breaking news
Bapatla
-
సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి
గుంటూరు లీగల్: నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఐదవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) లత సూచించారు. గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సాయి కల్యాణ్ చక్రవర్తి ఆదేశాల మేరకు విద్యార్థుల్లో న్యాయ అవగాహన పెంపొందించే లక్ష్యంతో మంగళవారం గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలో ఉన్న ఎన్ఆర్ఐ కళాశాలలో ‘న్యాయ విజ్ఞాన సదస్సు’ నిర్వహించారు. కార్యక్రమానికి ఐదవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) లత ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు న్యాయ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించారు. న్యాయమూర్తి లత మాట్లాడుతూ సోషల్ మీడియా, ఇంటర్నెట్ వంటి డిజిటల్ వేదికలను బాధ్యతాయుతంగా వినియోగించడంతోపాటు వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంచుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అనుమానాస్పద లింకులు, నకిలీ వెబ్సైట్లు, ఆనన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులు తమ కుటుంబాలకు ఎంతో విలువైన వారని, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ తమ భద్రతను కాపాడుకోవాలని అన్నారు. జీవితంలో ధైర్యంగా ముందుకు సాగుతూ, సురక్షితమైన వాతావరణంలో ఉంటూ, తమను తాము రక్షించుకునే అవగాహనను పెంపొందించుకోవాలని తెలిపారు. నేరాలకు అవకాశమిచ్చే పరిస్థితులను నివారిస్తూ, సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోక్సో చట్టం–2012 గురించి వివరిస్తూ 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను లైంగిక వేధింపులు, దుర్వినియోగం నుంచి రక్షించేందుకు ఈ చట్టం అమలులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. న్యాయ విజ్ఞాన సదస్సులో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఐదవ అదనపు సివిల్ జడ్జి లత -
జీజీహెచ్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లోని షాపులను మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ నరసింహుడు, జిల్లా విజిలెన్న్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ చదలవాడ హరిబాబు, బీరాల నాగేశ్వరరావులు షాపులు తనిఖీ చేశారు. షాపుల్లో కాల పరిమితి దాటిన శీతల పానియాలు అమ్ముతున్నట్లు సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మంగళవారం వారు తనిఖీలు నిర్వహించి నాలుగు షాపుల్లో ఏ ఒక్కరికి ఫుడ్లైసెన్సు లేదనే విషయాన్ని గుర్తించారు. ప్యాకెట్లపై నిబంధనల ప్రకారం ఉండాల్సిన వివరాలు లేవని, ఫుడ్ లైసెన్సు లేకుండా వ్యాపారం చేస్తున్న నాలుగు షాపులకు నోటీసులు జారీ చేశారు. ఒక దుకాణంలో టీ పొడిలో రంగు కలిపినట్లు గుర్తించి నమూనాలు సేకరించి ఆహార ప్రయోగశాలకు పంపించారు. పాల ఉత్పత్తులు, ఇతర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఆహార భద్రత ప్రమాణాల చట్ట ప్రకారం ఫుడ్లైసెన్సు తీసుకోకుండా వ్యాపారం చేయడం తీవ్రమైన ఉల్లంఘన అని, విజిలెన్స్ కమిటీ సభ్యుడు హరిబాబు తెలిపారు. జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు నమోదు చేసి హాజరు పరిస్తే రూ. 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. -
వేడుకగా విజ్ఞాన్ రత్తయ్య జన్మదిన వేడుకలు
గుంటూరు రూరల్: పలకలూరులోని విజ్ఞాన్ ప్రాంగణంలో మంగళవారం విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మణ్ డాక్టర్ లావు రత్తయ్య 74వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలతో ఆరంభమైన ఈ వేడుకలలో విజ్ఞాన్ హై స్కూల్ విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కూర్మనాధం, వైస్ చైర్పర్సన్ లావు రుద్రమదేవి, విజ్ఞాన్ పూర్వ విద్యార్థి, విజ్ఞాన్ వైజాగ్ విద్యా సంస్థల సీఈఓ శ్రీకాంత్, ప్రొఫెసర్ ఎల్ఎమ్ పట్నాయక్లు రత్తయ్యతో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కూర్మనాధం మాట్లాడుతూ ప్రతి ఏటా రత్తయ్య వల్ల అసంఖ్యాకంగా అభివృద్ధి చెందుతున్న విద్యార్థులు అధ్యాపకుల అభినందనలతో రత్తయ్య పూర్ణా యురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులంతా బాగా చదువుకుని ప్రయోజకులవటమే తనకు అసలైన బహుమతి అని తెలిపారు. రాణిరుద్రమ లావు మాట్లాడుతూ విజ్ఞాన్ విద్యాసంస్థలు విద్యను అందించే సంస్థలు మాత్రమే కాదని, విలువలతో కూడిన వ్యక్తిత్వాలను తీర్చిదిద్దే ఆలయాలని, ఇంతటి మహోన్నత విద్యాలయాలను గత 50 సంవత్సరాలుగా విజయవంతంగా నడుపుతున్న లావు రత్తయ్య సంపూర్ణ ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు విద్యారంగానికి మార్గదర్శకుడిగా కొనసాగాలని ఆకాంక్షించారు. శ్రీకాంత్ మాట్లాడుతూ తనలాంటి ఎన్నో వేల మందికి రత్తయ్య దైవసమానులన్నారు. ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో రక్త దాన శిబిరంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొని పెద్దఎత్తున రక్తదానం చేశారు. కార్యక్రమంలో విజ్ఞాన్ నిరుల ప్రిన్సిపాల్ డాక్టర్ పాతూరి రాధిక తదితరులు పాల్గొన్నారు. -
● విద్యార్థులు, తల్లిదండ్రుల ఆగ్రహం ● కమ్యూనిటీ హాల్ కోసం కూటమి నేతల యత్నాలు
పాఠశాలలో సైకిల్ స్టాండ్ ధ్వంసం బాపట్ల టౌన్: అధికారంలో ఉన్నామనే అహంతో రెవెన్యూ, పంచాయతీ, విద్యాశాఖాధికారుల అనుమతి లేకుండానే జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్మించిన సైకిల్ స్టాండ్ను కూటమి నాయకులు ధ్వంసం చేసిన ఘటన మండలంలోని చెరువుజమ్ములపాలెంలో చోటుచేసుకుంది. సుదూర ప్రాంతాల విద్యార్థులు, ద్విచక్ర వాహనాలపై వచ్చే ఉపాధ్యాయుల కోసం దీనిని నిర్మించారు. వాహనాలను పార్కింగ్ చేసేందుకు వీలుగా 2014–19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో సైకిల్స్టాండ్ను నిర్మితమైంది. ఆ గ్రామంలోని ఎన్ఆర్ఐలు స్వచ్ఛందంగా స్పందించి స్థానిక చిన్నారులకు 80 మంది వరకు సైకిళ్లు కూడా పంపిణీ చేశారు. ఆదేశాలు బేఖాతర్ ప్రభుత్వ పాఠశాలల్లో మరే ఇతర భవనాలు నిర్మించరాదని గత ప్రభుత్వం 2023లో స్పష్టమైన ఆదేశాలు జారీచేయటంతోపాటు చట్టసభలో తీర్మానం చేసి జీవో ఇచ్చింది. అయినప్పటికీ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ అధికారుల అనుమతులు లేకుండానే మండలంలోని చెరువుజమ్ముపాలెంలో కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు పాఠశాలలోని సైకిల్స్టాండ్ కూల్చేశారు. కనీసం అధికారుల అనుమతులు కూడా తీసుకోలేదు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి అనుమతి లేని భవనాలు నిర్మించకుండా చూడాలని వారు కోరుతున్నారు. -
సాగుకు చుక్క రాదు.. నిర్వహణకు దిక్కు లేదు...
ఖరీఫ్ సాగుకు నీరందించడంలో చేతులెత్తేసిన నీటి పారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడటం లేదు. పశ్చిమ బ్యాంక్ కెనాల్ ద్వారా విడుదల చేసిన నీరు తాగు అవసరాలకే అని ప్రకటనలు గుప్పించారు. దోనేపూడి చానల్కు నీటిని విడుదల చేశారు. ఈ నీరు కొల్లూరు బాలుర, బాలికోన్నత పాఠశాలల క్రీడా మైదానంలోకి భారీగా చేరడంతో విద్యార్థులకు ఆటలు కరువయ్యాయి. అమరావతి చాంపియన్స్ కప్ పేరిట 28, 29 తేదీలలో కొల్లూరు క్రీడా మైదానంలో నిర్వహించాల్సిన ఆటల పోటీల నిర్వహణకు సైతం అవకాశం లేకుండా పోయింది. వర్షాలకుతోడు పాఠశాల క్రీడా మైదానంలోకి కాలువ నీరు భారీగా చేరడంతో పోటీల వేదికను అమృతలూరుకు మార్చారు. – కొల్లూరు -
ఏజీపీ నల్లమోతుకు సత్కారం
బాపట్ల: బాపట్ల జిల్లా కోర్టుకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)గా బాధ్యతలు చేపట్టిన ప్రముఖ న్యాయవాది నల్లమోతు సుబ్బారావును జిల్లా కాకతీయ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అభినందించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమాఖ్య సభ్యులు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఆయనను సన్మానించారు.ఈ సందర్భంగా నల్లమోతు సుబ్బారావు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గౌరవించిన కాకతీయ సేవా సమాఖ్య సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను న్యాయపరంగా సమర్థంగా నిర్వహిస్తూ ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని అన్నారు. ఎన్నో కష్టనష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నానని, న్యాయవాద వృత్తి ఎంతో పవిత్రమైనదని, బాధ్యతాయుతమైనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాకతీయ సేవా సమాఖ్య సభ్యులు, మహిళలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
పాఠశాల నుంచి తప్పిపోయిన చిన్నారులు
● గుంటూరు కార్పొరేషన్లో 8 మంది ఉద్యోగులపై సీడీఎంఏకు లేఖ రాసిన కమిషనర్ ● రూ.68.65 లక్షల దుర్వినియోగం నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో నకిలీ యూడీఏ (అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చలాన్లు, నకిలీ బ్యాంక్ స్టాంపింగ్ చలాన్ల వ్యవహారంపై చర్యలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. 2015 నుంచి 2017 వరకు నకిలీ బ్యాంక్ చలానాలు సృష్టించి రూ.68.65లక్షల అవినీతికి పాల్పడ్డారు. ఈ విషయం ఆడిట్ విభాగం కనిపెట్టి సదరు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరింది. సదరు అంశంపై ప్రభుత్వ ఆదేశాలతో జరిగిన విచారణ కమిటీ నివేదిక ఆధారంగా 8 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ సర్వీస్ వివరాలతో కూడిన లేఖను ఈ నెల 24వ తేదీన కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్కు పంపిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్(ఎల్టీపీ) కారణంగా కార్పొరేషన్కు ఆర్థిక నష్టం జరిగినట్లు నివేదికలో తెలిపారు. మొత్తం చెల్లించాల్సిన మొత్తం రూ.74.79 లక్షలు కాగా, అందులో రూ.68.65 లక్షలు దుర్వినియోగమయ్యాయి. ఇప్పటివరకు రూ.34.20 లక్షలు రికవరీ చేయగా, ఇంకా రూ.34.45 లక్షలు రికవరీ చేయాల్సి ఉందన్నారు. -
పత్రాల కోసం పరుగులు
వేటపాలెం: జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త నిబంధనల కారణంగా 2018 సంవత్సరానికి ముందు జనన, మరణ రిజిస్టర్లలో నమోదు చేసిన వివరాలకు వెంటనే ధ్రువీకరణ పత్రాలు జారీ కాకపోవడంతో ప్రజలు గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కార్యాలయాలు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (డీఎంహెచ్ఓ) కార్యాలయాల చుట్టూ వారాల తరబడి తిరుగుతున్నారు. అత్యవసర అవరాల కోసం ధ్రువీకరణ పత్రాలు కావాల్సిన వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎలా ఉండేదంటే.. ఇప్పటి వరకు ఏదైనా జననం లేదా మరణం జరిగిన వెంటనే సంబంధిత గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలోని జనన, మరణ రిజిస్టర్లో నమోదు చేసేవారు. అనంతరం అవసరమైనప్పుడు దరఖాస్తు చేసుకుంటే సంబంధిత కార్యాలయం ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసేది. ఈ విధానం వల్ల ప్రజలకు పెద్దగా ఇబ్బందులు ఉండేవి కావు. కొత్త నిబంధనలతో మారిన పరిస్థితి ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త విధానం ప్రకారం 2018 సంత్సరానికి ముందు కేవలం మాన్యువల్ రిజిస్టర్లో నమోదై ఉండి, ఆన్లైన్లో నమోదు కాని వివరాలతో నేరుగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం నిలిచిపోయింది. ముందుగా డిజిటల్ విధానంలో నమోదు చేయాలని, అందుకోసం పలు అదనపు ధ్రువీకరణ పత్రాలు, ప్రత్యేక పత్రాలను సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత శాఖల అధికారులు చెబుతున్నారు. ఆ వివరాలను ఆన్లైన్ నమోదు చేసిన తర్వాత వాటిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పరిశీలించి ధ్రువీకరిస్తేనే తుది జనన లేదా మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయలేని పరిస్థితి నెలకొంది. అవసరమైన పత్రాలు సమర్పించిన తర్వాత కూడా ప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం పడుతోందని బాధితులు చెబుతున్నారు. పెరుగుతున్న అసహనం.. ఒకప్పుడు ఒకటి లేదా రెండు రోజుల్లో లభించే ధ్రువీకరణ పత్రం కోసం ఇప్పుడు నెల రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త నిబంధనలపై సరైన అవగాహన లేకపోవడం, ప్రతి దశలో కొత్త పత్రాలు అడగడం, ఆన్లైన్ నమోదు ఆలస్యం కావడం వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై అసహం పెరుగుతోంది. సరళమైన విధానాన్ని అమలు చేయాలని, ఇప్పటికే ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన వివరాల ఆధారంగానే త్వరితగతిన ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
గంజాయి,మత్తు పదార్థాల విక్రేతలు అరెస్టు
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) :చెడు వ్యసనాలకు బానిసలు గా మారి గంజాయి, మత్తు పదా ర్థాలు విక్రయిస్తున్న ఇరువురిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. పాతగుంటూరు పోలీసు స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఈస్ట్ డీఎస్పీ తాండ్ర సీతారామ్, పాతగుంటూరు సీఐ కె.వెంకటప్రసాద్ వివరాలు వెల్లడించారు. పాతగుంటూరు ఆనందపేటకు చెందిన షేక్ మస్తాన్, అలీనగర్కు చెందిన షేక్ మస్తాన్ అలియాస్ మున్నా ఇరువురు స్నేహితులు. చెడు వ్యసనాలకు బానిసగా మారి అక్రమ సంపాదనకు అలవాటు పడి గంజాయి, మత్తు పదార్ధాల విక్రయాలు చేస్తున్నారు. వీరికి పాతగుంటూరు మాచిరాజువారివీధికి చెందిన బిలాల్తో పరిచయం ఏర్పడింది. గోవా, పలు ప్రాంతాల నుంచి తెచ్చిన గంజా యి, మత్తు బిళ్లలు రూ. 300 లకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు పాతగుంటూరు శివారు ప్రాంతంలోని ప్రగతినగర్లో ఇరువురిని అదుపులోకి తీసుకున్నా రు. వారి వద్ద గంజాయి, మ త్తు బిళ్లలు ఉండటం గుర్తించా రు. 11 గ్రాముల గంజాయి, 90 మత్తు బిళ్లలు, రూ. 9వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరిస్తున్న బిలాల్ పరారీలో ఉన్నట్లు సమాచారం. -
భక్తిశ్రద్ధలతో వేదవ్యాసునికి ఆరాధన
అమరావతి: ప్రముఖ వైష్ణవక్షేత్రమైన వైకుంఠపురంలోని భవఘ్ని ఆరామంలో ఉన్న శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రంలో నిర్వహిస్తున్న గురుపూర్ణిమ మహోత్సవాల రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం వేకువజామున వ్యాసభగవానునికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, వ్యాసారాధన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భవఘ్ని గురూజీ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆధునికత, నాగరికత పేరుతో మానవాళి చెడు మార్గంలో పడకుండా వ్యాసభగవానుడు అందించిన భగవద్గీత శాశ్వత మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. వ్యాసభగవానుడు ప్రసాదించిన వేదాలు, పురాణాలను భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా అలరించింది. అలాగే వ్యాసదేవులు ప్రసాదించిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకున్న తర్వాత తమ జీవితాల్లో వచ్చిన మార్పులను భక్తులు అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సీతమ్మ వారికి సారె మంగళగిరి టౌన్: పట్టణంలోని కొప్పురావు కాలనీ 9వ లైన్లో ఉన్న అభయ ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో మంగళవారం దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు సీతమ్మ వారికి సారె సమర్పించారు. స్థానికంగా ఉన్న మహిళలు మేళ తాళాలతో సీతారాముల వారి నామాలను, హనుమాన్ చాలీసాను పారాయణం చేసుకుంటూ ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి కుంకుమ, పసుపు, గాజులు, చీర, పూలు సమర్పించారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురుపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం కమిటీ అధ్యక్షుడు రాము, ప్రధాన కార్యదర్శి పంచుమర్తి చిన్న, కోశాధికారి రాజేంద్ర ప్రసాద్లతో పాటు సభ్యులు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి తొలి ఏకాదశి సందర్భంగా రూ.12.02 లక్షల ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో డి.చంద్రశేఖర రావు తెలిపారు. ఆలయ ఆవరణలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ప్రధాన హుండీల ద్వారా రూ.11,62,024, అన్నదానం హుండీ ద్వారా రూ.40,342 కలిపి మొత్తం రూ.12,02,366 నగదు కానుకగా వచ్చింది. బంగారం 500 మిల్లీ గ్రాములు, వెండి 78 గ్రాములు, కొంత విదేశీ కరెన్సీ వచ్చినట్లు వివరించారు. దేవదాయ శాఖ అధికారి కె.మంజూష లెక్కింపును పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యల్లమంద శాఖ సిబ్బంది, ఆలయ సూపరిండెంటెంట్ చల్లా శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. భట్టిప్రోలులో గురుపౌర్ణమి వేడుకలు భట్టిప్రోలు: భట్టిప్రోలు సాయిబాబా మందిరంలో సాయినాథ – దత్తాత్రేయ స్వామి వార్ల గురుపౌర్ణమి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, అష్టోత్తర పూజలు జరిగాయి. పూజా కార్యక్రమాలను వేద బ్రాహ్మణులు మురికిపూడి దుర్గాప్రసాద్ శర్మ నిర్వహించారు. సాయి నామ ప్రచార కార్యక్రమంలో భాగంగా భక్తులు పురవీధులలో భిక్షాటన నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు తమ్మన రమేష్బాబు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సాంబశివరావు, కోశాధికారి బి.కిరణ్కుమార్, కమిటీ సభ్యులు సీహెచ్ పాపారావు, బి. రమేష్బాబు, కె. రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించే బాధ్యత ఆర్డీవోలకు బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. రెవెన్యూ అంశాలపై ఆర్డీవోలు, తహసీల్దార్లు, సర్వేయర్లతో స్థానిక కలెక్టరేట్ నుంచి మంగళవారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. రెవెన్యూ భూముల సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ చెప్పారు. భూమి రికార్డులలో ఇతరులుగా నమోదైన ప్రతి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఆ భూమి యజమాని వివరాలు సేకరించి, దస్త్రాలలో పేర్లు నమోదు చేయాలన్నారు. బాపట్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఐదు ఎకరాల భూమి గుర్తించాలన్నారు. -
నీటి మోటార్ల చోరీ ముఠా అరెస్ట్
రూ.15.33 లక్షల విలువ చేసే 91 మోటార్లు స్వాధీనం నగరంపాలెం(గుంటూరు వెస్ట్): నీటి మోటార్లను దొంగలించే ముఠాను పొన్నూరు గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. రెండు నెలలుగా పొన్నూరు, చేబ్రోలు, తెనాలి, చుండూరు పరిధిలో రోడ్ల వెంట పొలాల్లో నీటి మోటార్లు అపహరణకు గురవుతున్నాయి. దీనిపై బాధిత రైతుల వరుస ఫిర్యాదులతో ఆయా పోలీస్స్టేషన్లల్లో కేసులు నమోదు చేశారు. పొన్నూరు గ్రామీణ సీఐ పి. కృష్ణయ్య నేతృత్వంలో ఎస్ఐ వి.శ్రీహరి ప్రత్యేక బృందాలతో గాలించారు. బ్రాహ్మణకోడురు గ్రామ శివార్లల్లో తాడికొండ ఫణిదరం గ్రామ వాసులైన తాడిశెట్టి నాగేశ్వరరావు, తాడిశెట్టి వంశీ, ఊటుకూరి చరణ్వంశీ, మిండల సాంబశివరావు, కటారి సాంబశివరావు, పొన్నూరు టౌన్ నేతాజీనగర్లో ఉంటున్న అఖిల్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో ముఠాలోని ఆరుగురితోపాటు దొంగిలించిన మోటార్లను కొనుగోలు చేసిన గుంటూరు రూరల్ మండలం పెదపలకూరు గ్రామ వాసి మరియప్పన్ పెరియసామిని సైతం అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి రూ.15.33 లక్షలు ఖరీదు చేసే 91 నీటి మోటర్లు, రూ.20 వేలు విలువ చేసే 18 కిలోల కాపర్ వైరు, రెండు కార్లు, ఆటో, రెంచీలు, ఇనుపరాడ్ స్వాధీనం చేసుకున్నారు. వీరంతా రోజు కూలీలే.. ఈ ముఠాకు తాడిశెట్టి నాగేశ్వరరావు కీలకం. ఇతనిపై నల్లపాడు, తాడికొండ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని అన్నారు. పొన్నూరు పట్టణం డీవీసీ కాలనీలో ఉంటున్న మహిళతో అతనికి వివాహేతర సంబంధం ఉందన్నారు. సుమారు ఆరు నెలలు నుంచి ఆమె వద్దకు వచ్చేవాడని చెప్పారు. ఈ క్రమంలో అతనికి బంధువులైన పెయింట్ పనులకు వెళ్లే తాడిశెట్టి వంశీ, ఊటుకూరి చరణ్ వంశీలు ఏకమై, ఆటోడ్రైవర్ అయిన తాడిశెట్టి వంశీ ఆటోలో పొన్నూరు వెళ్లి మద్యం తాగేవారని చెప్పారు. వీరితోపాటు మిగతా ఇద్దరు కల్సి రాత్రిళ్లు పొలాల్లో విద్యుత్ మోటార్లు దొంగిలించేవారు. అనంతరం వాటిని విక్రయించి సొమ్ము చేసుకునేవారు. పొన్నూరు గ్రామీణ పీఎస్లో నాలుగు కేసుల్లో 47 మోటార్లు, తెనాలి గ్రామీణ పీఎస్లో ఆరు కేసుల్లో 26 మోటార్లు, చేబ్రోలు పీఎస్లో మూడు, పొన్నూరు పట్టణ పీఎస్లో తొమ్మిది, చుండూరు పీఎస్లో ఆరు దొంగలించారని అన్నారు. ఈ కేసుని ఛేదించిన పొన్నూరు గ్రామీణ పీఎస్ సీఐ పి.కృష్ణయ్య, ఎస్ఐ వి.శ్రీహరి, హెడ్కానిస్టేబుల్ వి.నరేష్, కానిస్టేబుళ్లు కె.రవి, బి.వెంకటశివయ్య, జి.సుధీర్, హోంగార్డు ఎం.రాజేష్, సీసీ కెమెరాల విభాగపు ఏఎస్ఐ రామదాస్రెడ్డి, టవర్ లోకేషన్ వింగ్ సీహెచ్.రాముని జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందించారు. -
దగా డీఎస్సీపై నిరసన హోరు
బాపట్ల: వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన నిరసన హోరెత్తింది. ప్రభుత్వ తీరును ఎండగడుతూ వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టిన నిరసనలో విద్యార్థులు, యువత అత్యధికంగా పాల్గొన్నారు. నిరసన కార్యక్రమానికి భారీగా తరలివచ్చే అవకాశం ఉందని నిఘా విభాగాలు ప్రభుత్వానికి తెలియజేయడంతో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఎల్లావుల సోహిత్, పార్టీ పట్టణ అధ్యక్షుడు కాగిత సుధీర్బాబు, జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చల్లా రామయ్యలను ముందస్తుగా అరెస్టు చేశారు. నాయకులు, కార్యకర్తల నుంచి భారీ నిరసనలు వ్యక్తం కావడంతో వారిని విడుదల చేశారు. పార్టీ పార్లమెంటు పరిశీలకుడు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, పర్చూరు, చీరాల, వేమూరు, రేపల్లె నియోజకవర్గాల సమన్వయకర్తలు గాదె మధుసూదన్రెడ్డి, కరణం వెంకటేష్బాబు, వరికూటి అశోక్బాబు, పీటా నాగమోహన్కృష్ణ, పార్టీ నియోజకవర్గాల పరిశీలకులు మోదుగుల బసవ పున్నారెడ్డి, సురేంద్రల నాయకత్వంలో భారీగా నిరసన కార్యక్రమం జరిగింది. భారీ స్పందన నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి మోసం చేయడంతోపాటు, డీఎస్సీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ చేపట్టిన నిరసనలో భారీగా పార్టీ శ్రేణులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. పార్టీ జెండాలతో నిర్వహించిన నిరసనతో బాపట్ల హోరెత్తింది. కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, రాష్ట్ర, జిల్లా నాయకులు నక్కా వీరారెడ్డి, దొంతిబోయిన జయ భారత్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, చింతల రాజశేఖర్, శీలం చంటి, ఉప్పలపాటి అనిల్చౌదరి, నీలం వీరేంద్ర, ఉరబిండి గోపీనాథ్, ఆట్ల ప్రసాదరెడ్డి, గుర్రం మురళి, జోషికాంత్, వడ్డిముక్కల డేవిడ్, రవితేజ, చిక్కాల సాగర్, మౌలాలి, అశ్వినీ రెడ్డి, గవిని కృష్ణమూర్తి, ఇనగలూరి మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులను దగా చేసిన లోకేష్ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మేరుగ చందన్ నాగ్ మాట్లాడుతూ.. విద్యార్థులను మోసం చేయడానికే కూటమి ప్రభుత్వం వచ్చిందని మండిపడ్డారు. అందులోనూ అసమర్థుడైన నారా లోకేష్కు విద్యాశాఖను కేటాయించడం బాధాకరమని పేర్కొన్నారు. ఒక కాంట్రాక్టు ఉద్యోగికి ఎంతో బాధ్యత కలిగిన డీఎస్సీ బాధ్యతలు అప్పగించడం ఏమిటంటూ ప్రశ్నించారు. క్రీడల కోటా పేరుతో దొడ్డిదారిన పార్టీ నాయకులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇప్పించారని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ.. మోసాల ప్రభుత్వానికి విద్యార్థులే సరైన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. అత్యధిక మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు రాకుండా, తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇవ్వడం దారుణమన్నారు. వీటిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కూటమి సర్కారుకు సరైన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున పేర్కొన్నారు. డీఎస్సీలో కాంట్రాక్టు ఉద్యోగికి స్టేట్ ర్యాంకు వచ్చిందంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోందన్నారు. నీట్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినట్లే, డీఎస్సీలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో అక్రమాలపై వెంటనే సీబీఐతో విచారణ చేపట్టాలన్నారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య మాట్లాడుతూ.. నిరుద్యోగులను నట్టేట ముంచిన చంద్రబాబు నాయుడికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల చొప్పున భృతి ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయాలని పేర్కొన్నారు. అదే జరిగి ఉంటే ఒక్కొక్కరికి రూ.78 వేల వరకు వచ్చేవని చెప్పారు. నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం ఎప్పటికీ నిలబడదని హెచ్చరించారు. -
పల్నాడులో గ్రానైట్ వార్
సాక్షి, నరసరావుపేట: అక్రమ గ్రానైట్ దందాపై ఆధిపత్య పోరు పల్నాడు జిల్లాలో వీధికెక్కింది. గ్యాంగ్ వార్ తరహాలో రొడ్డుకెక్కి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థాయికి చేరింది. గ్రానైట్ మాఫియా పోరు సవాళ్ల స్థాయి దాటి భౌతికదాడులకు చేరింది. చంద్రబాబు ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రానైట్ అక్రమ రవాణాపై అధిపత్యం కోసం పల్నాడు, ప్రకాశం జిల్లాలకు చెందిన రెండు గ్రూప్లు పోటీపడ్డాయి. పక్క జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరులు గత కొంతకాలంగా గ్రానైట్ అక్రమ రవాణాలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు. దీనిపై పల్నాడు జిల్లా అధికారపార్టీ నేతలు కొందరు గుర్రుగా ఉన్నారు. వీరి పోరు నేపథ్యంలో గ్రానైట్ యజమానులే ఇటీవల నేరుగా రవాణా వ్యవహారాలు చూస్తున్నారు. తమ ఆదాయ మార్గాలు దెబ్బతినడంతో ప్రకాశం జిల్లా గ్యాంగ్ ప్రత్యక్ష యుద్ధానికి తెరదీశారు. ఆయన సారధ్యంలోనే... గ్రానైట్ అక్రమ రవాణా దందా పక్క జిల్లాకు చెందిన ఓ మంత్రి వద్ద పనిచేసే వ్యక్తి సారధ్యంలోనే జరుగుతుందని సమాచారం. అయితే అక్రమ బిల్లులతో సరిహద్దులు దాటిస్తామని చెప్పి పెద్దమొత్తంలో వసూళ్లు చేస్తున్న ఈ గ్యాంగ్ అధికారులు పట్టుకుంటే తమకు సంబంధం లేదని చేతులెత్తుస్తున్నారట. ఇటీవల పల్నాడు జిల్లాకు చెందిన మరో గ్యాంగ్ గ్రానైట్ అక్రమ రవాణా వ్యవహారాలు చూస్తున్నారు. దీంతో కొత్త గ్యాంగ్ పంపుతున్న అక్రమ గ్రానైట్ వాహనాల వివరాలను తెలంగాణ జీఎస్టీ అధికారులకు సమాచారం ఇచ్చి పట్టుకునేలా చేశారని సమాచారం. ఈ సమాచారం అందించిన వ్యక్తులపై దాడులు సైతం చేశారు. ఈ క్రమంలో గత వారం ప్రకాశం జిల్లాకు చెందిన అక్రమ రవాణా మాఫియాకు చెందిన వ్యక్తి పిడుగురాళ్లకు వచ్చి సినీ ఫక్కీలో సెల్పీలు తీసుకొని సవాళ్లు విసిరాడు. తిరుగుమార్గంలో బొప్పూడి వద్ద సదరు వ్యక్తిని ప్రత్యర్థులు పట్టుకొని తీవ్రంగా దేహశుద్ధి చేయడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. దీనిపై చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వీరిని పరామర్శించేందుకు వచ్చిన పిడుగురాళ్లకు చెందిన కారుపై ప్రకాశం జిల్లా గ్యాంగ్ ప్రతికారదాడి చేసి ధ్వంసం చేశారు. గ్రానైట్ ఆధిపత్య దాడులు హత్యల వరకు దారి తీస్తాయోమోనన్న ఆందోళనలు గ్రానైట్ పరిశ్రమ వర్గాల్లో నెలకొంది. -
నవ్యాంధ్ర రాజధానిలో ఫిజియోథెరపీ కళాశాల ఏర్పాటు చేయాలి
గుంటూరు మెడికల్: ఆర్థోపెడిక్ వైద్యుల ఆపరేషన్ల అనంతరం రోగికి పూర్తి స్వస్థత చేకూర్చే ఫిజియోథెరపిస్టుల గౌరవానికి తగ్గట్టు నవ్యాంధ్ర రాజధాని పరిధిలో ప్రభుత్వ ఫిజియోథెరపీ కళాశాలను ఏర్పాటు చేయాలని ది ఫిజియోథెరఫిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ బి వి. హరికృష్ణ, డాక్టర్ షేక్ సుభాని పేర్కొన్నారు. స్థానిక అరండల్పేటలోని ది ఫిజియోథెరఫిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఏపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన అత్యవసర కార్యవర్గ సమావేశంలో డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ సుభాని మాట్లాడుతూ 2003లో స్థాపించిన ఫెడరేషన్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో 98 కళాశాలలు ఉన్నాయన్నారు. ఏటా 2000 మంది విద్యార్థులు పట్టభద్రులై బయటకు వస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా 60 వేలకు పైగా ఫిజియోథెరపీ పట్టభద్రులు సరైన ప్రోత్సాహకాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏడుకొండలు, డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ దయాకర్, డాక్టర్ శిరీష, డాక్టర్ మహినా, డాక్టర్ అనీస్ గ్రేస్, డాక్టర్ రవి వర్మ, డాక్టర్ తిరుపతిరావు, డాక్టర్ జనార్దన్, డాక్టర్ దుర్గా వరప్రసాద్, డాక్టర్ నూర్ భాష బాజీ, షేక్ షరీఫ్ ఉస్మాన్, డాక్టర్ పసల వినయ్ కుమార్, వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ది ఫిజియోథెరఫిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఏపీ అధ్యక్ష, కార్యదర్శులు -
భూ సమస్యలకు పరిష్కారం
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్బాపట్ల: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ క్లినిక్ను నిర్వహించి వివిధ రకాల భూ సంబంధిత సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అర్జీదారులతో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను విన్నారు. భూ వివాదాలు, పట్టాదారు పాస్బుక్లు, భూ సరిహద్దు సమస్యలు, రీసర్వే, భూ రికార్డుల సవరణ, వారసత్వ మార్పులు, ఆక్రమణలు, ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలపై వచ్చిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు తమ భూ సమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావు లేకుండా సంబంధిత అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, పెండింగ్లో ఉన్న భూ సంబంధిత ఫిర్యాదులను ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ శాఖ అధికారులు, పర్యవేక్షకులు షఫి, శ్రీలక్ష్మి, సతీష్ తదితరులు ఉన్నారు. టెక్స్టైల్ కేంద్రాన్ని వినియోగంలోకి..చీరాల టౌన్: లక్షలు వెచ్చించి గొప్ప లక్ష్యంతో నిర్మాణం చేపట్టిన కామన్ ఫెసిలిసీ సెంటర్ (హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ శిక్షణ కేంద్రం)ను వినియోగించకుండా మూసివేయడం మంచిదికాదని.. త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని ఈపురుపాలెం గ్రామంలో నిర్మాణం చేసి ఖాళీగా వదలిన కామన్ ఫెసిలిటీ సెంటర్ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మున్సిపాలిటీలోని గ్రామ చావిడి భవనాన్ని పరిశీలిచారు. కలెక్టర్ వెంట డీఎస్ జగన్మోహనరావు, మున్పిపల్ కమిషనర్ డానియేల్ జోసఫ్, సీఎస్డీటీ ఓంకార్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. బాపట్ల: అరకు కాఫీ విక్రయాలలో బాపట్ల జిల్లా డ్వాక్రా మహిళలు రాష్ట్రంలోనే ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. చీరాల, మార్టూరు మండలాల్లో అరకు కాఫీ విక్రయాలు చేస్తున్న డ్వాక్రా మహిళలు రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికవడంపై జిల్లా కలెక్టర్ సోమవారం ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆ మహిళలకు కలెక్టరేట్లో అవార్డు, నగదు బహుమతులను కలెక్టర్ అందజేశారు. జిల్లా ప్రజలను ఆకర్షించేలా అరకు కాఫీ తయారు చేయడం, విక్రయించడంలోనూ డ్వాక్రా మహిళలు మంచి సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. చీరాల వాడరేవుకు చెందిన అర్జీ శాంతి గతేడాది సెప్టెంబర్ 28వ తేదీన అరకు కాఫీ విక్రయశాలను వాడరేవులో ప్రారంభించారని, కేవలం 10 నెలల్లోనే రూ.12,83,227లు విక్రయాలు చేపట్టారన్నారు. శాంతి రాష్ట్రస్థాయిలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు, రూ.5 వేల నగదుతో ప్రభుత్వం సత్కరించిందన్నారు. మార్టూరు మండలానికి చెందిన షేక్ షాజియాభాను గడచిన 10 నెలల్లో అరకు కాఫీ రూ. 22,43,178 లు విక్రయాలు జరిపారన్నారు. దీనికిగాను ‘టాప్ పెర్ఫార్మర్ అవార్డు’, రూ.3 వేల నగదు బహుమతితో రాష్ట్ర ప్రభుత్వం అవార్డుతో సత్కరించిందన్నారు. జిల్లా జేసీ భావన వశిష్ఠ, డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్, డీఆర్డీఏ పీడీ బి.సింగయ్య, జిల్లా అధికారులు, వెలుగు డీపీఎం రవీంద్ర, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. -
బియ్యం షాపులో విజిలెన్స్ అధికారుల తనిఖీ
గుంటూరు మెడికల్: పాత గుంటూరులోని శ్రీ దుర్గా భావన బెస్ట్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ షాప్లో సోమవారం జిల్లా విజిలెన్న్స్ కమిటీ సభ్యులు, ఫుడ్ సేఫ్టీ అధికారి నరసింహుడు తనిఖీలు నిర్వహించారు. షాపు నిర్వాహకులు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ మున్సిపల్ ట్రేడ్ లైసెన్సు, లేబర్ లైసెన్సు లేకుండా విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఎలాంటి లైసెన్సు లేకుండా అమెరికన్ జనరల్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఐ సీ ఎం ఆర్ ధ్రువీకరించినట్లుగా బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అక్కడ ఉన్న బియ్యాన్ని శాంపిల్స్ తీసి షాపు నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. షాపు తనిఖీ చేసిన వారిలో జిల్లా విజిలెన్న్స్ కమిటీ సభ్యులు డాక్టర్ చదలవాడ హరిబాబు మునిపల్లి కవిత, అధికారులు ఉన్నారు. అమెరికా బ్రాండ్తో బియ్యం విక్రయాలు -
మార్టూరు పోలీసులపై ఎస్పీ ఆగ్రహం
మార్టూరు: స్థానిక పోలీస్ స్టేషన్ తమకు న్యాయం జరగలేదని విచారించి న్యాయం చేయాలని మార్టూరుకు చెందిన ఓ కుటుంబం సోమవారం బాపట్ల ఎస్పీ గ్రీవెన్స్ సెల్లో అభ్యర్థించింది. బాధితుల వివరాల మేరకు.. మైనార్టీ వర్గానికి చెందిన ఓ వ్యక్తికి పుట్టుకతో మూగ, చెముడు వైకల్యం కలిగిన కుమార్తె ఉంది. ఇంకొల్లు మండలం గంగవరం గ్రామానికి చెందిన నిరుపేద యువకుడికి 16 ఏళ్ల క్రితం తన కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. వివాహం జరిపించిన వ్యక్తి వారికి మార్టూరులోనే కాపురం పెట్టించి వారి ప్రతి అవసరాన్ని తనే చూసుకుంటూ వస్తున్నాడు. ఈ జంటకు 14, 15 సంవత్సరాల వయసుగల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే దివ్యాంగురాలైన ఆ యువతి భర్త గతకొంత కాలంగా మరొక మహిళతో సహజీవనం చేస్తూ భార్యను శారీరకంగా, మానసికంగా హింసించసాగాడు. ఈనెల 12వ తేదీ దివ్యాంగురాలైన భార్యకు బలవంతంగా నిద్రమాత్రలు మింగించాడు. తాను సహజీవనం చేస్తున్న యువతిని వివాహం చేసుకోవడానికి మోపిదేవి వెళుతున్నాను.. నీవు అడ్డు తొలగితే మాకు ఇబ్బంది ఉండదంటూ స్వయంగా భార్యకు చెప్పి ఆ రాత్రి యువతితో కలిసి మోపిదేవి వెళ్లాడు. ఈ క్రమంలో యువతి తాలూకు కుటుంబం జూలై 14న మార్టూరు పోలీస్ స్టేషన్లో తన కుమార్తైపె హత్యాయత్నానికి పాల్పడిన అల్లుడిపై చర్యలు తీసుకొని తమ కుమార్తె, ఆమె పిల్లలకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. బాధిత కుటుంబంపై నిందితుడి దాడి ఇదిలా ఉండగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి మార్టూరు చేరిన బాధిత యువతి తండ్రి, ఆమె సోదరుడిపై దాడి చేశారు. స్థానిక కూరగాయల మార్కెట్ ఎదురుగా రాత్రి 7 గంటల ప్రాంతంలో నిలబడి ఉండగా నిందితుడైన ఆమె భర్త నాపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తారా? మీ అంతు చూస్తానంటూ అంటూ ఇద్దరిపై దాడికి తెగబడ్డాడు. దాడిలో గాయపడిన తండ్రీకొడుకులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబం స్టేషన్లో ఫిర్యాదు చేసి 13 రోజులు గడిచినా తమకు స్థానిక పోలీసులు ఎలాంటి న్యాయం చేయకపోవడంతో ఆ కుటుంబం సోమవారం గ్రీవెన్స్లో జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్కు ఫిర్యాదు చేసింది. దివ్యాంగ యువతి పరిస్థితిని చూసి చలించిపోయిన ఎస్పీ సావధానంగా విషయం తెలుసుకున్నారు. అనంతరం మార్టూరు పోలీసు అధికారులను తీవ్రంగా మందలిస్తూ.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదుపై సక్రమంగా స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీ స్థానిక అధికారులను ఆదేశించినట్లు బాధిత కుటుంబం తెలిపింది. -
హోటల్లో అగ్నిప్రమాదం
రేపల్లె: పట్టణ శివారులోని ఓ హోటల్లో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ పి.శ్రీనివాస్ వివరాల మేరకు పెనుమూడి రోడ్డులోని దేవగిరి రమేష్బాబుకు చెందిన పల్లె రుచులు హోటల్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న సమయంలో నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. హోటల్లోని తాటాకు పందిళ్లకు మంటలు వ్యాప్తి చెందాయి. నిర్వాహకుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారని పేర్కొన్నారు. లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు నగరంలో స్తంభాలగరువు సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం ప్లాట్ఫాం వెనుక భాగాన్ని గుర్తు తెలియని వ్యక్తి ఢీ కొట్టడంతో మూడు రాతి దిమ్మెలు ఊడి పడిన ఘటన పై విచారణ నిర్వహించడం జరిగిందని వెస్ట్ డిఎస్పీ బెల్లం శ్రీనివాసరావు సోమవారం వెల్లడించారు. ఒక గుర్తు తెలియని ట్రాక్టర్ మలుపు తిరిగే సమయంలో వాహనం అదుపు తప్పి వైఎస్ఆర్ విగ్రహ వేదిక ప్లాట్ఫాం వెనుక భాగాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాద ఘటనలో విగ్రహం చుట్టూ ఉండే ప్లాట్ఫాం వెనుక భాగంలో మూడు రాతి దిమ్మెలు ఊడి కిందపడి పోయాయి. దీన్ని గమనించిన స్థానికులు ట్రాక్టర్ డ్రైవర్ను పట్టుకునేందుకు యత్నించగా వాహనాన్ని నిలపకుండా పరారై పోయాడు. సమాచారం తెలుసుకున్న పట్టాభిపురం పోలీసలు ఘటనా ప్రదేశంంలో ప్రమాదం జరిగిన వైనాన్ని విచారించారు. విచారణలో ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు, వేగంగా అదుపు తప్పి ఢీకొట్టిన ట్రాక్టర్ డ్రైవర్, ట్రాక్టర్ ను సీసీ కెమెరాల ద్వారా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని వెస్ట్ సబ్ డివిజన్ ఇన్చార్జి డిఎస్పీ పేర్కొన్నారు. పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): విద్యుత్ షాక్కు కేబుల్ ఆపరేటర్ మృతి చెందిన సంఘటనపై కేసు నమోదైంది. గుంటూరు లాలాపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏటీ అగ్రహారానికి చెందిన కావలి రామకృష్ణ (45) ఐపీడీ కాలనీ పరిసర ప్రాంతాల్లో కేబుల్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. సోమవారం ఐపీడీ కాలనీలో కేబుల్ వైర్ల మరమ్మతులు నిర్వహిస్తున్న సమయంలో విద్యుత్ వైర్ రామకృష్ణపై పడింది. విద్యుత్ షాక్కు గురైన రామకృష్ణ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి భార్య అరుణకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ సమావేశంలో పలు నిర్ణయాలు మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ప్రధాన కార్యాలయంలో సోమవారం అకాడమీ 22వ బోర్డ్ ఆఫ్ గవర్నర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అకాడమీ చైర్మన్ ఫారుక్ షిబ్లీ అధ్యక్షతన పలు అజెండా అంశాలను బోర్డు సభ్యులు సమగ్రంగా చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఉర్దూ భాషాభివృద్ధి, మైనార్టీ యువతకు నైపుణ్యాభివృద్ధి, కంప్యూటర్ శిక్షణ కేంద్రాల బలోపేతం, ఉర్దూ గ్రంథాలయాల అభివృద్ధి, సేవా నియమాళి, కారుణ్య నియామకాలు, ఉర్దూ సాహిత్య ప్రచురణలు తదితర అంశాలపై తీర్మానం చేశారు. రాష్ట్రంలోని 36 కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ల కోసం కంప్యూటర్ల కొనుగోలుకు ఏపీటీఎస్కు చెల్లించిన మొత్తం నిధులు విడుదలైనా వివిధ కారణాలతో సరఫరా ఆలస్యం కావడంపై బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. సరఫరా చేయని పరికరాలకు సంబంధించిన మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లించాల్సిందిగా ఏపీటీఎస్కు లేఖ రాయాలని, అవసరమైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 36 కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లలో ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఏడీసీఏ, మల్టీ లాంగ్వేజ్ డీటీపీ కోర్సులను ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది. సమావేశంలో బోర్డ్ ఆఫ్ గవర్నర్ సభ్యులు, మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరి చిత్తూరి శ్రీధర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరి జంపాని శివయ్య, ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్, బోర్డు సభ్యులు మెహబూబ్ బాషా, అకాడమీ డైరెక్టర్ నిజాముద్దీన్ తదితరులు ఉన్నారు. నకరికల్లు: నకరికల్లు శివారు ఎస్సీ కాలనీలో కొంతమంది వ్యక్తులు కోతముక్క పేకాట ఆడుతుండగా ఎస్ఐ కె.సతీష్, సిబ్బందితో దాడి చేసి నలుగురు వ్యక్తులను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి 3 మొబైల్ ఫోన్లు, రూ.5,770 నగదు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
క్వాంటమ్ కంప్యూటింగ్తో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు
చేబ్రోలు: భవిష్యత్ వైద్యరంగంలో క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ(ఏఐ), మెషిన్ లెర్నింగ్ సమన్వయంతో మరింత సమర్థమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, ఆ దిశగా యువ పరిశోధకులు పరిశోధనలు చేపట్టాలని ఏపీలోని ఐఐఐటీ శ్రీ సిటీ ఫ్యాకల్టీ అఫైర్స్ డీన్, ప్రొఫెసర్ పి.విశ్వనాథ్ సూచించారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘నేషనల్ సెమినార్ ఆన్ నెక్ట్స్ జెన్ హెల్త్కేర్: బయో మెడికల్ ఇమేజింగ్ థ్రూ క్వాంటమ్ డ్రివెన్ డీప్ లెర్నింగ్’ అనే అంశంపై ఐదు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయస్థాయి సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ విశ్వనాథ్ మాట్లాడుతూ క్వాంటమ్ కంప్యూటింగ్ ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోందన్నారు. సంప్రదాయ కంప్యూటర్లు పరిష్కరించడానికి ఎక్కువ సమయం తీసుకునే క్లిష్టమైన వైద్య సమస్యలను క్వాంటమ్ కంప్యూటింగ్ అత్యంత వేగంగా విశ్లేషించగలదని వివరించారు. వ్యక్తిగత వైద్య సేవలు, ఔషధాల రూపకల్పన, జీనోమిక్ డేటా విశ్లేషణ, క్యాన్సర్ వంటి క్లిష్ట వ్యాధుల నిర్ధారణలో క్వాంటమ్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఎన్ఐటీ వరంగల్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రకాష్ కొడాలి మాట్లాడుతూ భారీ స్థాయిలో డేటా విశ్లేషణ, సైబర్ సెక్యూరిటీ, బయోమెడికల్ ఇమేజింగ్ వంటి రంగాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ విశేష అవకాశాలను సృష్టిస్తోందని చెప్పారు. క్వాంటమ్ టెక్నాలజీపై విద్యార్థులు ఇప్పటి నుంచే అవగాహన పెంచుకొని పరిశోధనల వైపు అడుగులు వేయాలని సూచించారు. రాజస్థాన్లోని సెంట్రల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రకాష్ చౌదరి మాట్లాడుతూ ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ, వైద్య చిత్రాల విశ్లేషణ, రోగుల ఆరోగ్య పర్యవేక్షణ, చికిత్సా ప్రణాళికల రూపకల్పన, ఔషధాల అభివృద్ధి వంటి అనేక విభాగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్లో ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ లెర్నింగ్ సమన్వయంతో ఆరోగ్యరంగంలో వినూత్న ఆవిష్కరణలు చోటుచేసుకుంటాయని, విద్యార్థులు పరిశోధనల ద్వారా ఈ మార్పుకు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు పాల్గొన్నారు.ఐఐఐటీ శ్రీ సిటీ ఫ్యాకల్టీ అఫైర్స్ డీన్ విశ్వనాథ్ -
కూటమిలో భగ్గుమన్న విభేదాలు
రెంటచింతల: రెంటచింతలలో బీజేపీ జెండా దిమ్మె ధ్వంసం చేయడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహించారు. మాచర్ల–గుంటూరు రహదారిపై సోమవారం నిరసన తెలిపారు. టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య వివాదానికి దారి తీసింది. జాతీయ రహదారి పక్కనే రెండు నెలల కిందట బీజేపీ మండల అధ్యక్షులు ఇగుటూరి రాజశేఖర్రెడ్డి ఏర్పాటుచేసిన బీజేపీ దిమ్మెను సోమవారం కొందరు ధ్వంసం చేశారు. దీనిపై బీజేపీ నాయకులు ఆగ్రహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ నేతృత్వంలో నాయకులు మాచర్ల–గుంటూరు ప్రధాన రహదారిపై కొంత సమయం నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటుకు జెండా దిమ్మెను తొలిగించినట్లు స్థానిక టీడీపీ నాయకులు బదులివ్వడంతో ఇరు పార్టీల నాయకులు వాగ్వాదానికి దిగారు. బీజేపీ మహిళానేత లక్ష్మి విద్యుత్ స్తంభం కోసం తీసిన గుంతలోకి దిగి నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కారంపూడి సీఐ శరత్బాబు, స్థానిక ఎస్ఐ నాగార్జున ఇరు పార్టీల నేతలతో చర్చలు జరిపారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రధాన రహదారి విస్తరణ పనులు పూర్తి అయిన వెంటనే బీజేపీ జెండా దిమ్మె ఏర్పాటుకు రహదారి వెంబడే స్థలం కేటాయిస్తామని వారు హామినిచ్చి సమస్యను పరిష్కరించారు. -
గోమాతకు జాతీయ గౌరవం ఇవ్వాలి
నరసరావుపేట: ఆవులకు రాష్ట్ర మాత లేదా అంతర్జాతీయ ఆరాధ్య దేవత అనే రాజ్యాంగ హోదాను కల్పించి జాతీయ గౌరవం ఇవ్వాలని గో సన్మాన్ ఆహ్వాన్ అబియాన్ ప్రతినిధులైన ఉత్తరప్రదేశ్కు చెందిన రాధారమణదాస్ కోరారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో కలెక్టర్ను కలిసి విన్నవించారు. గో వధను నిషేధించాలని, గోశాలలకు ప్రభుత్వ బడ్జెట్ కేటాయించి వాటిని పెంచి పోషించాలని కోరారు. నరసరావుపేట, చిలకలూరిపేట గోశాల ప్రతినిధులు శివనాగేశ్వరరావు, కృష్ణచంద్ర, ప్రతినిధులు పాల్గొన్నారు. పెదకాకాని: శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో సహస్ర ఘటాభి షేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి ఆలయ అర్చకులు, వేదపండితులచే విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మట్టి కుండలతో మల్లేశ్వరస్వామి వారికి మహన్యాసపూర్వక సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్, పాలకమండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు దంపతులు, సభ్యులు బండారు మల్లేశ్వరి దంపతులు, భైరపనేని ధనలక్ష్మీ దంపతులు, ఉల్లం రాజేశ్వరి దంపతులు, ధూపాటి శివశంకరరావు, కొమ్మూరి మల్లిఖార్జునరావు, పలువురు భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ తీర్ధ ప్రసాదాలు పంపిణీ చేశారు. అమరావతి: ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించి అందరికీ మార్గదర్శకంగా నిలిచే గురువులను పూజించాలని భవఘ్నిగురూజీ అన్నారు. మండల పరిధిలోని వైకుంఠపుర భవఘ్ని అరామంలో గురిపూర్ణిమ మహోత్సవాలలో తొలిరోజు సోమవారం కార్యక్రమాలను భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ఈసందర్భంగా భవఘ్ని గురూజీ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన సంపద భారతదేశం సొంతమన్నారు. ఋషులు, మునులు మనకు అందించిన మహోన్నతమైన జ్ఞాన సంపదను సామాన్యునికి సైతం అర్ధమయ్యే రీతిలో బోధించే గురువులను స్మరించుకోవటం అదృష్టంగా భావించాలన్నారు. తొలుత వేకువజామున వ్యాసభగవానులకు సుప్రభాతసేవ, వ్యాసభగవానుడి ఉత్సవమూర్తికి రథోత్సవం, అనంతరం ఆదిగురువు వ్యాసభగవానునికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈవేడుకలలో పలు జిల్లాల నుంచి భక్తులు భారీగా పాల్గొన్నారు. ఈసందర్భంగా భక్తులందరికీ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిర్వాహకులు ఏర్పాట్లను పరవ్యవేక్షించారు. నగరంపాలెం(గుంటూరు వెస్ట్): స్థానిక విద్యానగర్ శ్రీసాయినాధ సన్నిధానంలో నిర్వహిస్తోన్న గురుపూర్ణిమ మహోత్సవాలు సోమవారం ఐదో రోజుకి చేరాయి. సాయినాధునికి శ్రద్ధాసక్తులతో రుద్రాభిషేకం నిర్వహించారు. మహిళలు హాజరవ్వగా, సాప్తాహిక అఖండ సాయినామ సంకీర్తన కొనసాగించారు. ఆలయ గౌరవాధ్యక్షుడు యడ్లపాటి అశోక్కుమార్, అధ్యక్షుడు వడ్లమూడి శివ రామకృష్ణయ్య, స్వరూపరాణి, సంజీవరావు, అప్పారావు పాల్గొన్నారు. -
నకిలీ డీఎస్పీ లీలలెన్నెన్నో..!
