breaking news
Kakinada
-
సినిమా చూసి ఇంటికెళ్తుండగా ఘోరం.. బైక్ను ఈడ్చుకెళ్లిన లారీ
కాకినాడ: ఆ కుటుంబ సభ్యులు అప్పటి వరకూ సినిమా చూసి, ఆనందంగా గడిపారు. అతడు భార్యాపిల్లలను ఇంటి దగ్గర దింపి, పలావ్ కొనుక్కుని వచ్చేందుకు బయల్దేరాడు. తిరిగి వెళ్తూండగా మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ.. అతడి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘోర సంఘటన జగ్గంపేటలోని గోకవరం రోడ్డులో చోటు చేసుకుంది. ఎస్సై రఘునాథరావు కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన నీలాపు సంతోష్ కుమార్ రెడ్డి (34) ప్రతిపాడులోని సీఎఫ్సీ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజినీర్గా పని చేస్తూ, 11 సంవత్సరాలుగా జగ్గంపేట బాలాజీ నగర్లో నివాసముంటున్నాడు. బుధవారం రాత్రి భార్య శ్రీలిఖిత, కుమార్తెలు శాన్వి, లాస్య(చిన్న పిల్లలు)తో కలసి సినిమాకు వెళ్లారు. అనంతరం, భార్యాపిల్లలను సంతోష్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద దించి, పలావు కోసం గోకవరం రోడ్డులోని బిర్యానీ సెంటర్కు మోటార్ సైకిల్పై వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్తూండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ అతడిని ఢీకొంది. దీంతో, సంతోష్ కుమార్ రెడ్డి బైక్ అదుపు తప్పి, ఎదురుగా వస్తున్న మరో మోటార్ సైకిల్ను ఢీకొంది. అందరూ కింద పడిపోగా ఆ లారీ సంతోష్ కుమార్ రెడ్డి బైక్ను కొంత దూరం ఈడ్చుకుపోయింది. ఈ ఘోర ప్రమాదంలో అతడి చెయ్యి నుజ్జునుజ్జయి ఊడిపోయింది. తీవ్ర గాయంతో రక్తస్రావం అవుతూండగానే సంతోష్ కుమార్ రెడ్డి మరో చేత్తో కుటుంబ సభ్యులకు ప్రమాదం గురించి మొబైల్ ఫోన్లో సమాచారం అందించడం స్థానికులను కలచివేసింది. అతడిని స్థానికులు, పోలీసులు, బంధువులు తొలుత స్థానిక సీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలిస్తూండగా మార్గం మధ్యలో అతడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో మోటార్ సైకిల్పై వెళ్తున్న వారు కూడా గాయపడ్డారు. సంతోష్ కుమార్ రెడ్డి భార్య శ్రీలిఖిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.చదవండి: ఫ్రెండ్ ప్రాణం తీసిన అక్రమ సంబంధం? -
ఫ్రెండ్ ప్రాణం తీసిన అక్రమ సంబంధం?
కాకినాడ క్రైం: ఓ ద్విచక్ర వాహనం వచ్చి ఆగింది. ఆ వాహనంపై వచ్చిన వ్యక్తితో నలుగురు చుట్టుముట్టారు. వారిలో ఇద్దరిపై ఆ వ్యక్తి దాడి చేశాడు. వారు ప్రతిదాడి చేశారు. వీరికి మిగిలిన ఇద్దరూ తోడయ్యారు. మొత్తం నలుగురూ కలసి మూకదాడికి దిగారు. అక్కడే ఉన్న చెక్కతో ఆ వ్యక్తిపై విచక్షణారహితంగా చావబాదారు. విరిగిన చెక్కలో పదునైన భాగాన్ని.. అపస్మారక స్థితికి చేరుకున్న ఆ వ్యక్తి గొంతులో పరమ కిరాతకంగా దించేశారు. అయినా బతికేస్తాడేమోననే అనుమానంతో ఆ కర్రను బయటకు తీసి మరింత లోతుగా దించారు. ఇలా ఒళ్లు గగుర్పొడిచే రీతిలో మూడుసార్లు తీసి గుచ్చి, చివరిగా ఆ కర్రను బలంగా గొంతులోకి దిగ్గొట్టి క్రూరాతిక్రూరంగా హతమార్చారు. ఇదంతా మూడంటే మూడు నిమిషాల్లోనే జరిగిపోయింది. ఏదో క్రైం థ్రిల్లర్ కథలా.. సినిమాలోని క్రూర సన్నివేశంలా జరిగిన ఈ దారుణం.. ప్రశాంతతకు మారుపేరుగా చెప్పుకొనే కాకినాడ నగరం నడిబొడ్డున.. భానుగుడి సెంటర్లో.. జిల్లా పోలీసు కార్యాలయానికి కూతవేటు దూరాన.. ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి చోటు చేసుకుంది. జిమ్ ట్రైనర్ కొడమాటి సతీష్రెడ్డి (30) క్రూరహత్యోదంతం జిల్లాను కుదిపేసింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లాలో పోలీసు భద్రతను ప్రశ్నార్థకం చేసింది. హతమార్చింది అందుకేనా? ఈ హత్య చేయించాడనే ఆరోపణలు వినిపిస్తున్న వ్యక్తికి రాజకీయ అండదండలున్నాయని చెబుతున్నారు. అతడి భార్య బ్యూటీషియన్గా పని చేస్తోంది. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకుల కేసు కోర్టులో నడుస్తోందని సమాచారం. ఆమెతో హతుడు సతీష్ చనువుగా ఉండేవాడని తెలుస్తోంది. అతడి స్నేహితుడు సాయికిరణ్ కూడా ఆమెపై కన్ను వేశాడని, ఆమెకు ఇష్టం లేకపోయినా దగ్గరవ్వాలనే ప్రయత్నాలు చేశాడని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆ మహిళ సతీష్కు చెప్పడంతో అతడికి, సాయికిరణ్కు మధ్య తరచుగా గొడవలు జరుగుతూండేవి. ఈ నేపథ్యంలో సాయికిరణ్ ఆ మహిళ భర్తకు సతీష్ పై లేనిపోని చాడీలు చెప్పి, ఇద్దరి మధ్య కక్షలు పెంచాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ మహిళ భర్త ఆదేశాలు, అండదండలతో సాయికిరణ్, మరో ముగ్గురు కలసి సతీష్ను ప్రణాళిక ప్రకారం అర్థరాత్రి భానుగుడి సెంటర్కు రప్పించి హతమార్చినట్లు తెలుస్తోంది. హత్యకు ఉపయోగించిన కర్రను సాయికిరణ్ అప్పటికే సమకూర్చుకున్నాడని తెలుస్తోంది. ఆ నాలుగు రోజుల్లో ఏం జరిగింది! గత నెల 8 నుంచి 12వ తేదీ మధ్య జరిగిన సంఘటనలే ఈ హత్యకు దారి తీశాయని తెలియవచ్చింది. ఆ మహిళ విషయంలో సతీష్ భార్య జయశ్రీని సాయికిరణ్ కలిశాడు. ఆ మహిళతో సతీష్ సన్నిహితంగా ఉంటున్నాడని, ఆమె ఫలానా వ్యక్తి భార్య అని వెల్లడించాడు. టీడీపీ ముఖ్య నాయకుడి అనుచరుడిగా చెబుతున్న ఆ వ్యక్తి అప్పటికే తన భర్త సతీష్ ద్వారా జయశ్రీకి తెలుసు. గర్భిణిగా ఉన్న ఆమె పుట్టింట్లో ఉండగా సాయికిరణ్, ఆ వ్యక్తితో జయశ్రీని కలిశాడు. ఆమె భర్తను చంపేస్తానని చెప్పాడు. తనను, కడుపులో ఉన్న బిడ్డను చూసి తన భర్తను విడిచిపెట్టాలని, సతీష్ ఆ మహిళ జోలికి వెళ్లకుండా చూసుకుంటానని ఆమె చెప్పింది. వారు వెళ్లిన తర్వాత రోజు ఆ మహిళ విషయమై సతీష్ను జయశ్రీ నిలదీసింది. ఆమెతో మాట్లాడుతున్నానని ఒప్పుకున్న అతడు.. నిండుగర్భిణిగా ఉన్న తన భార్యకు ఈ విషయం చెప్పిన సాయికిరణ్పై ఆగ్రహంతో రగిలిపోయాడు. అప్పటి నుంచీ వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భార్య పుట్టింట్లో ఉండగా, మంగళవారం అర్ధరాత్రి సాయికిరణ్, సతీష్లు ఫోనులో గొడవ పడ్డారు. దమ్ముంటే రా అంటూ సవాళ్లు విసురుకున్నారు. ఆగ్రహంతో రగిలిపోయిన సతీష్ తన ద్విచక్ర వాహనంపై కిరణ్ ఉన్న భానుగుడి జంక్షన్కు రాత్రి 1.45 సమయంలో వెళ్లాడు. ముందే సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం అతడిని సాయికిరణ్, అనుచరుల హతమార్చారు. సతీష్కు జయశ్రీతో ఏడాదిన్నర క్రితమే వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఆరో నెల గర్భిణి. పొంతన లేకుండా.. ఈ హత్యకు సంబంధించి పోలీసులు చెబుతున్న కారణాలకు, కుటుంబ సభ్యులు, తెలిసిన వారు చెబుతున్న విషయాలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. తునికి చెందిన ఓ యువతిని ఇద్దరూ ప్రేమించి గొడవ పడగా అది హత్యకు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు. కానీ, అది పోలీసుల కల్పిస్తామని కుటుంబ సభ్యులు అంటున్నారు. నిద్రలో నైట్ డ్యూటీ కమాండ్ కంట్రోల్ సిబ్బంది ఈ హత్య నేపథ్యంలో పోలీసుల రాత్రి నిఘా పూర్తిగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. హత్య జరిగిన భానుగుడి సెంటర్ జిల్లా పోలీసు కార్యాలయానికి 200 మీటర్ల లోపే ఉంది. హత్య సమయంలో అరగంట పైగా అక్కడ అలజడి చోటు చేసుకుంది. అయినప్పటికీ నైట్ బీట్లు అటువైపు కనీసం దృష్టి పెట్టలేకపోయాయి. పోనీ కూతవేటు దూరంలోనే ఉన్న కమాండ్ కంట్రోల్ సిబ్బంది కూడా సీసీ కెమెరాల ద్వారా ఏమీ గమనించలేదు. రాత్రి వేళ డ్యూటీల్లో ఉన్న వారు గుర్రు పెట్టి నిద్రపోవడం వల్లనే దీనిని గమనించలేదనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వారే కనుక మేల్కొని ఉండి, ఈ విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా గమనించి ఉంటే కనీసం సైరన్ మోగించే అవకాశం ఉండేది. అప్పుడైనా ఈ నేరం ఆగి ఉండేదని పలువురు అంటున్నారు. పోలీసులపై టీడీపీ నేత ఒత్తిళ్లు! రాష్ట్రంలోనే తీవ్ర సంచలనం రేపిన ఈ హత్యపై పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటనా చేయలేదు. సతష్ హత్యను నగరంలోని ఓ ముఖ్య టీడీపీ నేత అనుచరుడే చేయించాడని ప్రచారం జరుగుతోంది. అతడు సెటిల్మెంట్లు, దందాలతో పేట్రేగిపోతూ నగరంలో గూండాగిరి చేస్తూంటాడని, అతడే ఈ హత్య చేయించాడని సతీష్ కుటుంబ సభ్యులు సైతం ఆరోపిస్తున్నారు. అయితే, తమ నోటి వెంట అతడి పేరు రానివ్వకుండా పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని మృతుడి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. సతీష్ హత్య రాత్రి 2 గంటల సమయంలో జరిగితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ టీడీపీ నాయకుడి అనుచరుడు తనకు ఒంట్లో బాగోలేదంటూ సర్పవరం జంక్షన్ సమీపంలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో 3 గంటల ప్రాంతంలో చేరడం చర్చనీయాంశమైంది. ఈ కేసు నుంచి తన అనుచరుడిని తప్పించాలంటూ ఆ టీడీపీ నేత ఉన్నతాధికారుల ద్వారా పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. హత్యకు పాల్పడిన నలుగురు దుర్మార్గులూ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు.చదవండి: సినిమా చూసి ఇంటికెళ్తుండగా ఘోరం.. బైక్ను ఈడ్చుకెళ్లిన లారీ -
సాధిక్, సౌజన్య ఆన్లైన్లో ఏం ఆర్డర్ పెట్టారు?
కాకినాడ క్రైం: పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, జగదీశ్వర్రెడ్డి హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు సాధిక్ ఖాన్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జగదీశ్వర్రెడ్డికి అందించిన చికిత్స వివరాలు ఇవ్వాలంటూ ఆయన చికిత్స పొందిన ఆస్పత్రులకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. కాకినాడలోని జన్మభూమి పార్కు సమీపంలో ఉన్న అహోబిల ఆసుపత్రికి, సర్పవరం జంక్షన్లో ఎస్కే ఆసుపత్రి, నాగమల్లితోట జంక్షన్లో ఉన్న ఇనోదయ ఆసుపత్రుల్లో జగదీశ్వర్రెడ్డి చికిత్స పొందగా ఆయా ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసి వివరాలు కోరారు. చికిత్స వేళ ప్రమాదకరమైన పదార్థాలు ఏవైనా శరీరంలో గుర్తించారా, అనుమానాస్పద రీతిలో ఆరోగ్య స్థితి ఉండడాన్ని గమనించారా వంటి ప్రశ్నలకు సమా«ధానంగా వైద్యులు అందించే ఆరోగ్య నివేదికలు దోహదపడనున్నాయి. ఏం ఆర్డర్ పెట్టారు? స్లోపాయిజన్ గుణాలున్న రసాయనంతో సాధిక్ సౌజన్యతో కలిసి జగదీశ్వర్రెడ్డి హత్యకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చిన నేపథ్యంలో ఎక్కడి నుంచి ఎలా తెప్పించాడనే వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకు సంప్రదాయ మార్గాలను ఎంచుకున్నాడా, మరెక్కడి నుంచైనా తెచ్చాడా అని ఆరా తీస్తున్నారు. ఇందుకు సౌజన్య, సాధిక్లు గడచిన మూడు నెలల్లో పెట్టిన ఆన్లైన్ ఆర్డర్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కాకినాడలో ఇన్స్టా మార్టు, బ్లింకిట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ సహా ఇతర ఆన్లైన్ డెలివరీ కార్యాలయాలకు సాధిక్, సౌజన్యల ఫోన్ నంబర్లతో ఇచ్చిన ఆర్డర్ హిస్టరీలు అడుగుతున్నారు. ఇందుకు అధికారికంగా నోటీసులు జారీ చేస్తున్నారు. లావాదేవీలపై ఆరా... సాధిక్ బ్యాంకు అకౌంట్లను పోలీసులు జల్లెడ పడుతున్నారు. మతం మార్చడం, లవ్ జీహాద్, ఉగ్రవాదుల ప్రస్తావనలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో అక్రమ మార్గాల్లో లేదా మరెవరి నుంచైనా సాధిక్ ఆర్థిక ప్రయోజనాలు పొందాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అతడి బ్యాంకు వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకుగాను, మెయిన్రోడ్డులో ఉన్న యూనియన్ బ్యాంకు సహా కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాలకు నోటీసులు జారీ చేశారు. రేపు మరికొన్ని బ్యాంకులకు పోలీసుల నోటీసులు అందనున్నాయి. సాధిక్ఖాన్ కస్టడీపై కౌంటర్ దాఖలు కాకినాడ లీగల్: కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడైన షేక్ సాధిక్ఖాన్ను 7రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సర్పవరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయవాది జవహర్ అలీ మొబైల్ కోర్టులో గురువారం కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై కోర్టులో విచారణ జరగనుందిపోలీసులు కనీస మర్యాద ఇవ్వడం లేదు : సాధిక్ఖాన్ సోదరి సాజిదతమని స్టేషన్కి పిలిపిస్తున్న పోలీసులు హీనంగా చూస్తున్నారని, కనీస మర్యాద ఇవ్వడం లేదని సాధిక్ఖాన్ సోదరి సాజిద గురువారం ఆరోపించారు. అవమానకర రీతిలో మాట్లాడుతూ, నిలబెట్టే ప్రశ్నిస్తుండడం ఆవేదన కలిగిస్తోందన్నారు. స్టేషన్కు వెళ్లిన వెంటనే ఫోన్లు స్వాదీనం చేసుకోవడం, వాటిని ఇవ్వమంటే ముప్పుతిప్పలు పెట్టడం మానసిక క్షోభకు గురిచేస్తోందని తెలిపారు. చదవండి: మూడేళ్ల కొడుకుని వంతెనపై వదిలి.. నదిలో దూకిన దంపతులు! -
ఉమ్మడి జెడ్పీ ఆఖరి ‘భేటీ’ నేడే
కాకినాడలోని జెడ్పీ కార్యాలయం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ఆఖరి సమావేశం జెడ్పీ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించనున్నారు. జిల్లాల పునర్విభజన అనంతరం గత నాలుగేళ్లుగా ఉమ్మడిగానే కొనసాగిన జెడ్పీ ప్రస్తుత పాలకమండలి గడువు సెప్టెంబర్ 10తో ముగుస్తుంది. అక్టోబర్లో జెడ్పీ ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ ప్రతిపాదించడం, అంతకుముందే రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా ఉండటంతో ఈ జెడ్పీని నాలుగు భాగాలుగా విభజించనున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, రంపచోడవరం ప్రధాన కేంద్రాలుగా ఈ జిల్లా పరిషత్ విడిపోనుంది. తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చరిత్రలో ఒక విశిష్ట స్థానం ఉంది. అప్పట్లో జిల్లా బోర్డు చైర్మన్గా మల్లిపూడి పళ్లంరాజు సుదీర్ఘకాలం పనిచేశారు. మరోవైపు స్వాతంత్య్ర సమరంలోనూ పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్గా పనిచేసిన ఎస్బీవీకే సత్యనారాయణరావు కేంద్ర మంత్రి అయ్యారు. జీఎంసీ బాలయోగి లోక్సభ స్పీకర్గా ఎదిగారు. వంగా గీత జెడ్పీ చైర్పర్సన్గా పనిచేసి రాజ్యసభలో ప్రవేశించారు. బొడ్డు భాస్కర రామారావు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా పనిచేశారు. రాష్ట్ర స్థాయి పదవులు సైతం అలంకరించారు. చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ జెడ్పీ చైర్మన్గా పనిచేసి, అనంతరం వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. జిల్లా బోర్డు నుంచి జిల్లా పరిషత్గా మార్పు స్వాతంత్య్రం తరువాత దేశంలో స్థానిక స్వపరిపాలనకు కొత్త రూపం ఇవ్వాలనే ఆలోచన బలపడింది. 1959లో జిల్లా పరిషత్ చట్టం రావడంతో దాని ఆధారంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాకూ జెడ్పీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం జిల్లా పరిషత్తులు 1959 డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఏర్పాటయ్యాయి. దీంతో పాత జిల్లా బోర్డు వ్యవస్థకు బదులు మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు పునాది పడింది. గ్రామస్థాయి, సమితి స్థాయి, జిల్లా పరిషత్ స్థాయిగా ఏర్పడిన ఈ వ్యవస్థ అనంతర కాలంలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ల రూపంలో మార్పు చెందింది. తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ఆవిర్భావం 1959లోనే జరిగింది. 2022 ఏప్రిల్ 4న కొత్త జిల్లాలు అమలులోకి వచ్చాయి. అంతకు ఆరు నెలల ముందే జెడ్పీ ఎన్నికలు జరగడంతో విభజనకు పదవీకాలం ముగిసే వరకు ఆగాల్సి వచ్చింది. ఇప్పటివరకు పనిచేసినవారు వీరే... దివాన్ బహుదూర్ శేషగిరిరావు, మాదిరెడ్డి వెంకటరత్నం నాయుడు, పోకల గోవిందరావు నాయుడు, మల్లిపూడి పళ్లంరాజు, రాజా కాకర్లపూడి రాజగోపాల్ నరసరాజు, మెండు వీరన్న, బలుసు బుచ్చి సర్వారాయుడు, మారిన నరసన్న, తూర్పుగోదావరి జిల్లా బోర్డు సభ్యులుగా పనిచేశారు. జెడ్పీ చైర్మన్లుగా తోట రామస్వామి, ఎస్బీపీవీకే సత్యనారాయణ రావు, పంతం పద్మనాభం, బొడ్డు భాస్కర రామారావు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లుగా జీఎంసీ బాలయోగి, గారపాటి గంగాధర్ రామారావు చౌదరి, వంగా గీత, గుత్తుల బుల్లిరాజు, దున్న జనార్దన్రావు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, నామన రాంబాబు, జ్యోతుల నవీన్ కుమార్ విధులు నిర్వర్తించారు. 2021 సెప్టెంబర్ 25 నుంచి విప్పర్తి వేణుగోపాలరావు జెడ్పీ చైర్మన్గా కొనసాగుతున్నారు. -
ఖరీఫ్ ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ) : జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణఖు ముందస్తు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ అపూర్వభరత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అసౌకర్యం కలగకుండా అన్ని వసతులూ కల్పించాలన్నారు. జిల్లాలో 70.012 హెక్టార్లలో సాగు చేస్తుండగా ఇప్పటివరకు 50,824 హెక్టార్లలో క్రాప్ బుకింగ్ పూర్తయ్యిందన్నారు. జిల్లాలో 271 రైతు సేవా కేంద్రాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతాన్ని పరిశీలించేందుకు అవసరమైన యంత్రాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఏలేరు డివిజన్, ఈస్ట్రన్ డివిజన్, జలవనుల శాఖ ఇంజనీర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో నిర్వహించిన వాచ్ డాగ్ కమిటీ సమావేశంలో జేసీ మాట్లాడుతూ నీటి వనరులపై ఉన్న ఆక్రమణలను నిబంధనల ప్రకారం తొలగించాలని ఆదేశించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన కరప: వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ పారామెడికల్ జేఏసీ పిలుపు మేరకు వేళంగి పీహెచ్సీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ల్యాబ్ టెక్నీషియన్ సత్యనారాయణ, స్టాఫ్ నర్సులు శ్రావణి, అంబిక, ప్రియ తదితరులు నల్ల రిబ్బన్లు ధరించి పీహెచ్సీకి ఎదురుగా భోజన సమయంలో నిరసన తెలిపారు. పీహెచ్సీ డాక్టర్ ఆర్.శ్రీనివాస్నాయక్ తదితర సిబ్బంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు మద్దతు తెలియజేశారు. వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, రెగ్యులైజేషన్ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఉద్యోగులందరికీ 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని, విధినిర్వహణలో మరణించిన ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉపాధి కల్పించాలని తదితర డిమాండ్లతో ఈ కార్యక్రమం చేపట్టారు. శ్రీపాద క్షేత్రానికి భక్తుల తాకిడి రాఖీపౌర్ణమి వేడుకల కోసం వేలాదిగా తరలివచ్చిన భక్తులు పిఠాపురం: శ్రీపాద శ్రీవల్లభుడు, దత్తాత్రేయుని జన్మస్థలం కావడంతో పిఠాపురంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడికొచ్చి దత్తాత్రేయునికి రాఖీలు కట్టడం ఆనవాయితీగా ఉంది. శుక్రవారం రాఖీ పౌర్ణమి అయినప్పటికీ గురువారం నుంచే ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేలాదిగా భక్తులు తరలిరావడంతో దత్తాత్రేయుని ఆలయాలు కిటకిటలాడాయి. ఈ ఏడాది సుమారు 30 వేల మంది వరకు మహారాష్ట్రీయులు తరలిరావడం విశేషం. పిఠాపురంలో పేరొందిన శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో శుక్రవారం నిర్వహించే రాఖీ పౌర్ణమి ఉత్సవానికి భారీ ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈఓ ఆర్ సౌజన్య తెలిపారు. గోపూజలు, దత్త హోమాలు, పల్లకీ సేవలు వంటి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశామన్నారు. శుక్రవారం నాటికి మరింత మంది వచ్చే అవకాశం ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. పాదగయ క్షేత్రంలో వెలసివున్న దత్తాత్రేయ స్వామి వారికి గురువారం రాఖీ పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పలువురు భక్తులు స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. -
ఇదేం పద్ధతి స్వామీ!
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని సత్యగిరిపై బుధవారం అర్ధరాత్రి మద్యం సేవించిన కొంతమంది యువకులు హంగామా చేయడం, పెళ్లిబృందాల వారిపై దాడి చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో ఈ విదంగా మద్యం సేవించి పెళ్లిళ్లకు హాజరవడం, కొన్ని సార్లు పెళ్లిళ్లు జరిగే సత్రాల ఆవరణలోనే ఖాళీ మద్యం సీసాలు లభ్యమవడం దేవస్థానంలో నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతోంది. ఇది కేవలం దేవస్థానం అధికారుల లోపమే కాదు. రాష్ట్రంలో అఽధికార కూటమి పాలనలో వీధి వీధిలో సులభంగా మద్యం అమ్మకాలు జరుగుతుండడం ప్రధాన కారణం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా పెళ్లిళ్లలోను, హోటళ్లలోను పలు రకాలుగా గలాటా సృష్టించే మద్యం బాబులు ఎంతోమంది అని దేవస్థానంపై ఉన్న వ్యాపారులు చెబుతున్నారు. సెక్యూరిటీ గార్డులు ఉన్నా వారిని నియంత్రించలేకపోతున్నారని వారంటున్నారు. టోల్ గేట్ వద్ద నామమాత్రపు తనిఖీలు... ప్రస్తుత అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ అజాద్ 2023లో దేవస్థానం ఈఓగా ఉన్నప్పుడు రత్నగిరి టోల్ గేట్ వద్ద అన్ని వాహనాలనూ క్షుణ్ణంగా తనిఖీ చేశాకే కొండపైకి పంపించేవారు. మద్యం సేవించినా, వాహనాల్లో మద్యం బాటిళ్లు ఉన్నా అడ్డుకునేవారు. ఆయన తరువాత కొన్నాళ్లు ఇదే పద్ధతి అమలు చేసినా.. క్రమేపీ ఆ స్థాయిలో తనిఖీలు జరగడం లేదు. వివాహాల సీజన్లో ఒకేసారి పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తాయి కాబట్టి.. తనిఖీలకు ఎక్కువమంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించడంపై దృష్టిపెట్టాల్సి ఉంది. పోలీసుల మధ్య కొరవడుతున్న సమన్వయం అన్నవరం దేవస్థానం అన్నవరం పోలీస్స్టేషన్ పరిధిలో ఉంటే, వివాహాలు జరిగే సత్యగిరి కొండ, సత్రాలన్నీ ఒంటిమామిడి (తొండంగి) పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్నాయి. దీంతో ఇటువంటి వివాదాలు ఏర్పడినపుడు రెండు పోలీస్స్టేషన్ల మధ్య సమన్వయం కొరవడుతోంది. తొండంగి పోలీసులు సత్యగిరి చేరుకోవడానికి సమయం పడుతుంది. అందువల్ల దేవస్థానంలో ఔట్ పోస్టు ఏర్పాటు చేసి రెండు పోలీస్స్టేషన్ల సిబ్బంది విధులు నిర్వహించేలా చూడాలి. ఘాట్రోడ్డుకు కూతవేటు దూరంలో మద్యం దుకాణాలు అన్నవరంలో రెండు మద్యం దుకాణాలు దేవస్థానం ఘాట్రోడ్లకు కూతవేటు దూరంలో ఉన్నాయి. ఒక మద్యం షాపు దేవస్థానానికి చెందిన పంపా సత్రం ముందే ఉంది. మరోటి తొలిపాంచాకు 200 మీటర్లు, టోల్గేట్కు 150 మీటర్ల దూరంలో ఉంది. దీంతో పెళ్లిళ్లకు హాజరయ్యేవారు మద్యం సేవించి వస్తుంటే కొంతమంది కొండదిగువకు వచ్చి మద్యం సేవించి మరలా కొండమీదకు వెళుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ లోపాలను దేవస్థానం అధికారులు, పోలీసులు, ఎకై ్సజ్ విభాగాల వారు సరిదిద్దాల్సి ఉంది. లేనిపక్షంలో దేవస్థానంలో నెలకొనాల్సిన ఆధ్యాత్మిక వాతావరణం కలుషితమవడంతో పాటు భక్తులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడతాయి. సత్యదేవుని దేవస్థానం వద్ద పెళ్లి బృందంపై మద్యం సేవించిన యువకుల దాడి ముగ్గురు యువకులపై న్యూసెన్స్ కేసు ఉమ్మడి పోలీసులతో రత్నగిరిపై ఔట్పోస్టు ఏర్పాటు చేయాలి -
ఖననం చేసిన మృతదేహానికి పరీక్షలు
సఖినేటిపల్లి: స్థానికంగా ఖననం చేసిన ఓ వ్యక్తి మృతదేహాన్ని రాజోలు కోర్టు ఉత్తర్వుల మేరకు అధికారులు తిరిగి గురువారం వెలికి తీసి, శవపరీక్షలు నిర్వహించారు. రాజోలు సీఐ సురేష్బాబు, తహసీల్దార్ బి.సూర్యనారాయణరాజు, వైద్యులు, మధ్యవర్తుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు కథనం ప్రకారం.. సఖినేటిపల్లికి చెందిన గొల్లమందల కిరణ్ కుమార్ అలియాస్ కన్నులు తండ్రి పీటర్ (40) మార్చి 6న విషం తాగాడు. మలికిపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం, 13వ తేదీన డిశ్చార్జ్ అయ్యాడు. ఈ క్రమంలో మార్చి 15న తీవ్ర అనారోగ్యానికి గురైన పీటర్ను కుటుంబ సభ్యులు అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పీటర్ చనిపోయినట్లు అక్కడి డ్యూటీ డాక్టర్ ధ్రువీకరించారు. దీంతో, మార్చి 16న అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఖననం చేశారు. ఇదిలా ఉండగా మహేంద్రవాడకు చెందిన మృతుడి సోదరి నిస్సి రాజశ్రీ తన సోదరుడి మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ రాజోలు కోర్టులో ఫిర్యాదు చేశారు. మృతుడి కుటుంబ సభ్యులు తొమ్మిది మందిపై ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో, కోర్టు ఉత్తర్వుల మేరకు వారిపై కేసు నమోదు చేశామని, పీటర్ మృతదేహానికి తిరిగి పరీక్షలు చేశామని ఎస్సై వివరించారు. -
ఆటముత్యాలు
కపిలేశ్వరపురం: రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా యవనికపై గోదారమ్మ బిడ్డలు విజయకేతనం ఎగురవేస్తున్నారు. తద్వారా ఈ గడ్డ కీర్తిప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. దేశవిదేశాల్లో జరుగుతున్న వివిధ క్రీడా పోటీల్లో విజయ పరంపర కొనసాగిస్తూ పతకాల పంట పండిస్తున్నారు. ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకుంటున్నారు. అంతేకాదు.. తమ ప్రతిభాసంపత్తితో వివిధ క్రీడా సంఘాలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా.. కీలక పోటీలకు న్యాయనిర్ణేతలుగా కూడా వ్యవహరిస్తూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రీడా పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. ఒలింపిక్స్ హాకీలో భారత్కు మూడు బంగారు పతకాలు సాధించిన విఖ్యాత క్రీడాకారుడు ధ్యాన్చంద్ జయంతి– ఆగస్టు 29ని ఏటా జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారుల ప్రతిభను గుర్తు చేసుకుందాం పదండి.. అంతర్జాతీయ కీర్తికిరీటం అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ తన సహచర క్రీడాకారుడు చిరాగ్ శెట్టితో కలిసి అంతర్జాతీయ స్థాయి పురుషుల డబుల్స్లో అనేక విజయాలు సాధించాడు. ఈ ఏడాది మే 31న సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో డబుల్స్ విజేతలుగా నిలిచారు. డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్–1 ర్యాంక్ సాధించిన తొలి భారతీయ జోడీగా వీరు రికార్డు సృష్టించారు. 2022 కామన్వెల్త్, 2023 ఆసియా క్రీడలు, 2023 ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లలో సాత్విక్ స్వర్ణ పతకాలు సాధించాడు. థామస్ కప్–2022 విజేత జట్టులో సభ్యుడు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డు, మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న పురస్కారాలను అందుకున్నాడు. అంతే కాదు.. అత్యంత వేగంగా బ్యాడ్మింటన్ స్మాష్ (గంటకు 565 కిలోమీటర్లు) కొట్టిన రికార్డు సాత్విక్ పేరిట ఉండటం విశేషం. ఫ సామర్లకోటకు చెందిన ప్రముఖ మారథాన్ స్విమ్మర్ గోలి శ్యామల బంగాళాఖాతంలో విశాఖపట్నం నుంచి కాకినాడ తీరం వరకూ 150 కిలోమీటర్ల దూరాన్ని ఈది సరికొత్త రికార్డు సృష్టించారు. ఈమె గతంలో పాక్ స్ట్రెయిట్ను కూడా ఈదారు. వైకల్యం ఓడింది ఉమ్మడి జిల్లాలో దివ్యాంగ క్రీడాకారులు వీల్చైర్ క్రికెట్లో రాణిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 23 వరకూ ఒడిశాలో జరిగిన పోటీల్లో ఏపీ జట్టు ద్వితీయ స్థానం సాధించింది. ఆ జట్టులో 8 మంది క్రీడాకారులు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారే కావడం మరో విశేషం. సత్తా చాటుతున్న అతివలు వివిధ క్రీడల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన అతివలు సత్తా చాటుతున్నారు. ఫ గత జూన్ 30న హైదరాబాద్లో జరిగిన 26వ రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీల్లో కాకినాడకు చెందిన తల్లీకూతుళ్లు కల్పన, తన్మయిలు పతకాలు సాధించారు. ఫ మే 16, 17 తేదీల్లో పుదుచ్చేరిలో జరిగిన సౌతిండియా జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో వర రామచంద్రపురం మండలం సోములగూడెం గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థినులు మడకం సురేఖ కాంస్య, బంధం సరిత రజత పతకాలు సాధించారు. వారిద్దరూ గత ఫిబ్రవరిలో చిత్తూరులో జరిగిన రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో బంగారు పతకాలు సైతం సాధించడం విశేషం. ఫ 2025 నవంబర్లో పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) నిర్వహించిన 69వ జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు అంబాజీపేటకు చెందిన నిమ్మకాయల చరిష్మా సాయిరుత్వి ఎంపికై ంది. మరెందరో.. ఫ ఈ నెల 21 నుంచి 23 వరకూ శ్రీకాకుళంలో జరిగిన అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో కాకినాడ జిల్లా జట్టు ఓవరాల్ చాంపియన్షిప్ సాధించింది. ఫ ఏప్రిల్ 22, 23 తేదీల్లో దేవరపల్లి మండలం రామన్నపాలెంలో జరిగిన అమరావతి రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ ఇన్విటేషన్ కప్ టోర్నమెంట్లో రామచంద్రపురం జట్టు విజేతగా నిలిచింది. ఫ గత ఏడాది డిసెంబర్ 28న రావులపాలెం సమీపంలో వెదిరేశ్వరంలో జరిగిన రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీల పురుషుల విభాగంలో తూర్పు గోదావరి జిల్లా జట్టు విజయబావుటా ఎగురవేసింది. ఫ 2025 సెప్టెంబర్ 27, 28 తేదీల్లో ఒంగోలులో జరిగిన రాష్ట్ర స్థాయి సెపక్తక్రా పోటీల్లో తూర్పు గోదావరి జట్టు ప్రథమ స్థానలో నిలిచి, ఐదు బంగారు పతకాలు సాధించింది. ఫ గత ఏడాది డిసెంబర్ 13 నుంచి 15 వరకూ పాట్నాలో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు ఎటపాక మండలానికి చెందిన పీఈటీలు సోడె నాగిరెడ్డి, పెనుబల్లి లక్ష్మణరావు ఎంపికయ్యారు. రేపు జాతీయ క్రీడా దినోత్సవం న్యాయ నిర్ణేతలుగా.. ఫ గత జూన్లో కోనసీమ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఆలమూరు మండలం కలవచర్లకు చెందిన మార్షల్ ఆర్ట్స్ గ్రాండ్ మాస్టర్ టి.అబ్బులు ఎంపికయ్యారు. ఫ గత జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకూ ఆగ్రాలో జరిగిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలకు ఈదరపల్లికి చెందిన అడపా శ్రీనివాస్ న్యాయనిర్ణేతగా నియమితులయ్యారు. ఫ గత ఏడాది ఆగస్టు 26 నుంచి 31 వరకూ పుణేలో జరిగిన ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ గ్రాండ్ ప్రిక్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్కు అమలాపురానికి చెందిన పీడీ పాయసం శ్రీనివాసరావు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఫ గత ఏడాది సెప్టెంబర్లో రంజీ క్రికెట్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్గా అంబాజీపేటకు చెందిన నిమ్మకాయల ఎస్ఎస్ఎస్ శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఫ గోదారి నేలపై రాణిస్తున్న క్రీడాకారులు ఫ అంతర్జాతీయ వేదికపై దుమ్ము రేపుతున్న సాత్విక్ ఫ మరెందరో ఆటగాళ్లకు ఉమ్మడి ‘తూర్పు’ వేదిక -
కై లాసగిరి.. ఇదేం కిరికిరి!
