breaking news
Bapatla
-
బావ పొట్టిగా ఉన్నాడంటూ..
బావమరది బావ బతుకు కోరతారంటారు. కానీ, ఇక్కడ సొంత బావమరిది చేతిలోనే బావ హత్యకు గురయ్యాడు. అందుకు కారణం.. ఎత్తు తక్కువ అని తెలిస్తే ఎవరికైనా మతి పోవాల్సిదే. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగిన ఈ పరువు హత్య(Guntur Honor killing).. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గుంటూరులో పెళ్ళైన 10 రోజులకే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. బాపట్ల జిల్లా వేమూరు మండలం ఏడవురు గ్రామానికి చెందిన కుర్రా గణేష్(Kurra Ganesh Case)కు, దూరపు బంధువులైన తెనాలికి చెందిన కీర్తి అంజనీ దేవి అనే యువతితో పెళ్లి సంబంధం కోసం ప్రయత్నాలు జరిగాయి. అయితే.. గణేష్ పొట్టిగా ఉన్నాడని యువతి తల్లిదండ్రులు సంబంధం వద్దనుకున్నారు. కానీ మొదటి చూపులోనే గణేష్, కీర్తి.. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఒకరి నెంబర్లు ఒకరు మార్చుకొని, రోజు ఫోన్ మాట్లాడుకుంటూ దగ్గరయ్యారు. తాము వివాహం చేసుకుంటామని చెప్పగా.. పెద్దలు అంగీకరించలేదు. దీంతో పది రోజుల కిందట పారిపోయి అమరావతి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే గణేష్ పొట్టిగా ఉన్నాడని కీర్తి సోదరుడు దుర్గారావు అసహ్యం పెంచుకున్నాడు. తన చెల్లికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో.. వివాహం జరిగిన నాడే గణేష్ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చాడు కూడా. దీంతో.. తనకు యువతి కుటుంబసభ్యులతో ప్రాణహాని ఉందని నల్లపాడు పోలీసులను(Nallapadu Police) గణేష్ ఆశ్రయించాడు కూడా. ఈలోపు.. పెళ్లి గుడిలో చేసుకోవడంతో రిసెప్షన్ అయినా గ్రాండ్గా చేసుకోవాలని ఆ జంట భావించింది. ఇందుకోసం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి ఆ డబ్బులతో గణేష్ ఇంటికి పయనం అయ్యాడు. దారిలో గణేష్ను ఆటకాయించి.. కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు దుర్గారావు. ఆపై దుర్గారావును, అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. నిందితులు నేరాన్ని ఒప్పుకున్నారు.ఇదీ చదవండి: పిల్లనిచ్చిన అత్తతో రొమాన్స్! భార్యకు అడ్డంగా దొరికిపోయి.. -
12న బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక
తెనాలి: స్థానిక ఆంధ్రా ప్యారిస్ బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన ‘రాష్ట్రస్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక’ జరగనుంది. బోసురోడ్డులోని నూకల రామకోటేశ్వరరావు కల్యాణ మండపంలో కార్యక్రమం ఉంటుంది. స్థానిక రామలింగేశ్వరపేటలోని మూల్పూరు సుబ్రహ్మణ్య కల్యాణ మండపంలో గురువారం విలేకరుల సమావేశంలో కేంద్రం పాలకవర్గ అధ్యక్షుడు టి.దక్షిణామూర్తి సంబంధిత కరపత్రాన్ని ఆవిష్కరించారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఉచిత భోజన సౌకర్యంతోపాటు సమాచార బుక్లెట్ ఇస్తామన్నారు. ప్రధాన కార్యదర్శి ఎన్వీ సత్య కుమార్, సంయుక్త కార్యదర్శి పింగళి వేణుధర్, గౌరవాధ్యక్షుడు పీఎల్జీఎస్ ప్రకాశరావు, కోశాధికారి ఆర్.రాజేంద్రప్రసాద్, గౌరవ సలహాదారు బీఎల్ సత్యనారాయణమూర్తి, సభ్యులు డీవీ సోమయ్య శాస్త్రి పాల్గొన్నారు. -
జీజీహెచ్లో ఉచిత వైద్య సేవలు
మానసిక వ్యాధులకు జీజీహెచ్లో ఉచిత వైద్య సేవలను అందించటంతోపాటుగా మందులు కూడా ఉచితంగానే అందజేస్తున్నారు. అవుట్ పేషేంట్ విభాగంలోని 21వ నెంబర్ గదిలో వైద్య పరీక్షలు చేసి అవసరం ఉన్న వారిని ఇన్పేషేంట్ విభాగంలో అడ్మిట్ చేసుకుంటారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజూ ఓపీలో వైద్య సేవలు లభిస్తాయి. మందులతోపాటుగా రోగులకు కౌన్సెలింగ్ కూడా చాలా ముఖ్యం. – డాక్టర్ నీలి ఉమాజ్యోతి, మానసిక వ్యాధుల వైద్య విభాగాధిపతి, గుంటూరు జీజీహెచ్. -
అంతర్రాష్ట్ర గజదొంగ అరెస్ట్
బాపట్ల టౌన్ : ఇళ్లలో బంగారు అభరణాలు, నగదు చోరీ చేసే గజదొంగను బాపట్ల సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను సీసీఎస్ డీఎస్పీ బి. జగదీష్నాయక్ గురువారం వెదుళ్లపల్లి పోలీస్స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పల్నాడు జిల్లా, యడ్లపాడు మండలం, యడ్లపాడు గ్రామానికి చెందిన కోడిరెక్క విజయ్కుమార్ తాపీమేస్త్రిగా జీవనం సాగిస్తుండేవాడు. చెడు వ్యసనాలకు లోనై సులభ రీతిలో డబ్బు సంపాదించేందుకు దొంగ అవతారమెత్తాడు. ఓ దొంగతనం కేసులో తెలంగాణ రాష్ట్రంలోని చౌటుప్పల్ పోలీసులు 2022లో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం బెయిల్పై వచ్చి యడ్లపాడు గ్రామంలో తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 2023లో చిలకలూరిపేట, యడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి పాల్పడ్డాడు. చిలకలూరిపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. బెయిల్పై వచ్చిన జగదీష్నాయక్ మరలా ఈ ఏడాది అద్దంకి, సంతమాగులూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడాడు. ఇతడి కదలికలపై నిఘా పెట్టిన సీసీఎస్ పోలీసులు గురువారం ఉదయం అద్దంకి–మేదరమెట్ల బైపాస్ రోడ్డు జంక్షన్ సమీపంలో అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 5.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 30 వేలు విలువ చేసే వెండి అభరణాలు, రూ. 1.15 లక్షల నగదుతో పాటు రూ. 70 వేలు విలువ చేసే ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సీసీఎస్ సీఐ పి.ప్రేమయ్య, అద్దంకి పట్టణ సీఐ ఏ.సుబ్బరాజు, సీసీఎస్ ఎస్.ఐ బి.రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు. కేసును ఛేదించడానికి విశేష కృషిచేసిన సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, సీఐ పి.ప్రేమయ్య, ఎస్ఐ బి.రాంబాబు, కానిస్టేబుళ్లు ఎస్.కోటేశ్వరరెడ్డి, కె.చిరంజీవి, డి.వై.దాసు, కృష్ణలను జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ప్రత్యేకంగా అభినందించారు. -
మా ఆత్మగౌరవాన్ని కాపాడండి !
పిడుగురాళ్ల: తమ ఆత్మగౌరవాన్ని కాపాడాలని సచివాలయ ఉద్యోగులు మొర పెట్టుకుంటున్నారు. సర్వేల పేరుతో ఇంటింటికీ తిప్పుతూ తమతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని వాపోతున్నారు. వీటితోపాటు తమ ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని కోరుతూ సచివాలయ ఉద్యోగులు గురువారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం చర్చలకు పిలవకపోతే ఈ నెల 19న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వలంటీర్లను తొలగించటంతో ఆ విధుల భారాన్ని తమపై మోపారన్నారు. జాబ్ చార్ట్ ఇవ్వాలని కోరారు. పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. ఇప్పటికీ ఏ శాఖలో పని చేస్తున్నామో అర్థం కావటం లేదు. రేషలైజేషన్ ప్రక్రియతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. – నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయ కన్వీనర్ సచివాలయాల్లో పని చేస్తున్న మహిళలకు గౌరవం లేకుండాపోతోంది. శానిటరీ సెక్షన్లో పనిచేసే సచివాలయ ఉద్యోగులకు తెల్లవారుజామున 4 గంటలకు రోడ్లపై విధులు కేటాయిస్తున్నారు. కార్యాలయాల్లో వసతులు కూడా లేవు. – దీప్తి, మహిళా పోలీస్ -
ప్రజా సంక్షేమం కోసమే జీఎస్టీ తగ్గింపు
చీరాల రూరల్: ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు చేసిందని బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో సూపర్ జీఎస్టీ– సూపర్ సేవింగ్స్పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎంపీ మాట్లాడుతూ ప్రజల పెనుభారాన్ని తగ్గించేందుకు గతంలో నాలుగు శ్లాబులుగా ఉన్న జీఎస్టీని ప్రస్తుతం రెండుగా చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ వి. వినోద్కుమార్, గుంటూరు జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. మేదరమెట్ల: అంతర్జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకొని బాపట్ల జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో రావినూతల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు గురువారం విశేష ప్రతిభ కనపరచారు. బాపట్లలో గురువారం ‘సేవ్ ది గర్ల చైల్డ్’ అనే అంశంపై వక్తృత్వ పోటీ నిర్వహించారు. ఇందులో రావినూతల హైస్కూలుకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని కె.హనీ జిల్లాస్థాయిలో రెండో స్థానం, చిత్రలేఖనం పోటీలో పదో తరగతి విద్యార్థిని ఎం.వర్ష ప్రథమ స్థానంలో నిలిచారు. జిల్లా కేంద్రంలో ఈనెల 11న నిర్వహించే బహుమతి ప్రదానోత్సవంలో రూ. 3 వేలు, రూ. 5 వేల చొప్పున అందుకోనున్నట్లు పాఠశాల హెచ్ఎం రాఘవరెడ్డి తెలిపారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు. నగరంపాలెం: విశ్రాంత పోలీస్ అధికారి ఎన్.గోపాలరావు (87) అంత్యక్రియలు గురువారం జరిగాయి. బుధవారం డొంకరోడ్డులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గోపాలరావుకు భార్య, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1961లో ఎస్ఐగా పోలీస్ శాఖలో చేరి సీఐ, డీఎస్పీ, ఏఎస్పీ, ఎస్పీగా విధులు నిర్వహించారు. ఏపీ విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కాళహస్తి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు ఎం.రంగాప్రసాద్, కోశాధికారి డాక్టర్ కేవీ నారాయణ తదితరులు నివాళులర్పించారు. -
ఏఆర్టీ సెంటర్ ఏర్పాటు వ్యాధిగ్రస్తులకు వరం
అద్దంకి: స్థానిక సీహెచ్సీలో ఏఆర్టీ సెంటర్ ఏర్పాటు క్షయ వ్యాధిగ్రస్తులకు వరమని బాపట్ల జిల్లా క్షయ, ఎయిడ్స్, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ సోమల నాయక్ అన్నారు. సీహెచ్లో ఏఆర్టీ సెంటర్ ఏర్పాటు చేయనున్న దృష్ట్యా గురువారం సందర్శించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె. కె. వాహిలా చౌదరి, బాపట్ల జిల్లా హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ సమీకృత వ్యూహం, దిషా క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ సయ్యద్ జానీ బాషా, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ టీఐ ప్రాజెక్టర్ బీవీ సాగర్తో కలిసి హాస్పిటల్లో కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. సోమల నాయక్ మాట్లాడుతూ హాస్పిటల్కి వచ్చే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా గదులను ఏర్పాటు చేయడానికి పరిశీలిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో శాశ్వత భవనాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలో 1,300కు పైగా ఉన్న హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఏఆర్టీ సెంటర్ ఉపయోగపడుతుందని చెప్పారు. గతంలో వ్యాధిగ్రస్తులు మందుల కోసం ఒంగోలు వెళ్లాల్సి వచ్చేదన్నారు. కొన్నిసార్లు రవాణా చార్జీలు లేక ఇతర కారణాల ద్వారా మందులు మధ్యలో ఆపివేస్తుండటంతో ఆరోగ్యం క్షీణించి మరణానికి దగ్గరవుతున్నారని తెలిపారు. అద్దంకిలోనే ఏఆర్టీ సెంటర్ తీసుకురావడం ద్వారా వారు క్రమం తప్పకుండా మందులు వాడుకునే అవకాశం ఉంటుందని, త్వరలోనే ఇక్కడ ఏర్పాటు చేస్తామని సోమల నాయక్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎస్. తేజస్విని, డాక్టర్ అనిత జ్యోతి, ఐసీటీసీ కౌన్సిలర్ రమేష్, పారా మెడికల్ ఆఫీసర్ ఎన్. శ్రీనివాసరావు, బి. దుర్గ సురేంద్ర, ఔట్ రీచ్ వర్కర్ దుర్గాభవాని పాల్గొన్నారు.జిల్లా క్షయ, ఎయిడ్స్, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ సోమల నాయక్ -
ధాన్యం కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలి
జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ గుంటూరు వెస్ట్: ఖరీఫ్ సీజన్ 2025–26లో ధాన్యం సేకరణపై ఆయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యాన ఖరీఫ్ సీజన్ 2025–26లో ధాన్యం సేకరణపై అవగాహన, శిక్షణ సదస్సు నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతు సేవ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. జిల్లాలో 50 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ధాన్యం కనీస మద్దతు ధర సాధారణ రకం (కామన్) క్వింటా (100కిలోలు) రూ.2369, ‘ఏ’ గ్రేడ్ రకం క్వింటా (100కిలోలు) రూ.2,389లుగా నిర్ణయించినట్లు తెలిపారు. గత సంవత్సరం మద్దతు ధర కన్నా రూ.69 అధికంగా చెల్లించనున్నట్లు తెలిపారు. ధాన్యం విక్రయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా టోల్ ఫ్రీ నంబర్ 1967కు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఏడు గంటలలోపు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. గుంటూరు జిల్లా కంట్రోలు రూం ఏర్పాటు చేసినట్లు(నం.9491392717) తెలిపారు. సమావేశంలో సివిల్ సప్లయీస్ డీఎం తులసి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బండ్లమూడి వెంకయ్య చౌదరి, మిల్లర్లు పాల్గొన్నారు. -
పగలు రెక్కీ.. రాత్రిళ్లు చోరీ
నగరంపాలెం: పగలు పల్సర్ బైక్పై తిరుగుతూ తాళాలు వేసి ఇళ్లను గుర్తించి, రాత్రిళ్లు చోరీలకు పాల్పడే భార్యాభర్తలను కొల్లిపర పోలీసులు అరెస్ట్ చేశారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. దంపతుల నుంచి 173.19 గ్రాముల బంగారం, 226.36 గ్రాముల వెండి, రూ.2.15 లక్షలు, ఒక మోటారు సైకిల్, టీవీ, ఇనుపరాడ్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో గురువారం ఆయన మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. ఇటీవల కొల్లిపర మండల పరిధిలోని తాళాలు వేసి ఇళ్లల్లో వరుసగా చోరీలు జరిగాయి. తూములూరు గ్రామ వాసి మాటూరి మధుసూదనరావు గతనెల 28న ఊరెళ్లారు. ఈనెల 2న ఇంటికి రాగా, బీరువాలో దాచిన బంగారు సొత్తు చోరీ చేశారు. దీనిపై బాధితులు కొల్లిపర పీఎస్లో ఫిర్యాదు చేశారు. తెనాలి సబ్ డివిజన్ డీఎస్పీ బి.జనార్దనరావు, రూరల్ సీఐ ఆర్.ఉమేష్ నేతృత్వంలో కొల్లిపర పీఎస్ ఎస్ఐ పి.కోటేశ్వరరావు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు పరిసరాల్లోని సీసీ కెమెరాల పుటేజీలు పరిశీలించారు. సాంకేతిక ఆధారాలతో కొల్లిపర గ్రామ వాసి కటారి వెంకటేశ్వర్లుగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం రుజువైంది. గతంలోనూ మండల పరిధిలోని పలు గ్రామాల్లో 13 చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ చోరీల్లో కొంత వరకు భార్య తేజ నాగమణికి ఇచ్చి భద్రపరిచేవాడు. దీంతో భార్యాభర్తలను అరెస్ట్ చేసి, 173.19 గ్రాముల బంగారం, 226.36 గ్రాముల వెండి, రూ.2.15 లక్షలు, పల్సర్ బైక్, ఒక టీవీ, ఇనుపరాడ్ స్వాధీనం చేసుకున్నారు. ఇనుపరాడ్తో తాళాలు పగులకొట్టి.. గతంలో వెంకటేశ్వర్లు బేల్దారి పనులకు వెళ్లేవాడు. భార్యాభర్తలు కొద్దికాలంగా చోరీలకు పాల్పడుతున్నారు. భర్త ద్విచక్ర వాహనం (పల్సర్)పై వెళ్లి ఇళ్లకు తాళాలు వేసిన గృహాలను గుర్తించే వాడు. ఆ తర్వాత ఇరువురు కలసి చోరీకి వెళ్లేవారు. భర్త ఇనుపరాడ్డుతో తలుపులు పగలుకొట్టి, బంగారం, వెండి వస్తువులు, నగదుతో రెప్పపాటులో ఉడాయించేవాడు. భార్య ఘటనా స్థలంలో ఉండి వచ్చే, పోయే వారి కదలికలను గుర్తించేది. చోరీలకు పాల్పడి వచ్చాక ఏమీ తెలియనట్టు అందరితో కలిసిపోయేవారు. దొంగలించిన సొమ్ముతో జల్సాలు చేయడం, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకునేవారు. నిందితుడైన వెంకటేశ్వర్లుకు పాత నేర చరిత్ర ఉంది. దాదాపు 13 కేసులు నమోదై ఉన్నాయి. త్వరితగతిన కేసు ఛేదించిన తెనాలి డీఎస్పీ బి.జనార్దనరావు, తెనాలి రూరల్ పీఎస్ సీఐ ఆర్.ఉమేష్, కొల్లిపర పీఎస్ ఎస్ఐ పి.కోటేశ్వరరావు, హెచ్సీలు రామకోటేశ్వరరావు, మురళీకృష్ణ, పీసీలు కూర్మారావు, శివరామకృష్ణలను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి పాల్గొన్నారు. -
అండర్ – 19 బాలుర ఖోఖో జట్టు ఎంపిక
జె.పంగులూరు: స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాలలో గురువారం ఉమ్మడి ప్రకాశం జిల్లా అండర్ –19 విభాగంలో బాలుర ఖోఖో జట్టు ఎంపిక చేశారు. జిల్లా నుంచి 40 మంది వచ్చినట్లు కళాశాల పీడీ సీతారామిరెడ్డి తెలిపారు. సీనియర్ క్రీడాకారుడులు షేక్ అహ్మద్, పీడీ రవికిరణ్, వేణు మాట్లాడుతూ ప్రతిభ కనబరిచిన 12 మందిని ఎంపిక చేసిట్లు తెలిపారు. క్రీడాకారులకు ఉమ్మడి ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీ ఎం.చింపారెడ్డి, ఆర్ఐఓ ఆంజనేయులు అభినందనలు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు వీరే.. మాగుంట సుబ్బరామిరెడ్డి జూనియర్ కళాశాల నుంచి సీహెచ్. బాబ్జీ, యన్. భరత్ కుమార్, ఐ. ప్రవీణ్ రెడ్డి, పి. నరేష్, డి. విజయ్, సి. లక్ష్మీనారాయణ, సీహెచ్. నాగవర్దన్, ఎం. ఆంజనేయులు, ఐ. అనిల్, కె. మోహన్రావు, శ్రీ విద్యానికేతన్ సింగరాయకొండ నుంచి ఏ. రమణ కృష్ణారెడ్డి, సాయిబాబు చైతన్య జూనియర్ కళాశాల నుంచి ఆర్. విఖ్యాత్ రెడ్డి ఎంపికయ్యారు. స్టాండ్ బై క్రీడాకారులు మాగుంట సుబ్బారామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాల నుంచి ఎం. దానియేలు, సి. శివ ప్రసాద్, బి. గోపీచంద్ స్టాండ్ బైగా ఎంపికయ్యారు. -
మనోవ్యాధులకూ మంచి ఔషధాలు
గుంటూరు మెడికల్: జిల్లాలో 25 మంది మానసిక వ్యాధి వైద్య నిపుణులున్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు రోజూ 30 నుంచి 50 మంది వివిధ రకాల మానసిక సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు. గుంటూరు జీజీహెచ్లో రోజూ 160 మంది చికిత్స పొందుతున్నారు. ప్రతి ఏడాది మానసిక రోగుల సంఖ్య పెరిగపోవటంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్లో సైతం సమస్యలు రావటంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలు ఇవీ.. చిరాకు, కోపం, విసుగు తదితర లక్షణాలు వారానికి పైబడి ఉంటే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించాలి. తనలో తాను మాట్లాడుకోవటం, ఒంటరిగా నవ్వుకోవటం, వ్యక్తిగత శ్రద్ధ తీసుకోకపోవటం, చేసిన పనిని పదేపదే చేయాలనుకోవటం, అనవసరమైన ఆలోచల్ని ఆపుకోలేకపోవటం, నిద్రలోపం, బరువు పెరగటం, నిర్ణయాలు తీసుకోవటంలో తీవ్ర జాప్యం చేసి తనమీద ఆధారపడే వారందరినీ ఇబ్బందికి గురి చేయడం, తాను కూడా ఇబ్బందులకు గురవ్వటం, ఎక్కువ సమయం పనిమీద ఏకాగ్రత లేకుండా కాలక్షేపం చేసే ధోరణిలో ఉండటం, తనకు హాని చేస్తున్నట్లు ఊహించుకుని తగాదాలు వరకు వెళ్లటం, తిరగబడి దాడి చేయటం, వ్యక్తిలో ఉన్న అనుమానాలు ఎన్ని రూపాల్లో నివృత్తి చేసే ప్రయత్నం చేసినా ఒప్పుకోకపోవటం తదితర లక్షణాలు మానసిక వ్యాధి సోకిన వారిలో కనిపిస్తాయి. రోటీన్ లైఫ్కు భిన్నంగా ఉండే ప్రవర్తన కనిపిస్తే వారిలో మానసిక సమస్య ఉన్నట్లు గుర్తించాలి. చదువుకునేందుకు ఆసక్తి చూపించకపోవటం, ఎక్కువ సమయం సెల్ఫోన్లకే పరిమితమవ్వటం, ఉద్యోగం, ఇతర పనులు చేయకుండా ఉండిపోవటం లక్షణాలు వ్యాధి బాధితుల్లో ఉంటాయి. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందిన వారి వివరాలు.. ఏడాది రోగుల సంఖ్య 2023 22,189 2024 30,553 కరోనా వల్ల పెరిగిన మానసిక సమస్యల బాధితులను దృష్టిలో పెట్టుకుని మానసిక ఆరో గ్యానికి , వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మానసిక సమస్యలపై అవగాహన కల్పించి ప్రజలు ఇబ్బంది పడకుండా చేసేందుకు ప్రతి ఏడాది అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘ సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. -
ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం
● పావులు కదుపుతున్న తమ్ముళ్లు ● ఇప్పటికే ఫోన్ ద్వారా సంప్రదింపులు ● పార్టీ మారేది లేదని తేల్చి చెప్పిన ఎంపీటీసీ సభ్యులు పెదకాకాని: ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. మండలంలోని పలువురు ఎంపీటీసీలకు ఫోన్లు చేసి నయానా, భయానా చర్చలు జరిపే పనిలో నిమగ్నమయ్యారు. అయితే పార్టీలు మారి పరువు పోగొట్టుకోవడానికి తాము సిద్ధంగా లేమని పలువురు ఎంపీటీసీ సభ్యులు స్పష్టంచేసినట్లు చెబుతున్నారు. పెదకాకాని మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడుగా అనుమర్లపూడి ఎంపీటీసీ సభ్యుడిని ఎన్నుకొని నాలుగేళ్లు పూర్తయ్యింది. నాలుగేళ్ల వరకూ ఎంపీపీ కుర్చీపై అవిశ్వాసం పెట్టడానికి అవకాశం లేదనే నిబంధనలు ఉన్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినప్పటికీ నాలుగేళ్లు పూర్తయ్యే వరకూ వేచి ఉన్నారు. గత నెల సెప్టెంబరుతో నాలుగేళ్లు పూర్తి కావడంతో ఎంపీపీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెదకాకాని మండల పరిధిలో 12 గ్రామ పంచాయతీలు, ఒక హామ్లెట్ విలేజ్ ఉంది. ఆయా గ్రామాల్లో ఉన్న ఓటర్ల ఆధారంగా మండలంలో 21 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. వారిలో వైఎస్సార్ సీపీ చెందిన 15 మంది ఎంపీటీసీ సభ్యులు, ఆరుగురు టీడీపీ చెందిన ఎంపీటీసీలు గెలుపొందారు. మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు ఉన్న వైఎస్సార్ సీపీ నుంచి అనుమర్లపూడి ఎంపీటీసీ సభ్యుడు తుల్లిమిల్లి శ్రీనివాసరావును ఎంపీపీగా ఎన్నుకున్నారు. తమ్ముళ్లు రాయబారాలు నడుపుతున్నప్పటికీ పార్టీ మారడానికి, ఎంపీపీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంలో పాల్గొనడానికి పలువురు ఎంపీటీసీ సభ్యులు ససేమిరా అంటున్నారు. వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసి వారి మద్దతుతో విజయం సాధించి పదవీకాలం పది నెలలు ముందు తాము పార్టీ మారడానికి, చేతులెత్తడానికి సిద్ధంగా లేమని చెబుతున్నారు. ఈ వ్యవహారం మండలంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ నుంచి పార్టీ మారిన వారిని కేవలం ఓటు బ్యాంక్గా వాడుకుని ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదనే చర్చ కూడా సాగుతోంది. -
డీఎంఎఫ్ పనుల్లో పురోగతి కన్పించాలి
బాపట్ల: డీఎంఎఫ్ (డిస్ట్రిక్ మినరల్ ఫండ్) నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ప్రతి వారం పురోగతి కన్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశించారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, సమగ్ర శిక్ష అభియాన్, పబ్లిక్ హెల్త్, సీపీఓ, విద్యుత్, భూగర్భ గనుల శాఖ, ఇంజినీరింగ్ అధికారులతో గురువారం కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ శాఖల ద్వారా జిల్లా ఏర్పడిన నాటికి రూ.35 కోట్లు డీఎంఎఫ్ నిధులు ఉన్నాయని తెలిపారు. అప్పటి నుంచి మూడున్నర ఏళ్లలో మరో రూ.16 కోట్లు వచ్చాయని పేర్కొన్నారు. డీఎంఎఫ్ కింద మొత్తం రూ.51 కోట్లు ఉండగా, వివిధ శాఖల ద్వారా 31 పనులకు గానూ రూ.48.28 కోట్లు అధికారికంగా మంజూరయ్యాయని వివరించారు. ఇందులో ఇప్పటి వరకు రూ.5.77 కోట్ల పనులు మాత్రమే జరగడమేమిటిని ఆయన ప్రశ్నించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చీరాల ఓడరేవు నుంచి పిడుగురాళ్ల వరకు నిర్మిస్తున్న 167ఏ జాతీయ రహదారిని త్వరగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రూ.1,065 కోట్లతో నిర్మిస్తున్న రహదారి పనులు జిల్లాలో 95 శాతం పూర్తయ్యాయని, నవంబర్ నెలాఖరకు ముగించాలని చెప్పారు. అంతర్గత రోడ్లు వేగంగా నిర్మించాలి కలెక్టరేట్లో అంతర్గత రహదారులను ఆర్ అండ్ బీ అధికారులు వేగంగా నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు. అంతర్గత రహదారులు, ఏటీఎం గది ప్రతిపాదిత ప్రాంతాన్ని గురువారం ఆయన పరిశీలించారు. జిల్లా మినరల్ ఫండ్ నుంచి రూ.47.9 లక్షలతో ప్రతిపాదించిన అంతర్గత రహదారి ప్రాంతాన్ని తనిఖీ చేశారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఆర్ అండ్ బీ డీఈ అరుణకుమారి, అధికారులు ఉన్నారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ -
అమరేశ్వరునికి పుష్పార్చన
అమరావతి: అమరావతిలోని అమరేశ్వరాలయంలో గురువారం లోక కల్యాణార్థం దాతల సహకారంతో స్వామికి పుష్పార్చన నిర్వహించారు. తొలుత మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకరణ చేసి సహస్ర నామాలతో రుత్విక్కులు పుష్పార్చన జరిపారు. అనంతరం బాల చాముండికా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. రాజ్యలక్ష్మీఅమ్మవారికి బంగారు హారం బహూకరణ మంగళగిరి టౌన్: మంగళగిరిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దిగువ సన్నిధిలో ఉన్న శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారికి దాత బంగారు హారాన్ని బహూకరించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్కుమార్ తెలిపారు. అమ్మవారి అలంకరణ నిమిత్తం రూ. 3.50 లక్షల విలువైన బంగారు పచ్చల హారాన్ని మంగళగిరి పట్టణానికి చెందిన నీలి నాగమల్లేశ్వరరావు, రత్నకుమారి దంపతులు గురువారం ఆలయ అధికారులు, అర్చకులకు అందజేశారు. ఎన్ఆర్ఈజీఎస్ డిప్యూటీ కమిషనర్ పర్యటన గుంటూరు రూరల్: వెంగళాయపాలెంలో మహాత్మాగాంధీ ఎన్ఆర్ఈజీఎస్ వాటర్ షెడ్ ప్రోగ్రాం డిప్యూటీ కమిషనర్ సాగర్, జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్లు గురువారం పర్యటించారు. గ్రామ పంచాయతీలో 21.38 ఎకరాల ఊర చెరువు ఉంది. వాటర్ షెడ్, అమృత్ సరోవర్ పథకాలలో భాగంగా చెరువుకు రివిట్మెంట్, వాకింగ్ ట్రాక్, ప్లాంటేషన్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలను పరిశీలించారు. గ్రామ సర్పంచ్ నల్లపాటి లలితకుమారి, ఎంపీడీవో బి. శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి రవి, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో శ్రీరామ్, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నగదు రహిత చికిత్స అందించాలి గుంటూరు వెస్ట్: ఉద్యోగ, ఉపాధ్యాయ విశ్రాంత ఉద్యోగులకు నగదు రహిత చికిత్స అందించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు సయ్యద్ చాంద్ బాషా కోరారు. ఈ మేరకు గురువారం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ ఉత్సవకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజా సేవకు అంకితమైన ఉద్యోగుల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతగా భావించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు యు.సుమిత్రా దేవి, సంయుక్త కార్యదర్ళులు కోటా సాహెబ్, వి.కార్తిక్, కోశాధికారి శ్రీనివాస్, మహిళా విభాగం నాయకులు రమణి, మయూరి పాల్గొన్నారు. -
బాపట్ల
శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్ శ్రీ 2025భారత రాయబారిగా విల్సన్ బాబు నియామకం కూటమి కుట్రలపై విధేయతదే విజయం! పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 66,450 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 64,450 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 42.1600 టీఎంసీలు . ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం నరసరావుపేట రూరల్: ఇస్సప్పాలెం మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి తెలంగాణ మధిరకు చెందిన జంగా రామ్ భూపాల్రెడ్డి కుటుంబ సభ్యులు రూ.లక్ష అందజేశారు. క్రాకర్స్ షాపుల్లో తనిఖీలు చిలకలూరిపేట టౌన్: దీపావళి క్రాకర్స్ షాపుల్లో గురువారం పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. యజమానుల వద్ద ఉన్న లైసెన్సులు, అనుమతి పత్రాలను పరిశీలించారు. అద్దంకి: అన్నదాతలకు సంప్రదాయ సాగు భారంగా మారింది. అధిక పెట్టుబడులు, ప్రకృతి వైపరీత్యాలు పీల్చి పిప్పి చేస్తున్నాయి. తీరా పంట చేతికొచ్చేసరికి పడి పోతున్న ధరలతో నష్టాలే మిగులుతున్నాయి. సంప్రదాయ పంటల సాగుకు వెనకడుగు వేస్తున్నారు. తక్కువ ఖర్చుతో లాభాలొచ్చే పంటలపై ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఒక్కసారి నాటితే ఇరవై సంవత్సరాల పాటు ఆదాయాన్నిచ్చే సుబాబుల్ సాగు వైపు అడుగులేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 20 వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. ఈ ఏడాది మరో 10 వేల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉంది. వేగంగా పెరిగే సుబాబుల్ వేగంగా పెరిగే చెట్ల జాతిలో సుబాబుల్ ఒకటి. దీని ఆకులు పశుగ్రాసంగా ఉపయోగ పడతాయి. కాండాన్ని కాగితపు గుజ్జు పరిశ్రమలో ముడి సరుకుగా ఉపయోగిస్తారు. చౌడు నేలల మినహా అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఎక్కువ తేమ కలిగిన నేలలు బాగా అనుకూలం. కాలువ, పొలాల గట్లపై పెంచుకోవచ్చు. నాటిన రెండు నుంచి మూడేళ్లకే కర్ర దిగుబడి వస్తుంది. నేలసారం పెంపు సుబాబుల్ తోటల సాగుతో సారం పెరుగుతుంది. నేలలోని పెట్రోలియం, పురుగు మందులు, భారీ లోహాలు వంటి కలుషితాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. రాలిన ఆకు ఎరువుగా మారి భూమి సారవంతంగా మారుతుంది. ఏటేటా పెరగనున్న ఆదాయం సుబాబుల్ చెట్టు కర్రను ఒలిచే పని లేకుండా నేరుగా కొట్టి విక్రయించుకోచచ్చు. ప్రస్తుతం మార్కెట్లో టన్ను ధర రూ.5,800 పలుకుతోంది. రెండు సంవత్సరాల తోట అయితే ఎకరాకు రూ.1 లక్ష వరకు, నాలుగు సంవత్సరాలు అయితే ఎకరాకు రూ.1.5 లక్షల నుంచి రూ. 2.5లక్షల వరకు ఆదాయం వస్తుండటంతో పలువురు రైతులు ఆసక్తి చూపుతున్నారు. Iపదేళ్ల నుంచి సాగు చేస్తున్నా.. ఎకరాకు 30 టన్నుల దిగుబడి నేను పదేళ్ల నుంచి సుబాబుల్ సాగు చేస్తున్నా. గిట్టుబాటు ధర బాగుంది. ఎరువు వేసి నీరు పెడితే మంచి దిగుబడి వస్తుంది. పైగా కర్ర తాట తీసే పనిలేకుండా కొనుగోలు చేస్తారు. పెద్దగా నీటి అవసరం లేదు. సాగు చేయటం కూడా తేలిక. సుబాబుల్ కర్రను కాగితం తయారీ కంపెనీలు కొంటున్నాయి. –కోటేశ్వరరావు, రైతు సాలుకు సాలుకు మధ్య రెండు మీటర్లు, మొక్క మొక్కకు మధ్య రెండు మీటర్ల దూరం ఉండాలి. ఎకరాకు 666 మొక్కల నుంచి 1000 వరకు నాటుకోవచ్చు. ఎకరాకు 30 టన్నుల నుంచి సారవంతమైన నేలలు అయితే 40 టన్నుల వరకు కూడా దిగుబడి వస్తుంది. చెట్టు మూడు నుంచి నాలుగు సంవత్సరాలో 20 మీటర్ల ఎత్తు పెగుతుంది. ముదురుతోటలో విత్తనాలు సేకరించి నాటుకోచ్చు. లేదా నర్సరీల నుంచి మొక్కలు తెచ్చి నాటుకోవచ్చు. -
● బలం లేకున్నా టీడీపీ బరితెగింపు ● వైఎస్సార్సీపీ అభ్యర్థులపై వేధింపుల పర్వం ● అవిశ్వాసం అంటూ డ్రామా
ముప్పాళ్ల: ముప్పాళ్ల మండల పరిషత్ అధ్యక్ష పీఠంపై టీడీపీ నాయకులు గురి పెట్టారు. 2021లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు పదకొండు స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపొందారు. జనసేన ఒక స్థానంలో గెలుపొందింది. టీడీపీ ఒక్కచోట కూడా గెలిచిన దాఖలాలు లేవు. మాదల ఎంపీటీసీ సభ్యుడు మృతి చెందగా ప్రస్తుతం ఆ స్థానం ఖాళీగా ఉంది. భయపెడుతూ, ప్రలోభాలకు గురిచేస్తూ, పదవి ఆశ చూపుతూ ఆరుగురు ఎంపీటీసీలను టీడీపీ వైపునకు లాక్కున్నారు. ఎంపీపీతో కలిపి నలుగురు ఎంపీటీసీలు వైఎస్సార్ సీపీని వీడేందుకు ఇష్ట పడకపోవటంతో వారిపైన, వారికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను దెబ్బకొట్టేలా అధికార దర్పాన్ని ఉపయోగించుకుంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. కొత్తగా తెరపైకి అవిశ్వాసం డ్రామా కొత్తగా ఎంపీపీపై అవిశ్వాస డ్రామాను టీడీపీ నాయకులు తెర లేపారు. చాగంటివారిపాలెంకు చెందిన ఎంపీపీ మారూరి పద్మపై అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు సమావేశం నిర్వహించాలంటూ సత్తెనపల్లి ఆర్డీఓను మంగళవారం కలసి వినతిపత్రం అందించారు. అవిశ్వాస తీర్మానం ఇవ్వాలంటే కనీసం 8 మంది ఎంపీటీసీ సభ్యుల బలం ఉండాలి. ఎనిమిది మంది సభ్యులు ఆర్డీవో ఎదుట హాజరై అవిశ్వాస తీర్మానం కోరుతూ వినతిపత్రం అందించాల్సి ఉంటుంది. కేవలం ఐదుగురు సభ్యులతో సంతకాలు చేయించి అవిశ్వాస తీర్మానం అంటూ డ్రామా చేస్తున్నారు. ఈ విషయం పై వైఎస్సార్సీపీ సభ్యులు మాత్రం పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని ఖరాఖండిగా తేల్చి చెబుతున్నారు. పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం. –మలిరెడ్డి అనూష, లంకెలకూరపాడు ఎంపీటీసీ సోషల్మీడియాలో టీడీపీ నాయకులు చేస్తున్న విష ప్రచారంలో వాస్తవం లేదు. అవిశ్వాస తీర్మానంపై ఆర్డీఓకు ఇచ్చిన పేపర్లలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారు. వైఎస్సార్ సీపీ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం. కేసులతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడేది లేదు. -
బాపట్ల జిల్లా జేసీగా భావన వశిష్ట్
బాపట్ల టౌన్: బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్గా 2019 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారిణి భావన వశిష్ట్ను నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ అసిస్టెంట్ కలెక్టర్గా శిక్షణ ప్రారంభించిన ఆమె తరువాత పార్వతీపురం సబ్ కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. జీఎస్డబ్ల్యూఎస్ అడిషనల్ డైరెక్టర్గానూ సేవలందించారు. ఎన్నికలకు ముందు అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్గా పని చేశారు. గడిచిన 15 నెలలుగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తాజా ఉత్తర్వుల్లో భాగంగా బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమితులయ్యారు. -
చేయీ చేయి కలిపారు..
