు పరిహారం అందక, పనుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. భూ సేకరణ సమయంలో తిరుపతి జిల్లా కలెక్టర్ పర్యటించి స్థానికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారన్నారు. అయితే ఇప్పుడు క్రిస్సిటీ యాజమాన్యం రోడ్డుకు ఇరువైపులా పట్టా భూములున్న వాటిలోకి వెళ్లేందుకు రోడ్డు మార్గం చూపించకుండా 8 అడుగుల ఎత్తుకు పైగా చేస్తుండడంతో భవిష్యత్లో వ్యవసాయ పనులు చేసుకునేందుకు ట్రాక్టర్లు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు స్పందించి పరిహారం త్వరగా అందించే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కాంట్రాక్ట్ సంస్థకు చెందిన సిబ్బంది రైతులతో మాట్లాడి పనులు నిలిపివేయడంతో పాటు సంస్థ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
వెలుగులదివ్వె.. జువ్వలదిన్నె
జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప.. టీడీపీ ప్రభుత్వం పునాది వేసి.. పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఒక్కటీ లేదు. 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మొత్తంగా 16 ఏళ్ల రాజ్యాధికారంలో ఆ పార్టీ మార్కు అభివృద్ధి ఇది అని చెప్పే ఒక్క ప్రాజెక్ట్ లేదంటే అతిశయోక్తి లేదు. పునాది రాళ్లు కూడా వేయని ప్రాజెక్ట్లకు ఉద్యమంలా శిలాఫలకాలు వేయడం, గత ప్రభుత్వాలు పూర్తి చేసిన ప్రాజెక్ట్ల క్రెడిట్ చోరీ చేసి తమ ఖాతాలో వేసుకోవడం తప్ప.. టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యమనే చెప్పాలి. ఈ జాబితాలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, దగదర్తి ఎయిర్ పోర్టు, రామాయపట్నం పోర్టు ఉండడం గమనార్హం. కనీసం డీపీఆర్లు, నిధుల కేటాయింపులు లేకుండానే ఏకంగా శిలాఫలకాలు వేసిన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుండగా, తాజాగా ఆ జాబితాలో మంత్రి లోకేశ్ కూడా చేరుతున్నారు. – సాక్షి ప్రతినిధి, నెల్లూరు గాల్లో చక్కర్లు కొడుతున్న.. దగదర్తి ఎయిర్పోర్టు ● వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే హార్బర్ నిర్మాణానికి పునాది, పూర్తి ● 72 ఎకరాల్లో రూ.288.80 కోట్లతో నిర్మాణం ● 1,250 బోట్లు నిలిపే సామర్థ్యంతో ఏర్పాటు ● ఏటా 41,250 టన్నుల మత్స్యసంపద వెలికితీతే లక్ష్యం ● పూర్తయిన ఈ ప్రాజెక్ట్ను అటకెక్కించిన చంద్రబాబు సర్కారు నేను జువ్వలదిన్నె హార్బర్ను కట్టేశా..! నానారు.. ఎయిర్పోర్టును పూర్తి చేశా..!జిల్లాలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రాజెక్ట్ ‘జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్’ ఒకటి. అపార మత్స్యసంపదకు నిలయమైన ఆంధ్రా తీరాన్ని వేటకు అనుకూలంగా మార్చి, ఎగుమతులకు అవకాశం కల్పి స్తే మత్స్యకారుల్లో వలసలను నివారించడంతో పాటు సాగర తీరాన్ని సుసంపన్నంగా మార్చాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక దృష్టి సారించారు. సుమారు 76.89 ఎకరాల్లో రూ.288.8 కోట్ల వ్యయంతో 2021 మార్చి 19న జువ్వలదిన్నె ఫిషింగ్హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అదే సమయంలో కరోనా వంటి విపత్తు వచ్చినా.. అధిగమించి త్వరితగతిన పూర్తి చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి జువ్వలదిన్నె హార్బర్ దాదాపుగా పూర్తయింది. దీన్ని అప్పట్లో వర్చువల్గా ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ ఆఖరి నిమిషంలో తానే స్వయంగా వచ్చి ప్రారంభిస్తానని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వాయిదా వేశారు. ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రావడంతో ప్రారంభోత్సవం వాయిదా పడింది. 41,250 టన్నుల మత్స్యసంపదే లక్ష్యంగా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో వెలుగుల దివ్వెగా మార్చిన జువ్వలదిన్నెను టీడీపీ ప్రభుత్వం చీకట్లు కమ్ముకునేలా చేసింది. గత ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపదను వెలికి తీయడంతోపాటు హార్బర్ ఆధారిత పరిశ్రమల ద్వారా మత్స్సకారులకు అదనపు ఆదాయం పొందే మార్గాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 20 ఎకరాల్లో ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, ఐదు ఎకరాల్లో బోట్ల తయారీ యూనిట్తోపాటు సుమారు 50 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ఫుడ్పార్క్ల నిర్మాణంపై దృష్టి సారించింది. తద్వారా మత్స్యకార మహిళలకు, యువతకు స్థానికంగానే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వలసలు పూర్తిగా నివారించాలని భావించింది. ఇప్పటి వరకు సరైన వేట, ఉపాధి అవకాశాలు లేక మత్స్యకారులు తమిళనాడు, పాండిచ్చేరి, ముంబై, గోవా వంటి ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సి వచ్చేది. 1250 బోట్లకు బెర్త్లు ఏర్పాటు.. జువ్వలదిన్నెలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్లో ఏక కాలంలో 1250 బోట్లు నిలిపే విధంగా బెర్త్లను నిర్మించింది. ఇప్పటి వరకు తీరంలో పెద్దబోట్లు నిలిపే అవకాశం లేకపోవడంతోపాటు సముద్రంలో 25 నాటికల్ మైళ్లు దాటి వేట చేపట్టలేని పరిస్థితి. ఈ ప్రాజెక్ట్ అందులోబాటులోకి వస్తే.. ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లే పరిస్థితి లేకుండా.. ఇక్కడి నుంచి వేటను సాగించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ వల్ల 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్ష, పరోక్ష లబ్ధి చేకూరుతుంది. యువతకు ఉపాధి లభిస్తుంది. చంద్రబాబు చేసిందేమిటంటే.. జిల్లా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే ఈ ప్రాజెక్ట్ను చంద్రబాబు గతంలో 9 ఏళ్లు, ఆ తర్వాత ఐదేళ్లు అధికారంలో ఉన్నా.. నిర్మించాలనే ఆలోచనే చేయలేదు. అప్పటి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను నిర్మిస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల నోటిఫికేషన్కు పది రోజుల ముందు హడావుడిగా ఆర్భాటంగా వచ్చి శిలాఫలకం వేసి చేతులు దులుపుకొన్నారు. కనీసం ఈ ప్రాజెక్ట్కు సంబంధించి భూసేకరణ చేపట్టలేదు. నిర్మాణ అంచనా వ్యయంపై డీపీఆర్కు పెన్ను సైతం పెట్టలేదు. చివరగా పెట్టిన ఓటాన్ బడ్జెట్లో కూడా కనీసం కేటాయింపులు కూడా పెట్టలేదంటే.. ఈ ప్రాజెక్ట్పై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేసింది. ఈ ప్రాజెక్ట్ను వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే భూసేకరణ చేపట్టి, డీపీఆర్ సిద్ధం చేసి, నిధులు కేటాయించి పనులు పరుగులు పెట్టించి పూర్తి చేస్తే.. ఎన్నికల నోటిఫికేషన్తో మత్స్యకారులకు అంకితం చేయలేకపోతే.. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గడిచిన 21 నెలలుగా ఈ ప్రాజెక్ట్ ఊసే ఎత్తకపోవడం శోచనీయం. మత్స్యకారులంటే ఆయనకు ఉన్న ప్రేమ, చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. ఫిషింగ్ హార్బర్ కోసం సిద్ధం చేసిన భవనాలుజువ్వలదిన్నెలో నిర్మాణం పూర్తయిన బెర్తు2009 ఎన్నికల ముందు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కిసాన్సెజ్ ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో కృష్ణపట్నం పోర్టు, కిసాన్ సెజ్కు ఇటు నెల్లూరు, అటు ప్రకాశం జిల్లాలకు అందుబాటులో ఉండేలా దగదర్తి వద్ద జాతీయ రహదారికి పక్కనే ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశా రు. ఈ మేరకు భూసేకరణకు శ్రీకారం చుట్టారు. అయితే ఆయన అకాల మరణంతో ఎయిర్పోర్టు నిర్మాణానికి గ్రహణం పట్టింది. 2014 ఎన్నికల సమయంలో ఈ ఎయిర్పోర్టును ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉపయోగించుకున్న టీడీపీ.. అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఎయిర్పోర్టుకు ప్రతిపాదిత భూ ములపై గద్దల్లా వాలిపోయి.. ప్రైవేట్ భూములతోపాటు పేదలకు పంపిణీ చేసిన ప్రభుత్వ భూములు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి భూకుంభకోణానికి పాల్పడ్డారు. దీంతో ఎయిర్పోర్టును ఒక దశలో రద్దు చేసిన పరి స్థితి కూడా అప్పట్లో ఏర్పడింది. తర్వాత ప్రతిపక్షాల ఆందోళనలు, ఆరోపణల క్రమంలో 2019 ఎన్నికల నోటిఫికేషన్కు పది రోజుల ముందు ఎయిర్ నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ లేదు.. బడ్జెట్ కేటాయింపులు లేకుండానే హడావుడిగా ఆర్భాటంగా వచ్చిన శిలాఫలకం వేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికీ ఎయిర్పోర్టు నిర్మాణం గాల్లోనే చక్కర్లు కొడుతుండడం గమనార్హం. -
బ్యాంక్ ఉద్యోగాల పేరుతో టోకరా
శ్రీకాకుళం క్రైమ్: బ్యాంక్లో పీఓ, క్లర్క్ ఉద్యోగాలు తీసిస్తానని నిరుద్యోగ యువతను నమ్మించిన అంతర్జిల్లా నేరస్తుడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. శ్రీకాకుళంతోపాటు తిరుపతి, నెల్లూరు, తాడేపల్లిగూడెం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో అమాయక యువత నుంచి రూ.కోట్లలో దోచుకున్న నెల్లూరు జిల్లాకు చెందిన గొల్ల బెనర్జీని శ్రీకాకుళం రూరల్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు వివరాలను శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద మీడియాకు వెల్లడించారు. ఇలా చెప్పి.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం వవ్వేరు గ్రామానికి గొల్ల బెనర్జీ అలియాస్ హర్షవర్ధన్రెడ్డి ఇంటర్ చదివి సీఏ కోర్సులో చేరి మధ్యలోనే మానేశాడు. అకౌంట్స్పై పరిజ్ఞానం సంపాదించాడు. నెల్లూరులో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. భార్యను విడిచి పెట్టేశాడు. తర్వాత శ్రీకాకుళం జిల్లా గార మండలం సతివాడకు చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం అరసవల్లిలో దేశెట్టి రమణమూర్తి ఇంట్లో అద్దెకు దిగాడు. రమణమూర్తి స్వగ్రామం నందిగాం మండలం నర్సిపురం. ఢిల్లీ సెంట్రల్ జోనల్ ఆడిట్ అధికారిగా పనిచేసి ఇటీవల విశాఖ రీజియన్కు బదిలీపై వచ్చానని, పలు బ్యాంక్ల రిక్రూట్మెంట్ బోర్డులో మెంబర్నని బెనర్జీ నమ్మించాడు. పీఓలు, క్లర్కు పోస్టులంటూ.. ఎస్బీఐ బ్యాంక్లో బ్యాక్లాగ్ పోస్టుల కింద పీఓ, క్లర్కు పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. ఒక్కో ఉద్యోగానికి రూ. 6 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ కడితే ఉద్యోగం తీసిస్తానని యువతను నమ్మబలికాడు. అలా ఆరుగురి నుంచి రూ.36 లక్షలు తీసుకున్నాడు. వారికి నకిలీ అపాయిట్మెంట్ ఆర్డర్ కాపీలు సైతం ఇచ్చాడు. ఈ మేరకు బాధితులు 2024 నవంబర్ 12వ తేదీన జిల్లా ఎస్పీ గ్రీవెన్స్ను ఆశ్రయించారు. బెనర్జీ తమ వద్ద రూ.1.80 కోట్లు కాజేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థలాల పేరుతో.. చిన్నబజారు రోడ్డులో 8 సెంట్ల స్థలం వేలానికి వస్తుందని, తన పరిచయాలతో తక్కువ ధరకు ఇప్పిస్తానని దేశెట్టి రమణమూర్తి వద్ద రూ.86 లక్షలను బెనర్జీ తీసుకున్నాడు. రూ.29 లక్షల విలువైన గోల్డ్ క్రాఫ్ట్ మెషీన్ను రూ.14 లక్షలకే ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశాడు. మొత్తంగా రమణమూర్తి నుంచి రూ.1.05 కోట్లకు టోకరా వేశాడు. జిల్లాలో తన మోసాలు బయటపడటం, పలువురు ఫిర్యాదులివ్వడంతో బెనర్జీ మకాం మార్చేశాడు. పలు ప్రాంతాల్లో సైతం తిరుపతి ఈస్ట్ పోలీస్స్టేషన్ పరిధిలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నుంచి రూ.25 లక్షలు, వారి సోదరుడు, సోదరుని కుమార్తె నుంచి కొంత నగదు తీసుకున్నాడు. విశాఖపట్నంలో 8 మంది నుంచి రూ.కోటి తీసుకోగా, నెల్లూరులో 2 చీటింగ్ కేసులు, బుచ్చిరెడ్డిపాళెంలో 1, తాడేపల్లి గూడెంలో 1, ఏఎస్పేట పీఎస్లో ఒక కేసు ఉన్నాయి. సీఐడీ డీజీకి సైతం ఫిర్యాదు మూడేళ్లుగా ఎవరికీ చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న బెనర్జీపై అరసవల్లిలో ఉంటున్న నందిగాం వాసి రమణమూర్తి మంగళగిరి సీఐడీ డీజీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో అధికారులు లోతుగా విచారణ చేపట్టారు. నివేదికను తదుపరి చర్యల కోసం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డికి పంపించారు. డీఎస్పీ సీహెచ్ వివేకానంద పర్యవేక్షణలో రూరల్ పరిధి కావడంతో సీఐ పైడపు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తనకొచ్చిన సమాచారంతో సీఐ పైడపునాయుడు బెనర్జీని నగరంలోనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఢిల్లీలో సెంట్రల్ జోనల్ ఆడిటర్నంటూ మోసం శ్రీకాకుళం, నెల్లూరు, తిరుపతి, విశాఖ, తాడేపల్లిగూడెంలో దోపిడీ ఎట్టకేలకు అంతర్ జిల్లా నేరస్తుడు బెనర్జీ అరెస్ట్ నిందితుడిది బుచ్చిరెడ్డిపాళెం -
నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులు విక్రయిస్తే చర్యలు
నెల్లూరు(బారకాసు): 120 మైక్రాన్ల కన్నా తక్కువ స్థాయి ప్లాస్టిక్ ఆధారిత ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్ హెచ్చరించారు. మంగళవారం ఎంహెచ్ఓ తన సిబ్బందితో కలిసి నెల్లూరులోని స్టోన్హౌస్పేట, రేబాలవీధి, పప్పులవీధి ప్రాంతాల్లోని 14 ప్లాస్టిక్ ఉత్పత్తుల దుకాణాలు, గోదాములపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. 800 కేజీలు నిషేధిత సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను గుర్తించి సీజ్ చేశారు. ఆయా దుకాణాల యజమానులకు రూ.3.20 లక్షల జరిమానా విధించారు. మరోసారి నిషేధిత ఉత్పత్తుల విక్రయాలు జరిపితే దుకాణాలను శాశ్వతంగా సీజ్ చేస్తామని హెచ్చరించారు. దాడుల్లో శానిటరీ సూపర్వైజర్లు మహబూబ్ షరీఫ్, ఆశీర్వాదం, శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసులు, జిలానీబాషా, అశోక్ పాల్గొన్నారు. ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్ నెల్లూరులో దుకాణాలపై దాడులు -
హెచ్పీవీ వ్యాక్సిన్తో కేన్సర్లకు చెక్
నెల్లూరు(అర్బన్): కేన్సర్.. ఈ పదం వినగానే ప్రతిఒక్కరి గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. ఒక్కరికి కేన్సర్ సోకినా కుటుంబం మొత్తం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. కేన్సర్ వస్తే మరణం తథ్యమని అనుకునే వారే ఎక్కువ. జీవనశైలి, కాలుష్యం, కల్తీ ఆహారం, జంక్ఫుడ్స్ కారణంగా రోగులు పెరిగిపోతున్నారు. ఎన్నో రకాల కేన్సర్లు ఉన్నప్పటికీ కొన్ని రకాల నివారణకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో హ్యూమన్ పాపిల్లోవా వైరస్ (హెచ్పీవీ) వ్యాక్సిన్ కూడా ఒకటి. దీనితో పలురకాల కేన్సర్లు జీవితంలో దరిచేరవు. అందుకే ఈ వ్యాక్సిన్ను తొలిదశలో 14 ఏళ్లు నిండి 15వ జన్మదినం జరుపుకోని బాలికలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది తొలిసారిగా అందుకు శ్రీకారం చుట్టింది. ఖరీదైన ఈ వ్యాక్సిన్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో దొరుకుతున్నప్పటికీ పేదల కోసం ఉచితంగా వ్యాక్సిన్ వేస్తోంది. సాధారణంగా రెండు డోసులు వేయాల్సి ఉంది. జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలో.. జిల్లా జనాభాలో 14 సంవత్సరాల వయస్సు నిండి 15 ఏళ్లు నిండని బాలికలు 1 శాతం మంది ఉంటారని అంచనా వేశారు. ఈ లెక్కన సుమారు 26 వేల మంది బాలికలు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరికీ వ్యాక్సిన్ వేసేందుకు వైద్యారోగ్య శాఖ అఽధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే తొలి విడతగా 8,616 వ్యాక్సిన్లను మాత్రమే ప్రభుత్వం సరఫరా చేసింది. మరో వారంలో మిగిలిన వ్యాక్సిన్లను సరఫరా చేయనుంది. పీహెచ్సీలు, సీహెచ్సీలకు సరఫరా చేశారు. టీకా ఎలా వేయాలి..ఎన్ని డిగ్రీల కూలింగ్లో వ్యాక్సిన్ ఉంచాలి.. వ్యాక్సిన్ వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?, తదితర అంశాలపై నెలక్రితమే వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. హెచ్పీవీ అరికట్టగల కేన్సర్లు హెచ్పీవీ వ్యాక్సిన్ మహిళల్లో ఎక్కువగా వచ్చే సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార కేన్సర్), బాహ్య జననేంద్రియ, యోని, మలద్వారా, పురుషాంగ, గొంతు, నాలుక వెనుక భాగంలో వచ్చే కేన్సర్లను అరికట్టవచ్చు. హెచ్పీవీ వ్యాక్సిన్తో జెనిటల్ వార్ట్స్ లాంటి వ్యాధులు కూడా తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెబుతుతున్నారు. 9 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ వేస్తే ఎంతో ఉపయోగం. హెచ్పీవీ వైరస్ పురుషుల నుంచి మహిళలకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల బాలురకు కూడా వేయడం మంచిది. అయితే ప్రభుత్వం వ్యాక్సిన్ అందుబాటు, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది బాలికలకు మాత్రమే వేయనుంది. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రారంభం నేడు తొలిదశలో బాలికలకు ఉచితంగా టీకాలు ఇప్పటికే ప్రభుత్వాస్పత్రులకు చేర్చిన వైద్యాఆరోగ్య శాఖ జిల్లాలో 26 వేల మంది బాలికలు ఉంటారని అంచనాబాలికలకు వ్యాక్సిన్ వేస్తున్నాం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం 14 ఏళ్లు నిండిన 15వ జన్మదినం జరుపుకోని బాలికలకు మాత్రమే కేన్సర్ నివారణ కోసం హెచ్పీవీ వ్యాక్సిన్ను వేయనున్నాం. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. కలెక్టర్ అనుమతితో వ్యాక్సినేషన్ను బుధవారం నుంచి లాంఛనంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నాం. తల్లిదండ్రులు వైద్యసిబ్బంది వచ్చినప్పుడు బాలికలకు వ్యాక్సిన్ వేయించాలి. – డాక్టర్ సుజాత, డీఎంహెచ్ఓ -
కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు (టౌన్): జిల్లాలోని 12 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని కేజీబీవీల్లో ఆరో తరగతికి 40.. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 40 సీట్లున్నాయని చెప్పారు. అదే విధంగా ఏడు నుంచి పదో తరగతి వరకు.. ఇంటర్ ద్వితీయ సంవత్సరాల్లో మిగిలిన సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అనాథ, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలికలు మాత్రమే అర్హులని, దరఖాస్తులను apkgbv.apcfss.in ద్వారా వచ్చే నెల ఒకటిలోపు పొందొచ్చని వివరించారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన వాటినే పరిగణించనున్నామని, ఎంపికై న విద్యార్థుల ఫోన్కు మెసేజ్ వస్తుందన్నారు. సందేహాల కోసం సమీపంలోని కేజీబీవీ ప్రిన్సిపల్స్ను సంప్రదించాలని సూచించారు. నర్రవాడలో వేలం పాటలు దుత్తలూరు: మండలంలోని నర్రవాడలో కొలువైన వెంగమాంబ పేరంటాలు అమ్మవారి ఆలయంలో వివిధ హక్కులు పొందేందుకు సంబంధించిన బహిరంగ వేలం పాటలను దేవదాయ శాఖ అధికారులు మంగళవారం నిర్వహించారు. పూజా ద్రవ్యాలు విక్రయించుకునే హక్కును రూ.30.2 లక్షలకు.. అమ్మవారికి సమర్పించే చీరలు, జాకెట్లను సేకరించే హక్కును రూ.8.2 లక్షలకు శివలీల దక్కించుకున్నారు. పొంగలి షెడ్డుకు సంబంధించి పొంగలి సామగ్రిని విక్రయించే హక్కును రూ.1.36 లక్షలకు సుశీలమ్మ.. పుష్పాలు, పూలమాలలను సరఫరా చేసే హక్కును రూ.5.15 లక్షలకు పత్తి సుబ్రహ్మణ్యం.. పాదరక్షలు భద్రపర్చుకునే హక్కును రూ.22 వేలకు జయరాజ్ దక్కించుకున్నారు. ఇన్చార్జి ఈఓ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, వ్యవస్థాపక ధర్మకర్త వేమూరు ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్ఈఐఎల్ ఎనర్జీలో ఉత్తమ భద్రత ప్రమాణాలు తోటపల్లిగూడూరు(పొదలకూరు): ముత్తుకూరు మండలంలోని ఎస్ఈఐఎల్ ఎనర్జీ కంపెనీలో ఉత్తమ భద్రత ప్రమాణాలను పాటిస్తున్నారని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఈశ్వర్చంద్ పేర్కొన్నారు. ఎస్ఈఐఎల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్లో జాతీయ భద్రత వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంగళవారం ఆయన హాజరయ్యారు. ప్రపంచ స్థాయి భద్రత ప్రమాణాలు, మార్గదర్శకాలను అనుసరిస్తున్నారని ప్రశంసించారు. వివిధ భద్రత పోటీల్లో విజేతలకు అవార్డులు, బహుమతులను అందజేశారు. సంస్థలో భద్రత అవగాహన, పద్ధతులను ప్రోత్సహించడంలో కృషి చేసిన ఉద్యోగులను సత్కరించారు. సీఈఓ జన్మేజయ మహాపాత్ర తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 72,526 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 26,664 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.41 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
కార్యకర్తలకు అండగా వైఎస్సార్సీపీ
● నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి వాకాడు: ‘కష్టపడిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. త్వరలో మంచి రోజులు వస్తున్నాయి’ అని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం వాకాడులోని తన నివాసంలో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రామ్కుమార్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందన్నారు. అందుకు తగినట్టుగానే అధికారులు ప్రభుత్వానికి వంత పలుకుతున్నారన్నారు. త్వరలోనే ప్రజలు కూటమి ప్రభుత్వానికి చరమగీతం పాడతారన్నారు. ప్రస్తుతం రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పండించిన ధాన్యానికి తగిన గిట్టుబాటు ధరల్లేక అప్పుల పాలవుతున్నారన్నారు. తమ పార్టీ అన్నదాతలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. జగనన్న పాలనలోనే పేదలకు న్యాయం జరిగిందన్నారు. అనంతరం స్థానిక ముస్లింలు రామ్కుమార్రెడ్డిని కలిసి ఇఫ్తార్ విందుకు ఆహ్వానించారు. ఆయన వెంట ఎస్ఈసీ సభ్యుడు కొడవలూరు దామోదర్రెడ్డి, వాకాడు, చిట్టమూరు మండలాల కన్వీనర్లు ఏనుగు సుధాకర్నాయుడు, సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి, దేవారెడ్డి నాగూర్రెడ్డి, శేషురెడ్డి, గూడూరు వెంకటేశ్వర్లురెడ్డి, నెల్లూరు పెంచలరెడ్డి, పాపారెడ్డి రాజశేఖరరెడ్డి, రాజారెడ్డి, మధురెడ్డి, శ్రీహరిరెడ్డి, జనార్దనరెడ్డి, సుధాకర్ నాయుడు, బాలకృష్ణయ్య, మధురెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఎలాంటి పన్నులను చెల్లించకుండానే జిల్లాకు ఎలక్ట్రానిక్స్ వస్తువులు, పరికరాలను పలువురు దుకాణదారులు దర్జాగా దిగుమతి చేసుకుంటున్నారు. వాస్తవానికి వీటిపై 18 శాతం జీఎస్టీని చెల్లించాల్సి ఉన్నా, అవేవీ తమకు పట్టవనే రీతిలో వ్యవహరిస్తూ ప్రభుత్వాదాయానికి గండి కొడుత
నెల్లూరు (టౌన్): జిల్లాల్లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, మొబైల్స్ తదితర పరికరాలకు ఎలాంటి పన్నులను చెల్లించకుండానే పలు దుకాణ యజమానులు భారీ మొత్తంలో విక్రయాలు సాగిస్తున్నారు. బిల్లులు చెల్లించకుండానే అమ్మి అందిన కాడికి దోచుకుంటున్నారు. నిజానికి వీటికి జీఎస్టీని చెల్లించాల్సి ఉన్నా, అవేవీ లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి భారీ మొత్తంలో గండి కొడుతున్నారు. తనిఖీలతో వెలుగులోకి.. బ్రాండెడ్ కంపెనీల పేరుతో ఇయర్ బడ్స్, ఛార్జర్లు, పౌచ్లు, ఇయర్ ఫోన్స్ తదితర డూప్లికేట్ వస్తువులను విక్రయదారులకు అంటగట్టి పెద్ద మొత్తంలో యజమానులు క్యాష్ చేసుకుంటున్నారు. వీటిపై తనిఖీలు నిర్వహించాల్సిన జిల్లా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. నగరంలోని లస్సీ సెంటర్లో గల పలు మొబైల్స్ దుకాణాలపై పోలీస్ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలను సోమవారం చేపట్టారు. ఈ క్రమంలో అంబికా, జేపీ మొబైల్స్ షాపుల్లో ఎలాంటి బిల్లుల్లేకుండా అమ్మకానికి సిద్ధంగా ఉంచిన రూ.49.24 లక్షల విలువజేసే సెల్ఫోన్లు, యాక్సెసరీస్ను స్వాధీనం చేసుకొని ఎస్జీఎస్టీ అధికారులకు అప్పగించారు. మరోవైపు తనిఖీలు నిర్వహిస్తున్నారనే సమాచారం తెలియడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో గల మొబైల్ ఫోన్ల దుకాణాలను యజమానులు మూసేశారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలను మరిన్ని నిర్వహిస్తే, ఇలాంటి బాగోతాలు వెలుగుచూసే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. అబ్బే.. మాకెందుకు..! రూ.300 దాటితే జీఎస్టీ నంబర్ ఉన్న ఒరిజినల్ బిల్లును వినియోగదారులకు ఇవ్వాలి. అయితే ఏ దుకాణాంలోనూ వీటిని ఇస్తున్న దాఖలాల్లేవు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే, ధర పెరుగుతుందనే సమాధానమొస్తోంది. ఒక్కో యజమాని రెండు రకాల బిల్లుల పుస్తకాలను ముద్రించి డూప్లికేట్ను అంటగడుతున్నారని తెలుస్తోంది. వీటిపై తనిఖీలను నిర్వహించి కఠినంగా వ్యవహరించాల్సిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, మామూళ్ల మత్తులో జోగుతూ ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, మొబైల్ ఫోన్ల దుకాణాల యజమానుల నుంచి ప్రతి నెలా ముడుపులను స్వీకరిస్తున్నారని సమాచారం. జీఎస్టీ చెల్లించని, డూప్లికేట్ వస్తువులను విక్రయిస్తున్న దుకాణాలపై మరిన్ని తనిఖీలను నిర్వహించి వారిపై కఠిన చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. కాగా ఈ విషయమై వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ కిరణ్కుమార్ను సంప్రదించేందుకు పలుమార్లు యత్నించగా, ఆయన వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారని కింది స్థాయి అధికారులు తెలిపారు. ముంబై, చైన్నె తదితర ప్రాంతాల నుంచి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, మొబైల్స్, యాక్సెసరీస్ తదితర పరికరాలను జిల్లాకు భారీ మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నారు. ఇవన్నీ దాదాపు చైనా వస్తువులుగా తెలుస్తోంది. యాపిల్, సామ్సంగ్ తదితర కంపెనీల పరికరాలకు సంబంధించిన ఒరిజినల్స్ స్థానంలో నకిలీలను అంటగడుతున్నారు. వీటి ధరలూ పెద్ద మొత్తంలోనే ఉంటున్నాయి. ఆయా ప్రాంతాల్లోని హోల్సేల్ దుకాణాల యజమానులతో ముందుగానే మాట్లాడుకొని, అక్కడ్నుంచి లారీలు, పార్శిల్ వాహనాల్లో వీటిని తీసుకొస్తున్నారని తెలుస్తోంది. ఇలా తరలించిన వాటి ద్వారా వ్యాపారం నిత్యం రూ.లక్షల్లో ఉంటోంది. వినియోగదారులను ఆకర్షించేందుకు రకరకాల బ్రాండ్లు, కొత్త కంపెనీలకు సంబంధించిన పరికరాలను తరలిస్తున్నారని సమాచారం. ఎలాంటి బిల్లుల్లేకుండానే ఎలక్ట్రానిక్స్, పరికరాల దిగుమతి వాస్తవానికి వీటిపై 18 శాతం జీఎస్టీ తప్పనిసరి ఇవేవీ లేకుండానే యథేచ్ఛగా విక్రయాలు సెల్ఫోన్ల దుకాణాలపై విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు బిల్లుల్లేని రూ.49.24 లక్షల విలువజేసే మొబైల్స్, యాక్సెసరీస్ స్వాధీనం ప్రభుత్వాదాయానికి రూ.కోట్లల్లో గండి పట్టనట్లు వ్యవహరిస్తున్న వాణిజ్య పన్నుల అధికారులు -
ఆటోను ఢీకొట్టిన ఫ్యాక్టరీ బస్సు
● పలువురికి తీవ్రగాయాలు వింజమూరు(ఉదయగిరి): చంద్రపడియ కెమికల్ ఫ్యాక్టరీకి చెందిన బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. యర్రబల్లిపాళేనికి చెందిన కూలీలు మంగళవారం వ్యవసాయ పనుల నిమిత్తం ఆత్మకూరు రోడ్డు మార్గంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగులతో బస్సు వింజమూరుకు వస్తోంది. చెన్నకేశవ స్వామి దేవాలయం సమీపంలో ఉన్న మూల వద్ద ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా పడింది. అందులో ఉన్న శింగవరపు ఆదిలక్ష్మమ్మకు కాలు, చేయి విరిగింది. బయ్యపురెడ్డి శాంతమ్మకు తలపై తీవ్ర గాయాలయ్యాయి. సోమవరపు వజ్రమ్మ, బయ్యపురెడ్డి శారదతోపాటు ఆటో డ్రైవర్ నడిపిగడ్డ మస్తాన్కు గాయాలయ్యాయి. వీరిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు, ఆత్మకూరుకు తరలించారు. ఎస్సై జయరాజ్ వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. పన్నుల వసూళ్లపై టెలి కాన్ఫరెన్స్నెల్లూరు(పొగతోట): పంచాయతీల్లో ట్యాక్స్, నాన్ ట్యాక్స్ వసూళ్లను వేగవంతం చేయాలని డీపీఓ వసుమతి ఆదేశించారు. నగరంలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. వసూళ్లలో రాపూరు, వింజమూరు, పొదలకూరు తదితర మండలాలు వెనుకబడి ఉన్నాయని చెప్పారు. నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వసూళ్లకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. -
గిరిజన కాలనీల్లో ఆర్వో ప్లాంట్లు, బోర్ల ఏర్పాటు
● ఎంపీ గొల్ల బాబూరావు రూ.15 లక్షల ఎంపీ నిధుల మంజూరు ● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కోవూరు: కోవూరు నియోజకవర్గంలోని గిరిజన కాలనీల్లో ఆర్వోప్లాంట్ల ఏర్పాటుకు తన విజ్ఞప్తి మేరకు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు రూ.15 లక్షల ఎంపీ ల్యాడ్స్ మంజూరు చేశారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి (ఎన్ఎస్ఆర్) గిరిజన కాలనీలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు రూ.5 లక్ష లు, అలాగే చేతిపంపు నిర్మాణం కోసం రూ.2.5 లక్షలు మంజూరు చేశారు. కోవూరు మండలం పాటూరు, ఉత్తరపల్లిపాళెం ప్రాంతాల్లో సురక్షిత మంచినీరు అందించేందుకు ఆర్వో ప్లాంట్ కోసం మరో రూ.5 లక్షలు, బోరు నిర్మాణానికి రూ.2.5 లక్షలను కేటాయించినట్లు ప్రసన్న పేర్కొన్నారు. గిరిజన కాలనీల్లో తాగునీటి సమస్యలను ఎంపీ గొల్ల బాబూరావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి, తక్షణమే నిధులు విడుదల చేశారని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, పేదల కనీస అవసరాల తీర్చేందుకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామన్నారు. అడిగిన వెంటనే స్పందించి నిధులు కేటాయించిన గొల్లబాబూరావుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా సర్కిల్కు గుర్తింపునెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారులకు సేవలందించడంలో జిల్లా సర్కిల్ ముందంజలో ఉందని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం అన్నారు. నెల్లూరులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ విద్యుత్ సెక్షన్ పరిధిలో గాంధీనగర్లో మంగళవారం ఆయన ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని టాప్–20లో నెల్లూరు జిల్లా సర్కిల్కు చెందిన 10 సెక్షన్లు ఉన్నాయన్నారు. కోటమిట్ట సెక్షన్ 87 శాతం, కోవూరు టౌన్, స్టోన్హౌస్పేట, ఏకే నగర్ సెక్షన్లు 85 శాతం, బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు, ఇండస్ట్రియల్ ఎస్టేట్, డైకస్రోడ్డు సెక్షన్లు 84 శాతం, టౌన్హాల్, కిసాన్ నగర్ సెక్షన్లు 83 శాతం సాధించాయన్నారు. అధికారులు, సిబ్బంది సమష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఈఈలు శ్రీధర్, శేషాద్రి బాలచంద్ర పాల్గొన్నారు. మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదని..● కుమారుడిపై తండ్రి కర్రతో దాడి నెల్లూరు సిటీ: మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదని కుమారుడు నిద్రిస్తున్న సమయంలో తండ్రి కర్రతో దాడి చేసిన ఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మంగళవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. రూరల్ మండలంలోని మూడో మైలులో మసీదుకు సమీపంలో సుబ్బారావు, అతని భార్య సూరమ్మ ఉంటున్నారు. వారికి తిరుపతి అనే కుమారుడున్నాడు. సుబ్బారావు మద్యానికి బానిసయ్యాడు. తాగొచ్చి నిత్యం కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు. సోమవారం రాత్రి తనకు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్యను అడిగాడు. కుమారుడు.. తండ్రిని మందలించి డబ్బులు ఇచ్చేది లేదని తేల్చిచెప్పాడు. కోపోద్రిక్తుడైన సుబ్బారావు.. కుమారుడు నిద్రిస్తున్న సమయంలో కర్రతో ముఖంపై దాడి చేశారు. గాయపడిన తిరుపతిని స్థానికులు హాస్పిటల్కు తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
అంగరంగ వైభవంగా..
● ముత్యాలమ్మ, పోలేరమ్మ జాతర ప్రారంభం ● తూర్పుకనుపూరు చేరుకున్న ఘటోత్సవం చిల్లకూరు: తీర ప్రాంతంలోని తూర్పుకనుపూరులో ముత్యాలమ్మ, పోలేరమ్మ జాతర మంగళవారం ప్రారంభమైంది. జాతర సందర్భంగా గ్రామాల్లో తెలియజేసేలా ఏర్పాటు చేసిన ఘటోత్సవం ఐదు గ్రామా లు తిరిగి తూర్పుకనుపూరు చేరుకుంది. ఈదులవారిపాళెం, కొమరావారిపాళెం, పోసినవారిపాళెం, రావులవారిపాళెం గ్రామాల్లో తిరిగిన అనంతరం తూర్పుకనుపూరుకు ఘటోత్సవం చేరుకుంది. పోలేరమ్మ ప్రతిమను కుమ్మరి ఇంట తయారు చేసి మెట్టినిల్లుగా ఉన్న చాకలి వారి ఇంటికి చేర్చారు. ఆ తర్వాత ఆలయ ప్రధానార్చకుడి ఇంట ఘటం కుండలు దిగాక దిష్టి తీర్పు తీర్చి గణాచారి ముందు నడుస్తుండగా, పోలేర మ్మ ప్రతిమను సప్పరంపై ఉంచి గంగమిట్టపై వేసిన తాత్కాలిక తాటాకుల గుడిసెలో కొలువుదీర్చారు. పూలంగిసేవలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఉత్సవా న్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులు అమ్మవారికి వేయి కళ్ల దుత్తల తో ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోని రావి చెట్టు వద్ద మహిళలు పూజలు చేశారు. -
అన్నదాతకు అగచాట్లు
● పెనుబల్లిలో రైస్మిల్లు ఎదుట ధర్నా ● రూ.80 లక్షలు ఎగ్గొట్టిన వైనం బుచ్చిరెడ్డిపాళెం: చంద్రబాబు ప్రభుత్వం చెప్పే మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులకు పొంతన లేదు. అన్నదాతకు అండగా ఉంటాం.. ధాన్యం డబ్బులు త్వరగా జమ చేస్తామన్న కూటమి నేతల హామీలు నీటి మూటలయ్యాయి. బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లి గ్రామంలో రైతులకు జరిగిన అన్యాయమే ఇందుకు నిదర్శనం. కొల్లూరు గ్రామానికి చెందిన పలువురు రైతులు తమ ధాన్యాన్ని పెనుబల్లిలోని శ్రీరాజరాజేశ్వరి రా అండ్ బాయిల్డ్ రైస్మిల్లుకు తరలించారు. దాదాపు రూ.80 లక్షల విలువైన ధాన్యాన్ని అప్పగించి నెలలు గడుస్తున్నా, మిల్లర్లు మాత్రం నేటికీ నగదు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. నగదు కోసం మిల్లు యజమానుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో, విసిగిపోయిన బాధితులు మంగళవారం మిల్లు ఎదుట ధర్నా చేశారు. కలెక్టర్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా సొమ్ము జమ చేస్తే.. నేడు కూటమి ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మకై ్క నట్టేట ముంచుతోందని రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
విద్యుదాఘాతానికి గురై..
