breaking news
SPSR Nellore
-
నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, నెల్లూరు: ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ యువతి బలైంది. నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్లో గత రాత్రి(శుక్రవారం) దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఓ యువతిని కత్తితో పొడిచి కిరాతకంగా చంపాడు. బాధితురాలు బీఫార్మసీ విద్యార్థిని మైథిలి ప్రియగా తెలుస్తోంది. మైథిలికి, నిఖిల్కు కొంతకాలంగా స్నేహం ఉంది. ఈ క్రమంలో ఆమెను మాట్లాడాలని పిలిచాడు. ఆపై ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు నిఖిల్. ఘటన అనంతరం నిందితుడు పీఎస్లో లొంగిపోయాడు. మైథిలీ మృతదేహాన్ని నెల్లూరు మార్చురీకి తరలించారు పోలీసులు. మరోవైపు నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ మైథిలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. -
గంజాయి విక్రయాలపై దాడులు
నెల్లూరు(క్రైమ్): ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం గంజాయి విక్రయాలపై దాడులు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు బీవీ నగర్లోని ఆ శాఖ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ పి.అనిత వివరాలు వెల్లడించారు. అనిత తన సిబ్బందితో కలిసి వెంకటేశ్వరపురంలో గంజాయి విక్రయిస్తున్న ఎస్డీ మౌలాలీని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాళెంలో గంజాయి విక్రేత ఎ.ఓమ్రేష్ను అదుపులోకి తీసుకుని 2.5 కేజీలను స్వాధీ నం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం నిందితుడు మౌలాలీని నెల్లూరు ఎకై ్సజ్ – 1 స్టేషన్లో, ఓమ్రేష్ను కోవూరు ఎకై ్సజ్ స్టేషన్లో అప్పగించారు. గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాపై టోల్ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని అనిత తెలిపారు. దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై సీహెచ్ పూర్ణకుమార్, హెచ్సీలు ఎ.రమేష్కుమార్, ఎం.కిరణ్ సింగ్, ఎన్.ప్రసాద్, కానిస్టేబుళ్లు ఎం.మునిరాజ్కుమార్, ఎం.వెంకటేశ్వర్లు, కె.రమణయ్య తదితరులు పాల్గొన్నారు. -
పేదలే వారి టార్గెట్
దుత్తలూరు: ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని పేదలకు రుణాలిస్తామని కేటుగాళ్లు నమ్మించి నగదు వసూలు చేసి పరారయ్యారు. దుత్తలూరు, పరిసర మండలాల్లో జరిగిన ఈ వ్యవహారం శుక్రవారం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు లక్ష్మి ఫైనాన్స్ సంస్థ పేరుతో ప్రజల వద్దకెళ్లారు. బ్లాక్మనీని చలామణిలోకి తెచ్చుకునేందుకు అతి తక్కువ వడ్డీకి రుణాలిస్తున్నామని నమ్మబలికారు. అయితే రుణాలు మంజూరు చేయాలంటే ముందుగా తమ దగ్గరున్న ఫ్యాన్లను తీసుకోవాలన్నారు. దానిని తీసుకుని రూ.3,300 చెల్లించిన వారికి రూ.55 వేల రుణమిస్తామని చెప్పారు. వాస్తవానికి ఒక్కో ఫ్యాన్ ధర రూ.1,000 కూడా ఉండదని బాధితులు చెబుతున్నారు. అవి కూడా సక్రమంగా పనిచేయడం లేదంటున్నారు.ఎక్కడంటే..ఆ ఇద్దరు వ్యక్తులు నాలుగైదు రోజుల క్రితం దుత్తలూరు మండలంలోని కట్టకిందపల్లి దళిత కాలనీ, ఏఏ కాలనీ, ఎట్టిపాళెం తదితర కాలనీలతోపాటు మండలంలోని పలు ప్రాంతాలకు వెళ్లారు. గుట్టుచప్పుడు కాకుండా రుణాలు ఇస్తామంటూ సుమారు రూ.10 లక్షల మేర దండుకున్నారు. 11వ తేదీన వస్తామని, ఆధార్, రేషన్కార్డుల జెరాక్స్లు, రెండు ఫొటోలు సిద్ధం చేసుకుంటే ఒక కార్డు అందజేసి వెంటనే రుణ మొత్తాన్ని నగదు రూపంలో అందజేస్తామన్నారు. రూ.55 వేల రుణం ఇస్తే నెలకు రూ.2,650 వంతున 24 నెలలపాటు వాయిదాలు చెల్లించాలన్నారు. ఇదంతా రహస్యంగా ఉంచాలని, పోలీసులకు చెబితే బ్లాక్మనీ బట్టబయలవుతుందని, అందుకే మీకు ఆఫ్లైన్ ద్వారా రుణాలు అందిస్తున్నామని నమ్మించారు. అంతేకాక ఫ్యాన్లు ఇచ్చే సమయంలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా పంపుతామంటే వద్దని, చేతికి నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొందరికి అనుమానం వచ్చి ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెప్పారు. రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న పేదలు రుణంతో అవసరాలు తీరుతాయని భావించారు. ఫ్యాన్లకు నగదు చెల్లించినట్లు రశీదు ఇవ్వాలని బాధితులు అడిగితే.. మీకు అవసరం లేకపోతే రుణాలిచ్చినప్పుడు ఫ్యాన్లు తిరిగి తీసుకుని ఆ నగదును రుణ వాయిదాల్లో తగ్గించుకుంటామని సెలవిచ్చారు. బిల్లుల తమ వద్ద ఉంటాయన్నారు.మీకే నష్టమంటూ..పలువురు మిమ్మల్ని ఎలా నమ్మాలని ప్రశ్నించగా.. ఎవరో ఎక్కడో మోసం చేశారని అందర్నీ అనుమానిస్తే మీకే నష్టమని కేటుగాళ్లు చెప్పారు. దీంతో తమకు రుణాలిస్తే చాలని మిన్నకుండిపోయారు. దుత్తలూరులో గదిని అద్దెకి తీసుకుని కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, తమకు గుంటూరు, రాజమండ్రిలో ప్రధాన కార్యాలయాలున్నాయని, వింజమూరు, బద్వేలు ప్రాంతాల్లో బ్రాంచ్లు ఉన్నాయని ఎవరు అనుమానించొద్దని ఆ ఇద్దరు చెప్పారు. ఉదయగిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో సుమారు 600 మంది వరకు రూ.3,300 చొప్పున చెల్లించినట్లు తెలుస్తోంది. సుమారు రూ.20 లక్షల వరకు దండుకున్నారు. 11వ తేదీన వారు రాకపోవడంతో బాధితులు ఫోన్ చేయగా అది పని చేయలేదు. దుత్తలూరులోని గదిని ఖాళీ చేసేశారు. దీంతో మోసపోయామని బాధితులు గ్రహించి లబోదిబోమంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని చాలామంది లోలోపల కుమిలిపోతున్నారు. ఆ ఇద్దరు వివిధ ప్రాంతాలు తిరుగుతూ ప్రజలను మోసం చేస్తున్నట్లు తెలిసింది. -
వెంకటరెడ్డిపాళెంలో చెరువు కట్ట ధ్వంసం
ప్రభుత్వ భూములు, చెరువుల్లో ఇప్పటి వరకు గ్రావెల్ తవ్వి సొమ్ము చేసుకుంటున్న కూటమి నేతలు తాజాగా వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాళెం పంచాయతీ వెంకటరెడ్డిపాళెంలో చెరువు కట్టను ధ్వంసం చేసి గ్రావెల్ తరలిస్తున్నారు. మూడు రోజుల నుంచి యంత్రాలు పెట్టి యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారు. చెరువు కట్ట ధ్వంసంపై స్థానిక రైతులు ఇరిగేషన్, రెవెన్యూశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కానీ ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంతో రేయింబవళ్లు ట్రాక్టర్లతో గ్రావెల్ తరలింపు ఆగడంలేదు. రైతులు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసినా గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులు రైతులను బెదిరిస్తున్నారు. జిల్లా అధికారులు జోక్యం చేసుకుని చెరువు కట్ట ధ్వంసం చేయడాన్ని అడ్డుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
టీడీపీ నేత గుప్పెట్లో రెవెన్యూ వ్యవస్థ
సాక్షి టాస్క్ఫోర్స్: జిల్లాలోని జలదంకి తహసీల్దార్ కార్యాలయాన్ని ఓ టీడీపీ నేత అవినీతికి అడ్డాగా మార్చేశాడు. రెవెన్యూ వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకుని, ప్రతి పనికీ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నాడు. అడిగినంత ఇవ్వకపోతే ఏ పని చేయడానికి వీల్లేదని రెవెన్యూ అధికారులకు స్పష్టం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా భూముల మ్యుటేషన్కు సంబంధించి ముడుపులు ముట్టజెప్పకుంటే నిర్ధాక్షిణ్యంగా పక్కన పెట్టిస్తున్నట్లు టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారు. తాజాగా ఓ టీడీపీ నేత.. సదరు టీడీపీ నేత అవినీతిపై ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడిన ఆడియో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంచలనం రేపుతోంది. జలదంకి మండలం కమ్మవారిపాళెంకు చెందిన కర్రావుల అప్పలనాయుడు ప్రతీ శాఖను శాసిస్తున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ, మండల పరిషత్, పోలీస్శాఖలతోపాటు ఇతర శాఖల అధికారులు సైతం ఆయన కనుసన్నల్లోనే పని చేయాలని ఎమ్మెల్యే కాకర్ల ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అత్తగారి ఊరు కమ్మవారిపాళెం. మండలంలోని ప్రభుత్వశాఖలను శాసిస్తున్న అప్పలనాయుడు ఇల్లు.. కాకర్ల అత్తగారింటి పక్కనే ఉండడంతో, ఆయన మామతో చెప్పించుకుని మండలాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నట్లు ఆ పార్టీలోనే నేతలు చెప్పుకుంటున్నారు. తాజాగా అప్పలనాయుడుకి జలదంకి పీఏసీఎస్ చైర్మన్ పదవిని కూడా కాకర్ల కట్టబెట్టారు. జలదంకి రెవెన్యూ శాఖలో జరుగుతున్న పరిస్థితిపై ఒక విలేకరి ఆ మండలంలోని గోపన్నపాళెం చెందిన టీడీపీ నేత మల్లేష్నాయుడుకు ఫోన్ చేయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మండలానికి చెందిన ఓ టీడీపీ నేత కనుసన్నల్లో రెవెన్యూ, పోలీస్ వ్యవస్థలు నడుస్తున్నాయని, ప్రతి పనికీ ఒక రేటు ఉందని చెప్పడం, సదరు నేత ఎమ్మెల్యేకు చెడ్డపేరు తెస్తున్నాడని, ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు కూడా చెబుతామని అనడం విశేషం.రోస్టర్ నంబరు మార్చడానికి రూ.24 వేలు ఇచ్చానని, రెవెన్యూ ఉద్యోగులకు పలుమార్లు లంచం ఫోన్పే ద్వారా ఇచ్చానంటూ టీడీపీ నాయకుడే బయట పెట్టడంతో ఆ పార్టీ నాయకుడుతోపాటు రెవెన్యూ అధికారులు ఎంత దోచుకుంటున్నారో అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ఆడియో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మండలంలో చర్చనీయాంశంగా మారింది. జలదంకి తహసీల్దార్ కార్యాలయం భూముల మ్యుటేషన్ కావాలంటే ముడుపులు ముట్టజెప్పాల్సిందే జలదంకి తహసీల్దార్ కార్యాలయ అడ్డాగా అవినీతి ఈ దందాపై తమ్ముళ్ల ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో, వీడియో -
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు అప్రజాస్వామికం
●పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం అప్రజాస్వామికం. ‘సాక్షి’ పత్రిక తప్పుడు కథనాలు రాసి ఉంటే వివరణ కోరవచ్చు. లేదా రాజ్యాంగబద్ధంగా న్యాయస్థానంలో కేసు వేయొచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సాగిస్తున్న దుర్మార్గ పాలనను ‘సాక్షి’ వెలుగులోకి తేవడాన్ని జీర్ణించుకోలేకనే ఏకంగా ఎడిటర్తోపాటు విలేకరులపై కేసులు నమోదు చేయడం ఏమిటి. ప్రజాస్వామ్యదేశంలో ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు జరిగినట్లు చరిత్రలో లేదు. ప్రజలకు వాస్తవాలను తెలియజేసే విలేకరులపై పోలీసుల ద్వారా కేసులు పెట్టించడం విచారకరం. సోషల్ మీడియాను బెదిరించడం, అరెస్ట్లు చేయడంపై ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా పోతుంది. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మన రాష్ట్రంలో పాత్రికేయ రంగంపై బెదిరింపు కేసులు పెట్టడం సరైంది కాదు. – ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ, నెల్లూరు వాస్తవాలు రాస్తే కేసులు పెడతారా? ప్రజాస్వామ్యంలోని నాలుగు స్తంభాల్లో మీడియా ఒక స్తంభం. అలాంటి మీడియా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా ఉంటూ వాస్తవాలను వెలుగులోకి తెస్తుంటే ప్రభు త్వం కేసులు నమోదు చేయడం దుర్మార్గంగా ఉంది. ‘సాక్షి’ పత్రిక ప్రభుత్వ వైఫ ల్యాలను ఎత్తిచూపుతుందని ఎడిటర్పైనా, విలేకరులపైనా కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యంలో ఇంత వరకు జరగలేదు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతగా బరి తెగించలేదు. ప్రజలతీర్పుతో పార్టీల అధికారాలు మారుతూ ఉంటాయి. 40 శాతం ఓట్లు సాధించిన వైఎస్సార్సీపీపై కక్షతోనే ఈ ప్రభుత్వం ‘సాక్షి’ పత్రికపై పక్షపాత వైఖరి అవలంభిస్తోంది. కేసులు పెట్టి, పోలీసులతో దాడులు చేయించి భయపెట్టాలని చూడడం సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి సరికాదు. – మేకపాటి రాజమోహన్రెడ్డి, మాజీ ఎంపీ, నెల్లూరు -
మంచి పద్ధతి కాదు
కేసులు పెట్టడం దుర్మార్గం●ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని గుర్తుచేస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షిపై కేసులు పెట్టడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే జర్నలిస్టులపై కేసులు పెట్టడం దారుణం. దీనికి వ్యతిరేకంగా రానున్న రోజుల్లో పోరాటాలు చేయాల్సిన పరిస్థితులు తలెత్తే అవకాశముంది. – మూలం రమేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి మీడియా గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజల పక్షాన నిలిచే మీడియాపై కక్ష సాధింపులకు దిగడం సరికాదు. ప్రతిపక్షపాత్ర పోషిస్తున్న సాక్షిపై, అందులో పనిచేసే ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడం ప్రభుత్వ దిగజారుడుతనానికి పరకాష్ట. కేసులను ఎత్తేయాలి. – మారుబోయిన రాజా, కార్యదర్శి, సీపీఎం నరుకూరు శాఖ -
ఈ ప్రభుత్వం దళితులకు వ్యతిరేకం
● వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్బాబు నెల్లూరు (స్టోన్హౌస్పేట): కూటమి ప్రభుత్వం దళితులకు వ్యతిరేకమని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు అన్నారు. నెల్లూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఎస్సీ విభాగం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసే చర్యల్లో భాగంగా సమావేశమైనట్లు చెప్పారు. జగన్ ప్రభుత్వంలో డీబీటీ ద్వారా రూ.2.75 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందిస్తే అందులో రూ.50 వేల కోట్లు మాల, మాదిగ, రెల్లి కులస్తులకు వివిధ పథకాల ద్వారా అందాయన్నారు. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం సూపర్సిక్స్ అమలు చేస్తామని ఆయా సామాజికవర్గాల వారికి హామీ ఇచ్చారన్నారు. ఏడాదిగా రూ.10 వేల కోట్లు మాల, మాదిగ, రెల్లి కులస్తులకు బాబు బాకీ పడ్డారన్నారన్నారు. ఉచిత బస్సు తమ కులాలకు ఏ మాత్రం ఉపయోగకరం కాదన్నారు. సూపర్సిక్స్ను తొలి ఏడాది అమలు చేయకపోవడంతో నష్టం వాటిల్లిందన్నారు. రెండో ఏడాదిలో అమలు చేస్తున్న పథకాల్లో వారికి భాగస్వామ్యం లేదన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో పిల్లలు మంచి బడుల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నారన్నారు. దళితులంటే కోపం కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అవేవీ లేకుండా పోయాయన్నారు. దళితులను ఉక్కుపాదంతో తొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా అన్యాయం చేశారన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కె.కనకారావు, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. -
అనుమతులుంటే చూపిస్తావా.. సోమిరెడ్డీ
● మాజీ మంత్రి కాకాణి సవాల్ నెల్లూరు (స్టోన్హౌస్పేట): సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వకాలకు ఎంత మేర అనుమతులు ఉ న్నాయో, ఎంత గ్రావెల్ తవ్వకాలు జరిగాయో ఆధారాలతో సహా చూపిస్తావా.. సోమిరెడ్డీ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి సవాల్ విసిరారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో సోమిరెడ్డిపై ధ్వజమెత్తారు. తాను చాలెంజ్ విసురుతున్నానని, వెంకటాచలం మండలం నాగంబొట్లవారి కండ్రికలో జరిగిన తవ్వకాలను చూపించేందుకు మీడియాను తీసుకొచ్చి చూపే దమ్ము సోమిరెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. చట్టపరంగా గ్రావెల్ తవ్వుతుంటే.. ఆ గుంతలను చెత్తా చెదారంతో పూడ్చాల్సిన అవసరం ఏముందన్నారు. గుడ్లూరువారిపాళెం చెరువు కట్టను తవ్వుతున్నారు. కనబడడం లేదా? అని ప్రశ్నించారు. తనపై సోమిరెడ్డి పెట్టిన కేసులకు, చేసిన ఆరోపణలకు సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నానని చాలెంజ్ చేశారు. గతంతోపాటు ప్రస్తుతం సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి నిగ్గు తేల్చాలన్నారు. తమ నాయకుడు జగన్మోహన్రెడ్డిని దూషిస్తే చంద్రబాబు మంత్రి పదవి ఇస్తాడేమోననే భ్రమలో సోమిరెడ్డి ఉన్నారన్నారు. జగన్మోహన్రెడ్డి కాలి గోటికి కూడా ఆయన సరిపోడని, తమ నాయకుడిని విమర్శించే స్థాయి సోమిరెడ్డికి లేదన్నారు. రాష్ట్రంలోని బస్సులన్నీ మళ్లించి సూపర్ సిక్స్ సభకు పంపారని, పోలీసులందరిని ఆ సభలోనే పెట్టుకున్నారన్నారు. సూపర్ సిక్స్ సభకు రాని వారిపై ఫైన్లు వేశారని, ‘అన్నదాత పోరు’ కార్యక్రమానికి వచ్చిన వారిపై కేసులు పెట్టారని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా సూపర్ సిక్స్ సభ కంటే ఎక్కువ మంది ‘అన్నదాతపోరు’ కార్యక్రమానికే జనం ఎక్కువగా వచ్చారని, అధికారాన్ని చూపిన సూపర్సిక్క్ సభకు జనం రాలేదని అన్నారు. ‘నేను లావే.. నాకు తిన్నది తిన్నట్లుగా వంట బడుతుంది. ఆయనకు మాదరిగా నాకు కుళ్లు కుతంత్రాలు లేవంటూ కాకాణి గోవర్ధన్రెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
సోమిరెడ్డికి కాకాణి గోవర్థన్రెడ్డి సవాల్
సాక్షి, నెల్లూరు: సర్వేపల్లిలో గ్రావెల్కు అనుమతులుంటే చూపాలంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపరులు ఎవరో సీబీఐ విచారణ వేయించుకుందాం. సీబీఐ విచారణకు నేను సిద్ధం, సోమిరెడ్డి సిద్ధమా?. సీబీఐ ఎవరికి క్లీన్ చిట్ ఇస్తే.. వాళ్లే పోటీ చేయాలని కాకాణి అన్నారు.అచ్చెన్నాయుడికి దమ్ముంటే యూరియా కొరతపై బహిరంగ చర్చకు రావాలన్న కాకాణి.. డిమాండ్ వున్న ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పరిశీలనకు సిద్ధమా అంటూ నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో రైతుల గోడు పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక వైపు యూరియా కొరత.. మరో వైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు శూన్యం. సోమిరెడ్డికి వైఎస్ జగన్ గురించి మాట్లాడే స్థాయి లేదు. ఏదో జగన్ను విమర్శిస్తే మంత్రి పదవి వస్తుందని నోరు పారేసుకోకు అంటూ కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. -
అనుమానాస్పద స్థితిలో..
● వేర్వేరు చోట్ల ఇద్దరి మృతి అడవిలో.. సంగం: మండలంలోని సంగం చెక్పోస్ట్ సెంటర్ సమీపంలోని అడవిలో చల్లా రాము (41) అనే వ్యక్తి గురువారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పంచనామాకు తరలించారు. ఆటో తోలుకుని జీవించే రాము ఎలా చనిపోయాడో అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాముకు భార్య సీతారావమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. దుత్తలూరు మండలంలో.. దుత్తలూరు: మండలంలోని వెంకటంపేట గ్రామ బీసీ కాలనీకి చెందిన పఠాన్ సనా (17) అనే బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పఠాన్ ఖాదర్బాషా, నాజున్నీసాలకు ఇద్దరు కుమార్తెలు. ఖాదర్బాషా పొట్టకూటి కోసం గల్ఫ్కు వెళ్లి ఇటీవల సొంతూరికి వచ్చాడు. పెద్ద కుమార్తె సనా ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకు చదివి ఇంట్లోనే ఉంటోంది. అనారోగ్యంగా ఉండటంతో గురువారం భార్యాభర్తలు ఉదయగిరి వైద్యశాలకు వెళ్లారు. అనంతరం తిరిగి ఇంటికెళ్లి చూడగా కుమార్తె అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే ఆటోలో ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సనా మృతి అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆదిలక్ష్మి తెలిపారు. -
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
కలిగిరి: మండల కేంద్రమైన కలిగిరిలోని ఎర్రతోట ప్రాంతానికి చెందిన చిట్టారి మాధవి (38) అనే వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. మాధవికి కావలి రూరల్ మండలం చలంచర్ల గ్రామానికి భాగ్యరావుతో వివాహమైంది. వారికి బీటెక్ పూర్తి చేసిన కుమార్తె, బీటెక్ చదువుతున్న కుమారుడు ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా మాధవి కలిగిరిలో ఉంటోంది. భాగ్యరావు హైదరాబాద్లో బేల్దారి పనులు చేస్తున్నాడు. కలిగిరి ఎస్సీ కాలనీకి చెందిన గోసాల మధు అనే యువకుడితో మాధవి సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయమై అతని కుటుంబంలో వివాదాలున్నాయి. బుధవారం రాత్రి మధు కుటుంబ సభ్యులు, బంధువులు మాధవి ఇంటికెళ్లి ఒంటరిగా ఉన్న ఆమెను తీవ్రంగా కొట్టారు. ఇంటి యజమానురాలు వారించినా వినిపించుకోకుండా దాడి చేశారు. తల్లిపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న కుమారుడు మణిదీప్ గురువారం ఉదయం ఇంటికి చేరుకున్నాడు. ఆరుబయట ఫోన్లో మాట్లాడుతున్నాడు. మనస్తాపానికి గురైన మాధవి వంట గదిలోకి తాడుతో ఊరేసుంది. కుమారుడు గుర్తించి కత్తితో తాడును కత్తిరించి రిక్షాలో తల్లిని ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పీహెచ్సీ వద్దకు తరలించారు. మాధవి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆమైపె దాడి చేసి మృతికి కారణమైన మధుతోపాటు అతడి కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని ఎస్సై ఉమాశంకర్ పరిశీలించారు. మధు, అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
పాపం అన్నదాతలు
ఎడగారుకు యూరియా కొరత, పెరిగిన పెట్టుబడులు, తగ్గిన దిగుబడులతో అన్నదాతలు ఆవేదనలో ఉన్నారు. దీనికితోడు బుధవారం రాత్రి ఒక్కసారిగా కురిసిన వర్షం వారిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం, చేజర్ల మండలాల్లో వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.నేలవాలిన వరి ● పరుగులు తీసిన అన్నదాతలు ● కొనుగోలు కేంద్రాలు పెట్టాలని వినతిసంగం: వర్షంతో సంగం మండలంలోని దువ్వూరు, జెండాదిబ్బ, అన్నారెడ్డిపాళెం, తలుపూరుపాడు, పెరమన, కొరిమెర్ల, జంగాలకండ్రిక, సంగం రెవెన్యూ గ్రామాల్లో 2 వేల ఎకరాలకు పైగా, చేజర్ల మండలంలో 200 ఎకరాలకు పైగా వరి నేలవాలింది. చేతికొచ్చిన పంట ఇలా కావడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. పరుగులు పెట్టిన అన్నదాతలు రాత్రి సమయంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో అన్నదాతలు తమ పొలాల వైపు పరుగులు పెట్టారు. ఇప్పటికే కోతలు ప్రారంభమై ఉండటంతో పలుచోట్ల ధాన్యాన్ని గుట్టలుగా పోసి అమ్మకాల కోసం ఎదురుచూస్తున్నారు. వర్షంతో నీరు చేరుతుందనే భయంతో ధాన్యం వద్దకు వెళ్లి టార్పాలిన్ పట్టలు కప్పారు. ఆందోళన చెందుతూ.. వర్షంతో వరిపైరు నేలవాలింది. దీంతో ఏం చేయాలో అర్థంగాక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కోసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దళారులు పుట్టిని కేవలం రూ.14 వేలకే కొనుగోలు చేస్తున్నారు. వరి నేలవాలడంతో ధాన్యం పచ్చగింజ పడ్డాయని సాకు చెప్పి దళారులు మరింత దోపిడీకి పాల్పడి ధరలు తగ్గిస్తారన్న ఆందోళన నెలకొంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. -
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
వ్యవస్థలను నాశనం చేశారు ●రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ సీఎం చంద్రబాబు నాశనం చేశారు. ప్రజాస్వామ్యానికి కీలకమైన పత్రిక స్వేచ్ఛపై కుట్రపూరిత కేసులు పెట్టడం హేయం. సమాజహితం కోరే పత్రిక రంగాన్ని ఆయనేమో వాడుకుంటున్నారు. వాస్తవాలు తెలిపే వారిపై కేసులు బనాయించడం, బెదిరించడం దుశ్చర్య. అక్రమాలను బయటపెట్టే వారిపై దాడి చేసేందుకు పోలీసులను సైతం వాడుకోవడం ఎంత వరకు సమంజసం. వాస్తవాలను తెలుసుకొని పరిపాలనను సరిదిద్దుకోవాల్సిన సీఎం.. ఇలాంటి పనులు చేయడాన్ని ఎవరూ అంగీకరించరు. ప్రతి వ్యవస్థను తనకు అనుకూలంగా మలుచుకోవడం చంద్రబాబుకు బాగా తెలుసు. ఇప్పుడున్న మీడియా, సోషల్ మీడియా దెబ్బకు ఆయనకు సరైన గుణపాఠం లభిస్తుంది. – అనిల్కుమార్యాదవ్, మాజీ మంత్రి మీడియా స్వేచ్ఛపై సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న నియంతృత్వ పోకడ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ కంటే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దారుణాలు, అక్రమాలను బయటపెడతారనే భయంతో పాత్రికేయులను హింసించడం తగదు. సీఎం స్థానంలో ఉండి వార్తలు రాసే వారిని భయపెట్టడం, కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విరుద్దం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని బెదిరించి అరెస్ట్ చేయడం దారుణం. ఖబడ్దార్ అంటూ పాత్రికేయులను బెదిరించడం సమంజసం కాదు. ఎడిటర్ స్థాయి వారి ఇంటికి పోలీసులను పంపడం.. మళ్లీ కేసులు పెట్టడం.. మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చడం చంద్రబాబుకు తగదు. ఇలాంటి పాలనకు త్వరలోనే ప్రజలు సరైన సమాధానం చెప్తారు. – కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ మంత్రి -
ఐదు బార్లకు 20 దరఖాస్తులు
నెల్లూరు(క్రైమ్): రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన బార్ పాలసీకి వ్యాపారుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. జిల్లాలో ఓపెన్ కేటగిరీ కింద 50.. గీత కులాలకు సంబంధించిన ఐదు బార్లకు గత నెల 30, ఈ నెల రెండో తేదీన నిర్వహించిన లాటరీ ప్రక్రియలో 22 మంది వ్యాపారులు దక్కించుకున్నారు. మిగిలిన 33 బార్లకు రీ నోటిఫికేషన్ను ఈ నెల మూడున జారీ చేశారు. ఆఫ్లైన్ / ఆన్లైన్ విధానాల్లో ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఆరు వరకు దరఖాస్తుల స్వీకరణ.. 15న లాటరీ డ్రా తీస్తామని అధికారులు ప్రకటించారు. అయితే స్వీకరణ గడువును మరో మారు పొడిగించినా ఆశించిన స్థాయిలో దరఖాస్తులు దాఖలు కాలేదు. జిల్లాలోని మిగిలిన 33 బార్లకు గానూ నగరంలో నాలుగు, కావలిలో ఒకటి మొత్తంగా ఐదింటికి 20 దరఖాస్తులే దాఖలయ్యాయి. మిగిలిన వేటికీ దరఖాస్తులేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో మిగిలిన బార్లకు దరఖాస్తులు వేయించేందుకు బడా పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యా పారులు, పాత మద్యం వ్యాపారులతో ఎకై ్సజ్ అధికారులు చర్చిస్తున్నారు. మరో మూడు రోజుల్లో గడువు ముగియనుండటంతో ఏ మేరకు దాఖలవుతాయో వేచి చూడాలి.నూతన కలెక్టర్గా హిమాన్షు శుక్లా● అనంతపురానికి ఆనంద్ బదిలీనెల్లూరు రూరల్: జిల్లా నూతన కలెక్టర్గా హిమాన్షు శుక్లా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన ఆనంద్ను అనంతపురం కలెక్టర్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. జిల్లాలో పనిచేసిన ఆయన 14 నెలల్లో రాజకీయ కారణాలతో బదిలీ అయ్యారు. స్వల్ప వ్యవధిలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. జీఏడీలో ఐ అండ్ పీఆర్ డైరెక్టర్గా కొనసాగుతున్న 2013వ బ్యాచ్కు చెందిన ఐఏఎస్ హిమాన్షు శుక్లా ఇక్కడ కలెక్టర్గా బాధ్యతలను స్వీకరించనున్నారు. అసిస్టెంట్ కలెక్టర్గా విశాఖపట్నంలో.. సబ్ కలెక్టర్గా తిరుపతి, విజయవాడలో.. గుంటూరు జే సీగా.. పశ్చిమగోదావరి, బీఆర్ అంబేడ్కర్ కో నసీమ జిల్లాల కలెక్టర్గా ఈయన పనిచేశారు.పర్యాటకాభివృద్ధికి కృషినెల్లూరు రూరల్: జిల్లాలో పర్యాటకాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని జిల్లా పర్యాటక అధికారి ఉషశ్రీ కోరారు. బారాషహీద్ దర్గా వద్ద గల జిల్లా పర్యాటక కేంద్రంలో విలేకరుల సమావేశంలో గురువారం ఆమె మాట్లాడారు. ఉదయగిరి దుర్గాన్ని ట్రెక్కింగ్కు అనుకూలంగా మారుస్తామని వెల్లడించారు. పరిశుభ్రతను మెరుగుపర్చి పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతిక.. వారసత్వ కోటలు, జలపాతాలు, ఎకో టూరిజం, స్థానిక వంటకాలు తదితరాలను ప్రోత్సహిస్తూ విద్యార్థులు, ఫొటోగ్రాఫర్లు, సృజనాత్మక ప్రతిభ కలిగిన వారికి పోటీలను నిర్వహించనున్నామని చెప్పారు. ఫొటోలు హైరెజల్యూషన్ కలిగి జిల్లాలో తీసినవే అయి ఉండాలన్నారు. పాల్గొనాలనుకునే వారు ఈ నెల 20లోపు అందజేయాలని కోరారు. కమిటీని ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో స్క్రూట్నీ చేసి విజేతలను ప్రకటించనున్నామని చెప్పారు. విజేతలకు బహుమతులను ఈ నెల 27న అందజేయనున్నామని, వివరాలకు 94936 68022, 77807 49802 నంబర్లను సంప్రదించాలని సూచించారు.ఏఎస్పేట గంధ మహోత్సవంపై సమీక్షఆత్మకూరు: ఏఎస్పేటలోని ఖాజానాయబ్ రసూల్ దర్గా గంధ మహోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని తన కార్యాలయంలో ఆత్మకూరు ఆర్డీఓ పావని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గంధ మహోత్సవాన్ని ఈ నెల 18 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. మౌలిక వసతులను కల్పించాలని కోరారు. సరిపడా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. దర్గా ఈఓ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
మొదటి దశ ఎప్పుడో..?
రామాయపట్నం పోర్టు మొదటి దశలో భాగంగా 34.04 ఎమ్మెమ్టీపీఏ (మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ ఆనమ్) కార్గో సామర్థ్యంతో నాలుగు బెర్తులను నిర్మించాల్సి ఉంది. వీటిలో రెండు జనరల్, ఒకటి కోల్, మరొకటి మల్టీ పర్పస్కు సంబంధించనవి. సముద్రంలో వచ్చే ఆటుపోట్లు, తుఫాన్లను తట్టుకునేలా సౌత్, నార్త్ బ్రేక్ వాటర్ ఫీడర్ల నిర్మాణాన్ని చేపట్టారు. వీటిని నీటి ఉపరితలం నుంచి మూడు మీటర్ల ఎత్తు, 100 మీటర్ల వెడల్పుతో పెద్ద బండరాళ్లతో నిర్మించారు. ఇందులో సౌత్ బ్రేక్ వాటర్ ఫీడర్ 3.7.. నార్త్ బ్రేక్ వాటర్ ఫీడర్ 1.73 కిలోమీటర్ల మేర పనులను పూర్తి చేశారు. వీటి మధ్యలోనే బెర్తులనూ నిర్మిస్తున్నారు. లక్ష టన్నుల సామర్థ్యం గల భారీ నౌకలు నిలిచేందుకు వీలుగా సముద్ర లోతును 16 మీటర్ల వరకు గతంలోనే డ్రెడ్జింగ్ చేశారు. బల్క్ బెర్తును నిర్మించి, 2023 డిసెంబర్ నాటికే మొదటి వాణిజ్య నౌకను నిలపాలనే లక్ష్యంతో పనులు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికే మొదటి దశలో కీలకమైనవన్నీ పూర్తయ్యాయి. ఆపై సర్కార్ నిర్లిప్త ధోరణితో ఏ మాత్రం పురోగతి కనిపించడంలేదు. -
పోర్టుపై కూటమి సర్కార్ నిర్లక్ష్యం
చెప్పేదొకటి.. చేసేదొకటి అనే రీతిలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతోంది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తలపెట్టిన రామాయపట్నం పోర్టు నిర్మాణ తీరే దీనికి చక్కటి ఉదాహరణ. నాడు చకచకా పనులు సాగి, గతేడాది ఏప్రిల్ నాటికి మొదటి దశ పూర్తి కావాల్సిన ఈ నౌకాశ్రయం సర్కార్ నిర్లక్ష్య ధోరణి కారణంగా అతీగతీ లేకుండాపోతోంది. దీనిపై ఏ మాత్రం దృష్టి సారించకుండా.. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో ప్రతి 50 కిలోమీటర్లకో పోర్టును ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 70 శాతం పూర్తయిన దీనిపైనే శ్రద్ధ చూపని పాలకులు.. మిగిలిన వాటిని ఎలా నిర్మిస్తారు.. ఇదంతా బూటకమనే విషయం వారి చేష్టలతోనే స్పష్టమవుతోంది.కందుకూరు: రామాయపట్నం పోర్టును కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ హయాంలో దీని నిర్మాణ పనులు చకచకా సాగినా, ప్రస్తుతం అడుగు ముందుకు పడటంలేదు. నూతన ప్రభుత్వం కొలువుదీరాక.. అప్పటికే పనులు చేస్తున్న ఏజెన్సీని తొలగించడంతో ఆర్నెల్ల పాటు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆ తర్వాత చేపట్టినా, పనుల్లో వేగం నేటికీ పుంజుకోలేదు. గతంలో చేసిన వర్కుల మినహా ప్రస్తుతం ఏ మాత్రం పురోగతి లేదు.అసలెప్పటికి పూర్తవుతుందో..?వాస్తవానికి డిసెంబర్, 2023 నాటికే వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని నాటి సీఎం జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. తదనుగుణంగా అన్ని చర్యలు చేపట్టారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే మరో నాలుగేళ్లకై నా నిర్మాణం పూర్తవుతుందాననే అనుమానం తలెత్తుతోంది.ప్రస్తుతం.. గ్రహణంగతేడాది జూన్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతోనే పోర్టు నిర్మాణ పనులకు గ్రహణం పట్టింది. అధికారం చేజిక్కించుకున్న వెంటనే కాంట్రాక్ట్ సంస్థ అరబిందోను తొలగించింది. తదనంతరం దాదాపు ఆర్నెల్ల పాటు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆపై నవయుగ కంపెనీకి నిర్మాణ బాధ్యతను అప్పగించారు. అయితే అప్పటికే పాత సిబ్బందిని తొలగించడం.. కార్మికులు, భారీ యంత్రాలను సమకూర్చడంలో చోటుచేసుకున్న జాప్యంతో పనులు మరింత ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్నా, అవి నామమాత్రమే. గతంలో చేపట్టిన బ్రేక్ వాటర్ ఫీడర్ల నిర్మాణ పనులను అరకొరగా జరుపుతున్నారు. కీలకమైన డ్రెడ్జింగ్, బెర్తుల నిర్మాణం ఇంకా ప్రారంభమే కాలేదు.నీరుగారిన ఆశయంతీర ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఉలవపాడు మండలంలోని రామాయపట్నం వద్ద రూ.3736 కోట్ల అంచనాతో పోర్టు నిర్మాణానికి గత ప్రభుత్వంలో పునాది రాయి పడింది. 850.79 ఎకరాల్లో పనులకు 2022, జూలై 20న నాటి సీఎం జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మాణ పనులను అరబిందో సంస్థ వాయువేగంతో 70 శాతం మేర చేసింది. 18 నెలల్లోనే వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు సాగాయి. డిసెంబర్, 2023 నాటికి మొదటి వాణిజ్య నౌకను నిలపాలనే లక్ష్యంతో సర్కార్ అడుగులేసింది. అయితే ఆపై 2024 సాధారణ ఎన్నికల హడావుడి, కోడ్ అమల్లోకి రావడంతో అది సాధ్యపడలేదు.ప్రస్తుత పరిస్థితి..ఒక బెర్తు నిర్మాణం పూర్తి కాగా, మిగిలిన మూడు బెర్తులతో పాటు, సముద్ర లోతును పెంచే డ్రెడ్జింగ్ పనులు జరగాల్సి ఉంది. గతేడాది ఏప్రిల్ నాటికి మొదటి దశ పనులను పూర్తి చేసి అందుబాటులో తీసుకురావాలని నాటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంకల్పించినా, ప్రస్తుత సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా రామాయపట్నం పోర్టు ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ అంతుచిక్కడంలేదు. -
అవినీతి తప్ప అభివృద్ధేదీ..?
● ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరు: రాష్ట్రంలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని.. సర్వేపల్లిలో సోమిరెడ్డి, ఆయన కుమారుడు దోచుకుతింటూ బిజీగా గడుపుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. పొదలకూరు మండలం మహ్మదాపురంలో గురువారం ఆయన పర్యటించారు. ధాన్యానికి గిట్టుబాటు ధర లభించడంలేదనే విషయాన్ని ఆయన దృష్టికి రైతులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోగా.. కనీసం ఒక్క బస్తా యూరియా లభ్యం కావడంలేదని ఆరోపించారు. రీ వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగుల పింఛన్లను తొలగిస్తున్నారని విమర్శించారు. ఇళ్లపై విద్యుత్ వైర్లు వెళ్తే వాటిని తొలగించి కొత్త లైన్లు వేసేందుకు తమ ప్రభుత్వ హయాంలో నిధులను మంజూరు చేస్తే, వాటినీ ప్రభుత్వం నిలిపేసిందని మండిపడ్డారు. సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్తున్నారే తప్ప, హామీలను నెరవేర్చడంలేదని ధ్వజమెత్తారు. జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రైతులకు యూరియా సమృద్ధిగా లభించిన అంశాన్ని గుర్తుచేశారు. మాట్లాడితే పోలీస్ కేసులు.. ప్రభుత్వాన్ని విమర్శించినా.. వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా పోలీస్ కేసులు పెడుతున్నారని కాకాణి ఆరోపించారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసే అధికారులెవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలెప్పుడొచ్చినా, తమ పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు. జగన్మోహన్రెడ్డి హయాంలో తామెలా ఉన్నాం.. ప్రస్తుతం ఎలా ఉన్నామనే అంశాలను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని చెప్పారు. అన్నదాత పోరుకు వచ్చిన స్పందనే దీనికి నిదర్శనమన్నారు. ఇటీవల మృతి చెందిన వీరాస్వామి కుటుంబీకులకు పరామర్శించారు. సొసైటీ మాజీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్రెడ్డి, ఉప సర్పంచ్ కరిపరెడ్డి కృష్ణారెడ్డి, నేతలు అశోక్కుమార్రెడ్డి, మాలకొండారెడ్డి, శ్రీహరి, తిరుపాల్రెడ్డి, రమణారెడ్డి, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెన్నా పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● ఏ సమయంలోనైనా దిగువకు నీటి విడుదల ● 72 టీఎంసీలకు చేరువలో సోమశిల సోమశిల: సోమశిల జలాశయం పూర్తి సామర్థ్యానికి చేరుకోనున్న నేపథ్యంలో దిగువ భాగంలో ఉండే పెన్నా పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ జయవర్ధన్ కోరారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో జలాశయం 71.430 టీఎంసీలకు చేరుకుందని, రానున్న రెండు రోజుల్లో మరికొంత చేరే అవకాశం ఉన్న క్రమంలో క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని ఎప్పుడైనా విడుదల చేయొచ్చన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాగా జలాశయం నుంచి ఉత్తర కాలువకు 400, కండలేరు కాలువకు 9250, పవర్ టన్నెల్ ద్వారా పెన్నా డెల్టాకు 1850 క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని ఈఈ శ్రీనివాసులు తెలిపారు. -
గ్రామసభ తీర్మానాన్ని అమలు చేయాలి
కందుకూరు: ఇండోసోల్ కంపెనీ కోసం చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తూ కరేడులో నిర్వహించిన గ్రామసభలో ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని అమలు చేయాలని, గ్రామాలను ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేసేందుకు తాము సిద్ధంగా లేమని కరేడు పంచాయతీ పరిధిలోని ఉప్పరపాళెం దళితులు పేర్కొన్నారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ దామెర హిమవంశీకి వినతిపత్రాన్ని గురువారం అందజేసిన అనంతరం వారు మాట్లాడారు. కరేడు పంచాయతీలో 8348 ఎకరాలు, ఉప్పరపాళెం, రామకృష్ణాపురం, పొట్టేటిగుంట గిరిజన సంఘాలను ఖాళీ చేయాలని ఇప్పటికే నోటిఫికేషన్ను ఇచ్చారని తెలిపారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని.. భూములు, ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమని తేల్చిచెప్పారు. ఇంటింటికీ పంచాయతీ కార్యదర్శి వచ్చి కొలతలు తీయడంతో పాటు అకౌంట్ నంబర్లనూ సేకరిస్తున్నారని చెప్పారు. బలవంతపు భూసేకరణను నిలిపేయాలని కోరారు. అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అయితే పచ్చని పంటలు పండే పొలాలను తీసుకోవడం తగదన్నారు. గ్రామంలోని రైతులు, ఉద్యమ సంఘాల నేతలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. తొలుత ఆందోళనను చేపట్టారు. ఉప్పరపాళెం గ్రా మస్తులు గంజి చినకోటేశ్వరరావు, ప్రసాద్, అభిషే క్, శ్రీణు, కొట్టే మాలకొండయ్య, రమణమ్మ, పిచ్చమ్మ, ప్రజా సంఘాల నేతలు కుమార్, వెంకటేశ్వర్లు, వీసం విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
రషీద్ హత్య వెనుక లేడీ డాన్?.. వెలుగులోకి సంచలన విషయాలు
గూడూరు రూరల్: పట్టణంలోని గాంధీనగర్ శ్మశాన వాటిక సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం ఉదయం వెలుగుచూసింది. వివరాలు.. స్థానిక టిడ్కో ఇళ్లలో నివాసముండే షేక్ రహీద్(35) కారు డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన రహీద్ బుధవారం ఉదయం రోడ్డు పక్కన మృతదేహంగా కనిపించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కత్తిపోట్ల కారణంగా రహీద్ మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ గీతాకుమారి ఆదేశాల మేరకు టూటౌన్ సీఐ శ్రీనివాస్, వాకాడు సీఐ హుస్సేన్బాషా విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మృతుడి కుటుంబీకులు, బంధువులు రెండో పట్టణ పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.కాగా, రషీద్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రషీద్ హత్య వెనుక లేడీ డాన్ వందన ప్రమేయం ఉన్నట్లు సమాచారం. టిడ్కో గృహాల కాలనీలో వ్యభిచారం, గంజాయి, సెటిల్మెంట్తో లేడీ డాన్గా వందన ఎదిగింది. వందన క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడంతో రషీద్ హత్యకు గురైనట్లు సమాచారం. లేడీ డాన్ వందనతో పాటు ఆమె అనుచరులు వెంకీ, హన్షిద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ప్రశ్నిస్తే గొంతునొక్కుతున్న ప్రభుత్వం
నెల్లూరు(అర్బన్): రైతులు పంటలు పండించుకునేందుకు ఒక్క బస్తా యూరియా దొరకడంలేదు. బ్లాక్ మార్కెట్కు తరలిపోయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేవు. పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదంటూ కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. కాకాణి మాట్లాడుతూ ఽప్రజాస్వామ్యబద్ధంగా రైతు సమస్యలపై ధర్నా చేసేందుకు ఎస్పీ, డీఎస్పీలకు దరఖాస్తు చేసుకుంటే అర్ధరాత్రి రెండు గంటలకు వాట్సాప్ ద్వారా అనుమతిస్తున్నట్లు మెసేజ్ పెట్టడం దారుణమన్నారు. అది కూడా 15 మందికే అనుమతి అని పేర్కొనడం బాధాకరమన్నారు. పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నా, ఎన్ని ఆంక్షలు పెట్టినా రైతులు వేలాది మంది తరలి రావడం, కార్యక్రమా న్ని సూపర్ సక్సెస్ చేయడం చూస్తే కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అర్థమవుతుందన్నారు. ప్రశ్నిస్తే గొంతునొక్కడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. రూ.270లకు అందాల్సిన యూరియా బస్తా బహిరంగ మార్కెట్లో రూ.600లకు అమ్ముతున్నారని కాకాణి ఆరోపించారు. 50 శాతం ఎరువులు మాత్రమే డీలర్లకు ఇవ్వాలన్నారు. మిగతా 50 శాతం సొసైటీల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించాలనేది నిబంధన ఉందన్నారు. లక్షల టన్నుల యూరియా తీసుకువచ్చామని చెబుతున్న ప్రభుత్వం అదంతా ఎక్కడికి పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 50 శాతంకి మించి డీలర్లకు ఎరువులు ఇవ్వడం వెనుక రూ. 200 కోట్ల కమీషన్లు చేతులు మారాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వ్యవసాయం పండగ చేసిన విధంగా తమ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారన్నారు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా ఎరువులు అందించారన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు అధికారంలోకి రాగానే ధరల స్థిరీకరణ నిధిని ఎత్తేశాడన్నారు. తమ ప్రభుత్వంలో పుట్టి ధాన్యానికి మద్దతు ధర 19,700 ఉంటే బహిరంగ మార్కెట్లో రైతులు రూ.24 వేలకు అమ్ముకున్నారన్నారు. చంద్రబాబు పాలనలో రూ.15 వేలకే పుట్టి ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. తమ కాలంలో రైతులు ఏనాడు రోడ్డెక్కలేదన్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ రైతులకు దివంగత సీఎం వైఎస్సార్, ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యత నిచ్చారన్నారు. అయితే అందుకు విరుద్ధంగా చంద్రబాబు పాలనలో రైతు కంట కన్నీరు కారుతుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సెక్షన్ 30 పేరు చెప్పి నోటీసులు ఇవ్వడం, హౌస్ అరెస్టులు చేయడం, రైతులను ధర్నాలకు రానీయకుండా పోలీసులు దిగ్భందించడం చూస్తే చంద్రబాబుకు వైఎస్సార్సీపీ ఉద్యమం అంటే వణుకు పుడుతుందన్నారు. వైఎస్సార్ జలయజ్ఞం, జగన్మోహన్రెడ్డి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులను ఆదుకుంటే చంద్రబాబు రైతు కష్టాలను గాలికొదిలేశాడని విమర్శించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి మాట్లాడుతూ అందరి ఆకలి తీర్చేందుకు కష్టపడే రైతన్నలు ఒక్క కట్ట యూరియా కోసం రాత్రి, పగలు క్యూలో నిలబడాల్సిన దుస్థితి ఏంటని నిలదీశారు. రైతులకు ఎరువులు ఇవ్వకుండా వ్యాపారుల గుప్పెట్లో పెట్టడం సిగ్గు చేటన్నారు. వరి కోతలు ప్రారంభమై 10 రోజులు అయిందని మరో 15 రోజుల్లో వరికోతలు పూర్తవుతున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు శివుని నారసింహారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలల కాలంలో పత్తి, పసుపు, మినుము, వరి, ఉల్లి ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. అధికారంలోకి వస్తే సంవత్సరానికి రూ.20 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తానన్న చంద్రబాబు తొలి సంవత్సరం ఎగనామం పెట్టాడన్నారు. రెండో సంవత్సరం కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. ఈ రెండేళ్లకు చంద్రబాబు రైతులకు రూ.35 వేలు బాకీ ఉన్నాడన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు, రైతులు బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, కోవూరు యువజన విభాగం అధ్యక్షుడు నల్లపరెడ్డి రజిత్రెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి, మొయిళ్ల గౌరి, లక్ష్మీసునంద, మల్లి నిర్మల, పేర్నాటి కోటేశ్వరరెడ్డి, ఊటుకూరు నాగార్జున, ఆశ్రిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కందుకూరు: యూరియా సరఫరా కాక రైతులు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం వచ్చే సీజన్కు కూడా యూరియా అందుబాటులో ఉందంటూ పచ్చి అబద్ధాలు చెబున్నారని మాజీ ఎమ్మెల్యే కందుకూరు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ దుయ్యబట్టారు. ఇండోసోల్ కంపెనీ కోసం బలవంతంగా భూములు తీసుకోవడంతో నష్టపోతున్న రైతులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు పాల్పడితే కోర్టుకు వెళ్లి అయినా అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారన్నారు. అవినీతి పనులు చేస్తే తగిన గుణపాఠం చెప్తారనే విషయాన్ని ఎమ్మెల్యే గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. చంద్రబాబు పాలనలో రైతన్నల రోదనలు యూరియా దొరకదు.. పంటలకు గిట్టుబాటు లభించదు రైతు సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తాం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నం పెట్టే రైతు రోడ్డెక్కాల్సిన దుస్థితి యూరియాపై సీఎం చెప్పేవన్నీ అబద్ధాలే.. వైఎస్సార్సీపీ ఉద్యమం అంటే చంద్రబాబుకు వణుకు రూ.3 వేల కోట్లతో మా ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధి ఏ పంటకు గిట్టుబాటు ధరల్లేవు చేతులు మారిన రూ.200 కోట్ల కమీషన్లు -
యూరియా కొరత తీరుస్తాం
ఉదయగిరి: మెట్ట ప్రాంతంలో ఆలస్యంగా సాగు చేపట్టిన వరికి యూరియా కొరత లేకుండా తీరుస్తామని జిల్లా వ్యవసాయాధికారిణి పి.సత్యవాణి చెప్పారు. ఉదయగిరిలో సోమవారం యూరియా పంపిణీలో రైతుల వెతలపై మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం నేపథ్యంలో ఆమె మంగళవారం ఉదయగిరికి చేరుకుని అధికారులు, రైతులతో మాట్లాడారు. జిల్లాలో సాగులో ఉన్న పంటల వినియోగానికి సంబంధించి అవసరమైన యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఉదయగిరి, మర్రిపాడు, వరికుంటపాడు మండలాల్లో సాగులో ఉన్న పంటలకు అవసరమైన యూరియాను బుధవారం నుంచి ఉదయగిరి మండలం గుడినరవ, బండగానిపల్లిలో నిల్వలు ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏడీఏ లక్ష్మీమాధవి, అన్ని మండలాల వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. సమాచార శాఖ డీడీగా వేణుగోపాల్రెడ్డి నెల్లూరురూరల్: జిల్లా పౌర సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్గా పీ వేణుగోపాల్రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్నమయ్య జిల్లాలో పౌర సమాచారశాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న పీ వేణుగోపాల్రెడ్డికి డిప్యూటీ డైరెక్టర్గా పదోన్నతి కల్పిస్తూ నెల్లూరు పౌర సమాచారశాఖ డీడీగా నియమించింది. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూ కాంప్లెక్స్లో 10 కంపార్ట్మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 77,117 మంది స్వామి వారిని దర్శించుకోగా 22,765 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.10 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. 27న ఫొటోగ్రఫీ, రీల్స్, వీడియోల పోటీలు నెల్లూరురూరల్: ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఫొటోగ్రఫీ, రీల్స్ వీడియోల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా పర్యాటక అధికారి ఉషశ్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతిక వారసత్వ కోటలు, జలపాతాలు, ఎకోటూరిజం, స్థానిక వంటకాలు వంటి అంశాలను ప్రోత్సహిస్తూ విద్యార్థులు, ఫొటోగ్రాఫర్లు, సజనాత్మక ప్రతిభ కలిగిన వారు ఈ పోటీల్లో పాల్గొనాలని కోరారు. ఫొటోలు హైరిజల్యూషన్ కలిగి నెల్లూరు జిల్లాలో తీసినవే అయి ఉండాలన్నారు. జేపీజీ ఫార్మాట్లో అందించాలన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే వారు ఈ నెల 20వ తేదీలోపు అందజేయాలని కోరారు. రీల్స్, వీడియోల పోటీలకు రీల్స్ 30–90 సెకన్లు (ఇన్స్టాగాం), వీడియో వ్యవధి గరిష్టంగా 3 నిమిషాలు ఉండేలా రూపొందించాలని సూచించారు. ఈ పోటీల విజేతలకు ప్రథమ బహుమతి రూ.5,000, ద్వితీయ బహుమతి రూ.3,000, తృతీయ బహుమతి రూ.2,000తోపాటు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఆధ్వర్యంలో అందజేయనట్లు ఆమె చెప్పారు. ఫొటోలు, వీడియోలు, రీల్స్ను ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా జిల్లా పర్యాటక శాఖాధికారి కార్యాలయం, 2వ అంతస్తు, బోట్ షికారు క్యాంపస్, బారా షాహిద్ దర్గా దగ్గర, దర్గామిట్ట, నెల్లూరులో అందించాలని ఆమె సూచించారు. పోటీల్లో పాల్గొనదలచిన అభ్యర్థులు తమ వివరాలకు 9493668022 / 7780749802 నంబర్లలో నమోదు చేసుకోవాలని, క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. -
కొమ్మలపూడిలో అగ్నిప్రమాదం
● రెండు పూరిళ్లు దగ్ధం మనుబోలు: మండలంలోని కొమ్మలపూడి గిరిజన కాల నీలో అ గ్నిప్రమాదం జరిగింది. రెండు పూరిళ్లు దగ్ధమై రూ.లక్ష నష్టం వాటిల్లింది. స్థానికుల కథనం మేరకు.. కాలనీకి చెందిన వెందోటి శీనమ్మ, వెందోటి చందనమ్మ మేకలు మేపుతుంటారు. మంగళవారం ఉదయం మేకలు మేపేందుకు పొలానికి వెళ్లారు. ఏమైందో తెలియదు గానీ పూరిళ్లు మంటల్లో కాలిపోయాయి. ఎవరైనా సిగరెట్, బీడీ తాగి పడేసి ఉంటారని భావిస్తున్నారు. పక్కనే ఉన్న మేకల కొట్టం కూడా దగ్ధమైంది. శీనమ్మ ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.50 వేల నగదు, నిత్యావసర సరుకులు, టీవీ, దుస్తులు కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఆర్ఐ అరుణ్తేజ్, వీఆర్వో బుజ్జయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. -
రేషన్ బియ్యం స్వాధీనం
సంగం: మండలంలోని సిద్ధీపురం వద్ద జాతీయ రహదారిపై విజిలెన్స్ అధికారులు మంగళవారం రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. ట్రక్ ఆటో అక్రమంగా తరలిస్తున్న 60 బస్తాల బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేశారు. 84 బస్తాలు ఆత్మకూరు: బొలెరో వాహనంలో నెల్లూరుకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా ఆత్మకూరు మండలంలోని వాశిలి సమీపంలో ఎస్సై ఎస్కే జిలానీ మంగళవారం పట్టుకున్నారు. వివరాలు.. ఏఎస్పేట, అనంతసాగరం మండలాల పరిధిలోని గ్రామాల్లో సేకరించిన 84 బస్తాలను బొలెరోలో లోడ్ చేసుకుని వెళ్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. వాహనాన్ని, అందులోని ఇద్దరు వ్యక్తులను స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
నేటి నుంచి అండర్ 19 స్కూల్ గేమ్స్
నెల్లూరు(టౌన్): 69వ సూల్స్ గేమ్స్ అండర్ 19 జిల్లా స్థాయి పోటీలు బుధవారం నుంచి జరుగుతాయని ఆర్ఐఓ వరప్రసాదరావు, డీవీఈఓ కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం నెల్లూరు స్టోన్హౌస్పేటలోని కేఏసీ జూనియర్ కళాశాలలో ఉమ్మడి నెల్లూరుకు చెందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ఏపీ రెసిడెన్షియల్స్, ఏపీ సోషల్ వెల్ఫేర్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్, ఏపీ మోడల్స్ స్కూల్స్, కేజీబీవీ, హైస్కూల్ ప్లస్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న వ్యాయామ అధ్యాపకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ వరకు పోటీలు జరుగుతాయన్నారు. షెడ్యూల్, వేదికలు, విధివిధానాలను వివరించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులురెడ్డి, స్కూల్ గేమ్స్ సెక్రటరీ వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతుల్ని ఆదుకోవడంలో కూటమి విఫలం
● సీపీఎం నేతల ర్యాలీ నెల్లూరు(వీఆర్సీసెంటర్): రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఎం నేతలు విమర్శించారు. ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరులో ర్యాలీ జరిగింది. బాలాజీ నగర్లోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ధాన్యం బస్తాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లేకపోవడంతో పంటను అమ్ముకోలేక రోడ్డున పడుతున్నారన్నారు. ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ● ‘హలో రైతన్న.. చలో కలెక్టరేట్’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నా పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆత్మకూరు బస్టాండ్ వరకు ర్యాలీ చేశారు. కార్యక్రమంలో నాయకులు మోహన్రావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమస్యలపై పోరాటం
● హంస జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్రావు ● ప్రశాంతంగా కార్యవర్గ ఎన్నికలు నెల్లూరు(అర్బన్): వైద్యశాఖలో ఉద్యోగుల సమస్యలపై హెల్త్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ (హంస) పోరాటం చేస్తుందని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చేజర్ల సుధాకర్రావు, కమల్ కిరణ్ తెలిపారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో మంగళవారం అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ పీఆర్సీ, పెండింగ్ బకాయిలు తదితర సమస్యల పరిష్కారానికి ఇతర సంఘాలను కలుపుకొని ఐక్య పోరాటాలు చేస్తున్నామన్నారు. తమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరవపాల్ సూచనలతో ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు నారాయణరాజు, నిర్వహణ కార్యదర్శి జలీల్ అహ్మద్, ఉపాధ్యక్షులు మురళి, నాగరాజు, నాగరాజమ్మ, ఉష, ఇందుకూరుపేట తాలూకా ప్రెసిడెంట్ అరుణరాణి, నెల్లూరు రూరల్ తాలుకా ప్రెసిడెంట్ సుధాకర్రెడ్డి, సెక్రటరీ సుజాత తదితరులు పాల్గొన్నారు. ● హంస తాలూకాలో ఖాళీ పదవులకు ఎన్నికలు జరిగాయి. నెల్లూరు సిటీకి సంబంధించి ఎన్నికల అధికారులుగా జలీల్ అహ్మద్, నాగరాజు ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తాలూకా ప్రెసిడెంట్గా గౌస్బాషా (హెల్త్ సూపర్వైజర్), అసోసియేట్ ప్రెసిడెంట్గా వెంకటేష్ (డిప్యూటీ హెచ్ఈఓ), సెక్రటరీగా బి.మంజరి (హెల్త్ అసిస్టెంట్), కోశాధికారిగా ఉమామహేశ్వరి (హెడ్ నర్సు), ఉపాధ్యక్షులుగా వెంకటశేషయ్య (సీనియర్ అసిస్టెంట్), ప్రభావతి (ఫార్మసీ ఆఫీసర్), కల్పన (సచివాలయ హెల్త్ సెక్రటరీ), శ్రీదేవి (హెడ్ నర్సు), కేవీ రాహుల్ (జూనియర్ అసిస్టెంట్), జాయింట్ సెక్రటరీలుగా సురేష్కుమార్ (ఎస్ఏ), సచివాలయ హెల్త్ సెక్రటరీలుగా పనిచేస్తున్న రామలక్ష్మి, ఆసియాబేగం, జయశీల, రెహానీలను ఎన్నుకున్నారు. ● రూరల్ తాలూకా పరిధిలో పబ్లిసిటీ సెక్రటరీగా మార్క్, నిర్వహణ కార్యదర్శిగా పృథ్వీరాజ్, వైస్ ప్రెసిడెంట్గా బ్రహ్మేశ్వరి, జాయింట్ సెక్రటరీలుగా అనితకుమారి, లక్ష్మీనారాయణమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ● కోవూరు తాలూకా యూనిట్ అధ్యక్ష, కార్యదర్శిలుగా సోలా ఉమా, రాఘవేంద్ర, కార్యవర్గ సభ్యులుగా రాజేంద్రప్రసాద్, షబీనా, హైమావతి, జరీనా, విజయలక్ష్మి, మనుషా, అలాగే ఇందుకూరుపేట తాలూకా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నవనీత, కోశాధికారిగా రాజ్యలక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా మొబీనాను ఎన్నుకున్నారు. వీరి చేత ఎన్నికల అధికారులు ప్రమాణం చేయించారు. -
ముందు మాకు.. తర్వాతే మీకు..
● కూటమి సభకు ఆర్టీసీ బస్సులు ● ఇక్కట్లు పడిన ప్రయాణికులు ● ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్న వైనం నెల్లూరు సిటీ: ఊరికెళ్లేందుకు బిడ్డలతో వచ్చిన తల్లులు.. వేరే నగరంలో చదువుకునే విద్యార్థులు.. ఉద్యోగంలో భాగంగా మరో ప్రాంతానికి చేరాల్సిన వ్యక్తులు.. ఆస్పత్రులకు వెళ్లాల్సిన వృద్ధులు.. ఎందరో ఆర్టీసీ బస్టాండ్లకు వచ్చి బస్సుల కోసం ఎదురు చూశారు. కానీ కూటమి పెద్దలు బస్సుల్ని తమ సభకు తరలించి వారందరినీ కష్టపెట్టారు. అనంతపురంలో బుధవారం కూటమి పార్టీలు సూపర్ సిక్స్.. సూపర్ హిట్ బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి. దీని కోసం జిల్లా నుంచి 260 బస్సులను ఆర్టీసీ అధికారులు కేటాయించారు. నెల్లూరు డిపో–1 నుంచి 40, డిపో–2 నుంచి 60, ఆత్మకూరు నుంచి 31, కావలి నుంచి 40, ఉదయగిరి నుంచి 29, కందుకూరు నుంచి 35, రాపూరు నుంచి 25 బస్సులను పంపారు. మంగళవారమే వాహనాలను తరలించారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయంగా బస్సులను ఏర్పాటు చేయలేక అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది మే 30వ తేదీన మహానాడు కార్యక్రమానికి 259 బస్సులు కేటాయించారు. ఇలా కూటమి పెద్దలు ఇబ్బంది పెడుతుండటంతో ప్రయాణికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎదురుచూపులు నగరంలోని డిపో 1, 2లో బస్సుల కోసం ప్రయాణికులు మంగళవారం గంటల తరబడి ఎదురుచూశారు. ఉద్యోగస్తులు, విద్యార్థులు మండలాల నుంచి నగరానికి వచ్చేందుకు అష్టకష్టాలు పడ్డారు. నెల్లూరు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకున్న వారు వచ్చిన ఒకటి, రెండు బస్సుల్ని ఎక్కేందుకు పడిన పాట్లు వర్ణనాతీతం. గంటలు తరబడి వేచిచూసినా బస్సులు రాకపోవడంతో కొందరు తిరిగి వెళ్లిపోయారు. మరికొందరు ఇతర వాహనాలను ఆశ్రయించారు. అస్సలు బస్సులేవీ? అసలే ఉచిత బస్సుకు ఆంక్షలున్న నేపథ్యంలో మహిళలు అసహనంగా ఉన్నారు. బుధవారం జరిగే సభకు బస్సుల్ని పంపారు. ఊర్లకు వెళ్లేందుకు వచ్చిన మహిళలు బస్టాండ్లలోని పరిస్థితుల్ని చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ తీరు బాగోలేదని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. -
నేడే పోలేరమ్మ జాతర
వెంకటగిరి రూరల్: ప్రసిద్ధి చెందిన పోలేరమ్మ తల్లి జాతర బుధవారం కోలాహలంగా ప్రారంభం కానుంది. ఉదయం నుంచే ప్రతి వీధిలో పోలేరమ్మకు మడి భిక్షం పెట్టండి.. పోతురాజుకు టెంకాయ కొట్టండి.. అంటూ భక్తుల నినాదాలతో పట్టణం హోరెత్తనుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వేపాకు తోరణాలతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఇంట్లో పసుపు ప్రతిమను తయారు చేసి పూజలు చేస్తారు. అంబలిని నైవేద్యంగా సమర్పించి భక్తిని చాటుకుంటారు. పోలేరమ్మ తల్లి దర్శనార్థం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఉచితంతోపాటు రూ.100, రూ.300 టికెట్ల క్యూలైన్లు పెట్టారు. వెంకటగిరి జన జాతరకు బుధ, గురువారాల్లో లక్షలాది మంది తరలిరానున్నారు. దీంతో పట్టణంలో ఏ ఇంట్లో చూసినా సందడి వాతావరణం కనిపిస్తోంది. -
కాకాణిని కలిసిన తూమాటి
కందుకూరు: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మంగళవారం నెల్లూరులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని రాజకీయ అంశాలపై చర్చించినట్లు తూమాటి తెలిపారు. న్యూరో సర్జన్కు గోల్డ్మెడల్నెల్లూరు(అర్బన్): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 27వ, 28వ కాన్వొకేషన్ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతోంది. ఇందులో భాగంగా నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ ధీరజ్ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్తో గోల్డ్మెడల్ను సాధించారు. 2021 – 22 సంవత్సరానికి సంబంధించి స్టేట్ బెస్ట్ ఔట్ గోయింగ్ స్టూడెంట్ కింద మంగళవారం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా మెడల్, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ధీరజ్ మాట్లాడుతూ ఈ అవార్డును స్ఫూర్తిగా తీసుకుని పేదలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానన్నారు. వ్యక్తి అనుమానాస్పద మృతికోవూరు: మండలంలోని పడుగుపాడు – జమ్మిపాళెం అండర్ బ్రిడ్జి కింద నీటిలో మంగళవారం ఉదయం ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై రంగనాథ్ గౌడ్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు.అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి శరీరంపై గాయాలున్నాయి. అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్టీసీ ఖాళీ స్థలాలు వినియోగించుకోవాలి
● ఎండీ ద్వారకా తిరుమలరావు ఆత్మకూరురూరల్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోలకు సంబంధించిన ఖాళీ స్థలాలను ఓస్ – 15 పథకం కింద సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. ఆత్మకూరు ఆర్టీసీ డిపోను మంగళవారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిపో ప్రాంగణాలను పరిశీలించి మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన ఉత్తమ ఉద్యోగుల అభినందన సభలో పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సీ్త్ర శక్తి పథకాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. గ్యారేజీ సిబ్బంది, సూపర్వైజర్లు, అధికారుల పనితీరును పరిశీలించి వారిని అభినందించారు. ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికై న 10 మందికి ప్రశంసాపత్రాలు, నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ రీజినల్ చైర్మన్ సురేష్రెడ్డి, డిపో మేనేజర్ శివకేశ్ యాదవ్, ఈడీ అప్పలరాజు, నాగేంద్ర, డీటీపీఓ షమీమ్, అసిస్టెంట్ డీఎం రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
40 గ్రాముల బంగారం, నగదు చోరీ
విడవలూరు: మండలంలోని వావిళ్లలో ఓ ఇంట్లో 40 గ్రాములు బంగారం, రూ.20 వేల నగదును దుండగులు చోరీ చేసిన ఘటన సోమవారం రాత్రి చోటుచోసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామంలో గుంజి శ్రీనివాసులు అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతని ఇంటి పక్కనే చిన్న గదిలో తల్లి నాగమ్మ ఉంటోంది. ఆమె ఉదయం గదిలో ఉంటుంది. రాత్రి వేళ్లలో కుమారుడి ఇంటికెళ్లి నిద్రిస్తుంది. సోమవారం రాత్రి గదికి తాళం వేసి వెళ్లింది. మంగళవారం ఉదయం వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. దొంగలు బీరువాలోని 40 గ్రాముల బంగారం, రూ.20 వేలు ఎత్తుకెళ్లినట్లు ఆమె గుర్తించింది. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై నరేష్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. క్లూస్టీం వచ్చి ఆధారాలు సేకరించింది. -
ముస్లింలకు చంద్రబాబు ద్రోహం
నెల్లూరు (అర్బన్): అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లుగానే సీఎం చంద్రబాబు ముస్లింలను దగా చేశాడని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇమామ్లకు, మౌజన్లకు గౌరవ వేతనం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి, పలువురు మైనార్టీ నాయకులు, ముస్లిం మతపెద్దలతో కలిసి సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆనంద్కు కాకాణి గోవర్ధన్రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మసీదులను పర్యవేక్షించే, ప్రార్థనలు చేసే మౌజన్లకు రూ.5వేలు, ఇమామ్లకు రూ.10 వేలు ప్రతి నెలా క్రమం తప్పకుండా చెల్లించేవారన్నారు. గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు గౌరవ వేతనం పెంచుతానని హామీ ఇచ్చాడన్నారు. ప్రతి నెలా మసీదుల పర్యవేక్షణకు మరో రూ.5 వేలు ఇస్తానని తెలిపాడన్నారు. మసీదుల పర్యవేక్షణకు చందాలు ఇచ్చే దాతలు ఇప్పడు ప్రభుత్వం ఇస్తుందనే ఉద్దేశంతో ఆపేశారన్నారు. అటు దాతలు చందాలు ఇవ్వక, ఇటు ప్రభుత్వం గౌరవ వేతనాలకు, నిర్వహణకు నిధులు విడుదల చేయక మసీదు నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మైనార్టీల అభివృద్ధి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి కాలంలోనే జరిగిందన్నారు. వారికి నాలుగు శాతం రిజర్వేషన్లు రాజశేఖరరెడ్డి కల్పించారన్నారు. జగన్మోహన్రెడ్డి దుల్హన్ పథకం కింద పేద ముస్లిం ఆడబిడ్డల పెళ్లిళ్లలకు ఆర్థిక చేయూత అందించారన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే దుల్హన్ పథకాన్ని నిర్వీ ర్యం చేశారన్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం ఇవ్వకుండా సీఎం చంద్రబాబు అవమానించారన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం గౌరవ వేతనాలు విడుదల చేయా లని లేదంటే వైఎస్సార్సీపీ మైనార్టీలకు అండగా ఉండి పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి నివేదిక పంపుతానన్నా రు. అనంతరం పలువురు మైనార్టీలు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒకటో తేదీనే గౌరవ వేతనాలు ఇచ్చేవారన్నారు. ఇప్పుడు వేతనాలు ఇవ్వకుండా ఆపేయడం దుర్మార్గమన్నారు. ఈ సందర్భంగా మైనార్టీలు పెద్ద ఎత్తున ముస్లింల ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలు ఖలీల్అహ్మద్, హంజాహుస్సేని, సిద్దిఖ్, కరీముల్లా, సమీర్ఖాన్, మహబూబ్బాషా, మస్తాన్, యజ్దాని, అలీమ్, జిల్లాలోని పలు ప్రాంతాల మౌజన్లు, ఇమామ్లు పాల్గొన్నారు. ఇమామ్లు, మౌజన్లకు 11 నెలలుగా గౌరవ వేతనం ఎగనామం ద్రోహి అంటూ మైనార్టీలు నినాదాలు ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డితో కలిసి కాకాణి కలెక్టర్ ఆనంద్కు వినతి పత్రం అందజేత -
మిగులు పొగాకు కొనుగోలుకు అనుమతులు
మర్రిపాడు: రైతులు అధికంగా, అనధికారికంగా పండించిన పొగాకు అమ్మకానికి భారత వాణిజ్య, పరిశ్రమలశాఖ అనుమతిచ్చిందని డీసీపల్లి వేలం కేంద్రం నిర్వహణాధికారి జి.రాజశేఖర్ సోమవారం తెలిపారు. పొగాకు బోర్డు అనుమతించిన పరిమితిలో 10 శాతం అధిక ఉత్పత్తి వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా సాధారణ సర్వీస్ చార్జీతో, 11 నుంచి 20 శాతం అధిక ఉత్పత్తి వరకు సాధారణ సర్వీస్ చార్జీ (1శాతం)తోపాటు అదనపు సర్వీస్ చార్జ్ 2 శాతం, కిలోకు రూ.1 చొప్పున, 20 శాతం పైన అధిక ఉత్పత్తి అమ్మకానికి సాధారణ సర్వీస్ చార్జీ (1శాతం)తోపాటు అదనపు సర్వీస్ చార్జ్ 3శాతం, కిలోకి రూ 1 అపరాధ రుసుం ఉంటుందని తెలియజేశారు. రైతులు పొగాకు బోర్డును సంప్రదించి ఎంత సరుకు ఉందో తెలియజేస్తూ దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. వాణిజ్య సరళిలో పెంచే నారుమడికి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లేని పక్షంలో పొగాకు బోర్డు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. జిల్లా సైన్స్ అధికారిగా శివారెడ్డి నెల్లూరు (టౌన్): జిల్లా సైన్స్ అధికారిగా శివారెడ్డిని నియమించిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. గతంలో జిల్లా సైన్స్ అధికారిగా పనిచేస్తున్న కరుణాకర్రెడ్డికి హెడ్మాస్టర్గా పదోన్నతి కల్పిస్తూ తిరుపతి జిల్లా కోట జెడ్పీ హైస్కూల్లో పోస్టింగ్ కల్పించారు. దీంతో జిల్లా సైన్స్ అధికారి నియామకానికి తొలుత జిల్లా విద్యాశాఖాధికారులు ప్రకటన ఇచ్చారు. ఈ పోస్టింగ్కు ఫిజిక్స్, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్లు పలువురు పోటీ పడ్డారు. వీరందరిని రిజెక్ట్ చేశారు. రెండో సారి నోటిఫికేషన్ తర్వాత విడవలూరు మండలం రామతీర్థం జెడ్పీ హైస్కూల్లో బయాలజికల్ టీచర్ శివారెడ్డిని నియమిస్తూ గత నెల 14న ఉత్తర్వులు వెలువరించారు. శివారెడ్డి నియామకంలో స్థానిక ఎమ్మెల్యే చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. పోస్టింగ్ ఇచ్చిన రోజే హడావుడిగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోనే బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ విషయం నేటి వరకు మీడియాకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచడం గమనార్హం. జిల్లా విద్యాశాఖాఽధికారులు ఆయన పోస్టింగ్పై సమాచారం ఇవ్వకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 18 కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 27,410 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 9,656 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.39 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లోనే దర్శనమవుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళితే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది. అరుణ, అనుచరులపై న్యాయవాది ఫిర్యాదు నెల్లూరు (వీఆర్సీసెంటర్): తన కార్యాలయాన్ని పెట్రోలు పోసి తగుల పెడుతానని నిడిగుంట అరుణ బెదిరించిందని కోవూరుకు చెందిన హైకోర్టు న్యాయవాది రాజారామ్ సోమవారం పోలీస్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నిడిగుంట అరుణ ఎస్సీ అని చెప్పుకుంటూ అనేక మందిని బెదిరించి వారి వద్ద డబ్బులు వసూలు చేసేదన్నారు. తాను కోవూరులో నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోని ఓ ప్లాట్లో అరుణ ఉంటూ అనేక అసాంఘిక కార్యక్రపాలకు పాల్పడేదన్నారు. గన్ కల్చల్తో అందరినీ బెదిరిస్తోందని, స్థానికులు కూడా ఆరోపిస్తున్నారన్నారు. రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్పై వచ్చిన సమయంలో కోవూరులోని అరుణ ప్లాట్లోనే ఉండేవాడని, దీంతో అపార్ట్మెంట్ వాసులు భయాందోళనలకు గురయ్యారని, ఇందుకు సంబంధించి అన్నీ ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. తన కార్యాలయాన్ని పెట్రోలు పోసి తగుల పెడుతానని అరుణ బెదించిందని, ఈ విషయమై రెండు నెలల క్రితం గ్రీవెన్స్లో ఫిర్యాదు చేస్తే తన ఫిర్యాదు కోవూరు పోలీస్స్టేషన్కు వచ్చిందని, అయినప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదని వాపోయారు. న్యాయవాది అయిన తనకే న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగుతుందన్నారు. ఎస్పీ కృష్ణకాంత్ న్యాయం చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. -
తాగునీటి కోసం నిరసన
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండలంలోని ఏ కిస్తీపురం పంచాయతీ పరిధిలో ఉన్న చింతలపాళెంలో మూడునెలలుగా తాగునీటి సమస్య ఉంది. దీని గురించి పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ సోమవారం గ్రామస్తులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ గ్రామంలో పంచాయతీ పాలకవర్గానికి, కార్యదర్శికి, పలువురు అధికారులకు తాగునీటి సమస్యను తెలియజేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు దొరక్క అనేక కుటుంబాలు గ్రామం వదిలి వెళ్లిపోయాయని, మరికొన్ని వలసబాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తే అధికార పార్టీకి చెందిన కొందరు బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎంపీడీఓ స్పందిస్తూ రెండు రోజుల్లో బోరు వేయించి నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
కరేడు రైతుల భూములు కాపాడతాం
● లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్కుమార్ ● ఇదంతా చినబాబు చేస్తున్న కుట్ర ● మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుఉలవపాడు: ప్రభుత్వం మెడలు వంచి కరేడు రైతుల భూములు కాపాడతామని రిటైర్డ్ ఐఏఎస్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జీఎస్ఆర్కే విజయ్కుమార్ అన్నారు. సోమవారం కరేడు గ్రామంలో ఆయన రైతన్నతో విజయన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సేకరణ చట్ట విరుద్ధమన్నారు. చట్ట ప్రకారం భూమి సేకరించి తర్వాత కంపెనీకి అప్పగించాలన్నారు. కానీ ముందు 8348 ఎకరాల భూమిని మార్చిలో అప్పగించి జూన్లో నోటిఫికేషన్ ఇవ్వడమే తప్పన్నారు. ప్రజలను విభజించి పాలించాలనే ఉద్దేశంతో 5 నోటిఫికేషన్లు ఇచ్చారన్నారు. ఇది ప్రభుత్వం చేసే కుట్ర అని అభిప్రాయపడ్డారు. 15 ఏళ్ల పాటు రూ.14,152 కోట్ల రాయితీ ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. కాకినాడ – విశాఖపట్నం మధ్య బీపీసీఎల్కు భూ సేకరణ జరిగిన తర్వాత మళ్లీ ఇక్కడ చేవూరులో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. గతంలో ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ నిరాశ్రయులకు కూడా తాను కలెక్టర్గా వచ్చిన తర్వాత మేదరమెట్ల వద్ద కాలనీ నిర్మించానన్నారు. కానీ ఇప్పటికీ వారికి న్యాయం జరగలేదన్నారు. పోలీసు శాఖ అత్యుత్సాహం ప్రదర్శించవద్దన్నారు. ఆలోచన విరమించుకోవాలి మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ అధికారంలో ఉంటే ఏం చేసినా చెలామణి అవుతుందన్న ఆలోచన విరమించుకోవాలని, లేకుంటే ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని కారుచవకగా ఇస్తున్నారని చెప్పారు. రిలయన్స్కు 5 లక్షల ఎకరాలు కేటాయించాలని నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిపారు. అది కూడా త్వరలో బయటకు వస్తుందన్నారు. ఉలవపాడు మామిడి తోటలు కూడా ఉండటం వల్ల సుప్రీంకోర్టులో భూ సేకరణ చేయొద్దని కచ్చితమైన తీర్పు వస్తుందన్నారు. అమరావతిలో సాగు భూములు వద్దని చెప్పినా వినకుండా తీసుకొని 11 ఏళ్ల తర్వాత రోడ్లు వేస్తున్నారని విమర్శించారు. బీపీసీఎల్, ఇండోసోల్ ఏర్పాటు చేయడం వెనుక తెలుగుదేశం ఎంపీ, పెద్ద కాంట్రాక్టర్ ఉన్నారన్నారు. వారికి లాభం చేకూర్చడానికి చినబాబు ప్రజలపై చేస్తున్న కుట్ర అన్నారు. తొలుత రామకృష్ణాపురం, ఉప్పరపాళెం గ్రామాల్లో రైతులను కలిసి మాట్లాడారు. కరేడు బహిరంగ సభలో రైతుల అభిప్రాయాలను స్వీకరించారు. కరేడు భూములను పరిశీలించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది శ్రీదేవి, కరేడు ఉద్యమ నాయకులు మిరియం శ్రీనివాసులు, సోషల్ యాక్టివిస్ట్ వసుంధర, సీపీఎం నాయకులు జి.వెంకటేశ్వర్లు, కుమార్, అజయ్కుమార్ పాల్గొన్నారు. -
సత్వర పరిష్కారం చూపాలంటూ..
