ఇంకెప్పుడు స్వామీ..! | - | Sakshi
Sakshi News home page

ఇంకెప్పుడు స్వామీ..!

Feb 10 2026 7:38 AM | Updated on Feb 10 2026 7:38 AM

ఇంకెప

ఇంకెప్పుడు స్వామీ..!

● మిగిలింది మూడు రోజులే ● 13న ఏకాదశి నుంచి భక్తుల రాక ● 15న కోటప్పకొండ తిరునాళ్ల ● అధ్వాన్నంగా రోడ్లు

మహాశివరాత్రిని పురస్కరించుకుని కోటప్పకొండలో నిర్వహించే తిరునాళ్ల మహోత్సవాలకు గడువు దగ్గర పడుతుంది. ఈ నెల15వ తేదీ మహాశివరాత్రికి రెండు రోజుల ముందు ఏకాదశి నుంచే కోటప్పకొండకు భక్తుల రాక ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచే తిరునాళ్ల ప్రారంభమైనట్టు భక్తులు భావిస్తారు. ఇందుకు ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నా ఏర్పాట్లు కొలిక్కి రాలేదు. కొండకు వచ్చే రహదారులు గోతులమయంగా ఉన్నా ఆ శాఖ ఇప్పటి వరకు మరమ్మతు పనులు చేపట్టలేదు. – నరసరావుపేట రూరల్‌

క్యూలైన్‌ వద్ద చలువ పందిళ్లు

కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై మూడుసార్లు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సైతం సమీక్షలో పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరునాళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. తిరునాళ్లకు మరో మూడు రోజులే సమయం ఉన్నా పనుల్లో వేగం కనిపించడం లేదు.

రహదారుల పరిస్థితి ఆధ్వానం ...

కోటప్పకొండకు చేరుకునే ప్రధాన రహదారుల మినహా మిగిలిన రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. చిలకలూరిపేట మేజర్‌ కెనాల్‌ రోడ్డు పెద్ద పెద్ద గోతులతో నిండిపోయింది. ప్రభలు కొండకు చేరుకునే సమయంలో అర్ధరాత్రి ఈ మేజర్‌ కెనాల్‌ వద్ద ట్రాఫిక్‌ నిలిచిపోతుంటుంది. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించేందుకు ఈ రోడ్డును వినియోగిస్తారు. అలాగే ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించే కొండకావూరు రోడ్డులో కూడా మరమ్మతు పనులు చేపట్టలేదు. యూటీ నుంచి క్రషర్స్‌ మీదుగా ట్రాఫిక్‌ మళ్లిస్తారు. ఈ రోడ్దు దుమ్ముతో నిండిపోయి ఉంది. చినతురకపాలెం నుంచి గొనెపూడి, గురవాయపాలెం నుంచి గొనెపూడి రోడ్లు మరమ్మతు పనులు ప్రారంభించలేదు.

జాతర జరిగే కొండ దిగువున ప్రధాన రోడ్లులో విద్యుత్‌ దీపాలు ఏర్పాట్లు పనులను ఆర్‌అండ్‌బీ ఎలక్ట్రీకల్‌ విభాగం ప్రారంభించింది. ప్రధాన రోడ్డులో ఐరెన్‌ పోల్స్‌కు విద్యుత్‌ దీపాలు బిగించే పనులు నిర్వహిస్తున్నారు. బారికేడింగ్‌ పనులు ప్రారంభించలేదు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా నూతన ట్రాన్స్‌ ఫార్మర్స్‌ను ఏర్పాటు చేసే పని విద్యుత్‌ శాఖ చేపట్టింది. మేజర్‌ కెనాల్‌ వద్ద భక్తులు స్నానాలు ఆచరించే ప్రాంతంలో తాత్కాలిక మరుగుదొడ్లు పనులు ప్రారంభం కాలేదు.

ఇంకెప్పుడు స్వామీ..! 1
1/1

ఇంకెప్పుడు స్వామీ..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement