Kakinada
-
ఇలా అయితే సాగు చేయలేం
ఇప్పటికే రొయ్యలకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నాం. ఈ పరిస్థితుల్లో మేత ధరలు పెంచడం మరింత భారం కానుంది. ఆక్వాలో ఖర్చులు పెరిగిపోయి, పంటకు ఎకరాకు అదనంగా రూ.24 వేలు భారమంటే సామాన్య రైతులు ఎలా సాగు చేస్తారు? ఆశించిన దిగుబడి రాక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోగా మేతల ధరలు పెరిగినా నోరు మెదపకపోవడం అన్యాయం. ఇదే పరిస్థితి కొనసాగితే సాగు చేయలేం. – అనిశెట్టి శ్రీనివాసరెడ్డి, ఆక్వా రైతు లచ్చిపాలెం, తాళ్లరేవు మండలం, కాకినాడ జిల్లా -
సమస్యలు పరిష్కరిస్తాం
డిజిటల్ పేమెంట్ల వలన కొంత మంది భక్తులు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసింది. వారికి సహాయం చేసేందుకు కౌంటర్లలో పది మంది సిబ్బందిని అదనంగా నియమించాం. సత్రాల వద్ద వ్రతం, ప్రసాదం, దర్శనం టికెట్లు పొందేందుకు కియోస్క్లు ఏర్పాటు చేశాం. వైఫై సదుపాయం కోసం రూటర్లు ఏర్పాటు చేశాం. సెల్ టవర్లు ఏర్పాటు చేసేలా ప్రైవేటు కంపెనీలకు లేఖలు రాయాల్సిందిగా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించాం. ఈ సమస్యలన్నీ కొద్ది రోజుల్లో పరిష్కరిస్తాం. – నల్లం సూర్యచక్రధరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
రెండో ఘాట్ రోడ్డు సిద్ధం
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానం రెండో ఘాట్ రోడ్డు పనులు పూర్తయ్యాయి. రెండు దశాబ్దాలుగా లోవ దేవస్థానానికి మొదటి ఘాట్ రోడ్డు మీదుగానే భక్తులు, వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. కొన్నేళ్లుగా వాహనాలు, భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆషాఢ మాసం, ఇతర పర్వదినాల్లో ఘాట్ రోడ్డులో తరచుగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో రెండో ఘాట్ రోడ్డు నిర్మించాలన్న ధర్మకర్తలు, కార్యనిర్వహణాధికారి విజ్ఞప్తిపై డెక్కన్ ఫైన్ కెమికల్స్ సంస్థ యాజమాన్యం స్పందించింది. ఈ మేరకు రూ.70 లక్షలు అందించడంతో రెండో ఘాట్ రోడ్డు నిర్మించారు. దీనిని అధికారికంగా ప్రారంభించాల్సి ఉండగా.. ట్రయల్ రన్గా కొండపై నుంచి దిగువకు వెళ్లే వాహనాలను ఇప్పటికే ఈ రోడ్డు మీదుగా అనుమతిస్తున్నారు. వరి రైతుకు కాస్త ఊరట సాక్షి, అమలాపురం: ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న జిల్లా రైతులకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరట కలిగించే ప్రకటన చేసింది. వరి ధాన్యానికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాల్కు రూ.72 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ సాధారణ రకం ధాన్యం క్వింటాల్ రూ.2,369 ఉండగా, పెంచిన ధరతో ఇది రూ.2,441కు చేరింది. గ్రేడ్–ఎ ధాన్యం ధర రూ.2,489 ఉండగా తాజా పెంపుతో రూ.2,461కు పెరిగింది. ఈ ధరలు వచ్చే ఖరీఫ్ ధాన్యం కొనుగోలు నుంచి అమలులోకి రానున్నాయి. కోనసీమ జిల్లా పరిధిలోని తూర్పు, మధ్య డెల్టాల్లో వరి సాగు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 2.3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా 1,31,500 ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిగా వస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల మీద 50 శాతం కలిపి కనీస మద్దతు ధరలు ప్రకటించినట్టు చెబుతోంది. వాస్తవానికి రాష్ట్రంలోనే గోదావరి జిల్లాల్లో వరి పెట్టుబడి అధికంగా ఉంది. జిల్లాలో వ్యవసాయ రుణాల కోసం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను టెక్నికల్ కమిటీ నిర్ధారించిన పెట్టుబడి ఖరీఫ్లో ఎకరాకు రూ.55 వేల నుంచి రూ.60 వేలు. ఖరీఫ్ సగటు దిగుబడి 29 బస్తాలు అంటే (21.75 క్వింటాళ్లు). క్వింటాల్ ఉత్పత్తికి రైతుకు అవుతున్న ఖర్చు రూ.2,528. ప్రభుత్వం ఇప్పుడు ఇస్తానన్నది రూ.2,441. అంటే ఖరీఫ్ సాగు చేస్తే రైతులకు మిగిలేది ఏమీ లేనట్టే. కేంద్రం చెబుతున్న పెట్టుబడికి 50 శాతం కలిపి కనీస మద్దతు ధర ఇవ్వాలంటే క్వింటాల్కు కనీస మద్దతు ధర రూ.3,792 ప్రకటించాలని కోనసీమ రైతులు డిమాండ్ చేస్తున్నారు.వివిధ పనులకు రూ.34.5 కోట్లు కాకినాడ రూరల్: జిల్లాలో వివిధ పనుల నిమిత్తం కాకినాడ నగరాభివృద్ధి సంస్థ (కౌడా) నుంచి రూ.34.5 కోట్లు అందజేయాలని అధికారులు నిర్ణయించారు. వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధ్యక్షతన, చైర్మన్ తలాటం సత్య ఆధ్వర్యాన కౌడా కార్యాలయంలో బుధవారం 2026– 27 బడ్జెట్ సమావేశం నిర్వహించారు. మిగులు బడ్జెట్ను ఆమోదించి, నియోజకవర్గాల వారీగా అభివృద్ధి పనులకు రూ.16.5 కోట్లు, పురపాలక సంఘాలకు రూ.18 కోట్లు మంజూరు చేశారు. కౌడా సిబ్బంది, ప్లానింగ్ విభాగం అధికారులతో సమీక్షిస్తూ, అనధికార లే అవుట్ల నిర్మూలనకు, ఆదాయ వనరుల పెంపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో కౌడా కార్యదర్శి కాళీబాబు, ప్లానింగ్ అధికారి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలి
కాకినాడ రూరల్: ఫీడ్ ధరలను తక్షణం తగ్గించి, ఆక్వా రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక్కడ బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై సంబంధిత పరిశ్రమల యాజమాన్యాలు రైతులు, ఆక్వా సంఘాలతో సమావేశం నిర్వహించిన తరువాత నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో ఆక్వా ఫీడ్ తయారీ సంస్థలు అత్యధికంగా టీడీపీ నేతలవే కావడంతో ధరలు పెంచుతున్నా ప్రభుత్వం చోద్యం చూసిందా అనే అనుమానాలు వస్తున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దిగుమతులపై సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో ఆక్వా ఫీడ్ ధరలు మరింత తగ్గించాలని, కానీ వ్యాపారులు రేట్లు పెంచడమేమిటని ప్రశ్నించారు. ఆక్వా ఫీడ్ తయారీ సంస్థలపై ప్రభుత్వానికి నియంత్రణ ఉందా అని నిలదీశారు. గతంలో ఇలాగే ధరలు పెంచినప్పుడు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడుసార్లు తగ్గించారని నాగమణి గుర్తు చేశారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఆక్వా రైతుల పక్షాన నిలవాల్సింది పోయి ఫీడ్ తయారీదార్లకు మద్దతుగా నిలవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా చంద్రబాబు ప్రభుత్వం రైతు వ్యతిరేకి అనే విషయాన్ని మరోసారి నిరూపణ అయ్యిందని అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.72 వేలున్న ఆక్వా ఫీడ్ ధర చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రూ.లక్షకు పెరిగిందని, తాజాగా తయారీ సంస్థలు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో అది కాస్తా రూ.1.15 లక్షలకు చేరుకుందని వివరించారు. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధ వాతావరణంతో ఆక్వా ఎగుమతుల్లో అనిశ్చితి నెలకొందని, తాజాగా ఫీడ్ తయారీ సంస్థల ధనదాహానికి ఆక్వా రైతులు మరింత కుదేలవుతున్నారని అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం రైతుల పక్షాన నిలవాలని నాగమణి హితవు పలికారు. -
అక్రమ కేసులపై ప్రత్యక్ష పోరు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిని ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసులు అక్రమ కేసులతో వేధిస్తున్న తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ) కోరారు. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలనను గాలికొదిలేసి అరాచకంతో ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం కర్నూలు సిటీ అధ్యక్షుడు బాలు ఆత్మహత్యా యత్నానికి పోలీసు వేధింపులు, అక్రమ కేసులే కారణమని పేర్కొంటూ.. ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బన్నీ ఆధ్వర్యాన పార్టీ, యువజన విభాగం నేతలు కాకినాడ ఇంద్రపాలెం అంబేడ్కర్ విగ్రహం వద్ద బుధవారం ధర్నా, నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులనుద్దేశించి బన్నీ మాట్లాడుతూ, ఎటువంటి తప్పూ చేయకపోయినా కర్నూలులో యువజన నేత బాలుపై పోలీసులు సారా, డ్రగ్స్ పేరుతో తప్పుడు కేసులు నమోదు చేశారని అన్నారు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమ కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ఇటీవల యువతపై పోలీసుల వేధింపులు పెరిగిపోయాయనడానికి కర్నూలు ఘటనే ఉదాహరణన్నారు. బాలు కుటుంబానికి యువజన విభాగం అండగా ఉంటుందన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే తీవ్ర స్థాయిలో స్పందిస్తామని బన్నీ హెచ్చరించారు. కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మళ్ల కిశోర్, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన పార్టీ యువజన నేతలు ఉలవల భూషణం, సకురు గుర్రాజు, అడపా సోమేశ్వరరావు, కరణం భాను, మడద హేమంత్ కుమార్, మడిపల్లి రాజు, బోణం శంకర్, లంక సత్తిబాబు, చెక్క చక్రవర్తి, సీడీ కుమార్, దీపక్, యాసలపు పవన్, తోకల గోపి తదితరులు పాల్గొన్నారు. ఫ వైఎస్సార్ సీపీ యువ నేత రాగిరెడ్డి బన్నీ ఫ కర్నూలులో అక్రమ అరెస్టులపై నిరసన -
రత్నగిరికి భక్తుల వెల్లువ
అన్నవరం: రత్నగిరికి బుధవారం భక్తులు వెల్లువలా తరలివచ్చారు. దీంతో, ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రమే అయ్యింది. రత్నగిరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు వేలాదిగా సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 50 వేల మంది భక్తులు తరలి రావడంతో క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సర్కులర్ మండపం వద్ద సుమారు 5 వేల మంది భక్తులకు పులిహోర, దధ్యోదనం పంచిపెట్టారు. వ్రతాలు 2,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. వైశాఖ బహుళ ఏకాదశి సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ స్వామివారికి పుష్పాలతో, అమ్మవారికి కుంకుమతో, శంకరునికి బిల్వ పత్రాలతో పూజలు చేశారు. -
మేతలాకుతలం
సాక్షి, అమలాపురం: దేశానికి వందల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని అందిస్తూ, జిల్లాలో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే వనామీ రొయ్యల సాగు రెండేళ్లుగా వరుస సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు కొనుగోలుదారులు సిండికేటుగా మారి.. ట్రంప్ సుంకాలు, పశ్చిమాసియా యుద్ధం సాకుగా చూపి ధరలు తగ్గించేస్తున్నారు. మరోవైపు ఫీడ్ (మేత) ధరలను సైతం కంపెనీలు భారీగా పెంచేసి రైతులను ముంచేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా చంద్రబాబు సర్కార్ ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండడంపై వనామీ రైతులు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు వనామీ రొయ్యల ధరలు తగ్గిపోతుండడం వల్ల నష్టపోతున్న రైతులకు ఇప్పుడు మేతల ధరలు పెరగడం పిడుగుపాటుగా మారింది. ఆయా రకాల వనామీ రొయ్యల మేతలు టన్నుకు రూ.8 వేల వరకు, ష్రింప్ (టైగర్ రొయ్యల) మేతను రూ.10 వేలకు కంపెనీలు పెంచేశాయి. జిల్లాలో వనామీ రొయ్యల సాగు మాత్రమే జరుగుతోంది. వనామీ మార్కెట్ నిలకడగా లేకపోవడం, అంతర్జాతీయంగా చిన్న అలజడి చోటు చేసుకున్నా ఆ వంకతో రొయ్యల ధరలు తగ్గించేస్తూ కొనుగోలుదారుల సిండికేటు రైతులను నిలువునా ముంచేస్తోంది. ఈ విపత్తు నుంచి కోలుకోలేకపోతున్న రైతులకు మేత ధరలు పెరగడం గోరుచుట్టుపై రోకలిపోటుగా మారింది. 2.25 లక్షల మెట్రిక్ టన్నుల మేత వినియోగం ఎకరాకు సగటున రొయ్యల బరువు 50 కౌంట్ అనుకుంటే ఎకరా చెరువులో లక్ష వరకు పిల్లలను వదులుతున్నారు. సగటున ఎకరాకు 2 టన్నుల రొయ్యల దిగుబడి వస్తుంటే, 3 టన్నుల వరకు మేత వినియోగం అవుతోంది. రెండు పంటలు వేసుకుంటే 6 టన్నుల వరకు వినియోగం. కొంతమంది ఒకే ఏడాది మూడో పంట కూడా సాగు చేస్తున్నారు. దీనిని కూడా పరిగణనలోకి తీసుకుంటే 9 టన్నుల వినియోగించాల్సి ఉంది. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అధికారికంగా సుమారు 21 వేల ఎకరాల్లో వనామీ రొయ్యల సాగు జరుగుతోంది. అనధికారికంగా ఈ సాగు మరింత ఎక్కువగా ఉంటుంది. కనిష్టంగా సుమారు 35 వేల ఎకరాల్లో సాగు జరుగుతోందని అంచనా. తొలి పంట మొత్తం సాగు జరగగా, రెండో పంట 70 శాతం చెరువుల్లో అంటే సుమారు 24 వేల ఎకరాల్లో సాగవుతున్నట్టు అంచనా. ఇక మూడో పంట 40 శాతం చెరువుల్లో అంటే సుమారు 14 వేల ఎకరాల్లో సాగువుతోంది. ఈవిధంగా జనవరి నుంచి డిసెంబర్ వరకు 75 వేల ఎకరాలకు సరిపడా సాగు జరుగుతోంది. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మొత్తం 2.25 లక్షల మెట్రిక్ టన్నుల మేతను వినియోగిస్తున్నారని అంచనా. ఇప్పుడు మేత ధరలు టన్నుకు రూ.8 వేల వరకు పెరగడంతో ఇక్కడి వనామీ రైతులపై రూ.180 కోట్ల అదనపు భారం పడుతోంది. ఆక్వా రంగాన్ని కుదిపేస్తున్న మేత ధరల పెంపు కోనసీమ, కాకినాడ జిల్లాల్లో 35 వేల ఎకరాల్లో సాగు రెండు జిల్లాల రైతులపై రూ.180 కోట్ల మేర భారం -
మార్పులకు గ్రీన్ సిగ్నల్
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో కేంద్ర ప్రభుత్వ ‘పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్ప్రిట్యువల్ ఆగ్మంటేషన్ డ్రైవ్ ’ (ప్రసాద్’) స్కీం నిధులు రూ.11 .50 కోట్ల వ్యయంతో కడుతున్న అన్నదాన భవనంలో మరింత ఎక్కువ మంది భోజనం చేసేందుకు వీలుగా నిర్మాణంలో మార్పులు చేయనున్నారు. మంగళవారం అన్నవరం దేవస్థానానికి వచ్చిన టూరిజం, దేవదాయశాఖ శాఖ అధికారులు ఈ నిర్మాణాన్ని పరిశీలించిన అనంతరం ఈ మేరకు నిర్ణయించారు. మూడంతస్తులలో అన్నదాన భవనం నిర్మిస్తున్నారు. మూడు అంతస్తులలోని నాలుగు హాల్స్లో ఒక్కో హాలులో 350 మంది చొప్పున 1,400 మంది భోజనం చేసేందుకు వీలుగా నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ భవనంలోని హాల్స్లో మెట్లు లోపల వైపు ఉండేలా ప్లాన్లో పొందుపరిచి ఆ మేరకు నిర్మిస్తున్నారు. గత నెలలో ఇక్కడికి వచ్చిన దేవదాయశాఖ కమిషనర్ కే రామచంద్రమోహన్ ఈ భవనాన్ని పరిశీలించి మెట్లు లోపల కాకుండా భవనం బయట వైపు వస్తే ఒక్కో హాలులో 50 నుంచి వంద మంది అదనంగా భోజనం చేసే వీలుంటుందని సూచించారు. భోజనం చేసిన భక్తులు వినాయక అతిథిగృహం వెనుక నుంచి వెలుపలకు వచ్చేలా మార్పులు చేయాలని ఆదేశించారు. దేవదాయశాఖ సలహాదారు సుబ్బారావు, చీఫ్ ఇంజినీర్ జీవీ శేఖర్, టూరిజం శాఖ ఎస్ఈ ఈశ్వరయ్య, ఈఈ విజయభాస్కరరెడ్డి, ఆర్కిటెక్ట్ బీకే సాధి, అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధర్రావు, ఈఈ వీ రామకృష్ణ పరిశీలించారు. మెట్లు భవనం వెలుపల కడితే నాలుగు హాల్స్లో 50 నుంచి వంద మంది భోజనం చేసే వీలుంటుందని తేల్చారు. భవనం ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఈఈ రామకృష్ణ తెలిపారు. -
● ఎర్రటి ఎండలో చల్లని నేస్తాలు!
మండు వేసవిలో చెండాడే ఎండల్లో ప్రయాణించే వారికి చలివేంద్రాలు చల్లని నేస్తాలుగా నిలుస్తున్నాయి. ఎండ తీవ్రతకు, వడగాడ్పులకు సామాన్యుడి గొంతెండి పోకుండా రోడ్ల వెంబడి ఎక్కడికక్కడ దాతలు ఏర్పాటు చేస్తున్న ఇవి సేద తీరుస్తున్నాయి. వాహనదారుల దాహార్తి తీర్చేందుకు మేము సిద్ధం అన్నట్టు కొలువుదీరిన ఈ కూలింగ్ వాటర్ టిన్నులు కాకినాడ రూరల్ రమణయ్యపేట వద్ద పిఠాపురం రోడ్డులో కన్పించాయి. సామాజిక కార్యకర్త అనపాల ఆంజనేయరెడ్డి వీటిని ఏర్పాటు చేశారు. – కాకినాడ రూరల్ -
ఏసీబీ వలలో మున్సిపల్ డీఈ
రూ.10 వేలు తీసుకుంటుండగా పట్టివేత సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ డీఈ కె.శశిధర్ మంగళవారం ఏసీబీ వలకు చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలిలా.. మున్సిపల్ కాంట్రాక్టర్ కనూరి పవన్కుమార్కు రూ.11 లక్షల విలువైన ఐదు బిల్లులు చేయడానికి డీఈ లంచం డిమాండ్ చేశారు. మొదటి విడతగా రూ.10 వేలు ఇచ్చేందుకు అంగీకరించిన పవన్కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం రూ.10 వేలు ఇస్తుండగా మున్సిపల్ కార్యాలయంలో మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా డీఈని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన నోట్లు మున్సిపల్ డీఈ వద్ద ఉండడంతో ఏసీబీ డీఎస్పీ ఎం.కిశోర్కుమార్ ఆయనపై కేసు నమోదు చేశారు. మున్సిపల్ డీఈ తన అసిస్టెంట్ ఓదూరి శ్రీనివాసు ద్వారా రూ.10 వేలు తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఆక్వా రైతులను పీడిస్తున్న సిండికేట్లు ● ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కపిలేశ్వరపురం (మండపేట): చంద్రబాబు ప్రభుత్వ పాలనా తీరుతో ఆక్వా రైతులు కుదేలవుతున్నారని, వారిని కనీసం పట్టించుకుంటున్న పాపాన పోలేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి మంగళవారం వీడియో మాధ్య మం ద్వారా ప్రభుత్వ వైఖరిని ఖండించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల్లో 4.30 లక్షలు, వాస్తవంగా 10 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారని, ఆక్వా రైతులను ఫీడ్, ఎగుమతి పరిశ్రమల నిర్వాహకులు దోచుకుంటున్నారన్నారు. వారి దోపిడీకి తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వ అసమర్థత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి, ఫీడ్ పరిశ్రమల యాజమానులు వారి వారి పరిధుల్లో సిండికేట్ అయ్యి ఫీడ్ ధరలను పెంచేస్తున్నారన్నారు. ఫీడ్ తయారీ ముడిసరుకు ఈ దేశంలోనే లభ్యమవుతున్నప్పటికీ ధరలను ఎందుకు పెంచుతున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు. ధరల నిర్ధారణ విషయంలో రైతులతో కానీ, ఏపీఈడీఏ సంస్థతో కానీ ఏ మాత్రమూ సంప్రదించడంలేదన్నారు. కడుపు మండిన రైతులు యాజమానులను ప్రశ్నిస్తే.. కూటమి ప్రభుత్వం తమ కృషి వల్ల వచ్చిందని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని చెబుతున్నారని రైతులు అంటున్నారన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక పరిస్థితులు ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తున్నాయన్నారు. సిండికేట్లను నియంత్రించే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. కరోనా కాలంలో ఆక్వా ఉత్పత్తులను చెరువుల్లోనే వదిలేసే సంక్షోభం తలెత్తినప్పుడు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలతో ఆక్వా రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల పక్షాన నిలవకుండా కేవలం ఆదుకుంటామన్న ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతోందన్నారు. వైఎస్సార్ సీపీ ఆక్వా రైతులకు అండగా నిలుస్తుందని, ప్రభుత్వం రైతులను ఆదుకోని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఎమ్మెల్సీ తోట హెచ్చరించారు. కొనసాగుతున్న రొయ్యల చెరువుల తవ్వకాలు ˘ అయినవిల్లి: మండలంలోని అయినవిల్లి–నేదునూరు గ్రామంలోని కుమ్మరికాలువకు అనుకుని కొందరు రొయ్యల చెరువులు తవ్వుతున్నారు. దీనిపై సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ రాత్రి వేళల్లో తవ్వకాలు సాగుతున్నాయి. ఈ చర్యలను నిలువరించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. -
ప్రశాంతంగా ఏపీ ఈఏపీ సెట్
● తొలిరోజు 892 మంది హాజరు ● 45 మంది గైర్హాజరు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మశీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్–2026 మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలిరోజు ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి ఆన్లైన్ పరీక్ష నిర్వహించారు. కాకినాడ ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల, రాయుడుపాలెం సాఫ్ట్ టెక్నాలజీ, ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రానికి అందరూ గంట ముందుగానే చేరుకున్నారు. జిల్లాలో అక్కడక్కడా కొద్ది నిముషాల పాటు ప్రారంభ సమయంలో సర్వర్ సమస్య మినహా పరీక్షలు సజావుగా సాగాయి. పరీక్ష రెండు సెషన్లలో నిర్వహించగా 892 మంది హాజరుకాగా 45 మంది గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్లో 468 మందికి గాను 452 మంది హాజరుకాగా 16మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో 469 మంది దరఖాస్తు చేసుకోగా 440 మంది హాజరయ్యారు. 29 మంది గైర్హాజరయ్యారని కన్వీనర్ మోహనరావు తెలిపారు. -
కలెక్టర్ లేని మీటింగ్ ఎందుకు?
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లేకుండా జిల్లా పరిషత్ సమావేశం ఎందుకని కోనసీమ జిల్లాకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు మండిపడ్డారు. కాకినాడలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన నిర్వహించారు. జెడ్పీ సమావేశాలకు కలెక్టర్, జేసీ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రతీ సమావేశానికి కలెక్టర్ ఎందుకు దూరంగా ఉంటున్నారో చెప్పాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో సుమారు అరగంట పాటు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీటీసీ సభ్యులు నేలపై కూర్చుని నిరసన తెలిపారు. కలెక్టర్ లేకుంటే తాము సమావేశం బహిష్కరిస్తామని ప్రకటించారు. సమావేశానికి హాజరుకాని కలెక్టర్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేయాలన్నారు. కలెక్టర్ రానప్పుడు దూర ప్రాంతాల నుంచి తాము వచ్చినా ఏమీ ఉపయోగమని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ కోనసీమలో జాతీయ రహదాలకు పనులు జరుగుతున్నాయని, ఇరిగేషన్కు సంబంధించిన విషయాలు సమావేశంలో చర్చించాలని దీనిపై వివరణ ఇచ్చేందుకు కలెక్టర్ కనీసం జాయింట్ కలెక్టర్ అయినా లేకుంటే ఎలా అన్నారు. జెడ్పీ సమావేశానికి డీఆర్ఓ స్థాయి అధికారులను పంపిస్తున్నారని, ఇలా అయితే సమావేశం వద్దని ఆయన జెడ్పీ చైర్మన్కు సూచించారు. జిల్లా పరిషత్ సమావేశం వేరొక రోజు పెట్టాలని ఆ రోజు కలెక్టర్ వచ్చేలా చూడాలని ఎమ్మెల్సీతో పాటు జేడ్పీటీసీ సభ్యులు పట్టుబట్టారు. జెడ్పీ చైర్మన్ తో పాటు జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు సభ్యులకు ఎంత సర్దిచెప్పినా వారు తగ్గలేదు. కలెక్టర్తో సంప్రదించిన తర్వాతనే తాము సమావేశానికి తేదీలు ఖరారు చేశామని జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు తెలిపారు. కోనసీమ జిల్లాకు జడ్జి రావడంతో ప్రొటోకాల్ నిమిత్తం కలెక్టర్ ఉండాల్సి వచ్చిందని చెప్పడంతో వారు శాంతించారు. సంక్షేమ హాస్టళ్లలో స్వచ్ఛమైన మంచినీరివ్వాలి : ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు సంక్షేమ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీరు అందించకపోవడంతో రోగాల బారిన పడుతున్నారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ఆర్వో ప్లాంట్ల నిర్వహణను ఆయా కంపెనీలు సక్రమంగా చేయడం లేదని, అధికారులు పర్యవేక్షించడం లేదని మండిపడ్డారు. వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత, సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని, దీంతో వైద్య సేవలు అందకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని పలువురు జెడ్పీటీసీ సభ్యులు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువగా ఉందని అక్కడి జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు మండిపడ్డారు. దూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రిలో వేలాది రూపాయలు వెచ్చించి వైద్యం చేయించుకోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారని చెప్పారు. రహదారులు సక్రమంగా లేకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నామని పలువురు సభ్యులు తెలిపారు. ముఖ్యంగా రౌతులపూడి, తేటగుంట, ఎస్ పైడిపాల రోడ్డు పూర్తిగా గోతుల మయం అయిందన్నారు. ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీ, వేగుళ్ల జోగేశ్వరరావు, సత్తి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. MýSÌñæ-MýStÆŠ‡ çÜÐ]l*-Ðól-Ô>-°MìS Æ>¯]l…-§ýl$MýS$ °Æý‡çÜ-¯]lV> ¯ólÌSOò³ MýS*Æý‡$a¯]l² ˘ ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, కోనసీమ జిల్లా జెడ్పీటీసీ సభ్యులుసమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు కోనసీమ జెడ్పీటీసీ సభ్యుల ఆందోళన రైతులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం వాడీవేడిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం వరి రైతులు నష్టపోతున్నారు : ఎంపీ బోస్ ప్రస్తుత రబీలో వరి రైతులకు మద్దతు ధర రాాకపోవడం వల్ల ప్రతి బస్తాకు రూ.200 నుంచి రూ.300 నష్టపోవాల్సి వస్తోందని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తేమ పేరుతో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కోనసీమ జిల్లాలో తక్కువ రైస్మిల్లులు ఉండడం వల్ల ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ఇతర రైస్ మిల్లులకు కోనసీమ ధాన్యం తరలించే ఏర్పాట్లు చేయాలని, అప్పుడు రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. దీనికి కాకినాడ జిల్లా కలెకర్ట్ సానుకూలంగా స్పందించి ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకొంటామని చెప్పారు. -
ఆందోళనకరం
నీట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో పేపర్ లీక్ ఆరోపణలు ఆందోళనకరం. లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి, ఒత్తిడిని ఎదుర్కొంటూ ఈ పరీక్షకు సిద్ధమవుతున్నారు. కొంతమంది చేసిన తప్పులకు నిజాయితీగా చదివిన విద్యార్థులు శిక్ష అనుభవించకూడదు. సమగ్రమైన దర్యాప్తు జరగాలి. అవినీతికి లేదా అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిజాయితీగా చదివిన విద్యార్థుల మానసిక స్థితి, భవిష్యత్తును కాపాడటం ముఖ్యం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, డిజిటల్ మానిటరింగ్ అమలు చేయాలి. వైద్య విద్యపై ప్రజల నమ్మకం నిలబెట్టడం అందరి బాధ్యత. – డాక్టర్ ఎస్సీహెచ్ఎస్ రామకృష్ణ, కార్యదర్శి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రద్దు చేయడం దారుణం నీట్ పరీక్షలు రద్దు చేయడం దారుణం. విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడతారు. ఎంతో కష్టపడి నీట్ రాసిన విద్యార్థులు మంచిర్యాంకులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఎక్కడో రాజస్థాన్లో పేపర్ లీకేజ్ అయిందని పరీక్షలు రద్దు చేయడం సమంజసం కాదు. మా అబ్బాయి కోన సాయి సాత్విక్ నీట్ పరీక్షకు కష్టపడి చదివాడు. అలాగే రానున్న ఎంసెట్కు కూడా ప్రిపేర్ అవుతున్నాడు. ఈ సమయంలో పరీక్ష రద్దు ప్రభావం ఎంసెట్పై పడుతుంది. తిరిగి పరీక్షలు నిర్వహించడం, మళ్లీ చదివి రాయడం అంటే విద్యార్థికి ఇబ్బందిగా ఉంటుంది. – కోన సత్యనారాయణ, కే.పెదపూడి, అంబాజీపేట మండలం, కోనసీమ జిల్లా కొత్త పరీక్షా తేదీలను ప్రకటించాలి దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తును ఈ పరీక్షలపై ఆధారపడి నిర్మించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షల పారదర్శకత, నిష్పాక్షికత, విశ్వసనీయతను కాపాడటం కేంద్ర పరీక్షా సంస్థల ప్రాథమిక బాధ్యత. ఆరోపణల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయడం విద్యార్థుల నమ్మకాన్ని నిలబెట్టే దిశగా తీసుకున్న అత్యవసర చర్యగా భావించాలి. అయితే, విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా, త్వరితగతిన కొత్త పరీక్షా తేదీలను ప్రకటించి, భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏకు విజ్ఞప్తి చేస్తున్నాం. – మతుకుమిల్లి శ్రీవిజయ్ ధైర్యంగా ఉండాలి నీట్ 2026 ఎన్నో నెలల కృషి, కష్టం. ఎంతోమంది విద్యార్థుల, తల్లిదండ్రుల కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. ఇది చాలా దారుణం, తిరిగి నీట్ ఎగ్జామ్ ఎప్పుడూ ప్రారంభమవుతుందో తెలిసే వరకు ఎవరూ భయపడకుండా ధైర్యంగా ఉండాలి. – వై.గోవిందరాజు, కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు, రాజమహేంద్రవరం -
నేటి నుంచి ఏపీఈఏపీ సెట్
● నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ● జిల్లాలో ఆరు కేంద్రాల ఏర్పాటు ● ఇంజినీరింగ్ 5,701 మంది, అగ్రికల్చర్ ఫార్మాలో 2,963 మంది ● రెండు విభాగాలకు నలుగురు దరఖాస్తు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్, ఫార్మశీ, అగ్రికల్చర్(బైపీసీ) కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ–2026 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ బాధ్యతను ఈ ఏడాది జేఎన్టీయూ కాకినాడకు అప్పగించారు. ఈ నెల 12, 13, 14, 15, 18 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగాలకు, 19, 20 తేదీల్లో అగ్రికల్చరల్, ఫార్మశీ విభాగాలకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 2 నుంచి 5గంటల వరకూ పరీక్షలు సాగుతాయి. పరీక్ష కేంద్రంలోకి ఉదయం 7.30 నుంచి, మధ్యాహ్నం పరీక్ష సమయానికి గంట ముందు ప్రవేశానికి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైనా ప్రవేశానికి అనుమతించరు. జిల్లావ్యాప్తంగా ఇంజినీరింగ్లో 5,701 అగ్రికల్చరల్, ఫార్మా విభాగంలో 2,963 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. రెండు విభాగాలకు కలిపి నలుగురు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ఐదు ఆన్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలివే... కాకినాడ సాఫ్ట్ టెక్నాలజీ (రాయుడుపాలెం), అచ్యుతాపురం గేట్ వద్ద గల అయాన్ ఇనిస్టిట్యూట్, సూరంపాలెంలోని ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల, ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో 3 కేంద్రాలు. హెల్ప్ లైన్ నంబర్... 0884–2342499,2359599 ఏర్పాట్లు పూర్తి పరీక్షకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఏపీతో పాటు హైదరాబాద్లో పరీక్షలు నిర్వహిస్తాం. – ప్రొఫెసర్ ఎన్.మోహనరావు, కన్వీనర్, ఈఏపీ సెట్ -
రెండేళ్లుగా ఉత్తిపోతలు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎన్నికల్లో చెప్పిన మాటలు మూడు నెలలు తిరిగే సరికి ప్రజలు మరచిపోతారనే భ్రమలో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. కానీ జనం మాత్రం గద్దె నెక్కి రెండేళ్లు అయినా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని నిలదీస్తున్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో సుమారు 40వేల ఎకరాల్లో వరి సాగును ప్రశ్నార్థకం చేసిన తాళ్లూరు ఎత్తిపోతల పథకం నిర్మాణంలో జరుగుతోన్న జాప్యంపై రైతులు నిప్పులు చెరుగుతున్నారు. ఏడాది తిరగకుండా తాళ్లూరు ఎత్తిపోతలను పట్టాలెక్కించి మెట్టను సస్య శ్యామలం చేస్తానని అధికార పార్టీ నేతలు గొప్పగా ప్రకటించారు. ఎమ్మెల్యే, టీటీడీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఈ ఎత్తిపోతలను భుజాన కెత్తుకున్నారు. చంద్రబాబు గద్దె నెక్కిన తరువాత రెండు సీజన్లు సాగునీరు రాక పంట కోల్పోయారు. పఽథకాన్ని ప్రారంభించిన వైఎస్సార్ మెట్ట ప్రాంతంలో ఐదు మండలాల్లో 25 గ్రామాల పరిధిలో సుమారు 40వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే ఈ ఎత్తిపోతలపై ప్రభుత్వ ఉదాసీనత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గోదావరి జలాలను మెట్ట ప్రాంతానికి తరలించే లక్ష్యంతో 2008 మార్చిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పఽథకాన్ని ప్రారంభించారు. 1.85 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో సీతానగరం, కోరుకొండ, గోకవరం, రాజానగరం, గండేపల్లి, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని మండలాల వరకు కాలువ తవ్వారు. కాలువపై జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలంలో తాళ్లూరు లిఫ్ట్ను 2009లో అప్పటి ఎమ్మెల్యే తోట నరసింహం ప్రారంభించారు. సుమారు 37 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే లక్ష్యంతో రూ.30 కోట్లతో ఈ ఎత్తిపోతలను ఏర్పాటు చేశారు. జగ్గంపేట మండలం రాజపూడి లిఫ్ట్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ లిఫ్ట్ ద్వారా 5,500 ఎకరాలకు సాగునీరందేది. సుమారు 3.5 కిలోమీడర్ల పొడవు ఉన్న ఈ పైపులైన్లో సుమారు 2,200 పైపుల ద్వారా నీటిని తోడి కాలువల ద్వారా పంట పొలాలకు సాగునీరందించే వారు. కుడి కాలువ ద్వారా జగ్గంపేట మండలం ఇర్రిపాక వరకు, ఎడమ కాలువ ద్వారా గండేపల్లి మండలం మురారి వరకు పంట పొలాలకు సాగునీరందేది. అనంతరం జగ్గంపేట, గండేపల్లి మండలాలతో పాటు ఏలేశ్వరం, ప్రత్తిపాడు, రాజానగరం మండలాల్లోని 25 గ్రామాలకు సాగునీరు సరఫరా అయ్యేది. ఐదు మోటార్లు, మూడు పైపులైన్ల ద్వారా నీటిని తోడి పంట పొలాలకు సాగునీరు సరఫరాచేసే వారు. సిమెంట్ పైపులైన్లో విద్యుత్ అంతరాయం, మోటార్లు రిపేరు వచ్చిన సందర్భాల్లో నీరు హై ప్రెషర్తో వెనక్కి వచ్చి పైపులైన్లు పగిలిపోయేవి. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఇటువంటి సాంకేతిక సమస్యలను యుద్ధప్రాతిపదికన చక్కదిద్ది పుష్కర ఎత్తిపోతల పఽథకం ద్వారా 2019 నుంచి 2022 వరకు రెండు సీజన్లకు పుష్కలంగా సాగునీటిని సరఫరా చేశారు. అనంతరం పైపులైన్లు మరమ్మతులకు రావడం, ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో పైపులైన్ మరమ్మతు పనులు నిలిచిపోయాయి. పనులు ఎప్పటికి పూర్తవుతాయి? చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక పైపులైన్ మరమ్మతులు చేపట్టనుండటంతో ఆయకట్టు రైతులకు నీరందించలేమని ప్రకటించారు. పైపులైన్ మరమ్మతులకు రూ.49 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. సిమెంట్ పైపులైన్లు స్థానే ఎంఎస్ పైపులైన్ వేయించి ఈ ఖరీఫ్కు పూర్తి స్థాయిలో నీరందిస్తామని ఎమ్మెల్యే నెహ్రూ రైతులకు హామీ ఇచ్చారు. మూడు నెలలవుతున్నా పనులు నత్తను తలపిస్తున్నాయి. ప్రాజెక్టులో 2,200 పైపులకు ఇప్పటి వరకు కేవలం 300 పైపులు మాత్రమే బయటకు తీశారు. జూలై మొదటి వారంలో ఈ పథకం ద్వారా సాగునీరు అందివ్వాలంటే మిగిలి ఉన్న సమయం 60 రోజులు. ఈ 60 రోజులలో పంపు హౌస్ మోటర్లు, పంపులు మరమ్మతులు, సబ్స్టేషన్, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, ప్రతి పైపు లోపల, బయట ఐరన్ మెష్తో కూడిన సిమెంట్ కాంక్రీట్ పొర వేయడం వంటి పనులు ఎప్పటికి పూర్తి అవుతాయని రైతు సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఖరీఫ్కు నీరు ఇచ్చేందుకు కృషి పైపులు సిద్ధంగా ఉన్నాయి. పనులు జరుగుతున్న చోటుకు పది రోజుల్లో తీసుకువస్తాం. ఈ ఖరీఫ్కు నీరు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాం. – రాజేశ్వరరావు, పుష్కర పోలవరం ఈఈ తాళ్లూరు ఎత్తిపోతల పథకం పైపులైన్లను వెలికి తీస్తున్న పొక్లెయిన్లు నత్తను తలపిస్తున్న ‘తాళ్లూరు’ ఎత్తిపోతల పథకం పనులు పూర్తికాక అన్నదాతలకు ఇబ్బంది బీడువారిన 40 వేల ఎకరాలు జగన్ హయాంలో సమృద్ధిగా సాగునీరు సర్కార్ తీరుపై రైతుల నిప్పులు ప్రతి వారం సమీక్షించాలి అత్యవసర పనులు సకాలంలో పూర్తి చేసినప్పుడే ఈ పథకం పూర్తిస్థాయిలో రైతులకు ఉపయోగపడుతుంది. ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్ష జరపాలి. – పాటంశెట్టి సూర్యచంద్ర, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి, జగ్గంపేట. మూడేళ్లుగా బీడు వారి.. ఈ ఏడాదితో కలిపితే మూడేల్లు వరుసగా సాగునీరు అందక పంటపొలాలు బీడులుగా మారిపోయాయి. గండేపల్లి, జగ్గంపేట తదితర మండలాల్లో సుమారు 25 గ్రామాల్లోని ఆయకట్టు వృథాగా మారిపోయింది. – కర్ణాకుల వీరాంజనేయులు, ఏపీ ఆర్సీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాకు జీవన్మరణ సమస్య వర్షాధారిత కాలువలపై ఆధారపడే రైతులకు నీటి లభ్యత అనేది జీవన్మరణ సమస్యగా మారింది. చెరువులు, కాలువలు ఎండిపోయి బోర్లు కూడా మొరాయించడం వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. – మన్యం రామకృష్ణ, రైతు, తాళ్లూరు, గండేపల్లి మండలం -
కాలుష్యానికి కారకులను శిక్షించాలి
● దేవి ఫిషరీస్ వద్ద పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామస్తుల ఆందోళన ● అస్వస్థతకు గురైన పలువురు ఆస్పత్రుల్లో చేరిక తాళ్లరేవు: కోరంగి పంచాయతీ పరిధిలోని రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి వస్తున్న కలుషిత జలాలు కాలువలోకి వదలడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో పెదబొడ్డు వెంకటాయపా లెం గ్రామస్తులు సోమవారం స్థానిక దేవి ఫిషరీష్ వద్ద ఆందోళన చేసి బాధ్యులను శిక్షించాలని, ఆయా కంపెనీలపై అధికారులు దృష్టి సారించాలని నినాదాలు చేశారు. ఎంపీటీసీ సభ్యుడు పాలెపు పోశియ్య, గ్రామ పెద్దలు పంట కాలువ చెంతనే ఉన్న కంపెనీలు వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా వదిలేస్తున్నారని ఆరోపించారు. దీంతో రెండు మూడు రోజులుగా గ్రామంలో సుమారు 30 మంది వివిధ ఆస్పత్రిలలో వాంతులు, విరేచనాలతో చికిత్స పొందుతున్నారని తెలిపారు. -
ప్రధాని సూచనలను విజనరీ సీఎం పాటించరా?
● చంద్రబాబు సర్కార్ దుబారా ఖర్చులు ● వైఎస్సార్ సీపీ మహిళా నేత నాగమణి కాకినాడ రూరల్: దేశ ఆర్థిక పరిస్థితి, వివిధ దేశాల మధ్య యుద్ధాల వల్ల ఎదుర్కొంటున్న ఒడిదొడుకులను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ చేసిన సూచనలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు పాటించడం లేదని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ప్రశ్నించారు. కాకినాడలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధించలేకపోతున్నా ఖర్చులు మాత్రం అదుపులో ఉండటం లేదన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ చేస్తున్న దుబారా ఖర్చులు రాష్ట్ర ఖజానాకు ముప్పుగా పరిణమించాయన్నారు. రాజధాని అమరావతి నిర్మాణాల పేరిట చేస్తున్న వ్యయాలు అనాలోచిత చర్యలుగా ఉన్నాయన్నారు. ప్రజా సంఘాలు, మేధావులు చెబుతున్నా చంద్రబాబు పెడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు వారం వారం అప్పులతో నెట్టుకువస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.లక్షల కోట్లు అప్పులు చేయడం తప్ప సాధించిన ఆర్థికాభివృద్ధి ఎక్కడ అని నిలదీశారు. కూటమి భాగస్వామిగా చంద్రబాబు కేంద్రం నుంచి నిధులు సాధించడంలో వెనుకబడ్డారని అన్నారు. కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ రెండేళ్లలో సుమారు రూ.11 వేల కోట్ల నిధులు మురిగిపోవడం వారి చేతకాని తనమన్నారు. చంద్రబాబు సర్కార్ పనితీరుతో ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతోందన్నారు. ప్రధాని మోదీ సూచనలకు చంద్రబాబు విలువ ఇవ్వాలని, ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల ఖర్చులు అదుపులో ఉంచుకోవాలని నాగమణి హితవు పలికారు. -
అవే అర్జీలు పదే పదే
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సంవత్సరాల తరబడి పీజీఆర్ఎస్ చుట్టూ తిరుగుతున్నా తమ సమస్యలకు పరిష్కారం లభించడం లేదని ప్రజలు వాపోయారు. దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి వచ్చి అర్జీలు ఇచ్చినా వాటిని పరిష్కరించకపోవడంతో పదే పదే రావాల్సి వస్తోందని ప్రజలు మండిపడుతున్నారు.రెండేళ్లుగా తిరుగుతున్నాను నాకు తల్లిదండ్రుల ద్వారా వచ్చిన భూమిని సాగు చేసుకొంటే సొంత అన్నయ్య ఇబ్బందులు పెడుతున్నాడు. ఇటీవల నా పొలంలో ఉన్న వరిని కోసి ధాన్యం రైస్మిల్లుకు తరలిస్తుండగా అడ్డుపడి ఇబ్బందులు పెట్టాడు. ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్లో అనేక సార్లు ఫిర్యాదు చేశాను. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంతో చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. రెండు సంవత్సరాలుగా పోలీస్స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. – గొల్లపల్లి వరలక్ష్మి, దుర్గాడ, గొల్లప్రోలు మండలం ధాన్యం తక్కువ ధరకు కొంటున్నారు కష్టపడి ధాన్యం పండించిన రైతులకు మద్దతు ధర లభించడం లేదు. తేమ పేరుతో రైస్మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారు. రబీలో బస్తా ధాన్యం రూ.1,779 కాగా తేమ పేరుతో దళారులు, మిల్లర్లు కుమ్మక్కయి రూ.300కు పైగా కోత విధిస్తున్నారు. తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి, రైతు సేవా కేంద్రాల్లో తప్పుడు పేర్లతో మద్దతు ధర పొందుతున్నారు. దీనికి కొందరు అధికారులు సహకరిస్తున్నారు. – దడాల బుజ్జిబాబు, రైతు, జెల్లవారిపేట, తాళ్లరేవు మండలం పింఛన్ కోసం తప్పని పాట్లు భర్త చనిపోయి, ప్రస్తుతం కాళ్లు చచ్చుబడిపోయి నడవలేని స్థితిలో ఉన్న నాకు పింఛన్ ఇవ్వాలని ఏడాది నుంచి తిరుగుతున్నాను. ఎవరూ పట్టించుకోవడం లేదు. సచివాలయంలో అర్జీ ఇవ్వాలని చెబుతున్నారు. అక్కడ అర్జీ ఇస్తే కాకినాడలోనే పింఛన్లు మంజూరు చేస్తారని చెబుతున్నారు. తిరిగి తిరిగి ఇబ్బందులు పడుతున్నాను. నాకు పింఛన్ ఇప్పించి పుణ్యం కట్టుకోండి. – అగ్రహారపు రమణమ్మ, పిఠాపురం -
సబ్ జూనియర్స్ చాంపియన్ షిప్ ఏపీఎస్పీ కై వసం
కాకినాడ రూరల్: ఈ నెల 9, 10 తేదీలలో ఏపీఎస్పీ పోలీస్ గ్రౌండ్స్లో ఏపీఎస్పీ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సబ్ జూనియర్స్ చాంపియన్ షిప్ను ఏపీఎస్పీ టీం కై వసం చేసుకుంది. రెండవ స్థానంలో పిఠాపురం, మూడవ స్థానంలో రాజమండ్రి నిలిచాయి. ఈ కార్యక్రమంలో ధర్డ్ ఏపీఎస్పీ కమాండెంట్ దేవానందరావు ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులు ప్రధానం చేశారు. క్రీడాకారులను ఉద్దేశిస్తూ క్రీడలలో మంచి భవిష్యత్తు ఉన్నాయని, ఎన్నో అవకాశాలు ఉన్నాయని, మీరు ఇలాగే రాణించి ఉన్నత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి గన్నమనేని చక్రవర్తి, జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొజ్జ మాణిక్యాలరావు, ఏపీఎస్పీ బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాట్ల సుబ్బరాజు, శంకర్, మహేష్, వసీం ఖాన్, రాకేష్, దుర్గ, నయింఖాన్ పాల్గొన్నారు. -
డీఎస్వో బదిలీ వెనుక ప్రజా ప్రతినిధులు?
