breaking news
SPSR Nellore
-
చంద్రబాబు మోసాలకు అద్దంపట్టే బడ్జెట్: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ హయాంలో ప్రవేశ పెట్టిన ఐదు బడ్జెట్లు ప్రజా ఆమోదయోగ్యమైనవని.. కరోనా లాంటి పరిస్థితుల్లో సైతం సంక్షేమం ఎక్కడా ఆగలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దారుణంగా ఉందని.. ఆడ బిడ్డ నిధి, నిరుద్యోగ భృతి కేటాయింపు లేదన్నారు. సూపర్ సిక్స్ పథకాలకు సైతం అంతంతమాత్రమే కేటాయింపులు జరిపారన్నారు.‘‘అన్నదాత సుఖీభవ పథకానికి 6 లక్షల అప్లికేషన్స్ పెండింగ్లో వున్నాయి. రైతులను నిట్టనిలువునా మోసం చేసే బడ్జెట్. ఉద్యోగులను, కార్మికులను ఇలా అన్ని రంగాల వారిని మోసం చేశాడు. అన్ని సామాజిక వర్గాలకు అన్యాయం చేసిన బడ్జెట్గా చూడాలి. చంద్రబాబు మోసాలకు అద్దం పట్టే బడ్జెట్’’ అంటూ కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. -
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు
నెల్లూరురూరల్: కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను గాలికి వదిలేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా.. అసమర్థను నిలదీసినా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పోలీసుల తీరుపై ధ్వజమెత్తారు. కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బలో మైనార్టీ బాలిక గంజాయి బా్య్చ్ అఘాయిత్యానికి బలైపోయిన నేపథ్యంలో పరామర్శించినందుకు నమోదు చేసిన కేసులో శనివారం పోలీసుల విచారణకు కోవూరుకు కాకాణి బయల్దేరారు. ఈ క్రమంలో హడావుడిగా వచ్చిన కానిస్టేబుల్ కాకాణి నివాసానికి చేరుకుని ఈ రోజుకు విచారణకు రావొద్దని, 19వ తేదీన తామే మీ నివాసంలోనే విచారిస్తామంటూ మరో నోటీసు అందజేశారు. దీంతో కాకాణి తనపై అక్రమ కేసు నమోదు చేసి ఈ రోజు విచారణకు రావాలని 10వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో హడావుడిగా వచ్చి ఎందుకు నోటీసులు ఇచ్చారో చెప్పాలని పోలీసులను ప్రశ్నించారు. తాను ఏం నేరం చేస్తే ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. నాతోపాటు మైనర్ బాలిక కుటుంబాన్ని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, వక్ఫ్బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఇతర మైనార్టీ నాయకులు పరామర్శించి అదే రకమైన వ్యాఖ్యలే చేశారని, మరి తానొక్కడికే ఎందుకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటున్నారని ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టి, ప్రశ్నించే తత్వాన్ని అణిచి వేయాలని చూస్తున్నారని, ఎన్ని అక్రమ కేసులు బనాయించి నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా, కూటమి నాయకులు చేస్తున్న అవినీతి, అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలపై తాను ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. ప్రభుత్వానికి రక్షక భటులుగా మారారు రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ కూటమి నాయకుల కనుసన్నాల్లో పని చేస్తున్నారని, ప్రజలకు కాకుండా ప్రభుత్వానికి రక్షక భటుల్లా వ్యవహరిస్తున్నారని కాకాణి మండిపడ్డారు. నేరం చేసిన వారిపై చర్యలు తీసుకుంటే తప్పు లేదని, కూటమి నాయకుల ఆనందం కోసం తమపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తే పరిణామాలు రేపు అనుభవించాల్సి ఉంటుందన్నారు. గంజాయి అరికట్టలేకపోవడం పోలీసుల వైఫల్యం కాదా? మైనర్ బాలిక మృతి సమాజాన్ని కలిచి వేసిందని, ఆ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచి పరామర్శించేందుకు వెళ్తే కేసులు కట్టడం కాదాని, చేతనైతే గంజాయిని అరికట్టి.. ఇలాంటి నేరాలు జరగకుండా చూడాలన్నారు. బాలికతో బలవంతంగా విష ద్రవం తాగించారని కేసు నమోదు చేశారని, కోవూరు, నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఆ బిడ్డకు సరైన వైద్యం అందలేదని బాలిక తండ్రే స్పష్టంగా చెప్పి కన్నీరుమున్నీరయ్యాడన్నారు. రాష్ట్రంలో మహిళలకు అసలు రక్షణ ఉందా అని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపలనే గంజాయి లేకుండా నిర్మూలిస్తానని స్టేట్మెంట్లు ఇచ్చాడని, 19 నెలలు అవుతున్నా గంజాయిని నిర్మూలించలేకపోతున్నారని, మారుమూల గ్రామాల్లో కూడా విచ్చలవిడిగా దొరుకుతుందన్నారు. ఏం నేరం చేశానని పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు నా తర్వాత వక్ఫ్బోర్డు చైర్మన్ అజీజ్, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పరామర్శించారే వారిపై ఎందుకు కేసులు కట్టలేదు ప్రభుత్వం, పోలీసుల అసమర్థత కారణంగానే కాదా ఆ బాలిక చనిపోయింది? మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజం ప్రశ్నించారని ఆడపిల్లకు నోటీసులిస్తారా? కాకాణి పూజితమ్మ పైనా అక్రమ కేసు నమోదు చేసి వాట్సప్ ద్వారా నోటీసులు పంపించారన్నారు. పూజితమ్మ చేసిన తప్పు ఏమిటో తెలియడం లేదు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలను చూసి, విశ్లేషించి గంజాయి వల్లనే మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగిందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిందని, మీడియా సమావేశంలో మాట్లాడింది తప్పన్నట్లు పోలీసులు నోటీసులు జారీ చేశారన్నారు. పూజితమ్మ ప్రశ్నించినట్లు తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అసత్యపు మాటలు మాట్లాడాడు. పోలీసులు అయనకు నోటీసులిచ్చి విచారణకు పిలవగలరా? అని ప్రశ్నించారు. సీబీఐ, సిట్ నివేదికలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలవలేదని స్పష్టం చేశారని గుర్తు చేశారు. అక్రమ కేసులకు బయపడే పరిస్థితి లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసినా పోరాడి జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుంటామని, ఆ తర్వాత అందరి లెక్కలు సరిచేస్తామని హెచ్చరించారు. -
తల్లికి వందనం.. మోసం
తల్లికి వందనం కింద కుటుంబంలో 12వ తరగతి లోపు ఎంత మంది చదువుకుంటుంటే అంత మందికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం వేస్తామని చెప్పిన ప్రభుత్వం తల్లులను మోసం చేసింది. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద రూ 13 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా రూ 9,407 కోట్లు విడుదల చేసింది. అనేక మందికి రూ.7 వేలు, రూ.9 వేలు వేసి మిగతా మొత్తాన్ని ఎగనామం పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా బడ్జెట్లో ఆ మేరకు నిధులు పెంచుతారా అంటే.. తూతూ మంత్రంగా కేవలం రూ.261 కోట్లను మాత్రమే బడ్జెట్లో పెంచింది. సరిపడా ఈ సంవత్సరం కూడా నిధులు ఇవ్వలేదు. అంటే ఈ సంవత్సరం కూడా తల్లులను ప్రభుత్వం మోసం చేయబోతోందని అర్థమవుతోంది. -
నిరాశ, దగా బడ్జెట్
●రాష్ట్ర బడ్డెట్ అన్నీ వర్గాలను తీవ్ర నిరాశ పర్చింది. పీఆర్సీ, ఐఆర్ ప్రఽకటన వస్తోందని ఆశించిన ఉద్యోగులతోపాటు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్ మాటే లేదు. పొదుపు మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు సున్నా వడ్డీ ప్రస్తావనే కరువైంది. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఇచ్చే ధరల స్థిరీకరణకు మొక్కుబడిగా నిధులు కేటాయించారు. వెనుకబడిన ఉదయగిరి అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయింపులు లేవు. రూ.లక్షల కోట్లు అప్పులు తప్ప... అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదు. మొత్తంగా దగా బడ్జెట్గా చెప్పక తప్పదు. – మేకపాటి రాజగోపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, ఉదయగిరి -
గారడీ లెక్కలు.. అప్పుల ప్రణాళికలే
రాష్ట్ర బడ్జెట్లో పేదలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సీబీఎస్ఈ కోర్సులను కూడా చేపట్టలేక రద్దు చేయడం చూస్తుంటే పేద పిల్లలకు సీబీఎస్ఈ చదువులు అక్కరలేదన్నట్లు ఉంది. బడ్జెట్ మొత్తం అప్పులు కుప్ప తప్ప.. సంక్షేమం, అభివృద్ధి ఏ కోశానా కనిపించలేదు. కేంద్రం వద్ద అప్పులు చేసేందుకే ద్రవ్య లోటు భారీగా చూపించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీని, అన్నదాతలకు సాయం లేకుండా చేశారు. మహిళలకు రూ.1500 సాయం ఊసే లేదు. – మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ -
సాగునీటి రంగానికి మొండిచేయి
రాష్ట్ర బడ్జెట్లో సాగునీటి రంగానికి తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఈ రంగానికి రూ.18,224 కోట్లు కేటాయించగా, కీలక ప్రాజెక్ట్ల నిర్మాణానికి రూ.9,906 కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్ట్కే రూ.6 వేలు కోట్లు పోతే.. మిగిలిన నిధులతో ఏ ప్రాజెక్ట్లను పూర్తి చేస్తారు. మెట్ట రైతుల వరప్రసాదిని సోమశిల హైలెవల్ కెనాల్కు ఎంత మేర నిధులు కేటాయించారనేది స్పష్టంగా ప్రకటించలేదు. బడ్జెట్లో కేవలం ఆరు శాతం మాత్రమే సాగునీటి రంగానికి కేటాయించి చేతులు దులుపుకోవడం దారుణం. – లక్కు కృష్ణప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకుడు ● -
అబద్ధాలు, మోసాలు
కూటమి ప్రభుత్వం మూడో బడ్జెట్లో అన్నీ అబద్ధాలు, మోసాలే. సంక్షేమ పథకాలను అటకెక్కించారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.1500 బడ్జెట్లో పెట్టలేదు. సూపర్ సిక్స్ పథకాలకు మొండి చేయి చూపించారు. మిగిలిన పథకాలకు సైతం కోతల విధించారు. అప్పులతో కూడిన బడ్జెట్గా కనిపిస్తోంది. ఆత్మస్తుతి పరనిందతో బడ్జెట్ను రూపొందించారు. గత ప్రభుత్వంపై నిందలు వేయడం, వీరు ఉద్దరిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. రైతులు, సాధారణ ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎక్కడా ప్రభుత్వం అండగా నిలవలేకపోయింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డి నిధులను సంపూర్ణంగా కేటాయించారు. నాడు–నేడు, ఆరోగ్యశ్రీకు నిధులు కేటాయింపులు సక్రమంగా జరగలేదు. – కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ● -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,222 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 24,882 భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.20 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పెద్ద పులి సంచారం ఉంది జాగ్రత్త ఉదయగిరి: శివరాత్రిని పురస్కరించుకుని ఉదయగిరి అటవీశాఖ పరిధిలో పెద్దపులి సంచరిస్తుందని, సిద్ధేశ్వరంలోని పురాతన దేవాలయానికి వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని సీఐ వెంకట్రావు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం సీఐ విలేకరులతో మాట్లాడారు. ఆ ప్రాంతానికి ఎవరూ ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు. అటవీ ప్రాంతంలో క్షేత్రం ఉన్నందున స్నానం కోసం కోనేరులో తప్ప ఇతర వాగులు, వంకలు, బావుల్లో స్నానం చేయొద్దన్నారు. భక్తుల సౌకర్యార్థం వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్లు ఏర్పాటు చేశామన్నారు. అటవీ ప్రాంతం కావడంతో మహిళలు విలువైన బంగారు అభరణాలు ధరించొద్దని పేర్కొన్నారు. పెరుమాళ్లపాడుకు భక్తులెవరూ రావొద్దు చేజర్ల: మండలంలోని పెరుమాళ్లపాడులో ఇసుక గర్భం నుంచి బయటపడిన నాగమల్లేశ్వరస్వామి ఆలయానికి భక్తులు ఎవరూ రావొద్దని పోలీసులు, రెవెన్యూ, దేవదాయశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. శనివారం ఆత్మకూరు సీఐ గంగాధర్, చేజర్ల తహసీల్దారు మస్తానయ్య, చేజర్ల ఎస్సై తిరుమలేశ్వరరావు ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆలయం శిథిలావస్థలో ఉన్న కారణంగా మహాశివరాత్రి సందర్భంగా ఎటువంటి పూజా కార్యక్రమాలు, దర్శనాలు నిర్వహించడం లేదన్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ల్లో వస్తున్న సమాచారం నమ్మి భక్తులు ఎవరు రావద్దనారు. ఆలయం శిథిలం కావడంతో పాటు ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయన్నారు. పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు నెల్లూరు (టౌన్): ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ వరప్రసాదరావు తెలిపారు. శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లోని స్టోరేజీ పాయింట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 33 ప్రాంతాల్లోని స్టోరేజీ పాయింట్లల్లో 17 మంది అధ్యాపకులను కస్టోడియన్లుగా నియమించినట్లు చెప్పారు. స్టోరేజీ పాయింట్లల్లో ప్రశ్నపత్రాలను నిల్వ ఉంచేందుకు ట్రంకుపెట్టెలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 81 సెంటర్లల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. -
రైతాంగాన్ని నిరాశ పరిచిన బడ్జెట్
బడ్జెట్లో రైతులకు తీవ్ర నిరాళను మిగిల్చింది. గిట్టుబాటు ధరలు లేవు, కనీస మద్దతు ధర కరువైంది. కౌలు రైతుల ఊసేలేదు. ధరల స్థిరీకరణ నిధిని కేవలం రూ.500 కోట్లకు పరిమితం చేయడం దారుణం. అన్నదాత సుఖీభవ, జలవనరుల ప్రాజెక్ట్ల విస్తరణకు నిధులు తక్కువగా కేటాయించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయిస్తే నెల్లూరు జిల్లాకు కూడా మేలు జరిగేది. ఈ ప్రాజెక్ట్కు ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయం. విత్తన సబ్సిడీ, యంత్ర పరికరాలకు ఇచ్చే సబ్సిడీ కేటాయింపులు కూడా లేవు. వ్యవసాయ రుణాలపై సున్నా వడ్డీ పథకానికి నిధులు ఇవ్వలేదు. – చిరసాని కోటిరెడ్డి, రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు -
అన్నదాత సుఖీభవకు అరకొర
అన్నదాత సుఖీభవ తొలి ఏడాది ఎగనామం పెట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2.45 మంది రైతులకు రైతు భరోసా అందిస్తే.. కూటమి రెండో ఏడాది అమలు చేసినా.. కేవలం 1.80 లక్షల మందికి కూడా ఇవ్వకుండా లబ్ధిదారుల కోత పెట్టింది. ఈ సంవత్సరమైనా బడ్జెట్లో నిధులు పెంచుతారని ఎదురు చూసిన రైతులకు నిరాశ మిగిలింది. పరిశ్రమలకు నిధులేవి జిల్లాలో కొత్తగా పరిశ్రమలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. కొత్తగా పరిశ్రమలు గురించి ప్రస్తావించలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరైన నారంపేట పరిశ్రమల హబ్కు నిధులు ఇవ్వలేదు. నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్ల వద్ద కూడా పరిశ్రమల హబ్ను ఏర్పాటు చేస్తున్నామని ఇటీవల కాలంలో పాలకులు ప్రకటించినప్పటికీ దానికి కూడా నిధులు కేటాయించలేదు. బకింగ్హామ్ కెనాల్ విస్తరణ ఊసే లేదు. నెల్లూరకు, చైన్నె, బెంగళూరు కారిడార్కు సంబంధించి గతంలో ప్రకటనలు చేసిన ప్రభుత్వం బడ్జెట్లో ఆ ఊసే ఎత్తలేదు. జిల్లాలో సుమారు 3.7 లక్షల మంది పింఛన్ దారులున్నారు. వీరిలో కొంతమంది మృత్యువాత పడ్డారు. కొత్తగా వితంతువులు, హెచ్ఐవీతో బాధపడుతున్నవారు, బెడ్ రిడన్ పేషెంట్లు 5 వేల మంది వరకు ఉన్నారు. కొత్త వారు దరఖాస్తు చేసుకుని పింఛన్లు కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. వీరికి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే ఉద్యోగం వచ్చే వరకు చదువుకున్న వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని డప్పు కొట్టుకుంది. జిల్లాలో సుమారు 4 లక్షల మంది అర్హత కలిగిన నిరుద్యోగులున్నారు. అయినా బడ్జెట్లో వారి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు. ఆడబిడ్డ నిధి సంగతి మర్చిపోయారు. ఇలా అన్ని వర్గాలను నిరాశ పరిచిందని జిల్లా వాసులు ప్రభుత్వంపై మండి పడుతున్నారు. -
సచివాలయ ఉద్యోగులపై కక్షసాధింపు తగదు
నెల్లూరు(అర్బన్): సమయపాలన లేకుండా వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు విధులు నిర్వర్తించేలా ఒత్తిడి చేస్తూ సచివాలయ ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడం తగదని యునైటెడ్ వెల్ఫేర్ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ప్రభుత్వ ఎంప్లాయీస్ అసోసియేషన్(యూడబ్ల్యూజీఈఏ) రాష్ట్ర అధ్యక్షురాలు గుజ్జల రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. పనిఒత్తిడితో బుడతవలస గ్రామ సర్వేయర్ రఘునాథ్ గుండెపోటుతో మరణించడం, అంతకు ముందు కొద్ది రోజులుగా రాష్ట్రంలో మరణించిన ఇతర సచివాలయాల ఉద్యోగుల మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ముందుగా గాంధీబొమ్మ వద్ద బాపూజీకి నివాళులర్పించి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వీఆర్సీ కూడలి వరకు ప్రదర్శన నిర్వహించి అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ తామంతా ఉన్నతంగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నామన్నారు. తమతో శివరాత్రి పేరిట టాయిలెట్ల వద్ద విధులు నిర్వర్తించేలా చేయడం, వేకువజామున 4 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కాపలా ఉండమనడం దారుణమన్నారు. తీవ్రమైన ఒత్తిడి పెంచిన నేపథ్యంలో అనేక మంది ఉద్యోగులు మృత్యువాత పడ్డారన్నారు. ఇకనైనా ప్రభుత్వం తమను ఆఫీస్ అవర్స్లోనే విధులు నిర్వర్తించేలా వెసులుబాటు కల్పించాలన్నారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ లోకేశ్, నాయకులు మురళీకృష్ణ, గౌరీశంకర్, శ్రీనివాసులు, బాలు పాల్గొన్నారు. దేవస్థానం భూమిని ఆక్రమించి జామాయిల్ సాగు ● బీజేపీ నేత నిర్వాకం దుత్తలూరు: మండలంలోని నర్రవాడ వెంగమాంబ పేరంటాలు దేవస్థానానికి సంబంధించిన భూమిని ఆక్రమించి జామాయిల్ నాటారని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పచ్చవ కరుణాకర్బాబు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మాట్లాడుతూ బీజేపీ నాయకుడు మేకపాటి మాల్యాద్రి వెంగమాంబ పేరంటాలు దేవస్థానానికి సంబంధించి దొడ్డకొండ వద్ద ఉన్న కొంత భూమిని ఆక్రమించి అక్రమంగా జామాయిల్ సాగుచేయడంతో పాటు భక్తుల తాగునీటి కోసం ఏర్పాటు చేసిన బోరును కూడా ఆక్రమించి కంచె వేశాడని తెలిపారు. అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించి భక్తుల మనోభావాలను కాపాడడంతో పాటు దేవస్థాన ప్రతిష్టకు భంగం కలగకుండా చూడాలని కోరారు. దీనిపై తహసీల్దార్ నాగరాజును వివరణ కోరగా తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఆక్రమణ జరిగి ఉంటే రెవెన్యూ సిబ్బందిని పంపించి చర్యలు తీసుకుంటామన్నారు. -
కూలి పనులకు వెళ్లి..
● ట్రాక్టర్ బోల్తాపడి మహిళ మృతి మర్రిపాడు: మర్రిపాడు మండలం ఏపిలగుంట–శెట్టిసముద్రం మలుపు వద్ద పొగాకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ఓ మహిళ మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పెగళ్లపాడు ఎస్సీ కాలనీకి చెందిన వారు కూలి పనుల నిమిత్తం పొగాకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఏపిలగుంట వైపు నుంచి చిలకపాడుకు వస్తున్నారు. శెట్టి సముద్రం క్రాస్రోడ్డు వచ్చే సరికి కారుకు సైడ్ ఇవ్వబోయి ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న నాగమల్లేశ్వరి, సరస్వతి, రామలక్ష్మమ్మలకు గాయాలు కావడంతో 108 వాహనం ద్వారా ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగమల్లేశ్వరి(26) మృతి చెందారు. ఏఎస్సై నజీర్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్సాహంగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు
● వైఎస్సార్ కడప జిల్లా హవా ● భారీగా తరలివచ్చిన ప్రజలు కొడవలూరు: మండలంలోని గండవరంలో ఉదయకాళేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో వైఎస్సార్ కడప జిల్లా ఎడ్ల జత హవా కనబరిచింది. కడప జిల్లాకు చెందిన పెరమర్ల శివకృష్ణ జోడి ప్రథమ బహుమతిగా రూ.లక్ష గెలుచుకోగా, అదే జిల్లాకు చెందిన డి.గురివిరెడ్డి, పి.తేజస్విరెడ్డిల సంయుక్త జోడి రెండో బహుమతిగా రూ.75 వేలు, మార్తాల సుబ్బారెడ్డి జోడి మూడో బహుమతిగా రూ.50 వేలు గెలుచుకున్నాయి. నంద్యాల రోలి మేడమ్కు చెందిన ఓ జోడి నాలుగో బహుమతిగా రూ.30 వేలు, మరో జోడి ఏడో బహుమతిగా రూ.10 వేలు గెలుచుకున్నాయి. ఐదో బహుమతి ప్రకాశం జిల్లా వీరాస్వామి చౌదరి జోడి రూ.20 వేలు, ఆరో బహుమతి కడప జిల్లా గుత్తి ఆదిల్రెడ్డి జోడి రూ.15 వేలు గెలుచుకున్నాయి. విజేతలకు పౌరసరఫరాల శాఖ రాష్ట్ర డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి బహుమతుల ప్రదానం చేశారు. ఆసక్తిగా సాగిన పోటీలు గండవరం హైస్కూల్లో శనివారం జరిగిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఆసక్తిగా సాగాయి. ఇక్కడ రెండో సారి పోటీలు జరిగినప్పటికీ ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ప్రేక్షకులు కదలకుండా చూస్తూ ఉండిపోయారు. పోటీలకు వినియోగించిన 2.100 కిలోల బండను చుండి వెంకటరెడ్డి జ్ఞాపకార్ధం కుమారుడు అమర్నాథ్రెడ్డి అందించారు. కొడవలూరు సీఐ ఎ.సురేంద్రబాబు, ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. స్థానిక నాయకులు పెనాక వెంకటేశ్వర్లురెడ్డి, ఈశ్వర్రెడ్డి, బచ్చు సురేష్ పాల్గొన్నారు. -
యథేచ్ఛగా గుప్త నిధుల తవ్వకాలు
సీతారామపురం: మండలంలోని మారంరెడ్డిపల్లి గ్రామ సమీపాన నల్లబండ పరిసర ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా కొందరు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపడుతున్నట్లు పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం మారంరెడ్డిపల్లి గ్రామ సమీపాన గల చేలల్లో పైభాగాన గుప్త నిధులు, పురాతన విగ్రహాలు దొరికినట్లు ప్రచారం ఉంది. ఆ ప్రాంతమంతా రాజుల కాలంలో ఎంతగానో విరాజిల్లిందని, పురాతన కాలంలో అక్కడ దేవాలయాలు ఉండేవని, నిధి నిక్షేపాలు సైతం మెండుగా భూమిలో ఉంటాయనే నమ్మకంతో గత కొంతకాలంగా పరీక్షించిన ముఠా సభ్యులు నల్లబండ ప్రాంతంలో గుప్త నిధులు ఉన్నట్లు గుర్తించి కొద్ది రోజులుగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా తవ్వకాలు జరుపుతున్నట్లు పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే మా చేలల్లో మేము తవ్వుకుంటున్నాం, మీకేమి సంబంధం అంటూ ఎదురు దాడికి దిగుతున్నట్లు పలువురు చెబుతున్నారు. ఇదిలా ఉంటే భూ యజమానికి కలలో ఆ ప్రాంతంలో గుప్త నిధులు కనిపించాయని, అందుకే అక్కడ వాటి కోసం తవ్వకాలు చేస్తున్నట్లు మరికొందరు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే అక్కడ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ప్యాకెట్లు, చేతికి బ్లౌజులు, పలుగు, పార, సుత్తి, సమ్మెట, గోతాలు వంటి వస్తువులు అక్కడ ఉండటంతో స్థానికుల ఆరోపణలు, అనుమానాలకు బలం చేకూరుతోంది. -
వీఆర్వోపై దాడి హేయం
● నిందితుడిని కఠినంగా శిక్షించాలి ● వీఆర్వోల సంఘం డిమాండ్ నెల్లూరురూరల్: కొండాపురం మండలం ఇసుకదామెర్ల వీఆర్వో మురళీకృష్ణపై అదే గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి దాడికి పాల్పడడం హేయమైన చర్య అని, వెంటనే అతన్ని కఠినంగా శిక్షించాలని జిల్లా వీఆర్వోల సంఘం కార్యదర్శి డీవీ రమణయ్య డిమాండ్ చేశారు. నగరంలోని జిల్లా జర్నలిస్ట్ భవనలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీఆర్వోపై దాడి చేయడం అనాగరికమైన చర్యగా భావిస్తున్నామన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఎస్పీకి కూడా తెలియజేస్తామన్నారు. అదేవిధంగా మిగతా గ్రామ రెవెన్యూ అధికారులకు భరోసా కలిగించే విధంగా శిక్షలు అమలు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామ రెవెన్యూ అధికారుల సమస్యల పట్ల దశల వారీ ఆందోళన కార్యక్రమంలో భాగంగా 16వ తేదీ సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించామన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సంఘ గూడూరు డివిజన్ ప్రెసిడెంట్ గిద్దలూరు రమణయ్య, ఆత్మకూరు డివిజన్ ప్రెసిడెంట్ బీవీ శేషారెడ్డి, ఆత్మకూరు డివిజన్ సెక్రటరీ సూరిపోగు కృష్ణయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు కన్నెధార రవిశేఖర్ నాయుడు, గ్రేడ్–2 వీఆర్వో జనరల్ సెక్రటరీ మన్నేపలి రమేష్, గంప ఉదయ్తేజ, నెల్లూరు డివిజన్ కార్యవర్గ సభ్యులు చిన్నారావు చంద్రశేఖర్, ప్రసాద్రావు, గూడూరు డివిజన్ కార్యవర్గ సభ్యులు పుల్లయ్య, దాసరి హనుమంతయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కంచి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యుడు నాగేంద్ర పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చాలని డిమాండ్
● కలెక్టరేట్ ఎదుట ధర్నా నెల్లూరు(దర్గామిట్ట): కూటమి నేతలు అధికారంలోకి వచ్చేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు హామీలిచ్చారని, వాటిని వెంటనే నెరవేర్చాలని నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, గౌరవాధ్యక్షులు ఎం.సుదర్శనం, కె.నరసింహ, జి.రాజమనోహర్ మాట్లాడుతూ హామీలపై తక్షణం చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేయాలన్నారు. మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో నేతలు రమేష్బాబు, రాజు, రవి, రామారావు, మోజెస్, చిరంజీవి, హరిబాబు, సురేష్, సునీల్, వీరాస్వామి, కస్తూరయ్య, వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బమ్మ, వెంకటరత్నం, కల్పనాదేవి పాల్గొన్నారు. -
ఉపాధ్యాయురాలికి కలెక్టర్ పరామర్శ
నెల్లూరు(దర్గామిట్ట): ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న టీచర్ హరితను కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం పరామర్శించారు. బాలాయపల్లి మండలంలో ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న హరిత గురువారం గూడూరు నుంచి బాలాయపల్లికి టాటా మేజిక్ వాహనంలో వెళ్తున్న సమయంలో డ్రైవర్ దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కలెక్టర్ పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలిని ఓదార్చి ధైర్యం చెప్పారు. దాడి సమయంలో ఆమె చూపిన ధైర్యసాహసాలను ప్రత్యేకంగా అభినందించారు. కత్తిపోట్ల గాయాలున్నట్లు వైద్యులు చెప్పగా కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తరఫున బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆమెకు ధైర్యశాలి అవార్డు కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట డీఈఓ బాలాజీరావు ఉన్నారు. -
విచారణలు, నివేదికలు బుట్టదాఖలు
జిల్లా ఇరిగేషన్ శాఖ అవినీతికి అడ్డాగా మారింది. పారుదల కాలువల అభివృద్ధి పేరిట అక్రమార్కులు కల్పతరువుగా మార్చుకున్నారు. పైసా పని చేయకుండానే రూ.కోట్లల్లో నిధులు కాజేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విచారణ కమిటీలు సైతం అవినీతిని ధ్రువీకరించినా.. అక్ర మార్కులపై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవంటే ఈ శాఖలో ఏ స్థాయిలో అవినీతి రాజ్యమేలుతోందో అర్థం చేసుకోవచ్చు. కూటమి అధికారంలోకి రాగానే అవినీతిపరులనే ముద్రపడిన కొందరు అధికారులను దొడ్డిదారిన డిప్యుటేషన్పై ఈ శాఖలో ఉన్నతస్థాయిలో కూర్చొబెట్టి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. విషయం రచ్చకెక్కినప్పుడు తాత్కాలికంగా పంపించడం, రోజుల వ్యవధిలోనే మళ్లీ పట్టం కట్టబెట్టడం రివాజుగా మారింది.నెల్లూరు (స్టోన్హౌస్పేట): నెల్లూరులోని నీటి పారుదల శాఖ.. అవినీతి పారుదల శాఖగా అవతరించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ శాఖలో కొందరు అధికారులు, ఉద్యోగులే అన్నీ తామై కీలకంగా వ్యవహరిస్తూ.. ఈ శాఖను భ్రష్టుపట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాము చెప్పినట్లు చేయని ఉద్యోగులు, అధికారులను డిప్యుటేషన్పై ఇతర దూర ప్రాంతాలకు నిర్దయగా బదిలీ చేయడం నుంచి ఇష్టారీతిన బిల్లులు పాస్ చేసుకునే వరకు సంబంధిత అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారంటూ ప్రతిపక్షం ఆధారాలతో సహా బట్టబయలు చేస్తున్నా.. చలనం లేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి పని తమ కనుసన్నల్లో జరిగేలా అధికార పార్టీ ముఖ్యనేతలు వ్యవహరిస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ప్రధానంగా గతేడాది మోంథా తుఫాన్ ప్రభావంగా వరదలకు చాలా చోట్ల ఇరిగేషన్ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా కాలువలు, గండ్లు పూడ్చేందుకు తాత్కాలికంగా రూ.100 కోట్ల నిధులు మంజూరైతే.. ఆ నిధులన్నీ ఆవిరైపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా పనులు ఏ నియోజకవర్గంలో ఎక్కడ మంజూరయ్యాయో తెలియని చిదంబర రహస్యంగా మారుతోంది. తమ ప్రాంతాల్లో ఏఏ పనులు.. ఎంత అంచనాలతో చేస్తున్నారు.. ఎంత మేరకు పనులు జరిగాయో తెలపాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఆనం విజయకుమార్రెడ్డి తదితరులు దరఖాస్తు చేసినా.. సరైన సమాచారం ఇవ్వకుండా చట్టధిక్కారానికి సైతం పాల్పడుతున్నారంటే.. ఏ స్థాయిలో వీరు బరితెగిస్తున్నారో అర్థమవుతోంది. ఐఏబీల్లో ఆర్భాటపు ప్రకటనలు.. పనుల్లో అక్రమాలు జిల్లాలో ప్రధానంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ ఆధారాలతో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి బట్టబయలు చేసినా.. సంబంధిత పనులపైనా.. అధికారులపైనా కనీస విచారణ జరిపి చర్యలు తీసుకున్న పాపాన పోవడం లేదు. రైతులకు ఉపయోగకరంగా చేపట్టాల్సిన పనులను ధనార్జనే ధ్యేయంగా తూతూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకుని, రూ.కోట్లు దిగమింగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐఏబీ మీటింగ్ల్లో తీర్మానించిన తీర్మానాలు ఇంత వరకు ఒక్కటీ కూడా పూర్తి కాలేదు. నియోజకవర్గానికి కేటాయించిన పనుల వివరాలు కూడా చెప్పేవారు కరువయ్యారు. అధికార పార్టీ ముఖ్యనేతల ప్రమేయంతో ఆ శాఖ ఉద్యోగులు ఎలా పనిచేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అటు తప్పించి.. ఇటు కూర్చోబెట్టి గంగాధర్ అనే ఉద్యోగి కాంట్రాక్టర్ల నుంచి ఫోన్పే ద్వారా డబ్బులను అక్రమంగా తీసుకున్నారంటూ పక్కా ఆధారాలతో ఆరోపణలు వెల్లువెత్తడంతో అతనిపై చర్యలు చేపట్టకుండా కొన్ని రోజులు తప్పించి, మళ్లీ ఇప్పుడు విధుల్లోకి తీసుకొచ్చారనే విమర్శలు లేకపోలేదు. గంగాధర్, ఆయన కుమారుడు, కుటుంబ సభ్యుల ఖాతాల్లో డబ్బులను అక్రమంగా జమ చేశారనే పూర్తి ఆధారాలున్నా చర్యలను ఎందుకు చేపట్టలేదనే ప్రశ్నలకు ఆ శాఖ ఉన్నతాధికారుల వద్ద సమాధానం దొరకడం లేదు. అక్రమాలకు అడ్డాగా మారిన ఇరిగేషన్ శాఖలో అవినీతి జలగలపై విజిలెన్స్, ఏసీబీ శాఖలు కనీసం విచారణ చేపట్టకపోవడం వెనుక అధికార పార్టీ ముఖ్య నేతల ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం. అక్రమార్కుల పాలిట కల్పతరువు రూపాయి పనిచేయకుండానే రూ.కోట్లల్లో ప్రజాధనం దోపిడీ కూటమి ప్రభుత్వం రాగానే అవినీతి అధికారులకు డిప్యుటేషన్పై అందలం వీరిని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్న ప్రజాప్రతినిధి, కొందరు నాయకులు ఆరోపణలు, విచారణ కమిటీలు.. వీరి ముందు బలాదూర్ ఏ విచారణ నివేదికపైనా చర్యలు శూన్యం సంబంధిత అధికారులను తాత్కాలికంగా వెనక్కి పంపడం.. మళ్లీ దొడ్డిదారిన తెచ్చి కూర్చోబెట్టడం రివాజు నివ్వెరపోతున్న ఉద్యోగులు అనైతిక కార్యకలాపాలకు అడ్డా ఇరిగేషన్ శాఖ అనైతిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఒక డీఈఈ స్థాయి అధికారి అక్కడ పనిచేసే ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడితే చర్యలు చేపట్టలేదు. పది రోజులు ఆయన్ను పక్కన బెట్టి మళ్లీ అదే సీటులో కూర్చోబెట్టారు. సదరు డీఈఈ వేధింపులకు గురైన మహిళే ఆయన మీద ఎటువంటి ఫిర్యాదు ఇవ్వకపోవడంతో ఆయన్ను మళ్లీ విధుల్లో కూర్చొబెట్టుతూ ఉత్తర్వులు ఇచ్చారంటే ఇంతకంటే దౌర్భగ్యం మరొకటి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అవినీతి అధికారులు, అక్రమార్కులతోపాటు అధికార పార్టీ ముఖ్యనేతకు ఆ శాఖ ఉన్నతాధికారి కొమ్ముకాస్తూ ఇరిగేషన్ శాఖను భ్రష్టు పట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న తీరుపై ఆ శాఖ ఉద్యోగులే నివ్వెరపోతున్నారు. ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న కొందరు అధికారులకు అధికార పార్టీ ముఖ్య నేతల అండదండలు ఉండడంతో అవినీతి ఆరోపణలు వచ్చినా ఏ మాత్రం పట్టించుకోకుండా యథావిధిగా పనిచేస్తున్నారు. ఇటీవల సెంట్రల్ డివిజన్ మేనేజర్పై ఏకంగా విచారణకు ఆదేశించినా అవినీతి అక్రమాలపై విచారణ పూర్తి కాకుండానే క్వాలిటీ కంట్రోల్ ఈఈ ఆయన్ను సరెండర్ చేశారు. మళ్లీ వెంటనే విచారణ నిర్వహించామని, ఆయనపై ఆరోపణలేవీ లేవంటూ విచారణలు, నివేదికలు బుట్టదాఖలు చేశారు. క్వాలిటీ కంట్రోల్ విభాగం ఎంతో కచ్చితంగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఏ పని ఏ స్థాయిలో చేశారో చెప్పాల్సిన క్వాలిటీ కంట్రోల్ ఉద్యోగుల్లో ఇలా ఒకరినొకరు వెనుకేసుకొస్తూ పనుల క్వాలిటీనే పక్కదారి పట్టిస్తున్నారంటూ ప్రతిపక్షం ఆరోపిస్తోంది. -
19న ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్
నెల్లూరు(దర్గామిట్ట): ఈ నెల 19న కలెక్టరేట్లో కలెక్టర్ హిమాన్షుశుక్లా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్డేను నిర్వహించనున్నట్లుగా డీఆర్వో విజయ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20న నిర్వహించాల్సిన గ్రీవెన్స్డేను ఒకరోజు ముందుగా జరుపు తున్నామని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శైవక్షేత్రాలకు నిరంతర విద్యుత్ సరఫరా నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ఆదేశాల మేరకు శివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని శైవక్షేత్రాలకు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా చేయనున్నట్లుగా ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం తెలిపారు. నగరంలోని విద్యుత్భవన్లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలతో పాటు చిన్న శివాలయాలకు అంతరాయం లేకుండా సరఫరాను అందించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. విద్యుత్ సమస్య తలెత్తితో వెంటనే సిబ్బందికి తెలియజేయాలని కోరారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం నెల్లూరు (లీగల్): ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల కు సంబంధించి నెల్లూరులోని బార్ అసోసియేషన్ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10.30 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మొత్తం 1,607 మంది ఓటర్లు ఉండగా, 1,380 మంది న్యాయవాదులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుని సీసీ కెమెరాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమ యం పడుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 61,632 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 24,435 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.28కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జొన్నవాడ ఆలయ అతిథి గృహంలో టీడీపీ సమావేశం బుచ్చిరెడ్డిపాళెం రూరల్: జొన్నవాడలోని మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి ఆలయానికి చెందిన అతిథి గృహంలో టీడీపీ నాయకులు రాజకీయ సమావేశం నిర్వహించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు.. గత ఆదివారం జొన్నవాడ గ్రామ సర్పంచ్ పెంచలయ్య ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఆలయ అతిథిగృహంలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి ఆలయ ఆవరణలో, ఆలయ భవనాల్లో రాజకీయ సమావేశాలు నిర్వహించకూడదు. రాజకీయాల గురించి మాట్లాడకూడదు. ఇవన్నీ పక్కనపెట్టి అధికార టీడీపీ నాయకులు ఏకంగా అమ్మవారి ఆలయానికి చెందిన అతిథిగృహంలో పార్టీ సమావేశం నిర్వహించడం అధికార అహంకారానికి అద్దం పడుతోందని పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి సంబంధించిన భవనంలో రాజకీయ సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పార్టీ సమావేశానికి ఎలా అనుమతి ఇచ్చారని ఆలయ అధికారులపై మండిపడుతున్నారు. ఈ విషయమై ఈఓ అర్వభూమి వెంకట శ్రీనివాసులరెడ్డిని వివరణ కోరగా అక్కడ జరిగింది రాజకీయ సమావేశం కాదని, గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న సమావేశమని తెలిపారు. శివరాత్రి ఏర్పాట్ల గురించి చర్చించారని పేర్కొన్నారు. అయితే ఆలయ అధికారులు, సిబ్బంది, ఇతర శాఖల అధికారులు లేరు కదా అని ప్రశ్నించగా సమాధానం దాట వేశారు. -