ఒంగోలు టౌన్: అతడి స్వగ్రామం చిలకలూరిపేట మండలం యడవల్లి. తండ్రి నాగేశ్వరరావు వ్యవసాయ కూలీ. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయో చొరవ అతడి సొంతం. అదే పెట్టుబడిగా నేరాలకు పాల్పడ్డాడు. అతడే కొత్తపల్లి ప్రదీప్. ఒంగోలు మండలం ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన ముంగులూరి రఘుపతి ఫిర్యాదుతో అతడి అసలు రంగు బయటపడింది. ఒక సైబర్ నేరంలో రూ.1.23 కోట్లు పోగొట్టుకున్న రఘుపతి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాడు. అయితే, పోలీసుల నుంచి తగిన స్పందన లభించలేదు. ఈ క్రమంలో అతడికి కొత్తపల్లి ప్రదీప్ పరిచమయ్యాడు. సైబర్ డీఎస్పీగా పనిచేస్తున్నట్లు చెప్పుకున్న అతగాడు.. రఘుపతి పోగొట్టుకున్న నగదు తిరిగిప్పిస్తానని నమ్మబలికాడు. బదులుగా రఘుపతి నుంచి రూ.5 లక్షల నగదు, ఒక బుల్లెట్ వాహనం తీసుకున్నాడు. ఆ తర్వాత ఒట్టిచేతులు చూపడంతో అనుమానం వచ్చిన రఘుపతి విచారించగా.. ప్రదీప్ మోసం తెలిసి బిత్తరపోయాడు. పోలీసులతో ఉన్న సాన్నిహిత్యంతో ప్రదీప్ మోసాలకు పాల్పడుతున్నట్లు రఘుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు నకిలీ డీఎస్పీగా పలువురిని మోసం చేసిన కొత్తపల్లి ప్రదీప్పై ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే. ప్రస్తుతం జిల్లాలో ప్రదీప్ మోసాలపై చర్చ జరుగుతోంది. -
శాకంబరీ.. సకల శుభకరీ
ప్రణామం అంటూ భక్తితో కొలిచిన భక్తజనం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాకంబరీ ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలలో అమ్మవారిని ఆకుకూరలు, కాయగూరలు, డ్రైఫ్రూట్స్తో అలంకరిస్తారు. తొలి రోజున అమ్మవారి ప్రధాన మూలవిరాట్తో పాటు మహా మండపం ఆరో అంతస్తు, ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాల్లోని పరివార దేవతలకు ఆకుకూరలు, కాయగూరలతో అలంకరించారు. ఆలయ పరిసరాలను అలంకరించేందుకు సుమారు 20 టన్నుల కూరగాయలను వినియోగించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. పూజా సామగ్రిగా కూరగాయల దండలు.. శాకంబరీ ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు పూజా సామగ్రికి బదులుగా ఆకుకూరలు, కాయగూరలతో తయారు చేసిన దండలను అమ్మవారికి సమర్పించడం కనిపించింది. సారె, పూజా సామగ్రితో పాటు ఆకుకూరలు, కాయగూరలను మూల విరాట్తో పాటు ఉత్సవ మూర్తికి సమర్పించారు. -
గంజాయి కేసులో నలుగురు అరెస్ట్
బాపట్ల టౌన్: బాపట్ల మండలం వెదుళ్ళపల్లి గ్రామంలో గంజాయి తాగుతున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేశారు. సోమవారం వెదుళ్ళపల్లి పోలీస్స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సర్కిల్ సీఐ బి. హరికృష్ణ వివరాలను వెల్లడించారు. గంజాయి తాగుతున్న చీరాల పట్టణం, రామ్నగర్కు చెందిన పేరం సాయిచంద్, చిలకలూరిపేటటౌన్ ఎన్టీఆర్ కాలనీకి చెందిన దేవరకొండ హేమంత్కుమార్, కడప టౌన్ నాగరాజుపేటకు చెందిన రావినూతల అచ్యుత్సాయికుమార్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు తనదైన శైలిలో విచారించగా వారికి మండలంలోని వెదుళ్ళపల్లి గ్రామానికి చెందిన దేవి ఏడుకొండలరెడ్డి గంజాయి సరఫరా చేశారన్నారు. మొత్తం నలుగురిని అరెస్ట్చేసి కోర్టుకు హాజరు పరిచామన్నారు. వారి వద్ద నుంచి 190 గ్రాముల గంజాయి, వివో రెడ్ హ్యాండ్రైడ్ ఫోన్, రెండు నోకియా కీబోర్డ్ ఫోన్లు, ఒక లావా కీప్యాడ్ ఫోన్, రూ. 600 నగదు, టీవీఎస్ జూపీటర్ స్కూటర్ స్వాధీనం చేసుకున్నామన్నారు. వెదుళ్ళపల్లి ఎస్ఐ ఎం. వెంకటేశ్వర్లు, విధుల్లో ప్రతిభ కనపరిచిన హెడ్కానిస్టేబుల్ తిరుపతిరాజు, అంకయ్య, కానిస్టేబుల్స్ రమేష్, రాజేష్లను ప్రత్యేకంగా అభినందించారు. -
అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవు
బాపట్లటౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి సంబంధించిన అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలను వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ బి. ఉమామహేశ్వర్ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికంగా కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలకు సంబందించిన అర్జీలే అధికంగా వస్తున్నాయని పోలీసు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బంది తదితరులుపాల్గొన్నారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ -
కార్గిల్ యుద్ధ అమరవీరులకు నివాళి
గుంటూరు లీగల్: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా యుద్ధంలో పాల్గొన్న వీరజవాన్ల సంస్మరణ కార్యక్రమాన్ని స్థానిక గుంటూరు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. కార్గిల్ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్న 14 మంది సైనికులను గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి సయ్యద్ జియాఉద్దీన్న్ సత్కరించి మాట్లాడారు. కార్గిల్ ఆపరేషన్ విజయ్లో మన సైనికులు చూపిన ధైర్యం, త్యాగం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిందని చెప్పారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ప్రవేశపెట్టిన వీర్ పరివార్ సహాయత యోజనపై కార్గిల్ యుద్ధ వీరులకు, వారి కుటుంబాలకు, అమరవీరుల కుటుంబాలకు, మాజీ సైనికులకు ఉచిత న్యాయ సహాయం, చట్టపరమైన సలహాలు, పెన్షన్, సంక్షేమ సదుపాయాల విషయంలో సహాయం ఈ పథకం ద్వారా అందుతుందని న్యాయమూర్తి వివరించారు. జిల్లా సైనిక సంక్షేమాధికారి గుణశీల మాట్లాడుతూ డీఎల్ఎస్ఏ కార్యదర్శి, న్యాయమూర్తి సహాయంతో ఇప్పటి వరకు 40 మందికిపైగా సైనిక కుటుంబాల సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం సూపరింటెండెంట్ ఆనందరావు, డీఎల్ఎస్ఎ ప్యానల్ సీనియర్ న్యాయవాది కె.కాళిదాసు, డీఎల్ఎస్ఎ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ జె.సురేష్బాబు, ఐ.మధుబాబు, ఎల్.సుబ్బయ్య, లీగల్ ఎయిడ్ క్లినిక్ న్యాయవాది పి.రాజేష్ లింగం, డీఎసల్ఎస్ఏ ఇన్చార్జి సూపరింటెండెంట్ వాణి, ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా సైనిక కుటుంబ సభ్యులు, పారాలీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: నేషనల్ సబ్ మాస్టర్స్ (మెన్ అండ్ ఉమెన్) క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో గుంటూరు జిల్లాకు చెందిన క్రీడాకారిణి ప్రతిభ చాటినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి విజయభాస్కరరావు, షేక్ సంధాని తెలిపారు. మంగళగిరి పట్టణంలోని కార్యాలయంలో ఆదివారం పతకాలు సాధించిన క్రీడాకారిణి జ్యోతివర్మ దంపతులను సత్కరించి మెమెంటో అందజేశారు. వారు మాట్లాడుతూ ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు మహారాష్ట్రలో జరిగిన ఈ పోటీల్లో పవర్ లిఫ్టర్ జ్మోతివర్మ మాస్టర్స్ –2 విభాగంలో పాల్గొని మూడు పతకాలు సాధించినట్లు తెలిపారు. 69 కేజీల క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్, క్లాసిక్ డెడ్ లిఫ్ట్ విభాగాల్లో బ్రాంజ్ మెడల్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్లో సిల్వర్ మెడల్స్ సాధించినట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో జిల్లాకు మూడు పతకాలు సాధించడం గర్వకారణమని వారు కొనియాడారు. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి గుంటూరు ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం వాయిదాలు వేయడం తప్ప పరిష్కారం చూపడం లేదని రాష్ట్రోపాధ్యాయ సంఘ(ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి ఆరోపించారు. వాయిదాల పాలనకు ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యమం ద్వారా చరమగీతం పాడుతామని హెచ్చరించారు. ఆదివారం కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో ఎస్టీయూ ఆధ్వర్యంలో ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రఘునాథరెడ్డి మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు, న్యాయమైన వేతన సవరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్ బాబు, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వర రావు, రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడు డి.పెదబాబు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన ఆర్థిక కార్యదర్శులు శ్యాంబాబు, హనుమత్ ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.అమరనాథ్ పాల్గొన్నారు. పెదకాకాని: పశులు మేపుకునే విషయంలోలో చోటు చేసుకున్న వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. పెదకాకాని మండల పరిధిలోని వెనిగండ్ల గ్రామానికి చెందిన కొల్లికొండ శివయ్యకు ఇంటి ఎదురుగా ఉన్న కొల్లికొండ సాయికి పశువుల మేత విషయంలో గురువారం వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదం రాత్రి ఇళ్ల వద్ద రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కొల్లికొండ శివయ్య, అతని కుమారుడు గోపీనాథ్ తలలు పగిలి రక్తగాయాలయ్యాయి. అలానే మరొక వర్గానికి చెందిన కొల్లికొండ సాయికి కంటి పక్కన, చేతికి గాయమైంది. ఈ దాడిలో గాయపడిన వారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని పెదకాకాని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలకు చెందిన కొల్లికొండ శివయ్య, గోపీనాథ్, శివయ్య భార్యలపై ఆనందరావు ఫిర్యాదు చేయగా ఆనందరావు, సాయి, అంజమ్మ, కోటమ్మ మరి కొందరిపై శివయ్య ఫిర్యాదు చేశాడు. విచారించి కేసు నమోదు చేయడం జరుగుతుందని సీఐ టీపీ నారాయణస్వామి ఆదివారం తెలిపారు. -
ఆటో నడిచేదెలా..?
చంద్రబాబు పాలనలో ఆటోడ్రైవర్లకు కష్టాలు చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణంగా మారింది. అడ్డగోలు జీవోలు, నిత్యం పెరిగిపోతున్న ధరలతో వారు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో రెక్కాడితేగానీ డొక్కాడని వేల మంది సామాన్య ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఆటో విడిభాగాలు, మెయింటనెన్స్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో వారు కుదేలు అవుతున్నారు. దీనికితోడు రుసుములు, జరిమానాల పెంపుతో కష్టాలపాలవుతున్నారు. పట్నంబజారు: ప్రస్తుత కాలంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక స్థితిగతులు, అవసరాలు మారడంతో దాదాపు ప్రతి ఇంటికీ ఒకటి లేదా రెండు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వ్యక్తిగత వాహనాలు పెరిగిపోవడంతో ప్రయాణికులు అత్యవసరమైతే తప్ప ఆటో ఎక్కేందుకు మొగ్గు చూపడం లేదు. పల్లెలను, పట్టణాలను అనుసంధానించే భారీ ‘సెవెన్ సీటర్’ ఆటోలు నిషేధానికి గురయ్యాయి. నగరంతోపాటు అనేక ప్రధాన ప్రాంతాల్లో తిరిగే త్రీ సీటర్స్, ఫోర్ సీటర్స్ ఆటోలు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమించినా అరకొర ఆదాయం దిక్కువుతోంది. రోజువారీ ఇంధన ఖర్చులకే సంపాదన సరిపోతోంది. ఏటా కట్టాల్సిన ఫిట్నెస్ సర్టిఫికెట్ ఫీజులు, బీమా ప్రీమియం, ఫైనాన్స్ వాయిదాలు చెల్లించలేక డ్రైవర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. తమ కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీపై ఇంధనం అందించాలని, ఫైనాన్స్ వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని జిల్లా ఆటో కార్మిక సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. జీవోల రద్దుకు విజ్ఞప్తి రాష్ట్రంలో ముఖ్యంగా సీ్త్ర శక్తి పథకం ప్రారంభించిన తరువాత ఆటోవాలాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మహిళలు ఆటోలు ఎక్కే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంక్షోభంలో ప్రభుత్వ సేవల ఫీజులు పెంచుతూ, భారీ జరిమానాలు విధించేలా తెచ్చిన జీవో 21, 31 లు ఆటోవాలాలకు మరింత గుదిబండగా మారాయి. వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ బీమా రూ. ఆరు వందలకు తగ్గించాలని, ప్రైవేట్ సంస్థల పరిధిలోని వాహన ఫిట్నెస్ పరీక్షలను రద్దు చేసి ప్రభుత్వమే నిర్వహించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలతో కూడిన ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. తమను ఆదుకోవాలని ఆటో కార్మికులు కోరుతున్నారు. నేను ఏళ్లుగా ఆటో నడుపుతున్నా. ఇదే జీవనాధారం. డీజిల్, ఇతర ఖర్చులు పోను రోజుకు రూ.200 కూడా మిగిలడం లేదు. రోడ్డుపై ఆటో నిలుపుకొనే పరిస్థితి లేకుండా పోతోంది. బిడ్డల చదువులు.. పెద్దల వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. చంద్రబాబు ప్రభుత్వం ఆటో రంగానికి చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆటోవాలాలను ఇబ్బందికి గురి చేసేలా తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయాలి. – శేషగిరి పవన్కుమార్, ఆటో యూనియన్ నాయకుడు ఆటోడ్రైవర్ల పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారిపోతోంది. ఇప్పటికే ఉచిత బస్సు పథకంతో కిరాయిలు లేక బతుకులు చితికిపోయాయి. ప్రభుత్వం వెంటనే వ్యాట్, సెస్లను రద్దు చేసి ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.చంద్రబాబు ఆటోవాలాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలలో వాహనమిత్ర సాయం, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలు కల్పిచడంతోపాటు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. – మేడా మురళి, ఆటోడ్రైవర్, ఏటీ అగ్రహారం రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఆటోలకు నెలవారీ ఈఎంఐలు, ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక నిస్సహాయ స్థితిలో ఆటోడ్రైవర్లు కొట్టుమిట్టాడుతున్నారు. ఉపాధి కోల్పోయిన అనేకమంది డ్రైవర్లు పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్తున్న దుస్థితి ఏర్పడింది. ఇంధనం లీటరుపై ఇతర రాష్ట్రాల్లో వ్యాట్ రూ.25 నుంచి రూ.28 లోపు ఉంటే.. ఏపీలో అత్యధికంగా రూ.30 ఉందని ఆటో, మోటారు వర్కర్స్ సంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ తరహాలో పన్ను తగ్గిస్తే రవాణా రంగానికి, సామాన్యులకు కొంత వెసులుబాటు కలుగుతుందన్నారు. కూటమి సర్కార్ ఈ దిశగా కూడా యోచన చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ ఏపీలో ఇంధన ధరలు పెంచడంపై ఆటోడ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. ఆయిల్ కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచుకునే అనుమతులను రద్దు చేయటంతోపాటు ధరలపై నియంత్రణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. -
బాపట్ల
సోమవారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2026సంక్షేమంలోనూ పొరుగు వారే! ఒకటో తేదీ వచ్చిందంటే అకౌంట్లో పడే జీతానికి, అయ్యే ఖర్చులకు లెక్క సరిపోదు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగమంటూ పెదవులపై ప్లాస్టిక్ నవ్వులు పులుముకుని ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఇంట అప్పుల కుంపటి ఆరదు. వేతనాలు పెంచండని వేడుకున్నా చంద్రబాబు ప్రభుత్వం మనసు కరగడం లేదు. ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో కీలకమైన విధులు నిర్వర్తిస్తున్నా, అరకొర వేతనాలతో కుటుంబాలను కన్నీటితో వారు నెట్టుకొస్తున్నారు. కనీసం సంక్షేమం కూడా దరి చేరడం లేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అంగన్వాడీలకు సైతం అమలు చేసి, చిరు ఉద్యోగులకు మాత్రం ఇవ్వకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు.కొల్లూరు: కొల్లూరులో గ్రామ దేవతలకు మహిళలు ఆదివారం ఆషాఢ సారె సమర్పించారు. పొంగళ్లు, సారెలతో ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. నరసరావుపేట టౌన్: ఒకవైపు ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి సేవలందిస్తున్నారు... మరోవైపు అదే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మాత్రం అనర్హులుగా మిగిలిపోతున్నారు. ఇదే రాష్ట్రంలో వేలాది మంది పొరుగు సేవల సిబ్బంది దీనస్థితి. దాదాపుగా అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలలో ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తాజాగా తల్లికి వందనం పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాల్లో పిల్లల చదువుల కోసం నగదు జమ చేసింది. తమకు మాత్రం సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందడం లేదని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆవేదన మరోసారి తెరపైకి వచ్చింది. సీఎఫ్ఎంఎస్ ఐడీ మెడలో వేలాడుతుండగా కనీస వేతనాలు గానీ, సంక్షేమం గానీ అమలు కాక ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితం డీలా పడిపోతోంది. ఇప్పటికై నా మా జీతాలు చూసి జీవితాల్లో మార్పు తీసుకురావాలని వేడుకుంటున్నారు. పేరుకే ప్రభుత్వ కొలువు.. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలకు రూ.15 వేల వేతనం చెల్లిస్తున్నప్పటికీ, పీఎఫ్, ఈఎస్ఐ మినహాయింపుల తర్వాత చేతికి అందేది కేవలం రూ.13,087 మాత్రమే. పెరుగుతున్న ధరలు, అద్దె, పిల్లల చదువులు, వైద్య ఖర్చుల మధ్య ఈ మొత్తంతో కుటుంబాన్ని పోషించడం భారంగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా, సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదై ఉందని అంటున్నారు. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందని వాపోతున్నారు. సీఎఫ్ఎంఎస్లో ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదవడంతో తల్లికి వందనంతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు కూడా అనర్హులుగా పరిగణిస్తున్నారని చెబుతున్నారు. తాజాగా ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసింది. అయితే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ఉన్నప్పటికీ, సీఎఫ్ఎంఎస్ నమోదును కారణంగా చూపుతూ పథకం వర్తింపజేయడం లేదని వారు చెబుతున్నారు. తక్కువ వేతనం పొందుతున్న తమలాంటి కుటుంబాలకు ఈ సాయం అత్యంత అవసరమని పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు లభించే వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర సౌకర్యాలు తమకు లేవని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. పేద కుటుంబాలకు అందించే సంక్షేమ పథకాలూ అందక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను గత సోమవారం ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ పారామెడికల్ అసోసియేషన్ సభ్యులు పీజీఆర్ఎస్లో కలసి వినతిపత్రం అందజేశారు. ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తల్లికి వందనం సహా అన్ని అర్హత ఆధారిత సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సంక్షేమ పథకాలను నిలిపివేస్తున్నారని వాపోయారు. శాశ్వత ఉద్యోగులకు ఉండే వేతనాలు, డీఏ, హెచ్ఆర్ఏ, ఉద్యోగ భద్రత, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లి న్యాయం చేయాలని విన్నవించారు. -
రైలు తగిలి బాలుడు మృతి
వేటపాలెం: వేగంగా వెళుతున్న రైలు తగలడంతో బాలుడు మృతి చెందాడు. దేశాయిపేట పంచాయతీ ఆనుమల్లిపేట సచివాలయం దగ్గరలో రైలు పట్టాల వద్ద సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆనుమల్లిపేటకు చెందిన ఎం. ఏడుకొండలు, వెంకటలక్ష్మి కుమారుడు గణేష్ (5) ఒకటో తరగతి చదువుతున్నాడు. తాత ఉదయం రైలు పట్టాల అవతల ఉన్న గొర్రెల మంద వద్దకు బాలుడుని తీసుకొని వెళ్లాడు. రైలు పట్టాలు దాటే సమయంలో వేగంగా చీరాల వైపు ఉంచి రైలు వస్తోంది. అయితే తాత బాలుడిని రైలు వస్తుంది రావద్దని చెప్పి ఆయన మాత్రం పట్టాలు దాటి వెళ్లాడు. బాలుడు పట్టాల ఇవతల ఆగి నిలబడి ఉండిపోయాడు. అయితే రైలు వెళ్లిన తరువాత చూడగా బాలుడు తలకు కంటి పక్కన గట్టి దెబ్బతగిలి కింద పడి ఉన్నాడు. గమనించిన తాత వెంటనే బాలుడిని ఇంటికి తీసుకెళ్లి అక్కడ నుంచి బాలుడు తండ్రి సహాయంతో మోటార్ బైక్ పై చీరాల వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యులు బాలుడికి చికిత్స అందించినప్పటికీ మృతిచెందాడు. రైలు పట్టాల పక్కనే నిలబడి ఉండటంతో రైలుకు సంబంధించిన ఇనుప వస్తువు తగిలి ఉంటుందని భావిస్తున్నారు. కుమారుడు మృతి చెందాడని విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. అప్పటి వరకు తమ ముందు ఆడుకుంటున్న తమ బిడ్డ మృత్యుబడికి చేరడంతో వారి బాధ వర్ణనాతీతంగా మారింది. -
మడ మొక్కల పెంపకంపై అవగాహన పెంచాలి
బాపట్ల: మడ మొక్కల పెంపకంపై తీర ప్రాంత గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీఎఫ్ఓ ఎస్.రవిశంకర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మడ మొక్కల దినోత్సవం సందర్భంగా స్థానిక నగర వనంలో తీర ప్రాంత గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. డీఎఫ్ఓ మాట్లాడుతూ మడ అడవులను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, రాబోయే తరాలకు వీటిని అడవులుగా అందించాలని ముత్తయిపాలెం ఆదర్శనగర్ వన సంరక్షణ సమితి(వీఎస్ఎస్) సభ్యులకు, మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా దత్తత తీసుకోవాలని సూచించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మన్నెం సురేంద్ర మాట్లాడుతూ వన సంరక్షణ సమితి సభ్యులు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మడ అడవుల సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటిని కాపాడాలని సూచించారు. ప్రొటెక్ట్ సంస్థ కార్యదర్శి చవనం చంద్రారెడ్డి, మానవత సంస్థ చైర్మన్ డాక్టర్ బి.శరత్బోస్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గురజాల శ్రీనివాసరావు, కార్యదర్శి వి.జోష్న, సంస్థ డైరెక్టర్లు వి.హరిబాబు, పుత్తూరు సుభాషిణి శ్రీనివాస్, కోలా సుబ్బారావు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కోలా పద్మజ, సంఘ సేవకురాలు రజిని, జి.శాంతారామ్, విజయకుమార్, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలోని కస్తూర్భా బాలికా విద్యాలయాలలో ఖాళీగా ఉన్న 21 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 28, 29 తేదీలలో నిర్వహిస్తున్నట్టు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యామ్ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెదచెరువులోని కేజీబీవీ పాఠశాలలో ఉదయం 9గంటల నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమవుతుందన్నారు. అర్హులైన అభ్యర్థుల వివరాలు వారు నమోదు చేసిన మొబైల్ నంబర్ల ద్వారా సమాచారం అందజేస్తారని వివరించారు. ధ్రువపత్రాల పరిశీనలకు హాజరు కాని, ఒరిజినల్ పత్రాలు సమర్పించని, అర్హతకు సంబంధించిన ఆధారాలు చూపని అభ్యర్థుల అభ్యర్థిత్వం పరగణించబడదని స్పష్టం చేసారు. అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, టెట్, టీసీ, కుల, ఈడబ్ల్యూస్, స్థానికత, ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో నిర్ణీత తేదీ, సమయంలో హాజరు కావాలని తెలిపారు. డీఎఫ్ఓ ఎస్.రవిశంకర్ -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
లక్ష్మీపురం(తిరువూరురూరల్): ఇబ్రహీంపట్నం–జగదల్పూర్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళగిరి నుంచి తిరువూరు వస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో డ్రైవింగ్ చేస్తున్న కారుమంచి హరికృష్ణ ప్రసాద్(60)కి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న ఆయన భార్య భవానికి కూడా తీవ్రగాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. తిరువూరు మండలం చింతలపాడుకు చెందిన హరికృష్ణ ప్రసాద్ మంగళగిరిలో నివసిస్తూ స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులున్నారు. తిరువూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని విజయ బ్యాంక్ సెంటర్ సమీప హైవేపై శనివారం రాత్రి రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్న రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భూక్యా శ్రీసాయితోపాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు శ్రీసాయి తలకు బలమైన గాయమై చెవుల్లోంచి రక్తం కారడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అర్బన్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ట్రాఫిక్ ప్రమాదానికి కారణమైన వాహనాల్ని తొలగించి ట్రాఫిక్ను నియంత్రించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మహంకాళి అమ్మవారికి గాజుల అలంకరణ
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారిని ఆదివారం ప్రత్యేక గాజులతో అలంకరించారు. దేవస్థానం భక్తులతో కళకళలాడింది, ఆషాఢ మాసం రెండవ ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. పెదకాకాని: స్థానిక శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో సహస్ర ఘటాభిషేక పూజలను ఆదివారం అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వరుణ జపాలు, రుష్యశృంగ జపం,వరుణ మంత్ర హోమాలు నిర్వహించినట్లు ఆలయ ఉపకమిషనరు గోగినేని లీలాకుమార్, పాలకమండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు సోమవారం సహస్ర ఘటాభిషేకం, ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావలసినదిగా విజ్ఞప్తి చేశారు. సోమవారం అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. పాలకమండలి సభ్యులు కొమ్మూరి మల్లికార్జునరావు, ధూపాటి శివశంకరరావు తదితరులు పాల్గొన్నారు. నగరంపాలెం: గుంటూరు జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారు. సత్ ప్రవర్తనతో జీవించాలని రౌడీషీటర్లకు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు సూచించారు. నేరప్రవృత్తికి దూరంగా ఉండాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంపాలెం: సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన ఉండాలని సీఐడీ ఎస్పీ డాక్టర్ కేవీ శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్స్లోని రోటరీ భవన్లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐడీ ఎస్పీ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కష్టపడి సంపాదించిన సొమ్ము సైబర్ నేరాలతో క్షణాల్లో మాయమవుతుందని పేర్కొన్నారు. ఏటీఎం పిన్ నంబర్లు, ఓటీపీ, పాస్వర్డ్లు ఇతరులకు చెప్పొద్దని కోరారు. తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని చెప్పారు. అనుమానిత ఫోన్కాల్స్పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసం జరిగితే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని లేదా 1930 నంబర్కు కాల్ చేయాలని అన్నారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావును సత్కరించారు. ఈ సదస్సులో క్లబ్ అధ్యక్షుడు పొందూరి శివప్రసాద్, కార్యదర్శి తుమ్మల శ్రీనివాసరావు, కోశాధికారి కొల్లి అరవింద్కుమార్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
వైభోగ బోనం
● కనుల పండువగా ఊరేగింపు ● కొనసాగిన ఆషాఢ సారె సంబరాలు ● ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల తాకిడి ● అన్ని దర్శన టికెట్ల విక్రయాలు రద్దు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ తరఫున హైదరాబాద్లోని భాగ్యనగర్ శ్రీమహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆదివారం బంగారు, వెండి బోనాలను సమర్పించింది. ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి, వానలు పుష్కలంగా కురియాలని, ఉభయ తెలుగు రాష్ట్రాలలో పాడి పంటలతో రైతులు, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ అమ్మవారికి బోనం సమర్పించినట్లు జోగిని అవికా పేర్కొన్నారు. 17 ఏళ్ల్లుగా ఏటా ఆషాఢ మాసంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని ఉమ్మడి దేవాలయాల కమిటీ పేర్కొంది. భక్తితో బయలెల్లి.. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలోని రావిచెట్టు వద్ద అమ్మవారి ఉత్సవమూర్తి వద్ద తెలంగాణ బంగారు బోనానికి కమిటీ ప్రతినిధులు, దుర్గగుడి ఈవో శీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, తీన్మార్ డప్పులు, బేతాళ నృత్యాలు, కళాకారులు విన్యాసాలు, వివిధ వేషధారణలు, పోతరాజుల విన్యాసాలతో వైభవంగా ఊరేగింపు ప్రారంభమైంది. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ సుమారు 5 వందల మంది కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తూ ఇంద్రకీలాద్రికి వైపు సాగారు. అమ్మవారికి ప్రణమిల్లి.. జోగిని అవికా బంగారు బోనాన్ని తలపై పెట్టుకుని ఊరేగింపులో ముందుకు సాగగా.. వెండి తదితర బోనాలతో మిగిలిన వారు అనుసరించారు. బంగారు బోనాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు బ్రాహ్మణ వీధి, రథం సెంటర్, ఇంద్రకీలాద్రి పరిసరాలను తరలివచ్చారు. దుర్గాఘాట్కు చేరుకున్న తర్వాత కృష్ణమ్మకు గంగ తెప్ప, పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రి తదితరాలను సమర్పించారు. దుర్గాఘాట్, ఘాట్రోడ్డు మీదగా ఊరేగింపు ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. సుమారు 700 మంది కళాకారులు, కమిటీ ప్రతినిధులు చేరుకోవడంతో ఘాట్రోడ్డుపై పండుగ వాతావరణం కనిపించింది. ఆలయ ప్రాంగణంలోని గాలి గోపురం వద్ద బంగారు బోనానికి ఆలయ ఈవో, చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, అర్చకులు స్వాగతం పలికారు. కమిటీ ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల అనంతరం బంగారు, వెండి బోనాలతోపాటు పూజ సామగ్రి, పట్టువస్త్రాలు, పసుపుకుంకుమలను ఆలయ ఈవో, ఆలయ అర్చకులకు అందజేశారు. అమ్మవారి దయతో ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బుల్లెట్ శ్రీధర్, మాజీ అధ్యక్షులు పేర్కొన్నారు. కొనసాగిన సారె సంబరం ఆదివారం రికార్డు స్థాయిలో భక్త బృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించాయి. భక్తుల రద్దీ కనిపించడంతో దర్శనానికై విక్రయించే అన్ని టికెట్ల విక్రయాలను అధికారులు రద్దు చేశారు. ఆదివారం 70 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారని భావిస్తున్నారు. -
ముద్రగడ సేవలు అజరామరం
రేపల్లె: రాజకీయాలకతీతంగా అందరూ అభిమానించే మహోన్నత వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. కాపు నాయకుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణంలోని గుత్తికొండ లక్ష్మీనారాయణ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాపు సమాజానికి రాజకీయ రిజర్వేషన్ సాధించేందుకు ముద్రగడ పద్మనాభం సాగించిన వీరోచిత పోరాటాలను అంబటి గుర్తు చేశారు. వ్యక్తిగత రాజకీయ ఎదుగుదల కంటే కాపు జాతి అభివృద్ధికే ప్రాధాన్యమిచ్చి అహర్నిశలు శ్రమించారని కొనియాడారు. కాపుల హక్కుల కోసం చేసిన ఉద్యమాల్లో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారని తెలిపారు. అనుకున్నది సాధించే వరకు వెనక్కి తగ్గని పట్టుదలతో విక్రమార్కుడిలా ఆయన రాజకీయ ప్రస్థానం సాగిందన్నారు. అలాంటి మహానుభావుడు కాపు జాతిలో పుట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీకి ప్రతీకగా నిలిచిన ముద్రగడ పద్మనాభం లేకపోవడం బాధాకరమని, ఆయనను రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా ముద్రగడ పద్మనాభం చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. కాపు జాతి ఐక్యత కోసం ఆయన అనేక ఉద్యమాలను విజయవంతంగా నడిపించారని పేర్కొన్నారు. ఆయన నీతి, నిజాయతీ, పట్టుదలే ఆయన విజయానికి సోపానాలని కొనియాడారు. ముద్రగడ పద్మనాభం ప్రజాసేవ అపారమైనదని, ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా ఆయన చూపిన నిబద్ధత అరుదైనదన్నారు. కాపు జాతి ఐక్యత కోసం ఆయన నడిపిన ఉద్యమాలు సమాజంలో చైతన్యం నింపాయన్నారు. పదవులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి గానీ, ఆయన ఎప్పుడూ పదవుల కోసం విలువలను వదల్లేదన్నారు. నీతి, నిజాయితీ, అచంచలమైన పట్టుదల ఈ మూడు గుణాలే ఆయనను విశిష్ట నాయకుడిగా నిలబెట్టాయని, ఆయన జీవితం ప్రతి నాయకుడికి ఆదర్శమని కొనియాడారు. ఆగస్ట్ 1వ తేదీన కిర్లంపూడిలో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగే సంతాపసభకు అందరూ హాజరై ఆయన సేవలను స్మరించుకోవాలని కోరారు. పలువురు పద్మనాభం సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు మోపిదేవి శ్రీనివాసరావు, న్యాయవాది రజని, పలు పార్టీల నాయకులు చందు సాంబశివరావు, గూడపాటి శ్రీనివాసరావు, గడ్డం రాధాకృష్ణమూర్తి, గాదె వెంకయ్యబాబు, కమతం సాంబశివరావు, చదలవాడ శ్రీనివాసరావు, తోట రాంబాబు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు ప్రైవేటు బ్యాంకు మేనేజర్లు అరెస్ట్
లక్ష్మీపురం: అరండల్పేటలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంక్లో ఇద్దరు మేనేజర్లు సైబర్ నేరానికి పాల్పడటంతో అరెస్టు చేశారు. అరండల్పేట, సైబర్ క్రైమ్ పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరండల్పేట పోలీస్ స్టేషన్లో సీఐ ఆరోగ్య రాజు విలేకరులతో తెలిపిన వివరాల ప్రకారం.... గుంటూరు అరండల్పేట 4వ లైన్లోని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో బ్రాంచ్ మేనేజర్లుగా సయ్యద్ నౌషాద్, ఆపరేషనల్ మేనేజర్గా షేక్ బాజీ విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది మనీ మ్యూల్ అకౌంట్స్ ద్వారా సుమారుగా 11 ఖాతాల నుంచి రూ.25 లక్షలు విత్డ్రా చేసినట్లు సీఐడీ నుంచి ఫిర్యాదు వచ్చింది. సైబర్ క్రైమ్ సోషల్ మీడియా వింగ్కు చెందిన ఎస్ఐ లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరుగురిపై అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం రూ.25 లక్షలు సైబర్ మోసం చేసినట్లు తెలిసింది. సయ్యద్ నౌషాద్ ఇదంతా చేసి మేనేజర్ కొడవటిగంటి రామకృష్ణ ద్వారా యూకేలో ఉండే దగ్గుపాటి సాయి కిరణ్కు చేర్చి కమీషన్ తీసుకున్నట్లు గుర్తించారు. నేపాల్లో సైబర్ నేరం చేసి రూ.4.87 లక్షల నగదు కాజేసిన మోసంలో కూడా వీరు పాల్గొన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. శనివారం బ్రాడిపేట 4వ లైను వద్ద సయ్యద్ నౌషాద్, రామకృష్ణలను అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 సెల్ఫోన్లు స్వాధీన పరుచుకున్నారు. కేసు ఛేదనలో ప్రతిభ చాటిన అరండల్పేట సీఐ ఆరోగ్య రాజు, ఎస్ఐ ఈశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ ఒ. చిరంజీవులు, కానిస్టేబుల్ అప్పలనాయుడు, సైబర్ క్రైమ్ సెల్ సీఐ మొహమ్మద్ నిసార్ బాషా, ఎస్ఐ లక్ష్మి , హెడ్ కానిస్టేబుల్ రాజ కిశోర్, కానిస్టేబుల్లు యాసిన్, సాయి, ఇమాం, మానస, అరుణలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. సైబర్ క్రైమ్కు సహకరించిన నిందితులు -
మహిళలు, సామాన్య ప్రయాణికుల రక్షణే ధ్యేయం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): మహిళలు, సామాన్య ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా సరికొత్త డిజిటల్ విప్లవానికి నాంది పలికామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. శనివారం నగరంపాలెం పోలీస్ కల్యాణ మండపంలో అభయ్ ఆటో గుంటూరు డిజిటల్ యాప్, ఆటోలకు కేటాయించిన డిజిటల్ క్యూఆర్ కోడ్ ఆధారిత వ్యవస్థను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గుంటూరు నగరంలో ఆటోల రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఫిట్నెస్ పరిశీలించాక ప్రత్యేక క్యూఆర్ కోడ్తో రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తామన్నారు. ఈ క్యూఆర్ కోడ్ ఆటో ముందు, వెనుక, లోపల ప్రయాణికులకు కనిపించేలా అతికిస్తారని చెప్పారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. డీఎస్పీలు బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), అలహరి శ్రీనివాసరావు (ఎస్బీ), సీఐలు ఎ.అశోక్ (తూర్పు ట్రాఫిక్ పీఎస్), సింగయ్య (పశ్చిమ ట్రాఫిక్ పీఎస్), నిషార్బాషా (ఐటీ కోర్), యాప్ రూపకల్పనకు సహకరించిన పెంచలరెడ్డి శేఖర్, కమ్యూనికేషన్స్ ప్రతినిధులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. -
చదవకపోతే కొడతారని పరారీ
భట్టిప్రోలు: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని భట్టిప్రోలు మండలం, వెల్లటూరు గ్రామ దేవతలైన శ్రీ ముత్యాలమ్మ, శ్రీ కట్లమ్మ, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లకు శుక్రవారం భక్తులు వైభవంగా సారె సమర్పించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో అమ్మవార్లకు చీరలు, పసుపు, కుంకుమ, గాజులు, పిండివంటలతో కూడిన సారెను అందజేశారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వేద పండితులు క్రోవి రామకృష్ణ మాట్లాడుతూ అమ్మవార్లకు సారె సమర్పించడం మన జీవితాలను అమ్మవారికి శరణాగతి చేసుకోవడమేనని తెలిపారు. -