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్వో) ఆర్ఎస్ఎస్ సత్యనారాయణరాజు బదిలీ అయ్యారు. వెంటనే విధులు నుంచి రిలీవ్ అయి రాష్ట్ర పౌరపరఫరాల శాఖ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెల్సింది. ఆయన 13 నెలల క్రితం జిల్లా డీఎస్వోగా నియమితులయ్యారు. ఇటీవల కాలంలో ఆయన రైస్మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేయడంతోపాటు కేసులు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను బదిలీ చేయాలని జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి లోకేశ్ను పట్టుబట్టడంతో ఆయనను బదిలీ చేసినట్లు తెలిసింది. డీఎస్వోగా ఎవరినీ నియమించలేదు. జిల్లా అసిస్టెంట్ సివిల్ సప్లయి అధికారి తుమ్మల లక్ష్మీప్రసన్నను ఇన్చార్జి డీఎస్వోగా నియమించనున్నారు. మద్యం తాగి బైక్ నడిపిన వారికి జైలు కాకినాడ లీగల్: మద్యం తాగి బైక్ నడిపిన కేసుల్లో ముగ్గురికి మూడురోజుల చొప్పున, ఒకరికి రెండు రోజులు, ఇద్దరికి ఒకరోజు చొప్పున జైలు శిక్ష, 16 మందికి ఒక్కొక్కరికి రూ.పదివేల జరిమానా విధిస్తూ కాకినాడ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చింతా నాగేంద్రరావు తీర్పుచెప్పారు. కాకినాడ ట్రాఫిక్–1, 2 పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. సోమవారం కోర్టులో హాజరుపర్చగా ఆరుగురికి జైలు శిక్ష, 16 మందికి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. మూడో రోజూ అదే రద్దీ అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం మూడు రోజులుగా వేలాదిగా తరలివచ్చిన భక్తులతో భక్తజన సంద్రంగా దర్శనమిస్తోంది. వరుసగా మూడోరోజు సోమవారం సుమారు 40 వేల మంది భక్తులు రత్నగిరి సత్యదేవుని దర్శించుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న వివాహాల నేపథ్యంలో నవ దంపతులు, వారి బంధువులు, వేసవి సెలవుల కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సాధారణ భక్తులు పోటెత్తడంతో సత్యదేవుని సన్నిధి కిటకిటలాడుతోంది. సత్యదేవుని సన్నిధిలో సోమవారం రాత్రి పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది.సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. సుమారు ఐదువేల మందికి అన్నదానంలో భోజన సౌకర్యం కల్పించారు. ఆవును హతమార్చిన పులి రాజవొమ్మంగి: చిరుత పులి మళ్లీ రాజవొమ్మంగి మండలంలోకి ప్రవేశించింది. సోమవారం చికిలింత గ్రామంలో రైతు సోమరాజుకు చెందిన ఆవును హతమార్చింది. ఈ విషయం తెలుసుకున్న రాజవొమ్మంగి అటవీ క్షేత్రాధికారి ఉషారాణి తమ సిబ్బందితో వెళ్లి పులి చికిలింత, వాతంగి, పెదగర్రంగి పరిసర ప్రాంతంలోనే ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పుట్టినరోజు వేడుకలకు వచ్చి.. రంపచోడవరం: స్నేహితులతో కలసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు వచ్చిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రంపచోడవరం మండలం బోర్నగూడెం గ్రామం శివారున ఈ ఘటన జరిగింది. రాజానగరం మండలం నందరాడకు చెందిన మేడిశెట్టి తరుణ్ కుమార్ (35) పుట్టినరోజు వేడుకలు జరుపుకొనేందుకు ముసురుమిల్లి ప్రాజెక్టు వద్దకు రెండు బైక్లపై నలుగురు యువకులు వచ్చారు. ముసురుమిల్లి ప్రాజెక్టు సమీపంలో ఇద్దరు స్నేహితులు ఉండగా, తరుణ్కుమార్, ఈలి ప్రవీణ్లు కేక్, బిర్యానీ తేవడానికి మోటార్ సైకిల్పై రంపచోడవరం బయలు దేరారు. బోర్నగూడెం శివారున ఎదురుగా ఆటో వచ్చి మోటార్ సైకిల్ను ఢీకొంది. తరుణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈలి ప్రవీణ్కు తీవ్ర గాయాలు కావడంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని సీఐ సన్యాసినాయుడు, ఎస్సై రాంబాబు పరిశీలించారు. -
‘ఏపీలో అద్దాలు.. అబద్ధాల కథే నడుపుతున్నారు’
కాకినాడ: చంద్రబాబు మాయ మాటలు నమ్మిన ప్రజలు.. దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తురన్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ప్రస్తుతం కూటమి పాలనలో ఏ ఒక్క వర్గానికి మేలు చేసే పరిస్థితి కనిపించడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వారి సొంత ఎజెండా తప్పా మరొకటి లేదని మండిపడ్డారు. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలకు,ప్రాధమిక హక్కులకు భంగం కలిగించేలా ఈ ప్రభుత్వం పని చేస్తుంది. భావ వ్యక్తీకరణ స్వేచ్చ ఈ రాష్ట్రంలో లేదు. అభిప్రాయాలు చెబితే వారి మీద కేసులు పెడుతున్నారు.మెయిన్ స్ట్రీమ్ మీడియాను వారి ఆధీనంలో పెట్టుకుంది. సోషల్ మీడియా ను కంట్రోల్ చేస్తున్నారు. వ్యక్తిత్వ హననం చేయ్యడానికి ఒక గ్రూప్ పని చేస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియా ను ప్రభావితం చెయ్యడానికి పోలీసులతో ఒక అడుగు ముందు వెయ్యడానికి ప్రభుత్వం పని చేస్తోంది. ఆయా ఖాతాలను సస్పెండ్ చెయ్యడానికి పోలీసులు పని చేస్తున్నారు. అధికార పార్టీ కి పోలీసులు పూర్తిగా సరెండర్ అయిపోయారు. భాధితులను కాపాడాల్సిన పోలీసులు. .వారిని హింసిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే సోషల్ మీడియా ఖాతాలను సస్పెండ్ చెయిస్తున్నారు. మాజీ సిఎం జగన్ పిఆర్వో శ్రీహరి పై రెండు కేసులు పెట్టి..హైకోర్టు లో బెయిల్ రాకుండా ప్రయత్నించారు. వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను విచారణ నిమిత్తం పిలిచారు. టీడీపీ హ్యాండిల్ నుండి వైఎస్సార్సీపీ బృందంపై బురద చల్లుతారు. ఆర్టికల్ 19 1a క్రింద ప్రశ్నించే హక్కు ఉంది. అమరావతి లో అవినీతిని ప్రశ్నించారని ఎక్స్ ట్వీటర్కు ఫిర్యాదు చేసి ఆ వీడియోను తీయించేశారు. శ్రీకాళహస్తి లో సౌకర్యాలు లేవని ఒక మహిళ మాట్లాడిన వీడియోను జగనన్న కనెక్ట్స్ నుండి తీయించమని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అమరావతి లో అవినీతిని ప్రజలు ఎత్తి చూపితే సహించలేకపోతున్నారు. రాష్ట్రంలో అద్దాలు..అబద్దాలే కధ జరుగుతున్నాయి. అమరావతి లో భవనాలకు అద్దాలు బిగించడానికి రూ.2,500 కోట్లు.కేంద్ర గ్రాంట్ కోసం ఒక విభాగాన్ని ఎందుకు పెట్టలేదు. కేంద్రం ఇచ్చిన గ్రాంట్ ను ఎందుకు వాడుకోవడం లేదు.మేము వీటి కోసం అడిగితే...మీరు నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ్టీకీ ఆరోగ్యశ్రీ లో వైద్యం అందడం లేదు.. ప్రభుత్వ ఆసుపత్రిలలో మందులు లేవు. ఈ రోజుకు పండిన ధాన్యం కొనలేని పరిస్థితి లో ఉన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయాన్ని గాలికి వదిలేశారు. ప్రజా గ్రహం ఉవ్వెత్తున లేస్తూవుంటే...దానిని అగణతొక్కుతున్నారు.ఎంతకాలం గ్లోబెల్స్ ప్రచారంలా తప్పుడు ప్రచారాలు చేస్తారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధిన ఒక్కోక్క వాస్తవం బయటపడుతుంది. వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఒక్కరికి సహయం చెయ్యడం లేదు’ అని మండిపడ్డారు. -
ఉష్ణతాపం నుంచి ఉపశమనం
తుని రూరల్: పగలంతా తీవ్రమైన ఉష్ణతాపంతో అల్లాడిన తుని మండల ప్రజలు.. సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షంతో సేద తీరారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే కారు మబ్బులు కమ్ముకున్నా వర్షం కురవ లేదు. ఉదయం ఏడు గంటల తర్వాత సూర్యుడు భగభగమంటూ ప్రతాపం చూపించాడు. ఉష్ణోగ్రత గరిష్టంగా 34, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్ చొప్పున నమోదయ్యాయి. దీంతో, ప్రజలు ఆపసోపాలు పడ్డారు. సాయంత్రం ఆరు గంటల సమయానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో దట్టమైన కారు మబ్బులు మళ్లీ కమ్ముకున్నాయి. చల్లని ఈదురు గాలి వీయడంతో ప్రజలు సేద తీరారు. రాత్రి ఏడు గంటల తర్వాత ఒక మోస్తరు వర్షం కురవడంతో అప్పటి వరకూ వేసవి తాపంతో తల్లడిల్లిన ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం లభించింది. ఈదురు గాలులు, వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
రంగు బట్టబయలు
● గోదారి కాలువలో కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థాలు ● నీటి సరఫరా నిలిపిన వేళ బయట పడిన కాలుష్యం సామర్లకోట: వివిధ పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య జలాలు గోదావరి కాలువలో కలసిపోతున్నాయని ఎంతో మంది ఎన్నో పర్యాయాలు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ, కాలువలో కాలుష్యానికి అడ్డుకట్ట వేయడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. ప్రజల నుంచి తీవ్ర స్థాయి ఒత్తిడి వస్తే కాలువలో నీటి శ్యాంపిల్స్ తీసి, ఎటువంటి కాలుష్యం లేదని నిర్ధారణ చేసి చేతులు దులుపుకొంటున్నారు. కానీ, ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సామర్లకోట కాలువకు నీటి సరఫరాను నిలిపివేసిన వేళ.. ఇందులో ఎంత కాలుష్యం ఉంటోందనే విషయం బయటపడుతోంది. ఇందులోని నీటి రంగు నల్లగా మారడమే దీనికి సాక్ష్యంగా కనిపిస్తోంది. లక్షల మందికి ఇదే తాగునీరు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సామర్లకోట వరకూ ఉన్న తూర్పు డెల్టా ప్రధాన కాలువ జలాలను సాగుకే కాకుండా, లక్షలాది మందికి తాగునీటిగా ఉపయోగిస్తున్నారు. సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీలు, కాకినాడ నగర పాలక సంస్థతో పాటు అనేక గ్రామాలకు చెందిన ప్రజలు ఈ కాలువ నీటినే దాహార్తి తీర్చుకునేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ కాలువ నుంచి వస్తున్న జలాలను పండూరు చెరువులో నింపి, కాకినాడ రూరల్ పరిధిలోని గ్రామాలకు సైతం తాగునీటిగా అందిస్తున్నారు. పిఠాపురం బ్రాంచి కెనాల్ (పీబీసీ) నుంచి వచ్చిన నీటిని సామర్లకోట మండలం కాపవరం గ్రామంలోని ఫిల్టర్ చెరువులో నింపి, అక్కడి నుంచి సామర్లకోట మండలంలోని అనేక గ్రామాలకు పైపులైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. సామర్లకోట మున్సిపాలిటీ ప్రజల కోసం ఉండూరు రోడ్డులో ఏర్పాటు చేసిన నాగార్జున చెరువులో గోదావరి జలాలను నింపుతారు. అలాగే, పెద్దాపురం, కాకినాడ నగర ప్రజల కోసం కాకినాడ రోడ్డులోని సాంబమూర్తి రిజర్వాయర్ చెరువులో ఈ నీటిని నింపి, అందిస్తారు. కలుషితమవుతోందిలా.. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ కాలువలోకి అనేక పరిశ్రమల నుంచి కాలుష్య జలాలను యథేచ్ఛగా వదిలేస్తున్నారు. కాలువ పూర్తిగా నీటితో నిండి ఉన్న సమయంలో నీరు రంగు మారినా గుర్తించలేని పరిస్థితి. ప్రస్తుతం కాలువకు నీటి సరఫరాను నిలిపివేయడంతో కాలుష్య జలాల రంగు బయటపడింది. సామర్లకోట – పెద్దాపురం రోడ్డులోని పరిశ్రమ నుంచి కాలుష్య జలాలు వేట్లపాలెం మీదుగా గోదావరి కాలువలో కలుస్తున్నాయి. ఈ విషయాన్ని అధికారులు గుర్తించి, ఆ పరిశ్రమకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ, కాలుష్య జలాలకు అడ్డుకట్ట పడలేదు. రాత్రి వేళ ట్యాంకర్లతో కాలుష్య జలాలు తీసుకుని వచ్చి మరీ గోదావరి కాలువలో వదిలేస్తున్నారు. ఫలితంగా గోదావరి కాలువలో మిగిలి ఉన్న నీరు నల్లని రంగులోకి మారిపోయింది. వేసవిలో ఈ కాలువలో మిగిలి ఉన్న నీటినే పశువులు తాగుతూంటాయి. ఈ నీరు కాస్తా కలుషితమవడంతో పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా కాలుష్య జలాలకు అధికారులు చెక్ పెడతారేమో చూడాలి. పంటలకు నష్టం గోదావరి కాలువలో కాలుష్య జలాల కారణంగా వరి పంట తెగుళ్ల బారిన పడుతోంది. వేసవిలో గోదావరి కాలువ మూసివేసిన సమయంలో ఉన్న కొద్దిపాటి నీటిని పశువులు తాగుతాయి. ప్రస్తుతం ఉన్న నీటిలో దిగుతున్న పశువుల కాళ్లకు పుండ్లు పడుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అనేక మంది గోదావరి కాలువలో స్నానాలు చేస్తారు. పవిత్రమైన గోదావరి కాలువను కలుషితం చేయడం సరి కాదు. కాలుష్య జలాలను నివారించాలి. – వల్లూరి వెంకట రమణ, రైతు, సామర్లకోట సమన్వయంతోనే నివారణ గోదావరి కాలువలో కాలుష్య జలాల నివారణ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అధికారులతో సాధ్యం కాదు. రెవెన్యూ, ఇరిగేషన్, కాలుష్య నియంత్రణ మండలి, పంచాయతీరాజ్ అధికారులతో పాటు మున్సిపల్ అధికారులు టీములుగా ఏర్పడి, కాలుష్య నివారణకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలి. – కేటీ సుధాకర్, అదనపు కమిషనర్, కాకినాడ నగర పాలక సంస్థ -
ఏలేరులో తగ్గుతున్న నీటి నిల్వలు
ఏలేశ్వరం: ఎగువ నుంచి ప్రవాహం అంతంత మాత్రంగానే ఉండటం, అడపాదడపా వర్షాలు కురుస్తున్నా తీవ్రమైన ఎండలు కాస్తూండటంతో ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు స్వల్పంగా తగ్గుతున్నాయి. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, ఆదివారం 76.53 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి సామర్థ్యం 24.11 టీఎంసీలకు గాను 9.72 టీఎంసీల మేర మాత్రమే నీటి నిల్వలున్నాయి. పంటల సాగు ముగియడంతో ఆయకట్టుకు నీటి విడుదలను నిలిపివేశారు. విశాఖపట్నానికి 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పంపా, తిమ్మరాజు చెరువులకు కూడా నీటి సరఫరాను నిలిపివేశారు. రత్నగిరిపై భక్తుల రద్దీ అన్నవరం: వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రత్నగిరి ఆదివారం కిటకిటలాడింది. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజాము ముహూర్తాల్లో రత్నగిరి పైన, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోను వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, బంధువులతో పాటు ఇతర భక్తులు పెద్ద సంఖ్యలో సత్యదేవుని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం, క్యూలు, వ్రత మండపాలు భక్తులతో కిక్కిరిశాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సుమారు 40 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 2 వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. లోవకు పోటెత్తిన భక్తులు తుని రూరల్: లోవ దేవస్థానానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన 21 వేల మంది భక్తులు తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారని కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాలు విక్రయం ద్వారా రూ.1,78,200, పూజా టికెట్లకు రూ.2,33,510, కేశఖండన శాలకు రూ.16 వేలు, వాహన పూజలకు రూ.3,980, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.61,860, విరాళాలు రూ.31,531 కలిపి మొత్తం రూ.5,25,081 ఆదాయం సమకూరిందని వివరించారు. ఆటోడ్రైవర్ నిజాయతీ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తన ఆటోలో ప్రయాణికురాలు మరచిపోయిన పర్సును తిరిగి ఆమెకు అప్పగించి తన నిజాయతీని చాటుకున్నాడు రాజమహేంద్రవరంలోని ఓ ఆటో డ్రైవర్. కోటగుమ్మం సెంటర్ వద్ద ఉన్న ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్న మహిళ క్వారీ సెంటర్ వద్ద ఆటో ఎక్కి కోటగుమ్మం సెంటర్లో దిగింది. అనంతరం, ఆమె తన పర్సును ఆటోలో మరచిపోయినట్టు గుర్తించింది. ఆ ఆటో చుట్టుపక్కల ఉందేమోనని వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఆమె త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అదే సమయంలో ఆటో డ్రైవర్ తన ఆటోలో ఓ మహిళ పర్సు మరచిపోయిందంటూ త్రీటౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులకు అప్పగించాడు. ఫిర్యాదు చేసిన మహిళ చెప్పిన వివరాలతో సరిపోల్చిన పోలీసులు.. ఆ పర్సు ఆమెదేనని నిర్ధారించి అందజేశారు. పోగొట్టుకున్న పర్సు తిరిగి దొరకడంతో మహిళ ఆనందం వ్యక్తం చేసింది. నిజాయతీగా వ్యవహరించిన ఆటో డ్రైవర్ను త్రీటౌన్ సీఐ వి.అప్పారావు, ఎస్సై వి.అప్పలరాజు, సిబ్బంది అభినందించారు. -
కార్పెట్లు పరిచారు
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయ ప్రాంగణంలో ఆదివారం కార్పెట్లు పరిచారు. ఎండ వేడికి కాళ్లు కాలి దేవస్థానానికి వస్తున్న భక్తులు ఇబ్బంది పడుతున్నా ఆలయ ప్రాంగణంలో కార్పెట్లు వేయకపోవడంపై ‘కార్పెట్లు ఎక్కడ స్వామీ?’ శీర్షికన ‘సాక్షి’ ఆదివారం వార్త ప్రచురించింది. దీనిపై స్పందించిన అధికారులు పశ్చిమ రాజగోపురం నుంచి ఆలయం లోపలకు వెళ్లే మార్గంలోను, అన్నదానం విభాగం మార్గంలోను, రథపాత్లోను కార్పెట్లు వేశారు. దీనిపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే, గతంలో కూడా ‘సాక్షి’ వార్తలు ప్రచురించినప్పుడు అధికారులు స్పందించి, కార్పెట్లు వేసినప్పటికీ నాలుగు రోజులకే తీసేశారు. ఈసారి అలా చేయకుండా ఎండాకాలమంతా ఉంచాలని భక్తులు కోరుతున్నారు. -
త్వరితగతిన న్యాయసేవలు అందించడమే లక్ష్యం
ప్రత్తిపాడు రూరల్: ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేస్తూ త్వరితగతిన అందించడమే లక్ష్యంగా ప్రత్తిపాడులో అదనపు కోర్టును ప్రారంభించామని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పోర్ట్ఫోలియో ఇన్చార్జి న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందనరావు, బీఎల్వీ చక్రవర్తి, జగడం సుమతి అన్నారు. ప్రత్తిపాడులో అదనపు కోర్టును ఆదివారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ కోర్టు ఏర్పాటు వలన పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కారమవుతాయని ఆకాక్షించారు. కక్షిదారులకు తక్కువ కాలంలో న్యాయం చేయడమే ఈ కోర్టు ప్రధానోద్దేశమని వారు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోషియేషన్ అధ్యక్షుడు రాజాల చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి బొంగులూరి మధుబాబు, ఉపాధ్యక్షులు అడారి గుణ, ట్రెజరర్ అవసరాల దేవి తదితరులు పాల్గొన్నారు. డ్రోన్ నిఘాలో..కాకినాడ రూరల్: వేసవి సెలవులు, ఆపై ఆదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు రక్షణ కల్పించేలా కాకినాడ రూరల్ సూర్యారావుపేట బీచ్లో జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి నిఘా ఏర్పాటు చేసింది. అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో బీచ్తో పాటు పరిసర ప్రాంతాలను పర్యవేక్షించారు. తిమ్మాపురం పోలీసులతో పాటు వివిధ స్టేషన్ల సివిల్ పోలీసులు, మైరెన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
జీతమో నారా చంద్రా!
● మూడు నెలలుగా కాంట్రాక్టు ఉద్యోగులకు అందని వేతనాలు ● అప్పుల పాలై అష్టకష్టాలు ● నిర్దిష్ట ప్రణాళిక లేకుండా నిధి పోర్టల్కు వివరాల బదలాయింపు ● ఎక్స్టెన్షన్ జీఓ జారీ చేయని ప్రభుత్వం ● ఉద్దేశపూర్వక తాత్సారమేనని కార్మికుల ఆవేదనకాకినాడ క్రైం: వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. కొన్ని విభాగాల్లో సగానికి పైగా కష్టం వీరిదే. మరికొన్ని విభాగాలు ఏకంగా వీరి మీదే ఆధారపడి నడుస్తున్నాయి. రెగ్యులర్ ఉద్యోగుల్లో కొందరు వీరికి కనీస గౌరవ మర్యాదలైనా ఇవ్వరు. వారి కంటే ఎక్కువ విద్యార్హతలే ఉన్నా, కేడర్ పరంగా సమానులే అయినా తమ దయాదాక్షిణ్యాలతోనే వారు బతుకుతున్నట్లు భావిస్తారు. ఇన్ని కష్టాల మధ్య ఉద్యోగాలు చేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది జీతం రెగ్యులర్ ఉద్యోగులతో పోలిస్తే నాలుగింతలు తక్కువే. ఇన్ని కష్టాల మధ్య విధులు నిర్వహిస్తున్న వీరికి ఇస్తున్న జీతమే అరకొర. అది కూడా మూడు నెలలుగా చెల్లించకపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులు నానా అవస్థలూ పడుతున్నారు. జిల్లాలోని వివిధ విభాగాల్లో కాంట్రాక్టు విధానంలో పని చేస్తున్న ఉద్యోగులు సుమారు 7 వేల మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన వారే. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో వీరందరూ అప్పుల పాలై అష్టకష్టాలు పడుతున్నారు. ఎందుకిలా.. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టు ఉద్యోగులు నానా పడరాని పాట్లు పడుతున్నారు. ఏటా మార్చి నెలాఖరుకు ఇవ్వాల్సిన కాంట్రాక్టు వ్యవధి పొడిగింపు ఉత్తర్వులను చంద్రబాబు ప్రభుత్వం ఈసారి ఇవ్వలేదు. ఆర్థిక శాఖ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఉత్తర్వులు ఇప్పటి వరకూ వెలువడలేదు. మరోవైపు నిధి పోర్టల్లో ఇప్పటికే రెగ్యులర్ ఉద్యోగుల వివరాలు నమోదు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు, విధి నిర్వహణ నమోదును సీఎఫ్ఎంఎస్ నిర్వహిస్తోంది. ఈ విధానంలో ఉద్యోగి విధుల వివరాలు ట్రెజరీకి, అక్కడి నుంచి జీతాల కోసం ఆర్థిక శాఖకు చేరేవి. అయితే, ఆళ్లగడ్డలోని ఓ ప్రభుత్వ విభాగంలో ఐదుగురు కాంట్రాక్టు ఉద్యోగులుండగా, ఏడుగురి పేరిట జీతాలు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను కూడా రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే నిధి పోర్టల్లో చేర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు నిధి పోర్టల్లో కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు నమోదు చేస్తుండగా అనేక సాంకేతిక సమస్యలు, ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. పోర్టల్లో అప్లోడ్ అయి ఉన్న వివరాలకు, సీఎఫ్ఎంఎస్ ద్వారా నిర్వహిస్తున్న వివరాలకు అనేక తేడాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మ్యాపింగ్లో లోపాలు తలెత్తుతున్నాయి. దీంతో నమోదు ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఆయా ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యకు, ప్రభుత్వ ఆమోదిత సంఖ్యకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. క్యాడర్ స్ట్రెంగ్త్తో సంబంధం లేకుండా అనేక విభాగాల్లో ఆయా హెచ్ఓడీలు తమకు నచ్చినట్లు ఉద్యోగాలు ఇచ్చేసుకున్నారని, జీతాలు కూడా డ్రా చేస్తున్నారని బట్టబయలైంది. దీంతో, అదనపు నమోదు విషయం తేల్చకుండా తర్వాత ఉద్యోగి వివరాలు పోర్టల్లో నమోదు చేయడం సాధ్యం కావడం లేదు. ఎప్పటికి వస్తాయో! నిధి పోర్టల్లో కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు నమోదు పూర్తయిన వెంటనే జీతాలు పడతాయనుకుంటే ఉద్యోగులు తప్పులో కాలేసినట్లే. రెగ్యులర్ ఉద్యోగులు ఇదే విషయం చెబుతూ కాంట్రాక్టు ఉద్యోగులను తప్పుదారి పట్టించి, కార్యాలయాల్లో పనులు చేయిస్తున్నారు. నిధి పోర్టల్లో కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను అప్లోడ్ చేయడం పూర్తయినా ప్రభుత్వం కాంట్రాక్టు వ్యవధి పొడిగింపు జీఓ ఇచ్చేంత వరకూ జీతాలు వచ్చే ప్రసక్తే లేదు. ఈ జీఓ జారీ పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉంది. ఆర్థిక లోటును సర్దుబాటు చేసుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే జీఓ జారీ చేయడంలో తాత్సారం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాబట్టి జీతాలు ఎప్పటికి అందుతాయనే విషయంపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. అమరావతికే కాదు.. మా జీతాలకూ కాస్త డబ్బులివ్వండి బాబూ!ఎన్ని కష్టాలో... కాకినాడ జీజీహెచ్లో పని చేస్తున్న ఓ కాంట్రాక్టు స్టాఫ్ నర్సు విధుల్లో ఉండగా.. ఓ ఫైనాన్స్ కంపెనీ ఏజెంటు వార్డుకు వచ్చి నెలవారీ వాయిదాలు కట్టలేదని గొడవ చేశాడు. కొన్ని నెలలుగా జీతాలు రాలేదని, వచ్చిన వెంటనే బకాయిలన్నీ ఒకేసారి చెల్లించేస్తానని ఆ నర్సు బతిమాలుకున్నా కనికరించకుండా కేకలు వేసి, రోగులు, సహోద్యోగుల ముందు ఆ నర్సు పరువు తీశాడు. అక్కడి వారు సర్ది చెప్పి, ఆ వ్యక్తిని పంపించారు. అవమాన భారంతో స్టాఫ్ నర్సు కన్నీటిపర్యంతమైంది. కలెక్టరేట్ డేటా ఎంట్రీ విభాగంలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కొన్ని నెలల క్రితం వివాహమైంది. భార్య గర్భం దాల్చిన సంతోషంలో ఆమెకు ఇష్టమైన ఓ ద్విచక్ర వాహనాన్ని ఫైనాన్స్లో కొని బహుమతిగా ఇచ్చాడు. కొన్నాళ్లు వాయిదాలు చెల్లించాడు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో వాయిదాలు కట్టలేకపోయాడు. గత బుధవారం ఆమె తన తండ్రితో కలసి ఆ వాహనంపై ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్తూండగా, ఫైనాన్స్ సంస్థ రికవరీ ఏజెంట్లు నడి రోడ్డుపై ఆపారు. గర్భిణి అనే కనికరం కూడా చూపకుండా వాహనాన్ని తీసుకెళ్లిపోయారు. ఇటువంటి ఉదంతాలు కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాలను ప్రస్తుతం కుదిపేస్తున్నాయి. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని, జీతాలు తక్షణం చెల్లించే ఏర్పాటు చేయాలని ఆ చిరుద్యోగులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. -
పగలంతా ఉక్కపోత.. రాత్రి కుండపోత
రాజానగరం: చండప్రచండంగా కాసిన ఎండ తీవ్రత నుంచి ప్రజలు కాస్త సేద తీరారు. రాజానగరంలో ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పగలంతా 39 డిగ్రీల ఉష్టోగ్రతలతో తల్లడిల్లిపోయిన జనాలు.. హఠాత్తుగా చల్లబడిన వాతావరణాన్ని హాయిగా ఆస్వాదించారు. ఈదురు గాలులు, చినుకులతో ప్రారంభమైన వర్షం క్రమంగా జోరందుకోవడంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు గంటన్నర పాటు కుండపోతగా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. బాటసారులు, బైకులపై ప్రయాణించేవారు షెల్టర్ కోసం పరుగులు తీశారు. కలవరపడుతున్న రైతులు అకస్మాత్తుగా కురిసిన వర్షం రైతులను కలవరపాటుకు గురి చేసింది. రబీ వరి కోతలు జరుగుతున్న వేళ కురిసిన ఈ వర్షంతో పంట నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. కోతలు జరిగిన చోట కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసి దెబ్బ తింటుందని అంటున్నారు. అలాగే, కోతకు సిద్ధంగా ఉన్న పొలాల్లోని వరి పైరు ఈదురు గాలులకు నేలకొరిగి, ధాన్యం గింజలు రంగు మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
కాకినాడలో కానిస్టేబుల్ దారుణ హత్య
సాక్షి, కాకినాడ: కాకినాడలో సంచలన ఘటన వెలుగు చూసింది. కానిస్టేబుల్ నాగేశ్వర రావు హత్య స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కాగా, సదరు కానిస్టేబుల్ కొంత కాలంగా సస్పెన్షన్లో ఉన్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడలోని గాంధీనగర్ రెడ్ క్రాస్ సమీపంలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి.నాగేశ్వరరావు (46) సోమవారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తి దాడిలో హత్యకు గురైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
పిల్లల బస్సు.. ఫిట్నెస్ ఎంత?
● తనిఖీల్లో గుర్తిస్తే తప్ప పట్టించుకోని పాఠశాల యాజమాన్యాలు ● 15 రోజుల్లో సరిచేసి పాసైతేనే సర్టిఫికెట్ ఇస్తున్న అధికారులు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పిల్లలను తీసుకువెళ్లే పాఠశాల బస్సుల్లో సాంకేతిక సమస్యలు వారి తల్లిదండ్రులను భయపెడుతున్నాయి. అధికారులు తనిఖీలు చేపట్టి గుర్తించి నోటీసులు ఇస్తే తప్ప ఆయా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. జిల్లాలో 1685 బస్సులు ఉండగా ఇప్పటివరకూ రవాణాశాఖ అధికారులు 19 బస్సులలో లోపాలు గుర్తించి ఆయా యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు. గుర్తిస్తున్న లోపాలివీ.. వీఎల్టీడీ డివైజ్లు లేకపోవడం. అత్యవసర ద్వారాలు సరిగా పనిచేయకపోవడం. వాటి వద్ద సీట్లు అమర్చడం. ప్రమాదాల వేళ అద్దాలు పగులగొట్టేందుకు హ్యామర్లు, ఫైర్ ఎక్టింగ్విషర్లు అందుబాటులో లేకపోవడం. ఉన్నా కాలపరిమితి తీరినవి కావడం. అరిగిపోయిన, ఎలైన్మెంట్ సరిగా లేని వాహన టైర్లు. సమతులంగా లేని మెట్లు. ప్రధమ చికిత్స కిట్లు లేకపోవడం. ఇంటికేటర్లు, హెడ్లైట్లు, బస్సు అద్దం విజిబిలిటీ సరిగా లేకపోవడం. గతంలో నమోదు చేసిన కేసులు.. గత ఏడాది డిసెంబర్లో రవాణా శాఖ పది ప్రత్యేక బృందాలతో వంద బస్సులను తనిఖీ చేశారు. డ్రైవర్ వయసు, అనుభవం, లైసెన్స్, వాహనం కండిషన్ తదితర అంశాలు తనిఖీ చేసి 20 బస్సులపై కేసులు నమోదు చేశారు. రానున్న విద్యా సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ముందుగానే తనిఖీలు చేపడుతున్నారు. లోపాలుంటే నోటీసులు ఇస్తున్నాం.. రవాణా శాఖ కమిషనర్ అదేశాల మేరకు జిల్లాలో స్కూళ్లు, కళాశాలల బస్సులను తనిఖీచేస్తున్నాం. భద్రత ప్రమాణాలతో పాటు వెహికల్ రూల్స్ ప్రకారం తనిఖీ చేస్తున్నాం. సక్రమంగా లేని బస్సుల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చి 15 రోజుల్లో సరిచేసుకోవాలని ఆదేశిస్తున్నాం. అనంతరం మళ్లీ ఒకసారి తనిఖీ చేసి అన్నీ బాగుంటే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తున్నాం. – కె.శ్రీధర్, జిల్లా రవాణాశాఖాఽఽధికారి -
నాన్నమ్మకు తలకొరివి పెట్టిన మనవరాలు
రాజోలు: ఓ మనవరాలు తన నానమ్మకు తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజోలు సుందరమ్మ చెరువు గట్టు ప్రాంతానికి చెందిన గాలిదేవర సత్యవేణి (75) కిడ్నీ సమస్యతో బాధపడుతూ మృతి చెందింది. సత్యవేణికి ఒక్కగానొక్క కుమారుడు శ్రీనివాసరావు 2021లో కరోనాతో మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహమై వేరొక ప్రాంతంలో నివాసం ఉంటోంది. నాన్నమ్మ సత్యవేణి ఆలనాపాలనా చిన్న మనుమరాలైన గాలిదేవర రేణుక చూసుకుంటోంది. దీంతో శనివారం రాజోలు కై లాసభూమిలో నానమ్మకు తలకొరివి పెట్టింది. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ తన తండ్రి శ్రీనివాసరావు కరోనాతో చనిపోయినప్పుడు అంత్యక్రియలు నిస్సహాయ స్థితిలో జరిగాయని, కనీసం మృతదేహాన్ని చివరిచూపు చూసేందుకు కూడా నోచుకోలేకపోయామని విలపించింది. నానమ్మ సత్యవేణికి తలకొరివి పెట్టి పితృరుణం తీర్చుకున్నాని కన్నీటి పర్యంతమైంది. భారీ వర్షంతో అవస్థలు జలమయమైన రహదారులు రాజవొమ్మంగి: మండల వ్యాప్తంగా శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో స్థానిక వారపు సంత వెలవెలబోయింది. వ్యాపారులు సరకులు సర్దుకొనేలోగా వర్షం కురవడంతో ఇబ్బంది పడ్డారు. ఈదురుగాలులతో రాజవొమ్మంగి నుంచి లాగరాయి వెళ్లే రహదారిపై చెట్టు కూలిపోవడంతో, చుట్టూ తిరిగి దూసరపాము గ్రామం మీదుగా రాకపోకలు సాగించారు. భారీ వర్షానికి రహదారులపై నీరు ప్రవహించింది. మడికట్టు నేలలో నీరు చేరింది. మండు వేసవిలో ఆకాశం–నేల ఒకటైనట్లు కురిసిన వానకు ప్రజానీకం అవాక్కయ్యింది. గిరిజనం అప్పుడే తొలకరి వచ్చేసిందా అన్న అనుభూతిని పొందారు. కాగా అప్పటి వరకు వేసవి వేడిమికి అల్లాడిన వారు వాతావరణంలో మార్పుతో చల్లగాలులు వీయడంతో సేద తీరారు. -
కిక్కిరిసిన రత్నగిరి
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున రత్నగిరిపై సుమారు రెండువందల వివాహాలు జరిగాయి. నవదంపతులతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వివాహాలు చేసుకున్న నవదంపతులు, వారి బంధుమిత్రులు కుటుంబ సభ్యులతో సత్యదేవుని సన్నిధికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వరుసగా రెండ్రోజులు సెలవు రావడంతో సమాన్య భక్తులు పెద్ద సంఖ్యలో సత్యదేవుని సన్నిధికి విచ్చేసి స్వామివారి వ్రతాలాచరించారు. దీంతో ఆలయ ప్రాంగణం, వ్రతమండపాలు నవదంపతులు వారి బంధుమిత్రులు, భక్తులతో నిండిపోయాయి. 2,200 వ్రతాలు, అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 50 లక్షలు ఆదాయం సమకూరింది. సుమారు ఐదు వేల మంది భక్తులకు సత్యదేవుని నిత్యాన్నదానపథకంలో ఉచిత భోజన స్వకరించారు. ఘాట్రోడ్లో ట్రాఫిక్ జామ్ సత్యదేవుని సన్నిధిన శుక్రవారం రాత్రి భారీ సంఖ్యలో వివాహాలు జరిగిన విషయం తెలిసిందే. వివాహాలకు వివిధ వాహనాలలో తరలివచ్చిన పెళ్లిబృందాలు శనివారం స్వామివారి వ్రతం దర్శనం అనంతరం దిగువకు ప్రయాణం అయ్యారు. స్వామివారి దర్శనానికి శనివారం వందల సంఖ్యలో వాహనాలలో వేలాదిగా విచ్చేసిన భక్తులు సైతం స్వామివారి దర్శనం అనంతరం దిగువకు ఒకేసారి ప్రయాణమవ్వడంతో శనివారం దేవస్థానం ఘాట్రోడ్లో భక్తుల వాహనాలతో సుమారు అరగంట సేపు వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. -
దోపిడీకే ప్రాధాన్యం
● చివరి దశకు ధాన్యం కొనుగోళ్లు ● రైతుకు ‘మద్దతు’లేని ధర ● తేమ పేరుతో దళారుల దోపిడీ ● ఎకరాకు రూ.10 వేలు నష్టం సాక్షి ప్రతినిధి, కాకినాడ: రబీ దిగుబడి నింపిన జోష్ రైతులకు మూడునాళ్ల ముచ్చటగానే మిగిలింది. దిగుబడి బాగున్నా అకాల వర్షాలు రైతుల కొంప ముంచేశాయి. ప్రకృతి కన్నెర్రజేయడం సరిపోదన్నట్టు దళారులు కూడా రైతును నిలువునా దోచుకుంటున్నారు. ప్రభుత్వం చెప్పిన మద్దతు ధర రైతుల దరిచేరడం లేదు. చంద్రబాబు పాలనలో దళారుల దోపిడీ రాజ్యమేలుతోంది. జిల్లాలో ముమ్మరంగా సాగుతున్న మాసూళ్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ తరుణంలో కూడా ప్రభుత్వ నిర్వాకంతో రైతులకు కనీస మద్దతు ధర దక్కడం లేదు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యానికి తేమ సాకుతో ప్రతి బస్తాకు అదనంగా నాలుగు కేజీలు తూకం వేసుకుపోతున్నారని రైతులు లబోదిబోమంటున్నారు. కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని సీఎంఆర్కు విక్రయిస్తే ఎకరాకు రూ.11 వేలు పైనే నష్టపోతున్నామని కరప, కాకినాడ రూరల్, పిఠాపురం, సామర్లకోట ప్రాంత రైతులు గగ్గోలు పెడుతున్నారు. ధాన్యం కోతలు పూర్తిచేసి మాసూళ్లు చేసి ధాన్యాన్ని సిద్ధం చేసి తొమ్మిది రోజులైనా తేమశాతం పేరుతో కొనుగోలు చేయడం లేదని సామర్లకోట మండల రైతులు ఆవేదన చెందుతున్నారు. కళ్లాల్లో ధాన్యం విక్రయించడానికి తీవ్రంగా ఎదురుచూడాల్సి వస్తోందని వారంటున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో దళారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఽ ఈ ఏడాది రబీ సీజన్లో ఎంటీయు 3626 (బొండాలు), టాటా బొండాలు రకాలను ఎక్కువగా సాగుచేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధాన్యం దిగుబడి గణనీయంగా పెరిగింది. జిల్లాలోని పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లోని ఆయకట్టులో ఎకరాకు 45 నుంచి 50 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. సారవంతమైన భూముల్లో 55 బస్తాల దిగుబడి కూడా నమోదైంది. ఇదే అదునుగా వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నట్టు రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన కనీస మద్దతు ధర 75 కిలోల బస్తాకు సాధారణ రకం రూ.1725, ఏ గ్రేడ్ రకానికి రూ.1779 రావాలి. కానీ జిల్లాలో ఎక్కడా ఈ ధరకు కొనుగోలు చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు. రబీ సీజన్లో రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఆర్ఎస్కేలోని సిబ్బంది రైతు కళ్లాల్లోకి వెళ్లి మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా ఎక్కడా అమలు కావడం లేదు. కమీషన్ వ్యాపారులే రైతుల నుంచి పాస్బుక్లు, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్లు తీసుకువెళ్లి నమోదు చేయిస్తున్నారు. వ్యాపారులే తమ సిబ్బందితో ధాన్యం పట్టుబడి చేయించి, ట్రాక్టర్ల ద్వారా రైసుమిల్లులకు చేరవేస్తున్నారు. కమీషన్ వ్యాపారులు నగదు రూపంలో రూ.1600 కు కొనుగోలు చేస్తున్నారు. ఈ పద్ధతిలో ధాన్యం విక్రయిస్తున్న రైతులు ప్రతి బస్తాపై రూ.177 నష్టపోతున్నారు. ఎకరాకు 50 బస్తాలు దిగుబడి వస్తుందనే లెక్కలతో చూస్తే రూ.8,850 నుంచి రూ.10 వేలు రైతు నష్టపోతున్నాడు. అదే సీఎంఆర్ ద్వారా అయితే 75 కిలోల బస్తా రూ.1700కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. రవాణా, ఇతర చార్జీలు అంటూ మద్దతు ధర కంటే రూ.107 తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. తేమశాతం పేరుతో బస్తాకు రెండు కేజీలు, తప్ప, తాలు గింజల పేరుతో మరో కేజీ, కేళీ పేరుతో ఒక కేజీ.. ఇలా మొత్తంగా బస్తాకు నాలుగు కిలోల వంతున అదనంగా తూకం వేసుకుపోతున్నారు. ఇందుకు సమ్మతించని రైతుల ధాన్యాన్ని మిల్లర్లు తిప్పి పంపేస్తున్నారు. తెచ్చిన ధాన్యాన్ని తిరిగి తీసుకువెళితే ట్రాక్టర్ అద్దె ఇతర ఖర్చులు భరించలేక మిల్లర్లు పెట్టిన షరతులకు తలొగ్గి అయినకాడికు అమ్ముకోవాల్సి వస్తోందని కరప మండల రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తేమ, పొల్లు, ధూగర అంటూ మిల్లర్లు కుంటిసాకులతో నాలుగు కిలోలు కోత పెడుతున్నారు. అంటే కిలోకు రూ.25 వంతున బస్తాకు రూ.182 నుంచి రూ.207 వరకు రైతులు నష్టపోతున్నారు.తొమ్మిది రోజులైనా పట్టుబడి లేదు ధాన్యం అమ్ముదామంటే దారి కనిపించడం లేదు. ధాన్యం కోతలు జరిగే 15 రోజులు గడిచిపోయింది. ధాన్యం పట్టుబడి జరిగే అవకాశం కనిపించడం లేదు. ధాన్యం పట్టుబడి పట్టి అమ్ముకుంటే అన్యాయమే జరుగుతుంది. తరుగు పేరుతో బస్తాకు రెండు కేజీలు తగ్గిస్తున్నారు. దాంతో ఎకరానికి సుమారు రూ.2000 నష్టం జరుగుతోంది. రవాణా ఇతర చార్జీల పేరుతో బస్తాకు రూ.200 తగ్గిస్తున్నారు. ఇలా రూ.9 వేల వంతున ఎకరానికి నష్టపోవాల్సి వస్తోంది. ధాన్యం కోత పూర్తి చేసి తొమ్మిది రోజులైనా ఇంతవరకు పట్టుబడి జరగలేదు. – కాశి వెంకట్రావు, రైతు, సామర్లకోట రైతుల పక్షాన ఉద్యమిస్తాం రబీలో ధాన్యానికి కనీస మద్దతు ధర ప్రచారానికే పరిమితమైంది. కళ్లాల్లో ధాన్యాన్ని అమ్ముదామంటే దళారులనే ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. మద్దతు ధరను పర్యవేక్షించే పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనిపించడం లేదు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో కలెక్టరేట్లలో ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఏ రోజుకా రోజు రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులపై స్పందించి తక్షణ చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. రైతుల రెక్కల కష్టాన్ని దళారులకు రాజ్యభోజ్యంగా విడిచిపెట్టి ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. జిల్లాలో రబీ కోతలు, మాసూళ్లు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో సైతం ప్రభుత్వం వైపు నుంచి కనీస మద్దతు ధర అందించే బాధ్యత తీసుకోకపోవడం అన్యాయం. ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోకుంటే రైతుల తరఫున ఉద్యమిస్తాం. – దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, కాకినాడ జిల్లా -
మధురఫలమెంత ప్రియమో!
● మామిడిలో రారాజు కొత్తపల్లి కొబ్బరి ● సామాన్యులకు అందని ధరతో ౖపైపెకి ● దిగుబడి తక్కువ.. గిరాకీ ఎక్కువ ● పిందె ప్రాయంలోనే బుక్కింగులు ● వంద కాయ రూ.5 వేల వరకు విక్రయం పిఠాపురం: వేసవిలో ఫలరాజు మామిడి రుచి చూడనివారుండరు. మరీ ప్రత్యేకంగా కొత్తపల్లి కొబ్బరి, పండూరు మామిడి రకాలైతే కనీసం వాసన చూసినా చాలనేంత రుచి. కొత్తపల్లి నుంచి కొత్త ఢిల్లీ వరకు కొత్తపల్లి కొబ్బరి పేరు తెలియనివారు ఉండరు. మామిడి ఉత్పత్తుల్లో హిడెన్ జెమ్స్గా భావిస్తారు. ఏ గ్రామాల్లో ఇవి ఉత్పత్తి అయితే ఆ గ్రామం పేరుతో ప్రసిద్ధి చెందుతాయంటారు. పూర్వం ఆంధ్ర ప్రాంత రాజులు తమ తోటల్లో వీటి పెంపకం చేపట్టి మిత్రరాజులకు కానుకలుగా పంపేవారు. ఇప్పటికీ దేశాధినేతలకు, పై అధికారులకు మామిడిపండ్లను కానుకగా పంపడం మనకు తెలిసిందే. ఆవకాయ పెట్టుకోవాలన్న ఆలోచన రాగానే గృహిణులకు ముందుగా గుర్తొచ్చేది కొత్తపల్లి కొబ్బరే. పీచు ఎక్కువగా ఉండి, ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల దీనికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో వంద కాయలు రూ.3500 నుంచి రూ.ఐదు వేల వరకు పలుకుతున్నాయి. ఈ రకం కాయలు, పళ్ల రంగు, రుచి, వాసన ఎంతో ప్రత్యేకం. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో పాటు కెరోటిన్, కాల్షియం, విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉంటాయి. తొక్క పలుచగా ఉండి పీచు ఎక్కువగా ఉంటుంది. పులుపు ఎక్కువగా ఉండడం వల్ల పచ్చి మామిడి మామూలుగా తినలేరు. కాని పండు మాత్రం అతి మధురం. కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్లు కొత్తపల్లి కొబ్బరి మామిడి కాయలుమామిడి కాయలు కోస్తున్న నాగేశ్వరరావు35 ఏళ్లుగా వ్యాపారం ఈ ఏడాది దిగుబడి సరిగా లేకపోయినా 35 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నా. కొబ్బరి మామిడి మన దరిదాపుల్లోనే ఎక్కడా లేదు. ఉలవపాడు నుంచి తెస్తున్నాం. కొబ్బరి మామిడి ఒక పరక (14 కాయల) ధర రూ.400 ఉంది. ఈ జిల్లాలో పండే కొత్తపల్లి కొబ్బరి మామి డికి మంచి గిరాకీ ఉంది. – ఎ.శ్రీను మామిడి వ్యాపారి, పిఠాపురంగిరాకీ ఎక్కువ అత్యంత సువాసన భరితంగా ఉండే కొత్తపల్లి కొబ్బరి పళ్ల గిరాకీ మరే రకానికీ ఉండదంటే అతిశయోక్తి కాదు. ముందుగానే డబ్బులు ఇచ్చి ఆర్డర్లు బుక్చేసుకుంటారు. ప్యాకింగ్లు చేసి ఉంచేస్తే వారు తీసుకువెళ్తుంటారు. ఎక్కువ ధర పలికే ఈ కాయలు, పండ్లను రాజకీయ నాయకులు, అధికారులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. – పెద్దిమూడి నాగేశ్వరరావు, మామిడి వ్యాపారీ, కొత్తపల్లి. -
కార్పెట్లు ఎక్కడ స్వామీ?
● కాళ్లు కాలి అవస్థలు పడుతున్న భక్తులు ● మంత్రి ఆనం పర్యటనలో కార్పెట్లు పరచి మళ్లీ మూలకు చేర్చిన అధికారులుఅన్నవరం: ఎండలు మండి భక్తుల కాళ్లు కాలిపోతున్నా అన్నవరం దేవస్థానం అధికారులకు కార్పెట్లు పరచాలన్న తలంపు రాకపోవడం శోచనీయం. శనివారం సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చి ఆలయ ప్రాంగణంలో నడిచేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో వందల సంఖ్యలో నవ దంపతులు వారి బంధు మిత్రులు వస్తున్నారు. చలువ పందిళ్లు ఉన్నప్పటికీ అవి లేని చోట నడవడానికి వారు అవస్థ పడుతున్నారు. అధికారులు గత మార్చి నెలలో పది ఫుట్ కార్పెట్ బండిళ్లు కొనుగోలు చేశారు. భక్తుల అవస్థలపై గత నెల 8న ‘కాళ్లు కాలుతున్నా కార్పెట్లు తీయరా’ పేరుతో కథనం ప్రచురించగా ఆ నెల 12న మంత్రి ఆనం పర్యటన సందర్భంగా వాటిని పరిచారు. దీంతో ఆ తరువాత రోజు 13వ తేదీన ‘ఆనందంగా పరిచేశారు’ కథనాలు ‘సాక్షి’లో ప్రచురితమయ్యాయి. ఆ తరువాత కొన్ని రోజులు వాటిని ఉంచినప్పటికీ నాలుగు రోజులుగా అవి కనిపించడం లేదు. భక్తులు పశ్చిమ రాజగోపురం వెలుపలకు వచ్చేటప్పటికి నేల వేడెక్కి ఉంటుంది. దీంతో వారు కాలు పెట్టలేని పరిస్థితి ఉంటుంది. రాజగోపురం నుంచి అన్నదాన పథకానికి వెళ్లాలంటే తారు రోడ్ మీద నడవాల్సి ఉంది. దీనిపై భక్తులు నడిచేందుకు వీలుగా తెల్ల పెయింట్ వేసినా నాలుగు రోజులకే ఆ అది వెలిసిపోయి మళ్లీ ఇబ్బందిగా మారుతోంది. పశ్చిమ రాజగోపురం నుంచి అన్నదాన భవనం వరకు, దేవస్థానం బస్సులు ఆగే విశ్రాంతి షెడ్డు వరకు కార్పెట్ వేస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని భక్తులు అంటున్నారు. -
సినిమా సూపిత్త మామా..
కాకినాడ జిల్లా: పిఠాపురం ఎమ్మెల్యే పవన్కల్యాణ్ నటుడు. మేకప్.. పేకప్ ఆయనకు బాగా పరిచయమైన పదాలు. అందుకేనేమో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో అధికార యంత్రాంగం కూడా పైపై మేకప్పులకే పరిమితమై పట్టణ సుందరీకరణకు పేకప్ చెప్పడానికి సిద్ధమైంది! స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర పేరుతో పిఠాపురం పట్టణ సుందరీకరణ పనులు ప్రారంభించారు. గోడలపై చిత్రాలు వేయడం, ప్రభుత్వ భవనాలకు రంగులు వేసి సుందరంగా అలంకరించడం వంటి పనులను మున్సిపల్ అధికారులు చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా కాలం చెల్లిన భవనాలకు సైతం మాం...చి మేకప్ వేసి జనాలకు సినిమా చూపించాలనుకుంటున్నారు. మున్సిపల్ పార్కులో ఉన్న మస్తరు కార్యాలయం పూర్తిగా శిథిలమై తుప్పలు, డొంకలతో ప్రమాద స్థితిలో ఉంది. రేపో మాపో కూలి పోయే ఆ భవనానికి మరమ్మతులు చేయకుండా పగిలిపోయిన గోడలకే రంగులు వేసి బొమ్మ చూపిస్తున్నారు. ఇది చూసిన జనం ‘ఇదేనా సుందరీకరణ అంటే’ అని ముక్కున వేలేసుకుంటున్నారు! -
సర్పవరం పోలీసు స్టేషన్ ఎస్ఐ పోస్టుకు రూ.30 లక్షలు?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సర్పవరం పోలీసు స్టేషన్లో ఇన్స్పెక్టర్ పోస్టుకు మాం...చి డిమాండ్ ఉంది! పాడి ఆవు లాంటి ఈ పోస్టును వేలం పాడి మరీ దక్కించుకోవాలని పలువురు ఉవ్విళ్లూరుతున్నారు. ఇది ఇటీవలే ఖాళీ అయ్యింది. ఇక్కడి ఇన్స్పెక్టర్ బొక్కా పెద్దిరాజును కారణాంతరాలతో వేకెన్సీ రిజర్వు(వీఆర్)కు పంపించారు. పెద్దిరాజు సర్పవరం ఇన్స్పెక్టర్గా సుమారు 16 నెలలు పనిచేశారు. వాస్తవానికి రెండేళ్ల వరకు ఇదే స్టేషన్లో ఉంటాననే నమ్మకంతో పెద్దిరాజు ఇక్కడ జాయిన్ అయ్యారు. కానీ పరిస్థితులు మారి ఆయనను వీఆర్లో పెట్టారు. ఖాళీగా ఉన్న ఆ పోస్టుకు మహిళా పోలీసు స్టేషన్లో పనిచేస్తోన్న ఇనస్పెక్టర్ రవికుమార్ ఇన్చార్జిగా వచ్చారు. సర్పవరంలో బాధ్యతలు తీసుకున్నప్పటికీ మూడు రోజులు కూడా గడవకుండానే ఆయనను వీఆర్కు పంపించేశారు. ప్రస్తుతం కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ శాంతిభద్రతల బాధ్యతను తాత్కాలికంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్పవరం సీఐ పోస్టు హాట్ సీట్గా మారిందనే చర్చ పోలీసు సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. అందరి కళ్లూ దానిపైనే.. కాకినాడ రూరల్ మండలం పరిధిలో కాకినాడ రూరల్, సర్పవరం రెండు పోలీసు సర్కిల్స్ ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో అత్యధిక డిమాండ్ ఉన్న ఈ రెండు సర్కిళ్లలో సర్పవరం సర్కిల్ ఖాళీగా ఉండటంతో అందరి కళ్లూ దానిపైనే పడ్డాయి. ఇక్కడి పోస్టింగ్ కోసం కాకినాడ రూరల్లోని అధికార భాగస్వామ్య పార్టీ ముఖ్యనేత కనుసన్నల్లో అనుచర వర్గం బేరసారాలకు తెరలేపారని చెప్పుకుంటున్నారు. ఏడాదిన్నర క్రితం ఈ సర్కిల్లో పోస్టింగ్ కోసం సొమ్ముతో త్రీ స్టార్స్ క్యూ కట్టారని జిల్లా అంతటా విస్తృతమైన చర్చ నడిచింది. నాడు నలుగురైదుగురు పోటీ పడగా అధికార పార్టీ నేతకు అత్యధికంగా రూ.30 లక్షలు ముట్టచెప్పాకనే ఖాయం చేశారని వినికిడి. ఇప్పుడూ డిమాండే అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఇక్కడి పోస్టింగ్ కోసం ముఖ్య నేత, వారి అనుచరులను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ జిల్లాల త్రీస్టార్స్.. తెలిసిన నాయకుల ద్వారా నానా తంటాలు పడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నలుగురు ఇనస్పెక్టర్లు ఈ పోస్టింగ్ కోసం పోటీపడుతున్నారు. ఇందులో ఒక సీఐకు పిఠాపురానికి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ముఖ్యనేతకు సిఫారసు చేశారని విశ్వసనీయ సమాచారం. మరొక త్రీ స్టార్ ముఖ్యనేత బంధువుల ఆశీస్సులతో గడచిన వారం రోజులుగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గిట్టుబాటు ఖాయం! కాకినాడ రూరల్ మండలంలో ఉన్న రెండు ఇన్స్పెక్టర్ పోస్టులకు ఒకే తరహా డిమాండ్ ఉండటం విశేషం. ఈ రెండు కొలువు తెచ్చుకోవాలే కాని పెట్టిన పెట్టుబడికి తగ్గట్టు ఆదాయానికి లోటు ఉండదంటుంటారు. ఇందులో రూరల్ సర్కిల్ పరిధిలో అత్యధికంగా ఆరు (ఇంద్రపాలెం, తిమ్మాపురం, పెదపూడి, కోరంగి, గొల్లపాలెం, కరప) పోలీసు స్టేషన్లు ఉండటం కూడా ఇంతటి డిమాండ్కు కారణంగా పేర్కొంటున్నారు. సర్పవరం ఇన్స్పెక్టర్ పరిధిలో వాకలపూడి, రమణయ్యపేట, సర్పవరం, ఆటోనగర్ వంటి ఇండస్ట్రియల్ ఏరియాలలో పెద్ద పెద్ద కర్మాగారాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు కోకొల్లలు. అందుకే ఇక్కడి ఇనస్పెక్టర్æ పరిధిలో రాబడి దండిగా వస్తుందనే దూరదృష్టితో రూ.లక్షలు ముట్టచెప్పడానికి వెనుకాడటం లేదంటున్నారు. ఎవరు ఎంత ఎక్కువ ఇస్తారో, సిఫారసు లేఖ ఎవరికి దక్కుతుందో అనే చర్చ పోలీసుల్లో సాగుతోంది. -
తాగునీటి కోసం ఖాళీ బిందెలతో ధర్నా
● బలుసులపేటలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ● మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేసిన మహిళలు సామర్లకోట: మున్సిపాలిటీ నుంచి గుక్కెడు నీళ్లు కూడా రావడం లేదని ధ్వజమెత్తుతూ మహిళలు ఖాళీ బిందెలతో శుక్రవారం ధర్నా నిర్వహించారు. స్థానిక బలుసులపేటకు చెందిన మహిళలు మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పీకపై కత్తి పెట్టినట్టు పన్నులు వసూలు చేశారని, మరి మున్సిపాలిటీలో నివాసం ఉంటున్న తమకు తాగునీరు ఇవ్వవలసిన బాధ్యత లేదా అని మహిళలు ప్రశ్నించారు. గోదావరి జలాలు ఫిల్టరు చేసి ఇవ్వవలసి ఉండగా 20 రోజు లుగా బోరు నీరు ఇస్తున్నారని, దాంతో బలుసులపేటకు చెందిన పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నీళ్లు కూడా బురదతో వస్తున్నాయని ధ్వజమెత్తారు. బలుసులపేట ప్రజలు అంటే అలుసుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పన్నులు బకాయి ఉంటే కుళాయి కనెక్షన్లు తొలగిస్తామని బెదిరించారని, గుక్కెడు నీళ్ల కోసం రోడ్డు ఎక్కవలసి వచ్చిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ ఎ శ్రీవిద్యకు వినతి పత్రం అందజేశారు. సమస్యను రెండు రోజులలో పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఆందోళనకు వార్డు మాజీ కౌన్సిలర్ నేతల హరిబాబు నాయకత్వం వహించగా పి.శాంతి, పిట్టా పాప, ఎం.కుమారి, కడారి రాజమ్మ, టి.రాణి, ఎన్.దివ్యభారతి పాల్గొన్నారు. -
ఆ సీటు.. మరీ రేటు బాస్!