ఎండిన ఆశలు
మడిలో పగుళ్లు.. కర్షకుడి కళ్లల్లో కన్నీళ్లు ఎగువన సోమశిల, కండలేరు జలాశయాల్లో పుష్కలంగా నీళ్లు. దిగువన పొలాల్లో నీళ్లు లేక వెయ్యి ఎకరాల్లో అన్నదాతల ఆశలు ఎండిపోతున్నాయి. మడి మడిలో పగుళ్లు కర్షకుడి కళ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో కాలువల అభివృద్ధి పేరుతో రూ.కోట్లు ఖర్చు చేసినా.. సోమశిల దక్షిణ కాలువ పరిధిలోని 7 ఆర్ ఉప కాలువలో తట్టడు మట్టి తీసిన పాపాప పోలేదు. ఈ కాలువ కింద సుమారు 3 వేల ఎకరాల్లో వరి పంట సాగు జరుగుతోంది. కాలువలో జమ్ము, నాచు, చిల్లచెట్లు పెరిగిపోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరందక సుమారు వెయ్యి ఎకరాల్లో పచ్చని వరి పైరు ఎండిపోతోంది. ఎన్నెన్నో ఆశలతో సాగు చేసిన వరి కళ్ల ముందే ఎండిపోతుంటే అటు పాలకులు కానీ.. ఇటు అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. పొదలకూరు : పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అవినీతి వెరసి వెయ్యి ఎకరాల్లోని వరి పంటకు శాపంగా మారింది. రైతుల పేరుతో కాలువల మరమ్మతులకు రూ.కోట్ల నిధులు మంజూరు చేయించుకున్నారు. కానీ ఎక్కడా తట్టెడు పూడిక తీయలేదంటూ ఆది నుంచి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి చేసిన ఆరోపణలకు సోమశిల దక్షిణ కాలువ పరిధిలోని 7ఆర్ ఉప కాలువ అద్దంపడుతోంది. ఇప్పటికే ఎకరాకు రూ.25 వేల వరకు పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్న వరి పంట ఎండుపోతున్నా.. పాలకులు, అధికారులు కన్నెత్తి చూడడం లేదని అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. రూ.కోట్ల నిధులు మంజూరు చేయించుకుని కాలువల నిర్వహణను గాలికి వదిలేయడం వల్లనే ఈ దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటికి తప్పని యుద్ధం సోమశిల జలాశయం నిండుకుండలా ఉన్నా దిగువనున్న ఆయకట్టు రైతులు మాత్రం సాగునీటి కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సోమశిల దక్షిణ కాలువ, దాని ఉప కాలువల కింద చివరి ఆయకట్టు రైతులు జలాశయంలో నీటి నిల్వలు, నీటి కేటాయింపులను దృష్టిలో ఉంచుకుని సుమారు వేలాది ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. ప్రధానంగా 7 ఆర్ ఉపకాలువ కింద సుమారు 3 వేల ఎకరాల్లో వరి సాగులో ఉంది. రెండు వారాల క్రితం వరకు నీటిని సరఫరా చేసిన అధికారులు ఆ తర్వాత క్రమంగా తగ్గించడంతో మండలంలోని చివరి ఆయకట్టుగా ఉన్న చెన్నారెడ్డిపల్లి, నావూరు, భోగసముద్రం, బత్తులపల్లి, చేజర్ల మండలం కొండలరాయుడకండ్రిక రైతులు ఆందోళన చెందుతున్నారు. చివరి ఆయకట్టులో సుమారు వెయ్యి ఎకరాలకు చుక్కనీరు పారుదల లేక నెర్రిలు బారాయి. నిలువునా ఎండుతున్న పంటలు కాలువలో జమ్ము, నాచు, కంపకర్ర చెట్లు పెరగడంతో పూడికతో నిండిపోయి నీరు సక్రమంగా అందడం లేదు. దీనికితోడు మధ్యలో చేజర్ల మండలం చీర్లవారికండ్రిక వద్ద కాలువ పరిస్థితి దయనీయంగా ఉంది. జమ్ము దట్టంగా పెరగడంతో విడుదల చేసిన సాగునీరు ముందుకు సాగడం లేదు. సాగు నీటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల చివరి ఆయకట్టుకు నీరు చేరడం లేదు. చాలా చోట్ల కాలువకు షట్టర్లు లేకపోవడం కూడా ఇబ్బందిగా మారిందని రైతులు అంటున్నారు. చివరి ఆయకట్టులో వెయ్యి ఎకరాలకు తీవ్రంగా ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పటికే సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నట్టు రైతులు గగ్గోలు పెడుతున్నారు. అధికారులు మాత్రం గతేడాది రెండో పంటకు నీరు అందజేయడం వల్ల కాలువల మరమ్మతులు చేపట్టలేకపోయినట్టు చెబుతున్నారు. భారీగా పెట్టుబడులు పెట్టి, ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంటలు ఎండిపోతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని, పారుదల కాలువలు మరమ్మతులకు నోచుకోకపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం.. వెయ్యి ఎకరాల్లో వరికి నష్టం సర్వేపల్లిలో కాలువల అభివృద్ధికి రూ.కోట్లల్లో ఖర్చు అయినా జమ్ము, నాచుతో పూడిన 7ఆర్ కాలువ చివరి ఆయకట్టుకు పారని సాగునీరు కాలువల నిర్వహణను గాలికొదిలేసిన అధికారులు పంటను కాపాడాలని వేడుకుంటున్న రైతులు -
శేష వాహనంపై మూలస్థానేశ్వర స్వామి
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నెల్లూరులోని మూలాపేటలోని ఉన్న శ్రీభువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామికి శుక్రవారం శేష వాహనసేవ జరిగింది. – నెల్లూరు (బృందావనం) ప్రశ్నించినందుకు నోటీసులా?నెల్లూరు రూరల్: బాధితుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు నోటీసులివ్వడం దారుణమని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితకు నోటీసులివ్వడం నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. శాంతిభద్రతలను గాలికొదిలేసి రాజకీయ కక్ష సాధింపుల కోసం వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. దీంతో దేశంలో అట్టడుగు ర్యాంక్కు ఏపీ పోలీస్ వ్యవస్థ పడిపోయిందన్నారు. -
సిబ్బంది సంక్షేమమే ధ్యేయం : ఏఎస్పీ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమమే ధ్యేయమని ఏఎస్పీ సౌజన్య తెలిపారు. శుక్రవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఫోన్ఇన్ కార్యక్రమంలో ఆమె పాల్గొని 13 మంది సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి పోలీస్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఫోన్ ద్వారా సమస్యలను నేరుగా చెప్పొచ్చన్నారు. 13 మంది సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించామన్నారు. కార్యక్రమంలో పోలీసు కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదంలో వ్యక్తికి గాయాలు
రాపూరు: మండలంలోని పంగిలి గ్రామం బీసీ కాలనీలో శుక్రవారం ఉదయం ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఓ వ్యక్తికి తీవ్రయాలయ్యాయి. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మల్లి కోటేశ్వరరావు తన ఇంట్లో నిద్రిస్తుండగా టీవీ, ఫ్రిడ్జ్, లైట్ ద్వారా ఒక్కసారిగా శబ్దం వచ్చి మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన గ్రామస్తులు మంటలు ఆర్పివేసి కోటేశ్వరరావును బయటకు తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం నెల్లూరులోని వైద్యశాలకు తరలించినట్లు వివరించారు. ఇంట్లోని వస్తువులు కాలిపోయాయి. కండలేరులో 56.820 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 56.820 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,200, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 240, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
పంటలు ఎండుతున్నా పట్టని ప్రభుత్వం
పొదలకూరు : రైతులు భారీగా పెట్టుబడులు పెట్టి, ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంటలు ఎండిపోతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని, పారుదల కాలువలు మరమ్మతులకు నోచుకోకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని చెన్నారెడ్డిపల్లిలో ఎండుతున్న వరి పైరును శుక్రవారం పరిశీలించిన కాకాణి మీడియాతో మాట్లాడారు. మోంథా, దిత్వా తుఫాన్లుతో ఇరిగేషన్ కాలువలు, చెరువులకు తీవ్ర నష్టం జరిగిందని, రూ.100 కోట్లు కలెక్టర్ నుంచి మంజూరు చేయించుకున్నారని తెలిపారు. అయితే రైతులను గాలికి వదిలేసి కాలువల మరమ్మతు చేపట్టలేదన్నారు. ఇరిగేషన్ శాఖలో దొంగ బిల్లులు చేయించుకుని నిధులు స్వాహా చేసేందుకు స్కెచ్ వేశారని ఆరోపించారు. సోమశిల దక్షిణ కాలువ పరిధిలోని 7ఆర్ ఉపకాలువ కింద చివరి ఆయకట్టు రైతులు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు పరిస్థితిని సమీక్షించి సాగునీరు అందివ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, పంటలు ఎండిన తర్వాత నీరు ఇచ్చినా ఉపయోగం ఉండదన్నారు. కలెక్టర్ ఇబ్బడి ముబ్బడిగా జలవనరుల శాఖకు పనులు ఇవ్వడం మానుకుని క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాల్సిందిగా సూచించారు. జిల్లాలో రైతుల పంటలు ఎండిపోవడం ఎప్పుడూ చూడలేదని, నీటి నిర్వహణ లేకపోవడం వల్లనే ఇలాంటి దుస్థితి ఏర్పడినట్లు విమర్శించారు. రైతుల సమస్యలు కూటమి నాయకులు, అధికారులకు పట్టడం లేదని, అడ్డంగా దోచుకోవడం ప్రశ్నిస్తే అక్రమ కేసులు పడుతున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి పాలనలో రైతులు పాడి పంటలతో సస్యశ్యామలంగా వెలుగొందారన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఇరిగేషన్ పనులు చేయకుండానే దొంగ బిల్లులు పేరిట దోపిడీకి పాల్పడడంతో కాలువల ద్వారా నీరు సరఫరా కాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. కాలువలు జమ్ము, నాచుతో నిండిపోయి నీరు సరఫరా కావడం లేదన్నారు. మరమ్మతులకు నోచుకోని ఇరిగేషన్ కాలువలు రూ.100 కోట్లు మంజూరైనా పనులెక్కడ చేశారు? మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
వీఆర్వోను నిర్బంధించిన టీడీపీ నేత
కొండాపురం: తాను చెప్పినట్లు వినడంలేదని టీడీపీ నేత వీఆర్వోను గ్రామ సచివాలయంలో నిర్బంధించి తాళాలు వేసిన అరాచకం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది. కొండాపురం మండలం ఇస్కదామెర్లలో శుక్రవారం టీడీపీ నాయకుడు అన్నం సుబ్బారెడ్డి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ నాయకుడిపై చర్యలు తీసుకోకుండా తహసీల్దారు సురేష్ సుతిమెత్తగా మాట్లాడి వీఆర్వోను విడిపించారు. బాధిత వీఆర్వో మురళీకృష్ణ, స్థానికులు తెలిపిన మేరకు.. ఇస్కదామెర్లలో మందబైలు భూమిని స్థానిక రైతు కొన్నేళ్లుగా సాగుచేసుకుంటున్నాడు. అతడికి గతంలో రెవెన్యూ అధికారులు పట్టా కూడా మంజూరు చేశారు. సదరు రైతు ఆ భూమిని ఆక్రమించాడని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన సుబ్బారెడ్డి.. దీనిపై తనకు అనుకూలంగా రిపోర్టు ఇవ్వాలని కొద్దిరోజులుగా వీఆర్వో మురళీకృష్ణపై ఒత్తిడి తెస్తున్నారు. దీనికి వీఆర్వో అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం వీఆర్వో సచివాలయంలో ఉండగా సుబ్బారెడ్డి బయట నుంచి తాళం వేసి నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ సురేష్ అక్కడికి చేరుకుని సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలంటూ టీడీపీ నేతకు చెప్పి వీఆర్వోని విడిపించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ సుబ్బారెడ్డి వ్యవహరించిన తీరు సరికాదని చెప్పారు. వీఆర్వోను నిర్బంధించిన టీడీపీ నేత అన్నం సుబ్బారెడ్డిపై మండల వీఆర్వోల సంఘం నేతలు కొండాపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చారు. -
నిబంధనలను పాటించని డ్రైవింగ్ స్కూళ్లు
● జిల్లాలో డ్రైవింగ్ స్కూల్ను నిర్వహించాలంటే తొలుత రవాణా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ● ఎల్ఎమ్వీ స్కూల్కు కనీసం ఎకరా స్థలం ఉండాలి. ● ఇన్స్ట్రక్టర్కు డిప్లొమాతో పాటు డ్రైవింగ్లో ఐదేళ్ల అనుభవం తప్పనిసరి. ● ట్రేడ్మార్కును నమోదు చేసుకోవడంతో పాటు ఎమ్మెస్సెమ్ఈ, బీమా పాలసీ, పాన్తో పాటు సంబంధిత రవాణా శాఖ కార్యాలయం నుంచి డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ లైసెన్స్ పొందాలి. ● డెమో కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలి. ● డ్రైవింగ్కు సంబంధించిన మెళకువలను వారం పాటు వివరించాల్సి ఉంటుంది. ● రోడ్డు నిబంధనలు, సూచిక బోర్డులపై అవగాహన కల్పించాల్సి ఉంది. ● అనంతరం కనీసం 21 రోజుల పాటు డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. కారును కొనుగోలు చేసి దర్జాగా నడపాలని చాలా మంది కోరుకుంటారు. ఇందులో భాగంగా డ్రైవింగ్ నేర్చుకోవడం తొలి ఎత్తు. ఔత్సాహికుల్లో ఉన్న ఈ ఆసక్తిని డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులు చక్కగా క్యాష్ చేసుకుంటున్నారు. నిబంధనలను పాటించకుండా.. జిల్లాలో పుట్టగొడుగుల్లా ఇవి వెలుస్తున్నాయి. జిల్లాలో కేవలం 15 స్కూళ్లకే అనుమతి ఉండగా, ఇవి లేకుండా ఎన్నింటినో అనధికారికంగా నిర్వహిస్తున్నారు. పాత వాహనాల్లో అరకొరగా ట్రెయినింగ్ ఇస్తూ.. కనీసం డెమోను సైతం ఇవ్వకుండా నేరుగా డ్రైవింగ్లో కూర్చోబెడుతున్నారు. శిక్షణ.. లైసెన్స్ల పేరిట భారీగా వసూలు చేస్తున్నారు. ఈ రకంగా నేర్చుకొని టెస్ట్కు హాజరవుతున్న వారిలో కేవలం ఐదు శాతం మందే పాస్ అవుతుండటం.. శిక్షణ కేంద్రాల డొల్లతనాన్ని ఇట్టే బయటపెడుతోంది. ఇంత జరుగుతున్నా, చోద్యం చూడటం రవాణాధికారుల వంతవుతోంది. నెల్లూరు (టౌన్): జిల్లాలో లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులు నాణ్యమైన శిక్షణను అందించడంలో దారి తప్పుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా, కాలం చెల్లిన వాహనాల్లోనే శిక్షణ ఇస్తూ వేలాది రూపాయలను దోచుకుంటున్నారు. ఆధునిక పరికరాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా డెమో ఇచ్చాకే.. వాహనాన్ని నడపడంలో ట్రెయినింగ్ను ఇవ్వాల్సి ఉన్నా, అవేవీ తమకు పట్టదనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారి వద్ద రూ.ఐదారు వేలను వసూలు చేసి తూతూమంత్రంగా శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. అన్నీ మేమే చూసుకుంటాం..! లైసెన్స్ కావాలంటే మరో రూ.మూడు వేలను చెల్లిస్తే, అన్నీ తామే చూసుకుంటామనీ భరోసా ఇస్తున్నారు. తీరా దీని కోసం రవాణా కార్యాలయానికెళ్తే బొక్కాబోర్లపడి ఫెయిలవుతున్న పరిస్థితీ నెలకొంది. జిల్లాలో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ అందుబాటులోకి వచ్చాక, లైట్ మోటార్ వెహికల్ టెస్ట్లో కేవలం ఐదు శాతం మందే ఉత్తీర్ణులవుతున్నారు. డ్రైవింగ్లో నిర్వాహకులు ఏ మేరకు శిక్షణ ఇస్తున్నారో దీని ద్వారా అర్థమవుతోంది. పాత వాహనాల్లోనే అంతా.. జిల్లాలో అధికారికంగా 15 డ్రైవింగ్ స్కూళ్లుండగా, అనధికారికంగా 60కుపైగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇందులో ఎక్కడా అధునాతన వాహనాలు కానరావు. అంబాసిడర్, మారుతి 800 లాంటి వాహనాల్లోనే శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో ఒకట్రెండు చోట్లే డెమో తరగతుల కోసం పరికరాలున్నాయి. ఓ చిన్న గదిలో సైతం నిర్వహిస్తున్న పరిస్థితీ ఉంది. ఇన్స్ట్రక్టర్కు లైసెన్సే ఉండదు. ఆ సమయంలో ఎవరుంటే వారినే శిక్షణకు పంపుతున్నారు. తొలి రోజు నుంచే నేరుగా స్టీరింగ్ పట్టించి.. డ్రైవింగ్ను కేవలం పది రోజుల్లోనే ముగిస్తున్నారు. జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వైనం అనుమతున్నవి 15.. పర్మిషన్ లేనివెన్నో..! పాత వాహనాలతోనే అరకొరగా ట్రెయినింగ్ డెమో ఇవ్వకుండా నేరుగా డ్రైవింగ్ తర్ఫీదు పేరుతో రూ.ఐదారు వేల చొప్పున వసూలు లైసెన్స్తో కలిపి రూ.ఎనిమిది వేలు పట్టించుకోని రవాణాధికారులు ఇవీ నిబంధనలు.. ఇదీ తీరు.. తనిఖీలు నిర్వహిస్తాం జిల్లాలోని డ్రైవింగ్ స్కూళ్లపై తనిఖీలు జరుపుతాం. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిపై చర్యలు చేపడతాం. డెమో నిర్వహించిన అనంతరమే డ్రైవింగ్ను నేర్పించాలి. అనధికారికంగా నిర్వహిస్తే చర్యలు తప్పవు. – మదానీ, ఆర్టీఓ, నెల్లూరు -
తూపిలిపాళేనికి చేరుకున్న సైక్లథాన్
వాకాడు: వందేమాతరాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఐఎస్ఎఫ్ చేపట్టిన సైక్లథాన్ మండలంలోని తూపిలిపాళేనికి గురువారం చేరుకుంది. ఈ సందర్భంగా మత్స్యకారుల భద్రతపై స్థానిక మత్స్యకారులకు అవగాహన కల్పించారు. కోల్కతా నుంచి కేరళలోని కొచ్చి వరకు సైకిల్ యాత్ర సాగనుందని అధికారులు తెలిపారు. మత్స్యకార గ్రామాల్లో విద్యా సదుపాయాలు ఎలా ఉన్నాయనే అంశాన్ని ఆరాతీశారు. వాలమేడు హైస్కూల్ను సందర్శించి విద్యార్థులకు క్రికెట్, వాలీబాల్ కిట్లను అందజేశారు. ఫిష్కాన్ డైరెక్టర్ అప్పంగారి జయపాల్, కాపులు పామంజి గోవిందయ్య, వావిల సుబ్రహ్మణ్యం, మత్స్యకారులు కొండూరు వెంకటేశ్వర్లు, గోవిందయ్య, మస్తానయ్య, గోవిందు, బ్రహ్మయ్య, రఘు, యేసు తదితరులు పాల్గొన్నారు. -
గళమెత్తిన కార్మిక లోకం
● నెల్లూరులో సార్వత్రిక సమ్మె ● భారీ ర్యాలీ నిర్వహించిన ప్రజా సంఘాలు, యూనియన్లు ● సంఘీభావంగా బైక్ ర్యాలీ చేపట్టినవైఎస్సార్ ట్రేడ్ యూనియన్నెల్లూరు(వీఆర్సీసెంటర్): అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య, అఖిల భారత సంయుక్త కిసాన్మోర్చా పిలుపుమేరకు గురువారం నెల్లూరులో కార్మిక లోకం సమ్మె నిర్వహించింది. ఉదయం ఏబీఎం కాంపౌండ్ వద్దకు చేరుకున్న సీపీఎం, సీపీఐ, నెల్లూరు నగర, రూరల్ కమిటీలు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐఎఫ్టీయూ (న్యూ), ఏఐఎఫ్టీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, వైఎస్సార్ టీయూ, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు, కా ర్మికులు మద్రాస్ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎర్ర జెండాల చేతపట్టి నాలుగు లేబర్కోడ్స్కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. నేతలు ఏమన్నారంటే.. ర్యాలీ అనంతరం మద్రాస్ బస్టాండ్ వద్ద మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లా డుతూ పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఐక్యత లేకపోవడంతోనే కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలుగా పార్లమెంట్ను ఇంటిలా వాడుకుంటూ ఇష్టారాజ్యంగా చట్టాలు చేస్తోందని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ కార్మిక చట్టాలను మార్చడం, ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం దారుణమన్నారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మోదీ, చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి మాట్లాడుతూ కార్మికుల కోసం తెచ్చిన 29 చట్టాలను తిరిగి పునరుద్ధరించాలన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.అజయ్కుమార్ మాట్లాడుతూ నెల్లూరులోని ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిందన్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి ప్రైవేట్ వ్యక్తుల చేతిల్లోకి ఆర్టీసీ వెళ్తుందన్నారు. సమ్మెలో వివిధ సంఘాలకు చెందిన రాజేష్, జయకుమార్రెడ్డి, రాజేష్, పరంధామయ్య, మాదాల వెంకటేశ్వర్లు, కత్తి శ్రీనివాసులు, రెహానా బేగం, అన్నపూర్ణమ్మ, మూలం ప్రసాద్, రషీద్, నరిసింహ, వినోదిని, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు అండగా వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్: వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జయకుమార్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం సమ్మెకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద ర్యాలీని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి సమక్షంలో జెండా ఊపి సీనియర్ నాయకుడు ఎల్లసిరి గోపాల్రెడ్డి ప్రారంభించారు. వైఎస్సార్సీపీ కార్మికులకు అండగా ఉంటుందని జయకుమార్రెడ్డి తెలిపారు. రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి, నేతలు పాల్గొన్నారు. -
నమ్మండి.. నాణ్యత ఇలా ఉంటుంది..!
● నిర్మించిన మూడు రోజులకే ధ్వంసమైన రోడ్డు చిట్టమూరు: రోడ్ల నిర్మాణాల్లో నాణ్యతను విస్మరించి తమ జేబులు నింపుకొనేందుకే టీడీపీ ప్రభుత్వం పరిమితమవుతోంది. పది కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన రోడ్లు రోజుల వ్యవధిలోనే ధ్వంసమవుతున్నాయి. సూళ్లూరుపేట – కోట.. మల్లాం రహదారిలో చిట్టమూరు మండలం తాడిమేడు నుంచి సింగనాల్తూరు వరకు వేస్తున్న తారు రోడ్డు పనులు మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలాయి. మూడు రోజుల క్రితమే ఈ పనులను పూర్తి చేయగా, గురువారానికి ఇవి ధ్వంసమై దర్శనమిచ్చాయి. గుంతల్లో నాసిరక మెటల్ను పరిచి తారు వేస్తుంటే, మరుసటి రోజుకే అది లేచిపోతోంది. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అంతా ఇష్టారాజ్యంగా జరుగుతోంది. ఇప్పటికై నా వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
17న జిల్లా స్థాయి చెస్ పోటీలు
నెల్లూరు(స్టోన్హౌస్పేట): శాప్ లీగ్స్ – 2026లో భాగంగా నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈనెల 17న జిల్లా స్థాయి చెస్ పోటీలు, ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎం.పాండు రంగారావు తెలిపారు. నగరంలోని ఆ సంస్థ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అండర్ – 13, 15, 17, 19 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు, ఎంపికలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గల చెస్ క్రీడాకారులు https://sports.ap.gov.in/#/home/ saapleague వెబ్సైట్లో లేదా క్రీడా యాప్లో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. జిల్లాకు చెందిన వారే అర్హులని, ఆధార్కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకురావాలన్నారు. ఇతర జిల్లాల విద్యార్థులు నెల్లూరు జిల్లాలో చదువుతుంటే ఆ విద్యాసంస్థ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాలని తెలిపారు. ప్రతిభ చూపిన వారిని 21, 22 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. ఈనెలలో చెస్, సైక్లింగ్, అథ్లెటిక్స్ పోటీలు, మార్చి నెలలో బ్యాడ్మింటన్, టెన్నీస్ పోలీసులు జరుగుతాయన్నారు. ఆసక్తి గలవారు 88862 28444, 95813 72472 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు. -
మా మద్యం.. మా ఇష్టం
● టీడీపీ ప్రభుత్వంలో వింత పోకడ ● నిబంధనలకు తిలోదకాలు ● కంటైనర్లో బార్ను ఏర్పాటు చేసిన వైనం నెల్లూరు సిటీ: మద్యం విక్రయాలే పరమావధిగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మందుబాబులను ఎంత మత్తులోకి దింపితే అంత ఆదాయమొస్తుందనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. శాంతిభద్రతలు మృగ్యమైనా.. మహిళలకు రక్షణ కొరవడినా, వాటిని అరికట్టే దిశగా అడుగులేయకుండా.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. తాజాగా నగరంలోని జాతీయ రహదారి వద్ద దెయ్యాలదిబ్బ కాలనీకి సమీపంలో కంటైనర్లో బార్ అండ్ రెస్టారెంట్ను ఏర్పాటు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. కంటైనర్ పక్కనే షామియానాలను వేసి నయా దందాను సాగిస్తున్నారు. యాక్సిడెంట్ జోన్లో.. జాతీయ రహదారి వద్ద దెయ్యాల దిబ్బ కాలనీ సర్కిల్లో ఇటీవల పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో పలువురు గాయపడగా, మరికొందరు మృత్యువాత పడ్డారు. అయినా వీటిని పట్టించుకోకుండా బార్ను ఏర్పాటు చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. తాజాగా నిబంధనలకు పాతరేస్తూ సింహపురిలో కంటైనర్లో బార్ను ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. అసలే జాతీయ రహదారి.. ఆపై తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతంలో పెట్టడం విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికే వీధివీధినా వెలసిన వైన్ షాపులతో మహిళలకు రక్షణ కరువవుతోంటే.. ఇలా వ్యవహరిస్తుండటంపై ప్రజానీకం భగ్గుమంటోంది. -
రుణం చెల్లించినా.. ఇంటి పత్రాలివ్వడం లేదు
● మహిళ ఆవేదన ఆత్మకూరు: ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంక్కు రుణం చెల్లించినా ఇంటి పత్రాలివ్వకుండా తిప్పుకొంటున్నారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం ఆమె వివరాలు వెల్లడించారు. దుత్తలూరు మండలం తురకపల్లికి చెందిన మెట్ల సుభాషిణి 2023 సంవత్సరంలో ఆత్మకూరులోని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో రూ.30 లక్షలు విలువైన తన ఇంటి పత్రాలను మార్ట్గేజ్ చేసి రూ.10 లక్షల రుణం తీసుకుంది. కుమారుడి అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా అప్పు చేసింది. చికిత్స పొందుతూ కుమారుడు మృతిచెందాడు. రూ.10 లక్షలు అసలుకు గానూ రూ.6 లక్షల వడ్డీతో కలిపి మొత్తాన్ని 2025 నవంబర్ 19వ తేదీ నాటికి పూర్తిగా చెల్లించింది. లోన్ పూర్తయినట్లు బ్యాంక్ అధికారులు రశీదులిచ్చారు. మార్ట్గేజ్ చేసిన ఇంటి పత్రాలు వారం రోజుల్లో ఇస్తామని చెప్పి మూడు నెలలైనా ఇవ్వకుండా తిప్పుకొంటున్నారని బాధిత మహిళ వాపోయింది. హెడ్ ఆఫీస్ నుంచి పత్రాలు రావాలని చెబుతూ వచ్చారు. గురువారం వారిని నిలదీస్తే పత్రాలు పోయాయని, డూప్లికేట్ పత్రాలు ఇస్తామని చెప్పినట్లుగా సుభాషిణి వాపోయింది. రుణం చెల్లించే క్రమంలో ఒక్కరోజు ఆలస్యమైనా రూ.800 నుంచి రూ.3 వేలు పెనాల్టీగా సిబ్బంది వసూలు చేశారని చెప్పింది. పత్రాలు ఇవ్వకపోతే బ్యాంక్ ఎదుట పురుగు మందు తాగి ఆత్మహత్యకు చేసుకుంటానని పేర్కొంది. ఈ విషయమై ఆ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ వినోద్ను సంప్రదించగా ఆమె మార్ట్గేజ్ చేసిన పత్రాలు పోయిన విషయం వాస్తవమేనన్నారు. నెల్లూరులోని కార్యాలయ అధికారులకు తెలిపామని, రీ రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. -
విద్యుత్ భవన్ ఎదుట ధర్నా
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ సంస్థను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ నేషనల్ కో ఆర్డినేట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ ఇంజినీర్స్ యూనియన్ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం నెల్లూరులోని విద్యుత్ భవన్ ఎదుట ధర్నా జరిగింది. ధర్నాను యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దుగ్గిరాల సూరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి జాకీర్ హుస్సేన్ ప్రారంభిచారు. వారు మాట్లాడుతూ సంస్థను ప్రైవేటీకరిస్తే కార్మికుల కంటే రైతులు, ప్రజలు ఎక్కువగా నష్టపోతారన్నారు. విద్యుత్ ఉద్యోగుల కు రావాల్సిన డీఏలను వెంటనే చెల్లించాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. జేఎల్ఎం గ్రేడ్ – 2 సమస్యలను పరిష్క రించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు. ఈనెల 18వ తేదీన జరిగే యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశంలో కార్మికుల సమస్యలపై తీర్మానం చేసి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో నేతలు బొజ్జా సుమన్, నాగయ్య, హరినారాయణ, గిరిబాబు, దయాకర్, జనార్దన్, లక్ష్మీపతి, జ్యోతిబసు, నాగముని, రామయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలు వీడాలి
● ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్రావు నెల్లూరు(అర్బన్): ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలు మానుకోవాలని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఎసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్రావు డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం భోజన విరామ సమయంలో కలెక్టరేట్ వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. వందలాది మంది ఉద్యోగులు తరలివచ్చారు. ఈ సందర్భంగా విద్యాసాగర్రావు మాట్లాడుతూ ఉద్యోగుల రక్షణ, పెన్షన్, ఇంక్రిమెంట్లు తదితర బాధ్యతల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకొంటున్నాయని విమర్శించారు. కేంద్రం కరోనా లాంటి కష్టకాలంలో ఎవరికీ తెలియకుండా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులతోపాటు ఉద్యోగుల హక్కులు కూడా కాలరాయబడ్డాయన్నారు. సీపీఎస్ను రద్దు చేయాలని, ఓపీఎస్ను పునరుద్ధరించాలని, కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తున్నారన్నారు. ఈ విధానాలు ప్రమాదకరమన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపధ్యక్షుడు అజయ్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను కారుచౌకగా ప్రైవేట్ శక్తులకు కట్టబెడుతున్నారన్నారు. భవిష్యత్లో రైల్వేస్టేషన్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోతాయన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బలిజేపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, లక్కాకుల పెంచలయ్య, ఆంజనేయవర్మ, లక్ష్మి, స్వర్ణలత, సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్, ఏపీ ఎడ్యుకేషన్ అసోసియేషన్, సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. -
పీపీపీ మాటున చంద్రబాబు దోపిడీ
నెల్లూరు రూరల్: ‘గవర్నర్ ప్రసంగంలో కూటమి ప్రభుత్వం అసత్యాలు చెప్పించింది. పీపీపీ మోడల్ పేరుతో చంద్రబాబు దోచుకుంటున్నారు’ అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శించారు. నెల్లూరులోని ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. పీపీపీ అంటే పైసలు, పత్రికలు, పోలీసులను అడ్డం పెట్టుకుని దోచుకోవడమేనన్నారు. అమరావతిలో తానెక్కడికెళ్లి విచారించినా దోపిడీయే కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలను పట్టించుకోవడం మానేశారన్నారు. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ చార్జీలు అందక లక్షల మంది విద్యార్థులు దారుణ పరిస్థితుల్లో సతమతమవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు రోజురోజుకూ బలహీనపడుతున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కండలేరులో 57 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 57 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,200, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 240, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
ఇళ్ల మధ్య బార్ వద్దు
● కావలిలో ప్రజల నిరసన కావలి: వ్యాపార సముదాయాలు, గృహల మధ్యలో బార్ వద్దంటూ మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున నిరసనను గురువారం చేపట్టారు. కావలి పట్టణంలోని లత థియేటర్ సమీపంలో ఉన్న షాపింగ్ క్లాంపెక్స్లో బార్ను గురువారం ప్రారంభించారు. దీంతో స్థానిక వ్యాపారులు, మహిళలు పెద్దఎత్తున చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో అయ్యప్పస్వామి దేవస్థానం, కావలి గ్రామ దేవత కలుగోళమ్మ దేవస్థానం ఉందని, భక్తులు నిత్యం అధిక సంఖ్యలో వస్తుంటారన్నారు. బార్ వెనుకవైపు వైద్యశాలతోపాటు కూతవేటు దూరంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలున్నాయన్నారు. గతంలో ఇక్కడ మద్యం దుకాణం ఉండటంతో స్థానికులను మందుబాబులు తీవ్ర ఇబ్బందులను గురిచేశారని ఆరోపించారు. బార్ను తరలించాల్సిందేనని డిమాండ్ చేశారు. -
పాటూరు చీరలకు గుర్తింపు దిశగా అడుగులు
● క్షేత్రస్థాయిలో నిపుణుల బృందం పరిశీలన కోవూరు: జిల్లాకే గర్వకారణమైన పాటూరు చీరలకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) సాధించేందుకు కసరత్తులు మొదలయ్యాయి. ఇందులో భాగంగా జిల్లా చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన నిపుణుల బృందం కోవూరు, నెల్లూరు రూరల్ మండలాల్లో విస్తృతంగా పర్యటించింది. హైదరాబాద్లోని రిసల్యూట్ ఐపీ సర్వీసెస్ సీఈఓ సుభాజిత్ మార్గదర్శకత్వంలో, కన్సల్టెంట్ సాగర్రావు నేతృత్వంలోని బృందం పాటూరు, గుమ్మళ్లదిబ్బ, నారాయణరెడ్డిపేట గ్రామాలను గురువారం సందర్శించింది. ఆయా ప్రాంతాల్లోని చేనేత కార్మికులతో భేటీ అయి, చీరల తయారీలో వాడే సంప్రదాయ పద్ధతులు, ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చేనేత, జౌళి శాఖ జిల్లా అధికారి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. పాటూరు చీరల విశిష్టతను కాపాడటమే ఈ అధ్యయన ప్రధాన లక్ష్యమని చెప్పారు. -
లడ్డూ ప్రసాదంపై అదే దుష్ప్రచారం
● చంద్రబాబు తీరుపై అసహనంగా ప్రజలు ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరు: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు అదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని బ్రాహ్మణపల్లిలో గురువారం పర్యటించిన ఆయన మాట్లాడారు. లడ్డూ ప్రసాదంపై చేస్తున్న వ్యాఖ్యలు దుర్మార్గంగా ఉన్నాయని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి ఇలాంటి దుష్ప్రచారాలు సాగించడం తగదని హితవు పలికారు. గ్రామాల్లో ఎక్కడికెళ్లినా చంద్రబాబు వ్యాఖ్యలను ప్రజలు ఖండిస్తున్నారని తెలిపారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించే ప్రసాదాలపై విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. భక్తుల మనోవేదనను అర్థం చేసుకోకుండా ఇలా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. ప్రసాదంలో జంతువుల కొవ్వు లేదని తేలడంతో.. అసహనంతో పేట్రేగిపోయి బాత్రూమ్లు కడిగే రసాయనాలను వాడారంటూ ఆయన మాట్లాడుతుండటాన్ని ఆ పార్టీ నేతలే చీదరిస్తున్నారని చెప్పారు. పాపాలు శాపాలుగా మారడంతో చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, మంత్రులు నానా తంటాలు పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు కుట్రలను వెంకటేశ్వరస్వామి బద్ధలు కొట్టారన్నారు. శివదీక్షధారులపై దాడులు హేయం శ్రీశైల మల్లన్నను దర్శించుకునేందుకు నిష్టతో వెళ్లిన శివదీక్షధారులను పోలీసులు కొట్టడం హేయమైన చర్యగా కాకాణి అభివర్ణించారు. వెంకటాచలం మండలంలోని కాకుటూరు శివాలయ భూములను సోమిరెడ్డి విక్రయించి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. గ్రామాల్లో రైతుల గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యారని మండిపడ్డారు. అనేక రకాల హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. దేన్నీ అమలు చేయడంలేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో దేవాలయాల నిర్వహణ పవిత్రంగా ఉండేదని గుర్తుచేశారు. బ్రాహ్మణపల్లికి చెందిన పార్టీ సీనియర్ నేత రావుల చినఅంకయ్య దశదిన కర్మకు హాజరై నివాళులర్పించారు. వెన్నపూస దయాకర్రెడ్డి, బడుగు శ్రీనివాసులు, శ్రీహరి, గోపాల్నాయుడు, బత్తల పెంచలరెడ్డి, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బిషప్లుగా పట్టాభిషేకం
నెల్లూరు(బృందావనం): నెల్లూ రు మూలాపేట బట్వాడిపాళెం సెంటర్లో ఉన్న ది సెకండ్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో సెంటర్ ఫర్ ఎపిస్కోపల్ ఫెలో షిప్ ఇన్ ఇండియా (సెఫీ) – డయోసిస్ ఆధ్వర్యంలో బుధవారం ‘బిషప్ల పట్టాభిషేకం’ ఘనంగా జరిగింది. సెఫీ – డయాసిస్ అధ్యక్షుడు బిషప్ పాల్సుందర్ శేఖరన్ ఆధ్వర్యంలో రెవరెండ్ ఎస్.ప్రేమ్కుమార్ (కొవ్వూరు), వి.ఆశామీనన్ (అల్లూరు), ఎస్.ప్రకాష్ (చైన్నె)ను బిషప్లుగా పట్టాభిషేకం నిర్వహించారు. సర్టిఫికెట్లను అందజేసి వారి బాధ్యతలను పాల్సుందర్ శేఖరన్ వివరించారు. రెవరెండ్ రాజశేఖర్ దాసరి ప్రార్థనతో కార్యక్రమం మొదలైంది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 17 మంది దైవజనులకు రెవరెండ్గా అభిషేకం చేసి వివాహ లైసెన్స్లు మంజూరు చేశారు. సంప్రదాయంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ‘సెఫీ – డయోసిస్’ బిషప్లు స్టీఫెన్, శ్యాంసన్, ప్రేమ్కుమార్, శ్రీనివాసరావు, జయశీలన్, నెల్లూరు ఇన్చార్జి జె ర్మియా తదితరులు పాల్గొన్నారు. తొలుత బిషప్లుగా బాధ్యతలు స్వీకరించిన ప్రేమ్కుమార్, ఆశామీనన్, ప్రకాష్ల వ్యక్తిత్వ సాక్ష్యాలు, సంఘీయులుగా వారందించిన సేవలను దైవజ్ఞనులు వివరించారు. కార్యక్రమంలో ది సెకండ్ తెలుగు బాప్టిస్ట్ చర్చి చైర్మన్ ఉరందూరు సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల బెదిరింపులకు భయపడం
● గిరిజన నేత జయవర్ధన్ ● 12వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు నెల్లూరు(దర్గామిట్ట): పోలీసుల బెదిరింపులకు భయపడేది లేదని గిరిజన సంఘాల ఐక్యవేదిక నేత పొట్లూరి జయవర్ధన్ అన్నారు. కలెక్టరేట్ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారంతో 12వ రోజుకు చేరుకున్నాయి. దీనికి వివిధ ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. కాగా దీక్షలను ఆపేయాలంటూ పోలీసుల నుంచి సైతం బెదిరింపులు వస్తున్న సందర్భంగా జయవర్ధన్ మాట్లాడుతూ ఎన్ని అవరోధాలు ఎదురైనా న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. బలహీనవర్గాలపై నిరంకుశంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడం దారుణమన్నారు. ఎన్నికల కమిషన్ను కలవకూడదనే హక్కు ఎవరిచ్చారని పోలీసులను ప్రశ్నించారు. అవసరమైతే దేశ రాజధాని ఢిల్లీలో ధర్నాకు దిగుతామని తెలిపారు. మేయర్ పీఠంపై గిరిజలను కూర్చోబెట్టాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షకు ఎంప్లాయీస్ అసోసియేషన్ నేత చెంచయ్య రూ.5 వేలు విరాళాన్ని ప్రకటించారు. నగదును ఐక్యవేదిక నాయకుడు బాపట్ల వెంకటపతి యానాదికి అందజేశారు. కార్యక్రమంలో యాకశిరి మురళి సుధీర్బాబు చేవూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జయవర్ధన్కు నోటీసులు నెల్లూరు(స్టోన్హౌస్పేట): గిరిజనులు చేపట్టిన ఉద్యమంపై కూటమి ప్రభుత్వం అణచివేత ధోరణి ప్రదర్శిస్తోంది. నేతలు ఇటీవల ఎన్నికల కమిషన్ను కలిసిన విషయాన్ని నెల్లూరు కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా ఉద్యమాన్ని కట్టడి చేయాలన్న కుట్రలు పన్నుతున్నారు. అసెంబ్లీ, ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తారని పోలీసులకు సమాచారం అందడంతో బుధవారం జయవర్ధన్కు నోటీసులిచ్చారు. ఆందోళన విరమించాలన్నారు. ఎన్నికల కమిషన్ను కలిసేందుకు పర్మిషన్ లేదంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. దీంతో గిరిజన సంఘాలు రగిలిపోతున్నాయి. -
తమ్ముళ్ల కన్ను
ఎర్ర సంపదపై ● ఎర్రచందనం అక్రమ రవాణా ● పోలీసుల అదుపులో ఆరుగురు ● అందులో సోమశిల ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అనుచరుడుఆత్మకూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక, గ్రావెల్ను మండలాల టీడీపీ నాయకులు యథేచ్ఛగా దోచుకుని అక్రమంగా సంపాదించుకుంటున్నారు. ఎర్రచందనంపై ఆ పార్టీ శ్రేణుల కళ్లు పడ్డాయి. గత అక్టోబర్ నెలలో సోమశిల పెన్నానది పరీవాహక ప్రాంతంలో కొందరు స్మగ్లర్లు టీడీపీ నాయకుల అండదండలతో ఎర్రచందనం, అటవీ సంపదను రాత్రికి రాత్రే దూర ప్రాంతాలకు తరలించారు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా కొందరు అధికారుల అండదండలతో తొక్కి పెట్టేశారు. తొలుత ఎర్రచందనం నరికి అనుకూలమైన ప్రాంతాల్లో డంప్ చేసుకుంటున్నారు. అవకాశం చూసి చైన్నె, బెంగళూరులకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వారిలో టీడీపీ నేత ఇటీవల ఉదయగిరి ప్రాంతంలో పట్టుబడిన ఎర్రచందనం డంప్ విషయంలో అధికారులు ఆరా తీశారు. దీంతో వీటి వెనుకున్న వారు వెలుగులోకి రావడం, అరెస్ట్ చేయడం తెలిసిందే. మంత్రి ఆనం ప్రధాన అనుచరుడు, సోమశిల ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వేలూరు కేశవ చౌదరికి కుడిభుజంగా వ్యవహరించే ఆయన గ్రామానికే చెందిన తాళ్లూరు తిరుపతి నాయుడు పట్టుబడిన ఆరుగురిలో ఒకడు. ఎర్రచందనంను దూర ప్రాంతాలకు తరలించి రూ.లక్షలు వెనుకేసుకుంటున్నాడు. వీరికి మంత్రి అండదండలు ఉన్నాయని, వారికేమవుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. గత నెలలో సంక్రాంతి పండగ సమయంలో నాగులవెలటూరు శివారు పొలాల్లో అధికారుల సమక్షంలోనే పెద్దఎత్తున కోడి పందేలు నిర్వహించడం, భారీగా నగదు చేతులు మారిన విషయం మరువక ముందే ఎర్రచందనం అక్రమ రవాణా బయటపడింది. వెలుగులోకి ఇలా.. ఉదయగిరి నియోజకవర్గం ఆర్లపడియ, భైరవానికొండ తదితర ప్రాంతాల్లో గొర్రెలకాపరులు ఎక్కువగా ఉంటారు. కొద్దిరోజులుగా గొర్రెలు చోరీకి గురవుతుండడంతో కొందరు యజమానులు ఆర్లపడియ గ్రామ సమీపంలో రాత్రి వేళల్లో కాపలా ఉన్నారు. అదే సమయంలో రెండు వ్యాన్లలో కొందరు ఆ మార్గంలో అడవిలోకి ప్రవేశించిన విషయాన్ని గమనించిన యజమానులు వారు గొర్రెలు దొంగతనం చేసేందుకు వచ్చారనే అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే రాత్రి పోలీసులు భైరవానికొండ సమీపంలోని కాశీనాయన ఆశ్రమం వద్ద దాడులు నిర్వహించి 30 ఎర్రచందనం దుంగలు వ్యాన్లలోకి లోడ్ చేస్తున్న విషయాన్ని గమనించారు. పోలీసులను చూసిన స్మగ్లర్లు, టీడీపీ నాయకులు పరారయ్యారు. వారిలోని ఓ వ్యక్తి ఫోన్ అక్కడ దొరికింది. దాని ఆధారంగా ఈ అక్రమ రవాణాకు పాల్పడే వారి వివరాలను పోలీసులు తెలుసుకున్నారు. ఫోన్ యజమాని ద్వారానే మిగిలిన వారికి కాల్ చేయించి నెల్లూరు సమీపంలోని నరసింహకొండ వద్దకు వారందరూ వచ్చేలా చేసి అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఉదయగిరి, బుచ్చి, నెల్లూరు, చేజర్ల మండలాలకు చెందిన ఆరుగురు పట్టుబడ్డారు. ముఖ్యమైన వ్యక్తి తాళ్లూరు తిరుపతి. దీంతో ఎర్రచందనం అక్రమ రవాణా వెలుగులోకి వచ్చి టీడీపీ నాయకుల పాత్ర తెలిసింది. తిరుపతి గతంలో గుంటూరులో క్వారీలు నిర్వహించి పూర్తిగా నష్టపోయాడు. కుటుంబం బెంగళూరులో ఉంటోంది. అతను గ్రామంలో టీడీపీ నాయకుడికి అనుచరునిగా కొనసాగుతున్నాడు. ఆరు నెలలుగా ఎర్రచందనం అక్రమ రవాణాలో ప్రముఖపాత్ర పోషిస్తున్నట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోంది. ఎంత దాటించారో.. పట్టుబడిన 30 దుంగల ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్లో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఉంటుందని అటవీ శాఖ అధికారులే చెప్పడం గమనార్హం. ఇలా పట్టుబడకుండా మరెంత ఎర్రచందనం రాష్ట్రాలు దాటించి ఉంటారనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. -
20న రజకుల మహాధర్నా
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రజకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఈనెల 20వ తేదీన తాడేపల్లిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగే ‘రజకుల మహాధర్నా’ను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య పిలుపునిచ్చారు. నగరంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి నాయకులు రజక వృత్తిదారుల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చాక ఎలాంటి పథకాలు అందజేయలేదని ఆరోపించారు. రజకుల సంక్షేమం, అభివృద్ధి కోసం బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రజక వృత్తిదారులపై అక్రమ కేసులు, మహిళలపై దాడులు, బాలికలపై లైంగికదాడులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో శ్రమకు తగిన వేతనం అందడం లేదన్నారు. కార్మిక శాఖ ద్వారా సర్వే నిర్వహించి గుర్తింపుకార్డులు ఇవ్వాలన్నారు. సమావేశంలో నాయకులు గుంజి దయాకర్, కసుమూరు రమేష్, కటికాల వెంకటేశ్వర్లు, సుబ్బారావు, అంకయ్య, రమణయ్య, వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. -
రేపు రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు
● పోలింగ్కు సర్వం సిద్ధం నెల్లూరు(లీగల్): రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నిర్వహిస్తున్న ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి నెల్లూరు బార్ అసోసియేషన్ హాల్లో పోలింగ్ కేంద్రం ఏర్పాటుచేశారు. పోలింగ్కు సర్వం సిద్ధం చేసినట్టు నెల్లూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పులిమి అయ్యపరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 40,000 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 143 మంది న్యాయవాదులు పోటీ పడుతున్నారన్నారు. బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నిక జరుగుతుందన్నారు. ప్రతి న్యాయవాది 23 మంది అభ్యర్థులను ఎన్నుకోవచ్చన్నారు. ఓటరు కచ్చితంగా ఐదు ఓట్లు వేయాలన్నారు. క్యాపిటల్ లెటర్స్ (ONE, TWO, THREE, FOUR, FIVE) మాత్రమే రాయాలన్నారు. ఐదు కంటే తక్కువ ఓట్లు వేస్తే చెల్లదన్నారు. నెల్లూరు నుంచి ప్రస్తుత బార్ కౌన్సిల్ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్రెడ్డి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డి.ఫణిరత్నం, ఆలిండియా లాయర్స్ యూనియన్ బలపరిచిన సత్తు అంకయ్య, ఒ.ఈశ్వర మనోజ్కుమార్, ఒ.వెంకటరాజు బరిలో ఉన్నారు. గుర్తింపుకార్డుతో న్యాయవాదులు ఓటు వేయాలని, పోలింగ్ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని రిటర్నింగ్ అధికారి తెలిపారు. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్యనెల్లూరు(క్రైమ్): రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వేదాయపాళెం – వెంకటాచలం రైల్వేస్టేషన్ మధ్యలో నెల్లూరు వైపు వచ్చే పట్టాలపై బుధవారం చోటుచేసుకుంది. మృతుడి వయసు 50 నుంచి 55 సంవత్సరాల్లోపు ఉండొచ్చని భావిస్తున్నారు. తెలుపు రంగు కట్ బనియన్, పచ్చరంగు గళ్ల టవల్ నడుముకు చుట్టుకుని ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు నమోదు చేశారు.పెన్నానది నుంచి ఇసుక తరలిస్తుండగా.. ● ట్రాక్టర్ కింద పడి వృద్ధుడి మృతిబుచ్చిరెడ్డిపాళెం: పెన్నా నదిలో ఇసుక తరలిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం మండలంలోని జొన్నవాడ వద్ద ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పెనుబల్లి గ్రామానికి చెందిన షేక్ రసూల్ (64) జొన్నవాడ సమీపంలోని పెన్నా నది నుంచి ట్రాక్టర్లో ఇసుకలోడ్ చేసుకుని తరలిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పడంతో టైరు కింద నలిగి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సంతోష్కుమార్రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో పెనుబల్లి గ్రామంలో విషాదం నెలకొంది. -
ఎనర్జీ అసిస్టెంట్లకు షాక్
ఉద్యోగోన్నతులు వెనక్కి.. వేతనాన్ని కోసి నెల్లూరు (వీఆర్సీసెంటర్): కటింగ్ ప్లయర్.. టెస్టర్ను పట్టుకొని విద్యుత్ పునరుద్ధరణ పనులు చేయాల్సిన జేఎల్ఎం గ్రేడ్ – 2 ఎనర్జీ అసిస్టెంట్లపై ప్రభుత్వం పెనుభారాన్ని మోపుతోంది. వార్డు వలంటీర్లు చేయాల్సిన ఇంటింటి సర్వేకు వీరిని వినియోగిస్తోంది. ఫలితంగా వందలాది మంది ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. నాడు సజావుగా.. జిల్లాలో 570 మంది జేఎల్ఎం గ్రేడ్ – 2 ఎనర్జీ అసిస్టెంట్లను గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నియమించారు. వీరు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ.. పగలు, రాత్రనే తేడా లేకుండా విద్యుత్ సంబంధిత పనులు చేసేవారు. అధికారికంగా ఎలాంటి సెలవుల్లేకుండా విద్యుత్ సంస్థలో వీరు పనిచేస్తున్నారు. విద్యుత్ స్తంభాలెక్కడం.. లైన్ల పునరుద్ధరణ పనుల్లో ప్రమాదాలకు కొందరు గురికాగా, మరికొందరు ప్రాణాలను సైతం కోల్పోయారు. ఈ తరుణంలో 2022లో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి వీరందర్నీ క్రమబద్ధీకరించి జీవితాల్లో వెలుగులు నింపారు. సకాలంలో కాని పునరుద్ధరణ పనులు సర్వేలకు వీరిని పురమాయించడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడిన సమయాల్లో పునరుద్ధరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫలితంగా వినియోగదారులకు ఇబ్బంది తప్పడంలేదు. వీరికి ఇతర పనులను అప్పజెప్పకుండా విద్యుత్ అవసరాల నిమిత్తం వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీతంలో కోత.. పని రెట్టింపు విద్యుత్ సైనికులను సర్వే కూలీలుగా మార్చిన వైనం టెస్టర్, కటింగ్ ప్లయర్లను వదిలి ఇల్లిల్లూ తిరుగుతూ.. జేఎల్ఎం గ్రేడ్ – 2లకు ప్రభుత్వమిచ్చిన గిఫ్ట్ గతేడాది డిసెంబర్లో వీరికి ఉద్యోగోన్నతులను కల్పించి.. వేతనాలను పెంచుతున్నామంటూ టీడీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అయితే నెల గడవకముందే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని.. వేతనాల్లో కోత విధించింది. మరోవైపు జేఎల్ఎం గ్రేడ్ – 2 ఎనర్జీ అసిస్టెంట్లకు సంబంధం లేని ఇంటింటి సర్వే పనులను ఈ నెల నుంచి అప్పగించారు. వారు విధులు నిర్వర్తించే ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబసభ్యుల వివరాలను నమోదు చేసే పనులను అప్పజెప్పారు. ఓవైపు సర్వే.. మరోవైపు విద్యుత్ పునరుద్ధరణ పనులు చేయలేక వీరు సతమతమవుతున్నారు. -
పరిహార చెల్లింపులో దాగుడుమూతలు
● క్రిస్ సిటీ నిర్వాసితుల ఆవేదన చిల్లకూరు: తీర ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న క్రిస్ సిటీ కోసం భూములను సేకరించి రెండేళ్లవుతున్నా, పరిహారం చెల్లించకుండానే అక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఎదుట నిరసనను బుధవారం చేపట్టిన అనంతరం ఏఓ శిరీషకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పరిహారమై ప్రశ్నిస్తే, ప్రభుత్వం ద్వారా అందజేస్తామంటున్నారని చెప్పారు. చిల్లకూరు, కోట మండలాల తీర ప్రాంతంలోని తమ్మినపట్నం, కొత్తపట్నం రెవెన్యూ పరిధిలో సుమారు 986 ఎకరాలను సేకరించారని, ఆ సమయంలో తిరుపతి కలెక్టర్ ద్వారా ఎకరాకు రూ.ఎనిమిది లక్షల చొప్పున పరిహారాన్ని అందించేలా చూస్తామన్నారన్నారు. ఏపీఐఐసీ ద్వారా క్రిస్ సిటీ భూముల్లో అభివృద్ధి పనులను దక్కించుకున్న ప్రైవేట్ సంస్థ యాజమాన్యం.. భూములను చదును చేసి రోడ్ల నిర్మాణాన్ని చేపట్టిందని చెప్పారు. పలుమార్లు నిరసన చేపట్టగా, 40 శాతం మంది రైతులకు పరిహారాన్ని అందించి మిగిలిన వారికి ఇవ్వకుండా కాలం గడుపుతున్నారని ఆరోపించారు. తిరుపతి జిల్లా నుంచి రెండు మండలాలు నెల్లూరు జిల్లాలో విలీనం కావడంతో పరిహార విషయమై పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్ సిటీ పనులను పరిశీలించిన కలెక్టర్కు సైతం ఈ విషయాన్ని తెలియజేశామని వివరించారు. కలెక్టర్ చొరవ చూపాలని కోరారు. సతీష్యాదవ్, ఏడుకొండలు, శంకరయ్య, సుబ్రహ్మణ్యం, రంగయ్య, కోటయ్య పాల్గొన్నారు. -
రైతుల బాధలు వర్ణనాతీతం
● ధాన్యం ధరలపై ఇప్పట్నుంచే ఆందోళన ● యూరియా లభ్యం కాక ఇబ్బందులు ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరు: టీడీపీ ప్రభుత్వంలో రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయని, ధాన్యానికి మద్దతు ధరలు లభిస్తాయో లేదోననే ఆందోళనలో అన్నదాతలున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మొగళ్లూరు, మనుబోలు మండలంలోని కట్టువపల్లి, మడమనూరు, గొట్లపాళెం గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. యూరియా లభ్యం కావడం లేదని, పంటలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు అండగా నిలవాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. టీడీపీ నేతలు తమ ఇళ్లకు యూరియాను తరలించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఇరిగేషన్ పనులను నిర్వహించకుండానే.. దొంగ బిల్లులను సోమిరెడ్డి చేయించుకుంటే ఆయన అనుచరులు యూరియాను బ్లాక్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. పంటలకు మద్దతు ధరలను అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మొక్కుబడిగా తెరిచి రైతుల నుంచి పంటలను కొనుగోలు చేయకపోతే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర కోసం రైతుల పక్షాన తమ పార్టీ పోరాటం చేయనుందని ప్రకటించారు. కొత్త పింఛన్లు మంజూరు కాక అవస్థలు కొత్త పింఛన్లు మంజూరు కాక వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. అధికారులపై సోమిరెడ్డి మండిపడుతూ.. ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రెయిన్లను సంపూర్ణంగా నిర్మించామని, అయితే ప్రస్తుత సర్కార్ అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని విస్మరించిందని మండిపడ్డారు. జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని రైతులు కాంక్షిస్తున్నారని చెప్పారు. మొగళ్లూరులో యనమల రమణారెడ్డి భౌతికకాయానికి నివాళుర్పించారు. మనుబోలు మండలంలో సన్నారెడ్డి జానకిరామిరెడ్డి, పసల శంకరయ్య, పద్మావతి, వెంకటేశ్వర్లును పరామర్శించారు. పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, రెడ్డిచర్ల అంకిరెడ్డి, యనమల శ్రీనివాసులురెడ్డి, ఆకుల గంగిరెడ్డి, కసిరెడ్డి ధనుంజయరెడ్డి, గుండాల ఆదినారాయణ, సురేష్, రామచంద్రారెడ్డి, జనార్దన్రెడ్డి, బొమ్మిరెడ్డి హరిగోపాల్రెడ్డి, ముంగర రవీంద్రరెడ్డి, దాసరి భాస్కర్గౌడ్, ఈగా సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
డీఈఐఈడీ ఫీజును 17లోపు చెల్లించాలి
నెల్లూరు (టౌన్): డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కు సంబంధించి 2025 – 27 విద్యా సంవత్సరానికి చెందిన రెగ్యులర్ విద్యార్థులు.. 2023 – 25, 2024 – 26లో ఒకసారి ఫెయిలైన వారు పరీక్ష ఫీజును ఈ నెల 17లోపు చెల్లించాలని డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. రూ.50 అపరాధ రుసుముతో 24 వరకు అవకాశం ఉందన్నారు. రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.150, మూడు సబ్జెక్టులకు రూ.140, రెండింటికి రూ.120, ఒక దానికి రూ.వంద చెల్లించాలని తెలిపారు. డీఈఐఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలను త్వరలో నిర్వహించనున్నామని వెల్లడించారు. కావలిలో జాబ్ మేళా రేపు నెల్లూరు(పొగతోట): కావలిలోని ఎమ్మెస్సార్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళాను ఏపీఎస్సెస్డీసీ, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, సీడాప్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు నిర్వహించనున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్ ఖయ్యూం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 14 ప్రముఖ కంపెనీలు హాజరుకానున్నాయని చెప్పారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదివిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు 72868 22789, 99888 53335 నంబర్లను సంప్రదించాలని సూచించారు. 18 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు నెల్లూరు (టౌన్): డ్రాయింగ్, హ్యాండ్లూమ్ వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ విభాగాల్లో లోయర్, హయ్యర్ గ్రేడ్లకు సంబంధించిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలను ఈ నెల 18 నుంచి 21 వరకు నిర్వహించనున్నామని డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లను www. bse.ap.gov.inలో అందుబాటులో ఉంచామని చెప్పారు. హాల్ టికెట్తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డును తప్పక తీసుకురావాలని కోరారు. నెల్లూరు చేరిన సైక్లథాన్ నెల్లూరు(క్రైమ్): తీర ప్రాంత భద్రత.. యువత మత్తు బారిన పడకుండా.. వారిలో చైతన్యం కల్పించేందుకు సీఐఎస్ఎఫ్ చేపట్టిన వందేమాతరం కోస్టల్ సైక్లథాన్ నెల్లూరుకు బుధవారం చేరుకుంది. వీరికి పోలీస్ అధికారులు, సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ సంజీత్కుమార్ మాట్లాడారు. వందేమాతరాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాతృభూమి రక్షణ, దేశం కోసం త్యాగాలు చేయాల్సిన అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కోస్టల్ సైక్లథాన్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. కోల్కతాలో జనవరి 28న ప్రారంభమైన యాత్ర కేరళలోని కొచ్చిలో ఈ నెల 23న ముగియనుందని వెల్లడించారు. నగర ఏఎస్పీ దీక్ష, ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్, ఇండియన్ కోస్టల్ గార్డ్ కృష్ణపట్నం పోర్టు కమాండెంట్ కార్తీక్, మారుతి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ షామిలీ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 73,983 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 21,900 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.23 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
అప్పుడు అక్రమం.. ఇప్పుడు సక్రమం
ప్రభుత్వ భూములపై నిగ్గు తేల్చాలంటున్న వైఎస్సార్సీపీగతంలో ప్రభుత్వ భూములు దురాక్రమణ చేశారంటూ తెగ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రస్తుతం మౌనం దాల్చడం వెనుక ఏం జరిగిందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. అధికారులతో సర్వే చేయించారు కదా? వెంటనే ఆయా భూములను స్వాధీనం చేసుకుని మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అలా జరగలేదంటే మీ మధ్య జరిగిన డీల్ను బయట పెట్టాలంటూ సవాల్ విసురుతున్నారు. కావలిలో ‘రియల్’ ‘రాజీ’కీయం ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చుకుంది. అధికారంలోకి రాగానే వెంచర్లన్నీ ఆక్రమణలంటూ సర్వే నంబర్లతో సహా లీకులిచ్చి.. దూకుడు పెంచారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో సర్వేలు చేయించి 128 ఎకరాల ప్రభుత్వ భూములు దురాక్రమణ అయ్యాయంటూ గగ్గోలు పెట్టిన పచ్చ ప్రజాప్రతినిధులు యంత్రాలు దింపి రాళ్లు పీకించారు. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామంటూ రచ్చ చేసి, ఆక్రమణలపై ఒప్పందాలతో ‘సర్దుబాటు’ చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యజమానులు పచ్చ కండువాలు కప్పుకునే ‘డీల్’ కుదరడంతో ‘రాజీ రాజకీయం’తో తెరపడింది.నా వాటా ఇస్తే సరే..మీతో డీల్ ఓకే సార్ఎంతసాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ దురాక్రమణలకు క్యాష్, కండువా డీల్స్ కుదిరియా?. గత ప్రభుత్వ హయాంలో సర్కారు భూములు దురాక్రమణ చేసి లేఅవుట్లు వేసి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలతో తెగ హడావుడి చేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రస్తుతం మౌనం ఇందుకు అద్దం పడుతోంది. గత ప్రభుత్వ హయాంలో కావలి తూర్పు తీరంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, మరో వైపు రామాయపట్నం పోర్టు, వీటికి అనుబంధంగా పారిశ్రామిక వాడలకు భూసేకరణ జరగడంతో ఒక్కసారిగా రియల్ బూమ్.. ఊపందుకుంది. మొదట హడావుడి.. డీల్ కుదరడంతో గప్చుప్ ఆ సమయంలో రియల్ వెంచర్ల వ్యాపారం ఊపందుకోవడంతో కొందరు నేతలతోపాటు ఆ రంగంలో ఎంతో కాలంగా ఉన్న వెంచర్ల యజమానులు కూడా కావలి చుట్టూ రియల్ వెంచర్లు ఏర్పాటు చేశారు. కొందరు పట్టా భూములతోపాటు ఖాళీగా కాలువ, ప్రభుత్వ పొరంబోకు భూములను కలిపేసుకుని ప్లాట్లు వేసి విక్రయాలు చేశారంటూ అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఇందులో ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ప్రప్రథమంగా ఉన్నారు. ఈ క్రమంలో కావలి నుంచి ఎమ్మెల్యేగా దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎన్నిక కావడంతో ఆక్రమణలు అక్రమాలంటూ తెగ హ డావుడి చేశారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సర్వేలు చేయించారు. దాదాపు 128 ఎకరాల ప్రభుత్వ భూములన్నాయని నిగ్గు తేలాయని మీడియా ముందు తేల్చేశారు. కానీ ఇంత వరకు ఏ వెంచర్లో ఎంతనేది.. ఆ నివేదిక మాత్రం బయట పెట్టలేదు. ఎమ్మెల్యే మరో అడుగు ముందుకేసి రెవెన్యూ అధికారులతో వెంచర్లలో బోర్డులు పెట్టించారు. మున్సిపల్ అధికారులతో పత్రికల్లో హెచ్చరిక నోటీసులు జారీ చేయించారు. వెంచర్లలో యంత్రాలు పెట్టి హద్దు రాళ్లను పీకించేశారు. దీంతో ఆయా వెంచర్లల్లో పాట్లు కొనుగోలు చేసిన ప్రజలు ఆందోళన చెందారు. అక్కడ సీన్ కట్ చేస్తే.. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా కూడా సర్వే చేసిన నివేదిక బయటకు రాలేదు. ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోలేదు. రిజిస్ట్రేషన్లు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు మార్పు చేసి ఎంచక్కా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ప్లాట్లు మాత్రం చేతులు మారుతున్నాయి. కావలి నియోజకర్గంలో దాదాపు 130కు పైగా ఉన్న వెంచర్లలో కేవలం 5 వెంచర్లకు మాత్రమే నుడా అనుమతులున్నాయి. మిగిలినవి మాత్రం అప్రూవల్ లే అవుట్ ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. విభేదించిన బీద.. మౌనమేలా.. గతంలో కావలిలో స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి వన్ మ్యాన్ షోగా నడిచింది. అధికార మార్పుతోనే ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వెంచర్లపై పడి తెగ ఆవేశ పడ్డాడు. అప్పట్లో ఆయన దూకుడు చూసి ప్రస్తుత ఎమ్మెల్సీ సైతం లోలోన రగిలిపోయారు. వెంచర్ల వ్యవహారంలో భారీగా చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే పవర్ తగ్గడంతో బీద పెత్తనంలోనూ రియల్ డీల్స్పై మౌనం దాల్చడం వెనుక అంత్యర్యం ఏమిటాని సర్వత్రా ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో భారీగా లేఅవుట్ల ఏర్పాటు కూటమి అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ మద్దతుదారులపై కన్నెర్ర ప్రభుత్వ భూముల్లో వేశారంటూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల హడావుడి 128 ఎకరాలను ఆక్రమించారంటూ ఆరోపణలు రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో పత్రికల్లో ప్రకటనలు ఆ వెంటనే యంత్రాలు పెట్టి పలు వెంచర్ల ధ్వంసం ఆక్రమణలపై ఆగ్రహం.. పచ్చ కండువాతో శాంతం యజమానులతో డీల్ కుదరడంతో మౌనం కావలి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రియల్ వెంచర్లలో ప్రభుత్వ భూములు కలిపేసుకున్నారంటూ సర్వే నంబర్లతో సహా లీకులు ఇచ్చారు. కావలి బిట్–1లో సర్వే నంబరు 1834లో 5 ఎకరాలు, 487లో 2.67 ఎకరాలు, 551లో 2 ఎకరాలు, 832లో 2.61 ఎకరాలు, 546లో 4.02, 354లో 10.70 ఎకరాల చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని, బిట్–2లో 1855లో 15 ఎకరాలు, 1834లో 0.29, 1310లో 5.50, 1562లో 1.88, 1846లో 7.97, 1593లో 0.87 ఎకరాలు, 302లో 8.64 ఎకరాలు, కంచి రామగుంట, పులారుగుంటలో శ్మశాన స్థలం, కొనదిన్నె కాలనీలో 1.10 ఎకరాలు, అక్కిలగుంట పొరంబోకు భూములు ఆక్రమణలకు గురైనట్లు లీకులిచ్చేశారు. మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓలతో భూములు ఆక్రమణలు జరిగిందని ప్రకటనలు చేయించారు. -
గంజాయికి అడ్డాగా ఏపీ
● ప్రభుత్వంపై ధ్వజమెత్తిన ప్రసన్నకుమార్రెడ్డి ● గుమ్మళ్లదిబ్బలో బాలిక కుటుంబానికి పరామర్శ కోవూరు: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, గంజాయికి అడ్డాగా మారిపోయిందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని గుమ్మళ్లదిబ్బ కొత్త కాలనీలో గంజాయి ముఠా చేతుల్లో అఘాయిత్యానికి గురై, చైన్నెలో చికిత్స పొందుతూ బాలిక మరణించడంతో వారి కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. ఓదార్చి, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కోవూరు నియోజకవర్గంలో గంజాయి ముఠాల ఆగడాలు మితిమీరిపోయాయని ఆరోపించారు. బాలికపై ఇంతటి అఘాయిత్యం జరిగినా, ప్రభుత్వ స్పందన దారుణమని, మెరుగైన వైద్యాన్ని అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. సరైన వైద్యం అందకపోవడంతోనే బాలిక మృతి చెందిందంటూ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విచారణను పక్కదారి పట్టించొద్దు పోలీస్ యంత్రాంగం తీరుపై ప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు విచారణను నీరుగార్చేందుకు యత్నించొద్దని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విచారణను పక్కదారి పట్టించేందుకు యత్నిస్తే తమ పార్టీ ఊరుకోబోదని స్పష్టం చేశారు. సీబీఐ విచారణను నిర్వహించాలని, లేని పక్షంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక తాము జరిపిస్తామని వెల్లడించారు. ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కర్నీ కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, రైతు విభాగ జిల్లా అధ్యక్షుడు శివుని నరసింహులురెడ్డి, జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, కన్వీనర్ అత్తిపల్లి అనూప్రెడ్డి, దినేష్రెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, గొల్లపల్లి విజయకుమార్, గంగవరం సర్పంచ్ లక్ష్మీకుమారి, మందా రవి, చిరంజీవి, జనార్దన్, కోవూరు మాజీ సర్పంచ్ కూట్ల ఉమా, కిశోర్, గయాజ్, ప్రసాద్, అనీష్ తదితరులు పాల్గొన్నారు. -
కల్తీ పాపం చంద్రబాబుదే..
ప్రభుత్వ వైఫల్యమే.. ● కోట్లాది మంది వెంకటేశ్వరస్వామి భక్తులకు క్షమాపణలు చెప్పాలి ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు రూరల్: కల్తీ పాపం చంద్రబాబుదేనని, తిరుమల లడ్డూ విషయమై కూటమి నేతలు చేసిన ఆరోపణలన్నీ అబద్ధమని సిట్, సీబీఐతో కూడిన దర్యాప్తులో తేటతెల్లమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. లడ్డూ ప్రసాద అంశంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అందులో జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు దుర్మార్గంగా మాట్లాడారని ఆరోపించారు. 2019, మార్చి 6న బోలే బాబా డెయిరీకి అనుమతిచ్చింది టీడీపీ నేతలేనని, అప్పట్లో ప్రభుత్వం సైతం వారిదని గుర్తుచేశారు. టెక్నికల్గా క్వాలిఫై అయిందనే తీర్మానాన్ని ఆమోదించింది చంద్రబాబు కాదానని నిలదీశారు. అదే రోజు సదరు డెయిరీకి 82 వేల కిలోల నెయ్యి ఆర్డర్ ఇచ్చిందీ వారేనన్నారు. అదే ఏడాది ఏప్రిల్ 19న టిన్నుల రూపంలో 12,300 కిలోలను సరఫరా చేయాలని చెప్పింది మీరు కాదానని చంద్రబాబును ప్రశ్నించారు. ఈ అంశమై సమాధానం చెప్పాల్సిన ఆయన అలా చేయకుండా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందంటూ దుర్మార్గమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. తమ హయాంలో నిబంధనలతో కఠినంగా వ్యవహరించామే తప్ప ఎక్కడా పొరపాట్లు జరగనివ్వలేదని తెలిపారు. అసత్యాలు, ఆరోపణలు వారికే చుట్టుకున్నాయని తెలిపారు. కూటమి నేతలు బేషరతుగా క్షమాపణలు చెప్పి, లెంపలేసుకోవాలని డిమాండ్ చేశారు. వీటిని కప్పిపుచ్చుకునేందుకు దాడులు చేస్తూ.. అక్రమ కేసులను బనాయిస్తూ జైళ్లకు పంపుతున్నారని ఆరోపించారు. గుమ్మళ్లదిబ్బలో బాలిక మృతి విషయంలో ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని కాకాణి ధ్వజమెత్తారు. నెల్లూరులో ప్రైవేట్ హాస్పిటళ్లుండగా, చైన్నెకి ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇక్కడ వైద్యమందించి ఉంటే బాలిక బతికుండేదని వారి తల్లిదండ్రులే ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి వినియోగం ఎక్కువైందని, పల్లెల్లోకీ పాకి యువత పెడదారి పట్టి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన నెల్లోపే గంజాయిని నిర్మూలిస్తానంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు వాటిపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు తాను వెళ్తే అక్రమ కేసు పెట్టారన్నారు. పాలకులకో న్యాయం.. తమకో న్యాయమానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, పాలకుల అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలపై ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. -
ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్
నెల్లూరు (టౌన్): ఇంటర్ ప్రాక్టికల్స్ మంగళవారంతో ముగిశాయి. ఉదయం నిర్వహించిన ప్రాక్టికల్స్లో 493 మందికి గానూ 485 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలో 463 మందికి గానూ 21 మంది గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ వరప్రసాదరావు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, స్క్వాడ్ అధికారులు తనిఖీలను నిర్వహించారు. గోవులకు తక్షణమే టీఎమ్మార్ను అందించాలి దుత్తలూరు: మండలంలోని నర్రవాడ వెంగమాంబ దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో గోవులు బక్క చిక్కి ఉన్నాయని, వీటికి వెంటనే టీఎమ్మార్ దాణామృతాన్ని అందజేయాలని నర్రవాడ ఇన్చార్జి పశు వైద్యాధికారి మధు పేర్కొన్నారు. ఆవుల దుస్థితిపై ‘అయ్యో గోమాత’ అనే శీర్షికన సాక్షిలో సోమవారం కథనం ప్రచురితమైన తరుణంలో ఆలయ ఇన్చార్జి ఈఓ శ్రీనివాసరెడ్డితో కలిసి గోశాలను మంగళవారం పరిశీలించారు. గోవుల ఆరో గ్యం మెరుగుపడే అంశమై పలు సూచనలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఒక్కో గోవుకు రోజూ ఐదు కిలోల చొప్పున దాణామృతాన్ని అందజేయాలని కోరారు. ఎలాంటి అనారోగ్యమొచ్చినా వెంటనే చికిత్స చేయనున్నామని వివరించారు. ఆల్బెండాజోల్ మాత్రలను తప్పక ఇవ్వాలి నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో 19 ఏళ్లలోపు వారికి నులిపురుగుల నివారణ మాత్రలను తప్పక అందించాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు ఆదేశించారు. జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని ఈ నెల 17న పురస్కరించుకొని ఆల్బెండాజోల్ మాత్రల పంపిణీపై కలెక్టరేట్లోని తన చాంబర్లో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో వీటిని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వ ర్యంలో అందజేసేలా ఏర్పాట్లు చేశామని చెప్పా రు. ఈ నెల 17న వేసుకోలేకపోయిన వారికి 24న అందజేయనున్నామని పేర్కొన్నారు. డీఎంహెచ్ఓ సుజాత, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి ఉమామహేశ్వరి, ప్రోగ్రామ్ ఆఫీసర్ యశ్వంత్, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, ఆర్ఐఓ వరప్రసాదరావు, ప్రోగ్రామ్ మేనేజర్ జమీల్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం మోస్తరుగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 74,130 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 24,631 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.03 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
రాష్ట్రంలో మహిళలకు రక్షణేదీ..?
