breaking news
SPSR Nellore
-
విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అంత ఖర్చా?
● కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ నెల్లూరు రూరల్: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటాలు, ప్రజాధన వృథాను వెంటనే నిలిపివేయాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ డిమాండ్ చేశారు. మంగళవారం నెల్లూరు ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విమానాశ్రయం ప్రారంభానికి రూ.30 కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. ఓవైపు పొదుపు మంత్రం చెబుతూ, మరోవైపు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చినప్పుడు కేవలం రూ.లక్షతో, 500 మందితో సాదాసీదాగా సభ నిర్వహించామని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని మార్చి అమిత్ షా రాజ్యాంగాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నెల్లూరు కలెక్టర్ ముత్తుకూరు ప్రాంతాన్ని సందర్శించి అక్కడి పర్యావరణ సమస్యలను పరిశీలించాలని కోరారు. కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు చందనమూడి శివ, ఎస్వీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
సీబీఐతో విచారణ జరిపించాలి
మెగా డీఎస్సీ నియామకాల పేరుతో టీచర్ ఉద్యోగాలను అమ్ముకున్న చరిత్ర లోకేశ్దేనని ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. ఎలాంటి అర్హతల్లేని వారికి టీచర్ ఉద్యోగాలను కట్టబెట్టి విద్యావ్యవస్థ విలువలను దిగజార్చారని విమర్శించారు. స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన టీచర్ ఉద్యోగాలన్నీ అక్రమమని.. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ పేరుతో లక్షలాది మంది నిరుద్యోగులను సర్కార్ మోసం చేసి వారి భవిష్యత్తుతో చెలగాటమాడిందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, వసతి దీవెన నిధుల విషయాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతిగా నెలకు రూ.మూడు వేలను అందిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటి వరకు ఒక్కరికీ దీన్ని అమలు చేయలేదని దుయ్యబట్టారు. తల్లికి వందనం పథకంలో అర్హత పేరుతో అనేక మంది మాతృమూర్తులను మోసం చేశారని ఆరోపించారు. విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో ఈ అంశాలపై రానున్న రోజుల్లో తమ పార్టీ ఆధ్వర్యంలో మరింత ఉద్యమించనున్నామని స్పష్టం చేశారు. -
ఎదురుదాడికి దిగడమే నైజం
తప్పులను సరిదిద్దుకోకుండా.. ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగడమే టీడీపీ నైజంగా మారిందని పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మండిపడ్డారు. ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు మోసానికి గురై అవస్థలు పడుతుంటే, సర్కార్కు చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. మాయమాటలు చెప్పడం.. గద్దెనెక్కాక మోసం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్యగా మారిందని ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ను అరకొరగా ఇచ్చారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మారాక సీబీఐతో విచారణను జరిపిస్తామని తెలిపారు. -
అడవిలో మైనింగ్ అలజడి
● అటవీ అధికారులు, పోలీసుల దాడులు ● అదుపులో మేస్త్రి ● తవ్వకం చేసిన వారిపై విచారణ ● బాధ్యులపై చర్యలు ఉండేనా? సైదాపురం: మండల కేంద్రమైన సైదాపురానికి కూతవేటు దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో పురాతన పల్లిమిట్ట మైన్ల్లో అలజడి చెలరేగింది. అక్కడ అపారమైన ఖనిజ నిక్షేపాలున్నాయి. ఈక్రమంలో కొందరు కళ్లు ఇటీవల దానిపై పడింది. మంగళవారం ఆ మైన్లో కూలీల చేత పనులు చేయిస్తున్నారంటూ అధికారులకు సమాచారం అందింది. అటవీ, స్థానిక పోలీసులతోపాటు పలువురు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మైన్లోని ఓ ప్రాంతంలో ఖనిజాన్ని వెలికి తీస్తుండగా అధికారులు వస్తున్నారని తెలుసుకున్న కూలీలు ఉడాయించారు. దీంతో పనులు చేయించే మేస్త్రిని అదుపులోకి తీసుకున్నారు. పారలు, ఇతర సామగ్రి, ఆటోను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లీజుకు దరఖాస్తు ఈ మైన్ను కొందరు స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఈక్రమంలో గూడూరు ప్రాంతానికి ఓ వ్యక్తి మైనింగ్కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. గనికి లీజు వేసిన వ్యక్తులే పనులు చేసి ఉంటారనే అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా అనుమతి రాకముందే పట్టపగలే అక్రమ మార్గంలో కూలీలచే బాహాటంగా పనులు చేయించారు. మేస్త్రిని అధికారులు విచారణ చేసి అక్రమ మైనింగ్ పాల్పడిన వారెవరు అనే అంశంపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం అటవీ ప్రాంతంలో అనుమతి లేకుండా పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని నెల్లూరు అటవీ శాఖ రేంజర్ మాల్యాద్రి స్పష్టం చేశారు. సైదాపురం సమీపంలోని పల్లెమిట్ట మైన్లో కూలీలచే పనులు జరుగుతున్న సమయంలో తమ సిబ్బంది దాడులు చేశారన్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. సమగ్ర విచారణ చేస్తున్నట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడేవారు ఎంతటివారిౖపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.తవ్వకాలు సాగించిన ప్రాంతం స్వాధీనం చేసుకున్న పరికరాలు -
కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలంటూ..
● నెల్లూరులో సీఐటీయూ బైక్ ర్యాలీ నెల్లూరు(వీఆర్సీసెంటర్): ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు, షాపింగ్ మాల్స్, విద్య, వైద్యశాఖల్లో పనిచేస్తున్న కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాల్సిందేనని సీఐటీయూ నెల్లూరు నగర కార్యదర్శి జి.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దీనిని నగరాధ్యక్షుడు అత్తిమూరు శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు. శెట్టిగుంటరోడ్డు సెంటర్లోని సీపీఎం కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పప్పులవీధి, స్టోన్హౌస్పేట, ఆత్మకూరు బస్టాండ్, మినీబైపాస్ రోడ్డు, ముత్తుకూరు గేటు మీదుగా వీఆర్సీసెంటర్, గాంధీబొమ్మ సెంటర్, ఏబీఎం కాంపౌడ్ వరకు సాగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ దుకాణాలు, షాపింగ్ మాల్స్, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకం, 104, 108, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యమిత్ర, అర్బన్హెల్త్, ఆయూష్ తదితర చోట్ల పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ప్రభుత్వ శాఖలో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులకు మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేసి వాటి స్థానంలో పాత కార్మిక చట్టాలను అమలు చేయాలన్నారు. కార్మికుల సమస్యలపై ఈనెల 30వ తేదీన వీఆర్సీ మైదానం నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి మహాధర్నా నిర్వహిస్తామన్నారు. ఇందులో కార్మికలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ, డీవైఎఫ్ఐ నాయకులు రాంబాబు, మూలం ప్రసాద్, సుధాకర్, కామాక్షి, అశోక్, నరసింహ, అంకయ్య, సూర్యనారాయణ, మల్లెమ్మ, మధు, వెంకటేశ్వర్లు, మాలకొండేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కండలేరు క్రీక్లో పడి వ్యక్తి మృతి
చిల్లకూరు: మండల తీర ప్రాంతంలోని కండలేరు క్రీక్లో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. మండలంలోని మోమిడి గ్రామ సమీపంలోని పడవల రేవు వద్ద క్రీక్లో ఓ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని క్రీక్లో నుంచి బయటకు తీయించి పరిశీలించారు. మృతుడి కుడి కాలు పాదం సరిగ్గా లేకపోవడంతో క్రీక్ పరిసర గ్రామాల్లో ఆరా తీశారు. అతను చిల్లకూరు మండలానికి చెందిన వ్యక్తి కాదని తేలడంతో, క్రీక్కు అవతల ఉన్న వెంకటాచలం మండలంలోని గ్రామాల్లో విచారణ చేపట్టారు. వెంకటాచలం మండలం వెంకటరెడ్డిపాళెం గ్రామానికి చెందిన నడవల నాగరాజు (47)గా గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. నాగరాజు కుడి కాలు పాదం సరిగ్గా లేకపోవడంతో కండలేరు క్రీక్ వద్ద పట్టు తప్పి నీటిలో పడి చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సముద్రంలో పోటు కారణంగా మృతదేహం మోమిడి సమీపంలోని క్రీక్లోకి వచ్చి ఉంటుందని తెలిపారు. అయితే మృతికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో కూడా కుటుంబ సభ్యులను విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
డాక్యుమెంట్ రైటర్ల వినూత్న నిరసన
ఉదయగిరి: జీఓ నంబర్ 396ను రద్దు చేయాలని కోరుతూ స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఎదుట ఒంటి కాలిపై నిలిచి వినూత్న నిరసనను డాక్యుమెంట్ రైటర్లు మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పీపీపీ విధానంలో సేవా కేంద్రాల ఏర్పాటును రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం తమ జీవనోపాధికి గండి కొట్టేందుకే ఇలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పట్టించుకోకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. డీసీపల్లిలో 320 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 320 బేళ్లను మంగళవారం విక్రయించారని నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. వేలానికి 528 బేళ్లు రాగా, వీటిలో 320ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 44,169 కిలోల పొగాకును విక్రయించగా, రూ.84,88,476.80 వ్యాపారం జరిగిందని వివరించారు. గరిష్టంగా రూ.250.. కనిష్టంగా రూ.160.. సగటు ధర రూ.192.18గా నమోదైందని చెప్పారు. ఎనిమిది కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 80,003 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 32,918 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.59 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టిక్కెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు నెల్లూరు(పొగతోట): బాలల హక్కులకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు చేపట్టనున్నామని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. నగరంలోని అంగన్వాడీ కేంద్రాలు, చిల్డ్రన్స్ హోమ్ను మంగళవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. బాలలకు నాణ్యమైన సేవలను అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పించాలని పేర్కొన్నారు. నిబంధనలను పాటించకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం వాత్సల్య చిల్డ్రన్స్ హోమ్ను సందర్శించి, అక్కడి పిల్లలతో మాట్లాడారు. బాలల సంరక్షణ, పరిరక్షణ చట్టం – 2015 మేరకు హోమ్ను నిర్వహిస్తున్నారాననే అంశాన్ని ఆరాతీశారు. కమిషన్ సభ్యురాలు వెంకటపద్మలత, ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, డీసీపీఓ సురేష్, సీడీపీఓ అరుణ తదితరులు పాల్గొన్నారు. -
15 రోజుల్లోగా 22ఏ కేసుల పరిష్కారం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశం నెల్లూరురూరల్: జిల్లాలో 22ఏ, చుక్కల భూములు, రీ సర్వే కేసులను 15 రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను పూర్తిగా తెలుసుకుని, నిర్దేశిత గడువులోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనసాగుతున్న రీ సర్వే పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, పెండింగ్ లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇకపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తానని, అధికారులు తమ పరిధిలో స్పష్టమైన పురోగతి చూపించాలని స్పష్టం చేశారు. సమావేశంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సమర్థంగా హరిత కార్యక్రమాల అమలు
నెల్లూరు రూరల్: జిల్లాలో 2047 నాటికి 50 శాతం హరితవరణాన్ని సాధించడమే లక్ష్యంగా అన్ని ప్రభుత్వ శాఖలు సమష్టిగా కృషి చేసి హరిత కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. హరిత కార్యక్రమాల అమలుపై కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జిల్లా అటవీ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన, వ్యవసాయ, పంచాయతీరాజ్, విద్య, పరిశ్రమలు, నీటిపారుదల శాఖ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తదితర అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వీటిని జిల్లాలో విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. తమ పరిధిలోని రహదారులు, కాలువలు, చెరువులు, ప్రభుత్వ ఖాళీ భూములు తదితరాల్లో నర్సరీల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు, నమోవనాల స్థలాల ఏర్పాటుకు అనుకూల భూములను పరిశీలించి వివరాలను జిల్లా అటవీ శాఖకు త్వరితగతిన అందజేయాలని ఆదేశించారు. జిల్లా అటవీ అధికారి మహబూబ్బాషా, సోషల్ ఫారెస్ట్రీ జిల్లా అటవీ అధికారి నాగార్జునరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వసుమతి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస ప్రసాద్, డీఈఓ బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు. -
వీఎస్యూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన
వెంకటాచలం: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విక్రమ సింహపురి యూనివర్సిటీ అసోసియేషన్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆన్ కాంట్రాక్ట్ ఆధ్వర్యంలో కాకుటూరు వద్దనున్న వర్సిటీ క్యాంపస్లో చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు వర్సిటీ క్యాంపస్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పరిపాలన భవనం ఎదుట ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మినిమం టైమ్ స్కేల్ అమలు, రెగ్యులరైజేషన్, సర్వీస్ పరిగణన తదితర అంశాలతో కూడిన వినతిపత్రాన్ని యూనివర్సిటీ వీసీ ఆచార్య అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ కె.సునీతకు అందజేశారు. అనంతరం నిరసన దీక్షా శిబిరం వద్దకు యూనివర్సిటీ కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ అసోసియేషన్ సభ్యులు చేరుకుని మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాకుటూరు, కావలి యూనివర్సిటీ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు, కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.45 సన్నవి : రూ.25 పండ్లు : రూ.10 -
ప్రసన్న నివాసంలో వైఎస్సార్సీపీ నేతల భేటీ
కోవూరు: వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని మంగళవారం నెల్లూరులోని నివాసంలో పలువురు నేతలు కలిశారు. మాజీ మంత్రి డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ, మేరిగ మురళీధర్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఊటుకూరు మహేందర్రెడ్డి, కోవూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు నల్లపరెడ్డి రజత్కుమార్రెడ్డి, ఆ నియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అనిల్బాబు తదితరులు పార్టీ బలోపేతంపై చర్చించారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై పోరాటాలు నిర్వహించడంపై చర్చించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
ఆర్టీసీ కార్గో పాయింట్లో వానపాముల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు ఆర్టీసీ ప్రధాన బస్టాండ్ ఆవరణలోని కార్గో పాయింట్లో విజిలెన్స్ అధికారులు మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో సుమారు 35 కిలోల వానపాములను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. విచారణలో అవి అనంతసాగరం మండలంలోని ఓ ఎరువుల తయారీ సంస్థకు చెందినవిగా ప్రాథమికంగా గుర్తించారు. అయితే నిబంధనల ప్రకారం అనుమతులతోనే వాటిని రవాణా చేశారా?, లేదా అనే అంశంపై డీఎఫ్ఓ మహబూబ్బాషా ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడి కానున్నాయి. సదరు పార్శిల్స్ విజయవాడ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. తనిఖీల్లో ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు జి.వెంకటేశ్వర్లు, పీవీ ప్రసాద్, కేఎన్రావు తదితరులు పాల్గొన్నారు. -
దండుకోవడానికే జీఓలు
స్పోర్ట్స్ కోటాలో దండుకోవాలనే ఉద్దేశంతో.. నచ్చిన వారికి పోస్టులివ్వాలనే ఉద్దేశంతో దొంగ జీఓలను జారీ చేశారని పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. నీట్ పరీక్షలో అవకతవకలపై కేంద్ర మంత్రి రాజీనామా చేశారని, రాజ్యాంగంపై విశ్వాసముంటే లోకేశ్ సైతం రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ అవకతవకలకు నారా లోకేశ్ బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త గురవయ్య డిమాండ్ చేశారు. ఈ విషయంలో చంద్రబాబు స్పందించాలన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. స్టూడెంట్స్ అంటే అంత చులకన తగదని, లోకేశ్ తప్పుకొనేంత వరకూ ఈ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. లోకేశ్ బాధ్యత వహించాలి -
అంతా అవినీతిమయం
400కుపైగా ఉద్యోగాల భర్తీలో అవినీతి జరిగిందని.. ఒక్కో జాబ్కు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు జరిగాయని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆడియోలు బయటకొచ్చినా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిపై లోకేష్ వ్యాఖ్యలను ఖండించారు. విద్యావ్యవస్థపై మాట్లాడే హక్కు స్టూడెంట్స్కు ఉందని, వీరి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సర్కార్పై ఉందని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అసలైన క్రీడాకారులకు అవకాశాలను కల్పించకుండా అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు నిబంధనలనే మార్చారని విమర్శించారు. జీఓ నంబర్ 4, 47 ద్వారా స్పోర్ట్స్ కోటాను రెండు శాతం నుంచి మూడు శాతానికి పెంచడమే కాకుండా, పోటీ పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు పొందేలా నిబంధనలను సవరించారని ధ్వజమెత్తారు. -
మానసిక, శారీరక దివ్యాంగ చిన్నారులకు ఉచిత ప్రవేశాలు
నెల్లూరు(అర్బన్): ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నెల్లూరులో నిర్వహిస్తున్న ఎంఎస్ఆర్ స్పాస్టిక్స్ సెంటర్లో 14 ఏళ్లలోపు మానసిక, శారీరక దివ్యాంగ చిన్నారులకు ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఉదయభాస్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక విద్యతోపాటు స్కూలు బస్సు సౌకర్యాన్ని కూడా ఉచితంగా అందజేస్తామన్నారు. ప్రవేశాలకు ఎలాంటి ఫీజు లేదన్నారు. ఆసక్తి గల తల్లిదండ్రులు వివరాల కోసం మద్రాస్ బస్టాండ్ సమీపంలోని రెడ్క్రాస్ స్పాస్టిక్స్ సెంటర్ను లేదా 86399 34861 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. నిధుల దుర్వినియోగంజరగలేదు : ఆర్జేడీ నెల్లూరు(టౌన్): జిల్లాలో సమగ్రశిక్షకు సంబంధించి ఆయా పాఠశాలల్లో ప్రహరీ నిర్మాణాల్లో నిధుల దుర్వినియోగం జరగలేదని విద్యాశాఖ ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన నెల్లూరులోని సమగ్రశిక్ష కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉపాధి నిధులతో ఆయా పాఠశాలల్లో ప్రహరీ నిర్మాణాలు జరిగాయన్నారు. వీటికి సంబంధించి డబుల్ పేమెంట్ జరిగిందన్న ఆరోపణలు వచ్చినా, విచారణలో అలాంటిదేమీ లేదని స్పష్టమైందన్నారు. సమగ్రశిక్షలో ఇంజినీర్లు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. దీనిపై రాష్ట్ర కార్యాలయంలో వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. 2014 – 19వ సంవత్సరంలో స్పిల్ ఓవర్ వర్క్స్లో రూ.1.93 కోట్లు నిధులు గోల్మాల్ చేశారని పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. ఈ నిధులను నేరుగా రాష్ట్ర కార్యాలయం నుంచే చెల్లించినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల శిక్షణ నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. ఇది కూడా రాష్ట్ర కార్యాలయం నుంచే పేమెంట్ జరిగిందన్నారు. సమగ్రశిక్షలో నిధులు దుర్వినియోగం ఆరోపణలపై కలెక్టర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారని, ప్రస్తుతం వారు విచారణ చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో డీఈఓ ఆర్.బాలాజీరావు, మాజీ ఏపీసీ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. కుష్టు వ్యాధి సర్వే వేగవంతం● అడిషనల్ డీఎంహెచ్ఓ ఖాదర్వలీ నెల్లూరు(అర్బన్): కుష్టు వ్యాధి గుర్తింపు సర్వేను వేగవంతంగా నిర్వహించాలని అడిషనల్ డీఎంహెచ్ఓ ఖాదర్వలీ ఆదేశించారు. మంగళవారం సంతపేటలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయొచ్చన్నారు. ప్రధానంగా రొయ్యల గుంతలు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో సర్వేను మరింత జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు. కొత్తగా నమోదైన రోగులతో సన్నిహితంగా ఉన్నవారికి వ్యాధి సోకకుండా పెప్ మాత్రలు అందించాలని ఆదేశించారు. ప్రతినెలా 11వ తేదీన అంగవైకల్యం ఉన్న కుష్టు బాధితుల కోసం ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పీఓడీ శిబిరాలు నిర్వహించి, వారికి అవసరమైన ఎంసీఆర్ చెప్పులతోపాటు ఇతర సహాయక వస్తువులు అందించాలని సూచించారు. సమావేశంలో జిల్లా న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమేష్, టీహెచ్ వార్డు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షాలిని, ఫిజియోథెరపిస్టులు నరసింహులు, జోబు, పీఎంఓ మల్లమ్మ, డీపీఎంలు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు● డీపీఓ వసుమతి నెల్లూరు(పొగతోట): గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డీపీఓ, జిల్లా స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల అధికారి, జెడ్పీ సీఈఓ వసుమతి ఆదేశించారు. మంగళవారం నెల్లూరులోని హరనాథపురం, లేక్వ్యూ కాలనీ, గౌతమ్ నగర్ తదితర ప్రాంతాల్లోని సచివాలయాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ సర్వేలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈకేవైసీ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆధార్కార్డు ల్లేని పిల్లల వివరాలు సేకరించాలన్నారు. అర్హులైన వారికి పథకాలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. సిబ్బంది అంకితభావంతో పని చేయాలని సూచించారు. -
నెలకు పది కాన్పులు చేయాలి
మనుబోలు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు కనీసం పది కాన్పులు అయినా చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్కుమార్ ఆదేశించారు. సోమవారం ఆయన మనుబోలు పీహెచ్సీని స్టేట్ వ్యాక్సిన్ కోఆర్డినేటర్ డాక్టర్ దేవదానం, జిల్లా మేనేజర్ రమేష్తో కలిసి ఆకస్మికంగా సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై వైద్యసిబ్బందిని ఆరా తీశారు. ఆస్పత్రిలో కాన్పులు సక్రమంగా జరగడం లేదని తెలుసుకుని, కనీసం నెలకు పది అయినా చేయాలని, లేని పక్షంలో మెమో జారీ చేస్తామని హెచ్చరించారు. పీహెచ్సీల్లోనే కాన్పులు చేయించుకునేలా క్షేత్ర స్థాయిలో గర్భిణులకు అవగాహన కల్పించాలని సూచించారు. వారి వెంట పీహెచ్సీ డాక్టర్ గేయ పూజిత, సీహెచ్ఓ రాజయ్య, పీహెచ్ఎన్ జయలక్ష్మి, సూపర్వైజర్ రమణయ్య ఉన్నారు. పొగాకు రైతుల జాతీయ రహదారి దిగ్బంధం రేపు మర్రిపాడు : రాష్ట్ర పొగాకు రైతుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈ నెల 29న చేపడుతున్న జాతీయ రహదారి దిగ్బంధనాన్ని జయప్రదం చేయాలని రైతు సంఘ నాయకులు పిలుపునిచ్చారు. డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద పొగాకు రైతు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పొగాకుకు గిట్టుబాటు ధరలు కల్పించాలని చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం నాల్గో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి, డీసీపల్లి పొగాకు రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు మూలి వెంగయ్య, వైఎస్సార్సీపీ రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు చండ్ర నారాయణస్వామి, రైతు సంఘ మండల నాయకుడు గంగినేని నారాయణ మాట్లాడుతూ పొగాకు రైతులకు న్యాయమైన మద్దతు ధర లభించే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం, పొగాకు బోర్డు వెంటనే పరిష్కరించాలని, లేదంటే ఉద్య మాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చ రించారు. రైతు నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాకర్లను నిలదీసిన కార్యకర్తలు కొండాపురం: తమను పట్టించుకోకపోవడంపై టీడీపీ కార్యకర్తలు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ను నిలదీశారు. సోమవారం ఆయన సాయిపేట పంచాయతీలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీలోని రెండు వర్గాల మధ్యన నెలకొన్న విభేదాల నేపథ్యంలో అడుగడుగునా కార్యకర్తలు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన తమకు పార్టీలో గుర్తింపు లేకుండా పంచాయతీకి చెందిన నాయకులు చేస్తున్నారని, మీరు కూడా వారికి వత్తాసు పలుకుతూ పనులు కట్టబెట్టడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. మేము ఓట్లు వేస్తేనే మీరు గెలిచారని, మా ఓట్లు కూడా ముఖ్యమేనని, చాలా కాలంగా పార్టీని కనిపెట్టుకుని ఉన్నామని, తమకు ఈ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగలేదని వాపోయారు. తమను పార్టీలో గుర్తిస్తేనే పార్టీకి సేవలందిస్తామని, లేదంటే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటామని తెగేసి చెప్పారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 90,012 మంది స్వామివారిని దర్శించుకున్నారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
దొంగ పట్టాలను రద్దు చేయండి
గ్రామ దేవతల భూములకు సంబంధించి దొంగ పట్టాలు సృష్టించారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కలువాయి మండలం ఉయ్యాలపల్లికి చెందిన ఎం.చిన్న వెంకటేశ్వర్లు, ఎన్.రమణయ్య, ఎం.సోమయ్య వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ సర్వే నంబర్ 591లో 2.31, 592లో 2.31 ఎకరాలు భూమికి దండు కృష్ణయ్య, చేజర్ల తిరుపాలు దొంగ పట్టాలను సృష్టించారన్నారు. ఆ భూమిలోకి ప్రవేశిస్తే అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు. సంబంధిత అధికారులు విచారణ జరిపి అక్రమ పట్టాలను రద్దు చేసి దేవాలయ భూములను యథావిధిగా కొనసాగించాలని కోరారు. -
తల్లికి వందనం ఇవ్వాలి
‘నాకు ముగ్గురు పిల్లలు. భర్త చనిపోయాడు. గత ప్రభుత్వంలో అమ్మఒడి వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చాక రెండుసార్లు తల్లికి వందనం పడలేదు’ అని అనంతసాగరం మండలం పాత దేవరాయపల్లికి చెందిన షేక్ నస్రీన్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె మాట్లాడుతూ గతంలో మార్కాపురం జిల్లా సీఎస్పురంలో తన భర్తతో కలిసి నివసించేవారమని చెప్పారు. భర్త చనిపోయిన తర్వాత పిల్లలతో కలిసి తన తండ్రి వద్దకు వచ్చి పాతదేవరాయపల్లిలోని గవర్నమెంట్ స్కూల్లో పిల్లలను చదివించుకుంటున్నానని తెలిపింది. సచివాలయం వద్దకు వెళ్తే మా హౌస్హోల్డ్డ్ మ్యాపింగ్లో హోంగార్డు అయిన మరిది పేరు ఉందని చెబుతున్నారన్నారు. ఎన్నిసార్లు సచివాలయాల చుట్టూ తిరిగిన సమస్యను పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యను పరిష్కరించి తల్లికి వందనం వచ్చేలా చూడాలని కోరారు. -
వీఎస్యూలో నాలుగు కొత్త బీటెక్ కోర్సులు
● వీసీ అల్లం శ్రీనివాసరావు వెంకటాచలం: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా నాలుగు సెల్ప్ఫైనాన్స్ బీటెక్ కోర్సులను ప్రారంభిస్తున్నామని వైస్చాన్స్లర్ అల్లం శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఆయన వీఎస్యూలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కోర్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ప్రతి కోర్సుకు 60 చొప్పున మొత్తం 240 సీట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఆధునిక సాంకేతిక విద్యకు ప్రాధాన్యం ఇస్తూ ఈ కోర్సులకు అనుమతి ఇవ్వడం సంతోషకరమన్నారు. భవిష్యత్ పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కోర్సులు విద్యార్థులకు అత్యుత్తమ ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నా రు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలను విశ్వవిద్యాలయం కల్పిస్త్తుందని తెలిపారు. విద్యార్థులు, విద్యార్థినులకు ప్రత్యేక హాస్టల్ వసతి, ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజురీయింబర్స్మెంట్, బస్సు రవాణా సౌకర్యం, స్మార్ట్ క్లాస్రూమ్లు, అత్యాధునిక కంప్యూటర్ సెంటర్, అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రయోగశాలలు (ల్యాబ్లు), విశాలమైన క్రీడా మైదానాలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో కూడిన ఉత్తమ విద్యా వాతావరణం అందుబాటులో ఉంటుందని వివ రించారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలతో అనుసంధానమైన శిక్షణ, ఇంటర్న్ షిప్లు, ప్లేస్మెంట్ అవకాశాల కల్పనపై విశ్వవిద్యాలయం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో తక్కువ వ్యయంతో నాణ్యమైన ఇంజినీరింగ్ విద్యను అభ్యసించే అరుదైన అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
జీతాలివ్వండయ్యా..
● పెద్దాస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా నెల్లూరు(అర్బన్): మూడు నెలలుగా రావాల్సిన జీతాలు వెంటనే ఇప్పించాలంటూ నెల్లూరులోని ప్రభుత్వ పెద్దాస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులు తమకు సోమవారం విధులు బహిష్కరించి ఆకస్మికంగా ధర్నా చేశారు. పనులు ఆపేయడంతో రోగులను పట్టేందుకు దిక్కులేకుండా పోయింది. పారిశుద్ధ్య పనులు ఆగిపోయాయి. దీంతో ఆస్పత్రి ఏడీ ఏడుకొండలు కార్మికులతో చర్చించారు. నెల జీతం ఒక్కరోజులోనే ఇచ్చేలా సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడారు. మరోనెల జీతం పదిరోజుల తర్వాత ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అయినా కార్మికులు తగ్గలేదు. దీంతో సీఐటీయూ రూరల్ కార్యదర్శి కె.పెంచల నరసయ్య, యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు సతీష్, ప్రధాన కార్యదర్శి సందానీబాషా వచ్చి చర్చించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ జీతాల కోసం కాంట్రాక్టర్తో మాట్లాడాలని సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి వద్దకు వెళ్లగా తమను చులకన చేసి మాట్లాడారన్నారు. మూడు నెలలకే తొందరపడితే ఎలా అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తనను ఎందుకు కలవాలని వస్తున్నారంటూ చిరాకు పడ్డారన్నారు. డాక్టర్లు విధులకు వచ్చినా, రాకపోయినా జీతాలు తీసుకుంటున్నారన్నారు. తమ జీతాలు అడగడం తప్పా అని నిలదీశారు. దీంతో సీఐటీయూ నాయకులు ఏడీతో మాట్లాడారు. కాంట్రాక్టర్ను, కార్మికులను ఒకచోట చేర్చి సమావేశాన్ని నిర్వహించాలన్నారు. పెండింగ్లో ఉన్న పీఎఫ్, ఈఎస్సై చెల్లించాలని కోరారు. ప్రతినెలా జీతాలు సకాలంలో ఇవ్వకుంటే సమ్మె చేస్తామని హెచ్చరించారు. వీటికి అధికారులు ఒప్పుకోవడంతో కార్మికులు ధర్నాను విరమించారు. -
దస్తావేజు లేఖరుల జీవనోపాధిపై కూటమి దెబ్బ
● నిరసనకు కాకాణి, పర్వతరెడ్డి సంఘీభావం నెల్లూరురూరల్: జీఓ నంబర్ 396 పేరుతో కూటమి ప్రభుత్వం వేలాది మంది దస్తావేజు లేఖరుల జీవనోపాధిపై దెబ్బకొట్టిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి విమర్శించారు. జీఓను వ్యతిరేకిస్తూ నెల్లూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఆవరణలో సోమవారం నల్లరిబ్బన్లు ధరించి నిరసన చేపట్టిన డాక్యుమెంట్ రైటర్లను వారు కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్న దస్తావేజు లేఖరులు ఉపాధి కోల్పోయే పరిస్థితికి నెట్టడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. జీఓను తక్షణమే రద్దు చేసి వారి ఉపాధికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ● ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ సేవలను, ఆస్తులను ప్రైవేట్పరం చేసే విధానాన్ని అమలు చేస్తోందని విమర్శించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సేవలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందన్నారు. ఇప్పటి వరకు డాక్యుమెంట్ రైటర్ల వల్ల ప్రజలు రిజిస్ట్రే షన్ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకుంటున్నారని, అలాంటి వ్యవస్థను నిర్వీర్యం చేయడం సమంజసం కాదన్నారు. 396 నంబర్ జీఓ వారి పాలిట శాపంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త బూదూరు గురవయ్య, నాయకులు, డాక్యుమెంట్ రైటర్ల సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలతో కలెక్టరేట్ బాట
నెల్లూరురూరల్: జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అర్జీలతో నెల్లూరులోని కలెక్టరేట్ బాట పట్టారు. సోమవారం తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, మెప్మా పీడీ కిరణ్కుమార్, డిప్యూటీ కలెక్టర్లు వంశీకృష్ణ, కేశవర్ధన్రెడ్డి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. భూ సమస్యలు, ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి వినతులు ఎక్కువగా వస్తున్నాయని, వాటిపై దృష్టి సారించాలన్నారు. 40 ఏళ్ల సేవలకు గుర్తింపు ఇవ్వాలి కోవూరు కో ఆపరేటివ్ చక్కెర కర్మాగారంలో సుమారు 40 ఏళ్లపాటు కన్సాలిడేటెడ్ ఎన్ఎంఆర్/ఎన్ఎంఆర్ కార్మికులుగా పనిచేసిన 243 మందికి న్యాయం చేయాలంటూ అధికారులకు వినతిపత్రం అందింది. బాధితులు మాట్లాడుతూ పర్మినెంట్ ఉద్యోగులకు లభించే సెలవులు, గ్రాట్యుటీ, పెన్షన్ వంటి ప్రయోజనాలు తమకు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరగక జీవనోపాధి కోల్పోయామని తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏర్పాటు చేసిన కమిటీ ఒక్కో కార్మికుడికి సుమారు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కోట గురుకులాన్ని కొనసాగించాలంటూ బీఎస్పీ ధర్నా హామీలు నెరవేర్చాలని ఐద్వా డిమాండ్ -
స్వామిచెరువులో గ్రావెల్ డంప్
● నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న హైవే కాంట్రాక్టర్ ● చెరువు పూడిపోతుందని ఆయకట్టు రైతుల ఆందోళనసీతారామపురం : సీతారామపురం–పోరుమామిళ్ల ఘాట్రోడ్డు సమీపంలో ఆరులైన్ల జాతీయ రహదారి 544 నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. హైవే నిర్మాణంలో భాగంగా తవ్విన మట్టిని సమీపంలోని స్వామి చెరువులో పెద్దఎత్తున డంప్ చేస్తున్నారు. స్వామిచెరువు కింద వందలాది ఎకరాల ఆయకట్టు ఉంది. జాతీయ రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన మట్టిని తోలడం వల్ల చెరువు పూడిపోయి నిల్వ సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడి చెరువులోకి నీరు వచ్చినా గండిపడే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. స్వామి చెరువుపై ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయని, చెరువులో గ్రావెల్ డంప్ చేయడం వల్ల నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఈ విషయమై హైవే నిర్మాణదారులను పలుమార్లు హెచ్చరించినా వారు పెడచెవిన పెట్టడమే గాకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపి స్తున్నారు. టిప్పర్ల ద్వారా పెద్ద ఎత్తున మట్టి తరలించి డంప్ చేసే క్రమంలో ఇప్పటికే ప్రధాన కాలువ పూడిపోయింది. దీంతో వర్షాకాలంలో ముంపు సమస్య తలెత్తడంతో పాటు ఆయకట్టుకు సాగునీరు అందకుండాపోయే ప్రమాదం ఉందని రైతులు తెలిపారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ శాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై ఆయకట్టు రైతులు తహసీల్దార్ ఫజిహాను సోమవారం కలిసి ఫిర్యాదు చేశారు. గ్రావెల్ డంపింగ్ చేయడాన్ని నిలుపుదల చేసి చెరువును కాపాడాలని కోరారు. -
హెపటైటిస్తో లివర్కు ముప్పు
● ఆహార అలవాట్లు, వైరస్లతో దెబ్బతినే ప్రమాదం ● నిర్లక్ష్యం చేస్తే ఫ్యాటీ లివర్, సిర్రోసిస్, కేన్సర్కు దారి ● జిల్లాలో 25 వేల మందికిపైగా బాధితులున్నట్లు అంచనా ● నేడు వరల్డ్ హెపటైటిస్ డేనెల్లూరు(అర్బన్): హెపటైటిస్ బీ, సీ వైరస్లు లివర్ను నిశ్శబ్దంగా దెబ్బతీస్తూ ప్రాణాంతక వ్యాధులుగా మారుతున్నాయి. ముందుగా గుర్తించకపోతే లివర్ దెబ్బతిని సిర్రోసిస్, కేన్సర్కు దారితీసే ప్రమాదం ఉంది. వ్యాధి ముదిరే వరకు చాలామందికి లక్షణాలు కనిపించవు. హెచ్బీఎస్ఏజీ వంటి రక్తపరీక్షల ద్వారా మాత్రమే వైరస్ను గుర్తించగలరు. ఈలోపు సంవత్సరాలపాటు నెమ్మదిగా లివర్ను దెబ్బతీస్తుంది. వ్యాధి తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాది జూలై 28ను వరల్డ్ హెపటైటిస్ డేను నిర్వహిస్తోంది. మంగళవారం జిల్లాలో వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. జిల్లాలో ఇలా.. జిల్లా వైద్యశాఖ వద్ద పూర్తిస్థాయి గణాంకాలు లేకపోయినా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), సీనియర్ వైద్యుల అంచనా ప్రకారం జిల్లాలో 25 వేల మందికిపైగా హెపటైటిస్ బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నమోదైన వివరాల ప్రకారం 2022లో 14,684 మందికి పరీక్షలు నిర్వహించగా 205 మందికి బీ రకం వైరస్ నిర్ధారణ అయింది. 2023లో 21,837 మందికి పరీక్షలు చేయగా 404 మంది, 2024లో 23 వేల మందికి పరీక్షలు చేయగా 457 మంది, 2025లో సుమారు 64 వేల మందికి పరీక్షలు నిర్వహించగా 600 మందికి బీ రకం ఉన్నట్లు తేలింది. ఇక సీ రకం వైరస్ విషయంలో 2022 నుంచి 2024 మధ్య 73 మందికి పాజిటివ్గా నిర్ధారణ కాగా, 2025లో మరో 200 మందికి ఉన్నట్లు తేలింది. వీరంతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. డయాలసిస్ రోగులు, ఖైదీలు, ఏఆర్టీ చికిత్స పొందుతున్న వారికి నిర్వహించిన పరీక్షల్లో మరో 500 మంది వరకు వైరస్ల బారినపడినట్లు గుర్తించారు. జిల్లాలోని 52 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 10 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, 28 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఒక జిల్లా ఆస్పత్రి, రెండు ఏరియా ఆస్పత్రితోపాటు ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్ల వివరాలను పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో 25 వేల మందికిపైగా వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా.ఎలా సోకుతుంది? రక్షణలేని లైంగిక సంబంధాలు, ప్రసవ సమయంలో తల్లి నుంచి శిశువుకు హెపటైటిస్ బీ సోకే అవకాశం ఉంది. రక్తమార్పిడి, కలుషిత సూదుల ద్వారా బీ, సీ వైరస్లు వ్యాపిస్తాయి. కలుషిత ఆహారం, తాగునీటి ద్వారా ఏ, ఈ రకాలు ఎక్కువగా వస్తాయి. జ్వరం, అలసట, ఆకలి లేకపోవడం, వాంతులు, కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడం (కామెర్లు), ముదురు రంగు మూత్రం లక్షణాలుగా ఉన్నాయి. అవగాహన తప్పనిసరి హెపటైటిస్ వైరస్లు ప్రాణాంతకం. ఇవి లివర్ను ప్రధానంగా దెబ్బతీస్తాయి. అందువల్ల ఈ జబ్బులపై అవగాహన పెంచుకుని తగిన జాగ్రత్తలు పాటించాలి. బీ రకం రాకుండా ముందస్తుగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. నవజాత శిశువులకు 24 గంటల్లోపే వ్యాక్సిన్ వేయించాలి. ప్రతి ఒక్కరూ హెపటైటిస్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుని ఒకవేళ వైరస్ ఉంటే డాక్టర్ల పర్యవేక్షణలో మూడు నుంచి నాలుగేళ్లపాటు మందులు వాడాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయి నుంచే హెపటైటిస్ పరీక్షలు నిర్వహించాలి. – డాక్టర్ సునీల్కుమార్, సీనియర్ ఫిజీషియన్, సర్వజన ఆస్పత్రి వాటితోనే ఎక్కువగా.. హెపటైటిస్లో మొత్తం ఐదు రకాల వైరస్లున్నాయి. ఏ రకం వైరస్ సాధారణంగా కామెర్ల రూపంలో కనిపించి మూడు వారాల విశ్రాంతితో తగ్గిపోతుంది. డీ, ఈ రకాలు అరుదుగా వస్తాయి. అయితే బీ, సీ వైరస్లు సోకితే తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. హెపటైటిస్ బీ వైరస్కు పూర్తిస్థాయి చికిత్స లేదు. జీవితాంతం శరీరంలోనే ఉంటుంది. వైరస్ లోడ్ను తగ్గించే మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే సీ రకానికి ప్రస్తుతం చికిత్స అందుబాటులో ఉంది. జిల్లాలో బీ, సీ రకాలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. నివారణే ఉత్తమ మార్గం హెపటైటిస్ బీ నివారణకు ముందస్తుగా టీకా వేయించుకోవడం అత్యంత ప్రభావవంతమైన మార్గం. సురక్షిత రక్తాన్ని మాత్రమే వినియోగించాలి. ఒక్కసారి ఉపయోగించిన సూదులను మళ్లీ వాడకూడదు. పరిశుభ్రమైన ఆహారం, తాగునీరు తీసుకోవాలి. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే మందులతో నియంత్రించవచ్చు. -
మార్కెట్లోకి న్యూ బ్రెజ్జా కారు విడుదల
నెల్లూరు(టౌన్): మారుతి సుజుకి న్యూ బ్రెజ్జా కారును సోమవారం యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ శ్రీనివాస్, భార్గవి ఆటోమొబైల్స్ ఫౌండర్, చైర్మన్ కొండా బలరామిరెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ కొండా నిరంజన్రెడ్డి మార్కెట్లోకి విడుదల చేశారు. భార్గవి ఆటోమొబైల్స్ షోరూంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈ వాహనం ఎక్స్ షోరూం ధర రూ.7.39 లక్షల నుంచి ప్రారంభం అవుతుందన్నారు. కారు 1.5 లీటరు ఆస్పిరేటెడ్ ఇంజిన్తోపాటు సరికొత్త టర్బో ఇంజిన్ ఆప్షనర్ ఉందన్నారు. 7 సింగిల్, 3 డ్యూయల్ టోన్ రంగుల్లో లభిస్తుందన్నారు. ఫ్రంట్ వార్నింగ్ సెన్సార్లు, ఎమర్జెన్సీ స్టాఫ్ సిగ్నల్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్, 360 డిగ్రీల కెమెరా, తదితర ఫీచర్లు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ రాధాకృష్ణ, డీజీఎం రమేష్బాబు, మహేష్ , చీఫ్ జనరల్ మేనేజర్ రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు. నిస్సాన్ టెక్టాన్ కారు ఆవిష్కరణ నెల్లూరు(టౌన్): నెల్లూరులోని ఎంజీబీ మాల్లో హైటెక్ నిస్సాన్ షోరూం నిర్వాహకులు సోమవారం నూతన టెక్టాన్ కారును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ జగన్నాఽథ్రెడ్డి మాట్లాడుతూ ఈ కారులో వైర్లెస్ చార్జర్, వెంటిలేటర్ ఫ్రంట్ సీట్స్, డ్యూయల్ జోన్ ఏసీ, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ లాంటి సదుపాయాలు ఉన్నాయన్నారు. ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ.10.49 లక్షలన్నారు. బుకింగ్ కోసం 90142 11044 నంబర్ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు నిరంజన్, భారతి, హోషిమా రెడ్డి, ఆశీష్రెడ్డి, శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత భయ్యా వాసు, ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ హరికృష్ణ, హెచ్డీఎఫ్సీ ఏరియా మేనేజర్ వెంకట్, హైటెక్ నిస్సాన్ జనరల్ మేనేజర్ ఎన్వీఎస్ శాస్త్రి, సేల్స్ మేనేజర్ బ్రహ్మకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. కండలేరులో 26.46 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 26.46 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 65 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.45 సన్నవి : రూ.25 పండ్లు : రూ.10 -
చివరి డెలివరీ.. ముగిసిన జీవితం
● రాంగ్రూట్లో దూసుకొచ్చిన ఆటో ● బైక్ను ఢీకొట్టడంతో యువకుడి మృతి నెల్లూరు(క్రైమ్): ఆ యువకుడు ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు. కష్టపడి పనిచేసి విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. కానీ ఆ ప్రయాణం మధ్యలోనే ముగిసింది. రాంగ్రూట్లో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఆటో ఢీకొనడంతో కోవూరు మండలం ఇనుమడుగు గ్రామానికి చెందిన కె.హేమంత్ (21) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నార్త్ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. హేమంత్ నెల్లూరు రైల్వే స్టేషన్లో ఐఆర్సీటీసీ స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం విధుల నిమిత్తం నెల్లూరుకు వచ్చాడు. రాత్రి సుమారు 10:30 గంటలకు పని ముగించుకుని బైక్పై ఇంటికి బయలుదేరాడు. పాత పెన్నా బ్రిడ్జి మధ్యలోకి చేరుకోగానే వెంకటేశ్వరపురం వైపు నుంచి రాంగ్రూట్లో మితిమీరిన వేగంతో వచ్చిన ఆటో బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హేమంత్కు తలకు, కుడి మోకాలికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది హేమంత్తోపాటు ఆటోలో గాయపడిన ఇద్దరిని జీజీహెచ్కు తరలించారు. అయితే హేమంత్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కొడుకు మృతి వార్త తెలుసుకున్న తల్లి మల్లేశ్వరి, కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. నార్త్ ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, మల్లేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఇదిలా ఉండగా హేమంత్ మృతితో ఆగ్రహానికి గురైన అతని బంధువులు, స్నేహితులు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న ఆటోలోని ఇద్దరిపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కూడా ట్రాఫిక్ పోలీసులు విచారణ చేపట్టారు. -
డీఎస్సీ స్కామ్పై సీబీఐ విచారణ చేపట్టాలి