● సర్పవరం సర్కిల్ సీటుకు భారీ ధర ● ఏడాదిన్నర క్రితమే రూ.30 లక్షలు పలికిన వైనం ● అధికార పార్టీ నేత సిఫారసు కోసం త్రీ స్టార్స్ క్యూ సాక్షి ప్రతినిధి, కాకినాడ: సర్పవరం పోలీసు స్టేషన్లో ఇన్స్పెక్టర్ పోస్టుకు మాం...చి డిమాండ్ ఉంది! పాడి ఆవు లాంటి ఈ పోస్టును వేలం పాడి మరీ దక్కించుకోవాలని పలువురు ఉవ్విళ్లూరుతున్నారు. ఇది ఇటీవలే ఖాళీ అయ్యింది. ఇక్కడి ఇన్స్పెక్టర్ బొక్కా పెద్దిరాజును కారణాంతరాలతో వేకెన్సీ రిజర్వు(వీఆర్)కు పంపించారు. పెద్దిరాజు సర్పవరం ఇన్స్పెక్టర్గా సుమారు 16 నెలలు పనిచేశారు. వాస్తవానికి రెండేళ్ల వరకు ఇదే స్టేషన్లో ఉంటాననే నమ్మకంతో పెద్దిరాజు ఇక్కడ జాయిన్ అయ్యారు. కానీ పరిస్థితులు మారి ఆయనను వీఆర్లో పెట్టారు. ఖాళీగా ఉన్న ఆ పోస్టుకు మహిళా పోలీసు స్టేషన్లో పనిచేస్తోన్న ఇనస్పెక్టర్ రవికుమార్ ఇన్చార్జిగా వచ్చారు. సర్పవరంలో బాధ్యతలు తీసుకున్నప్పటికీ మూడు రోజులు కూడా గడవకుండానే ఆయనను వీఆర్కు పంపించేశారు. ప్రస్తుతం కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ శాంతిభద్రతల బాధ్యతను తాత్కాలికంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్పవరం సీఐ పోస్టు హాట్ సీట్గా మారిందనే చర్చ పోలీసు సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. అందరి కళ్లూ దానిపైనే.. కాకినాడ రూరల్ మండలం పరిధిలో కాకినాడ రూరల్, సర్పవరం రెండు పోలీసు సర్కిల్స్ ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో అత్యధిక డిమాండ్ ఉన్న ఈ రెండు సర్కిళ్లలో సర్పవరం సర్కిల్ ఖాళీగా ఉండటంతో అందరి కళ్లూ దానిపైనే పడ్డాయి. ఇక్కడి పోస్టింగ్ కోసం కాకినాడ రూరల్లోని అధికార భాగస్వామ్య పార్టీ ముఖ్యనేత కనుసన్నల్లో అనుచర వర్గం బేరసారాలకు తెరలేపారని చెప్పుకుంటున్నారు. ఏడాదిన్నర క్రితం ఈ సర్కిల్లో పోస్టింగ్ కోసం సొమ్ముతో త్రీ స్టార్స్ క్యూ కట్టారని జిల్లా అంతటా విస్తృతమైన చర్చ నడిచింది. నాడు నలుగురైదుగురు పోటీ పడగా అధికార పార్టీ నేతకు అత్యధికంగా రూ.30 లక్షలు ముట్టచెప్పాకనే ఖాయం చేశారని వినికిడి. ఇప్పుడూ డిమాండే అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఇక్కడి పోస్టింగ్ కోసం ముఖ్య నేత, వారి అనుచరులను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ జిల్లాల త్రీస్టార్స్.. తెలిసిన నాయకుల ద్వారా నానా తంటాలు పడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నలుగురు ఇనస్పెక్టర్లు ఈ పోస్టింగ్ కోసం పోటీపడుతున్నారు. ఇందులో ఒక సీఐకు పిఠాపురానికి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ముఖ్యనేతకు సిఫారసు చేశారని విశ్వసనీయ సమాచారం. మరొక త్రీ స్టార్ ముఖ్యనేత బంధువుల ఆశీస్సులతో గడచిన వారం రోజులుగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గిట్టుబాటు ఖాయం! కాకినాడ రూరల్ మండలంలో ఉన్న రెండు ఇన్స్పెక్టర్ పోస్టులకు ఒకే తరహా డిమాండ్ ఉండటం విశేషం. ఈ రెండు కొలువు తెచ్చుకోవాలే కాని పెట్టిన పెట్టుబడికి తగ్గట్టు ఆదాయానికి లోటు ఉండదంటుంటారు. ఇందులో రూరల్ సర్కిల్ పరిధిలో అత్యధికంగా ఆరు (ఇంద్రపాలెం, తిమ్మాపురం, పెదపూడి, కోరంగి, గొల్లపాలెం, కరప) పోలీసు స్టేషన్లు ఉండటం కూడా ఇంతటి డిమాండ్కు కారణంగా పేర్కొంటున్నారు. సర్పవరం ఇన్స్పెక్టర్ పరిధిలో వాకలపూడి, రమణయ్యపేట, సర్పవరం, ఆటోనగర్ వంటి ఇండస్ట్రియల్ ఏరియాలలో పెద్ద పెద్ద కర్మాగారాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు కోకొల్లలు. అందుకే ఇక్కడి ఇనస్పెక్టర్ పరిధిలో రాబడి దండిగా వస్తుందనే దూరదృష్టితో రూ.లక్షలు ముట్టచెప్పడానికి వెనుకాడటం లేదంటున్నారు. ఎవరు ఎంత ఎక్కువ ఇస్తారో, సిఫారసు లేఖ ఎవరికి దక్కుతుందో అనే చర్చ పోలీసుల్లో సాగుతోంది. -
ఐదు రైస్ మిల్లులకు షోకాజ్ నోటీసులు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో ఐదు రైస్ మిల్లులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జేసీ అపూర్వ భరత్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. కరపలో పూర్ణోదయ ఆగ్రోపుడ్స్ రైస్ మిల్లు, శ్రీవెంకట సూర్య రైస్మిల్లు, పిఠాపురం మండలం బి.పత్తిపాడులో శ్రీ శివజ్యోతి రైస్ మిల్లు, శ్రీ సాయిబాలాజీ ఎంఆర్ఎం రైస్ మిల్లు, శ్రీ శివశంకర్ రైస్ మిల్లులకు నోటీసులు ఇచ్చామన్నారు. సీఎంఆర్ నిబంధనలను ఉల్లంఘించడంతోపాటు ఏ, బీ రిజిస్టర్లను సరిగా నిర్వహించకపోవడం వంటి అంశాలపై నోటీసులు ఇచ్చామన్నారు. వారం రోజుల్లో నోటీసులకు వివరణ ఇవ్వాలన్నారు. వివరణను అనుసరించి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. డీఎన్ఏవో సత్యనారాయణరాజు ఇచ్చిన తనిఖీల నివేదిక ప్రకారం నోటీసులు ఇచ్చామన్నారు. రత్నగిరిపై పెళ్లి సందడి అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధి శుక్రవారం రాత్రి పెళ్లి బృందాలతో నిండిపోయింది. ఎటు చూసినా వధూవరులు, వారి బంధుమిత్రులు, వివాహాలు చేయించే పురోహితులు, సన్నాయి మేళం వారు ఇలా అంతా పెళ్లిళ్లకు సంబంధించిన వారే దర్శనమిచ్చారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల ముహూర్తంలో 150కి పైగా వివాహాలు జరిగాయి. ఈ వివాహాల నిర్వహణ కోసం సత్యగిరిపై నిర్మించిన 36 వివాహ హాల్స్, వివిధ సత్రాలలో వివాహాలు చేసుకునే స్థలాలు, రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డు, దాని పక్కనే గల ఖాళీ ప్రదేశం అంతా పెళ్లి సందడి కనిపించింది. సత్యగిరిపై గల మట్టేవారి ఉచిత ఏసీ కల్యాణ మండపం, ఎంఎస్ రెడ్డి వివాహ వేదికలోని 24 చిన్న కల్యాణ మండపాల్లో కూడా ఇదే ముహూర్తంలో వివాహాలు జరిగాయి. వివాహ బృందాల వారి తాకిడితో సాధారణ భక్తులకు సత్రాలలో గదులు లభ్యం కాలేదు. ఏపీ ఈసెట్–26లో 93.30 శాతం ఉత్తీర్ణత బాలాజీచెరువు (కాకినాడ సిటీ): గత నెల 24న నిర్వహించిన ఏపీ ఈసెట్–26లో కాకినాడ జిల్లా 93.30 శాతం ఉత్తీర్ణత సాధించింది. జిల్లా వ్యాప్తంగా బాలురు 1,282 మంది పరీక్షకు దరఖాస్తు చేయగా 1,255 మంది హాజరయ్యారు. వీరిలో 1,176 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 681 మంది దరఖాస్తు చేయగా 669 మంది పరీక్షకు హాజరై 619 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 93.71, బాలికలు 92.53 శాతం ఉత్తీర్ణత పొందారు. కరప మండల విద్యార్థికి 6వ ర్యాంక్ కరప: ఏపీ ఈసెట్ ఫలితాల్లో కరప మండలం వాకాడ గ్రామానికి చెందిన విద్యార్థి అడబాల లక్ష్మీ గణపతి 6వ ర్యాంక్ సాధించాడు. పాలిటెక్నిక్ డిప్లమా పూర్తిచేసిన విద్యార్థులకు బీటెక్ ద్వితీయ సంవత్సరం ప్రవేశాల కోసం ఏపీ ఈసెట్ నిర్వహిస్తారు. ఏపీ ఈసెట్–2026 వాకాడ గ్రా మానికి చెందిన లక్ష్మీగణపతి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో 141 మా ర్కులతో 6వ ర్యాంక్ సాధించాడు. తండ్రి అడబా ల ప్రసాద్ వ్యవసాయదారుడు, తల్లి ప్రభ టైలరింగ్ చేస్తారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ర్యాంక్ సాధించానని, బీటెక్ అనంతరం ఐఐటీలో సీటు సాధించి ఎంటెక్ చేసి, మంచి ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు అండగా ఉండటమే తన లక్ష్యమని ర్యాంకర్ లక్ష్మీగణపతి తెలిపాడు. సంజయ్కు 8వ ర్యాంకు కాకినాడ రూరల్: ఏపీ ఈసెట్ ఫలితాలలో మండలంలోని వలసపాకల సంతోష్నగర్కు చెందిన తడాల సంజయ్ సత్తా చాటాడు. సివిల్ ఇంజినీరింగ్ స్ట్రీమ్లో రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంక్ సాధించాడు. సంజయ్ తండ్రి వీర వరహాలు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. తల్లి రామలక్ష్మి గృహిణి. తమ కుమారుడు ఈసెట్లో ర్యాంక్ సాధించినందుకు తల్లిదండ్రులు అతడితో కలిసి ఆనందం పంచుకున్నారు. ప్రశాంతంగా ఈడీ సెట్ రాజానగరం: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎంపిక చేసిన 16 కేంద్రాలలో శుక్రవారం నిర్వహించిన ఏపీ ఈడీసెట్ 2026 ప్రశాంత వాతావరణంలో జరిగిందని ప్రాంతీయ సమన్వయకర్త, ఆదికవి నన్నయ యూనివర్సిటీ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు తెలిపారు. 4,622 మంది పరీక్ష రాసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోగా హాజరైంది మాత్రం 3,629 మంది అని చెప్పారు. -
● సినిమా సూపిత్త మామా..
పిఠాపురం ఎమ్మెల్యే పవన్కల్యాణ్ నటుడు. మేకప్.. పేకప్ ఆయనకు బాగా పరిచయమైన పదాలు. అందుకేనేమో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో అధికార యంత్రాంగం కూడా ౖపైపె మేకప్పులకే పరిమితమై పట్టణ సుందరీకరణకు పేకప్ చెప్పడానికి సిద్ధమైంది! స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర పేరుతో పిఠాపురం పట్టణ సుందరీకరణ పనులు ప్రారంభించారు. గోడలపై చిత్రాలు వేయడం, ప్రభుత్వ భవనాలకు రంగులు వేసి సుందరంగా అలంకరించడం వంటి పనులను మున్సిపల్ అధికారులు చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా కాలం చెల్లిన భవనాలకు సైతం మాం...చి మేకప్ వేసి జనాలకు సినిమా చూపించాలనుకుంటున్నారు. మున్సిపల్ పార్కులో ఉన్న మస్తరు కార్యాలయం పూర్తిగా శిథిలమై తుప్పలు, డొంకలతో ప్రమాద స్థితిలో ఉంది. రేపో మాపో కూలి పోయే ఆ భవనానికి మరమ్మతులు చేయకుండా పగిలిపోయిన గోడలకే రంగులు వేసి బొమ్మ చూపిస్తున్నారు. ఇది చూసిన జనం ‘ఇదేనా సుందరీకరణ అంటే’ అని ముక్కున వేలేసుకుంటున్నారు! – పిఠాపురం -
ఏపీ ఈఏపీ సెట్కు 3.55 లక్షల దరఖాస్తులు
● 12 నుంచి 20 వరకు ఆన్లైన్ పరీక్ష ● నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ● సెట్ చైర్మన్ ప్రసాద్ వెల్లడి బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మశీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్–2026కు 3,55,009 మంది దరఖాస్తు చేసుకున్నారని సెట్ చైర్మన్ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. జేఎన్టీయూకే వీసీ సమావేశపు హాల్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షకు ఇంజినీరింగ్ విభాగంలో 2,75,794 మంది దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్, ఫార్మశీ విభాగాల్లో 78,421 మంది, రెండు విభాగాలకూ కలిపి 794 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. పరీక్ష మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మశీకి, మే 12 నుంచి 18వ తేదీ వరకు ఇంజినీరింగ్ విభాగాలకు పరీక్షలు నిర్వహిస్తామని, ఏపీలో 142 సెంటర్లతో పాటు హైదరాబాద్లో ఒక ఆన్లైన్ సెంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యార్థులకు పరీక్ష కేటాయించిన తేదీన వేరే జాతీయ స్థాయి పరీక్ష ఉన్నట్లయితే వాటి ఆధారాలతో హెల్ప్లైన్ సెంటర్ను సంప్రదించాలని, ఆ వివరాలు పరిశీలించి పరీక్ష తేదీ మారుస్తామని చెప్పారు. ఉర్దూ మీడియం ఎంచుకున్న అభ్యర్థులు కర్నూల్ రీజనల్ సెంటర్లో మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుందన్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తామన్నారు. అంగవైకల్యం కలిగిన వారికి సహాయకులను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. దరఖాస్తులో ఏమైనా తప్పులు నమోదు చేస్తే పరీక్ష రాసిన తరువాత అయినా హెల్ప్లైన్ సెంటర్ ద్వారా మార్చుకోవచ్చని సూచించారు. పరీక్ష కేంద్రంలోకి గంటన్నర ముందుగా ప్రవేశానికి అనుమతి ఇచ్చామని, బయో మెట్రిక్కు ఆటంకం లేకుండా మెహందీ వంటివి పెట్టుకోకూడదని, ఎలక్ట్రికల్ పరికరాలు వంటి వాటికి అనుమతి లేదని చెప్పారు. హాల్ టికెట్పై పరీక్ష కేంద్ర రూట్ మ్యాప్ ఏర్పాటు చేశామని, ముందురోజు వెళ్లి పరీక్ష కేంద్రం చూసుకోవాలని కోరారు. హాల్ టికెట్లు మనమిత్ర వాట్సాప్ 9552300009 నంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. హెల్ప్లైన్ కోసం 0884–2359599, 0884–2342499 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో సెట్ కన్వీనర్ మోహనరావు, ఓఎస్డీ కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
కలకలం రేపిన విషాహారం
● కొత్తపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు ● నేతలు, అధికారుల పరామర్శ కొత్తపేట: ఫుడ్ పాయిజన్తో సుమారు 50 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటన కొత్తపేట మండలంలో కలకలం రేపింది. వివాహ విందులో మిగిలిపోయిన ఆహారాన్ని రెండో పూట, కొందరు మూడో పూట కూడా తిని అస్వస్థతకు గురైన ఘటన వానపల్లి శివారు రామమోహనరావుపేటలో చోటు చేసుకుంది. డీఎంహెచ్ఓ డి.దొర, తహసీల్దార్ వై.రాంబాబు తక్షణ చర్యలు తీసుకుని బాధితులను కొత్తపేట సీహెచ్సీకి తరలించి వైద్య సేవలు అందేలా చేశారు. బాధితుల్లో 11 మంది చిన్నారులు ఆ గ్రామంలో ఇంకా పలువురు అస్వస్థతకు గురైన విషయాన్ని డీఎంహెచ్ఓ దొరకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆయన 108 జిల్లా ఇన్చార్జ్ వెంకటేష్ను అప్రమత్తం చేసి జిల్లాలోని అంబులెన్స్లను రామమోహనరావుపేటకు పంపించాలని సూచించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 15 అంబులెన్స్లు రాగా వాటిలో 42 మందిని కొత్తపేట సీహెచ్సీకి తరలించారు. వారిలో వానపల్లి రామమోహనరావుపేటకు చెందిన వారు 37 మంది కాగా మిగిలిన ఐదుగురు మోడేకుర్రుకు చెందిన వారు. మొత్తం బాధితుల్లో 11 మంది చిన్నారులు ఉన్నారు. వారికి ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది వానపల్లి పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శివ వైద్య సేవలు అందించారు. జాయింట్ కలెక్టర్ నిడియాదేవి, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పరామర్శ ఫుడ్ పాయిజన్తో వానపల్లి వాసులు అస్వస్థతకు గురయ్యారన్న సమాచారంతో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి కొత్తపేట ఆస్పత్రికి వచ్చి రోగులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. అన్ని వార్డుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పలకరించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్ఓ దొర, ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. అవసరమైతే వైఎస్సార్ సీపీ తరఫున తాము సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్రాజు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, జిల్లా పార్టీ నాయకుడు సాకా జానకి రామరాజు ఉన్నారు. -
అల్లూరి పోరాటం మరువలేనిది
రంపచోడవరం: దేశ స్వాతంత్య్ర కోసం బ్రిటిష్ వారిపై మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం ఎప్పటికీ మరువలేనిదని పోలవరం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) పి.అంబేద్కర్ అన్నారు. అల్లూరి 102వ వర్ధంతిని పురస్కరించుకుని రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో అల్లూరి చిత్రపటానికి గురువారం పూలమాలలు వేసి, ఆయన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏపీఓ డీఎన్వీ రమణ, డీఆర్డీఏ పీడీ దాసరి రత్నాకర్, డీహెచ్ఓ దేవదానం, డీఏఓ రామ్మోహనరావు పాల్గొన్నారు. సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యాన.. సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యాన రంపచోడవరంలో అల్లూరి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి ఆ పార్టీ నాయకుడు పల్లాల లచ్చిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అల్లూరి స్ఫూర్తితో ఆదివాసీ ప్రాంతాల్లో నేషనల్ పార్కులు, పర్యాటక కేంద్రాల ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. సభలో మాట్లాడుతున్న లచ్చిరెడ్డి -
15 నుంచి కాలువలకు నీటి విడుదల
● మాసూళ్లు పూర్తవగానే ఖరీఫ్ సాగు చేపట్టాలి ● రైతులకు జేడీఏ సూచనకరప: గోదావరి డెల్టా కాలువలకు ఈ నెల 15వ తేదీ నుంచి నీరు విడుదల చేస్తారని, అందువలన రబీ మాసూళ్లు పూర్తయిన వెంటనే ఖరీఫ్ సాగు చేపట్టాలని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు (జేడీఏ) ఎన్.విజయ్ కుమార్ అన్నారు. గొడ్డటిపాలెం రైతు సేవా కేంద్రంలో గురువారం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందస్తు సాగు వల్ల తొలకరి సీజన్ చివరిలో వచ్చే తుపాన్ల గండం నుంచి బయటపడి, పంటను దక్కించుకోవచ్చని రైతులకు సూచించారు. మూడో పంటగా అపరాల సాగుకు అవకాశం ఉంటుందని, దీనివలన తక్కువ పెట్టుబడితో అదనపు ఆదాయం సమకూరుతుందని అన్నారు. తొలకరి నారుమళ్లు, వెదజల్లు పద్ధతి అనుసరించేవారు జూన్ నెలాఖరుకల్లా పూర్తి చేయాలన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు, ఎల్నినో ప్రభావం నుంచి పంటను దక్కించుకోవడానికి దాళ్వా కోతలు పూర్తి చేసిన ప్రతి పొలంలో పీఎండీఎస్ విత్తనాలు జల్లేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అరట్లకట్ట, గొడ్డటిపాలెం గ్రామాలకు పంట కాలువ ద్వారా సాగునీరు రాకుండా ఎగువ రైతులు అడ్డుకుంటున్నారని, దీంతో తమ పొలాలకు సకాలంలో నీరందక, వరి నాట్లు ఆలస్యమవుతున్నాయని ఆయా గ్రామాల రైతులు చెప్పారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి, ఈ సమస్య తలెత్తకుండా చూస్తామని విజయ్ కుమార్ హామీ ఇచ్చారు. అనంతరం, ఆయన కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడారు. తేమ శాతం, తప్ప, తాలు గింజల శాతం పేరుతో ఎవరైనా మద్దతు ధరలో కోత పెట్టినా, రైస్ మిల్లుల నుంచి సమస్యలు ఎదురైనా మిల్లుల వద్ద ఉండే కస్టోడియన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో కరప, కాకినాడ వ్యవసాయ సబ్ డివిజన్ల ఏడీఏలు వి.అశోక్ (ఇన్చార్జి), దుర్గాలక్ష్మి, మండల వ్యవసాయ అధికారి ఇమ్మిడిశెట్టి సత్య తదితరులు పాల్గొన్నారు. -
రత్నగిరిపై పెళ్లి సందడి
● నేటి రాత్రి 7 గంటల ముహూర్తానికి 150కి పైగా వివాహాలు ● వివాహ మండపాలు, సత్రం గదులు ఇప్పటికే రిజర్వ్అన్నవరం: రత్నగిరి, సత్యగిరి ప్రతిధ్వనించేలా సత్యదేవుని సన్నిధిలో నేడు పెళ్లి బాజాలు మోగనున్నాయి. శుక్రవారం రాత్రి 7 గంటల ముహూర్తంలో 150కి పైగా జంటలు ఒక్కటి కానున్నాయి. దీంతో, కొండపై ఎక్కడ చూసినా పెళ్లి సందడే కనిపిస్తోంది. ఇప్పటికే పెళ్లి బృందాలు వివాహ మండపాలు, సత్రం గదులను రిజర్వ్ చేసుకున్నాయి. సత్యగిరిపై 36 వివాహ హాల్స్, వివిధ సత్రాల్లో వివాహాలు చేసుకునే స్థలాలను, రెండు ఉచిత వివాహ మండపాల్లోని 24 చిన్న కల్యాణ మండపాలను కూడా రిజర్వ్ చేసుకున్నారు. అలాగే, వివిధ సత్రాల్లో 400 గదులుండగా.. 300కు పైగా గదులను వివాహ బృందాల వారు బుక్ చేసుకున్నారు. దేవస్థానం అధికారికంగా 70 శాతం గదులకు ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్కు అనుమతి ఇచ్చింది. వీటితో పాటు ప్రజాప్రతినిధులు, వీఐపీల సిఫారసు లేఖలతో మరో 100కు పైగా గదులు రిజర్వ్ చేశారు. దీంతో, సామాన్య భక్తులకు శుక్రవారం గదులు దొరకడం కష్టమేనని అధికారులు తెలిపారు. 13 తేదీతో శుభం కార్డు వైశాఖ మాసంలో వివాహాలకు ఈ నెల 13వ తేదీతో శుభం కార్డు పడనుంది. వైశాఖంలో ఈ నెల 9, 12, 13 తేదీల్లో వివాహ ముహూర్తాలున్నాయి. అయితే, అవి అంత పెద్ద ముహూర్తాలు కావని దేవస్థానం అధికారులు చెప్పారు. ఆ తేదీల్లో సత్యదేవుని సన్నిధిలో 50 వివాహాల వరకూ జరిగే అవకాశం ఉంది. ఈ నెల 17న అధిక జ్యేష్ట మాసం ప్రారంభమవుతోంది. దీంతో, ఆ మాసంలో వివాహాలు జరగవు. తిరిగి జూన్ 16 నుంచి నిజ జ్యేష్ట మాసం ప్రారంభమవుతుంది. ఆ మాసంలో వివాహాలు జరుగుతాయి. ఆగస్టు 13న ప్రారంభమవుతున్న శ్రావణ మాసంలో కూడా పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. -
ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది
● ఏ పంటకూ మద్దతు ధర దక్కడం లేదు ● మొక్క జొన్న, పొగాకు రైతుల కష్టాలు వర్ణనాతీతం ● వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బాబి అమలాపురం టౌన్: చంద్రబాబు ప్రభుత్వం రైతులను, వ్యవసాయాన్ని గాలికొదిలేసిందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో ఏ పంటలకూ మద్దతు ధరలు దక్కడం లేదని ఆరోపించారు. అమలాపురంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత సంవత్సరం టమాటా, మొక్కజొన్న, పొగాకు, శనగ, కోకో, అరటి, మామిడి, సజ్జ ఇలా ఏ పంటకూ మద్దతు ధర ఇవ్వలేదన్నారు. మొక్కజొన్న మద్దతు ధర క్వింటాల్కు రూ.2,400 దక్కాలి. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1,400, రూ.1,600కు రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారని చెప్పారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకల్లో మొక్కజొన్నకు రూ.2,400 మద్దతు ధరను ఆ ప్రభుత్వాలు ఇస్తున్నాయని బాబీ చెప్పారు. ఎంతసేపూ మాది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ పాలన అంటూ సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడమే తప్ప రైతులను ఆదుకోవడంలో మాత్రం వెనుకబాటులో ఉన్నారని విమర్శించారు. పొగాకు మద్దతు ధర కోసం ఇబ్బందులపై గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో రైతులు ధర్నా చేశారన్నారు. కేజీ పొగాకుకు రూ.265 కూడా రావడం లేదని చెప్పారు. అదే గత సంవత్సరం రూ.450 ఉందన్నారు. మొక్కజొన్న, పొగాకు రైతులు కష్టనష్టాలు వర్ణనాతీతమని బాబీ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నాయకులు బ్లాక్ మార్కెట్ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. పొగాకు నుంచి మొన్నటి ఎరువులు, నిన్నటి డీజిల్ కొరత వరకూ కొందరు కూటమి నేతలు దళారులై కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని చెప్పారు. అమరావతి పనులకు డీజిల్ సమృద్ధిగా ఇవ్వాలని ఆయిల్ కంపెనీలకు లేఖలు రాసి కాంట్రాక్టర్ల కొమ్ము కాసిన చంద్రబాబు ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని బాబీ విమర్శించారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి పంటకూ మద్దతు ధర ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కోవిడ్ సమయంలో కూడా గ్రామాలకు వాహనాలను పంపించి ఆయా పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించిన ఘటనలను గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టర్ల కొమ్ము కాస్తూ ధరల స్థిరీకరణ వాగ్దానాన్ని విస్మరించిందని బాబీ విమర్శించారు. -
ఇక చాలు.. దయచేయండి
శుక్రవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2026పార్టీ ఇన్చార్జి పదవి నుంచి తొలగించారని తెలిశాక పిఠాపురంలో విలేకర్లతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై నిష్క్రమిస్తున్న వర్మగత నెల 21న పాడా కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు (జనసేన)తో తీవ్ర వాగ్వాదానికి దిగిన వర్మసాక్షి ప్రతినిధి, కాకినాడ: ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవంటారు. అధికారం కోసం జత కట్టిన టీడీపీ, జనసేన మధ్య పిఠాపురంలో ఇది ఇప్పుడు అక్షర సత్యమైంది. అధికారం దక్కే వరకూ భాయీభాయి అంటూ చెయ్యీ చెయ్యీ కలిపి కలియ తిరిగిన ఇరు పార్టీల నేతలు చాలా నెలలుగా కయ్యానికి కాలు దువ్వుతూ, కత్తులు దూసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను ఆ పార్టీ అధిష్టానం తొలగించడం హాట్ టాపిక్గా మారింది. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వర్మను హఠాత్తుగా ఆ పదవి నుంచి తప్పించడంపై ఆయన అనుచరులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కూటమి గద్దెనెక్కిన తరువాత వర్మ వర్గీయులకు, జనసేన శ్రేణులకు దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ఆధిపత్య పోరు తాజా సంఘటనతో తారస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. తరచుగా వివాదాలు పిఠాపురం నుంచి 2014లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచిన వర్మ ఆ తరువాత రెండు పర్యాయాలు ఓటమి పాలయ్యారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జనసేన నేతలకు వర్మ ఒక పట్టాన కొరుకుడు పడటం లేదు. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత పిఠాపురంపై పెత్తనం కోసం జనసేన, టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల అనంతరం పలు సందర్భాల్లో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య తీవ్ర స్థాయి వివాదాలు అనేకం జరిగాయి. కూటమిగా ఉంటూనే ఇరు వర్గాలూ ఢీ అంటే ఢీ అనే రీతిలో కయ్యానికి కాలు దువ్విన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పవన్ గెలుపులో తమ పార్టీ నేతల పాత్ర ఎంతో ఉందని, అందువల్లనే ఆయనకు అంత మెజారిటీ వచ్చిందని వర్మ పదేపదే చెబుతూ వస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో తమనూ భాగస్వామ్యుల్ని చేయాలని, ఆ సందర్భంగా ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు, బ్యానర్లలో పవన్ కల్యాణ్ ఫొటోకు సమాన స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో ఇటీవల రెండు మూడు పర్యాయాలు వర్మ, ఆయన అనుచరులు రచ్చరచ్చ చేశారు. భూపందేరంలో మతలబు ఈ నేపథ్యంలో వర్మను దారిలోకి తెచ్చుకునేందుకు అధిష్టానం ఇటీవల భూ పందేరాన్ని ఎరగా చూపింది. వర్మ కుమారుడి పేరిట ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీకి ఐదు నక్షత్రాల హోటల్ నిర్మాణానికి గాను కాకినాడ గర్ల్స్ పాలిటెక్నిక్ (జీపీటీ) సమీపాన రూ.250 కోట్ల విలువైన 3.4 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ కేటాయింపులో పెద్ద మతలబు దాగి ఉందనే చర్చ నడిచింది. భూమి అంటూ కేటాయించారు తప్ప అది ఏ సర్వే నంబర్లో అనే విషయాన్ని ఆ ఉత్తర్వుల్లో నిర్దిష్టంగా ప్రస్తావించ లేదు. ఇంతలోనే ఏమైందో ఏమో కానీ వర్మకు హఠాత్తుగా ఉద్వాసన పలికారు. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని టీడీపీ సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. దీని వెనుక పై నుంచి కింది స్థాయి వరకూ జనసేన నేతల ఒత్తిళ్లున్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి అసలు ఇన్చార్జినే లేకుండా చేసి పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీకి అడ్రస్ లేకుండా చేయాలనుకుంటున్నారా అని కార్యకర్తలు నిలదీస్తున్నారు. పొమ్మనకుండానే పొగ సహజంగా ఇటువంటి సందర్భాల్లో ఒకింత దూకుడుగా వ్యహరించే వర్మ ఈసారి ఎందుకనో భిన్నంగా ప్రతిస్పందించడం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పైపెచ్చు మంత్రి లోకేష్, జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణ తనతో చర్చించాకనే ఇన్చార్జి పదవి నుంచి తొలగించే నిర్ణయం జరిగిందని ఆయన చెప్పుకు రావడం గమనార్హం. ఇప్పటి వరకూ వర్మ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జితో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఈ జంట పదవులతో భారమవుతోందని, ఈ విషయం చెప్పి, ఒక బాధ్యత నుంచి తప్పించాల్సిందిగా తనకు తానుగానే అభ్యర్థించానని చెప్పుకొచ్చారు. ఈ విషయాల్లో వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ.. ఎప్పటి నుంచో ఉన్న నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి తప్పించడమంటే.. పార్టీ నుంచి పొమ్మనకుండానే పొగబెట్టడం వంటిదేనని తెలుగు తమ్ముళ్లు విశ్లేషించుకుంటున్నారు. పార్టీ వ్యవహారాల్లో ఇదివరకు ఎప్పుడూ ఇటువంటి విధానాలు చూడలేదని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై తగిన కార్యచరణ కోసం వర్మ వర్గీయులు సమాయత్తమవుతున్నారు. ఎమ్మెల్సీ పదవి ఆశ చూపి జెల్ల గత సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం సీటును పొత్తులో భాగంగా జనసేనకు చంద్రబాబు కేటాయించారు. పవన్ కల్యాణ్ కోసం ఈ సీటును త్యాగం చేసిన వర్మకే.. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ఎమ్మెల్సీ పదవి కట్టబెడతామని బహిరంగంగానే మాట ఇచ్చారు. రెండేళ్లుగా ఎంతో మందికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. చివరకు పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు సైతం ఈ పదవి కట్టబెట్టారు. కానీ వర్మకు మాత్రం మొండిచేయి చూపుతూనే వచ్చారు. ఇలా అధినేత చంద్రబాబే ఇచ్చిన మాట తప్పడంతో వర్మ వర్గీయులు తొలి నుంచీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి వర్మ తొలగింపు టీడీపీ అధిష్టానం నిర్ణయం వర్మ వర్గానికి అవమాన భారం జనసేన ఒత్తిళ్లే కారణమా! తెలుగు తమ్ముళ్ల అంతర్మధనం -
ఇద్దరు అంతర్ జిల్లాల దొంగల అరెస్ట్
● రూ.97.50 లక్షల సొత్తు స్వాధీనం ● ఎస్పీ రాహుల్ మీనా వెల్లడి అమలాపురం టౌన్: వారు ఇంటి తలుపుల టవర్ బోల్ట్లు తీయడంలో, ఐరన్ రాడ్తో తాళాలు పగులగొట్టడంలో సిద్ధహస్తులు. ఇంట్లోని వారు నిద్రిస్తుండగానే చడీ చప్పుడు లేకుండా చోరీలు చేయడం వారి నైజం. కొత్తపేట ఓల్డ్ బ్యాంక్ వీధిలోని ఒక డాబా ఇంట్లో గత సంవత్సరం ఆగస్టు 30న జరిగిన చోరీ కేసు దర్యాప్తు చేస్తుండగా తీగ లాగితే డొంక కదిలినట్లు ఆ దొంగల చోరీల చిట్టా బయట పడింది. మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు ఆ ఇద్దరు దొంగలను వల పన్ని పట్టుకున్నారు. వారి నుంచి రూ.97.50 లక్షల సొత్తు రికవరీ చేశారు. కాకినాడ జిల్లా ఏటిమొగ గ్రామానికి చెందిన పొన్నాడ రవిశంకర్ (వీరబాబు), తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామానికి చెందిన వైరా చిరంజీవి ఈ చోరీలకు పాల్పడ్డారు. రవిశంకర్ను కొత్తపేట నాయుడు రైస్ మిల్లు వద్ద, చిరంజీవిని అనపర్తిలో అరెస్టు చేశారు. అమలాపురంలోని తన కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా విలేకరులకు గురువారం ఈ వివరాలు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న 646.361 గ్రాము ల బంగారు నగలు, రూ.2,100 నగదు, మోటారు సైకిల్, స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ను చూపించారు. 14 చోరీల కేసుల్లో సొత్తు స్వాధీనం ఈ అంతర జిల్లాల దొంగలు కోనసీమతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 14 చోరీలకు పాల్పడ్డారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, రావులపాలెం స్టేషన్ పరిధిలో 1, తూర్పు గోదావరి జిల్లా పెరవలి పోలీస్ స్టేషన్ పరిధిలో 3, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్, ఇరగవరం, తణుకు టౌన్, తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో తలో రెండు చోరీలు చేశారు. ఈ 14 చోరీ కేసుల నుంచి మొత్తం రూ.97.50 లక్షల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏ–1పై 120 చోరీలు, ఏ–2పై హత్య కేసు ఈ చోరీల్లో ఏ–1 అయిన రవిశంకర్ ఇప్పటి వరకూ 120 ఇంటి దొంగతనాలకు పాల్పడినట్లు కొత్తపేట పోలీసుల దర్యాప్తులో తేలింది. ఏ–2 అయిన చిరంజీవిపై గతంలో హత్య కేసు కూడా నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. అధికారులు, సిబ్బందికి ఎస్పీ అభినందన అంతర జిల్లాల దొంగలను అరెస్ట్ చేసి సొత్తును రికవరీ చేయడంపై ఎస్పీ మీనా పోలీస్ అధికారులు, క్రైమ్ సిబ్బందిని ప్రశంసించి వారికి నగదు రివార్డులు అందజేశారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్, అమలాపురం క్రైమ్ సీఐ ఎం.గజేంద్రకుమార్, కొత్తపేట ఎస్సై జి.సురేంద్రకుమార్, క్రైమ్ ఎస్సైలు ఎ.పరదేశి, అయితాబత్తుల బాలకృష్ణ, ఏఎస్ఐ ఎం.సుబ్బరాజు, కానిస్టేబుళ్లు లంకాడి శ్రీను, డి.అర్జునరావు, బీడీవీ ప్రసాద్, జి. కృష్ణసాయి, ఎ.శుభాకర్, ఆర్సీహెచ్వీ ప్రసాద్, ఎం.హరిబాబులకు ఎస్పీ మీనా రివార్డులు అందించి అభినందించారు. -
కట్టెయ్యాల్సిందే!
తుని/రాయవరం: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన అనంతరం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచే యోచనేదీ లేదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచేసింది. ఇప్పటికే సిలిండర్ల కొరతతో సతమతమవుతున్న హోటల్ రంగంపై ధరల పెంపు తీవ్ర ప్రభావం చూపుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యాపారం మూసేసుకోవాల్సిందేనని హోటళ్ల యజమానులు వాపోతున్నారు. మొన్నటి వరకూ రూ.2,350గా ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం ఒకేసారి రూ.993 మేర పెంచేసింది. దీంతో, 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా రూ.3,343కు పెరిగింది.వాస్తవానికి జనవరి నుంచి కమర్షియల్ గ్యాస్ ధరను కేంద్రం పెంచుతూనే ఉంది. జనవరి 1న రూ.111, ఫిబ్రవరి 1న రూ.50, మార్చి 1న రూ.31, మార్చి 7న రూ.115, ఏప్రిల్ 1న రూ.218 చొప్పున పెంచగా.. ఈ నెల 1న ఏకంగా రూ.993 మేర బాదేసింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,518 పెరగడంతో చిరు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. యుద్ధ ప్రభావంతో ధరలు పెరుగుతాయనే అంచనాలున్నా.. ఇంత భారీగా పెంచేస్తారని ఊహించలేదని అంటున్నారు. ఇప్పటికే సిలిండర్ల కొరతతో నెట్టుకొస్తున్న తమపై పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర మరింత భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు.మూసివేత దిశగా..పట్టణాలు, నగరాల్లో టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, బడ్డీలు, ధాబాలు, స్వీట్ షాపులు, చాట్ సెంటర్లు, చిన్న చిన్న బిర్యానీ, భోజన హోటళ్లు, బేకరీల్లో వివిధ వంటకాలు, ఆహార పదార్థాల తయారీకి వంట గ్యాస్ తప్పనిసరి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 200 గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లున్నాయి. కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 5 వేలు, కాకినాడ జిల్లాలో 20 వేలు, కోనసీమ జిల్లాలో 1,400 వరకూ ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లో రోజుకు దాదాపు 10 వేల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల వినియోగం ఉండేది.కమర్షియల్ గ్యాస్ ధరను ప్రభుత్వం పెంచేయడంతో ఆయా ఏజెన్సీల్లో వీటి బుకింగ్లు గణనీయంగా పడిపోయాయని నిర్వాహకులు చెబుతున్నారు. తుని నియోజకవర్గంలోని తుని పట్టణం, తుని, తొండంగి, కోటనందూరు మండలాల్లో 7 గ్యాస్ ఏజెన్సీలున్నాయి. వీటిలో డొమెస్టిక్ 1.30 లక్షలు, కమర్షియల్ 931 కనెక్షన్లు ఉన్నాయి. ఇక్కడ కూడా కమర్షియల్ సిలిండర్ల బుకింగ్లది అదే పరిస్థితి.కట్టెలకూ ధరల మంటకొంత మంది చిన్న, మధ్యతరహా హోటళ్ల యజమానులు గ్యాస్కు ప్రత్యామ్నాయంగా కట్టెలు వాడుతున్నారు. దీంతో, వాటి ధరలకు కూడా రెక్కలొచ్చాయి. గతంలో 25 కేజీల వంట చెరకు ధర రూ.170 ఉండగా, గ్యాస్ కొరత ప్రారంభమైన తర్వాత అది రూ.225కు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.ప్రజల పైనే భారంకమర్షియల్ గ్యాస్ ధర పెంపు ప్రభావం నేరుగా హోటళ్లపై పడినప్పటికీ.. పరోక్షంగా ఆ భారాన్ని ప్రజలే భరించాల్సి వస్తోంది. ఇప్పటికే హోటళ్లలో టిఫిన్ల రేట్లు పెంచేశారు. నాలుగు ఇడ్లీల ధర గతంలో రూ.20 ఉంటే ప్రస్తుతం ఆ రేటుకు 3 ఇడ్లీలే ఇస్తున్నారు. ఇంకా, పూరీ, బజ్జీ, దోశ వంటి అన్ని రకాల టిఫిన్ల రేట్లు దాదాపు రెట్టింపయ్యాయి. ఇది కూడా గిట్టుబాటు కావడం లేదని, గ్యాస్ ధర భారం మోయలేక వ్యాపారాలు నిర్వహించలేకపోతున్నామని, ఇలాగైతే కొట్టు కట్టేయాల్సిందేనని వ్యాపారులు వాపోతున్నారు. డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తే పౌర సరఫరాల శాఖ అధికారులు కేసులు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే కొన్ని టిఫిన్ సెంటర్లు, ధాబాలను మూసివేశారు. మరికొన్ని అదే బాటలో పయనిస్తున్నాయి. ఫలితంగా వాటిల్లో పని చేస్తున్న కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. పెద్ద హోటళ్ల యజమానులు సైతం గ్యాస్ ధర పెంపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టిఫిన్ల ధర పెంపుతో ఆన్లైన్ ఆర్డర్లు కూడా తగ్గుతున్నాయని చెబుతున్నారు.గిట్టుబాటు కావడం లేదు ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం హోటల్ నిర్వహిస్తున్నాను. గ్యాస్ ధర పెరగడంతో ఉదయం టిఫిన్లు ఆపేశాను. టిఫిన్ రేట్లు పెంచితే కస్టమర్లు దూరమవుతున్నారు. పెంచకపోతే నిర్వహణ కష్టమవుతోంది. భోజనం ధరలు పెంచాల్సి వచ్చింది. – అనపర్తి జయకృష్ణ, రెస్టారెంట్ యజమాని, రాయవరంకట్టెల పొయ్యిలే దిక్కు గ్యాస్ ధర పెంపు, కొరత కారణంగా ప్రస్తుతం కట్టెల పొయ్యిల పైనే వంట చేయాల్సి వస్తోంది. స్వల్పంగా ధరలు పెంచి, అతి కష్టం మీద నిర్వహిస్తున్నాం.– వి.రాజేష్, హోటల్ నిర్వాహకుడు, రాయవరందాబా మూసేశాంమార్కెట్లో పోటీ ఎక్కువగా ఉంది. ధాబాలు, హోటళ్లలో టిఫిన్లు, ఆహార పదార్థాల ధరలు పెంచితే కస్టమర్లు రావడం లేదు. వ్యాపారం అంతంత మాత్రంగానే ఉన్న ఈ సమయంలో గ్యాస్ ధర రెట్టింపు పెరగడంతో దాబాను మూసేశాం. నలుగురు కార్మీకులు పని చేసేవారు. వారు ఉపాధి కోల్పోయారు.– నాగేశ్వరరావు, ధాబా యజమాని, తుని -
పిఠాపురం వర్మకు బాబు వెన్నుపోటు
సాక్షి, విజయవాడ: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మకి తెలుగు దేశం పార్టీ అధిష్టానం షాకిచ్చింది. ఆయన్ని టీడీపీ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఎంత విధేయంగా ఉన్నా వర్మ తీరుపై చంద్రబాబు ఎందుకనో తీవ్ర అసహనంతో ఉన్న సంగతి తెలిసిందే. పిఠాపురంలో అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి టీడీపీ-జనసేన మధ్య విబేధాలు ఉన్నాయి. సీట్ల పంపకాల టైంలో అది తారాస్థాయికి చేరింది. వర్మకు కాకుండా పొత్తు ధర్మంలో భాగమంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్కు పిఠాపురం సీటును అప్పగించారు చంద్రబాబు. ఈ విషయంలో అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా అధినేత మాటకు లోబడి ఎస్వీఎస్ఎన్ వర్మ సైలెంట్గా ఉండిపోయారు. పవన్ తరఫున ప్రచారం చేయించి మరీ గెలిపించారు. అయితే గెలిచాక కూడా ఇరు పార్టీల మధ్య వర్గ పోరు కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా ఫ్లెక్సీ వార్ ఆ గొడవను తారాస్థాయికి చేరింది. ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటో లేకపోవడంతో హర్టైన వర్మ.. జనసేన వర్గీయులతో వాగ్వాదానికి దిగారు. ఇది దాదాపుగా ఆయనపై దాడి చేసేంత దాకా వెళ్లింది. ఆ టైంలో.. చంద్రబాబు మాట మీద తాము మౌనంగా ఉన్నామని.. ఇక మీదట పరిస్థితి మరోలా ఉంటుందంటూ ఆయన ఆవేశంగా మాట్లాడారు. ఇది చంద్రబాబుకి ఎందుకనో సహించలేదు. పార్టీ మీటింగ్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పరోక్షంగా వర్మను మందలించారు కూడా. అయితే.. మొన్నీమధ్యే జనసేన అధినేత పవన్ కల్యాణ్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో వర్మ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. వర్మ భావోద్వేగంఈ నిర్ణయం వెలువడ్డాక వర్మ పిఠాపురం టీడీపీ ఆఫీస్కు వచ్చారు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘పార్టీ తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. పార్టీ బలోపేతానికి కృషి చేస్తా. పార్టీ ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తా’’ అంటూ మాట్లాడారాయన.పిఠాపురంలో వర్మ పదే పదే రచ్చ చేస్తున్నారని పవన్ ఫిర్యాదు చేయడంతో.. ఇప్పుడు ఆయన్ని ఇంచార్జ్ బాధత్యల నుంచి తప్పించాలని చంద్రబాబు నిర్ణయించారు. నియోజక వర్గంలో వ్యవహారాలను చూసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ పరిణామంపై వర్మ అనుచరులు రగిలిపోతున్నారు. అధినేత కోసం వర్మ అంతలా ఆరాటపడితే.. పవన్ చెప్పుడు మాటలు విని ఇలా చేయడం ఏంటని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్మ నిర్ణయం ఎలా ఉండబోతోందా? అనే ఉత్కంఠ పిఠాపురంలో నెలకొంది. -
చిన వెంకన్నకు రూ. 2.20 కోట్ల రాబడి
ద్వారకా తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయ హుండీల ఆదాయాన్ని బుధవారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో లెక్కించారు. ఏలూరు జిల్లా దేవదాయ శాఖ అధికారి కె.శ్రీనివాసు పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపులో స్వామివారికి విశేష ఆదాయం సమకూరింది. గడచిన 20 రోజులకు గాను నగదు రూపేణా రూ.2,20,68,980 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వి.త్రినాథరావు తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 141 గ్రాముల బంగారం, 3.111 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించాయని వివరించారు. లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2,000, రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ.25,500 లభించినట్టు చెప్పారు. సగటున రోజుకు శ్రీవారికి రూ.11,03,449 ఆదాయం వచ్చినట్టు ఈఓ పేర్కొన్నారు. లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు. -
11న అప్రెంటీస్ మేళా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని వివిధ కంపెనీలకు సంబంధించి ఈ నెల 11న ప్రధాన మంత్రి అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ వేణుగోపాలవర్మ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఐటీఐలో వివిధ ట్రేడుల్లో ఉత్తీర్ణులై, ఎన్టీసీ సర్టిఫికెట్ కలిగిన విద్యార్థులు దీనికి హాజరు కావచ్చన్నారు. ఇతర వివరాలకు 94404 08182 నంబరులో సంప్రదించాలని సూచించారు. 9న స్విమ్మింగ్ క్రీడాకారుల ఎంపికలు నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటీ): ఈ నెల 9న జిల్లా స్థాయి స్విమ్మింగ్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా స్విమ్మింగ్ సంఘం కార్యదర్శి ఐ.రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 24న కర్నూలు జిల్లాలో జరిగే అంతర్ జిల్లాల స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కాకినాడలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) మైదానం స్విమ్మింగ్ పూల్లో జరిగే ఎంపికలకు ఆసక్తి గల పురుషులు, మహిళలు హాజరు కావాలని కోరారు. జీజీహెచ్ విస్తరణకు కృషి కాకినాడ క్రైం: జీజీహెచ్ విస్తరణకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. జిల్లా పర్యటన సందర్భంగా కాకినాడ జీజీహెచ్కు వచ్చిన ఆయన డీ అడిక్షన్ సెంటర్ను సందర్శించి, చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. అనంతరం విభాగాధిపతులతో సమావేశమై, ఆయా యూనిట్లలో అందుతున్న వైద్య సేవలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అత్యవసర సేవల నాణ్యతకు తగిన కార్యాచరణ రూపొందించి, అమలు చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్కు సూచించారు. సమావేశంలో ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. లక్ష టన్నుల ధాన్యం సేకరణ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రబీ ధాన్యం సేకరణ లక్ష్యం 3 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇప్పటి వరకూ లక్ష మెట్రిక్ టన్నులు సేకరించామని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. కలెక్టర్లో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రబీ ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు. సేకరించిన ధాన్యానికి సంబంధించి రైతుల ఖాతాల్లో రూ.213.53 కోట్లు జమ చేయాల్సి ఉండగా ఇప్పటికే రూ.211.46 కోట్లు జమ చేశామని చెప్పారు. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. గత ఖరీఫ్లో సీఎంఆర్ కింద 58 రైస్ మిల్లుల నుంచి 20 వేల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉందన్నారు. సీఎంఆర్ రైస్ను త్వరగా అందజేయాలని మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. రబీ ధాన్యం సేకరణ విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా అధికారుల దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కరిస్తామని జేసీ అపూర్వ భరత్ చెప్పారు. హుండీ ఆదాయం రూ.19.31 లక్షలు ఆలమూరు: చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయ హుండీల ఆదాయం లెక్కింపు బుధవారం జరిగింది. రామచంద్రపురం దేవదాయ శాఖ తనిఖీ ఇన్స్పెక్టర్ ఆర్.బాలాజీ రాంప్రసాద్, ఆలయ కమిటీ చైర్మన్ వీరి అప్పారావు, ఈఓ వుండవల్లి వీర్రాజు ఆధ్వర్యంలో స్థానిక ఆలయ ముఖ మండపంలో దేవదాయ శాఖ సిబ్బంది, మహిళా భక్త బృంద భక్తులు ఈ హుండీలను లెక్కించారు. గత నెల 4 నుంచి ఈ నెల 6వ తేదీ వరకూ (32 రోజులు) రూ.19.31 లక్షల ఆదాయం లభించినట్లు ఈఓ వీర్రాజు తెలిపారు. భర్త చనిపోతే భార్యకు పింఛన్ అమలాపురం రూరల్: భర్త పింఛను పొందుతూ చనిపోతే భార్యకు స్పౌజ్ పింఛన్ మార్పు చేసి అందిస్తామని డీఆర్డీఏ పీడీ రాంబాబు బుధవారం తెలిపారు. త్వరలోనే వీటిని మంజూరు చేయనున్నామని తెలిపారు. -
గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026
–8లో..లోవ దేవస్థానం ఈఓ పెన్మత్స విశ్వనాథరాజు కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం ఈఓ జగన్మోహన శ్రీనివాస్ కాకినాడ బాలా త్రిపుర సుందరి ఆలయ ఈఓ వుండవల్లి వీర్రాజు చౌదరిజిల్లా దేవదాయ అధికారి వెంకటేశ్వరరావు ఫ దేవదాయ శాఖ బదిలీల్లో నిబంధనలకు నీళ్లు! ఫ ఇష్టానుసారం ఈఓల నియామకాలు ఫ భారీగా డబ్బు చేతులు మారుతోందని ఆరోపణలుజిల్లా అధికారి నియామకం పైనా విమర్శలుకాకినాడ జిల్లా దేవదాయ శాఖ అధికారి కనపర్తి నాగేశ్వరరావు మార్చి 31న ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో పుష్కర కాలం క్రితమే గ్రేడ్–1 ఈఓగా పదోన్నతి పొందిన, సీనియర్ అయిన నడకుదురు గ్రూపు టెంపుల్స్ ఈఓ తలాటం సూర్యనారాయణను ఏప్రిల్ 1న నియమించారు. అయితే, ఆ శాఖలో ఉన్నత స్థాయి అధికారుల కనుసన్నల్లో చక్రం తిప్పుతున్న ఓ కోటరీ నెల రోజులు దాటీ దాటగానే సూర్యనారాయణను సాగనంపేసింది. దీనికి సరైన కారణం కూడా చూపించకపోవడంతో ఆ శాఖ ఉద్యోగులే విస్మయానికి గురయ్యారు. సూర్యనారాయణ స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న వి.వెంకటేశ్వరరావును ఉద్యోగోన్నతిపై కాకినాడ జిల్లా దేవదాయ శాఖాధికారిగా నియమించారు. వాస్తవానికి ఈ పోస్టింగ్ ఇవ్వాలంటే సీనియర్ గ్రేడ్–1 ఈఓ లేదా ఆ శాఖలో సూపరింటెండెంట్ హోదా అయినా ఉండాలి. అమలాపురంలో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న సమయంలో వెంకటేశ్వరరావుపై ఏసీబీ కేసు పెండింగ్లో ఉందని ఆ శాఖ ఉద్యోగులు బహిరంగంగా చెప్పుకొంటున్నారు. ఈ కేసు తేలకుండానే ఆయనకు ఉద్యోగోన్నతి కల్పించి, జిల్లా అధికారిగా నియమించడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో జిల్లా దేవదాయ శాఖ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి చక్రం తిప్పినట్టు ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జిల్లాలో సీనియర్ గ్రేడ్–1 ఈఓలు ఎంతో మంది ఉండగా రెండు జిల్లాల అవతల నుంచి అది కూడా గ్రేడ్–1కు అర్హత లేని వారిని ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: కొంతమంది అక్రమార్కులకు దేవదాయ శాఖ రూ.లక్షలు కురిపించే కల్పవృక్షంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. పైసలిస్తే చాలు హోదాలు, మార్గదర్శకాలను గాలికొదిలేసి మెచ్చిన వారికి నచ్చిన సీటు కట్టబెట్టేస్తున్నారు. ఆదాయం దండిగా వచ్చే ఆలయాలకు పోస్టింగ్లు ఇవ్వడంలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో ఇటీవల జరిగిన ఈఓల బదిలీలపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇంకా.. ఫ ఉమ్మడి తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పేరెన్నికగన్న తుని తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానం ఈఓగా డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారిని నియమించాలి. కానీ, ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ హోదా కలిగిన పెన్మత్స విశ్వనాథరాజును ఈఓగా కొనసాగిస్తున్నారు. లోవ దేవస్థానం ప్రసాదం తయారీలో నాణ్యత లేకపోవడంతో ఆహార నియంత్రణ శాఖ అధికారులు కొన్నాళ్ల కిందట దాడులు చేసి, జరిమానా విధించారు. ఇక్కడ డీసీ స్థాయి అధికారి లేకపోవడమే దీనికి కారణమనే విశ్లేషణలు అప్పట్లో సిబ్బంది నుంచి వచ్చాయి. ఫ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి దేవస్థానానికి అసిస్టెంట్ కమిషనర్ హోదా కలిగిన ఈఓను నియమించాలి. కానీ, ఇక్కడ పెద్దాపురం మహారాణి సత్రం గ్రేడ్–2 ఈఓగా ఉన్న కాట్నం జగన్మోహన శ్రీనివాస్ను నియమించారు. గ్రేడ్–1 సీనియార్టీ కలిగిన ఎంతో మంది వారి అర్హత కంటే తక్కువ స్థాయి ఆలయాల్లో ఈఓలుగా పని చేస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరికీ అవకాశం ఇవ్వకుండా నిబంధనలు పక్కన పెట్టి మరీ గ్రేడ్–2 ఈఓను కుక్కుటేశ్వరస్వామి ఆలయంలో నియమించారు. అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి లేకపోవడంతో ఇక్కడ యంత్రాంగం మధ్య సమన్వయంలోపించి, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విమర్శలున్నాయి. ఈ కారణంగానే అప్పటి కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందుమాధవ్ మహాశివరాత్రి వేడుకల ఏర్పాట్లను స్వయంగా చక్కబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి యంత్రాంగం భక్తుల కంటే నిత్యం అధికార పార్టీ నేతల సేవలోనే తరిస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఫ వాస్తవానికి అసిస్టెంట్ కమిషనర్ హోదా కలిగిన అల్లు వెంకట దుర్గాభవాని పిఠాపురం ఆలయ ఈఓగా పని చేసేవారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాగానే ఆమెను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ పంచారామ క్షేత్రానికి బదిలీ చేయడం గమనార్హం. ఫ చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చీ రాగానే కాకినాడ బాలా త్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి గ్రేడ్–1 ఈఓగా ఉన్న చింతపల్లి విజయభాస్కర్రెడ్డిని తప్పించారు. ఆయన స్థానంలో కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో గ్రేడ్–2 ఈఓగా ఉన్న వుండవల్లి వీర్రాజు చౌదరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులు పట్టుబట్టి మరీ ఆయనను నియమించుకున్నారనే విమర్శలున్నాయి. ఫ కాకినాడ సినిమా రోడ్డులోని మంత్రిప్రగడ వారి సత్రం ఈఓగా గ్రేడ్–1 కేడర్ అధికారిని నియమించాలి. కానీ, ఇక్కడ గ్రేడ్–2 ఈఓ శ్రీనివాస్ను నియమించారు. ఆయనకు కాకినాడ గాంధీనగర్ ఆలయంతో పాటు కాకినాడ రూరల్ కొవ్వూరు వారాహి అమ్మవారి దేవస్థానం ఇన్చార్జి బాధ్యతలు సైతం అప్పగించారు. ఇక్కడ గ్రేడ్–1 ఈఓగా ఉన్న సౌజన్యను తప్పించి గ్రేడ్–2 ఈఓ శ్రీనివాస్కు అదనపు బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఇలా హోదాలు, కేడర్లతో పని లేకుండా మెచ్చిన వారికి నచ్చిన సీటును ఇష్టారాజ్యంగా కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కట్టెయ్యాల్సిందే!