నెల్లూరు రూరల్: టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంగళవారం ఆమె మాట్లాడారు. గంజాయి బ్యాచ్ దాష్టీకానికి బాలిక మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆడపిల్లలను ఒంటరిగా బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. జగనన్న హయాంలో దిశ చట్టం ద్వారా మహిళలకు రక్షణ కల్పించిన అంశాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం ఎక్కువై.. యువత పెడదారి పడుతోందని తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై నిత్యం ఏదో ఒక చోట అఘాయిత్యాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. పోలీసులు, ప్రభుత్వ వైఫల్యంతోనే బాలిక మరణించిందని మండిపడ్డారు. నెల్లూరులోని ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, మంచి వైద్యాన్ని అందించి ఉంటే బాలిక బతికేదన్నారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాకాణి గోవర్ధన్రెడ్డిపై కేసు పెట్టడాన్ని చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామాననే అనుమానం తలెత్తుతోందని చెప్పారు. గంజాయి బ్యాచ్లను కూటమి నేతలే పెంచి పోషిస్తూ తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. బాధ్యులను శిక్షించి, కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో తమ పార్టీ తరఫున పోరాటం చేయనున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర మహిళా జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, జిల్లా మహిళాధ్యక్షురాలు లక్ష్మీసునంద తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న కాకాణి పూజిత -
శ్రీవారి ప్రసాదంపై రాజకీయం దుర్మార్గం
● వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ సమన్వయకర్త విజయకుమార్రెడ్డి నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వం భగవంతుని ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి మండిపడ్డారు. రూరల్లోని చింతారెడ్డిపాళెంలో పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసత్యాన్ని పదేపదే చెప్పి ప్రజలను నమ్మించడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. టీటీడీ లడ్డూ తయారీలో అవినీతి, కల్తీ జరిగిందని ప్రజల విశ్వాసాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ఆయనకు తోడుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా మాట్లాడారన్నారు. భూమన కరుణాకర్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిపై నిందలు వేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కోట్లమంది ఆరాధించే వేంకటేశ్వరస్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందని చంద్రబాబు విషప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. ఇప్పుడు కెమికల్స్ కలిశాయని మరో తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారన్నారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు వత్తాసుగా మాట్లాడటం దుర్మార్గమన్నారు. కాషాయం ధరించి వాస్తవాలు తెలుసుకోకుండా ఇటువంటి మాటలు చెప్పడం దారుణమన్నారు. లడ్డూలో కల్తీ జరగలేదని నిగ్గుతేలిన తర్వాత కూడా హిందూ ధార్మిక సంస్థల అధిపతులు, పీఠాధిపతులు, చంద్రబాబు, పవన్ కళ్యాన్ను క్షమాపణ చెప్పాలని అడగలేరా అని ప్రశ్నించారు. నిజాన్ని ప్రశ్నించిన రోజే గౌరవం లభిస్తుందన్నారు. ప్రవచనకర్తలు కూడా హెచ్చరించాల్సిన అవసరం లేదా అన్నారు. కూటమి ప్రభుత్వాని ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం, ఇళ్లు తగులబెట్టడం చేస్తున్నారన్నారన్నారు. భవిష్యత్లో కూటమి ప్రభుత్వానికి హిందువులు సరైన సమాధానం ఇస్తారన్నారు. భగవంతుని ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, వైఎస్సార్సీపీ రూరల్ మండల అధ్యక్షుడు పుచ్చలపల్లి రామ్ప్రసాద్, కలివెలపాళెం సర్పంచ్ మధుసూదన్రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు చెన్నారెడ్డి ప్రభాకర్రెడ్డి, ఏఐసీఎస్ మాజీ చైర్మన్ పార్లపల్లి వీరరాఘవరెడ్డి, రూరల్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు తోగూరు జాషువా, 12వ డివిజన్ ఇన్చార్జ్ ప్రసాద్, నాయకులు శ్రీనివాసులురెడ్డి, బాలాజీ, అక్కన్న, మదన్మోహన్, రాజా తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనులపై కూటమి చిన్నచూపు
● కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు నెల్లూరు(దర్గామిట్ట): రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులపై చిన్నచూపు చూస్తోందని పలువురు నాయకులు మండిపడ్డారు. నెల్లూరు కలెక్టరేట్ వద్ద గిరిజన సంఘాల ఐక్యవేదిక చేపట్టిన రిలే నిరాహారదీక్షలకు రాష్ట్ర స్థాయి నేతలు మంగళవారం హాజరై మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ గత ఎన్నికల్లో గిరిజనులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. మాజీ మేయర్ పొట్లూరి స్రవంతికి జరిగిన అన్యాయాన్ని సహించేది లేదన్నారు. దీనిపై త్వరలో రాష్ట్ర స్థాయి ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. అవసరమైతే ఢిల్లీలో పెద్దలను కలిసి అన్యాయాన్ని వివరిస్తామన్నారు. బడుగు, బలహీనవర్గాలపై నిరంకుశంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కార్యక్రమంలో యానాదుల యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యందేటి వెంకటసుబ్బయ్య, కోశాధికారి రాపూరి ప్రభావతి, గౌరవాధ్యక్షుడు కేవీ ప్రసాద్, ఇంకా చౌటూరి రమేష్, కొమరగిరి సూరిబాబు, పట్రా సుబ్రహ్మణ్యం, యందేటి సురేంద్ర, కొమరగిరి మరియమ్మ, గంధళ్ల నరేష్, రాపూరి గోపీ, పొట్లూరి అశోక్, అల్లురమ్మ, తిరుపతిరావు, బత్తుల లక్ష్మణశేఖర్, తలపల జై వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
● డీఎంహెచ్ఓ సుజాత నెల్లూరు(అర్బన్): జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు, ల్యాబ్లు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని డీఎంహెచ్ఓ సుజాత సూచించారు. మంగళవారం నెల్లూరులోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఆస్పత్రులు, ల్యాబ్లు నిర్వహిస్తున్న వారిపై అల్లోపతి మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ 2002 చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ చేయించుకుని ఐదు సంవత్సరాల గడువుతీరే వారు మూడు నెలలు ముందుగానే దరఖాస్తు చేసుకుని రెన్యువల్ చేసుకోవాలన్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్ ద్వారానే నిర్వహించాలన్నారు. ఆస్పత్రుల్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్తోపాటు అందిస్తున్న వైద్యసేవలకు సంబంధించిన ధరల పట్టికను బోర్డులో ప్రదర్శించాలన్నారు. అలాగే ప్రతి డాక్టర్, స్టాఫ్ నర్సులకు హెల్త్ ప్రొఫెషన్ ఐడీ (హెచ్పీఆర్), హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రేషన్ (హెచ్ఎఫ్ఆర్) చేయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డెమో అధికారి కనకరత్నం, డీపీఓ రమేష్బాబు, ఏఎస్ఓ రమేష్, షైనీ, కల్యాణ్ పాల్గొన్నారు. -
రోడ్డు బాగోలేదు.. మా బాధలు చూడండి
● విద్యార్థుల వినతి చిల్లకూరు: గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. మండలంలోని అన్నంబాక గ్రామానికి సరైన రోడ్డు బాగోలేదు. గత ప్రభుత్వంలో రోడ్డు వసతి కల్పించేలా ఏర్పాట్లు చేసినా అటవీ ఆంక్షలు ఉండటంతో నిర్మాణం పూర్తి కాలేదు. అత్యవసర వేళల్లో అంబులెన్స్ వచ్చేందుకు కూడా ఇబ్బందిగా మారింది. ఇక్కడి విద్యార్థులు ఐదు కిలోమీటర్ల దూరంలోని తిక్కవరం, కోట మండలంలోని చిట్టేడులో ఉన్న పాఠశాలల్లో చదువుకుంటున్నారు. రోజూ కుటుంబ సభ్యులు బైక్లపై తీసుకెళ్తుంటారు. వారికి ఏదైనా ఉంటే ఆరోజు విద్యార్థులు కష్టపడాల్సిందే. ఊర్లోకి ఆటోలు అంతంతమాత్రంగానే వస్తుంటాయి. దీంతో దారుణంగా ఉన్న రోడ్డుపై నడిచి వెళ్లి చదువుకుంటున్నారు. రహదారి బాగుంటే తమకు ఇంత కష్టం ఉండేది కాదని అధికారులు, పాలకులు దృష్టి సారించాలని కోరుతున్నారు. -
బాలాజీ మొబైల్స్, ఎలక్ట్రానిక్స్లో లక్కీ డ్రా
నెల్లూరు(బారకాసు): నెల్లూరులోని నర్తకీ సెంటర్లో ఉన్న బాలాజీ మొబైల్స్లో మంగళవారం సంక్రాంతి పండగ లక్కీ డ్రా తీశారు. మొదటి బహుమతిగా స్కూటర్ను నెల్లూరుకు చెందిన సత్యనారాయణ, మరో స్కూటర్ను ముత్తుకూరు మండలం నేలటూరుకు చెందిన నాగేశ్వరరావు గెలుచుకున్నారు. రెండో బహుమతిగా ఎయిర్ కండీషనర్, మూడో బహుమతిగా 43 అంగుళాల రెండు టీవీ, నాలుగో బహుమతిగా వాషింగ్ మెషీన్, ఐదో బహుమతిగా 32 అంగుళాల రెండు టీవీలు, ఆరో బహుమతిగా మూడు రైస్కుక్కర్లను విజేతలు గెలుచుకున్నారు. విజేతలకు సంస్థ డైరెక్టర్ రవి నాయుడు ఫోన్ చేసి సమాచారాన్ని తెలిపారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వినూత్న ఆఫర్లతో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ పరికరాలను బాలాజీ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అందిస్తోందని సంస్థ చైర్మన్ వైడీ బాలాజీ చౌదరి, సీఈఓలు సాయినిఖిలేష్, సాయినితీష్ తెలిపారు. రవి నాయుడు మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా తమ సంస్థ జిల్లా ప్రజలకు సేవలందిస్తోందని తెలిపారు. -
రూ.5.30 లక్షల విలువైన గుట్కాల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): బిల్లుల్లేకుండా పొగాకు ఉత్పత్తుల విక్రయాలు, నిల్వలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొద్దిరోజులుగా దాడులు చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి నెల్లూరులోని పలు ట్రాన్స్పోర్టు కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. పప్పులవీధి, స్టోన్హౌస్పేటలోని రెండు ట్రాన్స్పోర్టు కార్యాలయాల్లో రూ.5.30 లక్షలు విలువైన గుట్కాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు, డీసీటీఓ కె.విష్ణురావు, ఆఫీస్ సూపరింటెండెంట్ శాంతిభూషణ్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. జింకను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనంకావలి రూరల్: కావలి బుడంగుంట సమీపంలో ప్రధాన రహదారిపై రోడ్డు దాటుతున్న జింకను గుర్తుతెలియని వాహనం మంగళవారం ఢీకొట్టింది. స్థానిక యువకులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని జింకకు వైద్యం కోసం పశు వైద్యాధికారిని పిలిపించారు. ప్రథమ చికిత్స అనంతరం ఫారెస్ట్ ఆఫీసుకు తరలించారు. పశు వైద్యుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జింక పక్కటెముకలు విరిగినట్లు తెలిపారు. చికిత్స చేశామన్నారు. కండలేరులో 57.360 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 57.360 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగకాలువకు 1,200, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 200, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
త్వరితగతిన ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు
● ఏపీఎస్పీడీసీఎల్ సీజేఎం కృష్ణారెడ్డి నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘వేసవి కాలంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రిపేర్లకు వచ్చే ట్రాన్స్ఫార్మర్లకు త్వరితగతిన మరమ్మతులు చేయాలి’ అని ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ (ఓఅండ్ఎం) ఎం.కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరులోని కొత్తూరులో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ మరమ్మతుల కేంద్రంలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో నెల్లూరు, కావలి, ఆత్మకూరు, పొదలకూరు ప్రాంతాల్లో ఈ కేంద్రాలున్నాయన్నారు. మరో నాలుగు ప్రైవేట్ కేంద్రాలున్నట్లు చెప్పారు. ట్రాన్స్ఫార్మర్లు అధిక విద్యుత్ లోడ్కు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ఇంజినీర్లదే అన్నారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటికి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ కార్యాచరణ రూపొందిచుకోవాలని ఆదేశించారు. నిరంతర పర్యవేక్షణతో ట్రాన్స్ఫార్మర్ల ఫెయిల్యూర్లను తగ్గించుకోవచ్చని చెప్పారు. రికార్డుల నిర్వహణపై అసహనం కేంద్రంలోని రికార్డులను, స్టాక్ను కృష్ణారెడ్డి పరిశీలించారు. మరమ్మతుల సమయంలో ఉపయోగించే రాగితీగలు, ఆయిల్ వినియోగం, ఎన్ని రిపేర్లకు వచ్చాయి, వాటి స్థానంలో ఎన్ని పంపించారో వివరాల రిజిస్టర్లను చూశారు. కాగా రికార్డుల నిర్వహణపై ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్ఈ రాఘవేంద్రం, ఈఈలు శేషాద్రిబాలచంద్ర, శ్రీధర్, లక్ష్మీనారాయణ, డీఈఈ రాజాబాబు, ఏఈ సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
దారుణంగా రహదారులు
మర్లపూడి వద్ద ఇలా.. దెబ్బతిన్న రహదారి సైదాపురం: మండలంలో పలు రహదారులు దారుణంగా మారాయి. ఆర్అండ్బీ అధికారులున్నారా.. లేదా అనేది ప్రశ్నగానే మిగిలింది. గుంతల్లో తట్ట మట్టి పోసేసి అధికారులు మొహం చాటేస్తుండటంతో ఆ రహదారులపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. మండలంలోని మర్లపూడి – కోమటిగుంట రాజుపాళెం వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. సుమారు 5 కిలోమీటర్లు ఉన్న రహదారిపై ప్రయాణం గంటకు పైగా పడుతుంది. మర్లపూడి వద్ద రోడ్డు అధ్వానంగా ఉండటంతో వాహనదారులు కష్టాలు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. -
ప్రజల దృష్టి మళ్లించేందుకు విషప్రచారం
● భక్తుల మనోభావాలతో కూటమి చెలగాటం ● ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్చిల్లకూరు: ‘కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు తిరుమల లడ్డూ ప్రసాదంపై విషం చిమ్ముతోంది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా అసత్య ప్రచారాలు చేస్తోంది’ అని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ అన్నారు. గూడూరు పట్టణంలోని సనత్నగర్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ పెద్దలు పాలనను గాలికొదిలేశారన్నారు. లడ్డూలో కల్తీ జరిగిందని విషప్రచారం చేస్తూ పబ్బం గడుపుకొంటున్నారని విమర్శించారు. ఒక్క భక్తుడైనా ఫిర్యాదు చేశాడా అని ప్రశ్నించారు. సీబీఐ విచారణ చేసి ప్రసాదంలో ఎలాంటి కల్తీ జరగలేదని, అందులో ఎలాంటి కొవ్వు పదార్థాల్లేవని స్పష్టం చేసినా అధికార పార్టీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటాన్ని చూసి ప్రజలు ఈసడించుకుంటున్నారన్నారు. చంద్రబాబు సర్కార్ అభివృద్ధిని పక్కన పెట్టి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం పరిపాటిగా మారిందని మేరిగ దుయ్యబట్టారు. ఇటీవల జరిగిన దాడుల్లో ఇబ్బంది పడిన నాయకుల కుటుంబాల పరామర్శకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రోడ్డు మార్గంలో బయలుదేరితే ప్రజల నుంచి వచ్చిన స్పందనను ప్రభుత్వం ఓర్చుకోలేకపోయిందన్నారు. జగన్ పర్యటించే మార్గాలను మార్చి వేసి భద్రతా సిబ్బందికి కూడా కనీస సమాచారం ఇవ్వకపోవడం చూస్తుంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో తేట తెల్లమవుతోందన్నారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ భక్తుల మనోభావాలతో కూటమి నేతలు చెలగాటం ఆడుతున్నారన్నారు. సమావేశంలో గూడూరు రూరల్, కోట, చిట్టమూరు మండలాల వైఎస్సార్సీపీ కన్వీనర్లు మల్లు విజయకుమార్రెడ్డి, పలగాటి సంపత్కుమార్రెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఊటుకూరు మహేంద్రరెడ్డి, గూడూరు పట్టణ, కోట మండల మహిళా విభాగం అధ్యక్షులు సుజనారెడ్డి, రేష్మ, నాయకులు రాజీవ్రామిరెడ్డి, సుధాకర్రెడ్డి, రమేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అత్తను చంపిన కేసులో అల్లుడి అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): ఇటీవల హత్యకు గురైన జయలక్ష్మి అనే మహిళ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నగర ఏఎస్పీ దీక్ష సోమవారం నవాబుపేట ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్రెడ్డితో కలిసి వివరాలను వెల్లడించారు. అల్లీపురానికి చెందిన జయలక్ష్మి (39), జగన్ దంపతులకు కుమార్తె ఉంది. జయలక్ష్మి మేనల్లుడు టి.కుమార్ నెల్లూరు రూరల్ మండలం కల్లూరుపల్లి హౌసింగ్బోర్డులో నివాసముంటున్నాడు. అతని తల్లిదండ్రులు విభేదాలతో విడిపోవడంతో జయలక్ష్మి చేరదీసింది. తన ఇంట్లోనే పెట్టుకుని కుమార్తెనిచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకుంది. ఈక్రమంలోనే అత్త, అల్లుడి నడుమ వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి భర్త జయలక్ష్మిని వదిలివెళ్లిపోయాడు. సుమారు నెలరోజుల క్రితం ఆమె తన కుమార్తె, అల్లుడితో ఆరెస్సార్ స్కూల్ ఎదురువీధిలోని ఇంటిని అద్దెకు తీసుకుంది. కుమార్ను అతడి కుటుంబ సభ్యులను కలవనివ్వకపోగా, తల్లి మృతిచెందినా వెళ్లకుండా జయలక్ష్మి అడ్డుపడింది. ఈనెల ఆరో తేదీ కుమార్ తన పెద్దనాన్న ఇంటికి వెళ్లి వచ్చాడని జయలక్ష్మి గొడవపడింది. మద్యం మత్తులో ఉన్న అతను ఆమెను కత్తితో పొడిచి హత్యచేసి పరారయ్యాడు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ప్రశాంతినగర్ జంక్షన్ వద్ద అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. -
కలెక్టరేట్ను ముట్టడించిన గిరిజనులు
నెల్లూరు(దర్గామిట్ట): మేయర్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట గిరిజన సంఘాల ఐక్యవేదిక చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి 10వ రోజుకు చేరుకున్నాయి. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని ముట్టడించారు. జిల్లా నలుమూలల నుంచి గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజన నేత బాపట్ల వెంకటపతి యానాది మాట్లాడుతూ గిరిజనుల హక్కులను కాలరాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో గిరిజనులను పథకం ప్రకారం ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు. దీనికి నగరపాలక సంస్థ మేయర్పై కుట్ర నిదర్శనమన్నారు. గిరిజన మహిళకు అన్యాయం జరిగితే జిల్లా పెద్దలు నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు. అవసరమైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది అంబేడ్కర్, వివిధ సంఘాలకు చెందిన మాకాణి వెంకటేశ్వర్లు, బత్తెన లక్ష్మణశేఖర్, చెంచయ్య, గంధర్ల రమేష్, యాకసిరి మురళి, ఈగ శ్రీనివాసులు, తాళ్ల ఏడుకొండలు, బాపట్ల రామయ్య, చలంచర్ల శ్రీనివాసులు, చౌటూరు శ్రీనివాసులు, ఎందేటి సురేంద్ర, తలపల జైవర్ధన్, చేవూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
సినిమా అవకాశం పేరిట మోసం
● ఎస్పీకి ఫిర్యాదు ● పోలీస్ ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు 146 వినతులు నెల్లూరు(క్రైమ్): సినిమాలో అవకాశం, ఉద్యోగాల పేరిట మోసగించిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు పోలీసు ఉన్నతాధికారులను కోరారు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 146 మంది విచ్చేసి తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్ల, పోలీసు అధికారులకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఎస్పీ చట్టపరిధిలో సత్వరమే సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, మహిళా పోలీసుస్టేషన్, పీసీఆర్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, భక్తవత్సలరెడ్డి, బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన చక్రధర్రెడ్డి తాను తీయబోయే సినిమాలో హీరో తమ్ముడు క్యారెక్టర్ ఇస్తానని నా కుమారుడిని నమ్మించి రూ.1.06 లక్షలు నగదు తీసుకుని మోసగించాడు. విచారించి న్యాయం చేయాలని నెల్లూరు రూరల్ పరిధికి చెందిన ఓ వివాహిత కోరారు. ● విజయ్ శాంసన్, ప్రతాప్, మధు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నాతోపాటు మరికొందరి వద్ద రూ.15 లక్షలు నగదు తీసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పించకుండా నగదు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని బాలాజీ నగర్కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ● దుబాయిలో ఉద్యోగం ఇప్పిస్తానని హైదరాబాద్కు చెందిన రామకృష్ణ రూ.4.50 లక్షలు నగదు తీసుకున్నాడు. విజిటింగ్ విసా కింద అక్కడికి పంపి మోసగించాడు. విచారించి చర్యలు తీసుకోవాలని కోటకు చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు. ● కోడలు, మనుమడు బాగా చూసుకుంటానని నమ్మించి నా ఇళ్లు, పొలం వారి పేరుపై రాయించుకున్నారు. అనంతరం ఇంట్లో నుంచి తరిమేశారు. నాకు జీవనాధారం కష్టంగా ఉంది. న్యాయం చేయాలని కలిగిరికి చెందిన ఓ వృద్ధురాలు వినతిపత్రమిచ్చారు. ● నా కుమారుడు గతేడాది అక్టోబర్ నుంచి కనిపించడం లేదు. విడవలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ వేగవంతం చేసి కుమారుని ఆచూకీ తెలుసుకుని అప్పగించాలని విడవలూరుకు చెందిన ఓ మహిళ కోరారు. ● నన్ను, నా పిల్లలను ఇంట్లోకి రానివ్వకుండా భర్త, అత్తింటివారు ఇబ్బందులు పెడుతున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబాన్ని చక్కదిద్దాలని బాలాజీనగర్కు చెందిన ఓ వివాహిత అర్జీ అందించారు. -
అర్జీలిచ్చి.. ఆలకించాలని కోరి..
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● పింఛన్ కోసం పలువురి వినతినెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్ కుమార్, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కృష్ణకుమార్, డ్వామా పీడీ గంగా భవాని తదితరులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తగిన సదుపాయాలు కల్పించాలని అఖిలపక్ష రైతు సంఘ నాయకులు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ జిల్లాలో సుమారు 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం త్వరలో మార్కెట్లోకి రాబోతోందన్నారు. వరికి మద్దతు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.ఎవరూ వినిపించుకోవడం లేదు నాకున్న 4 ఎకరాల వారసత్వ భూమిలో 50 సెంట్లను పక్కన లేఅవుట్ వేసేవారు ఆక్రమించుకుని చదును చేసుకున్నారు. గతంలో మా మండలం తిరుపతి జిల్లాలో ఉన్నప్పుడు కలెక్టర్కు మూడుసార్లు అర్జీలిచ్చాను. పట్టించుకోలేదు. ఇక్కడ రెండుసార్లు ఇచ్చాను. ఎవరూ నా గోడు వినిపించుకోవడం లేదు. – చెన్నూరు రాజగోపాల్రెడ్డి, చిల్లకూరు మండలం -
రౌడీషీటర్పై పీడీ యాక్ట్
నెల్లూరు(క్రైమ్): తీరుమారని రౌడీషీటర్పై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. నెల్లూరు చిన్నబజారు ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు వివరాల మేరకు.. కోటమిట్టకు చెందిన షేక్ మసూద్ అలియాస్ మక్సూద్ అలియాస్ పెద్ద మసూద్పై చిన్నబజారు పోలీస్స్టేషన్లో రౌడీషీ ట్ ఉంది. అతనిపై హత్య కేసుతోపాటు పలు కేసులున్నాయి. కలెక్టర్ అనుమతితో పోలీసులు సోమవారం మసూద్పై పీడీ యాక్ట్ నమోదు చేశారు.పిల్లల్ని చూసేందుకు వెళ్తూ.. ● రోడ్డు ప్రమాదంలో మహిళ మృతికోట: మండలంలోని రాఘవాపురం వద్ద కోట – గూడూరు ప్రధాన రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కె.సుబ్బమ్మ (42) అనే మహిళ మృతిచెందింది. ఎస్సై పవన్కుమార్ కథనం మేరకు.. వాకాడు మండలం శ్రీపురానికి చెందిన సుబ్బమ్మ తన మరిది రవి మోటార్బైక్పై నెల్లూరుకు వెళ్తోంది. రామాపురానికి చెందిన రాజశేఖర్ బైక్పై ముందు వెళ్తూ ఒక్కసారిగా రాఘవాపురం వైపు తిప్పాడు. వెనుక వస్తున్న బైక్ అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడిన సుబ్బమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. రవికి గాయాలయ్యాయి. మృతురాలికి భర్త, పిల్లలున్నారు. నెల్లూరులో చదువుతున్న పిల్లల వద్దకు వెళ్తూ ప్రమాదానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్సై పరిశీలించారు. కోట ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేశారు. ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు● ఏఎస్పీ దీక్ష నెల్లూరు(క్రైమ్): ‘ప్రజలతో మమేకమై శాంతియుతంగా జీవించాలి. వారిని ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవు’ అని నగర ఏఎస్పీ దీక్ష ట్రాన్స్జెండర్లను హెచ్చరించారు. నగరంలోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ట్రాన్స్జెండర్స్తో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరితోనూ దౌర్జన్యంగా, దురుసుగా ప్రవర్తించరాదన్నారు. నేరాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు శాఖకు పూర్తిగా సహకరిస్తూ చట్టపరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. సమావేశంలో నగర ఇన్స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, జి.వేణుగోపాల్రెడ్డి, వైవీ సోమయ్య, కె.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రయోగంనెల్లూరు(క్రైమ్): గంజాయి అక్రమ రవాణా కేసులో నెల్లూరు వేదాయపాళేనికి చెందిన రౌడీషీటర్ జగదీష్పై పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్కు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులోని వివరాల మేరకు.. గతేడాది ఆగస్ట్ 24వ తేదీన జగదీష్ మరో ఇద్దరు గంజాయి అక్రమంగా తరలిస్తుండగా నెల్లూరు రూరల్ మండలం దొంతాలి వద్ద వేదాయపాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 19.470 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అదే ఏడాది సెప్టెంబర్ ఐదో తేదీన కారులో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న పలువురిని దొంతాలి అడ్డరోడ్డు జంక్షన్ వద్ద వేదాయపాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 23.470 కేజీల గంజాయిని స్వాధీనం చేశారు. విచారణలో జగదీష్ పేరు వెల్లడవడంతో అతడిపై కేసు నమోదు చేశారు. జిల్లా పోలీసు అఽధికారుల నివేదిక ఆధారంగా పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. -
కుమారుడే హంతకుడు
● రైల్వే ఉద్యోగి హత్య కేసును ఛేదించిన పోలీసులు ● కుటుంబ, ఆస్తి వివాదాలే కారణంకావలి రూరల్: కావలి మండలం రుద్రకోటలో ఇటీవల జరిగిన రైల్వే ఉద్యోగి ఆరే నాగరాజు (47) హత్య కేసును పోలీసులు ఛేదించారు. కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాల నేపథ్యంలోనే కుమారుడే హత్యకు పాల్పడినట్లు కావలి డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. ఆయన సోమవారం పట్టణంలోని కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాగరాజు, భార్య మాధవికి మధ్య పదేళ్లుగా విభేదాలున్నాయి. ఆమె తన ముగ్గురు కుమారులతో కలిసి చిన్నగంజాంలోని పుట్టింట్లో ఉంటోంది. నాగరాజు రుద్రకోటలోని ఎస్సీ కాలనీలో భార్య పేరుపై ఉన్న ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నాడు. పిల్లల చదువులు, పెద్ద కుమారుడి వివాహం కోసం మాధవి అప్పులు చేసింది. నాగరాజు కుటుంబానికి ఆర్థిక సహాయం చేయకుండా డబ్బును విలాసాలకే ఖర్చు చేసేవాడు. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో రుద్రకోట ఇంటిని అమ్మాలని భార్య, రెండో కుమారుడు నవీన్బాబు పలుమార్లు నాగరాజును కోరారు. అయితే అతను అందుకు అంగీకరించలేదు. ఆ ఇంటిని తన పేరుపై మార్చుకునే ప్రయత్నం చేశాడు. దీంతో విసిగిపోయిన మాధవి, నవీన్బాబులు నాగరాజును అడ్డుతొలగించుకోవాలని 15 రోజుల క్రితం నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా నవీన్బాబు రుద్రకోటలోనే ఉంటూ తండ్రితో సఖ్యతగా ఉన్నట్లు నటించాడు. ఈనెల 5వ తేదీ రాత్రి నాగరాజు మద్యం మత్తులో ఉండగా రోకలిబండతో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకు మృతదేహంపై మరికొన్ని గాయాలు చేసి పరారయ్యాడు. పోలీసుల విచారణలో దొరికిపోతామనే భయంతో మాధవి, నవీన్బాబు వీఆర్వో జనార్దన్ ఎదుట లొంగిపోయారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. సమావేశంలో రూరల్ సీఐ రాజేశ్వరరావు, ఎస్సైలు తిరుమలరెడ్డి, బాజీరావు పాల్గొన్నారు. -
క్రెడిట్ చోరీకి తమ్ముళ్ల ఆరాటం
● వైఎస్సార్సీపీ హయాంలో బుచ్చిరెడ్డిపాళెంలో హెల్త్ సెంటర్ నిర్మాణం ● మేమే చేశామని చెప్పుకొనేందుకు టీడీపీ యత్నం ● రిబ్బన్ కట్ చేసేందుకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి రెడీ బుచ్చిరెడ్డిపాళెం: క్రెడిట్ చోరీ చేయడం తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి స్థానిక నేతల వరకు పరిపాటిగా మారింది. కోవూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గత ప్రభుత్వం వైఎస్సార్సీపీ హయాంలో నిర్మించిన సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్లు, డిజిటల్ గ్రంథాలయం.. ఇలా అనేక ప్రభుత్వ భవనాలే కనిపిస్తాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, పునాది వేసి, నిర్మాణాలను పూర్తి చేసిన భవనాలకు ఇప్పుడు వాటికి రంగులేసి తమ ఖాతాలో వేసుకోవాలని కూటమి ప్రభుత్వం ఆరాట పడుతోంది. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో సాగుతున్న ఈ క్రెడిట్ చోరీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరిగిందంటే.. అప్పటి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలోని కట్టుబడిపాళెంలో సుమారు రూ.80 లక్షలతో పట్టణ ఆరోగ్య కేంద్రం (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) నిర్మాణానికి చొరవ తీసుకున్నారు. నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. పనుల్లో నాణ్యత తగ్గకుండా నిరంతరం పర్యవేక్షించి, గత ప్రభుత్వ హయాంలోనే భవన నిర్మాణాన్ని దాదాపు 99 శాతం పూర్తి చేయించారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఎన్నికల కోడ్ రావడం, ప్రభుత్వం మారడం చకచకా జరిగిపోయాయి. ప్రచార ఆర్భాటం సొంతంగా నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టడం చేతగాక, గత ప్రభుత్వం పూర్తి చేసిన భవనాలకు ‘కూటమి’ ముద్ర వేసే ప్రక్రియకు తెలుగు తమ్ముళ్లు తెరలేపారు. కొన్ని రోజులుగా ఈ ఆరోగ్య కేంద్రానికి హడావుడిగా రంగులు వేయించి, చిన్న చిన్న పనులను చేసి, తమ ఘనతగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో మంగళవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించి, అదంతా తామే చేశామని చెప్పుకోవాలని చూస్తున్నారు. ఈ తంతు చూస్తున్న కట్టుబడిపాళెం ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రసన్నకుమార్రెడ్డి నిధులు తెచ్చి బిల్డింగ్ కట్టించారు. ఇప్పుడు రంగులేసి మేమే కట్టామని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించడం లేదా?’ స్థానిక వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గమంతా ఇదే తీరు కేవలం ఈ ఆరోగ్య కేంద్రమే కాదు. కోవూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. కొత్తగా ఒక్క ఇటుక కూడా వేయని కూటమి నేతలు, పూర్తయిన భవనాలకు రిబ్బన్ కటింగ్ చేయడానికి మాత్రం పోటీ పడుతున్నారు. -
నిందితులను కఠినంగా శిక్షించాలి
ఆత్మకూరు: గుమ్మళ్లదిబ్బలో గంజాయి మత్తులో మైనర్ బాలికపై దారుణానికి పాల్పడి, మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆత్మకూరు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. సత్రం సెంటర్ నుంచి మున్సిపల్ బస్టాండ్లోని అంబేడ్కర్ విగ్రహం వరకు సాగిన ఈ కొవ్వొత్తుల ర్యాలీలో ప్రజాసంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయుకులు మాట్లాడుతూ గుమ్మళ్లదిబ్బలో మైనార్టీ వర్గానికి చెందిన మైనర్ బాలికను గంజాయి సేవించిన ఇద్దరు యువకులు (మైనర్లు) హింసించి ఆమె చావుకు కారణమవడం రాష్ట్రంలో గంజాయి ఏరులై పారుతుందనడానికి నిదర్శనమన్నారు. గంజాయి అరాచకాలకు పోయే ప్రాణాలు తెచ్చివ్వలేమని, ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టి గంజాయి విక్రయాలను సంపూర్ణంగా అడ్డుకోవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. -
ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు (టౌన్): విద్యాహక్కు చట్టంలో భాగంగా 2026–27 విద్యా సంవత్సరంలో జిల్లాలో ని ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల పిల్లలకు 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటో తరగతి పిల్లల తల్లిదండ్రులు ఈ నెల 20 నుంచి మార్చి 10వ తేదీలోగా గ్రామ సచివాలయం లేదా మండల విద్యా వనరుల కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అలాగే http://cse.ap.gov.in వెబ్సైట్ లో విద్యార్థుల ఆధార్, ప్రాథమిక వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపా రు. ఉచిత ప్రవేశాలకు సంబంధించిన వివరాల కోసం టోల్ఫ్రీ నంబర్ 180042 58599ను సంప్రదించాలని సూచించారు. పెన్నా డెల్టాకు 1600 క్యూసెక్కుల విడుదల సోమశిల: సోమశిల జలాశయం నుంచి పెన్నా డెల్టాకు సోమవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈఈ శ్రీనివాసులు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలతో పెన్నా డెల్టా ఆయకట్టు రైతుల అవసరాల మేరకు 12వ క్రస్ట్ గేట్ ద్వారా 1600 క్యూసెక్కులను విడుదల చేశామని తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 69.834 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ఎగువ ప్రాంతం నుంచి 3,514 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోందని చెప్పారు. పవర్ టెర్మినల్ ద్వారా పెన్నా నదికి 2,350, ఉత్తర కాలువకు 300, దక్షిణ కాలువకు 200, కండలేరు కాలువకు 400 క్యూసెక్కుల వంతున విడుదల చేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం జలాశయంలో 99.462 మీటర్ల నీటి మట్టం ఉందని తెలిపారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 81,894 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 24,754 మంది తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.91 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో దర్శించుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
రిలయన్స్కు భూములను ధారాదత్తం చేయొద్దు
● తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల అందోళన ● ప్రభుత్వ తీరుపై మండిపాటు ఉదయగిరి: కూటమి ప్రభుత్వం విలువైన ప్రభుత్వ భూములను అభివృద్ధి ముసుగులో బడా కంపెనీలకు ధారాదత్తం చేస్తుండడంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. భూమిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు కాకుండా కార్పొరేట్ కంపెనీలకు భూములను కట్టబెడుతుండడంపై స్థానికులు ఆందోళనలకు దిగుతున్నారు. ఉదయగిరి మండలం పుల్లాయపల్లి రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్లు 100,106లలో ఉన్న 312 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని ఇటీవల ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు రిలయన్స్ కంపెనీకి స్వాధీనం చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు సోమవారం పెద్ద సంఖ్యలో ఉదయగిరి తహసీల్ధార్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. తమ గ్రామానికి చెందిన భూములను రిలయన్స్ కంపెనీకి ఇచ్చి తమ కడుపు కొట్టొద్దని రెవెన్యూ అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఏమి జరిగిందంటే.. పుల్లాయపల్లిలోని సర్వే నంబర్లు 100,106లో ఉన్న 312 ఎకరాలు భూమిని సీలింగ్ ద్వారా ప్రభుత్వం తీసుకుంది. సదరు ప్రభుత్వ భూమిని 1992లో అప్పటి రెవెన్యూ అధికారులు గ్రామంలోని 242 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక వర్గాలకు చెందిన నిరుపేద రైతులకు సీజేఎఫ్ఎస్ ద్వారా లీజు పట్టాలుగా పంపిణీ చేశారు. ఈ వివరాలను అధికారులు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయలేదు. భూములను పొందిన కొందరు రైతులు కొంత కాలం సాగు చేశారు. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలించక సాగును నిలిపివేశారు. దీంతో భూముల్లో కంపచెట్లు పెరిగి చిట్టడవిలా మారింది. ఈ నేపథ్యంలో 2024లో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం రిలయన్స్ కంపెనీకి 312 ఎకరాల సదరు ప్రభుత్వ భూమిని కేటాయించి స్వాధీనం చేసింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తుల కడుపుమండింది. ఏళ్ల తరబడి తాము చేసుకుంటున్న భూమిని తమకు కాకుండా రిలయన్స్ కంపెనీకి ఎలా కేటాయిస్తారంటూ రెవెన్యూ అధికారులను నిలదీశారు. దాదాపు 250 మందికి పైగా రైతులు ఉదయగిరి చేరుకుని రంగనాయకులస్వామి ఆలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ షాజియాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ విజయమ్మ, అఖిలపక్ష నేతలు కాకు వెంకటయ్య, కే నరసింహారెడ్డి, కల్లూరి కృష్ణారెడ్డి, కొండా రాజగోపాల్రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ తీరు దుర్మార్గం టీడీపీ ప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్రభుత్వ, పేదలకు పంపిణీ చేసిన భూములను బడా కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. దీంతో కాలుష్యం పెరిగి ప్రజలు గ్రామాలను వదిలి వెళ్లే పరిస్థితి వస్తుంది. పుల్లాయపల్లిలో పేదలకు పంపిణీ చేసిన భూములను కాజేసే కుట్రలో భాగంగా రిలయన్స్కు చెందిన ఏబీసీ సంస్థ్ధకు కేటాయిస్తూ జీఓ ఇవ్వడం దుర్మార్గం. ప్రభుత్వం వెంటనే జీఓను వెనక్కితీసుకోపోతే పోరాటం చేస్తాం. – కాకు వెంకటయ్య, జిల్లా రైతు సంఘ నేత -
గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలో గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపి కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కోవూరు మండలంలోని గుమ్మళ్లదిబ్బకు చెందిన మైనర్ బాలికపై గంజాయి మత్తులో ఇద్దరు బాలురు అఘాయిత్యానికి పాల్పడడంతో, ఆ బాలిక మృతికి సంతాపంగా నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవాజ్ జిల్లా కార్యదర్శి రషీద్ మాట్లాడుతూ మైనర్ బాలికపై అఘాయిత్యం, హత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో గంజాయి విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని, మూడు నెలల క్రితం పెంచలయ్యను గంజాయి బ్యాచ్ హత్య చేశారని, ఇప్పుడు గంజాయి అరాచకాలకు బలైపోయిన బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గంజాయి వాడకం, రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి గంజాయి రహిత జిల్లాగా నెల్లూరును మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఆవాజ్, ఐద్వా, ప్రజానాట్యమండలి నాయకులు విక్రమ్, నరేంద్ర, రమణ, నరసింహ, శివకుమారి, గండవరపు శేషయ్య తదితరులు, పాల్గొన్నారు. -
అక్రమ కేసులు తప్ప సక్రమ పాలనేదీ?
నెల్లూరురూరల్: చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతిపక్షంపై అక్రమ కేసులు తప్ప.. సక్రమ పాలనేదని మాజీ మంత్రి విడదల రజిని దుయ్యబట్టారు. జిల్లా సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న పిన్నెల్లి సోదరులను విడదల రజిని, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత సోమవారం ములాకత్ అయ్యారు. ఈ సందర్భంగా విడదల రజని మాట్లాడుతూ పల్నాడు ఎస్పీ స్వయంగా టీడీపీ వాళ్ల ఆధిపత్య పోరులోనే హత్య జరిగిందని అని స్వయంగా ప్రకటించినా కూడా.. పిన్నెల్లి సోదరులపై అక్రమంగా హత్య కేసు బనాయించి జైలుకు పంపడం దారుణమన్నారు. పిన్నెల్లి సోదరులు ఎటువంటి తప్పు చేయలేదన్నారు. టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలని ఈ ప్రభుత్వం చూస్తుందన్నారు. మాజీ మంత్రుల మీద వరుస దాడులను ప్రోత్సహిస్తూ, మాపైనే అక్రమ కేసులు పెడుతుందన్నారు. గుడికి వెళ్లి పూజలు చేసుకుని బయటకు వస్తే నా మీద కూడా కేసులు నమోదు చేసిందన్నారు. ఇటువంటి దాడులకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవరూ భయపడరని తెలిపారు. టీడీపీ అరాచకాలను కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రశ్నిస్తుంటే ఆయన మీద పదే పదే కేసులు పెడుతున్నారన్నారు. టీడీపీ హయాంలో తిప్పి పంపిన ట్యాంకర్లను మళ్లీ తెప్పించి లడ్డూలో వాడేసి తమపైనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎక్కడా జంతువు కలవలేదని సిట్ రిపోర్ట్ ఇస్తే అడ్డగోలుగా వాదిస్తున్నారన్నారు. చేసిన తప్పుడు పనులను కప్పిపుచ్చేందుకే అవాస్తవ ప్రచారాలతో అడ్డదిడ్డంగా వాదిస్తున్నారన్నారు. ● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ జైలు అధికారులు పిన్నెల్లి సోదరులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని తెలిపారు. చంద్రబాబు కక్ష సాధింపులతో వ్యవహరిస్తున్నాడన్నారు. మామూలు ఖైదీ కన్నా దారుణంగా చూస్తున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం కత్తులు, కర్రలు, పెట్రోల్ బాంబులతో పాలన సాగిస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దాడులు చేయడం సంస్కృతిగా మారిపోయిందన్నారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని టీడీపీ వాళ్లే చెబుతున్నారన్నారు. కక్ష సాధింపులో భాగమవుతున్న అధికారులపై ప్రభుత్వం మారాక చట్టరీత్యా చర్యలు తీసుకొని జైల్లోకి పంపుతామన్నారు. కేసులకు ఏ వైఎస్సార్సీపీ కార్యకర్త భయపడరని తెలిపారు. ● రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మాట్లాడుతూ తప్పుడు కేసులతో జైల్లో పెట్టడం మంచి పద్ధతి కాదని తెలిపారు. సంబంధంలేని కేసుల్లో ఇరికించడం ఈ ప్రభుత్వం స్పెషాలిటీ అన్నారు. అక్రమ కేసుల్లో మా నాన్నను జైల్లో పెట్టినప్పుడు నేను ఎంతో బాధపడ్డానని తెలిపారు. తిరుమల లడ్డూను స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్నారు. స్కామ్లు చేయడం ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం ద్వారా ప్రజలు పాలనను అసహ్యించుకుంటున్నారన్నారు. గుడికి వెళ్లి బయటకు వచ్చిన నాపైనా కేసు నమోదు టీడీపీ అరాచకాలను ప్రశ్నిస్తున్నాడని కాకాణి అన్నపై పదేపదే కేసులు ఆ పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో హత్య జరిగిందని ఎస్పీనే చెప్పారు అయినా పిన్నెల్లి సోదరులపై అక్రమంగా హత్య కేసు నమోదు మాజీ మంత్రి విడదల రజిని జైల్లో పిన్నెల్లి సోదరులను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు -
ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ మీటర్లు
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ఇప్పటికే ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లకు ప్రీపెయిడ్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లతో సోమవారం ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు ఆధునిక సాంకేతికతతో మెరుగైన సేవలతో నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు స్మార్ట్మీటర్లను అమరుస్తున్నామని తెలిపారు. ప్రభు త్వ కార్యాలయాలు, కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోని వీధి దీపాలు, మంచినీటి పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో 16,802 స్మార్ట్ మీటర్లను అమర్చినట్లుగా తెలిపారు. వీటిని ప్రస్తుతం ప్రీపెయిడ్ మీటర్లుగా మారుస్తున్నామని, వాటిని రీచార్జి చేసేందుకు వీలుగా ఈ–వాలెట్లను ఏర్పాటు చేశామని వివరించారు. దశలవారీగా మిగిలిన కేటగిరీల వినియోగదారులకు కూడా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను అమర్చేందుకు చర్యలు చేపడుతామని తెలిపారు. ఈ మీటర్లతో విద్యుత్ వినియోగంపై వినియోగదారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. -
‘బెయిల్ను అడ్డుకునేందుకే కస్టడీ పిటిషన్లు’
నెల్లూరు: ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ మంత్రి విడదల రజిని పరామర్శించారు. సోమవారం(ఫిబ్రవరి 9వ తేదీ) నెల్లూరు వెళ్లిన విడదల రజిని.. పిన్నెల్లిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.‘బెయిల్ను అడ్డుకునేందుకే కస్టడీ పిటిషన్లు వేస్తున్నారు. ఏపీలో అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అంబటికి సినిమా చూపిస్తానమని టీడీపీ నేతలే హెచ్చరించారు. జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేశారు. లడ్డూ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకే దాడులు చేస్తున్నారు. -
సముద్రంలో మునిగిన బోటు
కోట: చైన్నె సమీపంలో చేపల వేటకెళ్లిన బోటు సముద్రంలో బోల్తాపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గోవిందపల్లిపాళేనికి చెందిన ఐదుగురు, విడవలూరు మండలం ఊటుకూరుపాళేనికి చెందిన ముగ్గురు, పొన్నపూడికి చెందిన నలుగురు ఇలా 12 మంది చైన్నెకు చెందిన బోటులో చేపల వేట నిమిత్తం మూడు రోజుల క్రితం వెళ్లారు. ఈ తరుణంలో చైన్నెకు ఐదు కిలోమీటర్ల దూరంలో బోటు సముద్రంలో శనివారం ఉదయం బోల్తాపడింది. మరో బోటు ద్వారా వీరిని వెంటనే సురక్షితంగా తరలించారు. కనులపండువగా సముద్రస్నానం కావలి: దుత్తలూరు మండలంలోని నర్రవాడలో కొలువైన వెంగమాంబ తల్లి సముద్రస్నాన మహోత్సవాన్ని వేడుకగా ఆదివారం నిర్వహించారు. అమ్మవారిని పుష్పాలతో సుందరంగా అలంకరించి.. మేళతాళాలు, బాణసంచా నడుమ నడుమ గ్రామోత్సవాన్ని జరిపారు. వింజమూరు, కలిగిరి, జలదంకి మీదుగా కావలికి శనివారం చేరుకుంది. అనంతరం కావలి మండలంలోని సత్రం వద్ద సముద్రస్నానాన్ని చేయించి పూజలు నిర్వహించారు. దారి పొడవునా ఆయా గ్రామాల ప్రజలు పూలు, పండ్లు, టెంకాయలను సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. -
పన్నులను నూరు శాతం వసూలు చేయాలి
కోవూరు: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 15 నాటికి పన్నులను నూరు శాతం వసూలు చేయాలని డీపీఓ వసుమతి ఆదేశించారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. లక్ష్యాన్ని సాధించలేకపోతే సహించేదిలేదని స్పష్టం చేశారు. పంచాయతీలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు ఇవి ఎంతో కీలకమని వివరించారు. కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించి వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు. ఇన్చార్జి ఎంపీడీఓ శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 81,777 మంది శనివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 30,209 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.7 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
వెతలు తీరక.. కాళ్లరిగేలా తిరుగుతూ..!