నెల్లూరురూరల్: రాష్ట్రంలో మెగా డీఎస్సీ నియామకాల పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని, ఈ వ్యవహారంపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 28న నెల్లూరులో చేపడుతున్న వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి నిరసన ర్యాలీ పోస్టర్లను నెల్లూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, గూడూరు పార్టీ సమన్వయకర్త బూదూరు గురవయ్య, యువజన, విద్యార్థి విభాగ నాయకులతో కలిసి కాకాణి సోమవారం ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. తొలుత కాకాణి మాట్లాడుతూ విద్యార్థులు, యువత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 28న నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు. మెగా డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత పూర్తిగా లోపించిందని, ప్రభుత్వం జీఓలను వరుసగా మార్చుతూ నిరుద్యోగులను తీవ్ర గందరగోళానికి గురిచేసిందని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా విషయంలో జీఓ ఎంఎస్4, 47, 56లను వరుసగా సవరించడం ద్వారా భారీ అవకతవకలకు తావిచ్చారని విమర్శించారు. సుమారు 420 మందికి పైగా స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమంగా ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపిస్తూ దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కాకాణి అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలని కోరారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు వైఎస్సార్సీపీ పూర్తి సంఘీభావం ప్రకటిస్తోందన్నారు. డీఎస్సీ అవకతవకలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పకుండా అధికారులతో ప్రెస్మీట్లు పెట్టించి తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోల వల్లే డీఎస్సీ నియామక ప్రక్రియ వివాదాస్పదంగా మారిందని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిందని మండిపడ్డారు. దేశంలో నీట్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అదే విధంగా రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ స్కామ్కు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ మెగా డీఎస్సీ కాస్త దగా డీఎస్సీగా మారిందని, డీఎస్సీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని చెబుతున్న ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. డీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ హామీని అమలు చేయకుండా యువతను మోసం చేశారని ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత హక్కుల సాధన కోసం, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, మంత్రి నారా లోకేశ్ రాజీనామా, ఫీజురీయింబర్స్మెంట్ బకాయిల విడుదల వంటి డిమాండ్లతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు భారీ విద్యార్థి, యువత నిరసన ర్యాలీ చేపడుతున్నామని తెలిపారు. యువత, విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. డీఎస్సీ అవకతవకలపై మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి విద్యార్థి, యువత సమస్యలపై పోరుబాట నేడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి విద్యార్థి, యువత నిరసన ర్యాలీ పోస్టర్ల ఆవిష్కరణ -
రూ.కోట్లు కొల్లగొట్టి
రెండేళ్ల టీడీపీ పరిపాలనలో ఇరిగేషన్శాఖ పనితీరు అస్తవ్యస్తంగా మారింది. కేవలం నేతల జేబులు నింపేందుకే అధికారులు పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రకృతి విలయతాండవాన్ని సైతం కాసులుగా మార్చుకుంటూ జిల్లా రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. గత ఏడాదిలో చూస్తే ఎఫ్డీఆర్ కింద దాదాపు రూ.100 కోట్లు, ఆర్ఆర్ఆర్ (రిపేర్స్ అండ్ రెన్యువేషన్ రీస్టోరేషన్) ద్వారా దాదాపు రూ.30 కోట్లు, ఓఅండ్ఎం ( ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ) ద్వారా దాదాపు రూ.100 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు. ఆయా పనులు సర్వేపల్లి, ఆత్మకూరు, నెల్లూరు రూరల్, కోవూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల అధికార పార్టీ నేతలకు భోజ్యంగా మారాయి. పనులు చేయకుండానే బిల్లులు పెట్టుకుంటున్నారు. అధికారులకు మాత్రం 20 శాతం కమీషన్ ఇస్తే చాలు బిల్లులు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాలువలకు గండ్లు కలువాయి మండలంలోని కుల్లూరు డీపీ–3 డిస్ట్రిబ్యూటరీ కాలువకు మూడు రోజుల క్రితం గండిపడింది. ఇటీవలే ఆ కాలువకు ఎఫ్డీఆర్ ద్వారా రూ, 4.5 లక్షలతో మరమ్మతులు చేసినట్లు చూపి బిల్లులు డ్రా చేసినట్లుగా ఆరోపణలున్నాయి. కానీ నీరు విడుదల చేయగానే గండిపడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ కాలువ కింద దాదాపు 600 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. కాలువకు గండిపడడంతో అధికారులు ప్రస్తుతం ఇసుకబస్తాలతో తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. ఇసుక బస్తాలకు కూడా మళ్లీ బిల్లులు పెట్టే అవకాశం లేకపోలేదు. అధికారులు, టీడీపీ నేతలతో కుమ్మకై ్క సొంత జేబులు నింపుకొనే ప్రయత్నాలు చేస్తుండడంపై రైతాంగం మండిపడుతోంది. ఇటీవలే సోమశిల దక్షణ కాలువ పరిధిలో ఎఫ్డీఆర్ నిధులు రూ.7 కోట్లతో దాదాపు 112 పనులు చేసినట్లుగా చూపి బిల్లులు డ్రా చేశారన్న ఆరోపణలున్నాయి. అలాగే బెజవాడ పాపిరెడ్డి కాలువ(కావలి కాలువ)కు భారీ గండి పడింది. సంగం మండలంలోని మర్రిపాడు గ్రామం వద్ద ఈ కాలువ సైఫన్ అక్విడెక్ట్ కొట్టుకుపోయింది. దీంతో కాలువలో వెళ్లాల్సిన సాగునీరు దువ్వూరు చెరువులోకి ప్రవహిస్తోంది. అక్కడ కూడా అధికారులు తాత్కాలికంగా ఇసుక బస్తాలు నింపి బిల్లులు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో కావలి కాలువ ఆధునికీకరణలో భాగంగా చేపట్టిన ప్యాకేజీ 94 పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్న విషయం తెల్సిందే. అప్పట్లో అక్రమాలకు పాల్పడిన అధికారే ప్రస్తుతం ఆ కాలువ బాధ్యతలు చూస్తుండడం విశేషం. నెల్లూరు ఇరిగేషన్ శాఖ అవినీతికి అడ్డాగా మారింది. టీడీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఆ శాఖ ఇంజినీర్లు పనిచేస్తున్నారు. వర్కులు చేయకున్నా 20 శాతం కమీషన్లతో బిల్లులు చేస్తున్నారు. దీంతో సాగునీటి కాలువలకు గండ్లు పడి ఆయకట్టుకు సాగునీరు సక్రమంగా అందని పరిస్థితి నెలకొంది. తాజాగా జిల్లాలోని కుల్లూరు డీపీ–3 డిస్ట్రిబ్యూటరీ కాలువ, కావలి కాలువకు గండ్లు పడడంతో వందలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం లేక రైతాంగం ఆందోళన చెందుతోంది. కేవలం తాము చెప్పినట్లుగా వినే అధికారులను నిబంధలకు విరుద్ధంగా ఇన్చార్జ్జిలుగా నియమించుకుని అధికార పార్టీ నేతలు ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. –సాక్షి ప్రతినిధి, నెల్లూరు ఇన్చార్జిల పాలనలో ఇరిగేషన్ శాఖ ఎఫ్డీఆర్, ఆర్ఆర్ఆర్, ఓఎండ్ఎం పనుల్లో చేతివాటం పనులు చేయకుండానే నిధుల ఆరగింత అధికారులకు 20 శాతం కమీషన్లు కార్యాలయాలకే పరిమితమవుతున్న ఇంజినీర్లు కుల్లూరులో డీపీ–3 డిస్ట్రిబ్యూటరీ కాలువకు గండి సంగంలో కావలి కాలువకు గండి ఆందోళనలో అన్నదాతలు ఇన్చార్జిల పాలనతో..జిల్లాలో ఇరిగేషన్ శాఖ అంతా ఇన్చార్జి అధికారుల పాలనలోనే కొనసాగుతోంది. రెగ్యులర్ అధికారులు ఉంటే ఎక్కడ తమ జేబులు నింపరోనని టీడీపీ ఎమ్మెల్యేలు తమ చెప్పుచేతుల్లో ఉండే అధికారులను నిబంధనలకు విరుద్ధంగా ఇన్చార్జులుగా పోస్టుల్లో కూర్చోబెట్టి బిల్లులు చేయించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం తెలుగుగంగ, సోమశిల ఎస్ఈ పోస్టుల్లో సైతం ఇన్చార్జిలే కొనసాగుతున్నారు. అలాగే వెంకటగిరి డీఈగా పనిచేసే అధికారికి గూడూరు డివిజన్ ఈఈ పోస్టులో కూర్చోబెట్టారు. కావలి ఈఈతో పాటు డీఈ పోస్టుల్లో కూడా ఇన్చార్జిలే కొనసాగుతున్నారు. ఉదయగిరి డీఈని నెల్లూరు డ్రైనేజీ ఈఈగా, నెల్లూరు డివిజన్ డీఈగా ఉన్న అధికారికి తెలుగుగంగ ఈఈగా అదనపు బాధ్యతలను అప్పగించి జేబులు నింపుకొనే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ శాఖ మరో అడుగు ముందుకేసి పలనాడు జిల్లాలో పనిచేసే అధికారికి డైవర్షన్ కింద ఉదయగిరి, ఆత్మకూరు డీఈగా బాధ్యతలు అప్పగించారంటే ఆ శాఖలోని పరిస్థితి తేటతెల్లం అవుతుంది. అలాగే వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠం లో పనిచేసే అధికారిని ఆత్మకూరుకు డైవర్షన్ చేశారు. అలాగే పొదలకూరులో ఏఈగా పనిచేసే అధికారిని ఇన్చార్జి డీఈ నియమించుకుని అధికార పార్టీ నేతలు తమ జేబులు నింపుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నాణ్యత చూడకుండానే.. జిల్లా ఇరిగేషన్ శాఖలో క్వాలిటీ కంట్రోల్ అధికారులు కేవలం పర్సెంటేజీల కోసమే పనిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఈఈ తిరుపతికి పరిమితం కావడం, డీఈ, ఏఈ స్థాయి అధికారులు కార్యాలయాలకే పరిమితమై 5 శాతం కమీషన్తో పనులు పరిశీలన చేయకుండానే సర్టిఫై చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. -
జిల్లాలో సర్ ప్రక్రియ విజయవంతం
● మ్యాపింగ్ కాని ఓటర్లకు మరో అవకాశం ● 31న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల ● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(అర్బన్): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్లకు సంబంధించి చేపట్టిన సర్ ప్రక్రియ 100 శాతం విజయవంతం అయిందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. సోమవారం సర్ ప్రక్రియపై కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. జూన్ 15 నుంచి ఈ నెల 24 వరకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించడానికి అధికారులు, సచివాలయ సిబ్బంది, బీఎల్వో లు అహర్నిశలు శ్రమించారన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. జిల్లాలో గతంలో 19,74,240 మంది ఓటర్లు ఉండగా, 16,83,557 మంది ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించి 85.28శాతం మ్యాపింగ్ పూర్తి చేశామన్నారు. వారిని 2002 ఓటర్ల జాబితాలోని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వివరాల ఆధారంగా అనుసంధానం చేశామన్నారు. మ్యాపింగ్ కాని 1.8 శాతం ఓటర్లకు నోటీసులు జారీ చేస్తామన్నారు. ప్రభుత్వం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదోకటి ఈఆర్ఓకు సమర్పిస్తే వారి ఓటు హక్కు కొనసాగుతుందన్నారు. వారికి ఇంకో అవకాశం కల్పించామన్నారు. 38,645 డూప్లికేట్ ఓట్లను తొలగించడం జరిగిందన్నారు. శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన 1,13,421 మంది ఓటర్లు, మృతి చెందిన 80,699 మంది ఓట్లను పక్కన పెట్టేశామన్నా రు. 57,077 మంది ఓటర్లు అందుబాటులో లేని వారిగా గుర్తించామన్నారు. ఈ నెల 31న ఓటర్ల ముసాయిదా జాబితా(డ్రాప్ట్)ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచురిస్తామన్నారు. అనంతరం 30 రోజల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. అర్హులైన వారి పేర్లు లేకపోతే ఈఆర్వోలను సంప్రదించి ఓటు వివరాలను సవరించుకోవచ్చని తెలిపా రు. కాగా అధికారులతో కలిసి సర్ ప్రక్రియ నిర్వహించిన వారిపై ఏమి చర్యలు తీసుకున్నారని విలేకరులు నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ నందన్ను ఉద్దేశించి ప్రశ్నించగా ఈ విషయమై ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చామన్నారు. సీఈఓ దృష్టికి తీసుకెళ్లామన్నారు. చట్టపరంగా పరిశీలించి చర్యలు తీసుకుంటారన్నారు. ఈ సమావేశంలో జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
లోకేశ్ రాజీనామా చేయాలి
● మేకపాటి రాజగోపాల్రెడ్డి ఉదయగిరి: డీఎస్సీ పరీక్షల్లో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని ఉదయగిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. డీఎస్సీలో అక్రమాలతో ఎంతో మంది ప్రతిభ ఉన్న విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో ఆ కుటుంబాలు రోదిస్తున్నాయన్నారు. ఏళ్ల తరబడి కోచింగ్లు తీసుకొని ఎంతో ఖర్చు చేసి కష్టపడి చదివి, పరీక్షలు రాస్తే ప్రతిభ ఉన్న వారిని కాదని, అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారన్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ విభాగంలో అక్రమా లు జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నా.. బాధ్యులపై ఇంత వరకు ప్రభు త్వం చర్యలు తీసుకోకపోవడంతో విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ అనర్హుడన్నారు. -
మనస్తాపంతో వ్యక్తి బలవన్మరణం
ఉదయగిరి: పట్టణంలోని కోళ్లవీధికి చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. ఉదయగిరికి చెందిన షేక్ అలీ అక్బర్ (60) గతంలో దుబాయిలో డ్రైవర్గా పనిచేశాడు. కొంతకాలం క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అతని భార్య హబీబా అనారోగ్యంతో బాధపడుతుండగా, వీరికి సంతానం లేదు. నెలరోజుల క్రితం హబీబాకు గుండెపోటు రావడంతో చికిత్స చేయించాడు. అప్పటి నుంచి ఆమెకు సంబంధించిన అన్ని పనులను అలీ చూసుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలో అతను కొంతకాలంగా మనస్తాపానికి గురయ్యేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం హబీబా ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో అలీ ఇంట్లో తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతసేపటి తర్వాత భార్య ఇంట్లోకి వెళ్లి చూసి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వెంటనే అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అలీ మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై మహేంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించి, బంధువుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు. -
జగన్ నాయకత్వాన్ని జనం కోరుకుంటున్నారు
● అధికారం లేకున్నా వైఎస్సార్సీపీలో చేరికలు ● మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిముత్తుకూరు(పొదలకూరు): ‘ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అధికారం లేకున్నా టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరికలే ఇందుకు నిదర్శనం’ అని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామానికి చెందిన 20 కుటుంబాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం మండల పార్టీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో కాకాణి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గూడూరు సమన్వయకర్త గురవయ్య సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా కాకాణి వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. కాకాణి మాట్లాడుతూ అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలో ఉన్న తమ పార్టీలో చేరడం చూస్తే కూటమి ప్రభుత్వంపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి వైఎస్సార్సీపీకే సాధ్యమన్నారు. తాళ్లపూడిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని అధికారంలో ఉన్న టీడీపీ కనీసం మంచినీటిని కూడా గ్రామస్తులకు అందించకపోతున్నట్టు ఆరోపించారు. హైకోర్టుకు వెళ్లి గ్రామస్తులకు గుక్కెడు మంచినీటిని అందివ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టు తెలిపారు. కక్షసాధింపులు తప్పించి అభివృద్ధి పనులు లేవన్నారు. తమ నాయకత్వంపై నమ్మకంతో అధికారం వీడి వైఎస్సార్సీపీలోకి రావడం సాహసోపేతమైన చర్యగా తెలిపారు. పా ర్టీలోకి వచ్చిన వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. చేరికల పేరుతో టీడీపీ డ్రామాలకు తెరలేపినట్టు కాకాణి విమర్శించారు. ఆ పార్టీలోకి కొత్తవారు చేరకపోవడంతో ఉన్నవారినే చేర్చుకుంటూ డ్రామాలు ఆడుతున్నట్టు ఆరోపించారు. -
యంత్ర భాగ్యం.. రైతులకు దక్కేనా?
● యాంత్రీకరణ పథకం అమలులో జాప్యం ● జిల్లాకు కేటాయించింది తక్కువ మొత్తమే.. ● 2025 – 26 నిధులు ఇప్పటికీ ఖర్చు కాని పరిస్థితి ● కూలీల కొరత, పెరిగిన వ్యయంతో ఇబ్బందులునెల్లూరు(వేదాయపాళెం): రైతులకు సబ్సిడీపై అందించాల్సిన వ్యవసాయ యంత్రాల పంపిణీ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో యాంత్రీకరణ లక్ష్యమే ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యయాన్ని తగ్గించి, అధిక దిగుబడులు సాధించేందుకు ఉద్దేశించిన సబ్ మెషీన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (ఎస్ఎంఏఎం) పథకం అమలులో జాప్యం కారణంగా రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఏం చేయాలంటే.. ఈ పథకం కింద మినీ ట్రాక్టర్లు, 40 హెచ్పీ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, రోటావేటర్లు, విత్తన గొర్రులు, గుంతలు తీసే యంత్రాలు, స్ప్రేయర్లు తదితర వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అర్హులైన రైతులకు అందించాల్సి ఉంది. అయితే జిల్లాలకు నిధులిచ్చినా.. లబ్ధిదారుల ఎంపిక, యంత్రాల పంపిణీపై స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులు కేటాయించినప్పటికీ, 2026 – 27 ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలు గడిచినా యంత్రాల పంపిణీ ప్రారంభం కాకపోవడం రైతుల్లో అసంతృప్తి పెంచుతోంది. ప్రభుత్వం ప్రకటించిన పథకం అమలులో జాప్యం వల్ల నిధులు వినియోగం కాకుండానే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. కేవలం రూ.4 కోట్లే.. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో సుమారు 4.48 లక్షల ఎకరాల సాగు భూమి, 3.75 లక్షల మంది రైతులున్నారు. ఇంత పెద్ద వ్యవసాయ విస్తీర్ణం ఉన్న జిల్లాకు మెకనైజేషన్ కింద కేవలం రూ.4.1 కోట్లు మాత్రమే కేటాయించారు. సమీప జిల్లాలకు రూ.7 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకు నిధులు మంజూరు చేసినట్లు చెబుతున్నారు. కానీ కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావంతో వ్యవసాయం సవాళ్లను ఎదుర్కొంటోంది. మరోవైపు కూలీల కొరత, పెరిగిన వ్యయం రైతులపై అదనపు భారం మోపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యంత్రాలు అందుబాటులోకి వస్తే సాగు ఖర్చు తగ్గడంతోపాటు పనులు వేగంగా పూర్తై దిగుబడులు మెరుగుపడే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. సకాలంలో యంత్రాల పంపిణీ చేపట్టి మెకనైజేషన్ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.త్వరలో అర్హుల జాబితా ప్రకటిస్తాంజిల్లా వ్యాప్తంగా 250 మంది దరఖాస్తు చేసుకున్నారు. అతి త్వరలో అర్హుల జాబితా ప్రకటించి యంత్ర సామగ్రిని అప్పగిస్తాం. – పి.సత్యవాణి, జిల్లా వ్యవసాయాధికారిణి -
బెజవాడ పాపిరెడ్డి కాలువకు భారీ గండి
● సైఫన్ ఆక్విడెక్ట్ కొట్టుకుపోయి దువ్వూరు చెరువులోకి సాగునీరు సంగం: జలవనరుల శాఖ నిర్వహణా లోపం, నిర్లక్ష్యానికి బెజవాడ పాపిరెడ్డి (కావలి) కాలువపై మండలంలోని మర్రిపాడు సమీపంలో నిర్మించిన సైఫన్ అక్విడెక్ట్ కొట్టుకుపోయింది. దీంతో కావలి కాలువకు గండి పడడంతో ఆ కాలువలో వెళ్లాల్సిన సాగునీరంతా దువ్వూరు చెరువులోకి ప్రవహిస్తోంది. అధికారుల నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణమని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల కథనం ప్రకారం, సైఫన్ అక్విడెక్ట్కు కొద్ది రోజుల క్రితమే స్వల్పంగా గండి పడింది. అప్పుడే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి, కాలువలో నీటి మట్టాన్ని తగ్గించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపించారు. సమస్యను ముందుగానే పరిష్కరించి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు మండిపడుతున్నారు. శనివారం గండిపడిన ప్రాంతంలో ఇసుక బస్తాలు వేసి చేతులు దులుపుకున్న అధికారులు, అసలు సమస్యను పరిష్కరించకుండా తాత్కాలిక చర్యలకే పరిమితమయ్యారని రైతులు విమర్శించారు. దీంతో కాలువలో నీటి ఒత్తిడి మరింత పెరిగి ఆదివారం సైఫన్ అక్విడెక్ట్ పూర్తిగా కూలిపోయిందని తెలిపారు. ఫలితంగా భారీగా నీరు బయటకు వెళ్లిపోతూ దువ్వూరు చెరువులోకి చేరుతోంది. ఈ ఘటనతో మర్రిపాడు రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. వ్యవసాయ పొలాలకు వెళ్లే దారి పూర్తిగా దెబ్బతినడంతో వందలాది ఎకరాల్లో సాగు పనులు నిలిచిపోయాయి. ఇప్పటికే సాగులో ఉన్న పంటల సంరక్షణకు కూడా పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే బెజవాడ పాపిరెడ్డి కాలువలో నీటి మట్టాన్ని తగ్గించి అత్యవసర రక్షణ చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. లేకుంటే మరింత పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
కన్నపేగుకే కన్నీటి శిక్ష
● ఆస్తి కోసం వృద్ధ తండ్రిని రోడ్డున పడేసిన కుమారులు ఆత్మకూరురూరల్: కన్నప్రేమ కడతేరిపోతోంది. అనురాగాల పందిరి కింద ఆస్తుల చిచ్చు రగులుతోంది. వృద్ధాప్యంలో ఆసరాగా నిలవాల్సిన కన్న కొడుకులే, ఆస్తి పంపకాల కోసం కన్న తండ్రిని వీధుల పాలు చేసిన దయనీయ ఉదంతమిది. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను పెంచి పెద్ద చేసి, వారి భవిష్యత్ కోసం ఆస్తిని సమకూర్చిన ఆ తండ్రికి ఇప్పుడు అశ్రునయనాలు, అనాథ బతుకు మిగిలింది. రామస్వామిపల్లి గ్రామానికి చెందిన వద్ది రమణయ్య తన జీవితకాలంలో కష్టపడి 8 ఎకరాల పొలం, రెండిళ్లను సంపాదించాడు. కొడుకులిద్దరికీ ఏ లోటు రాకూడదని భావించిన ఆ తండ్రి స్వేదమే ఆ ఆస్తులకు పునాది. పెద్ద కుమారుడు కరెంట్ పని చేస్తూ, ఇటీవల పక్షవాతం బారిన పడ్డాడు. చిన్న కొడుకు ఓ సబ్స్టేషన్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. అయితే వృద్ధాప్యంలో ఉన్న ఆ తండ్రికి విశ్రాంతినివ్వాల్సిన కొడుకులు, కోడళ్లు, అతడు కష్టపడి సంపాదించిన ఆస్తులపై కన్నేశారు. ఆస్తి నాకంటే నాకే రాయాలి అని ఒకరు, నాకు అనుకూలంగా ఇవ్వాలి అని మరొకరు నరకాన్ని చూపుతున్నారు. వయసు మళ్లడంతో రమణయ్యకు వినికిడి శక్తి బాగా తగ్గింది. ఎదుటి వారు గట్టిగా చెబితే తప్ప మాటలు వినపడవు. కానీ ఆ అశక్తతను కూడా కనికరించకుండా, కొడుకులతోపాటు ఆయన కోడళ్లు కూడా కలిసి వృద్ధుడిపై భౌతిక దాడులకు, తీవ్ర మానసిక వేధింపులకు పాల్పడుతుండడం మానవత్వానికే మచ్చ. ఆస్తులను తమ పేరిట రాయించుకోవడానికి ఆ వృద్ధుడిని సొంత ఇంటి నుంచే తరిమేశారు. విధి లేక ఆ తండ్రి ఆత్మకూరు వీధుల్లో, ప్రభుత్వాస్పత్రి, మున్సిపల్ కార్యాలయాల సమీపంలో కాలం వెళ్లదీస్తున్నాడు. తనను కన్న బిడ్డలు, కోడళ్లే కలిసి వేధిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని ఆ వృద్ధుడు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. ఇది కుటుంబ పంచాయితీ, కోర్టులోనే తేల్చుకోండని అధికారులు చేతులెత్తేయడంతో ఆ తండ్రి ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. ఇతని కన్నీటి గాధ తెలిసిన ప్రతి ఒక్కరి మనసు చలించిపోతుందే కానీ కన్న కుమారులు, కోడళ్ల మనసులు మాత్రం కరగడం లేదు. చట్టాలు, సివిల్ నిబంధనల కంటే ముందు మానవతా ధృక్పథంతో స్పందించి, ఆ వృద్ధుడికి తగిన రక్షణ, ప్రశాంతమైన జీవితం లభించేలా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఇసుక టిప్పర్ల అడ్డగింత
సంగం: బీరాపేరు బ్రిడ్జి సమీపంలోని అనధికారికంగా నిర్వహిస్తున్న ఇసుక రీచ్ వద్ద టిప్పర్ల రాకపోకలపై రైతుల ఆగ్రహం భగ్గుమంది. ఆదివారం బైక్లను రోడ్డుకు అడ్డంగా నిలిపి రీచ్కు వెళ్లే టిప్పర్లను అడ్డుకుని నిరసన చేపట్టారు. ఇసుక టిప్పర్ల రాకపోకలతో రేగుతున్న దుమ్ముతో తమ పంటలు తీవ్ర నష్టం కలుగుతున్నా.. అధికారులు, రీచ్ నిర్వాహకులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ప్రతి రోజూ వందల టిప్పర్లు రాక పోకలు సాగిస్తుండడంతో పంటలు దుమ్ముతో నిండిపోతున్నాయని, దీంతో తీవ్ర నష్టం కలుగుతోందని తెలిపారు. దుమ్ము కారణంగా గ్రామస్తులు శ్వాస సంబంధిత ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారన్నారు. ఇసుక తరలింపుతో కోట్లా ది రూపాయల ఆదాయం వస్తున్నా, రైతుల సమస్యలపై మాత్రం అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక రవాణాను పూర్తిగా నిలిపివేసి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 84,488 మంది దర్శించుకున్నారు. 37,061 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.78 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
మినీ మార్టులుగా చౌకదుకాణాలు
● డీఎస్ఓ పుల్లయ్య నెల్లూరు (పొగతోట): జిల్లాలో 150 చౌకదుకాణాలను మినీమార్టులుగా మార్పులు చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని డీఎస్ఓ పుల్లయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1513 చౌకదుకాణాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం మండలానికి ఐదు చొప్పున మినీ మార్టులుగా మార్చేందుకు తహసీల్దార్లు, సీఎస్డీటీలు సమన్వయంతో ఎంపిక చేస్తారన్నారు. మినీ మార్టులుగా మార్పు చేయడానికి ఫ్రంటీర్ మార్కెట్ సంస్థకు రేషన్ షాపు డీలర్ రూ.10 వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. చౌకదుకాణంలో అన్ని ఏర్పాట్లు చేసి మొబైల్ అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి నెలా 24వ తేదీలోపు డీలర్ అవసరమైన సరుకులు సరఫరా చేయడానికి ఇండెంట్ పెట్టాల్సి ఉంటుందన్నారు. సరుకుల కోసం డీలర్ ముందుగానే నగదు చెల్లించాలన్నారు. అవసరమైన డీలర్లకు బ్యాంకుల ద్వారా రూ.లక్ష వరకు రుణం మంజూరు చేయిస్తామన్నారు. డీలర్ ప్రతి నెలా రూ.800 లేదా ఒకే పర్యాయం నగదు బ్యాంకులకు తిరిగి రుణాన్ని కంతులుగా చెల్లించాలన్నారు. బీజేపీతో వ్యవస్థలు చిన్నాభిన్నం ● సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ గూడూరు: కేంద్రంలో బీజేపీ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ దేశంలో వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తోందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ విమర్శించారు. గూడూరులో ఆదివారం జరిగిన సీపీఐ నేత ప్రభాకర్ సంతాప సభకు హాజరైన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో అన్ని వ్యవస్థలను విచ్ఛి న్నం చేస్తూ పాలన కొనసాగిస్తున్న బీజేపీ విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించిందన్నారు. నీట్ ప్రశ్న పత్రం లీక్ చేసి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ను అగాధంలోకి నెట్టిందన్నారు. దీనిపై నిరసనలకు తలొగ్గి కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థులు సాధించిన గొప్ప విజయమన్నారు. ఇలానే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలా ప్రతి విషయంలో యువత పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడాలని పిలుపు నిచ్చారు. కార్మిక, ప్రజా వ్యతిరేక పోరాటలకు సిద్ధమవ్వాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో కూడా సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనపై పోరాటం సాగించాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, నాయకులు జమాలుల్లా, సునీల్, నారాయణ, రమేష్ బీకేఎంయూ నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు. ఎయిర్ రైఫిల్లో గోల్డ్ మెడల్ మనుబోలు: మండలంలోని పిడూరు గ్రామానికి చెందిన ఒరువూరు నైనిక అండర్–14 ఎయిర్ రైఫిల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. నర్సయ్య, రజిని దంపతుల కుమార్తె నైనిక కృష్ణపట్నంలోని అదానీ వరల్డ్ స్కూల్లో ఏడో తరగతి చదువుతోంది. ఇటీవల తమిళనాడులోని తిరుచ్చిలో నిర్వహించిన సౌత్ జోన్ అండర్–14 విభాగం ఎయిర్ రైఫిల్ షూటింగ్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. దీంతో నైనికను ఆదివారం పలువురు అభినందించారు. -
ఉద్యోగుల విభజన.. అంతా గందరగోళం
నెల్లూరు(అర్బన్): పరిపాలనా సౌలభ్యం కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022లో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించింది. అప్పట్లో కొత్త జిల్లాల్లో పరిపాలనకు ఇబ్బంది లేకుండా పాత జిల్లాల నుంచి ఉద్యోగులను సర్దుబాటు ప్రక్రియలో నియమించారు. స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఉద్యోగులను విభజించేందుకు 2025 డిసెంబర్ 15న రాష్ట్రపతి ఉత్తర్వులు (ప్రెసిడెన్షియల్ ఆర్డర్) జారీ అయ్యాయి. కొత్త జిల్లాలకు అనుగుణంగా స్థానిక కేడర్లను పునర్వ్యవస్థీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం కల్పించారు. ఈ ప్రక్రియను 18 నెలల్లోపు పూర్తి చేయాలని పేర్కొన్నారు. అయితే గడువు ముగియడానికి ఇంకా దాదాపు ఏడాది సమయం ఉన్నప్పటికీ, వచ్చే నెలలోపు ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోనూ కలెక్టర్ ఆధ్వర్యంలో హడావుడిగా ఈ తంతు కొనసాగుతోంది. ఈ తొందరపాటు వల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళిక లేకుండానే.. ఉద్యోగులకు సంబంధించి టీఏ, డీఏ, ఐఆర్, పీఆర్సీ బకాయిలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు అవుతోంది. ఉద్యోగుల బదిలీలపై ఫ్రీజింగ్ కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో విభజన చేపడితే పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుంది. కొత్త జిల్లాల్లో ఇల్లు వెతుక్కోవడం, అద్దెలు చెల్లించడం, పిల్లల్ని కొత్త పాఠశాలల్లో చేర్పించడం, రవాణా ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ కూడా ఇబ్బందిగా మారుతుంది. ఫలితంగా ఉద్యోగులపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. తొందరపాటు విభజనతో సీనియర్, జూనియర్ ఉద్యోగుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. కొత్త జిల్లాల ప్రకారం.. గతంలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో గూడూరును తిరుపతి జిల్లాలో, కందుకూరును నెల్లూరు జిల్లాలో కలిపారు. ఆ మేరకే రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే అనంతరం కూటమి ప్రభుత్వం గూడూరును తిరిగి నెల్లూరులో, కందుకూరును ప్రకాశం జిల్లాలో విలీనం చేసింది. దీంతో అప్పటి కొత్త జిల్లాల ఆధారంగా జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రస్తుతం గూడూరు, కందుకూరుకు వర్తిస్తాయా? లేదా? అనే సందిగ్ధత నెలకొంది. అయినప్పటికీ విభజన ప్రక్రియ కొనసాగుతుండటంపై ఉద్యోగులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జూనియర్లకే ఎక్కువ నష్టమా? విభజనకు సంబంధించి ఇప్పటికే ఆప్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగులు తమ ఆప్షన్లు నమోదు చేస్తున్నారు. అయితే స్థానికతకు పెద్దపీట వేయకుండా సీనియార్టీని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటున్నారని జూనియర్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు తడకు చెందిన ఓ వ్యక్తి నెల్లూరు కోరుకుంటాడు. నెల్లూరులో ఉండే జూనియర్ ఇక్కడ నుంచి పక్క జిల్లాలోని సుదూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. అంతేకాకుండా పదోన్నతులు, ఇంక్రిమెంట్లలో కూడా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. విభజనతో సీనియర్లు, జూనియర్లు అనే రెండు వర్గాలుగా ఉద్యోగులు విడిపోయే పరిస్థితి నెలకొంది. జిల్లాలో అన్ని శాఖల్లో కలిపి సుమారు 18 వేల మంది ఉద్యోగులున్నారు. వీరిలో కనీసం 4,300 మంది వరకు తిరుపతి జిల్లాకు వెళ్లాల్సి ఉంటుంది. రెవెన్యూ, వైద్య, పోలీసు, ఉపాధ్యాయ తదితర 50కి పైగా శాఖల్లోని ఉద్యోగులు వేరే జిల్లాలకు వెళ్లిపోవాల్సి వస్తుంది. జోన్ కేడర్ నుంచి జిల్లా కేడర్ వరకు ఇలా జరుగుతుంది. దీంతో తాము తీవ్రంగా నష్టపోనున్నామని కొందరు పేర్కొంటున్నారు. ఇలా చేస్తే.. జిల్లాల వారీగా అన్ని ప్రభుత్వ శాఖల్లో కొత్త జోన్లు, జిల్లా, డివిజన్ల వారీగా ఉద్యోగుల భర్తీ, కేటాయింపుల కోసం తగిన గడువు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇప్పటికీ అనేక శాఖల్లో సీనియారిటీ జాబితాలు సిద్ధం కాలేదు. ఇతర జిల్లాలకు కేటాయింపులపై అభ్యంతరాలు తెలిపేందుకు కనీసం 30 రోజుల గడువు ఇవ్వాలని, అప్పీళ్లను పరిశీలించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈలోపు పెండింగ్లో ఉన్న పదోన్నతులు కల్పించి, బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తొందరపాటు కాకుండా వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలని, లేదంటే న్యాయపరమైన, కోర్టు సంబంధిత సమస్యలతో పాటు సీనియర్, జూనియర్ ఉద్యోగుల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. గడువున్నా రాష్ట్రపతి ఉత్తర్వుల పేరుతో హడావుడి కొంతమందికి తీవ్ర అన్యాయం? తొందరపాటు నిర్ణయాలు వద్దంటున్న ఉద్యోగులు గడువు ఇచ్చి అభ్యంతరాలు స్వీకరించాలని విజ్ఞప్తి -
డ్రంక్ అండ్ డ్రైవ్పై 15 కేసులు
● జిల్లా వ్యాప్తంగా నాకాబందీ ● బహిరంగ మద్యసేవనంపై 28 కేసులు నెల్లూరు(క్రైమ్): జిల్లా వ్యాప్తంగా పోలీసులు శనివారం అర్ధరాత్రి వరకు నాకాబందీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారులు, జిల్లా ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్పై 15 కేసులు నమోదు చేశారు. అలాగే మోటార్ వాహనాల చట్టం (ఎంవీ యాక్ట్) కింద 389 కేసులు నమోదు చేసి రూ.1,39,700 జరిమానా విధించారు. బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై 28 కేసులు పెట్టారు. అనంతరం పలు లాడ్జీలను కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, చెక్పోస్టుల వద్ద పహారా మరింత పెంచామని తెలిపారు. ప్రజలు తమ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించినా వెంటనే సమీప పోలీస్స్టేషన్కు, డయల్ 100/112కు లేదా జిల్లా కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 93929 03143కు సమాచారం అందించాలని కోరారు. -
కోటయ్య సేవలు చిరస్మరణీయం
● డీఆర్వో విజయకుమార్ నెల్లూరురూరల్: ‘ప్రగడ కోటయ్య చేనేత కార్మికులు, రైతులు, బలహీనవర్గాల సంక్షేమానికి జీవితాంతం అంకితభావంతో కృషి చేశారు. ఆయన సేవలు చిరస్మరణీయం’ అని డీఆర్వో విజయకుమార్ అన్నారు. కోటయ్య జయంతిని ఆదివారం నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ కోటయ్య చేనేత కార్మికుల సమస్యలపై అధ్యయనం చేసి, రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించడం ద్వారా మరిన్ని సహకార సంఘాల ఏర్పాటుకు ప్రోత్సాహం అందించారని చెప్పారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించిన కోటయ్య వంటి మహనీయుల జీవితాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య మాట్లాడుతూ కోటయ్య యుక్త వయసు నుంచే చేనేత, వ్యవసాయ కార్మికుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. వ్యవసాయ కార్మికుల కోసం కూడా భూ పోరాటాలు నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా నేతన్నలు బైన ఏడుకొండలు (పాటూరు), పొనగంటి సింహబలుడు నారాయణరెడ్డి, కుండా సుబ్బారావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా చేనేత, జౌళి శాఖాధికారి దావులూరి ఐజయ్య, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ తల్లా నరసింహస్వామి, రాష్ట్ర చేనేత సంఘాల నాయకులు కేవీ శేషయ్య, కాటికాల వెంకటేశ్వర్లు, బి.బాలాజీ, జె.రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
నేడు ‘డయల్ యువర్ ఎస్ఈ’
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారులు సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ పరిధిలో ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని ఎస్ఈ రాఘవేంద్రం సోమవారం నిర్వహించనున్నారు. నెల్లూరు విద్యుత్ భవన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. వినియోగదారులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు. ● తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం సీఎండీ శివశంకర్ ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వినియోగదారులు 89777 16661 నంబర్కు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు. రాష్ట్ర స్థాయి రోయింగ్ పోటీల్లో జిల్లాకు పతకాలు నెల్లూరు (టౌన్): రాష్ట్ర స్థాయి రోయింగ్ చాంపియన్షిప్ పోటీల్లో నెల్లూరు క్రీడాకారులు సత్తా చాటారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఎర్రకాలువ వాటర్ స్పోర్ట్స్ సెంటర్లో ఆదివారం స్కల్లింగ్ అండ్ రోయింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో సింగిల్, డబుల్ స్కల్స్ అంశాలపై పోటీలు జరిగాయి. సబ్ జూనియర్ బాలుర విభాగంలో ఎం.కుశాల్ (బంగారు పతకం), బాలికల విభాగంలో ఎం.జాగృతి (కాంస్య పతకం) సాధించారు. బీసీ కాలనీలో నగదు, బంగారం చోరీవింజమూరు(ఉదయగిరి): వింజమూరు పట్టణంలోని బీసీ కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు.. కాలనీకి చెందిన ఉప్పు కృష్ణంరాజు, పద్మ దంపతులు శనివారం ఉదయం మాలకొండకు వెళ్లి స్వామిని దర్శించుకుని సాయంత్రం ఇంటికి వచ్చారు. అప్పటికే ఇంటికి వేసి ఉన్న తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. లోనికి వెళ్లి పరిశీలించగా బీరువా తాళం తీసి అందులో ఉన్న రూ.15 వేల నగదు, రెండు బంగారు ఉంగరాలు, జత కమ్మలు, కొన్ని వెండి వస్తువులు తీసుకెళ్లినట్లు గుర్తించారు.28, 29 తేదీల్లో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పర్యటననెల్లూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ ఏవీఎస్ సూర్యనారాయణ రాజు, సభ్యురాలు కేజీ వెంకట పద్మలత ఈనెల 28, 29 తేదీల్లో జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటిరోజు పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, స్కాన్ సెంటర్లు, బాలల గృహాలు, పరిశ్రమలు తదితరాల్లో పరిస్థితులను పరిశీలిస్తారన్నారు. 29న కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో బాలల, రక్షణ, బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టం అమలు, బాల కార్మిక నిర్మూలన, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల భద్రత, శిశు ఆరోగ్యం, హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహిస్తారన్నారు. అనంతరం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలతో సమావేశమై వినతులు స్వీకరిస్తారని తెలియజేశారు.నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.45 సన్నవి : రూ.25 పండ్లు : రూ.10 -
సాగునీటికి దుర్భిక్ష ఘంటికలు
జిల్లాలో సాగునీటి భవిష్యత్పై దుర్భిక్ష మేఘాలు కమ్ముకుంటున్నాయి. కండలేరు, సోమశిల జలాశయాల్లో రోజు రోజుకూ క్షీణిస్తున్న నీటి నిల్వలు ఖరీఫ్ సాగుతోపాటు తాగునీటి భద్రతపైనా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలపై ఆశలు సన్నగిల్లగా, మరో వైపు చైన్నెతోపాటు జిల్లాలోని తాగునీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించకపోతే రానున్న రోజుల్లో సాగునీటికే కాదు.. తాగునీటికీ తీవ్ర సంక్షోభం తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. కండలేరు జలాశయం పొదలకూరు: మెట్ట ప్రాంత వరప్రసాదిని కండలేరు జలాశయంలో నీటి మట్టం పడిపోతున్న కొద్దీ జిల్లా వ్యవసాయ భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కరువై, జలాశయాలకు వరద ప్రవాహాలు నిలిచిపోవడంతో సాగునీటి సరఫరాపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. సకాలంలో వర్షాలు కురవకున్నా పైతట్టు నుంచి వరద ప్రవాహం లేకున్నా వ్యవసాయ రంగానికి నీటి విడుదల అటుంచి తాగునీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జిల్లాకే తలమానికమైన సోమశిల జలాశయానికి ఇన్ఫ్లో పూర్తిగా ఆగిపోయింది. ప్రస్తుతం 31 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా అందులో 8 టీఎంసీల వరకు డెడ్ స్టోరేజీ కింద నిల్వ ఉంచాలి. మిగిలిన నీటిని సాగు, తాగునీటికి వినియోగించాల్సి ఉంటుంది. కండలేరులో 6 టీఎంసీల డెడ్ స్టోరేజీ ఉంచాల్సి ఉండగా చైన్నె తాగునీటి అవసరాలకు నీటి విడుదలను పెంపొందించాల్సిందిగా ఆ రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారుల బృందం కండలేరుకు వచ్చి కోరింది. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా సోమశిల, కండలేరు జలాలను తాగునీటికి వినియోగిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ల కింద సమగ్ర రక్షిత మంచి నీటి సరఫరా (సీపీడబ్ల్యూఎస్ స్కీమ్స్) పథకాల ఉన్నాయి. ఎల్నినో కారణంగా విపరీతమైన భూతాపం పెరుగుతోంది. ఫలితంగా వర్షాలు, వరదలపై నమ్మకం పెట్టుకోవాల్సిన పనిలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. వ్యవసాయశాఖ అధికారులు ముందస్తుగానే గ్రామాల్లో తక్కువ నీటి వినియోగంతో పండే పంటలను సాగు చేయాల్సిందిగా సూచిస్తున్నారు. రెండు ప్రాజెక్ట్ల కింద రబీలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సుమారు 7 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుంటారు. పొదలకూరు, మనుబోలు మండలాల్లోని కొన్ని గ్రామాలకు కండలేరు ఏటి కాలువకు ప్రాజెక్ట్ లోలెవల్ స్లూయిజ్ ద్వారా నిరంతరాయంగా స్వల్పంగానైనా సాగునీటిని విడుదల చేస్తుంటారు. రాపూరు మండలం సంక్రాంతిపల్లి పికప్ ఆనకట్ట నుంచి పిన్నేరు వాగు ద్వారా మనుబోలు మండలంలోని మరికొన్ని గ్రామాలకు తాగు, సాగునీరు అందుతుంది. 30 టీఎంసీలు ఉంటేనే గ్రావిటీ నీరు కండలేరు ఎడమ కాలువ మెట్టరైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ కాలువకు 300 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కాలువ వెంబడి చాలా మంది రైతులు ఖరీఫ్ కింద పంటల సాగు చేస్తున్నారు. కాలువకు గ్రావిటీ వాటర్ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. కండలేరుకు సోమశిల నుంచే ఇన్ఫ్లో రావాలి. కండలేరు జలాశయంలో 30 టీఎంసీల నీటి నిల్వ ఉంటేనే హైలెవల్ స్లూయిజ్ ద్వారా గ్రావిటీ నీరు అందుతుంది. అయితే జలాశయంలో ఇప్పుడు 26 టీఎంసీలు నీటి నిల్వ ఉన్నా సత్యసాయి గంగ కాలువకు 2 వేల క్యూసెక్కులు, ఒకటో బ్రాంచి కాలువకు 70, పిన్నేరు వాగుకు 5 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఎడమగట్టు కాలువకు గ్రావిటీ నీరు అందే పరిస్థితి లేదు. ఫలితంగా ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అవసరమైతే విడుదల చేయాల్సి ఉంటుంది. ఎల్నినో కారణంగా వేసవి తాపం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ముఖం చాటేస్తున్నాయి. జిల్లాలోనే కాక పైతట్టు ప్రాంతాల్లో వర్షం కురిసి ప్రాజెక్ట్లకు నీరు అందే పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నారు. కండలేరు జలాశయం కింద పొదలకూరు మండలంలో రెండు సీపీడబ్ల్యూఎస్ స్కీములు ఉన్నాయి. రాపూరు, గూడూరు తాగునీటి అవసరాలను కండలేరు జలాశయమే తీర్చుతోంది. చైన్నె మహా నగరానికి కండలేరు నుంచే తాగునీటిని అందిస్తున్నారు. వారు మరో 500 క్యూసెక్కుల నీటి విడుదల పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా నీటిని పొదుపుగా వినియోగించుకుంటేనే తాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రతి నీటి బొట్టు విలువైనదిగా భావించి వృథా చేయకుండా ఉంటే రబీ సీజన్లో వర్షాలు కురువకున్నా కొంత వరకు కండలేరు ఎడమగట్టు కాలువ కింద పంపింగ్ స్కీమ్ ద్వారానైనా పంటలు పండించేందుకు వీలుకలుగుతుంది. కండలేరులో తగ్గుతున్న నీటి మట్టం నీటి పొదుపు పాటించకుంటే తాగునీటికి కష్టాలే ఎడమగట్టు కాలువకు గ్రావిటీ ద్వారా కొద్ది రోజులే ఎల్నినో ప్రభావంతో విపరీతమైన భూతాపం ముందుచూపు లేకుంటే ఇబ్బందే నీటిని పొదుపు చేయాలి ప్రాజెక్ట్ల్లో నీటిని పొదుపు చేయాలి. కరువు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు వెల్లడిస్తున్న తరుణంలో ప్రాజెక్ట్ల్లో నీటి నిల్వలను పొదుపుగా వినియోగించి రైతులకు సాగు నీటిని అందివ్వాలి. లేకుంటే ప్రజల తాగునీటి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతోంది. – వై. పెంచలరెడ్డి, రైతు నాయకుడు, పులికల్లు -
పట్టా భూమిలో పచ్చముఠా మట్టి దోపిడీ
● యథేచ్ఛగా తరలింపు ● అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమని హుకుం కావలి: అధికార మదంతో పచ్చ ముఠా బరి తెగింపు పతాక స్థాయికి చేరింది. ఇప్పటి వరకు చెరువులు, ప్రభుత్వ భూముల్లో మట్టిని కొల్లగొట్టిన టీడీపీ నేతలు ఇప్పుడు ఏకంగా రైతుల పట్టా భూమిలోకి చొరబడి మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమని బాహాటంగానే దౌర్జన్యానికి తెగబడుతున్నారు. మా భూమిలో మా అనుమతి లేకుండా తవ్వడానికి నీకెవడు అనుమతిచ్చాడని సదరు రైతు నిలదీస్తే.. నేను టీడీపీ వాడిని.. నాకెవడు అనుమతులివ్వాల్సిన అవసరం లేదంటూ తలకెక్కిన గర్వధోరణితో మాట్లాడటం చూసి స్థానికులు నివ్వెరపోయారు. వివరాల్లోకి వెళ్తే.. కావలి మండల కొత్తసత్రం పంచాయతీ రెడ్డిపాళేనికి చెందిన పుల్లా సోమయ్యకు గతంలో ప్రభుత్వం సర్వే నంబర్ 1800–1లో 40 సెట్లు, 1789–2లో 55 సెంట్లు భూమిని మంజూరు చేసింది. దానికి సంబంధించి పట్టాదార్ పాసుపుస్తకం, వన్బీ అడంగళ్ కూడా ఆయన పేరిటనే ఉన్నాయి. ఈ భూమిలో కూరగాయలు, మెట్ట పైర్లు సాగు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో సోమయ్య అనారోగ్యంతో మరణించడంతో భార్య తిరుపతమ్మ తన కుమారుడుతో కలిసి అష్టకష్టాలు పడుతూ ఆ భూమిని సాగు చేసుకుంటూ బతుకు జీవనం సాగిస్తున్నారు. తిరుపతమ్మ సైతం అనారోగ్యానికి గురికావడంతో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటుంది. ఆమె కుమారుడు కూడా తల్లికి అండగా ఆస్పత్రిలోనే ఉన్నాడు. ఇదే అదునుగా భావించిన అధికార పార్టీకి చెందిన గోవిందరెడ్డి కన్ను ఆ పేద కుటుంబం సాగు చేసుకునే భూమిపై పడింది. ఈ క్రమంలో పేద రైతు భూమిలో ఆదివారం జేసీబీ పెట్టి ట్రాక్టర్ల ద్వారా మట్టిని తవ్వేసి తరలిస్తుండగా స్థానికులు ఇదేం అన్యాయమని నిలదీస్తే మీరెవరు.. మీకేంటి సంబంధం.. భూమి నాది.. నా ఇష్టం ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ బెదిరింపులకు దిగాడు. ఆ కుటుంబానికి ఆ పొలమే జీవనాధారమైతే.. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఆస్పత్రిలో ఉంటే.. ఈ సమయంలో ఇంతటి దౌర్జన్యానికి తెగబడటంపై స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. వారిని లెక్క చేయకుండా మట్టిని తరలించాడు. దీంతో టీడీపీ నేత దౌర్జన్యంపై స్థానిక వీఆర్వోకు ఫిర్యాదు చేసి, ఆ పేద కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. -
‘తప్పు చేయకపోతే.. లోకేష్కు ఎందుకంత భయం’