తుని/రాయవరం: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన అనంతరం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచే యోచనేదీ లేదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచేసింది. ఇప్పటికే సిలిండర్ల కొరతతో సతమతమవుతున్న హోటల్ రంగంపై ధరల పెంపు తీవ్ర ప్రభావం చూపుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యాపారం మూసేసుకోవాల్సిందేనని హోటళ్ల యజమానులు వాపోతున్నారు. మొన్నటి వరకూ రూ.2,350గా ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం ఒకేసారి రూ.993 మేర పెంచేసింది. దీంతో, 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా రూ.3,343కు పెరిగింది. వాస్తవానికి జనవరి నుంచి కమర్షియల్ గ్యాస్ ధరను కేంద్రం పెంచుతూనే ఉంది. జనవరి 1న రూ.111, ఫిబ్రవరి 1న రూ.50, మార్చి 1న రూ.31, మార్చి 7న రూ.115, ఏప్రిల్ 1న రూ.218 చొప్పున పెంచగా.. ఈ నెల 1న ఏకంగా రూ.993 మేర బాదేసింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,518 పెరగడంతో చిరు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. యుద్ధ ప్రభావంతో ధరలు పెరుగుతాయనే అంచనాలున్నా.. ఇంత భారీగా పెంచేస్తారని ఊహించలేదని అంటున్నారు. ఇప్పటికే సిలిండర్ల కొరతతో నెట్టుకొస్తున్న తమపై పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర మరింత భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. మూసివేత దిశగా.. పట్టణాలు, నగరాల్లో టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, బడ్డీలు, ధాబాలు, స్వీట్ షాపులు, చాట్ సెంటర్లు, చిన్న చిన్న బిర్యానీ, భోజన హోటళ్లు, బేకరీల్లో వివిధ వంటకాలు, ఆహార పదార్థాల తయారీకి వంట గ్యాస్ తప్పనిసరి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 200 గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లున్నాయి. కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 5 వేలు, కాకినాడ జిల్లాలో 20 వేలు, కోనసీమ జిల్లాలో 1,400 వరకూ ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లో రోజుకు దాదాపు 10 వేల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల వినియోగం ఉండేది. కమర్షియల్ గ్యాస్ ధరను ప్రభుత్వం పెంచేయడంతో ఆయా ఏజెన్సీల్లో వీటి బుకింగ్లు గణనీయంగా పడిపోయాయని నిర్వాహకులు చెబుతున్నారు. తుని నియోజకవర్గంలోని తుని పట్టణం, తుని, తొండంగి, కోటనందూరు మండలాల్లో 7 గ్యాస్ ఏజెన్సీలున్నాయి. వీటిలో డొమెస్టిక్ 1.30 లక్షలు, కమర్షియల్ 931 కనెక్షన్లు ఉన్నాయి. ఇక్కడ కూడా కమర్షియల్ సిలిండర్ల బుకింగ్లది అదే పరిస్థితి. ప్రజల పైనే భారం కమర్షియల్ గ్యాస్ ధర పెంపు ప్రభావం నేరుగా హోటళ్లపై పడినప్పటికీ.. పరోక్షంగా ఆ భారాన్ని ప్రజలే భరించాల్సి వస్తోంది. ఇప్పటికే హోటళ్లలో టిఫిన్ల రేట్లు పెంచేశారు. నాలుగు ఇడ్లీల ధర గతంలో రూ.20 ఉంటే ప్రస్తుతం ఆ రేటుకు 3 ఇడ్లీలే ఇస్తున్నారు. ఇంకా, పూరీ, బజ్జీ, దోశ వంటి అన్ని రకాల టిఫిన్ల రేట్లు దాదాపు రెట్టింపయ్యాయి. ఇది కూడా గిట్టుబాటు కావడం లేదని, గ్యాస్ ధర భారం మోయలేక వ్యాపారాలు నిర్వహించలేకపోతున్నామని, ఇలాగైతే కొట్టు కట్టేయాల్సిందేనని వ్యాపారులు వాపోతున్నారు. డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తే పౌర సరఫరాల శాఖ అధికారులు కేసులు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే కొన్ని టిఫిన్ సెంటర్లు, ధాబాలను మూసివేశారు. మరికొన్ని అదే బాటలో పయనిస్తున్నాయి. ఫలితంగా వాటిల్లో పని చేస్తున్న కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. పెద్ద హోటళ్ల యజమానులు సైతం గ్యాస్ ధర పెంపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టిఫిన్ల ధర పెంపుతో ఆన్లైన్ ఆర్డర్లు కూడా తగ్గుతున్నాయని చెబుతున్నారు. కట్టెలకూ ధరల మంట కొంత మంది చిన్న, మధ్యతరహా హోటళ్ల యజమానులు గ్యాస్కు ప్రత్యామ్నాయంగా కట్టెలు వాడుతున్నారు. దీంతో, వాటి ధరలకు కూడా రెక్కలొచ్చాయి. గతంలో 25 కేజీల వంట చెరకు ధర రూ.170 ఉండగా, గ్యాస్ కొరత ప్రారంభమైన తర్వాత అది రూ.225కు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.ఫ హోటళ్లపై కమర్షియల్ గ్యాస్ ధరాభారం ఫ ఒకేసారి రూ.993 మేర బాదేసిన కేంద్రం ఫ ఇప్పటికే మూత పడుతున్న టిఫిన్ సెంటర్లు ఫ ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని యజమానుల డిమాండ్ ధాబా మూసేశాం మార్కెట్లో పోటీ ఎక్కువగా ఉంది. ధాబాలు, హోటళ్లలో టిఫిన్లు, ఆహార పదార్థాల ధరలు పెంచితే కస్టమర్లు రావడం లేదు. వ్యాపారం అంతంత మాత్రంగానే ఉన్న ఈ సమయంలో గ్యాస్ ధర రెట్టింపు పెరగడంతో ధాబాను మూసేశాం. నలుగురు కార్మికులు పని చేసేవారు. వారు ఉపాధి కోల్పోయారు. – నాగేశ్వరరావు, ధాబా యజమాని, తునిగిట్టుబాటు కావడం లేదు ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం హోటల్ నిర్వహిస్తున్నాను. గ్యాస్ ధర పెరగడంతో ఉదయం టిఫిన్లు ఆపేశాను. టిఫిన్ రేట్లు పెంచితే కస్టమర్లు దూరమవుతున్నారు. పెంచకపోతే నిర్వహణ కష్టమవుతోంది. భోజనం ధరలు పెంచాల్సి వచ్చింది. – అనపర్తి జయకృష్ణ, రెస్టారెంట్ యజమాని, రాయవరం కట్టెల పొయ్యిలే దిక్కు గ్యాస్ ధర పెంపు, కొరత కారణంగా ప్రస్తుతం కట్టెల పొయ్యిల పైనే వంట చేయాల్సి వస్తోంది. స్వల్పంగా ధరలు పెంచి, అతి కష్టం మీద నిర్వహిస్తున్నాం. – వి.రాజేష్, హోటల్ నిర్వాహకుడు, రాయవరం -
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: రత్నగిరికి బుధవారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. సత్యదేవుని సన్నిధిలోను, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోను మంగళవారం రాత్రి పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధువులు, మిత్రులకు ఇతర భక్తులు కూడా తోడవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 30 వేల మంది స్వామివారి దర్శనానికి రావడంతో క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. నవ దంపతులను అంతరాలయ దర్శనానికి అనుమతించారు. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. వివాహాల కారణంగా రత్నగిరిపై ఆదివారం వరకూ భక్తుల రద్దీ కొనసాగనుంది. ఇంటర్ సప్లిమెంటరీకి పటిష్ట ఏర్పాట్లు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాధ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 21 నుంచి జూన్ 4 వరకూ జరగనున్న ఇంటర్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 40 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 24,072 మంది హాజరు కానున్నారని చెప్పారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. -
సంక్షేమ పథకాలు అమలు చేయాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): భవన నిర్మాణ కార్మికులకు 9 సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఐటీయూ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ బుల్లిరాణికి వినతిపత్రం సమర్పించారు. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబీరాణి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చెక్కల రాజ్కుమార్ మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భవన నిర్మాణ కార్మికుని కుమార్తె వివాహ బహుమతిగా రూ.40 వేలు చెల్లించేలా కార్మిక శాఖకు ఆదేశాలివ్వాలని కోరారు. పథకాలు పొందేందుకు కార్మిక శాఖ అధికారులు స్థానిక కార్యాలయాల్లో నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అందుకు వీలుగా ఖాళీ పోస్టులను తక్షణం భర్తీ చేయాలని, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బకాయి పెట్టిన రూ.5 కోట్లు కార్మికుల కుటుంబాలకు చెల్లించాలని, 2020 నాటి గుర్తింపు కార్డులను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆకుల సత్యనారాయణ, వై.సత్యనారాయణ, పప్పుల వీరబాబు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. -
‘అమరావతి పేరుతో చంద్రబాబు తప్పులపై తప్పులు’
సాక్షి, కాకినాడ జిల్లా: కలెక్టరేట్ వద్ద మాజీ ఎంపీ చింతా మోహన్ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిని ఎంత మంది ప్రజలు కోరుకుంటున్నారని చంద్రబాబును అడుగుతున్నా? అంటూ నిలదీశారు. కాసేపు అమరావతి దేవతల రాజధాని అంటాడు. మరికాసేపు మనుషుల రాజధాని అంటాడు. రేపు ఏ రాజధాని అంటాడో తెలియదు’’ అంటూ చింతా మోహన్ మండిపడ్డారు.రాజధాని ప్రాంతంలో కర్ర తుమ్మలు కొట్టడానికే రూ.40-50 కోట్లు ఖర్చు చేశారు. సచివాలయం భవనాలకు అద్దాలను బిగించేందుకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేయడం అవసరమా చంద్రబాబు?. రాష్ట్రం అప్పల్లో ఉంది.. చంద్రబాబు చాలా తప్పులు చేస్తున్నాడు. సచివాలయానికి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఒంగోలు నుండి కూడా ఒక్కరు రావడం లేదు. రాజధానిని చంద్రబాబు తన సొంత ఆలోచనతో చేసుకుంటున్నాడు’’ అంటూ చింతా మోహన్ ధ్వజమెత్తారు. -
ఆర్డీఓ శ్రీరమణి సస్పెన్షన్ రద్దు
సామర్లకోట: పెద్దాపురం ఆర్డీఓ కె.శ్రీరమణి సస్పెన్షన్ను రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో ఫిబ్రవరి 28న 28 మంది మరణానికి కారణమైన బాణసంచా విస్ఫోటంలో పోలీసు, రెవెన్యూ అగ్నిమాపక, కార్మిక శాఖల డివిజన్ స్థాయి అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం విదితమే. దీనిలో భాగంగా నాడు పెద్దాపురం ఆర్డీఓగా ఉన్న శ్రీరమణి కూడా సస్పెన్షన్కు గురయ్యారు. సామర్లకోట మండలం ఏర్పడినప్పటి నుంచీ కాకినాడ డివిజన్లోనే ఉంది. ఆర్డీఓ సస్పెండ్ అవడానికి నెల రోజుల ముందే ఈ మండలాన్ని పెద్దాపురం డివిజన్లో విలీనం చేశారు. ఈ నేపథ్యంలో ఈ సంఘటనతో ఆర్డీఓకు అంతగా సంబంధం లేదంటూ ఉన్నతాధికారుల నుంచి ప్రభుత్వానికి నివేదిక వెళ్లింది. దీనికి తోడు రెవెన్యూ సంఘ నాయకులు కూడా ఈ విషయంపై వినతి పత్రాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై విచారణ జరిపి, శ్రీరమణి సస్పెన్షన్ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమెను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఆమె పోస్టింగ్పై జీఓలో స్పష్టత ఇవ్వలేదు. పెద్దాపురం ఆర్డీఓగానే పోస్టింగ్ ఇస్తారా లేక మరోచోట నియమిస్తారా అనే విషయంపై చర్చ జరుగుతోంది. రెవెన్యూ సంఘాలు మాత్రం ఆమెకు పెద్దాపురంలోనే పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నాయి. -
విజయానికి సాక్షిగా..
పిఠాపురం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులు తమ ప్రతిభకు మరింత పదును పెట్టుకునేలా.. విజయ సోపానాలు అధిరోహించేలా.. పది మందిలో సగర్వంగా తలెత్తుకునేలా ‘సాక్షి’ తోడ్పాటునందించింది. ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా.. ‘సాక్షి’ దినపత్రిక అందించిన స్టడీ మెటీరియల్ అనేక మంది విద్యార్థులకు బాసటగా నిలిచింది. గణితం, సైన్స్ సబ్జెక్టులపై నిపుణుల ఆధ్వర్యాన రూపొందించిన ఈ మెటీరియల్ను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘సాక్షి’ ఉచితంగా అందించింది. అంతే కాకుండా పత్రికలో ప్రతి రోజూ సబ్జెక్టుల వారీగా నిపుణుల సూచనలతో పాఠాలు ప్రచురించింది. రోజువారీ బోధనకు తోడు ఈ మెటీరియల్, పాఠాల ఆధారంగా ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు ఇవ్వడమే కాకుండా అవగాహన కోసం పరీక్షలు నిర్వహించారు. ఫలితంగా సబ్జెక్టులపై పట్టు పెరిగి, వార్షిక పరీక్షల్లో ఎంతో మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు దీటుగా అత్యుత్తమ మార్కులు సాధించారు. గొల్లప్రోలులోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులే దీనికి ఉదాహరణగా నిలిచారు. ఈ పాఠశాల నుంచి టెన్త్ పరీక్షలకు 144 మంది హాజరవగా 131 మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో 22 మంది విద్యార్థినులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. నాణ్యమైన కంటెంట్, సులభమైన వివరణలతో ‘సాక్షి’ అందించిన మెటీరియల్ తమను టాపర్లుగా నిలిపిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫ టెన్త్లో గొల్లప్రోలు జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ ప్రతిభ ఫ 22 మందికి 500కు పైగా మార్కులు ఫ ‘సాక్షి’ మెటీరియల్తోనే ఈ ఘనత సాధించామన్న విద్యార్థినులు -
ఈవెంట్ మేనేజ్మెంట్లా చంద్రబాబు పాలన
సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు పాలన ఈవెంట్ మేనేజ్మెంట్ తరహాలో నడుస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విమర్శించారు. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు ప్రచార ఆర్భాటంగానే మిగులుతున్నాయని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న అధ్యక్షతన కాకినాడలో మంగళవారం జరిగిన పార్టీ సంస్థాగత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెండేళ్ల కూటమి పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. దాదాపు అన్ని వర్గాల ప్రజలూ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. ఈ రెండేళ్లలో టీడీపీ మూడో స్థానానికి దిగజారిపోయిందన్నారు. అదే సమయంలో వైఎస్సార్ సీపీ బలమైన పక్షంగా ప్రజలకు అండగా ఉంటోందని చెప్పారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేసేశామని చంద్రబాబు నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్నారని దుయ్యబట్టారు. పరిపాలన గాడిద తప్పిందని, ప్రభుత్వాసుపత్రుల్లో కనీసం మందులు కూడా లేవని ఆక్షేపించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలలో మోసం జరిగిందంటూ దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చపై ఎన్నికల కమిషన్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ మార్గదర్శకాల ప్రకారం సంస్థాగత నిర్మాణానికి కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేయాలని రాజా పిలుపునిచ్చారు. పది రోజుల్లో గ్రామ, వార్డు స్థాయిల్లో పార్టీ సభ్యుల డిజిటలైజేషన్, పార్టీ కేంద్ర కార్యాలయానికి అప్లోడ్ చేయడం పూర్తి చేయాలని చెప్పారు. సభ్యత్వ నమోదులో అన్నీ పక్కాగా నిర్వహించిన పార్టీ కాకినాడ సిటీ నియోజకవర్గ శ్రేణులను ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన నియోజవర్గాల్లో సంస్థాగత నిర్మాణం పటిష్టంగా చేపట్టాలని అన్నారు. కూటమి ప్రభుత్వంలో మోసపోయిన వర్గాలను చేరదీయాలని నాయకులకు సూచించారు. సమన్వయంతో కదలాలి వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు మాట్లాడుతూ, వార్డు స్థాయిలో పార్టీ సభ్యుల డిజిటలైజేషన్ను సమన్వయంతో పూర్తి చేయాలని అన్నారు. ఈ విషయంలో పార్టీ వార్డు ఇన్చార్జిలు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ నెల 16, 17 తేదీల్లో పార్టీ అధ్యక్షుని సమక్షంలో జరిగే సమావేశం నాటికి సంస్థాగత నిర్మాణ ప్రక్రియ పూర్తి కావాలని చెప్పారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ, కార్యకర్తలందరూ సమష్టిగా కృషి చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉందన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు, నాయకులకు అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తుందని అన్నారు. ఓటర్ల సవరణపై అప్రమత్తంగా ఉండాలి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కాకినాడ సిటీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, ప్రజల కోసం పార్టీ తలపెట్టే ప్రతి ఆందోళనలోనూ కార్యకర్తలు ముందుండాలని పిలుపునిచ్చారు. ఓటర్ల సవరణ ప్రక్రియలో పార్టీ సీనియర్ నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఓట్ల తొలగింపునకు చంద్రబాబు, లోకేష్ చేసే కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఒమ్మి రఘురాం మాట్లాడుతూ, ఓటర్ల సవరణ ప్రక్రియ సందర్భంగా పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించకుండా ప్రతి నాయకుడూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి దీప్తికుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ హయాంలో ప్రచారం తప్ప అభివృద్ధి లేదని, అన్ని వర్గాల ప్రజలూ అసంతృప్తితో ఉన్నారని అన్నారు. తొలుత పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు సిగల మధు, మంగరాజు, పోలిశెట్టి నాగేశ్వరరావుల మృతికి సంతాప సూచకంగా పార్టీ నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ), మాజీ డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కుమార్, ప్రచార విభాగం ఉపాధ్యక్షుడు రావూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.సమావేశానికి హాజరైన పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మాట్లాడుతున్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చిత్రంలో జెడ్పీ చైర్మన్ విప్పర్తి, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, పార్టీ పరిశీలకుడు సూర్యనారాయణరాజు తదితరులు ఫ కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఫ అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి ఫ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఫ కాకినాడలో పార్టీ సంస్థాగత సమావేశం -
నమూనా ఆలయం వద్ద డ్రైన్, ఫ్లోరింగ్
అన్నవరం: జాతీయ రహదారిపై రాజమహేంద్రవరం – విశాఖపట్నం మార్గంలోని సత్యదేవుని నమూనా ఆలయం వద్ద వాన నీరు నిలవకుండా అన్నవరం దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. ఇక్కడ వర్షపు నీరు నిలిచిపోతూండటంతో ఆలయానికి, ప్రసాదాల కౌంటర్ వద్దకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ‘నీ దరి చేరేదెలా స్వామీ!’ శీర్షికన సోమవారం ప్రచురించిన కథనం ద్వారా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్పందించి, అక్కడ వాన నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు నమూనా ఆలయం వద్ద వాన నీరు పోయేలా డ్రైన్ తవ్వి, దానిపై కాంక్రీట్ ఫ్లోరింగ్ చేస్తున్నారు. రెండు రోజుల్లో ఈ పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఉద్యోగులకు జీతాలు చెల్లింపు గత మూడేళ్లుగా దేవస్థానంలో ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు ప్రతి నెలా ఒకటో తేదీనే చెల్లిస్తున్నారు. కానీ, ఈ నెలలో జాప్యం జరగడంతో పలువురు పెన్షనర్లు ఫోన్ల ద్వారా అధికారులను ఆరా తీశారు. దీనిపై ‘జీతాలు, పెన్షన్లు ఆలశ్యంపై చర్చ’ శీర్షికన ‘సాక్షి’ మంగళవారం ప్రచురించిన వార్తకు అధికారులు స్పందించారు. ఈ మేరకు ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించారు. సంబంధిత చెక్కులపై ఈఓ సూర్యచక్రధరరావు సంతకాలు చేశారు. -
పదోన్నతికి పైసలివ్వాల్సిందే..
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పదోన్నతులు రావడంతో గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులు ఆనందంలో మునిగిపోయారు. సరిగ్గా ఇదే అదునుగా పదోన్నతుల పేరిట భారీ దోపిడీకి ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు పన్నాగం పన్నారు. రూ.20 వేలు ఇవ్వకుంటే పదోన్నతి రాదంటూ అర్హులైన కార్యదర్శులను భయపెట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 196 మంది గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులున్నారు. వీరందరూ 2018, 2020 సంవత్సరాల్లో ఈ పోస్టుల్లో నియమితులయ్యారు. గ్రేడ్–2 కార్యదర్శులకు ప్రభుత్వం ఇటీవల గ్రేడ్–1గా పదోన్నతి కల్పించింది. దీంతో, గ్రేడ్–2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటికి భర్తీకి అర్హులైన వారి జాబితాను రూపొందించాలంటూ పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లా పంచాయతీ కార్యాలయానికి ఆదేశాలు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలోని 196 మంది గ్రేడ్–3 కార్యదర్శులూ అర్హులే కావడంతో ఆ మేరకు జాబితా తయారు చేశారు. సరిగ్గా ఇక్కడే తాళ్లరేవు, కాజులూరు మండలాల్లో పని చేస్తున్న ఇద్దరు గ్రేడ్–2 పంచాయతీ కార్యదర్శులు అవినీతి దందాకు తెర లేపారు. వ్యవహారమంతా తామే చూస్తున్నామని, ఎవరికై నా పదోన్నతి కావాలంటే కమిషనర్ కార్యాలయంలో ముడుపులు చెల్లించాలని, దీనికి గాను ప్రతి ఒక్కరూ రూ.20 వేలు ఇవ్వాల్సిందేనని ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. అడిగినంతా ఇవ్వకుంటే పదోన్నతి రాదంటూ కొంత మంది గ్రేడ్–3 కార్యదర్శులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో, కొంతమంది ఇష్టం లేకపోయినా పదోన్నతి రాకపోతే ఇబ్బందులు పడతామనే భయంతో వారు అడిగినంత డబ్బులూ చెల్లించుకుంటున్నారు. వారు మెక్కేందుకేనా? పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా గ్రేడ్–2 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్–1గా పదోన్నతి కల్పించారు. ఎక్కడా ఒక్క పైసా కూడా డబ్బులు తీసుకోలేదు. కానీ, రగ్రేడ్–2 పదోన్నతులకు మాత్రం కమిషనర్ కార్యాలయంలో ఇవ్వాలంటూ గ్రేడ్–3 కార్యదర్శుల నుంచి జిల్లాలోని అక్రమార్కులు డబ్బులు గుంజుతూండటం హాట్ టాపిక్గా మారింది. కమిషనర్ కార్యాలయం పేరిట పెద్ద మొత్తంలో సొమ్ము నొక్కేసేందుకే వారిద్దరూ స్కెచ్ వేశారని పలువురు పంచాయతీ కార్యదర్శులు బహిరంగానే ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపి, పదోన్నతుల పేరిట ఆ ఇద్దరు కార్యదర్శులు అక్రమంగా వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేలా చూడాలని బాధిత కార్యదర్శులు కోరుతున్నారు. ఫ కమిషనర్ కార్యాలయంలో ఇవ్వాలంటూ వసూళ్లు ఫ ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల అవినీతి దందా ఫ ఒక్కొక్కరి నుంచి రూ.20 వేల గుంజుడు! ఫ బాధిత కార్యదర్శుల గగ్గోలు -
మనోధైర్యంతో చదివి ఉత్తీర్ణులు కావాలి
గొల్లప్రోలు (పిఠాపురం రూరల్): పదో తరగతి తప్పిన విద్యార్థులు మనోధైర్యంతో చదివి, సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అన్నారు. గొల్లప్రోలు, చేబ్రోలుల్లో మంగళవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చేబ్రోలు జెడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు. అనంతరం చేబ్రోలులో ఇంటింటా జనగణన ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. స్థానిక ఈబీసీ కాలనీలో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఐదేళ్లు నిండిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మిల్లు గరువు వద్ద ఉన్న పట్టు పరిశ్రమ శాఖ సముదాయాన్ని కలెక్టర్ పరిశీలించారు. గిట్టుబాటు ధర, ఇతర సౌకర్యాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, గొల్లప్రోలు పీహెచ్సీని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుధ్యం, ఆసుపత్రిలో ఇతర సదుపాయాలను పరిశీలించారు. సూయిజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) ఏర్పాటుకు వివిధ స్థలాలను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) పీడీ ఎన్వీ శివరామ్ ప్రసాద్, గొల్లప్రోలు తహసీల్దార్ జీఎం రాంప్రసాద్, గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసులు, పట్టు పరిశ్రమ శాఖ డీడీ బి.గీతారాణి, ఎంఈఓ బి.వెంట శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 12న జెడ్పీ సమావేశం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 12వ తేదీ ఉదయం 10.30 గంటలకు నిర్వహిస్తున్నారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని సీఈఓ లక్ష్మణరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బడి బస్సులకు నిబంధనలు పాటించాలి బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లాలోని వివిధ విద్యా సంస్థలకు ఉన్న 1,686 బస్సుల నిర్వహణలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా రవాణా శాఖాధికారి కె.శ్రీధర్ అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన బస్సులను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హరినాథరెడ్డి, సిబ్బంది మంగళవారం తనిఖీ చేశారు. బస్సులో ఎమర్జెన్సీ అలారం, ఫైర్సేఫ్టీ, స్పీడ్ గవర్నర్, బ్రేకులు, వాహన సాంకేతికత వంటి అంశాలను పరిశీలించారు. మొత్తం 48 బస్సులను పరిశీలించగా, 19 బస్సులను రిజెక్ట్ చేసి, నోటీసులు జారీ చేశారు. పాలిసెట్లో 90.83 శాతం ఉత్తీర్ణత బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు గత నెల 25 నిర్వహించిన పాలిసెట్లో జిల్లాలోని విద్యార్థులు 90.83 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షకు బాలుర విభాగంలో 6,155 హాజరవగా 5,490 మంది (89.02 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికల విభాగంలో 4,636 మందికి గాను 4,312 మంది (93.01 శాతం) ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర స్థాయిలో పూడి చైతన్య 13, కొడవలి కార్తీక 23, కోట దేవీ వెంకట ప్రసన్న తన్వీశ్రీ 27 ర్యాంకులు సాధించారని పాలిసెట్ కో ఆర్డినేటర్ విజయకుమార్ తెలిపారు. నరసన్న హుండీల ఆదాయం రూ.18,92,187 సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మంగళవారం ఎండోమెంట్స్ అధికారులు నిర్వహించిన వివిధ హుండీల లెక్కింపుల్లో భక్తుల నుంచి విరాళాలు రూపంలో మొత్తం రూ.18,92,187 ఆదాయం చేకూరింది. మార్చి 31 నుంచి మే 5వ తేదీ వరకూ 36 రోజులకు పై ఆదాయం వచ్చింది. ఎండోమెంట్స్ అమలాపురం తనిఖీదారుడు జె.రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో సిబ్బంది ఆలయంలోని హుండీలను తెరచి లెక్కింపు చేపట్టారు. -
బాసటగా నిలిచింది
వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో ‘సాక్షి’ ఇచ్చిన మెటీరియల్ మా విజయానికి బాసటగా నిలిచింది. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతో పాటు ఈ మెటీరియల్ ఆధారంగా పరీక్షలు రాశాను. తద్వారా 570 మార్కులు సాధించాను. – బి.ప్రత్యూష మంచి ప్రోత్సాహం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘సాక్షి’ మంచి ప్రోత్సాహం అందించింది. ఈ మెటీరియల్తో పాటు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు, మెళకువలు అర్థం చేసుకుని, 569 మార్కులు సాధించాను. – హేమ నాగబిందు ఆనందంగా ఉంది ‘సాక్షి’ మోడల్ పేపర్ల సాయంతో ప్రాక్టీస్ చేయడం ద్వారా 567 మార్కులు సాధించగలగడం చాలా ఆనందంగా ఉంది. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలతో పాటు ‘సాక్షి’ పంపిణీ చేసిన మెటీరియల్ చాలా ఉపయోగపడింది. – బి.లక్ష్మీప్రసన్న ఎంతో మేలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించేలా ‘సాక్షి’ అందించిన స్టడీ మెటీరియల్ ఎంతో మేలు చేసింది. దీంతో పాటు ఉపాధ్యాయుల ప్రోత్సాహం, ప్రత్యేక తరగతుల సాయంతో 569 మార్కులు పొందాను. – పాలా సువర్ణ అధిక మార్కులకు దోహదం ‘సాక్షి’ స్టడీ మెటీరియల్ ఆధారంగా మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేశాను. నేను అధిక మార్కులు సాధించడానికి ఇది ఎంతో దోహదపడింది. వార్షిక పరీక్షల్లో 575 మార్కులు పొందాను. – యువ ప్రసన్న -
వివాహితపై లైంగిక దాడికి యత్నం
– కేసు నమోదు తుని రూరల్: తుని మండలం లోవకొత్తూరు గ్రామానికి చెందిన పలివెల శివమణి తనపై లైంగిక దాడికి యత్నించాడని అదే గ్రామానికి చెందిన వివాహిత ఫిర్యాదు చేసింది. ఆదివారం రాత్రి తన కుమార్తెతో ఇంట్లో నిద్రిస్తుండగా బయట నుంచి ఎవరో తలుపు తట్టడంతో తెరిచానన్నారు. తెలుపు తెరవగానే పలివెల శివమణి తన నోరు మూసివేసి నెట్టుకుంకూ ఇంట్లోకి ప్రవేశించి లైంగిక దాడికి యత్నించాడన్నారు. పరిస్థితిని గమనించి భయాందోళనతో కేకలు వేస్తూ కుమార్తెను తీసుకుని బయటకు వచ్చేశానన్నారు. ఈ విషయం ఎవరికై నా తెలియజేస్తే చంపేస్తానని బెదిరించినట్టు ఆమె తెలిపింది. తనకు భర్త లేడని, కుమార్తెతో నివాసం ఉంటున్నట్టు తెలిపింది. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ రూరల్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్టు ఆమె తెలిపింది. శివమణి జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వివాహిత మహిళ నుంచి అందిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై కృష్ణమాచారి తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ ఇన్చార్జి డీఐజీగా జయలక్ష్మి కాకినాడ లీగల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ సీహెచ్ జానకీదేవి వ్యక్తిగత కారణంగా సోమవారం నుంచి సెలవు పెట్టారు. ఆమె స్థానంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మార్కెట్ అండ్ ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న జె.యు.ఎన్ .జయలక్ష్మిని ఇన్చార్జి డీఐజీగా నియమించారు. ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఖాళీ బిందెలతో మహిళల నిరసన గొల్లప్రోలు (పిఠాపురం రూరల్): మంచినీళ్లివ్వండి మహాప్రభో... అంటూ గొల్లప్రోలు పురపాలక సంఘ కార్యాలయం ఎదుట సోమవారం ఖాళీ బిందెలతో మహిళల నిరసన వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా స్థానిక అరుంధతిపేటలో తాగునీరు రావడం లేదని, నాలుగు వార్డుల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మండు వేసవిలో తాగేందుకు గుక్కెడు నీరు లేకపోతే ఎలా అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని, తమ కాలనీలకు తాగు అందివ్వాలని కోరారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారిగా కృపావరం కాకినాడ క్రైం: జిల్లా అగ్నిమాపక శాఖ అధికారిగా సీహెచ్ కృపావరం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో జిల్లా అధికారిగా పనిచేస్తున్న ఆయన సాధారణ బదిలీలలో భాగంగా కాకినాడకు వచ్చారు. ఇదే స్థానంలో పనిచేసిన పివి.రాజేష్ వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనలో చర్యల్లో భాగంగా సస్పెండ్ అయ్యారు. -
రొయ్యల చెరువులో పడి వ్యక్తి మృతి
మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన తాళ్లరేవు: జాతీయ రహదారి 216 చెంతన కోరంగి వంతెన దిగువన గల రొయ్యల చెరువుల్లో పడి వినకోటి సత్తిబాబు(34) దుర్మరణం పాలయ్యాడు. కోరంగి ఎస్ఐ పి.సత్యన్నారాయణ, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు పటవల ఎస్సీపేటకు చెందిన సత్తిబాబు రొయ్యల చెరువుల వద్ద పనిచేస్తున్నాడు. అయితే చెరువు మధ్య భాగంలో చేరే మురుగును తొలగించేందుకు ఏర్పాటు చేసిన యంత్రంలో ప్రమాదవశాత్తూ కాలు చిక్కుకుపోయింది. దీంతో సత్తిబాబు నీటిలో మునిగిపోయి ఊపిరాడక మృతి చెందాడు. గమనించిన ఇతర కూలీలు హుటాహుటిన అతన్ని బయటకు తీసి తాళ్లరేవు సామాజిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, నాలుగేళ్ల కుమారుడు, ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కుటుంబసభ్యులు స్థానిక సామాజిక ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్తితి నెలకొంది. విషయం తెలుసుకున్న కోరంగి ఎస్ఐ సత్యనారాయణ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతోపాటు, చెరువుల యజమాని రఘుతో మాట్లాడారు. మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని చెరువుల యజమాని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
కాసుపత్రులు
కాకినాడ జీజీహెచ్ జీవోటి ఆపరేషన్ థియేటర్ వద్ద ఊడి వేలాడుతున్న సీలింగ్ కాకినాడ జీజీహెచ్ ఓపీ బిల్డింగ్ దుస్థితి జీజీహెచ్ సర్జికల్ భవంతి వద్ద పెచ్చులూడిన స్లాబులు ● సమస్యలకు నిలయంగా ప్రభుత్వాసుపత్రులు ● రేటు నిర్ణయించి మరీ వసూళ్లు ● ‘పవన్’ఇలాకాలో నత్తను తలపిస్తోన్న 100 పడకల ఆస్పత్రి నిర్మాణం సాక్షి ప్రతినిధి, కాకినాడ/నెట్వర్క్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొర సౌకర్యాలతో వైద్యం అందక రోగులు అల్లాడిపోతున్నారు. సేవలకు రేటు నిర్ణయించి మరీ వసూళ్లు చేస్తున్నారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రితో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న ఆస్పత్రులలో పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టులో వైద్యం అందించలేని అనేక విభాగాలు రోగులను నరకాన్ని చూపిస్తున్న పరిస్థితులు కళ్లకు కట్టాయి. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి (జీజీహెచ్) అరకొర వైద్య సేవలు, నాణ్యత లేని సదుపాయాలు, బారులు తీరిన క్యూ లు, చాలని మందులతో రోగులకు నరకం చూపుతోంది. ఓపీ నిత్యం 2,000 పైమాటే. కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, నెఫ్రాలజీ విభాగాలకు వైద్యులే లేరు. అత్యవసర మందులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇన్పేషెంట్లకు సదుపాయాలు లేవు. ప్రసూతి, ఆర్థోపెడిక్ వార్డుల్లో ఇన్పేషెంట్లు ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురు చికిత్స పొందుతున్నారు. గడచిన ఆరు నెలల కాలంలో పలువురు గర్భిణిలు మృత్యువాత పడటం వివాదాస్పదమైంది. ఒక వైద్యురాలు అయితే పాంటోప్రజోల్ ఇంజెక్షన్ గర్భిణికి సరిపడదని తెలిసినా చేసి ఆమె మరణానికి కారణమైంది. సర్జికల్, మెడికల్, గైనకాలజీ విభాగాల్లో సిబ్బంది డబ్బు కోసం జలగల్లా పీడిస్తున్నారనే విమర్శలున్నాయి. తుని ఏరియా ఆసుపత్రిలో రోజుకు 500 ఓపీ ఉంటుంది. ఎక్కువ ధర కలిగిన ఇంజెక్షన్లు, మాత్రలు బయట కొనుగోలు చేసుకోవాలంటూ చీటీ రాసి పంపించేస్తున్నారు. శస్త్రచికిత్సలకు రూ.3,000 వరకు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అన్ని విభాగాలకు కలిపి 43 మంది వైద్యులు ఉండాలి. 26 మందే ఉన్నారు. ట్రామాకేర్ సెంటర్లో 43 మంది సిబ్బందికి ఎనిమిది మందే ఉన్నారు. పిఠాపురం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురంలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం నత్తను తలపిస్తోంది. రోజూ ఈ సీహెచ్సీలో 250 ఓపీ ఉండేది. ప్రస్తుతం 100 లోపు ఉంటోంది. ప్రసూతి, సాధారణ వైద్య సేవలు అంతంతమాత్రంగా అందుతున్నాయి. రోగులు అర్బన్ హెల్త్సెంటర్లకు, కాకినాడ ప్రభుత్వాస్పత్రిని ఆశ్రయిస్తున్నారు. ప్రత్తిపాడు ఏలేశ్వరం నగర పంచాయతీలోని అర్బన్ ఆస్పత్రి శిథిల భవనంలో నడుస్తోంది. వర్షం, ఎండలకు రోగులు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో రూ.96.48 లక్షలతో నూతన భవనం నిర్మించగా ఇటీవల ప్రారంభించారు. ప్రారంభించి నెల రోజులు దాటుతున్నా సేవలు అందడం లేదు. ఆస్పత్రిలో ఆర్థోపెడిక్, చిన్నపిల్లల వైద్యులు లేరు. కాకినాడ రూరల్ మండలం పండూరు పీహెచ్సీలో ఓపీ 100 నుంచి 150 వరకు ఉంటుంది. ఆస్పత్రిలో ఆరు బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వైరల్ ఫీవర్లతో బాధపడుతున్న రోగులకు సరైన వైద్యం అందడం లేదు. ఆస్పత్రిలో ఇన్ పేషెంట్గా తిమ్మాపురం గ్రామానికి మహిళ జ్వరంతో చికిత్స పొందుతోంది. ఇద్దరు వైద్యులలో ఒకరు మెటర్నిటీ లీవ్లో ఉంటే ఆ పోస్టులో డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి వచ్చిన వైద్యురాలు సేవలు అందిస్తున్నారు. 13 మంది సిబ్బంది ఉండాల్సిన ఈ పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు మాత్రమే ఉన్నారు. ప్రసూతి వైద్యం, మత్తు వైద్యులు లేక రోగులు కాకినాడ జీజీహెచ్కు వెళుతున్నారు. శిథిలావస్థలో ఉన్న తుని ఆస్పత్రి భవనంజగ్గంపేట గండేపల్లి మండలం జెడ్ రాగంపేటలో ఉన్న 30 పడకల సీహెచ్సీకి రోజుకి సుమారు 200 మంది రోగులు వస్తుంటారు. డెలివరీ కేసులకు రూ.1,000 వంతున వసూలు చేస్తున్నారు. ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే రోగి బంధువులతో సిబ్బంది వాగ్వావాదానికి దిగుతున్నారు. డెలివరీ అయిన తల్లి, బిడ్డకు మందులు బయట కొనుక్కోవాల్సి వస్తుంది. నర్సింగ్ పోస్టులు మూడు ఖాళీగా ఉన్నాయి. పెద్దాపురం నియోజకవర్గ కేంద్రంలో ఉన్న సామాన్య ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తానని ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయింది. గద్దె నెక్కి రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు 100 పడకల ఆస్పత్రి ఊసేలేదు. పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాలకు ఈ ఆస్పత్రి కీలకం. -
రెండేళ్లు గడవక ముందే ప్రజావిశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం
– జిల్లా పరిషత్తు చైర్మన్ వేణుగోపాలరావు సామర్లకోట: రెండేళ్లు గడవక ముందే కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్తు చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు అన్నారు. సోమవారం స్థానిక లారీ స్టాండ్ వద్ద సూర్య ఫంక్షన్ హాల్లో పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన పార్టీని ఎప్పుడూ ప్రజలు గుర్తు చేసుకొంటారని తెలిపారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీ అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో అధికారం చేపడుతుందని, దానికి ప్రతీ కార్యకర్త నడుం బిగించి కృషి చేయాలన్నారు. జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. గ్రామ స్థాయి నుంచి కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. గుర్తింపు కార్డుల పరిశీలన కార్యక్రమం వేగవంతం చేయాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, పార్టీ అధినేత పార్టీ కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చే విధంగా కార్యాచరణ తీసుకున్నారని, దీనిలో భాగంగానే ఈ సమావేశం ఏర్పాటు చేశారని తెలిపారు. పని చేసే ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. తమిళనాడులో సినీనటుడు విజయ్ జగన్మోహన్రెడ్డి పొటోతో ఎన్నికలలో ప్రచారానికి దిగి విజయం సాధించారనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా బూత్ కమిటీ ఽఅధ్యక్షుడు ఒమ్మి రఘురామ్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతాయని, దీనిని ప్రతీ కార్యకర్త, బూత్ స్థాయి కార్యకర్త గమనించాలన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో లక్షలాది ఓట్ల తొలగింపే దీనికి నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంటు పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు, పెద్దాపురం నియోజకవర్గ పరిశీలకుడు నక్కా శ్రీనగేష్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి జగ్గంపేట పరిశీలకుడు నెక్కంటి సాయిప్రసాద్, పార్టీ రాష్ట్ర అయ్యరక సంఘ అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ, ఉమ్మడి రాష్ట్ర కార్మిక సంఘ మాజీ నాయకుడు దవులూరి సుబ్బారావు, జిల్లా అధికార ప్రతినిధి ఇనుకొండ విష్ణుచక్రం పాల్గొన్నారు. -
ఈ ‘బాబు’ మా కొద్దు!
చీఫ్ కమిషనర్కు వ్యతిరేకంగా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల నిరసన నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులుకాకినాడ రూరల్: అయ్యా బాబు గారు.. మా కొద్దు ఈ బాబు అంటూ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ఆ శాఖకు చెందిన చీఫ్ కమిషనర్ అహ్మద్బాబుకు వ్యతిరేకంగా కాకినాడలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. రమణయ్యపేటలోని వాణిజ్య పన్నుల శాఖ డివిజన్ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఫ్లెక్సీని పట్టుకుని అహ్మద్బాబు ప్రవర్తనా శైలికి వ్యతిరేకంగా కాకినాడ నోడల్ డివిజన్లోని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పెండింగ్లో ఉన్న పదోన్నతులను వెంటనే భర్తీ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు పి.విజయ్కుమార్ మాట్లాడుతూ పునర్వ్యవస్థీకరణ పేరుతో చేపట్టిన చర్యల వలన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్వో కార్యాలయ వ్యవస్థ కారణంగా క్షేత్ర స్థాయి ఉద్యోగుల కొరత ఏర్పడిందని, ప్రభుత్వం పునఃసమీక్ష చేపట్టి ఈ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సంఘ కార్యదర్శి ఏవీవీఎస్ స్వామి, ఎస్.శ్రీను,. ఆర్.నారాయణమూర్తి, గంగాభవాని, నాగ కల్పన, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్.. అంత వీజీ కాదు!
● ఎన్ని అర్జీలు ఇచ్చినా పరిష్కారం సున్నా ● ప్రజాసమస్యల పరిష్కార వేదికపై ప్రజల పెదవి విరుపు ● చిన్న సమస్యలు కూడా పరిష్కారం కాని వైనం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సమస్య చిన్నదైనా దానికి పరిష్కారం మాత్రం రావడం లేదు. అదే సమస్యపై పదేపదే అధికారులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడంతో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) పై జనం పెదవి విరుస్తున్నారు. మండల కేంద్రాల్లో తమ గోడు పట్టించుకొనకపోవడంతో జిల్లా కేంద్రంలోని పీజీఆర్ఎస్కు వచ్చినా ఇక్కడ అదే తంతు కొనసాగుతుందోనని ప్రజలు మండిపడుతున్నారు. మంచినీటి కుళాయి ఇవ్వడం లేదని, అర్హత ఉన్నా పింఛన్ మంజూరు చేయడం లేదని, రైతు భరోసా నిధులు జమ కావడం లేదని, రీ సర్వేలో తమ భూమి తక్కువగా నమోదయ్యిందని ప్రజలు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ నిర్వహించిన పీజీఆర్ఎస్లో 435 అర్జీలు సమర్పించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి ప్రజలు వచ్చి కలెక్టరేట్లో అర్జీలు అందజేశారు. సర్వం బూడిదైనా పట్టించుకోవడం లేదు గత నెల 25న గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో ఇల్లు, ఫ్రిజ్, టీవీ, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. దీంతో రోడ్డున పడ్డాను. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం కట్టుబట్టలతో కుటుంబం వీధిన పడింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 10 లక్షలు నష్టం సంభవించింది. అధికారులు నాకు న్యాయం చేయాలి. – ప్రగడ సత్యకామేష్, కత్తిపూడి, శంఖవరం మండలం రైతు భరోసా నిధులు జమకావడం లేదు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రైతు భరోసా నిధులు నా ఖాతాలో పడడం లేదు. జగన్మోహన్రెడ్డి హయాంలో నాకు రైతు భరోసా నిధులు వచ్చేవి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలిపివేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక చాలాసార్లు ఫిర్యాదు చేశాను. ఎవరూ పట్టించుకోవడం లేదు. – అనుసూరి శ్రీను, రైతు, మాధవపట్నం, సామర్లకోట మండలం పింఛన్ నిలిపివేశారు గతంలో నాకు పింఛన్ వచ్చేది. గత ఏడాది నుంచి నాకు పింఛన్ నిలిపివేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాను. నా భర్త కూడా చనిపోయాడు. నాకు ఈ పింఛన్ ఒక్కటే ఆధారం. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. స్థానిక సచివాలయంలో అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. అధికారులు స్పందించి నా పింఛన్ ఇప్పించాలి – దేసాలంక చక్రమ్మ, ఎస్.అచ్యుతాపురం, కాకినాడ. నా భూమి ఆన్లైన్లో నమోదు కాలేదు రీ– సర్వే కారణంగా నా భూమి ఆన్లైన్లో నమోదు కాలేదు. నాకు కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో 75 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. ప్రస్తుతం 65 సెంట్లు మాత్రమే ఆన్లైన్లో నమోదయ్యింది. మిగిలిన భూమి ఆన్లైన్లో నమోదు చేయాలని సచివాలయంలో వీఆర్వో చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయాను. అయినా పట్టించుకోవడం లేదు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో గత నెలలో ఫిర్యాదు చేశాను. అయినా పరిష్కారం కాలేదు. – కడజారి శివలింగేశ్వరరావు, రైతు, తిమ్మాపురం -
సత్యదేవుని సన్నిధిలో భక్తుల సందడి
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం భారీగా తరలివచ్చిన భక్తులతో సోమవారం కిటకిటలాడింది. రత్నగిరితో బాటు పలు ప్రాంతాలలో ఆదివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున వివాహాలు చేసుకున్న నవ దంపతులు వారి బంధుమిత్రులతో కలిసి వేలాదిగా తరలి వచ్చారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామిని దర్శించారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు జరిగాయి. సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. దేవస్థానానికి రూ. 40 లక్షలు ఆదాయం సమకూరింది. సోమవారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లు, శంకరుడు ముత్యాలు పొదిగిన కవచాలు (ముత్తంగి) ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. -
మా మీదే కేసులు పెడతారా?