నెల్లూరు(దర్గామిట్ట): కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక‘ నామమాత్రంగా సాగుతోందనే భావన అర్జీదారుల్లో వ్యక్తమవుతోంది. ఇందులో వినతులను సమర్పించినా, అవి పరిష్కారానికి నోచుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల వ్యక్తిగత, సామాజిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి వారం దాదాపు 300 నుంచి 600 వరకు అర్జీలు అందుతున్నా, క్షేత్రస్థాయిలో పరిష్కారం తూతూమంత్రంగా ఉంటోంది. లాగిన్ సైతం చేయని వైనం.. వాస్తవానికి నిబంధనల మేరకు అర్జీ అందిన 24 గంటల్లోపు సంబంధిత శాఖ అధికారి తన లాగిన్ను ఓపెన్ చేసి వీటిని పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఆఫీసర్లు దీన్ని అమలు చేయడంలేదని తెలుస్తోంది. ఓ అధికారి తన లాగిన్ను ఓపెన్ చేసి ఎన్ని రోజులైందో సైతం తెలియని పరిస్థితి. పశుసంవర్థక శాఖ, ఉదయగిరి, అనంతసాగరం తదితర మండల స్థాయి అధికారులు సైతం ఇదే బాటలో పయనిస్తున్నారు. వామ్మో.. ఇన్నా..! తాగునీరు, పారిశుధ్యం తదితర సమస్యలను మూడు రోజుల్లో.. రెవెన్యూ సంబంధితమైన వాటిని 90 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో 778కుపైగా అర్జీలు పెండింగ్లో ఉన్నాయి. ఈ తరుణంలో సమస్యలు పరిష్కారం కాక అర్జీదారులు కలెక్టరేట్ చుట్టూ ప్రతి వారం తిరగాల్సి వస్తోంది. మరోవైపు 200 అర్జీల్లో 50 మాత్రమే పరిష్కారమవుతున్నాయని, మిగిలిన 150 మేర తరచూ వస్తున్నాయని సమాచారం. అర్జీదారుల సౌకర్యార్థం కలెక్టరేట్లో అన్ని సదుపాయాలను కల్పిస్తున్నా, సమస్యల పరిష్కార విషయంలో మాత్రం చిత్తశుద్ధి కరువైందనే ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అధికారులు ఇప్పటికై నా వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిష్కారానికి నోచుకోని వైనం అధికారుల్లో అంతులేని అలసత్వం పెండింగ్లో భారీగా అర్జీలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక తీరిదీ.. -
ఆత్మకూరు నియోజకవర్గంలోని మారుమూల గ్రామ ప్రజలు ప్రస్తుతం కిడ్నీ సమస్యలతో విలవిల్లాడుతున్నారు. తాగునీటితో ఈ రోగమొచ్చినా, అధికారులు తూతూమంత్రపు చర్యలకే పరిమితమవుతున్నారు. గ్రామంలోని దాదాపు 40 శాతం మంది నానా అవస్థలు పడుతూ.. వైద్యం కోసం పడరాని పాట్లు పడుతున్నా
కంపసముద్రం దళితకాలనీలోని ఓ వీధి ఆత్మకూరు: మర్రిపాడు మండలంలోని కంపసముద్రం దళిత కాలనీ వాసులు భయం..భయం నడుమ జీవనం సాగిస్తున్నారు. ఫ్లోరిన్ కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో రెండు నెలల వ్యవధిలో ఐదుగురు మృతి చెందడం వీరిని కలవరపాటుకు గురిచేస్తోంది. కిడ్నీ సంబంధిత సమస్యలు రెండేళ్ల నుంచి ఎక్కువవడంతో వైద్యం నిమిత్తం బద్వేలు, ఆత్మకూరు, నెల్లూరు ప్రాంతాలకు వీరు పరుగులు తీయాల్సి వస్తోంది. జల్జీవన్ ద్వారా సురక్షిత తాగునీటి సరఫరాకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నా, స్థానిక యంత్రాంగం మాత్రం విఫలమవుతోంది. 40 శాతం మందికి.. ఈ కాలనీలో సుమారు 130 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఆరేళ్ల మొదలుకొని 60 ఏళ్ల వయస్సు వారు కిడ్నీ వ్యాధిన బారిన పడ్డారంటే ఇక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ దాదాపు 40 శాతం మందికి ఇది సోకడం గగుర్పాటుకు గురిచేస్తోంది. తాగునీటి సమస్య కారణంగానే ఈ పరిస్థితి తలెత్తుతోందనే విషయాన్ని మండలాధికారులు ఏడాది క్రితం గుర్తించారు. అయినా ఎలాంటి రక్షణ చర్యలను చేపట్టలేదు. మంత్రి ఇలాకాలో ఇలా..! రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ దుస్థితి నెలకొన్నా, ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. ఈ విషయమై కలెక్టర్కు వినతిపత్రాన్ని పలువురు కాలనీ వాసులు గతేడాది అందజేశారు. ఎట్టకేలకు గత నెలాఖరులో ఆత్మకూరు ఆర్డీఓ పావని, డీఎంహెచ్ఓ సుజాత, స్థానిక మండల వైద్యుల బృందం పర్యటించారు. పలువురి వద్ద రక్త నమూనాలను సేకరించారు. 13 ఏళ్ల బాలుడు ఈ వ్యాధి బారిన పడ్డారనే అంశాన్ని గుర్తించారు. అనంతరం కాలనీలోని బోర్లను పరిశీలించి నీటి శాంపిళ్లను సేకరించారు. ఎట్టకేలకు బోర్లలోని నీటితోనే కిడ్నీ వ్యాధులు సంక్రమిస్తున్నాయని గుర్తించి.. తాగేందుకు ఉపయోగించరాదంటూ హెచ్చరికలు రాయించారు. వైద్యానికే భారీగా.. వైద్యం చేయించుకునేందుకు భారీగా వెచ్చించి పలువురు అప్పులపాలయ్యారు. మర్రిపాడు మండలంలోని ఈ గ్రామం మారుమూల కావడంతో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. గతంలో అప్పటి ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తన సొంత నిధులతో గ్రామంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ మాత్రమే ఉంది. ఇది గ్రామస్తులు, కాలనీ వాసులకు తాగునీటికి ఉపయోగపడుతోంది. కాలనీకి చెందిన సుమారు 40 మంది ప్రత్యేక వాహనంలో నెల్లూరులోని ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం శనివారం వెళ్లి మందులను తెచ్చుకున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కిడ్నీ వ్యాధి బాధితుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాగునీటితో కిడ్నీ సమస్యలు చిన్న వయస్సు వారికీ సంక్రమిస్తున్న వైనం రెండు నెలల వ్యవధిలో ఐదుగురి మృతి వైద్యం కోసం పరుగులు మర్రిపాడు మండలంలో భయం.. భయం -
అయ్యో.. గోమాత
● ఆకలితో అలమటిస్తూ.. బక్కచిక్కి ● వెంగమాంబ పేరంటాలమ్మ ఆలయ గోశాలలో ఇదీ దుస్థితి దుత్తలూరు: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మండలంలోని నర్రవాడ వెంగమాంబ పేరంటాలమ్మ ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో గోవులను దేవస్థానాధికారులు, సిబ్బంది పట్టించుకోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక్కడ గోవులు, కోడె దూడలు కలిపి సుమారు 40 ఉన్నాయి. గోశాలలో కొన్ని నెలలుగా గడ్డి నిల్వ లేకపోవడంతో ఇవి ఆకలితో అలమటిస్తున్నాయి. పచ్చిక బయళ్లు సైతం కరువై అనారోగ్యానికి గురవుతున్నాయి. ఫలితంగా చెత్తాచెదారాన్ని తినాల్సి వస్తోంది. కాగా ఈ విషయమై ఆలయ ఇన్చార్జి ఈఓ శ్రీనివాసరెడ్డిని సంప్రదించగా, గడ్డి కొరత తీవ్రంగా ఉందని, ఎక్కడ తిరిగినా దొరకడంలేదని చెప్పారు. గడ్డిని రెండు, మూడు రోజుల్లో ఏర్పాటు చేసేలా చూస్తామని బదులిచ్చారు. -
స్వగ్రామానికి వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ఉదయగిరి రూరల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడిన ఘటన ఆదివారం సాయంత్రం మండలంలోని సున్నంవారిచింతల వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని తిరుమలాపురం గ్రామానికి చెందిన మద్దిశెట్టి సుందర్ (55) భజన నేర్పిస్తుంటాడు. పని నిమిత్తం ఉదయగిరికి బైక్పై వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. అలాగే వరికుంటపాడు మండలం యర్రంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మనోహర్, గురుబ్రహ్మం బైక్పై ఉదయగిరి వైపు వెళ్తున్నారు. సున్నంవారిచింతలకు వచ్చేసరికి ప్రమాదవశాత్తు రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో సుందర్కు తీవ్రంగా, ఆ ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గ్రామస్తులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సుందర్ పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనా స్థలానికి ఎస్సై ఇంద్రసేనారెడ్డి చేరుకుని వివరాలు సేకరించారు. ‘యువత గంజాయికి బానిసవుతున్నారు’● వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్కోవూరు: యువత గంజాయికి బానిసలుగా మారి ఒళ్లు తెలియకుండా ప్రవర్తిస్తున్నారని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. ఆదివారం ఆయన గుమ్మళ్లదిబ్బలో బాలిక మృతదేహానికి నివాళులర్పించి మాట్లాడారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. పునరావృతం కాకుండా పెట్రోలింగ్ పెంచాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసుల్ని ఆదేశించారు. ఈ ఘటనతో మాకు కూడా రక్తం మరుగుతోందన్నారు. పొదలకూరు నిమ్మధరలు (కిలో)పెద్దవి : రూ.50 సన్నవి : రూ.30 పండ్లు : రూ.20 -
మరికొన్ని బ్యాంక్ల విలీనానికి అవకాశం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా ప్రభుత్వరంగ బ్యాంక్లను విలీనం చేసింది. రానున్న కాలంలో మరిన్నింటిని విలీనం చేయడం, ప్రైవేటీకరించేందుకు అవకాశం ఉంది’ అని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం సంయుక్త కార్యదర్శి ఉదయ్కుమార్ అన్నారు. నెల్లూరులోని రోటరీ క్లబ్ ఆడిటోరియంలో ఆదివారం ఏపీ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెల్లూరు రీజియన్ 2వ వార్షికోత్సవ మహాసభ నిర్వహించారు. దీనికి నెల్లూరు రీజీయన్ పరిధిలో పనిచేస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు విచ్చేశారు. ఉదయ్కుమార్ మాట్లాడుతూ 2020లో మూడు బ్యాంక్లను విలీనం చేశారన్నారు. 2024 మార్చి 8వ తేదీన బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ బ్యాంక్స్ ఫోరం బ్యాంక్ యూనియన్ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు బ్యాంకు ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు అమలు చేయాలని నిర్ణయించినా కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవడం దారుణమన్నారు. గత నెల 27వ తేదీన ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె నిర్వహించారన్నారు. ఈనెల 12వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాక్ ఆఫ్ ఇండియా నెల్లూరు రీజియన్ డిప్యూటీ హెడ్స్ వేణుగోపాల్, శివశంకర్, యూనియన్ నాయకులు శ్రీనివాసరావు, విజయ్భాస్కర్, లక్ష్మీపతి, శ్రీనివాస్, సుమన్, స్వాతి, మృదుల తదితరులు పాల్గొన్నారు. -
పెన్నానదిలో యువకుడి గల్లంతు
నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ మండలంలోని జొన్నవాడకు సమీపంలోని పెన్నానదిలో ఓ యువకుడు గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు సర్వేపల్లి కాలువకట్ట వద్ద సుబ్రహ్మణ్యం కుటుంబం నివాసం ఉంటోంది. అతడి కుమారుడు సంతోష్ కుమార్ బీకాం కంప్యూటర్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు జొన్నవాడ సమీపంలోని పెన్నానది వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు సంతోష్ నదిలో గల్లంతయ్యాడు. స్థానికులు గమనించి గాలించినా ఫలితం లేకుండా పోయింది. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి ఆచూకీ కోసం గాలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నేడు ‘డయల్ యువర్ ఎస్ఈ’ నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల కోసం ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమం జరుగుతుందని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ రాఘవేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎండీ శివశంకర్ ఆదేశాలతో నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్కు ఫోన్ చేసి సమస్యలను చెప్పొచ్చన్నారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
నష్టాల ఊబిలో విద్యుత్ సంస్థ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ సంస్థకు బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించేందుకు చార్జీలు పెంచి సామాన్య వినియోగదారులపై అదనపు భారం మోపేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. ప్రధానంగా ప్రభుత్వరంగ సంస్థల నుంచి రూ.వందల కోట్లు రాబట్టుకోలేక అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పటి వరకు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కి ల్ పరిధిలో రూ. 313 కోట్లు ప్రభుత్వశాఖల నుంచే రావాల్సి ఉంది. బకాయిలు గుదిబండగా మారి విద్యుత్ సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా తయారైంది. సామాన్య వినియోగదారులు చిన్నమొత్తాలను ఒక నెల కట్టడం ఆలస్యమైతే అదనంగా పెనాల్టీ విధించి వసూలు చేస్తారు. బిల్లును చెల్లించడం రెండునెలలు ఆలస్యమైతే సిబ్బంది విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తారు. అయితే నెలలు తరబడి రూ.కోట్లలో బిల్లుల బకాయిలున్న ప్రభుత్వ శాఖల విద్యుత్ సంస్థ ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేకపోతున్నట్లు విమర్శలున్నాయి. శాఖల వారీగా.. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు విద్యుత్ బిల్లుల రూపంలో రూ.313 కోట్లు బకాయి పడ్డాయి. వీటిలో అధికంగా మేజర్ పంచాయతీలు, వాటర్ వర్క్ పథకాల నుంచి రూ.175 కోట్లు రావాల్సి ఉంది. అదేవిధంగా రెవెన్యూ శాఖ నుంచి రూ.54 కోట్లు, లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి రూ.16 కోట్లు, మున్సిపాలిటీల నుంచి రూ.16 కోట్లు బకాయిలున్నాయి. ఈ నాలుగు శాఖలు అధిక సంఖ్యలో చెల్లించాలి. మిగిలిన శాఖలు బిల్లులు కట్టాల్సి ఉంది. ఏపీఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు, ప్రభుత్వం చొరవ చూపి ప్రభుత్వ శాఖలకు ఆదేశాలివ్వాల్సి ఉంది. పేరుకుపోతున్న బకాయిలు పంచాయతీలు, వాటర్ వర్క్ పథకాల నుంచే రూ.175 కోట్లు రెవెన్యూ శాఖ నుంచి రూ.54 కోట్లు లిఫ్ట్ ఇరిగేషన్, మున్సిపాలిటీల బకాయిలు రూ.32 కోట్లుబకాయిలిలా.. మేజర్ పంచాయతీలు, వాటర్ వర్క్ పథకాల నుంచి రూ.175,00,00,000, రెవెన్యూ శాఖ నుంచి రూ.54,00,00,000, లిఫ్ట్ ఇరిగేషన్ రూ.16,34,78,000, మున్సిపాలిటీలు రూ.16,00,00,000, వైద్యశాఖ రూ.7,45,09,000, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ రూ.6,95,17,000, ఎడ్యుకేషన్ రూ.4,61,04,000, కలెక్టరేట్ రూ.4,48,55,000, ఇరిగేషన్ రూ.2,90,83,000, ట్రాన్స్పోర్టు, ఆర్అండ్బీ రూ.2,43,45,000, హోం శాఖ రూ.1,80,58,000, ఇండస్ట్రీస్, కామర్స్ రూ.1,45,51,000, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ రూ.1,28,84,000, టూరిజం రూ.68,78,000, అగ్రికల్చర్ రూ.58,67,000, బీసీ వెల్ఫేర్ రూ.52,37,000, ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ రూ.48,55,000, పశుసంవర్థక శాఖ రూ.41,98,000, న్యాయశాఖ రూ.22,72,000, ఫైనాన్స్ శాఖ రూ.14,19,000, జనరల్ అడ్మినిస్ట్రేషన్ రూ.11,42,000, ఫారెస్ట్, సైన్స్ రూ.9,28,000, సివిల్ సప్లయ్స్ రూ.5,66,000, హౌసింగ్ రూ.4,59,000, మైనార్టీ వెల్ఫేర్ నుంచి రూ.1,00,000 బకాయిలు రావాల్సి ఉంది. -
కొండదిబ్బలో కార్డన్ సెర్చ్
● 35 ద్విచక్ర వాహనాల స్వాధీనం నెల్లూరు(క్రైమ్): నగరంలోని మూలాపేట కొండదిబ్బ ప్రాంతంలో ఆదివారం కార్డన్ సెర్చ్ జరిగింది. నగర ఏఎస్పీ దీక్ష పర్యవేక్షణలో చిన్నజారు, సంతపేట ఇన్స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, వైవీ సోమయ్య సిబ్బందితో కలిసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 500 మంది వరకు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వారి పూర్తి వివరాలను సేకరించారు. పత్రాలు సక్రమంగా లేని 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోటేశ్వరరావు స్థానిక ప్రజలతో మాట్లాడారు. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నా, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్లు విడిచి ఊర్లకు వెళ్లేవారు ఎల్హెచ్ఎంఎస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్డన్ సెర్చ్లో ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో పేట్రేగుతున్న గంజాయి బ్యాచ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘జిల్లాలో గంజాయి బ్యాచ్ చేతుల్లో వరుస హత్యలు జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికితోడు రాజకీయ నాయకులు ఒత్తిళ్లతో చర్యలు తీసుకునేందుకు పోలీసులు, అధికారులు వెనకడుగు వేస్తున్నారు. ఆడపిల్లల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది’ అని ఐద్వా జిల్లా కార్యదర్శి మస్తాన్బీ, ఆవాజ్ జిల్లా కార్యదర్శి రషీద్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేంద్ర, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణ, నరసింహ అన్నారు. నెల్లూరు బాలాజీ నగర్లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఆడపిల్లలను గంజాయి బ్యాచ్ల నుంచి ఎలా కాపాడుకోవాలో తల్లిదండ్రులకు అర్థం కావడం లేదన్నారు. గుమ్మళ్లదిబ్బ ప్రాంతంలోని పాఠశాల వద్ద గంజాయి మత్తులో యువకులు నిత్యం తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాలిక మృతిచెందిందని ఆరోపించారు. గతేడాది నవంబర్లో గంజాయి బ్యాచ్ చేతిలో పెంచలయ్య హత్యకు గురయ్యాడన్నారు. నేడు కోవూరు నియోజకవర్గంలో బాలిక అఘాయిత్యానికి గురై మృతిచెందడం బాధాకరమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం గంజాయి వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోందన్నారు. నెల్లూరు జిల్లాలో గంజాయి బ్యాచ్ల చేతుల్లో రెండు హత్యలు జరిగితే సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయకపోవడం విచారకరమన్నారు. బాలిక మృతిలో పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాలికకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సోమవారం మండల కేంద్రాల్లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో వివిధ సంఘాలకు చెందిన వరలక్ష్మి, కత్తి పద్మ, సుబ్బమ్మ, రియాజ్, యణ్నేష్, అమర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. చోద్యం చూస్తున్న పోలీసులు హత్యలపై స్పందించని సీఎం, హోంమంత్రి వివిధ సంఘాల నేతలు -
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
సీతారామపురం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఆదివారం నిద్రమాత్రలు మింగి స్టేషన్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన సహచర సిబ్బంది ఆమెను వింజమూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందారు. అనంతరం స్వగ్రామం ఉదయగిరి వెళ్లిన ఆమె అక్కడ పాత్రికేయులతో మాట్లాడారు. ఉదయగిరి సీఐ వెంకట్రావు.. ఇటీవల సస్పెన్షన్కు గురైన సీతారామపురం ఎస్ఐ శివకృష్ణారెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో తనకు ఎస్ఐతో వివాహేతర సంబంధాన్ని అంటగట్టి సీఐ ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారాన్ని అందించారని ఆరోపించారు.అందువల్లే ఎస్ఐ శివకృష్ణారెడ్డి సస్పెన్షన్కు గురయ్యారని చెప్పారు. తిరిగి ఎస్ఐపై ఉన్నతాధికారులకు తప్పుడు ఆరోపణలు చేసి అతని సస్పెన్షన్కు కారణమయ్యానని తనపైనే సీఐ నిందలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత కుటుంబానికి చెందిన తనతో సీఐ ఐదు నెలలుగా అవమానకరంగా మాట్లాడుతున్నారని, వీటిపై ప్రశ్నించినందుకు తనపై కక్షగట్టి నిందారోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వంపై ప్రతి ఒక్కరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని వివరించారు. -
వైఎస్సార్సీపీలోకి పెరిగిన వలసలు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ● పార్టీలో పలువురి చేరిక నెల్లూరు రూరల్: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అవినీతి, అక్రమాలను తట్టుకోలేక అధికారాన్ని సైతం వదులుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరుతున్నారని, ఆయన చాప్టర్ క్లోజైన విషయం దీని ద్వారా అర్థమవుతోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. వెంకటాచలం మండలం వడ్డిపాళెంలోని ఆరో వార్డు మెంబరు ఉప్పు మంజుల, రాఘవేంద్ర ఆధ్వర్యంలో 40 కుటుంబాలకు చెందిన టీడీపీ వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో శనివారం చేరారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరికి కండువాలు కప్పి ఆహ్వానించిన అనంతరం ఆయన మాట్లాడారు. సర్వేపల్లిలో వలసలు ప్రారంభం కావడంతో దిక్కుతోచక మైండ్ గేమ్కు టీడీపీ యత్నిస్తోందని విమర్శించారు. ఇలాంటి వారు ఎక్కువ కావడంతో పరువును కాపాడుకునేందుకు చూస్తోందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నా, సైకిల్ పార్టీని వీడి తమ పార్టీలో చేరిన వారికి యోధులుగా భావిస్తున్నామని వివరించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఆ పార్టీ పనైపోయిందని, అధికారం ఉండటంతోనే కొందరు ఇప్పటికీ అక్కడ ఉన్నారని చెప్పారు. తాము తలుపులు తెరిస్తే అక్కడ టీడీపీ ఖాళీ అయిపోతుందని పేర్కొన్నారు. ఎంతో మంది సంప్రదింపులు జరుపుతున్నా, స్థానిక నాయకత్వం అంగీకారం మేరకే ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. పార్టీలో చేరికలకు కృషి చేసిన మాజీ జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్యకు కృతజ్ఞతలను తెలియజేశారు. -
మేయర్ స్థానానికి ఎన్నిక జరపాల్సిందే..
నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ కార్యాలయంలోని అబ్దుల్ కలామ్ సమావేశ మందిరంలో ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని శనివారం నిర్వహించారు. గిరిజన మేయర్ స్థానాన్ని వారికే అప్పగించాలని.. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేయాలంటూ ప్లకార్డును చేతబట్టి పోడియం వద్దకెళ్లి మాజీ మేయర్ స్రవంతి నిరసన చేపట్టారు. ఈమెకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కామాక్షిదేవి, వేనాటి శ్రీకాంత్రెడ్డి, మొయిళ్ల గౌరి, సత్తార్, నీలి రాఘవరావు, గుంజి జయలక్ష్మి, సాహిత్య సంఘీభావం తెలిపారు. దీంతో సమావేశం కొంత గందరగోళంగా మారింది. మేయర్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ను ఇవ్వాల్సింది తాను కాదని, తాను కేవలం ఇన్చార్జి మేయర్ మాత్రమేనని రూప్కుమార్యాదవ్ తెలిపారు. ఈ క్రమంలో సభను అర్ధగంట పాటు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైనా, సభ్యులు ఇదే డిమాండ్ను లేవనెత్తడంతో, అజెండాలోని అంశాలన్నీ ఆల్ పాస్ అంటూ ఆమోదం తెలిపారు. అనంతరం పలువురు కార్పొరేటర్లు వివిధ సమస్యలను లేవనెత్తారు. సమస్యలపై మాట్లాడేందుకు 14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్రెడ్డి యత్నించగా, మీరు కూర్చోండి.. తర్వాత అవకాశమిస్తామని ఇన్చార్జి మేయర్ చెప్పారు. ఇలా అయితే ఇంట్లోనే ఉండేవాళ్లం.. ఇక్కడి వరకు ఎందుకొచ్చామంటూ ఆయన ప్రశ్నించారు. ఇలా వ్యవహరించడమేమిటి..? ఎస్సీ, ఎస్టీలకు తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పెద్ద పీట వేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మేయర్ స్థానాన్ని ఎస్టీ వర్గానికి చెందిన గిరిజన మహిళకు కేటాయించారని, ప్రస్తుతం అలా కాకుండా వేరే వ్యక్తికి దీన్ని ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. స్రవంతి వినూత్న నిరసన చర్చ లేకుండానే ఆల్ పాస్ నగరపాలక సంస్థ ప్రత్యేక సర్వసభ్య సమావేశం -
పక్కాగా ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో సోమవారం నుంచి బుధవారం వరకు నిర్వహించనున్న ఏపీపీఎస్సీ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేశామని డీఆర్వో విజయకుమార్ తెలిపారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సమన్వయాధికారులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీ శాఖ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, దేవదాయ శాఖ ఈఈ గ్రేడ్ – 3 నియామకాలకు సంబంధించిన పరీక్షలను నెల్లూరు రూరల్, అర్బన్, కావలి, బుచ్చిరెడ్డిపాళెంలోని ఐదు కేంద్రాల్లో నిర్వహించనున్నామని వివరించారు. హాల్ టికెట్తో పాటు ఫొటో గుర్తింపు కార్డును అభ్యర్థులు తీసుకురావాలని కోరారు. కేంద్రాల్లో మొబైల్ ఫోన్లను నిషేధించామని వెల్లడించారు. గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం అల్లూరు: స్థానిక ఆర్డీఆర్ కాలనీలోని మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ గురుకుల పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ సరిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకులంలో బాలికలకు 40 సీట్లు కేటాయించారని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల వారు మార్చి నాలుగులోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 23 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 67,085 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 24,832 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.78 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. అలరించిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎక్స్పో సంగం: విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మండలంలోని మర్రిపాడు జెడ్పీ హైస్కూల్లో ఆర్ట్స్ – క్రాఫ్ట్స్ ఎక్స్పోను ప్రధానోపాధ్యాయుడు నరసింహమూర్తి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుధీర్ హాజరయ్యారు. వివిధ నమూనాలను పరిశీలించిన అనంతరం విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు. క్రమబద్ధీకరణలో వేగం పెంచండి ఆత్మకూరు: అనధికార లేఅవుట్లు, భవనాల క్రమబద్ధీకరణ ప్రక్రియలో వేగం పెంచాలని రాష్ట్ర మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అధికారి మధుకుమార్ కోరారు. పట్టణంలోని పలు లే అవుట్లు, నిర్మాణంలో ఉన్న భవనాలను మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. పట్టణంలో 272 లేఅవుట్ల రెగ్యులరైజేషన్ కోసం అర్జీలు రాగా, వీటిలో 104 పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. -
గంజాయి అరాచకాలతో బాలిక మృతి బాధాకరం
పొదలకూరు: కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బలో గంజాయి అరాచకాలకు బాలిక మరణించడం బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితారెడ్డి శనివారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని చెప్పారు. ఘటన జరిగిన అనంతరం బాలికకు ప్రేమ వ్యవహారం ఉందని నిందలేయడం తగదన్నారు. జిల్లాలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, గంజాయి విక్రేతలు, నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని విమర్శించారు. శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. నేరస్తులను కఠినంగా శిక్షించడంతో పాటు బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
1.17 ఎకరాల గ్రామ స్థలం కబ్జా
దానమిచ్చిన స్థలాన్నే కబ్జా చేశారు గ్రామ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని భూమిని గొప్ప మనస్సుతో పెద్దలు దానం చేశారు. వీటిని 14 – 03 – 1966న 155 – 1966 నంబర్పై రిజిస్టర్ చేశారు. ఇందులో 4.42 ఎకరాలను గ్రామంలోని పాఠశాల, రోడ్డుకు వినియోగించాం. మిగిలిన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి కబ్జా చేశారు. ఈ విషయమై నిలదీద్దామంటే సదరు వ్యాపారి గ్రామం వైపు కన్నెత్తి చూడటంలేదు. ఎక్కడో ఉండి ప్లాట్లను విక్రయిస్తున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లభించడంలేదు. – పెనాక నాగశ్రీనివాసులురెడ్డి, మాజీ సర్పంచ్, పెయ్యలపాళెం మా భూమిని ఇప్పించండయ్యా.. మా పూర్వీకులతో పాటు గ్రామానికి చెందిన పలువురు పెద్దలు ధారాదత్తం చేసిన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి దర్జాగా కబ్జా చేసి విక్రయిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అధికారులకు మొరపెట్టుకున్నా, పట్టించుకున్న దాఖలాల్లేవు. వీటిని వ్యాపారి విక్రయించి చేతులు దులుపుకొన్నారు. ఆయన లాభపడినా.. కొనుగోలు చేసిన వారు నష్టపోతారు. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని స్థలాన్ని మాకు అందించాలి. – కర్తం బుజ్జిరెడ్డి, రైతు, పెయ్యలపాళెం రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కాసులు కురిపించుకోవడమే లక్ష్యంగా.. సమీపంలో ఎవరి భూములున్నా ఆక్రమించి ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే వస్తోందనే ఆశతో వీటికి అనుమతులున్నాయా లేదాననే అంశాన్ని పట్టించుకోకుండా పలువురు కొనుగోలు చేసి ఆపై లబోదిబోమంటున్నారు. కొడవలూరు మండలం గండవరం రెవెన్యూ పరిధిలోని పెయ్యలపాళెంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు విస్తుగొల్పుతున్నాయి. కొడవలూరు: మండలంలోని పెయ్యలపాళెంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెలరేగిపోతున్నారు. భూములు కనిపిస్తే చాలు అవి తమవా.. కాదాననే అంశాన్ని సైతం పట్టించుకోకుండా వాటిని ఆక్రమిస్తున్నారు. పెయ్యలపాళెంలో కర్తం చంద్రశేఖర్రెడ్డి, మరో 11 మంది పెద్ద రైతులు గ్రామావసరాల నిమిత్తం స్వచ్ఛందంగా 5.52 ఎకరాల భూమిని 1966లో దానం చేశారు. ఇందులో 4.42 ఎకరాలను గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, ప్రధాన రహదారికి వినియోగించారు. మిగిలిన 1.17 ఎకరాలను భవిష్యత్తు అవసరాల నిమిత్తం అలానే ఉంచారు. ఖాళీగా ఉన్న ఈ ప్రాంతంతో పశువులను మేపుకొంటూ వచ్చారు. ఆక్రమించి.. ప్లాట్లు వేసి ఇక్కడికి అత్యంత సమీపంలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్, ఇఫ్కో కిసాన్ సెజ్ ఏర్పడ్డాయి. వీటిని చూపి ప్లాట్లు విక్రయించుకొని కాసులు కురిపించుకోవచ్చని భావించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పెయ్యలపాళెం వద్ద 11.24 ఎకరాలను కొనుగోలు చేశారు. దీనికి ఆనుకొని ఉన్న గ్రామానికి చెందిన 1622, 1623 సర్వే నంబర్లలో గల 1.17 ఎకరాలను ఆక్రమించారు. పంచాయతీ, నుడా అనుమతుల్లేకుండానే ప్లాట్లు వేసి విక్రయానికి పెట్టారు. అన్ని అనుమతులతో అంకణం రూ.25 వేల నుంచి రూ.30 వేలకే ఇస్తున్నామంటూ విస్తృత ప్రచారం చేశారు. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండటం.. కాస్త తక్కువ ధరకే వస్తుండటంతో కొందరు కొనుగోలు చేశారు. ఆపై ఆరాతీయగా, వీటికి ఎలాంటి అనుమతుల్లేవని తెలిసి నిర్ఘాంతపోయారు. పట్టించుకునేవారేరీ..? గ్రామావసరాల నిమిత్తం కేటాయించిన భూమిని సైతం ఆక్రమించడంతో విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు.. సమస్యను నుడా, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమ భూమిని తమకు అందజేస్తే వినియోగించుకుంటామని మొరపెట్టుకున్నారు. అయినా ఎవరూ పట్టించుకున్న దాఖలాల్లేవు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం కాసులు దండుకొని జేబులు నింపుకొంటున్నారు. చెట్లకు అవతలి వైపునున్న భూమిని కబ్జా చేసి.. ప్లాట్లుగా మార్చారిలా.. అనుమతుల్లేకుండానే ప్లాట్ల విక్రయం అవసరాలకు దానమిచ్చిన భూమికే ఎసరు కొడవలూరు మండలం పెయ్యలపాళెంలో ఇదీ తంతు -
డిగ్రీ పరీక్షలకు 76 మంది గైర్హాజరు
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో శనివారం జరిగిన డిగ్రీ పరీక్షలకు 76 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్ ఆర్.మధుమతి తెలిపారు. మొత్తం 976 మంది విద్యార్థలకు గాను 900 మంది హాజరయ్యారని తెలియజేశారు. పాముకాటుకు గురై.. ● చికిత్స పొందుతూ మృతి నెల్లూరు(క్రైమ్): పాముకాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందారు. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని మన్సూర్నగర్లో మల్లేష్(45), పాంచాలి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి నలుగురు పిల్లలున్నారు. గత నెల 30వ తేదీ రాత్రి మల్లేష్ ఇంట్లో ఉండగా స్నేహితుడు కొండయ్య వచ్చి వాకర్స్రోడ్డు పరమేశ్వరి నగర్ ప్రధాన రహదారిపై పాము ఉందని, చంపాలంటూ అతన్ని తీసుకెళ్లాడు. అక్కడ మల్లేష్ పాముకాటుకు గురయ్యాడు. 31వ తేదీ ఉదయం మల్లేష్కు వాంతులు, రెండు చేతులు వాచి ఉండటం, శరీరంపై మచ్చలు ఏర్పడ్డాయి. గమనించిన పాంచాలి భర్తను చికిత్స నిమిత్తం జీజీహెచ్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. చెరువులో పడి వ్యక్తి మృతి కావలి: పట్టణ పరిధిలోని ము సునూరు మందాటిచెరువులో పడి గుర్తుతెలి యని వ్యక్తి మృతిచెందిన ఘట న శనివారం వెలుగు చూసింది. కావలి రూరల్ ఎస్సై తిరుమలరెడ్డి సమాచారం మేరకు.. సుమారు 40 నుంచి 45 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మందాటి చెరువులో శనివారం ఉదయం 6 గంటల సమయంలో మృతిచెందినట్లు కావలి రూరల్ పోలీస్స్టేషన్కు సమాచారం అందింది. మృతుడు దుస్తులు ఉతుక్కుని వాటిని గట్టుమీద ఆరబెట్టారని, మళ్లీ స్నానం చేసేందుకు చెరువులో దిగి మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించామని, మృతుని ఆచూకి తెలిసిన వారు రూరల్ పోలీస్స్టేషన్కు తెలియజేయాలన్నారు. రాపూరులో వృద్ధుడు రాపూరు: రాపూరు లోని దాబల చెరువులో పడి శనివారం వ్యక్తి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయడంతో రాపూరు కొత్తపేటకు చెందిన కొల్లు బాబు(65)గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు మృతి చెందారా, ఆత్మహత్య అనేది తెలియాల్సి ఉంది. రైలు కింద పడి.. ● మహిళ మృత్యువాత మనుబోలు: రైలు కింద పడి మహిళ మృతి చెందిన ఘటన మనుబోలు రైల్వేస్టేషన్ వద్ద శనివారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. మనుబోలు రైల్వేస్టేషన్ ఉత్తరం వైపు ప్లాట్ఫారమ్ చివరన డౌన్లైన్లో ఓ గుర్తు తెలియని మహిళ రైల్వే ట్రాక్ దాటుతుండగా సంత్రాగచి ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో మృతిచెందింది. మృతురాలి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఐదడుగుల ఎత్తు ఉన్న మహిళ పసుపు రంగపై నలుపు రంగు డిజైన్ గల సిల్క్ చీర ధరించి ఉంది. మృతురాలిని గుర్తించేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. ఆయుష్ డెంటల్ కేర్లో వైద్యశిబిరం నేడు నెల్లూరు(అర్బన్): నగరంలోని రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద ఉన్న ఆయుష్ డెంటల్ కేర్ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నామని ఆ ఆస్పత్రి అధినేత డాక్టర్ ఉమ్రాన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన శనివారం ఆస్పత్రిలో వెల్లడించారు. తమ ఆస్పత్రి 17వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని డెంటల్ ఇంప్లాంట్స్, రూట్ కెనాల్, క్రౌన్స్, బ్రిడ్జెస్, క్లీనింగ్ తదితర అన్నిరకాల దంత చికిత్సలపై 50 రాయితీ ఇస్తున్నామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన 50 మందికి పూర్తి ఉచిత డెంచర్ సెట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పూర్తి వివరాలకు 90521 54399 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
ఐదు కేజీల గంజాయి స్వాధీనం
● ఇద్దరి అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): అక్రమంగా గంజాయిని తరలిస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులను నెల్లూరు రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే డీఎస్పీ జి.మురళీధర్ తన కార్యాలయంలో రైల్వే సీఐ ఎ.సుధాకర్తో కలిసి శనివారం వివరాలను వెల్లడించారు. ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా శుక్రవారం రాత్రి నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ప్లాట్ఫారమ్పై అనుమానాస్పదంగా ఉన్న తమిళనాడు రాష్ట్రం తిరుపూర్ జిల్లా ఇచ్చిపట్టి ప్రాంతానికి చెందిన కార్తీక్, మాదవ్లను అదుపులోకి తీసుకుని వారి బ్యాగ్లను తనిఖీ చేశారు. ఐదు కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకుని నిందితులను స్టేషన్కు తరలించి తమదైన శైలిలో విచారించారు. నిందితులు ఒడిస్సా, ఏఓబీ సరిహద్దు ప్రాంతాల్లో గంజాయిని కొనుగోలు చేసి తమ స్వరాష్ట్రానికి విక్రయించేందుకు తీసుకెళ్తున్నామని వెల్లడించడంతో వారిని అరెస్ట్ చేశామని డీఎస్పీ చెప్పారు. తనిఖీల్లో పాల్గొన్న రైల్వే సీఐ, కావలి, నెల్లూరు ఎస్సైలు వెంకటరావు, హరిచందన, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
ఆటోనగర్లో అగ్ని ప్రమాదం
నెల్లూరు(క్రైమ్): నగరంలోని ఆటోనగర్లో రెండు దుకాణాల్లో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం మేరకు.. ఆటోనగర్ ఐఎల్ రెడ్డి లేఅవుట్లో షేక్.షాహుల్, అలీ అక్బర్లు ప్లాస్టిక్ వస్తువుల వేస్టేజ్ దుకాణాలు నిర్వహిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారో? ప్రమాదవశాత్తో.. కారణం తెలియదు కాని శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటచేసుకుంది. ప్లాస్టిక్ వస్తువులు కావడంతో మంటలు దట్టంగా వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఏడీఎఫ్ఓ రాజ ఆధ్వర్యంలో రెండు ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది చంద్రశేఖర్, శ్రీనివాసులు, ఇలియాజ్, రాజేంద్ర, మధు తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు 2.50 నుంచి మూడు లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని బాధితులు తెలిపారు. -
సాంకేతికతతోనే మంచి భవిత
వెంకటాచలం: సాంకేతికతతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని విక్రమసింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని కాకుటూరు వద్దనున్న వీఎస్యూలో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ఏఐపై రెండు రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి వర్క్షాప్ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ప్రస్తుతం మానవ వనరుల రంగంలో ఏఐ విప్లవాత్మక మార్పులు తెస్తోందన్నారు. ముఖ్యంగా నియామక ప్రక్రియలు, శిక్షణా విధానాలు, పనితీరు మూల్యాంకనంలో కృత్రిమ మేధస్సు వినియోగం వల్ల పారదర్శకత, వేగం పెరుగుతాయని తెలియజేశారు. విద్యార్థులు, అధ్యాపకులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. హెచ్ఆర్ కన్సల్టెంట్, ది హమ్మింగ్ బర్డ్ కోచింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు అబ్దుల్ రజాక్ రిసోర్స్ పర్సన్గా వ్యవహరించి, పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ విజయానంద్ కుమార్ బాబు, ప్రిన్సిపల్ సీహెచ్ విజయ, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయి స్రవంతి, డాక్టర్ జె.విజేత, ఎ.గాయత్రి తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన అధికారుల నిర్లక్ష్యం
ఇందుకూరుపేట: విద్యుత్ లైన్ పనులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని జగదేవిపేటలో శనివారం చోటుచేసుకొంది. పోలీసుల కథనం మేరకు.. మైపాడు– నెల్లూరు రోడ్డు విస్తరణలో భాగంగా పాత విద్యుత్ లైన్లను తొలగించి కొత్త లైన్లు ఏర్పాటు చేసే పనులు సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాకిచర్లకు చెందిన ప్రళయకావేరి జాలయ్య(44)తో పాటు మరికొందరు మండలంలోని జగదేవిపేటలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసేందుకు వచ్చారు. కొత్త స్తంభాలను ట్రాక్టర్ సాయంతో ఏర్పాటు చేసే క్రమంలో పాత లైన్కు తగలడంతో జాలయ్య, ఆవుల శీను, వెంకటరమణయ్యలకు కరెంట్ షాక్ తగిలింది. శీను, వెంకటరమణయ్య స్వల్పగాయాల పాలవగా, జాల య్య తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమి త్తం ఆయన్ను ఇందుకూరుపేట ప్రభుత్వ వైద్య శాలకు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్ప టికే మృతిచెందినట్లు చెప్పారు. విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమా దం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. పాత లైన్కు విద్యుత్ సరఫరాను నిలిపి వేసి పనులు చేయాల్సి ఉండగా, ఇందుకు భిన్నంగా కరెంటు నిలిపివేయకుండా పనులు చేయడంతోనే ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు. -
సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి
● ఆటో కార్మికుల భారీ ర్యాలీ నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆటో కార్మికులకు భద్రతతో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ వారు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అయ్యప్పగుడి సెంటర్ నుంచి పొదలకూరు రోడ్డు, డైకస్రోడ్డు, బొల్లినేని సెంటర్ మీదుగా కేవీఆర్ పెట్రోల్ బంకు వరకు భారీ ర్యాలీ చేశారు. ఆటో కార్మిక సంఘం రూరల్ గౌరవాధ్యక్షుడు నరసింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్టీసీ తర్వాత ఆటో రంగం ప్రజలకు సేవలందిస్తోందన్నారు. ఈ రంగంలో నిరుద్యోగులు, యువత ఎక్కువ మంది ఉన్నారని, గత 30 ఏళ్లుగా ఆటో కార్మికులకు ఏమైనా ప్రమాదం సంభవిస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని వాపోయారు. కూటమి ప్రభుత్వం రవాణా రంగంపై విపరీతమైన ఆర్థిక భారాలు మోపుతోందని, ఫిట్నెస్ సర్టిఫికెట్లకు సంబంధించి ప్రైవేటు సంస్థలకు అనుమతులు ఇవ్వడంతో ఆటో రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను మార్చి కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్కోడ్స్ను తీసుకొచ్చి కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. దీనిపై ఈనెల 12వ తేదీన దేశ వ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో ఆటో కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయా లని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు ఎం.సుధాకర్, పెంచలనరసయ్య, యూనియన్ రూరల్ నాయకులు ప్రసాద్, పెంచలయ్య, లవకుమార్, శివాజీ, కోటేశ్వరరావు, శివ, మురళి, ముని, కృష్ణారెడ్డి, హమీద్, సత్యం, ఆదిశేషయ్య, సత్యం తదితరులు, పాల్గొన్నారు. -
రీసైక్లింగ్ చేసి అధిక ధరలకు విక్రయాలు