● శివాలయ పూజారి మృతికోవూరు: విద్యుత్ షాక్కు గురై శివాలయ పూజారి ప్రాణాలు కోల్పోయిన ఘటన పోతిరెడ్డిపాళెం గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కోవూరు మండలం రాళ్లమిట్ట అరుంధతీయవాడకు చెందిన దువ్వూరు కృష్ణయ్య (71) పోతిరెడ్డిపాళెంలోని పెన్నానది కరకట్టపై ఉన్న పెన్నేశ్వర శివాలయంలో పూజారిగా ఉన్నారు. ఆయన ఆలయ సమీపంలోని రేకుల ఇంట్లో నివాసముంటున్నారు. మంగళవారం ఉదయం ఇంట్లోని స్టాండ్ ఫ్యాన్ ప్లగ్ను సాకెట్లో పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవహించింది. ఫ్యాన్ను పట్టుకోవడంతో కృష్ణయ్యకు తీవ్రస్థాయిలో షాక్ తగిలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆయన్ను కోవూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు దువ్వూరు నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణయ్య మృతితో పోతిరెడ్డిపాళెం, రాళ్లమిట్ట ప్రాంతాల్లో విషాదం నెలకొంది. -
టౌన్ప్లానింగ్లో ఏసీబీ తనిఖీలు
● అక్రమ నిర్మాణాలకు అనుమతులు.. పెండింగ్ ఫైళ్లపై ఫిర్యాదులు ● డీఎస్పీ రామకృష్ణుడు నేతృత్వంలో సోదాలు ● రికార్డుల పరిశీలన నెల్లూరు (బారకాసు): నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ విభాగంలో ఆకస్మిక తనిఖీలను ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు నేతృత్వంలో అధికారులు మంగళవారం చేపట్టారు. అక్రమ కట్టడాలకు అనుమతులు.. ఫైళ్ల పెండింగ్.. అవినీతి ఆరోపణలపై సోదాలు నిర్వహించి పలు కీలక ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఉదయం 11.30కు ప్రారంభమైన సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. రికార్డుల నిర్వహణలో లోపాలు.. సిటిజన్ చార్టర్లో నిర్లక్ష్యం.. అనుమతి లేని భవనాలకు అప్రూవల్స్.. అనధికారిక పర్మిషన్లతో పాటు డెస్కుల్లో ఫైళ్లను నిశితంగా పరిశీలించారు. సర్వేయర్లుండే గదిలో పలు ఫైళ్లను పరిశీలించి వివిధ అంశాలను ఆరాతీశారు. తనిఖీలను బుధవారం సైతం కొనసాగించనున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. మారని ఉద్యోగుల తీరు నెల్లూరు నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓ వైపు ప్రజాప్రతినిధుల అండ, మరోవైపు రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల సహకారంతో ఇక్కడి ఆఫీసర్ల అవినీతి రోజురోజుకూ పెరుగుతోంది. గతంలోనూ ఈ విభాగంలో ఏసీబీ అధికారులు పలుమార్లు తనిఖీలు చేసి కీలకమైన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయినా ఇక్కడ ఏ మాత్రం మార్పు రావడంలేదని కార్యాలయ ఉద్యోగులే పేర్కొంటున్నారు. మరోవైపు ఏసీబీ తనిఖీలతో టౌన్ప్లానింగ్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ విభాగానికి సంబంధించిన పలువురు అధికారులు అందుబాటులో లేకుండాపోవడం గమనార్హం. సీఐలు విజయ్కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్యసేవల్లో నిర్లక్ష్యం తగదు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా ● ఏపీఎమ్మెస్ఐడీసీ అధికారులపై ఆగ్రహం నెల్లూరు(అర్బన్): నగరంలోని పెద్దాస్పత్రిలో చిన్న కారణాలను చూపుతూ వైద్యసేవలను సక్రమంగా అందించకపోతే పేదలు, దళితులు, ఎస్టీలు ఎక్కడికెళ్లాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రశ్నించారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఏయే విభాగాల్లో ఆపరేషన్లు తక్కువగా జరిగాయని ప్రశ్నించారు. ఈఎన్టీ, నేత్ర, ఆంకాలజీ విభాగాల్లో ఆపరేషన్లు తక్కువగా జరిగాయని, న్యూరో సర్జన్ విభాగంలో ఒక్కటి సైతం జరగకపోవడానికి గల కారణాలను ఆరాతీశారు. వీటికి అవసరమైన కనీస పరికరాలు న్యూరో సర్జరీలో లేవని.. ఈఎన్టీలో పది నుంచి 15 మంది పేషెంట్లకు ఉపయోగించాక కొన్ని ఎక్విప్మెంట్లు పనికిరావని, కొత్తవి కావాల్సి ఉంటుందని ఆయా విభాగాల హెచ్ఓడీలు తెలిపారు. ఇవి లేకపోవడంతోనే ఆపరేషన్లు తగ్గిపోయాయని బదులిచ్చారు. జాబితాను అందజేయండి విభాగాల వారీగా కావాల్సిన అత్యవసర, కనీస అవసరాలు తీర్చే పరికరాల జాబితాను తయారు చేయించి డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి ద్వారా తనకు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో సంబంధం లేకుండా ఏదో విధంగా సర్దుబాటు చేయించి వీటిని ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆపరేషన్లు చేయడంలో ముందున్న ఆర్థోపెడిక్ డాక్టర్లను అభినందించారు. పరికరాలను అందించడంలో ఈ విభాగానికి తొలి ప్రాధాన్యమిస్తామని వెల్లడించారు. రిపోర్టులొచ్చేలోపే డాక్టర్లు వెళ్లిపోతున్నారు ఆస్పత్రిలో రక్త పరీక్షల రిపోర్టులొచ్చేలోపే డాక్టర్లుండటం లేదని హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యుడు మొగరాల సురేష్ తెలిపారు. సిబ్బంది తక్కువవడంతో రక్త పరీక్షల రిపోర్టులు ఆలస్యంగా వస్తున్నాయని వివరించారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ను సకాలంలో తీయడం లేదని.. అపాయింట్మెంట్ ఇచ్చి అప్పుడు రావాలంటున్నారని చెప్పారు. ఎమ్మారై, సీటీ స్కాన్ రిపోర్టులను రెండు, మూడు రోజులకు ఇస్తున్నారని ఆరోపించారు. ఫిజియోథెరపీ విభాగంలో పది శాతం పరికరాలే ఉన్నాయని, ఇలాగైతే సేవలు ఎలా అందుతాయని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఏపీఎమ్మెస్ఐడీసీ అధికారులు ఇటీవల రూ.13 లక్షలతో నిర్మించిన రేకుల గదులు ఉరుస్తున్నాయని తెలిపారు. లోపాలను సరిచేయాలని హాస్పిటల్ కో ఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు, కమిటీ సభ్యులు బ్రహ్మారెడ్డి, మల్లికార్జున, అబీదా సుల్తానా కోరారు. ఆస్పత్రిలోకి బయటి వ్యక్తులు గుంపులుగా రావడంతో పాటు ఎమర్జెన్సీ విభాగంలోకి వచ్చి వైద్యసేవలకు ఆటంకం కలిగిస్తున్నారని, వీటిని తక్షణమే అరికట్టేందుకు పోలీసులను ఉపయోగించాలని ఏఎస్పీ సౌజన్యను ఆదేశించారు. ఇలా బయటి వ్యక్తులు హల్చల్ చేస్తే సంబంధిత ఎస్సైపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. జాప్యం చేస్తే సహించేదిలేదు ఆస్పత్రిలో రాత్రి పూట లైట్లను ఏర్పాటు చేయాలని ఏపీఎమ్మెస్ఐడీసీ అధికారులను ఆదేశించగా, ప్రతిపాదనలను సిద్ధం చేస్తామని వారు చెప్పడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగైతే వేరే విభాగాలకు పంపుతానని స్పష్టం చేశారు. వేసవిలో విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా బ్యాకప్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెత్తను తరలించడంలో ఇబ్బందులను తొలగించాలని ఎంహెచ్ఓకు సూచించారు. క్లినికల్, నాన్ క్లినికల్ సమస్యలపై సమీక్షించారు. పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ కొండేటి మాధవి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, డీసీహెచ్ఎస్ పరిమళ, ఏడీఎంహెచ్ఓ ఖాదర్వలీ, ఆర్డీఓ అనూష, ఏఎస్పీ సౌజన్య, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కళారాణి, సుశీల్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు రక్షణేదీ..?
నెల్లూరు రూరల్: టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంగళవారం ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని మహిళలు భయంతో బతుకుతున్నారని చెప్పారు. గత సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో అర్ధరాత్రి సైతం మహిళలు ధైర్యంగా తిరిగేవారని గుర్తుచేశారు. అక్రమాలు, అన్యాయాలు, అఘాయిత్యాలు తప్ప మహిళల భద్రతను ప్రస్తుత ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను అటకెక్కించి, మద్యాన్ని మాత్రం డోర్ డెలివరీ చేస్తూ రాష్ట్రాన్ని మత్తులో ముంచుతున్నారని ధ్వజమెత్తారు. గుమ్మళ్లదిబ్బలో బాలికపై జరిగిన దాడిని మరువక ముందే వరిగొండలో మరో బాలికపై అఘాయిత్యం జరగడం హేయమన్నారు. కారకులపై చర్యలు చేపట్టకుండా.. బాధితులకు న్యాయం చేయాలని పోరాడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. వరిగొండలో బాలికపై జరిగిన దాడిని పోలీసులు ఎంత గోప్యంగా ఉంచాలని చూసినా, అది దాగలేదని చెప్పారు. జీజీహెచ్ హెచ్ఓడీ గీతాలక్ష్మిని సంప్రదించి వివరాలను కోరితే, బాలిక పేరు చెప్పాలని పదేపదే అడిగారని, పోక్సో చట్టం ప్రకారం పేరు వెల్లడించకూడదని తాము చెప్పినా వినలేదని తెలిపారు. ఐదో తేదీన హాస్పిటల్లో బాలిక చేరితే డాక్టర్లు, సిబ్బందికి తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. చివరికి బాలికపై అఘాయిత్యం జరగలేదని, టీవీ దొంగతనానికి వెళ్లిన వారిని అడ్డుకోవడంతో గాయలయ్యాయని పోలీసులు తెలిపారన్నారు. ఒక సీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అఘాయిత్యం జరిగిందని, మరొకరు మాత్రం అలా జరగలేదని రాయడం విస్మయాన్ని కలిగిస్తోందని చెప్పారు. పోలీసుల అసమర్థత, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. తనపై చిన్నబజార్ పోలీస్స్టేషన్లో గంజాయి కేసు నమోదైందని నిందితుడే స్వయంగా అంగీకరించిన అంశాన్ని ప్రస్తావించారు. బాలిక విషయం బయటకు రావడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా కృష్ణపట్నం సీఐ, ముత్తుకూరు ఎస్సైను సస్పెండ్ చేశారని విమర్శించారు. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టడాన్ని మాని, మహిళలకు రక్షణ కల్పించాలని ఎస్పీ, హోంమంత్రిని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణను ఎలా కల్పించాలో జగనన్నను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. బాలిక కుటుంబానికి తమ పార్టీ అండగా ఉండి.. న్యాయం జరిగేంత వరకూ పోరాడుతూనే ఉంటామని చెప్పారు. పార్టీ జోనల్ మహిళాధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, జిల్లా మహిళాధ్యక్షురాలు సునంద, రూరల్, సర్వేపల్లి మహిళాధ్యక్షులు రమాదేవి, సంధ్యారాణి, దువ్వూరు సర్పంచ్ కృష్ణవేణి పాల్గొన్నారు. -
సీహెచ్సీలో సోమిరెడ్డి అనుచరుల వీరంగం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ మూకల అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలకు అడ్డే లేకుండా పోతోంది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తరచూ దాడులకు దిగుతున్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులపైనా దాడులకు పాల్పడిన వీడియోలు మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రమైన వెంకటాచలంలోని క్లస్టర్ ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. వెంకటాచలంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో సోమవారం సీహెచ్సీకి తీసుకొచ్చారు. ఆ విద్యార్థికి వైద్యం చేయించి బెడ్పై ఉంచారు. ఇంతలో కొందరు టీడీపీ కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకుని ఆ విద్యార్థికి ఎక్స్రే తీయాలని రేడియాలజిస్ట్, వైద్య సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి బాగుందని, సెలైన్ కూడా పెట్టామని, వైద్యాధికారి సూచనల మేరకే ఎక్స్రే తీయాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు వైద్య సిబ్బందిని దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన మహిళా సిబ్బందితో కూడా దురుసుగా ప్రవర్తించారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు పాల్పడడం ఏంటని ప్రశ్నించిన సిబ్బందిని దూషిస్తూ, ఏం కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండని వీధి రౌడీల్లా ప్రవర్తించారు. కొద్ది సేపటి తర్వాత వచి్చన కొందరు వ్యక్తులు గొడవ చేస్తున్న వారిని అక్కడి నుంచి లాక్కొని వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. -
సారూ.. మీరైనా దయ చూపండి
● అధికారులను కోరిన అర్జీదారులు ● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నెల్లూరు(అర్బన్): ‘సారూ.. మా సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయిలో అధికారుల చుట్టూ తిరిగాం. అక్కడ స్పందన లేదు. మీరైనా దయ చూపండి’ అని అర్జీదారులు అధికారులను వేడుకున్నారు. సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులతో కలెక్టరేట్ కిటకిటలాడింది. ప్రజల నుంచి కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, డిప్యూటీ కలెక్టర్ మురళి తదితరులు వినతులు స్వీకరించారు.చర్యలు తీసుకోవాలి వరికుంటపాడు, పక్కనే ఉన్న భాస్కరాపురం గ్రామాల మధ్య ప్రభుత్వానికి చెందిన 47 ఎకరాల భూముల్లో తెల్లరాయి తవ్వకాలను గ్రామస్తులు వ్యతిరేకిస్తూ గత సంవత్సరం ఆగస్టులో ర్యాలీకి సిద్ధపడ్డారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు కాంట్రాక్టర్ తరఫున ఉండి ప్రజలపై దౌర్జన్యాలు చేశారు. దీంతో అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టుకెళ్లగా కోర్టు ప్రజలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అధికారులుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినా ఎలాంటి చర్యల్లేవు. కలెక్టర్ స్పందించి కోర్టు తీర్పునకు అనుగుణంగా రెండు గ్రామాల ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించిన వారిపై చర్యలు చేపట్టాలి. – నల్లగొండ్ల మాల్యాద్రి, వరికుంటపాడు గ్రామం బ్లాక్లో వంట గ్యాస్ విక్రయం ఇరాన్పై యుద్ధం నేపథ్యంలో పలు గ్యాస్ ఏజెన్సీలు కమర్షియల్ సిలిండర్లను బ్లాక్ చేశాయి. అందుబాటులో లేవంటూ అధిక రేటుకు బ్లాక్లో విక్రయిస్తున్నారు. సిలిండర్పై అదనంగా రూ.700 నుంచి రూ.1,000 వరకు డిమాండ్ చేస్తున్నారు. మాకు వ్యాపారాల రీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నాం. అధిక భారం మోయాల్సి వచ్చింది. మరింత రేట్లు పెరుగుతాయని ఏజెన్సీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమంగా బ్లాక్ మార్కెట్ను సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. గ్యాస్ సిలిండర్లను అందుబాటులో ఉంచాలి. – అర్షద్, యాదవ్కుమార్రెడ్డి, సుందర్నాయుడు, కృష్ణనాయుడు హోటళ్లు, ధాబాల నిర్వాహకులు గోషా ఆస్పత్రిని పూర్తి చేయాలి నెల్లూరులోని పాత మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఏడేళ్ల క్రితం గోషా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రహరీ నిర్మించారు. లోపల చిన్నపాటి ఆస్పత్రిలా అరకొర నిర్మాణాలు జరిపారు. దీంతో ప్రజలకు వైద్య సౌకర్యాలు స్థానికంగా అందడం లేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నిర్ణీత కాలపరిమితి లోపు పూర్తి నిర్మాణాలు జరిపి ప్రారంభోత్సవం చేసి వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావాలి. – మధు, అజీజ్, అహ్మద్బాషా, లీలామోహన్, సీపీఐ నేతలు -
చెడు వ్యసనాలకు బానిసై భార్యకు వేధింపులు
● న్యాయం కోసం పీజీఆర్ఎస్లో మహిళ వినతి నెల్లూరు(క్రైమ్): ‘చెడు వ్యసనాలకు బానిసైన నా భర్త అదనపుకట్నం కోసం వేధిస్తున్నాడు. నన్ను, పిల్లలను పట్టించుకోవడంలేదు. ఇటీవల ఇంటి నుంచి గెంటేశాడు. విచారించి తగిన చర్యలు తీసుకోవాలి’ అని తోటపల్లిగూడూరు మండలానికి చెందిన ఓ వివాహిత కోరారు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 161 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్లకు అందజేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. మీరైనా దృష్టి సారించాలని పలువురు ఉన్నతాధికారులను కోరారు. ఎస్పీ మాట్లాడుతూ చట్ట పరిధిలో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ యు.సత్యనారాయణ, డీసీఆర్బీ, పీసీఆర్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు ఎన్.రామారావు, భక్తవత్సలరెడ్డి, బి.శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● నా భర్త చనిపోయాడు. కుమారుడు నా దగ్గరున్న 8 సవర్ల బంగారు ఆభరణాలు, పీఎఫ్ అకౌంట్లోని నగదు తీసుకున్నాడు. నాకు జీవనాధారం కష్టంగా ఉంది. ఇదేమని ప్రశ్నిస్తే కొట్టేందుకు వస్తున్నాడు. విచారించి న్యాయం చేయాలని ముత్తుకూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. ● నా భర్త నిత్యం వేధిస్తుండటంతో జనవరిలో పోలీసుకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. విచారించి న్యాయం చేయాలని కోటకు చెందిన ఓ వివాహిత కోరారు. ● అమెరికాలో క్విక్ అకౌంట్ ద్వారా భారీ లాభాలు వస్తాయని అశ్విన్, నితిన్రెడ్డి నా వద్ద రూ.60 వేలు తీసుకుని మోసగించారు. వారిపై చర్యలు తీసుకోవాలని దర్గామిట్ట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. -
ప్లంబింగ్ పనులు చేస్తుండగా..
● సన్షేడ్పై పడి ప్లంబర్ మృతి నెల్లూరు(క్రైమ్): ఓ వ్యక్తి అపార్ట్మెంట్లో తాడు సాయంతో ప్లంబింగ్ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో తాడు తెగిపోవడంతో సన్షేడ్పై పడి ప్లంబర్ మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని ఉస్మాన్సాహెబ్పేటకు చెందిన ఎ.మధుసూదన్ (29) ప్లంబర్. భార్యాభర్తలు విడిపోయారు. దీంతో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటూ పనికి వెళ్తున్నాడు. సోమవారం అతను హరనాథపురం ఐదో వీధిలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో పనికి వెళ్లారు. సహచరులు కరీమ్, అజయ్ తాడు పట్టుకోగా దాని సాయంతో మధుసూదన్ మూడో అంతస్తులో పనులు చేయసాగాడు. ప్రమాదవశాత్తు తాడు తెగిపోవడంతో మధుసూదన్ ఒకటో అంతస్తు ఫ్లాట్స్ మధ్యనున్న సన్షేడ్పై పడటంతో తీవ్రగాయాలయ్యాయి. సహచరులు అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని అపో లో హాస్పిటల్కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మధుసూదన్ మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి తండ్రి లింగన్న బాలా జీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై పుల్లారెడ్డి కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమి త్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. పెన్నానదిలో మృతదేహం నెల్లూరు(క్రైమ్): నెల్లూరు కొత్త పెన్నాబ్రిడ్జి సమీపంలో సోమవారం నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వారు భగత్సింగ్ కాలనీ 54/4వ వార్డు వీఆర్వో తిరుమలరాజుకు సమాచారం అందించారు. ఆయన నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి వయస్సు 50 నుంచి 55 సంవత్సరాల్లోపు ఉంటుందని భావిస్తున్నారు. తెలుపు, గోధుమ రంగు గళ్ల ఫుల్ హ్యాండ్స్ చొక్కా ధరించి ఉన్నాడు. మృతదేహం కుళ్లిపోయి, ఉబ్చి జుట్టు ఊడిపోయి గుర్తించలేని స్థితిలో ఉంది. మృతుడు ఒంటిపై చొక్కా మాత్రమే ఉండటాన్ని బట్టి కాలకృత్యాల నిమిత్తం నదిలో దిగి ప్రమాదవశాత్తు మృతిచెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. -
జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
● కలెక్టరేట్లో డీవైఎఫ్ఐ ధర్నా నెల్లూరు(అర్బన్): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహ, ఎంవీ రమణ డిమాండ్ చేశారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఆ సంఘానికి చెందిన కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంకా ఖజనాలో డబ్బుల్లేవంటూ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కాలం గడపడం సిగ్గు చేటని విమర్శించారు. సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం వాటి సంగతి మర్చిపోయిందన్నారు. ఇప్పటికై నా ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేకుంటే, ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు తిరుపతి, జగదీష్, హర్ష, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అధికంగా గృహహింస కేసులు
● రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ● నెల్లూరులో జన సున్వాయి నెల్లూరు(పొగతోట): సమాజంలో ప్రస్తుతం గృహహింస కేసులు అధికంగా ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం జన సున్వాయి కార్యక్రమం జరిగింది. మహిళా కమిషన్ కార్యాలయం నుంచి 12 కేసులకు నోటీసులిచ్చారు. వాటిలో నలుగురు మహిళలు హాజరయ్యారు. 30 మంది వివిధ సమస్యలపై కమిషన్కు ఫిర్యాదు చేశారు. శైలజ మాట్లాడుతూ పోలీస్ అధికారులు జీరో ఎఫ్ఐఆర్పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరు ఆర్డీఓ అనూష చైర్పర్సన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి, ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, లీగల్ కౌన్సెలర్ పూజిత, సీఐ సుబ్బారావు, సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి పాల్గొన్నారు. సమస్యలు చెప్పి.. రంగనాయకులపేటకు చెందిన ఓ మహిళ తన భర్త ఇబ్బంది పెడుతున్నాడని, కుమారుడిని, తనను పట్టించుకోవడం లేదన్నారు. అనారోగ్యంతో అవస్థలు పడుతున్నానని భరణం ఇప్పించి, విడాకులు మంజూరు చేయించాలని కోరారు. తనును ప్రభు త్వ ఉద్యోగి ఇబ్బంది పెడుతున్నాడని న్యాయం చేయాలంటూ కోరుతూ నగరానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. లాయర్ అయిన తనకే న్యాయం జరిగలేదని ఓ మహిళ సమస్యను వెల్లడించారు. కొందరు ఇంటివద్ద ఉన్న నాపై, భర్తపై దౌర్జన్యం చేసి దాడి చేసి 10 సవర్ల బంగారం లాక్కెళ్లారని వాపోయారు. ఈ విషయంపై కేసు పెట్టినా కొట్టి వేశారని, మనం ఏ కాలంలో ఉన్నామని లాయర్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు ఇబ్బందులు పెడుతున్నారని ఓ తల్లి అర్జీ ఇచ్చారు. భర్త ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, కేసు నమోదు చేసి న్యాయం చేయాలని ఉదయగిరి ప్రాంతానికి చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు. మీ భర్తను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తాం. ఇద్దరూ కలిసి ఉండేలా చర్యలు తీసుకుంటామని కమిషన్ చెప్పినా ఆమె వినలేదు. భర్త వల్ల పడరాని పాట్లు పడుతున్నానని తల్లిదండ్రులతో వచ్చి ఫిర్యాదు చేశారు. కార్యాలయాల్లో అధికారుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని మహిళా ఉద్యోగులు అర్జీ ఇచ్చారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కమిషన్ ఆదేశించారు. -
ప్రభాకర్రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు
ఇందుకూరుపేట: కొమరిక గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు గూడూరు ప్రభాకర్రెడ్డి మృతి పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. ఇటీవల ప్రభాకర్రెడ్డి అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. సోమవారం కాకాణి కొమరికిలోని ప్రభాకర్రెడ్డి నివాసానికి చేరుకుని కుటుం బసభ్యులను పరామర్శించారు. తొలుత ప్రభాకర్రెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఆయన వెంట పార్టీ మండలాధ్యక్షుడు మావులూరు శ్రీనివాసులురెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టేపాటి నరేంద్రరెడ్డి, నాయకులు మందల వెంకటశేషయ్య, షబ్బీర్, మహీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘టీటీడీని చంద్రబాబు రాజకీయ వేదికగా వాడుకుంటున్నారు’
నెల్లూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల ప్రాశస్త్యం మసకబారిందన్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి. టీటీడీనే స్వయంగా చంద్రబాబే రాజకీయ వేదికా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. గో శాల, లడ్డూ, బిఆర్ నాయుడు రాసలీలు అనేక సంఘటనలు చూశాం. పరకామణీ కేసులో పెంచులయ్య 2025లో పట్టుబడ్డాడు. అతనికి బెయిల్ కూడా మంజీరా చేశారు. అదే రకమైన కేసులో రవి కుమార్ అనే నిందితుడు ఆస్తులు శ్రీవారికి రాసి ఇచ్చారు. కేసు నమోదు చేసి లోకాదలత్కు వెళ్ళింది.. పరకామణీ చోరి కేసులో కూటమి అధికారంలోకి వచ్చాక కేసును నీరు గార్చే ప్రయత్నాలు జరిగాయి. పెంచులయ్య ఎంత బంగారు చోరి చేశాడో అసలు నిజాలు బయటపెట్టలేదు. 2024 చివరిలో పెంచులయ్య చోరి చేస్తే బయటకు పొక్కకుండా చూశారు. పెంచులయ్య వెనుక ఎవరు వున్నారు. అసలు భద్రతా వ్యవస్థ పనిచేస్తుందా.. భద్రతా వైఫల్యం క్లియర్ గా కనబడుతుంది. శ్రీవారి పరకామణీలో చోరీ చేసిన నగలు కార్పొరేట్ దుకాణాల్లో మార్పిడి జరిగింది. మరీ వింతగా బ్యాంకులో శ్రీవారి నగలతో రుణాలు కూడా పొందారు.ఈ చోరీ వెనుక వున్న వారిని ఎవ్వరినీ విచారించిన పాపాన పోలేదు’ అని విమర్శించారు కాకాణి. -
డిప్యూటీ సీఎం పవన్కు అవమానం
నెల్లూరు: ‘ప్రజల చేతిలో ప్రభుత్వం’ వాట్సాప్ గవర్నెన్స్ ప్రచారం పోస్టర్లలో ప్రోటోకాల్ ప్రకారం డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఫొటో ముద్రించకపోవడంతో తీవ్ర అవమానం జరిగింది. ఒక పక్క చంద్రబాబు సింగిల్గా మనం గెలవలేదు.. మోదీ, పవన్కళ్యాణ్ అండతోనే గెలిచామంటూ బహిరంగ వేదికలపై చెబుతున్నారు. మరో పక్క ప్రభుత్వ ప్రచార పోస్టర్లలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఫొటోలు ముద్రించారు. సీఎం ఫొటో పెట్టారంటే అర్థం ఉంది. కానీ మంత్రి లోకేశ్ ఆ శాఖ కానప్పటికీ.. ఆ పోస్టర్లలో ఆయన ఫొటో ముద్రించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కూటమిలో సఖ్యత లేదనే ఒక ప్రచారం అయితే.. మరో వైపు పవన్కళ్యాణ్ను వ్యూహాత్మకంగా పక్కకు తప్పిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఒక వైపు సీఎం చంద్రబాబు, మరో పక్కన డీసీఎం పవన్ ఫొటోలు పెట్టారు. జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాట్సాప్ గవర్నెన్స్ ప్రచారం పోస్టర్లలో మాత్రం ఆయన ఫొటో లేకుండా చేయడం సర్వత్రా చర్చకు దారితీసింది. -
గూడూరు ఆర్డీఓగా సత్యనారాయణ బాధ్యతలు
చిల్లకూరు: గూడూరు ఆర్డీఓగా జీవీవీ సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న సబ్కలెక్టర్ రాఘవేంద్ర మీన ఆరు నెలల క్రితం బదిలీపై ఢిల్లీ వెళ్లారు. అప్పట్నుంచి నెల్లూరు ఆర్డీఓ నాగసంతోష అనూషా ఇన్చార్జి ఆర్డీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రామాయపట్నం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పని చేస్తున్న జీవీవీ సత్యనారాయణను పూర్తిస్థాయి బాధ్యతలతో ఆర్డీఓగా నియమించారు. ఇద్దరికి కారుణ్య నియామకాలు నెల్లూరు(అర్బన్): ప్రభుత్వ శాఖల్లో పని చేస్తూ మృతి చెందిన ఇద్దరి ఉద్యోగుల కుటుంబ సభ్యులకు సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా కలెక్టరేట్లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించారు. సూరాయపాళెం పీహెచ్సీలో ఎంఎన్ఓగా విధులు నిర్వర్తిస్తూ మృతి చెందిన వెంకటయ్య కుమారుడు ఆనంద్కుమార్కు జూనియర్ అసిస్టెంట్/కంప్యూటర్ అసిస్టెంట్గా, డక్కిలి పీహెచ్సీలో ఆఫీస్ సబార్డినేట్గా విధులు నిర్వర్తిస్తూ మృతి చెందిన రమేష్కుమారుడు నితిన్తేజను వ్యవసాయశాఖలో జూనియర్ అసిస్టెంట్గా నియమిస్తూ అందుకు సంబంధించిన ఉత్తర్వులను అందజేశారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 77,879 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 12 గంటలు పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
ఇసుక తవ్వకాలపై గతంలో ఫైర్
● నారాయణకు తలనొప్పిగా మారిన సొంత పార్టీ నేతలు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో షాడో మంత్రుల ఆధిపత్యం పెరిగింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు సొంత పార్టీ నేతలే తలనొప్పిగా తయారయ్యారు. సాక్షాత్తు మంత్రే కార్యకర్తల టెలికాన్ఫరెన్స్లో తనకు చెడ్డపేరు తెచ్చేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇక్కడ ఏం జరుగుతున్నాయో తనకు అన్నీ తెలుసని చెప్పడంతో పార్టీ లో గ్రూప్ రాజకీయాలను ఆయన విస్పష్టం చేసినట్లు అయింది. మంత్రి నారాయణ కుటుంబ సభ్యులు, ఆయనకు అత్యంత సన్నిహితులతో పాటు ముఖ్యనేతలు సైతం గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు. మద్యం వ్యాపారాలు, ఇసుక తవ్వకాలు, కాంట్రాక్ట్ పనులు, నామినేటెడ్ పదవులు, ఉద్యోగుల బదిలీలు తదితర విషయాల్లో వీరి జోక్యం అధికం అయినట్లు మంత్రి మాటల్లోనే తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు నగర ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నెలలో వారం రోజులకు మించి స్థానికంగా ఉండడం లేదు. నెల్లూరుకు ఆయన గెస్ట్గా అప్పుడప్పుడు వచ్చిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేరుతో హడావుడి చేసి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఆయన నగరంలో లేకపోవడంతో కొందరు టీడీపీ నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించారు. అయితే ఆ నేతలు తమ సొంత వ్యక్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీ కోసం దశాబ్దాలపాటు కష్టపడిన వారిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. మరో వైపు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే కాంట్రాక్ట్ పనులు అప్పగిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయాలను నారాయణ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులో లేకపోవడంతో క్రియాశీల కార్యకర్తలు పార్టీ వ్యవహారాల్లో దూరంగా ఉంటున్నారు. ఆ ఆరు గ్రూపులే కీలకం మంత్రి నారాయణ నగర నియోజకవర్గంలో ఎక్కువ రోజులు గడపకపోవడంతో కొందరు టీడీపీ ముఖ్య నేతలకు పార్టీ కార్యక్రమాలు, ఇతర కాంట్రాక్ట్ కేటాయింపులను అప్పగించారు. అయితే మంత్రి నారాయణ భార్య రమాదేవి, వేమిరెడ్డి విజయ్భాస్కర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఎవరికి వారు షాడో మంత్రులుగా వ్యవహరిస్తూ ఇసుక తవ్వకాలు, మద్యం వ్యాపా రులు, కాంట్రాక్ట్ పనులు, నామినేటెడ్ పదవులు, ఉద్యోగుల బదిలీలు ఇలా.. ప్రతి విషయంలో తమదైన ముద్ర వేసుకుంటున్నారు. పనులు అవసరమైన వారు సైతం వీరిలో ఎవరి దగ్గరకు పోతే.. తమ పని అవుతుందో తెలుసుకుని.. అక్కడికే వెళ్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కార్యకర్తలు సామాజిక వర్గాలు, స్థానిక బలాలతో ముడిపెట్టుకుని ఆయా నాయకుల చెంతకు చేరుతున్నారు. దీంతో తమ వారికి మున్సిపల్ కాంట్రాక్ట్ పనులు అప్పగింత, నామినేటెడ్ పదవులు కేటాయింపు, ఇతర పనుల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నారు. పోటాపోటీగా నారాయణ వద్దకు సిఫార్సులు నగరంలోని టీడీపీ నేతల గ్రూపుల్లోని తమ వర్గీయులకు ప్రాధాన్యత కల్పించుకునేందుకు పోటీ పడుతున్నారు. నగరంలోని ఓ ఆలయ కమిటీ చైర్మన్ ఎన్నికలో తమ వ్యక్తికి స్థానం కల్పించాలని ఇద్దరు టీడీపీ ముఖ్య నేతలు మంత్రి వద్ద సిఫార్సులు పెట్టారు. ఇతర నామినేటెడ్ పదవులను తమ వారికే ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఎవరికి ఇవ్వాలనే దానిపై నారాయణ సమాలోచనలు చేసి పదవులు కేటాయించారు. ఈ క్రమంలో తాజాగా రంగనాథస్వామి బ్రహ్మోత్సవ కమిటీలో అన్యమతస్తురాలికి మంత్రి సిఫార్సులతో చోటు కల్పించడంతో అభాసుపాలయ్యారు. గ్రూప్లుగా ఏర్పడిన నగర ముఖ్య టీడీపీ నేతలు తమ కనుసన్నల్లోనే మద్యం వ్యాపారాలు, ఇసుక తవ్వకాలు, కాంట్రాక్ట్ పనుల కేటాయింపులు నామినేటెడ్ పదవుల్లోనూ పోటా పోటీగా మంత్రికి నేతల సిఫార్సులు తాజాగా రంగనాథస్వామి బ్రహ్మోత్సవ కమిటీలో అన్యమతస్తురాలికి చోటు కల్పించి అభాసుపాలు మరో వైపు నగరంలో టీడీపీ నేతలే ఇసుక తవ్వకాలు బహిరంగా చేస్తున్నారంటూ గతంలో మంత్రి నారాయణ నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో పేర్లతో సహా హెచ్చరించడంతో పెద్ద దుమారమే రేగింది. తాజాగా జరిగిన టెలికాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడుతూ తనకు చెడ్డ పేరు తెచ్చేలా కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని, నాకు అన్నీ తెలుసని చెప్పడంతో ఆ నేతలు ఎవరనేదానిపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తన దగ్గర 700 మంది పనిచేస్తున్నారని, ఎప్పటికప్పుడు నగరంలో ఏమి జరుగుతుందో తన దృష్టికి వస్తుందన్నారు. దీంతో ఆ నేతలపై నారాయణ నిఘా ఉంచారని స్పష్టమవుతోంది. -
కూటమి పాలనలో రైతులు విలవిల
● ధాన్యానికి గిట్టుబాటు ధరలు కల్పించాలి ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తోటపల్లిగూడూరు(పొదలకూరు) : ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు విలవిలాడిపోతున్నారని, జిల్లాలో వరికోతలు ప్రారంభమైన నేపథ్యంలో ఒకటి రెండ్రోజుల్లోనే ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. తోటపల్లిగూడూరు మండలం ఈదూరులో సోమవారం ఆయన పర్యటించారు. ఇటీవల మృతి చెందిన పార్టీ నాయకుడు తూపిలి సుబ్బరామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతులకు కష్టాలు తప్పవన్నారు. 850 కేజీల పుట్టి ధాన్యం రూ.20,300 ఉండాల్సి ఉండగా, రూ.19 వేలకు పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద ధాన్యాన్ని సేకరించి కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కూటమి నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం తిరుమల శ్రీవారిని రాజకీయాల్లో లాగారని ఆరోపించారు. చంద్రబాబునాయుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే పథకం ప్రకారం తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేశారన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు భ్రష్టుపట్టిపోయారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో అప్పులు కుప్పలుగా మారినట్టుగా కాగ్ నివేదిక తేటతెల్లం చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ, గత ప్రభుత్వ పాలనల్లోని తేడాను ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారన్నారు. రాబో యేది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభ్యం అవుతుండడంతో నేరాలు బాగా పెరుగుతున్నాయన్నారు. గుమ్మళ్లదిబ్బ, వరిగొండ అఘాయిత్యాలు పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగాయని విమర్శించారు. సస్పెండ్ అయిన పోలీసు అధికారులపై లోతుగా విచారణ జరిపితే శాశ్వతంగా విధుల నుంచి తొలగించే అవకాశం ఉంటుందన్నారు. వారి హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలపై విచారణ జరిపితే అన్ని విషయాలు బయటపడతాయన్నారు. పోలీసులు సంఘవిద్రోహులపై నిఘాపెట్టకుండా వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టేందుకు సమయం వెచ్చించడం వల్లే అఘాయిత్యాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. జిల్లాలో శాంతిభద్రతలు లోపించాయని, వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులను పెట్టేందుకు ఆసక్తి చూపుతూ శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలమవుతున్నారన్నారు. తోటపల్లిగూడూరుకు చెందిన బాధిత బాలిక కుటుంబాన్ని త్వరలో పరామర్శించి ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామన్నారు. ఆయన వెంట పార్టీ నేతలు టంగుటూరు పద్మనాభరెడ్డి, ఉప్పల శంకరయ్యగౌడ్, వంశీకృష్ణారెడ్డి, సుబ్రహ్మణ్యంగౌడ్, తలమంచి సురేంద్రబాబు, చిరంజీవిగౌడ్ తదితరులు ఉన్నారు. -
సముద్రంలోకి ఆలివ్రిడ్లీ పిల్లల విడుదల
విడవలూరు: మండలంలోని ఊటుకూరు పెద్దపాళెం వద్ద సముద్రంలోకి ఆలివ్రిడ్లీ తాబేలు పిల్లలను సోమవారం విడిచి పెట్టారు. స్రౌత్ కోస్టల్ సెక్యూరిటీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మైరెన్ పోలీసులు ట్రీ ఫౌండేషన్ సహకారంతో సుమారు 80 తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి వదిలారు. ఈ సందర్భంగా ఇసుకపల్లి మైరెన్ పోలీస్ స్టేషన్ సీఐ శేషయ్య మాట్లాడుతూ సముద్రంలో జీవవైవిధ్యం కోసం అంతరించిపోతున్న ఆలివ్రిడ్లీ తాబేళ్ల సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ట్రీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ ఎం నరేష్ మాట్లాడుతూ ఆలివ్రిడ్లీ తాబేళ్లు గుడ్లు పెట్టే విధానం, పొదిగే ప్రక్రియ, పిల్లల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తీరప్రాంత మత్యకారులు తాబేళ్లను సంరక్షించాలన్నారు. హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, పీసీలు వినోద్, కృష్ణ, తాబేలు సంరక్షణ వాచర్లు, స్ధానికులు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలు
● ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా నెల్లూరు (లీగల్): అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో ఒడిశా ప్రాంతానికి చెందిన కుమార్ దలై, అనిల్కుమార్ జీనాకు ఐదేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జీ గీత సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. ఒడిశా నుంచి ఏపీకి గంజాయి సరఫరా జరుగుతున్న సమచారం మేరకు చీరాల రైల్వేస్టేషన్లో 2021 నవంబర్ 28న పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా సుమారు మూడు గంటల సమయంలో బిలాస్పూర్– తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు జనరల్ బోగి నుంచి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా దిగుతున్న సమయంలో రైల్వే పోలీసులు గుర్తించి తనిఖీలు చేశారు. వారి వద్ద ఉన్న బ్యాగ్లో 15 కేజీల గంజాయిని గుర్తించి మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు. దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయగా, విచారణలో నేరం రుజువు కావడంతో పైమేరకు శిక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ రఫీ మాలిక్ వాదించారు. -
డిప్యూటీ సీఎం పవన్కు అవమానం
‘ప్రజల చేతిలో ప్రభుత్వం’ వాట్సాప్ గవర్నెన్స్ ప్రచారం పోస్టర్లలో ప్రోటోకాల్ ప్రకారం డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఫొటో ముద్రించకపోవడంతో తీవ్ర అవమానం జరిగింది. ఒక పక్క చంద్రబాబు సింగిల్గా మనం గెలవలేదు.. మోదీ, పవన్కళ్యాణ్ అండతోనే గెలిచామంటూ బహిరంగ వేదికలపై చెబుతున్నారు. మరో పక్క ప్రభుత్వ ప్రచార పోస్టర్లలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఫొటోలు ముద్రించారు. సీఎం ఫొటో పెట్టారంటే అర్థం ఉంది. కానీ మంత్రి లోకేశ్ ఆ శాఖ కానప్పటికీ.. ఆ పోస్టర్లలో ఆయన ఫొటో ముద్రించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కూటమిలో సఖ్యత లేదనే ఒక ప్రచారం అయితే.. మరో వైపు పవన్కళ్యాణ్ను వ్యూహాత్మకంగా పక్కకు తప్పిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఒక వైపు సీఎం చంద్రబాబు, మరో పక్కన డీసీఎం పవన్ ఫొటోలు పెట్టారు. జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాట్సాప్ గవర్నెన్స్ ప్రచారం పోస్టర్లలో మాత్రం ఆయన ఫొటో లేకుండా చేయడం సర్వత్రా చర్చకు దారితీసింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
మొబైల్ యాక్సెసరీస్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు
● రూ.49.24 లక్షల సరుకు సీజ్ నెల్లూరు (క్రైమ్): నెల్లూరు నగరంలోని పలు మొబైల్ యాక్సెసరీస్ విక్రయ దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం దాడులు చేశారు. రూ.49.24 లక్షల సరుకును సీజ్ చేశారు. పలు మొబైల్ యాక్సరీస్ విక్రయ దుకాణాల్లో బిల్లులు లేకుండా వస్తువులు విక్రయిస్తున్నారనీ, జీఎస్టీ ఎగువేస్తూ ప్రభుత్వాదాయానికి గండికొడుతున్నారని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు తమ సిబ్బందితో కలిసి సోమవారం లస్సీ సెంటర్, గడ్డంవారివీఽధిలో ని పలు దుకాణాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వ హించారు. వ్యాపారులు సరైన బిల్లులు లేకుండా మొబైల్ యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ పరికరాలు విక్రయిస్తున్నారని గుర్తించారు. ప్రముఖ కంపెనీలకు చెందిన ఈయర్పోడ్స్, ఛార్జర్లు, నెక్ బ్యాండ్స్ అంటూ నాణ్యతలేని వస్తువులను వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. జై అంబికా షాపులో రూ.8,99, 224, శ్రీఅంబికా షాపులో రూ. 22,45,919, జేపీ షాపులో రూ.17,79,439 విలువ చేసే సరుకును సీజ్ చేసి దుకాణాలను మూసివేశారు. మూడు దుకాణాల్లో సీజ్ చేసిన రూ.49,24,582 సరుకును తదుపరి దర్యాప్తు నిమిత్తం జీఎస్టీ అధికారులకు అప్పగించారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ కే నరసింహరావు, డీసీటీఓ కే విష్ణురావు, వ్యవసాయాధికారి పీ వేణుగోపాల్, ఆఫీసు సూపరింటెండెంట్ శాంతిభూషణ్రెడ్డి, హెడ్కానిస్టేబుల్ వీ హరికృష్ణ, కానిస్టేబుల్ పీవీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తవరదాయిని ముత్యాలమ్మ
● నేటి నుంచి నాలుగురోజుల పాటు జాతర ● తూర్పుకనుపూరులో మొదలైన సందడి చిల్లకూరు: మండలంలోని తీరప్రాంతంలో కొలువైన ముత్యాలమ్మ భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. ఏటా ఉగాదికి ముందు ముత్యాలమ్మ ఆలయానికి అనుబంధంగా ఉండే పోలేరమ్మ జాతరను దేవదాయశాఖ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ ఏడాది మంగళవారం నుంచి నాలుగురోజుల పాటు జాతరను వైభవంగా నిర్వహించనున్నారు. జాతరకు నాలుగు రాష్ట్రాల నుంచి సుమారు నాలుగు లక్షల మందికిపైగా భక్తులు తరలిరానున్నారు. ముత్యాలమ్మను దర్శించుకుని పోలేరమ్మకు పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకోనున్నారు. అందుకనుగుణంగా దేవదాయశాఖ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చే స్తున్నారు. జాతర నిర్వహణ ఇలా.. ముత్యాలమ్మ సోదరిగా భావించే పోలేరమ్మ జాతర మంగళవారం రాత్రి ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు నిర్వహించే జాతరలో భాగంగా తొలిరోజు పోలేరమ్మ విగ్రహాన్ని కుమ్మరి ఇంట తయారు చేసి చాకలి ఇంటికి చేర్చుతారు. అనంతరం ఘటంలోని చద్దిని అమ్మవారికి ప్రసాదంగా సమర్పించి దిష్టితీర్పు చేపడుతారు. రెండోరోజు బుధవారం వేకువజామున గ్రామానికి సమీపంలో ఉన్న గంగమిట్ట మీద పోలేరమ్మను కొలువుదీర్చి భక్తులకు దర్శనం, గురునాథస్వామి గ్రామోత్సవం నిర్వహించనున్నారు. గురువారం యార గురునాథస్వామి గ్రామోత్సవం, గొల్లల వేడుక, ముత్యాలమ్మకు బంగారుచీర అలంకరణ, భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. శుక్రవారం పోలేరమ్మను సాగనంపే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. -
