breaking news
SPSR Nellore
-
వినాయక చవితి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరురూరల్: జిల్లాలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో మంగళవారం ఉత్సవాల నిర్వహణపై సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాట్లు, భద్రత, నిమజ్జన కార్యక్రమాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. గణేష్ ఘాట్, రంగనాథస్వామి దేవస్థాన సమీపంలోని పెన్నా బ్రిడ్జి వద్ద నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్రేన్లు, గజ ఈతగాళ్లు, పోలీసు సిబ్బంది, వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గణేష్ మండపాలకు అవసరమైన అన్ని శాఖల అనుమతులు తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. నిమజ్జన ప్రాంతాల్లో పూడిక తొలగించి, నీటి లోతును గుర్తించే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఊరేగింపు మార్గాల్లో గుంతలు, విద్యుత్ తీగలు, ఇతర అడ్డంకులను ముందుగానే తొలగించాలన్నారు. డీజేలు, మైక్లు, ఊరేగింపు సమయాలకు సంబంధించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో విజయ్కుమార్, ఏఎస్పీ సౌజన్య, ఆర్డీఓ అనూష, వివిధ శాఖల అధికారులు, విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
జగన్ను కలిసిన పర్వతరెడ్డి
నెల్లూరు రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలో ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మంగళవారం కలిశారు. నగర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి చేపడుతున్న చర్యలను వివరించారు. సోమశిలలో 16.85 టీఎంసీలు సోమశిల: సోమశిల జలాశయంలో మంగళవారం సాయంత్రానికి 16.85 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎండ తీవ్రతకు 133 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. పెన్నా డెల్టాకు 2700, కండలేరు కాలువకు 350 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జలాశయంలో 87.066 మీటర్ల నీటిమట్టం నమోదైంది. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండిపోయి.. శిలాతోరణం వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 69,440 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.75 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించండి నెల్లూరు(పొగతోట): కొత్త పింఛన్లకు అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి సూచించారు. నగరంలోని డీఆర్డీఏ కార్యాలయం నుంచి మున్సిపల్ కమిషనర్లు, వివిధ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. సచివాలయాల ద్వారా దరఖాస్తులను ఈ నెల 16 నుంచి స్వీకరించాలని సూచించారు. వైఎస్సార్సీపీ నేతలపై కేసులు నమోదు నెల్లూరు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కూటమి ప్రభుత్వ అక్రమ కేసుల పరంపర కొనసాగుతోంది. తాజాగా నెల్లూరు బ్యారే జీ సందర్శన నిమిత్తం వెళ్లిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, నెల్లూరు రూరల్, గూడూరు సమన్వయకర్తలు ఆనం విజయకమార్రెడ్డి, గురవయ్య, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుడు వీరి చలపతి, మరికొందరిపై కేసులను సంతపేట పోలీసులు నమోదు చేశారు. -
భక్తిశ్రద్ధలతో గంధ మహోత్సవాలు
● కసుమూరు, ఏఎస్పేటకు పోటెత్తిన భక్తులు వెంకటాచలం: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కసుమూరు మస్తాన్వలీ దర్గా 249వ గంధ మహోత్సవాలు మంగళవారం రాత్రి 11 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సందడి మొదలైంది. భక్తులు తొలుత దర్గాను సందర్శించి, గంధ మహోత్సవం ప్రారంభమయ్యే చందన్మహల్ వద్ద సేదతీరారు. కాగా ఏర్పాట్లకు వక్ఫ్ బోర్డు రూ.19 లక్షలు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. దర్గా ప్రాంగణంతోపాటు పలుచోట్ల విద్యుద్దీపాలు, దర్గాకు పెయింటింగ్, పారిశుద్ధ్య పనులు చేపట్టామంటున్నారు. గంధ మహోత్సవం సందర్భంగా తొక్కిసలాట జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోటాపోటీగా గంధం దంచిన మహిళలు అనుమసముద్రంపేట: హజరత్ ఖాజానాయబ్ రసూల్ దర్గాలో 253వ గంధ మహోత్సవం సందర్భంగా మహిళలు గంధం దంచేందుకు పోటీ పడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి అనేకమంది భక్తులు మంగళవారం దర్గాకు రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. దర్శనం అనంతరం మహిళలు గంధం దంచేందుకు క్యూలైన్లలో నిలబడ్డారు. మహల్ వద్ద ముతవల్లీ హఫీజ్పాషా గంధం దంచేందుకు ఏర్పాటు చేయగా మరో వర్గం ఫయాజ్ అహ్మద్ తన ఇంటి వద్ద చర్యలు తీసుకుంది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇటీవలే ఇద్దరు గంధం దంచేందుకు అధికారం కావాలంటూ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇరువర్గాలకు అనుమతి ఇచ్చింది. -
బుల్లెట్ తగిలి వ్యక్తికి గాయాలు
నెల్లూరు సిటీ: బుల్లెట్ తగిలి వ్యక్తి గాయపడిన ఘటన నెల్లూరు రూరల్ పరిధిలోని ఆమంచర్లలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఆమంచర్ల వద్ద పోలీస్ ఫైరింగ్ రేంజ్ ఉంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి అనుమతి తీసుకుని ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. దీనికి సమీపంలో నిమ్మతోట ఉంది. అందులో రూరల్ పరిధిలోని కొల్లంపూడికి చెందిన సీతారామయ్య పనిచేస్తున్నాడు. మంగళవారం అతను తోటలో ఉండగా బుల్లెట్ తగిలింది. యజమానికి సమాచారం తెలియడంతో 108 అంబులెన్స్లో బాధితుడిని హాస్పిటల్కు తరలించాడు. ఫైరింగ్ సమయంలో బుల్లెట్ సీతారామయ్య ఛాతిలో లేదా తలకు తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. బాధితుడు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. రెడ్క్రాస్ సభ్యులు వివరాలు సరిచూసుకోవాలి నెల్లూరు(అర్బన్): ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖలో జీవితకాల సభ్యులుగా నమోదైన వారు తమ పేరు, ఇతర వివరాలను నగరంలోని రెడ్క్రాస్ కార్యాలయంలో సరిచూసుకోవాలని సొసైటీ సెక్రటరీ మస్తానయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సభ్యుల ఫొటోలు నమోదు కాకపోయినా, ఇప్పటికే ఉన్న వివరాల్లో మార్పులు, సవరణలు చేయాల్సి ఉన్నా వెంటనే కార్యాలయానికి వచ్చి సరిచేసుకోవాలని కోరారు.ఇంట్లో విద్యుత్ పనులు చేస్తూ.. ● షాక్తో వ్యక్తి మృతి చిల్లకూరు: విద్యుత్ పనులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు షాక్కు గురై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కలవకొండ గ్రామంలో బూదూరు రమేష్ (35) అనే వ్యక్తి తన అన్న ఇంట్లో విద్యుత్ పనులు చేస్తున్నాడు. ఈ సమయంలో షాక్కు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. చిల్లకూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వివరాలను సేకరించారు. కేసు నమోదు చేశారు. రమేష్కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కండలేరులో 18.22 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 18.22 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,500, లోలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
వాహనాలు.. యమదూతలు
● వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి ఆత్మకూరు: ప్రైవేట్ దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉన్న యువతి ఆటోలో ప్రయాణిస్తూ అది బోల్తాపడి మృతిచెందిన ఘటన ఆత్మకూరులో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై జంపానికుమార్ కథనం మేరకు.. మున్సిపల్ పరిధిలోని వెంకట్రావుపల్లి దళిత కాలనీకి చెందిన బొగ్గవరపు మహాలక్ష్మి (23), నాగేంద్రబాబు దంపతులు. ఆమె పట్టణంలోని ఓ రెడీమేడ్ వస్త్ర దుకాణంలో పనిచేస్తూ కుటుంబ పోషణకు తనవంతుగా కష్టపడుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లి తిరిగి విధులకు హాజరయ్యేందుకు ఆటోలో బయలుదేరింది. డ్రైవర్ ప్రభు వాహనాన్ని అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడపడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో మహాలక్ష్మి రోడ్డుపై పడిపోయి తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఆమెను వెంటనే సమీపంలోని వారు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. సమాచారం అందుకున్న ఎస్సై కేసు నమోదు చేశారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. దగదర్తి: గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన అల్లూరు రోడ్డు జాతీయ రహదారిపై ఉన్న రైల్వే వంతెన వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పశ్చిమ బెంగాల్కు చెందిన దీపంకర్ బర్మన్ అనే యువకుడు సోమవారం రాత్రి అల్లూరు రోడ్డు రైల్వే వంతెనపై నెల్లూరు వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వాహనం అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో బర్మన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే మొబైల్, దగదర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్లో కావలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా పశ్చిమ బెంగాల్ వాసిగా గుర్తించారు. అక్కడి పోలీస్స్టేషన్లో తెలియజేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. వయసు 35 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్సై మహేంద్ర తెలిపారు. -
నిమ్మ ధరలు అదుర్స్
● బస్తా కాయలు రూ.18 వేలు పొదలకూరు: నిమ్మ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బస్తా (లూజు) కాయల ధర రూ.18 వేలు పలుకుతోంది. దిగుబడి లేకపోవడంతో రేట్లు ౖపైపెకెళ్తున్నాయని రైతులు, వ్యాపారులు పేర్కొంటున్నారు. పొదలకూరు నిమ్మ మార్కెట్ పరిధిలోని నాలుగైదు మండలాల్లో గల తోటల్లో కాయల్లేకపోవడంతో ఊహించని విధంగా డిమాండ్ పెరిగింది. పది కిలోల కాయలున్నా రూ.రెండు వేలకుపైగా తీసుకెళ్తున్నారు. పొదలకూరులోని యార్డులో బస్తాలకు బస్తాలను తోలుకొచ్చే రైతులు ఇప్పుడు స్వల్పంగా తీసుకొస్తున్నారు. కొందరైతే పది కిలోలను సైతం కవర్లలో తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. కిలోల్లెక్కన చూస్తే రూ.150 నుంచి రూ.225 వరకు ధరలు లభిస్తున్నాయి. ఆటోల్లో ఎగుమతులు సీజన్లో నిత్యం పది నుంచి 15 లారీల్లో నిమ్మకాయలను వివిధ రాష్ట్రాలకు తరలించే వ్యాపారుల్లో కొందరు ప్రస్తుతం ఆటోల్లో సైతం చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. తోటల నుంచి బస్తా కాయలను తెచ్చే రైతు లేకుండాపోయారని పేర్కొంటున్నారు. -
అధికారాన్ని అడ్డుపెట్టుకుని..భూ ఆక్రమణలు
వరికుంటపాడు: మండలంలోని డక్కునూరు గ్రామాన్ని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కొందరు అధికార పార్టీ నాయకులు, భూ ఆక్రమణదారులు పాగా వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పశువుల మేతకు ఉపయోగపడే పోరంబోకు భూములను సైతం యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డక్కునూరు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 240లో సుమారు మూడెకరాల భూమిలో ముళ్లచెట్లను యంత్రాలతో తొలగించి, భూమిని చదును చేసి బోరు వేశారు. ఈ వ్యవహారంలో గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకుల ప్రమేయం ఉందని వారు పేర్కొంటున్నారు. ఆదివారం కూడా జేసీబీతో సదరు భూమిలో చదును పనులు చేశారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ప్రభుత్వ భూములు, పశువుల మేత పోరంబోకు భూములను పరిరక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉన్నప్పటికీ, మండలంలోని పలు ప్రాంతాల్లో భూ ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. భూములు ఆక్రమణకు గురవుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వారిపై ఆక్రమణల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అనే ప్రశ్నలు గ్రామాల్లో వినిపిస్తున్నాయి.యథేచ్ఛగా పశువుల మేత పోరంబోకు కబ్జా ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణకు డిమాండ్ డక్కునూరు సర్వే నంబర్ 240లోని భూమిపై రెవెన్యూ అధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేసి, ఆక్రమణలు జరిగినట్లు తేలితే భూమిని స్వాధీనం చేసుకుని బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా పశువుల మేత పోరంబోకు భూమిలో ఎలాంటి లేఅవుట్లు వేయకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
రాజీ చేస్తానని పిలిచి.. వ్యక్తిపై కత్తిపోట్లు
● పేకాట క్లబ్ నిర్వాహకుడి దారుణం ● భార్యాభర్తల మధ్య వివాదంలో జోక్యం కావలి: భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరిస్తానంటూ మధ్యవర్తిత్వానికి పిలిచి.. చివరకు కత్తితో దాడికి పాల్పడిన ఘటన కావలి రూరల్ మండలం మద్దూరుపాడులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. మద్దూరుపాడులో నివాసముంటున్న బొమ్మిరెడ్డి శ్రీనివాసులు, అతని భార్య శేషమ్మ మధ్య కుటుంబ కలహాల నేపథ్యంలో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. అయితే అదే గ్రామంలో పేకాట క్లబ్ నిర్వహిస్తున్న కొండేటి సుబ్రహ్మణ్యం ఇటీవల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని.. రాజీ కుదురుస్తానని చెప్పినట్లు బాధితుడు ఆరోపించాడు. రాజీ కుదరకపోగా.. విభేదాలు మరింత పెరిగాయని చెబుతున్నాడు. ఈ క్రమంలో మరోసారి రాజీ చేస్తానంటూ సుబ్రహ్మణ్యం మంగళవారం తనను పిలిచాడని, ఏదో ఒక పరిష్కారం లభిస్తుందేమోనని భావించి మద్దూరుపాడుకు వెళ్లానని శ్రీనివాసులు తెలిపాడు. అయితే సుబ్రహ్మణ్యం వాదనకు దిగి.. ఉన్నట్టుండి కత్తితో దాడి చేసినట్లు ఆరోపించాడు. చుట్టుపక్కల వారు గమనించి చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అసలు వివాదానికి కారణాలేంటి?, కత్తితో దాడి చేసే పరిస్థితి ఎందుకొచ్చింది?, దాడి వెనుక మరేదైనా కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడికి న్యాయం చేయడంతోపాటు దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
మద్యానికి బానిసై భార్యకు వేధింపులు
● ఆత్మహత్య చేసుకున్న వివాహిత ● తల్లిని కోల్పోయిన ఐదు నెలల చిన్నారి మర్రిపాడు: ఆ చిన్నారికి లోకం ఇంకా తెలియదు.. అమ్మే తన ప్రపంచం. ఐదునెలల వయసులోనే తల్లిని కోల్పోవాల్సి వచ్చింది. భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడటంతో మండలంలోని డీసీపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వింజమూరు మండలం ఊటుకూరుకు చెందిన చాంద్ బాషాకు చీరాలకు చెందిన షేక్ హనీ (22)తో కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఐదునెలల బాబు ఉన్నాడు. హనీ తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాద్లో నివాసముంటున్నారు. చాంద్ బాషా డీసీపల్లిలో దుకాణాన్ని అద్దెకు తీసుకుని పవర్ స్పేర్ పార్ట్స్ విక్రయిస్తున్నాడు. అదే ఊరిలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగొచ్చి భార్యను వేధించేవాడు. హనీ భరించలేక సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. మంగళవారం ఉదయం ఇంటి యజమాని తలుపు కొట్టినా స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి పరిశీలించి హనీ మృతిచెందినట్లు గుర్తించారు. ఆత్మకూరు సీఐ గంగాధర్, ఎస్సైలు జంపాని కుమార్, శ్రీనివాసులురెడ్డి, మర్రిపాడు ఏఎస్సై శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్య మృతి విషయం తెలియగానే చాంద్ బాషా పరారయ్యాడు. అతడిని నెల్లూరు రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
చీకటి ఒప్పందాలతో దగా
● శ్రీశైలం జలాలను సోమశిలకు వెంటనే విడుదల చేయాలి ● ఏ ప్రయోజనాలను ఆశించి తెలంగాణకు తాకట్టు పెట్టారు..? ● రైతులను సర్కార్ ఆదుకోకపోతే పంటలు ఎండిపోవడం ఖాయం ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ● అన్నదాతలతో కలిసి నెల్లూరు బ్యారేజీ వద్ద భారీ నిరసన ● సాగునీటి కోసం కదంతొక్కిన రైతాంగం నెల్లూరు రూరల్: శ్రీశైలంలో జలాలు పుష్కలంగా ఉన్నా.. దిగువ ప్రాజెక్టులకు విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. కరువును సీఎం చంద్రబాబు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. శ్రీశైలం జలాశయం నుంచి సోమశిలకు నీటిని వెంటనే విడుదల చేసి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలనే డిమాండ్తో నెల్లూరు బ్యారేజీ వద్ద భారీ నిరసన ప్రదర్శనను కాకాణి ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, పార్టీ నెల్లూరు రూరల్, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తలు ఆనం విజయకుమార్రెడ్డి, బూదూరు గురవయ్య, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుడు వీరి చలపతి, రైతు విభాగ జిల్లా అధ్యక్షుడు శివుని నరసింహులురెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. నిత్యం ఐదు టీఎంసీలను తెలంగాణ తరలించుకెళ్తున్నా, ఇక్కడి ప్రభుత్వం మౌనంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏ ప్రయోజనాలను ఆశించి శ్రీశైలం జలాలను తాకట్టు పెట్టారని నిలదీశారు. మీనమేషాలను లెక్కిస్తున్న సర్కార్ శ్రీశైలం జలాశయంలో నీరు అందుబాటులో ఉన్నా, సోమశిలకు విడుదల చేయకుండా ప్రభుత్వం ఎందుకో మీనమేషాలను లెక్కిస్తోందన్నారు. నిత్యం ఒక టీఎంసీ చొప్పున తరలించే అవకాశమున్నా, స్పందించడంలేదని మండిపడ్డారు. ఇరిగేషన్ నిపుణులమని చెప్పుకొనే అధికార పార్టీ నేతలు ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. చంద్రబాబు.. కరువు.. కవల పిల్లలు..! చంద్రబాబు.. కరువు.. కవల పిల్లలని, రైతుల కష్టాలకు ఇవే ప్రతీకలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగు, తాగునీటి సమస్యలు చుట్టుముట్టాయని ఆరోపించారు. నెల్లూరు డెల్టా పరిధిలోని రైతులకు నీటి యాజమాన్య హక్కులున్నాయని స్పష్టం చేశారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా.. ప్రత్యామ్నాయ పంటలు, పశుగ్రాసం, సాగు, తాగునీటి సరఫరాపై ఎలాంటి సమీక్షలను నిర్వహించడంలేదని విమర్శించారు. రైతులకు ప్రయోజనం చేకూర్చకుండా ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నిధుల దుర్వినియోగానికి కూటమి ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. అన్నదాతల పేరిట నిధులు, బిల్లుల విషయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. బ్యారేజీలకు పేర్లు మారుస్తారా..? నెల్లూరు, సంగం బ్యారేజీల నిర్మాణానికి దివంగత సీఎం వైఎస్సార్ పునాది వేయగా, జగన్మోహన్రెడ్డి హయాంలో వీటిని పూర్తి చేసి జాతికి అంకితం చేశారని చెప్పారు. వీటికి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మేకపాటి గౌతమ్రెడ్డి పేర్లు పెట్టగా, వాటిని తొలగించి పెయింట్లు వేయించడం దారుణమన్నారు. కొత్త ప్రాజెక్టులను నిర్మించే ధైర్యం సర్కార్కు లేదని, మహనీయుల పేర్లు తొలగించేందుకు మాత్రం జీఓలను జారీ చేస్తున్నారని దుయ్యబట్టారు. అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టలేరు ప్రశ్నించే ప్రతిపక్ష నేతలు, మీడియా సంస్థలపై అక్రమ కేసులు పెట్టి అణిచేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. కోవూరులో ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ సీఈఓ శ్రావణ్పై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. తప్పుడు కేసులు పెట్టారనే అంశం భవిష్యత్తులో జరపబోయే విచారణలో తేలితే ఇలాంటి వారిని చంద్రబాబు, లోకేశ్ సైతం కాపాడలేరని హెచ్చరించారు. ఆధారాలతో సహా అనిల్కుమార్యాదవ్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు, ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పోలీసులను అడ్డుపెట్టి తమ పార్టీ శ్రేణులను నిలువరించలేరన్నారు. ఎమర్జెన్సీ, బ్రిటిష్ కాలం నాటి పాలనను ప్రస్తుత కూటమి ప్రభుత్వం తలపిస్తోందని విమర్శించారు. రానున్న రోజుల్లో పోరాటాలను మరింత ఉధృతం చేయనున్నామని ప్రకటించారు. కార్యక్రమానికి తరలివచ్చిన రైతులు, పార్టీ శ్రేణులు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఖలీల్ అహ్మద్, ఆత్మకూరు నియోజకవర్గ పరిశీలకుడు పేర్నేటి కోటేశ్వర్రెడ్డి, సిటీ నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు ధనుజారెడ్డి, కిషన్, విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ర్యాలీగా వస్తున్న కాకాణి, శైలజానాథ్, విజయకుమార్రెడ్డి, గురవయ్య, చలపతిరావు తదితరులు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో చీకటి ఒప్పందాన్ని చేసుకొని రాష్ట్ర రైతులను చంద్రబాబు దగా చేస్తున్నారని వీరి చలపతి ధ్వజమెత్తారు. రైతులకు ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడైనా మేలు చేసిందానని ప్రశ్నించారు. పోలీసులెన్ని ఆంక్షలను విధించినా ఆగేది లేదన్నారు. ప్రభుత్వానికి భయం పట్టుకుంది ప్రజా సమస్యలపై తమ పార్టీ శ్రేణులు బయటకొస్తుంటే కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుందని, అందుకే పోలీసులను ఉపయోగించి అరాచకానికి పాల్పడుతోందని శైలజానాథ్ ఆరోపించారు. జిల్లాలోని ఎనిమిది మండలాల్లో పంటలెండిపోతున్నా ప్రభుత్వానికి చలనం లేకపోవడం దారుణమని మండిపడ్డారు. రైతులు నష్టపోతుంటే.. అధికారులు, పాలకులు మాత్రం ఏసీ గదుల్లో కూర్చొని డబ్బులు లెక్కబెట్టుకోవడం సరికాదని విమర్శించారు. అమరావతిలో టీడీపీ నేతలకు నిధులు కేటాయిస్తున్న మంత్రి నారాయణ.. జిల్లా రైతాంగానికి నీరివ్వలేరానని ప్రశ్నించారు. వైఎస్సార్ పేరును గుర్తుచేసుకొని ఆయనలా పనిచేయాలని చంద్రబాబు యత్నిస్తున్నారని, అయితే వంద జన్మలెత్తినా అది సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమంలో వైఎస్సార్ తర్వాత జగన్మోహన్రెడ్డి మాత్రమే ముందున్నారని చెప్పారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న రీతిలో చంద్రబాబు తీరు ఉందని, చివరికి వాతలే మిగులుతాయని విమర్శించారు. -
ఎస్సీ నేతపై రెడ్బుక్ రాజ్యాంగం
● టీడీపీలో ఉండి ప్రశ్నించడంతో మౌనం ● వైఎస్సార్సీపీలో చేరడమే నేరం ● గంటల వ్యవధిలో వరుస కేసులతో భయభ్రాంతులు ● పల్లి కోటేశ్వరరావును అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు ● అయినా అరెస్ట్ చేస్తే.. గూడూరు కోర్టు బెయిల్ ● మళ్లీ అదుపులోకి తీసుకుని మరో రెండు కేసులు నమోదు బెయిల్ మంజూరు గూడూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పల్లి కోటేశ్వరరావుపై పోలీసుల ద్వారా అక్రమ కేసులను అధికార పార్టీ నేతలు బనాయించి రిమాండ్కు పంపాలని చూసినా, ఆయనపై పెట్టిన కేసులను పరిశీలించిన కోర్టు బెయిల్ను మంజూరు చేసిందని పార్టీ లీగల్ సెల్ న్యాయవాది రాఘవరెడ్డి తెలిపారు. ఈ మేరకు వివరాలను పట్టణంలో మంగళవారం ఆయన వెల్లడించారు. తమ వద్ద పల్లి కోటేశ్వరరావు బలవంతంగా నగదు వసూళ్లకు పాల్పడ్డారంటూ అధికార పార్టీకి చెందిన వారు కేసు పెట్టారని, దీనిపై హైకోర్టును ఆశ్రయించగా, ఆయనకు ఊరట లభించిందని చెప్పారు. అయినా గూడూరు ఒకటో పట్టణ పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకొని స్థానిక కోర్టులో హాజరుపర్చారని, వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ను మంజూరు చేసిందని వివరించారు. మరో కేసు నమోదైందంటూ వెంటనే ఆయన్ను రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో మంగళవారం హాజరుపర్చారని, అక్కడ వాదనలు విన్న న్యాయమూర్తి ఏకీభవించి బెయిల్ను మంజూరు చేశారని చెప్పారు. కోటేశ్వరరావుపై మోపిన అన్ని కేసుల్లో ఊరట లభించిందన్నారు. గూడూరు: ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ప్రజాప్రతినిధి ఓ ఎస్సీ నేతపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాక్షసం ప్రదర్శిస్తున్నారు. గూడూరులో అధికార పార్టీ అండదండలతో సాగుతున్న భూకబ్జాలు, అక్రమాలు, దందాలను అదే పార్టీలో గూడూరు పట్టణ ఎస్సీ సెల్ నాయకుడు పల్లి కోటేశ్వరరావు గత నెల 21న ధర్మరాజుల స్వామి ఆలయంలో జరిగిన భూముల లీజు వేలంపై ప్రశ్నించాడు. అంతకు ముందూ అక్రమాలను ప్రశ్నించాడు. అయితే ఆ తర్వాత వైఎస్సార్సీపీలో చేరడమే నేరంగా భావించి స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి పోలీసులను అడ్డు పెట్టుకుని వరుసగా అక్రమ కేసులు బనాయించి, వేధింపులకు గురి చేస్తున్న తీరుపై నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఒక కేసులో కోర్టు నుంచి ఊరట లభించిన వెంటనే మరో అక్రమ కేసు నమోదు చేస్తూ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూసి గూడూరు నియోజకవర్గంలో అంబేడ్కర్ రాజ్యాంగం ఉందా? ఎమ్మెల్యే పాశం సునీల్ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందా? అని పలువురు దళిత నాయకులు ప్రశ్నిస్తున్నారు. కేసులు.. అరెస్ట్ నుంచి గూడూరులోని ధర్మరాజుల స్వామి దేవస్థానంలో గత నెల 21న ఆలయ భూముల లీజు వేలం సరైన పద్ధతిలో జరగడం లేదని గూడూరు పట్టణ టీడీపీ ఎస్సీ సెల్ నేతగా పల్లి కోటేశ్వరరావు దేవదాయశాఖ అధికారులను ప్రశ్నించాడు. అప్పుడు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత పల్లి కోటేశ్వరరావు వైఎస్సార్సీపీలో చేరడంతో ఆ మరుసటి రోజు 28వ తేదీన ఆలయ ఈఓ రవికృష్ణపై ఒత్తిడి తెచ్చి ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయించి కేసు పెట్టించారు. ఎమ్మెల్యే పాశం సునీల్ ఇలా తనపై అక్రమ కేసు పెట్టి సాటి దళితుడిని ఇబ్బందులు పెడుతున్నారని వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఓ హోటల్లో కోటేశ్వరరావు ప్రెస్మీట్ పెట్టాడు. దీంతో ఎమ్మెల్యే ఆ హోటల్ యజమానిని హోటల్లో ఎలా ప్రెస్మీట్లు పెట్టనిస్తారంటూ బెదిరించడం, వెంటనే రూం ఖాళీ చేయించాలని ఆదేశించడంతో యాజమాన్యం హోటల్ గదులను ఖాళీ చేయించారు. ఆ తరువాత పల్లి కోటేశ్వరరావు తనను బెదిరింపులకు గురి చేసి నగదు డిమాండ్ చేశాడని ఓ పారిశ్రామికవేత్తతో ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో వారం తిరగక ముందే నాన్ బెయిల్ రెండో కేసుగా నమోదు చేయించారు. ఈ కేసులో బెయిల్ కోసం కోటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ వేయడంతో విచారణ సమయంలో అరెస్టులు చేయకూడదని ఆదేశించింది. సోమవారం కోటేశ్వరరావుకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన నేరుగా గూడూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త బూదూరు గురవయ్యతో కలిసి తనపై జరుగుతున్న కుట్రలను, ఎమ్మెల్యే కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న తీరును వివరించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి విలేకరుల సమావేశం జరిగే ప్రాంతానికి పంపించి నానా హంగామా సృష్టించారు. హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించిన పోలీసులు అరెస్ట్ చేయడమే కాకుండా, అధికార పార్టీ వర్గీయులతో పల్లి కోటేశ్వరరావుపై కొంత మంది రౌడీషీటర్స్తో భౌతిక దాడికి యత్నాలు చేసేందుకు చేసిన ప్రయత్నాలతో పోలీసుస్టేషన్ వద్ద గత రాత్రి హైడ్రామా నడిచింది. ఆ తర్వాత ఎట్టకేలకు రాత్రి 11 గంటల సమయంలో పల్లిని రిమాండ్ కోసం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అయితే న్యాయమూర్తి రిమాండ్ను తిరస్కరించినా విడిచి పెట్టకుండా గూడూరు టు టౌన్ పోలీసులు మళ్లీ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే పోలీసులు అప్పటికే పథకం ప్రకారం రెండో పట్టణానికి చెందిన బెజవాడ రమేష్ అనే వ్యక్తి కోటేశ్వరరావు తనను నగదు ఇవ్వాలని బెరించాడని అందుకు తాను రూ.10 వేలు ఇచ్చినట్లు పోలీసులకు పిర్యాదు చేయగా కోటేశ్వరరావుపై మరో కేసును బనాయించి మంగళవారం గూడూరు కోర్టుకు హాజరు పరిచారు. అలాగే మరో కేసును ఒకటో పట్టణం పోలీస్స్టేషన్లో నమోదు చేయించేందుకు ఉద్యోగులను పురమాయిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నించడమే నేరమా? స్థానిక ఎమ్మెల్యే సునీల్కుమార్ అవినీతిని, అక్రమాలను నిలదీస్తూ ప్రజల పక్షాన నిలిచిన గొంతును నొక్కేందుకే ఈ కుట్రలు సాగుతున్నాయని గూడూరు నియోజకవర్గం దళితులు భావిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన జరగనున్న భూముల వేలం ప్రక్రియలో పాల్గొని వాస్తవాలు వెలుగులోకి తెస్తాడనే భయంతోనే ముందస్తుగా ఈ అరెస్ట్ల పర్వానికి తెరలేపారని చర్చ సాగుతోంది. ఒక పద్ధతి ప్రకారం అధికార పార్టీ కార్యకర్తలతో వరుస ఫిర్యాదులు చేయిస్తూ, ఒక్కో కేసు తర్వాత మరొక కేసు పెడుతూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వైఎస్సార్సీపీ నేత కోటేశ్వరరావును బయటకు రాకుండా చక్రబంధం పన్నారని ఆరోపణలు వస్తున్నాయి. -
లోక్అదాలత్ను జయప్రదం చేయండి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి నరసింహమూర్తి నెల్లూరు (లీగల్): ఈ నెల 12న జరిగే జాతీయ లోక్అదాలత్ను జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ నరసింహమూర్తి కోరారు. జిల్లాలోని వివిధ కోర్టుల్లోని న్యాయమూర్తులతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వైజే పద్మశ్రీ అధ్యక్షతన జాతీయ లోక్ అదాలత్లో పెండింగ్ కేసుల పరిష్కారంపై సమీక్ష సమావేశాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చాంబర్లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయ మూర్తి మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. వివిధ కోర్టుల్లోని పెండింగ్ కేసుల పరిష్కారంపై న్యాయమూర్తులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కక్షిదారులు రాజీ చేసుకునేలా చూసి అధిక కేసులను పరిష్కరించి రాష్ట్రంలో మొదటి స్థానం కోసం కృషి చేయాలని కోరారు. పీఎం విశ్వకర్మ రుణాల మంజూరుకు ప్రత్యేక శిబిరాలు నెల్లూరు(అర్బన్): పీఎం విశ్వకర్మ పథకం కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసేందుకు కెనరా బ్యాంకు, జిల్లా పరిశ్రమల కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నామని లీడ్ బ్యాంకు డిస్ట్రిక్ట్ మేనేజర్ మణిశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు పొదలకూరు ఎంపీడీఓ కార్యాలయం, ఈ నెల 10న మధ్యాహ్నం 3 గంటలకు వింజమూరు ఎంపీడీఓ కార్యాలయంలో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పీఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకున్న చేతివృత్తిదారులు, కళాకారులు అవసరమైన ధ్రువీకరణపత్రాలతో శిబిరాలకు హాజరై రుణ మంజూరు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. కొత్త పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు(పొగతోట): కొత్త పింఛన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి సోమవారం తెలిపారు. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత, ఏఆర్టీ, డయాలసిస్, ట్రాన్స్ జెండర్, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులకు పింఛన్లు మంజూరు చేస్తామ ని చెప్పారు. అర్హులైన వారు ఈ నెల 16వ తేదీలోపు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఎంవీఐ గోపీనాయక్ సస్పెన్షన్ నెల్లూరు (టౌన్): కావలి సమీపంలోని టోల్గేట్ వద్ద చెకింగ్ చేస్తూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన రవాణాశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ ఎంవీఐ గోపీనాయక్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు సోమవారం రవాణా శాఖ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం అర్ధరాత్రి ఏసీబీ అధికారులు చేసిన సర్ప్రైజ్ తనిఖీల్లో ఎంవీఐ గోపినాయక్ వద్ద రూ.2.48 లక్షలు అనధికార నగదును గుర్తించారు. ఆదివారం ఏసీబీ అధికారులు రేడియో మెసేజ్ ద్వారా రవాణాశాఖ ఉన్నతాధికారులకు వివరాలను అందజేశారు. ఈ నేపథ్యంలో గోపినాయక్ను సస్పెండ్ చేశారు. ఎంవీఐతో పాటు పట్టుబడిన మరో ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లను ఆ ఆ శాఖకు సరెండర్ చేశారు. రెండో సారి సస్పెండ్ ఎంవీఐగా పనిచేస్తున్న గోపీనాయక్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే రెండు సార్లు సస్పెండ్ అయ్యారు. ఆయన సూళ్లూరుపేటలో ఎంవీఐగా పనిచేస్తున్న సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఆయిల్ ట్యాంకర్లు ఫిజికల్గా లేకుండానే రీ రిజిస్ట్రేషన్ చేశారు. మొత్తం 70కు పైగా ట్యాంకర్లకు రీ రిజిస్ట్రేషన్ చేసి భారీ మొత్తంలో లంచం రూపంలో నగదును తీసుకున్నట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ఆయన్ను 2022లో రవాణా శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆయన మళ్లీ 2023 జనవరిలో జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిగా పోస్టింగ్ తెచ్చుకున్నారు. ఏసీబీ అధికారుల విచారణ చెకింగ్ చేస్తూ పట్టబడిన ఎంవీఐ గోపీనాయక్ను సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు విచారించారు. రవాణాశాఖ డీటీసీ బి.చందర్తోపాటు ఎంవీఐ గోిపీనాయక్, ఎంవీఐ సంధ్య ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ఎంవీఐ గోిపీనాయక్ నుంచి అనధికార నగదు, చెకింగ్, విధులు, గతంలో సస్పెండ్ వివరాలు తదితరాలు అడిగినట్లు సమాచారం. ఎంవీఐ సంధ్య నుంచి స్టేట్మెంట్ తీసుకున్నట్లు తెలిసింది. రవాణాశాఖ వివరాలను కూడా డీటీసీని అడిగినట్లు సమాచారం. -
చంద్రబాబు అధికారంలో ఉంటే.. కరువే..
శ్రీశైలం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు ప్రస్తుత నీటి మట్టం 871 అడుగులు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గ్రావిటీ 841 అడుగులు రాయలసీమ ఎత్తిపోతల గ్రావిటీ 800 అడుగులు రోజుకు నీటి తరలింపు అవకాశం పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా – 4 టీఎంసీలు రాయలసీమ ఎత్తిపోతల ద్వారా – 3 టీఎంసీలు కరువు.. చంద్రబాబు కవలలని అప్పుడే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా.. జిల్లాను కరువు వెంటాడుతూనే ఉంది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన రెండేళ్లల్లో గతేడాది అంతంత మాత్రంగా వర్షాలు కురిస్తే.. ఈ ఏడాది పూర్తిగా ముఖం చాటేశాయి. జిల్లాలోని జలాశయాలు అడుగంటుతున్నాయి. ఈ తరుణంలో శ్రీశైలం జలాశయంలో తగింత స్థాయి నీటి మట్టం ఉన్నప్పటికీ కనీసం సాగు, తాగునీటి అవసరాలకు కూడా జిల్లా జలాశయాలకు నీటిని విడుదల చేయడంలో చంద్రబాబు సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి నేతృత్వంలో మంగళవారం రైతులతో చలో నెల్లూరు బ్యారేజీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో తీవ్ర వర్షాభావం తో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. సోమశిలలో 78, కండలేరులో 69 టీఎంపీలు, ప్రధాన రిజర్వాయర్లు, మేజర్, మైనర్ చెరువుల్లో కలిసి మొత్తంగా 200 టీఎంసీల నీటి నిల్వలకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం సోమశిలలో 17.1, కండలేరులో 18.3 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇక మేజర్, మైనర్ చెరువులు సైతం పూర్తిగా ఎండిపోయాయి. జిల్లాలో సమీప భవిష్యత్లో తాగునీటి ఎద్దడి సైతం నెలకొనే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులను అధిగమించేందుకు అవకాశాలు ఉన్నా.. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ప్రధాన జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలు లెక్కిస్తే.. దాదాపు 38 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం సాగులో ఉన్న ఖరీఫ్ సాగు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో సుమారు 6 టీఎంసీల నీటి అవసరం ఉందని జలవనరుల అధికారులు చెబుతున్నారు. మిగిలిన 32 టీఎంసీల్లో సోమశిల డెడ్ స్టోరేజీ 8, కండలేరు డెడ్ స్టోరేజీ 6 టీఎంసీలతోపాటు చైన్నె తాగునీటి అవసరాలకు 5 టీఎంసీలు సరఫరా చేయాల్సి ఉంది. ప్రస్తుత వాతావరణం మండు వేసవిని తలపిస్తుండడంతో జలాశయాల్లో ఆవిరి శాతం కూడా అత్యధికంగా ఉంది. అధికారుల అంచనా ప్రకారం 6 టీఎంసీలు ఆవిరి అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా. ఈ లెక్కన 25 టీఎంసీలు పోను 7 టీఎంసీలు కూడా నిల్వ ఉండే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం నుంచి నీటి విడుదలలో నిర్లక్ష్యం రాష్ట్రంలో కృష్ణా బేసిన్లో తీవ్ర వర్షాభావం నెలకొన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల జలనిధి అయిన శ్రీశైలం (గరిష్ట నీటి మట్టం 885 అడుగులు)లో కూడా నీటి మట్టం పడిపోయింది. అదృష్టవశాత్తు కర్ణాటక ప్రాంతంలో కురిసిన వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్ట్కు వరద నీరు రావడంతో 871 అడుగుల (149 టీఎంసీలు) నీటి మట్టానికి చేరింది. ఈ తరుణంలో పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులర్ కాలువ ద్వారా సోమశిల, కండలేరు జలాశయాలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నా.. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం సాగులో ఉన్న ఖరీఫ్ పంటలను కాపాడడంతోపాటు తాగునీటి సమస్యలు తలెత్తకుండా శ్రీశైలం జలాలను విడుదల చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తున్నా.. చంద్రబాబు కనీసం స్పందించడం లేదు. శ్రీశైలంలో 841 అడుగుల కంటే నీటి మట్టం పెరిగితే.. రోజుకు 44 వేల క్యూసెక్కులు తరలించుకునే వెసులుబాటు ఉంది. ఈ లెక్కన రోజుకు కనీసం 4 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గ్రావిటీ ద్వారా జిల్లాలోని జలాశయాలను నింపే అవకాశం ఉంది. మరో వైపు తెలంగాణ సర్కారు 800 అడుగుల నీటి మట్టానికి పడిపోయినా.. శ్రీశైలం జలాలను తరలించుకుని పోతున్నా.. కూటమి ప్రభుత్వం కట్టడి చేయడం లేదు. శ్రీశైలంలో గరిష్ట స్థాయిలో నీటి నిల్వలు ఉన్నప్పుడైనా జిల్లా జలాశయాలు నింపే ఆలోచన అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేయకపోవడం జిల్లా రైతాంగం, ప్రజలు చేసుకున్న దురదృష్టం. ప్రస్తుత పరిణామాలతో జిల్లా రైతాంగం కన్నీరు పెడుతోంది. రాయలసీమ ఎత్తిపోతల పూర్తయినా.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయినా.. తెలంగాణతో సమానంగా కాకపోయినా.. కొంత మేరకైనా నెల్లూరుతోపాటు రాయలసీమ జిల్లాలకు నీటిని తరలించి కరువు వేళ సైతం సస్యశ్యామలం చేసే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భవిష్యత్ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని దూరదృష్టితో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం ఉన్నా.. ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 3 టీఎంసీలు తరలించుకోవచ్చు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా రోజుకు 4 టీఎంసీలు తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలో 871 అడుగుల నీటి మట్టం ఉన్న నేపథ్యంలో గ్రేటర్ రాయలసీమలోని ప్రాజెక్ట్లకు రోజుకు 7 టీఎంసీలు తరలించుకుంటే.. కరువును తరిమి కొట్టే అవకాశం ఉంది. దాదాపు 85 శాతానికి పైగా పూర్తయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు సర్కారు ఆపేయడంతో శ్రీశైలంలో జల హక్కులు ఉన్నా.. వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడింది. వైఎస్సార్.. జలయజ్ఞంతో సస్యశ్యామలం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే రెండేళ్లలోనే దశాబ్దాలుగా కల్లలుగా మిగిలిపోయిన జిల్లా రైతుల సమగ్ర సోమశిల కలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 35–40 టీఎంసీలకే పరిమితమైన సోమశిలను జలయజ్ఞం ద్వారా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. రాయలసీమతోపాటు నెల్లూరుకు మళ్లించేందుకు ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కేవలం 1,500 క్యూసెక్కుల కెపాసిటి కలిగి ఉండేది. దీన్ని అధికారికంగా 44 వేల క్యూసెక్కులకు పెంచే విధంగా హెడ్ రెగ్యులేటర్తోపాటు, కాలువలను ఆధునికీకరించారు. ముంపు గ్రామాలకు పరిహారం చెల్లించడం, అటవీశాఖ అనుమతులు చకచకా తీసుకుని 2007–08 నాటికి జలాశయంలో నీటి సామర్థ్యాన్ని 72 టీఎంసీలకు పెంచి సింహపురి రైతుల్లో హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వైఎస్సార్ కేవలం రెండేళ్లల్లోనే రెట్టింపు స్థాయిలో నీటి నిల్వలను పెంచగలిగారు. చంద్రబాబు తొలుత తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా ఉండీ సోమశిలలో నిల్వ సామర్థ్యాన్ని కనీసం ఒక్క టీఎంసీ కూడా పెంచలేకపోయారు. జిల్లాలో నీటి నిల్వల సామర్థ్యం (టీఎంసీలు) జిల్లాలో అడుగంటుతున్న జలాశయాలు సోమశిలలో 17.1, కండలేరులో 18.3 టీఎంసీలే ప్రస్తుతం సాగులో ఉన్న ఖరీఫ్కు 10 టీఎంసీలు అవసరం చైన్నె తాగునీటికి, డెడ్ స్టోరేజీ, ఆవిరి కింద 25 టీఎంసీలు సమీప భవిష్యత్లో వర్షపు జాడలే లేవు కమ్ముకుంటున్న కరువు పరిస్థితులు శ్రీశైలంలో తగినంత నీటి మట్టం ఉన్నా.. చుక్క నీటిని వదలని వైనం సీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినా.. జిల్లా సస్యశ్యామలం చివరికి వచ్చిన ఖరీఫ్ సాగుకు సాగునీటి సమస్య సాగు, తాగునీటికి గడ్డు పరిస్థితులు నేడు కాకాణి ఆధ్వర్యంలో చలో నెల్లూరు బ్యారేజీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. వైఎస్సార్ హయాంలో 72 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి పెరిగిన సోమశిలను తర్వాతి పాలకులు పట్టించుకోలేదు. వైస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక.. సోమశిల ప్రాజెక్ట్లకు సంబంధించి పెండింగ్ అటవీభూములు, పరిహారాలు చెల్లింపులను క్లియర్ చేసి 78 టీఎంసీల కెపాసిటికి పెంచి సమగ్ర సోమశిలను సాకారం చేశారు. అదే సమయంలో వైఎస్సార్ హయాంలో శ్రీకారం చుట్టిన సంగం, నెల్లూరు బ్యారేజీలను అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ రెండేళ్ల కరోనా వంటి విపత్తును సైతం ఎదుర్కొని వీటిని పూర్తి చేసి రైతులకు అంకితం చేశారు. వీటితోపాటు సోమశిల–కండలేరు, కండలేరు– స్వర్ణముఖి కాలువ కెపాసిటిని రెట్టింపు చేశారు. సోమశిల ఉత్తర కాలువ విస్తరణతోపాటు కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.కరువు సీమలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జల ప్రాజెక్ట్లతో సస్యశ్యామలం చేస్తే.. చంద్రబాబు పదిహేడేళ్ల్లు అధికారంలో ఉండి ప్రాజెక్ట్లను నిర్వీర్యం చేశాడు. ఫలితంగా ముక్కారు పంటలతో అన్నపూర్ణగా ప్రసిద్ధిగాంచిన నెల్లూరు జిల్లాలో కరువు పరిస్థితులు వెంటాడుతున్నాయి. 1996–2004 మధ్య అధికారంలో ఉండి జిల్లాలో ఇది తాను నిర్మించి ప్రజలకు అంకింత చేశానని చెప్పుకునే ఒక్క ప్రాజెక్ట్ లేదంటే అతిశయోక్తి లేదు. జిల్లా జలనిధి సోమశిల పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు అయితే.. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ముంపు గ్రామాల ప్రజలు, రైతులకు పరిహారం చెల్లించకుండా ప్రాజెక్ట్ పనులు నిలిపివేయడంతో ఆయన హయాంలో 35–40 టీఎంసీలకే పరిమితమైంది. చంద్రబాబు ఆది నుంచి జల ప్రాజెక్ట్లకు వ్యతిరేకి. జిల్లాలోని సోమశిల, నెల్లూరు, సంగం, స్వర్ణముఖి బ్యారేజ్లతోపాటు సోమశిల ఉత్తర కాలువ ప్రాజెక్ట్లు ఆయన పాలనకు దృష్టాంతంగా నిలుస్తాయి. -
టీడీపీ వర్గీయుల బరితెగింపు
గూడూరు: టీడీపీ నేతల అక్రమాలను ప్రశ్నించిన మాజీ టీడీపీ నేత, ప్రస్తుత వైఎస్సార్సీపీ నాయకుడు పల్లె కోటేశ్వరరావుపై భౌతిక దాడులకు బరితెగించారు. గూడూరులోని ధర్మరాజుస్వామి ఆలయానికి సంబంధించి భూములు, దుకాణాల వేలంలో టీడీపీ నేతలు, ఆలయ అధికారుల అక్రమాలపై ఆ పార్టీ ఎస్సీ నేతగా ఉన్న పల్లె కోటేశ్వరరావు ప్రశ్నించారు. ఆ మరుసటి రోజే ఆయన వైఎస్సార్సీపీలో చేరడంతో జీర్ణించుకోలేకపోయిన టీడీపీ నేతలు కక్షపూరితంగా కేసులు బనాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోటేశ్వరరావు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ బయట ఉండి సోమవారం గూడూరుకు వచ్చారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త బూదూరు గురవయ్యతో కలిసి టీడీపీ నాయకుల అరాచకాలపై ప్రెస్మీట్ పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ పోలీసులు మండల పరిషత్ కార్యాలయంలో కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ఒకటో పట్టణ స్టేషన్కు తరలించేందుకు జీప్లో ఎక్కిస్తుండగా టీడీపీకి చెందిన కొందరు తమ నాయకుడిపైన ఇష్టానుసరంగా మాట్లాడతావా అంటూ పోలీసుల ఎదుటే కోటేశ్వరరావుపై భౌతికదాడికి యత్నించారు. ఆ తర్వాత అతన్ని పోలీస్స్టేషన్ వద్దకు తీసుకుని వెళ్లిన విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు గుంపులు, గుంపులుగా అక్కడకు చేరుకున్నారు. ఎమ్మెల్యే నివాసం ఉండే ప్రాంతానికి చెందిన మహిళలు, స్థానికులు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో టీడీపీ నాయకులు నేరుగా స్టేషన్ ఆవరణలోకి దూసుకెళ్లి అక్కడ ఉన్న పోలీసులతో కోటేశ్వరరావును బయటకు వదలాలని పట్టుబట్టారు. పట్టణ, రూరల్ సీఐలు శేఖర్బాబు, కిషోర్బాబు వాగ్వాదానికి దిగిన వారిని సముదాస్తూ.. పేరు పేరునా పిలుస్తూ బయటకు వెళ్లాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారికి అరెస్టు చేసిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకుని వెళ్లి వైద్య పరీక్షలు చేయించాలనే విషయం తెలియజేయడం చూస్తుంటే అక్కడకు వెళ్లి దాడులకు పాల్పడండని ప్రేరేపించేలా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగించింది. పోలీసులతో వాగ్వాదానికి దిగిన నాయకులు సుమారుగా గంటకు పైగా స్టేషన్ ఆవరణలో ఉండడం, అధికార పార్టీకి చెందిన వారు కావడం, స్థానిక ప్రజాప్రతినిధి ఆదేశాలతో టీడీపీ నాయకులపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా పోలీసులు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమంగా పల్లి కోటేశ్వరరావు అరెస్ట్ ● పోలీసుల వీరంగం గూడూరురూరల్ : గూడూరు ఎంపీపీ ఛాంబర్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి వచ్చిన వైఎస్సార్సీపీ నేత పల్లి కోటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కోటేశ్వరరావును అదుపులోకి తీసుకునేందుకు ఒకటో పట్టణ సీఐ, ఎస్సై. పోలీసులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో గూడూరు సమన్వయకర్త గురవయ్య, న్యాయవాది రాఘవరెడ్డి, నాయకులు చెబుతున్నా పోలీసులు లెక్కచేయకుండా ఈడ్చుకెళ్లి జీపు ఎక్కించుకుని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్కు తరలించారు. ధర్మరాజుస్వామి ఆలయంలో అక్రమాలపై ప్రశ్నించిన మాజీ టీడీపీ నేత ఆ మరుసటి రోజే వైఎస్సార్సీపీలో చేరిక వెంటనే అతనిపై కేసులు నమోదు చేసిన వైనం తాజాగా అరెస్ట్ చేస్తే పోలీసుల ఎదుటే పల్లె కోటేశ్వరరావుపై భౌతిక దాడికి టీడీపీ శ్రేణుల యత్నం బయటకు వదలాలని పోలీసులతో వాగ్వాదం -
సాగునీటి నిర్వహణ లేకనే రైతులకు కష్టాలు