నిడదవోలు పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ ఆందోళన నిడదవోలు: కూటమి పేరుతో తామంతా పనిచేయడం వల్లే ఇక్కడ జనసేన ఎమ్మెల్యే నెగ్గారని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు తమ పైనే కేసులు పెట్టే పరిస్థితి వచ్చిందని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలివీ.. రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్పై, జనసేన నాయకులపై దు ష్ప్రచారం చేస్తూ సింగవరం గ్రామానికి చెందిన టీడీపీ బూత్ ఇన్చార్జి కట్ట మణికంఠ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నాడంటూ గత నెల 26న జనసేన కార్యకర్తలు అడ్డాల సాయి లక్ష్మణ్, అచ్యుత పవన్ కుమార్లు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై జగన్మోహన్రావు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనపై అక్రమంగా కేసులు పెట్టారని, విచారణకు స్టేషన్కు రమ్మంటూ ఇబ్బంది పెడుతున్నారని, ఈ వేధింపులు తాళలేక తాను చనిపోతున్నానంటూ మణికంఠ సెల్ఫీ వీడియో చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ మేరకు వేలివెన్ను నీటి సంఘం అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నేత బూరుగుపల్లి శ్రీనివాస్, ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. మణికంఠ ఆచూకీ తెలిపే వరకూ ఎన్ని రోజులైనా అక్కడే ఉంటామని నిరసన తెలిపారు. వారితో సీఐ తిలక్ చర్చించినా ఫలితం లేకుండా పోయింది. మణికంఠ తండ్రి కృష్ణ మా ట్లాడుతూ, 1989 నుంచి టీడీపీ కోసం పని చేసిన తమకు జనసేన నాయకుల వల్ల రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగవరంలో భూ ఆక్రమణలపై పోరాడుతుంటే తన కుమారుడు మణికంఠపై జనసేన నాయకులు అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఉద్యోగం నుంచి తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటానంటూ మణికంఠ సెల్ఫీ వీడియో పెట్టాడని బోరున విలపించారు. టీడీపీ నాయకులమైన తమకే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. -
సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026
అకాల దుఃఖం● దంచి కొట్టిన భారీ వర్షం ● లోతట్టు ప్రాంతాలు జలమయం ● నీట మునిగిన ధాన్యపు రాశులు ● కన్నీరుమున్నీరవుతున్న అన్నదాతసాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం ఈదురు గాలులతో భారీ వర్షం దంచి కొట్టింది. జోరుగా కురిసిన వానతో కాకినాడ నగరంతో పాటు సామర్లకోట, జగ్గంపేట తదితర మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాలుల తీవ్రతకు పలుచోట్ల చెట్లు విరిగిపడి, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్నాళ్లుగా మండుతున్న ఎండలతో ఆపసోపాలు పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించినా.. అన్నదాతకు మాత్రం ‘అకాల’ దుఃఖమే మిగిల్చింది. చేతికి అంది వచ్చిన పంట కళ్ల ముందే తడిసి ముద్దవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పులి మీద పుట్రలా.. జిల్లావ్యాప్తంగా సుమారు 1.90 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరిగింది. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 1.15 లక్షల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. మిగిలిన పంట కోతలు, మాసూళ్లు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ ప్రభుత్వం 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇంకా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ తరుణంలో తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో ధాన్యం ధరలోనో లేదా బస్తాకు నాలుగైదు కేజీల వరకూనో కోత పెడుతున్నారంటూ పక్షం రోజులుగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో తేమ శాతం తగ్గించుకునేందుకు పిఠాపురం, గొల్లప్రోలు, జగ్గంపేట, సామర్లకోట, పెద్దాపురం, కాకినాడ రూరల్, కరప తదితర మండలాల్లోని రైతులు రోడ్ల పైన, కళ్లాల్లోనూ ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో పులి మీద పుట్రలా హఠాత్తుగా కురిసిన వర్షానికి ఆరబెట్టుకుంటున్న ధాన్యం తడిసిముద్దయ్యింది. అక్కడక్కడ అందుబాటులో ఉన్న బరకాలు కప్పినా, ధాన్యాన్ని రైతులు పెద్దగా కాపాడుకోలేకపోయారు. ప్రభుత్వం సమయానుకూలంగా ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఈ వర్షం వలన తమకు ఈ నష్టం జరిగి ఉండేది కాదని బాధిత రైతులు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ● జగ్గంపేట, గోకవరం మండలాల్లో ఎడతెరిపి లేకుండా గంటపాటు వర్షం కురిసింది. గోకవరం మండల రైతులు 8,325 ఎకరాల్లో రబీ వరి సాగు చేశారు. సుమారు 80 శాతం కోతలు పూర్తయ్యాయి. ధాన్యం కళ్లాల్లో ఉండగా ఒక్కసారిగా వర్షం కురిసింది. బరకాలు కప్పి కాపాడుకునేందుకు ప్రయత్నించినప్పటికీ పలుచోట్ల ధాన్యపు రాశులు తడిసిపోయాయి. సుమారు 1,200 మెట్రిక్ టన్నుల ధాన్యం కళ్లాల్లో ఉన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ● జగ్గంపేట మండలంలో 4,443 ఎకరాల్లో రబీ వరి సాగు జరిగింది. ఆరేడు వేల ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. కళ్లాల్లో 3,400 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకున్నారు. ఈ తరుణంలో కురిసిన అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయిందంటూ రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఒక్క కాట్రావులపల్లిలోనే సుమారు 5 వేల టన్నుల ధాన్యం తడిసి ముద్దయింది. తేమ శాతం సాకుగా చూపుతూ 75 కేజీల బస్తాకు గతంలో ఎన్నడూ లేని విధంగా 5 కేజీల తరుగు తీసేస్తున్నారని రైతులు ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు. చివరకు నాణ్యమైన సంచులు కూడా సరఫరా చేయలేదని కాట్రావులపల్లి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● పెద్దాపురం నియోజకవర్గంలో సుమారు 40 వేల ఎకరాల్లో రబీ వరి సాగు జరగగా.. దాదాపు 10 వేల ఎకరాల్లో వరి పంట ఈ వర్షానికి తడిసిపోయింది. మరో 5 వేల ఎకరాల్లో పంట ఈదురు గాలులకు నేలకొరిగిపోయింది. సామర్లకోట – పెద్దాపురం రోడ్డులోని ఒక ప్రైవేట్ లే అవుట్లోను, రోడ్ల పైన ఆరబెట్టిన ధాన్యం.. ఒక్కసారిగా కురిసిన వర్షంతో డ్రైన్లలోకి కొట్టుకుపోయింది. గడచిన ఐదు రోజులుగా కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయనందువల్లనే ఇప్పుడు తాము నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ● ఈ వర్షానికి శంఖవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లోని పలు గ్రామాల్లో మామిడి, అరటి తోటలు దెబ్బ తిన్నాయి. మామిడి కాయలు రాలిపోవడంతో రైతుల ఆశలు నేలనంటేశాయి. శంఖవరం మండలం అచ్చంపేట, కొత్తపల్లి గ్రామాల్లో వరి పంట తడిసి ముద్దయిపోయింది. ● కాకినాడ రూరల్, కరప మండలాల రైతులు సుమారు 19,280 ఎకరాల్లో రబీ వరి సాగు చేశారు. ఇప్పటి వరకూ సుమారు 10 వేల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయన్నది వ్యవసాయ శాఖ అంచనా. ఇందులో సగం వరకూ ధాన్యాన్ని కళ్లాల్లోను, రోడ్ల వెంబడి రాశులుగా పోసి ఆరబెడుతున్నారు. ఈ సమయంలో వర్షం కురవడంతో బరకాలు కప్పి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లూ పడుతున్నారు. 8పిడుగుపాటుకు మృత్యువాత వర్షానికి పిడుగులు కూడా తోడవడంతో పెద్దాపురం మండలం జి.రాగంపేటలో ఓ కౌలు రైతు మృత్యువాత పడ్డాడు. పొలంలో వర్షానికి తడిసిపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు కౌలు రైతు పెన్నాడ అర్జునరావు (60) ఆ రాశులపై బరకం కప్పుతున్నాడు. అదే సమయంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో అతడు మృతి చెందాడు. ఈ సంఘటనతో అతడి కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంత రైతులు విషాదంలో మునిగిపోయారు. -
పచ్చిగా మోసం!
పిఠాపురం: రబీ ధాన్యం కొనుగోళ్లలో కొంత మంది మిల్లర్లు, అధికార యంత్రాంగం కలిపి దోపిడీకి తెర తీసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో రబీ కోతలు ప్రారంభమైన తొలి రోజుల్లోనే పచ్చి ధాన్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేసిన కొంత మంది మిల్లర్లు.. ఇప్పుడు కొందరు అధికారులతో కుమ్మక్కై, ఎండు ధాన్యం కొంటున్నట్లు ధాన్యం కొనుగోలు కేంద్రాల (పీపీసీ) ద్వారా కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) నమోదు చేయించుకుంటున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మరోవైపు రబీ వరి కోతలు పూర్తయిన పంట పొలాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు నమోదు చేయాల్సి ఉండగా.. సీఎంఆర్ నమోదు కోసం ఆ ప్రక్రియ ఎక్కడా జరగడం లేదని పలువురు అంటున్నారు. అయితే, అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందని అధికారులు కొట్టిపారేస్తున్నారు. రబీలో జిల్లావ్యాప్తంగా సుమారు 1.90 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేపట్టారు. దాదాపు 6.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్నది వ్యవసాయ శాఖ అంచనా. జిల్లాలో సుమారు 225 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోళ్లు, రవాణాకు 2,101 వాహనాలను, సుమారు 37.50 లక్షల గోనె సంచులు, 227 తేమ యంత్రాలను సిద్ధం చేశారు. అలాగే, 3,400 మంది హమాలీలను, 990 మంది సిబ్బందిని నియమించారు. సీఎంఆర్కు 119 రైస్ మిల్లులను ఎంపిక చేశారు. ఏం జరుగుతోందంటే.. జిల్లాలో రబీ వరి కోతలు మార్చి నెలాఖరుకే ప్రారంభమయ్యాయి. అప్పటికి ప్రభుత్వం ఇంకా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించలేదు. ఇదే అదనుగా కొంత మంది ప్రైవేటు వ్యాపారులు పెద్ద మొత్తంలో పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసి, తమ మిల్లులకు తరలించేశారు. నిబంధనల ప్రకారం సాధారణ రకం 75 కిలోల బస్తాకు రూ.1,725, ఎ–గ్రేడ్ రకానికి రూ.1,777 చొప్పున మద్దతు ధర చెల్లించాలి. కానీ, అప్పటికప్పుడు మెషీన్తో కోసిన 75 కేజీల పచ్చి ధాన్యాన్ని రూ.1,250 నుంచి రూ.1,300కు కొనుగోలు చేశారని పలువురు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడక్కడ కొద్ది శాతం మాత్రమే ధాన్యం ఉందని అంటున్నారు. వరి కోతలు చివరి దశకు చేరుకున్న ఈ తరుణంలో లక్షల బస్తాల ఎండు ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు సీఎంఆర్లో నమోదు చేయిస్తూ, దోపిడీకి తెర లేపారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో తమ వద్ద తక్కువ ధరకు కొన్న పచ్చి ధాన్యాన్ని ఇప్పుడు కొనుగోలు చేసినట్టుగా ఆన్లైన్లో నమోదు చేస్తూ.. ఒక్కో బస్తాకు రూ.400కు పైగా దోచుకుంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఈవిధంగా రూ.కోట్లలో దోపిడీ సాగుతోందన్నది వారి వాదన. పంట వేసినప్పుడు కామన్ వైరెటీగా ఉన్న సాధన రకం ధాన్యాన్ని కోతల సమయంలో గ్రేడ్–1 ఫైన్ వైరెటీగా మార్చారు. ఎక్కువ ధర చెల్లించాల్సి రావడంతో మిల్లర్లు ఈ రకం కొనుగోలును ప్రస్తుతం నిలిపివేశారు. తాము పండించిన సాధన రకం ధాన్యం తమ వద్దనే ఉండగా.. సీఎంఆర్లో కొనుగోలు చేసినట్లు చూపుతూ మోసానికి పాల్పడుతున్నారని రైతులు అంటున్నారు. ధాన్యం కొనుగోళ్లు (ఫైల్)అవాస్తవం సీఎంఆర్ నమోదు నిబంధనల ప్రకారమే జరుగుతోంది. గతంలో కొన్న ధాన్యానికి ఇప్పుడు సీఎంఆర్ నమోదు అనేది అవాస్తవం కాదు. అటువంటిది ఎక్కడా లేదు. అలా జరిగి ఉంటే విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – దేవులా నాయక్, జిల్లా మేనేజర్, పౌర సరఫరాల సంస్థ, కాకినాడ రబీ ధాన్యం దిగుబడి అంచనా 6.76 లక్షల టన్నులు జిల్లాలో నెల రోజుల క్రితమే పెద్ద మొత్తంలో పచ్చి ధాన్యం కొనుగోలు 75 కేజీల బస్తాకు రూ.1,300 మాత్రమే చెల్లించిన మిల్లర్లు ప్రస్తుతం ఎండు ధాన్యం రూ.1,777కి కొన్నట్లు సీఎంఆర్లో నమోదు! రూ.కోట్ల మేర రైతు సొమ్ము దోపిడీసీఎంఆర్లో మాయాజాలం! సీఎంఆర్ కోసం ఏ కేంద్రం నుంచి ఎంత మొత్తంలో ధాన్యం కొనుగోలు చేశారు, ఏ వాహనంపై, ఏ మిల్లుకు తరలిస్తున్నారు, ఎంత దూరం వెళ్తున్నాయి తదితర వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. కానీ, ప్రస్తుతం ఎక్కడా కొనుగోలు చేయకుండానే ఎండు ధాన్యం కొన్నట్టు చూపుతూ, మిల్లర్లకు అనుకూలంగా సీఎంఆర్ నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మెట్ట ప్రాంతంలోని ఓ బడా రైస్ వ్యాపారి నెల రోజుల క్రితమే భారీగా ఽపచ్చి ధాన్యం కొనుగోలు చేయగా.. ఆయనకు లాభం చేకూరేలా ఎండు ధాన్యం కొన్నట్లు అధికారులు సీఎంఆర్ నమోదు చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సీఎంఆర్ నమోదు ప్రక్రియపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
నీ దరి చేరేదెలా స్వామీ!
● సత్యదేవుని భక్తులకు వాన కష్టాలు ● నమూనా ఆలయం వద్ద ఇబ్బందులుఅన్నవరం: జాతీయ రహదారిపై విశాఖపట్నం వైపు ఉన్న సత్యదేవుని నమూనా ఆలయం వద్ద స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు వాన కష్టాలు తప్పడం లేదు. కొద్దిపాటి వర్షం కురిసినా ఆలయం ముందు నీరు నిలిచిపోతోంది. దీంతో, ‘నీ దరి చేరేదెలా స్వామీ!’ అంటూ భక్తులు ఇబ్బందులు పడుతు న్నారు. గత్యంతరం లేక ఆ వాన నీటిలోనే నడిచి వెళ్తున్నారు. ప్రతి రోజూ విశాఖపట్నం వైపు వందలాది వాహనాల్లో వెళ్లే భక్తులు ఇక్కడ స్వామి, అమ్మవారిని దర్శించి, ప్రసాదాలు కొనుగోలు చేస్తారు. ఈ ఆలయం వద్ద ప్రసాద విక్రయాలు, హుండీ ద్వారా ఏటా రూ.3 కోట్ల ఆదాయం వస్తోంది. అయినప్పటికీ కనీస వసతులు కల్పించడం లేదనే విమర్శలున్నాయి. రెండు నెలల క్రితం ఇక్కడ ప్రసాదాల ప్యాకెట్లపై ఎలుకల స్వైర విహారం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అప్పట్లో పెద్డాపురం ఆర్డీఓ పరిశీలించి, ఎలుకలు రాకుండా, భక్తులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు నమూనా ఆలయం వద్ద దేవస్థానం అధికారులు మెట్లు కట్టించి వదిలేశారు. ఆ మెట్ల ముందు ఫ్లోరింగ్, డ్రైన్ నిర్మించకపోవడంతో కొద్దిపాటి వర్షం కురిసినా ఆలయం వద్ద నీరు నిలిచిపోతోంది. అన్నవరంలో మూడు రోజులుగా రోజూ వర్షం కురుస్తోంది. ఆదివారం ఉదయమైతే భారీ వర్షమే కురవడంతో నీరు నిలిచిపోయి భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. సత్యదేవుని ప్రసాద విక్రయశాల వద్ద కూడా వాన నీరు నిలిచిపోతోంది. ఇప్పటికైనా అధికారులు నమూనా ఆలయం ముందు చదును చేసి, వాన నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
తాటిపర్తిలో కార్డన్ సెర్చ్
38 ద్విచక్ర వాహనాల స్వాధీనం గొల్లప్రోలు (పిఠాపురం రూరల్): గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో పోలీసులు ఆదివారం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి, సరైన పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు పిఠాపురం సర్కిల్ ఎస్సైలు ఎన్.రామకృష్ణ, వి.మణికుమార్, వంద మంది పోలీసు సిబ్బందితో కలసి తాటిపర్తి గ్రామంలో ఉదయం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు వివరాలు సేకరించి, అనుమానిత ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పాత నేరస్తులు, అనుమానితులపై నిఘా మరింత కట్టుదిట్టం చేస్తామని, ఎవరైనా కొత్త వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించినా, అనుమానాస్పద కదలికలను గమనించినా పోలీసులకు సమాచారం అందించాలని సీఐ కోరారు. ఉత్కంఠకు నేటితో తెర.. నేడు యానాం నియోజకవర్గ ఓట్ల లెక్కింపు యానాం: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని యానాం అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. గత నెల 9న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా యానాం నియోజకవర్గ ఓట్ల లెక్కింపు స్థానిక సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటిగ్ హాలులో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. దీనికోసం విస్తృత బందోబస్తు చేసినట్టు రిటర్నింగ్ అధికారి శివరాజ్ మీనా తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 35,445 మంది ఓటర్లతో పాటు 360 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కళాశాలలో ఉదయం 5 గంటలకు జనరల్ అబ్జర్వర్ సమక్షంలో ఈవీఎంలను ర్యాండమైజ్ చేసి, 7.30 గంటలకు కౌటింగ్ కేంద్రానికి చేరుస్తారు. తొలుత 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను ఒక టేబుల్ వద్ద, 8.30 గంటలకు మరో 10 టేబుళ్లపై ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. మొత్తం 5 రౌండ్లలో 42 పోలింగ్ బూత్లకు సంబంధించి ఓట్లు లెక్కిస్తారన్నారు. ఫలితం మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో స్వతంత్రులతో కలిపి మొత్తం 14 మంది పోటీ చేయగా ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు మధ్యే పోటీ నెలకొంది. -
ప్రశాంతంగా నీట్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్ ఎలిజిబులిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) కాకినాడలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు కాకినాడలో 11 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పరీక్ష నిర్వహించారు. జిల్లాలో ఈ పరీక్షకు 3,126 మంది దరఖాస్తు చేసుకోగా 3,080 మంది హాజరయ్యారు. జీపీటీ కళాశాల, ఆనంద భారతి గ్రౌండ్ వద్ద రాజీవ్గాంధీ మున్సిపల్ పాఠశాలల్లోని కేంద్రాలను కలెక్టర్ హరీంధిర ప్రసాద్, గాంధీనగర్ పైండా సత్తిరాజు మున్సిపల్ పాఠశాలను కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు సందర్శించారు. -
కనుల విందుగా.. విరుల పండగ
అన్నవరం : సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాల్లో చివరి రోజయిన శనివారం రాత్రి శ్రీపుష్పయాగ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నిండయిన పుష్పాలంకరణలు, రంగురంగుల విద్యుద్దీపాలంకరణల నడుమ నిత్య కల్యాణ మండపంలో రాత్రి 7 గంటలకు జరిగిన ఈ ఉత్సవాన్ని వేలాది మంది భక్తులు కన్నులారా తిలకించి తన్మయులయ్యారు. పండితులు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించగా, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ ఎన్.సూర్యచక్రధరరావులు నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించిన ఊయలపై విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అలంకరణలో కొలువుదీరిన సత్యదేవుడు, అమ్మవార్లకు వివిధ రకాల పుష్పాలతో పూజలు చేశారు. ఊయలకు ఎదురుగా ఉంచిన అద్దంలో స్వామి, అమ్మవార్ల ప్రతిబింబాలను తిలకించి, భక్తులు పులకించారు. కిక్కిరిసిన ఆలయం వేలాదిగా వచ్చిన భక్తులతో సత్యదేవుని ఆలయం కిక్కిరిసిపోయింది. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున రత్నగిరి పైన, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులకు పెద్ద సంఖ్యలో ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయం కిటకిటలాడింది. సాయంత్రం వరకూ రద్దీ కొనసాగింది. సుమారు 2 వేల వ్రతాలు జరిగాయని, 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చిందని చెప్పారు. సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. -
విందు భౌజనం
పోషకాహారం అందించాలి పెంపుడు జంతువుల ఆరోగ్యం కోసం సహజమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడం ప్రతి పెట్ పేరెంట్ బాధ్యత. ప్రస్తుతం కాకినాడలో సేవలందిస్తున్నాం. త్వరలోనే మా సంస్థను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో సాగుతున్నాం. – డాక్టర్ బాల సువర్ణ, పెట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకురాలు, కాకినాడ ప్రతి పెట్కు హెల్దీ ఫుడ్ అందించే లక్ష్యంతో.. పెంపుడు జంతువులకు ఇప్పటి వరకూ ఎక్కువగా రెడీమేడ్ ప్యాకేజ్ ఫుడ్ అందించేవారు. అయితే, వాటిలోని ప్రిజర్వేటివ్స్, కృత్రిమ పదార్థాల వల్ల పెట్స్కు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్ ఫుడ్ సెంటర్ థాలీ ద్వారా తాజా పదార్థాలతో, నాణ్యత, శుభ్రత, పోషక విలువలుండే పెట్ ఫుడ్ తయారు చేస్తూ శాసీ్త్రయంగా సమతుల ఆహారం అందిస్తున్నాం. – కల్యాణి, పెట్ ఫుడ్ సెంటర్ భాగస్వామి, కాకినాడ నా కుక్క ఇష్టంగా తింటోంది అంతకు ముందు రెడీమేడ్ ప్యాకింగ్ ఫుడ్ పెడితే మా కుక్క అంత ఇష్టంగా తినేది కాదు. ఇప్పుడు చాలా ఇష్టంగా తింటోంది. ఆరోగ్యంగా, చురుకుగా ఉంటోంది. అందుకే ఫుడ్ సెంటర్లోని ఆహారాన్ని కొని మా కుక్కకు పెడుతున్నాం. ప్రతి రోజూ అప్పటికప్పుడు వేడివేడిగా వంటకాలు తయారు చేసి ఇస్తున్నారు. ఈ పద్ధతి చాలా బాగుంది. – చిన్ని, కాకినాడ పిఠాపురం: సాధారణంగా జాతిని బట్టి కుక్కలకు తగిన ఆహారాన్ని వాటి యజమానులు ఇళ్ల వద్దే తయారు చేసి పెడుతుంటారు. కొన్నిచోట్ల దుకాణాల్లో వివిధ రకాల బిస్కెట్లు, రెడీమేడ్ ఫుడ్ అమ్ముతారు. కానీ, ట్రెండ్ మారింది. కుక్కలకూ ఓ రోజు వచ్చింది. వాటికీ ప్రత్యేకంగా కేటరింగ్ సెంటర్లు వెలిశాయి. శాకాహారం మాంసాహారం తదితర రకరకాల ఆహారాన్ని తయారు చేసి కుక్కలను పెంచుకుంటున్న వారికి ఇళ్ల వద్దనే అందజేస్తున్న వ్యాపారం ప్రస్తుతం ఊపందుకుంటోంది. రిచ్ మెనూతో.. పెట్ కేటరర్లు కుక్కలకు నోరూరించే రిచ్ మెనూతో విందు భోజనం అందిస్తున్నారు. డాగ్ సేఫ్ చికెన్ ధమ్ బిర్యానీ, పనీర్ ఆధారంగా ప్రొటీన్ రిచ్ వెజ్ మీల్స్, పెట్ స్పెషల్ కాక్టెయిల్స్ (సమ్మర్ డ్రింకులు), డాగ్ ఫ్రెండ్లీ ఐస్ క్రీములు, పెట్ స్వీట్లు కుక్కల కోసం తయారు చేస్తున్నారు. కస్టమైజ్డ్ డైట్ ప్లాన్లలో భాగంగా పప్పీలు, సిక్ పెట్లకు.. చూలు కుక్కలు, పప్పీల కోసం ప్రత్యేక పోషకాహారం, హై ప్రొటీన్, సులభంగా జీర్ణమయ్యే, వెటర్నరీ వైద్యుల సలహాతో ప్రత్యేక డైట్ అందిస్తున్నారు. ఇంకా చికెన్, పనీర్, కూరగాయలు, అన్నం వంటివి కుక్కల వయస్సు, ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. ముందస్తు ఆర్డర్లపై తాజా ఆహారం తయారు చేసి హోం డెలివరీ ఇస్తున్నారు. కుక్కలకూ కేటరింగ్ సెంటర్లు సమ్మర్ డ్రింకులు, ఐస్క్రీములు, సలాడ్లు, స్వీట్లు ఇళ్లకే పౌష్టికాహారం పంపిణీ జంతుప్రియులను ఆకర్షిస్తున్న పెట్ ఫుడ్ సెంటర్లు -
భావనారాయణ స్వామికి హైకోర్టు న్యాయమూర్తి పూజలు
కాకినాడ రూరల్: సర్పవరంలోని శ్రీ రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి వచ్చిన వారికి దేవస్థానం ఆధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని, పూజలు అనంతరం, పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రాపాక శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. ఆస్తి వివరాల స్వీయ నమోదుతో ప్రయోజనం కాకినాడ లీగల్: ఆన్లైన్ ద్వారా ఆస్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు క్రయవిక్రయదారులకు ఓటీపీ వస్తుందని, ఆ తర్వాత ఆస్తి వివరాలు స్వయంగా నమోదు చేయడం ద్వారా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ల(ఈసీ)లో ఎటువంటి తప్పులూ రావని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) సీహెచ్ జానకీదేవి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కాకినాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆస్తుల కొనుగోలు సమయంలో ఈసీని పరిశీలిస్తే ఆ ఆస్తిపై అప్పులున్నాయా, ఇంతకు ముందు ఎవరికై నా విక్రయించారా, రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకునే వీలు కలుగుతుందని చెప్పారు. ఆన్లైన్లో ఐజీఆర్ఎస్ వెబ్సైట్ ద్వారా ఈసీలు పరిశీలించుకోవచ్చన్నారు. ఐజీఆర్ఎస్ వైబ్సైట్ ద్వారా ఆస్తి రిజిస్ట్రేషన్పై అవగాహన లేకపోవడంతో క్రయవిక్రయదారులు నెట్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారని, ఆ క్రమంలో కొన్ని తప్పులుంటున్నాయని కాకినాడ దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షుడు చోడపునీడి గోవిందరావు డీఐజీ దృష్టికి తీసుకువచ్చారు. ఆన్లైన్లో ఆస్తి వివరాలు తప్పుగా నమోదు చేసినప్పటికీ సరి చేయడానికి గత ప్రభుత్వ హయాంలో సబ్ రిజిస్ట్రార్కు అనుమతి ఉండేదన్నారు. సుమారు ఏడాది నుంచి ఈ అనుమతిని రద్దు చేయడంతో క్రయవిక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆన్లైన్లో ఆస్తి వివరాలు తప్పుగా నమోదు చేసినప్పటికీ సరి చేసేందుకు సబ్ రిజిస్ట్రార్కు గతంలో మాదిరిగానే అనుమతి ఇవ్వాలని కోరారు. -
రైతుకు తేమ శాపం
● తేమ 17 శాతంలోపు ఉంటేనే ధాన్యం కొనుగోలు చేస్తున్న మిల్లర్లు ● కోతలు కోసి సుమారు వారం రోజులు ఆరబెట్టాల్సిందే.. ● జోరుగా వరి కోతలు.. పట్టుబడులు ● ఇదే సమయంలో భయపెడుతున్న చిరుజల్లులు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రకృతి విపత్తులతో ఖరీఫ్ తుడిచిపెట్టుకుపోవడం.. రబీలో పంట పండినా ప్రభుత్వం సక్రమంగా కొనుగోలు చేయకపోవడం.. కొనుగోలు చేసినా కనీస మద్దతు ధర దక్కకపోవడం.. కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు చేయకపోవడం.. ఇదంతా కూటమి పాలనలో ఏటా జరుగుతున్న ప్రహసనమే. ప్రస్తుత రబీలోనూ ఇదే జరుగుతోంది. ఒకవైపు అకాలంగా వరుణుడు భయపెడుతూంటే, మరోవైపు సర్కారు వివిధ నిబంధనలతో ఓ ఆటాడుకుంటోంది. ఆరుగాలం శ్రమంచి పండిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని గొప్పలు చెప్పడం తప్ప క్షేత్ర స్థాయిలో రైతుల నుంచి చంద్రబాబు సర్కారు ధాన్యం కొనుగోలు చేయడం లేదు. ప్రస్తుత రబీలో జిల్లావ్యాప్తంగా 1.90 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 1.15 లక్షల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. సామర్లకోట, పిఠాపురం, కరప, కొత్తపల్లి, గొల్లప్రోలు, తుని, శంఖవరంతో పాటు పలు మండలాల్లో ఇప్పటికే కోతలు దాదాపు పూర్తయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని రైతులు రోడ్లు, కళ్లాల్లో ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. ఇప్పటి వరకూ రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) ద్వారా ప్రభుత్వం 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. తేమ శాతం 17 కంటే తక్కువ ఉంటేనే రైతుల నుంచి మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం సాధారణ రకం 75 కేజీల బస్తాకు రూ.1,777 మద్దతు ధర ప్రకటించింది. కానీ, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిప్పటిటి నుంచీ తేమ శాతాన్ని సాకుగా చూపిస్తూ రైస్ మిల్లర్లు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదు. దీంతో, తమకు ఇబ్బందులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించి మద్దతు ధర ఇవ్వకుండా బస్తాకు రూ.300 నుంచి రూ.400 వరకూ కోత పెడుతున్నారు. మరోవైపు గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వానికి ధాన్యం అమ్మితే డబ్బులు ఎప్పటికి వస్తాయో తెలియక పలువురు రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్ముకుంటున్నారు. మద్దతు ధర రాక తక్కువకు అమ్మేస్తున్నాం ఒకవైపు ధాన్యాన్ని వారం పది రోజులు ఆరబెట్టిన తర్వాత తెస్తే మద్దతు ధర ఇస్తామని చెబుతున్నారు. మరోవైపు వాతావరణంలో మార్పులతో ఎప్పుడు వర్షం కురుస్తుందోనని భయపడాల్సి వస్తోంది. అందుకే, బయటి వ్యక్తులకు బస్తా రూ.1,550కి అమ్ముకున్నాం. తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలి. – సామన గంగారావు, రైతు, తిమ్మాపురం, కాకినాడ రూరల్ మండలం -
పోలీస్ స్టేషన్లో యువకుడి ఆత్మహత్యా యత్నం
కాకినాడ క్రైం: స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సామర్లకోట మండలం కొప్పవరం గ్రామానికి చెందిన పండ్రాడ చరణ్ సర్పవరం బినోయ్ జూనియర్ కళాశాలలో ఎంఎల్టీ చదివాడు. అదే గ్రామానికి చెందిన పరమేశ్వరరావు కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో హోం గార్డుగా పని చేస్తున్నాడు. ఆయన కుమార్తె ఈకోలు నికితను చరణ్ ప్రేమించాడు. వారిద్దరూ గత గురువారం అన్నవరంలో ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నారు. అనంతరం నికితను చరణ్ పిఠాపురంలోని తన అమ్మమ్మ తిరగటి సంకురమ్మ ఇంటికి తీసుకెళ్లి అక్కడే ఉంచాడు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో చరణ్, నికితలతో పాటు చరణ్ తల్లి అపర్ణ ఆ ఇంట్లో ఉండగా కాకినాడ టూ టౌన్ పోలీసులు అక్కడకు వెళ్లారు. యువతీ యువకులిద్దరినీ జీపు ఎక్కించుకోగా అపర్ణ కూడా వారి వెంటే వెళ్లింది. ఉదయం 11.30 సమయంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి, యువతిని ప్రత్యేకంగా ఏసీ గదిలోను, చరణ్ను లాకప్లోను ఉంచారు. పరమేశ్వర్తో పాటు యువతికి బావ వరుస అయ్యే వ్యక్తి లాకప్లోకి వెళ్లారు. అక్కడ వారు తన కుమారుడు చరణ్ను కొట్టారని, చంపాలని చూశారని తల్లి అపర్ణ ఆరోపిస్తోంది. వారి చిత్ర హింసలు భరించలేక, యువతి దూరమవుతుందేమోనన్న ఆవేదనతో తన కుమారుడు జేబులో ఉన్న నడుమునొప్పి మాత్రలు ఒకేసారి 10 మింగి అపస్మారక స్థితికి వెళ్లాడని చెబుతోంది. లాకప్లో స్పృహ కోల్పోయిన చరణ్ను పోలీసులు తమకు అప్పగించారని, కాకినాడ జీజీహెచ్కు తరలించామని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. పోలీసులేమన్నారంటే.. తన కుమార్తె కనిపించడం లేదని, చివరిసారి వీర్కమల్ థియేటర్ సమీపాన మిస్ అయిందని నికిత తండ్రి అయిన హోం గార్డు పరమేశ్వరరావు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణలో భాగంగా చరణ్, నికితలు పిఠాపురంలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు కాకినాడ టూ టౌన్కు తీసుకువచ్చారు. స్టేషన్లో చరణ్ విటమిన్–సి మాత్రలు మింగాడు. పోలీసులు ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలిపి, చికిత్స కోసం జీజీహెచ్కు పంపారు. ఈ ఘటనపై కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
పేదల సొంతింటి కలను చిదిమేసిన చంద్రబాబు
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి కాకినాడ రూరల్: పేదవాడి సొంతింటి కలను చంద్రబాబు ప్రభుత్వం కర్కశంగా చిదిమేసిందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 33 లక్షలకు మందికి పైగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటి స్థలాలను కేటాయించారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలోని ఆర్ 5 జోన్లో పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను సీఆర్డీఏ పరిధిలోకి విలీనం చేయడంతో లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను బలవంతంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పరిస్థితి దాపురించిందని చెప్పారు. పేదలంటే చంద్రబాబుకు ఎప్పుడూ అలుసేనని పేర్కొన్నారు. సుమారు 50 వేల మంది పేదలు వారికి కేటాయించిన ఇంటి స్థలాలు కోల్పోతున్నారని తెలిపారు. మెడికల్ కాలేజీల నిర్వహణకు, ఆరోగ్య నెట్వర్క్ ఆస్పత్రులకు నిధులు ఇవ్వని ప్రభుత్వం అమరావతి రాజధానిపై కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. అమరావతిలో పలు కట్టడాలకు గ్లాస్ ఫినిషింగ్ చేసేందుకు రూ.2,540 కోట్లు మంజూరు చేయడాన్ని ఆక్షేపించారు. కాకినాడ–మైసూర్ రైలు ప్రారంభంబోట్క్లబ్ (కాకినాడ సిటీ): రైల్వే శాఖ నూతనంగా ఏర్పాటు చేసిన కాకినాడ – మైసూర్ ట్రైన్ను శుక్రవారం కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్లో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రత్యేక సర్వీస్గా నడుస్తున్న ఈ రైలు ఇకపై సోమవారం, శుక్రవారం కాకినాడలో ఉదయం 9 గంటలకు బయలుదేరుతుందన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా కాకినాడ, తుని, సామర్లకోట రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేశామన్నారు. జిల్లా దేవదాయశాఖాధికారిగా వేంకటేశ్వరరావు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా దేవదాయశాఖాధికారిగా వర్థినీడి వేంకటేశ్వరరావు శుక్రవారం స్థానిక కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం దేవదాయశాఖ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఆయనను పదోన్నతిపై కాకినాడ జిల్లా దేవదాయశాఖాధికారిగా నియమించారు. మార్చి నెలాఖరున జిల్లా దేవదాయశాఖాధికారిగా పనిచేసిన కనపర్తి నాగేశ్వరావు పదవీ విరమణ చేయడంతో తలాటం వెంకటసూర్యనారాయణను నియమించారు. నెల రోజుల వ్యవధిలోనే ఆయన స్థానంలో వేంకటేశ్వరావును నియమించడం దేవదాయశాఖలో చర్చాంశనీయమైంది. బాధ్యతలు స్వీకరించిన వేంకటేశ్వర్రావు పలు ఈవోలు, ఆలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. 4, 5 తేదీలలో ప్రత్యేక రైళ్లురాజమహేంద్రవరం సిటీ: వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 4, 5 తేదీలలో జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 4వ తేదీన కాకినాడ టౌన్– లింగంపల్లి (07703)మధ్య, 5వ తేదీన లింగంపల్లి– కాకినాడ టౌన్ (07704) మధ్య రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. -
అకాల వర్షం.. తెచ్చిన కష్టం
దేవీపట్నం: అకాల వర్షాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు వానలు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రం ఇందుకూరుపేట పరిసర గ్రామాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. దీని కారణంగా రైతులు ఆరబెట్టుకున్న మొక్కజొన్న కళ్లాలు తడిసిపోయాయి. మామిడి కాయల దింపు ఊపందుకున్న తరుణంలో కోసిన మామిడిని ఒబ్బిడి చేసేందుకు రైతులు నానా హైరానా పడ్డారు. మరో రెండు రోజుల పాటు ఇదే విధంగా వాతావరణం ఉండే సూచనలు కనిపిస్తుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పూడికతీత.. అవినీతి మేట!
● వెంకన్నదొర చెరువుకు గర్భశోకం ● యథేచ్ఛగా తవ్వేస్తోన్న ‘తమ్ముళ్లు’ ● ఇటుక బట్టీలకు అమ్మకాలుచెరువు గర్భంలో మట్టిని తవ్వుతున్న పొక్లెయిన్లు, లోడింగ్కు వచ్చిన లారీలు (వృత్తంలో)సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికార పార్టీ నేతలు పూడికతీత పేరుతో చెరువు గర్భంలో మట్టి కొల్లగొట్టేసి రూ.లక్షలు మింగేస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో అతి పెద్ద చెరువుల్లో వెంకన్నదొర చెరువు ఒకటి. ఒకప్పుడు పక్షుల కిలకిలారావాలతో, జల కళతో అలరారిన ’వెంకన్నదొర చెరువు’ తెలుగు తమ్ముళ్లకు ఇప్పుడు కాసులు కురిపిస్తోంది. ఏటా మధ్య ఆసియా, మంగోలియా ప్రాంతాల నుంచి వచ్చే విదేశీ పక్షులకు వెంకన్నదొర చెరువు స్వర్గధామం. రెండు, మూడు నెలలు ఇక్కడ విడిది చేసే విదేశీ పక్షుల మనుగడకు తెలుగుతమ్ముళ్ల అక్రమ మట్టి దందా ముప్పుగా పరిణమించింది. వెంకన్నదొర చెరువు పెదశంకర్లపూడి, పి జగన్నాథపురం, ఏలూరు, లంపకలోవ, ప్రత్తిపాడు ప్రాంతాల్లో ఆయకట్టుకు సాగునీరందిస్తోంది. నీటి నిల్వల పెంపు పేరుతో పూడికతీతకు అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. ఇక్కడ చెరువులో తవ్వే మట్టిని రైతులు పల్లంగా ఉన్న తమ పొలాలను మెరక చేసుకునేందుకు వినియోగించాలి. అందుకు భిన్నంగా తెలుగు తమ్ముళ్లు ఇటుక బట్టీలకు అమ్మేస్తున్నారు. నాలుగైదు రోజులుగా పగలు, రాత్రీ మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. 20 టిప్పర్లు.. 300 ట్రిప్పులు సుమారు 1,200 ఎకరాల మెట్ట భూములకు సాగునీరందించే ఈ చెరువులో నీటిని తెలుగు తమ్ముళ్ల మట్టి దందా కోసం బయటకు తోడేశారు. రాచబాట వేసి మరీ అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. పెదశంకర్లపూడిలో ఉన్న ఈ చెరువు మట్టిని తవ్వి తరలించేందుకు ట్రిప్పుకు రూ.5,000 తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారు. దూరాన్ని బట్టి అదనంగా రూ.1,000 దండుకుంటున్నారు. ఇక్కడి చెరువులో యంత్రాలతో తవ్విన మట్టిని 20 టిప్పర్లు అహోరాత్రులు తరలిస్తున్నాయి. టిప్పరు 15 ట్రిప్పుల వంతున రోజుకు మొత్తంగా 300 ట్రిప్పులకు పైనే అక్రమ మట్టి తరలిపోతోంది. ప్రత్తిపాడు, పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లోనే.. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేతలకు సన్నిహితులైన ఇద్దరు అనుచరుల కనుసన్నల్లోనే చెరువులో మట్టి దందా నడుస్తోంది. పొరుగు నియోజకవర్గ నేతల అనుచరులు తమ నియోజకవర్గంలోకి చొరబడి ఇష్టారాజ్యంగా మట్టి తవ్వేస్తుండటాన్ని ప్రత్తిపాడులోని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. తవ్వకాలపై ఉన్నతాధికారులకు, విజిలెన్స్కు ఫిర్యాదు చేశారని సమాచారం. రైతుల ప్రయోజనాన్ని గాలికొదిలేసి వెంకన్నదొర చెరువులో జరుగుతోన్న మట్టి మాఫియాపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
అకాల వర్షంతో రైతు విలవిల
● తడిసిన ధాన్యం రాశులు ● కొనుగోలు కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం పిఠాపురం: ప్రతి గింజా కొంటాం. రైతులకు ఎటువంటి ఇబ్బంది రానివ్వం అంటూ అధికారులు చేసిన ప్రకటనలు, ప్రచారాలు వట్టివేనని తేలిపోయింది. అట్టహాసంగా ప్రారంభించిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పేరుకే కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రబీ కోతలు పూర్తి కాగా 70 శాతంకు పైగా ధాన్యం ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేశారు. అక్కడక్కడా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నప్పటికి నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనకుండా నిలిపివేసి ప్రైవేటు వ్యాపారుల కొమ్ము కాస్తున్నారని సిబ్బందిపై రైతులు మండిపడుతున్నారు. ఒక్క గింజా కొనలేదు గొల్లప్రోలు మండలం మల్లవరంలో రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు ఒక్క గింజకూడా కొనకపోవంతో తీవ్ర నష్టాలు పాలయ్యామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో పది రోజులుగా రైతులు తమ ధాన్యంను కళ్లాల్లోనే వదిలేయాల్సి వచ్చింది. అధికారుల సూచనల మేరకు ధాన్యాన్ని కళ్లాల్లో ఆరబెట్టినట్లు రైతులు చెబుతున్నారు. అయితే మల్లవరంలో ధాన్యం కొనుగోలు చేయాల్సిన వీఏఏ పది రోజులుగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో శుక్రవారం వచ్చిన అకాల వర్షం మొత్తం ధాన్యం తడిపేసిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కేవలం మల్లవరంలోనే 700 ఎకరాల్లో పండించిన ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకే ఈ నష్టాలు సంభవించాయని, దీనికి వీఏఏపై చర్యలు తీసుకుని, తమకు నష్ట పరిహారం ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పరిహారం ఇవ్వాలి మల్లవరంలో రబీ కోతలు ప్రారంభమై నెల రోజులు దాటింది. ఇక్కడి వీఏఏ ఆన్లైన్ చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో పంటను అమ్ముకునే దారిలేక, వర్షంలో తడిసి రైతల నష్టాల పాలయ్యారు. పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. – అరిగెల అచ్చియ్యమ్మ రామయ్యదొర, మాజీ ఎంపీపీ, గొల్లప్రోలు మండలం -
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో తుపానులు, వరదలు ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా అప్రమత్తంగా ఉండడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టేందుకు అధికారులు పూర్తి సన్నద్ధతతో ఉండాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం తుపానులు, వరదలు ఇతర విపత్తుల సమయంలో చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి సన్నద్ధతపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. జిల్లాలో తుపానులు ఇతర ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశాల దృష్ట్యా చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, విపత్తుల అనంతరం పునరుద్ధరణ చర్యలపై కలెక్టర్ అధికారులతో చర్చించారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ రబీ సీజన్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ చేపట్టాలని, రాబోయే ఖరీఫ్ సీజన్కు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో రబీ సీజన్ పంట కోతలు, ధాన్యం సేకరణపై కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం సేకరణలో జాప్యం లేకుండా కొనుగోలు కేంద్రాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. ఇప్పటి వరకూ 1.15 లక్షల ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయని సుమారు 60 వేల మెట్రిక్ ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించామన్నారు. -
ఘనంగా సత్యదేవుని శ్రీ చక్రస్నానం
అన్నవరం: శ్రీ సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలలో భాగంగా ఆరో రోజు వైశాఖ పౌర్ణమి, శుక్రవారం ఉదయం పంపానదిలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు శ్రీచక్రస్నానం, సాయంత్రం రత్నగిరిపై నాగవల్లి, దండియాడింపు కార్యక్రమాలను పండితులు ఘనంగా నిర్వహించారు.ఉదయం 8–30 గంటలకు పెళ్లిపెద్దలు సీతారాములు వెంట రాగా నవదంపతులు సత్యదేవుడు, అమ్మవార్లను, ఊరేగింపుగా పంపా నదీ తీరానికి తీసుకువచ్చారు. అక్కడ మండపం లోపల గల సింహాసనం మీద స్వామి, అమ్మవార్లను, మరో ఆసనం మీద సీతారాములను ప్రతిష్ఠించి పూజలు చేశారు. పండితుల మంత్రోచ్ఛాటన మధ్య స్వామివారికి, శూలానికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, నెయ్యితో అవభృతస్నానం చేయించారు. విభిన్నంగా శ్రీచక్రస్నానం పంపా నదిలో సత్యదేవుని శ్రీచక్రస్నానం ఈసారి వాడపల్లిలో జరిగినట్టుగా విభిన్నంగా నిర్వహించారు. అవభృత స్నానం అనంతరం సత్యదేవుని ఉత్సవ మూర్తిని, శూలాన్ని ఊరేగింపుగా పంపా నది లోపలకు తీసుకువెళ్లి నదిలో మూడుసార్లు చక్రస్నానం చేయించారు. అనంతరం ఒడ్డున నిర్మించిన ఇనుప మంచె మీదకు స్వామివారిని, శూలాన్ని తీసుకువచ్చి పైపు ద్వారా నదిలో నీటితో శూలాన్ని అభిషేకించగా ఆ మంచె కింద ఉన్న భక్తులు స్నానం చేశారు. వేడుకగా నాగవల్లి, దండియాడింపు కార్యక్రమం సాయంత్రం అనివేటి మండపంలో స్వామి, అమ్మవార్లకు నాగవల్లి పట్టు, నీలలోహిత ధారణ, దండియాడింపు కార్యక్రమాలను నిర్వహించారు. రంగులతో నాగవల్లిని తీర్చిదిద్ది పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి నీలలోహిత మాల (నల్లపూసల దండ) ధారణ చేశారు. స్వామి కల్యాణం నాడు ఆరోహించిన ధ్వజాన్ని అవరోహణ చేశారు. అర్చకస్వాములు కంకణ విమోచనం చేశారు. బంతులాట, బిందెలో ఉంగరం వెదకడం వంటివి వేడుకగా చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల విగ్రహాలను పట్టుకుని అర్చకస్వాములు నృత్యం చేస్తూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. స్వామివారి నిత్య కల్యాణ మండపంలో శనివారం రాత్రి 8–30 గంటల శ్రీపుష్పయాగం నిర్వహించనున్నట్లు ఈఓ నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు. -
చిన్నారి.. జిల్లా ఫస్ట్
పెదపూడి: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పెదపూడి మండలం సంపర గ్రామానికి చెందిన విద్యార్థిని దూళ్ల చిన్నారి 596 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల నుంచి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఎంఈఓలు–1, 2 జి.విశ్వనాథ్, సీవీవీ సత్యనారాయణ ఈ విషయం తెలిపారు. సంపర జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన చిన్నారి ఈ ఘనత సాధించడం ఆనందంగా ఉందని అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎంఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ, చక్కటి ప్రణాళిక, క్రమశిక్షణతో చదివిన తమ విద్యార్థిని చిన్నారి జిల్లా ఫస్ట్ సాధించడం అభినందనీయమని అన్నారు. సీఏ చదవాలనేదే తన లక్ష్యమని చిన్నారి ఈ సందర్భంగా తెలిపింది. -
ఓ మెట్టు ఎక్కారు
● ‘పది’లో గత ఏడాది 15వ స్థానం ● ఈసారి 14 ● 86.08 శాతం ఉత్తీర్ణత ● గత ఏడాదికంటే కాస్త మెరుగుదలబాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో జిల్లాను రాష్ట్ర స్థాయి టాప్ టెన్లో నిలపాలనే అధికారుల ఆశలు ఆవిరయ్యాయి. ఉత్తీర్ణత శాతం కాస్త పెరిగినా.. గత ఏడాది కంటే రాష్ట్ర స్థాయిలో జిల్లా ఒక్క మెట్టు మాత్రమే ఎక్కగలిగింది. పొరుగునే ఉన్న కోనసీమ జిల్లా రాష్ట్ర స్థాయిలో 2, తూర్పు గోదావరి 9వ ర్యాంకులు సాధించి టాప్ టెన్లో స్థానం పొందగా మన జిల్లా మాత్రం 14వ ర్యాంకుకే పరిమితమైంది. గత నెల 16 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకూ నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 28,289 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 24,347 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 82.02 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్ర స్థాయిలో 15 స్థానంలో నిలిచిన జిల్లా.. ఈ ఏడాది 86.08 శాతం ఉత్తీర్ణతతో కాస్త మెరుగుపడి, 14వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. బాలికలదే పైచేయి పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. మొత్తం బాలికలు 14,357 మంది ఈ పరీక్షలకు హాజరవగా 12,609 మంది (87.84 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 13,932 మంది హాజరు కాగా, 11,738 మంది (84.26 శాతం) మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 20,034 మంది ప్రథమ, 3,091 మంది ద్వితీయ, 1,222 మంది తృతీయ శ్రేణుల్లో ఉత్తీర్ణులయ్యారు. టెన్త్లో మెరుగైన ఉత్తీర్ణత శాతం సాధించినా.. రాష్ట్రస్థాయి ర్యాంకింగ్ ఆశించినట్టుగా లేకపోవడంతో అధికారులు కాస్త నిరుత్సాహపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు సాధించిన ఫలితాలు సైతం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేసిన కృషికి ఫలితంగానే లభించడం గమనార్హం. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేయాలిలా.. జిల్లా వ్యాప్తంగా 3,942 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో తప్పారు. వీరితో పాటు పరీక్షల్లో పాసై, మార్కులు తక్కువ వచ్చాయని భావిస్తున్నవారు పునర్మూల్యంకనం (రీ వెరిఫికేషన్) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మే నెల 1 నుంచి ఏడో తేదీ రాత్రి 11 గంటల్లోగా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రీ కౌంటింగ్కు గాను ప్రతి సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్కు రూ.1,000 చెల్లించాలి. రీ కౌంటింగ్కు దరఖాస్తు చేసిన వారి మార్కులు మళ్లీ ఒకసారి లెక్కిస్తారు. తప్పుగా ఉంటే ఆ మార్కులు మళ్లీ కలుపుతారు. అంతే తప్ప పేపర్ ఇవ్వరు. అదే రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకుంటే మాత్రం స్కానింగ్ చేసిన జవాబు పత్రాలను విద్యార్థికి అందిస్తారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్ 4వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫలితాలు కూడా గురువారం విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 1,593 మంది హాజరు కాగా 668 మంది (41.93 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియెట్ పరీక్షలకు 6,003 మంది హాజరవగా 2,893 మంది (48.19 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఫెయిలైన వారికి మే 25 నుంచి జూన్ ఒకటో తేదీ వరకూ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, సమీప పాఠశాలల్లో ఫీజు చెల్లించాలని జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ పి.సాయి వెంకట రమణ తెలిపారు. -
రత్నగిరిపై ప్రతిధ్వనించిన వేదఘోష
అన్నవరం: రత్నగిరిపై వేద ఘోష ప్రతిధ్వనించింది. వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాల్లో భాగంగా నవ దంపతులు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల సమక్షంలో బుధవారం వేద పండిత సదస్యం ఘనంగా జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను, పెళ్లి పెద్దలు సీతారాములను అనివేటి మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి వేదికపై ప్రతిష్ఠించి, సర్వాంగ సుందరంగా అలంకరించి, పూజలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచీ వచ్చిన వేద పండితులు సాయంత్రం 6 గంటలకు స్వామివారి ముందు తమ నాలుగు వేదాలు పఠించి, తమ విద్వత్తును ప్రదర్శించారు. అనంతరం, సత్యదేవుడు, అమ్మవార్లకు దేవస్థానం వేద పండితులు వేదాశీస్సులందజేశారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన చెందిన ప్రవా రామకృష్ణ సోమయాజి, రామ్లాల్శర్మలతో పాటు 180 మంది వేద పండితులను, దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, శివ తదితరులను, ఆలయ ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యశర్మ, విశ్రాంత ప్రధానార్చకులు ఇంద్రగంటి గోపాలకృష్ణ, నాగాభట్ల సత్యనారాయణ, విశ్రాంత వ్రత పురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, మంగళంపల్లి కృష్ణభగవాన్జీలను దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి, ఏఈఓ కృష్ణారావు ఘనంగా సత్కరించారు. ఘనపాఠులకు రూ.4 వేలు, క్రమపాఠులు, విశ్రాంత అర్చకులు, వ్రత పురోహితులకు రూ.3 వేల చొప్పున పారితోషికాన్ని వారి అకౌంట్లలో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పొన్నచెట్టు వాహనంపై ఘనంగా ఊరేగింపు కల్యాణోత్సవాల్లో భాగంగా సత్యదేవుడు, అమ్మవారిని పొన్నచెట్టు వాహనం మీద ఘనంగా ఊరేగించారు. రాత్రి 8.30 గంటలకు స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా రత్నగిరి తొలి పావంచా వద్దకు తీసుకువచ్చి, పొన్నచెట్టు వాహనంపై వేంచేయించి, పండితులు పూజలు చేయించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ దర్శించి, పూజలు చేశారు. అనంతరం, రత్నగిరి తొలి పావంచా నుంచి ఆంధ్రా బ్యాంక్ సెంటర్ వరకు.. అక్కడి నుంచి తిరిగి తొలి పావంచా వరకు ఊరేగింపు సాగింది. పలువురు కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించారు. అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి, వేద పండితులు, అర్చకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. -
ఇంధన కొరత పాపం ప్రభుత్వానిదే..