నాడునేడు ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురుచూడకుండా స్థానిక విఠలేశ్వరస్వామి నగర్ కాలనీ నివాసితులు నడుం కట్టారు. చేయీ చేయి కలిపి రోడ్డును వేసుకున్నారు. ఇటీవల వర్షాలకు కాలనీ ప్రధాన రహదారి కాలువగా మారింది. నీరు నిలిచి పసికర్లు కూడా కట్టింది. నివాసితుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వృద్ధులు, చిన్నారులు నానా అవస్థలు పడుతున్నారు. అసలే లోతట్టు ప్రాంతం. పైగా కాలనీ పక్కగా వెల్లటూరు చానల్ పారుతుండటంతో ఊట నీరు దిగి మరింత ముంపునకు గురవుతోంది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి రహదారులు తటాకాలను తలపిస్తున్నాయి. సమస్యను అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. నిల్వ నీటితో జ్వరాలు, వ్యాధులు ప్రబలుతాయేమోనని భయంతో వణికిపోయారు. దీంతో కాలనీలోని అంతర్గత రహదారిలో నివసిస్తున్న ఏడుగురు కలసి సొంత ఖర్చుతో రోడ్డుకు మెరక తోలించుకున్నారు. – భట్టిప్రోలు -
విద్యార్థిని చితకబాదిన వైస్ ప్రిన్సిపాల్
చెరుకుపల్లి: బాపట్ల జిల్లా గుళ్లపల్లి ఎన్ఆర్ఐ కళాళాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థి పాల్ గాంధీని వైస్ ప్రిన్సిపాల్ విచక్షణ రహితంగా కొట్టగా ఆస్పత్రి పాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తల్లిదండ్రుల వివరాల మేరకు... గుళ్లపల్లి శివాలయం కాలనీకి చెందిన విద్యార్థి చల్లా పాల్ గాంధీకి, యశ్వంత్ అనే విద్యార్థితో ఈ నెల 7న క్లాస్రూమ్ బెంచ్పై కూర్చునే విషయంలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో వైస్ ప్రిన్సిపాల్ విజయ్ తరగతి గదికి వచ్చి విద్యార్థులను అడగ్గా పాల్గాంధీ యశ్వంత్ను కొట్టాడని చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన వైస్ ప్రిన్సిపల్ పాల్గాంధీపై తన మోచేతితో వీపుమీద గుద్దుతుండగా దెబ్బలు తట్టుకోలేక చెయ్యి అడ్డం పెట్టాడు. చేతి వేళ్లు విరగడంతో తొలుత రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్, ఎక్సరే తీయగా కుడి చేతి వేలి ఎముక విరిగినట్టు తల్లిదండ్రులు తెలిపారు.విద్యార్థి పాల్ గాంధీ (ఫైల్)వైస్ ప్రిన్సిపాల్ కొట్టడంతో వాచిన చేయి -
ఏఎన్యూ వీసీగా సత్యనారాయణ రాజు
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్గా ఆచార్య సామంతపూడి వెంకట సత్యనారాయణరాజు నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ నజీర్ అహ్మద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆచార్య సత్యనారాయణరాజు ఇప్పటి వరకూ వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంటోమాలజీ ప్రొఫెసర్గా ఉన్నారు. ఏఎన్యూలో గత కొంతకాలంగా ఇన్చార్జి వీసీగా ఆచార్య కె. గంగాధరరావు విధులు నిర్వహిస్తున్నారు. సత్యనారాయణరాజు అగ్రికల్చర్ బీఎస్సీని మహారాష్ట్రలోని డాక్టర్ పుంజాబ్రావు క్రిషి విద్యాపీఠ్ నుంచి 1983లో ఉత్తీర్ణులయ్యారు. ఎంఎస్సీ అగ్రికల్చర్ కోర్సును హిమాచల్ప్రదేశ్లోని డాక్టర్ వైఎస్ పర్మార్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్టికల్చర్ అండ్ పారెస్ట్రీ నుంచి 1986 లోనూ, అగ్రికల్చర్ ఎంటోమాలజీలో పీహెచ్డిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి 1990లో పొందారు. బోధన రంగంలో 28, పరిశోధనా రంగంలో 32 సంవత్సరాల అనుభవం గడించారు. రైతులు అనుబంధ అంశాల్లో 28 సంవత్సరాలకు పైగా పాలు పంచుకున్నారు. -
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలి
జిల్లా పంచాయతీ అధికారి సాయికుమార్గుంటూరు ఎడ్యుకేషన్ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించాలని జిల్లా పంచాయతీ అధికారి బీవీఎం సాయికుమార్ పేర్కొన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం స్థానిక సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ‘ధీమ్–5 క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్’పై రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీవో సాయికుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో అపరిశుభ్ర పరిస్థితులు, అధ్వాన్న వాతావరణం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చునని తెలిపారు. జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతత ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం ద్వారా సత్ఫలితాలను సాధించవచ్చునని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో డీపీఆర్సీ రీసోర్స్ పర్సన్ రామకృష్ణ, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పథకాల అమలులో అశ్రద్ధ వద్దు !
కలెక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: ప్రభుత్వ పథకాల అమలులో జిల్లాను రాష్ట్రస్థాయిలో మూడవ స్థానంలో ఉంచేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో గురువారం వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల పర్యవేక్షణకు ప్రతి మండలంలో ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేశామని, ఆయన వసతి గృహాలను దత్తత తీసుకొని పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు. వసతి గృహాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో పూర్వ విద్యార్థులను మమేకం చేసుకొని వారి ద్వారా మెరుగుపరచాలని సూచించారు. సంక్షేమ వసతి గృహాల్లో లోపల, బయట పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలని ఆయన తెలిపారు. సమస్యల పరిష్కారానికి వచ్చే అర్జీదారులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. గ్రామస్థాయి అధికారులు ప్రజలను కలిసేటప్పుడు గుర్తింపు కార్డులు ధరించాలని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు జిల్లాలోని ప్రతి పీహెచ్సీని తనిఖీ చేసి నివేదికను తయారు చేయాలని జిల్లా వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలతో మమేకమై పనిచేసినప్పుడు వారి నుంచి సానుకూల స్పందన వస్తుందని, ఆ దిశగా పని చేయాలని ఆయన సూచించారు. జిల్లాలో స్వామిత్వ సర్వేని వేగవంతం చేయాలని అధికారులకు తెలిపారు. 205 రెవెన్యూ గ్రామాల్లో స్వామిత్వ సర్వేను నూరు శాతం పూర్తి చేయాలని చెప్పా. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చే అర్జీల ఆడిటింగ్, ఈ–క్రాప్ నమోదు, సీసీఆర్సీ కార్డుల జారీ తదితర విషయాలపై జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ జి. గంగాధర్ గౌడ్, ఏఏఓ అనూరాధ, డీపీఓ ప్రభాకర్, ఇన్చార్జి పీడీడీఆర్ డీఏ లవన్న, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కనక ప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ప్రకాశరావు, వీక్షణ సమావేశం ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
ఏరులై పారుతున్న నకిలీ మద్యం
సంతనూతలపాడు: ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తామని దేశంలో ఎక్కడా లేని వింత వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 16 నెలలుగా నకిలీ మద్యం ఏరులై పారిస్తున్నారని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 85 లక్షల మందికి తల్లికి వందనం ఇవ్వాల్సి ఉండగా కేవలం 40 నుంచి 50 లక్షల మందికే అందజేశారని విమర్శించారు. లైసెన్సు ఉన్న డ్రైవర్లందరికీ ఆర్థిక సాయం అందజేస్తానన్న చంద్రబాబు కేవలం ఆటోలు తోలే డ్రైవర్లకు అది కూడా కోత విధించడం దారుణమన్నారు. పేదలకు ఇళ్లు కట్టి ఇస్తామని ఆశ పెట్టి అధికారంలోకి వచ్చి మాట తప్పారన్నారు. నకిలీ మద్యం సరఫరాతో చంద్రబాబు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో బూం బూం అంటూ విమర్శలు గుప్పించిన కూటమి నాయకులు ఇప్పుడు ఆ బ్రాండ్తో పాటు సూపర్ సిక్స్ అనే బ్రాండ్ మద్యాన్ని కూడా అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమలో నకిలీ మద్యం ప్లాంట్లు రెండు బయటపడడం, వీటి వెనుక టీడీపీ కీలక నేతలే ఉండడం, ఉత్తరాంధ్ర లోనూ నకిలీ మద్యం ప్లాంట్లు ఉన్నాయని సమాచారం రావడంతో రాష్ట్రంలో మద్యం ప్రియుల వెన్నులో వణుకు పుడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే నకిలీ మద్యాన్ని ప్రోత్సహిస్తోందని ప్రజలకు అర్థమైందన్నారు. నకిలీ మద్యం ఎలా తయారు చేయాలో కూటమి నాయకులకు ఆఫ్రికాలో శిక్షణ ఇచ్చి ఆ ఫార్ములా ద్వారా నకిలీ మద్యాన్ని ప్రభుత్వ పెద్దలే ఏరులై పారిస్తున్నారని విమర్శించారు. మందు తాగొద్దు.. తస్మాత్ జాగ్రత్త: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక కలుగు నాయుడుగా మిగిలిపోయారని మేరుగ నాగార్జున ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో అరవటం, రెచ్చిపోవటం, ఊగి పోవటం, తూగిపోవటం, జుట్టు పీక్కోవటం లాంటి చేష్టలు చేసిన ఆయన ఇప్పుడు మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా మాట్లాడకుండా కలుగులోనే ఉంటున్నారని విమర్శించారు. సొంత అన్నయ్యను బాలకృష్ణ అగౌరవపరిచినా బయటకు రాకపోవడం దారుణమన్నారు. పవన్ కళ్యాణ్ నిజస్వరూపాన్ని ఇప్పుడు ప్రజలు చూస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వంలో జే బ్రాండ్ మద్యం అని వ్యాఖ్యానించిన కూటమి నాయకులు ప్రస్తుతం సీబీఎన్, పీకే, ఎల్కే బ్రాండ్లు తయారు చేసి వైన్ షాపులు, బెల్టుషాపుల్లో విక్రయిస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో ప్రతి మద్యం బాటిల్ను డిస్టిలరీల్లోనే తయారు చేశారని, ఇప్పుడు టీడీపీ నాయకుల ఇళ్లలోనే నకిలీ మద్యం తయారవుతోందని ధ్వజమెత్తారు. మందు బాబులు ఈ మద్యం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. కూటమి సర్కారు పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉందని పేర్కొన్నారు. -
ముందస్తు పరీక్షలే బెస్ట్!
గుంటూరు మెడికల్: పేదల పెద్దాసుపత్రిగా పేరుగడించిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రొమ్ము క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించే వైద్య పరికరం మెమోగ్రఫీ వైద్య పరికరం అందుబాటులో ఉంది. నాట్కో ట్రస్ట్ వారు రూ. కోటి విలువైన త్రీడీ డిజిటల్ మెమోగ్రఫీ వైద్య పరికరాన్ని నాట్కో క్యాన్సర్ సెంటర్లో అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా రొమ్ము క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. మెమోగ్రామ్ పరీక్ష చేసినందుకు ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు రూ. 2వేలు వరకు ఫీజు తీసుకుంటున్నారు. జీజీహెచ్లో వ్యాధి నిర్ధారణతోపాటు, రొమ్ము క్యాన్సర్ బాధితులకు అవసరమైన ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు. ఆపరేషన్ల అనంతరం అవసరమయ్యే రేడియేషన్ థెరఫీ, కిమోథెరఫీ వైద్య సేవలు సైతం జీజీహెచ్ నాట్కో క్యాన్సర్సెంటర్లో పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. మెమోగ్రామ్ పరీక్షలు చేయించుకున్నవారి వివరాలు ... జీజీహెచ్లో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష మెమోగ్రామ్ 2023లో 368 మంది, 2024లో 381మంది, 2025 సెప్టెంబరు వరకు 381 మంది పరీక్షలు చేయించుకున్నారు. రొమ్ము క్యాన్సర్తో బాధపడుతూ 2022లో 34 మంది, 2023లో 73 మంది, 2024లో 69 మంది, 2025 సెప్టెంబరు వరకు 55 మంది రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకున్నారు. రొమ్ము కాన్సర్పై మహిళలకు అవగాహన అవసరం ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు రొమ్ము కాన్సర్ బాధితులే అక్టోబరు రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం ఆధునిక జీవన శైలి వల్ల 50 ఏళ్లు దాటిన తరువాత వచ్చే రొమ్ము క్యాన్సర్లు నేడు 25 ఏళ్లకే కనిపించడం సర్వత్రా ఆందోళనకు దారి తీస్తోంది. విద్యావంతులు, చదువులేనివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన లేకుండా నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ప్రతి ఏడాది రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని బారిన పడకుండా ప్రతి ఏడాది అక్టోబరు నెల రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ‘సాక్షి’ అందిసున్న ప్రత్యేక కథనం. తొలి దశలోనే రొమ్ము క్యాన్సర్ను గుర్తించేందుకు మెమోగ్రామ్ పరీక్ష చేస్తారు. మెమోగ్రామ్తో రెండు మి.మీ కన్నా తక్కువ సైజులో రొమ్ములో గడ్డలు ఉన్నా గుర్తించి వెంటనే వైద్యం చేయవచ్చు తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే వ్యాధి నుంచి త్వరితగతిన కోలుకోవటంతోపాటుగా మరణాన్ని తప్పించవచ్చు. మహిళలే స్వయంగా రొమ్ము పరీక్ష చేసుకుని రొమ్ములో ఏమైనా గడ్డలు ఉన్నట్లు అనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ చక్కా సుజాత, సీనియర్ రేడియాలజిస్ట్, గుంటూరు -
స్క్రీనింగ్ పరీక్షలతో చెక్
మహిళలంతా మెమోగ్రామ్, బయాప్సి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ను ప్రథమ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా పూర్తిగా నివారించవచ్చు. కుటుంబంలో ఎవరికై నా క్యాన్సర్ ఉంటే ఇతర కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశాలు ఉన్న దృష్ట్యా ముందస్తుగా జనటిక్ పరీక్ష చేయించాలి. సంతానం లేనివారికి, ఆలస్యంగా పిల్లలు పుట్టిన వారికి సైతం రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. రొమ్ము క్యాన్సర్లకు రేడియేషన్ థెరపీ, కిమో థెరపీ, ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయి. –డాక్టర్ బైరపనేని స్రవంతి, క్యాన్సర్ వైద్య నిపుణులు, గుంటూరు -
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక
చీరాల రూరల్: జిల్లాస్థాయి తైక్వాండో స్కూల్ గేమ్స్ సెలక్షన్స్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన చీరాల క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 6న ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలులో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 2025–26 ఇంటర్ డిస్ట్రిక్ట్ తైక్వాండో సెలక్షన్స్ నిర్వహించారు. ఈ పోటీలను స్కూల్గేమ్స్ జిల్లా సెక్రటరీ, రాష్ట్ర తైక్వాండో వైస్ ప్రసిడెంట్ షేక్ అబ్దుల్ సలాం పర్యవేక్షణలో నిర్వహించారు. పోటీల్లో చీరాల్లోని విజ్ఞాన భారతి హైస్కూల్, గౌతమి, సెయింట్ ఆన్స్ స్కూలు, కస్తూర్భా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలలకు చెందిన 12 మంది క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభచూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు చీరాల కోచ్ ఎస్డీ సలావుద్దీన్ తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులు.. అండర్–17 బాలుర 48 కేజీల విభాగంలో వి.హేమంత్, 59 కేజీల విభాగంలో ఎస్కే కాలేషావలి, 45 కేజీల విభాగంలో ఎన్.వెంకటరమణ, 55 కేజీల విభాగంలో వి.మనోహర్ ప్రథమ స్థానంలో నిలిచారు. అండర్–17 బాలికల 55 కేజీల విభాగంలో ఎస్కే తాహిర, 44 కేజీల విభాగంలో ఎన్.ప్రవళిక, 52 కేజీల విభాగంలో వై.లక్ష్మీప్రియ, 63 కేజీల విభాగంలో బి.కావ్యలు ప్రథమ స్థానంలో నిలిచారు. అండర్–14 బాలుర 44 కేజీల విభాగంలో ఎల్.కార్తీక్మణికంఠ, 41 కేజీల విభాగంలో వి.శరత్కుమార్, అలానే బాలికల అండర్–14 విభాగంలో 38 కేజీల విభాగంలో ఎస్కే తస్లీమా, 24 కేజీల విభాగంలో వి.జాహ్నవి ప్రథమ స్థానంలో నిలిచారు. అండర్–14 విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన క్రీడాకారులు ఈనెల 10, 11 తేదీల్లో రేపల్లెలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని కోచ్ సలావుద్దీన్ తెలిపారు. అండర్–17 విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన క్రీడాకారులు ఈనెల 18న వైఎస్సార్ కడప జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి వివిధ పాఠశాలల నుంచి 69 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు ఆయా పాఠశాలలకు చెందిన హెచ్ఎంలు, ప్రిన్సిపాల్స్, పీఈటీలు, క్రీడాకారులకు శిక్షణనిచ్చిన కోచ్లు సయ్యద్ సలావుద్దీన్, పి.ప్రశాంత్బాబును రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. -
ఉచితంగా రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్లు...
నాట్కో క్యాన్సర్ సెంటర్లో కార్పొరేట్ ఆస్పత్రుల కంటే దీటుగా రొమ్ము క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించేలా ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేశాం. గత ఏడాది 69 మందికి, ఈఏడాది ఇప్పటివరకు 55 మందికి ఉచితంగా క్యాన్సర్ ఆపరేషన్లు చేశారు. నన్నపనేని లోకాధిత్యుడు, సీతారావమ్మ స్మారక నాట్కో సెంటర్లో 24 గంటలు కార్పోరేట్ ఆస్పత్రుల కంటే ధీటుగా ఉచితంగా క్యాన్సర్ వైద్యసేవలను అందిస్తున్నారు. – నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ -
రేపు రాష్ట్రస్థాయి మాస్టర్స్ స్విమ్మింగ్ పోటీలు
గుంటూరు వెస్ట్: దివంగత స్విమ్మర్ కానాల అంజినీ శ్రీక్రాంత్రెడ్డి స్మారకార్ధం ఈనెల 10న 8వ మాస్టర్స్ ఇంటర్ డిస్ట్రిక్స్ స్విమ్మింగ్ చాంపియన్షిప్–2025 పోటీలు నిర్వహిస్తామని మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్ది రమణారావు తెలిపారు. బుధవారం స్థానిక అరండల్పేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 23 జిల్లాల నుంచి మాస్టర్స్ స్విమ్మర్లు పాల్గొంటారన్నారు. పోటీల్లో విజేతలకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరిహరనాథ్ చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. పోటీలను గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియం ఈతకొనలనులో ఏర్పాటు చేశామన్నారు. పోటీలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. -
టీడీపీ శ్రేణులు వైఎస్సార్ సీపీలో చేరిక
చెరుకుపల్లి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన మళ్లీ రావాలని అన్నివర్గాల ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ అన్నారు. మంగళవారం గుళ్లపల్లి లోని తన క్యాంపు కార్యాలయంలో మండలంలోని నడింపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది, తెలుగుదేశం పార్టీ రేపల్లె నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బడుగు ఫణికుమార్తో పాటు అదే గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, స్థానిక సర్పంచ్ ఏమినేని సుబ్బారావు, పార్టీ మండల కన్వీనర్ దుండి వెంకట రామిరెడ్డి, మరియు పలువురు వైఎస్సార్ సీపీ నాయకుల ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. డాక్టర్ ఈవూరు గణేష్ వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి, కండువాలు కప్పారు. ఈ సందర్భంగా ఫణి కుమార్ మాట్లాడుతూ పేదలకు పూర్తిస్థాయిలో సంక్షేమం అందాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతోనే వైఎస్సార్ సీపీలో చేరినట్లు పేర్కొన్నారు. డాక్టర్ గణేష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూటమిని చిత్తుగా ఓడించి, వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. పార్టీలో కొత్తా పాతా తేడా లేకుండా ఎలాంటి సమస్యవచ్చినా తనతో నేరుగా మాట్లాడి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందన్నారు. గ్రామ ఉపసర్పంచ్ ఆరాధ్యుల రోశయ్య, అలివేలు సన్ని, పెనుమాల రవి, అంబటి రాంబాబు, జంగం మాణిఖ్యారావు, దావులూరి రాంబాబు, జంగం విజయ్కుమార్, పెనుమాల విద్యాసాగర్, మంచాల శ్రీనివాసరావు, షక్ ఫిరోజ్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు. -
మతోన్మాదిని శిక్షించాలి..
బాపట్ల: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ పై మతోన్మాద న్యాయవాది చేసిన దాడి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య అన్నారు. జస్టిస్ గవాయ్పై దాడికి నిరసనగా మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో బాపట్ల పాత బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ ఈ దాడి ఒక వ్యక్తిపై కాదని భారత రాజ్యాంగం పై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి , స్పందించాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి.కృష్ణమోహన్, సిహెచ్ ముజుందర్, జిల్లా కమిటీ సభ్యులు పి కొండయ్య, నాయకులు కె. శరత్ , కె. నాగేశ్వరావు, టి.సుభాషిణి, మహబూబ్ సుభాని, చిన్న పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య -
చీఫ్ జస్టిస్ గవాయ్పై దాడి హేయం
రేపల్లె: దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయిపై న్యాయవాది రాకేష్ అనుచితంగా ప్రవర్తించటంపట్ల రేపల్లె బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంగళవారం విధులను బహిష్కరించారు. స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం సెంటరులో రేపల్లె బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొని దాడికి పాల్పడిన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయటమంటే రాజ్యాంగంపై దాడి చేయటమేనన్నారు. రాకేష్ను న్యాయవాద వృత్తి నుంచి శాశ్వతంగా బహిష్కరణ చేయటంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనగాని శ్రీనివాసమూర్తి, రేపల్లె బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఉప్పాల శ్రీనివాసరావు, మాజీ ప్రభుత్వ సహాయ న్యాయవాదులు దారం సాంబశివరావు, కర్రా ఐజాక్, న్యాయవాదులు గుంటూరు విజయ కుమారి, కట్టుపల్లి కాకమ్మ, ఎం.వెంకటేశ్వరరావు, గుడిపల్లి రవి, గురిందపల్లి రామారావు, నాలాది పోతురాజు, రేవు నాగరాజు, గుమ్మడి కుమార్ బాబు, మునిపల్లి సుబ్బయ్య, కర్రా జయరావు, నల్లూరి వెంకటేశ్వరరావు, దోవా రమేష్ రాంజీ తదితరులు పాల్గొన్నారు. దాడి అమానుషం.. చీరాల రూరల్: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై షూ విసిరి దాడిచేసేందుకు న్యాయవాది ప్రయత్నించడంపై మంగళవారం ఆగ్రహం పెల్లుబికింది. దళిత హక్కుల పరిరక్షణ సమితి నాయకులు, ఆల్ ఇండియా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆర్మీ నాయకులు మాట్లాడుతూ ఇది భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థలపై దాడిగా అభివర్ణించారు. చీరాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు తమ విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. తక్షణమే సీజేఐపై దాడికి యత్నించిన న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో కోరారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు మంగళవారం స్థానిక దళిత మహాసభ కార్యాలయంలో మాచవరపు జూలియన్ అద్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దేశ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు సాక్షిగా సీనియర్ న్యాయవాది రాకేష్ కిషోర్.. సనాతన ధర్మాన్ని సీజేఐ బీఆర్ గవాయ్ అవహేళన చేశారని ఆరోపిస్తూ.. తన కాలిబూటు విసిరి దాడి చేసేందుకు యత్నించాడన్నారు. లౌకిక భారతదేశంలో సనాతనం పేరుతో అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ హయాంలో మతోన్మాదం పెరిగిపోతోందని, కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ భావజాలం జడలు విప్పుతోందని ఈ దాడివెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తక్షణమే దాడికి యత్నించిన న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య, బాపట్ల జిల్లా ఎంఎస్పీ అధ్యక్షుడు తేళ్ల జయరాజు, దళిత నాయకులు కాకుమాను రవి, గొర్రెముచ్చు ఏలియా తదితరులు పాల్గొన్నారు. విధులు బహిష్కరించిన న్యాయవాదులు దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై న్యాయవాది బూటువిసిరి దాడిచేసేందుకు ప్రయత్నించినందుకు నిరసనగా మంగళవారం చీరాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు. ప్రజాస్వామ్యం దేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గౌరవ రమేష్బాబు, మేరుగ రవికుమార్లు పేర్కొన్నారు. చీరాల రూరల్: ఆల్ ఇండియా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆర్మీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మార్పు దీనరాజు.. చీరాల గడియార స్తంభం సెంటర్లో కళ్లకు నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన తెలియజేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో చీఫ్ జస్టి స్గా ఉన్న వ్యక్తిపై దాడి జరిగితే సామాన్యుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే విధానాన్ని తీవ్రంగా ఖండించారు. న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
వాల్మీకి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాపట్లటౌన్: వాల్మీకి మహర్షి జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం వాల్మీకి జయంతి కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామాయణ మహాకావ్యాన్ని రచించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అన్నారు. యుగాలు మారినప్పటికీ రామాయణం ఇచ్చే ఆదర్శాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. ప్రతి మనిషిలో ఉన్న చెడును తొలగించి మంచి దారిలో నడిపించే శక్తి వాల్మీకి రచనల్లో ఉందన్నారు. రామాయణ స్ఫూర్తితో కుటుంబ, మానవతా విలువలను పెంపొందించుకోవాలని, ధర్మబద్ధంగా జీవించాలన్నారు. ఎస్.బి. సీఐ జి.నారాయణ, అడ్మిన్ ఆర్ఐ షేక్ మౌలుద్దీన్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి తైక్వాండోలో సత్తా
చినగంజాం: చినగంజాం విద్యార్థులు 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తైక్వాండో పోటీల్లో సత్తా చాటారు. ఆరుగురు హాజరై గోల్డ్ మెడల్ సాధించారు. ఒంగోలులోని ఇస్లాం పేట షాదీకానాలో సోమవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అంతర జిల్లాల తైక్వాండో ఎంపికలు నిర్వహించారు. స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి, తైక్వాండో వైస్ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ సలాం, ఉమ్మడి ప్రకాశం జిల్లా కోచ్లు, క్రీడాకారుల సమక్షంలో జిల్లా నలుమూలల నుంచి 69 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్–17 విభాగంలో చినగంజాం సత్యం హైస్కూల్కు చెందిన కుక్కల రక్షిత్ రెడ్డి (38 కేజీల కేటగిరీ) గోల్డ్ మెడల్, వాటుపల్లి మౌనిక (42 కేజీలు) గోల్డ్మెడల్, అండర్ 14 విభాగంలో ఎల్. గీతిక (32కేజీల కేటగిరి) గోల్డ్ మెడల్ సాధించారు. సత్యం స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్.హరినాథ్, ఆర్. శ్రీనివాసరావు, సి.రమేష్ క్రీడాకారులను అభినందించారు. చినగంజాం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు అండర్–17 విభాగంలో సీహెచ్ జాషువా (42 కేజీల కేటగిరి) గోల్డ్మెడల్, బి.యశ్వంత్ (68 కేజీల కేటగిరి) గోల్డ్ మెడల్ సాధించారు. వీరంతా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం కె.శ్రీనివాసరెడ్డి, వ్యాయమ ఉపాధ్యాయుడు జి.అంకమ్మరావు, ఎస్.నరసింహరావు, పి.వెంకట ప్రసాద్, రాష్ట్రస్థాయి ఎంపికై న విద్యార్థులను, వీరికి శిక్షణ ఇచ్చిన కోచ్ వాటుపల్లి సుబ్రహ్మణ్యంను అభినందించారు. -
మిర్చి సీజన్ నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలి
కొరిటెపాడు(గుంటూరు): రాబోయే మిర్చి సీజన్ నాటికి మిర్చి యార్డు లోపల, బయట రైతులు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ కాకుమాను శ్రీనివాసరావు కోరారు. మిర్చి సీజన్ ఏర్పాట్లపై మార్కెటింగ్ శాఖ అధికారులు, మిర్చి ఎగుమతి, దిగుమతి వ్యాపారులు, సూపర్ వైజర్లు, వేమెన్స్లతో మంగళవారం సన్నాహాక సమావేశం నిర్వహించారు. తొలుత పలువురు ఎగుమతిదారులు మాట్లాడుతూ మిర్చి సీజన్లో సుమారు లక్ష మంది, అన్ సీజన్లో 50 వేల మంది యార్డుపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. సీజన్లో యార్డులోని అన్ని గేట్లు తెరిచేలా చూడాలన్నారు. కొనుగోలు చేసిన మిర్చిని తరలించేందుకు ట్రాన్స్పోర్టు సమస్య ఉందని, యార్డుకు ఇరువైపులా రోడ్లు విస్తరించాలని సూచించారు. లారీల యూనియన్ సమస్య అధికంగా ఉందని, కిరాయి ఎక్కువగా ఉందని, దానిని నియంత్రించేలా చర్యలు చేపట్టాలని విన్నవించారు. పరిశ్రమలకు ఇండస్ట్రీ డెవలప్మెంట్ కింద మాకు సబ్సిడీపై భూమి కేటాయిస్తే గోదాములు నిర్మించుకుంటామని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా మిర్చిని ఆరబెట్టుకునేందుకు డ్రయర్లు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఆర్జేడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ సీజన్ ప్రారంభం నాటికి యార్డులో అన్ని మౌలిక వసతులు పూర్తి చేసేలా చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ డీడీ దివాకర్, ఏడీఎం సత్యనారాయణ చౌదరి, యార్డు కార్యదర్శి ఎ.చంద్రిక, యార్డు అధికారులు సుబ్రహ్మణ్యం, శ్రీకాంత్, ఎగుమతి వ్యాపారులు జుగిరాజ్ భండారీ, కొత్తూరి సుధాకర్, తోట రామకృష్ణ పాల్గొన్నారు. -
జాతీయ అథ్లెట్ రష్మిశెట్టికి ఘన సన్మానం
లక్ష్మీపురం: జాతీయ అథ్లెటిక్స్లో గుంటూరు రైల్వే డివిజన్కి చెందిన టీటీఐ(రైల్వే టికెట్ ఇన్స్పెక్టర్) రష్మిశెట్టి కాంస్య పతకం సాధించడం అభినందనీయమని గుంటూరు రైల్వే డీఆర్ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని గుంటూరు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో మంగళవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రష్మిశెట్టి 64వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ క్రీడా పోటీలలో జావెలిన్ త్రో విభాగంలో కాంస్య పతకం సాధించారు. డీఆర్ఎం మాట్లాడుతూ ప్రధానంగా జాతీయ క్రీడా పోటీలలో గుంటూరు రైల్వే డివిజన్ తరుఫున జావెలిన్ త్రోలో పాల్గొని సత్తా చాటిన రష్మి శెట్టిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రైతు ద్విచక్ర వాహనం నుంచి రూ. 3 లక్షలు చోరీ సత్తెనపల్లి: సినీఫక్కీలో గుట్టుచప్పుడు కాకుండా వెంబడించి రైతు ద్విచక్ర వాహనంలో నుంచి గుర్తు తెలియని దుండగులు రూ. 3 లక్షలు నగదు కాజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం కందులవారిపాలెం గ్రామానికి చెందిన రైతు బూతుకూరి శ్రీనివాసరెడ్డి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల యూనియన్ బ్యాంకుకు వచ్చాడు. బంగారు నగలు కుదువపెట్టి రూ. 3 లక్షలు నగదు తీసుకున్నాడు. ఆ నగదును ద్విచక్ర వాహనంలో పెట్టుకొని మాచర్ల రోడ్లో గల పెద్ద మసీదు ఎదురు గల తిరుమల ఫర్టిలైజర్స్ ముందు ద్విచక్ర వాహనం ఆపి ఆ కొట్లో ఎరువులు కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. ఎరువులు కొనుగోలు చేసి తిరిగి నగదు కోసం ద్విచక్ర వాహనం వద్దకు రాగా అప్పటికే బ్యాంకు వద్ద నుంచి మాటు వేసిన గుర్తు తెలియని దుండగుడు ద్విచక్ర వాహనంలోని నగదును చోరీ చేశాడు. ద్విచక్ర వాహనంలో నగదు లేకపోవడాన్ని గుర్తించిన శ్రీనివాసరెడ్డి లబోదిబోమంటూ హుటాహుటిన పట్టణ పోలీస్స్టేషన్కు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పట్టణ ఎస్ఐ జె.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆసియా అభివృద్ధి బ్యాంకు బృందం పర్యటన
తాడికొండ: ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) బృందం రాజధాని అమరావతి పర్యటన వరసగా రెండో రోజు కొనసాగింది. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్ కె.కన్నబాబు, అడిషనల్ కమిషనర్లు జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్, అమిలినేని భార్గవ తేజ్లతో ఏడీబీ– వాటర్– అర్బన్ డెవలప్మెంట్ సెక్టార్ బృందంలోని సభ్యులైన నోరియా సైటో(సీనియర్ డైరెక్టర్), మనోజ్ శర్మ(డైరెక్టర్), సంజయ్ జోషి(ప్రిన్సిపాల్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్), అశ్విన్ హోసూర్ విశ్వనాథ్(సీనియర్ ప్రాజెక్టు ఆఫీసర్) సమావేశమయ్యారు. అనంతరం అమరావతి సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, పురపాలక– పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, పరిశ్రమలు– వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్ ఐఏఎస్లను కలిశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఐఏఎస్ను ఆయన చాంబర్లో ఏడీబీ బృందం కలిసినట్లు సీఆర్డీయే అధికారులు వెల్లడించారు. ఈ సందర్బంగా రాజధాని అమరావతి ప్రాజెక్టు పనులలో పురోగతి, ఏడీబీ అందజేస్తున్న ఆర్థిక సహకారం తదితర అంశాలను బృందంలోని సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించారు. -
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
కొల్లూరు: కృష్ణా నదిలో ఇసుక అక్రమ రవాణా చేపడితే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మంగళవారం మండలంలోని చింతర్లంక పరిధిలోని కృష్ణా నది నుంచి అధిక సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేపడతున్నట్లు అందిన సమాచారంతో తహసీల్దార్, రెవెన్యు సిబ్బంది, ఎస్ఐ జానకి అమరవర్ధన్తో కలసి నదిలోకి వెళ్లి పరిశీలించారు. ఆకస్మిక తనిఖీల సమయంలో నదిలో సుమారు 40 వరకు ట్రాక్టర్లు ఉండటాన్ని గమనించిన తహసీల్దార్, ఎస్ఐలు ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే సీజ్ చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. దీంతో ట్రాక్టర్లలో నింపుకొన్న ఇసుకను వాహనదారులు నదిలో అన్లోడ్ చేసి వెనుతిరిగారు. తనిఖీల సమయంలో ఇసుక నింపుకొని వెళుతున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని కొల్లూరు పోలీసు స్టేషన్కు తరలించారు. కొల్లూరు తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు -
రైతులకు కేళీ కష్టాలు
బాపట్లబుధవారం శ్రీ 8 శ్రీ అక్టోబర్ శ్రీ 2025రైతులు నమ్మి సాగు చేసిన విత్తనాల వల్ల ఏర్పడిన నష్టాన్ని పూడ్చే బాధ్యత సీడ్ కంపెనీనే భరించాలి. నా సోదరుల పొలంతో కలుపుకొని 40 ఎకరాలలో ఎన్ఆర్ఐ విత్తన కంపెనీకి చెందిన బీపీటీ 5204 రకపు విత్తనాలు సాగు చేశాం. ఇతర విత్తనాలు సాగు చేసిన పంట సాధారణ స్థితిలో ఉండగానే బీపీటీ 5204 రకం సాగు చేసిన మా పంటలో కేళీ కంకులు ఏర్పడ్డాయి. కేళీ కంకుల వల్ల ఏర్పడుతున్న నష్టాన్ని విత్తన కంపెనీ ప్రతినిధులు రైతులకు చెల్లించాలి. ధూళిపాళ్ల రవికుమార్, రైతు, అనంతవరం. 7 టీడీపీ నేత వద్ద విత్తనాలు కొనుగోలు కాలపరిమితికి ముందే కంకుల రాక పంటను పరిశీలించిన కంపెనీ ప్రతినిధులు కేళీలు ఉన్నట్లు నిర్ధారణ రైతులను ఆదుకుంటామని హామీ వరిలో కేళీల వల్ల కౌలుదారులకు తీవ్ర నష్టం ఏర్పడనుంది. 16 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని వరి సాగు చేశాం. ఎన్ఆర్ఐకు చెందిన బీపీటీ 5204 రకం విత్తనాల కారణంగా తీవ్రమైన పంట నష్టం ఏర్పడనుంది. కేళీల కారణంగా ధాన్యం దిగుబడులు సగానికి సగం తగ్గిపోతే కౌలుకు తీసుకున్న పొలాలకు కౌలు చెల్లించే వెసులుబాటు ఉండకపోగా, అప్పుల పాలవ్వాల్చి వస్తుంది. –అలనేని శివప్రసాద్, కౌలు రైతు, అనంతవరం. అచ్చంపేట : పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 75,430 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 0,430 క్యూసెక్కులు వదులుతున్నారు. నరసరావుపేటటౌన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయాధికారి సాయి కళ్యాణ్ చక్రవర్తిని పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా మంగళ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ఫిరంగిపురం: కారు, ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని పొనుగుపాడుకు చెందిన రత్నసాగర్(33) భార్య, ఇద్దరు పిల్లలతో కలసి గుంటూరు వెళ్లారు. గుంటూరు– కర్నూలు రాష్ట్ర రహదారిలో ఇంటికి తిరిగివస్తుండగా వేములూరిపాడు వద్ద గుంటూరు వైపు వెళ్తున్న ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. ఘటనలో ఇన్నోవా రోడ్డుకు మరోవైపు వెళ్లింది. రత్నసాగర్తో పాటు భార్య, పిల్లలు గాయపడ్డారు. వీరితో పాటు అటువైపు నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహన చోదకుడు గాయపడ్డారు. 108 అందుబాటులో లేకపోవడంతో ఆటోల్లో తరలిస్తుండగా రత్నసాగర్, గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం కారణంగా నిలిచిన ట్రాఫిక్ను పోలీసులు క్రమబద్దీకరించారు. -
దుర్గమ్మ దసరా హుండీ ఆదాయం రూ.10.30 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన దసరా ఉత్సవాల్లో భక్తులు హుండీల ద్వారా రూ.10.30 కోట్లను సమర్పించారు. ఉత్సవాల్లో అమ్మవారికి సమర్పించిన కానుకల లెక్కింపు మంగళవారంతో పూర్తయింది. తొలిరోజున రూ.3,57,92,708 నగదు, 122 గ్రాముల బంగారం, 9.7 కిలోల వెండి లభ్యమవగా..రెండో రోజు రూ.6,73,02,813 నగదు, 265 గ్రాముల బంగారం, 9.750 కిలోల వెండి లభ్యమైంది. దసరా ఉత్సవాల్లో హుండీల ద్వారా 480 సంచులతో దుర్గమ్మకు కానుకలు వచ్చాయి. వీటిని లెక్కించగా రూ.10,30,95,521 నగదు, 387 గ్రాముల బంగారం, 19.450 కిలోల వెండి లభ్యమైంది. గతేడాది కంటే దాదాపు కోటి రూపాయలు హుండీల ద్వారా అదనంగా లభించింది. -
బాలికపై లైంగికదాడి కేసులో జైలు శిక్ష
మేదరమెట్ల: కొరిశపాడు మండలం మేదరమెట్ల పతులకాలనీకి చెందిన మైనర్ బాలిక (2) పై అదే ప్రాంతానికి చెందిన గురజాల మహేష్ అనే వ్యక్తి 2021 జనవరి నెలలో లైంగికదాడికి పాల్పడినట్టు మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం మహేష్కు 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, రూ.12వేలు జరిమానా విధిస్తూ ప్రత్యేక ఒంగోలు పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.శైలజ మంగళవారం తీర్పును వెలువరించినట్లు పోలీసులు తెలిపారు. మైనర్ బాలికకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.3 లక్షలు నగదు పరిహారాన్ని చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. నృసింహుని ఆదాయం రూ.48.45 లక్షలు పీజీ సోషల్ వర్క్ ఫలితాలు విడుదల విద్యుత్ సబ్ స్టేషన్ను సందర్శించిన జేసీ రంగా వర్సిటీలో వాల్మీకి జయంతినరసింహస్వామి హుండీ లెక్కింపుమంగళగిరి టౌన్ : మంగళగిరిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హుండీ కానుకలను మంగళవారం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. ఎగువ, దిగువ సన్నిధులు, ఘాట్రోడ్లోని పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాలకు మొత్తం రూ. 48,45,565 ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో కంటే రూ.2,94,429 అధికంగా వచ్చినట్లు వివరించారు. లెక్కింపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా పొన్నూరు శ్రీ సహస్ర లింగేశ్వరస్వామి వారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి జి.వి.అమర్నాథ్ పర్యవేక్షించారు.సెమిస్టర్ ఫలితాలుఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కోర్సు రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. 13 మందికి 11 మంది ఉత్తీర్ణత సాధించారు. రీవాల్యూయేషన్కు దరఖాస్తు చేసుకునేవారు ఒక్కో పేపరుకు రూ.1,860 ఈనెల 17వ తేదీలోగా చెల్లించాలని సూచించారు.బీటెక్ సప్లిమెంటరీ ఫలితాలు..వర్సిటీ పరిధిలో బీటెక్ 3/4 మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సీఈ శివప్రసాదరావు విడుదల చేశారు. 132 మందికి 87మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. రీవాల్యూయేషన్ కోసం ఒక పేపరుకు రూ.2070 ఈనెల 17వ తేదీలోగా చెల్లించాలని సూచించారు. -
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