సీతానగరం: స్థానిక కై లాసగిరి ర్యాంపు వద్ద అడ్డూ అదుపూ లేకుండా ఇసుక అక్రమ దందా సాగుతోంది. నిబంధనలను, పర్యావరణ చట్టాలను గోదాట్లో తొక్కి మరీ అక్రమార్కులు యథేచ్ఛగా అనధికారిక ర్యాంపులు నిర్వహిస్తున్నారు. కళ్లెదుటే టన్నుల కొద్దీ ఇసుకను కై లాసగిరి దగ్గర నిల్వ చేసి, ట్రాక్టర్లపై విచ్చలవిడిగా తరలించుకుపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం గుర్తించిన అధికారిక ర్యాంపుల నుంచే మాత్రమే ట్రాక్టర్లపై ఇసుక రవాణా జరగాలి. కానీ, కై లాసగిరి ర్యాంపులో అనధికారికంగా భారీ స్థాయిలో ఇసుక నిల్వలు ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వందలాది ట్రాక్టర్లలో తరలించి, అధిక ధరలకు విక్రయిస్తూ లక్షలాది రూపాయలు దిగమింగుతున్నారు. మితిమీరిన లోడుతో దుమ్ము రేపుతూ, వేగంగా రాకపోకలు సాగిస్తున్న ఈ ట్రాక్టర్ల ధాటికి గ్రామీణ రహదారులు తీవ్రంగా దెబ్బ తింటున్నాయి. వీటివలన ఎప్పుడే ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. సీతానగరం కై లాసగిరి ర్యాంపు నుంచి బహిరంగంగానే ఇసుక అక్రమ దందా భారీ స్థాయిలో సాగుతున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీని వెనుక ఉన్న గుట్టు ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, కై లాసగిరి అనధికారిక ర్యాంపుపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాహనాలను స్వాధీనం చేసుకుని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫ దర్జాగా ఇసుక అక్రమ దందా ఫ రేయింబవళ్లు విచ్చలవిడిగా రవాణా ఫ పట్టించుకోని అధికారులు ప్రజలు తిరగబడతారు జాగ్రత్త కై లాసగిరి ర్యాంపు నుంచి ట్రాక్టర్లపై విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. రేయింబవళ్లు ట్రాక్టర్లపై ఇసుక, బొండు మట్టిని పలు గ్రామాలకు తరలిస్తున్నారు. తమ ఎదుటే ఈ ట్రాక్టర్లు వెళ్తున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు మరింత విచ్చలవిడిగా దందా నడుపుతున్నారు. అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. ప్రజలు తిరగపడతారు జాగ్రత్త. – పెదపాటి రమేష్బాబు (డాక్టర్ బాబు), వైఎస్సార్ సీపీ వలంటీర్ల విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, సీతానగరం -
ఇటుక బట్టీల్లో అధికారుల తనిఖీలు
బాల కార్మికులను పనిలో పెట్టొద్దని హెచ్చరిక పిఠాపురం రూరల్: మండలంలోని విరవ, విరవాడ పరిధిలో గల ఇటుక బట్టీలను అధికారులు గురువారం సంయుక్తంగా తనిఖీ చేశారు. జిల్లా యంత్రాంగం, ప్రాజెక్టు డైరెక్టర్, డీసీపీఓ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు. గురువారం ‘సాక్షి’ ప్రచురించిన ‘బట్టీలలో బలవుతున్న బాల్యం’ కథనానికి స్పందించిన అధికారులు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. దీంతో జిల్లా బాలల సంరక్షణ విభాగం కౌన్సిలర్, మండల విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష సిబ్బంది, కార్మిక శాఖ అధికారులు, క్రాఫ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కార్మికులతో మాట్లాడి వారి జీవన పరిస్థితులు, పని పరిస్థితులు, పిల్లల విద్యాభ్యాసం తదితర అంశాలపై ఆరా తీశారు. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఐదు వలస కార్మికుల కుటుంబాలను అధికారులు గుర్తించారు. నాలుగు కుటుంబాలు పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందినవిగా, మరోటి తాళ్లరేవు మండలానికి చెందినదిగా గుర్తించి, వారి పిల్లల విషయం ఆరా తీశారు. 5 నుంచి 10 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలను ఫకృద్దీన్పాలెం మండలపరిషత్ ఉన్నత పాఠశాలలో, 3, 4 సంవత్సరాల వయస్సు చిన్నారులను విరవ అంగన్వాడీ కేంద్రంలో చేర్పించారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను పనిలో పెట్టడం చట్టవిరుద్ధమని, ఎవరైనా బాలలు పనిలో ఉన్నట్టు గుర్తిస్తే, సంబంధిత బాల కార్మిక చట్టాల ప్రకారం యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంఈవో వై.రాంబాబు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి.దుర్గారాణి, క్రాఫ్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ బి.కుమారి, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మరింత ప్రాచుర్యం కల్పించాలి
తెలుగు భాషకు ప్రభుత్వమే మరింత ప్రాచుర్యం కల్పించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి. తెలుగు భాషలో జీఓలు విడుదల చేయడమే కాదు.. మన భాషను విస్మరించే వారిపై చర్యలు తీసుకోవాలి. తెలుగు మాట్లాడితే శిక్షలు విధించే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగు మీడియం విద్యార్థులకు ప్రాధాన్యం కల్పించాలి. – ఎండీ సత్యనారాయణరెడ్డి, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు, రాజమహేంద్రవరం తెలుగు మీడియం కొనసాగించాలి మాతృభాష తెలుగు పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంతో పాటు తప్పనిసరిగా తెలుగు మీడియం కూడా కొనసాగించాలి. తల్లిదండ్రుల వైఖరిలోనూ మార్పు రావాలి. తెలుగు భాష గొప్పదనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. – పెరవలి ఏసుబాబు, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్, తూర్పు గోదావరి జిల్లా -
తేట తెలుగు.. తేనెలొలుకు
ఫ అమ్మ భాషకు పట్టం కడదాం ఫ మాతృభాష పరిరక్షణకు గత ప్రభుత్వం పెద్దపీటరాయవరం: పాల మీగడ కన్న, పంచదారల కన్నా.. జుంటి తేనెల కన్న మధురమైనది మన తెలుగు భాష. ‘దేశభాషలందు తెలుగులెస్స’ అని శ్రీకృష్ణదేవరాయలు ప్రవచిస్తే.. ‘నికోలోడికోంటీ’ అనే చరిత్రకారుడు తెలుగు భాషను ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’గా పేర్కొన్నాడు. తెలుగు భాష గొప్పదనాన్ని మన కవులు శతాబ్దాల కిందటే విశ్వవ్యాప్తం చేశారు. తెలుగు జాతి గొప్పదనాన్ని ఖండాంతరాలకు చాటి చెప్పిన బహుభాషా కోవిదుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి (ఆగస్టు 29) సందర్భంగా ఏటా ఆ రోజు తెలుగు భాషా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. గత ప్రభుత్వంలో కృషి మమ్మీ, డాడీ పిలుపులకు అలవాటుపడిన తల్లిదండ్రులు చాలా ఏళ్లుగా తమ పిల్లలను తెలుగు మీడియంలో చదివించడానికి ఇష్టపడటం లేదు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో సైతం పూర్తిగా ఇంగ్లిషు మీడియం అమలు చేస్తున్నారు. అయితే, ఇంగ్లిషుతో పాటు పాఠశాలల్లో తెలుగు మీడియం కూడా అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. పదో తరగతి పరీక్షలు కూడా తెలుగు మీడియంలోనే నిర్వహించాలని కోరుతున్నాయి. పదో తరగతి పరీక్షల్లో అధిక శాతం విద్యార్థులు తెలుగులోనే ఉత్తీర్ణత పొందలేకపోతున్నారు. పలువురు పదో తరగతి విద్యార్థులు చదవడం, రాయడం చేయలేకపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన గత గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పునాది అభ్యసనానికి ప్రాధాన్యమిచ్చింది. తెలుగు, ఇంగ్లిషులో బలమైన పునాది వేయాలనే ఉద్దేశంతో 2022 నుంచి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యుమరసీ (ఎఫ్ఎల్ఎన్) అమలు చేశారు. అందులో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ప్రీ ప్రైమరీ బోధించే దాదాపు 5,800 మంది అంగన్వాడీ కార్యకర్తలకు, ప్రైమరీలో 1, 2 తరగతులు బోధించే 6 వేల మంది ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్ బోధనపై శిక్షణ ఇచ్చారు. అలాగే, 3, 4, 5 తరగతులకు టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ పేరుతో తెలుగు, ఇంగ్లిషులో వెనుకబడిన విద్యార్థులను భాషాపరంగా అభివృద్ధి చేసేందుకు తర్ల్ ప్రోగ్రామ్ ద్వారా ఉమ్మడి జిల్లాలో 3, 4, 5 తరగతులు బోధించే 8 వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. రేపు తెలుగు భాషా దినోత్సవంప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు ఎక్కడ? జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగుకు సంబంధించిన నిబంధనలు నేటికీ అమలుకు నోచడం లేదు. దీనిపై తెలుగు భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకూ ఇంగ్లిషు అవసరమే అయినప్పటికీ.. మాతృభాష తెలుగుకు కూడా అంతే ప్రాధాన్యమివ్వాలని వారు కోరుతున్నారు. -
జేఎన్టీయూ – కోరమాండల్ సాంకేతిక ఒప్పందం
కాకినాడ రూరల్: కాకినాడ జేఎన్టీయూ – కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మధ్య గురువారం సాంకేతిక అవగాహన ఒప్పందం కుదిరింది. మన దేశ యువతకు, పరిశ్రమలకు కావలసిన అవసరాలకు అనుగుణమైన శిక్షణ అందించి, నైపుణ్యాల కొరతను తగ్గించేందుకు సాంకేతిక శిక్షణ ఎంతగానో అవసరమని జేఎన్టీయూకే వైస్ చాన్సలర్ సీఎస్ఆర్కే ప్రసాద్ చెప్పారు. స్థానిక కోరమాండల్ సంస్థను సందర్శించిన ఆయన, సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. విజ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా యువతకు పారిశ్రామిక అవసరాలకు తగిన శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఒప్పందంపై జేఎన్టీయూకే తరఫున రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు, కోరమాండల్ తరఫున యూనిట్ హెడ్ కె.జగన్నాథం సంతకాలు చేశారు. అనంతరం 109 మంది విద్యార్థులకు సీఎస్ఆర్కే ప్రసాద్ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. -
దూసుకొచ్చిన మృత్యువు
ఫ బైక్ను ఢీకొన్న లారీ ఫ కొంత దూరం ఈడ్చుకుపోవడంతో ఊడిపడిన చేయి ఫ వ్యక్తి మృతి జగ్గంపేట: ఆ కుటుంబ సభ్యులు అప్పటి వరకూ సినిమా చూసి, ఆనందంగా గడిపారు. అతడు భార్యాపిల్లలను ఇంటి దగ్గర దింపి, పలావ్ కొనుక్కుని వచ్చేందుకు బయల్దేరాడు. తిరిగి వెళ్తూండగా మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ.. అతడి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘోర సంఘటన జగ్గంపేటలోని గోకవరం రోడ్డులో చోటు చేసుకుంది. ఎస్సై రఘునాథరావు కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన నీలాపు సంతోష్ కుమార్ రెడ్డి (34) ప్రతిపాడులోని సీఎఫ్సీ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజినీర్గా పని చేస్తూ, 11 సంవత్సరాలుగా జగ్గంపేట బాలాజీ నగర్లో నివాసముంటున్నాడు. బుధవారం రాత్రి భార్య శ్రీలిఖిత, కుమార్తెలు శాన్వి, లాస్య(చిన్న పిల్లలు)తో కలసి సినిమాకు వెళ్లారు. అనంతరం, భార్యాపిల్లలను సంతోష్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద దించి, పలావు కోసం గోకవరం రోడ్డులోని బిర్యానీ సెంటర్కు మోటార్ సైకిల్పై వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్తూండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ అతడిని ఢీకొంది. దీంతో, సంతోష్ కుమార్ రెడ్డి బైక్ అదుపు తప్పి, ఎదురుగా వస్తున్న మరో మోటార్ సైకిల్ను ఢీకొంది. అందరూ కింద పడిపోగా ఆ లారీ సంతోష్ కుమార్ రెడ్డి బైక్ను కొంత దూరం ఈడ్చుకుపోయింది. ఈ ఘోర ప్రమాదంలో అతడి చెయ్యి నుజ్జునుజ్జయి ఊడిపోయింది. తీవ్ర గాయంతో రక్తస్రావం అవుతూండగానే సంతోష్ కుమార్ రెడ్డి మరో చేత్తో కుటుంబ సభ్యులకు ప్రమాదం గురించి మొబైల్ ఫోన్లో సమాచారం అందించడం స్థానికులను కలచివేసింది. అతడిని స్థానికులు, పోలీసులు, బంధువులు తొలుత స్థానిక సీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలిస్తూండగా మార్గం మధ్యలో అతడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో మోటార్ సైకిల్పై వెళ్తున్న వారు కూడా గాయపడ్డారు. సంతోష్ కుమార్ రెడ్డి భార్య శ్రీలిఖిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో వెంకటేష్ ప్రథమం
అమలాపురం టౌన్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆర్య వైశ్య యువజన సంఘం ఆధ్వర్యాన బుధవారం జరిగిన రాష్ట్ర స్థాయి ర్యాపిడ్ చెస్ పోటీల్లో అమలాపురం విక్టరీ అకాడమీ విద్యార్థి తాడి సాయి వెంకటేష్ 7/7 పాయింట్లతో ప్రథమ స్థానం సాధించి, చాంపియన్షిప్ కై వసం చేసుకున్నాడు. తమ అకాడమీ నుంచి మొత్తం 15 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని ప్రిన్సిపాల్ టి.వెంకట సురేష్ తెలిపారు. కుడుపూడి తేజస్ 4, తామర ప్రసన్న 5 స్థానాలు సాధించారన్నారు. వివిధ వయస్సుల కేటగిరీల్లో పనిశెట్టి ధరణి, వంటెద్దు లక్ష్మీ శరణ్య, ఎం.లగీమా, కారుపర్తి కార్తికేయ, పిడుగు ప్రణీల్, అల్లకం ప్రమోద్ ప్రథమ స్థానాలు సాధించారని వివరించారు. విజేతలను పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. -
రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్లో రజతం
అల్లవరం: తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగిన అమరావతి చాంపియన్షిప్ అండర్–17 విభాగం రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో దేవగుప్తం ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి తాడి ఆర్య ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. రెండో స్థానంలో నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని అతడి తండ్రి ఏడుకొండలు గురువారం తెలిపారు. 60 కేజీల విభాగంలో ఓవరాల్గా 137 కేజీల బరువు ఎత్తి అతడు రజత పతకం సాధించాడు. ఆర్యను ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాలస్వామి, పీడీ రాజ్కుమార్. ఉపాధ్యాయులు అభినందించారు. -
అంతర్జాతీయ గోల్షాట్ బాల్ పోటీల్లో ప్రతిభ
ఆలమూరు: మండలంలోని మడికి గామానికి చెందిన ఉండ్రాసపు విలియం కేరీ అంతర్జాతీయ గోల్ షాట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో విశేష ప్రతిభ చూపి, జట్టు విజయానికి ప్రధాన కారకుడయ్యాడు. విజయనగరం జిల్లా కొత్తవలసలోని హిందుస్థాన్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న అతడు భారత్ అండర్–15 ఈ నెల 24న భూటాన్లో జరిగిన అంతర్జాతీయ స్థాయి గోల్ షాట్బాల్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. భారత్ జట్టు స్వర్ణ పతకంలో సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. విలియం కేరీని, తల్లిదండ్రులు సుందర విజయ్, రాజమణిలను స్థానికులు అభినందించారు. 4న సామూహిక ఉచిత వరలక్ష్మీ వ్రతం అన్నవరం: శ్రావణ మాసం నాలుగో శుక్రవారాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 4న రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిలో సామూహిక ఉచిత వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 7.30 గంటలకు స్వామివారి నిత్య కల్యాణ మండపంలో ఈ వ్రతం నిర్వహిస్తామన్నారు. వ్రతమాచరించే మహిళలు గాజులు, పువ్వులు, అరటి పండ్లు, రెండు కొబ్బరి కాయలు తెచ్చుకోవాలి. మిగిలిన పూజాద్రవ్యాలన్నింటినీ దేవస్థానమే సమకూరుస్తుంది. మహిళలకు లక్ష్మీదేవి రూపు, తోరం, ప్రసాదం అందజేస్తామని, స్వామివారి దర్శనానంతరం అన్నదాన పథకంలో భోజన సౌకర్యం కల్పిస్తామని అధికారులు తెలిపారు. భక్తుల సంఖ్య అధికంగా ఉంటే వ్రత మండపాల్లో కూడా వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. -
క్రూరాతిక్రూరంగా..
పోలీసులపై టీడీపీ నేత ఒత్తిళ్లు! రాష్ట్రంలోనే తీవ్ర సంచలనం రేపిన ఈ హత్యపై పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటనా చేయలేదు. సతష్ హత్యను నగరంలోని ఓ ముఖ్య టీడీపీ నేత అనుచరుడే చేయించాడని ప్రచారం జరుగుతోంది. అతడు సెటిల్మెంట్లు, దందాలతో పేట్రేగిపోతూ నగరంలో గూండాగిరి చేస్తూంటాడని, అతడే ఈ హత్య చేయించాడని సతీష్ కుటుంబ సభ్యులు సైతం ఆరోపిస్తున్నారు. అయితే, తమ నోటి వెంట అతడి పేరు రానివ్వకుండా పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని మృతుడి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. సతీష్ హత్య రాత్రి 2 గంటల సమయంలో జరిగితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ టీడీపీ నాయకుడి అనుచరుడు తనకు ఒంట్లో బాగోలేదంటూ సర్పవరం జంక్షన్ సమీపంలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో 3 గంటల ప్రాంతంలో చేరడం చర్చనీయాంశమైంది. ఈ కేసు నుంచి తన అనుచరుడిని తప్పించాలంటూ ఆ టీడీపీ నేత ఉన్నతాధికారుల ద్వారా పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. హత్యకు పాల్పడిన నలుగురు దుర్మార్గులూ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు. కాకినాడ క్రైం: ఓ ద్విచక్ర వాహనం వచ్చి ఆగింది. ఆ వాహనంపై వచ్చిన వ్యక్తితో నలుగురు చుట్టుముట్టారు. వారిలో ఇద్దరిపై ఆ వ్యక్తి దాడి చేశాడు. వారు ప్రతిదాడి చేశారు. వీరికి మిగిలిన ఇద్దరూ తోడయ్యారు. మొత్తం నలుగురూ కలసి మూకదాడికి దిగారు. అక్కడే ఉన్న చెక్కతో ఆ వ్యక్తిపై విచక్షణారహితంగా చావబాదారు. విరిగిన చెక్కలో పదునైన భాగాన్ని.. అపస్మారక స్థితికి చేరుకున్న ఆ వ్యక్తి గొంతులో పరమ కిరాతకంగా దించేశారు. అయినా బతికేస్తాడేమోననే అనుమానంతో ఆ కర్రను బయటకు తీసి మరింత లోతుగా దించారు. ఇలా ఒళ్లు గగుర్పొడిచే రీతిలో మూడుసార్లు తీసి గుచ్చి, చివరిగా ఆ కర్రను బలంగా గొంతులోకి దిగ్గొట్టి క్రూరాతిక్రూరంగా హతమార్చారు. ఇదంతా మూడంటే మూడు నిమిషాల్లోనే జరిగిపోయింది. ఏదో క్రైం థ్రిల్లర్ కథలా.. సినిమాలోని క్రూర సన్నివేశంలా జరిగిన ఈ దారుణం.. ప్రశాంతతకు మారుపేరుగా చెప్పుకొనే కాకినాడ నగరం నడిబొడ్డున.. భానుగుడి సెంటర్లో.. జిల్లా పోలీసు కార్యాలయానికి కూతవేటు దూరాన.. ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి చోటు చేసుకుంది. జిమ్ ట్రైనర్ కొడమాటి సతీష్రెడ్డి (30) క్రూరహత్యోదంతం జిల్లాను కుదిపేసింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లాలో పోలీసు భద్రతను ప్రశ్నార్థకం చేసింది. హతమార్చింది అందుకేనా? ఈ హత్య చేయించాడనే ఆరోపణలు వినిపిస్తున్న వ్యక్తికి రాజకీయ అండదండలున్నాయని చెబుతున్నారు. అతడి భార్య బ్యూటీషియన్గా పని చేస్తోంది. వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకుల కేసు కోర్టులో నడుస్తోందని సమాచారం. ఆమెతో హతుడు సతీష్ చనువుగా ఉండేవాడని తెలుస్తోంది. అతడి స్నేహితుడు సాయికిరణ్ కూడా ఆమైపె కన్ను వేశాడని, ఆమెకు ఇష్టం లేకపోయినా దగ్గరవ్వాలనే ప్రయత్నాలు చేశాడని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆ మహిళ సతీష్కు చెప్పడంతో అతడికి, సాయికిరణ్కు మధ్య తరచుగా గొడవలు జరుగుతూండేవి. ఈ నేపథ్యంలో సాయికిరణ్ ఆ మహిళ భర్తకు సతీష్పై లేనిపోని చాడీలు చెప్పి, ఇద్దరి మధ్య కక్షలు పెంచాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ మహిళ భర్త ఆదేశాలు, అండదండలతో సాయికిరణ్, మరో ముగ్గురు కలసి సతీష్ను ప్రణాళిక ప్రకారం అర్థరాత్రి భానుగుడి సెంటర్కు రప్పించి హతమార్చినట్లు తెలుస్తోంది. హత్యకు ఉపయోగించిన కర్రను సాయికిరణ్ అప్పటికే సమకూర్చుకున్నాడని తెలుస్తోంది. ఆ నాలుగు రోజుల్లో ఏం జరిగింది! గత నెల 8 నుంచి 12వ తేదీ మధ్య జరిగిన సంఘటనలే ఈ హత్యకు దారి తీశాయని తెలియవచ్చింది. ఆ మహిళ విషయంలో సతీష్ భార్య జయశ్రీని సాయికిరణ్ కలిశాడు. ఆ మహిళతో సతీష్ సన్నిహితంగా ఉంటున్నాడని, ఆమె ఫలానా వ్యక్తి భార్య అని వెల్లడించాడు. టీడీపీ ముఖ్య నాయకుడి అనుచరుడిగా చెబుతున్న ఆ వ్యక్తి అప్పటికే తన భర్త సతీష్ ద్వారా జయశ్రీకి తెలుసు. గర్భిణిగా ఉన్న ఆమె పుట్టింట్లో ఉండగా సాయికిరణ్, ఆ వ్యక్తితో జయశ్రీని కలిశాడు. ఆమె భర్తను చంపేస్తానని చెప్పాడు. తనను, కడుపులో ఉన్న బిడ్డను చూసి తన భర్తను విడిచిపెట్టాలని, సతీష్ ఆ మహిళ జోలికి వెళ్లకుండా చూసుకుంటానని ఆమె చెప్పింది. వారు వెళ్లిన తర్వాత రోజు ఆ మహిళ విషయమై సతీష్ను జయశ్రీ నిలదీసింది. ఆమెతో మాట్లాడుతున్నానని ఒప్పుకున్న అతడు.. నిండుగర్భిణిగా ఉన్న తన భార్యకు ఈ విషయం చెప్పిన సాయికిరణ్పై ఆగ్రహంతో రగిలిపోయాడు. అప్పటి నుంచీ వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భార్య పుట్టింట్లో ఉండగా, మంగళవారం అర్ధరాత్రి సాయికిరణ్, సతీష్లు ఫోనులో గొడవ పడ్డారు. దమ్ముంటే రా అంటూ సవాళ్లు విసురుకున్నారు. ఆగ్రహంతో రగిలిపోయిన సతీష్ తన ద్విచక్ర వాహనంపై కిరణ్ ఉన్న భానుగుడి జంక్షన్కు రాత్రి 1.45 సమయంలో వెళ్లాడు. ముందే సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం అతడిని సాయికిరణ్, అనుచరుల హతమార్చారు. సతీష్కు జయశ్రీతో ఏడాదిన్నర క్రితమే వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఆరో నెల గర్భిణి. పొంతన లేకుండా.. ఈ హత్యకు సంబంధించి పోలీసులు చెబుతున్న కారణాలకు, కుటుంబ సభ్యులు, తెలిసిన వారు చెబుతున్న విషయాలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. తునికి చెందిన ఓ యువతిని ఇద్దరూ ప్రేమించి గొడవ పడగా అది హత్యకు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు. కానీ, అది పోలీసుల కల్పితమని కుటుంబ సభ్యులు అంటున్నారు. నిద్రలో నైట్ డ్యూటీ కమాండ్ కంట్రోల్ సిబ్బంది ఈ హత్య నేపథ్యంలో పోలీసుల రాత్రి నిఘా పూర్తిగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. హత్య జరిగిన భానుగుడి సెంటర్ జిల్లా పోలీసు కార్యాలయానికి 200 మీటర్ల లోపే ఉంది. హత్య సమయంలో అరగంట పైగా అక్కడ అలజడి చోటు చేసుకుంది. అయినప్పటికీ నైట్ బీట్లు అటువైపు కనీసం దృష్టి పెట్టలేకపోయాయి. పోనీ కూతవేటు దూరంలోనే ఉన్న కమాండ్ కంట్రోల్ సిబ్బంది కూడా సీసీ కెమెరాల ద్వారా ఏమీ గమనించలేదు. రాత్రి వేళ డ్యూటీల్లో ఉన్న వారు గుర్రు పెట్టి నిద్రపోవడం వల్లనే దీనిని గమనించలేదనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వారే కనుక మేల్కొని ఉండి, ఈ విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా గమనించి ఉంటే కనీసం సైరన్ మోగించే అవకాశం ఉండేది. అప్పుడైనా ఈ నేరం ఆగి ఉండేదని పలువురు అంటున్నారు. ఫ జిమ్ ట్రైనర్ హత్యతో ఉలిక్కిపడిన జిల్లా ఫ ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే దారుణం ఫ ఘోరంగా హతమార్చిన దుర్మార్గులు -
అలా జరగకపోయి ఉంటే.. సాధిక్ నెక్ట్స్ టార్గెట్ ఎవరంటే?