సాక్షి, నెల్లూరు జిల్లా: నీట్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. ఏపీ డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. ఇంతపెద్ద అవినీతి జరిగితే నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయరు? అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణ కోరితే కనీసం జరిగిన అక్రమాలపై స్పందన లేదని మండిపడ్డారు.‘‘డీఎస్సీ అక్రమాలపై గత 4 నెలలు నుంచి పోరాటాలు చేస్తున్నాం. డీఎస్సీ అక్రమాలపై ఇప్పటివరకు ఒక ఎంక్వైరీ వేయలేదు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున పోరాటం చేసింది. డీఎస్సీ అవకతవకల వైఎస్సార్సీపీ సాక్ష్యాధారాలతో చూపింది. నేటికి ఒక్క అంశంపై పారదర్శకమైన విచారణ కానీ.. స్పందన కానీ లేదు. లోకేష్ ఏ తప్పూ చేయకపోతే.. సీబీఐ ఎంక్వైరీ అంటే ఎందుకు అంత భయం?’’ అంటూ చంద్రశేఖర్రెడ్డి నిలదీశారు. -
విజృంభిస్తున్న మట్టి మాఫియా
● పల్లిపాడు చెరువులో ఇదీ తంతు ● మూడు జేసీబీలు, 30కుపైగా ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలింపు ● 20 వేల క్యూబిక్ మీటర్ల మేర కొల్లగొట్టి మర్రిపాడు: మండలంలోని పల్లిపాడు చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అనుమతులు, అధికారిక పర్మిట్లు లేకుండానే మూడు జేసీబీలు, 30కుపైగా ట్రాక్టర్లతో చెరువు నుంచి మట్టిని పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఇప్పటికే సుమారు 50 ఎకరాల మేర విస్తీర్ణంలో తవ్వకాలు చేపట్టి, 20 వేల క్యూబిక్ మీటర్లకుపైగా మట్టిని తరలించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజకీయ అండదండలతో ఈ వ్యవహారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో దందా నడుస్తున్నా.. ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ అధికారులు సమర్థంగా వ్యవహరించడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా దీనిపై సమాచారం అందుకున్న మర్రిపాడు పోలీసులు శనివారం రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. మట్టి లోడుతో వెళ్తున్న ఆరు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పశువుల ఆస్పత్రి స్థలాన్నీ వదల్లేదు
కావలి రూరల్: మండలంలోని తుమ్మలపెంట బీచ్ రోడ్డులో పశువుల ఆస్పత్రికి కేటాయించిన స్థలం కబ్జాకు గురైంది. ఆపై పక్కా భవనాలుగా నిర్మించి అద్దెలకిస్తున్న వైనం వెలుగు చూసింది. వాస్తవానికి మన్నంగిదిన్నె, తుమ్మలపెంట, అన్నగారిపాళెం పంచాయతీలకు చెందిన రైతుల సౌకర్యార్థం తుమ్మలపెంట పంచాయతీ పరిధిలో పశువుల ఆస్పత్రికి 20 సెంట్ల స్థలాన్ని 1994లో కేటాయించారు. అప్పట్నుంచీ ఇక్కడ పశువులకు వైద్యసేవలందిస్తూ వచ్చారు. అయితే దీనికి బిల్డింగ్ లేకపోవడంతో మాగుంట పార్వతమ్మ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిర్మించారు. మిగిలిన 15 సెంట్ల స్థలాన్ని ఖాళీగా ఉంచారు. కాలక్రమంలో ఆ ప్రాంతంలో పశువులు ఎక్కువగా లేకపోవడం, గొల్లపాళెంలో ఉండటంతో గోపాలమిత్ర స్కీమ్ను అక్కడికి మార్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఈ స్థలంలో ఏడు రూమ్లను షాపులుగా నిర్మించి, విద్యుత్ మీటర్లను సైతం బిగించి అద్దెకిచ్చారు. పాత భవన పైభాగాన పశువుల వైద్యశాల, అన్నగారిపాళెం పంచాయతీ అనే బోర్డు నేటకీ కనిపిస్తూనే ఉంది. ఈ విషయమై పంచాయతీ సెక్రటరీని సంప్రదించగా, అది తమ పరిధిలో లేదని చెప్పారు. రోడ్డు నిర్మాణానికి ఆర్ అండ్ బీ ఉపక్రమించగా, విస్తరణకు ఇబ్బందిగా ఉండడంతో సదరు షాపుల యజమానులకు నోటీసులను జారీ చేశారు. పొరంబోకు స్థలాన్ని ఆక్రమించడంతో రోడ్డు నిర్మాణం ప్రస్తుతం నిలిచిపోయింది. కబ్జా చేసి రూమ్లు కట్టిన స్థలం ఆర్ అండ్ బీ పరిధిలో ఉంది. ఆక్రమించిన భూమిలో నిర్మించిన షాపులు -
టెన్జింగ్ నార్గే అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు రూరల్: కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే టెన్జింగ్ నార్గే జాతీయ సాహస అవార్డుల కోసం అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. 2023, 24, 25 సంవత్సరాల్లో భూమి, నీరు, గాలి విభాగాల్లో విశేష సాహస విజయాలు సాధించిన వారికి ఒక్కో అవార్డు.. సాహస రంగంలో విశిష్ట సేవలందించిన వారికి లైఫ్టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారని చెప్పారు. అవార్డు గ్రహీతలకు టెన్జింగ్ నార్గే కాంస్య విగ్రహం, ప్రశంసపత్రం, బ్లేజర్తో పాటు రూ.15 లక్షల నగదు బహుమతిని అందజేయనున్నారని వివరించారు. అర్హులు వచ్చే నెల 20లోపు awards.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం సదరు ప్రతితో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అదే రోజు సాయంత్రం ఐదు గంటల్లోపు ఏకేనగర్లోని సెట్నెల్ కార్యాలయంలో అందజేయాలని కోరారు. కలెక్టర్, సెట్నెల్ చైర్మన్ ఆమోదం అనంతరం దరఖాస్తులను కమిషనర్, యువజన సర్వీసుల శాఖకు పంపనున్నామన్నారు. వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని కోరారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయమే నెల్లూరు(వీఆర్సీసెంటర్): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం విద్యార్థి ఉద్యమం సాధించిన అతిపెద్ద విజయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బాలాజీనగర్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. నీట్ పేపర్ లీక్ కావడంతో విద్యార్థులు చేసిన ఉద్యమం దేశం మొత్తాన్నీ ప్రభావితం చేసిందన్నారు. ఇది బీజేపీ ప్రభుత్వాన్ని కదిలించిందని, తప్పనిసరి పరిస్థితిల్లో ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు. అయితే ఇది సమస్యకు పరిష్కారం కాదని, విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి ఆ శాఖను ఆయా రాష్ట్రాలకు అప్పజెప్పడంతో పాటు నీట్ విధానాన్ని వికేంద్రీకరించాలని డిమాండ్ చేశారు. చోద్యం చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను కేంద్రం భ్రష్టు పట్టిస్తుంటే, చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. ఇటీవల నిర్వహించిన పేరెంట్స్ టీచర్ మీటింగ్లో పిల్లలను కనాలని, వారే సంపద అని సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భూములను బలవంతంగా లాక్కొని కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ, పౌరులను సంపదతో పోల్చడం, పిల్లలను లాభాలు ఆర్జించే యంత్రాల్లా చూడటం సరికాదని హితవు పలికారు. పాలన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చుకోకపోతే కేంద్రంలో మోదీ సర్కార్ ఏ విధంగా దెబ్బతింటుందో, అదే తరహా పరిస్థితి ఇక్కడా ఏర్పడుతుందని చెప్పారు. పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్, కార్యదర్శివర్గ సభ్యురాలు రెహనాబేగం పాల్గొన్నారు. పారిశుధ్య మెరుగునకు ప్రత్యేక చర్యలు నెల్లూరు(పొగతోట): గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చేలా చర్యలు చేపట్టాలని డీపీఓ వసుమతి ఆదేశించారు. నగరంలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి వివిధ మండలాల ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలతో శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. గతంలో నిర్మించిన వర్మికంపోస్ట్ యానిట్లను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఇంటి పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పంచాయతీల ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. ఉద్యోగుల విభజనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాలని సూచించారు. -
పొరంబోకు భూముల్లో సాగు
దగదర్తి: మండలంలోని ఐతంపాడులో ప్రభుత్వ భూములను కొందరు యథేచ్ఛగా ఆక్రమించి.. జామాయిల్తో పాటు ఇతర పంటలను సాగుచేస్తున్నారు. ఒక్కొక్కరూ సుమారు పదెకరాలకు తగ్గకుండా చదును చేసి సాగు జరుపుతున్నా, సంబంధిత రెవెన్యూ అధికారులకు ఏ మాత్రం పట్టడంలేదు. ఫలితంగా అర్హులకు ల్యాండ్స్ అందని ద్రాక్షలా మారుతోంది. నిజానికి గ్రామంలోని సర్వే నంబర్ ఒకటిలో సుమారు 29 ఎకరాల అనాధీన.. సర్వే నంబర్ నాలుగులో సుమారు 150 ఎకరాల మేత పొరంబోకు భూమి ఉంది. వీటితో పాటు చెరువు పొరంబోకు, దేవదాయ శాఖ ల్యాండ్స్ సైతం ఆక్రమణకు గురవుతున్నాయి. గ్రామంలో దాదాపు 150 కుటుంబాలు నివాసముంటున్నా, వీరిలో భూమిలేని వారే ఎక్కువగా ఉన్నారు. రాజకీయ, అధికార పలుకుబడి ఉన్నవారు పెద్ద ఎత్తున ఆక్రమించి చదును చేసి సాగు చేస్తున్నారు. గ్రామంలో వందెకరాలకుపైగా భూములు 25 మంది కబంధహస్తాల్లో చిక్కుకున్నాయని గతంలో రెవెన్యూ అధికారులు చేసిన సర్వేలో తేల్చారు. కబ్జాదారులను హెచ్చరించినా, పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేకపోవడం గమనార్హం. -
పేద రైతుల పొట్టగొడుతూ..
ఆత్మకూరు రూరల్: మండలంలోని రామస్వామిపల్లిలో పేద రైతులకు చెందిన భూముల ఆక్రమణల పర్వాన్ని కొందరు యథేచ్ఛగా సాగిస్తున్నారు. ల్యాండ్స్ను కొనుగోలు చేసిన కొందరు సమీపంలోని పేదలకు చెందిన వాటినీ తమ ఆధీనంలోకి తీసుకునేందుకు యత్నిస్తున్నారు. వీరికి తెలియకుండా జామాయిల్ చెట్లను నరికి విక్రయించి తీవ్ర నష్టాన్ని కలిగించారు. ఇదే అంశంపై గతంలో ఫిర్యాదు చేసినా, సమస్య ఏ మాత్రం పరిష్కారం కాలేదనే ఆవేదన వీరిలో వ్యక్తమవుతోంది. వాస్తవానికి గ్రామానికి చెందిన పల్లాల లక్ష్మమ్మ కుటుంబానికి సర్వే నంబర్లు 1567 – 2ఏ, 2బీలో భూములను ప్రభుత్వం కేటాయించింది. ఈమె భర్త మాలకొండయ్యకు 1.44.. కుమారుడు మస్తాన్కు 1.13 ఎకరాల సీజేఎఫ్ఎస్ పట్టా మంజూరైంది. జామాయిల్ మొక్కలు, నాటేందుకు అవసరమైన వ్యయం, నీటి సరఫరా తదితర సౌకర్యాలను సర్కార్ 2011లో కల్పించడంతో ఇందులో సాగు చేపట్టారు. తదనంతరం భర్త, కుమారుడ్ని కోల్పోయిన లక్ష్మమ్మ ప్రస్తుతం వృద్ధాప్యంతో నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇదే సమయంలో పక్కనే కొనుగోలు చేసిన నెల్లూరుకు చెందిన పసుపులేటి సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు తమ వాటితో పాటు లక్ష్మమ్మ భూమినీ కలుపుకొని ఆమెకు తెలియకుండానే జామాయిల్ చెట్లను నరికి విక్రయించారు. హైదరాబాద్లో పనిచేస్తున్న తన మనవడు వచ్చాక పంటను విక్రయించాలని భావించామని, అయితే వీరిలా వ్యవహరించారని ఈమె ఆరోపించారు. ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు..? గ్రామానికి చెందిన పొడమేకల సుందరయ్యకు సంబంధించిన భూ వ్యవహారం సైతం వివాదాస్పదంగా మారింది. సర్వే నంబర్ 380 – 2లో 1.8 ఎకరాలను 2003లో అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేశారు. వ్యవసాయ బోరును ఇటీవల వేసి ఆయిల్పామ్ను సాగు చేసేందుకు సిద్ధమవుతుండగా, భూ రికార్డుల్లో మార్పులు జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. భూములను పసుపులేటి సుబ్రహ్మణ్యం కొనుగోలు చేసే క్రమంలో పలువురు రైతుల ల్యాండ్స్ను సంబంధం లేని వ్యక్తులతో ఫోర్జరీ సంతకాలు చేయించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బ్యాంక్ రుణాల కోసం ఈసీలు తీసుకున్న సమయంలో విషయం బయటపడింది. దీనిపై తహసీల్దార్, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కొందరికి న్యాయం.. మరికొందరికి నిరీక్షణ కోర్టును కొందరు రైతులు ఆశ్రయించడంతో వారికి తిరిగి రిజిస్ట్రేషన్ చేశారు. అయితే తాము మాత్రం న్యాయం కోసం ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపులేటి సుబ్రహ్మణ్యం కుటుంబానికి రాజకీయ అండదండలుండటంతో అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. -
హద్దుల్లేక వివాదాలు
దగదర్తి: మండలంలోని కొత్తపల్లి కౌరుగుంటలో ఏపీఐఐసీ భూమిలో హద్దులను స్పష్టంగా నిర్ణయించకపోవడంతో ఈ ప్రాంతంలో వివాదాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి గ్రామంలోని సర్వే నంబర్ 279లో సుమారు ఏడెకరాలను ఇండస్ట్రియల్ పార్కు కోసం ఏపీఐఐసీ సేకరించింది. ఈ భూమికి ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 309, 279లో సుమారు ఆరెకరాల మేర శ్మశాన భూమి 50 ఏళ్లుగా ఉందని గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో సర్వే నంబర్ 279లో ఎకరాను చిన్న పరిశ్రమ కోసం ప్రైవేట్ వ్యక్తి కొనుగోలు చేశారు. భూమిని చదును చేసే సమయంలో శ్మశానంగా వినియోగిస్తున్న ప్రాంతంలో సైతం జరుపుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై గతంలో వివాదాలు చోటుచేసుకోగా, కలెక్టర్కు వినతిపత్రాన్ని గ్రామస్తులు అందజేశారు. హామీ విస్మరణ భూములను ఏపీఐఐసీ సేకరించే సమయంలోనే అక్కడ శ్మశానం ఉందని అధికారులు గుర్తించారు. దీన్ని గ్రామస్తులకే అప్పగిస్తామని, భూసేకరణ చేయబోమని ఆ శాఖతో పాటు రెవెన్యూ ఆఫీసర్లు హామీ ఇచ్చారు. అయితే దీన్ని నేటికీ నెరవేర్చలేని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా శ్మశాన భూమికి స్పష్టమైన హద్దులను ఏర్పాటు చేసి, అధికారిక రికార్డుల్లో నమోదు చేసి తమకు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దు
నెల్లూరు(టౌన్): కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దని పలు విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలంటూ శుక్రవారం వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఐక్యవేదిక చేపట్టిన బంద్ విజయవంతమైంది. నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా మూసివేశారన్నారు. దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన వారిపై లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. నీట్ ప్రశ్నపత్ర లీక్ అంశంపై కేంద్రం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయడంతోపాటు విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మస్తాన్ షరీఫ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేంద్ర, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి షారుఖ్, ఏవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మున్నా, డీవైఎఫ్ఐ నాయకుడు రమణ, వివిధ సంఘాలకు చెందిన శివం వర్మ, యస్దానీ, సొహైల్, సర్దార్, జీవన్, కోటి, గోవర్ధన్, మున్నా, ధీరజ్, ఆదిత్య, త్రివిక్రమ్, హర్ష తదితరులు పాల్గొన్నారు. సీపీఐ సీనియర్ నేత పముజుల కన్నుమూత నెల్లూరు (వీఆర్సీసెంటర్): సీపీఐ జిల్లా కార్య దర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నేత, చేనేత కార్మిక సంఘ రాష్ట్ర నేత పముజుల దశరథరామయ్య (94) వయోభారం, అనారోగ్యంతో కన్నుమూశారు. అస్వస్థతకు శుక్రవారం గురికావడంతో ఆయన్ను నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నెల్లూరు రూరల్ మండలంలోని సౌత్మోపూరుకు చెందిన ఈయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. సీపీఐలో 70 ఏళ్లుగా ఉంటూ పార్టీ కోసం విశేష కృషి చేశారు. సౌత్మోపూరుకు 40 ఏళ్ల పాటు సర్పంచ్గా, నెల్లూరు రూరల్ ఎంపీపీగా, పార్టీ జిల్లా కార్యదర్శిగా పలు పదవుల్లో కొనసాగారు. కాగా ఈయన మృతిపై సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ, పార్టీ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, జాతీయ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, నేతలు హరినాథ్రెడ్డి, జంగాల అజయ్కుమార్, జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి తదితరులు సంతాపం తెలియజేశారు. -
సమగ్ర శిక్షలో సర్టిఫికేటుగాళ్లు
అంతులేని నిర్లక్ష్యం ● పలువురు సైట్ ఇంజినీర్లపై ఆరోపణలు ● విచారణ పేరుతో చర్యల్లో జాప్యం ● ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో వేతనాల రూపంలో ప్రజాధనం స్వాహా ఉదయగిరి: నెల్లూరులోని సమగ్ర శిక్ష కార్యాలయ పరిధిలో పలువురు ఉద్యోగులు ఫేక్ విద్యార్హత పత్రాలను సమర్పించి విధులను నిర్వర్తిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ విషయమై ఉన్నతాధికారులకు పలువురు ఫిర్యాదు చేయగా, విచారణ పేరుతో వారిని కాపాడుతూ వేతనాల రూపంలో రూ.కోట్ల మేర స్వాహా చేస్తున్నారని తెలుస్తోంది. వివాదాల ఛట్రంలో.. జిల్లా సమగ్ర శిక్షలో 14 మంది సైట్ ఇంజినీర్లు పనిచేస్తున్నారు. వీరిలో ఎనిమిది మంది నకిలీ విదార్హత పత్రాలతో విధుల్లో చేరారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల్లో చేరిన వీరిలో కొందరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. వివిధ పనులను చేయకుండానే రూ.లక్షల్లో నిధులను మింగేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరిపై విజి లెన్స్ విచారణ ప్రస్తుతం జరుగుతోంది. కార్యాలయంలో జేటీఓగా విధులు నిర్వర్తిస్తున్న అహ్మద్ బాషా (సైట్ ఇంజినీర్) నకిలీ సర్టిఫికెట్తో ఉద్యోగంలో చేరారని, ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలని కోరుతూ కలెక్టర్కు నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి గతేడాది డిసెంబర్లో ఫిర్యాదు చేశారు. అయినా నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. పంజాబ్లో పొందిన బీటెక్ సర్టిఫికెట్లో ఇక్కడ పనిచేస్తున్నారని, అయితే అది నకిలీదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్ సైతం నిబంధనల మేరకు లేదని తెలిపారు. మరికొన్ని ఉదాహరణలు.. ● సమగ్ర శిక్షలో సైట్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న రాయదుర్గం మహేశ్వరి (ప్రస్తుతం మానేశారు), దావులూరి రవి, అహ్మద్ బాషా, వేలూరి బలరామ్, మస్తానయ్య.. తప్పుడు విద్యార్హత పత్రాలతో డిప్లొమా ఇంజినీరింగ్తో ఉద్యోగాల్లో చేరారనే ఆరోపణలున్నాయి. పరిశీలన నిమిత్తం సర్టిఫికెట్లను వీరు చదువుకున్న నెల్లూరు పాలిటెక్నిక్ కళాశాలకు 2021లో అప్పటి ఏపీసీ పంపారు. అయితే అక్కడ్నుంచీ నేటికీ సమాధానం రాలేదని తెలుస్తోంది. ఈ ఉదంతంలో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారిందనే ఆరోపణలున్నాయి. ఆరోపణలను ఎదుర్కొంటున్న సైట్ ఇంజినీర్లపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి ఉంటే ఈ కుంభకోణం జరిగి ఉండేది కాదు. సమగ్ర శిక్షలో తవ్వేకొద్దీ అనేక అక్రమాలు, అవినీతి వ్యవహారాలు వెలుగుచూస్తున్నా, చిన్నపాటి చర్యలకే పరిమితం కావడంపై దుమారం రేగుతోంది. కాగా ఈ అంశమై డీఈఓ బాలజీరావును సంప్రదించగా, ఏపీసీగా తాను ఇంకా బాధ్యతలను చేపట్టలేదని బదులిచ్చారు. -
రెండు ఓట్లు ఇక కుదరవోయ్..!
● సర్తో సమగ్ర ప్రక్షాళన ● అందుబాటులో అధునాతన టెక్నాలజీ ● ఏమీ కాదనుకుంటే పొరపాటే ● చట్టపరమైన చర్యలకు అవకాశం ఉదయగిరి: ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటు దుర్వినియోగానికి గురవుతున్న వైనంపై సర్ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఒకే వ్యక్తికి వేర్వేరు చోట్ల ఓట్లుండటం.. ఎన్నికల సమయంలో ఇలా వేయడాన్ని నివారించాలనే లక్ష్యంతో స్క్రీనింగ్ అండ్ వెరిఫికేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అమల్లోకి తీసుకొచ్చింది. తీవ్ర ప్రభావం నగరాల్లో స్థిరపడిన నిపుణులు, ఉద్యోగులు.. తాత, ముత్తాతల నాటి సెంటిమెంట్ పేరుతో సొంతూళ్లలో ఒక ఓటు ఉంచుకుంటూ.. నివాసం ఉంటున్న చోట మరో దాన్ని కొనసాగించుకుంటున్నారు. అక్కడా.. ఇక్కడా రెండు ప్రాంతాల్లోనూ వేసి గెలుపోటములను శాసిస్తున్నారు. తమ బంధువులో లేదో అనుచరులో సర్పంచ్లు, వార్డు సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్గా పోటీలో ఉంటే ఓటు హక్కును ఉపయోగించుకుంటూ ఆ ప్రాంతాల్లో అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తును మార్చేస్తున్నారు. నిమిషాల్లో పసిగట్టేస్తూ.. జిల్లాలో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, పారదర్శకమైన పోలింగ్ను నిర్వహించడమే లక్ష్యంగా సర్ ప్రక్రియను చేపట్టారు. అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా దేశంలో ఎక్కడైనా ఒకే వ్యక్తి వివరాలతో రెండు ఓట్లుంటే ఈ సిస్టమ్ నిమిషాల్లోనే పసిగట్టేస్తుంది. గతంలో మాదిరిగా రెండు చోట్లా అంటే కుదరదు. కచ్చితంగా ఏదో ఒక ప్రాంతంలో రద్దు చేసుకోవాల్సిందే. ఉద్దేశపూర్వకంగా దాచిపెడితే కఠిన చర్యలు చేపట్టే అవకాశం ఉంది. -
అమ్మా.. క్షమించు..
చిల్లకూరు: ‘అమ్మా..నన్ను క్షమించు.మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నా.ఎందుకో కూడా సరైన కారణం చెప్పలేను. నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని సూసైడ్ నోట్లో రాసి సచివాలయంలో పనిచేసే ఏఎన్ఎం బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తొణుకుమాలలో గురువారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు..తిరుపతి జిల్లా ఓజిలి మండలం రాజుపాళేనికి చెందిన శ్రీపతి రమణయ్య ద్వితీయ కుమార్తె సాయి చందనప్రియ (27) ఏడాది క్రితం తొణుకుమాల సచివాలయానికి ఏఎన్ఎంగా బదిలీపై వచ్చింది. అప్పటి నుంచి ఆమె స్థానికంగా పనిచేసే వారితో పాటు చింతవరం వైద్యులతో కలిసి సచివాలయంలోనే మధ్యాహ్నం భోజనం చేసేది. గురువారం తాను మరోసారి భోజనం చేస్తానని ఆశ వర్కర్లకు చెప్పి వారిని గ్రామంలోని పాఠశాలకు పంపేసింది. సచివాలయ సిబ్బంది మండల పరిషత్లోని సమావేశంలో ఉండగా..అగ్రికల్చర్ అసిస్టెంట్ పక్కనే ఉన్న గ్రామానికి వెళ్లారు. సచివాలయంలో ఎవరూ లేకపోవడంతో సూసైడ్ నోట్ను రాసి టేబుల్పై పెట్టి..సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకుంది. కొన ఊపిరితో ఉన్న ఆమెను సచివాలయానికి వచ్చిన వారు గమనించి కిందికి దింపారు. అప్పటికే ఆమె మృతి చెందడంతో పంచాయతీ కార్యదర్శికి సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకొని విషయాన్ని ఆమె కుటుంబీకులకు చెప్పారు. అక్కడికి వచి్చన కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ బాబు తెలిపారు. రైలు కింద పడి తహసీల్దార్ ఆత్మహత్య ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడంతో తీవ్ర మానసిక వేదన చిత్తూరు సిద్ధంపల్లె రైల్వే గేటు వద్ద ఆత్మహత్య మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా మదనపల్లె కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ విభాగం పర్యవేక్షకుడిగా పనిచేస్తున్న తహసీల్దార్ శ్రీనివాసులు (45) చిత్తూరు పట్టణ సమీపంలోని సిద్ధంపల్లె రైల్వేగేటు వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం కాట్పాడి – తిరుపతి ప్యాసింజర్ రైలు కింద పడి ఆయన మరణించినట్లు రైల్వే పోలీసులు నిర్ధారించి.. మదనపల్లె అధికారులకు సమాచారం అందించారు. రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండల తహసీల్దార్ శ్రీనివాసులును ఇటీవల ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయ్యాక ఆయనను మదనపల్లె కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ విభాగానికి బదిలీ చేశారు. అయితే, సస్పెన్షన్ వేటుతో శ్రీనివాసులు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన చిత్తూరుకు వెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. -
పాస్పోర్టు సేవలను వేగవంతంగా అందించాలి
నెల్లూరు రూరల్: పాస్పోర్టు సేవలను ప్రజలకు మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు అధికారులు కృషి చేయాలని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయాధికారి నందుల భూక్య సూచించారు. నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో గల పాస్పోర్టు సేవా కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాన్ని నెల్లూరు పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సేవా కేంద్రంలో దరఖాస్తుల స్వీకరణ, పత్రాల ధ్రువీకరణ, బయోమెట్రిక్ నమోదు, అపాయింట్మెంట్ నిర్వహణ తదితరాలను పరిశీలించి.. ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా నందుల భూక్య మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పాస్పోర్టు సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించడం అధికారుల బాధ్యతని చెప్పారు. దరఖాస్తుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, సమయపాలనతో సేవలందేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. -
పెద్దాస్పత్రిలో సీసీయూకు ఆధునిక పరికరాలు
నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ), పరికరాలకు రూ.25 కోట్లను ప్రభుత్వం గతంలో మంజూరు చేసింది. మూడంతస్తుల భవన పనులు కొన్ని నెలల క్రితమే పూర్తయ్యాయి. అయితే అందులో ఆపరేషన్ థియేటర్కు సంబంధించిన పరికరాలు, యంత్రాలు, మంచాలు, ర్యాకులు, కుర్చీలు, ఇతర పరికరాలను ప్రస్తుతం సరఫరా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ రెండు లారీల్లో వచ్చాయి. వీటిని నూతన క్రిటికల్ కేర్ భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఎమర్జెన్సీ వార్డుతో పాటు గైనకాలజీ విభాగాన్ని వచ్చే నెల్లో ప్రారంభించనున్నారు. ఎస్సీ బాలుర హాస్టల్ వార్డెన్పై విచారణ వింజమూరు(ఉదయగిరి): స్థానిక సాంఘిక సంక్షేమ బాలుర వసతిగృహ వార్డెన్ భాస్కర్రావుపై ఆరోపణలొచ్చిన నేపథ్యంలో విచారణను ఐటీటీఏ పీఓ శ్రీనివాసరావు గురువారం జరిపారు. విద్యార్థులు, వార్డెన్ను వేర్వేరుగా విచారించి లిఖితపూర్వకంగా వివరాలను తీసుకున్నారు. అనంతరం రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వార్డెన్ వ్యవహరించిన తీరుపై విద్యార్థులు తెలియజేసిన పలు అంశాలను పరిశీలించారు. కొన్ని లోపాలను గుర్తించామని, సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నామని వెల్లడించారు. ఉదయగిరి ఏఎస్డబ్ల్యూఓ గీతాదేవి పాల్గొన్నారు. గురుకులంలో డీసీఓ తనిఖీలు వాకాడు: స్థానిక బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ గురుకులాన్ని తిరుపతి జిల్లా కోఆర్డినేటర్ ప్రభావతమ్మ గురువారం తనిఖీ చేశారు. విద్యతో పాటు మౌలిక వసతులపై ఆరాతీశారు. కోట నుంచి అదనంగా వచ్చిన 207 మంది విద్యార్థులతో పాఠశాలలో కనీస సౌకర్యాల్లేకపోవడంతో వారి తల్లిదండ్రులు చేసిన ఆరోపణలపై స్పందించారు. వసతులను త్వరలోనే కల్పించనున్నామని తెలిపారు. సరిపడా బాత్రూమ్లు, కొన్ని గదుల్లో ఫ్యాన్ల కొరత ఉందని, అదనపు గదులను ఏర్పాటు చేయనున్నామని వివరించారు. ఇన్చార్జి ప్రిన్సిపల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. చికెన్ వ్యర్థాల లారీ పట్టివేత బుచ్చిరెడ్డిపాళెం: చేపల చెరువుల్లో ఆహారంగా వినియోగించేందుకు భారీ మొత్తంలో తరలిస్తున్న చికెన్ వ్యర్థాలను పోలీసులు గురువారం పట్టుకున్నారు. వివరాలు.. చికెన్ వ్యర్థాలను డ్రమ్ముల్లో నింపి లారీలో తరలిస్తున్నారనే సమాచారంతో జొన్నవాడ వద్ద తనిఖీలను ఎస్సై ఉమాశంకర్, సిబ్బందితో గురువారం రాత్రి నిర్వహించారు. ఓ లారీని ఆపి తనిఖీ చేయగా, అందులో 68 డ్రమ్ముల్లో చికెన్ వ్యర్థా లుండటాన్ని కనుగొన్నారు. లారీని సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఓ ద్విచక్రవాహనాన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఆరుగుర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
తల్లులకు తిప్పలు
గూడూరు: క్యూలో నిలవలేక అవస్థ ఆత్మకూరులోని పోస్టాఫీస్ వద్ద ఇలా.. తల్లికి వందనం పేరిట మాతృమూర్తుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేసింది. ఈ మొత్తాన్ని డ్రా చేసే వారు కొందరైతే.. అసలు డబ్బు పడిందో లేదో తెలుసుకోవాలనే ఉద్దేశంతో బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద మహిళలు గురువారం బారులుదీరారు. కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నగదు ఉపసంహరణకు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఎండ తీవ్రత తట్టుకోలేక పలువురు ఇబ్బంది పడ్డారు. – ఆత్మకూరు / గూడూరు -
స్థిరాస్తి వ్యాపారం మందగించడంతో దిక్కులేక
సర్కారీ కొలువు.. ఇది ఎంతో మంది ఆశ. దీన్ని ఎలాగైనా సాధించాలనే లక్ష్యంతో అహర్నిశలూ పాటుపడుతుంటారు. అయితే వీరిలో ఉద్యోగం లభించేది అతి కొద్ది మందికే. అలా దక్కించుకున్న కొందరు అత్యంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ విధులకు డుమ్మా కొడుతున్నారు. రోజులకే పరిమితం కాకుండా ఏకంగా ఏళ్ల తరబడి డ్యూటీలకు గైర్హాజరవు తూ.. ఇతర వ్యాపకాల్లో మునిగి తేలుతున్నారు. జాబ్ పేరు చెప్పుకొని రియల్ ఎస్టేట్.. ఇతర వ్యాపారాలను కొందరు చేస్తుండగా, మరికొందరు మద్యం మత్తులో ఉంటూ ఇలా వ్యవహరిస్తున్నారు. అక్కడితో ఆగిపోకుండా సంవత్సరాల తర్వాత వచ్చి తమను కొలువుల్లోకి తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు. జిల్లాలోని దాదాపు ప్రతి శాఖలో ఇదే పరిస్థితి నెలకొనడం విస్మయానికి గురిచేస్తోంది. పలుకుబడి ఉన్న కొందరు ఉద్యోగులు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో పొలాలను కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. మద్యానికి బానిసలైన కొందరు అప్పులు చేసి, వాటిని తీర్చలేక ఎక్కడో తలదాచుకుంటున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలో కొందరు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం రియల్ రంగం కుదేలవడంతో పలువురికి ఉద్యోగమనే విషయం ఉన్నట్లుండి గుర్తొచ్చింది. దీంతో అధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనా ఇలాంటి వారిపై కఠిన చర్యలు చేపట్టకపోతే ఇదే దారిలో మరికొందరు నడిచే అవకాశం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వీరిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగుల నిర్లక్ష్యం తారస్థాయికి చేరుకుంటోంది. ఏళ్ల తరబడి విధుల నుంచి అదృశ్యమై.. వ్యవస్థకే సవాల్ విసురుతున్నారు. ఆపై తీరిగ్గా వచ్చి.. వివిధ కారణాలను చూపి ఉన్నతాధికారులను మచ్చిక చేసుకొని విధుల్లోకి చేరుతున్నారు. అప్పటికై నా నిబద్ధతతో పనిచేస్తారానంటే అదీ లేదనే చెప్పొచ్చు. తమ పాత పంథానే కొనసాగిస్తూ, మరోసారి అదే బాట పడుతున్నారు. ఎంత వెనుకేద్దాం..! ప్రస్తుతం సర్కార్ కొలువులను సాధించడమే గగనంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్లను విడుదల చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోంది. అయితే ఉద్యోగాలు చేస్తున్న వారు తమ విధులను గాలికొదిలి.. ఎంత సంపాదిద్దామాననే దిశగా ఆలోచిస్తున్నారు. విధులకు రాకుండా స్నేహితులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కొందరు భారీగా సంపాదిస్తున్నారు. రెండు లగ్జరీ కార్లు.. నాలుగు భవంతులను నిర్మించి ఇక తమకు తిరుగులేదనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. అధికారుల అవసరాలను తీరుస్తూ తమ పనిని యథేచ్ఛగా కానిచ్చేస్తున్నారు. దాదాపు అన్ని శాఖల్లోనూ ఇంతే.. రెవెన్యూ, విద్య, వైద్యారోగ్య తదితర శాఖల్లో ఇదే తంతు నడుస్తోంది. ఒక్క రెవెన్యూలోనే సుమారు 60 మందికిపైగా వీఆర్వోలు, 15 మంది జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు తమ విధులకు ఏళ్లుగా హాజరుకావడంలేదు. నెల్లూరు రూరల్ మండలంలో వీఆర్వోలుగా పనిచేసిన ఇద్దరు దాదాపు ఆరేళ్లుగా తమ ఉద్యోగంవైపు కన్నెత్తి చూడటంలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఇలా సాగిస్తున్నారు. తీరా తన పరిస్థితి బాగొలేదని.. ఈ కారణంతో విధులకు హాజరుకాలేకపోయానని మభ్యపెడుతూ.. కొలువొచ్చేలా చూడాలని కోరుతూ కలెక్టరేట్లోని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిబంధనలకు తూట్లు వాస్తవానికి ప్రభుత్వోద్యోగులు ఒక్కరోజు సెలవుపై వెళ్లాలన్నా, సంబంధిత అధికారి అనుమతిని విధిగా పొందాలి. లీవ్ లెటర్పై ఆఫీసర్లు సంతకం చేశాకే సెలవు తీసుకోవాలి. అయితే ఈ ప్రక్రియేమీ లేకుండానే ఉద్యోగులు ఏళ్ల తరబడి కార్యాలయ ముఖం చూడటంలేదు. మరోవైపు రూల్స్ మేరకు ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఏడాది పాటు విధులకు గైర్హాజరైతే సర్వీస్ నుంచి పూర్తిగా తొలగించాలి. అయితే ఇలాంటివేవీ జిల్లాలో అమలు కావడంలేదు. పరిస్థితులను పరిశీలించి తిరిగి విధుల్లోకి తీసుకుంటుండటంతో వీరు ఆడిందే ఆట.. పాడిందే పాట అనే చందంగా వ్యవహారం మారింది. పత్తా లేకుండా పోతున్న ప్రభుత్వోద్యోగులు ఏళ్ల తరబడి విధులకు రారు ఆ తర్వాత కొలువు ఇవ్వాలని వేడుకోలు ఇదే కోవలో 60 మందికిపైగా వీఆర్వోలు జిల్లాలో ఇదీ దుస్థితి -
పొగాకు రైతుల నిరసన
● గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ ● డీసీపల్లి వేలం కేంద్రంలో నిరవధిక ఆందోళన ప్రారంభం మర్రిపాడు: పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్తో మండలంలోని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద నిరవధిక నిరసనను ఆంధ్రప్రదేశ్ రైతు, పొగాకు బోర్డు సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ప్రస్తుత ధరలతో కర్షకులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కనీస గిట్టుబాటు ధరగా కిలోకు రూ.350ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. వేలంలో అమలవుతున్న నోబిడ్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు రూ.రెండు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. తిరస్కరించిన బేళ్ల కొనుగోలుకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు రైతుల ప్రయోజనాల పరిరక్షణలో టొబాకో బోర్డు ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలని పేర్కొన్నారు. డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. రైతు సంఘ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్రసాద్, జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీపతి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మర్రిపాడు కన్వీనర్ చెన్ను వెంకటేశ్వరరెడ్డి, చండ్రా నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
27 నుంచి క్రీడా పోటీలు : డీఎస్డీఓ
నెల్లూరు(టౌన్): జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని శాప్ ఆధ్వర్యంలో అమరావతి చాంపియన్షిప్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పాండు తెలిపారు. గురువారం నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం కాంప్లెక్స్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అండర్ 17, 23 విభాగాల్లో పురుషులు, మహిళలకు ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, యోగా తదితర క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఈనెల 27, 28 తేదీల్లో కోవూరు నియోజకవర్గానికి సంబంధించి పల్లిపాడులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, 29, 30 తేదీల్లో సర్వేపల్లి వారికి విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో, ఆత్మకూరు వారికి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ఉదయగిరికి వింజమూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పోటీలు జరగనున్నాయి. 30, 31 తేదీల్లో కందుకూరుకు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల, 31, వచ్చే నెల ఒకటో తేదీన కావలికి స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో, నెల్లూరు సిటీకి ఏసీ స్టేడియంలో, వచ్చే నెల 3, 4 తేదీల్లో నెల్లూరు రూరల్కు స్టేడియంలో పోటీలు జరుగుతాయని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని చెప్పారు. అండర్ 17 విభాగానికి 2009 ఆగస్ట్ 31 లేదా ఆ తర్వాత జన్మించిన వారు, అండర్ 23 విభాగానికి 2003 ఆగస్టు 31 లేదా ఆ తర్వాత జన్మించిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తిగల వారు క్రీడా యాప్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీల నిర్వహణకు ముందస్తుగా రూ.5 వేల అడ్వాన్స్ మంజూరు చేయనున్నట్లు చెప్పారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం చార్జీల రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సెట్నెల్ సీఈఓ నాగేశ్వరరావు, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి గురుప్రసాద్, ఎస్జీఎఫ్ గేమ్స్ కార్యదర్శి బీవీ రమణయ్య, ఎం.దేవిక తదితరులు పాల్గొన్నారు. -
పెద్దాస్పత్రిలో ఎక్స్రే సేవలకు విఘాతం
● డిజిటల్ రీడర్ దొంగలపాలు ● అవస్థలు పడుతున్న రోగులు ● సేవలను పునరుద్ధరించాలని డిమాండ్నెల్లూరు (అర్బన్): నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో డిజిటల్ ఎక్స్రేకు సంబంధించిన డిజిటల్ రీడర్ (డీఆర్)ను సుమారు రెండున్నర నెలల క్రితం దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఆ సేవలు రోగులకు అందడం లేదు. ఏకంగా డీఆర్ గదికి తాళం వేశారు. ఈ విషయమై దర్గామిట్ట పోలీస్స్టేషన్లో అధికారులు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటి వరకు పోలీసులు దొంగను పట్టుకునే ప్రయత్నం చేయలేదు. మాన్యువల్గా ఎక్స్రే సేవలు అందిస్తున్నప్పటికీ డిజిటల్ ఎక్స్రే సేవలు నిలిచిపోవడంతో ఆ విభాగంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. దీంతో రోగులకు సకాలంలో సేవలు అందడం లేదు. 120 నుంచి 150 మంది వరకు.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో గత సంవత్సరమే వైద్యశాఖ అధికారులు డిజిటల్ ఎక్స్రే మెషీన్ను ఏర్పాటు చేశారు. ఇది నాణ్యమైన ఎక్స్రే సేవలను అందించే యంత్రం. జిల్లా వ్యాప్తంగా సర్వజన ఆస్పత్రికి (పెద్దాస్పత్రి) వచ్చే రోగులకు ఇది ఎంతగానో ఉపయోగపడేది. రోజుకు కనీసం 120 నుంచి 150 మంది వరకు ఎక్స్రేలు తీస్తుంటారు. డిజిటల్ మెషీన్తోపాటు మరో రెండు మాన్యువల్ ఎక్స్రే మెషీన్లు కూడా ఉన్నాయి. మాన్యువల్గా తీయాలంటే క్యాసెట్లు ఉండాలి. ఎక్స్రే తీసిన తర్వాత వాటిని మళ్లీ సాధారణ రీడర్లో ఉంచిన తర్వాతే చిత్రం కనిపిస్తుంది. ఇందువల్ల సమయం ఎక్కువ పడుతుంది. పైగా అంత నాణ్యత కూడా ఉండదు. డిజిటల్ ఎక్స్రేలో అయితే నాణ్యత మెరుగ్గా ఉంటుంది. ఫొటో తీసిన భాగాలు స్పష్టంగా కనిపిస్తాయి. క్యాసెట్లు కూడా అవసరం ఉండదు. కొత్తగా డిజిటల్ మెషీన్ను ఏర్పాటు చేసినప్పటికీ తక్కువ కాలంలోనే దానికి సంబంధించిన డీఆర్ దొంగతనానికి గురైంది. అది లేకపోతే ఎక్స్రే తీసినా చిత్రం కనిపించదు. దొంగలెవరో.. డిజిటల్ డీఆర్ అనేది చిన్న పరికరం. పెన్డ్రైవ్ కంటే కొద్దిగా పెద్దదిగా ఉంటుంది. దీని ఖరీదు కూడా సుమారు రూ.2 లక్షలు. డీఆర్ రూములో టెక్నీషియన్ మాత్రమే ఉంటారు. అయినప్పటికీ దొంగతనం జరిగింది. దీంతో అప్పటి నుంచి డిజిటల్ ఎక్స్రే సేవలు నిలిచిపోయాయి. చోరీ జరిగిన రోజు విధుల్లో ఉన్న వారిని పోలీసులు విచారించాల్సి ఉంది. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించాలి. అనుమానితులను ప్రశ్నించాలి. అయితే ఈ ప్రక్రియ సక్రమంగా జరగలేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి దొంగల పాత్ర ఏమైనా ఉందా అనే ప్రచా రం కూడా జరుగుతోంది. ఎవరో చేసిన తప్పునకు రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు పక్కాగా విచారణ జరిపి డీఆర్ను రికవరీ చేయించాలి. లేకుంటే కొత్త డీఆర్ను కొనుగోలు చేసి డిజిటల్ ఎక్స్రే సేవలను పునరుద్ధరించాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు. -
బల్కర్లకు పగటిపూట నో ఎంట్రీ
ముత్తుకూరు(పొదలకూరు): రెండేళ్లుగా బూడిద బల్కర్ల కారణంగా నరకయాతన అనుభవిస్తున్న ముత్తుకూరు ప్రజలకు ఊరట లభించింది. నెల్లూరు – ముత్తుకూరు, ముత్తుకూరు – పంటపాళెం మార్గాల్లో పగటివేళల్లో బల్కర్ల రవాణాను పూర్తిగా నిలిపివేయాలని జరిగిన చర్చల్లో ట్రాన్స్పోర్టర్ల ప్రతినిధులు అంగీకరించారు. భారీ లోడుతో అధిక వేగంతో ఎలాంటి సమయ నియంత్రణ లేకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్న బల్కర్లు రోడ్లపై బూడిద దుమ్ము వెదజల్లుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఇదే మార్గాల్లో జరిగిన ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరెందరో శాశ్వత వైకల్యానికి గురయ్యారు. బల్కర్ల రవాణాపై పరిమితులు విధించాలని, నిబంధనలు కఠినతరం చేయాలని కోరుతూ టీడీపీ, బీజేపీ నాయకులు రెండు రోజులుగా నిరసన చేపట్టారు. గురువారం నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్టర్ల ప్రతినిధులు, కూటమి నాయకుల మధ్య చర్చలు జరిగాయి. పగటిపూట బూడిద బల్కర్ల రవాణాను పూర్తిగా నిలిపివేయడానికి అంగీకరించారు. -
లారీ చక్రాల కింద నలిగిన ప్రాణం
బుచ్చిరెడ్డిపాళెం: పట్టణంలోని ముంబై జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నుంచి ఆత్మకూరుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి వేణుగోపాల స్వామి ఆలయ సమీపంలో అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ అతడి తలపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ శివరామకష్ణారెడ్డి తెలిపారు. మృతుడిని ఆత్మకూరు జేఆర్ పేటకు చెందిన అశోక్కుమార్ (35)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అశోక్ హెల్మెట్ పెట్టుకుని బైక్ నడుపుతున్నాడు. కానీ ప్రమాదం వల్ల అది పూర్తిగా నలిగిపోయింది. జేఆర్పేటలో విషాదం ఆత్మకూరు: కంభంశెట్టి అశోక్కుమార్ మృతితో జేఆర్పేటలో విషాదం నెలకొంది. అతను ఆత్మకూరులోని ఎస్ఎస్వీ కళాశాల కరస్పాండెంట్గా వ్య వహరిస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అశోక్ అందరితో కలివిడిగా ఉంటూ విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించేవాడు. అతని మృతితో విద్యార్థులు, అధ్యాపకులు సంతాపం వ్యక్తం చేశారు. వ్యక్తి బలవన్మరణం కొండాపురం: మండలంలోని గొట్టిగుండాల ఎస్టీ కాలనీకి చెందిన రాపూరి అంజయ్య (52) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. అంజయ్య కొంతకాలంగా నెమ్ము సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. గురువారం ఉదయం అతను మద్యం తాగి ఇంటికి రాగా భార్య కోటేశ్వరమ్మ మందలించింది. దీంతో మనస్తాపం చెంది స్థానికంగా ఉన్న పంట పొలాల్లోకి వెళ్లి మద్యం తాగాడు. విష గుళికలు మింగి అకస్మారక స్థితికి చేరాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. వారు 108 అంబులెన్స్లో అంజయ్యను వింజమూరు హాస్పిటల్ తరలించారు. అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కొండాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. మద్యం మత్తులో భార్య, అత్తపై దాడి కావలి రూరల్: ఓ వ్యక్తి మద్యం మత్తులో భార్య, అత్తపై దాడి చేశాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కావలి ముసునూరు శివయ్య రైస్మిల్లు సమీపంలో చలంచర్ల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతను అద్దె ఆటో నడుపుతుంటాడు. రోజూ మద్యం తాగి భార్య సుజాతను ఇబ్బంది పెట్టేవాడు. బుధవారం రాత్రి గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం మద్యం తాగొచ్చి భార్యతో మళ్లీ గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ముందుగానే సిద్ధం చేసుకున్న కూరగాయలు కోసే కత్తితో సుజాత చేతులు, తలపై దాడి చేశాడు. ఆమె కేకలు వేయగా పక్క ఇంట్లో ఉన్న తల్లి రాధమ్మ వచ్చి అడ్డుపడింది. దీంతో వెంకటేశ్వర్లు రాధమ్మపై కూడా దాడి చేశాడు. రక్తగాయాలు కావడంతో ఇద్దరూ 108 అంబులెన్స్లో కావలి ఏరియా వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఉపాధి పనులకెళ్లి.. ● తీవ్ర అస్వస్థతకు గురై కూలీ మృతి సీతారామపురం: మండలంలోని అయ్యవారిపల్లి గ్రామ వేపలవాగు సమీపాన కొత్త చెరువులో గురువారం పూడికతీత పనులకు వెళ్లిన షేక్ దాదాపీర్ (64) అనే ఉపాధి కూలీ తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. రోజూలానే దాదాపీర్ అందరితో కలిసి పనులకు వెళ్లాడు. అతను గునపంతో మట్టిని తవ్వుతూ తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలాడు. సహచర కూలీలు 108 అంబులెన్స్కు ఫోన్ చేయగా వాహనం వచ్చేలోపే చనిపోయాడు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. -
పల్లె వీక్షణతో సమస్యలకు సత్వర పరిష్కారం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా వెంకటాచలం: గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ.. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడం పల్లె వీక్షణ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. వెంకటాచలంలో పల్లె వీక్షణ కార్యక్రమాన్ని వివిధ శాఖల అధికారులతో కలిసి గురువారం నిర్వహించారు. తొలుత వడ్డిపాళెంలో చేపడుతున్న వీబీజీ – రాంజీ ఉపాధి హామీ పనులను పరిశీలించి.. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి.. చిన్నారులతో ముచ్చటించి వారి అభ్యసన సామర్థ్యాలను పర్యవేక్షించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్య సేవలు, మౌలిక వసతులను తనిఖీ చేశారు. గతేడాది సంభవించిన తుఫాన్లతో దెబ్బతిన్న వీరన్న కనుపూరు చెరువులో రూ.47 లక్షలతో చేపట్టిన పునరుద్ధరణ పనులను పరిశీలించారు. పశుసంవర్థక శాఖ నిర్వహించిన కృత్రిమ గర్భధారణ ప్రత్యేక శిబిరాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం నిర్వహించిన గ్రామసభలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. నిర్ణీత గడువులోపు పరిష్కారం పల్లె వీక్షణలో అందిన ప్రతి అర్జీనీ ప్రత్యేక పోర్టల్లో నమోదు చేసి 30 రోజుల్లో పరిష్కరించేలా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సీఎస్సార్ నిధులతో అభివృద్ధి చేస్తున్నామని.. పీడియాట్రీషియన్, జనరల్ వైద్యుల కొరతను తీర్చేందుకు చర్యలు చేపట్టనున్నామని ప్రకటించారు. జిల్లాలో శుక్రవారం నిర్వహించనున్న మెగా పీటీఎం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ డిపోలను ప్రైవేటీకరించొద్దు
నెల్లూరు సిటీ: ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ తప్పదని మంత్రులు సంకేతాలు ఇవ్వడం సరికాదని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామా అంకయ్య అన్నారు. నెల్లూరులోని ఆర్టీసీ డిపో ఎదుట గురువారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రూ.300 కోట్ల విలువైన ఆర్టీసీ 2 డిపో ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం సరికాదన్నారు. కాలుష్యం పేరుతో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడాన్ని అందరూ స్వాగతిస్తున్నారని, అయితే వాటిని ప్రైవేట్ వ్యక్తులతో కాకుండా ఆర్టీసీ డ్రైవర్లతో నడిపించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు, నాయకులు సుధాకర్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. -
గ్రావెల్ కొల్లగొట్టి.. సొమ్ము చేసుకుంటూ..