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● ప్రజల నుంచి 515 అర్జీలు ● టీడీపీ వారు పింఛన్ తీసేయించారని వృద్ధుడి ఆవేదననెల్లూరు రూరల్: నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజలు పోటెత్తారు. కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ తదితరులు వినతులు స్వీకరించారు. మొత్తం 515 అర్జీలుందాయి. అధికంగా రెవెన్యూ శాఖవి 221, పోలీస్ శాఖవి 71, మున్సిపల్ శాఖవి 46, సర్వేవి 31, పంచాయతీరాజ్ శాఖవి 41 తదితర శాఖలవి ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో విజయ్కుమార్, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, డీపీఓ శ్రీధర్రెడ్డి, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, డ్వామా పీడీ గంగాభవాని, హార్టికల్చర్ ఏడీ సుబ్బారెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ విజయన్ తదితరులు పాల్గొన్నారు. ● కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అన్యాయం చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఆవుల నాగేంద్ర, సుభాన్బాషా తెలిపారు. వినతిపత్రమిచ్చిన అనంతరం మాట్లాడుతూ వైకల్య శాతాన్ని తగ్గించడంతో దివ్యాంగులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలకు అర్హత కోల్పోతున్నారన్నారు. ● ప్రభుత్వం ద్వారా వచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిహారం నగదును కల్లూరు చిన పెంచలయ్య, ఉషా అనే వారు కాజేశారని సజ్జాపురం ప్రాంతానికి చెందిన గురునాథం చందులు వినతిపత్రం సమర్పి ంచారు. పోలీసులు స్టేషన్ చుట్టూ తిప్పుకొంటున్నారని చెప్పారు. వారికి ఫిర్యాదు చేసినందుకు చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. ● అదనపుకట్నం కోసం భర్త షాహుల్ వేధిస్తున్నాడని కావలికి చెందిన షేక్ రేష్మా వినతిపత్రమిచ్చారు. కలిగిరిలో ఉండే నా అత్తమామలు పట్టించుకోవడం లేదని వాపోయారు. భర్త మద్యం తాగొచ్చి చిత్రహింసలు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కావలి రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం తన తల్లి ఇంట్లో మూడేళ్ల వయసున్న బిడ్డతో ఉంటున్నట్లు చెప్పారు. న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వ స్థలం ఆక్రమించారు కలువాయి మండలం దాచూరు గ్రామ పంచాయతీలోని ముక్కుతిప్ప గ్రామంలో సర్వే నంబర్ 989, 956లో 56 ఎకరాల మేత పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి నిమ్మచెట్లు నాటారని పలువురు వినతిపత్రమిచ్చారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్యంలో ఈ పొలాన్ని పేదలకు పంచాలని చూడగా ముక్కుతిప్ప గ్రామానికి చెందిన కొప్పాల నారయ్య, సుబ్బయ్య, బోరెడ్డి చినపెంచలస్వామి, లక్కాకుల శారదమ్మ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చారన్నారు. ప్రభుత్వం మారగానే ఆక్రమించుకుని నిమ్మ చెట్లు నాటారన్నారు. వీఆర్వో, ఆర్ఐ, తహసీల్దార్లతో కుమ్ముక్కై దొంగ పట్టాలు సృష్టించి, విద్యుత్ సరఫరా, బోర్లు వేసుకున్నారన్నారు. కోర్టు పరిధిలో ఉన్న భూములకు పట్టాలెలా ఇస్తారని ప్రశ్నించారు. పక్కనే ఉన్న 200 ఎకరాలు ఆక్రమించేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. హద్దులు చూపాలని వినతి కలువాయి మండలం గోపారం సచివాలయ పరిధిలోని చింతలాత్మకూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 32 సీ1లో ఉన్న 4.6 ఎకరాల్లో తమకు సంక్రమించిన భూమికి హద్దులు చూపించాలని ఎస్.నిరంజన్, రాధాకృష్ణ కోరారు. వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన పి.శివశంకర్ భార్య వైదేహి ఈ భూమిని ఆక్రమించుకుని దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. సాగు చేసుకునేందుకు వెళ్తే అడ్డుకుంటున్నారని చెప్పారు. తహసీల్దార్ హద్దు రాళ్లు వేయించారన్నారు. వాటిని తొలగించినట్లు చెప్పారు. ఎస్సైకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. సర్వే చేయించాలని కోరారు.కొండయ్య పింఛన్ రాకుండా అడ్డుకుంటున్నారు సంవత్సరం నుంచి పింఛన్ రాకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని జలదంకి మండలం కోదండరామాపురానికి చెందిన గోవింద కొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నేతలు వేరే వాళ్ల భూమిని తన పేరుపై ఎక్కించి పెన్షన్ తీయించేశారని వాపోయారు. నడవలేకపోతున్నాని, పెన్షన్ ఇప్పించాలని కోరారు. -
ఉద్యోగాల పేరుతో మోసాలు
● ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఉద్యోగం ఇప్పిస్తామని నగదు తీసుకుని మోసం చేశారని పలువురు ఫిర్యాదు చేశారు. సోమవారం నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 109 మంది ఫిర్యాదులు అందజేశారు. తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశించారు. లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ రామారావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరావు, డీఆర్సీబీ సీఐ రామారావు, ఎస్బీ – 2 సీఐ శ్రీనివాసరెడ్డి, వెల్ఫేర్ ఆర్ఐ రాజారావు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. u సంతపేట ప్రాంతానికి చెందిన మాబ్జాన్ అనే మహిళ శివశంకర్, సునయన అనే వారిని పరిచయం చేసి ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.6,56,000 నగదు తీసుకున్నారు. అయితే ఉద్యోగం ఇప్పించలేదని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. u నవీన్కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.11 లక్షలు తీసుకుని మోసం చేశాడని కావలి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వినతిపత్రమిచ్చాడు. u సంగం మండల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ద్వారా గుంటూరుకు చెందిన సయ్యద్ వారిస్, సాంబశివరావు పరిచయమై కౌన్సెలింగ్ – కెరీర్ డెవలప్మెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.36 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మోసం చేశారు. నగదు తిరిగి ఇవ్వడం లేదని నెల్లూరు నగరానికి చెందిన బాధితులు ఫిర్యాదు చేశారు. u హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో జలదంకికి చెందిన శివారెడ్డి అనే వ్యక్తి ప్రేమిస్తున్నాని మోసం చేశాడు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని ఓజిలి గ్రామానికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. u పొలంలోని వంద టేకు చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికారు. దీనిపై గత నెల 26వ తేదీన పొదలకూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, నిందితులపై చర్యలు తీసుకోవాలని పొదలకూరు మండలం మరువూరు గ్రామానికి చెందిన కందకట్ట రాజేశ్వరి కోరారు. u ఓ వ్యక్తి బ్యాంక్ అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. రూ.3 లక్షల లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డు మంజూరైందని చెప్పాడు. బ్యాంక్ వివరాలు తీసుకుని రూ.1,21,480లు స్వాహా చేశాడని బుచ్చిరెడ్డిపాళెం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. u కొడుకు, కోడలు నన్ను పట్టించుకోవడం లేదు. నా ఆస్తిని వినియోగించుకుంటూ ఇబ్బంది పెడుతున్నారని ఏఎస్పేట ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు అర్జీ ఇచ్చాడు. u నా భర్త నిత్యం మద్యం తాగొచ్చి చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. కన్నబిడ్డలను పట్టించుకోవడం లేదని నెల్లూరు నగరం వేదాయపాళేనికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. u నా భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబం గురించి పట్టించుకోవడం లేదు. అత్తమామలు ఆయనకు తోడ్పాటు అందిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కాపురాన్ని చక్కదిద్దాలని నెల్లూరు రూరల్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చింది. -
ఏపీఆర్ఎస్ఏ ఎన్నికలు ఏకగ్రీవం
● అల్లంపాటికే రెండో దఫా అధ్యక్ష పదవి నెల్లూరు(అర్బన్): ప్రభుత్వ విభాగాల్లో ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్ఎస్ఏ) జిల్లా శాఖ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఆదివారం నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలోని ఏపీఆర్ఎస్ఏ కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి అశోక్రెడ్డి ఎన్నికల అధికారిగా, శివప్రసాద్ సహాయ అధికారిగా, గోపీనాథ్రెడ్డి పరిశీలకులుగా ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. 2 గంటల వరకు స్క్రూట్నీ నిర్వహించారు. 24 పదవులకు 24 మంది మాత్రమే నామినేషన్లు వేయడం, పోటీలో ఎవరూ లేకపోవడంతో వారందరూ ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ప్రకటించిన ఎన్నికల అధికారులు ఉత్తర్వులు అందజేశారు. కార్యవర్గం ఇలా.. ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడిగా రెండో దఫా కూడా నుడా సెక్రటరీగా పని చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ అల్లంపాటి పెంచలరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కలెక్టరేట్లో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న యెడ్ల నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్గా చేజర్ల తహసీల్దార్ మురళి, ఉపాధ్యక్షులుగా కోవూరు సీఎస్ డీటీ బాలకోటమ్మ, వరికుంటపాడు తహసీల్దార్ హేమంత్కుమార్, వింజమూరు సీఎస్ డీటీ శ్రీనివాసులు, మర్రిపాడు తహసీల్దార్ అనిల్కుమార్ యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా నెల్లూరు రూరల్ తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ వెంకటేష్, స్పోర్ట్స్, కల్చరల్ సెక్రటరీగా నెల్లూరు అర్బన్ ఈడీటీ ఆనందరావు, జాయింట్ సెక్రటరీలుగా మనుబోలు తహసీల్దార్ రమాదేవి, ఇందుకూరుపేట డీటీ శ్రీకాంత్రెడ్డి, టీపీ గూడూరు ఆర్ఎస్ డీటీ అశోక్వర్ధన్, కలెక్టరేట్ ఓఎస్ నుంచి అలరేష్, కోశాధికారిగా వెంకటాచలం ఆర్ఎస్ డీటీ సతీష్కుమార్, ఈసీ మెంబర్లుగా యూత్ వెల్ఫేర్ డీటీ గయాజ్ అహ్మద్, కందుకూరు సీఎస్ డీటీ చెంచురామయ్య, కావలి ఆర్ఎస్ డీటీ నరసారెడ్డి, డీఎస్ఓ ఆఫీసు నుంచి సందానీ, కందుకూరు సీనియర్ అసిస్టెంట్ కోటయ్య, అనంతసాగరం డీటీ శేషయ్య, కొడవలూరు సీనియర్ అసిస్టెంట్ మస్తాన్బాబు, స్టేట్ కౌన్సిల్ మెంబర్లుగా మనుబోలు డీటీ ప్రదీప్, దుత్తలూరు డీటీ లక్ష్మి, నెల్లూరు రూరల్ నుంచి కృష్ణప్రసాద్ వ్యవహరిస్తారు. వారి చేత ఎన్నికల అధికారులు ప్రమాణం చేయించారు. పోరాటం చేస్తాం ఈ సందర్భంగా అల్లంపాటి పెంచలరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్నారు. ఈ ఏకగ్రీవ ఎన్నికలు రెవెన్యూ ఉద్యోగుల ఐక్యతను చాటాయన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు, డీఏ, పీఆర్సీ, ఇతర సమస్యలపై రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. రెండో దఫా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రాంతాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్, జూనియర్ సహాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఘటోత్సవ వైభవం
● ప్రారంభమైన వెంకటగిరి జాతర వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి గ్రామదేవత పోలేరమ్మ జన జాతర అంగరంగ వైభవంగా ఆదివారం ప్రారంభమైంది. ఘటోత్సవంతో అమ్మవారి సంబరం అంబరాన్నంటింది. ఘటోత్సవం చూసేందుకు తరలివచ్చిన అశేష భక్త జనంతో వెంకటగిరి పట్టణ పురవీధులు కిక్కిరిశాయి. పోలేరమ్మ తల్లీ చల్లగా చూడాలమ్మా అంటూ వేడుకున్నారు. ఘటం కుండలకు అధిక సంఖ్యలో భక్తులు పూజలు నిర్వహించి ఆధ్యాత్మికతను చాటుకున్నారు. ఘటం కుండలతో ఇంట్లో పూజలు చేస్తే సాక్షాత్తు పోలేరమ్మ తల్లే కొలువై ఉంటుందన్న విశ్వాసం. దీంతో అమ్మవారి ఘటోత్సవానికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులను తీర్చుకున్నారు. భక్తుల ఆగ్రహంతో.. రాష్ట్ర పండగైన వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా ఘటోత్సవంలో సంప్రదాయాలకు విరుద్ధంగా కొత్త విధానాలకు తెరలేపడంతో భక్తుల ఆగ్రహించారు. దీంతో పాత పద్ధతిలోనే కొనసాగించారు. వివరాలిలా.. ఘటోత్సవంలో సంప్రదాయాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం భక్తుల మనోభావాలు దెబ్బతీశాయి. వాస్తవానికి ఘటోత్సవం జీనుగుల వారి వీధిలోని మెట్టినింటి మండపం వద్ద నుంచి రాజా ప్యాలెస్కు నడక మార్గంలో ఘటం కుండలను ఊరేగించడం ఆనవాయితీ. ఈ ఏడాది పక్కన పెట్టి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఘటం కుండలను ఊరేగించేందుకు ప్రత్యేక వాహనంలో జీనుగుల వారి వీధిలోని అమ్మ మెట్టి నింటి మండపం వద్ద ఎక్కించేశారు. ఘటం కుండలు నడక మార్గం గుండా రాకపోవడంతో స్థానికంగా ఉన్న పట్టణ ప్రముఖులు ఆగ్రహించారు. దీంతో పోలీసు బందోబస్తు మధ్య యథావిధిగా కాలి నడక ద్వారా సాగించారు. యువత కేరింతలు జాతరలో తొలి ఘట్టం ఘటోత్సవం ఆరంభమైన నేపథ్యంలో పట్టణంలోని యువత, మహిళలు పెద్ద సంఖ్యలో జీనుగులవారి వీధిలోని అమ్మవారి మెట్టినింటి మండపం వద్దకు చేరుకున్నారు. మండపంలో అమ్మవారి ఘటము (కుండ)లకు స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఆలయ అధికారుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి ఘటం కదిలి ఆంజనేయస్వామి దేవస్థానం, బజారు వీధి, పోలేరమ్మ తల్లి దేవస్థానం, రాజా ప్యాలెస్ మీదుగా సాగింది. యువతతోపాటు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై కుండలను తాకేందుకు పోటీ పడ్డారు. రాజా ప్యాలెస్లో వెనుక భవనం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ యువత అధిక సంఖ్యలో చేరుకోవడంతో బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేశారు. అమ్మవారికి బలి ఇచ్చే దున్నపోతును ఘటంకు ముందుగా నడిపించుకుంటూ తీసుకొచ్చి పూజలు చేశారు. ఐదురోజులపాటు గురువారం వరకు ఈ ఘటం పట్టణంలోని అన్ని వీధుల్లోనూ తిరుగుతుంది. ఆలయ ఈఓ శ్రీనివాసులురెడ్డి, సీఐ ఏవీ రమణ పర్యవేక్షణతో కార్యక్రమాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించారు. -
అధ్వానంగా గురుకులాలు
అధికారుల తనిఖీల్లో వెలుగులోకి.. ● దారుణంగా పారిశుధ్యం ● తక్కువ మొత్తంలో చికెన్ తెచ్చిన వైనంనెల్లూరు(స్టోన్హౌస్పేట): కూటమి ప్రభుత్వంలో గురుకులాలు అధ్వానంగా తయారయ్యాయి. పేద పిల్లలుండే చోట్ల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సాక్షాత్తు అధికారుల తనిఖీల్లో అనేక విషయాలు వెలుగు చూశాయి. నెల్లూరులోని పొదలకూరు రోడ్డులో ఉన్న గిరిజన బాలుర, బాలికల పాఠశాలలను ఆదివారం జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి బి.శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాటిని నిర్వహిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుర గురుకులంలో.. ఇక్కడంతా అపరిశుభ్రంగా ఉండటం, ప్రిన్సిపల్ దేవసహాయం ఉదయం 11 గంటలకు సైతం రాలేదు. దీంతో ఆయన్ను పిలిపించారు. ఇంతలో పాఠశాలను సందర్శిస్తే వంట గది ముందు శనివారం నాటి మిగిలిన ఆహార పదార్థాలున్నాయి. మరుగుదొడ్ల వద్ద మురుగునీరు ఉంది. పారిశుధ్యం అధ్వానంగా ఉండటంతో ప్రిన్సిపల్ను తీవ్రస్థాయిలో మందలించారు. కాసేపటికి చికెన్ను తీసుకొచ్చారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా పది కేజీలు అవసరం. అయితే చిన్న కవర్లో ఉండటంతో ఇది పది కేజీలా అని అధికారి ప్రశ్నించారు. అందుకు ప్రిన్సిపల్ సంబంధం లేని సమాధానం చెప్పారు. పారిశుధ్యంపై తగిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాసులు ఆదేశించారు. డ్యూటీ టీచర్ రాకపోవడంతో పిల్లలు ఇష్టమొచ్చినట్లు ఆడుకోవడం కూడా సరికాదని తీవ్ర స్థాయిలో హెచ్చరించి పలు సూచనలు చేశారు. బాలికల గురుకులంలో.. గిరిజన బాలికల గురుకులంలో కూడా పరిస్థితి అధ్వానంగా ఉంది. అపరిశుభ్రంగా ఉండటం, వంట గదిలో వృద్ధురాలు కూరగాయలు కోయడాన్ని అధికారి చూసి డ్యూటీ టీచర్ను ప్రశ్నించారు. అయితే ఆ టీచర్కు అధికారి తెలియకపోవడంతో ఏదో సమాధానాలు చెప్పింది. అనంతరం ఆయన సంక్షేమ శాఖాధికారి అని తెలుసుకుంది. వంట చేసే ఆమె రాకుండా అమ్మను పంపించిందని జవాబిచ్చింది. ఈలోపు అక్కడున్న విద్యార్థినులతో సంక్షేమాధికారి మాట్లాడారు. వారికి ప్రాథమిక అంశాలు కూడా తెలియదని గుర్తించారు. ఐటీడీఏ అంటే ఏమిటి?, అది ఎలా పనిచేస్తుంది?, ఎలా చదువుకోవాలనే అంశాలపై శ్రీనివాసులు అవగాహన కల్పించారు. రెండు గురుకులాల నిర్వాహణపై పలు సూచనలు ఇచ్చారు. సంబంధిత సిబ్బందికి మెమోలు జారీ చేస్తామన్నారు. -
చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతుకు కష్టాలే
● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ● 9న ‘అన్నదాత పోరు’ పోస్టర్ ఆవిష్కరణ నెల్లూరు (స్టోన్హౌస్పేట): చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు కష్టాలు తప్పడం లేదన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అతివృష్టి, అనావృష్టితో రైతులు తీవ్రంగా నష్టపోయారని, గిట్టుబాటు ధరల్లేక అప్పుల ఊబిలో కూరుకుపోయా రన్నారు. ఇప్పుడు అధికారంలో వచ్చినా రైతులకు యూరియా అందించకుండా బ్లాక్ మార్కెట్కు తరలించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విత్తనాలు దొరక్క, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక పంటలు ఎగుమతి లేకపోవడంతో రైతులు నిరాశ నిస్పృహలతో ఉన్నారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రైతున్నలకు బాసటగా ఈ నెల 9వ తేదీ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ‘అన్నదాత పోరు’ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆదివారం నెల్లూరు రాంజీనగర్ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాలు రైతులకు వెన్నుదన్నుగా ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చిన ఘనత వారికి దక్కుతుందన్నారు. రాజశేఖరరెడ్డి చేపట్టి జలయజ్ఞం, ఉచిత విద్యుత్ అమలు, జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన రైతుభరోసా కేంద్రాలతో రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా నిర్వహించుకున్నారని తెలిపారు. రైతు భరోసాగా ఏడాది రైతులకు రూ.13,500, సీజన్కు ముందే ఎరువులు, విత్తనాలు సమృద్ధిగా అందించిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో రైతులు జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయన్నారు. వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రైతు సంతోషంగా ఉంటూ అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి తొలి ఏడాది నుంచి ప్రతి రైతు ఎకరాకు రూ.20 వేల నష్టపోతున్నారన్నారు. కూటమి విధానాల మూలంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటూ వ్యవసాయ రంగంలో నష్టాలు చవిచూడాల్సి వస్తుందన్నారు. వైఎస్సార్సీపీ నేత లు, కార్యకర్తలు, అన్నదాతలు జయప్రదం చేయాలని కోరారు. -
చివరి శ్వాస.. ఆశ
కోవూరు: మండలంలోని పడుగుపాడుకు చెందిన కొప్పల సుధాకర్, రాధిక దంపతుల పెద్ద కుమార్తె సుదీప్తి. బిడ్డ చివరి శ్వాసను చివరి వరకు నిలబెట్టుకునేందుకు ఆ తల్లిదండ్రులకు ఆర్థిక స్థోమత సరిపోగా, దాతృత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రాణాపాయం తప్పించాలంటే గుండె, ఊపిరితిత్తులు మార్పిడి శస్త్రచికిత్స తప్పదని వైద్యులు స్పష్టం చేశారు. చైన్నెలోని నిపుణులు సుదీప్తి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి.. తక్షణమే ఈ శస్త్రచికిత్స జరగాలని, దానికి సుమారు రూ.70 లక్షల ఖర్చవుతుందని వెల్లడించారు. కానీ సుదీప్తిది పేద కుటుంబం కావడంతో అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చే స్థోమత లేక తీవ్ర ఆందోళనలో ఉంది. పాప ప్రాణం కాపాడేందుకు ఆప్తులు, బంధువులు, గ్రామస్తులు వీలైనంతగా తోడ్పడుతున్నా.. అవసరమైన నిధులు సమకూర్చుకోవడం అది జీవిత స్వప్నంగా మిగిలిపోతుందని కుమిలికుమిలిపోతున్నారు. మనసున్న దాతలు ముందుకొచ్చి తమ బిడ్డ ప్రాణాన్ని కాపాడాలని కోరుతూ ఆ కుటుంబం కొంగుచాచి చివరి ఆశగా ఎదురు చూస్తోంది. కన్నీటిలో తడిసిన కలల గాధ సుదీప్తి చిన్ననాటి నుంచే గుండె, ఊపిరితిత్తులు సమస్యలతో బాధపడుతోంది. 2016–18 మధ్య కాలంలోనే వైద్యులు అనేక పరీక్షలు నిర్వహించి మార్పిడి శస్త్ర చికిత్స తప్పదంటూ స్పష్టం చేశారు. ఆ సమయంలో అనేక ఆస్పత్రులు చుట్టూ తిరిగినా ఉపయోగం లేకపోయింది. అప్పటి నుంచి సుదీప్తికి అనారోగ్యమే నిత్యసహచరిగా మారింది. రోజు రోజుకు అంతకంతకు పెరుగుతున్న ఆరోగ్య సమస్యలను సైతం లెక్క చేయకుండా చదువుపై ఆసక్తిని వదలని సుదీప్తి, తన కష్టాన్ని, నొప్పిని దాచుకుంటూ విద్యలో రాణించింది. మొదట 10వ తరగతి పూర్తి చేసి, తర్వాత ఉన్నత చదువులు కొనసాగిస్తూ చివరకు ఎంబీఏ పూర్తి చేసింది. ప్రతి అడుగులో ఆమెను శరీర బాధ, ఆర్థిక ఇబ్బందులు అడ్డుకున్నా.. ధైర్యాన్ని మాత్రం వదల్లేదు. కుమార్తె ప్రాణాల కోసం తల్లిదండ్రులు అప్పులు చేసి రూ.లక్షల ఖర్చు చేశారు. చైన్నె కంచికామకోటి ఆస్పత్రుల్లో, తర్వాత ఎంజీఎం వైద్యుల వద్ద అన్ని రకాల పరీక్షలు చేశారు. తాజాగా గుండె, ఊపిరితిత్తులు మార్పిడి శస్త్రచికిత్స తప్ప వేరే మార్గం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. రూ.70 లక్షలు.. దాతల కోసం ఎదురుచూపులు ఈ శస్త్రచికిత్స కోసం సుమారు రూ. 70 లక్షల ఖర్చవుతుంది. ఇప్పటికే వైద్యానికి రూ.లక్షల్లో అప్పలు చేసినా ఆ తల్లిదండ్రులకు అంత మొత్తం సమకూర్చుకోవడం సాధ్యం కాని పని. ఓ పక్క బిడ్డ ప్రాణాలు చివరి దశలో ఉన్నాయి. దాతృత్వం చివరి ఆశగా తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. మనస్సున్న దాతలు సాయం అందించేందుకు సుదీప్తి తల్లి రాధికను 9848923921 నంబరులో సంప్రదించవచ్చు. బ్యాంక్ ద్వారా సాయం చేయాలనుకుంటే కెనరా బ్యాంక్, కోవూరు బ్రాంచ్లోని ఖాతా నంబర్ : 110055071311, ఐఎఫ్ఎస్సీ కోడ్ యూబీఐఎన్0803332. దాతృత్వం.. నిలిపేను సుదీప్తి ప్రాణం గుండె, ఊపిరితిత్తులు మార్పిడి శస్త్రచికిత్స అవసరం రూ.70 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు స్పష్టం అనారోగ్యంలోనూ ఎంబీఏ వరకు చదివిన పేదింటి విద్యా కుసుమం పసిప్రాయం నుంచే ప్రాణాపాయం. గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో సతమతమైనా క్షణక్షణం.. శ్వాస కోసమే యుద్ధం చేస్తూ ఎదిగింది. చదువుతో తన జీవితానికి వెలుగుల ఆశలు రాసుకుంది. శరీరం శల్యమవుతున్నా.. మొక్కవోని లక్ష్యంతో ఉన్నత విద్యలో జయకేతనం ఎగురవేసిన ధైర్యవంతురాలు సుదీప్తి. కానీ ఇప్పుడు ఆమె జీవితం చివరి ఊపిరి దూరంలో నిలిచిపోయింది. గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స తప్ప మరో మార్గం లేదని వైద్యులు స్పష్టం చేశారు. కుమార్తె ఊపిరి నిలిపేందుకు చేసిన రుణాలతో నలిగిన తల్లిదండ్రుల బాధను దాచుకుని, కన్నీళ్లను మింగుకుని జీవచ్ఛంలా బతుకుతూ ఇప్పుడు ప్రాణం పణంగా పెట్టుకుంది. వైద్యానికి అవసరమైన రూ.లక్షలు సుదూర స్వప్నంగా మారింది. ఆపదలో ఉన్న తల్లిదండ్రుల మనోవేదన ఒక్కటే.. మనసున్న హృదయాలు కదలకపోతే తన కుమార్తె చివరి శ్వాస ఆగిపోతుందని, దాతృత్వం తోడ్పాటే జీవం పోస్తుందని ఆ తల్లిదండ్రుల చివరి ఆశ. -
పామాయిల్ దొంగ టీడీపీ నేతేనా!
● ఆ పార్టీ కీలక నేత రాజేంద్ర అరెస్ట్తో వాస్తవాలు బట్టబయలు ● రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు మౌనం.. తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పంటపాళెంలోని ఫ్యాక్టరీల నుంచి తరలించే పామాయిల్ ట్యాంకర్లల్లో ఆయిల్ను మరో వాహనంలోకి మార్చేసి ఆ వాహనానికి ప్రమాదంగా చిత్రీకరించి ఇటు సొమ్ము చేసుకుంటూ అటు ఇన్స్యూరెస్స్ పొందుతున్న గజదొంగ వెంకటాచలం వడ్డిపాళేనికి చెందిన టీడీపీ నేత రాజేంద్రే అని శనివారం పోలీసుల అరెస్ట్తో స్పష్టమైంది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డితో రాజేంద్రకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. టీడీపీ నేరచరితులను పెంచి పోషిస్తోందనే దానికి రాజేంద్ర ఉదంతమే ఉదాహరణగా నిలుస్తోంది. నాలుగు నెలల క్రితం జరిగిన ఈ కేసుకు సంబంధించి పాత్రధారి, సూత్రధారిని తప్పించిన పోలీసులు మిగతా వ్యక్తులను అరెస్ట్ చూపారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ముత్తుకూరు పోలీసులు రాజకీయ ఒత్తిళ్లను పక్కన బెట్టి టీడీపీ నేతగా చెలామణి అవుతున్న రాజేంద్రను అరెస్ట్ చేయడంతో సర్వేపల్లి నియోజకవర్గంలో చర్చానీయాంశమైంది. ఆయిల్ కాజేసీ.. ప్రమాదంగా చిత్రీకరించి.. సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రం వెంకటాచలం వడ్డిపాళెం పంచాయతీకి చెందిన రాజేంద్ర ఏప్రిల్లో ముత్తుకూరు మండలం పంటపాళెం ఫ్యాక్టరీ నుంచి సుమారు 24 టన్నుల పామాయిలతో బయటకు వచ్చిన ట్యాంకర్ను డ్రైవర్, మరి కొందరితో కలిసి వెంకటాచలం మండలం నాయుడుపాళెం సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి మరొక ట్యాంకర్లోకి పామాయిల్ మార్చేశారు. ఆ పామాయిల్ను పిడుగురాళ్లకు తరలించి, అక్కడి ఓ వ్యాపారికి అమ్మకాలు చేసి సొమ్మును వాటాలుగా పంచుకున్నారు. అయితే ఖాళీ ట్యాంకర్ను మనుబోలు మండలం కొమ్మలపూడి సమీపంలోని పంట కాలువలో జేసీబీతో పడేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ కేసులో పాత్రధారి, సూత్రధారి టీడీపీ నేత రాజేంద్రేనని ప్రచారం జరిగింది. అయితే రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు రాజేంద్రను తప్పించి ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ముత్తుకూరు పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ నేత రాజేంద్రను శనివారం అరెస్ట్ చేశారు. శ్రీకాంత్తోనూ రాజేంద్రకు సంబంధాలు హత్య కేసులో జీవిత ఖైదీగా ఉన్న శ్రీకాంత్తో టీడీపీ నేత రాజేంద్రకు సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య సమస్యల పేరుతో జైలు నుంచి తిరుపతి రూయా ఆస్పత్రికి వెళ్లే ప్రతిసారి వెంకటాచలం పంచాయతీ వడ్డిపాళెంలో రాజేంద్రను కలిసి వెళ్తుండేవాడని ప్రచారం జరుగుతోంది. గతేడాది వడ్డిపాళెంలో జరిగిన వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా రాజేంద్ర ఆహ్వానించడంతో శ్రీకాంత్ వడ్డిపాళెం వచ్చి వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అదే విధంగా మరో రౌడీషీటర్ జగదీష్తోనూ రాజేంద్రకు మంచి పరిచయాలు ఉన్నాయని బయటపడటంతో పోలీసులు వీటన్నింటిపై విచారణ జరుపుతున్నారు. -
గెజిటెడ్ ఆఫీసరైనా అంతే..
ముత్తుకూరు పీహెచ్సీలో విల్సన్ గెజిటెడ్ అధికారి. ఆయన 2023 ఏప్రిల్ నెలలో ప్రమాదానికి గురయ్యారు. తర్వాత మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు బిడ్డలున్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న భర్త కాలం చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భార్య తన భర్తకు చెందిన ఆర్జిత సెలవులు, పెన్షన్, గ్రాట్యుటీ కోసం వైద్యశాఖ చుట్టూ తిరుగుతోంది. ఇలా రెండేళ్ల నాలుగు నెలల పాటు తిరిగి, తిరిగి వేసారి పోయింది. వైద్యశాఖలో ఆ బిల్లులు చేయాల్సిన ఈ–1 సీనియర్ అసిస్టెంట్ గత నాలుగు నెలలుగా తిప్పుకుంటున్నాడు. అంతకు ముందు ఆ సీట్లో ఉన్న మరో మహిళా ఉద్యోగి కూడా ఇలాగే తిప్పుకుంది. ఆ బెనిఫిట్స్ ఇవ్వాలంటూ అడిగింత ముడుపులు చెల్లిస్తేనే బిల్లులు పెడుతానంటూ ఈ–1 సీటు చూస్తున్న సీనియర్ అసిస్టెంట్ పేర్కొనడంతో విల్సన్ కుటుంబ సభ్యులు తీవ్ర మనో వేదనకు గురైంది. ● మరో బయాలజిస్ట్ ఆర్జిత సెలవులకు సంబంధించి కూడా అలాగే తిప్పుకుంటున్నారు. ● ఒక రికార్డు అసిస్టెంట్ రిటైర్ట్ అయినప్పటికీ తన 10 నెలల జీపీఎఫ్ మిస్సింగ్ క్రెడిట్స్ ఎంటర్ చేయాలని పదే పదే వేడుకుంటున్నా ఫలితం శూన్యం. ● ఉద్యోగి ఎవరైనా మృతి చెందితే మట్టి ఖర్చుల కింద ట్రెజరీ కొంత నగదు చెల్లిస్తోంది. అయితే అందుకు సంబంధించిన బిల్లు సైతం వైద్యశాఖ సిబ్బంది పంపాలి. అందుకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని సాటి ఉద్యోగులే పేర్కొంటున్నారు. -
నేను బాధ్యతలు తీసుకున్నాక క్లియర్ చేస్తున్నా..
●ఆఫీసులో పెండింగ్ ఫైల్స్ అన్నీ క్లియర్ చేస్తున్నాం. కొంత మందికి ఆలస్యం కావడానికి ఎస్ఆర్లోనే ఏళ్ల తరబడి తప్పులు ఉన్నాయి. ఆ తప్పులను సరి చేసి డైరెక్టర్ ఆఫ్ హెల్త్కు పంపాం. అక్కడి నుంచి ఇక్కడకు రావడం, ఇక్కడ నుంచి సంబంధిత ఉద్యోగులు పని చేసిన పీహెచ్సీకి పంపడంలో కొంత సమయం గడిచి ఉండోచ్చు. ఇందులో ఎవరి లోపం లేదు. నేను బాధ్యతలు తీసుకున్నాక పెండింగ్ ఫైళ్లను వేగంగా క్లియర్ చేస్తున్నాను. విల్సన్, రసూల్ తదితరుల పెండిగ్ ఫైళ్లను రెండు రోజుల క్రితమే క్లియర్ చేశాం.– డాక్టర్ వి.సుజాత, డీఎంహెచ్ఓ -
అన్నం పెట్టే రైతులపై కూటమి రాక్షసత్వం
● వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 9న అన్నదాతపోరు ● పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి కాకాణినెల్లూరు (స్టోన్హౌస్పేట): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆది నుంచి రాక్షసత్వం ప్రదర్శిస్తోందని, ఎరువులు అడిగితే ముఖ్యమంత్రి, మంత్రి రైతులను, వైఎస్సార్సీపీ నేతలను పశువులతో పోల్చుతూ మాట్లాడడం అందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. రైతుల సమస్యలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 9న ఆర్డీఓ కార్యాలయాల వద్ద అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ధర్నా నిర్వహించి ఆర్డీఓలకు వినతిపత్రం అందజేస్తామన్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ‘అన్నదాత పోరు’ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ప్రధాన సమస్యగా ఉందని, రైతులు క్యూలో నిలబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విత్తనాల కోసం క్యూలో నిలబడాల్సిందేనని, చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇది కామన్ అన్నారు. రైతులకు చెందాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్కు తరలించేసి కృత్రిమ సంక్షోభం సృష్టించారని, వ్యవసాయశాఖ మంత్రి దీన్ని పట్టించుకోకుండా రైతులపై చులకనగా మాట్లాడుతున్నారు. ఇది సిగ్గుచేటన్నారు. అటు యూరియాను బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకు కొనాల్సిన పరిస్థితి ఉందన్నారు. అసలు ఆర్బీకేల ద్వారా ఎరువులు, యూరియా ఎందుకు ఇవ్వడం లేదనేది చెప్పాలన్నారు. ఎడగారు కోతలు.. దోపిడీలో దళారులు జిల్లాలో ఎడగారు కోతలు మొదలయ్యాయని, ఎక్కడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు ప్రవేశించి తక్కువ ధరకు ధాన్యాన్ని దోచుకుంటున్నారన్నారు. జిల్లాలో పుట్టి ధాన్యానికి గిట్టుబాటు ధర రూ.19,770 ఉంటే దాని కంటే తక్కువగా అమ్ముకుని రైతులు నష్టపోతున్నారన్నారు. ఫలితంగా రైతులు ఒక పుట్టిపై రూ.4 వేలు నష్టపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఎడగారు కోతలతో వస్తున్న ధాన్యాన్ని మద్దతు ధరతో ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, వైఎస్సార్ తెచ్చిన ఉచిత విద్యుత్ , జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాలను కూటమి ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. జగన్మోహన్రెడ్డి 54 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందిస్తే చంద్రబాబు 46 లక్షల మందికే అన్నదాత సుఖీభవ పథకాన్ని పరిమితం చేశారన్నారు. చంద్రబాబు మొదటి విడత ఎగ్గొట్టి, రెండో విడతలో 8 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ ఎగనామం పెట్టారన్నారు. అన్నదాతలందరికి ఈ పథకాలు వర్తించేలా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుని అన్నదాత సుఖీభవను రైతులందరికీ వర్తింపచేయాలని, అధిక వడ్డీలతో పెట్టుబడి తెచ్చుకుంటున్న రైతులను ఆదుకుని బాసటగా నిలవాలన్నారు. ఈ డిమాండ్లపై ఈ నెల 9వ తేదీన ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్లలో నిరసన ర్యాలీలు చేపట్టి ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీఓలకు వినతులు సమర్పించు రైతు సమస్యలను వివరిస్తామన్నారు. వైసీపీ శ్రేణులందరూ ఈ నిరసనలో పాల్గొని రైతులకు అండగా నిలబడాలని పిలుపునిస్తున్నామని, దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. -
టీడీపీలో ‘కాలువ’ కయ్యం
ఆ ఇద్దరూ టీడీపీలో కీలక నేతలు. ఒకరు ఎమ్మెల్యే దగుమాటి. మరొకరు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మాలేపాటి. ఎన్నికల ముందు కలిసి మెలిసి ఉన్నా.. తర్వాత ఇద్దరి మధ్య పరిస్థితి నిప్పు, ఉప్పు అన్నట్లుగా మారింది. దగుమాటి ఏకంగా మాలేపాటిపై క్రిమినల్ కేసులు పెట్టించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొంత కాలం మౌనంగా ఉన్న మాలేపాటి తనకు పదవి రావడంతో ఎమ్మెల్యేతో ‘సై’ అంటూ ఆయనపై అవినీతి ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. ఏకంగా సీఎం చంద్రబాబుకే ఎమ్మెల్యే దగుమాటి అక్రమాలపై ఫిర్యాదులు చేయడంతో అధికార పార్టీ నేతల మధ్య పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పరస్పర వర్గాల ఆరోపణలు, విమర్శలు, హెచ్చరికలతో అంతర్యుద్ధం జరుగుతోంది.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి టీడీపీలో ముఖ్య నేతల కలహాలు తార స్థాయికి చేరాయి. మొన్నటికి మొన్న ఎమ్మెల్యే కావ్య అనుచర వర్గం సాగిస్తున్న గ్రావెల్ అక్రమ రవాణాపై బహిరంగంగానే ధ్వజమెత్తిన రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు, తాజాగా దగదర్తి–రాచర్లపాడు చానల్ ఆధునికీకరణ పనుల్లో ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అవినీతిపై ఏకంగా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయడంతో ఆ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. స్థానిక కాంట్రాక్టర్తో కుమ్మకై ్క కాలువ లైనింగ్ పనులు మార్చేశారని, ఆయకట్టు రైతులు నష్టపోతున్నారనని ఆయన మీడియా ముందుకు రావడంతో పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి.కావ్యతో మాలేపాటి ఢీ అంటే ఢీఈ క్రమంలో బీదకు ఎమ్మెల్సీ పదవి రావడంతో మాలేపాటికి కొంత ఊపిరి వచ్చింది. పార్టీ అధిష్టానం వద్ద బీదకు ఉన్న పరపతితో మాలేపాటికి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పదవి ఇప్పించారు. అయినప్పటికీ మండల స్థాయిలో తన వర్గానికి అధికారులు ఏ చిన్న పని కూడా చేయకుండా ఎమ్మెల్యే హుకుం చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యేతో ఢీ కొట్టేందుకు సిద్ధపడ్డారు. ఇటీవల ఎమ్మెల్యే అనుచర వర్గం గ్రావెల్ అక్రమ రవాణాపై బహిరంగ ఆరోపణలు చేయడంతోపాటు తన వర్గం మట్టి తోలుకుంటుంటే అడ్డగించిన అధికారులతోనే వైరివర్గం యంత్రాలను సీజ్ చేయించడంతో ఆ పార్టీ నేతల మధ్య అంతర్యుద్ధం ప్రారంభమైంది.సీఎంకు ఫిర్యాదుతో టీడీపీలో కలకలంతాజాగా డీఆర్ చానల్ డిజైన్ మార్పు విషయంలో సీఎం చంద్రబాబుకు మాలేపాటి ఆధారాలు, ఫొటోలతో సహా ఫిర్యాదు చేయడంతో ఆ పార్టీలో కలకలం రేగింది. వర్క్ డిజైన్ మార్పుతో స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించినట్లు తెలుస్తోంది.డీఆర్ చానల్ వేదికగా రచ్చవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.26 కోట్లతో దగదర్తి–రాచర్లపాడు చానల్ ఆధునికీకరణ పనులు మంజూరయ్యాయి. అయితే ఆ పనిని నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్ దక్కించుకుని సబ్ కాంట్రాక్టర్కు పని అప్పగించారు. ప్రస్తుతం కొంత భాగం పనులు కూడా పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం రాకతో ఆ పనుల డిజైన్ మార్చేసి నిధులు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలున్నాయి. కాలువ లైనింగ్, పూడికతీతతో పాటు, రెండు చోట్ల సైపన్ల నిర్మాణం చేయాల్సి ఉంది. అయితే ఎస్టిమేషన్లో ఉన్న సైఫన్లు నిర్మించాల్సి ఉన్నా.. స్థానిక ఎమ్మెల్యే అందులో రెండు తొలగించి చేపడుతున్నారనే మాలేపాటి ఆరోపణలు. దీనివల్ల వరద నీరు వెళ్లే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఎస్టిమేషన్లో పొందుపరిచిన విధంగా కాకుండా డిజైన్ మార్చేయడంతో దగదర్తి రైతులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని మాలేపాటి చెబుతున్నారు. ఈ వ్యవహారం వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని బహిరంగంగా మీడియా ముఖంగా ఆరోపణలు చేయడంతో సంచలనం రేపింది. రెండు వంతెనల నిర్మాణం నిలిపివేసి నిధులు పక్కదారి పట్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని మాలేపాటి విమర్శలు చేస్తుంటే.. వాగు పోరంబోకు భూములను ఆక్రమించుకుని, కమీషన్ల కోసమే అభివృద్ధి పనులు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే అనుచర వర్గం ఆరోపిస్తోంది.పదవి రాగానే పగ..ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అనుచరుడిగా పార్టీలో క్రీయాశీలకంగా ఉన్న మాలేపాటి గత ఎన్నికలకు ముందు వరకు పార్టీని నడిపించారు. 2019 ఎన్నికల తర్వాత పార్టీని టీడీపీ నేతలు వదిలేసినా ఆ పార్టీ కి వెన్నుదన్నుగా నిలిచి రూ.కోట్ల ఖర్చు పెట్టుకుని ఎన్నికల ముందు కాడె నెత్తుకుని పార్టీ కోసం కష్టపడ్డారు. కానీ టీడీపీ అధినేత మాలేపాటికి ఝలక్ ఇచ్చి వైఎస్సార్సీపీ నేతగా ఉన్న దగుమాటిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చారు. బీద కూడా తన అనుచరుడికి అన్యాయం చేసినట్లేనని అప్పట్లో పార్టీ వర్గాలు మండిపడ్డాయి. అయినప్పటికీ పార్టీ విజయం కోసం పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎమ్మెల్యేగా దగుమాటి వెంకటకృష్ణారెడ్డి విజయం సాధించడంతో రాజకీయంగా మరో వ్యక్తి తనకు అడ్డుగా ఉండకూడదని భావించారు. మాలేపాటి వర్గాన్నే కాకుండా.. ఏకంగా ఆయన్నే టార్గెట్ చేశాడు. నియోజకవర్గ నాయకుడి నుంచి గ్రామస్థాయి కార్యకర్తగా మార్చేశారు. మాలేపాటి వర్గం అని చెప్పుకునేందుకు కార్యకర్తగా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఆయన చెబితే గ్రామస్థాయి వీఆర్వో కూడా పనిచేయని పరిస్థితి. ఈక్రమంలో మాలేపాటిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించడానికి సైతం ఎమ్మెల్యే వెనుకాడలేదు. ఈ క్రమంలో దగదర్తి మండలంలో మాలేపాటికి వ్యతిరేక వర్గం ఉన్న పమిడి రవికుమార్చౌదరిని ప్రోత్సహిస్తూ రావడంతో పార్టీలో ఘోర అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
నిరంతరాయంగా యూరియా సరఫరా
● కలెక్టర్ ఆనంద్ నెల్లూరురూరల్: జిల్లాలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిరంతరాయంగా యూరియాను సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 2,471 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. రాబోయే 10 రోజుల్లో మరో 500 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానున్నట్లు చెప్పారు. రైతులు ఆధార్ విధానం ద్వారా యూరియా కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతు సేవా కేంద్రాల్లో యూరియా అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. ఎవరైనా అధిక ధరలకు యూరియా అమ్మితే సమీపంలో ఉన్న మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయాలన్నారు. యూరియాకు ఇబ్బందులు పడుతుంటే టోల్ ఫ్రీ నంబరు 8331057285లో సంప్రదించాలని, రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా, యూరియాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. -
పేదల బియ్యం.. తమ్ముళ్ల వ్యాపారం