యూజీసీ పే స్కేల్ అమలు చేయాలి
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవలు క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం, యూజీసీ పేస్కేల్ అమలు చేయాలని అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ తిరుమలరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒప్పంద అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ తిరుమలరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు ప్రకారం కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పరిగణించి యూజీసీ పే స్కేళ్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తొలుత ఏఎన్యూ ప్రాంగణంలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. గురువారం రిలే నిరాహార దీక్షలో భాగంగా కె.సందీప్, డాక్టర్ వీడీ రాజాజీ, డాక్టర్ కె.శ్రీదేవి, డాక్టర్ ఎస్కే మస్తానమ్మ, డాక్టర్ సీహెచ్ రాధిక, డాక్టర్ ఎన్.ప్రసన్న కుమార్ విధులకు సెలవు తీసుకొని దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. వీరికి సంఘీభావంగా మిగిలిన కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ విధులు ముగించుకుని పెద్ద సంఖ్యలో నిరసన శిబిరానికి చేరుకొని దీక్షలో పాల్గొన్నవారికి మద్దతు తెలిపారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లపై వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఎన్యూ వద్ద కొనసాగుతున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల రిలే నిరాహార దీక్షలు -
రాగితీగల చోరీ ముఠా గుట్టురట్టు
మంగళగిరి రూరల్: నిర్మాణంలో ఉన్న భవనాల్లో విద్యుత్ వైర్లను చోరీ చేసి వాటి నుంచి కాపర్ను వేరు చేసి విక్రయిస్తున్న ముఠాను మంగళగిరి రూరల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. మొత్తం 10 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వారి వద్ద నుంచి 28 కిలోల రాగి తీగను స్వాధీనం చేసుకున్నట్లు మంగళగిరి రూరల్ సీఐ చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న రాగి తీగ విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందన్నారు. మండలంలోని కాజా టోల్గేట్ సమీపంలోని ఓ టెక్ పార్క్లో భద్రపరిచిన 20 బండిళ్ల ఎలక్ట్రికల్ వైర్లు చోరీకి గురయ్యాయని జూన్6న నిర్మాణ కాంట్రాక్టర్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. దర్యాప్తులో కాజా, చినకాకాని ప్రాంతాల్లో నిర్మాణ భవనాల నుంచి వైర్లు చోరీ చేసి వాటిని కాల్చి కాపర్గా మార్చి పేరేచర్లకు చెందిన పాత సామాను వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు గండాలయ్యపేట, తాడికొండ, పేరేచర్లలకు చెందిన మొగిలి మధు, జగన్నాథం, ఏసుబాబు, సాంబయ్య, నాగ తేజ, ఉయ్యాల సతీష్ లపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయటం జరుగుతుందన్నారు. కేసు దర్యాప్తులో ఏఎస్ఐ రత్నరాజు, హెడ్ కానిస్టేబుళ్లు శ్యామ్, రాము, చలమరావు, కానిస్టేబుల్ సాగర్ పాల్గొన్నారు. సోషల్ మీడియా పోస్ట్ కేసులో యువకుడికి బెయిల్ చిలమత్తూరు: మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై సోషిల్ మీడియాలో పోస్టు పెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు జిల్లా దాచేపల్లి మండలానికి చెందిన వీర ప్రతాప్రెడ్డికి హిందూపురం స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మడకశిరకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రతాప్రెడ్డిని అరెస్ట్ చేసి హిందూపురంలోని స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. బాధితుడికి వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక అండగా నిలిచారు. ఆమె సూచన మేరకు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు వెంకటరెడ్డి బాధితుడి తరుఫున వాదనలు వినిపించారు. ఈ మేరకు న్యాయమూర్తి బాధితుడి సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. కాగా బెయిల్ మంజూరు అయిన తర్వాత కూడా మడకశిర పోలీసులు బాధితుడిని పోలీసు జీపులో తీసుకెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వెంటనే బాధితుడిని విడుదల చేయాలని వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక డిమాండ్ చేశారు. కోటప్పకొండ మండపంలోనే అభిషేకాలు నరసరావుపేట: తొలి ఏకాదశి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 25 శనివారం నుంచి 27 సోమవారం వరకు మూడురోజులపాటు అభిషేకాలు అభిషేక మండపంలోనే నిర్వహించటం జరుగుతుందని సహాయ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి డి.చంద్రశేఖరరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
సమన్వయంతోనే వినూత్న ఆవిష్కరణలు
చేబ్రోలు: భవిష్యత్లో పరిశోధనలు ఇంటర్ డిసిప్లినరీ విధానంలో మరింత విస్తరించనున్నాయని, గణితం, కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, జీవశాస్త్రం, వైద్యశాస్త్రం వంటి విభిన్న రంగాల సమన్వయంతో వినూత్న ఆవిష్కరణలు సాధ్యమవుతాయని ఐఐటీ తిరుపతి ప్రొఫెసర్ ఎస్.బాలకృష్ణ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ‘కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్సెస్ (ఐసీసీఎంఎస్ఎస్–2026)’ అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. హైబ్రిడ్ విధానంలో (ఆన్లైన్, ఆఫ్లైన్) నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ముందుగా సదస్సుకు సంబంధించిన కాన్ఫరెన్స్ సావనీర్ను ఆవిష్కరించారు. ప్రొఫెసర్ ఎస్.బాలకృష్ణ మాట్లాడుతూ అనువర్తిత గణితం, కంప్యూటేషనల్ సైన్సెస్ రంగాలు నేటి సాంకేతిక ప్రపంచానికి వెన్నెముకగా నిలుస్తున్నాయన్నారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, హై–పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, శాసీ్త్రయ అనుకరణలు వంటి రంగాల్లో వేగంగా జరుగుతున్న పరిశోధనలను వివరించారు. ఐఐటీ పాట్నా ప్రొఫెసర్ ఓం ప్రకాశ్ మాట్లాడుతూ సంక్లిష్టమైన శాసీ్త్రయ సమస్యలను విశ్లేషించడంలో, వాటికి ఖచ్చితమైన పరిష్కారాలను రూపొందించడంలో అధునాతన గణిత భావనలు కీలకంగా మారాయని తెలిపారు. ఎన్ఐటీ కాలికట్ ప్రొఫెసర్ మహేశ్ కుమార్ మాట్లాడుతూ కంప్యూటేషనల్ గణితం ఆధునిక విజ్ఞానశాస్త్రం, సాంకేతిక అభివృద్ధిలో కీలకమైన సాధనంగా మారిందన్నారు. కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
టిప్పర్ ఢీకొని మహిళ మృతి
తుళ్లూరు మండలం రాయపూడి వద్ద ఘటన తాడికొండ: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను టిప్పర్ వెనుకనుంచి ఢీకొన్న ఘటనలో భార్య మృతిచెందగా.. భర్త గాయాలపాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డమాను గ్రామానికి చెందిన భార్యాభర్తలు గురువారం ద్విచక్రవాహనంపై వెళుతుండగా తుళ్లూరు మండలం రాయపూడి వద్ద వెనుకనుంచి వచ్చిన టిప్పర్ వీరి బండిని ఢీకొట్టడమే కాకుండా.. కొంతమేరకు ఈడ్చుకువెళ్లింది. ఘటనలో భార్య డేగల వెంకాయమ్మ (37) అక్కడికక్కడే మృతిచెందింది. భర్తకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూ సమీకరణ ప్రగతి సాధించాలిగుంటూరు వెస్ట్: సీఆర్డీయే రెండో విడత భూ సమీకరణ వారం రోజుల్లో ప్రగతి సాధించాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదేశించారు. సీఆర్డీయే భూ సమీకరణపై గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీసి హాల్లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సీఆర్డీయే అదనపు కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నోటిఫై చేసిన భూముల సమీకరణ ఆవశ్యమని అందుకు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పెద్దపరిమి, హరిశ్చంద్రాపురం, వడ్డమాను గ్రామాల్లో అవగాహన త్వరగా చేపట్టాలన్నారు. భూసమీకరణకు డిప్యూట్ చేసిన సర్వేయర్లు వెంటనే చేరాలని ఆదేశించారు. రికార్డు ప్రకారం భూమి వివరాలు, భౌతికంగా ఉన్న భూమి వివరాలు సరిపోతే సమీకరణ చేయవచ్చన్నారు. రికార్డు ప్రకారం ఉన్న భూమి కంటే ఎక్కువ భూమిని ఎవరు క్లెయిమ్ చేయలేరని స్పష్టం చేశారు. డాక్యుమెంట్లో చూపిన భూమిని రైతు విధిగా చూపించాలని తెలిపారు. డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఆర్డీఓలు కె.శ్రీనివాస రావు, కె.శ్రీరమణి, సీఆర్డీయే డిప్యూటీ కలెక్టర్లు, సంబంధిత మండల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. -
లీవ్ అడిగితే ఉద్యోగం తీసేశారు
సుభాష్నగర్: దుండిగల్ సర్కిల్ పరిధిలోని బహదూర్పల్లి టెక్ మహీంద్రా కార్యాలయం ఎదుట ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగి ధర్నాకు దిగింది. అకారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన రాజుపాలెం భావన ఈసీఐఎల్ లో నివాసము అంటూ బహదూర్ పల్లి లోని టెక్ మహీంద్రా లో ప్రాసెస్ అసోసియేట్ పనిచేస్తుంది. మూడు రోజులుగా సెలవు తీసుకున్నందున తనను ఉద్యోగం నుంచా అకారణంగా తీసి వేశారు అంటూ బుధవారం దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎలాంటి న్యాయం దొరకకపోవడంతో గురువారం టెక్ మహేంద్ర ముందు కూర్చొని నిరసనకు దిగింది. విషయం తెలుసుకున్న దుండిగల్ పోలీసులు అక్కడికి చేరుకొని యాజమాన్యంతో మాట్లాడగా తనకు ఎలాంటి న్యాయం చేయలేదంటూ బాధితురాలు భావన ఆరోపించింది. ఈ సందర్భంగా భావన మాట్లాడుతూ తన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఈనెల 17, 18 20 మూడు రోజులు సెలవు కావాలని యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఇచ్చి అనుమతి కోరినట్లు వెల్లడించింది. సెలవు కోరిన అనంతరం తనను ఉద్దేశపూర్వకంగా వేధిస్తూ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఈ మెయిల్ ద్వారా సమాచారం అందిందని ఆరోపించింది. యాజమాన్యం తమపై అనవసర ఒత్తిడి తెస్తోందని, వాష్రూమ్కు వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని భావన పేర్కొంది. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ విధులకు హాజరు కావాలని ఈ మెయిల్ ద్వారా ఆదేశించారని, సిక్ లీవ్కు వేతనం చెల్లించకపోయినా పనికి రావాలని ఒత్తిడి చేశారని ఆరోపించింది. దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తనకు న్యాయం జరగలేదని, నాకు న్యాయం జరిగే వరకూ కంపెనీ ముందు నిరసన కొనసాగుతుందని సాయంత్రం వరకు అలాగే బైఠాయించింది. -
భట్టిప్రోలు బౌద్ధ స్తూపం అభివృద్ధికి వినతి
భట్టిప్రోలు: స్థానిక బౌద్ధ స్తూపం అభివృద్ధికి తక్షణమే చర్యలు తీసుకోవాలని లోక్సభ ప్యానల్ స్పీకర్, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో గురువారం ఆయన భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక ప్రాంతమైన భట్టిప్రోలు స్తూపం సమగ్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎంపీ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన బౌద్ధ క్షేత్రాలలో భట్టిప్రోలు స్తూపం ఒకటని గుర్తుచేశారు. ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. బౌద్ధ పర్యాటక సర్క్యూట్లో అభివృద్ధి చేయడం, బౌద్ధ వారసత్వ ప్రదేశాల మధ్య అనుసంధానం కల్పించాలన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. -
పారా లీగల్ వలంటీర్ల పాత్ర కీలకం
శాశ్వత న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పీవీ రాజీవ్ గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు పారా లీగల్ వలంటీర్లకు గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత శాశ్వత న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి.ఆర్.రాజీవ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో శాశ్వత న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి.వి.రాజీవ్ పారా లీగల్ వలంటీర్ల ముఖ్యమైన బాధ్యతల గురించి వివరించారు. వాటిలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం అంశంపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రధానంగా మధ్యవర్తిత్వం, సంధానం, రాజీ విధానం ద్వారా న్యాయ పరంగా కేసుల పరిష్కారానికి ఉపయోగపడుతుందని తెలిపారు. సమాజంలో పారా లీగల్ వలంటీర్ల పాత్ర చాలా ముఖ్యమైనదన్నారు. న్యాయ సహాయం అవసరమైన వారిని గుర్తించి వారికి తగు సలహాలు, సూచనలు ఇచ్చి, చట్ట పరమైన సేవల గురించి కూడా అవగాహన కల్పించే బాధ్యత ఉందని తెలిపారు. చిన్న చిన్న ఉదాహరణలతో వలంటీర్లకు అర్ధమయ్యే రీతిలో సివిల్, క్రిమినల్ కేసులను ఎలా పరిష్కరించాలో వివరించారు. ప్యానెల్ అడ్వకేట్ కె.కాళిదాసు, సీనియర్ పారా లీగల్ వలంటీర్ షేక్ మొహమ్మద్ రఫీ మాట్లాడారు. కన్నెగంటి స్పోర్ట్స్ సొసైటీ వైస్ చైర్మన్గా సత్యనారాయణ గుంటూరు వెస్ట్ (క్రీడలు): కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ ఏపీ వైస్ చైర్మన్గా కనమర్లపూడి సత్యనారాయణను నియమించారు. గురువారం స్థానిక విశ్రాంత ఎస్పీ సిహెచ్ చక్రపాణి గృహంలో జరిగిన కార్యక్రమంలో ఈ ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపకుడు తిరుమలశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా సొసైటీ సభ్యుడిగా చక్కని సేవలందించిన సత్యనారాయణ నిబద్ధతను చూసి వైస్ చైర్మన్గా ఎంపిక చేశామన్నారు. సమాజంలో క్రీడాకారులను ప్రోత్సహించడం, క్రీడల అభివృద్ధికి తమ సొసైటీ కృషి చేస్తుందన్నారు. సత్యనారాయణకు విశ్రాంత ఎస్పీ చక్రపాణి చేతులమీదుగా నియామకపత్రాలను అందజేసారని చెప్పారు. సొసైటీ ప్రధాన కార్యదర్శి యర్రగోపు నాగేశ్వరరావు, ఎస్.ప్రసాద్, నాగరాజు, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
నాడీ సంబంధిత వ్యాధులపై అవగాహన అవసరం
గుంటూరు మెడికల్: ప్రపంచ మెదడు దినోత్సవం సందర్భంగా న్యూరో సైంటిస్ట్స్ అసోసియేషన్ – గుంటూరు ఆధ్వర్యంలో ప్రజా చర్చా వేదిక గురువారం నిర్వహించారు. న్యూరో సైంటిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం, ప్రజా ఆరోగ్య వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాలు ఎంతో ప్రశంసనీయమన్నారు. ఇటీవల డాక్టర్ విజయ ప్రపంచ స్ట్రోక్ అసోసియేషన్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలిగా ఎన్నికై న సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వివిధ ప్రజారోగ్య సంఘాల ప్రతినిధులు నాయకులు ఆమెను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. సభను గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం, ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో నిర్వాహకులు ఎల్.ఎస్. భారవి, జి. శ్రీనివాసరావు, మల్లికార్జున్, మురళి సమన్వయంతో నిర్వహించారు. న్యూరో సైంటిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ -
జట్టు కట్టి మట్టి మాయం!
బాపట్లశుక్రవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 29.280 టీఎంసీలు. విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 400 క్యూసెక్కులు దిగువకు వదలుతున్నారు.పర్యావరణానికి చేటు చేసేలా పచ్చ నేతలు యథేచ్ఛగా చెరువుల్లో మట్టిని తవ్వి తరలిస్తున్నారు. తమ జేబులు నింపుకొంటున్నారు. అధికారమే అండగా తమ్ముళ్లు అక్రమార్జనకు సహజ వనరులను కొల్లగొడుతున్నారు. రెవెన్యూ, మైనింగ్, డ్రైనేజీ అధికారులు అండగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్చూరు (చినగంజాం): టీడీపీ నేతలు స్థానిక చెరువులు, వాగుల్లో మట్టిని తవ్వి యథేచ్ఛగా అమ్మేసుకుంటూ రూ.కోట్లు గడిస్తున్నారు. భవిష్యత్లో చుట్టుపక్కల పంట పొలాలు దెబ్బతింటాయనే ఆలోచన కూడా లేకుండా మట్టిని తవ్వి తరలిస్తున్నారు. నిత్యం లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లలో మట్టిని భారీ యంత్రాలతో నింపి తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఇదేమని ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులుతో భయపెట్టడం, రాజకీయ నాయకులు బెదిరింపులకు గురిచేస్తుండటంతో మిగతవారు కూడా మిన్నకుండి పోతున్నారు. ప్రస్తుతం పర్చూరు నియోజక వర్గ పరిధిలో అన్ని మండలాల్లో ప్రకృతి వనరుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. అధికార పార్టీకి చెందిన వారంతా కుమ్మకై ్క దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన అందిన కాడికి దోచేసుకుంటున్నారు. పంటలకు ప్రమాదం పర్చూరు మండలం నూతలపాడు గ్రామంలో సర్వే నంబర్ 232లోని చెంచుకుంట, సర్వే నంబర్ 111లోని బురఖాయల కుంట ప్రాంతాల్లోని చెరువు మట్టిని లారీలు, ట్రాక్టర్లు, జేసీబీల సాయంతో నిత్యం తవ్వేస్తున్నారు. ఆయా శాఖల అధికారులకు ముడుపులు ముట్టజెబుతూ వారి అండదండలతో రూ.కోట్ల విలువైన మట్టిని ఇలా చెరబడుతున్నారు. ఫలితంగా రాబోయే రోజుల్లో చెరువులు, వాగులు కట్టలు లేకుండా పోయి చుట్టు పక్కల పంట పొలాలు దెబ్బతినే పరిస్థితులు తలెత్తుతున్నాయంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చేస్తున్నారట! ప్రకృతిని నిలువునా దోచుకుంటున్న తీరును అడ్డుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మామూళ్లకు కక్కుర్తి పడి సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పుడు కేసులకు భయపడి ఎవరూ ధైర్యంగా అడ్డు చెప్పేందుకు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. వీటిని ఆపాల్సిన రెవెన్యూ, మైనింగ్, డ్రైనేజీ అధికారులు మాత్రం ఎక్కడా మట్టి విక్రయిస్తున్న దాఖలాలు లేవని తేల్చేశారు. వాగు కట్టలు తీసి అభివృద్ధి చేస్తున్నారని చెప్పి తప్పించుకుంటున్నారు. కొన్ని చోట్ల భారీ గోతులు ఏర్పడటంతో వర్షాకాలంలో నీటితో నిండి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఈ విషయమై తహసీల్దార్ పి. బ్రహ్మయ్యను వివరణ అడగగా... నూతలపాడు గ్రామంలోని మట్టి తవ్వకం గురించి తన దృష్టికి రాలేదని చెప్పారు. పంచాయతీ పరిధిలో జరుగుతున్న పనులపై సమాచారం లేదని తెలిపారు. గ్రామ రెవెన్యూ అధికారులను పంపించి వివరాలు తెలుసుకుంటానని సమాధానం ఇచ్చారు. -
కరకట్ట వెంబడి తప్పిన పెను ప్రమాదం
బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జిని ఢీకొట్టిన టిప్పర్ తాడేపల్లి రూరల్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లే మార్గంలో కృష్ణానది ఎగువ ప్రాంతంలోని బకింగ్హామ్ కెనాల్ వద్ద ఓ టిప్పర్ లారీ గురువారం అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొట్టింది. సేకరించిన వివరాల ప్రకారం.. ఉండవల్లి సెంటర్ నుంచి అమరావతి కరకట్ట వైపు లారీ వెళుతోంది. అక్కడ రోడ్డు పల్లంగా ఉండడంతో బ్రేకులు పడకపోవడంతో వేగంగా వెళ్లి బకింగ్హామ్ కెనాల్ హెడ్ స్లూయిస్ గేటు దిమ్మకు ఢీకొని లారీ నిలిచిపోయింది. లారీ క్యాబిన్ పూర్తిగా దెబ్బతింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లే మార్గం, వీవీఐపీలు తిరిగే మార్గం కావడంతో తాడేపల్లి పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల, భద్రతా సిబ్బంది లారీని యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. ఈ సమయంలో 45 నిమిషాల పాటు ప్రకాశం బ్యారేజ్, మంగళగిరి రోడ్డు నుంచి కరకట్టవైపు వెళ్లే వాహనాలను, సచివాలయం నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్లే వాహనాలను నిలిపివేశారు. -
కోతకు గురైన తుంగభద్ర కాలువ కట్ట
చుండూరు (వేమూరు): తుంగభద్ర సైడ్ కాలువ కట్ట కోతకు గురైనప్పటికీ ఇరిగేషన్ అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తుంగభద్ర సైడ్ కాలువకు సాగునీరు విడుదల చేశారు. గతేడాది నవంబరు నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల దుండిపాలెం నుంచి యడ్లపల్లి వంతెన వరకు తుంగభద్ర సైడ్ కాలువ కట్ట కోతకు గురైంది. వేసవి కాలంలో మరమ్మతులు కూడా చేయలేదని రైతులు తెలిపారు. తాత్కాలికంగానైనా మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. కట్టలు బలహీనంగా ఉండటంతో నడిగడ్డవారిపాలెం, చుండూరు గ్రామాల వద్ద నీరు పొర్లి పొలాల్లోకి వెళ్లి పంట దెబ్బతింటోందని తెలిపారు. నడిగడ్డవారిపాలెం వద్ద కాలువకు వంతెన ఏర్పాటు చేశారు. అక్కడ గుర్రపు డెక్క నిలిచిపోవడంతో సాగునీటి పారుదల కష్టంగా మారింది. -
కొత్త బైపాస్లో రోడ్డు ప్రమాదం
యడ్లపాడు: క్షణకాలపు నిద్రమత్తు... జీవితాన్నే చీకట్లోకి నెట్టేసేంత పెనుప్రమాదమై ముంచుకొచ్చింది. కనురెప్పల వెనుక చేరిన అలసట, వేగంగా వెళ్తున్న వాహనాన్ని ఆపలేకపోయింది సరే... ఏకంగా వాహనం ధ్వంసం కావడంతో పాటు దానిని నడుపుతున్న డ్రైవర్ను కూడా తీవ్రగాయాల పాలు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యడ్లపాడు మండలం తిమ్మాపురం పరిధిలోని నూతన పెట్రోల్ బంకు సమీపంలో వేగంగా వెళ్తున్న కారు ముందు వెళ్తున్న కంటైనర్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. 16వ నంబర్ జాతీయ రహదారి కొత్త బైపాస్పై గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో కారు కంటైనర్ వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. దానిని గమనించని కంటైనర్ డ్రైవర్ వాహనాన్ని కొద్దిదూరం ఈడ్చుకెళ్లాడు. ఈ క్రమంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయి, టైర్లు వేడెక్కి అరిగిపోయాయి. స్థానికులు వెంటనే స్పందించి కంటైనర్ను నిలిపివేసి, కారులో చిక్కుకుపోయిన గుంటూరుకు చెందిన ఉప్పుటూరు హర్ష (33)ను ఎంతో శ్రమించి బయటకు తీశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హర్షను మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితుడు గుంటూరు నుంచి బాపట్ల జిల్లా మార్టూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, కారులో అతనొక్కడే ఉన్నాడని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న యడ్లపాడు పోలీసులు, హైవే సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ధ్వంసమైన వాహనాన్ని రహదారిపై నుంచి తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. 410 కిలోల గంజాయి స్వాధీనం పిడుగురాళ్ల: మాదక ద్రవ్యాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యలలో భాగంగా పట్టణ పోలీసులు 410 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్ఐ డి.శివనాగరాజు గురువారం తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈ నెల 21వ తేదీన విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో పిడుగురాళ్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద తనిఖీలు నిర్వహించారు. మాయాబజారు, మంగళబజారుకు చెందిన మారబోయిన అరుణ్సాయిని అదుపులోకి తీసుకొని తనిఖీలు చేయటంతో అతని వద్ద 410 గ్రాముల గంజాయి లభించిందన్నారు. అతనిని విచారించటంతో వినుకొండకు చెందిన లీలా అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు అంగీకరించినట్లు పేర్కొన్నారు. అరుణ్సాయి కొనుగోలు చేసి తెచ్చిన గంజాయిలో కొంత భాగాన్ని వినియోగించి మిగిలిన భాగాన్ని చిన్ని చిన్న ప్యాకెట్లుగా ఏర్పాటు చేసి వాటిని విక్రయించేందుకు మార్కెట్ యార్డుకు తీసుకొని వచ్చినట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి, ప్యాకింగ్ కవర్లను సీజ్ చేసినట్లు తెలిపారు. -
రేపల్లెలో టీడీపీకి ఎదురుదెబ్బ
పార్టీని వీడిన కీలక నేత గూడపాటి రేపల్లె: రేపల్లె నియోజకవర్గంలో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేసిన ఆయన పార్టీని వీడటం గమనార్హం. మంత్రి అనగాని సత్యప్రసాద్కు ప్రధాన అనుచరుడిగా ఉన్న రేపల్లె పట్టణానికి చెందిన శ్రీనివాసరావు గురువారం తన రాజీనామాను ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందించిన ఆయనకు ప్రాధాన్యం లేకపోవడం, కేడర్ను అధిష్ఠానం పట్టించుకోకపోవడం, స్థానిక నాయకత్వం వైఫల్యం వంటి కారణాల వల్లే రాజీనామా చేసినట్లు అనుచరులు చెబుతున్నారు. ప్రజల సమస్యలపై పోరాడే నాయకులను పక్కన పెట్టి, కేవలం కొందరికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్న టీడీపీ ధోరణిపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మంత్రి సత్యప్రసాద్, ఆయన సోదరుడు శివప్రసాద్లు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో పార్టీ ప్రథమ శ్రేణి నాయకులు సైతం ఇబ్బంది పడుతున్నారని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా నిలిచింది. రాజీనామాకు అసలు కారణాలపై అధికారికంగా స్పందన రాకపోయినా పార్టీలో అంతర్గత విభేదాలు, నాయకత్వంపై అసంతృప్తి కారణమని స్పష్టమవుతోంది. గూడపాటి శ్రీనివాసరావు మామ తాడివాక శ్రీనివాసరావు 2014 – 19 వరకు రేపల్లె మున్సిపల్ చైర్మన్గా సేవలు అందించారు. -
వినుకొండలో దొంగల హల్చల్
వినుకొండ: వినుకొండ పట్టణ పరిధిలోని జగనన్న కాలనీలో దొంగలు తీవ్రస్థాయిలో రెచ్చిపోతున్నారు. రాత్రి వేళల్లో విద్యుత్ స్తంభాలు ఎక్కి వైర్లను దొంగిలిస్తుండటంతో స్థానికులతోపాటు విద్యుత్ శాఖ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సబ్స్టేషన్ సమీపంలోనే దుండగులు ఈ దౌర్జన్యానికి ఒడిగడుతుండటం గమనార్హం. విద్యుత్ తీగలను తెంచేయడమే కాకుండా, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను కిందకు తోసివేసి వాటిలోని విలువైన రాగి (కాపర్) పరికరాలను దోచుకెళ్తున్నారు. అంతేకాకుండా కాలనీలోని ఇళ్ల విద్యుత్ మీటర్లు, నీటి బోర్లకు సంబంధించి అమర్చిన వైర్లను కూడా చోరీ చేస్తున్నారు. దొంగల భయంతోపాటు విద్యుత్, తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో పలువురు బాధితులు తమ ఇళ్లను ఖాళీ చేసి అద్దె ఇళ్లకు వెళ్లిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, పోలీసులు స్పందించి కాలనీలో పోలీసు గస్తీ (పెట్రోలింగ్) పెంచి, దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లలో రాగి చోరీ.. -
వరుణదేవుని కటాక్షం కోసం జలాభిషేకం
మంచాల(చేబ్రోలు): వరుణుడి కరుణ కోసం చేబ్రోలు మండలం మంచాల గ్రామంలోని గ్రామదేవత దేశమాంబకు మహిళలు గురువారం జలాభిషేకం చేశారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పసుపు బిందెలతో మేళతాళాల నడుమ ఊరేగింపుగా తొలతు గ్రామదేవత ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో జలాభిషేకం జరిగింది. అర్చకులు విశేష కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని మహిళలు మొక్కుబడులు చెల్లించుకున్నారు. సత్తెనపల్లి: పట్టణంలోని శ్రీ ఫిరోజి ఋషి ఇంద్రుల వారి మఠంలో వేంచేసియున్న వేదమాత గాయత్రి దేవస్థానంలో వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు, మహానవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. తొమ్మిది రోజులపాటు వారాహి మాత పూజలు, హోమాలు జరిగాయి. వేదమాత గాయత్రి అమ్మవారి ప్రధాన అర్చకులు బాల ఫిరోజి గురువారం అమ్మవారికి సాలగ్రామ అలంకార మహోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో భజనలు, కుంకుమ పూజలు చేశారు. పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అన్నదానం జరిగింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా భక్తులు పద్మ, మమత, ఫిరోజి అంజలి, సుజాత, మల్లేశ్వరి, సుకన్య తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమరావతి: వర్షాలు సమృద్ధిగా కురవాలని మండల కేంద్రమైన అమరావతికి చెందిన మహిళలు గురువారం గ్రామ నడిబొడ్డున ఉన్న మహాలక్ష్మమ్మ చెట్టుకు నీటితో వారు పోసి అభిషేకించారు. తొలుత పవిత్ర కృష్ణానది జలాలను బిందెలలో నింపుకొని ఊరేగింపుగా వచ్చి మహాలక్ష్మమ్మ చెట్టుకు అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలను రక్షించాలని వేడుకుంటూ మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. పెదకాకాని: పెదకాకానిలోని ప్రసిద్ధ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో గురువారం హుండీలలోని కానుకలు లెక్కించారు. పర్యవేక్షణాధికారిగా తెనాలి వైకుంఠపురం పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఏసీ వి. అనుపమ హాజరయ్యారు. హుండీల ద్వారా 122 రోజులకు రూ.67,22,181 ఆదాయం లభించినట్లు డీసీ గోగినేని లీలాకుమార్ తెలిపారు. అన్నప్రసాద వితరణ హాల్లోని హుండీ ద్వారా రూ.3,97,918 సమకూరిందన్నారు. హుండీల ద్వారా బంగారం, వెండి కొంత వచ్చిందని పేర్కొన్నారు. ఇంకా అమెరికన్ డాలర్లు 72, ఇతర విదేశీ కరెన్సీ కూడా కానుకల్లో ఉన్నట్టు చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలియజేశారు. లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యుడు పేటేటి ధనమహేశ్వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీఈఓలను పర్మినెంట్ చేయాలి
కొరిటెపాడు(గుంటూరు): వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న మల్టీ పర్పస్ ఎక్స్టెన్సన్ ఆఫీసర్(ఎంపీఈఓ)లను పర్మినెంట్ చేయాలని ఏపీ మల్టీ పర్పస్ ఎక్స్టెన్సన్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ పుల్లగూర అనిల్కుమార్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా సమాన పనికి సమాన వేతనం కింద రూ.35 వేల వేతనం ఇవ్వాలని కోరారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన ఎంపీఈఓలు బుధవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు చేతపట్టి సహాయ నిరాకరణ, ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అనిల్కుమార్ మాట్లాడుతూ ఎంపీఈఓలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కేవలం రూ.12 వేలు మాత్రమే జీతం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. పెండింగ్లో ఉన్న నాలుగు నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాన్ శాంక్షన్ పోస్టులను శాంక్షన్ కింద నమోదు చేయాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రమాద బీమా వర్తింపజేయాలని, విధి నిర్వహణలో మరణిస్తే ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీఈఓలకు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగు రోజుల పాటు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సహాయ నిరాకరణ, ధర్నా, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డేవిడ్, నాయకులు అనిల్, అఖిల్, వర్ధన్, సురేష్, రాఘవ, అంజిబాబు, సుభానీ, వెంకటేష్, కోటి, శాంతి, తదితరులు పాల్గొన్నారు. ఎంపీఈఓల అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ -
సీనియర్ సిటిజన్లను గౌరవించడం మన బాధ్యత
గుంటూరు వెస్ట్: సీనియర్ సిటిజన్లను గౌరవించడం మన కనీస బాధ్యతని ప్రిన్సిపల్ జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాలులో నిర్వహిస్తున్న పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ రెండో రోజు కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తితోపాటు జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ పెద్దలను గౌరవించే సమాజం గొప్ప సమాజంగా నిలుస్తుందన్నారు. ఉద్యోగ విరమణ చేసిన సిబ్బంది తమ సేవా కాలంలో ప్రభుత్వానికి అందించిన సేవలు అమూల్యమైనవని, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం ప్రతి శాఖ బాధ్యత అని పేర్కొన్నారు. గతంలో ఉద్యోగులు పెన్షన్ మంజూరు కోసం ఏజీ కార్యాలయం చుట్టూ తిరిగేవారని, అలాంటి పరిస్థితుల్లో వారిని గుర్తించి గౌరవించడం గొప్ప విషయమన్నారు. ఇందుకు అకౌంటెంట్ జనరల్ కార్యాలయ అధికారులకు అభినందనీయులన్నారు. జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చేసాక వారు పడే ఇబ్బందులను సత్వరంగా పరిష్కరించేందుకు జిల్లాలకు తరలివచ్చి ప్రత్యక్షంగా అదాలత్ నిర్వహిస్తుండటం శుభసూచికమన్నారు. ఇటువంటి కార్యక్రమాలు పెన్షనర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. సర్వీస్లో ఉన్నప్పుడు సీనియర్ అధికారుల నుంచి నేర్చుకుని, వారి ఉద్యోగ విరమణ సమయంలో వారికి సేవలు అందించడం మంచి విషయమన్నారు. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ మాట్లాడుతూ సుదీర్ఘ సర్వీస్ పూర్తిచేసిన ఉద్యోగులు పెన్షన్ పొందటం వారి హక్కు అని, దానిని సక్రమంగా అందించడం తమ బాధ్యతన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, కలెక్టర్లు విరమణ చేసిన ఉద్యోగులు కొందరికి పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. జీపీఎఫ్ చందాదారులు, డీడీఓల అవసరార్ధం సమగ్ర సమాచారంతో కూడిన తెలుగులో ముద్రించిన కరదీపికను జిల్లా జడ్జి, జిల్లా కలెక్టర్ సంయుక్తంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యుటీ అకౌంటెంట్ జనరల్ ఆషితా పట్నాయక్ , కుషాల్ కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, అకౌంటెంట్ జనరల్ కాార్యాలయ సీనియర్ అధికారులు టి.విజయ్ కుమార్, డి.చంద్రశేఖర్, వి.సురేష్, పి.రమేష్ తదితరులు, జిల్లా ట్రెజరీ డీడీ చంద్రశేఖర్ రెడ్డి, వివిధ శాఖల ప్రతినిధులు, ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి -
నికరలాభంలో వృద్ధి సాధించిన యూకో బ్యాంక్
త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వెల్లడించిన సీఈఓ రాజేంద్రకుమార్ సాబుతాడేపల్లి రూరల్: యూకో బ్యాంక్ ఇటీవల ప్రకటించిన జూన్ 30, 2026 నాటితో ముగిసిన త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకారం బ్యాంక్ తన నికర లాభంలో మంచి వృద్ధిని సాధించిందని, ఈమేరకు బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ రాజేంద్రకుమార్ సాబు నుంచి ప్రకటన విడుదలైనట్లు బుధవారం యూకో బ్యాంక్ విజయవాడ జోనల్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ. 6,05,083 కోట్లుగా నమోదై, వార్షిక ప్రాతిపదికన 15.53 శాతం వృద్ధిని సాధించినట్లు పేర్కొన్నారు. సీఎఎస్ఏ వృద్ధి రూ. 1,16,136 కోట్లుగా నమోదు అయ్యిందని, ఇది వార్షిక ప్రాతిపదికన 12.34 శాతం వృద్ధిని సాధించినట్లు తెలిపారు. రిటైల్, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగాల్లో అడ్వాన్సులు, రిటైల్ అడ్వాన్సుల్లో కూడా వార్షిక వృద్ధి చెందినట్లు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది త్రైమాసికానికి లాభదాయకత 79.84 శాతం వృద్ధిని కనబరిచి రూ. 2810 కోట్లుగా నమోదు అయ్యిందని, జూన్ 30 నాటికి మూలధన పర్యాప్త నిష్పత్తి 19.03 శాతంగా ఉండగా, మూల ధన నిష్పత్తి 17.44 శాతంగా ఉందని తెలిపారు. ముగిసిన త్రైమాసికానికి నికర లాభం రూ. 656 కోట్లుగా నమోదు అయ్యిందని, గత సంవత్సరంతో పోలిస్తే 8.05 వృద్ధిని నమోదు చేసుకుందన్నారు. ఆస్తులు, అప్పులు ఈ త్రైమాసికానికి రిటైల్ అడ్వాన్సులు రూ. 71,549 కోట్లుగా నమోదు అయ్యాయని, గృహ రుణాలు, వాహన రుణాల పోర్టుపోలియోలో వృద్ధి కారణంగా ఇది. 27.32 శాతం వార్షిక వృద్ధిని నమోదుచేసినట్లు ప్రకటించారు. వ్యవసాయ రుణాలు రూ. 38.952 కోట్లుకు చేరిందని, ఈ త్రైమాసికంలో రూ. 47244 కోట్లు రుణాలు ఎంఎస్ఎంఈకి ఇచ్చినట్లు తెలిపారు. దేశీయ శాఖలు 3421 ఉండగా, హాంగ్కాంగ్, సింగపూర్లలో రెండేసి విదేశీ శాఖలు, ఇరాన్లో 1 ప్రతినిధి కార్యాలయం ఉన్నాయన్నారు. దేశీయ శాఖల్లో 61 శాతం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో విస్తరించి ఆర్థిక సమ్మిళిత కార్యాక్రమాలకు దోహదపడుతున్నాయని సీఈఓ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. బియ్యం ధరలు పెరగకుండా సహకరించాలి జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గుంటూరు వెస్ట్: జిల్లాలో బియ్యం ధరలు పెరగకుండా సహకరించాలని వ్యాపారస్తులను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ కోరారు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుదల కనిపిస్తుండటంతో జిల్లా ధరల నియంత్రణ కమిటీ సమావేశం బుధవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గత పది రోజులుగా జిల్లాలో సూపర్ ఫైన్ బియ్యం ధర రూ.5 నుంచి 6 వరకు పెరిగిందని, కందిపప్పు, మినప్పప్పులు కూడా రెండు నుంచి మూడు రూపాయలు పెరిగినట్లుగా రోజువారీ ధరల సేకరణలో తెలిసిందన్నారు. ధరల పెరుగుదలపై వ్యాపారస్తులను ఆరా తీశారు. బియ్యం, కందిపప్పు ధరలలో ఇంకా పెరుగుదల కనిపిస్తే జిల్లా యంత్రాంగం స్థానిక హోల్సేల్ వ్యాపారస్తులు, మిల్లర్ల సహకారంతో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాపారులు, మిల్లర్లు సహకారం అందించాలని కోరారు. ఇతర వస్తువుల ధరలను కూడా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. నాటి నిబద్ధత ఫలమే నేటి వైభవం ఏఎన్యూ(పెదకాకాని): తల్లి లాంటి విశ్వ విద్యాలయం మనకు, మన కుటుంబాలకు ఎన్నో అవకాశాలు, గుర్తింపు, గౌరవాన్ని అందించిందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత వీసీ ఆచార్య కె.వియన్నారావు అన్నారు. ఏఎన్యూ స్వర్ణోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన పూర్వ బోధన, బోధనేతర సిబ్బంది సత్కార కార్యక్రమం భావోద్వేగభరిత వాతావరణంలో సాగింది. దశాబ్దాల పాటు వర్సిటీ అభ్యున్నతికి సేవలందించిన ఉద్యోగులు, అధ్యాపకులను ఒకే వేదికపై ఘనంగా సత్కరించడం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన పూర్వ వీసీ ఆచార్య కె.వియన్నారావు మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం తర్వాత అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిన విద్యాసంస్థగా ఏఎన్యూ ఎదిగిందన్నారు. నాటి ఉద్యోగుల నిబద్ధతతో కూడిన విధులే నేటి వైభవానికి కారణమన్నారు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల సరసన నిలుస్తూ, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లోనూ తన ప్రత్యేక స్థానాన్ని ఏఎన్యూ నిలబెట్టుకుంటోందన్నారు. -