● 50 ట్రాక్టర్లలో లేఅవుట్కు తరలింపు ● విలేకరులపై దౌర్జన్యం చేసిన టీడీపీ నేతలు ఆత్మకూరు: కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని జగనన్న కాలనీ సమీపంలో కొండను తవ్వి గ్రావెల్ను టిడ్కో గృహాల సమీపంలోని ఓ వెంచర్కు గురువారం అక్రమంగా తరలించారు. సుమారు 50 ట్రాక్టర్లలో 23వ వార్డు నెల్లూరుపాళేనికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఈ తంతు జరిగింది. కాగా నెల్లూరుపాళెంలోని టీడీపీకి చెందిన మరో వర్గం వారు ఆ ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురు విలేకరులు ఘటనా స్థలానికి చేరుకుని వీడియోలు తీస్తున్నారు. మాదాల హరీష్ నాయుడు, మాదాల విష్ణు నాయుడు అనే టీడీపీ నేతలు ఓ విలేకరిని అడ్డుకుని సెల్ఫోన్ను లాక్కున్నారు. అంతటితో ఆగకుండా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారుల కు మామూళ్లిచ్చి వారి అనుమతితో గ్రావెల్ తరలిస్తున్నామని ఏమి చేసుకుంటారో, చేసుకోండంటూ బెదిరించారు. ఓ విలేకరిని నెట్టేయడంతో అతని చొక్కా చినిగింది. దీంతో పలువురు జర్నలిస్టులు ఎస్సై జంపాని కుమార్కు లిఖితపూర్వకంగా ఫిర్యా దు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అక్రమ రవాణాదారులు ట్రాక్టర్లను గంటల వ్యవధిలో ఘటనా స్థలం నుంచి తీసుకెళ్లిపోయారు. ఉత్తరకాలువ గట్టు నుంచి.. కలిగిరి: కలిగిరి – కొండాపురం మార్గంలో చిన్నచెరువు సమీపంలో హెచ్పీ పెట్రోల్ బంక్ వెనుక ఉన్న సోమశిల ఉత్తరకాలువ గట్టు నుంచి అనుమతి లేకుండా గురువారం టిప్పర్ల ద్వారా గ్రావెల్ తరలించారు. ఈ విషయాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సోమశిల కెనాల్ ఏఈ మధుసూదన్ గ్రావెల్ తరలింపును నిలిపి వేస్తామని చెప్పినప్పటికీ ఆగలేదు. కలిగిరి చిన్నచెరువులో నుంచి కూడా రాత్రి టిప్పర్లు తిరిగాయి. కలిగిరి సమీపంలో మాగాణి పొలాలకు రోడ్డు వేయడానికి గ్రావెల్ను తరలిస్తున్నారు. -
సమగ్ర విచారణ ఎప్పుడో..?
● నిధుల స్వాహాలో సైట్ ఇంజినీర్లపై చర్యలేవీ..? ● పూర్తి ఎంకై ్వరీ జరిగితే వెలుగులోకి తిమింగలాలు ఉదయగిరి: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జరిగిన పనుల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిలో కొందరిపై వేటుపడగా, మిగిలిన వారిపై చర్యల్లేకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అన్ని పనులను సమగ్రంగా పరిశీలిస్తే, రూ.కోట్ల ప్రభుత్వ నిధులను దిగమింగిన తిమింగలాల బాగోతం బట్టబయలయ్యే అవకాశముంది. ఇందులో విధులు నిర్వర్తిస్తున్న పలువురు సైట్ ఇంజినీర్లు.. లేని పనులకు రికార్డులను తయారు చేసి ఫండ్స్ను పక్కదారి పట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు చోట్ల వెలుగులోకి ఈ అవినీతి బాగోతం ఇప్పటికే పలు మండలాల్లో వెలుగులోకి వచ్చింది. ఉదయగిరి, దుత్తలూరు, వింజమూరు, దగదర్తి, కొడవలూరు, కోవూరు, నెల్లూరు రూరల్ తదితర మండలాల్లో జరిగిన వర్కుల్లో అక్రమాల అంశాలు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంలో సైట్ ఇంజినీర్లుగా పనిచేసిన బలరామ్, కృష్ణారెడ్డి, అహ్మద్బాషా, ప్రవీణ్కుమార్, రవీంద్ర, మల్లేశ్వరి ప్రమేయముందనే ప్రచారం జరుగుతోంది. తీగలాగితే కదిలిన డొంక సమగ్ర శిక్షలో జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు. తీగ లాగితే డొంక కదిలిన చందంగా లోతుకెళ్లి కొద్దీ అవినీతి వెలుగుచూస్తోంది. వింజమూరు మండలం నల్లగొండ్ల, శంఖవరం మండల ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో ప్రహరీలను నిర్మించకుండానే నిధులను పక్కదారి పట్టించిన వైనంపై కథనాలను సాక్షి ప్రచురించింది. ఆ తర్వాత పలు మండలాల్లో ఇదే అంశాలు బట్టబయలయ్యాయి. ఈ క్రమంలోనే సమగ్ర శిక్షలో స్పిల్ ఓవర్ పనుల్లో అక్రమాలు వెల్లడయ్యాయి. ఉపాధ్యాయ శిక్షణ పేరుతో నిధులను భక్షించిన వైనంపై కథనాలను ప్రచురించారు. ప్రవీణ్కుమార్పై యాక్షనేదీ..? సమగ్ర శిక్షలో కోవూరులో సైట్ ఇంజినీర్గా విధులు నిర్వర్తిస్తున్న ప్రవీణ్కుమార్ పనులు చేయకుండానే బిల్లులను స్వాహా చేసే యత్నంలో తనకు సహకరించని ఉన్నత స్థాయి అధికారిపై చేయి చేసుకున్న ఉదంతంపై విచారణ జరిపి నివేదికను కలెక్టర్కు పీఆర్ ఎస్ఈ పంపారు. దీని ఆధారంగా సదరు వ్యక్తిపై చర్యలు చేపట్టారు. అయితే దీనికి సంబంధించిన ఆర్డర్ కాపీని కలెక్టర్ నుంచి తీసుకొని ప్రవీణ్కుమార్కు ఇవ్వకుండా ఏపీసీ మూడు నెలలు జాప్యం చేశారనే విషయం తాజాగా వెలుగుచూసింది. ఉదయగిరి: నెల్లూరులోని సమగ్ర శిక్ష కార్యాలయ కేంద్రంగా జరిగిన పనుల్లో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న పలువురు ఆధికారులపై ఆ శాఖ రాష్ట్ర పీడీ శ్రీనివాసరావు కొరడా ఝళిపించారు. పనులు చేయకుండానే నిధులను స్వాహా చేయడం, పలు పనులకు ఫేక్ ఐడీలను సృష్టించడం తదితరాలపై ’తిలాపాపం.. తలా పిడికెడు’ అనే శీర్షికన సాక్షిలో కథనం ఈ నెల ఏడున ప్రచురితమైంది. ఈ వ్యవహారంలో ప్రమేయమున్న సమగ్ర శిక్ష అధికారి వెంకటసుబ్బయ్యను తక్షణమే మాతృ సంస్థకు సరెండర్ చేస్తూ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీసీగా ఏఫ్ఏసీ బాధ్యతలను డీఈఓ బాలజీరావుకు అప్పగించారు. కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ను తక్షణమే మాతృ సంస్థకు బదిలీ చేశారు. టీసీఎస్ తరఫున విధులు నిర్వర్తిస్తూ అక్రమాలకు పాల్పడిన నేతాజీని ఉద్యోగం నుంచి తొలగిస్తూ క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేశారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రతి పనినీ పరిశీలించి, తేడాలను గుర్తించి ప్రమేయమున్న వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. -
ఎస్సీల భూముల్లో గ్రావెల్ తవ్వకాలు
● టీడీపీ నాయకురాలి పొలానికి తరలింపు ● ఎస్సైకి చెప్పినా ప్రయోజనం శూన్యంకొండాపురం: మండలంలోని భీమవరప్పాడు పంచాయతీ ఎస్సీ కాలనీ ఆనుకుని ఉన్న బీడు భూముల్లో టీడీపీ నాయకులు గ్రావెల్ను తవ్వి అక్రమంగా పంట పొలాలకు తరలిస్తున్నారు. బుధవారం మూడు జేసీబీలతో తవ్వి సుమారు 15 ట్రాక్టర్లలో టీడీపీ నాయకురాలైన టెలికామ్ అడ్త్వెజర్ కమిటీ సభ్యురాలు అనూష పంట భూమిని చదును చేసుకునేందుకు తరలించారు. కాలనీవాసులు ఎంత చెప్పినా పట్టించుకోకుండా గుంతలను తీశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని బెదిరించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ 2004లో కాలనీని ఆనుకుని 66 మందికి పట్టాలిచ్చారన్నారు. అయితే హద్దులు చూపించకపోవడంతో సాగు చేసుకోలేకపోయామని వాపోయారు. గతంలో కూడా కొందరు వ్యక్తులు ఇక్కడి నుంచి గ్రావెల్ తరలిస్తుంటే అడ్డుకున్నామని చెప్పారు. ఈ విషయమై కొండాపురం ఎస్సై కాసుల శ్రీనివాసులుకు ఫిర్యాదు చేయగా తహసీల్దార్కు చెప్పాలని, అప్పుడే తాము చర్యలు తీసుకుంటామని చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రావెల్ తరలించే సమయంలో ఎస్సై వచ్చి చూసి అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లకు లొంగి లంచం తీసుకెళ్లాడని ఆరోపించారు. ఈ విషయంపై ఎస్సైను వివరణ కోరగా తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. తాను అక్కడికి వెళ్లలేదని, గ్రావెల్ తరలించే వారికి పర్మిషన్లు ఉన్నాయని తెలిసిందన్నారు. -
విద్యాశాఖపై అయ్యోరి పెత్తనం
● ఏడాది తిరగకుండానే సైన్స్ అధికారి బదిలీ ● ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే కొత్త వ్యక్తికి డిప్యుటేషన్ ● మంత్రి నారాయణ ఒత్తిడితోనే అంతా.. ● గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త సిత్రాలు నెల్లూరు (టౌన్): వడ్డించే వ్యక్తి మనోడైతే బంతి చివర కూర్చున్నా, అన్ని సమకూరుతాయనే సామెత జిల్లా విద్యాశాఖకు చక్కగా సరిపోతుంది. ఎలాంటి ఆరోపణల్లేకపోయినా, ఏడాది తిరగకుండానే నిబంధనలకు విరుద్ధంగా జిల్లా సైన్స్ అధికారిని నియమించారు. మంత్రి నారాయణ ఒత్తిడితో ఆగమేఘాలపై ఇలా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు తుంగలో.. వాస్తవానికి సైన్స్ అధికారి నియామకానికి గానూ నోటిఫికేషన్ను జిల్లా విద్యాశాఖ జారీ చేయాల్సి ఉంది. పాఠశాలలో సంబంధిత సబ్జెక్ట్కు రెండో టీచర్ ఉన్నప్పుడే జిల్లా సైన్స్ అధికారిగా డిప్యుటేషన్ వేయాలని నిబంధనలు తెలియజేస్తున్నాయి. అయితే ఇలాంటివేవీ లేకుండానే అనంతసాగరం మండలం జే కాలనీలోని జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మూర్తిని డిప్యుటేషన్పై నియమించారు. ఇంత హడావుడిగా మార్చడంపై జిల్లా విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తే, వారు నోరే మెదపడం లేదు. ఇదే అంశం విద్యాశాఖలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏడాదిలో ఎంతో మంచి పేరు విడవలూరు మండలం రామతీర్థం జెడ్పీ హైస్కూల్లో బయాలజీ టీచర్గా పనిచేస్తున్న శివారెడ్డిని జిల్లా సైన్స్ అధికారిగా డిప్యుటేషన్పై గతేడాది ఆగస్ట్ 14న నియమించారు. ఈయన వచ్చాక సైన్స్ కేంద్రాన్ని అభివృద్ధి చేశారని ఉపాధ్యాయులే చెప్తున్నారు. గడిచిన విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో జిల్లా సైన్స్ కేంద్రానికి ఉత్తమ అవార్డూ లభించింది. దాదాపు 17 వేల మందికిపైగా విద్యార్ధులు కేంద్రాన్ని సందర్శించారు. తిరుపతి. ప్రకాశం, బాపట్ల జిల్లాల నుంచీ స్టూడెంట్స్ వచ్చారు. ఈ పరిణామాల క్రమంలో విజయకుమార్ ట్రస్ట్ నుంచి కేంద్రానికి ఒక బస్సును ఉచితంగా అందజేశారు. దీని ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి విద్యార్థులను రోజూ తీసుకొచ్చి అవగాహన కల్పిస్తున్నారు. అనుకున్నారు.. మార్చేశారు..! సాధారణంగా జిల్లా సైన్స్ అధికారిగా పనిచేస్తున్న వ్యక్తిపై అవినీతి ఆరోపణలు వస్తేనో.. లేదా రెండేళ్లు పూర్తి చేసుకున్నారనే కారణంతో బదిలీ చేస్తుంటారు. అయితే ఇలాంటివేవీ లేకుండానే మార్చేశారు. కాగా మూర్తి పనిచేస్తున్న జే కాలనీలోని స్కూల్లో రెండో టీచర్ లేరు. ఈ క్రమంలో అక్కడి విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. అమాత్యుడు పట్టుబట్టడంతోనే.. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఒత్తిడితోనే జిల్లా సైన్స్ అధికారిని మార్చారనే విమర్శలు విద్యాశాఖలో వినిపిస్తున్నాయి. మూర్తి నియామక విషయమై కలెక్టర్పై బాగా ప్రెజర్ చేశారని తెలుస్తోంది. ఈ తరుణంలో ఈ మేరకు డీఈఓను కలెక్టర్ ఆదేశించారని సమాచారం. మరోవైపు జిల్లా కేంద్రంలో నోడల్ అధికారిగా మూర్తి గతంలో పనిచేశారు. పాఠశాలకు సక్రమంగా వెళ్లారని.. జిల్లా కేంద్రానికే ఎక్కువ భాగం పరిమితమవుతారని ఉపాధ్యాయులే వ్యాఖ్యానిస్తుండటం విశేషం. ఇన్నేళ్లనే ఆర్డర్ ఉండదు జిల్లా సైన్స్ అధికారిగా డిప్యుటేషన్పై వచ్చిన వ్యక్తికి ఇన్నేళ్లనే ఆర్డరేమీ ఉండదు. ఎప్పుడైనా మార్చే అవకాశం ఉంటుంది. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే మార్పు చేశాం. – బాలాజీరావు, డీఈఓ తాను గతంలో అయ్యోరినేనంటూ ఎక్కడ అవకాశం లభిస్తే.. అక్కడ మంత్రి నారాయణ చెప్తుంటారు. ఇప్పటికీ అదే అనుకున్నారో.. ఏమో.. గానీ తాజాగా ఆయన పెత్తనం విద్యాశాఖపై పడింది. ఈ విమర్శలకు బలం చేకూరుస్తూ ఏకంగా సైన్స్ అధికారినే బదిలీ చేయించి.. నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్ను కల్పించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. అనంతసాగరం మండలంలోని జే కాలనీలో ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్న జేవీఆర్ మూర్తిని ఈ స్థానంలో నియమించారు. ఈ పరిణామాల క్రమంలో సదరు స్కూల్లో పీఎస్ ఉపాధ్యాయుడే కరువయ్యారు. -
పంటల బీమా అమలులో నిర్లక్ష్యం వద్దు
● జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కలెక్టర్నెల్లూరురూరల్: ‘పంటల బీమా అమలులో నిర్లక్ష్యంగా ఉండొద్దు. అర్హత ఉన్న రైతులు నమోదయ్యేలా చర్యలు చేపట్టాలి’ అని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. బుధవారం నెల్లూరులోని కలెక్టరేట్లో పంటల బీమా పథకాల అమలుపై జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరి పంటకు ఎకరాకు రూ.42,000 బీమాకు రైతు వాటా రూ.840 అన్నారు. చివరి తేదీ ఆగస్టు 15వ తేదీ అని తెలిపారు. వేరుశనగకు రూ.28,000కు రైతు వాటా రూ.280 కాగా, చివరి తేదీ జూలై 31, పత్తికి రూ.40,000కు రైతు వాటా రూ.2,000, చివరి తేదీ జూలై 24, నిమ్మకు రూ.48,000 బీమా మొత్తానికి అన్నదాత వాటా రూ.2,400 అని, చివరి తేదీ జూలై 24గా నిర్ణయించినట్లు వివరించారు. ప్రీమియం చెల్లింపు, బీమా నమోదు గడువులు, పథకాల ప్రయోజనాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఖరీఫ్ 2024 వరకు ఉచిత పంటల బీమా అమలులో ఉండగా, రబీ 2024 – 25 నుంచి రుణగ్రహీత, రుణేతర రైతులకు స్వచ్ఛంద నమోదు విధానం అమలులో ఉందన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పంట రుణం పొందిన అన్నదాతలు బీమాకు అర్హులన్నారు. బ్యాంక్లు, సాధారణ సేవా కేంద్రాలు, జాతీయ పంటల బీమా నమోదు వేదిక, గ్రామ సచివాలయాలు, తపాలా కార్యాలయాల ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారిణి పి.సత్యవాణి, జిల్లా ఉద్యాన అధికారి కె.అనురాధ, నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి డాక్టర్ బాబు, లీడ్ జిల్లా మేనేజర్ మునిశేఖర్, జిల్లా ప్రణాళికాధికారి లక్ష్మీనరసింహులు తదితరులు పాల్గొన్నారు. -
బల్కర్లపై తమ్ముళ్ల తిరుగుబాటు
● రాజకీయ విమర్శలకు దారితీసిన ఆందోళన ● పెంచి పోషించింది మీరేనంటున్న ప్రజలు ముత్తుకూరు(పొదలకూరు): ముత్తుకూరు ప్రధాన రహదారిపై అధిక లోడ్తో బూడిద బల్కర్లు సంచరిస్తుండటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ బ్రహ్మదేవిలోని జెన్కో రోడ్డు వద్ద నిరసనను టీడీపీ నేతలు బుధవారం చేపట్టారు. సామర్థ్యానికి మించి తరలిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పేర్కొన్నారు. ఇదే అంశమై పల్లె వీక్షణ కార్యక్రమంలో కలెక్టర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. 30 టన్నుల సామర్థ్యంతో వెళ్లాల్సిన బల్కర్లు 80 టన్నులతో రాకపోకలు సాగిస్తున్నాయని, దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా, ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. రహదారులు దెబ్బతింటున్నాయన్నారు. ముత్తుకూరు మెయిన్ రోడ్డుపై రాకపోకలకు అనుమతివ్వకుండా, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించేలా చూడాలని డిమాండ్ చేశారు. ఇదెక్కడి చోద్యం..? నిన్నామొన్నటి వరకు బూడిద బల్కర్ల రాకపోకలను అధికార పార్టీ నేతలు ప్రోత్సహించి, ఇప్పుడు ఇదే అంశంపై నిరసనలు చేపట్టి నియంత్రణ కోరడం విడ్డూరంగా ఉందని ప్రజలు విమర్శించారు. వీరి అండదండలతోనే ఇంతకాలం బల్కర్లు ఇష్టారాజ్యంగా తిరిగాయని ఆరోపించారు. మరోవైపు టీడీపీ నేతల ఆందోళన మండలంలో చర్చనీయాంశంగా మారింది. -
పనికెళ్లి.. కానరాని లోకాలకు..
● పొగాకు బేళ్లు పడి కూలీ మృతి ● ఆదుకుంటామని బోర్డు అధికారుల హామీ కలిగిరి: అతను ఉదయం ఇంట్లో భార్యాపిల్లలకు చెప్పి పనికొచ్చాడు. కానీ అదే ఆఖరి మాటైంది. అనుకోని ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. మండలంలోని కలిగిరిలో పొగాకు వేలం కేంద్రంలో ఆగి ఉన్న లారీలో లోడు చేసిన పొగాకు బేళ్లు పడి మెంతం శివకోటిరెడ్డి (52) అనే కూలీ మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కలిగిరి కొత్తూరుకు చెందిన శివకోటిరెడ్డికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. అతను 20 సంవత్సరాలపాటు వేలం కేంద్రంలో హమాలీగా పనిచేశాడు. ఈ సంవత్సరం మేసీ్త్రలు పిలిస్తే పనులకు వెళ్తున్నాడు. బుధవారం గోదాములోని పొగాకు బేళ్లను సహచర కూలీలతో కలిసి లారీల్లో లోడ్ చేశాడు. ఐటీసీ కంపెనీ లారీలు బోర్డు ప్రాంగణంలోకి రోడ్డుపైకి వచ్చాయి. శివకోటిరెడ్డి మంచినీరు తాగేందుకు ఆఫీస్ గది వద్దకు లారీ పక్కగా వెళ్తున్నాడు. ఒక్కసారిగా ఆరు బేళ్లు అతడిపై పడ్డాయి. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. నిర్లక్ష్యం వల్లే.. శివకోటిరెడ్డి మృతివిషయం తెలుసుకుని జెడ్పీటీసీ సభ్యుడు పాలూరు మాల్యాద్రిరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కాటం రవీంద్రారెడ్డి, మృతుడి బంధువులు భారీ సంఖ్యలో వేలం కేంద్రానికి చేరుకున్నారు. లారీలో లోడ్ చేసిన పొగాకు బేళ్లకు మోకులు కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే అతను చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. వేలం నిర్వహణాధికారి జి.రాజశేఖర్, రైతు సంఘాల నాయకులు మృతుడి కుటుంబ సభ్యులతో చర్చించారు. బోర్డు, రైతుల తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కలిగిరి సీఐ పి.సుబ్బారావు, ఎస్సై లతీఫున్నీసా, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అలాగే బోర్డు అధికారులు, రైతులు, మృతుల కుటుంబ సభ్యులతో చర్చించారు. పూర్తి న్యాయ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అందరితో కలివిడిగా ఉండే శివకోటిరెడ్డి మృతితో కలిగిరిలో విషాదం నెలకొంది. -
రీ సర్వేను వేగవంతం చేయండి
సంగం: జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళనకు అత్యంత ప్రాధాన్యమిస్తూ చేపట్టిన రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం సందర్శించిన ఆయన రీ సర్వే పురోగతిపై సమీక్షించారు. రికార్డులు, మ్యాపులు, సాంకేతిక వివరాలను పరిశీలించారు. పనుల్లో పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార చర్యలపై వివరాలను ఆరాతీసిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలోని 690 రెవెన్యూ గ్రామాల్లో రీ సర్వే దశల వారీగా సాగుతోందని చెప్పారు. 2024కు ముందు 314 గ్రామాల్లో పూర్తయిందని, మిగిలిన ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉందన్నారు. పూర్తయిన గ్రామాల రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని, వచ్చే నెల మొదటి వారానికి మరో విడత పూర్తి కానుందని వెల్లడించారు. సాంకేతిక పొరపాట్లు అక్కడక్కడా వెలుగుచూస్తున్నాయని, వీటిని వెంటనే సరిదిద్దేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. తొలుత స్థానిక బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యత, రుచి, పరిశుభ్రతపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ సారంగపాణి, ఎంపీడీఓ షాలెట్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ట్రాన్స్పోర్టు కనెక్ట్ యాప్లో నమోదు చేయాలి నెల్లూరు (టౌన్): రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ మారిటైమ్ బోర్డు, యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ ఫేస్ ప్లాట్ఫామ్ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన ఏపీ ట్రాన్స్పోర్టు కనెక్ట్ యాప్లో వాహన యజమానుల వివరాలు నమోదు చేసుకోవాలని డీటీసీ చందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని లారీ యజమానులు, ట్రాన్స్పోర్టు ఆపరేటర్లు, ఫ్లీట్ ఓనర్లు, ఇతర రవాణా సంస్థలను ఒకే డిజిటల్ లాజిస్టిక్స్ వేదికపైకి తీసుకురావడమే లక్ష్యమని వివరించారు. జాతీయ లాజిస్టిక్స్ వ్యవస్థతో అనుసంధానమై రవాణా రంగంలో పారదర్శకత, వేగం, సౌలభ్యాన్ని పెంపొందించడమే దీని ఉద్దేశమన్నారు. ఏపీ ట్రాన్స్పోర్టు కనెక్ట్ యాప్లో లారీ నంబర్, ఓనరు పేరు, అడ్రస్, మొబైల్ నంబర్, డ్రైవరు పేరు తదితర వివరాలను నమోదు చేసుకోవడం ద్వార భవిష్యత్తులో డిజిటల్ సేవలు, వేగవంతమైన ధ్రువీకరణ, తక్కువ పేపర్ వర్క్, సులభమైన సమాచార మార్పిడి, విస్తృత వ్యాపార అవకాశాలను పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలోని లారీ యజమానులు, ట్రాన్స్పోర్టు సంస్థలు, ఫ్లీట్ ఓనర్లు, అన్ని రంగాల వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు transportconnect. ap.gov.inను సంప్రదించాలని సూచించారు.నేటి నుంచి ఐటీఐ రెండో విడత ప్రవేశాలు నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో రెండో విడత ప్రవేశాల కోసం గురువారం నుంచి వచ్చే మూడులోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్ శ్రీధర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఐటీఐలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను వచ్చే నెల నాలుగున చేయించుకోవాలని కోరారు. ప్రభుత్వ ఐటీఐలో ఆరున.. ప్రైవేట్ ఐటీఐల్లో కౌన్సెలింగ్కు ఎనిమిదిన హాజరుకావాలని కోరారు. వివరాలకు సమీపంలోని ప్రభుత్వ కళాశాలను సంప్రదించాలని సూచించారు. -
సమస్యల పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ను ఆశ్రయించండి
● చైర్మన్, రిటైర్డ్ జస్టిస్ శ్రీనివాస ఆంజనేయమూర్తినెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ సమస్యలు అధికారుల వద్ద పరిష్కారం కాకపోతే సీజీఆర్ఎఫ్ను ఆశ్రయించాలని చైర్మన్, రిటైర్డ్ జస్టిస్ శ్రీనివాస ఆంజనేయమూర్తి కోరారు. బుధవారం ఆయన నెల్లూరుకు విచ్చేశారు. విద్యుత్ భవన్లోని గెస్ట్హౌస్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యుత్ వినియోగదారులు ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. నూతన సర్వీసులు, ట్రాన్స్ఫార్మర్లు, మీటర్లలో లోపాలు, మార్పు, లోడ్ పెంపు, తగ్గింపు, కేటగిరీల మార్పు, బిల్లుల్లో లోపాలు లాంటి సమస్యలకు పరిష్కారం లభించకపోతే సీజీఆర్ఎఫ్ను సంప్రదించాలని కోరారు. అంతకుముందు ఫిర్యాదులను సెక్షన్ కార్యాలయం, ఏఈ, ఏడీఈ, ఈఈ స్థాయి అధికారుల వద్ద నమోదు చేయాలని సూచించారు. ప్రత్యక్షంగా, పోస్ట్కార్డు, వాట్సాప్, ఏపీఎస్పీడీసీఎల్ వెబ్సైట్లోని పోర్టల్ ద్వారా కూడా సమస్యలు చెప్పొచ్చన్నారు. 2023 నుంచి ఈ ఏడాది జూన్ వరకు 1,291 ఫిర్యాదులు అందగా 1,234 ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. వివరాలకు 0877 – 2284118, 94408 12154 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో సభ్యులు మధుకుమార్, శ్రీనివాసబాబు, జిల్లా ఎస్ఈ రాఘవేంద్రం, ఈఈలు శ్రీధర్, ప్రసాద్, డీఈఈ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
పేరు మహిళలది..పెత్తనం డీలర్లది
నెల్లూరు(పొగతోట): జిల్లాలో ఖాళీగా ఉన్న చౌకదుకాణాల నిర్వహణలో నిబంధనలు అమలు కావడం లేదన్న విమర్శలున్నాయి. డీలర్లు లేని వాటిని స్వయం సహాయక సంఘాల (పొదుపు మహిళల) పేరుతో కేటాయించినప్పటికీ, వాస్తవానికి వాటిని మాజీ డీలర్లు లేదా ఇతరులే నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో సుమారు 160కిపైగా రేషన్ షాపులు డీలర్లు లేక ఖాళీగా ఉన్నాయి. రాజీనామాలు, 6ఏ కేసులు తదితర కారణాలతో ఖాళీ అయిన వాటిని తాత్కాలికంగా స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. నిబంధనల ప్రకారం మూడు నెలల్లో కొత్త డీలర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉన్నప్పటికీ, ఏళ్లుగా ఆ ప్రక్రియ చేపట్టలేదు. నెల్లూరు, కావలి, గూడూరు తదితర ప్రాంతాల్లో ఒకే డీలర్ మూడు నుంచి ఐదు వరకు షాపులను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నెల్లూరులో ఓ వ్యక్తి ఆధ్వర్యంలో ఏకంగా ఎనిమిది దుకాణాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసినా రెవెన్యూ, సివిల్ సప్లయీస్ అధికారులు పట్టించుకోవడం లేదు. నెలనెలా లంచాలు తీసుకుని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రిజైన్ చేసిన చౌకదుదకాణాల వివరాలు ఆర్డీఓ వద్ద ఉంటాయి. వారు పరిశీలించి నోటిఫికేషన్లు ఇవ్వాలి. కానీ సంవత్సరాల తరబడి ఇలా జరగడం లేదు. అక్రమాలెన్నో.. ఖాళీలను భర్తీ చేయకపోవడంతో రేషన్ పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అవకాశం ఏర్పడుతోంది. కొన్ని చౌకదుకాణాల్లో రేషన్ను లబ్ధిదారులకు పూర్తిగా పంపిణీ చేయకుండా, కార్డుదారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని మాఫియాకు, రైస్మిల్లులకు, హోటళ్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కార్డుదారుల నుంచి కిలో సుమారు రూ.12కు కొనుగోలు చేసిన బియ్యాన్ని హోటళ్లకు రూ.22కు, మాఫియాకు సుమారు రూ.17కు విక్రయిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 1,513 చౌకదుకాణాలు ఉండగా, ప్రతినెలా సుమారు 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ అవుతోంది. ఇంత పెద్ద వ్యవస్థపై పర్యవేక్షణ లోపిస్తోందనే విమర్శలున్నాయి. 5వ తేదీకే నో స్టాక్ నిబంధనల ప్రకారం ప్రతినెలా సాధారణ కార్డుదారులకు 1 నుంచి 15వ తేదీ వరకు చౌకదుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేయాలి. 26 నుంచి 31వ తేదీ వరకు దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్ద అందజేయాలి. అయితే పోర్టబిలిటీ పేరుతో కొందరు డీలర్లు నెలలో 4 లేదా 5వ తేదీకే దుకాణాల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని విమర్శలున్నాయి. రేషన్ కోసం వెళ్లిన వారికి బియ్యం అయిపోయింది.. వచ్చే నెల తీసుకోండని వెనక్కి పంపుతున్నారు. 26 నుంచి 31వ తేదీ వరకు దివ్యాంగులు, వృద్ధులకు మాత్రమే బియ్యం ఇంటి వద్ద ఇవ్వాల్సి ఉంది. డీలర్లు వారికి కాకుండా బోగస్ కార్డులకు పంపిణీ చేస్తున్నారు. పోర్టబిలిటీ విధానాన్ని దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. వీఆర్ఏలు, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొన్ని చౌకదుకాణాల్లో రేషన్ పంపిణీ అస్తవ్యస్తంగా సాగుతోంది. దీనిపై రెవెన్యూ, సివిల్ సప్లైస్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, ఖాళీ డీలర్ పోస్టులను భర్తీ చేయాలని కార్డుదారులు కోరుతున్నారు. చౌకదుకాణాలపై పర్యవేక్షణ కరువు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం డీలర్లకు వరం జిల్లాలో 160కి పైగా దుకాణాలు ఖాళీ పోర్టబిలిటీ పేరుతో అక్రమాలు పక్కదారి పడుతున్న పేదల బియ్యం -
అస్వస్థతలోనూ అప్రమత్తమై..