సాక్షి, టాస్క్ఫోర్స్: టీడీపీ నేతలు ధనదాహంతో బరితెగిస్తున్నారు. పేదల కడుపులు కొట్టి.. తమ బొక్కిసాలు నింపుకుంటున్నారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వ సరఫరా చేస్తున్న రేషన్ బియ్యాన్ని అధికార పార్టీ నేతలే దోచుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో మంత్రి ఆనం ఇలాకా ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం మండలంలో టీడీపీ నేతలు మాఫియాగా మారారు. ప్రధానంగా ఆ మండలంలోని వెంగంపల్లి అడ్డాగా అక్రమ రవాణా సాగిస్తున్నారు. నెల మొదటి వారంలోనే ఖాళీ అనంతసాగరం మండలంలో సుమారు 13,600 రేషన్ కార్డులు ఉండగా, సుమారు 340 టన్నుల బియ్యం సరఫరా అవుతోంది. అయితే ఇందులో 90 శాతం బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని తెలుస్తోంది. గత నెల మొదటి వారంలో ఈ మండలం నుంచి మినీ వాహనంలో కోవూరు సమీపంలోని ఓ రైస్మిల్లుకు తరలిస్తుండగా సుమారు 13 టన్నుల బియ్యం పట్టుబడిన విషయం విదితమే. తాజాగా ఈ నెల 3వ తేదీ 250 బస్తాలు 17.5 టన్నుల రేషన్ బియ్యం పట్టుబడగా, శనివారం 80 బస్తాలు 6 టన్నుల బియ్యం పట్టుబడింది. దీన్నిబట్టి ఏ స్థాయిలో జరుగుతుందో స్పష్టమవుతోంది. ప్రతి నెలా 31వ తేదీకి ముందే రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. 1వ తేదీ నుంచి కార్డుదారులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే కార్డుదారులకంటే ముందే రేషన్ మాఫియా అక్రమ మార్గంలో రైస్మిల్లులకు తరలించి పాలిష్ పట్టించి బ్రాండెడ్ బ్యాగుల్లో ప్యాక్ చేసిన నాణ్యమైన బియ్యంగా విక్రయిస్తున్నారు. మంత్రి ఆనం ఇలాకాలోనే... ప్రధానంగా మండలంలోని వెంగంపల్లి గ్రామాన్ని రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా మారింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ముఖ్య అనుచరులైన గ్రామానికి చెందిన టీడీపీ నేతలు బుట్టి మహేష్రెడ్డి (ప్రధాన సూత్రధారి)అనుసంధానంతో యనమల వంశీకృష్ణారెడ్డి, హజరత్రెడ్డి మాఫియా డాన్లుగా మారారు. పొలాల్లోని గోడౌన్లలో నిల్వ ఉంచి రాత్రి వేళల్లో అధికారులు పచ్చజెండా ఊపగానే నేరుగా నెల్లూరు, కావలి రైస్ మిల్లులకు తరలించి కిలో బియ్యాని రూ.35కు అమ్ముకుంటూ రూ.కోట్లు సొమ్ము చేసుకుంటున్నారని వెంగంపల్లిలో కోడై కూస్తోంది. వాహనాన్ని అడ్డుకున్న విలేకరులు మండలంలోని నల్లరాజుపాళెం కాలువ గట్టుపై వెంగంపల్లికి చెందిన టీడీపీ నేతలకు చెందిన అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఓ మినీవ్యాన్ను శనివారం స్థానిక విలేకరులు అడ్డుకొని సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దీంతో సివిల్ సప్లయీస్, పోలీస్, రెవెన్యూ అధికారులు వాహనం వద్దకు వచ్చి వాహనాన్ని తనిఖీ చేయగా, 80 బస్తాల రేషన్ బియ్యం ఉండడాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేశారు. మంత్రి ఆనం ఇలాకాలో రేషన్ బియ్యం మాఫియా అక్రమ రవాణాకు అడ్డాగా వెంగంపల్లి మాఫియా డాన్లుగా మహేష్ రెడ్డి, వంశీకృష్ణ, హజరత్ రెడ్డి 80 బస్తాలను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న మీడియా మామూళ్ల మత్తులో సంబంధిత అధికారులు మండలంలోని పలు రేషన్ డీలర్లు లబ్ధిదారులకు కిలో రూ.15 నగదు ఇచ్చి బియ్యాని కొనుగోలు చేసి మాఫియాకు కిలో రూ.20 వంతున అమ్ముకుంటూ అక్రమానికి పాల్పడుతున్నారని గ్రామాల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా మాఫియాకు సహకరించని డీలర్ల పరిధిలోని కార్డుదారుల వద్దకే మాఫియా మనుషులే నేరుగా వెళ్లి బియ్యాని కొనుగోలు చేస్తున్నారనేది జగద్వితమే. రూ.15లకు కొని.. రూ.20 అమ్మి.. -
వేళాంగణిమాత మహోత్సవాలు ప్రారంభం
తోటపల్లిగూడూరు: కోడూరులో వేళాంగణిమాత ఉత్సవాలు అట్టహాసంగా శనివారం ప్రారంభమయ్యాయి. పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ లూకాస్రాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను జరిపారు. మరియమాత – రక్షణ సహకారిణి అనే అంశంపై భక్తులకు దైవ సందేశాన్ని పలువురు అందించారు. మరియమాత తేరు ప్రదక్షిణ కార్యక్రమాన్ని ముత్యాలతోపు మీదుగా మహాలక్ష్మీపురం వరకు సాగింది. ప్రార్థనల అనంతరం స్థానికంగా ఉన్న కోడూరు బీచ్లో సముద్ర స్నానాలను స్థానికులు ఆచరించారు. ఉత్సవాల్లో నేడు వేళాంగణి మాత ఉత్సవాల్లో భాగంగా ఉదయకాల ప్రార్థన, ఆరాధన – స్వస్థత ప్రార్థనలు, దివ్య బలిపూజ, పరిశుద్ధ జపమాల తదితరాలను ఆదివారం నిర్వహించనున్నారు. వేళాంగణి చర్చి నుంచి కొత్తకోడూరు వరకు వేళాంగణిమాత విగ్రహ తేరుప్రదక్షిణ రాత్రి 8.30కు జరగనుంది. -
చికెన్ వ్యర్థాల వాహన అడ్డగింత
ముత్తుకూరు(పొదలకూరు): చికెన్ వ్యర్థాల వాహనాన్ని మండలంలోని తాళ్లపూడి పంచాయతీ బసరాలదిబ్బలో గ్రామస్తులు శనివారం అడ్డుకున్నారు. దుర్గంధాన్ని భరించలేకపోతున్నామంటూ వాహనాన్ని అధికార పార్టీ నేతలే అడ్డుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. చేపల చెరువుల్లో మేతగా వేసేందుకు గానూ బెంగళూరు నుంచి కోళ్ల వ్యర్థాలను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఈ ప్రాంతానికి వాహనం ప్రతి శుక్రవారం రాత్రి వచ్చి శనివారం వెళ్తోంది. వాహన రాకను గ్రామస్తులు గమనించి, దాన్ని అడ్డుకొని ఆందోళనను చేపట్టారు. ఈ ప్రాంతానికి రాకుండా కట్టడి చేయాలని కోరుతూ పోలీసులకు సమాచారమిచ్చారు. -
హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి
నెల్లూరు(అర్బన్): వైద్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని యునైటెడ్, మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. నగరంలోని ఏసీఎస్సార్ మెడికల్ కళాశాల, ప్రభుత్వ వైద్యశాల కమిటీ మహాసభను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. పారిశుధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కనీస వేతనంగా రూ.26 వేలను చెల్లించాలని కోరారు. పీఆర్సీని తక్షణమే ప్రకటించి.. మధ్యంతర భృతిని ఇవ్వాలన్నారు. అనంతరం ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన కమ్మటి శ్రీనివాసులు, కవి మోపూరు పెంచలనరసింహాన్ని సత్కరించారు. నూతన కార్యవర్గ ఎన్నిక ఈ సందర్భంగా యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎ న్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా నరమాల సతీష్కుమార్, గౌరవ సలహాదారుగా కమ్మటి శ్రీనివాసులు, అధ్యక్ష, కార్యదర్శులుగా ఉరూజ్, సందానీబాషా, అసోసియేట్ ప్రెసిడెంట్లుగా ప్రసన్నకుమార్, పార్థసారథి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా శ్రీనివాసరావు, రవీంద్రరాజు, కోశాధికారిగా గౌడ భాస్కర్, ఉపాధ్యక్షులుగా రాజ్కుమార్, రవివందన్, కామాక్షయ్య, సహాయ కార్యదర్శులుగా రీటా, తిరుపతి, జబ్బార్, కార్యవర్గ సభ్యులుగా కుమార్, అనీష్, అస్లామ్, వెంకటేశ్వర్లు, సునీతమ్మ, సావిత్రి, తిరుమలేష్, వెంకటరత్నం ఎన్నికయ్యారు. -
మండల సర్వసభ్య సమావేశం రసాభాస
పొదలకూరు: మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా శనివారం మారింది. టీడీపీకి చెందిన కొందరు నేతలు కలగజేసుకొని సభలోకి రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సభ్యులు, నేతల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న ఎస్సై హనీఫ్.. సమావేశం వద్దకొచ్చి బందోబస్తును నిర్వహించడంతో సభను ఎంపీపీ సుబ్బరాయుడు, వైస్ ఎంపీపీ వేణుంబాక చంద్రశేఖర్రెడ్డి యథావిధిగా నిర్వహించారు. జరిగిందిదీ.. సొసైటీ చైర్మన్గా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ మండలాధ్యక్షుడు తలచీరు మస్తాన్బాబు ప్రొటోకాల్ మేరకు సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఆయనతో పాటు కొందరు నేతలు హాజరై బయటే ఉన్నారు. సభ ప్రారంభమయ్యాక అధికారుల గైర్హాజరుపై పొదలకూరు బిట్ – 4 ఎంపీటీసీ సభ్యుడు గుంటి శ్రీనివాసులు ప్రశ్నలేవనెత్తారు. దీంతో మస్తాన్బాబు.. శ్రీనివాసులు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో బయటున్న టీడీపీ నేతలు సభలోకి చొచ్చుకొచ్చి, సభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఫలితంగా అరుపులు, కేకలతో గందరగోళం నెలకొంది. సభలోనే ఉన్న కొందరు సభ్యులు, వైస్ ఎంపీపీ సర్దిచెప్పడంతో వారు వెళ్లిపోయారు. దీంతో హాజరైన అధికారులతో సమీక్షను నిర్వహించారు. కొద్దిసేపటి తర్వాత సభాహక్కులు, నియమ నిబంధనలపై దుగ్గుంట ఎంపీటీసీ సభ్యుడు కేతు రామిరెడ్డి మాట్లాడటంతో సొసైటీ చైర్మన్, వైస్ ఎంపీపీ, సభ్యుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం నెలకొంది. ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరం వద్దకు ఎస్సై వచ్చి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తును నిర్వహించారు. దాడికి యత్నించారు సభలోకి ఇతరులు ప్రవేశించి తనపై దాడికి యత్నించారని పొదలకూరు బిట్ – 4 ఎంపీటీసీ సభ్యుడు గుంటి శ్రీనివాసులు ఆరోపించారు. అధికారులతో తానెప్పుడూ గౌరవంగానే మాట్లాడతానని, అయితే రెండు, మూడు సమావేశాలకు వీరు సక్రమంగా హాజరుకాకపోవడంతో సభ దృష్టికి తీసుకురావాల్సి వచ్చిందన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు సభలోకి చొచ్చుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. టీడీపీ నేతలు చొచ్చుకురావడంతో ఉద్రిక్తత అరుపులు, కేకలతో గందరగోళం సభ్యులు, నాయకుల మధ్య వాగ్వాదం పోలీస్ బందోబస్తుతో ముగిసిన సభ -
గిట్టుబాటు ధర కల్పనే లక్ష్యం
● జేసీ కార్తీక్ నెల్లూరు రూరల్: ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జేసీ కార్తీక్ సూచించారు. ధాన్యం కొనుగోలు విషయమై అధికారులు, వ్యాపారులు, రైస్ మిల్లర్లకు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు నష్టపోకుండా చూడాలని ఆదేశించారు. మండలానికో కమిటీ ఏర్పాటు చేయాలని, ఇందులో సివిల్ సప్లయ్స్, వ్యవసాయ, పోలీస్ శాఖల నుంచి ఒకర్ని నియమించాలని సూచించారు. పుట్టికి ప్రస్తుతం రూ.16,800 గిట్టుబాటు ధర లభిస్తోందని, దీనికి కట్టుబడి ఉంటామన్నారు. 30 శాతం కోతలు పూర్తి జిల్లాలో వరికోతలు ప్రస్తుతానికి 30 శాతం పూర్తయ్యాయని రైతు సంఘ నేతలు తెలిపారు. పుట్టిని దళారులు, మిల్లర్లు రూ.16 వేలకు కొనుగోలు చేస్తున్నారని, అదే పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న వారు రూ.16,700 మేర అందజేస్తున్నారని చెప్పారు. అయితే వీరు రైతుల వద్దకు రాకుండా రాజుపాళెంలోని ఏజెంట్లను పంపించి స్థానిక దళారులు ద్వారా ధాన్యాన్ని సేకరిస్తున్నారని వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.19,720 మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేసే వారిపై చర్యలు చేపట్టాలని కోరారు. గంగపట్నం రమణయ్య, షానవాజ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో స్థానిక సందడి
● మూడు నెలల ముందే సర్పంచ్ ఎన్నికలు ● ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ● జనవరిలో నిర్వహణకు తాత్కాలిక షెడ్యూల్ సీతారామపురం: గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి అప్పుడే మొదలైంది. వీటికి సిద్ధం కావాలంటూ పంచాయతీ రాజ్ శాఖకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ లేఖలు రాసిన తరుణంలో ముందస్తుగా వెళ్లాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. దీనికి తగిన విధంగా జిల్లా అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేసింది. కసరత్తు షురూ.. వాస్తవానికి సర్పంచ్ల పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్తో ముగియనుంది. అయితే మూడు నెలల ముందే ఎన్నికల నిర్వహణకు చట్టంలో ఉన్న వెసులుబాటు మేరకు కసరత్తును ప్రారంభించింది. తాత్కాలిక షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేయడంతో గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది. ఆశావహులపై అప్పుడే చర్చ సర్పంచ్ స్థానాలు, వార్డుల్లో ఎవరు పోటీ చేయాలనే అంశంపై అప్పుడే చర్చ జోరందుకుంది. జిల్లాలో 940 పంచాయతీలు.. 10,741 వార్డులున్నాయి. జిల్లాలో సుమారు 33.25 లక్షల జనాభా ఉండగా, వీరిలో 24,03,026 మంది ఓటర్లుగా ఉన్నారు. గడువుకు ముందే ఎన్నికల నిర్వహణకు వీలుగా కార్యకలాపాలను పూర్తి చేయాలని అధికార యంత్రంగాన్ని ఎస్ఈసీ అప్రమత్తం చేసింది. తాత్కాలిక షెడ్యూల్ మేరకు వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను అక్టోబర్ 15లోపు.. వార్డుల వారీగా ఓటర్ల జాబితాను అదే నెల 16 నుంచి నవంబర్ 15లోపు సిద్ధం చేసి ప్రచురించాల్సి ఉంది. ఎన్నికల అధికారులను నవంబర్ 15లోపు నియమించాలి. ఆపై పోలింగ్ కేంద్రాలను నవంబర్ 16 నుంచి 30లోపు ఖరారు చేయడం తదితరాలను పూర్తి చేయాల్సి ఉంది. రిజర్వేషన్లను డిసెంబర్ 15లోపు ఖరారు చేసి అదే నెల చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలను నిర్వహించాలి. వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ను ఇచ్చి, ఫలితాలను అదే నెల్లో ప్రకటించాలి. సజావుగా సాగేనా..? రెడ్బుక్ పేరిట క్షేత్రస్థాయిలో ఏకగ్రీవం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల నిర్వహించిన ఉప ఎన్నికల్లో కూటమి నేతలు ఎలా బెదిరింపులకు పాల్పడ్డారో అందరికీ తెలిసిన విషయమే. ఏ పార్టీ మద్దతుదారులకు సర్పంచ్గా కూటమి పార్టీలు అవకాశమిస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
ఎంపీడీఓ కార్యాలయంలో తనిఖీ
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు ఎంపీడీఓ కార్యాలయాన్ని జెడ్పీ సీఈఓ మోహన్రావు ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. మండల పరిషత్ లావాదేవాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. కార్యాలయ సిబ్బంది సమయపాలనను పాటించాలని కోరారు. నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. స్వచ్ఛభారత్ను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. జనరల్ ఫండ్, 15వ ఆర్థిక సంఘ నిధులు రూ.కోటి వరకు మండల పరిషత్కు వచ్చే అవకాశం ఉన్న తరుణంలో ప్రాధాన్య క్రమంలో ఖర్చు చేయాలని పేర్కొన్నారు. -
ఉద్యమాలకు ఉద్యోగులు సిద్ధం కావాలి
● డివిజన్ స్థాయిలో సంఘాల బలోపేతం ● ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజునెల్లూరు(అర్బన్): ‘ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదు. ఉద్యోగులు తమ హక్కులు సాధించుకునేందుకు ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలి’ అని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సూచించారు. జేఏసీలో భాగస్వామ్య పక్షాలైన వివిధ ప్రభుత్వ శాఖల అసోసియేషన్ నాయకులు, రాష్ట్ర నాయకులతో కలిసి శుక్రవారం నెల్లూరు దర్గామిట్టలోని నెల్లూరు క్లబ్లో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో బొప్పరాజు పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులకు సంబంధించి రావాల్సిన పెండింగ్ బకాయిలు, ఇతర సౌకర్యాలు సాధించుకునేందుకు మరోమారు అందరిని కలుపుకొని పోరాటం చేయాలన్నారు. పోలీసుల సమస్యలనే ముందుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. వారితోపాటు అన్ని శాఖల ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు, ఆర్జిత సెలవుల నగదు, పెన్షన్ నగదు తదితర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పోరాటాలు చేయాలంటే తమ, తమ విభాగాల్లో డివిజన్ స్థాయిలో సంఘాలను బలోపేతం చేసుకోవాలన్నారు. ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలు గురించి చర్చించాలన్నారు. ఉద్యమంలో మహిళలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. మహిళలకు ప్రసూతి సెలవుల్ని కేంద్ర ప్రభుత్వంమాదిరిగా రెండు సంవత్సరాలకు పెంచాలని కోరామన్నారు. మరోవైపు ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేయించేందుకు పోరాట ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఇప్పటికే ఉమ్మడి 12 జిల్లాల్లో జేఏసీ సమావేశాలు పూర్తి చేశామన్నారు. చిత్తూరు జిల్లాలో కూడా సమావేశం పూర్తి చేసి అనంతరం భాగస్వామ్య పక్షాలతో కలిసి ఉద్యమ ప్రణాళికను సిద్ధం చేస్తామన్నారు. ● వివిధ శాఖలకు చెందిన అసోసియేషన్ల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ తీరును నిరసించారు. ఏపీజేఏసీ జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసులు, వెటర్నరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జయప్రకాష్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కుమార్రెడ్డి, ఫైర్ డిపార్ట్మెంట్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్ర, పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాబూరావు, క్లాస్ – 4 అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, వార్డు సచివాలయ అధ్యక్షుడు థామస్, హెడ్మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెంచురామయ్య, ఏపీ జేఏసీ మహిళా వింగ్ చైర్మన్ సోమిశెట్టి వసంతకుమారి, ప్రధాన కార్యదర్శి చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో మిలాద్ – ఉన్ – నబీ
నెల్లూరు(బృందావనం): మహమ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని మిలాద్ – ఉన్ – నబీని శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నగరంలోని మసీదుల్లో ప్రత్యేక దువా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో అన్నదానం కార్యక్రమాలను చేపట్టారు. జెండావీధి కోటమిట్ట వద్ద ఉన్న అమీనియా మసీదు నుంచి సంప్రదాయంగా ప్రదర్శన నిర్వహించారు. ఇందులో మతపెద్దలు, ఇమామ్లు, మౌ ల్వీలు ముస్లింలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ప్రదర్శన జెండావీధి కోటమిట్ట వద్ద ఉన్న అమీనియా మసీదు నుంచి ప్రారంభమై మెయిన్రోడ్డు షాదీమంజిల్, చేపల మార్కెట్, వహబ్పేట, బారకాసు సెంటర్, ఆచారివీధి, మద్రాస్ బస్టాండ్, వీఆర్సీ, గాంధీబొమ్మ, ఏసీ సెంటర్, ములుముడి బస్టాండ్, చిన్నబజారు, పెద్దబజారు మీదుగా కోటమిట్ట చేరింది. ఇందులో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ, ఆ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఖలీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
ఇలాంటి రాజకీయాలను ఎప్పుడూ చూడలేదు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ● ప్రసన్న కుటుంబీకులకు పరామర్శ నెల్లూరు(స్టోన్హౌస్పేట): జిల్లాలో ప్రస్తుతమున్న రాజకీయాలను ఎన్నడూ చూడలేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. సుజాతమ్మ కాలనీలోని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి నివాసానికి శుక్రవారం వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం కాకాణి మాట్లాడారు. రాష్ట్రంలో హుందా రాజకీయాలు.. ప్రజలతో సత్సంబంధాలు కలిగిన కుటుంబం నల్లపరెడ్డిదని చెప్పారు. ఓటమి ఎరుగని నేత శ్రీనివాసులురెడ్డి అని, అంతటి చరిత్ర గల కుటుంబ వారసుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ప్రజలతో మమేకమై వారి అభిమానాన్ని పొందారని తెలిపారు. శ్రీనివాసులురెడ్డి సతీమణి పెద్దావిడ ఇంట్లో ఒక్కరే ఉన్నారనే ఆలోచన చేయకుండా.. మానవత్వాన్ని మరిచి రౌడీమూకలు దాడి చేయడం దారుణమన్నారు. బిహార్ తరహా రాజకీయాలను కూటమి ప్రభుత్వం పరిచయం చేస్తోందని ఆరోపించారు. ప్రసన్న ఇంటిపై దాడి జరిగితే కారకులైన రౌడీషీటర్లకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. ఆయన కుటుంబాన్ని తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పరామర్శించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అక్రమ కేసులను బనాయించడంలో పీహెచ్డీని ఎస్పీ చేశారని విమర్శించారు. పోలీసుల తీరు సరికాదు జిల్లాలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని కాకాణి పేర్కొన్నారు. దాడి చేసిన వారికి అధికార పార్టీతో సంబంధం లేకపోతే కేసుల నమోదుకు పోలీసులు ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు. దాడి చేసిన వారిని కాపాడుతూ మొక్కుబడిగా అరెస్ట్ చేసి మళ్లీ విడిచిపెట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. న్యాయస్థానాన్ని ప్రసన్న ఆశ్రయించారని, నిర్దోషిగా తీర్పొస్తుందని చెప్పారు. ప్రసన్నకుమార్రెడ్డికి జిల్లా ప్రజలు, పార్టీ అండగా నిలుస్తోందని తెలిపారు. ఈ ఘటన టీడీపీ పతనానికి నాంది పలకనుందని చెప్పారు. కారకులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
మెడికవర్లో వాస్కులర్ సర్జరీ సేవలు ప్రారంభం
నెల్లూరు(అర్బన్): నగరంలోని మెడికవర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నెల్లూరులోనే తొలిసారిగా పూర్తి స్థాయిలో వాస్కులర్, ఎండో వాస్కులర్ సర్జరీ సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రారంభించామని ఆ విభాగం కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ సుదర్శన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆస్పత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చెన్త్నె, హైదరాబాద్కు వెళ్లే అవసరం లేకుండా సేవలందిస్తున్నామన్నారు. మధుమేహ రోగుల్లో రక్త ప్రసరణ తగ్గినప్పుడు కాలి వేళ్లు, కాలు తీసేయాల్సిన అవసరం లేకుండా వైద్యం చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదంలో రక్తనాళాలు దెబ్బతింటే వాటికి సర్జరీ చేసి సరి చేయడం జరుగుతుందన్నారు. డయాలసిస్ కోసం ఫిస్టులా గ్రాఫ్ట్ శస్త్రచికిత్సలు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో నిర్వహిస్తామన్నారు సెంటర్ హెడ్ రంజిత్రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పూర్తి స్థాయి సేవలందించే వాస్కులర్ సర్జన్ విభాగం మెడికవర్లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. సమావేశంలో మెడికల్ సూపరింటెండెంట్ డా.అభిజిత్, మార్కెటింగ్ హెడ్ వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
● బాణసంచా పేలుడుతో ప్రమాదం కోవూరు: పట్టణంలోని సత్రం వీధికి చెందిన గణేష్ నిమజ్జన ఊరేగింపులో గురువారం రాత్రి అపశ్రుతి చోటు చేసుకుంది. లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన బ్యాటరీ వాహనం ఊరేగింపు ముందు వెళ్తోంది. అందులో జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయి. ఉత్సవం సందర్భంగా బాణసంచా కాల్చారు. దీంతో నిప్పురవ్వలు స్టిక్స్పై పడి పేలిపోయాయి. బ్యాటరీ వాహనానికి మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సమీపంలో ఉన్న సాయిబాబా మెడికల్ షాప్ యజమాని బ్రహ్మయ్య భార్య లక్ష్మి (45) తీవ్రంగా గాయపడగా వెంటనే ఆమెను నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. అదేవిధంగా అక్కడే ఉన్న రాందేవ్బాబా (20) అనే యువకుడు స్వల్పంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న కోవూరు ఎస్సై రంగనాథ్గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఉత్సవ కమిటీలోని ఐదుగురిపై కేసు నమోదు చేశారు. పేలుడు వల్ల సమీపంలో ఉన్న భవనాలు దెబ్బతిన్నాయి. ● కొండ ప్రాంతాల్లో రాళ్లు పేల్చడానికి వాడే జిలెటిన్ స్టిక్స్ వెలుగు చూడటంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. ఉత్సవాల సమయంలో భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని విమర్శలున్నారు. గాయపడిన మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కోవూరులో ఉద్రిక్తత నెలకొంది. -
నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం
● ఘనంగా గురుపూజోత్సవం నెల్లూరు రూరల్: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ రానున్న ఐదు, పది సంవత్సరాల కాలంలో విద్యావ్యవస్థలో వచ్చే మార్పుల్ని దృష్టిలో ఉంచుకుని టీచర్లు శిక్షణ పొందాలన్నారు. జిల్లాలో ఎంపీఎస్ (మోడల్ ప్రైమరీ స్కూల్) వ్యవస్థను విజయవంతంగా నడిపించే బాధ్యత ఉపాధ్యాయులేదేనన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు సమన్వయంతో పనిచేస్తే విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావొచ్చన్నారు. జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ జీవితంలో తల్లిదండ్రుల తర్వాత మర్చిపోలేని వ్యక్తులు గురువులే అన్నారు. డీఈఓ డాక్టర్ బాలాజీరావు మాట్లాడుతూ జిల్లాలో 15 మంది స్కూల్ అసిస్టెంట్లు 25 మంది ఎస్జీటీలు, ఇద్దరు స్కౌట్ టీచర్లలను అవార్డులతో సత్కరించామన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ రీజినల్ చైర్మన్ సురేందర్రెడ్డి, డీఆర్వో విజయకుమార్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సమగ్ర శిక్ష అధికారి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘కూటమి’ తెచ్చిన కష్టం
కొత్త కార్డుల కోసం గుమిగూడారిలా.. నవలాకులతోటలో రేషన్ కోసం వేచి ఉన్న జనం నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనాలు ఇంటింటికీ వెళ్లి రేషన్ అందజేసేవి. నేడు లబ్ధిదారులు పనులు మానుకుని షాపుల ముందు క్యూలైన్లో ఉంటున్నారు. శుక్రవారం నెల్లూరు నవలాకులతోట ప్రాంతంలో రేషన్ దుకాణం వద్ద బియ్యం తీసుకునేందుకు గంటల తరబడి వేచి చూశారు. కొందరు వృద్ధులు ఉండలేక బియ్యం తీసుకోకుండానే వెళ్లిపోయారు. మరోవైపు నూతన కార్డులు తీసుకునేందుకు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
ఎనిమిది వారాలు పనిచేశాం
ఉపాధి పనులకు గతంలో రోజూ హాజరయ్యేవాళ్లం. ఎనిమిది వారాలు పనులు చేయగా, రెండు వారాలకే డబ్బులు పడ్డాయి. ఇప్పటివరకు మిగిలిన మొత్తాన్ని ఇవ్వలేదు. గ్రామాల్లో పనులనూ కల్పించడంలేదు. – లక్ష్మి, లక్ష్మీనారాయణపురం పనులు కల్పించడంలేదు గ్రామంలో ఉపాధి పనులను కల్పించడంలేదు. గతంలో చేసిన వాటికి డబ్బులివ్వలేదు. ఆరు వారాలకు సంబంధించిన వేతనాలు రావాల్సి ఉంది. – శ్రీదేవి, లక్ష్మీనారాయణపురం బకాయిలు చెల్లించాలి పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను చెల్లించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. నెలల తరబడి వీటిని మంజూరు చేయకపోతే ఎలా బతకాలి. వీటిని అందజేసేలా చొరవ చూపాలి. – చిన్నయ్య, లక్ష్మీనారాయణపురం త్వరలో అందజేసేలా చర్యలు ఉపాధి పనులకు హాజరయ్యే శ్రామికులకు వేతన బకాయిలను త్వరలో చెల్లించేలా చర్యలు చేపడతాం. వీరి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమవుతుంది. పనిదినాలు పెంచేలా రాష్ట్ర అధికారులు చర్యలు చేపడుతున్నారు. – గంగభవానీ, డ్వామా పీడీ ● -
దర్జాగా కబ్జా
● ప్రభుత్వ భూమి అనే బోర్డున్నా, లెక్కచేయని వైనం ● గ్రావెల్ను భారీగా కొల్లగొడుతూ.. ● రెవెన్యూ అధికారుల సహకారం కలువాయి (సైదాపురం): ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. దాన్ని కబ్జా చేయడంలో కూటమి నేతలు ముందు వరుసలో ఉంటున్నారు. తాజాగా వీరి కన్ను మండలంలోని వెంకటరెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న భూమిపై పడింది. రూ.లక్షల విలువజేసే దీన్ని దర్జాగా ఆక్రమించి.. మట్టిని కొల్లగొడుతూ యథేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమార్కుల వ్యవహారాలను మీడియా బయటపెడుతున్న తరుణంలో రెవెన్యూ వారు సైతం కొత్త ట్రిక్కులను నేర్చుకుంటున్నారు. గ్రామస్తులు ఫిర్యాదు చేయగానే ముందుగానే ప్రభుత్వ బోర్డును పెట్టి.. పగలూ, రాత్రనే తేడా లేకుండా మట్టి తోలుకునేందుకు ప్రోత్సహిస్తూ తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. కొత్త కథలు.. నేషనల్ హైవేను ఆనుకొని ఉన్న భూమి ముందుంది ప్రభుత్వ భూమి అని.. వెనుకుంది మాత్రం పక్కా అంటూ రెవెన్యూ అధికారులు కొత్త కథలు చెప్తున్నారు. రూ.30 లక్షల విలువజేసే ప్రభుత్వ భూమిని కూటమి నేతలు కబ్జా చేస్తున్నా, అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు నేషనల్ హైవే అథారిటీ అధికారులూ నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్నారు. జంక్షన్ల వద్ద తూర్పు, పడమర 40 నుంచి 50 మీటర్ల స్తీర్ణం కలిగి ఉండాలి. వీటికి పరిహారాన్నీ ఇచ్చారు. భూములను ఆక్రమిస్తున్న వ్యవహారం వీరికి తెలిసినా పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా ఈ విషయమై ఇన్చార్జి తహసీల్దార్ వెంకటేశ్వర్లును సంప్రదించగా, వెంకటరెడ్డిపల్లి జంక్షన్ వద్ద నేషనల్ హైవేను ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 360లో కొంత ప్రభుత్వ భూమి ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. దీనిక వెనుక వైపు పట్టా ల్యాండ్ అని తెలిపారు. ప్రభుత్వ భూమిగా హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశామని చెప్పారు. మట్టిని అక్రమంగా తోలుతున్న విషయమై ఎలాంటి చర్యలు చేపట్టారని ప్రశ్నించగా, సమాధానాన్ని దాటేశారు. -
ఉపాధి శ్రామికుల ఆకలి కేకలు
వారందరూ శ్రామికులు. ఉపాధి పనులు చేయగా వచ్చే వేతనాలతోనే తమ బతుకు బండిని నెట్టాలి. అయితే వీరి పొట్టకొట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఏకంగా నాలుగు నెలల నుంచి వీరికి నగదును అందించలేదంటే సమస్య తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వీరికి మొత్తం రూ.70 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. ఈ పరిణామాలతో పనులకు హాజరవ్వాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నెల్లూరు(పొగతోట): ఉపాధి హామీ శ్రామికులకు వేతనాలు మూడున్నర నెలలుగా అందలేదు. వీరు చేసిన పనులకు గానూ దాదాపు రూ.70 కోట్ల మేర చెల్లించాల్సి ఉన్నా, మీనమేషాలను ప్రభుత్వం లెక్కిస్తోంది. ఇవి అందక శ్రామికులు నానా అగచాట్లు పడుతున్నారు. శ్రామికులతో పనులు చేయిస్తున్న అధిక శాతం మంది ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. ప్రశ్నల వర్షం కూలీలకు రెండు వారాల వేతనాలను మే 21న చెల్లించారు. అప్పటి నుంచి వీరికి చిల్లిగవ్వ అందలేదు. పనుల పర్యవేక్షణకు వెళ్తున్న అధికారులపై ప్రశ్నల వర్షాన్ని శ్రామికులు కురిపిస్తున్నారు. ఈ నిధులను కేంద్రం నుంచి తీసుకురావడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైంది. 2021 నుంచి ఉపాధి పని దినాలు ఏటా కోటికిపైగానే ఉన్నాయి. అయితే కూటమి సర్కార్ కొలువుదీరాక ఇవి పెరగలేదు. గత ఆర్థిక సంవత్సరంలో 1.19 కోట్ల పని దినాలను పూర్తి చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.2 కోట్ల లక్ష్యాన్ని కలెక్టర్ ఆనంద్ నిర్దేశించారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం వీటిని పెంచలేదు. ఈ ఆర్థిక సంవత్సర ప్రారంభంలో 65 లక్షల పనిదినాల లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించగా, ఇప్పటి వరకు 63.61 లక్షల మేరే పూర్తి చేశారు. మిగిలిన లక్ష్యం రెండు వారాల్లో పూర్తికానుంది. ఆ తర్వాత శ్రామికులకు పనులుండవు. అదనంగా కల్పిస్తేనే ప్రయోజనం వాస్తవానికి కేంద్రం నిర్దేశించిన పనిదినాలు ఆగస్ట్లో పూర్తవుతాయి. మంత్రులు చర్చించి వీటిని అదనంగా మంజూరు చేయించాలి. ఇలా చేయడం ద్వారా డిసెంబర్ వరకు శ్రామికులకు పనులు లభించేవి. అయితే ప్రస్తుతం రాష్ట్ర మంత్రులు, అధికారులు కేంద్రంతో చర్చించినా, ఎలాంటి ఫలితం లేదని సమాచారం. వీటిని అధికంగా కల్పిస్తే దాని ద్వారా వచ్చే మెటీరియల్ కాంపొనెంట్తో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర భవన నిర్మాణాలకు నిధులు మంజూరవుతాయి. పనుల కేటాయింపులోనూ రాజకీయాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు ఉపాధి పనులను కల్పించడంలేదు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను కూటమి సర్కార్ భారీగా తొలగించింది. వారి స్థానంలో రాజకీయ నేతలు తమ అనుచరులను నియమించారు. నూతనంగా పనిచేస్తున్న వీరు తమ అనుయాయులకే పనులు కల్పిస్తున్నారు. దుత్తలూరు, కావలి, దగదర్తి, బోగోలు తదితర మండలాల్లో ఈ తంతు అధికంగా ఉంది. ఫలితంగా పనుల్లేక.. వేతనాలు అందక శ్రామికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మూడున్నర నెలలుగా అందని వేతనాలు రూ.70 కోట్లకుపైగా బకాయిలు 65 లక్షల పనిదినాల కల్పనే లక్ష్యం ఇప్పటి వరకు చేసింది 63.61 లక్షలు అదనంగా మంజూరు చేయని కేంద్రం -
కూటమి పాలనలో వ్యవసాయం కుదేలు
● రైతులకు తప్పని తిప్పలు ● హామీల అమల్లో చంద్రబాబు విఫలం ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజం మనుబోలు: ‘కూటమి పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైంది. రైతులకు తిప్పలు తప్పడం లేదు’ అని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. మనుబోలు మండల కేంద్రంలోని చిట్టమూరు అజయ్రెడ్డి నివాసంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. రైతులు యూరియా కోసం రోడ్డెక్కే పరిస్థితి నెలకొందన్నారు. యూరియాను మార్క్ఫెడ్ ద్వారా కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు. ఆర్బీకేల ద్వారా ఎందుకు సరఫరా చేయరని నిలదీశారు. నాటి సీఎం జగన్మోహన్రెడ్డి రైతులకు అవసరమైనవన్నింటినీ ఆర్బీకేల ద్వారా నేరుగా అందజేశారన్నారు. యూరియా దొరక్క ఓ వైపు రైతులు గగ్గోలు పెడుతుంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఊరుకునేది లేదంటూ చంద్రబాబు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. జిల్లాలో రెండో పంట కోతలు ప్రారంభమైనా ప్రభుత్వం ఎందుకు ధాన్యానికి మద్దతు ధర ప్రకటించలేదని ప్రశ్నించారు. పుట్టి ధాన్యం రూ.19,770 ఉండగా, దళారులు రూ.15 వేలకే రైతుల నుంచి కొనుగోలు చేస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈ నెల 9న ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఆందోళనలకు పిలుపునిచ్చామన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు రూ.1,500 ఇస్తానని చెప్పిన చంద్రబాబు మోసం చేశారన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, తల్లికి వందనం పథకాన్ని సైతం అరకొరగా అమలు చేశారని విమర్శించారు. దివ్యాంగుల పింఛన్లు రద్దు చేయగా, వైఎస్సార్సీపీ ఆందోళనలతో మళ్లీ ఇస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పాపాలన్నీ ప్రజలు లెక్కిస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్మోహన్రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు చిట్టమూరు అనితమ్మ, నాయకులు మన్నెమాల సాయిమోహన్రెడ్డి, బొమ్మిరెడ్డి హరగోపాల్రెడ్డి, ముంగర రవీందర్రెడ్డి, సూరపనేని కిశోర్ నాయుడు, కసిరెడ్డి ధనుంజయరెడ్డి, గుండాల ఆదినారాయణ, గుమ్మడి వెంకటసుబ్బయ్య, దాసరి భాస్కర్గౌడ్, గుంజి రమేష్, గిరి, దయాకర్, నవకోటి తదితరులు పాల్గొన్నారు. 38 మందికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు -
హెల్త్ అసిస్టెంట్లకు అన్యాయం
నెల్లూరు(అర్బన్): వైద్యారోగ్య శాఖలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న సుమారు 170 మందికి పైగా హెల్త్ అసిస్టెంట్లను ఉమ్మడి రాష్ట్ర ప్రాతిపదికంటూ తెలంగాణ కోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వం తొలగించి తీరని అన్యాయం చేసిందని ఏపీ హంస జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్రావు పేర్కొన్నారు. ఇటీవల జిల్లాలో తొలగించబడిన కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లకు చెందిన కుటుంబాలను ఏపీ హంస నాయకులు గురువారం పరామర్శించారు. వారు పడుతున్న కష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంతపేట సమీపంలో జరిగిన విలేకరుల సమావేశంలో సుధాకర్రావు మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు కల్పించారన్నారు. వీరంతా జాతీయ ఆరోగ్య కార్యక్రమాలతోపాటు కోవిడ్ సమయంలో ప్రజలకు ఎంతగానో సేవలందించారన్నారు. రెగ్యులర్ అవుతామనే ఆశతో విధులు నిర్వర్తిస్తుండగా తెలంగాణ కోర్టు తీర్పును ఏపీకి ఆపాదించి వందలాది మందిని తొలగించారన్నారు. పిల్లల్ని చదివించుకోలేక, అద్దెలు కట్టలేక, వయో పరిమితి దాటి పోవడంతో వేరే ఉద్యోగాలు రాక వారంతా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకుని న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ హంస తాలూకా ప్రెసిడెంట్ సోమేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పాపారావు, ఉద్యోగ సంఘం నాయకులు స్టీఫెన్ కుమార్, జాన్ అంకయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సమాజ నిర్మాణంలో టీచర్లదే కీలకపాత్ర
● వీఎస్యూ వీసీ అల్లం శ్రీనివాసరావు వెంకటాచలం: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలకపాత్ర అని విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని కాకుటూరు వద్దనున్న వర్సిటీలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ నేటి కాలంలో ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా విద్యా రంగాన్ని అభివృద్ధి దిశగా నడిపించగల శక్తులుగా మారాలన్నారు. విద్యార్థులలో పాఠ్య జ్ఞానం మాత్రమే కాకుండా మానవీయ విలువలు, నైతికత, సామాజిక బాధ్యతలను పెంపొందించడానికి కృషి చేయాలన్నారు. వీఎస్యూ ఏంబీఏ విభాగం అధ్యాపకురాలు సుజా ఎస్.నాయర్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక కావడం గర్వకారణమని చెప్పారు. కార్యక్రమంలో డీకే కళాశాల మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సి.శారద, వీఎస్యూ ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
● తహసీల్దార్ల సమావేశంలో బొప్పరాజు నెల్లూరు(అర్బన్): ప్రజా సమస్యల పరిష్కారానికి, వారి హక్కులను కాపాడేందుకు, భూ సంబంధిత రికార్డుల నిష్పక్షపాత నిర్వహణకు రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన తహసీల్దార్లు అంకితభావంతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్రాధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకటరాజేష్ సూచించారు. గురువారం సాయంత్రం నెల్లూరులోని నెల్లూరు క్లబ్ సమావేశ మందిరంలో జరిగిన తహసీల్దార్ల సమావేశంలో వారు ముఖ్యఅతిథులుగా పాల్గొని మాట్లాడారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా నిజాయితీతో పనిచేస్తూ ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని తెలిపారు. అదే సందర్భంలో ఉద్యోగులకు ప్రభుత్వం కూడా పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. తహసీల్దార్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఇవ్వడం ద్వారా పారదర్శక పాలన అందిస్తారన్నారు. ఈ సందర్భంగా పలువురు క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు గురించి మాట్లాడారు. పరిష్కార మార్గాల గురించి చర్చించారు. సంఘం బలోపేతంగా ఉండటం ద్వారా ఉద్యోగుల హక్కులను సాధించుకోవచ్చని వక్తలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు అల్లంపాటి పెంచలరెడ్డి, డానియేల్ పీటర్రావు, అసోసియేట్ ప్రెసిడెంట్ మురళి, జిల్లాలోని పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు. -
పెంచలకోనలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ
రాపూరు: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో గురువారం రాత్రి పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయంలో నిత్య పూజల సమయంలో తెలిసీ తెలియక సంభవించే సకలదోష నివారణ కోసం పాంచరాత్రాగమానుసారం పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధానార్చకులు సీతారామయ్యస్వామి, పెంచలయ్యస్వామి తెలిపారు. మూడురోజులు కార్యక్రమాలు జరుగుతాయి. ప్రత్యేకంగా పట్టుతో తయారు చేసిన పవిత్రమాలలకు వివిధ పూజలు నిర్వహించి స్వామి మీద ఉంచి చతుస్థానార్చన (అభిషేకం) చేస్తామన్నారు. స్వామి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను శేషవాహనంపై కొలువుదీర్చి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం శ్రీవారి నందనవనం నుంచి పుట్ట మట్టి తీసుకొచ్చి అందులో నవధాన్యాలు కలిపి విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మత్సంగ్రహణం, స్వామికి స్నపన తిరుమంజనం జరిగింది. అనంతరం శ్రీవారికి పవిత్రాలు ప్రతిష్ట, ఆధివాసహోమం, పవిత్ర సమర్పణ, శాత్తుమొఱై, నిర్వహించారు. దీంతో పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం ప్రారంభమైందని అర్చకులు తెలిపారు. -
టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు సహకారం
నెల్లూరు(అర్బన్): టీబీ రహిత జిల్లాగా నెల్లూరును మార్చేందుకు ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లు సహకరించాలని జిల్లా టీబీ నివారణ అధికారి డాక్టర్ ఖాదర్వలీ కోరారు. గురువారం ఆయన తన బృందంతో కలిసి నగరంలోని అరవింద్ కిడ్నీ సెంటర్, పలు కార్పొరేట్ ఆస్పత్రులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఖాదర్వలీ మాట్లాడుతూ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లాలో పెద్ద సంఖ్యలో రోగులకు స్క్రీనింగ్ కార్యక్రమం వైద్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టామన్నారు. అలాగే ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే రోగుల్లో ఎవరికై నా రెండు వారాలకు మించిన దగ్గు, జ్వరం వస్తుంటే అలాంటి వారిని ప్రభుత్వాస్పత్రికి పంపి గళ్ల పరీక్ష చేయించాలని కోరారు. బరువు తగ్గినా, ఆకలి మందగించినా కూడా టీబీ ఆస్పత్రికి రెఫర్ చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీబీ నిర్ధారణ అయితే రోగికి మందులతోపాటు పౌష్టికాహారానికి నగదు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా పబ్లిక్, ప్రైవేట్ మిక్స్ కో–ఆర్డినేటర్ హరీష్, భవ్య సంస్థ కో–ఆర్డినేటర్ తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
స్నానం చేస్తుండగా డ్రోన్తో వీడియోలు!
