breaking news
Bapatla
-
ప్రభల భక్తికి ప్రతీక
బాపట్లబుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026● పురుషోత్తమపట్నంలో భారీ విద్యుత్ ప్రభల నిర్మాణం ● ఒకే ప్రాంతం నుంచి 11 ప్రభలు ● కోటప్పకొండ తిరునాళ్లకు సిద్ధమవుతున్న పల్నాడు భక్తి శ్రద్ధలతో ప్రభలు కట్టి దక్షిణామూర్తిని దర్శిస్తే పుణ్యం దక్కుతుందని ప్రతీతి. తిరునాళ్లకు ప్రభలను నిర్మించటం మనదైన, అరుదైన సంప్రదాయం. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. భారీ ప్రభలకు కోటప్పకొండ తిరునాళ్ల పెట్టింది పేరు. మహాశివరాత్రికి రూ.లక్షలు వెచ్చించి ప్రభలు కట్టి చేదుకో...కోటయ్యా...మమ్మాదుకో కోటయ్యా అంటూ దైవ నామస్మరణ చేస్తూ కొండకు వెళ్లటం ఆనవాయితీగా వస్తుంది. – చిలకలూరిపేట సాధారణంగా ఒక గ్రామం నుంచి ఒకటి లేదా రెండు ప్రభలు నిర్మించటం పరిపాటి. అయితే చిలకలూరిపేట పట్టణ పరిధిలోని పురుషోత్తమపట్నం ప్రభల నిర్మాణానికి పెట్టింది పేరు. ఈ ఒక్కచోట నుంచే 11 ప్రభలు నిర్మాణం చేసుకుంటూ ఉండటం ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడ ఒకదానికి మించి మరో ప్రభను రూ.లక్షలు వెచ్చించి విద్యుత్ దీపాలు అలంకరించి అందంగా తీర్చిదిద్దుతున్నారు. ● మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ ప్రభల నిర్మాణంలో పురుషోత్తమపట్నం వాసులు పూర్తిగా తలమునకలయ్యారు. సుమారు 136 ఏళ్ల కిందట పురుషోత్తమపట్నం నుంచి ఒకే ఒక్క గ్రామ ప్రభను నిర్మించి తిరునాళ్లకు తీసుకువెళ్లేవారని పెద్దలు చెబుతారు. తరువాత కాలంలో క్రమేణ ఇళ్ల పేర్లతో ప్రభలు నిర్మించి తిరునాళ్లకు వెళ్లటం ఆనవాయితీగా మారింది. ● ఇక్కడ గ్రామప్రభతో పాటు విడదల వారి ప్రభ, బైరావారి ప్రభ, తోటపుల్లప్పగారి ప్రభ, చిన్నతోటవారి ప్రభ, యాదవరాజుల ప్రభలు రెండు భారీ విద్యుత్ ప్రభలు. వీటికి తోడు తోట కష్ణమ్మగారి ప్రభ, బ్రహ్మంగారి గుడి వీధి ప్రభ, మండలనేనివారి ప్రభలు రెండుమధ్యస్థమైనవి. ఇందులో ఏడు భారీ విద్యుత్ ప్రభలు ఒక్కొక్కటి రూ. 18 లక్షలు నుంచి రూ.20లక్షలు పైబడి వెచ్చించి తీర్చిదిద్దుతున్నారు. లైటింగ్ ఏర్పాటుకే ఒక్కో ప్రభకు రూ.14 లక్షలు పై బడి ఖర్చు పెడుతున్నట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు. ● తిరునాళ్లకు ముందురోజు ప్రభలను రాతి చక్రాల బండ్లపై క్రేన్ల సహాయంతో యువకులు మోకులు చేతబట్టి భక్తి శ్రద్ధలతో నిలబెట్టే కార్యక్రమం చేపడతారు. ● ప్రభలను నిర్మించటం వాటిని కోటప్పకొండకు తరలించటం ఒక యజ్ఞంలా కొనసాగిస్తారు. ఆర్థిక పరిస్థితులు సహకరించినా, సహకరించకున్నా ప్రతి ఏటా క్రమం తప్పకుండా తమ సంప్రదాయ ప్రభల నిర్మాణానికి ఎలాంటి లోటు తలెత్తకుండా ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతారు. ● తిరునాళ్లకు ముందు రెండు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి తిరునాళ్ల నాటికి కొండవద్దకు చేరుకోవటానికి సిద్ధమవుతారు. కోటప్పకొండకు తరలివెళుతున్న పురుషోత్తమపట్నం ప్రభలు (ఫైల్) సిద్ధమవుతున్న విడదల వారి ప్రభ విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 538.20 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్కి 20,641 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
ఉరి వేసుకొని వివాహిత మృతి
మాదల(ముప్పాళ్ళ): కుటుంబ కలహాల నేపధ్యంలో వ్యక్తి ఇంట్లోని దర్వాజాకు ఉరిపోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని మాదల గ్రామంలోని బీసీ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. సంఘటనకు సంబందించి పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన వల్లెపు దుర్గారావు(42) ఆరు నెలల క్రితం భార్యతో కలిసి విజయవాడ పనులకు వెళ్లి అక్కడే ఉంటున్నాడు. భార్యకు ఆమె అక్క భర్తతో వివాహేతర సంబంధం ఉందనే విషయంలో తరచూ గొడవలు పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో పదిరోజుల క్రితం మాదల వచ్చి ఉంటున్నాడు. సోమవారం విజయవాడ నుంచి భార్యను పిలిపించి పెద్దల సమక్షంలో మాట్లాడగా అక్కడ కూడా గొడవ పడి వెళ్లిపోయాడు. దీంతో భార్య తిరిగి విజయవాడ వెళ్లగా దుర్గారావు మాదలలోనే తన తల్లి వద్దే ఉంటున్నాడు. తల్లి తెల్లవారుజామున లేచిచూడగా దుర్గారావు జాడ కనిపించక పోవటంతో వెతుకులాట చేయగా దుర్గారావు కొత్తగా నిర్మించుకుంటున్న ఇంట్లోనే దర్వాజాకు ఉరిపోసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే దుర్గారావును చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. జరిగిన సంఘటనపై దుర్గారావు సోదరుడు చెన్నకేశవరావు ఇచ్చిన ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.అనిల్కుమార్ తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. -
బాపట్లలో టీడీపీ విగ్రహాల రాజకీయం
● రాజన్న స్మృతి వనం ప్రతిపాదన స్థలంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు ● కౌన్సిల్ తీర్మానాలు ఉన్నా కేపీఆర్ సర్కిల్కు అభ్యంతరాలు ● బాపట్లలో తీవ్ర చర్చనీయాంశంబాపట్ల: జిల్లాలో టీడీపీ రోజుకో కొత్త అంశాన్ని తెర మీదకు తెచ్చి వివాదాలను రెచ్చగొడుతోంది. కొద్ది రోజుల కిందట చీరాలలోని వైఎస్ రాజశేఖరరెడ్డి సర్కిల్లో ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదని నిబంధన ఉన్నా టీడీపీ నాయకులు తిరుమల లడ్డూ విషయమై ఫ్లెక్సీ ఏర్పాటుచేసి కవ్వింపునకు పాల్పడ్డారు. తాజాగా బాపట్లలో విగ్రహాల ఏర్పాటు పేరుతో వివాదానికి శ్రీకారం చుట్టారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి స్మృతి వనం, చీలు రోడ్డులోని కోన ప్రభాకరరావు సర్కిల్కు కౌన్సిల్ తీర్మానం ఉన్నప్పటికీ వాటిని పెడచెవినపెట్టారు. మహానేత స్మృతి వనానికి కేటాయించిన స్థలంలో ఏకంగా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు టీడీపీ నాయకులు నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం హడావిడిగా స్థల పరిశీలన చేశారు. ఇది స్థానికంగా చర్చనీయాంశమైంది. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి స్మృతివనం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న మహానేత డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని రోడ్డు విస్తరణలో తొలగించారు. ఈ మేరకు బాపట్లలోని మార్కెట్ యార్డు వద్ద జాతీయ రహదారి పక్కన 1.5 ఎకరాలలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి స్మృతివనం నిర్మాణం చేపట్టేందుకు అప్పటి డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ముందుకొచ్చారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా 2023 సంవత్సరంలో పనులకు శంకుస్థాపన చేశారు. పోలవరం నిర్మాణదాతగా ఉన్న మహానేత గుర్తుగా అదే నమూనాతో అక్కడ స్మృతివనం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు కౌన్సిల్ తీర్మానం కూడా చేపట్టారు. కొద్దిపాటి ఆలస్యం, కొంతమంది కల్పించిన కోర్టు అడ్డంకులతో ఆ పనులు నిలిచిపోయాయి. తాజాగా అదే ప్రదేశంలో ఎన్టీఆర్ విగ్రహానికి కూటమి ప్రభుత్వం ముందుకువచ్చింది. అక్కడే వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ పంతానికి పోయి స్మృతివనం కేటాయింపు స్థలం జోలికే వస్తున్నారు. కేపీఆర్ సర్కిల్ విషయంలోనూ... పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద ఉన్న మాజీ గవర్నర్ కోన ప్రభాకరరావు విగ్రహాన్ని రోడ్డు విస్తరణలో తొలగించారు. బాపట్ల అభివృద్ధి ప్రదాత కోన ప్రభాకరరావు జ్ఞాపకార్థం చీలు రోడ్డు సెంటర్లో కోన ప్రభాకరరావు సర్కిల్ ఏర్పాటు చేయాలని కౌన్సిల్ తీర్మానం చేసింది. కోన ప్రభాకరరావు తనయుడు రఘుపతి ఈమేరకు ఆ ప్రాంత అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. అక్కడ రోడ్డు విస్తరణ పనులు కూడా చేపట్టారు. తాజాగా ఈ ప్రాంతాన్ని కేపీఆర్ సర్కిల్ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పలు సాకులు చెబుతూ కాలం గడుపుతోంది. -
విద్యుత్ అదాలత్లతో సమస్యల పరిష్కారం
సీజీఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమ్మానుయేల్ కొరిటెపాడు(గుంటూరు): ఏపీ సీపీడీసీఎల్ పరిధిలో ఉన్న ఏడు సర్కిల్స్లో అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కన్జూమర్ గ్రీవెన్సె రెడ్రస్సెల్ ఫోరం(సీజీఆర్ఎఫ్) పనిచేస్తోందని సీజీఆర్ఎఫ్ చైర్మన్, విశ్రాంత న్యాయమూర్తి ఎన్.విక్టర్ ఇమ్మానుయేల్ తెలిపారు. గుంటూరు–పొన్నూరు రోడ్లోని విద్యుత్ శాఖ సమావేశ మందిరంలో మంగళవారం విద్యుత్ అదాలత్ జరిగింది. అదాలత్లో 20 మంది విద్యుత్ వినియోగదారులు వివిధ రకాల సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. వాటిలో 19 మంది సమస్యలను తక్షణమే పరిష్కరించారు. ఈ సందర్భంగా విక్టర్ ఇమ్మానుయేల్ మాట్లాడుతూ ఏపీ సీపీడీసీఎల్ పరిధిలో గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ఒంగోలు, పల్నాడుతో పాటు సీఆర్డీఏ సర్కిళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సర్కిళ్ల పరిధిలో ఉన్న వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు సీజీఆర్ఎఫ్ పని చేస్తోందన్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేందుకు విద్యుత్ వినియోగదారుల అదాలత్లు నిర్వహిస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు సుమారు వెయ్యికి పైగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఫిర్యాదులు అందాయన్నారు. ఐదు సమస్యలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, మిగిలిన వాటిని పరిష్కరించామని వెల్లడించారు. కార్యక్రమంలో సాంకేతిక సభ్యులు డి.కృష్ణనాయక్, ఆర్థిక సభ్యులు కె.కృష్ణ, స్వతంత్ర సభ్యులు ఏ.సునీత, గుంటూరు పర్యవేక్షక ఇంజనీర్ సీహెచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. కొరిటెపాడు(గుంటూరు): ఈ నెల 12వ తేదీన జాతీయ సమ్మెలో భాగంగా మిర్చి యార్డులోని అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నట్లు నాయకులు తెలిపారు. దీనిలో భాగంగానే మిర్చి యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి చంద్రికకు మంగళవారం అన్ని సంఘాలు కలిపి సమ్మె నోటీస్ అందజేశాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ ‘కార్మిక కోడ్‘ల పేరుతో ఇప్పటివరకు ఉన్న చట్టాలను నిర్వీర్యం చేస్తోందని తెలిపారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమం కోసం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ప్రభుత్వ నియంత్రణలో ఉండే వ్యవసాయం, మార్కెటింగ్ వ్యవస్థ స్థానంలో ప్రైవేట్ మార్కెటింగ్కు అవకాశం కల్పిస్తూ చట్టాలు మారుస్తున్నారని, దీంతో ప్రస్తుత మార్కెటింగ్ వ్యవస్థలో ఉన్న రైతులు, కార్మికులు, ఉద్యోగులకు చివరకు చిన్న వ్యాపారస్తులకు కూడా నష్టమేనని తెలిపారు. పై సమస్యల పరిష్కారానికై గురువారం మిర్చి యార్డులో పనిచేసే అన్ని రకాల ముఠా కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో భాగస్వాములు అవుతున్నట్లు తెలిపారు. 12వ తేదీన సమ్మె కారణంగా ఎలాంటి లావాదేవీలు జరగవు కాబట్టి రైతులు ఎవరూ మిర్చి బస్తాలు తీసుకురావద్దని తెలిపారు. సమ్మె నోటీసు ఇచ్చిన వారిలో మిర్చి యార్డు ఎగుమతి, దిగుమతి, కాపలా ముఠా కార్మిక సంఘాల నాయకులు మర్రి శ్రీనివాస్, నాగ గౌడ్, వేమెన్స్ అసోసియేషన్ నాయకులు బాబు, కృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా కోల్డ్ స్టోరేజ్ వర్కర్స్ యూనియన్ నాయకులు గోవిందరావు తదితరులున్నారు. చిలకలూరిపేట/యడ్లపాడు: సొంత పార్టీ వర్గీయులే తమకు అన్యాయం చేస్తున్నారంటూ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నివాసం వద్ద మంగళవారం రాత్రి టీడీపీ నేతలు ఆందోళనకు దిగిన సంఘటన సంచలనంగా మారింది. యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో అధికార పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలే దీనికి కారణమని తెలుస్తోంది. గ్రామ మాజీ సర్పంచ్ వర్గీయులైన రేషన్ డీలర్లను తొలగించి కొత్తవారికి కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ టీడీపీ గ్రామ మాజీ అధ్యక్షుడు పావులూరి పిచ్చయ్య ఆధ్వర్యంలో యడ్లపాడు తహసీల్దార్ కార్యాలయం ముందు టీడీపీ వర్గీయులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం కొనసాగుతున్న రేషన్ డీలర్లను ఈ నెల డీడీలు కట్టవద్దని ఎందుకు ఆదేశించారు... ఉన్న వాళ్లను తొలగించేందుకే కదా అంటూ ఆందోళన నిర్వహించారు. దీనికి అధికారుల నుంచి సరైన సమాధానం లభించలేదు. దీంతో ఆగ్రహించిన తిమ్మాపురం గ్రామస్తులు చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురంలో ఉన్న ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని ఆందోళనకు దిగారు. పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు -
నకిలీ లాకెట్తో టోకరా
చీరాల: మహిళలు, వృద్ధులే టార్గెట్గా చేసుకొని వారికి మాయమాటలు చెప్పి అందినకాడికి డబ్బులు తీసుకెళ్లాడో ఘనుడు. కేంద్ర ప్రభుత్వం రజక మహిళలకు, వృద్ధులకు పింఛన్ అందిస్తున్నారని, త్వరలోనే పింఛన్లు వస్తాయని నమ్మబలికి మోసం చేశాడు. ఈ సంఘటన పేరాలలో మంగళవారం వెలుగు చూసింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు... పేరాలకు చెందిన శివమ్మ అనే వృద్ధురాలు ఇళ్ళలో పనులు చేసుకుంటూ జీవిస్తుంది. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఓ వ్యక్తి టక్ చేసుకొని టోపి పెట్టుకొని బైక్పై ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. ఆమె ఇంటి పేరుతో సహా చెప్పి మీకు పింఛన్ రావడం లేదు కదా.. త్వరలోనే మీకు పింఛన్ వస్తోందని నమ్మబలికాడు. అలానే కేంద్ర ప్రభుత్వం రజకుల్లో పెద్ద ముత్తైదువులకు విజయవాడలో పూజ చేయించిన బంగారు లాకెట్ అందిస్తున్నారని, రూ.2600లు ఇస్తే అవి మీకు పంపిస్తామని చెప్పాడు. అంత డబ్బు తమ దగ్గర లేదని చెప్పడంతో ఉన్నంత వరకు ఇవ్వమని చెప్పడంతో ఆమె వద్ద ఉన్న రూ.1500 ఇచ్చింది. ఆమెకు లక్ష్మీ దేవిబొమ్మతో ఉన్న లాకెట్ ఇచ్చి వెళ్లిపోయాడు. అనుమానం వచ్చిన ఆమె పరిశీలించగా అది నకిలీ అని తేలడంతో నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత పరిసర ప్రాంతాల్లో వాకబు చేయగా మరికొందరికి ఇదే తరహాలో ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి నగదు తీసుకెళ్లాడని తెలిసింది. -
పెదకాకాని శివాలయం పాలకమండలి నియామకం
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, వేదిక (తెలుగు నాటక పరిషత్ సంఘం) సంయుక్తంగా మార్కెట్ కూడలిలోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న భారత రంగ్ మహోత్సవ్ ● అంతర్జాతీయ నాటకోత్సవం మంగళవారంతో ముగిశాయి. ఈసందర్భంగా జరిగిన సభకు వేదిక అధ్యక్షుడు డాక్టర్ ఎం.సురేష్బాబు అధ్యక్షత వహించారు. అనంతరం గుంటూరు నగర వీధుల్లో భారీగా కళాకారుల ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, కళాకారులు హాజరయ్యారు. గుంటూరు వెస్ట్ ( క్రీడలు) : హాకీ ఆంధ్రప్రదేశ్ గౌరవ జనరల్ సెక్రటరీగా ఉన్న గంధం హర్షవర్ధన్ను ఎఫ్ఐహెచ్–ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ సెంట్రల్ ప్యానెల్ సభ్యునిగా నియమించారని సీనియర్ హాకీ క్రీడాకారుడు కె.క్రాంతి కుమార్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ను స్థానిక తమ కార్యాలయంలో ఘనంగా సత్కరించామన్నారు. జిల్లాలో తమతోపాటు హాకీని ప్రారంభించిన ఆయన జాతీయ జట్టుతోపాటు పలు టోర్నమెంట్లలో భారత్కు ప్రాతినిధ్యం వహించారన్నారు. దీంతోపాటు అంతర్జాతీయ హాకీ రిఫరీగానూ కొనసాగుతున్నారన్నారు. జాతీయ క్రీడైన హాకీకి పట్టణంలో ఇప్పటి వరకు మైదానం లేకపోవడంతో హర్షవర్ధన్ దీనిని ఏర్పాటు చేయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు నివ్వడం సంతోషకరమన్నారు. ఈ నియామకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. హర్షవర్ధన్ సతీమణి సత్తె గీత కూడా డబుల్ ఒలింపియన్ అని పేర్కొన్నారు. సీనియర్ హాకీ క్రీడాకారులు ఇఏ. రాజ శేఖర్, జి. మాణిక్యాలరావు, సుభాని, జి.ప్రసన్న కుమార్లు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారన్నారు. నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజన, వసతి సౌకర్యాలు కల్పించేలా సంక్షేమ శాఖ అధికారులు నిబద్ధతతో బాధ్యతగా విధులు నిర్వహించాలని రాష్ట్ర వెనుకబడిన తరగతుల, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆదేశించారు. మంగళవారం గుంటూరు వైద్య కళాశాల ఎదుట ఉన్న ఏపీఎన్జీవో కల్యాణ మండపంలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ డైరెక్టర్ మల్లికార్జున, ఎక్స్ అఫీషియల్ సెక్రటరీ సత్యన్నారాయణ, ప్రాంతీయ జిల్లాల బీసీ సంక్షేమ అధికారులు, సహాయ బీసీ సంక్షేమ అధికారులు, వసతి గృహా సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వనతి గృహాల నిర్వహణ, రాబోయే టెన్న్త్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాల సాధనపై గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి, ప్రకాశం, మార్కాపురం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల వసతి గృహా సంక్షేమ అధికారులతో జిల్లాల వారీగా, వసతి గృహాల వారీగా మంత్రి సమీక్ష నిర్వహించారు. పదవ తరగతి పరీక్షల్లో సీ గ్రేడ్ లో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారు ఉత్తమమైన మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంగళగిరి టౌన్ : ఓ వివాహిత ఇద్దరు బిడ్డలతో అదృశ్యమైన ఘటన మంగళగిరి మండలం యర్రబాలెంలో మంగళవారం చోటు చేసుకుంది.తిరుపతికి చెందిన బోయ నానికి లక్ష్మి అనే మహిళతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా యర్రబాలెంలో నివాసముంటున్నారు. భర్త నాని డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. భార్య లక్ష్మి గత కొన్ని సంవత్సరాలుగా మతిస్థిమితం లేక బాధపడుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తన ఇద్దరు బిడ్డలతో అదృశ్యమైంది. -
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల:గుంటూరుకు చెందిన ఎన్.సుధా రాణి టీటీడీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. విజయపురిసౌత్: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాల/ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, జూనియర్ ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ వాణి రాణి మంగళవారం తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ అర్హులైన విద్యార్థులు http://apgpcet.apcfss.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 19వ తేదీలోపు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 7569333798 ఫోన్ నంబర్ను సంప్రదించాలని ఆమె కోరారు. రేపల్లె: పట్టణంలో ని శాఖా గ్రంథాలయాన్ని ఏపీ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ సభ్యురాలు మగతాల పద్మజ మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. పత్రికా విభాగం, పుస్తక విభాగం, రిజిస్టర్లు, రికార్డులు, శిక్షణ ఫౌండేషన్ కంప్యూటర్ రిజిస్టర్లను పరిశీలించారు. పట్టణంలోని చంద్రమౌళి పార్కులో గ్రంథాలయానికి సంబంధించిన 15 సెంట్ల భూమిలో నూతన గ్రంథాలయ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. నరసరావుపేట:జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించిన మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ విద్యార్థి షేక్ జమీర్బాషాను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అభినందించారు. మంగళవారం కలెక్టరేట్కు పిలిపించి అభినందనలు తెలియచేశారు. విద్యార్థి తల్లితండ్రులు, డీఈవో రామారావు, ప్రధానోపాధ్యాయులు టి.రవికాంత్ను సైతం అభినందించారు. జమీర్బాషా జిల్లాకే కాకుండా రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ‘పరీక్షలపై చర్చ’ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కో విద్యార్థిని మాత్రమే ఎంపిక చేయగా, ఏపీ నుంచి నరసరావుపేట మున్సిపల్ బాయ్స్ హైస్కూల్కు చెందిన జమీర్బాషా ఎంపికయ్యారు. ప్రధానమంత్రితో నేరుగా మాట్లాడి తన ప్రతిభను చాటుకున్నారు. జమీర్బాషాకు ఎడ్యుకేషన్ కమిషనర్ విజయరామరాజు శుభాకాంక్షలు తెలియచేశారు. తెనాలి:పట్టణానికి చెందిన సంగీత సంస్థ శ్రీ సీతారామ గానసభ శాసీ్త్రయ సంగీత ఉత్సవా లు మంగళవారం సాయంత్రం స్థానిక శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఆరంభించారు. తొలుత త్యాగరాజస్వామి, గానసభ వ్యవస్థాపకులు నారుమంచి సుబ్బారావు, మాజీ అధ్యక్షుడు పిరాట్ల నారాయణమూర్తి చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంగీత ఉత్సవాన్ని ప్రారంభించారు. మొదట రోజు విజయవాడకు చెందిన కుమారి మల్లాది సింధు రాజేశ్వరి సంగీత కచేరి హృద్యంగా సాగింది. వాగ్దేవి కీర్తనలను ఆలపించారు. వయొలిన్పై మీద విజయవాడకు చెందిన అంబటిపూడి కామాక్షి, మృదంగంపై విజయవాడకు చెందిన మాస్టర్ మల్లాది శివానంద ఎస్.ఎస్.వి వాయి ద్య సహకారం అందించారు. గానసభ అధ్యక్షులు పిరాట్ల రమణి పర్యవేక్షించారు. -
ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యునిగా డాక్టర్ జి. నందకిషోర్
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పాలకవర్గం సభ్యులకు సోమవారం రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఎన్నికలలో గుంటూరు ఐఎంఏ శాఖకు చెందిన డాక్టర్ జి.నందకిషోర్ సభ్యునిగా ఎన్నికయ్యారు. 13 మంది సభ్యుల ఎంపికకు మొత్తం 84 మంది వైద్యులు పోటీపడ్డారు. ఆన్లైన్లో ఎన్నికలు జరగగా అత్యధిక ఓట్లు సాధించి ఎన్నికై న 13 మందిలో డాక్టర్ నందకిషోర్ ఒకరు. 30 వేల మందికి పైగా వైద్యులు ఈ ఎన్నికలలో పాల్గొన్నారు. గతంలో డాక్టర్ నందకిషోర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ కార్యదర్శిగా, అధ్యక్షునిగా పనిచేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ సభ్యునిగా వైద్యుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఎన్నిక పట్ల ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్షుడు డాక్టర్ టి.సేవ కుమార్, కార్యదర్శి డాక్టర్ బి.సాయికృష్ణ, స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ డి.అమర్, పలువురు సీనియర్ వైద్యులు అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల కు రాష్ట్ర సెకండరీ హెల్త్ డైరెక్టర్ కె.వి.ఎన్. చక్రధర బాబు రిటర్నింగ్ ఆఫీసర్ గా వ్యవహరించారు. -
పులి వాహనంపై మల్లేశ్వరుడు
మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం స్వామి వారు వ్యాఘ్ర వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మహిళల కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. వేదపండితులు భక్తులకు ఉత్సవ విశిష్టతను వివరించారు. ఉత్సవ కై ంకర్య పరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన శిందె నారాయణ వ్యవహరించారు. దేవస్థాన ఈ.వో. గోపి ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు. -
చివరి మజిలీ.. కన్నీళ్లు మిగిల్చె..
కర్లపాలెం: ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి శవాలను తీసుకెళ్లడానికి పేదలు పడే బాధలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. మంగళవారం బాపట్ల జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో అమాననీయ ఘటన చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా చింతాయపాలెం గ్రామానికి చెందిన నక్కా నాగేశ్(55) అలియాస్ నాగేశ్వరరావు మంగళవారం ఉదయం భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు బైక్పై బాపట్ల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నాగేశ్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని చింతాయపాలెం తరలించేందుకు బాపట్ల ఏరియా ఆస్పత్రిలో మహాప్రస్థానం వాహనం కావాలని అడిగారు.వాహనం లేకపోవడంతో ఓ ఆటోవాలాను సంప్రదించగా రూ.3 వేలు కిరాయి అడగడంతో.. అంత డబ్బు వారి వద్ద లేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. విధి లేని పరిస్థితుల్లో మృతదేహాన్ని మోటారు బైక్పైనే కూర్చోబెట్టుకుని 13 కిలోమీటర్ల మేర ప్రయాణించి గ్రామానికి తీసుకెళ్లారు. మృతిచెందిన నాగేశ్కు భార్యతో పాటు ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. మహాప్రస్థానం కోసం ప్రతిపాదనలు పంపాం: జిల్లా కలెక్టర్ మృతదేహాన్ని మోటారు బైక్పై తీసుకెళ్లిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
‘సీఐఎస్ఎఫ్’ సైకిల్ యాత్ర అభినందనీయం
చెరుకుపల్లి: దేశంలోని తీరప్రాంతం రక్షణలో గానీ, ప్రగతిలో గానీ సీఐఎస్ఎఫ్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని అస్సాం సీఐఎస్ఎఫ్ కమాండెంట్ రోషన్ రాజా పేర్కొన్నారు. సీఐఎస్ఎఫ్ యూనిట్ హెచ్పీసీఎల్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో గత 13 రోజుల క్రితం ప్రారంభమైన సైకిల్ ర్యాలీ సోమవారం చెరుకుపల్లి చేరుకుంది. సందర్భంగా స్థానిక తహసీల్దార్ సీహెచ్ పద్మావతి మండలంలోని అధికారులు, విద్యార్థులు, నాయకులతో కలసి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ కమాండెంట్ రోషన్ రాజా మాట్లాడుతూ సీఐఎస్ఎఫ్ 57వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు తీర ప్రాంతంలో ఈ సైకిల్ ర్యాలీని 75మందితో పశ్చిమ తీరం గుజరాత్ నుంచి ఒక టీము, మరో 50మందితో తూర్పు తీరం పశ్చిమ బెంగాల్ నుంచి మరో టీం ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ రెండు టీములు ఈ నెల 28వ తేదీ నాటికి 1500 కిలో మీటర్లు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తూ గుజరాత్ నుంచి కేరళలోని కొచ్చిన్ బీచ్ కు చేరుకుంటాయని ఆయన తెలిపారు. ఈ సైకిల్ ర్యాలీలో మహిళలు కూడా ఉన్నారని వారు కూడా పురుషులతో సమానంగా రోజుకు 100 కి.మీ వరకు ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఈ సైకిల్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం తీర ప్రాంత ప్రజలతో మమేకమవుతూ వారికి తీర ప్రాంతంలో జాతీయ భద్రత గురించి అవగాహన కల్పించటం, ఎక్కువగా తీరప్రాంతం నుంచే డ్రగ్స్ ఎగుమతులు జరుగుతుంటాయి కాబట్టి డ్రగ్స్ నియంత్రణ పై అవగాహన తో పాటు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన జాతీయ గీతమైన వందేమాతరం పాట యొక్క విశిష్టతను, జాతీయ సేవ భావనను ప్రోత్సహించటమేనన్నారు. కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ డిపూటీ కమాండెంట్ రిషబ్ దేవగన్, అసిస్టెంట్ కమాండెంట్ అరవింద్ కుమార్ శర్మ, మండల నాయకులు ఎంఆర్కే మూర్తి, దివి రాంబాబు, కొనకాల రవికిరణ్, మల్లాది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చెరుకుపల్లి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మధ్యాహ్న భోజనం విరామం అనంతరం సైకిల్ ర్యాలీ కొనసాగింది. తహసీల్దార్ సీహెచ్ పద్మావతి చెరుకుపల్లి చేరుకున్న సైకిల్ యాత్ర -
మూట్ కోర్టు పోటీల్లో విజేతగా ‘సత్యభామ’
గుంటూరు ఎడ్యుకేషన్: రెండు రోజులపాటు జేకేసీ కళాశాల రోడ్డులోని జేసీ లా కళాశాలలో నిర్వహించిన 5వ జాతీయస్థాయి మూట్ కోర్టు పోటీల్లో తమిళనాడుకు చెందిన సత్యభామ స్కూల్ ఆఫ్ లా, ఈరోడ్ న్యాయ కళాశాల విద్యార్థి బృందాలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో విజేతలుగా నిలిచాయి. ఆదివారం రాత్రి వరకు జరిగిన పోటీల్లో విజేతలకు వరుసగా రూ.37,500, రూ.30 వేలు చొప్పున నగదు బహుమతులను అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ సుధాకర్బాబు సోమవారం తెలిపారు. ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, కళాశాల కరస్పాండెంట్ వేమన కుప్పుస్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయస్థాయికి తెలుగు నాటకం
నగరంపాలెం: నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా/ వేదిక (తెలుగు నాటక పరిషత్ల సంఘం) సంయుక్తంగా మార్కెట్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఙాన మందిరంలో నిర్వహిస్తున్న భారత్ రంగ్ మహోత్సవ్ – అంతర్జాతీయ నాటక ఉత్సవం నాలుగో రోజుకి చేరింది. సోమవారం జరిగిన సభకు వేదిక అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు అధ్యక్షత వహించగా, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, వైద్యురాలు ముత్తవరపు భార్గవిచౌదరి జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం జరిగిన సభలో తెలుగు నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు నాటకం అంతర్జాతీయ స్థాయికి సాటి అని నిరూపించేలా భారత్ రంగ్ మహోత్సవ్ కొనసాగుతుందని అన్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రభావంతో నాటక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో అంతర్జాతీయ నాటకోత్సవాలను ఏపీకి తేవడం అభినందనీయమన్నారు. సీనియర్ కళాకారులు సుబ్బరాయశర్మ, బుద్దాల వెంకట్రావు, వి.పురుషోత్తమం, దేవేంద్రలను సత్కరించారు. అనంతరం ‘ఏ వెరీ సింపుల్ స్టోరీ’ అనే రష్యన్ నాటకం ప్రదర్శించారు. రష్యన్ దర్శకుడు అలెక్సి బ్లాకి అద్భుత సృజన దృశ్యరూపంగా మలిచారు. మనుషుల స్వార్థానికి, జంతువుల నిస్వార్థ ప్రేమకు మధ్య ఉన్న సన్నని గీతను నాటకం ఆవిష్కరించింది. కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా భాషా సరిహద్దులను చెరిపేస్తూ అద్భుత అభినయంతో కరుణ, స్నేహం, పరస్పర అవగాహనే జీవిత పరమార్థమని ఈ నాటకం చాటిచెప్పింది. మానవీయ విలువలు చాటిన రష్యన్ నాటకం ‘ఎ వెరీ సింపుల్ స్టోరీ’ -
అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చాటిన సిబ్బందికి అభినందనలు
నగరంపాలెం: గతనెల 30 నుంచి ఈనెల రెండు వరకు రాజస్థాన్ అజ్మీర్లోని పటేల్ సింథటిక్ స్టేడియంలో ఆల్ ఇండియా పోలీస్ అథ్లెటిక్స్ పోటీలు జరగ్గా, గుంటూరు జిల్లా పోలీసులు ప్రతిభ చాటారు. పలు పోటీల్లో పతకాలు సాధించిన ఏఆర్ హెచ్సీ ఎండీ షాహిదుల్లా (బంగారు పతకం), కానిస్టేబుల్ ఎం.లక్ష్మయ్య (వెండి పతకం), విశేష ప్రతిభ చాటిన ఏఎస్ఐ ఎం.సాంబశివరావును సోమ వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ రమణమూర్తి పాల్గొన్నారు. -
మాల్కీలాద్రి..!
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ బియ్యం నల్లబజారుకు తరలించే మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. అయినా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. ఈ అక్రమ రవాణాను చంద్రబాబు ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్లబజారుకు తరలించే రేషన్ బియ్యంలో పట్టుబడేది ఐదు శాతం కూడా ఉండదని, 95 శాతంపైగా మిల్లులు, పోర్టులకు తరలుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో విజి‘లెన్స్’శాఖ పనితీరుపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. – చీరాల అర్బన్ చీరాల నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలుతున్నాయని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మాల్యాద్రి అనే వ్యక్తి ప్రధాన పాత్రధారని, అతనికి పచ్చ నేత అండ సంపూర్ణంగా ఉందని, అందుకు ప్రతిగా పచ్చనేతకు ప్రస్తుతం నెలకు రూ.20 లక్షలు అందుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కేసులు నమోదులోనూ మాల్యాద్రి మార్క్ మంత్రాంగం రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందనేది బహిరంగ రహస్యం. అయితే కార్డుదారుల నుంచి డీలర్లు కొంటున్నారు. డీలర్లు నుంచి మేం కొంటున్నాం. మిల్లర్లుకు, లేదా విదేశాలకు తరలించేందుకు పోర్టులకు తరలిస్తుంటాం. ఇందులో తప్పేంటని మాల్యాద్రి అండ్ కో అంటుంటారనే ప్రచారం ఉంది. ఇక సంబంధిత అధికారులకు, అక్రమార్కులకు మధ్య ఎన్ఫోర్స్మెంట్లో దీర్ఘకాలంగా పనిచేస్తూ, చీరాలతో అవినాభావ సంబంధం ఉన్న ఓ అధికారి చక్రం తిప్పుతున్నారని సమాచారం. ఆ క్రమంలో అప్పుడప్పుడు కేసులు నమోదుకు సంబంధించి సదరు అక్రమార్కులే ఏ డీలర్లు మీద 6ఏ కేసులు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలనేది చెబుతుంటారని వినికిడి. అధికారులు తమ బాధ్యతను నిర్వహిస్తున్నారని చెప్పుకోవటానికి, ఏఏ డీలర్లు అయితే తమకు సరుకు ఇవ్వరో వారిని భయపెట్టేందుకు అక్రమార్కులకు ఉభయతారకంగా ఆ పని చేస్తుంటాయని విషయం తెలిసిన వారు అంటున్నారు. కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం గతంలో రేషన్ బియ్యం నల్లబాజరుకు తరలించే క్రమంలో పలుమార్లు పట్టుబడ్డ వారికి సంబంధించి పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసేందుకు సంబంధిత అధికారులు ఫైల్ సిద్ధం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రేషన్ బియ్యం నల్లబజారుకు తరలకుండా ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టాలంటే జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. దాడులు చేస్తున్నాం ... కేసులు కడుతున్నాం రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి డీఎస్ఓ జమీర్ బాషాను ఫోన్లో వివరణ కోరగా, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి దాడులు చేస్తున్నాం. కేసులు కడుతున్నామని చెప్పారు. అయితే ఇప్పటికి మీరు ఎన్ని దాడులు నిర్వహించారు, ఎన్ని కేసులు కట్టారనే ప్రశ్నకు జవాబు దాట వేస్తూ, ఆ విషయాలు మీరు స్థానిక తహసీల్దార్, అక్కడి అధికారులను అడగాలని చెప్పారు. అందరికి సమాధానం చెప్పలేక పోతున్నామన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఫీల్డ్లో కేసులు నమోదు చేసేందుకు ప్రత్యేక పంథాతో మాల్యాద్రి మార్క్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఓ పాత ఆటోలో 30 లేదా 40 బస్తాలు రేషన్ బియ్యం ఉంచి నల్లబజారుకు తరలించే క్రమంలో పట్టుకున్నట్లు, సంబంధికులపై 6ఏ, క్రిమినల్ కేసులు నమోదు చేసేటట్లు చేయటం ప్రత్యేకతని ప్రచారం జరుగుతోంది. చీరాల నుంచి గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లకు, కొత్తపట్నం మిల్లులకు అక్రమంగా తరలిస్తున్నారని చెప్పుకుంటున్నారు. గతంలో డీఎస్ఓ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు, గస్తీ ముమ్మరంగా ఉండేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నల్లబజారుకు తరలుతున్న రేషన్ బియ్యంపై చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గతానికి ఇప్పటికి నమోదవుతున్న కేసులు అందుకు నిదర్శనమంటున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి మా విధులు మేం నిర్వహిస్తున్నాం. మా పరిధిలో 20 నియోజకవర్గాలు ఉంటాయి. ప్రత్యేకంగా చీరాల అని చెప్పలేం కానీ మేం దాడులు నిర్వహిస్తున్నాం. పలు చోట్ల పెద్ద మొత్తాల్లో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనాలు పట్టుకుని సీజ్ చేశాం. కేసులు నమోదు చేశాం. అలానే ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వయిరీలకు సంబంధించి అన్ని నివేదికలు సమర్పించాం. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసేవారు ఎవరైనా ఉపేక్షించం. – చంద్రశేఖర్, సీఐ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, గుంటూరు. -
భూ వివాదాలపై అధిక ఫిర్యాదులు
నరసరావుపేట రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు భూ వివాదాలపై అధిక ఫిర్యాదులు అందాయి. నరసరావుపేట మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఎం.వెంకటరమణ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక సమస్యలతో పాటు పలు మోసాలకు సంబంధించిన 99 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో అధికంగా భూ వివాదలపై 27, ఆర్థిక సమస్యలపై 24, భార్యభర్తల వివాదాలు 14, ఆస్తి వివాదాలు 11, ఉద్యోగాల పేరుతో మోసాలపై నాలుగు ఫిర్యాదులు వచ్చాయి. పీజీఆర్ఎస్ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను డీఎస్పీ ఆదేశించారు. లండన్లో ఉద్యోగం అంటూ మోసం హోటల్ మేనేజ్మెంట్ రంగంలో లండన్లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.4లక్షలు తీసుకుని మోసం చేసినట్టు సత్తెనపల్లి మండలం దీపాల దిన్నెపాలెంకు చెందిన యువకుడు ఫిర్యాదు చేశాడు. 2024 డిసెంబర్లో నగదు తీసుకుని ఇప్పటివరకు ఉద్యోగం ఇప్పించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు. మోసానికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తప్పుడు లెక్కలతో ‘ఫైనాన్స్’ వేధింపులు.. కారంపూడి మండలం కాకానివారిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి 2023లో పాతఆటోను ఫైనాన్స్లో రూ.2.20లక్షలకు తీసుకున్నాడు. ఇందుకు గాను రూ.25వేలు డౌన్ పేమెంట్ కట్టి ప్రతి నెల రూ.9వేలు చెల్లించేవిధంగా ఒప్పందం చేసుకున్నాడు. 24 నెలల పాటు డబ్బులు చెల్లించినా బండి క్లియరెన్స్ ఇవ్వకుండా ఆటో ఫైనాన్స్ వారు వేధిస్తున్నారని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశాడు. రైల్వే ఉద్యోగం పేరిట టోకరా.. పెదకూరపాడు మండలం గారపాడు గ్రామానికి చెందిన యువకుడు కేతనకొండ ఆర్కే కాలేజీలో పాలిటెక్నిక్ రెండవ సంవత్సరం చదువుతూ మానేశాడు. ఆ సమయంలో కడపకు చెందిన వ్యక్తి పరిచయమై రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.35.18లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడని తెలిపాడు. పలు మార్లు ఫోన్లో సంప్రదించగా రూ.3లక్షలు తిరిగి ఇచ్చాడని, ఇప్పుడు ఫోన్లో కూడా స్పందించడం లేదని న్యాయం చేయాలని వేడుకున్నాడు. పీజీఆర్ఎస్కు 99 అర్జీలు ిస్వీకరించిన మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ వెంకటరమణ -
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్
వెట్టి చాకిరీ రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దుదాం బాపట్ల: వెట్టి చాకిరి రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. వెట్టి చాకిరి నిర్మూలన చట్టం అమల్లోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా బాండెడ్ లేబర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ, కార్మిక శాఖ షాడోస్ డీబీఆర్సీ, ఎస్ఎఫ్ఐ, ఆర్డీ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో పోస్టర్లను జిల్లా కలెక్టర్ వి వినోద్కుమార్ సోమవారం ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెట్టి చాకిరి ఒక అమానుష సామాజిక దురాచారమని, దీనిని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం 1976లో వెట్టి చాకిరి నిర్మూలన చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని తెలిపారు. చట్టం అమలులోకి వచ్చి ఐదు దశాబ్దాలు గడిచాయని, బాపట్ల జిల్లాను వెట్టిచాకిరి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలనీ పిలుపునిచ్చారు. జిల్లా కార్మిక శాఖ ఏసీఎల్ శివప్రసాద్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు గౌరవంగా, స్వేచ్ఛతో జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని, వెట్టి చాకిరి చట్టవిరుద్ధమే కాకుండా మానవ హక్కుల ఉల్లంఘన అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, షాడోస్ ప్రతినిధులు రాజాసల్మాన్, భాగ్యలక్ష్మి, అలేఖ్య, డీబీఆర్సీ ప్రతినిధులు శ్రీలత, భగవాన్దాస్, ఎస్ఎఫ్ఐ ఆర్డీ ప్రతినిధులు కిశోర్, తిరుపతిరావు, సుజని తదితరులు పాల్గొన్నారు. -
ఇంకెప్పుడు స్వామీ..!