● అనారోగ్యానికి గురైన డ్రైవర్ ● రోడ్డు పక్కన బస్సు నిలిపివేత ● 45 మంది ప్రయాణికుల క్షేమంసంగం: మండలంలోని సంగం సమీపంలో ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ అప్రమత్తమవడంతో ఘోర ప్రమాదం తప్పింది. వివరాలిలా ఉన్నాయి. బుధవారం పామూరు నుంచి 45 మంది ప్రయాణికులతో నెల్లూరుకు ఆర్టీసీ బస్సు వస్తోంది. డ్రైవర్ త్రిమోటి ప్రయాణ మధ్యలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. అతను స్టీరింగ్పై వాలిపోయేలోపు బస్సును రోడ్డు పక్కకు సురక్షితంగా నిలిపివేశాడు. ప్రయాణికులు వెంటనే డ్రైవర్ను సంగం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించగా ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని తెలిపారు. డ్రైవర్ కర్తవ్యదీక్షతో వ్యవహరించడంతో 45 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కండక్టర్ ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేయగా, ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. -
మాతృశాఖకు సరెండర్
నెల్లూరు (టౌన్): సమగ్రశిక్షలో జరిగిన అవినీతిపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. వింజమూరు, దుత్తలూరు ప్రాంతాల్లోని పాఠశాలల్లో ప్రహరీలను ఉపాధి హామీ నిధులతో నిర్మించి నాడు – నేడు కింద డ్రా చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విజిలెన్స్ విచారణకు కలెక్టర్ ఆదేశించారు. ఎంకై ్వరీ అనంతరం నివేదికను అందజేశారు. దీంతో సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, సూపరింటెండెంట్ అశోక్ను మాతృశాఖకు సరెండర్ చేస్తూ ఉత్తర్వులను ఆ శాఖ ఎస్పీడీ శ్రీనివాసులు జారీ చేశారు. వెంకటసుబ్బయ్యను హయ్యర్ ఎడ్యుకేషన్కు.. అశోక్ను విద్యాశాఖ ఆర్జేడీకి గురువారం రిపోర్టు చేయాల్సిందిగా అందులో పేర్కొన్నారు. టీసీఎస్ ప్రతినిధిగా పనిచేస్తున్న నేతాజీని తొలగించారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి.. శిలాతోరణం వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 82,105 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 34,484 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.17 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టిక్కెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
అయ్యా.. మా పొట్ట కొట్టొద్దు
● కొనసాగిన డాక్యుమెంట్ రైటర్ల నిరసన ● మూడోరోజు 32 రిజిస్ట్రేషన్లే.. నెల్లూరు సిటీ: ‘అయ్యా ప్రభుత్వ పెద్దలూ.. 396 జీఓతో మా పొట్ట కొట్టొద్దు. దానిని వెంటనే ఉపసంహరించుకోవాలి’ అని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ చేశారు. నెల్లూరులోని ప్రధాన రిజిస్ట్రేషన్ (ఆర్ఓ) కార్యాలయం వద్ద బుధవారం వారు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పట్నం దుర్గేష్బాబు మాట్లాడుతూ ఏళ్ల తరబడి కేవలం ఈ వృత్తిపై ఆధారపడి వందల మంది జీవిస్తున్నారన్నారు. ప్రభుత్వం కనీసం వారి పరిస్థితిని ఆలోచించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రూ.27 లక్షలే.. జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బుధవారం 32 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. 396 జీఓను వ్యతిరేకిస్తూ రైటర్లు ఈనెల 20వ తేదీ నుంచి పెన్డౌన్ చేస్తూ కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రోజూ 100 నుంచి 150కి పైగా రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉండగా ఆ సంఖ్య తగ్గింది. 32 రిజిస్ట్రేషన్లకు రూ.27 లక్షలు మాత్రమే ఆ శాఖకు ఆదాయం వచ్చింది. -
జర్నలిస్టుల రక్షణకు జేపీఎఫ్ ఆవిర్భావం
నెల్లూరు రూరల్: జిల్లాలో పాత్రికేయులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, వేధింపులను ఎదుర్కొనేందుకు గానూ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. నగరంలోని కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో గల ఓ హోటల్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫ్ రిపోర్టర్లు హాజరై ఈ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ గౌరవాధ్యక్షుడిగా డెక్కన్ క్రానికల్ కరస్పాండెంట్ రాజశేఖర్, కన్వీనర్గా ఛానల్ – 9 ఎండీ జయరాజు, కో కన్వీనర్లుగా విశాలాంధ్ర బ్యూరో దయాశంకర్, హెచ్ఎంటీవీ బ్యూరో ఇనన్చార్జి నరసింహులు, 99 టీవీ బ్యూరో ఇన్చార్జి మురళీకృష్ణ, వార్త జిల్లా ఇనన్చార్జి నరేంద్ర, ఎన్ – 3 ఛానల్ ఎండీ సునీల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యులుగా టీవీ 9కు చెందిన మురళి, ప్రజాశక్తి బాలకృష్ణ, సాక్షి మస్తానన్రెడ్డి, ఆంధ్రప్రభ వెంకటేశ్వర్లు, ఈటీవీ రాజారావు, ఆర్టీవీ గయాజ్, సీవీఆర్ న్యూస్ రమేష్, ఏబీఎన్ మహేష్, టీవీ 5 రాజేష్, మహాన్యూస్ దినకర్, ఆంధ్రజ్యోతి అమర్, వీ 6 ఖాజా, 10 టీవీ దేవ, ప్రైమ్ 9 నరేష్, జీటీవీ మునీంద్ర, బీఆర్కే మల్లికార్జున్, ఎన్టీవీ వెంకటనారాయణ, బిగ్ టీవీ సురేంద్ర, స్వతంత్ర టీవీ మల్లి, సాక్షి టీవీ లోకేశ్, ఇండియన్ ఎక్స్ప్రెస్ సురేంద్ర, ఐ న్యూస్ సాగర్ నియమితులయ్యారు. నెల్లూరులో ఆత్మహత్యకు పాల్పడిన జర్నలిస్ట్ దినేష్కు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి.. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు. -
ఎలక్ట్రిక్ కారు ఢీకొని స్కూటీ దగ్ధం
● జంగాలకండ్రిగ వద్ద రోడ్డు ప్రమాదం ● ఇద్దరికి తీవ్ర గాయాలు ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని జంగాలకండ్రిగ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. నెల్లూరు నుంచి ముత్తుకూరు వైపు వస్తున్న ఓ ఎలక్ట్రిక్ కారు ముత్తుకూరు వెళ్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టింది. అదుపు తప్పిన కారు రోడ్డుపక్కన ఉన్న ఆటోను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కారు ఢీకొన్న వెంటనే స్కూటీలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నాయుడుపేట మండలం యాకసిరి గ్రామానికి చెందిన పూండ్ల పవన్కుమార్, స్కూటీపై ప్రయాణిస్తున్న నార్తురాజుపాళెం సమీపంలోని రామన్నపాళేనికి చెందిన ఉదయగిరి కృష్ణయ్య తీవ్ర గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ సిబ్బంది నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు వివరాలు తెలియాల్సి ఉంది. ఆక్వా మందుల దుకాణంలో తనిఖీలు ● రూ.లక్ష జరిమానా ఇందుకూరుపేట: మత్స్య శాఖ అధికారులు మండలంలోని కుడితిపాళెంలో ఆక్వా దుకాణంలో బుధవారం తనిఖీలు చేపట్టారు. సీఏఏ అనుమతుల్లేని నాలుగు రకాల మందులను గుర్తించి రూ.లక్ష జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆ శాఖ ఏడీ చాన్బాషా, ఎఫ్డీఓ సురేష్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా గుర్తింపు లేని మందులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆక్వా రైతులు మందులను పరిశీలించి సక్రమంగా ఉంటేనే వాటిని వినియోగించుకోవాలన్నారు. లేకుంటే నష్టాలు పాలవుతారని వాపోయారు. వ్యక్తి అనుమానాస్పద మృతి చిల్లకూరు: మండలంలోని తిప్పగుంటపాళెం గ్రామంలో ఓ వ్యక్తి బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. తిప్పగుంటపాళెం సమీపంలో ఉన్న రొయ్యల గుంతలను విజయవాడకు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి లీజుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. వాటి వద్ద స్థానిక గిరిజన కాలనీకి చెందిన రాపూరు వెంకటేశ్వర్లు (42) కాపలాగా ఉంటున్నాడు. ఏమైందో తెలియదు గానీ అతను గుంతల వద్ద పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికంగా ఉన్నవారు గుర్తించి తాగిన మందును కక్కించి ఇంటికి పంపారు. అయితే కాసేపటికి వెంకటేశ్వర్లు మృతిచెందాడు. దీనిపై గిరిజన కాలనీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.60 సన్నవి : రూ.30 పండ్లు : రూ.15 -
గిరిజన బిడ్డల ఆకలి కేకలు
● ఉపాధ్యాయుడు రాక మూతబడిన పాఠశాల చిల్లకూరు: తమ పిల్లలను బడికి పంపితే మధ్యాహ్నం ఓ ముద్ద బువ్వైనా తింటారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు వదిలెళ్తుంటారు. అయితే పాఠశాలకు సకాలంలో రావాల్సిన అయ్యోర్లు.. అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో చిన్నారులకు ఆకలి కేకలు తప్పడం లేదు. ఇలాంటి ఘటనే గూడూరు రూరల్ పరిధిలోని కుందకూరు గిరిజన కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. డిప్యుటేషన్పై రోజుకొకరు.. గిరిజన కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి డిప్యుటేషన్పై రోజుకొకర్ని విద్యాశాఖ పంపుతోంది. ఈ క్రమంలో ఒకరికి ఆదేశాలివ్వాల్సిన అధికారులు, అందుకు భిన్నంగా మరొకరికి ఇవ్వడంతో ఆయన బడికే వెళ్లలేదు. దీంతో బడి తెరుచుకోకపోవడంతో ఉన్న ఆరుగురు గిరిజన పిల్లలు ఆకలితో అలమటించిపోయారు. అటకెక్కుతున్న చదువులు మారుమూల ఉన్న గిరిజన కాలనీలోని పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ అంశమై గూడూరు ఎంఈఓ మాధవరావును సంప్రదించగా, డిప్యుటేషన్ పంపే విషయంలో కొద్దిగా మార్పులు చోటుచేసుకోవడంతో పొరపాటు జరిగిందని, ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని బదులిచ్చారు. -
జ్యుడీషియల్ విచారణకు డిమాండ్
నెల్లూరురూరల్: మనుబోలు పోలీస్స్టేషన్లో దళిత యువకుడు ఏడుకొండలు కస్టడీలో మృతిచెందిన ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పందిటి కామరాజు డిమాండ్ చేశారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ ఘటన జరిగి రోజులు గడిచినా ఇప్పటివరకు బాధ్యులపై శాఖాపరమైన లేదా క్రిమినల్ చర్యలు తీసుకోలేదన్నారు. పోలీస్ కస్టడీలో దళితుడు మృతిచెందడం అత్యంత దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారున్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు అనేకం జరుగుతున్నాయని ఇది దారుణమన్నారు. సమావేశంలో ఎస్సీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దొంతాల రఘు, సర్వేపల్లి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాముల శ్రీనివాసులు, నెల్లూరు సిటీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాహుల్, ఇంకా బద్దేపూడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
‘ఎస్ఐఆర్’లో రాజకీయ పార్టీల సహకారం కీలకం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరురూరల్: ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా కోరారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్లో డీఆర్వో విజయకుమార్తో కలిసి ఆయన గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 19,74,240 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరిలో 9,62,575 మంది పురుషులు, 10,11,452 మంది మహిళలు, 213 మంది ఇతరులు ఉన్నట్లు చెప్పారు. ఎస్ఐఆర్ ప్రీమ్యాపింగ్ ప్రక్రియలో ప్రారంభంలో 66 శాతం పూర్తవగా, ప్రస్తుతం 82.62 శాతానికి చేరిందన్నారు. ప్రస్తుతం 45,890 (2.32 శాతం) కేసులు మాత్రమే మ్యాపింగ్ కాలేదన్నారు. 2,44,874 (12.40 శాతం) ట్రేస్ కాని కేసులు ఉన్నాయని తెలిపారు. మ్యాపింగ్ కాని, ట్రేస్ కాని కేసులకు మాత్రమే సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు. 80,405 మంది ఓటర్లు మరణించినట్లుగా గుర్తించామన్నారు. వీరికి సంబంధించి మరణ ధ్రువీకరణ పత్రం లేదా ఇతర ఆధారపత్రాలతో జాబితా నుంచి తొలగింపు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అలాగే 37,484 డూప్లికేట్, 67,384 గైర్హాజరు, 1,10,273 శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లను గుర్తించామన్నారు. 24న బీఎల్వోలు, బీఎల్ఏలతో మరో సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మ్యాపింగ్ స్థితి, అనామక కేసులు, ఇతర ఏఎస్డీడీ అంశాలపై చర్చిస్తామన్నారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బి.శ్రీరాం, బైరి శ్రీనివాస్, వై.రాజేష్, కె.శ్రీనివాసులు, టి.బాలసుధాకర్, వి.భువనేశ్వర ప్రసాద్, వి.సురేంద్రబాబు, ఎంవీ శేషయ్య పాల్గొన్నారు. -
అభినవ దుశ్శాసనులు.. పచ్చ సైకోలు
గత ప్రభుత్వంలో మహిళలకు రక్షణ నెల్లూరు రూరల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక మహిళలకు రక్షణ కరువైందని.. పచ్చ సైకోలు అభినవ దుశ్శాసనుల్లా చెలరేగిపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ధ్వజమెత్తారు. నగరంలోని వీఆర్సీ కూడలి వద్ద జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ తదితరులతో కలిసి భారీ నిరసన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని సమర్పించిన అనంతరం పూజిత మాట్లాడారు. మహిళలపై దాడులు, దుశ్శాసన పర్వాలు, హత్యలు, లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడుతున్న వారందరూ టీడీపీ ముసుగేసుకున్న పచ్చ సైకోలేనని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల మొదలుకొని రాష్ట్ర హోం మంత్రి వరకు అందరూ నేరస్తులను అండగా ఉండటంతో పోలీసులు సైతం కేసు నమోదు చేయకుండా తారుమారు చేస్తున్నారని దుయ్యబట్టారు. కావలిలో ఎస్టీ మహిళను గత నెల 19న వివస్త్రను చేసి పచ్చ నేతలు దారుణంగా కొట్టారని, ఘటనపై ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. నాడే కఠిన చర్యలను చేపట్టి ఉంటే గుంటూరు, బద్వేల్లో ఘటనలు చోటుచేసుకునేవి కావని చెప్పారు. బాధితులను టీడీపీ మహిళా నేతలు పరామర్శించకపోవడం.. పచ్చ సైకోల చర్యలను ఖండించకపోవడం దారుణమన్నారు. ఘటనలను కప్పిపుచ్చేందుకు సర్కార్ యత్నిస్తోందని ఆరోపించారు. వారి అరాచకాలను ప్రశ్నిస్తే, ప్రతిపక్షాలపై బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. వరుస ఘటనలతో అభద్రత రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలతో మహిళల్లో అభద్రతాభావం నెలకొంటోందని చెప్పారు. వీటికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రజలకు చంద్రబాబుతో సహా కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో అతివలకు భద్రత, మనోధైర్యం, సాధికారత కల్పించిన అంశాన్ని గుర్తుచేశారు. దిశ యాప్, చట్టాలను పటిష్టంగా అమలు చేయడంతో బయట ధైర్యంగా తిరిగేవారని, అయితే ప్రస్తుతం ఇవేవీ లేవని విమర్శించారు. హోం మంత్రి రాజీనామా చేయాలి మహిళల మాన, ప్రాణాలను రక్షించలేని నీచమైన స్థితిలో ప్రభుత్వం ఉందని పార్టీ రాష్ట్ర మహిళా జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి మండిపడ్డారు. ఈ రెండేళ్లలో కుప్పం నుండిచి కురుపాం వరకు పూటకో దాడి జరిగిందని ఆరోపించారు. కేంద్ర నివేదిక ఎన్సీఆర్బీ ప్రకారం మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఘటనల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని, న్యాయం జరగాలంటే హోం మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రక్షణకు చర్యలు శూన్యం రాష్ట్రంలో పోలీస్, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, వెంకటగిరి పరిశీలకులు కోడూరు కల్పలతారెడ్డి మండిపడ్డారు. ప్రతి స్టేషన్ పరిధిలో నేరగాళ్ల చిట్టానైనా బయటపెడితే కనీసం ప్రజలైనా తెలుసుకొని తమను తాము కాపాడుకుంటారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణకు పెద్ద పీటేశారని తెలిపారు. పాలనను గాలికొదిలారు రాష్ట్రంలో మహిళల భద్రతను గాలికొదిలి.. సోషల్ మీడియా యాక్టివిస్ట్లను ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేసి జైల్లో వేసేందుకు సర్కార్ శ్రద్ధ చూపుతోందని పార్టీ జిల్లా మహిళాధ్యక్షురాలు లక్ష్మీసునంద విమర్శించారు. ఇదే శ్రద్ధ మహిళల రక్షణకు ఎందుకు పెట్టడంలేదని ప్రశ్నించారు. రోజుకో దాడి జరుగుతున్నా, కనీస స్పందన లేని ప్రభుత్వాన్ని మొట్టమొదటగా చూస్తున్నామని చెప్పారు. నగర మహిళాధ్యక్షురాలు ధనుజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు అరాచక శక్తులను శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం వైఎస్సార్సీపీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్న వారిపై ప్రస్తుతం ఎలాంటి చర్యల్లేకపోవడంతో మరింత రెచ్చిపోతున్నారని అరుణమ్మ ఆరోపించారు. గత సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో మహిళలకు అన్ని విధాలా రక్షణ కల్పించిన అంశాన్ని ప్రస్తావించారు. టీడీపీ ప్రభుత్వంలో మొదటి ఘటన చోటుచేసుకున్నప్పుడే చర్యలు చేపట్టి ఉంటే ఇలాంటివి జరిగేవి కావని చెప్పారు. -
ఎస్సీ గురుకులాన్ని తెరవాల్సిందే..
● విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన కోట: కోటలో బీఆర్ అంబేడ్కర్ గురుకులం మూసివేతతో విద్యార్థులు రోడ్డున పడ్డారని, వారికి న్యాయం జరిగే వరకూ ఆందోళన కొనసాగిస్తామని తల్లిదండ్రులు తెలిపారు. మంగళవారం వారు గురుకుల పాఠశాల, కళాశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు అప్పగించిన క్రమంలో విద్యార్థులను పలు గురుకులాల్లో సర్దుబాటు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లుతో తల్లిదండ్రులు వాదనకు దిగారు. ఒక్కసారిగా పిల్లల్ని బయటకు పంపాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పేరెంట్స్ కమిటీకి చెప్పకుండా, తల్లిదండ్రుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా అధికారులు వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్కు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. దళిత సంఘాల మద్దతు విద్యార్థుల తల్లిదండ్రులకు బహుజన యూత్ఫోర్స్ సభ్యులు మద్దతు తెలిపారు. 39 ఏళ్ల చరిత్ర కలిగిన గురుకుల పాఠశాలను ఎత్తివేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్నారు. సమైక్యంగా పోరాడి నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. -
24న పాఠశాలల్లో మెగా పీటీఎం
నెల్లూరు(టౌన్): జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ మీటింగ్లు నిర్వహించనున్నట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు తెలిపారు. మంగళవారం నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2,421 ప్రభుత్వ పాఠశాలల్లో 1,59,059 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. దాతలు, పూర్వ విద్యార్థుల సహకారంతో బడుల్లో మౌలిక సదుపాయాలను సమకూర్చనున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రులతో సమావేశమై గత విద్యా సంవత్సరంలో అమలు చేసిన 75 రోజుల కార్యాచరణ ప్రణాళిక, తుది ఫలితాలపై చర్చిస్తామన్నారు. తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించాలన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమాన్ని మధ్యాహ్న భోజనంతో ముగించాలన్నారు. సమావేశాలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, సీఎంఓ రమణయ్య, ఏఎంఓ పెంచలయ్య పాల్గొన్నారు. -
రైతు బజార్లలో పప్పుల విక్రయాలు
పొదలకూరు: జిల్లాలోని ఐదు రైతు బజార్లలో తక్కువ ధరలకు పప్పులు, నూనెలను విక్రయించనున్నామని మార్కెటింగ్ ఏడీ అనితాకుమారి పేర్కొన్నారు. స్థానిక రైతు బజార్లో పప్పుల అమ్మకాలను మంగళవారం ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. జిల్లాలో ని అసోసియేషన్లతో జేసీ వెంకటేశ్వర్లు సంప్రదింపులు జరిపి పప్పు లు, నూనెలను బహిరంగ మార్కెట్ కంటే తక్కు వగా అందజేసేలా ఏర్పాటు చేశారని చెప్పారు. బియ్యం, కందిపప్పు, మినపప్పు, పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. బియ్యంపై రూ.10, కందిపప్పు పై రూ.70, మినపప్పుపై రూ.ఏడు, నూనెలపై రూ.పది మేర తగ్గించి విక్రయించనున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా ఉద్యానాధికారి సుబ్బారెడ్డి, సొసై టీ చైర్మన్ మస్తాన్బాబు, నెల్లూరు, పొదలకూరు ఏఎమ్సీ సెక్రటరీలు శ్రీనివాసు లు, కృష్ణప్రసాద్, మల్లికార్జున్నాయుడు, ఏఎమ్సీ డైరెక్టర్లు అనూరాధ, రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
నిమ్మ ధరలు (కిలో)
ఆస్తి తీసుకుని.. గుండైపె తన్ని.. ● కుమారుడు వీధిపాలు చేశాడని వృద్ధుడి ఆవేదన ● న్యాయం కోసం తహసీల్దార్కు వినతిఅనుమసముద్రంపేట: ఓ తండ్రి కుమారులకు ఆస్తులు పంచి ఇచ్చాడు. అయితే చిన్న కుమారుడు మోసం చేసి మిగిలిన ఆస్తిని సైతం రాయించుకుని ఇంటి నుంచి వెళ్లగొట్టాడంటూ సోమవారం ఏఎస్పేట తహసీల్దార్ కార్యాలయంలో కన్నీటి పర్యంతమయ్యాడు. అనుమసముద్రం గ్రామానికి చెందిన సోము హజరత్రెడ్డి ఇన్చార్జి తహసీల్దార్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వివరాలు వెల్లడించారు. ముగ్గురు కుమారులకు వివాహాలు చేసి ఒక్కొక్కరికి ఏడెకరాల చొప్పున భూమి పంచి ఇచ్చానని తెలిపారు. చిన్న కుమారుడు రమణారెడ్డి, కోడలు జీవితాంతం చూసుకుంటామని చెప్పి తన వద్ద ఉన్న ఒక ఎకరా భూమి, 150 అంకణాల స్థలం, ఏడు సవర్ల బంగారం రాయించుకున్నారని చెప్పారు. కొంతకాలానికే దాడి చేసి ఇంటి నుంచి వెళ్లగొట్టారని, ఆవేదనతో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని వృద్ధుడు కన్నీటి స్వరంతో వివరించారు. పెద్ద కుమారుడు ప్రస్తుతం తనకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. చిన్నకుమారుడి నుంచి భూమిని ఇప్పించి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాలని కోరారు.పెద్దవి : రూ.55 సన్నవి : రూ.25 పండ్లు : రూ.10 -
మీడియా గొంతు నొక్కే ప్రయత్నమా
● ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీడియా ప్రతినిధులను బదనాం చేస్తారా ? ● మనుబోలు లాకప్ డెత్ విషయంలో మీడియాకు నోటీసులు ఇవ్వడం దురదృష్టకరం ● వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తే వేధించడం దుర్మార్గం ● ఎమర్జెన్సీ సమయంలో కూడా జిల్లాలో మీడియాకు నోటీసులివ్వలేదు ● రాష్ట్రంలో చంద్రబాబు, లోకేశ్ నిరంకుశ పాలన సాగిస్తున్నారు ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటాచలం: ఈ రాష్ట్రంలో చంద్రబాబు, లోకేశ్ పోలీసులను అడ్డుపెట్టుకుని నిరంకుశ పాలన సాగిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియా గొంతు నొక్కాలనుకోవడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. పోలీసులు, అధికార పార్టీ నాయకులు సాగిస్తున్న అప్రజాస్వామిక చర్యలను, దాష్టీకాలను వెలుగులోకి తెస్తున్న మీడియాను బెదిరించేందుకు నోటీసులు ఇవ్వడం దురదృష్టకరమన్నారు. మండలంలోని పూడిపర్తిలో కాకాణి సోమవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్లకు మీడియా భయపడదని, వాళ్లను వేధిస్తే పదిరెట్లు ఘాటుగా స్పందిస్తారనే విషయాన్ని గ్రహించాలని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం తీవ్రంగా దిగజారిపోయి, ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. మనుబోలు పోలీసుల చేసిన లాకప్ డెత్కు సంబంధించి ప్రసారాలు చేసిన మీడియా, జర్నలిస్టులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమని ఖండించారు. నోటీసులు ఇచ్చి ఆ వార్తకు సంబంధించిన ఆధారాలు తీసుకురావాలనడం దురదృష్టకరమన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్లు చేసి జైలుకు పంపడం చూస్తున్నామన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబీఎన్ ప్రచురించిన వార్తలపై ప్రశ్నించే ధైర్యం పోలీసులకు ఉందా అని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే నోటీసులు ఇచ్చి వేధించడం ఎమర్జెన్సీ కాలంలో కూడా మీడియాపై ఇంత దారుణ పరిస్థితులు లేవన్నారు. తప్పులు చేయడం మానుకుంటే మీడియా కూడా స్పందించదన్నారు. మీరు తప్పులు, దుర్మార్గాలు చేస్తున్నారు కాబట్టే మీడియా తన బాధ్యతగాప్రజలకు చూపిస్తుందన్నారు. ఇప్పటికై నా మీడియాపై కక్ష సాధింపు చర్యలనుు మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. -
కడుపులు కాల్చుతున్నారు
మెనూ ప్రకారం కూరలు, కోడిగుడ్లు, చికెన్ పెట్టడం లేదు. ఇదేమిని అడిగితే వార్డె న్ బండ బూతులు తిడుతున్నారు. మూడేళ్లుగా భరిస్తున్నాం. వసతిగృహం నుంచి గుడ్లు, బియ్యం తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. చికెన్, పాలు ఇంటికి తీసుకెళుతూ మా కడుపులు కాల్చుతున్నారు. – సంతోష్, విద్యార్థివార్డెన్ వేధింపులు భరించలేకపోతున్నాం వార్డెన్ వేధింపులు భరించలేకపోతున్నాం. మెనూ ప్రకారం భోజనం సరిగా పెట్టడం లేదు. అర్ధాకలితో సరిపెట్టుకుంటున్నాం. వార్డెన్ చిన్నదానికి కూడా బూతులు తిడుతున్నారు. తల్లిదండ్రులకు చెప్పుకోలేక కుమిలిపోతున్నాం. వార్డెన్ వచ్చినప్పటి నుంచి ఇదే పరిస్థితి. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లారు. మా ఊరు చాలా దూరం కావడంతో వెళ్లలేక ఉంటున్నాం. ఆయన వార్డెన్గా ఉంటే ఇక్కడ ఉండలేం. ఇక్కడి నుంచి వేరే చోటుకు మార్చండి. – వెంకటసాయి, విద్యార్థి● -
పెట్టిందే తిను.. చెప్పిందే విను
వింజమూరు(ఉదయగిరి): వింజమూరులోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం ఎదుట సోమవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, అనవసరంగా అసభ్యపదజాలంతో దూిషించమే కాకుండా కొడుతున్నారని ఆరోపిస్తూ వార్డెన్ ఎన్ భాస్కర్రావు తీరుపై విద్యార్థులు నిరసన తెలిపారు. విద్యార్థులకు ఎమ్మార్పీఎస్, విద్యార్థి సంఘాలు మద్దతు తెలపడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. వార్డెన్ తీరుపై ఆరోపణలు ఎస్సీ బాలుర వసతి గృహ వార్డెన్గా భాస్కర్రావు నాలుగేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వసతిగృహంలో 85 మంది విద్యార్థులు ఉండగా, రాత్రి వేళల్లో 50 మంది మాత్రమే ఉంటున్నారు. మిగిలిన విద్యార్థులు ఇళ్ల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రతిరోజూ విద్యార్థుల ముఖహాజరును తీసుకుని అందరూ ఉన్నట్లుగా చూపించి వార్డెన్ సరుకులు మెక్కెస్తున్నాడు. అంతేకాకుండా సెలవు రోజుల్లో సైతం ఇళ్లకు వెళ్లిన విద్యార్థుల గ్రామాలకు వెళ్లి మరీ హాజరు వేసుకుని సరుకులు మింగేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా కోడి గుడ్లు, బియ్యం, తదితరాలు స్వాహా చేస్తున్నాడు. దీనిపై ప్రశ్నించిన విద్యార్థులను టార్గెట్ చేస్తూ బూతులు తిట్టడం..కొట్టడం చేస్తుండడంతో వారు విసిగిపోయారు. ఈ నేపథ్యంలో ఆదివారం వసతి గృహాన్ని సందర్శించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతకుమారికి పలువురు విద్యార్థులు తమ బాధలను ఏకరువు పెట్టారు. దీంతో ఫిర్యాదు చేసిన విద్యార్థులను గుర్తించి వార్డెన్ తీవ్రంగా దూషించాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు సోమవారం వసతిగృహం వద్దకు రాగా వార్డెన్ వారిని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నాడు. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా వారికి మద్దతుగా నిలబడి వార్డెన్పై తిరుగుబాటు చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి వార్డెన్ను స్టేషన్కు తీసుకెళ్లారు. అనంతరం విద్యార్థులు వసతిగృహం ఎదుట, మెయిన్రోడ్డుపై బైఠాయించి వార్డెన్ను వెంటనే సస్సెండ్ చేయాలని ఆందోళన చేపట్టారు. వీరికి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పందిటి అంబేడ్కర్ మాదిగ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మహంత్రెడ్డి మద్దతు తెలిపారు. వార్డెన్ తీరుపై జిల్లా ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో ఉదయగిరి, ఆత్మకూరు ఏస్డబ్ల్యూఓలు గీతాదేవి, రమణారెడ్డి, స్థానిక ఎస్సీ బాలికల వసతిగృహ మేట్రిన్ భారతి, ఏఎస్సై జయపాల్, కొండాపురం ఎస్సై శ్రీనివాసరావు వసతి గృహానికి వచ్చి విద్యార్థులు, నేతలతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. ఓ దశలో విద్యార్థి సంఘాల నేతలు, పోలీసుల నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. ఏఎస్డబ్ల్యూఓ విచారణ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శోభారాణి ఆదేశాల మేరకు ఏఎస్డబ్ల్యూఓ గీతాదేవి విద్యార్థులు, వసతిగృహ సిబ్బంది, వార్డెన్ నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు పంపుతున్నామని, వారి ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. కాగా వార్డెను తీరును డీడీ శోభారాణి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో సీరియస్ అయినట్లు సమాచారం. వార్డెన్పై సస్పెండ్ వేటు వేయడమా లేదా వేరే చోటుకు బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ ఎస్సీ బాలుర హాస్టల్ వార్డెన్ తీరు విసిగిపోయి ఆందోళన చేపట్టిన విద్యార్థులు వసతిగృహం ఎదుట, మెయిన్ రోడ్డుపైన బైఠాయించి నిరసన సంఘీభావం తెలిపిన ఎమ్మార్పీఎస్, విద్యార్థి సంఘాలు -
తిరుగుతున్నాం.. పరిష్కారమెక్కడ?
● కలెక్టరేట్కు పోటెత్తిన అర్జీదారులు ● 372 వినతుల అందజేతనెల్లూరు(అర్బన్): ‘అయ్యా మండల స్థాయిలో అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. అక్కడ సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో వ్యయ, ప్రయాసలకోర్చి నెల్లూరుకు వచ్చాం. మా సమస్యలు విని పరిష్కరించండి’ అని పలువురు బాధితులు కలెక్టర్ హిమాన్షు శుక్లాను కోరారు. సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలను కలెక్టర్, జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్ తదితరులు స్వీకరించారు. 372 మంది అర్జీలు అందజేశారు. ఆఫ్లైన్లో మరో 60 మంది వినతులు అందాయి. కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అధికారులపై చర్యలేవి? జిల్లాలో పలుచోట్ల హౌసింగ్ అధికారులు లూజ్ సాయిల్ ఉండే చోట్ల ఇళ్లు నిర్మించారని బీజేపీ సీనియర్ నాయకుడు మిడతల రమేష్ అన్నారు. కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 718 మంది ఇళ్లు పనికిరావని తేలిందన్నారు. ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుని లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. -
ట్రేడింగ్ లైసెన్స్గా మార్చాలంటూ..
జిల్లాలో గిరిజన యానాదుల మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి. సంగం మండలం గాంధీగిరిజన మత్స్యకార సొసైటీని ట్రేడింగ్ లైసెన్స్గా మార్చాలి. అక్కడి మత్స్యకారులు ప్రతి సంవత్సరం రూ.14 లక్షలు లీజు చెల్లించాల్సి వస్తుండటంతో లాభాలు రావడం లేదు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రేడింగ్ లైసెన్స్ మార్చితే ఉపయోగం ఉంటుంది. అలాగే మనుబోలు మండలం పిడూరు మత్స్యకార సొసైటీలో గిరిజన యానాదులకు నూతనంగా సభ్యత్వం ఇవ్వడంతోపాటు చేపలు పట్టుకునేలా చర్యలు చేపట్టాలి. – కేసీ పెంచలయ్య, యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, రమణయ్య, వెంకయ్య -
భూస్వామికి తెల్లరేషన్ కార్డా!
విడవలూరు: పేదవాడు ఒక పూట కడుపు నింపుకోవడానికి తెల్ల రేషన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా.. కనికరించని ప్రభుత్వం, అధికార యంత్రాంగం భూస్వాములకు అప్పనంగా కట్టబెడుతున్నారు. పేదలకు సొంతిల్లు ఉందని, కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చిందని, నాలుగు చక్రాల వాహనం ఉందంటూ కొర్రీలు పెడుతున్నారు. అర్హులకు అన్యాయం జరుగుతుందనేదానికి మండలంలోని గాదెలదిన్నెలో వైట్ కాలర్కు తెల్లరేషన్ కార్డును రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం 3 ఎకరాలకు మించిన మాగాణి భూమి ఉంటే.. తెల్లరేషన్ కార్డు పొందేందుకు పూర్తిగా అనర్హులు. కానీ మండలంలోని గాదెలదిన్నెకు చెందిన జెడ్పీటీసీ సభ్యుడు కుమారుడు తుమ్మల ప్రసాద్ కుటుంబానికి ఈ నిబంధనలేవీ వర్తించలేదు. అతని పేరు మీద ఏడాదికి మూడు పంటలు పండే 16 ఎకరాల మాగాణి భూమి ఉంది. సొంతిల్లు, కారు, చేపలు, రొయ్యల గుంతలు ఉన్న భూస్వామికి కార్డు జారీ చేయడం రెవెన్యూ వ్యవస్థ పనితీరుకు అద్దం పడుతోంది. సదరు కార్డులో జూలై (ప్రస్తుత నెల) రేషన్ కూడా పొందడం గమనార్హం. బాధ్యతగల జెడ్పీటీసీ తనయుడై ఉండి కూడా ఇలా తెల్ల రేషన్కార్డు పొందడం, పేద ప్రజలకు అందాల్సిన ఉచిత బియ్యం, ఇతర పథకాలను నిస్సిగ్గుగా ఆరగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పీజీ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థుల డిబార్
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్శిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో సోమవారం నిర్వహించిన పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారని వీఎస్యూ పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్ ఆర్ మధుమతి తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 1039 మందికి గాను, 929 మంది హాజరయ్యారు. 110 మంది గైర్హాజరయ్యారు. గూడూరు డీఆర్డబ్ల్యూ కళాశాలలో ఒక విద్యార్థి డిబార్ అయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1119 మందికి గాను, 1034 మంది హాజరయ్యారు. 85 మంది గైర్హాజరయ్యారు. నెల్లూరులోని వీఆర్ ఐపీఎస్ కళాశాలలో ఒక విద్యార్థి డిబార్ అయినట్లు ఆమె తెలిపారు. కిలో పొగాకు గరిష్ట ధర రూ.250 మర్రిపాడు: డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో సోమవారం కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.250 లభించింది. వేలానికి 486 బేళ్లు రాగా, 378 బేళ్లను విక్రయించారు. మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. వేలంలో కిలో పొగాకు గరిష్టంగా రూ.250, కనిష్టంగా రూ.160, సగటున రూ.207.89 ధర పలికిందని వేలం నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. వేలంలో 8 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలో 9.7 మి.మీ. వర్షపాతం నెల్లూరు(అర్బన్): ఎండలతో అల్లాడిన జిల్లా వాసులను సేద తీరుస్తూ రెండ్రోజులుగా పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదు కాగా , మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో సరాసరిన 9.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తోటపల్లిగూడూరు 35.0, చిల్లకూరు 33.4, రాపూరు 32.2, ఇందుకూరుపేట 25.4, గూడూరు 23.8, కోట 23.8, పొదలకూరు 22.2, ముత్తుకూరు 20.4, నెల్లూరు రూరల్ 20.4, నెల్లూరు సిటీ 20.4, వెంకటాచలం 18.4, సైదాపురం 16.6, కోవూరు 14.0,మనుబోలు 13.8, బుచ్చిరెడ్డిపాళెం 9.4, విడవలూరు 9.4, సంగం 4.2, కావలి 2.0, కొడవలూరు 1.8, దగదర్తి 1.6 మి.మీ. చొప్పున వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో వర్షం కురవలేదు. డాక్యుమెంట్ రైటర్ల నిరసన ● రిజిస్ట్రేషన్ శాఖకు ఒక్క రోజే రూ.కోటి మేర నష్టం నెల్లూరు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 396ను వ్యతిరేకిస్తూ జిల్లాలోని డాక్యుమెంట్ రైటర్లు సోమవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేట్కు అప్పగిస్తే ఏళ్ల తరబడి ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తాము జీవనోపాధి కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ప్రతిరోజూ జిల్లాలో 100 నుంచి 150 వరకు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. సుమారు రూ.కోటి నుంచి రూ.1.50 కోటి వరకు ఆదాయం వస్తుంది. డాక్యుమెంట్ రైటర్ల నిరసనతో సోమవారం కేవలం 45 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. రూ.39 లక్షలు మాత్రమే రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం వచ్చింది. దీంతో ఒక్కరోజే రూ.కోటి మేర నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 90,956 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 33,040 మంది తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో రూ.4.44 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్గా రేష్మ నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్గా షేక్ రేష్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్–2 ద్వారా ఉద్యోగాన్ని సాధించిన ఆమె తొలుత కార్పొరేషన్ కమిషనర్ నందన్ను మర్యాదపూర్వకంగా కలుసుకుని పూలమొక్కను అందజేశారు. -
పెద్ద కుమారుడు వేధిస్తున్నాడు
● పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన వృద్ధుడు ● పీజీఆర్ఎస్కు 161 వినతులునెల్లూరు(క్రైమ్): నేను వృద్ధాప్యంలో ఉన్నాను. పెద్ద కుమారుడు తరచూ వేధిస్తూ ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. తగిన చర్యలు తీసుకోవాలని వింజమూరుకు చెందిన ఓ వ్యక్తి కోరాడు. నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 161 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్లకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె ఆయా ప్రాంత పోలీస్ అధికారులతో మాట్లాడారు. చట్టపరిధిలో విచారణ జరిపి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ కె.వేమారెడ్డి, ఇన్స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, భక్తవత్సలరెడ్డి, దశరథ రామారావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ‘ప్రైవేట్పరం’
● ఇటీవల జీఓ నంబర్ 396ను విడుదల చేసిన ప్రభుత్వం ● దీనిపై డాక్యుమెంట్ రైటర్ల ఆగ్రహం ● జీవనోపాధి కోల్పోతామని ఆందోళన ● పీపీపీ విధానంతో ఆస్తుల భద్రతపై సందేహాలునెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వం ప్రభుత్వ రంగాలను ప్రైవేట్పరం చేసే దిశగా అడుగులు వేస్తోంది. జీఓ నంబర్ 396 ద్వారా ఆస్తుల క్రయ, విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో డాక్యుమెంట్ రైటర్లు జీవనోపాధి కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి.. జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వాటిపై ఆధారపడి దాదాపు రెండు వేల మంది డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్స్, కంప్యూటర్ ఆపరేటర్లు జీవనం సాగిస్తున్నారు. ఆస్తుల క్రయ, విక్రయాల్లో డాక్యుమెంట్ రైటర్లదే కీలకపాత్ర. ఏళ్ల తరబడి వందలాది మంది రైటర్లు ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్, మార్టిగేజ్, వివాహ ధ్రువీకరణపత్రాల తయారీలో వారి శ్రమ ఉంటుంది. లబ్ధిదారులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందికి వారధిగా పనిచేస్తున్నారు. ఏళ్ల తరబడి అనుభవంతో పనిచేస్తున్న వీరిని పక్కనపెట్టి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే పారదర్శకత లోపించే అవకాశం ఉంది. ప్రజల ఆస్తి వివరాలు వారి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన జీఓ నంబర్ 396ను వ్యతిరేకిస్తూ సోమవారం నెల్లూరులోని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయం(ఆర్ఓ) ఎదుట డాక్యుమెంట్ రైటర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తాము ఏళ్ల తరబడి ఈ వృత్తి మీదే ఆధారపడి జీవిస్తున్నామని, ప్రైవేట్కు రిజిస్ట్రేషన్ సేవలను అప్పగించి తమ పొట్టకొట్టొద్దని కోరారు. జీఓను రద్దు చేయాలి భూముల రిజిస్ట్రేషన్ విషయంలో ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. జిల్లాలో వేలాది మంది ఈ వృత్తిపై ఆధారపడి ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రోడ్డున పడతారు. వారిపై ఆధారపడిన కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందిపడతాయి. ప్రభుత్వం పునరాలోచించి జీఓను రద్దు చేయాలి. – పట్నం దుర్గేష్బాబు, జిల్లా డాక్యుమెంట్ రైటర్ల సంఘ అధ్యక్షుడు -
కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం కరువు
● తప్పుడు ప్రచారాలు తప్ప.. నిష్ప్రయోజనం ● ఉపాధి పనులు దక్కక కూలీలు అవస్థలు ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటాచలం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా అభివృద్ధి, సంక్షేమం కరువైందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. సోమవారం మండలంలోని పూడిపూర్తిలో కాకాణి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు కాకాణిని కలిసి కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి లేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న పాలనలో ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించడం, గ్రామాలు అభివృద్ధి చేయడంతో తాము చాలా సంతోషంగా జీవించామని, కానీ కూటమి పాలనలో తమ సమస్యలు అధికారులకు చెప్పుకున్నా పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుకు అధిక ప్రాధాన్యతనిచ్చారని గుర్తు చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రూ.3 వేల పింఛన్ను రూ.4 వేలు చేశామని గొప్పలు తప్ప, కొత్తగా ఒక్క పింఛన్ మంజూరు చేయకపో గా, ఉన్న పింఛన్లకు కోత విధించారన్నారు. గతంలో మంజూరైన ఫించన్లలో కొన్నింటిని వివిధ కారణాల పేరుతో తొలగించి వారికి అన్యాయం చేశారని ఆరోపించారు. జగనన్న పాలనలో ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు పనులు కల్పించి వారికి అండగా నిలవడం జరిగిందన్నారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనలో వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఉపాధి పనులు చేయడానికి వీల్లేదని కూటమి నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో పేద ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఉపాధి పనులు దక్కకపోవడంతో గిరిజనులు ఉపాధి కోసం దగ్గరలోని పరిశ్రమల బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పూడిపర్తి ఎస్సీ కాలనీలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న తాగునీటి సమస్యను వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రత్యేక బో ర్ల ద్వారా పరిష్కరించడం జరిగిందన్నారు. గిరిజన కాలనీలోని 52 కుటుంబాలకు నూతన ఇళ్లు మంజూరు చేసి నిర్మాణాలు చేపడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ ఇళ్లకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో గిరిజనులు అసంపూర్తిగా ఉన్న ఇళ్లలోనే నివాసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అంతకు ముందు పూడిపర్తి గ్రామ మాజీ ఉప సర్పంచ్ సురేష్ తండ్రి ఇటీవల మరణించగా, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట మండల వైస్ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, పార్టీ మండల కన్వీనర్ కొణిదెన మోహన్నాయుడు, ఎంపీటీసీలు వేమారెడ్డి రఘునందన్ రెడ్డి, కోడూరు రఘునాథరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు కొణిదెన విజయభాస్కర్నాయుడు, డక్కిలి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదుల పరిష్కారంపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్
● డీఆర్వో విజయకుమార్ నెల్లూరు రూరల్: ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతోపాటు ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జిల్లా పీజీఆర్ఎస్ నోడల్ అధికారి, డీఆర్వో విజయకుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదులు చేసిన పౌరులు తమ సమస్యల పరిష్కారంపై అభిప్రాయాలను నేరుగా ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఈ క్యూఆర్ కోడ్ ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రీవెన్స్ కేంద్రాలు, పౌర సేవా కేంద్రాల్లో క్యూఆర్ కోడ్ను ప్రదర్శిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే వాట్సాప్ గ్రూపులు, ఇతర సోషల్ మీడియా యాప్స్ ద్వారా విస్తృ తంగా ప్రచారం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.నేడు ‘డయల్ యువర్ ఎస్ఈ’ నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారులు సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ పరిధిలో ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని ఎస్ఈ రాఘవేంద్రం సోమవారం నిర్వహించనున్నారు. నెల్లూరు విద్యుత్ భవన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. వినియోగదారులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు. ● తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం సీఎండీ శివశంకర్ ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వినియోగదారులు 89777 16661 నంబర్కు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు. గిరిజన యువతకు ఉచిత శిక్షణ నెల్లూరు(వేదాయపాళెం): హెచ్పీసీఎల్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ వారు గిరిజన యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నెల్లూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ కె.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ పెరిఫెరల్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్ కోర్సుల్లో రెండు నుంచి మూడు నెలల పాటు ఉచిత శిక్షణ అందిస్తారన్నారు. వసతి, భోజన సదుపాయంతోపాటు స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇస్తారన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఎన్ఎస్డీసీ సర్టిఫికెట్తో పాటు ప్రముఖ పరిశ్రమలలో ఉద్యోగావకాశం కల్పిస్తారని పేర్కొన్నారు. వివరాలకు 81878 99877 ఫోన్ నంబర్ను సంప్రదించాలని కోరారు. కోడిపందేల స్థావరంపై పోలీసుల దాడిఆత్మకూరు: ఆత్మకూరు మండలంలోని పడకండ్ల గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న కోడిపందేల స్థావరంపై ఆదివారం పోలీసులు దాడులు చేశారు. ముందస్తుగా అందిన సమాచారంతో ఎస్సై జంపాని కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేపట్టారు. కోడిపందేల్లో పాల్గొంటున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, రూ.7,140 నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు, మూడు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. కోడిపందేలు, పేకాట తదితర జూద కార్యకలాపాలు నిర్వహించినా, వాటిలో పాల్గొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. రైలు కిందపడి..● గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య నెల్లూరు(క్రైమ్): రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం తెల్లవారుజామున నెల్లూరులోని సౌత్ రైల్వేస్టేషన్ చైన్నె వైపు వెళ్లే పట్టాలపై చోటుచేసుకుంది. మృతుడి వయసు 40 నుంచి 45 ఏళ్లలోపు ఉండొచ్చని భావిస్తున్నారు. బూడిద రంగు ఆఫ్ హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. ఘటనా స్థలాన్ని నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. కండలేరులో 28.20 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 28.20 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 60, హైలెవల్ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 65 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
పాతకక్షలతోనే హత్య
● కేసును ఛేదించిన కావలి రూరల్ పోలీసులు ● ముగ్గురి అరెస్ట్కావలి రూరల్: కావలి రూరల్ మండలం తాగేటివారిపాళెంలో జరిగిన చాట్ల వాసు (32) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కావలి రూరల్ పోలీస్స్టేషన్లో డీఎస్పీ వీవీ రమణకుమార్ ఆదివారం వివరాలు వెల్లడించారు. ఈనెల 10వ తేదీన అడవిరాజుపాళెం సర్వీస్ రోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు వాసుపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచినట్లు అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ జి.రాజేశ్వరరావు కేసు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలోని సీసీ టీవీ ఫుటేజీను సేకరించి పరిశీలించారు. సాంకేతిక ఆధారాలతో పథకం ప్రకారం జరిగినట్లు నిర్ధారించారు. ఏం జరిగిందంటే.. కావలి మండలం కట్టకిందపాళెం గ్రామానికి చెందిన తుళ్లూరు జనార్దన్ వద్ద వాసు మేకలు కాసేందుకు తీసుకున్నాడు. జనార్దన్ జూలై 9వ తేదీన రాత్రి తాగేటివారిపాళెం గ్రామానికి చెందిన మందా మధును కలిశాడు. ఈ విషయం వాసుకు తెలిసింది. గతంలో అతడికి, మధుకు మధ్య విభేదాలున్నాయి. దీంతో మేకల విషయంలో ఎందుకు కల్పించుకుంటున్నావని అదేరోజు రాత్రి గ్రామంలో మధును వాసు తిట్టాడు. దీంతో మధు అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. తాగేటివారిపాళెం గ్రామానికి చెందిన రవిచందుతో కలిసి పథకాన్ని రచించాడు. 10వ తేదీ ఉదయం రవిచందు.. వాసును మద్యం తాగుదామని నమ్మించి సిరి వైన్స్ షాపు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ మద్యం తాగించి రవిచందు మరుగుదొడ్డికి వెళ్తున్నానంటూ సమీపంలోని పొలాల వైపు వెళ్లిపోయాడు. బైక్ వద్ద వాసు ఒక్కడే ఉన్న సమయంలో వెనుక నుంచి నవీన్, గణపతి చెక్క మంచం కోడు, ఖాళీ బీరు బాటిల్తో దాడి చేసి పారిపోయారు. గాయపడిన వాసును నెల్లూరులోని నారాయణ ఆస్పత్రిలో చేర్పి ంచగా చికిత్స పొందుతూ 17వ తేదీ మృతిచెందాడు. హత్య కేసులో తాగేటివారిపాళేనికి చెందిన మధు, రవిచందు, కావలి పట్టణానికి చెందిన పసుపులేటి గణపతి, కావలి మండలం గౌరవరానికి చెందిన దేవరపల్లి నవీన్పై కేసు నమోదు చేశారు. నిందితుల్లో మధు, రవిచందు, గణపతిని అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, హత్యకు ఉపయోగించిన మంచం కోడును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో కార్యక్రమంలో కావలి రూరల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ఎస్సైలు ఎం.బాజీబాబు, తిరుమలరెడ్డి, కె.ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
నెలరోజులు నరకయాతన అనుభవించి..