తెనాలి రూరల్: బైక్ను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని మారిస్పేటలో ఉన్న సీఎం కాలనీలో ఆదివారం రాత్రి గ్యార్మీ పండుగ చేసుకున్నారు. దీనికి బాపట్ల జిల్లా అప్పికట్లకు చెందిన నాయబ్ రసూల్ (45), అతని బంధువు గౌస్బాషా, మరో చిన్నారి వసీం కుటుంబసభ్యులతో వచ్చారు. తిరిగి సోమవారం ఉదయం అప్పికట్లకు బైక్పై వెళుతున్నారు. ఈ క్రమంలో తెనాలి వైకుంఠపురం నుంచి జగ్గడిగుంటపాలెం వైపు వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నాయబ్రసూల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. ఘటనాస్థలాన్ని త్రీ టౌన్ పోలీసులు పరిశీలించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మంగళగిరి టౌన్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మంగళగిరిలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. విజయవాడ, ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన ముదిగొండ వెంకట ప్రమీల తన కుమారుడు వెంకట సురేంద్ర (18)తో కలసి ద్విచక్రవాహనంపై గుంటూరులోని బంధువుల ఇంటికి సోమవారం వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో మంగళగిరి ఆత్మకూరు జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. సురేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో ప్రమీలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం సురేంద్ర మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెకుముకి సంబరాలను విజయవంతం చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో సృజనాత్మకను వెలికితీసేందుకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాలను విజయవంతం చేయాలని జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. సోమవారం బ్రాడీపేటలో సైన్స్ సంబరాల పోస్టర్లు విడుదల చేశారు. లక్ష్మణరావు మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక గత 35 ఏళ్లుగా ఈ సంబరాలను నిర్వహిస్తోందని వివరించారు. ఈ నెల 8న పాఠశాల స్థాయి, నవంబర్ 1న మండల స్థాయి, 23న జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. డిసెంబర్ 12, 13, 14వ తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సంబరాల నిర్వహణకు విద్యాశాఖ అనుమతి ఇచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్, ఎం.ఉదయ్ భాస్కర్, టి.జాన్బాబు, జి.వెంకట్రావు, టీఆర్ రమేష్, టీఆర్ చాందిని, కె.శ్రీనివాస్, యు.రాజశేఖర్ పాల్గొన్నారు. -
మాజీ సైనికుడు బాజీబాబాకు ఘనంగా నివాళులు
నిజాంపట్నం: మాజీ సైనికుడు షేక్ బాజీబాబా విశాఖపట్టణం జిల్లా భీమిలిలో అకాల మరణం చెందారు. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన నిజాంపట్నం మండలం బావాజీపాలేనికి తీసుకువచ్చారు. సోమవారం నిర్వహించిన అంతిమ యాత్రలో పలువురు సైనికులు, మాజీ సైనికులు, గ్రామస్తులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అధికార లాంఛనాలతో ఆయన అంతిమయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా మాజీ సైనికుల అసోసియేషన్ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, జిల్లా సైనిక్ వెల్పేర్ కార్యాలయ అధికారి మునిపల్లె శ్రీనివాసరావు, అసోసియేషన్ ట్రెజరర్ నిజాముద్దీన్, నిజాంపట్నం అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ సుల్తాన్ మెహబూబ్, బాపట్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ షేక్ మొహినుద్దీన్, పొన్నూరు అసోసియేషన్ సెక్రటరీ మాసుం అలీ, మాజీ సైనికులు షేక్ అల్లావుద్దీన్, తాడివాక రుక్మధరరావు, చినమట్లపూడి, బావాజీపాలెం, పరిసర ప్రాంతాల మాజీ సైనికులు పాల్గొన్నారు. అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ సైనికులు -
98 డీఎస్సీ టీచర్ల సభకు తరలిరండి
గుంటూరు ఎడ్యుకేషన్: విజయవాడలోని ధర్నా చౌక్లో ఈ నెల 11వ తేదీన తలపెట్టిన 1998–డీఎస్సీ ఎంటీఎస్ ఉపాధ్యాయుల రాష్ట్రస్థాయి విజ్ఞాపన సభకు తరలిరావాలని గుంటూరు జిల్లా 98 ఎంటీఎస్ టీచర్ల మహిళా విభాగ అధ్యక్షురాలు శారద, శౌరీలమ్మ, ధనలక్ష్మి, పార్వతి, రూత్బస్లీనాలు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ సేవలను క్రమబద్ధీకరించి, ఉద్యోగ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని కోరారు. రిటైర్ అయినవారికి రూ.20 వేల పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో చేపడుతున్న సభకు ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.వృద్ధుడిని బలిగొన్న బైకు మోతడక(తాడికొండ): ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన తాడికొండ మండలం మోతడక గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతడక గ్రామానికి చెందిన కొమ్మినేని సాంబశివరావు (67) ఆదివారం సాయంత్రం సచివాలయం సెంటర్లో రోడ్డు దాటుతున్నాడు. అమరావతి వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం వేగంగా అతడిని ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే జీజీహెచ్కు తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు.ఏనుగుపాలెంలో యువకుడి హత్యవినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం ఏనుగుపాలెం గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గుంటూరు శివ (35)ను గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ సమీప పొలాల్లో గడ్డపారతో పొడిచి హత్య చేసినట్లు సోమవారం గుర్తించారు. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారంతో నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు, ఇన్చార్జి సీఐ బాలాజీ సంఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. హత్యపై విచారణ చేస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. మృతుడికి భార్య సుధతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.జిల్లా వ్యాప్తంగా వర్షాలుకొరిటెపాడు (గుంటూరు): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల గుంటూరు జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా గుంటూరు పశ్చిమలో 49.6, అత్యల్పంగా వట్టిచెరుకూరు మండలంలో 1 మి.మీ. వర్షపాతం నమోదైంది. సగటు 16.5 మి.మీ.గా కురిసింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు.. తెనాలి మండలంలో 47.2, మంగళగిరి 42.4, గుంటూరు తూర్పు 42.2, పెదనందిపాడు 15.2, పొన్నూరు 15, దుగ్గిరాల 13.8, కాకుమాను 12.4, ఫిరంగిపురం 9.8, తుళ్ళూరు 8.4, పెదకాకాని 8, తాడేపల్లి 6.2, తాడికొండ 6.2, ప్రత్తిపాడు 6, చేబ్రోలు 5.4, కొల్లిపర 5.2, మేడికొండూరు మండలంలో 2.2 మి.మీ. చొప్పున వర్షపాతం కురిసింది. -
సముద్ర స్నానానికి వచ్చి వివాహిత మృతి
చినగంజాం: సముద్ర స్నానం చేసేందుకు వచ్చి వివాహిత మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని మోటుపల్లి సముద్ర తీరంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శీలం రమేష్ వివరాల మేరకు.. చీరాల వాడరేవు పరిధిలోని అడవి పల్లెపాలెం గ్రామానికి చెందిన ఊసుపల్లి శాంతి (25)కి ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన సలగల వినయ్ అనే పాస్టర్తో చర్చికి వెళ్లే క్రమంలో పరిచయం ఏర్పడింది. ఆమె గడచిన కొద్ది రోజులుగా పందిళ్లపల్లి పాతరెడ్డి పాలెం గ్రామానికి వచ్చి ఆమె సోదరి ఇంటి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఆమె పాస్టర్ వినయ్తో కలిసి మోటుపల్లి సముద్ర తీరానికి స్నానం చేసేందుకు వచ్చింది. ఇద్దరు స్నానం చేసే క్రమంలో ఆమెను నీటిలో వదలి పెట్టి వినయ్ బయటకు వచ్చేశాడు. ఘటనను గమనించి స్థానికంగా ఉన్న మత్స్యకారులు ఆమెను ఒడ్డుకు తీసుకొని వచ్చి 108కి సమాచారం అందించారు. ఆమె ఆ పాటికే చనిపోయినట్లు గుర్తించారు. మృతురాలికి భర్త, ఇద్దరు సంతానం ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పాస్టర్ వినయ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. -
అమరావతిలో ఏడీబీ బృందం పర్యటన
తాడికొండ: ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) బృందం సోమవారం రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించింది. తొలుత విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లిన ఆ బృందానికి కమిషనర్ కె.కన్నబాబు, అడిషనల్ కమిషనర్లు జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్, అమిలినేని భార్గవ్ తేజలు స్వాగతం పలికారు. అనంతరం సీఆర్డీఏ, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్)లోని ముఖ్య అధికారులతో బృందం సమావేశమైంది. అమరావతి నిర్మాణ పురోగతిని కమిషనర్ కన్నబాబు వివరించారు. తర్వాత రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న పలు పనులను బృందం పరిశీలించింది. గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మెకానిజం(జీఆర్ఎం) గురించి వివరాలు తెలుసుకుంది. దీనిపై సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యటనలో ఏడీబీ– వాటర్ – అర్బన్ డెవలప్మెంట్ సెక్టార్ బృందంలోని సభ్యులైన నోరియా సైటో (సీనియర్ డైరెక్టర్), మనోజ్ శర్మ (డైరెక్టర్), సంజయ్ జోషి (ప్రిన్సిపాల్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్), అశ్విన్ హోసూర్ విశ్వనాథ్ (సీనియర్ ప్రాజెక్టు ఆఫీసర్)లు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలకు ఎంపిక
అద్దంకి: రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న స్కేటింగ్ పోటీలకు సోమవారం అద్దంకిలో క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమాన్ని పట్టణంలోని సిరీ వెంచర్లో నిర్వహించారు. జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ సీహెచ్ వెంకటేశ్వర్లు హాజరై అద్దంకి, ఒంగోలు, సింగరాయకొండకు చెందిన 24 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. ఇందులో 13 మంది అద్దంకి చెందిన వారు ఉన్నారు. వీరంతా రాష్ట్ర స్థాయిలో త్వరలో నిర్వహించనున్న అండర్– 11, అండర్ –14, అండర్– 17 విభాగాల్లో ఆడనున్నట్లు స్కూల్ గేమ్స్ సెక్రటరీ వెల్లడించారు.బెండ తోటను పీకేసిన దుండగులుఅద్దంకి: మండలంలోని చక్రాయపాలెంలో దుండగులు ఓ కౌలు రైతు బెండ తోటను పీకేశారు. గ్రామానికి చెందిన నగేశ్ భూమిని సంతమాగులూరు మండలంలోని కొమ్మాపాడుకు చెందిన కాలేషా మీరావలి నాలుగేళ్ల క్రితం కౌలుకు తీసుకుని ఏటా సాగు చేసుకుంటున్నాడు. ఈ ఏడాది అందులో బెండ తోట వేశాడు. ప్రస్తుతం అది కాపు దశలో ఉంది. ఈ క్రమంలో సోమవారం కౌలుదారు తోటను చూసుకునేందుకు వెళ్లగా అర ఎకరంలోని బెండ మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు పీకేశారు. దీనిపై మీరావలి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.జిల్లాకు 1620 మెట్రిక్ టన్నుల యూరియానాదెండ్ల: సాతులూరులోని రైల్వే ఎరువుల రేక్ పాయింట్ను నరసరావుపేట ఏడీఏ కేవీ శ్రీనివాసరావు పరిశీలించారు. పల్నాడు జిల్లాకు సీఐఎల్ యూరియా 1620 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు తెలిపారు. అనంతరం సాతులూరులోని ఆవాస్ గోడౌన్లు తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ కేటాయించిన ఎరువులు సొసైటీలకు , ప్రైవేటు డీలర్లకు సరఫరా చేసి రైతులకు సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఆయనతో పాటు ఏఓ టి.శ్రీలత, ఏఈఓ జీపీ శ్రీనివాసరావు ఉన్నారు. -
జీఎస్టీ సమావేశంలో గ్రూపు విభేదాలు బహిర్గతం
భట్టిప్రోలు(వేమూరు) : జీఎస్టీపై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో తెలుగుదేశం పార్టీలో రెండు గ్రూపుల మధ్య కొనసాగుతున్న విభేదాలు బహిర్గతమయ్యాయి. భట్టిప్రోలులో సోమవారం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. దీన్ని పార్టీలోని ఒక గ్రూపు బహిష్కరించింది. భట్టిప్రోలు మండల కేంద్రంలో తూనుగుంట్ల సాయిబాబా, బట్టు మల్లికార్జునరావు మధ్య గ్రూపు విభేదాలు నెలకొన్నాయి. రథం సెంటరులో జీఎస్టీపై అవగాహన సదస్సును సోమవారం తూనుగుంట సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించారు. బట్టు మల్లికార్జునరావు వర్గానికి చెందిన పార్టీ నాయకులు హాజరు కాక పోవడంతో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తల పట్టుకున్నారు. పార్టీలో నాయకుల మధ్య ఉన్న అంతర్గత వర్గ పోరు బయట పడటంతో ఆయనకు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గత శుక్రవారం కొల్లూరు మండల కేంద్రంలోని బస్స్టాండ్ సెంటరులో శుక్రవారం జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో కొల్లూరు మండలంలోని మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన ప్రసాద్, పార్టీ మండల అధ్యక్షడు మైనేని మురళీ మధ్య కొనసాగుతున్న వర్గ పోరు కొట్టుకునే దిశగా వెళ్లింది. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమక్షంలో ఇరు వర్గాలు కొట్టుకున్నారు. కొంత మందికి గాయాలయ్యాయి. మిగితా మండలాల్లోనూ విభేదాలు బహిర్గతమయ్యే పరిస్థితి నెలకొందని కొందరు టీడీపీ నేతలు అంటున్నారు. వర్గాల పోరుపై ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. ఎమ్మెల్యే హాజరైన కనిపించని నాయకులు -
గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ బలోపేతం లక్ష్యం
బాపట్ల: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు శుద్ధ జలాలు సరఫరా చేసేలా ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టమైన ప్రణాళిక ఉండాలని జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. జల సంరక్షణ ప్రణాళికపై స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో నాలుగు జిల్లాల ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. ప్రారంభ సూచికగా జ్యోతిని వెలిగించారు. గాంధీజీ, అంబేడ్కర్ చిత్రపటాలకు ఆయన పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమని తెలిపారు. జల వనరుల సంరక్షణ, అభివృద్ధిలోనూ ప్రజల సహకారం ఉండాలన్నారు. గ్రామాల అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అధునాతన సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఇంజినీర్లకు ఆయన సూచించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పారు. ప్రభుత్వ విధులను ఇష్టంతో, సంతోషంగా నిర్వర్తించాలని ఆయన తెలిపారు. జల జీవన్ మిషన్ పనులు పక్కాగా చేపట్టాలని, పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణ మాట్లాడుతూ జల వనరుల సుస్థిరాభివృద్ధి, తాగునీరు నిరంతర సరఫరా లక్ష్యంతో అధికారులు పని చేయాలని తెలిపారు. జీవన్ మిషన్ పనులు 2028 సంవత్సరం వరకు పొడిగిస్తూ కేంద్రం అధికారికంగా అనుమతులు ఇచ్చిందన్నారు. భవిష్యత్తులో తాగునీటి సమస్యను అరికట్టడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. జలజీవన్ మిషన్, స్వచ్ఛభారత్ కార్యక్రమాలను గ్రామాల్లో విరివిగా చేపట్టాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత పర్యవేక్షణ ఇంజినీర్ రాఘవులు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు, డీపీఓ ప్రభాకర్రావు, విస్తరణ శిక్షణ కేంద్రం ప్రధానాచార్యులు డి. వెంకటరావు పాల్గొన్నారు. పార్క్లను అభివృద్ధి చేయాలి బాపట్ల: ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించేలా పట్టణంలో పార్క్లను అభివృద్ధి చేయాలని కలెక్టర్ వి.వినోద్ కుమార్ సూచించారు. సోమవారం రాత్రి పట్టణంలోని వివేకానంద కాలనీలో గల మున్సిపల్ పార్క్లో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ జి.రఘునాథరెడ్డితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్క్ను ఈ నెల 20న ప్రారంభోత్సవం చేయాలని, ఈలోగా వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ఆదివారం పిల్లలు పార్కుకు వచ్చే విధంగా అభివృద్ధి చేయాలని సూచించారు. పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు, పరికరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. పిల్లలతో పాటు వచ్చే పెద్దలు పార్కులో వాకింగ్ చేసే విధంగా ట్రాక్ ఏర్పాటు చేయాలని తెలిపారు. యువతకు ఉపయోగపడే జిమ్ పరికరాలను కూడా సిద్ధం చేయాలని ఆదేశించారు. నగరంలో ప్రతి వార్డులో పార్క్ ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. దీని కోసం పట్టణ పరిధిలో ప్రభుత్వ భూములను పరిశీలించాలని ఆర్డీఓను, తహసీల్దార్ను కలెక్టర్ ఆదేశించారు.ఆయన వెంట ఆర్డీఓ పి.గ్లోరియా, తహసీల్దార్ శాలీమా, మున్సిపల్ డీఈ సిబ్బంది ఉన్నారు. -
క్లాప్ మిత్రల కృషితోనే జిల్లాకు అవార్డులు
కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పగలు, రాత్రీ తేడా లేకుండా క్లాప్ మిత్రలు పనిచేయడం ద్వారానే బాపట్ల జిల్లాకు విరివిగా అవార్డులు లభించాయని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం స్థానిక కమ్మ కల్యాణ మండపంలో జరిగింది.అనంతరం స్వచ్ఛ ఆంధ్ర అవార్డులకు ఎంపికై న వారికి జిల్లా కలెక్టర్ అవార్డులు ప్రదానం చేశారు. ప్రజల ఆరోగ్యం, విద్యా, వైద్య రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయయన చెప్పారు. రానున్న మూడు నెలల్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. వ్యర్థాలను పద్ధతి ప్రకారం తొలగించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెత్త సంపద కేంద్రాలను సమర్థంగా నిర్వహిస్తామన్నారు. రాననున్న రోజుల్లో బాపట్ల జిల్లా అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే తృతీయ స్థానంలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకోసం అధికారులు, ఉద్యోగులంతా కృషి చేయాలని చెప్పారు. చెరుకుపల్లి మండలంలోని కావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాష్ట్రస్థాయి స్వచ్ఛత అవార్డు సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లాలో వివిధ రంగాలకు 49 అవార్డులు లభించడం సంతోషదాయకమని తెలిపారు. 146 గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. గాంధీజీ స్ఫూర్తితో పారిశుద్ధ్య కార్యక్రమాలు సమర్థంగా నిర్వహించామని ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్ తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల వల్లే ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి బి.ఎస్.నారాయణభట్టు, బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్బాబు, ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఎం.వెంకట రమణ, ఆర్డీఓ పి. గ్లోరియా, డీపీఓ ప్రభాకరరావు పాల్గొన్నారు. -
ప్రతి కార్యకర్తా సైనికుడిలా పోరాడాలి !
సాక్షి ప్రతినిధి, బాపట్ల: గ్రామ స్థాయిలో ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్తా సైనికుడిలా మారాలని రాజ్యసభ సభ్యుడు, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ వై.వి. సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. బాపట్ల కోన భవన్లో సోమవారం నిర్వహించిన పార్టీ సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం కీలకమని, గ్రామస్థాయి నుంచి తిరుగులేని శక్తిగా రూపొందించాలని తెలిపారు. ఇందు కోసం గ్రామ స్థాయి నుంచి అన్ని పార్టీ కమిటీలను నవంబర్ 20 నాటికి పూర్తి చేయాలని చెప్పారు. గ్రామ స్థాయిలో 30 మంది కార్యకర్తలు సైనికుల్లా మారాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో 1400 మంది కార్యకర్తలు క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు. కమిటీల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన నియోజకవర్గ సమన్వయకర్తలను ఆదేశించారు. ఇందుకోసం గ్రామ, మండల స్థాయి నాయకులు పని చేయాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలం చెందిందని సుబ్బారెడ్డి దుయ్యబట్టారు. పేదల సంక్షేమ పథకాల్లోనూ కోత పెట్టిందన్నారు. రైతల పరిస్థితి దుర్భరంగా ఉందని పేర్కొన్నారు. పొగాకు, మిర్చి, టమోటాలకు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో రైతులకు అన్ని విధాలా మేలు జరిగిందని, గిట్టుబాటు ధరలు లభించాయని గుర్తు చేశారు. ప్రభుత్వం నడపాల్సిన మెడికల్ కళాశాలలను పీపీపీ మోడ్లో ప్రైవేటు పరం చేసిందని, నకిలీ మద్యం తయారు చేసి పేదల ప్రాణాలను బలికొంటోందని విమర్శించారు. బాధిత వర్గాల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని అభయమిచ్చారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను పార్టీ నేతలు, కార్యకర్తలు గడప గడపకు తీసుకు వెళ్లాలని తెలిపారు. ఇందుకోసం గ్రామస్థాయిలో పార్టీ మరింత బలోపేతం కావాలని దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, సమన్వయకర్తలు కరణం వెంకటేశ్, ఈవూరు గణేష్, వరికూటి అశోక్బాబు, గాదె మధుసూదన్రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు చేజర్ల నారాయణరెడ్డి, మోదుగుల బసవ పున్నారెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి, డాక్టర్ అశోక్ కుమార్, పుత్తా శివశంకర్రెడ్డి, కారుమూరు వెంకటరెడ్డి, కోకి రాఘవరెడ్డి ,అంజనీప్రసాదరెడ్డి, చెంచయ్య, చల్లా రామయ్య, డేవిడ్, విజయకుమార్, అన్ని నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతతో పని చేయాలి
జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. కొన్నింటికి తక్షణమే పరిష్కార మార్గం చూపించారు. కొన్నింటిని సంబంధిత శాఖ అధికారులకు అందించి, తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సూపర్ జీఎస్టీపై అవగాహన కల్పించాలి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామ, సచివాలయ పరిధిలో సమావేశాలు ఏర్పాటుకు షెడ్యూల్ తయారు చేయాలని ఆయన ఎంపీడీవోలను ఆదేశించారు. సెలూన్లు, యోగా సెంటర్లలో ధరల వివరాలను ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. జిల్లాస్థాయిలో వస్తు ఉత్పత్తుల, ధరలపై ఎగ్జిబిషన్ ఏర్పాటుకు షెడ్యూల్ తయారు చేయాలని పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయిలో డిస్ట్రిబ్యూటర్లకు జీఎస్టీపై సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్పై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, డిబేట్లు, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. వీడియోలను తయారు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా ప్రదర్శించాలని ఆయన తెలిపారు. రోజువారి నిర్దేశిత ప్రచార కార్యక్రమాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. స్థలాన్ని సేకరించాలి అద్దంకి నియోజకవర్గంలోని ఏడో సబ్స్టేషన్ పరిధిలో పీఎం కుసుమ పథకానికి భూ సేకరణపై రైతులతో బుధవారం నాటికి అగ్రిమెంట్లు పూర్తి చేసుకుని శనివారం పనులు మొదలు పెట్టాలని ఏపీ సీపీడీసీఎల్ ఎస్ఈని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ జి. గంగాధర్ గౌడ్, ఇన్చార్జి పీడీ డీఆర్డీఏ లవన్న, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మండల స్థాయిలో పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను నూరు శాతం నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని చెప్పారు. సంబంధిత ఫోటోలు, వీడియోలను ఈ– ఆఫీస్లో అప్లోడ్ చేయాలని సూచించారు. కాల్ సెంటర్లో (1100) నమోదైన అర్జీల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. సమస్యల పరిష్కారంలో అధికారులు వేగంగా పని చేయాలని చెప్పారు. జిల్లాలో గిరిజనులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వారి కోసం ప్రత్యేకమైన గ్రీవెన్స్ను నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, ఇన్చార్జి పీడీడీఆర్ డీఏ సమన్వయంతో గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. -
15న కార్తికేయుని హుండీ కానుకల లెక్కింపు
బోధనా నైపుణ్యాలు పెంచుకోవాలి: డీఈఓ చంద్రకళనరసరావుపేట ఈస్ట్: మెగా డీఎస్సీ–2025 ద్వారా ఉపాధ్యాయులుగా నియామకం పొందినవారు బోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. ఉపాధ్యాయులుగా నియామకం పొందినవారికి అందిస్తున్న శిక్షణ తరగతులను సోమవారం డీఈఓ సందర్శించి, నిర్వహణ తీరును పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లోని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని హితవు పలికారు. కార్యక్రమంలో పల్నాడుజిల్లా విద్యాశాఖ ఏడీ బి.వి.రమణ, శిక్షణ కేంద్రాం ఇన్చార్జి సత్యనారాయణసింగ్, ఏఎంఓ పూర్ణచంద్రరావు, రిసోర్స్పర్సన్లు పాల్గొన్నారు.సాగర్ నీటిమట్టంవిజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 588.00 అడుగులకు చేరింది. ఇది 306.1010 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 10,040, ఎడమ కాలువకు 9,076, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 33,211, ఎస్ఎల్బీసీకి 1,800, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 54,427 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 54,427 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.15న కార్తికేయుని హుండీ కానుకల లెక్కింపుమోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకుల లెక్కింపు ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు సోమవారం తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సమక్షంలో నిర్వహించే లెక్కింపులో పాల్గొనదలచిన భక్తులు డ్రస్కోడ్లో హాజరు కావాలని సూచించారు. కానుకల లెక్కింపు కారణంగా ఆ రోజున జరగాల్సిన స్వామివారి నిత్య శాంతి కల్యాణం ఉదయం 7 గంటలకు ప్రారంభిస్తారని తెలియజేశారు. -
ఆగని మరణ మృదంగం
స్జాక్షి ప్రతినిధి, గుంటూరు/ గుంటూరు రూరల్: గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో అంతుచిక్కని మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామంలోని చల్లా కృష్ణవేణి (24) పది రోజులపాటు జ్వరంతో బాధపడి చికిత్స పొందుతూ చివరికి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఆదివారం మృత్యువాతకు గురైంది. గత నెల సెప్టెంబర్ 3, 4 తేదీల్లో రెండు మరణాలు సంభవించిన అనంతరం తీరిగ్గా కూటమి ప్రభుత్వం స్పందించింది. అప్పుడు ఆరు రోజులపాటు గ్రామంలో ప్రజలకు భోజనాలు పెట్టారు. మరో నెల రోజులు మెడికల్ క్యాంప్ అంటూ హడావుడి చేశారు. అనంతరం పాలకులు చేతులు దులుపుకొన్నారు. కనీసం గ్రామంలో ప్రజల అనారోగ్యానికి కారణం.. ఏ వ్యాధితో మరణిస్తున్నారు.. దీనికి పరిష్కారం ఉందా? లేదా? అనే అంశాలపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యం వలనే ప్రాణం బలి పదిరోజులుగా జ్వరంతో ఉన్న కృష్ణవేణి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన రోజు బాగానే ఉందని, బాగానే మాట్లాడి తిరుగుతూనే ఉందని ఆమె భర్త దుర్గారావు, అత్త తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రిలో రోజుకు రూ.30 వేలు అడిగారని చెప్పారు. కూలీనాలీ చేసుకుని బతికే తాము అంత డబ్బు కట్టలేమని చెప్పటంతో జీజీహెచ్కు తీసుకెళ్లమన్నారని పేర్కొన్నారు. అక్కడికి వెళ్లాక కనీస స్పందన కరువైందని కుటుంబ సభ్యులు వాపోయారు. వైద్యులు పట్టించుకోలేదని తెలిపారు. చివరి నిమిషంలో కనీసం ఆక్సిజన్ అయినా పెట్టాలని తాము బతిమాలినా పట్టించుకోలేదని వాపోయారు. ప్రభుత్వం, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని కన్నీరు మున్నీరయ్యారు. అక్కడికి వచ్చిన అధికారులను గ్రామస్తులతో కలిసి నిలదీశారు. ఆరు నెలలుగా అదే పరిస్థితి.. గ్రామంలో ఆరు నెలలుగా సుమారు 46 మందికిపైగా మృత్యువాతకు గురయ్యారు. దీంతో గ్రామంలో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కొందరు గ్రామంలో బొడ్డురాయి సమస్య అని ఆందోళన చెందారు. నిపుణులు, రాజకీయపార్టీల నేతలు, అధికారులు కొందరు తాగునీరు కలుషితం కావడం వల్ల సమస్య వచ్చిందని పేర్కొన్నారు. ఈ రెండింటిలో బొడ్డురాయి సమస్యను స్థానిక పెద్దలు సంప్రదాయబద్ధంగా పరిష్కారం చూపారు. మెలియాయిడోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వ్యాధి సంక్రమించి అనారోగ్యాలకు గురవుతున్నారని వైద్యులు తెలిపారు. కానీ ఈ వ్యాధికి చికిత్స ఏంటి? ఏ మందులు వాడాలనే విషయాన్ని గ్రామస్తులకు చెప్పిన వారే లేరు. నెల రోజుల తరువాత మరో మరణం సంభవించటంతో గ్రామంలో కలకలం రేగింది. జీజీహెచ్లో చికిత్స పొందిన బాధితురాలు అదే వ్యాధితో మృతి చెందిందని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. కొన్ని రోజుల హడావుడే.. గ్రామంలో ప్రజలు ఆకస్మిక మరణాల విషయం వెలుగు చూడటం, మీడియాలో సంచలన కథనాలు, వార్తలు రావడంతో ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసింది ఇంటింటికీ వెళ్లి రక్త నమూనాలు సేకరించారు. పరీక్షలు చేశారు. గ్రామంలో దాదాపు వెయ్యి మందికి కిడ్నీ సమస్యలున్నాయని తేలిందని, మరో 300 మందికిపైగా లివర్ సమస్యలతో బాధపడుతున్నారని గుర్తించామని వైద్యులు తెలిపారు. వారికి పరీక్ష ఫలితాలను ఇవ్వలేదు. టాబ్లెట్, ఇంజక్షన్ కూడా లేదు. ఆరు రోజులు భోజనాలు ఏర్పాటు చేశారు. తర్వాత ఆ ఊసే లేదు. మరణించినవారి కుటుంబాలకు న్యాయం చేయలేదు. బాధితులు కలెక్టరేట్, తదితర అధికారులకు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా వారికి న్యాయం అందని ద్రాక్షగానే మిగిలింది. ఇంటికి ఒకరు ఇద్దరు చొప్పున జ్వరాలతో గ్రామస్తులు బాధపడుతూనే ఉన్నారు. కనీసం ఒక్కరు కూడా తమను పట్టించుకోవటంలేదని వాపోతున్నారు. గ్రామంలోనే విలేజ్ క్లినిక్లో ఒకరిద్దరు వైద్యులు ఉన్నా ఫలితం లేదని ఆరోపిస్తున్నారు. -
నకిలీ మద్యంతో పేదల ప్రాణాలు బలి
సాక్షి ప్రతినిధి, బాపట్ల: కూటమి అధికారంలోకి వచ్చాక ఏకంగా ఫ్యాక్టరీలు పెట్టి నకిలీ మద్యం ఉత్పత్తి చేసి, షాపులకు విక్రయిస్తూ పేదల ప్రాణాలను బలిగొంటోందని వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వై.వి. సుబ్బారెడ్డి విమర్శించారు. సోమవారం బాపట్లలోని కోన భవన్లో నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో నకిలీ మద్యం పరిశ్రమను అధికారులే కనుగొన్నారని పేర్కొన్నారు. నాసి రకం మద్యానికి ప్రజలు బలి కాకముందే దీనిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వైవీ డిమాండ్ చేశారు. కూటమి పాలన వచ్చాక పేద ప్రజలకు కష్టాలు తప్పడం లేదని, సంక్షేమ పథకాల్లోనూ కోతలు పెట్టిందని తెలిపారు. ఏ ప్రభుత్వమైనా పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని, కానీ కూటమి ప్రభుత్వం వాటిని వారికి అందకుండా చేస్తోందని వైవీ విమర్శించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం వైఎస్.జగన్మోహన్రెడ్డి సదుద్దేశంతో నెలకొల్పిన మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్లో ప్రైవేటు పరం చేసిందని విమర్శించారు. జగన్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 16 మెడికల్ కళాశాలలను మొదలు పెట్టి, ఆరు కళాశాలలను పూర్తి చేశారన్నారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు వాటిని ప్రైవేటీకరించడం దుర్మార్గమని ఖండించారు. లేని లిక్కర్ స్కాం అంటగట్టి వైఎస్సార్సీపీ నేతలను బదనాం చేశారని విమర్శించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని, దీన్ని పార్టీ సమర్థంగా ఎదుర్కొంటుందని తెలిపారు. బాధితులకు అండగా పార్టీ లీగల్ టీం పని చేస్తుందని, పార్టీ సైతం అండగా ఉందని హామీ ఇచ్చారు. అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంస్థాగతంగా వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, సమన్వయకర్తలు కరణం వెంకటేశ్, ఈవూరు గణేష్, వరికూటి అశోక్బాబు, గాదె మధుసూదన్రెడ్డి, డాక్టర్ అశోక్ కుమార్, పుత్తా శివశంకర్రెడ్డి, కారుమూరు వెంకటరెడ్డి, కోకి రాఘవరెడ్డి పాల్గొన్నారు. -
నేడు 650 మందికి ఉపకార వేతనాల పంపిణీ
తులసి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ తులసి యోగీష్ చంద్ర కొరిటెపాడు(గుంటూరు): కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్, ఏపీ కాట్వా సంయుక్త ఆధ్వర్యంలో చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 650 మంది పేద విద్యార్థులకు రూ.24.50 లక్షల ఉపకార వేతనాలను పంపిణీ చేయనున్నట్లు తులసి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ తులసి యోగీష్ చంద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అమలాపురంలోని ముక్తేశ్వరం రోడ్లోని సత్యనారాయణ గార్డెన్స్లో ఆదివారం ఉదయం 9 గంటకు కార్యక్రమం ప్రారంభమవుతోందన్నారు. తులసి గ్రూప్స్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు ముఖ్య అతిథిగా హాజరై ఉపకార వేతనాలు వితరణ చేయనున్నట్టు వెల్లడించారు. ఇందులో 331 మంది విద్యార్థులకు రూ.11.84 లక్షలు తులసి సీడ్స్ ఆధ్వర్యంలో కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ ద్వారా పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. -
కన్నవారిని కోల్పోయిన పిల్లలకు భరోసా
బాపట్ల: కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సోదరుడిలా ఉండి భరోసా కల్పిస్తానని జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ అన్నారు. కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలతో ప్రధానమంత్రి కేర్ మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా శనివారం స్థానిక కలెక్టరేట్లోని న్యూ వీసీ హాల్లో జిల్లా కలెక్టర్ ముఖాముఖిగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాకు సంబంధించి ఆరుగురు బాలలు ఆ విపత్తులో తల్లిదండ్రులను కోల్పోయారని చెప్పారు. వారు తిరుపతి, తెనాలి, కర్నూలు ప్రాంతాల్లో చదువుకుంటున్నారని పేర్కొన్నారు. వారికి సంబంధించిన అన్ని విషయాలను చూడాల్సిన బాధ్యత తమపైనే ఉందని చెప్పారు. లబ్ధిదారుల పేర్లు జాబితాల్లో చేరుస్తాం 19న బాపట్ల షాపింగ్ ఫెస్టివల్ బాపట్ల: ఈ నెల 19వ తేదీన బాపట్ల షాపింగ్ ఫెస్టివల్ను జిల్లాలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. శనివారం రాత్రి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ మురళీకృష్ణతో కలసి బాపట్ల, చీరాల ట్రేడర్ల సంఘం ప్రతినిధులతో ‘సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్’పై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని రకాల ట్రేడర్ల సంఘాలు సహకరించాలన్నారు. 7వ తేదీన ప్రతి పాఠశాలలోని తరగతి గదిలో 40 నిమిషాలపాటు జీఎస్టీ తగ్గింపుపై విద్యార్థులకు క్లాస్ నిర్వహించాలని డీఈఓను ఆదేశించారు. పర్యాటక అభివృద్ధికి చర్యలు జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే దృష్టితో క్యారవాన్ టూరిజం ప్రవేశపెట్టామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. శనివారం రాత్రి సూర్యలంక బీచ్లో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరావుతో కలసి డ్రీమ్లైనర్స్ క్యారవాన్ సర్వీస్ లగ్జరీ బస్సును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వాహనం వచ్చే శనివారం, ఆదివారం చీరాల బీచ్ వద్ద ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
రైతుకు విపత్తి
ప్రత్తిపాడు: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగానికి చెందిన నూనె గణపతికి ఎకరం భూమి ఉంది. మూడు నెలల కిందట మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. మొత్తం ఐదెకరాల్లో పత్తి సాగు చేశాడు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు, పై ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు కూడా పొలంలో రోజుల తరబడి నిలబడటంతో ఉరకెత్తి ఎర్ర తెగులు సోకింది. గులాబీ రంగు పురుగు కూడా పంటను తీవ్రంగా ఆశించింది. మూడు నెలలైనా రెండడుగులు కూడా పెరగలేదు. కౌలుకు రూ. లక్ష, వ్యవసాయం చేసేందుకు సుమారు మరో రూ.లక్ష వరకు పెట్టుబడులు అయ్యాయి. గుండె తరుక్కుపోయిన గణపతి పొలంపై ఆశలు వదులుకున్నాడు. కన్నబిడ్డలా సాగు చేసిన పైరును తన చేతులతోనే పీకేశాడు. -
బోధనా నైపుణ్యాలు పెంచుకోవాలి
పాఠశాల విద్య జేడీ శైలజ నరసరావుపేట ఈస్ట్: మెగా డీఎస్సీ–2025లో ఎంపికై న ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పాఠశాల విద్య జేడీ పి.శైలజ తెలిపారు. డీఎస్సీ జోన్–3 పరిధిలో పీజీటీ, టీజీటీలుగా ఎంపికై న ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను శనివారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల నియామకం చేపట్టిందని తెలిపారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఆమె చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా కృషి చేయాలని హితవు పలికారు. విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరిగేలా బోధన ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో పల్నాడు విద్యాశాఖ ఏడీ బి.వి.రమణ, ఎంఈఓలు ఎండీ. ఖాసిం, పి.సుధారాణి, ప్రధానోపాధ్యాయులు ఆర్.గోవిందరాజులు, వి.వెంకట్రావు, ఏఎంఓ పూర్ణచంద్రరావు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్కూల్ గేమ్స్ టెన్నిస్ పోటీలకు ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): శ్రీకాళహస్తిలో ఈనెల 7వ తేదీ నుంచి 9 వరకు జరగనున్న ఏపీ స్టేట్ స్కూల్ గేమ్స్ టెన్నిస్ చాంపియన్షిప్ పోటీల్లో ఎన్టీఆర్ స్టేడియంకు చెందిన ఆరుగురు క్రీడాకారులు జిల్లా జట్టుకు ఎంపికయ్యారని టెన్నిస్ కోచ్ జీవీఎస్ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులను రేమండ్స్ షో రూమ్ అధినేత టి.అరుణ్ కుమార్, ఏపీ రెరా సభ్యులు దామచర్ల శ్రీనివాసరావు, సహస్ర ఆర్థో అండ్ న్యూరో క్లినిక్ అధినేత డాక్టర్ ఎం. శివకుమార్, రక్షిత్, నాంచారయ్యలు అభినందించారన్నారు. ఎంపికై న క్రీడాకారుల వివరాలు... అండర్ 19 బాలుర విభాగంలో కె.విన్సెంట్, ఊరుబంది లలిత్ కుమార్, బాలికల విభాగంలో... సాధుర్ల కావ్య హర్షిత, అండర్ 17 బాలుర భాగంలో.... గంటా దిశాంత్, ఇ.జి. హర్షవర్ధన్, అండర్ 14 బాలుర విభాగంలో కుంభ సాయి నాగ కళ్యాణ్. -
వయోవృద్ధుల సంక్షేమానికి కృషి
గుంటూరు వెస్ట్: వయోవృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్దతతో కృషి చేస్తుందని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సెక్రటరీ సూర్య కుమారి తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశం మందిరంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం – 2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యకుమారితోపాటు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, శాసన సభ్యులు గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి, రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ చైర్మన్ జి.కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ వయో వృద్ధుల సమస్యలను సాధ్యమైనంతవరకు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వృద్ధుల అనుభవాలు చాలా గొప్పవి జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా మాట్లాడుతూ వయోవృద్ధుల అనుభవాలు నేటి సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. వారి నుంచి స్పూర్తి పొందాలన్నారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వయోవృద్ధులను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ జి. ప్రకాష్ రెడ్డి, డీఆర్ఓ ఎన్ఎస్కే ఖాజావలి, ఏడీ దుర్గాబాయి పాల్గొన్నారు. వయోవృద్ధుల సంక్షేమ శాఖ సెక్రటరీ సూర్య కుమారి -
మహనీయుల నిత్య చరిత్రను తెలిపే ‘సదాస్మరామి’
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ నగరంపాలెం(గుంటూరు వెస్ట్): తెలుగు భాషకు, సంస్కృతికి, చరిత్రకు, కళలకు, వన్నెతెచ్చిన మహనీయుల చరిత్రలను సమగ్రంగా, సంగ్రహంగా గ్రంథస్థం చేసి వర్తమాన భవిష్యత్ తరాలకు దిశా నిర్దేశం చేసిన గ్రంథకర్త మండలి బుద్ధప్రసాద్ అభినందనీయులని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రచించగా మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ వెలువరించిన సదాస్మరామి పుస్తకావిష్కరణ సభ నగరంపాలెం కలెక్టర్ బంగ్లా రోడ్లోని భారతీయ విద్యాభవన్లో శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జస్టిస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ మహనీయుల చరిత్రను తెలుసుకునే అవకాశం సదాస్మరామి పుస్తకం ఇస్తుందని పేర్కొన్నారు. పుస్తక రచయిత, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మహనీయుల గురించి రాయడం తన అదృష్టమన్నారు. దాన్ని వెలువరించిన బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలిపారు. సభలో ఎం.నాగేశ్వరరావు, న్యాయమూర్తి జగదీశ్వరి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ, భారతీయ విద్యాభవన్ కార్యదర్శి పి.రామచంద్రరాజు, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పలువురు రచయితలు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. -
బొక్కేస్తున్న పచ్చ బ్యాచ్!