● భారీగా రేషన్ బియ్యం పట్టివేత ● అధికార పార్టీ నేతల అండదండలతో.. కావలి/ కావలి రూరల్: పేదలకు సరఫరా చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి రీసైక్లింగ్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న వైనాన్ని అధికారులు గుట్టురట్టు చేశారు. కావలి పట్టణ పరిధిలోని మద్దూరుపాడు సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహా ట్రేడర్స్లో అధికారులు శనివారం దాడులు జరిపి భారీగా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంవత్సర కాలంగా లక్ష్మీనరసింహా ట్రేడర్స్ను కావలికి చెందిన సురే మదన్మోహన్రెడ్డి లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన అక్రమ రేషన్ బియ్యాన్ని తన మిల్లులో మెరుగుపట్టి అధిక రేట్లకు వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలతో సీఐ శ్రీహరి, కావలి రూరల్ పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీహరి మాట్లాడుతూ గత కొంత కాలంగా మద్దూరుపాడులోని లక్ష్మీనరసంహా ట్రేడర్స్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసి రీసైక్లింగ్ చేసి వేరే బస్తాలలోకి మార్చి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో విజిలెన్స్ దాడులు చేశామన్నారు. మిల్లులో సుమారు 400 బస్తాలకు పైగా అక్రమ రేషన్ బియ్యాన్ని దాచారన్నారు. ఈ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. విజిలెన్స్ తహసీల్దార్ కృష్ణప్రసాద్, సహాయ సప్లయ్ అధికారి పుల్లయ్య, కావలి రూరల్ ఎస్సై బాజీబాబు, సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ విజయమ్మ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. గుట్టుచప్పుడు కాకుండా.. ఈ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా కృష్ణపట్నం పోర్టుతో పాటు చైన్నె వంటి నగరాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. రేషన్ దందా చేస్తున్న మదన్మోహన్రెడ్డి అధికార పార్టీ ముసుగులో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. -
పెద్ద పులి సంచారంతో కలకలం
● ఉదయగిరి దుర్గంపై పంజా ● వణుకుతున్న కొండ కింద గ్రామాల ప్రజలు ● 40 రోజులుగా కదలికలు ● తాజాగా కోనకాలువ వద్ద ఆవును చంపినట్లు గుర్తింపు ఉదయగిరి: ఉదయగిరి ఫారెస్ట్ పరిధిలోని దుర్గం ప్రాంతంలో పెద్దపులి సంచారంతో మరోసారి కలకలం రేగింది. ఈ క్రమంలో దుర్గం కింద ఉన్న 11 గ్రామాల వాసులు ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. వ్యాఘ్రం 20 రోజులుగా ఈ ప్రాంత వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా దుర్గంపల్లి సమీపంలోని కోనకాలువ ప్రాంతంలో పెద్ద పులి పంజాకు ఓ ఆవు బలైందనే విషయాన్ని పశువుల కాపర్లు గురువారం గుర్తించి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో కావలి సబ్ డీఎఫ్ఓ శ్రీకాంత్రెడ్డి, ఉదయగిరి ఫారెస్ట్ రేంజ్ అధికారి కుమార్రాజా, మండల పశు వైద్యాధికారి రాఘవేంద్రశర్మతో పాటు పలువురు అటవీ అధికారుల బృందం ఘటన స్థలాన్ని శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఆవు కళేబరం కొంత మేర పాడైపోవడంతో శవపరీక్ష నిమిత్తం పలు నమూనాలను సేకరించారు. మరోవైపు ట్రాప్ కెమెరాలో పులి సంచారం నిక్షిప్తమై ఉన్నా, అధికారులు స్పందన నామమాత్రంగా ఉండటంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.అప్రమత్తంగా ఉండాలి ఉదయగిరి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పులి పంజా ద్వారా ఆవు మరణించిందాననే విషయం పోస్ట్మార్టం నివేదికలో తేలాల్సి ఉంది. అటవీ అధికారుల అనుమతి లేనిదే ఈ ప్రాంతానికి పర్యాటకులు రాకూడదు. – శ్రీకాంత్రెడ్డి, సబ్ డివిజన్ అటవీ అధికారి, కావలి -
ప్రతిపక్షంపై శ్రద్ధ.. నేరాలను అరికట్టడంపై పెట్టండి
●జిల్లాలో పోలీస్ యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. ప్రతిపక్ష నేతల ఇళ్లపై వీరి కళ్ల ముందే దాడులు చేస్తున్నా.. చూస్తున్నారు. తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అవినీతి, దాష్టీకాలపై ప్రెస్మీట్లు పెడితే.. కేసులు పెడతారు. ప్రభుత్వ అసమర్థను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారు. తమ పార్టీ నేతలు చేసే ఉద్యమాలను అడ్డుకునేందుకు ముందుంటారు. నేరస్తుల ఆటకట్టించరు. గుమ్మళ్లదిబ్బకు చెందిన బాలిక మరణానికి కారణం గంజాయి బానిసలు కాదా?. నిన్నా.. మొన్న ఎందుకు ఖండించలేదు. చనిపోవడంతో ఇప్పుడెందుకు కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి నిజానిజాలు నిగ్గు తేల్చాలి. అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం. -
9 నుంచి పది ప్రీ పబ్లిక్ పరీక్షలు
నెల్లూరు (టౌన్): జిల్లాలోని అన్ని యాజమాన్య పరిధిలో గల ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలను ఈ నెల తొమ్మిది నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలను జరపనున్నారు. తొమ్మిదిన తెలుగు / ఉర్దూ / కాంపోజిట్ కోర్సు, పదిన హిందీ / స్పెషల్ తెలుగు / స్పెషల్ ఇంగ్లిష్, 11న ఇంగ్లిష్, 12న మ్యాథ్స్, 13న భౌతిక శాస్త్రం, 16న జీవశాస్త్రం, 17న సోషల్ స్టడీస్, 18న కాంపోజిట్ కోర్సు – 2, 19న ఓఎస్సెస్సీ – 2 ఒకేషనల్ కోర్సు పరీక్షలను నిర్వహించనున్నారు. అదే విధంగా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఎఫ్ఏ – 4 పరీక్షలను ఈ నెల తొమ్మిది నుంచి 12 వరకు జరపనున్నారు. వీటికి ఎస్సీఈఆర్టీ నుంచి ప్రశ్నపత్రాలను ఇవ్వనున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు క్లస్టర్ కేంద్రాలు.. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు సంబంధించిన ప్రశ్నపత్రాలను మండల విద్యా వనరుల కేంద్రాల నుంచి గంట ముందు పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. అనంతరం అసెస్మెంట్ బుక్లెట్ల మూల్యాంకనం చేసి మార్కులను అప్లోడ్ చేయాల్సి ఉంది. ధాన్యానికి మద్దతు ధర నెల్లూరు(పొగతోట): ధాన్యం కొనుగోళ్లలో రైతులు నష్టపోకుండా మద్దతు ధర కల్పించాలని డీఎస్ఓ లీలారాణి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో వివిధ శాఖల ఉద్యోగులకు శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో వచ్చే నెల నుంచి వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. క్వింటాల్ గ్రేడ్ – ఏ ధాన్యం రూ 2389.. సాధారణ ధాన్యం క్వింటాల్ ధరను రూ.2369గా ప్రభుత్వం ప్రకటించిందని వివరించారు. మద్దతు ధరకు మించి కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. తేమ శాతం, నిబంధనలను పూర్తి స్థాయిలో పరిశీలించి సేకరించాలని కోరారు. ఆపై రైస్మిల్లలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. డీఏఓ నియామకంపై ఇరిగేషన్లో కలకలం నెల్లూరు(స్టోన్హౌస్పేట): జిల్లా ఇరిగేషన్ శాఖను రాష్ట్ర వ్యాప్తంగా అప్రతిష్టపాల్జేసిన గత డీఏఓ అక్రమాలపై విచారణ జరిపి నెల రోజులు కాక ముందే ఆయన హఠాత్తుగా బాధ్యతలను శుక్రవారం స్వీకరించారు. వాస్తవానికి విచారణ జరిగిన రోజే ఆయన మాతృశాఖ ఫైనాన్స్ అండ్ ఆడిట్కు సరెండరై వెళ్లిపోయారు. అనంతరం ఆ పోస్టు భర్తీకి అనేక మంది చాలా విధాలుగా యత్నించారు. అయితే తాజాగా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్గా హరిప్రసాద్ బాధ్యతలు చేపట్టడం ఆ శాఖ అధికారులు, సిబ్బందిని విస్మయానికి గురిచేసింది. బాధ్యతలు స్వీకరించేంత వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. ఈయన మరో రెండు, మూడు చోట్ల డీఏఓగా పనిచేస్తున్నారని సమాచారం. ఇరిగేషన్ శాఖలో గ్రేడ్ – 1 డీఏఓలు పనిచేస్తుండగా, గ్రేడ్ – 2 వ్యక్తిని నియమిస్తూ రాష్ట్ర వర్క్స్ ఆండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ ఉత్తర్వులివ్వడంపై ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా తనకు కావలి ఆర్ అండ్ బీలో డీఏఓ పదవి నుంచి గూడూరు ఇరిగేషన్, నెల్లూరు సెంట్రల్ డివిజన్ డీఏఓగా అదనపు బాధ్యతలను ఉన్నతాధికారులు అప్పగించారని ఆయన తెలిపారు. ఈఎమ్మార్ఎస్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం కొడవలూరు: మండలంలోని చంద్రశేఖరపురంలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎమ్మార్ఎస్)లో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ శాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో 60 సీట్లుండగా.. బాలురు, బాలికలకు 30 చొప్పున కేటాయించనున్నామని వివరించారు. 2025 – 26 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న వారే దీనికి అర్హులని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు తమ దరఖాస్తులను aptwgurukulam.ap.gov.inలో ఈ నెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రవేశ పరీక్షను ఏప్రిల్ నాలుగో తేదీ ఉదయం 11.30కు నిర్వహించనున్నారని, వివరాలకు 95736 60645, 90001 65505 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
గంజాయి మత్తులో బాలికపై దారుణం
● మొన్న పెంచలయ్య.. నేడు బాలిక ● మత్తుకు బానిసలవుతున్న బాలురు.. విచక్షణ కోల్పోయి నేరాలు ● అరాచకాలకు అడ్డుకట్టలో అధికార యంత్రాంగాల ఘోర వైఫల్యం ● అధికార పార్టీ నేతల సేవలో తరిస్తున్న వైనమే ఈ పరిస్థితికి కారణం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గంజాయి అరాచక శక్తులకు అడ్డాగా జిల్లా మారిపోయింది. ఒకప్పుడు నేరస్తుల గుండెల్లో సింహ స్వప్నంగా మారి వారి పీచమణిచిన పోలీసుల సమర్థత ప్రస్తుతం పాతాళానికి పడిపోయింది. జిల్లా పోలీస్ బాస్లుగా వ్యవహరించిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి, కసిరెడ్డి రాజేంద్రనాథ్రెడ్డి, ఈతమొక్కల దామోదర్, సెంథిల్కుమార్, పీహెచ్డీ రామకృష్ణ వంటి అనేక మంది అధికారులు కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకొని అరాచక శక్తుల ఆటకట్టించారు. నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితులను తీసుకొచ్చి, పోలీస్ ప్రతిష్టను ఇనుమడింపజేశారు. నేరాలను అరికట్టేందుకు అవసరమైతే అండగా నిలిచే పాలకులు గతంలో ఉండటంతో పోలీస్ బాస్లు సైతం ఖాకీ పవర్ చూపించారు. ప్రస్తుతం నేరాలను ప్రోత్సహిస్తున్న పాలకుల చేతిలో కీలుబొమ్మల్లా మారిన ఖాకీలు ఉండటంతో జిల్లా నేరమయంగా మారింది. నేరస్తులను పబ్లిక్ రోడ్లపై పరేడ్ చేయిస్తూ.. తద్వారా నేర నియంత్రణలో కఠినంగా వ్యవహరిస్తున్నామనే భ్రమలను కల్పిస్తున్నారు. గుప్పుమంటున్న గంజాయి కూటమి ప్రభుత్వంలో ఎక్కడా చూసినా గంజాయి గుప్పుమంటోంది. నగరం, పట్టణమనే తేడా లేకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయిన వారు నేరాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. నిలువరించాల్సిన పోలీస్, ఎకై ్సజ్ ఈగల్ టీమ్లు నామమాత్రపు చర్యలతో సరిపెట్టుకుంటున్నారు. సంబంధిత అధికారులు ఏదైనా సమాచారం వస్తేనో.. పైఅధికారుల ఆదేశాలతోనే అడపాదడపా దాడులు చేసి నిందితుల అరెస్ట్లతో సరిపెట్టుకుంటున్నారు. మూలాల్లోకి వెళ్లకపోవడంతో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు బ్రేక్ పడటం లేదు. దీంతో జిల్లాలో గంజాయి విక్రయాలు చాపకింద నీరులా సాగుతున్నాయి. మత్తులో నేరాలు పెరుగుతుండటంతో జిల్లా వాసులు భయపడుతున్నారు. జిల్లాలో జరుగుతున్న నేరాలు అధిక శాతం మత్తులోనే జరుగుతున్నాయని పోలీసుల విచారణలోనూ స్పష్టమైంది. మొక్కుబడి నిఘా నార్కొటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమన్వయ సమావేశంలో కలెక్టర్, ఎస్పీలు అన్నీ శాఖల సమన్వయంతో జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కింది స్థాయి అధికారులకు ఆదేశిస్తున్నారు. వారి ఆదేశాల అమలు క్షేత్రస్థాయిలో నామమాత్రంగానే ఉన్నాయనే విమర్శలున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయకపోతే శాంతిభద్రతలకు మరింత విఘాతం ఏర్పడే పరిస్థితి ఏర్పడనుంది. ఈ దారుణానికి బాధ్యులెవరు..? గతంలో ఉక్కుపాదంతో అణచివేత గంజాయిపై గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఎక్కడికక్కడ దాడులు చేసి గంజాయి సరఫరాదారులు, విక్రేతలను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. గంజాయి మూలాలను ఏరివేసి పూర్తిస్థాయిలో కట్టడి చేశారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఒడిశా, ఏఓబీ సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గంజాయి జిల్లా మీదుగా కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు తరలివెళ్తోంది. గంజాయి విక్రయాలు ఊపందుకున్నాయి. జిల్లాలోని వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా వివిధ మార్గాల ద్వారా గంజాయిని దిగుమతి చేసుకుంటున్నారు. చిన్న చిన్న పొట్లాలుగా చేసి వాటిని విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. జిల్లాలోని మారుమూల గ్రామాల్లోనూ గంజాయి విక్రయాలు చాపకిందనీరులా సాగుతున్నాయి. మత్తుకు బానిసైన యువత నేరాలకు పాల్పడుతున్నారు. హత్యలకు, హత్యాయత్నాలకు వెనుకాడటం లేదు. బాలికలపైనా మత్తులో దాడులకు తెగబడుతున్నారు. మత్తులో మృగాళ్ల వికృత చేష్టలకు అభం శుభం తెలియని ఓ బాలిక ప్రాణాలను కోల్పోయింది. జిల్లాలో గంజాయి దాష్టీకానికి తాజాగా బాలిక బలైపోయింది. ఇటీవల గంజాయి నిరోధక ఉద్యమకారుడు పెంచలయ్యను విక్రేతలు ప్రజలు చూస్తుండగానే తరిమితరిమి నరికి చంపారు. ఇప్పుడు గంజాయి మత్తులో ఇద్దరు బాలలు.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడటంతో ప్రాణాలే కోల్పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే దానికి ఈ రెండు ఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఖాకీ దుస్తులు ధరించిన పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు అవినీతి, అధికార మత్తులో పడి అసాంఘిక శక్తుల ఆటకట్టించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ దాష్టీకాలను ప్రశ్నించే ప్రతిపక్షంపై కేసులు నమోదు చేయడం, ఉద్యమాలను అణచివేయడంలో చూపించే శ్రద్ధ, వీటిపై లేకపోవడంతోనే అరాచక శక్తులు చెలరేగిపోతున్నాయి. కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బలో అభం శుభం తెలియని బాలికపై జరిగిన దారుణానికి కారకులెవరు..? గంజాయిని నిరోధించలేని పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు కాదా..? బాలికపై దారుణానికి గంజాయి కారణమని తెలిసినా.. ఈ ఘటనకు మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. నేరం జరిగినట్లుగా నిర్ధారించి నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జువైనల్ హోమ్కు తరలించడం నిజం కాదా..? బాలిక మరణించడంతో తమ అసమర్థత ఎక్కడ బయట పడుతుందోనని 12 ఏళ్ల బాలికకు ప్రేమ వ్యవహారం అంటగట్టి ఆ కుటుంబాన్ని అప్రతిష్ట పాల్జేసేందుకు సైతం వెనుకాడటంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరో బిడ్డకు జరగకూడదని, తమ బిడ్డకు ప్రేమ వ్యవహారాన్ని అంటగట్టారంటూ ఆ తండ్రి గుండెలు పగిలేలా రోదిస్తున్నాడు. వేలకు వేల జీతాలు, రూ.లక్షల్లో అవినీతి మరిగిన ఈ రెండు వ్యవస్థలు విచ్చలవిడిగా జరిగే గంజాయి విక్రయాలను అరికట్టడం, మద్యాన్ని నియంత్రించలేకపోవడంలో నిజం లేదా..? తమ వైపు తప్పులను కప్పి పుచ్చుకునేందుకు అసలు రేప్ జరగలేదంటూ చెప్పడం బాధ్యతారాహిత్యం కాదా..? పోలీసులు చెప్పినట్లు రేప్ జరగకపోతే ఆ పిల్లలను ఎందుకు అరెస్ట్ చేశారంటే.. ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా సమాధానాలు చెప్పారు. గంజాయి తాగుంటే పట్టుకున్నామని ఒకరికి.. పోక్సో కేసు ఎందుకు నమోదు చేశారంటే ఆ బాలికను లైంగికంగా వేధించారని.. దీనికి కూడా పోక్సో కేసు పెట్టామంటూ కొత్త భాష్యం చెప్పారు. పోలీసులు చెప్పినట్లే చూసినా.. దీనింతటికీ గంజాయే కారణం కాదా..? దాన్ని నియంత్రించకపోవడమే కారణం కాదాననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
మురుగులో మెరుపులు.. ఆకలిలో ఆశలు
నెల్లూరు: ముక్కు పుటరాలు అదిరే మురుగులో స్వర్ణ రేణువుల కోసం.. నిత్యం ఆకలి ఆశలు జల్లెడ పడుతుంటాయి. ఈ విభిన్న జీవన వాస్తవాలకు అద్దం పట్టే దృశ్యం నెల్లూరులోని కాపువీధిలో నిత్యం కనిపిస్తోంది. ఇక్కడ బంగారు ఆభరణాలు తయారు చేసే దుకాణాలు వరుసగా ఉంటాయి. మెరిసే ఉంగరాలు, కంఠహారాలు సిద్ధమైన తర్వాత మిగిలిపోయే సూక్ష్మ బంగారు రేణువులు వేస్ట్గా కాలువల్లోకి వెళ్లిపోతాయి. అవే నగరానికి చెందిన కొన్ని కుటుంబాలకు జీవనాధారం. ఆ పేదలు పొట్ట నింపుకోవడానికి రోజూ ఆకలి పోరాటం చేస్తుంటారు. మురుగు కాలువ వెంబడి నడిచే వారు ముక్కు మూసుకునే వెళ్లేవారెందరో... అయితే అదే కాలువల్లో పేరుకుపోయిన మట్టిని చేతులతో తీసి, జల్లెడ పట్టి, అందులో బంగారపు కణాలు చిక్కుతాయేమోనని వెతుకుతుంటారు. ఈ దృశ్యాలు వారి ఆకలి పోరాటాని, జీవిత వాస్తవానికి దర్పణంగా నిలుస్తాయి. -
‘సోమిరెడ్డి.. విజిలెన్స్ విచారణకు సిద్ధమా?’
నెల్లూరు: జిల్లాలో ఇరిగేషన్ శాఖ అవినీతి అక్రమాలకు నిలయంగా మారిపోయిందని వైఎస్సార్సీపీ నేత కాకాణి గోవర్థన్రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి రైతుల పేరిట, రైతులను అడ్డం పెట్టుకుని దొంగ బిల్లులు పెట్టుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశానని, కానీ ఎక్కడా స్పందన లేదన్నారు. మళ్లీ ఇంకోసారి రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాస్తాన్నన్నారు. ‘సోమిరెడ్డికి సవాలు విసురుతున్నా.. విజిలెన్స్ విచారణకు సిద్ధమా?, రైట్ ఇన్ఫర్మేషన్ కింద వివరాలు అడిగితే సరైన సమాచారం ఇవ్వడం లేదు. ఇరిగేషన్ లో జరుగుతున్న అక్రమాల్ పై మాట్లాడితే మాపై దాడులు చేస్తున్నారు. గంగాధర్ అనే ఉద్యోగి అక్రమంగా రైతులు నుండి ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకున్నారు.. ఈ ఉద్యోగిపై చర్యలు తీసుకోకుండా కొన్ని రోజులు తప్పించి మళ్ళీ ఇప్పుడు తీసుకు వచ్చారు. గంగాధర్ కొడుకు ఆయన కుటుంబ సభ్యుల ఖాతాల్లో అక్రమంగా డబ్బులు జమ చేసినట్టు పూర్తి ఆధారాలు వున్నా విచారణ లేదు, చర్యలు లేవు. విజిలెన్స్ విచారణ కానీ ఇతర అధికారులు కానీ అవినీతి చేస్తున్న వారి పై చర్యలు శూన్యం. ఒకప్పుడు సోమిరెడ్డి ఆర్ట్ ఆఫ్ కరెప్షన్.. ఇప్పుడు కింగ్ ఆఫ్ కరెప్షన్ గా మారాడు’ అంటూ ధ్వజమెత్తారు కాకాణి. -
గనులు, భూగర్భ శాఖలో ఏసీబీ సోదాలు
● సర్వేయర్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఒంగోలు సిటీ: ఒంగోలులోని గనులు, భూగర్భ జలాల (మైన్స్ అండ్ జియాలజీ) శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్న షేక్ అబ్దుల్ ఆసిఫ్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు అందిన సమాచారం ఆధారంగా అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం మంగమూరు రోడ్డు వేద రెసిడెన్సీలోని కార్యాలయంలో సోదాలు చేపట్టిన ఏసీబీ బృందం ఆసిఫ్ను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించింది. అతడిది మార్కాపురం కాగా కనిగిరిలో వివాహం చేసుకుని ప్రస్తుతం విజయవాడలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. గతంలో కడప, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో పనిచేశాడు. నెల్లూరులో పనిచేస్తుండగా ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి పక్కా సమాచారం అందిన నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు. ఆసిఫ్ నివాసం విజయవాడలో ఉండటంతో అక్కడి స్వగృహంతోపాటు మార్కాపురం, కనిగిరి, నెల్లూరు, గుంటూరుల్లోని బంధువుల ఇళ్లల్లో కూడా ఏకకాలంలో ఏసీబీ సోదాలు కొనసాగిస్తున్నారు. అక్రమ ఆస్తులకు సంబంధించి వివిధ డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమ ఆస్తుల్లో రెండు ఇళ్లు, ఒక ఇంటి స్థలం, 22 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.2,82,264 నగదు, సుమారు 620 గ్రాముల బంగారం, సుమారు 500 గ్రాముల వెండి, రూ.3,54,000 ల ప్రాంసరీ నోట్లు, 16 చేతిగడియారాలు, ఒక మోటార్బైక్, విలువైన గృహోపకరణాలు ఉన్నాయన్నారు. ఇవికాక అసిఫ్ హెచ్డీఎఫ్సీ బీమాలో రూ.15 లక్షలతో పాలసీలు తీసుకొన్నట్లు చెప్పారు. అలాగే టొయోటా హై రైడర్ కారు కొనడానికి రూ.20 వేలు అడ్వాన్స్గా ఇచ్చినట్లు గుర్తించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఒక లాకర్ను గుర్తించారు. సోదాల అనంతరం సర్వేయర్ను అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు చెప్పారు. -
ఆగని నేరాలు
జిల్లాలో నేరాలకు బ్రేక్ పడటం లేదు. బంగారం ధరలు భారీగా పెరగడంతో దొంగలు విజృంభిస్తున్నారు. ఇళ్లు, దేవాలయాలు అనే తేడా లేకుండా కొల్లగొట్టి అందినకాడికి దోచుకెళ్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు రూ.1.25 కోట్ల విలువచేసే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదును దుండగులు చోరీ చేశారు.నెల్లూరు(క్రైమ్): నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు రౌడీషీటర్లు, పాతనేరస్తుల కదలికలపై నిఘా పెంచారు. తీరుమారని రౌడీషీటర్లపై పీడీ యాక్ట్లు నమోదు చేస్తున్నారు. ప్రజాజీవనానికి భంగం కలిగించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. డ్రోన్ నిఘా, విజిబుల్ పోలీసింగ్, కార్డన్ సెర్చ్లు చేస్తున్నారు. అయినా నేరాలకు అడ్డుకట్ట పడటం లేదు. చిన్నపాటి వివాదాలకే కత్తులతో స్వైర విహారం చేస్తున్నారు. చంపుతామని బెదిరించి నగదు దోచుకుంటున్నారు. మత్తులో పోలీసులపైనా దాడులు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో ఐదు హత్యలు చోటుచేసుకోగా హత్యాయత్నాలు పదుల సంఖ్యలో జరిగాయి. అధిక శాతం నేరాలు మత్తులోనే జరుగుతున్నాయి. కొల్లగొడుతూ.. బంగారం, వెండి ధరలు పెరిగాయి. దీంతో దొంగల కళ్లు బంగారంపై పడ్డాయి. ప్రజలు రాత్రింబవళ్లు కష్టపడి.. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన మొత్తాన్ని పోలీసుల నిఘా కళ్లుగప్పిఒక్క రాత్రిలోనే కొల్లగొడుతున్నారు. దుకాణాలు, దేవాలయాలను వదలడం లేదు. ఆలయాల్లో అమ్మవార్లు, స్వామివార్ల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతోపాటు హుండీలను ధ్వంసం చేసి నగదును దోచుకెళ్తున్నారు. బైక్లపై రెక్కీ చేస్తూ ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లోని పుస్తుల తాడులను తెంపుకెళ్తున్నారు. వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఉదాసీనత కారణం కొందరి ఉదాసీనత దొంగలకు కలిసొస్తోంది. విలువైన వస్తువులు బీరువాల్లో పెట్టి బయటకు వెళ్లడం, తాళాలు అక్కడే పెట్టడం వంటివి చేస్తున్నారు. ఊర్లకు వెళ్లే సమయంలో విలువైన వస్తువులు ఇంట్లో ఉంచరాదని, లాకర్లలో భద్రపర్చుకోవాలని, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం సేవలను వినియోగించుకోవాలని పోలీసులు చెబుతున్నా ప్రజల నుంచి స్పందన నామమాత్రంగానే ఉంది. అప్రమత్తంగా ఉండాలి వరుస ఘటనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఊర్లకు వెళ్లే సమయంలో విలువైన వస్తువులను ఇంట్లో ఉంచరాదు. స్థానిక పోలీసులకు తెలియజేసి ఎల్హెచ్ఎంఎస్ సేవలను వినియోగించుకోవాలి. ఇంటిని గమనిస్తుండాలని చుట్టుపక్కల వారికి చెప్పాలి. అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలి. హడలెత్తిస్తున్న దొంగతనాలు ఈ ఏడాదిలో రూ.1.25 కోట్ల సొత్తు చోరీ చిన్నపాటి వివాదాలకే కత్తులతో స్వైర విహారం ఇటీవల -
గుండెపోటుతో కుప్పకూలిన టీచర్
● సీపీఆర్ చేసిన విద్యార్థి ఉదయగిరి రూరల్: పాఠశాలలో గుండెపోటుకు గురై కుప్పకూలిన టీచర్కు ఓ విద్యార్థి సీపీఆర్ చేసిన ఘటన శుక్రవారం మండలంలోని గండిపాళెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్గా కేసీ మాలకొండయ్య పనిచేస్తున్నారు. ఆయన శుక్రవారం విధులకు హాజరయ్యారు. ప్రార్థన సమయం ముగిసిన అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి వెళ్తుండగా ఒక్కసారిగా మాలకొండయ్య ఛాతిలో నొప్పితో కుప్పకూలారు. పదో తరగతి చదువుతున్న ఇస్కపల్లె గ్రామానికి చెందిన విద్యార్థి కంచర్ల వెంకటకిరణ్ సిద్ధార్థ సీపీఆర్ చేయడంతో మాలకొండయ్య ప్రాణాపాయ స్థితినుంచి బయటపడ్డారు. 108 అంబులెన్స్కు సమాచారం అందించి చికిత్స నిమిత్తం ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. అక్కడ్నుంచి మెరుగైన చికిత్స కోసం నెల్లూరు వైద్యశాలకు తరలించారు. వెంకటకిరణ్ను హెచ్ఎం రవీంద్ర, ఉపాధ్యాయులు వెంగళరావు, సురేష్, విష్ణు నారాయణ, నారాయ ణరావు తదితరులు అభినందించారు. -
సైన్స్ సెంటర్ క్యూరేటర్కు అవార్డు
నెల్లూరు(టౌన్): జిల్లా సైన్స్ కేంద్రంలో క్యూరేటర్గా విధులు నిర్వర్తిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో విజ్ఞాన విద్యను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్న ఎన్.సుబ్రహ్మణ్యంకు జాతీయ స్థాయిలో శిక్షాగ్రహ లీడర్షిప్ అవార్డు దక్కింది. బెంగళూరులో శుక్రవారం నిర్వహించిన ఇన్ఓక్డ్ 5.0 మిషన్ టు మూవ్మెంట్ జాతీయ విద్యా సదస్సులో అవార్డును అందుకున్నారు. విద్యా కార్యక్రమాల విస్తరణ కోసం రూ.10 లక్షలు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 6,500 మంది ఉపాధ్యాయుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక ప్రభావం, గ్రామీణ విద్యాభివృద్ధికి చేసిన కృషి ఆధారంగా ఎంపిక చేసిన ముగ్గురులో సుబ్రహ్మణ్యం ఒకరు. ఈ సందర్భంగా ఆయన్ను డీఈఓ బాలాజీరావు, సమగ్రశిక్షణ ఏపీసీ వెంకటసుబ్బయ్య అభినందించారు. రైల్వే ఉద్యోగి అనుమానాస్పద మృతి కావలి రూరల్: రైల్వే ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కావలి రూరల్ రుద్రకోట గ్రామం ఎస్సీ కాలనీలో ఆర్.నాగరాజు (48) ఉంటున్నాడు. అతను రైల్వే గేట్మెన్గా అడవిరాజుపాళెంలో ఎల్సీ గేటు 160 వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కాగా కుటుంబ సలహాల నేపథ్యంలో భార్య నుంచి విడిపోయి 12 సంవత్సరాల నుంచి ఒంటరిగా జీవిస్తున్నాడు. భార్య ప్రకాశం జిల్లా చిన్నగంజాంలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. నాగరాజు ఇంటి ముందు శుక్రవారం ఉదయం ముగ్గువేయడానికి అతని పిన్ని వెళ్లింది. తలుపు తీసి చూడగా నాగరాజు మృతిచెంది ఉన్నాడు. దీంతో గ్రామస్తులతో కలిసి కావలి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ రాజేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆడుకుంటూ.. విషగుళికలు తిని.. ● అపస్మారక స్థితిలోకి చిన్నారి వాకాడు: రొయ్య ల చెరువుల వద్ద కాపలా ఉంటు న్న కె.సురేంద్ర, గంగమ్మ దంపతుల కుమార్తె జయశ్రీ శుక్రవా రం ఆడుకుంటూ విషగుళికలు తిని అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికుల కథనం మేరకు.. చిట్టమూరు మండలం కొత్తగుంట సమీపంలో నాయుడుపేటకు చెందిన లోకేంద్ర అనే వ్యక్తికి రొయ్యల గుంతలున్నాయి. అక్కడ రేణిగుంట ప్రాంతానికి చెందిన సురేంద్ర, గంగమ్మ దాదాపు ఏడాది కాలంగా కాపలా ఉంటున్నారు. శుక్రవారం భార్యాభర్తలు తమ రెండేళ్ల వయసున్న కుమార్తెను పూరింట్లో వదిలి గుంతల వద్ద పనిచేస్తున్న చేస్తున్నారు. జయశ్రీ ఆడుకుంటూ అక్కడే ఉన్న విష గుళికలను తినింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని మోటార్బైక్పై వాకాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్లో గూడూరుకు తరలించారు. వాకాడు పోలీసులు వివరాలు నమోదు చేసి చిట్టమూరు పోలీసులకు అందజేసినట్లు తెలిసింది. -
నూతన మేయర్ ఎన్నిక జరపాలి
● రిలే దీక్షకు వివిధ సంఘాల మద్దతు నెల్లూరు(దర్గామిట్ట): రాజ్యాంగబద్ధంగా నూతన మేయర్ ఎన్నిక నిర్వహించాలని వివిధ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గిరిజన సంఘ ఐక్యవేదిక నెల్లూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారంతో ఏడో రోజుకు చేరుకున్నాయి. రైతు సంఘం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యవేదిక, బీఎస్పీల నేతలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంగపట్నం రమణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నెల్లూరు మేయర్ పదవి గిరిజన మహిళకు రాజ్యాంగబద్ధంగా కల్పిస్తే, దీనిని చూసి ఓర్వలేక జిల్లా నాయకులు మరో వర్గానికి చెందిన వ్యక్తికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం బాధాకరమన్నారు. ఇదేనా బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చే గౌరవమంటూ ప్రశ్నించారు. బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నాసిన భాస్కర్గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ స్పందించి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నేతలు చిన్న భాస్కర్గౌడ్, ఎల్వీ సుబ్బయ్య, ఎడ్ల రవి, బత్తెన లక్ష్మణ, శేఖర్, ఏడుకొండలు, చౌటురి శ్రీనివాసులు, శివకృష్ణ, వెంకటయ్య తలారి, కోవూరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన అతివేగం
● ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి నెల్లూరు(క్రైమ్): రటాక్టర్ మితిమీరిన వేగంతో మోటార్బైక్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన పెన్నా నూతన బ్రిడ్జిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కోవూరు మండలం లేగుంటపాడుకు చెందిన షేక్ రఫీ (30), బషీర్ఖాన్ స్నేహితులు. ఇద్దరూ కార్పెంటర్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం వారు నెల్లూరు హరనాథపురంలో పనులు చేసుకుని బైక్పై జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయలుదేరారు. రఫీ బైక్ నడుపుతున్నాడు. కొత్త పెన్నానది బ్రిడ్జిపైకి వచ్చేసరికి ట్రాక్టర్ మితీమిరిన వేగంతో వెనుకవైపు నుంచి బైక్ను ఢీకొంది. రఫీకి తీవ్రగాయా లై మృతిచెందాడు. బషీర్కు స్వలగాయాలయ్యాయి. ప్రమాద ఘటనపై సమాచా రం అందుకున్న నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. రఫీకి భార్య, పిల్లలున్నారు. -
గంజాయి బ్యాచ్ గ్యాంగ్రేప్
కోవూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. గంజాయి బ్యాచ్ అరాచకానికి ఓ బాలిక బలైపోయింది. ఇద్దరు మృగాళ్లు కలిసి ఓ బాలికను గ్యాంగ్ రేప్ చేశారు. బాధితురాలి పరిస్థితి విషమించగా వారం రోజులపాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి చివరికి శుక్రవారం ప్రాణాలు విడిచింది. అయితే, నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి అరెస్టుచేసిన పోలీసులు.. బాధిత కుటుంబం ఇంటికి వైఎస్సార్సీపీ నేతలు వస్తున్నారన్న సమాచారంతో బాలిక మృతి ఘటన ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని వారు కేసు తారుమారుకు యత్నాలు ప్రారంభించారు. బాలిక తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి వారితో మరో రకంగా ఫిర్యాదు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ప్రేమ వ్యవహారం అంటగట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పోలీసుల తీరుతో అర్ధమవుతోంది. జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటన వివరాలు.. ఏం జరిగిందంటే.. కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మళ్లదిబ్బ కొత్తకాలనీకి చెందిన ఎస్కే రసూల్ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అరీఫా (12) గత నెల 30వ తేదీ (శుక్రవారం) రాత్రి దుకాణానికి వెళ్లొస్తుండగా, గంజాయికి బానిసలైన అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలురు ఆమెపై కన్నేశారు. బాలికను సమీపంలోని చెట్ల పొదల్లోకి బలవంతంగా లాక్కెళ్లి వైట్నర్ కలిపిన నీటిని బలవంతంగా తాగించారు. బాలిక స్పృహ కోల్పోగానే వారు విచక్షణ మరిచి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. స్పృహలోకి వచి్చన తర్వాత ఆ చిన్నారి జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు వివరించింది. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. అప్పటికే బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో తొలుత కోవూరు ప్రభుత్వాస్పత్రికి అక్కడ నుంచి నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. పరిస్థితి క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా ఐసీయూలో మృత్యువుతో పోరాడిన ఆ బాలిక చివరికి శుక్రవారం ప్రాణాలు విడిచింది. తమ బిడ్డకు మత్తు ద్రావణం తాగించి దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు తారుమారుకు పోలీసుల యత్నం బాలిక మృతి చెందడంతో చెన్నైలోనే పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అనంతరం శనివారం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించనున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి, మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి వాకబు చేసినట్లు సమాచారం. అయితే, బాలిక స్వగ్రామానికి కాకాణి శనివారం వెళ్లనున్నారనే సమాచారంతో పోలీసులు కేసు తారుమారు చేసేందుకు ప్రయతి్నస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా బాలిక కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఆమెకు ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా కథలు అల్లుతున్నట్లు తెలుస్తోంది. పోక్సో కేసు నమోదు.. రేప్ జరగలేదంటూ బుకాయింపు.. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు, ఘటనా స్థలాన్ని సైతం పరిశీలించారు. అక్కడ కొన్ని ఆధారాలు సేకరించి, మైనర్లు అయిన ఇద్దరు నిందితులపై పోక్సో కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చారు. అయితే, గంజాయి బ్యాచ్ అరాచకాల విషయంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకే అవకాశం ఉండడం వల్ల కూడా వారు కేసు తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విచ్చలవిడిగా గంజాయి ఆగడాలు.. మరోవైపు.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి రవాణా, విక్రయాలు, అరాచకాలు, ఆగడాలు మితిమీరాయి. అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు, ఎక్సైజ్ శాఖలు అవినీతి మత్తులో జోగుతున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరులో గంజాయి నిరోధక ఉద్యమకారుడు పెంచలయ్యను ఇటీవలే గంజాయి విక్రేతలు దారికాచి తరిమితరిమి కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షితోపాటు ఆమె సోదరుడు, అనుచరులు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఇక గంజాయి విక్రయ మూలాలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారనడానికి తరచూ భారీస్థాయిలో పట్టుబడుతున్న గంజాయే నిదర్శనం. నిజానికి.. నెల్లూరు నగరానికి పక్కనే ఉన్న కోవూరు అడ్డాగా గంజాయి విక్రయాల దందా జరుగుతోంది. ఒడిశా నుంచి రైళ్లల్లో, బస్సుల్లో తెస్తూ.. పడుగుపాడు, ఇనమడుగు ప్రాంతాల్లో విక్రేతలు పాగా వేసి విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం.ఆ ఇద్దరే కారణం.. మా బిడ్డకు జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకూడదు. అభం శుభం తెలియని మా బిడ్డపైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. చిన్న బిడ్డకు ప్రేమ వ్యవహారం అంటకట్టడం చాలా పాపం. అవన్నీ తప్పుడు ప్రచారం. మా బిడ్డను కొందరు బలవంతంగా తీసుకెళ్లి ఇబ్బందికి గురిచేసిన విషయం నిజమే. అందుకే కోవూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మా బిడ్డ చనిపోవడానికి కారణం ఆ ఇద్దరు పిల్లలే. వారిని కఠినంగా శిక్షించాలి. – ఎస్కే రసూల్, బాలిక తండ్రి మా బిడ్డకు ఇలా జరగడం దారుణం.. పోయిన శుక్రవారం ఏదైనా కొనుక్కుంటానంటే నేనే రూ.10 ఇచ్చి పంపాను. దుకాణానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు పిల్లలు బలవంతంగా తీసుకెళ్లి మత్తు నీళ్లు తాగించడంతో చెట్ల పొదల మధ్యన పడిపోయింది. గంటసేపైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెంది అంతా వెతికాం. ఇంతలో ఇద్దరు పిల్లలు అక్కడ కూర్చొని ఉంటే అడిగాం. ముందు చూపిస్తామని, ఆ తర్వాత మాకు తెలియదని చెప్పారు. చివరకు చెట్ల పొదల్లో చూడగా అక్కడ మా బిడ్డ స్పృహలేకుండా పడిపోయి ఉంది. అప్పుడు కోవూరు ఆస్పత్రికి తీసుకెళ్లాం. పరిస్థితి ఇబ్బందిగా ఉంటే.. నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ కూడా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో చెన్నైకు తీసుకెళ్లమన్నారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. మా కళ్ల ముందు ఆడుకుంటున్న బిడ్డకు ఇలా జరగడం దారుణం. – బాలిక పిన్ని అంతా అబద్ధంగుమ్మళ్లదిబ్బలో బాలికపై అసలు అత్యాచారమే జరగలేదు. అదంతా అబద్ధం. ఆ బాలికకు బాలుడితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఆ బాలిక తన స్నేహితులతో ఉంటూ పొద్దుపోయే వరకు ఇంటికి వెళ్లకపోవడంతో ఇంట్లో వాళ్లు తిడతారేమోనని సమీపంలో ఉన్న గుర్తుతెలియని లిక్విడ్ తాగింది. ఆ కారణంగానే చనిపోయింది. – సుధాకర్రెడ్డి, కోవూరు సీఐరాష్ట్రం గంజాయికి అడ్డాగా మారింది.. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. మా ప్రభుత్వ హయాంలో గంజాయి, అక్రమ మద్యాన్ని ఉక్కుపాదంతో అణిచివేశాం. కానీ, నేడు చంద్రబాబు కనుసన్నల్లో రాష్ట్రమంతా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. ఈ మత్తు పదార్థాలవల్ల పసిబిడ్డల ప్రాణాలు సైతం గాలిలో కలిసిపోతుంటే ఈ ప్రభుత్వానికి కనికరంలేదు. కూటమి ప్రభుత్వ అక్రమాలకు కొందరు పోలీసులు వంతపాడటం సిగ్గుచేటు. బాలిక అత్యాచారం కేసును పక్కదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయతి్నస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తేలేదు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. – నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, మాజీమంత్రి -
అణగారిన వర్గాలపై ఎందుకీ వివక్ష
● గిరిజన సంఘాల దీక్షకు వామపక్షాల మద్దతు నెల్లూరు(దర్గామిట్ట): రాష్ట్ర ప్రభుత్వానికి అణగారిన వర్గాల పట్ల ఎందుకింత వివక్ష అంటూ వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టరేట్ వద్ద గిరిజన సంఘాల ఐక్యవేదిక చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారంతో ఆరో రోజుకు చేరుకున్నాయి. దీనికి వామపక్ష నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన సంఘ గౌరవాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ కత్తి శ్రీనివాసులు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. 50 ఏళ్ల తర్వాత నెల్లూరు మేయర్ పదవి ఎస్టీలకు దక్కితే, దీనిని చూసి ఓర్వలేక కుట్రలు పన్నడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. గిరిజన మహిళను దించి మరో సామాజిక వర్గానికి పెత్తనం ఇవ్వడం ఏమిటని దుయ్యబట్టారు. మంత్రి నారాయణ ఇలాకాలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం నూతన మేయర్ ఎన్నికపై నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సంఘాల నాయకులు పిట్ల సూర్యనారాయణ, ఎం.ప్రసాద్, ఎ.శ్రీనివాసులురెడ్డి, కత్తి చిన్న, సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, వివిధ సంఘాల నేతలు బాపట్ల శివకృష్ణ, చౌటురు శ్రీనివాసులు, తాళ్ల ఏడుకొండలు పాల్గొన్నారు. -
చికెన్ వ్యర్థాల వాహనం సీజ్
పొదలకూరు: తిరుపతి నుంచి పొదలకూరు మీదుగా సంగం వెళ్తున్న చికెన్ వ్యర్థాల వాహనాన్ని పొదలకూరు పోలీసులు గురువారం సీజ్ చేశారు. ఎస్సై హనీఫ్ కథనం మేరకు.. కోళ్ల వ్యర్థాలను సంగంలోని చేపల పెంపకానికి మేతగా వినియోగించేందుకు తీసుకెళ్తున్నట్లు నిందితులు వెల్లడించారు. ఈ మేరకు డ్రైవర్లుగా ఉన్న పడారుపల్లికి చెందిన మల్లి కృష్ణ, విడవలూరుకు చెందిన కంద్రాటి రవిప్రసాద్పై కేసు నమోదు చేశారు. వ్యర్థాలను ఊరికి దూరంగా తీసుకెళ్లి పాతిపెట్టారు. బైక్పై నుంచి పడి మహిళ మృతి చేజర్ల: తన కుమారుడి బైక్పై వెళ్తూ జారిపడి మహిళ మృతిచెందిన ఘటన గురువారం చేజర్ల మండలం ఆదూరుపల్లి గ్రామదేవత ఆలయ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామానికి చెందిన లక్ష్మమ్మ (55) ఆమె కుమారుడు శ్రీకాంత్తో కలిసి కలువాయి మండలంలో జరిగే బంధువుల ఉత్తరక్రియలకు బైక్పై బయలుదేరారు. ఆదూరుపల్లి వద్ద వెనుక కూర్చుని ఉన్న లక్ష్మమ్మ తన తలకు గుడ్డ చుట్టుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారి రోడ్డుపై పడిపోయింది. అక్కడికక్కడే ఆమె మృతి చెందడంతో కుమారుడు తీవ్రంగా రోధిస్తుండడం ఆ దారిలో వెళ్లేవారిని కలచివేసింది. కొందరు వాహన చోదకులు శ్రీకాంత్ను ఓదార్చారు. చేజర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిమ్మధరలు(కిలోల్లో) పెద్దవి: రూ. 50 సన్నవి: రూ. 30 పండ్లు: రూ. 20 -
వీఎస్యూలో పుస్తకావిష్కరణ
వెంకటాచలం: మండలంలోని కాకుటూరు వద్ద గల విక్రమ సింహపురి యూనివర్శిటీలో శాంతి సమర్ పుస్తకాన్ని వీసీ అల్లం శ్రీనివాసరావు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రసిద్ధ తెలుగు రచయిత పొట్లూరు సుబ్రహ్మణ్యం రాసిన పది ఉత్తమ కథలను డాక్టర్ ఐనాపురం రామలింగేశ్వరరావు హిందీలోకి శాంతి సమర్ పుస్తకంగా అనువందించడాన్ని అభినందించారు. అనంతరం బాల సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు గానూ ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్న నెల్లూరు వాసి డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ను సత్కరించారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ సునీత, పెన్నా రచయితల సంఘ అధ్యక్షులు గోవిందరాజు సుభద్రాదేవి, కవి ఇంద్రగంటి మధుసూదన్రావు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు దాటుతుండగా..