దిద్దుబాటుకు కుస్తీలు
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): తీవ్ర ఒత్తిడి మధ్య ఆర్పీలు అల్లాడిపోతున్నారు. తమకు గత నాలుగు నెలలుగా సీఓ ఇందిరా సుశీల జీతాల అప్రూవల్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న విషయంపై 12వ డివిజన్కు చెందిన ఆర్పీలు కొద్ది రోజుల క్రితం తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్కు వినతి పత్రం ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ‘జీవితాలను ‘ఆర్పీ’వేస్తున్నారు’ శీర్షికన ‘సాక్షి’లో ఈ నెల 20వ తేదీన కథనం ప్రచురితమైంది. ఈ కథనంతో ఉలిక్కి పడిన మెప్మా సిబ్బంది దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పీడీ స్థాయిలో విచారణ చేయరా? ఆర్పీల జీతాల విషయంపై రచ్చ జరుగుతుండటంతో మెప్మా కార్యాలయంలో ఓ సీఓ.. ఈ వివాదాన్ని పలుచన చేసేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఆ సమస్యను పీడీ స్థాయి అధికారి విచారణ చేపట్టాల్సి ఉండగా..సీఓ స్థాయి వ్యక్తి విచారణ చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన ఆర్పీలను కలెక్టరేట్ వద్ద ఉన్న మెప్మా కార్యాలయానికి ఓ సీఓ పిలిపించి బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. దీంతో సదరు ఆర్పీలు కూడా సీఓ కాదు.. జీతాలు ఆప్రూవల్ పీడీ లాగిన్లో పెండింగ్లో ఉన్నాయంటూ.. కాదు మరో అధికారి లాగిన్లో ఉన్నాయంటూ చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. దీంతో వివాదం ముదరకుండా ఆర్పీలకు జీతాలు వేసే ప్రక్రియ ముందుకు సాగుతున్నట్లు సమాచారం. గతంలో ట్యాబ్ల కుంభకోణం ఎమ్మెల్యే వెంట తిరిగే ఓ వ్యక్తి, డివిజన్లో ఉండే క్లస్టర్ ఇన్చార్జ్ అండ చూసుకునే సీఓ రెచ్చిపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్లస్టర్ ఇన్చార్జ్ కనుసన్నల్లోనే సదరు సీఓ అన్ని పంచాయితీలు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. గతంలో ఆర్పీలకు ట్యాబ్లు ఇచ్చే సమయంలో కూడా ట్యాబ్కు రూ.5వేలకు పైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. ఇది కూడా క్లస్టర్ ఇన్చార్జ్ పర్యవేక్షణలో జరిగినట్లు తెలిసింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఆర్పీలపై టీడీపీ నాయకుల పెత్తనం లేకుండా చూడాలని పలువురు ఆర్పీ సంఘాల నాయకులు కోరుతున్నారు. -
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలి
బాపట్లటౌన్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్మన్ ఆవుల వెంకటేశ్వర్లు కోరారు. జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ప్రథమ కార్యవర్గ సమావేశం బుధవారం కమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గాలి, నీరు, అగ్ని భూమి, ఆకాశం పంచభూతాల ప్రకృతి పరిరక్షణ నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ ధ్యేయమని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, ప్రభుత్వ అనుమతితో ప్రభుత్వ కార్యాలయాల వద్ద మొక్కలను నాటి వాటిని సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. నాలుగువందల పాతిక మొక్కలను సమకూర్చి కమ్మ కళ్యాణమండపం నుంచి వాజ్పేయి విగ్రహం వరకు రూ.50 వేల ఖర్చుతో మొక్కలు నాటించారు. మొక్కల దాతకు సహకరించిన తిరువీధుల వాణిను అభినందించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు గురజాల శ్రీనివాసరావు, జీవీఎల్ మోహన్ గౌడ్, గొల్ల ఏకాక్షరి, ఎంసీఏచ్ వెంకటేశ్వర్లు, చిల్లర నాగ సురేంద్రబాబు, పొందుగల ప్రసాదరావు పాల్గొన్నారు. నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ జిల్లా చైర్మన్ వెంకటేశ్వర్లు -
నిజాయతీ చాటుకున్న ప్రయాణికుడు
చీరాల రూరల్: తోటి ప్రయాణికురాలు బస్సులో పోగొట్టుకున్న హ్యాండ్బ్యాగును పోలీసుల సమక్షంలో బాధితురాలికి అప్పగించి తన నిజాయతీని చాటుకున్నాడు వ్యాపారి గౌస్బేగ్. వన్టౌన్ సీఐ సోమశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. చీరాల మసీదు సెంటర్లో బ్యాటరీల షాపు నిర్వహిస్తున్న గౌస్బేగ్ చందోలు నుంచి చీరాలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నాడు. అదే బస్సులో చెరుకుపల్లి నుంచి ప్రయాణిస్తున్న దేవరకొండ రాధిక తన హ్యాండ్బ్యాగును పొరపాటున బస్సులో మరిచిపోయి బస్సు దిగింది. అదే సమయంలో బస్సులో నుంచి దిగుతున్న గౌస్బేగ్కు బ్యాగు కనపడింది. బ్యాగులో రూ. 15,500 ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే గౌస్బేగ్ తన కుమారుడు మీర్జా సహాయంతో హ్యాండ్ బ్యాగును చీరాల వన్టౌన్ పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి సీఐ సోమశేఖర్, ఎస్సై రాజ్యలక్ష్మికి అప్పగించారు. కాగా సీఐ బ్యాగులో ఉన్న స్కూలు రిసిప్ట్ ఆధారంగా స్కూలు యాజమాన్యానికి ఫోన్చేసి సెల్ఫోన్ నంబర్ సేకరించారు. బాధితురాలు దేవరకొండ రాధికగా గుర్తించి ఆమెను పోలీసు స్టేషన్కు పిలిపించి నగదుతో పాటు ఇతర వస్తువులు ఉన్న హ్యాండ్బ్యాగును ఆమెకు అప్పగించారు. దీంతో రాధికతో పాటు పోలీసులు గౌస్బేగ్ నిజాయతీని అభినందించారు. -
మనోవ్యథతో మహిళ బలవన్మరణం
యద్దనపూడి: మానసిక సమస్యలతో బాధపడుతూ ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండల కేంద్రమైన యద్దనపూడిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రత్నకుమారి తెలిపిన వివరాలు.. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్న తురిమెళ్ల మంగమ్మ(49) బుధవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతూ యద్దనపూడి గ్రామంలో ఒక అద్దె ఇంటిలో ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం ఆస్పత్రిలో విధులకు హాజరైన ఆమె మంగళవారం వెళ్లలేదు. ఇరుగుపొరుగు వారికి ఇంటి వద్ద కన్పించింది. బుధవారం ఆమె ఇంటి తలుపులు వేసి ఉండటంతో ఇరుగుపొరుగు వారు తలుపు కొట్టి చూడగా ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె స్వగ్రామం వినుకొండ కాగా సంతమాగులూరు వైద్యశాలలో విధులు నిర్వహించి 13 నెలల క్రితం యద్దనపూడికి బదిలీపై వచ్చింది. ఆమె భర్త నారాయణ 20 ఏళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తూ చనిపోవడంతో కారుణ్య నియామక ప్రక్రియలో మంగమ్మకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగం వచ్చింది. ఆమెకు కుమారుడు ఉన్నాడు. -
ఘనంగా జాతీయ జెండా ఆమోద దినోత్సవం
మాదల(ముప్పాళ్ళ): మండలంలోని మాదల గ్రామంలో ఉన్న జ్యోతిబా పూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను భారత రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవం బుధవారం జరిగింది. కార్యక్రమంలో భాగంగా 120 మీటర్ల జాతీయ జెండాతో పాఠశాల నుంచి మాదలలోని మెయిన్సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు నివాళులర్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీసునీత, హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కంచర్ల బుల్లిబాబు, విద్యాకమిటీ చైర్మన్ సాగర్, సభ్యుడు లక్ష్మణ్, హెల్ప్ ఫౌండేషన్ సభ్యులు ఈశ్వరరెడ్డి, నిర్మల్, విష్ణు, పద్మావతి, వ్యాయామ ఉపాధ్యాయురాలు అనూష తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదకరంగా ఫ్లయ్ఓవర్ పనులు
చిలకలూరిపేట: జాతీయ రహదారి 16కు అనుసంధానంగా ఉన్న చిలకలూరిపేట బైపాస్ రోడ్డుపై ప్రమాదకర రీతిలో ఫ్లయ్ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ట్రాఫిక్ డైవర్షన్ చేయకుండా, ఎన్హెచ్ఏఐ అధికారుల అనుమతి లేకుండా పనులు నిర్వహిస్తున్నారని ఆ సంస్థ నోటీసు జారీ చేసినా పనులు కొనసాగించటం విశేషం. గతంలో ఇదే ప్రాంతంలో భారీ గడ్డర్ నేలకొరిగి పెను ప్రమాదం సంభవించింది. సంబంధిత కాంట్రాక్టు సంస్థ మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ ఈ నెల 18న జారీ చేసిన నోటీసుకు విలువ లేకుండా పోయింది. ఏదైనా ప్రమాదం జరిగితే జవాబుదారీతనం ఎవరిదనే ప్రశ్న తలెత్తుతోంది. వాడరేవు నుంచి ... చీరాల వాడరేవు నుంచి చిలకలూరిపేట మీదుగా నకిరికల్లు వరకు 167ఏ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో ఓడరేవు నుంచి చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామం వరకు 47 కిలోమీటర్ల మేర ఓ నిర్మాణ సంస్థ కాంట్రాక్టు దక్కించుకొని పనులు నిర్వహిస్తోంది. బొప్పూడి సమీపంలో చైన్నె నుంచి కోల్కతా వెళ్లే 16వ నంబర్ జాతీయ రహదారికి సంబంధించి బైపాస్ రోడ్డుపై ఫ్లయ్ఓవర్ నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన నిర్మాణ పనులు పరిశీలించిన జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్... నిర్మాణంలో ఉన్న ఫ్లయ్ఓవర్ కింద వాహనాల రాకపోకలు ఎలా అనుమతిస్తారని, ట్రాఫిక్ డైవర్షన్ చేయకుండా పనులు నిర్వహించరాదని సంబంధిత కాంట్రాక్టు సంస్థకు ఈ నెల 18వ తేదీన స్టాప్ వర్క్(పనుల నిలిపివేత) నోటీసు జారీ చేశారు. అయినప్పటికీ నిబంధనలు పాటించకుండానే పనులు కొనసాగిస్తున్నారు. గతంలో కూలిన గడ్డర్... ఇదే నిర్మాణం కోసం రోడ్డుకు ఇరువైపులా పిల్లర్లపై ఐరన్ రాడ్లు, సిమెంట్తో నిర్మించిన గడ్డర్లను భారీ క్రేన్లతో ఏర్పాటు చేసేందుకు గతంలో యత్నించారు. అప్పుడు క్రేన్లకు అమర్చిన ఐరన్ రోప్లు జారడంతో వందల టన్నుల బరువైన గడ్డర్ నేలకొరిగింది. ఈ ఘటన గత మార్చి 7వ తేదీన జరిగింది. నాడు ట్రాఫిక్ డైవర్షన్ చేసినందున ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాంట్రాక్టర్కు సంబంధించిన క్రేన్కు మాత్రమే నష్టం జరిగింది. ఇలాంటి చేదు అనుభవం ఉన్నప్పటికీ సంబంధిత సంస్థ నిబంధనలు ఉల్లంఘించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే నిర్మాణం నిలిపివేయాలని ఎన్హెచ్ఏఐ నోటీసులు లెక్క చేయకుండా కొనసాగిస్తున్న కాంట్రాక్టు సంస్థ గతంలో పెను ప్రమాదం జరిగినా అదే నిర్లక్ష్యం ట్రాఫిక్ మళ్లించకుండా ప్రమాదకరంగా పనులు నిర్వహిస్తున్న విషయం మా పరిశీలనలో నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే పనులు నిలిపివేయాలని నోటీసు జారీ చేశాం. ఎన్హెచ్ఏఐ నుంచి అనుమతి పొంది ట్రాఫిక్ డైవర్షన్ ఇతర నిబంధనలు పాటించాకే పనులు పునఃప్రారంభించాల్సి ఉంటుంది. ఈ విషయమై చర్యలు తీసుకుంటాం. – వికాస్.ఎస్, ప్రాజెక్టు డైరెక్టర్, ఎన్హెచ్ఏఐ -
జ్వరాన్ని అశ్రద్ధ చేయొద్దు
గతంలో మాదిరిగా కరోనా వైరస్ సోకగానే భయపడాల్సిన పనిలేదు. ప్రస్తుతం వస్తున్న కేసులు ఒమిక్రాన్ సబ్వేరియంట్కు చెందినవి. వీటి వల్ల ఎలాంటి ప్రాణహాని ఉండదు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, గర్భిణులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ నిర్ధారణ జరిగిన తరువాత వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందటం చాలా ఉత్తమం. తొలుతే గుర్తిస్తే మందులతోనే కరోనాను కట్టడి చేయవచ్చు. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నవారికి మాత్రమే ఇంజెక్షన్లు చేయాల్సి వస్తుంది. – డాక్టర్ వరా అనిల్కుమార్, కరోనా నోడల్ ఆఫీసర్, గుంటూరు జీజీహెచ్ జ్వరం సోకగానే భయపడకుండా, అశ్రద్ధ చేయకుండా అది ఏ జ్వరమో నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సలహాలు లేకుండా జ్వరం రాగానే మందులు వాడకూడదు. దీర్ఘకాలిక వ్యాధి బాధితులు, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారితోపాటుగా ప్రతి ఒక్కరూ వైరస్ను కట్టడి చేసేందుకు హైప్రోటీన్ డైట్ తీసుకోవాలి. గుడ్డు, పాలు, పండ్లు, ఆకుకూరలు, చికెన్, పప్పుధాన్యాలు, అధిక ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ఉత్తమం. వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు మంచి నిద్ర ప్రతి ఒక్కరికి అవసరం. వైరస్ లక్షణాలు ఉన్నాయనే అనుమానం వస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ కోగంటి కల్యాణ్చక్రవర్తి, ఇన్ఫెక్షన్స్ స్పెషలిస్టు, గుంటూరు -
జ్వరం వస్తే.. కాస్త జాగ్రత్త!
బాపట్లగురువారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2026గుంటూరు మెడికల్: కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. దేశ వ్యాప్తంగా రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో నాలుగు కరోనా మరణాలు సంభవించినట్లు రాష్ట్ర వైద్యాధికారులు తెలిపారు. తొలుత జిల్లాలో జూలై 16న మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు స్థానిక యువతి(18)కి, నవులూరుకు చెందిన యువతి (27)కి కరోనా ఉన్నట్లు నిర్ధారించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు, అధికారులు సూచిస్తున్నారు. వైరస్ ప్రభావం చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై ఉంటుంది. గుండె, కిడ్నీ, క్యాన్సర్, లివర్, ఊపిరితిత్తుల జబ్బులు ఉన్నవారు, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు అవగాహన కలిగి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో నమోదవుతున్న కరోనా వైరస్ కేసులు గతంలో థర్డ్వేవ్లో వచ్చిన ఒమిక్రాన్ సబ్వేరియంట్ ఆర్ఎఫ్ 5గా వైద్య నిపుణులు తెలిపారు. వైరస్ సోకిన వారిలో జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, వాసన లేకపోవటం, రుచి తెలియకపోవటం వంటి లక్షణాలు ఉంటాయి. వైరస్ ఎవరికై నా సోకిందో.. లేదో.. తెలుసుకునేలోపు బాధితుల నుంచి ఇతరులకు వచ్చే ప్రమాదం ఉంది. దీని దృష్ట్యా కొద్దిరోజులపాటు ప్రజలంతా ప్రయాణాలు రద్దు చేసుకోవాలి. అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రాకుండా చూసుకోవాలి. కరచాలనం చేయడం మానివేయాలి. కొత్త వ్యక్తులు, పరిచయం లేనివారికి దూరంగా ఉండాలి. దగ్గిన, తుమ్మినా ముఖానికి కర్చీఫ్లు, మాస్క్లు అడ్డుపెట్టుకోవాలి. సాధ్యమైనంత మేరకు ఎక్కువ సార్లు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. జనసంచారం ఉండే సినిమాహాళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో తిరగకూడదు. దగ్గు, జలుబు బాధితులకు దూరంగా ఉండటం ఉత్తమం. కరోనా నిర్ధారణ పరీక్షలు అవసరం జిల్లాలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల విషయంలో అప్రమత్తత ముఖ్యం వైద్య నిపుణులు, అధికారుల సూచనలు విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ మట్టం బుధవారం 513.30 అడుగులకు చేరింది. ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. -
నేడు ఓలేరులో వారాహి మహా హోమం
భట్టిప్రోలు: మండల పరిధిలోని ఓలేరు శివానంద ఆశ్రమంలో శ్రీ వారాహి గుప్త నవరాత్ర మహోత్సవంలో భాగంగా బుధవారం బాలాజీ గురుకుల్ పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గురువారం మహాహోమం జరుగుతుందని పేర్కొన్నారు. ఉగ్రరూప ధారిణి అయిన అమ్మవారిని చూడటం ఉపాసన బలం ఉన్నవారికి మాత్రమే వీలవుతుందని... అది కూడా అమ్మవారు గ్రామ సంచారానికి వెళ్లినప్పుడు మాత్రమే కుదురుతుందని చెప్పారు. ఈ పూజలో పాల్గొంటే శత్రు బాధలు, దుష్ట శక్తుల పీడలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారని తెలిపారు. కుంచవరం (తెనాలి): కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో వేంచేసియున్న శ్రీవారాహి అమ్మవారి ఆలయంలో గుప్త నవరాత్రులు బుధవారం ఎనిమిదో రోజుకు చేరాయి. తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, ప్రత్యేక పూజలను పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతి పర్యవేక్షణలో నిర్వహించారు. ఉదయం హోమాలు, సాయంత్రం కుంకుమపూజ చేశారు. చక్రాయపాలెంకు చెందిన పసుపులేటి మాణిక్యాలరావు, సావిత్రి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశాక, సారె సమర్పించారు. ఆలయ ధర్మకర్త తన్నీరు శ్రీనివాసబాబు, నాగమల్లేశ్వరి దంపతులు నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో ఎస్వీ యోగా కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య, భరత్స్వామి, హేమంత్కుమార్, జెట్టి వెంకట సాయితేజ, భక్తులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: ప్రజలను కరుణించాలని వరుణుడిని కోరుతూ మంగళగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్ధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ కోగంటి సునీల్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, లోక కల్యాణార్థం సమృద్ధిగా వర్షాలు కురవాలని, కరువు పరిస్థితులు తొలగిపోవాలని 23 నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గుంటూరు ఎడ్యుకేషన్: యూటీఎఫ్ టెట్ మోడల్ టెస్ట్ పేపర్లను డీఈఓ షేక్ సలీమ్ బాషా బుధవారం డీఈవో కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ యూటీఎఫ్ తయారు చేసిన టెస్ట్ పేపర్లు ఇన్స్టెంట్గా చదువుకుని, ఉత్తీర్ణులయ్యేందుకు అనువుగా ఉన్నాయని అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ 1ఏ, 2ఏలో తెలుగు, ఇంగ్లిషు, హిందీ, మాథ్స్, సోషల్ విడివిడిగా టెస్ట్ పేపర్లను పుస్తకాల రూపంలో అందుబాటులో తెచ్చామన్నారు. గతంలో జరిగిన ప్రశ్నపత్రాలు, ప్రాక్టీస్ కోసం అదనంగా మరికొన్ని మోడల్ పేపర్లను కలిపి పుస్తకాలను రూపొందించామని తెలిపారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజ శేఖరరావు, ఎం.కళాధర్లు మాట్లాడుతూ మోడల్ టెస్ట్ పేపర్లు కావలసిన వారు బ్రాడిపేట 2/6లోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో సంఘ జిల్లా సహాధ్యక్షుడు జి. వెంకటేశ్వర్లు, జిల్లా సహాధ్యక్షురాలు ఎండీ షకీలా బేగం, జిల్లా కార్యదర్శులు ఎం. గోవిందయ్య, కె.రంగారావు, బి.ప్రసాద్, ఎం.కోటిరెడ్డి, గఫార్ తదితరులు పాల్గొన్నారు. -
ఊపిరి పోయండి
రేపల్లె ఆస్పత్రిలో నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్ రేపల్లె: కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో రేపల్లె ప్రభుత్వ వైద్యశాలలో ప్రాణాలను నిలిపిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ నేడు నిరుపయోగంగా మారి మూలన పడింది. ప్రాణాలకు సంబంధించిన అత్యవసర సదుపాయాన్ని కూడా మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేసిన పాలకులు, అధికారుల తీరుపై ప్రజల్లో ఆగ్రహం ఉప్పొంగుతోంది. కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని వైద్య వర్గాలు హెచ్చరిస్తుండగా ఇలాంటి కీలక ప్లాంట్ను పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు ప్రజలు, ప్రజాసంఘాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. వెంటనే ఆక్సిజన్ ప్లాంట్కు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రాణదాతగా నిలిచిన ప్లాంట్ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో సకాలంలో ఆక్సిజన్ అందక ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిన దుర్భర స్థితులను చూశాం. ఆ సమయంలో రేపల్లెలో సరైన వైద్య సదుపాయాలు లేక పలువురిని తెనాలి, గుంటూరు ప్రాంతాలకు తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో స్థానికంగానే ఆక్సిజన్ అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచింది. ఆస్పత్రిలోని ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ మరమ్మతులకు గురైంది. దాని పునరుద్ధరణకు ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రస్తుతం రోగులకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే ప్లాంట్కు మరమ్మతులు చేయించి, వినియోగంలోకి తీసుకువస్తాం. – కొలసాని పృథ్వీ గణేష్, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో 2022 జనవరి 21న అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రేపల్లె రెడ్ క్రాస్ సొసైటీ, హిందుస్థాన్ కోకో కోలా బెవరేజెస్ సంస్థల సహకారంతో ఈ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పలువురికి ఆక్సిజన్ అందిస్తూ ప్రాణాలను నిలబెట్టింది.. కోవిడ్ సమయంలో క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందిన వారికి కూడా ఆక్సిజన్ సరఫరా చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్లాంట్ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
చోరీ కేసులో నిందితుడు అరెస్టు
కర్లపాలెం: చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్టలవానిపాలెం మండలం రెడ్లపాలెం గ్రామంలో జరిగిన చోరీ కేసును చందోలు పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం చందోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ కె.మాధవరావు కేసు వివరాలు వెల్లడించారు.. పిట్టలవానిపాలెం మండలం రెడ్లపాలెం గ్రామానికి చెందిన ముచ్చు సుబ్బారావమ్మ ఈనెల 8వ తేదీన ఇంటికి తాళం వేసి వరి నాట్ల కూలీ పనుల నిమిత్తం నల్గొండకు వెళ్లారు. 9వతేదీన మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి, బీరువాను ధ్వంసం చేసి ఇంటి అంతటా కారం పొడి చల్లివేసినట్లు స్థానికులు ఆమెకు సమాచారం అందించారు. దీంతో ముచ్చు సుబ్బారావమ్మ 20వతేదీన ఉదయం ఇంటికి వచ్చి పరిశీలించగా, ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న రూ.2,23,000 విలువగల రెండు సవర్ల బంగారు చైన్, ఏడు తులాల వెండి పట్టీలు, గోకతాడు దొంగిలించబడినట్లు గుర్తించారు. దీనిపై చందోలు పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. బాపట్ల రూరల్ సీఐ బి.హరికృష్ణ పర్యవేక్షణలో, చందోలు ఎస్ఐ కె.మాధవరావు నేతృత్వంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తులో భాగంగా 21 సాయంత్రం 4.30 గంటల సమయంలో పిట్టలవానిపాలెం ఆర్టీసీ బస్టాండ్ వద్ద రెడ్లపాలెం గ్రామానికే చెందిన పిట్టు వెంకట శివారెడ్డి (34)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన వస్తువులన్నీ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. -
టిష్యూ కల్చర్ అరటికి రాయితీ
కొల్లూరు: ఉద్యాన పంటల సాగుపై ఆధారపడిన రైతులు ప్రభుత్వం ద్వారా రాయితీ అందే పంటల సాగుకు మొగ్గు చూపాలని, దీంతో అధిక దిగుబడులతోపాటు, సబ్సిడీ రూపంలో నగదు ప్రతి ఫలం చేకూరుతందని జిల్లా ఉద్యానశాఖ అధికారి ఎస్ఎంకే ఖలీమ్ అన్నారు. మంగళవారం మండలంలోని చిలుమూరు, ఈపూరు గ్రామాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులకు నిర్వహించిన ఒక్క రోజు శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. టిష్యూ కల్చర్ అరటి హెక్టార్కు రూ. 70 వేలు, హైబ్రిడ్ కూరగాయల పంటలకు హెక్టార్కు రూ. 24 వేలు చొప్పున ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందన్నారు. అరటి సాగులో టిష్యూ కల్చర్ మొక్కలను వినియోగించడం వల్ల వ్యాధి రహిత మొక్కలు అందుబాటులో ఉండి అధిక దిగుబడులకు ఆస్కారం ఉంటుందన్నారు. వ్యవసాయానికి వినియోగించే మినీ ట్రాక్టర్, పవర్ వీడర్, తైవాన్ స్ప్రేయర్ వంటి వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు 50 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. శాస్త్రవేత్త కె.వెంకటసుబ్బయ్య పసుపు, కంద పంటలలో తెగుళ్ల నివారణ, సస్యరక్షణ చర్యలను వివరించారు. మండల ఉద్యాన శాఖాధికారి జి.కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. -
అప్పుల భారంతో వ్యక్తి బలవన్మరణం
పర్చూరు(చినగంజాం): అప్పుల భారంతో ఓ వ్యక్తి మనస్తాపానికి గురై బలవన్మరణం పొందిన సంఘటన పర్చూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడవాడ గ్రామ శివారులోని పంట పొలాల్లో వీరన్నపాలెం గ్రామానికి చెందిన తిమ్మనపల్లి శ్రీనివాసరావు(50) పురుగుల మందు తాగి మృతి చెందాడు. ఈ ఘటన గురించి స్థానికంగా గొర్రెలు మేపుకుంటున్న గొర్రె కాపర్లు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పర్చూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా శ్రీనివాసరావు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అప్పుల భారం వల్ల మనస్తాపానికి గురై శ్రీనివాసరావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. పర్చూరు పోలీసులు ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
మహిళలకు రక్షణ కరువు
టీడీపీ కీచకపర్వంపై కదం తొక్కిన మహిళాలోకంబాపట్ల: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఏట్రా అశ్వినీరెడ్డి పేర్కొన్నారు. గుంటూరులో మహిళపై జరిగిన దాడికి నిరసనగా మహిళలపై దాడులు సిగ్గు చేటు.. చంద్రబాబు నాయుడు డౌన్..డౌన్ అంటూ బాపట్ల పట్టణంలో మంగళవారం భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి గడియార స్తంభం మీదుగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సర్కిల్ వరకు చేరుకుంది. అనంతరం నిరసన చేపట్టి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. రెడ్బుక్ రాజ్యాంగం మేరకే దాడులు అనంతరం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జరిగిన కార్యాక్రమంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఏట్రా అశ్వినీరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై దారుణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం మహిళలకు రక్షణ లేకుండా చేస్తోందని దుయ్యబట్టారు. అధికారాన్ని, పోలీసు వ్యవస్థను అండగా పెట్టుకుని టీడీపీ నాయకులు యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ స్టాంప్ ఉంటే చాలు.. ఏ నేరం చేసినా తమను పోలీసులు కాపాడతారనే ధైర్యం అధికార పార్టీ నాయకుల్లో పెరిగిపోయిందన్నారు. ప్రభుత్వ కార్యాలయమైనా, పోలీస్ స్టేషన్ అయినా పచ్చ స్టాంప్ను చూసి ఎదురుగా సీటు వేయాలని, వారు చెప్పినట్లు వినాలి అన్న పరిస్థితులను రాష్ట్రంలో సృష్టించారని పేర్కొన్నారు. పోలీసులు కేసు పెట్టాలంటే స్థానిక టీడీపీ నాయకుడి అనుమతి తీసుకోవాలా? టీడీపీ నాయకుడు వద్దంటే బాధితులు ఫిర్యాదులను తొక్కిపెడతారా అని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు రోజుల తరబడి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలని, గట్టిగా నిలదీస్తే బాధితులపైనే ఎదురు కేసులు పెట్టే దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. భారత పార్లమెంటు రూపొందించిన చట్టాలకన్నా రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగమే వీళ్లకు పరమావధిగా మారిందని పేర్కొన్నారు. బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్ సెక్షన్లకన్నా నారా చంద్రబాబు సెక్షన్లు, లోకేష్ సెక్షన్లే రాష్ట్రంలో అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఈ దారుణాలకు బలైపోతున్నది ప్రధానంగా మహిళలు, చిన్నారులు, దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల ప్రజలేని చెప్పారు. వైరల్ అయ్యేంతవరకు స్పందించకపోవడం శోచనీయం ప్రతిపక్ష కార్యకర్త సోషల్మీడియాలో పోస్టు పెడితే నిమిషాల్లో కేసులు, అర్ధరాత్రి అరెస్టులు జరుగుతున్నాయని, కానీ ఓ మహిళపై అధికార పార్టీ నేత దాడి చేసి, వివస్త్రను చేస్తే.. ఆ వీడియో వైరల్ అయ్యేవరకు పోలీసులు కదలకపోవటం సిగ్గుచేటన్నారు. రాజకీయకక్ష సాధింపులకు అధికార పార్టీ నాయకులు పాల్పడుతున్నారని ఆమె తెలిపారు. గుంటూరులో దాడి జరిగి ఇంతకాలం అవుతున్నప్పటికీ పోలీసులు విచారణ చేపట్టకపోవటం ఏమేరకు న్యాయమో అర్ధంకావటం లేదన్నారు. మహిళలు అధైర్యపడొద్దని, వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. మహిళా నాయకులు వేల్పుల మీరాభి, కానుగంటి లక్ష్మీరాఘవ, నాగలక్ష్మి, సీతారావమ్మ, శివపార్వతి, గొర్రుముచ్చు పుష్పరాజ్యం, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, నాయకులు కోకి రాఘవరెడ్డి, కొక్కిలిగడ్డ చెంచయ్య, నక్కా వీరారెడ్డి, జయభారత్రెడ్డి, వడ్డిముక్కల డేవిడ్, గంగిశెట్టి రత్తయ్య, నర్రావుల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు
గుంటూరు మెడికల్: జిల్లాలో మంగళవారం నాటికి ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జీజీహెచ్లో జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న మంగళగిరికి చెందిన 53 ఏళ్ల మహిళకు, లాంకు చెందిన 44 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తాజాగా నిర్ధారించారు. బాపట్ల జైలులో ఉన్న 21 ఏళ్ల యువకుడికి సైతం కరోనా ఉన్నట్లు నిర్ధారించారు. జిల్లాలో తొలుత కరోనా పాజిటివ్ కేసులు మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు ఈ నెల 16న నిర్ధారించారు. మంగళగిరికి చెందిన 18 ఏళ్ల యువతికి, నవులూరుకి చెందిన 27 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. తొలుత కరోనా పాజిటివ్ సోకినట్లు నిర్ధారించిన మంగళగికి కేసుకు సంబంధించిన కుటుంబ సభ్యులకు మంగళవారం కరోనా సోకినట్లు నిర్ధారించారు. -
భక్తిశ్రద్ధలతో ఆషాఢ మాస సారె సమర్పణ
తెనాలిటౌన్ : లోక కల్యాణార్థం ప్రతి ఏటా ఆషాఢ మాసంలో శ్రీ పరంజ్యోతి భగవతి పద్మావతి అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అచ్యుత దాసాజీ పేర్కొన్నారు. తెనాలి రూరల్ మండలం బుర్రిపాలెంలోని శ్రీకల్కి సేవ ఆలయంలో మంగళవారం తెనాలి, బుర్రిపాలెం, పరిసర ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు హాజరై భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢ మాస సారె సమర్పించారు. అచ్యుత దాసాజీ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో కరవు, కాటకాలను పోగొట్టి, లోక సమృద్ధిని కాంక్షిస్తూ వర్షాలను ప్రసాదించమని కోరుతూ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్లకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏఎన్యూ(పెదకాకాని): పర్యావరణ పరిరక్షణ ప్రతి విద్యార్థి సామాజిక బాధ్యతగా స్వీకరించాలని వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) విభాగం, ధరిత్రీ సంరక్షణ చైతన్యం సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ప్లాంట్ ప్రొటెక్షన్ ఛాలెంజ్ వాల్పోస్టర్ను వర్సిటీ వీసీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు ప్రకృతిని ప్రేమిస్తూ, బాధ్యతతో వ్యవహరించినప్పుడే సుస్థిర సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం, కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్ ఆచార్య బబిత, ధరిత్రీ సంరక్షణ చైతన్యం సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్ : తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై మంగళవారం తిరునక్షత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళా శాసనాలతో సుదర్శన పెరుమాళ్ళ వారికి తిరునక్షత్ర మహోత్సవం వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఉదయం పంచామృతాలతో స్వామివారికి అభిషేకం, 10 గంటలకు సుదర్శన హోమం, పూర్ణాహుతి, మంగళశాసనం, వేద ఆశీర్వవచనం, తీర్థ ప్రసాద గోష్టి గావించామని తెలిపారు. 27 అడుగుల ఏకశిలా శ్రీ విఘ్న విమోచక హనుమాన్కు మల్లెలతో సహస్రనామార్చన జరిగిందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు. మాచర్ల: ఆషాఢ మాసం సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మైసమ్మ అమ్మవారికి మంగళవారం రెండవ రోజు బోనాల సమ ర్పణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఉదయం మాచర్లలోని రైల్వే స్టేషన్ రోడ్డు నుంచి వందలాది మంది మహిళలు దేవాలయం వద్దకు చేరుకొని మైసమ్మకి ప్రత్యేక పూజలు చేశారు. నాయీ బ్రాహ్మణులు, సంఘ పెద్దలు మాచర్ల వెంకటేశ్వర్లు, కృష్ణ, శ్రీనివాస్, హనుమంతరావు, పలువురు పెద్దల ఆధ్వర్యంలో ఊరేగింపు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు చేపట్టారు. మహిళలు కోలాట ప్రదర్శన చేసి ఊరేగింపు జరుపుతూ మైసమ్మ తల్లికి జేజేలు పలికారు. -
మూడు మండలాల్లో వర్షం
నరసరావుపేట: గడిచిన 24 గంటల్లో జిల్లాలోని 28 మండలాల్లో కేవలం మూడు మండలాల్లోనే వర్షం కురిసినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. వెల్దుర్తిలో 3.2 మిల్లీమీటర్లు, రెంటచింతలలో 3.8, ముప్పాళ్లలో 4.6మి.మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. వినుకొండ: పట్టణ శివారు రజక కాలనీలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. మర్రిపూడి సాయి (19) అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయి తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి రమణ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సోమవారం ఉదయం ఇద్దరూ పనులకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న సాయి ఫ్యాన్కు చీరతో ఉరివేసుకున్నట్లు తెలిపారు. సాయి పట్టణంలోని ఓ వ్యాపార సంస్థలో కూలీగా పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు సాయిని ఉరివేసుకున్న స్థితిలో గుర్తించి బోరున విలపించారు. ఈ ఘటనతో రజక కాలనీలో విషాద వాతావరణం నెలకొంది. వెంకటేశ్వర్లుకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు చదువుకుంటున్నాడని, రెండో కుమారుడైన సాయి అకారణంగా ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడంతో కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నాదెండ్ల: చిలకలూరిపేట నూతన వ్యవసాయ మార్కెట్ యార్డు పక్కనే షిరిడీ సాయి ఆలయం ఎదురుగా మృతదేహం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..16వ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ షెడ్డులో సోమవారం రాత్రి స్థానికులు మృతదేహాన్ని గమనించారు. రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు, నాదెండ్ల ఎస్ఐ ఆర్.వెంకటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 50 ఏళ్ల వ్యక్తి వారం రోజుల కిందట షెడ్డులో మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడు భిక్షాటన చేసే వ్యక్తిగా స్థానికులు చెబుతున్నారు. మృతదేహం కుళ్లిపోవడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. ఆనవాళ్లు గుర్తు పట్టలేని విధంగా మారిందని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. రెంటచింతల: మండల కేంద్రమైన రెంటచింతల గ్రామ సమీపంలో నున్న జాతీయ రహదారి వెంబడి ఉన్న రెస్టారెంట్ వద్ద సోమవారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గోలి గ్రామానికి చెందిన ఉప్పిడి నాగేశ్వరరావు బంధువులకు గురజాల మండలం సమాధానపేటకు చెందిన నరసింహానాయక్కు గొట్టిముక్కల మేజర్ కాల్వలో వేసిన దొనే విషయంలో (సాగునీటికి సంబంధించిన) వివాదం ఉంది. ఈ నేపధ్యంలో స్థానిక రెస్టారెంట్ వద్ద నాగేశ్వరరావు టీ తాగుతున్న సమయంలో ఆక్కడకు వచ్చిన నరసింహా నాయక్ వర్గీయులకు నాగేశ్వరరావుకు, ఆయన కుమారుడు వెంకటేశ్వర్లుకు కాల్వ వ్యవహారంపై మాటమాట పెరిగింది. నరసింహా నాయక్ వర్గీయులు చేసిన దాడిలో నాగేశ్వరరావు ఆయన కుమారుడు వెంకటేశ్వర్లుకు గాయాలు కాగా వారిని వెంటనే గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెదకాకాని: గుంటూరు జిల్లా పెదకాకానిలోని శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో పూజలు చేసేందుకు సోమవారం ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ ట్రైబ్యునల్ చైర్మన్ ఎ.భారతి దంపతులు విచ్చేశారు. ఆలయ అధికారులు, పాలకమండలి చైర్మన్, అర్చకస్వాములు, వేదపండితులు వారికి సాదర స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి అభిషేక సేవలో దంపతులు పాల్గొన్నారు. అనంతరం స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి చిత్రపటం, ప్రసాదాలను పాలకమండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు అందజేసినట్లు ఆలయ ఉపకమిషనరు గోగినేని లీలాకుమార్ తెలిపారు. -
ఆక్రమించి రిసార్టులు కట్టి..