త్యాగరాజ స్మరణోత్సవాల ప్రారంభం
నెల్లూరు(బృందావనం): నగరంలోని పురమందిరంలో త్యాగరాజ స్మరణోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలుత వేదాయపాళెంలోని త్యాగరాజస్వామి మందిరం నుంచి సీతారామ, లక్ష్మణ, హనుమత్ సమేత త్యాగరాజస్వామి ఉత్సవమూర్తులు, చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి పురమందిర ప్రాంగణంలోని వేదికపై ప్రతిష్టించారు. అనంతరం గణపతిపూజ, పుణ్యాహవచనం, కలశస్థాపనను జరిపారు. హరికథకులతో హరికథలు, ఔత్సాహిక సంగీత కళాకారులతో త్యాగరాజ కృతుల ఆలాపన, శాక్సాఫోన్, కీబోర్డు, గాత్ర కచేరీలు, పంచరత్న గోష్టిగానాన్ని వీనులవిందుగా నిర్వహించారు. తొలి రోజు 120 మంది పాల్గొన్నారని భిక్షాటన పూర్వక త్యాగరాజ స్మరణోత్సవ సభ కమిటీ శాశ్వత కార్యదర్శి యనమండ్ర నాగదేవీప్రసాద్ తెలిపారు. వీనులవిందుగా గాత్రకచేరి చైన్నెకి చెందిన సంగీత విద్వాంసులు దీపిక, నందిక బృంద ఆధ్వర్యంలో ప్రధాన గాత్రకచేరిని నిర్వహించారు. వాద్య సహకారాన్ని పప్పు జ్ఞానదేవ్, కిశోర్ రమేష్, హరికిశోర్ అందించారు. -
డయల్ యువర్ ఎస్ఈ నేడు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నామని ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని విద్యుత్ భవన్లో ఉదయం 8.30 నుంచి 9.30 వరకు కార్యక్రమాన్ని జరపనున్నామని, సమస్యలను 0861 – 2320427 నంబర్కు తెలియజేయాలని కోరారు. రౌడీషీటర్పై పీడీ యాక్ట్ నెల్లూరు(క్రైమ్): రౌడీషీటర్ మనోజ్ అలియాస్ మనోజ్కుమార్పై పీడీ యాక్ట్ను సంతపేట పోలీసులు ఆదివారం ప్రయోగించారు. స్థానిక పోలీస్స్టేషన్లో వివరాలను ఇన్స్పెక్టర్ సోమయ్య వెల్లడించారు. ముత్తుకూరు మండలం నారికేళపల్లికి చెందిన మనోజ్కుమార్.. వెంకటాచలం మండలం సర్వేపల్లిలో ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. సంతపేట పోలీస్స్టేషన్లో రౌడీషీట్ ఉంది. నగరంలోని పెన్నా సమీపంలో గతేడాది అక్టోబర్లో చోటుచేసుకుంటున్న జంట హత్యకేసుల్లో ఇతను నిందితుడు. ప్రస్తుతం జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా అనుమతితో మనోజ్పై పీడీ యాక్ట్ను నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కడప కేంద్ర కారాగారానికి తరలించనున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. జాతర ఘటోత్సవం ప్రారంభం చిల్లకూరు: మండలంలోని తీర ప్రాంతంలో కొలువైన ముత్యాలమ్మ ఆలయంలో నిర్వహించే పోలేరమ్మ జాతరకు తొలి ఘట్టం ప్రారంభమైంది. మూడో చాటింపును ఆదివారం వేసిన అనంతరం ఘటోత్సవాన్ని నిర్వహించారు. ఈ నెల 10 నుంచి 13 వరకు నిర్వహించనున్న జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు. జాతరకు ముందొచ్చే ఆదివారాన ఆలయ ప్రధానార్చకుడి ఇంటి నుంచి ఘటం కుండలు పంచాయతీలోని ఐదు గ్రామాల్లో తిరిగి తూర్పుకనుపూరుకు మంగళవారం రాత్రికి చేరుకుంటే పోలేరమ్మను గంగ మిట్టపైకి తీసుకొచ్చి వేడుకను ప్రారంభించడం ఆనవాయతీ. ఈ క్రమంలో ఆలయ ప్రధానార్చకుడు చాకిరి రమణయ్య ఇంటి వద్ద ఘటం కుండలకు పూజలు చేశారు. అనంతరం కుండలో చద్ది పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామస్తుల కిలారింపులతో ఘటం కుండలను గ్రామంలోని ప్రధానమైన ఐదు కుటుంబాల ఇంటికి తీసుకెళ్లి అక్కడ చద్ది పోయించుకొని తిరిగి ప్రధానార్చకుడి ఇంటికి వేకువజామున తీసుకురానున్నారు. ఒబ్బాయి శివకుమార్ పర్యవేక్షించారు. సీఐ, ఎస్సై సస్పెన్షన్ నెల్లూరు(క్రైమ్): విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఓ సీఐ, ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి జారీ చేశారు. ఓ బాలికపై లైంగిక దాడి యత్నం ఘటనలో పోక్సో కేసును తోటపల్లిగూడూరు పోలీసులు నమోదు చేశారు. సదరు కేసులో నిందితుడిపై ముత్తుకూరు పోలీస్స్టేషన్లో సస్పెక్ట్ షీటుంది. ఏడాదిగా నిందితుడిపై పోలీసుల నిఘా కొరవడటంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు భావించి కృష్ణపట్నం పోర్టు సీఐ రవినాయక్, ముత్తుకూరు ఎస్సై ప్రసాద్రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారని సమాచారం. దుబాయ్లో నారంపేట యువకుడి అదృశ్యం ఆత్మకూరు రూరల్: మండలంలోని నారంపేటకు చెందిన పాపసాని రాజశేఖర్ అనే యువకుడి ఆచూకీ పది రోజులుగా తెలియడంలేదని కుటుంబసభ్యులు ఆదివారం తెలిపారు. దుబాయ్లో సైబర్ గేట్ డిఫెన్స్ సెక్యూర్టీ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారని, ఫోన్లో అందుబాటులోకి రాకపోవడంతో ఆత్మకూరు పోలీసులను ఐదు రోజుల క్రితం ఆశ్రయించామని చెప్పారు. అయినా ప్రయోజనం లేదని, తమకు న్యాయం చేయాలని కోరారు. -
సర్వేయర్లకు ‘సర్కారు’ సంకటం
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థను సమూలంగా నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఒక్కొక్క సచివాలయంలో పది నుంచి పన్నెండు మందిని వివిధ విభాగాల కింద ఉద్యోగులుగా నియమించారు. ఇందులో భాగంగా విలేజ్ సర్వేయర్లను నియమించారు. ఇప్పటికే సచివాలయ వ్యవస్థను చీలకలు పీలికలు చేశారు. రెండు.. మూడింటిని విలీనం చేస్తూ.. ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీ చేయడంతో సచివాలయ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. తాజాగా విలేజ్ సర్వేయర్ల విభాగ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసేలా సర్కార్ నిర్దయగా వ్యవహరిస్తోంది. నెల్లూరు సిటీ : కూటమి సర్కారు విలేజ్ సర్వేయర్ల పాలిట సంకటంగా మారింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టారు. శతాబ్దం క్రితం ఏర్పాటు చేసిన సర్వే రాళ్లు, హద్దుల విషయంలో వివాదాలకు చెక్ పెట్టేందుకు అప్పటికే అమల్లోకి తెచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థలోకి విలేజ్ సర్వేయర్లను నియమించారు. రీసర్వే ప్రక్రియకు ఉపక్రమించారు. సచివాలయ వ్యవస్థ నిర్వీర్యమిలా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రజలకు విస్తృతంగా, వేగంగా సేవలందించేందుకు ఒక్కో సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పో లీస్, ఏఎన్ఎం, విలేజ్ సర్వేయర్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, వెటర్నరీ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్తోపాటు పండ్ల తోటలు ఉన్న ప్రాంతాల్లో హార్టికల్చర్ అసిస్టెంట్లు, సముద్రతీర ప్రాంతాల్లో మత్స్యశాఖ అసిస్టెంట్లను నియమించారు. అదే సమయంలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ను ఏర్పాటు చేసి అన్ని వివరాలను వీరితో సర్వే చేయించి, ఆ వివరాలు నమోదు చేసేందుకు ఆయా విభాగాలు పనిచేస్తూ వచ్చాయి. దీంతో పాటు కార్యాలయంతోపాటు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజాదరణ అందుకున్న సచివాలయ వ్యవస్థతో వైఎస్ జగన్మోహన్రెడ్డి కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుందనే దుగ్ధతో కూటమి ప్రభుత్వం వచ్చాక.. ఒక్కో విభాగాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చారు. వలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. రెండు..మూడు సచివాలయాలను విలీనం చేసి నిర్వీర్యం చేశారు. అందులోని ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీ చేశారు. ఉన్న ఇద్దరు ముగ్గురు ఉద్యోగులకు అలవికాని బాధ్యతలు అప్పగించి వేధింపులకు పాల్పడుతోంది. విలేజ్ సర్వేయర్ల వ్యవస్థకు విధ్వంస రచన జిల్లాలో మొత్తం 386 మంది విలేజ్ సర్వేయర్లు విధులు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో భాగంగా గ్రామ / వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందులో విలేజ్ సర్వేయర్ల నియామక ప్రక్రియ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి విలేజ్ సర్వేయర్లపై వివిధ శాఖల పనులుంచి ఒత్తిడి చేశారు. దూర ప్రాంతాలకు డిప్యుటేషన్ పై పంపారు. ఇవన్నీ భరిస్తూనే ఉద్యోగాలు చేస్తున్నారు. అదే సమయంలో గ్రామ / వార్డు సచివాలయ వ్యవస్థలోని ఇతర ఉద్యోగులకు మాదిరిగానే పే రోల్ మార్పు చేయాలని విలేజ్ సర్వేయర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. మిగతా అందరికీ రూ.30 వేల వరకు బేసిక్ పే ఉండగా, విలేజ్ సర్వేయర్లకు రూ.25,200 మాత్రమే బేసిక్ పే ఉందని, ఈ తారతమ్యాన్ని సరిచేసేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రమోషన్ చానల్ కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని అమలు చేయకపోవడంతో ఈ నెల ఐదు నుంచి విలేజ్ సర్వేయర్లు సహాయ నిరాకరణకు దిగారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వేయర్ల అసోసియేషన్లో నాయకులు సుమారు 40 మందిని సస్పెండ్ చేసింది. జిల్లాలో విలేజ్ సర్వేయర్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులపై ప్రభుత్వం చర్యలు చేపట్టడంపె సర్వేయర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట సచివాలయ సర్వేయర్లు ధర్నా నిర్వహించారు. అధ్యక్ష, ఉపాధ్యక్షుల సస్పెన్షన్ జిల్లాలోని సచివాలయ విలేజ్ సర్వేయర్ అసోసియేషన్లో కీలకంగా వ్యవహరించిన అధ్యక్ష, ఉపాధ్యక్షులు ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. ప్రభుత్వం నుంచి జరగాల్సిన న్యాయాన్ని ప్రశ్నించడమే వారు చేసిన తప్పు. బేసిక్ పే తక్కువగా ఉందని, సర్వేయర్లపై పని ఒత్తిడి ఉందని ఉన్నతాధికారులను ప్రశ్నించడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని విలేజ్ సర్వేయర్లుగా పనిచేస్తున్న అసోసియేషన్ అధ్యక్షుడు బీద లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు అస్మతుల్లాను సస్పెండ్ చేశారు. భయం గుప్పెట్లో సర్వేయర్లు ప్రభుత్వ ఏకపక్ష ధోరణి, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడంపై సర్వేయర్లు, భయం గుప్పెట్లో ఉన్నారు. ప్రతి వ్యవస్ధలో ప్రశ్నించే హక్కు ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం ఆ హక్కును కాలరాస్తోంది. దీంతో అధ్యక్ష, ఉపాధ్యక్షులనే సస్పెండ్ చేయడంతో ఇతర సర్వేయర్లు ముందుకొచ్చేందుకు సాహసం చేయలేకపోతున్నారు. తమపై ఎక్కడ వేటు వేస్తారని భయపడుతున్నారు. ఇది ఏ మాత్రం ఉపేక్షించేది కాదని పలువురు వాపోతున్నారు. హక్కుల కోసం పోరాటమే తప్పనే రీతిలో.. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరసనలు జిల్లాలో ఇద్దరు సచివాలయ సర్వేయర్ల సస్పెన్షన్తో బెదిరింపులు వైఎస్ జగన్ తెచ్చిన వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు రీ సర్వేకు ఆటంకాలు -
క్రీడా పోటీల్లో సత్తా
నెల్లూరు(పొగతోట): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు మొదటిసారిగా ఆటల పోటీలను జెడ్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో శుక్ర, శనివారాల్లో ఏర్పాటు చేసిన పోటీలు ఉత్సాహంగా సాగాయి. విజేతలకు బహుమతులను చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, సీఈఓ శ్రీధర్రెడ్డి, డిప్యూటీ సీఈఓ మోహన్రావు ఆదివారం అందజేశారు. జెడ్పీలో పనిచేస్తున్న అధిక శాతం మహిళా ఉద్యోగులు రెండు నుంచి మూడు బహుమతులను దక్కించుకున్నారు. అనంతసాగరం ఎంపీడీఓ కార్యాలయానికి చెందిన ఆఫీస్ సభార్డినేట్ సుమతి ఆరు బహుమతులను గెలుచుకున్నారు. అలరించిన భరతనాట్య ప్రదర్శన జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏఓగా పనిచేస్తున్న విజయరాణి 61 ఏళ్ల వయస్సులో భరతనాట్యాన్ని ప్రదర్శించి అబ్బురపర్చారు. ఈమెకు బహుమతిని అరుణమ్మ అందజేశారు. -
ప్రాణాలకు భద్రత కరువు
ఉదయగిరి: రాష్ట్రంలో రోడ్డెక్కాలంటే భయంతో వణికిపోవాల్సి వస్తోంది. ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోననే ఆందోళన వాహనదారుల్లో నెలకొంది. నిబంధనలను ప్రభుత్వం, రవాణా అధికారులు కచ్చితంగా అమలు చేయకపోవడంతో వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎంతోమంది క్షత్రగాతులుగా మారుతున్నారు. కేంద్ర మోటార్ వాహనాల చట్టాన్ని తెలంగాణలో గత నెల 20 నుంచి అక్కడి ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే రాష్ట్రంలోనూ ఈ విధానానికి శ్రీకారం చుట్టాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇదీ పరిస్థితి.. రాష్ట్ర పరిధిలో మొత్తం 55 జాతీయ రహదారులు.. 8638.15 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఈ మార్గాల్లో నిత్యం వేలాది సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి వేళ, పొగమంచు కురిసే సమయాల్లో ముందున్న వాహనాలు అతి సమీపానికి వచ్చేంత వరకు కనిపించవు. దీంతో ప్రమాదాల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. రాష్ట్ర రవాణా, పోలీస్ శాఖల వివరాల మేరకు రెండేళ్లలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు, క్షత్రగాతుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. చలి కాలంలో ముందున్న వాహనాలు కనిపించక రాష్ట్రంలో 1550 ప్రమాదాలు జరగ్గా, ఇందులో 700 మంది మృత్యవాత పడగా, మరో 1530 మంది గాయపడ్డారు. స్పష్టమైన విధానాలేవీ..? రిఫ్లెక్టివ్ టేపుల వినియోగంపై రాష్ట్రంలో నేటికీ స్పష్టమైన విధానమే లేదు. మరోవైపు నకిలీవి మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి. ప్రత్యేక విజిబిలిటీ చెకింగ్ డ్రైవ్లను రాత్రి వేళ చేపడుతున్న దాఖలాల్లేవు. ఇలా తిలాపాపం తలా పిడికెడు అనే రీతిలో ప్రభుత్వం.. అధికారులు వ్యవహరిస్తుండటంతో యాక్సిడెంట్లు నిత్యకృత్యమవుతున్నాయి. తెలంగాణలో అమలు.. తెలంగాణలో ఈ విధానాన్ని అక్కడి ప్రభుత్వం అమలు చేస్తోంది. క్యూఆర్ కోడ్ ఉన్న సరి్టఫైడ్ రిఫ్లెక్టివ్ టేపులను అమర్చాలి. ప్రభుత్వం ఎం ప్యానల్ చేసిన వాటిని మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఒక వేళ ఇవి లేకపోతే ఫిట్నెస్ పత్రాన్ని జారీ చేయరు. రాత్రి వేళ విజిబిలిటీ చెకింగ్, కఠినమైన జరిమానాలను విధిస్తున్నారు. గత నెల 20న ఈ ప్రక్రియ అమల్లోకి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ పద్ధతికి ఇక్కడా శ్రీకారం చుట్టాలని వాహనదారులు కోరుతున్నారు.చట్టం అమల్లో నిర్లక్ష్యం కేంద్ర మోటార్ వాహనాల చట్టం అమల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తోంది. వాస్తవానికి ఈ నిబంధన మేరకు యజమానులు తమ వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులను విధిగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు కాంతివంతమైన లైట్లనూ బిగించుకోవాలి. అయితే రాష్ట్రంలో ఇవి అమలుకు నోచుకోవడంలేదు. ఫలితంగా నెల్లూరు, ఎన్టీఆర్, గుంటూరు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో చలికాలంలో తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉండి, ముందున్న వాహనాలు సమీపానికి వచ్చేంత వరకు డ్రైవర్లకు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లపై నిలిపిన లారీలు, ట్రక్కులు, ట్రాక్టర్లు తదితరాలకు ఈ టేపుల్లేకపోవడంతో ప్రమాదాలు రాత్రి వేళ ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక వేళ వినియోగించినా, నాణ్యమైన టేపులు కాకపోవడం సైతం ప్రమాదాలకు కారణంగా నిలుస్తోంది. -
జైల్లో స్నేహం.. అంతులేని నేర చరిత్ర
నెల్లూరు సిటీ: ఒంటరి మహిళ ఇంట్లోకి ప్రవేశించి ఆమెను కుర్చీకి కట్టేసి, ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలను అపహరించిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నగరంలోని చిన్నబజారు పోలీస్స్టేషన్లో నగర ఏఎస్పీ దీక్ష శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. నగరంలోని ముత్తుకూరు బస్టాండ్ వద్ద టిఫెన్ అంగడి నిర్వహిస్తున్న ఎ.నాగరత్నమ్మ ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఈనెల 28వ తేదీ తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం మట్లపాళెం గ్రామానికి చెందిన టి.రామకృష్ణ, బిట్రగుంటకు చెందిన ఎం.మాల్యాద్రిలు చోరీ చేసేందుకు పన్నాగం పన్నారు. ఈ క్రమంలో నాగరత్నమ్మ ఇంట్లో నగదు, బంగారం ఉంటుందని భావించారు. ఆమె ఒంటరిగా ఉంటుండడంతో తమ చోరీ సులువుగా ఉంటుందని, గత నెల 28వ తేదీ తెల్లవారుజామున ఇంటి తలుపులు పగులకొట్టి లోనికి ప్రవేశించారు. చంపేస్తానని బెదిరించి, నాగరత్నమ్మను కుర్చీకి తాళ్లతో కట్టేశారు. బెడ్రూమ్లోని ట్రంకు పెట్టిలో రూ.1.50 లక్షలు, 160 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించి పరారయ్యారు. స్థానికులు ఉదయం వచ్చి చూడగా ఆమెను కట్టేయడాన్ని గుర్తించి విడిపించారు. బాధితురాలు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు తన సిబ్బందితో నిందితులను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ వద్ద ఇద్దరు నిందితులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.63 వేలు నగదు, 153 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. త్వరితగతిన నిందితులను పట్టుకున్న సిబ్బందిని దీక్ష అభినందించారు. సమావేశంలో ఎస్సై కిషోర్బాబు తదితరులు పాల్గొన్నారు. పరారీలో ప్లాన్ చేసిన వ్యక్తి ఈ చోరీకి నగరంలోని మాగుంట లేఅవుట్కు చెందిన చంద్రమోహన్రెడ్డి ప్లాన్ చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బాధితురాలి ఇంటికి సమీపంలో ఫైనాన్స్ కోసం వస్తూ ఆమె వద్ద భారీగా డబ్బులు ఉంటాయని చంద్రమోహన్రెడ్డి భావించారు. దీంతో ఆయనకు జైలులో రామకృష్ణ, మాల్యాద్రిలతో పరిచయం ఉండడంతో వారితో చోరీకి స్కెచ్ వేశారు. సమయం చూసి చోరీ చేయించారు. అయితే ప్రస్తుతం అతను పరారీలో ఉన్నారు. పోలీసులు అతన్ని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. ఆ ఇద్దరూ అంతర్ జిల్లాల నేరగాళ్లు వారిపై పలు జిల్లాల్లో దొంగతనం కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడు రామకృష మీద డీసీ(డోసియర్ క్రిమినల్) షీట్ ఉంది. ఆయనపై తూర్పు గోదావరి జిల్లాలో 11 కేసులు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 14 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకటి, ఏలూరు జిల్లాలో ఒకటి మొత్తంగా 27 కేసులు ఉన్నాయి. అదే క్రమంలో బిట్రగుంటకు చెందిన మాల్యాద్రి మీద సైతం డీసీ షీట్ ఉంది. నిందితుడిపై వైఎస్సార్ కడప జిల్లాలో 1, తూర్పుగోదావరి 3, పశ్చిమగోదావరి 1, ప్రకాశం జిల్లాలో 7, నెల్లూరు జిల్లాలో 2 కేసులు ఉన్నాయి. మొత్తంగా 14 కేసులు ఉన్నాయి. ఒంటరి మహిళపై దాడి చేసి బంగారం, నగదు అపహరణ ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని పట్టుకున్న పోలీసులు 153 గ్రాముల బంగారం, రూ.63 వేల నగదు స్వాధీనం వీరిపై ఏడు జిల్లాల్లో పదుల సంఖ్యలో కేసులు ఆ ఇద్దరూ దొంగతనమే పనిగా పెట్టుకున్నారు. చోరీలు చేయడం.. పోలీసులకు పట్టుపడడం వారికి పరిపాటి. జైల్లో స్నేహితులైన వారు.. కలిసి ప్లాన్ చేస్తే ఎంత పెద్ద చోరీ అయినా చేయవచ్చని నిర్ణయించుకున్నారు. వారిపై ఏడు జిల్లాల్లో పదుల సంఖ్యలో చోరీ కేసులు ఉన్నాయి. -
బైక్పై వెళ్తుండగా ఇనుప కమ్ములు తగిలి..
● హోంగార్డుకు గాయాలు ఆత్మకూరు: ఓపెన్ ఇంటర్ పరీక్షల విధులకు హాజరై తిరిగి బైక్పై స్వగ్రామం వెళ్తుండగా బస్టాండ్ సమీపంలో ఎదురుగా ఓ వ్యక్తి బైక్పై తరలిస్తున్న ఇనుప కమ్ములు హోంగార్డుకు తగిలి తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం జరిగింది. బాధితుని వివరాల మేరకు.. అనంతసాగరం పోలీస్స్టేషన్లో విధులు నిర్వహించే పి.ప్రసాద్రెడ్డి నాలుగు రోజులుగా ఆత్మకూరులో ఓపెన్ ఇంటర్ పరీక్షల కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పరీక్ష పూర్తయిన తర్వాత పేపర్లను సబ్మిట్ చేసి బైక్లో వెళ్తుండగా బస్టాండ్ వద్ద ఎదురుగా మరో మోటారు సైకిల్పై వస్తున్న వ్యక్తి పొడవాటి ఇనుప కమ్ములను అడ్డంగా పెట్టుకొని వస్తుండడంతో అవి తగిలి హోంగార్డు తొడపై లోతైన గాయమైంది. సమీపంలో ఉన్న వారు వెంటనే ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై సాయిప్రసాద్, సిబ్బంది ఆస్పత్రి వద్ద హోంగార్డును పరామర్శించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రైల్లో గంజాయి అక్రమ రవాణా
● తొమ్మిది కిలోల పట్టివేత నెల్లూరు సిటీ: ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ను ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్, ఈగల్ పోలీసులు శనివారం నిర్వహించారు. ఈ క్రమంలో రైల్లో అక్రమంగా తరలిస్తున్న రెండు బ్యాగుల్లోని తొమ్మిది కిలోల గంజాయిని పట్టుకున్నారు. నెల్లూరు రైల్వేస్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను రైల్వే డీఎస్పీ మురళీధర్ వెల్లడించారు. నెల్లూరు, ఒంగోలు సర్కిల్ పరిధిలోని రైల్వేస్టేషన్లు, రైళ్లలో తనిఖీలను చేపట్టామని తెలిపారు. ఈ తరుణంలో నెల్లూరు – గూడూరు మార్గంలోని రామేశ్వరం వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ జనరల్ కోచ్లో తనిఖీలను జరిపామని చెప్పారు. అనుమానాస్పదంగా ఉన్న రెండు బ్యాగ్లను పరిశీలించగా, అందులో తొమ్మిది కిలోల గంజాయి లభ్యమైందన్నారు. తనిఖీల నేపథ్యంలో సదరు బ్యాగ్లను వ్యక్తి వదిలి పరారయ్యారని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిరంతరంగా తనిఖీలు రైల్వేస్టేషన్లు, రైళ్లలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా ఉంచుతామని, తనిఖీలను నిరంతరం జరుపుతామని మురళీధర్ తెలిపారు. 1972 నంబర్కు సమాచారమివ్వాలని, వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. తొలుత ఈగల్ టీమ్కు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ పోస్టర్లను ఆవిష్కరించారు. సీఐ సుధాకర్, ఎస్సైలు హరిచందన, చెన్నకేశవ పాల్గొన్నారు. -
సమ్మె కాలపు జీతాలు చెల్లించాలి
నెల్లూరు(బారకాసు): మున్సిపల్ కార్మికులకు సమ్మె కాలపు జీతాలు చెల్లించాలని, 12వ పీఆర్పీ కమిషన్ ఏర్పాటు చేసి జీతాలు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు శనివారం రెండో రోజు జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.పెంచల నరసయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలపై రెండేళ్ల నుంచి కూటమి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా పరిష్కరించలేదన్నారు. కరోనా సమయంలో, ప్రకృతి విపత్తుల సందర్భంగా వారి ప్రాణాలకు తెగించి పనులు చేస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని, ఇప్పటికై నా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ చెన్నుడుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నెల్లూరు రూరల్ అధ్యక్షుడు ఎం.సుధాకర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మనోజ్, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, లోకేష్, శ్రీనివాసులు, రాము, జైకుమార్, రమేష్, కామేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, షఫీ పాల్గొన్నారు. -
మాటల్లో సాధికారత.. మారని బతుకుబాట
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన వేదికలపైనే మహిళా సాధికారత కనిపిస్తోంది. వాస్తవంలో జీవన పోరాటం తప్పడం లేదు. సమాజంలో సగం.. అని సగర్వంగా చెప్పుకొనే అతివల జీవితాల్లో నిజమైన ప్రాధాన్యం అల్లంత దూరంలోనే ఉండిపోతోంది. వేదికలపై మహిళా సాధికారతపై గొప్ప మాటలు వినిపిస్తున్నా, నేలపై నిత్య జీవితం కూలీ పనులు, చిరు వ్యాపారాల్లోనే కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే ఇంటి పనులతో ప్రారంభమయ్యే వీరి జీవన పోరాటం అర్ధరాత్రి వరకు అవిశ్రాంతంగా సాగుతోంది. గతంలో మహిళల ఆర్థిక బలానికి తోడుగా నిలిచిన పలు సంక్షేమ పథకాలు కొంత ఊరటనిచ్చాయి. అయితే ప్రభుత్వం మారాక ఈ పథకాల గమ్యం మారిపోవడంతో అనేక కుటుంబాల్లో మళ్లీ పాత కష్టాలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా మహిళల బతుకుబండి గమ్యంలో మార్పు కానరావడంలేదు. మహిళా సంక్షేమానికి బడ్జెట్లలో పెద్ద అంకెలు కనిపించినా, బతుకు బాటలో మాత్రం ఇంకా చిన్న ఆశలే ఆధారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పూలదండలు, శుభాకాంక్షల కంటే మహిళల కష్టాలు, వేదనలు, వారి జీవన పోరాటమే ఈ ఫొటోలకు నిదర్శనంగా కనిపిస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
శ్రామికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయండి
● డ్వామా పీడీ గంగాభవాని నెల్లూరు(పొగతోట): ఎండలు పేరుగుతున్నందున ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాల్లో శ్రామికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డ్వామా పీడీ గంగాభవాని మండలాధికారులను ఆదేశించారు. నగరంలోని డ్వామా కార్యాలయం నుంచి వివిధ మండలాల అధికారులు, ఉపాధి సిబ్బందితో శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో పీడీ మాట్లాడారు. పని ప్రదేశాల్లో శ్రామికుల కోసం చలువ పందిళ్లు వేయాలన్నారు. ఉపాధి హామీ పనులకు హాజరయ్యే శ్రామికుల సంఖ్యను పెంచాలన్నారు. జాబ్కార్డులు కలిగిన శ్రామికులకు ఈ–కేవైసీ చేయాలని, 30 శాతం ఈ–కేవైసీ పెండింగ్ ఉందని త్వరగా వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. నూతన పద్ధతిలో ఉపాధి హామీ పనులు పూర్తి చేయాలన్నారు. ఉదయం 7.30 గంటల్లోపు ఎన్ఎంఎంఎస్లో పనులకు హాజరైన శ్రామికుల ఫొటోలు అప్లోడ్ చేయాలన్నారు. ఫొటోలను అప్లోడ్ చేసే సమయంలో తేడాలు జరిగితే పేమెంట్లు మంజూరు కావన్నారు. -
కారు ఢీకొని జింక మృతి
కోవూరు: ఆహారం కోసం జనావాసాల వైపు వస్తూ గుర్తుతెలియని కారు ఢీకొని జింక మృతిచెందిన ఘటన మండలంలోని పోతిరెడ్డిపాళెం సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గంగవరం కాలువ వద్ద ముంబై హైవే సమీపంలో జింక రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని జింక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. చెట్టు పైనుంచి పడి విద్యార్థినికి గాయాలు నెల్లూరు(స్టోన్హౌస్పేట): నగరంలోని దర్గామిట్టలో గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల విద్యార్థిని చెట్టు పైనుంచి పడిన ఘటన కలకలం రేపింది. ఆ హాస్టల్ సిబ్బంది, అధికారుల నుంచి సేకరించిన వివరాల మేరకు.. సరస్వతి పూజ కోసం మామిడాకులు కోసేందుకు ఇద్దరు విద్యార్థినులు శుక్రవారం హాస్టల్ భవనాన్ని ఎక్కారు. అయితే హఠాత్తుగా తొమ్మిదో తరగతి విద్యార్థిని చెట్టుపై నుంచి పడిపోయింది. గడ్డం భాగంలో దెబ్బతగలడంతో రక్తం కారుతున్న విద్యార్థినిని ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో ఐటీడీఏ పీఓ శ్రీనివాసులు హాస్టల్ పరిశీలనకు వచ్చారు. హాస్టల్ సిబ్బందిలో ఆందోళనను చూసి ప్రశ్నించగా ఇక్కడ తొమ్మిదో తరగతి విద్యార్థిని చెట్టుపై నుంచి పడిందని, ఆస్పత్రిలో చేర్చామని వారు తెలపడంతో పీఓ తక్షణమే రామచంద్రారెడ్డి ఆస్పత్రికి వెళ్లి సందర్శించారు. అక్కడ సిబ్బంది విద్యార్థిని నోటికి దెబ్బలు తగలడంతో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉందని, తిరుపతికి తీసుకెళ్లాలని చెప్పడంతో అంబులెన్స్ కూడా మాట్లాడారు. అయితే తిరుపతికి వెళ్లేలోపు ఆలస్యమవుతుందని, కిమ్స్కు తరలించారు. అక్కడ ఆరోగ్యశ్రీ లేకపోవడంతో ఐటీడీఏ అధికారులు తల్లిదండ్రుల అనుమతితో నారాయణ ఆస్పత్రికి తరలించి చికిత్సను ప్రారంభించారు. దీనిపై ఐటీడీఏ పీఓను సంప్రదించగా ప్రస్తుతం ఆ విద్యార్థిని ఆరోగ్యం బాగుందని తెలిపారు. జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి సుజాత మాట్లాడుతూ పూర్తిస్థాయిలో విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మా మనుమరాలు బాగుంది పొదలకూరు మండలం బచ్చలపల్లికి చెందిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గాయపడిన విద్యార్థిని తన మనుమరాలు అని, ఘటనపై ప్రిన్సిపల్ నుంచి పీఓ వరకు బాగా స్పందించారన్నారు. ఆస్పత్రి ఖర్చుల కోసం పీఓ శ్రీనివాసులు రూ.10 వేలు ఇచ్చారన్నారు. తాము పెట్టిన డబ్బును సైతం ప్రభుత్వం ద్వారా తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రస్తుతం తన మనుమరాలి ఆరోగ్యం బాగుందన్నారు. నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి నెల్లూరు సిటీ: జిల్లాలో నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో శనివారం పోలీస్ అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు వచ్చే పిటిషన్లను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. డయల్ 112 కాల్స్కు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. డ్రోన్ నిఘా పెంచాలని, సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ సౌజన్య, ఎస్బీ, కావలి, ఆత్మకూరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా తెప్పోత్సవం
బిట్రగుంట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండబిట్రగుంట బిలకూట క్షేత్ర వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఉభయదేవేరులతో కలిసి పుష్కరిణిలో శనివారం రాత్రి జలవిహారం చేశారు. దేవదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం, అత్యుత్సాహం కారణంగా పుష్కరిణిలో తెప్ప ఈ నెల నాలుగున ఒరిగిపోయి ఉత్సవం ఆగిపోయిన విషయం విదితమే. ఈ తరుణంలో భక్తులతో పాటు కొండబిట్రగుంట, పాతబిట్రగుంట గ్రామస్తుల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవడంతో ఆగమ పండితుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలతో తెప్పోత్సవాన్ని మరోసారి నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాల నడుమ ఉభయదేవేరులు, స్వామివారిని కొండ దిగువన ఉన్న పుష్కరిణి వద్దకు అర్చక బృందం తీసుకొచ్చారు. వివిధ రకాల పుష్పాలు, పట్టు పీతాంబరాలతో సిద్ధం చేసిన తెప్పపై స్వామివారిని కొలువుదీర్చి జలవిహారం చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. వెబ్సైట్లో సీనియార్టీ జాబితా నెల్లూరు (టౌన్): జోన్ – 3 పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ల నుంచి గ్రేడ్ – 2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు సంబంధించిన తాత్కాలిక సీనియార్టీ జాబితాను deognt.blogspot.co mలో అందుబాటులో ఉంచామని డీఈఓ బాలాజీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏమైనా అభ్యంతరాలుంటే తగిన ఆధారాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈ నెల 13లోపు అందజేయాలని కోరారు. వేగవంతంగా గృహ నిర్మాణాలు నెల్లూరు(అర్బన్): గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పక్కా గృహాలను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో గృహ నిర్మాణ శాఖ అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా మంజూరైన గృహ నిర్మాణాలతో పాటు పెండింగ్లో ఉన్న వాటిని నిర్దిష్ట కాలపరిమితిలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆప్షన్ – 3 కింద గుర్తించిన నాణ్యత లేని నిర్మాణాలను వెంటనే కాంట్రాక్టర్లతో సరిచేయించాలని సూచించారు. పూర్తి చేసిన ఇళ్లకు బిల్లులను వెంటనే మంజూరు చేస్తున్నామని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ ఇన్చార్జి పీడీ మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శులతో టెలి కాన్ఫరెన్స్ నెల్లూరు(పొగతోట): గ్రామ పంచాయతీల్లో పొదుపు మహిళల సేవలను వినియోగించుకొని వారి ద్వారా ఇంటి పన్నులను వసూలు చేయాలని డీపీఓ వసుమతి ఆదేశించారు. నగరంలోని తన కార్యాలయం నుంచి పంచాయతీ కార్యదర్శులతో శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. వసూళ్లలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆదివారం సెలవైనా, కార్య దర్శులు విధులకు హాజరుకావాలని ఆదేశించారు. నూరు శాతం లక్ష్యాలను పూర్తి చేయా లని పేర్కొన్నారు. -
ఆర్చరీ జిల్లా జట్ల ఎంపిక
నెల్లూరు(స్టోన్హౌస్పేట): రాష్ట్ర ఆర్చరీ పోటీలకు హాజరయ్యే జిల్లా జట్ల ఎంపికలను శనివారం నిర్వహించారు. నగరంలోని పొట్టేపాళెం మార్గంలో నవబాల దుర్గాదేవి ఆలయం వద్ద లిటిల్ ఏంజెల్స్ ఆర్చరీ అకాడమిలో జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలను క్రీడాభివృద్ధి అధికారి పాండురంగారావు ప్రారంభించారు. ఎంపికై న క్రీడాకారుల వివరాలను అసోసియేషన్ అధ్యక్షుడు పల్లంరెడ్డి శ్రీహర్ష, కార్యదర్శి పావురాల వేణు ప్రకటించారు. మినీ అండర్–15 ఇండియన్ రౌండ్లో బాలురలో జి.మహేంద్ర, మోక్షితసాయి, డాత్విక్రెడ్డి, జి.హరిహర, జి.మోక్షిత్రెడ్డిలు, బాలికల విభాగంలో టి.ఆలయ, ఎం.కౌషికి లాస్య, ఎ.ప్రీతి, షఫియా సుల్తానా, యశస్విలు ఎంపికయ్యారు. అలాగే అండర్–15 రికర్వ్ రౌండ్లో బాలుర విభాగంలో సీహెచ్ అజయ్దేవ్, పి.కృష్ణేశ్వర కుమార్సింగ్, కె.చరిత్, బి.జిగ్నేష్, బాలికల విభాగంలో దిత్యా చండిక, డి.నిషితలు ఉన్నారు. మినీ అండర్–15 కాంపౌండ్ విభాగంలో ఎ.ఆస్రీత్, కె.జననీరెడ్డి ఎంపికయ్యారు. వీరు మార్చి 11 నుంచి 13 వరకు నూజివీడులో జరిగే రాష్ట్ర ఆర్చరీ చాంపియన్షిప్ పోటీలకు జిల్లా తరఫున పాల్గొంటారు. లిటిల్ ఏంజెల్స్ స్కూల్ కరెస్పాండెంట్ చాట్ల రాజేష్, కోచ్లు భరద్వాజ్రెడ్డి, పి.శంకర్, సాయికిరణ్, ఎం.హారతి పాల్గొన్నారు. -
మరికొన్ని ఘటనలు
చిన్నారులపై కామాంధులు కాటేస్తున్నారు. మృగాళ్ల చేతిలో అభం శుభం తెలియని చిన్నారులే కాకుండా మహిళలు సైతం బలైపోతున్న ఘటనలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. చట్టాలు కఠినంగా ఉన్నా.. మృగాళ్ల దాష్టీకాలకు ఏ మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ప్రేమ పేరుతో ఒకరు.. గంజాయి మత్తులో మరొకరు.. కామంతో మరొకరు.. ఇలా రోజురోజుకూ ఇలాంటి దారుణాలు పెరుగుతుండటం ప్రజలను కలవరపెడుతున్నాయి. ఆడ పిల్లలకు ఇంటా, బయట భద్రత కొరవడింది. ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. మరో వైపు దారుణ ఉదంతాలు వెలుగు చూసినా.. వీలైతే కప్పిపుచ్చడం, కాకుంటే.. తారుమారు చేసేందుకూ వెనుకాడటం లేదు. సాక్షి టాస్క్ఫోర్స్: ‘మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే అదే ఆఖరు రోజు అవుతుందంటూ’ బహిరంగ వేదికల్లో సాక్షాత్తు కూటమి ప్రభుత్వ పెద్దలే రోమాలు నిక్కబొడుచుకునే రీతిలో ఉపన్యాసాలిస్తున్నారు. నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొస్తామన్న మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన ఇరవై నెలల్లోనే జిల్లాలో బాలికలపై అనేక దారుణాలు జరిగాయి. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన సుమారు 40 పోక్సో కేసులే ఇందుకు అద్దం పడుతున్నాయి. జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి, మద్యం విక్రయాలే ఇలాంటి దారుణాలకు ప్రధాన కారణాలవుతున్నాయని మహిళా సంఘాలు, అభ్యుదయ వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు ఒంటరిగా కనిపిస్తే కామాంధులు ఏ వైపు నుంచి కాటేస్తారోనని కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. ఇలాంటి దారుణ పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదంటూ వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. చిన్నారులు, మహిళలకు రక్షణ కల్పించాలని, కామాంధులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వణికిస్తున్న వరుస ఘటనలు జిల్లాలో బాలికలపై వరుసగా జరుగుతున్న ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. చిన్నారులకు ఇంటా, బయటా భద్రత కొరవడింది. మానవ మృగాలుగా మారిన కొందరు అభం, శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. వావివరుసల తేడా లేకుండా కామాంధుల వికృత చేష్టలకు చిన్నారుల జీవితాలు చితికిపోతున్నాయి. మహిళలే కాదు చిన్నారులు ఒంటరిగా బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. స్నేహం, ప్రేమ ముసుగులో మృగాళ్లు లైంగిక దాడులకు పాల్పడుతూ వారి జీవితాలను చిదిమేస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన పేగుబంధాలు సైతం కాటేస్తున్నాయి. గత నెల రోజులుగా జిల్లాలో జరిగిన ఘటనలను పరిశీలిస్తే.. ● కోవూరులో బాలిక ఉదంతం తర్వాత కావలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ లైంగిక దాడి చేశాడు. బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ● కోట మండలం అటవీ ప్రాంతంలో 12 ఏళ్ల బాలికపై ఆటోడ్రైవర్ లైంగికదాడికి యత్నించాడు. ● గూడూరు పరిధిలో ఐదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. ● ఉదయగిరిలో బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించి గర్భిణిని చేసిన బాలుడిపై పోక్సో కేసును ఉదయగిరి పోలీసులు నమోదు చేశారు. ● కావలి పట్టణంలో ఓ పాఠశాలలో చదువుతున్న బాలికలకు తినుబండారాల ఆశ చూపి ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై పోక్సో కేసును కావలి రెండో పట్టణ పోలీసులు నమోదు చేశారు. ● నెల్లూరు నగరంలో ఆరేళ్ల బాలికపై తండ్రి పైశాచికంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని గమనించిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ● తాజాగా తోటపల్లిగూడూరు మండలం వరిగొండలో ఓ బాలికపై లైంగిక దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ● వరికుంటపాడు మండలంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన వెంట తీసుకెళ్లాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను సంరక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇలా చెప్పుకొంటూ పోతే జిల్లాలో ఇలాంటి ఘటనలు చాంతాడంత జాబితాలే ఉన్నాయి. బాలికపై లైంగిక దాడి..? వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు అయితే ఘటనను తారుమారు చేసేందుకు పోలీసుల యత్నం..? నిందితులు చోరీకి వచ్చారంటూ మీడియాకు వెల్లడి తోటపల్లిగూడూరు(పొదలకూరు): తోటపల్లిగూడూరు మండలం వరిగొండలో బాలిక (8)పై లైంగిక దాడి జరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనలోని బాధితురాలిని పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. అయితే సోషల్ మీడియాలో బాలికపై లైంగిక దాడి జరిగినట్లు వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కాగా ఈ ఘటనను తారుమారు చేసేందుకు పోలీసులు ఆపసోపాలు పడుతున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. బాలికపై లైంగిక దాడి జరగలేదని, నిందితులు దొంగతనానికి వచ్చారని మీడియా ముఖంగా వెల్లడించారు. అయితే నిందితులు చోరీకి వస్తే.. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్కు ఎందుకు తరలించారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. అసలేం జరిగిందంటే.. స్థానికుల సమాచారం మేరకు.. వరిగొండ గ్రామంలో కాలువ గట్టుపై బాలిక కుటుంబం నివసిస్తోంది. గురువారం ఆమె తల్లిదండ్రులు పనికెళ్లడంతో తమ్ముడితో కలిసి ఇంట్లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి (40) మరో మహిళతో కలిసి బైక్పై వచ్చారు. అయితే బాలిక తమ్ముడికి మహిళ కొని పెడతానని మాయమాటలు చెప్పి దూరంగా తీసుకెళ్లడంతో ఆ వ్యక్తి బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలేయడంతో స్థానికులు అక్కడికి రావడంతో మహిళతో కలిసి ఆగంతకుడు పారిపోయారు. దీంతో బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నెల్లూరు జీజీహెచ్కు పోలీసులు తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కృష్ణపట్నం పోర్టు ఇన్చార్జి సీఐ సుబ్బారావు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చిన వారు బాలిక ఇంట్లో టీవీని దొంగలించేందుకు యత్నించారని వెల్లడించారు. బాలికతో పాటు ఆరేళ్ల బాలుడు ఉన్నాడన్నారు. వీరిని చూసి బాలుడు కేకలేయడంతో నిందితులు పరారయ్యారని వివరించారు. అయితే నిందితులు చోరీ యత్నానికి పాల్పడితే బాలికకు వైద్య పరీక్షలు ఎందుకు చేయిస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. యువకుడిపై పోక్సో కేసు నమోదు వరికుంటపాడు: మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిపై పోక్సో కేసును నమోదు చేసి కోర్టులో హాజరుపర్చామని ఎస్సై రఘునాథ్ శుక్రవారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. మీరయ్య అనే యువకుడు ఓ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కావలి డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది గాలించి జడదేవి గ్రామ సమీపంలో ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. 29.01.2026 నెల్లూరు నగరంలో ఆరేళ్ల చిన్నారిపై కన్నతండ్రి లైంగిక దాడి చేశాడు. 29.01.2025 ఏడో తరగతి చదువుతున్న బాలికను ఆటోడ్రైవర్ సతీష్ మాయమాటలు చెప్పి కొత్తకోడూరు బీచ్కు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. అతనితో పాటు సహకరించిన స్నేహితులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. 16.03.2025 స్నేహితుడి కుమార్తెకు మాయమాటలు చెప్పి కుమార్ లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జూన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. 17.07.2025 ఆత్మకూరు మండలంలో ఓ బాలికపై ప్రణవ్ లైంగిక దాడి చేశాడు. 18.07.2025 ఆత్మకూరు మండలానికి చెందిన ఓ బాలిక ఆత్మకూరు పట్టణంలో చదువుతోంది. గ్రామానికి చెందిన చందన్ ప్రేమించాలంటూ ఆమెను వేఽధించాడు. నిరాకరించడంతో ఆమైపె దాడిచేసి గాయపరిచాడు. 27.07.2024 కావలి పట్టణంలో చిన్నారికి మాయమాటలు చెప్పి మహబూబ్బాషా లైంగిక దాడి చేశాడు. మానవ మృగాళ్ల దాడిలో సమిధలుగా బాలికలు జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు ఇంటా.. బయటా కొరవడిన భద్రత ఈ దారుణాలను కప్పిపుచ్చుతున్న పోలీసులు తాజాగా వరిగొండలో బాలికపై లైంగిక దాడి..? వరికుంటపాడులో ప్రేమ పేరిట బాలికను తీసుకెళ్లిన యువకుడు విచ్చలవిడిగా గంజాయి, మద్యం విక్రయాలే కారణాలు -
సివిల్ సప్లయ్స్శాఖ పరుగులు