ఆదివారం శ్రీ 5 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా నిరాటంకంగా కొనసాగుతోంది. మాముళ్లు అందుతుండడంతో కూటమి ఎమ్మెల్యేలు కొమ్ముకాస్తున్నారు. బాపట్ల జిల్లా నుంచి తరలిపోతున్న రేషన్ బియ్యం ఒక్క రోజులోనే పొన్నూరు, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో వెయ్యి బస్తాలు పట్టుబడిందంటే ఈ దందా స్థాయి అర్థం చేసుకోవచ్చు. మాఫియాలోని వర్గాల సమాచారంతో ఇవి పట్టుబడ్డాయని, లేకుంటే కృష్ణపట్నం పోర్టుకు తరలిపోయేవని తెలుస్తోంది. వేమూరు నియోజకవర్గంలో వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమర్తలూరు, చుండూరు మండలాల్లో ఎమ్మెల్యే అనుచరుల ఆధ్వర్యంలో దందా కొనసాగుతోంది. ప్రజల నుంచి రూ.10కే బియ్యం కొనుగోలు చేసి చుండూరు మండలం నడిగడ్డవారిపాలెం రైస్ మిల్లుకు తరలిస్తున్నారు. పాలీష్ చేసి నేరుగా కృష్ణపట్నం పోర్టుకు తీసుకెళుతున్నారు. భట్టిప్రోలు నుంచి తరలిస్తున్న బియ్యాన్ని గురువారం పొన్నూరులో 300 బస్తాలు పట్టుకున్నారు. ● రేపల్లె నియోజకవర్గంలో డీలర్లు కిలో రూ.10 చొప్పున కొని కూటమి నాయకులకు రూ. 11 నుంచి రూ.12 వరకు అమ్ముతున్నారు. తర్వాత ప్రకాశం జిల్లాకు తరలిస్తున్నారు. ఆపై రూ.16కు విక్రయిస్తున్నట్లు సమాచారం. నిజాంపట్నం మండలం కొలసానివారిపాలెంకు చెందిన కూటమి నేత కీలకంగా ఉన్నాడు. ప్రతి నెలా ఎమ్మెల్యేకు పెద్ద మొత్తం అందుతున్నట్లు తెలుస్తోంది. ● బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఈనగంటి గాంధీ, వక్కలగడ్డ సుధీర్ రేషన్ ఈ వ్యాపారం చేస్తున్నారు. బాపట్ల నుంచి తరలిస్తున్న 700 బస్తాల బియ్యం శుక్రవారం నాగులుప్పలపాడులో పట్టుబడిన సంగతి తెలిసిందే. గుంటూరులోని శ్రీనగర్కు చెందిన జనసేన నేత అనిల్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ఒకరు డీలర్లతో మాట్లాడి ప్రతినెల బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అధికారుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆర్టీసీ కాలనీకి చెందిన నాగేశ్వరరావు మిల్లర్ ద్వారా బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. మోహన్, సుబ్బారావులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ● పొన్నూరులో పచ్చ నేతలు ముగ్గురు హవా చాటుతున్నారు. పచ్చ జెండా మోసి అలసిపోయిన ఓ మువ్వగోపాలుడు మండలాన్ని చేజిక్కించుకున్నట్లు సమాచారం. రెండు నెలల క్రితం ఓ ఇంట్లో 70 బస్తాల రేషన్ బియ్యం నిల్వ చేసి పోలీసు రికార్డులకు ఎక్కిన టీడీపీ సానుభూతిపరుడు రబ్బాని ప్రస్తుతం కీలకంగా మారారని సమాచారం. పెదకాకాని మండలంలోని వెనిగండ్ల కేంద్రంగా అక్రమ రవాణా సాగుతోంది. ● తాడికొండ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యే ఫిరంగిపురం మండలంలోని టీడీపీ యువ నాయకుడికి దందా అప్పగించారు. మండలాల్లో నేతలకు మామూళ్లు ఇచ్చి నడిపిస్తున్నారు. తాడికొండలో ఇద్దరు రేషన్ డీలర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రత్తిపాడులో కొని రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఎమ్మెల్యే అల్లుడు, అనుచరులు దందా నడిపిస్తున్నారు. ● మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో బియ్యం నేరుగా మిల్లుల వద్దకు చేరుస్తున్నారు. పాలీష్ చేసి కిలో రూ. 50 నుంచి రూ.70కి విక్రయిస్తున్నారు. కూటమి నేతల అండతో ఓ టీవీ చానల్ రిపోర్టర్ సోదరుడు రేషన్ దుకాణాలపై పెత్తనం చేస్తున్నట్లు సమాచారం రేషన్ బియ్యం అక్రమ రవాణా పూర్తిగా అధికార పార్టీ నేతల అండదండలతో సాగుతుండటంతో రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్ శాఖల అధికారులు లంచాలు తీసుకుని చోద్యం చూస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన లారీలు, ఆటోలు మాత్రమే పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. పొన్నూరులో అధికారులకు చిక్కిన రేషన్ బియ్యం బస్తాలు టీడీపీ నాయకుల కనుసన్నల్లో రేషన్ మాఫియా అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న డీలర్లు అర్ధరాత్రి యథేచ్ఛగా అక్రమ రవాణా షాడో ఎమ్మెల్యేల కనుసన్నల్లో కార్యకలాపాలు బియ్యం పట్టుకుంటే ఎమ్మెల్యే అనుచరుల నుంచి ఫోన్లు పేదల నోటి దగ్గర కూడూ లాక్కుంటున్న నేతలు ప్రేక్షక పాత్రకే పరిమితమైన అధికారులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. పొన్నూరులో మామిళ్ళపల్లి కేంద్రంగా వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. టీడీపీ నాయకులు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. పాలకులు రేషన్ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారు. – చింతలపూడి మురళీకృష్ణ, వైఎస్సార్ సీపీ పొన్నూరు మండల అధ్యక్షుడు, గుంటూరు జిల్లా.పల్నాడు జిల్లాలో కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. సత్తెనపల్లిలో షాడో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బియ్యం అక్రమంగా కొనుగోలు చేస్తున్నారు. రాత్రి వేళ బొలెరో వాహనాలలో నకరికల్లుకు తరలిస్తున్నారు. ఎమ్మెల్యే ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు. -
కూటమి కుయుక్తులకు చెక్
● ఘనంగా అద్దంకి నూతన సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ ● అడ్డరోడ్డు నుంచి అద్దంకి వరకు పోలీసుల అవాంతరాలు ● బల్లికురవ మండలం వైదన వద్ద మట్టి ట్రాక్టర్ పెట్టి అడ్డుకున్న వైనం ● స్థైర్యం కోల్పోని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ● భారీ జనసందోహం మధ్య వేదిక వరకు పయనం అద్దంకి: వైఎస్సార్సీపీకి ప్రజాబలం ఎంత ఉందో.. కూటమి పాలనపై ఎంత వ్యతిరేకత ఉందో శనివారం అడుగడుగునా చోటు చేసుకున్న ఘటనలు నిరూపించాయి. వైఎస్సార్ సీపీ నూతన సమన్వయకర్త డాక్టర్ అశోక్కుమార్ బాధ్యతల స్వీకరణ, జన్మదిన వేడుకల కార్యక్రమం శనివారం అద్దంకి పట్టణంలోని కూకట్ల కన్వెన్షన్ హాల్లో నిర్వహించేందుకు ఆయనతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పిడుగురాళ్ల నుంచి బయలు దేరారు. కానీ పోలీసులు అవాంతరాలు సృష్టించారు. వాటన్నింటినీ అధిగమించి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అద్దంకి నూతన సమన్వయకర్త పిడుగురాళ్ల నుంచి బయలుదేరగా.. సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద నాయకులు ఆయనకు సంఘీభావంగా తరలివెళ్లారు. అక్కడకు పోలీసులు చేరుకుని ర్యాలీగా వెళ్లడానికి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. బల్లికురవ మండలంలోని వైదన వద్ద ఏకంగా మట్టి ట్రాక్టర్ను అడ్డుపెట్టించారు. శింగరకొండ వద్దకు చేరుకున్న తర్వాత కూడా అన్ని కార్లను అనుమతించలేదు. ఇలా అడుగడుగునా పోలీసులతో కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. తమకు అనుమతులు ఇచ్చారని.. ఇప్పుడు ఎందుకు వెళ్లనివ్వరంటూ డాక్టర్ అశోక్ కుమార్ గట్టిగా ప్రశ్నించారు. ఆయనకు అడుగడుగునా కార్యకర్తలు, నాయకులు బ్రహ్మరథం పట్టారు. వేదిక వద్ద భారీ గజమాల వేసి ఆహ్వానించారు. జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు ప్రసంగించారు. ● వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకుడు తూమాటి మాధవరావు వేదికపై మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఽఅధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చలేకపోయిందన్నారు. గ్రామాల్లోకి పోలీసులు లేకుండా ప్రజల ముందుకు వెళ్లలేని పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. ● పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ నాయకులను, కార్యకర్తలను పోలీసులతో అడ్డుకోలేరన్నారు. భయపెడదామని అనుకుంటే కుదరదన్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరని చెప్పారు. ● మాజీ ఎంపీ నందిగం సురేశ్ మాట్లాడుతూ పోలీసులను అడ్డుపెట్టుకోవడంతోనే కూటమి పతనం మొదలైందని... కేసులకు భయపడేది లేదన్నారు. ● నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రమంతా మార్పు మొదలైందన్నారు. మట్టి ట్రాక్టరను అడ్డుపెట్టి అభిమానాన్ని ఆపాలని చూసినప్పుడే వారు భయపడుతున్నారని అర్థం చేసుకోవాలన్నారు. ● పార్టీ నేత గౌతం రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అరాచకాలు ప్రజలు తెలుసని.. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. పచ్చ పార్టీ అబద్ధపు హామీలు ఇవ్వడమే కానీ ఎప్పుడూ అమలు చేసిన దాఖలాలు లేవని నూతన సమన్వయకర్త డాక్టర్ అశోక్కుమార్ అన్నారు. ఇక్కడ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఏం చేశాడని ప్రశ్నించారు. తాను లీడర్గా రాలేదని.. ప్రజా సేవకునిగా వచ్చానని చెప్పారు. ఇక్కడ అందరికీ విద్య, వైద్యం, ఉపాధి కల్పన, మహిళా సాధికారత సాధించేలా పనిచేస్తానన్నారు. తొలుత శింగకొండలో ప్రత్యేక పూజలు చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి ప్రసాదరెడ్డి, పలు విభాగాల నేతలు చల్లా రామయ్య, గునుపూడి రఘురామగుప్తా, ఈదా శ్రీనివాసరెడ్డి, కాకాని రాధాకృష్ణమూర్తి, జడ విజయ్ కుమార్, కేవీ ప్రసాద్, దేవినేని కృష్ణబాబు, జి.జగన్మోహన్రెడ్డి, రావూరి శ్రీనివాసరావు, పాలపర్తి శ్రీధర్, వూట్ల నాగేశ్వరరావు, మురహరి యాదవ్, చందోలు రాజకుమార్, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైద్యుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి
చీరాల రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని వైఎస్సార్ సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఇస్తర్ల బాబురావు పేర్కొన్నారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీహెచ్సీల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు గత కొద్దిరోజులుగా విధులు బహిష్కరించి నిరసన తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో క్లినికల్ విభాగంలో 30 శాతం, నాన్ క్లినికల్లో 50 శాతం చొప్పున గత ప్రభుత్వంలో ఇన్ సర్వీస్ కోటా ఉండేదని గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ కోటాను చంద్రబాబు ప్రభుత్వం రాగానే క్లినికల్ కోర్సుల్లో 15 శాతం, నాన్ క్లినికల్ విభాగంలో 30 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. దీంతో వైద్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం ఇన్ సర్వీసు కోటాను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న వైద్యులకు అలవెన్సులు, పదోన్నతులు కల్పించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు విష జ్వరాలతో అల్లాడిపోతున్నారని గుర్తుచేశారు. పీహెచ్సీల్లో వైద్యులు ఎమర్జెన్సీ వైద్య సేవలు నిలిపివేయడంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేక పేదలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఇస్తర్ల బాబురావు -
అన్నపూర్ణ కాంప్లెక్స్ ఖాళీ చేయాల్సిందే..!
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న నగరపాలక సంస్థకు చెందిన డాక్టర్ కొల్లి శారదా మార్కెట్లోని షాపుల లీజు గడువు పూర్తికావడంతో ఆగస్టు 18, 19, 20వ తేదీల్లో బహిరంగ వేలం నిర్వహించారు. ఒక్కో షాపును రూ.లక్షల్లో పాడుకుని దక్కించుకున్నారు. పాత లీజుదారులు పొన్నూరు రోడ్డు(బైపాస్) వద్ద ఉన్న అన్నపూర్ణ కాంప్లెక్స్లో షాపులు నిర్వహించుకుంటున్నారు. దీంతో మార్కెట్కు వచ్చే రైతులంతా అన్నపూర్ణ కాంప్లెక్స్కు వెళ్లడంతో మార్కెట్లో వ్యాపార లావాదేవీలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఈ నెల 10లోగా ఖాళీ చేయాలని ఆదేశాలు.. మార్కెట్లో ఉన్న 81 షాపులకు బహిరంగ వేలం పాట నిర్వహించగా కార్పొరేషన్కు రూ.ఆరు కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. 81 షాపుల్లో 41 షాపులకు సంబంధించి కొత్తగా పాడుకున్న లీజుదారులు కార్పొరేషన్కు నాన్ రిఫండబుల్ గుడ్విల్ చెల్లించారు. ఈ క్రమంలో పాత లీజుదారులు కార్పొరేషన్ అధికారులు తమను అన్యాయంగా ఖాళీ చేయిస్తున్నారని హైకోర్టుకు వెళ్లడంతో కొత్త లీజుదారులు దక్కించుకున్న రేటుతో షాపులను రెండు నెలల పాటు నిర్వహించుకోవాలని ఆదేశించింది. దాని ప్రకారం అధికారులు పాత లీజుదారులకు తెలియజేసినప్పటికీ వారు దానికి కూడా అంగీకరించకుండా అన్నపూర్ణ కాంప్లెక్స్ వద్దే వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై కొత్త లీజుదారులు ప్రైవేట్గా మార్కెట్ను నిర్వహించకూడదని, ఇతర తగిన ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించగా కోర్టు పాత లీజుదారులకు షాక్ ఇస్తూ అన్నపూర్ణ కాంప్లెక్స్ను ఈ నెల 10వ తేదీలోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. దీంతో పాత లీజుదారులు డైలామాలో పడ్డారు. హైకోర్టు ఉత్తర్వులు ఫాలో అవుతారో లేదో..! అన్నపూర్ణ కాంప్లెక్స్ ఖాళీ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయి. వీరిని ఖాళీ చేయించేందుకు అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాత లీజుదారులకు ఎమ్మెల్యే సపోర్ట్, కొత్త లీజుదారులకు మంత్రి సపోర్ట్ ఉందని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం కావడంతో.. ఎవరికి సపోర్ట్గా వ్యవహరిస్తే రాజకీయంగా ఎటువంటి సమస్యలు వస్తాయో అని అధికారులు సందిగ్గంలో ఉన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు అన్నపూర్ణ కాంప్లెక్స్లో వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారులకు నోటీసులు జారీ చేస్తున్నాం. ఈ నెల 10వ తేదీలోగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తాం. – డి.శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్–1 -
చేనేత పరిశ్రమను సర్వ నాశనం చేసిన ప్రభుత్వం
సత్తెనపల్లి: చేనేతపై జీఎస్టీ వేసి పరిశ్రమను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టా శివ దుర్గారావు విమర్శించారు. సంఘం 11వ రాష్ట్ర మహాసభలు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఈ నెల 6, 7 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో సభా ప్రాంగణం, వసతి ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. మహాసభల ప్రాంగణం ఆర్చీ వద్ద కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివదుర్గారావు మాట్లాడుతూ మహాసభల్లో చేనేత రంగం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై చర్చిస్తామని తెలిపారు. చేనేత రంగాన్ని పరిరక్షించేందుకు తీసుకోవలసిన చర్యలు, కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. మహాసభల ప్రారంభం రోజు 6వ తేదీన సత్తెనపల్లి పట్టణంలో చేనేత కార్మికుల భారీ ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర నలు మూలల నుంచి ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. వసతి ఏర్పాట్లు, మహాసభ జరిగే ప్రాంగణం, ఆర్చీ అన్ని ఇప్పటికే పూర్తయ్యాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి అనుముల వీరబ్రహ్మం, కమిటీ సభ్యులు పి. ప్రభాకర్, జి. సుసులోవ్, మల్లాల గురవయ్య, బిట్రా పానకాలు, జి. ఏసురత్నం, ఆవాజ్ సంఘం నాయకులు షేక్ మస్తాన్వలి పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి
మేదరమెట్ల: బైక్ను కారు ఢీకొని భార్యాభర్తలు మృతి చెందిన ఘటన కొరిశపాడు మండల పరిధిలోని వెంకటాపురం క్రాస్రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. జె.పంగులూరు మండలం అలవలపాడు గ్రామానికి చెందిన కొత్తూరు వెంకటసుబ్బారావు(55), భార్య లక్ష్మి(50)తో మోటారు బైకుపై ఒంగోలు వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తున్నాడు. వెంకటాపురం క్రాస్ వద్దకు రాగానే బైక్ను అలవలపాడు రోడ్డులోకి వెళ్లేందుకు మలుపు తిప్పుతుండగా ఇదే సమయంలో నెల్లూరు నుంచి ఏలూరు వెళ్తున్న కారు బైక్ను ఢీ కొంది. దీంతో బైక్పై ఉన్న భార్యాభర్త రోడ్డుపై పడిపోయారు. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్న మేదరమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను సేకరించారు. అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ మహ్మద్ రఫీ కేసు నమోదు చేశారు. ఇద్దరు యువకులు దుర్మరణం జరుగుమల్లి(సింగరాయకొండ): దసరా పండగ పూట రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. రోడ్డు మార్జిన్లో ఆగి ఉన్న టిప్పర్ను ప్రమాదవశాత్తు మోటారు సైకిల్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో మండల కేంద్రమైన జరుగుమల్లిలో పాల కేంద్రం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. జరుగుమల్లి మండలం చింతలపాలెం గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన కట్టా ప్రవీణ్(21), చీరాల మండలం వాడరేవు గ్రామానికి చెందిన శ్రీరాములు రాజు(20) ఇద్దరూ కలిసి చింతలపాలెం నుంచి టంగుటూరుకు బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు మార్జిన్లో నిలిపి ఉంచిన టిప్పర్ వెనుక భాగాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి.మహేంద్ర తెలిపారు. -
నూజిళ్లపల్లిలో పండుగ కళ కరవు
జె.పంగులూరు: పండగ వేళ పూజలతో కళకళలాడాల్సిన ఇళ్లు బోసిపోయాయి. మేళతాళాలతో మారుమోగాల్సిన వీధులన్నీ పోలీసుల బూటు చప్పుళ్లతో ధ్వనించాయి. దసరా పర్వదినం రోజైన గురువారం నూజిళ్లపల్లి గ్రామంలో నెలకొన్న పరిస్థితి. వివరాలు.. గ్రామంలో రాజరాజేశ్వరిస్వామి వారి దేవాలయం ఉంది. గతంలో విజయదశమి రోజున గ్రామంలో స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను ఎంతో వైభవంగా ఊరేగించి పండగ జరుపుకునే వారు. ఇది పూజార్లు, ధర్మకర్తలు దగ్గర ఉండి నడిపించేవారు. ఇది పదేళ్ల ముందుమాట. కానీ 2017 నుంచి గ్రామంలో ఆ పరిస్థితులు లేవు. పండగ రోజు కూడా దేవాలయంలో పూజలు, ఊరేగింపులు లేవు. పూజారులంటే ధర్మకర్తలకు పడదు, ధర్మకర్తలు అంటే పూజారులకు పడదు. ఈనేపథ్యంలో గురువారం దేవాలయంలో పూజలు, ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహణపై వివాదం నెలకొంది. వివాదానికి స్వస్తి పలికి గ్రామంలో ప్రశాంతంగా పండగ నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చీరాల డీఎస్పీ మహమ్మద్ మొయిన్, చీరాల ఆర్డీవో చంద్రశేఖర్నాయుడు, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సూర్యప్రకాష్రావు, తహసీల్దార్ పి.సింగారావు, పంగులూరు గ్రూపు దేవదాయ శాఖ కార్యనిర్వహణాధికారి ఉపలమర్తి శ్రీనివాసరావు పలుమార్లు పూజారులు, ధర్మకర్తలతో మాట్లాడారు. గురువారం రాత్రి వరకు వివాదం సర్దుమణిగే విధంగా చేయాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దేవాలయంలో ఉత్సవ విగ్రహాలు బయటకు తీయాలంటే ధర్మకర్తలే తీయాలని, పూజారుల పూజకు కూడా ధర్మకర్తలు ఒప్పుకోలేదు. సమస్య పరిష్కారమయ్యే వరకు తాము అంగీకరించబోమని ధర్మకర్తలు దేవాలయం గడప వద్ద కూర్చున్నారు. ధర్మకర్తలు ఆలయంలో ఉత్సవ విగ్రహాలు బయటకు తీస్తేనే పూజ చేస్తామని పూజారులు భీష్మించుకొని కూర్చున్నారు. పలుమార్లు అధికారులు ఇరువురితో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. అధికారులు రాత్రి 9 గంటల తర్వాత దేవాలయానికి తాళాలు వేయించి వెనుతిరిగి వెళ్లిపోయారు. భారీ పోలీసు బందోబస్తు దసరా పండుగ వేళ గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఒక డీఎస్పీ, నలుగురు సీఐలు, ఎనిమిది మంది ఎస్సైలు, 130 మంది పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, దేవదాయ శాఖ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా గ్రామంలోని ప్రజల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రజలు ఎవరూ ఇల్లు వదిలి బయటకు రాలేదు. వివాదానికి కారణం భూములు? దేవాలయానికి 31 ఎకరాల భూమి ఉంది. వాటిలో పూజారులకు 21 ఎకరాలు, ధర్మకర్తలకు మూడు ఎకరాలు, స్వస్తి వాచకులకు నాలుగు ఎకరాలుగా ఉండేదని సమాచారం. అయితే 31 ఎకరాలు పూజారులే అనుభవిస్తున్నారనేది వివాదానికి ప్రధాన కారణం. వివాదాలతో దేవాలయంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు నిలిచిపోయాయి. గ్రామస్తుల్లో కొంత మంది పూజారుల వైపు, మరికొంత మంది ధర్మకర్తల వైపు ఉండిపోయారు. రాజకీయరంగు పూసుకుంది. -
సమాజానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులు
బాపట్ల: సమాజానికి మార్గదర్శకులుగా ఉపాధ్యాయులు ఉండాలని జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక బాపట్ల ఫార్మసీ కాలేజీలో డీఎస్సీ 2025 లో ఎంపికై న ఉపాధ్యాయులకు ఎనిమిది రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే రెండు తరాల పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయలుగా ప్రయాణం ప్రారంభించి న మీరు ముందు శిక్షణ తీసుకొని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని చెప్పారు. తాను చిన్నప్పుడు చదువుకున్న ఉపాధ్యాయులను ఇప్పటికే నేను మర్చిపోలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పిల్లలు గురువు స్థానాన్ని ఎన్నటికీ మర్చిపోలేరని ఆయన చెప్పారు. నూతనంగా ఎంపికై న ఉపాధ్యాయులు మిమ్ములను తీర్చిదిద్దుకుని పవిత్రంగా ఉద్యోగం చేయాలని అని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని కోరారు. బాపట్ల జిల్లాకు డీఎస్సీ ద్వారా 485 మంది ఉపాధ్యాయులు ఎంపిక కాబడ్డారని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, సార్వ శిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ నాగిరెడ్డి పాల్గొన్నారు. ఎయిడ్స్వ్యాధిపై విస్తృత ప్రచారం చేపట్టాలి బాపట్ల: జిల్లాలో ఎయిడ్స్ వ్యాధిపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో ఆరోగ్య ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలందరికీ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరమైన వైద్య పరీక్షలు చేయించుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విజయమ్మ పాల్గొన్నారు. క్యారవాన్ బస్సుతో ప్రత్యేక అనుభూతి బాపట్ల: జిల్లాకు వచ్చే పర్యాటకులు అద్భుతమైన అనుభూతి పొందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో క్యారవాన్ బస్సును పరిశీ లించారు. పర్యాటక అభివృద్ధి దిశగా క్యారవాన్ టూరిజం రాబోయే రోజుల్లో నూతన వరవడిని చూపుతుందని అన్నారు. జిల్లాలో క్యారవాన్ టూరిజం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. క్యారవాన్ బస్ సౌకర్యాలను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. క్యారవాన్ వాహనాన్ని సూర్యులంక బీచ్లో పర్యాటకుల సందర్శన కోసం శని, ఆదివారాలలో ఉంచుతామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి నాగిరెడ్డి, టూరిజం శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ -
టీడీపీలో రెండు వర్గాల ఘర్షణ
కొల్లూరు: తెలుగు తమ్ముళ్ల రెచ్చిపోయారు. టీడీపీ అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే సాక్షిగా తన్నులాటకు దారితీసింది. కొల్లూరులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. టీడీపీ మండలాధ్యక్షుడు మైనేని మురళీ, మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన్ ప్రసాద్ వర్గాల నడుమ మాటల యుద్ధం జరిగింది. కొల్లూరు ఎంప్లాయీస్ రిక్రియేషన్ హోమ్లో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీకి వచ్చారు. ఆ సమయంలో మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన్ ప్రసాద్ను లక్ష్యంగా చేసుకొని అనంతవరానికి చెందిన నాయకుడు అనుచరులు అవాకులు, చవాకులకు దిగారు. కనగాల వర్గం నాయకులు స్థానిక బస్టాండ్ సెంటర్లో ప్రభుత్వ కార్యక్రమం జీఎస్టీ సమావేశం వద్దకు వెళ్లారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సాక్షిగా జీఎస్టీ సమావేశం ప్రారంభభమవుతున్న సమయంలో ఇరువర్గాల నడుమ మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. ఒక వర్గంపై మరో వర్గం బాహాబాహీకి దిగి పిడి గుద్దులు, చేతి కందిన కుర్చీలు, హెల్మెట్లతో పరస్పరం దాడులకు దిగారు. సర్దుబాటు చేసేందుకు ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. టీడీపీ వర్గాల నడుమ దాడులను సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్న విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే, కొట్లాట విషయం పక్కన పెట్టి వీడియోలు తీయడం ఆపించాలని పోలీసులకు హుకుం జారీ చేయడంతో వారు మీడియా ప్రతినిధుల నుంచి ఫోన్లు లాక్కొని వీడియోలను డిలీట్ చేశారు. తెలుగు తమ్ముళ్ల తన్నులాటలో టీడీపీ మండల అధ్యక్షుడు మైనేని మురళీకృష్ణ కింద పడిపోవడంతో ఎమ్మెల్యే ఆనందబాబు పరిస్థితిని అదుపు చేసేందుకు విశ్వప్రయత్నం చేయాల్సి వచ్చింది. పలువురికి గాయాలు టీడీపీ వర్గీయుల కొట్లాటను తాత్కాలికంగా సద్దుమణిచి రెండు ముక్కలలో జీఎస్టీ సమావేశాన్ని ముగించిన ఎమ్మెల్యే ఆనందబాబు అక్కడ నుంచి జారుకున్నారు. అనంతరం తిరిగి మళ్లీ ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. అనంతవరానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు కనగాల మధుసూదన్ ప్రసాద్ను దూషిస్తున్నాడన్న కారణంతో ఆయన అనుచరులు అతడిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం కనగాల మధుసూదన్ ప్రసాద్ వర్గానికి చెందిన ఓ యువకుడు ఒంటరిగా ఓ మెడికల్ షాప్ వద్ద ఉండటాన్ని గమనించిన మైనేని మురళీకృష్ణ వర్గీయులు అతడిపై దాడికి పాల్పడ్డారు. దీనికి ప్రతిగా కనగాల మధుసూదన్ ప్రసాద్ వర్గీయులు మైనేని వర్గీయులపై దాడులకు దిగడంతో పలువురు గాయల పాలయ్యారు. వీరి మధ్య కొట్లాట నెలకొన్న పరిస్థితుల్లో వారిని అదుపు చేసేందుకు వెళ్లిన ఓ పోలీసుకి దెబ్బల బారిన పడ్డాడు. పరిస్థితిని అదుపు చేసేందుకు వేమూరు సీఐ పీవీ ఆంజనేయులు, కొల్లూరు ఎస్ఐ జానకీ అమరవర్ధన్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. -
ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఇస్సాక్
బాపట్ల: ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా జి.ఇస్సాక్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ జిల్లా ఎన్నికలను ఎన్నికల అధికారిగా సిహెచ్.శేషుబాబు వ్యవహరించారు. ఎన్నికల్లో జి.ఇస్సాక్, డి.రాజేష్ తరఫున 18 మంది నామినేషన్లు వేశారు. వీరిలో జి.ఇస్సాక్కు సంబంధించిన ప్యానల్ను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. సహాయ ఎన్నికల అధికారులుగా కె.సాంబశివరావు, కె. కిరణ్ కుమార్, ముఖ్య అతిథులుగా బాపట్ల జిల్లా చైర్మన్ పి.నాగేశ్వరరావు, కన్వీనర్ బి.ప్రసాద్రావు హాజరై కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా అధ్యక్షుడు ఏకగ్రీవం జిల్లా ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులుగా జి.ఇస్సాక్, గౌరవ అధ్యక్షులు యు.నరసింహారావు, ఉపాధ్యక్షులుగా పి.సంధ్యారాణి, ఎ.జాషువా, షేక్.ఎం.సుభానీ, పి.అన్వేషన్, వై.శ్రీనివాసరావు, కార్యదర్శులుగా బి.రాజేష్, జాయింట్ సెక్రటరీలుగా చంద్రకాంత్, నాగూర్షరీఫ్, ఎం.శ్రీనివాసరావు, పి.వి.నవీన్, శ్యామ్యూల్రాజ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.శేషగిరిరావు, జాయింట్సెక్రటరీ వై.సృజనకుమారి, ట్రెజరర్ ఖాదర్బాషా, కో ఆప్షన్ సభ్యులు కె.పవన్వెంకట కుమార్, రత్నశేఖర్లను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. -
బరి తెగించిన టీడీపీ నేతలు
నగరం: టీడీపీ నాయకులు బరి తెగించారు. మండలంలోని చల్లమ్మఅగ్రహరం మామిడి తోటల్లో గురువారం జోరుగా కోడి పందేలు వేశారు. వేకువజాము నుంచే కోడిపందేలు వేయడంతో భారీ సంఖ్యలో జనసందోహం హాజరయ్యారు. నిర్వాహకులు పందేలు చేసేందుకు వచ్చిన వారి నుంచి రూ.200 వసూలు చేసినట్లు సమాచారం. ఉదయం ఆరు నుంచి 10 గంటల వరకు జోరుగా కోడిపందేలు నిర్వహించారు. లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగరం పోలీసులు ఉదయం 10.30 గంటల సమయంలో కోడిపందేల బరి వద్దకు వెళ్లారు. నిర్వాహకులను వదిలి చూసేందుకు వచ్చి వారిపై కేసులు నమోదు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోడిపందేల శిబిరంపై దాడులు చేసి 14 మంది జూదరులు, మూడు కోడి పుంజులు, ఏడు ద్విచక్రవాహనాలతోపాటు రూ.8760 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ భార్గవ్ తెలిపారు. -
స్థానిక సంస్థల అధికారాలు నిర్వీర్యం
చీరాల రూరల్: స్థానిక సంస్థల అధికారాలను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ పేర్కొన్నారు. స్థానిక బీఆర్ అంబేడ్కర్ భవన్లో గ్రామ స్వరాజ్యం, స్థానిక సంస్థలు, నిధులు, విధులు, అధికారాలు అంశాలపై గురువారం రాత్రి సమావేశం నిర్వహించారు. కొత్తపేట మాజీ సర్పంచి చుండూరి వాసు అధ్యక్షత వహించారు. విజయకుమార్ మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం పల్లెల్లో మచ్చుకై నా కనిపించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మండల వ్యవస్థ రాక ముందు పంచాయతీలు, సమితులు, జిల్లా పరిషత్లకు చెప్పుకోదగిన అధికారాలు ఉండేవని చెప్పారు. ప్రస్తుతం పంచాయతీరాజ్ వ్యవస్థ కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ఎంతో వెనుకబడి ఉందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన గిరిజనులు, ఎస్సీలకు చెందిన సర్పంచి పదవులను అగ్రవర్ణాలకు చెందినవారు దర్జాగా అనుభవిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నాయని మండిపడ్డారు. నక్సలైట్ల ఏరివేత పేరుతో కగార్ ఆపరేషన్ చేపట్టి అడవుల్లో బతుకుతున్న గిరి పుత్రులను వెళ్లగొట్టి ఆయా భూములను బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రం యత్నిస్తోందని చెప్పారు. రామాయపట్నం వద్ద పోర్టు పరిసరాల్లోని పేదల భూములను పెత్తందారులు కారుచౌకగా కొట్టేశారని చెప్పారు. బడుగు, బలహీనవర్గాలకు చెందిన ప్రజలు పార్టీల పేరుతో విడిపోయినంతకాలం అగ్రవర్ణాలవారు ఆధిపత్యాన్ని చెలాయిస్తునే ఉంటారని అభిప్రాయపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇచ్చిన ఓటు హక్కుతో బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఐకమత్యంలో మనఓట్లు మనం వేసుకుంటూ రాజ్యాధికారం సాధించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సభ కన్వీనర్ చుండూరి వాసు, మాచర్ల మోహనరావు, నల్లబోతుల మోహన్కుమార్ ధర్మా, గోసాల ఆశీర్వాదం, మాచవరపు జూలియన్, గవిని శ్రీనివాసరావు, ఊటుకూరి వెంకటేశ్వర్లు, దామర్ల శ్రీకృష్ణ, శీలం రవి, జ్యోతి రమేష్, బత్తుల శామ్యూల్, మల్లెల బుల్లిబాబు, రిటైర్డు ఏసీపీ కట్ట రాజ్వినయ్కుమార్ పాల్గొన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ -
ముంపు ప్రాంతాలలో డాక్టర్ గణేష్ పర్యటన
రేపల్లె: వరద ముంపు ప్రాంతాలలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుండాలని వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ కోరారు. కృష్ణానది వరద ముంపు గ్రామాలను బుధవారం ఆయన సందర్శించారు. లంకెవానిదిబ్బ, పెనుమూడి గ్రామాలలోని పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న వారితో ఆయన మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ పట్టణ, రూరల్, చెరుకుపల్లి కన్వీనర్లు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్, డుండి వెంకట రామిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చిమటా బాలాజీ, నాయకులు ఉమాదేవి, చౌటు రమేష్, శొంఠి సురేష్, నాగేశ్వరరావు, సుబ్బారావు, నాగబాబు, వీరనారాయణ, గోపి, తోట శివ, ఖాదర్, ఖాదర్వలి, అబ్దుల్ ఖుద్దూష్ తదితరులున్నారు. -
గ్రానైట్ లారీల రాకపోకలపై ఆగ్రహం
బల్లికురవ: రహదారి సక్రమంగా లేనందున అభివృద్ధి పరిచే వరకు గ్రానైట్ లారీల రాకపోకలను నిషేధిస్తున్నట్లు బుధవారం సాయంత్రం నక్కబొక్కలపాడు గ్రామస్తులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. బల్లికురవ–మార్టూరు ఆర్అండ్బీ రోడ్డు బల్లికురవ, నక్కబొక్కలపాడు, నాగరాజుపల్లి గ్రామాల మధ్య 6 కిలోమీటర్ల మేర గొతులతో అధ్వాన స్థితికి చేరింది. ఈ గోతుల్లో గ్రానైట్ లారీలు కూరుకుని రోజూ గంటల తరబడి ట్రాఫిక్ జాం అవుతోంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు నక్కబొక్కలపాడు, పల్లె సమీపంలో గ్రానైట్ లారీ రోడ్డుపై కూరుకుని గంటన్నరపాటు ట్రాఫిక్ జాంతో వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. గోతులు, దుమ్ము ప్రభావంతో అనారోగ్యం బారిన పడుతున్నా అధికారులు, పాలకులు పట్టించకోవటం లేదని గ్రామస్తులు వాపోయారు. రోడ్డు పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచే వరకు గ్రానైట్ లారీల రాకపోకలను నిషేధిస్తున్నట్లు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యతాలోపాలు నాదెండ్ల: సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యతాలోపాలు నిజమని తేలటంతో సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. 2017–18లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు రూ.40 లక్షల పంచాయతీరాజ్ నిధులతో సిమెంటు రోడ్డు నిర్మించారు. పనులు నాసిరకంగా ఉన్నాయంటూ 2020లో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశాడు. విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాణాలు పాటించలేదని నిర్ధారించారు. అప్పటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా వ్యవహరించిన కేశవరావుకు చార్జ్మెమో జారీ చేశారు. కాంట్రాక్టర్కు చెల్లించిన బిల్లులో కోత విధించారు. 2024లో కేశవరావు ఉద్యోగ విరమణ చేశారు. తాజాగా కేశవరావుపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన పింఛను నుంచి మూడేళ్లపాటు 15 శాతం చొప్పున జరిమానాగా కోత విధించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
కన్నీటిలోనే లంకలు
కొల్లూరు: కృష్ణమ్మ ప్రకోపానికి లంక గ్రామాలు విలవిలలాడుతున్నాయి. మూడు రోజులుగా లంక గ్రామాలను వరద తాకిడి వీడకపోవడంతో జలదిగ్బంధంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. స్థానికుల అత్యవసర సేవల కోసం మూడు ప్రాంతాలలో అధికారులు పడవలను ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం ప్రకాశం బ్యారేజ్ నుంచి 6,53,828 క్యూసెక్కుల నీటిని దిగువకు విడదల చేయగా, సాయంత్రానికి వరద ప్రవాహం తగ్గింది. 5,93,370 క్యూసెక్కుల వద్ద కొనసాగుతోంది. వరద ఉద్ధృతి కొనసాగుతున్న కారణంగా మూడు రోజుల నుంచి వాణిజ్య పంటలు వరద ముంపులో ఉండటంతో ఎందుకూ పనికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. వేలాది ఎకరాలలో ఉద్యాన పంటలను కృష్ణమ్మ ముంచెత్తడంతో రూ. వేల కోట్లలో రైతులు పంట నష్టానికి గురికానున్నారు. ప్రాథమిక అంచనా ఇదీ.. వరదల కారణంగా వాణిజ్య పంటలతో పాటు ఇతర పంటలు 7,450 ఎకరాలలో నష్టపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనాలకు వచ్చారు. కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలోని పసుపు, కంద, తమలపాకు, అరటి, జామ, మినుము, కూరగాయలు, పూలు, ఇతర పంటలు 2,980 హెక్టార్లలో ముంపునకు గురైనట్లు ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రూ. వేల కోట్లు పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్న వాణిజ్య పంటలు ముంపు బారిన పడటంతో రైతాంగం కోలుకోలేని నష్టానికి గురయ్యారు. చిలుమూరులంక, సుగ్గునలంక, ఈపూరులంక, చింతర్లంక, పెదలంక, పెసర్లంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక, పోతార్లంక, తోకలవారిపాలెం, తురకపాలెం, కిష్కిందపాలెం, దోనేపూడి, కొల్లూరు, ఈపూరు, శివరామపురం గ్రామాల పరిధిలోని వాణిజ్య పంటలు ముంపులో చిక్కుకున్నాయి. -
ఫోన్పేలో రూ. 5 లక్షల వరకు విద్యుత్ బిల్లు చెల్లింపు
ప్రత్తిపాడు: విద్యుత్ వినియోగదారులు రూ. 5 లక్షల వరకు ఫోన్పేలో తమ విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చని గుంటూరు రూరల్ విద్యుత్ శాఖ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ బి.చంద్రశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో బిల్లులు ఆన్లైన్లో చెల్లించడం, బ్యాంక్లో చెక్కులు డిపాజిట్ చేయడంతో ఒకటి రెండు రోజులు ఆలస్యమయ్యేవని గుర్తుచేశారు. తద్వారా వినియోగదారుకు సర్చార్జీలు పడేవని తెలిపారు. సర్ఛార్జీలను బిల్లు ఇచ్చిన పదిహేను రోజుల్లోపు చెల్లిస్తే తరువాతి బిల్లులో రూ.150 వరకు కేటగిరీ–2 వినియోగదారులకు లాభం చేకూరుతుందన్నారు. ఇక నుంచి వినియోగదారులు ఫోన్పే ద్వారా ఇన్టైంలో విద్యుత్ బిల్లులను రూ.లక్ష నుంచి రూ. ఐదు లక్షల వరకు చెల్లించవచ్చన్నారు. తద్వారా వినియోగదారులకు సమయం వృథా కాకుండా ఉంటుందన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రశేఖర్ పేర్కొన్నారు. జీజీహెచ్లో వృద్ధులకు ప్రత్యేక వార్డు గుంటూరు మెడికల్: ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవంలో భాగంగా బుధవారం గుంటూరు జీజీహెచ్లో వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డును జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ప్రారంభించారు. ఆసుపత్రిలోని కుటుంబ నియంత్రణ విభాగంలో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు 15 పడకలతో బేరియాట్రిక్ వార్డును ఏర్పాటు చేశారు. డెంటల్ విభాగంలో రూ.1.20 లక్షలతో ఏర్పాటు చేసిన రేడియో విజియోగ్రఫీ ఎక్స్రే యూనిట్ను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశసస్వి రమణ ఆసుపత్రిలో చేపట్టిన అభివృద్ధి పనులను, వార్డుల్లో అందిస్తున్న వైద్య సేవలను వివరించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు నగరంపాలెం (గుంటూరు వెస్ట్): కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తోందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్రెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా జైలులో ఉన్న సోషల్ మీడియా కార్యకర్త వజ్రాల తారక ప్రతాప్రెడ్డిని బుధవారం ములాఖత్ ద్వారా ఆయన కలసి భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియా యాక్టివిస్టులపై అడ్డగోలుగా కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. ఎటువంటి పోస్ట్లు చేయకపోయినా పార్టీలో చురుగ్గా ఉన్న వారిపై కూడా పోలీసులతో అక్రమ కేసులు నమోదు చేయించి, రాష్ట్రవ్యాప్తంగా అనేక మందిని జైళ్లకు పంపారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదుకు స్వస్తి చెప్పాలని హితవు పలికారు. కార్యక్రమంలో పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంకా జల దిగ్బంధంలోనే..