ఓడరేవు నుంచి వేటపాలెం మండలంలోని పొట్టిసుబ్బయ్యపాలెం వరకు పర్యాటక పాంత్రంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో రియల్టర్లు, రిసార్టు యాజమానుల కన్ను అటవీ భూములపై పడింది. తీరప్రాంత భూములను అక్రమించి రిసార్టులు నిర్మిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రిసార్టులకు ఎదురుగా సముద్రం కనిపించేలా ఉండాలనే దురుద్దేశంతో తీరం వెంట సరుగుడు తోటలు పెంచకుండా అధికారులకు, మత్స్యకారులకు కొంత ముట్టజెప్పి ఆ భూములను ఖాళీగా వదిలేస్తున్నారు. వారి రిసార్టుల నుంచి పర్యాటకులు నేరుగా సముద్రంలోకి వెళ్లడానికి తోటలను పెంచకుండా కుయుక్తులు పన్నుతున్నారు. -
జీడీసీసీ బ్యాంకు అభివృద్ధికి నోడల్ వ్యవస్థ కీలకం
బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లిఖార్జునరావుకొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (జీడీసీసీబీ) శాఖలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పనితీరును మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు నోడల్ అధికారుల వ్యవస్థను బలోపేతం చేయాలని ఆ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లిఖార్జునరావు అధికారులను ఆదేశించారు. గుంటూరు బ్రాడీపేటలోని బ్యాంక్ పరిపాలన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన నోడల్ అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంక్ అభివృద్ధిలో నోడల్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి నోడల్ అధికారి తమ పరిధిలోని శాఖల పనితీరు మెరుగుపడేలా అవసరమైన సూచనలు అందించడంతో పాటు లోపాలను వెంటనే గుర్తించి పరిష్కరించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్యాంక్లో 11 మంది నోడల్ అధికారులతో నోడల్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని బ్యాంక్ సీఈఓని ఆదేశించారు. బ్యాంక్ శాఖలు, సహకార సంఘాల మధ్య సమన్వయం పెంచుతూ నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో బ్యాంకు సీఈవో వీవీఎస్ ఫణి కుమార్, బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మమ్మల్ని బతికించండి
20వ రోజు కొనసాగుతున్న ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేతల నిరాహార దీక్ష మంగళగిరి రూరల్: మంగళగిరి మండలం చినకాకాని పరిధిలోని ఎన్నారై జంక్షన్ నేతన్న సర్కిల్ వద్ద 20 రోజులుగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు తమకు రావాల్సిన సబ్సిడీ బకాయిలను విడుదల చేయాలని నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఇది కచ్చితంగా వివక్షేనని అన్నారు. మేము పారిశ్రామికవేత్తలమే కాని అసాంఘిక శక్తులం కాదు. దేశ ప్రగతిలో, జీఎస్టీలో మేము భాగస్తులమే ఈ విషయాన్ని ప్రభుత్వం మర్చిపోయి మా డిమాండ్లు నెరవేర్చకుండా నిరాహార దీక్ష చేస్తున్న పట్టించుకోకుండా చిత్రహింసలుకు గురి చేస్తుందని వాపోయారు. పోలీసులు, పారిశ్రామికవేత్తల మధ్య వాగ్వాదం మంగళగిరి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు ర్యాలీగా బయలుదేరుగా పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. అనుమతులు తీసుకున్నామని పారిశ్రామికవేత్తలు చెప్పినప్పటికీ పోలీసులు నిరాకరించారు. ఈ దశలో పోలీసులకు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామివేతల మధ్య వాగ్వాదం జరిగింది. అమరావతి ఓఎస్డీ మనోజ్ హెగ్డే పారిశ్రామికవేత్తలతో మాట్లాడిన అనంతరం మరొకసారి అనుమతి తీసుకొని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేస్తామని వారు నిరాహార దీక్ష శిబిరానికి వెళ్లారు. సీపీఎం, కేవీపీఎస్ మద్దతు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల నిరాహార దీక్ష శిబిరాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు సందర్శించి వారికి మద్దతు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను చేస్తానన్నా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ఊబిలో ముంచుతుందని దుయ్యబట్టారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు అండా మాల్యాద్రి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల సమస్య పరిష్కారం కోసం దళిత సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు. ఏపీ ఎమ్మార్పీఎస్ మద్దతు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణ రాజు దీక్ష శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ఆదుకోవడంలో విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఆనర్బాబు, వైస్ ప్రెసిడెంట్ రామ్మూర్తి నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బారోతు రమేష్, కారం సత్యనారాయణమ్మ, కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చిన మౌలాలి, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా వీవీఐటీయూ జగన్నాథ రథయాత్ర
పెదకాకాని: విశ్వప్రఖ్యాత పూరీ జగన్నాథుని రథయాత్రకు సంఘీభావంగా నిర్వహించిన వీవీఐటియూ జగన్నాథ రథయాత్ర ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతూ వైభవంగా సాగింది. మండలంలోని నంబూరు వీవీఐటి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ రథయాత్రను విద్యార్థులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవాలయం నుంచి గోళ్లమూడి గ్రామం మీదుగా వీవీఐటియూ వరకు ఈ యాత్రను వివా, వీవీఐటి సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, అరుణప్రియ దంపతులు సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుడు కొలువుదీరిన రథం ముందు సంప్రదాయ క్రతువు చేరాపహరాతో (బంగారు చీపురుతో శుభ్రపరిచి) ప్రారంభించారు. వేలాది మంది భక్తులు, విద్యార్థులు, ఇస్కాన్ సభ్యుల భక్తిశ్రద్ధలతో, విదేశీ భక్తుల సంకీర్తనలు, జయ జయహే జై జగన్నాథ నినాదాలతో ఈ యాత్ర శోభాయమానంగా ముందుకు సాగింది. మార్గమధ్యలో విద్యార్థులు, అధ్యాపకుల కోలాట నృత్యాలు, గీతాలాపనలు అలరించాయి. వీవీఐటియూ అధ్యాపకేతర సభ్యుడు నంబూరు మణికుమార్ జగన్నాథుని వేషధారణలో ఆకట్టుకున్నాడు. ఈ కార్యక్రమంలో శివాలయం ఈవో గోగినేని లీలాకుమార్, వివా, వీవీఐటియూ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, ఇస్కాన్ మంగళగిరి ప్రతినిధులు, పెదకాకాని పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
ద్రోణాదులలో విషాదం..
రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి, కుమారుడికి గాయాలు మార్టూరు: మండలంలోని ద్రోణాదుల గ్రామంలో సోమవారం ఓ దళిత కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన జెండ్రాజుపల్లి ఏసోబు తన తల్లి విన్నెమ్మ (60)తో కలిసి ద్విచక్ర వాహనంపై అద్దంకి నుంచి స్వగ్రామం ద్రోణాదుల వస్తున్నాడు. జాతీయ రహదారిపై ముప్పవరం సమీపంలోకి రాగానే వీరి బైకును వెనుక నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు వెన్నెమ్మ రహదారిపై పడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా ఏసోబు తలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మార్టూరు 108 సిబ్బంది గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విన్నెమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రేణింగివరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొల్లూరు: రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసిన సంఘటన కొల్లూరులో సోమవారం రాత్రి జరిగింది. అధికారుల కథనం మేరకు.. కొల్లూరుకు చెందిన సామా సత్యనారాయణ రేషన్ బియ్యం కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారంతో పౌరసరఫరాల శాఖ సీఎస్డీటీ ఫణికుమార్ నేతృత్వంలో దాడులు నిర్వహించారు. సత్యనారాయణ ఇంటిలో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ప్లాస్టిక్ గోతాల్లోకి మార్చి అక్రమ రవాణాకు సిద్ధం చేసి ఉంచడాన్ని గుర్తించారు. అక్రమంగా నిల్వ చేసిన 40 బస్తాల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సంబంధిత వ్యక్తి సత్యనారాయణపై కేసు కేసు నమోదు చేశారు. తనిఖీలలో కొల్లూరు–3 వీఆర్ఓ నన్నెపాముల రాంబాబు, వీఆర్ఏలు పాల్గొన్నారు. 10 మందికి తీవ్ర గాయాలు విజయపురిసౌత్: ిపచ్చి కుక్క దాడి చేయడంతో పదిమంది తీవ్రంగా గాయపడిన సంఘటన మాచర్ల మండలం విజయపురిసౌత్లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే విజయపురిసౌత్ లోని దేశవరపు క్యాంపు తండాలో పలువురు వ్యక్తులు బయట ఉండగా పిచ్చి కుక్క వారిపై దాడి చేసింది. అక్కడున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం సాగర్ మాత ఆలయం వద్ద ఉన్న ఉన్న ఆరుగురిని అదే పిచ్చికుక్క కరిచి గాయపరచింది. మొత్తం 10 మంది పిచ్చికుక్క దాడిలో గాయపడ్డారు. క్షతగాత్రులకు స్థానిక ప్రాజెక్ట్ ఆసుపత్రిలో చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. -
కుమారుడి హత్య కేసులో తల్లిదండ్రులు, సోదరుడి అరెస్ట్
తెనాలి రూరల్: ఆస్తి, డబ్బు కోసం తల్లిదండ్రులను కన్న కొడుకు వేధింపులకు గురి చేస్తున్నాడు. సహనం సహించిన తల్లిదండ్రులు, సోదరుడు కలిసి అతడిని హత్య చేసి శవాన్ని కృష్ణా నదిలో మాయం చేసేందుకు ఆటోలో తరలిస్తున్న వేళ సమాచారం అందుకున్న పోలీసులు అడ్డుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు. తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి. జనార్ధనరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొల్లిపర భాస్కరరావు, బుల్లెమ్మ దంపతులకు ఇరువురు కుమారులు. పెద్ద కుమారుడు కోటేశ్వరరావు(28) ఆటో డ్రైవర్. చిన్న కుమారుడు మరియదాసు ఆర్టీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్. కోటేశ్వరరావుతో విభేదించిన భార్య కొంతకాలం క్రితం వెళ్ళిపోయింది. దీంతో నాజరుపేటలో తల్లిదండ్రులతో కలిసి కోటేశ్వరరావు ఉంటున్నాడు. వీరికి కొల్లిపరలో రెండున్నర సెంట్ల భూమి ఉంది. మద్యానికి బానిసైన కోటేశ్వరరావు ఆ భూమిని అమ్మి తనకు వాటా ఇవ్వాలని తల్లిదండ్రులను వేధించేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 రాత్రి కూడా ఆస్తి విషయంలో తల్లిదండ్రులతో తీవ్రంగా గొడవపడ్డాడు. దీంతో తల్లిదండ్రులు, రెండో కుమారుడు మరియదాసు, మరో మహిళ మున్నంగి నాగేశ్వరమ్మతో కలిసి నిందితుడిని కొట్టి, గొంతు కోసి హతమార్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. హత్య కేసును వెంటనే ఛేదించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారని డీఎస్పీ తెలిపారు. -
నేటి విద్యార్థులే భవిష్యత్ నిర్దేశకులు
బాపట్ల: నేటి విద్యార్థులే దేశ భవిష్యత్ నిర్దేశకులని జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వీ కన్వెన్షన్ హాలులో విద్యాశాఖ ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ – 2026 కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మున్ముందు ఉత్తీర్ణత శాతం పెంచడానికి అందరూ కృషి చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ టెన్త్లో 128 మంది, ఇంటర్లో 27 మంది విద్యార్థులకు రూ.20 వేల చొప్పున నగదు బహుమతి, ప్రశంసాపత్రం, పతకం అందించామని చెప్పారు. పదో తరగతి పరీక్షల్లో కొల్లూరు మండలం నుంచి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ రావడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. ఆ విద్యార్థిని, తల్లిదండ్రులకు ఆయన అభినందనలు తెలిపారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ రాజు, బావుడా చైర్మన్ రాజశేఖర్బాబు, ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చిలకపూడి పాపారావు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ చూపుల దుర్గాప్రసాద్, డీఈఓ శ్రీనివాస నాయక్ తదితరులు పాల్గొన్నారు. ‘ఎల్నినో’పై అవగాహన కల్పించాలి బాపట్ల: ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక పురపాలక సంఘ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ... ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని, వర్షాలు పడే అవకాశం తక్కువని రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలో ఎరువుల నిల్వపై ఆరా తీశారు. నిబంధనల ప్రకారం ఎరువులను విక్రయించాలని, లేకుంటే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యాన పంటల సాగు, వాటి దిగుబడి, ఎరువుల వినియోగం గురించి తెలుసుకున్నారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని తెలిపారు. గోడౌన్లు పరిస్థితిని తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారిణి శ్రీలక్ష్మి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఖలీం, మార్క్ఫెడ్ ఎండీ కరుణశ్రీ , ఇతర అధికారులు పాల్గొన్నారు. -
భూరక్షణ.. అరణ్యరోదన!
తీరం తరిగిపోతోంది. అక్రమార్కులు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తుండటంతో పెనుముప్పు కలిగే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు, సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిసార్ట్ యజమానులు, రియల్టర్లు కలిసి ఇక్కడి అటవీ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వంలో కనీస చలనం కలగడం లేదని తీర ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేటపాలెం: అటవీ భూముల్లో సరుగుడు తోటల పెంపకం ఓ తంతుగా మారింది. అటవీ అధికారుల నిర్లక్ష్యంతోపాటు కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు సిబ్బంది తీరుతో తీరప్రాంత గ్రామాల మధ్య చిచ్చు రగులుతోంది. ఫలితంగా తుఫాన్లు, ఉప్పెనలు, సునామీ వంటి ఉపద్రవాల సమయంలో ముంపు నుంచి కాపాడే సరుగుడు తోటలు కనుమరుగై పోతున్నాయి. అసలు ఉద్దేశం ఇదీ.. జిల్లాలో 112 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో అనేక మత్స్యకార గ్రామాలు తీరంపై అధారపడి జీవిస్తున్నాయి. అందరికీ ప్రధానంగా చేపల వేటే జీవనాధారం. తీర రక్షణకు బీచ్ వెంట అటవీ శాఖ సరుగుడు తోటలు పెంచుతోంది. 2007 వరకు కొనసాగినా.. అ తరువాత సరుగుడు తోటల పెంపకాన్ని మత్స్యకార గ్రామాలకు వదిలేశారు. కేవలం ఆదాయ వనరులుగానే తోటలను పెంచుతున్నారు. ఒకసారి పెంచిన సరుగుడు తోటలను ఎనిమిది సంవత్సరాల వరకు కొట్టివేయకూడదు. వీటిని కాపాడాల్సిన అటవీశాఖ అధికారులు పట్టించుకోకుండా వదిలేశారు. తోటల పెంపకంలో గ్రామాల మధ్య సరిహద్దుల సమస్య తలెత్తినప్పటికీ ఆశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో ఐదుగురు అరెస్టు
నగరంపాలెం: రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసుని తాడికొండ పోలీసులు ఛేదించగా, ఐదుగుర్ని అరెస్టు చేసి బంగారు సొత్తు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఈనెల ఏడున తాడికొండ మండలం ఫణిదరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మాడుగుల శంకరరావు (52) అదృశ్యమైనట్లు ఫిర్యాదివ్వగా తాడికొండ పీఎస్లో కేసు నమోదైంది. ఐదు రోజులు గడిచాక నల్లపాడు క్వారీ గుంతల్లో కుళ్లిన స్థితిలో ఓ మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులను తీసుకెళ్లగా, మృతుడు శంకరరావు అని నిర్ధారించారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టగా, మృతుని మొబైల్ లాం, వైజాగ్లో ఉన్నట్లు చూయించడంతో విచారణ కొనసాగించారు. మొబైల్ఫోన్ లాం గ్రామంలో చూయించగా, గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామానికి చెందిన దేవరకొండ నాగేశ్వరరావు అలియాస్ ఓంకార్, గుజ్జర్లపూడి శ్యామూల్ అలియాస్ సీమోను, కనపర్తి మణికంఠ, ఘట్టమనేని పుష్ప, దేవళ్ల పద్మను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం అంగీకరించడంతో ఐదుగుర్ని అరెస్ట్ చేసి నాలుగు ఉంగరాలు, ఒక బంగారు గొలుసు, రూ.70 వేలు, కారు, మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు ప్లాన్లతో.. రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో ఏ–1 నాగేశ్వరరావుకు మిగతా నలుగురితో పరిచయం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శంకరరావుతో శ్యామూల్కు పరిచయం ఉంది. అతను ఆర్థికంగా స్థిరపడ్డాడని, అతన్ని బెదిరిస్తే డబ్బులు వస్తాయని శ్యామూల్ నాగేశ్వరరావు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో యడ్లపాడులో భూమి కొనాలని శంకరరావుని నమ్మించి, ముందస్తుగా ప్లాన్ వేశారు. ఈనెల ఏడు సాయంత్రం రియల్ ఎస్టేట్ వ్యాపార్ని అద్దె కారులో తీసుకెళ్లారు. వంకాయలపాడు గ్రామ సమీపాన ఐదుగురు ఏకమై, అతనిపై దాడికి పాల్పడ్డారు. కొరియా తాడుతో అతను గొంతుకి బిగించి హత్య చేశారు. అనంతరం మృతుని ఒంటిపై నాలుగు బంగారు ఉంగరాలు, బంగారు గొలుసు, రూ.72 వేలు తీసేసుకున్నారు. మృతదేహానికి సిమెంట్ రాయి, బైండింగ్ వైరు కట్టేసి పొత్తూరు పరిధిలోని క్వారీ గుంతలో పడేశారు. అక్కడ్నుంచి అందరూ పరారయ్యారు. అయితే మృతు ని మొబైల్ఫోన్ లోకేషన్ వైజాగ్, లాం గ్రామంలో చూయించగా ఆ దిశగా విచారించారు. మరో హత్య కేసు వెలుగులోకి.. తాడికొండ పోలీసుల విచారణలో మరో యువకుడి హత్య కేసు వెలుగు చూసింది. వెంగళాయపాలెంకు చెందిన నాగరాజు, నాగేశ్వరరావు వద్ద ఉండేవాడు. నాగేశ్వరరావు కుమార్తె వేరొకరితో వెళ్లిపోయింది. అందుకు నాగరాజు సహకరించినట్లు నాగేశ్వరరావు పగ పెంచుకున్నాడు. రెండు నెలలు కిందట నాగరాజుని దారుణంగా హత్య చేశారు. అతని మృతదేహన్ని మాచర్ల సమీపాన సాగర్ కుడి కాలువలో పడేశారు. మాచర్ల పోలీసులు గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. కుమారుడు అదృశ్యంపై తల్లిదండ్రులు నల్లపాడు పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఇక ఏ–1 నాగేశ్వరరావుపై మహిళా పీఎస్, ఎకై ్సజ్ పీఎస్లో కేసులు, మణికంఠపై మూడు కేసులు, ఇద్దరు మహిళలపై చీటింగ్ కేసులు ఉన్నాయని జిల్లా ఎస్పీ తెలిపారు. వీరందరిపై రౌడీషీట్లు తెరుస్తామని చెప్పారు. నాగేశ్వరరావు, మణికంఠపై పీడీ యాక్ట్కు సిఫార్సు చేస్తామని అన్నారు. అదృశ్య కేసులను చేధించిన తాడికొండ పీఎస్ సీఐ ఆర్.ఉమేష్, ఎస్ఐ జేత్యనాయక్, సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించి, ప్రశంసా పత్రాలు అందించారు. తుళ్లూరు డీఎస్పీ టి.మురళీకృష్ణ పాల్గొన్నారు. మిస్సింగ్ కేసులను ఛేదించిన తాడికొండ పోలీసులు -
వినుకొండ సబ్ జైలును తనిఖీ చేసిన న్యాయమూర్తి
వినుకొండ: గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి సయ్యద్ జియావుద్దీన్ సోమవారం వినుకొండ సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీల ఆరోగ్యం, భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వంటగది, స్టోర్ రూమ్లను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని ఖైదీలకు లోక్ అదాలత్ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్లు పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్, కట్ట కాళిదాస్, లోక్ అదాలత్ సిబ్బంది, జైలు అధికారులు పాల్గొన్నారు. లీకేజీ నీటిని పరిశీలించిన సాగర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ విజయపురిసౌత్: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మెయిన్ కెనాల్ నుంచి నీటి విడుదల జరిగేటప్పుడు కుడి జల విద్యుత్ కేంద్రంలోకి వస్తున్న లీకేజీ వాటర్ను సాగర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పి.కాంతారావు ఆధ్వర్యంలో అధికారులు సోమవారం పరిశీలించారు. గతంలో కెనాల్ బెడ్ కొట్టుకుపోవడంతో వాల్ దెబ్బతిందని అధికారులు పేర్కొన్నారు. దీంతో నీరు పవర్ హౌస్లోకి లీక్ అవుతుండటంతో మరమ్మతులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్కో ఎస్ఈ వెంకటరమణ, ఇరిగేషన్ శాఖ ఈఈ మల్లికార్జునరావు, వపర్ హౌస్ డీఈఈ రాజారెడ్డి, సాగర్ ప్రాజెక్టు డీఈఈ గోపాలరావు, ఏఈలు శివయ్య, యుగంధర్ పాల్గొన్నారు. దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా భారతి పెదకాకాని: రాష్ట్ర దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్ పర్సన్గా విశ్రాంత న్యాయమూర్తి ఎం.భారతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా కోర్టు జడ్జిగా విధులు నిర్వహించిన భారతిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దేవదాయశాఖ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా నియమించింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గుంటూరు జిల్లా పెదకాకానిలోని రాష్ట్ర దేవదాయశాఖ ట్రిబ్యునల్ చైర్పర్సన్ పోస్టు ఖాళీగా ఉంది. రెండేళ్ల తర్వాత ఈ పదవిలో భారతి నియమితులయ్యారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి గుంటూరు ఎడ్యుకేషన్: ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.థామస్రెడ్డి, రాష్ట్ర కోశాధికారి సిద్దెల ప్రేమ్సాగర్ డిమాండ్ చేశారు. ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కోరుతూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మను కలెక్టరేట్లో కలసిన వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనకు వినతి పత్రం సమర్పించారు. విద్యాహక్కు చట్టానికి సవరణ తెచ్చి, టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రభుత్వం దీనిపై ఒత్తిడి తెచ్చి ఉపాధ్యాయుల హక్కులను పరిరక్షించాలన్నారు. కలెక్టర్ను కలసిన వారిలో సంఘ జిల్లా అధ్యక్షుడు పి.శేషిరెడ్డి ఉన్నారు. -
ఓటమి భయంతో అధికార పార్టీ కుయుక్తులు
పర్చూరు (చినగంజాం): రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో అధికార పార్టీకి చెందిన కొందరు దురుద్దేశంతో కుట్రపూరిత చర్యలకు తెరతీశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని పావులూరులోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ వ్యక్తులు తమ బూటకపు ఎత్తుగడల్లో భాగంగా ఇటీవల కాలంలో ఐవీఆర్ఎస్ సర్వే పేరుతో ఓటర్లకు నేరుగా ఫోన్ కాల్ చేసి అభిప్రాయ సేకరణ నిర్వహిస్తూ ప్రజలను గందరగోళంలోకి నెట్టేందుకు తెరలేపారన్నారు. నియోజకవర్గంలోని పలువురు ఓటర్లు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించడంతోపాటు విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయం.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేస్తుందని, తర్వాత సాధారణ ఎన్నికల్లో గెలిచి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు తమ బూటకపు ఫోన్ కాల్స్ ద్వారా నియోజకవర్గంలో మధుసూదనరెడ్డి పనితీరు, అక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఆయనే ఉండాలా? మార్చాలా? ఫలానా వ్యక్తికి ఇన్చార్జ్గా పెట్టి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది? వంటి పలు ప్రశ్నలను ఓటర్లను అడగటం ద్వారా చీప్ ట్రిక్స్ ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కాల్స్ రావని, కొందరు అధికార పార్టీలోని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఆడుతున్న నాటకమని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఈ కుట్రను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. -
యువ వైద్యుడి ప్రాణాలు తీసిన కల్వర్టు
వేటపాలెం: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కల్వర్టులోకి పల్టీ కొట్టిన ఘటనలో యువ పీజీ వైద్యుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఓడరేవు నుంచి రామాపురం సముద్రతీరం కల్వర్టు వద్ద ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బాపట్ల బీమావారిపాలెం చెందిన డాక్టర్ లేళ్ల వెంకట అనిరుద్దీన్ (24) తన స్నేహితుడితో కలసి ఆదివారం రామాపురం బీచ్కు వచ్చారు. ఆనందంగా గడిపిన తర్వాత బైక్పై తిరుగు ప్రయాణమయ్యారు. రామాపురం నుంచి ఓడరేవు వెళ్లే రహదారి మధ్యలో మరమ్మతులో ఉన్న కల్వర్టు వద్ద బైక్ అదుపుతప్పింది. కల్వర్టులో పల్టీ కొట్టింది. అనిరుద్దీన్ తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని 108లో చీరాల అసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఆహా’ర్టికల్చర్ హబ్ !
రెంటచింతల: వేసవి కాలంలో రెంటచింతల పేరు వినని వారుండరు. భగభగమని అత్యధిక ఉష్ణోగ్రతలే కాదు.. ఇది మిర్చినారుకు కూడా ప్రసిద్ధి చెందింది. మేలురకమైన మిర్చిపంటకు కావాల్సిన నారుకు కేరాఫ్గా, హార్టికల్చర్ హబ్గా రెంటచింతల పేరు గడిస్తోంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా 54 నర్సరీలు ఏర్పాటు చేశారు. మొదట మూడు, నాలుగు నర్సరీలు ఏర్పాటు చేయగా ఉద్యాన శాఖాధికారులు అవగాహన కల్పించడంతో మూడు సంవత్సరాల్లో నర్సరీల ఏర్పాటుకు రైతులు ఉత్సాహం చూపారు. పలు రకాల మిర్చినారు ఒకే చోట.. గతేడాది పలు రకాలకు చెందిన మొక్కలకు వేర్వేరు రేట్లు పలికాయి. ఒక మొక్కను 80 పైసలు నుంచి రూ.1.75 వరకు రైతులు కొనుగోలు చేశారు. సుమారు 200 ఎకరాల్లో షేడ్ నెట్లలో నర్సరీలు ఏర్పాటు చేయగా ఎకరాకు 18 వేల ట్రేల చొప్పున నారును పెంచుతున్నారు. రైతులకు ఇక్కడ పలు రకాల హైబ్రీడ్ మిర్చి నారు ఒకే చోట దొరుకుతుంది. దీంతో రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతులే కాక తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, మహబూబాబాద్, వరంగల్ తదితర జిల్లాలకు చెందిన వందలాది మంది రైతులు, కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన రైతులు కూడా ఇక్కడ నర్సరీలలో పెంచిన మిర్చినారును కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కొందరు రైతులు విత్తనాలను ఇచ్చి ఒక్కొక్క ట్రేకి ఇంత నగదు అని ముందుగానే నిర్వహకులతో ఒప్పందం చేసుకుంటారు. రాష్ట్రంలోనే మిర్చి పంట సాగుకు ఈ ప్రాంతానికే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడు నర్సరీల ద్వారా అనేక ప్రాంతాలకు మేలు రకాలైన మిర్చినారును సరఫరా చేసే కేంద్రంగా మారింది. పెద్ద సంఖ్యలో నర్సరీలను ఏర్పాటు చేయడం వలన మండలంలోని పలు గ్రామాలకు చెందిన వందలాది వ్యవసాయ కూలీలకు జీవనోపాధి కూడా లభిస్తోంది. ఈ ప్రాంతంలో సుమారు 54 నర్సరీలు ఏర్పాటు చేయడం వలన రైతులకు అవసరమైన మేలు రకమైన మిర్చినారు కచ్చితంగా దొరుకుతుంది. ఈ నమ్మకంతోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతులు ప్రతి ఏటా ఇక్కడకు వచ్చి మిర్చినారు కొనుగోలు చేస్తుంటారు. సుమారు 600 కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నాం. – బద్దూరి బ్రహ్మానందరెడ్డి, నర్సరీ యజమాని ఈ ప్రాంతంలో షేడ్ నెట్ నర్సరీల నిర్వహకులు ఎక్కువ మంది రైతులు కావడం వలన మేలు రకమైన నారు దొరుకుతుందని మాకు నమ్మకం. మా ప్రాంతంలో మిర్చినారును పెంచుకునే విధానంపై అవగాహన లేదు. ఇక్కడ ఎక్కువ నర్సరీలు ఉండటం కారణంగా రెండు, మూడు రకాల మేలు రకాలైన హైబ్రీడ్ మిర్చినారును కొనుగొలు చేసుకోవచ్చు. – వడితే మునినాయక్, తిమ్మాయిపాలెం గ్రామం, నల్గొండ జిల్లా, తెలంగాణ -
ప్రత్యేక టెట్లో మార్పులు చేయాలి
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు గుంటూరు ఎడ్యుకేషన్: దసరా సెలవుల్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించనున్న ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) లో పలు కీలక మార్పులు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సాంబశివపేటలోని ఏసీ కళాశాలలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన టెట్ తెలుగు అవగాహన తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డీఎస్సీకి అనుసంధానంగా నిర్వహించే టెట్కు, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు నిర్వహించే టెట్లో మార్పులు లేనట్లయితే అది స్పెషల్ టెట్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. స్పెషల్ టెట్లో కామన్గా అందరికీ పాస్ మార్కు తగ్గింపుగా ఉండాలని, ఆఫ్లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2ఏ పరీక్షలో ఉపాధ్యాయుడు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు వరకే సిలబస్ ఉండాలని, తనవి కాని సబ్జెక్టును తొలగించాలన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ మాట్లాడుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నిర్వహించిన సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు అవగాహన తరగతులు విజయవంతమయ్యాయని, మహిళా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. టెట్ అవగాహన తరగతులను నిర్వహించేందుకు సహకారం అందించిన ఏసీ కళాశాల యాజమాన్యానికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. తరగతుల ముగింపు కార్యక్రమంలో తెలుగు రీసోర్స్ పర్సన్ ఆర్.వెంకటరావును సత్కరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమకుమారి, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ టీఎస్ఎల్ఎన్ మల్లేశ్వరరావు, రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఎండీ షకీలా బేగం, జిల్లా కోశాధికారి ఎండీ దౌలా, యూత్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
చిలకలూరిపేటలో ఆటో బోల్తా
ఐదుగురికి గాయాలు చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని పురుషోత్తమపట్నం వినాయక గుడి వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ముందు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న ఆటో ఢీకొని బోల్తా పడింది. ఆటో డ్రైవర్ వేముల కోటేశ్వరరావుతోపాటు ప్రయాణికులు తోక చెంచు, నాగేంద్రం, మేడికొండి చంద్ర, పలపర్తి మేరీ, పలేపు వెంకాయమ్మలకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన నాగేంద్రంను మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.బాధితులంతా ఆదివారం ప్రార్థనలు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెనాలిరూరల్: హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ నాజరుపేటలో ఈ నెల 15వ తేదీ పొద్దుపోయాక కొల్లిపర కోటేశ్వరరావును అని తల్లిదండ్రులు భాస్కరరావు, బుల్లెమ్మ, తమ్ముడు మరియదాసు దాడి చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య జరిగిన నేపథ్యం, దారి తీసిన ఘటనలు వంటి వివరాలను సోమవారం నిర్వహించనున్న విలేకర్ల సమావేశంలో అధికారులు వెల్లడించనున్నారు. గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాలల్లో వ్యవసాయ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు గతంలో ఆన్లైన్లో నమోదు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 21, 22వ తేదీలలో రెండవ విడత వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ డాక్టర్ ఎ.మణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. మాజీ సైనికుడు గోవిందరావు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ మాజీ సైనిక సంఘాల జేఏసీ ఏర్పాటైంది. ఆదివారం గవర్నర్పేటలోని స్వాతంత్య్ర సమరయోధుల భవనంలో మాజీ సైనిక సంఘాల అఖిలపక్ష సమావేశం జరిగింది. మాజీ సైనికుడు గోవిందరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జేఏసీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సైనికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ శాఖలతో సమన్వయం, పెండింగ్ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించామన్నారు. రాష్ట్రంలో మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను సమర్థంగా పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. మాజీ సైనికులకు ఎలాంటి సమస్య ఎదురైనా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారం చూపడానికి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. సమావేశంలో ఏపీ మాజీ సైనిక హక్కుల పోరాట సమితి, ఏపీఎక్స్–సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్, ఏపీఆర్ఎంఎస్ఎస్ఎస్, ఎన్ ఎక్స్ సీసీ, ఏబీపీఎస్ఎస్పీ, ఏఐఈఎస్ఎల్ఎస్, ఎక్స్ సైలర్స్ ఆఫ్ ఇండియన్ నేవీ, రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి మాజీ సైనిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
కొల్లూరు: భర్త అనారోగ్య సమస్యలు.. వైద్యం కోసం చేసిన అప్పులతో మానసిక వేదనకు గురవుతున్న ఓ వివాహిత ఉరి పెట్టుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని తోకలవారిపాలెంలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. తోకలవారిపాలేనికి చెందిన వర్రె నాగమల్లేశ్వరరావు పెద్ద కుమార్తె వైష్ణవిని అదే గ్రామానికి చెందిన బంధువు వై. శ్రీనివాసరావుకు ఇచ్చి తొమ్మిదేళ్ల కిందట వివాహం చేశారు. భర్త ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ భార్య, చిన్నారులైన ఓ కుమారుడు, కుమార్తెతో కలసి గుంటూరులో నివసించేవారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాసరావు గుంటూరు నుంచి వచ్చి తన తల్లిదండ్రులు, భార్య పిల్లలతో కలసి ఉంటున్నాడు. ఉద్యోగ రీత్యా వెళ్లి వస్తున్న ఆయన అనారోగ్యం కారణంగా వైద్యం కోసం అప్పులు చేయడంతో అప్పులపాలయ్యాడు. ఆవేదనతో వైష్ణవి కొద్ది రోజులుగా మానసికంగా కుంగిపోతుంది. శనివారం మధ్యహ్నం అదే గ్రామంలో ఉన్న తన పుట్టింటికి వెళ్లిన వైష్ణవి తన తండ్రికి అప్పులు, తన భర్త అనారోగ్య సమస్యల గురించి చెప్పి ఆవేదన చెందింది. అన్నీ సర్దుకుంటాయని ధైర్యం చెప్పి పంపారు. సాయంత్రం సమయంలో వైష్ణవి అత్తింటి వద్ద భారీగా జనం ఉండటంతో వెళ్లి చూసిన ఆమె తండ్రి వైష్ణవి ఉరి పెట్టుకొని ఉండటం గమనించాడు. బంధువుల సాయంతో ఆమెను హుటాహుటిన వేమూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ కిశోర్బాబు తెలిపారు. -
ఆధునిక సాంకేతికతతో జీవితంలో విజయం తథ్యం
తెనాలి: ఆండ్రాయిడ్ టెక్నాలజీ సెల్ఫోన్లలో గల వందలాది అప్లికేషన్స్ను విద్యార్థులు నేర్చుకుంటే జీవితంలో విజయం సాధించటం తథ్యమని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇన్చార్జి రెక్టార్ ఆర్.శివవరామప్రసాద్ సూచించారు. పట్టణానికి చెందిన మొవ్వా విజయలక్ష్మి సేవాసమితి ఆధ్యర్యంలో ఆదివారం స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటైన ప్రత్యేక సభకు సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. సభలో ఆర్.శివరామప్రసాద్ ‘విద్యార్థులు–భవిష్యత్ సవాళ్లు’ అంశంపై మొవ్వా విజయలక్ష్మి స్మారక ప్రసంగం చేశారు. సెల్ఫోన్లో అనవసర విషయాలను వీక్షించటం మానుకోవాలని స్పష్టం చేశారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ జీవితంలో ఎదగాలని చెప్పారు. తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తన ప్రసంగంలో బాల్యం నుండే తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవిస్తూ ఈర్ష్య, అసూయలకు ఆస్కారం లేకుండా ఇతరులకు చేతనైన సేవ చేస్తూ సంతృప్తికరంగా గడపాలని సూచించారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే తల్లికి నమస్కరించి చెడు పనులకు దూరంగా ఉంటూ, తోటివారికి సహాయం చేస్తూ, సన్మార్గంలో నడవాలని చెప్పారు. దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి మాట్లాడుతూ తల్లిదండ్రులు, పిల్లలు ప్రతి రోజూ కొంత సమయం మాట్లాడుకోవాలని సలహానిచ్చారు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మంచి వ్యక్తిత్వాన్ని అలవరచుకుని క్రియాశీలత, లక్ష్యాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. గత మార్చిలో జరిగిన పదోతరగతి పరీక్షల్లో 550 పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.5 వేల చొప్పున మొత్తం 60 మందికి రూ.3 లక్షలను బహూకరించి, జ్ఞాపికలను అందజేశారు. బెల్లంకొండ వెంకట్ స్వాగతం పలికిన సభలో డాక్టర్ మొవ్వా ఏసుబాబు, పట్టణ ప్రముఖులు ఈదర వెంకట పూర్ణచంద్, కన్నెగంటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, నల్లూరి వెంకటేశ్వరరావు, ఓంకార్ ప్రసాద్, కొత్త హరిప్రసాద్, డాక్టర్ వాసిరెడ్డి నాగేశ్వరప్రసాద్, డాక్టర్ ధూళిపాళ్ల రవీంద్రనాథ్, షేక్ బాష, వెంపటి సత్యనారాయణ, మొవ్వా విజయలక్ష్మి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
ఇనుపరాడ్లతో కారు అద్దాలు ధ్వంసం
నరసరావుపేట రూరల్: ఇనుప రాడ్లతో కారు అద్దాలు ధ్వంసం చేసి చంపుతామని బెదిరింపుపై మండలంలోని లింగంగుంట్ల గ్రామానికి చెందిన సాగిరెడ్డి వెంకటరెడ్డి రూరల్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గ్రామంలోని తన ఇంటిపక్కనే తన తండ్రిపేరుపై ఉన్న తొమ్మిది సెంట్ల స్థలం తమది అంటూ సమీపంలో నివాసం ఉండే కందుల మర్రిరెడ్డి, విజయలు గత కొంతకాలంగా తమతో గొడవలు బడుతున్నారన్నారు. దీనిపై అనేకమార్లు గ్రామ పెద్దలతో పంచాయితీ నిర్వహించినా వారు ఆ స్థలం తమదే అంటూ ఆ స్థలంలో చెత్త వేస్తున్నారన్నారు. ఆదివారం తాను ఒక కూలీ సహాయంతో స్థలంలోని చెత్తను శుభ్రం చేస్తుండగా మర్రెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్రెడ్డి అసభ్యపదజాలంతో తిడుతూ ఇనుపరాడ్లతో తన ఇంటిముందున్న కారు ముందు, వెనుకా అద్దాలను పగులకొట్టారన్నారు. దీంతోపాటు తనపై దాడిచేయగా తాను తప్పించుకొని ఇంట్లోకి వెళ్లగా ఈసారి నిన్ను ప్రాణాలతో వదిలేశామని, స్థలం జోలికి వస్తే చంపుతామని బెదిరించారన్నారు. వెంటనే వారిపై కేసు నమోదుచేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు. -
వైభవంగా ప్రత్యేక హోమాలు, అన్నసంతర్పణ
రేపల్లె: బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఐదు రోజులుగా కొనసాగుతున్న అద్దె బస్సు డ్రైవర్ల సమ్మెకు ఆదివారం తెరపడింది. నూతన వేతన ఒప్పందం కుదరడంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి కార్మిక సంక్షేమ సదుపాయాలను అమలు చేయడానికి అద్దె బస్సు యజమానులు అంగీకరించడంతో డ్రైవర్లు ఆదివారం ఉదయం నుంచి విధుల్లో చేరారు. అద్దె బస్సు యూనియన్ (సీఐటీయూ) డిపో అధ్యక్షుడు జి.వెంకటేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు, సీఐటీయూ బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్.మణిలాల్లు మాట్లాడుతూ చీరాలలో అధిక సంఖ్యలో అద్దె బస్సులు ఉండటంతో చీరాల ఆర్డీవో ఆధ్వర్యంలో ఆర్టీసీ, పోలీసు అధికారులు, అద్దె బస్ యజమానులు, డ్రైవర్లు, సీఐటీయూ నాయకుల మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయని తెలిపారు. ఒప్పందం ప్రకారం ప్రస్తుతం అమలులో ఉన్న ఓటీ బస్ డ్రైవర్ రోజువారీ వేతనం రూ.1,100 నుంచి రూ.1,200, నైట్ అవుట్ బస్ డ్యూటీ వేతనం రూ.1,200 నుంచి రూ.1,300కు పెంచేందుకు యజమానులు అంగీకరించారన్నారు. ప్రతి డ్రైవర్కు నెలకు సుమారు రూ.1,500 అదనపు ఆదాయం లభించనుందని చెప్పారు. ఈ నూతన వేతన ఒప్పందాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారన్నారు. అదనంగా ప్రతి బస్సుకు పనిచేసే ఇద్దరు డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి చట్టబద్ధమైన కార్మిక సంక్షేమ సదుపాయాలను కార్మిక శాఖ సమక్షంలో అమలు చేయడానికి కూడా యజమానులు అంగీకరించినట్లు నాయకులు తెలిపారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కార్మిక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు డ్రైవర్లు, యజమానులు, ఆర్టీసీ అధికారులు కలిసి క్రమం తప్పకుండా సంయుక్త సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మదర్ థెరిసా అద్దె బస్ డ్రైవర్స్ యూనియన్ (సీఐటీయూ) కన్వీనర్ కె.గోపి, కోశాధికారి జి.రవిబాబు, డ్రైవర్లు భాస్కర్, ఇమ్రాన్, బాషా, రవి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల: ఆషాఢ మాసంలో అత్యంత ప్రీతికరమైన ఆషాఢ శుద్ధ పంచమి (స్కంద పంచమి) పర్వదినాన్ని పురస్కరించుకుని బాపట్ల పట్టణంలో సుబ్రహ్మణ్యస్వామి వారి లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో ఆదివారం (స్కంద షష్టి) రోజున విశేష పూజలు, సర్పసూక్త హోమం అత్యంత వైభవం నిర్వహించారు. నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు మాట్లాడుతూ ఉదయం కావడి ద్రవ్యాలతో సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష అభిషేక కార్యక్రమం, అనంతరం హస్త, కృత్తిక, విశాఖ, ఆశ్లేష నక్షత్రాల జాతకుల కోసం, శని, రాహు, కేతు గ్రహ జపాలు జరిగాయి. సుబ్రహ్మణ్యస్వామి వారి మూల మంత్రంతో సర్పసూక్త మహా మంత్ర దివ్య హోమంతోపాటు లక్ష్మీ గణపతి, రుద్ర, మృత్యుంజయ మంత్రాలతో విశేష హోమ క్రతువులు జరిగాయి. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన అఖండ పుష్పార్చన కార్యక్రమంతోపాటు సుబ్రహ్మణ్య స్వామి స్వరూపులైన వేద విద్యార్థులకు, చిన్న పిల్లలకు బ్రహ్మచారుల పూజా కార్యక్రమంలో భక్తులు వేద విద్యార్థులను పూజించారు. పూర్ణాహుతి అనంతరం భక్తులందరికీ స్వామి వారి అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో బాపట్ల పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు రొంపిచర్ల కేశవాచార్యులు, శ్రీనివాసుల విఖనస మూర్తి, పరాశరం రఘురామ్, కౌండిన్య, సాయి వెంకట్ పాల్గొన్నారు. -
నియామక తేదీ ఆధారంగానే సీనియార్టీ జాబితాలు రూపాందించాలి
ఎస్టీయూ నాయకులు గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల ఉద్యోగ నియామక తేదీ ఆధారంగానే సీనియార్టీ జాబితాలు రూపొందించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉగ్గం మహంకాళరావు, జె.శంకర వరప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కంకరగుంటలోని ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కొత్త జిల్లాల వారీగా చేపడుతున్న ఉపాధ్యాయుల కేటాయింపులో భాగంగా రూపొందిస్తున్న జిల్లా సీనియారిటీ జాబితాల్లో ఉపాధ్యాయులందరికీ పూర్తి న్యాయం జరగాలని, వారి అసలు నియామక తేదీని ప్రామాణికంగా తీసుకుని సీనియారిటీని కల్పించాలన్నారు. సుదీర్ఘకాలంగా ప్రభుత్వ సేవలో ఉంటూ విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుల హక్కులను కాలరాసే విధంగా సీనియారిటీ జాబితాల రూపకల్పన ఉండకూడదని పేర్కొన్నారు. ముఖ్యంగా కింది వర్గాల ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. జిల్లా పునర్విభజన అనేది కేవలం ప్రభుత్వ పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన ప్రక్రియ అని, దీని ప్రభావంతో దశాబ్దాలుగా ప్రభుత్వ సేవలో ఉన్న ఉపాధ్యాయులు తమ సీనియారిటీని కోల్పోయే పరిస్థితి రావడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఏ ఒక్క ఉపాధ్యాయుడికి అన్యాయం జరిగినా ఎస్టీయూ ఊరుకోదని హెచ్చరించారు. విద్యాశాఖ, ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఉపాధ్యాయుల అసలు నియామక తేదీ ప్రకారమే తుది సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసి, ఉపాధ్యాయ లోకానికి నమ్మకం కలిగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్టీయూ గుంటూరు జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షుడు కొరివి విజయబాబు, తదితరులు పాల్గొన్నారు. యడ్లపాడు: రోడ్డు ప్రమాదంలో రెండు బైక్లు ఢీకొన్ని ప్రమాదంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని బోయపాలెం గ్రామంలోని మసీదు వద్ద ఈనెల 17వ తేదీన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యడ్లపాడు పాత రెవెన్యూ కార్యాలయం వద్ద నివాసం ఉండే ఒంటిపులి శ్రీనివాసరావు(34) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం సుమారు రాత్రి 9.50 గంటలకు జరిగిందని, మసీదు సమీపంలోని వాటర్ ప్లాంట్ వద్ద వాటర్ డంబెల్ను స్కూటీపై తీసుకెళ్తున్న క్రమంలో అదే సమయంలో శ్రీనివాసరావు ఆ వైపు రావడంతో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. శ్రీనివాసరావు రోడ్డుపై పడిపోవడంతో తలకు, కంటికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, 108 వాహనంలో కాటూరు మెడికల్ వైద్యశాలకు తరలించారు. ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. భార్య త్రివేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణాలు ఎస్ఐ టి శివరామకృష్ణ ఛేదించారు. బోయపాలేనికి వలస వచ్చిన ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉద్దమ్సింగ్నగర్ జిల్లాకు చెందిన సోనిబ్గా గుర్తించామన్నారు. గ్రామంలోనే సెలూన్షాపులో పనిచేస్తున్న అతన్ని ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