నెల్లూరు సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారుల అలసత్వంపై ఓ రైతు ఆవేదనతో సివిల్ సప్లయ్స్ విభాగం పరుగులు తీసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ అర్జీని ఓ అన్నదాత అందజేయగా, దాన్ని పరిష్కరించకుండానే సంతకం పెట్టాలని ఒత్తిడి చేశారు. అయితే దానికి అంగీకరించకపోవడంతో సాల్వ్ అయినట్లు మెసేజ్ పంపారు. ఈ ఉదంతంపై ‘కలెక్టర్ సార్.. ఇదేం పరిష్కారం’ అనే శీర్షికన సాక్షిలో కథనం శుక్రవారం ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు.. ఫిర్యాదుదారుడి వద్దకే వెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. జరిగిందిదీ.. నెల్లూరు రూరల్ మండలంలోని ములుమూడిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏటా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం అలా చేయకపోవడంతో గ్రామానికి చెందిన సండి శ్రీనివాసులు.. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీని అందజేశారు. అయితే తన సమస్యను పరిష్కరించినట్లు మెసేజ్ రావడంతో కంగుతిన్నారు. ఈ తరుణంలో సాక్షిలో ప్రచురితమైన కథనంతో గ్రామానికి అధికారులు చేరుకున్నారు. కొనుగోలు కేంద్రాన్ని రెండ్రోజుల్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సివిల్ సప్లయ్స్ డీఎం తిరుపాల్, సీఈఓ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
నూరు శాతం పన్నుల వసూళ్లే లక్ష్యం
నెల్లూరు(పొగతోట): గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పన్నులను నూరు శాతం మేర ఈ నెల 15 నాటికి వసూలు చేయాలని డీపీఓ వసుమతి ఆదేశించారు. నగరంలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి వివిధ మండలాల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో శుక్రవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా రూ.47 కోట్లకు గానూ ఇప్పటి వరకు రూ.27 కోట్లనే వసూలు చేశారని చెప్పారు. పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని, వీటిని ఈ నెల తొమ్మిదిన ప్రచురించాల్సి ఉందన్నారు. బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించనున్నామని వివరించారు. -
పెద్దాస్పత్రిలో హైడ్రామా
● అఘాయిత్యానికి గురైన బాలికను హడావుడిగా తరలించిన వైనం ● తీరుపై మండిపడిన కాకాణి పూజిత నెల్లూరు రూరల్: తోటపల్లిగూడూరు మండలంలోని వరిగొండలో అఘాయిత్యానికి గురైన బాలిక ఉదంతంలో నెల్లూరులోని ప్రభుత్వాస్పత్రిలో హైడ్రామా శుక్రవారం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత వచ్చారు. ఈ క్రమంలో బాలికను హాస్పిటల్ సిబ్బంది, పోలీసులు హడావుడిగా తరలించారు. ఈ విషయాన్ని పూజిత ఆరాతీయగా, గైనకాలజీ విభాగాధిపతి గీతాకృష్ణని కలవాలని సూచించారు. దీంతో ఆమెను సంప్రదించగా, పాప విషయమే తమకు తెలియదంటూ బుకాయించారు. దీనిపై సమాచారమివ్వాలని పట్టుబట్టడంతో ఇక్కడ్నుంచి తరలించారంటూ ఎట్టకేలకు సమాధానమిచ్చారు. జిల్లాలో పోలీసులతో పాటు హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం దారుణంగా మారిందని మండిపడ్డారు. మహిళలకు రక్షణ కరువు కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని పూజిత ఆరోపించారు. వరిగొండలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడటం దారుణమని, గంజాయి మత్తులో రాష్ట్రంలో వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నా, సర్కార్ ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు తామొస్తే, ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందనే భయంతో పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది హడావుడిగా తరలించి నాటకమాడారని ఆరోపించారు. పారదర్శకంగా విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కోవూరులోని గుమ్మళ్లదిబ్బలో ఇటీవల జరిగిన ఘటనను మరువకముందే తాజాగా ఇలాంటి ఉదంతం చోటుచేసుకోవడంపై విచారం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను ఖాకీలు గాలికొదిలి.. ప్రశ్నించే వారికి నోటీసులిస్తూ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. పట్టణాలు, నగరాలకే పరిమితమైన డ్రగ్ కల్చర్, ప్రస్తుతం గ్రామాలకూ పాకిందని ధ్వజమెత్తారు. పార్టీ జోనల్ మహిళా ప్రెసిడెంట్ మొయిళ్ల గౌరి, జిల్లా మహిళాధ్యక్షురాలు సునంద, నెల్లూరు రూరల్ మహిళాధ్యక్షురాలు రమాదేవి, ముత్తుకూరు ఎంపీపీ సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు విరివిగా రుణాలివ్వండి
నెల్లూరు(అర్బన్): వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యమిచ్చి రైతులకు రుణాలను విరివిగా మంజూరు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా స్థాయి బ్యాంకర్లతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, డ్రోన్లు తదితరాల కొనుగోళ్లకు రుణాలను అధికంగా ఇవ్వాలని కోరారు. పశు, మత్స్య, కోళ్ల పరిశ్రమలను ప్రోత్సహించాలని చెప్పారు. డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి లాంటి ఉద్యాన పంటలు, పీఎం సూర్యఘర్కు లోన్లు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించి యాక్టివ్లో లేని అకౌంట్లను వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. అనంతరం నాబార్డు ద్వారా అమలవుతున్న పథకాలకు సంబంధించిన పుస్తకాలను ఆవిష్కరించారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మణిశేఖర్, డీఆర్వో విజయకుమార్, నాబార్డు డీడీఎం బాబు, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, డీఆర్డీఏ, మెప్మా, డ్వామా పీడీలు నాగరాజకుమారి, లీలారాణి, గంగాభవానీ, పశు, మత్స్య, ఉద్యాన శాఖల అధికారులు రమేష్నాయక్, చాన్బాషా, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. యూనిఫైడ్ సర్వేను పూర్తి చేయండి నెల్లూరు(పొగతోట): యూనిఫైడ్ సర్వేను నూరు శాతం పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి ఆదేశించారు. నగరంలోని జెడ్పీ కార్యాలయం నుంచి వివిధ మండలాల అధికారులతో శుక్రవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. గ్రామాల వారీగా ఇచ్చిన జాబితాల్లో ఒకట్రెండు కుటుంబాలు వలసెళ్లాయంటే నమ్మశక్యంగా ఉంటుందని, అయితే దీన్ని సక్రమంగా చేయకుండా ఇలా చెప్పడం సరికాదన్నారు. నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ‘పది’ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు ఆత్మకూరు: పదో తరగతి పరీక్షలను పక్కాగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని డీఈఓ బాలాజీరావు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో విధి విధానాలపై ఆత్మకూరు డివిజన్ పరిధిలోని తొమ్మిది మండలాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని 174 పరీక్ష కేంద్రాలకు 174 మంది చొప్పున చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమించామని వివరించారు. సెట్ – 1, 2 ప్రశ్నపత్రాలను ఈ నెల పది, 11 నాటికి భద్రపర్చి పరీక్షకు అర్ధగంట ముందు అందజేయనున్నామని వెల్లడించారు. విద్యార్థులు బాగా చదివి పరీక్షలను చక్కగా రాయాలని కాంక్షించారు. డిప్యూటీ డీఈఓ జానకిరామ్, శిక్షకులు ఫణీష్, రామ్కుమార్, ఎంఈఓలు అనంతలక్ష్మి, చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. వీఆర్కు ఇద్దరు సీఐలు నెల్లూరు(క్రైమ్): బుచ్చిరెడ్డిపాళెం ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం రూరల్ సీఐ సురేంద్రబాబును రేంజ్ వీఆర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి శుక్రవారం జారీ చేశారు. తుళ్లూరు – 2 సీఐగా పని చేస్తున్న శ్రీనివాసరావును బుచ్చిరెడ్డిపాళెం ఇన్స్పెక్టర్గా.. ఒంగోలు ఎస్సీ, ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ను రూరల్ సీఐగా నియమించా రు. వీఆర్కు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
లాహిరి.. లాహిరి.. లాహిరిలో
నేత్రపర్వంగా తెప్పోత్సవం వీక్షిస్తున్న భక్తులు రంగనాయకులపేటలోని పవిత్ర పినాకినీ తీరం శ్రీదేవీ, భూదేవీ సమేత తల్పగిరి రంగనాథస్వామి తెప్పోత్సవంతో శుక్రవారం రాత్రి కళకళలాడింది. భక్తజన ఆనందోత్సాహాల నడుమ కనులపండువగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని పెన్నమ్మ ఒడిలో సర్వాలంకారశోభితంగా కొలువై విహరించారు. తొలుత పూజలను అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. తెప్పలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై స్వామివారిని కొలువుదీర్చారు. మేయర్ దేవరకొండ సుజాత, ఏఎస్పీ దీక్ష, వేమిరెడ్డి విజయభాస్కర్రెడ్డి, ఈఓ ఆళ్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెప్పోత్సవం అనంతరం అశ్వవాహనంపై స్వామివారు విహరించారు. – నెల్లూరు(బృందావనం) -
మంచి వైద్యులుగా పేరు తెచ్చుకోవాలి
నెల్లూరు(అర్బన్): డాక్టర్లుగా మారుతున్న వైద్య విద్యార్థులు ప్రజలకు వైద్యసేవలందిస్తూ సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని మెడికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ రఘునందన్ సూచించారు. నెల్లూరులోని ఏసీఎస్సార్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డాక్టర్ విద్య పూర్తి చేసుకున్న ఏడో బ్యాచ్కు చెందిన 170 మంది వైద్య విద్యార్థులకు సంబంధించి పట్టాలిచ్చే కాన్వొకేషన్ డేను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రఘునందన్ మాట్లాడుతూ స్మార్ట్ డాక్టర్గా కాకుండా గాయానికి మందువేసి నయం చేసే మంచి డాక్టర్గా పేరు తెచ్చుకోవాలన్నారు. మృత్యువు కోరలు చాచే వేళ కొన ఊపిరి ఊది ప్రాణ దాతలుగా నిలవాలంటూ సాట పాడి కర్తవ్యాన్ని గుర్తు చేశారు. ● మరో ముఖ్యఅతిథి కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ డాక్టర్లు కనిపించే దేవుళ్లన్నారు. దేవుడిని చూస్తారో లేదో గానీ ఒక రోగిని కాపాడి ప్రాణం నిలిపినప్పుడు మొదటి దేవుడిగా డాక్టర్ కనిపిస్తారన్నారు. ఈ వృత్తి ఎంతో పవిత్రమైందన్నారు. రోగి చెప్పేది వైద్యుడు శ్రద్ధగా వినాలని, తర్వాత పరిశీలించి నవ్వుతూ వైద్యం చేయాలన్నారు. డబ్బే పరమావధిగా కాకుండా వైద్యంలో రాణిస్తూ సమాజానికి ఉపయోగపడాలని తెలిపారు. ● మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి మాట్లాడుతూ వైద్యులుగా ప్రయాణం ఆరంభిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రొఫెసర్లు డాక్టర్ మస్తాన్బాషా, డాక్టర్ గోవిందు మాట్లాడుతూ నేటితో ఆటలు, చదువు బంద్ అయ్యాయన్నారు. ఇక నుంచి అసలైన జీవితం చూస్తారనన్నారు. రోగుల పట్ల కరుణ, దయ చూపుతూ సేవలందించాలని కోరారు. అనంతరం ప్రిన్సిపల్ కులమతాలు, లింగ, వర్ణ భేదాలు చూపకుండా సేవే దైవంగా భావించి వైద్యం చేయాలంటూ పట్టాలు తీసుకుంటున్న వారితో ప్రమాణం చేయించారు. ఇదే సందర్భంలో అత్యున్నత ప్రతిభ చూపిన ఏడుగురికి కలెక్టర్ గోల్డ్ మెడల్స్ అందజేసి అభినందించారు. వైద్య డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తర్వాత ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డీఎంఈ రఘునందన్ వైద్యులు కనిపించే దేవుళ్లు : కలెక్టర్ హిమాన్షు శుక్లా ఘనంగా మెడికల్ కళాశాల కాన్వొకేషన్ డే -
జీవితం అమూల్యం
ఉదయం ఇలా.. మధ్యాహ్నం అలా.. మార్చినెల మొదలైపోయింది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కానీ రాత్రి, ఉదయం వేళల్లో పొగమంచు ఇంకా వీడలేదు. దట్టంగా కమ్ముకుని ఉంటోంది. మధ్యాహ్నానికి ఎండ వేడిమి అధికమై వృద్ధులు, చిన్నారులు అల్లాడిపోతున్నారు. భానుడి భగభగల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు చెట్ల కింద సేద తీరుతుండగా.. మరికొందరు గొడుగులు వినియోగిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్స్, నెల్లూరు ● సమస్యలు తాత్కాలికం ● ఆత్మహత్య పరిష్కారం కాదు ● రెండు నెలల వ్యవధిలో 40 మందికి పైగా బలవన్మరణంరెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి ● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(వీఆర్సీసెంటర్): రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తిక్కన ప్రాంగణంలో శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారులతో ఆయన సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో పీఓటీ, ఆర్ఓఆర్, ఇనామ్, స్టేట్ యాక్ట్స్, 22ఏ, రీ సర్వే లాంటి రెవెన్యూ అంశాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఇకనుంచి ప్రతినెలా రెవెన్యూ అధికారులకు సమీక్షలు నిర్వహిస్తామన్నారు. డీటీలు, వీఆర్యోలు, ఆర్ఐలు బాధ్య తాయుతంగా పనిచేసి రెవెన్యూ సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం పీజీఆర్ఎస్, మ్యుటేషన్లు, చుక్కల భూ ములు, 22ఏ కేసులు, జీరో ఖాతాలు, రీసర్వే అంశాలపై చర్చించారు. ఎన్ని ఆర్జీలు వచ్చాయి?, ఎన్ని పరిష్కరించారు?, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి?, ఎందుకు పరిష్కరించ లేదు తదితర వాటి గురించి ఆరాతీశారు. సమావేశంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్కుమార్, ఆర్డీఓలు అనూష, పావని, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ నెల్లూరు(క్రైమ్): రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో చోరీ ఘటనపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. కొండాయపాళెం నందవనం ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీధర్రెడ్డి తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని వద్ద శ్రీనివాసులురెడ్డి అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. శ్రీధర్రెడ్డి తల్లి నెలరోజులుగా హైదరాబాద్లో ఉంటున్నారు. ప్రస్తుతం ఇంటి వద్ద శ్రీధర్రెడ్డి, తన అసిస్టెంట్ మాత్ర మే ఉంటు న్నారు. గురువారం సాయంత్రం అతను వ్యాపారానికి సంబంధించి రూ.16.50 లక్షల నగదును అసిస్టెంట్కు ఇచ్చి బీరువాలో పెట్టాలని చెప్పాడు. శుక్రవారం ఉదయం శ్రీధర్రెడ్డికి అసిస్టెంట్ కాఫీ ఇవ్వడంతో తాగి మళ్లీ నిద్రపోయాడు. కొద్దిసేపటి అనంతరం లేచి చూడగా శ్రీనివాసులురెడ్డి కనిపించలేదు. ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చి బీరువాలో చూడగా రూ.16.50 లక్షల నగదు, 55 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు, పార్కిగ్లో ఉంచిన ఎలక్ట్రిక్ బైక్ కనిపించలేదు. బాధితుడు చోరీ ఘటనపై వేదాయపాళెం పోలీసులకు ఫిర్యా దు చేశాడు. అసిస్టెంట్పై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొనడంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. నెల్లూరు(క్రైమ్): జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకోలేక చిన్నచిన్న సమస్యలకు కుంగిపోతూ పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎన్నో బంధాలను చిదిమేస్తున్నాయి. అయిన వారిని, నమ్ముకున్న వారిని పుట్టెడు బాధలోకి నెట్టేస్తున్నాయి. జిల్లాలో రెండు నెలల వ్యవధిలో సుమారు 40 మందికిపైగా ప్రాణాలను బలవంతంగా తీసుకున్నారు. పెరుగుతున్న ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నో కారణాలు కుటుంబ కలహాలు, ఒంటరితనం, అనారోగ్య సమస్యలు, వరకట్న వేధింపులు, వ్యసనాలు, పరిపక్వత లేని ప్రేమలు, ప్రేమ వైఫల్యాలు, ఆర్థిక సమస్యలు, పరీక్షల్లో ఫెయిల్, వ్యాపారంలో నష్టాలు, జీవితంపై కొరవడిన అవగాహన తదితర కారణాలు ఎక్కువ శాతం మందిని ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. నేనేం సాధించలేను.. జీవితంలో ఒడిపోయాను.. నా జీవితం వృథా.. నన్నెవరూ అర్థం చేసుకోరు.. దాదాపు ఆత్మహత్యలు చేసుకునే వాళ్లంతా ఇలాంటి నిరాశ, నిస్పృహలతోనే ఉంటారు. మానసికంగా కుమిలిపోతున్న ఇలాంటి వారిని సకాలంలో గుర్తించి కౌన్సెలింగ్ ఇప్పిస్తే చాలావరకు ఆత్మహత్యలను నిరోధించవచ్చని మానసిక వైద్యులు పేర్కొంటున్నారు. ఇటీవల జరిగినవి పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని సంతపేటకు చెందిన ఓ విద్యార్థిని ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. ఒంటరితనం, అనారోగ్య సమస్యలతో కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో ఓ వృద్ధుడు, మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది ఓ కారు డ్రైవర్, చేజర్ల మండలానికి చెందిన ఓ వ్యక్తి మద్యానికి బానిసై, అప్పుల బాధలు తాళలేక డేవిస్పేటలో ఓ వ్యక్తి, భార్య కాపురానికి రాలేదని కల్తీ కాలనీలో భర్త బలవన్మరణానికి పాల్పడ్డారు. -
చికెన్ వ్యర్థాల పట్టివేత
సంగం: మండలంలోని సంగంలో చికెన్ వ్యర్థాల వాహనాన్ని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. వ్యర్థాలతో ఉన్న ఆరు డ్రమ్ము లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సమీపంలో గుంత తీసి వ్యర్థాలను పూడ్చి పెట్టారు. జామాయిల్ కర్ర తరలిస్తుండగా.. ● నాలుగు ట్రాక్టర్ల స్వాధీనం చేజర్ల: మండలంలోని ఏటూరు అటవీ ప్రాంతంలో ఉన్న జామాయిల్ ప్లాంటేషన్ నుంచి అక్రమంగా కలప తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను శుక్రవారం ఫారెస్ట్ అధికారులు స్వా ధీనం చేసుకున్నారు. వారి కథనం మేరకు.. ఏటూరు గ్రామానికి చెందిన ప్రైవేట్ వ్యక్తులు అనుమతి లేకుండా జామాయిల్ కర్రను నరికి తరలిస్తున్నారని సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది డ్రైవర్లను అదుపులోనికి తీసుకున్నారు. ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని ఆదూరుపల్లి చెక్పోస్ట్లో ఉంచినట్లు దాచూరు డీఆర్వో రసూల్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీటికి జరిమానా విధిస్తామన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు. జాతీయ స్థాయి పారా కబడ్డీ పోటీలకు ఎంపిక చిల్లకూరు: జాతీయ స్థాయి లో తొలిసారిగా ఏర్పాటు చేసిన పారా (దివ్యాంగు లు) కబడ్డీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. నెల్లూరుకు చెందిన రాజేష్ ఒకరు కాగా మరొక రు అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పారా క్రీడా పోటీల్లో పాల్గొని విజే తగా నిలిచిన గూడూరు పట్టణం చర్చి కాంపౌండ్కు చెందిన కేఏ పురుషోత్తం (అన్వే ష్). వీరు ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు మీరట్లో జరిగే పారా జాతీయ స్థాయి ఫెడరేషన్ కప్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారు. 9న మహిళా సమస్యల పరిష్కార వేదిక నెల్లూరురూరల్: ఈనెల 9వ తేదీన మహిళా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నెల్లూరులోని జెడ్పీ మీటింగ్ హాల్లో సోమవారం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా యంత్రాంగం, లీగల్ సెల్ ప్రతినిధులు, పోలీస్ అధికారులు పాల్గొని మహిళల ఫిర్యాదులను స్వీకరించి వాటిపై తక్షణ చర్యలు తీసుకుంటారన్నారు. గృహ హింస, వేధింపులకు గురైన మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆరోజు న అందిన ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. -
100 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
గూడూరు రూరల్: రెండో పట్టణ సమీపంలో విందూరు మార్గంలో ఉన్న మధురెడ్డి కాలనీలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేయడంతో శుక్రవారం రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. ఏఎస్ఓ లక్ష్మీనారాయణరెడ్డి కథనం మేరకు.. చైన్నెకి అక్రమంగా రవాణా చేసేందుకు ఓ ఇంట్లో రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు సమాచారం రావడంతో దాడులు చేసి 68 బస్తాలు, మినీ ట్రక్కులో ఉన్న 32 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సివిల్ సప్లయ్స్ గోదాముకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెంచామన్నారు. అక్రమార్కులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారన్నారు. స్థానికుల సమాచారంతో రేషన్ బియ్యా న్ని పట్టుకున్నట్లు వెల్లడించారు. దాడుల్లో గూడూరు డీటీ చైతన్య, రూరల్ ఎస్సై తిరుపతయ్య, వీఆర్వోలు రవిచంద్ర, విజయకుమార్ పాల్గొన్నారు. -
దళితుల ఇళ్లు తొలగిస్తే సహించం
● సీపీఎం నేతల ధర్నా నెల్లూరు(వీఆర్సీసెంటర్): సంవత్సరాలుగా నివాసముంటున్న పేద దళితుల ఇళ్లను అభివృద్ధి పేరుతో తొలగిస్తామంటే సహించేది లేదని సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, కమిటీ సభ్యుడు నాగేశ్వరరావు హెచ్చరరించారు. నెల్లూరులోని 8వ డివిజన్ కామాటి హరిజనవాడ ప్రాంతంలో దళితుల ఇళ్లను తొలగించవద్దంటూ శుక్రవారం నేతలు ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కాలువలపై ఉన్న ఇళ్లను తొలగిస్తామని చెప్పడం సరికాదన్నారు. అధికారులు కాకుండా స్థానిక టీడీపీ నాయకులు వచ్చి ఈ ప్రాంతంలో ఇళ్లు ఖాళీ చేయాలని ప్రతి ఇంటికీ రూ.5 వేలు ఇస్తామని, టిడ్కో అపార్ట్మెంట్లకు వెళ్లాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. 20 రోజుల నుంచి టీడీపీ నాయకులు స్థానికులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేయాలే కానీ ప్రజల ఇళ్లను కూల్చి రోడ్డు, కాలువలు వేస్తే అభివృద్ధి చెందుతుందా అని మంత్రి నారాయ ణను ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు పన్నులు చెల్లిస్తున్నారని, వెంటనే పక్కాఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. కాగా నగర డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ వచ్చి ఇళ్లను తొలగించకుండానే కాలువ నిర్మాణ పనులు చేపడతామనడంతో నాయకులు ధర్నాను విరమించారు. -
మార్కెట్లోకి నిస్సాన్ గ్రావైట్ కారు
నెల్లూరు(టౌన్): నూతన నిస్సాన్ గ్రావైట్ కారును మార్కెట్లోకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎం మురళీనాయక్ విడుదల చేశారు. నెల్లూరు మినీబైపాస్ రోడ్డులోని హైటెక్ మోటార్స్ నిస్సాన్ షోరూంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ సి.జగన్నాథ్రెడ్డి మాట్లాడుతూ కారు సెవన్ సీటర్స్తో అధునాతన ఫీచర్స్తో విడుదల చేశారన్నారు. 6 ఎయిర్బ్యాగ్స్, ఫ్రంట్ పా ర్కింగ్ సెన్సార్స్, క్రూజ్ కంట్రోల్, ఆటో వైపర్, ఫాలో హెడ్ల్యాంప్స్తో ఉందన్నారు. 3–రో ఏసీ, వైర్లెస్ చార్జర్, డ్యూయల్ డాష్ క్యామ్, ఎల్ఈడీ తదితర ఫీచ ర్స్ ఉన్నాయన్నారు. ప్రారంభ ధర రూ.5.65 లక్షలన్నారు. ఐదు రంగుల్లో లభ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో షోరూమ్ డైరెక్టర్లు నిరంజన్, భారతి, హోషిమ రెడ్డి, ఆశిష్రెడ్డి, జనరల్ మేనేజర్ ఎన్వీఎస్ శాస్త్రి, బ్రాంచ్ మేనేజర్ గోపీ, సిబ్బంది పాల్గొన్నారు. -
స్కూటీని దౌర్జన్యంగా తీసుకెళ్లారు
● పోలీసులకు మహిళ ఫిర్యాదు ఆత్మకూరు: ఫైనాన్స్ కంపెనీలో రుణం తీసుకుని కొనుగోలు చేసిన స్కూటీని ఒక ఈఎంఐ కట్టలేదని దౌర్జన్యంగా తీసుకెళ్లారంటూ కె.లక్ష్మి అనే మహిళ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు లోని వివరాల మేరకు.. ఆత్మకూరు మండలం భంట్లపల్లి గ్రామానికి చెందిన కలువాయి లక్ష్మి ఏడాదిన్నర క్రితం శ్రీరామ్ ఫైనాన్స్లో రుణం తీసుకుని స్కూటీని కొనుగోలు చేశారు. క్రమం తప్పకుండా నెలకు రూ.3,500 చొప్పున ఈఎంఐ చెల్లించారు. నాలుగునెలల క్రితం ఆమె అనారోగ్యానికి గురైంది. దీంతో మూడునెలల ఈఎంఐ కట్టలేకపోయింది. ఆ సమయంలో ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ రాజేంద్రరెడ్డి, అదే సంస్థకు చెందిన కలెక్షన్ ఏజెంట్ ఎస్కే సుల్తాన్ గ్రామానికి వెళ్లి ఆమెను నగదు అడగటంతో అప్పటికప్పుడే రెండు ఈఎంఐలు చెల్లించారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన ఉద్యోగులు మరో గంట తర్వాత వచ్చి కంపెనీ వారు ఒప్పుకోవడం లేదని, బాకీ ఉన్న మరో ఈఎంఐ కట్టాల్సిందేన ని బలవంతంగా వాహనాన్ని తీసుకెళ్లారు. కాగా రెండు రోజుల క్రితం ఈఎంఐలైనా చెల్లించండి లేదా వా హనాన్ని తిరిగివ్వండంటూ ఫైనాన్స్ కంపెనీ నుంచి నోటీసులొచ్చాయి. దీంతో ఆమె పట్టణంలోని ఫైనాన్స్ కంపెనీ వద్దకు వెళ్లి వాహనాన్ని తీసుకెళ్లారు కదా అని ప్రశ్నించారు. ఆ వ్యక్తులు ప్రస్తుతం కంపెనీలో లేరని.. వాహనం తమకు చేరలేదని ప్రస్తుత ఉద్యోగులు తెలిపారు. దీంతో ఆమె పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై జిలానీ తెలిపారు. -
ఇంటర్ పరీక్షలకు 443 మంది గైర్హాజరు
నెల్లూరు(టౌన్): ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో గురువారం జిల్లా వ్యాప్తంగా 443 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్కు సంబంఽధించి 5,066 మందికి గానూ 4,768 మంది హాజరుకాగా, 298 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్కు సంబంధించి 1,232 మందికి గానూ 1,087 మంది హాజరుకాగా 145 మంది గైర్హాజరయ్యారు. గుంటూరు ఆర్జేడీ జె.పద్మ కావలిలోని పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అదే విధంగా నెల్లూరు నగరంలోని కేఏసీ జూనియర్ కళాశాలలో జరుగుతున్న జవాబుపత్రాల మూల్యాంకనాన్ని పరిశీలించారు.రైల్లోంచి జారిపడి.. ● వ్యక్తి మృతి నెల్లూరు(క్రైమ్): ప్రమాదవశాత్తు రైల్లోంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన విజయమహాల్గేటు సమీపంలో నెల్లూరు వైపు వచ్చే పట్టాలపై గురువారం చోటుచేసుకుంది. మృతుడు 5.4 అడుగుల ఎత్తు ఉన్నాడు. వయసు 45 నుంచి 50 సంవత్సరాల్లోపు ఉండొచ్చు. తెలుపు, బులుగు రంగుల అడ్డచారలు కలిగిన హాఫ్ హ్యాండ్స్ టీషర్టు, సిమెంట్ రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.గుర్తుతెలియని వృద్ధుడి మృతి నెల్లూరు(క్రైమ్): అనారోగ్యంతో గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందిన ఘటన రాజరాజేశ్వరి గుడి సమీపంలో గురువారం చోటుచేసుకుంది. మృతుడి వయస్సు సుమారు 70 సంవత్సరాలు ఉండొచ్చు. సమాచారం అందుకున్న దర్గామిట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గుడి పరిసర ప్రాంతాల్లో విచారించగా మృతుడు కొంతకాలంగా అక్కడే ఉంటున్నాడని, సొంతూరు రాజమండ్రి అని చెప్పారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు దర్గామిట్ట పోలీస్స్టేషన్లో తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరులో గంజాయి స్వాధీనం నెల్లూరు(క్రైమ్): గంజాయిని విక్రయించేందుకు సిద్ధమవుతున్న ముగ్గురు వ్యక్తులను నెల్లూరు వేదాయపాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం మేరకు.. కొండాయపాళెం అనగుంటకు చెందిన మహేష్, బీవీనగర్కు చెందిన యువరాజ్, కరిముల్లా స్నేహితులు. వీరు మద్యం, గంజాయికి బానిసయ్యారు. ఏడాది క్రితం మహేష్ ను చిన్ననాటి క్లాస్మెట్ హరనాథపురానికి చెందిన సందీప్కుమార్ కలిశాడు. అతను రాజమండ్రి నుంచి గంజాయిని తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు మహేష్కు చెప్పాడు. దీంతో మహేష్ తన స్నేహితులు యువరాజ్, కరిముల్లాకు చెప్పి తాము గంజాయి విక్రయించి పెద్ద మొత్తంలో నగదు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. మూడురోజుల క్రితం సందీప్ ద్వారా రాజమండ్రి నుంచి 3 కేజీల గంజాయిని తెప్పించారు. వాటిని చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయించసాగారు. గురువారం వారు పొదలకూరురోడ్డు శ్రీలంక కాలనీ సమీపంలో ఆటోలో గంజాయిని విక్రయించేందుకు సిద్ధమవుతున్నారని వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావుకు సమాచారం అందింది. ఆయన తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మహేష్, యువరాజ్, కరిముల్లాను అరెస్ట్ చేశారు. వారి నుంచి 2.396 గ్రాముల గంజాయిని, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ.23,960 అని ఇన్స్పెక్టర్ చెప్పారు.ప్రయాణికులకు మెరుగైన సేవలు రాపూరు: ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే ఆర్టీసీ లక్ష్యమని నెల్లూరు జోన్ ఈడీ నాగేంద్రప్రసాద్ తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్రెడ్డితో కలిసి ఆర్వో ప్లాంట్ను గురువారం ప్రారంభించా రు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని డిపో ల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రయాణికులు కూర్చునేందుకు నూతన కుర్చీలు, బస్టాండ్ల పరిశుభ్రత, మరుగుదొడ్ల పరిశుభ్రతపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణాధికారి షమీమ్, డిప్యూటీ చీఫ్ రవికాంత్, ఆర్టీసీ మేనేజర్ అనిల్కుమార్ పాల్గొన్నారు. రహదారి ఇలా.. రాకపోకలెలా? సైదాపురం: మండలంలోని సైదాపురం నుంచి ఊటుకూరుకు వెళ్లే రహదారిపై అడుగుకో గుంత దర్శనమిస్తోంది. సుమారు 5 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే గంటకు పైగా సమయం పడుతోంది. ఇటీవల ఆ రహదారి పనులు కొంతమేర చేశారు. మిగిలినచోట్ల చేయకపోవడంతో రాకపోకలు సాగించేందుకు వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. -
దోపిడీపై ఆధారాలతో నిరూపిస్తా
● బీజేపీ నాయకుడు శ్రీనివాసులు యాదవ్ వెంకటాచలం: టీడీపీ నేత, చవటపాళెం సొసైటీ అధ్యక్షుడు రాధాకృష్ణమ నాయుడి దోపిడీపై ఆధారాలతో సహా నిరూపిస్తానని బీజేపీ సీనియర్ నాయకుడు, నిడిగుంటపాళెం సాగునీటి సంఘం అధ్యక్షుడు కుంచి శ్రీనివాసులు యాదవ్ తెలిపారు. వెంకటాచలంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారం వచ్చాక బలహీనవర్గాలను పక్కన పెట్టేస్తారా?, ఇదేనా కూటమి ప్రభుత్వ విధానమని ప్రశ్నించారు. రాధాకృష్ణమనాయుడు ఎమ్మెల్యేగా ఫీలవుతున్నాడని, ఇలానే కొనసాగితే కూటమి చాలా నష్టపోతుందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో నిడిగుంటపాళెంలో బీజేపీ నాయకులపై కేసులు పెట్టించిన నీచ సంస్కృతి రాధాకృష్ణమనాయుడు, పద్మనాభనాయుడిది కాదా అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు గ్రామాల్లో కనిపించని రాధాకృష్ణ, అధికారం వచ్చిన తర్వాత పెత్తనం చేస్తే తాము ఊరుకునే ప్రసక్తిలేదని హెచ్చరించారు. సోమిరెడ్డి ఇచ్చిన పదవులు తప్ప, ఎప్పుడైనా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన చరిత్ర నీకు ఉందానని విమర్శించారు. సమావేశంలో బీజేపీ మండలాధ్యక్షుడు హసనాపురం శ్రీనివాసులు, నాయకులు పాల్గొన్నారు. -
పేదోళ్ల భూముల్లోని నిమ్మచెట్ల తొలగింపు
చేజర్ల: పేదలు ఎన్నో సంవత్సరాల క్రితం పట్టాలు పొంది సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములవి. తాజాగా ఆక్రమణలంటూ అధికార పార్టీ నాయకులు రెవెన్యూ అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేయడం, ఆగమేఘాల మీద కదిలిన రెవెన్యూ యంత్రాంగం పేదోళ్ల భూముల్లోనే సాగులో ఉన్న నిమ్మ చెట్లను తొలగించారు. ఈ ఘటన రెవెన్యూ అధికారుల దాష్టీకానికి పరాకాష్టగా నిలుస్తోంది. మండలంలోని బిల్లుపాడులో గురువారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. బిల్లుపాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన పలువురు నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన అనాధీన భూముల్లో మెట్ట పైర్లు వరి, నిమ్మచెట్లు సాగు చేసుకుంటున్నారు. గ్రామంలోని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ప్రభుత్వ భూములు ఆక్రమించారంటూ రెవెన్యూ అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు. వెంటనే రెవెన్యూ శాఖ అధికారులు పోలీస్ బందోబస్తుతో వచ్చారు. సాగులో ఉన్న నిమ్మచెట్లను జేసీబీతో తొలగించారు. ఇందులో అధికార పార్టీకి చెందిన వారి భూముల జోలికి వెళ్లలేదు. వైఎస్సార్సీపీ మద్దతుదారుల చెట్లను తొలగించారు. గ్రామంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ కొంతమేర జరిగినా ఎన్నో ఏళ్లుగా పేదలు సాగు చేసుకుంటున్న రైతుల విషయంలో అధికార పార్టీ నాయకులు కక్షపూరితంగా వ్యవహరించి చెట్లను ధ్వంసం చేయడంపై బాధితులు లబోదిబోమంటున్నారు. అధికార పార్టీకి చెందినవారు పొలాలను ఆక్రమించారని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని బాధితులు చెబుతున్నారు. జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై చేజర్ల తహసీల్దార్ మస్తానయ్యను వివరణ కోరగా పట్టా భూములు జోలికి వెళ్లలేదని, ఆక్రమణ గురైన వాటిపై ఫిర్యాదు అందడంతో చర్యలు తీసుకున్నామన్నారు. అధికార పార్టీ నేతలు చెప్పారని.. బిల్లుపాడులో రెవెన్యూ అధికారుల దాష్టీకం బాధితులు వైఎస్సార్సీపీ వర్గీయులు కావడంతోనే.. -
కదం తొక్కిన కర్షక మహిళలు
● భూస్వాముల కబంధహస్తాల్లో మా భూములు ● స్వాధీనం చేయాలని ఆందోళనకావలి రూరల్: కావలి మండలం చెన్నాయపాళెం పెద్ద పట్టపుపాళెంలోని సీతారామనగరం గ్రామ పరిధిలోని తమ భూములు తమకే ఇవ్వాలంటూ గురువారం మహిళలు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం సర్వే నంబర్ 396 నుంచి 402లో భూములు ఇచ్చిందన్నారు. ఇప్పుడు వాటిపై హక్కులు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా తమ భూములను నాయకులు ఆక్రమించి అనుభవిస్తున్నారని వాపోయారు. అడవులను తలపిస్తున్న భూములను సాగుకు అనుకూలంగా తీర్చిదిద్ది సవక, జామాయిల్ మొక్కలు వేసి సాగుకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రస్తుతం బీపీసీఎల్ కంపెనీ నిమిత్తం భూ సేకరణ పేరుతో అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్లపాటు సాగు చేసుకుంటూ ఉంటే ఊర్లో జరిగిన పెద్ద గొడవలు, బాంబు దాడుల కారణంగా మత్స్యకార కుటుంబాలు ఊరును వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తర్వాత అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చి పొలాలను చూసుకుంటున్నామని తెలిపారు. అయితే ఇదే సమయంలో కొందరు ఆ భూములను ఆక్రమించి సాగు చేస్తున్నారని ఆరోపించారు. భూములిచ్చిన సమయంలో జామాయిల్, సవక మొక్కలు వంటివి వేసుకుని జీవనం సాగించుకోవాలని ప్రభుత్వం చెప్పిందని బాధితులు గుర్తుచేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి నిజమైన హక్కులు ఎవరివో తేల్చి, అక్రమ ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. బీపీసీఎల్ నిమిత్తం భూములు సేకరిస్తూ తమకు నష్టపరిహారం రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నాయకులు అడంగళ్ చేయించుకుని అనుభవిస్తున్నారని వాపోయారు. సుమారు 600 మంది మహిళలు భూముల వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. పల్లెకారి తిరుపతమ్మ, పన్నాడి జ్యోతి పొదుపు గ్రూపు మహిళల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సమస్యను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని, లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పలువురు పొదుపు మహిళా గ్రూపు సభ్యులు పాల్గొన్నారు. -
27 వారాలకే పుట్టిన బిడ్డకు అరుదైన చికిత్స
నెల్లూరు(అర్బన్): ఓ గర్భిణికి అత్యవసర పరిస్థితుల్లో ఆపరేషన్ చేసి మగబిడ్డను బతికించినట్లు కిమ్స్ సూపర్ స్పెషాలిటీ గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీదుర్గ తెలిపారు. గురువారం నెల్లూరు దర్గామిట్టలోని ఆస్పత్రిలో వివరాలు వెల్లడించారు. నగరంలోని తస్మిన్ 6.3 నెలల గర్భంతో ఉంది. నెలలు నిండక ముందే ఫిట్స్ వచ్చాయి. భర్త జునైద్ ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి స్పృహలో లేదు. హైబీపీ ఉన్నట్లు గుర్తించారు. ఆమె తలలో మెదడు వాపునకు గురైంది. బిడ్డను స్కానింగ్లో పరీక్షించగా హార్ట్బీట్ తగ్గిపోయింది. బరువు కూడా కేవలం 1.2 కిలోలు మాత్రమే ఉంది. అత్యవసరంగా తల్లికి ఆపరేషన్ చేసి మగబిడ్డను బయటకు తీశారు. బిడ్డకు శ్వాసకోశ సమస్య అయిన రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ వచ్చింది. ఫీడ్ ఇంటోలరెన్స్, సుప్రావెంట్రిక్యులర్ టాకీకార్డియా, సెప్సిస్ వంటి క్లిష్ట పరిస్థితులకు చికిత్స అందించారు. పీడియాట్రిక్ డాక్టర్ల బృందంతో కలిసి ఎన్ఐసీయూలో ఉంచి అత్యాధునిక చికిత్స చేశారు. దీంతో బిడ్డ ఆరోగ్యం సాధారణ స్థితికి చేరుకుంది. బరువు 1.6 కిలోలకు చేరుకుంది. క్లిష్టతరమైన కేసులకు కిమ్స్లో వైద్యసేవలు అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడినందుకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ రోహిణి లక్ష్మీప్రియ వైద్యులను అభినందించారు. కార్యక్రమంలో నియోనేటాలజిస్ట్లు డాక్టర్ భార్గవ్, డాక్టర్ నవీన్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ మురార్జి, పీడియాట్రిషియన్ డాక్టర్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు. గోదాములో అగ్నిప్రమాదం ● రూ.40 లక్షల ఆస్తి నష్టం తోటపల్లిగూడూరు(పొదలకూరు): మండలంలోని తోటపల్లి గ్రామంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో హైరర్స్ గోదా ము పూర్తిగా దగ్ధ మై భారీ నష్టం సంభవించింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నరసింహారావు చాలా ఏళ్లుగా హైరర్స్ను నిర్వహిస్తున్నాడు. విద్యుత్ సర్వీస్ లైన్ తెగిపోవడంతో నిప్పురవ్వలు గోదాముపై పడి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. షామియానాలు ఉండటంతో క్షణాల్లోనే మంటలు వ్యాపించి సామగ్రి మొత్తం కాలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే సామగ్రి పూర్తిగా కాలిపోయింది. సుమారు రూ.40 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు నరసింహారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ 40 ఏళ్లుగా హైరర్స్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నానని, అగ్నిప్రమాదంతో జీవనాధారం కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
పరిహారం.. పరిహాసం
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా క్రిస్సిటీ భూ నిర్వాసితుల పరిస్థితి తయారైంది. కృష్ణపట్నం పోర్టు అనుబంధంగా పరిశ్రమల ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూములను రైతులను సంతృప్తి పరిచే రీతిలో పరిహారం చెల్లించే విధంగా సేకరించింది. పరిహారం అందించే ప్రక్రియ వేగంగా చేపట్టింది. ఈ మేరకు కలెక్టర్ ఖాతాలో నిధులు జమయ్యాయి. అయితే ఈలోగా ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూ నిర్వాసితుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది. రెండేళ్లు గడుస్తున్నా.. మిగిలిన పరిహారం ఇవ్వకుండా అన్నదాతలకు చుక్కలు చూపిస్తోంది. రైతులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదు.చిల్లకూరు: అవి సిలికా భూములు. రైతులు ఏడాదిలో మూడు పర్యాయాలు వేరుశనగ పండించేవారు. ఎకరాకు ఖర్చులు పోను సుమారుగా రూ.50 వేల వరకు ఆదాయాన్ని పొందేవారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటు కోసం క్రిస్సిటీ పేరుతో భూ సేకరణకు శ్రీకారం చుట్టింది. రైతులు ముందుకొచ్చారు. అధికారులు చిల్లకూరు, కోట మండలాల్లోని రెండు రెవెన్యూ పరిధిలో సుమారు 987 ఎకరాల భూములను సేకరించి ఏపీఐఐసీకి అప్పగించారు. తొలి విడతలో తమ్మినపట్నంలో సుమారు 300, కోట మండలంలో సుమారు 233 ఎకరాలకు సంబంధించి రైతులకు 40 శాతం మేర పరిహారాన్ని నాడు విడుదల చేశారు. ఇప్పుడిలా.. ఎవరి వద్దనైనా భూమి కొనుగోలు చేస్తే పూర్తిగా సెటిల్మెంట్ చేసిన అనంతరం పనులు మొదలు పెట్టాలి. కానీ క్రిస్సిటీకి సేకరించిన భూమి విషయంలో అలా జరగడంలేదు. ఎన్నికల అనంతరం ఏర్పాటైన కూటమి ప్రభుత్వం పరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఈ క్రమంలో అన్నదాతలు ఆందోళనకు దిగడంతో గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విడుదల చేసిన 40 శాతం మొత్తాన్ని రైతులకు అందించి చేతులు దులుపుకుంది. మిగిలిన 60 శాతం ఇవ్వకుండానే అధికార పార్టీ నాయకుల అండ, జిల్లా స్థాయి అధికారుల భరోసాతో క్రిస్సిటీలో కాంట్రాక్ట్ సాధించిన బీఆర్ఎస్ సంస్థ ఇష్టానుసారంగా పనులు చేపడుతోంది. బాధిత రైతులు అక్కడికి వెళ్లి తమకు పరిహారం అందించిన తర్వాతే పనులు చేపట్టాలని కోరితే సదరు సంస్థకు చెందిన సిబ్బంది దౌర్జన్యాలకు దిగుతున్నారు. అక్రమ కేసులు బనాయించే పరిస్థితి ఏర్పడింది. దీంతో సన్న, చిన్నకారు రైతులు కలెక్టర్, గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కలెక్టర్ ఖాతాలో నిధులున్నా ఇచ్చే విషయంలో ఆలస్యం జరుగుతోంది. వాటిని ఇతర అవసరాలకు ఖర్చు చేశారా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా మార్పుతోనే ఆలస్యమా? భూ సేకరణ జరిగిన సమయంలో చిల్లకూరు, కోట మండలాలు తిరుపతి జిల్లాలో ఉన్నాయి. పరిహారం అంశం పూర్తిగా తిరుపతి కలెక్టర్ పర్యవేక్షణలో జరిగింది. నగదు కూడా ఆయన ఖాతాలో ఉండగా అక్కడి నుంచి గూడూరు సబ్ కలెక్టర్ ఖాతాలోకి మార్చారు. తర్వాత రైతులకు 40 శాతం మేర పరిహారం చెక్కులు అందించారు. అయితే ఈ ఏడాది ఆరంభంలో రెండు మండలాలు పూర్తిగా నెల్లూరు జిల్లా పరిధిలోకి వచ్చాయి. గూడూరు సబ్ కలెక్టర్ బదిలీపై వెళ్లారు. 60 శాతం పరిహారం కోసం అన్నదాతలు అధికారులను కలిసి మాట్లాడితే జిల్లా మార్పు కారణంగా మరోసారి రికార్డులను పూర్తిగా పరిశీలించిన అనంతరం ఆలోచిస్తామంటున్నారు. ప్రభుత్వ భూమిగా గుర్తింపు 987 ఎకరాల్లో సుమారు 260 ఎకరాలు రైతులు సాగులో ఉంది. అయితే కోవిడ్ సమయంలో కొందరు సాగు చేపట్టకపోవడంతో అప్పటి శాటిలైట్ చిత్రాలను ఆధారంగా చేసుకుని అధికారులు ఆ భూములను ప్రభుత్వానికి నమోదు చేసి పరిహారం అందించేందుకు నిరాకరించారు. అలాగే కోట మండలంలో డీకేటీ భూములకు అందించే పరిహారం చిల్లకూరు మండలంలో ఇవ్వకుండా తక్కువగా అందించడంపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వ భూమిగా గుర్తించిన 260 ఎకరాల విషయంపై మాట్లాడకుండా అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని, పరిహారం అందించేందుకు తమవంతు కృషి చేస్తామని రైతుల్ని మభ్యపెట్టి క్రిస్సిటీలో పనులు చేయిస్తున్నారు. క్రిస్సిటీ భూ నిర్వాసితులకు కూటమి అన్యాయం చెల్లింపులను పట్టించుకోని అధికారులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే 40 శాతం పరిహారం జమ మిగిలిన మొత్తానికి నేటి ప్రభుత్వంలో ఇంతవరకు దిక్కు లేదు తీవ్రంగా నష్టపోయామంటున్న సన్నకారు రైతులు -
హామీలు నెరవేర్చాలని అడగడం తప్పా?