పిఠాపురం రూరల్: ఇంధన కొరత పాపం ప్రభుత్వానిదేనని వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎంపీ వంగా గీత విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ కొరత కారణంగా అన్ని రంగాల వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని కొరత మన రాష్ట్రంలోనే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఇంధన కొరత లేదన్న అధికారులు.. వాహనాలకు మాత్రం రూ.200, రూ.500 విలువైన పెట్రోలు, డీజిల్ మాత్రమే పోయాలని, బాటిళ్లలో వేయవద్దని ఆదేశాలిచ్చారని, కొంతసేపటికే నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయని చెప్పారు. ఎటువంటి కొరతా లేదని మంత్రులు కూడా ప్రకటనలు ఇచ్చారని.. ఇదంతా చూస్తుంటే ఉద్దేశపూర్వకంగానే కొరత సృష్టించినట్లు కనిపిస్తోందని అన్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతోందని తెలియగానే అన్ని బంకులూ తెరచుకోవడం ప్రారంభమైందన్నారు. మరోసారి ఇటువంటి కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు చేపట్టాలని గీత డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు గండేపల్లి రామారావు (బాబీ), పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, నాయకులు కొత్తెం దత్తుడు, బత్తుల సాయి, పెదపాటి రాజేష్, తలిశెట్టి వెంటేశ్వరరావు, రావు చిన్నారావు, ఆనాల సుదర్శన్, అలీ, మొయిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రాక బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్కు కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ బుధవారం స్వాగతం పలికారు. స్థానిక హోటల్లో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం, మంత్రి బాలాత్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రి వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు కూడా ఉన్నారు. -
ఆ ఉత్తర్వులు మత స్వేచ్ఛకు విఘాతం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వేలాదిగా క్రైస్తవులు కాకినాడలో బుధవారం ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. కాకినాడ డిస్ట్రిక్ట్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యాన స్థానిక భానుగుడి సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా కాకినాడ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దొమ్మేటి శామ్యూల్ సాగర్, జోషఫ్ బెన్నీ మాట్లాడుతూ, 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేసి, దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేశారు. పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు వారికి సంఘీభావం తెలుపుతూ క్రైస్తవుల న్యాయ పోరాటానికి తన పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. ర్యాలీ, ధర్నా అనంతరం క్రైస్తవ సంఘాల నాయకులు కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. -
మెరుగైన ర్యాంకు సాధిస్తాం
పదో తరగతి ఫలితాల్లో జిల్లా మెరుగైన ర్యాంకు సాధిస్తుందనే నమ్మకం ఉంది. పరీక్షలకు ముందుగా విద్యార్థులకు వంద రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేశాం. ప్రతి విద్యార్థీ ఉత్తీర్ణత సాధించేలా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. పిల్లలు ఫెయిలైతే తల్లిదండ్రులు తిట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. పదో తరగతి అంటే పెద్ద వయసేమీ కాదు. మరోసారి చదివి ఉత్తీర్ణత సాధించేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ దాగి ఉంటుంది. దానిని తల్లిదండ్రులు గుర్తించి పిల్లలను ప్రోత్సహించాలి. – పిల్లి రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ పక్కాగా నిర్వహణ పదో తరగతి పరీక్షల అన్ని దశలనూ సమర్థవంతంగా నిర్వహించాం. పరీక్ష ప్రారంభం రోజు నుంచీ ఎక్కడా ఏ లోటూ రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం. మూల్యాంకనం కూడా నిర్ణీత గడువులో పూర్తి చేయగలిగాం. – రమామణి, అసిస్టెంట్ కమిషనర్, ప్రభుత్వ పరీక్షల విభాగం కాకినాడ -
మట్టి అక్రమ తవ్వకాలను నిలిపివేయాలి
పిఠాపురం రూరల్: మండలంలోని రాపర్తి చెరువులో జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎంపీ వంగా గీత డిమాండ్ చేశారు. పార్టీ నాయకులతో కలసి రాపర్తి చెరువును బుధవారం పరిశీలించిన ఆమె.. మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్న చోట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 70 ఎకరాల విస్తీర్ణం కలిగిన రాపర్తి చెరువు కింద సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. వారం రోజులుగా ఈ చెరువులోని మట్టిని భారీ యంత్రాలతో తవ్వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. మైనింగ్, రెవెన్యూ అధికారులు తమకు సంబంధం లేదంటున్నారని, ఇరిగేషన్ అధికారులను ప్రశ్నిస్తే కేవలం మూడడుగులు తవ్వేందుకు మాత్రమే.. అది కూడా రాయవరం చెరువుకు మాత్రమే అనుమతి ఇచ్చామని చెబుతున్నారని వివరించారు. అక్రమార్కులు చెరువును తవ్వేస్తూ లారీ మట్టిని రూ.5 వేలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్తోందని గీత ప్రశ్నించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇటుక బట్టీల ద్వారా అనేక మంది ఉపాధి పొందుతున్నారని, ఈ మట్టిని ఇటుక బట్టీలకు, రైతులకు, అవసరమైన ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రమ తవ్వకాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. గతంలో ఇదే మట్టి మాఫియాపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారని, ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రాపర్తి, రాయవరం చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాలను వెంటనే నిలిపివేయించాలని డిమాండ్ చేశారు. ఈ చెరువుల్లో తవ్విన మట్టిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే సహించేది లేదని, నర్సింగపురంలో పేదలకు కేటాయించిన 60 ఎకరాల లే అవుట్ అభివృద్ధికి వినియోగించాలని గీత కోరారు. -
కాలువలు క్లోజ్ ఓసారి చూడండి ప్లీజ్
పిఠాపురం: పూర్తిగా శిథిలమైపోవడంతో తాళ్లు కట్టిన, గాల్లో వేళ్లాడుతున్న గేట్లు.. చిట్టడిలా పెరిగిపోయిన గుర్రపుడెక్క, గడ్డి మొక్కలు.. మూసుకుపోయిన కల్వర్టులు.. ముందుకు పారని నీరు.. ఇదీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు, పిఠాపురం బ్రాంచి కెనాల్స్ దుస్థితి. ఈ కాలువల కింద నియోజకవర్గంలో సుమారు 30 వేల మంది రైతులు దాదాపు 42 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కాలువలు పూడుకుపోవడం, గేట్లు, స్లూయిజ్లు శిథిలమవడం, కల్వర్టులు, తూములు మూసుకుపోవడంతో భారీ వర్షాల సమయంలో పంట పొలాలను నీరు ముంచెత్తుతోంది. మామూలు రోజుల్లో నీరు సక్రమంగా ప్రవహించక పంటలు ఎండిపోతున్న దుస్థితి. ప్రస్తుతం పంట కాలం ముగియడంతో ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ నుంచి రబీ సాగుకు నీటి విడుదలను నిలిపివేసి దాదాపు పక్షం రోజులు కావస్తోంది. నీరు లేకపోవడంతో ఈ సమయంలో సాధారణంగా కాలువల్లో పూడికలు తొలగించడం, గేట్లకు మరమ్మతుల వంటి క్లోజర్ పనులు చేస్తూంటారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకూ ఆ పనుల సంగతే పట్టించుకోవడం లేదు. దీంతో, ఏలేరు, పీబీసీ ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజుల్లో అధికారులు కాలువలకు మళ్లీ నీరు విడుదల చేస్తారు. క్లోజర్ పనుల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది కూడా తమకు నష్టాలు తప్పవేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇల్లు కట్టుకోవాలంటే.. డబ్బివ్వు..
కాకినాడ జిల్లా: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నాయకుల దందా రోజురోజుకు పెరిగిపోతోంది. వారి ధనదాహం పెచ్చుమీరిపోయింది. ఇల్లు కట్టుకోవాలంటే తమకు డబ్బవ్వాల్సిందేనని తనను జనసేన నేతలు వేధిస్తున్నారని ఓ పేదమహిళ ఆవేదన చెందుతోంది. వారి వేధింపులు తట్టుకోలేక సీపీఐ, ప్రజాసంఘాల నేతలతో కలిసి ఆమె మంగళవారం ఆందోళనకు దిగింది. స్థానిక జగ్గయ్యచెరువు కాలనీలో పేదమహిళ కఠారి సత్యవతి తనకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టింది. ఇది గమనించిన స్థానిక జనసేన నాయకులు కొందరు ముఠాగా ఏర్పడి తమకు కొంత డబ్బు ఇవ్వాలని ఆమెను ఇబ్బందులకు గురిచేయడం మొదలుపెట్టారు. జనసేన నాయకులు తనను బెదిరిస్తున్నారని ఆమె ఈ నెల 20న పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై స్పందించిన అధికారులు రికార్డుల ప్రకారం ఇంటి నిర్మాణం సక్రమమేనని, ఎవరూ అడ్డు చెప్పరని, పనులు కొనసాగించవచ్చని లిఖితపూర్వకంగా ఆదేశాలిచ్చారు. అధికారుల ఆదేశాలతో ఆమె ఇంటి పనులు మొదలుపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన ముఠా మంగళవారం మరోసారి ఆమె వద్దకు వెళ్లి తమకు డబ్బు ఇవ్వాలని, లేదంటే పనులు నిలిపేయాలని బెదిరింపులకు దిగారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన సత్యవతి తనకు న్యాయం చేయాలంటూ సీపీఐ, ప్రజాసంఘాల నాయకులతో కలిసి పాడా కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఇంతకాలం సరైన ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులకు గురయ్యానని, కష్టపడి ఒక్కో రూపాయి సంపాదించి ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు నిరి్మంచుకుంటుంటే జనసేన నాయకులు అడ్డుపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వారం రోజుల కిందట స్లాబ్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటే జనసేన నాయకులు అడ్డుకున్నారని, దీంతో తీవ్రంగా నష్టపోయానని తెలిపింది. తన ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్న జనసేన నాయకులపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని ఆమె అధికారులను కోరింది. -
ప్చ్.. ఈసారీ అంతే..
అన్నవరం: సత్యదేవుని కల్యాణోత్సవం ఈ ఏడాది కూడా కళ కట్టలేదనే అభిప్రాయం భక్తుల నుంచి వస్తోంది. రత్నగిరిపై వార్షిక కల్యాణ వేదిక మీద తెరను సోమవారం రాత్రి 9 గంటలకే తీసి, స్వామి, అమ్మవారికి మేళతాళాల మధ్య హారతి ఇచ్చారు. అప్పటి నుంచి 9.30 గంటల వరకు కల్యాణం గురించి వ్యాఖ్యానం చెప్పించి, ఆ తరువాత ప్రారంభించారు. ఉత్సవానికి ఎమ్మెల్యేలెవ్వరూ హాజరవలేదు. కలెక్టర్ హరీంధిర ప్రసాద్ కూడా మంచి ముత్యాలు, పట్టువస్త్రాలు సమర్పించి వెళ్లిపోయారు. అయినప్పటికీ సీట్ల విషయంలో గందరగోళం తప్పలేదు. చైర్మన్, ఈఓ, 16 మంది ట్రస్ట్బోర్డు సభ్యులు, నలుగురు ప్రత్యే ఆహ్వానితులు, ఒక జిల్లా జడ్జి మాత్రమే వీఐపీలుగా వచ్చారు. ముందు వచ్చిన వారిని ముందు వరుస, వెనుక వచ్చిన వారిని వెనుక అన్నట్టుగా కూర్చోపెట్టారు. ఆలస్యంగా వచ్చిన ఒకరిద్దరు ట్రస్ట్బోర్డు సభ్యులు సీట్లు దొరకక చాలాసేపు ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చోవలసి వచ్చింది. కల్యాణ వేదిక మీద పుష్పాలంకరణ కాస్త నయమనిపించినా సత్యదేవుని ప్రధానాలయం లోపల, ఆలయం చుట్టూ తూతూమంత్రంగా బంతి, చామంతి పూలదండలు వేలాడతీశారు. విద్యుత్కు అంతరాయం స్వామివారి కల్యాణంలో ఎప్పుడూ విద్యుత్తు అంతరాయం అనేదే లేదు. కానీ, కల్యాణం జరుగుతున్న సమయంలో వేదిక మీద విద్యుద్దీపాలు రెండుసార్లు ఆరిపోయాయి. దీంతో, వేదిక ఎదురుగా ఉన్న ఫ్లడ్ లైట్ల వెలుగులోనే క్రతువు కొనసాగించారు. ఆ ఫ్లడ్లైట్లు కూడా రెండుసార్లు ఆరిపోయాయి. ఎల్ఈడీ స్క్రీన్లు కూడా కొంతసేపు మొరాయించాయి. కల్యాణ వేదిక ముందు విశ్రాంత షెడ్డులో అటూ ఇటూ అమర్చిన దీపాలు కూడా దోబూచులాడాయి. పశ్చిమ రాజగోపురం ముందున్న పందిళ్ల కింద, ఇంకా చాలాచోట్ల కూడా దీపాలు వెలగలేదు. ఈ పరిస్థితికి ఓవర లోడ్ కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే దేవస్థానంలో రెండేళ్ల క్రితం రూ.5 కోట్లతో సోలార్ ప్లాంటు పెట్టారు. అలాగే, దేవస్ధానానికి విద్యుత్ సరఫరా అయ్యేలా సబ్స్టేషన్ కూడా నిర్మించారు. అయినప్పటికీ ఇంకా ఓవర్ లోడు, లో ఓల్టేజీ అంటే ఎలాగనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకా.. ఫ సత్యదేవుని కల్యాణోహోత్సవాలు జరిగే వారం రోజులూ రత్నగిరి, సత్యగిరులపై దేవస్థానం వైద్య సిబ్బంది, శంఖవరం పీహెచ్సీ సంయుక్తంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కల్యాణోత్సవ సమన్వయ సమావేశంలో నిర్ణయించారు. కానీ, కల్యాణోత్సవం జరిగిన రోజున ఉదయం నుంచి రాత్రి వరకూ ఎక్కడ ఆ జాడే లేదు. ఫ తలంబ్రాల పంపిణీ చేసేందుకు సన్నిధి కౌంటర్, ప్రసాదం కౌంటర్ రెండూ 60 అడుగుల దూరంలోనే ఏర్పాటు చేశారు. దీంతో, రెండు క్యూలు కలిసిపోయి గందరగోళం ఏర్పడింది. ఫ ఈ నెల 30న జరిగే సత్యదేవుని రథోత్సవం, వచ్చే నెల 2న శ్రీపుష్పయాగం నాడు ఇటువంటి లోపాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది.తలంబ్రాల కోసం తప్పని గందరగోళం విద్యుత్ అంతరాయంతో కొద్దిపాటి వెలుగులోనే సత్యదేవుని కల్యాణంఫ సత్యదేవుని కల్యాణోత్సవ నిర్వహణలో లోపాలు ఫ విద్యుత్కు పలుమార్లు అంతరాయం ఫ తలంబ్రాల కోసం తప్పని అవస్థలు -
కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు
డీజిల్, పెట్రోల్ కొరత లేదని కేంద్రం చెబుతోంది. కానీ, ఆంధ్రాలో మాత్రం 70 శాతం బంకులు మూతబడ్డాయి. ఆయిల్ మాఫియాతో కలిసి కూటమి నేతలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ పక్కదారి పట్టిస్తున్నారు. ధరలు పెరిగిన తరువాత ఈ నిల్వలను విక్రయించడం ద్వారా రూ.కోట్లు ఆర్జించే ప్రయత్నాల్లో కూటమి నేతలున్నారు. వరి కోతల సమయాన్ని అవకాశంగా చేసుకుని కొంత మంది కూటమి నేతలు బ్లాక్ మార్కెట్లో డీజిల్ విక్రయిస్తున్నారు. ప్రజల కష్టాలు చంద్రబాబు చెవికెక్కడం లేదు. మంత్రులు కనీసం పట్టించుకోకుండా సింగపూర్లో షికారు చేస్తున్నారు. – తోట నరసింహం, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, జగ్గంపేట -
ఇదేం అన్యాయం?
ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోంది. పెట్రోలు, డీజిల్ కోసం ఇన్ని రోజులు వేచి చూడాల్సిన దుస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదు. ఇదేం అన్యాయం? చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. ఇంధన కొరత నివారణలో ప్రభుత్వం విఫలమైన విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. – ముద్రగడ గిరిబాబు, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, ప్రత్తిపాడు ఎక్కడా లేనిది మనకే ఎందుకు? దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లోనూ లేని పెట్రోల్, డీజిల్ కొరత ఒక్క మనకే ఎందుకుంది? ఆయిల్ మాఫియా, బంకు యాజమాన్యాలు డీజిల్, పెట్రోలు కృత్రిమ కొరత సృష్టించి, వేలకు వేల లీటర్లు దాచుకుని లీటరుపై రూ.150 వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, పెట్రోల్, డీజిల్ కొరత సమస్యను వెంటనే పరిష్కరించాలి. ఆయిల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి. – కర్నాకుల వీరాంజనేయులు, ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇలాగైతే కష్టమే.. పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టినప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికారులు సమీక్షలకే పరిమితమైతే సమస్య తీరదు. డీజిల్ కొరతతో ఆక్వా రైతులు కుదేలవుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రవాణా వ్యవస్థ స్తంభించి, అన్ని రంగాలపై భారం పడుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన డీజిల్, పెట్రోల్ కొరత నివారణకు చర్యలు చేపట్టాలి. – తాటిపాక మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, కాకినాడ వ్యాపారం పడిపోయింది నేను చిన్నపాటి కిరాణా వ్యాపారం చేస్తుంటాను. డీజిల్ కొరత వల్ల కిరాణా సామగ్రి తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. హోల్సేల్ వ్యాపారులు కూడా సరకులు రావడం లేదని చెబుతున్నారు. వ్యాపారాలు సగానికి సగం పడిపోయాయి. ఏం చేయాలో అర్థం కావటం లేదు. – ఎం.రమేష్బాబు, కిరాణా వ్యాపారి, పిఠాపురం -
ఘనంగా అరుంధతీ నక్షత్ర దర్శనం
అన్నవరం: సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల్లో మూడో రోజైన మంగళవారం సాయంత్రం నవదంపతులు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు దర్బారు మండపంలో స్థాలీపాక హోమాలు ఘనంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లను తూర్పు రాజగోపురం ముందు ఆవరణలోకి పండితులు ఊరేగింపుగా తీసుకువచ్చి, అరుంధతి నక్షత్రాన్ని దర్శింపజేసి, పూజలు చేశారు. రాత్రి 9 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కొండ దిగువన తొలి పావంచా వద్దకు తీసుకువచ్చారు. అక్కడ సర్వాంగ సుందరంగా అలంకరించిన రావణబ్రహ్మ వాహనంపై స్వామి, అమ్మవార్లను వేంచేయించి, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం తదితరులు పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు దర్శించి, పూజలు చేశారు. అనంతరం, రావణబ్రహ్మ వాహనం ముందు కుంభపు రాశి వేశారు. తరువాత కొబ్బరి కాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. తొలి పావంచా నుంచి ఆంధ్రా బ్యాంక్ సెంటర్ వరకూ, తిరిగి తొలి పావంచా వరకు ఈ ఊరేగింపు సాగింది. కళాకారులు పలు కళారూపాలను ప్రదర్శించారు. ఊరేగింపు సందర్భంగా గ్రామంలోకి భారీ వాహనాలను అనుమతించలేదు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఊరేగింపును తిలకించేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు తరలివచ్చారు. ఊరేగింపు సాగినంతసేపు బాణసంచా కాల్చారు. ఒకవైపు ఊరేగింపు సాగుతుండగా మరోవైపు వాహనాల రాకపోకలు యథాతథంగా కొనసాగడంతో కొంత గందరగోళం నెలకొంది. -
ఈవీఎంల గోదాము తనిఖీ
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎంలు, వీవీ ప్యాట్స్ గోదామును కలెక్టర్ ఎంఎన్ హరీంధిర ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి టి.తిప్పేనాయక్ మంగళవారం తనిఖీ చేశారు. గోదాము భద్రతకు చేపడుతున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని రెవెన్యూ, ఎన్నికల విభాగాల అధికారులను ఆదేశించారు. గోదాము పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలా ఈవీఎంల గోదామును తనిఖీ చేసి, నివేదిక పంపిస్తున్నామని చెప్పారు. పెట్రోలు బంకుల్లో జేసీ తనిఖీ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): నగరంలోని పెట్రోలు బంకులను జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మంగళవారం తనిఖీ చేశారు. భానుగుడి జంక్షన్ వద్ద హెచ్పీసీఎల్, నూకాలమ్మ గుడి వద్ద ఐఓసీఎల్ బంకులను తనిఖీ చేసి, స్టాకు వివరాలపై ఆరా తీశారు. వినియోగదారులతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, కాకినాడలో ఇంధన వనరులు అందుబాటులో ఉన్నాయని, వినియోగదారులకు ఆందోళన చెందకుండా అవసరమైన మేరకు మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ఇంధన వనరుల సరఫరాలో వినియోగదారులు ఇబ్బందులు పడకుండా రెవెన్యూ, పౌర సరఫరాలు, పోలీసు అధికారులతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. సూర్య, చంద్రప్రభ వాహనాలపై ఊరేగిన శ్రీవారు ద్వారకా తిరుమల: చినవెంకన్న ఆలయంలో జరుగుతున్న వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై దర్శనమిచ్చిన ఆ దేవదేవుడిని కన్నులారా వీక్షించిన భక్తులు పులకించారు. తొలుత పంచాయుధాలను ధరించి, నారాయణమూర్తి అలంకరణలో సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించిన శ్రీవారికి అర్చకులు విశేష పుష్పాలంకారాలు చేసి, హారతులిచ్చారు. అనంతరం అట్టహాసంగా గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి ఉభయ దేవేరులతో శ్రీవారు చంద్రప్రభ వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. శ్రీహరి కళాతోరణ వేదికపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. ఆలయ ముఖ మండపంలో అహల్య శాప విమోచనం అలంకరణలో ఉన్న శ్రీవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. పుష్కర భక్తులకు సదుపాయాలపై దృష్టి రాజమహేంద్రవరం సిటీ: వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలూ కల్పించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. పుష్కరాల నిర్వహణ, మౌలిక సదుపాయాలపై జాయింట్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్, కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మలతో కలసి నగర పాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్పొరేషన్ పరిధిలో వివిధ శాఖల అధికారులతో విభాగాల వారీగా జరుగుతున్న ప్రాథమిక పనులు, అవసరమైన సౌకర్యాలు, ఘాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, భద్రతా చర్యలు, నగర సుందరీకరణ, ఘాట్లలో విద్యుద్దీపాలు, తాగునీరు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. -
రవాణా రంగం కుదేలు
ఆటో, క్యాబ్ డ్రైవర్లు, భారీ వాహనాల డ్రైవర్లు డీజిల్ కోసం రోజుల తరబడి బంకు వద్ద పడిగాపులు పడుతున్నారు. రవాణా రంగం కుదేలైంది. ఎగుమతులు, దిగుమతులకు సరైన సమయంలో వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే డీజిల్ కొరత నెలకొంది. డీజిల్, పెట్రోలు కొరతను ప్రభుత్వం ఇప్పటికై నా నివారించాలి. – వాసు యేలేటి, జయహో రథసారథి లారీ డ్రైవర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, కాకినాడ -
ప్రజల ఇబ్బందులు పట్టవా?
అవసరానికి తగ్గట్టుగా డీజిల్, పెట్రోలును అందుబాటులోకి తీసుకురావడంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. డీజిల్ లేక రవాణా వాహనాలు నిలిచిపోయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఇంధన సంక్షోభం మన రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనాన్ని స్పష్టం చేస్తోంది. – పాకలపాటి సోమరాజు, సీఐటీయూ కార్యదర్శి, ఏలేశ్వరం బంకు వద్ద పడిగాపులు నాలుగు రోజులుగా డీజిల్ కోసం ఎన్ని బంకుల వద్దకు వెళ్లినా నో స్టాక్ బోర్డే దర్శనమిస్తోంది. ఎక్కడైనా డీజిల్ ఉన్నా అక్కడ 100 నుంచి 150 వాహనాలుండటంతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పడిగాపులు పడాల్సి వస్తోంది. అంతసేపు వేచి ఉంటే కేవలం 10 లీటర్ల డీజిల్ పోస్తున్నారు. ట్రావెల్స్ వాహనాలకు కూడా ఎక్కువ డీజిల్ కొట్టకపోవడంతో నాలుగు రోజులు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. – సుబ్రహ్మణ్యం, ట్యాక్సీ యజమాని -
కల్యాణం.. భక్తజన సమ్మోహనం
అన్నవరం: ‘మాంగల్యం తంతునానేనా లోక రక్షణ హేతునా..’ అంటూ పండితులు గళమెత్తి సుస్వరంగా వేదమంత్రాలు పఠిస్తూండగా.. మంగళధ్వనులు, భక్తుల జయజయధ్వానాలు దిక్కులన్నిటా ప్రతిధ్వనిస్తూండగా.. జగత్కల్యాణ కారకులైన సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల వార్షిక దివ్య కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. రత్నగిరి వార్షిక కల్యాణోత్సవపై సోమవారం రాత్రి ఆద్యంతం భక్తజన సమ్మోహనంగా ఈ ఉత్సవం జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి కల్యాణాన్ని కన్నులారా తిలకించి పులకించిపోయారు. కల్యాణ క్రతువు సాగిందిలా.. వరుడు సత్యదేవుడిని వెండి గరుడ వాహనంపై, వధువు అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని వెండి గజ వాహనంపై, పెళ్లి పెద్దలు సీతారాములను వెండి పల్లకీపై రాత్రి 7 గంటలకు కొండ దిగువన అన్నవరం గ్రామంలో ఘనంగా ఊరేగించారు. సీతారాములే పెళ్లి పెద్దలుగా వెంట రాగా, కల్యాణ వేదిక వద్దకు రాత్రి 9 గంటలకు వధూవరులను ఊరేగింపుగా తీసుకొచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన సింహాసనంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను.. మరో ఆసనంపై సీతారాములను వేంచేయించారు. రాత్రి 9.08 గంటలకు కల్యాణ క్రతువుకు శ్రీకారం చుట్టారు. రాత్రి 10.42 గంటల శుభముహూర్తంలో వధూవరుల శిరస్సులపై అర్చకులు జీలకర్ర, బెల్లం ఉంచారు. 10.50 గంటల సుముహూర్తంలో మంగళసూత్ర ధారణ గావించారు. 10.55 గంటలకు స్వామి, అమ్మవార్ల శిరస్సులపై అర్చకులు మంచి ముత్యాల తలంబ్రాలు పోశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను తిరిగి ఊరేగింపుగా ప్రధానాలయానికి చేర్చారు. వేద పండితులు, ఆలయ ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యశర్మ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, వ్రత పురోహితులు అంగర సతీష్, పాలంకి పట్టాభి, కొంపెల్ల మూర్తి తదితరులు కల్యాణ క్రతువు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున కలెక్టర్ ఎంఎన్ హరీంధిర ప్రసాద్ పట్టు వస్త్రాలు, మంచి ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. దేవస్థానం తరఫున చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు దంపతులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు నూతన వస్త్రాలు సమర్పించారు. ఇంకా తిరుమల తిరుపతి, విజయవాడ కనక దుర్గమ్మ, ద్వారకా తిరుమల దేవస్థానాల తరఫున అక్కడి పండితులు కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు. కల్యాణ వేదిక వద్ద విద్యుద్దీపాలంకరణ, పుష్పాలంకరణ అందరినీ ఆకట్టుకున్నాయి. కల్యాణోత్సవం సందర్భంగా సుమారు 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కల్యాణోత్సవం జరుగుతూండగా గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్యుత్ సరఫరాకు పలుమార్లు అంతరాయం కలిగింది. దీంతో, వేదిక మీద దీపాలు ఆరిపోవడం కొద్దిసేపు అసౌకర్యంగా అనిపించింది.ఫ వైభవంగా సత్యదేవుని కల్యాణోత్సవం ఫ తిలకించి, పులకించిన భక్తులు -
ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోరా?
ఫ ఇన్ని రోజులైనా జాప్యమెందుకు? ఫ ఎస్పీని మరోసారి కలసిన వైఎస్సార్ సీపీ నేతలు సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అసత్య, అభూతకల్పనలతో ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ నెల 9న చేసిన వ్యాఖ్యలు, ప్రసారాలపై ఫిర్యాదు చేసినా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడంపై ఆ పార్టీ ముఖ్య నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యాన పార్టీ నేతలు జిల్లా పోలీసు కార్యాలయం వరకూ సోమవారం ర్యాలీగా వెళ్లి ఎస్పీ గరికిపాటి బిందుమాధవ్ను కలిశారు. జిల్లాలోని దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పోలీసు స్టేషన్లలోనూ రాధాకృష్ణపై ఫిర్యాదులు చేసి రెండు వారాలు గడచి పోయినా చర్యలు తీసుకోని విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాజా మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలనకు స్వస్తి పలికే రోజులు ఎంతో దూరంలో లేవని అన్నారు. దాదాపు రెండేళ్లుగా సాగుతున్న చంద్రబాబు కుట్ర పూరిత పాలనతో దాదాపు అన్ని వర్గాల ప్రజలూ విసుగెత్తిపోయారన్నారు. కార్యక్రమంలో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ కో ఆర్డినేటర్లు తోట నరసింహం, వంగా గీతా విశ్వనాథ్, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, దవులూరి దొరబా బు, ముద్రగడ గిరిబాబు, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బెజవాడ సత్యనారాయణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ) తదితరులు పాల్గొన్నారు. అన్నదానంలో సత్యదేవుని ప్రసాదం అన్నవరం: సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో భక్తులకు స్వామివారి గోధుమ నూక ప్రసాదం పంపిణీని సోమవారం ప్రారంభించారు. అన్నదాన భవనంలో తొలుత సత్యదేవుని చిత్రపటం వద్ద ప్రసాదాన్ని ఉంచి పండితులు పూజలు చేశారు. అనంతరం, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యుడు పాలచర్ల నాగేంద్ర చౌదరి భక్తులకు ప్రసాదాన్ని వడ్డించారు. ఇకపై ప్రతి రోజూ అన్నదానంలో స్వామివారి ప్రసాదం పెడతామని వారు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని ప్రసాదం కూడా పెట్టాలని భక్తులు కోరుతున్న విషయాన్ని ‘అమాత్యా.. మొరాలకించవా..!’ శీర్షికన ఈ నెల 12న ప్రచురించిన కథనంలో ‘సాక్షి’ ప్రస్తావించింది. అదే రోజు అన్నవరం వచ్చిన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ కథనంపై స్పందించి అన్నదానంలో స్వామివారి ప్రసాదం పెట్టాలని ఆదేశించారు. ఆ మేరకు ఈ నెల 24న జరిగిన ట్రస్ట్ బోర్డు సమావేశంలో తీర్మానం ఆమోదించారు. అన్నదాన పథకంలో సోమవారం సుమారు 7 వేల మంది భక్తులకు అన్నప్రసాదంతో పాటు గోధుమ నూక ప్రసాదం కూడా పెట్టారు. ప్రతి భక్తునికి సుమారు 15 గ్రాముల చొప్పున సుమారు 100 కిలోల ప్రసాదాన్ని అన్నదానంలో అందించినట్లు ఏఈఓ ఎల్.శ్రీనివాస్ తెలిపారు. మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వర్యాన మే 1 నుంచి 31వ తేదీ వరకూ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీఓ) వి.సతీష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎనిమిది నుంచి 16 సంవత్సరాల్లోపు బాలబాలికలు ఈ శిబిరాలకు అర్హులన్నారు. ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకూ, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకూ శిక్షణ కొనసాగుతుందన్నారు. క్రీడల్లో ప్రాథమిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం కోసం ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసక్తి ఉన్న బాలబాలికలు క్రీడా యాప్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం కాకినాడలోని డీఎస్ఏ కార్యాలయంలో లేదా 94400 31610 నంబరులో సంప్రదించాలని కోరారు. -
రెండు రోజుల్లో అందుబాటులోకి..
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని బంకుల్లో పెట్రోలు, డీజిల్ రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ ఎంఎన్ హరీంధిర ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం రాత్రి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయిల్ కంపెనీలు ధరలు పెంచుతాయనే అపోహతో కొంత మంది అవసరం లేకున్నా అధికంగా పెట్రోలు, డీజిల్ స్టాకు పెట్టుకుంటున్నారని, దీనివలన బంకుల వద్ద రద్దీ పెరిగిందని చెప్పారు. గతంతో పోల్చుకుంటే ఈ రెండు రోజుల్లో సుమారు 50 నుంచి 60 శాతం మేర విక్రయాలు పెరిగాయన్నారు. వరి కోత యంత్రాల యజమానులకు రోజుకు 70 లీటర్ల డీజిల్ కూపన్లను గ్రామ వ్యవసాయ అధికారి, తహసీల్దార్ల సహకారంతో ఇస్తామని చెప్పారు. పెట్రోలు, డీజిల్ నిల్వ చేసినా, లూజు విక్రయాలు చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అవసరం లేని వారు బంకుల వద్దకు రావద్దని సూచించారు. జిల్లాలోని 160 బంకుల్లో 15 వరకూ పూర్తి స్థాయిలో పని చేయకపోవడంతో ప్రజల్లో ఆందోళన పెరిగిందని కలెక్టర్ చెప్పారు. విలేకర్ల సమావేశంలో ఎస్పీ జి.బిందుమాధవ్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ కూడా పాల్గొన్నారు. -
● నరకం కళ్ల చూస్తున్నాం
ఆటో రోడ్డెక్కితేనే కానీ పొట్ట నిండని పేద కుటుంబం మాది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నాలుగు రోజులుగా డీజిల్ కొరతతో నరకం కళ్ల చూస్తున్నాం. బంకుల్లో గంటల తరబడి వేచి ఉండటంతో ఆ ప్రభావం సర్వీసుపై పడుతోంది. రోజుకు 5 లీటర్ల వరకూ డీజిల్ కొట్టించుకొని లోకల్లో 120 కిలోమీటర్ల మేర సర్వీసు చేసుకునేవాడిని. నిర్వహణ ఖర్చులు పోను రూ.800 నుంచి రూ.1,000 చేతిలో ఉండేది. ఇప్పుడు బంకులో డీజిల్ రూ.200కు మించి కొట్టడం లేదు. ఆదాయం సగానికి పడిపోయింది. బంకు వద్ద 50 వాహనాలకు పైనే క్యూలో ఉంటున్నాయి. వంతు కోసం రెండు గంటలు పైనే నిరీక్షించాల్సి వస్తోంది. డీజిల్ సమస్యను తక్షణం పరిష్కరించాలి. – కడియాల కిరణ్, ఆటో డ్రైవర్, వాకలపూడి, కాకినాడ రూరల్ ● -
ఆటోపోట్లు
ఢీజిల్ కాకినాడలోని పెట్రోలు బంకు వద్ద డీజిల్ కోసం క్యూ కట్టిన ఆటోలు ఫ ఆటోవాలాలకు ఇం‘ధన’ కష్టాలు ఫ బంకుల్లో రూ.200 డీజిల్కే పరిమితి ఫ దాని కోసం ఉదయం నుంచీ పడిగాపులు ఫ ఇలాగైతే బతికేదెలాగంటూ ఆవేదన సాక్షి ప్రతినిధి, కాకినాడ: రోజులు గడుస్తున్నా ప్రజలకు చమురు కష్టాలు తీరడం లేదు. ముఖ్యంగా అవసరమైనంత డీజిల్ దొరకక ఆటోవాలాలు, రవాణా వాహనదారులు దారుణమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు. చమురు కంపెనీల నుంచి బంకులకు పూర్తి స్థాయిలో ఇంధనం సరఫరా కావడం లేదు. ఫలితంగా వాహనాలకు డీజిల్ అరకొరగానే లభిస్తోంది. దీంతో, తెల్లారింది మొదలు పెట్రోలు బంకుల వద్ద వాహనాలు భారీగా క్యూ కడుతున్నాయి. కొన్నిచోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడం నిత్యకృత్యంగా మారింది. గంటల తరబడి పడిగాపులు పడుతున్నా పరిమితంగానే డీజిల్ పోస్తూండటంతో ‘బతుకు బండి’ ముందుకు సాగడం లేదని వాహనదారులు ప్రధానంగా ఆటోవాలాలు ఆవేదన చెందుతున్నారు. ప్రభు త్వం తమ జీవితాలతో ఆటలాడుకుంటోందని మండిపడుతున్నారు. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా అధికారులు మాత్రం పెట్రోలు, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెబుతూండటం విమర్శలకు తావిస్తోంది. అరకొరగా సరఫరా జిల్లావ్యాప్తంగా ఉన్న 160 పెట్రోలు బంకులున్నాయి. వీటి ద్వారా ప్రతి రోజూ సుమారు 7 లక్షల లీటర్ల పెట్రోలు, 8 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతూంటాయి. చమురు కంపెనీల నుంచి ప్రతి బంకుకు రోజుకు 10 వేల లీటర్లకు తక్కువ కాకుండా పెట్రోల్, డీజిల్ సరఫరా అయ్యేవి. కానీ, మూడు రోజులుగా డీజిల్ అరకొరగానే వస్తోంది. దీంతో, బంకుల వద్ద టిప్పర్లు, లారీలు, ఆటోలు పెద్ద ఎత్తున క్యూ కట్టాల్సిన దుస్థితి దాపురించింది. పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు సైతం దర్శనమిస్తున్నాయి. ఇంధన కొరతతో మూడింట ఒక వంతు బంకులను మూసివేసిన పరిస్థితి కనిపిస్తోంది. ‘ఆటో’ ఎటో! అధిక శాతం ప్రజలు తమ రోజువారీ ప్రయాణాలకు ఎక్కువగా ఆటోల పైనే ఆధారపడుతూంటారు. అటువంటి ఆటోవాలాలను డీజిల్ కొరత దారుణంగా దెబ్బ తీసింది. మూడు రోజులుగా డీజిల్ దొరకక బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయలేక ఆటోవాలాలు నానా ఇక్కట్లూ పడుతున్నారు. ఇప్పటికే మూడింట ఒక వంతు ఆటోలు నిలిచిపోయాయి. కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, తుని, జగ్గంపేట, తుని తదితర ప్రాంతాల్లో డీజిల్ కొరత కారణంగా ఆటోలను నిలిపివేశారు. జిల్లావ్యాప్తంగా 13 వేలకు పైగా ఆటోలున్నా యి. ఒక్కో ఆటోవాలా రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకూ సర్వీసు చేస్తే ఖర్చులన్నీ పోనూ రూ.1,000 నుంచి రూ.1,500 వరకూ ఆదాయం పొందేవారు. స్థానికంగా రోజుకు 80 నుంచి 120 కిలోమీటర్ల వరకూ సర్వీసు చేసుకునేవారు. ప్రస్తుతం ఏ బంకుకు వెళ్లినా రోజుకు రూ.200కు మించి డీజిల్ పో యడం లేదు. దీంతో 40 కిలోమీటర్లకు మించి సర్వీసు చేయడం సాధ్యం కాదని, ఫలితంగా తమ ఆదాయానికి గండి పడిందని ఆటోవాలాలు వాపోతున్నారు. డీజిల్ కోసం వెళ్తే బంకుల్లో ఆరేడు గంటలు పడిగాపులు పడాల్సి వస్తోంది. గతంలో మాదిరిగా ఆటోలు పూర్తి స్థాయిలో తిరగకపోవడంతో తమ ప్రయాణాలకు ప్రజలు నానా ఇబ్బందులూ ఎదుర్కొంటున్నారు. సహనం కోల్పోయి కొట్లాటలు జిల్లాలో ఏ పెట్రోలు బంకుకు వెళ్లినా వాహన బారులు భారీగా కనిపిస్తున్నాయి. లీటరు పెట్రోలు, డీజిల్ కోసం గంటల తరబడి పడిగాపులు పడుతున్న వాహనచోదకులు కొన్నిసార్లు సహనం కోల్పోతున్నారు. కొన్నిచోట్ల కొట్లాటలకు దిగుతున్నారు. సామర్లకోట మండలం వీకే రాయపురం పెట్రోలు బంకులో డీజిల్ కోసం పోటీ పడి పిడిగుద్దులు గుద్దుకున్న సంఘటన డీజిల్ కొరత సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. చెత్త వాహనాలకూ సెగ చివరకు కాకినాడ స్మార్ట్ సిటీలో చెత్త తరలింపు వాహనాలకు కూడా డీజిల్ సెగ తగిలింది. డీజిల్ కొరతతో నగర పాలక సంస్థ వాహనాలు రాకపోవడంతో కాకినాడ పెద్ద మార్కెట్లోని రోడ్డుపై రెండు రోజులుగా చెత్త గుట్టలా పేరుకుపోయింది. మార్కెట్లో అడుగు పెట్టలేని పరిస్థితి. మార్కెట్ అంతా దుర్గంధభరితంగా మారినా కార్పొరేషన్ యంత్రాంగం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రహసనంగా కూపన్ల పంపిణీ వరి కోత యంత్రాలకు డీజిల్ కూపన్లు ఇవ్వాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ నిర్ణయించారు. మంగళవారం నుంచి కోతలు కోసే రైతులకు కూపన్లు ఇచ్చి 70 లీటర్ల వరకూ డీజిల్ అందించనున్నట్లు ప్రకటించారు. కోత యంత్రాలు కలిగిన రైతులు, కౌలు రైతులు నేరుగా మండల వ్యవసాయ అధికారులను, గ్రామ అగ్రికల్చర్ అసిస్టెంట్, రెవెన్యూ సిబ్బందిని కలిసి కూపన్లు పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ప్రక్రియ ప్రహసనంగా మారిందని రైతులు ఆక్షేపిస్తున్నారు. ఉదాహరణకు కరప మండలంలో తహసీల్దార్ సహా అధికారులు సంతకాలు చేసి, సోమవారం 112 మందికి కూపన్లు ఇవ్వగా 78 మందికి మాత్రమే డీజిల్ సరఫరా చేశారు. మిగిలిన వారిని నో స్టాక్ అని చెప్పి తిప్పి పంపేశారు. దీంతో, నిరాశ చెందిన రైతులు.. బంకుల్లో డీజిల్ లేకుండా కూపన్లు ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. వరి కోతలకు ఎఫెక్ట్ రబీ వరి కోతలపై కూడా డీజిల్ కొరత ప్రభావం చూపుతోంది. రబీలో జిల్లావ్యాప్తంగా 1.90 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ఇప్పుడిప్పుడే కోతలు ఊపందుకుంటున్నాయి. జిల్లాలో సుమారు 550 వరి కోత యంత్రాలున్నట్లు అంచనా. పలువురు రైతులు వరి కోతలకు ఈ యంత్రాల పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ తరుణంలో డీజిల్ కొరత ఏర్పడటంతో యంత్రాలు పని చేయక.. మూడు రోజులుగా కోతలు నిలిచిపోయాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. -
‘ఉపాధి’ వేతన బకాయిలు చెల్లించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉపాధి కూలీలకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీరంగనాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ఈ మేరకు జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మణరావుకు వినతిపత్రం సమర్పించారు. గత ఏడాది డిసెంబర్ నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో ఉపాధి కూలీల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి పనులు చేసేచోట తాగునీరు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని, కూలీలకు నీడ కల్పించాలని కోరారు. ఆయా గ్రామాల్లో ఉపాధి పనులు కల్పిస్తే కూలీలు వలస వెళ్లే పరిస్థితి ఉండదన్నారు. నకిలీ మస్టర్లు అరికట్టి నిజాయతీగా పనులు జరిగేలా చూడాలని, గ్రామసభల ఆడిట్లో బయటపడిన అవినీతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎండల తీవ్రత పెరిగినందున ఉదయం పూట మాత్రమే పనులు చేయించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఎటువంటి పనులూ లేకపోవడంతో నిరుపేదలు ఉపాధి పనులు మాత్రమే చేస్తున్నారని, నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని శ్రీరంగనాయకులు అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి జవ్వాది కృష్ణమాధవరావు, కార్యవర్గ సభ్యులు వై.సత్తిరాజు, ఎం.అప్పారావు, ఎన్.రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు అసమర్థ పాలనతోనే ఇంధన కొరత
సాక్షి, అమరావతి/కాకినాడ రూరల్/కడప కార్పొరేషన్/యర్రగొండపాలెం: చంద్రబాబు అసమర్థ పాలనతోనే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఎక్కడ చూసినా పెట్రోల్ బంక్ల వద్ద నో స్టాక్ బోర్డులు లేదా పెట్రోల్, డీజిల్ కోసం కొట్లాడుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. కిలోమీటర్ల కొద్దీ వాహనాల బారులు తీరి ఉన్నాయన్నారు. రవాణా వాహనాల వారి నుంచి ఆటో సోదరుల వరకు పడిగాపులు పడుతున్నారని చెప్పారు. మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్లు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.పబ్లిసిటీ స్టంట్ మాస్టర్ నడుపుతున్న ఈ ప్రభుత్వంలో ప్రచారం తప్ప పని కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన కొరతతో అల్లాడుతుంటే ప్రభుత్వం మాత్రం ఎక్కడా ఇంధన కొరత లేదని ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, టీడీపీ కూటమి అధికారంలో ఉన్న ఒక్క ఏపీలో మాత్రమే ఈ దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను గుర్తించి చక్కదిద్దడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు క్యూలైన్ కష్టాలు తప్పడం లేదన్నారు. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు, గ్యాస్ కోసం జనం క్యూ కట్టాల్సిన దుస్థితి నెలకొందన్నారు. చీమ చిటుక్కుమంటే పబ్లిసిటీ కోసం మీడియా ముందుకొచ్చే చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేశ్లు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇండిగో విమానాలు ఆగిపోతే తనకే మాత్రం సంబంధం లేకున్నా మంత్రి లోకేశ్ సమీక్షించాడని ఎల్లో మీడియా ఊదరగొట్టిందని, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇంధన కొరత గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. తుపాన్ను తప్పించానని చెప్పిన చంద్రబాబు పక్కనే ఉన్న హెచ్పీసీఎల్, ఐవోసీఎల్ నుంచి పెట్రోల్, డీజిల్ తెప్పించలేకపోతున్నారా?.. అంటూ ఎద్దేవా చేశారు. కాగా, మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలోని పెట్రోలు బంకుల వద్ద పరిస్థితుల్ని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పరిశీలించారు. పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు పడుతున్న అవస్థల్ని అడిగి తెలుసుకున్నారు. -
స్థలం విషయంలో వివాదం
ఫ చెయ్యేరులో అగ్రహారంలో ఉద్రిక్తత ఫ రోడ్డుపై గ్రామస్తుల ఆందోళన కాట్రేనికోన: చెయ్యేరు అగ్రహారంలో కనదుర్గమ్మ ఆలయం పునర్నిర్మాణ స్థలం విషయంలో గ్రామస్తులు, సరిహద్దు రైతు గంథం సుబ్బారావు వర్గానికి మధ్య ఆదివారం వివాదం తలెత్తింది. ఆ గ్రామంలో సుమారు 70 ఏళ్ల కిందట నిర్మించిన కనకదుర్గమ్మ ఆలయం శిథిలం కావడంతో పునర్నిర్మాణానికి గ్రామస్తులు సిద్ధమయ్యారు. ఆలయం నిర్మాణానికి మరికొంత స్థలం అవసరం కావడంతో సరిహద్దు రైతు గంథం సుబ్బారావును రెండు అడుగుల స్థలం అడిగారు. ఆ రైతు వ్యక్తిగతంగా సర్వే చేయించుకుని ఆలయం తన స్థలంలో ఉందని, ఆలయం ఇక్కడ నిర్మించేందుకు కుదరని తేల్చిచెప్పేశారు. మూడు రోజుల క్రితం స్థలం చుట్టూ సిమెంటు స్తంభాలను వేయించారు. ఆ స్తంభాలను గ్రామస్తులు తొలగించి పాత ఆలయం తొలగించిన స్థలంలో అమ్మవారి విగ్రహాన్ని, చుట్టూ వెదురు తడికలను కట్టారు. పెద్దల సమక్షంలో చర్చలు జరిపినా ఒప్పందం కుదరకపోవడంతో ఆదివారం ఉదయం ఆలయం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. చెయ్యేరు గున్నేపల్లికి చెందిన టీడీపీ నాయకుడు దొరబాబు రైతు గంథం సుబ్బారావులు తన అనుచరులతో వచ్చి ఆలయ స్థలం చుట్టూ ఉన్న తడికలను తొలగించి, అమ్మవారి పంట బోదెలో పడవేసి పనులను అడ్డుకునేందుకు టిప్పరుతో కంకర గుట్టగా వేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని రైతును నిలదీశారు. ఈ నేపథ్యంలో దొరబాబు అనుచరులు, గ్రామస్తులు మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలకు సర్థిచెప్పేందుకు వచ్చిన మాజీ సర్పంచి చెల్లి సురేష్పై దొరబాబు అనుచరులు దాడికి పాల్పడారని స్థానికులు ఆరోపిస్తూ రోడ్డుపై బైటాయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు, కాట్రేనికోన, ముమ్మిడివరం ఎస్సైలు అవినాష్లు బందోబస్తు నిర్వహించారు. ఆలయ స్థలం వివాదంపై గ్రామస్తులు ఫిర్యాదు చేశారని ఎస్సై అవినాష్ తెలిపారు. శాంతి కమిటీ వేసి ఇరువర్గాలతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని స్థానిక నాయకులు మంతెన మమ్మురాజు, నడింపల్లి సుబ్బరాజు, త్సవటపల్లి నాగు, మంతెన శ్రీనివాసరాజు తదితరులు అన్నారు. -
కల్యాణోత్సవాలకు శ్రీకారం
అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుడే వరుడైన వేళ.. సిరులొసంగే దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు వధువైన మహత్తర సన్నివేశాన్ని కన్నులారా తిలకించి, భక్తులు పులకించిపోయారు. సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాలకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు రత్నగిరిపై పండితులు శ్రీకారం చుట్టారు. రత్నగిరి క్షేత్ర పాలకులు సీతారాములు పెళ్లి పెద్దలుగా వెంట రాగా.. సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగింపుగా అనివేటి మండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన వేదికపై ప్రత్యేక ఆసనం మీద సత్యదేవుడు, అమ్మవార్లను, పక్కనే మరో ఆసనంపై సీతారాములను వేంచేయించి, ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అమ్మవారిని, స్వామివారిని వధూవరులను చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. పసుపు దంచే రోలు, రోకళ్లకు పండితులు పూజలు చేసిన అనంతరం శుభం కోరుతూ ముత్తయిదువలు పసుపు దంచారు. రత్నగిరిపై రామారాయ కళావేదిక మీద సత్యదేవుడు, అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ ఘనంగా నిర్వహించారు. పండితుల చతురోక్తులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. సోమవారం రాత్రి 9.30 గంటల నుంచి జరిగే సత్యదేవుని కల్యాణోత్సవానికి సుమారు 25 వేల మంది భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు. భక్తుల వాహనాలను కొండ దిగువన కళాశాల మైదానం వరకే అనుమతిస్తారు. అక్కడి నుంచి కొండ మీదకు చేరేందుకు ప్రత్యేక ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. కల్యాణ ఏర్పాట్లను చైర్మన్, ఈఓ సమీక్షించారు. అన్నవరంలో నేడు తెల్లవారుజామున 3.00 : సుప్రభాత సేవ ఉదయం 8.00 : చతుర్వేద పారాయణ ఉదయం 9.00 : అంకురార్పణ, ధ్వజారోహణం, కంకణధారణ, దీక్షా వస్త్రధారణ రాత్రి 7.00 : కొండ దిగువన వెండి గరుడ వాహనంపై స్వామివారు. వెండి గజవాహనంపై అమ్మవారు, వెండి పల్లకీపై సీతారాముల ఊరేగింపు రాత్రి 9.30 : రత్నగిరి కల్యాణ వేదికపై సత్యదేవుని దివ్య కల్యాణోత్సవం ఫ రత్నగిరి కళావేదిక పైన, కొండ దిగువన ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ సాంస్కృతిక కార్యక్రమాలు. ఫ వధూవరులుగా అమ్మవారు, సత్యదేవుడి అలంకరణ ఫ రత్నగిరిపై కన్నుల పండువగా వేడుక ఫ నేటి రాత్రి స్వామివారి కల్యాణం -
శిథిల భవంతుల నీడన.. ఘోషపత్రి
కాకినాడ క్రైం: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు పెద్దాసుపత్రిగా పేరొందిన కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి(జీజీహెచ్)లో రోగులకు సేవలందిస్తున్న మూడు భవనాలు ఏ క్షణమైనా కుప్ప కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. నిర్మించి 60 ఏళ్లు దాటడంతో ఈ భవనాల్లో వైద్య సేవలు, ఇతర కార్యకలాపాలు కొనసాగించడం ఇక ఎంత మాత్రం సురక్షితం కాదని, వీటిని వెంటనే తొలగించాలని జేఎన్టీయూకే సివిల్ ఇంజినీర్లు 2024 జూలై 10న నివేదిక అందజేశారు. ఈ భవనాలను తొలగించి, కొత్తవి నిర్మించేందుకు రూ.500 కోట్లు అవసరమని ప్రతిపాదించినా ప్రభుత్వం ఏడాదిన్నరగా స్పందించడం లేదు. వైద్యులు, రోగులకు ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఏటా రూ.కోటి మేర వృథా ఖర్చు చేస్తూ కేవలం ప్యాచ్ వర్కులతో సరిపెడుతోంది. ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్థి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) చేస్తున్న ఈ పనులతో ఎటువంటి శాశ్వత ప్రయోజనమూ ఉండటం లేదు. ఆ భవనాల్లోనే కీలక విభాగాలు ఫ జీజీహెచ్లో ఓపీ, సర్జికల్, మెడికల్ భవనాలను జీ+2 పద్ధతిలో నిర్మించి 60 ఏళ్లయ్యింది. ఓపీ భవంతిని 1967లో 1,17,739.58 చదరపు అడుగులు, మెడికల్ భవంతిని 1968లో, సర్జికల్ భవంతిని 1969లో 1,77,726.69 చదరపు అడుగుల్లో నిర్మించారు. ఫ ఓపీ భవనం కింది అంతస్తులో సాధారణ ఓపీ సేవలు, మెడికల్ స్టోర్లు, బ్లడ్ బ్యాంకు, రక్త పరీక్ష కేంద్రాలు, ఎక్స్రే విభాగాలు.. మొదటి అంతస్తులో ఆసుపత్రి సూపరింటెండెంట్, నర్సింగ్ సూపరింటెండెంట్ కార్యాలయాలు, కమ్యూనిటీ హాలు, మినిస్టీరియల్ విభాగాలు, సీఎస్ ఆర్ఎంఓ, ఆర్ఎంఓ, అడ్మినిస్ట్రేటర్, ఏడీ, ఏఓ సహా కీలక అధికారుల కార్యాలయాలు, కంటి, చర్మ, చంటి పిల్లల వైద్య విభాగాలు ఉన్నాయి. అత్యంత బలహీనంగా ఉన్న రెండో అంతస్తులో కీలకమైన మెడికల్ రికార్డుల సెక్షన్ ఉంది. ఇక్కడికి నిత్యం వందలాది మంది వస్తూంటారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసేదిక్కడే. ఇదే ఫ్లోర్లో ఓపీ ఎస్ఎస్ఆర్ గదులున్నాయి. ఫ ఆసుపత్రికి గుండెకాయగా అభివర్ణించే ఈ భవనంలో ఎంఆర్డీ విభాగం వద్ద ఫ్లోర్ పగలడంతో కొద్ది రోజుల క్రితం మరమ్మతులు చేపట్టారు. ఆ క్రమంలో ఫ్లోర్ డ్రిల్లింగ్ చేస్తే మొత్తం భవనమంతటా ప్రకంపనలు వచ్చాయి. ఏం జరుగుతుందో అర్థం కాక సిబ్బంది కంగారు పడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫ మెడికల్, సర్జికల్ భవంతిలో మెడికల్, సర్జికల్, ఆర్థోపెడిక్, కార్డియాలజీకి చెందిన కీలకమైన సుమారు 25 వార్డులతో పాటు ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లు, విభాగాధిపతుల కార్యాలయాలు, సేవలకు అనుగుణంగా ఆరోగ్యశ్రీ విభాగాలు, సెమినార్ హాళ్లు, నర్సింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఫ ఒక విధంగా చెప్పాలంటే ఆసుపత్రిలోని కీలక విభాగాలన్నీ ఈ మూడు భవంతుల్లోనే ఉన్నాయి. ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ భవనాలు వర్షం వస్తే చాలు.. గోడలు నాని పడిపోతాయేమోననిపించేంత బలహీనంగా ఉన్నాయి. భవనంపై ఉన్న ట్యాంకుల నుంచి ఏళ్ల తరబడి నీరు లీకవుతూండటంతో గోడలు గుల్లబారిపోయాయి. ఫ వీటితో పాటు గైనిక్, పీడియాట్రిక్స్, ఫ్యామిలీ ప్లానింగ్, ఐసోలేషన్, డీవీఎల్, ఏఆర్టీ కేంద్రం, క్యాన్సర్ ఓపీ, ఐపీ భవనాలు కూడా ప్రమాదకరంగానే ఉన్నాయి. టీబీ వార్డు పరిస్థితి మరీ ఘోరం. ప్రభుత్వానికి నివేదించాం జీజీహెచ్లో ప్రమాదకరంగా ఉన్న భవనాలను పరిశీలించాం. టీబీ వార్డు ఆవరణలో తాత్కాలిక భవంతి నిర్మించి, ప్రస్తుతం ఉన్న ఓపీ భవనం కార్యకలాపాలను అక్కడకు మార్చాలని, సర్జికల్, మెడికల్ భవంతుల్లోని ఐపీ సహా ఇతర విభాగాల తరలింపునకు అనుగుణంగా నిర్మాణం జరపాలని సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించాం. – ఎంఎన్ హరేంధిర ప్రసాద్, కలెక్టర్, కాకినాడ జీజీహెచ్లోని పీజీ వైద్యుల గదిలో ఉన్న వాష్రూమ్ పెచ్చులూడి పడటంతో ఎంతో గట్టిగా ఉన్న కమోడ్ తునాతునకలైంది. క్యాన్సర్ ఓపీ భవంతి పీజీ రూములో సీలింగ్ పెచ్చులూడి పడి గదిలోని మంచాలు సహా ఇతర వస్తువులు దెబ్బ తిన్నాయి. ఈ రెండు సందర్భాల్లో అక్కడ వైద్య విద్యార్థులు ఉండి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. సర్జికల్ భవంతిలో ఆహారం కోసం వేచి చూస్తున్న రోగుల బంధువుల నెత్తిన సీలింగ్ చిట్లి శిథిలాలు పడబోతే ఓ మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. మెడికల్ వార్డులో సీలింగ్ పెచ్చులూడి మంచంపై పడటంతో అప్పటికే అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఓ రోగి మళ్లీ గాయాలపాలయ్యారు. ఫ ప్రమాదకర పరిస్థితుల్లో జీజీహెచ్ ఫ 60 ఏళ్ల కిందట ఓపీ, సర్జికల్, మెడికల్ భవనాల నిర్మాణం ఫ కాలం చెల్లిన భవనాల్లోనే నేటికీ కాలక్షేపం ఫ 2024లోనే పరిశీలించిన జేఎన్టీయూకే సివిల్ ఇంజినీర్లు ఫ తక్షణం తొలగించాలని సూచన ఫ అయినా పట్టించుకోని ప్రభుత్వం -
బీచ్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
కాకినాడ రూరల్: సందర్శకులకు ఇబ్బందులు కలకుండా బీచ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సూర్యారావుపేట బీచ్ను ఆదివారం ఆయన సందర్శించారు. అక్కడ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో పాటు ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి అధికారులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బీచ్లో సందర్శకులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రధానంగా తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్పై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. పారిశుధ్యం సక్రమంగా నిర్వహించాలన్నారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి లక్ష్మణరావు, మత్స్యశాఖ అధికారి కృష్ణారావు, కాకినాడ రూరల్ తహసీల్దార్ కుమారి, కాకినాడ నగరాభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు. స్వీయ గణనలోభాగస్వాములు కావాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జనగణనలో భాగంగా నిర్వహిస్తున్న స్వీయ గణన ప్రక్రియలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. స్వీయ గణన(సెన్సస్ సెల్ఫ్ ఎన్యూమరేషన్)పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్ నుంచి జెడ్పీ సెంటర్, టూటౌన్ పోలీస్ స్టేషన్ సెంటర్ వరకూ ఆదివారం నిర్వహించిన 5కే రన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 30 వరకూ జిల్లాలోని ప్రతి పౌరుడూ స్వీయ గణన నమోదు చేసుకోవాలని కోరారు. ఇంటింటా జనగణ నమోదు కార్యక్రమం మే 1 నుంచి 30వ తేదీ వరకూ జరుగుతుందన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు ఇప్పటికే స్వీయ గణన పూర్తి చేసుకున్నారని చెప్పారు. నిధులు విడుదల చేస్తేనే పనులు ముందుకు.. తేల్చి చెప్పిన ఊడిమూడిలంక వంతెన కాంట్రాక్టర్ పి.గన్నవరం: మండలంలోని నాలుగు లంక గ్రామాల ప్రజల కోసం వశిష్ట నదీపాయపై రూ.71.43 కోట్లతో చేపట్టిన వంతెన పనులకు సంబంధించి రూ.14 కోట్ల మేర పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయకపోతే, పనులు కొనసాగించలేమని కాంట్రాక్టర్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆదివారం వంతెన పనులను పరిశీలించేందుకు విచ్చేసిన పంచాయతీ రాజ్ చీఫ్ ఇంజినీర్ శివకుమార్కు అసోసియేట్ ఇంజినీర్స్ ఎంటర్ప్రైజెస్ (కాంట్రాక్టర్) పీఎస్ రాజు తేల్చిచెప్పారు. గతంలో రూ.22 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. మిగిలిన రూ.14 కోట్లు విడుదల చేయకపోవడంతో అతి ముఖ్యమైన వేసవి కాలాన్ని వినియోగించుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నిధుల విడుదలకు సహకరించాలని ఆయన కోరారు. అలాగే లంకలో అబెక్ట్మెంట్ వాల్ నిర్మాణం కోసం 14 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని సమకూర్చాలని కోరారు. మొత్తం 9 పిల్లర్లు, రెండు అబెక్ట్మెంట్ వాల్లతో వంతెనను నిర్మిస్తున్నారు. ఇంత వరకూ 50 శాతం పనులు పూర్తి అయ్యాయని పీఆర్ డీఈఈ అన్యం రాంబాబు సీఈకి వివరించారు. వంతెన పూర్తయితే ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల ప్రజల కష్టాలు తొలగుతాయని ఆయన తెలిపారు. పనుల ప్రగతిని ఆయన ఎస్ఈకి వివరించారు. వంతెన నిర్మాణాన్ని సీఈ క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో పీఆర్ ఈఈ పి.రామకృష్ణం రాజు, జేఈ సంపన్న దుర్గా కొండలరావు పాల్గొన్నారు. -
చమురు..చుక్కలే..