మహాశివరాత్రిని పురస్కరించుకుని కోటప్పకొండలో నిర్వహించే తిరునాళ్ల మహోత్సవాలకు గడువు దగ్గర పడుతుంది. ఈ నెల15వ తేదీ మహాశివరాత్రికి రెండు రోజుల ముందు ఏకాదశి నుంచే కోటప్పకొండకు భక్తుల రాక ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచే తిరునాళ్ల ప్రారంభమైనట్టు భక్తులు భావిస్తారు. ఇందుకు ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నా ఏర్పాట్లు కొలిక్కి రాలేదు. కొండకు వచ్చే రహదారులు గోతులమయంగా ఉన్నా ఆ శాఖ ఇప్పటి వరకు మరమ్మతు పనులు చేపట్టలేదు. – నరసరావుపేట రూరల్ క్యూలైన్ వద్ద చలువ పందిళ్లు కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై మూడుసార్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సైతం సమీక్షలో పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరునాళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. తిరునాళ్లకు మరో మూడు రోజులే సమయం ఉన్నా పనుల్లో వేగం కనిపించడం లేదు. రహదారుల పరిస్థితి ఆధ్వానం ... కోటప్పకొండకు చేరుకునే ప్రధాన రహదారుల మినహా మిగిలిన రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. చిలకలూరిపేట మేజర్ కెనాల్ రోడ్డు పెద్ద పెద్ద గోతులతో నిండిపోయింది. ప్రభలు కొండకు చేరుకునే సమయంలో అర్ధరాత్రి ఈ మేజర్ కెనాల్ వద్ద ట్రాఫిక్ నిలిచిపోతుంటుంది. ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు ఈ రోడ్డును వినియోగిస్తారు. అలాగే ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించే కొండకావూరు రోడ్డులో కూడా మరమ్మతు పనులు చేపట్టలేదు. యూటీ నుంచి క్రషర్స్ మీదుగా ట్రాఫిక్ మళ్లిస్తారు. ఈ రోడ్దు దుమ్ముతో నిండిపోయి ఉంది. చినతురకపాలెం నుంచి గొనెపూడి, గురవాయపాలెం నుంచి గొనెపూడి రోడ్లు మరమ్మతు పనులు ప్రారంభించలేదు. జాతర జరిగే కొండ దిగువున ప్రధాన రోడ్లులో విద్యుత్ దీపాలు ఏర్పాట్లు పనులను ఆర్అండ్బీ ఎలక్ట్రీకల్ విభాగం ప్రారంభించింది. ప్రధాన రోడ్డులో ఐరెన్ పోల్స్కు విద్యుత్ దీపాలు బిగించే పనులు నిర్వహిస్తున్నారు. బారికేడింగ్ పనులు ప్రారంభించలేదు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా నూతన ట్రాన్స్ ఫార్మర్స్ను ఏర్పాటు చేసే పని విద్యుత్ శాఖ చేపట్టింది. మేజర్ కెనాల్ వద్ద భక్తులు స్నానాలు ఆచరించే ప్రాంతంలో తాత్కాలిక మరుగుదొడ్లు పనులు ప్రారంభం కాలేదు. -
మంగళగిరిలో మేఘాలయ ఎన్హెచ్ఎం బృందం పర్యటన
మంగళగిరిటౌన్:గుంటూరు జిల్లా మంగళగిరి లో మేఘాలయ నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) బృందం పర్యటించింది. ఈ మేరకు అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమం కింద రాష్ట్ర ఆరోగ్య, వైద్యశాఖ అవలంబిస్తున్న విధానాలను మంగళగిరిలోని పలు యూపీహెచ్ సెంటర్లలో సోమవారం బృందం సమీక్షించింది. ఇందిరానగర్లోని అర్బన్ హెల్త్ సెంటర్ను సందర్శించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పథకాల అమలు పై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనీమియా కింద గర్భిణులు, బాలింతలు, బాలికలు, విద్యార్థుల్లోని రక్తహీనత తగ్గించేందుకు అందిస్తున్న మాత్రలు, ఇతర చర్యల గురించి వైద్య అధికారులు వివరించారు. కార్యక్రమంలో మేఘాలయ ఎన్హెచ్ఎం సీనియర్ అధికారులు డాక్టర్ నోవెరినా మరక్, బాదోండర్ షిల్లా, ఇందిరానగర్ యూపీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ అనూష తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చిత్రకారులు వజ్రగిరి జెస్టిస్కు జాతీయ గోల్డెన్ మాస్టర్ స్ట్రోక్ అవార్డు వినుకొండ:క్రియేటివ్ ఆర్ట్స్ అధినేత అంజి ఆకొండి ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన మాస్టర్ స్ట్రోక్ జాతీయ చిత్రకళా ప్రదర్శనలో వినుకొండ పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారులు డాక్టర్ వజ్రగిరి జెస్టిస్ గీసిన మహేంద్ర మాత మేదరి చిత్రటానికి గోల్డెన్ స్ట్రోక్ అవార్డు లభించింది. జాతీయ సీనియర్ చిత్రకారులు దాకోజు శివప్రసాద్, వర్థమాన నటుడు సుబ్బు, ఆర్టిస్ట్ ఆనంద్, ప్రొఫెసర్ సుందర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. అవార్డు పొందిన జెస్టిస్ను పలువురు అభినందించారు. ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈ చిలకలూరిపేట: లంచం తీసుకుంటూ పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో సోమవారం చోటు చేసుకుంది. గుంటూరు రేంజ్ ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తే తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట పంచాయతీరాజ్ డీఈ కార్యాలయంలో పీవీ లక్ష్మీ సత్యనారాయణాచార్యులు ఏఈగా విధు లు నిర్వహిస్తున్నారు. ఓ అప్రోచ్రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ పెద్ద మస్తానయ్యకు రూ.8 లక్షలు బిల్లు చెల్లించేందుకు మూడు శాతం అంటే రూ. 24 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో సంబంధిత కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించటంతో, ముందస్తు వ్యూహం ప్రకారం రూ. 24వేలు లంచం తీసుకుంటుండగా ఏఈను పట్టుకున్నారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు నాగరాజు, సుబ్బారావు, సురేష్, మన్మథరావు పాల్గొన్నారు. గాయత్రీ మాత ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు గుంటూరురూరల్: చౌడవరం గ్రామం దాసరిపాలెంలో కొలువై ఉన్న ప్రసిద్ధ పంచముఖి గాయత్రీ మాత దేవాలయంలో 74వ బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం గాయత్రీ మాత సూర్యనారాయణస్వామి కల్యాణమహోత్సవ 16 రోజుల పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు వెండి పట్టుచీరె అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. చుట్టుపక్కల గ్రామాలు, నగరంలోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ మహోత్సవాల నిర్వహణను దేవాలయ మేనేజింగ్ ట్రస్టీ వడ్డే రామిరెడ్డి, సెక్రటరీ వడ్డే విజయభాస్కర్రెడ్డి, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. -
నయన మనోహరంగా శ్రీవారి పుష్పయాగం
బాపట్ల: స్థానిక కోన కళాక్షేత్రంలో లలితా త్రిపుర సుందరీ పీఠం ఆధ్వర్యాన సోమవారం సాయంత్రం నయన మనోహరంగా శ్రీవారి పుష్పయాగం సాగింది. పుష్పయాగ శోభాయాత్ర, శ్రీ సీతారామ కోలాట సమాజం వారి కోలాటం, భక్త జన సందోహంతో పురవీధుల్లో వైభవంగా సాగింది. నెమలికంటి హనుమంతరావు సారధ్యంలో ముత్తేవి శ్రీనివాస శశికాంత్ యాగ్నీక పర్యవేక్షణలో రొంపిచర్ల కేశవాచార్యులు, పరాశరం రఘురామ్, గోపాలాచార్యులు, కౌండిన్య, సాయి వెంకట్, ప్రసాద్ స్వామి, విఖనస మూర్తి, మణికంఠ, బండి రాంబాబు, కృష్ణగౌడ్ బాలాజీ, అంజిరెడ్డి, నాళం శ్రీను, సుదర్శన్, రాజు, వేలాదిగా భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ పాల్గొన్నారు. -
వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి
నరసరావుపేట: వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలనలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహా పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వెట్టి చాకిరి వ్యవస్థ (బాండెడ్ లేబర్) నిర్మూలన దినోత్సవం సందర్భంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో సోమ వారం కలెక్టరేట్ నుంచి చేపట్టిన ర్యాలీకి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ర్యాలీ సాగింది. జేసీ మాట్లాడుతూ సమష్టి కృషితోనే సమసమాజం సాధ్యమవుతుందన్నారు. వెట్టిచాకిరి ఒక సామాజిక దురాచారమని, భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, గౌరవప్రద జీవనానికి అవకాశం కల్పిస్తుందని చెప్పారు. కార్మిక శాఖ సహాయ కమిషనర్ షేక్ మహబూబ్ సుభాని, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి, కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆర్థిక అక్షరాస్యతపై పోస్టర్ ఆవిష్కరణ.. నరసరావుపేట: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆధ్వర్యంలో సోమవారం నుంచి 13 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం సందర్భంగా ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన పోస్టర్లను కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ సంజన సింహ ఆవిష్కరించారు. ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత ఎంతో కీలకమని, సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, డిజిటల్ లావాదేవీలు, పొదుపు అలవాట్లు, ఆర్థిక మోసాల నుంచి రక్షణపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కేఎస్ రాంప్రసాద్, ఝాన్సీరాణి పాల్గొన్నారు. పల్నాడు జాయింట్ కలెక్టర్ సంజన సింహా -
బాపట్ల
మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 36.1380 టీఎంసీలు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 538.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 12,864 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5200, గరిష్ట ధర రూ.6800, మోడల్ ధర రూ.6400 వరకు పలికింది. 7 -
సున్నా వడ్డీకి మంగళం
క్రాఫ్ రుణాలు సకాలంలో చెల్లించినా పైసా విదల్చని ప్రభుత్వం వేటపాలెం: రైతులు పంటల సాగు కోసం తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే ఇస్తున్న సున్నా వడ్డీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు రూ.18 నెలల కాలంలో ఇప్పటి వరకూ నయా పైసా కూడా వడ్డీ రాయితీ విడుదల చేయలేదు. ఫలితంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దాదాపు లక్ష పైచిలుకు మంది రైతులు నష్టపోయారు. అన్నదాతలకు ఎంతో మేలు చేసే ఈ పథకానికి 2004లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. తాను నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో పంట పెట్టుబడి కోసం రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా చూసిన ఆయన ఈ పథకాన్ని ప్రకటించారు. అప్పటి వరకు రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను ఒక్క సంతకంతో మాఫీ చేశారు. ఆ తరువాత రైతులు తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లిస్తే 4 శాతం వడ్డీ రాయితీ చెల్లిస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద పంట రుణాలు తీసుకున్న రైతుల నుంచి ఏడాదికి వసూలు చేసే వడ్డీలో కేంద్ర ప్రభుత్వం 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం చొప్పున భరిస్తున్నాయి. తద్వారా రైతులపై వడ్డీ భారం పడదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు ఐదేళ్లూ పూర్తి వడ్డీ రాయితీ అందించి ఎంతో మేలు చేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం అమలును పూర్తిగా నీరుగార్చింది. జిల్లాలోని జాతీయ, గ్రామీణ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పరిధిలో దాదాపు లక్ష మందికిపైగా రైతులు వివిధ పంటల సాగు కోసం సుమారు రూ.600 కోట్ల రుణాలు పొందారు. ఇందులో సన్న, చిన్నకారు రైతులు రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు తీసుకున్న పంట రుణాలకు వడ్డీ రాయితీ పథకం వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రాయితీకి ఎగనామం పెట్టడం వల్ల అసలుతోపాటు మొత్తం వడ్డీ రైతులే చెల్లించాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏటా రుణాలు సక్రమంగా చెల్లించే ప్రతి రైతుకు క్రమం తప్పకుండా రూ.3 వేల చొప్పున వడ్డీ రాయితీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా కింద ఇవ్వాల్సిన రూ.4 వేల వడ్డీ రాయితీని 18 నెలలుగా ఇవ్వడం లేదు. ఈ విధంగా జిల్లాలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.190 కోట్ల మేరకు వడ్డీ రాయితీ చెల్లించాల్సి ఉందని సమాచారం. ప్రభుత్వం వడ్డీ రాయితీ విడుదల చేస్తే ఆ మొత్తాన్ని తిరిగి జమ చేస్తామని చెబుతూ బ్యాంకులతోపాటు సొసైటీలు రైతు నుంచి వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఎవరైనా రైతులు వడ్డీ చెల్లించకపోతే వారికి రుణాలిచ్చేందుకు ఆయా బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. దీంతో కొంత మంది రైతులు బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తున్నారు. అలా చెల్లించలేనివారు తమకు పంట రుణాలు ఏ విధంగా వస్తాయో అర్థంగాక ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వడ్డీ రాయితీ చెల్లిస్తుందని గతేడాది బ్యాంకులకు చెల్లించలేదు. ఇటీవల రుణం కోసం బ్యాంకులకు వెళ్తే.. ప్రభుత్వం వడ్డీ రాయితీ విడుదల చేయలేదని అక్కడి అధికారులు చెప్పారు. గతేడాది తీసుకున్న రుణంపై వడ్డీ వసూలు చేశారు. వెంటనే వడ్డీ రాయితీ బకాయిలు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి. –డీ వసుంధర, మహిళా రైతు, వేటపాలెం ఏటా రుణాలు సక్రమంగా చెల్లించడంతో బ్యాంకులు తిరిగి రుణాలివ్వడంతోపాటు ప్రభుత్వం వడ్డీ రాయితీ కూడా సక్రమంగా అందించేది. కానీ రెండేళ్లుగా రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నా వడ్డీ రాయితీ రావడం లేదు. బ్యాంకు అధికారులు రుణాలు సకాలంలో చెల్లించాలని ఒత్తిడి తేవడంతో వడ్డీ కూడా చెల్లిస్తున్నాం. –బలరామిరెడ్డి, రైతు, వేటపాలెం -
పిన్నెల్లి సోదరులతో వైఎస్సార్ సీపీ నేతల ములాఖత్
వెల్దుర్తి: జంట హత్యల అక్రమ కేసులో జైలుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను సోమవారం ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి, పార్టీ వెల్దుర్తి మండల నాయకులు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా వెల్దుర్తి నాయకులు ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడుతూ.. అధికార పార్టీలో ఆధిపత్య పోరులో భాగంగా జరిగిన జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులను అన్యాయంగా ఇరికించి వారిని ఇబ్బందులకు గురిచేయటం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం చంద్రబాబు ప్రభుత్వానికి తగదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. అందులో భాగంగానే పిన్నెల్లి సోదరులపై కుట్రతో జంట హత్యల కేసును బనాయించిందన్నారు. ఇలాంటి అక్రమ కేసులు తమ నాయకులను ఏమీ చేయలేవన్నారు. ములాఖత్ అయినవారిలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రాయంకుల గోపాల్, మండాది సర్పంచ్ శీలం సైదారెడ్డి, కండ్లకుంట సొసైటీ మాజీ అధ్యక్షుడు తాడికొండ పుల్లారెడ్డి, కండ్లకుంట మాజీ సర్పంచ్ అమరయ్య, అంజిరెడ్డి ఉన్నారు. డీఎస్పీ ఎం.హనుమంతరావు నరసరావుపేట టౌన్: మహాశివరాత్రి సందర్బంగా కోటప్పకొండ తిరునాళ్లలో ఏర్పాటు చేసే విద్యుత్ ప్రభల వద్ద నిర్వహించే కార్యక్రమాల్లో అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు హెచ్చరించారు. సోమ వారం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15వ తేదీన జరిగే కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్ల సందర్భంగా సాధారణ ప్రభలు 100, విద్యుత్ ప్రభలు 30 నుంచి 40 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆలయాల పరిసరాలలో డెకరేషనన్ లైటింగ్ ఏర్పాటు చేసే ప్రదేశాలు, విద్యుత్ ప్రభల వైర్ల వద్దకు భక్తులు, పిల్లలు వెళ్లకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభల నిర్వాహకులకు సూచించారు. స్థానిక పోలీసు అధికారులు, ఆలయ కమిటీసభ్యులు, ప్రాథమిక ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారుల సమన్యయంగా వ్యవహరిస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటారన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరునాళ్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరునాళ్లకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన ముందుస్తు చర్యలు తీసుకున్నామని, వాహనాల పార్కింగ్కి అనువైన ప్రదేశాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రశాంత వాతావరణంలో తిరునాళ్ల ఉత్సవాలు జరిగేలా భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. డీఎస్పీతో పాటు సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రేపు అండర్–17 జూనియర్ షూటింగ్ బాల్ జట్టు ఎంపిక గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరు జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి గుంటూరు రూరల్ లాల్పురంలోని కాటూరి పబ్లిక్ స్కూల్లో అండర్–17 బాలబాలికల సబ్ జూనియర్ పోటీలు నిర్వహిస్తామని అసోసియేషన్ చైర్మన్ మార్కపూడి రవిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారు జనవరి 1, 2010 తర్వాత జన్మించిన వారై ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు 8639922978 నెంబర్లో సంప్రదించాలన్నారు. -
జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్లో పతకాలు
బాపట్ల: రాజస్థాన్లో జనవరి 30 నుంచి ఈనెల 2వ తేదీ వరకు జరిగిన జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్లో బాపట్ల క్రీడాకారులకు పతకాలు సాధించారని బాపట్ల అసోసియేషన్ కార్యదర్శి షేక్ నజీర్ పేర్కొన్నారు. ఈ మేరకు క్రీడాకారులను సోమ వారం స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అభినందించారు. 60 ఏళ్లు పైబడిన గ్రూపులో బత్తుల సాంబశివరావు హైజంప్లో సిల్వర్ మెడల్, 50 ఏళ్లు పైబడిన గ్రూపులో ఎం.మురళీకృష్ణారెడ్డి పోల్వాల్ట్లో సిల్వర్ మెడల్, 75 ఏళ్లు పైబడిన విభాగంలో 5 కిలోమీటర్లు వాకింగ్లో ముప్పలనేని రామారావు బ్రాంజ్మెడల్ సాధించారు. ఈ మేరకు క్రీడాకారులను బాపట్లలో పలువురు సన్మానించారు. -
‘పది’లో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
యాజలి(కర్లపాలెం): పదవ తరగతి పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని బాపట్ల జిల్లా విద్యాశాఖాధికారి డి.శ్రీనివాస్ చెప్పారు. బాపట్ల డివిజన్ పరిధిలో పదవతరగతి చదువుతూ చదువుల్లో వెనుకబడిన బాలికల కోసం యాజలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వసతి గృహాన్ని డీఈఓ శ్రీనివాస్ సోమవారం సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం బాలికా విద్యను ప్రోత్సహిస్తుందని చెప్పారు. బాలికలందరూ పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించటమే లక్ష్యంగా ప్రభుత్వం బాలికల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ తరగతులను నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. పదవ తరగతిలో మంచి మార్కులతో పాసయ్యే విధంగా ప్రత్యేకమైన సిలబస్ను రూపొందించి బోధించటం జరుగుతుందని తెలిపారు. ఎంఈఓ విజయశ్రీ మాట్లాడుతూ బాపట్ల డివిజన్ పరిధిలోని 12 మండలాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చదువుతూ చదువులో వెనుకబడిన బాలికలు చక్కగా చదివి పాసయ్యే విధంగా యాజలి ఉన్నత పాఠశాలలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. యాజలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం బి.సుగుణమణి, డెప్యూటీ డీఈఓ శివబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి డి. శ్రీనివాస్ -
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సమావేశం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి సీతానగరంలోని సీతా భవన్లో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యక్రమాలపై సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆరు నెలల కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికల ప్రకారం మార్చి 8వ –10 తేదీ వరకు కంచి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి స్వామి వారి సూచనల మేరకు ప్రకాశం బ్యారేజ్ నుంచి హంసల దీని వరకు దేవత వృక్షాలను నాటడం జరుగుతుందని తెలిపారు. ఆషాడ మాసం వ్యాస పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. గ్రామాల కేంద్రంగా ఉన్న దేవాలయాల్లో నిరంతర పూజా కార్యక్రమాలు, దీప ప్రజ్వలనలు, ధూపదీప నైవేద్యాలు నిరాటంకంగా కొనసాగేందుకు ఆర్థిక సహకారం అందించే పెద్దల మద్దతుతో చర్యలు తీసుకుంటామన్నారు. ట్రస్ట్ కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్లు ఊడ్చి పీఏసీఎస్ ఉద్యోగుల నిరసన కొరిటెపాడు(గుంటూరు): దీర్ఘకాలికంగా పేరుకుపోయిన వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు శ్యామలానగర్లోని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చొక్కాలు విప్పి చీపుర్లు చేతబట్టి రోడ్లు శుభ్రం చేస్తూ, సమస్యలు పరిష్కరించి తమ ఆకలి తీర్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏలూరు, కోనసీమ జిల్లాలకు చెందిన పీఏసీఎస్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ పీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ వెంటనే జీఓ నంబర్ 36ను అమలు చేసి పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేసి అప్పటి వరకు మధ్యంతర భృతిని ఇవ్వాలని కోరారు. అలాగే ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యూటీ సీలింగ్ను రూ.2 లక్షల నుంచి ఎత్తి వేయాలన్నారు. గ్రాట్యూటీ చట్టం ప్రకారం చెల్లింపులు చేయాలన్నారు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా పరభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా, రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ను చేయించాలని సూచించారు. -
బాపట్ల ఫొటోగ్రాఫర్కు జాతీయస్థాయి అవార్డు
బాపట్ల టౌన్: బాపట్ల ఫొటోగ్రాఫర్ డాక్టర్ పీవీఎస్ నాగరాజుకు ఫొటోగ్రఫీలో జాతీయ అవార్డు దక్కింది. ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్ అండ్ ఫొటో ఫైన్ ఎక్స్పో–2026, సిగ్మా ఆర్ట్ ఫొటోగ్రఫీ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో బాపట్ల మండలం, ముత్తాయపాలెం గ్రామానికి చెందిన పవన్ క్లాసిక్ ఫొటోగ్రఫీ అధినేత డాక్టర్ పీవీఎస్ నాగరాజు తీసిన వెడ్డింగ్ ఫొటోకు జాతీయస్థాయి అవార్డు లభించింది. అవార్డును ఈనెల 8న హైదరాబాద్లోని ఎల్బీ నగర్ కేబీఆర్ ఫంక్షన్హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మరెడ్డి భరద్వాజ, ఫెడరేషన్ ఇండియన్ ఫొటోగ్రఫీ ప్రెసిడెంట్ సీఆర్ సత్యనారాయణ, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఆనంద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అవార్డు అందుకున్న పీవీఎస్ నాగరాజును పట్టణ ఫొటోగ్రాఫర్లు అభినందించారు. -
ఇంటర్కు ఇన్విజిలేటర్లేరీ?
ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో కీలకమైన ఇన్విజిలేషన్ విధులకు గుంటూరు జిల్లాలో అధ్యాపకుల కొరత ఏర్పడింది. ఈ నెల 23వ తేదీ నుంచి జరగనున్న పబ్లిక్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సైన్స్, ఒకేషనల్ విద్యార్థులకు జరుగుతున్న ప్రాక్టికల్స్ ఈ నెల 10వ తేదీన ముగియనున్నాయి. థియరీ పరీక్షలపై దృష్టి సారించిన అధికారులకు ఇన్విజిలేటర్ల కొరత ఇబ్బందికరంగా మారింది. జిల్లాలోనే అధికం ప్రైవేటు అధ్యాపకులకు బాధ్యతలు -
ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీడీపీ కుట్రలు
చెరుకుపల్లి: రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని అబద్ధపు ఆరోపణలు చేస్తోందని, వైఎస్సార్సీపీ నాయకులపై కక్షపూరిత దాడులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున ఆరోపించారు. మండలంలోని గుళ్ళపల్లి గ్రామంలో డాక్టర్ ఈవూరు గణేష్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కటీ నెరవేర్చకుండా మోసం చేసిందన్నారు. వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వెంకటేశ్వర స్వామిని కూడా అపవిత్రం చేశారన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే ఒక అసత్య ప్రచారానికి తెరలేపి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన బృందం ఇలా పైశాచిక ఆనందం పొందుతోందని ధ్వజమెత్తారు. లడ్డూ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు, అత్యున్నత న్యాయస్థానాలు సైతం కల్తీ జరగలేదని తేల్చి చెప్పినా కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల ప్రసాదాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు పవిత్రంగా భావిస్తూ స్వీకరిస్తుంటే దానిని దెబ్బతీసేలా ఫినాయిల్ కూడా కలిసిందని టీడీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం దారుణమని పేర్కొన్నారు. మరో అడుగు ముందుకేసి రాష్ట్రంలో ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేయటం వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అని దుయ్యబట్టారు. పరిపాలన తీరుపై ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ నాయకులపై, కార్యకర్తలపై విచక్షణరహితంగా దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇది మంచి సంస్కృతి కాదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే చంద్రబాబు ప్రభుత్వ బెదిరింపులను లెక్క చేయకుండా గుంటూరులో మంత్రి అంబటి రాంబాబు ఇంటికి, ఇబ్రహీంపట్నంలో మంత్రి జోగి రమేష్ నివాసానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చినప్పుడు ప్రజలు వెంట నడిచారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా పేదలకు సంక్షేమం అందిస్తూనే విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చి నాణ్యమైన విద్య అందించారని తెలిపారు. దౌర్భాగ్యపు సీఎం అనంతరం వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ మాట్లాడుతూ ప్రతి పేద విద్యార్థికి వైద్య విద్య అందాలనే పట్టుదలతో ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని అనుమతులతో 17 మెడికల్ కళాశాలలను కట్టించాలని నిర్ణయించారన్నారు. నేడు అది కూడా ఓర్వలేక ప్రభుత్వ మెడికల్ కళాశాలలను అమ్ముకునేందుకు మార్కెట్లో పెట్టిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి చంద్రబాబు అని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు, ఇతర టీడీపీ నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న దాడులను, లడ్డూపై చేస్తున్న అసత్య ప్రచారాలను ఆపి వేసి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని డాక్టర్ మేరుగ నాగార్జున, డాక్టర్ ఈవూరు గణేష్లు వెంకటేశ్వరస్వామిని ప్రార్థించారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ దుండి వెంకట రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
బహిరంగంగా మద్యం తాగేవారిపై చర్యలు
మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్, హాజరైన జిల్లాలోని పోలీసు అధికారులుబాపట్ల టౌన్: బహిరంగంగా మద్యం తాగే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం జిల్లాలోని పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న రౌడీ షీటర్లు, చెడు నడత కలిగిన వ్యక్తులపై పీడీచట్టం ప్రయోగించాలన్నారు. మహిళల సంబంధిత నేరాలు, పోక్సో కేసులు, మిస్సింగ్ కేసులు, హత్యా నేరాలు, దొంగతనాలు, దోపిడీలు, రోడ్డు ప్రమాదాలు, నేరాలకు పాల్పడిన వారికి న్యాయస్థానాల్లో విధించబడిన శిక్షలు, డ్రోన్ నిఘా, స్మార్ట్ పోలీసింగ్, యాప్ల వినియోగంపై అధికారులకు పలు సూచనలు చేశారు. విచారణ దశలో ఉన్న కేసుల దర్యాప్తుపై ఆరా తీశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిర్దిష్ట గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానాలలో చార్జ్షీట్ దాఖలు చేయాలన్నారు. నేరాలు జరగకుండా ముందస్తుగా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీరి ఆగడాలు అరికడితే నేరాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రేపల్లె, చీరాల, బాపట్ల డీఎస్పీలు ఎ. శ్రీనివాసరావు, ఎం.డి.మోయిన్, పి.జగదీష్ నాయక్, జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ -
కొనసాగుతున్న వైద్య ప్రదర్శన
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో మెడ్ ఫ్యూజన్ పేరుతో ఈ నెల 4వ తేదీ నుంచి జరుగుతున్న వైద్య ప్రదర్శన ఆదివారం కూడా కొనసాగింది. డైరెక్టర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఎగ్జిబిషన్ను సందర్శించారు. అనాటమీ, జనరల్ సర్జరీ సహా పలు విభాగాల ప్రదర్శనను సందర్శించారు. వాటి వివరాలను తమ కుమార్తెకు వివరిస్తూ, చూపించారు. వైద్య విద్యార్థులతో ముచ్చటించారు. తాను ఎంబీబీఎస్ చదివే రోజులను గుర్తు చేసుకున్నారు. ఇలాంటి విజ్ఞాన ప్రదర్శనలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అనంతరం ఆయన్ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారి శాలువాతో సత్కరించారు. ఒక్కరోజే 4,184 మంది సందర్శన... ఆదివారం 4,184 మంది ప్రదర్శనను సందర్శించారని ప్రిన్సిపల్ తెలిపారు. ముందస్తుగా వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని రావాలని సందర్శకులకు విజ్ఞప్తి చేశారు. కళాశాల వద్ద నేరుగా టికెట్లు తీసుకోవడం వల్ల ఒక్కసారిగా రద్దీ ఏర్పడే అవకాశముందని పేర్కొన్నారు. బుకింగ్ ద్వారా సమస్యను నివారించవచ్చని తెలిపారు. -
ఏఆర్ బలగాలకు విజయవంతంగా శిక్షణ
నగరంపాలెం: ఏఆర్ బలగాల శారీరక దృఢత్వం, ఆయుధాల వినియోగంలో నైపుణ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా శిక్షణ (మొబిలైజేషన్) నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఆదివారం పోలీస్ కవాతు మైదానంలో జిల్లా ఏఆర్ బలగాలకు డి–శిక్షణ నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఏటా ఏఆర్ బలగాలకు శిక్షణ, డి–శిక్షణ నిర్వహించడం తప్పనిసరని అన్నారు. వీవీఐపీ, వీఐపీ కార్యక్రమాలు, విస్తృత బందోబస్త్ విధులు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. పోలీస్ సిబ్బంది శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడం చాలా అవసరమని అన్నారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు మాట్లాడుతూ ఏఆర్ బలగాలకు విజయవంతంగా శిక్షణ నిర్వహించామని పేర్కొన్నారు. అనంతరం ఏఆర్ బలగాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పరేడ్ను జిల్లా భద్రత విభాగ ఆర్ఐ శ్రీనివాసరావు పరేడ్ కమాండర్గా వ్యవహరించారు. జిల్లా భద్రత విభాగపు పోలీస్ జాగిలం (సింబా) ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాగిలం ప్రతిభను జిల్లా ఎస్పీ ప్రశంసించారు. కార్యక్రమంలో డీఎస్పీలు సంకురయ్య (ఏఆర్), అరవింద్ (గుంటూరు పశ్చిమ), సీఐలు నాగుల్మీరా, బిలాలుద్దీన్, ఆర్ఐలు శివరామకృష్ణ, శ్రీహరిరెడ్డి, సురేష్, శ్రీనివాసరావు, ఆర్ఎస్లు, ఏఆర్ బలగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలం మల్లన్న తలపాగా గ్రామోత్సవం
మంగళగిరి టౌన్: మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలం మల్లి కార్జున స్వామికి అలంకరించే తలపాగాకు మంగళగిరిలో గ్రామోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. మంగళగిరి పట్టణంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయంలో తలపాగాకు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఓం నమశ్శివాయ నామస్మరణతో తలపాగాను శిరస్సుపై ఉంచుకుని పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఊటుకూరు సుబ్రహ్మణ్యస్వామి, మాడిశెట్టి శివశంకరయ్యలు మాట్లాడుతూ మల్లికార్జున స్వామి వారి పెండ్లికుమారుని ఉత్సవం, దేవాంగులు నేసిన తలపాగా వస్త్ర విశిష్టత గురించి కొనియాడారు. రాష్ట్ర పద్మశాలీయ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం మంగళగిరి అధ్యక్షులు బల్లా వెంకటరమణ, అల్లక తాతారావు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో నేడు పీజీఆర్ఎస్ రద్దు
బాపట్ల: స్థానిక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతోపాటు కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తునట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పీజీఆర్ఎస్ రద్దు చేసినట్లు తెలిపారు. మండల కేంద్రాల్లో పీజీఆర్ఎస్ కొనసాగుతుందని తెలిపారు. -
మహాశక్తి దేవతగా బగళాముఖి అమ్మవారు
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం మహాశక్తి అలంకరణలో పూజలు అందుకున్నారు. అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేశారు. పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో రావటంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. అమరావతి: మండల పరిధిలోని అత్తలూరు గ్రామంలో అత్యంత పురాతనమైన పునీత తోమాసవారి ఉత్సవాలను ఆదివారం ఎంతో వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే ప్రార్థన కార్యక్రమాలలో భాగంగా గుంటూరు మేత్రాసన విశ్రాంత బిషప్ రెవరెండ్ గాలిబాలి, జిల్లా వ్యాప్తంగా పలు చర్చిల నుంచి వచ్చిన 40 మంది విచారణ గురువులతో దివ్య పూజాబలి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అత్తలూరు తోమాస చర్చి ఫాదర్ చాట్ల కస్పార్ మాట్లాడుతూ అందరూ దైవం పట్ల విశ్వాసంతో, తోటి మానవుల పట్ల కరుణతో జీవించాలన్నారు. ఏసుప్రభువు మానవులకు చేసిన అనేక మంచి కార్యాలకు కృతజ్ఞతగా ఈ పండుగను నిర్వహిస్తున్నామన్నారు. సాయంత్రం 4 గంటలకు నిర్వహించిన కోలాట ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఐదు గంటలకు కొవ్వొత్తులతో వీధులలో ప్రదర్శన నిర్వహించారు. రాత్రికి ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో, పూలతో అలంకరించిన తేరుపై ఏసుప్రభువు విగ్రహాన్ని ఉంచి పురవీధులలో తేరు ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో విచారణ గురువులు, మఠ కన్యలతోపాటు భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 3.3 సెంటీమీటర్ల అతి సూక్ష్మ వరల్డ్ కప్ నమూనా తయారీ చీరాల: అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో చరిత్ర సృష్టించిన భారత్ జట్టుకు బాపట్ల జిల్లా చీరాలకు చెందిన స్వర్ణకారుడు నక్కా వెంకటేష్ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రతిభతో 3.3 సెంటీమీటర్ల అతి సూక్ష్మమైన అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ నమూనా తయారు చేశారు. క్రికెట్లో ఇంగ్లండ్ను ఓడించిన భారత్ యువ క్రికెటర్లకు దీనిని అంకితం చేశారు. ఈ కప్పును 0.500 మిల్లీగ్రాముల బంగారాన్ని, 2.900 మిల్లీగ్రాముల వెండిని ఉపయోగించి రెండు రోజులు పాటు శ్రమించి తయారు చేసినట్లు తెలిపారు. నకరికల్లు: సీనియర్ సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ మండలంలోని అడ్డరోడ్డులో గల అభయాంజనేయ స్వామిని ఆదివారం దర్శించుకున్నారు. కొండవీడు ఉత్సవాల్లో పాల్గొనేందుకు బయలుదేరిన ఆయన మార్గమధ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకుడు విను కొండ కొండామాచార్యులు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. రాజేంద్ర ప్రసాద్ను కలిసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. -
కోర్టు భవన నిర్మాణంలో నాణ్యత పాటించండి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లుపర్చూరు (చినగంజాం): పర్చూరు కోర్టు భవన నిర్మాణంలో నాణ్యత పాటిస్తూ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు అన్నారు. పర్చూరులోని కోర్టు భవనం శిథిలావస్థకు చేరడంతో అద్దె భవనంలోకి కోర్టును మారుస్తున్న క్రమంలో ఆదివారం అద్దె భవనాల ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు పర్చూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.జాన్బాబు అధ్యక్షత వహించారు. హైకోర్టు జడ్జిలు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ వై.లక్ష్మణరావు ముఖ్య అతిథులుగా మాట్లాడారు. కోర్టు పాత భవనం శిథిలావస్థకు చేరినందున దాని స్థానంలో కొత్త భవనం నిర్మాణం జరిగే వరకు అద్దె భవనంలో కోర్టు కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. కొత్త భవన నిర్మాణంలో ఎటువంటి నాణ్యత లోపాలు లేకుండా కోర్టు నిర్వహణ అవసరాలను గుర్తించి ఆధునిక సౌకర్యాలతో నిర్మాణం పూర్తి చేయాలని సంబంధిత విభాగాలకు సూచించారు. కోర్టు భవనాలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ న్యాయమూర్తులు జస్టిస్ టి.సునీల్ చౌదరి, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు, ప్రకాశం జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి టి.రాజ్యలక్ష్మి, జిల్లా సెషన్స్ రిటైర్డ్ జడ్జి ఎ. భారతి తదితరులు పాల్గొన్నారు. -
బాలకోటేశ్వరస్వామి ఆలయానికి విరాళం