నెల్లూరు రూరల్: ‘అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న పోరాటాన్ని కూటమి ప్రభుత్వం అణచివేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడగడం తప్పా’ అని కనిపించడం లేదా?’ అని వైఎస్సార్సీపీ అంగన్వాడీల విభాగం జిల్లా అధ్యక్షురాలు పి.లావణ్య ప్రశ్నించారు. గురువారం నెల్లూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షురాలు పి.లావణ్య, అలాగే రాష్ట్ర విభాగం సెక్రటరీ వెంకట జ్యోతి, ఇంకా రమీజా, రిజ్వానా, షాలిని, ముంతాజ్ తదితరులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంగన్వాడీలు హక్కుల కోసం శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తుంటే పోలీసులను పంపి, దాడులు చేసి శిబిరాన్ని ఎత్తివేయడం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు నిదర్శనమన్నారు. హామీలను నెరవేర్చాలని అడిగితే అర్ధరాత్రి పూట దాడులు చేయడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటం ఇంత వరకూ అంగన్వాడీలను చర్చలకు పిలవలేదన్నారు. అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు అటవాటేనన్నారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఉద్యోగభద్రత కల్పించాలని చెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. అంగన్వాడీలకు అండగా వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. -
పాఠశాలలో టీచర్ల వేధింపులు
● ట్యూషన్ నిర్వహిస్తూ.. డబ్బుల వసూలు ● బాడీ షేమింగ్ చేస్తూ.. ● ప్రిన్సిపల్దీ అదే ధోరణి ● జేసీకి విద్యార్థి తల్లి ఫిర్యాదు నెల్లూరు(అర్బన్): నగరంలోని ఫతేఖాన్పేటలో గల రామయ్యబడి పాఠశాలలో ఉపాధ్యాయుల వేధింపులు, అక్రమాలపై విచారణ జరపాలంటూ జేసీ మొగిలి వెంకటేశ్వర్లుకు అక్కడ ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తల్లి జ్యోతి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్థానికులతో కలిసి వినతిపత్రాన్ని గురువారం అందజేసిన అనంతరం ఆమె మాట్లాడారు. పాఠశాలలో సాయంత్రం 5.30 నుంచి 7.30 వరకు టీచర్ భవ్య ట్యూషన్ చెప్తూ, ఫీజులను వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కంప్యూటర్, ప్రింటర్ను ఉపయోగించి ప్రింట్కు రూ.రెండు చొప్పున వసూలు చేస్తూ జిరాక్స్ షాపును అనధికారికంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ అంశమై డీఈఓకు గత నెల 27న ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వివరించారు. విద్యార్థులను మరో టీచర్ మారుపేర్లతో పిలుస్తూ, ఆరోగ్య సమస్యలపై వెటకారం చేస్తూ బాడీ షేమింగ్కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాలను తాను ప్రశ్నించడంతో మధు అనే టీచర్ బుధవారం చేయి చేసుకోబోయారని తెలిపారు. 112కు కాల్ చేసి పోలీసులను పిలవడంతో గొడవ సద్దుమణిగిందన్నారు. పాఠశాలలో టాయ్లెట్ల నిర్వహణ, సీసీ కెమెరాలు పనిచేయకపోవడాన్ని ప్రశ్నిస్తే, తమ స్కూల్ ఇంతే.. లేదంటే టీసీ తీసుకెళ్లాలంటూ ప్రిన్సిపల్ రమేష్బాబు బెదిరిస్తున్నారని చెప్పారు. వీరిపై చర్యలు చేపట్టాలని కోరారు. -
లా పరీక్షల్లో మారని తీరు
● ఆగని మాస్ కాపీయింగ్ నెల్లూరు (టౌన్): న్యాయవిద్య అపహాస్యంగా మారుతోంది. చీటీలతో పరీక్షలు రాస్తూ పదుల సంఖ్యలో విద్యార్థులు డీబారవుతున్నా, మాస్ కాపీయింగ్ ఏ మాత్రం ఆగడం లేదు. పరీక్షలను నిర్వహిస్తున్న వీఆర్ఐపీఎస్ కళాశాలలోని టాయ్లెట్లలో చీటీలు, పేపర్లు భారీగా గురువారం దర్శనమిచ్చాయి. వాస్తవానికి విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించాకే కేంద్రంలోకి అనుమతించాలి. అయితే ప్రస్తుతం ఈ పద్ధతిని అమలు చేయడంలేదు. ఫలితంగా చీటీలు, పుస్తకాలను యథేచ్ఛగా తీసుకొస్తున్నారు. ఫిర్యాదులు అందడంతో వీఎస్యూ వీసీ అల్లం శ్రీనివాసరావు ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల్లో 19 మంది, తాజాగా ముగ్గురు గురువారం డీబారయ్యారు. అయినా మాస్ కాపీయింగ్కు ఏ మాత్రం అడ్డుకట్ట పడటంలేదు. తనిఖీలకు వచ్చిన సమయంలో కొంతమంది విద్యార్థులు తమ చీటీలు, స్లిప్పులను టాయ్లెట్లలో పడేస్తున్నా రని తెలుస్తోంది. మరికొందరు పరీక్షకు ముందే అక్కడ దాచి వాష్రూమ్ పేరు చెప్పి వీటిని చూసొస్తున్నారని సమాచారం. మరోవైపు మాస్ కాపీయింగ్కు పాల్పడిన కొందర్ని విధుల్లో ఉన్న అధికారులు వదిలేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పరిష్కరించినట్లు మెసేజ్ వచ్చింది
ములుమూడిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏటా ఏర్పాటు చేస్తారు. అయితే ఈ సారి ఇలా చేయకపోవడంతో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీని సోమవారం అందజేశా. పాత ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు రెవెన్యూ, సొసైటీ సభ్యులు మరుసటి రోజొచ్చి ఫొటోలు తీసి వెళ్లిపోయారు. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి సమస్య పరిష్కారమైందంటూ సంతకాలు చేయాలని చెప్పారు. అయితే సాల్వ్ కాకపోతే చేయనని చెప్పా. ఇది జరిగిన మూడు గంటల్లో సమస్యను పరిష్కరించామంటూ నా ఫోన్కు మెసేజ్ వచ్చింది. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి. – శ్రీనివాసులు, రైతు, ఫిర్యాదుదారుడు ● -
మేం చెప్పినోళ్లకే పనులివ్వాలి
● ఇరిగేషన్ శాఖలో అధికార పార్టీ నేతల పెత్తనం ● గందరగోళంగా మారిన పరిస్థితి నెల్లూరు (స్టోన్హౌస్పేట): జిల్లా నీటిపారుదల శాఖలో అధికార పార్టీ నేతల ప్రమేయం నానాటికీ అధికమవుతోంది. ఫలితంగా ఆ శాఖ పనితీరు తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. రైతులకు అవసరమైన పనుల విషయంలోనూ అధికార పార్టీ నేతలు చొరబడుతుండటంతో ఆ శాఖ అధికారులు తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారు. నేటికీ నోచుకోని టెండర్లు ఈ ఉదంతానికి ఉదాహరణగా మోంథా తుఫాన్కు సంబంధించి మంజూరైన పనులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. రైతులకు సాగునీటిని అందించేందుకు గానూ 1615 పనులకు రూ.93 కోట్లను కలెక్టర్ కేటాయించి మూడు నెలలైంది. అయినా ఇవి ఇ ప్పటికీ ప్రారంభమైన దాఖలాల్లేవు. అధికార పార్టీలోని ఆధిపత్య ప్రమేయమే దీనికి కారణమని తెలుస్తోంది. వీటికి టెండర్లు పిలవకుండా తాము చెప్పిన వారికే పనులను కట్టబెట్టి చేయించాలంటూ అధికారులను ప్రజాప్రతినిధులు బెదిరించారని సమాచారం. మరోవైపు కాలువలు, చెరువులు, గట్లు తదితర పనులను నేటికీ ప్రారంభించకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐఏబీ సమావేశాలను ఇప్పటికే మూడుసార్లు నిర్వహించినా, హామీలివ్వడమే తప్ప పనులు చేసిన దాఖలాల్లేవు. నియోజకవర్గాల వారీగా వచ్చిన పనుల్లో అక్కడి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. అడుగు ముందుకు పడని వైనం టెండర్లు పిలిస్తే బయట వారికి ఎక్కడ వస్తుందోననే ఉద్దేశంతో వీటిపై అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు తెస్తున్నారని సమాచారం. రూ.పది లక్షల వరకు నామినేషన్ తెచ్చేందుకు యత్నాలు సాగిస్తుండటంతో మంజూరైన ఏ చిన్న పనీ అడుగు ముందుకుపడటంలేదు. మోంథా తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టంతో ఓ అండ్ ఎం, ఎఫ్డీఆర్ పనుల విషయంలో ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు వాస్తవాలను గ్రహించి పనులు పూర్తయ్యేలా సహకరించాలని రైతులు కోరుతున్నారు. మంజూరైన ఎఫ్డీఆర్ పనుల వివరాలు నియోజకవర్గం పనులు నిధులు (రూ.కోట్లలో) సర్వేపల్లి 316 16.90 నెల్లూరు రూరల్ 165 12.93 నెల్లూరు సిటీ 12 0.78 కోవూరు 368 20 కావలి 292 19.18 ఆత్మకూరు 199 10.31 ఉదయగిరి 150 7.26 వెంకటగిరి 100 6 కందుకూరు 13 0.18 మొత్తం 1615 93.27 -
ఐటీడీఏ పీఓ బాధ్యతల స్వీకరణ
నెల్లూరు(స్టోన్హౌస్పేట): ఐటీడీఏ పీఓగా బాధ్యతలను శ్రీనివాసరావు గురువారం స్వీకరించారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో రీజినల్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఈయన్ను డిప్యుటేషన్పై ఇక్కడికి బదిలీ చేశారు. గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకుల నియామకం నెల్లూరు రూరల్: జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులను నియమిస్తూ ఉత్తర్వులను పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది. నెల్లూరు సిటీకి కొండ్రెడ్డి రంగారెడ్డి.. నెల్లూరు రూరల్కు చిల్లకూరు సుధీర్రెడ్డి.. ఉదయగిరికి కూనం సుధాకర్రెడ్డి.. సర్వేపల్లికి వీరి చలపతి.. కోవూరుకు కొండూరు అనిల్.. ఆత్మకూరుకు పేర్నేటి కోటేశ్వరరెడ్డి.. కావలికి కొడవలూరు ధనుంజయరెడ్డి.. కందుకూరుకు పెళ్లకూరు సత్యనారాయణరెడ్డి.. గూడూరుకు బీరేంద్రవర్మ.. సూళ్లూరుపేటకు బిరదవోలు శ్రీకాంత్రెడ్డిని నియమించారు. జెడ్పీలో నేటి నుంచి మహిళలకు ఆటల పోటీలు నెల్లూరు(పొగతోట): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జెడ్పీ ఆవరణలో మహిళలకు ఆటల పోటీలను శుక్రవారం నుంచి ఆదివారం వరకు నిర్వహించనున్నామని సీఈఓ శ్రీధర్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపనున్నామని వెల్లడించారు. 40 ఏళ్లలోపు.. ఆపై వయస్సు గల వారికి రెండు విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నామని చెప్పారు. విజేతలకు బహుమతుల ప్రదానంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఆదివారం జరపనున్నామని పేర్కొన్నారు. భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. శ్రీవారి దర్శనానికి ఆరు గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని పది కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 63,772 మంది బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 24,013 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.1.47 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి పది గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. ఇంటి పన్నులపై కార్యదర్శులతో సమీక్ష సోమశిల: ఇంటి పన్నులపై పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని అనంతసాగరంలోని ఎంపీడీఓ కార్యాలయంలో డీపీఓ వసుమతి గురువారం నిర్వహించారు. పన్నుల వసూళ్ల వివరాలను ఆరాతీసిన అనంతరం ఆమె మాట్లాడారు. పన్ను చెలింపులో వెనుకబడిన పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించి నూరు శాతం వసూలు చేయాలని సూచించారు. అనంతరం స్థానిక సచివాలయ పరిధిలో పన్ను బకాయిదారుల ఇళ్ల వద్దకెళ్లి సకాలంలో చెల్లించాలని కోరారు. అనంతరం కాకూరివారిపల్లి గ్రామాన్ని జిల్లా మలేరియా నివారణాధికారి మస్తానమ్మతో కలిసి సందర్శించారు. గ్రామంలో విషజ్వరాలు ప్రబలిన తరుణంలో పరిస్థితిని పరిశీలించారు. ఈఓపీఆర్డీ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో అట్టడుగున లా అండ్ ఆర్డర్: మనోహర్రెడ్డి
సాక్షి, నెల్లూరు జిల్లా: రాష్ట్రంలో సమర్థవంతమైన అధికారులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం వారిని ప్రత్యర్థి రాజకీయ పార్టీలను వేధించడానికి 'ప్రైవేటు సైన్యం'లా వాడుకుంటోందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, హోంమంత్రి నియోజకవర్గాల్లో హత్యలు, అత్యాచారాలు, గంజాయి విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా పాలన కాకుండా 'పొలిటికల్ గవర్నెన్స్'(రాజకీయ పాలన) నడుస్తోందని, శిలాఫలకాలను పగలగొట్టడం నుంచి భౌతిక దాడుల వరకు విధ్వంసమే ధ్యేయంగా కూటమి నేతలు ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం దేశంలోనే ఏపీ అట్టడుగు స్థానంలో నిలిచిందని మనోహర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు తారాస్థాయికి చేరాయని మండిపడ్డారు.మాజీ మంత్రి కాకాణిపై 20కి పైగా అక్రమ కేసులు బనాయించిన కూటమి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. చివరకు ప్రెస్ మీట్లు పెడితే వాటిపైనా కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. "సూపర్ సిక్స్ హామీల వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ 'డైవర్షన్ పాలిటిక్స్' చేస్తున్నారని.. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రతి అధికారి పేరును డిజిటల్ డెయిరీలో నమోదు చేసి.. భవిష్యత్తులో ప్రభుత్వం మారిన తర్వాత చట్టపరమైన శిక్షలు తప్పవు" అని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు ఆపి, శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించాలని.. లేనిపక్షంలో న్యాయస్థానాల ద్వారా గట్టి పోరాటం చేస్తామని మనోహర రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..భక్తులకు సైతం రక్షణ లేని దుస్థితి:దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో అట్టడుగు స్ధానంలో నిల్చింది. చిట్టచివరి స్ధానంలో ఉన్నప్పటికీ శాంతిభద్రతలు మెరుగుపర్చడానికి కానీ, హత్యలు, అత్యాచారాలు, గంజాయి అమ్మకాలు నియంత్రణలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సీఎం, హోంమంత్రి, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి నియోజకవర్గాల్లో ఇవే సంఘటనలు జరుగుతున్నా చీమకుట్టినట్లైనా లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అత్యంత సమర్థవంతంగా శాంతిభద్రతలు నిర్వహణ ఉండేది. ఇవాళ గుడికి వెళ్తున్న భక్తులకు సైతం రక్షణ లేకుండా పోయింది.అధికార పార్టీ కనుసన్నల్లో పోలీసులు..పోలీసులు అధికార పార్టీ నేతలకు సలామ్ కొడుతూ వారి ప్రైవేటు సైన్యంలా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. పోలీస్ స్టేషన్ పైకి వెళ్లి దాడి చేసిన ఘటనలు గతంలో ఎప్పుడూ లేవు. కూటమి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైన దుస్థితి. నెల్లూరు జిల్లాలో వైయస్సార్సీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు తారాస్థాయికి చేరాయి. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పెద్ద సంఖ్యలో అక్రమ కేసులు బనాయించారు.మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై అత్యంత దారుణంగా దాడి చేసి... దాడికి పాల్పడిన వారిని వదిలేసి, తిరిగి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు. మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేసి, హత్యాయత్నం చేస్తే, వారిపై బెయిలబుల్ సెక్షన్లు కింది అరెస్టు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. దాడికి గురైన అంబటి రాంబాబు గారిపై నాన్ బెయిల బుల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు.కాకాణిపై కక్ష సాధింపు..కాకాణి గోవర్ధన్ రెడ్డి పై 20 కు పైగా అక్రమ కేసులు బనాయించింది. చివరకు గతంలో ఛార్జిషీట్ ఫైల్ చేసిన కేసుల్లో ముద్దాయి కాకపోయినప్పటికీ.. ఎవరో ఒక నిందితుడో లేక సాక్షిగా ఉన్న వ్యక్తో వాంగ్మూలం ఇచ్చారని... నాలుగైదు సంవత్సరాలు తర్వాత గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసులు నమోదు చేస్తున్నారు. మరికొన్ని కేసుల్లో 2019లో ఎవరో మద్యం పంచారని, ఎవరినో తీసుకొచ్చి బెదిరించి, బలవంతం సాక్ష్యం ఇప్పించి.. అందులో గోవర్థన్రెడ్డి ప్రమేయం ఉందని కేసు నమోదు చేస్తున్నారు.సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అనుచరులుతో ఫిర్యాదు చేయించి కేసులు నమోదు చేస్తున్నారు. విలేకరిని బెదిరించిన విషయంపై ప్రశ్నిస్తే.. దాని మీద కేసు నమోదు చేశారు. శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తూ.. ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారు.. దీనికి ప్రాయశ్చిత్తం చేసుకొండి, టీడీపీ నేతలకు ఇప్పటికైనా బుద్ధి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలకు పిలుపునిస్తూ.. ఆ కార్యక్రమం గురించి మీడియాతో మాట్లాడితే దానిపైనా కేసు నమోదు చేశారు.సోషల్ మీడియాకు సంబంధించి కూడా దాదాపు 8 కేసులు నమోదు చేశారు. ఇటీవల కొవూరులో బాధిత బాలికను పరామర్శించి ప్రెస్ మీట్ పెడుతూ.. శాంతిభద్రతలు కాపాడ్డంలో పోలీసులు విఫలమయ్యారు, పోలీసులు తమ పనితీరు మార్చుకోవాలని మాట్లాడితే దానిపైనా కేసు నమోదు చేశారు. అది కూడా పోలీసుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూటమి పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తే మరో కేసు నమోదు చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రూ.3 లక్షలు తీసుకొంటున్నారంటూ బీజేపీ నేత శేషాచలం వాట్సప్లో వీడియో పెడితే.. దాన్ని ఫార్వార్డ్ చేశారని కాకాణి గోవర్ధన్ రెడ్డి పై మరో కేసు పెట్టారు.చరిత్రలో ప్రెస్ మీట్ పెడితే కేసు నమోదు చేయడం ఇంతవరకు లేదు. తెలంగాణా హైకోర్టు ఇటీవల నల్లబాలు కేసులో రాజకీయ నాయకులు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు జాగ్రత్తగా పరిశీలించి.. నిరాధారంగా కేసులు పెట్టడానికి వీల్లేదని చెప్పింది. ప్రజాస్వామ్యంలో కనీస భావప్రకటనా స్వేచ్చే లేకపోతే ఎలా అని తీర్పునిస్తే.. సుప్రీం కోర్టు దాన్ని యథాతథంగా అమలు చేయమని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పింది. అదే విధంగా బాధితులే కేసు పెట్టాలని స్పష్టం చేసింది.కానీ ఈ రాష్ట్రంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఆయన ఇంటిపై దాడి చేయడమే కాకుండా.. ఒక ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా 36 కేసులు నమోదు చేసింది. ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఇదే తరహా కక్ష సాధింపు కేసులు నమోదు చేస్తున్నారు. చివరకు విలేకరులు, న్యాయవాదులపైనా కేసులు నమోదు చేస్తున్నారు.న్యాయవాదులపైనా అక్రమ కేసులు..కడప జిల్లా లీగల్ సెల్ ప్రతినిధి నాగిరెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టారు. వైఎస్సార్సీపీ నేతల తరపున కేసులు టేకప్ చేస్తున్నాడని భయపెట్టడానికి ఆయన మీదే కేసు పెట్టారు. చివరకు నా మీద కూడా కేసు నమోదు చేశారు. దానిపై హైకోర్టు తీవ్రంగా మందలించింది. సాక్షిలో వార్తలు రాస్తున్నారని కేసులు పెడుతున్నారు. అదే టీవీ5, ఈటీవీలో ఎంత అసభ్యకరవార్తలు రాసినా, ప్రచారం చేసినా వారిపై ఏ కేసులు ఉండవు. కూటమి ప్రభుత్వంపై వార్తలు రాస్తే మాత్రం... సాక్షితో పాటు యూట్యూబర్స్ పైనా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ తరహా విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైంది.అందుకే దేశంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో అట్టడుగ స్ధానానికి దిగజారింది. ఈ నేపధ్యంలో ఇప్పటికైనా పోలీసులు తమ తీరు మార్చుకోవాలని సూచించారు. పోలీసుల తల ఉన్నది టోపీ పెట్టుకోవడానికే తప్ప ఆలోచించడానికి కాదన్న ఓ కవి మాటలను పోలీసులు నిజం చేస్తున్నట్టే కనిపిస్తోంది. సూపర్ సిక్సి హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇలా అక్రమ కేసులు నమోదు చేయడం. .వాటిపై మీడియాలో చర్చలు పెడుతూ తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు.మరోవైపు తమ వైఫల్యాలను ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తూ వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా నిరసిస్తున్నాం. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమై ఇదే తరహాలో వ్యవహరిస్తే.. భవిష్యత్తులో ప్రభుత్వం మారిన తర్వాత వీరి పరిస్థితి ఏంటన్నది ఆలోచన చేసుకోవాలి. అలా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అధికారులందరి పేర్లను డిజిటల్ డెయిరీలో నమోదు చేస్తున్నాం. ఇలాంటి అధికారులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోకపోతే... వీరందరినీ భవిష్యత్తులో చట్టపరంగా శిక్షించడం ఖాయమని మనోహర్రెడ్డి హెచ్చరించారు. -
పిన్నెల్లి వెంటే మాచర్ల ప్రజలు
● మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ● జిల్లా కేంద్ర కారాగారంలో ములాఖత్ నెల్లూరు రూరల్: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెంటే మాచర్ల నియోజకవర్గ ప్రజలున్నారని, రానున్న ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించడం తథ్యమని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. అక్రమ కేసులో నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న పిన్నెల్లి సోదరులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జునయాదవ్తో కలిసి బుధవారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడారు. 84 రోజులుగా రామకృష్ణారెడ్డి రిమాండ్లో ఉన్నారని, అయినా చాలా ధైర్యంగా ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనలతో పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులను బనాయించారని ఆరోపించారు. జైల్లో కనీస సౌకర్యాల్లేవని, కోర్టు ఆర్డర్ ఉన్నా.. సరైన ఆహారం, వసతిని కల్పించడంలేదని ధ్వజమెత్తారు. అక్రమ కేసులు పెడుతున్న అధికారులు, దానికి కారణమైన వారిపై తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. జైలు నుంచి త్వరలోనే ఆయన బయటకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అక్రమంగా నిర్బంధించి, రాజకీయ కక్ష సాధింపులకు టీడీపీ పాల్పడుతోందని నాగార్జునయాదవ్ ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గంలో తమ పార్టీ నేతలపై 584 అక్రమ కేసులను నమోదు చేసి.. వేలాది మంది కార్యకర్తలను జైలుకు పంపారని ధ్వజమెత్తారు. సర్కార్ వేధింపులను తట్టుకోలేక సుమారు నాలుగు వేల కుటుంబాలు వలసెళ్లాయని చెప్పారు. జైల్లో ఫ్యాన్ రెగ్యులేటర్ కూడా లేకుండా చేసి ఆయనకు గాలి అందకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పిన్నెల్లి పడుతున్న ఇబ్బందులను సీసీ కెమెరాల ద్వారా వీక్షిస్తూ ఆనందిస్తున్నారని విమర్శించారు. -
ప్రజారోగ్యంతో టీడీపీ నేతల చెలగాటం
సంగం: ‘చేపలకు మేతగా చికెన్ వ్యర్థాలను తరలిస్తూ ప్రజల ఆరోగ్యంతో టీడీపీ నేతలు చెలగాటమాడుతున్నారు.. చికెన్ వ్యర్థాల దందాకు పూర్తి సహకారం అందిస్తున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి మా సొంత నగదుతో ప్రతిరోజూ చేపలను పంపిస్తాం. ఆయన తిని ఆరోగ్యం ఎలా ఉందో చెప్పాలి’ అని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సంగం మండలం దువ్వూరు వద్ద సాగు చేస్తున్న చేపల గుంతలు, అందులో వేసి ఉన్న చికెన్ వ్యర్థాలను బుధవారం రాత్రి ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంగం మండలంలో సుమారు రెండు వేల ఎకరాల్లో చేపల గుంతలను సాగు చేస్తున్నారని తెలిపారు. చేపలకు దాణాకు బదులుగా చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి చికెన్ వ్యర్థాలను అక్రమంగా తరలించి వేస్తున్నారని, దీని వల్ల ప్రజారోగ్యం పూర్తిస్థాయిలో దెబ్బతింటోందన్నారు. మరోవైపు భూగర్భజలాలు కలుషితమై సమీప గ్రామాల ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారన్నారు. చేపలకు చికెన్ వ్యర్థాల వినియోగాన్ని కట్టడి చేయాలని గత నవంబర్లో కలెక్టర్కు లేఖ ద్వారా తెలియజేసినా ఫలితం లేదన్నారు. అందుకే క్షేత్రస్థాయిలో చెరువులను పరిశీలించి చికెన్ వ్యర్థాల దందాను ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. చేజర్ల, సంగానికి చెందిన చోట నాయకుల సహకారంతో మరోనేత చికెన్ వ్యర్థాల దందాను సాగిస్తూ లక్షలు సంపాదిస్తూ నేరుగా మంత్రి కార్యాలయానికి లెక్కలు చెప్తున్నారన్నారు. ఆయన అండతోనే అధికారులు కూడా అక్రమార్కులను ఏమీ చేయలేకపోతున్నారన్నారు. ఈ విషయాన్ని నూతనంగా జిల్లాకు వచ్చిన ఎస్పీకి సైతం తెలియజేస్తామని, వారం రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. మంత్రి, అధికారులు అంతదూరం తెచ్చుకోకుండా వెంటనే ప్రజారోగ్యాన్ని దెబ్బతిసే ఈ దందాను నిలిపేయాలని కోరుతున్నామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు పులగం శంకర్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కరిముల్లా, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు దేవసహాయం, నేతలు సూరి మదన్మోహన్రెడ్డి, గుండాల బాలచంద్రారెడ్డి, పూనేటి ఫణికుమార్రెడ్డి, శంకరయ్య, బాబు, మాజీ ఎంపీటీసీ సభ్యులు హజరత్తయ్య, నెల్లూరు కోటారెడ్డి, సర్పంచ్ మానికల చందు, జనార్దన్, మాబాషా, సీతారామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.చేపల గుంతలను పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి చికెన్ వ్యర్థాల దందాకు మంత్రి ఆనం సహకారం సొంత నగదుతో చేపలను రోజూ పంపిస్తాం తిని ఆరోగ్యం ఎలా ఉందో ఆయన చెప్పాలి మాజీ ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి -
ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం
నెల్లూరు(దర్గామిట్ట): బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. యూటీఎఫ్ పిలుపు మేరకు చేపట్టిన ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టరేట్లోని తన చాంబర్లో బుధవారం ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న అత్యాధునిక వసతులు, నాణ్యమైన విద్యపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను వివరిస్తూ, విద్యార్థుల నమోదును పెంచడమే ఈ డ్రైవ్ ప్రధాన ఉద్దేశమని యూటీఎఫ్ నేతలు వెల్లడించారు. రాష్ట్ర కార్యదర్శి నవకోటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు శేషులు, జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతిశర్మ, జిల్లా గౌరవాధ్యక్షుడు అచ్చయ్య, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఖాజావలీ, జిల్లా కార్యదర్శి బాలరాగయ్య, జిల్లా కమిటీ సభ్యుడు మనోహర్బాబు పాల్గొన్నారు. అక్రిడిటేషన్ కార్డుల అందజేత నెల్లూరు(దర్గామిట్ట): ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తూ సమాజాభివృద్ధిలో మీడియా కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా కాంక్షించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ కార్డులను బుధవారం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. వీటిని అందజేయడం సంతోషంగా ఉందని తెలిపారు. జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారి వేణుగోపాల్రెడ్డి, డివిజనల్ పీఆర్వోలు రవికుమార్, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో 2026 – 27 విద్యా సంవత్సరంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ పీజీసెట్ నోటిఫికేషన్ను విడుదల చేశారని డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ హనుమారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు కళలు, శాస్త్రాలు, వాణిజ్యం, ప్రొఫెషనల్ కోర్సులకు ఈ పరీక్ష ఆధారంగా అడ్మిషన్లను నిర్వహించనున్నారని వెల్లడించారు. దరఖాస్తు సమర్పణకు ఈ నెల తొమ్మిది తుది గడువని, అపరాధ రుసుముతో ఈ నెల 23 వరకు అవకాశం ఉందని చెప్పారు. 24, 25న సవరణ, ఏప్రిల్ 21 నుంచి హాల్టికెట్ల డౌన్లోడ్, మే ఐదు నుంచి 11 వరకు రోజూ మూడు సెషన్లలో పరీక్షలను నిర్వహించనున్నారని ప్రకటించారు. అందుబాటులో ఉన్న కోర్సులు, ఫీజులు ఇతర వివరాలకు వీఎస్యూ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. వైద్యశాఖలో ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల నెల్లూరు(అర్బన్) జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఇటీవల వెలువడిన నోటిఫికేషన్ మేరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేశామని డీఎంహెచ్ఓ సుజాత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్, చైల్డ్ సైకాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసిన వారు మెరిట్ జాబితాను spsnellore. ap. gov. in/ recruitmentలో పరిశీలించాలని కోరారు. అభ్యంతరాలుంటే తగు ఆధారాలను వైద్యశాఖ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రంలోపు సమర్పించాలని కోరారు. పాలను కల్తీ చేస్తే చర్యలు నెల్లూరు(అర్బన్): పాలు, పాల పదార్థాలను కల్తీ చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపడతామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పాలసేకరణ కేంద్రాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు, హోటళ్లు, స్వీట్ స్టాళ్లలో తనిఖీలను ఫుడ్ సేఫ్టీ విభాగాధికారులు కొద్ది రోజులుగా చేపట్టి నమూనాలను సేకరించారు. ఈ క్రమంలో ట్రంక్రోడ్డు సమీపంలోని ఓ సమావేశ మందిరంలో వ్యాపారులతో అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు. -
మచ్చలేని రాజకీయాలతో ముందుకెళ్తూ..
● నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషి ● హామీలను అమలు చేయని చంద్రబాబు ● మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి మర్రిపాడు: దశాబ్దాల రాజకీయ జీవితంలో తమ సొంత నిధులతో రాజకీయాలు చేశామే తప్ప ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి పేర్కొన్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి జ్ఞాపకార్థం మండలంలోని సింగనపల్లిలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం రాజమోహన్రెడ్డి మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో తమ కుటుంబంపై వేలెత్తి చూపే వారెవరూ లేరని, మచ్చలేని రాజకీయాలు చేస్తూ నమ్మిన ప్రజలు, పుట్టిన గడ్డను అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తున్నామని తెలిపారు. తాము అధికారంలోకి ఉన్నా.. లేకపోయినా, ఆత్మకూరు నియోజకవర్గాన్ని సొంత నిధులతో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. మైనింగ్లో అక్రమాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయకుండా ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఇసుక, మైనింగ్ అక్రమాలు పెరిగిపోయాయని చెప్పారు. మర్రిపాడులో ఉన్న ఇసుక కొండను మంత్రి కాక ముందే మాయం చేశారని విమర్శించారు. 21 నెలల్లో హైలెవల్ కెనాల్ పనులు ఒక్క శాతం ముందుకు సాగలేదని తెలిపారు. దీన్ని పూర్తి చేసి మెట్ట నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసేందుకు గానూ జగన్మోహన్రెడ్డిని మరోసారి సీఎంను చేసుకుందామని పిలుపునిచ్చారు. 17 మెడికల్ కళాశాలలు, పది ఫిషింగ్ హార్బర్లు ఇలా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఆయన అభివృద్ధి చేసిన అంశాన్ని ప్రస్తావించారు. అవసరమైన ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్లు ఆత్మకూరులో ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నామని మేకపాటి విక్రమ్రెడ్డి వెల్లడించారు. దివంగత సీఎం వైఎస్సార్తో కలిసి ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు గానూ హైలెవల్ కెనాల్ పనులను తన తండ్రి మేకపాటి రాజమోహన్రెడ్డి మంజూరు చేయించారని చెప్పారు. అయితే పనులు నిలిచిపోవడానికి కారణం భూసేకరణ తారుమారు కావడమేనని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో పనులను ప్రభుత్వం నిలిపేసిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తమ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపర్చి, తమ ప్రభుత్వం కొలువుదీరాక వీటిని పూర్తి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని తెలిపారు. అందరి సహకారంతో నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు. మర్రిపాడు జెడ్పీటీసీ మల్లు సుధాకర్రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ చెన్ను వెంకటేశ్వరరెడ్డి, గంగవరపు శ్రీనివాసులునాయుడు, కాశిరెడ్డి, లక్ష్మీరెడ్డి, నారపరెడ్డి, కాంతారెడ్డి, ప్రతాప్రెడ్డి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవంలో అపశృతి
నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లాలో అపశృతి చోటు చేసుకుంది. బోగోలు మండలంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవంలో ఒక్కసారిగా తెప్ప పక్కకు ఒరిగిపోయింది. దీంతో భక్తులంతా నీళ్లలో పడిపోయారు. సామర్థ్యానికి మించి ఒకేసారి తెప్పపైకి 80 మందికి పైగా ఎక్కడంతో ఈ ఘటన జరిగింది. తెప్ప ఒకపక్క మునిగిపోవడంతో.. స్వామివారిని చేతులతోనే మోస్తూ భక్తులు ఊరేగింపు నిర్వహించారు. -
క్రికెట్ బెట్టింగ్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
● ల్యాప్టాప్, నాలుగు సెల్ఫోన్ల స్వాధీనం నెల్లూరు(క్రైమ్): క్రికెట్ బెట్టింగ్ కేసులో కీలక నిందితుడితోపాటు మరొకర్ని నెల్లూరు బాలాజీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నగరంలోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో వివరాలను నగర ఏఎస్పీ దీక్ష వెల్లడించారు. ఆన్లైన్ యాప్లో పెట్టుబడులు పెడితే లాభాలొస్తాయని ఎన్టీఆర్ నగర్కు చెందిన ఓ వ్యాపారిని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన వేణుగోపాల్ నమ్మించాడు. రూ.53 లక్షలను కాజేసి, మోసగించడంపై బాధిత వ్యాపారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో వేణుగోపాల్, వెంకటరమణ, మహేష్కుమార్, మణికుమార్ మరికొందరితో కలిసి క్రికెట్ బెట్టింగ్ ఆడిస్తున్నారని వెల్లడైంది. వేణు, వెంకటరమణను పోలీసులు గత నెల 19వ తేదీన అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మణికుమార్, మహేష్కుమార్ కోసం గాలించారు. బెంగళూరులో ఉంటున్న బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన మహేష్బాబుతో కలిసి నిందితులు బెట్టింగ్ను నిర్వహిస్తున్నారనే అంశాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడ మహేష్బాబు, అతని సహచరుడు, కందుకూరు ప్రాంతానికి చెందిన హరికృష్ణను ప్రత్యేక బృందం అరెస్ట్ చేసింది. వారి నుంచి ల్యాప్టాప్, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సులభంగా.. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా మహేష్బాబు పనిచేశాడు. సులభ మార్గంలో డబ్బు సంపాదించాలని శ్రీలంక, దుబాయ్కు పలుమార్లు వెళ్లి క్రికెట్ బెట్టింగ్ యాప్ల నిర్వహణపై అవగాహన పెంచుకున్నాడు. దుబాయ్ వాళ్ల దగ్గర రాధే ఎక్స్చేంజ్ యాప్ (ఆర్ 777)ను 30 శాతం షేర్ వచ్చేలా తీసుకుని వేణు, మహేష్కుమార్, మణికి 15 శాతాన్ని ఇస్తూ క్రికెట్ బెట్టింగ్ను నిర్వహిస్తున్నాడు. పరారీలో ఉన్న మిగిలిన నిర్వాహకులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఏఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు, ఎస్సై విజయశ్రీనివాస్ సిబ్బందిని అభినందించారు. వెంకటాచలంలో టీడీపీ పతనం తప్పదు● బీజేపీ సీనియర్ నేత కుంచి శ్రీనివాసులు యాదవ్ వెంకటాచలం: చవటపాళెం సొసైటీ చైర్మన్ రావూరు రాధాకృష్ణమ నాయుడు పెత్తనం కొనసాగితే వెంకటాచలం మండలంలో టీడీపీ పతనం తప్పదని బీజేపీ సీనియర్ నేత, నిడిగుంటపాళెం సాగునీటి సంఘం అధ్యక్షుడు కుంచి శ్రీనివాసులు యాదవ్ అన్నారు. మండలంలోని నిడిగుంటపాళెంలో పంచాయతీ తీర్మానాలు లేకుండా జరుగుతున్న పనులను మంగళవారం ఎంపీటీసీ మేకల ప్రవళ్లికతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మండలంలో రాధాకృష్ణమ నాయుడు పెత్తనంతో ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి చేసి పనులు జరగకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. గ్రామంలో ఉన్న దళిత ఎంపీటీసీ సభ్యురాలు ప్రవళ్లికకు సమాచారం ఇవ్వకుండానే పనులు చేయించడం ఏమిటని ప్రశ్నించారు. పంచాయతీ అనుమతి లేకుండా, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా రూ.10 లక్షల విలువైన పనులను ఎలా ప్రారంభిస్తారని నిలదీశారు. బిల్లల కోసమే అవసరం లేకున్నా ఈ పనులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రవళ్లిక మాట్లాడుతూ గ్రామంలో జరిగే కార్యక్రమాల గురించి తమకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు హసనాపురం శ్రీనివాసులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పిచ్చికుక్క స్వైర విహారం ● పదిమందికిపైగా గాయాలు మనుబోలు: మండల కేంద్రమైన మనుబోలులో పిచ్చికుక్క మంగళవారం స్వైర విహారం చేసి పదిమందికి పైగా గాయపరిచింది. స్థానికుల కథనం మేరకు.. మనుబోలు కోదండరాపురం పూల దుకాణం వద్ద పిచ్చికుక్క పలువురిపై దాడి చేసింది. గ్రామానికి చెందిన మస్తాన్రెడ్డి కాలికి తీవ్ర గాయమైంది. పలువురు బాధితులు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రేబిస్ ఇంజెక్షన్ వేయించుకున్నారు. -
రుణం కావాలా.. వాటా ఇస్తే చాలు
నెల్లూరు(పొగతోట): ‘మీరు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారని తెలిసింది. గ్రూపుగా ఏర్పడితే రుణం ఇప్పిస్తాం’ ఇలా కొందరు వ్యక్తులు పేద మహిళలను టార్గెట్గా చేసుకుని నట్టేట ముంచుతున్నారు. జిల్లాలో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. ఏజెంట్ల అవతారమెత్తిన పలువురు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడేవారిని గుర్తిస్తున్నారు. ఒక్కో గ్రామంలో ఐదుగురు మహిళలను నియమించినట్లు సమాచారం. ఏజెంట్లు మహిళలకు మాయమాటలు చెప్పి రుణాలు మంజూరు చేయిస్తామని గ్రూపులు ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ విషయంలో ఏజెంట్లు, బ్యాంక్ అధికారులు, మండల సిబ్బందికి మధ్య సఖ్యత ఉన్నట్లు సమాచారం. ఏం చేస్తున్నారంటే.. ఒక్కో మహిళ నుంచి రూ.1,000లు వసూలు చేసి పదిమంది చేత కొత్త గ్రూపులు ఏర్పాటు చేయిస్తున్నారు. రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బ్యాంక్ల నుంచి రూణాలు మంజూరు చేయిస్తామని ఏజెంట్లు నమ్మబలుకుతున్నారు. రూ.10 లక్షల మంజూరు చేయిస్తే 50 శాతం గ్రూపునకు, మిగిలింది మాకు ఇవ్వాలంటూ అగ్రిమెంట్ చెబుతున్నారు. మేము తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లిస్తామని ఏజెంట్లు చెబుతున్నారు. అయితే బ్యాంక్లిచ్చిన పూర్తి రుణం మహిళల పేరుతో ఉంటుంది. ఏజెంట్లు ఒక సంవత్సరంపాటు నగదు చెల్లించి తర్వాత చేతులెత్తేస్తే బాధ్యత మొత్తం గ్రూపువారే వహించాలి. వడ్డీతో తిరిగి జమ చేయాల్సి ఉంటుంది. నిబంధనలు గాలికి.. మహిళ బ్యాంక్కు ఎటువంటి బాకీ లేకపోతే కొత్త గ్రూపులో చేరడానికి, కొత్తడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ బకాయిలుంటే నూతన గ్రూపు ఏర్పాటు చేయడం సాధ్యపడదు. మహిళ ఆధార్ నంబర్ నమోదు చేస్తే బకాయిల వివరాలు వెల్లడవుతాయి. అయితే ఏజెంట్లు బ్యాంక్ అధికారుల సహకారంతో బకాయిలున్న వారిచేత కూడా కొత్తవి ఏర్పాటు చేయిస్తున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం మహిళ ఒక గ్రూపులో మాత్రమే సభ్యురాలుగా కొనసాగాలి. రుణాన్ని తిరిగి చెల్లించకపోయినా, నిబంధనలు పాటించకపోయినా తీర్మానం చేసి తొలగిస్తారు. అయితే దీంతో సంబంధం లేకుండా కొత్త గ్రూపులు పెడుతున్నట్లు సమాచారం. ఇందుకు మండల సిబ్బంది, బ్యాంకర్లు సహాయ సహాకారాలు అందిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. చర్యల్లేవు కోవూరు మండలంలో 20కిపైగా కొత్త గ్రూపులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. పడుగుపాడు ఎన్టీఆర్ కాలనీలో పదిమంది మహిళల చేత గ్రూపు పెట్టించారు. రుణాలు మంజూరు చేయించడంలో జాప్యం జరగడంతో మహిళలు పొదుపు చేసిన రూ.10 వేలను విత్డ్రా చేశారు. ఈ విషయం తెలు సుకున్న ఏజెంట్లు కాలనీకి వచ్చి పెద్ద గొడవ చేసినట్లు సమాచారం. దీనిపై మండల పొదుపు సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గ్రామీణ మహిళలే ఏజెంట్ల టార్గెట్ కొత్త గ్రూపులతో బ్యాంక్ల నుంచి రుణాలు 50 శాతం సభ్యులకు.. మిగిలింది ఏజెంట్లకు కోవూరు మండలంలో కొత్తగా 20 గ్రూపులుఫిర్యాదులు అందలేదు నిబంధనలు పాటించకుండా కొత్త గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారని ఫిర్యాదులు అందలేదు. స్వయం సహాయక గ్రూపు మహిళలు ఒక గ్రూపులో మాత్రమే సభ్యులుగా ఉండాలి. నిబంధనలు పాటించకుండా గ్రూపులు ఏర్పాటు చేసే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. మహిళలు ఏజెంట్ల మాటలు విని మోసపోవద్దు. కొత్త గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేయిస్తామని ఎవరైనా వస్తే ఫిర్యాదు చేయండి. – నాగరాజకుమారి, డీఆర్డీఏ పీడీ -
పారిశ్రామిక వినియోగదారుల ప్రత్యేక వేదిక నేడు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ఆదేశాలతో బుధవారం నెల్లూరులోని విద్యుత్ భవన్లో పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల ప్రత్యేక వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్ఈ రాఘవేంద్రం అన్నారు. నగరంలోని విద్యుత్ భవన్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతినెలా మొదటి బుధవారం జిల్లాలోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామన్నారు. ఉదయం 10:30 నుంచి 11:30 గంటల మధ్య సమస్యలు చెప్పొచ్చన్నారు.కండలేరులో 52.960 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 52.960 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,100, లోలెవల్ కాలువకు 100, హైలెవల్ కాలువకు 240, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
చిరుత సంచారంపై అటవీ అధికారుల పరిశీలన
ఉదయగిరి రూరల్: మండలంలోని వెంగళరావునగర్ సమీపంలో చిరుతపులి సంచరిస్తోందనే అంశంపై ఎఫ్బీఓ అఫ్జల్, ఏబీఓ వెంకటేశ్వర్లు మంగళవారం పరిశీలించారు. వివరాలు.. దుత్తలూరు మండలం పాపంపల్లికి చెందిన వెంకటరమణ పనినిమిత్తం బైక్పై గండిపాళేనికి సోమవారం వెళ్లి, తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో గండిపాళెం – వెంగళరావునగర్ మధ్య ఉన్న జామాయిల్ చెట్ల వద్ద చిరుతపులి రోడ్డు దాటుతుండడాన్ని సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో గుర్తించారు భయభ్రాంతులకు గురైన ఆయన కొద్దిసేపు అక్కడే ఉన్నారు. ఆపై విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయడంతో వారు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని ఆనవాళ్ల కోసం క్షుణ్ణంగా పరిశీలించగా, ఎలాంటి గుర్తులు లభించలేదు. మరోవైపు చిరుత సంచారంపై గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. -
అంగన్వాడీ కార్యకర్తల కన్నెర్ర
● వంద రోజుల హామీ ఏమైంది చంద్రబాబూ..? ● నగరంలో భారీ నిరసన ర్యాలీ నెల్లూరు(వీఆర్సీసెంటర్): తమ పార్టీ అధికారంలోకి వస్తే అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను వంద రోజుల్లో పరిష్కరిస్తామని గత ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారని, వీటి సాధన కోసం శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులతో శిబిరాలను ధ్వంసం చేయించి, నేతలను అక్రమ అరెస్ట్ చేయించడం అమానుషమని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రెహనాబేగం ఆరోపించారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీసెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీని అంగన్వాడీ కార్యకర్తలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కూటమి పార్టీలకు ఓట్లేసి గెలిపించామని, అయితే అధికారంలోకి వచ్చి 21 నెలలైనా, నేటికీ ఎలాంటి ప్రయోజనం లేదని ధ్వజమెత్తారు. తమ సమస్యలపై ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులకు వినతిపత్రాలను అందించినా, ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో విజయవాడలో ధర్నా చేస్తున్న సమయంలో శిబిరంలో ఉన్న అంగన్వాడీ నేతలపై పోలీసులు మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో లాఠీచార్జి జరిపి అరెస్ట్ చేశారని ఆరోపించారు. వీరిని ఎక్కడికి తీసుకెళ్లారో ఇప్పటికీ తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. అవమానకర రీతిలో రోడ్డుపై ఈడ్చుకుంటూ లాఠీలతో దాడి చేస్తూ అరెస్ట్ చేయడాన్ని మహిళా లోకం తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. వీరిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు కొందరు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నమ్మించి మోసం చేసిన చంద్రబాబుకు తమ సత్తా ఏమిటో చూపుతామని స్పష్టం చేశారు. హామీలను అమలు చేయకపోతే ఆయన్ను ఇంటికి పంపడం ఖాయమని తేల్చిచెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ.26 వేల వేతనాన్ని ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించి వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. దశల వారీగా ఉద్యమాలు, ఆందోళనలను చేపడతామని.. అవసరమైతే సర్కార్ ఇచ్చిన సెల్ఫోన్లను సైతం తిరిగి అప్పగిస్తామన్నారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాతమ్మ, కమిటీ సభ్యులు మల్లమ్మ, కామాక్షమ్మ, నాగభూషణమ్మ, పెంచలమ్మ, సంపూర్ణమ్మ, రజని, రమీజా, రత్నమ్మ, సీఐటీయూ నేత నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్ ఒత్తిడికి ఏకంగా రోడ్డు వర్కే క్యాన్సిల్..!
అధికారం అండ ఉంది.. అడిగే దమ్ము ఎవరికుంది? అనే ధీమా అతనితో అడ్డదారులు తొక్కించింది. రోడ్డు నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి అడ్డదారిలో టెండర్ వేశాడు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ యంత్రాంగం మాత్రం కళ్లకు గంతలు కట్టుకుని నిబంధనలు విస్మరించి టెండర్ ఓకే చేశారు. ఈ లోపు సదరు పనికి సంబంధించి అడ్వాన్స్ గ్రాంట్తో పనులు ప్రారంభించి హడావుడిగా చేపట్టారు. అడ్డదారిలో కాంట్రాక్ట్ దక్కించుకోవడంతో ఎవరైనా ఫిర్యాదు చేసినా.. పనులు తనతోనే పూర్తి చేయిస్తారనే ధీమా కావొచ్చు. మరో కాంట్రాక్టర్ వచ్చి వేలు పెట్టలేని రీతిలో పనులు చేసి.. చేసిన పనులకు రూ.కోట్లల్లో బిల్లులు ఇవ్వాలని పంచాయతీ రాజ్ అధికారులపై ఒత్తిడి పెంచారు. అనుకున్నట్లుగానే న్యాయవాదులు, తోటి కాంట్రాక్టర్లు విజిలెన్స్కు ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్ విచారణ జరుగుతోంది. అయితే సదరు కాంట్రాక్టర్ మాత్రం చేసిన పనులకు అడ్డుగోలుగా బిల్లులు చేయమని ఒత్తిడి చేయిస్తుండడంతో ఈ పరిస్థితుల్లో బిల్లులు చేసేందుకు అధికారులు సిద్ధంగా లేక.. తలలు పట్టుకుంటున్నారు. సాక్షి టాస్క్ఫోర్స్: అతనొక కాంట్రాక్ట్ మాఫియా. ఆయనకు జిల్లాలోని ఓ కీలక మంత్రి అండదండలు ఉన్నాయి. పోటీపడే కాంట్రాక్టర్లను ఏకంగా సదరు మంత్రి వ్యక్తిగత సహాయకులతో బెదిరిస్తాడు. పనిలో పనిగా సంబంధిత ఇంజినీరింగ్ శాఖల అధికారులను సైతం బెదిరించి తన గుప్పెట్లో పెట్టుకుని టెండర్లలో మాయోపాయం ప్రదర్శించి, చివరికి సొంతం చేసుకోవడంలో ఆరితేరాడు. ప్రాంతం ఏదైనా.. వర్కు ఏదైనా తనకు దక్కాల్సిందే. లేదంటే.. ఉద్యోగాలను ఊడగొడతానంటూ నిబంధనలు చూడొద్దంటూ తనదైన రాజకీయం చేస్తాడు. ఇతని వలలో పడిన ఆత్మకూరు పంచాయతీరాజ్ అధికారుల సీటుకు ఎసరు వచ్చింది. ఆత్మకూరు బైపాస్ రోడ్డు టెండర్ కాంట్రాక్ట్ వ్యవహారం పంచాయతీరాజ్శాఖ మెడకు చుట్టుకుంది. అర్హత లేకపోయినా.. అధికాన్ని అడ్డం పెట్టుకుని కాంట్రాక్ట్ కోసం టెండర్ వేస్తే.. సంబంధిత అధికారులు సైతం అధికారానికి తలొగ్గి టెండర్ ఖరారు చేశారు. తమ్ముడు అక్రమ టెండర్ వ్యవహారం రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్తే.. అక్కడి నుంచి విచారణకు ఆదేశించినా అధికారులు కనీసం స్పందించకపోవడంతో చివరకు విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో ఇప్పుడు వారి సీటు కిందకే నీళ్లు తెచ్చే పరిస్థితి నెలకొంది. బిడ్ కెపాసిటీకి మించి నాలుగు రెట్లు అధికంగా.. ఆత్మకూరు మండలం రామస్వామిపల్లికి చెందిన ఓ కాంట్రాక్టరు చాలా కాలంగా కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు. జిల్లాతోపాటు కర్నూలు, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్, తదితర తెలంగాణ జిల్లాల్లోనూ పనులు చేస్తున్నాడు. సాధారణంగా ప్రతి కాంట్రాక్టరుకు వారి ఎక్స్పీరియన్స్ను బట్టి బిడ్ కెపాసిటీని నిర్ణయిస్తారు. ఆ కెపాసిటీకి లోబడే ఎక్కడైనా టెండర్లు వేయాల్సి ఉంటుంది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ కాంట్రాక్టరుకు బిడ్ కెపాసిటీ రూ.52.60 కోట్లు మాత్రమే ఉండగా ఇప్పటికే తెలంగాణలో ఒక్క ఆర్అండ్బీ శాఖలోనే రూ.60 కోట్లకు పైగా ఆన్హ్యాండ్ వర్కులు చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక కర్నూలులోని పంచాయతీరాజ్ శాఖ పరిధిలో మరో రూ.80 కోట్లు వర్కులు ఉండగా, జిల్లాలో కూడా మరో రూ.20 కోట్ల వరకు వర్కులున్నట్లు తెలుస్తోంది. అంటే ఇప్పటికే తన బిడ్ కెపాసిటీకి మించి టెండర్లు వేసి వర్కులు తీసుకున్నాడు. ఆన్ హ్యాండ్ వర్కులు దాచి భారీగా టెండర్లు అదే సమయంలో ఇటీవల ఆత్మకూరులో బైపాస్ రోడ్డు వర్కుకు టెండర్లు పిలవగా అది కూడా ఆ కాంట్రాక్టరే దక్కించుకున్నాడు. ఈ టెండరు సమయంలో కూడా ఇతర ప్రాంతాల్లోని ఆన్ హ్యాండ్ వర్కులను చూపించలేదని అభియోగాలున్నాయి. ఈ టెండరు సమయంలో ఇతర కాంట్రాక్టర్లు పోటీకి రాకుండా రాజకీయ ఒత్తిళ్లు తేవడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ఇలా.. తన బిడ్ కెపాసిటీ రూ.52 కోట్లు అయితే అందుకు రెండింతలు అధికంగా వర్కులు దక్కించుకున్నారని సీఎంఓకు చేసిన ఫిర్యాదులో ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆన్హ్యాండ్ వర్కులు దాచి పెట్టి అధికారులకే మస్కా కొడుతూ టెండర్లు చేస్తున్నారని, తద్వారా ఇతర కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారంటూ సీఎంఓకు ఫిర్యాదు అందడంతో అక్కడి అధికారులు స్పందించారు. విచారణకు ఆదేశించినా.. తొక్కిపెట్టి.. సదరు కాంట్రాక్టర్ రూ.200 కోట్ల మేర తెలుగు రాష్ట్రాల్లో వర్కులు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై గతేడాది సెప్టెంబర్లోనే విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అయితే సదరు కాంట్రాక్టరు తనకున్న రాజకీయ పలుకుబడితో సీఎంఓకు నివేదిక పంపకుండా పంచాయతీరాజ్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాక్షాత్తు సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదును సైతం ఇంజినీరింగ్ అధికారులు బుట్టదాఖలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల ఓ న్యాయవాది సైతం కాంట్రాక్టర్ సంబంధించిన అక్రమాలపై కూడా సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించి న్యాయస్థానంలో పిల్ వేసినట్లుగా తెలిసింది. ఇంజినీరింగ్ అధికారుల వ్యవహార శైలిపై అనుమానం పెరిగిన సదరు కాంట్రాక్టర్ల బాధితులు ఏకంగా విజిలెన్స్ విచారణ చేయించమని మరోసారి సీఎంఓకు ఫిర్యాదులు వెళ్లడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశాలివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు కాంట్రాక్టర్ ఏఏ ప్రాంతాల్లో పనులు చేశారో అన్ని శాఖల నుంచి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రోడ్డు బిల్లు కోసం ఒత్తిడి ఆత్మకూరు బైపాస్రోడ్డు టెండర్ను అడ్డదారిలో దక్కించుకుని నాసిరకంగా పనులు చేస్తున్నారు. టెండర్ విధానంలోనే తప్పులు చేసినట్లు నిర్ధారణ కావడం, సీఎంఓ కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లడంతో ఆ టెండర్ను రద్దు చేయాల్సి ఉంది. కానీ ఇంజినీరింగ్ అధికారులు ప్రస్తుతం అధికార పార్టీ నేతల ఒత్తిడితో టెండర్ క్యాన్సిల్ చేయకపోగా, బిల్లులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు రాజకీయ ఒత్తిడితోనే బిల్లు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంట్రాక్ట్ కోసం అర్హత లేని తమ్ముడి అడ్డదారులు బిడ్ కెపాసిటీ లేకపోయినా టెండర్ల దాఖలు ఆన్ హ్యాండ్ వర్కులు చూపడంలో మతలబు ఇప్పటికే రాష్ట్రంలో రూ.200 కోట్ల పనులకు కాంట్రాక్ట్లు సీఎంఓ విచారణకు ఆదేశించినా అధికారుల బుట్టదాఖలు కాంట్రాక్టర్ చేసిన పనులకు బిల్లు చేయమని ఒత్తిడి సదరు తమ్ముడికి భయపడి సోమశిల రోడ్డు పనులే క్యాన్సిల్..!సదరు కాంట్రాక్టర్ ధనదాహానికి రాజకీయ అండ ఉండడంతో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. అడ్డదారుల్లో అడ్డుగోలుగా నిబంధనలు తుంగలో తొక్కి అత్మకూరులో కాంట్రాక్టర్ దక్కించుకున్న ఆయనకు రాజకీయ పలుకుబడి ఉండడంతో మరో వర్కు క్యాన్సిల్ చేయించాడు. ఆత్మకూరు నుంచి సోమశిలకు వెళ్లే రోడ్డు మరమ్మతుల కోసం ప్రభుత్వం ఆర్అండ్బీ శాఖ ద్వారా రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఆ వర్కుకు కూడా సదరు కాంట్రాక్టర్ టెండర్ వేశారు. టెండర్ ఓకే చేయకుంటే మీ ఉద్యోగాలు ఊడదీస్తానంటూ సంబంధిత అధికారులపై బెదిరింపులకు దిగడడంతో వారు ఎక్కడ తమ ఉద్యోగాలకు ఎసరొస్తుందోనని ఏకంగా వర్కునే క్యాన్సిల్ చేసి మిన్నకుండిపోయారు. -
పీఆర్సీని అమలు చేయాలంటూ ధర్నా
నెల్లూరు(దర్గామిట్ట): రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించడంతో పాటు బకాయిలను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి చిరంజీవి డిమాండ్ చేశారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో కలెక్టరేట్ ఎదుట ధర్నాను ఏపీటీఎఫ్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి 21 నెలలవుతున్నా, నేటికీ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. నాలుగు విడతల డీఏను ప్రకటించకపోవడం దారుణమన్నారు. అనంతరం జిల్లా గౌరవాధ్యక్షుడు శివకోటారెడ్డి మాట్లాడారు. సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని కోరారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ను అనుసరించి అన్ని రకాల ఉద్యోగోన్నతులను కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పిచ్చిబాబు, రాష్ట్ర సబ్ కమిటీ సభ్యుడు రియాజ్, ఏపీటీఎఫ్ బాధ్యులు శివరామిరెడ్డి, సుబ్బారెడ్డి, జుల్ఫికర్ అలీ, కృష్ణారెడ్డి, బాలాత్రిపురసుందరి, వెంకటేశ్వర్లు అబ్బూరి శ్రీను, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మర్యాదపూర్వకంగా..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. 8న జిల్లా స్థాయి బ్యాడ్మింటన్, టెన్నిస్ పోటీలు నెల్లూరు(స్టోన్హౌస్పేట): జిల్లా స్థాయి మాస్టర్స్ టెన్నిస్, బ్యాడ్మింటన్ పోటీలను ఈ నెల ఎనిమిదిన నిర్వహించనున్నామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పాండురంగారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ లీగ్ పోటీల్లో భాగంగా దర్గామిట్టలోని నెల్లూరు క్లబ్లో 40 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలకు మాస్టర్స్ టెన్నిస్ పోటీలను సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో జరపనున్నామని వివరించారు. 35 నుంచి 45 ఏళ్లలోపు పురుషులు, మహిళలకు బ్యాడ్మింటన్ పోటీలను సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించనున్నామని వెల్లడించారు. sports.ap.gov.inలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఇక్కడ ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నామని, వివరాలకు 88862 28444, 95813 72472 నంబర్లను సంప్రదించాలని సూచించారు. 135 పంచాయతీల్లో నూరు శాతం పన్నుల వసూలు పొదలకూరు: జిల్లాలోని 135 పంచాయతీల్లో ఇంటి పన్నులను నూరు శాతం మేర వసూలు చేయగలిగామని డీపీఓ వసుమతి పేర్కొన్నారు. పొదలకూరు పంచాయతీలో పేరుకుపోయిన ఇంటి పన్నులను వసూలు చేయించే నిమిత్తం పట్టణంలో మంగళవారం ఆమె పర్యటించారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 722 గ్రామ పంచాయతీలున్నాయని, నూరు శాతం మేర పన్నుల వసూల్లో పురోగతి చూపాల్సిన అవసరం ఉందని చెప్పారు. పొదలకూరు పంచాయతీలో బకాయిలు పేరుకుపోవడంతో స్పెషల్ డ్రైవ్ను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. నూరు శాతం వసూలు చేసిన వాటిలో సైదాపురం పంచాయతీ ఉందన్నారు. స్వామిత్వ సర్వే ద్వారా ప్రతి ఇంటికీ అసెస్మెంట్ నంబర్ను అందజేయనున్నామని, పొదలకూరులో డోర్ నంబర్లను కూడా పూర్తి చేయనున్నామని ప్రకటించారు. ఎంపీడీఓ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. వెంకటశేషయ్యకు బెయిల్ పునరుద్ధరణ వెంకటాచలం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్యకు బెయిల్ను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులను హైకోర్టు మంగళవారం జారీ చేసింది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వెంకటాచలం పోలీస్స్టేషన్ పరిధిలో 2024, డిసెంబర్లో అక్రమ కేసును టీడీపీ ప్రభుత్వం నమోదు చేసి జైలుకు పంపింది. ఆ తర్వాత కొన్ని రోజులు జైల్లో ఉన్న ఆయనకు బెయిల్ మంజూరు కావడంతో బయటకొచ్చారు. ఈ తరుణంలో బెయిల్ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ను ప్రాసిక్యూషన్ దాఖలు చేయడంతో, దీన్ని రద్దు చేస్తూ గత నెల 23న ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో హైకోర్టులో రీకాల్ పిటిషన్తో పాటు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తూ తన బెయిల్ రద్దుకు కారణమైన పోలీస్ అధికారులపై చర్యలు చేపట్టాలంటూ మరో పిటిషన్ను గత నెల 26న దాఖలు చేశారు. రీకాల్ పిటిషన్పై లంచ్ మోషన్లో వాదనలు జరిగాయి. ఇవి విన్న న్యాయమూర్తి.. వెంకటశేషయ్య తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించి బెయిల్ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని దీన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. -
కాటేసిన పాముతో ఆస్పత్రికి..
నెల్లూరు జిల్లా: సాధారణంగా పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరిగెడతాం. అలాంటిది తనను కాటేసిన పామును చంపి.. దాన్ని చేత్తో పట్టుకొని నేరుగా ఆస్పత్రికే వచ్చారో వ్యక్తి. కోవూరు ప్రభుత్వ వైద్యశాల సాక్షిగా ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఈ సాహసం చూసి రోగులు, ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కోవూరు పరిధిలోని భగత్సింగ్ కాలనీకి చెందిన వలీ పనుల్లో ఉండగా, ఓ పాము కాటేసింది. అయితే దాన్ని అక్కడికక్కడే చంపేశారు. ఏ పాము కరిచిందో తెలిస్తేనే వైద్యం కచ్చితంగా అందుతుందనే ఉద్దేశంతో నేరుగా దాంతో సహా కోవూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలోని వారంతా భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది వెంటనే స్పందించి చికిత్సను ప్రారంభించారు. ప్రస్తు తం వలీ పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. -
వినతులిచ్చి.. పరిష్కారం కోరి..
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● పోటెత్తిన అర్జీదారులునెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్కుమార్, డిప్యూటీ కలెక్టర్ మురళి, జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి, డీపీఓ వసుమతి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డీడీ నాగశేఖర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోపు అర్జీలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మురళి, డీపీఓ వసుమతి, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, బీసీ సంక్షేమాధికారి వెంకటలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. నిర్లక్ష్య ధోరణి వద్దు కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సమస్యల విషయంలో నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ దివ్యాంగ విభాగం నెల్లూరు అధ్యక్షుడు షేక్ సుభాన్బాషా, రూరల్ అధ్యక్షుడు సాధు పెంచలరెడ్డి, ఆదెమ్మ అన్నారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఇటీవల త్రీవీలర్ స్కూటీలకు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను ప్రభుత్వం నుంచి వచ్చిన గైడెన్స్ ప్రకారం చేశామని చెప్పారే కానీ పూర్తిగా అవగాహన లేకుండా పోయిందన్నారు. సదరం సర్టిఫికెట్లు దివ్యాంగులకు ఎంతో ముఖ్యమైనవని, ఇలాంటి విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. వీటిపై సంబంధిత మంత్రి వెంటనే సమీక్ష నిర్వహించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరారు. -
కాటేసిన పాముతో ఆస్పత్రికి..
కోవూరు: సాధారణంగా పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరిగెడతాం. అలాంటిది తనను కాటేసిన పామును చంపి.. దాన్ని చేత్తో పట్టుకొని నేరుగా ఆస్పత్రికే వచ్చారో వ్యక్తి. కోవూరు ప్రభుత్వ వైద్యశాల సాక్షిగా ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఈ సాహసం చూసి రోగులు, ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కోవూరు పరిధిలోని భగత్సింగ్ కాలనీకి చెందిన వలీ పనుల్లో ఉండగా, ఓ పాము కాటేసింది. అయితే దాన్ని అక్కడికక్కడే చంపేశారు. ఏ పాము కరిచిందో తెలిస్తేనే వైద్యం కచ్చితంగా అందుతుందనే ఉద్దేశంతో నేరుగా దాంతో సహా కోవూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలోని వారంతా భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది వెంటనే స్పందించి చికిత్సను ప్రారంభించారు. ప్రస్తు తం వలీ పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. -
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం ఎక్కు వగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ శి లాతోరణం వద్దకు చేరుకుంది. స్వామివారిని 8 3,112 మంది ఆదివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 30,054 మంది అర్పి ంచారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.49 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
● చెరువులో ఈతకెళ్లి యువకుడి మృతి దగదర్తి: సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. దీంతో మండలంలోని సున్నపుబట్టి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు మరియు పోలీసుల కథనం మేరకు.. సున్నపుబట్టి గ్రామానికి చెందిన బెల్లంకొండ శీనమ్మ పెద్ద కుమారుడు యశ్వంత్ (19) డిగ్రీ చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి గ్రామానికి సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. స్నేహితులందరూ ఈత కొట్టి తిరిగి ఒడ్డుకు చేరుకోగా యశ్వంత్ మాత్రం బయటకు రాలేదు. దీంతో భయాందోళనకు గురైన స్నేహితులు గ్రామంలోని బంధువులకు సమాచారం అందించారు. రాత్రి వరకు గాలించినా ఫలితం లేకపోయింది. మృతదేహం లభ్యం సోమవారం ఉదయం నుంచి దగదర్తి పోలీసులు, రెస్క్యూ టీమ్, స్థానిక యువకులు కలిసి చెరువులో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. సాయంత్రం యశ్వంత్ మతదేహం లభ్యమైంది కొడుకు విగతజీవిగా పడి ఉండటంతో తల్లి శీనమ్మ, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలాన్ని ఎస్సై జంపాని కుమార్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామన్నారు. -
ప్రభుత్వ భూముల ఆక్రమణపై కన్నెర్ర
మర్రిపాడు: మండలంలోని చుంచులూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 484లో ఉన్న 77 ఎకరాల ప్రభుత్వ భూమిని బినామీ పేర్లపై నమోదు చేసి క్రయవిక్రయాలు జరిపిన ఘటనపై సోమవారం గ్రామంలో భూమిలేని నిరుపేదలు ఆందోళన చేపట్టారు. చుంచులూరు గ్రామ సర్పంచ్ చిలపోగు చామంచయ్య, ఏపీ ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు బోటిక శ్రీనివాసులు మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమించి విక్రయించడం తీవ్ర అన్యాయమని మండిపడ్డారు. పేదలకు చెందాల్సిన భూములను బినామీ పేర్లతో నమోదు చేసి రూ.కోట్లకు అమ్మకాలు జరపడం సరికాదన్నారు. మండలానికి చెందిన వారు కాదన్నారు. దొంగ పట్టాలు సృష్టించి ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకుని భూములను కాజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రెవెన్యూ పరిధిలో 618 రేషన్ కార్డులుండగా, 4 వేల ఎకరాల భూమి ఉందన్నారు. కుటుంబానికి 5 ఎకరాల చొప్పున పంచినా మిగులు భూమి ఉంటుందన్నారు. చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్ అనిల్కుమార్కు వినతిపత్రం సమర్పించారు. -
కండలేరులో 53.210 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 53.210 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,100, లోలెవల్ కాలువకు 100, హైలెవల్ కాలువకు 240, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.92 సన్నవి : రూ.75 పండ్లు : రూ.40 -
అవినీతిపై చర్యలు తీసుకోవాలి
జిల్లాలో ఉపాధి హామీ పథకంలో, డీఆర్డీఏలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని జేసీకి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.లీలామోహన్, నందిపోగు రమణయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో సైదాపురం, రాపూరు, కలువాయి, ఉదయగిరి మండలాల్లో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాపూరు మండలంలో గిరిజనుల పేరుతో రూ.2.50 కోట్ల స్కామ్ జరిగిందని ప్రభుత్వ అధికారులు తేల్చినా రికవరీపై డీఆర్డీఏ జిల్లా అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. సొమ్మును రికవరీ చేయకపోతే భవిష్యత్లో డీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. నేతలు యామాల మధు, సయ్యద్ సిరాజ్, సయ్యద్ షాన్వాజ్, సునీల్, సుమతి, మాధవి తదితరులు పాల్గొన్నారు. -
ఆటోను ఢీకొట్టిన కారు
కావలి రూరల్: కావలి పట్టణ పరిధిలోని బుడమగుంట సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వేగంగా వచ్చి కారు ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో అదుపుతప్పి పల్టీకొట్టి ఎదురుగా వస్తున్న ట్రాలీ లారీపై పడింది. ఈ ఘనటలో ఆటో పూర్తిగా దెబ్బతింది. అందులో ప్రయాణిస్తున్న జలదంకి మండలం అన్నవరం గ్రామానికి చెందిన పోట్లూరి చిన హజరత్తయ్య, ఆయన భార్య సుశీలమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమా దాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. ప్రాథమిక చికిత్స నిమిత్తం వారిని వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు సిఫార్సు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారైనట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ గాలిస్తున్నారు. -
ప్రభాకర్రెడ్డి మృతి వైఎస్సార్సీపీకి తీరనిలోటు
● మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఇందుకూరుపేట: వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు గూడూరు ప్రభాకర్రెడ్డి మృతి పార్టీకి తీరనిలోటని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. మండలంలోని కొమరిక గ్రామానికి చెందిన ప్రభాకర్రెడ్డి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. సోమవారం గ్రామానికి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి విచ్చేసి ప్రభాకర్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రభాకర్రెడ్డి అందించిన సేవలను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. సీనియర్ నాయకులు మావులూరు శ్రీనివాసులురెడ్డి, కలువ బాలశంకర్రెడ్డి, బట్టేపాటి నరేంద్రరెడ్డి, గండవరపు వసంతకుమార్రెడ్డి, కొండ్లపూడి శ్రీనివాసులురెడ్డి, కార్యకర్తలు విచ్చేసి ప్రభాకర్రెడ్డికి నివాళులర్పించారు. -
చెప్పాడంటే.. చేయడంతే .. !