పొదలకూరు : సాగునీటి నిర్వహణ సక్రమంగా లేకనే పంటలు ఎండిపోతూ రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని పొదలకూరు, మరుపూరులో కాకాణి సోమవా రం పర్యటించారు. ఈ సందర్భంగాపొదలకూరులో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. కలువాయి మండలంలో సాగునీరందక పంటలు ఎండిపోతుంటే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కనుపూరుపల్లి, నూకనపల్లి, వెదనపర్తి, వెరుబొట్లపల్లి, గోపవరం తదితర గ్రామాల్లో 3,600 నుంచి 4వేల ఎకరాల్లో పంటలు సాగునీరందక ఎండిపోతున్నాయన్నారు. అక్కడి రైతులు పురుగుమందు డబ్బాలు చేతబట్టి నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి కనికరం లేదన్నారు. అధికారులు వెంటనే స్పందించి సాగునీరందించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. సాగునీటి పంపిణీలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. సెంటు భూమి కూడా ఎండనివ్వమన్న మంత్రుల మాటలు నీటి మూటలుగా మిగిలాయని విమ ర్శించారు. సోమశిల–కండలేరు ఫ్లడ్ఫ్లో కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తే కలువాయి, కుల్లూరు చెరువులకు నీరు చేరుతుందని, రైతులు పంటలు పండించుకుంటారని తెలిపారు. శ్రీశైలం నుంచి సోమశిలకు నీరు విడుదల చేయాలని గత పదిరోజులుగా మొత్తుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. నేడు రైతుల కోసం ఆందోళన జిల్లా రైతాంగాన్ని ప్రభుత్వం నట్టేట ముంచిందని కాకాణి ధ్వజమెత్తారు. సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటినిల్వలు అడుగంటుతున్న నేపథ్యంలో శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయమంటే పట్టించుకోవడం లేదన్నారు. రెండు జలాశయాల్లో 8 టీఎంసీల వంతున నిల్వలు ఉండే అవకాశం ఉందన్నారు. సాగునీటి సంగతి అటుంచి తాగేందుకు కూడా జిల్లా ప్రజలకు నీరందని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రైతుల హక్కులు కాపాడేందుకు వారితో కలిసి వైఎస్సార్సీపీ మంగళవారం ఉదయం 10 గంటలకు నెల్లూరు బ్యారేజీ వద్ద శ్రీశైలం నీటిని విడుదల చేయాలని ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి శైలజానాథ్ ఆందోళన కార్యక్రమానికి హాజరవుతున్నారని చెప్పారు. రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఒక పక్క జిల్లాలో పంటలు ఎండిపోతున్నా పట్టించుకోని ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నీటిని అడ్డగోలుగా తోడేస్తున్నా కూడా స్పందించడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం 27 నెలలుగా కొత్త పింఛన్లను మంజూరు చేయలేదని, ఇప్పుడు స్థానిక ఎన్నికల స్టంట్లో భాగంగానే దరఖాస్తులు స్వీకరిస్తోందని ఆరోపించారు. కాకాణి వెంట నాయకులు పెదమల్లు రమణారెడ్డి, బచ్చల సురేష్కుమార్రెడ్డి, వూకోటి లక్ష్మీనారాయణ, వాకాటి శ్రీనివాసులురెడ్డి, తెనాలి నిర్మలమ్మ, జీ.వేణుగోపాల్రెడ్డి, ఎస్కే అంజాద్, ఎం సతీష్రెడ్డి, ప్రసాద్, వెంకీ ఉన్నారు. కలువాయిలో నీరందక ఎండుతున్న పంటలు రైతు సమస్యలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమైపోయారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజం -
బాలకోటిరెడ్డి రిమాండ్కు తరలింపు
నెల్లూరు (అర్బన్): బాపట్ల జిల్లా చుండూరు పోలీసుస్టేషన్పై దాడికి పాల్పడి సీఐను కులం పేరుతో దూషించిన కేసులో రిమాండ్ ఖైదీ బాలకోటిరెడ్డిని ఎట్టకేలకు పోలీసులు రిమాండ్ తరలించారు. గత నెల 23న రిమాండ్కు తరలించిన బాలకోటిరెడ్డి అధికార పార్టీ నేత కావడంతో మూడు రోజులకే సాధారణ చర్మవ్యాధి పేరుతో తన రాజకీయ పలుకుబడితో ఏకంగా పెద్దాస్పత్రిలో పెయిడ్ రూమ్లో పెట్టి రాజభోగాలు కల్పించారు. ఈ నేపథ్యంలో శనివారం ‘తమ్ముడు రిమాండ్ ఖైదీ అయితే..’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం కలవరపడింది. రిమాండ్ ఖైదీ బాలకోటిరెడ్డికి నిబంధనలకు విరుద్ధంగా న్యాయమూర్తి ఆదేశాలు, అనుమతులు లేకుండా సాధారణ చర్మ వాధి పేరుతో పెయిడ్ రూమ్ కల్పించి, ఆయనకు పోలీసులు, డాక్టర్లు రాచమర్యాదలు చేయసాగారు. రిసార్ట్స్ వసతులు కల్పించారు. అదేదో నిషేధిత ప్రాంతమన్నట్లు ఆ క్యారిడార్లోకి కూడా రెండో వ్యక్తిని రాకుండా నర్సులు సైతం పొరబాటున అటు వైపు వెళ్లిన వారిని బెదిరించారు. ఖైదీలకే కాదు రోగులకు సైతం ఇలాంటి పే రూంలు ఇప్పటి వరకు పెద్దాస్పత్రిలో కేటాయించలేదు. ఇదే విషయాన్ని సాక్షి వెలుగులోకి తేవడంతో ప్రజల్లో చర్చనీయాంశంగా మారడంతో ఆగమేఘాల మీద నిందితుడిని రిమాండ్కు తరలించారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ తిరుమలలోని బాట గంగమ్మ ఆలయం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 84,176 మంది స్వామివారిని దర్శించుకున్నారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
గోపినాయక్ చరిత్ర అవినీతిమయం
● గూడూరు రవాణా కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఏఎంవీఐ రెండు నెలల క్రితం పరిమితికి మించి అధిక లోడు ఉందన్న కారణంగా ధాన్యం లారీకి సంబంధించిన వారి వద్ద నుంచి రూ.5 వేలు నగదు లంచం రూపంలో తీసుకున్నారు. ఈ విషయం లారీ అసోసియేషన్ నాయకులు దృష్టికి వెళ్లడంతో సదరు అధికారితో వాగ్వాదానికి దిగి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీంతో చేసేదేమి లేక తీసుకున్న నగదును తిరిగి వెనక్కి ఇచ్చారు. సదరు అధికారితోపాటు మరో అధికారి కూడా గూడూరు సమీపంలో ఉన్న సంత రోడ్డుపైనే తనిఖీలు నిర్వహించి అక్కడి నుంచి వచ్చే వాహన యజమానుల వద్ద భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏఎంవీఐకి డీటీసీ గతంలో మెమో కూడా జారీ చేశారు. గూడూరు ఆర్టీఓ కూడా అక్కడ పనిచేస్తున్న ఇద్దరు అధికారుల వ్యవహార శైలిపై డీటీసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. నెల్లూరు (టౌన్): జిల్లా రవాణాశాఖలో పనిచేస్తున్న కొంతమంది అధికారులకు అధిక లోడు వాహనాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రధానంగా ఇసుక, గ్రావెల్, మట్టి, గ్రానైట్, క్వార్ట్ ్జ, ఫ్లైయాష్, ధాన్యం లారీలు అత్యధిక లోడుతో రవాణా చేస్తున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది ఎంవీఐలు, ఏఎంవీఐలు జిల్లాలోని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల్లో నిత్యం తనిఖీల పేరిట అవినీతికి పాల్పడుతున్నారు. ప్రధానంగా గూడూరులో పనిచేసే ఇద్దరు అధికారులు, నెల్లూరులో పనిచేస్తున్న మరో ఇద్దరు అధికారులు, స్క్వాడ్లో ఉండే అధికారులు ఈ తరహా తనిఖీలతో భారీగా దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తనిఖీల సమయంలో రవాణా అధికారి రోడ్డుపైన ఉండి ప్రభుత్వం కేటాయించిన హోంగార్డు లేదా అటెండర్ సహాయంతో వాహనాన్ని ఆపి రవాణా అవుతున్న సరుకుకు సంబంధించి వే బిల్లులు, ఆర్సీ, పర్మిట్, ఫిట్నెస్ తదితర వాటిని పరిశీలించాల్సి ఉంది. అయితే కొంత మంది రవాణా అధికారులు హోంగార్డు లేదా అటెండర్లను తనిఖీలకు తీసుకెళ్లకుండా ప్రైవేట్ వ్యక్తులను కారులో ఎక్కించుకుని తీసుకెళుతున్నారు. సదరు అధికారి కారులోనే కూర్చొని ప్రైవేట్ వ్యక్తులతో వాహనాలను ఆపి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో అధికారి అయితే నలుగురైదుగురు ప్రైవేట్ వ్యక్తులను తీసుకెళ్లి లారీ యజమానులపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు వసూలు వాహన పరిమితికి మించి ఒక టన్ను అధికంగా ఉంటే తొలుత ఓనర్ ఫెనాల్టీ రూ.20 వేలు చెల్లించాలి. ఆ తర్వాత ప్రతి టన్నుకు అదనంగా రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 10 టన్నులు ఓవర్లోడ్ ఉంటే ఓనర్ ఫెనాల్టీ రూ.20 వేలు, 10 టన్నులకు రూ.20 వేలు కలిపి మొత్తం రూ.40 వేలు చెల్లించాలి. దీంతో పాటు డ్రైవరు లైసెన్స్, ఆర్సీ, పర్మిట్, ఫిట్నెస్ లేకుంటే అదనంగా చెల్లించాలి. ఈ నిబంధనలు కొంత మంది రవాణా అధికారులకు వరంగా మారాయి. పగలు, రాత్రి తేడా లేకుండా నిత్యం రోడ్లపై తనిఖీలు నిర్వహిస్తూ.. చిలక్కొట్టుడు కొడుతున్నారు. అధిక లోడు వాహనానికి లోడును బట్టి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొంత మంది అధికారులు ప్రైవేట్ వ్యక్తుల అకౌంట్కు ఫోన్పే చేయిస్తుండగా, మరికొంత మంది నేరుగా డబ్బులు తీసుకుంటున్నారు. ఈ రీతిలో కొందరు రవాణా అధికారులు ప్రతి రోజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు కలెక్షన్ రానిదే ఇంటికి వెళ్లరని ఆ శాఖలో పనిచేసే కొంత మంది రవాణా అఽధికారులే చెబుతున్నారు. ధాన్యం లారీలను తనిఖీ చేయొద్దని ఆదేశించినా.. జిల్లాలో తిరుగుతున్న ధాన్యం లారీలను ఆపి కేసులు నమోదు చేయొద్దని సాక్షాత్తు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను కొంత మంది రవాణా అధికారులు పెడ చెవిన పెట్టి ఆ లారీలనే టార్గెట్ చేస్తున్నారు. ధాన్యం లారీల్లో ఒకట్రెండు టన్నులు అధిక లోడు ఉన్నా రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. ధాన్యం లారీల నుంచి ప్రతి రోజూ రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవ్వకపోతే కేసులు నమోదు చేస్తున్నారు. ఈ విషయంపై లారీ అసోసియేషన్ నాయకులు జిల్లా రవాణా అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కొంత మంది లారీ యజమానులు వాపోతున్నారు. ఇటీవల కాలంలో ఏఎంవీఐలు కొంతమంది వివాదాస్పదంగా మారుతున్నారు. ప్రతి రోజు ఎక్కడోక ప్రాంతంలో లారీ యజమానులతో గొడవ పెట్టుకుంటున్న సందర్భాలు ఉంటున్నాయి.అర్ధరాత్రి వేళ ఎంవీఐ గోపినాయక్ తనిఖీలపై ఏసీబీ దాడులు రవాణా శాఖలో కొందరు అధికారులు 24/7 తనిఖీలతో కష్టపడుతున్నారు. కానీ ప్రభుత్వానికి పైసా పెనాల్టీ జమ కావడం లేదు. సదరు అధికారులు జాతీయ, రాష్ట్రీయ రహదారుల్లో ప్రాంతాలు విభజించుకుని డ్యూటీలు చేస్తూ.. జేబులు నింపుకొంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి తిమింగళాల దోపిడీ అప్రతిహతంగా జరుగుతున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఒక్కొక్క రవాణా వాహనానికి రేట్ ఫిక్స్ చేసి.. రైట్ రైట్ అంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక లోడుతో వెళ్లే వాహనాలను గుర్తించి ప్రభుత్వానికి జరిమానా రూపంలో ఆదాయం సమకూర్చాల్సిన కొంతమంది రవాణా అధికారులు.. అదే నిబంధనలను తమకు ‘కాసుల పంట’గా మార్చుకున్నారు. ఇసుక, గ్రావెల్, మట్టి, క్వార్ట్ ్జ, ఫ్లైయాష్, గ్రానైట్, ధాన్యం లారీలను టార్గెట్గా చేసుకుని పగలు, రాత్రి తేడా లేకుండా తనిఖీల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా కావలి సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న ఎంవీఐ గోపినాయక్ వద్ద భారీ మొత్తంలో అనధికారిక నగదు ఏసీబీకి పట్టుబడడం ఆ శాఖలో కలకలం రేపుతోంది. డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయండి రవాణా కార్యాలయంలో పని చేసే ఎంవీఐలు, ఏఎంవీఐలు, ఏఓలతోపాటు ప్రతి ఉద్యోగి వినియోదారుడికి జవాబుదారీగా ఉండాలి. తనిఖీల సమయంలో అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా 9281607030 నంబరుకు ఫిర్యాదు చేయండి. రవాణా అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో సర్ప్రైజ్ చెకింగ్లు నిర్వహిస్తాను. అక్కడ వారు డబ్బులు తీసుకోవడం.. అనధికార సిబ్బంది ఉన్నట్లయితే అక్కడే చర్యలు తీసుకుంటాను. ఇటీవల కాలంలో జిల్లాలోని ఎంవీఐలు, ఏఎంవీఐలతో సమావేశం నిర్వహించి కమిషనర్ ఆదేశాలను వివరించాం. – చందర్, డీటీసీ రూ.2.48 లక్షల అనధికారిక నగదు పట్టుబడిన వైనం పగలు, రాత్రి తేడా లేకుండా తనిఖీలు ఇసుక, గ్రావెల్, క్వార్ట్ ్జ, మట్టి, ధాన్యం ఫ్లైయాష్, గ్రానైట్ లారీలే టార్గెట్ ఒక్కో వాహనానికి రూ.5 వేల నుంచి రూ.20 వేలు వసూలు అడిగినంత డబ్బులిస్తే రైట్రైట్, లేకుంటే కేసు నమోదు ఒక్కో అధికారి రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వసూళ్లు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి వాహనాల తనిఖీలు ఫిర్యాదులు వస్తున్నా.. పట్టించుకోని రవాణా ఉన్నతాధికారులు రవాణాశాఖ స్క్వాడ్లో మోటారు వాహనాల అధికారిగా పనిచేస్తున్న గోపినాయక్ చరిత్ర అవినీతి మయం. తాజాగా శనివారం అర్ధరాత్రి తర్వాత కావలి సమీపంలోని టోల్గేట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో భారీ మొత్తంలో అవినీతి సొమ్ముతో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సదరు ఎంవీఐ కారు, జేబులను తనిఖీ చేయగా రూ.2.48 లక్షలు దొరికింది. గోపినాయక్ గతంలో సూళ్లూరుపేట ఎంవీఐగా పనిచేస్తున్న సమయంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ట్యాంకర్లను ఫిజికల్గా చెకింగ్ చేయకుండానే రీ రిజిస్ట్రేషన్లు చేసి భారీగా నగదు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై విచారణ చేసి నిజమని తేలడంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన్ను రవాణా శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఏడాది తిరగక ముందే నెల్లూరు స్క్వాడ్లో పోస్టింగ్ తెచ్చుకున్నారు. -
సినిమాకు తీసుకెళ్లి భార్య గొంతు కోసిన భర్త
నెల్లూరు జిల్లా: పెళ్లయి పట్టుమని పదిరోజులు కూడా కాలేదు. అంతలోనే వివాదాలు నెలకొని భార్య గొంతు, రెండు చేతుల మణికట్టు వద్ద భర్త కత్తితో కోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆత్మకూరు పరిధిలో శనివారం జరిగింది. ఎస్సై జంపానికుమార్ వివరాల మేరకు.. ఏఎస్పేట మండలం పందిపాడుకు చెందిన బద్దుకూరి మహాలక్ష్మి, హేమసాయి దగ్గరి బంధువులు కావడంతో కుటుంబ సభ్యులు గత నెల చివర్లో వివాహం చేశారు. వారు బైక్పై శనివారం సినిమాకి వెళ్లి ఆత్మకూరుకు వస్తున్నారు. ఈ క్రమంలో ముస్తాపురం సమీపంలో ఏఎస్పేట ఆర్చి వద్ద రోడ్డు పక్కనున్న నిమ్మతోట వద్ద బైక్ను నిలిపి దంపతులు గొడవ పడ్డారు. కోపోద్రిక్తుడైన భర్త హేమసాయి ముందుగా తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు, మణికట్టు వద్ద కోసి తీవ్రంగా గాయపరిచాడు. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఏఎస్పేట ఎస్సై జిలానీ గుర్తించి తన వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆత్మకూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని చేతికి కూడా గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించారు. తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. చదవండి: చిన్న పిల్లలు ఉన్నారన్నా.. నన్ను బతికించండి! -
హెచ్ఐవీ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి
నెల్లూరు(అర్బన్): హెచ్ఐవీ రహిత జిల్లాగా నెల్లూరును మార్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ సుజాత అన్నారు. నగరంలోని బీవీనగర్ డీఎఫ్ఐటీ కార్యాలయం నందు హెచ్ఐవీ, ఎయిడ్స్ జబ్బులపై సమీక్షా సమావేశం శనివారం జరిగింది. జిల్లాలో హెచ్ఐవీ నిర్మూలనకు జరుగుతున్న ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా ఎయిడ్స్, టీబీ, లెప్రసీ నియంత్రణాధికారి డాక్టర్ ఖాదర్వలీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐసీటీసీ కౌన్సిలర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ● నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆవరణలో ఉన్న బాలల సత్వర చికిత్స కేంద్రాన్ని డీఎంహెచ్ఓ సుజాత శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. లోపాలున్న చిన్న పిల్లలకు అందిస్తున్న సేవలపై ఆరాతీశారు. చిన్నపిల్లల డాక్టర్ సురేష్, ఇతర డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
బైక్ను ఢీకొన్న ట్రాక్టర్
● ఇద్దరికి తీవ్రగాయాలు పొదలకూరు: మోటార్ బైక్ను ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన పట్టణానికి సమీపంలో నెల్లూరు–పొదలకూరు మార్గం కేఆర్ఆర్ లేఅవుట్ వద్ద శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్లకు చెందిన గిరి మరో వృద్ధుడిని తన బైక్పై ఎక్కించుకుని పొదలకూరుకు వస్తుండగా నెల్లూరు వైపు వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై వస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108కు సమాచారం అందించడంతో ఈఎంటీ తిరుపాల్, పైలెట్ శరత్లు క్షతగాత్రులను పొదలకూరు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. -
సమస్యలను గుర్తించేది జర్నలిస్టులే
నెల్లూరు(పొగతోట): సమాజంలో ప్రజా సమస్యలను గుర్తించి వాటిని కథనాల రూపంలో ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లే వారే జర్నలిస్టులని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు శనివారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, మాట్లాడారు. తాను జిల్లాకు వచ్చి ఏడాది దాటిందన్నారు. నా దృష్టికి రాని అనేక సమస్యలను పత్రికల ద్వారా చూసి తెలుసుకున్నానన్నారు. ప్రస్తుతం సమాజంలో అనేక మార్పులు జరుగుతున్నాయని, దీనిపై జర్నలిస్టులకు నిరంతర శిక్షణ, మార్గదర్శకత్వం అవసరమన్నారు. ఈ మధ్యకాలంలో పత్రికల్లో వచ్చిన కథనాల ద్వారా వినియోగంలోకిరాని ప్రభుత్వ ఆస్తులు, క్రీడా సదుపాయాల అంశాలు తన దృష్టికి వచ్చాయన్నారు. వాటిని వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ అలపాటి సురేష్కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో గ్రామీణ విలేకరుల వ్యవస్థ ఉందన్నారు. ఈ క్రమంలో వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. సమాచార శాఖ డీడీ వేణుగోపాల్రెడ్డి, సీఆర్ మీడియా అకాడమీ ఓఎస్డీ జీవన్ పాల్గొన్నారు. -
సీఎం యోగి స్వర్ణభారత్ ట్రస్ట్కు రాక రేపు
వెంకటాచలం: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్కు రానున్నారని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఐ.దీపావెంకట్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు వెంకటాచలం చేరుకుని, 11.30 గంటలకు సరస్వతీనగర్లోని అక్షర విద్యాలయం ప్రాంగణంలోని సోమా నైపుణ్య కేంద్రాన్ని సందర్శిస్తారని తెలిపారు. 12 గంటలకు అక్కడి విద్యార్థులతో కాసేపు ముచ్చటిస్తారన్నారు. అనంతరం 2 గంటలకు స్వర్ణభారత్ ట్రస్ట్ చేరుకుని ట్రస్ట్ రజతోత్సవ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుతో కలిసి పాల్గొంటారని తెలిపారు. జిల్లా పరిషత్ విభజన ప్రక్రియ పూర్తి నెల్లూరు (పొగతోట): రాష్ట్రంలో పాత 13 జెడ్పీలను రద్దు చేసి వాటి స్థానంలో 28 జిల్లా పరిషత్లను పునర్వ్యవస్థీకరిస్తూ పీఆర్, రూరల్ డెవలప్మెంట్ రాష్ట్ర అధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు నెల్లూరు జిల్లా పరిషత్లో 46 మండలాలు ఉన్నాయి. నూతనంగా 35 మండలాలతో జిల్లా పరిషత్ ఉంటుంది. మిగిలిన 11 మండలాలు తిరుపతి జిల్లా పరిషత్లో విలీనం ఆయ్యాయి. జెడ్పీటీసీల పదవీ కాలం ఈ నెల 24వ తేదీతో ముగియనుంది. ఈ నెల 15 వరకే సాగునీటి విడుదల ● ఇరిగేషన్ ఈఈ ఆనంద్బాబు సంగం: కనిగిరి రిజర్వాయర్, కనుపూరు కెనాల్తోపాటు డెల్టా పరిధిలో సాగునీటిని ఈ నెల 15వ తేదీ వరకు విడుదల చేస్తామని ఇరిగేషన్ ఈఈ ఆనంద్బాబు తెలిపారు. సంగం బ్యారేజీ వద్ద శనివారం నీటిమట్టం, లభ్యత, విడుదల ప్రక్రియను పరిశీలించారు. ఆయకట్టు రైతులకు సాగునీటి కొరత లేకుండా, నీటి వృథా కాకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఈఈ తెలిపారు. సాగునీటి పంపిణీని ఎప్పటికప్పుడు నియంత్రించేందుకు సంబంధిత ఏఈలు, డీఈలకు తగిన సూచనలు జారీ చేశామన్నారు. ఒక్క ఎకరా పంట కూడా నీరు లేక ఎండిపోకుండా, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ పంటలను కాపాడుతామని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో నీటి లభ్యతలో లాసెస్ అధికంగా ఏర్పడినట్లు గుర్తించామని, దీనిపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తున్నట్లు చెప్పారు. పంటలను కాపాడేందుకు అదనపు నీటి విడుదలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో డీఈ పెంచలయ్య, ఏఈ వినయ్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ మండల కన్వీనర్పై కేసు నమోదు ● రెండు గ్రూపులుగా చీలిన తమ్ముళ్లు వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండల టీడీపీ కన్వీనర్ గూడ నర్సారెడ్డితోపాటు మరో పది మంది ఆయన ముఖ్య అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వింజమూరు బీసీ కాలనీకి చెందిన షేక్ ఖాదర్ బాషా మండల కన్వీనర్కు వ్యతిరేకంగా పలు అక్రమాలకు పాల్పడుతున్నా డంటూ గత నెల 27న సోషల్ మీడియాలో వాయిస్ మెసేజ్ పెట్టారు. దీంతో అదే రోజు రాత్రి తనపై మండల కన్వీనర్ వర్గీయులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదులో జాప్యం చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్పై మరో వర్గం ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలో మండల టీడీపీలో రెండు వర్గాలు ఎమ్మెల్యేతో పంచాయితీ పెట్టడంతో టీడీపీలో ఉన్న వర్గ విబేధాలు బహిర్గతమయ్యాయి. ఇరువర్గాలను సర్దుబాటు చేయడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని ఆ పార్టీ నేతలే చర్చించుకోవడం విశేషం. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీ మండల కన్వీనర్ నర్సారెడ్డి, ఆయన ముఖ్య అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 68,374 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 35,241 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.03 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
నవ వధువుపై భర్త హత్యాయత్నం
ఆత్మకూరు: పెళ్లయి పట్టుమని పదిరోజులు కూడా కాలేదు. అంతలోనే వివాదాలు నెలకొని భార్య గొంతు, రెండు చేతుల మణికట్టు వద్ద భర్త కత్తితో కోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆత్మకూరు పరిధిలో శనివారం జరిగింది. ఎస్సై జంపానికుమార్ వివరాల మేరకు.. ఏఎస్పేట మండలం పందిపాడుకు చెందిన బద్దుకూరి మహాలక్ష్మి, హేమసాయి దగ్గరి బంధువులు కావడంతో కుటుంబ సభ్యులు గత నెల చివర్లో వివాహం చేశారు. వారు బైక్పై శనివారం ఆత్మకూరుకు వస్తున్నారు. ఈ క్రమంలో ముస్తాపురం సమీపంలో ఏఎస్పేట ఆర్చి వద్ద రోడ్డు పక్కనున్న నిమ్మతోట వద్ద బైక్ను నిలిపి దంపతులు గొడవ పడ్డారు. కోపోద్రిక్తుడైన భర్త హేమసాయి ముందుగా తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు, మణికట్టు వద్ద కోసి తీవ్రంగా గాయపరిచాడు. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఏఎస్పేట ఎస్సై జిలానీ గుర్తించి తన వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆత్మకూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని చేతికి కూడా గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించారు. తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
వివాహేతర సంబంధం పెట్టుకుందని..
● నిద్రిస్తున్న సమయంలో రాడ్డుతో కొట్టి మహిళ దారుణ హత్యకోట: స్థానిక కోటమ్మగుడి కాలనీలో శుక్రవారం రాత్రి నాగభూషణమ్మ(35) అనే మహిళ దారుణ హత్యకు గురికాగా, శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, ఎస్సై పవన్కుమార్ వివరాల మేరకు.. కోటమ్మగుడి కాలనీలో ఆవుల నాగరాజు, యశోదమ్మ దంపతులకు నలుగురు సంతానం ఉన్నారు. పందులు మేపుకుని జీవనం సాగిస్తున్నారు. వీరి సమీప బంధువు అయిన ఏఎస్పేటకు చెందిన నాగభూషణమ్మ భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో నాగరాజుకు నాగభూషణమ్మతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమెను నాగరాజు చిల్లకూరు మండలం రామిరెడ్డిపాళెంలో ఉంచి అప్పుడప్పుడు వెళ్లి వస్తుండేవాడు. దీనిని యశోదమ్మ జీర్ణించుకోలేకపోయింది. భర్త నాగరాజు పనిమీద ఓజిలికి వెళ్లిన క్రమంలో శుక్రవారం నాగభూషణమ్మను పని ఉందని చెప్పి యశోదమ్మ ఇంటికి పిలిపించుకుంది. రాత్రి అందరూ నిద్రించిన తరువాత రాడ్డుతో నాగభూషణమ్మ తలపై బలంగా కొట్టి హత్య చేసి పరారైనట్లు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలాన్ని గూడూరు సీఐ మాలకొండయ్య, ఎస్సై పవన్కుమార్ పరిశీలించారు. క్లూస్టీమ్ ఆధారాలు సేకరించాయి. హత్యకు వాడిన ఇనుపరాడ్డును స్వాధీనం చేసుకున్నారు. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాగభూషణమ్మ తల్లి రోశమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
జీతాల కోసం ఎదురుచూపులే..
● పెద్దాస్పత్రి, మెడికల్ కళాశాలలో 800 మంది ● ప్రభుత్వం వద్ద ఫండ్స్ లేకపోవడమే కారణమా?నెల్లూరు(అర్బన్): ఐదో తేదీ దాటింది. అనేకచోట్ల ఇంకా ఉద్యోగులకు జీతాలు అందలేదు. ఎదురు చూపులే మిగిలాయి. నెల్లూరులోని సర్వజన ఆస్పత్రి, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 800 మందికి పైగా జీతాలు ఇవ్వలేదు. మెడికల్ కళాశాల పరిధిలోని పెద్దాస్పత్రిలో పనిచేస్తున్న రెగ్యులర్ నర్సులు, కాంట్రాక్ట్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నాలుగో తరగతి ఉద్యోగులు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, ఇతర సీనియర్ డాక్టర్లతో సహా సుమారు 800 మందికి పైగా ఉన్నారు. వీరందరికీ కలిపి 8 బిల్లులను ఆగస్టు 24వ తేదీనే ట్రెజరీకి మెడికల్ కళాశాల అధికారులు పంపారు. ఏమైనా లోపాలుంటే వెంటనే ట్రెజరీ అధికారులు తెలపాలి. అయితే గతానికి భిన్నంగా షెడ్యూల్స్ పంపలేదంటూ జిల్లా ట్రెజరీ అధికారి తొలిసారిగా బిల్లులను రిటర్న్ చేశారు. దీంతో మెడికల్ కళాశాల అధికారులు సకాలంలోనే ట్రెజరీ అధికారి కోరిన విధంగా షెడ్యూల్స్ను కూడా పంపారు. అటు తర్వాత బిల్లుల్లో ఎలాంటి లోపాలు లేవంటూ కూడా పాస్ చేశారు. దీంతో ఒకటో తేదీన జీతాలు వస్తాయని ఉద్యోగులంతా ఎదురు చూశారు. అయినా ప్రభుత్వం నేటికీ ఇవ్వలేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడమేనని తెలుస్తోంది. దీంతో చిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోన్లు తీసుకున్న వారు తమ ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే బ్యాంకులు తమను డిఫాల్టర్లుగా చేస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే ఠంచన్గా ఒకటో తేదీన జీతాలు ఇస్తామని చెప్పి మాట తప్పిందని ఉద్యోగులు దుమ్మెత్తి పోస్తున్నారు.మెడికల్ కాలేజీ (ఫైల్)ఇది ప్రభుత్వ వైఫల్యమే.. కూటమి నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాయమాటలు చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఒకటో తేదీన జీతాలిస్తామని నమ్మబలికారు. మంచి పీఆర్సీ ఇస్తామని, డీఏలు విడుదల చేస్తామని హామీలిచ్చి ఇప్పుడు వాటిని మరిచిపోయారు. ఉద్యోగులకు ఏ ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం వద్ద ఫండ్స్ లేకపోవడం వల్లనే జీతాలు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్లనే ఇలా జరిగింది. – నరమాల సతీష్కుమార్, యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ జిల్లా గౌరవాధ్యక్షుడు -
ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు
కోవూరు: కోవూరుతో పాటు కొడవలూరు మండలం నార్తురాజుపాళెం పరిధిలోని హోటళ్లు, దాబాలు, బేకరీలు, జ్యూస్ షాపులు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లపై శనివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఐదు హోటళ్లపై కేసులు నమోదు చేశారు. అలాగే నాలుగు ఫుడ్ సెంటర్లకు నోటీసులు జారీ చేశారు. 150 కేజీల నాసిరకం ఐస్తో పాటు నాలుగు కేజీల రంగులు కలిపిన చెకోడీలు, ఐదు కిలోల గవ్వలు, నాలుగు కేజీల వేరుశనగ పప్పులు, పది కేజీల కుళ్లిన అరటిపండ్లను ధ్వంసం చేశారు. అదేవిధంగా కృత్రిమ రంగులు కలిపిన చికెన్, చికెన్ బిర్యానీ, హాఫ్ బాయిల్ చపాతీలు, పరోటాలు, పాడైన కూరగాయలు, రంగులు కలిపిన గోబీ వంటి ఆహార పదార్థాలను గుర్తించి నిర్వీర్యం చేశారు. వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్లు కలిగి ఉండాలని, వంట గదులు, హోటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ జి.వెంకటేశ్వరరావు, అధికారులు డాక్టర్ డి.నీరజ, ఎం.ప్రణతి ఫ్లోరా పాల్గొన్నారు. -
ఫీడ్ ధరలతో ఆక్వా రైతులు కుదేలు
తోటపల్లిగూడూరు (పొదలకూరు) : రాష్ట్రంలో ఫీడ్ ధరలను కంపెనీలు ఇష్టానుసారం పెంచుతున్నా.. కూటమి ప్రభుత్వం కట్టడి చేయలేకపోతుందని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అసమర్థ పాలనలో ఆక్వా రైతులు కుదేలై పోయారని విచారం వ్యక్తం చేశారు. ఫీడ్ కంపెనీలతో కుమ్మకై ్క దోపిడీకి తెరతీశారని ఆరోపించారు. తోటపల్లిగూడూరు మండలం పాపిరెడ్డిపాళెం గ్రామంలో కాకాణి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్నెళ్లల్లో మూడు దఫాలుగా ధరలు పెంచుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 40 రోజుల క్రితమే ధరలు పెంచిన ఆక్వా ఫీడ్ కంపెనీలు వెంటనే మరోసారి కిలో రూ.17 నుంచి రూ.22లకు పెంచారన్నారు. ప్రభుత్వ అసమర్థత కారణంగా ఆక్వా సాగుకు హాలిడే ప్రకటించాల్సి వస్తుందన్నారు. ఫీడ్ కంపెనీలతో ప్రభుత్వం లాలూచీ పడి డ్రామాలకు తెర లేపిందని, ఆక్వా రైతుల నడ్డి విరిచేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నట్టు ఆరోపించారు. తుగ్లక్ నిర్ణయాలతో ప్రజలను ముంచుతున్న పాలకులు జిల్లా చీఫ్ ఇంజినీర్ల కంటే నాయకులు అంతా తమకు తెలిసినట్టు ఎక్కువగా మాట్లాడుతున్నట్టు ధ్వజమెత్తారు. సాగునీటి విడుదల అస్తవ్యస్తం రెండో పంటకు ప్రణాళికాబద్ధంగా కాకుండా నీరు విడుదల చేసి ప్రస్తుత జలాశయాలను ఖాళీ చేశారని కాకాణి విమర్శించారు. 600 ఎకరాల ఆయకట్టు ఉన్న గ్రామంలో కేవలం 30 నుంచి 40 ఎకరాల అవసరాల కోసం నీటిని విడుదల చేసి మిగిలిన 500 ఎకరాల సరిపడా నీటిని వృథా చేసినట్లు ఆరోపించారు. తొలి పంటపై అసంబద్ధ నిర్ణయాల వల్ల ప్రస్తుతం రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మొదటి పంటకు నీరు అందజేసేందుకు వీల్లేకుండా ఉందన్నారు. ముందస్తు ఆలోచన, ప్రణాళికలు లేకపోవడం వల్లనే జిల్లాలో సాగు, తాగునీటి ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు తెలిపారు. వాతావరణం అనుకూలించకున్నా, కృష్ణా నదికి నీళ్లు వచ్చాయని, నారాయణ్పూర్, జూరాల నిండి, శ్రీశైలం ప్రాజెక్ట్కు నీరు చేరినట్టు కాకాణి వెల్లడించారు. మళ్లీ వరదలు రావొచ్చు, రాకపోవచ్చునన్నారు. సోమశిలకు శ్రీశైలం నీటిని విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు. ఈ రోజుకు కూడా పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు అవకాశం ఉందని, అయితే నీళ్లు తరలించకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నట్లు విమర్శించారు. 17 టీఎంసీలు సోమశిల, 18 టీఎంసీలు కండలేరు జలాశయాల్లో అతి తక్కువ నీటి నిల్వలు ఉన్నాయని, డెడ్ స్టోరేజీ తీసివేస్తే 10 టీఎంసీలు ఉంటాయని ప్రస్తుత పంటకు మరో 3 నుంచి 4 టీఎంసీలు అవసరం అవుతాయన్నారు. ఈ నెల 8వ తేదీన రైతులతో కలిసి బ్యారేజీలు బావురుమంటున్నాయని శ్రీశైలం నుంచి వెంటనే నీటిని విడు దల చేయాలని ధర్నాను తలపెట్టినట్టు స్పష్టం చేశారు. ఇటీవల మృతి చెందిన పార్టీ సానుభూతి పరులు కోటమ్మ, శ్రీరాములు, వర్షిత్ కుటుంబ సభ్యులను కాకాణి పరామర్శించారు. కాకాణి వెంట మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కంపెనీలను కట్టడి చేయని అసమర్థ కూటమి సర్కారు ఆరు నెలల్లో మూడుసార్లు ధరల పెంపు 40 రోజుల్లోనే మరో సారి.. సాగునీటి విడుదల అస్తవ్యస్తం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
గణేష్ ఉత్సవాలకు ‘సింగిల్ విండో’ అనుమతులు
● ఇప్పటి వరకు 489 దరఖాస్తులు నెల్లూరు(క్రైమ్): వినాయక చవితి పండగ సందర్భంగా మండపాలు, పందిళ్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం ప్రభుత్వం సింగిల్ విండో ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వివిధ శాఖల అనుమతుల ప్రక్రియను ఒకే వేదిక ద్వారా పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించింది. గతేడాది జిల్లాలో 4,578 గణేష్ మండపాల ఏర్పాటుకు దరఖాస్తులొచ్చాయి. ఈ ఏడాది మండపాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 489 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఇలా.. గణేష్ ఉత్సవాలు నిర్వహించే వారు ముందుగా కమిటీగా ఏర్పడాలి. అనంతరం గణేష్ఉత్సవ్.నెట్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నిర్వాహకుని పేరు, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ, చిరునామా, కమిటీ సభ్యుల వివరాలు, మండప ఏర్పాటు ప్రదేశం, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, సంబంధిత పోలీస్స్టేషన్, సబ్డివిజన్ తదితర వివరాలను నమోదు చేయాలి. అదే విధంగా విగ్రహ నిమజ్జనం తేదీ, సమయం, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలు, ఏమార్గం గుండా వెళ్తారు.. తదితర వివరాలు దరఖాస్తులో పొందుపరిచి సబ్మిట్ చేయాలి. ఇది సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్తుంది. పోలీసు అధికారులు మండపం ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించి అనుమతుల ప్రక్రియను పూర్తి చేస్తారు క్యూఆర్ కోడ్ ఉంచుకోవాలి అనుమతి పొందిన ఉత్సవ నిర్వాహకులు వెబ్సైట్లోని అప్లికేషన్ స్టేటస్లో మొబైల్ నంబర్ నమోదు చేసి ఎన్ఓసీతో పాటు పాటించాల్సిన నిబంధనలతో కూడిన క్యూ ఆర్కోడ్ డౌన్లోడ్ చేసుకోవాలి. దానిని ప్రింట్ తీసి మండపంలో అందుబాటులో ఉంచాలి. తనిఖీలకు వచ్చే పోలీస్, ఇతర శాఖల అధికారులకు చూపించే విధంగా భద్రపరుచుకోవాలి. అనుమతులు తీసుకోవాలి గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. అల్లర్లు, ఘర్షణలకు తావులేకుండా ఉత్సవాలను నిర్వహించుకోవాలి. పోలీసుశాఖ సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. – అజిత వేజెండ్ల, ఎస్పీ -
మెప్మా రుణ మోసాలపై కలెక్టర్కు ఫిర్యాదు
కోవూరు: మెప్మా పేరుతో పేద ప్రజలకు రు ణాల పేరుతో జరుగుతున్న మోసాల ఫిర్యా దులపై కలెక్టర్కు నివేదించి తగిన చర్యలు తీసుకుంటామని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు. దళిత, గిరిజన ప్రాంతాల్లోని ప్రజల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని ఎవరైనా రుణాల పేరుతో మోసాలకు పాల్పడితే సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, మెప్మా పేరుతో జరిగే అక్రమ రుణ వ్యవహారాలపై ప్రజలను అప్రమత్తం చేస్తామని చెప్పారు. ‘మెప్మా రుణ మాఫియా’ శీర్షికతో శనివారం ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనం నేపథ్యంలో డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి స్పందించారు. కోవూరు మండలంలోని సంఘమిత్ర కార్యాలయంలో శనివారం సంఘమిత్ర సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మెప్మా పేరుతో రుణాల వ్యవహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు మంజూరు చేసే ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలను ఉల్లంఘించకూడదని ఆదేశించారు. ప్రతి పొదుపు సంఘ సభ్యురాలికి ప్రత్యేక ఎన్ఆర్ఎల్ఎం నంబర్ ఉంటుందని, ఆ నంబర్ ఆధారంగానే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు కావాల్సి ఉంటుందని తెలిపారు. రుణాల మంజూరులో ఆన్లైన్ ప్రక్రియ, సభ్యుల థంబ్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఎన్ఆర్ఎల్ఎం నంబర్, అవసరమైన ధ్రువీకరణలు లేకుండా రుణాలు మంజూరైతే సంబంధిత బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎలాంటి ప్రక్రియ లేకుండానే లక్షల రూపాయల రుణాలు మంజూరవుతున్నట్లు ఫిర్యాదు లు వస్తున్నాయని, అలాంటి రుణాలు ఏ విధంగా మంజూరయ్యాయన్న దానిపై సంబంధిత బ్యాంకు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. మెప్మా పేరుతో మోసాలను అడ్డుకోవాలి నెల్లూరు నగరంలోని మెప్మా కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకుని రుణాల పేరుతో పేద ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులపై కూడా అధికారులు దృష్టి సారించాలని నాగరాజకుమారి సూచించారు. మెప్మా లేదా ప్రభుత్వ పథకాల పేరుతో రుణాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా డబ్బులు అడిగినా, అనుమానాస్పద పద్ధతుల్లో పత్రాలపై సంతకాలు తీసుకున్నా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. అవసరమైతే దళిత, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి, రుణాల మంజూరు ప్రక్రియపై ప్రజలకు వివరించాలని సిబ్బందిని ఆదేశించారు. దళిత, గిరిజన ప్రాంతాల ప్రజల్లో అవగాహన కల్పిస్తాం ఇటువంటి వ్యవహారాలపై సంఘమిత్ర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి -
ఉపాధ్యాయ వృత్తి గొప్ప బాధ్యత
నెల్లూరురూరల్: ఉపాధ్యాయ వృత్తి సాధారణ ఉద్యోగం కాదని, గొప్ప బాధ్యతతో కూడిన సేవ అని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన అనంతరం భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ ఒక మంచి ఉపా ధ్యాయుడు ఒక విద్యార్థి జీవితాన్ని మాత్రమే కాదు.. ఒక కుటుంబం, సమాజం, దేశ భవిష్యత్ను మార్చగలడన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడంతో పాటు మంచి మనిషిగా ఎలా ఎదగాలనే విషయాలను కూడా ఉపాధ్యాయులు నేర్పాలన్నారు. నేటి విద్యార్థులే రేపటి వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతారని, వారి వ్యక్తిత్వ వికాసంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. విలువలతో కూడిన విద్య అందించాలి – ఆనం అరుణమ్మ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గురువులకు అత్యున్నత స్థానం ఉందన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు విలువలతో కూడిన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ గురువుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోందన్నారు. 58 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన 58 మంది ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. వీరిలో 20 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 20 మంది స్కూల్ అసిస్టెంట్లు, 18 మంది ప్రధానోపాధ్యాయులు ఉన్నారు. కార్యక్రమంలో డీఈఓ ఆర్. బాలాజీరావు, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్కు ఉపాధ్యాయులే మార్గదర్శకులు కలెక్టర్ హిమాన్షు శుక్లా జిల్లా వ్యాప్తంగా 58 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం -
ట్రావెల్స్ బస్సు ఢీకొని లారీ క్లీనర్ మృతి
వెంకటాచలం: రోడ్డు దాటుతున్న లారీ క్లీనర్ను ట్రావెల్స్ బస్సు ఢీకొని మృతిచెందిన ఘటన వెంకటాచలం టోల్ప్లాజా వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. డ్రైవర్ అన్నపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, క్లీనర్ గోపిరెడ్డి లారీలోని సరుకులను నెల్లూరులో అన్లోడ్ చేశారు. అనంతరం లారీని వెంకటాచలం టోల్ప్లాజా వద్ద శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో నిలిపారు. 10.20 గంటల సమయంలో క్లీనర్ గోపిరెడ్డి(33) రోడ్డు దాటుతుండగా నెల్లూరు వైపు నుంచి గూడూరు వైపు వేగంగా దూసుకొచ్చిన జబ్బార్ ట్రావెల్స్కు చెందిన బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గోపిరెడ్డిని చికిత్స నిమిత్తం వెంటనే జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ విషయంపై మృతుని బంధువు వెంకటరామిరెడ్డి శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ నిద్రమత్తు ● ముగ్గురికి గాయాలు వెంకటాచలం: కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ముగ్గురు గాయపడిన ఘటన మండలంలోని తిక్కవరప్పాడు– గొలగమూడి గ్రామాల మధ్య శనివారం జరిగింది. గొలగమూడిలో నివాసం ఉంటున్న దంపతులు తమ కుమార్తెతో కలిసి కారులో శుభ కార్యానికి శుక్రవారం కోట మండలం గూడలి గ్రామానికి వెళ్లారు. శనివారం తెల్లవారుజామున తిరిగి గొలగమూడి వెళ్తుండగా తిక్కవరప్పాడు గ్రామం దాటగానే కారు నడుపుతున్న వ్యక్తి నిద్రలోకి జారుకోవడంతో కాలినడకన వెళ్తున్న పట్రా సిద్ధయ్య, జయసుధ దంపతులను కారు ఢీకొనింది. ఈ ప్రమాదంలో పట్రా సిద్ధయ్య, జయసుధలకు గాయాలవ్వగా, కారు అదుపుతప్పి బోల్తా పడడంతో అందులో ఉన్న యువతికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇచ్చి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జిల్లా వ్యాప్తంగా నాకాబందీ నెల్లూరు(క్రైమ్): శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు నాకా బందీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర ప్రాంతాల్లో వాహన తనిఖీలు జరిపారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 14 మందిపై, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులపై ఎంవీయాక్ట్ కింద 237 కేసులు నమోదు చేసి రూ.1,34,775ల జరిమానా విధించారు. బహిరంగ మద్య సేవనంపై 19 కేసులు నమోదు చేశారు. లాడ్జీలను తనిఖీ చేసి అందులో బసచేసిన వారి వివరాలను సేకరించారు. లిఫ్ట్ నిర్వహణాలోపంతో వృద్ధుడి మృత్యువాత కావలి: అపార్ట్మెంట్లో లిఫ్ట్ నిర్వహణ సక్రమంగా లేని కారణంగా ఓ వృద్ధుడు మరణించిన ఘటన కావలిలోని శాంతినగర్ కాలనీలో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మల్లికార్జున అనే వ్యక్తి కావలిలోని శాంతినగర్లో ఉన్న సాయి అపార్ట్మెంట్లో గృహ ప్రవేశానికి పలువురిని పిలిచారు. జలదంకి మండలం హనుమకొండపాళేనికి చెందిన యానం రవీంద్ర(62)కు ఆహ్వానం అందింది. ఆయన శనివారం కావలిలోని అపార్ట్మెంట్లోకి వచ్చారు. లిఫ్ట్ను ఆన్ చేయగా అది వచ్చి వెళ్లిపోయింది. వాస్తవానికి లిఫ్ట్ వచ్చినప్పుడు మాత్రమే వాటి గ్రిల్స్కు ఉండే లాక్ తెరుచుకోవాలి. అయితే లిఫ్ట్ వచ్చి వెళ్లిన తర్వాత గ్రిల్స్ లాక్ కాకపోవడంతో వృద్ధుడికి తెలియకుండా ఓపెన్ చేసి వెళ్లిపోయారు. లిఫ్ట్ షాఫ్ట్లోకి జారిపడిన వృద్ధుడికి కింద ఉన్న ఇనుప రాడ్లు, స్ప్రింగ్స్ తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోయిన ఆయన్ను తొలుత ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో కావలి ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంతరిక్షంలో భారత్ ‘ఆకాశ నేత్రం’
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి చరిత్ర సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా జియోసింక్రోనస్ కక్ష్య నుంచి భూమిని చిత్రీకరించగల అధునాతన ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్–05 (ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్) ను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది. 2,367 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ–17 రాకెట్ ద్వారా నిర్దేశిత సబ్–జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగ వేదిక నుంచి తెల్లవారుజామున 2.55 గంటలకు జీఎస్ఎల్వీ–ఎఫ్17 నింగిలోకి దూసుకెళ్లింది. 27 గంటల కౌంట్డౌన్ అనంతరం ఈ ప్రయోగం చేపట్టారు. రాకెట్ నింగిలోకి ఎగిసిన సుమారు 18 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది. శుక్రవారం ప్రయోగంతో దాదాపు ఎనిమిది నెలల విరామం తర్వాత ఇస్రోకు విజయం లభించింది. ఈ ఏడాది జనవరి 12న 16 ఉపగ్రహాలతో ప్రయోగించిన పీఎస్ఎల్వీ–సీ62 రాకెట్.. మూడో దశలో ఏర్పడిన సమస్య కారణంగా వాటిని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టలేకపోయింది. వ్యూహాత్మక సమాచారం మన సొంతం ఈ ఉపగ్రహం ద్వారా భూమికి సంబంధించిన దాదాపు రియల్టైమ్ చిత్రాలను పొందవచ్చు. వ్యవసాయం, విపత్తుల నిర్వహణ సహా దేశ అవసరాలకు ఈ చిత్రాలు ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా దేశానికి అవసరమైన ‘వ్యూహాత్మక సమాచారం’ అందించడంలో ఈఓఎస్–05 కీలకంగా వ్యవహరించనుంది. ఈ ఉపగ్రహాన్ని మిషన్లో భాగమైన ఓ సీనియర్ శాస్త్రవేత్త ‘ఆకాశ నేత్రం’గా అభివర్ణించారు. ప్రయోగ వివరాలు వెల్లడిస్తున్న మిషన్ డైరెక్టర్ థామస్ కురియన్, ఇస్రో చైర్మన్ నారాయణన్ తదితరులు ఇప్పటివరకు అనేక భూ పరిశీలన ఉపగ్రహాలు తక్కువ భూ కక్ష్య (ఎల్ఈఓ) నుంచి పనిచేస్తున్నాయి. అయితే ఈఓఎస్–05 సుమారు 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియోసింక్రోనస్ కక్ష్యలో పనిచేయనుంది. ఈ ఎత్తులో ఉపగ్రహం భూమి భ్రమణ వేగంతో సమానమైన వేగంతో పరిభ్రమిస్తుంది. 2,367 కిలోల బరువున్న ఈఓఎస్–05 జీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల్లోనే అత్యంత బరువైనది. ఉపగ్రహంలోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని, సౌర ఫలకాలు విజయవంతంగా తెరుచుకున్నాయని ఇస్రో తెలిపింది. చాలా సంతోషంగా ఉంది జీఎస్ఎల్వీ–ఎఫ్17 రాకెట్ అధునాతన ఈఓఎస్–05 జియో ఇమేజింగ్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా, కచ్చితత్వంతో ప్రవేశపెట్టింది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఇది శ్రీహరికోట నుంచి చేపట్టిన 107వ ప్రయోగం. జీఎస్ఎల్వీకి ఇది 19వ మిషన్. జీఎస్ఎల్వీ తొలి ప్రయోగం (డీ1)లో 1,536 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. అప్పటి నుంచి నిర్మాణ బరువును తగ్గించడం, ప్రొపల్షన్ వ్యవస్థలను మెరుగుపరచడం ద్వారా జీఎస్ఎల్వీ సామర్థ్యాన్ని ఇస్రో క్రమంగా పెంచింది. ఇప్పుడు 2,367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆర్బిట్ రైజింగ్ ప్రక్రియను చేపట్టి ఉపగ్రహాన్ని అవసరమైన ఎత్తుకు చేర్చి జియో ప్లాట్ఫామ్లో ప్రవేశపెడతాం. ఈ విజయం ఇస్రోతో పాటు ఇందులో భాగస్వాముల సమష్టి కృషి ఫలితం. ఈఓఎస్–05 జీవితకాలం తొమ్మిదేళ్లు. ఇది ‘గూఢచారి ఉపగ్రహం’ అంటూ వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదు. దేశ అవసరాల కోసం భూ పరిశీలన, ఇమేజింగ్ సేవలను అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. 2027 మార్చి నాటికి ప్రధాని మోదీ నిర్దేశాల మేరకు ఆరు ప్రయోగాలు చేయాలనే లక్ష్యంతో ఉన్నాం – ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ రియల్టైమ్లో చిత్రాలను అందిస్తుంది ప్రత్యేకంగా రూపొందించిన ఈఓఎస్–05 ఉపగ్రహం దాదాపు రియల్టైమ్లో చిత్రాలను అందించగలదు. జీఎస్ఎల్వీ ద్వారా జీటీఓ లేదా సబ్–జీటీఓ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో ఇది అత్యంత బరువైనది. – మిషన్ డైరెక్టర్ థామస్ కురియన్ మోదీ అభినందనలు ఈఓఎస్–05 మిషన్ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇది దేశానికి గర్వకారణమైన సందర్భమని పేర్కొన్నారు. జియోసింక్రోనస్ కక్ష్య నుంచి పనిచేసే దేశ తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగించడం భారత అంతరిక్ష రంగం సాధించిన అద్భుత విజయమని తెలిపారు. జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: జీఎస్ఎల్వీఎఫ్17 రాకెట్ ప్రయోగం విజయవంతంపై వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. చారిత్రాత్మక ఘనతను సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు, సాంకేతిక బృందానికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా శుక్రవారం ట్వీట్ చేశారు. నిరంతరం సరికొత్త విజయాలతో అంతరిక్ష పరిశోధనల్లో మన భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు చూపుతున్న అపారమైన సామర్థ్యం, కృషి, సాధిస్తున్న విజయాలు దేశప్రజలందరికీ ఎంతో గర్వకారణంగా నిలుస్తున్నాయని కొనియాడారు. భవిష్యత్తులో ఇస్రో మరెన్నో మైలురాళ్లను అధిగమించాలని ఆకాంక్షించారు. 2021 ప్రయోగానికి ప్రత్యామ్నాయం! కాగా, జీఎస్ఎల్వీ–ఎఫ్17/ఈఓఎస్–05 మిషన్... 2021లో విఫలమైన జీఎస్ఎల్వీ–ఎఫ్10/ఈఓఎస్–03 మిషన్కు ప్రత్యామ్నాయంగా చేపట్టినట్లు తెలుస్తోంది. అప్పటి ప్రయోగంలో రాకెట్ ప్రయాణం ప్రారంభమైన 307 సెకన్ల వద్ద ఆన్బోర్డ్ కంప్యూటర్ ప్రయోగాన్ని నిలిపివేసింది. అనంతరం జరిపిన పరిశీలనలో క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్లో ఏర్పడిన లోపం కారణంగానే ఆ మిషన్ విఫలమైనట్లు ఇస్రో గుర్తించింది. -
నీటి ప్రవాహం మృత్యుపాశమై..