గోవాడ(వేమూరు): మహాశివరాత్రిని పురస్కరించుకుని గోవాడలోని బాలకోటేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఘంటా నిర్మలమ్మ దంపతులు రూ.లక్ష విరాళం అందజేసినట్లు దేవస్థానం చైర్మన్ రమేష్ తెలిపారు. భక్తులకు తాగునీటి సౌకర్యార్థం తెనాలి కుమార్ పంప్స్ అధినేత సబ్రహ్మణ్యం రూ.70 వేల విలువైన ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం దాతలు ఆలయంలో పూజలు నిర్వహించారు. రేపల్లె: ప్రమాదవశాత్తూ కృష్ణాదిలో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ వివరాల మేరకు... మండలంలోని తుమ్మల పంచాయతీ గాదెవారిపాలేనికి చెందిన గాదె అర్జునరావు (78) ఇటీవల పట్టణంలోని తన కుమార్తె ఇంటికి వచ్చాడు. శనివారం విజయవాడలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లే క్రమంలో పెనుమూడి వద్ద కృష్ణానదిలో కాళ్లు కడుకుంటూ ప్రమాదవశాత్తూ ముందుకు పడి నీటిలో మునిగిపోయి మృతి చెందాడన్నారు. మృతుని కుమారుడు శ్రీహరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. తెనాలి: తెనాలి కెమెరా క్లబ్కు చెందిన ఫొటోగ్రాఫర్, శిక్షకుడు కోకాటి నాగేశ్వరరావు (నాగు) ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్లో ద్రోణాచార్య సేవా పురస్కారం స్వీకరించారు. హైదరాబాద్లోని కేబీఆర్ ఫంక్షన్హాలులో జరుగుతున్న మూడురోజుల ఫెస్టివల్లో ఆదివారం ఈ పురస్కారాన్ని జేఎన్ఏఎఫ్యూ (ఫొటోగ్రపీ), హైదరాబాద్ ప్రిన్సిపాల్ ఆనంద్, హెచ్ఓడీ కమల్రాయ్ చేతులమీదుగా బహూకరించారు. నాగేశ్వరరావును తెనాలి కెమెరా క్లబ్ సభ్యులు, పట్టణానికి చెందిన ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అభినందించారు. రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా నాగమల్లేశ్వరరావు నరసరావుపేట: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్ఎస్ఎ) జిల్లా అధ్యక్షుడిగా పిడుగురాళ్ల తహసీల్దార్ కె.నాగమల్లేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నరసరావుపేటలోని ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న రెవెన్యూ భవనంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన నెల్లూరు జిల్లా అధ్యక్షులు పెంచలరెడ్డి పేర్కొన్నారు. అసోసియేట్ అధ్యక్షులుగా దాచేపల్లి తహసీల్దార్ జి.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా కారంపూడి తహసీల్దార్ ఆర్.వెంకటేశ్వర్లునాయక్, నరసరావుపేట తహసీల్దార్ కార్యాలయ టైపిస్టు శిరిగురి నాగరాజకుమారి, బొల్లాపల్లి తహసీల్దార్ ఏవీ సుధాకర్, పల్నాడు జిల్లా కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ షేక్ బాజి ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా అచ్చంపేట తహసీల్దార్ సీహెచ్.శ్రీనివాసరావు, కార్యదర్శిగా క్రోసూరు తహసీల్దార్ వీవీ.నాగరాజు, సంయుక్త కార్యదర్శులుగా పెరుసుమల నరసయ్య, నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయానికి చెందిన నంద్యాల ఆంజనేయులు, వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయ టైపిస్టు వి.నాగవల్లి, రెంటచింతల తహసీల్దార్ కార్యాలయ ఎంఆర్ఐ ఎం.మనమోహన్ప్రసాదు, కోశాధికారిగా సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కె.కోటేశ్వరరావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా కలెక్టరేట్లోని జూనియర్ అసిస్టెంట్ పి.వీరప్రతాప్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా గురజాల ఆర్డీఓ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ వి.వెంకటరెడ్డి, మాచవరం తహసీల్దార్ కార్యాలయ టైపిస్టు పి.నరేష్ ఎన్నికయ్యారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా రెండోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియచేశారు. రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికై న నాగమల్లేశ్వరరావును ఉన్నతాధికారులు, రెవెన్యూ సిబ్బంది సత్కరించారు. పిడుగురాళ్ల ప్రజలు తమ తహసీల్దార్ జిల్లా స్థాయి గుర్తింపు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. -
టీడీపీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదు
పెదకూరపాడు: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదని జలాలపురం గ్రామానికి చెందిన వ్యాపారి, సీనియర్ నాయకులు సరిపూడి రామారావు ఆవేదన వ్యక్తంచేశారు. జలాలపురంలోని తన స్వగృహంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గెలుపు కోసం సొంత డబ్బులు ఖర్చు చేశానన్నారు. గ్రామంలోనే టీడీపీకి చెందిన వారు నాపై హత్యాయత్నం చేసినా ఎమ్మెల్యే ప్రవీణ్ కనీసం పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాపై దాడి చేసిన వారే నాపై కేసులు పెట్టించారని తెలిపారు. పార్టీలో న్యాయం జరగదని భావించి సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా పత్రాన్ని టీడీపీ మండల అధ్యక్షులు ఏటుకూరి బ్రహ్మయ్యకు అందజేస్తామన్నారు. తనతోపాటు తన అనుచరులు కూడా త్వరలోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారని తెలిపారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. -
పోటీలలో పాల్గొంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె.లక్ష్మీశాతాడేపల్లి రూరల్: చిన్నవయసులోనే ఈత నేర్చుకోవడమే కాకుండా పోటీల్లో పాల్గొనడం వల్ల చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె.లక్ష్మీశా పేర్కొన్నారు. ఆదివారం ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి ఉన్న ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేన్ ఆధ్వర్యంలో 26వ కృష్ణా రివర్ క్రాస్ ఈతపోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె.లక్ష్మీశా మాట్లాడుతూ ఈత అనేది ఒకరకమైన వ్యాయామ క్రీడ అని పేర్కొన్నారు. ఈత శరీరానికి మంచి వ్యాయామం అని అన్నారు. ఏపీ ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ పి.వెంకటరమణ పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతుల చెక్కులు, మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జె. లక్ష్మీశాను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు లింగిపిల్లి రామకృష్ణ మాట్లాడుతూ అసోసియేషన్ లైఫ్ చైర్మన్ గోకరాజు గంగరాజు ఆశీస్సులతో గత 26 సంవత్సరాలుగా కృష్ణానదిలో ఈత పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 10 సంవత్సరాల నుండి 88 సంవత్సరాల వయస్సు వారు మొత్తం 634 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారని, మొత్తం 8 కేటగిరీలలో ఆడ, మగ పోటీదారులకు విడివిడిగా 16 గ్రూపులుగా పోటీలు నిర్వహించామని తెలిపారు. వేసవి కాలంలో సుమారు 300 మంది పిల్లలకు ఈత నేర్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరి యార్లగడ్డ రమేష్కుమార్, కన్వీనర్ వడిపినరాము, వైస్ ప్రెసిడెంట్ గోపాలం సాంబశివరావు, కె.వి.రామయ్య, ఎ. రామిరెడ్డి, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు పోలీస్ గ్రీవెన్స్ రద్దు
నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం నారా చంద్రబాబునాయుడు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం వరకు రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో మంత్రులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరవుతారని, పోలీస్ బందోబస్త్ ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో తాత్కలికంగా రద్దు చేశామని, అర్జీదారులు గమనించాలని అన్నారు. తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున కొలనుకొండ వద్ద ఒక లారీ క్యాబిన్లో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలో లారీ క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది. సేకరించిన వివరాల ప్రకారం... విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో ఓవర్లోడ్తో వెళుతున్న ఇసుక లారీ కొలనుకొండ ప్రాంతానికి వచ్చే సరికి లారీ క్యాబిన్లో నుంచి మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ లారీ దిగి ప్రాణాలతో బయట పడ్డారు. వారి కళ్లముందే నిమిషాల వ్యవధిలో లారీ దగ్ధమైంది. సమాచారం అందుకున్న మంగళగిరి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. సాంకేతిక లోపం, ఓవర్ లోడ్ వల్ల లారీ ఇంజిన్ వేడి ఎక్కి ఈ మంటలు వ్యాపించి ఉంటాయని లారీ డ్రైవర్లు చెబుతున్నారు. -
జిల్లాలో భారీగా ఫోన్ల రికవరీ
బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ బాపట్లటౌన్: జిల్లాలో జనవరి మాసంలో రూ.50 లక్షల విలువైన 237 ఫోన్లను రికవరీ చేశామని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం బాధితులకు ఫోన్లను అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ తక్కువ ధరకు వస్తున్నాయని బిల్లులు లేని సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. 2026 జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో ఐటీ కోర్ బృందం, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేసి, వివిధ ప్రాంతాల్లో పోయిన 237 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారన్నారు. నేటి ఆధునిక సమాజంలో మొబైల్ ఫోన్ అనేది ప్రతి వ్యక్తికి అత్యంత ఆవశ్యకమైన, విలువైన వస్తువుగా మారిందన్నారు. కేవలం సమాచార మార్పిడికే కాకుండా, వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, ఆర్థిక లావాదేవీలు ఇతర పలు వివరాలను ప్రతి ఒక్కరు ఫోన్లలో నిక్షిప్తం చేసుకుంటున్నారన్నారు. అనుకోని పరిస్థితుల్లో ఫోన్ పోగొట్టుకుంటే దానిలో ఉన్న సమాచారాన్ని తిరిగి పొందడం కష్టసాధ్యంగా ఉంటుందన్నారు. ప్రజలు పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసేందుకు జిల్లాలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే www.ceir.gov.in వెబ్సైట్ను సందర్శించాలన్నారు. ఆ పోర్టల్లో బ్లాక్ స్టాలెన్/లాస్ట్ మొబైల్ ఆప్షనన్ను ఎంచుకుని, ఫోన్ ఐఎంఈఐ నంబర్, మొబైల్ కొన్న రసీదు కాపీని అప్లోడ్ చేయాలన్నారు. ఇలా ఫిర్యాదు చేయడం ద్వారా పోయిన ఫోన్న్ను ఎవరైనా వాడాలని ప్రయత్నిస్తే ఆ ఫోన్ సిగ్నల్ పనిచేయకుండా బ్లాక్ అవుతుందన్నారు. తద్వారా ఫోన్ ట్రేసింగ్ సులభమవుతుందన్నారు. బిల్లులు లేని ఫోన్లను కొని అనవసరమైన ఇబ్బందుల్లో పడవద్దని ప్రజలను ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో చీరాల డీఎస్పీ ఎం.డి.మొయిన్, రేపల్లె డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు, సోషల్ మీడియా సీఐ వి.సూర్యనారాయణ, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రధాన ఆకర్షణగా ‘ఆ ఊరు – ఈ ఊరు’
నగరంపాలెం: నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా/ వేదిక (తెలుగు నాటక పరిషత్ల సంఘం) సంయుక్తంగా మార్కెట్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఙాన మందిరంలో నిర్వహిస్తున్న భారత్ రంగ్ మహోత్సవ్ – అంతర్జాతీయ నాటక ఉత్సవం ఆదివారం మూడో రోజుకి చేరింది. వేదిక అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు అధ్యక్షత వహించారు. దేశ, విదేశీ భాషలు, విభిన్న కళారూపాల సమ్మేళనంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు ప్రముఖ రచయితలు, కళాసంస్థలు, నాటక పరిషత్ నిర్వాహకులు, కళాకారులు తరలివచ్చారు. బళ్లారి రాఘవయ్య ఓపెన్ థియేటర్లో పాటలు, ఆటలు, కోలాటాలు, చెక్క భజనలు, డప్పు వాయిద్యాల విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. సాయంత్రం జ్యోతిప్రజ్వలన చేసి, తెలుగు రాష్ట్రాల్లోని పలు కళాపరిషత్ నిర్వాహకులను సత్కరించారు. అనంతరం నటమిత్రారు హవ్యాసి కళా సంఘం (తిరుత్తహల్లి, కర్నాటక) ప్రదర్శించిన ఆ ఊరు – ఈ ఊరు నాటకం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పల్లెటూరు కుటుంబ నేపథ్యంతో సమాజంలోని లోపాలను నిర్భయంగా ప్రశ్నిస్తూ, ప్రేక్షకులను ఆలోచనల లోకంలోకి తీసుకెళ్లింది. ఈ నాటకం జి.బి.జోషి రచించగా, హుళుగప్ప కట్టిమాని దర్శకత్వం వహించారు. కన్నడ భాషలో ప్రదర్శించినా.. కళాకారుల హావభావాలు, అభినయాలు భాషా అవరోధాలను చెరిపివేస్తూ ప్రేక్షకులకు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని మిగిల్చాయి. కొనసాగిన ‘భారత్రంగ్ మహోత్సవ్’ -
లబోదిబోమంటున్న మహిళ
తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పోలకంపాడు నుంచి ఉండవల్లి దళితకాలనీకి వెళ్లే కరకట్టపై పట్టపగలు నలుగురు మహిళలు ఉండగా ఒక మహిళను టార్గెట్ చేసి ఆమె అరువు తెచ్చుకున్న బంగారపు గొలుసును చైన్స్నాచర్లు లాక్కెళ్లిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. ఉండవల్లి పరిధిలోని దళిత కాలనీకి వెళ్లే కరకట్టపై ఉదయం కోటిచుక్కల లక్ష్మి తన బంధువులతో కలసి శుభకార్యానికి వెళుతున్నారు. ఇదే సమయంలో ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై ఎదురుగా వచ్చి వీరిని దాటుకుని వెళ్లారు. రెండునిమిషాల వ్యవధిలో తిరిగి వచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న లక్ష్మి మెడలోని బంగారం గొలుసును, సూత్రాలతో సహా లాక్కెళ్లారు. ఈక్రమంలో కోటిచుక్కల లక్ష్మి కింద పడిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే చైన్ స్నాచర్లు పరారయ్యారు. పక్కనే ఉన్న మహిళలు బండి ఢీకొందని అనుకున్నారు. కానీ మెడలో తాడు లాక్కెళ్లారని చెప్పడంతో మిగిలిన మహిళలు పెద్దగా కేకలు వేశారు. అప్పటికే ద్విచక్రవాహంపై వారు పరారయ్యారు. కోటిచుక్కల లక్ష్మి బంధువుల ఇళ్లలో శుభకార్యానికి వెళుతూ.. పక్క ఇంటిల్లోని వారు గొలుసును అరువుకు తెచ్చుకుని మెడలో వేసుకుంది. సుమారు 30 గ్రాములు ఉండే ఆ బంగారు గొలుసు లాక్కెళ్లడంతో గొలుసు యజమానికి డబ్బులు ఎలా కట్టాలని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తోంది. సమాచారం అందుకున్న తాడేపల్లి ఎస్ఐ సంఘటనా స్థలానికి వచ్చి బాధిత మహిళ వద్ద వివరాలు తెలుసుకున్నారు. నలుపు, ఎరుపు ద్విచక్రవాహనంపై ఒకరు హెల్మెట్ ధరించి ఉండగా, మరొకరు వెనుక కూర్చున్నారని, వారిలో ఒక టక్ చేసుకుని ఉన్నారని లక్ష్మి తెలిపింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఐ ఖాజావలి పలుచోట్ల సిసి కెమెరాలను పరిశీలించగా ఆమె చెప్పిన గుర్తులతో ఉన్న యువకులు ద్విచక్రవాహనాన్ని వేగంగా నడుపుకుంటూ ఉండవల్లి సెంటర్వైపు వెళ్లారు. జరిగిన సంఘటనపై ఎస్ఐ ఖాజావలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ చుట్టుపక్కల చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న బిహార్కు చెందిన వ్యక్తులు అని పోలీసులు భావిస్తున్నారు. బయటకు వెళ్లే సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ ఖాజావలి సూచించారు. ఉయ్యూరు: ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో ఆదివారం భక్తిపారవశ్యం వెల్లివిరిసింది. కల్పవల్లికి భక్తజనం నీరాజనం పలికారు. వేకువజాము నుంచే వేలాది మంది భక్తులు ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చి పాల పొంగళ్లు, చలువ కావిళ్లు, జోడు పొట్టేళ్ల ప్రభ బండ్లు కానుకగా సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఉయ్యూరు పట్టణం అంతా వీరమ్మతల్లి నామస్మరణతో భక్తజన సంద్రంగా మారింది. పలువురు భక్తులు ప్రసాదాలు పంపిణీ చేసి అమ్మవారి సేవలో తరించారు. -
వినుకొండ ఫొటోగ్రాఫర్కు ‘సిగ్మా’ అవార్డు
వినుకొండ: పట్టణానికి చెందిన కేసానపల్లి సుబ్బారావు జాతీయ స్థాయిలో వివాహ ఆచారాల కేటగిరిలో సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డు అందుకున్నారు. ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్–2026లో భాగంగా సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ నిర్వహించిన పోటీలలో వెడ్డింగ్ మూమెంట్స్ ఫొటోకు అవార్డు దక్కింది. హైదరాబాద్లో ఆదివారం జరిగిన అవార్డు ప్రదానం కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా సుబ్బారావు అవార్డు అందుకున్నారు. సుబ్బారావును పల్నాడు జిల్లా ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్బీకే, వినుకొండ ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు సూర్య, బ్రహ్మం, వెంకటేష్, పెద్దమల్లయ్య, శ్రీకాంత్, సీపీ కృపాకర్, వేణు, నరేంద్ర అభినందించారు. పిడుగురాళ్ల ఫొటోగ్రాఫర్లకు అవార్డులు పిడుగురాళ్ల: ిపడుగురాళ్ల పట్టణానికి చెందిన ఫొటోగ్రాఫర్లు అవార్డులు అందుకున్నారు. హైదరాబాద్లోని ఈఎంఆర్సీ–ఉస్మానియా యూనివర్సిటీ సమర్పణలో ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్ ఫొటో పరివార్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ పరివార్ విశిష్టసేవా పురస్కార వేడుకల్లో పిడుగురాళ్ల పట్టణనికి చెందిన ఫొటోగ్రాఫర్లు సీదా రామరావు, రామిశెట్టి చంద్రశేఖర్రావు, రామినేని భరత్కుమార్లు వెడ్డింగ్ ఫొటోగ్రఫీ, బిజినెస్ ఎక్స్లెన్స్ అవార్డును అందుకున్నారు. -
కేంద్ర బడ్జెట్ ఓ విక‘సిక్’ బడ్జెట్
ప్రముఖ విద్యావేత్త శ్రీనివాసరావు రెంటచింతల: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్ సామాన్యులకు ఓ విక‘సిక్’ బడ్జెట్ అని దీనివలన వారికి ఒరిగేదేమి లేదని కేవలం ఇది కార్పొరేట్లకు మాత్రమే ఉపయోగపడేలా ఉందని కన్నెగంటి హనుమంతు ఫౌండేషన్ అధ్యక్షుడు, ప్రముఖ విద్యావేత్త శ్రీనివాసరావు అన్నారు. శనివారం మండల కేంద్రమైన రెంటచింతలలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశ,దిశ లేని బడ్జెట్ మాత్రమే కాక స్పష్టతలేని ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు మెండిచేయి చూపించారని విమర్శించారు. కీలక రంగాలకు సరైన కేటాయింపులు లేవని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు యువత, మహిళ, కౌలురైతు, విద్యారంగం ఉద్యోగులకు శ్రామిక, పేద, మధ్య తరగతి వర్గాలకు పన్ను సడలింపులో ప్రత్యేక ఉపశమనం లేదన్నారు. ఎరువుల సబ్సిడీ తగ్గించడంతోపాటు దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, రాజకీయాలకు సంబంధించి బడ్జెట్లో పరిష్కారమార్గాలు చూపలేకపోయారన్నారు. ప్రజలు బాధలు తీర్చలేని నిరాశ బడ్జెట్అని, ఆర్థిక వ్యవస్థను దిగజార్చే బడ్జెట్ అన్నారు. దేశంలో 147 కోట్ల మందికి ఒక్కొక్కరి తలపై 1.34 లక్షల అప్పు ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్కు కొత్త ప్రాజెక్టులు కేటాయించకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. విశాఖ ఉక్కు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రం నుంచి 22 మంది ఎంపీలు ఉన్నా సాధించింది ఏంలేదన్నారు. రాష్ట్ర విభజన హామీలను సైతం విస్మరించారని గుర్తు చేశారు. ఈ బడ్జెట్లో సామాన్య ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. -
చివరి మజిలీలో చింతింపే..!
చీరాల రూరల్: మనిషి బతికుండగా కన్నీళ్లు, కష్టనష్టాలు, ఎన్నో బాధలు.. అంతకు మించిన ఆవేదన. అదే మనిషి కన్నుమూసిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకూ అగచాట్లు వెంటాడుతున్నాయి. మానవ మృతదేహాలను ఖననం చేయాలన్నా, దహన సంస్కారాలు నిర్వహించాలన్నా పేద, మధ్య తరగతి ప్రజలకు ఖరీదైన వ్యవహారమే కాదు.. కాస్త శ్రమతో కూడుకున్న పని. కర్రలు పోగు చేయడం దగ్గర నుంచి మృతదేహం పూర్తిగా కాలిపోయే వరకు శ్మశానంలో పడిగాపులు కాయాల్సి ఉంటంది. ఈ క్రమంలో వర్షం కురిస్తే మృతుడి బంధువుల వేదన వర్ణనాతీతం. దేహాలు పూర్తిగా కాలకపోతే అరిష్టమని, ఆత్మలు శాంతించవని పెద్దలు చెబుతుంటారు. అంతేగాక మృతదేహాలు కాలే సమయంలో శ్మశానం చుట్టుపక్కల నివాసముంటున్న వారు దుర్వాసనను తప్పక భరించాల్సిన పరిస్థితి. చీరాల పట్టణంలోని కారంచేడు రోడ్డులో గల హిందూ శ్మశానవాటికలో ఈ సమస్యలన్నింటికీ చమరగీతం పాడేందుకు నాలుగేళ్ల క్రితం అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నడుం బిగించింది. గత ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి విజ్ఞప్తి మేరకు రూ.1.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. దాదాపు పనులన్నీ పూర్తయినప్పటికీ హిందూ శ్మశానవాటికను చీరాల ప్రజలు సక్రమంగా వినియోగించుకోలేని దుస్థితి. విద్యుత్, నీటి వసతికి సంబంధించి స్వల్ప స్థాయి పనులు చేపడితే శ్మశానవాటిక అందుబాటులోకి వస్తుందని తెలిసినా ప్రస్తుత పాలకులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడంపై చీరాల వాసులు దుమ్మెత్తిపోస్తున్నారు. రూ.1.40 కోట్లతో వసతులు హిందూ శ్మశానవాటికలో అభివృద్ధి పనులకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.20 కోట్ల నిధులు విడుదల చేసింది. మూడేళ్ల క్రితం పనులు ప్రారంభించిన అధికారులు దహన యంత్రాన్ని ఏర్పాటు చేసేందుకు నూతన భవనం పూర్తి చేశారు. భవనం చుట్టూ వాహనాలు తిరగటానికి వీలుగా సిమెంట్ రోడ్లు, మంచినీటి పైప్ లైన్లు ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్ సౌకర్యం కల్పించారు. దహన యంత్రాన్ని చైన్నెలో కొనుగోలు చేసి అక్కడి నిపుణులను చీరాల రప్పించి సంబంధిత పనులు సైతం పూర్తి చేయించారు. మృతదేహాన్ని కాల్చే సమయంలో చుట్టుపక్కల నివాసముంటున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పొగను నేరుగా బయటకు పంపించేందుకు భవనం పక్కనే 100 అడుగుల పొడవుతో భారీ గొట్టాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవంగా ఈ దహన యంత్రం అందుబాటులోకి వస్తే మృతదేహాల అంతిమ సంస్కార ప్రక్రియ కేవలం గంట వ్యవధిలోనే పూర్తవుతుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్మశానవాటికలో వసతులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. స్వల్ప మొత్తంలో నిధులు మంజూరు చేస్తే దహనవాటిక అందుబాటులోకి వస్తుందని పాలకులకు తెలిసినా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందూ శ్మశానవాటికలో భవన నిర్మాణం పూర్తి చేయడంతోపాటు యంత్ర పరికరాలు ఏర్పాటు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. మరికొంత నిధుల కొరత కూడా ఉంది. పనులను కొద్ది రోజుల్లో పూర్తి చేసి దహన యంత్ర సేవలను అందుబాటులోకి తీసుకువస్తాం. – రఘురాం, మున్సిపల్ డీఈ -
అస్తవ్యస్తంగా శ్మశానవాటిక
చీరాలలోని కారంచేడు రోడ్డులో గల హిందూ శ్మశానవాటిక సుమారు 13 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఉంది. అయితే మృతదేహాలను ఖననం చేసేందుకు, దహనసంస్కారాలు నిర్వహించేందుకు శ్మశానవాటికలో పరిస్థితులు అనుకూలంగా లేవు. ఒకవైపు ఏపుగా పెరిగిన చిల్లచెట్లు, ముళ్లపొదలు పెరిగిపోవడంతోపాటు పల్లంగా ఉన్న మరి కొంత స్థలంలో మురుగు నిలిచి తటాకాన్ని తలపిస్తోంది. ఈ పరిస్థితుల్లో దహన వాటిక అవసరం అందరినీ ఆలోచింపజేస్తోంది. దహన యంత్రం అందుబాటులో ఉంటే పేద, మధ్య తరగతి ప్రజలకు డబ్బు ఆదా కావడంతోపాటు ఎక్కువ సమయం అక్కడ పడిగాపులు కాసే సమస్య ఉండదని చీరాల వాసులు అభిప్రాయపడుతున్నారు. చివరి మజిలీలో ఎదురవుతున్న తిప్పలను తప్పించాలని కోరుతున్నారు. -
విద్యతో పాటు నైతికత ముఖ్యం
ఏఎన్యూ(పెదకాకాని): ప్రతి విద్యార్థి విద్యతో పాటు నైతిక విలువలు కలిగి ఉండాలని ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శనివారం విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం – నైతిక విలువలు అనే అంశంపై ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.సురేష్కుమార్ అధ్యక్షత వహించారు. ఏఎన్యూ స్వర్ణోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. విలువలతో కూడిన జీవితం ప్రతి విద్యార్థి విజయానికి మార్గమన్నారు. గురువు గౌరవాన్ని కాపాడలేని చదువు వ్యర్ధమన్నారు. విలువలతో కూడిన విద్య అభ్యసించిన వారు తప్పక విజయం సాధిస్తారన్నారు. కష్టపడిన వారు ఎప్పటికీ నష్టపోరని.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్, గొప్ప ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నెల్సన్ మండేలా, బెనారస్ యూనివర్సిటీ స్థాపనకర్త మదన్మోహన్ మాలవ్య, భూదాన ఉద్యమదాత ఆచార్య వినోభా బావే వంటి మహనీయులు సమాజంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని విజేతలుగా నిలిచారని గుర్తు చేశారు. విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యాసంస్థ, గురువులు గర్వించేలా సమాజంలో ఉత్తమ గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. వర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య కె.గంగాధరరావు, రిజిస్ట్రార్ జి.సింహాచలం, రెక్టార్ ఆర్.శివరాంప్రసాద్లు ప్రసంగించారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు హాజరయ్యారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు -
గంజాయి విక్రయించే ముఠా అరెస్ట్
గుంటూరు రూరల్: గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను కాకుమాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నగరంలోని సౌత్ సబ్డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ భానోదయ తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి వినియోగం విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్దనుంచి 3.95 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా గంజాయి సంబంధిత అక్రమ కార్యకలాపాలను నిర్మూలించడమే లక్ష్యంగా పాత నేరస్తులు, గంజాయి కేసుల్లో పాల్గొన్న నిందితులు, ఇతర అనుమానితుల కదలికలపై జిల్లా పోలీసులు కఠిన నిఘా పెట్టి దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రమంలో గతంలో గంజాయి కేసులో పట్టుబడి, జువైనల్ హోంలో ఉన్న ఓ మైనర్ ఇచ్చిన సమాచారం మేరకు దేవరకొండ వెంకటరంజిత్కుమార్, మరికొంత మంది గంజాయి వ్యాపారంలో పాల్గొంటున్నట్లు నిర్ధారించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా కొనసాగించామన్నారు. నిఘాలో శుక్రవారం కాకుమాను పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపట్ల పెదనందిపాడు రహదారిలో ఉన్న డంపింగ్ యార్డు వద్ద గంజాయి కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని అనుమానాస్పదంగా ఉన్న ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద గంజాయి లభ్యమైందన్నారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారించగా, వారు విశాఖపట్నం, ఒడిశా ప్రాంతాల నుంచి గంజాయిని అక్రమంగా తెచ్చి బాపట్ల, మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు అంగీకరించారన్నారు. నిందితులు బాపట్లకు చెందిన దేవరకొండ వెంకట రంజిత్కుమార్, బాపట్లకు చెందిన జూటు చైతన్య పరమేశ్వరరావు, మచిలీపట్నంకు చెందిన జొన్నకూటి ఉదయ కిరణ్, బాపట్లకు చెందిన మల్లెల ఆరాధన రాజా, పొట్లూరు గణేష్ అలియాజ్ బుడ్డ గణేష్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఆపరేషన్లో పాల్గొన్న ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు, కాకుమాను ఎస్ ఏకానాథ్ సిబ్బంది నరసింహ, అశోక్, ప్రసాద్, శ్రీను, చిరంజీవి తదితరులను డీఎస్పీ అభినందించారు. -
11 నుంచి సూరేపల్లిలో శివపార్వతుల కల్యాణోత్సవాలు
సూరేపల్లి(భట్టిప్రోలు): మహా శివరాత్రిని పురస్కరించుకుని భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామంలో కొలువైన కేదారేశ్వర వాయులింగ ఆలయంలో శివపార్వతుల కల్యాణం, తిరునాళ్ల కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు విశ్వేశ్వరబాబు ఆధ్వర్యంలో సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రభను, గూడు బండ్లను అందంగా తీర్చిదిద్దారు. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు ప్రతి రాత్రి 7 నుంచి 12 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. 15వ తేదీ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు స్వామి వారికి భక్తులచే స్వయంగా అభిషేకాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చెరుకుపల్లి: గ్రామ దేవత నెల్లెమ్మ తల్లి ఆలయ మొదటి వార్షికోత్సవం అంగరంగ వైభవంగా శనివారం ఆరుంబాక గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవాని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ రావూరు నాగేశ్వరరావు, డేగల పాపారావు, రావూరి వెంకట సుబ్బయ్య దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పసుపు కుంకుమ గాజులు సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కారెంపూడి: మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలో మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి రెండు రోజుల తిరునాళ్ల వైభవంగా జరుగుతోంది. రెండవ రోజు శనివారం శివపార్వతుల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. బ్రహ్మంగారి గుడి ఆవరణలో ఉన్న శివపార్వతుల గుడిలో శివపార్వతుల కల్యాణాన్ని దంపతులు పీటలపై కూర్చుని జరిపించారు. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రికి ప్రభలు కట్టి స్వామి వారికి మొక్కులు చెల్లించేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం వీరబ్రహ్మేంద్రస్వాములు గోవిందమాంబల కల్యాణాన్ని జరిపించారు. గ్రామస్తులు భారీగా తరలివచ్చి బ్రహ్మంగారికి గోవిందమాంబలకు పూజలు చేశారు. తెనాలి టౌన్: జాతీయస్థాయిలో ఉత్తమ సర్పంచ్గా అవార్డు పొందడం అభినందనీయమని ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ కొనియాడారు. తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన అభినందన సభలో నందివెలుగు సర్పంచ్ ధూళ్ళిపాళ్ల పవన్కుమార్, ఎంపీటీసీ తిన్నలూరి విజయలక్ష్మి, గ్రూప్–1 పరీక్షల్లో విజయం సాధించి డీఎస్పీగా ఉద్యోగం పొందిన నాగేశ్వరరావులను దుశ్శాలువా, పుష్పగుచ్ఛంతో అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అత్తోట దీప్తి, సీడీపీవో విజయగౌరి, డిప్యూటీ ఎంపీడీవో వైవిడి ప్రసాద్, మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. -
వైభవంగా మల్లేశ్వరుడి గ్రామోత్సవం
మంగళగిరిటౌన్: మంగళగిరి గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజులో భాగంగా ఉదయం స్వామివారికి పెళ్లికుమారుడి ఉత్సవం శోభాయమానంగా నిర్వహించారు. గణపతిపూజ, పంచామృత అభిషేకం చేశారు. అనంతరం ఉత్సవ మూర్తిని పెళ్లి కుమారుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు. రాత్రి 7 గంటలకు మల్లేశ్వరుడి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామోత్సవంలో పెళ్లి కుమారుడిని దర్శించిన భక్తులకు పవిత్ర చేకూరి సకల శుభాలు అందుకుంటారనేది భక్తుల నమ్మకం. పట్టణానికి చెంది న జంజనం నాగేంద్రరావు, విజయలక్ష్మి దంపతు లు పెండ్లి కుమారునికి మధుపర్కాలు సమర్పించారు. కార్యక్రమ ఏర్పాట్లను దేవస్థాన కార్యనిర్వహణాధికారి పర్యవేక్షించారు. -
చందాలిస్తే..సమస్యలు పరిష్కరిస్తాం
● ప్రభుత్వ ఆస్పత్రులు, వసతిగృహాలు, పాఠశాలలు, అంగన్వాడీలలో సమస్యల తిష్ట ● నిధులివ్వని చంద్రబాబు ప్రభుత్వం ● చందాల కోసం ‘బాపట్ల సేవా సేతు’ వెబ్సైట్ ● దాతలు ముందుకు రావాలని కలెక్టర్ పిలుపు ● అధికారులకు దాతలను తెచ్చే బాధ్యత -
పచ్చ నేతల పైసా వసూల్!
ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026చీరాల అర్బన్: పైసా వసూల్ పరమావధిగా పచ్చ నేతలు ముందుకు సాగుతున్నారని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ అక్రమ వ్యాపారాలకు కొమ్ముకాస్తున్న కీలక నేత, యువనేతలు తాజాగా రామాపురంలో డబ్బుతో పేకాట ఆడేందుకు ఓ సొసైటీ నిర్వహకులతో మిలాఖత్ అయినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అందుకు కోర్టు అనుమతి ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం చేయాలని వారికి ఉచిత సలహా ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అందుకు ప్రతిగా నెలకు రూ.75లక్షలు తమకు గిఫ్ట్గా ఇవ్వాలని సూచించినట్లు చర్చించుకుంటున్నారు. అందుకు ప్రతిగా ఐజీతో మాట్లాడి పోలీస్ అనుమతి ఇప్పిస్తామని సొసైటీ నిర్వహకులకు యువనేత భరోసా ఇచ్చినట్లు రాజకీయ వర్గాలతో పాటు, విషయం తెలిసిన వారందరిలోను చర్చ నడుస్తోంది. అంతిమంగా నెలకు రూ.2కోట్లు అక్రమార్జనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రేషన్ మాఫియాతో మిలాఖత్.. నెలకు రూ.25 లక్షలు అక్రమార్జన ఒంగోలుకు చెందిన మాల్యాద్రి అనే వ్యక్తికి చీరాల నియోజకవర్గం నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసేందుకు సహకరిస్తున్నారు. అందుకు మొదట నెలకు రూ.25లక్షలు కప్పం చెల్లించగా, తాజాగా తమకు నష్టాలు వచ్చాయని రూ.5 లక్షలు తగ్గించి రూ.20లక్షలు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలిసారి.. పందెం బరి! నియోజకవర్గంలో తొలిసారిగా బరులు పెట్టి కోడి పందేలు జరిపించారు. ఇది సరికొత్త జూదానికి తెరతీసినట్లయ్యింది. ఇక పందిళ్లపల్లి ఓ తోటలో కొంత కాలం కోత ముక్క ఆటకు అండగా నిలిచారు. అందుకు రోజుకు రూ.2.50 లక్షలు నజరానాగా పొందినట్లు ప్రచారం జరిగింది. బిట్టు బిట్టుకూ పర్సంటేజీ జిల్లాలో అత్యధిక అనధికారిక లేఅవుట్లు ఉన్న ప్రాంతాలలో చీరాల నియోజకవర్గం ఒకటి. ఈ క్రమంలో అనధికారిక లేఅవుట్లు వేసిన వారు ముందస్తుగా ఒక మొత్తం, తరువాత క్రయ,విక్రయాలకు సంబంధించి కీలక నేత, యువనేతలకు పర్సంటేజీలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించి పెద్ద మొత్తాలు జమవుతున్నట్లు చెప్పుకుంటున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించటం అందుకు నిదర్శనమంటున్నారు. ఐజీ గారికి చెప్తాం.. అధైర్యపడొద్దు! తాజాగా రామాపురంలో ఓ సొసైటీ నిర్వహకులు డబ్బు పెట్టి పేకాట అడించేందుకు తమకు కోర్టు అనుమతి ఉందని విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. అందుకు సంబంధించి పోలీస్ అనుమతి కోసం డీఎస్పీని కలసినట్లు తెలిసింది. అయితే ఆయన వారికి ఎలాంటి అనుమతి ఇవ్వబోమని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యువనేత సదరు సొసైటీ నిర్వహకులకు అధైర్య పడకండి, ఐజీ గారికి చెప్తాం. మీ పనులు మీరు చేసుకోండని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రామాపురంలో ఓ సొసైటీ నిర్వాహకులు తమ కార్యకలాపాలకు సిద్ధం చేసుకుంటున్న నిర్మాణంఓ సొసైటీ నిర్వహకులు రామాపురంలో డబ్బుతో పేకాట ఆడేందుకు అనుమతి ఇవ్వమని నన్ను కలిశారు. అనుమతి ఇవ్వబోమని చెప్పాం. ఇది మంచి సంస్కృతి కాదని చెప్పాను. వారు మాట్లాడే తీరుకు కొట్టినంత పనిచేశాం. వెళ్లిపోయారు. మాకు కోర్టు నుంచి ఎలాంటి డైరెక్షన్ అందలేదు. ఏదిఏమైనా జూద క్రీడలను ప్రోత్సహించేది లేదు. అలానే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే చర్యలను ఉపేక్షించం. – ఎండీ మొయిన్, డీఎస్పీ, చీరాల అక్రమ ఇసుక దందా చేసేవారికి కొమ్ముకాసేందుకు ఒక్కో ట్రాక్టరుకు(ట్రిప్పుకు) రూ.500 వసూలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. కొండలు మాదిరిగా ఉన్న ఇసుక తిన్నెలు కరిగిపోతుండటం అందుకు నిదర్శనం. చీరాల నియోజకవర్గంలో ఇసుక తవ్వకాలు, రవాణాకు అనుమతులు లేకున్నా రోజుకు సుమారు 400 ట్రిప్పుల ఇసుక అక్రమంగా తరలుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రాత్రిళ్లు మాత్రమే అక్రమ త్వకాలు, రవాణా జరుగుతోంది. అందుకు రమారమి రోజుకు రూ.2లక్షలు చొప్పున, నెలకు రూ.60లక్షలు నేతల ఖజానాకు జమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంబంధిత అధికారుల తనిఖీలు మొక్కుబడిగా ఉంటున్నాయనేది జనవాణి. అందుకు తిలాపాపం తలా పడికెడు అన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పేకాట ఆడించండి .. ఐజీ గారికి చెబుతామని ఓ సొసైటీ నిర్వాహకులకు టీడీపీ నేతల ఎర పోలీస్ అనుమతి ఇప్పించినందుకు నెలకు రూ.75 లక్షలు ఇవ్వాలని ఒప్పందం ముందు డెన్ తెరవండి.. డబ్బు నిదానంగా ఇవ్వచ్చులే అంటూ సన్నాయి నొక్కులు కోర్టు ఆర్డర్ ఉందనే ప్రచారం విస్తృతంగా చేయాలని ఉచిత సలహా రామాపురంలో ఓ సొసైటీ నిర్వాహకులు, కీలక నేత, యువనేత మధ్య పంచాయితీ అక్రమ ఆదాయం నెలకు రూ.2 కోట్లు రాబట్టే దిశగా పావులు -
పొలాలు ఇచ్చేందుకు అంగీకరించని రైతులు
గోవాడ(వేమూరు): మహా శివరాత్రి సందర్భంగా గోవాడలోని బాలకోటేశ్వరస్వామి ఆలయానికి వచ్చే వాహనాలు పార్కింగ్ చేసేందుకు తమ పొలాలు ఇచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. దీంతో దేవస్థానం అధికారులు, పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అమర్తలూరు మండలం గోవాడలోని బాలకోటేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈనెల 13వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బాలకోటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు వేల సంఖ్యలో వస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వాహనాలను పార్కింగ్ చేసేందుకు ప్రతి ఏడాది రైతులు తమ పొలాలు ఇస్తుంటారు. ట్రాఫిక్ నియంత్రణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతుంది. అయితే ఈ ఏడాది రైతులు తమ పొలాలు ఇచ్చేందుకు అంగీకరించలేదు. తహసీల్దారు నెహ్రుబాబు, చుండూరు సీఐ, ఆనందరావు, ఎంపీడీవో మారుతి శేషాంబలు శుక్రవారం వాహనాలు పార్కింగ్ చేసేందుకు స్థలం పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. రైతులు పొలాలు ఇచ్చేందుకు అంగీకరించలేదు. అధికారులలో అయో మయం నెలకొంది. ట్రాఫిక్ నియంత్రణ గురించి పోలీసు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. రైతులు పొలాలు ఇస్తే ట్రాఫిక్ నియంత్రణ సక్రమంగా నిర్వహించి, భక్తులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడటం జరుగుతుందని పోలీసులు పేర్కొంటున్నారు. రైతులు పొలాలు ఇవ్వకపోతే ట్రాఫిక్ నియంత్రణ చేయడం కష్టంగా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. రైతులు పొలాలు ఇచ్చి సహకరిస్తే మహాశివరాత్రి ఎలాంటి సమస్యలు లేకుండా జరుగుతుందని, రైతులు పూర్తిగా సహకరించాలని అధికారులు కోరుతున్నారు. తిరునాళ్ల సమయంలో ట్రాక్టర్లు తిప్పడంతో పంట దెబ్బతిని నష్టపోతున్నామని రైతులు పేర్కొంటున్నారు. -
వెంకటసుబ్రహ్మణ్యానికి జీవన సాఫల్య పురస్కారం
పెదకాకాని: గుంటూరు విశ్వనాథ సాహిత్య అకాడమీ దశమ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ కూచిపూడి నాట్య గురువు, సాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపకుడు డాక్టర్ కాజ వెంకట సుబ్రహ్మణ్యంకు విశ్వనాథ సాహిత్య అకాడమీ జీవన సాఫల్య పురస్కారం అందించారు. వీవీఐటీయూ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. మండల పరిధిలోని నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, అకాడమీ చైర్మన్ డాక్టర్ మద్దినేని సింహకౌటిల్య చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సుబ్రహ్మణ్యం దంపతులను చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ సత్కరించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి బృందం ప్రదర్శించిన కూడిపూడి నృత్యనాటకం భక్తప్రహ్లాద ప్రేక్షకులను అలరించింది. అకాడమీ కార్యదర్శి మోదుగుల రవికృష్ణ. సభ్యులు పి.సత్యనారాయణరాజు, భూసురుపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఇది రాజకీయమా .. కవ్వింపా..!
రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న చీరాల టీడీపీ శ్రేణులు చీరాల అర్బన్(చీరాల): చీరాల టీడీపీ నేతలు దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారు. అది రాజకీయమా..లేక కవ్వింపా అని చీరాల గడియార స్తంభం సెంటర్లో శుక్రవారం జరిగిన ఘటన చూసి అక్కడి జనాలు ఇలా వ్యాఖ్యానించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం సర్కిల్ వద్ద ఎలాంటి ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయకూడదని గతంలో మున్సిపల్ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే శుక్రవారం టీడీపీ శ్రేణులు వైఎస్సార్ సర్కిల్ వద్ద టీడీపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు అక్కడికి చేరారు. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించి సమీపంలో ఉన్న వీరరాఘవస్వామి దేవస్థానం వద్ద ఉంచారు. అయితే టీడీపీ శ్రేణులు పోలీసుల సాక్షిగా తిరిగి ఆ ఫ్లెక్సీని తిరిగి వైఎస్సార్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించటం విమర్శలకు తావిచ్చింది. దీనిపై వైఎస్సార్ సీపీ శ్రేణులు పోలీసులను ప్రశ్నించే క్రమంలో పోలీసులు, వైఎస్సార్ సీపీ శ్రేణులను అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి పంపించారు. వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి వారు బయటకు రాకుండా పహారా ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీకి సంబంధించిన ర్యాలీలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య గడియార స్తంభం సెంటర్లో మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీ ముందుకు సాగింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్ సీపీ శ్రేణులు బయటకు వచ్చి గడియార స్తంభం సెంటర్లో ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. పార్టీ నాయకులు మాట్లాడుతూ తిరుమల లడ్డూలో జంతు కొవ్వు లేదని సీబీఐ, సిట్ పేర్కొందన్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు దానిని మభ్యపెట్టేందుకు నెయ్యిలో రసాయనాలు కలిశాయని కొత్త పాటకు తెరలేపారన్నారు. కవ్వింపు చర్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కేసులో సంబంధం లేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి ఫొటోలతో ఫ్లెక్సీలు వేయడం దారుణమన్నారు. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ఫ్లెక్సీలు వేసి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టి రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఫ్లెక్సీ వ్యవహారంలో గుంటూరు సంఘటనలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన సంఘటన మరువకముందే చీరాలలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారన్నారు. టీడీపీ చేపట్టిన ర్యాలీ ఇదే మార్గంలో రావడంతో ఎమ్మెల్యే మెప్పు కోసం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న చీరాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే అప్పటికప్పడు ఫ్లెక్సీ వేశారని ఆరోపించారు. అభివృద్ధి పనులపై దృష్టి సారించకుండా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. టీడీపీ నీచ రాజకీయాలకు చరమగీతం పాడాలని నినాదాలు చేశారు. వైఎస్సార్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసి ఫ్లెక్సీని తొలగించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని మానవహారంగా ఏర్పడ్డారు. దీంతో పోలీసులు మనుషులను పెట్టి ఆ ఫ్లెక్సీని తొలగించారు. మొత్తం మీద ఉద్రిక్తతల అనంతరం ప్రశాంత వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గవిని శ్రీనివాసరావు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు వాసిమళ్ళ వాసు, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు చీమకుర్తి బాలకృష్ణ, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు గోసాల అశోక్, కౌన్సిలర్లు బత్తుల అనిల్, కంపా అరుణ్, గుంటూరు ప్రభాకరరావు, పార్టీ నాయకులు చెల్లి బాబూరావు తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆందోళనతో ఫ్లెక్సీని తొలగించడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే, కవ్వింపు చర్యలను ప్రజలు చూస్తూన్నారని, తాము చట్టపరంగా, ధర్మబద్ధంగా, న్యాయపరంగా మాత్రమే అడుగులు వేస్తామని పేర్కొన్నారు. అంతిమంగా పరిస్థితులు మితిమీరితే తాము కూడా అదే తీరున స్పందించటంలో ఏమాత్రం వెనకాడబోమని పేర్కొన్నారు. సదరు టీడీపీ ఫ్లెక్సీ ఏర్పాటులో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి కీలక పాత్ర పోషించటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రమంలో సదరు ఉద్యోగి ఫ్లెక్సీ ఏర్పాటుకు ఫ్లెక్సీని పట్టుకున్న సమయంలో ఫొటోలు తీస్తున్న ఓ పత్రికా విలేకరిని నువ్వెవరు ఫొటోలు, వీడియోలు తీయడానికంటూ.. రుబాబుగా ప్రశ్నించటం కూడా విమర్శలకు తావిచ్చింది. -
ఆకతాయి చేష్టలతో ‘బాంబు’ కలకలం
లక్ష్మీపురం: గుంటూరు వైద్య కళాశాలలో జరుగుతున్న ఎగ్జిబిషన్లో ఫీడ్బ్యాక్ బోర్డుపై గుర్తు తెలియని యువకుడు శుక్రవారం అల్లాహు అక్బర్ భూమ్ అని రాసి బాక్స్లో వేయడంతో బాంబు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయి ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎగ్జిబిషన్కు పలువురు విద్యార్థులు వస్తున్నారు. వారి ఫీడ్బ్యాక్ కోసం బోర్డు ఏర్పాటు చేశారు. శుక్రవారం విజయవాడలోని నాగార్జున నర్సింగ్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు వచ్చారు. ఫీడ్ బ్యాక్ బోర్డు వారిలో ప్రదీప్ సాహిత్య అనే యువకుడు ఇలా రాశాడు. బాంబు బెదిరింపు అనుకుని ఎగ్జిబిషన్ను కొద్దిసేపు నిలిపి వేశారు. నగరంపాలెం పోలీసులకు సమాచారం అందడంతో ఎవరినీ లోనికి అనుమతించలేదు. ఓ యూట్యూబ్ చానల్కు చెందిన యువకుడు దీని గురించి అడిగి, బాంబు కలకలం అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. క్లూస్ టీమ్, బాంబ్ స్క్వాడ్ కళాశాల ప్రాంగణం అంతా పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైరల్ అవ్వాలనే ఇలా చేసినట్లు చెప్పిన విద్యార్థి ప్రదీప్ సాహిత్యను మందలించి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సొంత పూచీకత్తుపై పంపించేశారు. నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ కోసం స్లిప్ రాసిన విద్యార్థి -
అంకితభావంతో పనిచేసినప్పుడే గుర్తింపు
జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ బాపట్లటౌన్: అంకితభావంతో పనిచేసినప్పుడే పోలీసులకు సరైన గుర్తింపు వస్తుందని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న వార్షిక మొబలైజేషన్ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ముగింపు సందర్భంగా జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో క్యాంప్ ఫైర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ నిత్యం ఉండే పని ఒత్తిడిని పక్కన పెట్టి, సిబ్బంది కొద్దిసేపు ఆహ్లాదకరంగా గడిపేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పునశ్చరణ చేసుకోవడానికి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఇది ఒక మంచి వేదికన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ నిరంతర ప్రక్రియని, ప్రజల విశ్వాసాన్ని పొందడమే పోలీస్ వ్యవస్థకు అసలైన పునాదని పేర్కొన్నారు. జిల్లాలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలీస్ సిబ్బంది ప్రజా సేవకుడిగా పనిచేస్తూ వారి మన్ననలు పొందాలని వివరించారు. మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమం ముగింపులో భాగంగా ఎస్పీ క్యాంప్ ఫైర్ను వెలిగించి వేడుకలను విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో చీరాల డీఎస్పీ ఎండీ మోయిన్, సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్ పాల్గొన్నారు. -
ఆలయ పునఃప్రతిష్ట అదృష్టంగా భావించాం
బాపట్ల: బాపట్లలోని క్షీరభావన్నారాయణస్వామి దేవాలయాన్ని పునఃప్రతిష్ట చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. దేవాలయ పునఃప్రతిష్ట సందర్భంగా చేపట్టిన పనులు, సేకరించిన నిధులకు సంబంధించిన లెక్కల ఆడిట్ రిపోర్టును మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, అప్పటి పునరుద్ధరణ కమిటీ సభ్యులతో కలసి శుక్రవారం విడుదల చేశారు. కోన మాట్లాడుతూ భావదేవున్ని ఊరేగింపునకు కాగడాల్లో నూనె కూడా లేని పరిస్థితి బాధ కలిగించినట్లు తన తండ్రి కోన ప్రభాకరరావు అప్పట్లో దీక్షితులు రచించిన భావదేవుని చరిత్ర పుస్తకంలో ముందు మాటగా రాశారని గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దేవాలయాన్ని పునఃప్రతిష్ట చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కార్యక్రమానికి అప్పటి అర్బన్ బ్యాంకు చైర్మన్ కొల్లిమర్ల సత్యనారాయణను కమిటీ అధ్యక్షులుగా ముందుకెళ్లామని చెప్పారు. ఆయన మరణంతో లెక్కలకు సంబంధించి కొద్దిపాటి ఆలస్యం జరిగిందని వివరించారు. రూ.40 నుంచి రూ.50 లక్షలలోపు విరాళాలు వస్తాయని, ఆ మేరకు పనులు పూర్తి చేద్దామని మొదలుపెట్టగా రూ.2.34 కోట్లు వరకు విరాళాలు రావడం సంతోషకరమన్నారు. స్వామివారికి వెండి, బంగారాన్ని రూ.1.11కోట్లతో కొనుగోలు చేయగా వాటి విలువ ప్రస్తుతం రూ.నాలుగు కోట్లకు పెరిగిందన్నారు. వీటితోపాటు తనకు వచ్చిన 13 వెండి కిరీటాలు, వెండి తోడుగు వంటివి తాను స్వయంగా చేయించానని చెప్పారు. ఆలయానికి దీర్ఘకాలిక ఆదాయాన్ని సమకూర్చేందుకు మాకర్లపూడి రామాంజనేయ కూటమిని అభివృద్ధి చేశామని, నెలకు రూ.2లక్షలు వరకు ఆదాయం వచ్చేవిధంగా ఏర్పాటు చేశామని చెప్పారు.పాతబస్టాండ్లోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయానికి రూ.15లక్షలు ఇవ్వటం జరిగిందన్నారు. రెండు ధ్వజస్తంభాలు కొత్తవి ఏర్పాటు చేశామని చెప్పారు. గాలిగోపురం నిర్మాణానికి అధికారులు తనతో టెంకాయలు కొట్టించారని, ఆ స్వామి ఆ పనులను మాతో చేయించుకోవటం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. వీటికి సంబంధించిన పూర్తి లెక్కలను అడిట్ చేయించామని తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు చేజర్ల నారాయణరెడ్డి, వక్కలగడ్డ శ్రీనివాసరావు, రామకృష్ణ భరధ్వాజ్, గురువులు తదితరులు పాల్గొన్నారు. -
భారత్ రంగ్ మహోత్సవం ప్రారంభం
ఐదురోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు నగరంపాలెం(గుంటూరు వెస్ట్): నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా–వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న భారత్ రంగ్ మహోత్సవ్, అంతర్జాతీయ నాటక ఉత్సవం శుక్రవారం గుంటూరులోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదిక అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు నేతృత్వంలో ఐదురోజులు కొనసాగనున్న ఈ ఉత్సవాలను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రతినిధి లీలాశర్మ, బెంగళూరు ప్రతినిధి వీణాశర్మ, ఏఎన్యూ థియేటర్ ఆర్ట్స్ డైరెక్టర్ నాగభూషణం, ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి రామచంద్రరాజు, నాటకరంగ ప్రముఖుడు కందిమళ్ళ సాంబశివరావు, నటుడు గోపీనాయుడు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా లీలాశర్మ మాట్లాడుతూ నాటకం కేవలం వినోద సాధనం మాత్రమేకాదని, సమాజాన్ని ప్రశ్నించే శక్తిమంతమైన మాధ్యమమని చెప్పారు. విశ్వవిద్యాలయ స్థాయిలో థియేటర్ ఆర్ట్స్కు లభిస్తున్న ప్రాధాన్యతను ఏఎన్యూ థియేటర్ ఆర్ట్స్ డైరెక్టర్ నాగభూషణం వివరించారు. అనంతరం కోరస్ రిపెర్టరీ థియేటర్ (మణిపురి) ఆధ్వర్యంలో కనుప్రియ నాటకాన్ని ప్రదర్శించారు. అంతకుముందు కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. గుంటూరు, నరసరావుపేట, యడ్లపాడు నుంచి వచ్చిన విద్యార్థినుల సంప్రదాయ నృత్యాలు, కోలాటం, నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. -
స్టేషన్లో ప్రత్యక్షమైన బాలికలు
వేటపాలెం: నెల్లూరు హోం నుంచి పారిపోయి వచ్చిన ముగ్గురు బాలికలు వేటపాలెం పోలీస్స్టేషన్లో ఉన్నట్లు ఎస్సై పి.జనార్దన్ శుక్రవారం తెలిపారు. ముగ్గురు బాలికలు మధ్యాహ్నం వేటపాలెం బైపాస్ రోడ్డులో తిరుగుతుండగా పోలీసులు కంట పడ్డారని తెలిపారు. బాలికలను విచారించగా కట్ట జ్యోతి (కావలి), గందల చందన (నెల్లూరు), గురుశి మిఽథున్ (నెల్లూరు)గా చెప్పినట్లు ఎస్సై తెలిపారు. వీరు ముగ్గురు నెల్లూరు హోం నుంచి పారిపోయి ఇక్కడకి వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం వేటపాలెం పోలీస్ వారి సంరక్షణలో ఉన్నట్లు వివరించారు. వివరాలకు 9121102141, 912102143 నంబర్లను సంప్రదించాలని తెలియజేశారు. -
గనులు భూగర్భశాఖలో ఏసీబీ సోదాలు
ఒంగోలుసిటీ:ఒంగోలులోని గనులు, భూగర్భజలా ల (మైన్స్ అండ్ జియాలజీ) శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్న షేక్ అబ్దుల్ ఆసిఫ్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు అందిన సమాచారం ఆధారంగా అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం స్థానిక మంగమూరు రోడ్డు వేద రెసిడెన్సీలోని కార్యాలయంలో సోదాలు చేపట్టిన ఏసీబీ బృందం ఆసిఫ్ను అదుపులోకి తీసుకుని విజయవాడకుతరలించింది. ఆసిఫ్ది మార్కాపురం కాగా కనిగిరిలో వివాహం చేసుకుని ప్రస్తుతం విజయవాడలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఆయన గతంలో కడప, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో పనిచేశారు. ఏడాదిగా ఒంగోలు డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. నెల్లూరులో పనిచేస్తుండగా ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి పక్కా సమాచారం అందిన నేపథ్యంలో నెల్లూరు ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు. ఆసిఫ్ నివాసం విజయవాడలో ఉండటంతో అక్కడి స్వగృహంతోపాటు మార్కాపురం, కనిగిరి, నెల్లూరు, గుంటూరుల్లోని బంధువుల ఇళ్లల్లో కూడా ఏకకాలంలో ఏసీబీ సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సోదాల్లో అతని అక్రమ ఆస్తులకు సంబంధించి వివిధ డాక్యు మెంట్స్ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారు లు తెలిపారు. అక్రమ ఆస్తు ల్లో రెండు ఇళ్లు, ఒక ఇంటి స్థలం, 22ఎకరాల వ్యవసా య భూమి, రూ.2,82,264 నగదు, సుమారు 620 గ్రాముల బంగారం, సుమా రు 500 గ్రాముల వెండి, రూ.3,54,000 ల ప్రాంసరీనోట్లు, 16 చేతిగడియారాలు, ఒక మోటారు సైకిల్, విలువైన గృహోపకరణాలు ఉన్నట్లు తెలిపారు. ఇవికాక అసిఫ్ హెచ్డీఎఫ్సీ ఇన్సూరెన్స్లో రూ.15 లక్షలతో పాలసీలు తీసుకొన్నట్లు చెప్పారు. టొయోటా హై రైడర్ కారు కొనడానికి రూ.20 వేలు అడ్వాన్స్గా ఇచ్చినట్లు గుర్తించారు. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ సోదాల్లో ఒక లాకర్ను గుర్తించారు. సోదాల అనంతరం సర్వేయర్ను అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్నట్లు చెప్పారు.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సర్వేయర్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు -
సందడిగా విజ్ఞాన్ మహోత్సవ్
చేబ్రోలు: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి 19వ ఎడిషన్ విజ్ఞాన్ మహోత్సవ్ కార్యక్రమం రెండో రోజు శుక్రవారం సందడి సందడిగా సాగింది. విజ్ఞాన మహోత్సవ్లో భాగంగా నిర్వహిస్తున్న పోటీల్లో విద్యార్థులు నువ్వా–నేనా అన్న రీతిలో పోటీ పడ్డారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం (చాంపియన్ మూవీ) మాట్లాడుతూ నటుడిగా ఎదగాలంటే భాషపై పట్టు అవసరమని, మంచి నటుడిగా మారాలంటే భాషలో నైపుణ్యం పెంపొందించుకోవాలని విద్యార్థు లకు సూచించారు. మంచి విమర్శలను అంగీకరించడం ద్వారా మాత్రమే వ్యక్తి ఎదుగుదల సాధ్యమని వివరించారు. జీవితాన్ని, పుస్తకాలను, సినిమాలను గమనిస్తే అనేక మంచి ఆలోచనలు వస్తాయన్నారు. భవిష్యత్తులో ఇంట్లో కూర్చొని కూడా ‘అవతార్’ తరహా సినిమాలను రూపొందించే స్థాయికి సాంకేతికత ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు -
ఆ ఫ్లెక్సీలు తొలగించండి. వైఎస్సార్సీపీ నిరసన
చీరాల: బాపట్ల జిల్లాలోని చీరాలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ టీడీపీ ఫ్లెక్సీలు వెలిశాయి. టీడీపీ కట్టిన ఫ్లెక్సీలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిరసన చేపట్టింది. దీనిపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద ఫ్లెక్సీలను తొలగించేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు యత్నించాయి. అయితే టీడీపీ కట్టిన ఫ్లెక్సీల వద్దకు వెళ్లకుండా పోలీసుల అడ్డుకున్నారు. వివాదాస్పద ఫ్లెక్సీలను తొలగించాలంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు బైఠాయించాయి. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. -
శాంతి భద్రతల పరిరక్షణలో ఏఆర్ విభాగం కీలకపాత్ర
●సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని విధులు నిర్వర్తించాలి ●డీ మొబిలైజేషన్ ముగింపు సమావేశంలో జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాపట్లటౌన్: శాంతిభద్రతల పరిరక్షణలో ఏఆర్ పోలీస్ విభాగం పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా సాయుధ బలగాలకు నిర్వహించిన మొబిలైజేషన్ ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ వృత్తిపరమైన, వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తూ పోలీసుశాఖ ప్రతిష్ట మరింత పెరిగేలా సాయుధ బలగాల పనితీరు ఉండాలన్నారు. తొలుత పరేడ్ పరిశీలన వాహనంలో వెళ్లి పోలీసు బలగాల ప్లటూన్లను ఆయన పరిశీలించారు. ఆ తర్వాత ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్, బ్యాండ్ ప్రదర్శన చక్కగా ప్రదర్శించారన్నారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ ఏఆర్ సిబ్బంది విధుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రతి సంవత్సరం మొబిలైజేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. సాధారణ బందోబస్తు విధుల నుంచి శాంతిభద్రతల సమస్యల పరిరక్షణ వరకు ఏఆర్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. సిబ్బందికి ఎవరికి ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే సత్వర పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే సిబ్బందికి సబ్సిడీ ధరలకే నిత్యావసర సరుకులు, వస్తువులు అందించేందుకు బాపట్లలో త్వరలోనే పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ● అదేవిధంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహన చోదకులకు హెల్మెట్ ధరించాలని చెప్పేముందు పోలీసు సిబ్బంది సైతం హెల్మెట్ ధరించి, వారికి మార్గదర్శకులుగా ఉండాలని హితవు పలికారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులు, సిబ్బందిని, పరేడ్ కమాండర్ అడ్మిన్ ఆర్ఐ షేక్ మౌలుద్దీన్లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఇన్చార్జ్ డీఎస్పీ (సీసీఎస్ డీఎస్పీ) పి.జగదీష్ నాయక్, జిల్లాలోని సీఐలు, ఏఆర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వారాహి దేవస్థానంలో కోటి కుంకుమార్చన
తెనాలి: కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో కొలువైన వారాహి దేవస్థానంలో ఈనెల 11–15 తేదీల్లో జరగనున్న అమ్మవారికి కోటి కుంకుమార్చనలో ప్రజలందరూ పాల్గొనాలని పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామి) సూచించారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీవిద్యాపీఠంలో గురువారం కోటి కుంకుమార్చన ఆహ్వాన పత్రికను బాలస్వామీజీ ఆవిష్కరించారు. 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 15వ తేదీ మధ్యాహ్నం వరకు కుంకుమార్చన జరుగుతుందని తెలిపారు. ఆహ్వానపత్రిక ఆవిష్కరణలో యోగ గురువు ముద్దాభక్తుని రమణయ్య, వీ–ఫర్నిచర్ మాల్ అధినేత వక్కలగడ్డ రామమోహనరావు, తుంగల శ్రీనివాస్, వారాహి అమ్మవారి దేవస్థానం వ్యవస్థాపకులు తన్నీరు శ్రీనివాసబాబు, సంగీత టీచర్ పోతూరి వెంకట ఆదిలక్ష్మి, పెనుగొండ ప్రమీలరాణి, గోపు ప్రభారాణి, కోట లక్ష్మీకుమారి, ముద్దాభక్తుని సామ్రాజ్యం, వరలక్ష్మి, లక్ష్మి, సువర్ధ తదితరులు పాల్గొన్నారు. భట్టిప్రోలు: భట్టిప్రోలు మండలం గొరిగపూడిలోని ఓ ప్రైవేట్ గోడౌన్ పై విజిలెన్స్, పౌర సరఫరాల అధికారులు బుధవారం రాత్రి దాడి చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 450 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రేపల్లె సీఎస్డీటీ ఓంకార్ తెలిపారు. వీటిని అక్రమంగా నిల్వ చేసిన నాగ మల్లేశ్వరరావు, శ్రీనివాసరావులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గుంటూరుఎడ్యుకేషన్: జేకేసీ కళాశాల రోడ్డు లోని జాగర్లమూడి చంద్రమౌళి న్యాయ కళాశాలలో (జేసీ లా) ఈ నెల 7, 8వ తేదీల్లో 5వ జాతీయస్థాయి మూట్ కోర్టు పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల కార్యదర్శి వేమన కుప్పుస్వామి తెలిపారు. గురువారం జేసీ లా కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ సుధాకర్ బాబుతో కలిసి పోటీలకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరించారు. జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న మూట్ కోర్టు పోటీలకు దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల నుంచి 32 కళాశాలల విద్యార్థులు టీంలుగా పాల్గొంటున్నారని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.రామకృష్ణప్రసాద్ పోటీలను ప్రారంభించనుండగా, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి ముగింపు కార్యక్రమానికి హాజరవుతున్నట్లు చెప్పారు. పోటీలకు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారని తెలిపారు. తాడికొండ: ఈనెల 7వ తేదీన క్వాంటం వ్యాలీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా గురువారం ఉద్దండరాయునిపాలెం వద్ద జరగనున్న కార్యక్రమ ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఆహ్వానితులు అందరూ మధ్యాహ్నం 1.30 గంటలకు సభాస్థలకిక చేరుకోవాలని, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, పలు అంశాలపై సంబంధిత అధికారులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
కడలి వెంట కాసుల వేట
మత్స్యకారులు ఆందోళనకు దిగకుండా... మత్స్యకారుల నుంచి ఆందోళనలు రాకుండా ముందస్తుగా వారికి చీరాల బడాబాబు పలు హామీలు ఇచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగా గ్రామం నుంచి సముద్రపు క్రీకు వరకు రోడ్డు వేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇక మురుగుకాలువ వద్ద జెట్టీ నిర్మాణం జరుగుతుందని కూడా నమ్మబలికినట్లు మత్స్యకారులు సంభాషించుకుంటున్నారు. అలానే గ్రామ ఉమ్మడి అవసరాలకు కూడా కొంత మొత్తం చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రాంతంలో జెట్టీ ఏర్పాటుకు సంబంఽధించి మత్స్యశాఖ పరంగా ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవటం గమనార్హం. అధికారులు ఏం చేస్తున్నారో! అధికారులకు తెలియకుండా ఏ అంశానికి సంబంధించి కూడా సంబంధీకులు అడుగులు వేయరనేది ఈ ప్రాంత నానుడి. ముందస్తుగా సమాచారం తెలిసినా మిన్నకుంటారు. ఫిర్యాదులు అందినా పరిశీలిస్తామంటారు. అందుకు వారిని తగిన రీతిలో సంతృప్తి పరుస్తారనేది బహిరంగ రహస్యమంటున్నారు. ఈ క్రమంలో అక్రమార్కులు తమ పనిని పూర్తి చేసుకుంటారు. కొద్ది రోజులు పాలపొంగు లాంటి ఆందోళనలు, వాటిపై రాజకీయ, అధికార అండ అనే నీళ్లతో ఆ ఆందోళనల పొంగును చల్లబరుస్తారు. క్రమేణా ప్రజలు ఆ విషయాలను మర్చిపోతారు. అంతిమంగా భావి తరాలకు అందాల్సిన సహజ వనరులు కనుమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో పారదర్శకత, దార్శనికత అనే పెద్ద, పెద్ద మాటలను పదే,పదే ఉపయోగించే చంద్రబాబు దృష్టికి ఇలాంటి అంశాలు వెళ్లవా అని ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతిమంగా ఏం నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే. సముద్రంలో వాలు కలిసే చోట అడ్డుకట్ట వేస్తే, సముద్రం వెంటే సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో తీరప్రాంతం ఖాళీగా ఉంటుంది. దీన్ని ప్రస్తుతం ఎవరైతే కొనుగోలు, విక్రయాలు జరుపుకుంటున్నారో వారు ఆ 50 ఎకరాల ప్రదేశాన్ని కూడా తమ స్థలంలో కలుపుకునేందుకు (కబ్జా) అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ మనుషులుగా గుర్తింపు పొందిన వ్యక్తులు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విక్రయించే భూమిలో చీరాల బడాబాబు గతంలో కొంత ప్రభుత్వ భూమిని కూడా కలుపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు సంబంధించి సంబంధిత అధికారులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసి క్రమబద్ధీకరించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పూర్వ రికార్డులు పరిశీలిస్తే కొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని విషయం తెలిసిన వారంటున్నారు. -
అంతర్జాతీయ షూటింగ్ బాల్ పోటీల్లో బాపట్ల విద్యార్థికి స్వర్ణం
కర్లపాలెం: బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం ఏట్రవారిపాలెం గ్రామానికి చెందిన పిట్టు అనూరాధ రెడ్డి ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో జరిగిన అంతర్జాతీయ షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకం సాధించింది. ఏట్రవారిపాలెం గ్రామానికి చెందిన పిట్టు అనూరాధరెడ్డి గుంటూరు జిల్లా తెనాలి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ డిగ్రీ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఈనెల 1వ తేదీ నుంచి 3వరకు జవహర్లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొని విజయం సాధించి బంగారు పతకం కై వసం చేసుకుందని బాపట్ల జిల్లా షూటింగ్ బాల్ కార్యదర్శి నాగలక్ష్మి తెలిపారు. బంగారుపతకం సాధించి గురువారం రాత్రి బాపట్ల వచ్చిన అనూరాధ రెడ్డిని ఏట్రవారిపాలెం గ్రామ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి, శ్రీనివాసరెడ్డి దంపతులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికి శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. బంగారు పతకం సాధించిన అనూరాధ రెడ్డిని పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు. -
అంబటి కుటుంబానికి పరామర్శ
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, ఏలూరు జిల్లా కన్వీనర్ జయప్రకాష్ (జేపీ), ఉంగుటూరు కన్వీనర్ పప్పుల శ్రీనివాసరావు, నూజివీడు కన్వీనర్ మేకా ప్రతాప్ అప్పారావులు గురువారం పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అంబటి ఇంటిపై, కార్యాలయంపై దాడికి వ్యూహరచన చేసిన టీడీపీ పశ్చిమ ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త రామచంద్రరావులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా విధ్వంసం సృష్టిస్తే పార్టీ శ్రేణులు భయపడతాయని అనుకోవడం టీటీపీ నేతల అవివేకం అన్నారు. అంబటి కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం ధ్వంసమైన కార్యాలయాన్ని పరిశీలించారు. రాంబాబు ఇంటిని కాపు సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. -
కేఎల్యూకు పురస్కారాలు
తాడేపల్లి రూరల్ :వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీకి గ్రీన్ ఉర్జా మరియు ఎనర్జీ ఎఫిషియెన్సీ గోల్డ్ అవార్డులు వచ్చాయని వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కోనేరు లక్ష్మణ్ హవీష్ గురువారం పేర్కొన్నారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్, నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, డెలాయిట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ గ్రీన్ ఉర్జా మరియు ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డ్స్ కార్యక్రమంలో ఢిల్లీలో ఈ నెల 4వ తేదీన ఈ అవార్డులు ప్రదానం చేశారని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ కె. సుబ్బారావు వీటిని స్వీకరించారని తెలిపారు. -
మహిళలకు చదువే వజ్రాయుధం
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్బాపట్ల: డ్వాక్రా సంఘంలో ఉన్న ప్రతి మహిళ చదువుకోవడం ద్వారా వ్యక్తిగత అభివృద్ధితోపాటు కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. ఈతేరు గ్రామంలోని ఎంపీపీ పాఠశాల ఆవరణలో ఉన్న వయోజన విద్యా కేంద్రంలో వయోజన విద్యాశాఖ ద్వారా నిర్వహిస్తున్న అక్షర ఆంధ్రలో గురువారం నిర్వహించిన ‘అందరికీ విద్య మనందరిదీ బాధ్యత‘ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వలంటీర్ల ద్వారా సంఘంలో ఉన్న మహిళలకు చదువు చెప్పడంతోపాటు చదవడం, రాయడం నేర్పించాలని వారికి బుక్స్ను ఇంటికి పంపించాలన్నారు. మహిళలతో కలెక్టర్ స్నేహపూర్వకంగా మాట్లాడారు. చదువు ప్రాముఖ్యతను మహిళలకు కలెక్టర్ వివరించారు. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని మహిళలను కలెక్టర్ ప్రశ్నించగా తాగునీరు, సీసీ రోడ్లు, డ్రెయినేజీ కాల్వలు ఏర్పాటు చేయాలని కోరారు. మీరు చెప్పిన సమస్యలు పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ మారతమ్మ, డీఆర్డీఏ పీడీ సింగయ్య, తహసీల్దార్ షేక్ సలీమా, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీరాములు, వయోజన విద్యాశాఖ అధికారులు మధుసూదనరెడ్డి, మనోరంజన్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. పన్నుల వసూళ్లలో జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలి వాణిజ్య పన్నుల వసూళ్లలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేలా అధికారులంతా సమష్టి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. వాణిజ్య పన్నుల వసూలు ప్రక్రియపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్లో గురువారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన పన్నులు పెండింగ్ లేకుండా రావాలన్నారు. జీఎస్టీ పన్నుల రూపంలో బాపట్ల జిల్లా నుంచి రూ.35 కోట్లు వసూలు జరుగుతున్నాయన్నారు. జీఎస్టీ పన్నుల పెంపుదలకు ట్రేడ్ లైసెనన్స్ల జాబితాలను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. జీఎస్టీ అరియర్స్ పన్నుల వసూలు పెండింగ్లో ఉండడంపై ఆరా తీశారు. ప్రతి నెలా జీఎస్టీ పన్నుల వసూలు లక్ష్యం, వాటి పురోగతిపై అధికారులతో సమీక్షిస్తామన్నారు. గ్రానైట్, అనుబంధ పరిశ్రమల నుంచి పన్ను ఎగవేతదారులను అరికట్టాలన్నారు. సమావేశంలో జిల్లా వాణిజ్య పన్నులశాఖ ఉప కమిషనర్ మురళీకృష్ణ, కమిటీలోని వివిధశాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా పట్టణ ప్రాంతాలలో వెలువడే చెత్త, మురుగును పద్ధతి ప్రకారం తొలగించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను అనుసరించి చెత్త తొలగింపుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఘన వ్యర్థాల నిర్వహణ, తొలగింపుపై మునిసిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని ఆదేశించారు. పర్యావరణ సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చీరాల పట్టణం నుంచి 35.7 టన్నుల చెత్త తొలగింపుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సేకరించిన ఘన వ్యర్థాలను జిందాల్ ఫ్యాక్టరీకి పంపేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంతో అధికారులు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో కమిటీ కన్వీనర్ బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్రెడ్డి, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు, ప్రజారోగ్య శాఖ అధికారులు, రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ నారాయణ భట్టు తదితరులు పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలి గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక న్యూ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ మాట్లాడారు. ఉద్యోగస్తుల డిప్యూటేషన్లు, ఓడీల వివరాలను ఈ ఆఫీసులో పొందుపరచాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ పి.గ్లోరియా, కలెక్టరేట్ ఏఓ మల్లికార్జునరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, డీపీఓ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
యూజీ ఐదో సెమిస్టర్ ఫలితాలు విడుదల
పెదకాకాని: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేషన్ ఐదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను గురువారం వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు. ఏఎన్యూ పరిధిలో గత ఏడాది నవంబరులో జరిగిన అండర్ గ్రాడ్యుయేషన్ రెగ్యులర్ ఐదో సెమిస్టర్ పరీక్షలకు 6,991 మంది హాజరు అయ్యారని తెలిపారు. వారిలో 6,721 మంది ఉత్తీర్ణులు అయ్యారన్నారు. రీవాల్యూయేషన్కు ఈ నెల 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, యూజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో ఈ నెల 20వ తేదీలోగా సమర్పించాలని సూచించారు. సబ్జెక్ట్కు ఫీజు రూ.1,640 కాగా, పర్సనల్ వెరిఫికేషన్ ఫీజు కూడా అంతేనని వివరించారు. వివరాలు వర్సిటీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు. తాడికొండ: తుళ్ళూరు మండలం వెంకటపాలెంలో అస్సాంకు చెందిన కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామంలోని వాజ్పేయి విగ్రహం సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించారు. ఆధార్ కార్డు ప్రకారం అతడు అస్సాంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. జేబులో డ్రైవింగ్ లైసెన్సు కూడా ఉంది. రాజధాని భవన నిర్మాణ కూలీగా లేదా డ్రైవర్గా వచ్చి ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ వంశీధర్ తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరుకు చెందిన మల్లవరపు జీవారత్నం (58) గత నెల 28వ తేదీన పేరేచర్ల నుంచి టెంట్ హౌస్ సామగ్రిని ఆటోలో తీసుకుని గుంటూరు వైపుగా వెళుతున్నాడు. ఈ క్రమంలో చిన్నపలకలూరు రైల్వే గేటు సమీపంలో ఆటో బోల్తా కొట్టింది. జీవరత్నంకు తీవ్రగాయాలు కాగా... స్థానికులు చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుని కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళగిరి టౌన్ : ఆంధ్రప్రదేశ్ పోలీస్ జీతాల ప్యాకేజీ కింద రూ. 1.11 కోట్ల బీమా క్లయిమ్ చెక్కును బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు గురువారం రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ గుంటూరు బ్రాంచ్ అధికారి సతీష్కుమార్ మాట్లాడుతూ పోలీస్ శాఖతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక్కో ఉద్యోగికి రూ. 1.11 కోట్ల వరకు బీమా రక్షణ కల్పించబడుతుందన్నారు. ఇటీవల ఏపీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న కీర్తి వెంకటరాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలిపారు. ఆయన భార్య నన్నూరమ్మకు ఈ క్లయిమ్ మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేసినట్లు పేర్కొన్నారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో హరీష్కుమార్ గుప్తా చేతుల మీదుగా చెక్కును అధికారికంగా అందజేశామని పేర్కొన్నారు. బ్యాంకు గుంటూరు ప్రాంతీయ కార్యాలయ ఏజీఎం, రీజనల్ హెడ్ కిరణ్రెడ్డి, విజయవాడ ప్రాంతీయ కార్యాలయ డీజీఎం, రీజనల్ హెడ్ అనుపమ్ శ్రీవాత్సవ, హైదరాబాద్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వయిజర్ బ్రిగేడియర్ సంజయ్ కుమార్ ప్రసాద్ పాల్గొన్నారు. -
ఎంబుక్ లేకుండా నిధులు డ్రా?