వాకాడు: ఆ వృద్ధుడి ఆఖరి రోజులు దారుణంగా గడిచాయి. లెప్రసీతో బాధపడుతుండగా ఆదుకునేవారు లేక అల్లాడిపోయాడు. చివరికి చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. వివరాలిలా ఉన్నాయి. నాయుడుపేటకు చెందిన అల్లెయ్య అనే వృద్ధుడు యాచిస్తుంటాడు. కొంత కాలంగా లెప్రసీ వ్యాధితో బాధపడుతున్నాడు. వాకాడు పరిసర ప్రాంతాల్లో యాచన చేసేవాడు. అయితే వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో నెలరోజులుగా కదల్లేని స్థితిలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని చెట్టు కింద అన్నపానీయాలు లేకుండా నరకయాతన అనుభవించాడు. పూర్తిగా స్పృహ కోల్పోయిన వృద్ధుడు శనివారం రాత్రి కురిసిన వర్షం, ఈదురుగాలులకు చతి తీవ్రత తట్టుకోలేక చనిపోయాడు. ఆదివారం సాయంత్రం 4 గంటల వరకూ మృతదేహం అక్కడే ఉంది. ఎవరూ పట్టించుకోలేదు. ఓ వ్యక్తి తన సొంత ఖర్చుతో అంబులెన్స్లో మృతదేహాన్ని నాయుడుపేటకు తరలించి బంధువులకు అప్పగించాడు. -
దేవుడి భూమికే ఎసరు
● నాగేశ్వర స్వామి స్థలంపై తెలుగు తమ్ముళ్ల కన్ను ● మొన్నటి వరకు ఆలయ ప్రాంగణంలో ఇసుక దోపిడీ ● నేడు ప్రాంగణాన్ని చదును చేసి ఆక్రమణ ● ఆక్రమణదారులకు మంత్రి ఆనం అండదండలుచేజర్ల: ఇసుకలో నుంచి బయటపడిన పురాతన నాగేశ్వరాలయం ఆలయ పరిసర ప్రాంతం కబ్జారాయుళ్ల కబంధహస్తాల్లో చిక్కుకుంది. మొన్నటి వరకు ఆలయం చుట్టూ వేలాది టన్నుల ఇసుకను యథేచ్ఛగా పట్టపగలు దోపిడీ చేసిన తమ్ముళ్లు నేడు ఆ ప్రాంగణాన్ని ఆధీనంలోనికి తీసుకుని ఏకంగా యంత్రాలతో చదును చేశారు. ఇదంతా సాక్షాత్తు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరిగింది. కబ్జాదారులకు మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు విమర్శలున్నాయి. అంతా వారే.. కొంతకాలం క్రితం చేజర్ల మండలంలోని పెరుమాళ్లపాడు గ్రామంలో పెన్నా నది ఒడ్డున పురాతన నాగేశ్వరాలయం ఇసుక గర్భం నుంచి బయటపడింది. ఆలయాన్ని పూర్తిస్థాయిలో వెలికితీసే క్రమంలో మంత్రి ఆనం ప్రధాన అనుచరులు ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. ఇసుకను తొలగిస్తుండటంతో ఇక్కడ నూతన ఆలయాన్ని నిర్మిస్తారని భక్తులంతా భావించారు. కానీ స్థానికుల కోరిక మేరకు ఊరికి దూరంగా ఉన్న ఆలయాన్ని గ్రామ సమీపంలో ఆత్మకూరు – చేజర్ల ప్రధాన రహదారి పక్కనే నిర్మించేందుకు ఇటీవల మంత్రి ఆనం భూమి పూజ చేసి శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. ఇక తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. వెంటనే పురాతన ఆలయ ప్రాంగణంలో ఉన్న రెండు ఎకరాలకు పైగా భూమిని కబ్జా చేశారు. యంత్రాలతో చదును చేసి సాగు చేసేందుకు గట్లు కూడా ఏర్పాటు చేశారు. ఆలయ భూములు కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు, భక్తులు సదరు దేవదాయ శాఖ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు మాకు సంబంధం లేదు అని ఒకరిపై ఒకరు చెప్పుకొంటున్నారని భక్తులు వాపోతున్నారు. కాపాడాలంటూ.. మంత్రి ప్రధాన అనుచరులు ఆలయానికి చెందిన భూమినైనా కాపాడాలని భక్తులు అధికారులను వేడుకుంటున్నారు. పట్టపగలు యథేచ్ఛగా ఇసుకను దోపిడీ చేసి ఆ ప్రాంగణాన్ని సైతం ఆక్రమించిన ప్రైవేట్ వ్యక్తులపై దేవదాయ శాఖ చర్యలు తీసుకోకపోవడంతో కబ్జారాయుళ్లకు, ఇసుక దోపిడీదారులకు మంత్రి ఆనం అండ ఉందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. -
ఎంబుక్లలో పనులు.. జేబుల్లోకి నిధులు
ఉదయగిరి: జిల్లాలో సమగ్రశిక్ష అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన పనుల్లో అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. వర్కులు చేయకుండానే నిధులను భారీగా కాజేస్తున్నారు. ఆ శాఖకు సంబంధించి ఇప్పటికే అనేక అవినీతి బాగోతాలు బయటకొచ్చాయి. ప్రహరీల నిర్మాణాల్లో పనులు చేయకుండానే నిధులను దిగమింగిన ఉదంతాలు బట్టబయలైనా, ప్రమేయం ఉన్న అధికారులపై చర్యలు చేపట్టలేదు. ఈ వ్యవహారం వెనుక బడా వారుండటం.. వారికి అధికార పార్టీ పెద్దల ఆశీస్సులు ఉండటంతో చర్యలకు జంకుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తవ్వేకొద్దీ మరింతగా.. సమగ్ర శిక్షలో వెలుగు చూసిన అవినీతి రూ.మూడు కోట్లకుపైగానే ఉంటుందని ప్రాథమిక అంచనా. అయితే తవ్వేకొద్దీ ఇది మరింత పెరుగుతోంది. కొన్ని మండలాల్లో అసలు ప్రహరీలను నిర్మించకుండానే నిధులను మింగేసిన అంశం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఇలా.. మాయమైన ఎంబుక్లు దుత్తలూరు మండలం నందిపాడుకు సంబంధించిన ఎంబుక్లు కనిపించడంలేదని సమాచారం. కొడవలూరు మండలం గండవరంలో ఇదే తరహాలో ఆరు పనులకు సంబంధించి రూ.60 నిధులను మింగేశారని తెలుస్తోంది. అవినీతి బాగోతంలో కార్యాలయ ముఖ్య అధికారితో పాటు పలువురు సైట్ ఇంజినీర్లు, ప్రైవేట్ ఐటీ కంపెనీ ఉద్యోగి పాత్ర ఉందనే ప్రచారం జరుగుతున్నా, వీరిపై నేటికీ చర్యలు చేపట్టకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. దర్యాప్తు పేరుతో కాలయాపన చేస్తూ, ఇది మరుగునపడేలా ప్లాన్ ప్రకారం వ్యవహరిస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. వర్కులు చేయకుండానే స్వాహా ప్రహరీల నిర్మాణం పేరుతో భారీగా అక్రమాలు సమగ్రశిక్షలో బయటపడుతున్న బాగోతాలు -
ఇదో దోపిడీ..
దుత్తలూరు మండలంలోని నందిపాడు కేజీబీవీ, దుత్తలూరు ఏపీ మోడల్ పాఠశాలల్లో ప్రహరీని నిర్మించినట్లు చూపి నిధుల స్వాహాకు అధికారులు పాల్పడ్డారనే అంశం శనివారం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఏపీ మోడల్ పాఠశాలలో 2018లోనే ప్రహరీని నిర్మించారు. అయితే 2022లో ప్రహరీని నిర్మించినట్లు 2025 నవంబర్లో వర్క్ ఐడీ నంబర్ – 9009016తో రూ.13,66,087 మేర.. నందిపాడు కేజీబీవీలో వర్క్ ఐడీ – 02090090009తో రూ.9,92,692 నిధులను స్వాహా చేశారు. సమగ్ర విచారణ జరిపితే గానీ పూర్తి వివరాలు బయటపడే అవకాశం లేదు. -
మట్టి అక్రమ తవ్వకాలపై దాడులు
చెరువులో మట్టిని తవ్వేశారిలా.. ● ఐదు టిప్పర్లు, ఒక హిటాచీ స్వాధీనం మర్రిపాడు: మండలంలోని పెద్దమాచనూరు చెరువులో జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలపై ఆకస్మిక దాడులను ఉదయగిరి పోలీసులు ఆదివారం నిర్వహించారు. అనుమతుల్లేకుండా మట్టిని తరలిస్తున్న ఐదు టిప్పర్లు, తవ్వకాలకు వినియోగిస్తున్న ఒక హిటాచీ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆపై పోలీస్స్టేషన్కు తరలించారు. తవ్వకాలపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
గడ్డివామి దగ్ధం
● రూ.లక్ష మేర ఆస్తినష్టం ఆత్మకూరురూరల్: ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు పంచాయతీ పాతజంగాలపల్లి గ్రామంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామంలోని రైతు కటారి శ్రీనివాసులుకు చెందిన సుమారు గడ్డివామి మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. అక్కడివారు వెంటనే స్పందించి ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఆత్మకూరు అగ్నిమాపక శాఖాధికారి బాలాజీ గురుప్రసాద్, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. రైతుకు సుమారు రూ.లక్ష మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.55 సన్నవి : రూ.25 పండ్లు : రూ.10 -
పరిహారం.. ఇదో మోసం
ప్రమాదానికి గురైన బస్సు (ఫైల్) సంగం: వారణాశి యాత్ర నిమిత్తం బయల్దేరి బిహార్లోని గయా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన వారి కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గుప్పించిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఘటన జరిగిన 40 రోజులైనా నేటికీ పరిహారం అందకపోవడంతో క్షతగాత్రుల అవస్థలు వర్ణనాతీతమవుతున్నాయి. అసలీ మొత్తం వస్తుందాననే సందేహాలు వీరిలో వ్యక్తమవుతున్నాయి. నాడు ఆర్భాటంగా.. జిల్లాలోని సంగం, ఆత్మకూరు, దుత్తలూరు ప్రాంతాలకు చెందిన 43 మంది భక్తులు ఉత్తరాది రాష్ట్రాల్లో పుణ్యక్షేత్రాల దర్శనానికి శ్రీసాయి యాత్ర స్పెషల్ బస్సులో బయల్దేరారు. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో బిహార్లోని గయా సమీపంలో ఎదురుగా వచ్చిన లారీని వీరు ప్రయాణిస్తున్న బస్సును గత నెల ఎనిమిదిన ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి శస్త్రచికిత్సలూ చేయాల్సి వచ్చింది. కొందరు పాక్షిక గాయాలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటన అనంతరం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షలు.. తీవ్రంగా గాయపడిన వారికి రూ.రెండు లక్షలు.. పాక్షికంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదే అంశాన్ని సీఎం చంద్రబాబు సైతం చెప్పినా, నేటికీ పరిహారం అందించే దిశగా ఎవరూ చొరవ చూపడంలేదు. వైద్యానికి అప్పులు.. తీవ్రంగా గాయపడిన పలువురు ఇప్పటికీ కోలుకోలేదు. కొందరి కాళ్లు, చేతులకు శస్త్రచికిత్సలు జరిగి ఇంటి వద్ద విశ్రాంతి పొందుతుండగా, మరికొందరు ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. ఈ పరిణామాల క్రమంలో వైద్యం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఉపాధి కోల్పోయి ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలూ ఉన్నాయి. పరిహార విషయాన్ని తెలుసుకునేందుకు అధికారులను పలుమార్లు సంప్రదించినా, స్పష్టమైన సమాధానం కొరవడుతోందని బాధితులు వాపోతున్నారు. ప్రక్రియ కొనసాగుతోందనే జవాబు తప్ప, పరిహారం ఎప్పుడందుతుందనే అంశాన్ని చెప్పడంలేదు. వారణాశి ప్రమాద బాధితులకు మంత్రి ఆనం హామీ 40 రోజులైనా నేటికీ దిక్కులేని వైనం ప్రకటనలతో ప్రభుత్వ ఆర్భాటం మంచానికే పరిమితమైన క్షతగాత్రులు వైద్య ఖర్చులకు నానా అవస్థ ఎందుకీ పరిస్థితో..? మంత్రి ప్రకటించిన హామీ అమల్లో ఎందుకు జాప్యం జరుగుతోందో అంతుచిక్కడంలేదు. అధికార యంత్రాంగం నిర్లక్ష్యమా.. లేక పరిపాలన లోపమాననే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాయాన్ని అందజేసి తమ కష్టాలను తీర్చాలని కోరుతున్నారు. -
వైద్యులు సేవా భావంతో పనిచేయాలి
● మెడికోస్ రాష్ట్ర కన్వెన్షన్లో వక్తలు నెల్లూరు(అర్బన్): పేద, ధనిక తేడాల్లేకుండా సేవా భావంతో డాక్టర్లు పనిచేయాలని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం నెల్లూరులోని ఏసీఎస్ఆర్ మెడికల్ కళాశాల లెక్చరర్స్ గ్యాలరీలో జనవిజ్ఞానవేదిక, కళాశాల జనరల్ సర్జరీ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ మెడికోస్ కన్వెన్షన్ – 2026 జరిగింది. ఈ సందర్భంగా సమాజంలో వైద్యుల పాత్రపై జేవీవీ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన డాక్టర్ బ్రహ్మారెడ్డి, సమాజహితం కోసం పనిచేసిన ప్రముఖ వైద్యులు అనే అంశంపై మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, వైద్యరంగం అభివృద్ధిలో జీవపరిణామ సిద్ధాంతం పాత్రపై డాక్టర్ సుధాకర్రెడ్డి మాట్లాడారు. వైద్యం ఎలా అభివృద్ధి చెందిందో, గతంలో ఎలా ఉండేదో, ఇప్పుడు ఏ రూపంలో ఉందో వివరించారు. ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. లేకుంటే కార్పొరేట్, ప్రైవేట్ శక్తుల కబంధ హస్తాల్లోకి పోతుందన్నారు. అప్పుడు డబ్బులున్న వారికే వైద్య సేవలందుతాయన్నారు. ఈ స్థితి మారాలంటే వైద్యరంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని రకాల పరీక్షలు, పరికరాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. ఆహార లోపం, కలుషిత నీరు, కాలుష్యం, రసాయనాల వల్లనే జబ్బులు వస్తున్నాయని తెలిపారు. వాటికి పరిష్కారాలు వివరించారు. అనంతరం జూనియర్ వైద్య విద్యార్థులకు సీపీఆర్ గురించి వెల్లడించారు. జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ మణికుమార్, జేవీవీ రాష్ట్ర నాయకులు డా.కాలేషా సాహెబ్, ఆరోగ్యసబ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ శ్రీనునాయక్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవీ చలపతి, విజయకుమార్, ప్రజారోగ్య రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎంవీ రమణయ్య, రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల సూపరింటెండెంట్ డా.రాజేశ్వరరావు, డాక్టర్ రఫీ, విజయమ్మ, ఏసీఎస్ఆర్, నారాయణ, తిరుపతి, ప్రకాశం, గుంటూరు, కడప తదితర ప్రాంతాల మెడికోలు పాల్గొన్నారు. -
పెన్నానదిలో వ్యక్తి గల్లంతు
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు పొర్లుకట్ట శివాలయం సమీప పెన్నానదిలో ఆదివారం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం కొత్తూరు వైఎస్సార్ నగర్లో షేక్ అబ్దుల్ సలాం అలియాస్ అబ్దుల్లా నివాసం ఉంటున్నాడు. అతను ఆదివారం ఐదుగురు స్నేహితులతో కలిసి కొత్తకోడూరు బీచ్కు వెళ్లాడు. సముద్రంలో స్నానం చేసిన అనంతరం మంచినీటిలో స్నానం చేయాలని వారు నిర్ణయించుకున్నారు. అందరూ నెల్లూరు పొర్లుకట్ట శివాలయం సమీప పెన్నానది వద్దకు చేరుకున్నారు. ఒడ్డున భోజనం చేశారు. అనంతరం అబ్దుల్ సలాం స్నానం చేసేందుకు నదిలో దూకాడు. నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. సమాచారం అందుకున్న సంతపేట ఇన్స్పెక్టర్ వైవీ సోమయ్య ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖ సిబ్బంది, గజ ఈతగాళ్ల సాయంతో అబ్దుల్ కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబానికి సమాచారం అందించారు. -
గురుకులం కథ ముగిసింది
కోట: కోటలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)గా మార్చాలని ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, దళిత సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆదివారం సాయంత్రానికే గురుకులాన్ని ఖాళీ చేయాలని ఆదేశాలు రావడంతో ఉపాధ్యాయులు.. తల్లిదండ్రులకు సమాచారం అందించి పిల్లల్ని తీసుకెళ్లాలని కోరారు. దీంతో గురుకులం వద్ద ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో కోటను ఎంపిక చేసింది. వద్దని కోరినా.. వేసవి సెలవుల్లోనే కోట గురుకులాన్ని సీఓఈ కేంద్రంగా మార్చే ప్రతిపాదనను అధికారులు పరిశీలించారు. అప్పట్లో దళిత సంఘాలు, పూర్వ విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అయితే ఈసారి గడువు ఇవ్వకుండా ఒక్కరోజులోనే ఖాళీ చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ ఉత్తర్వులు జారీ చేయడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. ప్రస్తుతం ఇక్కడున్న 455 మంది పాఠశాలల, 160 మంది కళాశాలల విద్యార్థులను వాకాడు, నాయుడుపేట, చిల్లకూరు ఎస్సీ గురుకులాలు, చిట్టేడు ఎస్టీ గురుకులంలో సర్దుబాటు చేయాలని అధికారులు ఆదేశించారు. అలాగే 70 మంది బోధన, బోధనేతర సిబ్బందిని ఇతర గురుకులాలకు బదిలీ చేశారు. ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో ఎస్సీ గురుకులాన్ని ఎత్తేస్తుంటే ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ ఏం చేస్తున్నారని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 1987లో గురుకులం ఏర్పాటుకాగా వేలాది మంది పేద పిల్లలు చదువుకున్నారు. అలాంటి విద్యాసంస్థను అకస్మాత్తుగా రద్దు చేయడాన్ని అంగీకరించబోమని వారు చెబుతున్నారు. నీట్, ఐఐటీ శిక్షణ కేంద్రాన్ని మరోచోట ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉందంటున్నారు. దీని కోసం కోట, చిల్లకూరు మండలాల్లో ప్రభుత్వ భవనాలు పరిశీలించారు. చివరకు కోట గురుకులాన్ని రద్దు చేసి ఇక్కడ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించి కోట గురుకులాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆ గురుకులాన్ని 1987లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంతోమంది పేద పిల్లలు చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్కరోజులోనే దాని కథ ముగిసింది. సీఓఈ కేంద్రంగా మార్పు చేస్తున్నట్లుగా ప్రకటించి విద్యార్థులను తీసుకెళ్లిపోవాలని చెప్పడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోటలో అంబేడ్కర్ గురుకులం ఎత్తివేత సీఓఈ కేంద్రంగా మార్పు అధికారుల నిర్ణయంపై తల్లిదండ్రుల మండిపాటు ఉపసంహరించుకోవాలంటున్న దళిత సంఘాలు -
అప్లికేషన్ల స్వీకరణ గడువు పొడిగింపు
నెల్లూరు(వేదాయపాళెం): ఏపీపీఎస్సీ గ్రూప్ – 2 ప్రిలిమినరీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సంబంధించిన ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 25 వరకు పొడిగించారని డీబీసీడబ్ల్యూఓ, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 100 మంది అభ్యర్థులకు రెండు నెలల పాటు ఉచిత శిక్షణతో పాటు స్టయిపండ్, స్టడీ మెటీరియల్ను అందజేయనున్నామని పేర్కొన్నారు. డిగ్రీ మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నామని వివరించారు. వీరికి తరగతులను ఈ నెల 30న ప్రారంభించనున్నామని చెప్పారు. ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను శోధన్నగర్లోని స్టడీ సర్కిల్ కార్యాలయంలో అందజేయాలని కోరారు. వివరాలకు 93815 54779, 93902 39588 నంబర్లను సంప్రదించాలని సూచించారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండిపోయి.. శిలాతోరణం వద్దకు చేరుకుంది. స్వామివారిని 90,045 మంది శనివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 38,573 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.06 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టిక్కెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
పెట్రోల్ పోసుకుని..
● వృద్ధుడి ఆత్మహత్య వరికుంటపాడు: ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలం జడదేవి గ్రామ సమీపంలో 565 జాతీయ రహదారి పక్కన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. జడదేవికి చెందిన ఏనుగంటి కొండయ్య (65)కి భార్య ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అతను కొంతకాలంగా అనారోగ్య సమస్యలు, మానసిక ఇబ్బందులతో బాధపడుతూ వైద్యం చేయించుకున్నాడని చెబుతున్నారు. ఈ క్రమంలో పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోగా స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి పరిశీలించి అప్పటికే కొండయ్య మృతిచెందినట్లు నిర్ధారించారు. -
రాష్ట్రంలో ఒమిక్రాన్ ఆర్ఎఫ్–5 వేరియంట్ కోవిడ్ కేసులు
సాక్షి, అమరావతి/నెల్లూరు (అర్బన్): రాష్ట్రంలో ప్రస్తుతం నమోదవుతున్న కోవిడ్ కేసులు ఒమిక్రాన్ ఆర్ఎఫ్–5 వేరియంట్కు చెందినవని తేలింది. నమోదవుతున్న కేసుల వేరియంట్ గుర్తించడం కోసం వైఎస్సార్ కడప జిల్లాలోని కోవిడ్ బాధితుల నాలుగు నమూనాలను మహారాష్ట్రలోని పూణె వైరాలజీ ల్యాబ్కు వైద్యశాఖ పంపింది. ఈ పరీక్షల్లో ఒమిక్రాన్ ఆర్ఎఫ్–5 వేరియంట్ను శాస్త్రవేత్తలు గుర్తించినట్టు శనివారం వైద్య శాఖ ప్రకటించింది. ఈ వేరియంట్ కేసులు సింగపూర్తో పాటు ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల్లో ఎక్కువగా నమోదైనట్టు వెల్లడవుతోంది. ఒమిక్రాన్ ఇతర వేరియంట్లతో పోలిస్తే ఆర్ఎఫ్–5 ప్రమాదకరమని ఎలాంటి ఆధారాలు లేవని వైద్యశాఖ వెల్లడించింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు. అయితే ఈ వైరస్ సోకిన బాధితులు వైఎస్సార్ కడప జిల్లాలో మృత్యువాతపడటంతో ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు. ఆర్ఎఫ్–5 వేరియంట్ సోకిన వారిలో గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం, మూసుకుపోవడం, అలసట, ఒళ్లు నొప్పులు ఉంటాయని వైద్య శాఖ పేర్కొంది. గత నెల 26 నుంచి ఈ నెల 16 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 12 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు బాధితులు మృత్యువాతపడ్డారు. మూడేళ్ల బాలుడికి కరోనాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కోవిడ్ కేసు వెలుగు చూసింది. వెంకటాచలం మండలం నిడిగుంటపాళెంగ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు బ్లడ్ కేన్సర్కు గురయ్యాడు. వైద్యం కోసం ఆ బాలుడిని తల్లిదండ్రులు ఈ నెల 13న పాండిచ్చేరిలోని జిప్మర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు కేన్సర్కు చికిత్స చేస్తూనే ఆ చిన్నారిలో కోవిడ్ లక్షణాలు గుర్తించి పరీక్షలు చేశారు. కోవిడ్ నిర్ధారణ కావడంతో ఆ బాబుకు కేన్సర్తోపాటు కోవిడ్ చికిత్స కూడా అందిస్తున్నారు. ఈ సమాచారాన్ని అక్కడి వైద్యాధికారులు నెల్లూరు జిల్లా వైద్యశాఖ అధికారులకు అందించారు. నిడిగుంటపాళెంలో ఉన్న ఆ చిన్నారి నాయనమ్మ, అన్నయ్యకు ఇక్కడి వైద్యులు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, లేదని తేలింది. ఆ బిడ్డతో ఉన్న తల్లిదండ్రులకు పాండిచ్చేరిలో కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వారికి కూడా నెగటివ్ వచ్చింది. -
చలో పోర్టుకు సర్కారు విఘాతం
నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మణిహారంగా ఉన్న రామాయపట్నం పోర్టును చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు చేస్తున్న కుట్రలను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ ఆందోళన బాట పట్టింది. పోర్టుకు వెన్నుపోటు పొడవడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులతో అడ్డుకుంది. పోర్టుకు వెళ్లే దారుల్లో భారీ ఎత్తున పొలీసులను మోహరింపజేసి చలో పోర్టు కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు కుట్రలు పన్నింది. దాదాపు నాలుగు గంటల పాటు సహనంగా ఆందోళన చేసిన పార్టీ శ్రేణులపై ప్రభుత్వ కవ్వింపు చర్యలతో జాతీయ రహదారిపై బైఠాయించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యేలని చూడకుండా ఈడ్చిపడేశారు. కేసులు నమోదు చేశారు. మహిళలను సైతం లాగేశారు. రామాయపట్నం పోర్టు సందర్శనను భగ్నం చేసేందుకు అడుగడుగునా కుట్రలు వందల సంఖ్యలో పోలీసుల మోహరింపు పోర్టు దారిలో రేకులు, టిప్పర్లు అడ్డుపెట్టి అడ్డంకులు పది రోజుల ముందే పోలీసులకు సమాచారమిచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు అనుమతి లేదంటూ అడ్డుకున్న ఖాకీలు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగిన వైఎస్సార్సీపీ పోలీసులు, పార్టీ శ్రేణులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాటలు, ఉద్రిక్తంగా మారిన పోర్టు ఏరియా పోర్టు ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదంటూ నేతలు, స్థానికుల తీవ్ర ఆగ్రహం -
అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా నిరాకరణ
సాక్షిప్రతినిధి, నెల్లూరు/కందుకూరు: పోర్టు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, కందుకూరు ఇన్చార్జి బుర్రా మధుసూదన్యాదవ్తో కలిసి చేపట్టిన ‘చలో రామాయపట్నం పోర్టు’ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు కూటమి ప్రభుత్వం పక్కా వ్యూహంతో కుట్రలకు తెర లేపింది. డీఎస్పీలు, సీఐలు, పదుల సంఖ్యలో ఎస్సైలు వందలాది మంది పోలీసులు మోహరించి వైఎస్సార్సీపీ శ్రేణులను పోర్టు దరిదాపుల్లోకి కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు. పోర్టు నిషిద్ధ ప్రాంతమన్నట్లుగా ఎవరూ వెళ్లకుండా ఎన్హెచ్– 16 రహదారి నుంచి చేవూరు మీదుగా పోర్టులోకి వెళ్లే రహదారిని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. పోర్టుకు కిలోమీటర్ దూరంలోనే రోడ్డుకు అడ్డంగా ఎత్తైన ఇనుప రేకులతో భారీ అడ్డుగోడ కట్టారు. పోర్టు పనులకు వినియోగించే టిప్పర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టారు. పోలీసుల చర్యలను, సృష్టించిన అడ్డంకులను చూసి అక్కడికి వచ్చిన వారందరూ ఆశ్చర్యపోయారు. పోర్టు సందర్శనకు వెళ్తుంటే దేశ సరిహద్దులో ఏర్పాటు చేసిన విధంగా ఇంత అడ్డగోడలు ఏంటంటూ విస్తుపోయారు. వైఎస్సార్సీపీ చేపట్టిన చలో రామాయపట్నం పిలుపు ప్రభుత్వంలో వణుకు పుట్టించినట్లు అర్థమవుతుందన్నారు. పోర్టు నిర్మాణం సక్రమంగా జరుగుతుంటే.. పోర్టు నిర్వహణ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంటే.. ప్రభుత్వం అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. పోర్టు అధికారులకు సందర్శనకు తమకు అనుమతి లేదని లెటర్ ఇచ్చారని, వారి ఆదేశాల మేరకు ఎవర్నీ అనుమతించడం లేదంటూ పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పోర్టు ప్రైవేటీకరణ నేపథ్యంలో పోర్టు వద్ద నిరసన వ్యక్తం చేసేందుకు అనుమతి ఇవ్వాలని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి, మధుసూదన్యాదవ్.. పోలీసులకు పది రోజుల క్రితమే దరఖాస్తు చేసుకున్నారు. మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కూడా తన సొంత మెయిల్ ద్వారా పోర్టు సీఈఓకు అనుమతి కోరుతూ లేఖ పంపారు. ఇదే విషయాన్ని పోలీసులు అడ్డుకున్న సందర్బంలో కాకాణి బహిర్గతం చేశారు. అయినా సరే ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా పోర్టు అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేశారు. పోర్టు అధికారులకు చేసిన విన్నపానికి సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు పోర్టు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2.20 గంటల వరకు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కావలి నుంచి బైక్ ర్యాలీ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. పార్టీ కార్యాలయం నుంచి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ప్రతాప్కుమార్రెడ్డి పార్టీ శ్రేణులు వందలాది మంది బైక్ ర్యాలీగా చేవూరు రోడ్డు వరకు వెళ్లారు. అక్కడ కందుకూరు ఇన్చార్జి బుర్రా మధుసూదన్యాదవ్ ఆధ్వర్యంలో తరలివచ్చిన పార్టీ శ్రేణులతో కలిసి చేవూరు మీదుగా పోర్టు రోడ్డులో బయల్దేరారు. అయితే అక్కడ పోలీసుల అడుగడుగునా అడ్డుకున్నారు. ఉద్రిక్తంగా మారిన హైవే దిగ్బంధం పోలీసుల తీరును నిరసిస్తూ కాకాణి గోవర్ధన్రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, బుర్రా మధుసూదన్యాదవ్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కోల్కత్తా–చైన్నె జాతీయ రహదారిపై బైఠాయించారు. రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో వాహనాలు కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి. మరోసారి రంగ ప్రవేశం చేసిన పోలీసులు నాయకులను బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయగా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రోడ్డుపై పడుకున్న కాకాణిని పోలీసులు బలవంతంగా పక్కకి ఈడ్చి పడేశారు. ప్రతాప్కుమార్రెడ్డి, బుర్రాను లాక్కెళ్లే ప్రయత్నంలో పెద్ద ఎత్తున తోపులాటలు చోటు చేసుకున్నాయి. దీంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఆ ప్రాంతంలో నెలకొంది. రోడ్డుపై బైఠాయించిన మహిళా నేతలను మహిళా పోలీసులు పక్కకి లాగేశారు. అంతం కాదు.. ఆరంభం మాత్రమే ‘రామాయపట్నం పోర్టు ప్రజల ఆస్తి.. దాన్ని ప్రైవేటీకరించేందుకు చేసే ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకుంటాం. ఇది అంతం కాదు.. ప్రజల హక్కుల కోసం ప్రారంభమైన పోరాటానికి ఇదే ఆరంభం’ అని కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. పోర్టును పరిశీలించేందుకు, ప్రజలకు నిజాలు చెప్పేందుకు వచ్చిన ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం, పోలీసులతో బలవంతంగా తరలించడం ప్రభుత్వ భయానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రజల ఆస్తిని అమ్మే కుట్ర బయ ట పడుతుందనే భయంతోనే మమ్మల్ని అడ్డుకున్నారు. ప్రజల ఆస్తులను కాపాడే ఈ పోరాటం ఇక్కడితో ముగిసేది కాదు. రామాయపట్నం పోర్టు ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగే వరకు, ప్రైవేటీకరణ నిర్ణయం పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు న్యాయ పోరాటంతో పాటు ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. సూపర్ సక్సెస్ రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో రామాయపట్నం‘ కార్యక్రమం విజయవంతమైంది. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, కందుకూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు లు, మత్స్యకారులు భారీ సంఖ్యలో కార్లు, బైక్లతో ర్యాలీగా రామాయపట్నం పోర్టు వైపు తరలివెళ్లి ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. నేతలపై కేసులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేసినందుకు వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు గుడ్లూరు పోలీస్స్టేషన్లో కేసులు పెట్టారు. కాకాణి గోవర్ధన్రెడ్డి, బుర్రా మధుసూదన్యాదవ్, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డితోపాటు కందుకూరు నాయకులు గణేశం గంగిరెడ్డి, షేక్ రఫి, బిళ్లా రమణయ్య, కాపులూరి మధుసూదన్యాదవ్, చేపల బాలాజీ, కాట్రగడ్డ వెంకట్రావు, కావలి నియోజకవర్గానికి చెందిన కామరాజు తదితరులపై కేసు నమోదు చేశారు. -
డయల్ యువర్ ఎస్పీకి వినతులు
నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ అజిత వేజెండ్ల డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 12 మంది సిబ్బంది తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా బదిలీలు, సస్పెన్షన్ తొలగింపు, ఇతర పరిపాలన అంశాలకు సంబంధించిన అభ్యర్థునలున్నాయి. వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో ఏఏఓ సావిత్రమ్మ, సూపరింటెండెంట్లు సురే ష్, శిరీష, ఎస్బీ – 2 ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి, పీజీఆర్ఎస్ సిబ్బంది పాల్గొన్నారు. పారా స్పోర్ట్స్కు 10 మంది విద్యార్థుల ఎంపిక నెల్లూరు(టౌన్): రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ – 2026 పోటీలకు జిల్లాకు చెందిన 10 మంది దివ్యాంగ విద్యార్థులు ఎంపికై నట్లు సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20 నుంచి 22 వరకు ఏలూరు జిల్లా అగిరిపల్లిలోని హీల్ స్కూల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థుల్లో రాజ్యపూడి సంజన, మేడబాలిమి నిత్యశ్రీ, షేక్ అప్సర్, రాగి మనోజ్ (వరికుంటపాడు), ముత్యం అశోక్ (రాపూరు), పురిమి వెంకట పవన్ సాయి, పురిమి వెంకట సుదీష్ణు (నెల్లూరు), గున్న ప్రతీక్ (సంగం మండలం అన్నారెడ్డిపాళెం), డి. మస్తానయ్య (సైదాపురం), ఎ.చరణ్తేజ (అల్తూరు) ఉన్నారని తెలిపారు. వీరికి రవాణా, వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఎంపికై న విద్యార్థులు నిర్ణీత తేదీల్లో పోటీలకు హాజరయ్యేలా సంబంధిత ఎంఈఓలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉరేసుకుని వ్యక్తి బలవన్మరణం సీతారామపురం: మండలంలోని అంకిరెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో గొల్లపల్లి ఆనందరావు (49) అనే వ్యక్తి తన పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కుటుంబ కలహాల నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది ఆనందరావు గురువారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శుక్రవారం కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య నెల్లూరు(క్రైమ్): ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ కావలి వైపు వెళ్లే పట్టాలపై శుక్రవారం చోటుచేసుకుంది. మృతుడి వయసు 30 నుంచి 35 సంవత్సరాల్లోపు ఉంటుందని భావిస్తున్నారు. పసుపు రంగు ఫుల్హ్యాండ్స్ టీషర్టు, గ్రే కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. ఆత్మహత్య ఘటనపై సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు నెల్లూరు రైల్వే పోలీసులను సంప్రదించాలని హరిచందన కోరారు. ఆర్థిక సాయం అందజేత ఉదయగిరి రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఉదయగిరికి చెందిన హోంగార్డు వాకమల్ల జనార్దన్రెడ్డిని శుక్రవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల సుబ్బారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం సామాజిక బాధ్యత అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మాజీ మండల కన్వీనర్ సీఎం ఓబుల్రెడ్డి, దాసరపల్లి మాజీ సర్పంచ్ గౌస్మొహిద్దీన్, మాజీ మండల ఉపాధ్యక్షుడు బాలిబోయిన శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ ఉప్పుటూరి హరి, నాయకులు ఎంఏ రియాజ్, గానుగపెంట ఓబుల్రెడ్డి, చేజర్ల సుధాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
దూరవిద్య ద్వారా పది, ఇంటర్కు అవకాశం
● డీఆర్వో విజయకుమార్ నెల్లూరు(అర్బన్): చదువుకోవాలనే ఆసక్తి ఉన్న గృహిణిలు, ఉద్యోగులు, వివిధ రంగాల్లో ఉన్న వ్యాపారస్తులు, ప్రజా ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం (ఏపీఓఎస్ఎస్) నిర్వహిస్తున్న దూరవిద్య ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేయొచ్చని జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్పోస్టర్లను శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో డీఈఓ బాలాజీరావు, జెడ్పీ సీఈఓ వసుమతి ఇతర అధికారులతో కలిసి డీఆర్వో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూరవిద్య ద్వారా ఎంతో మంది ఉద్యోగాలు సైతం తెచ్చుకున్నారన్నారు. తాము పనిచేసే రంగాల్లో అభివృద్ధి సాధించవచ్చన్నారు. చదువును కొనసాగించలేకపోయిన వారికి దూరవిద్య సువర్ణ అవకాశం కల్పిస్తుందన్నారు. డీఈఓ మాట్లాడుతూ 2026 – 27 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించేందుకు ఈనెల 31వ తేదీ వరకు గడువు ఉందన్నారు. ఆగస్టు 1 నుంచి 15 వరకు రూ.200 ఫైన్తో ఫీజు చెల్లించి ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. -
టీ తాగేందుకు వెళ్తూ..
ఆత్మకూరు: తెల్లవారుజామున టీ తాగేందుకు మున్సిపల్ బస్టాండ్ వద్దకు వెళ్తున్న ఓ వృద్ధుడిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం ఆత్మకూరులో చోటుచేసుకుంది. ఎస్సై జంపాని కుమార్, స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని నాగేంద్రపురానికి చెందిన చలమల సుబ్బారెడ్డి (78) టీ తాగేందుకు మున్సిపల్ బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమశిలకు వెళ్తూ సుబ్బారెడ్డిని గమనించకుండా అతివేగంగా వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ బస్సును రివర్స్ చేశాడు. కాసేపటికి సోమశిలకు వెళ్లిపోయాడు. ఈ ఘటన మొత్తం సీసీ టీవీ ఫుటేజీలో కెమెరాల్లో రికార్డైంది. స్థానికులు గమనించి పరిశీలించగా అప్పటికే సుబ్బారెడ్డి మృతిచెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదానికి కారణమైన బస్సును సోమశిల మార్గంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ సయ్యద్ కరిముల్లాను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. మృతుడి బంధువుల నిరసన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయినా అధికారులు స్పందించలేదంటూ మృతుడి బంధువులు ఘటనా స్థలంలో మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్సై జంపాని కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని బస్సును స్వాధీనం చేసుకుని, డ్రైవర్ను అరెస్ట్ చేశామని, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో బంధువులు నిరసన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. రెండు బైక్లు ఢీకొని.. కావలి: పట్టణంలోని ట్రంకురోడ్డు ఉత్తర శివార్లలో శుక్రవారం ఉదయం రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. వెంకగళరావునగర్కు చెందిన దేవమణినాయుడు (60) తన బైక్లో ఉత్తర శివార్లలోని బంకులో పెట్రోల్ పట్టించుకుని తిరిగి వస్తుండగా, ఎదురుగా మద్దూరుపాడు వైపు పట్టణానికి చెందిన యోగేంద్ర, ధనూష్ అనే యువకులు బైక్పై అతివేగంగా వెళ్తూ ఢీకొన్నారు. ఈ ఘటనలో దేవమణినాయుడు అక్కడిక్కడే మృతి చెందాడు. బీరుపొట్టు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతి చెందాడని నిర్ధారించారు. ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. కొడవలూరు: గుర్తు తెలి యని వాహనం ఢీకొని ఓ వృద్ధురాలు మృతిచెందిన ఘటన మండలంలోని తలమంచి సెంటర్లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. దామేగుంట చలివేంద్రం కాలనీకి చెందిన అద్దూరి తులసమ్మ (68) తలమంచి సెంటర్లో శుక్రవారం రోడ్డు దాటుతుండగా అల్లూరు వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన తులసమ్మను 108 వాహనంలో అల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా చనిపోయినట్లుగా సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. ఇక్కడి ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా అదే సమయంలో బైక్ వెళ్లినట్లు గుర్తించారు. ఆ వాహనం ఢీకొనడంతో వృద్ధురాలు మృతిచెంది ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. గూడూరు వైపు వెళ్తూ.. కోట: మండలంలోని కొండుగుంట వద్ద ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో షేక్ ముజీబ్ (30) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. చిట్టేడుకు చెందిన అమీర్బాషా కుమారుడు ముజీబ్ మోటార్బైక్పై గూడూరు వైపు వెళ్తూ కొండుగుంట వద్ద రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డును ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గర్భంతో ఉన్న తన భార్యను చూసేందుకు ముజీబ్ శ్రీకాళహస్తికి వెళ్తున్నట్లు తెలిపారు. ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించే క్రమంలో రోడ్డు పక్కన ఉన్న బోర్డును ఢీకొన్నట్లు సమాచారం.విచారణ జరుపుతున్నట్లు ఎస్సై పవన్కుమార్ తెలిపారు.● వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి -
చేపలు పడుతూ చెరువులో పడి..