వరద తీవ్రత కాసత్త తగ్గినప్పటికీ లంక గ్రామాలను చుట్టుముట్టిన నీరు తొలగలేదు. మండలంలోని సుగ్గునలంక, దోనేపూడి చప్టాల పైనుంచి, ఆవులవారిపాలెం – గాజుల్లంక, పోతార్లంక – గాజుల్లంక, భట్టిప్రోలు మండలం వెల్లటూరు కరకట్ట దిగువున రోడ్లపై నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. లంక గ్రామాలు మూడు రోజులుగా చుట్టుముట్టిన వరద నీటి మధ్యనే చిక్కుకొని ఉన్నాయి. సుగ్గునలంక, దోనేపూడి, భట్టిప్రోలు మండలం వెల్లటూరు వద్ద అందుబాటులో ఉంచిన పడవలను అత్యవసర పనుల కోసం ప్రజలు వినియోగించుకుంటూ రాకపోకలు సాగిస్తున్నారు. మండంలోని పోతార్లంక, తిప్పలకట్ట, తోకలవారిపాలెం, తురకపాలెం, కిష్కిందపాలెం, తడికలపూడి, గుంటూరుగూడెం, మధ్యగూడెం, జువ్వలపాలెం, శివరామపురం, రావిలంక, గాజుల్లంక వరదలో చిక్కుకున్నాయి. -
వైభవంగా చండీకల్యాణం
అమరావతి: ప్రముఖ శైవక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీబాల చాముండిక సమేత అమరేశ్వరస్వామి దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి చండీకల్యాణం వైభవంగా నిర్వహించారు. తొలుత అమ్మవారికి, స్వామివారికి ఎదుర్కోల మహోత్సవం జరిగింది. ఆలయంలోని వెంకటాద్రినాయుని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారిని ఉంచి ఆలయ అర్చకులు కౌశిక చంద్రశేఖరశర్మ యాజ్ఞీక పర్యవేక్షణలో అర్చకులు విఘ్నేశ్వర పూజ, రక్షాబంధనం,పుణ్యహవాచనం, కన్యాదానం, శాస్త్రోక్తంగా కల్యాణ క్రతువు నిర్వహించారు. ఏటా రెండుసార్లు అనగా మహాశివరాత్రి, దసరాకు కల్యాణం నిర్వహించటం సంప్రదాయమని అర్చకులు పేర్కొన్నారు. -
నేటి అలంకారం
దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ శ్రీరాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. చెరకుగడను వామహస్తంతో ధరించి, దక్షిణ హస్తంతో అభయాన్ని ప్రసాదిస్తూ, శ్రీషోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా వెలుగొందే శ్రీ రాజరాజేశ్వరీదేవిని దర్శించి, అర్చించడం వలన సర్వ శుభాలు కలుగుతాయి. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందింప చేసే అపరాజితా దేవిగా, చల్లనితల్లిగా శ్రీ కనకదుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరీదేవి అలం కారంలో దర్శనం ఇస్తుంది. అమ్మను సేవించి జీవితాన్ని ధన్యం చేసుకుందాం. సకల శుభాలు, విజయాలు శ్రీ అమ్మవారి దివ్య దర్శనం ద్వారానే మనకు లభిస్తాయి. -
మహిషాసురమర్దిని
జయ జయ హే మహిషాసుర మర్దిని అలంకారంలో హారతులందుకుంటున్న దుర్గమ్మఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ శ్రీమహిషాసురమర్దినీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. మహిషాసురమర్దినీదేవి అలంకారం నేపథ్యంలో ఆర్జిత సేవల్లోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. మహా మండపం ఆరో అంతస్తులో నిర్వహించిన ప్రత్యేక ఖడ్గమాలార్చన, ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక చండీయాగంతో పాటు శ్రీచక్రనవార్చనలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు అన్ని క్యూలైన్లు భక్తులతో రద్దీగా కనిపించాయి. బుధవారం ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు, యాత్రికులే క్యూలైన్లో అధికంగా కనిపించారు. పెరిగిన భవానీలు.. అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు, భవానీలు తెల్లవారుజామున ఆలయం తెరవడంతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరో వైపున ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భవానీలు పాదయాత్రగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి కొండపైకి చేరుకున్నారు. రద్దీ నేపథ్యంలో అన్ని దర్శన టికెట్లు రద్దు చేస్తున్నట్లు దేవస్థానం ముందుగానే ప్రకటించడంతో రూ.100, రూ.300 టికెట్ క్యూలైన్లలోనూ భక్తులు విచ్చేసి ఆలయానికి చేరుకున్నారు. సీతమ్మవారి పాదాలు, పద్మావతి ఘాట్, పున్నమి, భవానీ ఘాట్లలో భవానీల తాకిడి కనిపించింది. భవానీల పుణ్యస్నానాలతో నదీతీరం, ఆలయ పరిసరాలు ఎరుపు వర్ణాన్ని సంతరించుకున్నాయి. అమ్మ వారిని దర్శించుకుని కొండ దిగువకు చేరుకున్న భవానీలు అన్న ప్రసాదం స్వీకరించి, లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేసి తిరిగి తమ స్వస్థలాలకు బయలుదేరారు. పాదయాత్రగా ఇంద్రకీలాద్రికి... రాజమండ్రి, అనకాపల్లి, రంపచోడవరం, విశాఖ పట్నంలోని మన్యం ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భవానీలు పాదయాత్ర చేసుకుంటూ ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయానికి చేరుకునేందుకు 5 రోజులు పట్టినట్లు వారు తెలిపారు. వర్షాలు, ఎండలు, చలికి సైతం తట్టుకుని అమ్మవారిపై భక్తితో ఏటా ఇలా పాదయాత్రగా వస్తుంటామని భవానీలు చెప్పారు. కొంతమంది భవానీల పాదాలకు బొబ్బలు రావడం, వాపులు కనిపించడంతో వారికి వీఐపీ క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలను సమర్పించారు. 11 గంటలకు పూర్ణాహుతి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గత నెల 22వ తేదీ నుంచి జరుగుతున్న శ్రీ దేవీ శర న్నవరాత్రి మహోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. గురువారం ఉదయం 11 గంటలకు ఇంద్రకీలాద్రిపై యాగశాలలో మహా పూర్ణాహుతితో దీక్షలు పరిసమాప్తం కానున్నాయి. ఆలయ వైదిక కమిటీ పర్యవేక్షణలో పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. పూల పల్లకీపై ఆది దంపతులు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లు పూలపల్లకీపై ఇంద్రగిరి పురవీధుల్లో విహరించారు. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాల వద్ద పూలతో అలంకరించిన పల్లకీపై శ్రీగంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడమ భక్తజనుల జయజయధ్వానాల మధ్య నగరోత్సవం సాగింది. ఆది దంపతుల నగరోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మహా మండపం, గోశాల, కనకదుర్గ నగర్, ఘాట్రోడ్డు మీదుగా నగరోత్సవం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. 10వ రోజు ఆదాయం రూ.62.16 లక్షలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలలో 10వ రోజైన బుధవారం దేవస్థానానికి రూ.62.16 లక్షల మేర ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రానికి 85 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 25,533 మందికి అన్నప్రసాదం పంపిణీ చేశామని, 11,468 మంది భక్తులు అమ్మవారికి తలనీలాలు సమర్పించినట్లు అధి కారులు తెలిపారు. ఇక సింగిల్ లడ్డూ విక్రయం ద్వారా రూ.1.92 లక్షలు, ఆరు లడ్డూల ప్యాక్లను విక్రయించడం ద్వారా రూ.54.70 లక్షలు, ఆర్జిత సేవలు, ఇతర సేవల ద్వారా రూ.5.54 లక్షల మేర ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. -
ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి
నరసరావుపేట టౌన్: న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించి వైద్య రంగంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పీహెచ్సీ వైద్యుల సంఘం అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ మమత ప్రియ అన్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు బుధవారం పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన దీక్షను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఇన్ సర్వీస్ వైద్యులకు పీజీ కోటా తగ్గించింటంతో వైద్యులు నైపుణ్యాన్ని పెంచుకొనే అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ జీఓ నెం. 99 ద్వారా పీజీ ప్రవేశాల్లో 20 శాతం ఉన్న కోటాను 15 శాతానికి తగ్గించటమే కాకుండా కేవలం ఏడు బ్రాంచ్లకే పరిమితం చేయటం అన్యాయమన్నారు. సంఘ నాయకులు డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ సుమారు 25 సంవత్సరాల నుంచి పదోన్నతులు లేక ఒకే హోదాలో సేవలందిస్తున్న వైద్యాధికారులకు న్యాయం చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు 50 శాతం మూలవేతనం గిరిజన భత్యంగా మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. మొదట దీక్ష శిబిరం వద్ద నుంచి పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. వైద్యులు హనుమకుమార్, రమ్య, జగన్నరసింహారెడ్డి, రాధా కృష్ణణ్, ప్రదీప్, బాల అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధులను ప్రతి ఒక్కరూ గౌరవించాలి
చీరాల రూరల్: వృద్ధులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) టి.చంద్రశేఖర నాయుడు అన్నారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్లో 23 మంది వృద్ధులను ఘనంగా సత్కరించారు. ఆర్డీఓ చంద్రశేఖర నాయుడు మాట్లాడుతూ మనకోసం– మన క్షేమం కోసం పెద్దలు వారిజీవితాలను పణంగా పెట్టి కొవ్వొత్తుల్లా కరిగిపోతారన్నారు. అటువంటి పెద్దలను మనం గౌరవించుకోవాలని, వారి సూచనలు సలహాలను పాటించి ముందుకెళ్లాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధుల సంక్షేమం కోసం అనేక చట్టాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. వృద్ధులను నిర్లక్ష్యం చేసిన 40 కేసులను ట్రిబ్యునల్ జడ్జిగా పరిష్కరించానని, వృద్ధులకు పోలీసు ప్రొటెక్షన్ కూడా ఇచ్చానని వివరించారు. వారిని సక్రమంగా చూడని పక్షంలో వీలునామా, గిఫ్ట్ డీడ్లు కూడా రద్దు చేసే అధికారం తన పరిధిలో ఉందని హెచ్చరించారు. ప్రతినిత్యం వృద్ధులు వాకింగ్, వ్యాయామం చేస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. అనంతరం వాకర్స్ సభ్యులు ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వాకింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణ, వలివేటి మురళీకృష్ణ, సీనియర్స్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి ఎ.నాగవీరభద్రాచారి, చింతా రమేష్, వీరాంజనేయులు, తిరుపతిరావు, ఎంఎస్. సుబ్బారావు, బదరీనాఽథ్, రమేష్, పూర్ణ, దరియాసాహెబ్, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓ టి.చంద్రశేఖర నాయుడు -
పచ్చనేత ఆక్రమణలపై భగ్గుమన్న కడలి పుత్రులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: చీరాల టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ఆక్రమించి పూడ్చివేసిన ఈపూరుపాలెం స్ట్రెయిట్కట్ కాలువను తక్షణం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ చీరాల, బాపట్ల నియోజకవర్గాల పరిధిలోని 12 వేల కుటుంబాలకు చెందిన సుమారు 20 వేలమంది మత్స్యకారులు బుధవారం బాపట్లలో కదం తొక్కారు. వివిధ రూపాల్లో ఆందోళన తెలియజేసారు. ఎల్.ఆకారంలో ఉన్న స్ట్రెయిట్ కట్ను సీమౌత్ వద్ద పూడ్చి వేయడం వల్ల మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లేందుకు వీలులేకుండా పోయింది. పోటు సమయంలో సముద్రపు నీరు వేగంగా కాలువలోకి వచ్చి అక్కడ ఉండే 2 వేల బోట్లలో చాలావరకు దెబ్బతింటున్నాయి. దీనివల్ల పేద మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దీనిపై గతంలో ఆందోళన చేసిన సమయంలో అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట మురళి హామీ ఇచ్చినా.. అది నెరవేరలేదని, తక్షణం ఆక్రమణలు తొలగించి కాలువను పునరుద్ధరించాలని వేలాది మంది గంగపుత్రులు ఉదయం 10 గంటలకు బాపట్లకు చేరుకున్నారు. తొలుత గడియార స్తంభం సెంటర్లో గంటపాటు ధర్నా నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ సెంటర్కు చేరుకుని బైఠాయించారు. గంటన్నరపాటు అక్కడే నిరసన తెలిపారు. ఆ తర్వాత ర్యాలీగా చీలు రోడ్డుకు చేరుకున్న మత్స్యకారులు అక్కడ గుంటూరు, మచిలీపట్నం, చీరాల రోడ్లను దిగ్బంధించారు. రోడ్డుపై కూర్చుని టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ఆక్రమించిన ఈపూరుపాలెం స్ట్రెయిట్ కట్ను తక్షణం పునరుద్ధరించాలని, వేలాది మత్స్యకార కుటుంబాలకు న్యాయం చేయాలని నినదించారు.పర్యావరణ శాఖ మంత్రి స్పందించాలిపర్యావరణ శాఖామంత్రి, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలని, సీమౌత్ను వెంటనే తెరిపించాలని మత్స్యకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. పూర్వం నుంచి వున్న కాలువను ఆక్రమించిన టీడీపీ నేత బుర్ల వెంకట్రావుపై కేసులు నమోదు చేయాలని, తీరంలో ఆయన పొందిన డీకేటీ పట్టాలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చి తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకూ ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. మత్స్యకారుల ఆందోళనతో బాపట్లలో ట్రాఫిక్ స్తంభించి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం రెండు గంటలవరకూ ఆందోళన విరమించకపోవడంతో డీఎస్పీ రామాంజనేయులు, సీఐ రాంబాబు వచ్చి ఆందోళన విరమించాలని పదేపదే కోరినా మత్స్యకారులు ససేమిరా అన్నారు. 2:30 గంటల సమయంలో బాపట్ల ఆర్డీవో గ్లోరియా వచ్చి ఆందోళన విరమించాలని మత్స్యకారులను కోరినా అంగీకరించలేదు. కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు. కలెక్టర్ వద్దకు వచ్చి సమస్యను విన్నవించాలని ఆర్డీవో, డీఎస్పీలు కోరినా.. కలెక్టర్ ఇక్కడేకే రావాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. పండుగ నేపథ్యంలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని, కలెక్టర్ కార్యాలయానికి వచ్చి చర్చించాలని ఆర్డీవో, డీఎస్పీలు చెప్పినా మత్స్యకారులు వినిపించుకోలేదు. డీఎస్పీ రామాంజనేయులు పదేపదే చెప్పడంతో సాయంత్రం 6 గంటలకు ఆందోళనకారులంతా కలెక్టరేట్కు వెళ్లి కలెక్టర్ వినోద్కుమార్ను కలిశారు. తాను కొత్తగా వచ్చానని, రెండు రోజుల క్రితమే ఈ సమస్య దృష్టికి వచ్చిందని చెప్పిన కలెక్టర్ అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుని, త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ హామీతో సంతృప్తి చెందని మత్స్యకారులు ఎమ్మెల్యే నరేంద్రవర్మ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన కొనసాగిస్తామని.. గురువారం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని మత్స్యకారులు చెప్పిన మత్స్యకారులు అక్కడినుంచి వెనుదిరిగారు. నిరసన కార్యక్రమాలకు మత్స్యకార సంఘ నాయకులు బాబ్జి, రమణ, సూరిబాబు, సైకం రాజశేఖర్, శీలం రవికుమార్, తదితరులు నాయకత్వం వహించారు. -
దళితులపై దాడులు చేస్తే ఊరుకోం
పర్చూరు(చినగంజాం): దళితులపై అన్యాయంగా దాడులు.. అమానుష చర్యలకు పాల్పడితే అధికార పార్టీ అయినా.. అధికారులైనా చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున హెచ్చరించారు. మార్టూరు మండలం డేగర్లమూడిలో ఇటీవల సీఐ శేషగిరి అమానుష చర్యలకు బాధితులైన దళిత యువకులు జ్యోతి పోతులూరి, అల్లడి ప్రమోద్ కుమార్తో పాటు బాధితులను పరామర్శించేందుకు మంగళవారం ఆయన గ్రామాన్ని సందర్శించి మాట్లాడారు. మార్టూరు మండలం డేగర్లమూడిలో జగనన్న కాలనీ ప్రవేశంలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని గ్రామ కంఠానికి సంబంధించిన భూమిలో ఏర్పాటు చేసుకునేందుకు గ్రామంలోని యువత ఏర్పాట్లు చేసుకున్నారని తెలిపారు. దేశంలో అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టుకునేందుకు ఎటువంటి ఆంక్షలు లేవని, రాష్ట్రంలో మహనీయులు వైఎస్ రాజశేఖర్రెడ్డి, బీఆర్ అంబేడ్కర్, వంగవీటి మోహనరంగా వంటి చరిత్ర కలిగిన నాయకుల విగ్రహాలను పెట్టుకున్నామన్నారు. కానీ డేగర్లమూడిలో గ్రామ కంఠంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పంచాయతీ అనుమతి ఉన్నప్పటికీ గ్రామ కార్యదర్శి మీకు అనుమతి లేదంటూ విగ్రహాన్ని దొంగిలించుకు పోయారన్నారు. అదే ప్రాంతంలో విగ్రహాలు పెట్టకూడదని పోలీస్ అధికారులు ఆంక్షలు పెట్టడం, విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంలో యాక్టివ్గా ఉన్న ఇద్దరు యువకులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చితకబాదారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. స్థానికంగా కొందరు అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంలో పోలీస్ అధికారులను సమాయత్తం చేయడంతో వారు యువకులను పోలీస్స్టేషన్కు తీసుకొని వెళ్లి అమానుషంగా కొట్టడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. అధికారులు వారం రోజుల్లో విగ్రహాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారని.. లేని పక్షంలో 10 రోజుల్లో తామే విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంబేడ్కర్ విగ్రహాన్ని దొంగిలించిన గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్ని కలిసి సీఐపై చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. విగ్రహాల ఏర్పాటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని ప్రజాస్వామ్యంలో విగ్రహాల ఏర్పాటుకు స్వేచ్ఛ ఉందన్నారు. ద్రోణాదుల సర్పంచ్ కుటుంబానికి పరామర్శ మార్టూరు సీఐ శేషగిరిరావు అమానుష చర్యకు బలై తీవ్రగాయాలపాలైన ద్రోణాదుల సర్పంచ్ వంకాయలపాటి భాగ్యారావు కుటుంబాన్ని మేరుగ నాగార్జున పరామర్శించారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ నాయకుడు పోపూరి వెంకట్రావు ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు భవనం శ్రీనివాసరెడ్డి,ఎస్సీ విభాగం పర్చూరు నియోజకవర్గ అధ్యక్షుడు నూతలపాటి బలరాం, ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి పాలెపోగు రాంబాబు, యువజన విభాగం కార్యదర్శి ఉప్పలపాటి అనిల్చౌదరి, మాచవరపు రవికుమార్, గర్నెపూడి రవిచంద్, బండి రాంబాబు, జంపని వీరయ్య చౌదరి, రావూరి వేముబాబు, మువ్వల రాంబాబు, పాదర్తి ప్రకాష్. పఠాన్ కాలేష వలి, కట్టా రత్నరాజు, మైలా చిన నాగేశ్వరరావు, బూరగ రాము, గోపతోటి బాబురావు, సూరవరపు వందనం, వాసుమల్లి వాసుబాబు, కూరాకుల ఇసాక్ బాబు, కుమ్మరి చందు, యాతం మేరీ బాబు, పులిపాటి అరుణ్, జంగం మహేష్, గొర్రె ముచ్చు సుబ్బారావు, వల్లపునేని లక్ష్మీనారాయణ, జి.చిన్న, సురేష్, తమ్మలూరి సురేష్ బాబు, తమ్మా అమ్మిరెడ్డి, గడ్డం మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. -
వల విసరక.. బతుకు సాగక..
తాడేపల్లి రూరల్ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో చేపలు వేటాడే మత్స్యకారుల బతుకు దయనీయంగా ఉంది. గత రెండు నెలల నుంచి కృష్ణానదికి తరచూ వరద రావడంతో వల విసరలేని పరిస్థితి నెలకొంది. పొట్ట నింపుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యారేజ్ ఎగువ, దిగువ ప్రాంతాల్లో సుమారు 450 కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. వీరే కాకుండా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి నుంచి వలస వచ్చిన మరో 50 కుటుంబాలు కృష్ణానదిని నమ్ముకునే ఇలా బతుకుతున్నాయి. నదికి కొన్ని నెలలుగా వరద పోటెత్తుతూ ఇప్పుడు 6 లక్షల క్యూసెక్కుల వరకు చేరింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లాలంటే కృష్ణానది గేట్లు తప్పని సరిగా మూసి ఉండాలి. లేని పక్షంలో పడవ నిలిచి వల వేడయానికి కుదరదు. నాలుగైదు నావల వారు కలిసి రాత్రి సమయంలో కృష్ణానదిలో అక్కడక్కడ రంగ వలలతో బుట్టలను ఏర్పాటు చేస్తారు. వరద రావడంతో అవి కొట్టుకుపోతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. గత మూడు నెలలుగా అందిన చోట అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద సొసైటీలు ఉన్నాయని, వాటి ద్వారా మత్స్యశాఖ అధికారులు ఆర్థిక సహాయాన్ని అందించాలని విన్నవించారు. రేషన్ సరకులు అందజేస్తే కడుపు నింపుకొంటామన్నారు. ప్రస్తుతం తమ కుటుంబాలు అర్ధాకలితో జీవించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. దోచుకుంటున్న వ్యాపారులు.... కృష్ణానదిలో చేపల వేట లేకపోవడంతో ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతంలోని సీతానగరానికి వెళ్లే మార్గంలో చేపల వ్యాపారుల తమకు ఇష్టం వచ్చిన ధరలతో విక్రయిస్తున్నారు. కేజీ చెరువు చేపలను రూ.300 – రూ.500 వరకు అమ్ముతున్నారు. అవి కూడా కృష్ణానది చేపలు అంటూ అంటగడుతున్నారు. దిగువ ప్రాంతంలో చేపల వ్యాపారులు ఏర్పాటు చేసిన కాటాల్లో సైతం భారీ వ్యత్యాసం కనబడుతోంది. కేజీ చేప తీసుకుంటే 750 గ్రాములే ఉంటోందని పలువురు వాపోతున్నారు. తూనికలు, కొలతల అధికారులకు ఫిర్యాదు అందడంతో తనిఖీ చేయగా మోసం వెలుగుచూసింది. 15 కాటాలు సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు. అయినా వ్యాపారులు తమ తీరు మార్చుకోవడం లేదని పలువురు కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అలరించిన ‘మోహినీ భస్మాసుర’
తెనాలి: పురాణగాథ ‘మోహినీ భస్మాసుర’ పద్యనాటకంగా పండిత పామరులను అలరిస్తూనే ఉంది. తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరుగుతున్న వీణా అవార్డ్స్–2025 జాతీయ పంచమ పద్యనాటక, సాంఘిక నాటక/నాటికల పోటీల్లో నాలుగోరోజైన మంగళవారం తొలి ప్రదర్శనగా ఈ నాటకం అలరించింది. విజయనగరానికి చెందిన అక్కినేని సాంస్కృతిక సమాజం ప్రదర్శించగా, వీక్షకుల కరతాళధ్వనులను అందుకుంది. వృకాసురుడనే రాక్షసుడు అయిదేళ్లపాటు భీకర తపస్సు చేయటంతో శివుడు ప్రత్యక్షమై, అడిగినదే తడవుగా ఎవరి తలపైనయినా చేయి పెట్టిన వెంటనే అతడు భస్మమయేలా, ఎవరివల్ల కూడా వృకాసురుడికి మరణం లేకుండా వరాలిస్తాడు. ఈ వరాలతో జరిగే కీడు తెలిసిన నారదుడు రెచ్చగొట్టటంతో వరాన్ని పరీక్షించుకునేందున వృకాసరుడు నేరుగా శివుడు దగ్గరకు వెళతాడు. శివుడు తప్పించుకుని శ్రీవిష్ణువును శరణు వేడతాడు. విష్ణువు నారదుడిని సంప్రదించి, మోహినీరూపం దాల్చి వృకాసురుని అంతమొదించటం ఇతివృత్తం. మద్దెల పంచనాదం రచనకు గవర సత్తిబాబు దర్శకత్వం వహించారు. వృకాసురుడుగా దాసరి తిరుపతినాయుడు, మోహినిగా కేవీ పద్మావతి, లక్ష్మీదేవిగా పి.నీలవేణి, నారుదుడిగా గవర సత్తిబాబు పాత్రోచితంగా నటించారు. ఆకట్టుకున్న ఇతివృత్తాలు అనంతరం టీజీవీ కళాక్షేత్రం, కర్నూలు వారి ‘జగదేక సుందరి సామా’ పద్యనాటకాన్ని ప్రదర్శించారు. సామా అనే వేశ్య ఎందరినో బానిసలను చేసుకుంటుంది. వేలంలో కొనుగోలు చేసిన బానిస మాఘపై మనసు పడుతుంది. ఆమె దగ్గర బానిసలను విడిపించటానికి మాఘ ఆమెను ప్రేమిస్తున్నట్టు నటిస్తాడు. అతడి మాటలను నమ్మి బానిసలు విడుదల చేస్తుంది. ఆ వెంటనే సామా ఎదుటనే మాఘ విషం తీసుకుని మరణిస్తాడు. విరక్తి చెందిన సామా ఆత్మహత్యకు పూనుకోగా, పుణ్యకుడు అనే బౌద్ధగురువు హితబోధతో బౌద్ధసన్యాసినిగా మారుతుంది. సామాగా ప్రముఖ రంగస్థల, సినీనటి సురభి ప్రభావతి అద్భుతంగా నటించారు. ఇతర పాత్రల్లో జీవీ శ్రీనివాసరెడ్డి, కె.బాలవెంకటేశ్వర్లు, పి.రాజారత్నం నటించారు. పల్లేటి కులశేఖర్ రచనకు పద్యాలు/దర్శకత్వం పత్తి ఓబులయ్య. అనంతరం మానవత, యడ్లపాడు వారి ‘అంతా మంచివారే...కానీ’ సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. రచన, దర్శకత్వం జరుగుల రామారావు. చివరగా అభ్యుదయ ఆర్ట్స్, విజయవాడ వారు ‘క్రతువు’ సాంఘిక నాటికను ప్రదర్శించారు. కేవీవీ సత్యనారాయణ రచనకు వేంపాటి రమేష్ దర్శకత్వం వహించారు. నాటకపోటీలను కళల కాణాచి, తెనాలి, ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో కొనసాగిస్తున్నారు. -
విజయ దశమి రోజు అన్ని వీఐపీ దర్శనాలు రద్దు
● వైభవంగా దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు ● వేదపఠనంతో మార్మోగిన ఇంద్రకీలాద్రి ● అమ్మ దర్శనానికి తరలివస్తున్న భవానీలు ● నేడు మహిషాసురమర్దినిగా దర్శనమివ్వనున్న దుర్గమ్మ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవీశరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ మంగళవారం శ్రీదుర్గాదేవి అలంకారంలో భక్తులను కరుణించారు. లోకకంటకుడైన దుర్గమాసురుడనే రాక్షకుడిని వధించి ఇంద్ర కీలాద్రిపై దుర్గాదేవిగా కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము మూడు గంటలకు అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత క్యూలైన్లోకి చేరిన భక్తులకు తెల్లవారుజామునే దర్శనం పూర్తయింది. మధ్యాహ్నం నుంచి వర్షం పడటంతో క్యూలైన్లో ఉన్న భక్తులు, అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమైన వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వీఐపీలు, సిఫార్సులతో దర్శనానికి వచ్చే వారి సంఖ్య అంతంత మాత్రంగానే కనిపించింది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వీఐపీల తాకిడి పెరగడంతో ఆలయ ప్రాంగణంలో కాస్త గందరగోళ పరిస్థితులు కనిపించాయి. కనకదుర్గమ్మ బుధవారం శ్రీమహిషాసుర మర్దినీదేవిగా దర్శనమిస్తారు. ముగింపు దశకు ఉత్సవాలు గత నెల 22వ తేదీన ప్రారంభమైన దసరా ఉత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. గురువారం శ్రీరాజరాజేశ్వరి అలంకారం, ఉదయం పది గంటలకు యాగశాలలో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో అమ్మవారి దీక్ష స్వీకరించిన భవానీల రాక ప్రారంభమైంది. దీంతో పోలీసులు, ఇటు రెవెన్యూ అధికారులు అప్రమత్తమై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భవానీమాలధారుల రాకతో ఆలయ పరిసరాలు అరుణ వర్ణాన్ని సంతరించుకున్నాయి. దుర్గమ్మ సేవలో దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ శీనానాయక్ సాద రంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, ఆలయ అధికారులు అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలను అందించారు. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. సినీ నటి హేమ అమ్మవారిని దర్శించుకున్నారు. -
లోతట్టు ప్రాంతాల ప్రజలు అధైర్య పడొద్దు
బాపట్ల: ‘‘అధైర్య పడవద్దు.. జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని’’ జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ లోతట్టు ప్రాంతాల ప్రజలకు భరోసా ఇచ్చారు. రేపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆర్డీఓ, భట్టిప్రోలు, కొల్లూరు, రేపల్లె మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు హెబిటేషన్, పునరావాస కేంద్రాల ఇన్చార్జిలతో వరద ప్రవాహ పరిస్థితిపై మంగళవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేసి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాక్టర్లు, బోట్లు సిద్ధంగా పెట్టుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో ఉన్న బాధితులకు అన్ని సౌకర్యాలు ఉండేలా ఇన్చార్జి చూసుకోవాలన్నారు. వరద ఉధృతి పెరిగినా ఎదుర్కొనడానికి అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాలకు కేటాయించిన అధికారులు, సిబ్బంది రాత్రీపగలు అక్కడే ఉండాలన్నారు. నదిలో నీటి ప్రవాహం తగ్గే వరకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
ఉత్కంఠగా కొనసాగుతున్న చెస్ పోటీలు
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో 62వ నేషనల్ చెస్ చాంపియన్షిప్ పోటీలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. ఆలిండియా చెస్ ఫెడరేషన్ విభాగంలోని ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో ఈ పోటీలు జరుగుతున్నాయి పదో రోజైన మంగళవారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కై కలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. ఆట ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ చదరంగాన్ని బ్రెయిన్ గేమ్ అని కూడా అంటారన్నారు. నిజమైన విజయమంటే ప్రత్యర్థిని ఓడించడం మాత్రమే కాదని, మనలోని ఆలోచనా శక్తిని పెంచుకోవడమనిన అభిప్రాయపడ్డారు. మాస్టర్ లంకా రవి మాట్లాడుతూ చదరంగం అనేది ఒక మేధో క్రీడ మాత్రమే కాకుండా, అనేక నైపుణ్యాలను నేర్పే వేదికన్నారు. 9వ రౌండ్ ఫలితాలు తొమ్మిదో రౌండ్లో సంచలనాలు చోటుచేసుకున్నాయి. ముగ్గురు గ్రాండ్మాస్టర్లు, మాజీ జాతీయ చాంపియన్లు కూడా ఇంటర్నేషనల్ మాస్టర్ల చేతిలో ఓటమిపాలయ్యారు. పీఎస్పీబీకి చెందిన జీఎం సశికిరణ్ కృష్ణన్ గెలుపు అవకాశాన్ని కోల్పోయినా 7.5 పాయింట్లతో టాప్లో కొనసాగుతున్నాడు. తమిళనాడుకు చెందిన జీఎం ఇనియన్ పి.ఎ., కేరళకు చెందిన ఐఎం గౌతమ్ కృష్ణ. హెచ్ కూడా అతనితో సమంగా లీడ్లో చేరారు. ఇంకా రెండు రౌండ్లు మిగిలి ఉండటంతో టైటిల్ పోరు ఉత్కంఠభరితంగా మారింది. పీఎస్పీబీకి చెందిన టాప్ జీఎంలు సూర్యశేఖర్ గంగూలీ, అభిజిత్ గుప్తా, ఎస్పీ సేతురామన్ వరుసగా గోవా ఐఎం రిట్విజ్ పరాబ్, కేరళ ఐఎం గౌతమ్ కృష్ణ, తమిళనాడు ఐఎం మనిష్ ఆంటో క్రిస్టియానో చేతిలో ఓడిపోయారు. -
7న చలో విజయవాడకు ఫ్యాప్టో పిలుపు
గుంటూరుఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఽఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేరకు ఈనెల 7న విజయవాడలోని ధర్నా చౌక్లో తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకులు నక్కా వెంకటేశ్వర్లు, గుత్తా శ్రీనివాసరావు, గుంటూ రు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ కె.నరసింహారావు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు ధర్నా సన్నా హక సమావేశాన్ని మంగళవారం నగరంపాలెంలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, ఏపీటీఫ్ రాష్ట్ర కార్యదర్శి మేకల సుబ్బారావు, ఫ్యాప్టో జిల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎండీ ఖాలీద్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.కళాధర్, జి.వెళాంగిణిరాజు, జిల్లా నాయకులు దిబ్బయ్య, ఎం.కోటిరెడ్డి, షేక్ బాజి బాలాజీ, ప్రసాద్, విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. -
బిక్కుబిక్కుమంటూ చెట్టు నీడన..