● ప్రత్తిపాడు పంచాయతీలో అధికారుల నిర్వాకం ● విచారణకు ఆదేశించిన డీపీఓ ప్రత్తిపాడు: అధికారుల నిర్వాకంతో పంచాయతీ నిధులు గోల్మాల్ అయినట్లు తెలుస్తోంది. ఎం బుక్ లేకుండానే రూ. లక్షల్లో నిధులు డ్రా చేసి నిధులు కాజేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రత్తిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ రక్షిత మంచి నీటి చెరువుకు ఆయిల్ ఇంజిన్లు ద్వారా నీటిని పెట్టినట్లుగా లెక్కలు చూపుతూ 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి జనవరిలో సుమారు రూ. 6 లక్షల వరకు డ్రా చేసినట్లుగా సమాచారం. వాస్తవంగా చెరువుకు నీరు పెడితే, ఆ సమయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యవేక్షించి, చెరువు నింపడం పూర్తయిన తరువాత ఎంబుక్ రికార్డు చేయాలి. ఆ తరువాతనే అధికారులు ఎంబుక్ ఆధారంగా గ్రామ పంచాయతీ నుంచి నిధులు డ్రా చేసుకోవాలి. కానీ అసలు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎంబుక్ చేయలేదని చెబుతుండగా, పంచాయతీ అధికారులు మాత్రం దర్జాగా డబ్బులు డ్రా చేసేశారు. ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లడంతో పంచాయతీ అధికారులు ఇరకాటంలో పడ్డారు. ఎంబుక్ కనిపించడం లేదని, ఎంబుక్ ఆడిట్ కార్యాలయంలో ఉందని, బీరువాల్లో దాచిపెట్టారని పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. ఎమ్మెల్యే దృష్టికి కూడా దీనిని కొందరు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వినీల్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఈ పనికి సంబంధించి ఎంబుక్ చేయలేదని స్పష్టం చేశారు. ఈవోపీఆర్డీ షేక్ ఆదంషఫీని వివరణ కోరగా ఎంబుక్ తాను కూడా చూడలేదని, ఆడిట్ కార్యాలయంలో ఉందని ఓ ఉద్యోగి చెప్పారని, వారు సంతకం చేయమంటే తాను చేశానని చెప్పారు. డీపీవో బి.వి.నాగసాయికుమార్ను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి కూడా రావడంతో విచారణకు ఆదేశించామన్నారు. విచారణాధికారిగా డీఎల్పీవోను నియమించామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
గుండెపోటుతో ఏఎస్ఐ మృతి
బాపట్ల టౌన్: బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ కె.వెంకటరమణ గుండెపోటుతో మృతిచెందారు. బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కె. వెంకటరమణ (57) ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో తెనాలిలోని హరిత హాస్పిటల్లో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన భౌతిక దేహాన్ని పొన్నూరు మండలం, గాయంవారిపాలెంలోని వారి స్వగృహం నందు ఉంచగా, బాపట్ల సబ్ డివిజన్ ఇన్చార్జ్ డీఎస్పీ (సీసీఎస్ డీఎస్పీ) పి.జగదీష్ నాయక్, బాపట్ల పట్టణ సీఐ ఆర్.రాంబాబు, ఇతర పోలీసు అధికారులు, సహద్యోగులు సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటరమణ 1990 సంవత్సరంలో కానిస్టేబుల్గా పోలీస్ శాఖలోకి ప్రవేశించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించి ఏఎస్ఐగా పదోన్నతి పొంది ప్రస్తుతం బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ మృతిచెందారన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్ఐ భౌతిక దేహానికి పోలీస్ అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. మట్టి ఖర్చుల నిమిత్తం రూ. లక్ష నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం గాయంవారి పాలెం సమీపంలో గల స్మశాన వాటికలో పోలీస్ అధికార లాంఛనాలతో ఏఎస్ఐ మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
రైతులు పంట నమోదు చేసుకోవాలి
15వ తేదీలోపు జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల చెరుకుపల్లి: ప్రతి రైతు స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా నూతనంగా ప్రవేశ పెట్టిన ఫార్మర్ యాప్లో పంట నమోదు చేసుకోవచ్చని బాపట్ల జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల తెలిపారు. గురువారం మండలంలోని గూడవల్లి గ్రామంలో వ్యవసాయ అధికారులతో కలసి పంట నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులను అడిగి తెలుసుకున్నారు. విజయనిర్మల మాట్లాడుతూ ఈనెల 15వ తేదీలోపు తాము సాగు చేసిన వివిధ పంటలను వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా లేదా ఫార్మర్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలని రైతులకు వివరించారు. అనంతరం ఫార్మర్ యాప్ను నమోదు చేసుకునే పద్ధతిని రైతులకు తెలిపారు. కార్యక్రమంలో రేపల్లె వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎ.లక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయ అధికారి డి.వెంకటరామయ్య, మండల వ్యవసాయ శాఖ అధికారి ఎండి.ఫరూఖ్, గూడవల్లి పీఏసీఎస్ అధ్యక్షుడు ఎ,నరేంద్ర, ఏఈవో రామకృష్ణ, వీఏఏ శివసాయి తేజ, గ్రామ అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. -
అసిస్టెంట్ మలేరియా అధికారులుగా పదోన్నతి
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం పరిఽధిలో ఎంపీహెచ్ఈఓలుగా పనిచేస్తున్న ఇరువురికి అసిస్టెంట్ మలేరియా అధికారులుగా (ఏఎంఓ) పదోన్నతి లభించింది. గురువారం గుంటూరులోని ఆర్డీ కార్యాలయంలోఉత్తర్యులు అందజేశారు. ఆరుగురికి హెడ్నర్సులుగా పదోన్నతి... ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో స్టాఫ్నర్సులుగా పనిచేస్తున్న ఆరుగురికి హెడ్నర్సులుగా పదోన్నతి ఇచ్చారు. వీరిలో గుంటూరు జీజీహెచ్కు నలుగురిని, నెల్లూరుకు ఇరువురిని ప్రమోషన్ ఇచ్చి బదిలీ చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆర్డీ డాక్టర్ జి.శోభారాణి, డెప్యూటీ డైరక్టర్ బెజ్జం పాల్ప్రభాకర్, ఆఫీస్ సూపరింటెండెంట్లు సత్యం, రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్స్ శ్రీకాంత్, గాబ్రియేల్ పాల్గొన్నారు. -
సముద్రంలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
●విషాదంగా మారిన పుట్టినరోజు వేడుకలు ●గల్లంతైన విద్యార్థుల కోసం తీవ్రంగా గాలింపు చినగంజాం: పుట్టిన రోజును ఆనందంగా గడుపుదామనుకున్న నలుగురు స్నేహితుల ఆనందం చివరకు విషాదం మిగిల్చింది. స్నేహితుడు పుట్టిన రోజు నాడు సముద్రంలోకి సరదాగా వెళ్లిన నలుగురు స్నేహితుల్లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ సంఘటన గురువారం చినగంజాం సముద్ర తీరంలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల సమాచారం మేరకు..ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన నలుగురు స్నేహితులు చందలూరి శ్రీరామ్ (15), బిక్కి అవినాష్ (15), గుంజి హేమవర్థన్, తాటిపర్తి హేమంత సాయిలు స్నేహితుడు శ్రీరామ్ పుట్టినరోజును పురస్కరించుకొని సరదాగా సముద్రంలో స్నానం చేసేందుకు చినగంజాం మండలం పల్లెపాలెం పంచాయతీ బాపయ్యనగర్ సముద్ర తీరానికి వచ్చారు. వీరంతా దుద్దుకూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నలుగురు విద్యార్థులు ఆనందంగా సముద్రంలో గడుపుతున్న సమయంలో అలల తాకిడికి బిక్కి అవినాష్, చందలూరి శ్రీరామ్లు కన్పించకుండా సముద్రపు నీటిలో చిక్కుకొని గల్లంతయ్యారు. ఇద్దరు స్నేహితుల ఆచూకీ తెలియకపోవడంతో సముద్రం నుంచి బయటకు వచ్చిన హేమవర్ధన్, తాటిపర్తి హేమసాయిలు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, తహసీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు, ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్యలకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను విచారించి పూర్తి సమాచారం తెలుసుకున్నారు. నలుగురు స్నేహితులు కలిసి చినగంజాం సముద్రతీరానికి ఒకే మోటారు బైక్పై వచ్చినట్లు ఘటన నుంచి బయటపడ్డ విద్యార్థులు తెలిపారు. గురువారం సాయంత్రం సంఘటనా స్థలానికి చేరుకున్న గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు ఆచూకీ లభించక పోవడంతో శోక సముద్రంలో మునిగిపోయారు. వారు రోదిస్తున్న తీరు చూపరులను కలచి వేసింది. సముద్రంలో ప్రత్యేకంగా గాలింపు గల్లంతైన ఇద్దరు విద్యార్థుల కోసం అగ్నిమాపక సిబ్బంది, మైరెన్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది గాలించారు. ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్య ఆధ్వర్యంలో స్థానికంగా ప్రత్యేక బోటు తెప్పించి సముద్రంలో ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. తీరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి బాగా పొద్దుపోయేంతవరకు గాలించినా ఫలితం లేదు. గాలింపు చర్యల్లో ఇంకొల్లు ఎస్సై జి.సురేష్, చినగంజాం పోలీస్ సిబ్బందితోపాటు మైరెన్ సీఐ రమేష్ బాబు, డీఎఫ్ఓ కె.వినయ్, చీరాల ఏడీఎఫ్ వీవీ రామకృష్ణ పాల్గొన్నారు. పేద కుటుంబాలకు చెందిన వారే.. నలుగురు విద్యార్థుల్లో చందలూరి శ్రీరామ్, బిక్కి అవినాష్, గుంజి హేమవర్ధన్ ఇంకొల్లు మండలంలోని దుద్దుకూరు గ్రామానికి చెందిన వారు కాగా తాటిపర్తి హేమంత్ సాయి రాచపూడి గ్రామానికి చెందిన వాడు. గల్లంతై వారిలో చందలూరి శ్రీరామ్ తండ్రి వాసు వ్యవసాయ కూలీ కాగా తల్లి సునీత ఒంగోలు ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తోంది. ఇతనికి ఒక సోదరుడు కాగా, మరో విద్యార్థి బిక్కి అవినాష్ తండ్రి అశోక్ వ్యవసాయ కూలీ, తల్లి అంజమ్మ గృహిణి, ఇతనికి ఒక సోదరి ఉంది. శ్రీరామ్ పుట్టిన రోజు పురస్కరించుకొని గురువారం పావులూరులోని ఆంజనేయస్వామి గుడికి వెళ్లి వచ్చారు. ఇంతలోనే కొడుకు గల్లంతు కావడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. గల్లంతయిన బిక్కి అవినాష్ (ఫైల్) గల్లంతైన చందలూరి శ్రీరామ్(ఫైల్) -
దళితులపై మారణకాండ ఆపాలి
గుంటూరు వెస్ట్: ఎంఆర్పీఎస్ ఉద్యమ నాయకుడు టి.ఎం. రమేషన్ దారుణ హత్యపై ప్రభుత్వం విచారణ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోందని రాష్ట్ర కో–కన్వీనర్ ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయడంలో పారదర్శకంగా వ్యవహరించడం లేదన్నారు. ఈ ఏడాది జనవరిలో కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, బొందిమడుగుల గ్రామానికి చెందిన రమేష్ను దారుణంగా కొట్టిచంపారన్నారు. దీనిని దళిత, ప్రజా సంఘాలు ఖండించాయని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. అనంతరం డీఆర్వో షేఖ్ ఖాజావలికి విజయ్ కుమార్, కారుమూరు బెర్నార్డ్ మాదిగ, ఎస్ప్రసాదరావు మాదిగ, కె.వీరబాబు మాదిగ వినతిపత్రం అందజేశారు. నిర్వహణకు కేంద్రాల ఏర్పాటు సిద్ధం చిలకలూరిపేటటౌన్: నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతి ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహిస్తున్నట్లు మద్దిరాల జేఎన్వీ ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహారావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవోదయ విద్యాలయ సమితి నిర్వహించే ఈ పరీక్షలకు ఉమ్మడి గుంటూరు జిల్లాల పరిధిలో 2031 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరిలో 9వ తరగతికి 838 మంది, 11వ తరగతికి 1193 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆయా పరీక్షల నిర్వహణకు కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసినట్లు వివరించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 10 గంటలకంటే ముందే చేరుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. హాజరయ్యే విద్యార్థులు తమ వెంట అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఈ రెండూ లేనిదే పరీక్ష రాయడానికి అనుమతి ఉండదన్న విషయాన్ని అభ్యర్థులు, తల్లిదండ్రులు గ్రహించాలన్నారు. అడ్మిట్కార్డులో పొందు పరిచిన పరీక్ష కేంద్రం పేరు, చిరునామా, తేదీ, సమయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సరి చూసుకోవాలని తెలిపారు. అడ్మిట్ కార్డును ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడంలో ఏవైన ఇబ్బందులు, సందేహాలు ఉంటే నవోదయ ప్రిన్సిపాల్ సెల్ 9014307677, 9494676751 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. -
హత్యకేసు నిందితులను నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు
చీరాల: ఘోరమైన నేరాలకు పాల్పడేవారిని ఉపేక్షేంచేది లేదని వన్టౌన్ సీఐ ఎస్.సుబ్బారావు హెచ్చరించారు. చీరాల్లో ఇటీవల సంచలనం కలిగించిన యువకుడు కొండే త్రినాథ్ హత్య కేసులో ఐదుగురు నిందితులను వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితులను బుధవారం వన్టౌన్ పోలీస్స్టేషన్ నుంచి ఏరియా వైద్యశాల వరకు రోడ్డుపై నడిపించి ప్రజలకు హెచ్చరికగా చూపించారు. ఇటువంటి ఘోరమైన నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవారిపై చట్టపరంగా శిక్షలు తప్పవని తెలిపారు. -
భూసార పరీక్షలపై అవగాహన అవసరం
బాపట్లటౌన్: భూసార పరీక్షలపై రైతులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.విజయనిర్మల తెలిపారు. మండలంలోని ఈస్ట్ బాపట్లలో బుధవారం భూసార పరీక్షలపై రైతులకు అవగాహన కల్పించారు. జేడీఏ ఎం.విజయనిర్మల మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకొని దానికి తగినట్లుగా ఎరువులను వినియోగించుకోవాలన్నారు. విచక్షణా రహితంగా ఎరువులు వాడటం వలన పొలంలో శత్రు పురుగులతోపాటు మిత్రపురుగులు చనిపోయి పైరుకు నష్టాన్ని కలిగిస్తాయన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలన్నారు. అనంతరం వ్యవసాయ, రైతు సాధికార సంస్థ సిబ్బందికి మట్టినమూనాల సేకరణపై శిక్షణ, అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సయ్యద్ అత్తర్ హుస్సేన్, ఏడీపీఎం జక్కుల మోహన్, ఏఓ కె.శారద, వీఏఏ టి.గోపికృష్ణ, రైతు సాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు రూరల్: సంస్కృతీ సంప్రదాయాలు, మానవత్వం కలిగిన వారు వైఎస్సార్ సీపీ శ్రేణులని బుధవారం మరోసారి నిరూపించారు. విషయమేమిటంటే.. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు రానుండగా.. స్వాగతం పలికేందుకు ఏటుకూరు బైపాస్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు, అశేష జనసందోహం ఆయన రాకకోసం ఎదురు చూస్తున్నారు.. ఈక్రమంలో జాతీయ రహదారి నుంచి గుంటూరు నగరంలోకి వెళ్లేందుకు అంబులన్స్ రావడంతో అంతా అడ్డుతొలగి.. స్వచ్ఛందంగా దారి ఇచ్చారు. అంతేకాకుండా.. దారిపొడవునా మరికొందరు యువకులు ద్విచక్ర వాహనాలపై వెళుతూ రోడ్డుపై ఉన్న వైఎస్సార్ సీపీ శ్రేణులకు అంబులెన్స్ వస్తుంది... పక్కకు తొలగండి అంటూ అంబులెన్స్కు దారిచ్చి పంపారు. చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో జాతీయస్థాయిలో నిర్వహించనున్న యూత్ ఫెస్టివల్ విజ్ఞాన్ మహోత్సవ్–2కే26కు సన్నాహాలు పూర్తయ్యాయని ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ బుధవారం తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు మూడు రోజుల పాటు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గురువారం జరిగే ప్రారంభ వేడుకలకు ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్, కంపోజర్, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు డాక్టర్ కొమండూరి రామాచారి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. 7వ తేదీన జరిగే ముగింపు వేడుకలకు 2025 ఏసియన్ చాంపియన్షిప్ గోల్డ్ మెడలిస్ట్, భారత హెప్టాథ్లెట్ నందిని అగసారా ముఖ్య అతిథిగా పాల్గొంటారని ప్రకటించారు. మహోత్సవ్లో రెండో రోజున ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం, మూడో రోజున ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ దీక్షిత్ శెట్టి సందడి చేస్తారని వెల్లడించారు. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 50 వేల మందికి పైగా విద్యార్థులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. పోటీల విజేతలకు మొత్తం రూ.15 లక్షలకు పైగా నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ మహోత్సవంలో మొత్తం 80కు పైగా ఈవెంట్లు నిర్వహించనున్నారు. -
అనుమానాస్పదస్థితిలో బాలుడు మృతి
కారంచేడు: ఎప్పటిలానే అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన మూడు సంవత్సరాల బాలుడు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ అపస్మారకస్థితికి చేరుకుని ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. ఈ సంఘటనపై బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కారంచేడు ఎస్ఐ షేక్ ఖాదర్బాషా కేసు నమోదు చేశారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. కారంచేడు మండలం రంగప్పనా యుడువారిపాలెం పంచాయతీ శివారు గ్రామం నందిగుంటపాలేనికి చెందిన పల్లపోతుల రాంబాబు–సువార్త దంపతులకు 4 సంవత్సరాల దీపిక, 2 సంవత్సరాల మూడు నెలల రోహిత్ సంతానంగా ఉన్నారు. వీరు అదే ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్తుంటారు. బుధవారం ఉదయం కూడా వెళ్లగా, బాలుడు రోహిత్ మధ్యాహ్న సమయంలో ఏడుస్తుండగా తల్లి వచ్చి అంగన్వాడీ సిబ్బందిని అడిగింది. బయట ఆడుకుంటూ ఉన్న సమయంలో కాలి మడమ, చిటికెన వేలికు చిన్న ముల్లు గుచ్చుకుని ఉన్నట్లు గమనించి మందు రాశానని సిబ్బంది చెప్పారు. ఏడుపు ఆపకుండా ఉండటంతో పాటు అపస్మారకస్థితికి చేరుకున్న బాలుడిని వెంటనే చీరాల ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు మృతిచెందినట్లు తెలిపారు. బాలుడికి ఏమైనా పాము కరిసిందా, ఇంకై మైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ జరిపించాలని తండ్రి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని ఎస్ఐ ఖాదర్బాషా తెలిపారు. బాలుడి మృతితో నందిగుంటపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఒక్కగానొక్క కుమారుడు ఆకస్మికంగా మృతిచెందడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులచే కంటతడి పెట్టించింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు -
పిన్నెల్లిలో హింసను రూపుమాపేందుకు చర్యలు
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ జవహర్ నరసరావుపేట: పిన్నెల్లి ఘటనపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ బుధవారం మున్సిపల్ అతిథి గృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ గ్రామ ప్రజలు శాంతిని బలంగా కోరుకుంటున్నారని, పోలీసులు, ప్రజ లు, అధికారుల సహకారంతో హింసను రూపు మాపేందుకు చర్యలు తీసుకుంటామన్నా రు. ఎస్పీ బి.కష్ణారావు, డీఆర్వో నారదముని, ఆర్డీవో మురళీకృష్ణ, కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. సాల్మన్ హత్య బాధాకరం గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో జరిగిన మందా సాల్మన్ హత్య చాలా దురదృష్టకరం, బాధాకరమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కేఎస్.జవహర్ పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ అతిథి గృహంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంఘటనలో దాడిచేసిన వారు, దాడికి గురైన వారు ఇరువురూ దళితులే అన్నారు. ప్రాణం పోయింది దళితుడిది కాబట్టి తమ కమిషన్కు బాధ్యత ఉందన్నారు. చాలా పారదర్శకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో నిజనిర్ధారణకు ఒక కమిటీని వేశామని, వీరు బాధితులతోపాటు మిగిలిన వారి నుంచి సమాచారం సేకరించి ఒక నివేదికను తయారుచేశారని చెప్పారు. ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగతమైన వివాదాల వలనే సంఘటన జరిగినట్లుగా నిజనిర్ధారణ కమిటీ నిర్ధారించిందన్నారు. ఇది ప్రేరేపితమైన సంఘటన కాదని, కేవలం యాధృచ్ఛికమైందన్నారు. తాడికొండ: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పనున్న క్వాంటం వ్యాలీకి శంకుస్థాపనకు జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ప్రద్యుమ్న, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాలు బుధవారం పరిశీలించారు. ఉద్దండరాయునిపాలెం వద్ద స్థల పరిశీలన చేసి పలు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో సీఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవతేజ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఆర్టిజీఎస్ అధికారులు ప్రకార్ జైన్, గీతాంజలి శర్మ, రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి పి కోమలి పద్మ పాల్గొన్నారు. కొరిటెపాడు(గుంటూరు): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులోని శ్యామలానగర్లో గల రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట చేస్తున్న నిరసన, వంట– వార్పు కార్యక్రమం ఏడవ రోజుకు చేరుకుంది. బుధవారం ఉమ్మడి శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పీఏసీఎస్ల ఉద్యోగులు పాల్గన్నారు. ప్లకార్డులు చేతబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రప్రభుత్వం తక్షణమే స్పందించి, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12వ తేదీ వరకు నిరసన, వంట వార్పు కార్యక్రమం, 13వ తేదీన కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయాల ముట్టడి, కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. అప్పటికీ ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించకపోతే, 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల రాష్ట్ర నాయకులు తోట వెంకట రామయ్య, మువ్వా వెంకటేశ్వరరావు, బి.రఘురామ్, ఎస్.ఖాజామొహిద్దీన్, జీబీ రంగనాథ్, యెర్నేని పాపినాయుడు, ఎం.సత్యనారాయణ, పి.విజయభాస్కర్, పి.కృష్ణశాస్త్రి, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల పీఏసీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. తాడికొండ: తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో అక్షర ఆంధ్రా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో అక్షర ఆంధ్రా క్రింద శిక్షణ పొందుతున్న వయోజనుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, రానున్న పరీక్షలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని సూచించారు. పటిష్ట పర్యవేక్షణ ఉండాలని, కేంద్రంలో అభ్యసిస్తున్న ప్రతీ ఒక్కరూ చక్కని చదవడం, రాయడం రావాలని ఆదేశించారు. అక్షర ఆంధ్రాలో గుంటూరు జిల్లా ఆదర్శంగా నిలవాలని సూచించారు. తమ కేంద్రంలో 140 మంది శిక్షణ పొందుతున్నారని, మండలంలో 4100 మంది అక్షర ఆంధ్రా కార్యక్రమంలో ఉన్నారని అక్షర ఆంధ్రా పర్యవేక్షకులు దాసరి వెంకటస్వామి వివరించారు. ప్రతి రోజూ సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నామని. డ్వాక్రా, ఉపాధి హామీ సభ్యులు ఇందులో అభ్యాసకులుగా, అక్షరాస్యులుగా ఉన్న సభ్యులు వాలంటీర్లుగా ఒక్కొక్కరు 10 మందికి బోధిస్తున్నారని చెప్పారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి కె శిల్ప పాల్గొన్నారు. -
యూనివర్సిటీ క్రీడాకారుల ఎంపిక
వేటపాలెం: సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో రెండు రోజులుగా జరుగుతున్న ఇంటర్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్, బెస్ట్ ఫిజిక్ సెలక్షన్లు బుధవారం ముగిశాయని కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్.లక్ష్మణరావు తెలిపారు. ఈ సెలక్షన్స్లో జేఎన్టీయూ పరిధిలోని 25 కళాశాలల్లో చదువుతన్న 175 మంది విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ కె.జగదీష్బాబు తెలిపారు. సెలక్షన్స్లో ఎంపికై న విద్యార్థులు యూనివర్సిటీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. మహిళల కేటగిరీలో 57 కేజీల విభాగంలో పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఒంగోలుకు చెందిన ఎం.కావ్య, 69 కేజీల విభాగంలో ఆర్వీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. చేబ్రోలుకు చెందిన ఎం.తేజశ్విని, 83 కేజీల విభాగంలో పి.వందన.. ఎస్వీఈసీ ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీ భీమవరం, బి.సృజన.. ఐడియా ఇన్స్టిట్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. యునివర్సిటీ టీం కింద ఎంపికై నట్లు తెలిపారు. పురుషుల కేటగిరీలో 83 కేజీల విభాగంలో పి.వివేక్ ఆర్అండ్డీ ఆర్హెచ్ఎస్ మిక్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, కంచికచర్ల, పి.భార్గవరామ్ ప్రియదర్శిని.. చింతలపూడి యునివర్సిటీ టీంలో ఎంపికై ట్లు వ్యాయామ ఉపాధ్యాయులు జేఎన్టీయూకే స్పోర్ట్స్ మెంబర్ అన్న శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో అక్రిడిటేషన్స్ డైరెక్టర్ సి.సుబ్బారావు, అడ్మినిస్టేషన్ డైరెక్టర్ వనా దోరనాగ సాయినాథ్, వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఇళ్ల మధ్య నుంచి హైటెన్షన్ విద్యుత్లైన్
వేటపాలెం: దేశాయిపేట పంచాయతీ ఎస్సీ కాలనీ మధ్యలో నుంచి నూతనంగా నిర్మాణం చేపట్టిన 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ల నిర్మాణం పనులను కాలనీ వాసులు బుధవారం అడ్డగించారు. దేశాయిపేట సిలోన్ కాలనీ వద్దగల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నుంచి కొత్తగా 33 కేవీ విద్యుత్ లైన్ చల్లారెడ్డిపాలెం పంచాయతీ బైపాస్ రోడ్డు వద్ద గల సబ్ స్టేషన్ వద్దకు హైటెన్షన్ విద్యుత్ లైన్ నూతనంగా వేస్తున్నారు. సిలోన్ కాలనీ వద్దగల సబ్ స్టేషన్ నుంచి నూతనంగా కొత్త లైన్ గ్రామ పంచాయతీ వరకు ప్రధాన రహదారి పక్క నుంచి వేశారు. అక్కడ నుంచి గ్రామం, ఎస్సీ కాలనీ మీదుగా చల్లా రెడ్డిపాలెం సబ్స్టేషన్ వరకు నిర్మాణం జరగాల్సి ఉంది. రెండు నెలల క్రితం రెండు పర్యాయాలు కాలనీ నుంచి విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తున్న సమయంలో కాలనీ వాసులు అడ్డుకున్నారు. దీంతో అప్పడు తాత్కాలికంగా లైన్ నిర్మాణం నిలుపుదల చేశారు. బుధవారం తిరిగి విద్యుత్ లైన్ల నిర్మాణం కోసం విద్యుత్ సిబ్బంది ట్రాక్టర్ విద్యుత్ స్తంభాలు తీసుకొని రాగా కాలనీ మధ్య నుంచి లైన్ ఏర్పాటు చేయడాని వీల్లేదని అడ్డగించారు. సమాచారం అందుకున్న ఏడీఏ పెరుగు శ్రీనివాసరావు కాలనీకి వచ్చి కాలనీ వాసులతో మాట్లాడారు. అయితే కాలనీలో నివాసులు నివాస గృహాల మధ్యలో హైటెన్షన్ విద్యుత్ లైన్లు వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఇళ్ల మధ్య అధిక ఓల్టేజీ విద్యుత్ లైను వేయడానికి వీల్లేదని ఏడీఏ దృష్టికి తీసుకొచ్చారు. హైటెన్షన్ లైన్ని గ్రామ చివర నుంచి తరలించుకోవాలని కాలనీ వాసలు ఏడీఏని కోరారు. కాలనీలో కాకుండా గ్రామం చివరగా హైటెన్షన్ లైన్ డిజైన్ మార్చుకోవాలన్నారు. పనులు అడ్డగించిన దేశాయిపేట పంచాయతీ ఎస్సీ కాలనీ వాసులు ఎస్సీ కాలనీలో నివాసాలకు ఇబ్బంది లేకుండా లైన్ నిర్మాణం చేపడతాం. విద్యుత్ స్తంభాలు 30 అడుగుల ఎత్తులో ఉంటాయి. విద్యుత్ వైర్లు 30 అడుగుల ఎత్తులో వెళుతుంటాయి. ఇళ్లకు ఇబ్బంది లేకుండా చూస్తాం. – పెరుగు శ్రీనివాసరావు, ఏడీఏ, వేటపాలెం -
రసకందాయంగా చీరాల రాజకీయం
●టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీ గూటికి చేరేందుకు పలువురు ఆసక్తి ●ఇన్చార్జి కరణం వెంకటేష్బాబు, మాజీ ఎమ్మెల్యే కరణం బలరాంలతో మాటామంతీ..! ●మెజార్టీ ఉన్నా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల నిర్వహణలో టీడీపీ చైర్మన్ విఫలం ●పరోక్షంగా ఎమ్మెల్యే కొండయ్య వైఫల్యమే ఇదని ప్రచారం చీరాల అర్బన్ (చీరాల): చీరాల రాజకీయం రసకందాయంగా మారింది. ఎప్పుడు, ఎవరు, ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఎప్పుడు ఎవరు వెళ్తారో ఊహించలేని స్థితి. చంద్రబాబు ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక పలువురు వైఎస్సార్ సీపీని వీడి టీడీపీ గూటికి చేరారు. అందులో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు కూడా ఉన్నారు. వారిని తమ వైపు తిప్పుకొనేందుకు అప్పట్లో టీడీపీ వర్గాలు కృషి చేశాయనే ప్రచారం జరిగింది. ఇది మున్నాళ్ల ముచ్చటగా మారింది. టీడీపీ పక్షాన ప్రస్తుతం సింహభాగం కౌన్సిలర్లు ఉన్నా జనవరి నెలలో కనీసం మున్సిపల్ సాధారణ, అత్యవసర సమావేశాలు కూడా నిర్వహించలేని దుస్థితి ఏర్పడింది. ఇది పరోక్షంగా ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య వైఫల్యమేనని వాదనలు కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మళ్లీ వెనక్కి వచ్చే ఆలోచన.. వైఎస్సార్ సీపీని వీడి టీడీపీ గూటికి చేరిన కౌన్సిలర్లలో పలువురు తాము తొందరపాటు నిర్ణయం తీసుకున్నామనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. వారు పునరాలోచనలో పడినట్లు విశ్వసనీయ సమాచారం. గత కొంత కాలంగా వారు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్బాబు, మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిలతో తిరిగి సయోధ్య కుదుర్చుకునేందుకు అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కొందరు బహిరంగంగా, మరికొందరు సందర్భానికి అనుగుణంగా కలుస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే వైఖరే కారణం.. కౌన్సిల్లో స్వపక్షానికి చెందిన మెజార్టీ కౌన్సిలర్లు ఉన్నా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించలేని స్థితికి మున్సిపల్ చైర్మన్ ఉండటమనేది, పరోక్షంగా ఎమ్మెల్యే కొండయ్య వైఫల్యమేనని వాదనలు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా వినిపిస్తున్నాయి. ఆ వాదనలును కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రతినెలా జరగాలి. అవసరమైతే మధ్యలో అత్యవసర సమావేశాలు, టేబుల్ అజెండాలతో కూడా కౌన్సిల్ సమావేశాలు కొనసాగుతుంటాయి. ఈ సందర్భాల్లో మున్సిపల్ పరిధిలో సమస్యలు, జరగాల్సిన అభివృద్ధి పనులు, నిధుల వినియోగం, సమీకరణ, వివిధ శాఖల అఽధికారుల పనితీరు, లోటుపాట్లు, తదితర అంశాలకు సంబంధించిన చర్చలు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో అజెండాలోని అంశాలకు సంబంధించి వాదనలు ఉంటాయి. అవసరమైతే ఓటింగ్ ద్వారా ఆమోదిస్తుంటారు. ఆ ప్రక్రియ జరగక పోవడం కౌన్సిల్ గౌరవాన్ని, పురప్రజలను చిన్నచూపు చూసినట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సందర్భాన్ని బట్టి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్బాబు, మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిలు క్యాడర్కు సంబంధించిన కార్యక్రమాల్లో తలలో నాలుకలా ఉంటారు. ఈ క్రమంలో నాలుగు రోజులు క్రితం పలువురిని మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం శ్రేణులతో కలిసి పరామర్శించారు. ఆ సమయంలో ఆయనతో కలిసి ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. వారిలో వైఎస్సార్ సీపీని వీడి టీడీపీ గూటికి చేరినవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పలువురు కౌన్సిలర్లు తాము గెలిచింది వైఎస్సార్ సీపీ ఫ్యాన్ గుర్తుపై అని, పరిణామాల క్రమంలో పక్కటడుగు వేశామని, అవసరమైతే సరిదిద్దుకుని మరలా సొంత గూటికి వస్తామని.. తమ సన్నిహితులతో అటుండటం విశేషం. తాజాగా బుధవారం చీరాల్లో పలు కార్యక్రమాలకు హాజరైన బలరాంతో పలువురు అదే పంథాతో నడవడం కనిపించింది. ప్రస్తుతం ఈ అంశాలపై జోరుగా చర్చ సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో భాగంగా రీ సర్వేకు సంబంధించి చంద్రబాబు, కూటమి వర్గాలు విషప్రచారాలు చేశాయి. ఎవరి ఆస్తులు వారికి దక్కవని గోబెల్స్ ప్రచారం చేశాయి. దీంతో ఆనాటి పరిణామాల క్రమంలో చీరాల్లో ఓ సామాజికవర్గం ఎన్నికలకు కేవలం ఐదారు రోజులు ముందు వైఎస్సార్ సీపీకి ఓటు వేయకూడదని నిర్ణయించుకుంది. అది రాష్ట్ర కమిటీ పిలుపేనని ఆ సామాజికవర్గానికి చెందిన వారు అంతరంగికుల వద్ద చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో సుమారు 19 వేల ఓట్లకు గండి పడింది. అలానే ఇతర సామాజిక వర్గాల్లో కూడా ఆ ప్రభావం గణనీయంగా పడింది. దీంతో జరగాల్సిన నష్టం జరిగింది. అదే సామాజికవర్గానికి చెందిన వారిలో పలువురు తాము విష ప్రచారానికి మోసపోయామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు ఎన్నో విధాలుగా ప్రయోజనాలను చేకూర్చిన వారిని విస్మరించామనే పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. వారిలో కొందరు వేస్తున్న అడుగులు అందుకు దర్పణం పడుతున్నాయని సమాచారం. -
నేతలను అడ్డుకున్న పోలీసులు
గుంటూరులో వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు భారీగా హాజరైన వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులుసాక్షి ప్రతినిధి, గుంటూరు: అడుగడుగునా అంతులేని అభిమానం... ఎక్కడికక్కడ కట్టడికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించినా ఆగని జనసందోహం... ఇవీ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు పర్యటనలో కనిపించిన దృశ్యాలు. అధికార పార్టీ గూండాల దాడిలో ధ్వంసమైన అంబటి ఇంటిని, కార్యాలయాన్ని బుధవారం పరిశీలించి, కుటుంబసభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. తాడేపల్లి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్కు అడుగుడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. రెడ్బుక్ రాజ్యాంగం, విధ్వంస పాలనతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. వైఎస్ జగన్ కార్యక్రమానికి తరలివచ్చారు. ఆయన్ను చూసేందుకు పోటెత్తారు. తాడేపల్లి నుంచి గుంటూరు, సిద్ధార్థనగర్లోని రాంబాబు ఇంటికి ఆయన చేరుకోవడానికి దాదాపు 6 గంటలు పట్టింది. తరలివచ్చిన అభిమానులు కుంచనపల్లి క్రాస్రోడ్స్, కాజ టోల్గేట్, మంగళగిరి బైపాస్, కాకాని, ఏటుకూరు బైపాస్ సర్వీస్ రోడ్, గుంటూరులోని కేవీపీ (వీఐపీ) రోడ్, చుట్టుగుంట, కలెక్టర్ ఆఫీస్, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల మీదుగా సిద్ధార్థనగర్లోని అంబటి రాంబాబు నివాసానికి వైఎస్ జగన్ చేరుకున్నారు. ఉదయం 10.40 గంటలకు బయలుదేరిన ఆయన.. అంబటి ఇంటికి చేరే సరికి సాయంత్రం 4.35 గంటలు అయ్యింది. మరోవైపు జగన్ పర్యటనను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రతి చోటా ప్రయత్నించింది. తాడేపల్లి నుంచి అంబటి రాంబాబు ఇంటివరకూ ఎక్కడికక్కడ పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. జగన్ కాన్వాయ్ను మాత్రం అనుమతించి.. ఆయన వెనుక వస్తున్న వాహనాలను, జనసందోహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డంకుల మధ్య కూడా జగన్ పర్యటన విజయవంతం అయ్యింది. ఒకటి, రెండు చోట్ల లారీలను కూడా రోడ్డు మీద పెట్టి అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆయన వెంట తరలివచ్చారు. గుంటూరు నగరం జనసంద్రంగా మారింది. పల్నాడు జిల్లా నుంచి ఎవ్వరూ రాకుండా దిగ్బంధించారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ, యడ్లపాడు మండలం బోయపాలెం హైవే వద్ద, సత్తెనపల్లి మండం నందిగం అడ్డరోడ్డు వద్ద పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి మరీ అడ్డంకులు సృష్టించారు. బందోబస్తు హడావుడి ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని గుంటూరు రూరల్ మండలం బొంతపాడు వై జంక్షన్ వద్ద డీఎస్పీలు భానూదయ, అరవింద్తోపాటు సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, రోప్ పార్టీలు, ప్రత్యేక బలగాలు బందోబస్తు నిర్వహించాయి. డ్రోన్ కెమెరాలతో పర్యటనపై డేగ కన్ను వేశారు. శనివారం రాత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద టీడీపీ మూకలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన ప్రత్తిపాడు నియోజకవర్గం బీసీ విభాగం అధ్యక్షుడు దారం అశోక్యాదవ్ను వైఎస్ జగన్ పరామర్శించారు. అంబటి ఇంటికి వెళుతున్న దారిలో ఏటుకూరు బైపాస్లోగల ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్ కార్యాలయం వద్ద టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన అశోక్, పూర్తిగా ధ్వంసమైన కారును జగనన్న తన వాహనం నుంచి అభిమానుల మధ్యనే పరిశీలించారు. ఎట్టకేలకు... ఉదయం 10 గంటల నుంచి అంబటి నివాసం దగ్గరకు వస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు అభిమానులను పోలీసులు బారికేడ్లను అడ్డంగా పెట్టి అడ్డుకున్నారు. సిద్ధార్థనగర్కు వెళ్లే అన్ని రహదారులను మూసి వేశారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వస్తున్న నాయకులు, కార్యకర్తలను అంబటి ఇంటికి వెళ్లనీయకుండా ఆపివేశారు. గుంటూరు నగరంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ కాన్వాయ్కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో చుట్టుగుంట సెంటర్ నుంచి అంబటి నివాసానికి వచ్చేందుకు మూడు గంటలకుపైగా సమయం పట్టింది. ముఖ్య నేతలు హాజరు కార్యక్రమానికి పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, విడదల రజిని, పేరి నాని, మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, నంబూరు శంకరరావు, సింఽహాద్రి రమేష్, మాజీ ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, నందిగం సురేష్, సమన్వయకర్తలు షేక్ నూరిఫాతిమా, వనమా బాలవజ్రబాబు (డైమండ్బాబు), దొంతిరెడ్డి వేమారెడ్డి, అంబటి మురళీకృష్ణ, వరికూటి అశోక్బాబు, బలసాని కిరణ్, ఈవూరు గణేష్, డాక్టర్ సుధీర్రెడ్డి, అవినాష్, నాయకులు పోతుల మహేష్, షేక్ గులాం రసూల్, నిమ్మకాయల రాజనారాయణ, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభివాదం చేస్తున్న జగనన్నఅంబటి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు పర్యటనలో పాల్గొనేందుకు సత్తెనపల్లి, సత్తెనపల్లి రూరల్, ముప్పాళ్ళ, రాజుపాలెం, దాచేపల్లి, అచ్చంపేట, బెల్లంకొండ తదితర మండలాలకు చెందిన 37 మంది వైఎస్సార్సీపీ నాయకులు ప్రత్యేక వాహనంలో గుంటూరు బయలుదేరారు. సత్తెనపల్లి నందిగం అడ్డరోడ్డు వద్ద సత్తెనపల్లి రూరల్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. గుంటూరు సమీపంలోకి చేరుకోగానే హైవేపై జన సంద్రం పోటెత్తింది. జననేతను చూసేందుకు అభిమానులు మండే ఎండను సైతం లెక్కచేయక బారులు తీరారు. అభిమానులు, పార్టీ శ్రేణులు తరలిరావడంతో హైవేతోపాటు ఏటుకూరు పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో మెయిన్ హైవేపై నుండి సర్వీసు రోడ్డులోనికి జగన్ కాన్వాయ్ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రవేశించింది. కాన్వాయ్ కనిపించగానే జననేతను చూసేందుకు అభిమానులు, పార్టీ శ్రేణులు హైవేపైకి పరుగులు పెట్టారు. చేతులు ఊపుతూ, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. దీంతో జగన్ కారుపై నుండే ప్రజలకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అంబటి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని, భయపడవద్దని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘‘మాజీ మంత్రి అంబటి కాపు కులంలో ఒక టైగర్. విలువలున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా నల్లపాడు సీఐ వంశీ, పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు ఆయన్ను తీవ్రంగా దూషించి కొట్టడం తగదు. రేపు మా ప్రభుత్వం వచ్చాక ఈ అరాచకాలన్నింటి మీదా విచారణలు చేయిస్తాం. వడ్డీ సహా చెల్లిస్తాం. అందర్నీ బోన్లలో నిలబెట్టి సాక్ష్యాధారాలతో వారి యూనిఫాంలు విప్పిస్తాం. ఈ దారుణాల్లో భాగస్వాములైన కూటమి నాయకులు ఎవరున్నా వారిని జైలుకు పంపించి బాధితులకు న్యాయం చేసి తీరుతామని’’ హెచ్చరించారు. -
మహాదత్తునికి విశేష పూజలు