● కావలి కాలువలో యువకుడి గల్లంతు ● కొద్దిసేపటికే మృతదేహం లభ్యంసంగం: ఆ యువకుడు పొట్టకూటి కోసం వచ్చాడు. ఈ క్రమంలో సరదాగా కాలువలో స్నానానికి దిగాడు. కానీ నీటి ప్రవాహం రూపంలో మృత్యువు కబళించింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గుంటూరుకు చెందిన మోహన్ (30), ఇబ్రహీం నేమ్బోర్డులు బిగించే పనుల నిమిత్తం వచ్చారు. పనులు ముగించుకుని తిరిగెళ్తూ శుక్రవారం సంగం కావలి కాలువ వద్ద స్నానానికి దిగారు. కొద్దిసేపటికే మోహన్ నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. అప్రమత్తమైన ఇబ్రహీం ఈత కొట్టి ఒడ్డుకు చేరుకున్నాడు. మోహన్ మాత్రం నీటిలో కొట్టుకుపోయి కనిపించలేదు. సమాచారం అందుకున్న ఎస్సై భోజ్యానాయక్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా మోహన్ ఆచూకీ లభించలేదు. చివరకు గల్లంతైన ప్రాంతానికి సమీపంలోనే అతని మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తరలించారు. -
పొట్టకూటి కోసం వెళ్లి..
● లారీ, బైక్ ఢీ ● నెల్లూరు జిల్లా వాసి దుర్మరణంనెక్కొండ: పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లిన ఓ వ్యక్తి బైక్ను లారీ ఢీకొన్న ఘటనలో దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదం వరంగల్ జిల్లా నెక్కొండ – వరంగల్ ప్రధాన రహదారిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఏఎస్సై రవి కథనం మేరకు.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బసినేనిపల్లి గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ (50) వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సాయిరెడ్డిపల్లిలో తాపీమేస్త్రిగా పనిచేస్తున్నాడు. మస్తాన్ నెక్కొండ నుంచి బైక్పై వస్తుండగా మార్గమధ్యలోని క్రషర్ మిల్లు వద్ద లారీ అదుపుతప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో మస్తాన్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించామని ఏఎస్సై తెలిపారు. కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య మస్తానమ్మ, ఇద్దరు కుమారులున్నారు. -
గురువులు..సమాజ శిల్పులు
ఉత్తమ బోధనతో.. ● నేడు జిల్లా స్థాయి గురుపూజోత్సవం ● 58 మందికి జిల్లా స్థాయి ● నలుగురికి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు నెల్లూరులోని దర్గామిట్ట డీఎస్సార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ పనిచేస్తున్న ఎం.ధనుంజయరావు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాల పెంపు, బోధనలో ఉత్తమ పద్ధతుల ఆచరణ, పాఠశాల అభివృద్ధికి కృషి చేసినందుకు ఈయనను అవార్డుకు ఎంపిక చేశారు.నెల్లూరు (టౌన్): భారతీయ సంస్కృతిలో గురువుల స్థానం ఎంతో విశిష్టమైంది. తల్లిదండ్రుల తర్వాత స్థానం వారిదే. మట్టి అనే అజ్ఞానం నుంచి జ్ఞానవంతులనే మాణిక్యాలను వెలికితీసే వారు గురువులు. శిష్యుల ఎదుగుదలను తనివితీరా అస్వాదించే నిస్వార్థ జీవి. విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేసే గురువులను గౌరవించడం అందరి బాధ్యత. ఎందరికో విద్యా బుద్ధులు నేర్పి భరత మాతకు ముద్దు బిడ్డలు అందించిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని గురుపూజోత్సవంగా జరుపుకోవడం జాతికి గర్వకారణం. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బోధన, సమాజం, వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులు జిల్లా, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. 58 మంది ఎంపిక జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు 58 మందిని ఎంపిక చేశారు. వీరిలో 18 మంది గ్రేడ్–2 హెడ్మాస్టర్లు, 20 మంది స్కూల్ అసిస్టెంట్లు, 20 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉన్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లా నుంచి నలుగురు ఎంపికయ్యారు. వీరిలో వరిగొండ జెడ్పీ హెచ్ఎస్కు చెందిన బయాలజీ ఉపాధ్యాయుడు యర్రగుంటి శ్రీనివాసులు, అల్లీపురంలోని ఎస్ఎస్సార్ జెడ్పీహెచ్ఎస్కు చెందిన ఫిజిక్స్ ఉపాధ్యాయిని ఎస్ రాజేశ్వరి, నెల్లూరులోని కర్ణాలమిట్ట మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల సోషల్ ఉపాధ్యాయుడు పనిచేస్తున్న ఆరుముళ్ల మాల్యాద్రి, కంటేపల్లి ఎంపీపీఎస్కు చెందిన ఉపాధ్యాయుడు జగన్నాఽథం రామ్మోహన్ ఉన్నారు. ● కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా విద్యాశాఖ అధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలను శనివారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నారు. అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులు ఉదయం 8.30 గంటలకు రిపోర్టు చేయాలి. -
6న జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ ఎంపికలు
నెల్లూరు(టౌన్): నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ నెల 6వ తేదీన జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఎం.విజయలక్ష్మీరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు 30 ఏళ్ల వయస్సు పైబడిన పురుషులు, మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఉదయం 8 గంటల్లోపు స్టేడియానికి చేరుకోవాలని సూచించారు. జిల్లాస్థాయిలో ఎంపికై న వారు వచ్చేనెల 10, 11 తేదీల్లో గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ మైదానంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.కుటుంబ సభ్యులకు మహిళల అప్పగింత నెల్లూరు(క్రైమ్): వివిధ కారాణాలతో బాలాజీ నగర్, సైదాపురం, వింజమూరు పోలీస్స్టేషన్ల పరిధిలో ఐదుగురు మహిళలు తప్పిపోయారు. మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ కె.వేమారెడ్డి ఆధ్వర్యంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్టీయూ) సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి సమాచారం, వివిధ విభాగాల సమన్వయంతో వారి ఆచూకీని గుర్తించి ఆయా ప్రాంత పోలీసుల ద్వారా కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. శుక్రవారం డీఎస్పీ వేమారెడ్డి మాట్లాడుతూ మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఎవరైనా తప్పిపోతే ఆలస్యం చేయకుండా కుటుంబ సభ్యులు స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటికి చేరకుండానే.. ● బైక్ ఢీకొని వృద్ధురాలి మృతి ● నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అనుమసముద్రంపేట: పని నుంచి ఇంటికి బయలుదేరిన వృద్ధురాలిని మోటార్బైక్ ఢీకొనడంతో మృతిచెందిన ఘటన మండలంలోని దుబగుంట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. దుబగుంట గ్రామానికి చెందిన కొండపరెడ్డి మహాలక్ష్మమ్మ (69), తన స్నేహితురాలు ఎడ్ల రమతో కలిసి ముత్తురాలు గ్రామ పరిధిలోని తోటకు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లింది. పనులు ముగించుకుని ఇద్దరూ నడుచుకుంటూ దుబాగుంటకు తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో అవినాష్రెడ్డి అనే వ్యక్తి నిర్లక్ష్యంగా బైక్ నడుపుతూ మహాలక్ష్మమ్మను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రమ, స్థానికుల చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.వైఎస్సార్సీపీ ఫ్లెక్సీ చించివేతపై ఫిర్యాదు జలదంకి(కలిగిరి): జలదంకి మండలం బ్రాహ్మణక్రాక అగ్రహారంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ కార్యదర్శి దేవరపల్లి రఘురామిరెడ్డి శుక్రవారం జలదంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పార్టీ మండల కన్వీనర్ ఇస్కా మదన్మోహన్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించి వేయడం మంచి సంస్కృతి కాదన్నారు. ఇలాంటి చర్యలతో గ్రామాల్లో గొడవలు, వివాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు. పోలీసులు ఫ్లెక్సీ చించి వేసిన వారిని పట్టుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కండలేరులో 18.82 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 18.82 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,500, లోలెవల్ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
మెడికల్ సంఘాన్ని విస్మరించడం బాధాకరం
● ఏపీ హంస జిల్లా అధ్యక్షుడు సుధాకర్రావు నెల్లూరు(అర్బన్): ‘ఉద్యోగుల ఆందోళనల నేపథ్యంలో ఎట్టకేలకు వివిధ సంఘాల నాయకులను ప్రభుత్వం చర్చలకు పిలవడం స్వాగతించదగిన పరిణామం. అయితే అత్యధికంగా అధికారులు, వైద్య ఉద్యోగులు ఉండే సంఘాన్ని పిలవకపోవడం బాధాకరం’ అని ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీ హంస) జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల సుధాకర్రావు పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని హరనాథపురంలోని ఆ సంఘం కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంతో జరిగే సమావేశానికి ఉపాధ్యాయులు, రెవెన్యూ, రవాణా తదితర రంగాలకు చెందిన అసోసియేషన్ల నాయకులనే ఆ హ్వానించారన్నారు. రాష్ట్ర వైద్యశాఖలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, ఇతర ఆరోగ్యశాఖ సిబ్బందితో కూడిన లక్షలాది మంది ఉద్యోగులున్నారన్నారు. వీరి సమస్యలపై పోరాడుతున్న మెడికల్, హెల్త్ డిపార్ట్మెంట్కు చెందిన గుర్తింపు పొందిన హంస లాంటి సంఘాలను ఎందుకు పిలవలేదనే ప్రశ్న ఉద్యోగ వర్గాల్లో ఉత్పన్నమైందన్నారు. మెడికల్, హెల్త్ ఉద్యోగులకు సంబంధించిన పోస్టుల సర్దుబాటు, కేడర్ సమస్యలు, పదోన్నతులు, బదిలీలు, సర్వీస్ సమస్యలు, సిబ్బంది కొరత, పనిభారం తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే వైద్య సంఘానికి కూడా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి పునరాలోచన చేసి తక్షణమే ఏపీ హంస రాష్ట్ర అధ్యక్షుడు అరవపాల్కు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా సెక్రటరీ కమల్కిరణ్, గౌరవ సలహాదారు అరవ పరిమళ, జిల్లా పబ్లిసిటీ సెక్రటరీ మజార్, సిటీ కార్యదర్శి గౌస్బాషా, వాకాడు తాలూకా ప్రెసిడెంట్ నాగయ్య, ఉపాధ్యక్షులు జయలక్ష్మి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయండి
నెల్లూరు (లీగల్): ఈనెల 12న ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎ.నరసింహమూర్తి అన్నారు. నగరంలోని జిల్లా కోర్టు హాల్లో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వైజే పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులతో ఆయన గురువారం సాయంత్రం సమావేశమై మాట్లాడారు. ప్రభుత్వానికి సంబంధించిన కేసులు లోక్ అదాలత్లో వినియోగించుకునే విధంగా చూడాలన్నారు. పోలీస్ శాఖకు సంబంధించిన అన్ని స్టేషన్ల పరిధిలో లోక్ అదాలత్పై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో సుమారు 54,590 సివిల్, క్రిమినల్ కేసులను గుర్తించామని, రాజీకి అవకాశం ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం వల్ల కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వినియోగదారులు ఫోరమ్ చైర్మన్ జి.రవిశంకర్, డీఆర్వో విజయకుమార్, అడిషనల్ ఎస్పీ సౌజన్య, తిరుపతి డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్, కమిషనర్ వై.నందన్, జిల్లా జైలు సూపరింటెండెంట్ సన్యాసిరావు, డీఎంహెచ్ఓ సుజాత, ఆర్టీఓ మొదాని మహమ్మద్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ షమీమ్, ఎకై ్సజ్, విద్య, ఆరోగ్య, బ్యాంక్ ఇన్సూరెన్స్, చిట్ ఫండ్స్ అధికారులు పాల్గొన్నారు. -
రెండేళ్ల నుంచి చెబుతున్నా ఫలితం లేదు
నెల్లూరు(పొగతోట): సచివాలయాలు, ఆర్బీకేలు తదితర భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి.. భవనాలు పూర్తయి ప్రారంభోత్సవాలు చేసిన బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.. ఈ విషయంపై రెండేళ్ల నుంచి అధికారులకు తెలుపుతున్నా ఫలితం లేదని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అసహనం వ్యక్తం చేశారు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో స్థాయీ సంఘాల సమావేశాలను గురువారం నిర్వహించారు. మొత్తం ఏడింటిలో 2, 3 స్థాయీ సంఘాల సమావేశాలు కోరం లేని కారణంగా వాయిదా వేశారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని జెడ్పీటీసీ సభ్యులు సమావేశంలో వాదనకు దిగారు. జెడ్పీ సీఈఓ వసుమతికి ఇన్చార్జి మాత్రమే ఇచ్చారని, పూర్తి బాధ్యతలు ఇవ్వని కారణంగా జాప్యం జరిగిందని చైర్పర్సన్ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం సీఈఓకు ఎఫ్ఏసీ ఇచ్చారు కనుక బిల్లుల చెల్లింపులు త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుంటామని జెడ్పీ డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య సమాధానమిచ్చారు. సచివాలయాలు, ఆర్బీకేల భవన నిర్మాణాలు పూర్తయి ప్రారంభించామని, వాటికి ఇంత వరకు బిల్లులు చెల్లించలేదని సభ్యులు పీఆర్ అధికారులను నిలదీశారు. ఈ విషయంపై సమావేశాల్లో పదే పదే చెబుతున్నా ఫలితం లేదని వాపోయారు. దీనిపై పీఆర్ అధికారులు సమాధానమిస్తూ రాష్ట్ర అధికారులకు తెలియజేశామని, ముఖ్యమైన భవనాలు పూర్తయిన తరువాత మిగిలిన వాటి విషయంపై చర్చిద్దామని చెప్పారన్నారు. బోరు వేయడానికి అనుమతించడం లేదు ఒకటిన్నర సంవత్సరం నుంచి బోరు వేయడానికి అనుమతి ఇవ్వడం లేదని ఆత్మకూరు జెడ్పీటీసీ సభ్యులు సమావేశంలో చర్చించారు. పనులపై అధికారులను సంప్రదిస్తే ఫలితం ఉండడం లేదని కలెక్టర్కు పీజీఆర్ఎస్లో వినతి పత్రం సమర్పిస్తే సాయంత్రంలోపు పనులు జరుగుతున్నాయంటూ అధికారులు సమాధానం ఇస్తున్నారన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో భవన నిర్మాణాలు చేసిన వ్యక్తులు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. త్వరగా బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్, ఆర్జీఎస్ఏ నిధులు రూ.1,952 లక్షలతో 61 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేశామన్నారు. వాటిలో 11 భవన నిర్మాణాలు పూర్తి చేశారన్నారు. అంగన్వాడీ భవన నిర్మాణాలకు నిధులు కేటాయించామని, నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీలకు సంబంధించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా తాగునీటిని సరఫరా చేయాలని సూచించారు. పీహెచ్సీల్లో వైద్యాధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సభ్యులు లేవనేత్తిన సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. బిల్లుల చెల్లింపుల్లో ఎందుకీ జాప్యం సమస్యలను త్వరగా పరిష్కరించండి కోరం లేక 2, 3 స్థాయీ సంఘాల సమావేశాలు వాయిదా జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ -
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
● 30 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిక మనుబోలు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. మండలంలోని కొమ్మలపూడి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు చెందులూరు శ్రీనివాసులు, గుర్రం ప్రభాకర్ల ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన 30 కుటుంబాల వారు గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. నెల్లూరులోని తన నివాసంలో వారికి కాకాణి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నా జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో అధికార పక్షాన్ని వీడి వైఎస్సార్సీపీలో చేరడం అభినందనీయమన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అసలైన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు కూలి జనాన్ని తీసుకొచ్చి చేరికల పేరుతో డ్రామాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్రెడ్డి, దాసరి భాస్కర్గౌడ్, ఆవుల తుసీరామ్ యాదవ్ పాల్గొన్నారు. -
చి‘వరి’కి నీరేదీ?
● అధికారులను నిలదీసిన రైతులు ● తెలుగు గంగ కార్యాలయ ముట్టడి కలువాయి(సైదాపురం): రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని పండించిన పంట చివరి దశలో సాగు నీరందక ఎండిపోతున్నాయని, తమ పొలాలకు నీరందించకుంటే ఆత్మహత్యలే శరణ్యం అంటూ మండలంలోని కనుపూరుపల్లి రైతులు అధికారులను నిలదీశారు. ఈ మేరకు వారు గురువారం తెలుగు గంగ ప్రాజెక్ట్ కార్యాలయాన్ని ముట్టడించారు. వెయ్యి ఎకరాల్లో సాగు సోమశిల దక్షిణ కాలువ 8ఎల్ కింద సుమారు వెయ్యి ఎకరాల్లో వరి పంటను కనుపూరుపల్లి రైతులు సాగు చేస్తున్నారు. వరి వెన్ను దశలో ఉండగా ప్రస్తుతం చుక్కనీరు అందకపోవడంతో వరి పైరు తమ కళ్లెదుటే ఎండిపోతుండటంతో ఆవేదన చెందిన అన్నదాతలు తమ గోడును అధికారులకు విన్నవించుకునేందుకు కార్యాలయానికి చేరుకున్నారు. నెల్లూరులో ఇటీవల జరిగిన ఐఏబీ సమావేశంలో చివరి పంట వరకు సాగునీరందిస్తామని చెప్పిన కూటమి నేతలు నిలువునా మోసం చేశారని వాపోయారు. అప్పులు చేసి పంటలను సాగు చేసుకుని పంట చేతికొచ్చే సమయంలో నష్టపోయే పరిస్థితులు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు స్పందించికపోతే రానున్న రోజుల్లో తాము కూడా బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు.చర్యలు తీసుకుంటాం సోమశిల జలాశయం నుంచి పంట కాలువ ద్వారా సాగునీరందిస్తున్నాం. ఎల్నినో ప్రభావం కారణంగా నీటి విడుదల తగ్గింది. ప్రస్తుతం 300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నాం. దీనిని 500 క్యూసెక్కులకు పెంచేలా ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. – మస్తానయ్య, డీఈ -
డివైడర్ వైపు దూసుకెళ్లిన కారు
● వ్యక్తి మృతి మర్రిపాడు: కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఒకరు మృతిచెందిన ఘటన నెల్లూరు– ముంబై జాతీయ రహదారిపై కండ్రిక– నందవరం మధ్య గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మర్రిపాడు మండలం తిమ్మాయపాళేనికి చెందిన వెంగయ్య(48) నెల్లూరులో నివాసం ఉంటూ కారు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ క్రమంలో ఆయన డబ్బుల విషయమై సొంతూరికి వచ్చి తిరిగి వెళ్తుండగా కండ్రిక– నందవరం మధ్య కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ప్రమాద ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ క్రమంలో కారులోనే వెంగయ్య మరణించారు. సమాచారం అందుకున్న ఎస్సై బలరాంరెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30వ తేదీ వరకు గడువు పెంచినట్లు బీడీ కార్మికుల సంక్షేమ నిధి వైద్యశాల సీనియర్ మెడికల్ ఆఫీసర్ కేవీ భాస్కర్రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని బీడీ, మైకా, డోలమైట్ తదితర గనుల కార్మికుల పిల్లలు ప్రీ మెట్రిక్ విభాగంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈనెల 30వ తేదీ వరకు పెంచారన్నారు. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ విభాగంలో చదువుతున్న పిల్లలు అక్టోబర్ 31వ తేదీలోపు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు నగరంలోని జెడ్పీ కాలనీలోని బీడీ కార్మికుల సంక్షేమనిధి వైద్యశాల సీనియర్ మెడికల్ ఆఫీసర్ను సంప్రదించాలని కోరారు. కానిస్టేబుల్పై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్ సైదాపురం: రటాఫిక్కు అంతరాయం కలిగించొద్దని, రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆటోను తీయమని చెప్పిన కానిస్టేబుల్పై దాడికి పాల్పడిన వ్యక్తిని సైదాపురం పోలీసులు గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. శ్రీకాళహస్తిలో ఇటీవల ఓ కానిస్టేబుల్పై వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన మరువకముందే సైదాపురంలో అదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు కానిస్టేబుల్ ప్రేమ్కుమార్పై దాడికి పాల్పడిన మచ్చా వెంకటేశ్వర్లును సైదాపురం పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రాపూరు సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్స్టేషన్ నుంచి దాడి జరిగిన ఘటనా స్థలం వద్దకు, అక్కడి నుంచి మళ్లీ సైదాపురం పోలీస్స్టేషన్ వరకు నిందితుడు వెంకటేశ్వర్లును నడిపించుకుంటూ తీసుకెళ్లారు. దాడికి సంబంధించి స్థానికులను అడిగి క్షేత్రస్థాయిలో వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. ఆంజనేయపురంలో పడవ దగ్ధం ● పరిహారం కోసం జేడీకి వినతి విడవలూరు: పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైన ఘటన మండలంలోని ఆంజనేయపురం గ్రామంలో బుధవారం జరిగింది. బాధితుల వివరాల మేరకు.. మండలంలోని రామతీర్థం పంచాయతీ ఆంజనేయపురం గ్రామానికి చెందిన మత్స్యకారుడు పామంజి నరసింహ బుధవారం తన పడవలో చేపల వేటకు వెళ్లేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాడు. పడవలో వంటకోసం పెట్టిన గ్యాస్ లీకై , పక్కన ఉన్న డీజిల్ క్యాన్కు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి పడవతో పాటు అందులో ఉన్న రూ.లక్షల విలువైన వేట వలలు, సామగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న మత్స్యకార నాయకులు ఆవుల వాసు, కొండూరు పోలిశెట్టి బాధితులతో కలిసి గురువారం నెలూరులోని మత్స్యకార జాయింట్ డైరెక్టర్ లక్ష్మణరావును ఆయన కార్యాలయంలో కలిసి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వినతి పత్రం అందజేశారు. -
ప్రజా సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా సంగం: గ్రామాల్లోని వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో తెలుసుకొని.. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను గుర్తించి.. సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించడమే పల్లె వీక్షణ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మండలంలోని మక్తాపురంలో గురువారం నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించడంతో పాటు రైతులు, గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పలు రెవెన్యూ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడంతో పాటు పది మంది లబ్ధిదారులకు పింఛన్లను మంజూరు చేశారు. మక్తాపురంలో ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు గోడౌన్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలియజేయగా, ఏర్పాటుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసి ప్రతిపాదనలను పంపాల్సిందిగా ఆర్డీఓ పావనిని ఆదేశించారు. గ్రామంలో శ్మశాన వాటిక.. సంగంలో బస్టాండ్ ఏర్పాటు తదితరాలను చేపట్టనున్నామని వెల్లడించారు. గ్రామంలో జరుగుతున్న వీబీ – జీరామ్జీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. అనంతరం చెత్తతో సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామంలోని చిక్కుడు తోటలు.. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. తహసీల్దార్ సారంగపాణి, ఎంపీడీఓ షాలెట్, సీడీపీఓ సునీలత తదితరులు పాల్గొన్నారు. -
గణనాథుడి ఆలయంలో అపచారం
● జనసేన నేత బరితెగింపు ● వినాయకుడి ఆలయం వద్ద పవన్ కల్యాణ్ ఫ్లెక్సీకి గుమ్మడి కాయతో దిష్టి ● దెబ్బతిన్న భక్తుల మనోభావాలునెల్లూరు(బృందావనం): అధికార అహంకారం తలకెక్కిన కూటమి నేతల్లో భయం.. భక్తి లేకుండాపోతోంది. సనాతన ధర్మం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిత్యం వల్లె వేస్తున్నా, ఆ పార్టీ నేతలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దైవం అంటే డోంట్ కేర్ అనే భావన వారిలో నరనరాన జీర్ణించుకుపోతోంది. పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలో ఆ పార్టీ నేత గునుకుల కిశోర్ అనుసరించిన వైఖరి తీవ్ర వివాదాస్పదమైంది. జరిగిందిదీ.. పాదరక్షలను పవన్ కల్యాణ్ ధరించి ఉన్న నిలువెత్తు ఫ్లెక్సీని నగరంలోని చిల్డ్రన్స్పార్కు రోడ్డులో గల వినాయకస్వామి ఆలయం వద్ద ఆనించారు. ఆపై కర్పూరాన్ని వెలిగించి.. టెంకాయలు, గుమ్మడికాయ కొడుతూ దిష్టి తీసి నినాదాలు చేస్తూ ఆలయ ప్రశాంతతకు భంగం వాటిల్లేలా వ్యవహరించారు. భక్తుల మనోభావాలు గాయపడేలా నినాదాలతో హోరెత్తించారు. ఆలయంలో కొలువైన వినాయకుడికి మాత్రం వీరెలాంటి పూజలను చేయకుండా తమ పార్టీ అధినేత ప్రాపకం కోసం పాకులాడారు. ఈ తంతును గమనిస్తున్న భక్తులు.. వారిస్తే ఏ సమస్య వస్తుందోననే ఉద్దేశంతో మిన్నకుండిపోయారు. ఈ తతంగాన్ని కొందరు తమ మొబైల్ ఫోన్లలో బందించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. చివరికి విషయం తెలుసుకున్న ఆ పార్టీ నేతలు మూడు గంటల తర్వాత ఫ్లెక్సీని తొలగించారు. పార్టీలకతీతంగా స్పందిస్తాం.. ఘటనపై హిందూ చైతన్య వేదిక నేత, జనసేన కార్యక ర్త కాకు మురళీరెడ్డి స్పందించారు. నేత నిర్వాకాన్ని తప్పుబట్టారు. హైందవ ధర్మానికి భంగం కలిగిస్తే పా ర్టీలకతీతంగా స్పందిస్తామని స్పష్టం చేశారు. మరో వైపు ఈ వ్యవహారాన్ని ఆ పార్టీ కార్యకర్తే ఖండించడం ఆ పార్టీలో సాగుతున్న పోరును స్పష్టం చేస్తోంది. -
వివరాలివ్వడంలో జాప్యం
దొంగే.. దొంగా.. దొంగా అని అరిచిన తరహాలో మారింది జిల్లాలోని నీటి యాజమాన్య సంస్థ ఉద్యోగుల పరిస్థితి. ఉపాధి పనుల్లో అడుగడుగునా అవినీతి విలయతాండవం చేస్తుందనే అపవాదు ఉంది. దీన్ని నిజం చేస్తూ వర్కులు చేయకుండానే బిల్లులు చెల్లించడం.. ఐదుగురు కూలీలు పనిచేస్తే పది మందికి మస్లర్లేసి డబ్బులు కాజేసిన ఉదంతాలు వెలుగు చూశాయి. ఇదే తరహాలో జిల్లాలోని వివిధ పాఠశాలల్లో మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ నిధులతో చేపట్టిన ప్రహరీల్లో చోటుచేసుకున్న అవినీతి బాగోతాలు ఇటీవలి కాలంలో బట్టబయలయ్యాయి. నెల్లూరు(టౌన్): జిల్లాలో డ్వామా పనితీరు.. అంతా డ్రామాగా మారింది. ఆ శాఖలో వెలుగుచూస్తున్న అవినీతి పర్వాలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి 2018 – 23 మధ్యలో ఉపాధి నిధులతో జిల్లాలోని 389 పాఠశాలల్లో ప్రహరీలను దశలవారీగా చేపట్టారు. కలెక్టర్ అనుమతితో నిర్మాణ బాధ్యతలను సమగ్రశిక్ష, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఏపీడబ్ల్యూఐడీసీ శాఖల్లోని ఇంజినీరింగ్ విభాగాలకు అప్పగించారు. అయితే ఇక్కడే భారీ అవినీతి జరిగింది. బిల్లులు.. పదేపదే చెల్లింపు కొన్ని పాఠశాలల్లో ప్రహరీ నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు బిల్లులను రెండు సార్లు చెల్లించారు. మరికొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్న పనుల్లో కొంత మేరే ఇవ్వాల్సి ఉన్నా, అవేవీ పట్టించుకోకుండానే మొత్తం చెల్లించిన విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఈ వ్యవహారంలో జరిగిన అవినీతి బాగోతాలు మీడియాలో రావడంతో వాటిని సరిదిద్దుకునే యత్నాల్లో డ్వామా అధికారులున్నారని తెలిసింది. ఇదీ తంతు.. 2018లో అప్పటి టీడీపీ హయాంలో ఉపాధి నిధులతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణాలను చేపట్టారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరాక నాడు – నేడు మొదటి దశలో భాగంగా మరికొన్ని పాఠశాలల్లో నిర్మించారు. అప్పటి కలెక్టర్ల అనుమతితో బాధ్యతలను ఆయా శాఖల ఇంజినీరింగ్ విభాగంలోని సైట్ ఇంజినీర్లకు అప్పజెప్పారు. ఇందులో భాగంగా సమగ్రశిక్ష ఆధ్వర్యంలో జిల్లాలోని 16 మండలాల పరిధిలో ఎంపిక చేసిన సుమారు 115 పాఠశాలల నిర్మాణ బాధ్యతలను కేటాయించారు. మిగిలిన మండలాల్లోని స్కూళ్లను పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఏపీడబ్ల్యూఐడీసీలోని సైట్ ఇంజినీర్లకు అప్పగించారు. ఇలా మొత్తం 389 స్కూళ్లలో ప్రహరీల నిర్మాణాన్ని చేపట్టారు. పాఠశాల విస్తీర్ణాన్ని బట్టి ప్రహరీకి రూ.ఐదు లక్షల నుంచి రూ.12 లక్షల్లోపు ఖర్చవుతుందని ఆయా శాఖ ఇంజినీర్లు చెప్తున్నారు. జిల్లాలో ఇంకేమైనా నాలుగైదు స్కూళ్లుంటే వాటికి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు అవుతుంది. ఇవీ ఉదాహరణలు.. లొసుగులతో.. ఉపాధి పనుల బిల్లులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ (డీసీసీ) సాఫ్ట్వేర్ను టీసీఎస్ సంస్థ గతంలో నిర్వహించేది. అయితే దీన్ని తొలగించి ఎన్ఐసీని తీసుకొచ్చారు. అయితే టీసీఎస్ ఉన్న సమయంలో జరిగిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ఎన్ఐసీ సాఫ్ట్వేర్ జీరో అని చూపింది. దీన్ని ఆసరాగా చేసుకొని పెండింగ్ పనులకు సైతం మొత్తం బిల్లులిచ్చారని తెలుస్తోంది. విజిలెన్స్.. సోషల్ ఆడిట్ నిధుల దుర్వినియోగ విషయం వెలుగులోకి రావడంతో విజిలెన్స్ విచారణకు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. ప్రస్తుతం ఇది జరుగుతోంది. మరోవైపు సోషల్ ఆడిట్ను నిర్వహించి సమగ్ర నివేదికను అందజేయాలని డ్వామా ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో అవినీతికి పాల్పడిన అధికారులు, ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. దీంతో శంఖవరం, నల్లగొండ్ల పాఠశాలల్లో ప్రహరీలకు రెండోసారి తీసుకున్న బిల్లుల నగదును తిరిగి డ్వామా శాఖకు చెల్లించారని తెలిసింది. ఇదే దారిలో నందిపాడు, ఏపీ మోడల్ స్కూళ్ల కాంట్రాక్టర్ ఉన్నారని సమాచారం. మొత్తమ్మీద రూ.ఐదు కోట్లకుపైగా నిధులు స్వాహా అయ్యాయని తెలుస్తోంది. డ్వామాలోని కింది స్థాయి నుంచి ఉన్నతాధికారులు, ఆయా శాఖల ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించిన సైట్ ఇంజినీర్లు వాటాలు పంచుకున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా ఈ విషయమై సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్యను సంప్రదించగా, విజిలెన్స్ అందించే నివేదిక ఆధారంగా చర్యలను కలెక్టర్ చేపట్టనున్నారని, ఎంకై ్వరీ జరుగుతున్న సమయంలో తానేమీ మాట్లాడకూడదని బదులిచ్చారు. ఉపాధి నిధులతో జిల్లాలోని 389 పాఠశాలల్లో ప్రహరీ నిర్మాణాలు సమగ్రశిక్ష, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఏపీడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ విభాగాలకు బాధ్యతలు భారీగా నిధుల దుర్వినియోగం కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు చేతివాటం రూ.ఐదు కోట్లకుపైగా అవినీతి వాస్తవాలు వెలుగులోకి రావడంతో సరిదిద్దుకునే యత్నం పర్యవేక్షణ మొత్తం వారిదే.. ఉపాధి నిధులతో నిర్మాణాలు జరుగుతుండటంతో పర్యవేక్షణ మొదలుకొని బిల్లులు చెల్లించేంత వరకు డ్వామా అధికారులే బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. తొలుత ఎస్టిమేషన్, ఇసుక, ఇటుక, సిమెంట్, మెటీరియల్ తదితర ఖర్చుల వివరాలను ఎంబుక్లో ఆయా శాఖ సైట్ ఇంజినీర్ పొందుపరుస్తారు. అనంతరం దీన్ని ఆయా మండలంలో ఉండే డ్వామా ఏపీఓకు అందజేస్తారు. ఆపై వివరాలను స్కాన్ చేసి కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా అప్లోడ్ చేయిస్తారు. పాఠశాలకు డ్వామా ఫీల్డ్ అసిస్టెంట్ వెళ్లి ప్రహరీని జియోట్యాగ్ ద్వారా ఫొటో తీసి వివరాలను అప్లోడ్ చేయాల్సి ఉంది. వీటన్నింటినీ పరిశీలించాక బయోమెట్రిక్ వేసి బిల్లుల చెల్లింపునకు ఎంపీడీఓ గ్రీన్ సిగ్నలిస్తారు. ఇవన్నీ జరిగాకే సదరు కాంట్రాక్టర్కు బిల్లులను చెల్లించాల్సి ఉంది. నెల్లూరు (పొగతోట): పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణాల్లో జరిగిన అవినీతికి సంబంధించిన వివరాలను అందజేయడంలో సమగ్ర శిక్ష అధికారులు జాప్యం చేస్తున్నారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చిన స్టేట్ రిసోర్స్ పర్సన్లు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. వర్కులకు సంబంధించిన పూర్తి వివరాలను సమగ్ర శిక్షకు సంబంధించిన మండలాధికారులు చేపట్టారు. ఉపాధి సిబ్బంది మాత్రం చివర్లో ఎంబుక్స్కు సంబంధించిన వివరాలను అప్లోడ్ చేశారు. అయితే తాము అప్లోడే చేశామని, అవినీతి, అక్రమాల్లో తమకెలాంటి సంబంధంలేదని సమగ్ర శిక్ష అధికారులు పేర్కొంటున్నారు. అవినీతిపై నిగ్గుతేల్చేందుకు గానూ జిల్లాకు 15 మంది ఎస్సార్పీలను పీఆర్ కమిషనర్ పంపారు. అయితే ఎంబుక్స్, ఇతర వివరాలను సమగ్ర శిక్షకు సంబంధించిన మండలాధికారులు తీసుకురావడంలేదని సమాచారం. తమ వద్ద సమాచారం లేదని కొందరు బదులిస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగకపోతే బ్యాంక్ ఖాతాల్లో జమైన నగదును ఎందుకు తిరిగిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నిర్మాణాలు పూర్తయిన చోట రెండోసారి బిల్లులేశారు. కీలకమైన అధికారుల సహాయ, సహకారాల్లేనిదే అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఈ ప్రక్రియను చేపట్టడం సాధ్యం కాదనే భావన వ్యక్తమవుతోంది. కొంత మంది అధికారులు వారి బంధువులను కాంట్రాక్టర్లుగా ఎంపిక చేసి వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమయ్యేలా చేశారు. బిల్లులు చెల్లించే సమయంలో వీరిలో ఎవరైనా మరణిస్తే కాంట్రాక్టర్ను మార్చి మరొకరికి క్రెడిట్ అయ్యేలా చేశారు. ఇన్ని లొసుగులు చోటుచేసుకున్న తరుణంలో విచారణకు సహకరించకపోతే ఏసీబీ ఎంకై ్వరీకి ఆదేశించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. -
వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపునకు కుట్ర
వెంకటాచలం: సర్ ప్రక్రియలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. వెంకటాచలంలో గురువారం సాయంత్రం పర్యటించిన ఆయన మాట్లాడారు. ఈ విషయంలో అధికారులపై టీడీపీ నేతలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. స్వయంగా కూటమి ఎమ్మెల్యేలే వీరికి ఫోన్లు చేసి ఇలా వ్యవహరించాలని హుకుం జారీ చేస్తూ.. అధికార దుర్వినియోగంతో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. అన్ని అర్హతలున్నా తమ పార్టీ మద్దతుదారులకు నోటీసులిస్తూ.. అర్హత లేకపోయినా టీడీపీ వారికి జారీ చేయడంలేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు మోసపూరిత హామీలిచ్చిన చంద్రబాబు.. చివరికి నమ్మకం లేకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తమ పార్టీ శ్రేణులను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. తమ పార్టీ మద్దతుదారులకు కేటాయించిన ప్లాట్లు, అసైన్మెంట్ భూములను రద్దు చేసేందుకు కుట్రలు సాగిస్తున్నారని దుయ్యబట్టారు. అధికారులు అన్ని రకాల విచారణలు జరిపి అసైన్మెంట్ భూములను అర్హులకు చట్టబద్ధంగా ఇచ్చిన అంశాన్ని గుర్తుచేశారు. అధికారులపై కూటమి నేతలు ఒత్తిడి తెచ్చి తమ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపులను రద్దు చేయించడం దారుణమన్నారు. ఇందులో తప్పులుంటే ముందుగా అధికారులపై చర్యలు చేపట్టాలే గానీ, కేవలం తమ పార్టీకి చెందిన వారి భూములను రద్దు చేయడం సరికాదని హితవు పలికారు. సర్వేపల్లిలో సర్వం దోపిడీ కూటమి ప్రభుత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. అవినీతి, అక్రమాలు, అరాచకాలు రాజ్యమేలుతున్నా, అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. శివాలయ భూములను ఆక్రమించి లేఅవుట్ వేసిన యజమానుల వద్ద ఎలాంటి లబ్ధి పొందలేదంటూ ప్రమాణం చేయగలరానిని సోమిరెడ్డికి సవాల్ విసిరారు. ఈ విషయంలో ఆయన కచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో తన నాయకత్వంలో ఎలాంటి భూ ఆక్రమణలు జరగలేదని స్పష్టం చేశారు. వెంకటాచలం పంచాయతీ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి మాజీ సర్పంచ్ మందల రాజేశ్వరి, ఆమె భర్త మందల వెంకటశేషయ్య ఎంతో కృషి చేశారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక వెంకటాచలం పంచాయతీలో టీడీపీ నేతలు ఎన్ని ఇబ్బందులను సృష్టించినా, అన్నింటినీ దీటుగా ఎదుర్కొని సమర్థంగా పాలించారని చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ పారిశుధ్య లోపం పెరిగిపోయిందని, అపరిశుభత్ర రాజ్యమేలుతున్నా, పట్టించుకునే వారే కరువయ్యార ని ధ్వజమెత్తారు. తమ పార్టీ నేత సండ్రా రవి సజీవంగా ఉన్న సమయంలో ఆయన దుకాణం వద్ద గుంతలను టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా తవ్వించి వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాలు, కక్షసాధింపు చర్య లను లెక్కగడుతున్నామని వీటన్నింటికీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కాకాణి స్పష్టం చేశారు. సండ్రా రవి మృతిపై దిగ్భ్రాంతి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన సండ్రా రవి నివాసానికి కాకాణి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కాంక్షించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, మండల కన్వీనర్ కొణిదెన మోహన్నాయుడు, నేతలు కొణిదెన విజయభాస్కర్నాయుడు, మందల పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. సర్ ప్రక్రియలో అధికారులపై కూటమి ఎమ్మెల్యేల ఒత్తిడి అధికార దుర్వినియోగంతో రాజ్యాంగం అపహాస్యం ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
ఉద్యోగుల సత్తా చూపిస్తాం
● అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన నెల్లూరు(అర్బన్): కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు ఏదో చేస్తుందని భావించామని, రెండున్నరేళ్లు అయినా తమను పట్టించుకోలేదని ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి అన్నారు. అందుకే ఉద్యోగుల ఉద్యమ సత్తా చూపించి ప్రభుత్వ మెడలు వంచుతామని పేర్కొన్నారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించాలని, అంతవరకు న్యాయమైన ఐఆర్ ఇవ్వాలని కోరుతూ ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. నగరంలోని కలెక్టరేట్లో పెద్ద ఎత్తున ఉద్యోగులు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. అలాగే నగరంలోని ఆర్డీఓ, ఆర్అండ్బీ, పశుసంవర్థక శాఖ, ఇరిగేషన్, తహసీల్దార్ కార్యాలయం, వ్యవసాయ శాఖ ఇలా పలు కార్యాలయాల వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో నిరసన జరిగింది. ఈ సందర్భంగా పెంచలరెడ్డి నెల్లూరులో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఉద్యోగులకు 30 వేల కోట్లకు పైగా బకాయిలు ఉందన్నారు. తమకు పీఆర్సీ ఇవ్వనందున ప్రతి ఉద్యోగి రూ.లక్షల్లోనే నష్టపోతున్నారన్నారు. తాము ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామన్నారు. ఎన్నో వినతి పత్రాలిచ్చామన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకుండా నాన్చుడి ధోరణితో కాలం వెళ్ల బుచ్చుతోందన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే దశల వారీగా ఉద్యమించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుని పోరుబాట పట్టామన్నారు. కార్యక్రమాల్లో జేఏసీ జిల్లా కార్యదర్శి ఓవీ ప్రసాద్, మహిళా విభాగం చైర్పర్సన్ బాలకోటమ్మ, కో చైర్పర్సన్ శరత్బాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వంపై మొదలైన ఉద్యమం
నెల్లూరు(అర్బన్): దాదాపు రెండున్నరేళ్లుగా నిరీక్షించినా.. ఎన్నో వినతిపత్రాలిచ్చినా.. ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిల విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం, నాన్చుడు ధోరణిని అవలంబించడంతో ఉద్యమాన్ని ప్రారంభించామని ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు మంగళవారం హాజరై నిరసన తెలిపారు. ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, కలెక్టరేట్, వైద్య, ఆరోగ్య శాఖ ఇలా అన్ని విభాగాల ఉద్యోగులు ఇలా విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యమాన్ని దశలవారీగా విస్తరిస్తూ.. దీర్ఘకాలిక పోరుబాటగా మారుస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నామని వెల్లడించారు. తొలి రోజు భోజన విరామ సమయంలో ధర్నాలను చేపట్టామన్నారు. సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి అనే నినాదం ప్రతి ఉద్యోగి తమ వాట్సాప్ డీపీగా పెడుతున్నారని చెప్పారు. ఇప్పటికై నా తమకు రావాల్సిన రూ.30 వేల కోట్ల బకాయిలను విడుదల చేయడంతో పాటు పీఆర్సీని వేయాలని డిమాండ్ చేశారు. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ అల్లంపాటి నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు -
సమయపాలనను పాటించాల్సిందే
పొదలకూరు: సచివాలయ ఉద్యోగులు సమయపాలనను పాటించి సర్టిఫికెట్ల కోసం వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పొదలకూరు బిట్ – 3, 4 సచివాలయాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. బిట్ – 4 సచివాలయంలో విధులకు డిజిటల్ అసిస్టెంట్ సక్ర మంగా హాజరుకావడం లేదనే ఫిర్యాదులందాయని, షోకాజ్ నోటీస్ను జారీ చేయాలని ఆదేశించారు. రికార్డులను పరిశీలించారు. నెలకెన్ని సర్టిఫికెట్లను అందజేస్తున్నారనే వివరాలను ఆరాతీశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికెళ్లి అక్కడి సిబ్బందితో మా ట్లాడారు. రీ సర్వే తదితర అంశాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ నరసింహరావు, తహసీల్దార్ శివకృష్ణయ్య పాల్గొన్నారు. -
విద్యుత్ లైన్ల మార్పిడి పనికెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలో 17 మందికి గాయాలు ● క్షతగాత్రులు జార్ఖండ్కు చెందిన కూలీలు ● పరామర్శించిన కలెక్టర్ హిమాన్షు శుక్లావెంకటాచలం: దోస్త్ వాహనం బోల్తా పడి 17 మంది జార్ఘండ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలు గాయపడిన ఘటన వెంకటాచలం మండలం చెముడుగుంట సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 21 మంది కూలీలు తిరుపతి జిల్లా బాలాయపల్లి సమీపంలోని దగ్గవోలు వద్ద విద్యుత్ లైన్ల మార్పిడికి సంబంధించిన పనుల నిమిత్తం నెల్లూరుకు వచ్చారు. వీరంతా దోస్త్ వాహనంలో నెల్లూరు నుంచి బాలాయపల్లికి వెళ్తుండగా చెముడుగుంట సమీపానికి చేరుకోగానే ముందుగా వెళ్తున్న లారీ నెమ్మదించడంతో దోస్త్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మందికి గాయాలవ్వగా చికిత్స నిమిత్తం నెల్లూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పర్యవేక్షించిన కలెక్టర్ నెల్లూరు(అర్బన్): క్షతగాత్రుల్లో ఒకరిని పెద్దాస్పత్రిలోని ఐసీయూలో చేర్చారు. కాగా ప్రమాద విషయం తెలుసుకున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆస్పత్రికి చేరుకుని రోగులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ డాక్టర్ మాధవిని ఆదేశించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను విచారణ జరిపి నివేదిక అందించాలని డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీఓ అనూష, కార్మికశాఖ అధికారి విజయకుమార్రెడ్డిని ఆదేశించారు. రోగులకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓ కాంట్రాక్టర్ 21 మంది కూలీలను జార్ఖండ్ నుంచి నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చినట్లు చెప్పారు. క్షతగాత్రులకు తక్షణ సాయంగా ఒక్కొక్కరికి రూ.10 వేలు, ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషెంట్కు రూ.లక్ష అందించాలని కాంట్రాక్టర్ను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమాచారాన్ని బాధిత కుటుంబ సభ్యులకు తెలిపి ఫోన్ పే ద్వారా నగదు అందించాలని పేర్కొన్నారు. బాధితులంతా కోలుకునే వారికి వారి యోగక్షేమాలు చూసుకోవాలని, వేతనాన్ని కూడా పూర్తిగా చెల్లించాలన్నారు. నర్సులపై ఆగ్రహం కలెక్టర్ క్షతగాత్రులను పరిశీలించేందుకు ఆస్పత్రికి వచ్చిన సందర్భంగా వారికందుతున్న వైద్యం పరిశీలించి నర్సులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక పేషెంట్కు శరీరంపై మట్టి కూడా క్లీన్ చేయలేదని, మీ అన్న, తమ్ముడికో ప్రమాదం జరిగితే ఇలాగే వైద్యం చేస్తారా అని ప్రశ్నించారు. హక్కులంటూ సమ్మెలు చేయడమే కాదు.. సేవలు కూడా సక్రమంగా నిర్వర్తించాలంటూ హితవు పలికారు. ఇదే సందర్భంలో సూపరింటెండెంట్ డాక్టర్ మాధవిని ఉద్దేశించి మాట్లాడుతూ కనీసం మీరు రౌండ్స్ వేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. లిఫ్ట్ ఎందుకు పని చేయలేదని ప్రశ్నించారు. దీంతో సూపరింటెండెంట్ ఇప్పుడే ఆగిపోయిందని బదులిచ్చారు. దీంతో కలెక్టర్ చిరాకు పడ్డారు. ఎప్పుడు అడిగినా ఇలాగే చెబుతారా అంటూ ప్రశ్నించారు. గాయపడిన వారికి మంచి వైద్యం అందించాలని ఆదేశించారు. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ కో ఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు తదితరులు రోగులను పరామర్శించారు. -
కన్సల్టెన్సీ పేరుతో రూ.6.32 కోట్ల మోసం
● ఆలస్యంగా వెలుగులోకి నెల్లూరు (క్రైమ్): కన్సల్టెన్సీ పేరుతో రూ.6.32 కోట్లు మోసగించిన వారిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు సరస్వతీనగర్కు చెందిన పి.అనూష ఎస్పీ అజిత వేజెండ్లకు ఫిర్యాదు చేసిన విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదులోని వివరాల మేరకు.. నెల్లూరుకు చెందిన అవినాష్ మరి కొందరు కలిసి కన్సల్టెన్సీ కార్యాలయం నిర్వహిస్తున్నారని, విదేశాల్లో ఎంబీబీఎస్ సీట్లు, నారాయణ కళాశాలలో సీట్లు ఇప్పిస్తామని, డాలర్లు తక్కువ ధరకే ఇప్పిస్తామని, దుబాయి నుంచి తక్కువ ధరకే బంగారు నాణేలు తెప్పిస్తామని నమ్మించి తన భర్త, తన స్నేహితుల బ్యాంకు ఖాతాల నుంచి వివిధ ఖాతాలకు రూ. 6,32,71,497 నగదు బదిలీ చేయించుకుని మోసగించారని అనూష ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా మారణాయుధాలతో బెదిరించరాని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన కుమార్తెను చంపేస్తామని హెచ్చరించారని ఆరోపించారు. తనను మోసగించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడంతోపాటు తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆమె ఎస్పీని కోరారు. స్పందించిన ఎస్పీ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్ లోని 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 77,042 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 36,698 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.14 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు గల వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శన టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. సమయానికంటే ముందెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
కూటమి పాలనతో అంధకారంలోకి రాష్ట్రం
● ఉద్యోగాల కోసం పోరాటాలు తప్పవు ● డీవైఎఫ్ఐ ఆలిండియా ఉపాధ్యక్షుడు జాక్ సి.థామస్నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాటిని నెరవేర్చలేక రూ.లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తోంది’ అని డీవైఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. నెల్లూరు నగరంలో మూడురోజులపాటు జరిగే డీవైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభలు మంగళవారం ప్రారంభమయ్యాయి. వీఆర్సీౖ మెదానం నుంచి నర్తకీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసి బహిరంగ సభలో డీవైఎఫ్ఐ ఆలిండియా ఉపాధ్యక్షుడు జాక్ సి.థామస్ మాట్లాడారు. దేశంలో పోరాటాలు చేస్తున్న యువతకు డీవైఎఫ్ఐ అండగా నిలుస్తుందన్నారు. సాధారణ ప్రజలు, రైతులు, యువత, విద్యార్థులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. దేశంలో ఒక సంవత్సరంలో 750 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ప్రధాని మోదీ 13 ఏళ్ల పాలనలో ఆకలిచావులు, నిరుద్యోగం, నీట్ పేపర్ లీక్లు, కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ సంపదను దోచిపెట్టడం తప్ప చేసిందేమీ లేదని ఆరోపించారు. దేశంలోని ప్రభుత్వ శాఖల్లో 8 లక్షలు, రాష్ట్రంలో 2.14 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 11,639 పోస్టులను వెంటనే భర్తీల చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు క ల్పించాలన్నారు. రాజకీయ జవాబుదారీతనంపై యువత ప్రశ్నించాలని కోరారు. నేడు రాష్ట్రంలో రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు అంతులేని అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గంజాయిని అరికట్టడంతో కూటమి నాయకులు విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రామన్న, రాము, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణ, నరసింహ, రాజు, శివ, బాబు, రమేష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. -
పెట్రోల్ బంక్లో నగదు చోరీ