● లారీ ఢీకొని వ్యక్తి మృతి కలువాయి(సైదాపురం): రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో మృతిచెందిన ఘటన కలువాయి మండలంలో గురువారం చోటుచేసుకుంది. అనంతసాగరం మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన భాగాది నరసింహులు(38) పది రోజుల క్రితం మాదన్నగారిపల్లెలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. గురువారం మాదన్నగారిపల్లె వద్ద జాతీయ రహదారిని దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ లారీని ఘటనా స్థలంలోనే వదిలి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పరిశ్రమల్లో ప్రమాదాలపై సమాచారమివ్వండి
● కలెక్టర్ హిమాన్లు శుక్లా నెల్లూరు(దర్గామిట్ట): పరిశ్రమల నిర్వహణలో ఇబ్బందికర, ఏదైనా ప్రాణాంతకమైన సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే విషయాన్ని అధికారులు తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్లోని శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి క్రైసిస్ గ్రూప్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమా ద కారణాలను తెలుసుకోవడంతో పాటు నివారణ చర్యలను చేపట్టాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, కోస్ట్ గార్డులకు సమాచారమివ్వాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయి క్రైసిస్ గ్రూప్లో చైర్మన్గా తాను, మెంబర్ సెక్రటరీగా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్ కమిషనర్, ఇతర శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ ఈశ్వర్ చంద్ తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
దగదర్తి: తన తండ్రి ఆస్తులలో తనకు సక్రమంగా పంపకాలు చేయలేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని దుండిగం ఎస్సీ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. దుండిగం ఎస్సీ కాలనీకి చెందిన పందిళ్ల సుధాకర్ (41)కు ఆరేళ్ల క్రితం శాంతమ్మతో వివాహం జరిగింది. సుధాకర్ తండ్రి వెంకటేశ్వర్లు ఆస్తి పంపకాలు సక్రమంగా చేయకుండా కుమార్తెకు చెందేలా వ్యవహరించడంతో భార్యతో మరస్పర్థలు ఉన్నాయి. ఈ క్రమంలో భార్య కొద్దిరోజుల క్రితం ఆత్మకూరులోని పుట్టింటికి వెళ్లింది. ఓ వైపు ఆస్తి పంపకాల విషయంలో మనస్తాపంతో పాటు అనారోగ్య సమస్యల వల్ల అతను గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంట గదిలో రేకుల షెడ్డుకు వేసిన ఇనుప పైపునకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం వచ్చిన సమాచారం మేరకు ఎస్సై జంపానికుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఫీజు చెల్లింపునకు 12 వరకు అవకాశం
నెల్లూరు (టౌన్): పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఫీజును చెల్లించేందుకు ఈ నెల 12 వరకు గడువుందని డీఈఓ బాలాజీరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తత్కాల్ ఫీజు కింద రూ.వెయ్యి, అపరాధ రుసుమును చెల్లించాలని కోరారు. అదే తేదీలోపు అన్ని డాక్యుమెంట్లతో నామినల్ రోల్స్ను ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు. వివరాలకు bse.ap.gov.in లేదా దర్గామిట్టలోని జెడ్పీ స్కూల్లో గల జిల్లా పరీక్షల విభాగాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగల అప్పగింత ఉదయగిరి: మండలంలోని ఆర్లపడియ అటవీ ప్రాంతంలో గత నెల 18న పోలీసులు స్వాధీ నం చేనుకున్న ఎర్రచందనం దుంగలు, వాహనాన్ని అటవీ శాఖ అధికారులకు గురువారం అప్పగించారు. 30 దుంగలు, వాహనాన్ని అప్పగించామని ఎస్సై ఇంద్రసేనారెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో 20న ఎంప్లాయీస్ గ్రీవెన్స్ నెల్లూరు(దర్గామిట్ట): కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఎంప్లాయీస్ గ్రీవెన్స్ను ఈ నెల 20న నిర్వహించనున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏపీ జేఏసీ అమరావతి కార్యదర్శిగా చంద్రశేఖర్ నెల్లూరు(క్రైమ్): ఏపీ జేఏసీ అమరావతి కార్యదర్శిగా ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ జేఏసీ అమరావతి కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. ఇందులో కార్యదర్శిగా జిల్లాకు చెందిన చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. ఆయనకు పలువురు అభినందనలను తెలియజేశారు. మూడు నెలల పసికందు మృతి ● వ్యాక్సిన్ వికటించి మృతి చెందిందంటున్న బంధువులు దుత్తలూరు: మూడు నెలల పసికందు మృతి చెందిన ఘటన మండలంలోని భైరవరం ఎస్సీ కాలనీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వ్యాక్సిన్ వికటించడంతోనే తమ బిడ్డ మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. భైరవరం ఎస్సీ కాలనీకి చెందిన చాట్ల లక్ష్మీదేవి మూడు నెలల క్రితం పాపకు జన్మనిచ్చారు. నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవం జరిగింది. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహిస్తుండటంతో చిన్నారికి పోలియో వ్యాక్సిన్ను ఏఎన్ఎం వేశారు. రాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో 108కు సమాచారం అందించారు. ఊపిరాడటంలేదని, వెంటనే వైద్యశాలకు తరలించాలని కోరగా, పరిశీలించిన సిబ్బంది అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. సమాచారం అందుకున్న దుత్తలూరు వైద్యాధికారి అయూబ్ అఫ్సర్ సిబ్బందితో కలిసి గ్రామానికి గురువారం వెళ్లి చిన్నారిని పరీక్షించారు. వ్యాక్సిన్ వికటిస్తే గంటన్నర్లోనే ప్రభావం ఉంటుందని, ఇది కారణం కాదని తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు సైతం ఇదే విషయాన్ని తేల్చారు. తమ బిడ్డ మరణానికి వ్యాక్సినే కారణమంటూ దుత్తలూరు పోలీసులకు చిన్నారి తల్లి ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి ఎస్సై ఆదిలక్ష్మి వెళ్లి చిన్నారి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు. -
శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు
రాపూరు: పెంచలకోన క్షేత్రంలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాల్లోని హుండీల కానుకల లెక్కింపులో భారీ రాబడి వచ్చిందని ఏసీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. శ్రీవారి అలంకార మండపంలో బుధవారం కానుకల్ని లెక్కించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 రోజులకు గానూ రూ.35,36,474 వచ్చిందన్నారు. బంగారం 24 మిల్లీ గ్రాములు, వెండి 691 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. పలు విదేశీ నాణ్యాలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో జిల్లా దేవదాయశాఖ అధికారులు, జె.శ్రీనివాసరావు, పి.శ్రీనివాసులు పాల్గొన్నారు. -
గిరిజనులపై చిన్నచూపు తగదు
● ఐదోరోజుకు రిలే నిరాహార దీక్షలు నెల్లూరు(దర్గామిట్ట): గిరిజనులపై చిన్నచూపు తగదని పలువురు నేతలు అన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ నూతన మేయర్ ఎన్నికకు సంబంధించి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని గిరిజన నేత బాపట్ల వెంకటపతి యానాది డిమాండ్ చేశారు. గిరిజన సంఘాలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష బుధవారం ఐదోరోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జయవర్ధన్, బాపట్ల వెంకటపతి యానాదికి పెద్దఎత్తున గిరిజన సంఘాల నుంచి మద్దతు లభించింది. నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామన్నారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని జయవర్ధన్ హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు దీక్షకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో చేవూరు శ్రీనివాసులు యానాది, యాకసిరి మురళి, ఎందేటి సురేంద్ర పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీకి భౌతికకాయం దానం
నెల్లూరు(అర్బన్): జిల్లాలో ఎస్ఎఫ్ఐ ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన జానా వెంకయ్య (78) బుధవారం మృతిచెందారు. సింహపురి దేహ సమర్పణ సంస్థ కన్వీనర్ పి.విజయమ్మ అభ్యర్థన మేరకు ఆయన భౌతికకాయాన్ని కుమారుడు డా.చైతన్య కిశోర్, కుమార్తె స్రవంతి నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు దానం చేశారు. జానా వెంకయ్య ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ చాలాకాలం క్రితం స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. ఆయన మరణించే వరకు సీపీఎంలో పని చేశారు. ఆయన మృతిపట్ల మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, రామచంద్రారెడ్డి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేశ్వరరావు, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎంవీ రమణయ్య, సీనియర్ డాక్టర్ దత్తాత్రేయులు తదితరులు సంతాపం తెలిపారు. ప్రధానమంత్రి ఫొటో ఎందుకు పెట్టలేదు● ప్రశ్నించిన బీజేపీ నేతలు వాకాడు: మండలంలోని వాకాడులో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో బ్యానర్పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటో లేకపోవడంపై బుధవారం జేసీ గోవిందరావును బీజేపీ నాయకులు ప్రశ్నించారు. తిరుపతి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తంరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పనబాక కోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తూ ప్రధాని ఫొటో లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ అహర్నిశలు కష్టపడినట్లు చెప్పారు. ప్రతి పనికి రెవెన్యూ అధికారులు పేద ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటూ అన్యాయం చేస్తున్నారన్నారు. వారికి న్యాయం జరగకపోతే తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కండలేరులో 58.440 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 58.440 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 300 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,400, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 175, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసె క్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
దోచుకొనే మిషన్
వింజమూరు(ఉదయగిరి): ఇంటింటికీ సురక్షత నీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్జీవన్ మిషన్ పథకం నిధులు పక్కదారి పడుతున్నాయి. అధికారుల కక్కుర్తి, కాంట్రాక్టర్ల స్వార్థం వెరసి రూ.కోట్ల ప్రజాధనం స్వాహా అవుతోంది. దీనికి ఉదాహరణ వింజమూరులో జరుగుతున్న పనులు. ఆవాసాలు, అవసరం లేని ప్రభుత్వ లేఅవుట్లలో తూతూమంత్రంగా పనులు చేస్తూ నిధులు ఆరగిస్తున్నారు. మండలంలో వివిధ పనులకు సంబంధించి రూ.1.84 కోట్లు జేజేఎం ద్వారా మంజూరయ్యాయి. చాకలికొండ లేఅవుట్కు రూ.16.20 లక్షలు, ఊటుకూరుకు రూ.13.20 లక్షలు, వింజమూరు సబ్స్టేషన్ వద్ద లేఅవుట్కు రూ.47 లక్షలు, దుత్తలూరు రోడ్డు మార్గంలో జాతీయ రహదారి వద్ద ఉన్న లేఅవుట్కు రూ.49.58 లక్షలు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం ఉన్న మూడు లేఅవుట్లకు రూ.58 లక్షలు మంజూరయ్యాయి. వీటిలో జాతీయ రహదారి పక్కన ఉన్న లేఅవుట్ తప్ప మిగిలిన ఎక్కడా కూడా ఇళ్లు పూర్తి కాలేదు. ప్రజలు నివాసం ఉండటం లేదు. చిల్లచెట్లు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజిలెన్స్ విచారణ పేరుతో పనులు నిలిపివేశారు. ఎవరి కోసం చేస్తున్నారు? వింజమూరు – ఆత్మకూరు బైపాస్ సమీపంలో ఉన్న మూడు లేఅవుట్లలో సుమారు 250 మందికి పట్టాలు పంపిణీ చేశారు. వివిధ దశల్లో ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు ఆగిపోయాయి. దీంతో ప్రస్తుతం ఒక్కరు కూడా నివాసం లేరు. అదేవిధంగా ఊటుకూరు, చాకలికొండలో కూడా అదే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ పనులు అవసరం లేదు. ప్రజలున్న గ్రామాలు, కాలనీల్లో జేజేఎం పనులు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. కానీ గ్రామీణ నీటి సరఫరా అధికారులు ఈ అంశాలు పరిగణలోకి తీసుకోకుండా ఎస్టిమేషన్లు వేసి, టెండర్లు పిలిచి, పనులు చేయిస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల పూర్తి చేశారు. అప్పుడే పలు లేఅవుట్లలో కుళాయిలు ధ్వంసమయ్యాయి.జల్జీవన్ పథకం పేరుతో నిధుల స్వాహా నివాసాల్లేని ప్రాంతాల్లో పనులు కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కు రూ.1.84 కోట్ల పనుల్లో అక్రమాలునాసిరకంగా పనులు ఈ లేఅవుట్లలో చేస్తున్న పనులు నాసిరకంగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. పైపులైన్ వేసేందుకు తీసిన గుంతల్లో ఇసుక వేసి పూడాల్చి ఉండగా అలా జరగడం లేదు. తీసిన మట్టి పోసి పూడ్చుతున్నారు. కుళాయి దిమ్మెలు, సామగ్రి నాసిరకంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. బోర్లలో కొంచెం నీరు పడినా బిల్లులు పెడుతున్నారు. కానీ వాస్తవంగా కొన్ని బోర్లలో కనీసం అరగంట కూడా నీరు రావడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే వేసవిలో పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం వద్ద ఉన్న లేఅవుట్లలో మూడు బోర్ల పరిస్థితి ఇలాగే ఉంది. పనులపై విజిలెన్స్ విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని స్థానికులు కోరుతున్నారు. -
జిల్లా వ్యాప్తంగా నాకాబందీ
● డ్రంక్ అండ్ డ్రైవ్ 13, ఓపెన్ డ్రింకింగ్పై 27 కేసుల నమోదు నెల్లూరు(క్రైమ్): నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో భాగంగా మంగళవారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు నాకాబందీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, హైవే ప్రవేశం, నిష్క్రమణ, శివారు ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహించారు. 1,571 వాహనాలు తనిఖీ చేయగా 13 మంది మద్యం మత్తులో నడుపుతుండటంతో కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 121 మందిపై కేసు నమోదు చేసి రూ.73,345 అపరాధరుసుము విధించారు. బహిరంగ మద్యం సేవనంపై 27 కేసులు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా 51 లాడ్జీలను తనిఖీ చేశారు. ● షబ్ – ఏ – బరాత్ (పవిత్ర జాగరణ రాత్రి) సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి నగర ఏఎస్పీ దీక్ష నెల్లూరులోని మసీదులను సందర్శించారు. కమిటీలు, పెద్దలు, స్థానిక ముస్లింలతో మాట్లాడారు. ఆమె వెంట నగర ఇన్స్పెక్టర్లున్నారు. -
రామాలయంలో చోరీ
● బంగారం, వెండి అపహరణకలువాయి(సైదాపురం): బంగారు, వెండి ధరలు పెరగడంతో కొందరు దుండగులు దేవస్థానాలను టార్గెట్గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. కలువాయి మండలం తోపుగుంట అగ్రహారంలోని రామాలయంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. అమ్మవారి మెడలో ఉన్న నాలుగు గ్రాముల బంగారు మంగళసూత్రం, కేజీ వెండి వస్తువులు, హుండీలోని నగదు తస్కరించారు. బుధవారం ఆలయానికి వచ్చిన పూజారి చోరీ జరినట్లు గుర్తించారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై కోటయ్య ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హుండీని పగులగొట్టి బయట గడ్డివాముల దగ్గర దుండగులు పడేశారు. హుండీలో సుమారు రూ.20 వేల నగదు ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటన స్థలానికి క్లూస్టీమ్ వచ్చి వేలిముద్రలు సేకరించింది. మండలంలో జరుగుతున్న వరుస చోరీలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
ఒంటరితనం.. ఆరోగ్య సమస్యలతో..
● వ్యక్తి ఆత్మహత్య నెల్లూరు సిటీ: ఓవైపు ఒంటరితనం.. మరోవైపు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఓ వ్యక్తి మానసికంగా కుంగిపోయి బలనవ్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. రూరల్ మండలంలోని కల్లూరుపల్లిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో దేవరకొండ శ్రీనివాసులు (54) నివాసం ఉంటున్నా డు. ఇటీవల అతని తల్లి మృతిచెందింది. శ్రీనివాసులుకు వివాహం కాకపోవడంతో ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో అతను బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మానసికంగా కుంగిపోయాడు. మంగళవారం తన ఇంటికి సమీపంలోని ఆటో స్టాండ్ వద్ద మద్యం తాగాడు. సమీపంలో మున్సిపల్ పార్కులో చెట్టుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి
సంగం: జిల్లా స్థాయిలో 20,468 ఇళ్లను పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనులు చేయిస్తున్నారని హౌసింగ్ శాఖ ఈఈ మోహన్రావు తెలిపారు. మండలంలోని పలు లేఅవుట్లను ఆయన బుధవారం సందర్శించి ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఆప్షన్ 3 కింద కాంట్రాక్టర్లు నిర్మించిన ఇళ్లలో నాణ్యతా లోపాలు ఉన్నాయని ఫిర్యాదుల నేపథ్యంలో క్వాలిటీ కంట్రోల్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. 6,980 ఇళ్లలో లోపాలున్నట్లు గుర్తించామని వెల్లడించారు. 141 ఏజెన్సీలను బాధ్యులుగా గుర్తించగా, అందులో 67 ఏజెన్సీలు పనులు సరిచేయడానికి ముందుకు రావడం లేదన్నారు. వాటిపై పోలీసు కేసులు నమోదు చేసి ఖర్చులను రికవరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆవాస్ ప్లస్ పథకం కింద మరో 6,000 ఇళ్లకు సంబంధించిన సర్వే పూర్తయ్యిందన్నారు. ఈనెల 13వ తేదీ లోపు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నట్లు ఈఈ తెలిపారు. కార్యక్రమంలో ఏఈ గౌస్మొహిద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు. -
కృష్ణపట్నం పోర్టులో స్థానికులకే ఉద్యోగావకాశాలు
ముత్తుకూరు(పొదలకూరు): అదానీ కృష్ణపట్నం పోర్టులో జిల్లాకు చెందిన వారికే 70 శాతం మేర ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నామని యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘భూముల త్యాగం.. ఉద్యోగాల్లో మోసం’ శీర్షికన సాక్షిలో బుధవారం ప్రచురితమైన కథ నానికి వారు స్పందించారు. ఇక్కడి శ్రామికుల్లో 76 శాతం మంది రాష్ట్రానికి చెందిన వారేనని తెలిపింది. స్థానికంగా ఉపాధి అవకాశాలను సృష్టించడం, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడేందుకు కృషి చేస్తున్నామని వివరించింది. భవిష్యత్తులో వచ్చే సవాళ్లను స్వీకరించేందుకు, నైపుణ్యాలను పెంపొందించేందుకు పని శక్తిని కొనసాగించనున్నామని వెల్లడించింది. అమరావతికి చేరిన నీటి పంచాయితీ నెల్లూరు(స్టోన్హౌస్పేట): జిల్లాలో సాగునీరు పుష్కలంగా ఉన్నా, దాన్ని అందించే విషయంలో సమస్యలు నెలకొన్నాయి. జిల్లా స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలను టీడీపీ ప్రభుత్వం గాలికొదిలింది. నీటి వినియోగదారుల సంఘ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, ఇంజినీర్లను రాష్ట్రస్థాయి సమావేశం నిమిత్తం అమరావతికి పిలిచారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం గురువారం మధ్యాహ్నం నుంచి జరగనుంది. ఇక్కడ పరిష్కరించలేని వాటిని అక్కడ ఎలా చక్కదిద్దుతారోనంటూ సమావేశానికి వెళ్తున్న వారే పేర్కొనడం గమనార్హం. అపార్ వ్యవస్థతో భవిష్యత్తుకు భరోసా వెంకటాచలం: అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్)తో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని వీఎస్యూ వీసీ అల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. అపార్ క్రెడిట్ సీడింగ్పై మండలంలోని కాకుటూరు వద్ద గల వర్సిటీలో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్క్షాపులో ఆయన మాట్లాడారు. ఈ వ్యవస్థ ద్వారా విద్యార్థుల అకడమిక్ క్రెడిట్లను డిజిటల్ రూపంలో భద్రపర్చనున్నారని వివరించారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్పర్సన్ రత్నా షీలామణి, డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ప్రాంతీయ సమన్వయకర్త రవి పాండే, వీఎస్యూ ఇన్చార్జి రిజిస్ట్రార్ సునీత, ప్రిన్సిపల్ విజయ, వెంకట్రాయులు, మధుమతి, సుజాత తదితరులు పాల్గొన్నారు. 21 బార్లకు.. 84 దరఖాస్తులు నెల్లూరు(క్రైమ్): జిల్లాలో ఓపెన్ కేటగిరీలో మిగిలిపోయిన బార్ల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. 21 బార్లకు గానూ 84 దరఖాస్తులొచ్చాయి. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 18.. కావలి పరిధిలో రెండు, ఆత్మకూరు పరిధిలో ఒకటి.. ఇలా మొత్తంగా 21 బార్లకు రీ నోటిఫికేషన్ను ఎకై ్సజ్ అధికారులు గత నెల 27న విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియడంతో కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో లాటరీ డ్రాను గురువారం నిర్వహించనున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి ఉదయగిరి: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రోత్సహించాలని ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్ కన్నయ్య పేర్కొన్నారు. రైతు సాధికారత సంస్థ ఆధ్వర్యంలో ఏపీ కమ్యూనిటీ మేనేజ్మెంట్ నేచురల్ ఫార్మింగ్ పథకంలో భాగంగా పట్టణంలోని బిట్ – 1 రైతు సేవా కేంద్రంలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై సీఆర్పీలతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పెట్టుబడులను రైతులు తగ్గించుకొని.. నాణ్యమైన అధిక దిగుబడులను పొందొచ్చని చెప్పారు. అనంతరం మట్టి నమూనాల సేకరణపై అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన పంటలను పరిశీలించారు. రీజినల్ సాంకేతిక కోఆర్డినేటర్ రవిచంద్రప్రసాద్, ఏడీఏ చెన్నారెడ్డి, సిబ్బంది మల్లికార్జున, ట్రెయినర్ రామ్మోహన్ పాల్గొన్నారు. -
అవినీతిలో కొత్త పుంతలు
తనఖాలో ఉన్న భూమికి రిజిస్ట్రేషన్ – కోవూరు సబ్ రిజిస్ట్రార్ నిర్వాకం రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి కొత్త పుంతలు తొక్కుతోంది. ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా, ఏ మాత్రం లెక్కచేయకుండా అధికారులు అడ్డదారుల్లో వెళ్తున్నారు. ప్రభుత్వ భూములే కాకుండా బ్యాంక్ తనఖాల్లో ఉన్న వాటికి సైతం కాసులకు కక్కుర్తిపడి రిజిస్ట్రే షన్లు చేస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా కోవూరు సబ్ రిజిస్ట్రార్ తీరుపై బ్యాంక్ అధికారులు సీరియస్ అవ్వడం జిల్లాలో హాట్టాపిక్గా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అక్రమాలకు అడ్డాగా మారాయి. ఏ మాత్రం జంకు బొంకు లేకుండా అడ్డదారుల్లో అధికారులు వెళ్తున్నారు. తాజాగా బ్యాంక్ తనఖాలో ఉన్న భూమిని కోవూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. జరిగిందిదీ.. కోవూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని విడవలూరు మండలం ముదివర్తికి సంబంధించిన సర్వే నంబర్ 434లో దాదాపు మూడెకరాలకుపైగా భూమిని 2001లో అప్పటి ఆంధ్రా బ్యాంక్లో తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. అప్పట్లో 146 – 2001, 147 – 2001 మార్ట్గేజ్ డాక్యుమెంట్ నంబర్లుగా ఉన్నాయి. వాస్తవానికి ఇవి 22 బీగా నమోదవుతాయి. ఈసీలో సైతం మార్ట్గేజ్ చేసినట్లుగా ఉంటుంది. బ్యాంక్ క్లియరెన్స్ ఇచ్చేంత వరకు వీటిని రిజిస్టర్ చేయకూడదు. అయితే స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ భూమిని 5053 – 2025 డాక్యుమెంట్ నంబర్గా సబ్ రిజిస్ట్రార్ ఇటీవల రిజిస్ట్రేషన్ చేశారు. భారీగా చేతులు మారిన నగదు నిజానికి భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. భూమి స్థితిగతులు, వన్బీ, అడంగళ్తో పాటు ఈసీని నిశితంగా గమనిస్తారు. అయితే కోవూరు సబ్ రిజిస్ట్రార్ మాత్రం ఈసీని సైతం పరిశీలించకుండానే రిజిస్టర్ చేశారు. ఈ వ్యవహారం వెనుక భారీ మొత్తంలో చేతులు మారాయనే ప్రచారం జరుగుతోంది. సీరియస్ అయిన అధికారులు గతంలోని ఆంధ్రా బ్యాంక్ ప్రస్తుతం యూనియన్ బ్యాంక్గా రూపాంతరం చెందింది. తమ తనఖాలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయడంపై అక్కడి అధికారులు సీరియస్ అయ్యారు. చట్ట విరుద్ధంగా ఇలా ఎలా చేస్తారంటూ ఆయన్ను నిలదీశారని తెలుస్తోంది. ఈ విషయమై రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, చర్యలకు ఆ శాఖ వెనుకాడుతోందనే టాక్ నడుస్తోంది. 2001లోనే అప్పటి ఆంధ్రా బ్యాంక్ ద్వారా రుణం పొందిన వైనం మార్ట్గేజ్లో ఉందని తెలిసినా క్లియరెన్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన యూబీఐ అధికారులు చర్యలకు వెనుకాడుతున్న రిజిస్ట్రేషన్ శాఖ ఆఫీసర్లు ఈసీ చూడకుండా చేసింది వాస్తవమే ఈసీ చెక్ చేయకుండానే రిజిస్ట్రేషన్ చేశాను. తప్పును తెలుసుకొని సరి చేసుకున్నా. బ్యాంక్కు లోన్ను చెల్లించేలా చేసి క్లియరెన్స్ ఇప్పించా. – పెంచలయ్య, సబ్ రిజిస్ట్రార్, కోవూరు -
సీమ ఎత్తిపోతలపై వెనుకడుగేసేదిలేదు
● దీని సాధనే ధ్యేయంగా పనిచేస్తాం ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరు: రాయలసీమ ఎత్తిపోతలపై వెనుకడుగేసే ప్రసక్తే లేదని, దీని సాధనే ధ్యేయంగా నిర్వహించే ఉద్యమాల్లో పాల్గొంటామని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని పొదలకూరు, భోగసముద్రంలో బుధవారం ఆయన పర్యటించారు. యూరియా సకాలంలో అందడంలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. కూటమి పాలన అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులను నిలిపేయడాన్ని నిరసిస్తూ చలో పోతిరెడ్డిపాడుకు తమ పార్టీ గురువారం పిలుపునిచ్చిందని వెల్లడించారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ఎత్తిపోతల పథకాన్ని తిరిగి ప్రారంభించేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉంటామని చెప్పారు. నాటికి.. నేటికీ మధ్య ఎంతో వ్యత్యాసం రైతులు, ప్రజల సంక్షేమానికి కృషి చేసిన నాటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి.. అన్నదాతలను అష్టకష్టాలకు గురిచేస్తున్న కూటమి సర్కార్కు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని విమర్శించారు. కూటమి కక్షసాధింపులతో విసిగి వేశారిన ప్రజలు జగనన్న పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలెప్పుడొచ్చినా జగన్మోహన్రెడ్డి సీఎం కావడం ఖాయమని తెలిపారు. ఆయన పర్యటనను అడుగడుగునా అడ్డుకునేందుకు పోలీసులను ఉసిగొల్పి, ఎక్కడా లేని నిబంధనలను సృష్టించి ప్రజలను నిలువరించేందుకు యత్నించారని మండిపడ్డారు. అయినా ప్రజలు భారీగా తరలిరావడం రేపటి రోజున తమ పార్టీ ఘన విజయానికి సంకేతమని పేర్కొన్నారు. జిల్లాలో పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టమొచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. యూరియా సకాలంలో అందక రైతులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని వివరించారు. పొదలకూరుకు చెందిన వెన్నపూస సుందర్రెడ్డి.. భోగసముద్రంలో త్రోవగుంట ప్రసాద్నాయుడి తండ్రి మస్తాన్నాయుడి మృతి చెందడంతో వారి కుటుంబాలను పరామర్శించారు. సొసైటీ మాజీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, వెన్నపూస జనార్దన్రెడ్డి, విష్ణు, వేణుగోపాల్రెడ్డి, అంజద్, శ్రీనివాసులురెడ్డి, విజయభాస్కర్రెడ్డి, శ్రీనారెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
పర్మిట్లు లేకున్నా..