ఫిరంగిపురం: మండలంలోని అమీనాబాద్ గ్రామంలో శ్రీ దత్తపీఠంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న విశేష పూజలు బుధవారంతో ముగిశాయి. ఉదయాన్నే అనఘాదేవి, దత్తాత్రేయ స్వామి వార్లకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. యాగశాలలో మహాదత్తహవనం చేసి పూర్ణాహుతి నిర్వహించి భక్తుల గోత్రాలతో పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం రెండు వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమాలను శ్రీదత్తపీఠం నిర్వాహకులు జయశంకర్ పర్యవేక్షించారు. వేమూరు: అమృతలూరు మండలం గోవాడ గ్రామంలోని బాలకోటేశ్వరస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించారు. 2025 మార్చి 1వ తేదీ నుంచి 2026 ఫిబ్రవరి 3వ తేదీ వరకు లెక్కింపు చేశారు. 11 నెలలకుగాను రూ.4,70,918 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ పావులూరు రమేష్ తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, దేవదాయ ఇన్స్పెక్టర్ ఎం.వెంకటేశ్వరరావు, తెనాలి దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. నరసరావుపేట: ఈ నెల 7, 8 తేదీల్లో నిర్వహించే కొండవీడు ఫెస్ట్ ద్వారా కొండవీడు వైభవాన్ని తిలకించేందుకు ప్రతి కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక వీడియా ద్వారా తన సందేశాన్ని రిలీజ్ చేశారు. తెలుగుజాతి ఘనచరిత్ర, వీరత్వానికి ప్రతీక కొండవీడు కోట అన్నారు. చరిత్ర, వైభవాన్ని నేటితరానికి పరిచయం చేస్తూ ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. హలీరైడ్, బోటింగ్, శాండ్ ఆర్ట్, లేజర్షో, క్రాకర్స్షో, హార్స్ రైడింగ్తో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. గాయకులు గీతామాధురి, సమీరా భరద్వాజ్, జబర్దస్ట్ కళాకారులు అలరించనున్నారని తెలిపారు. పిల్లల కోసం ప్రత్యేకంగా అమ్యూజ్మెంట్ పార్కు ఏర్పాటు చేశామన్నారు. పలు పోటీల్లో విద్యార్థులు పాల్గొని బహుమతులు పొందవచ్చన్నారు. అన్ని ప్రాంతాల తెలుగు వంటకాలతో ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ వేడుకలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి చూసి ఆనందించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. పెదకాకాని: పెదకాకానిలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో త్వరలో జరగనున్న మహాశివరాత్రి ఏర్పాట్లను ఆర్జేసీ చంద్రశేఖర ఆజాద్ బుధవారం ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్తో కలిసి పరిశీలించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు, తాగునీరు, మజ్జిగ, పాలు సరఫరా పాయింట్లను పరిశీలించారు. మహాశివరాత్రి రోజున తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులకు సాధారణ దర్శనాలు అందుబాటులోకి రావాలన్నారు. ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, వీఐపీలు స్వామి వారి దర్శనానికి వచ్చిన సమయంలో తగు ఏర్పాటు చేయాలని ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్కు సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు ఉండాలని ఆర్జేసీ సూచించారు. -
శరవేగంగా పర్యాటకాభివృద్ధి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: స్వదేశీ దర్శన్ పర్యాటకం అభివృద్ధితో స్వర్ణ బాపట్లగా రూపుదిద్దుకోనుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. స్వదేశీ దర్శన్ పర్యాటక రంగం అభివృద్ధిపై అనుబంధ శాఖల అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్ నుంచి హైబ్రిడ్ మోడ్లో ఆయన సమావేశం నిర్వహించారు. పనులలో వేగం పెంచాలని సంబంధిత అధికారులు, గుత్తేదారులను కలెక్టర్ ఆదేశించారు. పర్యాటక రంగం ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తే బాపట్ల అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. సూర్యలంక వద్ద ఏర్పాటు చేస్తున్న పనులు వేగం పుంజుకోవాలన్నారు. హౌస్ బోట్ నిర్మాణం త్వరగా పూర్తి చేస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. అభివృద్ధి పనులలో జాప్యం ఉండరాదన్నారు. ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కు నిర్మాణం పది నెలల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గుత్తేదారులు బాధ్యతతో పనిచేయాలన్నారు. జిల్లా అభివృద్ధికి ఈ ప్రాంతం కీలకం కానుందన్నారు. పనుల పురోగతిపై క్షుణ్నంగా ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో మత్స్య శాఖ డి.డి. గాలి దేముడు, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, అనుబంధ శాఖల అధికారులు, గుత్తేదారులు, తదితరులు పాల్గొన్నారు. ‘దళిత ఉద్యమ చరిత్ర‘ క్యాలెండర్ ఆవిష్కరణ దళిత ఉద్యమ చరిత్ర క్యాలండర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బుధవారం ఆవిష్కరించారు. దళిత నాయకులు నీలం నాగేంద్రకుమార్ రూపొందించిన ఈ క్యాలెండర్ను కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఉద్యమాలతోపాటు గేయాలు, గాయాలతో కూడిన వారిని గుర్తు చేసేవిధంగా క్యాలెండర్ రూపొందించటం ఆకర్షణగా నిలిచిందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. సంక్షేమ వసతి గృహాల నిర్మాణం వేగవంతం చేయాలి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల నిర్మాణం, మరమ్మతు పనులను ఇంజినీర్లు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. వివిధ శాఖలలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు, మరమ్మతు పనులపై ఇంజినీరింగ్ అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలలో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణం నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. వసతి గృహాలకు గోడలు, చిన్నచిన్న మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో మూడు ఆటిజం సెంటర్ ల నిర్మాణానికి రూ.60 లక్షలు మంజూరు కాగా అనేది పనులు త్వరగా ప్రారంభించాలన్నారు. భవిత కేంద్రాలకు సామాగ్రి సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ కిచెన్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. చీరాల ప్రాంతీయ వైద్యశాల పక్కనే నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ మే నెల నాటికి పూర్తి చేయాలన్నారు. ఆయుష్ శాఖ ద్వారా చేపట్టిన వైద్యశాలల భవన నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ విజయమ్మ, డీసీహెచ్ఎస్ కోఆర్డినేటర్ పద్మావతి, పీఆర్ డీఈ రాజన్, ఇంజినీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి ప్రభుత్వ ఆలోచనలకు తగినట్టుగా అభివృద్ధి కొరకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. ఎన్హెచ్ఏ, ఆర్ అండ్ బీ రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులపై సంబంధితశాఖల అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్ లో ఆయన సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు బహుమతులు అందజేత ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ బహుమతులు అందజేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ విజయమ్మ, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి పాల్గొన్నారు. -
పర్చూరు వాగు విస్తరణం
170 ఎకరాల భూ సేకరణకు సిద్ధమైన చంద్రబాబు ప్రభుత్వం పర్చూరు వాగు విస్తరణ పేరుతో ప్రభుత్వం భూసేకరణకు దిగడంపై ఈ ప్రాంత రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముంపు నుంచి బయటపడేందుకు వాగు విస్తరణ తప్పనిసరని అధికారులు ప్రతిపాదించారు. ఐతే ఎగువనున్న ఉప్పుటూరు, పోతుకట్ల వాగు ఆక్రమణలు తొలగించకుండా ప్రభుత్వం కారంచేడు ప్రాంత రైతులకు చెందిన విలువైన భూములను వాగు విస్తరణ పేరుతో తీసుకొనే ప్రయత్నాలపై రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, బాపట్ల: రూ. 20 కోట్లతో పర్చూరు వాగును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కారంచేడు ప్రాంతంలో 170 ఎకరాల భూములు సేకరించాలని డ్రైనేజీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విషయం తెలుసుకున్న రైతులు మండిపడుతున్నారు. అనాలోచితంగా పర్చూరు వాగులో వాడరేవు– పిడుగురాళ్ల జాతీయ రహదారి బ్రిడ్జి పిల్లలర్లు నిర్మించడంతోపాటు ఎగువనున్న ఉప్పుటూరు –పోతుకట్లవాగు కబ్జాకు గురైనా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నది రైతుల అభిప్రాయం. ప్రభుత్వ ప్రతిపాదనలపై వ్యతిరేకతతో ఉన్న రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్కు వినతిపత్రం సమర్పించారు. మంగళవారం సాయంత్రం కారంచేడులో ఏకంగా సమావేశం నిర్వహించారు. ఎగువనున్న ఉప్పుటూరు–పోతుకట్ల వాగు కబ్జాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అది చేయకపోతే వాగు విస్తరణకు భూములిచ్చేది లేదని తేల్చిచెప్పారు. సమస్యను మరోమారు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని తీర్మానించారు. దీంతో పర్చూరు వాగు విస్తరణ వివాదం ముదురుతోంది. అధికార పార్టీ నేతల కబ్జాలను అధికారులు వదిలేసి... రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పచ్చ నేత కాసుల కక్కుర్తి... వాడరేవు – పిడుగురాళ్ల జాతీయ రహదారికి సంబంధించిన రెండు భారీ బ్రిడ్జీల నిర్మాణం చేపట్టారు. వీటికి సంబంధించి దాదాపు 40కి పైగా భారీ పిల్లర్లు పర్చూరు వాగులో నిర్మించారు. వాస్తవానికి పిల్లర్ల వల్ల కాలువ నీరు సజావుగా ఆయకట్టుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా కాంట్రాక్టర్ల వద్ద పర్చూరు పచ్చ నేత పెద్ద మొత్తంలో ముడుపులు పుచ్చుకొని రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించారనే విమర్శలు ఉన్నాయి. వరద సమయంలో ఇది మరింత ప్రమాదకరంగా మారుతోంది. అధికవర్షాలు కురిసినప్పుడు కాలువల నీరుతోపాటు పొలాల నుంచి వచ్చే నీరు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితోపాటు ఉప్పుటూరు – పోతుకట్ల వాగు నీరు పర్చూరు వాగులో కలుస్తోంది. ఉప్పుటూరు వాగు కబ్జాకు గురై పర్చూరు వద్ద జాతీయ రహదారి ప్రాంతంలో దాదాపుగా కనుమరుగైంది. దీంతో వరదనీరు ఈ ప్రాంతంలోని పర్చూరు, నాగులపాలెం గ్రామాలను చుట్టుముడుతోంది. పంట పొలాలను నాశనం చేస్తోంది. గత ఏడాది మోంథా తుపాను ప్రభావం వల్ల వరద ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్ స్పందించి సకాలంలో జాతీయ రహదారికి రెండు చోట్ల గండి కొట్టించారు. దీంతో వరదనీరు 50 వేల ఎకరాల వరి పొలాలను ముంచెత్తి రైతులకు తీవ్ర నష్టం చేకూర్చింది. వరద సమస్యలను అధిగమించేందుకు పర్చూరు వాగు విస్తరణ మార్గమని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం రూ. 20 కోట్లతో కారంచేడు నుంచి పెద్దివారిపాలెం వరకు 16 కిలోమీటర్ల మేర కాలువను విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకు 170 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నేడో రేపో ప్రభుత్వం దీనికి ఓకే చెప్పే అవకాశముంది. మొత్తంగా పర్చూరు వాగులో అడ్డంగా రెండు వంతెనలు నిర్మించకపోయినా... ఉప్పుటూరు– పోతుకట్ల వాగు కబ్జాకు గురికాకుండా అడ్డుకున్నా.. వరద ముంపు ఉండేది కాదని స్థానిక రైతులు చెబుతున్నారు. -
మహా శివరాత్రి వాల్ పోస్టర్ ఆవిష్కరణ
గోవాడ(వేమూరు): మహా శివరాత్రి తిరునాళ్లను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గోవాడ దేవస్థానం చైర్మన్ పావులూరు రమేష్ తెలిపారు. అమృతలూరు మండలం గోవాడ గ్రామంలోని శ్రీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానంలో వాల్పోస్టర్లు మంగళవారం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 13వ తేదీ నుంచి మహాశివరాత్రి తిరునాళ్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈనెల 13 నుంచి 17వ తేది వరకు తిరునాళ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం అధికారి వర్మ పాల్గొన్నారు. యద్దనపూడి: మండలంలోని యద్దనపూడి గ్రామానికి చెందిన పల్లెపోగు అభిలాష్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏరోస్కాటోబాల్ పోటీల్లో అండర్ 14 విభాగంలో మూడో స్థానం సాధించాడు. ఏరోస్కాటోబాల్ ఫెడరేషన్ ఆప్ ఇండియా ఆధ్వర్యంలో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు మహారాష్ట్రలోని షిర్డీలో నిర్వహించిన పోటీల్లో విద్యార్థి పాల్గొన్నాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాచే గుర్తించిన జాతీయ ఖేల్ మహోత్సవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో అతడు పాల్గొని స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇందులో భాగంగా అభిలాష్ మోడల్, కప్తోపాటు ప్రశంస పత్రం అందుకున్నాడు. మార్టూరు వివేకానంద స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి తండ్రి రవి పశుసంవర్థక శాఖలో ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. చినగంజాం: పాలకొల్లులో వపా బాపు ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన దక్షిణ భారత చిత్రకారులచే ఆర్ట్ క్యాంపులో చినగంజానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు సూరిబోయిన శ్రీనివాసరెడ్డి గుర్తింపు లభించింది. స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు చిక్రకారులు పాల్గొనగా లైవ్ పెయింటింగ్ పోటీలో శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథం అనే అంశానికి సంబంధించి అమరావతి, పోలవరం, గూగుల్ సెంటర్, గిరిజన తండాల అభివృద్ధి, క్యాంటం వ్యాలీ, పర్యాటక ప్రాంతాలు, ప్రసిద్ధ క్షేత్రాలకు సంబంధించిన పెయింటింగ్ వేసేందుకు పోటీలు నిర్వహించగా శ్రీనివాసరెడ్డి గిరిజన తండాల అభివృద్ధి అనే అంశంపై పెయింటింగ్ వేసి నిర్వాహకుల నుంచి సత్కారం అందుకున్నారు. అతనికి శాలువా కప్పి ప్రశంస పత్రం, మెమెంటో అందజేసి గౌరవించారు. చెరుకుపల్లి: సంప్రదాయ వస్త్రం చెరుకుపల్లి షర్టింగ్ క్లాత్ (ఆరుంబాక చెక్ అంగడి ష్టింగ్)కు భౌగోళిక సూచిక గుర్తింపు సాధించేందుకు అవసరమైన సమాచారం సేకరించినట్లు జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి వెంకట్రావు తెలిపారు. చెరుకుపల్లిలోని ఆరుంబాక చేనేత సహకార షర్టింగ్ అంగడిని మంళవారం సందర్శించి దుకాణంలోని వస్త్రాలను పరిసీలించారు. ఆయన మాట్లాడుతూ సంప్రదాయ చెరుకుపల్లి షర్టింగ్కు సంబంధించిన చరిత్ర, ప్రత్యేక లక్షణాలు, తయారీ ప్రక్రియలు, సామాజిక, ఆర్థిక ప్రాధాన్యత వంటి అంశాలను సమగ్రంగా లిఖితపూర్వకంగా డాక్యుమెంటేషన్ చేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. చేనేత కార్మికులు తాము నేత నేచే విధానం కళకు సంబంధించిన చారిత్రక ఆధారాలు, సాంకేతిక వివరాలను అధికారులకు వివరించారు. భౌగోళక సూచిక(జీఐ) నమోదు దరఖాస్తును త్వరలో ఆన్లైన్ ద్వారా దాఖలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆరుంబాక చేనేత సహకార సంఘ అధ్యక్షుడు దివి రాంబాబు, పలువురు చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ పూర్తి స్థాయి నియామకం కొరిటెపాడు: గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్గా కుర్రా అప్పారావు, వైస్ చైర్మన్గా బిట్రగుంట మల్లికలను నియమిస్తున్నట్లు రాష్ట ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎ.వి.రాజమౌళి మంగళవారం సాయంత్రం జీవో విడుదల చేశారు. సభ్యులుగా కొనకళ్ల వెంకటసత్యనారాయణ, ముదావత్ మంగాబాయి, కె.విజయలక్ష్మి, మొహమ్మద్ హఫీజ్, మేళం సైదయ్య, షేక్ ఖాదర్బాయి, బత్తుల జాన్సైదా, దర్శనపు విజయమ్మ, చంద్రగిరి బాబు, ఇమ్మడి వెంకటలక్ష్మి, డి.భాగ్యారావు, ఎన్. వంశీకృష్ణ, కె.శ్రావణకుమారిలను నియమిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. -
వైభవం.. సాయిబాబా మందిర వార్షికోత్సవం
మంగళగిరి టౌన్: దక్షిణ షిరిడీగా ప్రసిద్ధి గాంచిన మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో వున్న భగవాన్ శ్రీ సత్యషిరిడీసాయిబాబా మందిరం 20వ వార్షికోత్సవం ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. బాబాను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉదయం బాబాకు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మప్రచారక్ ఆధ్వర్యంలో స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించారు. పలువురు ప్రముఖులు వార్షికోత్సవానికి హాజరై బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సుమారు 70 వేల మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. చిన్నారులకు, పెద్దలకు వినోదాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, హ్యాండ్ల్యూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ప్రధాన కార్యదర్శి సిసోడియా, మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరిరావు, రాజ్యసభ మాజీ సభ్యులు గరికపాటి మోహనరావు, ఏపీ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫర్ నార్త్ అమెరికా కోమటి జయరాం, రిటైర్డ్ డీజీపీ మాలకొండయ్య, గంగాధర్ నాదెళ్ళ, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పంతల సురేష్, ఎన్ఆర్ఐలు యలమంచిలి జగదీష్బాబు, కావూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వామివారి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి జయప్రదం చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణం ధన్యవాదాలు తెలిపారు. -
పర్యాటక హబ్గా బాపట్ల
బాపట్ల: రానున్న ఐదేళ్లలో బాపట్ల పర్యాటక హబ్గా మారనుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్కుమార్ తెలిపారు. జిల్లాలో అభివృద్ధి చేస్తున్న పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు సింగపూర్ అధికారుల బృందం మంగళవారం జిల్లాకు చేరుకుంది. కలెక్టరేట్కు వచ్చిన సింగపూర్ ప్రభుత్వ అధికారుల బృందానికి జిల్లాలోని అధికారులు పూల మొక్కలతో ఘనంగా ఆహ్వానం పలికారు. బాపట్ల జిల్లా భౌగోళిక స్వరూపం, వ్యవసాయ, ఆక్వా సాగుపై ఆధారపడిన పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులు, పర్యాటక రంగం అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ను జిల్లా కలెక్టర్ వివరించారు. బీచ్ ల అభివృద్ధికి రాష్ట్రం ప్రభుత్వం చేస్తున్న కృషిని బృందం ప్రత్యేకంగా అభినందించింది. సమావేశంలో సింగపూర్ ఎకానమిక్ కన్సల్టెంట్ ప్రైస్ సీఈవో చూతోక హిమ్, సింగపూర్ కోపరేషన్ ఎంటర్ప్రైజ్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ త్యాలైన్ చీవో, సింగపూర్ సస్టైనబిలిటీ స్టాటజిక్ ప్రాజెక్ట్ సీనియర్ మేనేజర్ నిషశర్ధ, రాష్ట్ర ఆర్థిక ఘనంగా శాఖ డైరెక్టర్ బి గోపాల్, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. విల్లేజ్ క్లినిక్లకు స్థలాలు కేటాయించాలి జిల్లాలో ప్రతి సచివాలయ పరిధిలో ఏర్పాటు చేయనున్న విల్లేజ్ క్లినిక్లకు ప్రతిపాదించిన స్థలాలను వెంటనే వైద్య–ఆరోగ్యశాఖకు అప్పగించి నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి హైబ్రిడ్ విధానంలో తహసీల్దార్లు, ఆర్డీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 30 ప్రాంతాల్లో ఇప్పటివరకు స్థలాలు ఖరారు కాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదని కలెక్టర్ తెలిపారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న కొందరు తహసీల్దార్లపై అసహనం వ్యక్తం చేశారు. స్థలాలు కేటాయించని చోట్ల వెంటనే స్థలాలను గుర్తించి, వైద్య–ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ భావన, డీఆర్ఓ గంగాధర్ గౌడ్ తదితర అధికారులు పాల్గొన్నారు. విద్యార్థినులకు కళ్లద్దాలు పంపిణీ జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కంటి సమస్యలతో బాధపడుతున్న 2,974 మంది విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థినులకు కలెక్టర్ కళ్లద్దాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి విజయమ్మ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి రత్నమోహన్తోపాటు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
దత్తపీఠంలో మహాసుదర్శన హోమం
ఫిరంగిపురం: ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామంలోని శ్రీ దత్తపీఠంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. అనఘాదేవి, శ్రీ దత్తాత్రేయ స్వామిని విశేషంగా అలంకరించి అష్టోత్తర, సహస్ర నామ పూజలు చేశారు. యాగశాలలో రుత్వికులచే మహా సుదర్శన హోమం నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలను శ్రీదత్త పీఠం నిర్వాహకులు జయశంకర్ పర్యవేక్షించారు. తెనాలి టౌన్: శ్రీపంచముఖ ఆంజనేయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి పుష్పాలతో విశేష అర్చనలను వైభవంగా జరిపించారు. స్థానిక షరాఫ్ బజారులోని సువర్చల సమేత పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పుష్ప ఉత్సవం కనులపండువగా నిర్వహించారు. స్వామి వారిని, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన మండపంపై కొలువుదీర్చి వివిధ రకాల పుష్పాలతో అర్చన చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి హరి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి సంకీర్తన సభ్యులు పాల్గొని శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ, అన్నమాచార్య కీర్తనలను ఆలపించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పుష్పాలంకరణతో ఉన్న స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, ఆర్.వి.కిరణ్కుమార్లు పర్యవేక్షించారు. నగరంపాలెం: తెలుగు నాటక రంగ గౌరవాన్ని, భారతీయ నాటక సంప్రదాయాల గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పే లక్ష్యంతో భారత్ రంగ మహోత్సవ్ –అంతర్జాతీయ నాటక ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు వేదిక (తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళన సంఘం) అధ్యక్షుడు ముత్తవరపు సురేష్బాబు తెలిపారు. మంగళవారం అరండల్పేటలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో బ్రోచర్ విడుదల చేశారు. తెలుగు నాటక కళా పరిషత్ల సమ్మేళనం ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఢిల్లీ) సహకారంతో ఈ ఉత్సవాన్ని చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 6, 7, 8, 9, 10 తేదీల్లో మార్కెట్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నాటక ఉత్సవాలు కొనసాగుతాయని అన్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, నాటక ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. సమావేశంలో భూషణ్, పోపూరి నాగేశ్వరరావు, ముత్తవరపు పద్మారావు, పొగర్తి నాగేశ్వరరావు పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం మంగళవారం 542.30 అడుగులకు చేరింది. ఇది 193.1535 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 8,023, ఎడమ కాలువకు 7,852, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 27,866, ఎస్ ఎల్బీసీకి 2,200, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 46,241 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 46,241 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
హోరాహోరీగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు
రెంటచింతల: స్థానిక కానుకమాత చర్చి 176 వ వార్షిక తిరునాళ్ల మహోత్సవాన్ని పురస్కరించుకుని సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో మంగళవారం నిర్వహించిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన నువ్వానేనా అన్నట్లు హోరాహోరీగా జరిగాయి. సీనియర్ విభాగంలో జరిగిన ఈ ప్రదర్శనను చూడటానికి అనేక ప్రాంతాల నుంచి వేలాదిమంది తరలిరావడంతో క్రీడామైదానం కిక్కిరిసిపోయింది. ఈ విభాగంలో తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లా హూజూరునగర్కు చెందిన ఏఎస్పీ సుంకు సురేందర్ రెడ్డి ఎడ్లు 2,656.8 అడుగులు దూరంలాగి ప్రథమ బహుమతి రూ.2.70 లక్షల విలువైన రాయల్ ఇన్ఫీల్డ్(బుల్లెట్)ను కైవశం చేసుకున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా చౌటప్పల్ గ్రామానికి చెందిన మార్తల చంద్ర ఓబుల్రెడ్డి ఎడ్లు 2,637.10 అడుగుల దూరంలాగి 2వ బహుమతి రూ. 1.40 లక్షల విలువైన యూనికార్న్ బైక్ను దక్కించుకున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా కల్లూరు గ్రామానికి చెందిన పెరుమాళ్ళ శివకృష్ణ యాదవ్ ఎడ్లు 2,519 అడుగులు దూరంలాగి 3వ బహుమతి కై వసం చేసుకున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడ గన్నవరంకు చెందిన కాసనేని రాజాచౌదరి, వల్లభనేని మోహన్రావు ఎడ్లు 2,511.2 అడుగుల దూరంలాగి లాగి 4వ బహుమతి, బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్లు 2,502.4 అడుగులు దూరంలాగి 5వ బహుమతి, నంద్యాల జిల్లా ఎస్.కొత్తూరు గ్రామానికి చెందిన బీరం సుబ్రమణ్యేశ్వరరెడ్డి, నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామానికి చెందిన బాపతి కొండారెడ్డి కంబైన్డ్ డెడ్లు 2,342 అడుగుల దూరంలాగి 6వ బహుమతి, వైఎస్సార్ కడప జిల్లా చౌటప్పల్ గ్రామానికి చెందిన మార్తల చంద్ర ఓబుల్రెడ్డి ఎడ్లు 2,141.4 అడుగుల దూరంలాగి 7వ బహుమతి, నంద్యాల జిల్లా పెద్దకోట్టాల గ్రామానికి చెందిన బోరెడ్డి కేశవరెడ్డి ఎడ్లు 2,110.4 అడుగులతో 8వ బహుమతి, నంద్యాల జిల్లా టి.హుసేనాపురం గ్రామానికి చెందిన ఎం.రామచంద్రారెడ్డి ఎడ్లు 2,042 అడుగులు దూరంలాగి 9వ బహుమతి, కృష్ణా జిల్లా మల్లవల్లి గ్రామానికి చెందిన అక్కినేని ముకుల్ సత్య చౌదరి ఎడ్లు 1,815 అడుగులు లాగి 10వ బహుమతి రూ.14 వేలను గెలుచుకున్నాయి. – అదేవిధంగా 11, 12, 13, 14, 15 జతలకు పోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ విభాగంలో 15 జతలు పాల్గొనగా నిర్వహించిన బలప్రదర్శనలో మొత్తం 8 విభాగాలలో 123 జతల ఎడ్లు పాల్గొన్నట్లు కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి, ఆదూరి ఇన్నారెడ్డి, గొంటు సుమంత్రెడ్డి, ఏరువ జోజిరెడ్డి, బి.రామకృష్ణ, ఎం. రాజారెడ్డి, ఎం.చిన్న శౌర్రెడ్డి, కె. జోసఫ్రెడ్డి, జె. రాజేష్రెడ్డి, ఒ.ఇన్నారెడ్డి తెలిపారు. న్యాయనిర్ణేతలుగా రాధాకృష్ణ, పి.సుబ్బారెడ్డి, దుర్గి శ్రీనివాసరావు వ్యవహరించారు. ప్రథమస్థానంలో నిలిచిన సూర్యాపేట జిల్లా గిత్తలు -
జీజీహెచ్లో ఉచితంగా వైద్య సేవలు
గుంటూరు జీజీహెచ్లోని నన్నపనేని లోకాధిత్యుడు, సీతారావమ్మ స్మారక నాట్కో క్యాన్సర్ సెంటర్ను అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో నిర్మించాం. రోగులకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నాం. సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియో థెరపీ వైద్య సేవలు, న్యూక్లియర్ మెడిసిన్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. నాట్కో ట్రస్టు, ప్రభుత్వ భాగస్వామ్యంలో సుమారు రూ. 45 కోట్లతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అత్యాధునిక వైద్య సౌకర్యాలతో 125 పడకలతో ఈ సెంటర్ నిర్మించాం. మరో రూ.18 కోట్లతో 125 పడకల క్యాన్సర్ సెంటర్ను నిర్మిస్తున్నాం. ఈ ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి వస్తుంది. ఆపరేషన్లు, మందులూ ఉచితం. –నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ -
వ్యాధి నిర్ధారణలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకం
డీఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ బాపట్ల: ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు వ్యాధి నిర్ధారణ చేయడంలో ల్యాబ్ టెక్నీషియన్లది అత్యంత కీలకమైన పాత్ర అని డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ విజయమ్మ అన్నారు. స్థానిక బాపట్ల ఎన్జీవో హోమ్లో మంగళవారం బాపట్ల జిల్లా ల్యాబ్ టెక్నీషియన్లు, సబ్ యూనిట్ అధికారుల నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్లు కచ్చితంగా సమయపాలన పాటిస్తూ రోగులకు ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా వ్యాధి నిర్ధారణ చేసినప్పుడే రోగులకు సరైన న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ల్యాబ్లలో ఏమైనా పరికరాలు అవసరం ఉంటే వెంటనే తెలియజేయాలని చెప్పారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి నాగార్జునరావు మాట్లాడుతూ కీటక జనత వ్యాధులైన మలేరియా, బోదకాలు, డెంగీ, చికెన్ గున్యా లాంటి వ్యాధులను త్వరితగతిన గుర్తించాలని దీనికి సంబంధించి వైద్యాధికారులతో ఎప్పటికప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ మమేకమై తగు సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా వచ్చిన జ్వర అనుమానిత రక్తపూతలను ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా పరీక్షించాలని, వెంటనే ఐహెచ్ఐపి యాప్లో పొందుపరచాలని ఆదేశించారు. సమావేశంలో మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రేమ వ్యవహారంలో యువకుడు బలి
చీరాల: ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిని అతి కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితులను చీరాల వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి స్థానిక వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఎండీ మొయిన్ వివరాలను వెల్లడించారు. ఆయన కథనం.. జనవరి 27న చీరాల హరిప్రసాద్నగర్ గేటు సమీపంలో యువకుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో జీఆర్పీ పరిధిలోకి రాకపోవడంతో చీరాల వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి ఫొటోలు సోషల్ మీడియాలో రావడంతో వివరాల లభించాయి. మృతుడిని కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన కొండే త్రినాఽథ్ (19)గా గుర్తించారు. మృతుడి సోదరుడు కొండే హేమంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. త్రినాథ్ రోజూ చీరాలకు వచ్చి కరెంటు మేసీ్త్ర వద్ద పనిచేస్తుండేవాడు. త్రినాథ్, ఓ యువతి నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. కొంత కాలం తర్వాత మనస్పర్థలు రావడంతో మాట్లాడుకోవడం లేదు. షేక్ గౌస్ ఈసుబ్ నాలుగు నెలలుగా సదరు యువతితో పరిచయం పెంచుకొని తరచూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. త్రినాథ్తో కలిసి యువతి లాడ్జిలో నుంచి బయటకు రావడాన్ని ఏ1 షేక్ గౌస్ ఈసుబ్, ఏ2 దేవహర్ష చూసి వీడియో తీశారు. ఈ వీడియోను తొలగించాలని త్రినాథ్ చెప్పినా పట్టించుకోకపోవడంతో అప్పుడప్పుడు గొడవలు పడుతుండేవారు. త్రినాఽథ్ను అడ్డు తప్పించి యువతికి దగ్గర కావాలని షేక్ గౌస్ ఈసుబ్ నిర్ణయించుకున్నాడు. జనవరి 27న త్రినాథ్కు ఫోన్ చేసి మద్యం తాగుదామని పిలిచాడు. ఇద్దరు కలిసి హరిప్రసాద్నగర్లో రైల్వే గేటు సమీపంలో ఆర్వోబీ కింద కూర్చొని మద్యం తాగారు. ఈ క్రమంలో షేక్ గౌస్ ఈసుబ్ తన స్నేహితుడు దేవహర్షకు ఫోన్ చేసి రప్పించాడు. అతడితోపాటు శీలం భగవంతుడు కూడా వచ్చాడు. అందరూ కలిసి మద్యం తాగారు. అందరూ కలిసి పథకం ప్రకారం హత్య చేసి పరారయ్యారు. విఠల్నగర్లోని చంద్రప్రకాష్, వల్లెపు వాసును కలిసి జరిగిన విషయం చెప్పారు. ఓ ఇంటి వెనుక శ్మశానంలో రక్తం అంటిన దుస్తులు తగలబెట్టి పరారయ్యారు. ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులందరూ 19–21 సంవత్సరాల్లోపు వారే కావడం గమనార్హం. కేసును ఛేదించిన వన్టౌన్ సీఐ ఎస్.సుబ్బారావు, ఎస్ఐ జి.రాజ్యలక్ష్మి, పీఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ పి.రామారావు, పి.వెంకటేశ్వర్లు, పీసీలు పి.రాజు, ఎన్.భాస్కర్, ఎం.నాగరాజు, జి.బ్రహ్మయ్య, డి.రవి, హోంగార్డు అంకమ్మలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, రివార్డులు ప్రకటించారు. -
18 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు
నగరంపాలెం: జీడీసీసీ బ్యాంక్ (నల్లపాడు బ్రాంచ్)లో నిధుల దుర్వినియోగం కేసులో మరొకర్ని అరెస్ట్ చేశామని గుంటూరు సీసీఎస్ డీఎస్పీ బీవీ.మధుసూదనరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం కేసు వివరాలను సీసీఎస్ డీఎస్పీ తెలిపారు. జీడీసీసీ బ్యాంక్ (నల్లపాడు బ్రాంచ్)లో నిధుల దుర్వినియోగంపై గతేడాది నవంబర్ 28న డివిజనల్ కో–ఆపరేటివ్ అధికారి కె.శీనారెడ్డి ఫిర్యాదుతో నల్లపాడు పీఎస్లో కేసు నమోదైందని అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని చెప్పారు. ఈ మేరకు ఏ–8 అయిన బాపట్ల టౌన్ పటేల్నగర్ రెండో వీధిలో ఉంటున్న పీటా వెంకటేశ్వరావు కదలికలపై నిఘా ఉంచామని అన్నారు. ఈనెల రెండో తేదీన అతన్ని గుంటూరు బ్రాడీపేటలోని జీడీసీసీ బ్యాంక్ సమీపాన అరెస్ట్ చేశామన్నారు. గతంలో వెంకటేశ్వరరావు నల్లపాడు జీడీసీసీ బ్యాంక్ పాలకవర్గంలో సభ్యుడిగా నామినేట్ చేశారని తెలిపారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల న్యాయస్థాన కస్టడీకి ఆదేశించారని అన్నారు. పరారీలో ఉన్న కొందర్ని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. గుంటూరు వెస్ట్: జిల్లాలో రేషన్ దుకాణాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మంగళవారం తెలిపారు. జిల్లా పౌర సరఫరాల అధికారి, వారి సిబ్బందితో కలసి విస్తృతంగా తనిఖిలను నిర్వహిస్తున్నారన్నారు. ఈ నెలలో రేషన్ పంపిణీ జరుగుతున్న పలు చౌక ధరల దుకాణాలలో పౌర సరఫరాల సిబ్బంది ఆకస్మికగా తనఖిలను నిర్వహించి వాటిలో వ్యత్యాసాలు గుర్తించిన రేషన్ దుకాణాల డీలర్లపై 6ఎ, క్రిమినల్ కేసులను నమోదు చేయడం జరిగిందని వివరించారు. గుంటూరు నగరంలో రేషన్ షాప్ నెంబర్ 0781095, 0781106, 0781141లలో తనిఖీలను నిర్వహించగా ఆ దుకాణాల్లో బియ్యం తక్కవగా ఉండటాన్ని గుర్తించడం జరిగిందని తెలిపారు. రేషన్ షాపుల నెంబర్లు 0781003, 0781018, 0781015 లో తనిఖీలను నిర్వహించగా వాటిలో బియ్యం ఎక్కువగా ఉండటాన్ని గుర్తించామన్నారు. తాడేపల్లి మండల పరిధిలో రేషన్ షాప్ నెంబర్ 0793014 లో తనిఖీలు నిర్వహించగా అక్కడ కూడా బియ్యం తక్కవగా ఉండటాన్ని గుర్తించి డీలర్లపై కేసులను నమోదు చేశామన్నారు. పీడీఎస్ బియ్యం కొనుగోలు, విక్రయాలు జరిపితే నేరమని తెలిపారు. అమ్మినా, కొన్నా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జేసీ హెచ్చరించారు. -
బాపట్ల
బుధవారం శ్రీ 4 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 36.4577 టీఎంసీలు. నరసరావుపేట రూరల్: ఇస్సపాలెంలోని మహంకాళి ఆలయ నిర్మాణానికి కాసరగడ్డ వీరేంద్ర, రమాదేవి దంపతులు రూ.1,01,116 విరాళంగా అందజేశారు. తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో మంగళ వారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,500, గరిష్ట ధర రూ.4,800, మోడల్ ధర రూ.4,300 వరకు పలికింది. 7 -
అందుబాటులో ఆధునిక వైద్యం
క్యాన్సర్ను నయం చేసే ఆధునిక వైద్య పద్ధతులు నేడు అందుబాటులో ఉన్నాయి. ఇమ్యూనోథెరపీ, టార్గెట్ థెరపీ ద్వారా రోగులు త్వరగా కోలుకుంటున్నారు. నెక్ట్స్ జెనరేషన్ సీక్వెన్సింగ్ టెస్ట్ ద్వారా వ్యాధిని చాలా త్వరగా గుర్తించవచ్చు. ఏ జీన్లో తేడా వల్ల సోకుతుందనే విషయం తెలుస్తుంది. ల్యాప్రోస్కోపిక్, రోబోటిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. బీఆర్సీఏ–1, 2 పరీక్షల ద్వారా కుటుంబంలో ఒకరికి వ్యాధి ఉంటే ఇతరులకు వస్తుందా రాదా అని నిర్ధారించవచ్చు. హెల్త్ ఇన్సూరెన్సుల ద్వారా అనేక రకాల క్యాన్సర్లకు ఉచిత వైద్య సేవలు లభిస్తున్నాయి. – డాక్టర్ ఎం.జి.నాగకిషోర్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, గుంటూరు -
క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్లు
గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్, లివర్ క్యాన్సర్ సోకకుండా ముందస్తుగా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. తొమ్మిదేళ్ల బాలిక నుంచి 20 ఏళ్ల యువతులు ముందస్తుగా వ్యాక్సిన్లు వేయించుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సోకదు. మమ్మోగ్రామ్ పరీక్ష ద్వారా రొమ్ము క్యాన్సర్ను ముందస్తుగానే గుర్తించి, నివారించవచ్చు. అతి తక్కువ సమయంలో వ్యాధిని గుర్తించే ఆధునిక వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ముందస్తుగానే గుర్తించవచ్చు. – డాక్టర్ బైరపనేని స్రవంతి, క్యాన్సర్ వైద్య నిపుణురాలు, గుంటూరు -
ముందే గుర్తిస్తే.. మెరుగైన వైద్యం
గుంటూరు మెడికల్ పూర్వం రాచపుండుగా పిలిచే క్యాన్సర్ వ్యాధి సోకితే మరణం తప్పదనే వారు. క్యాన్సర్ సోకగానే వ్యాధికి మందు లేదనే భయాందోళనలతో అనేక మంది చనిపోయేవారు. నేడు ఆధునిక వైద్యం ఎంతో అభివృద్ధి చెందటంతో క్యాన్సర్ను పూర్తిగా నయం చేస్తున్నారు. ప్రాథమిక దశలోనే గుర్తించే అత్యాధునిక నిర్ధారణ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ రాకుండా ముందస్తుగా కట్టడి చేసే వ్యాక్సిన్లు సైతం మార్కెట్లోకి వచ్చాయి. యువ క్రికెటర్ యువరాజ్సింగ్ క్యాన్సర్ నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. వ్యాధి పట్ల అవగాహన కోసం ప్రతి ఏడాది ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డేగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త.. మానకుండా ఉండే పుండు, శరీరంలోని ఏ భాగంలోనైనా ఎదిగే గడ్డ, ఎదుగుతున్న కణుతులు, అసహజమైన రక్తస్రావం, పెరుగుతున్న పుట్టుమచ్చలు, పులిపిరి కాయలు, మింగటం కష్టంగా ఉండటం, గొంతు బొంగురుపోయి తగ్గకుండా ఉండటం, చాలా రోజులుగా ఉన్న అజీర్ణవ్యాధి తదితర లక్షణాలు ఉంటే తక్షణమే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. పొగాకు ఉత్పత్తుల కారణంగా 40 నుండి 45 శాతం, కాలుష్యం వల్ల 8 నుంచి 10 శాతం, మద్యం వల్ల మూడు శాతం క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 50 మంది క్యాన్సర్ వైద్య నిపుణులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్ద రోజూ దాదాపు 10 నుంచి 20 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. సంవత్సరం ఓపీ రోగులు ఆపరేషన్లు 2021 11,719 168 2022 13,105 417 2023 14,648 753 2024 16,359 823 2025 19,598 1,131 -
పంట కాలువలో మహిళ మృతదేహం లభ్యం
చీరాల: పంట కాలువలో మహిళ మృతదేహం సోమవారం చీరాలలో కలకలం రేగింది. పంట కాలువలో మహిళ మృతదేహం లభించడంతో స్థానికంగా భయాందోళనకు గురిచేసింది. చీరాల మండలం ఈపూరుపాలెం పోలీస్స్టేషన్ పరిధిలో తోటవారిపాలెం 216 హైవే పక్కన కాలువలో మహిళ మృతదేహం తేలుతూ కనిపించింది. మృతదేహాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు వయస్సు 25–30 మధ్య ఉంటుందని భావిస్తున్నారు. మరణించి రెండు, మూడు రోజులు అయి ఉంటుందని, మృతురాలికి సంబంధించిన ఆధారాలేమీ లభించలేదన్నారు. సంఘటనా స్థలానికి డీఎస్పీ ఎండీ మొయిన్ చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. హత్య, ఆత్మహత్య అనే కోణంలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఈపూరుపాలెం ఎస్ఐ ఎ.చంద్రశేఖర్ తెలిపారు. -
బాపట్ల
మంగళవారం శ్రీ 3 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3400, గరిష్ట ధర రూ.4800, మోడల్ ధర రూ.4200 వరకు పలికింది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిల్వ 54.90 టీఎంసీలు.జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల:ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అర్జీదారులు ఇచ్చే అర్జీలను పరిశీలించి పరిష్కరించి చూపాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. సోమవా రం కలెక్టరేట్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పి.జి.ఆర్.ఎస్)లో వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వింటూ వారి నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, జేసీ భావన, డీఆర్వో గంగాధర్గౌడ్, డిప్యూటీ కలెక్టర్ లవన్న అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలపై 235 అర్జీలు నమోదయ్యాయి. తన పరిధిలోని వాటికి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపడం జరుగుతుందని, కొన్నింటిని పరిశీలన, మరికొన్నింటిని విచారించాలని తర్వాత సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుందని అర్జీదారులకు సూ చించారు. ప్రజల సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామ, మండల స్థాయిలో ప్రజ ల నుంచి అర్జీల స్వీకరణ జరుగుతుందన్నారు. ప్రతి సోమవారం ఇదే క్రమాన్ని పాటించాలని సూచించారు. నమోదైన అర్జీలను పరిశీలించి న, తదుపరి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించా లన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, జెడ్పీ సీఈఓ ఏ.ఎస్.రాజు, డ్వామా, డీఆర్డీఏ, మెప్మా, ఐసీడీఎస్, గృహ నిర్మాణ సంస్థల పీడీలు విజయలక్ష్మి, సింగ య్య, పాల్, రాధామాధవి, వెంకటేశ్వరరావు, మార్క్ఫెడ్ డీఎం కరుణశ్రీ, డీసీహెచ్ఎస్ పద్మావతి, డీటీఓ పరంథామరెడ్డి, డీఐసీ జీఎం రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు. బాపట్ల టౌన్: కాళ్ళరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగటమే కానీ సమస్యలు పరిష్కరించిన దాఖలాలు లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నెలల తరబడి తిరుగుతున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయంటూ టీడీపీ సర్కార్పై మండిపడ్డారు. నల్లమడ వాగును తక్షణమే ఆధునికీకరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నల్లమడ రైతుసంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ● రైతు సంఘం అధ్యక్షులు డాక్టర్ కొల్లా రాజమోహన్ మాట్లాడుతూ టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల ఇబ్బందులు పరిష్కరించాలని అర్జీలు పెట్టడమే కానీ...పరిష్కరించిన దాఖలాలు లేవన్నారు. గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించాలని, నల్లమడ వాగు ఆధునికీకరణ చేయాలని, నల్లమడ వాగు గండ్లను పూడ్చేందుకు నిధులు మంజూరు చేయాలని ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేక ఆందోళన చేపట్టామన్నారు. ● బాపట్ల, గుంటూరు జిల్లాల పరిధిలో సుమారు 50 గ్రామాలు పూర్తిగా వర్షధార వ్యవసాయంపై ఉన్నాయన్నారు. తాగునీరు, సాగునీరు, భూగర్భ జలాలు లేని ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న కృష్ణా జలాలను గుంటూరు ఛానల్ ద్వారా పర్చూరు వరకు తరలించాలని పలు పర్యాయాలు గుంటూరు, బాపట్ల జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేదన్నారు. నల్లమడ ఆధునికీకరణ కలేనా..? ● గత రెండేళ్ళుగా వస్తున్న తుఫాన్లకు, వరదలకు పై నుంచి వస్తున్న ఉధృతికి దిగువ ప్రాంతాల్లోని నల్లమడ వాగుకు గండ్లు పడి పొలాలు ముంపునకు గురై రూ.లక్షల్లో నష్టాలు వస్తున్నా కనీసం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. నల్లమడ వాగు ఆధునీకరణ నిమిత్తం పరిపాలన అనుమతుల కోసం ఇప్పటికే అధికారులకు రూ. 337.30 కోట్ల అంచనాలను సమర్పించటమైందన్నారు. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వయంగా నల్లమడ వాగును పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఏళ్ళు గడుస్తున్నా అతీగతీ లేదన్నారు. ● కేంద్ర, రాష్ట్ర కమిటీల నివేదికల ప్రకారం నల్లమడ వాగును 500 సీ వాల్యూకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నల్లమడ ఆధునికీకరణకు పరిపాలనా పరమైన అనుమతులు ఉన్నప్పటికీ నిధులు మంజూరు కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదన్నారు. కనీసం గండ్లు కూడా పూడ్చకపోవడంతో వర్షాకాలంలో ముంపునకు గురై పంటలకు భారీ నష్టం జరుగుతుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు దేవవరపు లక్ష్మీనారాయణ, లావు అంకమ్మ చౌదరి, నాయుడు సుబ్బారావు, మువ్వా పెద్దన్న, కాపు సాంబశివరావు, గోరంట్ల బాబు, దండా శ్రీనివాసరావు, చెన్నుపాటి సూర్యపకాశరావు, ఎం. రాము, మలినడి జగన్మోహన్రావు పాల్గొన్నారు. 7 -