‘సాక్షి’ చొరవతో పునరావాస కేంద్రానికి తరలింపు కొల్లూరు: పనుల కోసం సొంత ఊళ్లను విడిచి ఏళ్ల తరబడి ఇక్కడే నివాసాలు ఏర్పరుచుకొని జీవిస్తున్న కుటుంబాలకు చెట్టు నీడే పునరావాసంగా మారింది. కృష్ణా నదికి వచ్చిన వరదల కారణంగా కొల్లూరు కరకట్ట దిగువన నివసిస్తున్న నిరుపేదల తాటాకుల పాకలలోకి వరద నీరు ప్రవేశించింది. పాకలను వదిలి సమీపంలో ఏడుగురు పసిపిల్లలతో నలుగురు మహిళలు చెట్టు నీడన తలదాచుకున్నారు. సోమవారం వరద నీటి పక్కనే చెట్టు నీడన చిన్నారులతో ఉన్న కుటుంబాలను గమనించిన ‘సాక్షి’ వారి పరిస్థితి గురించి ఆరా తీయడంతో గోడు వెళ్లబోసుకున్నారు. కొల్లూరులో రోజువారీ హోటళ్లతోపాటు, ఇతర వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవించే వీరు ఏరోజుకు ఆరోజు వచ్చే సంపాదనతోనే జీవనం వెళ్లబుచ్చుతున్నారు. వీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలివెళితే అధికారులు పనులుకు వెళ్లేందుకు అనుమతించకపోతే చేసే పని పోతుందన్న భయంతో చెట్టు నీడనే ఉన్నారు. దీంతో ‘సాక్షి’ వారి పరిస్థితిని తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకువెళ్లింది. తక్షణం స్పందించిన ఆయన.. రెవెన్యూ సిబ్బందిని వారి వద్దకు పంపించారు. పనులకు వెళ్లడానికి అభ్యంతరం ఉండదని భరోసా కల్పించి, వారిని పునరావాస కేంద్రానికి తరలించారు. -
8వ రౌండ్కు చేరిన జాతీయ చెస్ పోటీలు
చేబ్రోలు: ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ విజ్ఞాన్ యూనివర్సిటీ వేదికగా నిర్వహిస్తున్న 62వ జాతీయ చెస్ చాంపియన్షిప్ పోటీలు సోమవారం ఆసక్తికరంగా జరిగాయి. ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి, పీఎస్పీబీకి చెందిన నాలుగు సార్లు జాతీయ విజేత జీఎం కృష్ణన్ శశికిరణ్ తన జట్టు సహచరుడు జీఎం దీప్సెం గుప్తాపై గెలిచాడు. అదే జట్టుకు చెందిన మరో గ్రాండ్మాస్టర్ అభిజీత్ గుప్తా యూపీకి చెందిన ఐఎం ఎలెక్ట్ అజయ్ సంతోష్ పర్వతరెడ్డిపై విజయం సాధించారు. దీంతో శశికిరణ్, అభిజీత్లు చెరో ఏడు పాయింట్లతో టాప్లో నిలిచారు. వీరికి సగం పాయింట్ వెనుక ఆరుగురు ఆటగాళ్లు (తమిళనాడు జీఎం ఇనియన్, రైల్వేస్ జీఎం దీపన్ చక్రవర్తి, నలుగురు ఐఎంలు) ఉన్నారు. -
విచారణ తర్వాత సీఐపై తగిన చర్యలు
మార్టూరు: అంబేడ్కర్ విగ్రహ స్థాపనకు అన్ని విధాలా సహకరిస్తామని జిల్లా అధికారులు స్పష్టం చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ హాలులో సోమవారం సాయంత్రం డేగరమూడి గ్రామంలోని ఇరువర్గాలతో నిర్వహించిన సమావేశంలో అధికారులు మాట్లాడారు. ఆర్డీవో గ్లోరియా మాట్లాడుతూ.. విగ్రహ స్థాపనకు ఎన్నుకున్న స్థలం తాలూకు పూర్వాపరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి గ్రామ, మండల కమిటీల ఆమోదం అనంతరం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామన్నారు. అనుమతులు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. అప్పటివరకు గ్రామాల్లోని ఇరువర్గాలు ఎలాంటి విభేదాలు తలెత్తకుండా సంయమనంతో వ్యవహరించాలని కోరారు. సీఐపై చట్టప్రకారం చర్యలు డీఎస్పీ గోగినేని రామాంజనేయులు మాట్లాడుతూ దళిత యువకులు జ్యోతి పోతులూరి, అల్లడి ప్రమోద్ కుమార్లపై సీఐ శేషగిరి లాఠీచార్జి చేశారనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ ఆదేశాలతో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. బాధిత యువకుల వైద్య పరీక్షల రిపోర్టులు, ఇతర వివరాలను పరిశీలించి ఎస్పీకి నివేదిక పంపనున్నట్లు చెప్పారు. నిజ నిర్ధారణ అనంతరం సీఐ ప్రమేయం రుజువైతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. సోషల్ వెల్ఫేర్ డీడీ రాజా దిబోరా మాట్లాడుతూ విగ్రహ స్థాపనకు సంబంధించిన అంశాన్ని జిల్లా పరిషత్ అధికారులతో చర్చించి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
కౌలు రైతుల సమస్యలపై అక్టోబర్ 13, 14 తేదీల్లో ఆందోళన
లక్ష్మీపురం: కౌలు రైతుల సమస్యలపై అక్టోబర్ 13, 14 తేదీల్లో మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు చెప్పారు. గుంటూరు బ్రాడీపేటలోని సంఘం జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌలు రైతులందరికీ భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు వర్తింప చేయాలని కోరారు. ఈ క్రాప్ నమోదు చేసి ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర నష్ట పరిహారాలు వర్తింప చేయాలని విజ్ఞపి చేశారు. కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ జిల్లాలో సుమారు లక్ష మంది కౌలు రైతులున్నారని, 70 శాతం వారే సాగు చేస్తున్నారని పేర్కొ న్నారు.రైతు సేవా కేంద్రాల్లో అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, యూరి యా అందుబాటులో ఉంచాలని కోరారు. సమా వేశంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.రామకృష్ణ, నాగమల్లేశ్వరరావు, సాంబిరెడ్డి, కృష్ణ, అమ్మిరెడ్డి, నీలాంబరం పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న కౌలు రైతు సంఘ నేతలు -
తాళం వేసిఉన్న ఇంట్లో చోరీ
యడ్లపాడు: మండలంలోని జగ్గాపురం గ్రామంలోని తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు తలుపులు పగులగొట్టి విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరించుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రైతు షేక్ బాజీవలి, మీరాబీ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరికి వివాహాలు కావడంతో కుమారుడు, కోడలు ఉద్యోగం నిమిత్తం దుబాయ్లోనూ, కుమార్తె, అల్లుడు వట్టి చెరుకూరు మండలం కుర్నూతల అడ్డరోడ్డు వద్ద చిల్లర కూల్డ్రింక్ షాపును ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం బాజీవలి దంపతులు కుమార్తె ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం 10 గంటలకు జగ్గాపురంలోని ఇంటికి తిరిగి రాగా, రేకుల షెడ్డు తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. లోపలకు వెళ్లి చూడగా, బీరువా, కప్ బోర్డులో ఉన్న వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. దుండగులు కప్బోర్డులో దుస్తుల మధ్యలో దాచి ఉంచిన వెండి, బంగారం ఆభరణాలు, నగదు అపహరించుకుపోయినట్లు బాజీవలి గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో యడ్లపాడు ఎస్సై టి.శివరామకృష్ణ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. జిల్లా కేంద్రం నుంచి క్లూస్ టీం, డాగ్స్క్వాడ్ను రప్పించి ఆధారాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 130 గ్రాముల బంగారం, 20గ్రామలు వెండి ఆభరణాలు, రూ.6 వేల నగదు చోరీకి గురైనట్లు ఎస్సై శివరామ కృష్ణ తెలిపారు. -
ప్రజల ఫిర్యాదులపై సత్వర చర్యలు
బాపట్ల: ప్రజల ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను జిల్లా ఎస్పీ స్వయంగా స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని, చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. అర్జీలలోని వాస్తవికతను దృష్టిలో పెట్టుకొని వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అర్జీలను పరిష్కరించడంలో జవాబుదారీతనంతో వ్యవహరించాలని తెలిపారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని ఎస్పీ పోలీస్ అధికారులను హెచ్చరించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి కుటుంబ కలహాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీల మోసాలు, ఇతర పలు సమస్యలపై 56 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి. జగదీశ్ నాయక్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ -
దళిత నాయకుల నినాదాలు..
ఈ సందర్భంగా సమావేశంలో ఒకానొదశలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దళిత యువకులపై అక్రమ కేసులు బనాయించి లాఠీచార్జికి పాల్పడిన సీఐను సస్పెండ్ చేయాలని దళిత సంఘాల నాయకులు చార్వాక, నీలం నాగేంద్రరావు తదితరులు నినాదాలు చేశారు. డేగరమూడి పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు ఏకపక్ష నిర్ణయాలపై అధికారులు విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ రామాంజనేయులు జోక్యం చేసుకొని దళిత నాయకులను శాంతపరిచారు. గ్రామాల్లోని ఇరువర్గాలు అంబేడ్కర్ విగ్రహ స్థాపన కోసం కమిటీ వేసుకొని అనుమతులు వచ్చాక ప్రశాంత వాతావరణంలో విగ్రహ స్థాపన చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ టి. ప్రశాంతి, సీఐ శేషగిరి, డేగర మూడి గ్రామప్రజలు, నాయకులు వైఎస్సార్ సీపీ మార్టూరు మండల కన్వీనర్ జంపని వీరయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
తప్పిపోయిన పాప తల్లిదండ్రుల చెంతకు
చీరాల అర్బన్: తప్పిపోయిన పాపను చీరాల ఒన్టౌన్ పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఒన్టౌన్ సీఐ ఎస్.సుబ్బారావు తెలిపిన వివరాల మేరకు జె.పంగులూరు మండలానికి చెందిన నాలుగు సంవత్సరాల పాప ఆరాధ్య చీరాల ఎంజీసీ మార్కెట్ వద్ద సోమవారం తప్పిపోయింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన సిబ్బందిని, శక్తి టీం సభ్యులను అప్రమత్తం చేశారు. గంట వ్యవధిలోనే పాపను గుర్తించి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. తమ పాపను సురక్షితంగా అప్పగించిన పోలీసులకు వారు ధన్యవాదాలు తెలిపారు. జె పంగులూరు: మద్యం తాగి బైక్ మీద వస్తూ అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి మండలంలోని ముప్పవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై సర్వీసు రోడ్లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ముప్పవరం గ్రామంలో జాతీయ రహదారిపై చిలకలూరిపేట వైపు వెళుతున్న సర్వీస్ రోడ్డులో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వెళుతూ సైడ్ డివైడర్ని ఢీకొన్నారు. మద్యం తాగి ఉండటం వల్ల అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో చిలకలూరిపేటకు చెందిన ఒక వ్యక్తి తలకు గట్టి దెబ్బ తగిలి ప్రమాద స్థలంలోనే మృతిచెందాడు. మరో వ్యక్తికి బలమైన గాయాలు అవటంతో అతన్ని అంబులెన్స్లో మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు హైవే అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. వీరి వివరాలు తెలియరాలేదు. రేణింగవరం ఎస్సై వినోద్బాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యర్రబాలెం(మంగళగిరి): ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసం చేసిన ఘటన యర్రబాలెం బీసీ కాలనీలో జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగర పరిధిలోని యర్రబాలెం బీసీ కాలనీకి చెందిన మైనర్ బాలిక అదే ప్రాంతానికి చెందిన సందీప్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యలో బాలికను వివాహం చేసుకోవాలని కుటుంబసభ్యులు కోరగా నిరాకరించాడు. దీంతో బాలిక కుటుంబసభ్యులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు. గుంటూరు మెడికల్: అత్యవసర మందులు, వైద్య పరికరాలపై ప్రభుత్వం జీఎస్టీని 12 నుంచి ఐదు శాతానికి తగ్గించడం వల్ల ప్రజలకు ఖర్చులు తగ్గుతాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణల్లో భాగంగా శిశువులకు ఉపయోగించే న్యాప్కిన్లు, ఫీడింగ్ బాటిల్స్, వ్యక్తిగత ఆరోగ్య బీమా అంశాలపై జీఎస్టీ పూర్తిగా మినహాయింపును ఇచ్చారని పేర్కొన్నారు. క్యాన్సర్ కారకమైన పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 28 నుంచి 40 శాతానికి పెంచడం వల్ల వినియోగం తగ్గుతుందన్నారు. తద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని తెలిపారు. వైద్యశాఖ అధికారులు, వైద్యులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు, క్యాలెండరు యాక్టివిటీస్లో భాగంగా అక్టోబర్ 1న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా న్యాయ విజ్ఞాన సంస్థలో సదస్సు నిర్వహించారు. ఇన్చార్జి కార్యదర్శి ఎం.కుముదిని సదస్సును ప్రారంభించారు. వృద్ధులకు న్యాయపరంగా ఉన్న సెక్షన్లు, హక్కులు, పిల్లల ద్వారా మోసపోయిన వారికి తిరిగి ఆస్తిని పొందే చట్టాల గురించి ఆమె వివరించారు. వృద్ధులు ఎదుర్కొనే పలు సమస్యలు, వాటి పరిష్కారాల గురించి స్టేట్ సీనియర్ సిటిజన్స్ అసోసి యేషన్ సెక్రటరీ ఉమామహేశ్వరరావు తెలియజేశారు. సీహెచ్.పరమేశ్వరరావు, పారా లీగల్ వలంటీర్స్, వృద్ధులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న వీణా సింఫనీ
తెనాలి: శ్రీదేవీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజైన సోమవారం సాయంత్రం తెనాలిలో 108 వీణల ఘన సప్తస్వర సమ్మేళనం (వీణా సింఫనీ) నిర్వహించారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతి (బాల స్వామీజీ) ఆధ్వర్యంలో 108 మంది వైణికుల వాద్య స్వర తరంగాలు ఒకే సమయాన ఆడిటోరియంలో ఆవహించాయి. దివ్యానంద సుడిగాలిలా భక్తులను చుట్టుముట్టాయి. స్థానిక చెంచుపేటలోని పద్మావతి కల్యాణ మండపంలో ఈ ఆధ్యాత్మిక సంగీత యజ్ఞాన్ని వేడుకగా చేశారు. బాలస్వామీజీ స్వయంగా వీణావాదన చేశారు. సరస్వతీ దేవికి ప్రీతిపాత్రం వీణ అని తెలిసిందే. వీణ ధ్వనిని వేదమంత్రాల నాదంతో సమానంగా పరిగణిస్తారు. ఇక 108 సంఖ్య హిందూ సంప్రదాయంలో పవిత్రమైనది. జపమాలలో ఉండే గింజల సంఖ్య 108. అంతమంది వైణికులు ఒకేసారి వీణ వాయించటమంటే జపమాల గింజల్లా ప్రతి స్వరం ఒక మంత్రధ్వనిగా మారటం అన్నమాట! శ్రోతలలో భక్తి, శాంతి, ఆనందం, ఆత్మశుద్ధిని కలిగించే ఆధ్యాత్మిక యజ్ఞంలా జరిగింది. పట్టణానికి చెందిన శ్రీ విద్యా పీఠం, సాలిగ్రామ మఠం, జయలక్ష్మి మాతృమండలి ఆధ్వ ర్యంలో నిర్వహించారు. ఆయా సంస్థల బాధ్యులు నంబూరి వెంకటకృష్ణమూర్తి, పెనుగొండ వెంకటేశ్వరరావు, రావూరి సుబ్బారావు, ముద్దాభక్తుని రమణయ్య, పల్లపోతు మురళీ మనోహర్, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రమణ్యం, గోపు రామకృష్ణ, రాజేశ్వరరావు, కమిటీ సభ్యులు, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు. -
అర్జీలను వెంటనే పరిష్కరించండి
బాపట్ల: ప్రజలు తమ సమస్యలపై ప్రజా సమస్యల పరిస్కార వేదికలో అందజేసిన అర్జీలను అధికారులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, పలువురు జిల్లా అధికారులతో అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ మొదటి రోజునే వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత నెలలో పింఛన్ తీసుకోలేకపోతే కారణాలు గుర్తించాలని డీఆర్డీఏ పీడీని ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో, ఆర్డీఓలు, ప్రతి మండల కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి నెలా 28 కల్లా అంగన్వాడీ కేంద్రాలకు బియ్యంతోపాటుగా మిగిలిన వస్తువులు పంపిణీ చేయాలన్నారు. రెవెన్యూ భూ సమస్యలకు సంబంధించి పెండింగ్లో ఉన్న నిషేధిత జాబితా, 22ఏకి సంబంధించి ప్రతి శుక్రవారం సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు ఫైల్స్ను పరిష్కరిస్తామన్నారు. కలెక్టరేట్ పరిపాలన అధికారి (ఏఓ) మల్లి కార్జునరావు, డీఆర్డీఏ ఇన్చార్జి పీడీ లవన్న, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ రాధామాదవి, డీఎఫ్ఓ రవిశంకర్, డీపీఓ ప్రభాకరరావు, సీపీఓ ఏ.ఎస్.రాజు, డీఈఓ పురుషోత్తం, డ్వామా పీడీ విజయలక్ష్మి, డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ విజయమ్మ, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
ప్రైవేటీకరణతో పేదలకు వైద్యం దూరం
బాపట్ల: పేదవాడికి అనునిత్యం వైద్యం అందుబాటులో ఉండాలంటే మెడికల్ విద్య ప్రభుత్వంలోనే ఉండాలని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు వాసుమల్ల వాసు పేర్కొన్నారు. ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టనున్న నిరసన పోస్టర్లను సోమవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాలను నిర్మించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. నేడు కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమవుతోందని, దీన్ని అంతా వ్యతిరేకించాలని ఆయన కోరారు. మంగళవారం ఉదయం 10గంటలకు స్థానిక పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ భవనం వరకు ప్రదర్శన ఉంటుందని, పట్టణ ప్రజలంతా పాల్గొనాలని ఆయన కోరారు. కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, ఎస్సీ విభాగం నియోజకవర్గ అధ్యక్షులు బడుగు ప్రకాశ్, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి మండే విజయకుమార్, వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు అడే చందు, జమ్మలపాలెం సర్పంచ్ కటికల యోహోషువా, బాపట్ల నియోజకవర్గం ఎస్టీ సెల్ అధ్యక్షులు పాలపర్తి గోపి, నాయకులు నర్రావుల వెంకట్రావు పాల్గొన్నారు. -
ఆర్డీ కార్యాలయం డెప్యూటీ డైరెక్టర్గా పాల్ సుధాకర్
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం డెప్యూటీ డైరెక్టర్గా (డీడీ) బండి పాల్ సుధాకర్ను నియమిస్తూ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన గుంటూరు మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. పదోన్నతి ద్వారా డీడీగా విధుల్లో చేరనున్నారు. కడపకు చెందిన పాల్ సుధాకర్ హాకీ క్రీడలో ప్రతిభ చాటారు. పలుమార్లు జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనడంతో స్పోర్ట్స్ కోటాలో 1993లో సీనియర్ అసిస్టెంట్గా ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికై , డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో విధుల్లో చేరారు. ఆఫీస్ సూపరింటెండెంట్గా, పరిపాలనా అధికారిగా పదోన్నతులు పొంది 2014 వరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో పని చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రమోషన్ పొంది గుంటూరు జీజీహెచ్కు 2015లో బదిలీ అయ్యారు. -
రంగస్థలంపై మరో ‘చింతామణి’
ఆకట్టుకున్న ‘వీణా అవార్డ్స్’ ప్రదర్శనలు తెనాలి: సుదీర్ఘరాగం.. హోరెత్తే సంగీతం.. అర్థం కాని పద్యం... తెలుగువారికే సొంతమైన పద్యనాటకంపై సాధారణ ప్రేక్షకుడి అభిప్రాయం. ఒకప్పుడు పామరులను సైతం ఉర్రూతలూగించిన పద్యనాటకం, రానురాను ఆదరణ కోల్పోతుండటానికి ఇదే కారణం. భాష, భావం అర్థంకాని పద్యగానంపై మక్కువ తగ్గిపోయింది. ఇలాంటి తరుణంలో తెనాలిలో జరుగుతున్న వీణా అవార్డ్స్ నాటకోత్సవాల్లో రెండోరోజైన ఆదివారం ప్రదర్శించిన ‘కస్తూరి తిలకం’ పద్యనాటకం ఆద్యంతం ప్రేక్షకులను కూర్చోబెట్టింది. కల్పిత కథో, చారిత్రక ఆధారాలున్నాయో తెలీదుగాని, బిల్వమంగళుడు, చింతామణి పేర్లతో ప్రధాన పాత్రల చుట్టూ శారదా ప్రసన్న అల్లిన నాటకాన్ని చందాల కేశవదాసు కళారిషత్, మధిర వారు ప్రదర్శించారు. రంగస్థల కళలో ఆరితేరిన డాక్టర్ నిభానుపూడి సుబ్బరాజు దర్శకత్వం వహించారు. పాత్రల మధ్య సంభాషణలు సందర్భోచితంగా వచ్చే పద్యాలు స్పష్టంగా వినిపిస్తూ, హృద్యమైన గానాలాపనతో నాటకం నడిచింది. చాలాకాలానికి ప్రేక్షకులు చక్కటి పద్యనాటకాన్ని ఆస్వాదించారు. ప్రధాన పాత్రల్లో చిలువేరు శాంతయ్య, బి.విజయరాణి నటించారు. ఇతర పాత్రల్లో సరిత, జి.శివకుమారి, ఎన్.సాంబశివారెడ్డి, నిభానుపూడి సుబ్బరాజు నటించారు. సంగీతం సీహెచ్ నాగేశ్వరరావు. ●తదుపరి మిర్యాలగూడ సాంస్కృతిక సమాఖ్య, మిర్యాలగూడవారి ‘బ్రహ్మరథం’ పద్య నాటకాన్ని ప్రదర్శించారు. బ్రహ్మహత్యాపాతకానికి భయపడి ఇంద్రుడు అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఇంద్రపీఠం ఎక్కిన నహుషుడుకు పదవీ వ్యామోహంతో చేసిన అరాచకాలకు శాపానికి గురై, పశ్చాత్తాపానికి లోనైన ఇతివృత్తమిది. సూలూరి శివసుబ్రహ్మణ్యం రచనకు తడికమళ్ల రామచంద్రరావు దర్శకత్వం వహించారు. తదుపరి కళాంజలి, హైదరాబాద్ వారి ‘యాగం’ సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. శ్రీశైలమూర్తి రచనకు కొల్లా రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. చివరగా హర్ష క్రియేషన్స్, విజయవాడ వారి ‘భువి కోరని భ్రమణం’ సాంఘిక నాటికను ప్రదర్శించారు. ఆచళ్ల ఉమామహేష్ మూలకథకు తాళాబత్తుల వెంకటేశ్వరరావు నాటకీకరించగా, కత్తి శ్యాంప్రసాద్ దర్శకత్వంలో ప్రదర్శించారు. కళల కాణాచి, తెనాలి, ఆర్ఎస్ఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. -
ఉద్యోగులకు ప్రభుత్వం డీఏ ప్రకటించాలి
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ బాపట్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దసరా కానుకగానైనా డీఏ ప్రకటించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బడుగు శ్రీనివాస్ కోరారు. పట్టణంలోని ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో సంఘ సమావేశం ఆదివారం నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ 2024 నుంచి ఇప్పటి వరకు 4 డీఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. పీఆర్సీ బకాయిలు, డీఏ, సరెండర్ లీవ్ బకాయిలు, పీఎఫ్ లోన్లు, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్స్ బకాయిలు దాదాపు రూ.25 వేల కోట్లు ఉన్నాయని చెప్పారు. ఆ బకాయిల విడుదలకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలకు పింఛన్లు, వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని అసెంబ్లీ కమిటీ సిఫార్సు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం, వైద్య సదుపాయాలు కల్పించమంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదని కుంటి సాకులు చెప్పడం సరికాదన్నారు. డీఎస్సీ నియామకాల ద్వారా కొత్త ఉపాధ్యాయులు పాఠశాలలకు వస్తున్నందున ఎంటీఎస్ ఉపాధ్యాయులను ఏకోపాధ్యాయ పాఠశాలలకు సర్దుబాటు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుడివాడ అమర్నాథ్, ఉపాధ్యాయ వాణి కన్వీనర్ పీవీ నాగరాజు, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి నూర్ బాషా సుభాని, జిల్లా ఆర్థిక కార్యదర్శి బొంతా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిలర్ ఎ.ఉదయశంకర్, ఏవీ నరసింహారావు, గవిని శ్రీనివాస్, పి.శివాంజనేయులు, ఏవీ నారాయణ, తోట శివయ్య, కోటేశ్వరరావు, నారాయణమూర్తి, ప్రభాకర్ పాల్గొన్నారు. ఆగిఉన్న లారీని ఢీకొన్న ఆటో.. వృద్ధుడు మృతి -
ఆదర్శంగా నిలిచిన కుటుంబం
కారంచేడు: తాను చనిపోయిన తరువాత మరొకరికి చూపునివ్వాలని గ్రామానికి చెందిన యార్లగడ్డ బుల్లెయ్య నిర్ణయించుకున్నారు. ఆయన ఆగస్టు 29వ తేదీన మృతి చెందాడు. అప్పుడు ఆయన నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. కాగా ఆయన భార్య యార్లగడ్డ నాగేంద్రం (80) ఆదివారం ఉదయం మృతి చెందగా ఆమె కూడా భర్త అడుగుజాడల్లో నిలిచి నేత్రాలను దానం చేయగా.. పెదకాకానిలోని శంకర నేత్రాలయం వారు ఆదివారం నేత్రాలను సేకరించారు. కాగా తమ తల్లి కోరిక ప్రకారం కుమారుడు వెంకటేశ్వర్లు, కుమార్తె అనంతలక్ష్మి కూడా నేత్రాలను దానం చేయడానికి అంగీకరించడం విశేషం. -
సెపక్ తక్రాలో జోత్స్న ప్రతిభ
చెరుకుపల్లి: జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలకు తుమ్మ వెంకట జోత్స్న ఎంపికై నట్లు ఎంఈఓ పులి లాజర్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఈ నెల 27, 28 తేదీలలో డాక్టర్ పి. ఆనంద్ మినీ స్టేడియంలో నిర్వహించిన ఏపీ సీనియర్ సెపక్ తక్రా చాంపియన్షిప్లో ప్రతిభ కనబరచి అక్టోబర్లో గోవాలో నిర్వహించనున్న జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. మండలంలోని పొన్నపల్లి గ్రామానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు తుమ్మ శ్రీనివాసరెడ్డి కుమార్తె, క్రీడాకారిణి జోత్స్నను ఉపాధ్యాయులు మాదావత్ సాంబయ్య నాయక్, ఈమని సాంబశివరావు, రమేష్, కిరణ్ అభినందించారు. దసరా సెలవుల్లో పిల్లలపై నిఘా ఉంచాలి ఎస్పీ ఉమామహేశ్వర్ బాపట్లటౌన్: దసరా సెలవుల్లో తల్లిదండ్రులు పిల్లల కదలికలపై నిఘా పెట్టాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. వర్షాలకు చెరువులు, గుంతలు నిండిపోయి, నదులు, వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్న దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సెలవుల్లో సరదాగా కాలక్షేపం కోసం పిల్లలు, యువకులు చెరువులు, కాలువలు, వాగులు, నదీ తీరాలు, సముద్రతీరాలకు వెళ్లి ఈతకు దిగే ప్రయత్నాలు చేస్తున్నారని హెచ్చరించారు. ముఖ్యంగా సూర్యలంక, వాడరేవు, రామాపురం వంటి సముద్రతీరాలకు యాత్రికులు భారీగా తరలివస్తున్నారన్నారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. యాత్రికులు తప్పనిసరిగా పోలీసు సూచనలు పాటించాలన్నారు. ఎరుపు రంగు జెండాలను దాటి లోతు ప్రాంతాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదన్నారు. ‘క్లెసా’ జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మీకాంత్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు నరసరావుపేట: కాన్ఫిడరేషన్ ఆఫ్ లైసెన్స్డు ఇంజినీర్స్, సర్వేయర్స్, అండ్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఏపీ (క్లెసా–ఏపీ) పల్నాడు జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఆదివారం స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) భవనంలో క్లెసా ఏపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్నాడు చాప్టర్ నూతన కమిటీ ఆవిష్కరణకు గౌరవ చైర్మన్ వేల్పుల రాము, చైర్మన్ ముని శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ కొమ్మసాని కమలాకరరెడ్డి, జనరల్ సెక్రటరీ ఎన్.ఎన్.వి.ఎస్.ఎస్.మూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రేజేటి సతీష్కుమార్ ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. వీరి సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా గౌరవ చైర్మన్గా కె.కమలాకరరెడ్డి, చైర్మన్గా ఎం.మురళీకృష్ణ, ప్రెసిడెంట్గా ఎస్.లక్ష్మీకాంత్, కోశాధికారిగా డి.రాజశేఖర్రెడ్డి, ఉపాధ్యక్షులుగా మీసా శ్రీనివాసరావు, బి.నరేంద్ర, ప్రధాన కార్యదర్శిగా డేవిడ్ కృపానందం, సంయుక్త కార్యదర్శులుగా మారెళ్ల రామాంజనేయులు, తోట సాంబశివరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బి.వెంకటనారాయణరావు, ఈసీ సభ్యులుగా పి.నిర్మల్కుమార్, డీవీ కృష్ణారావు, పి.శ్యాంప్రసాద్, వి.శ్రీనివాసరావు, నుసి నాగఫణింద్రారెడ్డి, పి.కోటిరెడ్డి, అమర్లను ఎన్నుకున్నారు. ఈసందర్భంగా నూతన అధ్యక్షుడు సిరివేరి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ సంఘం సంక్షేమం, టెక్నికల్ సెమినార్లు, సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తామని హామీ ఇచ్చారు. చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల, దాచేపల్లి ప్రాంతాల ఇంజినీర్లు పెద్దఎత్తున పాల్గొన్నారు. తొలుత కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టారు. మ్యాక్స్ విజన్ కంటి హాస్పిటల్ డాక్టర్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించారు. అలాగే ఇంజినీర్స్ వృత్తిలో ఎదురవుతున్న పలు సమస్యలపై చర్చించారు. -
దళితులంటే అంత చులకనా
● మార్టూరు సీఐపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ● డిజిటల్ బుక్లో మొదటి వ్యక్తి సీఐ శేషగిరే.. ●వైఎస్సార్ సీపీ నేతలు కొమ్మూరి, టీజేఆర్ మార్టూరు:దళిత యువకులపై అమానుషంగా ప్రవర్తించిన మార్టూరు సీఐ ఎం.శేషగిరిరావుపై అట్రాసి టీ కేసు నమోదు చేయాలని, గ్రామంలో తొలగించి న అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని వైఎస్సార్ సీపీ నేత కొమ్మూరి కనకారావు మాదిగ, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు డిమాండ్చేశా రు. మార్టూరు మండలం డేగరమూడి గ్రామానికి చెందిన దళిత యువకులు జ్యోతి పోతులూరి, అల్లడి ప్రమోద్కుమార్లపై తప్పుడు కేసు బనా యించి లాఠీచార్జి చేసిన సీఐ వైఖరిని ఆదివారం పార్టీ నాయకులు ఖండించారు. పోలీసుల దెబ్బలకు గాయపడిన ఇద్దరు యువకులను గ్రామంలో పరామర్శించి ధైర్యం చెప్పారు. ● కొమ్మూరి కనకారావు మాదిగ మాట్లాడుతూ సీఐ శేషగిరి అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తూ ఇతర కులాల పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నట్లు తమ విచారణలో తెలిసిందన్నారు. అతని వ్యవహారంపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. సీఐతోపాటు అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించిన పంచాయతీ కార్యదర్శి, అధికార పార్టీ గ్రామ నాయకుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తగిన మూల్యం చెల్లించక తప్పదు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు మాట్లాడు తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన డిజిటల్ బుక్లో మొదటి వ్యక్తిగా మార్టూరు సీఐ శేషగిరి చోటు సంపాదించి.. అరుదైన ఘనత సాధించారని ఎద్దేవాచేశారు. ద్రోణాదుల సర్పంచ్ వంకాయలపాటి భాగ్యరావు, ఎంఎల్ఏ బాలకృష్ణపై పోస్టింగ్ పెట్టినందుకు అక్రమంగా కేసు పెట్టారన్నారు. దళితులతో చెలగాటం ఆడుతున్న కూటమి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తొలగించిన ప్రదేశంలోనే త్వరలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ద్రోణాదుల వెళ్లి సర్పంచ్ భాగ్యరావుని పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బండ్రేవు వెంకట నారాయణరెడ్డి, రాష్ట్ర లీగల్సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శనరెడ్డి, గ్రీవె న్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నాగ నారాయణ మూర్తి, బొందిల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్రసింగ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలెపోగు రాంబాబు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమల్ల వాసు, మండల కన్వీనర్ వీరయ్యచౌదరి పాల్గొన్నారు. -
చతికిల పడిన మార్కెట్ కమిటీలు
● గుంటూరు మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.115 కోట్లు కాగా, ఆగస్టు నాటికి 29.58 శాతంతో రూ.34.02 కోట్లు సాధించారు. ● తెనాలి మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.7.65 కోట్లు కాగా 35.06 శాతంతో రూ.2.68 కోట్లు వసూలు చేసింది. ● పొన్నూరు మార్కెట్ కమిటీ రూ.8.38 కోట్లు కాగా, 32.66 శాతంతో రూ.2.74 కోట్లు. ● దుగ్గిరాల మార్కెట్ కమిటీ రూ.3.75 కోట్లకు 34.67 శాతంతో రూ.1.30 కోట్లు. ● తాడికొండ మార్కెట్ కమిటీ రూ.2.17 కోట్లకు కేవలం 3.27 శాతంతో రూ.7 లక్షలు. ● మంగళగిరి మార్కెట్ కమిటీ రూ.3.03 కోట్లకు 24.72 శాతంతో రూ.75 లక్షలు. ● ఫిరంగిపురం మార్కెట్ కమిటీ రూ.1.88 కోట్లకు 15.73 శాతంతో రూ.30 లక్షలు. ● ప్రత్తిపాడు మార్కెట్ కమిటీ రూ.4.45 కోట్లకు 28.41 శాతంతో రూ.1.26 కోట్లు వసూలు చేశాయి. ఫీజు వసూళ్లలో మందగమనం గుంటూరు జిల్లాలోని 8 మార్కెట్ కమిటీల్లో రాబడి అంతంత మాత్రం ఈ ఏడాది లక్ష్యం రూ.146.31 కోట్లు.. ఆగస్టు చివరి నాటికి వసూలైంది రూ.43.12 కోట్లు -
కృష్ణమ్మ ఉగ్రరూపం
కృష్ణమ్మ మరోసారి కన్నెరజేసింది. ప్రకాశం బ్యారేజి నుంచి సముద్రంలోకి ఆరు లక్షల క్యూసెక్కులకుపైగా విడుదల చేశారు. సోమవారం నాటికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బ్యారేజి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద నీరు లంక గ్రామాల్లోకి చొచ్చుకు వచ్చింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంటలు నీట మునిగాయి. అధికారులు అప్రమత్తమయ్యారు. లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా నదిలో పోటెత్తుతున్న వరద రెండో ప్రమాద హెచ్చరిక జారీ వరద ముంపులో ఉద్యాన పంటలు పల్లపు ప్రాంతాల్లోకి చేరిన వరద నీరు రహదారులపై ప్రవహిస్తున్న వరద నీరు ఆందోళనలో లంక గామాల ప్రజలు -
తల్లిని హత్య చేసిన తనయుడి అరెస్ట్
బాపట్ల టౌన్: మండల పరిధిలోని పూండ్ల గ్రామంలో తల్లిని హత్య చేసిన తనయుడిని బాపట్ల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను శనివారం బాపట్ల రూరల్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జి. రామాంజనేయులు వివరించారు. పూండ్ల గ్రామానికి చెందిన పెనిమిటి రమణమ్మ పారిశుద్ధ్య ఎస్డబ్ల్యూ షెడ్లో రెండో భర్త శ్రీనివాసరావుతో కలిసి పని చేస్తోంది. మొదటి భర్త చనిపోవడంతో ఆమె రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్తకు ఇద్దరు సంతానం ఉన్నారు. షెడ్లో పనిచేస్తున్న వారికి గత కొన్ని నెలలుగా జీతాలు రావడం లేదు. అయితే, ఇటీవల జీతం ఒక్కసారిగా రూ. 42,000 రావడంతో అదే షెడ్డు వద్ద రెండవ భర్తతో కలిసి మృతురాలు, కొడుకు మద్యం తాగుతున్నారు. మృతురాలి కొడుకు జాలయ్య మందు తాగడానికి డబ్బులు అడగడంతో నిరాకరించింది. దీంతో పక్కనే ఉన్న ఇనప రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశాడు. మృత్యురాలి భర్త శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకొని అన్ని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు జాలయ్య హత్య చేసి పారిపోగా చుండూరుపల్లిలో శనివారం అదువులోకి తీసుకుని కోర్టుకు హాజరు పరుస్తున్నామని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ కె. శ్రీనివాసరావు, రూరల్ ఎస్ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
మొబైల్ బుక్ కీపింగ్ సకాలంలో పూర్తి కాకపోతే చర్యలు
బాపట్ల టౌన్: మొబైల్ బుక్ కీపింగ్ నూరు శాతం పూర్తిచేయని వీఓఏలకు గౌరవ వేతనాలు నిలుపుదల చేస్తామని సెర్ఫ్ అడిషనల్ సీఈవో ఆర్. శ్రీరాములు తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వెలుగు సిబ్బందితో కలిసి శనివారం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఈటీసీ కార్యాలయంలో జిల్లాలోని 25 మండలాల ఏపీఎం, డీపీఎం అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 30 నాటికి మొబైల్ బుక్ కీపింగ్ని 100% పూర్తి చేయాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్. లవన్న మాట్లాడుతూ జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు గురించి గ్రూపు సంఘ సభ్యులకు అవగాహన కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో సెర్ఫ్ అధికారి ఎల్.వాల్మీకి, డీపీఎంలు, ఏపీఎంలు, సీ్త్ర నిధి సభ్యులు పాల్గొన్నారు. సెర్ఫ్ అడిషనల్ సీఈవో ఆర్. శ్రీరాములు -
భక్తి రసానందం పద్యనాటకాలు
తెనాలి: కళల కాణాచి, తెనాలి, ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో జాతీయస్థాయ పంచమ పద్యనాటక, సాంఘిక నాటక, నాటికల పోటీలు ‘వీణా అవార్డ్స్–2025’ శనివారం ఇక్కడ ప్రారంభమయ్యాయి. తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ప్రముఖ నటీమణి, పట్టణ కళాకారుల సంఘం అధ్యక్షురాలు, బుర్రా జయలక్ష్మి జ్యోతిప్రజ్వలనతో పోటీలను ఆరంభించారు. తొలిగా టీజీవీ కల్చరల్ అకాడమీ, కర్నూలు వారి ‘శ్రీవెంకటేశ్వర మహా త్మ్యం’ పద్యనాటకాన్ని ప్రదర్శించారు. శ్రీవెంకటేశ్వరుడిపై అమిత భక్తిభావం కలిగిన అనంతాచార్యుడు స్వామివారి కై ంకర్యాలు కోసం నియమితుడవటం, అందుకోసం ఆయన పడే కష్టాలు, చివరకు శ్రీవేంకటేశ్వరుడే మారురూపంలో వచ్చి సాయం చేయటం కథాంశం. శ్రీవెంకటేశ్వరుడుగా టి.రాజశేఖరరావు, అనంతాచార్యులుగా జె.మోహన్ నాయర్, మహాలక్ష్మిగా సురభి హారిక కార్తిక్, అలిమేలు మంగమ్మగా సురభి వెంగమాంబ నటించారు. సంగీతం పీజీ వెంకటేశ్వర్లు, శారదా ప్రసన్న రచనకు వీవీ రమణారెడ్డి దర్శకత్వం వహించారు. రెండో ప్రదర్శనగా పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు అండ్ లలిత కళాపరిషత్, అనంతపురం వారి ‘కాలభైరవ సంహారం’ పద్యనాటకాన్ని ప్రదర్శించారు. కీ.శే పోతులయ్య రచనకు రామగోంద్సాగర్ దర్శకత్వం వహించారు. శ్రీకృష్ణుడుగా గంటా శివశంకర్, కాలభైరవుడుగా దాసరి దయానంద్, దుర్యోధనుడుగా సోమర లక్ష్మీనారాయణ, నారదుడుగా సి.శ్రీరాములు, ద్రౌపదిగా ఎస్.విజయశారద నటించారు. రాత్రి చివరి ప్రదర్శనగా వెలగలేరు థియేటర్ ఆర్ట్స్, వెలగలేరు వారి ‘నల్లత్రాచు నీడలో’ సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. రచన, దర్శకత్వం శ్రీనివాసరావు పోలుదాసు, ప్రధాన పాత్రల్లో దర్శకుడు శ్రీనివాసరావు, సురభి లలిత, పవన్కళ్యాణ్, షణ్ముఖి నాగుమంత్ర, గోవర్ధనరెడ్డి, చైతన్య నటించారు. -
సాగర్ కాల్వలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు
కారెంపూడి: సాగర్ కుడి కాల్వలో సరదాగా ఈత కొడదామని యత్నించిన ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు మునిగి మృతి చెందిన ఘటన స్థానిక వినుకొండ రోడ్డు బ్రిడ్జి సమీపంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ వాసు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సరావుపేటకు చెందిన సయ్యద్ సత్తార్, ఖాదర్ వలి, నాగుల్ మీరాలు పదవ తరగతి చదువుతున్నారు. దసరా సెలవలు కావడంతో సయ్యద్ సత్తార్ ఇద్దరు మిత్రులతో కలసి కారెంపూడిలో ఉంటున్న పెద్దమ్మ జహీరా ఇంటికి వచ్చారు. బట్టలు ఉతికేందుకు వెళ్తున్న పెద్దమ్మ జహీరాతో పాటు వారు కూడా సాగర్ కాల్వ వద్దకు వచ్చారు. ఈత కొడదామని సరదా పడి ముగ్గురు కాల్వలో దిగారు. ప్రవాహ వేగానికి ముగ్గురు మునిగి కొట్టుకుపోతుండగా జహీరా పెద్ద పెట్టున ఏడుస్తూ కేకలు వేయడంతో ఆ సమీపంలో ఉన్న స్థానికులు గమనించి ఇద్దర్ని కాపాడి ఒడ్డుకు చేర్చారు. సయ్యద్ సత్తార్ను ఒడ్డుకు చేర్చేసరికే (15) ప్రాణాలు విడిచాడు, ఒక్కగానొక్క కుమారుడు మృతితో తల్లిదండ్రులు బంధువులు తల్లడిల్లిపోతున్నారు. నర్సరావుపేటకు చెందిన సయ్యద్ రహీమ్ వ్యవసాయదారుడు, ఆయనకు కుమారుడు కుమార్తె ఉన్నారు. కుమారుడు సత్తార్ కారెంపూడిలో ఉన్న తన అక్క దగ్గరకు సెలవుల్లో సరదాగా గడిపేందుకు వచ్చి ఇలా తనువు చాలించడంతో అందరు శోకసంద్రంలో మునిగిపోయారు. గురజాలలో పోస్టుమార్టం అనంతరం సయ్యద్ సత్తార్ మృతదేహాన్ని ఎస్ఐ వాసు బంధువులకు అప్పగించారు. వారిలో ఒకరు మృతి, ఇద్దరిని కాపాడిన స్థానికులు -
ఆట్యాపాట్యా రాష్ట్ర క్రీడల్లో గుంటూరుకు తృతీయ స్థానం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఆట్యాపాట్యా క్రీడా పోటీల్లో గుంటూరు జిల్లా బాలబాలికల జట్లు తృతీయ స్థానాలు దక్కించుకున్నాయని గుంటూరు జిల్లా ఆట్యా–పాట్యా అసోసియేషన్ కార్యదర్శి దావులూరి సుబ్బారావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పల్నాడు జిల్లా ఆట్యా–పాట్యా అసోసియేషన్ ఆధ్వర్యంలో నకరికల్లులోని వంగా వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 25, 26 తేదీల్లో నిర్వహించిన 12వ రాష్ట్ర స్థాయి సీనియర్ ఆట్యా–పాట్యా చాంపియన్ షిప్–2025 పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఈ విజయాలు నమోదు చేశారన్నారు. క్రీడాకారులను ఏపీ ఆట్యా–పాట్యా సీఈవో రంభ ప్రసాద్, కార్యదర్శి శ్రీ చరణ్, గుంటూరు జిల్లా అధ్యక్షులు కాళ్ల విజయ్కుమార్ తదితరులు అభినందించారని తెలిపారు. -
పనులు సకాలంలో పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ బాపట్ల: జల వనరుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన వివిధ పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. గుంటూరు సర్కిల్ పరిధిలోని పనులకు సంబంధించి శనివారం జిల్లా కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్సు హాల్లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరు సర్కిల్ పరిధిలోని బాపట్ల జిల్లాలో సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని భూములకు సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 716 పనులు చేపట్టినట్లు, వాటిలో 148 పూర్తి అయ్యాయని, మిగతా పనులు పలు దశలలో ఉన్నాయని జిల్లా వాటర్ రీసోర్సెస్ అధికారి అబా అబుతలీమ్ ఈ సందర్భంగా కలెక్టరుకు వివరించారు. ‘జీఎస్టీ తగ్గింపు’ ప్రయోజనాలపై హెల్ప్ డెస్క్ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్పై జిల్లా కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. జీఎస్టీ కమిషనర్ మురళీకృష్ణతో కలసి శనివారం జిల్లా కలెక్టరేట్లో హెల్ప్ డెస్కును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అంతకు ముందు జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు, జీఎస్టీ కమిషనర్ మురళికృష్ణ, డ్వామా పీడీ విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏఓ మల్లికార్జున రావులతో కలసి కరపత్రాలను విడుదల చేశారు. వసతుల కల్పనకు చర్యలు జిల్లాలో పర్యాటకాభివృద్ధిలో భాగస్వాములయ్యే సంస్థలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. శనివారం పర్యాటక శాఖ అధికారులు, పలు సంబంధిత సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. చెత్త తరలించాలి బాపట్ల డంపింగ్ యార్డ్లోని వ్యర్థాలను నిర్దిష్ట కాలపరిమితిలోపు నిర్దేశిత ప్రాంతానికి తరలించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. శనివారం బాపట్ల జమ్ములపాలెం రోడ్డులోని డంపింగ్ యార్డ్ను ఆయన పరిశీలించారు. -
ఇంట్లో అర కిలో బంగారం, వెండి చోరీ
మార్టూరు: మండలంలోని వలపర్ల గ్రామంలో అరకిలో బంగారం, వెండి వస్తువులు చోరీకి గురైన ఘటన శనివారం వెలుగు చూసింది. బాధితుల వివరాల మేరకు.. వలపర్లకు చెందిన కారంపూడి కొండలు, నాగిని దంపతులు వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరు స్థానిక సినిమా హాల్ సెంటర్ సమీపంలో గ్రామానికి దూరంగా ఇటీవల కొత్తగా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. దసరా సెలవులు ప్రారంభం కాగానే గత ఆదివారం ఇద్దరు కలిసి కర్ణాటక రాష్ట్రంలో ఉంటున్న తమ కుమార్తెను చూడటం కోసం వెళ్లారు. శనివారం సాయంత్రం ఇంటికి వచ్చిన కొండలు దంపతులు ఇంటి తలుపులకు వేసిన తాళం ధ్వంసం చేసి ఉండటాన్ని గమనించారు. లోపల వైపు తలుపులు బీరువాలు ధ్వంసం చేసి ఉండటానికి గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, సంతమాగులూరు సీఐ, బల్లి కురవ ఎస్సైలతో కలిసి ఘటనా స్థలిని పరిశీలించారు. -
కరుణించవమ్మా...
శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. దసరా సందర్భంగా ఉత్సవాలు శనివారంతో ఆరో రోజుకు చేరాయి. జిల్లాలోని వివిధ దేవస్థానాలలో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కరుణించవమ్మా.. అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి గ్రామంలో అమ్మవారిని రూ.1.41 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించి, పూజలు నిర్వహించారు. చెరుకుపల్లి మండలంలోని గుళ్లపల్లి ఆనందీశ్వర స్వామి దేవస్థానంలో శ్రీమహంకాళి అమ్మవారు, చెరుకుపల్లిలోని ఆర్యవైశ్య సత్రంలో, బాలకోటేశ్వర స్వామి ఆలయంలో కనగాల పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో కరెన్సీ నోట్లతో అమ్మవారు శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని కనులారా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి, భక్తి గీతాలు ఆలపించారు. ఏర్పాట్లను పర్యవేక్షించిన నిర్వాహకులు.. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. – మార్టూరు/చెరుకుపల్లికనగాల పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరణ జొన్నతాళి గ్రామంలో కరెన్సీ నోట్ల అలంకరణలో అమ్మవారు గుళ్లపల్లి ఆనందీశ్వర స్వామి దేవస్థానంలో లలితాత్రిపుర సుందరీదేవిగా అమ్మవారు -
నిండుకుండలా కృష్ణమ్మ
కొల్లూరు: కృష్ణమ్మ నిండుకుండలా ప్రవహిస్తోంది. పంటలు ముంపు బారిన పడతాయన్న ఆందోళన రైతాంగాన్ని పట్టి పీడిస్తోంది. శనివారం ఉదయం ప్రకాశం బ్యారేజ్ నుంచి 2,26,293 క్యూసెక్కులకు నీటి విడుదల పరిమితం కావడంతో వరద ప్రభావం తగ్గిందని ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మధ్యాహ్నం నుంచి వరద తీవ్రత గణనీయంగా పెరుగుతూ వచ్చింది. సాయంత్రానికి 1,58,232 క్యూసెక్కులు... తర్వాత 3,84,525 క్యూసెక్కులకు చేరింది. ప్రకాశం బ్యారేజ్కు శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీటికి తోడు హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాల కారణంగా మూసీ నది, తెలంగాణలోని ఖమ్మం ప్రాంతం నుంచి ప్రవహించే మున్నేరు వరద కూడా ఉద్ధృత రూపం దాల్చడంతో నదిలో వరద క్రమంగా అధికమైంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి 3.75 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదలడం కారణంగా మండలంలోని పెసర్లంక, గాజుల్లంక, ఆవులవారిపాలెం గ్రామాల చుట్టూ నీరు చుట్టుముట్టింది. దోనేపూడి లోలెవల్ చప్టాపై వరద ప్రవాహం కొనసాగుతుండటంతో పది లంక గ్రామాల ప్రజలు రాకపోకలకు చుట్టు మార్గంలో ప్రయాణించాల్సి వస్తోంది. ఆదివారానికి 5 లక్షల నుంచి 6 లక్షల క్యూసెక్కులకు నీటి విడుదల చేరవచ్చునని ఆర్సీ, నీటిపారుదల శాఖాధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నీటి విడుదల పరిమాణం పెరిగిన పక్షంలో శనివారం అర్ధరాత్రి నుంచి బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఆదివారం రెండో ప్రమాద హెచ్చరిక సైతం వెలువడవచ్చునని అధికారులు పేర్కొన్నారు. -
ట్రాక్టర్ కింద నలిగిన రెండు ప్రాణాలు
అద్దంకి: డ్రైవర్ మద్యం మత్తు కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ట్రాక్టరు కింద పడి కూలీలు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటన మండలంలోని తిమ్మాయపాలెంలోని దర్శి–అద్దంకి రహదారిలో శనివారం చోటుచేసుకుంది. మృతుల బంధువుల కథనం మేరకు.. తిమ్మాయపాలెం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన వేము నరసమ్మ (60), కొప్పోలు స్వరూపారాణి (47)లు ప్రకాశం జిల్లా పోలవరం గ్రామంలో కూలీ పనుల కోసం వెళ్తున్నారు. గ్రామంలోని బట్టీ వద్ద ఇటుకలు లోడు చేసుకుని ఓ ట్రాక్టర్ దర్శి వైపు వెళ్తోంది. ఇటుక ఎత్తిన కూలీలను గ్రామంలో దించాక దర్శి రహదారిలో ట్రాక్టర్ను డ్రైవర్ రవి నడుపుతున్నాడు. అటుగా వెళ్తున్న నలుగురు కూలీలను ట్రాక్టర్లో ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లిన తరువాత అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లింది. ఒక వైపు బానెట్పై కూర్చుని ఉన్న నర్సమ్మ, స్వరూపారాణి జారి ట్రాక్టర్ కింద పడి అక్కడిక్కడే మృతి చెందారు. అదే సమయంలో రోడ్డుపక్కన ఇంటి ముందు పని చేసుకుంటున్న టి. శ్రీనివాసరావు ఇంకుడు గుంతలో కూర్చోవడంతో గాయాలు మాత్రమే అయ్యాయి. ఆయన్ను వైద్యశాలకు తరలించారు. మద్యం మత్తులో డ్రైవర్.. నర్సమ్మకు ముగ్గురు పిల్లలు. ఐదు సంవత్సరాల క్రితం భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. స్వరూపారాణికి భర్త రవి, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కాలనీకి చెందిన ఇరువురు మృతి చెందడంతో బంధువులు, స్థానికులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. అదే ట్రాక్టర్పై ఉన్న మరో ఇరువురు కూలీలు తెలిపిన వివరాల మేరకు.. బస్సు కోసం వేచి చూస్తున్న కూలీలను ట్రాక్టర్ డ్రైవర్ పిలిచాడన్నారు. మద్యం మత్తుగా ఉన్నాడని, దాంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. తాము రెండో వైపు ఉండడంతో బతికామని పేర్కొన్నారు. ఇరువురు కిందపడ్డారని కేకలు వేసినా డ్రైవర్ పట్టించుకోలేదని వాపోయారు. రోజూ తమతో కూలీ పనులు చేసుకునే ఇద్దరు తమ కళ్లముందే మృత్యువాత పడడంతో నోట మాట రాలేదని కన్నీటిపర్యంతం అయ్యారు. డ్రైవర్కు మృతుల బంధువులు దేహశుద్ధి చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. నష్టపరిహారం చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు, దళిత సంఘాల నేతలు శనివారం రాత్రి ఆందోళన చేశారు. -
పార్టీ శ్రేణులకు భరోసా.. ‘డిజిటల్ బుక్’
బాపట్ల: వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ భరోసాగా ఉంటుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం ఆరాచకాలు చేస్తోందని పేర్కొన్నారు. పరిపాలనకు పక్కన పెట్టి ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తోందని కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్నందుకు వైఎస్సార్సీపీ వారిని వేధిస్తోందన్నారు. డిజిటల్ బుక్లో తమ సమస్యలను నమోదు చేసుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారిస్తామని మాజీ సీఎం, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం గొప్ప విషయమన్నారు. శ్రేణులు ఇబ్బందులు ఎదురైతే ఈ యాప్లో సమగ్ర వివరాలు నమోదు చేయాలని కోరారు. భయపడొద్దు... అండగా పార్టీ ఉంది.. కూటమి ప్రభుత్వ అరాచకాలకు భయపడొద్దని, వైఎస్సార్సీపీ శ్రేణులకు పార్టీ అండగా ఉంటుందని జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి పేర్కొన్నారు. దుర్మార్గమైన పాలన రాష్ట్రంలో నడుస్తోందన్నారు. లోకేష్ రెడ్బుక్ పాలన చూస్తున్న మనకు త్వరలో డిజిటల్ బుక్ పాలన అందించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాబోతోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి నక్కా వీరారెడ్డి, జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, మార్కెట్యార్డు మాజీ చైర్మన్ గవిని కృష్ణమూర్తి, ఇనగలూరి మాల్యాద్రి, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, ఎస్సీ సెల్ నాయకులు వడ్డిముక్కల డేవిడ్ , జోగి రాజా, అడే చందు, మోర్ల సముద్రాలగౌడ్, బడుగు ప్రకాశ్, కటికల యోహోషువా తదితరులు ఉన్నారు. -
బాధితులకు అండగా ఉంటాం
మార్టూరు: బాధిత కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని.. ఎవరూ అధైర్యపడొద్దని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి అన్నారు. శనివారం మార్టూరు మండలంలోని డేగరమూడి గ్రామానికి చెందిన దళిత యువకులు ప్రమాద్, పోతులూరిలను పరామర్శించారు. మార్టూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన దళిత యువకులను మార్టూరు సీఐ మద్దినేని శేషగిరిరావు అత్యంత క్రూరంగా పోలీస్ స్టేషన్కు పిలిపించి చిత్రహింసలకు గురిచేసిన ఘటనకు స్పందించిన ఆయన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు కోసం యాక్టివ్గా ఉన్న వారిపై రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి అక్రమ కేసులు బనాయించారన్నారు. వారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో టీడీపీ ఫ్లెక్సీని చించివేశారంటూ పోలీసే స్టేషన్కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసి ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం శాశ్వతం కాదు.. నిజంగా తప్పు చేస్తే కేసు ఫైల్ చేసి శిక్షించాలిగానీ, వారిని ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన అధికారులను ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిపోతుంటాయని చెప్పారు. దానిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు నడుచుకోవాలని పేర్కొన్నారు. ఈ ఘటనను ఇంతటితో వదలిపెట్టకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసికట్టుగా పోరాడి బాధితులకు అండగా నిలుస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో తమ పార్టీ నాయకులతో మాట్లాడి చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు వాసు, మార్టూరు మండల పార్టీ కన్వీనర్ జంపని వీరయ్య చౌదరి, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి ఉప్పలపాటి అనిల్ చౌదరి, జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నూతలపాటి బలరాం, మార్టూరు టౌన్ అధ్యక్షుడు అడకా గంగయ్య, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి అట్లూరి వెంకయ్య, మండల ఉపాధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా, మైలా నాగేశ్వరరావు, బూరగ రాము, తమ్మలూరి సురేష్, రాజుపాలెం అంజిబాబు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిన్న నాయక్, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
దళిత యువకులపై సీఐ దాష్టీకం
మార్టూరు: బాపట్ల జిల్లాలో ఇద్దరు దళిత యువకుల్ని పోలీస్ స్టేషన్లో దారుణంగా హింసించారు. టీడీపీ నేతలు చేయించిన తప్పుడు ఫిర్యాదుతో శుక్రవారం వారిని స్టేషన్కు పిలిపించి బూటుకాళ్లతో సీఐ తొక్కిపట్టి ఇద్దరు పోలీసులతో అరికాళ్లపై లాఠీలతో కొట్టించారు. తరువాత మరింత అమానుషంగా గులకరాళ్లపై నడిపించారు. ఈ విషయం ఎక్కడైనా చెబితే మళ్లీ ఇదేగతి పడుతుందని హెచ్చరించారు. మార్టూరు మండలం డేగరమూడికి చెందిన బాధిత యువకులు శుక్రవారం డేగరమూడిలో ఈ దారుణం గురించి వివరించారు. సీఐ మీద చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని కోరారు. బాధితుల కథనం మేరకు.. డేగరమూడిలో నెలరోజులుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహస్థాపన విషయమై వివాదం నెలకొంది. సర్పంచ్ భర్త, వైఎస్సార్సీపీ మండల కన్వినర్ జంపని వీరయ్యచౌదరి సహాయంతో స్థానిక ఎస్సీ కాలనీ యువకులు అల్లడి ప్రమోద్కుమార్, జ్యోతి పోతులూరి ఈ విగ్రహస్థాపనలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరిమీద కక్షగట్టిన స్థానిక అధికారపార్టీ నాయకులు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయించారు. గ్రామానికి చెందిన అన్నం హనుమంతరావుతో టీడీపీ నాయకుల ఫ్లెక్సీలను తొలగించారు. తరువాత హనుమంతరావును పోలీస్ స్టేషన్కు పంపించి.. దళిత యువకులు ప్రమోద్కుమార్, పోతులూరి ఫ్లెక్సీలు తొలగించారంటూ తప్పుడు ఫిర్యాదు చేయించారు. రంగంలోకి దిగిన సీఐ శేషగిరి శుక్రవారం ఉదయం ప్రమోద్కుమార్, పోతులూరిలను స్టేషన్కు పిలిపించారు. వాళ్లు వచ్చీరాగానే రాజకీయాలు మీకు అవసరమంట్రా అంటూ నానా దుర్భాషలాడుతూ విరుచుకుపడ్డారు. వారిని గదిలో గోడపక్కన కూర్చోబెట్టి వారి కాళ్లను సీఐ శేషగిరి బూటుకాళ్లతో తొక్కిపట్టారు. ఇద్దరు సిబ్బంది లాఠీలతో ఆ యువకుల అరికాళ్లపై తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలతో వారి అరికాళ్లపై బొబ్బలొచ్చాయి. తరువాత సీఐ ఆ ఇద్దరిని బొబ్బలు తగ్గేవరకు కంకరరాళ్లపై నడిపించారు. తరువాత వారిద్దరితో తెల్లకాగితాల మీద సంతకాలు చేయించుకున్నారు. ఈ విషయం ఎక్కడైనా చెబితే మళ్లీ ఇదేగతి పడుతుందని హెచ్చరించి మధ్యాహ్నం వదిలిపెట్టారు. తప్పుడు ఫిర్యాదు చేయించారు స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన బాధిత యువకులు తమపై తప్పుడు ఫిర్యాదు చేసిన అన్నం హనుమంతరావును ఇలా ఎందుకు చేశావని నిలదీశారు. గ్రామ నాయకులు మద్యం పోయించి, కొట్టి, తనచేత ఫ్లెక్సీలు తొలగింపజేశారని, తరువాత డబ్బిస్తామని ఆశచూపి ఫిర్యాదు చేయమంటే చేశానని హనుమంతరావు చెప్పాడు. హనుమంతరావు చెప్పిన ఈ విషయాన్ని బాధిత యువకులు వీడియో రికార్డు చేశారు. తమను హింసించిన సీఐపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని వారు జిల్లా ఎస్పీని కోరారు. -
డిజిటల్ అరెస్ట్ను ఛేదించిన పోలీసులు
బాపట్ల టౌన్: డిజిటల్ అరెస్ట్ అంటూ రిటైర్డ్ ప్రభుత్వ వైద్యుడిని బెదిరించి రూ.1.10 కోట్లు కొల్లగొట్టిన కేసును బాపట్ల పోలీసులు ఛేదించారు. కర్ణాటకకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.55 లక్షలను ఫ్రీజ్ చేయించారు. ఈ కేసు వివరాలను బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ శుక్రవారం వివరించారు. ఎస్పీ తెలిపిన వివరాల మేరకు.. చీరాల పట్టణానికి చెందిన విశ్రాంత వైద్యుడికి ఈ నెల 9న తొలుత ట్రాయ్ (టెలికమ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి మాట్లాడుతున్నామని అంటూ కాల్ వచ్చింది. అదే రోజు మధ్యాహ్నం ఇన్కంట్యాక్స్ విభాగం నుంచి మాట్లాడుతున్నామని అంటూ మరో కాల్ వచ్చింది. ఈ నెల 10న మీపై ట్రాయ్, ఇన్కంట్యాక్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా దర్యాప్తు చేస్తున్నాం.. సీబీఐ అధికారులమంటూ యూనిఫాంలో ఉన్న నకిలీ పోలీసులు వీడియో కాల్ చేశారు. ఈ కేసులో భాగంగా మీ ఇంట్లో సోదాలు నిర్వహించాలంటూ బెదిరించారు. అలా జరగకుండా ఉండాలంటే ముందు రూ.1.10 కోట్లు చెల్లించాలని, దర్యాప్తులో నిర్దోషి అయితే డబ్బు బ్యాంకు ఖాతాకు వాపసు చేస్తామని చెప్పారు. ఇది నిజమని నమ్మిన ఆయన ఈనెల 11న వారు పంపించిన ఎస్ బ్యాంక్ అకౌంట్కు రూ.50 లక్షలు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అకౌంట్కు రూ.50 లక్షలు జమ చేశారు. ఈ నెల 17న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అకౌంట్కు మరో రూ.10 లక్షలు జమ చేశారు. తరువాత వారి నుంచి ఫోన్ రాకపోవడంతో అనుమానించిన ఆయన ఈ నెల 19న చీరాల వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇది కర్ణాటకకు చెందిన వ్యక్తుల మోసమని గుర్తించారు. చీరాల వన్టౌన్ సీఐ, జిల్లా ఐటీ కోర్ సిబ్బంది కొందరు కర్ణాటక వెళ్లి ఇద్దరిని అరెస్టు చేసి తీసుకొచ్చి శుక్రవారం బాపట్ల కోర్టులో హాజరుపరిచారు. విచారణలో తమతోపాటు తమిళనాడు, ఇతర దేశాలకు చెందినవారు ఈ ముఠాలో ఉన్నట్లు నిందితులు తెలిపారు. అరెస్టు చేసిన వారి నుంచి రూ.2.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల్లోని ఖాతాల్లో ఉన్న రూ.55 లక్షల్ని ఫ్రీజ్ చేయించారు. కేసును త్వరితగతిన ఛేదించిన చీరాల వన్టౌన్ సీఐ, చీరాల డీఎస్పీ, జిల్లా ఐటీ కోర్ బృందాన్ని ఎస్పీ అభినందించారు. -
బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి
పట్నంబజారు: అసెంబ్లీ సాక్షిగా నటుడు చిరంజీవి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిలపై ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్రెడ్డి ధ్వజమెత్తారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో యువజన విభాగం నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కనీస విజ్ఞత లేకుండా సభా మర్యాద తెలియని బాలకృష్ణ తాను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న మద్యాన్ని తాగి వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తోందని విమర్శించారు. మాజీ సీఎం వై.ఎస్.జగన్ ద్వారా ఎంతో లబ్ధి పొందిన విషయాన్ని గుర్తించాలన్నారు. బసవతారకం హాస్పిటల్కు సంబంధించి పెండింగ్ బిల్లులను టీడీపీ హయాంలో ఇవ్వకపోతే, స్వయంగా వై.ఎస్.జగన్ వాటిని విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి వెంటనే రాజకీయం చేయకుండా బాలకృష్ణ జీవితాన్ని కాపాడిన విషయాన్ని గుర్తుచేశారు. తండ్రిపై చెప్పులు వేయించిన వ్యక్తితో పయనిస్తున్న బాలకృష్ణకు, తండ్రి ఆశయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వై.ఎస్.జగన్ను విమర్శించే స్థాయి లేదన్నారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్టీ యువజన విభాగం నగర అధ్యక్షుడు యేటి కోటేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ సినిమా వాళ్లను అవమానించారంటూ పిచ్చిబట్టిన వ్యాఖ్యలు చేస్తూ వై.ఎస్.జగన్పై కూటమి నేతలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారన్నారు. ప్రజా సమస్యలు చర్చించిన పాపాన పోలేదని మండిపడ్డారు. సినిమా డైలాగులు చెప్పడం తప్ప, కనీసం మాట్లాడలేని బాలకృష్ణ ఒక సైకో అని మండి పడ్డారు సమావేశంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం నేతలు వేలూరి అనిల్రెడ్డి, కానూరి శశిధర్, వెంకటేష్రెడ్డి, దానం వినోద్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్రెడ్డి -
97 రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు
తాడికొండ: అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన పెనుమాక (జరీబు, మెట్ట), మల్కాపురం(ప్రత్యామ్నాయ ప్లాట్లు) గ్రామాల రైతులకు శుక్రవారం విజయవాడలోని ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో ఈ– లాటరీ విధానంలో 97 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. వీటిలో 41 నివాస ప్లాట్లు కాగా, 36 వాణిజ్య ప్లాట్లు, 20 ప్రత్యామ్నాయ ప్లాట్లు ఉన్నాయి. మొత్తంగా 56 మంది రైతులు, భూయజమానులకు ప్లాట్లను కేటాయించారు. అధికారులు ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేశారు. డైరెక్టర్(ల్యాండ్స్)/స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్– క్యాపిటల్ సిటీ) ఎన్వీఎస్బీ వసంతరాయుడు మాట్లాడుతూ రైతులకు భౌగోళికంగా ప్లాట్లు ఎక్కడ కేటాయించబడ్డాయో వివరించడానికి ప్రత్యేకంగా జి.ఐ.ఎస్. సిబ్బంది, గ్రామ సర్వేయర్లను నియమించామన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు. రుసుము వసూలు చేయబడదని రైతులు గమనించాలని కోరారు. -
డీఎస్సీ ఉపాధ్యాయులకు తప్పిన ప్రమాదం
ప్రత్తిపాడు: హైవేపై పెను ప్రమాదం తప్పింది. మార్జిన్లో నిలిపి ఉంచిన ఫర్నీచర్ లోడ్ ఆటోను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 40 మంది డీఎస్సీ ఉపాధ్యాయులకు ప్రమాదం తప్పిపోవడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా అచంట మండలం కొండమంచిలి గ్రామానికి చెందిన మానూరి త్రినాథ్ గత కొంతకాలంగా విజయవాడలో నివాసం ఉంటూ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 25వ తేదీ రాత్రి త్రినాథ్ తన మేనల్లుడు పొదిలి మోషేకుతో కలసి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నుంచి ట్రాలీ ఆటోలో కుర్చీల లోడుతో తిరుపతికి బయల్దేరాడు. మార్గమధ్యలో అర్ధరాత్రి సమయంలో ఆటో నడుపుతున్న మహేష్ కాలకృత్యాల కోసం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం సమీపంలో పదహారో నంబరు జాతీయ రహదారిపై మార్జిన్లో ఆటో నిలిపాడు. తర్వాత కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఇటీవల డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన సుమారు 40 మంది ఉపాధ్యాయులతో గుంటూరు వైపు నుంచి చిలకలూరిపేట వైపు వెళుతున్న కనిగిరి డిపో ఆర్టీసీ బస్సు వేగంగా ఆ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. ఆటోలో ఉన్న త్రినాథ్తోపాటు ఆటో కూడా సైడు కాలువలోనికి దూసుకుపోయింది. ప్రమాదంలో ఆటో పూర్తిగా దెబ్బతినగా, త్రినాథ్కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న 40 మంది డీఎస్సీ ఉపాధ్యాయులకు ఎలాంటి నష్టం జరగలేదు. వీరంతా గురువారం రాజధానిలో జరిగిన సీఎం సభకు హాజరై రాత్రికి తిరుగు పయనమయ్యారు. త్రినాథ్ను చిలకలూరిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇచ్చిన పిర్యాదు మేరకు ప్రత్తిపాడు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎన్. నరహరి తెలిపారు. -
ఇద్దరు విద్యార్థుల ఉసురు తీసిన కాలేజీ బస్సు
పొదిలి: దసరా పండగను స్వగ్రామంలో జరుపుకొనేందుకు బయల్దేరిన ఇద్దరు బీటెక్ విద్యార్థులను ఓ కాలేజీ బస్సు పొట్టన పెట్టుకుంది. వరుసకు అన్నదమ్ములైన వీరు బైకుపై విజయవాడ నుంచి స్వగ్రామం హనుమంతునిపాడుకు బయల్దేరారు. ఈ క్రమంలో శుక్రవారం పోతవరం వద్ద ఓ కాలేజీ బస్సు ఢీకొనటంతో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వివరాలు.. మచ్చా బ్రహ్మయ్య (19), బండ్లమూడి గురువిష్ణు (22) అక్కాచెల్లెళ్ల కుమారులు. విజయవాడలో బీటెక్ చదువుతున్నారు. గురువిష్ణు కుటుంబం విజయవాడలో, బ్రహ్మయ్య కుటుంబం హనుమంతునిపాడులో ఉంటోంది. దసరా పండగకు హనుమంతునిపాడులో గడిపేందుకు బైకుపై శుక్రవారం ఉదయం బయల్దేరారు. వేగంగా వస్తున్న కాలేజీ బస్సు యువకులను ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడే కిందపడి ప్రాణాలు కోల్పోయారు. మోటారు సైకిల్ దూరంగా పడి ఉంది. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణంగా భావిస్తున్న కాలేజీ బస్సును పోలీసుస్టేషన్కు తరలించారు. భీతావహంగా సంఘటన స్థలం ప్రమాద స్థలం భీతావహంగా మారింది. ఒక యువకుడి మెదడు చిదిరి రోడ్డంతా పడింది. వర్షం కురుస్తుండటంతో రక్తంతో రోడ్డంతా ఎరుపెక్కింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. శరీర భాగాలు దూరంగా ఎగిరిపడ్డాయి. బ్యాగ్లు, పిండి ప్యాకెట్ సంఘటన స్థలంలో పడి ఉన్నాయి. తొలుత గుర్తు తెలియని వాహనంగా అనుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ఓ ప్రైవేటు కాలేజీ బస్సు సంఘటనకు కారణంగా అనుమానించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేయడంతో బస్సు వివరాలు తేలాయి. కంభాలపాడు వైపు నుంచి పిల్లలను ఎక్కించుకుని విశ్వనాథపురానికి వస్తున్న బస్సు మధ్యలో పోతవరం విద్యార్థులు చేయెత్తినా ఆపకుండా వెళ్లింది. ఈ క్రమంలో విద్యార్థులను విచారించగా... ఆ బస్సే ప్రమాదానికి కారణమని తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పండగకు వస్తూ పరలోకాలకు.. మృతుల తల్లులు తిరుపతమ్మ, రమణమ్మలు అక్కాచెల్లెళ్లు. వీరిది వెలిగండ్ల మండలం పూలికుంట్ల. బ్రహ్మయ్య తల్లిదండ్రులు హనుమంతునిపాడులో నివాసం ఉంటున్నారు. ఇంటర్ వరకు కనిగిరిలో చదివిన బ్రహ్మయ్య.. బీటెక్ చదివేందుకు విజయవాడలో చేరి హాస్టల్లో ఉంటున్నాడు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న బండ్లమూడి రాజా, రమణమ్మల కుమారుడైన విష్ణు విజయవాడలోనే బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. సెలవులు ఇవ్వడంతో విష్ణు, బ్రహ్మయ్యలు పండగ ఆనందంగా గడిపేందుకు వస్తుండగా బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ప్రభుత్వ వైద్యశాలకు చేరిన కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
సమర్థంగా ప్రభుత్వ పథకాల అమలు
అధికారులకు కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశం బాపట్ల: జిల్లాలో సూపర్ సిక్స్ పథకాలను సమర్థంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో గురువారం పథకాల అమలుపై ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పథకాలను పారదర్శకంగా ప్రజలకు చేరువు చేయడానికి కృషి చేయాలని తెలిపారు. అన్నదాత సుఖీభవ, ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకాలను అర్హులందరికీ అందజేయాలని చెప్పారు. జిల్లాలో సీ్త్ర శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, డిపోల్లో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా మరుగు దొడ్లు నిర్మించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణులయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆ శాఖ అధికారులకు చెప్పారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం రుచిగా, సుచిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని హాస్టళ్లలో మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని ఆయన చెప్పారు. సమావేశంలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ లవన్న, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శివలీల, జిల్లా ప్రజా రవాణా అధికారి సామ్రాజ్యం పాల్గొన్నారు. పరిశుభ్రతతోనే ఆరోగ్య సమాజం చీరాల అర్బన్: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. గురువారం చీరాల పట్టణంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద నుంచి గడియార స్తంభం సెంటర్ వరకు కలెక్టర్ అధికారులతో కలిసి చీపురు చేతపట్టి, రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వారు స్వయంగా చీపుర్లు చేత పట్టాలన్నారు. పరిసరాలను శుభ్రం చేయడం ద్వారా పరిశుభ్రత ప్రాధాన్యాన్ని ఇతరులకు తెలియచెప్పే ప్రయత్నం చేయాలని తెలిపారు. రోడ్లుపై చెత్తను నిల్వ ఉంచకుండా షాపుల నిర్వాహకులు కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. చెత్త పేరుకుపోవడం వల్ల నీరు నిలిచి దోమల వ్యాప్తి చెంది, విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితులు రాకుండా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. స్వచ్ఛ బాపట్ల.. స్వచ్ఛ చీరాలలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పారు. బాపట్ల జిల్లాలో త్వరలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించనున్నామని వెల్లడించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, ప్రజలు కూడా వినియోగాన్ని తగ్గించి వస్త్రాలతో తయారు చేసిన సంచులను వాడాలని ఆయన సూచించారు. చీరాల మున్సిపాలిటీలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని, వినియోగిస్తే జరిమానా విధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ గోపీకృష్ణ, మున్సిపల్ చైర్మన్ ఎం. సాంబశివరావు, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, మున్సిపల్ వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య, కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల: జిల్లాలోని రైతులందరికీ వారి అవసరాల మేరకు యూరియాను వ్యవసాయ శాఖ అధికారులు పంపిణీ చేస్తున్నారని కలెక్టర్ వి.వినోద్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలోని 26 రైతు భరోసా కేంద్రాలు, పరపతి సంఘాల ద్వారా 318 మెట్రిక్ టన్నుల యూరియాను 3,452 మంది రైతులకు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంకా 112 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని కలెక్టర్ తెలిపారు. -
మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి
చినగంజాం: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో వంద మంది తెలుగు మహనీయుల విగ్రహాలతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహా నిర్మాణం చేయాలని ఊరూర జన విజ్ఞానం రాష్ట్ర అధ్యక్షుడు కోట వెంకటేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నవ్యాంధ్ర రాష్ట్ర సాంస్కృతిక చైతన్య ప్రచార కార్యక్రమంలో భాగంగా కడవకుదురులో నవ్యాంధ్ర సాంస్కృతిక కళాయాత్ర నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు విజ్ఞప్తులపై స్థానిక ప్రజా చైతన్య కళావేదిక సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి ఇనేళ్లయినా సరైన అభివృద్ధి జరగలేదన్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టణం, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఆహ్వాన కమిటీలు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసే ఐదు విజ్ఞప్తులపై కార్యక్రమంలో వివరించారు. ఆరిగ వెంకట్రావు, కాళిదాస్, పల్లపోలు నాగమనోహర లోహియా, సుంకర కోటేశ్వరరావు, వారు ముసలారెడ్డి, దైవాల తిరుపతిరెడ్డి, ఎం. గోపాల్, ఏడుకొండలు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
● భక్తుల పాలిట కల్పవల్లి కాత్యాయని దేవి
జిల్లావ్యాప్తంగా దేవీ శరన్నవరాత్య్రుత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. గురువారం పలు ఆలయాల్లో కాత్యాయని దేవిగా అమ్మవారు దర్శనమించారు. భక్తులు పెద్దఎత్తున దర్శించుకుని పూజలు నిర్వహించారు. కాత్యాయని దేవిని పూజిస్తే చదుర్విద పురుషార్థాలు సిద్ధిస్తాయని, రోగాల భయాలు నశిస్తాయని, ఆయురారోగ్యాలు, సుఖఃసంతోషాలు వర్ధిల్లుతాయని భక్తుల నమ్మకం. – సాక్షి, నెట్వర్క్ పెదపులిపర్రులో ప్రత్యేక అలంకరణలో గోగులాంబ అమ్మవారుఅన్నపూర్ణాదేవిగా జిల్లేళ్లమూడి అమ్మ బాపట్ల రాజీవ్గాంధీ కాలనీలో శ్రీ కాత్యాయని దేవిగా.. చందోలులో నృసింహ, వారాహి అవతారంలో బగళాముఖి అమ్మవారు -
గతాన్ని మరిచిన బాలకృష్ణ
తాడికొండ: మెంటల్ సర్టిఫికెట్తో హత్యకేసు నుంచి బయటపడిన బాలకృష్ణ గతాన్ని మరిచి మాట్లాడటం దుర్మార్గమని, ఆయన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని మాజీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. బెల్లంకొండ సురేష్పై బాలకృష్ణ ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందో ఓ సారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. నాడు దిగంవత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి లేకపోతే నీ గతి ఏమై ఉండేదో ఆలోచించుకోవాలని, అప్పుడే నువ్వు జైలు పాలు అయ్యేవాడివనే గతాన్ని గుర్తుంచుకొని మాట్లాడితే మంచిదన్నారు. అప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కాళ్లు పట్టుకొనే నువ్వు కేసు నుంచి తప్పించుకున్నావని గుర్తుంచుకొని మాట్లాడితే మంచిదని, కక్షపూరిత రాజకీయాలు, అబద్ధపు హామీలు, మాటలు వైఎస్సార్ కుటుంబానికి లేవు, రావనే నిజం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని బాలకృష్ణ తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. గతాన్ని మర్చిపోయి బాలకృష్ణ ప్రవర్తించిన తీరుపై సినీనటుడు చిరంజీవి సైతం హుందాగా స్పందించారని, ప్రజా ప్రతినిధిగా ఉన్న బాలకృష్ణ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకొని క్షమాపణ చెపితే మంచిదని లేదంటే నీకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. మెంటల్ సర్టిఫికెట్ ఉన్న వ్యక్తులు అసెంబ్లీకి అనర్హులని, బాలకృష్ణ ముందు ఆ సంగతి తేల్చుకొని చట్టసభల్లో మాట్లాడాలని హెచ్చరించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ -
ఖాతాదారులకు బురిడీ