● వ్యక్తి మృతి ఆత్మకూరు: ఆత్మకూరు చెరువులో చిన్న తెప్పపై చేపలు పట్టేందుకు వెళ్తున్న వ్యక్తి నీటిలో పడిపోవడంతో మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. చెరువులో చేపలు పట్టించే క్రమంలో సంబంధిత కాంట్రాక్టర్ రాజమండ్రి పరిసర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులను ఆత్మకూరుకు గురువారం తీసుకొచ్చాడు. వారిలోని మోజెస్ (31) అనే వ్యక్తి చిన్న తెప్పపై చేపలు పట్టేందుకు చెరువులోకి వెళ్లగా ఆ సమయంలో అతనికి ఫిట్స్ రావడంతో నీటిలో పడిపోయాడు. పరిసరాల్లోని వారు గమనించి ఒడ్డుకు చేర్చగా అప్పటికే అతను మృతిచెందాడు. వెంటనే రాజమండ్రి నుంచి వచ్చిన మత్స్యకారులు అందరూ మృతదేహాన్ని తీసుకొని వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు కాలేదు. అక్కడి కాంట్రాక్టర్ను సంప్రదించినా తనకేమి తెలియదన్నట్లుగా చెప్పడం గమనార్హం. మృతుడికి రెండు రోజులుగా జ్వరం ఉందని, ఫిట్స్కు గురై నీళ్లల్లో పడిపోయాడని స్థానికులు తెలిపారు. -
వ్యవసాయ బోర్ల తొలగింపు అమానుషం
● వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పందిటి కామరాజు కలిగిరి: ‘తెల్లపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూనిపోగు ఇర్మియాకు చెందిన రెండు వ్యవసాయ బోర్లను తొలగించడం అమానుషం. బాధ్యులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పందిటి కామరాజు తెలిపారు. ఇర్మియాకు న్యాయం చేయాలంటూ కలిగిరిలోని తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇర్మియా కుటుంబం 60 ఏళ్లుగా తెల్లపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 522/2లో 2.80 పట్టా భూమిలో వ్యవసాయం చేస్తోందన్నారు. 15 సంవత్సరాల క్రితం ఇంటి వద్ద వ్యవసాయ పనులు, పశువుల కోసం బోరు వేయించారన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్సార్ జలకళ పథకంలో ఉపాధి హామీ ద్వారా బోరు వేసి మోటార్, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు ఎస్సీ కాలనీలో నీటి ఎద్దడి ఉందని కొందరితో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేయించారన్నారు. వారు స్థానిక టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో ఇర్మియా సాగు చేస్తున్న భూమిలో రెండున్నర సెంట్లు ఆక్రమణలో ఉందని, అందులో బోరు ఉందని చెబుతూ తొలగించడం సమంజసం కాదన్నారు. డిప్యూటీ తహసీల్దార్ దగ్గరుండి ఇర్మియాపై ఫిర్యాదు చేసిన వ్యక్తి, ఇతర టీడీపీ నాయకులతో రెండు బోర్లను తొలగించడం దుర్మార్గమన్నారు. ఈ చర్యపై ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల సంఘం, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదులు చేస్తామన్నారు. న్యాయ పోరాటం జరుపుతామన్నారు. ● ఇర్మియా మాట్లాడుతూ డిప్యూటీ తహసీల్దార్ తమ ఇంటికి వచ్చి బోర్లు తొలగించకుండా ఉండాలంటే స్థానిక టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే వద్దకు వెళ్లాలని ఒత్తిడి చేశారన్నారు. తలొగ్గకపోవడంతో ఉద్దేశపూర్వకంగా బోర్లు తొలగించారన్నారు. వరిపంట సాగులో ఉందని నీరు ఇవ్వకపోతే ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్తే వరి పంట సాగు పూర్తయే వరకు అధికారులు ఇబ్బందులు పెట్టరని హామీ ఇచ్చారన్నారు. ఈ మాటలను కూడా స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదన్నారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కాటం రవీంద్రారెడ్డి మాట్లాడుతూ కలిగిరికి కిలోమీటర్ దూరంలో సుమారు 13 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఇతర ప్రాంతాల వారి పేర్లకు ఎలా మార్చారో, కలిగిరిలో సమీపంలో ఐదు సెంట్ల భూమిని అసలు యజమానికి తెలియకుండా ఇద్దరి పేర్ల మీదకు ఎలా మార్చారో వివరాలతో కలెక్టర్ను కలుస్తామన్నారు. ఇర్మి యా పొలంలో బోరు, మోటార్ ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్రెడ్డి, యువనేత మేకపాటి అభినవ్రెడ్డి సొంత నిధులు అందిస్తామని భరోసా ఇచ్చారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీ నియోజకవర్గ అధ్యక్షుడు ఒంగోలు రాఘవేంద్ర, జిల్లా కార్యదర్శి దావులూరి వెంకటేష్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు యలపల తిరుపాలు, నాయకులు పాల్గొన్నారు. -
సిద్ధార్థలో ఏఐసీటీఈ ఐడియా ల్యాబ్ ప్రారంభం
నారాయణవనం: మండలంలోని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఏఐసీటీఈ ఏఐసీటీఈ ఐడియా ల్యాబ్ను శుక్రవారం తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ ప్రారంభించారు. ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లారుతూ ఐడియా ల్యాబ్లో సీఎస్సీ మెషీన్ కటింగ్, త్రీడీ ప్రింటింగ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, ఐఓటీ ల్యాబ్లతో విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇన్నోవేటివ్ టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. యువ ఇంజినీర్లు స్టార్టప్లను, ఇంకుబేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఐడియా ల్యాబ్ కో ఆర్డినేటర్ రత్నకమల మాట్లాడుతూ సాంకేతిక పరమైన ఐడియాల ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నోవేషన్, ఇంప్లిమెంటేషన్, స్టార్టప్స్ అంశాలపై పరిజ్ఞానం పెంచుకోవచ్చని తెలిపారు. కళాశాల చైర్మన్ అశోకరాజు మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు అధునాతన సాంకేతిక విజ్ఞనానికి ఐడియాని, టెక్నాలజీని జోడించి అభివృద్ధి పరచడానికి ఐడియా ల్యాబ్ ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ రమేష్ కుముద్, జనార్దన్రాజు, కో కోఆర్డినేటర్ సునీల్కుమార్రెడ్డి, హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆటో చోరీ
నెల్లూరు(క్రైమ్): ఆటో చోరీపై వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. పొర్లుకట్టకు చెందిన షాహీర్ ఆటో డ్రైవర్. ఆయన అప్పుడప్పుడు బస్సు క్లీనర్గా పనిచేస్తున్నాడు. గతనెల 28వ తేదీ రాత్రి అతను కరెంటాఫీస్ సెంటర్ సమీపంలో తన ఆటోను పార్క్ చేశాడు. అక్కడే ఉన్న బస్సును క్లీన్ చేసి నిద్రపోయాడు. 29వ తేదీ తెల్లవారుజామున లేచిచూడగా ఆటో కనిపించలేదు. శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కండలేరులో 28.64 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 28.64 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 60, హైలెవల్ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 62 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ
నెల్లూరు రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన జగన్ 2.0 సూపర్ యాప్ను నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సోషల్ మీడియా వేదికల్లో పార్టీ కార్యకర్తలు పోస్ట్ చేసే కంటెంట్ను తొలగించడం, అడ్డంకులు సృష్టించడం వంటి పరిణామాల నేపథ్యంలో పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు యాప్ను రూపొందించారని తెలిపారు. దీని ద్వారా ప్రతి కార్యకర్తా తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేయడంతో పాటు పార్టీతో నేరుగా అనుసంధానమై ఉండే అవకాశం కలుగుతుందని చెప్పారు. గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు అందరూ ఒకే వేదికపై అనుసంధానమవుతారని.. క్షేత్రస్థాయిలో ప్రజలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పోలీసుల వేధింపులు వంటి అంశాలను నేరుగా పార్టీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఈ యాప్ ద్వారా ఉంటుందని వివరించారు. పార్టీ నిర్వహించే సమావేశాలు, ప్రెస్మీట్లు, ముఖ్య ప్రకటనలు, కార్యక్రమాలన్నీ లైవ్ ఫీడ్ రూపంలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. యాప్ను భవిష్యత్తులో మరింత విస్తరించి, కార్యకర్తల సమస్యలపై వెంటనే స్పందించేలా అభివృద్ధి చేయనున్నారని తెలిపారు. రాజకీయ వేధింపులు, పోలీసుల ఇబ్బందులను నమోదు చేసేందుకు పార్టీ రూపొందించిన డిజిటల్ డైరీని సైతం ఈ యాప్తో అనుసంధానించనున్నారని వెల్లడించారు. దీంతో బాధితులు నేరుగా ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. పార్టీ మహిళా జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, జిల్లా మహిళాధ్యక్షురాలు లక్ష్మీసునంద, ఇంద్రసేన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కోటితీర్థంలో టీడీపీ నేతల దాష్టీకం
● పొలం వివాదంలో మహిళలపై దాడి ● ముగ్గురికి తీవ్ర గాయాలు ● బాధితులపైనే పోలీసులకు ఫిర్యాదుచేజర్ల: టీడీపీ నేతలు రోజురోజుకూ బరితెగిస్తున్నారు. పొలం వివాదంలో వైఎస్సార్సీపీ మద్దతుదారులైన ముగ్గురు మహిళలపై దాడి చేసి గాయపరిచారు. అయితే దాడిని కప్పిపుచ్చుకునేందుకు నాయకులు అధికార బలాన్ని ఉపయోగించి బాధితులపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చికిత్స పొందుతున్న మహిళల వద్ద పోలీసులు ప్రాథమిక సమాచారం సేకరించలేదు. బాధితులు, గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని కోటితీర్థంలో టీడీపీ నేత కొమ్మి జనార్ధన్ నాయుడికి అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరురాలు మేకా సరోజనమ్మకు భూమి హద్దు వివాదం ఉంది. బుధవారం అధికార యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరించి జనార్ధన్కు సరోజనమ్మకు చెందిన భూమిలో హద్దులు చూపించింది. శుక్రవారం ఉదయం సదరు నేత వర్గం ఆ పొలంలో ఫినిషింగ్ రాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో సమీప పొలంలో కాపలాగా ఉన్న మేకా సరోజనమ్మ, మేకా రత్నమ్మ, నాగినేని దొరసానమ్మను దూషించారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై జనార్దన్, అతని మామ పొత్తూరు రామయ్య, బావమరిది పొత్తూరు శ్రీహరి మరికొందరు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుల బంధువులు 112 హెల్ప్లైన్, 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. వారిని చికిత్స నిమిత్తం ఆత్మకూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ● సాయంత్రం తీరిగ్గా గ్రామానికి చేరుకున్న చేజర్ల పోలీసులు టీడీపీ నేతలు గాయపడిన మహిళలపై ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్నారు. ఇదిలా ఉండగా హెల్ప్లైన్కి ఫోన్ చేసి మాపై దాడి జరిగిందని బాధితులు తెలిపినప్పటికీ పోలీసులు వారి నుంచి ప్రాథమిక సమాచారాన్ని కూడా సేకరించలేదు. ముగ్గురు మహిళలను మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు రూరల్: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్, డీఆర్వో విజయ్కుమార్ ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను అందజేశారు. హిమాన్షు శుక్లా మాట్లాడుతూ గ్రీవెన్స్లో అందిన ప్రతి వినతిని పరిశీలించి, పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
పోర్టుకు వెన్నుపోటు
● నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తలమానికం రామాయపట్నం పోర్టు ● రూ.4929.39 కోట్లతో 4 బెర్త్లతో తొలి దశ పోర్టు పనులు 95 శాతం పూర్తి ● రెండేళ్లుగా జాతికి అంకితం చేయకుండా నిర్లక్ష్యం ● ప్రైవేట్కు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కారు కుటిల యత్నాలు ● నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చలో రామాయపట్నం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మణిహారంగా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ద్రోహదపడే రామాయపట్నం పోర్టుకు చంద్రబాబు సర్కారు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమైంది. కోస్తా తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రూ.4902.39 కోట్ల పెట్టుబడి అంచనాతో 850.79 ఎకరాల్లో తొలి దశగా 2022 జూలై 20న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తొలి దశలో 34.04 ఎంఎంటీపీఏ (మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానమ్) సామర్థ్యంతో రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్ వినియోగంగా నాలుగు బెర్తులతో నిర్మాణాన్ని 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రారంభించారు. అయితే సార్వత్రిక ఎన్నికల నాటికి దాదాపు 95 శాతానికి పైగా పోర్టు పనులు పూర్తయ్యాయి. రెండో దశకు 15 బెర్తులు పూర్తి చేసి 138.54 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానమ్ రవాణా లక్ష్యంగా గత ప్రభుత్వం ప్రణాళికను రచించింది. అప్పటికే బ్రేక్ ఫీడర్ల నిర్మాణంతోపాటు లక్ష టన్నుల సామర్థ్యం కలిగిన భారీ నౌకలు నిలిచే విధంగా 16 మీటర్ల వరకు డ్రెడ్జింగ్ పూర్తి చేశారు. ఒక బల్క్ బెర్తు నిర్మాణం, సెంట్రల్ ఎకై ్సజ్, కస్టమ్స్ విభాగాలకు చెందిన బిల్డింగ్ల నిర్మాణాలను సిద్ధం చేసింది. పోర్టుతో కావలి కనకపట్నం రామాయపట్నం పోర్టు నిర్మాణం పూర్తయితే మొదటగా అభివృద్ధి చెందేది కావలి పట్టణం. పోర్టుకు 15 కి.మీ. దూరంలో రోడ్డు, రైల్ కనెక్టివిటి ఉన్న కావలి కనకపట్నంగా అభివృద్ధి చెందుతోంది. పట్టణాల అభివృద్ధికి పోర్టులే కీలమని గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి 50 కి.మీ. ఒక పోర్టు నిర్మించాలని భావించారు. నెల్లూరుకు సమీపంలో కృష్ణపట్నం పోర్టు రూపుదిద్దుకున్న క్రమంలో జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్, రామాయపట్నంలో పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పోర్టులు, హార్బర్లకు అనుబంధంగా ఏర్పడే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాల కల్పన చేపట్టాలని భావించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరుగా, ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి కల్పన లక్ష్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామాయపట్నంపోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రైవేట్ పరం చేసేందుకు చంద్రబాబు సర్కారు అడుగులు వేస్తోంది. అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబు 2014 ఎన్నికల సమయంలో రామాయపట్నం పోర్టును నిర్మిస్తానని ఆర్భాటంగా హామీలు గుప్పించారు. ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా కనీసం సెంటు భూమి సేకరణకు నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. 2019 ఎన్నికల ముందు ఇదే ప్రచారాస్త్రంతో ఫిబ్రవరిలో డూప్ శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వ కేటాయింపులు కానీ, డీపీఆర్ కానీ, భూసేకరణ ప్రణాళిక కానీ, సర్వే కానీ ఏదీ చేయకుండానే హడావుడిగా టెంకాయ కొట్టి వెళ్లారు. వైఎస్ జగన్ సీఎం కాగానే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రామాయపట్నం పోర్టుకు సంబంధించి విధివిధానాలు, డీపీఆర్ సిద్ధం చేసి, బడ్జెట్ కేటాయింపులు చేసి, భూసేకరణ నోటిఫికేషన్లు ఇచ్చి భూములు సేకరించి, నిర్వాసితులకు పరిహారం అందజేసి 2022 జూలై 20న శంకుస్థాపన చేశారు. కేవలం 18 నెలల్లోనే పోర్టులో కార్యకలాపాలు సాగేలా ప్రణాళికను సిద్ధం చేశారు. దాదాపు 95 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం మారడంతో ఇటువంటి ప్రాజెక్ట్ను పూర్తి చేసి ప్రజలకు అంకింత చేయాల్సిన చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా పోర్టు పరిధిలో 51 కి.మీ. మేర వ్యాపార కార్యకలాపాలు నిర్వర్తించే విధంగా గత ప్రభుత్వం విధివిధానాలు రూపొందిస్తే.. కూటమి సర్కారు దాన్ని 15 కి.మీ.ల పరిధికి కుదించింది. నేడు చలో రామాయపట్నం రామాయపట్నం పోర్టును ప్రైవేట్పరం చేసేందుకు సర్కారు కుట్రలను నిరసిస్తూ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, కందుకూరు సమన్వయకర్త బుర్రా మధుసూదన్యాదవ్లు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డితో కలిసి శనివారం చలో రామాయపట్నం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. -
పంచాయతీ నిధులకు పాతర
భారీగా స్వాహా ● కుమ్మకై ్కన సర్పంచ్, కార్యదర్శులు ● రూ.రెండు కోట్ల ప్రజాధనం స్వాహా ● ఫండ్స్ దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ ● పచ్చ నేతల ఒత్తిడితో ఎంకై ్వరీలో జాప్యం ● పంచాయతీలో కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటు, బల్బ్ల కొనుగోలు పేరుతో దొంగ బిల్లులు పెట్టి, సర్పంచ్ సృజన భర్త సంధ్యారాయుడు అకౌంట్కు జమ చేశారనే ఆరోపణలున్నాయి. ● పంచాయతీలోని నేరేడుపల్లిలో గ్రామస్తుల విరాళాలతో వాటర్ ప్లాంట్ కోసం గదిని నిర్మిస్తే, దాన్ని పంచాయతీ నిధులతో చేసినట్లు చూపి రూ.4.8 లక్షలను కాజేశారు. ● పంచాయతీలో పాత మోటార్లకు రిపేరు చేసి, కొత్తవి కొనుగోలు చేసిన తరహాలో బిల్లులు రూపొందించి నిధులు డ్రా చేశారనే ఆరోపణలున్నాయి. పంచాయతీలో కొంతమంది బినామీ సిబ్బందిని పెట్టుకొని జీతాలను నెలనెలా బొక్కేశారని తెలుస్తోంది. ● పారిశుధ్య పనుల కోసం బ్లీచింగ్, సున్నం కొనుగోలు చేసినట్లు పంచాయతీ కార్యాలయ సిబ్బంది పేరుతో బిల్లులు పెట్టి స్వాహా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి ● పంచాయతీ నిధులతో సిమెంట్ రోడ్లను నాసిరకంగా నిర్మించి నిబంధనలకు విదర్ధుంగా సర్పంచ్ భర్తపై డ్రా చేశారు. ● వాస్తవానికి నిధుల ఖర్చుకు సంబంధించి రూ.20 వేలు దాటితే ఓచర్కు బదులు ఎం బుక్లో రికార్డు చేసి డ్రా చేయాల్సి ఉంది. అయితే ఓచర్ల పేరుతో రూ.లక్షల మేర డ్రా చేసి.. కంప్యూటర్ ఆపరేటర్, స్వీపర్ల ఖాతాల్లో జమ చేశారు. వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మేజర్ పంచాయతీలో రూ.కోట్ల ప్రజాధనాన్ని స్వాహా చేశారు. మాజీ సర్పంచ్ నల్లగొండ్ల సృజన, పలువురు పంచాయతీ కార్యదర్శులు కుమ్మకై నిబంధనలకు విరుద్ధంగా ఇలా వ్యవహరించారు. ఇంత జరుగుతున్నా, సంబంఽధిత అధికారులు పట్టించుకోలేదు. భారీ మొత్తంలో నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్కు ఓ ఎంపీటీసీ ఫిర్యాదు చేశారు. దీంతో విచారణను అధికారులు చేపట్టారు. అయితే పచ్చ నేతల ఒత్తిడితో ఎంకై ్వరీలో జాప్యం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా ఇలా.. వింజమూరు మేజర్ పంచాయతీలో 25 వేల వరకు జనాభా ఉంది. జనరల్ ఫండ్, ఆర్థిక సంఘ నిధుల రూపంలో ఏటా రూ.కోటి వరకు వస్తోంది. ఇదే కాకుండా ఇతర మార్గాల ద్వారా సైతం మరికొంత ఆదాయమొస్తోంది. ఈ క్రమంలో 2022 నుంచి 2026 ఆర్థిక సంవత్సరం వరకు నిధులు భారీగా పక్కదారి పట్టాయి. తూతూమంత్రంగా.. నిధుల దుర్వినియోగంపై కలెక్టర్కు వింజమూరు సెగ్మెంట్ – 6కు చెందిన ఎంపీటీసీ యాకసిరి భవాని ఏడాది క్రితమే ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ నిమిత్తం కావలి డీఎల్పీఓను నియమించి నివేదికివ్వాలని ఆదేశించారు. అయితే అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో విచారణలో జాప్యం చేశారు. దీంతో విజిలెన్స్ ఆఫీసర్లకు ఆమె ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఎంకై ్వరీ సాగుతున్నా, పచ్చ నేతలు ఒత్తిడి తెచ్చి తూతూమంత్రంగా క్లోజ్ చేసి చేతులు దులుపుకొనేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేరుకే షోకాజ్ నోటీస్ పంచాయతీ నిధులు దుర్వినియోగమయ్యాయని, దీనికి సమాధానమివ్వాలని కోరుతూ సర్పంచ్ సృజనకు షోకాజ్ నోటీస్ను మార్చిలో కావలి డీఎల్పీఓ జారీ చేశారు. అయితే ఇది ఏమైందో నేటికీ తెలియదు. అధికారులు గోప్యంగా ఉంచారనే ఆరోపణలూ లేకపోలేదు. నిధులను దుర్వినియోగం చేసిన వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేయాల్సి ఉన్నా, అలాంటివేవీ నేటికీ జరగలేదు. ప్రాథమిక సమాచారం మేరకు పంచాయతీలో రూ.1.54 కోట్ల మేర నిధులు పక్కదారి పట్టాయని తెలుస్తోంది. విచారణను పారదర్శకంగా జరిపితే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆఫీసర్లు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సి ఉంది.రికార్డులను పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు వింజమూరు పంచాయతీ కార్యాలయం విచారణ చేస్తున్నాం పంచాయతీ నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నాం. ఇవి పక్కదారి పట్టాయనే అంశాన్ని గుర్తించాం. అన్ని రికార్డులు, వాటి అధారంగా పనులను పరిశీలించాం. ఉన్నతాధికారులకు నివేదికను త్వరలో అందజేయనున్నాం. – వేణుగోపాల్, విజిలెన్స్ అధికారి -
మర్యాదపూర్వకంగా..
నెల్లూరు రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో పార్టీ సీఈసీ సభ్యుడు పేర్నాటి శ్యామ్ప్రసాద్రెడ్డి మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలుతిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శిలాతోరణం వద్దకు చేరుకుంది. స్వామివారిని 82,255 మంది బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 32,683 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.76 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. పాస్పోర్ట్ ప్రత్యేక అపాయింట్మెంట్ డ్రైవ్ నెల్లూరు రూరల్: ప్రజలకు మెరుగైన పాస్పోర్ట్ సేవలను అందించేందుకు గానూ ప్రత్యేక పాస్పోర్ట్ అపాయింట్మెంట్ డ్రైవ్ను నిర్వహించనున్నామని నెల్లూరు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 18, ఆగస్ట్ ఒకటిన ప్రత్యేక స్లాట్లను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఈ తేదీల్లో అపాయింట్మెంట్ను బుక్ చేసుకోవచ్చని వివరించారు. రక్షాబంధన్ సందర్భంగా రాఖీలు, స్వీట్లు పంపే అవకాశం ఉందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్ ప్రక్రియ నూరు శాతం పూర్తి నెల్లూరు(అర్బన్): కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ జాబితా (సర్)కు సంబంధించిన ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్ను నూరు శాతం పూర్తి చేశామని కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 19,74,240 మంది ఓటర్లకు గానూ ప్రక్రియను పూర్తి చేశామని వెల్లడించారు. జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు రేపు నెల్లూరు (టౌన్): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా స్థాయి బ్మాడ్మింటన్ పోటీలను శనివారం నిర్వహించనున్నామని బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాఽథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ – 13, 17, 19 మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో పోటీలను జరపనున్నామని వివరించారు. ఇక్కడ గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక చేయనున్నామని వెల్లడించారు. హాజరవ్వాలనుకునే వారు పుట్టిన తేదీతో ఉన్న ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాలని కోరారు. ఆసక్తి గల వారు తమ వివరాలను శుక్రవారం సాయంత్రం ఏడు గంటల్లోపు నమోదు చేసుకోవాలని సూచించారు. పంటల బీమాతో రైతుకు భరోసా నెల్లూరు(వేదాయపాళెం): ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంట బీమా పథకాలతో రైతులకు భరోసా లభిస్తుందని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసుత ఖరీఫ్ సీజన్లో రైతులు తమ పంటలను బీమా చేయించుకొని ప్రకృతి వైపరీత్యాలతో కలిగే నష్టాల నుంచి రక్షణ పొందాలని సూచించారు. నిర్ణీత గడువులోపు ప్రీమియాన్ని చెల్లించాలని కోరారు. వేరుశనగ పంటకు ఎకరాకు రూ.280 చెల్లిస్తే రూ.28 వేలు.. వరి ఎకరాకు రూ.840 ప్రీమియానికి రూ.42 వేల నష్టపరిహారాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. పత్తి పంటకు ఎకరాకు రూ.రెండు వేలను చెల్లిస్తే పరిహారంగా రూ.40 వేలను పొందొచ్చని వెల్లడించారు. సమీపంలోని ఆరెస్కేలు, కామన్ సర్వీస్ సెంటర్లు, పోస్టాఫీస్లు, నేషనల్ క్రాప్ ఇన్సురెన్స్ పోర్టళ్లను సంప్రదించాలని సూచించారు. -
న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యం
పొదలకూరు: అధికార పార్టీకి చెందిన నాయకుడు తన జీవనాధారం కోల్పోయేలా చేశాడని ఓ వృద్ధుడు ఆవేదన చెందుతూ తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. లేనిపక్షంలో ఆత్మహత్యే శరణ్యమని కన్నీటి పర్యంతం అవుతున్నారు. పొదలకూరు మండలం మరుపూరు గ్రామానికి చెందిన కొంగి పెంచలనర్సయ్య విలేకరుల సమక్షంలో తన ఆవేదనను వెల్లడించారు. తనకు ఇల్లు లేదని, రేకులు తెచ్చుకుని గ్రామ మెయిన్రోడ్డు పక్కన చిన్న నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. అధికార పార్టీకి చెందిన కొందరు తనను వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తూ ఆర్అండ్బీ అధికారులను పురాయించారన్నారు. అధికారులు వచ్చి పరిశీలించిన సందర్భంగా తనకు వేరే ఆధారం ఏమీ లేదని, ఉండడానికి నిలువ నీడ కూడా లేదని చెప్పడంతో వారు వెళ్లిపోయినట్టు తెలిపారు. అయితే గ్రామానికి చెందిన కలిచేటి శ్రీనివాసులురెడ్డి తన మనుషుల చేత బలవంతంగా రేకులను తొలగించడమే కాకుండా తాను నివసించే చోట చెత్తను పోయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఇక్కడ టెంకాయలు, జామకాయలు అమ్ముకుంటూ జీవిస్తున్నానని, శ్రీనివాసులురెడ్డి మనుషులు వచ్చి నా టెంకాయలను పగలగొట్టి వ్యాపారానికి సంబంధించిన కత్తులు, గొడ్డళ్లు తీసుకుపోయారని, నా తోపుడు బండి చక్రాలను విరగ్గొట్టారని తెలిపారు. సామగ్రి మొత్తాన్ని పారేసి నన్ను వీధిన పడేశారని, రోడ్డుపైనే పడుకుంటున్నానని కన్నీంటి పర్యంతం అవుతున్నారు. పిల్లలెవరూ నన్ను పట్టించుకోవడం లేదని, ఇక్కడ కూడా ఉండనివ్వకుండా ఇలా ఇబ్బంది పెడుతుంటే నేను ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. -
మూడు రోజులు కొట్టి.. హింసించారు
● పాడుబడిన పోలీస్ క్వార్టర్స్లో దాష్టీకం ● అపస్మారక స్థితిలో స్టేషన్కు ఏడుకొండలును తీసుకొచ్చారు ● వివరాలు వెల్లడి నెల్లూరు(పొగతోట): ఓ కేసులో తమను పోలీసులు మూడు రోజులు చితక్కొట్టి వదిలారని.. ఆపై మరో రెండు రోజుల పాటు నిర్బంధించారని ఏడుకొండలు లాకప్ డెత్ కేసులో రియాజ్, ప్రసాద్ వివరించారు. మనుబోలు పోలీస్స్టేషన్లో జరిగిన ఘటనపై పూర్తి వివరాలను మీడియా ఎదుట వీరు వివరించారు. నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి గురువారం నిర్వహించారు. ఘటన వివరాలను రియాజ్, ప్రసాద్ ఈ సందర్భంగా వెల్లడించారు. రోడ్డులో ఉంటే తీసుకెళ్లారు.. అక్కంపేట రోడ్డులో ఉన్న తమ ముగ్గుర్నీ ఖాకీలు శుక్రవారం తీసుకెళ్లి.. పాడుబడిన పోలీస్ క్వార్టర్స్లో చితక్కొట్టారని ఆరోపించారు. ఎస్సై హనీఫ్, పోలీసులు వచ్చి.. శుక్రవారం నుంచి ఆదివారం వరకు తమను పోలీస్స్టేషన్లోనే ఉంచారని చెప్పారు. తాము తప్పు చేశామని అంగీకరించామని వివరించారు. వస్తువు రికవరీ అయిందని ఆదివారం సాయంత్రం చెప్పి, స్టేషన్ బెయిల్ కోసం ముగ్గురి వేలిముద్రలను తీసుకున్నారని పేర్కొన్నారు. సంతకాలు పెట్టించుకొని జామీన్ తెచ్చుకోమని పంపారన్నారు. ఈ క్రమంలో పోలీస్స్టేషన్కు ఏడుకొండలు మినహా తామిద్దరం సోమవారం ఉదయం వచ్చామని చెప్పారు. మంగళవారం వరకు తమను అక్కడే ఉంచి ఏడుకొండలును కారులో అదే రోజు సాయంత్రం తీసుకొచ్చారని తెలిపారు. వాహనం నుంచి మాధవ్ అనే వ్యక్తి దిగి.. ఏడుకొండలు లేరా.. లేరా అని పిలిచినా చలనంలేదని వివరించారు. మాధవ్ వెళ్లి రైటర్ను తీసుకొచ్చారని, ఆ తర్వాత కారు గూడూరు వైపు వెళ్లిపోయిందన్నారు. గంట అనంతరం తెల్లపేపర్లపై సంతకాలు చేయించుకొని తమను పంపారని చెప్పారు. మోటార్ కొన్న వ్యక్తి వచ్చి ఏడుకొండలు లేవడం లేదురా.. గుండె దగ్గర బాగా వాచిపోయిందిరా అని చెప్పారన్నారు. వెంకటాచలం పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి మరుసటి రోజు వదిలిపెట్టారన్నారు. ప్రభుత్వ అరాచకాలు ప్రజలకు తెలియాలి ఏడుకొండలు మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం హ్యాండోవర్ చేశారని కాకాణి తెలిపారు. దీన్ని పరిశీలిస్తే పోలీస్స్టేషన్లోనే రియాజ్, ప్రసాద్ ఉన్నారన్నారు. ప్రభుత్వం ఎంత అరాచకంగా ఉందో ప్రజలకు తెలియాలని చెప్పారు. సాక్ష్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. విషయాలను నిర్భయంగా తెలియజేసిన ఇద్దరికీ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. -
యథేచ్ఛగా గడ్డి మందు విక్రయాలు
● అధికారుల నియంత్రణ శూన్యం ● పక్క రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతి చేజర్ల: నిషేధిత గడ్డి మందు విక్రయాలు జిల్లాలో యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. జిల్లాకు చెందిన పెద్ద వ్యాపారులు పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చి అనేక ప్రాంతాల్లో బహిరంగంగా విక్రయిస్తున్నారు. వ్యవసాయ శాఖ పర్యవేక్షణ లోపం కారణంగా ఈ పరిస్థితి నెలకొందనేది అక్షర సత్యం. కుటుంబ కలహాలు లేదా ఇతర వ్యక్తిగత కారణాలతో కొందరు దీన్ని సేవించి ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు కోకొల్లలు. అయితే దీని కట్టడిపై శ్రద్ధ కొరవడింది. అధికారులకు వ్యాపారులు మామూళ్లను సమర్పించి విక్రయాలు సాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిషేధించిన కేంద్ర ప్రభుత్వం విషపూరిత రసాయనాలైన గ్లయ్పోసెట్, ప్యారాకిట్, క్లింటన్ తదితర రసాయనాలను దేశంలో కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయితే ప్యారాకిట్ తప్ప మిగిలిన బ్రాండ్ల రసాయన ప్రభావాన్ని కొంత మేర తగ్గించి ఇతర రాష్ట్రాల్లో విక్రయాలకు రెండేళ్ల క్రితం అనుమతించారు. అయితే రాష్ట్రంలో మాత్రం నిషేధం కొనసాగుతోంది. ఈ క్రమంలో జిల్లాలోని ఫర్టిలైజర్ వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొని రాపూరు, పొదలకూరు, ఆత్మకూరు, కలువాయి, సైదాపురం, గూడూరు, చేజర్ల, ఆదూరుపల్లి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విక్రయాలు జరుపుతున్నారని తెలుస్తోంది. కొన్ని చోట్ల ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సైతం అమ్ముతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కఠిన చర్యలు చేపడతాం నిషేధంలో ఉన్న గడ్డి మందుల విక్రయాలను సహించేదిలేదు. ఈ విషయంలో ఎవర్నీ ఉపేక్షించేదిలేదు. అవసరమైతే ఆయా వ్యాపార సంస్థల గుర్తింపును శాశ్వతంగా రద్దు చేసి క్రిమినల్ కేసులనూ నమోదు చేస్తాం – సత్యవాణి, జిల్లా వ్యవసాయాధికారి -
విద్యుత్ బస్సులను ప్రభుత్వమే నడపాలి
● ఎమ్మెల్సీని కోరిన ఆర్టీసీ యూనియన్ నాయకులు నెల్లూరు(పొగతోట): ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రభుత్వమే నేరుగా నడపాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు కోరారు. ఆ మేరకు గురువారం నగరంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల సేవలను ప్రైవేట్కు అప్పగించడం వల్ల ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఆర్టీసీ బస్సుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ప్రయాణికుల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితి ఆర్టీసీ మనుగడకే ప్రమాదకరమన్నారు. ఉద్యోగుల ఆకాంక్షలను చట్టసభల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి ఆర్టీసీ భవితవ్యాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు బాబుశామ్యూల్, కృష్ణారావు, మురళీమోహన్రెడ్డి, కట్టా సుబ్రహ్మణ్యం, నారాయణరావు, మాల్యాద్రి పాల్గొన్నారు. -
సేవకు ప్రతిరూపం రెడ్క్రాస్
నెల్లూరు(అర్బన్): సేవకు ప్రతిరూపం రెడ్క్రాస్ సంస్థ అని ఇండియన్ రెడ్క్రాస్ సంస్థ జిల్లా శాఖ స్పెషలాఫీసర్, డీఆర్వో విజయకుమార్ అన్నారు. రెడ్క్రాస్కు కలెక్టర్ ఆధ్వర్యంలో ఇటీవల నియమించిన అడ్హాక్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం గురువారం మద్రాస్ బస్టాండ్ పక్కనే ఉన్న ఆ సంస్థ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో రెడ్క్రాస్ సేవలు ఎంతో గుర్తింపు తెచ్చాయన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ప్రమాదాలలో రెడ్క్రాస్ సేవలు మరువలేనివన్నారు. రెడ్క్రాస్ పాలకవర్గం ముగిసినందున ఎన్నికలు జరిగే వరకు నూతన అడ్హాక్ కమిటీ కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. 14 మంది సభ్యుల ప్రమాణం రెడ్క్రాస్ పాలకమండలి నూతన అడ్హాక్ కమిటీ సభ్యులుగా 11 మంది, మరో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు కలిపి ప్రమాణం చేశారు. వారిలో స్పెషలాఫీసర్గా డీఆర్వో విజయకుమార్, సభ్యులుగా యాలమూరి రంగారావు, సర్వేపల్లి విజయకుమార్, కమలేష్కుమార్జైన్, జనార్దన్రాజు, దయాకర్రావు, పాదర్తి నాగరాజు, కలికి శ్రీహరిరెడ్డి, పందిపాటి జనార్దన్రెడ్డి, బృంగి సుధాకర్రావు, మల్లు స్వాతిరెడ్డి, కుడుముల సుధాకర్రెడ్డి, అలాగే జిల్లా కో–ఆపరేటివ్ ఆఫీసర్, జిల్లా ఆడిట్ ఆఫీసర్లు ప్రమాణం చేశారు. వీరిలో ఎక్కువ మంది పాత కమిటీలోని సభ్యులే కావడం గమనార్హం. కాగా రిటైర్డ్ డిప్యూటీ ఇంజినీర్ గోసుల వెంకటసుబ్బారెడ్డి రెడ్క్రాస్ కేన్సర్ ఆస్పత్రికి రూ.2 లక్షలను విరాళంగా అందజేసి కేన్సర్ రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని కోరారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సెక్రటరీ మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు. -
జైళ్లలో ప్రశాంత వాతావరణం ఉండాలి
ఆత్మకూరు: జైళ్లలో వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతూ.. ఖైదీల్లో పరివర్తన వచ్చేలా చూడాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మశ్రీ పేర్కొన్నారు. పట్టణంలోని సబ్ జైలును స్థానిక సీనియర్ సివిల్ జడ్జి గాయత్రితో కలిసి గురువారం ఆమె తనిఖీ చేశారు. పలువురు ఖైదీలతో మాట్లాడి.. జైల్లో సమస్యలేమైనా ఉన్నాయా.. అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారాననే విషయాలను ఆరాతీశారు. అనంతరం జైల్లోని వంటశాల, తయారైన పదార్థాలు, స్టోర్ రూమ్, బాత్రూమ్లలో పరిశుభ్రత తదితరాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడారు. జిల్లాలోని అన్ని జైళ్లలో పరిస్థితులను పరిశీలిస్తున్నామని వివరించారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. అడ్వొకేట్ ఓబులేసు, లోక్ అదాలత్ సభ్యుడు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కమీషన్ ఇస్తేనే రుణం
నెల్లూరు (పొగతోట): జిల్లాలో మెప్మా, డీఆర్డీఏ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించే బ్యాంక్ లింకేజ్, సీ్త్రనిధి రుణాల మంజూరులో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. 5 నుంచి 10 శాతం వరకు కమీషన్ ఇవ్వాలని కింది స్థాయి సిబ్బంది మహిళలను డిమాండ్ చేస్తున్నారు. డబ్బు ఇచ్చిన వారికే వేగంగా రుణాలు మంజూరు చేస్తున్నారని, అర్హులైన పేద మహిళలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. మంజూరులో అవకతవకలు జిల్లాలో 35,120 స్వయం సహాయక సంఘాలున్నాయి. సుమారు నాలుగు లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ప్రతినెలా పొదుపు చేస్తూ రుణాలు తీసుకుని తిరిగి చెల్లిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,400 కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలు, రూ.250 కోట్ల సీ్త్రనిధి రుణాలు మంజూరయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,400 కోట్లకు పైగా బ్యాంక్ లింకేజ్ రుణాలు, రూ.300 కోట్లకు పైగా సీ్త్రనిధి రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే మంజూరులో అవకతవకలు జరుగుతున్నాయంటూ జిల్లా అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా ఫలితం కనిపించడం లేదు. గత నెలలో కమీషన్లకు సంబంధించి సిబ్బందికి చెల్లించిన నగదుపై పూర్తి ఆధారాలతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మితిమీరిన రాజకీయ జోక్యం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం పెరిగిందనే విమర్శలున్నాయి. గ్రామాల్లో పనిచేస్తున్న కొందరు వీఓఏలను తొలగించి, కూటమికి అనుకూలంగా ఉన్న మహిళలను నియమించుకున్నారు. రుణాల మంజూరులో కూడా అధికార పార్టీ నాయకులు సూచించిన మహిళలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రెండు నెలల క్రితం కుల సంఘాలకు చెందిన ఇద్దరు నాయకులు మహిళల ఆధార్ కార్డుల ఆధారంగా బినామీ గ్రూపులు ఏర్పాటు చేసి, వారి పేర్లపై పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేయించుకున్నట్లు సమాచారం. యూనిక్ నంబర్లు లేకుండానే మహిళల పేర్లపై రుణాలు మంజూరైనట్లు ఆరోపణలున్నాయి. అధిక వడ్డీ వ్యాపారానికి? పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ పలుకుబడి, ఆర్థికంగా బలమైన కొందరు మహిళలు తమకు అనుకూలంగా ఉండేవారితో గ్రూపులు ఏర్పాటు చేశారు. సుమారు 100 మందికిపైగా మహిళలతో ఈ తరహా గ్రూపులు పెట్టి ఒక్కోదానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బ్యాంక్ లింకేజ్ రుణాలు తీసుకుంటున్నారు. ఆ నగదును ఇతరులకు అధిక వడ్డీకి ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు నిజమైన నిరుపేద మహిళలు మాత్రం రుణాలు అందక పేదరికంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. మంజూరులో కూటమి నేతల జోక్యం 5 నుంచి 10 శాతం వరకూ డిమాండ్ యూనిక్ నంబర్ ఉన్న మహిళలకే రుణాల మంజూరంటూ విమర్శలు ఓ నాయకుడి బినామీ గ్రూపులకు బ్యాంక్ లింకేజీ రుణాలు ఆధారాలతో పోలీసులను ఆశ్రయించిన మహిళలు ఉదాహరణకు.. ఇటీవల నెల్లూరుకు చెందిన ఓ మహిళ భర్త అనారోగ్యానికి గురికావడంతో శస్త్రచికిత్స, ఆస్పత్రి ఖర్చుల కోసం సుమారు రూ.2 లక్షలు అవసరమయ్యాయి. చేతిలో రూ.2 వేల మినహా మరే మార్గం లేకపోవడంతో అత్యవసరంగా రుణం కోసం సంబంధిత సిబ్బందిని సంప్రదించారు. 10 శాతం కమీషన్ ఇస్తే 48 గంటల్లో రుణం మంజూరు చేయిస్తామని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో అంగీకరించగా, మూడు రోజుల్లోనే రుణం బ్యాంక్ ఖాతాలో జమైంది అనంతరం ఒప్పందం ప్రకారం 10 శాతం కమీషన్ చెల్లించారు. కావలికి చెందిన ఓ నిరుపేద కుటుంబం వ్యవసాయ పనులు చేస్తోంది. పెద్ద కుమార్తెకు వివాహం నిశ్చయం కాగా కట్నకానుకలు, ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వచ్చింది. పొదుపు సిబ్బందిని సంప్రదించగా 10 శాతం కమీషన్తో గ్రూపునకు బ్యాంక్ లింకేజ్ రుణం మంజూరు చేయించారు. గ్రూపులోని ముగ్గురు మహిళల ద్వారా రూ.3 లక్షలు అందించినట్లు తెలిసింది. ఇలాంటి ఘటనలు జిల్లాలో అనేకం ఉన్నాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో అప్పులు పొందడం కష్టంగా మారింది. ప్రైవేట్ రుణదాతలు కులం, ప్రాంతం, ఆస్తుల వివరాలు పరిశీలించిన తర్వాతే రుణాలు ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పేద మహిళలకు బ్యాంక్ లింకేజ్, సీ్త్రనిధి రుణాలే ఆధారంగా నిలుస్తున్నాయి. అయితే కింది స్థాయి సిబ్బంది వ్యవహారశైలితో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. -
సమర్థ నాయకత్వంతోనే ప్రపంచ శాంతి
వెంకటాచలం: సమర్థ నాయకత్వంతోనే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం డైరెక్టర్ మాడభూషి సంపత్కుమార్ అన్నారు. మండలంలోని సరస్వతి నగర్ వద్దనున్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో గురువారం విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ జల్ది విద్యాధరరావు, సరికొండ నరసింహరాజు సంపాదకత్వంలో 341 మంది కవులు రాసిన ‘యుద్ధం– శాంతి’ కవితల పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంపత్కుమార్ మాట్లాడుతూ యుద్ధం భవిష్యత్ వినాశనానికి కారణమని, ఇది చిన్నారుల జీవితాలను నాశనం చేస్తుందని చెప్పారు. కళారత్న చిన్ని నారాయణరావు, సాహితీ విమర్శకుడు టేకుమళ్ల వెంటప్పయ్య మాట్లాడుతూ యుద్ధం లోకానికి వినాశనాన్ని కలిగిస్తే, శాంతి రేపటి తరానికి వెలుగునిస్తుందని అన్నారు. ప్రముఖ రచయిత్రి గోవిందరాజు సుభద్రాదేవి మాట్లాడుతూ సమాజానికి హితాన్ని కలిగించేదే సాహిత్యమని, మనిషి అత్యున్నతంగా ఎదగాలంటే నిరంతరం సమస్యలతో యుద్ధం చేయాలన్నారు. ప్రముఖ రచయిత అవ్వారు శ్రీధర్బాబు, రచయిత్రి పార్లపల్లి నాగేశ్వరమ్మ, ఆదినారాయణరెడ్డి, దయాకర్రెడ్డి తదితరలు పాల్గొన్నారు. -
విధి నిర్వహణలో పక్కాగా ఉండాలి
నెల్లూరు(అర్బన్): ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వారికి కేటాయించిన విధులను పక్కాగా నిర్వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ సుజాత అన్నారు. సంతపేటలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆశా నోడల్ ఆఫీసర్స్ సమీక్షను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు టీనేజ్ ప్రెగ్నెన్సీలను నివారించాలని, కిశోర బాలికల ఆరోగ్యం పెంపొందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఇన్చార్జి డీఐఓ డాక్టర్ బ్రిజిత మాట్లాడుతూ మాతా–శిశు సంరక్షణ చర్యలను ఎప్పటికప్పుడు ఆర్సీహెచ్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లలకు షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయించడం, బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వంద శాతం వేసేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి(డీసీహెచ్ఎస్) డాక్టర్ పరిమళ మాట్లాడుతూ ఏంటినేటల్ కేసులను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చి డెలివరీలు చేయించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎన్ఎంఓ డాక్టర్ రమేష్, స్టాటిస్టికల్ ఆఫీసర్ సహాన, డీపీఓ రమేష్, డీసీఎం సునీత పాల్గొన్నారు. -