విధులకు మంగళం... ఇంటికే పరిమితం
కొల్లూరు: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి ఉమ్మడి రాష్ట్రంలో పలు అవార్డులు అందుకున్న కొల్లూరు పీహెచ్సీ ప్రతిష్ట వైద్యురాలి తీరు కారణంగా అట్టడుగు స్థాయికి దిగజారుతుంది. వైద్యురాలు దోనేపూడి నుంచి డెప్యూటేషన్పై ఇటీవల కొల్లూరు పీహెచ్సీకి వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. కొద్దిరోజులుగా ఆమె విధులకు హాజరుకాకుండా ఇంటికే పరిమితమైంది. ఇంటి నుంచే ఆన్లైన్లో హాజరు వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక వేళ విధులకు హాజరైనా సమయపాలన పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఆమె ఇన్చార్జి డీడీఓగా ఉన్న సమయంలో వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించకుండానే కమిటీ సభ్యుల సంతకాలు సేకరించి మమ అనిపించేదని చెబుతున్నారు. కొద్ది నెలల కిందట ఆమె స్థానంలో డీడీఓగా అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడిని నియమించారు. అయినప్పటికీ ఆమె డీడీఓ అధికారాలను తన గుప్పెట్లో పెట్టుకుని ఆ వైద్యుడిపై పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆన్లైన్ హాజరును డీడీఓ అనుమతించాల్చి ఉండగా, డీడీఓపై బెదిరింపులకు దిగుతూ హాజరు అనుమతి అథారిటీని తన వద్దే ఉంచుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. విధులకు హాజరుకాకున్నా తనకు అనుకూలంగా ఉన్న సిబ్బందికి సైతం అటెండెన్స్ వేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి తనకు అండదండలు ఉన్నాయంటూ సిబ్బందిని బెదిరిస్తున్నట్లు సమాచారం. హాజరు పట్టికలో జనవరి 22న సీఎల్గా (క్యాజువల్ లీవ్) చూపిన ఆమె అదే నెల 29 వరకు వైద్యశాలకు వచ్చిన పాపాన పోలేదు. కానీ 29న వైద్యశాలకు వచ్చిన ఆమె 22న ఉన్న సీఎల్ను సైతం తన సంతకంలో కలిపేసుకొని ఏకంగా 8 రోజుల సంతకాలు ఒకే రోజు చేసినట్లు సమాచారం. ‘తాను చెడ్డ కోతి వనమంతా చెరిపింది’ అనే చందంగా సిబ్బందిలో ఒకరిద్దరు ఏఎన్ఎంలను సైతం తన ఇంటికి పిలిపించుకొని వారితో కాలక్షేపం చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యురాలి తీరు కారణంగా ఆస్పత్రికి వచ్చే రోగులు మెరుగైన సేవలు అందక అవస్థలు పడుతున్నారు. -
మద్యం తాగి వ్యక్తి మృతి
కొల్లూరు: మద్యం తాగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కొల్లూరులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా ఆవులవారిపాలేనికి చెందిన సనక రామకృష్ణ(40) కుటుంబం కొన్నేళ్ల క్రితం కొల్లూరు బోస్నగర్ సమీపంలోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద స్థిర పడింది. ఇటుకరాయి లోడింగ్ వంటి కూలి పనులు చేస్తున్న రామకృష్ణకు మద్యపానం అలవాటుంది. ఆదివారం కొల్లూరు లాక్ సెంటర్ ప్రాంతంలో మద్యం తాగి వినాయకుడి ఆలయం పక్క వీధిలోని సిమెంట్ రోడ్డుపై మత్తులో పడుకున్నాడు. గమనించిన స్థానికులు పక్కనే ఉన్న అరుగుపై పడుకోపెట్టారు. సోమవారం ఉదయం అతడిని లేపాలని ప్రయత్నించగా పరిశీలించి మృతి చెందినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో మృతుడి తల్లి, భార్య మృతదేహాన్ని ట్రాలీ ఆటోలో తమ గృహానికి తరలించారు. ఇటీవల ఇటుక బట్టీలలో పనిచేసేందుకు వచ్చిన అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వలసకూలీ మద్యం తాగి అపస్మారక స్థితిలో వంతెన పై నుంచి పడి మృతి చెందడం, తాజాగా సనక రామకృష్ణ మృతితో మందుబాబులలో ఆందోళన నెలకొంది. -
అంగరంగ వైభవంగా కానుకమాత తిరునాళ్ల
రెంటచింతల: పునీతురాలైన కన్యమరియ తన కుమారుడైన ప్రభువైన ఏసుక్రీస్తును సమస్త మానవాళి రక్షణ నిమిత్తం లోకానికి ఇచ్చిందని నల్గొండ మేత్రాసన పీఠాధిపతులు, అభిషిక్త గురువులు మహా ఘన డాక్టర్ కరణం దమన్ కుమార్ అన్నారు. రెంటచింతలలోని ప్రఖ్యాత కానుకమాత చర్చిలో సోమవారం కానుకమాత చర్చి 176వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత స్థానిక విచారణ గురువులు రెవ.ఫాదర్ ఏరువ లూర్ధుమర్రెడ్డి నేతృత్వంలో రెవ.ఫాదర్ ఏరువ బాల శౌర్రెడ్డి, రెవ.ఫాదర్ కాసు జోజిరెడ్డిలతో కలిసి కానుకమాత చర్చి 176వ వార్షిక తిరునాళ్ల మహోత్సవ సమష్టి దివ్య బలిపూజలో భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సమాజంలో నెలకొన్న అశాంతి తొలిగి పోవాలంటే క్రీస్తు ప్రభువు సూక్తులను ఆచరిస్తూ ఆయన చూపిన బాటలో నడవాలన్నారు. ప్రభువును ప్రేమించే విషయంలో, ఇతరులకు సేవ చేసే విషయంలో పల్నాటి పౌరుషం చూపాలన్నారు. ఇరుగు పొరుగు వారిని దయాహృదయంతో ఆదుకోవాలన్నారు. దివ్యాపూజాబలి సమర్పించిన నల్గొండ మేత్రాసన పీఠాధిపతి మహా ఘన డాక్టర్ కరణం దమన్కుమార్ -
ప్రశాంత వాతావరణంలో టెన్త్ పరీక్షలు
బాపట్ల: మార్చి 16 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు నిర్వహించే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించా రు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలను తహసీల్దార్లు, ఆర్డీఓలు, డీఈఓ, ఎంఈఓలు ముందుగా పరిశీలించి ఏమైనా సమస్య లు ఉంటే తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. విద్యార్థులు 9 గంటల కల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఓఆర్ఎస్, ఫస్ట్ ఎయిడ్, ఏఎన్ఎం నియమించాలని, పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులకు సూచించా రు. పరీక్ష ముగిసిన వెంటనే జవాబు పత్రాల ను సమీపంలో ఉన్న పోస్టాఫీస్లో అందజేయాలన్నారు. పరీక్ష జరిగే రోజు 144 సెక్షన్ విధించడంతోపాటు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. జిల్లాకు వచ్చే ప్రశ్నపత్రాలను జాగ్రత్తగా స్ట్రాంగ్ రూముల్లో భద్రపర్చాలని, పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాలను బందోబస్తుతో తీసుకెళ్లాలని పోలీసు అధికారులకు సూచించారు. డీఈఓ శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ, పోలీసు, విద్యుత్, ఆర్టీసీ, అధికారులు పాల్గొన్నారు. బాపట్ల సేవా సేతుతో తల్లి ప్రేమను అనుసంధానించాలి అంగన్వాడీ కేంద్రాలకు బాపట్ల సేవా సేతు ద్వారా తల్లి ప్రేమను అనుసంధానించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ తెలిపారు. బాపట్ల సేవా సేతు ద్వారా అంగన్వాడీ కేంద్రాలలో మాలిక సదుపాయాల కల్పనపై మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో 1,552 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, పూర్తి సౌకర్యాలు కల్పించాలన్నారు. దాతలు అందించే విరాళాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ పంచాయతీల్లో ప్రతి ఇంటి నుంచి తప్పనిసరిగా చెత్త సేకరణ జరగాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పరిశుభ్రత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పంచాయతీ, మున్సిపల్ రంగాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి నిధులతో అభివృద్ధి పనులు ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ తెలిపారు. ఉపాధి హామీ పథకం అమలు తీరుపై జిల్లా, మండలస్థాయి అధికారులతో సమీక్షించారు. -
టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోండి
తప్పుడు ప్రచారంపై పోలీస్స్టేషన్లో వైఎస్సార్ సీపీ ఫిర్యాదుచీరాల: తిరుపతి లడ్డూ వ్యవహారంపై సిట్ చార్జిషీట్కు విరుద్ధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి ఫొటోలతో తప్పుడు ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు వేసి ప్రజల్లో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకులు సోమవారం చీరాల ఒన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం వెంకటేష్ బాబు ఆదేశాల మేరకు పార్టీ నాయకులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నెయ్యి కల్తీ అంశంపై సీబీఐ, సిట్ కోర్టులో దాఖలు చేసిన సప్లమెంటరీ చార్జిషీట్ను పరిశీలిస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిపై ఎలాంటి నేరారోపణలు, పాత్ర నిర్ధారణ లేదని స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో చార్జిషీట్లో లేని ఆరోపణలును ప్రజా ప్రదేశాల్లో పోస్టర్ల రూపంలో ప్రచారం చేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. ఇది కేవలం వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా కోర్టులో పెండింగ్లో ఉన్న అంశంపై ప్రజల్లో తప్పుదారి పట్టించే భావజాలాన్ని సృష్టించే యత్నంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పోస్టర్లు కారణంగా ప్రజల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరిగి, మాటల తగాదాలు, వాగ్వాదాలు చోటుచేసుకొని శాంతిభద్రతలకు భంగం కలిగే పరిస్థితి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరైతే చట్టవిరుద్ధంగా సిట్ అధికారకంగా తెలియపరచిన ఆధారాలను తప్పుదారి పట్టించి, దాడులు చేయడం, రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కొనసాగించే విధంగా చేసే ప్రతి ఒక్కరినీ చట్టపరంగా శిక్షించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, వేటపాలెం మండల అధ్యక్షుడు సాధు రాఘవ, చీరాల మండల అధ్యక్షుడు అద్దంకిరెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు చీమకుర్తి బాలకృష్ణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జైసన్బాబు, కౌన్సిలర్లు గుంటూరు ప్రభాకరరావు, బత్తుల అనిల్, రైతు విభాగం అధ్యక్షుడు కావూరి రమణారెడ్డి, బూత్ లెవల్ చైర్మన్ శిఖా సురేష్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ కబీర్, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు కోడూరి ప్రసాద్రెడ్డి, పార్టీ నాయకులు గోలి గిరి, ఎస్.నవీన్, షేక్ మహబూబ్, కంచర్ల చక్రవర్తి, చెల్లి బాబూరావు, డిక్కి వెంకటరాజు, వాసిమళ్ల శ్రీను, కోండ్రు పూర్ణ, మొహమ్మద్ పాల్గొన్నారు. -
శ్రీరామ సైనిక్ స్కూల్ విద్యార్థికి జాతీయస్థాయి అవార్డు
కొల్లూరు: కదలిక శక్తి వృథా కాకుండా విద్యుత్ ఉత్పత్తి చేసి దానిని సద్వినియోగం చేసుకునే విధానంపై ప్రాజెక్టు ప్రదర్శించిన శ్రీరామ సైనిక్ స్కూల్ విద్యార్థి జాతీయ స్థాయిలో మెరసి అవార్డును కై వసం చేసుకున్నాడు. ఆదివారం బెంగళూరు యునైటెడ్ మిషన్ హైస్కూల్లో టేన్ 90 సంస్థ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన వినూత్న పరిశీలనాత్మక ప్రాజెక్టుల జాతీయస్థాయి ఎస్పీఏఆర్సీ పోటీలలో మండలంలోని శ్రీరామ సైనిక్ స్కూల్ 8వ తరగతి విద్యార్థి పిల్లా నాగచైతన్య మూడవ స్థానంలో నిలిచి తన ప్రతిభను చాటాడు. కదిలే టూగు టుయ్యాల అనే వినూత్న ప్రాజెక్టుతో దేశ వ్యాప్తంగా సమర్పించిన వెయ్యి ప్రాజెక్టులలో 30 ప్రాజెక్టులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కాగా వాటిలో నాగచైతన్య ప్రాజెక్టు ప్రదర్శనకు స్థానం దక్కింది. ఈ ప్రదర్వనలో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. జాతీయ స్థాయిలో రాణించిన నాగచైతన్యకు నగదు బహుమతిగా రూ.5 వేలు నగదు, రూ.20 వేలు విలువైన గిప్ట్ ఓచర్, ప్రశంసాపత్రాన్ని నిర్వాహకులు అందజేశారు. విద్యార్థికి మార్గదర్శకత్వం అందించిన అయితిరెడ్డి సురేష్, ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. భవిష్యత్లో నాగ చైతన్య మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించాలని శ్రీరామ సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కె.శ్రీకాంత్, డైరెక్టర్ కొలసాని తులసివిష్ణుప్రసాద్ ఆకాంక్షించారు. -
బాధితులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు
ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాపట్లటౌన్: సమస్యలను చెప్పుకునేందుకు స్టేషన్కు చేరుకునే బాధితులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 62 మంది అర్జీలు అందించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని కోరారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలని చెప్పారు. అర్జీలను పూర్తి స్థాయిలో విచారించి శాశ్వతంగా పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికంగా కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలకు సంబంధించిన అర్జీలే అధికంగా వస్తున్నాయని పోలీసు అధికారులు ఎస్పీకు వివరించారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్నాయక్, పీజీఆర్ఎస్ సెల్ మహిళా ఎస్ఐ లక్ష్మీరాజ్యం పాల్గొన్నారు. -
తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం మహాపాపం
రేపల్లె: పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారంటూ రాష్ట్రవ్యాప్తంగా తప్పుడు ప్రచారం చేయడం మహా పాపమని వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ పేర్కొన్నారు. సీబీఐ స్పష్టమైన నివేదిక ఇచ్చినా దానిని అపహాస్యం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్న్లో టీడీపీ నేతలు కావాలనే ప్రజల్లో గందరగోళం సృష్టస్తున్నారని విమర్శించారు. ఈ అసత్య ప్రచారానికి సంబంధించిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని, వాటిని ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రేపల్లె పట్టణ పోలీస్స్టేషన్లో ఎస్సై రాజశేఖర్కు, రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. డాక్టర్ గణేష్ మాట్లాడుతూ సీబీఐ నివేదికలో తిరుమల లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని స్పష్టంగా తేలినా, నిజాలను పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిట్రిక్స్కు తెరలేపారని అన్నారు. ప్రశ్నించే వారిపై దాడులు చేయడం, అక్రమ అరెస్టులకు పాల్పడటం టీడీపీ సిగ్గుమాలిన రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఫ్లెక్సీలను తొలగించాలని కోరిన అంబటి రాంబాబుపై టీడీపీ రౌడీలు దాడులు చేయడం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సంస్కృతి కొనసాగితే రానున్న రోజుల్లో టీడీపీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఫ్లెక్సీలను వెంటనే తొలగించకపోతే పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తామే తొలగిస్తామని హెచ్చరించారు. ఇసుకపల్లిలో ఏర్పాటు చేసిన ప్లెక్సీని తొలగించాలని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు చిత్రాల ఓబేదు, చిమట బాలాజీ, జిల్లా అధికార ప్రతినిధి కేవీ కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చదలవాడ శ్రీనివాసరావు, మండల కన్వీనర్లు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్, యార్లగడ్డ వెంకట రాంబాబు, ఇంకొల్లు రామకృష్ణ, డుండి వెంకట రామిరెడ్డి, నాయకులు పట్టెం శ్రీనివాసరావు, లియాఖత్ బాషా, ఖుద్దూష్, శొంఠి సురేష్, పద్మావతి, తదితరులు పాల్గొన్నారు. కూటమి నేతలపై పోలీసులకు వైఎస్సార్ సీపీ ఫిర్యాదు -
ఏపీ ఉపాధ్యాయ సంఘ ఆవిర్భావ దినోత్సవం
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ (ఏపీయూఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం గుంటూరు పట్టాభిపురం హైస్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర మహిళా కన్వీనర్ పమిడి పద్మ మాట్లాడుతూ 1982లో ఆవిర్భవించిన ఏపీయూఎస్ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం విశేష కృషి చేస్తోందన్నారు. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పని చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి మన్నవ సురేష్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసరావు, బాలచంద్రారెడ్డి, జిల్లా ఆర్థిక కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు, అదనపు కార్యదర్శి వైఆర్కే ప్రసాద్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షడు వీరబాబు పాల్గొన్నారు. దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో సోమవారం హుండీ కానులు లెక్కించారు. రూ.18, 83,646 ఆదాయం వచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. దేవదాయ శాఖ ఇన్స్పెక్టరు సి.హెచ్. వెంకట శ్రీనివాసులు, దేవాలయ ధర్మకర్త డి.రంగప్రసాద్, దేవస్థాన సిబ్బంది, అర్చక స్వాములు, స్వచ్ఛంద సేవా సంస్థలు, భక్తుల సమక్షంలో లెక్కింపు కార్యక్రమం నిర్వహించామని ఆలయ కార్యనిర్వాహణ అధికారి కె.సునీల్ కుమార్ తెలిపారు. నూజండ్ల: కొండ గురునాథస్వామి తిరునాళ్ళ అత్యంత వైభవంగా సాగింది. లక్ష మంది పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని అంచనా. ఈ మేరకు సోమవారం దేవదాయశాఖ, ధర్మకర్త, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హుండీ ద్వారా వచ్చిన విరాళాలు, కొబ్బరికాయ వేలం ద్వారా వచ్చిన రాబడిని లెక్కించారు. హుండీ ద్వారా 5 లక్షల 64 వేల రూపాయలు, కొబ్బరి చిప్పలు తలనీలాల వేలంపాట ద్వారా 2 లక్షల 50 వేల రూపాయలు ఆదాయం లభించినట్లు దేవదాయశాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ మంజూష, ఈవో శివనాగిరెడ్డి, సుధాకర్రెడ్డి, నెమలిరెడ్డి, లక్ష్మయ్య, సుబ్బారెడ్డి, ఎ.వెంకటేశ్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పలువురు భక్తులు సోమవారం విరాళాలు అందజేశారు. గుంటూరు జిల్లా స్తంభాలగరువుకు చెందిన బండ్రెడ్డి దుర్గా పవన్ కుటుంబం అమ్మవారి ఉచిత ప్రసాద వితరణకు రూ.1,00,001 విరాళాన్ని ఆలయ ఏఈవో వెంకటరెడ్డికి అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 542.80 అడుగులకు చేరింది. జలాశయం నుంచి కుడి కాలువకు 8,023, ఎడమ కాలువకు 7,852, ఎస్ఎల్బీసీకి 2,200, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి 18,375 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. -
ముగిసిన విజ్ఞాన్ బాల మహోత్సవ్
చేబ్రోలు: చిన్న వయసులోనే లక్ష్యాన్ని నిర్ణయించుకుని, క్రమశిక్షణతో శ్రమిస్తే ఏ రంగంలోనైనా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లవరపు సూర్యతేజ (ఐఆర్ఎంఎస్) అన్నారు. వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి రెండో ఎడిషన్ ‘విజ్ఞాన్ బాల మహోత్సవ్–2కే26’ వేడుకలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా బాల మహోత్సవ్ గెజిట్ పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. వివిధ క్రీడా, సాంస్కృతిక పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు రూ.5 లక్షల నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు, మెమొంటోలు అందజేశారు. బాల మహోత్సవ్ 2కే26 విజేతలు వీరే... రాష్ట్రస్థాయి విజ్ఞాన్ బాల మహోత్సవ్లో భాగంగా మొత్తం 50 ఈవెంట్లను నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను అందించారు. ఏఐ మోడల్తో సుస్థిర అభివృద్ధికి బలమైన పునాది చేబ్రోలు: భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ఖర్చుతో, స్వదేశీ అవసరాలకు అనుగుణంగా రూపొందించే ఓపెన్ సోర్స్, లో రిసోర్స్ ఏఐ మోడళ్లు భవిష్యత్తులో సుస్థిర అభివృద్ధికి బలమైన పునాదిగా మారతాయని స్విస్నెక్స్ ఇన్ ఇండియా కంపెనీ అకడెమిక్ ఎంగేజ్మెంట్ హెడ్ లీనా మారైకే జోసెఫిన్ రోబ్రా అన్నారు. వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘ కాన్క్లేవ్ ఆన్ రెస్పాన్సిబుల్ అండ్ సెస్టెయినబుల్ ఏఐ’ అనే అంశంపై సోమవారం సదస్సును నిర్వహించారు. ఈ సదస్సును ‘బిల్డింగ్ బెటర్ విత్ ఏఐ : సస్టేనబిలిటీ యాస్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ ఇండియా’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్విస్నెక్స్ ఇన్ ఇండియా కంపెనీ అకడెమిక్ ఎంగేజ్మెంట్ హెడ్ లీనా మారైకే జోసెఫిన్ రోబ్రా మాట్లాడుతూ.. తక్కువ వనరులతో, తక్కువ ఖర్చుతో రూపొందించే ఏఐ మోడళ్ల ద్వారా గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాలకు కూడా ఆధునిక సాంకేతిక సేవలను అందించవచ్చని వివరించారు. -
అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలంటూ ఆందోళన
బాపట్లటౌన్:చీరాల పట్టణంలో రూ.కోట్ల విలువైన ఐఎల్టీడీ సొసైటీ భూములను యథేచ్ఛగా అక్రమించుకొని అక్రమ రిజిస్ట్రేష న్లు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. జనవరి 13 నుంచి 23వ తేదీలోగా రూ.10 కోట్ల విలువైన 90 శెంట్ల భూమిని 22 మంది పేరుతో సొసైటీ పెద్దలు అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. విషయం తెలుసుకున్న ఐఎల్టీడీ సొసైటీ సభ్యులు అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. సొసైటీ సభ్యులు మాట్లాడుతూ 2021 ఫిబ్రవరిలో జరిగిన ఐఎల్టీడీ సొసైటీ ఎన్నికల ప్రచారంలో తక్కెళ్లపాటి చిన్న వెంకటేశ్వర్లు సొసైటీ భూమిని విక్రయించి వచ్చిన సొమ్ముతో బయట మూడు ఎకరాలు కొనుగోలు చేసి సొసైటీ సభ్యులందరికీ 2 సెంట్లు చొప్పున పంచుతానని నమ్మబలికి చైర్మన్గా ఎన్నికయ్యారన్నారు. దీంతోపాటు ఏడాదికి ఒకసారి జరిగే జనరల్ బాడీ మీటింగ్లో కూడా ప్రతి ఒక్కరికి రెండు సెంట్ల భూమిని తప్పనిసరిగా అందిస్తానంటూ చెప్పుకొచ్చిన వెంకటేశ్వర్లు జనవరి 13 నుంచి 23వ తేదీలోపు వారం రోజుల వ్యవధిలో చీరాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొంతమందికి, ఇంకొల్లు రిజిస్ట్రార్ కార్యాలయంలో మరికొందరికి మొత్తం 22 మందికి 90 సెంట్ల భూమిని విక్రయించి రూ.10 కోట్లకు పైగా సొమ్ము చేసుకున్నారన్నారు. అధికారులు, పాలకుల అండతోనే సొసైటీ భూములు కబ్జాకు గురౌతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించిన వారిలో సొసైటీ సభ్యులు కోటి సుధా, చింతా శ్రీనివాసరావు, నూనె చంద్ర, ఎం.శ్రీకాంత్, కె.అంటోని, ఎం.రవి, కె.ప్రసాద్, సుధీర్, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. -
సందర్శించిన జిల్లా కలెక్టర్
పురాతన ఆలయాలను కుటుంబ సభ్యులతో ఆటవిడుపుగా సందర్శన చినగంజాం: మండలంలోని మోటుపల్లి పురాతన దేవాలయాలను జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. గ్రామంలోని కాకతీయుల కాలంనాటి గణపతి దేవుడు, రుద్రమదేవి పాలనలో నిర్మాణం చేసుకున్న పురాతన వీరభద్ర స్వామి దేవాలయం, సీతారామాలయాలను ఆయన సందర్శించారు. ఆలయంలోని స్తంభాలు, గోడలపై ఉన్న శిలాఫలకాలను, చోళుల నాటి శాసనాలను, ప్రాకృతాలను ఆయన పరిశీలించారు. ఆలయంలో పురాతన శిలలన్నింటిని ఎక్కడ ఉన్నాయో గుర్తించి ఆలయంలోనికి తెప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో కే ధనలక్ష్మిని ఆదేశించారు. ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన ఒంగోలు ఆర్కియాలజీ శాఖకు చెందిన యశ్వంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఆలయంలోని పురాతన విగ్రహాలను, విరిగిపోయిన శాసనాలు, విగ్రహాలను తెప్పించి మ్యూజియంలా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన కలెక్టర్ వివరించినట్లు సమాచారం. అనంతరం పురావస్తు శాసనాలపై పూర్తి అనుభవం కలిగిన అద్దంకి చెందిన జ్యోతి చంద్రమౌళితో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు. ఆలయానికి సంబంధించి చరిత్ర వివరాలను ఆయనను అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి సంబంధించిన అన్ని పురాతన విగ్రహాలను, వస్తువులను సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇచ్చి తెప్పించాల్సిందిగా ఎంపీడీవోకు సూచించారు. అనంతరం ఆయన మోటుపల్లి తీరంలో తన కుటుంబ సభ్యులతో కలిసి కొంత సేపు సరదాగా గడిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కే ధనలక్ష్మి, వీఆర్వో దానియేలు, గ్రామ సర్పంచ్ వడ్లమూడి సాంబశివరావు, మాజీ సర్పంచ్ వడ్లమూడి సత్యం , గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ కరువు
చెరుకుపల్లి: రాష్ట్రంలో సామాన్యుడి నుంచి రాష్ట్ర మాజీ మంత్రుల వరకు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని... రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాగం నడుస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకట రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని గుళ్ళపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి పీటా నాగ మోహన్ కృష్ణ వ్యక్తిగత కార్యాలయంలో ఆదివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట రెడ్డి మాట్లాడుతూ.. గడిచిన 20 నెలలుగా రాష్ట్రంలో రాక్షస రాజ్యం, అరాచక పాలన రోజు రోజుకూ పెరిగిపోతోందన్నారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై, కార్యాలయంపై దాడి అన్నారు. అంబటిపై హత్యాయత్నం చేసేందుకు టీడీపీ గూండాలు వచ్చి ఆయన ఇంటిని, కార్లను ధ్వంసం చేశారన్నారు. ఆదివారం మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించారన్నారు. ఈ సంఘటనలకు ముందు మాజీ మంత్రి విడదల రజినిపై, మాజీ శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డిపై, మరికొందరు వైసీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడి చేశారన్నారు. వారి అరాచకాలు దుర్మార్గం అన్నారు. ఈ దురాగతాన్ని పోలీసులు చూస్తూన్నారేగానీ నిలువరించటానికి చర్యలు తీసుకోకపోవటం హేయమైన చర్యగా పేర్కొన్నారు. రాష్టాన్ని వల్లకాడు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజకీయంగా వైఎస్సార్ సీపీని ఎదుర్కోలేక, ప్రజలకు మంచి పాలన అందించడం చేతగాక ఈ దురాగతాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. చేతగాని పరిపాలన చేస్తున్న చంద్రబాబు పాలనలో తప్పులను ప్రశ్నించే అమాయక ప్రజలపై తప్పుడు కేసులు మోపటం, దాడులకు దిగటం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాబోవు రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని నీచ రాజకీయాలు చేసిన పాపపు ముఖ్యమంత్రి చంద్రబాబు అని మండిపడ్డారు. దీనిపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో త్వరలో రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను వివరించి రాష్ట్రపతి పాలన పెట్టాలని గవర్నర్ను కోరతామని పేర్కొన్నారు. ఇప్పటికై నా పోలీసు యంత్రాంగం, కేంద్ర హోం శాఖ చొరవ తీసుకొని రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి యార్లగడ్డ మదన్ మోహన్, ఆరుంబాక సర్పంచ్ కామినేని కోటేశ్వరరావు, లుక్కా బాపనయ్య, వంగరు భాను, శారద, సుభాని రెడ్డి, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లలితాంబకు కుంకుమ పూజలు
మాచర్ల: స్థానిక సాయిబాబా ఆలయలోని లలితాంబ అమ్మవారి 9వ వార్షికోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. మహిళలు కుంకుమ పూజలు జరిపారు. పొన్నూరు: అఖిల విశ్వ గాయత్రీ పరివార్ పొన్నూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక సాక్షి భావనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం 24 కుండముల గాయత్రీ మహాయజ్ఞం నిర్వహించారు. గోపూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గాయత్రీ మహా యజ్ఞాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిల గాయత్రి పరివార్ సంఘ ప్రధాన్ డీవీఆర్ మూర్తి మాట్లాడుతూ ఆధ్యాత్మికతను కులమతాలకతీతంగా విశ్వవ్యాప్తి చేయడమే గాయత్రి పరివార్ ముఖ్య లక్ష్యమని చెప్పారు. గాయత్రి మహామంత్రం జపిస్తే గాయత్రీ మాత అనుగ్రహాన్ని పొందవచ్చని చెప్పారు. పరివార్ సభ్యులు దమ్మాల వెంకటేశ్వర్లు, పులిపాటి శ్రీనివాసరావు, పులిపాటి భవాని శంకర్, నారాకోడూరు గాయత్రి పీఠం నిర్వాహకులు చుండూరు వెంకట చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. చేబ్రోలు: చారిత్రక ప్రసిద్ధి చెందిన చేబ్రోలులోని భూ నీలా సమేత ఆదికేశవ స్వామి దేవస్థానంలో ఆదివారం రాత్రి పున్నమి గరుడ సేవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఫణిహారం శ్రీధర్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. మాఘపౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గరుడ సేవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదికేశవ స్వామికి ప్రత్యేక పూజలు, విశేష కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి గ్రామోత్సవం కనుల పండువగా జరిగింది. నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : స్థానిక పట్టాభిపురం సత్యనారాయణస్వామి ఆలయ 49వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రమాసమేత సత్యనారాయణ స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. మూల విరాట్కు విశేష అభిషేకాలు, అర్చనలు, అలంకరణ జరగ్గా, ఆంజనేయస్వామికి మన్య సూక్తంతో అభిషేకం, సిందూరార్చన చేపట్టారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై రమా సమేత సత్యనారాయణస్వామి ఉత్సవమూర్తులకు రథోత్సవం పురవీధుల్లో నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, నామ సంకీర్తన బృందాలు, దేవత వేషధారణలో కళాకారులు, విద్యుత్ దీప కాంతుల నడుమ నగరోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామికి ఊంజల్ సేవ చేపట్టారు. ప్రముఖ సంగీత విధ్వంసరాలు శ్రోతాస్విని (బెంగళూరు) నిర్వహించిన స్వరార్చన అలరించింది. ఆలయ కమిటీ చైర్మన్ చావలి గణపతి, ఉత్సవ కమిటీ కన్వీనర్ రాయపాటి సత్యనారాయణ భక్తులు పాల్గొన్నారు. -
నృసింహుని తెప్పోత్సవం
కనుల పండువగా పట్టు వస్త్రాలు సమర్పించిన ఇంద్రకీలాద్రి వేదపండితులుడేపల్లి రూరల్ : ప్రసిద్ధి గాంచిన మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి తెప్పోత్సవం ఆదివారం వేదమంత్రాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున లక్ష్మీ నరసింహస్వామి వారిని సీతానగరంలోని ఆంజనేయస్వామి దేవస్థానంలో ఉత్సవ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి యున్న కనకదుర్గ ఆలయం నుంచి నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం నృసింహస్వామి ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతానికి తీసుకువెళ్లి ప్రత్యేకంగా అలంకరించిన పంటు వాహనంలో స్వామివారిని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి తెప్పోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేక భద్రతా చర్యల మధ్య ఇ.వో. సునీల్కుమార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
పచ్చ మూకల విధ్వంసం
వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి ఇంటిపై, కార్యాలయంపై వేలాదిగా వచ్చిన టీడీపీ మూకలు పక్కా వ్యూహంతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాయి. ఆ సమయంలో అడ్డుగా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను, మహిళలపై కూడా వారు దాడి చేశారు. దీంతో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. – లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్)అంబటి ఇంటిపై , కార్యాలయంపై దాడి చేస్తున్నారన్న విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్నా. టీడీపీ గూండాలు మమ్మల్ని మహిళలు అని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించారు. దాడి చేయడంతో కింద పడిపోయాం. అక్కడే ఉన్న తోటి పార్టీ శ్రేణుల సహాయంతో వారి బారి నుంచి బయట పడ్డాం. ఇంతటి రాక్షసంగా వ్యవహరిస్తుంటే పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర పోషించడం చాలా బాధగా ఉంది. – భాగ్యలక్ష్మి, త్రివేణి అంబటి ఇంటి వద్దకు పోలీసులు వచ్చారన్న సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకున్నాను. ఒక్కసారిగా కర్రలతో, రాళ్లతో, ఇనుప రాడ్లతో టీడీపీ గూండాలు అంబటి కార్యాలయంలోకి చొరబడ్డారు. అడ్డుగా ఉన్న నాపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. వారి నుంచి తప్పించుకుని రాత్రి 11.45 గంటల వరకు అంబటి రాంబాబు కార్యాలయంలో తలదాచుకున్నాను. నేను పల్నాడు జిల్లా నుంచి వచ్చి గుంటూరు పట్టాభిపురంలో నివాసం ఉంటున్నాను. – గుంజి శివ, పల్నాడు జిల్లా అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేస్తున్నారన్న సమాచారం తెలుసుకుని నాతోపాటు మా నాన్న, ప్రస్తుత వైఎస్సార్ సీపీ కో ఆప్షన్ సభ్యుడు పూనూరి నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ తుమ్మెటి శ్రీను, మరికొంత మందితో వెళ్లాం. అక్కడ ఉన్న టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. నాపై చేతులతో, కర్రలతో తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానికులు జీజీహెచ్కు తరలించారు. – పూనూరి చంద్ర ప్రకాష్ -
కోటప్పకొండలో రద్దీ
నరసరావుపేట రూరల్: మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అభిషేక మండపంలో ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. తెల్లవారుజామున స్వామి వారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. భక్తులు గిరిప్రదక్షణలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో చంద్రశేఖర్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి
వేటపాలెం: అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం పాత కూరగాయల మార్కెట్ నుంచి పద్మశాలి వీధికి వెళ్లే రోడ్డు పక్కన చోటుచేసుకుంది. వన్వే రోడ్డు దగ్గరలో జెండా చెట్టు వద్ద నివాసం ఉంటున్న ఆత్మకూరి మధు(48) పెయింటింగ్ మేసీ్త్రగా పనిచేస్తుంటాడు. అతనికి రోజూ మద్యం తాగే అలవాటు ఉంది. నాలుగు రోజుల కింద భార్య బంధువుల ఊరెళ్లింది. అప్పటి నుంచి నిత్యం రోజంతా మద్యం తాగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం మద్యం తాగి పడిపోయి ఎంతకీ లేవకపోవడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వచ్చి 108కి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరిశీలించి మధు చనిపోయినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ జనార్దన్ పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
టైప్ పరీక్షలకు 43 మంది హాజరు
రేపల్లె: స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆదివారం తెలుగు, ఇంగ్లిష్ టైపురైటింగ్ పరీక్షలు లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్, ఇంగ్లిష్ జూనియర్ గ్రేడ్ల విభాగాలలో ప్రశాంతంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, టైప్ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పరీక్షలకు ఇంగ్లిష్ లోయర్ గ్రేడ్ 25 మందికి గాను 24 మంది, హయ్యర్ గ్రేడ్ 14 మంది, జూనియర్ గ్రేడ్ నలుగురు, తెలుగు హయర్ గ్రేడ్కు ఒక్కరు చొప్పున మొత్తం 44 మందికి 43 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. -
గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులుగా సుధీర్
బాపట్ల: జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులుగా పి.సుధీర్ను ఎన్నుకున్నారు. బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం సంఘం ఎన్నికలను ఎన్నికల అధికారి మన్సూన్బాషా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అసోసియేట్ అధ్యక్షుడు టి.ఎన్.వి.ఎస్.కృష్ణవేణి(వేటపాలెం), ఉపాధ్యక్షులుగా డి.సత్యనారాయణ(బాపట్ల), డి.సత్యకుమార్(కొల్లూరు), పి.కృష్ణ ప్రసాద్(ఇంకొల్లు), వి.ఆనందబాబు(అమృతలూరు), వి.శివ నాగరాజు(కర్లపాలెం), ప్రధాన కార్యదర్శిగా ఎస్కే మునీర్(చిన్నగంజాం), జాయింట్ సెక్రటర్లుగా టి.వీరస్వామి(చీరాల), డి.రాజేష్బాబు(చుండూరు), జె.నాగాంజనేయులు పి.వి.పాలెం, డి.బుల్లిబాబు(కారంచేడు), కె.రామకృష్ణరెడ్డి(బాపట్ల), ఆర్గనైజింగ్ సెక్రటర్లుగా వి.చిట్టిబాబు(భట్టిప్రోలు), ఎ.వి.సుబ్రహ్మణ్యం(మార్టూరు), వి.కృష్ణరెడ్డి(చీరాల), జె.కోటేశ్వరరావు(నగరం), ఆర్.నాగమల్లేశ్వరరావు(రేపల్లె), మహిళా కార్యదర్శులుగా పి.నాగలక్ష్మి(నిజాంపట్నం), కె.సుజాత(పర్చూరు), కె.కల్యాణి(వేమూరు) ఎన్నికయ్యారు. -
ప్రతిభావంతులు సమాజాభివృద్ధికి తోడ్పడాలి
కొరిటెపాడు(గుంటూరు): దాతల సహకారంతో ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకున్నాక సమాజాభివృద్ధికి తమవంతు తోడ్పాటు అందించాలని తులసి గ్రూప్ కంపెనీస్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు అన్నారు. ఆదివారం గుంటూరు నగరం ఆర్.అగ్రహారంలోని రామనామ క్షేత్రం ప్రాంగణంలో కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలైజ్డ్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం తులసి రామచంద్ర ప్రభు, ట్రస్టు సభ్యుల చేతుల మీదుగా జరిగింది. 270 మంది విద్యార్థులకు రూ.12,12,500 చెక్కుల రూపంలో ఉపకార వేతనాలను అందజేశారు. తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ 1995–96లో ఇద్దరు విద్యార్థులతో మొదలుపెట్టి నేటికి సుమారు 40 వేల మంది విద్యార్థులకు రూ.23 కోట్లు ఉపకార వేతనాలుగా ట్రస్టు ద్వారా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. దీనికి మేజర్ కాంట్రిబ్యూషన్ తులసి సీడ్స్ సమకూరుస్తుందని, దీంతో పాటు నగరంలోని కొంతమంది సమాజ హితం కోరే పెద్దలు ఈ కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ ఫూర్ అండ్ అండర్ ప్రివిలైజ్డ్ ట్రస్టులో సభ్యులుగా చేరి సహాయ సహకారాలు అందిస్తున్నారని వెల్లడించారు. అనంతరం విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. ట్రస్ట్ సభ్యులు తులసి రామచంద్ర ప్రభును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏటుకూరు మాజీ సర్పంచ్ ఉగ్గిరాల సీతారామయ్య, ట్రస్ట్ సభ్యులు నారదాసు శ్రీహరిరావు, తిమ్మిశెట్టి నారాయణరావు, పసుపులేటి రమణయ్య, అంకిరెడ్డి సాంబశివరావు, నారదాసు కోటేశ్వరరావు, పుచ్చకాయల ఆనంద్, కనదం నరేంద్రనాథ్, దళవాయి సుబ్రమణ్యం, మిరియాల శ్రీనివాస్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తులసి గ్రూప్ కంపెనీస్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు 270 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ -
‘మార్చ్ టు పార్లమెంట్’ విజయవంతం చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ జాతీయస్థాయిలో ఏడు ప్రధాన ఉపాధ్యాయ సంఘాలతో ఆవిర్భవించిన ఏఐ – జాక్టో ఆధ్వర్యంలో ఈనెల 5న చేపడుతున్న మార్చ్ టు పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం గుంటూరు కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో ఎస్టీయూ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యవర్గ సమావేశాన్ని సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఇరువురు నాయకులు మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇవ్వాలని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో చట్ట సవరణ దిశగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జాతీయస్థాయిలో ఉమ్మడి పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. దేశవ్యాప్తంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు 1,04,125 ఉండగా, మన రాష్ట్రంలో 12,912 ఏకోపాధ్యాయ పాఠశాలలతో దేశంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. బోధన కోసమే నియమించబడిన ఉపాధ్యాయులతో బోధనేతర కార్యక్రమాల భారం పెంచటం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు, 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలన్నారు. ఈనెల 10న జిల్లా కలెక్టరేట్ల దగ్గర చేపడుతున్న ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్బాబు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డి.పెదబాబు, రాష్ట్ర ఉపా ధ్య క్షులు కాకుమాను జోజప్ప, ఎం.శ్రీధర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శ్యాంబాబు, ఉమ్మడి గుంటూరు జిల్లా, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