సీతారామపురం: మండలంలోని బసినేనిపల్లిలోని వెంకటదుర్గా ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంక్లో రూ.60 వేల నగదు చోరీకి గురైన ఘటన మంగళవారం వెలుగు చూసింది. బంక్ యజమాని కథనం మేరకు.. సోమవారం వేకువజామున 3:30 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి స్కూటీపై పెట్రోల్ బంక్కు వచ్చాడు. అక్కడ వాచ్మెన్, పంప్ బాయ్ నిద్రపోతున్నారు. అతను పరిసరాలను గమనించాడు. ఆఫీస్ గది తాళం చెవి తలుపుకే ఉండటంతో లోపలికి ప్రవేశించి డెస్కులో ఉన్న రూ.60 వేల నగదును అపహరించాడు. అనంతరం తలుపు వేసి, తాళం చెవిని యథావిధిగా అక్కడే ఉంచి స్కూటీపై సీతారామపురం మార్గంలో వెళ్లిపోయాడు. ఉదయం 6 గంటలకు నిద్రలేచిన సిబ్బందికి నగదు కనిపించకపోవడంతో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని యజమానికి సమాచారం అందించారు. దీంతో ఆయన సీసీ ఫుటేజీలో నమోదైన దొంగ ఫొటో ఆధారంగా పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. అదేరోజు మార్కాపురం జిల్లా కొత్తపల్లి టోల్ప్లాజాను నిందితుడు దాటినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. యజమాని సురేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రెడ్క్రాస్ సొసైటీకి అరుదైన గుర్తింపు నెల్లూరురూరల్: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ అందిస్తున్న విశేష సేవలకు అరుదైన గుర్తింపు లభించింది. కలెక్టర్ హిమాన్షు శుక్లాకు గవర్నర్ గోల్డ్ మెడల్ లభించింది. మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా కలెక్టర్ అవార్డును స్వీకరించారు. ఐఆర్సీఎస్ సేవా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు రక్తదాన కార్యక్రమాల విస్తరణ, లైఫ్ మెంబర్ల నమోదులో సాధించిన ప్రగతిని గుర్తిస్తూ ఈ గౌరవం దక్కింది. 15,747 యూనిట్ల రక్తం సేకరణ జిల్లా ఐఆర్సీఎస్ శాఖలో ఇప్పటి వరకు 2,097 మంది లైఫ్ మెంబర్లు నమోదు చేసుకున్నారు. వివిధ రక్తదాన శిబిరాల ద్వారా 15,747 యూనిట్ల రక్తాన్ని సేకరించి, అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి అందుబాటులో ఉంచడంలో జిల్లా శాఖ కీలకపాత్ర పోషించింది. గోల్డ్మెడల్ దక్కడంపై అధికారులు, ఐఆర్సీఎస్ సభ్యులు, వలంటీర్లు హర్షం వ్యక్తం చేశారు.నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.150 సన్నవి : రూ.85 పండ్లు : రూ.40 -
పొదుపు సంఘాలకు రూ.600 కోట్ల రుణాలు
● డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి సంగం: ‘2026 – 27 ఆర్థిక సంవత్సరానికి పొదుపు సంఘాలకు బ్యాంక్ల ద్వారా రూ.1,600 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యం నిర్దేశించారు. ఇప్పటివరకు సుమారు రూ.600 కోట్ల మేర రుణాలు అందించాం’ అని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు. సంగం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో సోమ, మంగళవారాల్లో పొదుపు సంఘాల పనితీరు, రుణాల మంజూరు, రికవరీ తదితర అంశాలపై వీఓఏలతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీ్త్రనిధి కింద రూ.11 కోట్ల లక్ష్యానికి గానూ ఇప్పటికే రూ.6 కోట్ల మేర రుణాలు అందించామన్నారు. ఉన్నతి పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జీవనోపాధుల కల్పన కోసం రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.2 కోట్ల మేర అందించినట్లు పేర్కొన్నారు. సీఐఎఫ్ కింద రూ.17 కోట్ల లక్ష్యానికి గానూ రూ.16 కోట్లను సభ్యులకు అందించినట్లు వివరించారు. జిల్లాలో అన్ని పథకాల కింద పొదుపు సంఘాల సభ్యులకు అందించిన రుణాల రికవరీ 96 శాతానికి పైగా ఉందని తెలిపారు. వివిధ యాప్ల వినియోగంలో జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. అలాగే పొదుపు సంఘాల సభ్యులు జీవనోపాధి కోసం వివిధ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే అవసరమైన శిక్షణను మండల కేంద్రాల్లోనే అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం మధుసూదన్రావు, ఏపీఎం రవిశంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆకాశాన్నంటిన నిమ్మ ధరలు
● బస్తా కాయలు రూ.16 వేలు పొదలకూరు: నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బస్తా కాయల ధర రూ.16 వేలు పలుకుతోంది. మార్కెట్లో అధిక ధరలున్నా, కాపు లేకపోవడంతో రైతులకు వింత పరిస్థితి ఎదురైంది. దీంతో కర్షకులతో నిత్యం కళకళలాడే పొదలకూరు నిమ్మ మార్కెట్ వెలవెలబోతోంది. పొదలకూరు మార్కెట్ పరిధిలోని నాలుగైదు మండలాల్లో చెట్లకు కాయల్లేకపోవడంతో నిమ్మకాయలకు అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది. గత మంగళవారం 80 కిలోల బస్తా ధర సుమారు రూ.12 వేల వరకు పలకగా, ప్రస్తుతం రూ.16 వేల వరకు చేరుకుంది. కాయల నాణ్యత, పరిమాణాన్ని బట్టి బస్తా రూ.14 వేల నుంచి రూ.16 వేల వరకు పలుకుతోందని మార్కెట్ వ్యాపారులు వెల్లడించారు. జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు రేపు నెల్లూరు(పొగతోట): జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలను జెడ్పీ కార్యాలయంలో గురువారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు వరకు నిర్వహించనున్నామని సీఈఓ వసుమతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన నిర్వహించనున్న సమావేశాలకు ఆయా శాఖల జిల్లా అధికారులు, జెడ్పీ సభ్యులు హాజరుకావాలని కోరారు. 93 శాతం మందికి పింఛన్ల పంపిణీ నెల్లూరు(పొగతోట): సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. 93 శాతం మంది లబ్ధిదారులకు నగదును మంగళవారం అందజేశారు. 2,85,316 మందికి గానూ 2,65,344 మందికి పంపిణీ చేశారు. రానున్న రెండు రోజుల్లో మిగిలిన వారికి అందజేయనున్నామని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు. శ్రామికుల సంఖ్యను పెంచండి నెల్లూరు(పొగతోట): వీబీ జీరామ్ జీ ద్వారా పనులకు హాజరయ్యే శ్రామికుల సంఖ్యను పెంచాలని డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్ ఆదేశించారు. నగరంలోని డ్వామా కార్యాలయం నుంచి వివిధ మండలాల ఏపీఓలు, ఈసీలు, టీఏలతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పనులను గుర్తించి.. శ్రామికులతో చేయించి వారికి ఉపాధిని కల్పించాలని సూచించారు. కూలీలకు 15 రోజులకోసారి పేమెంట్లను వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేయనున్నారని వెల్లడించారు. జాప్యం జరిగితే వడ్డీతో సహా వేయనున్నారని తెలిపారు. హార్టికల్చర్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఎస్పీడీసీఎల్ ఎస్ఈ బాధ్యతల స్వీకరణ నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈగా బాధ్యతలను సుధాకర్ నగరంలోని విద్యుత్ భవన్లో మంగళవారం స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్ఈగా ఉన్న రాఘవేంద్రం ఉద్యోగ విరమణ పొందారు. ఈ తరుణంలో విద్యుత్ విజిలెన్స్ విభాగంలో ఈఈగా పనిచేస్తున్న సుధాకర్ను ఉద్యోగోన్నతిపై ఇక్కడ నియమిస్తూ ఉత్తర్వులను సీఎండీ శివశంకర్ జారీ చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడారు. నాణ్యమైన విద్యుత్ను అందించేలా కృషి చేస్తానని చెప్పారు. కాగా ఆయనకు శుభాకాంక్షలను పలువురు తెలియజేశారు. డీపీఓగా.. నెల్లూరు(పొగతోట): జిల్లా పంచాయతీ అధికారిగా బాధ్యతలను వెంకటరామన్ స్వీకరించారు. నరసాపురం డీడీఓగా విధులు నిర్వర్తిస్తున్న ఈయన్ను డీపీఓగా నియమిస్తూ ఉత్తర్వులను అధికారులు జారీ చేసిన విషయం విదితమే. -
డీసీపల్లిలో 616 పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో మంగళవారం 616 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. వేలానికి 824 బేళ్లు రాగా వాటిలో 616 బేళ్లను విక్రయించామని, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలియజేశారు. గరిష్ట ధర కిలో ఒక్కింటికి రూ.250 కాగా కనిష్ట ధర రూ.110 లభించింది. మొత్తమ్మీద సగటు ధర రూ.187.90 గా నమోదైంది. వేలంలో పది కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. కిలో పొగాకు ధర రూ.161 కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో కిలో పొగాకుకు సరాసరి ధర రూ.161.36 లభించింది. జనరల్ క్లస్టర్కు చెందిన రైతులు 1,012 పొగాకు బేళ్లను తీసుకురాగా 798 బేళ్లను కొనుగోలు చేయగా 214 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ మాట్లాడుతూ కిలో పొగాకు గరిష్ట ధర రూ.250 పలకగా, కనిష్ట ధర రూ.110 వచ్చిందన్నారు. వేలంలో 11 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. -
నష్టపరిహారం చెల్లించాలంటూ నిరసన
నెల్లూరు(అర్బన్): ఆర్అండ్బీ శాఖలో వాచ్మెన్గా పనిచేస్తూ ఓ వ్యక్తి మరణించగా, అతని భార్య తుపాకుల వెంకటరమణమ్మకు ఒకటిన్నర సంవత్సరంగా కారుణ్య నియామకం కింద ఉద్యోగ ఇవ్వనందున నష్టపరిహారం చెల్లించాలని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అసోసియేట్ చైర్మన్ ఈవీఎం శరత్బాబు డిమాండ్ చేశారు. వెంకటరమణమ్మకు నష్టపరిహారంతోపాటు జియావుల్ హక్ అనే వ్యక్తికి కారుణ్య నియామక ఉత్తర్వులు ఇవ్వాలంటూ మంగళవారం నెల్లూరు దర్గామిట్టలోని ఆర్అండ్బీ ఎస్ఈ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శరత్బాబు మాట్లాడుతూ ఆర్అండ్బీ శాఖలో బాధితులకు న్యాయం జరగడం లేదన్నారు. వెంకటరమణమ్మ తన భర్త మృతిచెందిన తర్వాత బతికేందుకు చాలా అవస్థలు పడుతోందన్నారు. ఇంటిపై రుణం తీసుకుని ఉన్నందున బ్యాంక్ వారు తాళాలు తీసుకుని ఆమెను బయటకు నెట్టేశారన్నారు. సకాలంలో ఉద్యోగం ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. మరో గిరిజన మహిళకు ఇలా జరగకుండా ఉండాలన్నారు. ఉద్యోగం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని ఎస్పీని కలిసి వినతిపత్రం ఇచ్చామన్నారు. జియావుల్ హక్కు ఇంకా ఉద్యోగం ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. అలాగే మినిస్టీరియల్ ఉద్యోగులకు, వర్క్ చార్జెడ్ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. -
కాంట్రాక్ట్ నర్సుల ఆందోళన ఉధృతం
● రెగ్యులర్ చేయాలంటూ సంతకాల సేకరణ ● ఆన్లైన్ సేవలు ఆపడంతో రోగులకు ఇక్కట్లు నెల్లూరు(అర్బన్): డిమాండ్లు తీర్చాలంటూ ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కేర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పీహెచ్సీలు, సీహెచ్సీలు, బోధనాస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సులు చేపట్టిన ఆందోళన ఉధృతమైంది. నర్సులు, కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్లు నల్లరిబ్బన్లు ధరించి విధులకు హాజరవుతూ భోజన విరామ సమయంలో ధర్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో తమ ఆందోళనకు మద్దతుగా సంతకాలు సేకరణ చేపట్టారు. డాక్టర్లు, రెగ్యులర్ నర్సులు, ఉద్యోగులు, ఆస్పత్రికి వచ్చేవారికి తమ న్యాయమైన డిమాండ్లు వివరిస్తూ తమ ఆందోళనలకు మద్దతుగా సంతకాలు సేకరించారు. 20 సంవత్సరాల క్రితమే.. మధ్యాహ్నం ఐపీ భవనం వద్ద ధర్నా జరిగింది. వీరి ఆందోళనకు మద్దతుగా పాల్గొన్న యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి సందాని బాషా మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితమే చంద్రబాబు ప్రభుత్వ రంగంలో కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టి యువతకు రెగ్యులర్ ఉద్యోగాలు లేకుండా చేశారని విమర్శించారు. ఈ విధానం సమాజానికి మంచిది కాదన్నారు. సెలవులు, పెన్షన్ లాంటి ఎలాంటి సౌకర్యాల్లేకుండా కేవలం జీతంపైనే ఆధారపడి కాంట్రాక్ట్ పద్ధతిలో 15 నుంచి 20 ఏళ్లకు పైగా నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, హెల్త్ అసిస్టెంట్లు పని చేస్తున్నారన్నారు. సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జేఏసీ రాష్ట్ర నాయకురాలు రూత్గ్రేస్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్ చేయాలన్నారు. అప్పటి వరకు వంద శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని, విధినిర్వహణలో మరణించిన కుటుంబ సభ్యులకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషి యా ఇవ్వాలన్నారు. ఈపీఎఫ్తోపాటు అనారోగ్యానికి గురైతే వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని, ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మ్యూచ్వల్, రిక్వెస్ట్ బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఈనెల 8 నుంచి అన్ని రకాల సేవలు ఆపేసి నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. రోగులకు తప్పని తిప్పలు కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న నర్సులు ఆన్లైన్ సేవలు ఆపేయడంతో రెండోరోజు కూడా రోగులకు ఇబ్బందులు తప్పలేదు. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి ఓపీలు ఇవ్వడానికి తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉదయం 8 గంటలకు రోగులకు ఓపీలు రాయాల్సి ఉండగా 9:30 గంటల వరకు కూడా ఇవ్వలేదు. న్యూరోఫిజీషియన్ పక్కనే ఉండే ఓపీ రూమ్లో అయితే ఏకంగా 10 గంటల వరకు కూడా సిబ్బంది రాకపోవడంతో రోగులు గంటలపాటు నిలబడిపోయారు. పదిగంటలకు ఆరోగ్యశ్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్లు వచ్చిన తర్వాతే ఓపీలు రాయడం మొదలు పెట్టారు. దీంతో రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు. -
వేమిరెడ్డే మైనింగ్ డాన్
● చైనాకు చెందిన డౌతో సంబంధాలపై సమాధానమివ్వాలి ● కేంద్ర మంత్రి జైశంకర్కు లేఖ రాసింది నిజం కాదా..? ● కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నాం ● మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్ నెల్లూరు రూరల్: జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి పాత్ర ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు అనిల్కుమార్యాదవ్ ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడారు. డబ్బున్న కొందరు వైట్కాలర్ నేరాలకు పాల్పడిన తరహాలో ఆయనా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాను సంధించిన ప్రశ్నలకు గానూ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని విమర్శించారు. డౌతో సంబంధమేమిటి..? కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్కు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి లేఖ రాశారని, చైనాకు చెందిన ఐదుగురికి ఇక్కడ మైనింగ్ వ్యాపారానికి అనుమతులివ్వాలని అందులో కోరారనే ఆధారాలను అనిల్ చూపారు. వీరిలో డౌ సైతం ఉన్నారని, ఆయనతో వేమిరెడ్డికి ఉన్న సంబంధమేమిటో తెలియజేయాలని డి మాండ్ చేశారు. ఇందులో వేమిరెడ్డికి సంబంధం లేదంటూ రవిచంద్ర మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. వేమిరెడ్డి ఆధ్వర్యంలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలొస్తున్నాయని, దీనిపై ఆయన ఆన్సరివ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను మైనింగ్ యజమానులు తన దృష్టికి తీసుకొచ్చారని, వీరి బాధలపైనే తాను మాట్లాడుతున్నానని చెప్పారు. గనులుంటేనే మైనింగ్పై మాట్లాడాలానని ప్రశ్నించారు. మేయర్నని చైనాలో పరిచయం చేసుకున్నారు..! నవంబర్ ఐదు, 2024 మేయర్గా గిరిజన మహిళ ఉన్న సమయంలో, మరో వ్యక్తి చైనాలో తనను తాను మేయర్గా పరిచయం చేసుకోవడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. వేమిరెడ్డికి చెందిన వ్యక్తిగా పేర్కొంటున్న రమణకుమార్తో కలిసి చైనాలోని సినోమా అనే కంపెనీ వద్దకెళ్లి, ఇలా చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. ఇది దేశ ప్రతిష్టకు భంగం కలిగించే తీవ్రమైన అంశమన్నారు. ఈ వ్యవహారం వేమిరెడ్డికి తెలిసే జరిగిందానని ప్రశ్నించారు. ఎందుకు వెనుకేసుకొస్తున్నారు..? మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ను ప్రశ్నించారు. ఫేక్ మేయర్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో ఇంకా ఎన్ని స్కాములు జరిగాయో వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తిని దగ్గర పెట్టుకోవడం వెనుక వేమిరెడ్డితో ఏమైనా లోపాయికారీ ఒప్పందం ఉందాననే అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్పారు. రవిచంద్ర, నారాయణ, శ్రీధర్రెడ్డికి అనిల్ పలు ప్రశ్నలను సంధించారు. ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తిని డిప్యూటీ మేయర్ పదవి నుంచి వెంటనే తొలగించాలని కోరారు. దీనంతటికీ బాస్ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను పక్కా ఆధారాలతోనే మాట్లాడుతున్నానని, కూటమి ప్రభుత్వ హయాంలో ఇలాంటి వ్యవహారాలు ఇంకా ఎన్ని జరుగుతున్నాయో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఉదంతంపై ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయనున్నామని వెల్లడించారు. పూర్తి వివరాలను జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తాము కూడా రాజకీయాల్లో సేవ చేశామని, అయితే ఇలాంటి మోసాలకు పాల్పడలేదని చెప్పారు. చట్టానికెవరూ అతీతులు కారు డబ్బున్నంత మాత్రాన చట్టానికి ఎవరూ అతీతులు కారని వ్యాఖ్యానించారు. వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి దమ్ముంటే తాను చేసిన ఆరోపణలపై బహిరంగంగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మైనింగ్, చైనా లింకులు, ఫేక్ మేయర్ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. -
పసిబిడ్డతో అత్తింటి ఎదుట గర్భిణి కన్నీటి పోరాటం
నెల్లూరు జిల్లా: మూడేళ్ల పాప.. కడుపులో మరో బిడ్డ.. అయినా మెట్టింటి గడప దాటనివ్వని పరిస్థితి. భర్త, అత్తమామలు తనను విడాకులు ఇవ్వాలని వేధిస్తున్నారంటూ ఐదో నెల గర్భిణి అత్తింటి ఎదుట బైఠాయించింది. తరచూ వేధించి పుట్టింటికి పంపిస్తున్నారని ఆరోపించింది. భర్త మరో వివాహం చేసుకునేందుకే తనను దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన మండలంలోని కొడవలూరు రైల్వేగేట్ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. కొడవలూరు రైల్వే గేట్ కాలనీకి చెందిన చిత్తూరు జయకుమార్ వరికోత యంత్రం డ్రైవర్గా పనిచేస్తున్నారు. వరి కోతల సీజన్లో వృత్తిరీత్యా వివిధ జిల్లాలకు వెళుతుంటారు. మూడేళ్ల క్రితం ఒంగోలు వెళ్లిన సమయంలో అక్కడి పూజల చెంగమ్మతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో పెద్దల సమక్షంలో 2023 ఆగస్టు 30న కొడవలూరు విష్ణు ఆలయంలో వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల పాప ఉంది. ప్రస్తుతం చెంగమ్మ ఐదో నెల గర్భిణి. విడాకులివ్వాలంటూ వేధిస్తున్నారు గత ఐదు నెలలుగా భర్త తనను వేధిస్తున్నారని, విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ తరచూ పుట్టింటికి పంపిస్తున్నారని చెంగమ్మ ఆరోపించారు. వృత్తిరీత్యా మచిలీపట్నం వెళ్లిన జయకుమార్కు మరో యువతితో పరిచయం ఏర్పడిందని, ఆమెను వివాహం చేసుకునేందుకే తనకు విడాకులు ఇవ్వాలని చూస్తున్నారని వాపోయారు. భర్తకు అత్తమామలు కూడా మద్దతుగా నిలిచి తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోమవారం తన తల్లి, పిన్నమ్మతో కలిసి మూడేళ్ల కుమార్తెను వెంట బెట్టుకుని జయకుమార్ ఇంటి ఎదుట బైఠాయించారు. తనకు న్యాయం చేయాలని కోరారు. గతంలోనూ పోలీసులకు ఫిర్యాదు భర్త వేధింపులపై గతంలో ఒంగోలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెంగమ్మ తెలిపారు. పోలీసులు ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారని చెప్పారు. అనంతరం కొద్దిరోజులు సజావుగా ఉన్నప్పటికీ మళ్లీ వేధింపులు మొదలయ్యాయని వాపోయారు. పోలీసుల రంగప్రవేశం చెంగమ్మ అత్తింటి ఎదుట బైఠాయించిన విషయం తెలియడంతో పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. స్థానిక సీఐ, ఎస్సైలు విధుల్లో భాగంగా బయటకు వెళ్లడంతో అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలు, అత్తింటి వారిని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. జయకుమార్ వరి కోతల నిమిత్తం నాయుడుపేట వెళ్లి ఉండటంతో ఆయన్ను కూడా కొడవలూరు పోలీస్స్టేషన్కు రావా లని సమాచారం ఇచ్చారు. ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చి సమస్యను పరిష్కరించి, దంపతులు కలిసి ఉండేలా చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
పీజీఆర్ఎస్కు వినతుల వెల్లువ
నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 154 మంది హాజరై తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్లకు అందజేశారు. వినతులను పరిశీలించిన ఎస్పీ.. చట్టపరిధిలో విచారించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాల పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కావలి డీఎస్పీ వీవీ రమణకుమార్, మహిళా పోలీస్స్టేషన్, డీసీఆర్బీ, ఎస్బీ ఇన్స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, బి.శ్రీనివాసరెడ్డి, బి.పాపారావు, దశరథరామారావు, వెంకటరావు, సిబ్బంది పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● కెమికల్స్, మెటీరియల్స్ సరఫరా చేస్తానని హైదరాబాద్కు చెందిన ప్రశాంత్రెడ్డి తమ వద్ద రూ.51.85 లక్షలు తీసుకుని మోసం చేశాడని చిల్లకూరు ప్రాంతంలోని ఎంఓ మినరల్స్ కంపెనీ ప్రతినిధి ఫిర్యాదు చేశాడు. ● సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని హైదరాబాద్కు చెందిన యదువీర్ రూ.15 లక్షలు తీసుకుని మోసం చేశాడని కోవూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరాడు. ● కార్తీక్తేజ్ అనే వ్యక్తి వెంటబడి వేధిస్తున్నాడని నెల్లూరు రూరల్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఫిర్యాదు చేశారు. ● భర్త, అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించడంతోపాటు బంగారు ఆభరణాలు తీసుకుని ఇంటి నుంచి బయటకు పంపించారని ముత్తుకూరుకు చెందిన ఓ మహిళ వినతిపత్రం అందజేశారు. -
కాంట్రాక్ట్ నర్సుల ఆందోళన ఉధృతం
● జీజీహెచ్లో ఆన్లైన్ సేవలు బంద్ ● ఓపీ కోసం బారులు తీరిన రోగులు నెల్లూరు(అర్బన్): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కేర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఆందోళనలను కాంట్రాక్ట్ నర్సులు ఉధృతం చేశారు. గత వారం రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టిన వారు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సోమవారం ఆన్లైన్ సేవలను నిలిపేశారు. ఇప్పటి వరకు కాంట్రాక్టు నర్సులు ఆన్లైన్ సేవలందిస్తుండటంతో ఓపీ సాఫీగా జరిగి పోయేది. అయితే ఇప్పుడు వారి ఆందోళనల నేపథ్యంలో ఆన్లైన్ చేసి ఓపీ రాసిచ్చే వారు లేకపోవడంతో ఓపీ రూముతో పాటు వరండాలో వందల సంఖ్యలో రోగులు బారులు తీరి నిలబడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న జీజీహెచ్ సూపరింటెండెంట్, తదితరులు హడావుడిగా ఆరోగ్యశ్రీ, ఇతర విభాగాల వద్ద ఉండే డేటాఎంట్రీ ఆపరేటర్లను పిలిపించి ఆన్లైన్ ద్వారా ఓపీలు రోగులకు అందజేయాలని కోరారు. అంతలోనే సర్వర్ కూడా కొంతసేపు పని చేయలేదు. ఉదయం 8 గంటల నుంచే ఓపీ చీటీలు రాయాల్సి ఉంటుంది. అయితే ఎక్కువ మందికి 11.30 గంటల వరకు కూడా ఇవ్వలేదు. రోగులు ఓపీలు తీసుకుని డాక్టర్ను కలిసే సమయానికి మధ్యాహ్నమైంది. దీంతో వైద్యులు నామమాత్రంగా పరీక్షలు రాసేసి వెళ్లిపోయారు. రోగులు పరీక్షలు చేయింకుని వచ్చేసరికి వైద్యులు అందుబాటులో లేరు. దీంతో శిక్షణ పొందుతున్న జూనియర్ వైద్యులే దిక్కయ్యారు. కాంట్రాక్ట్ నర్సుల ఆందోళనతో రోగుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. నల్లరిబ్బన్లు ధరించి నిరసన భోజన విరామసమయంలో నర్సులు నల్లరిబ్బన్లు ధరించి ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. వీరికి మద్దతుగా సీఐటీయూ నాయకులు సతీష్, సందానిబాషా మద్దతు తెలిపారు. జేఏసీ కన్వీనర్ శరత్బాబు మాట్లాడుతూ తమను రెగ్యులర్ చేయాలని అంతవరకు 100 శాతం గ్రాస్ శాలరీతో కూడిన వేతనం మంజూరు చేయాలని, విధి నిర్వహణలో మరణించిన కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు రూ 50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ప్రతి కాంట్రాక్టు ఉద్యోగికి ఈపీఎఫ్ చెల్లించాలని, జబ్బుచేస్తే వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులకు దూరంగా ఉన్న తమకు రిక్వెస్ట్ బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే తాము సేవలు బంద్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నర్సులు మేరి, మాధురి, శేషగిరి తదితరులు పాల్గొన్నారు. -
గోడు వినండి.. న్యాయం చేయండి
● మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలు ● కలెక్టరేట్కు పోటెత్తిన అర్జీదారులునెల్లూరు(అర్బన్): ‘అయ్యా.. మా సమస్యలపై మండలస్థాయి అధికారులకు ఎన్నోసార్లు అర్జీలిచ్చాం. అయినా పరిష్కారం కాలేదు. అందుకే వ్యయప్రయాసలకోర్చి దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్కు వచ్చాం. మీరైనా ఆలకించి పరిష్కరించండి’ అంటూ పలువురు అర్జీదారులు కలెక్టర్ హిమాన్షు శుక్లాను కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. కలెక్టర్, డీఆర్వో విజయకుమార్, డీసీఓ గుర్రప్ప, మెప్మా, డీఆర్డీఏ, డ్వామా పీడీలు కిరణ్కుమార్, నాగరాజకుమారి, శ్రీనివాసప్రసాద్, సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్ తదితరులు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. -
పొలం ఆక్రమిస్తున్నారు
చేజర్ల మండలం వావిలేరు గ్రామంలోని సర్వే నంబర్ 188/6లో మునగాల లక్ష్మీశైలజ వద్ద 0.62 సెంట్ల పట్టా పొలం కొనుగోలు చేసి కుమార్తె అజీజున్నీసా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాను. అయితే ఆమె 2011లో మృతి చెందింది. అప్పటి నుంచి పొలంలో జామాయిల్ చెట్లు పెంచుతున్నారు. గ్రామానికి చెందిన చిల్లంకూరు నాగార్జున, స్వాతి, సులోచనలు నా భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెవెన్యూ అధికారులు వారిని హెచ్చరించినా.. చంపేస్తామని బెదిరిస్తున్నారు. జామాయిల్ చెట్లను విక్రయించగా.. వాటిని కూలీలతో కొట్టించేందుకు ప్రయత్నించిన సమయంలో అడ్డుకున్నారు. – షేక్ అమీర్బాషా, అక్కంపేట, మనుబోలు మండలం -
క్రషర్ మైన్తో మా జీవితాలు గుల్ల
మా గ్రామానికి ఆనుకుని స్టోన్ క్రషర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. పెద్ద బండరాళ్లను పేలుడు పదార్థాలతో పగులగొడుతుండటంతో భారీ శబ్దాలకు ఇళ్లలోని వస్తువులు కిందపడిపోతున్నాయి. దుమ్ము, ధూళి కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కంకర పొడి కారణంగా పంటలు బూడిదమయం అవుతున్నాయి. సంబంధిత ఏఎంఆర్ మైన్స్ను మూసివేయించి గ్రామస్తుల ఆరోగ్యాన్ని కాపాడాలి. – చిన్న, యజ్దాని బాషా, సుబ్బరాయుడు, హజరత్తయ్య, అమీర్, ఆమనిచిరువెళ్ల, అనంతసాగరం మండలం -
ఇక సమరమే.. సమ్మెకు సైరన్
● ఏపీజేఏసీ అమరావతి నాయకులు ● కలెక్టర్కు ఉద్యోగ సంఘాల నోటీసునెల్లూరు (అర్బన్): ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్, అవుట్సోర్సింగ్ కార్మికులకు రావాల్సిన పీఆర్సీ, పెండింగ్ బకాయిలు సాధించుకునేందుకు సమరానికి సన్నద్ధంగా ఉన్నామని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి, కార్యదర్శి ప్రసాద్, మహిళా విభాగం చైర్పర్సన్ బాలకోటమ్మ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్కు ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన సమ్మె నోటీసును అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణంలో దశల వారి ఉద్యమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఉద్యమం ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. తమకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటిని, తాము దాచుకున్న డబ్బులను చెల్లించాలని కోరుతూ పోరాటం ప్రారంభించామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటినా పీఆర్సీ పెండింగ్లో ఉందన్నారు. 12వ పీఆర్సీ కమిషనర్ నియామకం, మధ్యంతర భృతి, ెపెండింగ్లో ఉన్న 5 డీఏల విడుదల, పింఛన్దారులకు అదనపు క్వాంటమ్ పింఛన్ పునరుద్ధరణ తదితర 29 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామన్నారు. ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యాక రావాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్లో తీవ్ర జాప్యం వల్ల వృద్ధాప్యంలో విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఆవేదనలో ఉన్నారన్నారు. మంగళవారం నుంచి ఉద్యమ కార్యాచరణ పూర్తయ్యే వరకు సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి అంటూ ఉద్యోగులు డీపీలో ఫొటో ప్రదర్శిస్తారన్నారు. 5వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలతో విధుల్లోకి వచ్చి నిరసన, 9వ తేదీ వరకు తమకు జరుగుతున్న నష్టాలపై కరపత్రాల పంపిణీ, 11న ట్రేడ్ యూనియన్లతో కలిపి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 15 నుంచి 26వ తేదీ వరకు పని గంటల సమయంలో మాత్రమే పని చేస్తామని మిగిలిన సమయంలో అధికారులకు సహకరించేది లేదన్నారు. అనంతరం ధర్నాలు, ఆందోళనలు చేస్తామన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మె బాట పడుతామన్నారు. సంఘ నాయకులు చెన్నమ్మ, పరంధామయ్య, శ్రీనివాసులు, ధారా రమణయ్య, సతీస్, కొండలరావు, జమీర్బాషా, తదితరులు పాల్గొన్నారు. -
పాతకక్షలతోనే రౌడీషీటర్ హత్య
● ఎనిమిది మంది అరెస్ట్ ● పరారీలో మరికొందరు నెల్లూరు(క్రైమ్): నెల్లూరులో సంచలనం రేకెత్తించిన రౌడీషీటర్ కమ్మసాయి హత్య కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. సోమవారం వేదాయపాళెం పోలీస్స్టేషన్లో నగర ఇన్చార్జి డీఎస్పీ ఎం.గిరిధర్ వివరాలు వెల్లడించారు. చంద్రమౌళినగర్కు చెందిన్ లక్ష్మీశెట్టి సాయితేజ అలియాస్ కమ్మసాయిపై గతేడాది ఏప్రిల్లో వేదాయపాళెం పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించి కడప కేంద్రకారగారానికి తరలించారు. ఇటీవలే అతను జైలు నుంచి బయటకు వచ్చాడు. సాయికి పలువురితో పాతకక్షలు, వ్యక్తిగత విభేదాలున్నాయి. ఆదివారం అతను వేదాయపాళెం పోలీస్స్టేషన్లో కౌన్సెలింగ్కు హాజరయ్యాడు. అనంతరం కె.హనుక్, ప్రేమ్కుమార్, వంశీకృష్ణ అలియాస్ నిప్పో వంశీ, సాయికుమార్, రాహుల్, ప్రదీప్, హరి, జగదీష్, మరికొందరితో కలిసి మద్యం తాగాడు. పాతకక్షలు, వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో మద్యం మత్తులో చెలరేగిన వివాదంతో వారు సాయిని హత్య చేశారు. మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశామని డీఎస్పీ చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో వంశీకృష్ణ, సాయికుమార్, జగదీష్పై రౌడీషీట్లు ఉన్నట్లు తెలిపారు. పరారీలో ఉన్నవారిని వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. సమావేశంలో వేదాయపాళెం ఇన్చార్జి ఇన్స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్య పాల్గొన్నారు. -
ఇళ్లు చేరని జీవితాలు
జిల్లాలోని వేర్వేరు మండలాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది.లారీని ఢీకొని ఆటో బోల్తావెంకటాచలం: లారీని వెనుక నుంచి ఆటో ఢీకొని ఒకరు మృతిచెందగా, మరో 9 మందికి గాయపడిన ఘటన మండలంలోని సర్వేపల్లి పంచాయతీ నాగంబోట్లకండ్రిగ సమీపంలో కృష్ణపట్నం పోర్టు రోడ్డుపై సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామానికి చెందిన బత్తల పోలయ్య (58), మరో 9 మంది మత్స్యకారులు మనుబోలు సమీపంలోని గుంతల వద్దకు రొయ్యలు పట్టేందుకు ఆటోలో వెళ్లారు. సాయంత్రం తిరిగి ఊరికి బయలుదేరారు. నాగంబోట్లకండ్రిగ సమీపంలో కృష్ణపట్నం రోడ్డుపై లారీ అకస్మాత్తుగా ఆగడంతో వెనుక నుంచి ఆటో ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో బత్తల పోలయ్యకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందగా, మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోలీసులు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఇంటి సామగ్రి కొనుగోలుకు వెళ్తూ.. సంగం: ఇంటి సామగ్రి కొనుగోలు చేసేందుకు వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన మండలంలోని తరుణవాయి వద్ద జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. నీలాయపాళెం గ్రామానికి చెందిన వెంకటరమణయ్య (57) బేల్దారి పనులు చేస్తుంటాడు. వివాహమై పిల్లలున్నారు. ఇంటికి సంబంధిచిన సామగ్రి కొనుగోలు చేసేందుకు బుచ్చిరెడ్డిపాళేనికి మోటార్బైక్పై వెళ్తుండగా అతడిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం అనంతరం వాహనం ఆపకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. తీవ్రగాయాలతో పడి ఉన్న వెంకటరమణయ్యను గుర్తించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. అంబులెన్స్లో సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటో అదుపుతప్పి.. మనుబోలు: ఆటో బోల్తా పడటంతో వాకా రమేష్ (45) అనే వ్యక్తి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని కొమ్మలపూడి క్రాస్రోడ్డు వద్ద సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగ గ్రామానికి చెందిన రమేష్ ఓ ఛానల్లో మనుబోలు మండల విలేకరిగా పనిచేస్తున్నాడు. ఇల్లు కట్టిస్తున్నాడు. ఈ క్రమంలో సొంత ఆటోలో మనుబోలుకు వచ్చి సిమెంట్ బస్తాలు తదితరాలు తీసుకెళ్తున్నాడు. కొమ్మలపూడి క్రాస్రోడ్డు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడి రమేష్ తీవ్రంగా గాయపడ్డాడు. హైవే మొబైల్ సిబ్బంది మస్తాన్, మహేష్ అతడికి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం రమేష్ను హైవే అంబులెన్స్లో నెల్లూరులోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. -
12న జాతీయ లోక్ అదాలత్
నెల్లూరు (లీగల్): ఈ నెల 12న జాతీయ లోక్అదాలత్ను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ నరసింహమూర్తి తెలిపారు. సోమవారం ఆయన జిల్లా కోర్టు హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న నెల్లూరు, కోవూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, గూడూరు, కోట, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట కోర్టుల్లో జాతీయ లోక్అదాలత్ను నిర్వహించనున్నామని తెలిపారు. ఆయా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్, వివాహ, మోటార్ వాహన ప్రమాద, రాజీ పడదగిన ఇతర కేసుల్లోని కక్షిదారులు సద్వినియోగం చేసుకుని కేసులను రాజీ చేసుకోవాలని కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వైజే పద్మశ్రీ, తదితరులు పాల్గొన్నారు. హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు గూడూరు: చిన్నపాటి వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడికి గూడూరు ఏడో అదనపు జిల్లా జడ్జి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. గూడూరు ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు..తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన వింగవాసం జోగేంద్ర అలియాస్ జోగి, అలియాస్ బొగ్గు ఇంజన్, అదే ప్రాంతానికి చెందిన కామేష్ రైళ్లలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించే వారు. వారి ఇద్దరి మధ్యన మనస్పర్థలు రావడంతో అప్పుడప్పుడు ఘర్షణ పడే వారు. ఈ నేపథ్యంలో 2023 మార్చి 23న గూడూరు రైల్వే స్టేషన్ వద్ద ఇరువురి మధ్యన వివాదం నెలకొని ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఆ తరువాత కామేష్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఆర్ఎం ఆఫీస్ వద్ద నిద్రిస్తున్న సమయంలో తలపై నిందితుడు జోగేంద్ర సిమెంట్ కాంక్రీట్ దిమ్మెతో రెండుసార్లు కొట్టడంతో మృతి చెందాడు. రైల్వే స్టేషన్ సిబ్బంది ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అప్పటి సీఐ హజరత్బాబు కేసు నమోదు చేసి నిందితుడు జోగేంద్రను కోర్టులో హాజరుపరచారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొత్తపల్లి వంసతకుమార్ నేర నిరూపణ చేయడంతో నిందితుడు జోగేంద్రకు జీవిత ఖైదు, రూ5వేలు జరిమానా విఽధిస్తూ కోర్టు తీర్చునిచ్చింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాలని పేర్కొంది. ఈ కేసును పర్యవేక్షణ చేసి నిందితుడికి శిక్ష పడేలా చేసిన ఒకటో పట్టణ సీఐ శేఖర్బాబు, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ డీ మల్లికార్జున, హెడ్కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యేశ్వరరావును ఎస్పీ అజిత్ వేజెండ్ల అభినందించారు. 2.87 లక్షల మందికి పింఛన్లు నెల్లూరు(పొగతోట): జిల్లాలో మంగళవారం సామాజిక పింఛన్ల నగదు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,87,970 మంది లబ్ధిదారులకు రూ.126 కోట్ల నగదు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. 13,265 క్లస్టర్లల్లో 6,593 మంది ఉద్యోగుల ద్వారా నగదు అందజేయనున్నట్లు చెప్పారు. పింఛన్ లబ్ధిదారులు అందుబాటులో ఉండి నగదు తీసుకోవాలని సూచించారు. 150 కేజీలకు మించిన పొగాకు బేళ్ల తిరస్కరణ మర్రిపాడు : పొగాకు రైతులు 150 కేజీలకు మించిన బేళ్లను వేలానికి తీసుకొస్తే తిరస్కరించడం జరగుతుందని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ పొగాకు రైతులు వేలం ప్రక్రియలో నిబంధనలు పాటించాలని సూచించారు. ఉదయం కాటాలు వేసే సమయంలో రైతులు స్వయంగా దగ్గర ఉండి టీబీజీఆర్ నంబర్లు వేయించుకోవాలని తెలిపారు. వేలానికి ముందు రోజు వచ్చి మార్కెట్ పరిస్థితిని పరిశీలించి కొనుగోలు చేసే బేళ్లను మాత్రమే తీసుకురావాలని సూచించారు. సెప్టెంబర్ 2న గుండెమడకల క్లస్టర్–5, ఆదురుపల్లి క్లస్టర్–8, 3న డీసీపల్లి క్లస్టర్–6, 4న నెల్లూరుపాళెం క్లస్టర్–7కు సంబంధించిన రైతుల బేళ్లను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. బ్యారెన్కు నాలుగు బేళ్లు, అర బ్యారెన్కు రెండు బేళ్ల చొప్పున వేలానికి తీసుకురావాలని సూచించారు. -
పెండింగ్ బకాయిలు తక్షణమే చెల్లించాలి
● జేఏసీ జిల్లా చైర్మన్ బండారుపల్లి వెంకటేశ్వర్లు నెల్లూరు(అర్బన్): ఉద్యోగులకు ప్రభుత్వం పెండింగ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని జిల్లా జేఏసీ చైర్మన్ బండారుపల్లి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం నెల్లూరు దర్గామిట్టలోని ఎన్జీఓ భవన్లో వివిధ సంఘాలతో కలిసి జేఏసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 5 డీఏలను, లీవ్ ఎన్క్యాష్మెంట్ బకాయిలను విడుదల చేసి పీఆర్సీ కమిషన్ను నియమించాలన్నారు. ఉద్యోగులకు న్యాయం జరగకపోతే ఈనెల 5న జరిగే రాష్ట్ర జేఏసీ సమావేశంలో తీసుకునే ఉద్యమ నిర్ణయాలకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ సెక్రటరీ సురేంద్రరెడ్డి, చలపతి శర్మ (యూటీఎఫ్), మురళీకృష్ణారెడ్డి (ఆర్టీసీ – ఎన్ఎంయూ), సుదర్శన్ (ఎస్టీయూ) తదితర పలు సంఘాల నేతలు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో పెరిగిన నిరుద్యోగం
● డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది’ అని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న అన్నారు. నెల్లూరులోని డా.జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న 2.14 లక్షల ఖాళీ పోస్టులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వెంటనే భర్తీ చేయాలన్నారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడా మైదానాలు నిర్మిస్తామని చెబుతున్న చంద్రబాబు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆడుకునేందుకు కనీస సౌకర్యాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.కూటమి ప్రభుత్వం ప్రజలు, రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి సొమ్ము చేసుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. నేటి నుంచి మూడురోజులపాటు జరిగే డీవైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. మంగళవారం సాయంత్రం వీఆర్సీ మైదానం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి నర్తకీ సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహ, రమణ, నాయకులు చైతన్య, నరేంద్ర, సురేంద్ర పాల్గొన్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని అదృశ్యం
సంగం: బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి అదృశ్యమైంది. సోమవారం ఆమె తండ్రి సుధాకర్రెడ్డి సంగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి కథనం మేరకు.. బద్వేల్లోని మడగలవారెపల్లికి చెందిన ఓ యువతిని సంగంలో ఓ యువకుడికి ఇచ్చి వివాహం చేసేందుకు నిశ్చయించారు. ఆదివారం రాత్రి జరిగిన పెళ్లి వేడుకలకు మడగలవారెపల్లి గ్రామానికి చెందిన సుధాకర్రెడ్డి కుమార్తె వచ్చింది. భోజన అనంతరం బంధుమిత్రులతో మాట్లాడింది. ఆ తర్వాత ఆమె అదృశ్యమైంది. సోమవారం కుమార్తె ఇంటికి రాకపోవడంతో సుధాకర్రెడ్డి సంగం వచ్చి బంధువుల వద్ద విచారించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి ఆచూకీ కోసం సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. భార్యాభర్తలపై దాడి ● మహిళ మెడలోని బంగారు సరుడు దోపిడీ సంగం: వివాహ వేడుకలకు వెళ్లి తిరిగి సొంతూరికి వెళ్తున్న భార్యాభర్తలను గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి వారిని కొట్టి మహిళ మెడలోని బంగారు సరుడును దోపిడీ చేసిన ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. బాధితులు సోమవారం సంగం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల మేరకు.. జెండాదిబ్బ పంచాయతీ మజారా అరవపాళెం గ్రామానికి చెందిన కరేటి లక్ష్మీనారాయణ, భాగ్యలక్ష్మి దంపతులు మోటార్బైక్పై ఆదివారం రాత్రి బుచ్చిరెడ్డిపాళెం మండలం చెల్లాయపాళెం వెళ్లారు. అక్కడ వివాహ వేడుకలకు హాజరయ్యారు. అర్ధరాత్రి పంచేడు రోడ్డు మీదుగా జెండాదిబ్బకు వెళ్తున్నారు. గ్రామ సమీపంలోని శ్మశానం వద్ద గుర్తుతెలియని ముగ్గురు యువకులు బైక్ను అడ్డగించి భార్యాభర్తలను కొట్టారు. భాగ్యలక్ష్మి మెడలో ఉన్న 2.5 సవర్ల తాళిబొట్టు సరుడును లాక్కెళ్లారు. లక్ష్మీనారాయణ 112కు ఫోన్ చేయడంతో సంగం పోలీసులు వచ్చే సరికి దుండగులు పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.దెబ్బతిన్న కండలేరు హెడ్రెగ్యులేటర్ గేట్లు రాపూరు: మండలంలోని కండలేరు ప్రాజెక్ట్కు సంబంధించి హెడ్రెగ్యులేటర్ గేట్లు, సాఫ్ట్లాక్ గేట్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. జలాశయాల భద్రత కమిటీ బృందం డ్యామ్ను సందర్శించింది. నీటినిల్వలు, గేట్ల పనితీరు, ఇతర అంశాలకు సంబంధించి స్థితిగతులను సభ్యులు తెలుసుకున్నారు. సోమవారం డ్యామ్ ఆర్గనైజేషన్ చైర్మన్ గోపాల్రెడ్డి, కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, శ్రీకాంత్ మాట్లాడుతూ జలాశయం భద్రతకు సంబంధించిన అంశాలను రెండురోజులపాటు పరిశీలించామన్నారు. లీకేజీలు కూడా ఉన్నాయన్నారు. భవిష్యత్లో చేపట్టాల్సిన రక్షణ చర్యల్ని గుర్తించామన్నారు. పూర్తి నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో తెలుగుగంగ ఎస్ఈ సుబ్రహ్మణ్యేశ్వరావు, కండలేరు ఈఈ గజేంద్రరెడ్డి, డీఈ అనిల్బాబు, ఏఈ అనిల్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
మైనింగ్పై చైనా పెత్తనం
నెల్లూరు రూరల్: రాష్ట్రంలో మైనింగ్ వ్యవస్థను చైనా జాతీయుడు శాసిస్తున్నారని, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అండదండలతోనే మైనింగ్ సిండికేట్ దందా కొనసాగుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు అనిల్కుమార్యాదవ్ ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. మల్టీ ఎలిమెంట్ కంపెనీకి చెందిన డౌ అనే చైనా జాతీయుడు స్థానిక మైనింగ్ సిండికేట్ను తన గుప్పెట్లో పెట్టుకొని గనుల యజమానులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమ కంపెనీకే క్వార్ట్జ్ మెటీరియల్ను ఇవ్వాలని, లేని పక్షంలో అధికారుల ద్వారా గనులను బ్లాక్ చేయిస్తానంటూ బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. డౌతో వీపీఆర్కు ఉన్న సంబంధంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.55 కోట్ల ఆదాయం.. రూ.11.99 కోట్లకు క్వార్ట్జ్ మైనింగ్ ద్వారా తమ హయాంలో ప్రభుత్వానికి రూ.55 కోట్ల ఆదాయమొచ్చిందని, అయితే ప్రస్తుతం ఇది రూ.11.99 కోట్లకు పడిపోయిందని చెప్పారు. ఆర్టీఐ ద్వారా తన వద్దకొచ్చిన సమాచారంతోనే ఈ అంశాలను వెల్లడిస్తున్నానని స్పష్టం చేశారు. చైనాలో క్వార్ట్జ్ డిమాండ్తో ఎగుమతులు ఆగిపోలేదని, సిండికేట్ దోపిడీ కారణంగానే మైనింగ్ రంగం కుదేలైందని విమర్శించారు. లీగల్గా మైనింగ్ చేస్తున్న గనుల యజమానుల నుంచి టన్నుకు రూ.ఎనిమిది వేల నుంచి రూ.15 వేల వరకు సిండికేట్ అక్రమంగా వసూలు చేస్తోందని ఆరోపించారు. ఈ రకంగా గత రెండేళ్లలో రూ.200 కోట్లకుపైగా అక్రమంగా కొల్లగొట్టారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 147 క్వార్ట్జ్ లీజులుండగా, 98 గనులనే తెరిచారని, సిండికేట్కు కప్పం కట్టలేదనే కారణంతో మిగిలిన వాటిని మూయించారని ధ్వజమెత్తారు. ఫలితంగా వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసించే స్థాయికెలా వచ్చారు..? రాష్ట్రంలో మైనింగ్ వ్యవస్థను శాసించే స్థాయికి మల్టీ ఎలిమెంట్ కంపెనీకి చెందిన డౌ అనే చైనా జాతీయుడు ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఇది తీవ్రమైన అంశమని, దేశ భద్రతకు సంబంధించిన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందని తెలిపారు. వీపీఆర్ అండదండలతోనే సిండికేట్ నడుస్తోందని.. డౌ చెప్తున్నట్లే మైన్ ఓనర్లు వ్యవహరిస్తున్నారని, దీనిపై ఎంపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫినీ క్వార్ట్జ్ పేరుతో విజయ్కుమార్రెడ్డి అనే వ్యక్తి ఆధ్వర్యంలో సిండికేట్ కార్యకలాపాలు సాగుతున్నాయని మండిపడ్డారు. ఈ దందాలతో ఒక్కో మండలంలో సుమారు మూడు వేల మంది వరకు కార్మికులు ఉపాధి కోల్పోయారని తెలిపారు. మైనింగ్ కోసం జేసీబీలు, వాహనాలను కొనుగోలు చేసిన వారు ఈఎంఐలను చెల్లించలేక ఆర్థికంగా నష్టపోయారని చెప్పారు. దేవదాయ శాఖకు సంబంధించిన భూముల్లోనూ పల్స్ఫర్ అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. పురాతన సిద్ధలయ్యకోన ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరపాలని దేవాదాయ శాఖ మంత్రికి లేఖ రాసినా, స్పందించడంలేదని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో నాలుగు లక్షల టన్నుల పల్స్ఫర్ మైనింగ్ జరిగితే, ప్రస్తుతం ఇది 1.48 లక్షల టన్నులకు పడిపోయిందన్నారు. చిన్న స్థాయిలో వ్యాపారం చేసుకునే సుమారు 352 ఎమ్డీఎల్లను ఎందుకు బ్లాక్ చేశారని ప్రశ్నించారు. ఎంపీ వేమిరెడ్డి కనుసన్నల్లోనే సిండికేట్ దోపిడీ టన్నుకు రూ.ఎనిమిది వేల నుంచి రూ.15 వేల వరకు అక్రమ వసూళ్లు మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్ దమ్ముంటే సీబీఐ విచారణకు ఆదేశించండి తాను చేస్తున్న ఆరోపణలు తప్పని తేలితే సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు. చైనా జాతీయుడి వ్యవహారంపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖకు ఫిర్యాదు చేయనున్నానని వెల్లడించారు. మైనింగ్ దందాలను ఆపకపోతే తన వద్ద ఉన్న వాట్సాప్ చాట్లు, చైనా పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వాయిస్ రికార్డింగ్లను బయటపెడతానని హెచ్చరించారు. -
మాట వినరు.. రవాణా ఆగదు
● ఆగని చికెన్ వ్యర్థాల తరలింపు ● పొదలకూరు మీదుగా సంగం, బుచ్చి, నెల్లూరుకు.. ● చేపలు, రొయ్యల మేతకు వినియోగం ● కేసులు పెడుతున్నా మారని తీరుపొదలకూరు: పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా చికెన్ వ్యర్థాల రవాణా మాత్రం ఆగడం లేదు. పగటి వేళల్లో వ్యర్థాలను తరలించకుండా రాత్రి, తెల్లవారుజామున మినీ లారీలు, వ్యాన్లలో యథేచ్ఛగా తరలిస్తున్నారు. గతంలో పగటి వేళ పొదలకూరు పట్టణం మీదుగా వ్యర్థాలు తరలించడంతో దుర్వాసనకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరుస ఫిర్యా దులు రావడంతో ప్రస్తుతం రాత్రి వేళల్లో రవాణా చేస్తున్నారు. తిరుపతి, చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి సంగం, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందులో పొదలకూరు మీదుగానే అధికంగా రవాణా చేస్తున్నట్టు సమాచారం. మేతగా వినియోగం సంగం, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో, పొదలకూరు మండలం కొనగలూరులో చేపల గుంతలున్నాయి. ఆయా ప్రాంతాల్లో చేపలు, రొయ్యలకు మేతగా చికెన్ వ్యర్థాలను వినియోగిస్తున్నారు. బెంగళూరు వైపు నుంచి వచ్చే వ్యర్థాలు పొదలకూరు పట్టణం మీదుగానే తరలివెళ్తున్నాయి. ఇప్పటి వరకు పోలీసులు నాలుగైదు పర్యాయాలు వ్యర్థాలను తరలిస్తున్న మినీ లారీలు, ఆటోలను పట్టుకుని కేసులు నమోదు చేశారు. గత వారంలో కూడా డ్రమ్ముల్లో తీసుకెళ్తున్న మినీ లారీని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం రెవెన్యూ, పోలీసు అధికారులు వ్యర్థాలను తవ్వి పాతిపెట్టారు. అలాగే మండలంలోని బిరదవోలు గ్రామ సమీపంలో రాత్రివేళ వ్యర్థాలను తరలిస్తున్న లారీలను గ్రామస్తుల సమాచారంతో పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. చేపలు, రొయ్యలకు చికెన్ వ్యర్థాలను మేతగా ఇవ్వకూడదనే నిబంధనలు ఉన్నా పట్టించుకోవడం లేదు. మండలంలోని కొనగలూరు చేపల గుంతల నిర్వాహకులు సైతం వాటిని వినియోగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. హైవే మీదుగా.. చైన్నె, తిరుపతి, బెంగళూరు నుంచి మనుబోలు వరకు హైవే మీదుగా వచ్చిన తర్వాత వీరంపల్లి మీదుగా పొదలకూరుకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి సంగం, బుచ్చిరెడ్డిపాళెం తదితర ప్రాంతాలకు చికెన్ వ్యర్థాలను తరలిస్తున్నారు. ఇప్పటి వరకు పొదలకూరు పోలీస్స్టేషన్లో నాలుగు కేసుల వరకు నమోదయ్యాయి. డ్రైవర్లు, వాహన యజమానులపై కేసులు పెట్టారు. అయినా వ్యర్థాల రవాణా కొనసాగుతూనే ఉందని స్థానికులు చెబుతున్నారు. సంగం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు పొదలకూరు మార్గం అనువుగా ఉండటంతో ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది. -
నిన్న రహదారి.. తాజాగా చెట్లకు..!