సాక్షి,నెల్లూరు జిల్లా : బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని ఇస్కపాళెం పంచాయతీ వడ్డిపాళెంలో నివాసం ఉంటున్న మాజీ వలంటీర్ రుక్మిణి ఇంటిపై డ్రోన్ను కొందరు వ్యక్తులు సోమవారం ఉదయం ఎగురవేసి వీడియోలు చిత్రీకరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం మేరకు.. తన తల్లిదండ్రులు, అక్క, ఆమె కుమార్తెలు ఇంట్లో ఉండగా, డ్రోన్ ఎగురవేయడాన్ని గమనించామని చెప్పారు. వెంటనే బయటకొచ్చి చూడగా, ఓ వ్యక్తి రిమోట్ కంట్రోల్తో డ్రోన్ను ఆపరేట్ చేస్తుండటాన్ని గుర్తించామని వివరించారు. ఆ సమయంలో తన అక్క కుమార్తె స్నానం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రోన్ను ఆపరేట్ చేస్తున్న వ్యక్తిని గ్రామానికి చెందిన జనార్దన్గా గుర్తించామన్నారు. దీనిపై ప్రశ్నించగా.. రామకృష్ణ, శంకరయ్య చెప్తే తాను వీడియోలు తీస్తున్నానని తెలిపారన్నారు. ఈ విషయమై 112కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి డీఎస్పీ శ్రీనివాసులుకు విషయాన్ని మంగళవారం తెలియజేయగా, ఆయన ఆదేశాలతో బుచ్చిరెడ్డిపాళెం పోలీస్స్టేషన్లో నిందితులపై ఫిర్యాదు చేశామన్నారు. గతంలోనూ వీరు తమ కుటుంబాన్ని అనేక ఇబ్బందులకు గురిచేశారని, ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. -
జలవనరుల అభివృద్ధికి చర్యలు తీసుకోండి
నెల్లూరురూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆర్ఆర్ఆర్ (రిపేర్, రెన్నోవేషన్, రెస్టోరేషన్) స్కీం ద్వారా జిల్లాలో జలవనరులను అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీసీ హాల్లో జరిగిన జిల్లా స్థాయి అమలు, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ పంటలకు నీటిని సమృద్ధిగా అందించేందుకు, నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భ జలాలు పెంచడమే ఆర్ఆర్ఆర్ స్కీం ప్రధాన లక్ష్యమని చెప్పారు. డ్వామా, భూగర్భ జల, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ పథకం కింద రూ.35,519.56 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన జిల్లాలోని 220 మైనర్ ఇరిగేషన్ చెరువులను క్షుణ్ణంగా పరిశీలించి, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. తద్వారా సుమారు 26,928 హెక్టార్ల ఆయకట్టు అభివృద్ధిలోకి వస్తుందని చెప్పారు. చెరువులను అభివృద్ధి చేసిన తర్వాత ఉపాధి హామీ పథకం ద్వారా ప్లాంటేషన్, వాకింగ్ ట్రాక్ మొదలైన పనులను చేపట్టాలని డ్వామా పీడీకి సూచించారు. గ్రౌండ్ వాటర్ అధికారులు అవరసమైన సాంకేతిక సహాయాన్ని అందించాలన్నారు. తొలుత ఇరిగేషన్ ఎస్ఈ దేశ్నాయక్ ఆర్ఆర్ఆర్ స్కీం ద్వారా చేపట్టాల్సిన చెరువులు, కాలువలు, చెక్డ్యామ్ల బలోపేతం, మరమ్మతు పనులు చేపట్టడం, నీటిపారుదల అవకాశాలను మెరుగు పరచడానికి చేపట్టాల్సిన చర్యలను కమిటీకి వివరించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ భూగర్భ జల విభాగం శాస్త్రవేత్త పెరిక యాదయ్య, డ్వామా పీడీ గంగాభవాని, భూగర్భ జల డిప్యూటీ డైరెక్టర్ శోభన్బాబు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయభాస్కర్, ఇరిగేషన్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. -
పన్ను చెల్లించని వాహనాలపై కేసులు
నెల్లూరు (టౌన్): నెలల తరబడి జిల్లాలో తిరుగుతూ ఎలాంటి లైఫ్ట్యాక్స్లు చెల్లించని కార్లపై రవాణా అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పన్నులు చెల్లించని ఇతర రాష్ట్రాల వాహనాలపై గత నెల 28న ‘సాక్షి’లో ‘అడిగేదెవరు.. ఆపేదెవరు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి రవాణాశాఖాధికారులు స్పందించారు. ఎంవీఐ బాలమురళి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా జీవిత పన్ను చెల్లించని ఇతర రాష్ట్రాలకు చెందిన 15కు పైగా కార్లు, ఇతర వాహనాలపై కేసుల నమోదు చేసి సీజ్ చేశారు. ఆర్టీఓ మదాని మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు జిల్లాలో తిరగాలంటే ఆ వాహనానికి సంబంధించి జీవిత పన్ను చెల్లించాలన్నారు. జెడ్పీలో కారుణ్య నియామకాలు నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ యాజమాన్యంలో పనిచేస్తూ మరణించిన ఇద్దరు కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ఆఫీస్ సబార్డినేట్లుగా ఉద్యోగావకాశాలు కల్పించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను బుధవారం జెడ్పీ చైర్పర్స్న్ ఆనం అరుణమ్మ, జెడ్పీ సీఈఓ మోహన్రావు అందించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల నెల్లూరు (పొగతోట): జిల్లాలోని గ్రామ పంచాయతీలకు రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని డీపీఓ శ్రీధర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 722 పంచాయతీల్లో నాలుగు పంచాయతీకు జరగలేదు. 718 పంచాయతీలకు రూ. 40,82,23,462 నిధులు విడుదల చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత నిధులు విడుదల కాని 65 గ్రామ పంచాయతీలకు రూ.1,90,78,952 నిధులు విడుదల చేశారు. మొత్తం 718 గ్రామ పంచాయతీలకు రూ.42,73,02,414 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేశారు. ముగ్గురికి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు నెల్లూరు (టౌన్): జిల్లా నుంచి అత్యుత్తమ సేవలు అందించిన ముగ్గురు ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపికయ్యారు. బుచ్చి మండలం పెనుబల్లి ఎంపీపీఎస్లో సెకండరీ గ్రేడ్ టీచర్ సీహెచ్ చెన్నయ్య, ఇందుకూరుపేటలోని ఎంకేఆర్ ప్రభుత్వ హైస్కూల్ ప్లస్లో స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్) కె. డొమనిక్రెడ్డి, ఇందుకూరుపేట మండలం నరసాపురంలోని ఎంవీఆర్ఆర్ జెడ్పీహైస్కూల్ అసిస్టెంట్ (పీడీ) ఎస్కే ముజీర్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అమరావతిలో సీఎం చేతుల మీదుగా అవార్డులను అందుకోనున్నారు. 9న హెచ్ఐవీపై అవగాహన మారథాన్ నెల్లూరు (అర్బన్): హెచ్ఐవీ/ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 9న 5 కి.మీ. పరుగు (మారథాన్) నిర్వహిస్తున్నామని డీఎంహెచ్ఓ సుజాత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 6 గంటలకు నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహిస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ, ఎయిడ్స్ నియంత్రణ విభాగం, స్పోర్ట్స్ అథారిటీ, రెడ్రిబ్బన్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో పాల్గొనేందుకు 17– 25 ఏళ్లలోపు విద్యార్థులు, మగ, ఆడ, ట్రాన్స్జెండర్ విభాగాల్లో విడివిడిగా పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 7వ తేదీ సాయంత్రంలోపు 86394 32458 నంబర్కు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ నెల 9న ఏసీ స్టేడియం వద్దకు తమ ఐడీ కార్డుతో హాజరు కావాలని కోరారు. విజేతలకు అన్ని విభాగాల్లో మొదటి బహుమతిగా రూ.10 వేలు, రెండో బహుమతిగా రూ.7 వేలు నగదు బహుమతి ఇస్తామన్నారు. విజేతల ఎంపిక జిల్లా స్పోర్ట్స్ అథారిటీ నిర్ణయిస్తార న్నారు. ఎంపికైన విద్యార్థులు రాష్ట్ర స్థాయి మారథాన్ పోటీకి అర్హులవుతారన్నారు. -
కూటమి అరాచకాలకు చరమగీతం పాడుదాం
రాపూరు/సైదాపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు రాష్ట్ర ప్రజలు విసిగి వేసారి పోతున్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమిని కూకటి వేళ్లతో సహ పెకళించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వైఎస్సార్సీపీ ప్రభంజం సృష్టించడం ఖాయమని ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. రాపూరులోని బత్తిన పట్టాభిరామిరెడ్డి నివాసంలో బుధవారం విలేకరుల సమావేశంలో కాకాణి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులు పెట్టడంలో కూటమి ప్రభుత్వం కుట్రలు పతాక స్థాయికి చేరాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అరాచకాలకు చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. 1995 నాటి సీఎంను ప్రజలకు చూపిస్తామని మాట్లాడుతున్న చంద్రబాబు, గతంలో కూడా కూతురినిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారం దక్కించుకున్నారని గుర్తుచేశారు. ఆ తరహాలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వెన్నుపోటు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. వయసు మీద పడుతున్నా.. గతంలో చేసిన అరాచక పాలనే సాగిస్తున్నారని ఆరోపించారు. యూరియా కోసం రైతులు క్యూలైన్లో ఇబ్బందులు పడుతుంటే ఆ సమస్యను పరిష్కరించాల్సిన ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అవహేళనగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రైతులకు ఉసురు కూటమి ప్రభుత్వానికి తప్పని సరిగా తగులుతుందన్నారు. ఎంతో రాజకీయ అనువభం ఉన్న నేదురుమల్లి కుటుంబం నుంచి వారసుడు రామ్కుమార్రెడ్డి ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. 2027లో జమిలీ ఎన్నికలు రావడం ఖాయమని, రామ్కుమార్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలుపించుకునేందుకు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గతంలో వెంకటగిరి అభివృద్ధికి దివంగత మాజీ ముఖ్యమంత్రి జనార్దన్రెడ్డి సతీమణి, మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఎన్నో శాశ్వతమైన పనులు చేపట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయన తనయుడు రామ్కుమార్రెడ్డి అదే తరహాలో అభివృద్ధి చేస్తారని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి వెంకటగిరి నుంచే గెలుపు ఆరంభమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైఎస్సార్సీపీ ప్రభంజనం రైతులను ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు వ్యంగ్యంగా మాట్లాడడం సమంజసం కాదు వచ్చే ఎన్నికల్లో రామ్కుమార్రెడ్డి అత్యధిక మెజార్టీ ఖాయం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
అయ్యో.. కన్నా
నెల్లూరు(క్రైమ్): అంత వరకు ఉత్సాహంగా గడిపి.. పాఠశాలకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. బాల్కనీలో బ్యాగ్ సర్దుతూ.. ప్రమాదవశాత్తూ కిందపడటంతో బాలుడు మృతి చెందిన హృదయ విదారక ఘటన నెల్లూరు రూరల్ మండలం విజయలక్ష్మీనగర్లో బుధవారం చోటుచేసుకుంది. ఈ హఠాత్పరిణామాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసుల సమాచారం మేరకు.. విజయలక్ష్మీనగర్లోని గాయత్రి నిలయం రెండో అంతస్తులో నివాసం ఉంటున్న రాజు, సుమతి దంపతులకు వంశీకృష్ణ (15), మహేంద్ర సంతానం. సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో వంశీకృష్ణ పదో తరగతి చదువుతున్నాడు. ఈ తరుణంలో స్కూల్కు వెళ్లేందుకు బాల్కానీలో బ్యాగ్ను సర్దుకుంటుండగా, ప్రమాదవశాత్తూ కాలుజారి కింద మట్టి రోడ్డుపై పడ్డాడు. గమనించిన వాచ్మెన్.. రాజుకు తెలియజేయడంతో ఆయన కిందకొచ్చి అపస్మారక స్థితిలో ఉన్న కుమారుడ్ని చికిత్స నిమత్తం కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. ఈ మేరకు వేదాయపాళెం పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు రోదన చూపరులను కంటతడి పెట్టించింది. -
గ్రావెల్ను కొల్లగొట్టి.. చెత్తతో గుంతలు నింపుతూ
● సర్వేపల్లిలో బరితెగించిన కూటమి నేతలు ● పాపాలను కప్పిపుచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వం కొలువుదీరాక సర్వేపల్లి నియోజకవర్గంలో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా దోపిడీకి తెగబడ్డారు. ప్రభుత్వ భూములనే లక్ష్యంగా చేసుకొని కోట్లాది రూపాయల విలువజేసే గ్రావెల్ సంపదను కొల్లగొట్టి సొమ్ము చేసుకున్నారు. వారి ధనదాహానికి సజీవ సాక్ష్యాలుగా మిగిలిన ఈ గుంతలను మాయం చేసేందుకు నెల్లూరులోని చెత్తనంతా తరలిస్తున్నారు. అడ్డుకున్నా.. బెదిరించి వెంకటాచలం మండలం సర్వేపల్లిలో కోట్లాది రూపాయల విలువజేసే 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది నెలల్లో వీటిపై కూటమి నేతల కన్ను పడింది. భూముల్లో విలువైన గ్రావెల్ ఉందని తెలిసిన వెంటనే, ఎలాంటి అనుమతుల్లేకుండా తరలించారు. తమకు ఇళ్ల పట్టాలిచ్చేందుకు ఈ భూములను కేటాయించారంటూ గిరిజన కుటుంబాల్లోని పలువురు అప్పట్లోనే వెళ్లి అడ్డుకున్నా, నిర్వాహకులు బెదిరించి వారిని వెళ్లగొట్టారు. ఇక్కడ 10 నుంచి 15 అడుగుల లోతులో గ్రావెల్ను తవ్వి నెల్లూరులోని పలు లేఅవుట్లకు తరలించారు. టిప్పర్లో మట్టిని రూ.12 వేల నుంచి రూ.15 వేల చొప్పున విక్రయించారు. తవ్వకాలను ఐదు నెలల పాటు సాగించి, నిత్యం వందలాది టిప్పర్లలో తమ పనిని కానిచ్చారు. ఈ రకంగా వ్యవహరించినా భూగర్భ గనుల శాఖ, పోలీస్, రెవెన్యూ, అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు. చెత్తతో నింపే పనిలో నిమగ్నం గ్రావెల్ గుంతలను పూడ్చేందుకు గానూ నెల్లూరులోని చెత్తాచెదారాలు, వ్యర్థాలను ఇక్కడికి తీసుకొస్తున్నారు. సర్వేపల్లిలో గ్రావెల్ గుంతలు సజీవ సాక్ష్యాలుగా ఉంటే, తాము ఇరుక్కునే ప్రమాదం ఉందనే ఆలోచనతో కూటమి నేతలు ప్రస్తుతం ఇలా వ్యవహరిస్తున్నారు. చెత్తాచెదారాలను టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. దీని ద్వారా వచ్చే దుర్గంధంతో స్థానికులు నానా అవస్థ పడుతున్నారు. ఈ విషయమై టిప్పర్ల డ్రైవర్లతో గ్రామస్తులు మాట్లాడినా, వారు ఏ మాత్రం లెక్కచేయడంలేదు. అధికారులు పట్టించుకోకపోవడంపై వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతల్లో నింపేందుకు ఉంచిన చెత్త వ్యర్థాలు నింపిన చెత్తను చదును చేస్తున్న జేసీబీ -
238 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
సోమశిల: అనంతసాగరం మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతోంది. గత నెల మొదటి వారంలోనే అక్రమంగా తరలిస్తూ కోవూరు సమీపంలో 950 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నెల ప్రారంభమై రెండు రోజులు గడవక ముందే బుధవారం ఇనుగలూరు గ్రామానికి సమీపంలోని ఓ తోటలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచారని అధికారులు, మీడియాకు గ్రామస్తులు సమాచారమివ్వడంతో రెవెన్యూ, సివిల్ సప్లయ్స్, పోలీస్ అధికారులు తనిఖీలు చేపట్టారు. తోటలోని ఓ రేకులషెడ్, రెండు ట్రాక్టర్ల ట్రంకులో 238 బస్తాల బియ్యం ఉండటాన్ని అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా సివిల్ సపయ్స్ డీటీ అజీజ్ మాట్లాడారు. బియ్యం అక్రమ నిల్వలు ఉన్నాయనే సమాచారంతో దాడులు చేసి సరుకును సీజ్ చేశామన్నారు. ఈ బియ్యాన్ని ఆత్మకూరు ఎమ్మెల్ఎస్ పాయింట్కు తరలిస్తామని వెల్లడించారు. తహసీల్దార్ జయవర్ధన్, ఎస్సై సూర్యప్రకాష్రెడ్డి తదితరులున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
టేకు చెట్లు నరికి.. తరలించింది టీడీపీ నేతలే
పొదలకూరు: తన పొలంలో రూ.కోటి విలువైన టేకు చెట్లను టీడీపీ నేతలు అక్రమంగా నరికించి తరలించారని బీజేపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి రాజేశ్వరమ్మ ఆరోపించారు. మండలంలోని మరుపూరు సమీపంలో గల రాజేశ్వరమ్మ పొలంలో అక్రమంగా నరికిన టేకు చెట్లను బలిజ సంఘం, బీజేపీ నేతలు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. పొదలకూరుకు చెందిన టీడీపీ నేత యశ్వంత్రెడ్డి, మురళి, అనిల్కుమార్రెడ్డి కలిసి తన పొలంలో టేకు చెట్లను అక్రమంగా నరికించి అక్కడే విక్రయించారని మరుపూరుకు చెందిన ఆ పార్టీ నేతలే పేర్లతో సహా వెల్లడించారని పేర్కొన్నారు. పొదలకూరు పోలీస్స్టేషన్లో గత నెల 26న తాను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని, అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని ముందుగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లానన్నారు. అయితే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లొద్దని, పోలీస్స్టేషన్లో కేసు పెట్టాలని ఆయన సూచించారని చెప్పారు. కేసు పెట్టక ముందు, ఆపైన సుమారు 12 రోజులుగా అందరి వద్దకెళ్లినా ప్రయోజనం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగకపోతే చలో అమరావతిని చేపట్టి సీఎంకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ ఓబీసీ మోర్చా మాజీ రాష్ట్ర కార్యదర్శి దాసరి సురేంద్రబాబు, బలిజ సంఘ నేత పామూరు కృష్ణయ్య,, పార్టీ నేతలు చొప్పా వెంకటేశ్వర్లు, గురుస్వామి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగని దందా..
రోడ్డు నిర్మాణం కోసం ఉలవపాడు మండలంలోని కరేడు చెరువు నుంచి గ్రావెల్ను అక్రమంగా తవ్వి తరలించారు. వాస్తవానికి సాగునీటి చెరువుల్లో తవ్వకాలను సాగించాలంటే ఆ శాఖ అధికారుల నుంచి అనుమతులను విధిగా పొందాలి. క్యూబిక్ మీటర్ మేరకు ధరను నిర్ణయించి ఆపై తవ్వుకునేందుకు అనుమతులను మంజూరు చేస్తారు. అయితే నియోజకవర్గంలో ఇలాంటివేవీ జరగడంలేదు. చెరువులను అధికార పార్టీ నేతలు తమ చేతుల్లోకి తీసుకొని భారీ ఎత్తున తవ్వకాలు సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా, సాగునీటి శాఖ.. రెవెన్యూ అధికారులు గానీ ఆవైపు కన్నెత్తి చూసే సాహసం చేయడంలేదు. కందుకూరు: నియోజకవర్గంలోని ఇరిగేషన్ చెరువుల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలకు ఏ మాత్రం అడ్డుకట్ట పడటంలేదు. ఇరిగేషన్ అధికారుల అండదండలు అక్రమార్కులకు పుష్కలంగా లభిస్తుండటంతో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. చెరువులను లక్ష్యంగా చేసుకొని తవ్వకాలకు భారీగా పాల్పడుతున్నారు. పట్టపగలు.. జోరుగా గుడ్లూరులోని పెద్దచెరువు నుంచి గ్రావెల్ తవ్వకాలను సోమవారం పట్టపగలు భారీగా చేపట్టారు. ఒక జేసీబీ, 20 ట్రాక్టర్లను ఏర్పాటు చేసి తమ తంతును సాగించారు. ఆపై గుడ్లూరులోని ఓ లేఅవుట్కు తరలించారు. చెమిడిదిపాడు పరిధిలోని దూదాలచెరువు నుంచీ ఇదే తరహాలో వ్యవహరించారు. తవ్వకాల వెనుక అధికార పార్టీకి చెందిన నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రావెల్ అవసరమైన ప్రైవేట్ వ్యక్తులతో ఒప్పందాలు చేసుకోవడం.. తదుపరి స్థానికంగా ఉండే చెరువుల నుంచి అక్రమంగా కొల్లగొట్టి తరలించడం పరిపాటిగా మారింది. సమాచారమిచ్చారంటూ ఫిర్యాదులు తాను గ్రావెల్ తవ్వకాలకు సహకరిస్తున్నా.. తన శాఖలోని కొందరు సిబ్బంది సమాచారాన్ని బయటకు చెప్పడంతో పాటు విలేకరులకూ తెలియజేస్తున్నారంటూ వారిపై స్థానిక ప్రజాప్రతినిధి వద్దకెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారని సమాచారం. అధికార పార్టీ నేతల అండదండలు మెండుగా ఉండటంతో తనకు ఎదురేలేదనే రీతిలో అక్రమ సంపాదనకు ఇరిగేషన్ చెరువులను ఆదాయ వనరుగా మలుచుకున్నారు. చెరువుల్లో భారీ ఎత్తున గుంతలను యంత్రాలతో తీసి గుల్ల చేస్తున్నా, సదరు అధికారి అడ్డుకోకపోగా, వ్యతిరేకించే కింది స్థాయి సిబ్బందిని సైతం బెదిరిస్తున్నారని సమాచారం. కరేడు చెరువులో ఇటీవల జరిపిన మట్టి తవ్వకాలు గుడ్లూరు పెద్ద చెరువులో ఇలా..అనుమతులా.. అబ్బే..! తీరుమార్చుకోని ఉన్నతాధికారి.. సంపూర్ణ సహకారం అందిస్తున్న ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారిచెరువుల్లో జోరుగా గ్రావెల్ తవ్వకాలు పట్టపగలు దౌర్జన్యంగా సాగుతున్న ఈ దందాలో ఇరిగేషన్ శాఖలోని ఓ ఉన్నతాధికారి పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. ఆయనే వెనుకుండి ఈ దందాను కొంతకాలంగా నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు అధికారి ఇప్పటి వరకు ఒక్కసారి సైతం అడ్డుకోకపోవడం ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. తవ్వకాలు జరిగే ప్రదేశాలకు తన కింది స్థాయి సిబ్బంది సైతం వెళ్లకుండా నియంత్రిస్తున్నారని, తనకు చెప్పకుండా ఏ చెరువు వద్దకెళ్లేందుకు వీల్లేదంటూ హుకుం జారీ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రతిఫలంగా మాఫియా నుంచి ముడుపులు భారీగా ముడుతున్నాయనే అంశం ఆ శాఖ సిబ్బందిలో చర్చనీయాంశంగా మారింది. -
భుజం నొప్పికి ప్రత్యేక స్క్రీనింగ్
నెల్లూరు(అర్బన్): భుజం నొప్పితో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారి కోసం నగరంలోని అపోలో సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రిలో ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షల ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చామని హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ శ్రీరామ్ సతీష్ పేర్కొన్నారు. రోబోటిక్ ఆర్థోప్లాస్టీ సర్జన్ వివేకానందరెడ్డి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ డాక్టర్ శశిధర్రెడ్డి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ విక్రమ్రెడ్డితో కలిసి ఆస్పత్రిలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీరామ్సతీష్ మాట్లాడారు. రూ.999కే డాక్టర్ల కన్సల్టేషన్తో పాటు ఆర్బీఎస్, సీబీసీ, యూరిక్ యాసిడ్, సీరమ్ క్రియాటినిన్, ఎక్స్రే – షోల్డర్, సీస్పైన్ పరీక్షలను నిర్వహించనున్నామని, ఈ ప్రత్యేక ప్యాకేజీ అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. తొలుత బ్రోచర్లను ఆవిష్కరించారు. యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కొరత వెనుక రూ.200 కోట్ల అవినీతి: కాకాణి
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో యూరియా కొరత వెనుక రూ.200 కోట్ల అవినీతి ఉందని, ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ యూరియాను ప్రైవేటు మార్కెట్కు తరలించారని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. అందుకే రైతు సేవా కేంద్రాలు, మార్క్ఫెడ్ నుంచి యూరియా పంపిణీ కావడం లేదని ఆయన గుర్తు చేశారు.యూరియా కావాలన్న రైతుల మాట వినిపించకుండా, నిర్దాక్షిణ్యంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగం సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి స్పష్టం చేశారు. కాకాణి ఇంకా ఏం మాట్లాడారంటే..:రూ.200 కోట్ల అవినీతి:రాష్ట్రంలో ఏటా దాదాపు 7 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటుంది. దాంట్లో ఏకంగా 5 లక్షల టన్నుల వరకు యూరియాను వ్యాపారులకే ఇచ్చేస్తే రైతులకు ఎలా అందుతుంది?. అందుకే వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో బస్తా మీద రూ.200 నుంచి రూ.300లు అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ ఒక్క యూరియా బ్లాక్ మార్కెట్ వ్యవహారంలోనే దాదాపు రూ. 200 కోట్లు చేతులు మారినట్టు స్పష్టంగా అర్థమైపోతుంది. ఆ మేరకు రైతుల జేబులకు చిల్లు పడుతోంది. మరి ఆ డబ్బంతా జేబుల్లోకి వెళ్లిందో త్వరలోనే తేలుస్తాంరైతులకు మంత్రి క్షమాపణ చెప్పాలి:డిమాండ్కు తగిన యూరియాను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా పంపిణీ చేయకుండా, ప్రైవేటు మార్కెట్కు చాలా ఎక్కువ సరుకు పంపించడం వల్ల అది బ్లాక్ మార్కెట్కు చేరింది. అందుకే గతంలో రూ.270 కే దొరికిన యూరియా బస్తా, ఇప్పుడు రూ.600 పెట్టినా దొరకని పరిస్థితి నెలకొంది. యూరియా దొరక్క రైతులు నానా ఇబ్బంది పడుతుంటే, సమస్య పరిష్కారంపై ఏ మాత్రం దృష్టి పెట్టని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వారిని అవమానపర్చేలా మాట్లాడారు. పెళ్లిళ్లలో భోజనం కోసం బఫే వద్ద ప్లేటు పట్టుకుని నిలబడినట్లు, రైతులు కూడా యూరియా కోసం నిలబడలేరా? అని వ్యాఖ్యానించడం తప్పు. అచ్చెన్నాయుడు వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలి.ప్రశ్నిస్తే గొంతు నొక్కే ప్రయత్నం:డిమాండ్కు తగిన యూరియాను కేంద్రం నుంచి రప్పించడంలో విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆ సమస్యను లేవనెత్తే రైతుల గొంతు నొక్కాలని చూస్తోంది. యూరియా కొరతపై ఎక్కడైనా రైతులు నిరసనకు దిగితే, నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తున్నారు. చివరకు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు కోసం వస్తున్న రైతులను కూడా దారుణంగా అరెస్ట్ చేసి వేధిస్తున్నారు. అసలు రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా ఎందుకు పంపిణీ చేయడం లేదు? దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి.‘మీ’ మీడియాలో వస్తున్నా కనిపించడం లేదా?:యూరియా దొరక్క దాదాపు మూడు నెలలుగా రైతులు తీవ్ర ఇబ్బంది పడుతుంటే, ఇన్నాళ్లూ కుంభకర్ణుడిలా నిద్ర పోయిన మంత్రి కె.అచ్చెన్నాయుడు.. మా పార్టీ నిరసన కార్యక్రమాన్ని ప్రకటించడంతో హడావుడిగా ప్రెస్మీట్ ఏర్పాటు చేసి, యూరియా కొరత లేదని చెప్పే ప్రయత్నం చేశారు. కేంద్రం నుంచి యూరియా వస్తున్నా బ్లాక్ మార్కెట్కు తరలి పోతుంటే ఏం చేస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. రైతులు ఆ మాత్రం క్యూలైన్లలో నిలబడలేరా? అని ఎగతాళిగా మాట్లాడటం సిగ్గుచేటు.యూరియా కొరతపై చివరకు టీడీపీ అనుకూల పత్రికల్లో రాస్తున్నా మంత్రి కళ్లకు కనిపించడం లేదా?. ఇంకా కేంద్రం కేటాయించిన యూరియాలో సింహభాగం ప్రైవేటు డీలర్లకు ఇచ్చేయడం వల్లే కొరత ఏర్పడిందని మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. మరి రైతు ప్రయోజనాలను పణంగా పెట్టి నిబంధనలను అతిక్రమించి మరీ 50 శాతం కన్నా అధికంగా ప్రైవేట్ డీలర్లకు ఎందుకు కేటాయించాల్సి వచ్చిందో మంత్రి చెప్పాలి.ఈనెల 9న నిరసన కార్యక్రమం:రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రైతుల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. వ్యవసాయ అవసరాలను ఫణంగా పెట్టి, రైతులను దోచుకోవడానికి కూడా ప్రభుత్వం ఏ మాత్రం సిగ్గు పడటం లేదు. ఒకవైపు యూరియా దొరకడం లేదు. మరోవైపు పండిన పంటలకు మద్దతు ధర లభించడం లేదు. ఇక ఉచిత పంటల బీమా లేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించి, పంట నష్టం జరిగితే కనీసం పరిహారం కూడా అందడం లేదుఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై ఈనెల 9న వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతోంది. ఆ రోజున ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి, ఆ తర్వాత ఆ అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తామని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి వివరించారు. -
అనుమతుల్లేని గనుల్లో..
మండలంలోని చాగణం రాజుపాళెం, సైదాపురం సమీపంలో కాలం చెల్లిన శ్రీనివాసా పద్మావతి (శోభారాణి), సిద్ధి వినాయక గనులున్నాయి. గతంలో లీజు తీరిపోవడంతో వాటిని అలాగే వదిలేశారు. ఈ గనిలో మైకా క్వార్ట్ ్జ ఖనిజం ఉంది. దీనికి ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని కూటమి నేతలు వాలిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా జీఓలు తెచ్చుకున్నారు. గతేడాది అక్టోబర్ నెలలో ఆ గనిలో అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు సాగిస్తుండటంతో స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులు ఒప్పుకోలేదు. అధికారుల ద్వారా ముమ్మరంగా తనిఖీలు చేయించారు. దీంతో అందులో విలువైన యంత్రాలను స్వాధీనం చేసుకుని 13 మందిపై కేసులు కూడా నమోదు చేయించారు. ఈ ఏడాది మార్చి నెలలో కూడా తవ్వకాలు సాగించడాన్ని ప్రజాప్రతినిధి అనుచరులే అడ్డుకున్నారు. దీంతో పనులు ఆగిపోయాయి. -
చెలరేగిపోతూ..
నెల్లూరులోని కూటమికి చెందిన ఓ ముఖ్యనేత కన్ను మళ్లీ ఈ గనులపై పడింది.మంగళవారం నుంచి పనులు చేపట్టారు. అనుమతి లేకుండానే బ్లాస్టింగ్తో చెలరేగిపోతున్నారు. ఈ గనులపై గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు నడుస్తున్నాయి. ఇటీవల డివిజన్ స్థాయి అధికారి పర్యవేక్షణలో మైనింగ్, పర్యావరణ శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తగా తనిఖీలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అనుమతి లేని గనుల్లో మళ్లీ తవ్వకాలు సాగిస్తున్నా మైనింగ్, వివిధ శాఖల అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నట్లు సమాచారం. -
యాజమాన్య పద్ధతులు పాటించాలి
కలిగిరి: పొగాకు నారుమడులు సాగు చేసే రైతులు బోర్డు అధికారుల సూచనల మేరకు ఆధునిక యాజమాన్య పద్ధతులు పాటించాలని కలిగిరి పొగాకు బోర్డు వేలం నిర్వహణాధికారి శివకుమార్ తెలిపారు. వేలం కేంద్రం పరిధిలోని శెట్టిపాళెం, పార్లపల్లి, కొండాపురం, ఎస్.అగ్రహారం గ్రామాల్లో నారుమడుల సాగును మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారుమడుల సాగుకు బోర్డులో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. నారును రిజిస్టర్ చేసుకున్న రైతులకు మాత్రమే విక్రయించాలన్నారు. ఇతరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. బోర్డు రిజిస్ట్రేషన్ లేకుండా నర్సరీలు, నారుమడులు సాగు చేయొద్దన్నారు. కార్యక్రమంలో ఐటీసీ కంపెనీ మేనేజర్ జి.వెంకటేష్, పొగాకు బోర్డు సిబ్బంది పాల్గొన్నారు. -
మైనింగ్.. మళ్లీ మొదలు
కాలం చెల్లిన గనుల్లో ముఖ్యనేత పనులు ● బ్లాస్టింగ్ చేపట్టిన వైనం ● పట్టించుకోని యంత్రాంగంసాక్షి టాస్క్ఫోర్స్: మండలంలోని సైదాపురం, చాగణం రాజుపాళెం సమీపంలో ఎలాంటి అనుమతుల్లేకుండా ఓ ముఖ్యనేత కనుసన్నల్లో అక్రమ మైనింగ్ మళ్లీ మొదలైంది. కొంతకాలం క్రితం స్థానిక ప్రజాప్రతినిధికి ఆ నేతకు మధ్య చెలరేగిన వివాదం కారణంగా మైన్పై పోలీసులు, రెవెన్యూ అధికారులు మూకుమ్మడిగా దాడులు చేసి పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కూటమి నేతల మధ్య ఏం జరిగిందో కానీ శ్రీనివాసా పద్మావతి (శోభారాణి), సిద్ధి వినాయక గనుల్లో మళ్లీ అక్రమ మైనింగ్ మొదలైంది. మంగళవారం అనధికారికంగా వాటిల్లో అక్రమంగా బ్లాస్టింగ్ చేసినట్లు తెలిసింది. కూటమి నేతలే.. నెల్లూరు జిల్లాలోని సైదాపురం, పొదలకూరు, చేజర్ల, ఉదయగిరి మండలంతోపాటు తిరుపతి జిల్లాలోని గూడూరు ప్రాంతాల్లో దొరికే క్వార్ట్ ్జ, ఫల్స్పర్, వర్ముఖ్లైట్ ఖనిజానికి స్వదేశంతోపాటు విదేశాల్లో కూడా ప్రస్తుతం గిరాకీ ఉంది. ప్రధానంగా సైదాపురం మండలంలో దొరికే మైకా క్వార్ట్ ్జకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో కూటమికి చెందిన నేతలు కొత్తగా వ్యాపారాలు చేసేందుకు రంగప్రవేశం చేస్తున్నారు. -
డయాలసిస్ రోగుల ఇబ్బందులు
● విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పాట్లు ● జనరేటర్ లేక అవస్థలుపొదలకూరు: డయాలసిస్ సెంటర్కు వచ్చిన రోగులు మంగళవారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. డయాలసిస్ జరుగుతున్న సమయంలో సుమారు మూడుగంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో రోగులతోపాటు వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పొదలకూరు సీహెచ్సీలో 8 బెడ్స్ ఉండగా డయాలసిస్ చేయించుకునేందుకు చుట్టుపక్కల మండలాల నుంచి రోగులు వస్తుంటారు. ప్రక్రియ జరుగుతున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే రోగుల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని టెక్నీషియన్లు వెల్లడిస్తున్నారు. పట్టణంలో ట్రాన్స్ఫార్మర్ సమస్య ఉందని విద్యుత్ అధికారులు గంటల సమయం సరఫరాను నిలిపివేశారు. సెంటర్ పర్యవేక్షణను రహీ కేర్కు కేటాయించారు. జనరేటర్ లేకపోవడంతో తరచూ సమస్యలు వస్తున్నాయి. థర్ట్ పార్టీ సంస్థ జనరేటర్ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందా? లేక కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందా? అనేది స్పష్టత లేదు. దీంతో విద్యుత్ అంతరాయాల సమయంలో రోగులు నరకం అనుభవిస్తున్నారు. -
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం
● కాలువ వద్ద ఒరిగిపోయిన బస్సు ● బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడో? సోమశిల: రోడ్లను అభివృద్ధి చేశామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటోంది. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. దారుణంగా ఉన్న రహదారుల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన సోమశిల గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. మంగళవారం ఉదయం సోమశిల నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. కొంతకాలం క్రితం ప్రాజెక్ట్ సమీపంలోని పరమానందయ్య ఆశ్రమం వద్ద బ్రిడ్జి కూలిపోయింది. ఇంతవరకు మరమ్మతులు చేపట్టలేదు. పక్కన డైవర్షన్ రోడ్డు ఏర్పాటుచేసి చేతులు దులుపుకొన్నారు. ఇక్కడ సరిపడినంత మార్జిన్ లేకపోవడంతో అటుగా వెళుతున్న బస్సు కాలువ వద్ద ఒరిగిపోయింది. ఆ సమయంలో 20 మందికి పైగా ప్రయాణికులుండగా డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదం తప్పింది. ఇటీవల ఓ వ్యక్తి బైక్పై వెళ్తూ కాలువలో పడగా తీవ్ర గాయాలయ్యాయి. అధికారులు త్వరతరగతిన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
ప్రతి మదిలో రాజన్న జ్ఞాపకాలు
● ఆనం అరుణమ్మ, విజయకుమార్రెడ్డి నెల్లూరు సిటీ: ‘వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పేదలకు చేయూ తనందించారు. అందరి మదిలో ఆయన జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి’ అని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి అన్నారు. రూరల్లోని కరెంటాఫీస్ సెంటర్లో మహానేత రాజన్న విగ్రహానికి మంగళవారం వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి అన్ని వర్గాలకు ఆశాజ్యోతి అన్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య చికిత్స చేయించినట్లు చెప్పారు. ఆయన ప్రతి ఒక్కరి మనసులో శాశ్వతంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రూరల్ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
గేదెను ఢీకొట్టిన మోటార్బైక్
● వ్యక్తి మృతి ఉదయగిరి: మండలంలోని సర్వరాబాదు సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. మసాయిపేటకు చెందిన పిడుగు మస్తాన్బాబు (30) మోటార్బైక్పై సీతారామపురం మండలానికి వెళ్లాడు. పని ముగిశాక తిరిగి సొంతూరికి బయలుదేరాడు. ఈ క్రమంలో సర్వరాబాదు సమీపంలో బైక్ గేదెను ఢీకొట్టింది. మస్తాన్బాబు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే గేదె కూడా చనిపోయింది. సమాచారం అందుకున్న ఎస్సై ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్గా మాధవి
నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి) రెగ్యులర్ సూపరింటెండెంట్గా డాక్టర్ కొండేటి మాధవిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్గా పనిచేసిన డాక్టర్ సిద్ధానాయక్ జూన్ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేశారు. దీంతో మెడికల్ కళాశాలలో బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ మాధవిని తాత్కాలికంగా ఇన్చార్జిగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నియమించింది. అప్పటి నుంచి ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు పదోన్నతి కల్పించి రెగ్యులర్ విధానంలో నియమించారు. నిజాయితీగా పని చేస్తారనే పేరున్నా ఇప్పటి వరకు ఆమె ఇన్చార్జిగా ఉండటంతో ఆస్పత్రి పరిపాలనలో తనదైన ముద్ర వేయలేకపోయారు. కొందరు డాక్టర్లు సమయపాలన పాటించకపోవడం, గంటో, రెండు గంటలో పని చేసి తప్పించుకుని తిరుగుతున్నా కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోయారని ప్రచారం జరిగింది. స్కానింగ్, ఎక్స్రే, రక్తపరీక్షల వద్ద రద్దీగా ఉండటం, సకాలంలో పరీక్షలు చేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు రెగ్యులర్గా నియమించడంతో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు. యువతి అదృశ్యంనెల్లూరు సిటీ: రూరల్ పరిధిలోని ధనలక్ష్మీపురం ప్రాంతానికి చెందిన ఓ యువతి గత నెల 25వ తేదీ నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మైపాడు రిసార్ట్స్కు కరెంట్ కట్
● అస్తవ్యస్తంగా నిర్వహణ ● అవస్థలు ఎదుర్కొంటున్న పర్యాటకులు ఇందుకూరుపేట: జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మైపాడు బీచ్లో రిసార్ట్స్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందనే ఆరోపణలున్నాయి. రూ.2.30 లక్షల విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో సంబంధిత అఽధికారులు గత నెల 30వ తేదీ రాత్రి నుంచి సరఫరాను నిలిపివేశారు. బీచ్కు జిల్లా నలుమూలల నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి అనేకమంది సందర్శకులు వస్తుంటారు. సెలవు రోజుల్లో తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. 2013లో తీరంలో రిసార్ట్స్ ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణను ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పింది. అయితే ఇక్కడ నగదు వసూలు చేయడం తప్ప పర్యాటకులకు కనీస వసతులు కల్పించడం లేదనే ఆరోపణలున్నాయి. గదుల్లో ఏసీలు, టీవీలు సక్రమంగా పనిచేయకపోవడం, పారిఽశుధ్యం లోపించడం తదితర సమస్యలున్నాయని పర్యాటకులు ఆవేదన చెందుతున్నారు. సూదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి విడిది చేసేందుకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో సర్దుకుపోవాల్సి వస్తోంది. రెస్టారెంట్ నిర్వహణ ఘోరంగా ఉన్నట్లు ప్రచారం ఉంది. అసాంఘిక కార్యకలాపాలకు రిసార్ట్స్ అడ్డాగా మారాయి. జంటలకు గదులను ఇచ్చేస్తున్నారు. అలాగే జూదరులు, మందుబాబులకు ఇది చిరునామాగా మారింది.బిల్లు చెల్లిస్తేనే.. బిల్లును సకాలంలో చెల్లించపోవడంతో రిసార్ట్స్కు విద్యుత్ సరఫరా కట్ చేశాం. బిల్లు చెల్లిస్తే సరఫరాను పునరుద్ధరిస్తాం. – నరసింహులు, విద్యుత్ శాఖ ఏఈ, నరసాపురం -
ప్రజల గుండెల్లో వైఎస్సార్ స్థానం పదిలం
ఉదయగిరి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ప్రజల గుండెల్లో పదిలమైన స్థానం ఉందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి అన్నారు. ఉదయగిరిలో ట్యాంక్ బండ్ సర్కిల్లో మంగళవారం రాజన్న వర్ధంతిని పార్టీ మండలాధ్యక్షుడు కొండా రాజగోపాల్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ వైఎస్సార్ సమాజంలో అన్ని వర్గాల అభిమానాన్ని సంపాదించారన్నారు. 108, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం తదితర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి తన పాలన స్వర్ణయుగంగా మార్చారన్నారు. హామీలు నెరవేర్చే గుణం చంద్రబాబుకు లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు ఎంతో మేలు చేశారన్నారు. అబద్ధపు హామీలతో అఽధికారం చేపట్టిన చంద్రబాబు ప్రతిపక్షంపై కక్ష సాఽధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. తొలుత భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పలువురు నేతలు వైఎస్సార్తో ఉన్న అనుబంధం, పాలన గొప్పతనం గురించి వివరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు గణపం బాలకృష్ణారెడ్డి, పి.మాల్యాద్రిరెడ్డి, మేదరమేట్ల శిలలీల, మోది రామాంజనీయులు, సీనీయర్ నాయకులు చేజర్ల సుబ్బారెడ్డి, షేక్ అలీఅహ్మద్, అక్కి భాస్కర్రెడ్డి, కల్లూరు వెంకటేశ్వరరెడ్డి, డేగా వంశీ, పల్లాల కొండారెడ్డి, కె.రమణారెడ్డి, సలీం, దస్తగిరి అహ్మద్, కె.వెంకటరెడ్డి, కె.వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అవినీతిలో నెల్లూరు కార్పొరేషన్ నంబర్ వన్
● ఆనం వెంకటరమణారెడ్డి నెల్లూరు (బారకాసు): సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం ప్రత్యేకాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి వికాస్మర్మత్ను టార్గెట్ చేస్తూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఏపీ ఆక్వా అథారిటీ బోర్డు చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపణలు గుప్పించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేసిన సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోరంటూ మంగళవారం ప్రస్తుత కమిషనర్తో మాట్లాడిన అనంతరం విమర్శలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని పలు భవంతులు, అపార్ట్మెంట్ల మార్ట్ గేజ్ ప్రక్రియలో భారీ అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని వెంకటరమణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని కార్పొరేషన్లలో అవినీతిలో నెల్లూరు కార్పొరేషన్ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. అవినీతిపై విచారణకు హైకోర్టు ఆదేశాలు కార్పొరేషన్లో జరిగిన అవినీతిపై తాను హైకోర్టును ఆశ్రయించడంతో పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కలెక్టర్ ఆనంద్ను ఆదేశించిందన్నారు. నెల్లూరు నగరంలో 74 భవంతులకు సంబంధించి ఆక్యూపెన్సీ స ర్టిఫికెట్లు ఇతర ధ్రువ పత్రాలు లేకున్నా వాటిని రిలీజ్ చేశారన్నారు. గతంలో కమిషనర్లుగా పనిచేసిన ఐఏఎస్ అధికారులు హరిత, వికాస్మర్మత్తోపాటు చెన్నుడు హయాంలోనే ఈ అక్రమాలు జరిగాయని ప్రస్తుతం ఉన్న ఉన్నతాధికారులే చెబుతుంటే మరలా ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఎందుకు ఆదేశించారో తనకు అర్థంకావడం లేదన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరగకుండానే గత కమిషనర్గా ఉన్న హరిత బిల్లులు చేశారని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే న్యాయం కోసం మళ్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు. -
దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలు
నెల్లూరు (టౌన్): చెవి, కంటి, మానసిక, శారీరక వైకల్యం ఉన్న దివ్యాంగ విద్యార్థులకు త్వరలో ఉపకరణాలను అందజేయనున్నట్లు డీఈఓ బాలాజీరావు తెలిపారు. మంగళవారం రంగనాయకులపేటలోని పీఎంఆర్ మున్సిపల్ స్కూల్లో నిర్వహించిన మెడికల్ క్యాంపులో 135 మంది దివ్యాంగ విద్యార్థులకు వివిధ విభాగాల వైద్యు లు పరీక్షలు నిర్వహించారు. సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, ఎంఈఓ తిరుపాల్, సమగ్రశిక్ష సీఎంఓ పెంచలయ్య, హెచ్ఎం హైమావతి తదితరులు పాల్గొన్నారు. కంప్యూటర్, వృత్తి నైపుణ్య కోర్సుల్లో ఉచిత శిక్షణ నెల్లూరు (టౌన్): దీన్దయాళ్ ఉపాధ్యాయ– గ్రామీణ కౌసల్య యోజన పథకంలో భాగంగా సీడాప్, త్రెడ్జ్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్ కంప్యూటర్, వృత్తి నైపుణ్య కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ యజమాని కె.సునీల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణ సమయంలో వసతి, భోజనం, యూనిఫాం అందజేస్తామని చెప్పారు. శిక్షణ అనంతరం ఇండస్ట్రీయల్ సర్టిఫికెట్తోపాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి ఉన్న యువతీ, యువకులు విద్యార్హత స ర్టిఫికెట్, రేషన్కార్డు, ఆధార్కార్డు జెరాక్స్లను త్రెడ్జ్ ఐటీ ప్రైవేట్ లిమిటెడ్, కేఎస్ఎన్ ఇంజినీరింగ్ కాలేజి, కొత్తూరురోడ్డు, కోవూరు అడ్రసులో అందజేయాలన్నారు. ఇతర వివరాలకు 98661 11223 నంబరులో సంప్రదించాలన్నారు. వెంకటాచలం సర్పంచ్కు షోకాజు నోటీసు వెంకటాచలం: వెంకటాచలం సర్పంచ్ మందల రాజేశ్వరి చెక్ పవర్ ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని డీపీఓ శ్రీధర్రెడ్డి మంగళవారం షోకాజు నోటీసు ఇచ్చారు. పంచాయతీ నిధులు దుర్వినియోగం జరిగాయ ని టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో డీఎల్పీఓ తో విచారణ చేపట్టగా, నిధులు దుర్వినియోగానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే మళ్లీ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి కావలి డీఎల్పీఓతో ఇటీవల విచారణ జరిపారు. ఈ క్రమంలో సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయకూడదో వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాల ని సర్పంచ్ రాజేశ్వరి షోకాజు నోటీసు ఇచ్చారు. రాజేశ్వరి మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే బీసీ మహిళా సర్పంచ్నైన తన చెక్పవర్ రద్దు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రైళ్ల పరుగుకు అంతరాయం బిట్రగుంట: కాకినాడ పోర్ట్ నుంచి చైన్నె వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్లో బ్రేక్ బైండిగ్ కారణంగా కొదిసేపు నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. రైలు కావలిస్టేషన్ దాటిన తర్వాత ఎస్వీపాళెం స్టేషన్ సమీపంలోకి వచ్చేసరికి బ్రేక్ బైండింగ్ సమస్య తలెత్తింది. దీంతో రైలును పరిమిత వేగంతో బిట్రగుంట స్టేషన్కు చేరుకుంది. అప్పటికే సిద్ధంగా ఉన్న సిబ్బంది హుటాహుటిన మరమ్మతులు పూర్తి చేసి రైలు పరుగుకు పచ్చజెండా ఊపారు. -
భాగస్వామ్య పార్టీ నేతకే ద్రోహమా..?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ మహిళా నేత, ప్రముఖ వైద్యడు అంజనీకుమార్ సతీమణి రాజేశ్వరమ్మకు జరిగిన అన్యాయంపై అనేక సంఘాలు ఇప్పటికే మద్దతు పలికాయి. జిల్లా బలిజ సంఘాలు సైతం మంగళవారం నెల్లూరులో సమావేశమై రాజేశ్వరమ్మకు బాసటగా నిలిచాయి. అవసరమైతే చలో అమరావతి సైతం చేపడతామని ప్రకటించారు. పొదలకూరు మండలం మరుపూరులో కే రాజేశ్వరికు చెందిన సొంత భూమిలో టేకు చెట్లను టీడీపీ నేతలు అక్రమంగా నరికి దుంగలను తరలించిన రూ.లక్షలు సొమ్ము చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నాయకుల నిర్వాకంపై రాజేశ్వరమ్మ ఎమ్మెల్యే సోమిరెడ్డి వద్ద పంచాయితీ పెట్టినా ఎలాంటి ఉపయోగం లేకపోయింది. దీంతో ఆమె గత నెల 26న పొదలకూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో బలిజ సంఘాల నాయకులు రంగంలోకి దిగారు. వంద టేకు చెట్ల నరికివేత పొదలకూరు మండలం మరుపూరులో 637–3, 637–4, 639–1, 639–2, 640–1, 640–2 సర్వే నంబర్లలో రాజేశ్వరమ్మకు 20.98 ఎకరాల భూమి ఉంది. ఈ పొలంలో ఉన్న వంద టేకు చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేసినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే రూ.లక్షలు విలువైన టేకు చెట్లను టీడీపీ నేతలు కొట్టేసినట్లు గుర్తించారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆమె అభిమానులు, సామాజిక వర్గానికి చెందిన వారు, బీజేపీ, జనసేన కార్యకర్తలు స్పందించి సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెడుతూనే ఉన్నారు. నేడు మరుపూరుకు.. జిల్లా బలిజ సంఘాల నాయకులు కత్తిర మల్లిసిరి శ్రీనివాసులు, నాగిశెట్టి మురళీ బృందం మరుపూరు సమీపంలో రాజేశ్వరమ్మకు చెందిన తోటలో టేకు చెట్లను నరిన ప్రాంతాన్ని పరిశీలించనున్నట్లు తెలిపారు. తమ ఆడపడుచుకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని ఎంత దూరమైన వెళ్లి పోరాటం చేస్తామని ప్రకటించారు. అటవీశాఖ అనుమతి లేకుండా టేకు చెట్ల ను ఎలా నరుకుతారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలో కొనసాగుతున్న రాజేశ్వరమ్మ పొదలకూరు పోలీస్స్టేషన్లో రాత పూర్వకంగా గత నెలలో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం దుర్మార్గమన్నారు. స్థలం పత్రాలను పోలీసులు అడుగుతున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ మహిళా నేత రాజేశ్వరమ్మకు బలిజ సంఘాల మద్దతు వంద టేకుచెట్లు అక్రమంగా నరికివేత రూ.లక్షలు విలువైన కలపను అమ్ముకున్న వైనం ఎమ్మెల్యే సోమిరెడ్డి వద్ద తెగని పంచాయితీ పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువు నేడు మరుపూరు తోట సందర్శనకు రాక -
ఆదుకోండి సారూ..