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పశ్చిమాసియా యుద్ధం పుణ్యమా అని వాహనదారులకు చమురు.. చుక్కలు చూపిస్తోంది. తగినంతగా పెట్రోలు, డీజిల్ సరఫరా లేకపోవడం.. అవసరానికి దొరకదేమోననే ఆందోళనతో వాహనచోదకులు పెట్రోలు బంకుల వద్ద భారీగా క్యూ కడుతున్నారు. లీటర్ పెట్రోలు కోసం గంటల తరబడి పడిగాపులు పడుతున్నారు. పెట్రోలు, డీజిల్ ఏ బంకులో ఉంటే అక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడం శనివారం జిల్లావ్యాప్తంగా కనిపించింది. మూత పడుతున్న బంకులు జిల్లాలో 160 పెట్రోల్ బంకులుండగా.. అక్కడి సిబ్బంది చెబుతున్న దానిని బట్టి ప్రస్తుతం ఏ ఒక్క చోటా ఒక్క చుక్క కూడా డీజిల్ లేదు. పెట్రోల్ కూడా అరకొరగానే దొరుకుతోంది. దీంతో, ఆందోళన చెందుతున్న వినియోగదారులు పెట్రోలు కోసం బంకుల వద్ద బారులు తీరుతున్నారు. కాకినాడలో ఏ బంకు వద్ద చూసిన ఇదే పరిస్థితి. రెండు మూడు లీటర్ల పెట్రోలు కోసం సుమారు మూడు నాలుగు గంటలు క్యూలో నిలబడుతున్న పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్ సమీపాన పౌర సరఫరాల శాఖ నిర్వహిస్తున్న పెట్రోలు బంకు శనివారం ఉదయమే మూతపడిపోయింది. వాస్తవానికి శుక్రవారం నుంచే పెట్రోలు, డీజిల్ సరఫరా లేకపోవడం, ఉన్న స్టాక్ అయిపోవడంతో జిల్లావ్యాప్తంగా సగం బంకులను మూసివేశారు. స్టాక్ రాక.. జిల్లావ్యాప్తంగా అన్ని బంకుల ద్వారా ప్రతి రోజూ 7 లక్షల లీటర్లకు పైగా డీజిల్, 8 లక్షల లీటర్లకు పైగా పెట్రోలు అమ్మకాలు జరుగుతాయి. మామూలుగా ప్రతి బంకుకూ రోజుకు 10 వేల లీటర్ల పెట్రోలు, 10 వేల లీటర్ల డీజిల్ సరఫరా జరిగేది. ప్రజలకు కావాల్సినంత ఇంధనం అందుబాటులో ఉండేది. శుక్రవారం నుంచి శనివారం వరకూ ఆయా బంకులకు రావాల్సిన స్టాక్ రాలేదు. దీంతో, ఉన్న స్టాక్ అంతా అయిపోయింది. ఈలోగా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రకటనలు రావడంతో బెంబేలెత్తిన వినియోగదారులు ఇంధనం కోసం బంకుల వద్దకు ఎగబడ్డారు. ఫలితంగా ఉన్న స్టాక్ మరింత వేగంగా అమ్ముడుపోవడంతో జిల్లావ్యాప్తంగా చమురుకు ఒక్కసారిగా కొరత ఏర్పడింది. కొన్ని బంకుల్లో ఒక్కొక్కరికి ఒకటి రెండు లీటర్లు మాత్రమే పెట్రోలు కొడుతున్నారు. ఆటో, కార్లకై తే 5 నుంచి 10 లీటర్లు మాత్రమే డీజిల్ పోస్తున్నారు. దీనిపై అడిగితే, పౌర సరఫరాల అధికారుల ఆదేశమని బంకుల యజమానులు చెబుతున్నారు. డీజిల్ కొరతతో ఇక్కట్లు కాకినాడలో శనివారం ఉదయం ఏ బంకులోనూ డీజిల్ లభించలేదు. డీజిల్ అయిపోయిందని బంకుల నిర్వాహకులు చెప్పడంతో హతాశులైన వాహన యజమానులు ఉసూరుమని వెనుతిరిగారు. తప్పనిసరి పరిస్థితుల్లో పలువురు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. డీజిల్ కొరత తమ ఉపాధిని దెబ్బ తీస్తోందని ఆటోల యజమానులు వాపోతున్నారు. ఏ బంకుకు వెళ్లినా డీజిల్ దొరకడం లేదని, ఆటో నడపకపోతే కుటుంబాలను ఏవిధంగా పోషించుకోగలమని వారు ఆవేదన చెందుతున్నారు. నిలిచిన వరి కోతలు జిల్లావ్యాప్తంగా 1.90 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరిగింది. ప్రస్తుతం ముమ్మరంగా కోతలు జరుగుతున్నాయి. పలువురు రైతులు యంత్రాలతో వరి కోతలు కోయిస్తున్నారు. వీటికి అవసరమైన డీజిల్ లభించకపోవడంతో వరి కోతలు సైతం నిలిచిపోయాయి. వరి కోత యంత్రాలను పెట్రోలు బంకుల వద్దకు తీసుకుని వెళ్లే పరిస్థితి ఉండదు. వాటికి టిన్నుల ద్వారానే డీజిల్ పోయాలి. ఏదైనా బంకులో డీజిల్ ఉన్నా 5 నుంచి 10 లీటర్లు మాత్రమే విక్రయిస్తున్నారు. ఇది అరకొరే కావడంతో వరి కోతలకు ఆటంకం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో రైతులు గత్యంతరం లేక బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. వరి కోత యంత్రాలకు గతంలో ఎకరాకు రూ.2,500 అద్దె ఉండేది. డీజిల్ కొరత, బ్లాక్ మార్కెట్ కారణంగా అది ఇప్పుడు రూ.3 వేలకు పెరిగింది. యథేచ్చగా బ్లాక్ మార్కెట్ కొంత మంది బంకుల యజమానులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే టిన్నులతో పెట్రోలు, డీజిల్ పక్కదారి పట్టించేసి, బ్లాక్ చేసేశారు. ఎవరైనా అర్జెంట్ అని అడిగితే లీటరు పెట్రోలుపై రూ.10, డీజిల్పై రూ.20 అదనంగా వసూలు చేస్తున్నారు. అదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే అసలు పెట్రోలు, డీజిల్ లేదని చెప్పేస్తున్నారు. ఆర్టీసీకి ఓకే.. మార్కెట్లో డీజిల్ కొరత ఉన్నప్పటికీ ఆర్టీసీకి ఎటువంటి ఇబ్బందీ లేదని జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు తెలిపారు. తమ డిపోలోని బంకులో తగినంత డీజిల్ అందుబాటులో ఉందని, నిరంతరాయంగా బస్సులు తిప్పేందుకు ఇబ్బంది లేదని చెప్పారు. నాగమల్లితోట జంక్షన్ వద్ద ‘బంక్ క్లోజ్డ్’ అంటూ బోర్డు కుటుంబాన్ని ఎలా పోషించాలి? నాకు ఆటో నడపడం తప్ప వేరే పని తెలీదు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తిరిగినా నగరంలో ఏ బంకులోనూ డీజిల్ దొరకలేదు. రోజుకు రూ.700 సంపాదించేవాడిని. ఈ రోజు డీజిల్ లేకపోవడంతో బేరాలకు వెళ్లలేకపోయాను. కుటుంబాన్ని ఎలా పోషించాలి? చాలినంత డీజిల్ ఇవ్వకుండా ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది. – అనిల్ కుమార్, ఆటో డ్రైవర్ డీజిల్ నిల్ పెట్రోలు కోసం ఎగబడుతున్న వాహనదారులు బంకుల వద్ద భారీ బారులు మూత పడుతున్న బంకులు పట్టించుకోని ప్రభుత్వం -
అపోహలు.. అవసరానికి మించి కొనుగోలు వద్దు
జిల్లాలో ఇంధన కొరతపై జరుగుతున్న ప్రచారం అవాస్తవం. తప్పుడు ప్రచారాన్ని నమ్మి, అపోహలకు గురై ఎవ్వరూ ఆందోళన చెందవద్దు. అన్ని బంకుల్లోనూ పెట్రోలు, డీజిల్ నిల్వలు తగినంతగా ఉన్నాయి. సరఫరా యథాతథంగా కొనసాగుతోంది. అన్ని బంకుల వద్ద మండల స్థాయి అధికారులను నియమించి, నిల్వల లభ్యత, అమ్మకాలను నిత్యం పర్యవేక్షిస్తున్నాం. ప్రజలు అవసరానికి మించి అధికంగా ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దు. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు బాటిళ్లు, క్యాన్ల వంటి లూజ్ కంటెయినర్లలో ఇంధన విక్రయాలను పూర్తిగా నిషేధించాం. పౌర సరఫరాలు, లీగల్ మెట్రాలజీ, వాణిజ్య పన్నుల శాఖల అధికారులతో కూడిన జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఇంధన రిటైల్ అవుట్లెట్లను తనిఖీ చేస్తున్నాయి. ఎవరి వద్దనైనా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ అమ్మకాలు జరిగినట్లు గుర్తిస్తే వెంటనే 6ఎ కింద కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటాం. – జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్.సత్యనారాయణరాజుతో కలసి కలెక్టరేట్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ -
పెద్దపులి.. మళ్లీ మన్యంలోకి
దేవీపట్నం/కోరుకొండ: రెండు రోజులుగా తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం పాండవుల మెట్ట, మునగాల కొండపై పెద్ద పులి తిష్ట వేసిన విషయం తెలిసిందే. అది శుక్రవారం రాత్రి మునగాల కొండపై నుంచి కిందకు దిగి, కోటి గ్రామం వైపు వెళ్లడాన్ని అటవీ శాఖ అధికారులు ట్రాకర్ ద్వారా గుర్తించారు. ప్రస్తుతం ఇది దేవీపట్నం మండలం ఇందుకూరు, ఇందుకూరుపేట మీదుగా మళ్లీ పోలవరం జిల్లాలోకి ప్రవేశించింది. దేవీపట్నం మండలం కొత్తవీధి – బూరుగుబంద గ్రామాల మధ్య ఉన్న దట్టమైన కొండ ప్రాంతంలో ఈ పులి సంచరిస్తున్నట్లు ట్రాకర్ ద్వారా అటవీ అధికారులు శనివారం గుర్తించారు. పెద్ద పులి బూరుగుబంద – కొత్తవీధి కొండపై ఉండడంతో ప్రజలెవరూ ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని ఇందుకూరు ఫారెస్ట్ రేంజర్ కొండలరావు హెచ్చరించారు. పశువుల కాపరులు సైతం అడవి వైపు వెళ్లరాదని, రాత్రి సమయాల్లో పొలాల వద్ద ఉండరాదని సూచించారు. -
నేటి నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు
అన్నవరం: సత్యదేవుని కల్యాణోత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం రత్నగిరి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మే 2న జరిగే శ్రీపుష్పయాగంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. ఆదివారం సాయంత్రం 4 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేసే వేడుక కన్నుల పండువగా జరగనుంది. కల్యాణోత్సవాలకు పెళ్లి పెద్దలుగా వ్యవహరించే రత్నగిరి క్షేత్ర పాలకులు శ్రీ సీతారాములు రాత్రి 9 గంటలకు అన్నవరం గ్రామంలో వెండి ఆంజనేయ వాహనంపై ఊరేగుతూ భక్తులను, గ్రామస్తులను ఆహ్వానిస్తారు. సోమవారం రాత్రి 9 గంటల నుంచి స్వామివారి దివ్య కల్యాణం వైభవంగా జరగనుంది. కల్యాణోత్సవాలకు రూ.కోటి వరకూ ఖర్చు చేస్తున్నారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది పుష్పాలంకరణ వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మాదిరిగా చేయనున్నట్టు ఈఓ తెలిపారు. కల్యాణోత్సవ ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ శనివారం మధ్యాహ్నం దేవస్థానం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏర్పాట్ల వివరాలను ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు వివరించారు. ఈ ఉత్సవాలకు సుమారు 200 మంది పోలీసులతో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లను పరిశీలించి నివేదిక ఇవ్వాలని పెద్దాపురం ఆర్డీఓ ఎన్కే శ్రీధర్ను జేసీ ఆదేశించారు. -
కిక్కిరిసిన రత్నగిరి
అన్నవరం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిటకిటలాడింది. దర్శనం క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో రద్దీగా మారాయి. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సర్కులర్ మండపం వద్ద సుమారు 5 వేల మంది భక్తులకు పులిహోర, దధ్యోదనం పంచిపెట్టారు. సత్యదేవుని వ్రతాలు 1,600 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. జన్మ నక్షత్రం మఖను పురస్కరించుకుని సత్యదేవునికి ఆదివారం పంచామృతాభిషేకం నిర్వహించనున్నారు. తెల్లవారుజామున 2 గంటలకు ఆలయాన్ని తెరచి పూజలు చేసిన అనంతరం, స్వామి, అమ్మవార్ల మూలవిరాట్టులకు, శంకరునికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఉదయం 7 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ ఆయుష్య హోమం కూడా నిర్వహిస్తారు. స్వామివారి కల్యాణోత్సవాల సందర్భంగా ఈ రెండు కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనేందుకు టిక్కెట్లు విక్రయించరు. మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): మలేరియా రహిత జిల్లాగా కాకినాడను తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో మలేరియా నివారణకు చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో శుభ్రత, నీటి నిల్వ నివారణ, మురుగు నీటి సక్రమ పారుదల, క్రిమి సంహారక మందుల స్ప్రేయింగ్ వంటి చర్యలను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. అన్ని సంక్షేమ వసతి గృహాల్లో దోమతెరలు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి నరసింహ నాయక్ కూడా పాల్గొన్నారు. ప్రశాంతంగా పాలిసెట్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్ జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 36 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష నిర్వహించారు. కాకినాడలో 18, పెద్దాపురంలో 5, పిఠాపురంలో 5, సామర్లకోటలో 4, తునిలో 4 చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షకు 11,313 మంది దరఖాస్తు చేసుకోగా 11,151 మంది హాజరయ్యారు. బాలురు 6,411 మందికి గాను 6,155 మంది, బాలికలు 4,902 మందికి గాను 4,636 మంది పరీక్షలు రాశారు. బాలురు 96 శాతం, బాలికలు 95 శాతం హాజరయ్యారని పాలిసెట్ జిల్లా కో ఆర్డినేటర్ వి.విజయ కుమార్ తెలిపారు. -
రెడ్బుక్ పాలనకిది నిదర్శనం
● దొడ్డిగుంట అక్రమ అరెస్టులపై వైఎస్సార్ సీపీ నేతల ఆగ్రహం ● కార్యకర్తలకు అండగా ఉంటాం ● మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, డాక్టర్ సూర్యనారాయణరెడ్డి భరోసా ● పార్టీ నేతలు వెంకట్రావు, వీరబాబులకు రిమాండు సామర్లకోట: రాష్ట్రంలో రెడ్బుక్ పాలన సాగుతోందనడానికి రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో జరిగిన అక్రమ అరెస్టులే నిదర్శనమని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆ పార్టీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. దొడ్డిగుంటలో శుక్రవారం అరెస్టు చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు, స్థానిక మత్స్యకార సంఘం నాయకులు మడికి వెంకట్రావు, చెల్లుబోయిన వీరబాబులను పోలీసులు శనివారం పెద్దాపురం కోర్టుకు తీసుకుని వచ్చారు. వారికి మద్దతుగా వచ్చిన జక్కంపూడి రాజా పెద్దాపురంలో విలేకర్లతో మాట్లాడారు. కిడ్నాప్ అయ్యారని పోలీసులు చెబుతున్న వారు తమనెవరూ కిడ్నాప్ చేయలేదని, సొంత పనులపై బయటకు వెళ్లామని స్వయంగా న్యాయమూర్తి ఎదుటనే వారు చెప్పారని అన్నారు. అయినప్పటికీ పోలీసులు తప్పుడు సెక్షన్లతో ఇష్టం వచ్చిన కేసు నమోదు చేశారని, దీని వెనుక వెంకట్రావు, వీరబాబులను ఏవిధంగా అరెస్టు చేయాలనే కుట్ర జరిగిందని ఆరోపించారు. ఎన్నికల్లో కుప్పలుతెప్పలుగా ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రజలను తప్పుదారి పట్టించడానికే వైఎస్సార్ సీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. దొడ్డిగుంట మత్స్యకార సంఘ ఎన్నికల్లో కూటమి ఓటమి ఖాయమనే భయంతోనే అక్కడి వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులపై తప్పుడు కేసులు పెట్టి, అరెస్టు చేశారని ఆయన చెప్పారు. అక్రమ అరెస్టులపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, బీసీ నాయకులు రాజకీయంగా ఎదగడాన్ని కూటమి నేతలు భరించలేకపోతున్నారన్నారు. సంఘంలో ఉన్న కొంత మంది సభ్యులు ఊరికి దూరంగా ఉంటే.. వారిని కిడ్నాప్ చేసినట్లు తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. తమ నాయకులను పోలీసులు దౌర్జన్యంగా కొట్టారన్నారు. పోలీసు స్టేషన్కు వెళ్లి ప్రశ్నిస్తే తమకేమీ తెలియదంటూ పోలీసులు వ్యంగ్యంగా బదులిచ్చారని, ఇది ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం పని చేసే పోలీసులు తగిన ఫలితం అనుభవించక తప్పదని రాజా హెచ్చరించారు. ఈ దారుణాలను అందరూ గమనిస్తున్నారు అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో జరుగుతున్న దారుణాలను అందరూ గమనిస్తున్నారని అన్నారు. తమ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని, పార్టీ మూడు జిల్లాల అధ్యక్షులు, నాయకుల పోరాటంతో పోలీసులు దిగి వచ్చారని చెప్పారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల ఒత్తిడికి లొంగి పోలీసులు పని చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఉత్సాహంగా పని చేసే వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లెవ్వరినీ రానివ్వకుండా చేసి, పోలీసులే ఓట్లు వేశారని, ఇక్కడ కూడా అదే విధంగా చేయాలనే కుట్ర పన్నుతున్నారని, దీనిలో భాగమే ఈ అక్రమ కేసులని చెప్పారు. తప్పుడు కేసులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడేది లేదని, టీడీపీ నాయకుల కలలు నెరవేరవని అన్నారు. ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. పెద్దాపురం కోర్టు వద్దకు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తదితరులు కూడా వచ్చారు. విలేకర్ల సమావేశంలో పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, రాష్ట్ర కార్యదర్శి నెక్కంటి సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.అరెస్టు చేసిన ఇద్దరికీ రిమాండురంగంపేట: కిడ్నాప్ కేసులో అరెస్టు చేసిన ఇద్దరికి పెద్దాపురం కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండు విధించారని ఎస్సై శివప్రసాద్ శనివారం స్థానిక విలేకర్లకు ఆయన కథనం ప్రకారం.. మండలంలోని పెద్ద దొడ్డిగుంట గ్రామానికి చెందిన మడికి వెంకట్రావు (లాజరు), చెల్లుబోయిన వీరబాబు, మరికొంత మంది ఈ నెల 23వ తేదీ రాత్రి 11.30 గంటలకు అదే గ్రామానికి చెందిన విత్తనాల బూరయ్య ఇంటికి వెళ్లారు. ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికల్లో తమ పార్టీకే ఓటు వేయాలని బెదిరించారు. తనకు నచ్చిన వారికి ఓటు వేస్తానని చెప్పడంతో బూరయ్యను, అతడి భార్య సూరమ్మను కొట్టి చంపేస్తామంటూ వెంకట్రావు, వీరబాబులు బెదిరించారు. బూరయ్యను కాలర్ పట్టుకుని బయటకు తీసుకెళ్లారు. బూరయ్య ఆచూకీ కనిపించకపోవడంతో అతడి భార్య సూరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. దీనిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి, వెంకట్రావు, వీరబాబులను అరెస్టు చేసి, శనివారం పెద్దాపురం కోర్టులో హాజరు పరిచామని ఎస్సై తెలిపారు. -
‘ఆ బండారం బయటపడుతుందని చంద్రబాబుకు భయం’
సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ మావిగన్ అని చెప్పడంతో చంద్రబాబు బిహేవియర్ మారిపోయింది. అమరావతిలో అవినీతి బండారం బయటపడుతుందని చంద్రబాబుకు భయం. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు నుండి ఇది చేశానని చెప్పుకోవడానికి ఏదీ లేదు. నేల విడిచి సాము చేస్తున్నారు. చంద్రబాబుకు అధికారం మాత్రమే కావాలి.’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు.‘‘వైఎస్సార్సీపీ గొడ్డలి పార్టీ అయితే.. టీడీపీ బాంబులు, గునపం పార్టీనా?. ఒక ఎన్నికలతో కమ్యూనిస్టులతో పొత్తుంటే.. మరో ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీతో టీడీపీ పొత్తు. వెన్నుపోటుకు చంద్రబాబు పేటెంట్. ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయకపోవడం వెన్నుపోటే. మీరు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా?...చంద్రబాబు ఎంతసేపు కార్పొరేట్ సంస్థలకు, తనకు కావాల్సిన వారికి దోచి పెట్టే కార్యక్రమం చేస్తారు. మీ దోపిడీని అరాచకాల్ని ఎవరూ అడగకూడదు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన పథకాల్ని చాపచుట్టినట్లు ఎత్తేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేదు. కొనుగోలు కేంద్రాలన్ని ప్రారంభించలేదు. రైతులు ఎలా పోయినా చంద్రబాబుకు పట్టదు. అమరావతి పేరుతో మీ జేబులు నింపుకునే కార్యక్రమం జరుగుతుంది.’’ అంటూ కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘పదో తరగతి పేపర్ సరిగ్గా దిద్ది మార్కులుఇవ్వలేక పోయారు. రాష్ట్రంలో పౌర హక్కులను హననం చేశారు. రెడ్బుక్ రాజ్యాంగానికి పోలీసు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. విజనరీ చంద్రబాబు పాలనలో అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించారు. ప్రతి మంగళవారం అప్పు కోసం పరిగెత్తితే కానీ.. రాష్ట్రాన్ని పాలించలేని పరిస్థితి. అప్పల్లోనూ..అవినీతిలోనూ ఆల్ టైమ్ రికార్డ్. ఇవాళ వాకింగ్ ట్యాక్స్.. రేపు టాకింగ్ ట్యాక్స్ వేస్తాడు...చంద్రబాబు అప్పులు చేస్తే రుణ సమీకరణ.. అదే జగన్ చేస్తే అప్పుల కుప్ప అని ఆయన అనుకూల మీడియా రాస్తుంది. రైతులకు మొంథా తుపాను ఇన్ఫుట్ సబ్సిడీ ఇవ్వలేదు. అప్పులు చేస్తున్న మీరు కనీసం ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చారా?. ఇవాళ ఆక్వా రంగం కుదేలు అయినా పరిస్థితి. బంకుల వద్ద డీజిల్ దొరకడం లేదు. ప్రజా వైద్య రంగాన్ని చేతులారా నాశనం చేస్తున్నారు. ఏమీ చేయకపోయినా... గోరంతల్ని కొండంతల్ని చేసి పబ్బంగడుపుకుంటారు. వైఎస్ జగన్పై నిలువునా విషాన్ని నింపుకున్నారు. వైఎస్ జగన్ పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. వైఎస్ జగన్కు ఆశీర్వాదం ఇచ్చిన పండితులకు నోటీసులు ఇవ్వడ చంద్రబాబుకు హుందాతనమా?’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు. -
రాష్ట్ర ఫుట్బాల్ పోటీలకు అరట్లకట్ట విద్యార్థినులు
కరప: రాష్ట్ర స్థాయిలో జరిగే శాప్ ఫుట్బాల్ లీగ్– 2026 పోటీలకు కరప మండలం అరట్లకట్ట ముత్యాల సుబ్బన్న మెమోరియల్ జెడ్పీ హైస్కూల్కు చెందిన 10 మంది విద్యార్థినులు ఎంపికయ్యారు. జట్టులో ఆరుగురు ప్లేయర్లుగా, నలుగురు స్టాండ్బైగా ఎంపికయ్యారని హెచ్ఎం పి.శ్రీనివాస్ కుమార్ శుక్రవారం తెలిపారు. గురువారం కాకినాడ డీఎస్ఏ మైదానంలో జిల్లా స్థాయిలో జరిగిన ఎంపికల్లో తమ విద్యార్థినులు అర్హత సాధించారన్నారు. వీరు 27న అనంతపురం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఎంపికై న క్రీడాకారుల్లో వల్లు అపర్ణ, నక్కా జ్యోష్స్న, కానేటి రిషిక, షేక్ సమీరాబేగం, వాసంశెట్టి సమీరా, సిరివిశెట్టి సృజన, స్టాండ్బై ప్లేయర్లుగా పాట్నీడి లక్ష్మితులసి, పచ్చిమాల జెస్సీకా, సింగినీడి నవ్య, పంపన మహాలక్ష్మి ఉన్నారు. ఎంపికై న క్రీడాకారులను, తర్ఫీదునిచ్చిన పీడీ కౌర్లను హెచ్ఎం శ్రీనివాస్ కుమార్, ఫస్ట్ అసిస్టెంట్ ఫణిశర్మ, ఎంఈఓలు కె.బుల్లికృష్ణవేణి, పి.సత్యనారాయణ, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, జెడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు తదితరులు అభినందించారు. -
తరిమేద్దోమా..!
నేడు మలేరియా నివారణ దినోత్సవం ఆలమూరు: చిన్న దోమ కుట్టడం వల్లే మలేరియా లాంటి పెద్ద ప్రమాదం సంభవిస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి సకాలంలో చికిత్స తీసుకోకుంటే ప్రాణాంతకంగా మారుతుంది. సంపూర్ణ పారిశుధ్య చర్యలతోనే దోమల వ్యాప్తిని అరికట్టి మలేరియా మహమ్మారిని తరిమికొట్టవచ్చు. శనివారం ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవాన్ని జరుపనున్నారు. కోనసీమ జిల్లాలోని 56 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో మలేరియా నియంత్రణకు జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఒక కేసు కూడా నమోదు కాలేదని జిల్లా మలేరియా యూనిట్ చెబుతోంది. వ్యాధి లక్షణాలు.. వ్యాప్తి ఫ మలేరియాను రక్త పరీక్ష (ఆర్డీ) ద్వారా గుర్తించవచ్చు. ప్లాస్మోడియం జాతికి చెందిన అనాఫిలిస్ దోమ వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఫ వ్యాధి సోకిన వ్యక్తికి చలి, వణుకుతో కూడిన జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. ఫ వ్యాధి నిరోధకశక్లి లేని రోగులు విపరీతమైన తలనొప్పి సంభవించి ఒక్కోసారి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదముంది. ఫ దోమ కుట్టిన 10 నుంచి 15 రోజుల వ్యవధిలో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఫ గిరిజన ప్రాంతాల్లో ఫాల్సిపారం మలేరియా అధికంగా ఉండగా, మైదాన ప్రాంతాల్లో వైవాక్స్ జాతి మలేరియా వ్యాపిస్తుంది. ఫ దోమలను నివారించడం ద్వారా మలేరియా వ్యాధిని పూర్తిగా అరికట్టే అవకాశం ఉంది. చికిత్సా విధానం ఫ మలేరియా సోకిన రోగి 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. ఫ మధ్యలో మందులు మానేస్తే వ్యాధి తిరగబెట్టే అవకాశఽం ఉంది. ఫ ఫాల్సీపారం మలేరియాకు మూడు రోజుల పాటు ఏసీటీ చికిత్స తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు అవసరం ఫ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. ఫ ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను తరచూ లార్వాసైడ్ క్రిమి సంహారక మందును పిచికారీ చేయాలి. -
సామర్లకోట స్టేషన్ సెంటర్లో ఎమ్మెల్యే చినరాజప్ప అట్టహాసంగా గడియారం స్తంభం ప్రారంభించారు. ఏడాది గడువక ముందే అందులోని గడియారం మోరాయించింది. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో రూ.15 లక్షలతో గడియారం స్తంభానికి శంకుస్థాపన చేశారు. మరో రూ.16 లక్షలు కేటాయించి 2025
● టిక్టిక్.. బ్రేక్ –సామర్లకోట ● ఎంతొట్టి నిర్లక్ష్యం మూగజీవాల దాహార్తి తీర్చేందుకు ఏడాది కిందట పల్లె పండగలో భాగంగా నిర్మించిన నీటి తొట్టెలు ఎందుకూ కొనగాకుండా ఉన్నాయి. పోలవరం జిల్లాలో చాలా ప్రాంతాల్లో రూ.లక్షలు ఖర్చు చేసి వీటిని నిర్మించినా, ఆ తొట్టెల్లో నీరు పోసేవారు లేకపోయారు. వీఆర్పురం మండలంలో ఈ నీటితొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఒక్కో తొట్టెకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఖర్చు చేశారు. ఈ తొట్టెల్లో నీరు నింపేవారు లేకపోయారు. –వీఆర్పురం -
సంగ్రామం ఎప్పుడో!
గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామం ఏరియల్ వ్యూ● గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా సిద్ధం ● ఇంకా తేలని రిజర్వేషన్లు ● ఎన్నికల నిర్వహణపై వీడని సందిగ్ధత ● ఆశావహుల ఎదురుచూపులు పిఠాపురం: పాలకవర్గాల పదవీ కాలం పూర్తయింది.. ఓటర్ల జాబితాలూ సిద్ధమయ్యాయి.. పల్లె పగ్గాలు చేజిక్కించుకునేందుకు ఆశావహులు ఎదురు చూస్తున్నారు.. కానీ, ప్రభుత్వం మాత్రం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదు. ప్రత్యేకాధికారుల పాలనకే పచ్చజెండా ఊపింది. దీంతో, గ్రామ స్వరాజ్యానికి దూరమై ఇటు ప్రజలు, కోరుకున్న పదవి దక్కే చాన్స్ కానరాక అటు అటు ఆశావహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత సెప్టెంబర్లోనే.. రాష్ట్ర ఎన్నికల సంఘం గత ఏడాది సెప్టెంబర్లో ప్రీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం గత ఏడాది అక్టోబర్ 15లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ, అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీ ఓటర్ల జాబితాలు, నవంబర్ 1 నుంచి 15లోగా ఎన్నికల అధికారులు నియామకం, డిసెంబర్ 16 నుంచి 30 లోగా పోలింగ్ కేంద్రాల ఖరారు, డిసెంబరు 15వ తేదీలోగా రిజర్వేషన్ల ఖరారు, జనవరిలో ఎన్నికల నిర్వహణ పూర్తి కావాలి. కానీ, ఏప్రిల్ నెల పూర్తవుతున్నా ఇప్పటి వరకూ ఓటర్ల జాబితా మాత్రమే పూర్తయ్యింది. కొత్త ఓటర్ల జాబితాలను ఇటీవల ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలో పురుషుల కంటే 11,317 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఓటర్ల జాబితాలు సిద్ధమవడంతో పల్లె సంగ్రామంలో పాల్గొనాలని ఉత్సాహంగా ఎదురు చూస్తున్న వారిలో ఆశలు చిగురించాయి. పలువురు ఆశావహులు తమ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావడం లేదు. వచ్చే ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు. దీంతో, ఆశావహులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అందరి దృష్టీ రిజర్వేషన్ల పైనే.. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వార్డులు, సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు కావాల్సి ఉంది. గత రిజర్వేషన్ల ఆధారంగా ఈసారి తమకే చాన్స్ వస్తుందని కొందరు భావిస్తున్నారు. మరోవైపు ఆశావహులు ముఖ్యంగా అధికార కూటమికి చెందిన వారు రిజర్వేషన్లను తమకు అనుకూలంగా మార్చేలా అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. అయితే, బీసీ రిజర్వేషన్ల వ్యవహారం కోర్టులో పెండింగ్లో ఉంది. అది తేలిన తరువాత కానీ రిజర్వేషన్ల ప్రక్రియ మొదలు కాదని అంటున్నారు. అయితే, ఎప్పుడు ఎన్నికలు జరిగినా బరిలో నిలిచేందుకు పలువురు సర్వ శక్తులతో రెడీ అవుతున్నారు. వీరిలో అనేక మంది ఇప్పటికే స్థానికుల అవసరాలపై దృష్టి సారిస్తున్నారు. ఓటర్లను ఇప్పటి నుంచే తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ఆరంభించారు. గ్రూపుల వారీగా రహస్య సమావేశాలు ఏర్పాటు చేసి, ముఖ్యులకు తాయిలాలు ఎర చూపుతున్నారు. కొన్ని గ్రామాల్లో గట్టి పోటీ నెలకొని ఉండటంతో రూ.లక్షల్లో సైతం ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయతీల ఓటర్ల వివరాలు గ్రామ పంచాయతీలు 385 వార్డులు 4,328 ఓటర్లు 12,58,458 వీరిలో మహిళలు 6,34,864 పురుషులు 6,23,547 ఇతరులు 47 ప్రత్యేక పాలనపై అసంతృప్తి పాలక వర్గాల పదవీ కాలం ముగియడంతో ఈ నెల 3వ తేదీ నుంచి అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ప్రత్యేకాధికారులు పాలన మొదలైంది. అయితే, ఇప్పటికే పలు విధులు నిర్వహిస్తూ తీవ్ర పనిభారంతో సతమతమవుతున్న అధికారులు.. తమకు అదనంగా అప్పగించిన పంచాయతీల పాలనపై దృష్టి సారించలేని పరిస్థితి. అటు పాలక వర్గాలు లేక.. ఇటు ప్రత్యేకాధికారుల పాలన సక్రమంగా లేక గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేస్తున్నాయి. ముఖ్యంగా తాగునీరు, పారిశుధ్య సమస్యలు పల్లె ప్రజలను వేధిస్తున్నాయి. నిధుల కొరతతో జల్ జీవన్ మిషన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. సమస్య చెప్పుకుందామన్నా వినే వారు, విన్నా పరిష్కరించే వారు లేక గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారు. -
ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. దీనికోసం జల్జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలన్నారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 3,79,185 ఇళ్లకు గాను ఇప్పటి వరకూ 2,96,777 ఇళ్లకు తాగునీరు అందించామన్నారు. మిగిలిన పనులను ప్రణాళిక ప్రకారం గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకులన్నింటినీ నీటితో నింపాలన్నారు. డ్రైనేజీల్లో ఉన్న తాగునీటి సరఫరా పైపులైన్లను గుర్తించి, వెంటనే తొలగించాలని పంచాయతీ, ఆర్బ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ, గ్రామాలు స్వయం సమృద్ధి సాధించేందుకు మూడంచెల విధానంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీలు సొంతంగా నిధులు సమకూర్చుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధికి గ్రామాలే వెన్నెముక అని, అధికార వికేంద్రీకరణ ద్వారా పాలనను ప్రజలకు చేరువ చేయడమే పంచాయతీరాజ్ శాఖ ప్రధాన ఉద్దేశమని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, పెద్దాపురం డీఎల్పీఓ బాలామణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆస్తుల కొనుగోలులో ఈసీ పరిశీలన కీలకం సామర్లకోట: ఆస్తులు కొనుగోలు చేస్తున్న సమయంలో ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ల (ఈసీ) పరిశీలన ఎంతో ముఖ్యమని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టరు జనరల్ (డీఐజీ) సీహెచ్ జానకీదేవి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సామర్లకోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, ఈసీని పరిశీలిస్తే ఆ ఆస్తిపై అప్పులున్నాయా, ఇంతకు ముందు ఎవరికై నా విక్రయించారా, రిజిస్ట్రేషన్ అయిందా, లేదా అనే విషయాలు తెలుసుకునే వీలు కలుగుతుందని చెప్పారు. ఆన్లైన్లో ఐజీఆర్ఎస్ వెబ్సైట్ ద్వారా కూడా ఈసీలు పరిశీలించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్ బీవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వనదుర్గమ్మకు యథావిధిగా హోమాలు అన్నవరం: సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణోత్సవాల సందర్భంగా ఈ నెల 26 నుంచి మే రెండో తేదీ వరకూ అన్నవరం దేవస్థానంలో పలు ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నారు. గత ఏడాది స్వామి వారి కల్యాణోత్సవాల సమయంలో వనదుర్గ అమ్మవారికి చండీ, ప్రత్యంగిర హోమాలను నిలిపివేయడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అవి యథావిధిగా జరుగుతాయని అధికారులు తెలిపారు. సత్యదేవుని కల్యాణోత్సవాల సమయంలో ఈ హోమాలను నిలిపివేయడంపై ‘సాక్షి’ గత ఏడాది మే 8న ‘రత్నగిరి వనదుర్గకు అపచారమా?’ శీర్షికన, మే 13న ‘ప్రత్యంగిర హోమానికి బ్రేక్’ శీర్షికన కథనాలు ప్రచురించింది. ఈ హోమాలు నిలిపివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని ఈ ఏడాది యథాతథంగా కొనసాగించనున్నారు. వీటితో పాటు శుక్రవారం ఉదయం జరిగే ఖడ్గమాల పూజ కూడా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. -
ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి (ట్రస్ట్ బోర్డు) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసింది. రత్నగిరి రామాలయం వద్ద ఉన్న విశ్రాంతి మండపంలో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. చైర్మన్గా ఐవీ రోహిత్, సభ్యులుగా పర్వత సూర్యారావు (సురేష్), సూర్య భాస్కరం ధనేకుల, కామర్స్ చిరంజీవిరావు, రావిపాటి సత్యనారాయణ, పాలచర్ల నాగేంద్రబాబు, తూము అప్పారావు, హెచ్.రామాంజనేయులు, తేలుకుంట్ల అనంతమ్మ, గెడ్డం అప్పారావు (బుజ్జి), గొడేటి భగవత్, రెడ్డి ఎరుకమ్మ, ఇండుగబిల్లి లోవకుమారి. యరగాటపు బాబ్జీ, బండి లక్ష్మి, తోలేటి శిరీష, తుల్లిమల్లి ఝాన్సీలక్ష్మితో ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఎక్స్ అఫీషియో సభ్యునిగా ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేక ఆహ్వానితులుగా వేములపల్లి కాంతారావు, గంగి గోవిందరాజు, ఇమ్మిడిశెట్టి వెంకట రమణ, బి.సురేంద్రనాథ్రెడ్డి హాజరయ్యారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడంతో వేదిక వద్ద గందరగోళం ఏర్పడింది. తొలుత ఒక్కొక్క సభ్యునితో విడివిడిగా ప్రమాణ స్వీకారం చేయించాలనుకున్నారు. పరిస్థితి చూసి, సభ్యులందరితో ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించారు. అన్నదానంలో భక్తులకు సత్యదేవుని ప్రసాదం ట్రస్ట్ బోర్డు తొలి సమావేశంలో తీర్మానం సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో భక్తులో భోజనంతో పాటు స్వామివారి ప్రసాదం కూడా అందించాలని నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశంలో తీర్మానించారు. చైర్మన్ రోహిత్ అధ్యక్షతన మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఈ తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ అంశంపై ‘అమాత్యా.. మొరాలకించవా..!’ శీర్షికన ఈ నెల 12న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. అదే రోజు అన్నవరం వచ్చిన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ కథనంపై స్పందించి, అన్నదానంలో సత్యదేవుని ప్రసాదం కూడా భక్తులకు పెట్టాలని ఆదేశించారు. ఈ మేరకు నూతన ట్రస్ట్ బోర్డు తొలి సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించి, వెంటనే అమలు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. -
అక్రమ నిర్బంధంపై ఆగ్రహం
● దళిత ఎంపీటీసీ భర్తను, మరో బీసీ నేతను తీసుకెళ్లిన పోలీసులు ● పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్సార్ సీపీ నేతల నిరసనసాక్షి, రాజమహేంద్రవరం/రంగంపేట: వైఎస్సార్ సీపీ నాయకులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, వారిని చిత్రహింసలు పెట్టారంటూ కుటుంబ సభ్యుల ఆరోపణలు.. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తల నిరసనలు.. టీడీపీ నాయకుల కవ్వింపు చర్యలతో రంగంపేటలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కూటమి కుట్రలతో.. రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలోని ఫిషర్మెన్ సొసైటీలో 270 మంది సభ్యులున్నారు. ఈ సంఘం ఎన్నికలకు గత మార్చి 5న అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. సొసైటీలో వైఎస్సార్ సీపీకే మెజారిటీ ఉండటంతో ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన కూటమి నేతలు కుట్రలకు తెర తీశారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎన్నికను గతంలో వాయిదా వేయించారు. దీనిపై వైఎస్సార్ సీపీ మత్స్యకార సంఘం నాయకులు కోర్టును ఆశ్రయించగా రెండు వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని తీర్చు వచ్చింది. ఈ మేరకు ఈ నెల 29న ఎన్నిక జరగాల్సి ఉంది. కిడ్నాప్ కేసు నమోదైందని.. దొడ్డిగుంట గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యురాలు మడికి లక్ష్మి భర్త, ఆ పార్టీ దళిత నేత మడికి వెంకట్రావు, మరో బీసీ నేత చెల్లుబోయిన వీరబాబులు వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. వీరు ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికల్లో కూడా చురుకుగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి ఇళ్లకు రంగంపేట పోలీసులు శుక్రవారం ఉదయం వెళ్లి, వారిని స్టేషన్కు తీసుకొచ్చారు. కూటమి మద్దతుదారులైన గుత్తుల యేసు, విత్తనాల భూరయ్య భార్యలతో వెంకట్రావు, వీరబాబులపై కిడ్నాప్ కేసు నమోదు చేయించారు. వెంకట్రావు, వీరబాబులను పోలీసులు చిత్రహింసలకు గురి చేసినట్లు వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసుల బుకాయింపు వెంకట్రావు, వీరబాబులను పోలీసులు తీసుకెళ్లిన సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆ పార్టీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి తదితరులు రంగంపేట పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. తమ వాళ్లను ఎక్కడ నిర్బంధించారో చెప్పాలని, వారిని వెంటనే క్షేమంగా అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే, పోలీసులు బుకాయించారు. తాము ఎవ్వరినీ తీసుకు రాలేదని రాజాతో అనపర్తి సీఐ సుమంత్ వాగ్వాదానికి దిగారు. ఆ సందర్భంగా సీఐ, రాజాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. సీఐ తనను బెదిరించే ధోరణిలో మాట్లాడటంతో రాజా సైతం అదే స్థాయిలో బదులిచ్చారు. వెంకట్రావు, వీరబాబులను పోలీసులు తీసుకెళ్లిన దృశ్యాలు వెంకట్రావు ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు తీసుకువచ్చిన తమ పార్టీ నేతలను వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ రాజా, సూర్యనారాయణరెడ్డిలు వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలసి ఏడీబీ రోడ్డుపై బైఠాయించారు. వాద్దరినీ తమకు చూపించేంత వరకూ అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేస్తూ.. ఎర్రటి ఎండలోనే మొక్కవోని పట్టుదలతో ఆందోళన నిర్వహించారు. కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారమూ లేకుండా ఒక దళితుడిని అక్రమంగా నిర్బంధించడాన్ని తప్పుబట్టారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. పోలీసులు ఇరు పక్షాలకూ సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. దిగివచ్చిన పోలీసులువైఎస్సార్ సీపీ నేతల నిరవధిక ఆందోళనతో పోలీసులు ఎట్టకేలకు దిగివచ్చారు. తాము అక్రమంగా నిర్బంధించిన వెంకట్రావు, వీరబాబులు తమ వద్దనే ఉన్నారని ఒప్పుకొని, కిడ్నాప్ కేసులో అరెస్టు చేస్తున్నట్లు రాత్రి తెలిపారు. పెద్దాపురం కోర్టులో హాజరు పరిచేందుకు ప్రయత్నించగా.. శనివారం తీసుకురావాలని న్యాయమూర్తి జి.బుల్లెమ్మ ఆదేశించారని చెప్పారు. దీంతో, వెంకట్రావు, వీరబాబులను రాత్రి అనపర్తి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాత్రంతా వారిని అక్కడే పోలీసు కస్టడీలో ఉంచి, వారిని శనివారం పెద్దాపురం కోర్టులో హాజరుపరచనున్నారు. వెంకట్రావు, వీరబాబులను పోలీసులు చూపించడంతో వైఎస్సార్ సీపీ నేతలు శుక్రవారం రాత్రి ఆందోళన విరమించారు. రాత్రి వరకూ ఆందోళన వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మరో మాజీ మంత్రి, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, మాజీ హోం మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, జక్కంపూడి రాజా, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, యువజన నేత జక్కంపూడి గణేష్ తదితరులు రంగంపేట స్టేషన్ వద్దకు సాయంత్రం చేరుకున్నారు. డీఎస్పీ విద్యతో చర్చలు జరిపారు. మడికి వెంకట్రావు, చెల్లుబోయిన వీరబాబులు తమ వద్దే ఉన్నారని, వారిని కిడ్నాప్ కేసులో అరెస్టు చేశామని, రాత్రి పెద్దాపురం కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ చెప్పారు. తమ వారిని కొట్టినట్లు తెలిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నేతలు హెచ్చరించారు.పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకారులను నెట్టివేస్తున్న పోలీసులు -
ట్యాక్స్.. తగ్గించడానికి టాక్స్
● పన్ను విధింపులో చేతివాటం ● అడిగినంత ఇస్తే తక్కువ వచ్చేలా నమోదు ● నగర పాలక సంస్థ ఆదాయానికి గండి కాకినాడ లీగల్: నగరంలో ఖాళీ స్థలాలకు, రేకుల షెడ్లకు, భవనాలకు పన్ను విధింపులో కొంత మంది రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అడిగినంతా ఇచ్చుకుంటే తక్కువ పన్ను వచ్చేలా ఆన్లైన్లో నమోదు చేస్తూ నగర పాలక సంస్థ ఆదాయానికి గండి కొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా ఇంటి నిర్మాణం పూర్తి చేసి, స్వర్ణ వార్డు (సచివాలయం) కార్యాలయానికి వెళ్లి పన్ను వేయాలని దరఖాస్తు అందజేస్తే.. వార్డు అడ్మిన్ పరిశీలించి, ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. ఆవిధంగా ఎవరైనా వస్తే ముందుగా నగర పాలక సంస్థ రెవెన్యూ అధికారులను కలిసి రావాలని కొంత మంది స్వర్ణ వార్డు సిబ్బంది చెబుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు రెవెన్యూ అధికారులను ప్రసన్నం చేసుకుంటేనే వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారని కొందరు యజమానులు వాపోతున్నారు. అదే సమయంలో భవనం విస్తీర్ణం తగ్గించి చూపించినా.. ఖాళీ స్థలంలో రేకుల షెడ్డు ఉన్నట్లు చూపినా.. పన్ను తక్కువగా వస్తుందని చెబుతున్నారని అంటున్నారు. అయితే, ఇందుకు ఇందుకు కొంత ముట్టజెప్పాల్సిందేనంటూ బాహాటంగానే బేరసారాలకు దిగుతున్నట్లు తెలిసింది. అంతా అడ్డగోలు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. పట్టణాల్లో పన్ను వేయని ఇళ్లకు కొత్తగా పన్ను విధించాలని, ఇప్పటికే పన్ను చెల్లిస్తున్న ఇళ్లు, భవనాల విస్తీర్ణంలో తేడాలుంటే సవరించాలని నగర పాలక సంస్థ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే, నగరంలో ఈ ప్రక్రియను మొక్కుబడిగా చేపట్టి చేతులు దులుపుకొన్నారు. ● మధురా నగర్లోని ఒక ఇంటికి గ్రౌండ్ ఫ్లోర్ ఉండగా దాని పైన మరో అంతస్తుకు అనుమతి తీసుకుని నిర్మాణం చేపట్టారు. సిబ్బంది గ్రౌండ్ ఫ్లోర్కు మాత్రమే పన్ను వేశారు. సుమారు రెండేళ్లవుతున్నప్పటికీ మొదటి అంతస్తుకు పన్ను వేయలేదు. ● గాంధీనగర్ సుబ్బారావు వీధిలో 100 గజాల స్థలం విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారమే సుమారు రూ.30 లక్షలు. ఆ స్థలంలో రేకుల షెడ్డుకు 2023 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకూ రెండేళ్లకు రూ.54 మాత్రమే పన్ను విధించారు. ● కొత్తగా నిర్మించిన భవనాలకు ఇతర కారణాలు చూపి పన్నులు వేయడం లేదు. ● ఆస్తి రిజిస్ట్రేషన్ అయిన తరువాత పన్ను మార్చాలన్నా, కొత్త ఇంటికి పన్ను వేయాలన్నా.. అనేక ఇబ్బందులు పెట్టి, అదనపు సొమ్ము గుంజుతున్నారని, ఆ తర్వాతే ఫైల్ ముందుకు వెళ్తోందని బహిరంగంగానే పలువురు ఆరోపిస్తున్నారు. ● ఈవిధంగా చేసేందుకు సంబంధిత యజమానుల నుంచి పెద్ద మొత్తంలో దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ అవకతవకలతో నగరపాలక సంస్థ ఆదాయానికి గండి పడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగులు నగర పాలక సంస్థలో రెవెన్యూ విభాగంలో 2025 నవంబర్ వరకూ రెవెన్యూ అధికారి (ఆర్ఓ) పోస్టులు రెండు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) పోస్టులు ఐదు ఉండేవి. అయితే, పరిపాలన సౌలభ్యం, పన్ను బకాయిలు వసూలు పేరుతో గతంలో పని చేసిన ఓ అధికారి నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెంచారనే ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగానే రెండు సర్కిళ్లలో ఇద్దరు ఆర్ఓలుండగా, సర్కిళ్లను మూడుకు పెంచి, అదనంగా మరో ఆర్ఓను నియమించారు. అలాగే, ఆర్ఐల సర్కిళ్లు ఐదు ఉండగా వాటిని ఏడుకు పెంచి, ఏడుగురు ఆర్ఐలను నియమించారు. ఇలా పోస్టులు పెంచడం వెనుక పెద్ద మొత్తంలో వ్యవహారం జరిగిందని, ఆదాయం వచ్చే ప్రాంతాల్లో కావలసిన అధికారిని నియమించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటువంటి వారిపై చర్యలు నగర పాలక సంస్థకు పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయానికి నష్టం కలిగించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. గతంలో రెవెన్యూ విభాగంలో అదనపు పోస్టింగ్ల నియామకంపై విచారణ జరుగుతోంది. – ఎన్వీవీ సత్యనారాయణ, ఇన్చార్జి కమిషనర్, నగర పాలక సంస్థ, కాకినాడ కాకినాడ నగరం (ఫైల్) -
ఉన్నట్టా.. లేనట్టా..!