తాడికొండ గురుకుల పాఠశాలను కొనసాగించాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ లక్ష్మీపురం: తాడికొండలోని బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలను మూసివేయటాన్ని, దీనిని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన విద్యార్థు తల్లిదండ్రులు, ఎస్.ఎఫ్.ఐ, కె.వి.పి.యస్ సంఘాల నాయకులపై పోలీసులు దౌర్జన్యంగా దాడిచేసి అరెస్టు చేయటాన్ని సీపీఎం జిల్లా కమిటీ ఖండిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వై.నేతాజీ పేర్కొన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక దశాబ్దాలుగా జిల్లాలోని పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన గురుకుల పాఠశాలను మూసివేయడం వల్ల దళిత, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమవుతుందని అన్నారు. రాజధానిలో వేల ఎకరాల భూములను సేకరించి అనేక కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా కట్టబెడుతున్నారని, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్కు కూడా అలాగే భూములు కేటాయించి నడపవచ్చని, ఏకపక్షంగా గురుకుల పాఠశాలను తరలించడం సరికాదన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో నీట్, జేఈఈ కోచింగ్ ఇవ్వడానికి ప్రైవేటు వారిని ఆహ్వానించి వారికి కట్టబెట్టటాన్ని సీపీఎం వ్యతిరేకిస్తుందన్నారు. అమర్యాదగా, దౌర్జన్యంగా ప్రవర్తించిన సీఐపై చర్య తీసుకోవాలని, తాడికొండలో అంబేద్కర్ గురుకుల పాఠశాలను కొనసాగించటానికి ప్రభుత్వం పూనుకోవాలని, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ అమరావతిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు, ఎన్.భావన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కరోనా కలకలం
● మంగళగిరిలో ఇరువురికి కరోనా పాజిటివ్ ● తాజాగా బాపట్ల జిల్లావాసికి నిర్ధారణ ● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు జీజీహెచ్లో ప్రత్యేక వార్డు గుంటూరు జీజీహెచ్లో కరోనా బాధితుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు జీజీహెచ్లో ప్రత్యేకంగా కరోనా టెస్టింగ్ కేంద్రాన్ని, బాధితుల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి మొత్తం ప్రతి పడకకు ఆక్సిజన్ పైపులైను ఏర్పాటు చేయడంతోపాటు, సహజంగా ఆక్సిజన్ తయారు చేసే భారీ ఆక్సిజన్ ప్లాంట్లను సైతం ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఎమర్జన్సీ మెడిసిన్ వైద్య విభాగం వద్ద గతంలో స్టెప్డౌన్ ఐసీయూ వార్డుగా ఉన్న దానిని కరోనా వార్డుగా ఏర్పాటు చేశామని సూపరింటెండెంట్ వెల్లడించారు. -
బాపట్ల
సోమవారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2026తీరంలో భూఆక్రమణల చెర ● తీరప్రాంత అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ దందా ● ఎన్వోసీల కోసం రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు ● సర్వేయర్లకు బెదిరింపులు, కోర్టు కేసులు ● ప్రశ్నార్థకంగా మారిన ప్రభుత్వ భూముల పరిరక్షణ విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 513.40 అడుగులకు చేరింది. ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. చీరాల నియోజకవర్గం పరిధిలో దాదాపు 40 శాతం వరకు అసైన్డ్, ప్రభుత్వ భూములున్నాయి. సముద్ర తీరం పరిధిలోని ఓడరేవు నుంచి రామచంద్రాపురం వరకు వందల ఎకరాల అసైన్డ్ భూములుగా రికార్డులున్నాయి. తీరాన్ని ఆనుకుని ఉన్న ఈ భూములు ప్రస్తుతం భారీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారాయి. చీరాల ప్రాంతంలో ఓడరేవు నుంచి వేటపాలెం మండలం రామాపురం, కఠారివారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామల పరిసరాల్లో పర్యాటక కార్యకలాపాలు పెరగడం, రిసార్టులు ఏర్పడటంతో భూముల విలువ ఒక్కసారిగా భారీగా పెరిగింది. దీంతో ప్రభుత్వానికి చెందిన అసైన్డ్ భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆక్రమణలకు తెరలేపినట్లు తెలిపారు. -
విశాఖలో ప్రమాదం.. ఇనిమెళ్లలో విషాదం
● శుభకార్యానికి వెళుతుండగా కబళించిన మృత్యువు ● ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు దుర్మరణం ఈపూరు: విశాఖపట్నం సమీపంలోని పెందుర్తి– ఆనందపురం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామంలో విషాదం అలముకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన ముగ్గురు, నరసరావుపేటకు చెందిన డ్రైవర్ మృతి చెందారు. ఇనిమెళ్లకు చెందిన మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నరసరావుపేటలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో శుభకార్యం ఏర్పాటు చేశారు. ఇనిమెళ్ల గ్రామానికి చెందిన పాలగాని రామాంజనేయులు, షేక్ మీరావలి, మందపాటి చంద్రశేఖర్, అతని కుమారుడు మందపాటి భవాని శంకర్లు వాహనంలో శనివారం సాయంత్రం అక్కడికి బయలు దేరారు. తెల్లవారుజామున విశాఖ సమీపంలోని ఆనందపురం జాతీయ రహదారిపై వీరి వాహనం ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొంది. పాలగాని రామాంజనేయులు (51), షేక్ మీరావలి (55), మందపాటి భవాని శంకర్ (11) అక్కడికక్కడే మృతి చెందారు. మందపాటి చంద్రశేఖర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్ద దిక్కును కోల్పోయాం... పాలగాని రామాంజనేయులుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం భార్య, వృద్ధురాలైన తల్లి, ఇద్దరు కుమారులతో కలసి ఆయన ఉంటున్నారు. తనకున్న కొద్దిపాటి పొలంతోపాటు మరికొంత కౌలుకు సాగు చేస్తుంటారు. కుటుంబానికి అండగా ఉండే ఆయన మృతి చెందడంతో పెద్ద దిక్కును కోల్పోయామని బాధితులు కన్నీరుమున్నీరు అయ్యారు. బడికి సెలవు కావడంతో.. మందపాటి చంద్రశేఖర్కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారిలో చిన్నవాడైన మందపాటి భవాని శంకర్ ఆరో తరగతి చదువుతున్నాడు. తండ్రి చంద్రశేఖర్ కారులో శుభకార్యానికి వెళుతుండగా ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో వస్తానని చెప్పి తండ్రితోపాటు వెళ్లి మృత్యువాత పడ్డాడు. కుమారుడు మరణించి, భర్త ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉండటంతో బాధిత కుటుంబం విలపిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. ఇక దిక్కెవరు... షేక్ మీరావలికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు కెనడాలో ఉద్యోగి. చిన్న కుమారుడు గతంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం తండ్రికి తోడుగా ఇంటి వద్ద ఉంటున్నాడు. వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. రోడ్డు ప్రమాదంలో ఇంటి పెద్దను కోల్పోవడంతో కుటుంబం విషాదంలో మునిగింది. నిన్నటివరకు తమ కళ్లముందే తిరిగిన వారు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాన్ని గ్రామస్తులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మృతదేహాల కోసం ఆయా కుటుంబాల వారు కన్నీటితో ఎదురుచూస్తున్నారు. -
మహంకాళికి నిమ్మకాయల అలంకరణ
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి నిమ్మకాయల దండలతో అలంకరించారు. భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు వేలాది సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు స్వీకరించి, మొక్కులు తీర్చుకున్నారు. అసౌకర్యం కలగకుండా ఆలయ ఈఓ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. జాతీయ స్థాయిలో రెండోస్థానం కైవసం గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ పోలవరపు కృష్ణప్రియ క్విజ్ పోటీల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటారు. న్యూఢిల్లీలో శనివారం ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులకు జాతీయ స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఏపీ తరఫున గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి పాల్గొన్న డాక్టర్ కృష్ణప్రియ జాతీయస్థాయిలో రెండోస్థానంలో నిలిచారు. ఇటీవల ఏపీలో జరిగిన రాష్ట్రస్థాయి క్విజ్ పోటీల్లో స్టేట్ ఫస్ట్ సాధించిన డాక్టర్ కృష్ణప్రియ జాతీయ స్థాయిలో చేరుకున్నారు. ఆదివారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్వీ సుందరాచారి, న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. గాజుల రామకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అజ్మ, పలువురు పీజీ వైద్య విద్యార్థులు ఆమెకు అభినందనలు తెలిపారు. డాక్టర్ గాజుల రామకృష్ణ 2014లో జాతీయ స్థాయి క్విజ్ పోటీల్లో ప్రథమస్థానం సాధించి రికార్డు సృష్టించగా.. నేడు గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీకి చెందిన డాక్టర్ కృష్ణప్రియ రెండో స్థానంలో నిలిచారు. తద్వారా గుంటూరు వైద్య కళాశాల పేరు మరోమారు జాతీయస్థాయిలో మారుమోగేలా చేశారు. ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలలో ఆదివారం రికార్డు స్థాయిలో భక్త బృందాలు సారెను సమర్పించాయి. జగన్మాత దుర్గమ్మను భక్తులు తమ ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావించి పసుపు, కుంకుమ, పూజా సామగ్రి, చీర, మిఠాయిలను సమర్పించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు, తిరిగి సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి 9.30 గంటల వరకు సారె సమర్పణలు కొనసాగాయి. దీంతో ఉదయాస్తమాన సేవగా సారె సమర్పణ కార్యక్రమం జరుగుతుందా అనే భావన భక్తుల్లో కలిగింది. ఆషాఢ మాసం తొలి ఆదివారం కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. అన్ని టికెట్ల విక్రయాలు రద్దు.. గతంలో శుక్రవారం, ఆదివారాల్లో కేవలం అంతరాలయ దర్శనాలను మాత్రమే రద్దు చేసేవారు. అయితే ఆదివారం భారీగా భక్తులు తరలిరావడంతో అన్ని టికెట్ల విక్రయాలను రద్దు చేసి ఉచితంగా ఆయా క్యూలైన్ మార్గాల్లో భక్తులను దర్శనానికి అనుమతించారు. ముందుగా ఆన్లైన్లో రూ. 500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ప్రత్యేక సమాయాన్ని కేటాయించారు. వారికి మాత్రమే అంతరాలయ దర్శనం కల్పించారు. -
గుంటూరు నగరంలో భారీ వర్షం
నెహ్రూనగర్: గుంటూరు నగరంలో ఆదివారం రాత్రి 7.30 గంటలకు భారీ వర్షం కురిసింది. కేవలం గంట వ్యవధిలోనే కురిసిన భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా మూడు వంతెనలు, కొత్తపేట, విద్యానగర్, కొరిటెపాడు, పాతగుంటూరు, అమరావతి రోడ్డులోని ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా చేరడంతో చెరువును తలపించింది. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో మోకాలి లోతున నీరు చేరింది. దీంతో ఆయా మార్గాల్లో వెళ్లే వాహనదారులు, ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్లే స్వల్ప వ్యవధిలో కురిసిన వర్షానికే రోడ్లు జలమయం అవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ
నరసరావుపేట రూరల్: లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా విద్యార్థినులకు 101 సైకిళ్లను పంపిణీ చేశారు. పాఠశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో బ్యాంక్ జోనల్ హెడ్ ఎం.పిచ్చయ్య, రీజినల్ హెడ్ జీవీ రమణారావు, నరసరావుపేట శాఖ మేనేజర్ పి.వెంకట రవికుమార్లు అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థినులను ప్రొత్సహించాలనే ఉద్దేశంతో సైకిళ్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. హెచ్ఎం పార్వతి, ఉపాధ్యాయులు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకటరామిరెడ్డి జయంతిని పురస్కరించుకొని శనివారం వెంకటరామ్ మెమోరియల్ జీబీఆర్ హాస్పిటల్లో సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి భవనం చేసిన సేవలను కొనియాడారు. పలువురు నాయకులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: విజయవాడ కనకదుర్గ అమ్మవారికి మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో శనివారం సారె సమర్పించారు. ఈ మేరకు మంగళగిరి మెయిన్ బజారులోని ఆర్యవైశ్య కల్యాణ మండపం నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం వరకు పెద్ద ఎత్తున మహిళలు తరలివెళ్లారు. తొలుత మెయిన్ బజారులోని ఆరవైశ్య కల్యాణ మండపం నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు మహిళా సంఘం ప్రతినిధులు చీర, పూలు, పండ్లు, స్వీట్లతో ఊరేగింపుగా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ధ్వజ స్తంభం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య మహిళ సంఘం ప్రధాన కార్యదర్శి త్రిపురమల్లు అపర్ణ పార్వతి, కోశాధికారి వెంకట కీర్తి, కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య సంఘాల సమైఖ్య అధ్యక్షుడు సంకా బాలాజీ గుప్త హాజరయ్యారు. మంగళగిరి టౌన్: ఆపరేషన్ క్లీన్ స్వీప్ పారిశుద్ధ్య కార్యక్రమంలో మూడు లక్షల జనాభాకు పైబడిన పట్టణ స్థానిక సంస్థల విభాగంలో మంగళగిరి – తాడేపల్లి నగరపాలక సంస్థ రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించింది. ఈ మేరకు గుడివాడలో జరిగిన రాష్ట్రస్థాయి వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎంటీఎంసీ కమిషనర్ అలీంబాషా అవార్డును, ప్రశంసా పత్రాన్ని శనివారం అందుకున్నారు. స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో ఎంటీఎంసీ కనబర్చిన విశిష్ట పని తీరుకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించినట్లు అధికారులు తెలిపారు. నగర పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య కార్యక్రమాల అమలులో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ విజయం సాధించినట్లు పేర్కొన్నారు. -
స్వర్ణాంధ్రకు పునాది
బాపట్లఆదివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2026స్వచ్ఛ గ్రామాలే జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 29.480 టీఎంసీలు. సాగునీటి అవసరాల నిమిత్తం ప్రాజెక్టు నుంచి దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.నిజాంపట్నం (రేపల్లె): స్వచ్ఛ గ్రామాలే స్వర్ణాంధ్రకు పునాది అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ చెప్పారు. స్వచ్ఛ ఆంద్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని అడవులదీవి గ్రామ జడ్పీహైస్కూల్ ఆవరణంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛమైన గ్రామాల నిర్మాణమే స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు తొలి అడుగని పేర్కొన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని అన్నారు. అనంతరం జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన సభలో కలెక్టర్ పాల్గొని స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం లక్ష్యాలు, ప్రభుత్వ ఆశయాలు, ప్రజల భాగస్వామ్యం అవసరాన్ని వివరించారు. గ్రామాల్లో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పారిశుధ్య నిబంధనలు పాటించడం, మొక్కలు నాటడం వంటి చర్యలను ప్రతి కుటుంబం అలవాటు చేసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీలు, మహిళా సంఘాలు, యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తే స్వచ్ఛ గ్రామాల లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చని చెప్పారు. తొలుత గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి, ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రేపల్లె ఆర్డీవో బూసి శ్రీదేవి, డీపీఓ ఎల్.ప్రభాకరరావు, సీపీఓ ఏఎస్ రాజు, డ్వామా పీడీ విజయలక్ష్మి, డిఆర్డీఏ పీడీబీ సింగయ్య, ఐసీడీఎస్ పీడీ రాధమాదవి, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, ఎంపీడీవో నర్రా నాగలక్ష్మి, నాయకులు అనగాని శివప్రసాద్, హెచ్ఎం ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటుతోనే జిల్లా అభివృద్ధి బాపట్ల : పరిశ్రమల ఏర్పాటుతోనే బాపట్ల జిల్లా అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. పరిశ్రమల ఏర్పాటుకు అధికారులంతా సహకరించాలని కలెక్టర్ చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా సహకరించాలన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం ఆన్ లైన్ లో నమోదైన 27 దరఖాస్తులను ఏకపక్ష పద్ధతిలో ఆమోదించేందుకు వేగంగా దరఖాస్తులను పరిశీలించాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ వై. రామకృష్ణ, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నరసింహారావు, బాపట్ల ఆర్డీవో హరికుమార్, కమిటీలోని ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. మాతృ, శిశు మరణాలు పూర్తిగా నివారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. పీఎం సురక్షిత్ మంత్రిత్వ అభియాన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. మాతృ, శిశు మరణాల నిర్మూలన లక్ష్యంతో అధికారులు పనిచేయాలని కలెక్టర్ అన్నారు. కాన్పుల సమయాలలో మరణాలు అరికట్టగలిగితే నవజాత శిశువు అభివృద్ధికి తోడ్పాటునందించగలమన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్. విజయమ్మ, డీసీహెచ్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పద్మావతి, కమిటీలోని అనుబంధ శాఖల జిల్లా అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. -
మద్దిరాల పీఎంశ్రీ జేఎన్వీ విద్యార్థుల ప్రతిభ
యడ్లపాడు: మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయంలో రెండురోజుల వైజ్ఞానిక ప్రదర్శన శనివారం ముగిసింది. జేఎన్ఎస్ హైదరాబాద్ రీజియన్ పరిధిలోని 9 జవహర్ నవోదయ విద్యాలయాలకు చెందిన విద్యార్థులు 60 రకాల ప్రాజెక్టులతో హాజరై ప్రదర్శనలో పాల్గొన్నారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో విద్యాలయ ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహారావు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో బాల శాస్త్రవేత్తలు రూపొందించిన అంశాలు అందర్నీ ఆకట్టుకుని ఆలోచింపజేశాయి. ముఖ్య అతిథులు చేతుల మీదుగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తీవ్ర పోటీ నడుమ సాగిన ఈ ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యాలయాల వివరాలు ఇలా ఉన్నాయి. -
డాక్యుమెంట్ రైటర్ల ఆందోళన
బాపట్లటౌన్: ఏళ్ళ తరబడి ఇదే వృత్తిని నమ్ముకొని బతుకుతున్నాం...ఎంతో మంది కక్షిదారులకు ఎన్నో రకాల సేవలు అందిస్తున్న మాపై కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అమానుషమని డాక్యుమెంట్ రైటర్ల సంఘం బాపట్ల అధ్యక్షులు కె. నారాయణరావు తెలిపారు. కూటమి సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 396 కు నిరసనగా శనివారం బాపట్లలో డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేశారు. తొలుత బాపట్ల సబ్ రిజిస్ట్రార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యక్షులు కె. నారాయణరావు మాట్లాడుతూ మేం ఏ ఒక్క కక్షిదారుడిని ఇబ్బందులకు గురిచేయటం లేదు. కక్షిదారుడికి సకాలంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేస్తున్నాం. అలాంటి మాపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ జారీ చేసిన జీవో 396ను రద్దు చేసేవరకు పోరాటం సాగిస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డాక్యుమెంట్ రైటర్ల సంక్షేమసంఘం సెక్రటరి టి. కొండలరావు, జాయింట్ సెక్రటరి టి. సంతోష్గోకుల్ గుప్తా, ట్రెజరర్ వి. సాయి శ్రీనివాస్, సభ్యులు పాల్గొన్నారు. జీవో నెంబర్ 396ను రద్దు చేయాలి -
ఘనంగా జగన్నాథ రథయాత్ర మహోత్సవం
బాపట్ల: పట్టణంలో శ్రీ జగన్నాథ స్వామి వారి దివ్య రథయాత్ర మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఇస్కాన్ కొత్తపేట, చీరాల శాఖలు, బాపట్లకు చెందిన కన్నెగంటి మంజుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు భక్తులు పోటెత్తారు. పురవీధులన్నీ భక్తజన సంద్రంగా మారాయి. భక్తుల జయజయ ధ్వానాలు, హరినామ స్మరణతో పట్టణం మారుమోగింది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు శృంగారపురంలోని తాలింఖానాలో స్వామికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుండిచా మందిరం నుంచి ఈ దివ్య రథయాత్ర ప్రారంభమైంది. పాత బస్టాండ్ మీదుగా జీబీసీ రోడ్డులోకి ప్రవేశించింది. గడియారస్తంభం చేరుకుని, సూర్యలంక రోడ్డులోని శ్రీ ఆంజనేయ స్వామి గుడి, జీబీసీ రోడ్డులో పోలేరమ్మ గుడి మీదుగా మళ్లీ తిరిగి వచ్చింది. యాత్ర పొడవునా ఇస్కాన్ ప్రతినిధులు, భక్తులు భజనలు, కీర్తనలు, నృత్యాలతో అలరించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గురువుల ఆధ్యాత్మిక ప్రసంగం, భోగ సమర్పణ, కనులపండువగా మహా హారతి వంటి విశేష కార్యక్రమాలను నిర్వహించారు. -
గుర్రపు డెక్క తొలగింపు వేగవంతం చేయాలి
భట్టిప్రోలు(వేమూరు): డ్రైనేజీ శాఖ అధికారులు గుర్రపు డెక్క తొలగించే కార్యక్రమం వేగవంతం చేయాలని వైఎస్సార్ సీపీ వేమూరు సమన్వయకర్త వరికూటి అశోక్బాబు పేర్కొన్నారు. భట్టిప్రోలు కనగాల కెనాల్లో గుర్రపు డెక్క ఏళ్ల తరబడి పేరుకు పోయి పంట పొలాలు దెబ్బతినడం జరుగుతుంది. గుర్రపు డెక్క తొలగించేందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం శనివారం ఆయన అదేపల్లి కనగాల కెనాల్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువల్లో మళ్లీ భారీగా గుర్రపు డెక్క పెరిగి పోవడంతో సాగునీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడిందన్నారు. రైతులకు ఇప్పటికి అందాల్సిన సాగునీరు ఆలస్యమైందన్నారు. గుర్రపు డెక్క తొలగింపుపై వారం రోజులుగా డ్రైయినేజీ శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తే మళ్లీ దీక్ష చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. గతేడాది గుర్రపు డెక్క తొలగింపుపై అదేపల్లి కనగాల డ్రైనేజీపై జల దీక్ష చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది కూడా గుర్రపు డెక్క తొలగించక పోతే దీక్ష చేపట్టడం జరుగుతుందన్నారు. దీంతో అధికారులు స్పందించి శని వారం గుర్రపు డెక్క తొలగించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పడమటి శ్రీనివాసరావు, టౌన్ ప్రెసిడెంట్ కుందేటి రమేష్, పెద్ద బుజ్జి, బొల్లెదు ప్రతాప్, వేల్పూరి చిన్నారి, వెంకట్రామయ్య, మోర్ల కోటయ్య, సయ్యద్ నభీ, రత్నబాబు, అంకబాబు తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్ సీపీ వేమూరు సమన్వయకర్త వరికూటి అశోక్బాబు -
సీనియర్ మెడికల్ ఆఫీసర్గా డాక్టర్ నాగార్జున
గుంటూరు మెడికల్: ఐదు జిల్లాల పరిధి వరకు విస్తరించి ఉన్న గుంటూరు సీ.జీ.హెచ్.ఎస్ (సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం) వెల్ నెస్ కార్యాలయంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్గా సేవలందిస్తున్న డాక్టర్ కొండా నాగార్జున చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీ.ఎం.ఓ) గా పదోన్నతి పొందారు. ఆయనను గుంటూరుకు కేటాయిస్తూ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం అధికారికంగా గుంటూరు నగరంపాలెంలోని సీ.జీ.హెచ్ ఎస్ కార్యాలయం లో సీ.ఎం.ఓ గా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. నాలుగు రోజుల క్రితం నెల్లూరు సీ.జీ.హెచ్.ఎస్ నుంచి బదిలీ పై వచ్చిన దాసరి రమేష్ సీ.ఎం.ఓ గా ప్రస్తుతం గుంటూరులో విధులు నిర్వహిస్తున్నారు. కొండా నాగార్జునకు కూడా పదోన్నతి లభించడంతో సీ.జీ.హెచ్.ఎస్ కేంద్రాలలో ఎక్కడా లేని విధంగా గుంటూరులో ఇద్దరు సీ.ఎం.ఓ లు విధులు నిర్వహించడం విశేషం. పదోన్నతి పొందిన కొండా నాగార్జున ను గుంటూరు సీ.జీ.హెచ్.ఎస్ లోకల్ ఎడ్వైజరీ కమిటీ మెంబర్లు గుమ్మడి సీతారామయ్యచౌదరి, కట్టా వెంకటేశ్వర్లు, పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు, వైద్య సిబ్బంది పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ గుంటూరు సీ.జీ.హెచ్.ఎస్ పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాలలోని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య పరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. -
బాజీ కుటుంబానికి ఆర్థిక సహాయం
మేడికొండూరు : జగనన్న బాటలోనే పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు నాయకుడికి కుటుంబ సభ్యులుగా అండగా ఉంటామని మేడికొండూరు జెడ్పీటీసీ సభ్యులు కందుల సిద్ధయ్య జిల్లా మైనార్టీ ప్రెసిడెంట్ సయ్యద్ హబీబుల్లా, అవుతు శ్రీనివాస్ రెడ్డి, బుర్ర సుబ్బారెడ్డి పాములపాటి జయరావు, రాజేంద్రప్రసాద్ అన్నారు. మేడికొండూరు గ్రామానికి చెందిన జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించాడు. శుక్రవారం వీరంతా బాజీ కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన బాజీ రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరమని మేడికొండూరు మండలంలో పార్టీకి తీరని లోటు అని అన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడికొండూరు మండల ఉపాధ్యక్షులు ఉడతా ప్రభాకర్, చావుపాటి బాజీ షేక్ హుస్సేన్ మీరా, జలంధర్ బాజీ, మన్నవ బ్రహ్మయ్య, జోకర్ గఫార్, షేక్ సుభాని, పాల్గొన్నారు. -
రేపు మొవ్వా విజయలక్ష్మి స్మారక అవార్డు ప్రదానోత్సవం
తెనాలి: పట్టణానికి చెందిన మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవాసమితి ఆధ్వర్యంలో మొవ్వా విజయలక్ష్మి స్మారక 5వ వార్షిక అవార్డు ప్రదానోత్సవం ఈనెల 19వ తేదీన జరగనుంది. స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఆరోజు ఉదయం 9 గంటలకు ఏర్పాటయే ప్రత్యేక సభలో గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి ఈ అవార్డును బహూకరిస్తారు. ఇదే వేదికపై గత మార్చిలో జరిగిన పదోతరగతి పరీక్షల్లో 550 మార్కులకు పైగా సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.5 వేల చొప్పున దాదాపు రూ.3 లక్షల నగదు ప్రోత్సాహకం, జ్ఞాపికను బహూకరిస్తారు. సంబంధిత ఆహ్వానపత్రికను శుక్రవారం కవిరాజు పార్కులోని వీజీకే భవన్లో సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ ఆవిష్కరించారు. వివరాలను తెలియజేశారు. ● అవార్డు ప్రదానోత్సవ సభలో తెనాలి ఆర్డీవో కె.శ్రీరమణి ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఇన్ఛార్జి రెక్టార్, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ డీన్ ఫాకల్టీ ప్రొఫెసర్ ఆర్.శివరామప్రసాద్, తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, మానవత, తెనాలి చైర్మన్, ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ పాల్గొంటారని వివరించారు. ● సేవాసమితి పేరుతో 2018 నుంచి మొవ్వా విజయలక్ష్మి స్మారకార్థం పట్టణంలో పలు ప్రజోపయోగ శాశ్వత నిర్మాణ కార్యక్రమాలను చేపడుతున్నట్టు సత్యనారాయణ గుర్తుచేశారు. ● 2022లో ఆమె పేరుతో అవార్డును ప్రవేశపెట్టి, వివిధ రంగాల్లో ప్రముఖులకు బహూకరిస్తూ, విద్యార్థులకు విజయలక్ష్మి స్మారకోన్యాసం ఇప్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఐపీఎస్ అధికారిణి, సీఐడీ అడిషనల్ ఎస్పీ కేజీవీ సరిత, తెనాలి సబ్కలెక్టర్ గీతాంజలి శర్మ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గురిజాల రాధారాణి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వెంకట జ్యోతిర్మయి ప్రతాపకు బహూకరించినట్టు వివరించారు. ఆహ్వానపత్రిక ఆవిష్కరణలో ప్రసాదం పూర్ణచంద్రరావు, ఎన్.హనుమారెడ్డి, ఎ.రామూర్తి, వి.శరత్, వెనిగళ్ల శివప్రసాద్, రామకృష్ణ పాల్గొన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి బహూకరణ 10వ తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.3 లక్షల నగదు ప్రోత్సాహకాలు -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పర్చూరు(చినగంజాం): జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ హెచ్చరించారు. బాపట్ల సబ్ డివిజన్ పరిధిలోని పర్చూరు పోలీస్ స్టేషన్, మార్టూరు రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ కార్యాలయ పరిసరాలను, వివిధ నేరాలలో సీజ్ చేసిన వాహనాలను ఆయన పరిశీలించారు. ప్రతి శనివారం రాష్ట్రమంతటా ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. క్రైమ్ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. స్టేషన్లోని సీసీ కెమెరాల వ్యవస్థను, సరిహద్దులను సూచించే మ్యాప్ను పరిశీలించారు. హెల్మెట్ధారణపై వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఎస్బీ ఇన్స్పెక్టర్ నారాయణ, మార్టూరు రూరల్ సీఐ నాగభూషణం, పర్చూరు ఎస్ఐ పులి గోపి తదితరులు పాల్గొన్నారు. -
వర్షంతో పంటలకు జీవం
కొల్లూరు: చుక్క నీటి కోసం అర్రులు చాస్తున్న పంటలకు వర్షం జీవం పోసింది. గురువారం రాత్రి మండలంలో భారీగా కురిసిన వర్షానికి వాణిజ్య పంటలు, ఖరీఫ్లో సాగు చేసిన వరి పంటకు మేలు చేకూరింది. కూటమి ప్రభుత్వం కాలువలకు సాగు నీరు విడుదల చేయడంలో వైఫల్యంతో రైతులు పంటలకు నీరందించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. సాగు నీటి కొరతకుతోడు ఎల్నినో ప్రభావంతో విపరీతంగా ఎండలు కాస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు మాడిపోయి ఎదుగుదలపై ప్రభావం పడుతోంది. ఈ తరుణంలో వరుణుడు కరుణించడంతో పంటలు జీవకళను సంతరించుకున్నాయి. తీవ్ర నీటి ఎద్దడి కారణంగా బోర్ల కింద పంటలకు నీరందించినా ప్రయోజనం లేక విలవిలాడుతున్న రైతుల మోములు వర్షంతో కాస్త కళకళలాడుతున్నాయి. -
మూలాంకురేశ్వరికి విశేష పూజలు
ఫిరంగిపురం: మండలంలోని అమీనాబాద్ గ్రామంలోని మూలాంకురేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాస శుక్రవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు అయ్యన్నశాస్త్రి, కార్తీక్శాస్త్రిలు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం విశేషంగా అలంకరించారు. పసుపు, కుంకుమలతో లలిత అష్టోత్తర, సహస్రనామ అర్చనలు చేశారు. ముఖమండపంలో ఉన్న శ్రీచక్రానికి ఖడ్గమాల స్త్రోత్రంతో కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. చందోలు(కర్లపాలెం): బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన బగళాముఖి అమ్మవారి ఆలయంలో వారాహి నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం మూడవ రోజున అమ్మవారు శాకంబరి వారాహిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శాకంబరి దేవి అలంకరణ కోసం సుమారు 800 కిలోల పలు రకాల కూరగాయలు, పండ్లు వినియోగించారు. మూడవ రోజున రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రదక్షిణలు చేశారు. నవరాత్ర మహోత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు వారాహి హోమం విశేష పూజలు నిర్వహించారు. చందోలు గ్రామానికి చెందిన సుమారు 60 మంది ఆర్యవైశ్య మహిళలు సంప్రదాయ బద్ధంగా సారెలు, పూజా ద్రవ్యాలు శిరస్సున ధరించి మంగళ వాయిద్యాలతో శోభాయాత్రగా ఆలయానికి చేరుకుని విశేష పూజల అనంతరం అమ్మవారికి సమర్పించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఒంగోలుకు చెందిన తెల్లపాటి శ్రీనివాసరావు, కనకదుర్గ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 20న జగన్నాథ రథయాత్ర తెనాలి టౌన్: ఇస్కాన్ టెంపుల్ తెనాలి ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన పట్టణంలో శ్రీశ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. స్థానిక నాజరుపేటలోని టెంపుల్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ ఇన్చార్జి సింహ గౌరదాస్ వివరాలను తెలిపారు. 20వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు పట్టణ శివాజీచౌక్లో ఇందుకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 2 గంటల నుండి శ్రీశ్రీ జగన్నాథ రఽథయాత్ర మహోత్సవం ప్రారంభమవుతుందని వెల్లడించారు. శివాజీచౌక్, గాంధీచౌక్, నెహ్రూ రోడ్డు, లక్ష్మీ డీలక్స్ రోడ్డు, మెయిన్ రోడ్డు మీదుగా బోసురోడ్డులోని శ్రీకన్యకాపరమేశ్వరి దేవస్థానం వరకు రథయాత్ర జరుగుతుందని చెప్పారు. దేవాలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనం, 108 పదార్థాలతో భోగ నివేదన, మహా హారతి ఉంటాయని తెలిపారు. అన్నప్రసాద వితరణ ఉంటుందని వివరించారు. ఆలయ కమిటీ సభ్యులు అప్పారావు, శ్రీనివాసరెడ్డి, ప్రసాద్, గోపాలకృష్ణ, కార్తీక్ తదితరులున్నారు. దుర్గమ్మకు ఆషాఢ సారె మంగళగిరి టౌన్: పట్టణంలోని బైపాస్రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలోని శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆంజనేయ కాలనీ భక్తబృందం శుక్రవారం సారె సమర్పించింది. కాలనీలోని ప్రధాన సెంటర్ నుంచి మహిళలు సారెతో ఊరేగింపుగా వచ్చారు. మేళతాళాలు, కనక తప్పెట్ల మధ్య ఊరేగింపు భక్తి శ్రద్ధలతో సాగింది. ఆయా వీధుల్లోని వారు సారెకు భక్తి శ్రద్ధలతో నీరు వారబోశారు. అనంతరం ఊరేగింపు ఆలయం వరకు చేరుకుంది. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో భక్తబృందం ప్రతినిధులు మల్లేశ్వరి, అంజలి, సత్యవతి, లేఖ, సుజాత, వాణి పాల్గొన్నారు. -
తెనాలి పోలీసులపై క్రమ శిక్షణ చర్యలు
● ఇద్దరు కానిస్టేబుళ్ల బదిలీ, డీఎస్పీ సహా అధికారులకు మెమోలు ● ‘సాక్షి’ కథనానికి స్పందన తెనాలిరూరల్:తెనాలి పోలీసు లపై అక్రమ వసూళ్లు, అవినీతి దందాల ఆరోపణలు హెచ్చుమీరుతున్న నేపథ్యంలో పోలీ సు ఉన్నతాధికారులు చర్యల కు శ్రీకారం చుట్టారు. ‘పేరుకే పోలీసు.. చట్టం అంటే అలుసు’ పేరిట ఈ నెల 10వ తేదీన తెనాలిలో పోలీసుల వ్యవహారాన్ని కళ్లకుకట్టినట్టు చెబుతూ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. పేకాట దందాలు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న అరోపణలతో వన్ టౌన్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ ఎం. రమేష్ను కాకుమాను స్టేషన్కు, తెనాలి రూరల్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ డి.రవిని ఫిరంగిపురం బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ శుక్ర వారం ఉత్తర్వులు జారీ చేశారు. తెనాలి డీఎస్పీ బి.జనార్ధనరావు, త్రీ టౌన్ సీఐ ఎస్.సాంబశివరావు, వన్ టౌన్ సీఐ సీహెచ్.రాంబాబు, రూరల్ ఎస్ఐ కె.ఆనంద్లకు చార్జ్ మెమోలు జారీ చేసిన ట్టు తెలిసింది. వేరే మహిళతో సహజీవనం చేస్తూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇల్లు మార్చిన సీఐ ప్రస్తుతం ఎక్కడ అద్దెకు తీసుకున్నారన్న అంశాన్ని విచారిస్తున్నట్టు తెలిసింది. -
అంగన్వాడీ సేవల్లో నాణ్యత పాటించండి
రేపల్లె: అంగన్వాడీ కేంద్రాల్లో అందించే సేవల నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని ఐసీడీఎస్ జిల్లా అధికారి రాధా మాధవి ఆదేశించారు. రేపల్లె ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఆయా కేంద్రాల పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. సేవల అమలు విధానం, లబ్ధిదారులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలను నిర్ణీత సమయాలకు కచ్చితంగా నిర్వహించడంతో పాటు మరుగుదొడ్లు, తాగునీరు, ఫ్యాన్లు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. పిల్లల ఎత్తు, బరువులను క్రమం తప్పకుండా నమోదు చేసి పోషణ్ ట్రాకర్ యాప్లో నిరంతరం అప్డేట్ చేయాలని ఆదేశించారు. ప్రీ స్కూల్ విద్యలో భాగంగా బోధన ఉపకరణాలను వినియోగించి చిన్నారులకు ఆసక్తికరమైన బోధన అందించాలన్నారు. ఏఐ ఆధారిత వ్యవస్థలో నమోదయ్యే రెడ్ ఫ్లాగ్ కేసులను సూపర్వైజర్లు నిరంతరం పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో సీడీపీవో ఎం.సుచిత్ర, సూపర్వైజర్లు సీహెచ్.హిమబిందు, ఎస్.సునీత, టి.రాధిక, జ్యోతిలక్ష్మి, వెంకట రమణ, నాగలక్ష్మి, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ జిల్లా అధికారి రాధా మాధవి -
అత్తింటికి కన్నం వేసిన అల్లుడు అరెస్ట్
తెనాలి రూరల్: భార్య పుట్టింటికి వెళ్లి రాకపోతుండడంతో అత్తపై కోపం పెంచుకుని అత్తింటికి కన్నం వేసిన అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాయబ్రసూల్ వివరాలు వెల్లడించారు. మండలంలోని కొలకలూరు గ్రామానికి చెందిన సుద్దపల్లి సుజాత మనవరాలు మంగళగిరి ఎయిమ్స్లో చికిత్స పొందుతోంది. మనవరాలి వద్దకు కుటుంబమంతా ఈ నెల 8వ తేదీన వెళ్లి, మరుసటి రోజు తిరిగి వచ్చారు. ఇంటికి వేసి ఉన్న తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెల్లి చూడగా ఇంట్లో ఉంచిన రూ. 10 వేల నగదు, సుమారు 70 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. పోలీసులను ఆశ్రయించగా రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చోరీకి పాల్పడింది సుజాత అల్లుడే అని నిర్ధారణకు వచ్చారు. సుజాత కుమార్తె శిరీష తన భర్త, బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడికి చెందిన అయ్యంకి పసితో కుటుంబ కలహాల నేపథ్యంలో కొలకలూరులోని పుట్టింటికి వచ్చింది. ఎన్నిసార్లు అడిగినా భార్య కాపురానికి రావడానికి నిరాకరిస్తోంది. ఇందుకు అత్త సుజాత కారణమని అల్లుడు కక్ష పెంచుకున్నాడు. 8వ తేదీన ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని చోరీకి పాల్పడ్డాడని సీఐ తెలిపారు. నిందితుని నుంచి చోరీ సొత్తు స్వాధీనపర్చుకున్నట్టు వివరించారు. సమావేశంలో ఎస్ఐ ఆనంద్, సిబ్బంది ఉన్నారు. -
వినియోగదారుల హక్కుల పరిరక్షణ ముఖ్యం
కర్లపాలెం: వినియోగదారుల హక్కుల పరిరక్షణ ముఖ్యమని, సంబంధిత చట్టాలపై అందరికీ అవగాహన అవసరం అని గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి సయ్యద్ జియాఉద్దీన్ చెప్పారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. జియాఉద్దీన్ మాట్లాడుతూ న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు పారా లీగల్ వలంటీర్లను సంప్రదించాలని చెప్పారు. జనన, మరణ, వివాహ ధ్రువపత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. న్యాయవాదులు కట్టా కాళిదాసు, సీహెచ్ రామాంజనేయులు, శ్రీనివాసరావు, తహసీల్దార్ రవీంద్రకుమార్, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. -
31న వినతి పాదయాత్ర ప్రారంభం
● ఆగస్టు 1న రాష్ట్ర డీజీపీకి వినతి పత్రం అందజేయటంతో ముగింపు ● వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మంగళగిరి రూరల్: తన ఇంటిపై జరిగిన దాడి కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 31న తేదీన గుంటూరులోని తన నివాసం నుంచి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం వరకు వినతి పాదయాత్ర చేపట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు చెప్పారు. మండలంలోని ఆత్మకూరు పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. అంబటి మాట్లాడుతూ జనవరి 31న తన ఇంటిపై ఏకంగా ఏడు గంటలపాటు జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఒక్కరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై ఏప్రిల్ 16వ తేదీన ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టి జిల్లా ఎస్పీకి వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదన్నారు. అందుకే డీజీపీ కార్యాలయానికి పాదయాత్ర చేసి వినతిపత్రం అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాజా గ్రామంలో 31వ తేదీ రాత్రి బస చేసి, ఆగష్టు ఒకటో తేదీన డీజీపీ కార్యాలయానికి చేరుకుంటామని అనంతరం డీజీపీకి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు వ్యవస్థ దాడి ఘటనపై స్పందించకపోవడం ఆందోళనకరమని, ప్రజలకు న్యాయం జరిగేలా ఒత్తిడి తీసుకురావడమే పాదయాత్ర లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల మద్దతు కోరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు(డైమండ్ బాబు), వైఎస్సార్ సీపీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్, మంగళగిరి రూరల్ అధ్యక్షుడు నాలి వెంకటకృష్ణ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బురమ్రుక్కల వేణుగోపాల్రెడ్డి, తాడేపల్లి రూరల్ మండల అధ్యక్షుడు అమర నాగయ్య, దుగ్గిరాల రూరల్ మండల అధ్యక్షుడు శివగోపయ్య, పార్టీ పంచాయతీరాజ్ కార్యదర్శి ఫిరోజ్, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డేవిడ్రాజు, జిల్లా ఆక్టివిటీస్ కార్యదర్శి మల్లావరపు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
నీట్ ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం
గుంటూరు ఎడ్యుకేషన్: నీట్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని సంస్థ ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్ తెలిపారు. శుక్రవారం గుంటూరు లక్ష్మీపురంలోని సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గుంటూరు జోన్ నుంచి అఖిల భారతస్థాయిలో అన్ని కేటగిరీల వారీగా తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు కై వసం చేసుకున్నట్లు తెలిపారు. సీహెచ్ మోహన నాగశ్రీ సాయి అఖిల్ 115వ ర్యాంకు, కె.సిద్ధార్థ 164వ ర్యాంకు, షేక్ నిహాల్ పర్వేజ్ 935వ ర్యాంకు, ఏ. నికేత్ రామ్ చౌదరి 1514వ ర్యాంకు, బి. శశిధర్ 1620వ ర్యాంకుతో పాటు ఐదువేల లోపు 46 మంది, 10వేల లోపు 89 ర్యాంకులతో పాటు 179 మంది విద్యార్థినీ, విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించనున్నారని వివరించారు. విద్యార్థులకు సంస్థ అకడమిక్ డైరెక్టర్ బొప్పన సుష్మ, ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్, ఏజీఎం ఎల్టీసీ శ్రీనివాస్, ఆయా క్యాంపస్ల ప్రిన్సిపాల్స్ అభినందనలు తెలియజేశారు. -
చివరికి సాగు నీరేది?
కురవని వర్షాలు నామమాత్రంగా సాగు ప్రత్యామ్నాయ పంటలు మేలు జిల్లాలో వరి సాగుకు దాదాపు 80 టీఎంసీలు అవసరం కాగా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కేవలం 46 టీఎంసీలే కేటాయించింది. దీంతో ఖరీఫ్లో వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నీటితో సాధారణ విస్తీర్ణంలో సగం కూడా సాగయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వానలు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కనీసం వారిని అప్రమత్తం చేయడం, ప్రత్యామ్నాయ పంట ప్రణాళిక రూపకల్పనలో చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
దివ్యాంగులకు అండగా భవిత కేంద్రాలు
రేపల్లె: పట్టణానికి నిజమైన హీరే తమరేనని ఐఈఆర్పీ అనూరాధను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అభినందించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు విద్యాబుద్ధుల్ని నేర్పే భవిత సెంటర్ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అంకితభావంతో పనిచేస్తున్న ఐఈఆర్పీలు సమాజానికి నిజమైన హీరోలని అభినందించారు. వారి సేవలు అమూల్యమైనవని, ఇలాంటి ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శప్రాయులని పేర్కొన్నారు. అనంతరం ఐఈఆర్పీ అనూరాధను సత్కరించారు. డీఎంహెచ్వో డాక్టర్ విజయమ్మ, ఆర్డీఓ బూసి శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ కాకర్ల సాంబశివరావు, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, ఎంపీడీఓ రవిబాబు, ఐఈఆర్పీ సుకన్య తదితరులు పాల్గొన్నారు. అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాలి బాపట్ల: పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను శుక్రవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి పరిష్కరించాలని చెప్పారు. ఆన్లైన్లో నమోదైన అర్జీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి సూచనలు చేశారు. అర్జీదారులతో స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. నిజాంపట్నం మండలం పలపట్ల గ్రామానికి చెందిన బేతపూడి సీతారావమ్మ భూమి సమస్య గురించి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తక్షణమే భూ రికార్డుల శాఖ సహాయ సంచాలకుడితో ఆయన నేరుగా మాట్లాడారు. ఆమెకు హక్కు కల్పించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్కుమార్ -
డిగ్రీ ప్రవేశాలపై కొరవడిన స్పష్టత
చీరాల: అధికారులు, ప్రభుత్వం అలసత్వం కారణంగా విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. డిగ్రీ కోర్సులలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్పై చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడి రెండు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు నోటిఫికేషన్కు సంబంధించి ఎటువంటి సమాచారం రాకపోవడంతో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఎదురుచూస్తున్న విద్యార్థులకు నిరాశే మిగులుతోంది. రెండేళ్లుగా ఇదే గందరగోళాన్ని సృష్టిస్తోందనే విమర్శలు సర్కారుపై వినిపిస్తున్నాయి. అంతా అయోమయం.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలో మొత్తం 88 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో డిగ్రీ మొదటి సంవత్సరం బీఎస్సీ, బీకాం, బీఏ కోర్సులో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. నోటిఫికేషన్ వెలువడకుండా అడ్మిషన్లు తీసుకునే పరిస్థితి లేదు. చీరాలలో వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీకి మంచి పేరుంది. ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ నెలలో రాగా సప్లమెంటరీ ఫలితాలు కూడా జూన్ 18న విడుదలయ్యాయి. డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి ఇప్పటి వరకూ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. నోటిఫికేషన్ ఎప్పుడిస్తారు? ఈ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారు? తరగతులు ఎప్పుడు మొదలవుతాయోనని విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అభ్యర్థులు అడ్మిషన్లను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని సీట్ల సంఖ్య ఆధారంగా అడ్మిషన్లు ఫేజ్ల వారీగా భర్తీ చేస్తారు. విద్యార్థులు కాలేజీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. విద్యార్థుల పేర్లు, ఫోన్ నంబర్లు తీసుకుని సిబ్బంది వెనక్కి పంపించి వేస్తున్నారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు కౌన్సెలింగ్ ప్రక్రియకు షెడ్యూలు కూడా ప్రకటించారు. గతేడాది కూడా ఇదే తీరు.. ఈ ప్రక్రియ గత రెండేళ్లుగా ఆలస్యంగా సాగుతోంది. డిగ్రీ తరగతులు 2024–25 విద్యా సంవత్సరంలో ఆగస్టు నెలాఖరుకు ప్రారంభం కాగా, గత విద్యాసంవత్సరం కూడా ఇదే విధంగా జరిగింది. ఇప్పుడు కూడా జూలై నెల పూర్తి కావస్తున్నా నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఎంసెట్ చివరి కౌన్సెలింగ్ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తారేమోనని ప్రచారం నడుస్తోంది. కాలేజీల్లో చేరేందుకు విద్యార్థినులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. నోటిఫికేషన్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. -
గురుకుల పాఠశాలలో పాలకుల దాష్టీకం
తాడికొండ: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులు, తల్లిదండ్రులపై చంద్రబాబు ప్రభుత్వం దాష్టీకానికి దిగింది. పోలీసులను ఉసిగొల్పి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులను బెంబేలెత్తించింది. తమకు చదువు కావాలని బతిమాలుతూ ‘అయ్యా మా పిల్లలను రోడ్డున పడేయకండి.. చదువుకుంటారు. పాఠశాల ఉంచండి..’ అని అడిగినందుకు దళిత తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు చితకబాదారు. అనంతరం అరెస్టు చేసి స్టేషన్లో బంధించారు. ఇప్పటికే ఈ విషయంపై మూడు సార్లు రోడ్డెక్కి నిరసనలు తెలియజేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఇక కన్నీరే మిగిలింది. పేద విద్యార్థులకు అన్యాయం ఐఐటీ– జేఈఈ, నీట్ ఎక్స్లెన్స్ సెంటర్ల ఏర్పాటు పేరుతో ఇటీవల ప్రభుత్వం మంత్రివర్గ తీర్మానం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న మూడు గురుకుల పాఠశాలలను ఖాళీ చేయించి వాటిలో ఎక్స్లెన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రచారం చేసింది. వీటిని ప్రభుత్వమే నిర్వహిస్తుందా.. అంటే అదీ కాదు. పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. అనుకున్నదే తడవుగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు తాడికొండతోపాటు తిరుపతి జిల్లా కోట, విశాఖ జిల్లా మేఘాద్రి గడ్డలోని గురుకుల పాఠశాలలకు చెందిన 1,500 మంది విద్యార్థులను బలవంతంగా బయటకు పంపేందుకు రంగం సిద్ధం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమావేశం ఏర్పాటు చేసి పేరుకు కూడా తెలియజేయలేదు. ఫోన్లు మాత్రమే చేసి ఇక్కడ గురుకుల పాఠశాల సెంటర్ను తీసివేస్తున్నారని, ఐఐటీ సెంటర్ వస్తున్నందున పిల్లలను తీసుకెళ్లాలని హుకుం జారీ చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేద విద్యార్థులు విషయం ఏమిటా అని సోమవారం పాఠశాలకు చేరుకొన్నారు. విషయం తెలిసిన తర్వాత ఆవేదనతో నిరసన వ్యక్తం చేశారు. దీంతోపాటు ఆర్డీఓ, జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. తర్వాత విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసి సమాచారం తెలియజేయాలని చెప్పినా నిబంధనలు ఉల్లంఘించి పిల్లలను తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక రోడ్డెక్కారు. అండగా నిలిచిన వైఎస్సార్సీపీ బాధితులకు వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు అండగా నిలిచారు. గురువారం బాధితులతో కలసి పాఠశాలకు చేరుకొని పాఠశాలను తరలిస్తే సహించేది లేదని, ఐదు ఎకరాల విలువైన స్థలం ఉందని గుర్తుచేశారు. కావాలంటే భవనాలు నిర్మించుకోవాలని, కానీ పేదల ఉసురుపోసుకుంటే ఒప్పుకోబోమని హెచ్చరించారు. గురుకులాలను పూర్తిగా తొలగించి విద్యార్థులను రోడ్డుపాలు చేయడం తగదని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి మెజార్టీ సభ్యుల అభిప్రాయం తీసుకున్న అనంతరం ప్రక్రియ కొనసాగించాలని హెచ్చరించారు. దీంతో ఆ రోజుకు వాయిదా వేసి శుక్రవారం పేరెంట్స్ మీటింగ్ పేరుతో పిలిచారు. తర్వాత పిల్లలను తీసుకెళ్లాలని హుకుం జారీ చేశారు. అధికారుల తీరుపై నిరసనగా వారందరూ రోడ్డెక్కితే పోలీసులను రంగంలోకి దించారు. తల్లిదండ్రులను అమానుషంగా కొట్టి బెదిరించారు. విద్యార్థులను బయటకు పంపించేశారు. నారాయణ విద్యా సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ఈ ప్రక్రియ అంతా కొనసాగిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని వసతులు ఉన్న 3 గురుకులాలను ఎంచుకొని దందాకు పక్కాగా స్కెచ్ గీసినట్లు చెబుతున్నారు. తాడికొండలోని గురుకుల పాఠశాల 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రాజధానికి కూతవేటు దూరంలో ఉండటంతో ఎకరం రూ.10 కోట్లకు పైగా పలుకుతుంది. దీంతో అన్ని వసతులు ఉన్న ఈ పాఠశాలలను పీపీపీ పద్ధతిలో ‘నారాయణ’కు కట్టబెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ సెంటర్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో ఒక్కో సెంటర్కు రూ. 3.90 కోట్ల చొప్పున రూ. 11.7 కోట్లకు ప్రభుత్వం టెండర్లను ఇప్పటికే పిలిచింది. ఇందులో భాగంగా ఇంజినీరింగ్ అధికారులు పనులు చేపట్టేందుకు సెంటర్కు వచ్చి పరిశీలించి వెళ్లారు. ఈ ఏడాది విద్యాభ్యాసం ప్రారంభించేందుకుగాను ఇప్పటికే కంటెయినర్ లోడు ఐఐటీ– జేఈఈ మెటీరియల్ను గుంటూరులోని అడవి తక్కెళ్ళపాడు గురుకులానికి నారాయణ సంస్థల నుంచి చేర్చినట్లు సమాచారం. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా ప్రభుత్వం ఐఐటీ– జేఈఈ పేరుతో 1,500 మంది పేద విద్యార్థుల చదువులను దెబ్బతీయడం పట్ల పలువురు మండిపడుతున్నారు. పోలీసుల జులంతో దిక్కుతోచని స్థితిలో చిన్నారులను వెంటబెట్టుకొని చంకన పుస్తకాలు బ్యాగు, ట్రంకు పెట్టెలతో తల్లిదండ్రులు తరలిపోయారు. -
ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులుగా మారుటూరి
రేపల్లె: రేపల్లె సబ్ జైలులో సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన మన్నెం వెంకటేశ్వరరావు(59) మృతి చెందారు. సబ్జైల్ క్వార్టర్స్లో నివాసం ఉంటున్న వెంకటేశ్వరరావు శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఉదయం వరకు నిద్రలేవక పోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇటీవల రిమాండ్ ఖైదీ బీముడు అజిత్ కుమార్ పరారీ ఘటన నేపథ్యంలో వెంకటేశ్వరరావును అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సహోద్యోగులు, సిబ్బంది ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. మృతుడు వెంకటేశ్వరరావుకు భార్య పార్వతి, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. చీరాల: ఇంటి నుంచి చెప్పకుండా వచ్చిన భార్యను వెతుక్కుంటూ చీరాల వచ్చిన భర్తకు సహకరించి భార్యాభర్తలను కలిపారు. ఈ ఘటన శుక్రవారం చీరాలలో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు శక్తి టీం చీరాల రైల్వేస్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. విజయవాడకు చెందిన మేరి, ఏసోబు ఇద్దరు భార్యాభర్తలు. ఇద్దరూ గొడవపడగా భార్య మేరి ఇంటిలో చెప్పకుండా రెండు రోజులు క్రితం రైలు ఎక్కి చీరాలకు వచ్చింది. భార్యను వెతుక్కుంటూ శుక్రవారం చీరాలకు రాగా రైల్వేస్టేషన్లో విధులు నిర్వహిస్తున్న శక్తి టీం సభ్యులకు విషయాన్ని వివరించారు. ఒన్టౌన్ సీఐ సోమశేఖర్కు విషయాన్ని తెలుపగా శక్తి టీం సభ్యులు, మహిళా ఏఎస్ఐ శివకుమారి, కానిస్టేబుల్ సుబ్బారావు, సునీత అందరూ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద గల పాడుపడిన రైల్వే క్వార్టర్స్ వద్ద చెట్టు కింద నిద్రిస్తున్న ఆమెను గుర్తించి భర్తకు అప్పగించారు. అనంతరం ఇద్దరితో మాట్లాడి విజయవాడ వెళ్లే రైలు ఎక్కించారు. -
గంజాయి విక్రయ ముఠా అరెస్ట్
కర్లపాలెం: గంజాయి అమ్మినా, తాగినా, నిల్వ చేసినా చట్టప్రకారం నేరమని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి చెప్పారు. గురువారం కర్లపాలెం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ చంద్రమౌళి రూరల్ సీఐ హరికృష్ణ, కర్లపాలెం ఎస్ఐ రవీంద్రతో కలసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. కర్లపాలెం పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీలో గల ఎంపీఎఫ్సీ గోదాములో కొంతమంది వ్యక్తులు గంజాయి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేస్తున్నట్లు సమాచారం అందటంతో కర్లపాలెం ఎస్ఐ తమ సిబ్బందితో పాటు సీసీఎస్ సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది, ఇద్దరు మధ్యవర్తులను వెంటబెట్టుకుని సంఘటనా స్థలానికి వెళ్ళి నలుగురు వ్యక్తులను చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 500గ్రాముల గంజాయి, రూ.వెయ్యి నగదు, ఓ ఎస్యూవీ వాహనం, మూడు సెల్ఫోన్లు, 8 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో కర్లపాలెం గ్రామానికి చెందిన ప్రస్తుతం చెరుకుపల్లిలో నివాసం ఉంటున్న మున్నంగి మణికంఠ, చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి గ్రామానికి చెందిన పొన్నపల్లి రోషన్, అలియాస్ శాస్త్రి, చెరుకుపల్లి మండలం నడుంపల్లి గ్రామానికి చెందిన ఖాజా కేశవ్ శ్రీరామ్, నగరం మండలం తోటపల్లి గ్రామానికి చెందిన గోనతోటి సుధాకర్, అలియాస్ సోనూ ఉన్నారని డీఎస్పీ తెలిపారు. మున్నంగి మణికంఠపై గతంలో కర్లపాలెం, నర్సీపట్నం, కేడిపేట పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని తెలిపారు. మరో నిందితుడు స్టువార్టుపురం వృక్షనగర్కు చెందిన మెండ్రగుట్టి ప్రతాప్ పరారీలో ఉన్నాడని తెలిపారు. నిందితులను కోర్టుకు హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారని తెలిపారు. గంజాయి విక్రేతలను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ రవీంద్రను, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 500 గ్రాముల గంజాయి, వాహనం సీజ్ -
భక్తిశ్రద్ధలతో కార్మెల్మాత ఉత్సవాలు
ఫిరంగిపురం: మండల కేంద్రంలో నిర్వహిస్తున్న కార్మెల్మాత ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. కొండపై పలు ప్రాంతాల నుంచి వచ్చిన క్రైస్తవ విశ్వాసులు భక్తిశ్రద్ధలతో కార్మెల్మాతను దర్శించుకున్నారు. కొవ్వొత్తులు వెలిగించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా బాల ఏసుదేవాలయంలో విచారణ గురువులు ఫాతిమామర్రెడ్డి ప్రధాన యాజకులుగా ఉండి దివ్యపూజా నిర్వహించారు. భక్తులకు దేవుని సందేశం వినిపించారు. కొండపై 9గంటలకు ఏర్పాటు చేసిన దివ్యపూజాబలి కార్యక్రమంలో విజయవాడ పీఠాధిపతి టి.రాజారావు పాల్గొని వాక్యోపదేశం చేశారు. కోరిన వరాల నిచ్చే మాతగా కార్మెల్ మాతను భక్తులు విశ్వసిస్తారన్నారు. మాతపై విశ్వాసంతో ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక ప్రశాంతత, అమ్మ అనుగ్రహం లభిస్తాయని చెప్పారు. అనంతరం 10.30 గంటలకు కార్మెల్మాత సమిష్టి దివ్యపూజా బలి కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన యాజకులుగా గుంటూరు మేత్రాసన నూతన అభిషిక్త గురువులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు తాగునీరు, అన్నదానం, వైద్యసదుపాయాలు కల్పించారు. పోలీసు సిబ్బంది, వలంటీర్లు భక్తులకు రద్దీలేకుండా చేస్తూ వారిరాకపోకలు పర్యవేక్షించారు. ఉత్సవాలు ప్రశాత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. -
రాగి తీగల దొంగలు అరెస్ట్
● 16 ట్రాన్స్ఫార్మర్లలో రూ. 1.50 లక్షల విలువైన 105 కిలోల వైరు చోరీ ● పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు నరసరావుపేట టౌన్: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులోని రాగి తీగలను అపహరిస్తున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు పల్నాడు జిల్లా అడ్మిన్ ఎస్పీ జె.వి.సంతోష్ తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నకరికల్లు మండలం కండ్లగుంట, నరసింగపాడు గ్రామాల పరిధిలో ఇటీవల వరుసగా ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులో విలువైన రాగితీగలను చోరీలకు పాల్పడుతున్న కేసులను డీఎస్పీ ఎం. హనుమంతరావు ఆధ్వర్యంలో నకరికల్లు పోలీసులు ఛేదించారన్నారు. కండ్లగుంట గ్రామానికి చెందిన చండ్రా వెంకటేశ్వర్లు తన పొలంలోని ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసి రాగి వైర్లను దొంగలించినట్లు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారన్నారు. బుధవారం చేజర్ల గ్రామ సమీపంలో ఎన్ఎస్పీ కుడి కాల్వ దగ్గర నకరికల్లు మండలం చేజర్ల గ్రామానికి చెందిన తడపాల సాయిబాబు, ఉరాలశెట్టి మల్లయ్య, చలంచర్ల హనుమంతరావులు అనుమానస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని, విచారించగా.. రాగివైర్లు దొంగతనానికి పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించారన్నారు. నకరికల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో 16 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులో విలువైన కాపర్ వైర్లను అపహరించినట్లు తేలిందన్నారు. కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మాచర్ల టౌన్కు చెందిన రాజు కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.1.50 లక్షల విలువైన 105 కేజీల రాగి వైరును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ హనుమంతరావు, సత్తెనపల్లి రూరల్ సీఐ పి.కిరణ్, నకరికల్లు ఎస్ఐ సతీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
హరే రామ.. హరే కృష్ణా..!
గుంటూరులో వైభవంగా జగన్నాథ రథయాత్ర నగరంపాలెం (గుంటూరు వెస్ట్): గుంటూరు నగర పుర వీధుల్లో జగన్నాథ రథయాత్ర వైభవంగా కొనసాగింది. హరేకృష్ణ నామ సంకీర్తనతో వీధులన్నీ మార్మోగాయి. స్వామినామంతో భక్తులు పులకించిపోయారు. గుంటూరు ఏటీ అగ్రహారం పరిధిలోని మల్లారెడ్డినగర్లో ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో గురువారం జగన్నాథుని రథయాత్ర భక్తిశ్రద్ధలతో సాగింది. భక్తులు భారీగా తరలివచ్చి, హరే రామ, హరేకృష్ణ నామ సంకీర్తనల ఆలాపనతోపాటు కోలాటం, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. యాత్ర మిర్చియార్డు, కలెక్టరేట్రోడ్డు, కంకగుంట రైల్వే ఫ్లై ఓవర్, పట్టాభిపురం, కుందుల రోడ్డు, బృందావన్గార్డెన్స్, లక్ష్మీపురం, కొరిటెపాడు మీదగా చంద్రమౌళినగర్ మాజేటి కల్యాణ మండపం వద్దకు చేరుకుంది. అనంతరం స్వామివారికి మంగళహారతి. మహాప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ జగన్నాథ రథయాత్రకు హాజరై నామస్మరణ చేయడం ద్వారా ఆధ్యాత్మిక ప్రశాంతత, దైవానుగ్రహం లభిస్తాయని తెలిపారు. ● అదేవిధంగా గుంటూరు తూర్పు పరిధిలో గురువారం రాత్రి శ్రీజగన్నాథస్వామి రథయాత్రను భక్తిశ్రద్ధలతో చేపట్టారు. కొత్తపేట పశువుల ఆసుపత్రి ఎదురు శ్రీజగన్నాథ స్వామి వారి దేవస్థానంలో శ్రీబాలభద్ర సుభద్ర శ్రీజగన్నాథస్వామి వారి రథయాత్ర వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. గుంటూరు నగరంలో నివసించే ఒడిశా రాష్ట్ర భక్తులు తరలివచ్చి, స్వామి వారిని దర్శించుకున్నారు. -
వినుకొండలో పట్టపగలే చోరీలు
వినుకొండ: వినుకొండ పట్టణంలో గురువారం ఒకే రోజు నాలుగు ఇళ్లలో వరుస దొంగతనాలు జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దొంగలు పట్టపగలే తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని బీరువాలు పగలగొట్టి, భారీగా నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. స్థానిక కొత్తపేట ఐదో లైను, ట్రాన్న్స్ఫార్మర్ బజారుతో పాటు, కాలువ కట్టపై ఉన్న రెడ్డి నగర్ సమీపంలోని మూడు ఇళ్లలో ఈ చోరీలు జరిగాయి. కొత్తపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆవుల సుబ్బారెడ్డి ఇంట్లోకి చొరబడిన దొంగలు, బీరువా తాళాలు పగలగొట్టి సుమారు పది తులాల బంగారం, లక్ష రూపాయల నగదును అపహరించుకుపోయారు.మరో మూడు ఇళ్లలోనూ దొంగలు అదే పద్ధతిలో తాళాలు, బీరువాలు పగలగొట్టి విలువైన వస్తువుల కోసం వెతికారు. ఇళ్లలోని సామాన్లను, బట్టలను గదుల నిండా చెల్లాచెదురుగా పడేశారు. ఆ ఇళ్లలో జరిగిన నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకే రోజు, అది కూడా పట్టపగలే నాలుగు ఇళ్లలో దొంగతనాలు జరగడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే వినుకొండ పోలీసులు ఘటనా స్థలాలకు చేరుకున్నారు. దొంగతనం జరిగిన ఇళ్లను పరిశీలించి, వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దించి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒకే రోజు నాలుగు ఇళ్లలో చోరీ! -
అమ్మోనియా భద్రతపై అవగాహన
కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు, ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఫ్యాక్టరీల శాఖ ఆధ్వర్యంలో గురువారం గుంటూరు జీటీ రోడ్లోని టుబాకో అసోసియేషన్ హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు 81 ఫ్యాక్టరీల యాజమాన్యాలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డెప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివకుమార్రెడ్డి మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజ్లలో వినియోగించే అమ్మోనియా గ్యాస్ అత్యంత ప్రమాదకరమైనదని, అందువల్ల భద్రతా ప్రమాణాలను ఏ మాత్రం విస్మరించరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా కంప్రెసర్ గదుల్లో ఉన్న అమ్మోనియా నిల్వ ట్యాంకులను బయట ఏర్పాటు చేయడం ద్వారా భారీ ప్రమాదాలను సమర్థంగా నివారించవచ్చని తెలిపారు. గ్యాస్ లీకేజీలు, పేలుళ్లు వంటి ప్రమాదాలు సంభవించకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జీరో ప్రమాద మరణాలే లక్ష్యం.. కోల్డ్ స్టోరేజ్ల అసోసియేషన్ అధ్యక్షుడు సురేంద్రబాబు మాట్లాడుతూ శివకుమార్ రెడ్డి చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, శిక్షణల వల్లే పరిశ్రమల యాజమాన్యాల్లో భద్రతపై స్పష్టమైన అవగాహన ఏర్పడిందని చెప్పారు. ఈ చైతన్యమే అమ్మోనియా ట్యాంకుల స్థాన మార్పుతో పాటు భద్రతా ప్రమాణాల అమలుకు దోహదపడిందన్నారు. సదస్సులో కోల్డ్ స్టోరేజ్ అసోసియేషన్ కార్యదర్శి రాఘవయ్య, అసిస్టెంట్ జిల్లా అగ్నిమాపక అధికారి కృష్ణారెడ్డి, కోకాకోలా, సంగం డెయిరీ, సిసిల్ సంస్థల సేఫ్టీ అధికారులు, వివిధ పరిశ్రమల యాజమాన్యాలు, భద్రతా ప్రతినిధులు పాల్గొన్నారు. -
కోవిడ్ కేసులపై భయపడాల్సిన పనిలేదు
మంగళగిరి రూరల్: మంగళగిరిలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్ )లో కోవిడ్ కేసు నమోదయిందంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అయిన విషయంపై ఎయిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ రాకేష్ గురువారం స్పందించారు. కోవిడ్ కేసులపై ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ఎయిమ్స్లో ఎవరూ కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ముందు జాగ్రత్తగా ఔట్ పేషెంట్ విభాగంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, ఇద్దరు డాక్టర్లను ప్రత్యేకంగా నియమించామన్నారు. కోవిడ్ రోగుల కోసం ముందస్తు జాగ్రత్త చర్యగా 10 బెడ్లతో సపరేటు వార్డు ఏర్పాటు చేశామని తెలిపారు. గుంటూరు మెడికల్: విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు గుంటూరు వైద్య కళాశాల మెన్స్ హాస్టల్లో టేబుల్ టెన్నిస్ కోర్టును ప్రారంభిస్తున్నట్లు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి చెప్పారు. గురువారం అమరావతి రోడ్డులోని మెన్స్ మెడికల్ హాస్టల్లో రూ. 2.50 లక్షలతో ఏర్పాటు చేసిన టేబుల్ టెన్నిస్ పరికరాలను ఆయన ప్రారంభించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శివగోపాల్, ఫిజికల్ డైరెక్టర్ అజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రెంటచింతల: పూర్వీకులు నిర్మించిన ఆలయాలు మన చరిత్రకు సజీవ సాక్ష్యాలని పల్నాడు జిల్లా దేవదాయ శాఖ అధికారి జీఏవీ శ్రీనివాసు అన్నారు. గురువారం తుమృకోట గ్రామంలోని పాత శివాలయం పునర్నిర్మాణానికి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మంజూరైన రూ. 15 లక్షల చెక్కును ఆయన ఆలయ కమిటీ వారికి అందజేసి మాట్లాడారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలించిన తుమృకోట గ్రామంలో సుమారు 400 సంవత్సరాల చరిత్ర కిందట నిర్మించిన పాత శివాలయం శిథిలమైనట్లు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యుల కృషి మేరకు రూ. 15 లక్షల నిధులను టీటీడీ శ్రీ వాణి ట్రస్ట్ మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. మండల దేవదాయ శాఖ అధికారి గాదె రామిరెడ్డి, ఆలయ అధ్యక్షుడు జంగాల వెంకటే శ్వర్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: టెట్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఇన్ సర్వీసు ఉపాధ్యాయుల ప్రయోజనార్ధం ఈనెల 19న గుంటూరులోని ఏసీ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి తెలుగు సబ్జెక్టుపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ తెలిపారు. గురువారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో అవగాహన తరగతుల పోస్టర్ విడుదల చేశారు. నెల్లూరుకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు ఆర్.వెంకట్రావు తరగతులు బోధిస్తారని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పాల్గొని జిల్లాల విభజనపై తాజా సమాచారాన్ని తెలియజేస్తారని పేర్కొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, బి.ప్రసాద్, కె.రంగారావు, కె.కేదార్నాథ్, శ్రీధర్ పాల్గొన్నారు. -
గుంటూరు వైద్యురాలి ఘనవిజయం
గుంటూరు మెడికల్: గుంటూరుకు చెందిన సీనియర్ న్యూరాలజిస్ట్, లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పమిడిముక్కల విజయ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 18 మంది వైద్యులను మాత్రమే ఎంపిక చేసే వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎంపికై రికార్డు సృష్టించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్కు ఎంపికై న మొట్టమొదటి వ్యక్తిగా డాక్టర్ విజయ రికార్డు సృష్టించారు. బ్రెయిన్ స్ట్రోక్ బాధితులకు అందిస్తున్న చికిత్సలకు, పక్షవాత బారిన పడకుండా ప్రజలకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలకు, బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సల్లో వైద్యులు, సిబ్బందికి లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు చెందిన అంకినీడు స్ట్రోక్ సెంటర్ ద్వారా అందిస్తున్న అత్యుతన్నత వైద్య ప్రమాణాలకు అంతర్జాతీయ గౌరవం లభించింది. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలిగా ఆమె పనిచేసి రికార్డు సృష్టించారు. 1996 నుంచి సేవలు ఉమ్మడి ఏపీలోనే మొట్టమొదటిగా, దేశంలో రెండవదిగా 1996లో గుంటూరులో అంకినీడు స్ట్రోక్ సెంటర్ను డాక్టర్ విజయ ఏర్పాటు చేశారు. పక్షవాత ( బ్రెయిన్ స్ట్రోక్) చికిత్సలో అత్యున్నత ప్రమాణాలు, నాణ్యమైన వైద్యసేవలు అందించటంలో అంకినీడు స్ట్రోక్ సెంటర్ చూపుతున్న నిరంతర కృషికి గాను ఇటీవల జాతీయ అవార్డు లభించింది. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ఏజెంల్స్ ఇనిస్టిట్యూట్ డైమండ్ స్టేటస్ అంతర్జాతీయ అవార్డు స్ట్రోక్ సెంటర్కు, డాక్టర్ విజయకు 2020 నుంచి 2025 వరకు వరుసగా ఐదుసార్లు లభించింది. తాత మరణం కలచివేసింది.. ఈ సందర్భంగా డాక్టర్ పి.విజయ ‘సాక్షి’తో మాట్లాడుతూ నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో తాత అంకినీడుకు పక్షవాతం వచ్చి సకాలంలో చికిత్స ఎక్కడా లభించక చనిపోయారని, కళ్లెదుటే ఆయన మరణం చూసి తట్టుకోలేక బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు నివారించాలని మనస్సులో గట్టిగా నిర్ణయించుకున్నానని తెలిపారు. తదనుగుణంగా న్యూరాలజిస్ట్గా సేవలు ప్రారంభించానని తెలిపారు. ఉమ్మడి ఏపీలోనే మొట్టమొదటిగా, దేశంలో రెండవదిగా మా తాత అంకినీడు పేరు మీదుగా 1996లో గుంటూరులో పక్షవాత మరణాలు నివారణే లక్ష్యంగా స్ట్రోక్ యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. అంకినీడు స్ట్రోక్ సెంటర్ డైరక్టర్గా ఉన్న తాను ప్రతినెలా 100 నుంచి 125 మంది స్ట్రోక్ బాధితులకు చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వరల్డ్ స్ట్రోక్ అసోసియేషన్కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎంపికవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి స్ట్రోక్ మరణాలు తగ్గింపే లక్ష్యంగా చిత్తశుద్ధితో విధులు నిర్వహించి ఇచ్చిన పదవికి దేశానికి గుర్తింపు వచ్చేలా పనిచేస్తానని తెలిపారు. కుటుంబమంతా వైద్యులే.. డాక్టర్ విజయ భర్త పి. వి.రాఘవశర్మ సీనియర్ కార్డియాలజిస్టుగా, కార్డియాలజీ వైద్యుల సంఘం రాష్ట్ర నాయకుడిగా సేవలందిస్తున్నారు. పెద్దకుమారుడు డాక్టర్ అనురాగ్ కార్డియాజిస్ట్గా, పెద్ద కోడలు డాక్టర్ స్రవంతి క్యాన్సర్ వైద్య నిపుణులుగా చిన్న కుమారుడు డాక్టర్ నరేన్ న్యూరాలజిస్ట్గా, చిన్న కోడలు డాక్టర్ సిరి చందన నెఫ్రాలజిస్ట్గా సేవలందిస్తున్నారు. సీనియర్ న్యూరాలజిస్టుగా, స్ట్రోక్ స్పెషలిస్టుగా 35 సంవత్సరాలుగా డాక్టర్ విజయ సేవలందిస్తూ ఎన్నో అవార్డులు, సన్మానాలు పొందారు. నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ (యూఎస్ఏ), వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎస్ఓ), అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ (ఏఏఎన్), యూరోపియన్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ (ఈఎస్ఓ), ఏపీ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ (ఏపీఎన్ఎస్ఏ), న్యూరలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఏపీ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. -
విజ్ఞాన్కు జాతీయ స్థాయిలో స్వయం ఎన్పీటీఈఎల్ ‘ఏఏ’ గ్రేడ్
చేబ్రోలు: మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి భారతీయ సాంకేతిక విద్యా రంగంలో ప్రతిష్టాత్మక గుర్తింపుగా నిలిచే ఐఐటీ మద్రాస్ స్వయం– ఎన్పీటీఈఎల్ విడుదల చేసిన జాతీయ స్థాయి ర్యాంకింగ్స్లో ‘ఏఏ’ గ్రేడ్ లభించిందని వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ గురువారం తెలిపారు. దేశవ్యాప్తంగా స్వయం–ఎన్పీటీఈఎల్ లోకల్ చాప్టర్ల పనితీరు ఆధారంగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో విజ్ఞాన్ యూనివర్సిటీ 22వ జాతీయ ర్యాంక్ను సాధించి ‘ఏఏ’ గ్రేడ్ను కైవసం చేసుకుందని తెలిపారు. ఎన్పీటీఈఎల్ నిర్వహించిన వివిధ ఆన్లైన్ కోర్సుల్లో విజ్ఞాన్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొత్తం 5,851 కోర్సు సర్టిఫికెట్లను సాధించారని చెప్పారు. 2026 జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎన్పీటీఈఎల్ విద్యార్థులు ప్రదర్శించిన విశిష్ట ప్రతిభ, కోర్సులలో నమోదు, ఉత్తీర్ణత శాతం, టాపర్ విజయాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ‘ఏఏ’ గ్రేడ్ ప్రదానం చేసినట్లు పేర్కొన్నారు. గ్రేడ్ సాధించేందుకు కృషి చేసిన ఎన్పీటీఈఎల్ లోకల్ చాప్టర్ కోఆర్డినేటర్లు, అధ్యాపకులు, విద్యార్థులు, విభాగాధిపతులను చైర్మన్ లావు రత్తయ్య అభినందించారు. -
సినీ రచయిత కోన వెంకట్కు మాతృ వియోగం
బాపట్ల: సినీ రచయిత నిర్మాత కోన వెంకట్కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కోన ధర్మావతి (82) బుధవారం రాత్రి వైజాగ్లో కన్నుమూశారు. ఆమె మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి వదిన. ధర్మావతి మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వైఎస్సార్ సీపీ లీగల్సెల్ రాష్ట్ర కార్యదర్శిగా మణిబాబు నరసరావుపేట: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సత్తెనపల్లికి చెందిన చిన్నం మణిబాబును లీగల్సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మాచర్లకు చెందిన మేరాజ్యోత్ హనుమానాయక్ను పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి మాచర్ల: పట్టణంలోని గుర్తు తెలియని వ్యక్తి గురువారం తెల్లవారు జామున బస్టాండ్ ఎదురు వెంగమాంబ కాంప్లెక్స్ వద్ద మృతి చెందాడు. సుమారు 42 సంవత్సరాలు కలిగిన వ్యక్తి అపస్మారక స్థితిలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పట్టణ పోలీసులు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్టు వారికి తెలుపగా పోలీసుల సహకారంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎవరైనా స్నేహితులు, బంధువులు సంబంధిత వ్యక్తిని గుర్తుపడితే మాచర్ల పట్టణ పోలీసు స్టేషన్ను సంప్రదించాలన్నారు. స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్టు చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రి మార్చురీకి చేర్చారు. ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్టు నూజండ్ల: ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇరువురు దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు ఐనవోలు ఎస్సై బి.వి.కృష్ణారావు గురువారం తెలిపారు. పల్నాడు జిల్లా పరిధిలో ఇటీవల ద్విచక్రాల చోరీ అధికమవుతున్నట్లు పలు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడమైందని అన్నారు. సీఐ బి.బ్రహ్మయ్య ఆదేశాలతో సిబ్బందితో కలిసి ముప్పరాజువారిపాలెం గ్రామంలో అనుమానాస్పదంగా ఉన్న ఇరువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించమాన్నారు. గ్రామానికి చెందిన దుర్గంపూడి సుబ్బారావు, నందిగం వెంకటశివయ్యలుగా గుర్తించామన్నారు. వివిధ సంఘటనల్లో ఆరు ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు వారు అంగీకరించటంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కారెంపూడిలో ఐపీ దాఖలు చేసిన వ్యాపారి కారెంపూడి: ఒక వ్యాపారి రూ. కోటిన్నరకు పైగా ఇన్సాల్వెన్సీ పిటిషన్ (ఐపీ) దాఖలు చేశారని సమాచారం గురువారం రాత్రి సంచలనం రేపింది. సదరు వ్యాపారి 22 మంది వద్ద మొత్తం రూ. 1,52,50,000లు అప్పుగా తీసుకుని వారందరికి ప్రాంసరీ నోట్లు రాసిచ్చారు. వారందరికి కూడా ఐపీ నోటీసులు సిద్ధం చేసినట్లు సమాచారం. అప్పు చెల్లించాలని అడుగుతున్నవారికి అప్పు చెల్లిస్తానని చెబుతూ వచ్చి తీరా ఐపీ దాఖలు చేయడంతో అప్పులిచ్చినవారంతా ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి, పొదుపు పథకాలు నడుపుతున్నాడనే నమ్మకంతో వ్యాపారులు అతనికి కూడా లక్షల్లో అప్పులిచ్చారని తెలుస్తోంది. -
నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక
మంగళగిరి టౌన్: నేషనల్ మాస్టర్స్ (మెడ్ అండ్ ఉమెన్) క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్ చాంపియన్షిప్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు జిల్లాకు చెందిన పవర్ లిఫ్టర్లు ఎంపికయ్యారని జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి విజయభాస్కరరావు, సంధాని గురువారం తెలిపారు. ఈనెల 18 నుంచి 23 వరకు మహారాష్ట్ర ఛత్రపతి సంబోజి నగర్లో నిర్వహించనున్న పోటీలకు క్రీడాకారులు హాజరవుతారని చెప్పా రు. మాస్టర్స్–1లో 84 కిలోల విభాగంలో లక్ష్మీతులసి, మాస్టర్స్– 2లో 69 కిలోల విభాగంలో జ్యోతివర్మ, మాస్టర్స్–2 మెన్లో 93 కిలోల విభాగంలో మస్తాన్వలి టీమ్ తరఫున జిల్లాకు ఎంపికయ్యారని తెలిపారు. పోటీలకు ఎంపికైన పవర్లిఫ్టర్లు ఉత్తమ ప్రదర్శన చేసి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. -