● మంత్రి వ్యవసాయ క్షేత్రానికి యథేచ్ఛగా మట్టి తరలింపు ● నిత్యం వందలాది టిప్పర్లలో రవాణా ● చోద్యం చూస్తున్న అధికారులు చేజర్ల: అమాత్యుడు ఆనం రామనారాయణరెడ్డికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో రహదారుల నిర్మాణం కోసం ఉలవపల్లిలోని ప్రభుత్వ భూమిలో గ్రావెల్ గుట్టను ఇటీవల పది రోజుల పాటు గుల్ల చేశారు. తాజాగా అక్కడి చెట్లకు ప్రభుత్వ భూముల్లో ఉన్న సారవంతమైన మట్టిని వందలాది టిప్పర్లలో రోజూ తరలిస్తున్నారు. తూర్పుకంభంపాడు నుండి పెరుమాళ్లపాడులోని క్షేత్రానికి పగలూ, రాత్రనే తేడా లేకుండా రవాణా చేస్తున్నారు. మంత్రి విషయం కావడంతో అటువైపు కన్నెత్తి చూసే సాహసాన్ని అధికారులు చేయలేకపోతున్నారు. గుట్టను మాయం చేసి.. మండలంలోని ఉలవపల్లిలో కోర్టు పరిధిలో వివాదాస్పదంగా ఉన్న సర్వే నంబర్ 124లో గ్రావెల్ గుట్టను సగం మేర మాయం చేశారు. ఇదే విషయమై పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. అధికారం నాది.. ప్రభుత్వం మాది.. తనను ఎవరేమి చేస్తారనే ధీమాతో వ్యవసాయ క్షేత్రంలో రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం అక్కడి చెట్లకు సారవంతమైన మట్టిని తూర్పు కంభంపాడులోని ప్రభుత్వ భూముల నుంచి మూడు రోజులుగా తరలిస్తున్నారు. ఫలితంగా అక్కడ భారీ గుంతలు ఏర్పడ్డాయి. రానున్న రోజుల్లో వర్షాలు కురిస్తే ఇక్కడ నీరు చేరి ప్రమాదాలు జరిగే అవకాశం పొంచి ఉంది. కూటమి ప్రభుత్వమొచ్చాక తమ అగచాట్లు వర్ణనాతీతమయ్యాయని స్థానికులు పేర్కొంటున్నారు. -
యథేచ్ఛగా గ్రావెల్ తరలింపు
● పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు కలిగిరి: కలిగిరి పెద్ద చెరువు నుంచి గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ తంతు జరుగుతున్నా, ఇరిగేషన్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆదివారం హిటాచీ, నాలుగు టిప్పర్లలో జోరుగా తరలించారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు ఉండటంతో అటువైపు కన్నెత్తి చూసేందుకు అధికారులు సాహసించడంలేదు. వ్యవసాయ పనులకంటూ కొంత మేర అనుమతులు పొంది, ప్రైవేట్ స్థలాలకు మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలిగిరి పెద్ద చెరువులో భారీ యంత్రాలు, టిప్పర్ల ద్వారా మట్టిని తరలించడంతో పెద్ద గుంతులు ఏర్పడ్డాయి. చెరువు కట్ట సమీపంలోనే అక్రమంగా తరలిస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలిగిరిలోని ఇరిగేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ వ్యవహారం సాగుతుండటం గమనార్హం. ఉన్నతాధికారులు స్పందించి తరలింపునకు అడ్డుకట్టేసి పెద్ద చెరువును కాపాడాలని ఆయకట్ట రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. గ్రావెల్ను తరలిస్తున్న వాహనాలు టిప్పర్లో మట్టిని పోస్తున్న యంత్రం -
ఎండైనా.. బరువైనా.. బతుకు కోసం
కడుపు నింపుకోవడానికి ఎండను లెక్కచేయకుండా.. బరువును భుజాన మోస్తూ.. చెమటను చిందిస్తూ.. ప్రమాదాలను సైతం పట్టించుకోకుండా శ్రమిస్తుంటారు కార్మికులు. జీవితం సాఫీగా సాగేందుకు ఒక్కొక్కరిదీ ఒక్కో పోరాటం. పనిలో కష్టం ఎంత ఉన్నా.. ఆ శ్రమ వెనుక ఉన్నది మాత్రం కుటుంబాన్ని నడిపించాలనే తపనే. పాత వస్తువులను సేకరించి వాటిని అమ్ముకోవడం నుంచి.. బరువైన సామగ్రిని మోసే వరకు.. నిర్మాణ పనుల్లో ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయడం నుంచి.. మండుటెండలో ధాన్యాన్ని ఆరబెట్టడం వరకు.. ఇలా పనులు వేరైనా లక్ష్యం మాత్రం ఒక్కటే. బతుకు బండి ఆగకూడదు. శ్రమను నమ్ముకున్న వారి జీవితాల్లో రోజూ ఓ పోరాటమే. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
అదుపుతప్పి కారు బోల్తా
● నలుగురికి గాయాలు మర్రిపాడు: నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై అల్లంపాడు క్రాస్రోడ్డు సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నుంచి కోవెలకుంట్లకు ఆదివారం ఏడుగురు వ్యక్తులు కారులో వెళ్తున్నారు. అల్లంపాడు క్రాస్రోడ్డు సమీపంలో కారు అదుపుప్పి రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఉన్న వారిని బయటకు తీశారు. గాయపడిన నలుగురిని 108 అంబులెన్స్లో ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారును ఆత్మకూరు ఎంవీఐ రాములు పరిశీలించారు. పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. నేడు ‘డయల్ యువర్ ఎస్ఈ’ నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారులు సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ పరిధిలో ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని ఎస్ఈ రాఘవేంద్రం సోమవారం నిర్వహించనున్నారు. నెల్లూరు విద్యుత్ భవన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. వినియోగదారులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు. ● తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం సీఎండీ శివశంకర్ ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వినియోగదారులు 89777 16661 నంబర్కు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు. స్వగ్రామానికి వెళ్తుండగా..● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిసీతారామపురం: అతను కుమార్తెను బడిలో వదిలాడు. పనికి అవసరమైన సామగ్రి తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అయితే విధి చిన్నచూపు చూడటంతో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మండలంలోని సీతారామపురం – పోరుమామిళ్ల ఘాట్ రోడ్డు మార్గంలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో మార్కాపురం జిల్లా సీఎస్ పురం మండలం నల్లమడగల ఎస్సీ కాలనీకి చెందిన గుడిగుంట్ల నారాయణ (45) అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నారాయణ ఆదివారం ఉదయం ఇంటి నుంచి తన కుమార్తెను మోటార్బైక్పై వైఎస్సార్ కడప జిల్లాకు తీసుకెళ్లి ఓ పాఠశాలలో వదిలిపెట్టాడు. తిరుగు ప్రయాణంలో అత్తగారి గ్రామమైన సాయిశెట్టిపల్లెకు వెళ్లి అక్కడున్న బేల్దారి సామగ్రిని తీసుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. దారిలో ఘాట్ రోడ్డులోని ఓ మలుపు వద్దకు వచ్చేసరికి బైక్ అదుపుతప్పి కింద పడటంతో తలకు బలమైన గాయమై మృతిచెందాడు. అటుగా వెళ్లే ప్రయాణికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. -
రిటైనింగ్ వాల్ పరిశీలన
సోమశిల: సోమశిల జలాశయాన్ని డ్యామ్ సేఫ్టీ కమిటీ సభ్యులు గోపాల్రెడ్డి, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు రెండు రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రాజెక్ట్ గ్యాలరీ, రిటైనింగ్ వాల్తో పాటు ప్రధానమైన జలాశయ ప్రాంతాలను పర్యవేక్షించారు. భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, చేపటాల్సిన అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను త్వరలోనే అందజేయనున్నామని వెల్లడించారు. సేఫ్టీ కమిటీ సభ్యులను ఈఈ శ్రీనివాస్కుమార్ సత్కరించారు. డీఈఈలు రవీంద్రప్రసాద్, విజయ్కుమార్, జేఈలు పెద్దిరాజు, పాపిశెట్టి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. 4 నుంచి బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ అల్లూరు: రాష్ట్ర సీనియర్స్ పురుషులు, సీ్త్రల బాల్బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలను సెప్టెంబర్ నాలుగు నుంచి ఆరు వరకు నిర్వహించనున్నారు. స్థానిక రామకృష్ణ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో మురళీకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం జరపనున్న పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ విజయ్శంకర్రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులు, కోచ్లు, మేనేజర్లు, న్యాయనిర్ణేతలకు వసతి, భోజన సదుపాయాలను కల్పించనున్నామని వెల్లడించారు. విజేతలకు బహుమతులను అందజేయనున్నారని చెప్పారు. అనంతరం పోటీలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. మేడా రామసుబ్బారెడ్డి, ప్రసాద్రెడ్డి, అసోసియేషన్ సభ్యులు రమేష్ బాబు, క్రాంతికుమార్, మురళి, మోహన్, సుబ్బన్న, శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్ష నెల్లూరు(అర్బన్): ఎంబీబీఎస్ను పూర్తి చేసి స్పెషలిస్ట్ కోర్సులో చేరేందుకు అవసరమైన నీట్ పీజీ ప్రవేశ పరీక్ష జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్.. కావలిలోని విశ్వోదయ కళాశాలలు.. నెల్లూరు రూరల్ మండలంలోని పొట్టేపాళెం వద్ద గల డిజిటల్ అయాన్ సెంటర్, జైశ్రీరామ్ ఇన్ఫ్రా ఐటీ సొల్యూషన్స్ సెంటర్లో పరీక్షలను నిర్వహించారు. 950 మందికి గానూ 34 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 20 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 85,246 మంది శనివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 34,085 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.3 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. ఉదయగిరి దుర్గం సందర్శన ఉదయగిరి: ఉదయగిరి దుర్గాన్ని విశాఖపట్నానికి చెందిన నేవీ బృందం ఆదివారం సందర్శించింది. దుర్గంపై ఉన్న పెద్ద, చిన్న మసీదులు, గుర్రపుశాల, కోనకాలువ తదితరాలను పరిశీలించారు. ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధనౌక ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నౌక పేరుతో ఉన్న ఉదయగిరిని సందర్శించామని తెలిపారు. అనంతరం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. 2026 – 27 విద్యా సంవత్సరంలో పాఠశాలలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి రూ.15 వేలు, రూ.పది వేలు, రూ.ఐదు వేల చొప్పున అందించాలని కోరుతూ ఈ మొత్తాన్ని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావుకు ఇచ్చారు. -
తక్షణమే తగ్గించాలి
నెల్లూరు (పొగతోట): నానాటికీ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు ప్రజల పాలిట గుదిబండలా మారుతున్నాయి. జీతాలు పెరగకపోవడం.. నూతనంగా కొలువులు లభించకపోవడంతో సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఆదాయాలు పెరగకపోగా, ఖర్చులు మాత్రం ఎక్కువవుతున్నాయి. యుద్ధం సాకుతో రేట్లను పెంచి ప్రజలను దోచుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. నెల్లూరులో స్టోన్హౌస్పేట కేంద్రంగా నిత్యావసర సరుకులు జిల్లా వ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. ఇక్కడే దాదాపు వెయ్యికిపైగా హోల్సేల్, రిటైల్ దుకాణాలున్నాయి. కందిపప్పు కిలోను రూ.130 నుంచి రూ.140 వరకు.. మినపప్పు కిలో రూ.120 నుంచి రూ.130కు, వేరుశనగ పప్పు కిలో రూ.180కు.. చింతపండు కిలో రూ.240.. చక్కెర కిలోను రూ.80 నుంచి రూ.90కు విక్రయిస్తున్నారు. చక్కెర ధరలు రెండు నెలల్లో విపరీతంగా పెరగడంతో కేఫ్ల నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు. వీటి రేట్లను పెంచితే ప్రజలు రావడంలేదని పేర్కొంటున్నారు. ప్రతి దానికీ యుద్ధమే కారణమంట..! పెట్రోల్, డీజిల్ ధరలు.. నిత్యావసర సరుకుల రేట్లు.. ఇలా ప్రతి దానికీ యుద్ధాన్ని కారణంగా చూపుతున్నారు. రవాణా చార్జీలు పెరిగాయని, ఈ ప్రభావం దీనిపై పడిందనే సమాధానం యజమానుల నుంచి వస్తోంది. ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతుల నుంచి రూ.పదికి కొనుగోలు చేసిన వస్తువు వినియోగదారుడికి చేరేసరికి రూ.45 నుంచి రూ.50 అవుతోంది. వచ్చిన ఆదాయాన్ని దళారులు, మధ్యవర్తులు, వ్యాపారులు స్వాహా చేస్తున్నారు. సరుకుల రేట్లు చూసి మహిళలకు కన్నీళ్లొస్తున్నాయి. ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో ఏం కొనాలన్నా.. తినాలన్నా, భయమేస్తోంది. రోజువారి కూలిలతో బతికే పేదలు ఎలా బతకగలరు. నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. అదుపు చేయాల్సిన ప్రభుత్వం మాటలతో కాలం గడుపుతోంది. ఇప్పటికై నా పాలకులు స్పందించి వీటిని నియంత్రించాలి. – రాసాల కుమారి, బెడుసుపల్లి, సీతారామపురం మండలం జిల్లాలో ఇలా.. మండుతున్న నిత్యావసర సరుకుల రేట్లు యుద్ధం సాకు చూపి భారీగా పెంపు మధ్య తరగతి అగచాట్లు నియంత్రించడంలో సర్కార్ వైఫల్యం ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న ప్రజలు కూటమి పాలనలో పేద, మధ్య తరగతి వర్గాలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు రాకెట్ వేగంతో ౖపైపెకి దూసుకెళ్తుండటంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో వీరున్నారు. యుద్ధాన్ని సాకుగా చూపి రేట్లను పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. సరుకుల కోసం రెండేళ్ల క్రితం వరకు ఓ చిన్న కుటుంబం నెలకు రూ.ఐదు వేల వరకు ఖర్చు చేసేది. అయితే ప్రస్తుతం ఇది రూ.ఎనిమిది వేలు దాటుతుండటంతో వారు ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా, నియంత్రించాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. ఈ తీరుపై ప్రజానీకం భగ్గుమంటోంది. రెవెన్యూ డివిజన్లు – 4 మండలాలు – 36 జనాభా – 24.16 లక్షలు కుటుంబాలు 6.29 లక్షలు -
రౌడీషీటర్ దారుణ హత్య
● నెల్లూరులో ఘటన ● పాతకక్షలే కారణమా? నెల్లూరు(క్రైమ్): రౌడీషీటర్ను కొందరు బండరాయితో తలపై కొట్టి అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నెల్లూరులోని ఆర్టీఓ కా ర్యాలయ సమీపంలోని ఖాళీ స్థలంలో ఆదివా రం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చంద్రమౌళి నగర్కు చెందిన లక్ష్మీశెట్టి సా యితేజ అలియాస్ కమ్మసాయి (24)పై వేదాయపాళెం పోలీస్స్టేషన్లో రౌడీషీట్ ఉంది. గతేడాది పోలీసులు అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపారు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చాడు. అనంతరం బుచ్చిరెడ్డిపాళెంలో ఉంటున్నట్లు తెలిసింది. ఆదివారం సాయితేజ వేదాయపాళెం పోలీస్స్టేషన్లో కౌన్సెలింగ్కు హాజరయ్యాడు. రాత్రి ఏం జరిగిందో తెలియదు గానీ గుర్తుతెలియని వ్యక్తులు అతడిని వెంబడించారు. ఆర్టీఓ కార్యాలయ సమీప ఖాళీ స్థలంలో సిమెంట్ రాయితో తలపై కొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న నగర ఇన్చార్జి, నెల్లూరు రూరల్ డీఎస్పీలు గిరిధర్, ఘట్టమనేని శ్రీనివాసరావు, వేదాయపాళెం ఇన్చార్జి ఇన్స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్య తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్టీం ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా ఆరాతీస్తున్నారు. హత్య వెనుక బీవీ నగర్కు ప్రాంతానికి చెందిన ఓ రౌడీషీటర్తోపాటు మరికొందరి ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. పాతకక్షలే హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దేవాలయాలకు భద్రత కరువు
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో ఆలయాలకు భద్రత కొరవడటంతో దొంగలు విజృంభిస్తున్నారు. గ్రామాలకు దూరంగా, ప్రధాన రహదారులు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్నవాటిని లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి తర్వాత చోరీలకు పాల్పడుతున్నారు. గేట్లు, తలుపులు పగులగొట్టి విగ్రహాలపై ఉన్న బంగారు ఆభరణాలు, హుండీల్లోని కానుకలను ఎత్తుకెళ్తున్నారు. కొన్నిచోట్ల హుండీలను ఆలయాలకు దూరంగా పడేసి నగదును అపహరిస్తున్నారు. చోరీల నివారణలో పోలీసు యంత్రాంగం, ముందస్తు భద్రతా చర్యలు చేపట్టడంలో ఆలయ కమిటీలు విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయాలు, దర్గాలు, మసీదులు, చర్చిల్లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ శాఖ గతంలోనే సూచించినా.. అనేకచోట్ల ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తే చోరీలు, దాడులు జరిగినప్పుడు వాటికి సంబంధించిన దృశ్యాలు దర్యాప్తులో కీలక ఆధారాలుగా ఉపయోగపడతాయని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికై నా ఆలయ కమిటీలు అప్రమత్తమై సూచనలు పాటించి భద్రతను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. వరుస ఘటనలు తప్పనిసరిగా భద్రతా చర్యలు వరుసగా చోటుచేసుకుంటున్న దొంగతనాలతో ఆలయాల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో ఎలాంటి నిఘా లేకపోవడం, సీసీ కెమెరాలు అందుబాటులో లేకపోవడం, సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం దొంగలకు అనుకూలంగా మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏం చేయాలంటే.. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలి. రాత్రివేళల్లో సెక్యూరిటీ గార్డును నియమించుకోవాలి. ఆలయం మూసే ముందు తలుపులు, గేట్లకు తాళాలు సక్రమంగా వేశారో లేదో తనిఖీ చేసుకోవాలి. హుండీల్లోని కానుకలను తరచూ ఖాళీ చేయడంతోపాటు.. ఆలయ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలి. ఎవరైనా కనిపిస్తే వెంటనే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.కలిగిరి మండలంలో చోరీ జరిగిన కోదండరామస్వామి ఆలయం బంగారు ఆభరణాలు, నగదు తస్కరణ నిర్మానుష్య ప్రాంతాల్లోని ఆలయాలే టార్గెట్ కనీస జాగ్రత్తలు తీసుకోని కొందరు నిర్వాహకులు వరుస ఘటనలతో భక్తుల్లో ఆందోళనరెండు ఆలయాల్లో.. కలిగిరి: మండలంలోని చిన్నఅన్నలూరులోని కోదండరామస్వామి, అంకమ్మతల్లి ఆలయాల్లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు.. కోదండరామస్వామి ఆలయంలో అమ్మవారి మెడలోని మంగళసూత్రం దొంగతనం చేశారు. అంకమ్మ ఆలయంలో అమ్మవారి ముక్కుపుడక, హుండీని ఎత్తుకెళ్లారు. ఆదివారం గ్రామస్తుల సమాచారం మేరకు కలిగిరి పోలీసులు పరిశీలించారు. నెల్లూరు నుంచి వచ్చిన క్లూస్టీమ్ వేలిముద్రలను సేకరించింది. -
ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు
● మాజీ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు(టౌన్): ‘కూటమి ప్రభుత్వం నూతన పోకడలతో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయులను విస్మరిస్తోంది. ఇదే రీతిలో వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. నెల్లూరులోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం జిల్లా కమిటీ మధ్యంతర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవకోటేశ్వరరావు మాట్లాడుతూ టెట్ పేరుతో టీచర్ల ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు. టెట్పై వచ్చేనెల 3వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సరెండర్ లీవ్ బకాయిలు వెంటనే చెల్లించడంతోపాటు పీఆర్సీని నియమించి ఐఆర్ ప్రకటించాలన్నారు. బకాయిలు పడిన ఐదు డీఏలను మంజూరు చేయాలన్నారు. కార్పొషన్ పరిధిలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలన్నారు. అనంతరం బద్దలైన నిశబ్దం పుస్కకాన్ని బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి శేషు, చలపతిశర్మ, నాయకులు అచ్చయ్య, ఖాజావలీ, మురళీధర్, శ్రీదేవి, రమాదేవి, మధుసూదన్, నాగిరెడ్డి, బాలరాగయ్య, భారతి, శైలజ, శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీ వేమిరెడ్డిపై మాజీ మంత్రి అనిల్ సంచలన ఆరోపణలు
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వ హయాంలో భారీగా మైనింగ్ అక్రమాలు, అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. మైనింగ్ యజమానులను బెదిరించి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని, ఈ వ్యవహారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో సీబీఐ విచారణకు సిద్ధమా? అంటూ ఎంపీకి సవాల్ విసిరారు.మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మైనింగ్ పర్మిట్ల ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.55 కోట్ల ఆదాయం వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.7 కోట్లు, రూ.12 కోట్లకు పరిమితమైందని ఆరోపించారు. గూడూరు నియోజకవర్గంలో మైనింగ్ యజమానులను బెదిరించి టన్నుకు రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని అన్నారు.ఎగుమతులు చేయాలంటే కూటమి ఎంపీ అనుచరులకు తప్పనిసరిగా ‘శిస్తు’ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఒక్కో మైనింగ్ యజమాని నుంచి రూ.10 కోట్ల చొప్పున వసూలు చేసి దాదాపు రూ.200 కోట్లు సమీకరించారు. ఈ వ్యవహారం ‘ఫినీ క్వార్ట్జ్’ అనే కంపెనీ పేరుతో ఎంపీ అనుచరుడు విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సాగుతోందని పేర్కొన్నారు. చైనాకు చెందిన ‘డౌ’ అనే వ్యక్తిని తీసుకొచ్చి, అతనికే మైనింగ్ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. ఒక చైనా వ్యక్తిని రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ తరహా వ్యవహారాలు నడపడం దేశ భద్రతకు ముప్పుగా మారే అంశమని అన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు అవసరమని డిమాండ్ చేశారు.చదవండి: పార్టీ పదవుల భర్తీ అన్నారు.. ఎప్పుడు?తమకు ఎదురు తిరిగిన మైనింగ్ సంస్థలపై డీఎంజీ శాఖ ద్వారా చర్యలు తీసుకుని మైన్స్ మూసివేయిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలతో కొన్ని గనులు మూతపడే పరిస్థితి వచ్చిందని, వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల్లోనూ అక్రమ మైనింగ్ జరుగుతోంది. సైదాపురం మండలంలోని సిద్ధేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మైనింగ్ చేసి సహజ వనరులను దోచేస్తున్నారని అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి విచారణకు ఆదేశించినా అది ముందుకు సాగకుండా అడ్డుకునే స్థాయి ఒక్క ఎంపీ వేమిరెడ్డికే ఉందని ఆరోపించారు.తన ఆరోపణలకు మరిన్ని లోతైన ఆధారాలు ఉన్నాయని, వాటిని త్వరలో బయటపెడతానని అన్నారు. మైనింగ్ అక్రమాల్లో వేమిరెడ్డికి ఎలాంటి సంబంధం లేకపోతే సీబీఐ విచారణకు అంగీకరించాలని డిమాండ్ చేశారు. తన ఆరోపణలు అవాస్తవమని నిరూపిస్తే క్షమాపణ చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. -
ఓ అండ్ ఎం, ఎఫ్డీఆర్ పనుల్లో దోపిడీ
రూ.లక్షలు లూటీ చేసి.. కనీసం గుర్రపు డెక్క కూడా తొలగించని సౌత్ ఫీడర్ కాలువ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాకు జీవనాడి సోమశిల ప్రాజెక్ట్ అవినీతి పరుల పాలిట కల్పతరువుగా మారింది. ప్రాజెక్ట్ కాలువల నిర్వహణ పనుల పేరుతో సాగిన ఈ బాగోతం ఇరిగేషన్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏసీబీ ట్రాప్తో అవినీతి డొంక కదలగా, ఆర్టీఐ సమాచారంతో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పనుల వివరాలు అధికార యంత్రాంగానికే చెమటలు పట్టిస్తున్నాయి. తాగు, సాగునీటి కాలువల నిర్వహణను ఇరిగేషన్ శాఖ పర్యవేక్షిస్తోంది. తుఫాన్లు, వరదలు వచ్చి కాలువలు, చానల్స్ దెబ్బతిన్నప్పుడు చేపట్టే మెయింటెనెన్స్ పనుల పేరుతో రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసినట్లు వెలుగులోకి వస్తున్నాయి. ఎలాంటి పనులు చేయకుండానే సౌత్ ఫీడర్ చానల్ పనులు పూర్తి చేసినట్లు కాగితాల్లో చూపి ఏకంగా రూ.10 కోట్ల దోపిడీకి బినామీ కాంట్రాక్టర్తో కలిసి అధికారులు స్కెచ్ వేశారు. తట్టడు మట్టి తీయకుండానే బిల్లులు పెట్టేశారు... అధికారులు సైతం బిల్లులపై సంతకాలు చేసి అప్రూవల్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి ముగ్గురు ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లను అదుపులోకి తీసుకోవడంతో ఆ శాఖ అవినీతి బాగోతాలు బయటకు వస్తున్నాయి. ఆర్టీఐ సమాచారంతో ఇరిగేషన్ శాఖలో అక్రమాలు కోకొల్లలుగా వెలుగు చూస్తున్నాయి. మరో వైపు అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి సైతం ఈ దోపిడీ బాగోతాలపై సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. టెండర్స్ లేవు.. నామినేషన్లపైనే.. కలెక్టర్ మంజూరు చేసిన పనులకు సంబంధించి ఇప్పటి వరకు ఏ ఒక్క చోట పనిపూర్తి చేయలేదు. ఒకటీ అర చోట కాస్త మట్టిని చదును చేశారంతే. ఈ 100 పనులకు సంబంధించి టెండర్స్ పిలవలేదు. నామినేషన్లపై నచ్చిన వారికే కట్టబెట్టారు. కాగితాల్లోనే పనులు పూర్తి చేశారు.. ఖాతాల్లో నిధులు మళ్లించుకున్నారు. క్షేత్ర స్థాయిలో చేపట్టిన పనుల ఆనవాళ్లు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. కానీ ఫైళ్లలో మాత్రం పూర్తయినట్లు నమోదు చేశారు. చివరకు చేపట్టిన పనులకు కొలతల్లేవు.. తనిఖీల్లేవు.. కానీ బిల్లులకు మాత్రం అధికారులు ఆమోద ముద్రలు వేశారు. ఎఫ్ఏసీ ఎస్ఈపై ఆరోపణలు ఏసీబీ నిర్వహించిన దాడుల్లో ముగ్గురు ఇంజీనీర్లు మాత్రమే దొరికారు. ఎఫ్ఏసీ ఎస్ఈగా ఉన్న అధి కారి ఒకే పేరు మీద ఉన్న అన్ని బిల్లులకు ఎలా సంతకం చేశారో తెలియడం లేదు. క్షేత్ర స్థాయి పరిశీలన లేదు. మెజర్మెంట్ తీయలేదు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా పరిశీలించకుండా సర్టి ఫికెట్ ఇచ్చేశారు. ఈ వ్యవహారంలో బినామీ కాంట్రాక్టర్కు 50 శాతం, ఇరిగేషన్ శాఖలోని ఇంజినీర్లకు 50 శాతం వాటాల ఒప్పందంతోనే పనులు చేయకుండానే బిల్లులు సంతకాలయ్యాయి. గతంలో ఇదే అధికారి ఉన్నప్పుడు సోమశిల ప్రాజెక్ట్ నుంచి పాలకులకు, జిల్లా ఉన్నతాధికారులకు తెలియకుండా ఏకంగా ఒక టీఎంసీ నీటిని కిందికి వదిలేశారు. అప్పట్లో ఈ విషయమై పెద్ద దుమారమే చెలరేగింది. ఎవరి కోసం నీటిని వదిలారంటూ రచ్చ జరిగింది. ఇప్పుడు కూడా ఇదే అధికారి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయమై కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ జరపాల్సి ఉంది. విజిలెన్స్ విచారణ చేపడితే.. నిజాలు నిగ్గుతేలుతాయి. ఏసీబీ తనిఖీల్లో తప్పించుకున్న వారు సైతం పట్టుబడతారు. కాలువల్లో కమీషన్ వరద సోమశిల ప్రాజెక్ట్ కాలువల నిర్వహణ పనుల్లో అవినీతి వరద పోటెత్తింది. కంచే చేను మేసిన చందంగా ప్రాజెక్ట్ అధికారులే కాగితాల్లోనే డిజైన్లు చూపించి రూ.కోట్ల కమీషన్లుగా కొల్లగొట్టేశారు. క్షేత్ర స్థాయిలో పనుల ఆనవాళ్లు కనిపించకపోయినా.. ఫైళ్లలో మాత్రం పూర్తయ్యాయి. కొలతల్లేవు.. తనిఖీల్లేవు.. కానీ బిల్లులకు ఆమోద ముద్రలు లభించాయి. టెండర్లు లేకుండానే నామినేషన్ల పేరుతో ప్రాజెక్ట్ చైర్మన్ బినామీ కాంట్రాక్టర్కు పనులు కట్టబెట్టారన్న ఆరోపణలు, రూ.కోట్ల బిల్లులు సృష్టించి కాజేశారన్న ఫిర్యాదులు ఇప్పుడు ఇరిగేషన్ శాఖలో ప్రకంపనలు రేపుతున్నాయి. కాలువల్లో మట్టి తొలగించకుండానే తొలగించినట్లు, గండ్లు పూడ్చకుండానే పూడ్చినట్లు, అత్యవసర మరమ్మతులు చేయకుండానే చేసినట్లు బిల్లులు పెట్టడం మరింత కలకలం సృష్టిస్తున్నాయి. ఇలా ఒక్కటి కాదు.. రెండు కాదు.. వంద పనుల వరకు ఇదే తంతుగా సాగినట్లు ఆర్టీఐ సమాచారంతో అవినీతి బట్టబయలు కావడం, ఏసీబీ తనిఖీల నేపథ్యంలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఓఅండ్ఎం, ఎఫ్డీఆర్ పనుల్లో రూ.10 కోట్ల లూటీకి స్కెచ్ కాగితాల్లో పనులు.. ఖాతాల్లో సొమ్ములు బినామీ కాంట్రాక్టర్తో చక్రం తిప్పుతున్న ప్రాజెక్ట్ చైర్మన్ బిల్లుల అప్రూవల్లో ఎఫ్ఏసీ ఎస్ఈ కీలకపాత్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ఇరిగేషన్ శాఖలో ఏసీబీ దాడుల నేపథ్యంలో తవ్వేకొద్దీ అవినీతి ఊట ఆర్టీఐతో వెలుగులోకి వచ్చిన నిర్వహణ పనుల వ్యవహారం బినామీతో ప్రాజెక్ట్ చైర్మన్ లూటీపనులు చేయకుండా బిల్లులు చేసిన వాటిని కొన్నింటిని పరిశీలిస్తే.. 1. ఎస్పీ–ఎస్ఎఫ్సీ–ఓ అండ్ ఎం పనుల్లో 17.500 కి.మీ. నుంచి 23.000 కి.మీ. వరకు సెప్టెంబర్ 2025 నుంచి 26 జూలై 2026 నాటికి మట్టి, రాళ్లు, చెత్తాచెదారం తొలగించిన పనులు పూర్తి చేసినట్లు ఉంది. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ నంబర్ 368570 కాగా, చైర్మన్, సో మశిల ప్రాజెక్ట్ కమిటీ పేరుతో చేసినట్టు ఉంది. 2. 23.000 కి.మీ. నుంచి 28.000 కి.మీ. వరకు 371716 అగ్రిమెంట్ నంబర్తో బిల్లు ఓకే చేశారు. ఇక్కడ కూడా ఎలాంటి చెత్తను తొలగించడం గాని, రాళ్లను తొలగించడం గాని జరగలేదు. 3. 35.000 కి.మీ. నుంచి 38.500 కి.మీ. వరకు, 38.500 కి.మీ. నుంచి 42.000 కి.మీ. వరకు పనులు చేయలేదు. బిల్లు అప్రూవల్ చేశారు. ఇలా సుమారు 10 పేర్లకు పైగా ప్రాజెక్ట్ చైర్మన్ పేరుతోనే పనులు పూర్తయినట్టు వివరాలున్నాయి. 4. వాచ్ అండ్ వర్డ్ అరేంజ్మెంట్స్కు సంబంధించిన ఎస్ఎఫ్సీ పనులు 58.500 కి.మీ. నుంచి 70.000 కి.మీ. వరకు హర్షవర్ధన్ పేరుతో పూర్తి చేసినట్లు ఉంది. 5. అత్యవసర మరమ్మతుల పేరుతో కలువాయి సౌత్ ఫీడర్ 36.325 కి.మీ. నుంచి 38.125 కి.మీ. వరకు, 38.200 కి.మీ. నుంచి 40.100 కి.మీ. వరకు, 40.200 కి.మీ. నుంచి 42,100 కి.మీ. వరకు కలువాయి మండలంలో పనులు జరిగాయి. ఈ పనులను లీలామాధవ్ పూర్తి చేసినట్టు చూపారు. ఇలా 100 వరకు పనులు చేయకుండానే చేసినట్లు కాగితాల మీద బిల్లులు సృష్టించారు. అందిన కాడికి దోచుకున్నారు. ఈ పనులకు సంబంధించి అవినీతిలో సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ వి. కేశవచౌదరి చక్రం తిప్పారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఏసీబీకి ఇంజినీర్లతోపాటు కేశవచౌదరి బినామీ కాంట్రాక్టర్ పట్టుబడ్డాడు. సదరు బినామీ కాంట్రాక్టర్ చైర్మన్ సమీప బంధువే కావడం ఆరోపణలకు బలం చేకూరుతోంది. బినామీ కాంట్రాక్టర్ పేరుతోనే అనేక పనులు పూర్తి చేసినట్టు కాగితాల్లో ఉన్నాయి. ఒకే వ్యక్తికి చెందిన అగ్రిమెంట్, బిల్, అగ్రిమెంట్ నంబర్ అనేక పనుల్లో కనిపిస్తున్నాయి. ఇక్కడే అవినీతికి స్కెచ్ పడింది. అధికారం అండతో చెలరేగిపోయాడనే ఆరోపణలు ముంచెత్తుతున్నాయి. ఇరిగేషన్ ఇంజినీర్లకు లంచాలు ఎరవేసి పనులు చేయకుండానే బిల్లులు పెట్టేశారు. డ్యామ్లు, కాలువలు, గేట్లను క్రమబద్ధీకరిస్తూ పంట పొలాలకు సజావుగా నీటిని విడుదల చేసేందుకు, కాలువల పూడిక తీసేందుకు, గండ్లు పడకుండా చూసేందుకు, గేట్లను మరమ్మతులు చేయడం కోసం ఓ అండ్ ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) పనులకు ప్రతి ఏటా నిధులు విడుదలవుతాయి. భారీ వర్షాలు, వరదలతో కాలువలకు పడిన గండ్లు, డ్యామ్ గేట్ల అత్యవసర మరమ్మతులు, దెబ్బతిన్న సబ్ డివిజన్ ఆఫీస్ భవనాల పునరుద్ధరణకు ఎఫ్డీఆర్ (ఫ్లడ్ డ్యామేజీ రిపేర్స్) నిధులు మంజూరు చేస్తారు. 2024 నుంచి 2026 వరకు మోంథా, దిత్వా తుఫాన్ వల్ల దెబ్బతిన్న చానల్ పనులకు, ఇతర పనులకు కలెక్టర్ 100 పనులకు రూ.10 కోట్లు మంజూరు చేశారు. -
శ్రీశైలం నుంచి జలాలను విడుదల చేయాలి
నెల్లూరు రూరల్: శ్రీశైలం జలాశయంలో నీరు సమృద్ధిగా ఉన్నా, జిల్లాలోని సోమశిల, కండలేరుకు జలాలను విడుదల చేయకుండా రైతులను కూటమి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. జిల్లా రైతులు, ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారీ వ్యత్యాసం ఏపీ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ గణాంకాలను పరిశీలిస్తే శనివారం ఉదయం ఎనిమిది గంటలకు శ్రీశైలం జలాశయంలో నిల్వ 153.5 టీఎంసీలుగా ఉందని, అంటే దాదాపు 71 శాతమని చెప్పారు. అదే సమయంలో 78 టీఎంసీల సామర్థ్యమున్న సోమశిలలో 20.64.. 68 టీఎంసీల సామర్థ్యం గల కండలేరులో 20.15 టీఎంసీలే ఉన్నాయని వివరించారు. సోమశిల నుంచి 2863.. కండలేరు నుంచి 2580 క్యూసెక్కులను వివిధ అవసరాల నిమిత్తం విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు. ఎందుకు విడుదల చేయడంలేదు..? శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉంటే, గ్రావిటీ ద్వారా పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసే అవకాశమున్నా, ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. నెల్లూరులోని ప్రాజెక్టులకు ఎందుకు విడుదల చేయడంలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నీటి పారుదలపై కాకుండా నిధుల పారుదలపైనే ప్రభుత్వానికి ఆసక్తి ఉందని విమర్శించారు. జిల్లా ఇరిగేషన్ వ్యవస్థ దొంగ బిల్లులమయంగా మారిందని ఆరోపించారు. సర్వేపల్లి రిజర్వాయర్కు రూ.50 కోట్ల మంజూరు పేరుతో అవసరం లేని పనులు చూపించి బిల్లులను డ్రా చేసే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టారా..? శ్రీశైలం నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి, లిఫ్ట్ ఇరిగేషన్ అవసరాల కోసం నీటిని వినియోగించుకుంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు. అక్కడి సీఎం రేవంత్రెడ్డితో ఉన్న సంబంధాల కోసం రాష్ట్ర రైతుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఇక్కడి ప్రజల ఓట్లతో గెలిచి.. తెలంగాణ ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వడం దారుణమని, ఇలాంటి చర్యలను చరిత్ర క్షమించదని స్పష్టం చేశారు. నెల్లూరుకు ఇదేనా ప్రతిఫలం..? గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో పది స్థానాలను టీడీపీకి ప్రజలు కట్టబెట్టారని, అయినా ఇక్కడి ప్రయోజనాలను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయలేని పరిస్థితుల్లో జిల్లా ప్రజాప్రతినిధులు ఉండటం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు, లోకేశ్కు భయపడి కూటమి నేతలు నోరు మెదపడంలేదని, వీటిని జిల్లా రైతులు, ప్రజలు ఊరుకోబోరని హెచ్చరించారు. రానున్న రోజుల్లో సాగునీటితో పాటు తాగునీటి సమస్యా తీవ్రరూపం దాల్చే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. మెట్ట ప్రాంతాల్లో ఇప్పటికే రైతులు ఇబ్బందులు పడుతున్నా, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, విత్తనాల పంపిణీ, పశుగ్రాసం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించడంలేదని విమర్శించారు. జిల్లాలో నీటి పరిస్థితిపై సమీక్ష సమావేశాన్ని వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష జరిపి రైతుల ప్రయోజనాలను కాపాడేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. మొదటి పంటకు సాగునీరందించేలా చూడాలని డిమాండ్ చేశారు. శ్రీశైలంలో నీరు అందుబాటులో ఉన్నప్పుడే సోమశిల, కండలేరును క్రమంగా నింపుకోవాలని సూచించారు. ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా ప్రజలు, రైతాంగం తరఫున తమ పార్టీ ఉద్యమించనుందని స్పష్టం చేశారు. సోమశిల, కండలేరును ఖాళీ చేసి రైతులకు ద్రోహం చేస్తారా..? నీటి నిర్వహణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి -
158 మందికి ఉద్యోగాలు
నెల్లూరు (టౌన్): నగరంలోని డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన జాబ్మేళాలో 158 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అభ్యర్థులకు ఆయా కంపెనీల ప్రతినిధులు నియామక పత్రాలను అందజేశారు. మొత్తం 19 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గిరి, వైస్ ప్రిన్సిపల్ రమణారావు, జేకేసీ కోఆర్డినేటర్ గీత, జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వినయ్కుమార్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్ఖయ్యూం, సెట్నల్ సీఈఓ నాగేశ్వరరావు, లలిత, ఏడుకొండలు, వేణు తదితరులు పాల్గొన్నారు. ‘ఐఎన్ఎస్ ఉదయగిరి’కి ఏడాది ● నేవీ బృందం బైక్ ర్యాలీ ఉదయగిరి: ‘ఐఎన్ఎస్ ఉదయగిరి’ యుద్ధ నౌక ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా విశాఖ నుంచి నేవీ బృందం చేపట్టిన బైక్ ర్యాలీ శనివారం ఉదయగిరికి చేరింది. ముందుగా వీరు పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలు సందర్శించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ కమాండర్ సూరజ్ గణేశ్, లెఫ్టినెంట్ భారత్ అనుక మాట్లాడుతూ 2025 ఆగస్టు 26న ‘ఐఎన్ఎస్ ఉదయగిరి’ నౌక ప్రారంభమైందన్నారు. తొలి వార్షికోత్సవం సందర్భంగా ఉదయగిరి పట్టణాన్ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, రక్షణ రంగంపై ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు ఈ ఏడాది నుంచి నేవీ తరఫున ఉపకార వేతనాలు అందిస్తామని తెలిపారు. అనంతరం పాఠశాల తరఫున హెచ్ఎం, ఉపాధ్యాయులు వారికి జ్ఞాపిక అందజేశారు. నేవీ సిబ్బంది రామునివాస్, సుమిత్, పి.విశ్వేశ్వరరావు, అర్నాకులేరియా, లోకేశ్, పాఠశాల హెచ్ఎం జి.శ్రీనివాసులు, ఇండియన్ నేవీ సిబ్బంది పాల్గొన్నారు. -
అమాంతం పెరిగిన నిమ్మ ధరలు
● బస్తా కాయలు రూ.12 వేలు పొదలకూరు: తోటల్లో కాయలు గణనీయంగా తగ్గిపోవడంతో నిమ్మ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. పొదలకూరు నిమ్మ మార్కెట్ యార్డులో బస్తా (లూజు) రేట్లు రూ.12 వేలు ప్రస్తుతం పలుకుతున్నాయి. కిలోల వంతునైతే ఇది రూ.85 నుంచి రూ.150 వరకు ఉందని వ్యాపారులు వెల్లడించారు. శ్రావణ మాసం సందర్భంగా తమిళనాడులో నిమ్మకాయలకు డిమాండ్ బాగా పెరిగింది. ఫలితంగా ఇక్కడ ధరలు ఎగబాకుతున్నాయి. అయితే తోటల్లో కాయల్లేకపోవడంతో రైతులకు పెద్దగా ఉపయోగం లభించడంలేదు. మార్కెట్కు కాయలు స్వల్పంగా వస్తుండటంతో ఎగుమతి తగ్గిపోతోంది. తోటల నుంచి దిగుబడి ఇప్పట్లో పెరిగే అవకాశం లేదు. నీట్ పీజీ పరీక్షకు పటిష్ట బందోబస్తు నెల్లూరు(క్రైమ్): నీట్ పీజీ పరీక్షకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని ఎస్పీ అజిత వేజెండ్ల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా లోని నాలుగు కేంద్రాల్లో ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరగనుందని, అభ్యర్థులు ముందే చేరుకోవాలని సూచించారు. ఉదయం 8.30 తర్వాత ఎవర్నీ అనుమతించబోమని స్పష్టం చేశారు. సోమశిల జలాశయంలో తనిఖీ సోమశిల: సోమశిల డ్యామ్ను జలాశయ భద్రత కమిటీ అధికారులు క్షేత్రస్థాయిలో శనివారం సందర్శించారు. ప్రస్తుత నీటి నిల్వ వివరాలపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. క్రస్ట్ గేట్ల పనితీరు, జలాశయ ప్రస్తుత స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం డ్యామ్ మ్యాప్ను పరిశీలించి భవిష్యత్తులో చేపట్టాల్సిన రక్షణ చర్యలు, జాగ్రత్తలపై ఇంజినీర్లతో చర్చించారు. జలాశయ దృఢత్వం, పటిష్టతపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక పరిశీలన జరిపారు. క్షేత్రస్థాయిలో సేకరించిన పూర్తి నివేదికను ప్రభుత్వానికి త్వరలోనే సమర్పించనున్నామని వెల్లడించారు. కమిటీ అధికారులు గోపాల్రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, తెలుగుగంగ ఎస్ఈ సుబ్రహ్మణ్యరావు, సోమశిల ఈఈ శ్రీనివాసులు, డీఈఈలు రవీంద్ర ప్రసా ద్, విజేందర్ బాబు తదితరులు పాల్గొన్నారు. సింహపురిలో నిధి అగర్వాల్ సందడి ● ఏకాధి సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ప్రారంభం నెల్లూరు(బృందావనం): నగరంలోని ఆచారివీధిలో ఏర్పాటు చేసిన ఏకాధి సిల్వర్ జ్యువెలరీ స్టోర్ను సినీ నటి నిఽధి అగర్వాల్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నాణ్యమైన వెండి ఆభరణాలు, వినూత్న డిజైన్లతో నెల్లూరు నగర ప్రజలకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఏకాధి సిల్వర్ జ్యువెలరీని ఆదరించాలని కోరారు. గతంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నెల్లూరుకు తానొచ్చానని చెప్పారు. మలైకాజా.. నెల్లూరు భోజనం తనకెంతో ఇష్టమని తెలిపారు. హిందీ, తెలుగులో రెండు చొప్పున సినిమాల్లో నటిస్తున్నానని, త్వరలోనే విడుదల కానున్నాయని పేర్కొన్నారు. ఏకాధి సిల్వర్ జ్యువెలరీ డైరెక్టర్లు వేణు రాచకొండ, శివచరణ్ ఉప్పలంచి, నెల్లూరు ఫ్రాంచైజ్ భాగస్వాములు వానరాసి గౌతమ్, కొండేటి సాయికృష్ణ, యన్నారు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘కారుణ్యం’ చూపని ఆర్అండ్బీ