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: తన వియ్యంకుడు ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై భాస్కర్రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు జగదీశ్వర్రెడ్డి హత్యతో సాధిక్ ఖాన్ పాత్రతో పాటు తన కోడలు ప్రమేయం కూడా ఉందని భాస్కర్రెడ్డి ఆరోపించారు.నూకరాజు కుటుంబం ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన జరగకపోయి ఉంటే సాధిక్ ఖాన్ తర్వాత టార్గెట్ తామేనన్న భాస్కర్రెడ్డి.. ఇప్పటివరకు ప్రభుత్వం తన మనవడికి ఎటువంటి సెక్యూరిటీ కల్పించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుణ్ని కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశామన్న భాస్కర్రెడ్డి.. తన కొడుకును తన నుంచి కోడలు దూరం చేసిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు.తన కుమారుడికి అనారోగ్యంగా ఉన్న సమయంలో ఆయనతో పాటు రూమ్లో ఉంటానంటే కోడలే వద్దని వారించిందన్నారు. సాధిక్ ఖాన్ ఒక సైకో.. అతడి నుంచి మా కుటుంబానికి రక్షణ కావాలి. నా కొడుకుని పొట్టన పెట్టుకుని మా కుటుంబాన్ని నాశనం చేసిన సాధిక్ ఖాన్ను ఉరితీయాలి. మా మనవడికి న్యాయం జరగాలి’’ అని భాస్కర్రెడ్డి అన్నారు.ఇదీ చదవండి: సాధిక్కు ఆ కెమికల్ ఎక్కడి నుంచి వచ్చింది? -
సాధిక్కు ఆ కెమికల్ ఎక్కడి నుంచి వచ్చింది?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య భర్త జగదీశ్వరరెడ్డి హత్యలో పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. సాధిక్ ప్రొటీన్ పౌడర్లో కెమికల్స్ కలిపి తన తండ్రికి ఇచ్చాడంటూ జగదీశ్వరరెడ్డి కుమారుడు రియాన్ష్ కార్తికేయ చెప్పడంతో దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆ కెమికల్ కేరళ నుంచి హైదరాబాద్కు వచ్చిందని, అది సాధిక్కు చేరేలా హైదరాబాద్లోని ఓ బంగారు దుకాణం యజమాని సహకరించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనిని నిగ్గు తేల్చేందుకు పోలీసు బృందం హైదరాబాద్ వెళ్లింది.నూకరాజు కుటుంబం నుంచి ఆస్తులు లాక్కునేందుకు సాధిక్ ప్రయత్నించాడనే ఆరోపణలపైనా విచారణ జరుపుతున్నారు.నూకరాజు కుటుంబం, జగదీశ్వరరెడ్డి ఆస్తులకు సంబంధించి రెండేళ్లలో ఏవైనా లావాదేవీలు జరిగాయా.. అవి ఎవరి పేరు మీద బదిలీ అయ్యాయో తెలుసుకొనేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. సౌజన్య బ్యాంక్ ఖాతాలు, పాస్ పుస్తకాలను సాధిక్ లాక్కున్నాడనే అంశంపైనా విచారణ సాగుతోంది. సాధిక్ తిమ్మాపురం పంచాయతీలో నూకరాజు పేరిట ఉన్న స్థలాన్ని విక్రయించేందుకు సైతం ప్రయత్నించాడని ఓ వ్యక్తి వాంగ్మూలంలో చెప్పినట్లు సమాచారం.రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు?సాధిక్ ఖాన్ను కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు పొందుపరిచినట్లు తెలిసింది. సాధిక్ మొదటి నుంచీ ఆస్తి కొట్టేయాలనే ఆలోచనతో ఉండేవాడని పేర్కొన్నట్లు సమాచారం. జగదీశ్వర్రెడ్డి అడ్డు తొలగించుకుని, సౌజన్యను పెళ్లి చేసుకుని, ఆమె డబ్బు, బంగారం, ఆస్తి తీసుకోవాలని అతను పథకం వేసినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపినట్లు సమాచారం. జగదీశ్వర్రెడ్డి ఇంటికి వెళ్లిన సాధిక్ అతడితో గొడవ పడి, తీవ్రంగా గాయపరిచాడని, అడ్డు వచ్చిన సౌజన్యపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. జగదీశ్వరరెడ్డిని అనేక మార్లు కొట్టినట్లు సాక్షులు వాంగ్మూలం ఇచ్చారని తెలిసింది. జగదీశ్వరరెడ్డి హైదరాబాద్లో చికిత్స పొందుతున్న సమయంలో సాధిక్ హైదరాబాద్లోనే ఉండి సౌజన్యతో ఫోనులో మాట్లాడేవాడని కాల్ డేటా ద్వారా తేలినట్లు సమాచారం.బయటకొచ్చిన మరో లేఖ..!నూకరాజు, ఆయన కుమార్తె సౌజన్య రాసిన లేఖలతో పాటు మూడో సూసైడ్ నోట్ సైతం ఉన్నట్లు సమాచారం. ఆ నోట్ నూకరాజు భార్య మీనాదిగా ప్రచారం జరుగుతోంది. పోలీసులు సూసైడ్ నోట్లను ఫోరెన్సిక్, హ్యాండ్ రైటింగ్ పరీక్షకు పంపినట్లు సమాచారం. ఈ కేసులో మరింత లోతైన విచారణ కోసం నిందితుడు షేక్ సాధిక్ ఖాన్ను వారం రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలంటూ సర్పవరం పోలీసులు కాకినాడ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ఉపాధ్యాయులపై ఒత్తిడి వద్దు
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి కాకినాడ రూరల్: ఉపాధ్యాయులపై కూటమి ప్రభుత్వం అనవసర ఒత్తిడి తెస్తోందని, ఉద్యోగంలో చేరినప్పుడు లేని టెట్ నిబంధన ఇప్పుడు ఎందుకు అని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి బుధవారం నిలదీశారు. సంవత్సరం క్రితం ప్రభుత్వం నిర్వహించిన నియామక ప్రక్రియలో అన్ని అర్హతలను పరిశీలించి నిర్ధారించిన తరువాతే ఉపాధ్యాయ ఉద్యోగాలలోకి తీసుకున్నారని, ఇప్పుడు టెట్ రాయాలని చెప్పడం ఎంత వరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. టెట్కు సుప్రీంకోర్టు ఆదేశాలలే కారణమని చెబుతున్నప్పటికీ ఆ తీర్పు అమలులో ఉపాధ్యాయులపై భారం పడకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. టెట్ పేరుతో ఉపాధ్యాయులను భయపెట్టవద్దని ఉచిత శిక్షణ, తగినంత సమయం, అనేక అవకాశాలు కల్పించాలని తాము కోరుతున్నామని నాగమణి తెలిపారు. ఉపాధ్యాయుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు. ఆంజనేయరెడ్డికి గ్లోబల్ ఇన్స్పిరేషన్ పురస్కారం కాకినాడ రూరల్: రోడ్డు పక్కన ప్లాస్టిక్ సామగ్రిని విక్రయిస్తూ జీవనోపాధి పొందే కాకినాడకు చెందిన అనపాల ఆంజనేయరెడ్డి అవివాహితుడిగానే ఉండిపోయి తన సంపాదన అంతా సేవా కార్యక్రమాలకే కేటాయిస్తుండంతో సేవారత్నతో పాటు పలు అవార్డులను పొందారు. ఆయన సేవలకు అంతర్జాతీయంగా మరో అరుదైన గౌవరం లభించింది. గ్లోబల్ ఇన్స్పిరేషన్ అంతర్జాతీయ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. ఈ మేరకు మలేషియాలోని కౌలాలంపూర్లో సెప్టెంబరు 9న జరగనున్న కార్యక్రమానికి హాజరవ్వాలని ఆయనకు ఆహ్వానం వచ్చింది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా, సామాజిక సేవా రంగాలలో విశిష్ట సేవలకు పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్, మలేషియాలోని తెలుగు ఎక్స్పాట్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గ్లోబల్ ఇన్స్పిరేషన్–2026 అవార్డులు ప్రదానం చేస్తుందన్నారు. తనును ఎంపిక చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కొండచిలువ హతం శంఖవరం: మండలంలో జి.కొత్తపల్లి గ్రామంలో పొలాల్లో సంచరిస్తున్న కొండచిలువను స్థానికులు బుధవారం హతమార్చారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం కొండప్రాంతం దగ్గరగా ఉండడం చేత సుమారు 10 అడుగుల ఉన్న కొండచిలువ రొడ్డు వెంబడి వెళ్తుండగా స్థానికులు చూసి భయాందోళనకు గురై దానిని హతమార్చినట్టు చెప్పారు. నిత్యం పొలాల్లో విష సర్పాలు, పురుగులు సంచరిస్తుండడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. చినవెంకన్నకు రూ.92 లక్షల ఆభరణాల సమర్పణద్వారకా తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడేనికి చెందిన వేగుంట సాంబశివరావు, సౌందర్యలక్ష్మి దంపతులు, కుటుంబ సభ్యులు రూ.92 లక్షల విలువైన బంగారు, వెండి కవచాలను బుధవారం సమర్పించారు. మొత్తం 584 గ్రాముల బంగారం, 507 గ్రాముల వెండితో తయారు చేయించిన కవచాలను ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, ఈఓ వేండ్ర త్రినాథరావులకు అందజేశారు. హస్తాలతో వక్షస్థల భాగాన్ని ఈ కవచాలపై రూపొందించారు. కార్యక్రమంలో ఈఈ డీవీ భాస్కర్, దాత కుటుంబ సభ్యులు చేవూరి లక్ష్మీనారాయణ, చేవూరి ఈశ్వర ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆనంద సాగరం
అల్లవరం: జీవనాధారమైన సముద్రమే తమవారి బతుకుల్ని చిదిమేసిందేమోనని ఆ మత్స్యకార కుటుంబాల వారు ఎంతో కుమిలిపోయారు. జాడ తెలియకుండా పోయిన తమవారు ఏమైపోయారోనని తల్లడిల్లిపోయారు. ఏడ్చి ఏడ్చి వారి కన్నీరు ఇంకిపోయింది. వారు క్షేమంగా రావాలని ఆ గంగమ్మ తల్లిని, కోటి దేవుళ్లను ప్రార్థించారు. పొడిబారిన కళ్లతో తీరం వైపే చూస్తూ రోజులు గడుపుతున్నారు. వారి మొరలను ఆ దేవుడు ఆలకించాడో ఏమో కానీ.. మూడు వారాలకు పైగా ఆచూకీ తెలియకుండా పోయిన ఆ ఏడుగురు మత్స్యకారుల క్షేమ సమాచారం బుధవారం అందింది. దీంతో, ఆ కుటుంబాలు ఒక్కసారిగా ఆనంద సాగరంలో మునిగిపోయాయి. ఈ నెల 3న బయల్దేరి.. ఓడలరేవు తీరం నుంచి సంగాడి తాతారావు (బలుసుతిప్ప), కొల్లాటి ఏసుదాసు (ఆరగట్లపాలెం, బెండమూర్లంక), పాలెపు శాంతారావు (ఓడలరేవు), కర్రి రాముడు (ఎన్.రామేశ్వరం), కాటాడి సతీష్ (పశువుల్లంక, ఐ.పోలవరం మండలం), కొల్లాటి శ్రీనుబాబు (ఓడలరేవు)తో పాటు ముత్యాలమ్మ బోటు (ఏపీ ఈ8 ఎంఓ135) యజమాని కొపనాతి రామకృష్ణవర్మ (కొమరగిరిపట్నం) కలసి ఈ నెల 3న సముద్ర లోతు జలాల్లో వేటకు వెళ్లారు. తీరం నుంచి బయల్దేరిన గంట వరకూ తన తమ్ముడు భవాని శంకరం ఫోనుకు రామకృష్ణవర్మ అందుబాటులో ఉన్నారు. ఆ తరువాత మత్స్యకారుల మొబైల్ నెట్వర్క్ పని చేయలేదు. వేటకు వెళ్లిన మత్స్యకారులు 10 రోజుల తర్వాత ఈ నెల 13న తీరానికి తిరిగి చేరాల్సి ఉంది. కానీ, వారి జాడ తెలియకుండా పోయింది. ఈ విషయం ఈ నెల 17న వెలుగులోకి వచ్చింది. అనంతరం, ఆ మత్స్యకారుల ఆచూకీ కోసం జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి మేరకు కోస్టుగార్డు, తూర్పు నౌకాదళం సముద్రంలో 300 నాటికల్ మైళ్ల విస్తీర్ణంలో గాలింపు ఆరంభించాయి. ట్రాన్స్పాండర్ లేకపోవడంతో బోటు ఎక్కడుందో గుర్తించడం కష్టంగా మారింది. రోజులు గడుస్తున్నా వారి జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందారు. గాలివాటుకు.. దిఘా తీరానికి.. చివరకు వారి బోటు సముద్రంలో గాలివాటుకు పయనిస్తూ పశ్చిమ బెంగాల్లోని దిఘా తీరానికి చేరుకుంది. అక్కడి మత్స్యకారులు వీరిని గుర్తించి, సురక్షితంగా తీరానికి చేర్చారు. అనంతరం, అక్కడ తన మొబైల్ ఫోన్కు చార్జింగ్ పెట్టుకుని, రామకృష్ణవర్మ కొమరగిరిపట్నంలోని తన సోదరుడు భవాని శంకరానికి తమ క్షేమ సమాచారం అందించారు. మత్స్యకారులు తమ బోటుతో దిఘా తీరానికి చేరుకున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ కూడా ధ్రువీకరించారు. దీంతో, 23 రోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి గెలిచిన తమ వారిని తలచుకుని, ఆ కుటుంబ సభ్యులు ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి ఈ ఏడుగురు మత్స్యకారులను మరో బోటు సాయంతో సురక్షితంగా స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. దిఘా నుంచి వారి బోటు గురువారం బయల్దేరనుంది. ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా దిఘా తీరానికి చేరుకోవడంపై ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎంపీ చింతా అనురాధ హర్షం వ్యక్తం చేశారు. ఆ మత్స్యకారులను స్వస్థలానికి త్వరితగతిన తీసుకురావాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. దిఘా తీరానికి క్షేమంగా చేరుకున్న మత్స్యకారులు కొపనాతి రామకృష్ణవర్మ, కొల్లాటి ఏసుబాబు, సంగాడి తాతారావు, కర్రి రాముడు, కాటాడి సతీష్కుమార్, కొల్లాటి శ్రీనుబాబు, పాలెపు శాంతారావు గేర్ బాక్స్ పాడై.. చేపల వేటకు వెళ్లిన ఈ ఏడుగురు మత్స్యకారులు ఓడలరేవు తీరం నుంచి 100 నాటికల్ మైళ్ల దూరంలో ఒక రోజు వేట సాగించుకుని ముందుకు పయనమయ్యారు. నడిసంద్రంలో ఉండగా సరిగ్గా అదే సమయంలో వారి బోటులోని గేర్ బాక్సు పాడైంది. తమకున్న పరిజ్ఞానంతో ఆ మత్స్యకారులు గేర్ బాక్సుకు మరమ్మతులు చేసుకుని ముందుకు కదిలారు. కొంతసేపటి తర్వాత ఇంజిన్ వేడెక్కి బోటు ఆగిపోయింది. ఇక చేసేదేమీ లేక గాలివాటు ఆధారంగా ఆ మత్స్యకారులు తమ బోటు ప్రయాణాన్ని కొనసాగించారు. వేటకు బయల్దేరినప్పుడు 15 రోజులకు సరిపడ గ్రాసాన్ని మాత్రమే తీసుకెళ్లారు. ఊహించని విధంగా బోటు పాడవడం.. తీరానికి చేరే దారి లేకపోవడంతో ఉన్న కొద్దిపాటి ఆహార పదార్థాలను ఒక పూట తింటూ, మరో పస్తులుంటూ 20 రోజులు గడిపారు. చివరి మూడు రోజులూ నీళ్లు మాత్రమే తాగుతూ ప్రాణాలు నిలుపుకొన్నారు. 23 రోజుల తర్వాత అందిన మత్స్యకారుల క్షేమ సమాచారం సంతోషంలో మునిగిన కుటుంబ సభ్యులు ఇంజిన్ పాడై గాలివాటుకు పశ్చిమ బెంగాల్ తీరానికి చేరిన బోటు నేడు స్వస్థలానికి తీసుకొచ్చేందుకు సన్నాహాలు -
ఆధార్ ఉంటేనే సత్రం
అన్నవరం: రత్నగిరిపై బుధ, గురువారాలలో వివాహాలు భారీగా జరగనుండడంతో సత్రం గదులకు డిమాండ్ ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు గదుల కేటాయింపును కఠినతరం చేశారు. ఈ మేరకు ఆన్లైన్లో గదులు రిజర్వ్ చేయించుకున్న వారు స్వయంగా వచ్చి ఆధార్ చూపితేనే సత్రాన్ని కేటాయించారు. ఈ మేరకు ఈఓ నల్లం సూర్యచంద్రరావు ఏఈఓలు, సూపరింటెండెంట్లతో కమిటీ వేసి ఎవరి సిఫార్సులకూ లొంగవద్దని వారిని ఆదేశించారు. దేవస్థానం సత్రాలలోని దాదాపు 500 గదులలో 350 నెల క్రితమే రిజర్వ్ అయిపోయాయి. మిగిలిన 150 గదులకు ట్రస్ట్ బోర్డు సభ్యుల సిఫార్సులే ఎక్కువగా ఉన్నాయి. కాగా ఆన్లైన్లో రిజర్వ్ చేసుకున్న గదులలో ఆధార్ కార్డులు చూపినవారికి 250 గదుల కేటాయించగా ఇంకా వంద మిగిలిపోయాయి. అనంతరం మిగిలిన 250 గదులకు సిఫార్సు లేఖలను పరిశీలించి 200 మందికి కేటాయించారు. దీంతో బుధవారం రాత్రికి ఇంకా 50 గదులు మిగిలాయి. రిజర్వు చేసుకున్న మరికొందరు రావాల్సి ఉందని వారు రాకుంటే సాధారణ భక్తులకు కేటాయిస్తామని అధికారులు తెలిపారు. వసతి గది లేని వారి డార్మెటరీ కాగా, దేవస్థానంలో వసతి గదులు లభ్యం కాని భక్తులకు ఈఓ కార్యాలయం దిగువన గల మెయిన్ క్యాంటీన్ హాలును డార్మెటరీగా మార్చి పరుపులు వేసి భక్తులకు ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే వారికోసం మరుగుదొడ్లు, స్నానపుగదులు ఏర్పాటు చేసి బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు. రత్నగిరిపై కొత్త నిబంధన దళారుల ఆగడాలకు చెక్ ఈఓ ఆదేశాలతో కేటాయింపు -
సమన్వయంతోనే సాధిక్ అరెస్టు
కాకినాడ క్రైం: పిఠాపురం ఏఈ టి.నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసుకు సంబంధించి పోలీసుల్ని ముప్ప తిప్పలు పెట్టిన సాధిక్ఖాన్ను నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు. పోలీసుల చేజింగ్ తీరు థ్రిల్లర్ చిత్రాన్ని తలపించింది. ఇందులో పోలీసుల నెట్వర్కింగ్తో సహా వారి సమన్వయం ఔరా అనిపించింది. సుమారు 70 మంది పోలీసులు ఐదు రాష్ట్రాల్లో నిందితుడి కోసం జల్లెడ పడుతుంటే చివరకు మహారాష్ట్రలో గుర్తించారు. సరిగ్గా అక్కడ గస్తీ కాస్తున్న జిల్లా, స్థానిక పోలీసులు సమీపించే సరికి ఒకే చోట ఉండడం సేఫ్ కాదని భావించిన సాధిక్ అక్కడి నుంచి మీరట్కు పయనమయ్యాడు. ఈ విషయంతో పాటు అతడు కేరళ పారిపోయే యోచనలో ఉన్నాడని అధికారులు ఎస్పీ బిందుమాధవ్కు వివరించారు. దీంతో స్పందించిన ఎస్పీ తుని రూరల్ సీఐ గీతారాంకృష్ణ, ఇంద్రపాలెం ఎస్ఐ ఎం.వీరబాబు, ఇంద్రపాలెం కానిస్టేబుల్ మొయిన్లను సాధిక్ను అరెస్టు చేసి తీసుకురావలసిందిగా ఆదేశించి విమానంలో పంపారు. వారు సాధిక్ స్నేహితుడు అబ్బాస్ ఇంటి వద్దకు వెళ్లి కాపుకాయగా అక్కడ సాధిక్ పట్టుబడ్డాడు. విమానంలో వెళ్లకపోయి ఉంటే సాధిక్ కేరళ పరారయ్యేవాడని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ‘గొడవ రెండు కుటుంబాలది, రెండు మతాలది కాదు’ – సీనియర్ న్యాయవాది జవహర్ అలీ సాధిక్ ఘటన రెండు కుటుంబాలకు చెందినదే తప్ప రెండు మతాలది కాదని కాకినాడకు చెందిన సీనియర్ న్యాయవాది జవహర్ అలీ అన్నారు. కుటుంబ సభ్యులు కేసు చేయమని కోరారని, తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ములాఖత్తో సాధిక్ను కలిసింది తానేనని, కేసు నేనే చేస్తున్నానన్న ప్రచారంలో వాస్తవం లేదని, తానింకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. సౌజన్యతో కలిసి ఆమె భర్తను హతమార్చడంలో భాగస్వామి కావడం, నలుగురు కుటుంబసభ్యుల్ని ఆత్మహత్యలకు పురిగొల్పడం అనే అభియోగాలు సాధిక్పై ఉన్నాయన్నారు. న్యాయవాదులు ఎవరూ సాధిక్ తరఫున వాదించొద్దన్న ఎంపి తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్ వ్యాఖ్యలు సరైనవి కాదని అన్నారు. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అలీ తెలిపారు. ఓ కేసు చేయాలా వద్దా అన్నది న్యాయవాది ఇష్టమని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల్లో స్థానిక సిబ్బందితో కలసి గాలింపు క్షణక్షణం సమాచారంతో ఇక్కడ పావులు కదిపిన ఎస్పీ విమానంలో వెళ్లి నిందితుడిని పట్టుకున్న స్థానిక సిబ్బంది -
అభయారణ్యాన్ని సందర్శించిన ఎఫ్బీఓ ట్రైనీలు
తాళ్లరేవు: హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్బీఓ) ట్రైనీలు బుధవారం కోరింగా అభయారణ్యాన్ని సందర్శించారు. స్టడీ టూర్లో భాగంగా చొల్లంగిలోని కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజాన్ని (సీబీఈటీ) సందర్శించి, పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, ఎఫ్బీఓ కె.మహేష్లు మడ అడవుల విశిష్టత, వన్యప్రాణుల సంరక్షణ, సముద్ర తాబేళ్ల ప్రాముఖ్యతలను వివరించారు. అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ వి.మంజుక్ సిబ్బంది పాల్గొన్నారు. టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి ముమ్మిడివరం: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ టీచర్స్ ఫెడరేషన్–1938 జిల్లా శాఖ ఆధ్వర్యాన ముమ్మిడివరంలోని విద్యా శాఖ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక టెట్ నోటిఫికేషన్లో ఏపీటీఎఫ్–1938 సూచనల మేరకు కొన్ని సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా శాఖ అధ్యక్షుడు ఎస్ఎన్ మునేశ్వరరావు మాట్లాడుతూ, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునిచ్చేందుకు తమిళనాడు ప్రభుత్వం మాదిరిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కోరారు. లేదంటే టెట్ అర్హత మార్కులు తగ్గించాలని డిమాండ్ చేశారు. -
మళ్లీ వరద గోదారి
ధవళేశ్వరం: గోదావరి వరద ఉధృతి బుధవారం క్రమేపీ పెరుగుతోంది. దీంతో, ధవళేశ్వరం వద్ద ఉన్న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద మిగులు జలాల విడుదలను పెంచారు. బుధవారం రాత్రి బ్యారేజీ నుంచి 4,63,583 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఉపనదులైన ఇంద్రావతి, శబరి నుంచి గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అలాగే, తాలిపేరు నుంచి వరద నీరు దిగువకు రావడంతో బ్యారేజీ వద్ద బుధవారం రాత్రి నీటి ఉధృతి పెరిగింది. గురువారం సాయంత్రం వరకూ నీటి ఉధృతి పెరిగి అనంతరం, తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 33.80 అడుగులు, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులు నమోదైంది. సముద్రంలోకి 4.63 లక్షల క్యూసెక్కుల విడుదల -
రామచంద్రపురంలో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: రామచంద్రపురంలో దారుణం జరిగింది. భర్తను భార్య పొత్రం రాయితో కొట్టి హత్య చేసింది. భార్య తంగేటి ఉమాదేవి చేతిలో భర్త తంగేటి ఎల్లారావు హత్యకు గురయ్యాడు. భార్యపై భర్త అనుమానం పెంచుకోవడంతో భార్యభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు.నిందితురాలు ఉమాదేవిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మొదటి భార్య మృతి చెందడంతో ఉమాదేవిని ఎల్లారావు రెండో వివాహం చేసుకున్నాడు. వృత్తి రీత్యా వంట పనులు చేసుకుని జీవించే ఎల్లారావుకు భార్యపై అనుమానం కలగడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నెల 25న మద్యం సేవించి వచ్చి భార్యతో ఎల్లారావు ఘర్షణకు దిగాడు.దీంతో భార్య పొత్రం రాయితో కొట్టడంతో భర్త మృతి చెందాడు. హతుడు సోదరుడు ఇచ్చిన పిర్యాదు మేరకు ఉమాదేవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్లారావు హత్యలో ఇతరుల ప్రమేయం ఉందా? అనే దానిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఏఈ నూకరాజు కుటుంబం కేసులో మరో మలుపు
సాక్షి, కాకినాడ జిల్లా: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సాధిక్ వేధింపులు కారణం కాదని సాధిక్ ఖాన్ తల్లి నూర్జహాన్ తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నూకరాజు అల్లుడు జగదీశ్వర్రెడ్డిని సాధిక్ చంపలేదన్నారు. ‘‘సౌజన్య రెండు సార్లు మా ఇంటికొచ్చింది. సాధిక్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పింది. ఈ ప్రతిపాదనకు మా కుటుంబం ఒప్పుకోలేదు. జగదీశ్వరరెడ్డి మరణించాక తనను పెళ్లి చేసుకోవాలని సౌజన్య.. సాధిక్ను ఒత్తిడి చేసింది’’ అంటూ సాధిక్ ఖాన్ తల్లి చెప్పుకొచ్చారు.‘‘ఈ ఏడాది ఫిబ్రవరి 14న సౌజన్య ఇంటికి రమ్మని సాధిక్ను పిలిచింది. అక్కడ సాధిక్పై జగదీశ్వర్రెడ్డి అతని మనుషులు దాడి చేసి బంధించారు. దీంతో వంటగదిలో కత్తితో బెదిరించి సాధిక్ అక్కడ నుండి పారిపోయాడు. జగదీశ్వరరెడ్డితో పెళ్లి కాకపొతే సౌజన్యను సాధిక్ ఇచ్చి వివాహం చేసేవాడినని నూకరాజు మా ఇంటికి వచ్చి చెప్పాడు. ఈ రిలేషనల్ మంచిది కాదని సాధిక్ను మందలించాను. తన భర్త పట్టించుకోవడం లేదని సాధిక్తో సౌజన్య రిలేషన్ నడిపింది. సౌజన్య కొడుకు సాధిక్ను అబ్బు అని.. తన తండ్రిని ఇడియట్ అని పిలిచేవాడు. రోజు ఫోన్లో మా అబ్బాయి చెప్పే కథలు విని సౌజన్య కొడుకు పడుకునేవాడు.‘‘మా ఇంటికి వచ్చి తెలుగు ఖురాన్, బుర్కా కావాలని సౌజన్య అడిగింది. చనిపోయిన రోజు సాయంత్రం 5:30కి సాధిక్కు సౌజన్య ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. తన స్టూడెంట్స్ కేరళలో ఈవెంట్స్ వెళ్లాలని.. రావడం కుదరదని చెప్పి సాధిక్ అకాడమీకి వెళ్ళిపోయాడు. నూకరాజు, జగదీశ్వర రెడ్డి ఆస్తులు, బంగారం మా వద్ద లేదు. మా కుటుంబం బ్యాంక్ పుస్తకాలు, ఆధార్ కార్డులు పోలీసులకు ఇచ్చేశాము.’’ అని సాధిక్ ఖాన్ తల్లి నూర్జహాన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: 6 ఏళ్లకే ఈ బాలుడు ‘అభిజీత్ దీప్కే’లా అయిపోయాడు.. -
పిల్లల్ని ఎరగా వేసి తల్లులకు వల..!