నీటి కుంటలో పడి వృద్ధుడు మృతి
పెదకూరపాడు: మూగజీవాలకు మేత కోసం వెళ్లి....నీటి కుంటలో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండలంలోని బలుసుపాడు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పెదకూరపాడు ఎస్ఐ గిరిబాబు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బలుసుపాడు గ్రామంలో ఆదివారం ఉదయం పది గంటల సమయంలో గేదెలకు మేత కోసం వెళ్లి నీటి కుంటలో పడి ఎస్సీ కాలనీకి చెందిన గంజిమాల బాబురావు (62) మృతి చెందాడు. గ్రామ శివారులో మేత కోస్తుండగా నీటి కుంటలో పడ్డాడు. మధ్యాహ్నం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా నీటి కుంటలో విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికుల సహాయంతో బాబురావు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. బాబురావు మనవడు గంజి మాల విజయబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గిరిబాబు తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. శవ పంచనామా నిర్వహించి అమరావతి సామాజిక ఆరోగ్య కేంద్రానికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. జాతీయ స్థాయిలో గుంటూరు వైద్యుడి ప్రతిభ గుంటూరు మెడికల్: వెన్నుముక పరిశోధనల్లో జాతీయ స్థాయిలో గుంటూరు వైద్యుడు ప్రతిభ చూపించి రెండు జాతీయ అవార్డులు ఒకేసారి సొంతం చేసుకుని అరుదైన రికార్డు సృస్టించారు. గుంటూరుకు చెందిన సీనియర్ స్పయిన్ సర్జన్, మల్లిక సెంటర్ అధినేత డాక్టర్ జె.నరేష్బాబు వెన్నుపై చేసిన పరిశోధనలకు రెండు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆదివారం గుంటూరు కొత్తపేటలోని మల్లిక స్పయిన్ సెంటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు ఆయన మీడియాకు వెల్లడించారు. ప్రతిష్టాత్మక అస్సి బేసిక్ స్పయిన్ రీసెర్చ్ అవార్డు .. అసోసియేషన్ ఆఫ్ స్పయిన్ సర్జన్స్ ఆఫ్ ఇండియా గత వారం పూణేలో నిర్వహించిన స్పయిన్ సర్జన్స్ 2026 జాతీయ సదస్సులో మల్లిక స్పయిన్ సెంటర్ అరుదైన ఘనత సాధించింది. ఎంఆర్ఐలో కంటికి కనిపించని మార్పులను రేడియోమిక్స్అనే ఆర్టిఫి షల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని వాడడం ద్వారా డిస్క్ అరుగుదలను ముందుగానే గుర్తించి నివారణోపాయాలను సూచించవచ్చు అని నిరూపించిన పరిశోధనకు అత్యంత ప్రతిష్టాత్మక అస్సి బేసిక్ స్పయిన్ రీసెర్చ్ అవార్డు 2026ను నరేష్ బాబు అందుకున్నారు. బేసిక్ స్పయిన్ రీసెర్చ్ అవార్డు తో పాటు క్లినికల్ స్పయిన్ రీసెర్చ్ అవార్డు కూడా మల్లిక స్పయిన్ సెంటర్ గెలుచుకోవడం విశేషం. ఒకే సమయంలో ఈ రెండింటినీ సొంతం చేసుకున్న తొలి స్పయిన్ సెంటర్గా గుంటూరు మల్లిక స్పయిన్ సెంటర్ రెండు తెలుగు రాష్ట్రాలలో చరిత్ర సృష్టించింది. సదస్సులో మల్లిక స్పయిన్ సెంటర్ నుంచి మొత్తం 11 పోడియం ప్రెజెంటేషన్లు జరగడం విశేషం. ఈ సందర్భంగా మల్లిక స్పయిన్ సెంటర్ చీఫ్ ఆఫ్ స్పయిన్ సర్వీసెస్ డాక్టర్ జె.నరేష్ బాబు మాట్లాడుతూ ఈ విజయాలు మొత్తం వైద్య బృందం, సహాయక సిబ్బంది అందరి కృషికి ప్రతిఫలమని పేర్కొన్నారు. అవార్డు గెలుచుకున్న తమ విద్యార్థి డాక్టర్ పృథ్వీకుమార్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
కరుణ చూపే కానుకమాత
రెంటచింతల: ప్రేమను వర్షించే ఆధ్యాత్మిక కేంద్రం కానుకమాత దేవాలయం. ఆలయంలో అడుగు పెట్టగానే చలువరాయి చల్లదనమే కాదు...కానుకమాత కరుణా కటాక్షాల వీక్షణాలు కూడా ప్రసరిస్తాయి. క్రీస్తు శిలువ వేసే సమయంలో పడిన పాట్లను గుర్తుచేసే 14 స్థలాలు ఇక్కడ భక్తులలో ప్రేమ, శాంతి, కరుణ, సహనం నింపుతాయి. రాష్ట్రంలోనే దాదాపు 5వేల మంది భక్తులు ఒకేసారి ప్రార్థన చేసుకునే సౌకర్యం ఉన్న అతిపెద్ద చలువరాతి క్రీస్తు దేవాలయం 1982 సంవత్సరంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించారు. ఇంతపెద్ద ఆలయం కేవలం రెండు ఫిల్లర్ల ఆధారంగా నిర్మించడం మరో విశేషం. ఈ దేవాలయాన్ని 2025 సంవత్సరంలో కోట్లాది రూపాయల వ్యయంతో ఎంతో అద్భుతంగా విచారణ గురవులు గ్రామ సంఘస్తుల సహకారంతో పున:నిర్మాణం చేపట్టారు. కనుల పండువగా తిరునాళ్లు రెంటచింతల గ్రామంలో పలు సామాజిక వర్గాలకు చెందిన సుమారు 1200కి పైగా కుటుంబాలు క్రైస్తవ్యాన్ని విశ్వసిస్తున్నాయి. ఆలయంలో ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు చేస్తుండటంతో ఈ ప్రాంతంలో ఎప్పుడు ఆధ్యాత్మిక భావన తొణికసలాడుతూ ఉంటుంది. ఫాదర్ జోసఫ్ గ్రాండ్ నుంచి ఫాదర్ ఏరువ లూర్ధు మర్రెడ్డి వరకు 19 మంది విచారణ గురువులు ఇక్కడ క్రీస్తు బోధనలు చేస్తూ సేవలను అందిస్తున్నారు. ప్రతి ఏటా కానుకమాత దేవాలయంలో జనవరి 24న జెండా ప్రతిష్టతో ప్రారంభమై ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు నవదిన ప్రార్థనలు జరుగుతాయి. ఫిబ్రవరి 2న కానుకమాత తిరునాళ్ల మహోత్సవం కనుల పండుగగా జరుగుతుంది. వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న గ్రామానికి చెందిన వారితోపాటు వారి బంధుమిత్రులు ఈ తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొంటారు. నేటి కార్యక్రమాలు మంగళవారం ఉదయం 5 గంటలకు విచారణ గురువులు ఏరువ లూర్ధు మర్రెడ్డి, సహాయ గురువులు ప్రసన్నకుమార్ మొదటి దివ్యపూజాబలి, ఉదయం 9.30 గంటలకు నల్గొండ మేత్రాసన పీఠాధిపతులు, అభిషిక్త గురువులు మహా ఘన డాక్టర్ కరణం దమన్కుమార్చే పండుగ పవిత్ర సమష్టి మహోత్సవ దివ్యపూజాబలి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 4 గంటల నుంచి అన్నీ మతస్తులవారు కానుక మాత, యేసుక్రీస్తు దీవెనలు పొంది కొవ్వొత్తులు సమర్పించి తమ జీవితాలలోను కొత్త వెలుగును నింపాలని మనసారా ప్రార్థిస్తారు. కోలాట ప్రదర్శన ఉంటుంది. ఏర్పాట్లు పూర్తి... కానుకమాత చర్చి తిరునాళ్ల మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విచారణ గురువులు రె.ఫాదర్ ఏరువ లూర్ధు మర్రెడ్డి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ జిల్లాల నుంచి క్రైస్తవ గురువులు, మఠకన్యలు ఆదివారం సాయంత్రానికి ఇక్కడకు చేరుకుంటారు. నేడు కానుకమాత దేవాలయ తిరునాళ్ల రాష్ట్రంలోనే అతి పెద్ద చర్చి -
ట్యాంకర్ను ఢీకొన్న లారీ
యడ్లపాడు: అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మండలంలోని తిమ్మాపురం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో హైవే సెంట్రల్ డివైడర్ మొక్కలకు నీరు పోస్తున్న మహిళా కూలీ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చైన్నె నుంచి విజయవాడ వైపు వెళ్తున్న తమిళనాడుకు చెందిన లారీ, తిమ్మాపురం 16వ నంబర్ జాతీయరహదారి పక్కనే నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంక్ సమీపానికి రాగానే అదుపు తప్పింది. ఆ సమయంలో రహదారి డివైడర్పై ఉన్న మొక్కలకు హైవే సిబ్బంది ట్యాంకర్తో నీరు పోస్తున్నారు. వేగం నియంత్రణ కాక ట్యాంకర్ను లారీ వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో మొక్కలకు నీరు పోస్తున్న హైవే ఆధ్వర్యంలో పనిచేస్తున్న కార్మికురాలు బాసర నాగమ్మ(36)కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ట్యాంకర్ను ఢీకొన్న అనంతరం లారీ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని పసిగట్టిన లారీలోని ఇద్దరు కిందకు దూకారు. లారీ క్యాబిన్ నుజ్జునుజ్జు అయింది. ఈ క్రమంలో లారీలోని డ్రైవింగ్ సీట్లోనే ఉన్న తమిళనాడుకు చెందిన డ్రైవర్ కేబిన్లో చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న యడ్లపాడు ఎస్ఐ టి శివరామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో కేబినన్లో చిక్కుకున్న డ్రైవర్ను చాకచక్యంగా వెలికితీశారు. డ్రైవర్ కాలికి తీవ్ర గాయాలవ్వడంతో చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన నాగమ్మ మృతదేహాన్ని చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మృతురాలు ఏడాది కిందట కర్నాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా సేడం తాలూకా బాటికేరెక్క గౌట్ గ్రామ నుంచి కుటుంబంతో వలస వచ్చి హైవే క్యాంపులో ఉంటూ రోజువారీ కూలీలుగా పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. హైవే పనులు చేస్తున్న మహిళా కూలీ మృతి మృతురాలు కర్ణాటక వాసి -
రైతులే స్వయంగా సాగు వివరాలు నమోదు చేయాలి
పెదకాకాని: రైతులు వారి మొబైల్ ఫోన్ ద్వారా సాగు వివరాలు నమోదు చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలాని సుమూన్ అన్నారు. పెదకాకాని మండలం పెదకాకాని, వెనిగండ్ల గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలాని సుమూన్ శనివారం ఆకస్మికంగా పర్యటించారు. ఏపీ ఎయిమ్స్ (ఏపిఎఐఎంఎస్) అనే యాప్ని రైతులు వారి మొబైల్ ఫోన్లో స్వయంగా రిజిస్ట్రేషన్ చేసి ఆ యాప్ పనిచేసే విధానాన్ని రైతులకు వివరించారు. యాప్లో ఇంకా ఏమేమి జోడిస్తే బాగుంటుంది అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతు పండించిన పంటను తనంతట తానే నమోదు చేసుకునే విధానాన్ని బోయపాటి రమేష్ ద్వారా చేయించారు. మొక్కజొన్న పంటను పరిశీలించి కలుపు మందుల పిచికారి గురించి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పురుగుమందుల ద్వారా కాకుండా మనుషుల ద్వారా కలుపును తీయిస్తే అయ్యే ఖర్చు, పురుగుమందుల ద్వారా కలుపు నివారణకు అయ్యే ఖర్చు గురించి తెలుసుకున్నారు. సబ్సిడీపై ఆయిల్ ఇంజన్లు, పైపులు ఇప్పించాలని రైతులు కోరారు. అనంతరం వెనిగండ్ల గ్రామాన్ని సందర్శించి జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకంలో భాగంగా మట్టి నమూనాలను సేకరించటం, ఆన్లైన్ అప్లోడ్ చేసే విధానాన్ని పరిశీలించారు. గ్రామ రైతు పులగం రామిరెడ్డితోపాటు పలువురు రైతులు ఆయిల్ ఇంజిన్లు, పైపులు, నల్ల పట్టాలు, సిర్పాలిన్ పట్టాలు సబ్సిడీపై అందించాలని కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఐ.నాగేశ్వరరావు, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారి, జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు ఎన్ మోహన్రావు, ఏఓ కె రమణకుమార్ పాల్గొన్నారు. -
3న సాయిబాబా మందిర వార్షికోత్సవం
మంగళగిరి టౌన్: మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని భగవాన్ శ్రీ సత్య షిర్డీ సాయిబాబా మందిరం 20వ వార్షికోత్సవ మహోత్సవం ఫిబ్రవరి 3వ తేదీన నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణం తెలిపారు. ఆలయ ఆవరణలోని కల్యాణ మండపంలో శుక్రవారం వార్షికోత్సవానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 19 సంవత్సరాలుగా ఏటా వేడుకలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నామన్నారు. సంస్కృతి, సంప్రదాయాలే భావితరాలకు ఇచ్చే వారసత్వ సంపద అని పేర్కొన్నారు. ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 5.15 గంటలకు బాబాకు కాగడ హారతి, 6కు పాలాభిషేకం, 8కి అన్నాభిషేకం, 9 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 10 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, అన్నప్రసాద వితరణ ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబా కృపకు పాత్రులు కావాలని కోరారు. మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు, రాష్ట్ర పద్మశాలీయ సంఘం అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ అన్నె శేషారావు తదితరులు పాల్గొన్నారు. -
కనుల విందుగా వేంకటేశ్వర స్వామి కళ్యాణం
బాపట్ల: శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. శ్రీనివాస సేవా సమితి త్యాగరాయనగర్ ఆధ్వర్యంలో ఉదయం నిత్య కళ్యాణం మహోత్సవం నిర్వహించారు. కళ్యాణం తలంబ్రాల సందడి, ఎదురుకోలా విశ్రాంతి సేవ, శాంతి హోమం నిర్వహించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత స్వామి గరుడోత్సవం జరుగుతుందని అర్చక స్వాములు రమేష్, శ్రీనివాస సేవాసమితి తెలిపింది. తెనాలి: తెనాలి ఇన్ఛార్జి సబ్కలెక్టర్గా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ బాధ్య తలు చేపట్టారు. తెనాలి సబ్కలెక్టర్ వి.సంజనా సింహ పదోన్నతిపై బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే ఆమె పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతు చేపట్టారు. దీనితో ఇన్ఛార్జి సబ్కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ హోదాలోని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. క్వారీ తిరునాళ్లపై సమీక్ష స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయంలో సోమవారం క్వారీలో గల శ్రీబాలకోటేశ్వరస్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై డివిజన్స్థాయి కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. డివిజనులోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఆలయ ఈవో హాజరయ్యారు. ఇన్చార్జి సబ్కలెక్టర్ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరిగే తిరునాళ్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై చర్చించారు. మరోసారి పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్తో కో–ఆర్డినేషన్ సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు. తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను తాడేపల్లి పోలీసులు సీజ్ చేసి శనివారం కేసు నమోదు చేశారు. రాజధాని ప్రాంతం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా వస్తున్న ఈ రెండు లారీలను సీజ్ చేసినట్లు ఎస్ఐ అపర్ణ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. 15వ వర్థంతి సభలో వక్తల నివాళి నూతక్కి(తెనాలి): ప్రముఖ రంగస్థల దర్శకుడు, నటుడు అన్నపురెడ్డి శివరామరెడ్డి 15వ వర్ధంతి సభను శనివారం మంగళగిరి మండలం నూతక్కిలో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. శివరామరెడ్డి నటనను, దర్శక ప్రతిభను కొనియాడుతూ వక్తలు నివాళులర్పించారు. నటుడు జొన్నల పేరిరెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో భీమిరెడ్డి సుబ్బారెడ్డి, కూర్మారెడ్డి, వల్లూరి శివప్రసాద్, ప్రజానాట్యమండలి గాయకుడు జగన్ తదితరులు మాట్లాడారు. వైఎస్సార్ సీపీ యడ్లపాడు అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహారావు యడ్లపాడు: బోయపాలెం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శనార్థం వచ్చిన మాజీ మంత్రి విడదల రజినిపై టీడీపీ శ్రేణులు దాడికి ప్రయత్నించడాన్ని వైఎస్సార్ సీపీ యడ్లపాడు మండల అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహారావు తీవ్రంగా ఖండించారు. శనివారం రాత్రి దాడికి సంబంధించిన వారిని అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలంటూ యడ్లపాడు పోలీస్స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీనేత, మాజీ మంత్రి, ఓ మహిళ అనే విచక్షణ మరిచి టీడీపీ శ్రేణులు ఆమె కారును అడ్డుకుని గ్రామంలోకి రాకుండా దౌర్జన్యానికి దిగడంపై మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రజినిని రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. శ్రీవారి ప్రసాదంపై చేసిన విషప్రచారానికి సిగ్గుపడాల్సింది పోయి, వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతున్న వారిపై దాడికి యత్నించడం దారుణమన్నారు. ఘటనపై యడ్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దాడికి పాల్పడిన వారిని వదలబోమని, తమకు న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున పోరాడతామన్నారు. -
ఆర్వీఆర్జేసీ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ
గుంటూరు రూరల్: కళాశాల విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన స్మార్ట్ వాయిస్ కంట్రోల్డ్ వీల్ చైర్ జాతీయ స్థాయి వైజ్ఞానిక పోటీల్లో ప్రథమ బహుమతిని సాధించి, సమాజానికి ఉపయోగపడే వినూత్న ఆవిష్కరణలకు ఆర్వీఆర్ జేసీ కళాశాల కేరాఫ్ అడ్రస్గా నిలుస్తుండటం గర్వకారణమని కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జె మురళీమోహన్, డాక్టర్ జగదీష్లు పేర్కొన్నారు. శనివారం చౌడవరం గ్రామంలోని కళాశాలలో విద్యార్థుల అభినందన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో శారీరక వికలాంగులు, వృద్ధుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఇంటర్నెట్ సదుపాయం అవసరం లేకుండా కేవలం మనిషి గొంతు ఆదేశాలతో పనిచేసే స్మార్ట్ వాయిస్ కంట్రోల్డ్ వీల్ చైర్ (ప్రొటోటైప్) విద్యార్థులు ఆవిష్కరించారని తెలిపారు. ఈ ఆవిష్కరణకు ప్రథమ స్థానం దక్కడంతో పాటు రూ.25,000 నగదు బహుమతి ప్రశంసా పత్రాలు అందుకున్నారన్నారు. సమాజానికి మేలు చేసే సాంకేతిక పరిష్కారాలతో ముందుకు సాగడం గర్వకారణమని కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ఆర్ గోపాలకృష్ణ, ట్రజరర్ డాక్టర్ కె కృష్ణప్రసాద్లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎం.భార్గవ్నాగతేజ, కె.సాయిచైతన్య, తృతీయ సంవత్సరం చదువుతున్న పి. శేఖర్, ఐ.ఓ.టి విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎన్.అఖిల్శివచౌదరి కలసి రూపొందించిన వీల్ చైర్ ఎటువంటి వై–ఫై లేదా మొబైల్ డేటా అవసరం లేకుండా పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ కె రవీంద్ర, ఏవో డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, డాక్టర్ నాగమల్లేశ్వరరావు, డాక్టర్ కృష్ణప్రసాద్, డాక్టర్ ఏ ముద్దు విద్యార్థులను అభినందించారు. స్మార్ట్ వాయిస్ కంట్రోల్డ్ వీల్ చైర్కు ప్రథమ బహుమతి -
రసవత్తరంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు
సబ్ జూనియర్ విభాగంలో గుంటూరు ఎడ్లకు ప్రథమస్థానం రెంటచింతల: ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహించనున్న స్థానిక కానుకమాత చర్చి 176 తిరునాళ్ల మహోత్సవాన్ని పురష్కరించుకుని శనివారం స్థానిక సెయింట్ జోసఫ్స్ ఉన్నత పాఠశాల క్రీడామైదానం లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు రసవత్తరంగా జరిగాయి. సబ్ జూనియర్ విభాగంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన గరికపాటి లక్ష్మయ్య చౌదరి ఎద్దులు 3,606 అడుగుల దూరంలాగి ప్రథమ బహుమతి రూ. 90 వేలను కై వశం చేసుకున్నాయి. బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్లు 3,300 అడుగుల దూరంలాగి రెండవ బహుమతి రూ. 70 వేలు, తెలంగాణ రాష్ట్రం నాగర్కర్నూల్ జిల్లా మండల కేంద్రమైన పెదకొత్తపల్లికు చెందిన వి.శ్రావన్కుమార్, చంద్రకళ ఎడ్లు 3,080.8 అడుగుల దూరం లాగి 3 వ బహుమతి రూ. 50 వేలు, వైఎస్సార్ కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామానికి చెందిన పెరుమాళ్ల శివకృష్ణ యాదవ్, పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన యామిని మోహన్ శ్రీ కంబైన్డ్ ఎడ్లు 3,057.2 అడుగుల దూరంలాగి 4 వ బహుమతి రూ. 35 వేలు, హైదరాబాద్కు చెందిన డి.రోహన్బాబు ఎడ్లు 3,008.9 అడుగుల దూరం లాగి 5 వ బహుమతి రూ. 25 వేలను గెలుచుకున్నాయి. కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి, గొంటు సుమంత్ రెడ్డి, ఏరువ జోజిరెడ్డి, బొడపాటి రామకృష్ణ, జడ్డు రాజేష్రెడ్డి, ఆదూరి ఇన్నారెడ్డి, మూలి రాజారెడ్డి, ఎం. చిన్న శౌర్రెడ్డి పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా సురపనేని రాధాకృష్ణ, పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి, గూడ శ్రీనివాసరావు వ్యవహరించారు. -
ఉద్యోగ విరమణ చేసిన సిబ్బందికి సన్మానం
బాపట్లటౌన్: పోలీస్శాఖలో మూడు దశాబ్ధాలకు పైగా సేవలు అందించడం హర్షనీయమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ విభాగంలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన అడిషనల్ ఎస్పీ బి.రామాంజనేయులు, ఏఆర్ డీఎస్పీ పి.విజయసారథి, ఏఎస్ఐ పి.సత్యనారాయణమూర్తిలను శనివారం సన్మానించారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం చాలా ఒత్తిడితో కూడుకున్నదని చెప్పారు. ప్రజలకు నేరుగా సేవలు అందించడం పోలీసు ఉద్యోగంలోనే జరుగుతుందని పేర్కొన్నారు. అలాంటి ఉద్యోగంలో మనం చేరడం చాలా గొప్ప అదృష్టంగా భావించాలని అభిప్రాయపడ్డారు. పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడపాలని, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు, ఎటువంటి సమస్య వచ్చిన నేరుగా తమను కలవవచ్చన్నారు. కార్యక్రమంలో చీరాల డీఎస్పీ ఎం.డి.మెయిన్, సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్నాయక్ పాల్గొన్నారు. -
అమరేశ్వరుని సేవలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
అమరావతి: అమరావతిలోని శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వర స్వామిని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతామిట్టల్ శనివారం దర్శించుకున్నారు. అమరేశ్వరునికి, బాలచాముండేశ్వరీ అమ్మవారికి జస్టిస్ గీతామిట్టల్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ వేదపండితులు ఆశీర్వదించగా, ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. చాగంటివారిపాలెం(ముప్పాళ్ళ): మండలంలోని చాగంటివారిపాలెం గ్రామంలో వేంచేసియున్న సుభద్ర బలభద్ర సహిత జగన్నాథస్వామి ఆలయ 14వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పొంగళ్లు చేసి మొక్కులు సమర్పించుకున్నారు. సాయంత్రం శ్రీరాధాకృష్ణుల శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. కారెంపూడి: కారెంపూడి పీహెచ్సీని అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ కె.మాధవీలత శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలోని రికార్డులు తనిఖీ చేశారు. రోజువారీ ఓపీ వారికి అందుతున్న వైద్య సేవల గురించి పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ జి. రమ్య, డాక్టర్ కె. లక్ష్మీమౌనికలను అడిగి తెలుసుకున్నారు. స్పర్శ కార్యక్రమం కింద కుష్ఠువ్యాధి లేని సమాజాన్ని చూసేందుకు సంబంధిత శాఖ ఉద్యోగులు అందరూ కృషి చేయాలని కోరారు. సీహెచ్ఎ మల్లయ్య, ఉద్యోగులతో అడిషినల్ డీఎంహెచ్ఓ సమావేశం నిర్వహించారు. బాపట్ల: బాపట్ల జిల్లా గనులు–భూగర్భ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్గా జి.శ్రీనివాస్ నియమితులయ్యారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా గనులు–భూగర్భ విభాగం కార్యాలయంలో అసిస్టెంట్ జియాలజిస్ట్గా పనిచేస్తున్న ఆయన పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయన శనివారం బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
బాపట్ల
ఆదివారం శ్రీ 1 శ్రీ ఫిబ్రవరి శ్రీ 202677తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3500, గరిష్ట ధర రూ.4800, మోడల్ ధర రూ.4200 వరకు పలికింది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2,900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నిల్వ 36.7317 టీఎంసీలు. నరసరావుపేట రూరల్: ఇసప్పాలెంలోని మహంకాళి ఆలయ నిర్మాణానికి కొనకంచి రామయ్య, జయశ్రీ దంపతులు రూ.1,11,116 విరాళంగా అందజేశారు. -
అంబటి రాంబాబు ఇంటిపై దాడి హేయం
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడి హేయమైన చర్య. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే ఉద్దేశపూర్వకంగా ఇంటిలోకి చొరబడి దాడులు చేయడం సరికాదు. వ్యక్తిగత దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరగడం సహించకూడదు. ప్రశ్నిస్తే దాడులు చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం సరికాదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వైఎస్సార్ సీపీ నాయకులపై దాడులు, కక్షసాధింపు చర్యలు పెరిగాయి. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. – కరణం వెంకటేష్, వైఎస్సార్ సీపీ చీరాల సమన్వయకర్త అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేయడం అమానుష చర్య. రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న వివాదాలను రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప నివాస గృహాలపై దాడి చేయడం సమంజసమైన చర్య కాదు. కుటుంబంలో మహిళలు, చిన్నారులు ఉంటారని వారిని భయాందోళనకు గురి చేయడం సరి కాదు. ఇటువంటి అమానుష చర్యలను ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – గాదె మధుసూదనరెడ్డి, వైఎస్సార్ సీపీ పర్చూరు సమన్వయకర్త -
వసతి గృహాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు
బాపట్ల: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి బాపట్ల సేవ సేతు వెబ్సైట్ను రూపకల్పన చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ వెల్లడించారు. వెబ్సైట్ అమలు తీరుపై శనివారం స్థానిక కలెక్టరేట్లో మీడియా సమావేశం నిర్వహించారు. చీరాల బీసీ బాలికల వసతి గృహంలోని విద్యార్థినుల కోసం కొనుగోలు చేసిన 18 బెడ్ రోల్స్ విరాళంగా ఇస్తూ రసీదును సంబంధిత వసతి గృహ సంక్షేమ అధికారిణికి కలెక్టర్ అందజేశారు. ప్రజలకు అవగాహన కల్పించడానికే తానే తొలి విరాళం ఇచ్చానని చెప్పారు. ఇప్పటివరకు 491 రకాల వస్తువులు, అవసరాలను గుర్తించి వెబ్సైట్లో నిక్షిప్తం చేశామన్నారు. సమావేశంలో జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి సత్యనారాయణ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి అబ్బులు, బీసీ సంక్షేమ శాఖ అధికారి శివలీల పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
‘పచ్చ’ పంతాలకు పడకేసిన ప్రగతి
● ప్రజల ఇబ్బందులను పక్కనపెట్టి పచ్చ నేతల పంతాలు ● అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న మున్సిపల్ చైర్మన్ ● ఏకపక్ష నిర్ణయాలతో సమావేశానికి కౌన్సిలర్లు గైర్హాజరు ● కోరం సరిపోదనే సమావేశాల నిర్వహణకు దూరం నగరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్, పార్టీ నేతలువైఎస్సార్సీపీ వారిపై మరింతగా... మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు కోరం కొరత వేధిస్తోంది. పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు నిర్వహించేందుకు, ప్రగతి ప్రణాళికలు రూపొందించడానికి కౌన్సిల్ సభ్యుల ఆమోదం తప్పనిసరి. అయితే అసలు కౌన్సిల్ సమావేశం సజావుగా జరిగేందుకు, అజెండాలోని అంశాల ఆమోదానికి కౌన్సిలర్లు ముందుకు రావడం లేదు. కోరం సరిపోక కౌన్సిల్ సమావేశం వాయిదా పడడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి. -
మహిళ ముక్కు కోసిన ఇద్దరు అరెస్టు
పిడుగురాళ్ల: కోడి కత్తితో మహిళ ముక్కు కోసి పారిపోయిన ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ... పట్టణంలోని లెనిన్ నగర్లో ఈ నెల 22వ తేదీన మహిళ ముక్కు కోసి పరారైన వ్యక్తులను పట్టణ ఎస్ఐ శివనాగరాజు, సిబ్బంది పట్టుకున్నారు. పట్టణంలోని శ్రీనివాస కాలనీకి చెందిన కంపా వెంకట్రావుకు చెరుకూరి మరియమ్మతో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇటీవల మనస్పర్థలు ఏర్పడి నాలుగు నెలలుగా దూరంగా ఉంటున్నారు. మరియమ్మను చంపేందుకు బంధువైన కంపా నగేష్తో కలిసి వెంకట్రావు కోడికత్తి తీసుకొని ఆమె ఇంటికి వెళ్లాడు. మరియమ్మను నగేష్ రెండు చేతులు వెనక్కి పట్టుకోగా గొంతుపై కత్తితో కోసేందుకు వెంకట్రావు ప్రయత్నించాడు. తోపులాటలో మరియమ్మ ముక్కు తెగింది. దీంతో వారు పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ శివనాగరాజు, మోహన్, సిబ్బంది ఉన్నారు. -
ఒడిశా కార్మికుడి బలవన్మరణం
నాదెండ్ల: ఒడిశా కార్మికుడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గణపవరం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు ఒడిశాకు చెందిన కార్మికుడు రణబిడఅరుణ్ (36) నాలుగు నెలలుగా స్థానిక ప్రసన్నవంశీ స్పిన్నింగ్ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తూ క్వార్టర్స్లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 28న తనకు ఆరోగ్యం బాగాలేదని, మీరు ఇక్కడకు వచ్చి తనను తీసుకెళ్ళాలని ఫోన్లో చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అదేరోజు తాను ఒడిశాకు వెళ్తున్నట్లు కంపెనీ అధికారులకు తెలియపరిచి బయటకు వచ్చాడు. గురువారం అర్ధరాత్రి జాతీయ రహదారి పక్కనే ఉన్న పాత గోల్డెన్ టుబాకో కంపెనీలోకి వెళ్లి ఐరన్రాడ్కు వైరుతో ఉరేసుకున్నాడు. తెల్లవారుజామున 5.30 గంటలకు కంపెనీ వాచ్మెన్ నాగరాజు విద్యుత్ లైట్లు ఆపేందుకు వెళ్ళగా మృతదేహాన్ని చూసి కంపెనీ యాజమాన్యానికి తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకుని మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పిచ్చికుక్క స్వైరవిహారం
పిడుగురాళ్ల: పిచ్చి కుక్క స్వైర విహారంతో ఆరుగురికి తీవ్ర గాయాలైన సంఘటన మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని చింతల శృతి అనే చిన్నారి స్థానిక హైస్కూల్ సమీపంలో ఆడుకుంటుండగా పిచ్చి కుక్క దాడి చేసి ముఖంపై గాయపరిచింది. మరో చిన్నారిని వీపుపై గాయం చేసింది. ఇద్దరు చిన్నారులకే కాకుండా అటుగా వెళ్లే ఇద్దరు మహిళలతోపాటు ఎస్సీ కాలనీకి చెందిన వంగపూరి హారిక మెడ బాగాన, వీపు బాగాన గాయపరిచింది. వీరితోపాటు బీసీ కాలనీకి చెందిన మరో ఇద్దరిపై దాడి చేసి కలవర పరిచింది. మొత్తం ఆరుగురికి గాయాలు అయ్యాయి. ఆరుగురికి గాయాలు -
ద్విచక్ర వాహన దొంగల అరెస్ట్
13 వాహనాలు స్వాధీనం నకరికల్లు: వాహన దొంగలను అరెస్ట్ చేసి 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ కె.సతీష్ శుక్రవారం తెలిపారు. ఈనెల 21న నకరికల్లులోని సినిమాహాలు వీఽధిలో ద్విచక్రవాహనం చోరీ జరిగిందని వచ్చిన ఫిర్యా దు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. దర్యాప్తులో ఇద్దరు మైనర్లతో పాటు నరసరావుపేటకు చెందిన ఉద య్, గోపిలను అదుపులోకి తీసుకొని విచారించి వారి వద్ద నుంచి 13 బైక్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచామన్నారు. పేకాట స్థావరంపై దాడి 16 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పిడుగురాళ్ల: పేకాట ఆడుతున్న స్థావరంపై పిడుగురాళ్ల పట్టణ పోలీసులు గురువారం రాత్రి మెరుపు దాడులు నిర్వహించారు. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు టోల్గేట్ సమీపంలో ఉన్న హోటల్లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం తెలుసుకున్న పిడుగురాళ్ల పట్టణ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పలువురు పేకాట రాయుళ్లు వచ్చి ఇక్కడ ఆడుతున్నారు. దీంతో పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీస్లు ఒక్కసారిగా దాడులు నిర్వహించి 16 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1,40,190 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ హోటల్ కేంద్రంగా నిర్వాహకులే పేకాట ఆడిస్తున్నట్లు కొంత మేరకు సమాచారం ఉందని, ప్రస్తుతం హోటల్ నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏఎన్యూ లైబ్రరీకి వేటూరి పుస్తకాలు బహూకరణ ఏఎన్యూ(పెదకాకాని): సినీ సినీయేతర సాహిత్య రచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్య పుస్తకాలను ఆయన కుమారులు శనివారం వర్సిటీలోని గ్రంథాలయానికి బహూకరించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించిన వేటూరి సుందర రామమూర్తి రచించిన సాహిత్య పుస్తకాలు దొరకునా ఇటువంటి సేవ, మానసవీణ మధుగీతం, నవమి నాటి వెన్నెల, ఎడారిలో కోయిల, ఝుమ్మంది నాదం, ఎరక్కపోయి వచ్చాను వంటి పుస్తకాలను వేటూరి కుమారులు వేటూరి రవి ప్రకాష్, వేటూరి చంద్రశేఖరరావులు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మెమోరియల్ లైబ్రరీకి స్వయంగా విచ్చేసి బహూకరించారు. గ్రంథాలయ అధికారి ప్రొఫెసర్ కోడెల వెంకట్రావు నేటి యువతకు ఈ సాహిత్య పుస్తకాలు, సాహిత్య పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. -
పదిలో ఉత్తమ ఫలితాలకు కృషి చేయాలి
వినుకొండ: రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలు, అత్యున్నత ర్యాంకులు లక్ష్యంగా పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈవో పీవీజే రామారావు పాల్గొని మాట్లాడుతూ పరీక్షలకు మిగిలి ఉన్న 45 రోజుల సమయాన్ని విద్యార్థులు అత్యంత కీలకంగా భావించాలని సూచించారు. లక్ష్యంతో, సరైన ప్రణాళికతో చదివి రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించాలన్నారు. అనంతరం నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో డీఈవో సమీక్ష నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులందరూ మంచి మార్కులు సాధించేలా ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈవోలు జఫ్రుల్లా, కె.పార్వతి, జి.చిన్నపరెడ్డి, ఎం.సాంబశివరావు, ఎన్. రవిచంద్ర, ఎ.లలిత కుమారి, కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట డీఈఓ రామారావు -
నాలుగవ రోజుకు చేరిన సహకార ఉద్యోగుల నిరసన
కొరిటెపాడు(గుంటూరు): దీర్ఘకాలికంగా పేరుకుపోయిన వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు శ్యామలానగర్లోని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, రిజిస్టారు కార్యాలయం వద్ద ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సహకార సంఘాల ఉద్యోగులు చేస్తున్న నిరసన, వంట–వార్పు కార్యక్రమం శుక్రవారం నాలుగవ రోజుకు చేరుకుంది. రోజుకు రెండు జిల్లాల నుంచి పీఏసీఎస్ ఉద్యోగులు పాల్గొని నిరసన, వంట వార్పు కార్యక్రమం చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. శుక్రవారం ఎన్టీఆర్, అనంతపురం జిల్లాలకు చెందిన పీఏసీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ 45 రోజులుగా పీఏసీఎస్ ఉద్యగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు నుంచి స్పందన రాకపోవడం బాధాకరమని ధ్వజమెత్తారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు మువ్వా వెంకటేశ్వరరావు, తోట వెంకట్రామయ్య, బి.రఘురాం, సత్యనారాయణ, ఎస్.ఖాజా మొయిద్దీన్, ప్రకాశం, చిత్తూరు జిల్లాల నాయకులు బీఎస్ విజయ్కుమార్ రెడ్డి, బి.రమేష్, వి.మనోజ్కుమార్, జి.రామాంజనేయరెడ్డి, ప్రకాశం, చిత్తూరు జిల్లాల ఉద్యోగులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో బీఫార్మసీ విద్యార్థి మృతి చెందాడు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి సమీపంలో ఈ ఘటన శుక్రవారం జరిగింది. వివరాలు.. సత్తెనపల్లి మండలం కంటేపూడి సమీపంలోని కళాశాలలో చిత్తూరు జిల్లా ఎన్జీ గూడెంకు చెందిన వి.భరణి (19) బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు జరిగాయి. తన స్నేహితుడు దాచేపల్లికి చెందిన దాసరి గణేష్ను ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని కొమెరపూడి వైపు వెళుతుండగా అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టాడు. భరణి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. గణేష్కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యానాదులపై అధికార పార్టీ నేత అరాచకం
చేబ్రోలు: సిమెంట్ బ్రిక్స్లో పనిచేసే కూలీలను అధికార పార్టీకి చెందిన నాయకుడు భయపెట్టడం, బెదిరించి దాడి చేయటంపై యానాది గిరిజన సంక్షేమ సంఘం నాయకులు శుక్రవారం రాత్రి చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యానాది, గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాపట్ల బ్రహ్మయ్య, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తుపాకుల ఉమామహేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి పొన్నూరు అంకమ్మరావు, బాపట్ల జిల్లా అధ్యక్షుడు సిరిమెళ్ల శ్రీను, ఉన్నం దుర్గారావు, నక్కా చంద్రయ్య తదితరులు చేబ్రోలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. చేబ్రోలు మెయిన్ రోడ్డులో అప్పాపురం చానల్ సమీపంలో ఉన్న సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో గత ఐదు సంవత్సరాలుగా బాపట్ల జిల్లా కొంగట్టు అడ్డరోడ్డు గాదె వెంకటరెడ్డి కాలనీకి చెందిన ఎమినిది యానాది కుటుంబాల వారు కార్మికులుగా పనిచేస్తున్నారు. రోజుకు రూ.150 చొప్పున కూలీకి పనిచేస్తున్నారు. 20 మంది ఉన్నా పది రోజులే పని ఉంటోంది. బ్రిక్స్ యజమాని అధికార టీడీపీ నేత షేక్ హర్షద్బాషా సక్రమంగా డబ్బులు ఇవ్వకుండా కులం పేరుతో దూషిస్తూ, బెదిరిస్తూ, దాడి చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. గదిలోకి తీసుకువెళ్లి తమను అకారణంగా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పనులు లేకపోవటంతో మిరప, మినుము పీకుడు పనులకు వెళితే కూలి ఆరువందల వరకు వస్తుందని వెళితే అక్కడకు వచ్చి బెదిరించి దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం మందపాడు మిరపకాయల కూలీలకు వెళ్లగా అక్కడకు కారులో మద్యం తాగిన నలుగురు వచ్చి బలవంతంగా తీసుకువచ్చారన్నారు. ఇక్కడకు తీసుకువచ్చి తమపై దాడి చేసినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి బాధితులకు రక్షణ కల్పించాలని యానాది, గిరిజన సంక్షేమ సంఘం నాయకులు కలిసి చేబ్రోలు ఎస్ఐ పి.వీరనారాయణకు ఫిర్యాదు చేశారు. సిమెంట్ బ్రిక్స్లో కూలీలుగా పనిచేసే చేగోరు సుబ్బారావు, చేగూరు రాంబాబు, బాపట్ల రాఘవులు, చూటూరి దుర్గారావు, పత్తి వెంకటేశ్వర్లు, టి. సాంబయ్య, సి.చంద్రయ్య, సీహెచ్ బాలులకు చెందిన కుటుంబసభ్యులతో పాటు యానాదికాలనీకి చెందిన బాధిత కుటుంబాలకు చెందిన బంధువులు, నాయకులు పాల్గొన్నారు. కేసును పక్కదారి పట్టించి బ్రిక్స్ కంపెనీ యజమానిని కాపాడటానికి అధికార పార్టీ నేతలు పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు యానాది గిరిజన సంక్షేమ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. సిమెంట్ బ్రిక్స్లో పనిచేసే కార్మికులపై బలప్రయోగం -
రైలు కిందపడి పెయింటర్ ఆత్మహత్య
సత్తెనపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సత్తెనపల్లి మండలం భీమవరం రైల్వే గేటు వద్ద శుక్రవారం జరిగింది. వివరాలు... పట్టణంలోని సంఘం బజార్కు చెందిన పెయింటర్ గైక్వాడ గోపీనాథ్ (29) మద్యం తాగుతుంటాడు. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లింది. మద్యం మానేసినప్పటికీ తిరిగి రావడం లేదని, మానసిక పరిస్థితి బాగాలేక పోవటంతో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అల్లుడి పెద్దకర్మ సరుకులకు వెళ్తూ అత్త మృతి సత్తెనపల్లి: అల్లుడి పెద్దకర్మ సరుకుల కోసం వస్తూ అత్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన సత్తెనపల్లి మండలం బృగుబండ నుంచి పాకాలపాడు శివారు మార్గంలో శుక్రవారం జరిగింది. వివరాలు... క్రోసూరు మండలం గుడిపాడుకు చెందిన సిద్దిల మరియమ్మ అలియాస్ మేరమ్మ (50)కు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు వ్యవసాయ పనులు చేస్తూ జీవనం వెళ్లదీస్తున్నాడు. కుమార్తెను సత్తెనపల్లి మండలం బృగుబండ గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అల్లుడు ఈ నెల 7న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందాడు. పెద్దకర్మకు సంబంధించిన సరుకులు కొనుగోలు చేసేందుకు శుక్రవారం తన వరుసకు చెల్లి, మరిది అయిన ఇరువురితో కలిసి మరియమ్మ ద్విచక్ర వాహనంపై సత్తెనపల్లి వస్తోంది. అదే సమయంలో మట్టి ట్రాక్టర్ పాకాలపాడు శివారు వద్ద ఢీకొంది. మరియమ్మ తలపై నుంచి ట్రాక్టరు టైర్ వెళ్లడంతో మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశ్వబ్రాహ్మణల ఎదుగుదలకు కృషి నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): విశ్వబ్రాహ్మణుల సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రగతికి పార్టీలకతీతంగా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్ర్సన్ కుమ్మర పార్వతి పేర్కొన్నారు. గుంటూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో రింగ్ రోడ్డు సాయిబాబా రోడ్డులో సంఘ కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్వతి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ సామాజిక ఆర్థిక ప్రగతికి విద్య బలమైన ఆయుధం అన్నారు. కుటుంబాలు తమ పిల్లలను విద్యావంతులుగా చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కడియాల సుబ్బారావు, కార్యదర్శి వై. ధర్మారావు, నాయకులు గట్టి శ్రీనివాసరావు చిరంజీవి ఆచారి, మేడపి వెంకటప్రసాద్, బ్రహ్మముడి కోటేశ్వరరావు, సిద్ధి సాంబశివరావు, మేడూరి మల్లేశ్వరరావు, మను బ్రహ్మచారి, శివాజీ, కొమ్మూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