● భర్తను కోల్పోయిన భార్య ● కారుణ్య నియామకం కోసం ఏడాదిన్నరగా ఎదురుచూపులు ● మరోవ్యక్తికి అదే పరిస్థితి ● రెండు రోజులు ఆగితే ఉద్యోగం కష్టమే నెల్లూరు(అర్బన్): కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న భర్త ఆర్అండ్బీ శాఖలో వాచ్మెన్గా చిరుద్యోగం చేస్తూ మృతిచెందడంతో ఆమెకు పూట గడవడం కూడా కష్టంగా మారింది. నిబంధనల మేరకు కనీసం కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం వస్తుందని గిరిజన మహిళ భావించింది. అయితే ఏడాదిన్నరగా ఆ ఆశ నెరవేరలేదు. దరఖాస్తులతో ఆర్అండ్బీ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ వారు పట్టించుకోకుండా మరో అధికారి వద్దకు వెళ్లాలని తిప్పుకుంటున్నారు. గూడూరులోని మరో వ్యక్తి పరిస్థితి కూడా ఇలానే ఉంది. కాగా కొత్త జిల్లాలకు ఉద్యోగుల విభజన నేపథ్యంలో ఈనెలాఖరుతో కారుణ్య నియామకాలకు బ్రేక్ పడనుంది. దీంతో వారు శనివారం నగరంలోని ఆర్అండ్బీ సర్కిల్ కార్యాలయంలో నేల మీద కూర్చొని నిరాహార దీక్ష చేపట్టారు. వాచ్మెన్గా పనిచేస్తూ మృతి కోవూరుకు చెందిన గిరిజనుడు తుపాకుల శేషయ్య నెల్లూరు ఆర్అండ్బీ డివిజన్ కార్యాలయంలో వాచ్మెన్గా పనిచేస్తూ ఒకటిన్నర సంవత్సరం క్రితం మృతి చెందాడు. దీంతో భార్య ఒంటరిదైంది. బతికేందుకు భర్త ఉద్యోగం తనకు ఇప్పించాలని ఆమె దరఖాస్తు చేసుకుంది. ఆమె గిరిజనురాలు కావడంతో పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేకుండాపోయింది. దీనిని సాకుగా పెట్టుకుని ఉద్యోగం ఇవ్వలేమని.. పుట్టిన తేదీ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని అధికారులు తెలిపారు. దీంతో ఆమె కలెక్టర్కు అర్జీ ఇచ్చింది. ఆయన సర్వజన ఆస్పత్రిలో ఆర్థోపెడిక్, డెంటల్, ఫోరెన్సిక్, రేడియోలజీ విభాగాలకు చెందిన డాక్టర్ల కమిటీని ఏర్పాటు చేసి పుట్టిన తేదీ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించారు. వారు పరిశీలించి ఆమె వయస్సును 36 ఏళ్లుగా నిర్ధారించారు. సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే అది కూడా చెల్లదని ఆర్అండ్బీ అధికారులు కొర్రీ వేసి ఆర్డీఓ ద్వారా తెచ్చుకోవాలని కోరారు. కాగా ఆర్డీఓ పెద్దాస్పత్రి డాక్టర్ల సర్టిఫికెట్ పరిశీలించి విచారణ జరిపి సచివాలయం ద్వారా 1990 సంవత్సరం అక్టోబర్ నెలలో పుట్టినట్టు సర్టిఫికెట్ను ఇచ్చారు. ఫైనాన్స్ శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ కొత్త జిల్లాలకు ఉద్యోగుల విభజన నేపథ్యంలో పోస్టింగ్లు, ప్రమోషన్లు లాంటి వాటిని నిలిపేశారు. అయితే అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో ప్రభుత్వాదేశాల మేరకు ఫైనాన్స్ శాఖ ఈనెల 22న ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఉద్యోగాలిచ్చి తర్వాత ఆపేయాలని ఉత్తర్వులిచ్చింది. ఈ రెండు రోజులు ఆగితే ఇక బాధితులకు ఇప్పట్లో ఉద్యోగాలు రావు. జియావుల్ హక్కు తప్పని ఇబ్బందులు గూడూరు ఆర్అండ్బీ డివిజన్ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తూ షేక్ మెహతాబ్ అనే మహిళ జూన్ నెలలో మృతి చెందింది. ఆమె కుమారుడు జియావుల్ హక్ కూడా కారుణ్యనియామకం కింద తనకు వాచ్మెన్ పోస్టు కల్పించాలని ఆర్అండ్బీ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. లంచాలు ఇవ్వనందునే.. నానా కష్టాలు పడి అధికారులు అడిగిన సర్టిఫికెట్లను తెచ్చి కారుణ్య నియామకాల కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంలో ఆశాఖ సూపరింటెండెంట్, క్లర్క్ తదితర వారికి లంచాలు ముట్టలేదనే ప్రచారం జరుగుతోంది. పూట గడవని వారు లంచాలు ఇవ్వకపోవడంతో అసలు ఇప్పట్లో ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. కలెక్టర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
జిల్లా జైలులో ఖైదీ మృతి
వెంకటాచలం: అనారోగ్యం కారణంగా మండలంలోని చెముడుగుంట వద్దనున్న జిల్లా జైలులో ఖైదీ మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరు రూరల్ సుందరయ్య కాలనీకి చెందిన షేక్ చిన మౌలాలి(48) కొంతకాలంగా జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. శనివారం ఉదయం మౌలాలి తన సెల్లో అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో మరో ఖైదీ గమనించి వార్డెన్కు సమాచారం అందించాడు. వెంటనే చికిత్స నిమిత్తం జైలు అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించాడని నిర్ధారించారు. ఈ విషయాన్ని వెంకటాచలం పోలీసులకు తెలియజేశారు. జైలు సూపరింటెండెంట్ ఎం.వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలుడులో గాయపడిన మహిళ మృతి ఆత్మకూరురూరల్: గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలో ఈనెల 11న జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో షేక్ జమీల తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆమెను మెరుగైన వైద్యం కోసం చైన్నెలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందారు. ఆమె మృతదేహాన్ని శనివారం స్వగ్రామమైన మహిమలూరుకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. నిమ్మధరలు (కిలో) పెద్దవి : రూ.150 సన్నవి : రూ.85 పండ్లు : రూ.40 -
రంగులు కలిపిన చికెన్, పాడైపోయిన కాలీఫ్లవర్
● బుచ్చిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు బుచ్చిరెడ్డిపాళెం: ఫుడ్ సేఫ్టీ అధికారులు బుచ్చిరెడ్డిపాళెం పట్టణ పరిధిలో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గిరిజాహాల్ సెంటర్, మలిదేవి సెంటర్, బస్టాండ్ ప్రాంతంలోని కొన్ని హోటళ్లలో కృత్రిమ రంగులు కలిపిన, పాడైపోయిన చికెన్, సరిగా ఉడకని చపాతీలు, పరోటాలు, వినియోగానికి అనర్హమైన కాలీఫ్లవర్ తదితర ఆహార పదార్థాలను గుర్తించారు. సుమారు ఐదు కేజీల పాడైన కాలీఫ్లవర్తో పాటు ఇతర నాణ్యత లేని ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. అలాగే పలుచటి పాలిథిన్ కవర్లలో వేడి పదార్థాలను ప్యాక్ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించి, వాటిని నిలిపివేయాలని వ్యాపారులను హెచ్చరించారు. సుమారు 15 కేజీల పాడైపోయిన చికెన్ను ధ్వంసం చేశారు. పరిశుభ్రత పాటించని ఏడు హోటల్స్కు అధికారులు నోటీసులు జారీ చేశారు. అలాగే ఆహార తయారీ ప్రదేశాల్లో అపరిశుభ్రత, నిబంధనలు ఉల్లంఘించిన ఐదు హోటల్స్పై కేసులు నమోదు చేశారు. -
బాలికలు అన్నిరంగాల్లో రాణించాలి
వెంకటాచలం: బాలికలు చదువుతో పాటు అన్నిరంగాల్లోనూ రాణించాలని ఎస్పీ అజిత వేజెండ్ల పిలుపునిచ్చారు. మండలంలోని సరస్వతీనగర్ వద్దనున్న అక్షర విద్యాలయంలో సీబీఎస్ఈ క్లస్టర్–7 బాలికల బాస్కెట్ బాల్ పోటీలను ఆమె శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత దేశానికి ఎంతో అవసరమని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో రెండు తెలు గు రాష్ట్రాలకు చెందిన 120 టీమ్లకు గాను 1,500 మంది బాలికలు, వారితో పాటు కోచ్లు, మేనేజర్లు పాల్గొన్నారు. పాఠశాల డైరెక్టర్ కుముద, ప్రిన్సిపల్ ప్రియా జాకబ్, స్వర్ణభారత్ ట్రస్ట్ కోఆర్డినేటర్ జనార్దన్రాజు పాల్గొన్నారు. -
చికెన్ వ్యర్థాలు, అక్రమ మద్యం స్వాధీనం
బుచ్చిరెడ్డిపాళెం: చికెన్ వ్యర్థాలను అక్రమంగా తరలిస్తూ, తమిళనాడు రాష్ట్రానికి చెందిన మద్యాన్ని రవాణా చేస్తున్న ముగ్గురిపై బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. మినగల్లు గ్రామ సమీపంలో చికెన్ వ్యర్థాలను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో బడా దోస్త్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా 14 డ్రమ్ముల్లో చికెన్ వ్యర్థాలు ఉండటంతో పాటు తమిళనాడు రాష్ట్రానికి చెందిన మెక్లీన్ బ్రాందీ ఐదు మద్యం సీసాలు లభ్యమయ్యాయి. వాహనంలో ఉన్న నలబాయి వంశీ, ఎజ్జగిరి ప్రేమ్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరు చికెన్ వ్యర్థాలను మినగల్లు గ్రామంలోని చేపల చెరువు యజమాని నరసింహారెడ్డికి అప్పగించేందుకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చికెన్ వ్యర్థాలు, మద్యం సీసాలతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
రైతులను ముంచడమే చంద్రబాబు ఉద్దేశమా?: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని ఉపయోగించుకోవడంలో కూటమి పూర్తి స్థాయిలో విఫలం అయిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శ్రీశైలంలో నుంచి సోమశిల, కండలేడు జలాశయాలకు ఎందుకు విడుదల చేయడం లేదు? అంటూ ప్రశ్నించారు.పోతిరెడ్డిపాడు హెడ్ రెగులేటర్ను ఉపయోగించి వెంటనే ఎందుకు నీరు వినియోగించడం లేదు. నెల్లూరు, రాయలసీమ రైతులను నిట్టనిలువుగా ముంచడమే చంద్రబాబు ఉద్దేశమా?. నెల్లూరులో జలాశయాలు అడుగంటి పోయే పరిస్థితి ఏర్పడింది. 71 శాతం వరకు పుష్కలమైన నీరు శ్రీశైలంలో వున్న నీటిని వినియోగించుకోకపోవడంలో మీ దురుద్దేశం ఏంటి? అంటూ కాకాణి నిలదీశారు.‘‘మరో వైపు తెలంగాణ శ్రీశైలం నీటి ఎడాపెడా దోచుకుంటున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏపీ రైతుల జీవితాలను తాకట్టు పెడుతున్నాడా..?. నీటి యాజమాన్య పద్దతులను ఏనాడు పాటించిన పాపాన పోలేదు. మొదటి పంటకే నీరు కరువైంది. నెల్లూరు జిల్లా రైతాంగం ఆందోళన చేపట్టే పరిస్థితులు తలెత్తాయి’ అని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: అలిగి వెళ్లిపోయిన దానం నాగేందర్ -
పేదల కల సాకారానికే జగనన్న కాలనీలు
● గత సీఎం జగన్మోహన్రెడ్డికి పేరొస్తుందనే నిలిపివేత ● న్యాయస్థానాల్లో సైతం అడ్డుకునేందుకు ప్రభుత్వ యత్నం ● లేఅవుట్లో ప్లాట్లనూ వదలకుండా గ్రావెల్ దందా ● ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరు: దశాబ్దాలుగా ఇల్లు లేని పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరుతో ఊళ్లనే నిర్మించేందుకు చిత్తశుద్ధితో కృషి చేశామని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు సమీపంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన జగనన్న కాలనీలో పక్కా గృహాలను జగనన్న కాలనీ – చంద్రబాబు కహానీ పేరుతో పార్టీ శ్రేణులు, లబ్ధిదారులతో ర్యాలీగా వెళ్లి శుక్రవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణాలను అర్ధాంతరంగా నిలిపేయడంపై మండిపడ్డారు. జగనన్న గృహం – చంద్రబాబు ద్రోహం పేరిట ప్రజాచైతన్య కార్యక్రమాలను ఇక నుంచి ప్రతి మంగళవారం నిర్వహించనున్నామని వెల్లడించారు. ఎమ్మెల్యే స్థాయిని సోమిరెడ్డి దిగజార్చుకొని చౌకబారు పనులు చేస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అండగా నిలిచామని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 25 లక్షల గృహాలను మంజూరు చేశామని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులున్నా నివేశన స్థలాలు, ఇళ్లను ఇచ్చిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. అతిపెద్ద టౌన్షిప్గా తీర్చిదిద్దాం పొదలకూరు సమీపంలోని చిట్టేపల్లి తిప్పకు దిగువన 45 ఎకరాల్లో 1500 కుటుంబాలకు జగనన్న కాలనీలో ప్లాట్లను కేటాయించి నుడా నిబంధనల మేరకు 40, 50 అడుగుల వెడల్పు రోడ్లను నిర్మించడమే కాకుండా మౌలిక సదుపాయాలను కల్పించి అతిపెద్ద టౌన్షిప్గా మార్చామని పేర్కొన్నారు. 1100 ఇళ్లను మంజూరు చేసి, 530 నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభించి, వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని తెలిపారు. అమరావతి తరహాలో ఇక్కడా ఇళ్లు నిర్మించేందుకు వీల్లేదంటూ న్యాయస్థానాలను సోమిరెడ్డి అండ్ కో ఆశ్రయిస్తే సమర్థంగా వాదనలు వినిపించడంతో వీరి పిటిషన్ వీగిపోయిందని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇక్కడి ఇళ్లకు గ్రహణం పట్టిందని, నాణ్యత లేకుండా నిర్మించారంటూ విజిలెన్స్ విచారణకు ఆదేశించారని తెలిపారు. అయితే ఇళ్లను పరిశీలించిన నిపుణులు, విజిలెన్స్ అధికారులు నివాసాలకు ఆమోదయోగ్యంగా ఉన్నాయనే నివేదికను ఇచ్చారన్నారు. తమ ప్రభుత్వంలో ప్రతి మండలాన్ని అర్బన్ పరిధిలోకి తీసుకురావడంతో ఇంటి నిర్మాణానికి రూ.2.15 లక్షల వరకు అందజేసే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. అయితే వీటిని చంద్రబాబు తొలగించడంతో ప్రస్తుతం రూ.1.59 లక్షలే సాయమే అందుతోందని వివరించారు. హద్దు రాళ్లను పీకేసీ గ్రావెల్ దందా జగనన్న లేఅవుట్లో హద్దు రాళ్లను పీకేసీ కొండకింద ఏర్పాటు చేసిన ప్లాట్లలో నాణ్యమైన గ్రావెల్ను అధికార పార్టీకి చెందిన వారు అక్రమంగా తరలించారని ఆరోపించారు. మహిళలకు కేటాయించిన ప్లాట్లలో గ్రావెల్ గుంతలు ఏర్పడటంతో లబ్ధిదారులు కన్నీరుమున్నీరవుతున్నారని చెప్పారు. విద్యుత్ స్తంభాలు, ప్లాట్లలో గ్రావెల్ దందాతో ఏర్పడిన పెద్ద గోతులను చూపారు. నేతలు పెదమల్లు రమణారెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, వాకాటి శ్రీనివాసులురెడ్డి, జెడ్పీటీసీ నిర్మలమ్మ, ఎంపీటీసీలు లక్ష్మీకల్యాణి, శ్రీనివాసులు, వూకోటి లక్ష్మీనారాయణ, రావుల ఇంద్రసేన్గౌడ్, వేణుగోపాల్రెడ్డి, అంజద్, వెంకటశేషయ్య తదితరులు పాల్గొన్నారు. -
అత్యంత వివాదాస్పదం
గత ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేపై తీవ్రమైన దుష్ప్రచారం చేసిన కూటమి పార్టీల నేతలు.. అధికారంలోకి వచ్చాక భూముల రీసర్వేను అత్యంత వివాదాస్పదంగా మార్చేసింది. సర్వే నంబర్ల వారీగా ముందుగా సర్వే చేయడం లేదు. అక్షాంశాలు, రేఖాంశాలతో కచ్చితత్వ సర్వేకు తిలోదకాలిచ్చింది. రైతులకు తమ భూములకు సంబంధించి ఉన్న పత్రాలకు, రెవెన్యూ రికార్డుల్లో ఉన్న భూమికి, ఫీల్డ్లో వాస్తవ భూమికి తేడాలు ఉన్నా.. పట్టించుకోవడం లేదు. ఎవరి సాగులో ఎంత భూమి ఉంటే అంతే భూమికి హక్కులు కల్పిస్తామని చెబుతోంది. మీకేమైనా ఇబ్బందులు ఉంటే.. కోర్టుకెళ్లండంటూ భూ తకరారులకు ఆజ్యం పోస్తోంది. ప్రభుత్వ శివాయి భూములు, పొరంబోకు, చెరువు పొరంబోకులతోపాటు సీలింగ్ భూములు సైతం ఆక్రమణదారుల కబ్జాల్లో ఉన్నా.. వారి హక్కు పత్రాలతో సంబంధం లేకుండా.. వారి సాగు అనుభవంలో ఉన్న మొత్తానికి హక్కులు కల్పిస్తూ సరికొత్త వివాదాలను సృష్టిస్తోంది. -
మేమంతా క్షేమంగా ఉన్నాం..
● కాఠ్మాండుకు చేరేందుకు ప్రయత్నిస్తున్నాం ● టిబెట్ నుంచి డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్రెడ్డి సందేశం ఆత్మకూరురూరల్: డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్రెడ్డి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి టిబెట్లోని మానస సరోవర్ యాత్రకు వెళ్లిన నేపథ్యంలో అక్కడ జలప్రళయం ముంచెత్తిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళనలో ఉన్నారు. దీంతో ఆయన తామంతా క్షేమంగా ఉన్నామని, మానస సరోవర్ యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకున్నామని, ప్రస్తుతం టిబెట్లోని సాగాలో క్షేమంగా ఉన్నామని సతీష్రెడ్డి సందేశాన్ని పంపారు. నేపాల్ టిబెట్ సరిహద్దులో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తిరుగు ప్రయాణంలో మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. ప్రస్తుతం తమ బృందం రోడ్డు మార్గంలో కాఠ్మాండుకు చేరుకునేందుకు ప్రయత్నిస్తోందని సతీష్రెడ్డి వెల్లడించారు. రహదారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నామని, మార్గమధ్యలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. పరిస్థితులు అనుకూలిస్తే శనివారం సాయంత్రానికి కాఠ్మాండు చేరుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే అనుకున్న ప్రకారం విమాన టికెట్లు బుక్ చేసుకున్నామని, కాఠ్మాండు నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ మీదుగా హైదరాబాద్కు తిరిగి రానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమ బృందంలోని అందరూ సురక్షితంగా ఉన్నారని, కుటుంబ సభ్యులు, బంధువులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నేపాల్లో వరదల కారణంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, వాటికి సంబంధించిన వివరాలను మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గంలో సురక్షితంగా స్వదేశానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. -
అమ్మా ఆకలన్నాడు.. చైన్ లాక్కెళ్లాడు
కావలి: అమ్మా ఆకలిగా ఉంది. అన్నం పెట్టాలని అడిగాడు. పాపం జాలిగుండె కలిగిన మహిళ పండు అందించింది. కొద్దిసేపటి అనంతరం కునుకు తీస్తున్న ఆమె మెడలోని బంగారు చైన్ లాక్కొని పరారయ్యాడు. శుక్రవారం మధ్యాహ్నం కావలి జనతాపేట ఉత్తర శివార్లలో ఈ ఘటన జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. జనతాపేటకు చెందిన కంచర్ల సంపూర్ణమ్మ కంచర్ల వస్త్ర దుకాణం నిర్వహిస్తోంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా కలుగోళ్లమ్మ ఆలయానికి వెళ్లొచ్చి వ్యాపారంలో నిమగ్నమైంది. మధ్యాహ్నం వేళ గుర్తుతెలియని ఓ యువకుడు వచ్చి ఆకలేస్తుందమ్మా అని చేయి చాచాడు. ఇది ఇల్లు కాదు నాయనా షాపు అని చెప్పి అరటి పండు అందించింది. అది తీసుకుని తిరుగుముఖం పట్టిన అతను ఆమె ఆదమరిచి కునుకు తీస్తున్న సమయంలో వచ్చి ఒక్కసారిగా మెడలోని మూడున్నర సవర్ల బంగారు చైన్ లాక్కెళ్లాడు. బాధితురాలు తేరుకునేలోపే అతను అదృశ్యమయ్యాడు. మహిళ చుట్టుపక్కల వారికి విషయం తెలిపి లబోదిబోమంది. సంపూర్ణమ్మ కుమారుడు రెండో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కావలి డీఎస్పీ వీవీ రమణకుమార్ సీఐ గిరిబాబుతో దుకాణం వద్దకు వెళ్లి బాధితురాలితో మాట్లాడారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
నెల్లూరు(లీగల్): రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నక్కల నాగరాజు యాదవ్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థకు న్యాయవాదులు రక్షకులుగా వ్యవహరిస్తున్నారని, వారికి భద్రత క ల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో న్యాయవాదుల రక్షణ చట్టం అమలులో ఉందని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్లోనూ దీనిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు భద్రత కల్పించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి లక్ష్మీనారాయణ, కోశాధికారి ప్రణీత్రెడ్డి, లైబ్రరీ కార్యదర్శి నాగశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ వర్గీయుల ఘర్షణ వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండల కేంద్రంలో టీడీపీలోని రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. స్థానికుల కథనం మేరకు.. వింజమూరు బీసీ కాలనీలో నివాసముంటున్న ఎంపీపీ వనిపెంట హైమావతి కారు డ్రైవర్ షేక్ బాషా గురువారం సాయంత్రం టీడీపీ మండల కన్వీనర్ గూడా నరసారెడ్డిని ఉద్దేశించి అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా సోషల్ మీడియాలో వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న నరసారెడ్డి రాత్రి పది గంటల సమయంలో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు బాషాను స్టేషన్కు తీసుకొచ్చే ప్రయత్నంలో రాఘవేంద్ర సెల్ప్లాజా సమీపంలోని మెయిన్రోడ్డుపై కన్వీనర్ వర్గీయులు అతడితో ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో కొంతమంది బాషాపై చేయి చేసుకోవడంతో కిందపడిపోయాడు. దీని నుంచి అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని స్టేషన్కు తరలించి అనంతరం వైద్యం కోసం నెల్లూరులోని ప్రైవేట్ వైద్యశాలకు పంపారు. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇరువురూ టీడీపీకి చెందినవారే కావడంతో స్థానిక నేతలు సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. -
రేషన్ బస్తాలపై క్యూఆర్ కోడ్ స్కానింగ్ వద్దు
● కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ధర్నా నెల్లూరురూరల్: రేషన్ బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని వెంటనే సమీక్షించి నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సెప్టెంబరు నెల నుంచి కార్డుదారులకు పంపిణీ చేసే 10 శాతం బ్రోకెన్ రైస్ బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఈ విధానంతో డీలర్లపై అదనపు పనిభారం పడటంతోపాటు సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అనేక మంది రేషన్ డీలర్లకు ఇప్పటికీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు అందుబాటులో లేవని, దీంతో క్యూఆర్ కోడ్ స్కానింగ్కు అవసరమైన యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం కూడా ఇబ్బందికరంగా మారుతుందన్నారు. మరోవైపు మండల స్థాయి స్టాక్ పాయింట్లలోనే క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని అమలు చేయకుండా రేషన్ షాపుల వద్ద మాత్రమే ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల అనవసరమైన బాధ్యతలు మోపుతున్నారని ఆరోపించారు. స్టాక్ పాయింట్లలో జరుగుతున్న తరుగుదల, ఇతర అవకతవకలకు డీలర్లను బాధ్యులను చేయడం సరికాదన్నారు. వివిధ సమస్యలను పరిష్కరించకుండా కొత్త విధానాన్ని అమలు చేయడం ద్వారా మరింత భారం మోపుతున్నారన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శన రమేష్, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లాభక్షు, మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రెగ్యులర్ చేసే వరకూ ఆందోళన చేస్తాం
నెల్లూరు(అర్బన్): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్ చేసే వరకూ నిరంతర ఆందోళనలు చేస్తామని ఏపీ మెడికల్, హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్ జేఏసీ కన్వీనర్ శరత్బాబు తెలిపారు. నెల్లూరు దర్గామిట్టలో ఉన్న సర్వజన ఆస్పత్రిలో నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైన కాంట్రాక్ట్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు శుక్రవారం మధ్యాహ్నం ఐపీ భవనం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తాము 20 ఏళ్లకు పైగా కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. పెన్షన్, ఇతర ఎలాంటి బెనిఫిట్స్ లేవన్నారు. రెగ్యులర్ నర్సులు, ఇతర సిబ్బందితో సమానంగా పని చేస్తున్నప్పటికీ వేతనంలో భారీ తేడా ఉందన్నారు. అరకొర వేతనాలతోనే సంవత్సరాల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ బదిలీ అయిన ప్రతిచోట విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ 100శాతం గ్రాస్ వేతనం ఇవ్వాలని పేర్కొన్నారు. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రే షియా చెల్లించాలని కోరారు. అనారోగ్యానికి గురైన ఉద్యోగులకు పూర్తి వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రూత్గ్రేస్, వేణు, సుమతి, మేరి మాధురి తదితరులు పాల్గొన్నారు. -
అదృశ్యమై నెల.. రవి జాడెక్కడ?
కానరాని ఆర్మీ జవాన్ ఆచూకీ● కుటుంబ సభ్యుల తీవ్ర ఆందోళన ● రెండు ప్రత్యేక బృందాలతో గాలింపువరికుంటపాడు: మండలంలోని తోటలచెరువుపల్లికి చెందిన ఆర్మీ జవాన్ పగడాల రవి అదృశ్యమై నెల రోజులు దాటినా ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 18 ఏళ్లుగా ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న రవి ఇటీవల మణిపూర్ నుంచి జమ్మూ కశ్మీర్కు బదిలీ అయ్యాడు. ఈ క్రమంలో 30 రోజుల సెలవుపై స్వగ్రామానికి బయలుదేరాడు. అయితే మార్గమధ్యలోనే అదృశ్యమయ్యాడు. ఇంఫాల్ నుంచి బెంగళూరుకు విమాన టికెట్ బుక్ చేసుకోగా అది రద్దయింది. దీంతో పశ్చిమ బెంగాల్లోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేశాడు. అనంతరం జూలై 19వ తేదీన న్యూ జల్పాయ్గురి రైల్వేస్టేషన్కు చేరుకుని గువహాటి నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎస్సెమ్వీటీ ఎక్స్ప్రెస్లో ప్రయాణించాడు. అదేరోజు సాయంత్రం 6:30 గంటలకు భార్య ఫోన్ చేయగా.. ‘టీటీ వస్తున్నారు.. తర్వాత మాట్లాడతాను’ అంటూ కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ రవి స్పందించలేదు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి ఉండొచ్చనే అనుమానంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. ఎక్కడా సమాచారం లభించకపోవడంతో జూలై 23వ తేదీన వరికుంటపాడు పోలీసులను ఆశ్రయించారు. మరుసటి రోజు ఎస్సై మధుసూదన్రావు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రవి ఆచూకీ కోసం పలువురు ప్రజాప్రతినిధులను కుటుంబ సభ్యులు కలిసి వినతిపత్రాలు అందించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అర్జీ ఇవ్వగా సంబంధిత భద్రక్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలను తెలియజేశారు. ఒడిశా గవర్నర్కు కూడా ఫోన్ ద్వారా జవాన్ మిస్సింగ్ విషయాన్ని వివరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం పలువురు నాయకులు నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్లతో ఫోన్లో మాట్లాడి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జవాన్ ఆచూకీ కనిపెట్టాలని కోరారు. ఎస్పీ ఆదేశాలతో వరికుంటపాడు, కావలి వన్టౌన్ ఎస్సైల ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఒడిశా ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. పలు ప్రాంతాలను జల్లెడ పట్టినా రవి ఆచూకీ మాత్రం లభించలేదు. కుటుంబ సభ్యుల అనుమానాలు2009లో అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో తోటలచెరువుపల్లి గ్రామంలో సుమారు ఐదెకరాల భూమిని పట్టా ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల ఆ భూమిలో రవి వ్యవసాయం చేసి జామాయిల్ పంట వేశాడు. ఈ భూమి విషయంలో గ్రామానికి చెందిన కొందరు నాయకులు ఫోన్ చేయడం, మెసేజ్లు చేయడం జరిగింది. ఈ విషయంలో అనుమానాలు ఉన్నాయని కూడా జవాన్ భార్య వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూమి విషయమై రవి అదృశ్యానికి ఏమైనా సంబంధం ఉందా? అనే అనుమానాలు కుటుంబ సభ్యుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై పోలీసులు దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సి ఉంది. -
సీలింగ్ భూమితోపాటు పక్క సర్వే నంబరు భూమి ధారాదత్తం
ఉన్నదే ఎకరం.. పూర్తిగా పక్క రైతుకు కట్టబెట్టేశారు..చుక్కలు చూపించారు.. ● రైతుల మధ్య భూ విస్తీర్ణాల తకరారులు ● కొనుగోలు పత్రాలు, రెవెన్యూ రికార్డులు చూడరు ● ఎవరి అధీనంలో ఉంటే అంతటికి హక్కు పత్రాలు ● ఆక్రమణ భూములను కట్టబెట్టేస్తున్నారు ● ప్రభుత్వ శివాయి, చెరువు, మేత పొరంబోకు భూములు ధారాదత్తం ● తేడాలు పరిష్కరించకుండా.. కోర్టుకెళ్లమంటూ ఉచిత సలహాలు ● సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న రెవెన్యూ ● ఫైళ్ల క్లియరెన్స్ కోసం కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు నెల్లూరు (అర్బన్): ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన కలెక్టర్ కార్యాలయం సామాన్యుడికి అందనంత దూరంలో ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతున్న భూముల రీసర్వే తప్పుల తడకగా, అత్యంత వివాదాస్పదంగా మారింది. స్థానిక రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భూ తకరాలకు ఆజ్యం పోస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రీసర్వే తర్వాత పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చుతున్నారు. రైతులకు తెలియకుండానే వారి భూములు నోషనల్ ఖాతాలోకి మార్చేస్తున్నారు. దశాబ్దాలుగా ఉన్న భూముల సరిహద్దు భూ తకరారులను పరిష్కరించేందుకు చేపట్టిన రీ సర్వేను తప్పదోవ పట్టించి.. రైతులకు కడగండ్లు మిగులుస్తున్నారు. దశాబ్దాలుగా రెవెన్యూ రికార్డుల్లో ఉండాల్సిన భూ విస్తీర్ణాలకు, క్షేత్రస్థాయిలో ఉన్న భూ విస్తీర్ణాలకు ఉన్న తేడాలను పరిశీలించి, సరిహద్దు వివాదాలను పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు కొత్త తరహా సమస్యలను సృష్టిస్తున్నారు. కోర్టుకెళ్లి తేల్చుకోండంటూ చెప్పి ముఖం చాటేస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థ చేసే తప్పులకు రైతులు బలవుతున్నారు. అధికారులు చేసే తప్పులను సరిదిద్దాల్సిన కలెక్టర్ పట్టించుకోకపోవడంతోనే ఈ దుస్థితి దాపురించిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రీ సర్వేలో అధికారిక లెక్కలు ఇలా.. రీసర్వే ప్రాజెక్ట్ కింద ఇప్పటి వరకు 493 గ్రామాల్లో సర్వే పూర్తి చేశారు. 50 గ్రామాల్లో సర్వే పనులు పురోగతిలో ఉన్నాయి. రీ సర్వేపై వచ్చిన 8,761 అర్జీలను పరిష్కరించినట్లు చెప్పుకుంటున్నారు. మిగిలిన 147 గ్రామాల్లో మార్చి నాటికి రీసర్వే పూర్తి చేస్తామంటున్నారు. అధికారులు పరిష్కరించినట్టు చెబుతున్న అర్జీలను పరిశీలిస్తే కొంత మంది నేరుగా కలెక్టరేట్కు వచ్చి గ్రీవెన్స్లో అర్జీలు ఇచ్చారు. కలెక్టర్ తహసీల్దార్కు రాసి పరిష్కరించినట్టు పేర్కొంటున్నారు. తీరా పరిశీలిస్తే ఆ ఫైల్ ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. ఫైల్ కదలాలంటే పైసలతోనే పని రెవెన్యూ శాఖలో భూ రికార్డులు, మ్యుటేషన్, వారసత్వం, పట్టాదారు పాస్ పుస్తకాలు, సర్వే, సరిహద్దులు, ఆక్రమణలు వంటి వాటికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీటికి సంబంధించి చిన్నపాటి సాంకేతిక సమస్య కూడా సంవత్సరాల తరబడి పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో రైతులు తీవ్ర అష్ట కష్టాలు పడుతున్నారు. అధికారికంగా అర్జీలను పరిష్కరిస్తున్నామని కలెక్టర్ ప్రకటిస్తున్నప్పటికీ సంబంధిత ఫైళ్లు కదలడం లేదు. కలెక్టర్ కార్యాలయం, రెవెన్యూ వ్యవస్థలో పని జరగాలంటే బాధితులు మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. రాజకీయంగా సిఫార్సు చేయించుకుంటున్నారు. నెలల తరబడి తిరిగి అధికారులకు అమ్యామ్యాలు ముట్ట చెప్పి పనులు చేయించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేరుకుపోతున్న ఫైళ్లు కలెక్టరేట్లో మ్యుటేషన్, నోషనల్ ఖాతా, చుక్కలు భూములు, రీ సర్వే వివాదాల పరిష్కారానికి దరఖాస్తు చేసుకున్న ఫైళ్లు సకాలంలో క్లియర్ చేయడం లేదు. వేలకు వేలుపైనే ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయని తెలుస్తోంది. కలెక్టరేట్లో డిప్యూటీ తహసీల్దార్లు, సూపరింటెండెంట్లు సమయ పాలన పాటించడం లేదు. ఫైళ్లు గురించి పట్టించుకోవడం లేదు. అందువల్లనే ఇలా గుట్టలుగా ఫైళ్లు పోగవుతున్నాయనే ప్రచారం ఊపందుకుంది. కలెక్టరేట్ అంటే తమ సమస్యకు పరిష్కారం దొరికే గుమ్మంగా మారాలి. కలెక్టరేట్ చుట్టూ కాళ్లకు విశ్రాంతి దొరకాలి. ఫైళ్లు కదలాలి. అర్జీలకు పరిష్కారం కావాలి. బోగోలు మండలం అల్లిమడుగు రెవెన్యూ గ్రామ పరిధిలో పూర్వ సర్వే నంబరు 65లోని భూమి సీలింగ్గా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. దీన్ని కొన్నేళ్ల క్రితం అన్నదమ్ములైన రైతులు కొనుగోలు చేశారు. ఈ విషయం తెలిసినా.. అప్పటి అధికారులు ముడుపులు పుచ్చుకుని రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ చేశారు. ఇటీవల ఆ గ్రామంలో చేపట్టి రీ సర్వేలో సీలింగ్ భూమి అని తెలిసినా.. పాత రికార్డుల జోలికి వెళ్లికుండా.. సదరు రైతులకు సీలింగ్ భూమితోపాటు పక్కన ఉన్న సర్వే నంబరు 61లోని ఇతరుల పేరిట రిజిస్టర్ డాక్యుమెంట్లు కలిగిన మరో మూడెకరాలు కూడా వీరి ఆక్రమణలో ఉండడంతో ఆ భూమిని కూడా వీరి పేరిట కట్టబెట్టారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.. జిల్లాలో రెండేళ్లల్లో ఇలాంటి భూ వివాదాలు లెక్కకు మించి ఉన్నాయి. సీసీలదే హవా.. సోమవారం జరిగే గుంపులో గోవింద అనే గ్రీవెన్స్లో మినహా కలెక్టరేట్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో తదితరులను కలిసి తమ బాధలు చెప్పుకోవాలంటే సామాన్యుడికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీసీలు చక్రం తిప్పుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సామాన్యులు సైతం తను నేరుగా కలవ వచ్చని చెప్పిన కలెక్టర్ ఆచరణలో అందుకు భిన్నంగా పైరవీకారులకు, సిఫార్సులకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. తెలిసిన వారో.. మధ్యవర్తుల ద్వారా వెళ్తే పనులు త్వరగా జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లేదంటే కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉండాల్సి వస్తుందని బాధితులు ఆవేదన చెందుతున్నారు. -
అవినీతిపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా?
● గూడూరు సమన్వయకర్త బూదూరు గురవయ్య చిల్లకూరు: కూటమి పాలనలో అవినీతి పెరిగిందని, అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం ఎంత వరకు న్యాయమని ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ను వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య ప్రశ్నించారు. గూడూరులోని ఓ హోటల్లో శుక్రవారం ఆయన నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణంలోని రెండు ఆలయాలకు చెందిన భూముల లీజుల విషయంలో నిబంధనలు పాటించకుండా తూతూమంత్రంగా వేలం పాటలు నిర్వహించడం నిజం కాదా అని ప్రశ్నించారు. ధర్మరాజు స్వామి దేవస్థానంలో సుమారు రూ.1.50 కోట్ల అవినీతి జరిగిందన్నారు. దుకాణాల బాడుగుల విషయంలో ఎవరికి వారుగా అద్దెల పేరుతో వసూలు చేసుకుని ఆరగిస్తున్నారన్నారు. చిల్లకూరు మండలంలోని కలవకొండలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నిధుల దుర్వినియోగం జరుగుతోందని చైర్పర్సన్ వినతిపత్రాన్ని దేవదాయ మంత్రికి అందించారన్నారు. మంత్రి దానిని బుట్టదాఖలు చేస్తే తమ పార్టీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వేలం పాటలు జరిగిన సమయంలో పల్లి కోటేశ్వరరావు అనే తమ పార్టీ కార్యకర్త ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా, బెదిరించినా భయపడే ప్రసక్తే లేదు. కడివేడు భూములపై విచారణ చేపడతామని ఎమ్మెల్యే చెప్పారే తప్ప కార్యరూపం దాల్చలేదన్నారు. ప్రతి అవినీతిలో ఎమ్మెల్యేకు వాటా ఉందన్నారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీలో విధానాలు నచ్చక వైఎస్సార్సీపీలో చేరారని చెప్పారు. ఎమ్మెల్యే, అతని అనుచరుల నుంచి ప్రాణహాని ఉందన్నారు. చెన్నూరుకు చెందిన నాయకుడు కల్లూరు రవి మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఉన్న ఆలయ భూములకు సంబంధించి దండోరా వేయకుండా ఏకపక్షంగా అధికార పార్టీ నాయకులు లీజు పొందడం ఏమిటని ప్రశ్నించారు. చిల్లకూరు జెడ్పీటీసీ సభ్యుడు మన్నెం శీనయ్య మాట్లాడుతూ చిల్లకూరు మండలంలో జాతీయ రహదారి వెంబడి ముత్యాలపాడు పంచాయతీలో రూ.కోట్ల విలువైన భూములు అప్పనంగా మింగేశారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు ముప్పాళ్ల చంద్రమోహన్రెడ్డి, అట్ల శ్రీనివాసులురెడ్డి, యల్లా శ్రీనివాసులురెడ్డి, ఇందుకూరు జనార్దనరెడ్డి, డేగపూడి కృష్ణారెడ్డి, వేణురెడ్డి, వసంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శక పరిష్కారం..
భూముల రీసర్వేలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పారదర్శకతను పాటించింది. దశాబ్దాలుగా భూముల సరిహద్దుల తకరారులను సరిదిద్దే చర్యలు చేపట్టింది. తొలుత ఎక్కడ సర్వే చేపడితే.. ఆ రెవెన్యూ గ్రామంలో సుమారు వందేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సర్వే నంబర్ల వారీగా అక్షాంశాలు, రేఖాంశాలతో కచ్చితత్వంగా సరిహద్దు సర్వే రాళ్లను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత సదరు సర్వేనంబర్లలో ఏ రైతుకు ఎంత పొలం ఉందో, వారి వద్ద ఉన్న భూముల డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డుల ఆధారంగా హద్దురాళ్లు నాటి ప్రత్యేక నంబరుతో వారికి హక్కులు కల్పించింది. ఈ క్రమంలో ఎవరి భూమికి ఎలాంటి ఇబ్బందులు, తకరారులు లేకుండా చేసింది. అదే సమయంలో ఏళ్ల తరబడి ప్రభుత్వ శివాయి భూములు, ప్రభుత్వ పొరంబోకు, చెరువు పొరంబోకు భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులను సరి చేసింది. ఈ క్రమంలో సదరు భూములకు సంబంధించి వారికున్న హక్కులకు సంబంధించి రికార్డులను పరిశీలించి.. తిరిగి రైతుల పేరిట హక్కులు కల్పించింది. -
టీడీపీ వాళ్లయితే వదిలేయ్!