ఏడుకొండలు మృతి.. సంచలన విషయాలు చెప్పిన సాక్షులు
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఏడుకొండలు మృతి కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. మృతికి సంబంధించి చోరీ కేసులో ఏడుకొండలుతో నిందితులుగా ఉన్న రియాజ్, ప్రసాద్ కీలక విషయాలను వెల్లడించారు. ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు నిజాలను బయటపెట్టారు. చోరీ కేసులో తమను పోలీసులు హింసించారని రియాజ్, ప్రసాద్ చెప్పుకొచ్చారు. పోలీసుల దెబ్బలకే ఏడుకొండలు చనిపోయాడని వారిద్దరూ తెలిపారు.దొంగతనం కేసులో ఏడుకొండలతో నిందితులుగా ఉన్న రియాజ్, ప్రసాద్ తాజాగా పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్బంగా. ‘ఏడుకొండలను పోలీసులు.. 10వ తేదీ అదుపులోకి తీసుకొని 12వ తేదీన వదలిపెట్టారు. తిరిగి 13వ తేదీ ఉదయం రావాలని పోలీసులు చెప్పారు. 14వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఓ కారులో ఏడుకొండలను స్టేషన్కు తీసుకొచ్చిన పోలీసులు. అప్పటికి ఏడుకొండలుకు ఉలుకు పలుకు లేకపోవడంతో అటు నుండి అటే.. రెండు గంటల తరువాత గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఏడుకొండలు మృతి చెందినట్టు పోలీసులు తేల్చారు’ అని తెలిపారు. పోలీస్ దెబ్బలకే ఏడుకొండలు చనిపోయాడు అనడానికి సాక్షులు తెలిపిన వివరాలు కీలకం కానున్నాయి. -
ఏడుకొండలు బాడీపై దెబ్బలు ఎందుకున్నాయి: కాకాణి
సాక్షి, నెల్లూరు: ఏపీలో హత్యలు, అత్యాచారాలు, లాకప్ డెత్లు పెరుగుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు నెల్లూరు జిల్లాలో ఏఓ శ్రీహరి హత్య ఘటన తర్వాత తాజాగా ఏడుకొండల మృతి మరో ఉదాహరణగా పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని విమర్శించారు. ఏడుకొండలది లాకప్ డెత్ కాదు అని ఎస్పీ ఎలా అంటారు అని ప్రశ్నించారు.మాజీ మంత్రి కాకాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్న ఏడుకొండలను పోలీసులు తీవ్రంగా కొట్టారు. , ఆసుపత్రికి తరలించే సమయంలోనే ఆయన మృతి చెందారు. ఇది లాకప్ డెత్ కాదని పోలీసులు ఎలా చెబుతున్నారు?. ఎస్పీకి పూర్తి సమాచారం ఉందా? లేక ఏదైనా ఒత్తిడితో వాస్తవాలు దాచిపెడుతున్నారా?. గడ్డి మందు తాగడం వల్లే మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు. అయితే ఏడుకొండల శరీరంపై ఉన్న గాయాలకు సమాధానం చెప్పాలి. కాలువ వద్ద బురదలో పొర్లించి మరీ ఏడుకొండలను దారుణంగా కొట్టారు.12వ తేదీనే ఏడుకొండలను వదిలేశామని చెబుతున్న పోలీసులు, 13, 14 తేదీలకు సంబంధించిన మనుబోలు పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ను బయటపెట్టాలి. ఎస్పీ గారు దయచేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకండి. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ఉండటానికి ఒత్తిడితో నిజాన్ని దాచిపెట్టకండి. ఇదే కేసులో ఉన్న రియాజ్ను వెంకటాచలం పీఎస్కు పిలిచి అనుకూలంగా స్టేట్మెంట్ తీసుకున్నారు. నా మాటల్లో నిజం లేకుంటే పూర్తి ఆధారాలతో ఎస్పీ సమాధానం చెప్పాలి. ఈ ఘటన అనంతరం టీడీపీ నాయకుడు ఏడుకొండలు అక్కకు కాల్ చేశారు. ఎస్ఐను బదిలీ చేయిస్తాం, మీకు ఇంకా కుటుంబం ఉంది అని సంభాషించాడు. అవసరం అయితే ఎమ్మెల్యే సోమిరెడ్డితో మాట్లాడి ఆర్థికంగా లబ్ధి చేస్తాం అని కూడా చెప్పారు. మేము దొంగలను సపోర్ట్ చేయడం లేదు. లాకప్ డెత్ లాంటి ఘోరమైన ఘటనలను ప్రశ్నిస్తున్నాం అని వ్యాఖ్యలు చేశారు. -
పోలీసులు చితకబాదడం వల్లే నా తమ్ముడు చనిపోయాడు
చంద్రబాబు కర్కశ పాలనలో ఖాకీలు కాలాంతకుల్లా మారుతున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన పోలీసుస్టేషన్లు బడుగుజీవుల బలికోరే వధశాలలవుతున్నాయి. ఇటీవల విజయవాడ నగరంలో పోలీసుల అధికారమదానికి బలైన కాపు యువకుడు సాయికృష్ణ, దళిత యువకుడు క్రాంతికుమార్ మరణాలను మరిచిపోకముందే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు ఎస్సై దాష్టీకానికి మరో దళిత యువకుడు ఏడుకొండలు, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సీఐ వేధింపులకు మైనార్టీ ఉద్యోగి దరియా హుసేన్ అసువులుబాశారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో ఖాకీలు మోగిస్తున్న ఈ మరణ మృదంగం రాష్ట్రంలో బాబు సర్కారు సాగిస్తున్న రెడ్బుక్ నరమేధానికి సజీవసాక్ష్యమై నిలుస్తోంది. రక్షణ చట్టాలకు ఉరితాడు బిగించి వికటాట్టహాసం చేస్తోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్స్టేషన్ ఎస్సై ఎస్కే హనీఫ్ ఖాకీ దుస్తులు ధరించిన క్రిమినల్ మాదిరిగా అరాచకంగా వ్యవహరిస్తున్నాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన వ్యవహార శైలి అత్యంత వివాదాస్పదంగా ఉందని చర్చించుకుంటున్నారు. తప్పు చేస్తే నిందితులను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పర్చాల్సిన ఎస్సై.. నిందితులను, అమాయకులను చచ్చే వరకు కొడుతున్నాడని పేర్కొంటున్నారు. ఆయన అరాచకాలకు ఎన్నో ఉదంతాలున్నాయని స్పష్టం చేస్తున్నారు. బదిలీపై వచ్చి.. ఈ ఏడాది మే 9వ తేదీన పొదలకూరు మండలం నావూరుపల్లికి చెందిన గాలం హరికృష్ణ అనే రైతును టీడీపీ నేతల ఆదేశాల మేరకు అకారణంగా స్టేషన్కు తీసుకొచ్చి లాఠీలతో చితకబాదాడు. ఈ సన్నివేశాలను వీడియో కాల్ ద్వారా టీడీపీ నేతలకు లైవ్లో చూపించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. గూడూరు ఇన్చార్జి డీఎస్పీ దీనిపై విచారించి కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఎట్టకేలకు ఈ నెల మొదటి వారంలో ఆ ఎస్సైను మనుబోలు పోలీస్స్టేషన్కు బదిలీ చేయడంతో 6వ తేదీన బాధ్యతలు చేపట్టారు. చోరీ కేసులో పైశాచికత్వం బంగారం చోరీ కేసులో మనుబోలు మండలం చెరుకుమూడికి చెందిన బొల్లు ఏడుకొండలతోపాటు మరో ఇద్దరిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై హనీఫ్, కానిస్టేబుళ్లు రెండు రోజుల పాటు స్టేషన్లో వారిని లాఠీలతో కుళ్ల బొడిచారు. ఈ క్రమంలో వారిని ఆదివారం రాత్రి వదిలేసి.. మర్నాడు రావాలంటూ హెచ్చరించారు. సోమవారం ఇద్దరు మాత్రమే స్టేషన్కు రాగా ఏడుకొండలు రాలేదు. దీంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాధవరావు, మరో కానిస్టేబుల్ కారులో ఏడుకొండలు ఉన్న గ్రామానికి చేరుకుని విచక్షణారహితంగా కొట్టారు. సొమ్మసిల్లి పడిపోయిన ఏడుకొండలను కారు డిక్కీలో కుక్కి స్టేషన్కు తీసుకెళ్లారు. స్పృహలో లేకపోవడంతో నీళ్లు చల్లి మరీ చావబాదినట్లు సమాచారం. సాయంత్రం 6 గంటలకు ఏడుకొండలును గూడూరు ఏరియా వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చోరీ కేసులో కొట్టి చంపొచ్చా..? చోరీ కేసులో నిందితుడు ఏడుకొండలును అదుపులోకి తీసుకున్న మనుబోలు పోలీసులు విచారణ అనంతరం కోర్టులో హాజరు పరచాలి. కానీ ఏడుకొండలతోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని రెండు రోజుల పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. నాలుగు సవర్ల బంగారం పోయిందని కేసు నమోదైతే.. నిందితులను కొట్టి, హింసించి 12 సవర్ల బంగారాన్ని తీసుకున్నారు. వారి నుంచి బంగారం కొనుగోలు చేసిన వారిని బెదిరించి కేసులు పెడతామని మరో 12 సవర్ల బంగారాన్ని తీసుకున్నారు. చివరకు 2 సవర్లు మాత్రమే రికవరీ చూపించారు. నిందితులను కోర్టుకు హాజరుపర్చకుండా స్టేషన్కు తరలించి చావబాదడం వల్లే ఏడుకొండలు చనిపోయాడని స్పష్టమవుతోంది. ఎస్పీ అజిత బుధవారం మీడియాతో మాట్లాడుతూ అది లాకప్ డెత్ కాదన్నారు. మరి ఎలా చనిపోయాడనే ప్రశ్నకు పోలీసుల దగ్గర సమాధానం లేదు. కొట్టి చంపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? మనుబోలు పోలీస్స్టేషన్ వద్ద ఏడుకొండలు మృతదేహంతో ఆందోళనకు దిగిన కాకాణి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ గడ్డి మందు తాగి చనిపోయాడంటూ.. ఏడుకొండలు మృతి చెందాడని గుర్తించిన పోలీసులు అతడి సోదరుడికి ఫోన్ చేసి మీ అన్న గడ్డి మందు తాగి పొలాల్లో చనిపోయాడని, ఆస్పత్రికి వచ్చి సంతకాలు పెట్టాలని తొలుత చెప్పారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి గడ్డి మందు తాగి ఎలా చనిపోతాడని బాధితులు స్టేషన్ ఎదుట మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. చంపేసి గడ్డి మందు తాగాడని చెబుతున్నారంటూ మండిపడ్డారు. గడ్డి మందు తాగి పొలాల్లో చనిపోతే నిబంధనల ప్రకారం స్థానిక వీఆర్వో ద్వారా ఫిర్యాదు తీసుకుని శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టంకు తరలించాలి. కానీ ఏడుకొండల విషయంలో అలాంటిదేమీ జరగలేదు. అసలు గడ్డి మందు తాగినట్లు ఆనవాళ్లు కూడా లేవు. పోలీసుల అదుపులో వ్యక్తి ఆస్పత్రిలో శవంగా తేలటాన్ని బట్టి దెబ్బలకు తాళలేకే చనిపోయాడన్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. పంచనామా రిపోర్టులో ఆ వివరాలేవి? ఏడుకొండలు మృతిపై పోలీసులు చెప్పేవన్నీ అబద్ధాలేనని శవ పంచనామా రిపోర్టే తేటతెల్లం చేస్తోంది. ఏడుకొండలును మంగళవారం సాయంత్రం 6.15 గంటలకు గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడని డ్యూటీ డాక్టర్ చెప్పినట్లు పంచనామా రిపోర్టులో పొందుపరిచారు. మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పేర్కొన్నారు. పోలీసులు చెప్పినట్లు నిజంగానే గడ్డి మందు తాగి ఉంటే.. పాయిజన్ వాసన వస్తుంది. శరీరం రంగు మారడం లాంటివి జరగాలి. కానీ ఇవేవి లేవు. కానిస్టేబుల్ మాధవరావు, మడమనూరుకు చెందిన నవీన్ కలిసి ఏడుకొండలను ఆస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. అపస్మారక స్థితిలో ఎక్కడ ఉండగా ఆస్పత్రికి తీసుకెళ్లారనే విషయం పంచనామా రిపోర్టులో రాయలేదు. పోలీసులు మొదట చిత్రీకరించిన ప్రకారం.. గడ్డి మందు తాగి చనిపోయి ఉంటే వీఆర్వో ఫిర్యాదు లేకుండా ఎలా తరలించారు? ఎవరి ద్వారా సమాచారం లేకుండా.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా.. ప్రాథమికంగా చేపట్టాల్సిన శవ పంచనామా చేయకుండా నేరుగా ఆస్పత్రికి ఎలా తరలించారు? అనే ప్రశ్నలకు పోలీసుల వద్ద సమాధానం లేదు. -
ఏడుకొండలు మృతదేహంతో హైవేపై బైఠాయింపు
● బాధితులకు అండగా కాకాణి, వైఎస్సార్సీపీ శ్రేణులు ● మూడు డిమాండ్లను నెరవేర్చాల్సిందేమనుబోలు: పోలీసుల దాష్టీకంతో ప్రాణాలు కోల్పోయిన మండలంలోని చెరుకుమూడికి చెందిన బొల్లు ఏడుకొండలు (41) మృతదేహాన్ని శవ పంచనామా అనంతరం మనుబోలుకు బుధవారం సాయంత్రం తీసుకొచ్చారు. విషయం ముందుగా తెలియడంతో వందల సంఖ్యలో పోలీసులను హైవేపై మోహరించారు. పోలీస్స్టేషన్ వద్దకు స్థానికులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏడుకొండలు మృతికి పోలీసులే కారణమని, వారిని శిక్షించాలని కోరుతూ స్థానిక తహసీల్థార్ కార్యాలయ ఎదుట మృతదేహంతో హైవేపై కుటుంబసభ్యులు బైఠాయించారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. వీరిని చెదరగొట్టేందుకు ఖాకీలు యత్నించడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. హైవేపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి స్పందించి కార్యకర్తలను శాంతింపజేయడంతో పాటు డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుతో చర్చలు జరిపారు. న్యాయం జరిగేంత వరకూ పోరాటం బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకూ వారి తరఫున తాము పోరాటం చేయనుందని కాకాణి పేర్కొన్నారు. తాము నిర్దిష్టంగా మూడు డిమాండ్లను పోలీసుల ముందుంచామని.. ఎవరైతే ఏడుకొండలు మృతికి కారణమో వారిపై చర్యలు చేపట్టడం, బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారాన్ని అందజేయడంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశామన్నారు. మృతికి కారణమైన వారిపై 15 గంటల్లోపు చర్యలు చేపడతామని డీఎస్పీ హామీ ఇచ్చారని తెలిపారు. ఇతర అంశాలను కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని చెప్పారన్నారు. దాటవేత ధోరణిలో ఎస్పీ ఏడుకొండలు మృతిపై ఎస్పీ దాటవేత ధోరణిలో మాట్లాడారని కాకాణి విమర్శించారు. ముగ్గురు నిందితులను శని, ఆదివారాల్లో తీసుకొచ్చామని పోలీసులు చెప్తున్నారని, అయితే ఏడుకొండలు రాకపోవడంతో మాధవ్ అనే కానిస్టేబుల్ మంగళవారం స్వయంగా వెళ్లి ఈడ్చుకొచ్చే క్రమంలో ఆయన కాళ్లకై న బురద మరకలను తాము చూశామని చెప్పారు. న్యాయం చేయాలని, అలా కాకుండా లాకప్ డెత్కు కారణమైన పోలీసులను వెనుకేసుకొని రావడం న్యాయం కాదని డీఎస్పీకి సూచించారు. ఏడుకొండలును పట్టుకున్నప్పటి నుంచి మృతదేహాన్ని గూడూరు ఆస్పత్రికి తరలించేంత వరకూ సీసీ ఫుటేజీలను పోలీసులు బయటపెడితే నిజాలు నిగ్గు తేలుతాయని పేర్కొన్నారు. వారికి అనుకూలమైన వీడియోలను మాత్రమే బయటపెట్టి.. బాధితులను దొంగలుగా, తాగుబోతులుగా చిత్రీకరించడం తగదని హితవు పలికారు. దొంగైనంత మాత్రాన ఇక ఏమీ అవసరం లేకండా పోలీసులే కొట్టి చంపేస్తామంటే ఇక చట్టాలు, కోర్టులు ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు అదే నమ్మితే కేంద్రంతో మాట్లాడి ఓ చట్టాన్ని తీసుకురావాలని ఎద్దేవా చేశారు. ఎస్పీకి తప్పుడు సమాచారమిచ్చి ఉంటారని, దీన్నంత తేలిగ్గా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని.. ప్రైవేట్ కేసును వేస్తామని.. జాతీయ ఎస్సీ కమిషన్, మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నామని వెల్లడించారు. శవ పంచనామా మొక్కుబడిగా కుదరదని, వీడియోగా చేయాలని ఫొరెన్సిక్ నిపుణులను పిలిపించాలంటే సాయంత్రం వరకూ తాత్సారం చేశారని ఆరోపించారు. జిల్లాలోని పోలీసులందర్నీ పిలిపించి తమను అష్టదిగ్బంధనం చేసేందుకు యత్నించారని ధ్వజమెత్తారు. ఏడుకొండలు కుటుంబానికి న్యాయం జరిగేంత వరకూ దళిత, ప్రజా సంఘాలను కలుపుకొని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. జాతీయ రహదారిపై బాధితుల బైఠాయింపు భారీగా పోలీసులు -
డ్రోన్ నిఘా నీడలో జిల్లా
● ఎస్పీ అజిత వేజెండ్ల నెల్లూరు(క్రైమ్): జిల్లాను డ్రోన్ కెమెరాల నిఘా నీడలోకి తీసుకొచ్చామని ఎస్పీ అజిత వేజెండ్ల పేర్కొన్నారు.నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బుధవారం ఆమె మాట్లాడారు. ఈ ఏడాది ప్రథమార్థంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో 82 మార్కులతో ఏ గ్రేడ్ను సాధించామని చెప్పారు. గడిచిన ఆర్నెల్లో 37 మందిపై పీడీ.. పది మందిపై పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్, నేర ప్రవృత్తి ఉన్న 76 మందిపై సెక్సువల్ ఆఫెండర్ షీట్లను తెరిచి నిరంతర నిఘాను ఉంచామని వెల్లడించారు. ప్రజాభద్రతే ధ్యేయంగా 153 కార్డన్ సెర్చ్లను నిర్వహించామని పేర్కొన్నారు. నగరంతో పాటు కావలి, గూడూరు, ఆత్మకూరులో ప్రత్యేక బృందాలతో రాత్రి గస్తీని పటిష్టంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. బుచ్చి కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు వ్యవసాయాధికారి శ్రీహరి హత్య కేసులో పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామనీ, కేసులో ఇప్పటికే ఇద్దర్ని అరెస్ట్ చేశామన్నారు. కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బుచ్చిరెడ్డిపాళెం అర్బన్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్, ఎస్సైను వీఆర్కు పంపడంతో పాటు సిబ్బంది మొత్తాన్నీ బదిలీ చేశామన్నారు. శాఖాపరమైన చర్యల్లో భాగంగా వీఆర్లో ఉన్న ఇన్స్పెక్టర్ శ్రీనివాసులును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని చెప్పారు. ఆత్మహత్యల నివారణ చర్యల్లో భాగంగా ‘ఒక్క క్షణం ఆలోచించంది.. పోరాడి విజేతలుగా నిలవండి’ అంటూ ముద్రించిన పోస్టర్లను ఎస్పీ, పోలీస్ అధికారులు ఆవిష్కరించారు. ఏఎస్పీలు సౌజన్య, దీక్ష, నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ, డీసీఆర్బీ, పీసీఆర్ ఇన్స్పెక్టర్లు దశరథరామారావు, శ్రీనివాసరెడ్డి, పాపారావు, భక్తవత్సలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శిలాతోరణం వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 75,485 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 30,939 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.36 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. డీసీపల్లిలో 422 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 422 బేళ్లను బుధవారం విక్రయించారని నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. వేలానికి 462 బేళ్లు రాగా, 422ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 59,362.1 కిలోల పొగాకును విక్రయించగా, రూ.1,30,32,993.20 వ్యాపారం జరిగిందని వివరించారు. గరిష్టంగా కిలో రూ.250.. కనిష్టంగా రూ.160.. సగటు ధర రూ.219.55గా నమోదైందని వెల్లడించారు. పది కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారన్నారు. కిలో పొగాకు గరిష్ట ధర రూ.250 కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.250 లభించింది. జనరల్ క్లస్టర్కు చెందిన రైతులు 351 బేళ్లను తీసుకురాగా, 259ను విక్రయించగా, మిగిలినవి తిరస్కరణకు గురయ్యాయి. ఈ సందర్భంగా వేలం నిర్వహణాధికారి చంద్రశేఖర్ మాట్లాడారు. గరిష్టంగా రూ.250.. కనిష్టంగా రూ.160.. సరాసరిన రూ.187.59 లభించిందని వివరించారు. 12 కంపెనీలు హాజరయ్యాయని చెప్పారు. గిరిజన బాలికపై లైంగిక దాడికి యత్నం అల్లూరు: తొమ్మిదేళ్ల గిరిజన బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. అల్లూరు ఎస్సై శ్రీనివాసరెడ్డి వివరాల మేరకు.. మండలంలోని గాలిదిబ్బలుకు చెందిన బాలిక ఇంటి సమీపంలో స్నేహితులతో కలిసి మంగళవారం సాయంత్రం ఆడుకోసాగింది. ఈ క్రమంలో మద్యం మత్తులో అటుగా వచ్చిన నాగులదేవిగుంటకు చెందిన యాటగిరి చాంద్బాషా బాలిక చేతిని పట్టుకోగా విడిపించుకొని పక్కనే స్నేహితురాలి ఇంట్లోకి వెళ్లింది. ఆపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో భయంతో కేకలేయగా, చుట్టుపక్కల వారొచ్చి అతడ్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో కేసును నమోదు చేసి రిమాండ్కు తరలించారు. సర్ డిజిటలైజేషన్ @99.99 శాతం నెల్లూరు(అర్బన్): కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న ఓటర్ల సమగ్ర సవరణ జాబితా (సర్)కు సంబంధించిన ప్రక్రియ దాదాపు 100 శాతం పూర్తయిందని కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 19,74,240 మంది ఓటర్లకు గానూ, ప్రతి ఒక్కరికీ ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలు అందజేశారని వివరించారు. ఇందులో 19,74,044 ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేసి 99.99 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని పేర్కొన్నారు. కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, సర్వేపల్లి, ఉదయగిరి నియోజకవర్గాల్లో నూరు శాతం.. నెల్లూరు రూరల్లో 99.95, గూడూరులో 99.98 శాతం మేర పూర్తయిందని వెల్లడించారు. 18 వరకు వెబ్ ఆప్షన్లు నెల్లూరు (టౌన్): డీఈఈ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఆప్షన్ల నమోదుకు అవకాశాన్ని ఈ నెల 18 వరకు కల్పించామని డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆప్షన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ప్రక్రియ ఈ నెల 20 నుంచి 23 వరకు ఉంటుందన్నారు. సీట్లు పొందిన వారు అధికారిక వెబ్సైట్ నుంచి తాత్కాలిక ప్రవేశ పత్రాన్ని డౌన్లోడ్ చేసుకొని సంబంధిత ప్రభుత్వ డైట్కు ఈ నెల 24 నుంచి 29 వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరై పత్రాల పరిశీలనను జరిపించుకోవాలని కోరారు. అనంతరం తుది ప్రవేశ పత్రాన్ని జారీ చేయనున్నామని, డీఎల్ఎడ్ ప్రథమ సంవత్సర తరగతులు ఈ నెల 30న ప్రారంభంకానున్నాయని వెల్లడించారు. -
బుచ్చి మాజీ సీఐ సస్పెన్షన్
కోవూరు: బుచ్చిరెడ్డిపాళెం సీఐగా పని చేస్తూ వీఆర్కు బదిలీ అయిన మాతంగి శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం మినగల్లుకు చెందిన వ్యవసాయశాఖాధికారి శ్రీహరిని అతని మేనల్లుడు, బావమరిది హరికృష్ణ గత నెల 15వ తేదీ హత్య చేసిన కేసును గుండెపోటు మరణంగా చిత్రీకరించడంలో సీఐ శ్రీనివాసరావు కీలకపాత్ర పోషించారనే ఆరోపణలు నేపథ్యంలో అతన్ని రేంజ్ వీఆర్కు బదిలీ చేశారు. అయితే ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో ఈ ప్రధాన నిందితుడు హరికృష్ణ మంగళవారం తన భార్య, ఇద్దరు బిడ్డలతో కలిసి సింగరాయకొండ రైల్వేస్టేషన్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో హడావుడిగా అతన్ని సస్పెండ్ చేసినట్లు బుధవారం బయటకు వచ్చింది. అయితే పోలీసులు మాత్రం నాలుగు రోజుల క్రితమే సస్పెండ్ చేసినట్లు చెబుతున్నారు. బుచ్చిలో అచ్చిరాని ఖాకీ కొలువులు బుచ్చిరెడ్డిపాళెంలో రెండేళ్ల కాలంలో పోలీస్ శాఖలో ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్సైలు మారారు. బుచ్చిరెడ్డిపాళెం పట్టణం విస్తరిస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలతో పోలీస్ శాఖ సమన్వయం కీలకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ అధికారుల తరచూ మార్పులు క్షేత్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కొత్తగా వచ్చే అధికారులు గత అధికారుల ప్రణాళికలు, కేసుల వివరాలు, స్థానిక సమస్యలను అధ్యయనం చేసేలోపే బదిలీలు జరిగితే వ్యవస్థలో వేగం తగ్గుతుందంటున్నారు. అయితే ఇదే కేసులోని ఎస్సైను వీఆర్కు బదిలీ చేసి చేతులు దులుపుకొన్నారు. -
గూడురులో ఉద్రిక్తత.. ‘లాకప్ డెత్’ అంటూ కాకాణి ఫైర్
సాక్షి, నెల్లూరు: గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల వేధింపులతో చనిపోయిన ఏడుకొండలు మృతికి నిరసనగా మాజీ మంత్రి కాకాణి ఆందోళన చేపట్టారు. అయితే, మనుబోలు ఎస్ఐ హనీఫ్ టార్చర్తోనే ఏడుకొండలు చనిపోయాడని అతడి భార్య, బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి ఆసుప్రతి వద్ద మీడియాతో మాట్లాడుతూ..‘ఇది ముమ్మాటికి లాకప్ డెత్ అనే అనుమానాలు ఉన్నాయి. దొంగతనం కేసులో విచారణకు పిలిచి ఎస్ఐ హనీఫ్.. ఏడుకొండలను కొట్టి చంపేశాడు. చావు బ్రతుకుల్లో ఉన్న ఏడుకొండలు ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. ఐదు రోజులపాటు విచారణ పేరుతో స్టేషన్కు పిలిచి చిత్రహింసలకు గురి చేశారు. పోస్టుమార్టం వీడియో రికార్డింగ్, పారదర్శకమైన విచారణ జరపాలి. ఏడుకొండల కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది. పోస్టుమార్టం పూర్తయ్యాక ఏడుకొండలు మృతదేహంతో మనుబోలు పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
ఆ ముగ్గురు చేసిన తప్పేంటి?
జల్సాలు.. అప్పులు.. ఆస్తి వివాదం.. ఒక హత్య. చివరకు నాలుగు ప్రాణాలను మింగేసింది. హత్య కేసులో నిందితుడిగా మారిన వ్యక్తి అరెస్ట్ భయంతో తన ప్రాణం తీసుకోవడమే కాదు, ప్రపంచం అంటే ఏమిటో కూడా తెలియని ఇద్దరు చిన్నారులను, తనను నమ్ముకుని వచ్చిన భార్యను కూడా మరణం వైపు నడిపించాడు. బావ హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న హరికృష్ణ తీసుకున్న ఈ నిర్ణయం.. ఓ కుటుంబాన్ని పూర్తిగా తుడిచి పెట్టేసిన విషాదం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ ముగ్గురు చేసిన తప్పేంటి?. అభం శుభం తెలియని ఐదేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు, భర్తే లోకంగా భావించిన ఓ భార్య. వీరికి హత్య కేసుతో సంబంధం లేదు. కానీ నేరం చేసిన వ్యక్తి తను శిక్షను తప్పించుకోవాలని చూసి.. తన కుటుంబానికే శాశ్వత శిక్ష విధించాడు. భావావేశంలో తీసుకున్న నిర్ణయంతో నాలుగు జీవితాలు రైలు పట్టాలపై ముగిశాయి. నెల్లూరు: బుచ్చిరెడ్డిపాళెం వ్యవసాయశాఖ అధికారి శ్రీహరి హత్యోదంతం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఆస్తి కోసం మేనబావను హత్య చేసిన బావమరిది హరికృష్ణ ఉదంతం వెలుగులోకి రావడం, ఉలిక్కి పడిన నిందితుడు హరికృష్ణ కుటుంబంతో కలిసి ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్లో రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ రెండు కుటుంబాల్లో కన్నీటి సుడులు మిగిలి్చంది. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతున్నాయి. పోలీస్శాఖ అవినీతి, నిర్లక్ష్యం వెరసీ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడు హరికృష్ణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ఘోర కలికి కారణమైంది. ఆ రోజే స్పందించి ఉంటే.. వ్యవసాయశాఖ అధికారి శ్రీహరి హత్య జరిగిన రోజే కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఉంటే.. ఈ రోజు ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడేది కాదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హత్య కేసును ఆ రోజే నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడంలోనే కాదు.. ప్రస్తుతం దర్యాప్తు దశలో కూడా పోలీస్ శాఖ నిర్లిప్తత, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఏ1 నిందితుడిగా ఉన్న హరికృష్ణ కదలికలపై నిఘా పెట్టలేకపోయారు. హరికృష్ణ తన కుటుంబ సభ్యులతో టచ్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. భార్యాపిల్లలు ఆమె పుట్టింట్లో ఉండగా, మంగళవారం తెల్లవారుజామున వచ్చి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. హరికృష్ణ, అతని కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్, కదలికలపై నిఘా ఉండి ఉంటే.. అభం శుభం తెలియని చిన్నారులతోపాటు జీవితాన్ని పంచుకున్న భార్య బతికుండేది. వారేం తప్పు చేశారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన రోజునే హరికృష్ణ తాను చనిపోతున్నానంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు వచ్చినా.. పోలీస్శాఖ నిర్లిప్తతగా వ్యవహరించిందని జిల్లా ప్రజలు నిందిస్తున్నారు. హత్య కేసులో ఇరుక్కుని.. కుటుంబాన్ని బలి తీసుకుని జల్సాలకు అలవాటు పడ్డాడు. ఖర్చులు బాగా పెట్టేవాడు. అంతే స్థాయిలో అప్పుల పాలయ్యాడు. మేనబావ కాక చెల్లి భర్త అయిన బావ ఆస్తిని కాజేయాలని బావ హత్య కేసులో ఏ–1 నిందితుడిగా మారాడు. చివరకు పోలీసులు గాలిస్తున్నారని అరెస్ట్కు భయపడి తనతోపాటు అభం శుభం తెలియని చిన్న పిల్లలు, భార్యతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని వాడు. గ్రామంలో చురుగ్గా ఉండే శ్రీహరి స్థానిక రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా ఉండేవాడు. అయితే ఏఓ శ్రీహరి రెండో వివాహానికి హరికృష్ణ చెల్లెలను ఇచ్చారు. శ్రీహరి మేనమామ కూడా కావడం వల్ల ఇద్దరి మధ్య ఆస్తి వ్యవహారాలు ఉండేవి. ఈ క్రమంలో శ్రీహరిని హరికృష్ణ అంతమొంచాడని పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య కేసులో హరికృష్ణకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా ఏ–1 నిందితుడిగా ఉన్న హరికృష్ణ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ కేసులో ఇరుక్కుని తన జీవితాన్ని నాశం చేసుకోవడంతోపాటు కుటుంబాన్ని కూడా బలి తీసుకున్నాడు. బుచ్చిరెడ్డిపాళెం ఏఓ శ్రీహరి హత్య కేసులో నిందితుడిగా ఉన్న హతుని బావమరిది కుడుముల హరికృష్ణ (32) ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్కు వెళ్లి భార్య ప్రణతి (29), కుమార్తె మూగాంబిక (5), కుమారుడు కౌశిక్(3)లతో కలిసి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన ఘోరకలి తోటపల్లిగూడూరు మండలం వరిగొండ పంచాయతీ రావులవారి కండ్రికలో విషాదం నెలకొంది. వెంటాడిన అమావాస్య ఏఓ శ్రీహరి గత నెల 15వ తేదీన అమావాస్య నాడు హత్యకు గురయ్యాడు. సరిగ్గా నెల తిరగకుండానే అదే అమావాస్య అయిన 14వ తేదీ మంగళవారం హరికృష్ణ తన కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడడం యాదృచ్చికంగానే భావిస్తున్నారు.తెల్లవారు జామున ఇంటికొచ్చి.. హరికృష్ణ మంగళవారం తెల్లవారు జామున ఇంటికొచ్చాడు. భార్య ఇద్దరు పిల్లలను తన వెంట తీసుకుని సింగరాయకొండకు వెళ్లాడు. అక్కడే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల భయం పట్టుకుని అరెస్ట్ చేస్తే బయటకు రావడం కష్టంగా మారుతుందని తన భార్య, పిల్లలు దిక్కులేని వారవుతారనే ఉద్దేశంతోనే హరికృష్ణ అఘాయిత్యానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. -
సర్కారు కిరాతకంలో మరో లాకప్డెత్!
సాక్షి టాస్క్ ఫోర్స్: చంద్రబాబు సర్కారులో వరుస లాకప్ డెత్లు రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ఇటీవల విజయవాడలో కాపు యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్, తర్వాత శవాన్ని మాయం చేయడం సర్కారు కిరాతకానికి పరాకాష్ట. తాజాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మరో లాకప్ డెత్ చోటు చేసుకుంది. బంగారు గొలుసు చోరీ కేసులో నెల్లూరు జిల్లా మనుబోలు పోలీసులు తీసుకొచ్చిన బొల్లి ఏడుకొండలు (50) మంగళవారం పోలీసు స్టేషన్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీసు దెబ్బలకే అతను చనిపోయాడని స్థానికులు అంటుండగా.., గడ్డి మందు తాగి చనిపోయాడని పోలీసులు అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ బంగారు గొలుసు దొంగతనం కేసులో చెరుకుమూడి గ్రామానికి చెందిన బొల్లి ఏడుకొండలును మనుబోలు పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో విచారించారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్పై విడిచి పెట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఏడుకొండలు గ్రామంలో ఉన్నాడని ఎవరో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు చెరుకుమూడి వెళ్లి ఏడుకొండలును తిరిగి అదుపులోకి తీసుకుని, స్టేషన్కు తీసుకెళ్లి చితకబాదినట్లు సమాచారం. దెబ్బలకు తాళలేక అతను మృతి చెందడంతో గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని చెరుకుమూడి దారిలో పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏడుకొండలు మృతదేహాన్ని ఎవరికీ చూపించకుండా పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఏడుకొండలు సోదరి మంగళవారం రాత్రి స్టేషన్ చేరుకుని మా తమ్ముడిని తీసుకొ చ్చి, ఏమి చేశారంటూ విలపించడం కంట తడి పెట్టించింది. కాగా, ఏడుకొండలు గడ్డి మందు తాగి చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. -
అభివృద్ధి పేరుతో ‘ప్రైవేట్’ దోపిడీ
కావలి : రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరచూపుతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా రామాయపట్నం పోర్టును నిర్మిస్తే.. చంద్రబాబు దాన్ని కాజేసేందుకు తన బినామీల పేరుతో ప్రైవేటీకరణకు శ్రీకారం చుడుతున్నాడు. ప్రజలకు సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు తను, తన బినామీలకు ప్రభుత్వ ఆస్తులను దోచి పెట్టి సంపద సృష్టించుకుంటున్నాడని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఆరోపించారు. రామాయపట్నం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 18న ‘చలో రామాయపట్నం’ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. మంగళవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. జగనన్న సంపద సృష్టిస్తే.. చంద్రబాబు దోచుకుంటున్నాడని ధ్వజమెత్తారు. కావలికి 15 కి.మీ. దూరంలో ఉన్న రామాయపట్నం పోర్టు పూర్తయితే కనకపట్నం వైపు అడుగులు వేస్తుందని ఆశించామన్నారు. హార్బర్లు, పోర్టులు ప్రైవేటీకరిస్తే సహించం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్యార్డులు, మెడికల్ కాలేజీలు.. ఇలా ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ జపం చేస్తున్నాడని రామిరెడ్డి మండిపడ్డారు. సుమారు రూ.5 వేల కోట్లతో పూర్తి చేసిన రామాయపట్నం పోర్టును కేవలం రూ.వెయ్యి కోట్ల ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలనుకుంటున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. పోర్టు అనుబంధంగా తమ ప్రభుత్వ హయాంలోనే సోలార్ వంటి ఎన్నో సంస్థలు ముందుకొచ్చాయన్నారు. కార్యకలాపాలు ప్రారంభమైతే చెన్నాయపాళెం, ఆనెమడుగు, రుద్రకోట, మద్దూరుపాడు వరకు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను కూడా ప్రైవేట్కు కట్టబెట్టారని, పూర్తి స్థాయిలో కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది చంద్రబాబు దివాళా కోరు తనానికి నిదర్శనమని మండిపడ్డాడు. మత్స్యకారుల సొత్తు దీనిని ప్రైవేటీకరిస్తే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే పరిస్థితే లేదని తేల్చి చెప్పారు. అభివృద్ధి అంటే జగనన్న.. దోపిడీ అంటే చంద్రబాబు అప్పట్లో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా, మరో పక్క కోవిడ్తో రాష్ట్ర రాబడి తగ్గిపోయినా సరే ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూనే ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి నాలుగు పోర్టులు, 11 ఫిషింగ్ హార్బర్స్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారన్నారు. పోర్టులు, హార్బర్లే కాకుండా 17 మెడికల్ కాలేజీలను నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. అదే విధంగా ఏ గ్రామానికి పోయినా కూడా ఒక సచివాలయము, ఒక ఆర్బీకే సెంటర్, ఒక హెల్త్ సెంటర్, ఒక మిల్క్ డెయిరీ నిర్మాణంతోపాటు గ్రామాలు, పట్టణాల్లో రోడ్లు, డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ కనెక్టింగ్ రోడ్స్, హైవే బ్రిడ్జెస్ కావొచ్చు ఇవన్నీ కూడా జగన్మోహన్రెడ్డి హయాంలో రూపుదిద్దుకున్నవేనన్నారు. చంద్రబాబు వచ్చి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ.. చేసిన అభివృద్ధి పనుల ఫలాలను ప్రజలకు ఇవ్వకుండా తన బినామీలకు దోచి పెట్టే పనిలో ఉన్నారని మండిపడ్డారు. ఎకరం రూ.99 పైసలకే ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధి అంటే జగనన్న అయితే దోపిడీ అంటే చంద్రబాబు అని అన్నారు. పోర్టుకు భూములిచ్చిన వారికి పరిహారం ఇవ్వండి రామాయపట్నం పోర్టుకు భూములిచ్చిన నిర్వాసితులకు సంపూర్ణ నష్టపరిహారం చెల్లించాలని రామిరెడ్డి డిమాండ్ చేశారు. పోర్టు అనుబంధంగా ఎన్నో ప్రాజెక్ట్లు వస్తున్నాయని, వాటికి సంబంధించి భూసేకరణ జరుగుతున్న నేపథ్యంలో వారికి సైతం సముచిత నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఆ ప్రాంత యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గూడు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఇళ్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గ్రావెల్ దందాపై టీడీపీ నేతలే ఫిర్యాదులు కావలి నియోజకవర్గంలో గ్రావెల్ దందా యథేచ్ఛగా జరుగుతోంది. దీనిపై తమ నాయకులు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ శాఖలు స్పందించకపోవడంతో గ్రామాల్లో ఘర్షణలకు కారణమవుతుందన్నారు. ఈ క్రమంలో ఏ పాపం తెలియని కొందరు కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ నేతలు సాగిస్తున్న ఈ అరాచకాలను, అన్యాయాలను సహించలేక ఆ పార్టీ నేతలే ఫిర్యాదులు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రామాయపట్నం పోర్టు కోసం జగనన్న తపించాడు ఫస్ట్ ఫేజ్లో నాలుగు బెర్తులతో సిద్ధం చంద్రబాబు తన బినామీల పేరుతో కాజేసే కుట్రలు ఈ నెల 18న చలో రామాయపట్నం -
సంక్షోభంలో పొగాకు రైతులు
● ధరలు పెంచుతామన్న ప్రభుత్వ హామీలు ఏమయ్యాయి? ● పంటకు గిట్టుబాటు ధర కల్పించకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం ● మాజీ ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి మర్రిపాడు: రాష్ట్రంలో వర్జీనియా పొగాకు రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నా.. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆదుకోవడం లేదని, పొగాకు ధరల పతానికి, నిలకడ లేని ధరలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన మండలంలోని డీసీపల్లి పొగాకు విక్రయ కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వేలం కేంద్రం నిర్వహణాధికారి సునీల్కుమార్తో వేలం ప్రక్రియ, ధరల తగ్గుముఖం తదితర విషయాలపై చర్చించారు. పొగాకు రైతులను ఆదుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం తీసుకునేలా చూడాలంటూ వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజు రోజుకు పతనమవుతున్న ధరలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు కనీసం రూ.200లకు కూడా కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు ఉత్పత్తిలో భారతదేశం రెండో స్థానంలో ఉందని, అయినా దానిని పండించే రైతు మాత్రం నష్టాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారన్నారు. డీసీపల్లి వేలం కేంద్రంలో 100 రోజులు పూర్తయినా కేవలం 17 శాతం పొగాకు మాత్రమే కొనుగోలు చేయడం ఆందోళనకరమన్నారు. ఇంకా 83 శాతం పొగాకు రైతుల గోదాముల్లోనే ఉండిపోవడం చూస్తే కొనుగోలు ప్రక్రియ ఎంత మందగమనంగా సాగుతుందో అర్థమవుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నెలల్లో కేవలం 32 మిలియన్ కిలోల పొగాకు మాత్రమే కొనుగోలు చేస్తే మిగిలిన పంటను ఎప్పుడు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. 50 శాతం పొగాకు తిరస్కరణ రాష్ట్రంలోని పొగాకు వేలం కేంద్రాల్లో 50 శాతానికి పైగా బేళ్లను ’నో బిడ్’ పేరుతో తిరస్కరిస్తున్నారని, రైతు శ్రమకు తగిన విలువ ఎందుకు దక్కడం లేదన్నారు గతేడాది బ్రైట్ పొగాకుకు రూ.280 నుంచి రూ.360 వరకు ధర లభించగా, ప్రస్తుతం రూ.160 వరకు పడిపోవడం రైతులను తీవ్రంగా నష్టపరుస్తోందన్నారు. ప్రస్తుతం బ్రైట్కు సగటున రూ.243, మీడియం రూ.216, లో గ్రేడ్కు రూ.187 మాత్రమే వస్తోందని, కనీసం బ్రైట్కు రూ.300, మీడియం రూ.280, లో గ్రేడ్కు రూ.250 ధర వస్తేనే రైతు గట్టెక్కే పరిస్థితి ఉంటుందన్నారు. ప్రస్తుతం ధరల నేపథ్యంలో చిన్నరైతులు రూ.5 లక్షల వరకు నష్టపోతున్నారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కిలో గరిష్ట ధర రూ.456 వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పొగాకు ధర కిలోకు గరిష్టంగా ఒక సీజన్లో రూ.456 వరకు నమోదైందని, కరోనా సమయంలో కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్క్ఫెడ్ ద్వారా రూ.200 కోట్లు కేటాయించి రైతులను ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. పొగాకు బోర్డు రైతుల ప్రయోజనాలను కాపాడేలా పనిచేస్తోందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రకాశం, నెల్లూరు సహా అన్ని పొగాకు జిల్లాల రైతులతో కలిసి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సారథ్యంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల పరిశీలకులు పేర్నేటి కోటేశ్వరరెడ్డి, కూనం సుధాకర్రెడ్డి, మర్రిపాడు మండల కన్వీనర్ చెన్ను వెంకటేశ్వరరెడ్డి, గంగవరపు శ్రీనివాసులనాయుడు, బొర్రా సుబ్బిరెడ్డి, పట్టణ కన్వీనర్ నాగులపాటి ప్రతాప్రెడ్డి, రవీంద్రబాబు, శ్రీనివాసులరెడ్డి, నారాయణస్వామి, కృష్ణారెడ్డి, నారసింహారెడ్డి, కన్నపనాయుడు, చెన్నకృష్ణారెడ్డి, నూనె ప్రసాద్, గురవారెడ్డి, జయరామిరెడ్డి, మెట్టుకూరు సుబ్బారెడ్డి, నోటి వినయ్కుమార్రెడ్డి, బాల అంకయ్య, శ్రీనివాసులరెడ్డి, అశోక్, రవికుమార్ రెడ్డి, అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇదేంది ఇంత దారుణమా సర్
చిల్లకూరు: ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ (ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ) ప్రక్రియలో బీఎల్ఓలకు స్థానికంగా ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఆయా పార్టీలు గుర్తింపునిచ్చిన బీఎల్ఏలు మాత్రమే సహకారం అందించి సర్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే మంగళవారం సర్ ప్రకియలో చిల్లకూరు మండలం తొణుకుమాల అధికార పార్టీ నాయకులు సచివాలయంలో కూర్చుని బీఎల్ఓల వద్ద తమకు అనుకూలంగా ఉండే వారి ఓట్లను డిజిటలైజేషన్ చేయించుకోవడం కనిపించింది. దీంతో ప్రతిపక్షానికి చెందిన బీఎల్ఏలు అడ్డుకోవడంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించారు. బీఎల్ఏలు కాని వారిని బీఎల్ఓలు కూడా ఎలా అనుమతి ఇస్తారని పలువురు విమర్శిస్తున్నారు. ఇదే విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకుని వెళ్లినా కనీసం పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్ ప్రక్రియను మరో పది రోజులు పొడిగించిన క్రమంలో చివరి రోజుల్లో అధికారులు క్షేత్రస్థాయిలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి రాజకీయ నాయకుల జోక్యం లేకుండా చూడాల్సి ఉంది.