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● 436 వినతుల అందజేత ● సాయం కోసం పలువురి వినతినెల్లూరు రూరల్: అయ్యా.. నా బిడ్డకు పింఛన్ పెంచి ఆదుకోండని ఒకరు.. ఆపరేషన్ చేయించేందుకు డబ్బుల్లేవని, సాయం చేయాలని మరొకరు.. ఇలా ఎంతోమంది వివిధ సమస్యలపై వినతులందించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్, ఇన్చార్జి డీఆర్వో విజయ్కుమార్, జెడ్పీ సీఈఓ మోహన్రావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్రెడ్డి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 174, మున్సిపల్ శాఖవి 41, సర్వేవి 18, పంచాయతీరాజ్ శాఖవి 38, పోలీసు శాఖవి 62, సివిల్ సప్లయ్స్వి 11 తదితరాలు కలిపి 436 అర్జీలను ప్రజలు అందజేశారు. దొంగ పట్టాలు సృష్టించి ప్లాట్లు వేశారు టీడీపీ కార్పొరేటర్ భర్త అరవ శ్రీనివాసులు దొంగ పట్టాలు సృష్టించి ప్లాట్లు వేసి అమ్ముతున్నారని 24 డివిజన్ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఉడతా మురళి యాదవ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ కలూరుపల్లి గ్రామంలో 75 ప్లాట్లు వేసి ఒక్కొక్కటి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు విక్రయిస్తున్నట్టు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సదరు భూమిలో ఉంచిన బోర్డులను తీసేశారన్నారు. దీనిపై అధికారులకు పలుమార్లు అర్జీలిచ్చినట్లు చెప్పారు. ఇంత వరకు స్పందన లేదన్నారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయం చేయాలని విన్నవించి.. కొందరు వ్యక్తులు తప్పుడు కుల ధ్రువీకరణపత్రం పెట్టి తనకు రావాల్సిన వ్యాయామ ఉపాధ్యాయుడి పోస్టు తీసుకున్నారని సంగం మండలం గాంధీ జనసంగం గ్రామస్తుడు మేంద్రగుత్తి మధుబాబు వినతిపత్రమిచ్చాడు. తనకు డీఎస్సీలో 235 ర్యాంక్ వచ్చిందన్నారు. తప్పుడు పత్రాలతో కొందరు ధ్రువపత్రాలు సృష్టించి ఉద్యోగాలకు అర్హత పొందారన్నారు. న్యాయం చేయాలని కోరాడు. పింఛన్ పెంచాలంటూ.. ఈమె పేరు షేక్ షకియా. పుట్టినప్పటి నుంచి సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. పెన్షన్ వస్తోంది. రూ.15,000 పెన్షన్ కోసం పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు. బయోమెట్రిక్ పనిచేయకపోవడంతో ప్రస్తుతం రూ.6,000 అందుతోంది. ఇటీవల ఆమె తండ్రి మరణించాడు. నెల్లూరు రామకోటి నగర్లో ఉంటున్న తల్లి ఆయేషా మళ్లీ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. భర్త ఉన్నప్పుడు ఎలాగోలా నెట్టుకొచ్చామని, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని వాపోయారు. ఆధార్ అప్డేట్ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని, అధికారులు స్పందించాలని కోరింది. సహాయం చేయండి నా బిడ్డ తలలో నీరు గడ్డలున్నాయని, ప్రాణం కాపాడాలని ఆత్మకూరు మండలం వెంకట్రావుపల్లికి చెందిన ఆదిపూడి వెంకటరమణమ్మ వినతిపత్రం సమర్పించారు. ఆమె వివరాలు వెల్లడించారు. రుయా హాస్పిటల్కు పాపను రెండుసార్లు తీసుకెళ్లగా డాక్టర్లు పరీక్షలు చేసి నీరుగడ్డలు ఎక్కువ ఉన్నట్లు చెప్పారు. చిన్నపిల్లలకు ఆపరేషన్ ఇప్పుడు చేయట్లేదని, నెల్లూరులోనే నారాయణ హాస్పిటల్కు తీసుకెళ్లాలన్నారు. అక్కడికెళ్తే డాక్టర్లు రూ.75,000 ఖర్చవుతుందన్నారు. తమది నిరుపేద కుటుంబమని, అంత డబ్బు కట్టలేమని, పాపను రక్షించాలని ఆమె కోరుతోంది. -
పాఠశాల వ్యాన్ ఢీకొట్టడంతో..
● భర్త మృతి, భార్యకు గాయాలు ఆత్మకూరు: పాఠశాల వ్యాన్ మోటార్బైక్ను ఢీకొట్టడంతో షేక్ ఖాసీం (35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మండలంలోని కరటంపాడు గ్రామం వద్ద నెల్లూరు – ముంబై రహదారిపై సోమవారం సాయంత్రం జరిగింది. ఎస్సై ఎస్కే జిలానీ కథనం మేరకు.. ఉదయగిరి మండలానికి చెందిన షేక్ ఖాసీం తన భార్య హజరత్బీతో కలిసి ఉదయగిరి నుంచి నెల్లూరుకు బైక్పై వెళ్తున్నాడు. అదే సమయంలో ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల వ్యాన్ కరటంపాడు గ్రామంలోకి మలుపు తిరుగుతూ బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై ఖాసీం మృతిచెందాడు. హజరత్బీకి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
లాభాలు వస్తాయని.. నమ్మించి మోసం
● ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 79 ఫిర్యాదులు ● సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త : ఏఎస్పీనెల్లూరు(క్రైమ్): లాభాలు వస్తాయని నమ్మించి.. పెట్టుబడి పెట్టించి మోసం చేశారని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 79 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా ఏఎస్పీ సీహెచ్ సౌజన్య మాట్లాడుతూ ఇంటర్నెట్ వేదికగా సైబర్ నేరగాళ్లు మోసగిస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన ఏఎస్పీ ఆయా ప్రాంత పోలీస్ అధికారులతో మాట్లాడారు. చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ కేసీహెచ్ రామారావు, లీగల్ అడ్వైజర్ టి.శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ – 2 ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదుల సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని... ● మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో కీర్తీ అనే మహిళ పరిచయమైంది. క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేస్తే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి రూ.14.50 లక్షలు పెట్టుబడి పెట్టించింది. ఆదాయం రాకపోవడంతో విచారించగా నకిలీ పోర్టల్ అని తేలింది. ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్లో ఉంది. విచారించి న్యాయం చేయాలని కలిగిరికి చెందిన ఓ వ్యక్తి కోరాడు. ● ఇన్స్టాగ్రామ్లో ఓ మహిళ పరిచయమైంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించింది. ఆమె మాటలు నమ్మి రూ.50 లక్షలు వరకు పెట్టి మోసపోయానని కావలి రెండో పట్టణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ● నా తమ్ముడిని టిప్పర్ ఢీకొనడంతో తీవ్రగాయాలై మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అల్లూరుకు చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు. ● పెద్ద కుమార్తె ప్రమీల, ఆమె భర్త జీవనోపాధి కోసం నా వద్ద రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్నారు. నగదు తిరిగివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని వెంకటాచలం ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు వినతిపత్రం ఇచ్చాడు. ● నా కుమార్తె నెలరోజులుగా కనిపించడం లేదు. ఆచూకీ కనుక్కుని అప్పగించాలని దర్గామిట్ట ప్రాంతానికి చెందిన ఓ మహిళ కోరారు. ● నా భర్త వేధింపులు తట్టుకోలేక బుచ్చిరెడ్డిపాళెం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశా. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు కేసును విత్డ్రా చేసుకోవాలని లేకుంటే అంతు చూస్తానని భర్త బెదిరిస్తున్నాడు. విచారించి చర్యలు తీసుకోవాలని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. -
వినాయకా.. మన్నించు
నెల్లూరు(బృందావనం): వినాయకచవితి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే నిమజ్జన విషయంలో అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్న స్వర్ణాల చెరువు గణేష్ ఘాట్ను తగినంత నీటిని నింపలేకపోయారు. దీనికితోడు చాలాచోట్ల నుంచి ఊరేగింపుగా వచ్చేసరికి సోమవారం తెల్లవారుజామున కావడంతో విగ్రహాలను ఇష్టానుసారంగా వదిలేశారు. చాలావరకూ పూర్తిగా మునగలేదు. సగం మునిగిన ఏకదంతుని రూపాలు చూసి భక్తజనం మండిపడుతోంది. ఈ ఏడాది నాయకులను మన్నించు.. రానున్న ఏడాదైనా సరిదిద్దుకునే అవకాశమివ్వమంటూ వేడుకుంటున్నారు. -
పాత పద్ధతిలోనే ఎఫ్సీలివ్వాలని డిమాండ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లను పాత పద్ధతిలోనే ఇవ్వాలని ఆలిండియా రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరులోని సీఐటీయూ కార్యాలయంలో ఆటో, మినీలారీ, అంబులెన్స్, ట్రక్ అండ్ గూడ్స్ యూనియన్ నాయకులు సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ ఫెడరేషన్ జిల్లా బాధ్యుడు సురేష్ మాట్లాడుతూ సెన్సార్ పద్ధతి ద్వారా ఎఫ్సీ ఇచ్చే విధానం వల్ల వాహన యజమానులపై ఆర్థిక భారం పడుతుందన్నారు. ఉదయగిరి, సీతారామపురం, కందుకూరు, రాపూరు తదితర మండలాలకు చెందిన వాహనదారులు సర్టిఫికెట్ల కోసం 100 కిలోమీటర్ల దూరంలో ముత్తుకూరు మండలం కప్పలదొరువు వద్ద ఏర్పాటు చేసిన సెన్సార్ ట్రాక్ వద్దకు రావాల్సి ఉంటుందన్నారు. ప్రైవేట్ సంస్థలకు ఆదాయాన్ని తీసుకొచ్చేలా ఈ పద్ధతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చాయని ఆరోపించారు. సమావేశంలో పలు యూనియన్ల నాయకులు రాజా, మాలకొండయ్య, వెంకటేశ్వర్లు, శివకుమార్, విజయ్, జిలానీ, సుధాకర్, రవీంద్ర, రమేష్, తదితరులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వ దుర్మార్గ నిర్ణయం
● ప్రాణాలు కోల్పోయిన పారిశుద్ధ్య కార్మికుడు ● నివాళులర్పించిన సీఐటీయూ నాయకులు నెల్లూరు(బారకాసు): కూటమి ప్రభుత్వ నిర్ణయంతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఇలాకాలో నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన నెల్లూరు నగరంలో సోమవారం చోటుచేసుకుంది. ఎన్ఎంసీ పరిధిలోని 45వ డివిజన్ కార్మికుడు జోసఫ్ వయసు 60 ఏళ్లు నిండిందని నిలిపేశారు. దీంతో అతను మానసికక్షోభకు గురై గుండెపోటుతో మరణించాడని ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు ఆరోపించారు. ఆ యూనియన్ నగర గౌరవాధ్యక్షుడు కత్తి శ్రీనివాసులుతోపాటు పలువురు నేతలు మృతదేహానికి నివాళులర్పించారు. శ్రీనివాసులు మాట్లాడుతూ 30 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న జోసఫ్కు ఒక్క రూపాయి కూడా బెనిఫిట్ ఇవ్వలేదన్నారు. వారసులకు ఉద్యోగం కల్పించకపోవడంతో బాధిత కుటుంబంలో ఆవేదనలో ఉందన్నారు. వారికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. వారసులకు ఉద్యోగావకాశం కల్పించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. -
ఇన్చార్జి డీఆర్ఓగా విజయకుమార్
నెల్లూరు రూరల్: జిల్లా ఇన్చార్జి రెవె న్యూ అధికారిగా విజయ్కుమార్కు కలెక్టర్ ఓ ఆనంద్ సోమ వారం అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఇన్చార్జి డీఆర్వోగా ఉన్న హుస్సేన్సాహెబ్ ఉద్యోగ విరమణ చేయడంతో ఆ స్థానంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిగా ఉన్న విజయ్కుమార్ను నియమించారు. విజయకుమార్ గతంలో కోవిడ్ సమయంలో నోడల్ ఆఫీసర్గా పనిచేశారు. సర్పంచ్ చెక్పవర్ రద్దు పొదలకూరు: పొదలకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ మల్లిక చిట్టెమ్మ చెక్పవర్ను రద్దు చేస్తూ డీపీఓ శ్రీధర్రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ నిధులను సర్పంచ్ దుర్వినియోగం చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి, స్థానిక టీడీపీ నేతలు పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో డీఎల్పీఓ ద్వారా విచారణ నిర్వహించగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు రుజువైనట్లు పేర్కొన్నారు. ఆరు నెలల పాటు నిధులు డ్రా చేసే అధికారం లేకుండా చెక్పవర్ రద్దు చేసినట్టు తెలిపారు. అయితే సర్పంచ్ చిట్టెమ్మ మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతోనే తన చెక్పవర్ రద్దు చేయించారని ఆరోపించారు. పంచాయతీ నిధులు ఎక్కడా దుర్వినియోగం కాలేదని తమ వద్ద నిధుల ఖర్చుకు సంబంధించి ఆధారాలు ఉన్నట్లు వెల్లడించారు. టీజీపీ ఇన్చార్జి స్పెషల్ కలెక్టర్గా ఆసిఫా నెల్లూరు (అర్బన్): తెలుగుగంగ ప్రాజెక్ట్ ఇన్చార్జి స్పెషల్ కలెక్టర్గా డిప్యూటీ కలెక్టర్ ఆసిఫాను నియమిస్తూ కలెక్టర్ ఆనంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు టీజీపీ స్పెషల్ కలెక్టర్గా ఉన్న హుస్సేన్సాహెబ్ ఉద్యోగ విరమణ చేయడంతో ఆ స్థానంలో ఆమెను నియమించారు. ఆసిఫా ప్రస్తుతం ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్గా పని చేస్తున్నారు. కలెక్టర్ ఉత్తర్వులతో ఇప్పుడు అదనంగా టీజీపీ ఇన్చార్జి స్పెషల్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ నియామకంపై కోర్టు స్టే ఉదయగిరి: ఉదయగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకంపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ పదవి మొదట ఓసీ మహిళకు కేటాయించారు. అయితే కలెక్టర్ గత నెల 14న జనరల్కు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు. అదే రోజు సాయంత్రం ఓసీ మహిళకే కేటాయిస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు. జలదంకి ఎంపీటీసీ కుట్టుబోయిన మాధవరావు బీసీలకే చైర్మన్ పదవి కొనసాగించాలని హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించింది. ఈ నెల 3వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశింది. ఈక్రమంలో బీసీ నేతలు బి.మాధవరావు, శ్రీనివాస్ యాదవ్, లలితారం యాదవ్ సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్ను కలిసి ఏఎంసీ చైర్మన్ పదవి బీసీలకే కేటాయించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు మర్రిపాడు: మండలంలో ప్రభుత్వ భూములు ఆక్రమించే వారు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు కబ్జాదారులను హెచ్చరించారు. ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన ‘ప్రభుత్వ భూములు హాంఫట్’ కథనానికి అధికారులు స్పందించారు. ఆర్ఐ సాయికిరణ్, పెగళ్లపాడు వీఆర్ఓ శ్యాం, సర్వేయర్లు పెగళ్లపాడులోని ఆయా సర్వే నంబర్లలోని ఆ భూములను పరిశీలించి ఎవరైనా ప్రభుత్వ భూముల్లో దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసు కేసులు కూడా నమోదు చేయిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు తమ ఈ భూ ములకు సంబంధించి పట్టాలిచ్చి ఉన్నారని అధికారులకు దృష్టికి తీసుకురావడంతో ఆ పట్టాలను తీసుకుని వచ్చి వెబ్ ల్యాండ్లో భూమిపై హక్కు లు సరిచూసుకోవాలని సూచించారు. వెబ్ ల్యాండ్లో భూమి లేకుండా ఎవరైనా దిగితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కావ్య అక్రమాల నిగ్గు తేల్చుతాం
నెల్లూరు (అర్బన్): కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అవినీతి, అక్రమాలను నిగ్గు తేల్చుతామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. కావ్య అవినీతిని ప్రశ్నించినందుకే కక్షగట్టి పోలీసుల ద్వారా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. జలదంకి మండలం అన్నవరం క్వారీలో జరుగుతున్న అక్రమాలు, రూ.900 కోట్ల మనీస్కాం వెనుక ఉన్న అధికారపార్టీ ప్రజాప్రతినిధుల హస్తంపై విచారణ జరిపించాలని కోరుతూ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి, పలువురు పార్టీ నేతలతో కలిసి కాకాణి కలెక్టర్ ఆనంద్కు కలెక్టరేట్లో సోమవారం వినతిపత్రం అందజేశారు. కాకాణి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. కావలి ఎమ్మెల్యే అన్నవరం క్వారీలో పరిమితికి మించి చేపడుతున్న అక్రమ తవ్వకాలను వెలుగులోకి తెచ్చేందుకు 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్కుమార్రెడ్డి డ్రోన్తో ఫొటోలు తీయించారన్నారు. ఎమ్మెల్యే లేని ప్రాంతంలో ఎమ్మెల్యేని చంపడానికి డ్రోన్ ఎగురవేశారంటూ హత్యాయత్నం కేసు నమోదు చేయ డం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎక్కడ బెయిల్ వస్తుందోననే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ కేసు కూడా పెట్టడం సిగ్గు చేటన్నారు. తాము రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని పరామర్శించడానికి వెళ్తుంటే తొడగొట్టి మీసం మెలేసిన ఎమ్మెల్యే వెంటనే పోలీసులను పురమాయించి తమను, తమ పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం చేతగాని తనమన్నారు. కావలి ప్రాంతంలో రూ.900 కోట్ల మనీ స్కాంలో సూత్రధారులను వదిలేసి అనామకులైన ఒకరిద్దరిపై కేసులు దులుపు కోవడం దారుణమన్నారు. ఈ మనీస్కాంను కావలి ఎమ్మెల్యే ఎందుకు తొక్కిపెడుతున్నాడో సమాధానం చెప్పాలని కాకాణి డిమాండ్ చేశారు. పేదల సొమ్ముకు ఆశ పడి మనీస్కాంకు పాల్పడిన కావలి ఎమ్మెల్యే శాసనసభకు అర్హుడా అని ప్రశ్నించారు. ఎన్ని కారుకూతలు కూసినా కావ్య అవినీతిని బట్టబయలు చేసి తీరుతామన్నారు. ఎస్పీకి వినతిపత్రం ఇచ్చి నా స్పందించడం లేదన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని కావలి ఎమ్మెల్యే నిర్వహిస్తున్న క్వారీ అక్రమాలు, మనీ స్కాం సూత్రధారులపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ స్పందించకపోతే చలో అన్నవరం కార్యక్రమం నిర్వహించి తీరుతామన్నారు. స్థాయి మరిచి.. బజారు భాష ఏంటి? ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తన స్థాయిని మరిచి బజారు మనిషిగా మాట్లాడుతున్న మాటలను చూసి ప్రజలే అసహ్యించుకుంటున్నారన్నారు. తమ పార్టీ నాయకులను కావలికి రమ్మని పిలిచి పోలీసులతో హౌస్ అరెస్టు చేయించిన పిరికోడని దుయ్యబట్టారు. పోలీసులు ఎవరి మాటలు విని తమ ఇళ్లను చట్టుముట్టారో తెలపాలన్నారు. ఎమ్మెల్యే నిజాయితీ నిరూపించుకోవాలి సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ప్రతి పక్షంలో ఉన్న రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ప్రజలకు అండగా ఉన్నాడన్నారు. ప్రజలకు జరిగే ఇబ్బందులను ప్రశ్నించాడన్నారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ప్రతాప్కుమార్రెడ్డి చేసిన విమర్శలను స్వీకరించి స్వచ్ఛందంగా ఎమ్మెల్యే నిర్వహిస్తున్న క్వారీపై అధికారులతోనే విచారణ జరిపించుకోవాలన్నారు. కావలికి ప్రతిపక్ష నాయకులు వస్తే ఒప్పుకునేది లేదంటే.. అదేమైనా జీ జగీరా అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తేనే 307 సెక్షన్ నమోదు చేస్తారా? నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి మా ట్లాడుతూ కేవలం ప్రశ్నిస్తేనే 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసులు నమోదు చేస్తారా? అని నిలదీశారు. జగన్మోన్రెడ్డి పర్యటనలో ప్రసన్నకుమార్రెడ్డి ఇంటి వద్ద మఫ్టీలో ఉన్న ఓ పోలీసు తట్టుకుని కింద పడితే ప్రసన్నకుమార్రెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రౌడీలను పెంచిపోషిస్తున్నదే అధికారపార్టీ ఎమ్మెల్యేనన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డిపై అక్రమ కేసు దుర్మార్గం ఎమ్మెల్యే క్వారీలో అవినీతిపై విచారణ జరపాలి రూ.900 కోట్ల మనీస్కాం సూత్రధారులను కాపాడుతున్న ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ నేతలతో కలిసి కలెక్టర్కు కాకాణి వినతిపత్రం -
చరిత్రకొక్కడు..
వైఎస్సార్.. ఈ పేరు వింటే అన్నదాతే కాదు.. పుడమి తల్లి పులకిస్తోంది. వర్షపు నీటిని ఒడిసి పట్టి సాగుకు మళ్లించిన అపర భగీరథుడు. సింహపురి సిగలోని జలనిధి నుంచి జిల్లా నలుమూలలకు గంగమ్మను ఉరకలెత్తించారు. బంజరు భూములకు జలసిరులు అందించి బంగరు భూములుగా మార్చిన పాలక కర్షకుడు. జలయజ్ఞంతో డెల్టానే కాకుండా మెట్టలో ముక్కారు పంటలతో అన్నపూర్ణగా తీర్చిదిద్దారు. ఉమ్మడి జిల్లా తీరంలో మధ్య భాగంగా కృష్ణపట్నంలో పోర్టు నిర్మించి ప్రపంచ స్థాయి పటంలో నెల్లూరుకు స్థానం కల్పించిన భవిష్యత్ స్వాప్నికుడు. పవర్ ప్రాజెక్ట్లతో ఉమ్మడి జిల్లాలో వెలుగులు నింపిన వెన్నెల రేడు. పారిశ్రామిక సెజ్లతో విదేశీ సంస్థలను స్థాపించి అభివృద్ధికి బీజాలు వేసిన పాలికుడు. నిరుద్యోగాన్ని రూపు మాపి లక్షల కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన వల్లభుడు. దశాబ్దన్నర కాలం గడిచినా జిల్లా అన్నదాతల మదిలో రాజన్న స్థానం పదిలం.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: డాక్టర్ యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి 5 ఏళ్ల 3 నెలల ముఖ్యమంత్రి పరిపాలనలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాలు చరిత్రకొక్కడుగా చిరస్మరణీయం అయ్యారు. ఆ పెద్దాయన ప్రజల నుంచి దూరమై 16 వత్సరాలు గడిచిపోయినా.. నేటికీ జనం గుండెల్లో గూడు కట్టుకునే ఉన్నారు. క్రీ.పూ. క్రీ.శ. అన్నట్లు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిపాలనలోనూ, అభివృద్ధిలోనూ వైఎస్సార్ ముందు, వైఎస్సార్ తర్వాత అంటూ అభివర్ణిస్తూ, విశ్లేషిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఆ కోవలోనే నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ చేసిన అభివృద్ధి అజరామరంగా నిలిచిపోయాయి.అన్నపూర్ణగా ఖ్యాతిగాంచిన సింహపురిని జలసిరిగా మార్చిన జలయాజ్ఞికుడు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు వందల రూ.కోట్లతో పునాదులు వేసి జలయజ్ఞానికి శ్రీకారం చుట్టిన పాలక కర్షకుడు. 2004 ఎన్నికలకు ముందు వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర తర్వాత జిల్లాలో బస్సు యాత్రలో అడుగడుగునా అన్నదాతలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాలో సాగునీటిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. జలయజ్ఞం ద్వారా వందల రూ.కోట్లతో సమగ్ర సోమ శిల నుంచి పెన్నా, సంగం బ్యారేజీల నిర్మాణం వరకు అన్నింటికి ఆయన అంకురార్పణ చేశారు.వృథా నీటిని ఒడిసి పట్టి..వృథాగా సముద్రంలో కలుస్తున్న కృష్ణా నది వరద నీటిని శ్రీశైలం డ్యాం నుంచి కరువు ప్రాంతమైన రాయలసీమకు కేవలం 1,500 క్యూసెక్కుల తరలించేందుకు గతంలో ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని అధికారికంగా 44 వేల క్యూసెక్కులని చెప్పినా వాస్తవంగా 1.10 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో రోజుకు దాదాపు 10 టీఎంసీలు తరలించే విధంగా అభివృద్ధి చేశారు. పెన్నార్ డెల్టాతో పాటు మెట్ట ప్రాంత భూములను సస్య శ్యామలం చేసేందుకు జలయజ్ఞం ద్వారా రూ.220 కోట్లతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. సోమశిల ప్రాజెక్ట్ ద్వారా 5,84,500 ఎకరాలు సాగులోకి తెచ్చేందుకు ప్రతిపాదన చేశారు. ఇందులో 4,05,500 ఎకరాలు మాగాణి భూములతో పాటు కొత్తగా 1,79,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. దీంతో ఇప్పటికి దాదాపు 5,34,583 ఎక రాలకు పారుదల జరుగుతోంది. 49,917 ఎకరాలు ఆయ కట్టు పారుదల జరగాల్సి ఉంది. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణానది జలాలు సోమశిల రిజర్వాయర్ నుంచి కండలేరు జలాశయానికి, చైన్నె తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు పంపాల్సి ఉంది.సంగం బ్యారేజ్ నిర్మాణంతో..జిల్లాలోనే కీలక ప్రాజెక్ట్లైన సంగం, పెన్నా బ్యారేజీలపై దృష్టి సారించి 2006 మే 28న రూ.98 కోట్ల వ్యయంతో సంగం బ్యారేజీ శంకుస్థాపన చేశారు. 800 మీటర్ల పొడవుతో దీన్ని నిర్మించి 0.45 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటు డెల్టా స్థిరీకరణకు దోహదపడేలా సిద్ధం చేశారు. అయితే నిర్మాణ వ్యయం పెరగడంతో 2008లో రీ టెండర్లు నిర్వహించి ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.149.60 కోట్లకు పెంచి పనులు వేగవంతం చేశారు. ఆయన మరణానికి ముందు వరకు 40 శాతం పనులు పూర్తయ్యాయి. తదనంతర పాలకులు దీనిపై నిర్లక్ష్యం వహించడంతో పనులు ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లుగా మారాయి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఆయన కుమారుడు, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిపై దృష్టి సారించి పనులు వేగవంతం చేయించి ప్రజలకు అంకితం చేశారు. దీంతో జిల్లాలోని 3.85 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు దోహపడింది. పెన్నాడెల్టాలో 2.47 లక్షల ఎకరాలకు, కనుపూరు కెనాల్ పరిధిలో 63 వేల ఎకరాలు, కావలి కెనాల్ 75 వేల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రానున్న రోజుల్లో కొత్త ఆయకట్టు సాగులోకి రావడానికి దోహదపడింది. ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, సర్వేపల్లి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో సాగుకు మేలు చేకూరుతోంది. సోమశిల నుంచి 40 కిలో మీటర్ల దిగువ భాగంలో దీన్ని నిర్మించడం ద్వారా కుడి వైపున నెల్లూరు చెరువు, నెల్లూరు కాలువ, కనుపూరు కాలువ, కనిగిరి ప్రధాన కాలువ, దువ్వూరు కాలువ, కావలి కాలువ పరిధిలోని 3.85 లక్షల ఎకరాల సాగుకు ఇబ్బంది లేకుండా నీటి విడుదల జరుగుతోంది.● సూళ్లూరుపేట నియోజకవర్గంలో సెజ్లు ఏర్పాటు చేసి పారిశ్రామికాభివృద్ధితో ఆ ప్రాంతం ముఖచిత్రాన్ని మార్చేశారు. మూడు సెజ్ల్లో పారిశ్రామికంగా అభివృద్ధి వైపు పరుగులు తీయించి ప్రజల జీవన స్థితిగతుల్లో పెనుమార్పులు తీసుకువచ్చారు. గతంలో ఈ ప్రాంతం ఎంతో వెనుకబడి ఉండేది. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక రాజీవ్ పల్లెబాట కార్యక్రమాన్ని తడ నుంచి ప్రారంభించారు. ఆ సమయంలో నిరుద్యోగ యువతను చూసిన ఆయన ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తడ మండలం మాంబట్టు, నెల్లూరు – చిత్తూరు జిల్లాల సరిహద్దులో సత్యవేడు, వరదయ్యపాళెం, తడ మండలాలను కలుపుకుని సుమారు ఆరు వేల ఎకరాల్లో శ్రీసిటీ సెజ్ ఏర్పాటయ్యాయి. నాయుడుపేటలోని మేనకూరును కలిపి మూడు సెజ్ల్లో సుమారు 220 కంపెనీలు ఏర్పాటు చేశారు. ఎంతో మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించిన ఘనతను వైఎస్సార్ దక్కించుకున్నారు.● 2008 మే నెలలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మేనకూరు సెజ్లో భూమి పూజ చేసి పరిశ్రమలకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ చిన్న, మధ్య తరహా భారీ పరిశ్రమలతో కలిపి 25కు పైగా ఉన్నాయి. పోర్టులు, విమానాశ్రయాలు దగ్గర్లో ఉండడం, జలవనరులు పుష్కలంగా ఉండడంతో ఈ సెజ్ పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతోంది. హిందూస్థాన్ నేషనల్ గ్లాస్, గ్రీన్టెక్, లాయల్ టెక్స్టైల్స్, ప్రైమ్ మేడిన్, హీమెయిర్, అరబిందో ఫార్మా తదితర భారీ పరిశ్రమలున్నాయి.పెన్నా బ్యారేజ్తో.. 2008లో పెన్నాబ్యారేజ్ను రూ.126 కోట్ల వ్యయంతో నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. 0.55 టీఎంసీ నీటి సామర్థ్యంతో తలపెట్టిన పెన్నా బ్యారేజీ తదనంతరం రీ టెండర్ల ద్వారా రూ.149.39 కోట్లకు చేరింది. దివంగత మహానేత హయాంలో పరుగులు తీసిన అభివృద్ధి మళ్లీ ఆయన తనయుడు దృష్టి సారించి పూర్తి చేశారు. 57 గేట్లతో 637 మీటర్ల పొడవుతో 10.90 లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా బ్యారేజ్ని నిర్మించారు. నెల్లూరు బ్యారేజ్ నిర్మాణంతో 5 మండలాల్లోని 72 గ్రామాల పరిధిలో 99,525 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. సర్వేపల్లి కాలువ, జాఫర్ సాహెబ్ కాలువల పరిధిలోని ఈ ఆయకట్టు పూర్తిగా నీరు అందుతోంది. నెల్లూరు నగర తాగునీటి అవసరాలు తీరుతాయి. నెల్లూరు–కోవూరు మధ్య దూరం తగ్గింది.మహానేత దూరదృష్టి.. అభివృద్ధి సృష్టి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ దూరదృష్టితో అభివృద్ధి సృష్టించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 169 కి.మీ. పొడవైన సముద్ర తీరంలో మధ్య భాగం కృష్ణపట్నంలో పోర్టును నిర్మించారు. ఈ పోర్టు ద్వారా ఎగుమతులు, దిగుమతులతో ప్రపంచ స్థాయిలో సింహపురి కీర్తిని నిలిపారు. ఈ పోర్టు ద్వారా జిల్లాలో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి కల్పనకు బీజాలు వేశారు. జిల్లాకే కాకుండా రాష్ట్ర, కేంద్ర ఖజానాలకు ఆదాయవనరుగా మార్చారు. మరో వైపు అదే ప్రాంతంలో ప్రభుత్వ రంగంలో 2,400 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టి.. జిల్లాలో వెలుగులు నింపారు.సమగ్ర సోమశిల సాకారం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జిల్లా రైతుల సమగ్ర సోమశిల కలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏటా 35 నుంచి 48 టీఎంసీలకే పరిమితమైన సోమశిలను జలయజ్ఞం ద్వారా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ముంపు పరిహారంలో నెలకొన్న జాప్యం, అటవీశాఖ అనుమతులు లభించని పరిస్థితిపై దృష్టి సారించారు. ముంపు ప్రాంత బాధితుల పరిహారాన్ని వెంటనే విడుదల చేయించారు. వైఎస్సార్ పాలన ఏడాదిలోపే 48 టీఎంసీల నీటి నిల్వను 51 టీఎంసీల వరకు నీటి నిల్వ సామర్థ్యం పెంచారు. 2007–08లో 317 కాంటూరు వరకు నింపి పూర్తిస్థాయిలో 51 టీఎంసీ నిల్వ ఉంచేలా చేశారు. అనంతరం 326 కాంటూరు వరకు నీటి నిల్వ సామర్థాన్ని పెంచేందుకు వైఎస్సార్ జిల్లా ఎగువరాచపల్లి అడ్డంకిగా ఉండేది. ఈ గ్రామానికి యుద్ధప్రాతిపదికన పరిహారం చెల్లించి ఖాళీ చేయించి నీటి సామర్థ్యం పెంచేలా చేశారు. జలాశయంలో నీటి సామర్థ్యాన్ని 72 టీఎంసీల వరకు పెంచేలా చేసి సింహపురి రైతుల్లో హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారు. ప్రధానంగా సమగ్ర సోమశిలలో భాగంగా 104 కిలో మీటర్ల పొడవునా ఉత్తర కాలువను సోమశిల నుంచి ప్రకాశం జిల్లా కందుకూరు వరకు అభివృద్ధి చేసి నీటి అవుట్ ఫ్లో సామర్థ్యాన్ని పెంచారు. -
దైవ, దేశభక్తి సమ్మేళనమే గణేష్ ఉత్సవాలు
● మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరు(బృందావనం): దైవభక్తి, దేశభక్తి సమ్మేళనమే గణేష్ ఉత్సవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న నిమజ్జనోత్సవం పురస్కరించుకుని స్వర్ణాల చెరువు వద్ద ఆదివారం గణేష్ఘాట్ గణపతి విగ్రహానికి పూజలు చేసి ఆవిష్కరించారు. తొలుత శ్రీస్వర్ణ లింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకుని పూజలు చేశారు. ప్రజల్లో ఐక్యత పెంపొందించేందుకు, దేశభక్తిని కలిగించేందుకు, సంస్కృతి, సంప్రదాయాలను చాటేందుకు బాలగంగాధర్ తిలక్ సామూహిక గణేష్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఆయన ఆశయాలను అందరూ అనుసరించాలన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల పండగ సందర్భంగా దేశభక్తి, ధర్మానురక్తి ప్రజలందరి ఆకాంక్షంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆర్టీసీ నెల్లూరు రీజియన్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్రెడ్డి, బీజేపీ నేతలు పి.సురేందర్రెడ్డి, వంశీధర్రెడ్డి, ఇంకా బయ్యా వాసు, పిట్టి సత్యనాగేశ్వరరావు, శ్రీకాంత్, భాస్కరరెడ్డి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
వినాయక గ్రామోత్సవంలో ఉద్రిక్తత
● డీజేను అడ్డుకున్న పోలీసులు ● రోడ్డుకు అడ్డంగా ఉత్సవ వాహనం ● పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలుఇందుకూరుపేట: మండలంలోని గంగపట్నం మజరా టీవీకండ్రిగలో వినాయక గ్రామోత్సవంలో డీజే సౌండ్ సిస్టంకు అనుమతుల్లేవని పోలీసులు ఆదివారం అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిమజ్జనంలో భాగంగా ముందుగా గ్రామంలో ఊరేగింపు ప్రారంభించారు. డీజే ఏర్పాటు చేసి డ్యాన్స్లు చేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సమయంలో డీజేకు అనుమతి లేదని, స్థానికుల నుంచి ఫిర్యాదు అందిందంటూ ఎస్సై నాగార్జునరెడ్డి సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. అన్ని చోట్లా ఉత్సవాల్లో డీజే పెట్టారని, మా గ్రామంలో ఎటువంటి సమస్య లేకుండా ప్రశాంతంగా ఉత్సవం జరుగుతుంటే ఎందుకు అడ్డుకున్నారని గ్రామస్తులు పోలీసులను నిలదీశారు. ఫిర్యాదు చేశారో చెప్పాలని కోరారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మహిళల నినాదాలుపోలీసుల తీరుపై ఆగ్రహించిన ప్రజలు డీజే లేనిదే ఉత్సవం జరగదని భీష్మించారు. ఉత్సవ వాహనాన్ని రోడ్డుకు అడ్డుగా పెట్టి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ మహిళలు నినాదాలు చేశారు. నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించినా లెక్కచేయని గ్రామస్తులు తమ నిరసనను అలాగే కొనసాగించారు. పలువురు నాయకులు వచ్చి చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. -
ఎన్టీఏ జిల్లా కార్యవర్గ ఎన్నిక
నెల్లూరు(టౌన్): నోబెల్ టీచర్స్ అసోసియేషన్ (ఎ న్టీఏ) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. స్థానిక ఎన్టీఏ జిల్లా కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా నాటకం తిరుమలయ్య, ప్రధాన కార్యదర్శిగా సీహెచ్ చెన్నయ్య, గౌరవాధ్యక్షుడిగా వెంకటరాజు, క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడిగా చంద్రశేఖరరెడ్డి, ఆత్మకూరు ఇన్చార్జిగా రహంతుల్లా నియమితులయ్యారు. సమావేశంలో ఎన్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులురాజు, నాయకులు వెంకరావు, జయప్రకాష్ నాయుడు, రెడ్డి రమే ష్, జిల్లా నాయకులు శ్రీనివాసులు, చంద్రశేఖర్, రఫీ, సురేష్, హరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన తెలుగు భాషోత్సవాలు
నెల్లూరు(బృందావనం): గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని నెల్లూరు పురమందిరంలో సేవ తెలుగు భాష, సాహితి, సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో మూడురోజులుగా జరుగుతున్న తెలుగు భాషోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఉదయం ‘తెలుగు సాహిత్య విమర్శ’పై నిర్వహించిన సదస్సు నూతన ఆలోచనలకు నాందిపలికింది. దీనికి ప్రముఖ కవి కొండ్రెడ్డి వేంకటేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. ప్రసిద్ధ విమర్శకులు రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ విమర్శ రాయడం కష్టతరమైన బాధ్యతగా పేర్కొన్నారు. కీలకోపన్యాసకులు మేడిపల్లి రవికుమార్ మాట్లాడుతూ నేటి విమర్శపై, పరిశోధనలపై అప్రకటిత ఆంక్షలున్నాయంటూ వివరించారు. ఆచార్య పీసీ వెంకటేశ్వర్లు, ఆచార్య సీహెచ్ సుశీలమ్మ, ఉన్నం జ్యోతివాసు, డాక్టర్ శ్రీనివాసులురెడ్డి, డాక్టర్ కవితశ్రీ తదితరులు తమ భావాలను కూలంకషంగా వ్యక్తీకరించారు. వేంకటేశ్వరరెడ్డి రచించిన మూడు గ్రంథాలను ఆవిష్కరించారు. నెల్లూరు కవి గుడ్లదొన సాయిచంద్రశేఖర్ తొలి కవితా సంపుటి ‘నిశ్శబ్ద మాధుర్యం’ను చంద్రశేఖర్రెడ్డి ఆవిష్కరించారు. ఆ సంస్థ అధ్యక్షుడు కంచర్ల సుబ్బానాయుడు సాహితీవేత్తలను గౌరవ పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో ఆచార్య కొలకలూరి ఇనాక్, నాగసూరి వేణుగోపాల్, గారపాటి ఉమామహేశ్వరరావు, చలంచర్ల భాస్కరరెడ్డి, డాక్టర్ నాళేశ్వర శంకరం, కుసుమ కుమారి, కె.శోభ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం, కథ, నవల, నాటకం, సినీ సాహిత్య సదస్సు, రాత్రి సమాపనోత్సవం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు, రచయితలు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొని మాట్లాడారు. -
వరి కోసేందుకు వెళ్లి..