పర్మిట్లు లేకున్నా సిలికాను యథేచ్ఛగా తరలిస్తున్నారు. అనధికార రీచ్లలో తవ్వకాలు చేసి ఇతర పర్మిట్లతో పంపిస్తున్నారు. ఇందులో కూడా వాహనానికి పది టన్నుల పర్మిట్ను తీసుకొని ఓవర్ లోడ్ దాదాపు 25 నుంచి 30 టన్నుల వరకు తరలిస్తున్నార. కేవలం ఆ పది టన్నులకే రాయల్టీని చెల్లిస్తున్నారు. 12 టైర్ల వాహనాలకు 25 టన్నులు.. 16 టైర్ల వాహనాల్లో 35 టన్నుల మేర రవాణా చేస్తున్నా.. అటు మైనింగ్ అధికారులు గానీ ఇటు రవాణాశాఖాధికారులు గానీ ఎక్కడా వీటిని తనిఖీ చేసిన పాపాన పోవడం లేదు. యథేచ్ఛగా దోపిడీ సాగుతున్నా.. ఆ వైపు కన్నెత్తి చూసే సాహసాన్ని ఎవరూ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో ప్రధాన నేతలతో సంబంధాలు ఉన్న సంస్థ కావడంతో దోపిడీని అరికట్టే సాహసం ఎవరూ చేయలేరు. స్థానిక అధికార యంత్రాంగం, విజిలెన్స్, మైనింగ్, పోలీస్, రెవెన్యూ యంత్రాంగం అనధికార దోపిడీకి రక్షణగా నిలుస్తున్నారు. ఇక స్థానిక ప్రజాప్రతినిధులు సైతం చూస్తూ ఉండాల్సిందే. వారిచ్చే తాయిలాలు తీసుకొని మౌనం పాటించాల్సిందేనని ప్రచారం ఉంది. -
రెడ్క్రాస్ కేన్సర్ ఆస్పత్రి సేవలు ఎనలేనివి
దాతల సహకారంతో ముందుకు ● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(అర్బన్): కేన్సర్ బారినపడిన పేద, మధ్య తరగతి ప్రజలకు అండగా ఉంటూ రూపాయి ఖర్చు లేకుండా ఎన్టీఆర్ వైద్యసేవా పథకం ద్వారా చికిత్సలను అందిస్తున్న రెడ్క్రాస్ కేన్సర్ ఆస్పత్రి సేవలు ఎనలేనివని కలెక్టర్ హిమాన్షు శుక్లా కొనియాడారు. ప్రపంచ కేన్సర్ దినోత్సవం, పొదలకూరు రోడ్డులో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో కేన్సర్ ఆస్పత్రిని స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ వేడుకలను ఆస్పత్రి ఆవరణలో బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. కేన్సర్ను ముందుగానే గుర్తించేందుకు గానూ స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకోవాలని కోరారు. రెడ్క్రాస్ లాంటి సంస్థలు లాభాపేక్ష లేకుండా సేవా భావంతో వైద్యాన్ని అందిస్తున్నాయని చెప్పారు. పలువురి విరాళం కేన్సర్ ఆస్పత్రికి నగరానికి చెందిన శ్రీహరిరెడ్డి రూ.1.1 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఆస్పత్రిలో ఐదు నూతన గదుల నిర్మాణానికి ఆర్థిక సాయాన్ని అందజేయనున్నామని రెడ్క్రాస్కు చెందిన రంగయ్యనాయుడు తెలిపారు. రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు రామారావు, ఉపాధ్యక్షుడు రామచంద్రరాజు, కోశాధికారి శ్రీహరిరావు, వైస్ చైర్మన్ జనార్దన్రాజు, కో శాధికారి సురేష్జైన్, ఎడవల్లి సురేష్, వెంకటేష్, రంగాచారి, కేన్సర్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆరు పడకలతో 2001లో ప్రారంభమైన కేన్సర్ ఆస్పత్రి.. ఇప్పుడు 150 పడకలతో ఆధునిక యంత్రాలతో అభివృద్ధి చెందేందుకు నిబద్ధత కలిగిన డాక్టర్ల సేవలతో పాటు దాతల కృషి కారణమని రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ వాకాటి విజయకుమార్రెడ్డి పేర్కొన్నారు. దాతల సహకారంతోనే మంచి వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. ఆస్పత్రి అభివృద్ధికి సహకరించిన జేఎస్ చారిటబుల్.. భగవాన్ మహావీర్ ట్రస్ట్ల నిర్వాహకులతో పాటు సుమంత్రెడ్డి, దొడ్ల స్వాతి, డేవిట్ పీటర్, సీతారాములు తదితరులను కలెక్టర్ సత్కరించారు -
లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
● తప్పిన పెను ప్రమాదం కోవూరు: లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటన మంగళవారం కోవూరులో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కొందరు యాత్రికులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కన్యాకుమారికి వెళ్లారు. అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరారు. ఈ క్రమంలో బస్సు కోవూరు లారీ స్టాండ్ సమీపానికి చేరుకుంది. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో బస్సు లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై కేకలు వేశారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. కోవూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పెను ప్రమాదం తప్పడంతో యాత్రికులు ఊపిరి పీల్చుకున్నారు. -
ప్రధాన కార్యాలయానికి ఎంవీఐ అటాచ్
నెల్లూరు(టౌన్): జిల్లాలోని గూడూరులో ఎంవీఐగా పనిచేస్తున్న సునీల్రెడ్డిని విజయవాడలోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆ శాఖ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సునీల్ గూడూరులో రిలీవై ప్రధాన కార్యాలయంలో మంగళవారం రిపోర్టు చేసినట్లు సమాచారం. కార్మికుడి ఆత్మహత్మకోట: ఆప్కో సంస్థలో కా ర్మికుడిగా పనిచేస్తున్న బాబుల్ హక్ (27) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై పవన్ కుమార్ కథనం మేరకు.. విద్యానగర్ వద్ద ఆప్కో సంస్థ ద్వారా సాగరమాల రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్కు చెందిన కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. వారిలో బాబుల్ హక్ కూడా ఉన్నాడు. రెండు నెలల క్రితం పనిలో చేరాడు. సోమవారం రాత్రి భార్యతో ఫోన్లో మాట్లాడుతూ ఇద్దరూ పరస్పరం గొడవ పడినట్లు కార్మికులు చెబుతున్నారు. సమీపంలోని వంతెన వద్ద కమ్ములకు బాబుల్ హక్ ఉరేసుకుని ఉండటాన్ని మంగళవారం తెల్లవారుజామున గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై వివరాలు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రెండు ఇసుక టిప్పర్ల సీజ్ కోవూరు: కోవూరు పరిసర ప్రాంతాల నుంచి ఎటువంటి పత్రాల్లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్లను జాతీయ రహదారిపై లారీ యార్డు వద్ద మైన్స్ అండ్ జియాలజీ అధికారులు పట్టుకున్నారు. ఏడీ బి.రామచంద్రరావుకు అందిన ముందస్తు సమాచారంతో మంగళవారం తెల్లవారుజాము నుంచి నిఘా ఉంచారు. కోవూరు నుంచి ఒంగోలు వైపు ఇసుకను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తదుపరి చర్యల నిమిత్తం వాహనాలను కోవూరు పోలీసుస్టేషన్లో అప్పగించారు. తనిఖీలు చేసే సమయంలో వాహనదారుల వద్ద ఎటువంటి వే బిల్లులు, మైనింగ్ అనుమతి పత్రాల్లేకపోవడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా మైన్స్ అండ్ జియాలజీ శాఖ నేరుగా రంగంలోకి దిగి టిప్పర్లను సీజ్ చేయడం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో ఉన్న సూత్రధారులెవరు? పట్టుబడిన టిప్పర్లు ఎవరివి? అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. -
కేన్సర్.. డేంజర్ బెల్స్
● వేగంగా పెరుగుతున్న కేసుల సంఖ్య ● జిల్లాలో ఇప్పటికే సుమారు 35 వేలమంది రోగులు ● అవగాహన, స్క్రీనింగ్ పరీక్షలతో చెక్ ● నేడు ప్రపంచ కేన్సర్ నివారణ దినోత్సవం మేజర్, మైనర్ సంవత్సరం ఆపరేషన్లు కీమో తీసుకుంది 2021 933 7,106 2022 1,055 9,497 2023 1,029 10,739 2024 1,135 8,871 2025 1,077 9,200 ● గతేడాదిలో సుమారు 9,757 కొత్త కేసులకు రేడియోథెరపీ ఇచ్చారు. నెల్లూరు(అర్బన్): పాతికేళ్ల క్రితం సమాజంలో ఎక్కడో ఒకటి, అరా కేన్సర్ కేసులు కనిపించేవి. జీవనశైలిలో మార్పులు, కాలుష్యం, కల్తీ ఆహారం, ప్లాస్టిక్ వినియోగంతో ఇప్పుడు చాపకింద నీరులా విస్తరిస్తోంది. జిల్లాలో 35 వేల మంది వరకు బాధితులున్నట్టు వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. ఇంటి పెద్దకు జబ్బు వస్తే కుటుంబ సభ్యులంతా అల్లాడిపోతున్నారు. ఆర్థికంగా మాత్రమే కాకుండా మానసికంగా కుంగిపోతున్నారు. అనేకమంది మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిధ ఆరోగ్య సంఘాల సహకారంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీని ప్రపంచ కేన్సర్ నివారణ దినోత్సవంగా ప్రకటించింది. జిల్లాలో బుధవారం వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఏడాది జిల్లాలో కేన్సర్ రోగులు ప్రతి ఏడాది పెరుగుతున్నారు. నెల్లూరు నగరంలో పూర్తిస్థాయిలో మెడికవర్ కేన్సర్ ఇన్స్టిట్యూట్, రెడ్క్రాస్ కేన్సర్ ఇన్స్టిట్యూట్లో సేవలందుతున్నాయి. తర్వాత ప్రభుత్వ పెద్దాస్పత్రిలో రేడియేషన్ మినహా మిగతా కీమో, సర్జరీలు లాంటివి చేస్తున్నారు. ఇంకా నారాయణ, అపోలో ఆస్పత్రుల్లో కీమో సేవలందిస్తున్నారు. మెడికవర్లో గత రెండేళ్లుగా రెడ్క్రాస్ ఆస్పత్రి స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోజూ ఓపీ 10 నుంచి 15 వరకు ఉంది. నెలకు సరాసరి 20 నుంచి 22 మందికి ఆంకాలజీ, మరికొన్ని సర్జరీలు జరుగుతున్నాయి. ఇక చైన్నె, హైదరాబాద్, తిరుపతి నగరాలకు వెళ్లి చికిత్స పొందేవారు కూడా నాలుగు వేల మంది వరకు ఉన్నట్టు అంచనా. తొలిదశలో గుర్తిస్తేనే.. చాలామందికి కేన్సర్ ఉన్నట్టు తెలియదు. మూడో, నాలుగో స్టేజీల్లో బయటపడుతుంది. చివరి దశలో గుర్తిస్తే ప్రాణాంతకం. అందువల్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలి. 35 సంవత్సరాల వయసు దాటిన వారు సంవత్సరానికి ఒక దఫా ముందస్తు స్క్రీనింగ్ చేయించుకోవాలి. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సులభతరంగా చికిత్స అందించవచ్చు. అలాగే 9 నుంచి 14 ఏళ్ల వయసున్న బాలికలకు కొన్ని రకాల కేన్సర్లు సోకకుండా వాక్సిన్ వేయిచాలి. 40 ఏళ్లు దాటిన సీ్త్రలు మోమోగ్రఫీ, పాప్స్మియర్ లాంటి పరీక్షలు చేయించుకోవాలి.రెడ్క్రాస్ కేన్సర్ ఆస్పత్రిలో పరిశీలిస్తే.. -
కార్మికులతో డీఎస్పీ, అధికారుల చర్చలు
● నిరసన వాయిదా కొడవలూరు: మండలంలోని రాచర్లపాడు వయోనా ఎనర్జీ ఫ్యాక్టరీ ఎదుట కార్మికుల నిరసన మంగళవారం కూడా కొనసాగింది. తొలగించబడిన కార్మికులు ఉదయం 9 గంటలకు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని నిరసన ప్రారంభించారు. దీంతో యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, సీఐ ఎ.సురేంద్రబాబు, ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి, తహసీల్దార్ కె.స్ఫూర్తి రెడ్డి ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని నిరసనకారులు, యాజమాన్యంతో చర్చించారు. తమను విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీలో జూలై మాసంలో ఉత్పత్తి ప్రారంభమవుతున్నందున అప్పట్నుంచే విధుల్లోకి తీసుకుంటామని సంస్థ ప్రతినిధి వేణుగోపాల్ తెలిపారు. అందుకు కార్మికులు అంగీకరించలేదు. నాలుగు రోజుల గడువిస్తే యాజమాన్యంతో మాట్లాడి స్పష్టత ఇస్తామని, అప్పటి వరకూ నిరసనలు ఆపాలని వేణుగోపాల్ కోరారు. అందుకు కార్మికులు కూడా అంగీకరించి నిరసనను ఉపసంహరించారు. కార్యక్రమంలో రేగడిచెలిక, రాచర్లపాడు గ్రామస్తులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకూ పోరాటం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): లేబర్ కోడ్స్ను రద్దు చేసే వరకూ పోరాటం చేస్తామని వివిధ సంఘాల నేతలు తెలిపారు. ట్రేడ్ యూనియన్లు, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు మంగళవారం నెల్లూరులోని టౌన్హాల్లో సదస్సు నిర్వహించాయి. దీనికి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.అజయ్కుమార్, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జయకుమార్రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కొండలరావు, ఏఐఎఫ్టీయూ (న్యూ) రాష్ట్ర అధ్యక్షుడు జాస్తి కిశోర్బాబు, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు మోహన్ మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగుల హక్కులను హరించేలా కార్మిక చట్టాలను రద్దు చేసిందన్నారు. కొత్త లేబర్కోడ్స్ అమలైతే కార్మికవర్గం కనీస వేతనం కోల్పోతుందని, ఉద్యోగభద్రత ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 12వ తేదీన జరిగే సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర బడ్జెట్ కార్మికులు, సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా ఉందన్నారు. కార్పొరేట్లకు ఆదాయాన్ని సమకూర్చే బడ్జెట్ అని ఆరోపించారు. సదస్సులో నాయకులు చంద్రశేఖర్రెడ్డి, బసవరాజు, టీవీవీ ప్రసాద్, గోగుల శ్రీనివాసులు, జలీల్ఖాన్, శంకర్ కిశోర్, యానాదయ్య, రాంబాబు, వినోదిని తదితరులు పాల్గొన్నారు. -
పెద్దాస్పత్రిలో హెర్బల్ పార్కు
● సీఈఓ చంద్రశేఖర్ నెల్లూరు(అర్బన్): పేషెంట్ దగ్గరకే నేచర్ అనే కాన్సెప్ట్తో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో హెర్బల్ పార్కు ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు సీఈఓ ఆవుల చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఆయన సూపరింటెండెంట్ డాక్టర్ మాధవితో కలిసి ఆస్పత్రి, మెడికల్ కళాశాల ఆవరణలోని ఖాళీ ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ తొలిదశలో జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో హెర్బల్ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. నెల్లూరులో రెండెకరాల స్థలంలో పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. వాకింగ్ ట్రాక్, బెంచీలు, పూలమొక్కలు, తాగునీటి వసతి, సీ్త్ర, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్స్ ఉంటాయన్నారు. అశ్వగంధ, వేప, తులసి మొక్కలు నాటుతారన్నారు. ప్రభుత్వ నిధులతోపాటు దాతలు, పారిశ్రామికవేత్తల సహకారం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ కో ఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి, ఉద్యానాధికారి సాయి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రదీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులో ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్
నెల్లూరు(అర్బన్): నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కంటి రెటీనా వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఓజర్డెక్స్ అనే ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్ను అందుబాటులోకి తెచ్చామని కంటి విభాగాధిపతి డాక్టర్ వసంత తెలిపారు. మంగళవారం ఆస్పత్రిలో పీజీ వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఇంజెక్షన్ ఖరీదు రూ.36 వేలు అన్నారు. ఏబీబీవీఐఈ సంస్థ స్పాన్సర్గా రెటీనా కన్సల్టెంట్ డాక్టర్ రాజశేఖర్ ఎలాంటి వారికి, ఏ స్థితిలో ఇవ్వాలో వివరించారు. నారాయణ ఆస్పత్రి కంటి వైద్య విభాగానికి చెందిన పీజీ వైద్య విద్యార్థులు, యువ వైద్యులు ఇంజెక్షన్ గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి సహకారంతో శిక్షణను నిర్వహించారు. డయాబెటిక్ మాక్యులర్ ఎడిమా, కంటి రక్తనాళాల అడ్డంకి, యువైటీస్ వంటి వ్యాధుల్లో వినియోగించే ఇంజెక్షన్లపై అవగాహన కల్పించారు. కంటి సమస్యలున్న పేదలు వినియోగించుకోవాలని అధికారులు కోరారు. -
ఆయిల్ యూనిట్పై విజిలెన్స్ దాడులు
● రూ.1.46 కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం మనుబోలు: మండల పరిధిలోని మనుబోలు జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఇండస్ట్రియల్ ఆయిల్ యూనిట్పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. జ్యాన్తి మల్టీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో తనిఖీలు చేశారు. బిల్లుల్లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇండస్ట్రియల్ ఆయిల్ను దిగుమతి చేసుకుని, డీజిల్ పేరుతో అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సదరు సంస్థ చెల్లుబాటయ్యే లైసెన్స్లు, విక్రయ బిల్లులు, ఫాం ఎఫ్ తదితర అనుమతులు లేకుండానే వ్యాపారం చేస్తున్నట్లు బయటపడింది. రూ.97.90 లక్షల విలువ చేసే 1.10 లక్షల లీటర్ల ఇండస్ట్రియల్ ఆయిల్, రూ.49 లక్షల విలువైన 5 ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సరుకును మనుబోలు తహసీల్దార్కు అప్పగించారు. ఈ ఘటనపై ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955లోని సెక్షన్ 6–ఏ ప్రకారం చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. సంస్థ డైరెక్టర్లు చంద్రభాన్ సింగ్, మమతాసింగ్, స్థానిక ఆర్గనైజర్ నరేష్నాయుడిపై కేసు నమోదు చేసి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించామన్నారు. దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐఓపీ శ్రీహరి, ఏఎస్ఓలు లక్ష్మీనారాయణ, పుల్లయ్య, పొదలకూరు సీఎస్డీటీ రవి, తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఏఈఈ వెంకటరెడ్డి, ఇన్స్పెక్టర్ ఎస్కే రియాజ్ పాల్గొన్నారు. -
కార్మికులను నిలిపివేయడంపై ఆగ్రహం
● వయోనా ఎనర్జీ ఫ్యాక్టరీ ఎదుట రేగడి చెలిక, రాచర్లపాడు గ్రామస్తుల నిరసన ● ఫ్యాక్టరీలోకి కార్మికుల వాహనాలను వెళ్లనీయకుండా అడ్డగింత కొడవలూరు: మండలంలోని రాచర్లపాడులోని వయోనా ఎనర్జీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులను నిలిపివేయడంపై రేగడిచెలిక, రాచర్లపాడు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఫ్యాక్టరీ ఎదుట నిరసనకు దిగారు. ఫ్యాక్టరీలోకి కార్మికుల వాహనాలను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. గతంలో సీమెన్స్ గమేసాగా ఉన్న ఫ్యాక్టరీని నెల క్రితం వయోనా ఎనర్జీ సంస్థ తీసుకొంది. గమేసా సీమెన్స్ ఫ్యాక్టరీ రెండేళ్లుగా ఉత్పత్తి నిలిపివేసినా అందులో పని చేస్తున్న 110 మంది కార్మికులకు వేతనాలు చెల్లిస్తూ వచ్చింది. అయితే వయోనా ఫ్యాక్టరీ 75 మంది కార్మికులను నిలిపి వేసి కేవలం 35 మందిని మాత్రమే విధుల్లోకి తీసుకుంది. దీంతో తొలగించబడిన కార్మికులు గ్రామస్తుల అండతో ఫ్యాక్టరీ ఎదుట నిరసనకు దిగారు. ఫ్యాక్టరీలోకి కార్మికుల వాహనాలను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. కార్మికుల అందర్ని విధుల్లోకి తీసుకునే దాకా నిరసనను కొనసాగిస్తామంటూ పట్టుబట్టారు. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం తరఫున ప్రతినిధులు వచ్చి నిరసనకారులతో మాట్లాడారు. ఫ్యాక్టరీ రెండు నెలల తరువాత పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తుందని, ఆ సమయంలో మిగిలిన వారిని కూడా విధుల్లోకి తీసుకుంటామని బుజ్జగించారు. అయితే కార్మికులు సీమెన్స్ గమేసా రెండేళ్లుగా ఎలాంటి పనులు చేయించకుండానే వేతనాలు చెల్లించిందని, వయో నా సంస్ధ నిర్ధాక్షిణ్యంగా తొలగించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఉన్నతాధికారులు అందుబాటులో లేనందున మంగళవారం వారితో చర్చించి స్పష్టత ఇస్తామని చెప్పడంతో నిరసనకారులు శాంతించారు. స్థానిక నాయకులు దేవనబోయిన శివకుమార్, కసిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నాగేంద్ర యాదవ్, చెముకుల హజరత్తయ్య, దువ్వూరు శీనయ్య, ఓబులేసు, సతీష్, వంశీ తదితరులు పాల్గొన్నారు. -
సాక్షిపై మాజీ ఎమ్మెల్సీ వాకాటి చిందులు
నెల్లూరురూరల్: కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి సాక్షిపై, గత ప్రభుత్వంపై చిందులు తొక్కారు. సాక్షి విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక గల్లీ స్థాయిలో అభ్యంతరకర భాషలో విరుచుకుపడ్డాడు. బడ్జెట్లో అమరావతికి రూ.1500 కోట్లు కేంద్రం ఇస్తున్నట్లుగా చెప్పడంతో.. అప్పుగానే తప్ప.. బడ్జెట్ కేటాయింపులు కాదు కదా? అని ప్రశ్నించిన విలేకరిపై ఆవేశంగా మాట్లాడారు. రైల్వేజోన్, ట్రిపుల్ ఐటీ, గిరిజన యూనివర్సిటీ, పోర్టులకు రైతులకు ఇచ్చే సబ్సిడీలు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించ లేదని ప్రశ్నించడంతో వాకాటి మరింతగా రెచ్చిపోయారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఏం చేశారని ప్రశ్నిస్తున్నారే.. అప్పట్లో కూడా కేంద్ర ప్రభుత్వం మీదే కదా అంటే అప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరంటూ సమాధానం దాటవేశారు. తిరుమల లడ్డూలో కొవ్వు కలవలేదని సాక్షాత్తు సుప్రీం కోర్టు నియమించిన సీఐబీ నివేదిక ఇచ్చినా.. బీజేపీ నేతగా వాకాటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతల దుష్ప్రచారంపై వైఎస్సార్సీపీ నేతలు నిజాలు నిగ్గుతేలాయని చెబుతుంటే జీర్ణించుకోలేక.. వారిపైనా దూషణలకు దిగారు. కూటమిలో భాగస్వామి పార్టీ నేతగా ఉన్న వాకాటి ఆ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా టీడీపీకి వత్తాసు పలుకుతూ చెలరేగిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో మైపాడులో బీచ్ ఫెస్టివల్ ఇందుకూరుపేట: ప్రముఖ పర్యాటక కేంద్రమైన మైపాడు బీచ్లో త్వరలో బీచ్ ఫెస్టివల్ను నిర్వహించనున్నట్లుగా జిల్లా పర్యాటక శాఖ అఽధికారిణి ఉషశ్రీ తెలిపారు. సోమవారం ఆమె మండల తహసీల్దార్ బీ మురళీతో కలిసి మైపాడు బీచ్ను పరిశీలించారు. తీరంలోని పరిస్థితులపై అధికారులతో పాటు స్థానికులను ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు తీరంలోని పరిస్థితులను పరిశీలించినట్లుగా తెలిపారు. ఆమె వెంట స్థానిక వీర్వో శ్రీహరి ఉన్నారు. చిన్నారుల్లో వైకల్యాన్ని ముందుగా గుర్తించాలి నెల్లూరు(పొగతోట): గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చిన్నారుల్లో అంగవైకల్యాన్ని ముందుగా గుర్తించాలని ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ అంగన్వాడీకార్యకర్తలకు సూచించారు. సోమవారం సీఆర్సీ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పీడీ మాట్లాడారు. పీడీబ్ల్యూడీ, సీఆర్సీ ప్రయోజనాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం అంగవైకల్యాన్ని గుర్తించేందుకు అవసరమై న కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డైరెక్టర్ మనోజ్కుమార్, సీడీపీఓ అరుణ, సీడీఈఐసీ ప్రత్యేక విద్యావేత్త రాకేష్, పునరావాస అఽధికారి ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. పోలీసింగ్లో డ్రోన్ టెక్నాలజీ కీలక ఆయుధం నెల్లూరు(క్రైమ్): పోలీసింగ్లో డ్రోన్ టెక్నాలజీ కీలక ఆయుధమని ఏఎస్పీ సీహెచ్ సౌజన్య పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డ్రోన్ బృందాలకు సోమవారం నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఏఎస్పీ మాట్లాడారు. కార్డన్ సెర్చ్, ఓపెన్ డ్రింకింగ్, జూదాలు వంటి అక్రమ కార్యకలాపాలపై డ్రోన్ నిఘాను మరింత పెంచాలన్నారు. పాఠశాల, కళాశాలల పరిసరాల్లో ఈవ్టీజింగ్ కట్టడికి శక్తి టీమ్లను సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు. పీసీఆర్ ఇన్స్పెక్టర్ భక్తవత్సలరెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ బీ శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
విష సంస్కృతిని కొనసాగిస్తే తీవ్రపరిణామాలు
ఆత్మకూరు: టీడీపీ కూటమి నాయకులు చేసిన తప్పులను ప్రశ్నించిన ప్రతిఒక్కరిపై భౌతిక దాడులకు దిగుతూ కేసులు నమోదు చేయించి ఇబ్బందులకు గురిచేస్తూ విషసంస్కృతిని కొనసాగిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరిన నాయకులతో పాటు ప్రభుత్వ తప్పులను ప్రశ్నించిన వారిని టార్గెట్ చేస్తూ దాడులు చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం వంటివి చేస్తున్నారన్నారు. జిల్లాలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి నివాసంతో మొదలు పెట్టి మాజీ మంత్రులు విడదల రజని, అంబటి రాంబాబు, జోగి రమేష్తో పాటు వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తూ ఎంతగానో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించిన వారి నోళ్లు మూయించి కూటమి ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటుందని ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపారని ఇప్పటి వరకు దుష్ప్రచారం చేసిన కూటమి నాయకులు సీబీఐ నివేదికతో తమ తప్పును గ్రహించారని, దీని నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించేందుకు దాడులు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి దాడులు చూసి రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం నడుస్తుందా లేక కూటమి రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందా అని అనుకునే పరిస్థితుల్లోకి ప్రజలు వెళ్లిపోయారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై ఇలాంటి చర్యలు కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
తిరుమల లడ్డూపై దుష్ప్రచారం దుర్మార్గం
నెల్లూరు(క్రైమ్): పవిత్రమైన తిరుమల లడ్డూపై ఆరోపణలన్నీ అవాస్తవమని సీబీఐ నివేదిక ఇచ్చినా ఇంకా కొందరు తప్పుడు ప్రచారాలు, అసత్యాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ దుష్ప్రచారం సాగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పోలీసు అధికారులను కోరారు. ఈ మేరకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కే శ్రీనివాసరావుకు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆటవిక పాలన రాజ్యమేలుతోందన్నారు. ఎక్కడ చూసినా దాడులు, దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిరాధారమైన ఆరోపణలు చేయడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. లడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి మీద నిందలు వేశారన్నారు. సీబీఐ విచారణ ద్వారా నిజానిజాలు బయటకు వచ్చాయన్నారు. ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్ట్లలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారణ అయిందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నిరాధారమని ఆధారాలతో సహా నిరూపితమైందన్నారు. అయినప్పటికీ నిసిగ్గుగా నేడు అదే అసత్యాలను ఫ్లెక్సీలు, బ్యానర్ల రూపంలో ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఆ ఫ్లెక్సీలను తొలగించమని కోరితే మాజీ మంత్రుల ఇళ్లపై దాడి చేస్తారా? మీరు చేసే తప్పుల ను ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తారా? చంపేస్తారా? అని ప్రశ్నించారు. ఆరు గంటల పాటు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ మూకలు దాడి చేస్తుంటే రక్షించాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన టీడీపీ మూకలు పెట్రోల్ బాంబులు వేశాయన్నారు. అంబటి రాంబాబు ‘అనుకోని పరిస్థితుల్లో మాట తూలాను..చంద్రబాబునాయుడును ఏమీ అనలేదు..నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా’ అని చెప్పినా ఇంటిమీద దాడిచేయడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి కక్ష పూరిత దాడులు ఆంధ్రరాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఆంధ్రరాష్ట్రం కూటమి పాలనలో రావణ కష్టంలా రగిలిపోతోందని, ఆటవిక పాలనతో అతలాకుతలమవుతోందన్నారు. దీనికి కూటమి ప్రభు త్వం భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. శ్రీవా రి లడ్డూ వ్యవహారాన్ని, గీతం వర్శిటీకి ఐదువేల కోట్ల రూపాయల విలువైన భూముల అప్పగింత వ్యవహారాలను పక్కదోవ పట్టించేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు. పోలీసులు పక్షపాత ధోరణిని విడనాడాలని, అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాయడం ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదన్నారు. తామిచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి ఫ్లెక్సీలను ఎవరు కట్టారు? ఎవరు కట్టించారు? ధన సాయం ఎవరు చేశారు? ఎవరి ప్రోద్బలంతో కట్టారో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో భక్తులకు మనోవేదనను కలిగించిన చంద్రబాబునాయుడు, లోకేశ్, పవన్కళ్యాణ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేసి తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీయడమే కాకుండా హిందువుల మనోభావాలను కించపరిచారన్నారు. లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వును వినియోగించలేదని సీబీఐ నివేదికతో వెల్లడైనా దాన్ని వక్రీకరిస్తూ ప్రజల్లోకి అవాస్తవాలను తీసుకెళ్లేందుకు కూటమి నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని కోరిన అంబటి రాంబాబు ఇంటిపై కూటమి నేతలు దుర్మార్గంగా దాడిచేశారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతతను పాడుచేస్తూ కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. కూటమి నేతలు చేస్తున్న అక్రమాలు, అవాస్తవ ప్రచారాలపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నా రు. పోలీసులు కేసులు నమోదు చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. చంద్రబాబు కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామిని తన స్వార్థ రాజకీయాలకు వాడుకుంటూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, దీన్ని ప్రజలు క్షమించరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆనం విజయకుమార్రెడ్డి మాట్లాడుతూ దేవదేవుడిని రాజకీయాలకు వాడుకోవడం చంద్రబాబునాయుడుకే చెల్లిందన్నారు. పవిత్రమైన తిరు మల లడ్డూపై ఏ విషయం తేలకముందే ఎవరూ మాట్లాడవద్దని న్యాయస్థానాలు ఆదేశించినా తెలుగుదేశం పార్టీ నాయకులు పెడచెవిన పెట్టారన్నారు. ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులో లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ అయిన తర్వాత చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేశ్లు ప్రజలకు ముఖం చూపించేందుకు ఇబ్బంది పడుతామని ఇంకా అసత్యప్రచారాలు కొనసాగించడం దుర్మార్గమన్నారు. వైఎస్సార్సీపీ నేతలు మొయిళ్ల గౌరీ, ఖలీల్అహ్మద్, మందల వెంకట శేషయ్య, చేజర్ల సుబ్బా రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, వివిధ విభాగాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి వేదాయపాళెం ఇన్స్పెక్టర్కు వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు -
ప్రతిపక్ష పార్టీ మీడియా సాక్షిగా చూపించినా..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీ ఎమ్మెల్యేల ధనదాహానికి పెన్నమ్మ శోకిస్తోంది. వీరి కనుసన్నల్లో తమ్ముళ్లు నదిని భారీ యంత్రాలతో కుళ్లబొడుస్తున్నారు. సోమశిల ప్రాజెక్ట్కు ముప్పు తప్పదని రైతుల ఆందోళన చేస్తున్నా.. ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పర్యావరణాన్ని, ప్రాజెక్ట్, రైతాంగం భవిష్యత్ను పణంగా పెట్టి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ప్రకృతి సంపదను కాపాడడంతో పాటు పర్యావరణాన్ని, ప్రజల భద్రతను పరిరక్షించాల్సిన అధికార యంత్రాంగాలు ముడుపుల మత్తులో ముఖం చాటేస్తున్నాయి. కలువాయి మండలం తెలుగురాయపురం అక్రమ రీచ్లో జరుగుతున్న ఇసుక దందాను ప్రతిపక్ష నేతలు మీడియా సాక్షిగా బట్టబయలు చేసినా చలించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వందల టిప్పర్లు.. వేల టన్నులు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. పెన్నానదిలో అనధికార రీచ్లు ఏర్పాటు చేసుకుని భారీగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. ఉచిత ఇసుక విధానానికి ఎమ్మెల్యేలు, మంత్రులు తూట్లు పొడుస్తూ అక్రమ రవాణాకు గేట్లు తెరిచారు. వెంకటగిరి, ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో అక్రమ రవాణాకు అఽధికార యంత్రాంగం గ్రీన్ సిగ్నల్ వేయడంతో పబ్లిక్గా దోపిడీ జరుగుతోంది. ఓ వైపు ఇసుక అక్రమ రవాణా వల్ల లక్షల ఎకరాలకు పారుదల చేసే సోమశిల ప్రాజెక్ట్కు ముప్పు తప్పదని నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నా.. అఽధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. తెలుగురాయపురంలో తగ్గేదేలా అంటున్న ప్రజాప్రతినిధి కలువాయి మండలం తెలుగరాయపురంలో కొన్ని నెలలుగా అనఽధికార రీచ్ను స్థానిక ప్రజా ప్రతినిధి ఓపెన్ చేశారు. నేరుగా నదిలోకి రోడ్డు వేయించి భారీ యంత్రం ద్వారా ఇసుక తోడేస్తున్నారు. రోజుకు వందల సంఖ్యలో టిప్పర్లు లోడింగ్ చేస్తున్నారు. తద్వారా రూ.12 లక్షలు జేబుల్లో వేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు తుంగలో తొక్కి పర్యావరణానికి తూట్లు పొడుస్తూ ఇప్పటికే నదీ గర్భాన్ని 20 మీటర్ల వరకు తోడేస్తున్నారు. భారీ గోతులు ఏర్పడి భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోతున్నాయి. ఈ రీచ్కు కేవలం వంద మీటర్ల దూరంలో ఉన్న సోమశిల ప్రాజెక్ట్కు పెను ముప్పు తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. అనధికార రీచ్లో నేరుగా ప్రజాప్రతినిధి జోక్యం ఉండడంతో అధికార యంత్రాంగం సైతం కళ్లకు గంతలు కట్టేసుకున్నారు. ఇసుక లోడింగ్ చేసిన టిప్పర్లు నేరుగా కలువాయి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు నుంచే వెళ్తున్నా రెవెన్యూ అధికారులకు కనిపించడంలేదు. అధికార యంత్రాంగానికే సవాల్ జిల్లాలో జరిగే ఇసుక అక్రమ దందాపై అధికార పక్షానికి చెందిన ఎల్లోమీడియా సైతం గగ్గోలు పెడుతోంది. పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారని, ప్రజాపక్షంలో ఉన్న నేతలు సైతం అక్రమ రవాణాను ఆధారాలతో సహా చూపిస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి కాకాణి గోవర్ధ న్రెడ్డి సైతం పక్కా ఆధారాలతో సహా విరువూరు రీచ్లో జరిగే ఇసుక దందాను చూపించారు. ఇంత జరుగుతున్నా కలెక్టర్, ఎస్పీ సైతం కనీస కట్టడి చర్యలు చేపట్టలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అఽధికార పార్టీ అండ ఉంటే ప్రకృతిని చెరపట్టి చీల్చేస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. తెలుగురాయపురం, పడమటి కంభంపాడు అడ్డాలుగా ఇసుక దోపిడీ రోజుకు వందల టిప్పర్ల ఇసుక అక్రమ రవాణా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలిపోతున్నా.. ఎక్కడా నో చెకింగ్ అక్రమ రీచ్ సందర్శనకు వెంకటగిరి వైఎస్సార్సీపీ ఇన్చార్జ్జి నేదురుమల్లి వెళ్లగానే తవ్వకాలు ఆపేసి పలాయనం ప్రతిపక్ష పార్టీ నేతలొచ్చి ఇసుక దందా చూపించినా చర్యలు నిల్ ముందు మంత్రి ఆనంను ఆపమనండి.. ఆ తర్వాత చూస్తామన్న వెంకటగిరి ఎమ్మెల్యే మళ్లీ మరుగంట నుంచే యథా ప్రకారం విచ్చలవిడిగా తవ్వకాలు సోమశిల డ్యామ్కు అతి సమీపంలో ఇసుకను తవ్వేయడంతో ప్రాజెక్ట్ భద్రతకు ముప్పు పీకేపాడులోనూ ఇదే పరిస్థితి అనంతసాగరం మండలం పడమటి కంభంపాడులోనూ అనధికార ఇసుక రీచ్ నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకున్నా నది మధ్యలోనే భారీ యంత్రం పెట్టి లోడింగ్ చేస్తున్నారు. రోజుకు దాదాపు రూ.6 లక్షల మేర ఇసుక దందా జరుగుతుందనే ఆరోపణలున్నాయి. పీకేపాడు రీచ్ కూడా సోమశిల ప్రాజెక్టుకు వంద మీటర్ల దూరంలోనే ఉంది. ఓ వైపు సోమశిల ప్రాజెక్టుకు ముప్పు ఉందని స్థానిక రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నా తమ్ముళ్లు తగ్గడం లేదు. స్థానిక అఽధికార పార్టీ ప్రజాప్రతినిధి అండతో రెచ్చిపోతున్నారు. ఇటీవల ఇసుక అక్రమ రవాణా వాహనాల వల్ల రోడ్లు దెబ్బతిని వాహనాలు వేళ్లే పరిస్థితి లేదని స్థానిక టీడీపీ నేతలే అనధికార రీచ్ వద్ద ఆందోళన చేసిన సంగతి తెల్సిందే. ఇటీవల వర్షా కాలంలో స్కూటర్, బైకులు కూడా ఆ రోడ్డు వైపే వెళ్ల లేని పరిస్థితి నెలకొంది. అంతటి దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. అయినా కూడా తమ్ముళ్లు మాత్రం ఇసుక అక్రమ రవాణా నిలిపివేసే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగంనేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా పచ్చ నేతలు పెన్నానదిలో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. జిల్లాకు జలనిధి అయిన సోమశిల ప్రాజెక్ట్కు అతి చేరువలో దిగువన తెలుగురాయపురం, పడమటికంభంపాడులో అనధికార రీచ్లు ఏర్పాటు చేసి ఇసుక తవ్వుతున్నారు. ఈ రెండు అనధికార రీచ్ల్లోనే నిత్యం వందల కొద్దీ టిప్పర్ల ఇసుక తవ్వేస్తున్నారు.ఈ పరిణామాలతో భవిష్యత్లో జలాశయం భద్రతకు పెనుముప్పు పొంచి ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. జిల్లా అధికార యంత్రాంగాలు వీసమంత బాధ్యతగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ నేతలు స్వయంగా ఇసుక దందాను బట్టబయలు చేస్తున్నా.. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ.. ధ్రుతరాష్ట్రుల్లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఆపే దమ్ముందా? అనే రీతిలో టీడీపీ నేతలు సవాల్ విసరుతున్నారు. తెలుగురాయపురం రీచ్లో జరిగే అక్రమ ఇసుక రవాణాపై వెంకటగిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మీడియా సాక్షిగా బట్టబయలు చేశారు. రెండు రోజుల క్రితం ఆయన మీడియాను వెంట బెట్టుకుని వెళ్లి రీచ్లో సాగే ఇసుక దందాను చూపించారు. భారీ యంత్రంతో నదీ గర్భాన్నే తోడేస్తున్న వైనాన్ని ప్రత్యక్షంగా చూపించినా అధికార యంత్రాంగం కనీస చర్యలు చేపట్టలేదు. ఆయన రీచ్లో ఉన్నప్పుడు మాత్రమే ఇసుక లోడింగ్ ఆపేశారు. ఆయన అటు వెళ్లగానే గంటలోపే మళ్లీ యంత్రాలు పెట్టి లోడింగ్ చేశారంటే వారి బరితెగింపు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
రేషన్ బియ్యం అక్రమ రవాణా కట్టడికి చర్యలు
● తనిఖీలకు మొబైల్ ఫ్లయింగ్ స్క్వాడ్లు ● ఫిర్యాదులకు టోల్ఫ్రీ నంబర్ 80083 04495 ● జేసీ మొగిలి వెంకటేశ్వర్లునెల్లూరు (దర్గామిట్ట) : రేషన్ బియ్యం అక్రమ రవాణా ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా మని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు 24 గంటలూ పనిచేసేలా రెండు మొబైల్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలీసు, రెవెన్యూ, సివిల్ సప్లయీస్ అధికారులతో కూడిన ఈ బృందాలు రోజూ రెండు షిఫ్టుల్లో పనిచేస్తాయని చెప్పారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక స్క్వాడ్, సాయంత్రం ఆరు నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మరో స్క్వాడ్ పనిచేస్తుందని వివరించారు. వీరితోపాటుగా అక్రమ రవాణాపై ఫిర్యాదులకు టోల్ఫ్రీ నంబర్ 80083 04495ను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలు ఏ క్షణమైనా ఆ ఫోన్ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. కాగా డీలర్లు కొందరు లబ్ధిదారులకు డబ్బులిచ్చి బియ్యం ఇవ్వడం లేదని, దీనిపై ఏమి చర్యలు తీసుకుంటారని జేసీని విలేకరులు ప్రశ్నించగా, అలాంటి ఫిర్యాదులు అందితే తక్షణమే కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని తెలియజేశారు. -
మమ్మల్ని ఆదుకోండి సారూ..
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● వినతులు స్వీకరించిన అధికారులునెల్లూరు(దర్గామిట్ట): ‘మా వినతులు పరిశీలించి ఆదుకోండి సారూ’ అంటూ అర్జీదారులు అధికారులను కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్కుమార్, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కృష్ణకుమార్, జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి, డీపీఓ వసుమతి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలు, పింఛన్లకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిపై అధికారులు ప్రత్యేకశ్రద్ధ పెట్టాలన్నారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు కలువాయి మండలం నూకనపల్లి, తెలుగురాయ పురం గ్రామాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు నిలు పుదల చేయించాలని ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు అధికారులకు వినతిపత్రమిచ్చారు. వారు మాట్లాడుతూ తవ్వకాలతో పొలాల్లోని బోర్లు, బావుల్లో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయిందన్నారు. సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని, రైతుల జీవనాధారం పూర్తిగా ప్రమాదంలో పడినట్లు వాపో యారు. తవ్వకాలు ఆపించి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. -
ఇంట్లో నుంచి తరిమేశారు
● పోలీసుల ఎదుట వృద్ధురాలి ఆవేదన ● పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’నెల్లూరు(క్రైమ్): ‘చిన్న కుమారుడు, కోడలు నా ఆస్తి అమ్ముకుని ఇంట్లో నుంచి తరిమేశారు. జీవనాధారం కష్టంగా ఉంది. విచారించి న్యాయం చేయండి’ అని సీతారామపురానికి చెందిన ఓ వృద్ధురాలు కోరారు. నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతుల వెల్లువెత్తాయి. 180 మంది పాల్గొని వినతులను పోలీసు అధికారులకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఎస్పీ అజిత చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, మహిళ, పీసీఆర్ ఇన్స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, భక్తవత్సలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● కడపకు చెందిన అశ్విన్, కొండారెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.1.50 లక్షలు తీసుకుని మోసగించారు. విచారించి న్యాయం చేయాలని ఆత్మకూరుకు చెందిన ఓ యువకుడు కోరాడు. ● నా భర్త యాక్సిడెంట్లో మరణించాడు. స్థానిక పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఆయన మరణంపై అనుమానం ఉంది. లోతుగా దర్యాప్తు చేయాలని పొదలకూరుకు చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. ● నేను గొర్రెలు మేపుకొని జీవనం సాగిస్తున్నాను. రామతీర్థం ప్రాంతానికి చెందిన భాస్కర్ రూ.4 లక్షల విలువైన గొర్రెలను కొనుగోలు చేసి నగదు ఇవ్వకుండా అడిగితే చంపుతామని బెదిరిస్తున్నాడు. తగిన చర్యలు తీసుకోవాలని అల్లూరుకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. -
వేమిరెడ్డి దంపతులు గిరిజన ద్రోహులు
● నెల్లూరు మాజీ మేయర్ స్రవంతి కోవూరు: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గిరిజన ద్రోహులని నెల్లూరు మాజీ మేయర్ పొట్లూరి స్రవంతి ధ్వజమెత్తారు. ఆమె కోవూరు మండల పరిధిలోని పోతిరెడ్డిపాళెం గిరిజన కాలనీలో సోమవారం ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవూరు ఏఎంసీ చైర్మన్ పదవి గిరిజనులకు దక్కాల్సి ఉండగా, తమ అనుచరుడికి కట్టబెట్టాలని వారు కుట్రలు పన్నారన్నారు. అయితే న్యాయస్థానం వారి దుర్మార్గపు ఆలోచనలకు అడ్డుకట్ట వేసి తగిన బుద్ధి చెప్పిందని పేర్కొన్నారు. కోవూరు జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలను అణచి వేయడమే ధ్యేయంగా వేమిరెడ్డి దంపతులు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం నెల్లూరు(దర్గామిట్ట): నగరపాలక సంస్థ నూతన మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వకుండా జాప్యం చేయడంపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. సోమవారం రిలే నిరాహార దీక్షలో గిరిజన సంఘాల తరఫున బాపట్ల వేంకటపతి పాల్గొని ప్రభుత్వం, వేమిరెడ్డి దంపతుల తీరును ఎండగట్టారు. అనంతరం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం సమర్పి ంచారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు తలపల జయవర్ధన్, బత్తిన లక్ష్మణ శేఖర్, మురళి, రమేష్, శ్రీనివాసులు, శ్రీనివాసులు పాల్గొన్నారు.