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి అధికారంలోకి వచ్చాక.. అన్నదాతల ఆశలను చిదిమేసింది. నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి.. లబ్ధిదారుల సంఖ్యలో కోతలు విధించి.. అన్నదాతకు గుండెకోత మిగిల్చింది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘పీఎం కిసాన్– వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని అమలు చేసింది. జిల్లాలో అర్హులైన 2,14,667 మంది రైతులను లబ్ధిదారులుగా ఎంపిక చేసి ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభం మే నెలలో, రబీ సీజన్ ప్రారంభం అక్టోబర్లో, రబీ కోతల సీజన్ జనవరిలో ఠంఛన్గా మూడు విడతల్లో రైతు భరోసా నగదును జమ చేస్తూ వచ్చింది. మరోసారి అధికారంలోకి రావడానికి కూటమి ప్రభుత్వంలోని పార్టీలు పీఎం కిసాన్ సాయం కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఏటా ప్రతి రైతుకు రూ.20 వేలను అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఇస్తామని హామీలు గుప్పించాయి. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చాక.. 2025–26 ఆర్థిక సంవత్సరానికి 3.19 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే తొలి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండో ఏడాదిలో తొలి విడతలో ఆర్టీజీఎస్ వ్యాలిడేషన్ తర్వాత 1,98,514 మంది రైతులను అర్హులైన లబ్ధిదారులుగా గుర్తించినట్లు స్వయంగా జిల్లా వ్యవసాయశాఖాధికారులు అప్పట్లో ప్రకటించారు. అయితే చివరికి 1,95,866 మందిని ఫైనల్ చేశామని చెప్పినా.. ఈ – కేవైసీ, ఆధార్లింక్, బ్యాంక్ అకౌంట్ అనుసంధానం కాలేదంటూ తదితర కారణాలు చూపి మరి కొంత మందిని తగ్గించి.. చివరికి 1,86,368 మంది రైతులకు రూ.93,18,40,000 జమ చేయగా, రెండో విడతగా 1,95,866 మందికి రూ.97,93,30,000 జమ చేశారు. మే రెండో వారంలో మొదటి విడత జమ చేయాల్సి ఉంటే.. ప్రతిపక్షాల ఆరోపణలు, రైతుల విమర్శల నేపథ్యంలో నాలుగు నెలలు ఆలస్యంగా గతేడాది ఆగస్ట్ట్ రెండో తేదీన, ఇక రెండో విడత అక్టోబర్ రెండో వారంలో ఇవ్వాల్సి ఉంటే.. నెల ఆలస్యంగా నవంబర్ 18వ తేదీన రైతుల ఖాతాల్లో జమ చేశారు. అయితే ప్రభుత్వం ప్రకటించినట్లు రైతుల ఖాతాల్లో అందరికీ జమయ్యాయా? అనేదానికి పారదర్శకత లేదు. ఎవరికి జమయ్యాయో.. జమ కాలేదో తెలియని పరిస్థితి. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి రైతు భరోసా కేంద్ర పరిధిలో రైతుల జాబితాలను ఆయా ఆర్బీకేల్లో నోటీస్ బోర్డుల్లో ఏర్పాటు చేసేవారు. సంవత్సరం మొత్తం ఆర్థిక సాయం రైతులు (రూ.కోట్లల్లో) 2019–20 2,02,306 273.11 2020–21 2,43,502 328.72 2021–22 2,43,911 329.27 2022–23 2,14,667 289.80 2023–24 2,14,667 289.80 అన్నదాత సుఖీభవ మూడో విడత మంగళమేనా..? మార్చి వచ్చినా.. జమ కాని నిధులు ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ ప్రక్రియ లబ్ధిదారుల ఏరివేతకేనా..? ఈ నెలాఖరు దాటితే.. అంతే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మే, అక్టోబర్, జనవరి నెలల్లో ఠంఛన్గా రైతు భరోసా ఏటా రూ.20 వేలిస్తామన్న చంద్రబాబు పీఎం కిసాన్తో కలిపి నాలిక మడత.. అయినా తొలి ఏడాది ఎగనామం జిల్లాలో 3.19 లక్షల మంది రైతుల దరఖాస్తు చివరికి 1,95,866 మందికే లబ్ధి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు చంద్రబాబు చరిత్ర చూస్తే.. గతంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ ఏనాడు అన్నదాతల కోసం ఎలాంటి పథకాన్ని అమలు చేయలేదు. ఆర్థికంగా ఆదుకున్నదీ లేదు. అధికారంలోకి వచ్చిన ప్రతి సారి రైతులను వంచనకు గురి చేసిన చరిత్ర చంద్రబాబుకు మాత్రమే ఉంది. వ్యవసాయమే దండగ అంటూ వ్యాఖ్యానించిన ఆయన 2004 ముందు వరకు వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేశారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు రైతులే రాష్ట్రానికి వెన్నెముక అంటూ పెద్దపెద్ద మాటలు చెప్పి.. తాము అధికారంలోకి వస్తే.. రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తానని... అధికారంలోకి రాగానే ఒక కమిటీ వేసి నిబంధనలు పెట్టి కొర్రీలు వేసి లక్షల మంది రైతులను తొలగించారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని తిరిగి ఇస్తానని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధనలు పెట్టి బంగారాన్ని వేలం వేసి దగా చేశారు. రుణం మొత్తాన్ని ఐదు విడతల్లో ఇస్తామని ఒకటి.. రెండు విడతలు ఇచ్చి మిగతావి ఎగనామం పెట్టి నిలువునా మోసం చేశారు. తాజా ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన వైఎస్సార్ రైతు భరోసా పథకం పేరును అన్నదాత సుఖీభవ పథకంగా మార్పు చేసి ఆర్థిక సాయం అందిస్తామని హామీల్చినా.. తొలి ఏడాది పంగనామం పెడితే.. రెండో ఏడాదిలో రెండు వితడలే ఇచ్చి.. మూడో విడతకు మంగళం పలుకుతున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ ఖర్చులకు ఆఖరి మాసం మార్చి నెల గడుస్తున్నా.. అన్నదాత సుఖీభవ మూడో విడత ఊసే లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తాజాగా వ్యవసాయశాఖాధికారుల మెడపై కత్తి పెట్టి.. ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ చేయించాలని.. ఇది ఉంటేనే.. అన్నదాత సుఖీభవ వస్తుందంటూ చెప్పడాన్ని బట్టి కూడా ఈ పేరుతో చాలా మంది రైతుల పేర్లను జాబితాల నుంచే తొలగించే కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది.మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అనే దానికి అన్నదాత సుఖీభవ పథకమూ ఓ నిదర్శనం. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా రైతాంగాన్ని ఆదుకునేందుకు ఒక్క పథకాన్ని అమలు చేసిన చరిత్ర లేదు. తొలుత అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు వ్యవసాయమే దండగ అన్నారు. మళ్లీ అధికారంలోకి రావడానికి రైతులకు రుణమాఫీ అంటూ మోసం చేశారు. తాజాగా సాగు పెట్టుబడిగా అన్నదాత సుఖీభవ పథకంతో ఏడాదికి రూ.20 వేలు ఇస్తామంటూ ప్రచారం చేసి తొలి ఏడాదిలో హామీని తుంగులో తొక్కేశారు. ఆ తర్వాత పీఎం కిసాన్తో కలిపి అంటూ నాలిక మడతేసి.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.14 వేలు మూడు విడతల్లో ఇస్తామన్నారు. గత ప్రభుత్వంలోని లబ్ధిదారుల్లో నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి వేలాది మందిని తొలగించి రెండు విడతల్లో అరకొర మందికే పథకాన్ని వర్తింపజేశారు. మార్చి నెల గడుస్తున్నా.. మూడో విడత ఊసేలేదు. కూటమి వచ్చాక.. తొలి ఏడాది ఎగనామం -
వీసీ ఆకస్మిక తనిఖీలు
నెల్లూరు (టౌన్): నగరంలో లా పరీక్షలను నిర్వహిస్తున్న వీఆర్ఐపీఎస్ కళాశాల కేంద్రంలో తనిఖీలను వీఎస్యూ వీసీ అల్లం శ్రీనివాసరావు సోమవారం చేపట్టారు. ‘న్యాయ విద్య అపహాస్యం’ అనే శీర్షికన సాక్షిలో కథనం గత నెల 28న ప్రచురితమైన తరుణంలో పరీక్షల పారదర్శకత, నాణ్యత ప్రమాణాల తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. విద్యార్థుల హాజరు, ప్రశ్నపత్రాల పంపిణీ విధానంపై కేంద్ర సూపరింటెండెంట్లతో సమీక్షించారు. అనంతరం మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థులను గుర్తించి వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పరీక్షల విశ్వసనీయతను కాపాడటం వర్సిటీ బాధ్యత అని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కేంద్రాల్లో భద్రత చర్యలను కట్టుదిట్టం చేసి విధులను ప్రతి ఇన్విజిలేటర్ సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు. -
కలెక్టర్ చొరవ.. వృద్ధురాలికి న్యాయం
నెల్లూరు(దర్గామిట్ట): కలెక్టర్ హిమాన్షు శుక్లా చొరవతో ఓ వృద్ధురాలికి న్యాయం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీన కావలికి చెందిన రమాజ్యోతి నడవలేని స్థితిలో నెల్లూరు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కింద కూర్చొన్నారు. హిమాన్షు శుక్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టాక మొట్టమొదటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి విచ్చేశారు. ఆమె వద్దకెళ్లి అర్జీ స్వీకరించారు. పెద్దకొడుకు తనను మభ్యపెట్టి ఇంటిని రాయించుకుని బయటకు వెళ్లగొట్టాడని వాపోయింది. తక్షణమే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులు పిలిచి ఆమెకు వెంటనే న్యాయం చేయాలని ఆదేశించారు. దీంతో చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ను రద్దు చేసి ఇంటిని ఆమెకు అప్పగించారు. రమాజ్యోతి సోమవారం కలెక్టరేట్కు వచ్చారు. హిమాన్షు శుక్లా విజయవాడకు వెళ్లడంతో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్కుమార్ను కలిసి స్వీట్లు అందజేశారు. ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకోవూరు: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కోవూరు మండలం పాటూరు గ్రామానికి చెందిన పాటూరు శ్రీనివాసులు కుమారుడు పవన్సాయి (19) గంగవరం గ్రామంలోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున అతను ఇంట్లో పురుగు మందు తాగాడు. కొద్దిసేపటికే వాంతులు చేసుకోవడంతో గమనించిన తండ్రి వెంటనే ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం పవన్ మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీగా సత్యనారాయణ నెల్లూరు(క్రైమ్): నెల్లూరు మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీగా యు.సత్యనారాయణను నియమిస్తూ రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ 1995 బ్యాచ్ ఎస్సై. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో ఎస్సైగా, సీఐగా బాధ్యతలు నిర్వర్తించారు. డీఎస్పీగా సీఐడీలో పనిచేసి ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్లో ఉన్నారు. రెండు రోజుల్లో మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. రోడ్డు దాటుతుండగా..● కారు ఢీకొని వృద్ధుడి మృతి నాయుడుపేట టౌన్: మండలంలోని బిరదవాడ సమీపంలో జాతీయ రహదారి కూడలి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. చిల్లకూరు మండలం కలగుర్తిపాడు గ్రామానికి చెందిన తీపలపూడి దొరస్వామి (66) సోమవారం బిరదవాడ జాతీయ రహదారి కూడలి వద్ద రోడ్డు దాటుతున్నాడు. ఆ సమయంలో చైన్నె నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి అతడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో దొరస్వామి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.హోంగార్డ్పై దాడి కేసులో డ్రైవర్కు ఏడాది జైలుకోవూరు: విధుల్లో ఉన్న హోంగార్డుపై మద్యం మత్తులో దాడికి పాల్పడిన లారీ డ్రైవర్కు కోవూరు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి పి.చైతన్య ఏడాది జైలుశిక్ష విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్కు చెందిన లారీ డ్రైవర్ సంతోష్కుమార్ రావత్ 2019 సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో కోవూరు సమీపంలోని సాలుచింతల ప్రాంతంలో మద్యం తాగి గొడవ చేశాడు. డ్యూటీలో ఉన్న కోవూరు పోలీస్స్టేషన్ హోంగార్డు వడ్డేముక్కల మల్లికార్జున అక్కడికెళ్లి గొడవ చేయవద్దని సంతోష్కుమార్కు చెప్పాడు. అతను ఆగ్రహానికి గురై తన వద్ద ఉన్న మద్యం బాటిల్తో మల్లికార్జున తల, ముక్కుపై బలంగా కొట్టాడు. హోంగార్డుకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఈ ఘటనపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో సంతోష్కుమార్కు శిక్ష పడింది. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పూండ్ల బాబు (స్టాలిన్) వాదించారు. -
జీజీహెచ్లో అంతా అస్తవ్యస్తం
నెల్లూరు(అర్బన్): నగరంలోని జీజీహెచ్లో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఆస్పత్రి ఎమ్సీహెచ్ బ్లాక్లోని హెచ్డీ వార్డులో ఏసీ పేలడం.. మరో ఏసీ పూర్తిగా కరిగి ధ్వంసం కావడం కలకలం రేపుతోంది. ప్రమాదాలు సంభవించి ప్రాణాపాయం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్న రోగుల నుంచి ఉత్పన్నమవుతోంది. భయంతో వణికిపోయి.. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆస్పత్రిలో మంటలు ఆదివారం వ్యాపించాయి. ఈ తరుణంలో చిన్నారులు, పురిటి పిల్లలను తల్లిదండ్రులు ఎత్తుకొని భయంతో వణికిపోతూ.. పరుగులు తీశారు. అధికారులకన్నా ముందే అప్రమత్తమైన సిబ్బంది సేఫ్టీ పరికరాలతో మంటలను ఆర్పేశారు. ఆపై కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ తదితర అధికారులు వేగంగా స్పందించి రోగులకు ఇబ్బందుల్లేకుండా ఇతర వార్డుల్లోకి మార్చేలా చర్యలు చేపట్టారు. తొమ్మిది మంది పురిటి పిల్లలను కిమ్స్ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలందేలా చేశారు. మొత్తానికి పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. అప్రమత్తం కాని అధికారులు ఏసీలు, ఫ్రీజర్లు, ఆటో గ్లవ్ మెషీన్లు తదితర యంత్రాల పర్యవేక్షణను గాలికొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ థియేటర్లో రూ.లక్షల విలువజేసే ఆటో గ్లవ్ మెషీన్ గత నెల్లో పేలిపోయింది. అక్కడ ఉండే ఆపరేషన్ థియేటర్ అద్దాలు, కుర్చీలు పగిలిపోయాయి. ఈ ఘటన తర్వాతైనా అధికారులు అప్రమత్తం కాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పుడే మేల్కొని విద్యుత్ పరికరాల నిర్వహణ సామర్థ్యాన్ని పరిశీలించి ఉంటే ఇలా జరిగేది కాదని ఉద్యోగ వర్గాలే పేర్కొంటున్నాయి. నిర్లక్ష్య ధోరణి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారుల కార్యాలయం పక్కనే ఉంది. ఆ శాఖకు చెందిన ఎలక్ట్రికల్ ఇంజినీర్లు తనిఖీలు చేస్తుంటే ఈ యంత్రాల పనితీరేమిటో తెలుసుండేది. అయితే ఎవరికి వారు నిర్లక్ష్యం వహించడంతో పరికరాలు తనిఖీలు, సర్వీస్కు నోచుకోక ప్రమాదాలు జరుగుతున్నాయి. అన్ని విభాగాల్లో కలిపి సుమారు 500 మంది నుంచి 550 మంది రోగులు అడ్మిషన్లో ఉంటున్నారు. ఇప్పటికై నా స్పందించి ఆస్పత్రిలో రక్షణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ప్రాణాపాయం జరిగి ఉంటే బాధ్యులెవరు..? ఏసీలు, ఫ్రీజర్లు, విద్యుత్ పరికరాల నిర్వహణ గాలికి ఆటో గ్లవ్ మెషీన్ గత నెల్లో పేలినా, చర్యలు శూన్యం సీఈ పరిశీలన నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఎమ్సీహెచ్ బ్లాక్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగిన ప్రాంతాన్ని మంగళగిరి నుంచి వచ్చిన ఏపీఎమ్మెస్ఐడీసీ చీఫ్ ఇంజినీర్ హర్షవర్ధన్ సోమవారం పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కావడానికి గల కారణాలను ఆరాతీశారు. విద్యుత్ ఉపకరణాలను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై సూచనలు చేశారు. మంటలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించనున్నామని తెలిపారు. వేగంగా మరమ్మతులు ఎమ్సీహెచ్ వార్డులో కాలిపోయిన మంచాలు, విద్యుత్ వైర్లు, ఏసీలు ఉండే హెచ్డీ వార్డులో మరమ్మతు పనులను వేగవంతం చేశారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ కో ఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు, మల్లికార్జున తదితరులతో కలిసి సూపరింటెండెంట్ మాధవి, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కళారాణి, సుశీల్ తనిఖీ చేశారు. హెచ్డీ వార్డు మినహా మిగిలిన వాటిని బుధవారం పునఃప్రారంభించనున్నామని మాధవి తెలిపారు. పెయింటింగ్ వేసి ఇతర వసతులను కల్పిస్తున్నామన్నారు. హెచ్డీ వార్డులో మరమ్మతులు చేపట్టి మరో నాలుగు రోజుల్లో అడ్మిషన్లను యథాతథంగా నిర్వహించనున్నామని వెల్లడించారు. -
మెరుగైన వైద్యమందించాలి
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పెద్దాస్పత్రి ఎమ్సీహెచ్ బ్లాక్లో మంటలు చెలరేగడంతో అక్కడి ఎన్ఐసీయూలో చికిత్స పొందుతున్న తొమ్మిది మంది పురిటి పిల్లలను కిమ్స్ స్పెషాల్టీ ఆస్పత్రికి అత్యవసరంగా ఆదివారం రాత్రి తరలించారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతున్న పిల్లల ఆరోగ్యాన్ని డీఎంహెచ్ఓ సుజాత, ఎన్టీఆర్ వైద్య సేవా జిల్లా కో ఆర్డినేటర్ సుధీర్కుమార్ సోమవారం పరిశీలించారు. మంచి వైద్యాన్ని అందించాలని ఆమె ఆదేశించారు. వైద్య ఖర్చులను ఎన్టీఆర్ వైద్యసేవ నుంచి చెల్లించనున్నామని తెలిపారు. -
ప్లాస్టిక్ గోదాములో అగ్నిప్రమాదం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు ఆటోనగర్లో ఓ ప్లాస్టిక్ గోదాములో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కథనం మేరకు.. నగరానికి చెందిన పి.పఠాన్ అన్వర్ఖాన్ ఆటోనగర్ ఫేజ్ – 1లో ప్లాస్టిక్ గోదాము నిర్వహిస్తున్నాడు. అందులో పెద్దఎత్తున ప్లాస్టిక్ నిల్వలున్నాయి. కొంతకాలంగా దానిని మూసి ఉన్నారు. ఎవరైనా కావాలని చేశారో?, మరే ఇతర కారణమో స్పష్టంగా తెలియదు గానీ గోదాములో మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ వస్తువులు కావడంతో అంతటా వ్యాపించాయి. గోదాములో నుంచి దట్టమైన పొగ రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖ, వేదాయపాళెం పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి వాకా శ్రీనివాసులురెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బంది అతి కష్టంపై మంటల్ని ఆర్పివేశారు. గుర్తుతెలియని వ్యక్తులు పొగతాగి నిప్పును నిర్లక్ష్యంగా అక్కడ వేయడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదంలో రూ.40 వేల మేర ఆస్తినష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేశారు. వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని గోదాముకు సమీపంలోని వివిధ షాపుల వారిని అక్కడ్నుంచి దూరంగా పంపారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో ప్లాస్టిక్ వేస్టేజ్ దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది. వరుస ఘటనల నేపథ్యంలో దుకాణదారులు, గోదాముల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులు సూచించారు. కాగా ఘటనపై కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆరాతీశారు. వార్డు రెవెన్యూ అధికారి ఫిర్యాదు మేరకు యజమాని నిర్లక్ష్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
బంగారు సరుడు మాయం
సంగం: నెల్లూరుకు చెందిన జ్యోతి అనే మహిళ సంగంలో తన బంగారు తాళిబొట్టు సరుడు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల మేరకు.. బుజబుజనెల్లూరులో నివాసముంటున్న మన్నూరు జ్యోతి నర్సుగా విధులు నిర్వహిస్తోంది. బ్యాంక్ పని నిమిత్తం స్వగ్రామమైన పొదలకూరు మండలం మహ్మదాపురం వెళ్లాలనుకుంది. తన పక్కింట్లో ఉంటున్న ఆటో డ్రైవర్ గౌతమ్నంద ఏఎస్పేట మండలం కొండమీదకొండూరుకు వెళ్తున్నాడు. సోమవారం ఆమె అతడి ఆటో ఎక్కింది. సంగం నాలుగు రోడ్ల సెంటర్లో దిగిన జ్యోతి మరో ఆటోలో సంగం శివాలయానికి చేరుకుంది. అక్కడ్నుంచి మహ్మదాపురం వెళ్లేందుకు పొదలకూరు బస్సు ఎక్కింది. బస్సు కదిలి బ్యారేజ్ మీదకు వెళ్లే సరికి తన మెడలో 13 సవర్ల బంగారు తాళిబొట్టు సరుడు కనిపించలేదు. దీంతో కంగారుపడిన జ్యోతి సాయంత్రం వరకు బ్యారేజ్, అక్కడి నుంచి నాలుగు రోడ్ల సెంటర్కు వెళ్లి వెతికింది. అయినా ఫలితం లేకపోవడంతో సంగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై రాజేష్ సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించామని విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. -
ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం
నెల్లూరు (టౌన్): ఇంటర్ సంస్కృత జవాబు పత్రాల మూల్యాంకనాన్ని స్టోన్హౌస్పేటలోని కేఏసీ జూనియర్ కళాశాలలో సోమవారం ప్రారంభించారు. 56 మంది అధ్యాపకులకు గానూ 47 మంది హాజరయ్యారు. క్యాంప్ ఆఫీసర్గా ఆర్ఐఓ వరప్రసాదరావు వ్యవహరించారు. ఐటీడీఏ పీఓగా శ్రీనివాసరావు నెల్లూరు(స్టోన్హౌస్పేట): ఐటీడీఏ పీఓగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రాంతీయాధికారి శ్రీనివాసరావును నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులను గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ముదావత్ నాయక్ సోమవారం జారీ చేశారు. డిప్యుటేషన్ ప్రాతిపదికన ఏడాది పాటు విధులు నిర్వర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డయల్ యువర్ ఎస్ఈకి 14 ఫిర్యాదులు నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారమే లక్ష్యంగా డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. నగరంలోని విద్యుత్ భవన్లో గల తన చాంబర్లో నిర్వహించిన కార్యక్రమంలో 14 మంది వినియోగదారులు తమ సమస్యలను ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను సంబంధిత అధికారులకు తెలియజేశారు. వీటిని పరిష్కరించి ఫొటోలతో సహా నివేదించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈఈలు శ్రీధర్, శేషాద్రిబాలచంద్ర, డీఈఈ మునీంద్ర, ఏఈలు తిరుపతయ్య, నరసింహరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాం
నెల్లూరు(పొగతోట): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నామని సివిల్ సప్లయ్స్ సంస్థ డీఎం అర్జున్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘మద్దతు లేక రైతన్న రోదన’ అనే శీర్షికన సాక్షిలో కథనం ఆదివారం ప్రచురితమైన నేపథ్యంలో ఆయన స్పందించారు. 161 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఉద్యోగులు, సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించామన్నారు. వరి కోతల ఆధారంగా అవసరమైన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ఇతర జిల్లాల ట్రేడర్లను ప్రోత్సహించకుండా ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టనున్నామని ప్రకటించారు. -
అదనపుకట్నం కోసం వేధింపులు
● పోలీసులకు వినతిపత్రమిచ్చిన మహిళ ● పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నెల్లూరు(క్రైమ్): ‘అదనపుకట్నం కోసం భర్త, అత్తింటివారు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. విచారించి న్యాయం చేయాలి’ అని కోవూరుకు చెందిన వివాహిత కోరారు. నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 143 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్యకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె ఆయా ప్రాంత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో నెల్లూరు రూరల్, ఎస్బీ డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, ఎ. శ్రీనివాసరావు, మహిళా పోలీస్స్టేషన్, డీసీఆర్బీ, కంట్రోల్ రూమ్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, ఎన్.రామారావు, భక్తవత్సలరెడ్డి, బి.శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● గతేడాది డిసెంబర్లో నా కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయిలో విచారించి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కొండాపురానికి చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు. ● వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన దేవిక నా కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.5 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పించకపోగా, డబ్బులడిగితే చంపుతామని బెదిరిస్తున్నారు. ఆమైపె చర్యలు తీసుకోవాలని కోవూరుకు చెందిన ఓ మహిళ కోరారు. ● బంగారంలో డబ్బులు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని హైదరాబాద్లోని ఓ జ్యువెలరీ కంపెనీకి చెందిన సాయికిరణ్, సుదీప్లు నమ్మించారు. దీంతో రూ.25 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. అప్పట్నుంచి వారు సరిగ్గా స్పందించ లేదు. డబ్బు తిరిగివ్వాలని వారిని కోరగా చంపుతామని బెదిరిస్తున్నారని వేదాయపాళేనికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. -
హామీలిచ్చే సమయంలో తెలీదా..?
ఎన్నికలకు ముందు అంగన్వాడీలకు ఎన్నో హామీలను చంద్రబాబు ఇచ్చారు. తీరా గెలిచాక వీటి అమలుకు డబ్బుల్లేవంటున్నారు. వాగ్దానాలిచ్చే సమయంలో ఈ విషయం తెలీదా..? అధికారం కోసం గుప్పించిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలి. – సుజాత, అంగన్వాడీ జిల్లా నేత కనీస వేతనంగా రూ.26 వేలివ్వాలి ఏళ్లుగా అతి తక్కువ వేతనానికి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పనిచేస్తున్నారు. కనీస వేతనంగా రూ 26 వేలివ్వాలి. హామీలను అమలు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలను రానున్న రోజుల్లో ఉధృతం చేస్తాం. – అన్నపూర్ణ, శ్రామిక సంఘ నేత -
సోమిరెడ్డిది అవినీతి బతుకు
● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు(అర్బన్): సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిదీ ఒక బతుకేనానంటూ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. తనపై సోమిరెడ్డి చేసిన విమర్శలకు ప్రతిగా కాకాణి ఒక ప్రకటనను ఆదివారం విడుదల చేశారు. సర్వేపల్లిలో చిన్నపిల్లాడ్ని అడిగినా సోమిరెడ్డి చరిత్ర ఏమిటో చెప్తారన్నారు. అవినీతి గురించి మాట్లాడే అర్హత ఆయనకు ఉందానని ప్రశ్నించారు. ఆయన్ను చూసి సర్వేపల్లి ప్రజలు ఛీ కొడుతున్నారని తెలిపారు. అవినీతిని ప్రశ్నించినప్పుడల్లా ఎదుటివారిపై దాడి చేసే అలవాటు ఆయనకే సొంతమని విమర్శించారు. కాకుటూరు శివాలయ రోడ్డు వేసే కాంట్రాక్టర్ నుంచి డబ్బులు వసూలు చేసింది వాస్తవం కాదానని ప్రశ్నించారు. కాగితాలపూరు వద్ద పొలాన్ని కాజేయాలని చూసి వీలుకాక నుడాకు అప్పగిస్తున్నానంటూ మాట మార్చింది నిజం కాదానన్నారు. ఎదుటి వారి గురించి మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేదిలేదని స్పష్టం చేశారు. ధైర్యముంటే తనతో పోటీపడాలని సవాల్ విసిరారు. విమర్శలు చేయడాన్ని ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. -
అంగన్వాడీల పోరుబాట
నెల్లూరు(పొగతోట): సమస్యల సాధన కోసం అంగన్వాడీలు పోరుబాట పట్టారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్తో నిరసన కార్యక్రమాలను పది రోజులుగా నిర్వహిస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చలో విజయవాడ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సోమవారం చేపట్టనున్నారు. వీరికి సీఐటీయూ మద్దతిస్తోంది. ఇవీ హామీలు.. తమను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించడంతో పాటు కనీస వేతనంగా రూ.26 వేలను ఇవ్వాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. గ్రాట్యుటీ అమలుకు మార్గదర్శకాలను రూపొందించడంతో పాటు మేలో వేసవి సెలవుల జీఓను విడుదల చేయాలంటున్నారు. జిల్లాలోని 2934 అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు ఆరు వేల మందికిపైగా కార్యకర్తలు, ఆయాలు అతి తక్కువ వేతనాలతో ఏళ్లుగా పనిచేస్తున్నారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. తుంగలో తొక్కి.. గత ఎన్నికల్లో విజయమే పరమావధిగా ఊకదంపుడు హామీలను చంద్రబాబు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక, వీటి అమలుకు డబ్బుల్లేవంటూ తుంగలో తొక్కారు. బడ్జెట్ కేటాయింపుల్లోనూ ఐసీడీఎస్ శాఖకు అన్యాయం చేశారనే ఆవేదన అంగన్వాడీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. డబ్బుల్లేవనే విషయం హామీలిచ్చే సమయంలో తెలియదానని వీరు మండిపడుతున్నారు. బెదిరింపు ధోరణి పోలీసుల ద్వారా ప్రభుత్వం బెదిరింపు చర్యలకు పాల్పడుతుండటంతో అంగన్వాడీలు వేర్వేరుగా విజయవాడ చేరుకుంటున్నారు. ఆరోగ్యం సక్రమంగా లేని వారు, గర్భిణులు, బాలింతల మినహా అధిక శాతం మంది ఇందులో పాల్గొననున్నారు. అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయిలో సోమవారం మూసేయనున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే మా సత్తా ఏమిటో ప్రభుత్వానికి తెలియజేస్తాం చలో విజయవాడ నేడు -
వెబ్సైట్లో సీనియార్టీ జాబితా
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, మున్సిపాల్టీ, కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులకు సంబంధించిన సీనియార్టీ జాబితాను deonellore.50webs.comలో ఉంచామని డీఈఓ బాలాజీరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏమైనా అభ్యంతరాలుంటే ఆధారాలను నగరంలోని డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో ఈ నెల ఏడులోపు సమర్పించాలని కోరారు. ఉపాధి హామీ నూతన విధానాలపై అవగాహన నెల్లూరు(పొగతోట): వీబీ – జీ – రామ్ జీ నూతన చట్టంపై ప్రజాచైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని డ్వామా పీడీ గంగాభవానీ ఆదేశించారు. ఇందుకూరుపేటలో నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడారు. నూతన చట్టం మేరకు 125 రోజుల పనిదినాలను కల్పించాలని, దీనిపై అవగాహన నిమిత్తం గ్రామసభలను నిర్వహించాలని సూచించారు. ఆరు వారాల పాటు కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా వీటిని జరపాలని ఆదేశించారు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ నెల్లూరు(బృందావనం): అన్నమయ్య సర్కిల్ సమీపంలోని ఎన్టీఆర్ పార్కులో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన భూమి పూజను ఆదివారం నిర్వహించారు. లాయర్ వారపత్రిక సంపాదకుడు తుంగా శివప్రభాత్రెడ్డి, వీరిశెట్టి హజరత్బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హాజరయ్యారు. ఆత్మకూరు భానుమూర్తి, ప్రసాద్, గ్రోసు సుబ్బారావు, నలుబోలు బలరామయ్యనాయుడు, శేషగిరీశం, రియాజ్బాషా, డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఇంజినీర్ చలపతి పాల్గొన్నారు. కుక్కల దాడిలో దుప్పి మృతి కోట: జనావాసాల్లోకి వచ్చిన చుక్కల దుప్పిని కుక్కలు వెంబడించి కరవడంతో మృతి చెందిన ఘటన మండలంలోని అల్లంపాడులో ఆదివారం చోటుచేసుకుంది. నేలబావి వద్దకు ఏడు దుప్పిలు రాగా, అందులో ఒక దాన్ని కుక్కలు గాయపర్చాయి. గ్రామస్తులు రక్షించినా, కొద్దిసేపటికే మృతి చెందింది. అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చి.. వారికి అప్పగించారు. 4న ‘రంగడి’ రథం ట్రయల్ రన్నెల్లూరు(బృందావనం): నగరంలోని శ్రీదేవీ, భూదేవీ సమేత తల్పగిరి రంగనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని ఈ నెల ఐదున నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రయల్ రన్ను బుధవారం ఉదయం పదికి నిర్వహించనున్నామని ఈఓ ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఆదివారం తెలిపారు. -
జీజీహెచ్ పిల్లల వార్డులో మంటలు
● బిడ్డలతో పరుగులు తీసిన తల్లిదండ్రులు ● త్రుటిలో తప్పిన ప్రాణాపాయం కాలిబూడిదైన బెడ్లుభయపడిన చిన్నారిని సముదాయిస్తూ.. నీరు తాగిస్తున్న తల్లి బెడ్పై చిన్నారులు నెల్లూరు(అర్బన్): నగరంలోని సర్వజన ఆస్పత్రి ఎమ్సీహెచ్ విభాగంలో గల హెచ్డీ పిల్లల వార్డులో పెద్ద శబ్దాలతో రెండు ఏసీలు ఆదివారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో పేలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమనే ప్రాథమిక నిర్ధారణకు అధికారులొచ్చారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ మాధురి మరో ఇద్దరు సిబ్బందితో కలిసి పిల్లల వార్డులో ఉన్న అద్దాలను పగలగొట్టారు. పెద్దగా కేకలేయడంతో సిబ్బంది హుటాహుటిన వచ్చి విద్యుత్ సరఫరాను నిలిపేశారు. దీంతో పిల్లల వార్డుతో సహా ఎమ్సీహెచ్ బ్లాక్ మొత్తం ఒక్కసారిగా అంధకారంగా మారింది. అప్రమత్తమైన సిబ్బంది అగ్నినిరోధక పరికరాల్లో ఉండే గ్యాస్ను వదిలి మంటలను ఆర్పేశారు. తల్లిదండ్రులు తమ బిడ్డలను తీసుకొని బయటకు పరుగులు తీశారు. కొంతసేపు భయంతో రోగులు వణికిపోయారు. ఏమి జరిగిందో అర్ధం కాక హాహాకారాలు చేశారు. అక్కడ పిల్లలు, పురిటి పిల్లలు, కాన్పుల వార్డులున్నాయి. బ్లాక్లో 150 మంది వరకు రోగులున్నారని అంచనా. పిల్లల వార్డుతో పాటు ఎన్ఐసీయూలో ఉన్న వారిని అధికారులు ట్రామా వార్డులోకి మార్చి వైద్యసేవలకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు. త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. ఆస్తి నష్టం ఏ మేర సంభవించిందనే వివరాలు తెలియాల్సి ఉంది. సూపరింటెండెంట్ మాధవి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి, డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి, డాక్టర్లు సుశీల్, కళారాణి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రోగులకు అండగా నిలిచి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టారు. ● తొమ్మిది మంది పురిటి పిల్లలను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ అజిత, ఆర్డీఓ అనూష, విద్యుత్ శాఖ డీఈ శ్రీధర్ పరిశీలించారు. నిర్లక్ష్యమే కొంపముంచిందా..? రెండు నెలల క్రితం కూడా ఆటో గ్లవ్ మెషీన్ పేలింది. అప్పట్లోనే అద్దాలు పగిలి, కుర్చీలు ఎగిరిపడ్డాయి. కొంతమేర ఆస్తి నష్టం సంభవించింది. అయితే ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. ఇదే అంశమై సాక్షిలో కథనం సైతం ప్రచురితమైంది. అయినా అఽధికారులు పట్టించుకోకపోవడంతో మళ్లీ షార్ట్ సర్క్యూట్ సంభవించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రి ఆవరణలో చంటి పిల్లలతో తల్లులు తదితరులు చిన్నారులను ట్రామా వార్డుకు అంబులెన్స్లో తరలిస్తున్న అధికారులు ఏసీ పేలడంతోనే ప్రమాదం నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ పెద్దాస్పత్రిలో ఏసీ పేలడంతోనే మంటలు చెలరేగాయని ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం తెలిపారు. ఆస్పత్రిలోని ఎమ్సీహెచ్ విభాగాన్ని సిబ్బందితో కలిసి ఆదివారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రసూతి వార్డులో ఒక రూమ్లో ఏసీ పేలడంతో షార్ట్ సర్క్యూట్ సంభవించిందని, దీని ప్రభావంతో పక్కనే ఉన్న రెండు బెడ్లపై నిప్పు రవ్వలు పడి కాలిపోయాయన్నారు. ఈ ఘటన ఆ రూమ్కు మాత్రమే పరిమితమైందన్నారు. మిగిలిన అన్ని వార్డులకు విద్యుత్ సరఫరా యథావిధిగా కొనసాగుతోందని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. -
హక్కుల సాధన కోసం పోరుబాట
● పీఆర్సీ, డీఏ, అరియర్స్ కోసం ఆందోళనలు ● ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ వెంకటేశ్వర్లు నెల్లూరు(అర్బన్): ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ఆర్టీసీ, పెన్షనర్ల, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన హక్కులను సాధించుకునేందుకు పోరుబాట పట్టనున్నట్టు ఏపీ జేఏసీ నూతన కార్యవర్గం ప్రకటించింది. ఆదివారం నెల్లూరు దర్గామిట్టలోని ఎన్జీఓ భవన్లో ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్లకు చెందిన పలు సంఘాలకు చెందిన నేతలతో సమావేశం జరిగింది. నూతన జేఏసీ కమిటీని ఎన్నుకున్నారు. ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు బండారుపల్లి వెంకటేశ్వర్లును చైర్మన్గా, జనరల్ సెక్రటరీగా ఏపీటీఎఫ్ (1938) జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి నియమితులయ్యారు. 32 మందితో జేఏసీ కమిటీ ఏర్పడింది. ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ● వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు 32 శాతం మధ్యంతర భృతి, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని కోరారు. తగ్గించబడిన హెచ్ఆర్ఏ, అడిషనల్ క్వాంటం పెన్షన్ను పునరుద్ధరించాలని, నిరుపయోగంగా ఉన్న ఈహెచ్ఎస్ స్థానంలో క్యాష్లెస్ వైద్య చికిత్సలు పొందే నూతన విధానాన్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వ మెమో 57 పరిధిలోకి వచ్చే ఉద్యోగులను ఓపీఎస్ పెన్షన్ పరిధిలోనికి తీసుకురావాలన్నారు. ఉద్యోగ, పెన్షనర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. కార్యక్రమంలో నూతన జేఏసీ కో చైర్మన్లు మురళీమోహన్రెడ్డి, చలపతిశర్మ, కిరణ్కుమార్, సుదర్శన్, లక్ష్మీనారాయణ, రాజేంద్రప్రసాద్, మార్కండేయులు, కార్యదర్శి సురేంద్రరెడ్డి, జాయింట్ సెక్రటరీలు సురేష్బాబు, దశరథరామయ్య, పెంచలయ్య, శ్రీనివాసరావు, కుమార్, శ్రీధర్ చౌదరి, నిర్వహణా కా ర్యదర్శి రామకృష్ణ, కోశాధికారి వీఎమ్వీ ప్రసాద్రెడ్డి, ఈసీ మెంబర్లు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో పాలు, నీరు, ఆహారం కల్తీ
● పసిబిడ్డలపై లైంగిక దాడులు ● ప్రశ్నిస్తే కేసులు, దౌర్జన్యాలు ● మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ నెల్లూరు(అర్బన్): ‘రాష్ట్రంలో ఏ ప్రాంతం చూసినా కల్తీ రాజ్యమేలుతోంది. పాలు, నీరు, ఆహారాన్ని కొందరు కల్తీ చేస్తుండటంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి’ అని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ అన్నారు. నెల్లూరుకు ఆదివారం వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు మేల్కోవాలంటూ ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని తెలిపారు. బాబు పాలనలో మంచినీరు, పాలు, లడ్డూ కలుషితమయ్యాయని ఆరోపించారు. పసిబిడ్డలపై లైంగిక దాడులు, హత్యలు జరుగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో నిమిషానికి ఐదుగురిపై లైంగికదాడులు జరుగుతున్నాయంటూ కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇచ్చిందన్నారు. విశాఖపట్నంలో దళితులకు ఏనాడో ప్రభుత్వమిచ్చిన 50 ఎకరాలను ఒక ఎమ్మెల్యే గ్రావెల్, ఇసుక కోసమంటూ వారిని అక్రమంగా ఖాళీ చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు వస్తాయో రావో తెలియదన్నారు. అయితే ప్రభుత్వంలో ఉన్న ఓ నేతకు నెలనెలా మామూళ్లు వెళ్తాయన్నారు. ఆలస్యమైతే సదరు నేత అందర్నీ బెదిరిస్తూ హంగామా చేస్తారని ఆరోపించారు. అసెంబ్లీలో పవన్ కల్యాణ్ లడ్డూ కల్తీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాత్ర లేదని చెప్తూ.. టీటీడీదే తప్పు అన్నట్టు మాట్లాడారన్నారు. సీబీఐ క్లీన్చిట్ ఇచ్చినా, చంద్రబాబు గందరగోళం చేస్తున్నారని మండిపడ్డారు. చివరికి హెరిటేజ్కు్ ఉన్న లింకు ప్రజలకు అర్థమైందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని, అరాచక పాలన రాజ్యమేలుతోందని ఆరోపించారు. ప్రశ్నిస్తే తెల్లారే సరికే తమ శ్రేణులపై పోలీసులతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అయినా తాము భయపడేదిలేదన్నారు. శాంతిభద్రతలను కాపాడాలని, అక్రమ కేసులు ఆపాలంటూ తాము గవర్నర్నను కలవనున్నామన్నారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఎక్కడికెళ్తే అక్కడికి జన ప్రభంజనం వస్తోందన్నారు. ఈ విషయాన్ని తట్టుకోలేని చంద్రబాబు అర్ధగంటలో చేయాల్సిన ప్రయాణం ఆరు గంటలు పట్టిందా అంటూ అసెంబ్లీలో మాట్లాడటం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వ తీరును ప్రజలు తప్పుబడుతున్నారన్నారు. మీరెలా గెలిచారో పరకాల ప్రభాకర్ వీడియోలు చూస్తేనే అర్థమవుతోందని విమర్శించారు. రానున్న రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేల్చిచెప్పారు. అవినీతి అధికారులపై విచారణ జరిపిస్తామన్నారు. సమావేశంలో నేతలు స్వర్ణా వెంకయ్య, ఏసునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఈరోజు సెలవు.. రేపొచ్చి ఫిర్యాదు ఇవ్వండి
● మట్టి అక్రమ తరలింపుపై అధికారుల తీరు సైదాపురం: చెరువులో మట్టిని ఇతర ప్రాంతాలకు టిప్పర్లలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయమై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేస్తే.. ‘ఈరోజు సెలవు, రేపొచ్చి ఇదే ఫిర్యాదు ఇవ్వండి. అప్పడు తీసుకుంటాం’ అని చెప్పారు. మండలంలోని మర్లపూడి చెరువు సమీపంలో ఉన్న మట్టిని ఆదివారం బహిరంగంగానే జేసీబీతో తవ్వి టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు తరలించారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నా రేపు అర్జీ ఇవ్వండి.. అప్పడు చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేకుండా మట్టి తవ్వి బహిరంగంగానే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా ఏ అధికారి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
పదోన్నతుల్లో ఏఎన్ఎంలకు తీవ్ర నష్టం
● ఏపీ హంస అధ్యక్షుడు సుధాకర్రావు నెల్లూరు(అర్బన్): వైద్యశాఖలో ఏఎన్ఎం లాంటి కొన్ని శాఖల ఉద్యోగులకు పదోన్నతుల్లో తీవ్ర నష్టం జరుగుతోందని, దీనిని తక్షణమే ప్రభుత్వం సరిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ (ఏపీ హంస) అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చేజర్ల సుధాకర్రావు, కమల్ కిరణ్ డిమాండ్ చేశారు. నెల్లూరులో ఆదివారం ఏపీ హంస జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్)లుగా ఉన్న ఏఎన్ఎంలకు 28 సంవత్సరాలుగా ప్రమోషన్లు లేవన్నారు. వారి సర్వీస్ మొత్తంలో ఎక్కువ మంది కనీసం ఒక ప్రమోషన్ కూడా తీసుకోకుండానే రిటైర్డ్ అయ్యారన్నారు. వైద్యశాఖలో క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకే వెళ్లి సేవలందించేది ఏఎన్ఎంలు మాత్రమేనన్నారు. ఈ నష్టాన్ని సరిచేసేందుకు ఏఎన్ఎంల కొత్త పోస్టులు మంజూరు చేసి వారికి పదోన్నతులు కల్పించాలన్నారు. ● ఏసీఎస్ఆర్ మెడికల్ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా సేవలందిస్తున్న జంగా శ్రీనివాసులును ఏపీ హంస జిల్లా కార్యవర్గ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఆయన్ను సన్మానించారు. కార్యక్రమంలో ఏపీ హంస జిల్లా గౌరవాధ్యక్షురాలు ఆర్.ఇందిర, సలహాదారు అరవ పరిమళ, ఉపాధ్యక్షురాలు నాగరాజమ్మ, ఇంకా మజార్, గౌస్బాషా, మంజరి, లక్ష్మీకాంతమ్మ, అరుణరాణి, వరలక్ష్మి, సోలా ఉమ, కామాక్షి, నాగయ్య, షీలా, అనితాకుమారి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూమికి ఎసరు
● అధికార పార్టీ నేత నిర్వాకం ● నిరసన చేపట్టిన దళితులుచిల్లకూరు: ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు.. టీడీపీ నేతలు ప్రత్యక్షమై ఆక్రమణకు పాల్పడుతున్నారు. బూదనంలో ఎన్నో సంవత్సరాలుగా దళితవాడకు చెందిన వారు చెత్త, పేడదిబ్బలు వేసుకునే సుమారు ఎకరాకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని ఆదివారం గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు ఆక్రమించుకునేందుకు సిద్ధమయ్యాడు. యంత్రాలతో చదును చేయడం ఆరంభించారు. దళితులు నిరసన చేపట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అక్కడికి చేరుకుని ఆ భూమి వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దళితులు మాట్లాడుతూ టీడీపీ నేత ప్రభుత్వ భూమి ఆవలి వైపునున్న పట్టా భూమి సుమారు రెండెకరాలను ఇటీవల కొనుగోలు చేశారన్నారు. అందులోకి నేరుగా వెళ్లేందుకు వీలుగా ప్రభుత్వ భూమిలో పేడదిబ్బలు తొలగించాడన్నారు. రెవెన్యూ అధికారులు నేతకు అండగా ఉన్నట్లు ఆరోపించారు. ఫోన్ కూడా ఎత్తకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులకు కూడా ఇక్కడ జరుగుతున్న తంతును వీడియోల ద్వారా తెలియజేసినా పట్టించుకోలేదన్నారు. వెంటనే స్పందించి సర్వే చేయించి ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై స్థానిక వీఆర్వో భాస్కర్ను వివరణ కోరాగా పట్టా భూమిని కొనుగోలు చేసిన వారు దారి ఏర్పాటు చేసుకునే క్రమంలో పేడదిబ్బలున్న ప్రాంతంలో డ్రెయినేజీని ఏర్పాటు చేస్తున్నారన్నారు. అలాగే సర్వే చేయించి పట్టా భూమి వరకు వారు హద్దులు ఏర్పాటు చేసుకునేలా చూస్తామన్నారు. -
నిత్యం పడిగాపులే..