బాపట్ల టౌన్: బాపట్ల పట్టణంలోని ఏజీ కళాశాల రోడ్డులో ఏర్పాటు చేసిన హెచ్ఎంఎఫ్ఎల్ (హిందూస్థాన్ మైక్రోఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెట్) పరిధిలో బాపట్ల జిల్లాలోని సుమారు 350 మందికిపైగా ఖాతాదారులు వివిధ రూపాలలో రూ. కోట్లలో రుణాలు తీసుకున్నట్లు సమాచారం. విడతలవారీగా ఈఎంఐలు చెల్లించినప్పటికీ అవి సంస్థ ఖాతాలో జమ చేయటం లేదనే ఆరోపణలు వచ్చాయి. ఖాతాదారులు వారం రోజులుగా కార్యాలయం చుట్టూ తిరిగి తమ అకౌంట్లకు సంబంధించిన స్టేట్మెంట్లు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మేనేజర్ అందుబాటులో లేకపోవడంతో తిరుగు పయనమవుతున్నారు. ఉన్నతాధికారులను కలిసినా ఫలితం శూన్యం ఈఎంఐలు చెల్లించినప్పటికీ తమ అప్పు యథావిధిగా ఉందనే విషయం తెలుసుకున్న ఖాతాదారులు సదరు మేనేజర్ తీరుపై విజయవాడ రీజినల్ మేనేజరు షేక్ సైదులుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆడిటర్ సమక్షంలో బాపట్ల బ్రాంచ్ను సందర్శించి సదరు మేనేజర్ తీరుపై ఆయన విచారించారు. వారి విచారణలో ఈ ఏడాది ఆగస్టు 31న జమ చేయాల్సిన రూ. 5,06,384, సెప్టెంబర్ 20లోపు జమ చేయాల్సిన రూ. 5,22,212లు జమ చేయలేదని తేలినట్లు సమాచారం. రూ.2.23 లక్షలు చెల్లించినా రూ.40,400కే రసీదులు కర్లపాలెం మండలంలోని గణపవరం పంచాయతీ కేసరపూడి కాలనీకి చెందిన తాడిశెట్టి లక్ష్మితిరుపతమ్మ గ్రామంలో రేకుల ఇల్లు నిర్మించుకున్నారు. అప్పట్లో రూ. 7 లక్షల అప్పు అయ్యింది. దానిని తీర్చేందుకు ఇంటిని హెచ్ఎంఎఫ్ఎల్లో తనఖా పెట్టి రూ. 7.50 లక్షల రుణం తీసుకున్నారు. నెలకు రూ. 20,200 చొప్పున చెల్లించారు. ఇప్పటివరకు 11 నెలలకు రూ. 2.23 లక్షలు చెల్లించినా కేవలం రూ. 40,400 చెల్లించినట్లు రసీదులు ఇచ్చారని ఆమె వాపోయారు. ఇదేమని సిబ్బంది రామకృష్ణ, నూరేళ్ళను అడిగితే తమ మేనేజర్ రాజశేఖర్ జమ చేయడం లేదని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. మేనేజర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తే అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. గురువారం మేనేజర్పై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
గుంటూరులో 21 వాటర్ ప్లాంట్లు సీజ్
నెహ్రూనగర్: నగరంలో కలుషిత తాగు నీటిని సరఫరా చేస్తూ ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్న 21 మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రజారోగ్యం దృష్ట్యా వైద్యారోగ్య శాఖ సూచనల మేరకు సీజ్ చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలియజేశారు. నగరంలో కొన్ని ప్రాంతాలలో కలుషిత తాగు నీటి వలన డయేరియా కేసులు నమోదవుతున్న నేపధ్యంలో జిల్లా కలెక్టర్, నగర కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలో ఉన్న 120 మినరల్ వాటర్ ప్లాంట్లు సరఫరా చేసే తాగు నీటి శాంపిల్స్ను మంగళగిరిలోని ఐపీఎం పీహెచ్ ల్యాబ్, గుంటూరు మెడికల్ కాలేజీ ఆవరణలోని రీజినల్ పీహెట్ ల్యాబరేటరీలో పరీక్షించగా అందులో 21 ప్లాంట్ల నుంచి విక్రయించే నీటిలో హానికారక బ్యాక్టీరియాను గుర్తించడం జరిగిందన్నారు. సదరు ల్యాబ్ రిపోర్టులను నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపామని, ప్రభుత్వం తక్షణమే ప్రజారోగ్యానికి భంగం కలిగించే హానికారిక బ్యాక్టీరియాలను కలిగియున్న నీటిని విక్రయిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్లను వెంటనే సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిందన్నారు. సీజ్ చేసిన ప్లాంట్లు ఇవీ.. నగరంలోని ఐపీడీ కాలనీలోని పెరల్స్ ఎంటర్ ప్రైజేస్, నల్లచెరువులోని నీల్ డ్రాప్, శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డులోని మై ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్, చరణ్ వాటర్ ప్లాంట్, రెడ్ల బజార్లోని కేపీ రావు ప్లాంట్, అంబేడ్కర్ నగర్లోని జేఎస్ వాటర్ ప్లాంట్, పాత గుంటూరు బాలాజీనగర్లోని ఏకా వారి వీధి వాటర్ ప్లాంట్, మల్లిఖార్జున పేటలోని గురుశ్రీ మినరల్ వాటర్ ప్లాంట్, ఏటీ అగ్రహారంలోని బాషా కూల్డ్రింక్, శివనగారాజు కాలనీలోని వాసవి వాటర్ ప్లాంట్, నెహ్రూనగర్లోని ఆర్కే వాటర్ ప్లాంట్, నగరాలలోని స్వాతి ఫుడ్ అండ్ వాటర్ ప్లాంట్, స్థంభాలగరువులోని ఎలైన్ ఫ్రెష్ వాటర్, మద్దిరాల కాలనీలోని పరమేష్ హోల్ సేల్, సంపత్ నగర్లోని నరేష్ షాప్, కోబాల్ట్ పేటలోని ఉమర్ బాషా ఫ్లేవర్డ్ వాటర్, పలకలూరులోని ఎన్టీఆర్ సుజల ప్లాంట్, హిమని నగర్లోని సరస్వతి కృష్ణ స్టోర్, బుడంపాడులోని స్టెయిన్ లెస్ స్టీల్ స్టోరేజ్ ట్యాంక్, ఏటుకూరులోని మేఘన షాప్, లాలుపురం రోడ్డులోని 76వ సచివాలయం దగ్గరలోని ప్లాంట్లను నగర పాలక సంస్థ ప్రజారోగ్య అధికారులు సీజ్ చేశారు. -
జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
బాపట్ల: స్వచ్ఛతా ిహీ సేవల్లో బాపట్ల జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు. 461 గ్రామాల్లో మురికి కూపాలుగా ఉన్న ప్రాంతాలను గుర్తించి శుభ్రం చేయాలని ఆదేశించారు. జిల్లాకు 342 సామాజిక మరుగుదొడ్లు మంజూరు కాగా, నేటి వరకు 223 మొదలు పెట్టకపోవడం ఏమిటని ఆరా తీశారు. ముఖ్యంగా పురపాలక సంఘాలలోని ప్రధాన కాల్వలన్నిటీలో పూడికతీత పనులు చేపట్టాలని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని తాగునీటి చెరువులని క్లోరినేషన్ చేయాలన్నారు. జిల్లా పరిషత్ సీఈఓ వారంలో మూడు రోజులు సంబంధిత గ్రామాల్లో క్షేత్ర పరిశీలన చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఇంచార్జి సంయుక్త కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్, ఆయా శాఖల జిల్లా అధికారులు, డీపీఓ ప్రభాకర్ రావు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, పాల్గొన్నారు. చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు చీరాల టౌన్: పర్యావరణ పరిరక్షణ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చీరాల మున్సిపాలిటీలో అక్టోబర్ 2 (గాంధీ జయంతి) నుంచి పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు ప్రకటించారు. గురువారం తన కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, చీరాల తహసీల్దార్ సమక్షంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అక్టోబర్ 2 నుంచి మున్సిపల్ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్తో పాటుగా కవర్లు వినియోగం, అమ్మకం, నిల్వలు, తయారీ, పంపిణీలను పూర్తిగా నిషేధిస్తున్నామని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడకం, అమ్మకాలు, పంపిణీ చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాపారులంతా ఆదేశాలను తప్పక పాటించాలని ఆయన ఆదేశించారు. గోవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చీరాల మున్సిపాలిటీలో గోవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యజమానులు వాటిని పబ్లిక్ స్థలాల్లో వదలకూడదని చెప్పారు. గోవుల సమస్యలను పరిష్కరించేందుకు వాటికి పునరావాసంతో పాటు గుర్తింపు కూడా చేస్తున్నామని వివరించారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో గోవులను సంరక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ కుర్రా గోపీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ పాల్గొన్నారు. -
‘డీఈఓ పూల్’ ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతి కల్పించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: డీఎస్సీ–2025 నియామకాల కంటే ముందుగానే డీఈఓ పూల్లో ఉన్న ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు కె.బసవలింగారావు పేర్కొన్నారు. గురువారం జిల్లాకోర్టు ఎదుట ఉన్న ఏపీటీఎఫ్ జిల్లా శాఖ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో బసవ లింగారావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1236 మంది డీఈఓ పూల్లో ఉన్నారని, 2016లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నిలకడగా ఏ ఒక్క పాఠశాలలో పనిచేయలేక పోయారన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 50 మందికి పైగా ఉన్నారని తెలిపారు. వీరికి ఉద్యోగోన్నతి కల్పించకుండా డీఎస్సీ నియామకాలు ద్వారా కేడర్లో జూనియర్లుగా మిగిలిపోతారన్నారు. న్యాయపరమైన అంశాలతో వీరికి ఉద్యోగోన్నతులు అడ్డుకోవడం సరికాదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ అర్హత గల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పీఈటీ ఉద్యోగోన్నతుల్లో అన్యాయం జరిగిందని తెలిపారు. డీఎస్సీ మాదిరిగానే జూనియర్ కాలేజీ, డైట్లలో నియామకాలు చేపట్టాలని కోరారు. ప్లస్ 2 పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు సబ్జెక్ట్ టీచర్స్ కొరతో ఇబ్బంది పడుతున్నారని, ఖాళీలను అర్హత గల స్కూల్ అసిస్టెంట్స్ తో భర్తీ చేసి విద్యా ప్రమాణాలు కాపాడలన్నారు. సంఘ నాయకులు మాట్లాడుతూ దసరా పండుగకు పెండింగ్ నాలుగు డీఏ లలో ఒక్క డీఏ ఐనా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు గత 15 నెలల నుంచి ఒక్క బకాయి విడుదల కాలేదన్నారు. సమావేశంలో జిల్లా శాఖ నాయకులు పి.లక్ష్మినారాయణ, జి.దాస్, ముని నాయక్, టి.రామారావు, పి.వేణుగోపాలరావు, కిరణ్, శివరామ కృష్ణ, మూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్
బాపట్ల: జిల్లాలోని ఎస్టీల సమస్యలపై ప్రతి నెలలో నాలుగో శుక్రవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.అందులో భాగంగా ఉదయం 10.30గంటల నుంచి కలెక్టరేట్ సముదాయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని ఎస్టీలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.ఏఎంఆర్ కంటైనర్ ధ్వంసం బల్లికురవ: గ్రానైట్, మెటల్, గ్రావెల్, ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన ఏఎంఆర్ కంటైనర్ అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం పగులగొట్టి ధ్వంసం చేశారు. అక్టోబర్ 1 నుంచి అక్రమ రవాణాకు అడ్డుకట్టతో సీనరేజ్ వసూలు బాధ్యతలను ప్రభుత్వం ఏఎంఆర్ సంస్థకు కట్టబెట్టింది. ఇందుకోసం ఆ సంస్థ నెలకు రూ.47 కోట్లు రాయల్టీ రూపంలో చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. బల్లికురవ, సంతమాగులూరు, అద్దంకి మండలాల లోని ప్రధాన గ్రామాల్లో కంటైనర్లను తెచ్చి ఇప్పటికే అమర్చారు. అక్రమ రవాణాతో కోట్ల రూపాయలు వెనకేసుకున్న వారంతా కంటైనర్ల ఏర్పాటుతో హడలెతుత్తుతున్నారు. ధర్మవరం కొండ సమీపంలో ఏర్పాటు చేసిన కంటైనర్ను ధ్వంసం చేశారు.జీఎస్టీ రేట్ల తగ్గింపుపై అవగాహన పెంచాలిబాపట్ల: జీఎస్టీ రేట్ల తగ్గింపుపై వ్యాపారస్తులు ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించాలని తూనికలు కొలతల శాఖ రీజినల్ ఆఫీసర్ ఐజాక్ పేర్కొన్నారు. బాపట్ల రిటైల్ కిరణా అండ్ జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ కల్యాణ మండపంలో గురువారం వ్యాపారస్తులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0లో భాగంగా మార్పులు చేసినట్లు తెలిపారు. దీనిపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో బాపట్ల జిల్లా అధికారి లిల్లీ, ఇన్స్పెక్టర్ రామదాసు పాల్గొన్నారు. కంట్రోల్ రూం ఏర్పాటుబాపట్ల టౌన్: భారీ వర్షసూచన నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనటానికి జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఏదైనా సహాయం అవసరమైతే తక్షణమే టోల్ ఫ్రీ నంబర్ 112 (లేదా) 8333813228కి ఫోన్ చేయాలని సూచించారు. ఇప్పటికే 26 పునరావాస కేంద్రాలను కొల్లూరు, రేపల్లె, భట్టిప్రోలు మండలాల్లో ఏర్పాటు చేశారని వెల్లడించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలు వాటిల్లో రక్షణ పొందాలని ఆయన సూచించారు.రిటర్నబుల్ ప్లాట్లకు నేడు ‘ఈ – లాటరీ‘తాడికొండ: రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏపీసీఆర్డీఏ పరిధిలో భూములిచ్చిన పెనుమాక (జరీబు, మెట్ట), మల్కాపురం (ప్రత్యామ్నాయ ప్లాట్లు) గ్రామ రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపునకు ఈ – లాటరీ నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ లెనిన్ సెంటరులోని ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి లాటరీ తీయనున్నట్లు పేర్కొన్నారు. 56 మంది రైతులకు 104 ప్లాట్లను ఆన్న్లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా కేటాయిస్తామని వెల్లడించారు. వీటిలో 43 రెసిడెన్షియల్, 41 కమర్షియల్, 20 ప్రత్యామ్నాయ ప్లాట్లు ఉన్నట్లు వివరించారు. ఈ– లాటరీ కార్యక్రమానికి రైతులు హాజరు కావాలని వారు ఒక ప్రకటనలో తెలిపారు. -
ఎన్ఎంఎంఎస్ నమోదుకు 30 తుది గడువు
డీఈఓ చంద్రకళ నరసరావుపేట ఈస్ట్: నేషనల్ మీన్స్ కం మెరిట్స్ స్కాలర్షిప్ పరీక్ష రాసేందుకు ఈనెల 30వ తేది వరకు విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష డిసెంబర్ 7వ తేదీన నిర్వహిస్తారని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, మండల ప్రాథమికోన్నత, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులని తెలిపారు. పరీక్ష రుసుం ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 ఆన్లైన్ అప్లికేషన్లో ఇవ్వబడిన ఎస్బీఐ కలెక్ట్ లింక్ ద్వారా చెల్లించాలని తెలిపారు. వివరాలకు డీఈఓ కార్యాలయంలో పి.శంకరరాజు (9963192487)ను సంప్రదించాలని సూచించారు. యడ్లపాడు: విద్యార్థులకు చేతిరాతలో ఉచిత శిక్షణ ఇస్తూ తనదైన శైలిలో గుర్తింపు పొందిన కొండవీడు జెడ్పీ హైస్కూల్ ఎస్జీటీ ఉపాధ్యాయుడు డాక్టర్ షేక్ జున్నుసాహెబ్కు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. శారద ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లో బిర్లా ప్లానెటోరియం వద్ద ఉన్న భాస్కర ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు నేషనల్ టీచర్స్ ఎక్స్లెన్స్ అవార్డు–2025ను ప్రదానం చేశారు. ఒకే నెలలో మూడు అవార్డులు విద్యారంగానికి జున్ను సాహెబ్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ నెలలో ఇది మూడో అవార్డు రావడం విశేషం. ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఏపీ రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఆయనకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. ఈనెల 7న విశాఖపట్నంకు చెందిన సెయింట్ మదర్థెరిసా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుంచి గురుబ్రహ్మ రాష్ట్రస్థాయి అవార్డు, తాజాగా జాతీయస్థాయి అవార్డు తెలంగాణ రాష్ట్రంలో అందుకున్నారు. -
లిఫ్టులో ఇరుక్కున్న ప్రయాణికులు
దాచేపల్లి: నడికుడి రైల్వే జంక్షన్లో ఉన్న లిఫ్ట్లో ప్రయాణికులు గురువారం ఇరుక్కుపోయారు. నడికుడి రైల్వేస్టేషన్ నుంచి గుంటూరు వెళ్లేందుకు ప్రయాణికులు నడికుడి రైల్వేస్టేషన్కి చేరుకున్నారు. ఒకటో నెంబర్ ప్లాట్ ఫారం నుంచి రెండో నెంబర్ ప్లాట్ ఫారం పైకి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ ఎక్కి కిందకు దిగుతుండగా ఆకస్మాత్తుగా లిఫ్టు మధ్యలో ఆగిపోయింది. దీంతో లిఫ్ట్లో ప్రయాణికులు ఇరుక్కుపోయి తీవ్ర భయాందోళన చెందారు. ఈ విషయం అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు గమనించి రైల్వేస్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు స్టేషన్లోకి వచ్చి ఆగింది. లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు ఈ రైలులోనే వెళ్లాల్సి ఉంది. రైల్వే సిబ్బంది అతి కష్టం మీద లిఫ్ట్ ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీశారు. లిఫ్ట్లో ఇరుక్కుపోయిన వీరిని బయటకు తీసేంతవరకు జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలుని స్టేషన్లోనే ఆపేశారు. సుమారు పది నిమిషాలపాటు రైలు ఆగింది. తర్వాత లిఫ్ట్లో ఇరుక్కున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కి వెళ్లారు. ఇటీవల కాలంలో నడికుడిలో ఏర్పాటు చేసిన లిఫ్ట్లు తరచూ ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. -
ప్రకృతి వ్యవసాయంలో రైతులు భాగస్వాములు కావాలి
నరసరావుపేటరూరల్: ప్రకృతి వ్యవసాయంలో ప్రతి ఒక్క రైతు భాగస్వామి కావాలని ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్ జిల్లా మేనేజర్ కె.అమలకుమారి తెలిపారు. బృందావనంలోని ప్రకృతి వ్యవసాయం జిల్లా కార్యాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అమలకమారి మాట్లాడుతూ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ఉద్యమంలా ముందుకు వెళ్తుందని తెలిపారు. 2025–26 సంవత్సరంలో జిల్లాలో 82,619 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటల సాగు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. రైతులు రసాయనాలు విడిచి కషాయాలు వాడటం వలన భూమి ఆరోగ్యంగా ఉంటుందన్నారు. పంట ఉత్పత్తులు ఆరోగ్యకరంగా ఉండటంతోపాటు రైతులకు ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందని తెలిపారు. -
రసవత్తరంగా జాతీయ చెస్ చాంపియన్ షిప్
చేబ్రోలు: ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ విజ్ఞాన్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న 62వ జాతీయ చెస్ చాంపియన్షిప్ బుధవారం నాలుగోరౌండ్ ముగిసే సరికి ముగ్గురు గ్రాండ్మాస్టర్లు, నలుగురు ఇంటర్నేషనల్ మాస్టర్లు చెరో నాలుగు పాయింట్లతో అగ్రస్థానాన్ని పంచుకున్నారు. టాప్ బోర్డులపై జీఎంలు, ఐఎంల మధ్య ఉత్కంఠభరితంగా పోటీలు జరిగాయి. మాజీ ఆసియా చాంపియన్, రెండో సీడ్ జీఎం సూర్యశేఖర్ గంగూలీ అలాగే భారత 2700 రేటింగ్ దాటిన రెండో ఆటగాడు జీఎం కృష్ణన్ శశికిరణ్లు ప్రతిభ చూపించారు. తమిళనాడు ఆటగాడు ఐఎం మనీష్ ఆంటో క్రిస్టియానోపై పీఎస్పీబీ ఆటగాడు గంగూలీ ఎక్సేంజ్ సాక్రిఫైస్ తర్వాత రూక్ త్యాగంతో ఆధిపత్యం సాధించాడు. ఆంధ్ర ఆటగాడు జీఎం ఎం.ఆర్. లలిత్ బాబు ఫ్రెంచ్ డిఫెన్స్లో స్థిరమైన ఆట ఆడి, అలేఖ్య ముఖర్జీపై విజయం సాధించాడు. మూడో సీడ్ జీఎం ఎస్.పి.సేతురామన్, హరియాణా ఆటగాడు ఐఎం ఆదిత్య దింగ్రా తప్పిదం వల్ల ఓటమి నుంచి తప్పించుకున్నాడు. గేమ్ డ్రాగా ముగిసింది. కేరళ ఐఎం హెచ్.గౌతమ్ కృష్ణ, గుజరాత్ ఆటగాడు ఘాదవి వీరభద్రసింగ్పై అద్భుతంగా ఆడాడు. రూక్ త్యాగం చేసి బ్యాక్ ర్యాంక్ చెక్మేట్తో విజయం సాధించాడు. ఇప్పటివరకు టోర్నమెంట్లో పొడవైన గేమ్ ఆంధ్ర ఆటగాడు ఐఎం ఎస్. రవితేజ (రైల్వేలు), గుజరాత్ ఆటగాడు జిహాన్ తేజస్ షా మధ్య సాగింది. రవితేజ 140 మూవ్ల తర్వాత బిషప్, నైట్ కాంబినేషన్తో చెక్మేట్ చేశాడు. -
జమ్మూ కశ్మీర్లో బాపట్ల సైనికుడి మృతి
బాపట్ల టౌన్: జమ్మూ కశ్మీర్లో ఆర్మీ హవల్దార్గా విధులు నిర్వర్తిస్తూ బాపట్లకు చెందిన సైనికుడు మృతి చెందారు. బాపట్ల మండలం, కంకటపాలేనికి చెందిన మద్దసాని గోపికృష్ణ(33) బుధవారం రాత్రి సరిహద్దులో విధులు నిర్వర్తిస్తుండగా, తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సైనికుడి మృతిపై విచారణ జరుగుతుందని ఆర్మీ అధికారులు తెలిపారు. అతని పార్థివ దేహాన్ని గురువారం స్వగ్రామానికి తరలించారు. జిల్లా పోలీస్ అధికారులు, సూర్యలంక ఎయిర్ ఫోర్స్, ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారులు, ఎన్సీసీ అధికారులు, ఏపీ మాజీ సైనిక సంక్షేమ సంఘం నాయకులు కంకటపాలేనికి చేరుకొని సైనికుడి పార్థివ దేహానికి పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, మృతునికి భార్య హేమలత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ట్యాంకులు ఇలా.. ఆరోగ్యం ఎలా?
నెహ్రూనగర్: గుంటూరు నగరానికి తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి నగరంలోని పలు వాటర్ ట్యాంకులకు నీటి సరఫరా అయి అక్కడ నుంచి పైపులు ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరా జరుగుతుంది. అయితే నగరంలో ఉన్న పలు వాటర్ ట్యాంకులు శిథిలావస్థకు చేరడంతో పాటు పై కప్పులు ఊడిపోవడంతో అధ్వానంగా మారాయి. వీటి ద్వారానే తాగునీటి సరఫరా జరుగుతుండటంతో నగర వాసులు అనారోగ్యం బారిన పడుతున్నారు. శిథిలావస్థలో ఏడు ట్యాంకులు.. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 62 వాటర్ ట్యాంకులు ఉన్నాయి (వీటిల్లో 42 ట్యాంకులు నగర పరిధిలో, మిగిలిన విలీన గ్రామాలకు చెందినవి). అయితే ఈ 42 వాటర్ ట్యాంకుల్లో 7 ప్రాంతాల్లోని 9 వాటర్ ట్యాంకులకు పై కప్పులు ఊడిపోయి అధ్వానంగా మారాయి. బీఆర్ స్టేడియం, నల్లచెరువు, ఏటీ అగ్రహారం, స్థంభాలగరువు, శారదాకాలనీ, వసంతరాయపురం, నెహ్రూనగర్ రిజార్వయర్లలో ఉన్న వాటర్ ట్యాంకులకు ఉన్న పై కప్పులు సక్రమంగా లేకపోవడంతో వాటిలో పక్షుల వ్యర్థాలు పడుతున్నాయి. ఈ నీటినే అధికారులు నగరంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. 2018లో బీఆర్ స్టేడియం పరిధిలోని ఆనంద్పేటలో 30కి మందికిపైగా డయేరియా బారిన పడి మృతిచెందిన విషయం తెలిసిందే. అప్పుడు హడావుడిగా పాడైపోయిన వాటర్ ట్యాంకులను కవర్ చేస్తూ మరమ్మతులు చేపట్టారు. కాలక్రమేనా అవి కూడా పాడైపోవడంతో వాటిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. తీరా ఇప్పుడు అదే ప్రాంతంలో డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్గా 80 కేసులు.. గుంటూరు నగర పరిధిలో ఇప్పటివరకు 160 మంది జీజీహెచ్లో డయేరియాతో బారిన చికిత్స పొందుతున్నారు. వీరిలో 80 మంది డిశార్జి అవ్వగా..ఇంకా 80 మంది చికిత్స పొందుతున్నారు. అదే విధంగా ఈకోలి బ్యాక్టరీయా కారణంగా కలరా వ్యాప్తి చెంది 3 కేసులు నమోదవగా.. వారు చికిత్స తీసుకుని డిచార్జ్ అయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో జిల్లాస్థాయి అధికారులను ఒక్కో వార్డుకు ఒక్కో అధికారిని నియమించి, వారికి డయేరియాపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. గుంటూరు నగరంలో ఉన్న 42 వాటర్ ట్యాంకులను నెలకొక సారి శుభ్రం చేయాల్సి ఉంది. కాఠీ ఇందులో చాలా ట్యాంకులను సకాలంలో శుభ్రం చేయడం లేదని గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికి ఇంకా ఈ నెలలో 10 ట్యాంకులను శుభ్రం చేయలేదని వారు చెబుతున్నారు. తాగునీటి సరఫరాపై అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యజఆరించడంపై నగర వాసులు పాలకులు, అధికారుల తీరుపై మండిపడుతున్నారు. గుంటూరు నగరంలో 7 ప్రాంతాల్లో ఉన్న వాటర్ ట్యాంకులు శిథిలావస్థలో పై కప్పులు ఊడిపోయి ఉన్నా యి. 42 వాటర్ ట్యాంకులు నగర పరిధిలో ఉంటే వీటిల్లో 10 ట్యాంకులను ఇంకా శుభ్రం చేయలేదు. డయేరియా ప్రభావిత ప్రాంతాలకు ఆయా పాడైన వాటర్ ట్యాంకుల నుంచే వాటర్ సప్లయి చేస్తే ప్రయోజనం ఏం ఉండదు. తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచితాగునీరు సరఫరా చేయాలి. – నారాయణరెడ్డి, గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
ముగిసిన చేతిరాత శిక్షణ శిబిరం
గుంటూరు రూరల్: అందమైన చేతిరాత అదృష్టమని, అది ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు మున్నంగి సంజీవరెడ్డి తెలిపారు. శ్రీమతి చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి చేతిరాత శిక్షణ శిబిరం బుధవారంతో ముగసింది. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంజీవరెడ్డి మాట్లాడుతూ అందమైన చేతిరాత వలన విద్యార్థులు పరీక్షల్లో అదనంగా మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. జాతీయ అవార్డు గ్రహీత వి.రామమోహనరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 వేల మంది విద్యార్థులు, 15 వేల మంది ఉపాధ్యాయులు చేతిరాతలో శిక్షణ పొందారన్నారు. వీర గంగాధరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. చైల్డ్ లైన్ వెల్ఫేర్ బోర్డు రిటైర్డ్ అధికారి ప్రసాదలింగం మాట్లాడుతూ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా శిక్షణ పొందటం అమూల్యమైనదని ప్రశంసించారు. రిటైర్డ్ ఉపాధ్యాయురాలు మల్లీశ్వరి మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజానికి, విద్యార్థులకు అందిస్తున్న సేవలు గొప్పవని కొనియాడారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారిని సత్కరించిన అనంతరం చేతిరాతలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు అందజేశారు. -
అతివృష్టితో అపర నష్టం!
తాడికొండ: అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు అన్నదాతలు కుదేలవుతున్నారు. మబ్బుకు చిల్లుపడిందా అన్న చందంగా ప్రతి రోజు వాన కురుస్తుండటంతో రైతన్నలు పంట పొలాల్లో అడుగు పెట్టేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అరకొరగా సాగుచేసిన అపరాల పంటలు వర్షార్పణం కాగా పత్తి పంట ఎదుగుదల లేక ఎర్రబారుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జ్యూట్ పంట పరిస్థితి కూడా ఇదేవిధంగా మారడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా పొలంలోకి అడుగు పెట్టి అంతర కృషి చేసే పరిస్థితి కూడా లేని కారణంగా పై పాటుగా మందుల పిచికారీ కలుపు ఏరివేత కూడా చేయలేని పరిస్థితితో పొలాలు పిచ్చి కంపల్లా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుండె ‘చెరువు’ అయింది! ఈ ఏడాది నెలకొన్న అతివృషి పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు పెట్టుబడుల రూపంలో పెట్టిన సొమ్ము అయినా తిరిగొస్తుందా లేదా అనే బెంగ అన్నదాతల్లో పట్టుకుంది. కొండవీటి వాగు ఉధృతికి తాడికొండ, తుళ్ళూరు మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు గత రెండు నెలలుగా నానుతున్నాయి. పంటనష్టం పరిహారం అంచనాలు రూపొందించి అన్నదాతకు అండగా నిలవాల్సిన వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులు ఆ దిశగా యత్నించిన దాఖలాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు యూరియా సరఫరా లేక ప్రభుత్వం చేతులెత్తేయగా.. అధిక ధరలు వెచ్చించి కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేసి పెట్టుబడులు పెట్టామని, తీరా ఇప్పుడు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని రైతులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కొండవీటి వాగు ముంపునకు గురైన రైతులకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఇకపై రోబోటిక్ తుంటిమార్పిడి సర్జరీలు
స్ట్రైకర్ సంస్థతో సాయిభాస్కర్ ఆస్పత్రి ఒప్పందం గుంటూరు మెడికల్: ఇప్పటివరకు మోకీలు మార్పిడి సర్జరీలకు మాత్రమే రోబోటిక్ వ్యవస్థను వినియోగిస్తుండగా, ఇకపై తుంటి మార్పిడిలకు కూడా రోబోటిక్ సర్జరీలు చేయనున్నట్లు సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి చెప్పారు. అందుకోసం వరల్డ్ క్లాస్ రోబోటిక్ సంస్థ స్ట్రైకర్తో ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడలోని తమ ఆస్పత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోవిడ్ తర్వాత తుంటి కీలు అరుగుదలపై తీవ్ర ప్రభావం చూపి, చిన్న వయస్సులోనే తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలు చేయాల్సి వస్తుందన్నారు. రోబోటిక్ వ్యవస్థతో రోగికి మరింత మెరుగైన వైద్యసేవలు అందిస్తామని స్పష్టం చేశారు. ఏపీలోనే మొదటిసారిగా తుంటి మార్పిడి ఆపరేషన్లలో మాకొ హిప్ అండ్ నీ రోబోటిక్ను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అక్టోబర్ నుంచి తమ ఆస్పత్రిలో రోబోటిక్ తుండి మార్పిడి ఆపరేషన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. -
సాగర్ కాలువకు గండి
కొల్లూరు: కృష్ణమ్మ ఉగ్రరూపంతో నదీ పరీవాహక లంక గ్రామాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. వరద తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటంతో పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరుతోంది. వాణిజ్య పంటలు ముంపు బారిన పడుతున్నాయి. బుధవారం ప్రకాశం బ్యారేజ్ నుంచి 4.44 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేయడంతో నదిలో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్ని వరద నీరు ముంచెత్తింది. మండలంలోని పెసర్లంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక గ్రామాల చుట్టూ ఇటుకరాయి తయారీకి అవసరమైన మట్టి కోసం తవ్విన భారీ గుంతల్లోకి నీరు చేరింది. చింతర్లంక, గాజుల్లంక, పోతార్లంక, దోనేపూడి కరకట్ట దిగువు ప్రాంతాల్లో వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లింది. పంట భూములలోకి వరద నీరు ప్రవేశించింది. అరటి, కంద, కూరగాయలు, పసుపు, మినుము పంటలు ముంపు బారిన పడ్డాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని దిగువుకు విడుదల చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇంచుమించు ఇంచుమించు 6.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వదిలే అవకాశాలున్నట్లు అధికారులు ముందస్తు హెచ్చరికలు చేస్తూ ప్రజలను ఆప్రమత్తం చేశారు. వరద తీవ్రత పెరిగిన పక్షంలో ప్రజలను తరలించడానికి అవసరమైన ఏర్పాట్లతో పాటు మండలంలో 13 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతుల గుండెల్లో రైళ్లు భట్టిప్రోలు: కృష్ణమ్మ బిరబిరమంటూ పరవళ్లు తొక్కుకుంటూ ప్రవహిస్తుంటే లంక గ్రామాల రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత ఆరేళ్లుగా ఏటా వరదలు పంటల్ని ముంచెత్తుతున్నాయి. బిక్కుబిక్కుమంటూ దేవునిపై భారం వేసి సాగుకు సమాయత్తమవుతున్నారు. వరదల సమయంలో ఓలేరు పల్లెపాలెం పక్కనే ఉన్న రేవులో నీరు పారుతోంది. దీంతో పంట భూములు కోతకు గురవుతున్నాయి. ఏటా భూములు రేవులో కలిసిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కృష్ణానది ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని తహసీల్దార్ మేకా శ్రీనివాసరావు తెలిపారు. మండలంలో లోతట్టు ప్రాంతాలైన చింతమోటు, పెదలంక, పెసర్లంక, ఓలేరు లంక గ్రామాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కారంచేడు: మండలంలోని దగ్గుబాడు సమీపంలో సాగర్ కాలువ కట్ట కోతకు గురైంది. గండి పడిన సమయంలో 130 క్యూసెక్కులు నీరు ప్రవహిస్తోంది. గత రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరద నీరు కూడా వచ్చి చేరింది. దీంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. కట్టలు పటిష్టంగా లేకపోవడంతో ఈ ప్రమాదం తలెత్తింది. 50 ఎకరాలు మునక కాలువలోని నీరు సుమారు 50 ఎకరాల్లోకి చేరింది. ప్రస్తుతం పంటలు ఇంకా సాగు చేయక పోవడంతో ఇటు అధికారులు, అటు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కాలువలను శుభ్రం చేయించి, అవసరమైన మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు. పర్చూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సాగర్ ఆయకట్టుతో పాటు, కొమ్మమూరు కాలువ ఆయకట్టే ఆధారం. గత ఏడాది సాగర్ కాలువ కట్టల పైన జంగిల్ క్లియరెన్స్ సమయంలో వాటిని పటిష్ట పరచాలని రైతులు డిమాండ్ చేసినా అధికారులు పట్టించుకోలేదు. ప్రమాదం గురించి ఎన్ఎస్పీ జేఈ రాజేష్ను వివరరణ కోరగా, ప్రస్తుతం నీటి ప్రవాహానికి ఓవర్ ఫ్లో అయిందని, దీంతో బలహీనంగా ఉన్న కట్ట కోతకు గురైందని వివరణ ఇచ్చారు. వెంటనే చిమ్మిరిబండ లాకుల వద్ద నీటి ప్రవాహం నిలుపుదల చేశామని తెలిపారు. ప్రవాహం పూర్తిగా తగ్గిన తరువాత తాత్కాలిక మరమ్మతులు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వేసవిలో శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు చేస్తామని వివరించారు.