ఆస్తి వివాదంలో యువకుడు హత్య
తెనాలిరూరల్: ఆస్తి వివాదం చినికి చినికి గాలివానగా మారి ఘర్షణకు దారితీసింది. వేధింపులతో విసిగి వేసారారో లేక తట్టుకోలేకపోయారో గానీ ఆ కుటుంబ సభ్యుల పరస్పర ఘర్షణలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో కలకలం రేపిన ఘటనపై పట్టణ వన్టౌన్ సీఐ ిసీహెచ్ రాంబాబు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక నాజరుపేటలో నివాసం ఉండి, ఆటో డ్రైవర్గా జీవనం సాగించే కొల్లిపర కోటేశ్వరరావు(28)కు కొంతకాలంగా తల్లిదండ్రులతో ఆస్తి వివాదం జరుగుతోంది. కొల్లిపరలో ఉన్న నివేశన స్థలాన్ని అమ్మి తనకు కొంత డబ్బు ఇవ్వాల్సిందిగా తల్లిదండ్రులు భాస్కరరావు, విజయమ్మ, తమ్ముడు మరియదాసులపై కోటేశ్వరరావు ఒత్తిడి తెస్తుండడంతో పాటు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి వరకు పరస్పరం వాదనలు, ఘర్షణ జరిగాయి. ఘర్షణలో తల్లిదండ్రులు సోదరుడు మరియదాసు చేతిలో తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మృతదేహాన్ని మూటలో పెట్టి ఆటోలో తరలించే ప్రయత్నం చేస్తుండగా స్థానికులు గమనించి డయల్ 112 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐతో పాటు సిబ్బంది అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేసి.... కోటేశ్వరరావు డబ్బు కోసం తల్లిదండ్రులను తీవ్రంగా వేధింపులకు గురి చేసేవాడని తెలుస్తోంది. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లి తెచ్చిన డబ్బును జల్సాల కోసం ఖర్చు చేసేవాడు. వివిధ రకాల పనులు చేసి తమ్ముడు కూడబెట్టిన సుమారు రూ.5 లక్షల వరకు సొమ్మునూ ఖర్చు చేశాడు. వేమూరు మండలం చదలవాడ గ్రామానికి చెందిన మహిళతో కోటేశ్వరరావుకు వివాహం కాగా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. విభేదాల కారణంగా ఏడేళ్ల క్రితం భార్యతో విడిపోయాడు. కొందరు మహిళలతో లైంగిక సంబంధాలు ఏర్పరచుకుని కుటుంబ సభ్యుల సంపాదనంతా వారికి ఖర్చు చేస్తుండడంతో తండ్రి భాస్కరరావు, తల్లి విజయమ్మ నాజరుపేట ఇంద్ర టవర్స్ ఎదురుగా ఉన్న రేకుల షెడ్డుకు మకాం మార్చారు. వీరితో కలిసి ఉంటున్న కోటేశ్వరరావు ఆటో నడుపుతూ తన జల్సాలను మాత్రం మానుకోలేదు. డబ్బు కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి తీవ్రతరం చేశాడు. భాస్కరరావు బుధవారం కొల్లిపర వెళ్లి తమ బంధువులతో ఇంటి స్థలం విక్రయించాలని, బేరం త్వరగా చూడాలని కోరి, తమ పెద్ద కొడుకు వేధింపులు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. వేధింపులు తాళ లేక హతమార్చి ఉంటారని బంధువులు చెబుతున్నారు. ఆటోలో ఉన్న కోటేశ్వరరావు మృతదేహం కొల్లిపర కోటేశ్వరరావు(ఫైల్) తల్లిదండ్రులు, తమ్ముడే అంతమొందించారని ఆరోపణలు -
రైతు శ్రేయస్సే ధ్యేయంగా యార్డు అభివృద్ధికి కృషి
తెనాలిటౌన్: తెనాలి మార్కెట్ యార్డులో గణనీయంగా నిమ్మకాయల వ్యాపారం జరుగుతుందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ గుంటూరు డైరెక్టర్ పి.రవి సుభాష్ పేర్కొన్నారు. రైతు శ్రేయస్సే ధ్యేయంగా యార్డును మరింత అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. మార్కెట్యార్డుకు చెందిన అన్ని తనిఖీ కేంద్రాల్లో ఈ–పర్మిట్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని వ్యవసాయ మార్కెటింగ్శాఖ, గుంటూరు డైరెక్టర్ పట్టన్శెట్టి రవిసుభాష్ స్పష్టంచేశారు. స్థానిక సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్యార్డును మార్కెటింగ్శాఖ, గుంటూరు డైరెక్టర్ పట్టన్శెట్టి రవిసుభాష్ గురువారం సందర్శించారు. అక్కడి నిమ్మకాయల వ్యాపార కేంద్రానికి వెళ్లి వ్యాపారులతో మాట్లాడి నిమ్మకాయల ఎగుమతి, ధరల వివరాలను తెలుసుకున్నారు. మార్కెట్యార్డు చైర్మన్ తోట దుర్గాప్రసాద్ అభివృద్ధి పనులపై డైరెక్టర్తో చర్చించారు. ప్రాంతీయ సంయుక్త మార్కెటింగ్ సంచాలకులు ఎం.దివాకర్, విజయవాడ, సహాయ మార్కెటింగ్ సంచాలకులు, గుంటూరు పి.సత్యనారాయణచౌదరి, కార్యనిర్వాహక ఇంజినీరు కె.శేషగిరిరావు, ఉపకార్యనిర్వాహక ఇంజినీరు డి.కోటయ్య, మార్కెట్యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి డీసీహెచ్ సుబ్బారావు పాల్గొన్నారు. -
మార్టూరులో భూచోళ్లు
బాపట్లశుక్రవారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2026● యథేచ్ఛగా ప్రభుత్వ భూముల పందేరం ● టీడీపీ నేతలకు అధికారుల అండదండలు ● ఫిర్యాదు చేసినవారిపైనే అధికారుల చిందులు మార్టూరు: మండల కేంద్రం మార్టూరులో ప్రభుత్వ భూములను అధికార పార్టీ నాయకులకు రెవెన్యూ అధికారులే యథేచ్ఛగా కట్టబెడుతున్నారనే ఆరోపణు ఉన్నాయి. రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడంతో ప్రజా సంఘాల నాయకులు కొందరు తరచూ కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నా ఎవరూ ఖాతరు చేయడంలేదు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా రాజుగారి పాలెం వెళ్లే రోడ్డులో గల రెండు ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఇటీవల స్థానిక టీడీపీ నాయకుడి పేరుతో తహసీల్దార్ ఆన్లైన్ చేశారు. బహిరంగ మార్కెట్లో సుమారు రూ.6కోట్ల విలువైన ఆ భూమిలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతున్నారంటూ మార్టూరుకు చెందిన దళిత నాయకుడు రామకూరి విజయ్ కుమార్ అనే వ్యక్తి గత సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తహసీల్దార్ ప్రశాంతి అర్జీ ఇచ్చిన విజయ్ కుమార్ను మంగళవారం తన కార్యాలయానికి పిలిపించుకుని తిట్ల దండకం అందుకున్నట్లు బాధితుడు విలేకరులకు తెలిపాడు. ఈక్రమంలో విజయకుమార్ తహసీల్దార్తో ‘భూమిలేని నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వ్యక్తులకు సెంటు భూమి ఇవ్వడం కోసం అనేక షరతులు పెట్టే అధికారులు.. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా ఉన్నవారికి రూ.కోట్ల ప్రభుత్వ భూములు ఎలా కట్టబెడతారు? త్వరలో ప్రజాసంఘాలతో మీ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం’ అని హెచ్చరించినట్లు తెలిపారు. అంతేకాక స్థానిక పోలీస్ స్టేషన్ పక్కన గల రూ.30 కోట్ల విలువైన మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని అగ్రవర్ణానికి చెందిన ఓ టీడీపీ నాయకుడికి ఎలా కట్టబెడుతున్నారని.. దీనిపై కూడా పోరాడతాం అని అన్నట్లు విలేకరులకు చెప్పారు. వాస్తవానికి పోలీస్ స్టేషన్ పక్కన గల మూడు ఎకరాల భూమి అన్యాక్రాంతానికి ప్రయత్నం జరుగుతున్న విషయంపై గత నెలలో రాజశేఖర్ అనే వ్యక్తి నేరుగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్కు అర్జీ ఇచ్చారు. ఆ విషయమై ఎలాంటి చర్యలు తీసుకున్న విషయం తెలియదు కానీ సదరు నాయకుడు మాత్రం ఆ భూమిలో పంట వేయడం కోసం ఇటీవల దున్నిన విషయం ప్రస్తుతం మార్టూరులో చర్చనీయాంశంగా మారింది. త్వరలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు సిద్ధం కాబోతున్నట్లు విజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. చెరుకుపల్లి: చెరుకుపల్లిలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘా వృతమై చల్లని గాలి వీస్తూ భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది. -
స్టీరింగ్ వదిలి.. కంచం పట్టి
రేపల్లె: స్టీరింగ్ పట్టి ప్రయాణికులను గమ్యానికి చేర్చే చేతులు.. గురువారం ఖాళీ కంచాలు పట్టి వీధుల్లోకి వచ్చాయి. జీతాల పెంపు, కార్మిక హక్కుల అమలు కోసం సమ్మె చేస్తున్న హైర్ బస్సు డ్రైవర్లు వినూత్నంగా బిక్షాటన చేపట్టి తమ ఆవేదనను చాటుకున్నారు. రేపల్లె ఆర్టీసీ డిపో నుంచి ప్రధాన రహదారి వరకు ఖాళీ కంచాలతో నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. స్థానిక కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కూడా డ్రైవర్ల పోరాటానికి సంఘీభావం ప్రకటించాయి. జీతాల పెంపుదలతో పాటు కార్మిక హక్కుల అమలు కోరుతూ రేపల్లె, చీరాల డిపోల పరిధిలో హైర్ (అద్దె) బస్ డ్రైవర్లు చేపట్టిన సమ్మె గురువారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీఐటీయూ బాపట్ల జిల్లా కోశాధికారి సీహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రేపల్లె డిపో పరిధిలో ప్రతి రెండేళ్లకు ఒకసారి వేతనాల సవరణ జరుగుతుందన్నారు. రెండు సంవత్సరాల క్రితం రోజువారీ వేతనం రూ.1,000 ఉండగా కేవలం రూ.100 మాత్రమే పెంచి ప్రస్తుతం రూ.1,100 చెల్లిస్తున్నారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు, ఇతర వ్యయాలు భారీగా పెరిగినా హైర్ బస్ యజమానులు వేతనాల పెంపుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ అధికారులు జోక్యం చేసుకోవాలి ఆర్టీసీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి డ్రైవర్కు కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పిస్తామని హైర్ బస్ యజమానులు హామీ ఇచ్చినా వాటిని అమలు చేయడం లేదని ఆరోపించారు. ఆర్టీసీ అధికారులు జోక్యం చేసుకుని ఒప్పందాలను అమలు చేయించే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సమ్మెకు మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు, ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర ప్రజా సంఘాల నాయకులు వై.కిషోర్, కొప్పుల గోపి, ఎన్.రవి, పి.విజయ్ తదితరులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో మదర్ థెరిసా హైర్ బస్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు జి.వెంకటేశ్వరరావు, కోశాధికారి జి.రవిబాబు, నాగరాజు, వెంకటేశ్వరరావు, రాజు, ఇమ్రాన్ పాల్గొన్నారు. -
చిత్తశుద్ధి జాడెక్కడ?
గుర్రపుడెక్కతో రైతులకు కోలుకోలేని నష్టం ఏటా గుర్రపు డెక్క సమస్య రైతులకు సమస్యలు తెచ్చిపెడుతోంది. దీనివల్ల పంటలు దెబ్బతింటున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదు. రేపల్లె డ్రైనేజీ కాలువల్లో గుర్రపు డెక్క తొలగించకుంటే ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు. తమ సంక్షేమంపై చిత్తశుద్ధి లేని చంద్రబాబు పాలనలో ప్రతి సంవత్సరం ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. – ఈపూరు బాబురావు, పోతుమర్రు –ఆల్లూరు యోనబాబు, జంపని -
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
బాపట్ల: రైతులు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. వ్యవసాయ రంగంలో ఆధునిక మార్పులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించాలన్న లక్ష్యంతో జిల్లా వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కిసాన్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు శాఖలు ఏర్పాటు ప్రదర్శన స్టాళ్లను తిలకించారు. పంటలు, విత్తనాలు, ఎరువుల వాడకం వంటి సమాచారంతో బ్రోచర్లు, కరపత్రాలను కలెక్టర్ విడుదల చేశారు. ఉత్తమ రైతులను సన్మానించారు. జిల్లా వ్యవసాయ అధికారిణి ఎ.లక్ష్మి, ఆత్మ పీడీ జి.వెంకటేశ్వరావు, పశు సంవర్ధక శాఖ జేడీ డి.వేణుగోపాల్, ఏపీఎంఐపీ పీడీ డి.నీలిమ, ఉద్యాన శాఖ డీడీ ఖలీం, మార్క్ఫెడ్ డీఎం కరుణశ్రీ , పౌర సరఫరాల శాఖ డీఎం ఎం. శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కట్టను చెరబట్టి మట్టి దందా
అధికారమే అండగా... భద్రత ప్రశ్నార్థకం పంట పొలాల చుట్టూ మట్టి అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. చివరకు లక్షలాది ఎకరాల ఆయకట్టుకు నీరందించే కాలువపైనా కన్నేశారు. నీటి పారుదల శాఖలో ఇంటి దొంగల అండతో ఏకంగా కాలువ కట్టల అంచులను తవ్వి మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకొంటున్నారు. వీరి దెబ్బకు కాలువ రూపురేఖలు మారిపోతున్నా.. కొల్లూరు మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడి సిఫార్సులతో దందా యథేచ్ఛగా సాగిపోతోంది. కొల్లూరు నీటి పారుదల శాఖ కార్యాలయం సమీపంలోనే ఈ అక్రమం సాగుతున్నా అధికారులు నిద్రపోతున్నారు. – రవిబాబు, ఇరిగేషన్ ఇన్చార్జి ఏఈ -
కృష్ణా డెల్టాకు నీరు విడుదల
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కృష్ణా పశ్చిమ డెల్టాకు బుధవారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రకాష్లు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ కృష్ణానదిపై ఎగువన ఉన్న రిజర్వాయర్లలో నీటి నిల్వలు లేనందున కృష్ణా డెల్టాకు రాలేదన్నారు. కృష్ణా డెల్టా 13 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి అయోమయంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పులిచింతలలో 30 టీఎంసీలు నిల్వ చేసుకునేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా 16 టీఎంసీలు తరలించగలుగుతున్నట్లు పేర్కొన్నారు. కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతంలో వర్షాలు పడితే మరో 30 టీఎంసీలు, వెరసి ఈ సీజన్లో 75 టీఎంసీలు అందించే వీలు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. కృష్ణా డెల్టాలోని మొత్తం 13 లక్షల ఎకరాల సాగుకు 150 టీఎంసీలు అవసరమని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, కేడీఎస్ సీఈ రాంబాబు, రాష్ట్ర సాగునీటి సంఘాల ప్రతినిధులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు. బగళాముఖి ఆలయంలో ప్రత్యేక పూజలు చందోలు(కర్లపాలెం): బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన బగళాముఖి అమ్మవారి దేవస్ధానంలో శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి లఘు వారాహిదేవి అలంకరణ చేశారు. మహోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయ ప్రాంగణం శుద్ధి చేయటంతోపాటు సుందరంగా అలంకరించారు. ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేశారు. అనంతరం ట్రస్టు బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్రెడ్డి జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. అర్చకులు అష్టోత్తర శతనామార్చన, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. టీటీడీకి రూ.30 లక్షల విరాళం గుంటూరు మెడికల్: టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు నగరానికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్, బ్రిందా న్యూరో సెంటర్ అధినేత డాక్టర్ హనుమ శ్రీనివాసరెడ్డి రూ.10,00,116, శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116, బర్డ్ ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించింది. శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు బ్రింద హాస్పటల్ అధినేతలు డాక్టర్ భవన హనుమ శ్రీనివాసరెడ్డి, వసంత సిద్ధార్థలు ఈ విరాళం డీడీలను అందజేశారు. కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు, నాట్కో ట్రస్టు ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు. పొంగలి షెడ్డు నిర్మాణానికి విరాళం తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని 17వ వార్డులో ఉన్న శ్రీ గంగానమ్మ ఆలయంలో పొంగలి షెడ్డు నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ తన సొంత నిధుల నుంచి రూ. 1.50 లక్షల విరాళం అందజేశారు. ఆయన తరఫున బుధవారం టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకటరావు ఈ మొత్తాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాడిబోయిన భాస్కర్, గుద్దంటి నాగేశ్వరరావు, ఇట్టా భాస్కర్, నిర్మల, రాంబాబు, గోపి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
‘భరోసా’ కరువు
ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు నేతన్నలను నట్టేట ముంచింది. సంక్షేమ పథకాలకు కోతలు పెడుతూ ఆ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పండుగలా సాగిన నేతన్నల బతుకుల్లో కూటమి సర్కారు చీకట్లు నింపిందని చేనేత కార్మికులు వాపోతున్నారు.చీరాల అర్బన్: చంద్రబాబు మాటలతో మభ్యపెడుతూ, చేతల్లో గారడీ చేస్తూ చేనేత రంగాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నారని ఆ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు, సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘నేతన్న నేస్తం’ కింద జిల్లాలో ఏకంగా 8,705 మందికి లబ్ధి చేకూర్చారని, ఏటా రూ.24 వేలు చొప్పున క్రమం తప్పకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేసి ఆదుకున్నారని గుర్తు చేస్తున్నారు. కానీ, చంద్రబాబు ‘నేతన్న భరోసా’ పేరుతో ఏటా రూ.25 వేలు ఇస్తానన్న హామీని గాలికి వదిలేశారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత విద్యుత్ కింద జిల్లాలో 6,318 మందికి మాత్రమే లబ్ధి చేకూర్చి చేతులు దులుపుకొంది. అర్హులకు కోతలు విధించి లబ్ధిదారుల సంఖ్యను దారుణంగా తగ్గించడంపై నేతన్నలు వాపోతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి నిలువునా మోసపోయామని బావురుమంటున్నారు. 50 ఏళ్లకే పెన్షన్ ఏమైంది? చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని కూటమి నేతలు ఎన్నికల వేళ ఆర్భాటంగా హామీ ఇచ్చారు. ఆ కల్లబొల్లి మాటలు నమ్మిన నేతన్నలు ఓట్లు వేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు. ఇంతవరకు ఒక్కరికి కూడా పెన్షన్ మంజూరు చేయలేదు. అటకెక్కిన రిజర్వేషన్లు ఒకవైపు జీఎస్టీ భారం చేనేత రంగానికి గుదిబండగా మారగా, మరోవైపు నేతన్నలకు అండగా నిలవాల్సిన 11 రకాల చేనేత రిజర్వేషన్ల చట్టాన్ని కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. అధికారుల ఉదాసీనతతో నేతన్నలకు పని భద్రత ప్రశ్నార్థకమైంది. పవర్లూమ్ మాయాజాలం పెరిగిన నూలు, రంగులు, రసాయనాల ధరలతో చేనేత వస్త్రాల తయారీ, విక్రయాలు భారంగా మారాయి. ఈ కష్టకాలంలో పవర్లూమ్ వస్త్రాలు చేనేత వస్త్రాలుగా మార్కెట్లో యథేచ్ఛగా చెలామణి అవుతున్నాయి. వాడేకొద్దీ వాటి అసలు రంగు బయటపడుతున్నా.. అప్పటికే చేనేత రంగానికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అక్రమార్కులను నియంత్రించాల్సిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి సంబంధించిన కార్యాలయం తిరుపతిలో ఉంది. అక్కడి నుంచి అధికారులు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో ఎవరికీ తెలియని పరిస్థితి. స్థానిక అధికారులు, చేనేత సంఘాల ప్రతినిధులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నామమాత్రపు చర్యలతోనే సరిపెడుతున్నారు. అధికారులుగా మా వంతు బాధ్యతలు మేం నిర్వహిస్తున్నాం. కానీ, ‘నేతన్న భరోసా’ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి మాకు ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు. బహుశా ఆగస్టులో వచ్చే జాతీయ చేనేత దినోత్సవం నాటికి ఇవ్వొచ్చని చెబుతున్నారు. ఇక చేనేత ముసుగులో కొన్నిచోట్ల పవర్లూమ్ వస్త్రాలు చెలామణి అవుతున్న మాట వాస్తవమే. మా ఎన్ఫోర్స్మెంట్ వింగ్ తిరుపతిలో ఉంటుంది. ఎవరైనా ఫిర్యాదులు చేసినప్పుడు మాత్రమే వారు వస్తుంటారు. – వెంకటేశ్వరరావు, హ్యాండ్లూమ్స్ ఏడీ, చీరాల 50 ఏళ్లకే పింఛన్ ఇస్తారని చెప్పడంతో ఎంతో ఆశపడి కూటమికి ఓట్లు వేశాం. ఇప్పుడు నాకు 55 సంవత్సరాలు. ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైనా.. ఎవరిని అడిగినా దాటవేస్తున్నారు. ఎదురుచూసి కళ్లు కాయలు కాస్తున్నాయి. – అంజయ్య, చేనేత కార్మికుడు, ఈపూరుపాలెం 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామంటే నిజమేనని నమ్మి ఓట్లు వేశాం. కానీ, ఇప్పుడు ఎదురుచూపులు తప్ప మాకు ఒరిగిందేమీ లేదు. అధికారులను, నేతలను అడిగితే సమాధానం లేదు. – వెంకటేశ్వరమ్మ, చేనేత కార్మికురాలు, దేవాంగపురి -
క్రీడల్లో సత్తాచాటిన కానిస్టేబుల్కు ఎస్పీ అభినందనలు
బాపట్ల: జిల్లా పోలీస్ శాఖ ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయడం అభినందనీయమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ కొనియాడారు. 2026 జూలై 6 నుంచి 8వ తేదీ వరకు మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్లో నిర్వహించిన 14వ సీనియర్ నేషనల్ పెన్కాక్ సిలాట్ చాంపియన్షిప్ 2026–27 పోటీల్లో కర్లపాలెం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహించే వీరంకి నరేంద్ర సత్తా చాటి సిల్వర్ మెడల్ సాధించారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరేంద్రను ఎస్పీ అభినందించి మెడల్తో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూనే జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు. షిల్లాంగ్లో జరిగిన 14వ సీనియర్ నేషనల్ పెన్కాక్ సిలాట్ ఛాంపియన్షిప్ 2026–27 పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించి జిల్లా పోలీస్ శాఖ కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయడం గర్వకారణమన్నారు. గతంలో కూడా నరేంద్ర అనేక జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించారని తెలిపారు. ఇప్పటివరకు ఆయన ఒక గోల్డ్, రెండు సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ జాతీయ స్థాయిలో సాధించడం గర్వకారణమన్నారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటాలని ఆకాంక్షించారు. క్రీడల ద్వారా ఒత్తిడిని సునాయాసంగా అధిగమించవచ్చని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కోల్డ్ స్టోరేజీ బాధిత రైతులను మోసం చేసిన ప్రభుత్వం
దుగ్గిరాల: దుగ్గిరాల శుభం కోల్డ్ స్టోరేజీలో పసుపు దగ్ధమైన రైతుల సమావేశం నిర్వహించారు. మంగళవారం దుగ్గిరాలలోని పసుపు యార్డులో ములకా సాంబిరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో పసుపు రైతుల రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర సంత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజీలో దగ్ధమైన పసుపునకు పరిహారం అందించడంలో రైతులను ముప్పతిప్పలు పెడుతోందన్నారు. పెద్దల కమిటీలో బహిరంగంగా రైతులకు క్వింటాకు రూ.7 వేలు ఇస్తామని హామీ ఇచ్చి నేడు పరిహారం కుదించి రూ.5 వేలు ఇస్తామని చెప్పడంతో రైతులు ఉద్యమ బాటలో నడవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ములకా సాంబిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుందని ఆశ పడ్డ రైతులకు నిరాశే మిగిలిందన్నారు. రైతులు ఆందోళనకు సిద్ధంగా ఉన్నారని, ఈ నెల 20 లోపు న్యాయం జరగకపోతే వ్యవసాయ మంత్రి క్యాంపు కార్యాలయానికి రాయబారానికి వెళ్లాలని సమావేశంలో తీర్మానించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు లాయర్లు కె.వీరయ్య, వై.శ్రీనివాసరావు, రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె.అజయ్, కమిటీ సభ్యులు బి.శ్రీనివాసరావు, వ్యవసాయం కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జెట్టి బాలరాజు, రైతులు రవి కిషోర్, వెంకటప్ప రెడ్డి, నాగేశ్వర రెడ్డి, సత్యనారాయణ, సురేంద్ర, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. -
రైలు నుంచి జారిపడిన యువతి
తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు వేజండ్ల(చేబ్రోలు): చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామ పరిధిలో రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని యువతికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం జరిగింది. తెనాలి నుంచి గుంటూరు వెళ్తున్న రైలు నుంచి మధ్యాహ్న సమయంలో సుమారు 20 సం.ల వయస్సు కలిగిన యువతి జారిపడి పొలాల్లో పడిపోయింది. తలకు, ముఖానికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ట్రాక్టర్తో పొలం దున్ను తున్న రైతులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి వెళ్లిన సిబ్బందికి సంఘటనా ప్రాంతం నుంచి తీసుకురావటానికి ఇబ్బందులు పడ్డారు. సుమారు కి.మీ దూరం వరకు రైలు పట్టాలపై, రాళ్లలో నడుచుకుంటూ అపస్మారక స్థితిలో ఉన్న యువతిని స్ట్రెక్చర్పై 108 సిబ్బంది కోట ఉదయ్ కిరణ్, బి.యహోషవాలతో పాటు స్థానిక రైతులు అంబులెన్స్ వాహనం వరకు అతికష్టం మీద తీసుకువచ్చి అత్యవసర వైద్య సేవలు అందించి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆమెను ఒడిశాకు చెందిన యువతిగా భావిస్తున్నారు. రైలు గేటు వద్ద ఉన్న సమయంలో పొరపాటున జారిపడి ఉంటుందా లేక ఎవరైన ఉద్దేశపూర్వకంగా కిందకు నెట్టి ఉంటరా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భవిత కేంద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
బాపట్ల: ప్రతి చిన్నారికి సమాన విద్య అవకాశాలు కల్పించేలా భవిత కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో ఉన్న సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆటిజం సహాయక కేంద్రాలు, సాహిత విద్య కార్యక్రమాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భవిత కేంద్రాల బలోపేతానికి చర్యలు – సమగ్ర విద్యతో ప్రతి చిన్నారికి విద్యాబుద్ధులు నేర్పడమే లక్ష్యమని తెలిపారు. బాపట్లలో ప్రత్యేక సీఎస్ కోన శశిధర్ ప్రతిపాదనల మేరకు ఆటిజం సహాయక కేంద్రం ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 17 మంది శిక్షణ పొందుతున్నారని తెలిపారు. తగిన వసతులు కల్పించినట్లు చెప్పారు. డీఈఓ శ్రీనివాస్ సింగ్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. విజయమ్మ, డీసీహెచ్ ఎస్. డాక్టర్ పద్మావతి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి మాధవి, డీఆర్డీఏ పీడీ సింగయ్య తదితరులు పాల్గొన్నారు. ‘సర్’లో 99.7 శాతం డిజిటలైజేషన్ సాక్షి ప్రతినిధి, బాపట్ల: జిల్లాలో సర్ కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించారు. మంగళవారం తుది గడువుగా ప్రకటించిన అధికారులు ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ పూర్తి కాకపోవడంతో గడువు పెంచారు. మంగళవారం నాటికి 99.7 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. జిల్లాలో 10,50,605 మంది ఓటర్లు ఉన్నారు. వేటపాలెం, చీరాల అర్బన్, చీరాల రూరల్, భట్టిప్రోలు, బాపట్ల అర్బన్, బాపట్ల రూరల్, ఇంకొల్లు, కారంచేడు మండలాల పరిధిలో మరో 5 వేల ఫారాలు డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. -
అధికారం మాదే.. పెత్తనమూ మాదే!
చీరాల టౌన్: అధికారం చేతిలో ఉంది.. అధికారులు మా కిందే ఉన్నారు... మా మాటకు అడ్డు లేదంటూ టీడీపీ గ్రామ, మండల స్థాయి నాయకులు సచివాలయంలో తిష్ట వేసి చక్రం తిప్పుతున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ కార్యక్రమంలో ఏకంగా అధికారి కుర్చీలోనే టీడీపీ నేతలు కూర్చొని సర్ డిజిటలైజేషన్ చేయిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయం, ప్రభుత్వ అధికారికి కేటాయించిన కుర్చీలో కూర్చొని వారి అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నారు. ఈ సంఘటన మంగళవారం చీరాల మండలంలోని తోటవారిపాలెం గ్రామ సచివాలయంలో చోటు చేసుకుంది. సర్ కార్యక్రమంలో బీఎల్వోలకు అనుసంధాన పార్టీ తరఫున ఏర్పాటు చేసి బీఎల్ఏలు, టీడీపీ నాయకులు బీఎల్ఓలతో కలిసి గ్రామ సచివాలయంలో ఓట్ల చేర్పు, తొలగింపు ప్రక్రియ చేస్తున్నట్లు సమాచారం. సర్ ప్రక్రియలో అనుకూలమైన ఓట్లు ఉంచుతున్నారు. ఇతర పార్టీల ఓట్లు తొలగిస్తున్నారని సమాచారం. -
సర్పోతుందా.. గడువు!
బాపట్లబుధవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2026అచ్చంపేట : ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 30.9103 టీఎంసీలు. ఎగువ ప్రాంతాల నుంచి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా... దిగువకు అంతే నీరు వదులుతున్నారు.సర్ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినా, పలు వర్గాల ఓట్లు గల్లంతవుతాయనే ఆందోళన నెలకొంది. నెల రోజుల్లో ఓటరు వివరాలను డిజిటలైజేషన్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గడువులోపు సిబ్బంది సాధ్యమైనంత మేర పూర్తి చేశారు. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ సర్ ప్రక్రియకు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించడంతో, మిగిలిన ఫారాల డిజిటలైజేషన్ పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. చీరాల: చీరాల నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలాల్లో మొత్తం 218 పోలింగ్ బూత్లు ఉన్నాయి. మొత్తం 2,03,641 మంది ఓటర్లు ఫారాలు అందించగా, వీరిలో 2,02,167 ఓట్లను డిజిటలైజేషన్ పూర్తి చేశారు. ఇంకా 1,474 ఓటర్ల ఫారాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. మంగళవారం నాటికి మొత్తం 99.28 శాతం నమోదైంది. ఒక్కో బీఎల్ఓకు రాజకీయ పార్టీల నుంచి ఒక్కో బీఎల్ఏను కేటాయించారు. బీఎల్ఏల పనితీరును బీఎల్ఓలు పరిశీలిస్తారు. బీఎల్ఓ ద్వారా పొందిన రెండు రకాల ఫారాల్లో ఓటరు తన వివరాలను నింపి తిరిగి అందజేయాలి. గత నెల 15న ప్రారంభమైన సర్ ప్రక్రియ ఈనెల 14వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే ఎక్కువ మంది ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పూర్తి కాకపోవడంతో పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సర్ కార్యక్రమాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేశాయి. వారి ఓట్లకు గండి? కొంతమంది ఓటర్లకు సర్ ప్రక్రియపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రక్రియ నెమ్మదిగా సాగింది. గత రెండు దఫాలుగా ఓటు వేసినా, 2002 నాటి సర్ వివరాలను అందించాలనే నిబంధన ఉండడంతో ఎక్కువ మంది ఓటు హక్కును కోల్పోతున్నారు. అప్పటి వివరాలు లభించకపోవడం, వేరే ప్రాంతం నుంచి ఇక్కడకు వలస రావడం, స్థిర నివాసం లేకపోవడం వంటి కారణాలతో ఎంతో మంది ఓటు హక్కును కోల్పోతామనే ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా మైనార్టీలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారు ఎక్కువ మంది ఉన్నారు. వీరికి స్థానికంగా ఓటు హక్కు ఉన్నా, 2002లో ఎక్కడ ఓటు వేశారనే విషయంపై స్పష్టమైన అవగాహన లేదు. చీరాల మున్సిపాలిటీలోని శివారు వార్డుల్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వలస వచ్చిన వారు ఎక్కువ మంది ఉన్నారు. తూర్పు రెడ్డి, తూర్పు కాపు సామాజికవర్గాలకు చెందిన వారు ఎన్నో ఏళ్లుగా చీరాలకు వచ్చి స్థిరపడ్డారు. పట్టణంలోని 27, 28 వార్డుల్లో తూర్పు రెడ్డి సామాజికవర్గానికి చెందిన 1,000 ఓట్లు ఉన్నాయి. అలాగే 23, 24 వార్డుల్లో తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన 800 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి ఇక్కడ, అక్కడ ఓట్లు ఉండడంతో, వారిలో ఎక్కువ మంది తమ సొంత ప్రాంతంలోనే ఓటు కొనసాగించడానికి మొగ్గుచూపుతున్నారు. ఈ వార్డుల్లో ఓట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. మైనార్టీ వర్గాలకు చెందిన ఎక్కువ మందికి గత సర్ కార్యక్రమంలో ఓటు లేకపోవడంతో, వారి ఓట్లు కూడా తగ్గే అవకాశం ఉందని సమాచారం. స్పెషల్ డ్రైవ్లు.. హెల్ప్ డెస్క్లు.. సర్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం కదిలింది. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. బీఎల్ఓలతో మాట్లాడి సర్ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. అధికారులకు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు అందిస్తూ సర్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేసేందుకు ప్రయత్నించారు. మున్సిపాలిటీల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్లు, స్పెషల్ డ్రైవ్లు ఏర్పాటు చేశారు. ఓటర్లు పూర్తి చేసిన ఫారాలు అందించేందుకు వీలుగా చీరాల మున్సిపాలిటీలో నాలుగు ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న సర్ ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్బాబు పార్టీ నాయకులతో మాట్లాడారు. పార్టీకి సంబంధించి బీఎల్ఏలు నిరంతరం బూత్లలో బీఎల్ఓలకు అందుబాటులో ఉంటూ అర్హులందరికీ ఓటు హక్కు అందేలా చూడాలన్నారు. బీఎల్ఏలు నిబద్ధతతో పనిచేయాలన్నారు. పోలింగ్ బూత్ల పరిధిలో డబుల్ ఎంట్రీ ఓట్లు తొలగించి, అర్హులైన వారి ఓట్లు పోకుండా చూడాలన్నారు. అలాగే గత మూడు రోజులుగా ఆయన నియోజకవర్గంలోని పలు సచివాలయాల్లో పర్యటిస్తూ సర్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సిబ్బంది కూడా నిష్పక్షపాతంగా వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించాలన్నారు. ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటరు జాబితాలో కొనసాగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
వృద్ధులే లక్ష్యంగా దోపిడీలు
తెనాలిరూరల్: వృద్ధులే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల నకిలీ పోలీసులను తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ బి.జనార్ధనరావు వివరాలను వెల్లడించారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన కావటి కిరణ్కుమార్, సదుపాటి మురళి స్నేహితులు. కిరణ్కుమార్ గతంలోనే నకిలీ పోలీస్ అవతారమెత్తి, పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. గుంటూరు, చీరాల, ఇంకొల్లు, వేటపాలెం, ఒంగోలు, నందిగామల్లో నేరాలకు పాల్పడ్డాడు. ఇతనిపై 12 కేసులు ఉన్నాయి. మురళి 12 ఏళ్లు బీఎస్ఎఫ్లో పనిచేసి 2012లో ఉద్యోగం వదిలి వచ్చేశాడు. మద్యం, ఇతర వ్యసనాలకు బానిసైన మురళి కిరణ్కుమార్తో కలిసి ఇటీవలి కాలంలో నేరాలకు పాల్పడుతున్నాడు. ఈనెల 7వ తేదీన కొల్లిపర చెందిన మల్లికార్జున రెడ్డి నందివెలుగు నుంచి స్కూటీపై తెనాలి వస్తుండగా ఆటోనగర్ వద్ద అతడిని ఇద్దరు నిందితులు అడ్డగించి పోలీసుల పేరుతో బెదిరించారు. స్కూటీని చెక్ చేయాలంటూ భయపెట్టి డిక్కీలో ఉన్న రూ. 1.60 లక్షల నగదులో రూ.50,000 లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు. అదే రోజు దుగ్గిరాల సమీపంలోని కొత్త పెట్రోల్ బంకు వద్ద మోపెడ్పై వెళుతున్న వృద్ధుడు మహమ్మద్ ఫరూక్ను కూడా బెదిరించి అతని వద్ద ఉన్న రూ 7వేలు తీసుకొని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు నిందితులను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 57 వేల నగదు, పల్సర్ బైక్ స్వాధీనపర్చుకున్నారు. నిందితులను తక్కువ సమయంలోనే గుర్తించి అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులను డీఎస్పీ అభినందించారు. సయావేశంలో రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ కె.ఆనంద్, సిబ్బంది ఉన్నారు. -
హామీలను ప్రభుత్వం అమలు చేయాలి
ఫ్యాప్టో నాయకుల డిమాండ్ బాపట్ల: ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు చింతల సుబ్బారావు, కొమ్మోజు శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు బాపట్ల కలెక్టరేట్ వద్ద ర్యాలీ, పికెటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఫ్యాప్టో చైర్మన్ పి.డి.సోషలిజం పికెటింగ్ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ... ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ సాగతీత ధోరణి సరైనది కాదన్నారు. వేతన కమిటీ ఆలస్యమయ్యేకొద్దీ ఉద్యోగులు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. ఫ్యాప్టో కార్యదర్శి కె. పిచ్చయ్య, జిల్లా ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాల జిల్లా బాధ్యులు నారాయణ, అమర్నాథ్, వినయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర స్థాయి ఉద్యమం చేపడతామన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి ఫ్యాప్టో నాయకత్వం వినతిపత్రం అందజేసింది. కార్యక్రమంలో అడుగుల శ్రీనివాసరావు, బడుగు శ్రీనివాసరావు, మచ్చ వెంకటేశ్వరెడ్డి, నాగరాజు, సుభాని, రాజేష్, శివ పాల్గొన్నారు.