● రోజూ ఆర్టీసీ బస్టాండ్లో 700 పార్శిల్ బుకింగ్లు ● రెండు కేంద్రాలతో నెట్టుకొస్తున్న అధికారులు ● గంటల తరబడి వేచిచూస్తున్న వినియోగదారులు నెల్లూరు సిటీ: ‘ఆర్టీసీలో పార్శిల్ బుకింగ్ చేసుకుంటే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తాం. సంస్థ ఆదాయం పెంపునకు ప్రతి ఒక్కరూ కలిసిరావాలి’ నిత్యం అధికారులు చెప్పే మాటలివి. అయితే ఇవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. వినియోగదారులు పార్శిల్ బుకింగ్ కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజూ ఇలా.. జిల్లాలోని 7 డిపోల్లో మొత్తం 34 పార్శిల్ సర్వీసు కేంద్రాలున్నాయి. నెల్లూరు నగరంలోని డిపో 1లో (ప్రధాన బస్టాండ్) రెండు, డిపో 2లో (ఆత్మకూరు బస్టాండ్) ఒకటి ఉన్నాయి. డిపో 1లో 600 నుంచి 700 పార్శిల్స్ రోజూ బుకింగ్ అవుతుంటాయి. డిపో 2లో ఈ సంఖ్య చాలా తక్కువ. సాయంత్రం సమయంలో ప్రధాన బస్టాండ్లో ఆర్టీసీ కార్గో కేంద్రం వద్ద వినియోగదారులు పడిగాపులు కాస్తుంటారు. డిపో 1 నుంచి కార్గో ద్వారా రోజూ రూ.లక్ష నుంచి రూ.1.10 లక్షల రాబడి వస్తుంది. అదే జిల్లా మొత్తం నుంచి అయితే రోజుకు రూ.3 లక్షల వరకు ఆదాయం ఉంది. రెండు బుకింగ్ కేంద్రాలతోనే.. ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లో వందల సంఖ్యలో రోజూ పార్శిల్ బుకింగ్లు జరుగుతున్నాయి. అయితే చాలాకాలంగా రెండు కేంద్రాలను మాత్రమే కొనసాగిస్తున్నారు. ఓ ప్రైవేట్ సంస్థ అవుట్ సోర్సింగ్ కింద సిబ్బందిని ఏర్పాటు చేసింది. ఆర్టీసీ అధికారులు కేంద్రాలు పెంచకపోవడం, ఆ సంస్థ తగినంత మంది సిబ్బందిని నియమించకపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు.కేంద్రాలు పెంచే ఆలోచనలో ఉన్నాం బుకింగ్ కేంద్రాలు సరిపోలేదని ఫిర్యాదులొచ్చాయి. త్వరలో ఒకటి లేదా రెండు కేంద్రాలు పెంచే ఆలోచనలో ఉన్నాం. ప్రయాణికులు, పార్శిల్ సర్వీస్ వినియోగదారులకు నాణ్యమైన సేవలందించడం మా బాధ్యత. – షేక్ షమీమ్, జిల్లా ప్రజా రవాణా అధికారిణి -
మహిళా సాధికారత వారోత్సవాలు ప్రారంభం
నెల్లూరు(క్రైమ్): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళ సాధికారత వారోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో వాక్థాన్ ర్యాలీని ఏఎస్పీ సీహెచ్ సౌజన్య జెండా ఊపి ప్రారంభించారు. గివ్ టు గెయిన్ అనే నినాదంతో ర్యాలీ కేవీఆర్ కూడలి వరకు తిరిగి ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ వరకు సాగింది. కేవీఆర్ కూడలి వద్ద మహిళా పోలీస్లు, విద్యార్థినులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడే సమాజంలో మహిళలకు తగిన గుర్తింపు, ఆర్థిక స్వాలంబన లభిస్తాయన్నారు. ప్రతి మహిళ, యువతి తమ సెల్ఫోన్లలో శక్తియాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో యాప్ ద్వారా తక్షణ పోలీసు సాయం పొందవచ్చన్నారు. ఈనెల ఎనిమిదో తేదీ వరకు మహిళలు, చిన్నారుల రక్షణ చట్టాలు, బాల్య వివాహాలు, బాలకార్మిక నిరోధక చట్టాలు, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల నిషేధం తదితరాలపై అవగాహన కార్యక్రమాలు, మహిళలకు వివిధ విభాగాల్లో పోటీలు, రక్తదాన శిబిరం, మెడికల్ క్యాంప్, ఓపెన్ హౌస్ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నెల్లూరు రూరల్, ఏఆర్ డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, ఎస్.చంద్రమోహన్, దర్గామిట్ట, మహిళా పోలీస్స్టేషన్, కంట్రోల్రూమ్, ఎస్బీ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు బి.కల్యాణరాజా, టీవీ సుబ్బారావు, భక్తవత్సలరెడ్డి, బి.శ్రీనివాసరెడ్డి, కె.వెంకటరెడ్డి, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావు, శక్తి టీమ్ సభ్యులు, డీకేడబ్ల్యూ, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినులు పాల్గొన్నారు. -
దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్
● రూ.20 లక్షల విలువైన సొత్తు స్వాధీనం కావలి: కావలిలోని పూనూరివారివీధిలో పేరూరి కల్పన అనే మహిళ నివాసంలో గత నెల 23వ తేదీ జరిగిన దొంగతనం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశామని డీఎస్పీ పి.శ్రీధర్ తెలిపారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మద్దూరుపాడుకు చెందిన పాలేటి లక్ష్మణరావు, గట్టుపల్లివారివీధికి చెందిన దేవరకొండ ప్రేమ్కుమార్ (స్వగ్రామం బోగోలు మండలం ఏగులబావి) కోడిపందేలు, పేకాట, మద్యానికి బానిసయ్యారు. జల్సాల కోసం దొంగతనాలకు అలవాటు పడ్డారు. వీరిపై గతంలో పలు స్టేషన్లలో దొంగతనం కేసులు ఉన్నాయి. వారి నుంచి సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు కేజీల వెండి, ఇంకా ఒక మోటార్బైక్ను స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకుని నగలను రికవరీ చేసిన కావలి వన్టౌన్ సీఐ ఎండీ ఫిరోజ్, ఎస్సై సుమన్ను డీఎస్పీ అభినందించారు.ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదుకోవూరు: వైఎస్సార్సీపీ నేతలపై ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా కార్యదర్శి వడ్డే సంపూర్ణమ్మ అన్నారు. ఆదివారం కోవూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. గుమ్మళ్లదిబ్బకు చెందిన బాలికకు జరిగిన అన్యాయంపై బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి, వారికి అండగా నిలబడటమే కాకాణి చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ఆయనకు నోటీసులిచ్చి విచారణకు పిలవడం రాజకీయం కాదా అని నిలదీశారు. ఫిబ్రవరి 27న విచారణ అనంతరం విలేకరులతో మాట్లాడిన కాకాణి ఎక్కడా టీడీపీ నేత పేరును ప్రస్తావించలేదని ఆమె గుర్తుచేశారు. నియోజకవర్గంలో మహిళల సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రత్యర్థి పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. కాకాణి కుమార్తె పూజిత గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యేకు లేదన్నారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డికి అపారమైన ప్రజా బలం ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయన గెలుపు ఖాయమని చెబితే భయం ఎందుకు?, అహంకారంతో మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. యేడెం లక్ష్మీకుమారి, జెడ్పీటీసీ సభ్యురాలు కవరగిరి శ్రీలత తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలుతిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 75,428 మంది స్వామిని దర్శించుకున్నారు. 36,240 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.56 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు నీట్ రాయాలినెల్లూరు(అర్బన్): బీఎస్సీ నర్సింగ్ నాలుగు సంవత్సరాల కోర్సు, బీపీటీ 5 సంవత్సరాల కోర్సుల్లో 2026 – 27 సంవత్సరంలో చేరేందుకు నీట్ – యూజీ పరీక్షకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీ ప్రభుదాస్ తెలిపారు. ఆయన ఆదివారం నెల్లూరులోని దిలీప్ నర్సింగ్ కళాశాలలోమాట్లాడారు. బీపీటీ, బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు సంబంధించి ఈ సంవత్సరం నుంచి కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లకు కొత్తగా నీట్ పరీక్ష రాయాలనే నిబంధన వచ్చిందన్నారు. అయితే క్వాలిఫై కావాల్సిన అవసరం లేదన్నారు. ఈ కోర్సుల్లో చేరాలనుకునే వారు ఈనెల 8వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేసిన వారికి దేశ, విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇతర వివరాలకు 98490 17633 ఫోన్ నంబర్ను సంప్రదించాలని కోరారు. -
నెల్లూరు జీజీహెచ్లో మంటలు
నెల్లూరు (అర్బన్): నెల్లూరులోని సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) ఎమ్సీహెచ్ బ్లాక్లోని హెచ్డీ వార్డులో ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండు ఏసీలు పేలిపోయాయి. అక్కడే డ్యూటీలో ఉన్న డాక్టర్ మాధురి సిబ్బంది సాయంతో అద్దాలు పగులగొట్టారు. సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపేశారు. ఒక్కసారిగా ఆస్పత్రిలో చీకట్లు అలుముకున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని భయంతో అరుస్తూ చీకట్లోనే బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది ఫైరింజన్ వచ్చేలోపు అగి్నమాపక పరికరాల సాయంతో మంటలను ఆర్పేశారు. అప్పటికే రెండు బెడ్లకు మంటలు అంటుకోగా, వాటినీ అదుపుచేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆస్పత్రి అధికారులు డాక్టర్ సుశీల్, డాక్టర్ కళారాణి పిల్లలను ట్రామా వార్డులోకి మార్చి వైద్యసేవలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టారు. ఎస్పీ అజిత, ఆర్డీఓ అనూష, విద్యుత్ శాఖ ఈఈ శ్రీధర్, డీఈఈ అశోక్ తదితరులు పరిశీలించారు. -
కొన్ని ఘటనలు
తెలుగుదేశం పాలనలో బాలికలపై పైశాచికం ఆగడం లేదు. అభంశుభం తెలియని వారిపై మృగాళ్లు దారుణంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కావలిలో వెలుగు చూసిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. జిల్లాలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో బాలికలపై లైంగిక వేధింపులు, దాడుల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ● ఇంటా.. బయట కొరవడిన భద్రత ● పెరుగుతున్న వేధింపులు, లైంగిక దాడులు ● తాజాగా కావలిలో దారుణం ● కోట మండలం అటవీ ప్రాంతంలో 12 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్ లైంగికదాడికి యత్నించాడు. ● గూడూరు పరిధిలో ఐదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగికదాడికి ప్రయత్నించాడు. ● కావలి మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలికపై వ్యక్తి లైంగికదాడి చేశాడు. ● కావలిలో స్కూల్ బాలికలపట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ● నెల్లూరు నగరంలో ఆరేళ్ల బాలికపై తండ్రి పైశాచికంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని గమనించిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ● ఉదయగిరి నియోజకవర్గంలో ఓ యువకుడు ప్రేమ పేరిట బాలికను గర్భవతిని చేశాడు. నెల్లూరు(క్రైమ్): బాలికలకు ఇంటా.. బయట రక్షణ కొరవడింది. మానవ రూపంలోని కొందరు మృగాళ్లు దారుణంగా వ్యవహరిస్తున్నారు. మనుమరాలి వయస్సున్న వారిపై వృద్ధులు అకృత్యాలకు తెగబడుతున్నారు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి యువకులు లైంగిక దాడు లకు పాల్పడుతున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే కామంతో కళ్లు మూసుకుపోయి చిన్నారులను చిదిమేస్తున్న ఘటనలున్నాయి. రక్తసంబంధీ కులు, దగ్గరి బంధువులు, తెలిసిన వారు అఘాయిత్యాలకు ఒడిగడుతున్న ఘటనలు లేకపోలేదు. జిల్లాలో చోటు చేసుకుంటున్న ఇలాంటి ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. లైంగిక వేధింపులు, దాడులకు గురైన వారిలో అనేకమంది ఫిర్యాదులు చేసేందుకు ముందుకు రావడం లేదు. పోలీసుల దృష్టికి తీసుకెళ్తే పరువు పోతుందని, కొందరు ఇతరులకు తెలిస్తే తమబిడ్డ జీవితం నాశనం అవుతుందని, తలెత్తుకు తిరగలేమని భావించి మరికొందరు మిన్నకుండిపోతున్నారు. కఠిన చట్టాలున్నా.. పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఎఫెన్సెస్ యాక్ట్) చట్టం కఠినమైనది. దీని కింద కేసు నమోదైతే 20 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉంది. దీంతోపాటు ఒక్కోసారి జీవితఖైదు విధించవచ్చు. బాధితుల వయస్సు 18 ఏళ్లలోపు ఉంటే పోక్సో కింద కేసు నమోదు చేస్తారు. ఇంత ఉన్నా కామాంధుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు పిల్లలతో అధిక సమయం గడపాలి. స్నేహపూర్వకంగా మెలగాలి. వారు ఏ విషయమైనా తమతో పంచుకునేలా తీర్చిదిద్దాలి. రోజువారి కార్యక్రమాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఏం జరుగుతుందో అడిగి తెలుసుకుంటుండాలి. అపరిచితులు, ఆకతాయిలు ఆట పట్టించినా, అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బందులు పెట్టినా నేరుగా తమకు చెప్పాలని వారికి భరోసా ఇవ్వాలి. ఆడపిల్లలు తమను తాము రక్షించుకునేందుకు అవసరమైన ఆత్మరక్షణ విద్యలు నేర్పాలి. పిల్లలపై అతిగా ప్రేమ చూపిస్తున్నట్లు నటించేవారిపై కన్నేసి ఉంచాలి. అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు, డయల్ 112కు ఫోన్ చేసేలా వారికి సూచించాలి. లైంగిక వేధింపులు, బాలల హక్కుల చట్టాలపై అఽధికారులు అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలి. బడుల్లో గుడ్టచ్, బ్యాడ్టచ్లపై బాలికలకు అవగాహన కల్పించాలి. అనుకోని పరిస్థితులు ఎదురైతే ఎలా అప్రమత్తం కావాలి? ఎలా ప్రతిఘటించాలనే అంశాలను వివరించాలి.పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్ -
కదంతొక్కిన విద్యుత్ కార్మికులు
తమ సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నాను విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్ మాట్లాడారు. దశాబ్దాల తరబడి సంస్థనే నమ్ముకొని పనిచేస్తున్న వారితో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రూ.కోటితో బీమాను అమలు చేయాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ.పది లక్షలివ్వాలన్నారు. 2019 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పనిచేసిన షిఫ్ట్ ఆపరేటర్లు, వాచ్మెన్లకు రూ.27,953 మేర ఇవ్వాలని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించకపోతే విజయవాడ కేంద్రంగా ధర్నాను వచ్చే నెల 27న చేపట్టనున్నామని వెల్లడించారు. వివిధ సంఘాల నేతలు విజయరామిరెడ్డి, నాగరాజు, సునీల్, ఆరిఫ్, రాజమోహన్నాయుడు, ఆసిఫ్, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. – నెల్లూరు(దర్గామిట్ట) -
ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వ అడుగులు
నెల్లూరు సిటీ: ఆర్టీసీని ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం సరికాదని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రావు, కార్యదర్శి నరస య్య అన్నారు. నెల్లూరులోని ఏనుగు సుందరరామిరెడ్డి కల్యాణ మండపంలో శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ బస్సుల పేరుతో మొదటి విడతగా 12 డిపోలను ప్రైవేటీకరించడం తగదన్నారు. ఈ విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన జోనల్ అధ్యక్షుడిగా డి.రవికుమార్, కార్యదర్శిగా డి.బాబు శ్యాముల్, జిల్లా అధ్యక్షుడిగా ప్రసాద్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
కూటమి ప్రభుత్వానికి రూ.14 కోట్ల ముడుపులు
● కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ గూడూరు రూరల్: ‘హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తికి సిలికా, ఇసుక అప్పగించారు. అతని నుంచి కూటమి ప్రభుత్వానికి నెలకు రూ.14 కోట్లు ముడుపులు అందుతున్నాయి’ అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ ఆరోపించారు. గూడూరు పట్టణంలోని టవర్క్లాక్ సెంటర్ వద్ద శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ బంధువుకు సిలికా ఇవ్వడం పెద్ద పొరపాటని, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. గూడూరు నియో జకవర్గాన్ని చంద్రబాబు బలహీనం చేశారని మండిపడ్డారు. నల్లపరెడ్డి, నేదురుమల్లి వంటి నాయకులను బలహీనం చేసే కుట్రలో భాగంగానే గూడూరు ను ముక్కలు చేశారన్నారు. దుగరాజపట్నం, మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పను లు ప్రారంభించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సిలికా గనులను పేదలైన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణారావు, మీజూరు మాధవ్, శివ, అంకయ్య, వెంకటయ్య, శివశంకర్రాజు, రామచంద్రయ్య, దయాకర్ పాల్గొన్నారు. -
అంగన్వాడీల సమర శంఖారావం
విజయవాడలో సోమవారం నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాలంటూ కలెక్టరేట్ వద్ద ఆందోళనను ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు శేషమ్మ మాట్లాడారు. అంగన్వాడీలకు కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచడంతో పాటు గ్రాట్యుటీ అమలుకు మార్గదర్శకాలను రూపొందించాలని డిమాండ్ చేశారు. మే నెలకు సంబంధించి వేసవి సెలవుల జీఓను అమలు చేయాలని పేర్కొన్నారు. గౌరవాధ్యక్షురాలు రెహనాబేగం, ప్రధాన కార్యదర్శి సుజాత తదితరులు పాల్గొన్నారు. – నెల్లూరు(దర్గామిట్ట) -
విశిష్ట సేవలకు పురస్కారాలు
నెల్లూరు(క్రైమ్): విధి నిర్వహణలో గతేడాదిలో విశిష్ట సేవలందించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి అతి ఉత్కృష్ట, ఉత్కృష్ణ సేవా పతకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పురస్కారాలకు ఎంపికై న వారి జాబితాను డీజీపీ హరీష్కుమార్ గుప్తా విడుదల చేశారు. జిల్లాకు చెందిన 13 మంది అతి ఉత్కృష్ట.. 23 మంది ఉత్కృష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు. అతి ఉత్కృష్ట సేవా పతకానికి.. శ్రీనివాసులు, ఏఎస్సై, డీసీఆర్బీ.. వెంకటేశ్వరరావు, ఏఎస్సై, అల్లూరు.. జయంత్, పీసీ, బిట్రగుంట.. పూర్ణచంద్రబాబు, పీసీ, కావలి రూరల్.. వెంకటసుబ్బారావు, హెచ్సీ, ఏఆర్.. శిఖామణి, హెచ్సీ, సంగం.. సత్యనారాయణ, హెచ్సీ, ఆత్మకూరు.. ఆరిఫ్, హెచ్సీ, సంతపేట.. రమణయ్య, హెచ్సీ, ఏఆర్.. శ్రీనివాసులు, హెచ్సీ, చిన్నబజార్.. చౌడయ్య, హెచ్సీ, డీసీఆర్బీ.. మీరా, హెచ్సీ, ఏఆర్.. సుల్తాన్ మొహిద్దీన్, పీసీ, నవాబుపేట. ఉత్కృష్ట సేవా పతకానికి.. భాస్కర్, హెచ్సీ, నవాబుపేట.. రమేష్బాబు, హెచ్సీ, మర్రిపాడు.. రమణయ్య, హెచ్సీ, సౌత్ ట్రాఫిక్.. చంద్రశేఖర్, హెచ్సీ, ఏఆర్.. శీనయ్య, హెచ్సీ, ఏఆర్.. చెంగయ్య, హెచ్సీ, ఏఆర్, భాస్కర్రావు, హెచ్సీ, ఏఆర్.. గోపాల్, హెచ్సీ, ఏఆర్.. మస్తాన్బాబు, పీసీ, డీసీఆర్బీ.. మాల్యాద్రి, పీసీ, ఏఆర్.. భవానీ, డబ్ల్యూపీసీ, ముత్తుకూరు.. అనూరాధ, డబ్ల్యూపీసీ, వేదాయపాళెం, మస్తానయ్య, ిపీసీ, ఏఆర్.. ఖాజాపీర్, పీసీ, వేదాయపాళెం.. సతీష్కుమార్, పీసీ, కోవూరు.. మహ్మద్ రఫీ, పీసీ, ఏఆర్.. నాగరాజు, పీసీ, నార్త్ ట్రాఫిక్.. శ్రీనివాసులు, హెచ్సీ, జలదంకి.. శ్యామ్ప్రసాద్, పీసీ, చిన్నబజార్.. మ హేష్కుమార్, హెచ్సీ, డీసీఆర్బీ.. శ్రీనివాసులు, హెచ్సీ, బుచ్చిరెడ్డిపాళెం.. శ్రీకాంత్, పీసీ, కావలి రూరల్.. జరీనా, డబ్ల్యూపీసీ, కావలి రూరల్. జిల్లా వాసికి అతి ఉత్కృష్ట సేవా పతకం అతి ఉత్కృష్ట సేవా పతకానికి జిల్లా వాసి, ఇన్చార్జి రీజినల్ ఇంటెలిజెన్స్ అధికారి వేలమూరి శ్రీరామ్ ఎంపికయ్యారు. సోమశిలకు చెందిన శ్రీరామ్.. ఎస్సైగా ప్రకాశం జిల్లాలోని దోర్నాల, మార్టూరు, కందుకూరు, చీరాల రూరల్, చీమకుర్తిలో.. సీఐగా పొదిలి, దర్శి, కందుకూరులో పనిచేశారు. ప్రకాశం జిల్లా ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్గా ఉంటూ ఇన్చార్జి రీజినల్ ఇంటెలిజెన్స్ (బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు) అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విధి నిర్వహణలో ఆయనెన్నో సంచలన కేసులను ఛేదించారు. -
పింఛన్ల పంపిణీ నేడు
నెల్లూరు(పొగతోట): లబ్ధిదారులకు పింఛన్లను శనివారం ఉదయం నుంచే పంపిణీ చేయాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి ఆదేశించారు. నగరంలోని డీఆర్డీఏ కార్యాలయం నుంచి వివిధ మండలాల అధికారులతో శుక్రవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 2.98 లక్షల మందికి సుమారు రూ.125 కోట్లను పంపిణీ చేయనున్నామని వెల్లడించారు. అందుబాటులో లేని వారికి సోమవారం అందజేయనున్నామని చెప్పారు. పాల కేంద్రాల్లో తనిఖీలు సంగం: మండలంలోని పలు గ్రామాల్లో గల పాల కేంద్రాల్లో తనిఖీలను ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. పాలు చిక్కగా కనిపించేలా ఇతర పదార్థాలను కలిపి కొందరు నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో తనిఖీలను చేపట్టామని వివరించారు. ఎవరైనా కల్తీ చేశారనే సమాచారముంటే, తమకు తెలియజేయాలని కోరారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 21 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 62,074 మంది గురువారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 27,784 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.21 కోట్లను సమర్పించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు గంటల్లో లభిస్తోంది. టైమ్ స్లాట్ టికెట్లు గల భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ధాన్యానికి మద్దతు ధర కల్పించాలి ● నెల్లూరులో భారీ ర్యాలీ నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలో పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడంతో పాటు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్తో నగరంలో భారీ ర్యాలీని ఏపీ రైతు, కౌలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, సీఐటీయూ, సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. నగరంలోని ఏబీఎం కాంపౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ర్యాలీని రైతు సంఘ జిల్లా నేత పొట్టేపాళెం చంద్రమౌళి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి వెంగయ్య మాట్లాడారు. జిల్లాలో ఈ ఏడాది ఎనిమిది లక్షలెకరాల్లో వరిని పండిస్తున్నారని, దాదాపు 30 లక్షల పుట్ల ధాన్యం దిగుబడయ్యే అవకాశం ఉందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పుట్టి ధాన్యానికి రూ.20,306 మేర ఇస్తున్నారని.. కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల తరహాలో క్వింటాల్కు రూ.500ను అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి అధికమై.. గిట్టుబాటు ధరల్లేక కర్షకులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రాన్ని సమర్పించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి పుల్లయ్య, నేతలు వెంకమరాజు, జనార్దన్, చండ్ర రాజగోపాల్, గోపాల్, ప్రసాద్, మాదాల వెంకటేశ్వర్లు, కత్తి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’లో అవినీతిపై చర్యలకు డిమాండ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిలో సంబంధం ఉన్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ డిమాండ్ చేశారు. నెల్లూరులోని సంతపేటలో ఉన్న సీపీఐ జిల్లా కార్యాలయం రామకోటయ్య భవన్లో శుక్రవారం ఆ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ వీబీ జీ రామ్జీ పథకాన్ని రద్దు చేసి జాతీయ గ్రామీణ ఉఫాధి హామీ చట్టాన్ని కొనసాగించాలన్నారు. దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో ఉపాధి పనుల్లో అవినీతి జరిగిందన్నారు. పేదలకు అందాల్సిన నగదును ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ సిబ్బంది కుమ్మకై ్క స్వాహా చేశారన్నారు. అలాగే వెలుగు పథకంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధి, వెలుగు పథకాల్లో జరిగిన అవినీతిపై మార్చి ఒకటి నుంచి 15వ తేదీ వరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. 16వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామన్నారు. సమావేశంలో నేతలు సీహెచ్ ప్రభాకర్రావు, లీలామోహన్, నందిపోగు రమణయ్య, మధు, సిరాజ్, శిరీష, వనజ, షాన్వాజ్, శీనయ్య తదితరులు పాల్గొన్నారు. -
హామీ ఇచ్చారు.. విస్మరించారు..!
నెల్లూరు(టౌన్): న్యాయవాద పరీక్షలకు కొందరు కళంకం తీసుకొస్తున్నారు. చీటీలతో ఎంచక్కా పరీక్షలు రాస్తూ.. నిర్వహణ విధానంపైనే అనుమానాలొచ్చేలా వ్యవహరిస్తున్నారు. టెస్టుల పర్యవేక్షణకు ఓ వైపు ఇన్విజిలేటర్లు.. మరోవైపు అబ్జర్వర్లు, హైపవర్ కమిటీ అధికారులను నియమించినా, మాస్ కాపీయింగ్పై ఏ మాత్రం దృష్టి సారించడంలేదు. నామమాత్రంగా ఽవిధులు నిర్వర్తిస్తూ, ఈ వ్యవహారాన్ని ప్రోత్సహిస్తున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. కళాశాలకు చెందిన అధికారులు సైతం సహకరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవహారం బట్టబయలు తాజాగా పరీక్ష కేంద్రాన్ని వీఎస్యూ వీసీ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. ఈ క్రమంలో చీటీలు, పుస్తకాలు పెట్టి రాస్తూ పది మంది గురువారం.. తొమ్మిది మంది శుక్రవారం పట్టుబడ్డారు. వీరిని హైపవర్ కమిటీ అధికారులకు అప్పగించారు. జవాబు పత్రాలను పరిశీలించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు ఇదే తరహాలో వ్యవహరిస్తున్న కొందరు ముందే జాగ్రత్తపడి వాటిని బయట విసిరేశారని తెలుస్తోంది. నిద్రమత్తులో జోగుతూ.. పరీక్షలను పక్కాగా నిర్వహించాల్సిన వీఎస్యూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విభాగాధికారులు నిద్రమత్తులో జోగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పీజీ, యూజీ పరీక్షలను సైతం మొక్కుబడిగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. వాస్తవానికి అడిషనల్ కంట్రోలర్గా అనుభవజ్ఞులకు బాధ్యతలను అప్పగించాల్సి ఉంది. అయితే యూజీ, పీజీ విభాగాన్ని చూస్తున్న అడిషనల్ కంట్రోలర్లకు ఎలాంటి అనుభవం లేదని సమాచారం. ఎగ్జామ్స్ పర్యవేక్షణ మొదలుకొని ఫలితాల ప్రకటన, సర్టిఫికెట్ల ముద్రణ వరకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలు విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. దృష్టంతా చీటీలు, పుస్తకాలపైనే.. లా పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ వీఎస్యూ వీసీ ఆకస్మిక తనిఖీల్లో బట్టబయలు చీటీలు చూసి రాస్తూ పట్టుబడిన 19 మంది వీరిపై చర్యలకు ఆదేశం తూతూమంత్రంగా ఇన్విజిలేటర్లు, హైపవర్ కమిటీ అధికారుల విధులు లోపభూయిష్టంగా సెమిస్టర్ పరీక్షల నిర్వహణ అనేక మంది విద్యార్థుల సర్టిఫికెట్లలోనూ తప్పులు దొర్లాయి. ఈ విభాగంపై వీసీ సైతం పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదని సమాచారం. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విభాగంపై అనేక ఫిర్యాదులు రావడంతో.. ప్రక్షాళన చేస్తానని వీసీ హామీ ఇచ్చి ఏడాదైనా నేటికీ అతీగతీ లేకపోవడం గమనార్హం. మాస్ కాపీయింగ్పై ఉక్కుపాదం మోపి కష్టపడి చదివిన విద్యార్థులే లా పట్టా అందుకునేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో న్యాయం, ధర్మాన్ని పరిరక్షించాల్సిన న్యాయ విద్యార్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. కష్టపడి చదివి న్యాయవాద పట్టాను అందుకోవాల్సిన కొందరు అక్రమ బాటలో పయనిస్తున్నారు. చేతినిండా చీటీలు పెట్టుకొని పరీక్ష రాస్తూ పట్టుబడటం దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. కళాశాలకు వెళ్లకపోయినా.. కష్టపడి చదువుకోకపోయినా.. ఎంచక్కా పట్టా అందుకోవచ్చనే దురాలోచనతో వీరు అక్రమ మార్గాల్లో పయనిస్తూ కళంకం తెస్తున్నారు. వీఎస్యూ వీసీ అల్లం శ్రీనివాసరావు వచ్చి మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న 19 మందికిపైగా స్టూడెంట్స్ను పట్టుకున్నారంటే లా పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఏ స్థాయిలో జరుగుతోందో ఇట్టే అర్థమవుతోంది. చదివిన వారికే డిగ్రీ అందాలి కష్టపడి చదివిన విద్యార్థే ఏ డిగ్రీనైనా అందుకోవాలి. మాస్ కాపీయింగ్పై ఉక్కుపాదం మోపుతాం. చీటీలు, పుస్తకాలు పెట్టి రాసే వారిని ఉపేక్షించేదిలేదు. భవిష్యత్తులో మరిన్ని తనిఖీలు చేస్తా. వర్సిటీ పరిధిలో ఏ పరీక్షలనైనా పక్కాగా నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేస్తాం. – అల్లం శ్రీనివాసరావు, వీసీ, వీఎస్యూ నగరంలోని వీఆర్ న్యాయ కళాశాలలో మూడు, ఐదేళ్లకు సంబంధించిన లా కోర్సులున్నాయి. మూడేళ్ల కోర్సులో ఏడాదికి 330 మంది చొప్పున 990 మంది.. ఐదేళ్లకు సంబంధించి సంవత్సరానికి 112 మంది చొప్పున 560 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరికి వరుసగా మొదటి.. ఆరు.. పదో సెమిస్టర్ పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నాయి. వీటిని మద్రాస్ బస్టాండ్ సమీపంలోని వీఆర్ ఐపీఎస్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. దాదాపు 500 మందికిపైగా హాజరవుతున్నారు. అయితే ఇక్కడే అసలు గమ్మత్తు వెలుగు చూసింది. ఇక్కడ మాస్ కాపీయింగ్ జరుగుతున్నా, విధులు నిర్వర్తిస్తున్న ఇన్విజిలేటర్లు, అబ్జర్వర్లు, హైపవర్ కమిటీ అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు. ఇదే అంశమై గతంలోనే కథనాలు ప్రచురితమైనా, వారిలో ఏ మాత్రం చలనం లేదు. మరోవైపు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఈ కళాశాలలో ఎక్కువ మంది ఉన్నారు. -
పోక్సో కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు
● ఎస్పీ అజిత వేజెండ్ల నెల్లూరు(క్రైమ్): పోక్సో కేసుల్లో దర్యాప్తును త్వరితగతిన పూర్తిచేసి చార్జిషీట్లు దాఖలు చేయాలని ఎస్పీ అజిత వేజెండ్ల పోలీసు అధికారులను ఆదేశించారు. స్మార్ట్ పోలీసింగ్లో భాగంగా శుక్రవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఈ – ఆఫీస్, సీసీటీఎన్ఎస్, డిజిటల్ అండ్ సైబర్ ఫోరెన్సిక్, మొబైల్ డేటా అనాలసిస్, సాఫ్ట్వేర్ ఆధారిత పోలీసింగ్ టూల్స్, సీసీ టీవీ ఫుటేజ్ల విశ్లేషణ, డ్రోన్ టెక్నాలజీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్ శాఖకు అందుబాటులో ఉన్న ఈ – ఆఫీస్ వ్యవస్థ ద్వారా పరిపాలన ప్రక్రియలను వేగవంతం చేసి పారదర్శకతను పెంపొందించాలన్నారు. డయల్ 112 కాల్స్కు సంబంధించి కంట్రోల్ రూమ్ నుంచి ఫీల్డ్ స్థాయి వరకు తక్షణ స్పందన ఉండాలన్నారు. సైబర్ ఫ్రాడ్ కేసుల్లో హోల్డ్ మనీ రికవరీ వేగవంతం చేయాలని, అందుకు సంబంధించిన ఎస్ఓపీపై సైబర్ వింగ్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, డీఎస్పీలు, పోలీసు అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
బాధితులను పరామర్శించడం నేరమా..?
● అక్రమ కేసులకు భయపడేదిలేదు ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి సాక్షిప్రతినిధి నెల్లూరు: అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై జిల్లా పోలీసులు ఏకపక్షంగా అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. కోవూరు పోలీస్స్టేషన్లో నమోదైన అక్రమ కేసుకు సంబంధించి మూలాపేటలోని నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విచారణకు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం హాజరయ్యారు. పోలీసుల విచారణ అనంతరం కాకాణి మాట్లాడారు. కోవూరులో బాలికపై జరిగిన దారుణాన్ని ఖండించడం నేరమా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించడం పాపమానని ప్రశ్నించారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. పోక్సో చట్టంపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని, బాలిక వివరాలను తామెక్కడా వెల్లడించలేదని గుర్తుచేశారు. మీడియా సమావేశాన్ని సైతం నిర్వహించలేదన్నారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించి తిరిగెళ్తుండగా, కొద్ది దూరంలో కొంతమంది మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పానని, అయితే కొన్ని పచ్చ మీడియా ఛానళ్లు పనిగట్టుకొని తనపై దుష్ప్రచారాన్ని సాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. బాలికకు సరైన చికిత్సను అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని బాధితులు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాన్నే మీడియా ఎదుట ప్రస్తావించానని తెలిపారు. దీంతో పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి నోటీసులను మూడుసార్లు ఇచ్చారని చెప్పారు. విచారణ సందర్భంగా సంబంధంలేని ప్రశ్నలను పోలీసులు సంధించారని చెప్పారు. 25 ప్రశ్నలు కాదు.. 2500 వేసినా సమాధానం చెప్పే దమ్ముందని స్పష్టం చేశారు. విచారణకు ఎన్నిసార్లు పిలిచినా సహకరిస్తానని తెలిపారు. టీడీపీ నేతలకు నోటీసులు ఎందుకివ్వలేదు..? గంజాయితో బాలికపై దారుణం జరిగిందని, దీన్ని అరికడతామంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే, వక్ఫ్బోర్డు చైర్మన్ వ్యాఖ్యానించిన అంశాన్ని ప్రస్తావించారు. అయితే వీరికి నోటీసులను ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. గంజాయిని అరికట్టి ప్రజలకు సుపరిపాలనను టీడీపీ ప్రభుత్వం అందించాల్సింది పోయి.. అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. బాలికపై జరిగిన ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని, తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, తనపై ఇలాంటి అక్రమ కేసులెన్ని పెట్టినా ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని మానుకునే ప్రసక్తేలేదన్నారు. తాము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేస్తామని, వారికి అండగా నిలిచి పోరాడతామని ప్రకటించారు. పోలీసుల తీరు హేయం.. జిల్లాలో తమ పార్టీని అడ్డుకునేందుకు అధికార పార్టీ ముందుకు రావడంలేదని, పోలీసులే ఈ పాత్రను పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో తాము ఎన్నికల్లో పోటీ చేసినా, అందుకు వీల్లేదంటూ నోటీసులను జారీ చేస్తారేమోననే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఓర్వలేకే.. పచ్చ మీడియా కథనాలు నెల్లూరు పర్యటనకు మాజీ సీఎం, తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి గురువారం వచ్చారని, ఆయన్ను చూసేందుకు అశేష జనవాహిని కదిలొచ్చిందని చెప్పారు. ప్రజాదరణను చూసి ఓర్వలేక కడుపు మంటతో.. పెళ్లికొస్తే ఇంత భారీ జనం అవసరమా అంటూ పచ్చమీడియా ప్రత్యేక కథనాలను ప్రచురించడం సిగ్గుచేటని విమర్శించారు. ఆయనెక్కడ పర్యటించినా, ప్రజలు భారీగా తరలివచ్చి.. తమ బిడ్డగా భావిస్తారని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టించిన నేత జగన్మోహన్రెడ్డి అని.. పరిపాలన చేతకాకపోతే ఆయన్ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. -
దొంగనోటిచ్చి.. ఉడాయించి..
బుచ్చిరెడ్డిపాళెం: పేద వృద్ధురాలికి ఓ వ్యక్తి దొంగనోటు ఇచ్చి మోసం చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. బుచ్చిరెడ్డిపాళెంలో రమణమ్మ అనే వృద్ధురాలు రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. శుక్రవారం ఎప్పటిలాగే ఆమె వ్యాపారం చేసుకుంటోంది. ఓ వ్యక్తి వినియోగదారుడిలా వచ్చాడు. రూ.100 విలువైన కూరగాయలు తీసుకుని ఆమెకు రూ.200 నోటు ఇచ్చాడు. అది అసలు నోటేనని నమ్మిన రమ ణమ్మ, అతడికి మిగిలిన రూ.100 ఇచ్చింది. అతను వెళ్లిన కాసేపటికి అనుమానంతో రమణమ్మ నోటును నిశితంగా పరిశీలించింది. అది నకిలీదని తెలియడంతో షాక్కు గురైంది. అప్పటికే అతను పరారు కావడంతో ఏం చేయాలో తెలియక ఆ వృద్ధురాలు లబోదిబోమంది. రోజంతా కష్టపడితే వచ్చే ఆదా యం కాస్తా ఇలా దొంగనోటు రూపంలో ఆవిరైపోవడంతో కన్నీరుమున్నీరైంది.కండలేరులో 53.960 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 53.960 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,100, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 240, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
పోలీసులపై కాకాణి సీరియస్.. బాధితులను పరామర్శించడమే నేరమా?
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. కోవూరులో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్యను ఖండించడమే నేరమా.. బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించడం పాపమా? అని ప్రశ్నించారు. కోవూరు ఘటన ముమ్మటికీ ప్రభుత్వ వైఫల్యమేనని ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి కాకాణి ఈరోజు.. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అనంతరం, కాకాణి మాట్లాడుతూ.. ‘కోవూరులో బాలిక హత్యను ఖండించడమే నేరమా?. పోక్సో చట్టంపై అవగాహన ఉన్న మేము ఎక్కడా బాలిక వివరాలు వ్యాఖ్యానించలేదు. అధికార పార్టీలోని వక్ఫ్ బోర్డు చైర్మన్ ఈ ఘటనలో స్వయంగా గంజాయిపై వ్యాఖ్యలు చేశారు. నిందితుల పట్ల ఉదాశీలతగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ అక్రమ కేసులో నాకు మూడు సార్లు నోటీసులు ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి అధికార పార్టీ ముందుకు రావడం లేదు.జిల్లాలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఈ అక్రమ కేసులో సంబంధం లేని ప్రశ్నలు వేశారు. కోవూరు మైనర్ బాలిక కేసు ఘటన ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. పరిపాలన చేత కాకపోతే వైఎస్ జగన్ పాలన చూసి నేర్చుకోండి. ఇలాంటి అక్రమ కేసులు ఎన్ని బనాయించినా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానుకునే సమస్య లేదు. నిన్న వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు అశేష జనాభా కదిలి వచ్చారు. వైఎస్ జగన్ ప్రజాదరణ ఓర్వలేక పచ్చ మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురించింది’ అని మండిపడ్డారు. -
పచ్చని చెట్లు కూల్చివేత
నెల్లూరు(వేదాయపాళెం): మద్యం వ్యాపారులు బరితెగించారు. పర్యావరణ చట్టానికి తూట్లు పొడుస్తూ.. నేషనల్ హైవే అథారిటీ పర్యవేక్షణలో పెంచిన పచ్చని చెట్లను నరికేశారు. జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన తమ దుకాణం వాహనచోదకులకు బాగా కనిపించేందుకు ఈ దారుణానికి తెగబడ్డారు. టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్ మద్యం దుకాణాలను విచ్చలవిడిగా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో నెల్లూరులోని జాతీయ రహదారిపై అనేక షాపులున్నాయి. మందుబాబులను ఆకట్టుకునేందుకు పెద్ద బోర్డులు, లైటింగ్ను ఏర్పాటు చేశారు. చింతారెడ్డిపాళెం కూడలిలో మెడికవర్ ఆస్పత్రి ఎదురుగా ఎస్ఎల్ఎన్ఎస్ మద్యం షాపును జాతీయ రహదారికి పడమర వైపు ఏర్పాటు చేశారు. వాహనాల్లో ప్రయాణించే మందు బాబులకు షాపు కనిపించేందుకు చెట్లు అడ్డుగా ఉన్నాయని భావించి వాటిని నరికివేయించారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు రోడ్డు పక్కన మొక్కలు నాటించి సంరక్షించారు. నేడు ఎన్నో చెట్లు వాహనదారులకు ఉపయోగకరంగా ఉన్నాయి. అయితే మద్యం షాపు నిర్వాహకులు ఏ మాత్రం లెక్కచేయకుండా వ్యాపారమే పరమావధిగా పచ్చని చెట్లను పొట్టన పెట్టుకున్నారు. నిట్టనిలువునా భారీ చెట్లను కొట్టేయించడం విమర్శలకు తావిస్తోంది. మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించుకుందామని నిత్యం మాటలు చెప్పే అధికారులు ఇంత దారుణం జరుగుతున్నా పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం షాపు నిర్వాహకుల బరితెగింపు పర్యావరణ చట్టానికి తూట్లు దుకాణం కనిపించేందుకు నరికేసిన వైనం నెల్లూరులో హైవే పక్కన పరిస్థితి -
తలశిల రఘురామ్కు ప్రసన్న పరామర్శ
కోవూరు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ను మాజీ మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి పరామర్శించారు. ఇటీవల రఘురామ్ తండ్రి చంద్రశేఖర్రావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ క్రమంలో విజయవాడ గొల్లపూడిలోని రఘురామ్ నివాసానికి వెళ్లిన నల్లపరెడ్డి.. చంద్రశేఖర్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రఘురామ్ను, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రసన్న వెంట సీనియర్ నాయకులు కలువ బాలశంకర్రెడ్డి, పుత్తా శివశంకర్రెడ్డి ఉన్నారు.ఆదాల పరామర్శఅల్లూరు: కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ ఏటూరు భానుప్రకాష్రెడ్డిని నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి పరామర్శించారు. భానుప్రకాష్రెడ్డి తల్లి ఏటూరి విద్యావతమ్మ ఇటీవల మరణించారు. గురువారం అల్లూరు మండలం ఇందుపూరుకు మాజీ ఎంపీ వచ్చారు. విద్యావతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విజయ డెయిరీ మాజీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.ఇంటర్ పరీక్షలో ఒకరి డిబార్నెల్లూరు(టౌన్): ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారం జరిగాయి. దీనికి జిల్లా వ్యాప్తంగా 25,969 మందికి గానూ 25,417 మంది విద్యార్థులు హాజరయ్యారు. 552 మంది గైర్హాజరయ్యారు. బీవీనగర్లోని కృష్ణచైతన్య జూనియర్ కళాశాలలో మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న శ్రీచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థిని ఇంటర్ అధికారులు డిబార్ చేశారు. నెల్లూరు ధనలక్ష్మీపురంలోని వీబీఆర్, శ్రీచైతన్య, నారాయణ జూనియర్ కళాశాలలను ఆర్ఐఓ వరప్రసాద్రావు తనిఖీలు నిర్వహించారు. స్థానిక ఆర్ఐఓ కార్యాలయంలో సీసీ కెమెరాల ద్వారా ఇంటర్ పరీక్షలను పర్యవేక్షించారు.లారీని ఢీకొట్టిన కారు● ముగ్గురికి గాయాలుదగదర్తి: మండల పరిధిలోని ఉలవపాళ్ల జాతీయ రహదారి పెట్రోలు బంక్ సమీపంలో గురువారం రాత్రి లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. కావలి నుంచి చైన్నెకి ముగ్గురు కుటుంబ సభ్యులు కారులో ప్రయాణిస్తున్నారు. పెట్రోల్ బంక్ సమీపానికి రాగానే ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో నెల్లూరు హాస్పిటల్కి తరలించినట్లు ఎస్సై జంపాని కుమార్ తెలిపారు.నాలుగో అంతస్తు నుంచి దూకి..● వృద్ధుడి బలవన్మరణంనెల్లూరు సిటీ: ఓ వృద్ధుడు నాలుగో అంతస్తు భవనం నుంచి దూకి బలన్మరణానికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ పరిధిలోని నారాయణ హాస్పిటల్కు సమీపంలో మహిళా పీజీలో బస్వ సురేంద్రరెడ్డి (70) పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు వివాహం కాలేదు. కుటుంబ సభ్యుల నుంచి సురేంద్రరెడ్డికి బుధవారం ఫోన్ వచ్చింది. తన సోదరుడితో మాట్లాడుతుండగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన సురేంద్రరెడ్డి గురువారం పీజీ భవనం నాలుగో అంతస్తు నుంచి దూ కాడు. స్థానికులు గుర్తించి వెంటనే ఆయన్ను హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.