చిట్టమూరు: మండల పరిధిలోని తాడిమేడు చెరువులో మట్టి తోలుకోవాలంటే అధికార పక్షానికి జై కొట్టాల్సిందే. లేకుంటే టీడీపీ నేతలు అధికారులు, పోలీసులను పంపి నిలుపుదల చేయిస్తారు. చెరువులో నుంచి మట్టిని తోలుకుని తమ పొలాలను చదును చేసుకోనునేందుకు కొద్దిరోజుల క్రితం వైఎస్సార్సీపీ సానుభూతిపరులుగా ఉన్న రైతులు ప్రయత్నించారు. అయితే తమను కాదని ఎలా మట్టిని తోలుతారని టీడీపీ నేతలు పోలీసులను పంపి బెదిరింపులకు పాల్పడ్డారు. జేసీబీలు, ట్రాక్టర్లు తీసుకెళ్లిపోవాలని, లేకుంటే కేసులు నమోదు చేస్తామన్నారు. దీంతో చేసేది లేక రైతులు ఈ ప్రక్రియను ఆపేశారు. అయితే రెండు రోజుల నుంచి అధికార పార్టీకి సానుభూతిపరులు చెరువులో మూడు జేసీబీలు పెట్టి ట్రాక్టర్ల ద్వారా తమ పొలాలకు మట్టిని తరలిస్తున్నారు. దీనిపై పోలీసులు, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. కూటమి ప్రభుత్వంలో రైతులపై వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు చెరువులో ఇష్టానుసారంగా జేసీబీలు పెట్టి గుంతలు చేసి మట్టిని తోలేయడంతో సాగునీరు పొలాలకు పారే పరిస్థితి లేదని ఆయకట్టు రైతులు చెబుతున్నారు. తాడిమేడు చెరువులో మట్టి తరలింపుపై రైతుల ఆగ్రహం పోలీసులు, ఇరిగేషన్ అధికారుల తీరుపై విమర్శలు -
స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం
● టీడీపీ అరాచకాలను ఎదుర్కొందాం ● సర్వేపల్లిలో సర్వం దోపిడీ ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరు: టీడీపీ అరాచకాలను ఎదుర్కొని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. పొదలకూరు, వెంకటాచలం, ముత్తుకూరు మండలాల్లో గురువారం పర్యటించిన ఆయన మాట్లాడారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి చోట బరిలో దిగి విజయం సాధించాలని పేర్కొన్నారు. ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జిల్లాలో కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అందరం ఒక్కతాటిపై నిలిచి పార్టీని విజయ తీరాలవైపు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ప్రజల్లో పరపతిని కూటమి ప్రభుత్వం కోల్పోవడంతో పోలీసులను అడ్డుపెట్టుకొని దౌర్జన్యాలకు తెగబడే అవకాశముందని చెప్పారు. పార్టీ సత్తా ఏమిటో చూపిద్దామని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా కృషి చేద్దామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి మినహా కూటమి పాలనలో ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదని ఆరోపించారు. శాసనసభ ఎన్నికలెప్పుడొచ్చినా చంద్రబాబును సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పంచభూతాల దోపిడీ సర్వేపల్లి నియోజకవర్గంలో పంచభూతాలను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. సీఎస్సార్ నిధుల్లోనూ ఇదే పర్వాన్ని సాగిస్తున్నారని మండిపడ్డారు. కంపెనీలను సోమిరెడ్డి బెదిరించి పిల్లల సైకిళ్లు, సోలార్ లైట్ల పేరుతో దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ముత్తుకూరులో ట్యాంకర్కు రూ.600 చొప్పున నిత్యం 113 ట్యాంకర్లతో ఒక్కోటి ఐదు ట్రిప్పుల మేర నీటిని కంపెనీలకు అమ్ముతున్నారని ఆరోపించారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నా, ఇళ్ల మధ్యలో బోర్లేసి తోడుకుంటూ ఈ పర్వాన్ని సాగిస్తున్నారని దుయ్యబట్టారు. మంచినీటికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా, సోమిరెడ్డి పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అక్కంగారి శివ గృహప్రవేశానికి హాజరయ్యారు. అనంతరం వేణు, కావ్య.. గణేష్, సుమలత.. సునీల్, శైలజ వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కేతు రామిరెడ్డి, లెక్కల పెంచలనాయుడు, సుందరయ్య, వెంకటశేషయ్య, మెట్టా విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీపీ సుగుణ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీలకు సంక్షేమ పథకాలు అందాలి
నెల్లూరు రూరల్: జిల్లాలోని ఎస్సీలకు సంక్షేమ పథకాలు నూరు శాతం అందేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ జవహర్ పేర్కొన్నారు. కమిషన్ సభ్యులు శ్రీపతిబాబు, భిక్షం, రామాజనమ్మ, సెక్రటరీ చిన్నరాముడితో కలిసి అధికారులతో సమీక్ష సమావేశాన్ని కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జవహర్ గురువారం నిర్వహించారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజితా వేజెండ్ల అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, ఏఎస్పీ సౌజన్య, డీఆర్వో విజయకుమార్, సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. వినతుల అందజేత ఎస్సీ కమిషన్ సభ్యులకు 196 వినతులు అందాయి. వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించేలా కృషి చేస్తామని జవహర్ తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల్లో అక్రమాలకు తావిస్తే సహించం
కోవూరు: ‘స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శకంగా జరగాలి. అక్రమాలకు తావిస్తే సహించేది లేదు. అధికార యంత్రాంగం ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. కోవూరులోని ఆ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రజల మద్దతు లభించడం, వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో ఉన్న తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పోలీస్ అధికారులు తమ బాధ్యతలను గుర్తుంచుకోవాలని సూచించారు. కొందరు పోలీస్ అధికారులు తమ పార్టీ నాయకులకు ఫోన్లు చేసి మీరు ఎన్నికల్లో పోటీ చేయొద్దు, మీపై రౌడీషీట్ తెరుస్తామని బెదిరించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. పెన్షన్లు, నిరుద్యోగ భృతి, ఇతర సంక్షేమ పథకాలపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వైఎస్సార్సీపీదే విజయం జిల్లాలో మండల పరిషత్లు, జెడ్పీటీసీలు, సర్పంచ్ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయభేరి మోగిస్తుందని ప్రసన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు తమకు ఉందన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థులకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 8 నుంచి 11వ తేదీలోపు ఒకరోజు నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. 12 నుంచి 22వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. ● డీసీఎంఎస్ మాజీ చైర్మన్, సర్వేపల్లి పరిశీలకుడు వీరి చలపతిరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కేడర్ను సమాయత్తం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. కార్యక్రమంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాధాకృష్ణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జునరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత, మండల క న్వీనర్లు అనూప్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, నవీన్కుమార్రెడ్డి, షాహుల్, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి -
బాయిలర్ డ్రమ్ములు పడి కార్మికులకు గాయాలు
● పంటపాళెంలోని పామాయిల్ ఫ్యాక్టరీలో ఘటన ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని పంటపాళెంలో గల పామాయిల్ ఫ్యాక్టరీలో గురువారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. నిర్మాణంలో ఉన్న బాయిలర్ సెక్షన్లో ప్రమాదవశాత్తూ డ్రమ్ములు అదుపు తప్పి ఇద్దరు కార్మికులపై పడ్డాయి. వీరి తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటి కార్మికులు క్షతగాత్రులను ఆటోలో తరలించసాగారు. మార్గమధ్యలో 108 ఎదురొచ్చి వీరిని నెల్లూరు తరలించారు. ఘటనపై ఫ్యాక్టరీ యాజ మాన్యం స్పందించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రైతులకు ఆదాయం పెంచేలా చర్యలు
నెల్లూరు(పొగతోట): తక్కువ ఖర్చుతో అధిక ఆదాయమొచ్చే పంటలను రైతులు సాగుచేసేలా చర్యలు చేపట్టాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి ఆదేశించారు. నగరంలోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో వివిధ మండలాల ఎంపీఎంలు, ఎఫ్పీఓల సీసీలకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆర్గనిక్ పద్ధతిలో వ్యవసాయం చేయడాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఇందుకూరుపేటలో గుర్రపుడెక్కతో ఎరువుల తయారీ పద్ధతి అందుబాటులో ఉందని వివరించారు. ఆత్మకూరులో అరటి నారతో రూపొందించే ఉత్పత్తుల యూనిట్లను ఏర్పాటు చేశారన్నారు. కలువాయి, సైదాపురం, చేజర్ల, మర్రిపాడు, దుత్తలూరు మండలాల్లో రైతులకు తక్కువ ధరలకే వ్యవసాయ పరికరాలను అందజేసేలా కస్టమ్ హైరింగ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. మిగిలిన మండలాల్లోనూ ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామన్నారు. లావాదేవీలను సక్రమంగా నమోదు చేయాలని ఎఫ్పీఓలకు సూచించారు. అనంతరం సెర్ప్ అడిషనల్ డైరెక్టర్ (ఫార్మ్) మహిత మాట్లాడారు. స్వయం సహాయక గ్రూపులకు వివిధ రకాల రుణాలను మంజూరు చేయనున్నామని వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాలు రైతులందరికీ అందుబాటులోకి వచ్చేలా చూడాలని సూచించారు. అకౌంట్స్ సాఫ్ట్వేర్ ద్వారా లావాదేవీలను నిర్వహించాలని చెప్పారు. -
బాధితులకు నష్టపరిహారం అందించాలి
కావలి రూరల్: తుమ్మలపెంట రోడ్డు విస్తరణలో భాగంగా దుకాణాలు, ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించడంతోపాటు నష్టపరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కావలి నియోజకవర్గ ఇన్చార్జ్ రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఆయన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తుమ్మలపెంటలో చాలా కాలంగా దుకాణాలు నిర్వహించుకుంటూ జీవనోపాధి పొందుతున్న అనేక కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. కొందరు 40 – 50 ఏళ్లుగా ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు. ప్రాంత అభివృద్ధి, రహదారుల విస్తరణ అవసరమేనని, ప్రజలకు మెరుగైన రహదారులు అందుబాటులోకి రావాలన్నదే తమ అభిప్రాయమని చెప్పారు. అయితే దుకాణాలు, ఇళ్లను తొలగించే ముందు బాధితులకు ముందస్తు సమాచారం ఇచ్చి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అకస్మాత్తుగా యంత్రాలను తీసుకొచ్చి నిర్మాణాలను తొలగించడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. స్థలాలు కేటాయించాలి బాధితులు రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులను వ్యతిరేకించడం లేదని రామిరెడ్డి స్పష్టం చేశారు. తమ దుకాణాలు, ఇళ్లు తొలగించాల్సి వస్తే.. ప్రత్యామ్నాయంగా ప్రధాన రహదారి వెంట స్థలాలు కేటాయించాలని కోరుతున్నారని తెలిపారు. దుకాణాలను తిరిగి నిర్మించుకునేందుకు కొంత నష్టపరిహారం అందించాలని మాత్రమే కోరుతున్నారని చెప్పారు. తుమ్మలపెంట ప్రాంతంలో రోడ్డు పక్కన ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని, వాటిని బాధితుల జీవనోపాధికి వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నష్టపోయిన వ్యాపారులకు తక్షణమే పరిహారం అందించడంతో పాటు ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బాధితుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే వైఎస్సార్సీపీ వారి తరఫున అండగా నిలిచి పోరాడుతుందని తెలిపారు. ● అన్నగారిపాళెంలో శ్రీకృష్ణ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓరుగుంటమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి రామిరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ సన్నీబోయిన ప్రసాద్యాదవ్, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముందస్తు సమాచారం లేకుండా నిర్మాణాల తొలగింపు సరికాదు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి -
సంబరం వేళ.. పుట్టెడుశోకం
నెల్లూరు సిటీ: ఆ ఇంట్లో బాలుడు చేసే సందడి అంతాఇంతా కాదు. రోజు గడిస్తే పుట్టినరోజు సంబరాలు మొదలవుతాయి. అయితే విధి చిన్నచూపు చూసింది. అనుకోని ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లింది. పోలీసుల కథనం మేరకు.. రూరల్ పరిధిలోని కొత్త వెల్లంటి గ్రామానికి చెందిన అనంత్రెడ్డి వ్యవసాయం చేస్తుంటాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గురువారం నానమ్మ తన మనుమరాలిని స్కూల్ వ్యాన్ ఎక్కించేందుకు తీసుకెళ్లింది. ఈ క్రమంలో మనుమడు ఆయాన్ష్ (2) అక్కడికి వచ్చాడు. ఎవరూ గమనించకపోవడంతో వాహనం వెళ్లే సమయంలో బాలుడికి తగలడంతో తలకు తీవ్రగాయమైంది. హాస్పిటల్కు తరలించేలోపు మృతిచెందాడు. రూరల్ పోలీసులు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్పి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నేడు మూడో పుట్టినరోజు శుక్రవారం ఆయాన్ష్ మూడో పుట్టినరోజు. కుటుంబ సభ్యులు వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అప్పటి వరకు కళ్లముందు ఆటలాడిన పిల్లాడు అనంతలోకాలకు చేరుకోవడంతో కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.చెత్త గోదాములో అగ్నిప్రమాదంవింజమూరు(ఉదయగిరి): వింజమూరు పట్టణంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న గ్యాస్ గోదాము సమీపంలో ఉన్న చెత్త గోదాములో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అందులోని వస్తువులు కాలిపోయాయి. పక్కనే ఉన్న గ్యాస్ గోదాములో సిలిండర్లు ఉండటంతో అంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపులోకి తెచ్చారు. దీంతో గ్యాస్ గోదాము సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఎదురెదురుగా ఢీకొన్న బైక్లు● ఇద్దరికి తీవ్రగాయాలు చిల్లకూరు: జాతీయ రహదారిపై రెండు మోటార్బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన గురువారం రాత్రి నారాయణ ఇంజినీరింగ్ కళాశాలకు వచ్చే మార్గంలో చోటు చేసుకుంది. గూడూరు రూరల్ పోలీసుల కథనం మేరకు.. కలువాయి మండలం పర్ల కొండ ప్రాంతానికి చెందిన నారాయణ, మహేష్ అనే ఇద్దరు బైక్పై పోటుపాళెం వైపు నుంచి గూడూరు మినీబైపాస్ వరకు వస్తున్నారు. ఎదురుగా చిల్లకూరు మండలంలోని వేళ్లపాళెం పంచాయతీలో కాకువారిపాళెం గ్రామానికి చెందిన చందు అనే యువకుడు బైక్పై వస్తున్నాడు. రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో చందు, నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. కేసు నమోదు చేశారు. అమ్మమ్మ మందలించిందని..● యువకుడి బలవన్మరణం సైదాపురం: అమ్మమ్మ మందలించిందనే కారణంతో ఓ యువకుడు మైనింగ్ గుంతలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు విడిచిన విషాదకర ఘటన మండలంలోని గిద్దలూరు పంచాయతీ పరిధిలో ఇసుకపల్లిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని తెలుగుగంగ కాలువ ప్రాంతానికి చెందిన యామిని కృష్ణ (23) అమ్మమ్మను చూసేందుకు రెండు రోజుల క్రితం ఇసుకపల్లి గ్రామానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఏం జరిగింది గానీ కృష్ణను అమ్మమ్మ మందించిందనే కారణంగా సమీపంలోని మైనింగ్ గుంతలో దూకేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి వెళ్లి చూడా కృష్ణ అప్పటికే చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించి గూడూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేశారు. నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.125 సన్నవి : రూ.60 పండ్లు : రూ.30 -
ఆక్రమణల తొలగింపు పేరుతో పక్షపాతం
● శంఖవరంలో ఉద్రిక్తత ● వైఎస్సార్సీపీ వర్గీయులే టార్గెట్ ● గ్రామస్తుల ఆందోళన వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండలంలోని శంఖవరం గ్రామానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ వాగు పోరంబోకు భూముల్లో ఆక్రమణల తొలగింపులో అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి. సర్వే నంబర్ 167, 169లో ఉన్న వాగు పోరంబోకు భూమి గ్రామంలో అంతర్భాగంగా ఉంది. మొత్తం 66 ఎకరాలు ఆక్రమణకు గురికాగా అందులో 65 ఎకరాలు టీడీపీ నేతల చేతుల్లో ఉన్నాయి. ఆ భూముల్లో పక్కాఇళ్లు నిర్మించుకుని వ్యవసాయం చేస్తున్నారు. మిగిలిన ఒక ఎకరాలో చిన్న, సన్నకారు పాడిరైతులు గడ్డివాములు, పేడదిబ్బలు, పశువుల షెడ్లు వేసుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్తుల మధ్య నెలకొన్న విభేదాలతో ఆక్రమణలు తొలగించాలని అధికారులకు ఇరు వర్గీయులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు కొంతమందికి ఆక్రమణలు తొలగించాలని మూడేళ్ల క్రితం నోటీసులు జారీ చేశారు. కానీ ఆ ప్రక్రియ జరగలేదు. న్యాయం కాదు గురువారం ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ అధికారులు గ్రామానికి చేరుకుని ఆక్రమణలు తొలగించే ప్రయత్నం చేశారు. అందరివి తీసేయాలని, కేలవం వైఎస్సార్సీపీ వర్గీయులవే తొలగించడం న్యాయం కాదని అధికారులను నిలదీశారు. కాగా టీడీపీ వర్గీయులు తీసేయాల్సిందేనంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎస్సై ఉమామహేశ్వరరావు జోక్యం చేసుకుని రెండువర్గాలను హెచ్చరించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గ్రామస్తులు వారం రోజుల సమయం అడగడంతో అధికారులు అంగీకరించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ డీఈ టి.రమణారావు మాట్లాడుతూ వాగు పోరంబోకులో ఉన్న ఆక్రమణలు తొలగిస్తామని తెలిపారు. ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. -
తల్లికి వందనం నుంచి రూ.58.28 కోట్లు హాంఫట్
నెల్లూరు (టౌన్): కూటమి పాలన చిరుద్యోగుల కన్నీటి వేదనగా మారింది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్ పాలనలోని విద్యాశాఖలో ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఆయాలు, వాచ్మెన్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నెల నెలా వేతనం ఇస్తేనే బతుకు జీవనం గడవని పరిస్థితి వారింది. వారికి చెల్లించేది కూడా చాలా తక్కువ వేతనం. చాలీచాలని వేతనంతోనే కుటుంబాన్ని వెళ్లదీస్తున్నారు. అలాంటిది గత 5 నెలలుగా ఆయాలు, వాచ్మెన్లకు వేతనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరనో.. రోడ్డెక్కి ఉద్యమాలు చేయలేరనో వారికి నెలనెలా వేతనాలు చెల్లించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కనబరుస్తోంది. ప్రభుత్వ సంస్థల్లో రూ.లక్షల్లో జీతాలు తీసుకునే వారికి మాత్రం నెలనెలా క్రమం తప్పకుండా వేతానాలు చెల్లిస్తున్న కూటమి ప్రభుత్వం చిరుద్యోగుల విషయంలో నిర్దయగా వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాలల పర్యవేక్షణలో కీలకం జిల్లాలో 2,421 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 2686 మంది ఆయాలు, 255 మంది వాచ్మెన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. పాఠశాల సామర్థ్యాన్ని బట్టి ఒకరు లేదా ఇద్దరు ఆయాలు ఉంటారు. ప్రతి రోజు పాఠశాలలోని గదులతో పాటు పరిసరాలు, టాయ్లెట్స్ క్లీన్ చేస్తుంటారు. పాఠశాల పరిస్థితిని బట్టి వాచ్మెన్లను నియమిస్తారు. రాత్రి సమయంలో పాఠశాలకు కాపలా ఉంటారు. రాత్రి సమయంలో, సెలవు దినాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు వీరు విధులు నిర్వహిస్తుంటారు. అయితే ఆయాలు ఒక రోజు సెలవు పెడితే పాఠశాలలో ఉండలేని పరిస్థితి. విద్యార్థులు, ఉపాధ్యాయులు టాయ్లెట్స్ నుంచి వచ్చే దుర్గంధంతో ఇబ్బందులు పడుతుంటారు. వేసవి సెలవుల సమయంలో పాఠశాలలోని వాటర్ ట్యాంకు, గదులను శుభ్రం చేస్తుంటారు. పాఠశాలల పర్యవేక్షణలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వీరి విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వాచ్మెన్లు, ఆయాలకు ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించడంలో జాప్యం చేస్తోంది. వైఎస్సార్సీపీ పాలనలో ఠంఛన్గా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాక ముందు ఒకటీ.. అర పాఠశాలల్లో వాచ్మెన్లు, ఆయాలు ఉండేవారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు బడులను నాడు–నేడు పథకం ద్వారా రూపురేఖలు మార్చుతూ అభివృద్ధి చేపట్టారు. ఈ క్రమంలో ఆయా పాఠశాలలకు వాచ్మెన్లను, ఆయాలను నియమించారు. అప్పట్లో అమలు చేసిన అమ్మఒడి పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఆర్థిక సాయం నుంచి మినహాయించిన రూ.2 వేలను పాఠశాలల ఖాతాల్లో జమ చేసి వాచ్మెన్లు, ఆయాలకు జీతాలతోపాటు పాఠశాలల్లో పారిశుధ్య చర్యలకు వినియోగించారు. దీంతో ప్రతి నెల వీరికి ఠంఛన్గా జీతాలను అందించారు. కూటమి పాలన వచ్చాక వీరి కష్టాలు మొదలయ్యాయి. రూ.7.58 కోట్ల బకాయిల పెండింగ్ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు, వాచ్మెన్లకు గత 5 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. వీరికి నెలకు రూ.6 వేలు వేతనం చెల్లిస్తారు. మే, జూన్ నెలల్లో పాఠశాలలకు వేసవి సెలవుల నేపథ్యంలో రూ.3 వేలు చెల్లిస్తున్నారు. వీరికి ఈ ఏడాది మార్చి వరకు వేతనం చెల్లించినట్లు తెలిసింది. ఏప్రిల్ నుంచి జూలై వరకు వేతనాలు చెల్లించలేదు. ఆగస్టు నెలతో కలిపితే 5 నెలలు వేతనాలు పెండింగ్లో ఉంటాయి. ఆయాలకు సంబంధించి నెలకు రూ.6 వేలు లెక్కన 3 నెలలకు రూ.4,83,48,000 బకాయిలు ఉన్నాయి. మే, జూన్ నెలలో వేతనం రూ.3 వేలు లెక్కన 2 నెలలకు రూ.1,61,16,000 బకాయి ఉంది. మొత్తం కలిపితే 5 నెలలకు రూ.6,44,64,000 పెండింగ్లో ఉన్నాయి. వాచ్మెన్లు 255 మందికి నెలకు రూ.6 వేలు లెక్కన రూ.15.30 లక్షలు వేతనం రావాలి. ఈ లెక్కన 3 నెలలకు రూ.45.90 లక్షలు రావాల్సి ఉంది. మే, జూన్ నెలలకు రూ.3 వేలు లెక్కన 2 నెలలకు రూ.15.30 లక్షలు రావాల్సి ఉంది. మొత్తం 5 నెలలకు కలిపి రూ.61.20 లక్షలు వేతన బకాయిలు రావాల్సి ఉంది. ఆయాలు, వాచ్మెన్ల కలిపి మొత్తం రూ.7,05,84,000 వేతనాలు బకాయిలు ఉన్నాయి. విద్యాశాఖలో చిరుద్యోగుల ఆకలి కేకలు నెలకు రూ.6 వేలు. ఆ జీతం వస్తేనే ఆ ఇళ్లలో పొయ్యి వెలుగుతుంది. అయినా ఆ చిరుద్యోగుల కష్టాలు కూటమి సర్కారుకు కనిపించడం లేదు. ఐదు నెలలుగా జీతాల్లేవు. సర్కారు బడులను తెల్లవారుజామునే శుభ్రం చేసేది వాళ్లే. పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేది వాళ్లే. రాత్రిళ్లు బడులకు కాపలా కాసేది వాళ్లే. కానీ వాళ్ల ఆకలి కేకలు మాత్రం పట్టడం లేదు. విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న పెద్దలు కోట్ల రూపాయల నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ బడిని శుభ్రం చేసే చేతులకు నెలకు రావాల్సిన చిరు వేతనం కోసం ఐదు నెలలుగా ఎదురుచూపులు తప్పడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో పాఠశాలల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆయాలు, వాచ్మెన్లకు సకాలంలో వేతనాలు అందేవి. ఇప్పుడు అదే వ్యవస్థలో ఐదు నెలలుగా జీతాలు నిలిచిపోవడంలో పాలకుల నిర్లక్ష్యం.. నిర్దయ స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2,686 మంది ఆయాలు, 255 మంది వాచ్మెన్లు వీరికి నెలకు ఇచ్చేదే.. రూ. 6 వేల వేతనం గత 5 నెలలుగా రూ.7.58 కోట్ల బకాయిలు పెండింగ్ తల్లికి వందనం నుంచి రూ.58.28 కోట్ల మినహాయింపు జీతాల కోసం ఎదురు చూపులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఠంఛన్గా జీతాలు పెండింగ్ బకాయిలను త్వరలో చెల్లిస్తాం ఆయాలు, వాచ్మెన్లు వేతనాలు ఈ ఏడాది మార్చి వరకు పూర్తిగా చెల్లించాం. ఏప్రిల్ నుంచి పెండింగ్లో ఉన్నాయి. వాటికి సంబంధించి నిధులు కూడా విడుదలయ్యాయి. ప్రస్తుతం బిల్లులు చేస్తున్నాం. త్వరలోనే పెండింగ్లో ఉన్న బకాయిలను ఆయాలు, వాచ్మెన్లకు చెల్లిస్తాం. – ఆర్. బాలాజీరావు, డీఈఓ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకంలో ప్రతి విద్యార్థి నుంచి రూ.2 వేలు మినహాయిస్తున్నారంటూ దుష్ప్రచారం చేసిన కూటమి పెద్దలు.. తాము అధికారంలోకి వస్తే తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామని.. చివరకు తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది నుంచి అమలు చేసినా.. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రతి విద్యార్థి నుంచి రూ.2 వేలు మినహాయించారు. ఈ మేరకు జిల్లాలో ఈ ఏడాది 2,91,383 మందికి తల్లికి వందనం జమ చేసింది. ఈ లెక్కన విద్యార్థుల నుంచి మినహాయించిన మొత్తం రూ.58,27,6,6000 ప్రభుత్వం తన దగ్గరే ఉంచుకుంది. పాఠశాలల ఖాతాల్లో జమ చేయలేదు. ఈ మొత్తాన్ని జమ చేసినా.. వాచ్మెన్లు, ఆయాలకు పెండింగ్ వేతనాలు ఇవ్వడంతోపాటు ప్రతి నెల ఠంఛన్గా జీతాలు ఇచ్చేందుకు వెసులుబాటు ఉండేది. -
ఏసీబీ వలలో సోమశిల ప్రాజెక్ట్ ఈఈ, డీఈ, ఏఈ
నెల్లూరు (క్రైమ్): కాలువపై కల్వర్టు నిర్మాణానికి ఎన్ఓసీ ఇచ్చేందుకు రైతు వద్ద నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా సోమశిల ప్రాజెక్ట్ ఈఈ, డీఈ, ఏఈలను గురువారం రాత్రి నెల్లూరు అవినీతి నిరోధకశాఖ వలపన్ని పట్టుకుంది. వీరితోపాటు మరో ప్రైవేట్ వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నెల్లూరు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు వివరాల మేరకు... కలువాయి మండలం కనుపూరుపల్లికి చెందిన రైతు ఎ. చిరంజీవి మరికొందరుతో కలిసి తన పొలంలో రైతులకు ఉపయోగపడే ధాన్యం ఆరబెట్టే యంత్రం (ప్యాడీ డ్రైయింగ్) ఏర్పాటు చేసుకునేందుకు నుడా అధికారులను సంప్రదించారు. అయితే పొలానికి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేకపోవడంతో మధ్యలో సోమశిల ప్రాజెక్ట్కు చెందిన పది అడుగల వెడల్పు కాలువ ఉండడంతో నుడా అధికారులు అంగీకరించలేదు. దీంతో ప్రాజెక్ట్ అధికారుల ఎన్ఓసీ తీసుకురావాలని సూచించారు. దీంతో చిరంజీవి సోమశిల ప్రాజెక్ట్ ఇరిగేషన్ ఈఈ పి. మహేష్, డీఈ గౌతమ్ సుమన్, ఏఈ ఎం. నారాయణరాజులను సంప్రదించారు. వారు కాలువపై కల్వర్టు నిర్మాణానికి ఎన్ఓసీ కావాలంటే రూ.4 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు రూ.3 లక్షలకు ఒప్పందం కుదిరింది. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని చిరంజీవి ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారి సూచనల మేరకు ఆయన గురువారం రాత్రి డైకస్రోడ్డు సమీప తెలుగుగంగ కాలనీ ఆవరణలోని ఈఈ కార్యాలయంలో అధికారులకు లంచంగా నగదు ఇస్తుండగా వలపన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ క్రమంలో ఈఈను కాపాడేందుకు లంచం డబ్బులు అక్కడే ఉన్న కాంట్రాక్టర్ మాధ వ్ దాచి పెట్టేందుకు యత్నించగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వారి ఇళ్లలో మూడు బృందాలతో సోదా లు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఏసీబీ ఇన్స్పెక్టర్లు విజయ్కుమార్, రమేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కల్వర్టు నిర్మాణానికి ఎన్ఓసీ ఇచ్చేందుకు రూ.4 లక్షలు డిమాండ్ రూ.3 లక్షలకు కుదిరిన ఒప్పందం లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న వైనం -
ఎస్టీవీ ప్లాంట్ను మరుగున పడేశారు
● కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కావలి: ఎంతో ఉన్నతాశయంతో ప్రజారోగ్యం కోసం ప్రారంభించి పనులు చేపట్టిన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ప్రభుత్వం అర్ధాంతరంగా మరుగున పడేసిందని వైఎస్సార్సీపీ కావలి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అన్నారు. పట్టణంలోని 12వ వార్డులో ఆయన బుధవారం పర్యటించారు. వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికి సమస్యలను వెల్లడించారు. రామిరెడ్డి ఎస్టీవీ ప్లాంట్ వద్దకు వెళ్లి తుప్పు పడుతున్న మెషినరీని, బావిలో రంగుమారిన నీటిని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీద మస్తాన్రావు, బీద రవిచంద్ర ముగ్గురం చర్చించుకుని ప్లాంట్కు ప్రణాళిక వేసినట్లు తెలిపారు. పనులు ప్రారంభించగా, నిధుల కొరత వల్ల కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ కాంట్రాక్టర్ కొనసాగించారని గుర్తుచేశారు. 2019లో తాను తిరిగి ఎమ్మెల్యే అయ్యాక మెషినరీ, స్ట్రక్చర్ వంటివి పూర్తిచేశామని తెలిపారు. ప్రభుత్వం మారి రెండేళ్లు దాటినా ఇప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన మెషినరీ పాడయ్యే దశ కనిపిస్తోందన్నారు. నా మీదనో, బీద సోదరుల మీద కోపంతోనే ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పర్యావరణ పరిరక్షణకు ప్రారంభించిన మంచి ప్రాజెక్ట్ మూలనపడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు బాధ? ప్రశ్నిస్తే టీడీపీ నేతలకు ఎనలేని బాధ పుడుతోందని, ఎందుకంటే వారి హయాంలో ఇప్పటి వరకు కొత్తవేమి మంజూరు చేయలేదని రామిరెడ్డి ఎద్దేవా చేశారు. చిన్నవి చేసి అదేదో బ్రహ్మాండంగా చేసినట్లుగా చెప్పడం వారికి అలవాటైపోయిందన్నారు. దీనికి మందాడి చెరువును ఆనుకుని ఇటీవల పూర్తిచేసిన పార్కు ఉదాహరణ అని చెప్పారు. ఆ పార్కుకు సంబంధించి మంజూరు నుంచి పనులన్నీ తమ హయాంలో చేశామని గుర్తుచేశారు. కట్ట వెడల్పు పనులు, నుడాలో రూ.1.4 కోట్ల నిధులు మంజూరు చేయించి పార్కుకు సంబంధించి లెవలింగ్ పూర్తి చేశామని వివరించారు. ప్రస్తుతం వారు మిగిలిన పనులు మాత్రమే పూర్తి చేశారని, ఈక్రమంలో భారీ అవినీతి చోటుచేసుకుందన్న విమర్శలు ఉన్నాయన్నారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని, వెలికితీసి దోషులుగా నిలబెడతామని, ఎవరినీ వదలమని ఆయన హెచ్చరించారు. మున్సిపల్ అధికారులను కూడా అడుగుతామని స్పష్టం చేశారు. వరవ కాలువ పైనుంచి కింద వరకు తీవ్ర దుర్గంధం వెదజల్లుతోందని, అలాగే చెత్తాచెదారం ఉందని, దీంతో 11, 12, 13 వార్డులు, కొంత భాగం 10 వార్డు ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. దీనిపై తక్షణమే మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్రెడ్డి, ఆయా వార్డుల ఇన్చార్జిలు అక్కిలగుంట మాల్యాద్రి, చేవూరి కిరణ్కుమార్, శ్యామ్సన్, దంతం సునీల్కుమార్, కుందుర్తి కామయ్య, ఆత్మకూరి రాజేష్, గంధం ప్రసన్నాంజనేయులు, పందిటి కామరాజు ప్రసాద్రెడ్డి, నెల్లూరు వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మొసలి కోసం గాలింపు
ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని కృష్ణపట్నం పంట కాలువలో మొసలి సంచరిస్తోందనే అంశాన్ని రైతులు మంగళవారం రాత్రి గుర్తించి.. అధికారులకు తెలియజేశారు. ఈ క్రమంలో అటవీ, పోలీస్ శాఖల అధికారులు, సిబ్బంది గాలింపు చర్యలను బుధవారం చేపట్టారు. రెండు డ్రోన్లను ఉపయోగించి పంట కాలువ మొత్తాన్ని గాలించారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లో కాలువల్లోకి దిగడం లేక చెరువుల్లోకి వెళ్లొద్దని సూచించారు. ముత్తుకూరు చెరువు వెంట నివసించే వారు తమ చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. ఎవరైనా గుర్తిస్తే వెంటనే 112 లేదా ముత్తుకూరు సీఐ, ఎస్సైకు సమాచారమివ్వాలని పేర్కొన్నారు. సీఓఈ శిక్షణ కేంద్రంలో పరిశీలన కోట: స్థానిక ఎస్సీ గురుకుల పాఠశాలను సీఓఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) శిక్షణ కేంద్రంగా మార్పు చేసిన క్రమంలో ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను గురుకులాల అసిస్టెంట్ జాయింట్ సెక్రటరీ శ్రీదేవి బుధవారం పరిశీలించారు. ఇక్కడ నీట్, ఐఐటీ కోసం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ.20 లక్షలతో తరగతి గదులను అధునాతనంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసి త్వరలో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నామని ప్రకటించారు. డీసీఓ ప్రభావతి, ప్రిన్సిపల్స్ వెంకటేశ్వర్లు, ఆనందరావు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి.. కృష్ణతేజ అతిథి గృహం వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 73,285 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 32,334 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.39 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శన టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. సివిల్ సప్లయ్స్ డీఎం బదిలీ నెల్లూరు(పొగతోట): సివిల్ సప్లయ్స్ సంస్థ డీఎం అర్జున్రావును అన్నమయ్య జిల్లా డీఎంగా బదిలీ చేశారు. పార్వతీపురం నుంచి శ్రీనివాస్ను ఇక్కడ నియమించారు. కాగా డీఎంగా అర్జున్రావు బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర దాటింది. -
నేలవాలిన వరి
● రూ.40 లక్షల నష్టం వాకాడు: మరో నాలుగు రోజుల్లో పంట చేతికొస్తుందని ఆశపడిన అన్నదాతలకు గాలివాన గుండెకోతను మిగిల్చింది. మండలంలోని పలు ప్రాంతాల్లో 48 మంది రైతన్నలకు సంబంధించిన దాదాపు 70 ఎకరాల్లో ఇటీవల కురిసిన వర్షం కంటతడిని మిగి ల్చింది. దీంతో పంట నేలవాలి పాచిపోతోంది. మండలంలో ప్రస్తుతం 1800 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. తొలిదశలో 709 ఎకరాల్లో కోతలను పూర్తి చేశారు. ఈ నెలాఖరు నాటికి పూర్తి కావాల్సిన రెండో దశ మొత్తం నేలవాలి పనికిరాకుండా పొతోంది. దాదాపు రూ.40 లక్షల నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. వర్షం కొందరికి ఊరట కలిగించగా, అధిక శాతం మందికి నష్టాన్నే మిగిల్చింది. -
ప్రేమ విఫలమైందని..
● యువకుడి ఆత్మహత్యపై పోలీసుల విచారణ ● వెలుగులోకి సెల్ఫీ వీడియో వెంకటాచలం: ప్రేమ విఫలమవడంతోనే వెంకటాచలం పంచాయతీ ఇందిరమ్మ కాలనీకి చెందిన శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలింది. శివకుమార్ కాలనీలో తన నివాసంలో మంగళవారం ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు శివకుమార్ ఫోన్ను పరిశీలించగా, ఓ యువతి తనను నమ్మించి మోసం చేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో బయటపడింది. ఈ విషయంపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కేసు నమోదు చేశారు. అప్పులబాధ తాళలేక..● యువకుడి ఆత్మహత్య నెల్లూరు(క్రైమ్): అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బాలాజీ నగర్ వైకే ఆచారి వీధికి చెందిన మణికంఠ (29) అవివాహితుడు. అతను చింతారెడ్డిపాళెం క్రాస్రోడ్డు సమీపంలో తోపుడు బండిపై పుల్కాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్నేహితులు, తెలిసిన వారి వద్ద రూ.లక్షల్లో అప్పులు చేశాడు. వారి ఒత్తిడి అధికమవడంతో కొంతకాలం క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మూడు రోజుల క్రితం తిరిగి వచ్చాడు. అప్పుల బాధలు తాళలేక బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు బాలాజీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.లేస్ ప్యాకెట్ అడిగి.. మెడలో సరుడు లాక్కెళ్లారు పొదలకూరు: లేస్ ప్యాకెట్ అడిగారు.. అంగట్లో మహిళ తీసిచ్చేలోపు ఆమె మెడలో బంగారు సరుడు లాక్కెళ్లాడు. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో బాధితురాలు అయోమయానికి గురై తేరుకునే లోగానే బైక్పై దుండగులు పరారైన ఘటన మండలంలోని మర్రిపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. మర్రిపల్లి గ్రామం రాపూరు – పొదలకూరు మెయిన్రోడ్డు పక్కన రమాదేవి దుకాణం పెట్టుకుని జీవిస్తోంది. ఆమె వద్దకు ఇద్దరు యువకులు మోటార్బైక్పై వచ్చారు. వారిలో ఒకతను బైక్ను ఆపకుండా రోడ్డుపైనే ఉండగా మరొకడు వచ్చి సిగరెట్లు, వాటర్ ప్యాకెట్లు అడిగి తీసుకున్నాడు. అవి తీసుకున్న తర్వాత లేస్ ప్యాకెట్ అడిగాడు. అది తీసిచ్చేలోగా ఆమె మెడలోని నాలుగు సవర్ల బంగారు సరుడును లాక్కుని బైక్పై పరారయ్యారు. మహిళ కేకలు వేసి వెంటనే నిందితుల కోసం గాలించినా ఫలితం దక్కలేదు. బంగారు సరుడు విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని తెలిపారు. పొదలకూరు సీఐ వెంకట్రావు, ఎస్సై శివరాకేష్ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. సంపులో మృతదేహం● అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చిల్లకూరు: భవన నిర్మాణ పనులకు వెళ్లి కూలీ సంపులో మృతదేహంగా కనిపించడం పట్టణంలో కలకలం రేపింది. సీఐ శేఖర్బాబు, ఎస్సై మనోజ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. వారి కథనం మేరకు.. గూడూరులోని జాండ్ర వీధికి చెందిన ఆలూరు రమణయ్య (50) భవన నిర్మాణ పనులకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో అతను మంగళవారం పట్టణంలోని న్యూ బాలాజీ కాలనీలో పనికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు మేస్త్రికి ఫోన్ చేయగా రమణయ్య పనులు ముగించుకుని ఇంటికి వెళ్లినట్లు చెప్పాడు. రాత్రంతా అతడి కోసం ఎదురు చూసిన కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం పనులు జరిగే ప్రాంతానికి వెళ్లి చూశారు. అక్కడ నూతనంగా నిర్మిస్తున్న సంపులో రమణయ్య మృతిచెంది ఉన్నాడు. దీంతో బాధిత కుటుంబం అనుమనాలు వ్యక్తం చేసింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, పిల్లలున్నారు. కండలేరులో 20.55 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 20.55 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, హైలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.125 సన్నవి : రూ.60 పండ్లు : రూ.30 -
అదుపుతప్పిన కారు
● యువకుడికి గాయాలు కోవూరు: నెల్లూరు నుంచి రాజుపాళెం వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. రామన్నపాళెం గేట్ సమీపంలో బుధవారం జరిగిన ఈ ఘటనలో రాజుపాళెందిన్నె గ్రామానికి చెందిన గంగపట్నం శ్రీనివాసులు గాయపడ్డారు. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. స్థానికుల కథనం ప్రకారం.. శ్రీనివాసులు కారులో ప్రయాణిస్తుండగా రామన్నపాళెం గేట్ వద్దకు చేరుకునే సమయంలో ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే ఈ సమాచారాన్ని 108 సిబ్బందికి అందించారు. 108 టెక్నీషియన్ అలీ, పైలట్ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం నెల్లూరుకు తీసుకెళ్లారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు. అతివేగమా, లేక వాహనం అదుపు తప్పిందా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. రామన్నపాళెం గేట్ ప్రాంతంలో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో అప్రమత్తంగా ప్రయాణించాలని స్థానికులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వేగ నియంత్రణ పాటిస్తూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కోరుతున్నారు. -
కూటమి అవినీతిమయం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరు: కూటమి పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతి చోటుచేసుకుంటోందని.. అభివృద్ధిని గాలికొదిలి దోపిడీ పర్వాన్ని సాగిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. పొదలకూరు, ముత్తుకూరు మండలంలోని నేలటూరుపాళెంలో బుధవారం పర్యటించిన ఆయన మాట్లాడారు. తనపై సోమిరెడ్డి చేసిన ఆరోపణలకు కట్టుబడి, తన సవాల్ను స్వీకరించాలని పేర్కొన్నారు. అవినీతిపరుడు కాదని ఆయన ప్రమాణం చేయడంతో పాటు తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని పేర్కొన్నారు. రావుల ఇంద్రసేన్గౌడ్కు చెందిన భూములు తన బినామీవిగా ఆంజనేయస్వామి సమక్షంలో సోమిరెడ్డి చేసిన ఆరోపణలు వాస్తవమని ప్రమాణం చేయాలని తాను కోరినా ఇప్పటి వరకు స్పందించలేదని విమర్శించారు. పొదలకూరులో అక్రమ లేఅవుట్లపై విచారణ జరిపించాలని తాను పలుమార్లు డిమాండ్ చేసినా, ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. లేవుట్ల యజమానుల వద్ద లబ్ధి పొందకపోతే విచారణ జరిపించాలన్నారు. బల్కర్లకు ఎందుకు అనుమతిచ్చారు..? ముత్తుకూరు మీదుగా బూడిద బల్కర్లు మళ్లీ వెళ్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, వీటికి అనుమతులను ఎందుకిచ్చారని ప్రశ్నించారు. కప్పం కట్టాలనే డిమాండ్కు బల్కర్ల యజమానులు అంగీకరించకపోవడంతో టీడీపీ నేతలు ఆందోళలు చేపట్టారని, బేరసారాలు కుదిరాక వీటిని యథాతథంగా వదిలారని మండిపడ్డారు. దీనిపై పోలీసుల సహకారం తీసుకున్నారని ఆరోపించారు. గిరిజనులపై వల్లమాలిన అభిమానం కురిపించే సోమిరెడ్డి, పంటపాళెంలోని వారి భూముల్లో ఇష్టానుసారం గోతులు తీస్తూ మట్టిని విక్రయిస్తుంటే చర్యలను ఎందుకు చేపట్టడంలేదని ప్రశ్నించారు. పోర్టులో కంటైనర్ టెర్మినల్ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీ ఎలాంటి పురోగతిని సాధించలేకపోయారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్విగా చూపించి పామాయిల్ ఫ్యాక్టరీలకు విక్రయించేందుకు యత్నిస్తున్నారని, తమ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే వీటిపై సమగ్ర విచారణను చేపడతామని స్పష్టం చేశారు. అధికారుల చుట్టూ నేలటూరు గ్రామస్తులు ప్రదక్షిణలు చేస్తున్నా, బూటకపు మాటలు చెప్తున్నారని, వీరికి పునరావాసాన్ని వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం వధూవరులు సునీల్, సాయివెంగమ్మ.. పవన్ కల్యాణ్, హేమలత, చంద్రారెడ్డి, అమృత.. దుర్గాప్రసాద్, జాలమ్మను ఆశీర్వదించారు. నేతలు బచ్చల సురేష్కుమార్రెడ్డి, పామూరు లచ్చారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, శ్రీహరి, మెట్టా విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పారా స్పోర్ట్స్ పోటీల్లో ప్రతిభ
నెల్లూరు(టౌన్): రాష్ట్రస్థాయి పారా స్పోర్ట్స్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ముగ్గురు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు 60 రోజుల క్యాంపునకు ఎంపికయ్యారు. వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన షేక్ అప్సర (మేథో వైకల్యం) 400 మీటర్ల పరుగు, షాట్పుట్, లాంగ్జంప్ విభాగాల్లో ప్రతిభ చూపి మూడు స్వర్ణ పతకాలు సాధించారు. అదే పాఠశాలకు చెందిన మెదబలిమి నిత్యశ్రీ (లోకో మోటర్ వైకల్యం)కు షాట్పుట్ విభాగంలో రజత పతకం వచ్చింది. ఇందుకూరుపేట మండలం ఆదెమ్మసత్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన కేతగాని జ్ఞాన వెంకటచందు పరుగు విభాగంలో రజత పతకం సాధించారు. ఈనెల 29వ నుంచి విశాఖపట్నంలోని ఏఎంటీజెడ్ క్యాంపస్లో రాష్ట్ర సమగ్ర శిక్ష, రాష్ట్ర పారా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే క్యాంపులో వీరు పాల్గొననున్నారు. విద్యార్థులను డీఈఓ బాలాజీరావు, ఏపీసీ వెంకటసుబ్బయ్య బుధవారం అభినందించారు. నవంబర్లో జరిగే జాతీయ పారా ఒలింపిక్ క్రీడల్లోనూ రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.షేక్ అప్సరనిత్యశ్రీవెంకటచందు -
వచ్చేనెల 9న చలో విజయవాడ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వచ్చేనెల 9వ తేదీన జరిగే ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకాశి పిలుపునిచ్చారు. నెల్లూరు సంతపేటలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక సంవత్సరాల నుంచి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను సంస్థలో విలీనం చేయాలన్నారు. 2026 పీఆర్సీ ప్రకారం సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మి కుల సమస్యలపై నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్లు గొప్పలు చెప్పుకొంటూ కాలాయాపన చేస్తున్నారే గానీ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులు కొమ్మి నారాయణ, యామాల మధు, సుధాకర్, కుమార్, ఉమ, శిరీష, బద్రి, మహీంద్ర, పెంచలయ్య, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
డ్రైవర్లే చెకింగ్లు.. ఇదేంది కొత్తగా ఉందేననే అనుమానం కలగక మానదు. అయితే జిల్లాలో జరుగుతున్న తంతును చూస్తే ఇది నిజమనే విషయం అర్థమవుతోంది. వాస్తవానికి రవాణా అధికారులు తనిఖీలకు వెళ్లే సమయాల్లో వారికి సాయంగా హోంగార్డులు, అటెండర్లను ప్రభుత్వం కేటాయిస్తోంది. అయ
నెల్లూరు (టౌన్): రవాణా శాఖలో అంతా ఇష్టానుసారంగా సాగుతోంది. అక్కడి అధికారులు నియమించుకున్న డ్రైవర్లు, ప్రైవేట్ వ్యక్తులే కింగ్ మేకర్లుగా చెలామణీ అవుతున్నారు. రహదారులపై తనిఖీలు చేస్తున్న సమయంలో.. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం, నెలవారీ మామూళ్ల వరకు అన్నీ వీరి కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సొంత వారికే పెద్దపీట జిల్లాలో పనిచేస్తున్న కొంతమంది రవాణా అధికారులకు హోంగార్డు లేదా అటెండర్ను కేటాయించారు. అయితే వీరిని పక్కనబెట్టి సొంతంగా నియమించుకున్న వారినే తనిఖీలకు తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో అడిగినంత మేర ఇవ్వకపోతే లారీలు, ఇతర వాహనాల డ్రైవర్లపై దాడులకూ తెగబడుతున్నారు. తాజాగా విశాఖపట్నం సమీపంలోని జాతీయ రహదారిపై ఏఎమ్వీఐ పార్వతి మూడు రోజుల క్రితం తనిఖీలు చేస్తున్న సందర్భంగా, ఆమె కారు డ్రైవర్.. ఓ లారీ డ్రైవర్పై దాడి చేశారు. ఘటనలో సదరు వ్యక్తి కన్ను దెబ్బతినిందని తెలిసింది. వీడియో వెలుగులోకి రావడంతో సదరు ఏఎమ్వీఐని ఎస్టీఏకు ఆ శాఖ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా అటాచ్ చేశారు. రాష్ట్రంలోని ఏ జిల్లాలోనైనా చెకింగ్ సమయంలో డ్రైవర్ లేదా ప్రైవేట్ వ్యక్తులుంటే చర్యలు చేపడతామనే ఆదేశాలనూ జారీ చేశారు. మారతారా.. లేక అలానే వ్యవహరిస్తారా..? జిల్లాలోనూ కొందరు అధికారులు వాహనాల తనిఖీల సమయంలో తమ వెంట నలుగురైదుగురు ప్రైవేట్ వ్యక్తులకు తమ వెంట తీసుకెళ్తున్నారని తెలిసింది. కమిషనర్ ఆదేశాల తరుణంలో వీరిని పక్కనబెడతారా లేక తమ ఇష్టానుసారం కొనసాగిస్తారాననే అంశం తెలియాల్సి ఉంది. నిరంతరం తనిఖీలే.. టార్గెట్ల పేరుతో పగలూ, రాత్రనే తేడా లేకుండా రాష్ట్ర, జాతీయ రహదారులపై తనిఖీలు చేస్తున్నారు. వీరు ప్రత్యేకంగా నియమించుకున్న డ్రైవర్లు, ప్రైవేట్ వ్యక్తులను తమ వెంట తీసుకెళ్తున్నారు. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలకు వాహనాలను పెట్టే సమయాల్లోనే హోంగార్డులు, అటెండర్లను వినియోగించుకుంటూ, మిగిలిన సమయాల్లో వీరిని ఇంటికే పరిమితం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక చెకింగ్ సమయాల్లో ప్రైవేట్ వ్యక్తులు యూనిఫారం లేకుండా రోడ్లపై వాహనాలను ఆపుతున్నారు. అసలు వీరెవరనే అంశం డ్రైవర్లకు అర్థం కావడంలేదు. కొందరు ప్రశ్నిస్తుండగా, మరికొందరు తమకెందుకులేనని మిన్నకుండిపోతున్నారు. వివరాల నమోదూ వీరితోనే.. వాస్తవానికి కేసుల వివరాలను ఆన్లైన్లో అధికారులే స్వయంగా నమోదు చేయాల్సి ఉంది. అయితే కొందరు మాత్రం ప్రైవేట్ వ్యక్తులతో ఈ పనిని చేయించుకుంటున్నారు. మరోవైపు గూడూరులో పనిచేస్తున్న ఓ రవాణా అధికారి రోజంతా రోడ్డుపైనే ఉండి ఫుల్ కలెక్షన్లతో ఇంటికెళ్తున్నారని ఆ శాఖలో పనిచేసే వారే పేర్కొంటున్నారు. ఆ ప్రాంతంలో పశువుల సంత, ధాన్యం లారీలు, ఇసుక, సిలికా, క్వార్ట్జ్ తదితర ఆదాయ వనరులున్నాయి. సదరు ఆఫీసర్ వెంట ఆయన నియమించుకున్న ప్రైవేట్ వ్యక్తులే ఉంటారని పేర్కొంటున్నారు. జిల్లా రవాణా అధికారుల్లో ఇప్పటికై నా మార్పొస్తుందా.. లేదాననే అంశం వేచి చూడాల్సిందే. రవాణా అధికారుల వెంట తనిఖీలకు వీరు, ప్రైవేట్ వ్యక్తులు హోంగార్డులు, అటెండర్లను కేటాయించినా పక్కనబెడుతున్న వైనం లారీలు, ఇతర వాహనాల నుంచి నేరుగా వసూళ్లు అడిగినంత ఇవ్వకపోతే దాడులు విశాఖపట్నం సమీపంలో వెలుగులోకి వచ్చిన ఘటన జిల్లాలోనూ ఇదే తంతు అడిగినంత ఇస్తే సరే.. లేకపోతే కేసే ఓవర్లోడ్ వాహనం కనబడితే అధికారి బట్టి రూ.ఐదు వేల నుంచి రూ.పది వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆఫీసర్ డ్రైవరో లేదా ప్రైవేట్ వ్యక్తికో యూపీఐ చేయించుకుంటున్నారు. అడిగినంత ఇవ్వకపోతే కేసు నమోదు చేసేందుకూ వెనుకాడటంలేదు. కొన్ని సందర్భాల్లో దాడులకూ తెగబడుతున్నారు. తనిఖీలకు వచ్చిన అనధికారిక వ్యక్తులకు రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేల వరకు నిత్యం ముట్టజెప్తున్నారనే టాక్ నడుస్తోంది. మరోవైపు ఆఫీసర్లకు తెలియకుండా ఇతర వాహనాల డ్రైవర్లను బెదిరించి తమ జేబులను వీరు నింపుకొంటున్నారు. జిల్లాలో ఇలా.. ఇలా వ్యవహరిస్తే చర్యలు తప్పవు తనిఖీల సమయంలో వారు నియమించుకున్న ఒక డ్రైవరే ఉండాలి. కేటాయించిన హోంగార్డు లేదా అటెండర్నే తీసుకెళ్లాలి. అలా కాకుండా ఇష్టమొచ్చిన వారిని తీసుకెళ్తే చర్యలు తప్పవు. రవాణా కమిషనర్ ఆదేశాలతో జిల్లాలోని ఎమ్వీఐలు, ఏఎమ్వీఐలతో సమావేశాన్ని నిర్వహించాం. వీరికి అన్ని అంశాలను స్పష్టంగా చెప్పాం. తనిఖీలు చేస్తున్న ప్రాంతానికెళ్లి పరిశీలిస్తా. నిబంధనలను పాటించకపోతే చర్యలు తప్పవు. – చందర్, ఉప రవాణా కమిషనర్ జిల్లాలో 18 మంది ఎమ్వీఐలు, ఏఎమ్వీఐలు పనిచేస్తున్నారు. నగరంలో నలుగురు.. కావలి, ఆత్మకూరులో ఒకరు చొప్పున.. గూడూరు, స్క్వాడ్లో ఇద్దరు చొప్పున ఎమ్వీఐలు విధులు నిర్వర్తిస్తున్నారు. అదే విధంగా నెల్లూరు హెడ్ క్వార్టర్స్లో ఐదుగురు.. కావలి, గూడూరు, స్క్వాడ్లో ఒకరు చొప్పున.. ఇలా ఎనిమిది మంది ఏఎమ్వీలున్నారు. ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఏడాదికి రూ.17.04 కోట్ల లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశించారు. స్క్వాడ్లో ఉండే ఎమ్వీఐ, ఏమ్వీఐ నెలకు రూ.పది లక్షలు.. ఎన్ఫోర్స్మెంట్లో ఉండే ఎమ్వీఐ రూ.ఎనిమిది లక్షలు.. ఏఎమ్వీఐ రూ.12 లక్షలు.. హెడ్ క్వార్టర్స్లో ఉండే ఎమ్వీఐ నెలకు రూ.6.5 లక్షలు.. ఏఎమ్వీఐ రూ.9.5 లక్షల మేర టార్గెట్ను పూర్తి చేయాల్సి ఉంది. -
ఫోన్ చూస్తూ.. మెట్లెక్కుతూ
● కిందపడి యువకుడికి గాయాలు రాపూరు: ఫోన్ చూస్తూ.. మెట్లెక్కుతూ కిందపడటంతో యువకుడు గాయపడిన ఘటన మండలంలోని వెలుగోను గిరిజన కాలనీలో చోటుచేసుకుంది. వివరాలు.. తన స్నేహితులతో కలిసి ఇంటి సమీపంలో ఉన్న మిద్దైపె నిద్రించేందుకు సిసింద్రీ మంగళవారం రాత్రి వెళ్లారు. ఈ క్రమంలో ఫోన్ చూస్తూ.. మెట్లెక్కుతూ ప్రమాదవశాత్తు కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డా రు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక వైద్యం నిమిత్తం రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం నెల్లూరు తరలించారు. -
క్యూఆర్ కోడ్తో తంటాలు
నెల్లూరు(పొగతోట): పేదల బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానంతో తిప్పలు తప్పడంలేదు. ఫలితంగా నిర్దేశించిన సమయానికి రేషన్ పంపిణీ కష్టతరంగా మారుతోంది. వాస్తవానికి దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దే వీటిని బుధవారం నుంచి పంపిణీ చేయాల్సి ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా 25 శాతం దుకాణాలకు శాతం వీటిని పంపిణీ చేయలేదు. క్యూఆర్ కోడ్ స్కానింగ్తో బస్తాలను అన్లోడ్ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతంలో సజావుగా.. గతంలో 250 బస్తాలను అన్లోడ్ చేసేందుకు గంటే పట్టేది. అయితే ప్రస్తుతం ఏడు గంటలకుపైగా పడుతోంది. హమాలీలు గతంలో రోజూ రూ.వెయ్యికిపైగా సంపాదించేవారు. అయితే నూతన విధానంతో రూ.300 రావడమే గగనంగా మారుతోంది. జిల్లాలో 1513 చౌక దుకాణాలున్నాయి. ఎమ్మెల్ఎస్ పాయింట్ల నుంచి ప్రతి నెలా 12,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్నిమినీ ట్రక్కుల ద్వారా వీటికి సరఫరా చేస్తున్నారు. కొత్తగా యాప్ బియ్యం బస్తాలకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ను ప్రస్తుతం ఏర్పాటు చేశారు. దీన్ని స్కానింగ్ చేసేందుకు గానూ ప్రత్యేక యాప్ను విడుదల చేశారు. చౌక దుకాణాల డీలర్లు స్కాన్ చేశాకే, బియ్యం బస్తాలను హమాలీలు అక్కడ అన్లోడ్ చేస్తున్నారు. మరోవైపు ప్రతి నెలా 25వ తేదీ నాటికి 70 నుంచి 80 శాతం మేర.. మిగిలిన మొత్తాన్ని 25 నుంచి మరుసటి నెల ఒకటిలోపు పూర్తి చేసేవారు. అయితే ప్రస్తుతం 25 శాతం సరఫరా సైతం పూర్తి కాలేదు. నెల్లూరులోని ఎమ్మెల్ఎస్ పాయింట్కు సంబంధించి 292 చౌక దుకాణాలకు రేషన్ను సరఫరా చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 54 షాపులకు మాత్రమే చేర్చారు. స్కానింగ్.. తలనొప్పిగా..! లారీని డీలర్లెక్కి ప్రతి బియ్యం బస్తాను స్కాన్ చేయాలి. ఇది సక్సెస్ అయితేనే హమాలీ అన్లోడ్ చేయాలి. అయితే పదింటిలో నాలుగైదు మాత్రమే సక్సెస్ అవుతున్నాయని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన విధానం తమకు తలనొప్పిలా మారిందని పేర్కొంటున్నారు. జాప్యంతో సరఫరా చేసేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.పాత బస్తాలే సరఫరా ఎమ్మెల్ఎస్ పాయింట్లలో పాత బియ్యం బస్తాలు నిల్వ ఉన్నాయి. ముందుగా చౌక దుకాణాల డీలర్ల నేతల షాపులకు క్యూఆర్ కోడ్ లేని వాటిని సరఫరా చేశారు. నగరంలో సుమారు 25 షాపులకు ఇలా జరిగింది. తొలుత ఎమ్మెల్ఎస్ పాయింట్లలోనే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలని ఆదేశించారు. అయితే వేల బస్తాల అన్లోడ్లో తీవ్ర జాప్యం జరగడంతో ప్రక్రియను విరమించి చౌక దుకాణాల్లోనే జరపాలనే ఉత్తర్వులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు జారీ చేశారు. స్కానింగ్.. పరేషాన్ చౌక దుకాణాలకు చేరని రేషన్ జాప్యమవుతున్న వైనం లారీ లోడ్ దించేందుకే ఏడు గంటలు కూలిలు గిట్టుబాటు కావడంలేదంటున్న హమాలీలు -
ఉపాధ్యాయుల పోరుబాట
● ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నెల్లూరురూరల్: ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. 2010 సంవత్సరానికి ముందు ఉద్యోగాల్లో చేరిన సీనియర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, సర్వీసులో ఉన్నవారికి పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి, జిల్లా ప్రధాన కార్యదర్శి గురవయ్య హాజరయ్యారు. నేతలు మాట్లాడుతూ 20 నుంచి 30 సంవత్సరాల క్రితం ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులను మళ్లీ టెట్ రాయాలని కోరడం సరైన విధానం కాదన్నారు. సీనియర్లకు మినహాయింపు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం సంబంధిత చట్టంలో సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక టెట్లోనూ సీనియర్లకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రత్యేక టెట్లో ఉపాధ్యాయులందరికీ అర్హత మార్కులను 40 శాతంగా నిర్ణయించాలని పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోకపోవడం సరికాదన్నారు. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23(1)ను సవరించి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక టెట్ను ఆఫ్లైన్లో నిర్వహించాలని, ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టు సిలబస్ నుంచే ప్రశ్నలను రూపొందించి పరీక్ష జరపాలన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జుల్ఫికర్ అలీ, బాలాత్రిపుర సుందరి, రియాజ్, పిచ్చిబాబు, కరీం మొహిద్దీన్, ఖాదర్బాషా, మహేంద్రరెడ్డి, రాజశేఖర్, విజయభారతి, సుంకు వెంకటేశ్వర్లు, జైపాల్రెడ్డి, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
రైలు పట్టాలపై మరణ మృదంగం
కొన్ని..నెల్లూరు(క్రైమ్): రైలు పట్టాలపై మరణ మృదంగం వినిపిస్తోంది. రోజూ ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు ప్రయాణికుల నిర్లక్ష్యం, అప్రమత్తత లోపం కారణంగా నిండుప్రాణాలు రైలు చక్రాల కింద నలిగిపోతున్నాయి. నెల్లూరు రైల్వే సర్కిల్ పరిధిలో తెట్టు నుంచి సూళ్లూరుపేట వరకు సుమారు 160 కిలోమీటర్ల మేర రైల్వే మార్గం విస్తరించి ఉంది. ఈ పరిధిలో కావలి, నెల్లూరు, గూడూరు రైల్వే స్టేషన్లతో పాటు బిట్రగుంట, సూళ్లూరుపేట, కృష్ణపట్నం పోర్టులో అవుట్పోస్టులు ఉన్నాయి. ఈ మార్గంలో రోజుకు సుమారు 120 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఒక నెలలో.. పట్టాలు దాటుతూ, రైల్లోంచి ప్రమాదవశాత్తు జారిపడి కింద పడుతూ పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. అదే సమయంలో వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా ఉంది. నెలకు సగటున 22 మంది రైలు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో రైలులో నుంచి ప్రమాదవశాత్తు జారిపడి, పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని సుమారు 117 మంది మృతిచెందారు. వివిధ కారణాలతో 61 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కొన ఊపిరితో ఉన్నా.. కాపాడలేని పరిస్థితి రోడ్డుపై ప్రమాదం జరిగితే ఘటనను చూసిన ప్రజలు వెంటనే స్పందించి బాధితులకు సహాయం చేసేందుకు పరుగులు తీస్తారు. అయితే రైలు పట్టాలపై జరిగే ప్రమాదాలు చాలాసార్లు ఎవరి కంటా పడవు. దీంతో వ్యక్తి కొన ఊపిరితో ఉన్నా సకాలంలో వైద్యం అందని పరిస్థితి నెలకొంటోంది. పట్టాలపై జరిగే ప్రమాదాలు చాలా సందర్భాల్లో ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. లోకో పైలట్లు, కీమెన్లు, ట్రాక్మెన్లు ప్రమాదాన్ని గుర్తించి స్టేషన్ మాస్టర్ దృష్టికి తీసుకెళ్తే ఆయన రైల్వే పోలీసులకు సమాచారం అందిస్తారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేస్తారు. అయితే లోకో పైలట్లు, కీమెన్లు, ట్రాక్మెన్లకు ప్రమాదం కనిపించకపోతే పరిస్థితి మరింత విషమంగా మారుతుంది. జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ప్రమాదానికి గురైన వారికి సకాలంలో వైద్యసేవలు అందించే అవకాశం ఉంటుంది. కానీ జనసంచారం లేని ప్రాంతాల్లో తీవ్రంగా గాయపడిన వారు కొన ఊపిరితో ఉన్నా సాయం అందక ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మృతదేహాల గుర్తింపు కష్టతరం రైలు ప్రమాదాల్లో మృతిచెందిన వారిని గుర్తించడం రైల్వే పోలీసులకు పెద్ద సవాల్గా మారుతోంది. మృతుల్లో అధికశాతం మంది ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడం ఒక కారణమైతే.. వారి వద్ద సెల్ఫోన్, ఆధార్కార్డు వంటి గుర్తింపు పత్రాలు లేకపోవడం మరో సమస్యగా మారుతోంది. ప్రమాద తీవ్రతతో మృతదేహాలు ఛిద్రమవడం కూడా గుర్తింపును మరింత కష్టతరం చేస్తోంది. కొన్ని సందర్భాల్లో మృతదేహాలు పట్టాల పక్కనే ఉన్న ముళ్లపొదలు, పిచ్చిమొక్కల మధ్య పడిపోవడంతో రోజుల తరబడి గుర్తించలేని పరిస్థితి నెలకొంటోంది. దీంతో మృతదేహాల గుర్తింపు, తరలింపు మరింత కష్టతరమవుతోంది. సొంత కుటుంబ సభ్యులైనా గుర్తుపట్టలేని దుస్థితి ఏర్పడుతోంది. నిబంధనల ప్రకారం గుర్తుతెలియని మృతదేహాలను 72 గంటలు (మూడు రోజులు) పాటు మార్చురీలో భద్రపరచాలి. ఆ సమయంలో మృతుడి సంబంధీకులు ఎవరూ రాకపోతే రైల్వే పోలీసులే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు మృతుడి వివరాలు, ఆచూకీ కోసం పోలీసులు వివిధ మార్గాల్లో ప్రయత్నించాల్సి ఉంటుంది. నిర్లక్ష్యమే ప్రధాన కారణం రైలు ప్రమాదాల్లో అధికశాతం ఘటనలకు ప్రయాణికుల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా నిలుస్తోంది. కదులుతున్న ట్రైన్లో ఎక్కడం, దిగడం, ఫుట్బోర్డుపై ప్రయాణించడం, తలుపు వద్ద కూర్చోవడం, అటూఇటూ గమనించకుండా పట్టాలు దాటడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. రైలు వస్తున్న విషయాన్ని గమనించకుండా పట్టాలు దాటేందుకు ప్రయత్నించడం, రైలు ప్రయాణ సమయంలో సెల్ఫోన్ ఉపయోగిస్తూ అప్రమత్తత కోల్పోవడం వంటి చర్యలు కూడా ప్రాణాల మీదకు తెస్తున్నాయి. రైల్వే అధికారులు, పోలీసులు ఎప్పటికప్పుడు ప్రయాణికులకు భద్రతపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరిలో నిర్లక్ష్య వైఖరి మారడం లేదు. నిబంధనలు పాటిస్తేనే ఇలాంటి విషాదాలను నివారించే అవకాశం ఉంటుంది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉంటే నిండు ప్రాణాలను కాపాడుకోవచ్చని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. నెలకు సగటున 22 మంది మృతి నిర్లక్ష్యం.. అప్రమత్తత లోపంతో నిండుప్రాణాలు బలి మృతదేహాల గుర్తింపు రైల్వే పోలీసులకు సవాల్ నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని 50 ఏళ్ల వృద్ధుడు ఓ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఇలాంటి ఘటనలు నెల్లూరు రైల్వే పరిధిలో తరచూ చోటుచేసుకుంటుండటంతో పట్టాలు మృత్యుమార్గాలుగా మారుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. అవగాహన కల్పిస్తున్నాం కదులుతున్న రైల్లో ఎక్కడం, దిగడం చేయరాదు. ఫుట్బోర్డులపై నిలబడి, తలుపుల వద్ద కూర్చొని ప్రయాణించరాదు. పట్టాలు దాటాల్సి వచ్చినప్పుడు ముందు, వెనుక చూసుకోవాలి. మలుపుల వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలి. రైల్వేస్టేషన్లలో ఫుట్ఓవర్ బ్రిడ్జిలను మాత్రమే వినియోగించాలి. రైలు ప్రమాదాల నివారణ చర్యలపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నాం. – ఎ.సుధాకర్, రైల్వే సీఐ -
భక్తిశ్రద్ధలతో మిలాద్ – ఉన్ – నబీ
మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాద్ – ఉన్ – నబీని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని మసీదుల్లో ప్రత్యేక దువా చేశారు. వివిధ ప్రాంతాల్లో అన్నదానాలను చేపట్టారు. కామాటివీధిలోని ఆయేషా మసీదు నుంచి కోటమిట్ట వద్ద గల అమీనియా మసీదు మీదుగా ప్రదర్శనను నిర్వహించారు. మతపెద్దలు, ఇమామ్లు, మౌల్వీలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. గుర్రాలతో ప్రత్యేక వాహనంపై తీర్చిదిద్దిన మక్కా, మసీదు నమూనాలు, ఒంటెలు, వాహనాలతో నగరోత్సవం నేత్రపర్వంగా సాగింది. – నెల్లూరు(బృందావనం) -
ఏం పర్వాలేదు.. ఇసుక తవ్వుకోండి..!