ఇందుకూరుపేట: విద్యుత్ వైరు తగిలి రైతు మృతిచెందిన ఘటన మండలంలోని కొత్తూరు మజారా చట్టివారికండ్రిగలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నెట్రంబాక వెంకటేశ్వర్లు (55) వరి పంటను కోసేందుకు సిద్ధమై పొలంలో తిరుగుతున్నాడు. ఈ సమయంలో విద్యుత్ స్తంభానికి ఉన్న లైన్ తెగి పడిఉంది. ఇది వెంకటేశ్వర్లు గమనించలేదు. అతను విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతిడికి భార్య, పిల్లలున్నారు. కాగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణమని స్థానిక రైతులు ఆరోపించారు. ఏబీ స్విచ్లు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. -
మృత్యు తీగలు
● విద్యుదాఘాతానికి గురై వేర్వేరు చోట్ల ఇద్దరి మృతి ● విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమని ఆరోపణలుఉదయగిరి: ఉదయగిరి పట్టణంలోని కంసాలవీధిలో ఐదో తరగతి చదువుతున్న షేక్ సమీర్ (10) అనే చిన్నారి విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కంసాలివీధిలో విద్యుత్ స్తంభం నుంచి గృహ వినియోగం కోసం సర్వీస్ వైర్ లాగి ఉన్నారు. స్తంభం నుంచి ఇంటి వరకు దూరం ఉన్నందున స్థానికులు ఇనుప పైపు ఏర్పాటు చేసుకుని అందుకు సర్వీసు తీగలు లాగి కట్టారు. ఆ పైపునకు విద్యుత్ సరఫరా అయ్యింది. ఆ వైపు వెళ్తున్న సమీర్ దానిని పట్టుకోవడంతో షాక్కు గురయ్యాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బిడ్డ మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇనుప పైపునకు విద్యుత్ సరఫరా అవుతున్న విషయం తెలిపినా పట్టించుకోలేదని వాపోతున్నారు. ఎస్సై ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.విద్యుత్ తీగలు యమపాశాలుగా మారాయి. వేర్వేరు మండలాల్లో ఇద్దరు షాక్కు గురై తనువు చాలించారు. మృతుల్లో పదేళ్ల చిన్నారి ఉన్నారు. -
తమ్ముళ్ల బరితెగింపు
లారీల్లో ఇసుక తరలింపుప్రకృతి వనరులను కొల్లగొట్టడంలో తెలుగు తమ్ముళ్ల బరితెగింపు హద్దులుదాటుతోంది. వాస్తవానికి ఇసుక తవ్వకాలపై అక్టోబర్ 15 వరకు నిషేధమున్నా, ఇదేమీ వారిని ఆపలేకపోతోంది. అధికారం ఉందనే ధీమాతో చెలరేగిపోతూ పెన్నాలో దర్జాగా రోడ్డును నిర్మించారు. ప్రవాహానికి అది కొట్టుకుపోవడంతో కొద్ది రోజులు మౌనంగా ఉండి.. ఆపై గ్రావెల్, బండ రాళ్లతో పక్కాగా ఏర్పాటు చేసుకొని తమ పనిని కానిచ్చేస్తున్నారు. ఈ రకంగా వ్యవహరిస్తున్నా, చోద్యం చూడటం అధికారుల వంతవుతోంది.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఇసుకను అక్రమంగా తరలిస్తూ పచ్చ నేతలు చెలరేగిపోతున్నారు. కలువాయి మండలంలో జరుగుతున్న ఈ తంతు వీరి ఆగడాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ భూ, ఇసుక, గ్రావెల్ మాఫియా పేట్రేగిపోతోంది. సహజ సంపదను అక్రమంగా రవాణా చేసి కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు. పండగ వేళ.. ప్రజలందరూ వినాయక చవితి ఉత్సవాల్లో ఉన్న సమయంలో కలువాయి మండలం రాజుపాళెం సమీపంలోని పెన్నా పరిధిలో ఇసుక మాఫియా తమ పనిని సజావుగా కానిచ్చేందుకు ఏకంగా రోడ్డునే నిర్మించింది. రాపూరు మండలం తెగచర్ల నుంచి భారీగా గ్రావెల్, బండ రాళ్లను ఇక్కడికి తోలి.. పైపులతో దారిని ఏర్పాటు చేయడంపై స్థానికులు భగ్గుమంటున్నారు. కొద్ది రోజులు నటన నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో రోడ్డు ఇటీవల కొట్టుకుపోయింది. అయితే మీడియాను పక్కదోవ పట్టించేందుకు పనులను ఆపేసినట్లు.. రెవెన్యూ, మైనింగ్ అధికారులు సీజ్ చేశారనే రీతిలో వ్యవహరించి ఆపై తమ పనులను యథావిధిగా చేపట్టారు. రాజుపాళెంలో అక్రమ రీచ్ ఏర్పాటుకు ఓ ప్రైవేట్ వ్యక్తి మామిడి తోట నుంచి డీపీ – 1 కాలువను పూడ్చేసి మరీ రహదారిని ఏర్పాటు చేసుకున్నారు. వీటిని చకచకా చేపట్టడం వెనుక అధికారుల హస్తం ఉందని సమాచారం. ఆదేశాలు బేఖాతర్ జిల్లాలో ఇసుక రీచ్లకు అనుమతులను అక్టోబర్ 15 వరకు అధికారులు రద్దు చేశారు. అయితే వీరి ఆదేశాలను బేఖతార్ చేస్తూ రాజుపాళెం రీచ్లో అక్రమ రవాణాకు అన్నీ సిద్ధం చేశారు. గ్రావెల్, బండరాళ్లను పట్టపగలు దర్జాగా తోలుతున్నా పట్టించుకోకుండా, రెవెన్యూ, మైనింగ్ పోలీస్, ఇరిగేషన్ శాఖలు అక్రమార్జనలో భాగస్వాములయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మళ్లీ ఇసుక దోపిడీ పెన్నాలో దర్జాగా రోడ్డు నిర్మాణం ప్రవాహానికి కొట్టుకుపోవడంతో కొద్ది రోజులు విరామం తాజాగా గ్రావెల్, బండ రాళ్లతో పక్కాగా ఏర్పాటు అక్టోబర్ 15 వరకు తవ్వకాలపై నిషేధమున్నా.. ప్రయోజనమేదీ..? అధికారుల తీరుపై విస్మయం యంత్రాల ద్వారా కాకుండా కూలీలతో పెన్నా నుంచి ఇసుక పూడికతీత అని అధికారులు టెండర్లు పిలిచి అనుమతులిచ్చారని తెలిసింది. సంగం బ్యారేజీలో పూడికతీత పనులకు టెండర్లను సోమశిలకు దగ్గరగా ఉండే రాజుపాళెంలో ఎలా పిలిచారో అధికారులకే అర్థం కావాలి. ఇసుకను కూలీలే బయటకు తీసి, వాహనాల్లో ఎలా లోడ్ చేస్తారో వారికే ఎరుక. అధికారుల తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. -
క్షణం ఆలోచిస్తే.. నిలుస్తుంది ప్రాణం
ఇటీవల కొన్ని ఘటనలు ● బుజబుజనెల్లూరు వల్లూరమ్మకాలనీకి చెందిన ఓ వృద్ధుడు అప్పులపాలై ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు.● గుర్తుతెలియని వ్యక్తి వందేభారత్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.● నెల్లూరు డ్రైవర్స్ కాలనీలో అనారోగ్యంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.● బీవీనగర్లో ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకున్నాడు.● మద్యానికి బానిసైన ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.నెల్లూరు(క్రైమ్): జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకోలేక చిన్నచిన్న సమస్యలకూ కుంగిపోతూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఎన్నెన్నో బంధాలను పెనవేసుకున్నా.. అన్నింటిని తుంచేసుకుని నా అనుకున్న వారిని నట్టేట వదిలేసి అనంతలోకాలకు వెళ్లిపోతున్నారు. జిల్లాలో పెరుగుతున్న బలవన్మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.ప్రస్తుత పోటీ ప్రపంచంలో జీవన వేగం జోరందుకోవడంతోపాటు అంతే స్పీడుగా ప్రజల్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. కుటుంబ సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, అనారోగ్యం, ఉద్యోగం రాలేదని, రుణ, ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలు, ఒత్తిడి ఇలా రకరకాల కారణాలతో పలువురు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎన్నో బంధాలను చిదిమేస్తున్నాయి. ఆలోచన శక్తి కలిగి ఉండి తనకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారమార్గాలు కనుగొనే అవకాశం ఉన్నా చిన్నచిన్న విషయాలకే మనోధైర్యాన్ని కోల్పోతూ ప్రాణాలు తీసుకుంటూ కుటుంబ సభ్యులకు అంతులేని ఆవేదన మిగులుస్తున్నారు. కొన్ని కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి చిన్నాభిన్నమవుతుంటే.. మరికొన్ని ఇళ్లలో చేతికందొచ్చిన కొడుకు తనువు చాలించి పోషణ కరువవడం, మరోచోట భర్తను కోల్పోయి భార్యాపిల్లలు అనాథలవడం, అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు చదువుల్లో ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడటం వంటి ఘటనలు కలవరపెడుతున్నాయి.గుర్తుచేసుకుని..సమస్య ఏదైనా ఓర్పుగా పరిష్కారం వైపు అడుగులు వేయాలే తప్ప భయపడి ఆత్మహత్యలకు పాల్పడితే నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటో గ్రహించాలి. అనుబంధాలు, ఆత్మీయతలను ఒక్కసారి గుర్తుచేసుకుని క్షణంపాటు ఆలోచించినా జీవితాన్ని అలవోకగా జయించవచ్చని మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు 61 మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. బలవన్మరణానికి పాల్పడుతున్న వారిలో 16 నుంచి 40 ఏళ్లలోపు వయసున్న వారే ఎక్కువగా ఉన్నారు. -
నీ వ్యాఖ్యలను అసహ్యించుకుంటున్న ప్రజలు
● కావలి ఎమ్మెల్యేపై ధ్వజమెత్తిన పేర్నేటి నెల్లూరు(స్టోన్హౌస్పేట): ఈవీఎంలు కలిసొచ్చి గెలిచిన నీవు.. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడే మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ప్రజలు అసహ్యించుకుంటున్నారంటూ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పేర్నేటి కోటేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. కావలిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ను వెలుగులోకి తీచ్చేందుకు యత్నించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిపై అక్రమ కేసులను బనాయించడం దారుణమని చెప్పారు. ఆయన్ను పరామర్శించేందుకు సంకల్పించిన కాకాణి, పర్వతరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు కావ్య వ్యక్తిత్వానికి నిదర్శనమని విమర్శించారు. ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలపై కృష్ణారెడ్డికి కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత దూషణలకు దిగడం సిగ్గుచేటన్నారు. మీడియా సమావేశాల్లో ఎలా మాట్లాడాలో తెలియని ఆయన తన నీచపు వ్యక్తిత్వాన్ని బయటపెట్టారని పేర్కొన్నారు. చంద్రశేఖర్రెడ్డికి స్కూళ్లు లేవని, ఉన్నవి కళాశాలలు మాత్రమేననే విషయాన్ని అజ్ఞానైన ఆయన గుర్తుంచుకోవాలని హితవు పలికారు. క్వారీల్లో జరుగుతున్న అక్రమ బ్లాస్టింగ్లతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. కావలిలో జరిగిన మనీస్కామ్లో కోట్లాది రూపాయలు చేతు లు మారాయని తాము చెప్తుంటే, ఇప్పటివరకు స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికై నా చవకబారు మాటలకు స్వస్తి పలికి, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. -
పక్షవాత రోగిపై పచ్చపాతం
పక్షవాతంతో దయనీయ దుస్థితిని ఎదుర్కొంటున్న అభాగ్యుడిపై దయ లేకుండా పింఛన్ సొమ్ములో కోత విధించేందుకు కూటమి సర్కార్ సిద్ధపడింది. ఇందుకూరుపేట మండలం గంగపట్నం దళితవాడకు చెందిన మర్లపాటి చార్ముడయ్య కూలీనాలీ చేసుకొని జీవనం సాగించేవారు. పక్షవాతంతో చార్ముడయ్య పదేళ్ల క్రితం మంచాన పడ్డారు. భార్య సాయం లేనిదే కాలకృత్యాలు తీర్చుకోలేని పరిస్థితిలో బతుకీడుస్తోంది. ఏ ఉపాధీ లేని ఆ కుటుంబానికి చార్ముడయ్యకు ఇచ్చే పింఛనే ఆధారం. మందులకే నెలకు ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంది. గత నెల వరకు పింఛన్ రూపంలో రూ.15 వేలను ఇస్తుండగా, తాజాగా ఈ నెల నుంచి రూ.ఆరు వేలే వస్తాయంటూ ఈయనకు నోటీసులను అందజేశారు. దీంతో తామెలా బతకాలంటూ ఈ దంపతులు లబోదిబోమంటున్నారు. -
30 శాతం ఐఆర్ను ప్రకటించాలి
నెల్లూరు (టౌన్): కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ కమిషన్ను నియమించి 30 శాతం ఐఆర్ను వెంటనే ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. స్థానిక అన్నమయ్య సర్కిల్లోని యూటీఎఫ్ భవనంలో ఆదివారం నిర్వహించిన మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. పాఠశాలల బలోపేతానికి యూటీఎఫ్ కార్యకర్తలు శ్రమించాలని సూచించారు. ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని కోరారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవకోటేశ్వరరావు మాట్లాడారు. ప్రచార యాత్రను ఈ నెల 8 నుంచి 12 వరకు నిర్వహించనున్నామని చెప్పారు. పీఆర్సీ, ఐఆర్, డీఏల సాధనకు గానూ ఈ నెల 17 నుంచి 20 వరకు మండల కేంద్రాల్లో.. అక్టోబర్ 7న జిల్లా కేంద్రంలో.. 21న విజయవాడలో ధర్నా ను నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నామని వెల్లడించారు. సమావేశంలో మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి, జన విజ్ఞాన వేదిక నేతలు కృష్ణారెడ్డి, ఉదయ్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూములు హాంఫట్
● జామాయిల్ మొక్కలు నాటి.. సొంతం చేసుకుంటున్న కబ్జాదారులు ● అధికారులకు విన్నవించినా స్పందన శూన్యం మర్రిపాడు: మర్రిపాడులోని ప్రతి గ్రామంలో వందలెకరాల్లో ప్రభుత్వ భూములున్నాయి. ఇంకేముంది కబ్జాదారుల కన్ను వీటిపై పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వీరి ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. మండల పరిధిలోని పెగళ్లపాడు రెవెన్యూలో 82, 83, 84 నుంచి 113 వరకు ఉన్న ససర్వే నంబర్లలో దాదాపు వందెకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఉమ్మాయపల్లికి చెందిన కొందరు జామాయిల్ సాగు చేసుకునేందుకు గానూ కొన్ని ఆన్లైన్ పట్టాలు.. మరికొన్ని నకిలీ పట్టాలతో వీటిని కబ్జా చేసేందుకు జేసీబీ ద్వారా చెట్లను తొలగిస్తున్నారు. జామాయిల్ను వారం రోజులుగా సాగు చేస్తున్నా, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే తరహాలో.. మండలంలోని చుంచులూరు రెవెన్యూ పరిధిలో కొత్తపల్లి పాత రోడ్డును ఆనుకొని తారు రోడ్డు పక్కనే ఉన్న సర్వే నంబర్ 39, 41లో విలువైన ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ ఎకరా విలువ రూ.ఐదు లక్షలకుపైగానే ఉంటుంది. రాజకీయ పలుకుబడి ఉన్న గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఈ భూమికి పక్కనే కొంత భూమికి అసైన్మెంట్ పట్టా పొందారు. తాజాగా దీని పక్కనే ఉన్న సుమారు రెండెకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి జేసీబీలతో ముళ్ల చెట్లను తొలగించి, చదును చేసి జామాయిల్ మొక్కలు నాటారు. విషయం తెలుసుకున్న పక్కనే ఉన్న 42 సర్వే నంబర్ పట్టాదారు.. 50 ఏళ్ల హక్కు అనుభవం కలిగిన రిజిస్టర్ పొలానికి దారి లేకుండా చేయడం అన్యాయమంటూ తహసీల్దార్ను ఆశ్రయించారు. మర్రిపాడులో ఇటీవల నిర్వహించిన స్పెషల్ గ్రీవెన్స్లో ఆర్డీఓ పావనికు అర్జీని సమర్పించారు. ఆదేశాలు పెడచెవిన ఈ క్రమంలో సర్వేయర్లతో సర్వేను మూడు రోజుల క్రితం తహసీల్దార్ చేయించారు. పక్కా నివేదికతో సదరు భూమిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి అది ప్రభుత్వానికి చెందినదిగా నిర్ధారించారు. 42 సర్వే నంబర్ గల సెటిల్మెంట్ భూమికి ప్రభుత్వ పొలంలో 20 అడుగుల దారిని కొలిచి సదరు రైతుకు ఇచ్చారు. అయితే అక్రమణలకు అలవాటుపడిన కబ్జాదారులు అధికార పార్టీ నేతల అండదండలతో రెచ్చిపోతూ ప్రభుత్వ భూములను స్వాహా చేస్తున్నారు. తహసీల్దార్ అనిల్కుమార్ ఆదేశాలను ధిక్కరిస్తూ దారి ఇక్కడ లేదంటూ అడ్డుకున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించడం.. చెట్లు నాటి పక్క పొలానికి దారి లేకుండా చేయడం అన్యాయమని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఆత్మకూరు ఆర్డీఓ క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేయాలని బాధిత రైతు కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ను సంప్రదించగా, పరిశీలించి చర్యలు చేపడతామని బదులిచ్చారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ప్రభుత్వ భూములను అక్రమార్కులు అన్యాక్రాంతం చేస్తున్నారు. వీటిని చేజిక్కించుకునేందుకు ఎన్నో జిమిక్కులకు పాల్పడుతున్నారు. భూములను చదును చేయడం.. ఆపై జామాయిల్ మొక్కలు నాటడం.. అవి తమదేనంటూ బొక్కేయడం పరిపాటిగా మారింది. మండల, డివిజన్ స్థాయి అధికారులకు స్థానికులు సమాచారమిచ్చినా, వారెలాంటి చర్యలు చేపట్టడంలేదు. -
మరోసారి ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
కావలి (జలదంకి): కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి మరోసారి వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి, మాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నోరు పారేసుకున్నారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వీరంతా అవినీతిపరులు, తాను సచ్చీలుడినంటూ చెప్పుకొచ్చారు. ఎప్పుడో కొన్నేళ్ల కిత్రం నిర్మించిన ప్రతాప్కుమార్రెడ్డి కాలేజీ, కల్యాణ మండపం, ఇల్లు ఆక్రమించాడంటూ పొంతన లేకుండా మాట్లాడారు. మాజీ మంత్రి కాకాణిని ఉద్దేశించి ‘నీవు చచ్చోడివి.కావలికి రాలేకపోయావు. పోలీసులకు చెప్పి హౌస్ అరెస్ట్ చేయించుకున్నావు. నీకు బొక్కలున్నాయి. వాటిని నీకు విప్పి చూపిస్తా’ అభ్యంతరకర భాషలో దూషిస్తూ ఊగిపోయాడు. దొంగతనాలు, మానభంగాలు చేయించావు. మనుషులను చంపించావు. మంత్రి అయ్యేటప్పుడు కోర్టులో ఫైళ్లు దొంగిలించావు. కృష్ణపట్నం పోర్టు నుంచి నీ అవినీతిని బయటకు తీస్తానంటూ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. చంద్రశేఖర్రెడ్డిని కూడా పరుష పదజాలంతో మాట్లాడాడు. చదువుల తల్లికి ప్రతినిధిగా ఉండే నీవు సంస్కారంగా ఉండాలన్నారు. నీ జీవితం, నీ కథ, నీ ఆస్తులు, నీ మానభంగాలు అన్నీ తెలుసు, 10వ తరగతి, ఇంటర్ పేపర్లలో లీకేజీలతో నీకు సంబంధం ఉందంటూ విమర్శలు గుప్పించారు. -
అస్తిత్వవాద సాహిత్యంపై సదస్సు
నెల్లూరు(బృందావనం): వ్యావహారిక భాషోద్యమకారుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని నగరంలోని పురమందిరంలో తెలుగు భాషోత్సవాలను సేవ తెలుగు భాషా, సాహితీ, సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అస్తిత్వవాద సాహిత్యంపై సదస్సును రెండో రోజు శనివారం నిర్వహించారు. సభకు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘ అధ్యక్షుడు రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి అధ్యక్షత వహించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వాధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ రచించిన బహుజనగణమన వచన కావ్యాన్ని ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ మాట్లాడారు. సామాజిక న్యాయ ప్రాతిపదికన దేశాన్ని శాంతియుత పద్ధతుల్లో పునర్నిర్మించడమే అస్తిత్వ ఉద్యమాల లక్ష్యమని చెప్పారు. కథా రచయిత్రి ప్రతిమ, డాక్టర్ షమీవుల్లా, డాక్టర్ జయప్రద, సేవ అధ్యక్షుడు కంచర్ల సుబ్బానాయుడు, డాక్టర్ రేవూరు అనంతపద్మనాభరావు, డాక్టర్ మాడభూషి సంపత్కుమార్ తదితరులు గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన పలువురు కవులతో కవితోత్సవాన్ని నిర్వహించారు. తెలుగు సాహిత్య సౌరభాలు సాహితీ రూపకాన్ని ప్రదర్శించారు. మహిళా సదస్సును ఏర్పాటు చేశారు. -
పోలీసుల సమక్షంలో రికార్డింగ్ డ్యాన్స్
● టీడీపీ నేత నిర్వాకం ● జనరేటర్కు చున్నీ తగిలి.. కిందపడటంతో డ్యాన్సర్కు గాయాలు ఉలవపాడు: వినాయక చవితి నేపథ్యంలో రికార్డింగ్ డ్యాన్స్ను ఉలవపాడులో పోలీసుల సమక్షంలో టీడీపీ నేత నిర్వహించారు. అధికారం అండతో స్థానిక గంగమిట్టలోని వినాయకుడి గుడి ధర్మకర్తగా ఉన్న టీడీపీ నేత.. చిలకలూరిపేటకు చెందిన ఎనిమిది మంది యువతులను తీసుకొచ్చి ట్రాక్టర్పై గ్రామమంతా తిరుగుతూ డ్యాన్స్ నిర్వహించేలా ఏర్పాటు చేశారు. దీనిపై కాలనీకి చెందిన కొందరు కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నాలుగు రోజుల క్రితమే ఫిర్యాదు చేసినా, పోలీస్ శాఖ ఏ మాత్రం పట్టించుకోలేదు. పోలీస్ వాహనంలో ఖాకీలు వచ్చి దగ్గరుండి డ్యాన్స్ను నిర్వహించారు. ఈ క్రమంలో కోనేరు వద్దకు ట్రాక్టర్ వచ్చేసరికి ఓ డ్యాన్సర్ చున్నీ జనరేటర్కు తగిలింది. దీంతో తీవ్రగాయాలతో స్పృహ తప్పి పడిపోయారు. స్థానికంగా ఉన్న సరయూ వైద్యశాలకు వెంటనే తరలించారు. రికార్డింగ్ డ్యాన్స్లపై నిషేధం ఉన్నా.. డీజేకు అనుమతి లేకపోయినా సదరు టీడీపీ నేత తాను డ్యాన్స్ పెడతానని ముందే ప్రకటించి ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిందని ఎస్సై అంకమ్మకు స్థానికులు ఫోన్ చేయడంతో దీన్ని నిలిపేయించారు. -
సిండికేట్ సక్సెస్
● జిల్లాలో 55 బార్లకు నోటిఫికేషన్ ● 21 బార్లకే నామమాత్రంగా దరఖాస్తులు ● గత్యంతరం లేక కట్టబెట్టిన వైనం నెల్లూరు (క్రైమ్): బార్ల ఏర్పాటు విషయంలో సిండికేట్ వేసిన ప్లాన్ కొంత మేరకు సక్సెస్ అయింది. జిల్లాలో 55 బార్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే మద్యం షాపులు, పర్మిట్ రూమ్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వ్యాపారాన్ని కోల్పోతున్న బార్ల యజమానులు సిండికేట్గా మారారు. అన్ని బార్లకు దరఖాస్తులు రాకుండా కేవలం 21 బార్లకు మాత్రమే దరఖాస్తులు వేశారు. దీంతో గత్యంతరం లేక నిబంధనలు సడలించిన అధికారులు లక్కీడ్రా నిర్వహించి బార్లను కేటాయించారు. సిండికేట్ చర్యలతో ప్రభుత్వాదాయానికి భారీగా గండి పడింది. జిల్లాలో ఓపెన్ కేటగిరీ కింద 50 బార్లు, గీత కులాలకు సంబంధించి ఐదు బార్లకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు నోటిఫికేషన్లు విడుదల చేశారు. దీంతో బార్లన్నింటిని ఏకపక్షంగా దక్కించుకునేందుకు మద్యం సిండికేట్ రంగంలోకి దిగింది. దరఖాస్తులు దాఖలు చేయకుండా అడ్డుకుంటూ వచ్చింది. మరో వైపు బార్ల విధానంలో తమకు అనుకూలంగా మరిన్ని సడలింపులు, రాయితీలు దక్కించుకోవాలని సిండికేట్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి. నూతన బార్పాలసీపై వ్యాపారులు అనాసక్తి కనబరుస్తూ దరఖాస్తులు దాఖలు కాకుండా చేశారు. దీంతో ఈ నెల 26న దరఖాస్తుల స్వీకరణ ముగిసే సమయానికి కేవలం ఐదు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం గడువును 29వ తేదీ వరకు పొడిగించింది. అయినప్పటికి దరఖాస్తుల దాఖలు నామమాత్రంగానే మారింది. దీంతో సిండికేట్ కొంత మేర సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. 21 దుకాణాలకే దరఖాస్తులు.. లక్కీడ్రా జిల్లాలో 55 బార్లకు 21 దుకాణాలకు 94 దరఖాస్తులు మాత్రమే దాఖలయ్యాయి. నెల్లూరులో 38 బార్లకు 13, కావలిలో ఏడు బార్లకు రెండు, కందుకూరులో మూడు బార్లకు రెండింటికే దరఖాస్తులు వచ్చాయి. గీత కులాలకు సంబంధించి నెల్లూరులో రెండు, కావలి, కందుకూరులో చెరో ఒక బార్కు దరఖాస్తులు వచ్చాయి. మిగిలిన వాటికి దరఖాస్తులు దాఖలు కాలేదు. 21 బార్లకు శనివారం జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో జేసీ కె.కార్తీక్ లక్కీడిప్ నిర్వహించారు. బార్లు దక్కించుకున్న వ్యాపారులు లైసెన్సు ఫీజులో ఆరో వంతు, బ్యాంకు గ్యారెంటీలు సమర్పించిన అనంతరం ఎకై ్సజ్ అధికారులు లైసెన్సులు మంజూరు చేయనున్నారు. దరఖాస్తులు, ప్రొసెసింగ్ ఫీజు రూపేణా రూ.4,79,40,000, తొలి విడత లైసెన్సు ఫీజు రూపేణా రూ.2,21,29,000 మొత్తంగా రూ.7,00,69,000 ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చింది. మిగిలిన బార్లకు ప్రభుత్వం మరో మారు రీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. లక్కీడిప్లో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఎం.శంకరయ్య, ఏసీ పి. దయాసాగర్, డీపీఈఓ ఎ. శ్రీనివాసులునాయుడు, ఏఈఎస్లు జే రమేష్, ఆర్. జగదీశ్వర్రెడ్డి పాల్గొన్నారు. నేటితో కాలపరిమితి ముగింపు ప్రస్తుతం జిల్లాలోని 47 బార్ల కాల పరిమితి ఆగస్టు 31వ తేదీ ఆదివారం రాత్రితో ముగియనుంది. దీంతో వారం రోజుల ముందు నుంచే బార్ల నిర్వాహకులు మద్యం కొనుగోలును నిలిపివేశారు. ఉన్న అరకొర మద్యంను విక్రయిస్తున్నారు. ఆదివారం రాత్రి ఎకై ్సజ్ అధికారులు వాటన్నింటికి సీల్ వేయనున్నారు. రేపటి నుంచి కొత్తబార్లు లాటరీ డ్రాలో నెల్లూరు నగరంలో గెజిట్ సీరియల్ నంబర్ 4, 6, 7, 9,11,12,16, 18, 28, 29, 30, 35, 36, కావలిలో 42, 45, కందుకూరులో 46, 48, గౌడ కులాలలకు సంబంధించి నెల్లూరులో రెండు, కావలి, కందుకూరులో చెరో ఒక బార్ను వ్యాపారులు దక్కించుకున్నారు. బార్లు దక్కించుకున్న వారిలో అధికశాతం మంది టీడీపీకి చెందిన వారే. సెప్టెంబర్ ఒకటి నుంచి కొత్త బార్లు ప్రారంభం కానున్నాయి. -
రైతుకు యూరియా ఇవ్వలేని విజనరీ చంద్రబాబు
నెల్లూరు (స్టౌన్హౌస్పేట): సీఎం చంద్రబాబు వ్యవసాయాన్ని పూర్తిగా గాలికొదిలేశారని, రైతు సమస్యలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి మండి పడ్డారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కనీసం రైతులకు సరిపడినంత యూరియాను కూడా అందించలేని అసమర్థ పాలనను చంద్రబాబు కొనసాగిస్తున్నాడని, ఆయనొక విజనరీ అంటూ ఎద్దేవా చేశారు. వ్యవసాయశాఖ మంత్రి చూస్తే అధికారులను అడ్డం పెట్టుకుని కమీషన్లు దండుకునే పనిలో తీరిక లేకుండా ఉన్నారని దుయ్యబట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. ఒక వైపు పంటలకు యూరియా దొరక్క అవస్థలు, మరో వైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేని దుస్థితి ఉందన్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో వ్యవసాయ యాంత్రీకరణ కింద రైతులు ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు కొనుగోలు చేస్తే 40 శాతం సబ్సిడీని వారి ఖాతాల్లో మా ప్రభుత్వం పారదర్శకంగా జమ చేసిందన్నారు. ఆర్బీకేల ద్వారా విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలబడ్డామన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రి అధికారులను కమీషన్ ఏజెంట్లుగా మార్చేశాడని దుబయ్యబట్టారు. నెల్లూరులో పంట కోతకొచ్చినా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని ప్రభుత్వం ఇంతవరకు అధికారులకు చెప్పలేదు. పుట్టి ధాన్యం రూ.19,770 ఉంటే.. దళారులు రూ.15 వేలకే కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఉల్లి రైతులను పట్టించుకోరా? కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల ఆర్తనాదాలు సీఎం చంద్రబాబుకు వినిపించడం లేదని కాకాణి విమర్శించారు. మార్కెట్లో కిలో ఉల్లి రూ.25 ఉంటే, ఏపీలో మాత్రం రైతుల దగ్గర కేవలం రూ.2 నుంచి రూ.4లకే కొనుగోలు చేస్తున్నారన్నారు. మద్దతు ధర కల్పించే దిశగా చంద్రబాబు ఆలోచన చేయడం లేదు. వ్యవసాయ పంటల నుంచి ఉద్యాన పంటల వరకు ఏ ఒక్క రైతుకు మేలు జరగడం లేదని, ప్రతిపక్షంగా రైతుల తరఫున రాష్ట్ర వ్యాప్త పోరాటాలకు సిద్ధమవుతామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా ఉండడం వల్ల రైతులు ధైర్యంగా ఉండేవారన్నారు. మా ప్రభుత్వమే రైతుల తరఫున ప్రీమియం కూడా చెల్లించిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత పంటల బీమా పథకాన్ని పూర్తిగా గాలికొదిలేశారన్నారు. ఇప్పటికై నా రైతు సమస్యలపైన సీఎం చంద్రబాబు దృష్టి సారించాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని, పోలవరం ప్రాజెక్ట్ జాప్యం కావడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. చంద్రబాబు చేసిన పాపాలు రైతుల పాలిట శాపాలుగా పరిణమించాయి. గతంలో 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు హంద్రీ నీవా పనులు పూర్తి చేయలేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే కుప్పానికి నీళ్లు తెచ్చి ఇచ్చిన చరిత్ర అని ధైర్యంగా చెప్పుకుంటామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని గాలికొదిలేశారు వ్యవసాయం దండగనే మనస్తత్వం ఆయనది కమీషన్లు దండుకునే పనిలో ఆ శాఖ మంత్రి నిమగ్నం కూటమి సర్కార్పై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
నేను ఇలాంటి బెదిరింపులకు భయపడను
నెల్లూరు సిటీ: నేను రౌడీషీటర్ల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, వి ద్యార్థి నేతగా ఉన్న సమయంలోనే రౌడీలను ఉరికించి ఉరికించి తరిమికొట్టిన చరిత్ర నాదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. శనివారం మాగుంట లేవుట్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కోటంరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హుందా రాజకీయాలకు చిరునామా అయిన నెల్లూరులో రౌడీషీటర్లు నన్ను చంపేయాలని అందరూ మాట్లాడుకున్నార ని తెలిపారు. నన్ను చంపేందుకు ఎవరు వారికి డబ్బు ఇస్తామన్నారని, ఒక పౌరుడిగా నేను అడుగుతున్నానన్నారు. ఎస్పీ మూడు రోజుల ముందు నుంచే మా నోటీసులో ఉందని చెప్పారని, కనీసం నాకు సమాచారం ఇవ్వలేదని, జాగ్రత్త కూడా చెప్పలేదన్నారు. ఈ విషయం పోలీసుల విచారణలో తేల్చాలని డిమాండ్ చేశారు. నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి నాపై కుట్ర చేశారంటూ వైఎస్సార్సీపీ ప్రచారం చేసిందన్నారు. ఇటువంటి సంప్రదాయం మా కుటుంబంలో లేదన్నారు. -
మా అందర్నీ జైల్లో వేయండి
ఉలవపాడు: అయ్యా మేము ఊరొదిలెళ్లం.. మీ ప్రభుత్వం మమ్మల్ని హింసిస్తోంది.. పోలీసులు అర్ధరాత్రి వచ్చి భయపెట్టి అరెస్ట్ చేస్తున్నారు.. కుట్రతో జైలుకూ పంపారు.. ఈ ప్రభుత్వం చేసిన అవమానాలు చాలు.. ఇంకా ఎంతమందిని జైలుకు పంపిస్తారో పంపండంటూ రామకృష్ణాపురం మహిళలు సబ్ కలెక్టర్ హిమవంశీకి తమ గోడును వెళ్లబోసుకున్నారు. రామకృష్ణాపురం, ఉప్పరపాళెంలో శనివారం పర్యటించిన ఆయన గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రామకృష్ణాపురం మహిళలు తమ ఆవేదనను తెలియజేశారు. ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని తెలిపారు. ఇప్పుడు వంద మంది మాట్లాడుతున్నాం.. అందర్నీ జైల్లో వేయండన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాల్సిన సర్కార్ అందుకు భిన్నంగా ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. భూములివ్వమని తెలియజేసినందుకు ఇంతలా ఇబ్బందులు పెడతారానని ప్రశ్నించారు.సమస్యలు తెలుసుకునేందుకే వచ్చా..సమస్యలు తెలుసుకోవాలనే తానొచ్చానని సబ్ కలెక్టర్ తెలిపారు. ఎంత మందికి ఉద్యోగాలు అవసరమవుతాయి.. కుటుంబాల వివరాలపై సర్వే చేస్తున్నామే తప్ప భూములు తీసుకోవడానికి కాదని చెప్పారు. ఇష్టం ఉండి భూములిస్తే తీసుకుంటామని, అది వేరే సంగతని పేర్కొన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పారు. మాకు సర్వేలొద్దు.. మీరు మాకేదైనా సాయం చేయాలనుకుంటే ఏమీ వద్దు.. ప్రశాంతంగా ఉన్నాం.. ఇక్కడికి వదిలేయండంటూ మహిళలు పేర్కొన్నారు.పరిహారం తక్కువగా ఉంది..భూ సేకరణ జరుగుతుందని కలెక్టర్ ఆనంద్ తెలిపారని ఉప్పరపాళెం ప్రజలు పేర్కొన్నారు. ఒక కుటుంబానికిచ్చే పరిహారం చాలా తక్కువగా ఉందని, ఇలా అయితే తమ భూములు, ఇళ్లను ఇచ్చేదిలేదని తేల్చిచెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.ఆరు లక్షలను ఇస్తామంటున్నారని, దీన్ని రూ.25 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
లేడీ డాన్గా చిత్రీకరించారు
● దందాలు, నేరాలతో సంబంధాల్లేవు ● ముగిసిన అరుణ పోలీస్ కస్టడీ ● ఒంగోలు జైలుకు తరలింపు సాక్షి టాస్క్ఫోర్స్: నేనో సాధారణ మహిళను.. నేరాలతో నాకెలాంటి సంబంధం లేదు.. లేడీడాన్ అంటూ మీడియా చిత్రీకరించింది.. అన్ని సక్రమంగా జరిగి ఉంటే శ్రీకాంత్ను పెళ్లి చేసుకొని హాయిగా జీవించే వాళ్లం.. మా బాగోగులన్నీ అధికార పార్టీ నేతలే చూసుకునే వారని పోలీస్ కస్టడీలో అరుణ వెల్లడించారని తెలిసింది. మూడు రోజుల కస్టడీలో భాగంగా కేంద్ర కారాగారం నుంచి కోవూరు పోలీస్స్టేషన్కు ఆమెను పోలీసులు శనివారం తరలించారు. ఎస్పీ కృష్ణకాంత్, ఏఎస్పీ సౌజన్య, నెల్లూరు రూరల్, ఒంగోలు డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, రాయపాటి శ్రీనివాసరావు అనేక ప్రశ్నలను సంధించగా, ఎక్కువ సమాధానాలను దాటేశారని తెలుస్తోంది. ఆమె గతం, ప్రస్తుతం, ఆర్థిక లావాదేవీలు, రాజకీయ నేతలు, అధికారులతో సంబంధాలు, శ్రీకాంత్తో ఉన్న అనుబంధం, అతని గ్యాంగ్తో ఏమైనా నేరాలు చేశారా.. ఇలా పలు విషయాలపై ఈ మూడు రోజుల్లో దాదాపు 90 ప్రశ్నలు సంధించారని సమాచారం. తన చెల్లెలు ఓ విద్యాసంస్థలో ఏఓగా పనిచేస్తున్నారని, ఆమెకు వస్తున్న జీతం, తనకు కుటుంబం ద్వారా సంక్రమించిన ఆస్తితోనే బతుకుతున్నామని ఆమె వెల్లడించారని తెలిసింది. ప్రకాశం జిల్లాలో జరిగిన వీరయ్యచౌదరి హత్య కేసు నిందితుల్లో ఏమైనా సంబంధాలున్నాయానని ప్రశ్నించారని తెలుస్తోంది. జగదీష్ విషయంలో సామాజికవర్గంతో భేదాభిప్రాయాలొచ్చాయని చెప్పారని తెలిసింది. అనేక ప్రశ్నలకు సమాధానం దాటేయడంతో, కస్టడీకీ మరోసారి ఆమెను తీసుకునే అవకాశం ఉందని సమాచారం. మూడు రోజుల విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నామని నెల్లూరు రూరల్ డీఎస్పీ వెల్లడించారు. పోలీస్ కస్టడీ శనివారం సాయంత్రంతో ముగియడంతో ఆమెకు వైద్యపరీక్షలు చేయించి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. అనంతరం ఆమెను ఒంగోలు కేంద్ర కారాగారానికి తరలించారు. -
బాణసంచా ఘటన నీరుగార్చేందుకు యత్నం
● అప్పసముద్రం గ్రామస్తుల ఆందోళన ఉదయగిరి: మండలంలోని అప్పసముద్రంలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న బాణసంచా ఘటనతో ప్రమేయమున్న నిందితులను కాపాడేందుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అనుచరులు యత్నిస్తున్నారంటూ ఆందోళనను గ్రామస్తులు శనివారం చేపట్టారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులపై ఒత్తిడి తెచ్చి నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. నడింపల్లికి చెందిన టీడీపీ నేత మద్దినేని విజయమ్మ.. ఎమ్మెల్యేకు సమీప బంధువు కావడంతో బాణసంచా ఘటనతో సంబంధం ఉన్న వ్యక్తులను కాపాడేందుకు చూస్తున్నారని తెలిపారు. గ్రామంలో కొన్నేళ్లుగా మద్యం విక్రయాలను విజయమ్మ సాగిస్తున్నారని, దీన్ని అడ్డుకోవడంతో మనస్సులో పెట్టుకొని అధికార పార్టీ అండదండలతో తమపై వేధింపులు, దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు. నిమజ్జన సమయంలో బాణసంచా పేల్చొద్దని కోరినా, ఆమె ప్రోద్బలంతో కాల్చడంతో ఘటన చోటుచేసుకుందని చెప్పారు. గాయపడిన చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారిందని, శరీరమంతా కాలిపోయి వైద్యశాలలో చికిత్స పొందుతున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. ఘటనను ఎమ్మెల్యే సీరియస్గా తీసుకొని, ప్రమేయమున్న వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరారు. కేసు నీరుగార్చేందుకు విజయమ్మ సమీప బంధువు వెంకట్ పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు రూ.ఐదు లక్షల ఎక్స్గ్రేషియాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆరుగురు చిన్నారులు ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎక్కువ మంది బాలికలే ఉన్నారు. వీరి శరీర భాగాలు చాలా వరకు కాలిపోయాయి. -
లారీ చక్రాల కింద నలిగిన ప్రాణం
● హమాలీ మృతి కొడవలూరు: లారీ చక్రాల కింద నలిగి గిరిజన హమాలీ మృతి చెందిన ఘటన మండలంలోని చంద్రశేఖరపురం వేర్ హౌస్ల వద్ద శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. చంద్రశేఖరపురంలోని గిడ్డంగుల్లో హమాలీగా మండలంలోని కమ్మపాళెం మజరా గుర్రాలదిన్నెకు చెందిన యాకసిరి శ్రీనివాసులు (50) పనిచేస్తున్నారు. గిడ్డంగుల్లో లారీకి లోడింగ్ ఉందనే సమాచారంతో ఇంటి నుంచి మోపెడ్పై బయల్దేరారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఖాళీ లారీ మరో వరుసలోకి మారే క్రమంలో వేగంగా వస్తూ మోపెడ్ను ఢీకొంది. కిందపడిన ఆయనపై లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న ఎస్సై కోటిరెడ్డి ఘటన స్ధలానికి చేరుకొని పరిశీలించారు. పోస్ట్మార్టం నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘కోటంరెడ్డి.. శ్రీకాంత్ పెరోల్ డైవర్షన్ కోసం మాస్టర్ ప్లాన్’
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో రౌడీ షీటర్స్, ముఠాలను పెంచి పోషించింది కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కాదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఎమ్మెల్యేలపై హత్యాయత్నం అంటూ కేసులు నమోదు అవుతున్నాయి. శ్రీకాంత్ పెరోల్ విషయం నుండి బయట పడటానికి కోటంరెడ్డి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు. శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నెల్లూరులో అనేక నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. క్రిష్ణారెడ్డి, కోటంరెడ్డి, ప్రశాంతి రెడ్డిపై స్కెచ్ అంటూ వార్తలు వస్తున్నాయి. హత్యా రాజకీయాలు మేము ప్రోత్సహించం. శ్రీధర్ రెడ్డి మొదట ఎమ్మెల్యే అవ్వడానికి కారణం వైఎస్ జగన్. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే పనులు చేయకూడదు. నీతి నియమాలు లేకుండా మాట్లాడే వ్యక్తి కోటంరెడ్డి. నెల్లూరులో రౌడీ షీటర్స్, ముఠాలను పెంచి పోషించింది కోటంరెడ్డి కాదా!. శ్రీకాంత్ పెరోల్ విషయం నుండి బయట పడటానికి డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. నెల్లూరులో రౌడీ కల్చర్ తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం, కోటంరెడ్డి. పెరోల్పై హోంమంత్రి సంతకం పెట్టింది నిజం కాదా?. ఏం తీసుకొని, ఎవరు ప్రలోభంతో హోంమంత్రి పెరోల్ సంతకం చేశారు. పెరోల్ మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం కాదా?.నేడు నీపై హత్యాయత్నం ప్లాన్ చేసిన వ్యక్తులు నీ అనుచరులు కాదా!. మా ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు తప్పు చేసినా వదిలిపెట్టలేదు. నాడు కోటంరెడ్డి ప్రభుత్వ ఉద్యోగిపై దాడి ఘటనలో చర్యలు తీసుకోమన్నారు జగన్. నేడు సంబంధం లేని వ్యక్తులపై కక్ష్య సాధింపు కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. పోలీసులు వైఫల్యం చెందారు. నెల్లూరు ఎస్పీ అసమర్థుడు. మీకు నిజంగా చిత్త శుద్ధి ఉంటే పెరోల్ మంజూరు విషయం, హత్యాయత్నాలు విషయాలపై సీబీఐ విచారణ వేయాలి. శ్రీధర్ రెడ్డి నీ ప్రవర్తన సరికాదు. వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే సహించే పరిస్థితులు ఉండవు జాగ్రత్త అని హెచ్చరించారు.మరోవైపు.. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. రైతాంగానికి యూరియా ఇవ్వలేని విజనరీ చంద్రబాబుది. రైతు ప్రయోజనాలు కోసం పనిచేసే ప్రభుత్వం కాదు ఇది. దళారీలు, వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఉల్లి రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు. అన్నదాతా సుఖీభవా పేరుకే పరిమితం అయింది. ఒకటిన్నర ఏడాది తరువాత ఉచిత బస్సు పెట్టి మహిళలు లక్షాధికారులు అయిపోతారు అనడం సిగ్గు చేటు. చంద్రబాబు ఏనాడు అధికారంలోకి వచ్చినా రైతులకు చీకటి రోజులే అనుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో రైతులు పారదర్శకమైన లబ్ధి పొందారు. వైఎస్సార్సీపీ రైతాంగానికి మద్దతుగా పోరాటం కొనసాగిస్తుంది. అండగా నిలుస్తుంది అని చెప్పుకొచ్చారు. -
అధికారుల చుట్టూ తిరుగుతూ..
నెల్లూరు(టౌన్): డీఎస్సీ ఆరంభం నుంచి గందరగోళం నెలకొంది. కాల్లెటర్లు రాని అభ్యర్థులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో అభ్యర్థుల మార్కులను జిల్లా విద్యాశాఖ కార్యాలయ నోటీసు బోర్డులో ఉంచేవారు. అభ్యంతరాలు స్వీకరించి తుదిజాబితాను రూపొందించేవారు. ఆ తర్వాత జాబితా ప్రకారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగేది. అయితే ఈసారి అంతా విరుద్ధంగా ఉంది. తొలినుంచి వ్యవహారమంతా రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచే జరుగుతోంది. ఎంపికై న అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా కాల్లెటర్లు డౌన్లోడ్ చేసుకుని సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరుకావాలని ఆదేశించారు. దీంతో ఎవరికెన్ని మార్కులు వచ్చాయి?, రిజిర్వేషన్ కేటగిరీలో ఏ పోస్టులు పోయాయో తెలియని పరిస్థితి. పారదర్శకంగా చేయాల్సిన ప్రక్రియ గోప్యంగా చేయడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మెరిట్ జాబితాలో పేరుండి కాల్లెటర్లు రాని అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయలేని స్థితిలో జిల్లా విద్యాశాఖాధికారులున్నారు. శుక్రవారం ఏడుగురు అభ్యర్థులకు మెసేజ్ రాలేదు. వివరాలను రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచి జిల్లాకు పంపించడంతో వారి సూచనలతో కాల్లెటర్లు డౌన్లోడ్ చేసుకుని సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఎప్పుడొస్తాయో.. జిల్లాలో మొత్తం 673 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు సంబంధించి రోస్టర్ కమ్ రిజర్వేషన్ ఆధారంగా 673 మందికి కాల్లెటర్లు పంపించాల్సి ఉంది. అయితే గురువారం నాటికి 585 మంది, అదేరోజు రాత్రి 56 మందికి పంపించారు. గురువారం 585 మందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టగా ఏడుగురు అభ్యర్థులు గైర్హాజరయ్యారు. శుక్రవారం 56 మందికి వెరిఫికేషన్ నిర్వహించాల్సి ఉండగా ఒకరు రాలేదు. మొత్తంగా రెండు రోజులకు కలిపి 641 మందికి కాల్లెటర్లు రాగా 633 మంది సర్టిఫికెట్లను పరిశీలించారు. 8 మంది గైర్హాజరయ్యారు. ఇంకా 32 మందికి కాల్లెటర్లు రాలేదు. ఎప్పుడొస్తాయో అనే దానిపై జిల్లా విద్యాశాఖాధికారులకు సమాచారం లేదు. అయితే మెరిట్ లిస్టులో పేర్లు ఉండి దూరప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు రెండు రోజులుగా జిల్లా కేంద్రంలోనే పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. రోస్టర్ కమ్ రిజర్వేషన్పై కూడా అంతగా అవగాహన లేకపోవడంతో లెటర్లు అందని అభ్యర్థుల సందేహాలకు సమాధానం చెప్పే వారు కరవయ్యారు. ఇప్పుడు లెటర్ రాకపోతే ఎప్పుడు వస్తుందోనన్న ఆందోళన నెలకొంది. డీఎస్సీలో అంతా గందరగోళమే.. 673 మందికి గానూ 641 మందికే కాల్లెటర్లు ఎప్పుడు వస్తాయన్న దానిపై సమాధానం కరువు రాష్ట్ర స్థాయిలోనే రోస్టర్ కమ్ రిజర్వేషన్ -
ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు
● మంత్రి నారాయణ నెల్లూరు(బారకాసు): ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యేలు, నుడా, కార్పొరేషన్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆ నియోజకవర్గ ఆభివృద్ధికి ఖర్చు చేయాలన్నారు. కొత్త లేఅవుట్లలో పది శాతం స్థలం పార్క్, దేవాలయాలకు వదిలేయాలని చెప్పారు. అనంతరం సర్వేపల్లి, కావలి, కందుకూరు ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, ఇంటూరు నాగేశ్వరరావు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడారు. సమీక్షలో కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్, ఆర్డీఓ అనూష, కమిషనర్ నందన్, కందుకూరు సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతలపై కనికరం లేదా?
● కలెక్టరేట్ ఎదుట కౌలు రైతు సంఘం నిరసన నెల్లూరు రూరల్: అన్నదాతలపై కనికరం లేదా అని కూటమి ప్రభుత్వాన్ని ఏపీ కౌలు రైతు సంఘం నాయకులు ప్రశ్నించారు. శుక్రవారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఐఏబీ సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో 3.50 లక్షల ఎకరాల సాగు నీరిస్తామని చెప్పడంతో రైతులు వరి పంట వేశారన్నారు. ధాన్యం మార్కెట్లోకి రాబోతుండగా కొనుగోలు కేంద్రాల ఆలోచన చేయకపోవడం దారుణమన్నారు. మిల్లర్ల కోసమే ఈ ప్రభుత్వం, అధికారులు పనిచేస్తోందని ఆరోపించారు. ఇదే కొనసాగితే రైతుల ఆత్మహత్యలు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటకు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ సంఘం నెల్లూరు జిల్లా కమిటీ అధ్యక్షుడు ముత్యాల గురునాథం, కార్యదర్శి తుళ్లూరు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
8 ఏళ్లుగా అద్దె కట్టని దుకాణం సీజ్
నెల్లూరు(బారకాసు): సుబేదారుపేటలోని మున్సిపల్ ఎన్సీ బిల్డింగ్లో ఓ దుకాణానికి సంబంధించి యజమాని 8 ఏళ్లుగా అద్దె కట్టని కారణంగా రెవెన్యూ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. ఆ కాంప్లెక్స్లో షాప్ నంబర్ పదికి సంబంధించి అద్దెకు ఉంటున్న యజమాని 2017 డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూలై వరకు బాడుగ రూ.17,84,754లు ఎన్ఎంసీకి కట్టలేదు. కమిషనర్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో సచివాలయ అడ్మిన్ దొరబాబుతోపాటు మున్సిపల్ సిబ్బంది సమక్షంలో దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఐ కిరణ్ మాట్లాడుతూ తాము అందజేసిన నోటీసుకు మూడు రోజుల్లోపు అద్దె బకాయిలు మొత్తాన్ని చెల్లించాలని, లేనిపక్షంలో చట్ట పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
చవితి వేడుకల్లో అపశ్రుతి
● బాణసంచా ప్రమాదంలో పదిమందికి గాయాలు ఉదయగిరి: వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. అప్పసముద్రం, నడింపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను మూడోరోజైన శుక్రవారం నిమజ్జనం కోసం తరలించారు. అప్పసముద్రంలో రెండు విగ్రహ ఊరేగింపులు ఒక ప్రదేశానికి చేరుకున్నాయి. నడింపల్లి ఊరేగింపులో మద్యం తాగిన వ్యక్తి బాణసంచా కాల్చే క్రమంలో నిప్పురవ్వలు అప్పసముద్రం ఊరేగింపు వాహనంలో పడ్డాయి. అందులో ఉన్న బాణసంచా పేలింది. దీంతో పదిమంది బాలబాలికలకు గాయాలయ్యాయి. వారిని వెంటనే దుత్తలూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. అనంతరం వింజమూరులోని వైద్యశాలకు తరలించారు. ఐదుగురు ప్రైవేట్ ఆస్పత్రిలో చిక్సిత్స పొందుతున్నారు. మరో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాల తరలించారు. ఓ చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తెలుగుభాష పరిరక్షణ అందరి బాధ్యత
● మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ● సింహపురిలో తెలుగు భాషోత్సవాలు ప్రారంభంనెల్లూరు(బృందావనం): తెలుగుభాష పరిరక్షణ అందరి బాధ్యత కావాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా సేవ తెలుగుభాష, సాహితి, సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజులు జరిగే తెలుగుభాషోత్సవాలను శుక్రవారం నెల్లూరు పురమందిరంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు రంగాల్లో బహుముఖ ప్రజ్ఞ చూపిన గిడుగువారు తెలుగువారందరికీ ఆదర్శనీయులన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని మాతృభాష పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. తిక్కన మహాకవి మొదలుకుని తన గురువు పోలూరు హనుమజ్జానకీరామ శర్మ వరకు ఎందరో మహనీయులు తెలుగు సాహిత్య సేద్యం చేశారన్నారు. తెలుగు మన చిరునామా అన్నారు. మన జీవితాలకు వెలుగునిచ్చేది మాతృభాషేనన్నారు. ● ప్రసార భారతి విశ్రాంత అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ రేవూరు అనంత పద్మనాభరావు అధ్యక్షతన జరిగిన తొలిరోజు సభలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి) పూర్వ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (అనంతపురం) విశ్రాంత ఆచార్యులు రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ అల్లం శ్రీనివాసరావు, గిడుగు రామమూర్తి పంతులు వారసులు, పెద్దకోడలు గిడుగు సరస్వతి తదితరులు పాల్గొని ప్రసంగించారు. వ్యాఖ్యాతలుగా డాక్టర్ పత్తిపాక మోహన్, డాక్టర్ శోభ కొణిదెల వ్యవహరించారు. ఆత్మీయ అతిథులుగా ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. తొలుత సంస్థ అధ్యక్షుడు కంచర్ల సుబ్బానాయుడు స్వాగతోపన్యాసం చేశారు. ● మధ్యాహ్నం నిర్వహించిన ప్రాచీన సాహిత్య సదస్సుకు సభాధ్యక్షుడిగా తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ వ్యవహరించారు. ప్రముఖ సాహితీవేత్తలు అప్పాజోస్యుల సత్యనారాయణ, ఆచార్య పాపినేని శివశంకర్, ఆచార్య టి.గౌరీశంకర్, అల్లు భాస్కరరెడ్డి ప్రాచీన సాహిత్య విలువలను వివరించారు. కవి, విమర్శకులు డాక్టర్ పెరుగు రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఆధునిక సాహిత్య సదస్సులో ఆచార్య శిఖామణి మాట్లాడారు. కందిమళ్ల సాంబశివరావు బాలనాటక రంగం ప్రాధాన్యతను వివరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ అధ్యక్షతన జరిగిన బాలసాహిత్య సదస్సులో విశిష్ట అతిథులుగా డాక్టర్ డీకే చదువులబాబు, డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, చంద్రలత, డాక్టర్ కందేపి రాణీప్రసాద్, దార్ల బుజ్జిబాబు, టీవీ రామకృష్ణ పాల్గొన్నారు. కవితోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమ సమన్వయకర్తలుగా బోర భారతీదేవి, డాక్టర్ శోభ కొణిదెల, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, డాక్టర్ కె.కరుణశ్రీ తదితరులు వ్యవహరించారు. -
గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టి..
● తండ్రీకొడుకులకు తీవ్రగాయాలు ● పరిస్థితి విషమం ఉలవపాడు: గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తండ్రీకొడుకులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జాతీయ రహదారిపై చాగల్లు సమీపంలో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. చైన్నెకు చెందిన రత్నవేలు, గాంధీ తండ్రీకుమారులు. కొంతకాలంగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. వీరు స్వస్తిక్ ఎంటర్ప్రైజెస్లో పనిచేస్తున్నారు. ఆఫీస్ పని నిమిత్తం చైన్నెకు సొంత కారులో బయలుదేరారు. ఉలవపాడు దాటి చాగల్లు సమీపంలోకి వచ్చేసరికి ముందు వెళుతున్న గుర్తుతెలి యని వాహనాన్ని కారు బలంగా ఢీకొట్టి రోడ్డు మా ర్జిన్లోకి దూసుకెళ్లింది. ఇద్దరికీ తీవ్రగాయాలై స్పృహ కోల్పోయారు. డ్రైవింగ్ చేస్తున్న గాంధీ లోపల ఇరుక్కుపోయాడు. హైవే అంబులెన్స్ సిబ్బంది శ్రమించి బయటకు తీశారు. క్షతగాత్రులను కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పక్కాగృహాల్లో తనిఖీ
నెల్లూరు(అర్బన్): జిల్లాలో పక్కాగృహాల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో రాష్ట్ర విజిలెన్స్ అధికారి చంద్రశేఖర్రాజు శుక్రవారం నెల్లూరు వచ్చి పరిశీలించారు. వెంకటేశ్వరపురంలోని గృహాలతోపా టు రూరల్ మండల పరిధిలోని కొండ్లపూడి లేఅవుట్లో లబ్ధిదారులకు నిర్మించిన ఇళ్లను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ పూర్తిస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ ఈఈ మోహన్రావు, డీఈ షంషుద్దీన్, ఏఈలు పాల్గొన్నారు. ● జిల్లాలో కాంట్రాక్టర్లు, హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు కుమ్మకై ్క నివాసం ఉండేందుకు వీల్లేకుండా తూతూమంత్రంగా నిర్మాణాలు చేపట్టారంటూ బీజేపీ నాయకుడు మిడతల రమేష్ విజిలెన్స్, హౌసింగ్ అధికారులకు బంతిపూలు ఇచ్చి నిరసన తెలిపారు. -
కాల్లెటర్ రాలేదు
నాకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కేటగిరీలో 89వ ర్యాంక్ వచ్చింది. మెరిట్ లిస్టులో 8వ పేరు ఉంది. ఈ కేటగిరీకి సంబంధించి పురుషులు – 4, మహిళలు – 2 కలిపి 6 పోస్టులున్నాయి. అయితే నా కంటే ముందున్న ఇద్దరు అభ్యర్థులు పీజీటీ, టీజీటీ పోస్టులకు వెళ్లారు. ఆరుగురు అభ్యర్థులకు పోస్టులు రావాలి. అయితే నాకు ముందున్న ఐదుగురు అభ్యర్థులకు కాల్లెటర్లు పంపించారు. నాకు పంపించలేదు. రెండు రోజులుగా స ర్టిఫికెట్ వెరిఫికేషన్ కేంద్రం చుట్టూ తిరుగుతున్నా. – సీహెచ్ సుధీర్, కోవూరు రెండురోజుల నుంచి ఇక్కడే ఉన్నా నాకు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ కేటగిరీలో 36వ ర్యాంక్ వచ్చింది. ఈ కేటగిరీలో 4 పోస్టులున్నాయి. ముగ్గురికి కాల్లెటర్లు పంపించారు. ఇంకా ఈ కేటగిరీలో ఒక పోస్టు ఖాళీగా ఉంది. మాది బీసీ డీ. ఇంకా కాల్లెటర్ అందలేదు. దాని కోసం రెండు రోజులుగా నెల్లూరులోనే ఉంటున్నా. జిల్లా అధికారులను అడిగితే మా చేతుల్లో ఏమీ లేదని, లెటర్ వచ్చిన వారి సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేస్తామన్నారు. – జి.చంద్రశేఖర్, సూళ్లూరుపేట -
అరుణ వెనుక టీడీపీ గోతులు
కోవూరు: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న జీవిత ఖైదీ శ్రీకాంత్, అతని స్నేహితురాలు నిడిగుంట అరుణ వ్యవహారం కూటమి ప్రభుత్వం మెడకు చుట్టుకోవడంతో బయట పడేందుకు నానా పాట్లు పడుతోంది. వీరిద్దరి వెనుక టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్న విషయం పెరోల్తో వెలుగు చూసిన విషయం విదితమే. అరుణ ఇటీవల సోషల్ మీడియాలో శ్రీకాంత్ను వాడుకున్న టీడీపీ నేతలు ఇప్పుడు మౌనంగా ఉండడంపై ప్రశ్నిస్తూనే అందరి బాగోతాలు బయట పెడుతానంటూ పెట్టిన పోస్టు అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పోస్టు పెట్టిన మరుసటి రోజే అరుణను, ఆమె అనుచరులను ఎప్పటి కేసునో బయటకు తీసి హడావుడిగా అరెస్ట్ చేయడం, పోలీస్ కస్టడీ పేరుతో విచారణ చేపట్టడం తెలిసిందే. అరుణ కేసుతో తమకు సంబంధం లేదంటూనే.. మరో వైపు అరుణను విచారణ నిమిత్తం జిల్లా జైలు నుంచి కోవూరు పోలీస్స్టేషన్కు, అనంతరం జిల్లా జైలుకు తరలిస్తున్న కారు (ఏపీ 40 డీటీ 3388) టీడీపీ స్థానిక నేత ఇంతా మల్లారెడ్డికి సంబంధించింది కావడం గుసగుసలకు తావిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఆమె వెనుక టీడీపీ నేతలు ఉన్నారా? లేక ఆమె వెనుక గోతులు తవ్వుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేత కారు వినియోగంపై పోలీసులు ఎలాంటి వివరణ ఇవ్వకుండా మౌనం దాల్చుతున్నారు. టీడీపీ నేతలతో కలిసి పక్కా అవగాహనతోనే జరుగుతోందనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రభుత్వం ఈ వ్యవహారం నుంచి బయట పడటానికి మాత్రమే ప్రయత్నిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేసు విచారణలో పారదర్శకత చూపకుండా, కథలు చెప్పడంపై ప్రజల్లో అనుమానాలకు మరింత బలం చేకూరుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆమె వ్యవహారం ఆ పార్టీ మెడకు చుట్టుకున్న వైనం తమకు సంబంధం లేదంటూ హడావుడి అరెస్ట్లు, పోలీస్ కస్టడీ విచారణలు టీడీపీ నేత వాహనంలోనే ఆమె తరలింపు -
నిరంకుశ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం
● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నెల్లూరు (స్టోన్హౌస్పేట): కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నిరంకుశ పాలనతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి విమర్శించారు. శుక్రవారం తన కార్యాలయం నుంచి కావలికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా బాలాజీనగర్ పోలీసులు అడ్డుకుంటూ నోటీసులు ఇవ్వడాన్ని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక రెడ్బుక్ రాజ్యాంగంలో ఉన్నామంటూ మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లడాన్ని అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతుందన్నారు. కూటమి నేతల అరాచకాలకు పోలీసులు వంత పాడడం దారుణమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా అనే సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతుందన్నారు. కావలిలో అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను బయటపెడతానని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి హెచ్చరించడంతో ఆయనపై ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమన్నారు. ప్రతాప్కుమార్రెడ్డి కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు కావలి వెళ్లే ప్రయత్నం చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. జిల్లాలో ఎప్పుడూ చూడని వికృతాలు చూడాల్సిన వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కావలికి వెళ్తే నరుకుతామని చెబుతున్న వారిని పోలీసులు వదిలేసి తమను నిర్బంఽధించడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ దుర్మార్గాలు ప్రజలకు ఇట్టే అర్థమవుతున్నాయన్నారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కావలికి వెళ్లి ప్రతాప్కుమార్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తామని తెలిపారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వైఎస్సార్సీపీ బెదిరేది లేదన్నారు. -
పోలీసుల అత్యుత్సాహం
● ప్రతాప్కుమార్రెడ్డి ఇంటి వద్దకు ఎవరినీ వెళ్లకుండా అడ్డగింత ● కావలికి వచ్చే అన్నిదారుల్లో పోలీసుల మోహరింపు, వాహనాల తనిఖీ కావలి (జలదంకి): కావలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి నివాసానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నెల్లూరు నుంచి మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయ్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితరులు కావలికి వస్తున్నట్లు సమాచారం ఉండడంతో పోలీసులు అత్యుత్సాహం చూపి మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్దకు ఎవరినీ వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఆయన ఇంటికి వచ్చే అన్ని దారుల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కావలిలోని బృందావనం వద్ద, ముసునూరు టోల్ప్లాజా, బైపాస్ క్రాస్రోడ్డు, ముసునూరు లింక్ రోడ్డుతోపాటు ప్రతాప్కుమార్రెడ్డి నివాసం వద్ద ఎస్సైలు సుమన్, బాజీబాబు, తిరుమలరెడ్డితోపాటు పోలీసులు వెళ్తున్న ప్రతి వాహనాన్ని తనిఖీలు చేసి ప్రతాప్కుమార్రెడ్డి నివాసానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మా నాయకుడి ఇంటికి కూడా వెళ్లకూడదా అంటూ పోలీసులను ప్రశ్నించారు. కావలిలో ప్రజాస్వామ్యం ఉందా లేక కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చేతుల్లో ఉందా అంటూ పోలీసులను నిలదీయడంతో పైఅధికారుల ఆదేశాలంటూ సమాధానమిచ్చారు. -
కూటమి అరాచకాలకు వంత
● కావలికి వస్తే ఖబడ్దార్ అంటూ ఎమ్మెల్యే రౌడీయిజం వ్యాఖ్యలు ● ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డిపై అనుచిత భాషతో దూషణలు ● భగ్గుమన్న వైఎస్సార్సీపీ శ్రేణులు ● ప్రతాప్కుమార్రెడ్డి నివాసానికి వెళ్లకుండా అడ్డగింత ● మాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి హౌస్ అరెస్ట్ ● అందరి ఇళ్ల వద్ద భారీగా పోలీసుల మోహరింపు ● టోల్ప్లాజా వద్దే మాజీ మంత్రి కారుమూరిని అడ్డగింపుఎమ్మెల్సీ నివాసం వద్ద భారీగా చేరుకున్న పోలీసులువైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపుసాక్షి ప్రతినిధి,నెల్లూరు: కూటమి ప్రభుత్వం అరాచకాలకు అంతుపంతు లేకుండా పోయింది. ఇందుకు పోలీస్ యంత్రాంగం తోడైంది. కూటమి ఎమ్మెల్యేల ఆదేశాలే శిరోధార్యంగా భావించి వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడుతూ పోలీసులు పైశాచిక ఆనందం పొందుతున్నారు. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం అన్నవరంలో సాగిస్తున్న అక్రమ మైనింగ్ వ్యవహారం, ముసునూరులో జరిగిన మనీ స్కీమ్ స్కామ్ను బయట పెడతానని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి హెచ్చరికలను జీర్ణించుకోలేకపోయారు. ఇదే సమయంలో సోషల్ మీడియా యాక్టివిస్టులు కావ్య అక్రమ మైనింగ్ గుట్టు రట్టు చేసేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డం పెట్టుకుని ప్రతాప్కుమార్రెడ్డిపై హత్యాయత్నం కేసుతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేయించడం తెలిసిందే. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీసులు సైతం అధికార ఎమ్మెల్యేకు సాష్టాంగం పడుతూ చట్టాలను తుంగలో తొక్కి తప్పుడు కేసులు బనాయించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి మాజీ ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే అవినీతిని బహిర్గతం చేస్తామని హెచ్చరించడంతో కలవర పడిన కావ్య ప్రెస్మీట్ పెట్టి వీధిరౌడీలా మాట్లాడారు. ఎమ్మెల్యేనని స్థాయి మరిచిపోయి, పక్కనే మహిళ ఉందనే విచక్షణ కోల్పోయి అసభ్యకంగా, అనుచితంగా మాట్లాడుతూ ఊగిపోయారు. కాకాణి గోవర్ధన్రెడ్డి కావలి వస్తే.. ఖబడ్దార్ అంటూ రెచ్చిపోయారు. ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డిని అయితే పత్రికల్లో రాయలేని భాషతో అనుచితంగా మాట్లాడారు. ఎమ్మెల్యే వ్యవహారిక భాషపై, అనుచిత వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండి పడ్డారు. పోలీసుల రెడ్బుక్ రాజ్యాంగం పోలీసులు చట్టాన్ని గౌరవించడం మానేశారు. న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టిస్తూ రాజ్యాంగాన్ని వదిలేసి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధిని, మాజీ మంత్రిని దారుణంగా దుర్భాలాషడిన ఎమ్మెల్యేను వదిలేసిన పోలీసులు ప్రతిపక్షాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. శుక్రవారం వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి కావలిలోని రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు కాకాణి, పర్వతరెడ్డి ఇళ్ల వద్దకు నెల్లూరు వేదాయపాళెం సీఐ శ్రీనివాసరావు, బాలాజీనగర్ సీఐ సాంబశివరావు ఆధ్వర్యంలో భారీగా చేరుకున్న పోలీసులు వారిని బయటకు కదలనీయకుండా అడ్డుకున్నారు. తమ పార్టీ నేతలను పరామర్శ చేయడమే నేరంగా భావించిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కాకాణితోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే కిలివేటిని ఆయన నివాసంలో, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డిని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. నోటీసులిచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. కారుమూరిని వెంబడించి.. కావలిలోని ప్రతాప్కుమార్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విజయవాడ నుంచి వస్తున్న మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావును పోలీసులు వెంబడించారు. ఆయన్ను కావలికి చేరుకోనివ్వకుండా జాతీయ రహదారి పైనే నిలిపివేశారు. తాను పరామర్శ కోసమే వెళ్తున్నానని చెప్పినా వినిపించుకోకుండా తిరిగి విజయవాడకు పంపించారు. ఆయన వాహనాన్ని జిల్లా సరిహద్దులు దాటించే వరకు పోలీసులు వాహనాలు వెంబడించి పంపించారు. జిల్లాలో పోలీసులు కూటమి పాలకులకు సాష్టాంగం చేస్తూ సాగిలపడుతున్నారు. చట్టాన్ని పచ్చ నేతలకు చుట్టాలుగా తయారు చేస్తున్నారు. రాజ్యాంగం అంటే గౌరవం లేదు. న్యాయవ్యవస్థ అంటే భయమూ లేదు. కూటమి నేతల అరాచకాలకు వంత పాడుతూ జీ హుజూర్ అంటున్నారు. ప్రతిపక్ష నేతలను బయటకు అడుగు పెట్టనీయకుండా అడ్డుకుంటూ, నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నెల్లూరులో ఎమర్జెన్సీ పరిస్థితులు సృష్టిస్తున్నారు. కావలి ఎమ్మెల్యే వీధి రౌడీలా కారు కూతలు కూస్తే స్పందించని పోలీసులు, ప్రతిపక్ష నేతలను మాత్రం హౌస్ అరెస్ట్ చేసి అధికార పార్టీ నేతలకు అండగా అడ్డదారులు తొక్కుతున్నారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పోలీసులు
● మా మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడానికి ఎందుకీ ఆంక్షలు ● పార్టీ నేతలుగా ప్రతి కార్యకర్తకు ధైర్యం ఇవ్వడం మా బాధ్యత ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు (స్టోన్హౌస్పేట): చట్టాన్ని గౌరవించాల్సిన పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి దుయ్యబట్టారు. వాస్తవాలతో సంబంధం లేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే ఏం చెబితే.. అది చేస్తున్నారంటూ విమర్శించారు. కావలిలోని తమ నేత, మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడానికి ఎందుకీ ఆంక్షలు పెడుతున్నారంటూ మండిపడ్డారు. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు శుక్రవారం వెళ్తున్న కాకాణితోపాటు సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను నగరంలోని కాకాణి నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాకాణి మీడియాతో మాట్లాడారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అవినీతికి పాల్పడుతుంటే విమర్శిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిపై అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నవరంలో విచ్చలవిడిగా సహజ వనరులను కొల్లగొడుతుంటే ఆ ఫొటోలు తీసేందుకు వెళ్లిన సోషల్ మీడియా యాక్టివిస్టులను నిర్బంధించి వారిని భయపెట్టి బెదిరించి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని ఈ కేసులో జత చేశారన్నారు. హైకోర్టును ఆశ్రయించిన రామిరెడ్డికి బెయిల్ రాకూడదనే ఉద్దేశంతో నాపై ఏ విధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారో ఆ విధానాన్నే రామిరెడ్డిపై అవలంబిస్తూ తప్పుడు కేసులు, తప్పుడు సెక్షన్లు పెట్టారన్నారు. కావలిలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలతో మాట్లాడి ధైర్యమిచ్చామన్నారు. అయితే తనను, పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిని అభ్యంతరకరంగా మాటలు మాట్లాడారని తెలిపారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని, అవినీతి ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం, నిర్బంధించడం ఎన్నడూ చూడలేదని, ఇప్పుడు పరిస్థితులు చూడాల్సి వస్తుందన్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని, రాజ్యాంగ విలువలు దిగజారి పోతున్నాయన్నారు. ప్రతాప్కుమార్రెడ్డి వంటి సౌమ్యుడిపై హత్యాయత్నం కేసు పెట్టడంతో ప్రజలు అసహ్యంచుకుంటున్నారన్నారు. ఎన్నికలు ఏ రోజు జరిగినా జగన్మోహన్రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు జైళ్లకు, అక్రమ కేసులకు భయపడరని తెలిపారు. ఎంత మంది పోలీసులు వచ్చినా, మిలటరీ బలగాలను దింపినా కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తమ పోరాటం ఆగదన్నారు. -
అడవిలో సొరంగ మార్గానికి శ్రీకారం
● రూ.857.75 కోట్ల వ్యయంతో టన్నెల్ పనులు ● గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేలో భాగంగా నిర్మాణం సీతారామపురం: విజయవాడ–బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేలో భాగంగా జిల్లా సరిహద్దు ప్రాంతమైన మండలంలోని సీతారామపురం–పోరుమామిళ్ల ఘాట్రోడ్డు సమీపంలో మ్యాక్స్ ఇన్ఫ్రా కంపెనీ రూ.857.75 కోట్ల వ్యయంతో సొరంగ మార్గం (టన్నెల్) తవ్వకాల పనులకు శ్రీకారం చుట్టింది. ఆరు లేన్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా వాహనాలు వెళ్లేందుకు, వచ్చేందుకు వేరువేరుగా సొరంగ మార్గాలు నిర్మించనున్నారు. ఒక్కో సొరంగం 16.7 మీటర్ల వెడల్పు, 9.8 మీటర్ల ఎత్తుతో 3.68 కిలో మీటర్ల పొడవు ఉంటుంది. సీతారామపురం అటవీ ప్రాంతంలో ప్రారంభమయ్యే ఈ సొరంగ మార్గం వైఎస్సార్ కడప జిల్లాలో తెరుచుకుంటుంది. ప్రస్తుతం ఒక సొరంగం మార్గానికి రెండు వైపులా తవ్వకం పనులు ప్రారంభమైనట్లు నిర్మాణ పనులు చేపట్టిన మ్యాక్స్ ఇన్ఫ్రా కంపెనీ బృందం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన పనులను 2027 ఫిబ్రవరిలోపు పూర్తి చేయడమే గాక 15 ఏళ్ల పాటు అదే కంపెనీ నిర్వహణ బాధ్యతలను చూడనుంది. సుమారు 520 కిలో మీటర్ల పొడవున నిర్మిస్తున్న విజయవాడ బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేలో భాగంగా ఈ టన్నెల్ తవ్వుతున్నారు. ఈ సొరంగం అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైవేల్లో ఉన్న టన్నెల్స్లో ఇదే పొడవైనదిగా రికార్డులకెక్కుతుందని జాతీయ రహదారి సంస్థ అధికారులు అంటున్నారు. -
శిక్షణ, ఉద్యోగావకాశాలు
నెల్లూరు (పొగతోట): డీఆర్డీఏ, సీడాప్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగు యువతకు వివిద రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి శుక్రవారం ఒక ప్రటకనలో తెలిపారు. బోగోలు, కోవూరులో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. ఎలక్ట్రానిక్స్, ఫీల్డ్ టెక్నీషియన్, సర్వీస్ ఇంజినీర్, ఐటీ హార్డ్వేర్ తదితర వాటిపై శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఇంటర్ పాస్, డిగ్రీ చదివిన నిరుద్యోగులైన యువతి, యువకులు డీఆర్డిఏ కార్యాలయంలోని జాబ్స్ విభాగంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9493513896, 9553491047, 9032693233 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. ఎన్ఎల్ఆర్ 3648 నూతన వరి రకం నెల్లూరు (పొగతోట): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (వ్యవసాయ పరిశోధన క్షేత్రం)లో ఎన్ఎల్ఆర్ 3648 నూతన వరి రకం విత్తనాలను అధికారులు సిద్ధం చేశారు. పరిశోధన క్షేత్రంలో వరి పంటను రైతులకు శుక్రవారం పరిచయం చేశారు. పరిశోధన క్షేత్రం అధికారులు శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఈ రకం వరి వంగడం అన్ని రకాల వాతావరణాలను తట్టుకుని అధిక దిగుబడులను ఇస్తుందని తెలిపారు. ఈ వరి దిగుబడులపై రైతులకు శుక్రవారం అవగాహన కల్పించారు. జిల్లాలోని రైతులందరికీ ఎన్ఎల్ఆర్ 3648 రకం విత్తనాలను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశోధన క్షేత్రం అధికారి వినిత, రైతులు పాల్గొన్నారు. 18 బార్లకు దరఖాస్తుల దాఖలు నెల్లూరు (క్రైమ్): బార్లకు దరఖాస్తులు దాఖలు చేసేందుకు ప్రభుత్వం గడువు పెంచినప్పటికీ వ్యాపారుల స్పందన నామ మాత్రంగానే ఉంది. జిల్లాలోని ఓపెన్ కేటగిరీలో 50, గౌడ కులాలకు 5 బార్లకు సంబంధించి శుక్రవారంతో గడువు ముగిసింది. 55 బార్లకు 18 బార్లకు మాత్రమే దరఖాస్తులు దాఖలయ్యాయి. అయితే గడువు ముగిసే సమయానికి కొందరు ఆఫ్ లైన్లో దరఖాస్తులు వేసేందుకు క్యూలైన్లలో ఉండడంతో వారి నుంచి అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు. నెల్లూరు నగరంలో 38 బార్లకు 10, కావలిలో రెండు బార్లకు, కందుకూరులో మూడు బార్లకు దరఖాస్తులు అందాయి. గీత కులాలకు సంబంధించి నెల్లూరు నగరంలోని రెండు బార్లకు, కావలిలో ఒక బారుకు దరఖాస్తులు అందాయి. కందుకూరులోని ఒక బారుకు మూడు దరఖాస్తులు, అల్లూరులోని ఒక బారుకు ఒక దరఖాస్తు మాత్రమే అందాయి. అయితే ఒక్కో బారుకు నాలుగు దరఖాస్తులు అందాలనీ, ఒక్కరే నాలుగు దరఖాస్తులు వేయకూడదనే నిబంధన ఉండడంతో 18 బార్లకు వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. శనివారం నగరంలోని న్యూ జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో డ్రా నిర్వహించనున్నారు. పింఛన్ బాధితులు దరఖాస్తులు చేసుకోండి నెల్లూరు(పొగతోట): పింఛన్లు తొలగించిన దివ్యాంగులు ఎంపీడీఓ, మునిసిపల్ కమిషనర్లకు దరఖాస్తులు చేసుకోవాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో వైద్యాధికారులు అంగవైకల్యాన్ని పరిశీలించి సర్టిఫికెట్లు మంజూరు చేశారు. వాటి ఆధారంగా దివ్యాంగుల పింఛన్లు రద్దు చేయడం, మార్పులు చేయడం జరిగిందన్నారు. రద్దు చేసిన, మార్పులు చేసిన పింఛన్ల లబ్ధిదారులు అర్హులని భావిస్తే ఎంపీడీఓ, మునిసిపల్ కమిషనర్లకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పాత పింఛన్ కార్డు, సర్టిఫికెట్లు, బయోమెట్రిక్ ద్వారా అందుకున్న నోటీసు, ఆధార్ కార్డుతో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వచ్చిన దరఖాస్తులను పునః పరిశీలించి చర్యలు చేపడుతామన్నారు. పోలీసుల అదుపులో నిందితులు? నెల్లూరు (క్రైమ్): నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని చంపేస్తే డబ్బేడబ్బుని కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాల్లో వైరల్ అయింది. దీన్ని పోలీసులు సీరియస్గా తీసుకుని అన్నీ కోణాల్లో విచారిస్తున్నారు. వీడియో తీసిన సమయంలో అక్కడ ఎనిమిది మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వారిలో రౌడీషీటర్ జగదీష్ ఇప్పటికే జైల్లో ఉండగా మిగిలిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీడియో తీసిన సమయంలో వారు అక్కడ ఎందుకు ఉన్నారు? ఏం మాట్లాడుకున్నారు? ఇలా అన్నీ కోణాల్లో లోతుగా విచారిస్తున్నట్లు తెలిసింది. -
ఏపీలో మహిళలకు భద్రత కరువైంది: వరుదు కళ్యాణి
సాక్షి, నెల్లూరు: కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కూటమికి ఓట్లు వేసినవారు బాధపడుతున్నారన్నారు. కూటమి పాలనలో లిక్కర్ అమ్మకాలు దారుణంగా పెరిగాయని.. లిక్కర్ అమ్మకాలతో మహిళలకు భద్రత కరువైంది’’ అని వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మద్యానికి బానిసలై.. మహిళలకు భద్రత లేకుండా చేస్తున్నారు. ఏపీలో మహిళలపై గంటకు మూడు, నాలుగు అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో గంజాయి, డ్రగ్స్ పెరిగాయి. మహిళల రక్షణ కోసం వైఎస్సార్సీపీ మహిళా విభాగం పోరాడుతుంది. ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. మహిళలకు ఇచ్చిన హామీలకు చంద్రబాబు మంగళం పాడారు’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు...రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. ఎక్కడికక్కడ బెల్టు షాపులు, పర్మిట్ రూములకు అనుమతులు ఇచ్చేశారు. గతంలో మేము ‘దిశ’ పేరుతో మహిళా రక్షణ చేపడితే దాదాని పూర్తిగా నీరుగార్చారు. మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. అధికారంలోకి వచ్చాక నెల రోజుల్లో గంజాయి నిర్మూలన అన్నారు. నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా గంజాయి లభ్యం, డ్రగ్స్ డోర్ డెలివరీ అవుతుంది. జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానంటూ అధికారంలోకి వచ్చారు. హామీలు విస్మరించి.. సూపర్ సిక్స్ అమలు చేసేశాం అంటున్నారు...ఎన్నికలకు ముందు ఉచిత బస్సు అనీ, ఐదు బస్సుల్లో అవకాశం కల్పించారు. ఏపీ రాష్ట్రాన్ని ముగ్గురు సీఎంలు పరిపాలిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్లు ముగ్గురు సీఎంలే. కలల రాజధాని నిర్మాణం అన్నారు.. నేడు అలల్లో తేలే రాజధాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం సంపద కాదు.. అప్పలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యేలే స్వయంగా మహిళలను వేధించే పరిస్థితి చూస్తున్నాం. మహిళలపై లైంగిక దాడులు చేసిన వారిపై చర్యలు లేవు..మహిళపై చేయి వేసిన వారి తాట తీస్తా.. తోలు తీస్తా అన్న పవన్ ఎక్కడ తీస్తున్నాడో తెలియడం లేదు. చంద్రబాబు పాలనలోనే సుగాలి ప్రీతి ఘటన జరిగింది. ఎన్నికలకు ముందు రాజకీయాల కోసం ప్రీతి ఘటనను వాడుకున్నాడు పవన్.. రాజకీయ లబ్ధి కోసం వాడుకుని తీరా వచ్చాక గాలికి వదిలేశారు. పవన్కు చిత్తశుద్ధి వుంటే వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి’’ అంటూ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. -
కావలిలో అడుగు పెట్టి తీరతాం.. బుడ్డ బెదిరింపులకు భయపడం: కాకాణి
సాక్షి, నెల్లూరు: మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి సంఘీభావంగా వైఎస్సార్సీపీ నేతలు చేపట్టిన నిరసనకు పోలీసులు అడ్డు తగిలారు. మాజీ మంత్రి కాకాణి గోవర్దనరెడ్డిని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి సహా పలువురు నేతలను కావలికి వెళ్లకుండా అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలపై ఈ ఇద్దరూ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ప్రతాప్ కుమార్ రెడ్డి పై అక్రమ కేసు నమోదు చేశారు. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పడానికి కావలి బయల్దేరాం. కానీ, కావలిలో ఎలా అడుగు పెడతారో చూస్తాం.. తలలు తీస్తాం అంటూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు పోలీసులను అడ్డం పెట్టుకొని హౌస్ అరెస్ట్ చేయించారు. కానీ, టీడీపీ బుడ్డ బెదిరింపులకి భయపడేది లేదు. అక్రమాలపై పోరాడతాం. పోలీసులు రాష్ట్రంలో శాంతిభద్రతను గాలికి వదిలేశారు. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు, అరెస్ట్ ప్రధాన ఎజెండాగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. ఇవాళ కాకపోయినా రేపోమాపో కావలిలో అడుగుపెట్టి తీరతాం. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అరాచకాలు అక్రమాలను బయటపెడతాం అని కాకాణి అన్నారు.హౌజ్ అరెస్ట్లో ఉన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలో ప్రజాస్వామ్యం చనిపోయింది. మాపైనే దాడి చేసి.. తిరిగి మాపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మాజీ మంత్రి కాకాణి అక్రమ అరెస్టుతో ఈ పరంపర మొదలైంది. ఇప్పుడు ప్రతాప్ కుమార్ రెడ్డి పై అక్రమ కేసు బనాయించారు. ఆ కుటుంబాన్ని కలవడానికి వెళ్తే.. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. కావలి టోల్ ప్లాజా దాటితే తలలు నరుకుతామని టీడీపీ బెదిరిస్తోంది. ఇప్పుడు పోలీస్ శాఖ అడ్డం పెట్టుకొని హౌస్ అరెస్ట్ చేయిస్తోంది అని మండిపడ్డారు.మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసును నిరసిస్తూ కాకాణి, చంద్రశేఖర్ కావలికి పయనం అయ్యారు. అయితే.. కావలిలో ఎలా అడుగు పెడతారో చూస్తాను అంటూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి బెదిరింపులకు దిగిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ క్రమంలో పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలపై కక్షసాధింపునకు దిగారు. ఎమ్మెల్యే ఆదేశాలనుసారం వేదాయపాళెం పోలీసులు నోటీసులు జారీ చేయడానికి వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
స్వస్థలానికి వస్తుండగా..
పూతలపట్టు(యాదమరి): రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారులు మృతిచెందిన ఘటన పూతలపట్టులో చోటుచేసుకుంది. సీఐ కృష్ణమోహన్ కథనం మేరకు.. నెల్లూరుకు చెందిన సుబ్బారాయుడు (60) కుటుంబం చాలా సంవత్సరాల క్రితమే వ్యాపారరీత్యా బెంగళూరులో స్థిరపడింది. ఆయన తన కుమారుడు నాగేంద్ర (30)కు వివాహం చేయాలని సంబంధాలు చూసే ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తమ స్వస్థలానికి సుబ్బరాయుడితోపాటు ఆయన భార్య మంగమ్మ, నాగేంద్ర, కుమార్తె సుభాషిణి, మనవడు లక్కీతో కలిసి గురువారం ఉదయం బెంగళూరు నుంచి కారులో బయలుదేరారు. నాగేంద్ర కారు నడుపుతున్నాడు. అతను నిద్రమత్తులోకి జారుకోవడవంతో బెంగళూరు – తిరుపతి హైవేలోని పూతలపట్టు మండలం గోపాలపురం సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ పాల డెయిరీ వద్ద కల్వర్టును ఢీకొట్టింది. దీంతో నాగేంద్ర కారులోనే మృతిచెందాడు. పక్కసీటులో ఉన్న సుబ్బారాయుడు కల్వర్టు కింద పడి మరణించాడు. వెనుక కూర్చొన్న మంగమ్మ, సుభాషిణి, లక్కీకి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బయటకు తీసి 108 అంబులెన్స్లో పి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబానికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సుభాషిణి ఆస్పత్రిలో తన తండ్రి, తమ్ముడికి ఏమైంది.. వారెక్కడ అని రోదిస్తూ అడగడం పలువురిని కంటతడి పెట్టించింది. మృతులను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. డివైడర్ను ఢీకొట్టిన కారు తండ్రీకుమారుల మృతి మరో ముగ్గురికి తీవ్రగాయాలు