● ఉపాధ్యాయ బదిలీలపై రాని స్పష్టత ● సంఘాలతో చర్చలు జరపని ప్రభుత్వంరాయవరం: వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం.. దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్లు కనిపించడం లేదు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్యాల కింద దాదాపుగా 18 వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరందరూ బదిలీలపై ఆశలు పెట్టుకున్నారు. గత విద్యా సంవత్సరంలో పదోన్నతులు, బదిలీలు నిర్వహించారు. దీని కోసం గత ఏడాది ఏప్రిల్ 21న నోటిఫికేషన్ జారీ చేసి, ఈ ప్రక్రియను జూన్ 12 నాటికి పూర్తి చేసింది. ఎస్జీటీల బదిలీలు మాన్యువల్గా, మిగిలిన బదిలీలు ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. ఈ ఏడాది కూడా అదే విధంగా బదిలీలు, పదోన్నతులు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. దీనికి నోటిఫికేషన్ ఎప్పుడిస్తారా అని ఎదురు చూస్తున్నారు. మీమాంస కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బదిలీలు, పదోన్నతులు వేసవి సెలవుల్లోనే కొనసాగిస్తామని షెడ్యూల్ విడుదల చేసింది. కానీ, వివిధ కారణాలతో ఈ ఏడాది బదిలీలుంటాయా, ఉండవా అనే మీమాంసను ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు. జనాభా లెక్కల ప్రక్రియ కారణంగా బదిలీలు చేపట్టరని కొందరు.. బదిలీలకు, సెన్సన్కు సంబంధం ఉండదని కొందరు అంటున్నారు. గత ఏడాది ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన బదిలీలు చేపట్టారు. ఈసారి కొత్త జిల్లాల ప్రకారం చేపట్టాల్సి ఉంటుంది. అలా జరగాలంటే రాష్ట్రపతి ఉత్తర్వులు రావాలి. మరోవైపు ఉమ్మడి సర్వీసు నిబంధనల అంశంపై చిక్కుముడి ఇంకా వీడలేదు. ఈ రెండు విషయాలపై స్పష్టతకు వచ్చిన తరువాతే బదిలీలు, పదోన్నతులు చేపడతారనే చర్చ కూడా సాగుతోంది. దీనిపై, రెండు మూడు రోజుల్లో ఉన్నతాధికారులు స్పష్టతనిచ్చే అవకాశముందని భావిస్తున్నారు. సర్దుబాటుతో సరా! బదిలీలు జరగని పక్షంలో ఉపాధ్యాయులు సర్దుబాటుతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ (రేషనలైజేషన్) చేపడతారు. దీనికి తొలుత నిబంధనలు రూపొందించిన అనంతరం ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు అసంబద్ధంగా ఉంటే ఉపాధ్యాయులు వ్యతిరేకించే అవకాశమూ ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుంటే మాత్రం కచ్చితంగా వర్క్ అడ్జస్ట్మెంట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బదిలీలపై స్పష్టత ఇవ్వాలని పలు ఉపాధ్యాయ సంఘాలు, టీచర్ ఎమ్మెల్సీలు ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ కమిషనర్కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఉపాధ్యాయ సంఘాలు, పీడీఎఫ్ ఎమ్మెల్సీలతో చర్చించి, బదిలీల షెడ్యూల్ను కచ్చితంగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకు గురవుతున్నారు షెడ్యూల్ విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. వేసవి సెలవులు ప్రారంభమైనా బదిలీ షెడ్యూల్ ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలతో ముందుగానే చర్చించి షెడ్యూల్ విడుదల చేయాలి. – చింతాడ ప్రదీప్ కుమార్, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ, కాకినాడ -
కోస్ట్గార్డు ‘విన్యాసం’
కాకినాడ క్రైం: కాకినాడ కోస్ట్గార్డు స్థానిక అధికారులు సొంత పెత్తనాలకు తెరలేపి శాఖ పరువును దిగజార్చుతున్నారు. గురువారం కాకినాడ శాఖ అధికారులు సాగర తీరంలో చాటుగా విన్యాసాలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఏటా సంప్రదాయంగా జరిగే ఈ విన్యాసాలకు ఈ ఏడాది ఉన్నతాధికారులు ఎవరూ రాకపోవడం చర్చకు దారితీసింది. ఎక్కడా ప్రచారం లేకుండా చాటుగా నిర్వహించాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం మీడియా సహా అనుబంధ విభాగాల సమక్షంలో కోస్ట్గార్డు విన్యాసాలు సముద్రంలో జరగాల్సి ఉంది. అయితే, ఎవరినీ ఆహ్వానించకుండానే, ఎంతోమంది తరలి వచ్చారని లెక్కల్లో చూపి అధిక బిల్లులు రాసుకోవడం కాకినాడ అధికారులకు పరిపాటిగా మారిందని కాకినాడ కోస్ట్గార్డు కార్యాలయానికి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. కాగా చాటుగా విన్యాసాలు ఎందుకు నిర్వహించారనే అంశంపై స్థానిక అధికారులను ఉన్నతాధికారులు వివరణ కోరడం చర్చనీయాంశమైంది. అన్నవరంలో మాక్ డ్రిల్ అన్నవరం: విజయవాడకు చెందిన 80 మంది ఉగ్రవాద నిరోధక దళం (ఆక్టోపస్) పోలీసులు గురువారం రాత్రి తొమ్మిది గంటల నుంచి 10–30 గంటల వరకు రత్నగిరిపై సత్యదేవుని ఆలయ సమీపంలో ‘ఆగమ్’ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదులు దేవస్థానంలో చొరబడితే వారిని ఎలా పట్టుకుంటారో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఒక్కసారిగా 80 మంది పోలీసులు ఆలయం వద్దకు రావడంతో అందరూ కంగారు పడ్డారు. చివరకు ఇది మాక్ డ్రిల్ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్టు ఆక్టోపస్ డీఎస్పీలు విశ్వనాఽఽథ్, తిమ్మయ్య తెలిపారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
కాకినాడ లీగల్: తాళ్ళరేవు సబ్రిజిస్ట్రార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు డి.శిరీషను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) సీహెచ్ జానకీదేవి సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై డీఐజీ జానకీదేవి మాట్లాడుతూ సీనియర్ అసిస్టెంట్ శిరీష సమయానికి విధులకు హాజరు కాకపోవడంతో క్రయవిక్రయదారులు ఇబ్బంది పడుతున్నామని కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ దార్వా ఫిర్యాదులు చేశారని చెప్పారు. ఆమైపె అనేక ఫిర్యాదులు కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కె.ప్రసాదరావుకు రాగా ఆయన వెళ్లి పరిశీలించారని అన్నారు.బుధవారం తాళ్ళరేవు సబ్రిజిస్ట్రార్ కార్యాలయం పరిశీలించగా ఏపీఎఫ్ఆర్ఎస్లో సుమారు 4నెలల నుంచి లాగిన్ అవ్వలేనట్టు గుర్తించానని డీఐజీ తెలిపారు. గతంలో పిఠాపురం సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించినప్పడు ఏసీబీ తనిఖీల్లో ఆమైపె కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జనవరి 30వ తేదీన క్రమశిక్షణ చర్యలకు తీసుకోవాలని ప్రభుత్వం అదేశించారు. -
పెట్రోలు పోసి, నిప్పు పెట్టాలని చూసి..
● ప్రేమించడం లేదని యువతిపై యువకుడి దాడి ● సకాలంలో ఇతర విద్యార్థులు రావడంతో తప్పిన ప్రమాదం రాజానగరం: ప్రేమించిన తనను పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన ఓ యువకుడు ఆ యువతిపై పెట్రోలు పోసి, అంటించబోయాడు. ఇతర విద్యార్థులు చూసి, అతన్ని వెనక్కి లాగడంతో ప్రమాదం తప్పింది. ఇదే సమయంలో అతను వెలిగించబోయిన లైటర్ వెలగకపోవడం ఆమె అదృష్టం. ఓ కాలేజీలో చదువుతున్న కోనసీమకు చెందిన యువతిని చొప్పెల్లకు చెందిన యర్రంశెట్టి లోకేష్ ప్రేమించాడు. మూడేళ్లు చదివి మానేసిన లోకేష్ ప్రవర్తన నచ్చక అతన్ని ఆ యువతి దూరం పెట్టింది. అయినప్పటికీ ఆమెను వెంటపడి వేధించడం మానకపోవడంతో కాకినాడకు మకాం మార్చి అక్కడ లేడీస్ హాస్టల్లో ఉంటూ ఆమె చదువుకుంటోంది. ఈ క్రమంలో పరీక్షలు రాసేందుకు రాజానగరంలో ఓ కాలేజీకి వచ్చిన ఆమెను కాలేజీ ప్రాంగణంలోకి బైకుపై వచ్చిన లోకేష్ జుట్టు పట్టుకుని బలవంతంగా పక్కకు తీసుకువెళ్లి, ఆమె పై పెట్రోలు పోసి, లైటర్తో అంటించబోయాడు. ఆ లైటర్ వెలగకపోవడంతోపాటు ఆమె పెట్టిన అరుపులకు సమీపంలో ఉన్న ఇతర విద్యార్థులు పరుగున వచ్చి లోకేష్ని వెనక్కి లాగడంతో ప్రమాదం తప్పింది. ఆ తరువాత అక్కడ నుంచి పారిపోయిన నిందితుడిని పట్టుకుని కేసు నమోదు చేసి, రిమాండ్కు పంపించామని ఎస్సై ప్రియకుమార్ తెలిపారు. -
నేడు కొలువు తీరనున్న ‘అన్నవరం’ ట్రస్ట్ బోర్డు
అన్నవరం: వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి (ట్రస్ట్ బోర్డు) శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ నేపథ్యంలో దేవస్థానంలోని రామాలయం వద్ద గల విశ్రాంతి మండపంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. చైర్మన్ ఐవీ రోహిత్తో పాటు 16 మంది సభ్యులు, నలుగురు ఆహ్వానితులు, ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అన్నదానంలో సత్యదేవుని ప్రసాదంపై తొలి తీర్మానం సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని ప్రసాదం కూడా పెట్టాలంటూ భక్తులు కోరుతున్న నేపథ్యంలో దీనిపై ఈ నెల 12న ‘సాక్షి’లో ‘అమాత్యా.. మొరాలకించవా! ’ శీర్షికన వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. అదేరోజు అన్నవరం వచ్చిన దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దీనిపై స్పందించి అన్నదానంలో స్వామివారి ప్రసాదం పెట్టాలని ఆదేశించారు. ట్రస్ట్ బోర్డు తొలి సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేయనున్నట్టు అధికారులు తెలిపారు. పుష్కరాల ఏర్పాట్ల పైనా.. 2027 జూన్లో జరుగనున్న గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరం వచ్చే భక్తులు సత్యదేవుని కూడా దర్శించుకుంటారు. పుష్కరాల 12 రోజులూ ఈ విధంగా భక్తుల తాకిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో చేపట్టవలసిన ఏర్పాట్లపై ట్రస్ట్బోర్డు తీర్మానించి కమిషనర్ అనుమతికి పంపించాల్సి ఉంటుంది. -
వాకింగ్ చేయాలంటే పన్ను కట్టాలా?
కాకినాడ రూరల్: కూటమి పాలనలో విశాఖలో విచిత్ర పరిస్థితి నెలకొందని, నగరంలో వాకింగ్ చేయాలంటే పన్ను కట్టాలా అని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి నిలదీశారు. విశాఖపట్నం కార్పొరేషన్ కమిషనర్ రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం నగర వాసులు, సామాన్యుల ఆరోగ్యంపై పడేలా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ నగరంలోని ప్రతి పార్కు, స్టేడియం వద్ద ప్రతీ వాకర్ రూ.750 చెల్లించాలని ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో జనం అవాక్కయ్యారని, బలవంతపు వసూళ్లకు పూనుకోవడమేమిటని ఆమె ప్రశ్నించారు. ఖరీదైన జిమ్లు, హెల్త్ క్లబ్బులకు వెళ్లలేని పేద మధ్య తరగతి ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కూడా సొమ్ము చెల్లించాల్సిన దుస్థితిని తీసుకురావడం సిగ్గు చేటు అన్నారు. విశాఖపట్నంలో అమలు చేయనున్న బలవంతపు వసూళ్లను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. దీనిని విశాఖ వాసులతో పాటు అందరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. మేధో సంపత్తి హక్కులపై సదస్సు బాలాజీచెరువు: పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మేధోసంపత్తి హక్కులపై జాతీయ స్థాయి సదస్సు కళాశాల మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ కందుల ఆంజనేయులు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది ఎం.డీ.జవహర్ ఆలీ హాజరై మేధోసంపత్తి హక్కుల రక్షణలో ఉన్న సందేహాలు, వాటి ప్రాధాన్యం వివరించారు. ఏఐ కాలంలోనూ మేధోసంపత్తి హక్కుల రక్షణ సాధ్యమని, ప్రతి వ్యక్తి విలువలను పాటించి యాజమాన్య హక్కులను చెందవలసినవారికి ఇస్తే అది సాధ్యమని వివరించారు. చైన్నె పేటెంట్ ఆఫీసు నుంచి ఆన్లైన్లో హాజరైన సుబారాబెనర్జీ కాపీరైట్స్కు సంబంధించి అనేక అంశాలు వివరించారు. రిజిస్టర్ అయిన పేటెంట్ కాపీరైట్ ఎలా కాపాడుకోవాలో తెలిపారు. ప్రొఫెసర్ గంటా సత్యనారాయణ, కామర్స్ విభాగాధిపతి పాండు రంగారావు, వైస్ ప్రిన్సిపాల్ సంజీవ్కుమార్, కె.లక్ష్మణ్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ పి.హరిరామప్రసాద్ పాల్గొన్నారు. వసతి గృహాల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రభుత్వ బధిర బాలుర, బాలికల వసతి గృహంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తునట్టు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు ఏ వై. శ్రీనివాసు గురువారం ప్రకటనలో తెలిపారు. కాకినాడ సాంబమూర్తినగర్లో గల ప్రభుత్వ బధిరుల పాఠశాలలో నేరుగా అడ్మిషన్ పొంది, అదే ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ బధిర బాలుర వసతి గృహంలో అడ్మిషన్ పొందాలనుకొనేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. వివరాలకు 0884 2352303 నంబర్లో సంప్రదించాలన్నారు. భగీరథుడి కృషి ఆదర్శనీయం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సమాజ అభ్యున్నతి, సమాజ హితం కోసం పట్టుదల, సంకల్పబలంతో భగీరథుడు చేసిన తపస్సు, కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం భగీరథ మహర్షి జయంతిని నిర్వహించారు. కలెక్టర్ భగీరథుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగీరథుడు గంగను భూమికి తీసుకువచ్చిన మహనీయుడిగా చరిత్రలో నిలిచారన్నారు. ప్రజల సంక్షేమం కోసం, అంకితభావంతో పనిచేయడం వంటి విలువలు భగీరథుని జీవితంలో మనకు స్పష్టంగా కనిపిస్తాయని కొనియాడారు. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏ.శ్యామల కుమారి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
సర్పవరం జంక్షన్ వద్ద ఉద్రిక్తత
● గుండె సంబంధిత వైద్యం కోసం వెళ్లిన ఉపాధ్యాయుడి మృతి ● ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని కుటుంబ సభ్యుల ఆరోపణ కాకినాడ రూరల్: జిల్లా సైన్స్ అధికారి, కాకినాడ రూరల్ తమ్మవరం గ్రామ పంచాయతీ పరిధిలోని పోలవరం యూపీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మైలపల్లి శ్రీనివాస్ వినీల్ అకాల మృతి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయ వర్గాలను తీవ్ర విషాదంలో నింపింది. ఆయన గుండె సంబంధిత సమస్యతో సర్పవరం జంక్షన్ వద్ద గల ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం చేరారు. బుధవారం శస్త్ర చికిత్స జరగగా రాత్రి మృతి చెందినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే తన భర్త మృతి చెందారని, ఇద్దరు చిన్న పిల్లలను వీధిన పడేశారని భార్య విలపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, ఆస్పత్రిపై చర్య తీసుకోవాలని ఆందోళనకు దిగారు. మరోవైపు ఆస్పత్రిలోని వైద్యులకు మద్దతుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)సభ్యులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆస్పత్రి ఎదురుగా ఉన్న వలసపాకల రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆస్పత్రి వద్ద ఆందోళన జరగడంతో సర్పవరం పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆస్పత్రి వర్గాలు, మృతుడి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల మధ్య చర్చలు అనంతరం రాత్రి ఆందోళన విరమించారు. -
గిర్జినకరి జనారే!
● పెదమల్లాపురం కేంద్రంగా మండలం లేదా ఐటీడీఏ సాధనకు పోరుబాట ● 1980 నుంచీ నెరవేరని ఆకాంక్ష ● మళ్లీ గళమెత్తుతున్న గిరిజనం ప్రత్తిపాడు రూరల్: ఒకే భౌగోళిక ప్రాంతం.. ఒకే విధమైన సంస్కృతి.. పరిపాలన మాత్రం నాలుగు ముక్కలు! ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల పరిధిలోని 59 ఏజెన్సీ గ్రామాల ప్రజలు నాలుగు వేర్వేరు మండలాల చుట్టూ తిరగలేక, సరైన అభివృద్ధి అందక అల్లాడుతున్నారు. 90 శాతం గిరిజన జనాభా ఉన్న ఈ ప్రాంతాన్ని పెద్దమల్లాపురం కేంద్రంగా ప్రత్యేక మండలంగా తీర్చిదిద్దాలన్న డిమాండ్ ఇప్పుడు మళ్లీ గళమెత్తుతోంది. శంఖవరంలో (23 గ్రామాలు), రౌతులపూడి (16), ఏలేశ్వరం (15), కోటనందూరు (5) మండలాల్లోని మొత్తం 59 సబ్ ప్లాన్ ఏజెన్సీ గ్రామాలను కలిపి ప్రత్యేక మండలంగా ప్రకటించాలని స్థానిక గిరిజనులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. సుదీర్ఘ పోరాటం ఈ 59 గ్రామాలకు పెద్దమల్లాపురం భౌగోళికంగా మధ్యలో ఉండటంతో పాటు కీలక గిరిజన గ్రామం కావడంతో దీనినే మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. ఈ గ్రామాల పరిధిలో సుమారు 40 వేల మంది జనాభా ఉండగా, అందులో దాదాపు 90 శాతం అంటే 32 వేల మంది గిరిజనులే. ప్రత్యేక మండల డిమాండ్ 1980 నుంచీ ఉంది. అప్పట్లో ఐటీడీఏ వ్యవస్థలు బలపడుతున్న తరుణంలోనే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక మండలం ఉండాలని ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ గ్రామాలు నాలుగు వేర్వేరు మండలాల్లో ఉండటంతో సంక్షేమ పథకాల అమలు, పరిపాలనలో గందరగోళం ఏర్పడుతోంది. రవాణా, విద్య, వైద్య సమస్యల పరిష్కారం కోసం ఈ గ్రామాల వారు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రత్యేక మండలం ఏర్పడితే పెద్దమల్లాపురంలో ిపీహెచ్సీ, పోలీసు స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు అందుబాటులోకి వస్తాయి. గిరిజన ఉప ప్రణాళిక నిధులు పూర్తిస్థాయిలో ఈ ప్రాంతాలకే ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అనేక విజ్ఞాపనలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు మండలాల పరిధిలోని 50 సబ్ప్లాన్ ఏజెన్సీ గ్రామాల గిరిజనులకు రంపచోడవరం ఐటీడీఏ కేంద్రంగా ఉండేది. అయినా గిరిజనులకు అందాల్సిన సదుపాయాలు వీరికి దక్కేవి కావు. ఈ క్రమంలో గిరిజన హక్కుల సాధన సంఘం, కొండరెడ్డి, కమ్మర, శృంగధార గిరిజన సంక్షేమ సంఘం, ఆదివాసి గిరిజన సంఘాలు కలిసి పెదమల్లాపురం మండల సాధన కమిటీగా ఆవిర్భవించాయి. ఎస్టీ కమిషన్ చైర్మన్కు అనేక సందర్భాల్లో విజ్ఞాపనలు అందజేశారు. పవన్ కల్యాణ్ హామీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఏలేశ్వరం రోడ్లో జరిగిన సభలో పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పెదమల్లాపురం గిరిజన మండలం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రిగా పదవినధిష్టించి 22 నెలలు దాటినా పట్టించుకోలేదని గిరిజనం మండిపడుతోంది. ఇన్నేళ్లకు మళ్లీ.. ప్రభుత్వం జిల్లాలు, మండలాల పునర్విభజనకు సిద్ధమవుతుండటంతో తెరమరుగైన పెదమల్లాపురం కేంద్రంగా ఐటీడీఏ ప్రతిపాదన మళ్లీ పురుడు పోసుకుంటోంది. సబ్ప్లాన్ ఏరియా గిరిజనులు పెదమల్లాపురం కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కుల ధ్రువీకరణ పత్రాలకు దిక్కు లేదు ఈ ప్రాంత గిరిజనులకు పెద్దాపురం ఆర్టీఓ ద్వారా ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. పురుషులకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నా, మహిళలకు భర్త ఇంటి పేరున మంజూరు చేయడానికి అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ఉన్నత విద్యకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడి స్కాలర్ షిప్లకు దూరమవుతున్నారు. -
జనసేన నాయకులపై ఎమ్మెల్సీ నాగబాబు అసహనం
● కాపు కార్పొరేషన్, కల్యాణ మండపం కోసం ప్రశ్నించిన జనసేన నాయకుడు ● పవన్కల్యాణ్ ఆరోగ్యం కోసం ఎవరూ అడగలేదని అసహనం పిఠాపురం రూరల్: జనసేన నాయకులపై ఎమ్మెల్సీ నాగబాబు అసహనం వ్యక్తం చేశారు. పిఠాపురం పర్యటనలో భాగంగా వచ్చిన ఎమ్మెల్సీ కె.నాగబాబు మండలంలోని కుమారపురంలో ఒక ప్రైవేట్ హోటల్లో గురువారం జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాపు కార్పొరేషన్, కల్యాణ మండపం కోసం ఒక జనసేన నాయకుడు ప్రశ్న వేశారు. అది విన్న నాగబాబు పవన్కల్యాణ్ ఆరోగ్యం కోసం ఎవరూ అడగలేదని జనసేన నాయకులపై అసహనం వ్యక్తం చేశారు. సెన్స్ ఉందా? అంటూ నిలదీశారు. ఎంత కష్టపడ్డారో, ఆయన ఆరోగ్యందెబ్బతిందని, అది ఎవరూ అడగటం లేదని మండిపడ్డారు. సదరు జనసేన నాయకుడు ‘సారీ సార్..’ అనడంతో ‘అది.. అదే కావాలి’ అంటూ శాంతించారు. -
పవన్ మాట నిలబెట్టుకోవాలి
సార్వత్రిక ఎన్నికల్లో పవన్కలాణ్ ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలి. పెదమల్లాపురం కేంద్రంగా మండలం ఏర్పాటు చేసి ఐటీడీఏ హోదా కల్పిస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – జర్తా ముసలయ్య, జిల్లా అధ్యక్షుడు, గిరిజన హక్కుల సాధన సంఘం, పెదమల్లాపురం ఐటీడీఏ ఏర్పాటు చేయాలి 1985లో శంఖవరంలో మినీ ఐటీడీఏ ఉండేది. అదే తరహాలో ఏర్పాటు చెయ్యాలి. – బూసరి బాలరాజు, జిల్లా కార్యదర్శి, గిరిజన హక్కుల సాధన సంఘం, దారమల్లాపురం నిధులు రావడం లేదు సబ్ప్లాన్ ఏరియాలో గ్రామాలు నాన్ షెడ్యూల్ పరిధిలో ఉండటం వల్ల 2 శాతం సబ్ ప్లాన్ నిధులు కూడా రావడం లేదు. – తరుం నాగేశ్వరరావు, గిరిజన నేత, పెదమల్లాపురం -
సబ్సిడీపై రుణాలు అందించాలి
మామిడి తాండ్ర తయారీని కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్న మాకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందించాలి. బ్యాంకుల ద్వారా తాండ్ర పరిశ్రమ అభివృద్ధికి భారీగా రుణాలు ఇవ్వాలి. మామిడి పండ్లు, పంచదార, బెల్లం ధరలు పెరుగుతున్నాయి. – మల్లవరపు రమేష్, తాండ్ర తయారీదారు, ఆత్రేయపురం భరోసా కల్పించాలి సంప్రదాయంగా తాండ్ర తయారు చేస్తున్నప్పటికీ కుటుంబాలు ఆర్థికంగా పైకి ఎదగడం లేదు. ప్రభుత్వాలు డ్వాక్రా మహిళలతో పాటు, తాండ్రను రిటైల్గా వ్యాపారం చేస్తున్న మహిళలకు కూడా ఆర్థిక సాయం అందించి భరోసా కల్పించాలి. ఈ పరిశ్రమ వ్యాప్తికి చర్యలు తీసుకోవాలి. – సంధ్య, స్టాల్ నిర్వాహకురాలు, ఆత్రేయపురం● -
వ్యక్తి దుర్మరణం
శంఖవరం: కత్తిపూడిలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. అన్నవరం పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం నుంచి తుని వైపు కంటైనర్ వెళ్తుండగా కత్తిపూడిలో వెనుక నుంచి వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ షేక్ సుభాని (50) అక్కడికక్కడే మృతి చెందాడు. అతనిది కృష్ణా జిల్లా నూజివీడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు. గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం శంఖవరం: గ్యాస్ సిలిండర్ పేలి ఓ ఇల్లు ధ్వంసం అయ్యింది. అక్కడ ఎవరూ లేని సమయంలో ఈ ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో ప్రగడ కల్పన ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దీంతో ఇంటి గోడలు బీటలు వారాయి. పేలుడు ధాటికి వస్తువులు, దుస్తులు చెల్లాచెదురయ్యాయి. స్టౌపై అన్నం వండుతూ మిగతా పని చూసుకునేందుకు మేడ పైకి వెళ్లిన సమయంతో పెద్ద పేలుడు శబ్దం వచ్చి చూసేసరికి మంటలు వ్యాపించాయని బాధితురాలు తెలిపారు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు మంటలు అదుపు చేశారు. ఇండియన్ గ్యాస్ కంపెనీ నిర్వాహకులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. -
మద్యం అక్రమ తయారీపై కఠిన చర్యలు
రాజమహేంద్రవరం రూరల్: మద్యం అక్రమ తయారీ, బెల్టు షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్ శ్రీధర్ ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఎకై ్సజ్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్ విధానం అమలు తీరు, ఆదాయ వృద్ధి, నేరాల నియంత్రణ తదితర అంశాలపై శ్రీధర్ విశ్లేషించారు. అనుమతులు పొందిన మద్యం షాపులు, బార్లలో తనిఖీలు నిర్వహించాలని, సమయ పాలన పాటించేలా చూడాలన్నారు. అక్రమ మద్యం నియంత్రణలో విఫలమయ్యే అధికారులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మంగళగిరి ప్రొహిబిషన్– ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ వై.చైతన్య మురళి, అసిస్టెంట్ కమిషనర్ ఎం.వినయ్ బాబు, జిల్లా ఎకై ్సజ్ అధికారులు వై.శ్రీలత, ఆర్ఎస్ కుమారేశ్వరన్ తదితరులు పాల్గొన్నారు. -
లాభాలు వెదజెల్లీ
స్టాల్లో తాండ్రను విక్రయిస్తున్న మహిళ చాపలపై మామిడి గుజ్జును పూస్తున్న మహిళలు ●ఆత్రేయపురం: పూతరేకుల పేరు వినగానే అందరికీ వెంటనే ఆత్రేయపురం గుర్తుకు వస్తుంది. ఈ గ్రామంలో తయారయ్యే పూతరేకులు దేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. అయితే మామిడి తాండ్ర (మ్యాంగో జెల్లీ) తయారీకి కూడా ఆత్రేయపురం పేరు గాంచింది. శతాబ్దాలుగా ఇక్కడ తాండ్ర తయారీ పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు ఉపాధిగా ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో మామిడి తోటలు హెచ్చుగా ఉండటం వల్ల పండ్లను నిల్వ చేసుకోవటానికి ఇదొక ప్రధాన మార్గంగా భావించి అప్పట్లో తాండ్ర తయారీ చేయడం ప్రారంభించారని పూర్వీకులు చెబుతారు. ప్రస్తుతం ఇక్కడి మామిడి తాండ్ర దేశ, విదేశాలకు ఎగుమతి అవుతోంది. ప్రధానంగా కలెక్టర్ రకం మామిడి పండ్లతో తాండ్ర తయారు చేస్తుంటారు. యంత్రాల వినియోగం ప్రస్తుతం తాండ్ర తయారీకి రసం తీసే చిన్నపాటి యంత్రాలను వినియోగిస్తున్నారు. రసం తీసిన తర్వాత పంచదార, బెల్లం కలిపి ఈత ఆకు చాపలపై రసం పోసి ఆరబెడతారు. ఇలా వారం, పది రోజుల పాటు దళసరి సరిపడినంత వచ్చిన తర్వాత వాటిని చాపపై కోసి నిర్దిష్ట సైజులో ప్యాకింగ్ చేస్తున్నారు. ఒక కేజీ లేదా అర కేజీ చొప్పున ప్యాకింగ్ చేసి అట్టపెట్టెలలో నిల్వ చేసుకుంటారు. కొంత తాండ్రను రాజమహేంద్రవరంలోని కోల్డ్ స్టోరేజీలలో నిల్వ చేసుకుని, ఇక్కడి వ్యాపారానికి అవసరమైనప్పుడు తెచ్చుకుని అమ్ముకుంటున్నారు. వేసవి అనంతరం తాటి పండ్లతో తాటి తాండ్రను సైతం తయారు చేస్తారు. పంచదార తాండ్రను కిలో రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు. బెల్లం తాండ్రను రూ.250 నుంచి రూ.350కు అమ్ముతున్నారు. లాభసాటిగా.. ఆత్రేయపురం గ్రామంలో వందల సంఖ్యలో పూతరేకుల వ్యాపారం కోసం స్టాళ్లు ఏర్పాటు చేశారు. వాటిలో ఏడాది పొడవునా మామిడి తాండ్రను కూడా విక్రయిస్తున్నారు. గతంలో ఈ తాండ్రను ముంబై, చైన్నె, కోల్కతా తదితర నగరాలకు ఎగుమతి చేసేవారు. కానీ ఇప్పుడు చాలా వరకూ స్థానిక స్టాళ్లలోనే అమ్ముడుపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. తద్వారా వ్యాపారం లాభసాటిగా సాగుతోందన్నారు. ఇటీవల కాలంలో మామిడి కాయలను జ్యూస్ ఫ్యాక్టరీలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. దీంతో వాటికి డిమాండ్ ఏర్పడి, ధరలు కూడా పెరిగాయి. గతంలో ఒక మెట్రిక్ టన్ను రూ.2 వేలు ఉండగా, ఇప్పుడు సుమారు రూ.20 వేలు పలుకుతోంది. కొన్నిచోట్ల జ్యూస్తో జెల్లీ తాండ్రను యంత్రాలపై తయారు చేస్తున్నారు. ఆ తాండ్ర ఇక్కడ స్టాళ్లలో లభిస్తోంది. మామిడి తాండ్ర తయారీ కేంద్రంగా ఆత్రేయపురం పూతరేకులతో పాటు ఎంతో ప్రసిద్ధి మహిళలకు జీవనోపాధి విదేశాలకూ ఎగుమతి -
తల్లిని ఇంటి నుంచి గెంటేయడం నేరం
● లక్ష్మీకాంతంకు న్యాయం చేయండి ● దళిత, బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్ రాజామణి అనపర్తి: కని పెంచిన తల్లిని ఇంటి నుంచి గెంటేయడం చట్టరీత్యా నేరమని దళిత, బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్, న్యాయవాది కొంకి రాజామణి అన్నారు. గురువారం బిక్కవోలు పోలీస్ స్టేషన్ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. పందలపాక గ్రామానికి చెందిన కొవ్వూరి లక్ష్మీకాంతానికి ముగ్గురు కుమారులు ఉన్నారన్నారు. వీరి తండ్రి చిన్నప్పుడే విడిచి వెళ్లిపోవడంతో లక్ష్మీకాంతం ఆ ముగ్గురి పిల్లల్ని చదివించి ప్రయోజకులను చేశారన్నారు. అలాగే ఆమెకు ఉన్న పూర్వపు ఆస్తులు కూడా ఆ కుమారులకు ఇచ్చేశారన్నారు. ఇది లా ఉండగా మార్చి 5న జరిగిన ఓ సంఘ టనలో నమోదైన కేసు లో ముగ్గురు కుమా రులు నిందితులుగా ఉన్నారని, ఈ నేపథ్యంలో తల్లి లక్ష్మీకాంతం కుమారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పలేదన్న కోపంతో మార్చి 21న ముగ్గురు కుమారులు, కోడలు, లక్ష్మీకాంతం సోదరుడు, అతని భార్య కలసి లక్ష్మీకాంతం వద్ద ఉన్న నగదు, బంగారం లాక్కుని కొట్టి బయటకు గెంటేశారన్నారు. అప్పటి నుంచి దేవాలయాల వద్ద తలదాచుకుంటుందని, తన కుమారులు, సోదరులు కలసి తనను చంపాలని చూస్తున్నారని బాధితురాలు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారని రాజామణి తెలిపారు. అలాగే దళిత, బహుజన మహిళా శక్తి ఆధ్వర్యంలో గురువారం బాధితురాలితో కలసి బిక్కవోలు పోలీస్ స్టేషన్లో ఎస్సై రవిచంద్రకుమార్కు ఫిర్యాదు కాపీని ఇవ్వడానికి రాగా, ఆమె కుమారులను పిలిచి మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు. -
రాష్ట్ర బాస్కెట్బాల్ టోర్నీ విజేత రామచంద్రపురం
బాస్కెట్బాల్ విజేత రామచంద్రపురం మహిళా జట్టుకు, పురుషుల జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న శాప్ చైర్మన్ రవినాయుడు, దాతలు దేవరపల్లి: రామన్నపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన అమరావతి రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ ఇన్విటేషన్ కప్ టోర్నమెంట్లో రామచంద్రపురం జట్టు విజేతగా నిలిచింది. బుధ, గురువారాల్లో హైదరాబాద్కు చెందిన కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ టోర్నమెంట్ నిర్వహించారు. హైస్కూల్ హెచ్ఎం, శాప్ డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్ పర్యవేక్షణలో నిర్వహించిన టోర్నమెంట్లో పురుషులు, మహిళా విభాగాల్లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. మహిళల విభాగంలో రామచంద్రపురం, ఏలూరు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో 42–31 పాయింట్లతో రామచంద్రపురం జట్టు విజేతగా నిలిచింది. ఏలూరు జట్టుకు ద్వితీయ, రామహేంద్రవరం జట్టుకు తృతీయ స్థానాలు లభించాయి. పురుషుల విభాగంలో రామచంద్రపురం – గుంటూరు జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో 65 – 61 పాయింట్ల తేడాతో రామచంద్రపురం జట్టు విజయం సాధించింది. గుంటూరు జట్టు ద్వితీయ, రాజమహేంద్రవరం జట్టు తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. విజేతలకు ఆంఽధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ (శాప్) చైర్మన్ అనిమని రవినాయుడు చేతుల మీదుగా కప్లు, నగదు బహుమతులు, మెడల్స్ అందజేశారు. గ్రామానికి చెందిన కూచిపూడి రమేష్ కప్లు సమకూర్చగా, కేర్ ఫౌండేషన్ చైర్మన్ రాపాక గాంధీ ప్రథమ నగదు బహుమతిగా పురుషుల జట్టుకు రూ.50 వేలు, రాపాక యూత్ అధ్యక్షుడు రాపాక అశోక్ ద్వితీయ బహుమతిగా రూ.30 వేలు, ఐటీ కంపెనీ ప్రతినిధులు గోపాల్, రవి తృతీయ బహుమతిగా రూ. 20 వేలు సమకూర్చారు. మహిళల జట్టుకు ప్రథమ బహుమతిని ఇమ్మణి సూరిబాబు రూ. 30 వేలు, కొయ్యలమూడి చినబాబు ద్వితీయ బహుమతిని రూ. 20 వేలు, తృతీయ బహుమతిని అనిశెట్టి ప్రభాకరరావు రూ. 10 వేలు సమకూర్చారు. శాప్ డైరెక్టర్ జగదీశ్వరి, ఆనంద్ ఎడ్యుకేషనల్ విద్యా సంస్థల చైర్మన్ సువర్ణరాజు, పరమేశు బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ జీఎం శివప్రసాద్, కేర్ ఫౌండేషన్ సీఈఓ రాపాక శ్రీ పాల్గొన్నారు. -
‘మీకు కార్పొరేషన్ కావాలా?’.. పవన్ ఆరోగ్యం ఎలా ఉందని అడిగారా?
సాక్షి,కాకినాడ: పిఠాపురం జనసేన నేతలపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ఆరోగ్యం ఎలా ఉందని ఎవరూ అడగడం లేదని అన్నారు. కాపు కార్పొరేషన్, కల్యాణ మండపం కావాలని అడుగుతారా? అని ప్రశ్నించారు. పవన్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోరా? అంటూ మండిపడ్డారు. దీంతో నాగుబాబు మాటలకు జనసేన నేతలు సారీ చెప్పారు. జనసేన క్షమాపణలు చెప్పడంతో అదే కావలని నాగబాబు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఎక్స్ పోస్ట్లో పేర్కొంది. గత వారం సడెన్గా పవన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్న ఆయన తన వ్యక్తిగత వైద్యుల సలహాతో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శనివారం సాయింత్రం శస్త్రచికిత్స చేశారు.వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఇదే విషయాన్ని పవన్ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ తెలిపారు. 2018లో పవన్ కల్యాణ్ కంటి సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో హైదరాబాద్లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. పవన్ ఎడమ కంట్లో కురుపు ఉన్నట్లుగా గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్సతో తొలగించారు. రంగస్థలం మూవీ సక్సెస్ మీట్లో ఈ విషయాన్ని పవన్ వెల్లడించారు. -
పిచ్చికుక్క స్వైర విహారం
పి.గన్నవరం: మండల కేంద్రం పి.గన్నవరంలో బుధవారం ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. సాయంత్రం నుంచి రాత్రి వరకూ కనిపించిన వారిని కరుస్తూ భయబ్రాంతులకు గురి చేసింది. మొత్తం ఆరుగురిని గాయపరిచింది. రెండు కుక్క పిల్లల్ని కూడా హతమార్చింది. తొలుత స్థానిక మూడు రోడ్ల సెంటర్లో కొప్పాడి నాగలక్ష్మి, అనంతరం శివాలయం వెనుక రోడ్లో పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న బెజవాడ గీతిక అనే 7వ తరగతి విద్యార్థినితో పాటు, ఆమె కూడా వెళ్తున్న డిగ్రీ విద్యార్థిని జి.శ్రీనివాస మంగతాయారును, బాలురు ఎస్హెచ్ఎస్ సాయి, కోట ఏసేబు, మరో వ్యక్తి ఐ.మణికంఠను తీవ్రంగా గాయపరిచింది. క్షతగాత్రులకు పి.గన్నవరం సీహెచ్సీలో డాక్టర్ వందన వైద్య సేవలు అందించారు. ఇందులో ఏసేబు, గీతిక, నాగలక్ష్మి సీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. చివరికి స్థానిక అంబేడ్కర్ కాలనీలో స్థానికులు పిచ్చికుక్కను హతమార్చారు. అలాగే రాజులపాలెం గ్రామంలో ఎం.సత్యవతి, బెల్లంపూడిలో డి.వీరేంద్రలను కుక్కలు కరవడంతో పి.గన్నవరంలో చికిత్స పొందారు. బుధవారం 9 డాగ్ బైట్ కేసులకు వైద్య సేవలు అందించినట్టు డాక్టర్ వందన తెలిపారు.ఆరుగురికి తీవ్ర గాయాలు -
గురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
● బతికినా.. బతకలేకపోతున్నా.. ఎలా బతకాలి? సామర్లకోట: ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా 28 మందిని బలి తీసుకున్న ఘోర విస్ఫోటం ఆ కుటుంబాల్లో ఎప్పటికీ తీరని మహావిషాదాన్నే మిగిల్చింది. సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో గత ఫిబ్రవరి 28న ఈ మృత్యు విలయ విన్యాసం ఇప్పటికీ బాధితుల కళ్ల ముందు మెదులుతూనే ఉంది. విస్ఫోటం రగిల్చిన చిచ్చులో సంఘటన స్థలంలోనే ఆ రోజు 20 మంది సజీవదహనమైపోయారు. తీవ్రంగా గాయపడిన మరో తొమ్మిది మందిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. వీరిలో చికిత్స పొందుతూ ఎనిమిది మంది ఒకరొకరుగా మరణించారు. ఈ ప్రమాదం నుంచి ఆ రోజు ప్రాణాలతో బయట పడిన ఒకే ఒక్కడు పెద్దాపురానికి చెందిన చాపల శామ్యూల్. అయితే, నాటి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. మృత్యులోకపు అంచుల వరకూ వెళ్లి.. మృత్యువును జయించి, సుదీర్ఘ చికిత్స అనంతరం ప్రాణాలు దక్కించుకున్న మరో వ్యక్తి సామర్లకోట కుమ్మర వీధికి చెందిన వేమగిరి దావీదు. వైద్యుల కృషే ఫలించిందో.. బతకాలనే ఆశే అతడి ఊపిరి నిలిపిందో.. ప్రార్థించిన దేవుడే కరుణించాడో కానీ.. సుమారు 40 రోజుల చికిత్స అనంతరం కోలుకుని దావీదు కొద్ది రోజుల కిందట ఇంటికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా తనను కలసిన ‘సాక్షి’కి.. నాటి ఘోర కలిని, కుటుంబ పోషణకు పడుతున్న ఇబ్బందులను అతడు వివరించాడు. క్షతగాత్రులకు సాయమేదీ? బాణసంచా విస్ఫోటం జరిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకూ ఆ సహాయం అందలేదని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షలు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ నుంచి రూ.2 లక్షలు మాత్రమే అందాయని అంటున్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఎటువంటి సహాయమూ చేయలేదు. దీంతో, దావీదు కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బాణసంచా ఘోర విస్ఫోటంలో తనువెల్లా దహించుకుపోయింది.. కోలుకున్నాక చర్మం, కండరాలు బిగిసిపోయాయి.. అవయవాలు స్వాధీనంలోకి రావడం లేదు.. ఏ పని చేయడానికీ సహకరించడం లేదు.. ప్రాణాలతో బయట పడినా.. బతికే దారి కానరావడం లేదు.. సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో గత ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన దుర్ఘటనలో తీవ్రంగా కాలి, గాయపడి, సుదీర్ఘ చికిత్స అనంతరం కోలుకున్న వేమగిరి దావీదు దుస్థితి ఇది. వేట్లపాలెం బాణసంచా విస్ఫోటంలో మృత్యుంజయుడి దుస్థితి సుదీర్ఘ చికిత్సతో నిలిచిన ప్రాణాలు ఇటీవల ఇంటికి చేరుకున్న వేమగిరి దావీదు పని చేయడానికి సహకరించని శరీరం ఏ పనీ చేయలేని దుస్థితి కుటుంబ పోషణకు ఇబ్బందులు ప్రభుత్వమే ఆదుకోవాలి సుమారు పదేళ్లుగా సామర్లకోట, వేట్లపాలేల్లో బాణసంచా తయారీలో పని చేసినా ఎప్పుడూ ఇంత పెద్ద ప్రమాదం జరగలేదు. తెలిసిన విద్య కావడం, బాణసంచా తయారీని బట్టి కూలి ఇస్తూండటంతో రోజుకు రూ.1,000 నుంచి రూ.1,200 సంపాదించవచ్చనే ఆశతో ఈ పనికి వెళ్లేవాడిని. బాణసంచా ప్రమాదంలో శరీరం తీవ్రంగా కాలిపోవడంతో అవయవాలు సహకరించడం లేదు. మా అమ్మ రాఘవ 57 సంవత్సరాల వయస్సులోనూ తాటాకు విసనకర్రలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమె సంపాదనపై ఆధారపడి అద్దె ఇంట్లో జీవిస్తున్నాం. రేకులతో ఉన్న ఇంట్లో వేడి రావడంతో పైన తాటాకులు వేసుకుని నివాసం ఉంటున్నాం. నాకు భార్య విజయలక్ష్మి, కుమారుడు వినయ్ కుమార్, కుమార్తెలు రమ్యప్రియ, కరుణ ఉన్నారు. కొడుకు పదో తరగతి చదివి మానేశాడు. ఏ పనీ చేయడం లేదు. పెద్ద కుమార్తె పది, చిన్న కుమార్తె ఎనిమిది తరగతుల్లోకి వస్తున్నారు. ఏ పనీ చేయలేని పరిస్థితిలో వారిని ఏవిధంగా పోషించుకోవాలో తెలియడం లేదు. కోలుకుని ఇంటికి వచ్చిన తరువాత ప్రభుత్వం నా క్షేమ సమాచారం తెలుసుకోలేదు. కనీసం దివ్యాంగ పింఛను ఇచ్చి ఆదుకోవాలి. అత్తగారు ఇచ్చిన స్థలం బ్యాంకులో ఉండటంతో ఇల్లు కట్టుకోవడానికి గతంలో రూ.8 లక్షల అప్పు చేసి స్థలం విడిపించాను. ఈ ప్రమాదం తరువాత ఇప్పుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. అప్పులు తీర్చలేని దుస్థితిలో ఉన్నాను. కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి. – వేమగిరి దావీదు, సామర్లకోట