నెల్లూరు జిల్లా: నదుల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం అమల్లో ఉన్నా, తవ్వుకోండంటూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల సంరక్షణలో భాగంగా నదుల్లో ఇసుక తవ్వకాలను నిర్ణీత కాలం పాటు నిలిపేస్తారు. అయితే ఈ నిషేధం కొనసాగుతున్న తరుణంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బుచ్చిరెడ్డిపాళెంలో ఓ టీడీపీ నేత శుభకార్యానికి హాజరైన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. భవన నిర్మాణ రంగ కార్మికులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇసుక లభ్యతపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీఎం సూచనల మేరకు రీచ్ల నుంచి పగటిపూట ఇసుకను తరలించుకోవచ్చని, యంత్రాలను ఉపయోగించకుండా మనుషుల ద్వారా ట్రాక్టర్లలో పంపొచ్చని నేతలకు సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలు అక్రమార్కులకు మరింత ఊతమిచ్చే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి: వెలిగొండలో చంద్రబాబు క్రెడిట్ చోరీ -
యువగళం హామీలను ఎప్పుడు నెరవేరుస్తారు?
● నెల్లూరులో ర్యాలీ నెల్లూరు(టౌన్): యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారని అఖిల భారత విద్యార్థి బ్లాక్ జాతీయ కమిటీ సభ్యుడు వీవీఎస్ చైతన్య, రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ మంగళవారం నెల్లూరులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. జీఓ నంబర్ 77ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదన్నారు. సంక్షేమ హాస్టళ్లల్లో విద్యార్థులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. నిరుద్యోగ భృతి బూటకపు హామీగా మిగిలిందన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖరరెడ్డి, పోతులయ్య, వంశీ, మణి, సాయికృష్ణ, గౌతమ్, ఇంతియాజ్, పవన్ పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణకు ప్రత్యేకాధికారుల నియామకం
నెల్లూరు(పొగతోట): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. త్వరలో జరగనున్న ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. దీనిపై అధికారులతో సమావేశాన్ని డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. జిల్లా స్థాయి కమిటీ.. బ్రహ్మయ్య, జెడ్పీ డిప్యూటీ సీఈఓ.. స్వరూప్, డీడీఓ, నెల్లూరు.. కిరణ్కుమార్, మెప్మా పీడీ.. రమణయ్య డీడీఓ ఆత్మకూరు. మండల ప్రత్యేకాధికారులు రమేష్నాయక్, సీతారామపురం.. వెంకటరెడ్డి, ఉదయగిరి.. వెంకటేశ్వర్లు, వరికుంటపాడు.. జహీరుద్దీన్ అహ్మద్, దుత్తలూరు.. శ్రీనివాసరావు, మర్రిపాడు.. సింహాద్రి, వింజమూరు.. శ్రీధర్, కలిగిరి.. శ్రీనివాసరెడ్డి, కొండాపురం.. సన్ని వంశీకృష్ణ, కావలి.. ఇషాక్, జలదంకి.. అశోక్కుమార్, బోగోలు.. నాగరాజకుమారి, కోవూరు.. అనితకుమారి, కొడవలూరు.. లక్ష్మీనరసింహులు, విడవలూరు.. ఈశ్వర్ చందర్, దగదర్తి.. నగేష్కుమారి, అల్లూరు.. సుజాత, బుచ్చిరెడ్డిపాళెం.. విజయభాస్కర్, సంగం.. బాలాజీరావు, ఆత్మకూరు.. వెంకటసుబ్బయ్య, ఏఎస్పేట.. సోమ్లానాయక్, అనంతసాగరం.. అర్జున్రావు, ఇందుకూరుపేట.. నిర్మలాదేవి, తోటపల్లిగూడూరు.. శివకుమార్, నెల్లూరు రూరల్.. వెంకటలక్ష్మి, వెంకటాచలం.. చంద్ర, ముత్తుకూరు.. గుర్రప్ప, పొదలకూరు.. పవన్, చేజర్ల.. కోటేశ్వరరావు, కలువాయి.. కేశవర్ధన్రెడ్డి, రాపూరు.. వాణి, గూడూరు.. సుబ్బారెడ్డి, మనుబోలు.. శ్రీనివాసప్రసాద్, చిల్లకూరు.. శ్రీనివాసరావు, సైదాపురం.. దేశ్నాయక్, కోట. -
అనుమతి లేకుండా మట్టి తరలింపు
● రెండు ట్రాక్టర్ల పట్టివేత వాకాడు: ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను వాకాడు పోలీసులు సోమవారం పట్టుకున్నారు. మంగళవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. చిట్టమూరు మండలం రొయ్యల కాలువ ప్రాంతం నుంచి వాకాడుకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు పోలీసులకు సమచారం అందడంతో తనిఖీలు చేట్టారు. కేసు నమోదు చేసి రెండు ట్రాక్టర్లను వాకాడు తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్కు అప్పగించారు. అనంతరం తహసీల్దార్ జరిమానా విధించి ట్రాక్టర్ల యజమానులను మందలించినట్లు తెలిసింది. నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.125 సన్నవి : రూ.60 పండ్లు : రూ.30 -
మద్యం మత్తులోనే హత్య
● నిందితుడి అరెస్ట్ కలిగిరి: మండలంలోని నాగిరెడ్డిపాళెం సెంటర్లో సంగన రామిరెడ్డి అనే వృద్ధుడి హత్య కేసులో నిందితుడు సంజీవ్కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కలిగిరి పోలీస్స్టేషన్లో సీఐ పి.సుబ్బారావు మంగళవారం వివరాలు వెల్లడించారు. ఈనెల 23వ తేదీన సంజీవ్కుమార్ మద్యం మత్తులో క్షణికావేశంలో 90 సంవత్సరాల వృద్ధుడు రామిరెడ్డిని కత్తితో పొడిచి చంపాడు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిపై రౌడీషీట్ తెరుస్తామని సీఐ తెలిపారు. కార్యక్రమంలో కలిగిరి, వింజమూరు ఎస్సైలు లతీఫున్నీసా, ఉమామహేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
జూడాల ఆందోళన.. పట్టించుకోని ప్రభుత్వం
● స్టై పెండ్ సవరించాలని డిమాండ్ ● నర్సింగ్ విద్యార్థులతోనే వైద్య సేవలు ● అర్హత లేని ఫార్మడీ ఇంటర్న్లతో చికిత్స ● అరకొర వైద్య సేవలతో రోగుల అవస్థలు నెల్లూరు(అర్బన్): న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు 16 రోజులుగా వైద్య సేవలకు దూరంగా ఉంటూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నెల్లూరులోని సర్వజన ఆస్పత్రి వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన దీక్ష చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హనీష్కుమార్ మాట్లాడుతూ 16 రోజులుగా తాము వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. స్టై పెండ్ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీఓలను సైతం అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. తాము ఏడాది కాలంగా వినతిపత్రాలు సమర్పిస్తూ, మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి స్టై పెండ్ను సవరించాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మె బాట పట్టాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి తమకు న్యాయమైన స్టై పెండ్ను పెంచాలని డిమాండ్ చేశారు. వైద్యుల ఉద్యోగ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచరాదని కోరారు. జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వ వైద్యులుగా అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే వైద్య విద్యార్థులకు ఎంబీబీఎస్, పీజీ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్లతోనే పాఠాలు బోధించాలని కోరారు. ఎంఎస్సీ, పీహెచ్డీ చేసిన వారితో బోధన చేయిస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం న్యాయం చేయకపోతే నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కావ్య, కీర్తి, షాలిని, సుగుణ, స్వామి, మధు, సుజిత్ తదితరులు పాల్గొన్నారు. వారితోనే సేవలంటూ.. జూనియర్ డాక్టర్లు సాధారణంగా ఐసీయూ, క్యాజువాలిటీ (ఎమర్జెన్సీ) విభాగాల్లో రోగులకు వైద్య సేవలు అందిస్తుంటారు. గాయాలకు కట్లు కట్టడం, ఇంజెక్షన్లు వేయడం, చేతికి క్యానులా పెట్టడం వంటివి చేస్తారు. సీనియర్ డాక్టర్ల సూచనల మేరకు ఆయాసం, ఇతర చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు వైద్యం చేస్తుంటారు. అయితే జూడాల సమ్మె కారణంగా ఈ సేవలకు అంతరాయం ఏర్పడింది. క్యాజువాలిటీ వంటి కీలక విభాగాల్లో ప్రస్తుతం మొదటి సంవత్సరం నర్సింగ్ విద్యార్థులతో ఇంజెక్షన్లు వేయించడం, ఈసీజీ తీయించడం వంటి పనులు చేస్తున్నారు. ● ఫార్మడీ కోర్సు చదువుతున్న ఇతర కళాశాలలకు చెందిన విద్యార్థులు శిక్షణలో భాగంగా ఇంటర్న్షిప్ కోసం సర్వజన ఆస్పత్రికి వచ్చారు. వారికి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించే అర్హత లేదు. అయినప్పటికీ సమ్మె నేపథ్యంలో ఫార్మడీ ఇంటర్న్లతో రోగులకు చికిత్సలు చేయిస్తున్నారు. అర్హత, అనుభవం లేని వారితో వైద్య సేవలు అందించడం వల్ల ఏదైనా అనుకోని ఘటన జరిగితే బాధ్యత ఎవరిదనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మెకు పరిష్కారం చూపడంతోపాటు ఆస్పత్రిలో రోగులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
సమ్మెకు సిద్ధమైన కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులు
● నల్లబ్యాడ్జీలతో నిరసన నెల్లూరు(అర్బన్): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం తమను రెగ్యులర్ చేయాలంటూ వైద్యశాఖకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్ చేశారు. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ విధులకు హాజరయ్యారు. దశల వారీగా తాము ఆందోళనలు జరుపుతున్నామని ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు వెళ్తామంటూ కాంట్రాక్ట్ నర్సులు, ల్యాబ్టెక్నీషి యన్లు, ఇతర సిబ్బంది మంగళవారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ మాధవికి నోటీసులు అందజేశారు. అలాగే తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ రెగ్యులర్ నర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వరలక్ష్మికి, బాలాజీ నగర్లో సీఐటీఐయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులుకు, ఎన్జీఓ భవన్లో ఆ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండారుపల్లి వెంకటేశ్వర్లుకు వినతిపత్రాలిచ్చారు. ఉద్యోగ సంఘాల నాయకులు తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. వినతిపత్రం అందజేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కాంట్రాక్ట్ వైద్యసిబ్బంది కలిసి వినతిపత్రం అందజేశారు. తమకు అండగా నిలబడాలని కోరారు. కార్యక్రమాల్లో రూత్గ్రేస్, శేఖర్, సుసన్న తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..● యువకుడి ఆత్మహత్య వెంకటాచలం: ఫ్యాన్కు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెంకటాచలం పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మకాలనీలో మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. శివకుమార్ (23) ఇందిరమ్మ కాలనీలో తన కుటుంబ సభ్యులతో ఉంటూ పెయింట్ పనులకు వెళ్లేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొంతసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించి చుట్టుపక్కల వారి సాయంతో కిందకు దించారు. అయితే శివకుమార్ అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిదగదర్తి: మండలంలోని దుండిగం గ్రామంలో విద్యుదాఘాతానికి గురై కాప దామోదర్ (47) అనే వ్యక్తి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం పొలాల వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు విద్యుత్, పోలీసు అధికారులు తెలిపారు. మంగళవారం వివరాలు వెల్లడించారు. దామోదర్ తన ద్విచక్ర వాహనాన్ని గ్రామంలోని రహదారి వద్ద ఉంచాడు. సమీప బీడు పొలాల్లో సుమారు ఎనిమిది అడుగుల ఎత్తులో వెళ్తున్న 11 కేవీ విద్యుత్ వైర్ల వద్దకు వెళ్లాడు. అనంతరం విద్యుత్ వైర్ను చేతితో తాకడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు మంగళవారం మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా.. దామోదర్ కుటుంబంలో కొంతకాలంగా కలహాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కావలి ఏరియా ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించినట్లుగా ఎస్సై మహేంద్ర తెలిపారు. దామోదర్కు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు నెల్లూరులో ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ..
● డీఈఓ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ నిరసన నెల్లూరు(టౌన్): ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవకోటేశ్వరరావు డిమాండ్ చేశారు. టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో మంగళవారం నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2010కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. టెట్కు వ్యతిరేకంగా ఇప్పటికే అనేక ఆందోళనలు నిర్వహించామని తెలిపారు. ప్రత్యేక టెట్ ఇస్తామని చెప్పి విడుదల చేసిన నోటిఫికేషన్లో ఎలాంటి సవరణలు చేయకపోవడం టీచర్లను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. అర్హత మార్కులను 40 శాతానికి తగ్గించాలని, పరీక్షను ఆఫ్లైన్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎస్ఏలు ఏ సబ్జెక్టును బోధిస్తారో, అదే సబ్జెక్టు సిలబస్లో టెట్ పరీక్ష నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శేషులు, గౌరవాధ్యక్షుడు అచ్చయ్య, అసోసియేట్ అధ్యక్షుడు ఖాజావలీ, కోశాధికారి మురళీధర్, కార్యదర్శులు నాగిరెడ్డి, అనిల్కుమార్, రమణయ్య, శ్రావణ్కుమార్, బాలరాగయ్య, శైలజ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధుసూదనరావు, జమీర్ అహ్మద్, మనోహర్బాబు పాల్గొన్నారు. -
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
నెల్లూరు(అర్బన్): జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల్లో గర్భిణులకు లింగ నిర్ధారణ చేశారనే తెలిస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ సుజాత స్పష్టం చేశారు. పీసీ పీఎన్డీటీ యాక్ట్ అమలు తీరుపై సంతపేటలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో గల తన చాంబర్లో కమిటీ సభ్యులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. చట్టాన్ని కఠినంగా అమలు చేసేలా అన్ని స్కానింగ్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించేలా కమిటీ సభ్యులను నియమించామని వెల్లడించారు. స్కాన్ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. లైసెన్స్లను సకాలంలో రెన్యువల్ చేయించుకోవాలని సూచించారు. గైనకాలజిస్ట్ కిరణ్, జీజీహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్వర్ణరెడ్డి, ఇమ్యూనైజేషన్ జిల్లా అధికారి బ్రిజిత, డిప్యూటీ డెమో సునీత, ఎస్ఓ సహన, ఎన్డీఓలు శ్రీనివాస్, కుసుమ, కవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏం పర్వాలేదు.. ఇసుక తవ్వుకోండి..! ● ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దుమారం బుచ్చిరెడ్డిపాళెం: నదుల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం అమల్లో ఉన్నా, తవ్వుకోండంటూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల సంరక్షణలో భాగంగా నదుల్లో ఇసుక తవ్వకాలను నిర్ణీత కాలం పాటు నిలిపేస్తారు. అయితే ఈ నిషేధం కొనసాగుతున్న తరుణంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బుచ్చిరెడ్డిపాళెంలో ఓ టీడీపీ నేత శుభకార్యానికి హాజరైన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. భవన నిర్మాణ రంగ కార్మికులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇసుక లభ్యతపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీఎం సూచనల మేరకు రీచ్ల నుంచి పగటిపూట ఇసుకను తరలించుకోవచ్చని, యంత్రాలను ఉపయోగించకుండా మనుషుల ద్వారా ట్రాక్టర్లలో పంపొచ్చని నేతలకు సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలు అక్రమార్కులకు మరింత ఊతమిచ్చే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రవాణా శాఖ అధికారుల్లో ఎట్టకేలకు కదలిక నెల్లూరు (టౌన్): నగరంలోని టౌన్ బస్సుల నిబంధనల అతిక్రమణపై జిల్లా రవాణా శాఖ అధికారుల్లో ఎట్టకేలకు కదలికొచ్చింది. ‘మా దారి అడ్డ దారి’ అనే శీర్షికన సాక్షిలో కథనం మంగళవారం ప్రచురితమైన నేపథ్యంలో, టౌన్ బస్సులపై తనిఖీలను రవాణా స్క్వాడ్ అఽధికారులు నిర్వహించారు. పొల్యూషన్ లేదని.. ఎల్ఈడీ లైట్లు బిగించారని.. హెవీ హారన్లు.. పత్రాలు చూపించలేదంటూ ఆయా బస్సులపై కేసులు నమోదు చేశారు. రూ.100 నుంచి రూ.600 వరకు అపరాధ రుసుమును విధించారు. కాగా స్క్వాడ్ అధికారులు నమోదు చేసిన కేసులపై రవాణా శాఖలో పనిచేస్తున్న అధికారులే నవ్వుకుంటున్నారు. శ్రీవారి దర్శనానికి ఎనిమిది గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవా రం మోస్తరుగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 14 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 77,085 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాల ను 33,766 మంది అర్పించారు. కానుకల రూ పంలో హుండీలో రూ.4.61 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
తవ్వకాల్లోనూ నిబంధనలు బేఖాతరు
గూడూరు తీరంలో సిలికా గనులు.. కాసుల గనులుగా మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అరుదైన సిలికాపై ప్రైవేట్ సంస్థ గుత్తాధిపత్యం సాగిస్తూ.. గని యజమానుల నుంచి కారుచౌకగా కొనుగోలు చేసి, అదే సిలికాను భారీ ధరకు విక్రయిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతులున్న గనుల నుంచి తవ్వకం మొదలు డంపింగ్ యార్డుకు తరలింపు వరకు ఆ సంస్థ కనుసన్నల్లోనే జరుగుతోంది. రోజుకు వందకు పైగా లారీల్లో వేల టన్నుల సిలికా తరలుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతుండగా ప్రభుత్వ పెద్దల ఖజానా నిండుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిలికా రవాణాలో ప్రైవేట్ సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీలు ఎగ్గొట్టేందుకు ప్రతి నాలుగు నెలలకు కొత్త కంపెనీని తెరపైకి తెచ్చి కొత్త తరహాలో దోపిడీకి పాల్పడుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ అధికారంలోకి రాగానే గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు, కోట మండలాల తీర ప్రాంతంలో అరుదుగా దొరికే సిలికా దోపిడీకి తెరతీశారు. సిలికా గనులను తమ అధీనంలోకి తీసుకుని కాసుల వేట ఆరంభించారు. తమ కనుసన్నలో ఉండే ఓ ప్రైవేట్ సంస్థను ఎంపిక చేసి సిలికా రవాణా బాధ్యతలను వారికి అప్పగించారు. ఇందుకోసం ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసుకున్నారు. తమ సంస్థ ముద్ర లేకుండా ఎలాంటి రవాణా చేసేందుకు వీల్లేకుండా కట్టడి చేశారు. దీంతో సిలికా రవాణా మొత్తం వారి కనుసన్నలోనే జరుగుతుండడం విశేషం. గూడూరు నియోజకవర్గంలో 114 సిలికా గనులుండగా, దాదాపు 60కు పైగా లీజు అనుమతులున్నాయి. కానీ టీడీపీ నేతల గుత్తాధిపత్యం నేపథ్యంలో కేవలం 33 గనుల్లో మాత్రమే మైనింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఎన్నికలకు ముందు యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేశ్ టీడీపీ అధికారంలోకి రాగానే సిలికా యజమానులకు కాసుల వర్షం కురిపిస్తామని, యజమానులే రాయల్టీ చెల్లించి స్వయంగా రవాణా చేసుకునేలా చేస్తానంటూ ఊదరగొట్టారు. కానీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రభుత్వ పెద్దలు తమ బినామీగా బీడీఎం ప్రైవేట్ సంస్థను పెట్టుకుని మైనింగ్ దోపిడీకి తెరతీశారు. అనుమతులున్న గనుల యజమానులకు మాత్రం టన్నుకు రూ.250 నుంచి రూ.300 వరకు ఇచ్చి ఆ ప్రైవేట్ సంస్థే కొనుగోలు చేసి రవాణా చేసుకోనేలా అనధికారంగా నిబంధనలు విధించారు. హవా అంతా ప్రైవేట్ సంస్థదే రోజుకు కోటి రూపాయలకు పైగా జరిగే సిలికా వ్యాపారంపై బీడీఎం ప్రైవేట్ సంస్థ చిల్లకూరు మండలం అంకులపాటూరు వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుకు సిలికాను ఇక్కడ డంపింగ్ చేసి అక్కడి నుంచి టన్ను రూ.1700 లెక్కన విక్రయిస్తోంది. గనుల యజమానుల వద్ద టన్ను రూ.300లకు కొనుగోలు చేస్తున్న ఈ సంస్థ.. ఈ మేరకు ప్రభుత్వానికి ఒక శాతం రాయిల్టీ చెల్లిస్తోంది. ఇక టన్నుకు రూ.500 చొప్పున ప్రతి నెలా నేరుగా ప్రభుత్వ పెద్దలకు చేర్చుతున్నారనే ఆరోపణలున్నాయి. ఓవర్ లోడేజీ.. అడిగే వారెవరు జీ సిలికా గనుల నుంచి ఒక లారీలో అనుమతి మేరకు 22 నుంచి 25 టన్నుల వరకు మాత్రమే తరలించాల్సి ఉంది. అయితే ప్రైవేట్ సంస్థ నిర్వాహకులు మైన్ నుంచి ఒక లారీకి కనీసం 45 నుంచి 50 టన్నుల సిలికాను తరలిస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని ఎగనామం పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ దొరికే సిలికాకు మంచి గిరాకీ ఉండడంతో గ్లాస్, ఇండాలియం పరిశ్రమలు సిలికాకు ఆర్డర్లు ఇస్తుంటారు. దీంతో ఈ ప్రాంతం నుంచి డీలర్లు ద్వారా రోజుకు కనీసం వందకు పైగా లారీల్లో సిలికా తరలిపోతోంది. ఒక లారీకి కనీసం 45 టన్నుల చొప్పున వంద లారీల్లో నిత్యం సుమారు 4500 టన్నులు సిలికా రోజు తరలిపోతోంది. గూడూరు డివిజన్లో 114 గనుల్లో 33 ఓపెన్ చినబాబు కనుసన్నల్లోనే దోపిడీ బీడీఎం సంస్థ గుత్తాధిపత్యంలోనే సిలికా తవ్వకాలు అనుమతులున్న యజమానులకు టన్నుకు రూ.250 మాత్రమే బీడీఎం సంస్థ మాత్రం టన్ను రూ.2 వేలకు పైగా విక్రయం నెలకు రూ. కోట్లలో ప్రభుత్వ పెద్దలకు? తరచూ సంస్థ పేర్లు మార్చుతూ దోపిడీ అనుమతులు లేని మైన్లే టార్గెట్ కాలం చెల్లిన మైన్లలో తవ్వకాలను పూర్తిగా నిలిపి వేశారు. ప్రస్తుతం సిలికా తరలింపు చేపట్టిన సంస్థ ఎక్కడా ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేపట్టకూడదని ప్రకటించారు. అయితే కాలక్రమంలో మాటా దాట వేసిన సంస్థ ప్రతినిధులు ఏకంగా కాలం చెల్లిన మైన్లపై దృష్టి పెట్టారు. దీంతో ఎక్కడ మైన్లు ఖాళీ చేశారో అక్కడ రోడ్లు, మిగిలిన సిలికాను డంపింగ్ యార్డుకు తరలించి అక్కడి నుంచి పరిశ్రమలకు తరలిస్తున్నారు. ప్రభుత్వం అనుమతి పొందిన ఈ ప్రైవేట్ సంస్థ సిలికా తరలింపుల్లో కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక సంస్థ పేరుతో సిలికా తరలింపులు చేపడితే భవిష్యత్లో లెక్కలు చెప్పాల్సి వచ్చిన సమయంలో ఇబ్బందులు ఉంటాయని సంస్థ ప్రతినిధులు ప్రతి నాలుగు నెలలకు ఒక కొత్త సంస్థను తెరపైకి తెచ్చి దోపిడీకి పాల్పడుతోంది. ఈ రెండేళ్లలో 8 సంస్థల పేర్లు మార్పులు చేసి ఆయా సంస్థల పేరుతో వే బిల్లులు ఇస్తున్నారు. ఈ లెక్కన ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అధిక లోడుతో వెళ్లే లారీల్లో కొంత మేర మాత్రమే బిల్లులు వేసి మిగిలిన దానికి బిల్లులు లేకుండా పంపి దానిపై వచ్చిన ఆదాయం మొత్తం చిన్నబాబుకు అప్పగిస్తున్నట్లు సమాచారం. సిలికా గనులు లీజుకు తీసుకునే సమయంలో యజమానులు పర్యావరణం దెబ్బతినకుండా కూలీలతో సిలికాను తవ్వి తరలిస్తామని హామీ ఇస్తారు. సుమారు 15 అడుగుల లోతు మేర మాత్రమే తవ్వకాలు చేపట్టాలనే నిబంధనలను యజమానులు నిబంధనలు తుంగలో తొక్కి యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్నారు. పర్యావరణం దెబ్బతినకుండా ఏర్పాటు చేసిన బఫర్ జోన్ దాటి.. సుమారు 30 అడుగుల లోతు వరకు తవ్వకాలు చేపడుతున్నారు. సిలికా తవ్వకాల్లో అక్రమాలు వెలుగుచూస్తున్నా.. గనులశాఖ, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేసి అంతా బాగుందని చెప్పి వెళ్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. -
విద్యార్థుల్లో జాతీయ భావాన్ని పెంచాలి
● వైఆర్జేసీ స్వర్ణోత్సవ సభలో వెంకయ్యనాయుడు వింజమూరు(ఉదయగిరి): విద్యార్థుల్లో చిన్నతనం నుంచే జాతీయ భావాన్ని పెంచేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హితవు పలికారు. వింజమూరులో మంగళవారం జరిగిన వైఆర్జేసీ స్వర్ణోత్సవ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మాతృభాషను తప్పనిసరిగా, అలాగే ఇంగ్లిష్, హిందీని కూడా అందరూ నేర్చుకోవాలన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే, భారతీయ సంస్కృతిని మరిచిపోకూడదన్నారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం గౌరవం పెరిగిందన్నారు. ప్రపంచ దేశాల్లో ఒక శక్తిగా మారిందన్నారు. పాలకులు ప్రజలకు అన్నీ ఉచితాలు ఇవ్వకూడదన్నారు. విద్య, ఆరోగ్యం, ఆహారానికి ఉచిత పథకాలు అమలు చేయాలన్నారు. 1975 ప్రాంతంలో ఉదయగిరి, వింజమూరు మెట్ట ప్రాంతంలో ఉన్నత చదువుకు వైఆర్జేసీ కాజేజీ ఏర్పాటు చేసి, దాని ద్వారా ఎంతోమంది ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన రాజాసత్యనారాయణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. స్వర్ణోత్సవాలు జరుపుకోవడం చిన్న విషయం కాదన్నారు. రూ.కోటి కార్పస్ ఫండ్ వసూలు చేసి తద్వారా వచ్చిన వడ్డీతో స్టాఫ్ను పెట్టి మంచి విద్యను అందించేందుకు అందరూ సహకరించాలన్నారు. నేడు మన రాష్ట్రంతోపాటు, తెలంగాణలో ఆర్థిక పరిస్థితులు బాగోలేవు. దీనిని దృష్టిలో పెట్టుకుని పాలన సాగించాలని హితవు పలికారు. ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి లోకానికి వెంకయ్యనాయుడు రోల్ మోడల్గా అభివర్ణించారు. చిన్నతనం నుంచి కష్టపడి పనిచేసే తత్వం తమదన్నారు. కాలేజీకి వెంకయ్య రూ.5 లక్షలు, వేమిరెడ్డి రూ.10 లక్షలు ఆర్థిక సహయం ప్రకటించారు. అంతకుముందు మాజీ ఉప రాష్ట్రపతి రాజాసత్యనాయణ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆర్ఐఓ వరప్రసాద్రావు, ప్రొఫెసర్ యల్లాల వెంకట్రామిరెడ్డి, కె.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి ఫొటోగ్రాఫర్లకు అవార్డులు
అచీవ్మెంట్, కన్సోలేషన్ అవార్డులు పొందిన చిత్రాలు ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్మలిస్టుల అసోసియేషన్ (ఏపీ పీజేఏ) ఆధ్వర్యంలో నేషనల్ ఫొటో పోటీలు – 2026 అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం విజయవాడ ప్రెస్క్లబ్లో ఘనంగా జరిగింది. సీఆర్ మీడియా అకాడమీ, రాష్ట్ర క్రియేటివ్ అండ్ కల్చరర్ కమిషన్లు ఈ కార్యక్రమ నిర్వహణకు తోడ్పాటునందించాయి. ఈ సందర్భంగా నెల్లూరుకు చెందిన సాక్షి ఫొటోగ్రాఫర్లను అవార్డులు వరించాయి. జనరల్ విభాగంలో ఆవుల కమలాకర్ అచీవ్మెంట్ అవార్డు, విజయకృష్ణ జనరల్ విభాగంలో కన్సోలేషన్ అవార్డును అందుకున్నారు. – విజయవాడ అవార్డులు స్వీకరిస్తున్న కమలాకర్, విజయకృష్ణ -
అన్నదమ్ములు.. చోరీల్లో సిద్ధహస్తులు
● రైళ్లల్లో వరుస దొంగతనాలు ● అరెస్ట్ చేసి రూ.13.65 లక్షల సొత్తు స్వాధీనంనెల్లూరు(క్రైమ్): చెడు వ్యసనాలకు బానిసై రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అన్నదమ్ములను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.13.65 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నెల్లూరు రైల్వే డీఎస్పీ జి.మురళీధర్ తన కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. ఇటీవల రైళ్లల్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. డీఎస్పీ నేతృత్వంలో సీఐ ఎ.సుధాకర్ తన సిబ్బందితో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా పెంచారు. గూడూరు బొగ్గులదిబ్బ ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు తాల్లూరు అనిల్కుమార్, సునీల్కుమార్, ఓ జువైనల్ను అదుపులోకి తీసుకుని విచారించగా మూడు బ్యాగ్ దొంగతనాలు, ఐదు చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి నుంచి రూ.13.65 లక్షల విలువైన 104.248 గ్రాముల బంగారు ఆభరణాలు, 180 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. డబ్బు కోసం.. నిందితులు చిన్నతనం నుంచే చెడు వ్యసనాలకు బానిసై వాటి కోసం డబ్బు సమకూర్చుకునేందుకు దొంగతనాలకు పాల్పడసాగారు. రైళ్లలో తిరుగుతూ ప్రయాణికుల బ్యాగ్లు, బంగారు గొలుసులను అపహరించసాగారు.. వీరిపై ఇప్పటికే బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీస్స్టేషన్, గూడూరు రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో నాలుగు కేసులున్నాయని డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తు రాబట్టేందుకు కృషి చేసిన సీఐ ఎ.సుధాకర్, గూడూరు, నెల్లూరు ఎస్సైలు ఎం.నారాయణ, ఎన్.హరిచందన, సిబ్బందిని డీఎస్పీ అభినందించి నగదు రివార్డులను అందజేశారు. రైలు ప్రయాణ సమయంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని డీఎస్పీ సూచించారు. -
జీపీఎస్కు మంగళం
నెల్లూరు (టౌన్): నగరంలో ట్రాఫిక్ నరకప్రాయంగా మారింది. రయ్ రయ్ మంటూ దూసుకెళ్లే వేలాది ఆటోలు, పదుల సంఖ్యలో టౌన్ బస్సులు, వీటితో పాటు కార్లు, బైకులతో నిత్యం రోడ్లపై ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది. ఓ పక్క ఇరుకురోడ్లు, మరో పక్క ఫుట్పాత్లు లేకపోవడంతో నిత్యం ఏదోక చోట ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి. నగరంలో ఆటోలు, టౌన్ బస్సులను నిబంధనలకు విరుద్ధంగా తిప్పుతున్నారు. బస్టాప్తో సంబంధం లేకుండా ఆపమని చేయి ఎత్తకున్నా మనిషి కనబడితే చాలు ఆటో లేదా టౌన్ బస్సు ఆగిపోతుంది. దీంతో వెనుకగా వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రధానంగా టౌన్ బస్సులు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి. పర్మిట్తో సంబంధం లేకుండా ఇష్టమొచ్చిన రూట్లో తిరుగుతున్నా రవాణా, పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారు. వారిచ్చే మామూళ్లు పుచ్చుకుని మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇష్టారాజ్యంగా నిర్వహణ నగరంలో టౌన్బస్సుల యాజమాన్యాల ఆగడాలకు అడ్డుకట్ట వేసే వారు లేకపోవడంతో వారి ఇష్టారాజ్యంగా మారింది. ప్రస్తుతం టౌన్ పరిధిలో 69 టౌన్ బస్సులు తిరుగుతున్నాయి. మరో 65 టౌన్ బస్సులకు పర్మిట్ కోసం రవాఽణా అధికారులకు దరఖాస్తు చేసుకుని ఉన్నారు. టౌన్ బస్సులను తిప్పేందుకు రవాణా అధికారులు రూట్ మ్యాప్, సమయాన్ని కేటాయిస్తారు. పర్మిట్ తీసుకున్న రూట్లో నిర్దేశించిన సమయంలో బస్సులను తిప్పాల్సి ఉంది. పర్మిట్ కాల పరిమితి ఐదేళ్లు ఉంటుంది. బస్సులను కండీషన్లో ఉంచడంతో పాటు పరిమితి మేరకు మాత్రమే ప్రయాణికులను ఎక్కించుకోవాలి. అనుభవం కలిగిన డ్రైవర్తోనే బస్సులు నడపాలి. అయితే ఈ నిబంధనలు వారికి వర్తించవు. టౌన్ బస్సుల్లో ఎక్కుతున్న మహిళలపై డ్రైవర్లు, కండక్టర్లు అనుచితంగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. బస్సుల్లో సీసీ కెమెరాలు బిగించమని చెప్పినా పట్టించుకోవడం లేదు. మరో 65 బస్సుల పర్మిట్లకు దరఖాస్తులు నగరంలో ఇప్పటికే 69 టౌన్ సర్వీసులు తిరుగుతున్నాయి. మరో 65 బస్సులను తిప్పేందుకు పర్మిట్ల కోసం జిల్లా రవాణా కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. బస్సులపై ఆదాయం ఉండడం, మామూళ్లు ఇస్తే అధికారులు పట్టించుకోకపోవడంతో టౌన్ బస్సులను తిప్పేందుకు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం తిరుగుతున్న టౌన్ బస్సుల కండీషన్ సరిగా లేదు. కొత్తగా పర్మిట్లు తీసుకునే బస్సులు కూడా ఎక్కువగా సెకండ్ హ్యాండ్ బస్సులే ఉంటున్నాయి. ఇప్పటికే కార్పొరేషన్ పరిధిలో సుమారు 20 వేల వరకు ఆటోలు తిరుగుతున్నట్లు రవాణా అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ రోడ్ల మీదకొస్తే నగరంలో ప్రయాణం నరకంగా మారుతుంది. నిబంధనలు పాటించని టౌన్ బస్సుల నిర్వాహకులు పేరుకే రవాణా స్క్వాడ్ ఎన్ని బస్సులు తిప్పితే అంత ఆదాయం అనుకుంటున్న రవాణా అధికారులు కొత్తగా పర్మిట్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. రవాణా శాఖలో ప్రత్యేకంగా స్క్వాడ్ ఉంటుంది. ఈ స్క్వాడ్లో ముగ్గురు అధికారులు ఉంటారు. వీరి పని కేవలం నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై కేసులు నమోదు చేయడం లేదా సీజ్ చేయడం. వీరు ఏనాడు నగరంలో తనిఖీలు చేపట్టడం లేదు. టౌన్ బస్సులను తనిఖీ చేస్తే శ్రమ తప్ప ఆదాయం రాదని వాటిపై దృష్టి సారించడం లేదు. హైవేలో అయితే ఓవర్లోడ్ వాహనాల నుంచి నగదు వెనుకవేసుకోవచ్చని ఎప్పుడు చూసినా అక్కడే తనిఖీలు చేస్తున్నారు. శుభకార్యాల సమయంలో టౌన్ బస్సులు పట్టుబడ్డా రూ.2వేలు తీసుకుని వదిలివేస్తున్నారు. టౌన్ బస్సులు, ఆటోల డ్రైవర్లకు ఏనాడు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేసిన సందర్భాలు కూడా లేవు. బస్సులను కండీషన్ లేకుండానే తిప్పుతున్నా , అద్దాలు పగిలిపోయి ఉన్నా పట్టించుకోవడం లేదు. జిల్లా ఉపరవాణా కమిషనర్ ఉన్నా మెతక వైఖరిని అవలంభిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికై నా నగరంలో తనిఖీలు నిర్వహించిన నిబంధనలు పాటించని టౌన్ బస్సులు, ఆటోలపై చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. పర్మిట్లు ఉన్న రూట్లలోనే తిరగాలి నగరంలో టౌన్ బస్సులు వారికి ఇచ్చిన పర్మిట్లలోనే తప్పనిసరిగా తిరగాలి. సమయం పాటించాలి. ప్రతి బస్సుకు జీపీఎస్ను బిగించాలి. పర్మిట్ తీసుకుని శుభకార్యాలయాలకు కాంట్రాక్ట్ క్యారేజీగా తిప్పితే బస్సులపై కేసు నమోదు చేసి సీజ్ చేస్తాం. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లల్లోనే బస్సులను ఆపాలి. బస్సులను కండీషన్లో ఉంచాలి. డ్రైవర్లు, కండక్టర్లకు తప్పనిసరిగా లైసెన్స్లు ఉండాలి. –బీ చందర్, డీటీసీ ఒక రూట్కు పర్మిట్.. తిరిగేది మరో రూట్లో.. మూణ్ణాళ్ల ముచ్చటగా జీపీఎస్ కండీషన్ కూడా అంతంత మాత్రమే బస్సులను శుభకార్యాలకు సైతం పంపిస్తున్న వైనం ప్రస్తుతం తిరుగుతున్నది 69 టౌన్ బస్సులు మరో 65 బస్సులకు పర్మిట్ల కోసం దరఖాస్తులు వీటికి తోడు 20వేలకుపైగా ఆటోలు నగరంలో నరకంగా మారిన ట్రాఫిక్ పట్టించుకోని పోలీస్,రవాణా అధికారులు టౌన్ బస్సుల నిర్వాహకుల ఆగడాలపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో గతంలో రవాణా అధికారులు పట్టుబట్టి మరి జీపీఎస్ను బిగించారు. జిల్లా రవాణా కార్యాలయంలో మానిటర్ను ఏర్పాటు చేసి టౌన్ బస్సులను పర్యవేక్షించే వారు. ఈ సిస్టంతో నెలపాటు బస్సులను తిప్పారు. ఆ తరువాత జీపీఎస్ మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలింది. జీపీఎస్ తొలగించినా రవాణా అధికారులు మిన్నకుండిపోవడంంతో వారి ఆగడాలకు అంతే లేకుండా పోయింది. పర్మిట్ రూటులో కాకుండా వారికి ఇష్టమైన రూట్లో తిప్పుతున్నారు. శుభకార్యాలకు సైతం టౌన్ బస్సులను అద్దెకు తిప్పుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. తరచూ తనిఖీలు నిర్వహిస్తూ చర్యలు తీసుకోవాల్సిన పోలీసు, రవాణా అధికారులు నెలవారీ మామూళ్లకు అలవాటు పడి తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. -
పరిష్కారం కోసం ఎదురుచూపులు
● కలెక్టర్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● వినతులు స్వీకరించిన అధికారులు నెల్లూరురూరల్: నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి అనేకమంది వ్యయప్రయాసలకోర్చి కార్యాలయానికి వచ్చారు. జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, వివిధ శాఖల అధికారులు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజలు అందించిన అర్జీలను వెంటనే పరిష్కరించేందుకు ఆయాశా ఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా భూ సమస్యలు, ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. క్రమబద్ధీకరించాలంటూ.. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు తెలిపారు. వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. అనారోగ్యానికి గురైన ఉద్యోగులకు పూర్తి జీతంతో కూడిన సెలవులు మంజూరు చేసి వారి కుటుంబాలకు హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా.. కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఇంటర్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి షేక్ షారుక్ వినతిపత్రం అందజేశారు. రక్షణ కల్పించాలంటూ.. స్వర్ణముఖి నది నుంచి జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతున్న బీజేపీ నేత మిడతల రమేష్కు రక్షణ కల్పించాలని నాయకులు కోరారు. వారు మాట్లాడుతూ నది నుంచి వందలాది ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్కు కొందరు అధికారులు అండగా నిలుస్తున్నారని విమర్శించారు. రమేష్పై ఇసుక అక్రమ రవాణాదారులు సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కె.రాజేశ్వరి, నరాల సుబ్బారెడ్డి, సాంబశివారెడ్డి, రఘురామయ్య, యనమల నాగేశ్వరరావు, సుజన, ఆదినారాయణ పాల్గొన్నారు. -
క్వార్ట్ ్జ మైనింగ్ లీజుపై..
సీతారామపురం మండలం సింగారెడ్డిపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 129లో ఉన్న 12.00 హెక్టార్ల మేత పోరంబోకు భూమిని ఏ మినరల్స్ సంస్థకు క్వార్ట్ ్జ మైనింగ్ కోసం మంజూరు చేసిన లీజును పునః పరిశీలించాలని ప్రజలు జేసీకి వినతిపత్రం సమర్పించారు. లీజు మంజూరు చేసే సమయంలో ప్రజల అభిప్రాయాలు, ప్రజా ప్రయోజనాలు, స్థానిక సమస్యలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరారు. ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. న్యాయస్థానంలో విషయం పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సంబంధిత రెవెన్యూ, మైనింగ్ రికార్డులను పరిశీలించాలని కోరారు. -
దళితవాడల్లోని సమస్యలపై ప్రజా సంఘాల ధర్నా
నెల్లూరురూరల్: దళితవాడల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజాసంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వీఆర్సీ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరిన నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణానికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జేసీ మొగిలి వెంకటేశ్వర్లుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న మాట్లాడుతూ జిల్లాలో ‘సామాజిక శంఖారావం’ అధ్యయన యాత్రలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. దళితులకు దేవాలయ ప్రవేశం లేకపోవడం, శ్మశానవాటికల సమస్య, ఇళ్లు, ఇళ్ల స్థలాల కొరత, సొంత భూమి లేకపోవడం, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం, కాలువల్లో పూడిక తొలగించకపోవడం వంటి సమస్యలు ఉన్నాయన్నారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆలూరు తిరుపాలు మాట్లాడుతూ దళిత కాలనీల అభివృద్ధికి ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను సక్రమంగా ఖర్చు చేయడం లేదన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలు అందడం లేదని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మూలం రమే ష్, మాదాల వెంకటేశ్వర్లు, జొన్నలగడ్డ వెంకటరాజు, అన్వర్, పి.మస్తానయ్య, పెద్దబ్బయ్య, బెల్లంకొండ నాగమ్మ, తాళ్లూరు మాల్యాద్రి, గోగుల శ్రీనివాసులు, కత్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
కండలేరులో 20.95 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 20.95 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 10, హైలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. వైభవంగా ప్రాకారోత్సవంనెల్లూరు(బృందావనం): మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం రాత్రి స్వామివార్లకు చిన్నరథంపై ప్రాకారోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామికి సంప్రదాయంగా అభిషేక, అర్చనలు విశేషంగా చేశారు. శ్రీవార్ల సేవా సమితి, భక్తబృందం ఆధ్వర్యంలో కోలాటాలతో నిర్వహించిన ప్రాకారోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కార్యక్రమాలను కార్యనిర్వహణాధికారి అర్వభూమి వెంకటశ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు. -
మద్యం దుకాణాలను తరలించాలని వినతి
దేవాలయాలు, విద్యాలయాలకు అత్యంత సమీపంలో ఉన్న మద్యం షాపులు, బార్లను వేరే ప్రాంతాలకు తరలించాలని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ, మైనారిటీ, సేవాదళ్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. సేవాదళ్ అధ్యక్షుడు కొండా అనిల్కుమార్ మాట్లాడుతూ మద్యం, మాదకద్రవ్యాల కారణంగా యువతపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. బెల్ట్ షాపులు, నైట్ సేల్స్ను అరికట్టాలని కోరారు. జిల్లా కాంగ్రెస్ ఓబీసీ అధ్యక్షుడు సిరివెల్ల నరేష్ మాట్లాడుతూ సంజయ్ గాంధీ నగర్లోని గ్రీన్ పార్క్ బార్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నేతలు షేక్ నవీద్బాషా, పఠాన్ సైఫ్ అలీఖాన్, షేక్ ఖాదర్బాషా తదితరులు పాల్గొన్నారు.