కాకినాడ క్రైం: సౌజన్యను సాధిక్ ఖాన్ ట్రాప్ చేసి తన దారిలోకి తెచ్చుకుంది మొదలు, ఓ క్రైం థ్రిల్లర్ని తలపించేలా తన రాచకార్యాల్ని గుట్టుచప్పుడు కాకుండా కొనసాగించాడు. తన దారిలోకి తెచ్చుకోవడం, ఆమైపె ఇష్టాన్ని వ్యక్తం చేయడం, అక్రమ బంధాన్ని కొనసాగించడం, ఆమె భర్తను అడ్డు తొలగించుకునేందుకు కుయుక్తులు పన్నడం, ఆస్తి కాజేసేందుకు చేసిన కుట్ర, అంతకుముందు ఆమెను కొట్టడం, భర్తపై దాడి, బాధితురాలి కుటుంబసభ్యుల పైనా విరుచుకుపడడం, వారిని బ్లాక్మెయిల్ చేయడం ఇవేవీ థ్రిల్లర్కు తీసిపోని రీతిలో ఉన్నాయి. ఆత్మహత్య ఘటన తర్వాత తప్పించుకోవడానికి చేసిన విఫలయత్నాలు ఈ కోవకే చెంది పోలీసుల మతులనే పోగొట్టాయి. సౌజన్య లాంటి మరికొందరు సాధిక్ ఖాతాలో ఉండొచ్చన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పిల్లల్ని అడ్డుపెట్టుకొని తల్లులకు వల వేసేవాడని వారి ప్రాథమిక విచారణలో తేలింది.ఆ ఒక్క క్లూతోనే...కేవలం ఒక్క క్లూతోనే సాధిక్ జాడ బట్టబయలైందని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యలు జరగడం, వాటికి తానే కారణం కావడంతో ఎవరూ అతడిపై ఆరోపణలు చేయకుండానే జాగ్రత్తపడి పరారయ్యాడు. అప్పటికి లేఖ దొరకలేదు, సాధిక్ ఖాన్ అనే వ్యక్తి పేరు కూడా ఎవరికీ తెలియదు. ఆ సమయంలో తాను వినియోగిస్తున్న ఒక్కొక్కటి రూ.1.5 లక్షలు విలువ చేసే రెండు ఖరీదైన ఫోన్లు వదిలేసి పరారయ్యాడు. వెళుతూ రైఫిల్ అసోసియేషన్లో ఉన్న ఓ ఆప్తమిత్రుడికి ఫోన్ చేసి ఆ నంబర్ డిలీట్ చేసేశాడు. కొందరి ఫోన్ నంబర్లు పాకెట్ బుక్లో రాసుకొని బయల్దేరాడు. కాల్ రికార్డ్స్ డేటాలో ఆ కాల్ జాడ లభ్యమైంది. ఇంటి నుంచి నేరుగా ద్విచక్రవాహనంపై సామర్లకోటకు వెళ్లిన సాధిక్ బైక్ను పార్కింగ్లో ఉంచి కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. పలువురి ప్రయాణికుల ఫోన్లతో తనకు కావలసిన వారికి ఫోన్లు చేశాడు. చివరికి మహారాష్ట్రకు వెళ్లి తన స్నేహితుడిని కలిశాడు. అక్కడ ఒక రోజు ఉన్నాడు. తర్వాత రోజు మీరట్కి బయల్దేరాడు. సరిగ్గా అదే సమయానికి కాకినాడ పోలీసులు సదరు మిత్రుడ్ని చేరారు, కొద్ది సేపటి ముందు సాధిక్ మీరట్కు అబ్బాస్ అనే మరో రైఫిల్ ట్రైనర్ను కలిసేందుకు వెళ్లాడని సమాచారం అందించాడు. అతడి కంటే ముందు అబ్బాస్ ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు సాధిక్ అబ్బాస్ ఇంటి వద్దకు సమీపిస్తుండగా పట్టుకున్నారు. అక్కడి నుంచి కేరళ వెళ్లాలని అనుకున్నాడని పోలీసులు తెలిపారు.కోడలిపై అనుమానం..కోడలి వ్యవహారశైలి ఆది నుంచీ అనుమానాస్పదంగానే తోచిందని సాధిక్ ఖాన్ చేతిలో హత్యకు గురయ్యాడని భావిస్తున్న జగదీశ్వర్రెడ్డి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అనూహ్య రీతిలో ఏ కారణం లేకుండానే జగదీష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని వాపోయారు. ఏడాది పాటు వాంతులు అయ్యాయని, కారణం తెలిసేది కాదని చెప్పుకొచ్చారు. మాట నెమ్మదించి, కాలు కూడా చచ్చుబడిందని అన్నారు. జీర్ణకోశ సమస్యతో బాధపడుతూ కాకినాడ సర్పవరంలో ఉన్న ఓ ఆసుపత్రిలో ఐదు రోజులు చికిత్స అనంతరం జగదీష్ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లో ఉన్న ప్రముఖ ఆసుపత్రి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి వెళ్లి చికిత్స పొందినట్టు చెప్పారు. అక్కడ కాస్త కోలుకోగా, హైటెక్ సిటీలో ఉన్న ఓ ఫిజియోథెరపీ సెంటర్కు సౌజన్యతో పాటు ఆమె తల్లిదండ్రులు, అత్త, మామ తీసుకువెళ్లి చేర్చారు. కేవలం ఫిజియోథెరపీ చేస్తే చాలు కోలుకోవలసిన దశలో జగదీశ్వర్రెడ్డి హఠాత్తుగా మరణించాడు. ఫిజియోథెరపీ చేస్తుండగా తన భర్త స్పందించడం లేదని కోడలు సమాచారం ఇచ్చిందని జగదీశ్వర్రెడ్డి కుటుంబీకులు చెబుతున్నారు. సౌజన్య ప్రవర్తన తీవ్ర అనుమానాలకు తావిచ్చిందని తెలిపారు. ఆసుపత్రిలో చేర్చినప్పటి నుంచి తాను మాత్రమే ఉంటానని అందరూ వెళ్లిపోవాలని చెప్పేదన్నారు. చనిపోయే కొద్దిసేపటి ముందు కూడా తమను హోటల్ గదికి పంపేసిందని, తానే చూసుకుంటానని చెప్పిందని అంటున్నారు. సాధిక్ ఖాన్ ఆ సమయంలో వచ్చి సౌజన్యతో కలిసి జగదీష్ తాగే ప్రొటీన్ షేక్లో అంతకుముందు పట్టించిన స్లో పాయిజన్ గుణాలున్న రసాయనాన్ని మరోమారు కలిపి ఉంటాడని అనుమానిస్తున్నామని కుటుంబీకులు తెలిపారు.పిల్లలు ఎర.. తల్లులు సొరఖతర్నాక్ ఖాన్ వ్యవహార శైలిని తమ పిల్లల్ని కోచింగ్లో చేర్చిన పలువురు తల్లులు పూసగుచ్చినట్టు తమను సంప్రదించిన మీడియాకు తెలిపారు. పిల్లల్ని అడ్డుపెట్టుకొని తమతో మాటకలిపేందుకు యత్నించేవాడని, తమ స్టేటస్లు, ఫేస్బుక్, ఇన్స్ట్రాగాం పేజీలు ఫాలో అవుతూ లైక్స్ కొడుతూ ముగ్గులోకి దించేందుకు యత్నించేవాడన్నారు. ఈ కారణంతోనే తమ పిల్లల్ని అతడి అకాడమీలో మానిపించేశామని కొందరు చెప్పారు. క్లాస్ ఇన్ఫర్మేషన్ కోసం అంటూ కాల్స్ చేసి అక్కర్లేని విషయాలతో మాటలు పెంచేవాడన్నారు.ఇంటిని అమ్మి ప్రియుడితో వెళ్లిపోయిన భార్య -
కూటమి పాలనలో కుప్ప కూలుతున్న విద్యా వ్యవస్థ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కూటమి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ కుప్ప కూలుతోందని ఆర్ఎస్యూ జాతీయ అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ మాజీ జాతీయ నాయకుడు నూర్ మహమ్మద్ అన్నారు. స్థానిక లయన్స్ క్లబ్లో మంగళవారం నిర్వహించిన ఆర్ఎస్యూ ప్లీనరీ సమావేశాల్లో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. నియామక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని, మౌలిక వసతుల లేమితో బోధన, పరిశోధన కార్యక్రమాలు దెబ్బ తింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యా మండలిని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఈ శ్రావణ మాసంలో పెళ్లిళ్లు పెద్ద సంఖ్యలోనే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెలలోనే ఎక్కువగా 26, 27 తేదీల్లో భారీ సంఖ్యలో వివాహాలు జరుగనున్నాయి. దీంతో దేవస్థానంలో ఈ రెండ్రోజులూ ఏ వివాదం లేకుండా గట్టెక్కితే అదే చాలు అనే అభిప్రాయం వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం పెళ్లి బృందాలకు వసతి గదుల కోసం పెద్ద ఎత్తున సిఫార్సులు రావడమే. వైశాఖ మాస వివాహాల తరువాత రత్నగిరిపై పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగేది శ్రావణ మాసంలోనే. సత్యదేవుని సన్నిధిలో ప్రతి ఏటా ఐదు వేలకు పైగా వివాహాలు జరుగుతుండగా శ్రావణ మాసంలో సుమారు వేయి వివాహాల వరకు జరుగుతాయని అంచనా. సత్యదేవుని సన్నిధిలోని న్యూ సీసీ, ఓల్డ్ సీసీ సత్రాలు, ప్రకాష్ సదన్, హరిహరసదన్ ఆవరణలో, విష్ణుసదన్లోని 36 వివాహ హాళ్లలో వివాహాలు జరుగనున్నాయి. ఇవి కాకుండా మట్టే శ్రీనివాస్ దంపతులు నిర్మించిన సత్యశ్రీనివాస ఉచిత కల్యాణ మండపం, ఎంఎస్ రెడ్డి నిర్మించిన కల్యాణ మండపంలోని 24 ఉచిత కల్యాణ వేదిక (మండపాలు)లో వివాహాలు జరుగుతున్నాయి. గదులకు భారీ డిమాండ్... 26, 27 తేదీల్లో భారీ సంఖ్యలో వివాహాలు జరుగుతుండటంతో సత్రం గదులకు భారీ డిమాండ్ ఏర్పడింది. దేవస్థానం సత్రాల్లో దాదాపు 500 గదులుంటే వాటిలో 70 శాతం అంటే 350 గదులు ఇప్పటికే ఆన్లైన్లో రిజర్వ్ అయిపోయాయి. మిగిలిన 150 గదులకు 300 సిఫార్సు లేఖలు, ఫోన్లు, మెసేజ్లు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ సిఫార్సులలో దేవస్థానం ట్రస్ట్బోర్డు సభ్యులవి కూడా ఎక్కువే ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ఉన్న వసతి గదులను ఈ రెండ్రోజుల్లో ఎలా సర్దుబాటు చేయాలా అని సీఆర్వో కార్యాలయ సిబ్బంది తర్జనభర్జన పడుతున్నారు. ఒకే వివాహం కోసం మూడు నాలుగు సిఫార్సులు వచ్చిన లేఖల్లో ఒక దానినే పరిగణనలోకి తీసుకుంటున్నారు. రెండు గదులు కావాల్సినవారికి ఒక గది మాత్రమే కేటాయించి సర్దుకోమంటున్నారు. ఇలా ఏదోక విధంగా వివాదం లేకుండా ఈ రెండ్రోజులు గట్టెక్కెతే చాలని అధికారులు కోరుకుంటున్నారు. కొండ కింద కూడా ఫుల్.. కొండ దిగువన సుమారు 30 లాడ్జిలు, కల్యాణమండపాలు, హోటళ్లు ఉండగా అవన్నీ ఈ రెండ్రోజులకూ హౌస్ఫుల్ అయ్యాయి. వీటిలో 20 కల్యాణ మండపాలు, 300 గదులు ఉన్నాయి. వీటన్నింటినీ పెళ్లి బృందాలు రిజర్వు చేసుకున్నాయి. రత్నగిరిపై 150కి పైగా వివాహాలు ఆ రెండ్రోజులు సత్రాల గదులకు భారీ డిమాండ్ 500 గదులకు 350 ఇప్పటికే రిజర్వ్ మిగిలిన 150 గదులకు 300 సిఫార్సులు! కొండ దిగువన లాడ్జిలు, కల్యాణ మండపాలు, హోటళ్లు కూడా హౌస్ఫుల్ -
జిల్లా పోలీస్ కార్యాలయానికి రూ.2 కోట్లు
అమలాపురం టౌన్: జిల్లా కేంద్రం అమలాపురంలో ఏడు ఎకరాల్లో నిర్మితమవుతున్న జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణానికి రాష్ట్ర డీజీపీ రూ.2 కోట్ల నిధులు కేటాయించారని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ తెలిపారు. అమలాపురం పాత పోలీస్ క్వార్టర్స్, జిల్లా పోలీస్ గ్రౌండ్స్లో నూతనంగా నిర్మించిన పోలీస్ గెస్ట్హౌస్ (డీఎస్పీ కార్యాలయం)ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే పుష్కరాల లోపు జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతానికి అమలాపురం డీఎస్పీ కార్యాలయం లేదు కాబట్టి నూతనంగా నిర్మించిన ఈ పోలీస్ గెస్ట్ హౌస్ను కొద్ది రోజులు డీఎస్పీ కార్యాలయంగా ఉపయోగించుకోనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ మహేంద్ర మత్తే, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, పేరాబత్తుల రాజశేఖర్, అమలాపురం, ముమ్మిడివరం ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, అమలాపురం, కొత్తపేట డీఎస్పీలు టీఎస్ఆర్కే ప్రసాద్, సుంకర మురళీమోహన్, పట్టణ, రూరల్ సీఐలు పి.వీరబాబు, డి.ప్రశాంత్కుమార్ పాల్గొన్నారు. -
పుష్కరాలకు పటిష్ట ప్రణాళిక
కలెక్టర్ ఆదేశంబోట్క్లబ్ (కాకినాడ సిటీ): గోదావరి పుష్కరాలను భక్తి శ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలూ సమన్వయంతో పటిష్ట ప్రణాళిక రూపొందించి పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. జిల్లా పరిధిలోని గోదావరి నదీ తీర ప్రాంతాల్లో ప్రధాన ఘాట్లను గుర్తించి, భక్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతులనూ ముందుగానే సమకూర్చేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో గోదావరి తీర ప్రాంతాల్లో ఐదు ప్రధాన ఘాట్లను అన్ని వసతులతో అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. గోదావరి కాలువల వెంబడి జిల్లాలోని 9 మండలాల్లో 82 సీ–కేటగిరీ ఘాట్లను గుర్తించినట్టు తెలిపారు. ఆయా ఘాట్ల వద్ద భక్తుల రాకపోకలు, భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు, మరుగు దొడ్లు, పార్కింగ్, రహదారి సౌకర్యాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో డాక్టర్ డి.తిప్పే నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఉద్యోగాలు తొలగించం జీజీహెచ్ డీఈవోలకు కలెక్టర్ భరోసా కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్లో 16 ఏళ్లుగా కేవలం రూ.5 వేలు నెలసరి వేతనానికి పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ల (డీఈవో)లలో కొందరిని ఉన్నపళంగా ఆసుపత్రి అధికారులు ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ అన్యాయంపై ‘సాక్షి’ దినపత్రిక మంగళవారం ‘ఐదు వేలాకోలం’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీనిపై జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ స్పందించారు. ఆసుపత్రి అధికారుల నుంచి వివరణ కోరినట్టు తెలిపారు. డీఈవోలలో ఏ ఒక్కరినీ తొలగించకుండా అక్కడే కొనసాగించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే పనిచేస్తున్నవారి వరకు విద్యార్హతలకు మినహాయింపునిచ్చి, అనుభవాన్నే ప్రాతిపదికగా తీసుకొని, యథాస్థానంలో కొనసాగిస్తామని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. రేపే నిధి ఆప్ కే నికత్ ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలో గురువారం ఉదయం 9 గంటలకు నిధి ఆప్ కే నికత్ డిస్ట్రిక్ట్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ ఎంకే వెంకటరావు మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పరిధికి సంబంధించి పెద్దాపురం ఏడీబీ రోడ్డులోని పతంజలి ఫుడ్స్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి యానాంలోని నల్లం ఎడ్యుకేషనల్ సొసైటీలోను, కాకినాడ జిల్లాకు తుని మార్కండ్రాజుపేట అర్కా ఎడ్యుకేషనల్ సొసైటీలోను, పశ్చిమ గోదావరి జిల్లాకు కాళ్ల మండలం సీసలి జయలక్ష్మి సీఫుడ్స్లోను, ఏలూరు జిల్లాకు వట్లూరులోని రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లోను ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. కొత్త ఈపీఎస్, ఈడీఎల్ఐ, ఆమ్నెస్టీ, ఈఈసీ, కొత్త సీఐటీఈఎస్ పథకాల అమలు నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పీఎఫ్ సభ్యులు, పింఛనుదారులు, ఆయా సంస్థలు దీనిని ఉపయోగించుకోవాలన్నారు. నిధి ఆప్ కే నికత్ అని పేర్కొంటూ ఫిర్యాదులు సమర్పించవచ్చన్నారు. ఈ సందర్భంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వవచ్చని వెంకటరావు తెలిపారు. ‘నీట్ పీజీ’ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు : కలెక్టర్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జాతీయ స్థాయిలో ఈ నెల 30న జరగనున్న నీట్ పీజీ (జాతీయ అర్హత) పరీక్షను జిల్లాలో అత్యంత ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేయాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నీట్ పరీక్షపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 30న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరిగే నీట్ పీజీ జాతీయ అర్హత పరీక్షకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద నిరంతరం విద్యుత్ సరఫరా, పారిశుధ్య నిర్వహణ, గట్టి పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో తిప్పేనాయక్ పాల్గొన్నారు. -
ప్రభుత్వం మాట తప్పింది
30 సంవత్సరాలు సర్వీసు చేసిన సీనియర్ ఉపాధ్యాయులు ఆన్లైన్ విధానంలో టెట్కు అటెండ్ కాలేరనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లాం. ఆఫ్లైన్లోనే అని చెప్పి, ఆన్లైన్లో టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం మాట తప్పింది. స్పెషల్ టెట్పై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నాం. – పోతంశెట్టి దొరబాబు, ఎస్టీయూ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆఫ్లైన్ విధానంలో నిర్వహించాలి ఇతర రాష్ట్రాల మాదిరిగానే స్పెషల్ టెట్ ఆఫ్లైన్లోనే నిర్వహించాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనిపై ఉద్యమబాట పడుతున్నాం. – ఈవీవీఎస్ఎస్ ప్రసాద్, యూటీఎఫ్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడుఅసెంబ్లీలో తీర్మానం చేయాలి తమిళనాడు ప్రభుత్వం మాదిరిగా ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ లేకుండా అసెంబ్లీ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి. స్పెషల్ టెట్ పేరుతో ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసగించింది. – చింతాడ ప్రదీప్ కుమార్, పీఆర్టీయూ కాకినాడ జిల్లా అధ్యక్షుడు -
‘సాధిఖ్ ఖాన్ మమ్మీని కొట్టేవాడు చాలా భయం వేసేది’
సాక్షి,కాకినాడ: తన కుటుంబాన్ని నాశనం చేసి.. తనను అనాథను చేసిన సాధిక్ ఖాన్కు కఠిన శిక్ష విధించాలని ఏఈ నూకరాజు మనవడు రియాన్ష్ కార్తికేయ రెడ్డి డిమాండ్ చేశాడు. ‘రైఫిల్ షూటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాను. మూడో తరగతి నుంచి సాధిక్తో పరిచయం ఉంది. గతంలో మా స్కూల్లో పనిచేసేవాడు. స్కూల్ నుంచి తీసేసారని తన అకాడమీకి రమ్మని ఫోన్ నెంబర్ ఇచ్చాడు. అక్కడే అమ్మకి పరిచయం అయ్యాడు. మమ్మీని కొట్టేవాడు చాలా భయం వేసేది. ఎవరికైనా చెప్తే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానని చెప్పాడు. ఇప్పటికీ నాకు భయంగా ఉంది. సాధిక్కి పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి’అని ఆవేదన వ్యక్తం చేశాడు. 👉ఇదీ చదవండి: బ్లాక్మెయిల్ చేశాడు.. ప్రశ్నిస్తే కొట్టాడు: లేఖలో సౌజన్య -
రాజమండ్రి: బీరు సీసాలతో యువకులపై మహిళల దాడి
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో యువకులపై మహిళల దాడి చేశారు. దీంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు మహిళలు ఇద్దరు యువకులపై బీరు సీసాలతో దాడి చేయడంతో ఒకసారిగా కలకలం రేగింది.సోమాలమ్మగుడి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అర్థరాత్రి చనిపోతే యువకులు విజయ్, దుర్గాప్రసాద్ చూసేందుకు వెళ్లారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో యువకులు ఆలయం వద్దకు చేరుకున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న తుమ్మలోవకు చెందిన ముగ్గురు మహిళలు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.ఇదీ చదవండి: ఖైదీతో మహిళా ఎస్ఐ అర్దనగ్నంగా వీడియో కాల్..! -
బ్లాక్మెయిల్ చేశాడు.. ప్రశ్నిస్తే కొట్టాడు
కాకినాడ క్రైం: ‘సాధిక్ ఖాన్ నన్ను బ్లాక్మెయిల్ చేశాడు.. ప్రశ్నిస్తే కొట్టాడు.. నన్ను మతం మార్పించడానికి, నా ఆస్తి కోసం వేధించేవాడు’ అంటూ ఆత్మహత్యకు పాల్పడిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య మరణానికి ముందు రాసినట్లుగా భావిస్తున్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లేఖలో సాధిక్ క్రూరత్వాన్ని వివరించింది. సాధిక్ తన కుమారుడు రియో సాయంతో తనకు దగ్గరయ్యాడని తెలిపింది. తన బిడ్డ చదివే స్కూల్లో చేరాడని, చెప్పిన మాట వినకపోతే రియోను కిడ్నాప్ చేస్తానని బెదిరించేవాడని పేర్కొంది. తన ప్రైవేటు విషయాలతో బ్లాక్మెయిల్ చేశాడని, ప్రశ్నిస్తే కొట్టాడని తెలిపింది. తన భర్త కూడా సాధిక్కు భయపడేవాడని తెలిపింది. తన భర్తను చంపేయడానికి ఓ రసాయనాన్ని తెచ్చాడని పేర్కొంది. తన ప్రతి ఫోన్ కాల్ను పరిశీలించేవాడని తెలిపింది. అతడి కన్ను తన ఆస్తిపై ఉందన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించానని పేర్కొంది. తన ఆస్తి పత్రాలు, లాకర్ కూడా అతని ఆధీనంలో పెట్టుకున్నాడని, అతనికి పోలీసులతో సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల ఎవరికీ చెప్పుకోలేకపోయానని వివరించింది. తనను ఇస్లాంలోకి మారాలని తీవ్రమైన ఒత్తిడి తెచ్చి ఇస్లాం మత పుస్తకాలు చదవమని, రాయమని బెదిరించేవాడని పేర్కొంది. చాలాసార్లు మనోవేదనకు గురై చనిపోదామనుకుంటే బిడ్డ గుర్తొచ్చి ఆగిపోయానని తెలిపింది. మతం పిచ్చి, ఆడవాళ్ల పిచ్చి ఉన్న సాధిక్తో ప్రతి మహిళ, యువతులు, పిల్లల తల్లులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ లేఖ విషయమై ఎస్పీ బిందుమాధవ్ని వివరణ కోరగా, పరిశీలిస్తున్నామని చెప్పారు. సాధిక్ ఖాన్ తనకంటే పదేళ్లు పెద్ద వయసున్న సౌజన్యను ట్రాప్ చేసి మతం మార్చేందుకు, ఆస్తి కాజేసేందుకు కుట్రపన్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. సాధిక్ ఇచ్చిన విష రసాయనంతోనే జగదీశ్వర్ రెడ్డి మృతి? సౌజన్య భర్త జగదీశ్వర్రెడ్డి నరాల సంబంధ వ్యాధితో బాధపడుతుండేవాడని, సాధిక్ ఇచ్చిన విష రసాయనంతో అతనికి జీర్ణకోశ వ్యాధి కూడా వచ్చిందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. అతన్ని హైదరాబాద్లో ఏఐజీ ఆసుపత్రిలో చేర్చగా 23 రోజుల చికిత్స అనంతరం జూలై 2న మృతి చెందినట్లు సమాచారం. పోలీసులతోనే ఫొటోలన్నీ... సాధిక్ కాకినాడ గుడారిగుంటలో నిర్వహిస్తున్న ప్రో షూటింగ్ అకాడెమీలో ఫొటోలన్నీ పోలీసులతోనే ఉండటం చర్చనీయాంశమైంది. తాను సాధించిన మెడల్స్తో గతంలో పనిచేసిన జిల్లా ఎస్పీ సహా పలువురు అధికారులతో ఫొటోలు తీయించుకున్నాడు. వీటిని చూపించి పోలీస్ ఉన్నతాధికారులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని తన అకాడెమీకి వచ్చే పిల్లల తల్లిదండ్రులకు చెప్పుకునేవాడు. పలువురు పోలీసుల పిల్లలకు కూడా సాధిక్ శిక్షణ ఇస్తుండటం గమనార్హం. రిమాండ్కు సాధిక్ ఖాన్శనివారం ఉత్తరప్రదేశ్లో అరెస్టు చేసిన పోలీసులుకాకినాడ రూరల్/కాకినాడ లీగల్/కాకినాడ క్రైం: కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడైన రైఫిల్ షూటింగ్ శిక్షకుడు షేక్ సాధిక్ ఖాన్ను సర్పవరం పోలీసులు సోమవారం కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. అతనికి సెప్టెంబర్ 3 వరకు రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ ఎన్.ఉషాలక్ష్మి కుమారి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నిందితుడిని కాకినాడ సబ్జైలుకు రిమాండ్కు పంపించారు. ఈ నెల 16న ఏఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన వెంటనే సాధిక్ ఖాన్ పరారయ్యాడు. అతన్ని శనివారం ఉదయం ఉత్తరప్రదేశ్లోని మీరఠ్లో అరెస్ట్ చేసి, ఆదివారం అర్ధరాత్రి సర్పవరం పోలీసు స్టేషన్కు తీసుకువచ్చారు. ఆరితేరిన నేరస్తుడిలా సాధిక్ పరారు: కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆత్మహత్యకు పాల్పడగానే సాధిక్ ఖాన్ ఆరితేరిన నేరస్తుడి తరహాలో చాకచక్యంగా పారిపోయాడని ఎస్పీ బిందుమాధవ్ చెప్పారు. అతని కోసం 10 పోలీసు బృందాలు ఆరు రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో గాలించాయని సోమవారం కాకినాడలో విలేకరుల సమావేశంలో తెలిపారు. అతను సామర్లకోట నుంచి కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్లిపోయాడన్నారు. సామర్లకోట మీదుగా ఢిల్లీ, అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్లోని మీరఠ్కు వెళ్లాడన్నారు. రైఫిల్ షూటింగ్లో శిక్షకుడైన ఓ మిత్రుడు సహా ఒకరిద్దరి దగ్గర ఆశ్రయం పొందినట్లు తెలిపారు. అతని ఫోన్ నుంచి చివరి కాల్ షూటింగ్ అసోసియేషన్లో సభ్యుడైన ఓ వ్యక్తికి వెళ్లడంతో అతని జాడ తెలుసుకొనే అవకాశం చిక్కిందని చెప్పారు. 22వ తేదీన అతని వద్దకు పోలీసులు వెళ్లగా.. అప్పటికి కొద్ది సేపటి ముందు సాధిక్ అక్కడి నుంచి మీరఠ్లో ఉంటున్న మరో షూటింగ్ శిక్షకుడైన అబ్బాస్ వద్దకు వెళ్లినట్లు తెలిసిందన్నారు. స్థానిక పోలీసుల సాయంతో అబ్బాస్ ఇంటి వద్ద కాపు కాసి, సాధిక్ రాగానే పట్టుకున్నట్లు తెలిపారు. అతనిపై హత్య, ఆత్మహత్యకు ప్రేరేపించడం, బెదిరింపులు, మతమార్పిడికి యత్నం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. -
పురపోరుకు సన్నాహాలు
పెద్దాపురం మున్సిపాలిటీలో ఆర్డీ సమీక్ష పెద్దాపురం : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నట్టు పురపాలక సంఘ రీజనల్ డైరెక్టర్ సీహెచ్ నాగ నరసింహారావు తెలిపారు. పెద్దాపురం పురపాలక సంఘంలో ఓటర్ల జాబితా వార్డు మ్యాపింగ్ ప్రక్రియను సోమవారం ఆయన పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది ఓటర్ల జాబితాల మ్యాపింగ్ను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందికి, బీఎల్ఓలకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన రీజియన్ పరిధిలో 34 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లు ఉన్నాయని చెప్పారు. 2026 జనవరి ఓటర్ల జాబితా ప్రకారం మ్యాపింగ్ జరుగుతుందని తెలిపారు. 18 మున్సిపాలిటీల్లో ఎన్నికల సంబంధించి ఎలాంటి వివాదాలూ లేవన్నారు. 9 స్థానిక సంస్థలకు సంబందించి గ్రామ పంచాయతీల విలీనంపై కోర్టు కేసులు ఉన్నాయని, వాటిలో ఇప్పటికిప్పుడు ఎన్నికల నిర్వహణ కష్టమని చెప్పారు. మరో ఏడు స్థానిక సంస్థలకు సంబంధించి వార్డుల పునర్విభజన అంశంలో కోర్డు కేసులు ఉన్నాయన్నారు. రెండు మూడు రోజుల్లో అవి పరిష్కారమైతే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంతో చేపడతామని చెప్పారు. సెప్టెంబర్ మూడో తేదీన ప్రతి పోలింగు బూత్ వద్ద మ్యాపింగ్తో కూడిన ఓటర్ల జాబితా ప్రచురిస్తామన్నారు. వాటిపై అభ్యంతరాలు కూడా స్వీకరిస్తామని చెప్పారు. ఓటర్ల జాబితా మ్యాపింగ్ పారదర్శకంగా జరిగేలా ఎన్నికల సిబ్బందికి తర్ఫీదు ఇస్తామన్నారు. మ్యాపింగ్ ప్రక్రియ అనంతరం ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు వార్డుల వారీగా ఇంటింటా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గుర్తింపు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లేబర్ చట్టాలు తుంగలో తొక్కి..
కాకినాడ క్రైం: ‘‘వాళ్లకేముంది.. రూ.లక్షల్లో వేతనం. భద్రతతో కూడిన రెగ్యులర్ ఉద్యోగం, సమాజంలో గౌరవ మర్యాదలు, సకాలంలో జీతాలు, అదనంగా ఒకటా రెండా ఎన్నో ప్రయోజనాలు. 16 ఏళ్లుగా కేవలం రూ.5 వేల జీతాలకు పనిచేస్తున్న మా లాంటి దీనుల బాధ వారికేం తెలుస్తుంది. వాళ్లలాగే డిగ్రీలు చదువుకున్నాం, తలరాతలు బాగోక వారి కింద పని చేస్తున్నాం. వారి ఆధిపత్యాన్ని చూపడానికి మా కడుపులే కొట్టాలా..’’ ఇదీ కాకినాడ జీజీహెచ్లో అవుట్సోర్సింగ్ విధానంలో దశాబ్దంన్నరగా కేవలం రూ.5 వేలు జీతానికి పనిచేసి ఉద్వాసనకు గురైన ఉద్యోగుల మనోగతం. కాకినాడ జీజీహెచ్ ఓపీ విభాగంలో 22 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు (డీఈఓ)లుగా పనిచేస్తున్నారు. వీరు ఆసుపత్రికి వచ్చే రోగులకు ఓపీ చీటీలు జారీ చేస్తారు. వివరాలు కంప్యూటర్లో నమోదు చేస్తారు. అలాంటి కీలక విభాగంలో అవుట్సోర్సింగ్ విధానంలో వారంతా పని చేస్తున్నారు. 16 ఏళ్ల నుంచి రెండేళ్ల మధ్య అనుభవంతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో 10 నుంచి డిగ్రీ వరకు చదివిన వారున్నారు. తమ ఉద్యోగాలకు ఎప్పటికై నా ప్రాధాన్యం దక్కకపోదా, జీతాలు పెరగవా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కాస్తా కనీసం కాంట్రాక్టు ఉద్యోగమైనా కాకపోదా అని ఎదురు చూస్తున్నారు. కనీసం పీఎఫ్, ఈఎస్ఐలు కూడా లేకుండానే ఇన్నేళ్లు కేవలం రూ.5 వేల జీతానికి పని చేశారు. ఆసుపత్రి అవసరం తీరడానికి అధికారులు సైతం వీరిని వాడుకున్నారు. వీరే లేకపోతే ఓపీ విభాగాన్ని నిర్వహించేందుకు ఇబ్బంది వచ్చేది. కలెక్టర్నే తప్పుదోవ పట్టించి.. ఆసుపత్రి అధికారుల నిర్ణయంతో లబోదిబోమంటూ ఉద్యోగులంతా కలెక్టర్ హరేంధర్ ప్రసాద్ను ఆశ్రయించారు. 16 ఏళ్లుగా కేవలం రూ.5 వేల జీతంతో పనిచేస్తున్న తమకు ఆ ఉద్యోగం కూడా ఊడే పరిస్థితి వచ్చిందని, ఇప్పటికే తమలో ఆరుగురిని తొలగిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్ లావణ్యకుమారి ఆదేశాలతో అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్ ఉత్తర్వులు ఇచ్చారని వాపోయారు. స్పందించిన కలెక్టర్ ఆసుపత్రి అధికారులను పిలిపించి వివరణ కోరగా, టెండర్లో నియమావళి దాచి తప్పుదోవ పట్టించారని ఉద్యోగులు అంటున్నారు. టెండర్ రూల్స్ జారీ చేసినప్పుడు ఇన్నేళ్లుగా పనిచేసిన మా అర్హత, సమర్థతలు గుర్తురాలేదా అని అధికారులను డీఈఓలు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగాలు అమ్ముకోవడానికేనా? అర్హత, అనుభవంతో కొనసాగించాల్సిన ఉద్యోగాలను అమ్ముకునేందుకే కుటిల యత్నం చేస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆరుగురిని తొలగించి, ఆ స్థానంలో కొత్త వారిని నియమిస్తున్నారన్నారు. ఒక్కో ఉద్యోగం రూ.2 లక్షలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. దీనికి అధికారులు మద్దతు, భాగస్వామ్యమో తేలాలని సిబ్బంది డిమాండ్ చేశారు. ఫ ఊడిగం చేయించుకుని ఉద్వాసన ఫ జీజీహెచ్లో డీఈఓల పరిస్థితి ఫ 16 ఏళ్లు ఉద్యోగం చేసినా, రూ.5 వేలే జీతం ఫ ఇప్పుడేమో విధుల నుంచి తొలగింపు ఆసుపత్రి అధికారులు ఇన్నేళ్లుగా లేబర్ చట్టాలు తుంగలో తొక్కి తమను వినియోగించుకున్నారని డీఈఓలు అంటున్నారు. కనీస వేతనాల చట్టం 1948 ప్రకారం, కాంట్రాక్టు లేబర్ యాక్ట్ 1970, ఏపీ గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ రెమ్యూనరేషన్ రేట్ను అనుసరించి కనీస వేతనం నెలకి రూ.13,772 ఇవ్వాల్సి ఉంది. అయితే ఇన్నేళ్లుగా అందులో సగం కూడా ఇవ్వకుండా దారుణమైన శ్రమ దోపిడీకి పాల్పడి 22 మంది ఉద్యోగుల జీవితాలను అంధకారంలోకి నెట్టేశారు. టెండర్ రూల్స్ వదిలేసి.. సుమారు 16 ఏళ్ల క్రితం ఓ సంస్థ వీరిని నియమించుకుంది. అప్పటి నుంచి రూ. 5 వేల జీతంతోనే కొనసాగుతున్నారు. తాజాగా అన్నవరం దేవస్థానం సహా అనేకచోట్ల వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన కనకదుర్గ మ్యాన్పవర్ సప్లయర్స్ సంస్థకు డీఈఓల కాంట్రాక్టు మే నెలలో ఇచ్చారు. టెండర్ పిలిచినప్పుడే ఆసుపత్రి అధికారులు నియామక నియమావళితో టెండర్ డాక్యుమెంట్ విడుదల చేశారు. అందులో ప్రస్తుతం ఉన్నవారిని కొనసాగిస్తూ అదనంగా నియమించుకునే ఏ ఉద్యోగికై నా డిగ్రీ అర్హత తప్పనిసరి అని పేర్కొన్నారు. తీరా కాంట్రాక్టు వచ్చిన తర్వాత అనుమానాస్పద రీతిలో టెండర్ డాక్యుమెంట్లోని నియమావళిని రాసిన వారే తుంగలో తొక్కేశారు. ఈ వ్యవహారమే ప్రస్తుతం వివాదానికి దారి తీసింది. ఇన్నేళ్లుగా వెట్టిచాకిరీ చేసిన వారి ఉద్వాసనకు జీజీహెచ్ అధికారులు సిద్ధమయ్యారు. డిగ్రీ లోపు విద్యార్హత ఉన్నవారి అందరినీ, వారి అనుభవం, అందించిన సేవలను కూడా కనీసం పరిగణించకుండా నిర్థాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించారు. -
ప్రవాహ శక్తితోనే సాగునీరు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): విద్యుత్, డీజిల్, పెట్రోల్ వంటి ఎటువంటి ఇంధన అవసరం లేకుండా, కేవలం నీటి ప్రవాహ శక్తి (యాంత్రిక శక్తి) ఆధారంగా దిగువ ప్రాంతాల నుంచి ఎగువకు నీటిని ఎత్తిపోసే వినూత్న ‘హైడ్రో లిఫ్ట్‘ యంత్రాన్ని ఆవిష్కరించడంలో పెదపూడి మండలం కై కవోలు గ్రామానికి చెందిన రైతు పంపన శ్రీనివాస్ కృషి ఎనలేనిదని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ప్రశంసించారు. ఈ మేరకు సోమవారం స్థానిక పీజీఆర్ఎస్ హాలులో జాతీయ గుర్తింపు అవార్డు పత్రాన్ని శ్రీనివాస్కు అందించి అభినందనలు తెలిపారు. వాగులు, చెక్ డ్యామ్ల వద్ద నీటి ఉధృతికి ఇనుప టర్బైన్లు తిరుగుతాయని, గేర్ బాక్సుల సహాయంతో ఈ యాంత్రిక శక్తి ద్వారా పంపులు పనిచేసి, నీటిని ఎగువ ప్రాంతాలకు పంప్ చేస్తాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈ హైడ్రో లిఫ్ట్ 24 గంటల ప్రాతిపదికన పనిచేస్తూ, రోజుకు దాదాపు 25 లక్షల లీటర్ల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం కలిగి ఉందన్నారు. ఐటీఐ ఫిట్టర్ కోర్సు పూర్తి చేసిన పంపన శ్రీనివాస్, కొండ ప్రాంతాల్లో సాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్న రైతుల కష్టాలను ప్రత్యక్షంగా చూసి దాదాపు 10 ఏళ్ల పాటు శ్రమించి ఈ ప్రాజెక్ట్ నమూనాను సిద్ధం చేశారన్నారు. కేఎల్ విశ్వవిద్యాలయం అటల్ ఇన్నోవేషన్ మిషన్ అందించిన రూ.5 లక్షల ఆర్థిక సాయంతో వేట్లపాలెం చెక్ డ్యామ్ వద్ద ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారన్నారు. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 26 మంది గ్రాస్ రూట్ ఇన్నోవేటర్లలో ఒకరిగా నిలిచి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ప్రశంసలు అందుకోవడం జిల్లాకే గర్వకారణమన్నారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా ‘బెస్ట్ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్‘ పురస్కారాన్ని స్వీకరించారన్నారు. థాయిలాండ్ (బ్యాంకాక్)లో 30 దేశాలు పాల్గొన్న అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ప్రశంసా పత్రాలు, మెడల్స్ సాధించారన్నారు. జాతీయ అవార్డు గ్రహీత పంపన శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం 30 అడుగుల ఎత్తు వరకు నీటిని ఎత్తిపోసే ఈ యంత్రాన్ని, భవిష్యత్తులో 100 అడుగుల ఎత్తు వరకు పనిచేసేలా, దీని ద్వారా 10 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా నవీకరిస్తున్నానన్నారు. పేటెంట్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తెస్తానన్నారు.‘హైడ్రో లిఫ్ట్’ ఆవిష్కరణకు జాతీయ స్థాయి గుర్తింపు -
సర్టిఫికెట్లు ఇప్పించండి సారూ..
ప్రభుత్వ పథకాలు అందడం లేదు మా రేషన్ కార్డుకు వేరే వ్యక్తి మ్యాపింగ్ చేయడంతో మాకు ప్రభుత్వ పథకాలు ఏమీ అందడం లేదు. మార్చాలని కోరుతూ అధికారులు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. అయినా పరిష్కారం లభించడం లేదు. రెండేళ్ల క్రితం నా భర్త చనిపోయాడు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నాను. – చిక్కాల నారాయణమ్మ, వీరవరం, కిర్లంపూడి మండలం అధికారులు పట్టించుకోవడం లేదు మా గ్రామంలో నాకు 1.25 ఎకరాల భూమి ఉంది. కానీ ప్రస్తుతం ఎకరం మాత్రమే ఆన్లైన్లో నమోదైంది. మిగిలిన 25 సెంట్లు ఆన్లైన్లో కనిపించడం లేదు. సర్వే చేయాలని ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే మూడు సార్లు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశాను. రెండు నెలలుగా తిరుగుతున్న అధికారులు స్పందించడం లేదు. – దడాల పాము రాజు, కోదాడ, తొండంగి మండలం బోట్క్లబ్ (కాకినాడ సిటీ) / తుని రూరల్: ఫీజు రీయింబర్స్మెంట్తో సంబంధం లేకుండా చదువు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇప్పించాలని పీజీ విద్యార్థులు జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ను కోరారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చారు. తుని మండలం వి.కొత్తూరులో ఉన్న ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో 2024–26 విద్యా సంవత్సరంలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.60 వేల ఫీజుకు గాను ప్రభుత్వం రూ.48 వేలు కళాశాల ఖాతాకు జమ చేసిందని, మిగిలిన డబ్బు విద్యార్థులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పారు. ఫీజులు చెల్లించలేని విద్యార్థులే ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్నారని, అటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులను ప్రభుత్వం, ప్రభుత్వ కళాశాల యాజమాన్యం ఇబ్బందులకు గురిచేయడం దారుణమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.గంగాసూరిబాబు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యం తీరుతో నాక్ బీ గ్రేడ్ సర్టిఫికెట్ ఉన్న ఈ ప్రభుత్వ కళాశాల నాక్ గుర్తింపును కోల్పోయిందన్నారు. సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 324 అర్జీలను పీజీఆర్ఎస్లో సమర్పించారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అర్జీదారులు నెలల తరబడి అందించిన అర్జీలకు పరిష్కారం లభించకపోవడంతో మళ్లీ మళ్లీ వచ్చి దరఖాస్తులు సమర్పించాల్సి వస్తోందని వాపోయారు. పీజీఆర్ఎస్లో కలెక్టర్కు పీజీ విద్యార్థుల వినతి రెండేళ్లుగా తిరుగుతున్నాను మా గ్రామంలో నాకు 1.50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సర్వే చేయడంతో కేవలం ఎకరా మాత్రమే చూపిస్తోంది. మిగిలిన 50 సెంట్ల భూమి ఆన్లైన్లో నమోదు చేసేందుకు గత రెండేళ్లుగా దరఖాస్తు సమర్పిస్తూనే ఉన్నాను. అయినా పరిష్కారం లభించడం లేదు. స్థానిక సర్వేయర్ డబ్బులు ఇవ్వకుండా ఏ పనీ చేయడం లేదు. – పి.స్వామి, తాటిపర్తి, గొల్లప్రోలు మండలంమా భూమి ఆక్రమించుకున్నారు మా సమీప బంధువులు నా భూమిని ఆక్రమించుకొని ఇవ్వటం లేదు. నాకు ఉన్నదే 50 సెంట్ల భూమి. ప్రస్తుతం దానికి ఎటువంటి శిస్తూ చెల్లించడం లేదు. నా భూమి నాకు ఇవ్వమన్నా ఇవ్వడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాను. వేరే వ్యక్తి తోడు లేనిదే ఇల్లు కదలలేని పరిస్థితి నాది. అయినా అధికారులు కనికరించడం లేదు. – డొంక నారాయణమ్మ, రౌతులపూడి -
డీసీసీబీ ఇన్చార్జి సీఈవోగా సురేంద్రబాబు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): డీసీసీబీ ఇన్చార్జి సీఈవోగా సలాది సురేంద్రబాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 15న ‘డీసీసీబీకి దిక్కెవరు?’ శీర్షికతో ‘సాక్షి’లో వచ్చిన కథనానికి ఆప్కాబ్ అధికారులు, డీసీసీబీ చైర్మన్ స్పందించారు. అమరావతిలోని ఆప్కాబ్ డీజీఎం పనిచేస్తున్న సురేంద్రబాబును ఇన్చార్జి సీఈ వోగా నియమించారు. ప్రస్తు తం ఇన్చార్జి సీఈవోగా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్, డీజీఎం గా పనిచేస్తున్న శ్రీధర్ చౌదరి సెలవుపై వెళ్లడంతో బ్యాంకు కార్యకలాపాలకు ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో అప్కాబ్ అధికారులను ఇక్కడ నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సురేంద్రబాబు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జవాబుదారీతనంతో పనిచేయాలి : కలెక్టర్బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో జాబితాల రూపకల్పనకు చిత్తశుద్ధి, అంకితభావం, జవాబుదారీతనంతో పనిచేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లాలోని తహసీల్దార్లతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మండలాల వారీగా వివిధ అంశాల పురోగతిని, పెండింగ్ అంశాలను సమీక్షించారు. ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులూ సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో భూ రీ–సర్వే, రెవెన్యూ క్లినిక్లు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, పెండింగ్ అంశాలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. -
అ‘గౌరవం’పై ఇక న్యాయపోరాటమే!
● ఎంపీపీ, జెడ్పీటీసీలకు గౌరవ వేతనం విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం ● అత్యధికంగా వైఎస్సార్సీపీ సభ్యులనే కారణంతో చిన్నచూపు ● ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 62 మంది ఎంపీపీలు, 62 మంది జెడ్పీటీసీలు, 1,184 మంది ఎంపీటీసీలు ● వచ్చే నెలతో ముగియనున్న పదవీకాలం ● మొత్తం 40 నెలలకు వేతనాల బకాయి ● ప్రభుత్వంపై నమ్మకం లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమైన ప్రజాప్రతినిధులు గత్యంతరం లేక హైకోర్టును ఆశ్రయిస్తున్నాం మాకు, మా ఎంపీటీసీ సభ్యులకు గౌరవ వేతనం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తప్ప ఈ కూటమి ప్రభుత్వంలో విడుదల చేయలేదు. ఈ రెండేళ్లుగా ఎదురు చూశాం. అయినా ఫలితం లేదు. వచ్చే నెలతో మా పదవీ కాలం కూడా ముగుస్తుంది. వేతనాల విషయంలో ఇక ప్రభుత్వంపై నమ్మకం పోయింది. గత్యంతరం లేక హైకోర్టును ఆశ్రయిస్తున్నాం. – మార్గన గంగాధరరావు, ఎంపీపీ, కొత్తపేటకొత్తపేట: మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ ప్రతినిధుల గౌరవ వేతనం చెల్లింపు అంశాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. 80 శాతం స్థానిక సంస్థలు వైఎస్సార్సీపీ ఖాతాలోనే ఉండటమే దానికి కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఒక్క నెల గౌరవ వేతనం కూడా చెల్లించకపోవడం గమనార్హం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో 62 మంది జెడ్పీటీసీలు, 62 మంది ఎంపీపీలు, 1,184 మంది ఎంపీటీసీలు ఉన్నారు. 2021 సెప్టెంబర్ చివరి వారంలో వారు ప్రమాణస్వీకారం చేయగా అక్టోబర్ నుంచి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2023 మే వరకు రెండు విడతలుగా వేతనాలు చెల్లించింది. 2024లో బిల్లు పెట్టి మూడో విడత చెల్లించేందుకు చర్యలు తీసుకునే సమయంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రభుత్వం చెల్లించలేకపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నాటి నుంచి నేటి వరకు వారికి వేతనాలు ఇవ్వలేదు. వారి పదవీ కాలం సెప్టెంబరు 24తో ముగియనుంది. ఆ నెలతో కలిపి 40 నెలలకు, జెడ్పీటీసీ సభ్యులకు 13 నెలలకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. మొదటికే మోసం.. సర్పంచ్ల నుంచి జెడ్పీ చైర్మన్ల వరకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని పెంచుతామంటూ 2024 ఎన్నికలప్పుడు ఊదరగొట్టిన చంద్రబాబు నాయకత్వంలోని కూటమి నాయకులు, తీరా అధికారంలోకి వచ్చాక వారికి మొండిచేయి చూపారు. వేతనాలు పెంచడం అటుంచి కనీసం అసలు వేతనాలు కూడా చెల్లించలేదు. ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు నెలకు రూ.6 వేలు చొఽప్పున, ఎంపీటీసీ సభ్యులకు రూ.3 వేలు చొప్పున గౌరవ వేతనం కాగా ఆ చిన్నమొత్తాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించకుండా తాత్సారం చేస్తూ వస్తోంది. గౌరవ వేతనాల కోసం ఎంపీటీసీ సభ్యులు అధికారులు, ఎమ్మెల్యేల ద్వారా అనేకసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో తీర్మానాలు కూడా చేశారు. పలు మండలాల్లో సర్వసభ్య సమావేశాల్లో సైతం పార్టీ రహితంగా ధర్నాలు చేశారు. పామూరు ఎంపీపీ బాటలో న్యాయస్థానానికి.. ప్రభుత్వం స్థానిక ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనం చెల్లించకపోవడంపై ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు ఎంపీపీ గంగసాని లక్ష్మి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఆ పిల్ను స్వీకరించిన హైకోర్టు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫలితంగా ఆమెతో పాటు 13 మందికి ఖాతాల్లో 27 నెలల వేతనం జమ అయ్యింది. ఎంపీపీ లక్ష్మి బాటలో జిల్లాలో పలువురు ఎంపీపీలు తమ మండలాల పరిధిలోని ఎంపీటీసీ సభ్యులతో హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. నిధులు లేవు.. విధులు లేవు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎంపీటీసీ సభ్యులకు గౌరవ వేతనాలు ఇవ్వకపోవడమే కాదు.. తమ పరిస్థితిని మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు మాత్రమే పరిమితం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎంపీటీసీ సభ్యులకు నిధులు లేవు.. విధులు లేవు. గౌరవ వేతనాలైనా వెంటనే విడుదల చేయాలి. – నేలపూడి భీమరాజు, ఎంపీటీసీ సభ్యుడు, వాడపాలెం గౌరవ వేతనం విడుదల చేయాలి కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచింది. మాకు ఇప్పటికీ గౌరవ వేతనాలు ఇవ్వలేదు. మూడేళ్లకు పైగా చెల్లించవలసి ఉంది. మూడు నెలలకు ఒకసారి మండల పరిషత్ సమావేశానికి వెళ్లడం తప్ప అంతకు మించి గౌరవం కనిపించలేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గౌరవ వేతనం నిధులు విడుదల చేయాలి. – దూళి సూరిబాబు, ఎంపీటీసీ సభ్యుడు, అవిడి -
చిచ్చర పిడుగా.. బిత్తర చూపేలరా!
కాకినాడ: ఒక్క బిడ్డ బిడ్డా కాదు.. ఓ కన్ను కన్నూ కాదు అంటారు పెద్దలు. సరి ఈడు.. సరిజోడు.. సహాధ్యాయుల సావాసం ఓ వ్యక్తి ఉన్నతికి జిజ్ఞాసకు తోడ్పడుతుంది. పాఠశాల వ్యవస్థ ఏర్పాటుకు ఈ లక్ష్యమే ప్రాణం. ఆ లక్ష్యానికి భిన్నంగా మాట్లాడడానికి, భావ వ్యక్తీకరణకు మరొక జోడు లేకుండా రోజుల తరబడి సాగుతున్న ఆ చిన్నారి ప్రయాణం ఇంకెన్నాళ్లు సాగాలో.. గోగన్నమఠం ప్రాథమిక పాఠశాల నేటి ప్రభుత్వ విద్యా వ్యవస్థ దుస్థితికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఒకప్పుడు పదుల సంఖ్యలో విద్యార్థులు ఆటపాటలతో సందడిగా ఉండే పాఠశాలో నేడు ఒకే ఒక్క విద్యార్థి జి.సుదీర్ మిగిలాడు. ఆ చిన్నారికి చదువు చెప్పడానికి ఓ హెచ్ఎం.. వండి పెట్టడానికి ఓ ఆయా. ఇదీ ఆ పాఠశాల సంక్షిప్త స్వరూపం. ఇటీవలి వరకూ మరో విద్యార్థి కూడా ఉండేవాడు. అతడు కొన్నాళ్ల కిందట మరో పాఠశాలకు వెళ్లిపోవడంతో సుధీర్ ఒక్కడే మిగిలిపోయాడు. పాఠశాల బెంచ్పై ఒక్కడే కూర్చుండగా హెచ్ఎం తనకు తోచిన నాలుగు ముక్కలు వల్లె వేస్తూ రోజును గడిపేస్తున్నారు. -
మీనా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిలోకి పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఈ నెల 16న దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో నూకరాజు భార్య మీనా మృతదేహం శనివారం లభ్యం కాగా, ఆదివారం పోస్టుమార్టం పూర్తి చేశారు. ఇదిలావుండగా మీనా మృతదేహం బాగా పాడవడంతో కుటుంబీకులు సొంతూరు కాకినాడకు తీసుకెళ్లకుండా, ధవళేశ్వరంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కంబాలచెరువు (రాజమహేంద్రవరం) -
జుట్లు పట్టుకుని కొట్టుకున్న నర్సింగ్ అమ్మాయిలు
కాకినాడ రూరల్: తమ నర్సింగ్ విద్యార్థులు కాకినాడలో దాడులకు గురవుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలుసుకున్న మణిపూర్, అసోం, నాగాలాండ్ ప్రభుత్వాలు సీరియస్గా స్పందించడం రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కాకినాడలో నర్సింగ్ విద్యార్థునుల వివాదం, కొట్లాటల వ్యవహారంలో పరువు పోతోందని భావించి, ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పరిస్థితి సద్దుమణిగిందని కాకినాడ జిల్లా అధికారులు ప్రకటించారు. అయితే, పరిస్థితి ఇంకా నివురు గప్పిన నిప్పులానే ఉండటంతో నర్సింగ్ కళాశాల ప్రాంగణాన్ని పోలీసుల సాయంతో అధికారులు తమ ఆ«దీనంలోనే ఉంచుకున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) విష్ణువర్ధన్ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. కాగా, ఈ వివాదం, కొట్లాట తెలుగు, ఈశాన్య రాష్ట్రాల విద్యార్థునుల మధ్య దూరాన్ని పెంచింది. కాకినాడ వైద్యనగర్లోని ఎస్కే నర్సింగ్ ఆఫ్ కాలేజ్, ఆర్కే స్కూల్ ఆఫ్ నర్సింగ్ పేరిట పక్క పక్క భవనాలతో పాటు మరో రెండు సంస్థల పేరిట ఎదురుగా ఉన్న భవనాల్లో నర్సింగ్ విద్య బోధిస్తున్నారు. వీటిల్లో నాలుగేళ్ల జీఎన్ఎం, మూడేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సులు బోధిస్తున్నారు. మణిపూర్, అసోం, నాగాలాండ్కు చెందిన 31 మందితో పాటు తెలుగు విద్యార్థునులు కలిపి సుమారు 400 మంది ఇక్కడ చదువుతున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో మణిపూర్కు చెందిన విద్యార్థుని సెల్ఫోన్ చార్జింగ్లో ఉంచగా, అది కనిపించలేదు. దీనిపై ఆ విద్యార్థిని, మరికొందరు విద్యార్థునులు తోటి తెలుగు విద్యార్థునులను అడిగారు. దీనికి సరైన సమాధానం రాకపోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. తెలుగు, ఉత్తరాదిగా విద్యార్థునులు భాష, ప్రాంతాల ప్రాతిపాదికన విడిపోయి పిడిగుద్దులతో కొట్టుకున్నారు. సమాచారం అందుకున్న ఆరుగురు పోలీసులు వచ్చినా వారిని నివారించలేక చేతులెత్తేశారు. కొందరు తెలుగు విద్యార్థునుల చేతిలో కర్రలు పట్టుకుని ఉన్న దృశ్యాలను మణిపూర్ విద్యార్థునులు తమ ఫోన్లలో చిత్రీకరించి, వాటిని తమ కుటుంబ సభ్యులకు, ఆయా రాష్ట్రాల్లోని సోషల్ మీడియాకు పోస్టు చేశారు. దీంతో, అక్కడి వారిలో ఆందోళన మొదలైంది. తమ విద్యార్థులకు భద్రత కల్పించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేయడంతో మన రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అధికారుల పరిశీలన కాకినాడ కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, ఎస్పీ బింధుమాధవ్లు ఆదివారం ఉదయమే నర్సింగ్ కళాశాల, స్కూల్ను సందర్శించారు. మణిపూర్ విద్యార్థునుల భద్రతపై నేరుగా వారినే అడిగి తెలుసుకున్నారు. రక్షణ నిమిత్తం వారిని వేరే భవనానికి తరలించారు. సర్పవరం సీఐ ప్రకాష్ నేతృత్వంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సెల్ఫోన్ విషయమై విద్యార్థినుల మధ్య వివాదం తలెత్తిందని, మరే ఇతర కారణాలూ లేవని, ప్రస్తుతానికి సమస్య సద్దుమణిగిందని కలెక్టర్, ఎస్పీ మీడియాకు చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేశారని వెల్లడించారు. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన మరోవైపు ఏపీ నర్స్ అండ్ మిడ్వైవ్స్ కౌన్సిల్ (ఏపీఎన్ఎంసీ) రిజి్రస్టార్ కె.సుశీల కాకినాడలోని నర్సింగ్ స్కూల్, కళాశాల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నర్సింగ్ కళాశాలల నిర్వహణపై తమకు పది రోజుల క్రితమే ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. దీనిపై విచారణ జరిపి, ఈ నెల 25లోగా సమాధానం ఇవ్వాల్సిందిగా షోకాజ్ నోటీసు జారీ చేశామని చెప్పారు. నర్సింగ్ స్కూల్, కళాశాలలు నాలుగు పేర్లతో ఒకేచోట వేర్వేరు భవనాల్లో నిర్వహిస్తున్నారని, నిర్వహణ అధ్వానంగా ఉందని తెలిపారు.రెండు స్కూళ్లు, నాలుగు కళాశాలల పేరిట ఒకే భవనంలో తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. విద్యార్థుల బాధలు తెలుసుకున్నానని, ఇక్కడ దుర్భర పరిస్థితులున్నాయని చెప్పారు. ఒకవేళ ఆయా సంస్థల గుర్తింపు రద్దయితే ఇక్కడి విద్యార్థులకు వేరేచోటకు పంపుతామని తెలిపారు. ఈ నర్సింగ్ కళాశాలకు ఐఎన్సీ సరి్టఫికెట్ లేదన్నారు. సర్పవరం, కొవ్వూరు, ఎస్.అచ్యుతాపురం, విద్యుత్ నగర్ చిరునామాలతో వేర్వేరు సొసైటీలతో అనుమతులున్నప్పటికీ అన్నింటినీ వైద్యనగర్లోనే కొనసాగిస్తున్నారని వివరించారు. నర్సింగ్కు ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ అవసరమని, కానీ విద్యార్థులకు ఎక్కడకూ పంపించడం లేదని చెప్పారు. ఈ విద్యా సంస్థల డైరెక్టర్లు విజయలక్ష్మి, సుశీల మీడియాతో మాట్లాడుతూ, తమ సోదరుడు ఎంతో సేవాభావంతో ఈ సంస్థలను స్థాపించారని, ఆ దంపతుల మరణాంతరం తాము పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఇక్కడ చదువుకునేందుకు మణిపూర్ విద్యారి్థనులు 30 ఏళ్లుగా వస్తున్నారని, ఇదే చివరి బ్యాచ్ అని తెలిపారు. -
ఎవరి గోల వారిదే!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎవరి గోల వారిదే అన్నట్టు కూటమి పాలన సాగుతోంది.. చిన్న పనిచేసినా తామే చేశామని చెప్పుకోవడం విస్మయానికి గురిచేస్తోంది.. అసలు దాతలను పక్కనపెట్టేసి తమ క్రెడిట్ అంటూ ప్రజాప్రతినిధులు చెప్పుకోవడం జనానికి విస్తుపుట్టిస్తోంది. నిధులు ఒకరివి.. క్రెడిట్ మాత్రం తాము కొట్టేసేందుకు టీడీపీ, జనసేన ఎంపీలు విశ్వప్రయత్నాలు గందరగోళానికి గురిచేస్తోంది. క్యాన్సన్ యంత్రం నేను తెచ్చానని ఒక ఎంపీ వెల్లడిస్తే.. తమ అధినేత కృషితోనే అని మరో ఎంపీ స్పష్టం చేయడం ఆయా పార్టీ శ్రేణుల్లో అయోమయానికి గురి చేస్తోంది. ఎవరికి వారే క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారే తప్ప.. ఇద్దరు ఎంపీల కృషితో వచ్చిందని ప్రెస్నోట్లలో చెప్పకపోవడం శోచనీయం. ఇద్దరి మధ్యలో నలిగిపోవడం ఎందుకని భావించిన అధికారులు మాత్రం ఇద్దరి కృషి వల్లే అందిందంటూ చెప్పి చేతులు దులిపేసుకున్నారు. అసలేం జరిగిందంటే.. కాకినాడ జీజీహెచ్కు క్యాన్సర్ సేవల కోసం హైఎనర్జీ యాక్సిలరేటర్ మెషీన్ మంజూరైంది. ఓఎన్జీసీ సంస్థ సౌజన్యంతో ఈ పరికరం సమకూరింది. రూ.36.6 కోట్ల విలువైన యంత్రం శనివారం జీజీహెచ్కు చేరింది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఇప్పటి నుంచే అసలు ప్రచారం మొదలైంది. తన చొరవతోనే యంత్రం సమకూరిందని టీడీపీ రాజ్యసభ ఎంపీ సానా సతీష్, తాను, పవన్ కళ్యాణ్ కృషితో జీజీహెచ్కు చేరిందని జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వేర్వేరు ప్రకటనల్లో పేర్కొనడాన్ని చూస్తే, చంద్రబాబు వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నారా..? అనే అనుమానం కలగకమానదు. ఎవరివో నిధులైతే.. తమవల్లే అంటూ సొంత డబ్బా కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఓఎన్జీసీ సంస్థ మంజూరు చేసిన నిధులతో సమకూరిన యంత్రాన్ని కూడా తమ ఖాతాలో వేసుకోవాలని చూడటం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. క్రెడిట్ చోరీలో చంద్రబాబే ఘనుడు అనుకుంటే.. ఇద్దరు ఎంపీలు ఆయన కంటే ఘనుల్లా ఉన్నారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జనసేన, టీడీపీ మధ్య వర్గ విభేదాలు భగ్గుమంటున్న తరుణంలో ఈ పరిణామం ఇరుపార్టీల నేతల్లో మరింత ఆజ్యం పోస్తోంది. ఒకవేళ నిజంగా ఇద్దరి చొరవతో పరికరం మంజూరైందని అనుకున్నా.. మిత్రపక్షమైన ఇద్దరు ఎంపీలు వేర్వేరుగా పత్రికా ప్రకటనలు విడుదల చేయడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనిని బట్టి చూస్తే కూటమి నేతల మధ్య సఖ్యత కొరవడిందన్న విషయం స్పష్టమవుతోంది. ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎంపీల మధ్య సయోధ్య లేకపోవడంపై ఆయా పార్టీల శ్రేణులు గందరగోళానికి గురవుతున్నారు. చిన్న విషయానికే ఇద్దరు వేర్వేరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిస్థితేంటన్న వాదన వినిపిస్తోంది. సోమవారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2026ఫ ప్రచారం కోసం పాకులాట ఫ జీజీహెచ్కు ఓఎన్జీసీ సౌజన్యంతో క్యాన్సర్ యంత్రం ఫ తమ వల్లే వచ్చిందంటూ టీడీపీ, జనసేన ఎంపీల ప్రకటనలు ఫ యంత్రం ఇచ్చిన సంస్థను విస్మరించిన నేతలు నా చొరవతోనే.. కాకినాడ జీజీహెచ్కు అధునాతన క్యాన్సర్ చికిత్స సదుపాయాల కల్పనకు తన చొరవతోనే హై ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్, సిటీ సిమ్యులేటర్ వంటి పరికరాలతో క్యాన్సర్ చికిత్స కేంద్రం ఏర్పాటైందని టీడీపీ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని కలసి కోరానన్నారు. దీంతో పాటు ఢిల్లీలో ఓఎన్జీసీ అధికారులతో పలుమార్లు చర్చించినట్లు చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ఓఎన్జీసీ ముందుకొచ్చి సీఎస్ఆర్ నిధులు మంజూరు చేసినట్లు, యంత్రం ఏర్పాటైనట్లు పేర్కొన్నారు. పవన్, నా కృషితో.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో కాకినాడ జీజీహెచ్లో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం ఏర్పాటైందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మరో ప్రకటనలో పేర్కొన్నారు. చికిత్సలను అందుబాటులోకి తెచ్చేందుకు రెండేళ్లుగా తాను నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. పలుమార్లు జీజీహెచ్ వైద్యులు, పార్లమెంట్ సమావేశాల్లో అంశాన్ని ప్రస్తావించినట్లు వెల్లడించారు. నిరంతర సంప్రదింపులతో ఓఎన్జీసీ సంస్థ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.36.6 కోట్ల వ్యయంతో అత్యాధునిక యంత్రాన్ని సమకూర్చిందన్నారు. -
శుభములివ్వు సత్యదేవా..
అన్నవరం: శ్రావణ శుద్ధ ఏకాదశి, ఆదివారం కలిసి రావడంతో వేల మంది భక్తులతో రత్నగిరి కిటకిటలాడింది. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. దీంతో అన్నవరం దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవికి స్వర్ణపుష్పార్చన చేశారు. తర్వాత కుంకుమ పూజ, పుష్పార్చన నిర్వహించారు. భక్తుల రద్దీ కారణంగా సత్యదేవుని దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. రూ.200 టిక్కెట్ తీసుకున్న భక్తులను వెలుపల నుంచి దర్శనానికి అనుమతించారు. 2,500 వ్రతాలు జరగ్గా, సుమారు 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చింది. సరస్వతీదేవిగా వనదుర్గమ్మ శ్రావణమాస జాతర మహోత్సవాల్లో భాగంగా రత్నగిరిపై వనదుర్గమ్మ వారిని సరస్వతీదేవిగా అలంకరించారు. ఉదయం వివిధ పూజలు, చండీ పారాయణ చేశారు. సాయంత్రం లక్ష కుంకుమార్చన, చండీహోమం నిర్వహించారు. కొండ దిగువన తొలిపాంచా వద్ద కొలువైన కనకదుర్గమ్మ వారి జన్మ నక్షత్రం మూల సందర్బంగా అమ్మవారికి పండితులు చండీ హోమం జరిపారు. అనంతరం అమ్మవారికి నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి ప్రసాదాలు నివేదించారు. -
రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
కాకినాడ క్రైం: జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అరాచకాలకు పాల్పడినా, బెదిరింపులు, సెటిల్మెంట్లకు దిగినా చట్టప్రకారం చర్యలు చేపడతామని పోలీసు అధికారులు హెచ్చరించారు. కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవితం గడపాలని ఆకాంక్షించారు. కాకినాడ వన్ టౌన్ సీఐ నాగదుర్గారావు, టూ టౌన్ సీఐ మజ్జి అప్పలనాయుడు, పెద్దాపురం ఎస్సై పాపారావు, పెదపూడి ఎస్సై బుజ్జిబాబు, తిమ్మాపురం ఎస్సై గణేష్కుమార్ సహా పలు స్టేషన్ల ఎస్హెచ్ఓలు కౌన్సెలింగ్ నిర్వహించారు. కొనసాగిన జూడాల నిరసన కాకినాడ క్రైం: స్థానికంగా జూనియర్ వైద్యుల నిరసన 12వ రోజు కొనసాగింది. ఆదివారం కాకినాడ జీజీహెచ్ ఎదురుగా ఉన్న పీజీ వసతి గృహం ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. 65 ఏళ్లకు పదవీ విరమణ వయసు పెంచాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో ఎండీ, ఎంఎస్ చదివిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. -
లాగేసిన రాకాసి కెరటాలు
కాకినాడ రూరల్: ఆదివారం సెలవు రోజు కావడంతో ఆనందంగా గడుపుదామని ఆ నలుగురు యువకులు వచ్చారు.. సముద్రం వద్దకు వెళ్లి కెరటాలను చూసి మురిసిపోయారు.. సరదాగా స్నానాలు చేద్దామని దిగారు. ఆ సరదా ఎంతో సేపు నిలవలేదు. రాకాసి కెరటాలు అందులో ఇద్దరిని లోపలకు తీసుకుపోయాయి. ఈ ఘటన కాకినాడ రూరల్ మండలం చీడిగ, ఇంద్రపాలెం గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. దీనిపై తిమ్మాపురం పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ రూరల్ మండల పరిధిలో సూర్యారావుపేట ఓల్డ్ ఎన్టీఆర్ బీచ్ కొద్ది దూరంలో గుర్రాల బీచ్ ఉంది. ఇక్కడ స్నానాలకు పెద్దగా జనాలు రారు. అక్కడకు నలుగురు యువకులు వెళ్లారు. స్నానం చేద్దామని సముద్రంలోకి ఇంద్రపాలెం గ్రామానికి చెందిన పడాల యువకిశోర్ (20), చీడిగ గ్రామంలో నివాసం ఉంటున్న అనుసూరి వీరబాబు (21) దిగి, గల్లంతయ్యారు. వీరబాబు కవల సోదరుడు శ్రీగణేష్ సాయిరామ్, ఇంద్రపాలెం గ్రామానికి చెందిన మరో యువకుడు కాదా ఆదిత్య వెంకట సందీప్ కుమార్లు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణాలతో బయటపడిన వారు ఉప్పునీరు ఎక్కువగా తాగడంతో ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య సేవలందిస్తున్నారు. గల్లంతైన పడాల యువకిశోర్ విద్యుత్నగర్ ఐడియల్ కళాశాలలో ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. మరో యువకుడు అనుసూరి వీరబాబు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తిమ్మాపురం ఎస్సై గణేష్కుమార్, రూరల్ సీఐ చైతన్య కృష్ణ సంఘటన జరిగిన బీచ్ వద్దకు చేరుకుని గల్లంతవ్వడానికి గల కారణాలను ఆరా తీశారు. వీరి ఆచూకీ కోసం మత్స్యకారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టేందుకు చర్యలు చేట్టారు. ఈ విషయం తెలుసుకున్న గల్లంతైన యువ కిశోర్ తండ్రి వీరేష్, వీరబాబు తండ్రి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు సముద్రం వద్దకు చేరుకుని బోరున విలపించారు. తమ బిడ్డలను కాపాడాలని పోలీసులను వేడుకున్నారు. కవల సోదరులు వీరబాబు, శ్రీగణేష్ సాయిరామ్ల కుటుంబం ఇటీవలే చీడిగ నివాసం వచ్చిందని, సొంతూరు కరప మండలం గొడ్డటిపాలెం అని చెబుతున్నారు. వీరు హైదరాబాద్లో కొన్నేళ్లపాటు మకాం ఉండి ఇక్కడకు వచ్చారు. ఇద్దరు అన్నదమ్ముల్లో వీరబాబు గల్లంతు కాగా జీజీహెచ్లో శ్రీగణేష్ సాయిరామ్ చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గణేష్కుమార్ తెలిపారు. జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు, మైరెన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేకేలు వేసి.. కాపాడి ఆ నలుగురు యువకుల్లో సందీప్కుమార్ బయటికొచ్చి కేకలు వేయడంతో అక్కడే ఉన్న మత్స్యకారుడు, కెమెరా మ్యాన్ వెళ్లి సాయిరామ్ను కాపాడారు. దీంతో ప్రాణాపాయం తప్పిందని స్థానికులు అంటున్నారు. చికిత్స పొందుతున్న శ్రీగణేష్ సాయిరామ్పడాల యువకిశోర్ (ఫైల్) జీజీహెచ్లో కోలుకుంటున్న కాదా ఆదిత్య సందీప్కుమార్ఫ సముద్రంలో ఇద్దరు యువకుల గల్లంతు ఫ ప్రాణాలతో బయటపడిన మరో ఇరువురు ఫ సూర్యారావుపేట బీచ్లో ఘటన -
ఏలేరులో 76.49 మీటర్ల నీటిమట్టం
ఏలేశ్వరం: ఏలేరు ప్రాజెక్టులో ఆదివారం 76.49 మీటర్ల నీటిమట్టం నమోదైంది. వర్షాలు అనుకూలించకపోవడంతో అనుకున్న స్థాయిలో జలాలు లేవు. దీంతో సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి 1,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 86.56 మీటర్లకు 76.49 మీటర్ల నీటిమట్టం ఉంది. 24.11 టీఎంసీలకు గాను 9.69 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో ఆయకట్టుకు 100, విశాఖకు 200, తిమ్మరాజుచెరువుకు 50 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. లోవలో భక్తుల సందడి తుని రూరల్: తలుపులమ్మ లోవ దేవస్థానం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సుమారు 14 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు డిప్యూటీ కమిషనర్ పి.విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,95,855, పూజా టికెట్లకు రూ.3,58,180, కేశఖండనశాలకు రూ.16,680, వాహన పూజలు, ఇతర సేవలకు రూ.14,380, కాటేజీలు, వసతి గదులు, పొంగలి షెడ్ల అద్దెలు రూ.89,300, విరాళాలు రూ.40,173, వేద ఆశీర్వచనం రూ.17,298 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ, ధర్మకర్తలు, శ్రీవారి సేవకులతో కలసి పర్యవేక్షించామన్నారు. మీనా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిలోకి పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఈ నెల 16న దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో నూకరాజు భార్య మీనా మృతదేహం శనివారం లభ్యం కాగా, ఆదివారం పోస్టుమార్టం పూర్తి చేశారు. ఇదిలావుండగా మీనా మృతదేహం బాగా పాడవడంతో కుటుంబీకులు సొంతూరు కాకినాడకు తీసుకెళ్లకుండా, ధవళేశ్వరంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఉద్యోగ నియామకాలకు చట్టం చేయాలి రంపచోడవరం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానిక ఆదివాసీ నిరుద్యోగులకే దక్కేలా ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం తక్షణమే అమలు చేయాలని ఏపీ ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ (ఏటీఏ) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జలగం రాంబాబు, మువ్వల అమర్నాథ్ డిమాండ్ చేశారు. రంపచోడవరంలో ఆదివారం జరిగిన ఏటీఏ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, డీఎస్సీ–2025లో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదేవిధంగా టీచర్ నియామకాలు చేపడితే తీవ్ర స్థాయిలో పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. 1/70, అటవీ హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రంపచోడవరం షెడ్యూల్డ్ ప్రాంతంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఏటీఏను మరింత బలోపేతం చేసి, చట్టపరమైన హక్కులు సాధించుకుంటామని అన్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా విలీనం చేయకుండా ప్రతి గిరిజన పాఠశాలను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సరియం అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏటీఏ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి మట్ల కృష్ణారెడ్డి, గౌరవాధ్యక్షుడిగా కురసం ఫకీర్దొర, ఉపాధ్యక్షుడిగా కుంజం రాంబాబుదొర ఎన్నికయ్యారు. -
యానాంలో దారుణం.. భార్య పరాయి వ్యక్తితో చాటింగ్ చేస్తుందని..
సాక్షి, కాకినాడ జిల్లా: కేంద్రపాలిత యానాం కనకాల పేటలో దారుణం ఘటన చోటుచేసుకుంది. పరాయి వ్యక్తితో చాటింగ్ చేస్తుందన్న అనుమానంతో భర్త.. భార్యను హత్య చేసి గోదావరి నది పాయలో పడేశాడు. ఆరేళ్ల కిందట చెక్కా అప్పారావు, పువ్వల రేఖ ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం రేఖ ఫోన్లో మరోకరితో చాటింగ్ చేస్తుండగా చూసిన భర్త... గొడవకు దిగాడు.. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో భార్యను భర్త పిడిగుద్దులు గుద్ది.. గొంతు నులిమి చంపేశాడు.అనంతరం భార్య మృతదేహన్ని గోదావరి నది పాయలో పడేసి.. తన భార్య కనిపించడం లేదంటూ భర్త అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అప్పారావును విచారించారు. విచారణలో అప్పారావు నేరం ఒప్పుకున్నాడు. నదిలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. రేఖ మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. -
విద్యార్థిని ఫోన్ మాయం.. మాజీ సీఎం ట్వీట్, పరుగులు తీసిన కలెక్టర్, ఎస్పీ!
సాక్షి,కాకినాడ: ఓ కాలేజీ హాస్టల్లో విద్యార్థిని ఫోన్ మాయమైంది. అంతే సదరు హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులు మధ్య మధ్య మాట మాట పెరిగింది. చేతికి అందిన బకెట్లు,కర్రలు,చెప్పులు ఏది దొరికితే ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఫలితంగా విద్యార్థునుల సమస్యను పరిష్కరించాలని మాజీ సీఎం ట్వీట్ చేశారు. జిల్లా ఐఏఎస్, ఎస్పీ వంటి ఉన్నత స్థాయి పోలీస్ శాఖ అధికారులు హుటాహుటీన పరుగులు పెట్టారు.పోలీసుల వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలోని ఓ మహిళా నర్సింగ్ కాలేజీ హాస్టల్లో మొబైల్ ఫోన్ మాయమవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆగస్టు 21న హాస్టల్లో ఉంటున్న ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఓ విద్యార్థినికి సంబంధించిన ఫోన్ కనిపించకుండాపోవడంతో ఈ వివాదం ప్రారంభమైంది.ఘర్షణకు దారితీసిన పరిస్థితులు ఫోన్ పోవడానికి స్థానిక విద్యార్థులే కారణమనే అనుమానంతో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఈ వివాదం తీవ్రరూపం దాల్చి, తెలుగు విద్యార్థినులకు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులకు మధ్య వాగ్వాదానికి, ఘర్షణకు దారితీసింది. హాస్టల్ క్యాంపస్లో చేతికి ఏది దొరికితేదాన్ని విసురుకుంటూ పరస్పరం దాడులకు దిగడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో కొందరు విద్యార్థినులు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.👉ఇదీ చదవండి: సాధిక్ మామూలోడు కాదుఉన్నతాధికారుల జోక్యం ఘటన తీవ్రత పెరగడంతో మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ సైతం స్పందించి, విద్యార్థినుల మధ్య వివాదాన్ని పరిష్కరించాలని ట్విట్టర్ వేదికగా కోరారు. పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉండటంతో జిల్లా కలెక్టర్ (ఐఏఎస్) పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) తక్షణమే రంగంలోకి దిగారు.సమస్య పరిష్కారం జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు హుటాహుటీన హాస్టల్ను సందర్శించి, ఇరు వర్గాల విద్యార్థినులతో మాట్లాడి శాంతియుతంగా సమస్యను పరిష్కరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా, భద్రతా చర్యల్లో భాగంగా ఈశాన్య ప్రాంత విద్యార్థినులకు ప్రత్యేక వసతిని కల్పించారు. BREAKING ⚡ 🚨NORTHEAST STUDENTS ATTACKED BY MOB AT SK COLLEGE OF NURSING, ANDHRA PRADESH @AndhraPradeshCM 22 August 2026📍Valasapakala, Kakinada—A scuffle reportedly broke out between Northeast and local girl students following allegations of stolen mobile phones… pic.twitter.com/HN8X6ZfRsW— 📍SHANGH CHE🚭 (@JosephNaga1986) August 22, 2026 -
ఒక్కరోజు గడిస్తే దేశం దాటేవాడు.. ఫోన్, కార్డులు లేకుండా నాలుగు రాష్ట్రాల్లో..
సాక్షి, కాకినాడ: నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన అనంతరం పరారీలో ఉన్న సాధిక్ ఖాన్ను పోలీసులు ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్లోని మీరట్లో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సాధిక్ పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. తన ఆచూకీ బయటపడకుండా సెల్ఫోన్, డెబిట్, క్రెడిట్ కార్డులు వెంట తీసుకెళ్లకుండా.. రైలు ప్రయాణంలో ఇతరుల ఫోన్లు ఉపయోగిస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.ఆత్మహత్య తర్వాత పరారీనూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన తర్వాత సాధిక్ ఖాన్ సామర్లకోట నుంచి పరారయ్యాడు. అక్కడి నుంచి కోణార్క్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించి కర్ణాటకలోని వాడి రైల్వే స్టేషన్లో దిగినట్లు పోలీసులు గుర్తించారు. వాడి నుంచి తదుపరి తన ప్రయాణాన్ని కొనసాగించిన సాధిక్.. మహారాష్ట్రలోని సోలాపూర్కు చేరుకున్నాడు. అక్కడ తన స్నేహితుడిని కలిసినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. అనంతరం, సోలాపూర్లో కొంతసేపు మకాం వేసిన అనంతరం సాధిక్ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అక్కడి నుంచి ఢిల్లీకి, ఆపై ఉత్తరప్రదేశ్లోని మీరట్కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సాధిక్ వరుసగా ప్రాంతాలు మార్చుకుంటూ ప్రయాణించడంతో అతడి ఆచూకీ గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది.విదేశాలకు వెళ్లేందుకు స్కెచ్..మీరట్ చేరుకున్న తర్వాత కూడా సాధిక్ అక్కడే ఉండిపోవాలని భావించలేదని పోలీసులు గుర్తించారు. కేరళలోని మలబార్ తీరానికి చేరుకుని, అక్కడి నుంచి సముద్ర మార్గంలో విదేశాలకు పారిపోవాలని ప్రణాళిక వేసుకున్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఒక్కరోజు ఆలస్యమైనా దేశం దాటి వెళ్లేందుకు ప్రయత్నించేలా తన ప్రయాణాన్ని సాధిక్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేరళ తీరానికి చేరుకుని అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా విదేశాలకు వెళ్లిపోతే పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవచ్చని భావించినట్లు సమాచారం.ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్యే థామన్ ఆసుపత్రితో యువతి ఆత్మహత్యఇక, పోలీసులకు తన కదలికలపై ఎలాంటి ఆధారం దొరకకుండా ఉండేందుకు సాధిక్ మరింత జాగ్రత్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. తన వెంట సెల్ఫోన్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులను తీసుకెళ్లలేదు. సాధారణంగా సెల్ఫోన్ ద్వారా వ్యక్తి ప్రయాణించే ప్రాంతాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. అలాగే, బ్యాంకు కార్డుల వినియోగం ద్వారా కూడా అతడి కదలికలను పోలీసులు గుర్తించే అవకాశం ఉంది. దీంతో ఈ రెండింటినీ తన వెంట తీసుకెళ్లకుండా సాధిక్ ప్రయాణించినట్లు తెలిసింది. అయితే, ఇదే జాగ్రత్త చివరకు అతడికి చిక్కేలా చేసిన కీలక క్లూగా మారింది. రైలు ప్రయాణ సమయంలో సాధిక్ తోటి ప్రయాణికుల నుంచి సెల్ఫోన్ తీసుకుని తన సోదరి, ఓ లాయర్తో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. తన సొంత ఫోన్ ఉపయోగించకపోయినా.. ఇతరుల ఫోన్ల నుంచి చేసిన కాల్స్ అతడి ఆచూకీని గుర్తించేందుకు పోలీసులకు కీలక ఆధారంగా మారినట్లు తెలుస్తోంది. ఆ కాల్స్కు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు సాధిక్ కదలికలపై నిఘా పెట్టారు. చివరకు అతడు మీరట్లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు.మీరట్ కోర్టులో హాజరు..మీరట్లో సాధిక్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్ పొందిన పోలీసులు అతడిని కాకినాడకు తీసుకువస్తున్నారు. కాకినాడకు తీసుకువచ్చిన తర్వాత సాధిక్ను విచారించడంతో కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సాధిక్ను కాకినాడకు తీసుకువచ్చిన అనంతరం అతడి ప్రయాణ మార్గం, ఎవరెవరిని కలిశాడు, కేరళలో ఎవరిని సంప్రదించాలనుకున్నాడు, సముద్ర మార్గంలో విదేశాలకు వెళ్లేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నాడు అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించనున్నారు. -
ప్రతి అర్జీకీ పరిష్కారం చూపుతాం: కలెక్టర్
కాకినాడ రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతామని కలెక్టర్ ఎంఎస్ హరేంధిర ప్రసాద్ అన్నారు. వన్ మంత్ – వన్ విలేజ్– ఫోర్ విజిట్లో భాగంగా రమణయ్యపేట సర్పవరం జంక్షన్ వద్ద ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. కాకినాడ రూరల్, కరప మండలాలకు చెందిన పలువురు వచ్చి అర్జీలు అందజేయడంతో వాటిని కలెక్టర్ తీసుకుని సంబంధిన అధికారులను విచారించి, పరిష్కారానికి హామీలు ఇచ్చారు. కలెక్టరు మాట్లాడుతూ రూరల్లో సుమారు 60కు పైగా అర్జీలు వచ్చాయన్నారు. పరిష్కారం చూపకుంటే ఎలా.. తమ అర్జీలకు పరిష్కారం చూపని గ్రీవెన్స్లు ఎందుకుని తిమ్మాపురం మాజీ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. తిమ్మాపురంలో ఎకరం స్థలంలో నాన్ లేఅవుట్పై తాము గతంలో ఫిర్యాదు చేశామని, పంచాయతీ తీర్మానం చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదని ఆయన కలెక్టర్కు వివరించారు. గ్రామ పరిధిలో అనుమతులు లేకుండా ఓ ఫంక్షన్ హాలు నిర్మించారని, అలాగే తిమ్మాపురంలోని ఓ పీజీ స్టడీ సెంటర్లో అనుమతి లేకుండా భవనాలను నిర్మించారన్నారు. అనుకూలంగా ఉన్నందుకా.. తిమ్మాపురం గ్రామ పంచాయతీలలో లైబ్రరీ అటెండర్గా దొరబాబు అనే దివ్యాంగుడు దాదాపు 16 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. వైఎస్సార్ సీపీ చెందిన గ్రామ మాజీ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణకు అనుకూలంగా ఉంటున్నాడనే ఒక్క కారణంతో అతడి సర్వీసును పరిగణనలోకి తీసుకోకుండా కూటమి నేతల ఒత్తిడితో విధులకు రావద్దని హుకుం జారీ చేయడంతో పాటు రెండు నెలలుగా జీతం అందించలేదు. దీంతో దొరబాబు తన ఆవేదనను జిల్లా కలెక్టర్కు లిఖిత పూర్వకంగా తెలిపాడు. దీనిపై పంచాయతీ కార్యదర్శి రాజబాబును కలెక్టర్ వివరణ కోరడంతో లైబ్రరీ లేదని తెలిపారు. మెట్ల వద్ద వేచి ఉన్న వృద్ధుడు కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో పీజీఆర్ఎస్కు కలెక్టర్ వారడడంతో సర్పవరానికి చెందిన వృద్ధుడు వాసంశెట్టి వెంకటకృష్ణ అర్జీ ఇచ్చేందుకు వచ్చి సుమారు గంటకు పైగా వీల్ చైర్లోనే ఉన్నారు. మొదటి అంతస్తులో గ్రీవెన్స్ జరగడంతో అక్కడకు వీల్ చైర్లో వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఒంటి గంటకు కార్యక్రమం ముగించుకుని కిందకు వచ్చిన కలెక్టరు హరేంధిర ప్రసాద్కు అర్జీని ఆయన అందించారు. తనకు వృద్ధాప్య పింఛను వస్తుందని, కాలు దెబ్బతినడంతో నడవలేని స్థితిలో ఉన్న తనకు దివ్యాంగ పింఛను ఇప్పించాలని వేడుకున్నాడు. -
మహాధర్నాను విజయవంతం చేయండి
ప్రత్తిపాడు: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 17న విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరుగనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా కన్వీనర్ అజయ్ పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు 100 శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని, చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి రూ. 50 లక్షల నష్ట పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ సదుపాయం కల్పించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలనే ప్రధాన డిమాండ్లతో ప్రభుత్వానికి 45 రోజుల గడువు ఇచ్చామన్నారు. ఈ నెల 20 నాటికి గడువు ముగుస్తుందని చెప్పారు. గడువులోగా ప్రభుత్వం నుంచి చర్చలు జరపకపోతే సెప్టెంబర్ 7వ తేదీ దాటిన తర్వాత ఏ క్షణం నుంచైనా సమ్మె చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు సమ్మె నోటీసులను వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీపీహెచ్, డీఎంఈ, దీఎస్హెచ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె.అనితతో పాటు జిల్లాలోని మండల స్థాయి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అందజేశామని అజయ్ వివరించారు. -
● ఈ పైనమేలా..
పట్టుజారితే ప్రమాదమని తెలిసినా పట్టించుకోవడం లేదు. తొండంగి మండలం గోపాలపట్నం నుంచి బెండపూడి జాతీయ రహదారిపై పలు వాహనాలు ఇలా ప్రమాదకరంగా ప్రయాణించాయి. బరువైన బండ రాళ్లను రవాణా చేసే సమయంలో ఇనుప రోప్లతో భద్రంగా తీసుకెళ్లాలి. కానీ ట్రాలీపై గ్రానైట్ రాళ్లను కట్టకుండానే తరలిస్తున్నారు. అదేవిధంగా గూడ్స్ వ్యాన్లో జనాన్ని ఎక్కించుకుని, కేబిన్పై సైతం కూర్చోబెట్టి తీసుకెళ్లారు. ఇలాంటి ప్రయాణాలను అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. – తొండంగి -
రిమాండ్ ఖైదీ పరారీ
కాకినాడ క్రైం / తుని రూరల్: తుని సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోక్సో నిందితు డు పోలీసుల కళ్లుగప్పి పరా రయ్యాడు. పోలీసుల కథ నం ప్రకారం. తుని రూరల్ కేఓ మల్లవరం గ్రామానికి చెందిన 23 ఏళ్ల అడిగెళ్ల భానుప్రకాష్ కొద్దిరోజుల క్రితం పోక్సో కేసులో అరెస్టయ్యి తుని సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కోర్టు ఆదేశాల మేరకు భానుప్రకాష్ను ఎస్కార్ట్తో కాకినాడ జీజీహెచ్కు సామర్థ్య పరీక్ష కోసం శనివారం పంపారు. పరీక్ష పూర్తయిన తర్వాత ఎం–4 వార్డులో ఉంచారు. అ దే సమయంలో ముద్దాయి భార్య, కుమారుడు అ క్కడికి వచ్చారు. తన కుమారుడిని ఎత్తుకుంటాన ని కోరగా ఎస్కార్ట్ కానిస్టేబుల్ బేడీలు తొలగించారు. ఇదే అదునుగా ఒక్కసారిగా ఖైదీ పరుగు అందుకున్నాడు. ఆగమేఘాలపై మెడికల్ వార్డు నుంచి బయటకు వచ్చి, జన్మభూమి సత్రం మీదు గా ఆసుపత్రి వెనుక గోడ దూకి పరారయ్యాడు. ఎవరికై నా ముద్దాయి సమాచారం తెలిస్తే వెంటనే సర్కిల్ ఇన్స్పెక్టర్ 94407 96531, రూరల్ ఎస్సై 94407 96573 ఫోన్ నంబర్లకు తెలిపారు. కొనసాగుతున్న జూడాల నిరసనకాకినాడ క్రైం: కాకినాడలో జూనియర్ డాక్టర్ల నిరసన పదకొండో రోజుకు చేరింది. అత్యవసర వైద్య సేవలను బహిష్కరించిన జూడాలు శనివారం రిలే నిరాహార దీక్షలు, ఫ్లాష్ మార్చ్ నిర్వహించారు. స్టైఫండ్ 15–30 శాతం మేర పెంచాలని, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో ఎండీ, ఎంఎస్ చదివిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని, 65 ఏళ్ల వరకు ఉద్యోగ విరమణ వయసును పెంచడం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సాయంత్రం నిర్వహించిన ఫ్లాష్మార్చ్ పీఆర్ కళాశాల, డీఎంహెచ్ఓ కార్యాలయం, జిల్లా పరిషత్ జంక్షన్ మీదుగా జీజీహెచ్ తల్లి పిల్లల విభాగం వరకు కొనసాగింది. -
నూకరాజు కుటుంబం ఆత్మహత్య కలచివేసింది
కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కాకినాడ రూరల్: పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలచివేసిందని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. ఉద్యోగులు కుటుంబ పరమైన సమస్యలను, ఒత్తిడి, మానసిక ఇబ్బందులను సహచర ఉద్యోగులతో పంచుకోవాలని సూచించారు. కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో శనివారం పీజీఆర్ఎస్కు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం రాత్రి 11 గంటలకు నూకరాజు వాట్సాప్ మెసేజ్లు పెట్టడంతో పంచాయతీరాజ్ సిబ్బంది ఆయన వద్దకు రీచ్ అయ్యేందుకు ప్రయత్నించారన్నారు. కింద స్థాయి ఉద్యోగులు రెగ్యులర్గా ఎలా ఉంటున్నారో.. టెన్షన్లో ఉన్నారా అనేది గుర్తు పెట్టాలని, నూకరాజు ఉదంతం ఒక పాఠం లాంటిందన్నారు. ఆయన సమస్యను తమ దృష్టికి తీసుకువచ్చి ఉంటే కచ్చితంగా న్యాయం చేసేవారమన్నారు. నేడు కాకినాడకు సాధిక్ ఖాన్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. షేక్ సాధిక్ ఖాన్ వేధింపుల కారణంగానే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ లెటర్ల ఆధారంగా పోలీసులు గుర్తించారు. అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటనకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న షేక్ సాధిక్ ఖాన్ను పట్టుకునేందుకు రాజమహేంద్రవరం, కాకినాడ పోలీసులు జల్లెడ పట్టారు. అతను దేశం దాటి వెళ్లిపోకుండా ముందుగా పోలీసులు పాస్పోర్ట్ను సీజ్ చేశారు. అనంతరం అతను విదేశాల్లో ఎవరెవరిని సంప్రదిస్తున్నాడో కాల్ డేటా ఆధారంగా వివరాలు సేకరించారు. చివరికి శుక్రవారం సాయంత్రం నిందితుడిని మీరట్లో పట్టుకుని అక్కడి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు ట్రాన్సిట్ వారెంట్పై అతన్ని కాకినాడకు తీసుకువస్తున్నారు. రిమాండ్ ఖైదీ మృతి కంబాలచెరువు: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న ఆవుల శ్రీనివాస్ (55) శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం బొయిగాపల్లికి చెందిన శ్రీనివాస్ను జగ్గంపేట పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరి 6న గంజాయి కేసులో అరెస్టు చేశారు. కోర్టు అతనికి రిమాండ్ విధించింది. శ్రీనివాస్కు పలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇదిలా ఉండగా తెల్లవారుజామున కడుపునొప్పి రావడంతో జైలు సిబ్బంది అతనిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతను అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రత్నగిరి కిటకిట అన్నవరం: స్థానిక శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి శ్రావణ శుద్ధ దశమి, శనివారం సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి విచ్చేశారు. రెండు వేల సత్యదేవుని వ్రతాలు జరిగాయి. దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదు వేల మందికి అన్నదానంలో భోజనం పెట్టారు. ఉదయం సత్యదేవుడు అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు పల్లకీ సేవ నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తూర్పురాజగోపురం లోపల ప్రాకారంలోకి ఊరేగింపుగా తీసుకువచ్చారు. పూజలు చేసి పల్లకీ సేవ ప్రారంభించారు. పోక్సో చట్టంపై అవగాహన అవసరం ధవళేశ్వరం: మహిళలు, చిన్నారులకు పోక్సో చట్టంపై అవగాహన పెంచాలని రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి రెడ్డిప్రసన్న సూచించారు. ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గణేష్ నేతృత్వంలో శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికోన్నత పాఠశాలలో బాలికలకు చట్టాలు, పోక్సో యాక్ట్, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రిన్సిపల్ సివిల్ జడ్జి రెడ్డి ప్రసన్న మాట్లాడుతూ చదువుకునే దశలో పిల్లలు పాటించాల్సిన నియమాలు, అపరిచిత వ్యక్తులతో ప్రవర్తించాల్సిన తీరు, ఈవ్టీజింగ్, గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు. ధవళేశ్వరం పీఎస్ ఎస్సై హరిబాబు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. -
బ్యాగోతాలు బట్టబయలు
చంద్రబాబు సర్కారు బాగోతమిది.. భావిభారత పౌరులపై చూపిన నిర్లక్ష్యమిది.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు నాసిరకం బ్యాగులు ఇచ్చి, అపహాస్యం చేసిన వైనమిది.. ఆ బ్యాగులు ఎక్కడికక్కడే చిరిగిపోయి, జిప్లు, కుట్లు ఊడిపోవడం కనిపిస్తోంది. ఇది అందరినీ విస్తుపోయేలా చేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాణ్యమైన బ్యాగులు ఇవ్వగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నాసిరకానికే పెద్దపీట వేసింది. కాకినాడలో చిరిగిన బ్యాగ్ను సైకిల్ పెట్టుకుని స్కూల్కు వెళ్తూ..● విద్యార్థులకు నాసిరకం స్కూల్ బ్యాగులు ● చంద్రబాబు సర్కారు బాగోతమిది ● రెండు నెలలకే మూలకు చేరిన వైనం ● జిల్లా వ్యాప్తంగా 70 శాతం ఇదే పరిస్థితి సాక్షి, ప్రతినిధి, కాకినాడ: భావిభారత పౌరులను సైతం మోసగించిన చరిత్రను చంద్రబాబు ప్రభుత్వం మూటగట్టుకుంది. విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు ఉండాల్సిన స్కూల్ బ్యాగులు మూణ్ణాళ్ల ముచ్చటగానే మారాయి. బ్యాగులు అందించిన రెండు నెలలకే జిప్లు ఊడిపోతున్నాయి. బ్యాగు చిరిగిపోతోంది. పోనీ కుట్టించుకుని వాడుకుందామంటే కుట్టించిన రోజుల వ్యవధిలో బ్యాగు వస్త్రం చివికిపోతోంది. చేసేది లేక.. విద్యార్థులు తమ సొంత డబ్బులతో బ్యాగులు కొనుగోలు చేసుకునే పరిస్థితి తలెత్తింది. జిల్లా వ్యాప్తంగా 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు ‘డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ (ఎస్ఆర్కేవీఎం) పేరుతో కిట్లు పంపిణీ చేశారు. మొత్తం 1,280 ప్రభుత్వ పాఠశాలల్లో 1,28,988 స్కూల్ బ్యాగుల కోసం విద్యా శాఖ ఇండెంట్ పెట్టింది. జూన్ 20 నాటికి 20,850 బ్యాగులు మాత్రమే జిల్లాకు వచ్చాయి. అంత తక్కువగా వచ్చినా, ఆ పార్టీ నేతలతో వాటిని ఆర్భాటంగా పంపిణీ చేయించేశారు. మిగిలినవి జూలై రెండో వారానికి దశల వారీగా వచ్చాయి. ఇదేం కక్కుర్తి చంద్రబాబు సర్కారు మూడు దశల్లో పంపిణీ చేసిన బ్యాగులు కనీసం రెండు నెలలు కూడా ఉండకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పుస్తకాలు ఎక్కువగా పెట్టుకుంటే బ్యాగ్ మొత్తం కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయమై తల్లిదండ్రుల సమావేశాల్లో (పీటీఎం)లలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను నిలదీశారు. ఇచ్చిన నెలల వ్యవధిలోనే బ్యాగ్లు పాడైపోవడమేంటని ప్రశ్నించారు. దీంతో నీళ్లు నమిలిన విద్యాశాఖ అధికారులు పాడైన బ్యాగ్ల స్థానంలో కొత్త బ్యాగ్లు అందిస్తామని చెప్పారు. అయితే జిల్లాలో కొంత మందికి మాత్రమే ఇచ్చి.. మిగిలిన వారికి పంగనామాలు పెట్టారు. ఇలా ప్రభుత్వం పంపిణీ చేసిన 100 బ్యాగుల్లో 70 బ్యాగుల పరిస్థితి ఇలాగే ఉందన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం రూ.2 వేలు పెట్టి కొనుగోలు చేసి.. విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు పట్టుమని రెండు నెలలు కూడా మన్నకపోవడంతో తల్లిదండ్రులు అవాక్కవుతున్నారు. చేసేది లేక చిరిగిపోయిన బ్యాగ్ల స్థానంలో సొంత డబ్బులతో కొత్త బ్యాగులు కొనుగోలు చేసుకుంటున్నారు. కిట్లలోనూ కిటుకే.. చంద్రబాబు ప్రభుత్వం అందించిన విద్యార్థి మిత్ర కిట్లలోనూ కనికట్టే చూపారు. బ్యాగులు అత్యంత నాసిరకంగా ఉన్నాయి. బూట్ల సైజు సరిపోవడం లేదు. ఒక తరగతి విద్యార్థికి ఇవ్వాల్సినవి రెండో తరగతి విద్యార్థికి ఇచ్చారు. కిట్లో ఒక వస్తువు ఇస్తే మరో వస్తువు ఉండటం లేదు. బ్యాగులతో పాటు డిక్షనరీలు, యూనిఫాం, సాక్స్లు ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులే కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతమెంతో ఘనం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ‘జగనన్న విద్యా కానుక’ పేరుతో నాణ్యమైన బ్యాగ్లు, బూట్లు, యూనిఫామ్ అందించేవారు. పైగా పాఠశాలలు తెరిచేందుకు రెండు నెలల ముందే విద్యార్థులకు కానుకలు చేరేవి. అలా ఏటా 1.59 లక్షల మందికి పైగా విద్యార్థులకు నాణ్యమైన కిట్లు అందించేవారు. ఇందుకు గాను సుమారు రూ.30 కోట్లు వెచ్చించేవారు. కొనుగోలు చేసుకున్న కొత్త బ్యాగ్తో.. కమీషన్లు దండుకోవడం సిగ్గుచేటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూటమి ప్రభుత్వం సరఫరా చేస్తున్న స్కూల్ బ్యాగులు వారం రోజుల్లోనే చిరిగిపోతున్నాయి. ఈ బ్యాగుల సరఫరాలో కమీషన్లు దండుకోవడం సిగ్గుచేటు. మార్కెట్లో రూ.150 కూడా చేయని నాసిరకం బ్యాగులు ఇచ్చారు. జిప్లు పనిచేయడం లేదు, బెల్టులు తెగిపోతున్నాయి, కుట్లు ఊడిపోతున్నాయి. బడా కాంట్రాక్టర్లకు రూ.వేల కోట్లు కట్టబెట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన కిట్లను రద్దు చేసి, నాసిరకం సరుకు ఇవ్వడం ద్వారా పేద విద్యార్థులను అవమానిస్తున్నారు. జిల్లాలో పంపిణీ చేసిన అన్ని బ్యాగులను వెనక్కి తీసుకుని, నాణ్యమైన బ్యాగులు ఇవ్వాలి. – చింతలపూడి సునీల్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు -
వాడపల్లికి పోటెత్తిన భక్తజనం
ఆత్రేయపురం: మండలంలోని వాడపల్లి వవేంకటేశ్వరుని దర్శనానికి శనివారం భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. భక్తుల గోవింద నామ స్మరణతో మాడవీధులు మార్మోగాయి. స్వామివారిని సుమారు లక్షకు పైగా భక్తులు దర్శించారని, భారీ ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్థానిక గౌతమి గోదావరిలో స్నానమాడి అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. భారీ భక్తజనంతో క్యూలైన్లు నిండిపోయాయి. ఆలయంలో సుప్రభాత సేవ, తొలి హారతి, నీరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాలభోగం నిర్వహించారు. భక్తులు విశిష్ట దర్శనం, ఉచిత దర్శనం ద్వారా స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. క్షేత్రపాలకులు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామిని భక్తులు దర్శించారు. భక్తులు ఉచిత అన్న ప్రసాదం, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆర్యవైశ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులుకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈఓ సూర్యచక్రధరరావు, చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు వాడపల్లి సుందర శేషావతారం స్వామి వారి పూజలు, సేవలు, కై ంకర్యాలను పర్యవేక్షించారు. -
జీజీహెచ్లో హైఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్
కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్లో క్యాన్సర్ సేవల కోసం హైఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్ మెషీన్ మంజూరైంది. ఓఎన్జీసీ సంస్థ సౌజన్యంతో ఈ పరికరం సమకూరింది. ఈ మేరకు, శనివారం ఆసుపత్రి అధికారులు రేడియాలజీ కాన్ఫరెన్స్ హాల్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్, రేడియేషన్ అంకాలజీ ప్రొఫెసర్, హెచ్ఓడీ శ్రీనివాసన్ మాట్లాడుతూ, క్యాన్సర్ బాధితులకు చికిత్స, నివారణ కోసం రేడియేషన్ చేస్తామన్నారు. ఇందుకు జీజీహెచ్లో తక్కువ సామర్థ్యం ఉన్న టెలీ కోబాల్ట్ మెషీన్ను వినియోగిస్తున్నామన్నారు. ఒక రోజులో గరిష్టంగా 30 మందికి మాత్రమే రేడియేషన్ ఇవ్వగలుతున్నామన్నారు. అయితే కొత్తగా మంజూరైన హైఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్ ద్వారా ఒక రోజులో 100 మందికిపైగా క్యాన్సర్ బాధితులకు రేడియేషన్ చేయవచ్చని తెలిపారు. ఈ యంత్రం ధర రూ.36.6 కోట్లు కాగా, రూ.3.5 కోట్ల విలువైన సీటీ సిమ్యులేటర్ను ఓఎన్జీసీ అందిస్తోందన్నారు. వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ ఐటీఐ సమీపంలో మూడెకరాల్లో నిర్మిస్తున్న క్యాన్సర్ ఆసుపత్రి ఆవరణలో 12,800 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో ప్రత్యేక విభాగాన్ని నిర్మించామన్నారు. భారీ బంకర్లు సిద్ధమయ్యాయని, యంత్రాలను వీటిలోనే ఉంచుతామని శ్రీనివాసన్ తెలిపారు. ప్రస్తుత కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి యంత్రం జీజీహెచ్కు మంజూరు అయ్యేలా అన్ని అధికారిక కార్యకలాపాలు సకాలంలో పూర్తి చేశారన్నారు. -
పుత్రశోకంలోనూ ప్రాణదాతలై..
కాకినాడ రూరల్/సఖినేటిపల్లి: ఎదిగొచ్చిన కుమారుడు తమకు అండగా ఉంటాడని మురిసిపోయిన ఆ తల్లిదండ్రులను విధి చిన్న చూపు చూసింది. డ్రైవర్గా పనిచేస్తూ చేదోడుగా ఉన్న అతడిని వారికి దూరం చేసింది. అయితే కుమారుడి అవయవాలను దానం చేసి, పుత్ర శోకంలోనూ ఆ తల్లిదండ్రులు ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ముత్యాల తేజా దుర్గ హనుమంత్ (19) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. బిడ్డను కోల్పోయిన విషాదంలో ఉన్న తల్లిదండ్రులు వరలక్ష్మి, నాగేశ్వరరావు, మేనమామ రావి ఆంజనేయులు, అక్కా బావ చల్లా శిరీష, పవన్లు హనుమంత్ అవయవదానానికి ముందుకు వచ్చి సమ్మతించారు. ఈ మేరకు సర్పవరం జంక్షన్లోని కిమ్స్ ట్రస్ట్ ఆస్పత్రిలో శనివారం తెల్లవారుజామున హనుమంత్ అవయవాలను సేకరించారు. ఒక కిడ్నీని కిమ్స్ ట్రస్ట్ ఆస్పత్రిలో అవసరమైన రోగికి విజయవంతంగా మార్పిడి చేశారు. మరో కిడ్నీని అవయవ కేటాయింపు ప్రక్రియ ప్రకారం విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కిమ్స్ ట్రస్ట్లో నిర్వహించిన క్యాడావర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కార్యక్రమంలో సర్జన్ డాక్టర్ గణేష్ ఆదిమూలం, వైద్యులు సనా ప్రవీణ్, కిశోర్ కుమార్, కళ్యాణ్ చక్రవర్తి, ఎస్పీహెచ్ఎస్ రామకృష్ణ పాల్గొన్నారు. కిడ్నీ మార్పిడి విజయవంతంగా జరిగినట్టు కిమ్స్ ట్రస్ట్ ఆస్పత్రి సీఓఓ డాక్టరు రవి సంతోష్ తెలిపారు. గేదె అడ్డురావడంతో ప్రమాదం సఖినేటిపల్లి మండలం అంతర్వేదికరకు చెందిన ముత్యాల తేజ దుర్గా హనుమంతు ఈ నెల 17వ తేదీ రాత్రి అంతర్వేది దేవస్థానం నుంచి ఇంటికి బైక్పై వస్తున్నాడు. మార్గం మధ్యలో గేదె అడ్డు రావడంతో దాన్ని ఢీకొని పడిపోయాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని కుటుంబ సభ్యులు తొలుత మలికిపురం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అటుపై మెరుగైన చికిత్స కోసం అమలాపురం కిమ్స్, అక్కడ నుంచి కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, అనంతరం ట్రస్టు ఆసుపత్రికి తరలించారు. అక్కడ గత రాత్రి హనుమంతు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కొందరికి జీవితం ఇవ్వాలన్న ఉద్దేశంతో హనుమంతు అవయవాలను తల్లిదండ్రులు దానం చేశారు. ఆదర్శంగా నిలిచిన తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో కుమారుడు బ్రెయిన్ డెడ్ అవయవాలను దానం చేసిన కుటుంబ సభ్యులు కిమ్స్ ట్రస్ట్ హాస్పటల్లో విజయవంతంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ -
ఆటే పంచప్రాణాలు
సాక్షి, అమలాపురం: కోనసీమ అంటే పచ్చని కొబ్బరి తోటల అందం, గోదావరి పాయల పరవశం మాత్రమే కాదు. ఇప్పుడు షటిల్ బ్యాడ్మింటన్కు కూడా చిరునామాగా మారింది. అంతర్జాతీయ డబుల్స్ సంచలనం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, ఆకుల సునీల్, కృష్ణంరాజు, డి.సునీల్ కుమార్ వంటి స్టార్ షట్లర్లను ఈ నేల అందించింది. ప్రస్తుతం కోర్టుకు న్యాయం చేసే న్యాయ నిర్ణేతలకు సైతం పుట్టినిల్లుగా మారింది. ఆశ్చర్యం ఏమిటంటే.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఐదుగురు టెక్నికల్ అఫీషియల్స్ పేర్లు శ్రీనివాసే కావడం విషయం. పాయసం, గొల్లకోటి, దొడ్డా, ఏవీ, అడపా.. వీరే కోనసీమ షటిల్ పంచ పాండవులు. టీచర్ ఉద్యోగం చేస్తూనే (ఒకరికి త్రుటిలో తప్పింది), షటిల్పై మక్కువతో 18 ఏళ్లుగా కోర్టులో సైడ్లైన్కు, సర్వీస్ ఫాల్ట్లకు కాపలా కాస్తున్న ఈ పంచ పాండవుల ప్రస్థానంపై కథనం. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన బ్యాడ్మింటర్ రిఫరీలు ఐదుగురి పేరూ శ్రీనివాస్ కావడం గమనార్హం నలుగురు ఉపాధ్యాయులు, ఒకటికి త్రుటిలో తప్పిన అవకాశం -
కట్టుకున్న భర్తే కాలయముడు
యానాం: ప్రేమించి, కులాంతర వివాహం చేసుకుని, ఆరేళ్ల కాపురం చేసిన అనంతరం కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. యానాంలో కలకలం రేపిన ఈ ఘటనపై సీఐ డి.సురేష్బాబు తెలిపిన వివరాల ప్రకారం.. యానాం పట్టణ పరిధిలో భీమ్ నగర్కు చెందిన పువ్వల రేఖ (25), కనకాలపేటకు చెందిన చెక్కా అప్పారావు ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేరుకున్నారు. వీరిలో రేఖ ఎస్సీ సామాజికవర్గానికి, అప్పారావు మత్స్యకార సామాజిక వర్గానికి చెందినవారు. పెళ్లయిన అనంతరం దంపతులిద్దరూ కనకాలపేటలో నివాసం ఉంటున్నారు. అయితే వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రేఖను అప్పారావు దారుణంగా హింసించి, చాతీపై కూర్చుని ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. మృతదేహాన్ని ఆటోలో తీసుకుని వెళ్లి మెట్టకూరు శివారు గణపతి నగర్ బైపాస్ కాలువలో పడేశాడు. అనంతరం తన భార్య కనిపించడం లేదంటూ యానాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పారావుపై అనుమానంతో పోలీసులు విచారణ చేయగా కొంతసేపటికి నిజాన్ని అంగీకరించాడు. దీంతో కాలువలో పడేసిన మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి, పోస్టుమార్టం కోసం యానాం జీజీహెచ్కు తరలించారు. ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
జీవనోపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నాం
● పండగ వేళల్లో అవకాశం కల్పించాలి ● ఉమ్మడి జిల్లా బాణసంచా తయారీదారుల డిమాండ్ ● పెద్దాపురంలో సర్వసభ్య సమావేశం సామర్లకోట: బాణసంచా తయారీదారులపై అధికారులు కరణ చూపాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బాణసంచా తయారీదారుల సంఘం డిమాండ్ చేసింది. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొప్పిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన శనివారం వేట్లపాలెంలో నియోజకవర్గ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొప్పిశెట్టి శ్రీనివాసరావు, కోనసీమ జిల్లా ఉపాధ్యక్షుడు నామన దుర్గాప్రసాద్, రాజమహేంద్రవరం జిల్లా ఉపాధ్యక్షుడు బాబు బేగ్, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షుడు వినకోటి శ్రీనివాసు, నియోజకవర్గ అధ్యక్షుడు కొప్పిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 60 మంది బాణసంచా లైసెన్సు తయారీదారులు ఉన్నారన్నారు. తాము కుటీర పరిశ్రమగా నడుపుతున్న బాణసంచా తయారీ కేంద్రాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి సుమారు 1,500 మంది జీవిస్తున్నట్లు తెలిపారు. ఆరు నెలలుగా జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు, రాబోయే పండగల రోజుల్లో బాణసంచా తయారీకి అధికారులు లైసెన్సులు అందించి, జీవనోపాధి కల్పించాలన్నారు. బాణసంచా తయారీని నిలిపి వేయడంతో దానిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. తమ ఇబ్బందులపై కలెక్టరు, ప్రజాప్రతినిధులను కలిసినా లైసెన్సులు పునరుద్ధరించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. శివకాశీలో మాదిరిగా బాణసంచా తయారీకి ఏపీఐఐసీ భూముల్లో ఓకే చోట స్థలం కేటాయింపునకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, అది తమకు అనువైన నిర్ణయం కాదన్నారు. పెద్ద పరిశ్రమలకు మాత్రమే అటువంటి ప్రణాళికలు ఉపయోగడపడతాయని అభిప్రాయ పడ్డారు. కుటీర పరిశ్రమలకు వ్యక్తిగతంగా స్థలాలు అవసరం ఉంటుందన్నారు. సమావేశంలో నియోజకవర్గ స్టీరింగ్ కమిటీ సభ్యులు జ్యోతుల శ్రీనివాసు, కార్యదర్శి కింతాడ దుర్గారావు, కోఽశాధికారి గుంటముక్కల శ్రీనివాసు అసోసి యేషన్ నాయకులు పాల్గొన్నారు. -
పాము కాటుకు వ్యవసాయ కూలీ మృతి
పి.గన్నవరం: కొబ్బరి తోటలో పనిచేస్తుండగా పాము కాటు వేయడంతో వ్యవసాయ కూలీ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే. కె.ఏనుగుపల్లికి చెందిన శేరు ముసలయ్య (49) చేపల వేటతో పాటు, వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం వై.కొత్తపల్లి సమీపంలో ఒక రైతుకు చెందిన తోటలో కొబ్బరి కాయలు దింపు తీస్తుండగా, ముసలయ్య వాటిని పోగు చేసి మరొక చోటికి తరలిస్తున్నాడు. ఈక్రమంలో అతడి ఎడమ కాలుపై పొడపాము కాటు వేసింది. సంబంధిత రైతు ముసలయ్యను వెంకటనే కారులో పి.గన్నవరం సీహెచ్సీకి తీసుకువచ్చాడు. అక్కడ చికిత్స పొందుతూ ముసలయ్య మృతి చెందాడు. మృతుడికి భార్య మంగాదేవి, కుమారుడు దుర్గా ప్రసాద్, కుమార్తె కొండాలక్ష్మి ఉన్నారు. మృతదేహానికి రాజోలు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ప్రమాదానికి కారణమైన పామును గ్రామస్తులు హతమార్చారు. పి.గన్నవరం ఎస్సై ఇ.నరసింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాయసం శ్రీనివాసరావు
వృత్తి : స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, అయినవిల్లి మండలం నల్ల చెరువు జెడ్పీ ఉన్నత పాఠశాల. రిఫరీగా అర్హత: వెటరన్ రిఫరీ దివంగత రంకిరెడ్డి కాశీ విశ్వనాథం సూచనతో 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఖమ్మంలో జరిగిన స్టేట్ అంపైర్ పరీక్షలో ఉత్తీర్ణత. 2013లో కటక్లో గ్రేడ్–2, 2019లో గ్రేడ్–1 నేషనల్ అంపైర్గా ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ టెక్నికల్ అఫీషియల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు. అలాగే బ్యాడ్మింటన్ ఇండియా టెక్నికల్ అఫీషియల్స్ అసోసియేషన్ దక్షిణ భారతదేశ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు. రిఫరీగా అనుభవం: 15 ఏళ్లు అత్యుత్తమ ప్రాతినిధ్యం ● థామస్ – ఉబెర్ కప్ ఫైనల్స్. ● ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రపంచ టీమ్ ఛాంపియన్ షిప్. ● వరల్డ్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్, ఢిల్లీ. ● బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్. ● హైదరాబాద్లో 37వ జాతీయ క్రీడలు. ● గోవా, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2020. ● ఒడిశా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2026. -
దొడ్డా శ్రీనివాస్
వృత్తి: స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గూడపల్లి పల్లిపాలెం, మలికిపురం మండలం. రిఫరీ అర్హత: 2011లో స్టేట్ అంపైర్ గా ఉత్తీర్ణత. 14 ఏళ్లుగా సేవలు అత్యుత్తమ ప్రాతినిధ్యం ● సౌత్ ఆసియా ఛాంపియన్ షిప్, హైదరాబాద్. ● సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్ షిప్. ● ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్. ● ఆల్ ఇండియా మాస్టర్స్ ర్యాంకింగ్ టోర్నమెంట్. ● రాష్ట్ర స్థాయి ఛాంపియన్ షిప్, ఎస్జీఎఫ్, సీబీఎస్ఈ, సీఐఎస్ఈ జాతీయ టోర్నమెంట్లు అడబాల విజయ శ్రీనివాస్ వృత్తి: స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేశనపల్లి, మలికిపురం మండలం. రిఫరీ అర్హత: 2007 స్టేట్ రిఫరీ, 2012లో గ్రేడ్–2, 2017లో గ్రేడ్–1 రిఫరీలు రిఫరీగా అనుభవం: 18 ఏళ్లు అత్యుత్తుమ ప్రాతినిధ్యం ● వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2009, హైదరాబాద్. ● ఇండియన్ ఓపెన్ వరల్డ్ సూపర్ సిరీస్, ఢిల్లీ. ● ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్, హైదరాబాద్. ● సౌత్ జోన్, సెంట్రల్ జోన్ ఇంటర్ స్టేట్ ఛాంపియన్ షిప్స్. ● ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ ఛాంపియన్ షిప్స్. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
రౌతులపూడి: రౌతులపూడి – కత్తిపూడి ఆర్ అండ్ బీ రహదారిలో బంగారయ్యపేట సమీపంలో ఈ నెల 20న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ములగపూడికి చెందిన కాపారపు ఏలిసా రాజు (23) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వివరాలు.. కాజులూరు మండలం దుగ్గుదుర్రుకు చెందిన కొందరు ఒక ప్రైవేటు కారులో నాతవరం మండలం సరుగుడు వాటర్ పాల్స్కు వెళ్లి తిరిగి వస్తున్నారు. బంగారయ్యపేట సమీపంలో ఎదురుగా రౌతులపూడి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న కాపారపు ఏలిసా రాజును ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరిన రాజును వెంటనే స్థానికులు రౌతులపూడి సీహెచ్సీకి తరలించారు. అక్కడి వైద్యుడు భరత్ క్షతగాత్రుడికి వైద్య పరీక్షలు జరిపి, మెరుగైన చికిత్స కోసం కాకినాడ తరలించారు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ రాజు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. కాగా.. రాజుకు తల్లి రాఘవ, తండ్రి వరహాలు, సోదరుడు విజయ్బాబు, సోదరి వరలక్ష్మి ఉన్నారు. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడిన కాబోయే వరుడు పిఠాపురం రూరల్: మద్యం మత్తులో అతి వేగంగా డ్రైవింగ్ చేసిన యువకుడు అదుపు తప్పి కాలువ పక్కనున్న పొదల్లోకి కారుతో దూసుకుపోయాడు. పిఠాపురం మహారాజా వారధి సమీపంలో శనివారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. పెద్దాపురానికి చెందిన దమ్మాల వీర వెంకట దుర్గా ప్రసాద్కు ఈ నెల 26న వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో శనివారం స్నేహితులతో కలిసి మద్యం పార్టీ చేసుకుని అనంతరం కాకినాడ నుంచి పిఠాపురం వైపు కారులో బయలుదేరాడు. మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడంతో పిఠాపురం మహారాజా వారధి సమీపాన అదుపు తప్పి రహదారి పక్కనున్న కాలువ పొదల్లోకి దూసుకెళ్లింది. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు కారులో చిక్కుకున్న దుర్గా ప్రసాద్ను బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో వివాహ ఆహ్వాన పత్రికలతో పాటు మద్యం బాటిల్ ఉన్నట్లు గుర్తించారు. కాగా.. దుర్గా ప్రసాద్ కాకినాడ ఎస్ఆర్ఎంటీ – ఏపీఎస్పి ప్రాంతం మధ్యలో కారు నడుపుతూ పలుమార్లు అటూ ఇటూ ఊపుతూ, ఎదురుగా వెళుతున్న ఆటోలను సైతం పక్కకు తప్పించుకుంటూ వచ్చినట్లు ఓ ఆటో డ్రైవర్ తెలిపాడు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి అడ్డతీగల: ట్రాక్టర్ను ఆటో ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న గిరిజన మహిళ మృతి చెందింది. అడ్డతీగల మండలం వీరభద్రపురం వద్ద జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం జరిగింది. వీరంపాలెం గ్రామానికి చెందిన 12 మంది ఆటోలో రాజవొమ్మంగి వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. వీరభద్రపురం వద్ద ఆ గ్రామం నుంచి జాతీయ రహదారిపైకి ట్రాక్టర్ వస్తుండగా, దాన్ని తప్పించబోయి ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న లోతా లక్ష్మి సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన బచ్చల చంటమ్మ, పేరు కాంతమ్మ, రేవుల ఈశ్వరమ్మ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అడ్డతీగల సీహెచ్సీకి తరలించారు. ఈ ఘటనపై అడ్డతీగల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య కేసు.. ఎట్టకేలకు సాధిక్ అరెస్ట్
సాక్షి, కాకినాడ: రాజమండ్రిలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధిక్ ఖాన్ను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా, సాధిక్ ఖాన్ కోసం గత ఐదు రోజులుగా పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. మొత్తం ఎనిమిది పోలీసు బృందాలు వివిధ ప్రాంతాల్లో అతడి కోసం గాలించినట్లు తెలుస్తోంది. చివరకు ఢిల్లీలో సాధిక్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.అతడిని రేపు రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్కు లేదా కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన జరిగిన అనంతరం సాధిక్ కాకినాడ నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన రోజే సాధిక్ ఓ లాయర్తో ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సాధిక్ కారణమయ్యాడనే ఆరోపణలపై రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.ఇదిలా ఉండగా నూకరాజు అల్లుడు జగదీశ్వర రెడ్డి మృతికి సాధిక్ కారణమని ఆయన భార్య సౌజన్య లేఖ రాయడం తెలిసిందే. జగదీశ్వర రెడ్డి తండ్రి భాస్కర రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం పోలీస్ స్టేషన్లో సాధిక్పై హత్య కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం సాధిక్ ఖాన్కు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నూకరాజు భార్య మీనా మృతదేహం కోసం గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సాధిక్ను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: నూకరాజు ఆత్మహత్యలో సౌజన్య లేఖ ఇదే.. -
రాష్ట్ర స్థాయి క్రీడలకు గిరిజన విద్యార్థిని
రాజవొమ్మంగి: స్థానిక గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బోయపాడు గ్రామానికి చెందిన కాకూరి దీక్షిత అమరావతిలో త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలకు ఎంపికై ంది. ప్రిన్స్పాల్ సత్యవేణి శుక్రవారం విలేకరులకు ఈ విషయం తెలిపారు. ఇటీవల పాడురులో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అండర్ – 17 విభాగంలో కోకోలో ఆమె ప్రతిభ చూపిందన్నారు. కాగా.. ఆ బాలికను పలువురు అభినందించారు. సమస్యలపై రాజీలేని పోరాటం రామచంద్రపురం రూరల్: రాష్ట్రంలో విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటాలు చేయాలని పీవైఎల్ మహాసభలో వక్తలు అన్నారు. రామచంద్రపురంలోని చెలికాని రామారావు స్మారక భవనంలో శుక్రవారం నిర్వహించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 7వ మహాసభలో పలు తీర్మానాలు చేశారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని, మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలను నిషేధించాలని, నీట్ పరీక్ష లీకేజీ, అవినీతి, అక్రమాల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులకు కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద ఓసీ విద్యార్థుల స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని తదితర తీర్మానాలు చేశారు. నేటి నుంచి వనదుర్గమ్మ జాతర అన్నవరం: రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గమ్మ శ్రావణ మాస జాతర మహోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. వీటిని ఈ నెల 28 తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు వనదుర్గ అమ్మవారి ఆలయంలో పండితులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం నిర్వహించి జాతర మహోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. నవధాన్యాలతో మండపారాధన, కలశస్థాపన జరుపుతారు. 50 మంది రుత్విక్కులు నవగ్రహ జపాలు, శ్రీచక్రార్చన, మూలమంత్ర జపాలు నిర్వహిస్తారు. జాతరలో భాగంగా అమ్మవారిని తొలిరోజు బాలా త్రిపుర సుందరిగా, 23న సరస్వతిగా, 24న అన్నపూర్ణగా, 25న మహాలక్ష్మిగా, 26న గాయత్రీదేవిగా, 27న వారాహి అమ్మవారిగా, 28న రాజరాజేశ్వరిగా అలంకరించి పూజలు నిర్వహిస్తారు. తలుపులమ్మకు చండీహోమం తుని రూరల్: లోవదేవస్థానంలోని తలుపులమ్మ తల్లికి వేదపండితుల, అర్చకులు మహాచండీ హోమం, కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. హత్య కేసులో నిందితుడి అరెస్ట్ శంఖవరం: పి.మల్లాపురం పంచాయతీ శృంగధార గ్రామంలో రాజమ్మంగి మండలం వాతంగి పంచాయతీ ఓకూర్తి గ్రామానికి చెందిన ముర్లా మణికుమార్ను హత్య చేసిన ఘటనలో నిందితుడు కాకూరి చంద్రయ్యను శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రయ్య, భార్య సూర్యావతిలను గతంలో మణికుమార్ నాటు తుపాకీతో కాల్చి గాయపర్చాడు. ఆ కేసులో జైలు శిక్ష అనుభవించి తిరిగి వచ్చాడు. అనంతరం మళ్లీ సూర్యావతిని ఇబ్బంది పెట్టడంతో మణికుమర్కు చంద్రయ్య హత్య చేశాడు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి, త్వరితగతిన విచారణ చేపట్టి, 72 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు. -
ముస్లింలపై దుష్ప్రచారం దారుణం
కాకినాడ క్రైం: పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు కుటుంబం మూకుమ్మడి ఆత్మహత్య ఘటనలో సాధిక్ ఖాన్ అంశం తెరమీదికి వచ్చినప్పటి నుంచి ముస్లిం సమాజాన్ని కించపరిచేలా కొందరు దారుణమైన ప్రచారం చేస్తున్నారని ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ (మా) రాష్ట్ర అధ్యక్షుడు, ముస్లిం మైనారిటీ జేఏసీ కో కన్వీనర్ ఎండీ జవహర్ అలీ అన్నారు. ఈ మేరకు కాకినాడ గంజాం వారి వీధిలోని తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఏ మూల ఏం జరిగినా ముస్లింలతో ముడిపెట్టడం పరిపాటిగా మారిందన్నారు. తప్పు చేసిన వ్యక్తిని కేవలం వ్యక్తిగతంగానే చూడాలి తప్ప యావత్ కులానికో, మతానికో ఆపాదించడం తగదని హితవు పలికారు. హిందూ ముస్లింల మధ్య తారతమ్యాలు సృష్టించి, లేనిపోని గొడవలు పెట్టి, తమ పబ్బం గడుపుకోవడానికి కుటిల యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రశాంతతకు మారుపేరైన కాకినాడ నగరంలో ముస్లింలు, హిందువులతో సహా మిగిలిన మతస్తులు అందరితోనూ ఎంతో సోదరభావంతో మెలుగుతారన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ముస్లింలపై చేస్తున్న దుష్ప్రచారాలకు అడ్డూ అదుపూ లేదని, అడ్డుకునే నాథుడు కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. తప్పు చేసే ఏ ఒక్కరికీ తమ మద్దతు ఉండదని, చట్టం ముందు కులమతాలకు అతీతంగా ఎవరైనా సమానులేనని జవహర్ అలీ స్పష్టం చేశారు. సమావేశంలో మా జాయింట్ సెక్రటరీ యజజుద్దీన్, వైఎస్సార్ సీపీ మైనారిటీ నాయకుడు ఎండీ అస్గర్, జేఐహెచ్ కాకినాడ నాయకులు ఎండీ రహత్ షరీఫ్, ఎస్డీ ఇమ్రాన్, టీడీపీ మైనారిటీ నాయకుడు ఎం.ఇనాముల్లాహ్, ఎండీ బాషా తదితరులు పాల్గొన్నారు. తప్పు చేసిన ఎవరైనా చట్టం ముందు సమానులే సాధిక్ ఖాన్ ఘటనతో మతానికి సంబంధం ఏమిటి? ముస్లిం మైనారిటీ జేఏసీ కో కన్వీనర్ జవహర్ అలీ -
ప్రశ్నిస్తే పరారవుతారా!
కపిలేశ్వరపురం (మండపేట): ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తామని తెలిసి, ముందే కౌన్సిల్కు మంత్రి నారా లోకేష్ పరారు కావడం, ఆయన బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. రాష్ట్రంలోని డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై తాము బాధ్యతాయుతంగా కౌన్సిల్లో ప్రశ్నించామన్నారు. ప్రతి రోజూ అసెంబ్లీకి వచ్చిన లోకేష్ ఆ కౌన్సిల్కు రాకపోవడంతో తమ ఆరోపణలు వాస్తవమని తేలిందన్నారు. శుక్రవారం మండపేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులతో ఎమ్మెల్సీ త్రిమూర్తులతు మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై తాము ప్రశ్నించామని, అవి పరిష్కారమవుతాయని ఆశించిన ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం నుంచి నిరాశ ఎదురైందన్నారు. డీఎస్సీలో సుమారు 400 మందికి క్రీడా కోటాలో ఉద్యోగాలిచ్చామని చెప్పడం, అందుకు క్రీడాకారిణి పీవీ సింధూకు ఉద్యోగం ఇవ్వడంతో పోల్చి చెప్పడం వెనుక లోకేష్ అక్రమాలకు పాల్పడారన్న దానికి బలం చేకూరుతుందన్నారు. పీవీ సింధూ వంటి స్థాయి క్రీడాకారులకు గౌరవార్థం ఉద్యోగాలిస్తారని, వారు ఉద్యోగ విధుల్లో ఉండకపోవచ్చన్నారు. సింధూతో పోల్చడాన్ని బట్టి చూస్తే చంద్రబాబు ప్రభుత్వంలో క్రీడా కోటాలో ఉద్యోగాలు పొందిన 400 మంది ఉద్యోగ విధుల్లో చేరకపోయినా ఫర్వాలేదా అని ప్రశ్నించారు. అవస్థలకు ఎల్నినో కారణమా? సాగునీరు అందక రైతులు అవస్థ పడుతున్నారని, ఎల్నినో కారణమంటూ కూటమి చెప్పడాన్ని ఎమ్మెల్సీ తోట తప్పుబట్టారు. పంట సాగు చేసే ముందే సాగునీటి పరిస్థితిపై రైతులకు అవగాహన కల్పించకపోవడాన్ని నిలదీశారు. అన్నదాతా సుఖీభవ పేరుతో ఏడాదికి రూ.20 వేల చొప్పున రెండేళ్లలో రూ.40 వేల పెట్టుబడి సాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ. మూడు వేల నిరుద్యోగ భృతి హామీలు అమలు కాలేదన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరుతో కూటమి ప్రభుత్వం హడావుడి చేస్తుందని, వాస్తవానికి అమలు చేసే చిత్తశుద్ధి మాత్రం కనిపించడం లేదని ఎమ్మెల్సీ అన్నారు. దీనికి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా కేంద్రంతో చర్చించి ఆ అంశాన్ని 9వ షెడ్యూల్లో పెట్టించాలన్నారు. బీసీలకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 50 శాతానికి పైగా రాజకీయపరంగా రిజర్వేషన్లు ఇచ్చారని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు సిద్ధం డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పలేని ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో గ్రూప్స్ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ ఇంతకాలం తర్వాత హంగామా చేస్తుందని త్రిమూర్తులు మండిపడ్డారు. గత ప్రభుత్వంలో గ్రూప్స్, ప్రస్తుత ప్రభుత్వంలోని డీఎస్సీ రెండింటి మీదా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సీబీఐ విచారణ వేసుకోవచ్చని చెప్పారు. అధికారం చేతిలో ఉండగా, చేయాల్సిన పనులు చేయకుండా గత ప్రభుత్వంపై బురద చల్లడం, అసెంబ్లీలో కూటమి ప్రతినిధులతో ప్రశంసించుకోవడంతో చంద్రబాబు ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చుతుందన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉద్యోగాలివ్వలేదంటూ కూటమి అధినాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారానికి ప్రజలే సమాధానం చెబుతారన్నారు. ఫ బాధ్యతారాహిత్యంగా మంత్రి లోకేష్ తీరు ఫ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపాటు ఫ చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీపై విచారణకు ఆదేశించండి -
కొనసాగిన జూడాల నిరసన
కాకినాడ క్రైం: జూనియర్ డాక్టర్ల నిరసన పదో రోజు శుక్రవారం కొనసాగింది. కాకినాడ జీజీహెచ్ ఎదురుగా ఉన్న పీజీ వసతి గృహ ఆవరణలో 600 మంది జూనియర్ డాక్టర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్ట్రైఫండ్ 15 నుంచి 30 శాతం పెంచాలని, వైద్యుల పదోన్నతి వయసు 65 ఏళ్లకు పెంచాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని, ఎండీ, ఎంఎస్లు చేసిన వైద్యులకే అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాడతామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగరాలి పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు పిలుపు రాజమహేంద్రవరం రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేసేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా చెల్లుబోయిన వేణును పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు శుక్రవారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయానికి చేరుకుని ఆయన్ని పుష్ఫగుచ్చాలు, శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కేఆర్జే రాజేష్ మిత్ర బృందం హుకుంపేట డీబ్లాకు తదితర ప్రాంతాల నుంచి భారీ బైక్ ర్యాలీగా వచ్చి వేణును సన్మానించారు. కొంతమూరు నుంచి వైఎస్సార్ సీపీ మెనార్టీ సెల్ అధికార ప్రతినిధి ఎంఎం అలీ, నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షుడు చెరుకూరి సత్యనారాయణలతో కలసి వచ్చి వేణును సత్కరించారు. పార్టీ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ హమీద్ బాషా, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ నిజాముద్దీన్, ధవళేశ్వరం గ్రామానికి చెందిన పార్టీ నేత మెండా రాజేష్ మిత్ర బృందం, దామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దళిత నేతలు వచ్చి వేణుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందన్నారు. ప్రభుత్వం మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. ‘సర్’పై నేడు, రేపు ప్రత్యేక ప్రచార దినాలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–2026లో భాగంగా శని, ఆదివారాల్లో జిల్లాలో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. అర్హులను ఓటరుగా నమోదు చేయడం, ఓటర్ల జాబితాలోని వివరాలను పరిశీలించడం, ఓటర్ల వివరాల్లో తప్పులు ఉంటే సరిచేయడం వంటివి చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్ స్థాయి అధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండి ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. స్వీకరించిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి, జాప్యం లేకుండా ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. ఆ రోజుల్లో ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అంతర్వేదిలో సామూహిక వ్రతాలు సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శ్రావణ మాసం రెండో శుక్రవారం పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో సా మూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఆల య ఈవో ఎంకేటీఎన్వీ ప్రసాద్ పర్యవేక్షణలో ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో వింజమూరి రామరంగాచార్యులు, అర్చకులు వరలక్ష్మీ వ్రతాలు చేయించారు. ఈ సందర్భంగా 400 మంది మహిళలు సామూహికంగా కుంకుమ పూజలు నిర్వహించారు. -
ముంచెత్తే..!
● పేరుకే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ● జిల్లాలో ఎక్కడ చూసినా అపరిశుభ్రతే ● నిరుపయోగంగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు పిఠాపురం: పన్నులు పంచాయతీలకు... చెత్త ప్రజలకు అన్నట్టుంది వాస్తవ పరిస్థితులు. జిల్లాలో ఏ పల్లె చూసినా చెత్త సమస్యతో కనిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర పేరుతో ఎంతో అట్టహాసంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో మొత్తం 385 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సుమారు 4,85,089 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆయా పంచాయతీల నుంచి రోజుకు సుమారు 50 టన్నుల చెత్త వస్తోంది. అయినా వీటి తరలింపు మాత్రం ప్రహసనంలా మారుతోంది. నాడు అట్టహాసం.. నేడు అధ్వానం గత ప్రభుత్వంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిర్మితమై, పంచాయతీలకు బాసటగా నిలిచాయి. అక్కడ తయారైన సేంద్రియ ఎరువులతో పంచాయతీలకు ఆదాయం సమకూరేది. చెత్త సమస్య తీరేది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చెత్త నుంచి సంపద తయారు చేయడానికి రూ.కోట్లతో నిర్మించిన ఆ కేంద్రాలు ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయాయి. ఇవి అనేక చోట్ల నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక కొన్ని గ్రామాల్లో మందుబాబులకు అడ్డాలుగా మారాయి. అనేకచోట్ల చెత్త నుంచి సంపద తయారు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా, అనేక కేంద్రాల్లో ఎరువుల తయారీ అరకొరగానే సాగుతోంది. దీంతో పల్లెల్లో ఎక్కడబడితే అక్కడ చెత్త సమస్య తాండవిస్తోంది. డంపింగ్ యార్డులు లేక.. జిల్లాలో మొత్తం 385 గ్రామ పంచాయతీలు ఉండగా, సగానికి పైగా పంచాయతీలకు డంపింగ్ యార్డులు లేవు. దీనివల్ల చెత్తను రోడ్లపైనే పోసి ఆయా పంచాయతీల సిబ్బంది చేతులు దులుపుకొంటున్నారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నెలలో ఒకటి రెండు సార్లు చెత్తను తగలబెడుతుండటంతో వాయు కాలుష్యం ఏర్పడుతుంది. పొగ కారణంగా అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణా లోపం గ్రామాల్లో రోజూ గ్రీన్ అంబాసిడర్లు ఇంటింటికీ వెళ్లి సేకరించిన తడి, పొడి చెత్తతో పాటు వీధుల్లో పేరుకుపోయిన చెత్తను రిక్షాల ద్వారా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు తరలించాలి. అక్కడ తడి, పొడి చెత్తను వేర్వేరుగా కుండీల్లో వేసి వర్మీకంపోస్టు, సేంద్రియ ఎరువు తయారు చేసి రైతులకు తక్కువ ధరకు విక్రయించడం, అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలను స్క్రాప్ దుకాణాలకు విక్రయించి పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూర్చాలన్నదే ఈ కేంద్రాల లక్ష్యం. అయితే అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడడంతో ఈ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దృష్టి పెట్టక.. చెత్త వీడక పలు పంచాయతీల్లో పారిశుధ్యం పూర్తిగా క్షీణిస్తోంది. శివారు గ్రామాల్లో పారిశుధ్య పనులు అసలు జరగడం లేదని స్థానికులు అంటున్నారు. వివిధ గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్తే కనిపిస్తోంది. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ, వాకతిప్ప, అమీనాబాద్, కొత్తపల్లి, కొమరగిరి, గొల్లప్రోలు మండలం చేబ్రోలు, వన్నెపూడి, చిన్న జగ్గంపేట, దుర్గాడ,చెందుర్తి, తాటిపర్తి, పిఠాపురం మండలంలో గోకివాడ, మాధవపురం, చిత్రాడ, విరవాడ, మంగితుర్తి తదితర గ్రామాల్లో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది. అయినా పంచాయతీల్లో సిబ్బంది కొరత, అధికారుల ఉదాశీనత వెరసి ఇబ్బందిగా మారింది. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనాఉంది. ఆర్భాటానికే కార్యక్రమం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ఆర్భాటానికేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమాలకు మొదట్లో కొన్ని నిధులు విడుదల అయినప్పటికీ ఆ తర్వాత కాలం నుంచి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. తూతూ మంత్రంగా మాత్రమే ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు ఆర్థిక సంఘాల నిధులు ఖర్చుపై ఆంక్షలు విధించడం, ఉన్న కాస్త సాధారణ నిధులు అభివృద్ధి పనులకు సైతం సరిపోకపోవడం వంటి అనేక కారణాలతో పల్లెల్లో పారిశుధ్య సమస్య వస్తోంది. -
కోయకుండానే కన్నీరు!
● పెరిగిన ఉల్లిపాయల ధర ● ఇతర కూరగాయలదీ అదే దారి ● సామాన్య ప్రజల అవస్థలు తాళ్లపూడి: సాధారణంగా ఉల్లిపాయలు కోసినప్పుడు మన కళ్ల నుంచి కన్నీళ్లు వస్తాయి. అది సాధారణంగా జరిగే విషయమే అయినప్పటికీ ఇప్పుడు పెరిగిన ధరలతో ఉల్లిపాయలను కొనాలంటేనే కన్నీరు వస్తోంది. ఇతర కూరగాయల ధరలు కూడా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజులుగా కూరగాయల రిటైల్ మార్కెట్లు, రైతు బజార్లు, స్థానిక సంతలలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నెల మొదటి వారంలో నాణ్యమైన ఉల్లి కిలో రూ.25 నుంచి రూ.30 వరకు ఉండగా, ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.45 నుంచి రూ.50కి పైనే చేరింది. చిరు వ్యాపారులు ఆటోలపై ఇళ్ల వద్దకు వచ్చి విక్రయించే కొంచెం నాసిరకం ఉల్లిపాయలను మూడు కిలోలు రూ.100కు ఇస్తున్నారు. ఇటీవల మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో సంభవించిన ప్రకతి వైపరీత్యాలతో ఉల్లి పంట తీవ్రంగా దెబ్బతింది. దీనికి తోడు ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తి వేశారు. ఆ ప్రభావం దిగుమతులపై పడింది. డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ఉల్లి ధరలు పెరిగిపోతున్నాయి. ధరల నియంత్రణ ఎక్కడ? ఉల్లి ధరల నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఉల్లి ఎగుమతులను నిషేధించడంతో పాటు నాఫెడ్లోని ఉల్లి నిల్వలను మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తే ధరల నియంత్రణ సాధ్యమవుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు మార్కెట్లలో అన్ని రకాల కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కిలో ఉల్లిపాయలు రూ.45 నుంచి రూ.50, పచ్చిమిర్చి రూ.50, బీరకాయ, రూ.50, ఆకాకర రూ.160, టమాటా, బెండ, దొండ రూ.30, బీన్స్ రూ.150, క్యారెట్, బీట్రూట్, తెల్లవంకాయలు రూ.50, అల్లం రూ.120 పలుకుతున్నాయి. మరోవైపు ఆకుకూరలు, కొత్తి మీర ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. -
కొత్తపేటలో భారీ చోరీ
● రూ.31.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాల మాయం ● వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లి సరికి వస్తువుల దొంగతనం కొత్తపేట: వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్లి తిరిగి వచ్చే లోపు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరపడి, బీరువాలో భద్రపరచిన బంగారం, వెండి వస్తువులు దోచుకుపోయారు. ఎస్సై జి.సురేంద్ర శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట ఆర్ఎస్ నగర్లో నివాసం ఉంటున్న చెల్లిబోయిన రాంబాబు ఈ నెల 18వ తేదీ రాత్రి తన భార్యతో కలిసి హాస్పిటల్ పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. తిరిగి 20వ తేదీన ఉదయం 8 గంటలకు ఇంటికి వచ్చే సరికి తలుపు పగలగొట్టి ఉంది. లోపలకు వెళ్లి చూడగా బీరువాలోని బంగారం, వెండి వస్తువులు కనిపించలేదు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఆ బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.30 లక్షలు, వెండి వస్తువులు సుమారు రూ.1.50 లక్షలు ఉంటాయని అంచనా. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ పరిశీలించారు. -
పండగ వేళ పెను విషాదం
● జ్యూస్ తయారు చేస్తుండగా విద్యుత్ షాక్ ● రాయవరంలో చిరు వ్యాపారి మృతి రాయవరం: శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం చేసుకునేందుకు భార్య సిద్ధమైంది. ఈ లోపు జ్యూస్ షాప్ నిర్వహిస్తున్న ఆమె భర్త విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన రాయవరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కావలికి చెందిన జి.వెంకటేశ్వర్లు (42) రాయవరం బస్టాండ్ సెంటర్లో భార్య భవానీతో కలిసి కొన్నేళ్లుగా ఫ్రూట్ జ్యూస్ షాపు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం మిక్సర్లో జ్యూస్ తయారు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. వరలక్ష్మీ వ్రతం చేసుకునేందుకు సిద్ధమవుతున్న భవానీ వెంటనే ఈ విషయాన్ని గమనించి, విద్యుత్ షాక్ను తప్పించేందుకు చీపురుతో బలంగా కొట్టింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో వెంకటేశ్వర్లు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు దేవుడు అన్యాయం చేశాడంటూ ఆమె బోరును విలపించింది. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఇద్దరు చిన్నారులతో కలిసి విలపిస్తున్న ఆమెకు స్థానికులు భరోసాగా నిలిచారు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని కావలి తీసుకువెళ్లేందుకు వ్యాపారులు, ఆటో యూనియన్ నాయకులు, స్థానికులు కలిసి రూ.30 వేలు సేకరించి అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. పుట్టెడు దుఖంతో భర్త మృతదేహాన్ని తీసుకుని భవాని కావలికి బయలుదేరింది. -
అన్న ప్రసాదంపై భక్తుల అసంతృప్తి!
● అన్నవరంలో నిత్యాన్నదానం ● చల్లారితే తినలేని పరిస్థితి ● బియ్యం నాణ్యతపై అనుమానాలు ● ప్రతిరోజూ 5 వేల మందికి భోజనం అన్నవరం: సత్యదేవుని ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకంలో భోజనంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో భోజనం బాగుండేదని, ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బియ్యంలో నాణ్యత లేకపోవడంతో అన్నం వేడిగా ఉన్నప్పుడు తప్ప, వేడి తగ్గితే తినలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. కూరలు, పప్పు, సాంబారు కూడా చాలాసార్లు బాగోవడం లేదంటున్నారు. అన్నదాన విభాగంలో ఒకప్పుడు చేయితిరిగిన వంటవారు ఉండేవారు. వారందరూ ఉద్యోగ విరమణ చేశాక తాత్కాలిక పద్ధతిపై పనిచేసేవారే కొనసాగుతున్నారు. వారు కూడా కేవలం ఆరుగురే ఉండటం, వారికి అంతగా అనుభవం లేకపోవడం కూడా ఆహార పదార్థాల నాణ్యత తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. ప్రతి రోజూ సుమారు ఐదు వేల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. రూ.69 కోట్లకు అన్నదానం డిపాజిట్లు సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి ఇప్పటివరకు భక్తులు సమర్పించిన విరాళాల డిపాజిట్లు రూ.69 కోట్లకు చేరాయి. వీటిపై ఏటా వచ్చే వడ్డీ రూ.4 కోట్లు. ఇక ఒక భోజనం తయారీకి రూ.39 వ్యయం అవుతుందని అంచనా. భోజనంలో సత్యదేవుని గోధుమ నూక ప్రసాదంతో పాటు పులిహోర, అన్నం, పప్పు, కూర, సాంబారు, మజ్జిగ వడ్డిస్తారు. ఇవీ ఇబ్బందులు నిత్యాన్నదానంలో వినియోగించే బాయిల్డ్ రైస్ను ఒక ప్రముఖ బియ్యం విక్రయ సంస్థ టెండర్ ద్వారా కేజీ రూ.42కు సరఫరా చేస్తోంది. తక్కువ నాణ్యత కలిగిన బియ్యాన్ని బాయిల్డ్ రైస్ అని చెప్పి సరఫరా చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. పీడీఎస్ బియ్యాన్ని పాలిష్ చేయించి సరఫరా చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ బియ్యం కొంత ఎక్కువ సేపు ఉడికితే జావ అయిపోవడం, తక్కువ ఉడికితే పలుకుగా ఉండటం జరుగుతోంది. దీంతో వేడిగా ఉంటే తప్ప ఈ అన్నం తినలేకపోతున్నామని భక్తులు చెబుతున్నారు. చర్యలు తీసుకుంటాం : ఈవో ఈ విషయాన్ని దేవస్థాన ఈవో ఎన్.సూర్యచక్రధరరావు దృష్టికి తీసుకెళ్లగా అన్నదాన పథకం అమలు తీరుపై దాదాపు ప్రతిరోజూ తనిఖీ చేస్తున్నానని చెప్పారు. భోజనం నాణ్యంగానే ఉందని భక్తులు చెబుతున్నారని, ఇంకా బాగుండేలా తగు చర్యలు తీసుకుంటానన్నారు. సాంబారు, పచ్చడి తయారీకి అవసరమైన కొబ్బరి ముక్కలు కాంట్రాక్టర్ ఇచ్చేలా తదుపరి టెండర్లో షరతు పెడతామన్నారు. రుచి లేక.. గతంలో సాంబారులో కొబ్బరి కోరు వేసేవారు. కొబ్బరి పచ్చడి కూడా వడ్డించేవారు. గతంలో దేవస్థానంలో వ్రతాల్లో భక్తులు కొట్టిన కొబ్బరి ముక్కలు తీసుకునే కాంట్రాక్టర్ అన్నదానం పథకానికి అవసరమైనన్ని కొబ్బరి ముక్కలు సరఫరా చేయాలనే నిబంధన ఉండేది. గతేడాది ఈ నిబంధన తీసేసి టెండర్ కం వేలం నిర్వహించారు. దీనివల్ల అన్నదాన పథకానికి కొబ్బరి ముక్కలు రాకపోవడంతో సాంబారు, పచ్చడిలో కొబ్బరి లేక అవి రుచిగా ఉండడం లేదు. గురువారం అన్నదానంలో భోజనం చేసిన అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ అజాద్ కూడా సాంబారు రుచి, నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సాంబారును మరింత చిక్కగా, రుచిగా తయారు చేయాలని ఆదేశించారు. అలాగే క్యూలైన్లో వేచివుండే భక్తులు కూర్చునే సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. -
వీరి రూటు సెపరేటు!
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో పదోన్నతుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. అర్హతలు, సీనియారిటీతో సంబంధం లేకుండా కొందరికి పదోన్నతులు కల్పించేందుకు భారీగా ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు బ్యాంకు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల పదోన్నతుల పేరుతో సుమారు రూ.2 కోట్ల మేర అక్రమ వసూళ్లు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదోన్నతులు పొందిన కొందరు ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లలో (ఎస్ఆర్) సీనియారిటీని మార్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఉద్యోగంలో చేరిన వారిని సైతం పదేళ్లకు పైగా క్రితమే విధుల్లో చేరినట్లుగా రికార్డులు సృష్టించి పదోన్నతులు కల్పించినట్లు బ్యాంకు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అవకతవకలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ప్రాంతానికి చెందిన ఒక ఉద్యోగి సర్వీస్ రికార్డుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. సహకార సంఘం అధ్యక్షుడి సంతకంతో సర్వీస్ వివరాలను మార్చినట్లు, అనంతరం సీనియారిటీ ఆధారంగా పదోన్నతి పొంది ప్రస్తుతం ఊడిమూడి పీఏసీఎస్ సీఈఓగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి మరికొన్ని ఎస్ఆర్లను కూడా సృష్టించి పదోన్నతులు కల్పించినట్లు బ్యాంకు వర్గాల్లో చర్చ జరుగుతోంది. పి.గన్నవరం సహకార సంఘంలో ఒక ఉద్యోగి స్టాఫ్ అసిస్టెంట్గా 14 నెలల 29 రోజులు పనిచేసి, అనంతరం 8 నెలల 5 రోజులు వడ్డిపర్రు సహకార సంఘంలో పనిచేసినట్లు, ప్రస్తుతం అదే వ్యక్తి వడ్డిపర్రు సహకార సంఘంలో ఇన్చార్జ్ సీఈవోగా పనిచేస్తున్నట్లు ఎస్ఆర్లో నమోదు చేశారు. అయితే ఎక్కడ పనిచేస్తే అక్కడ సహకార సంఘ అధ్యక్షులతో ఎస్ఆర్లో సంతకాలు పెట్టించుకోవాల్సి ఉండగా ఆ వ్యక్తి వడ్డిపర్రు సహకార సంఘం అధ్యక్షుడితో మూడు చోట్ల సంతకాలు చేయించుకున్నారు. ఇద్దరికి కీలక పదోన్నతులు డీసీసీబీ పరిధిలో ఇటీవల ఇద్దరు ఉద్యోగులకు కల్పించిన పదోన్నతులు కూడా అనుమానాలకు తావిస్తున్నాయి. రాజమహేంద్రవరంలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగికి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం)గా పదోన్నతి లభించినట్లు సమాచారం. అదే విధంగా కాకినాడ జిల్లాలో సీనియర్ ఏజీఎంగా పనిచేస్తున్న మరో ఉద్యోగికి ఇన్చార్జి డీజీఎం బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ రెండు పదోన్నతుల విషయంలోనూ భారీగా ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమగ్ర విచారణకు డిమాండ్ డీసీసీబీలో కొంత కాలంగా చోటుచేసుకున్న పదోన్నతులపై సర్వీస్ రిజిస్టర్లు, సీనియారిటీ జాబితాలు, నియామక ఉత్తర్వులు, పదోన్నతి కమిటీ నిర్ణయాలు, ఉద్యోగుల అర్హతలు, ఆర్థిక లావాదేవీలను సమగ్రంగా పరిశీలించాలని ఉద్యోగులు, సహకార రంగానికి చెందిన పలువురు కోరుతున్నారు. రూ.2 కోట్ల మేర ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు నిజమా, ఎవరెవరి పాత్ర ఉంది, సర్వీస్ రిజిస్టర్లలో మార్పులు జరిగాయా అన్న విషయాలపై ఉన్నతస్థాయి విచారణ జరిగితే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. జనసేన నేత పాత్రపై ఆరోపణలు పదోన్నతుల వ్యవహారంలో ఓ జనసేన నేత కీలకంగా వ్యవహరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి సిఫారసులు చేయడంతో పాటు వ్యవహారాలను చక్కదిద్దడంలో ఆయన పాత్ర ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. కోనసీమ జిల్లా మాదిరిగా కాకినాడ జిల్లాలో పలు సహకార సంఘాల్లో తప్పుడు ఎస్ఆర్లు సృష్టించి ఉద్యోగాలు పదోన్నతుల పేరుతో భారీగా దండుకొనేందుకు సంబంధిత జనసేన నేత పన్నాగం పన్నినట్లు తెల్సింది. కానీ దీనికి జిల్లా సహకార శాఖ అధికారులు మోకాలడ్డు వేయడంతో కాకినాడ జిల్లాలో అక్రమాలకు అడ్డుకట్టపడిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. డీసీసీబీలో పదోన్నతుల మాయాజాలం! డబ్బులిచ్చి ప్రమోషన్లు పొందారనే ఆరోపణలు రూ.రెండు కోట్ల మేర ముడుపులు సర్వీస్ రిజిస్టర్లలో అక్రమ మార్పులపై అనుమానాలు -
మహాలక్ష్మీ పాహిమాం..
రావమ్మా! మహలక్ష్మి రావమ్మా.. అంటూ శ్రావణ శుక్రవారం పూజలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం వరలక్ష్మీ వ్రత పూజల సందర్భంగా గురువారం జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లో మార్కెట్లు కిటకిటలాడాయి. పూజా సామగ్రి, బంగారు రూపుల కొనుగోలుతో సందడి నెలకొంది. కాకినాడ భానుగుడి, నాగమల్లితోట జంక్షన్, పిఠాపురం, పెద్దాపురం, తుని, ఏలేశ్వరం తదితర చోట్ల మార్కెట్లు రద్దీగా మారాయి. పూజా సామగ్రి ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్యులు ఇబ్బంది పడ్డారు. –బోట్క్లబ్ (కాకినాడ), ఏలేశ్వరం -
15 శాతం శిక్షణ భృతి లక్ష్యం
కాకినాడ క్రైం: కనీసం 15 శాతం శిక్షణ భృతే (స్టైఫండ్) లక్ష్యమని జూడాలు నినదించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా కాకినాడ ఆర్ఎంసీ జూనియర్ వైద్యులు చేపట్టిన నిరసన తొమ్మిదో రోజుకు చేరింది. జీజీహెచ్ ఎదురుగా ఉన్న పీజీ వసతి గృహ ఆవరణలో నిరసన కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం రక్తదానం నిర్వహించారు. సాయంత్రం ఫ్లాష్ మార్చ్ చేపట్టారు. జీజీహెచ్ నుంచి ఇంద్రపాలెం అంబేడ్కర్ విగ్రహం వరకు సెల్ఫోన్లలో ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి నినాదాలు చేస్తూ సాగారు. ప్రభుత్వ మొండి వైఖరి వల్ల తమతో పాటు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జూడాలు ఆవేదన వ్యక్తం చేశారు. శిక్షణ భృతితోపాటు ఉద్యోగ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఎండీ, ఎంఎస్ చేసిన వారికే అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. -
ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలి
తొండంగి: జిల్లాలో 30,502 మంది రైతులు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో చేరారని వ్యవసాయ శాఖ జేడీ కె.రాబర్ట్పాల్ అన్నారు. గురువారం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలోని తుని సబ్ డివిజన్ పరిధిలో అధికారులు, గ్రామ సచివాలయాల అగ్రికల్చర్ అసిస్టెంట్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో కారణంగా దేశ వ్యాప్తంగా కూడా వర్షాలు పూర్తి స్థాయిలో కురవని పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలో పంపా, పీబీసీ ఆయకట్టు పరిధిలో రైతులంతా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించేలా అధికార యంత్రాంగం అవగాహన కల్పించాలన్నారు. పంపా, పీబీసీ పరిధిలో ఇప్పటి వరకూ 2,754 ఎకరాల వరకూ వరి నాట్లు వేసినట్టు అధికారులు వివరించారు. మిగిలిన ప్రాంతాల్లో చిరు ధాన్యాలు వంటి సాగు చేయాలన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకూ సాగు చేసిన వరి పొలాలకు ఈ– క్రాఫ్ నమోదు, బీమా చెల్లింపు తదితర అంశాలపై చర్చించారు. వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్, మండల వ్యవసాయ శాఖాధికారి ఎంఎంవీఎస్ పద్మశ్రీ, ఏఈఓ మాథన సతీష్వర్మ పాల్గొన్నారు. -
అక్రమ అరెస్టులతో.. ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరు
ఆలమూరు: కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులు, చేస్తున్న అక్రమ అరెస్టులతో వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేరని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. బడుగువానిలంక, మూలస్థాన అగ్రహారం వంతెనల పేర్ల విషయమై ప్రశ్నించిన పార్టీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్పై కూటమి నేతలు అక్రమ కేసు నమోదు చేయించి, ఈ నెల 17న అరెస్టు చేయించిన విషయం తెలిసిందే. ఆలమూరు కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగ్గిరెడ్డి.. న్యాయ సలహాదారులను నియమించి, కోర్టులో న్యాయ పోరాటం చేశారు. ఈ పోరాటం ఫలించడంతో మూడు రోజుల్లోనే తమ్మనకు కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల కోరిక మేరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి భారీ కార్లు, బైక్ ర్యాలీ, బాణసంచా కాల్పుల నడుమ తమ్మనను గురువారం రాత్రి చెముడులంకలోని ఇంటికి తీసుకువచ్చారు. ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ధర్మం గెలిచింది.. దుర్మార్గం ఓడిందంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తమ్మనను ఆయన కుటుంబ సభ్యులకు జగ్గిరెడ్డి అప్పగించారు. కూటమి అరాచకాలపై పోరాటం ఉధృతం ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ, జిల్లా, నియోజకవర్గవ్యాప్తంగా ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ, కూటమి నేతల అకృత్యాలు, అరాచకాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం దళారీ వ్యవస్థను ప్రోత్సహించడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. పార్టీ శ్రేణులందరూ ఐకమత్యంతో ఉండి, కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిత్యం పోరాడాలని, రానున్న స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. జగ్గిరెడ్డి వెన్నంటే ఉంటాం వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఏ కష్టనష్టాలు ఎదురైనా, అన్యాయానికి గురైనా అన్నివిధాలా అండగా ఉంటున్న జగ్గిరెడ్డి వెన్నంటి జీవితాంతం ఉంటామని ఆ పార్టీ మండల నేతలు పేర్కొన్నారు. ఏ నేరం చేయకపోయినా పార్టీలో చురుగ్గా ఉంటున్నారనే కక్షతో తమ్మనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తాను అరెస్టయి, విడుదలయ్యేంత వరకూ వెన్నంటి ఉన్న జగ్గిరెడ్డికి, కార్యకర్తలకు, నాయకులకు తమ్మన కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖుల పరామర్శ ఇదిలా ఉండగా తమ్మన శ్రీనివాస్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద పలువురు ప్రముఖులు పరామర్శించారు. వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎంపీ చింతా అనురాధ, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కర్రి పాపారాయుడు తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. -
గడువులోగా ఓటర్ల జాబితా పూర్తి చేయాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో వివిధ ప్రక్రియలను నిర్ణీత గడువులోగా, అత్యంత పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఈఆర్వోలను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో గురువారం ఓటర్ల జాబితాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి జిల్లాలో మొత్తం 31,695 నోటీసులకు గాను, ప్రస్తుతం కేవలం 1,305 మాత్రమే పెండింగ్లో ఉన్నాయన్నారు. కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణకు సంబంధించి ఫారమ్ 6లో 8,396, ఫారమ్ 8లో 5,386 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, ఈ దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, నిర్ణీత షెడ్యూల్ లోపే పరిష్కరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఫ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ, ఆరోగ్యకర వాతావరణాన్ని నిర్మించే లక్ష్యంతో చేపట్టిన ‘నెట్ జీరో హెల్త్ క్యాంపస్’ ప్రాజెక్టును జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నెట్ జీరో హెల్త్ క్యాంపస్ ప్రాజెక్టు అమలు తీరు, మొక్కల పెంపకం, సోఫ్ కిట్, పారిశుధ్య నిర్వహణ, మధ్యాహ్న భోజనం, వసతి గృహాల్లో చేపట్టిన మరమ్మతులు వంటి అంశాలపై సంక్షేమ వసతి గృహాల వారీగా కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ -
దోషులను కఠినంగా శిక్షించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడడానికి రైఫిల్ షూటర్ షేక్ సాధిక్ ఖాన్ వేధింపులే కారణమని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన సంబంధించి సాధిక్ ఖాన్తో పాటు అతనికి సహకరించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ మేరకు ప్రజాసంఘాల నాయకులు గురువారం స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ హరేంధిర్ ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్లను కలసి వినతి పత్రాలను అందజేశారు. ఆత్మహత్య చేసుకునే సమయంలో ఏఈ కుటుంబ సభ్యులను సాధిక్ ఖాన్ వేధించారని, అందుకే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్లను సౌజన్య రాశారన్నారు. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి అతనికి కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఏఈ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. సాధిక్ ఖాన్ తమను ఇస్లాం మతంలోకి మారాలని తీవ్రంగా ఒత్తిడి చేయడంతోనే నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు జిల్లా కుమ్మర శాలివాహన సంఘ అధ్యక్షుడు టిల్లపూడి నాగేశ్వరరావు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రహీమ్, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ మాలకొండయ్య మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూకరాజు అల్లుడు జగదీష్రెడ్డికి సాధిక్ ఖాన్ పాయిజన్ ఇచ్చి హత్య చేశాడని సూసైడ్ నోట్లో సౌజన్య రాశారని అన్నారు. దీనిపై సమగ్రంగా విచారణ చేపట్టాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో శాలివాహన సంఘ నాయకులు సత్యనారాయణ, నారాయణరావు, వెంకటరమణ, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖాన్, కాకినాడ సిటీ అధ్యక్షుడు పైసల్, జిల్లా సెక్రటరీలు కె.అలీఖాన్, ఆన్సర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇలా వెలుగుబెట్టారు!
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆగస్టు 20.. ఈ రోజుకు కాకినాడ జేఎన్టీయూ చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. అది యూనివర్సిటీ ఏర్పాటైన రోజు కావడంతో వ్యవస్థాపక దినోత్సవం ఏటా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సరిగ్గా 18 ఏళ్ల నుంచి కోవిడ్ సమయంలో తప్ప ఈ రోజు యూనివర్సిలో సందడే సందడి. విద్యార్థుల కోలాహలం.. ప్రొఫెసర్ల మాటామంతి.. ముఖ్య అతిథులు, ఆపై పూర్వ విద్యార్థులతో వర్సిటీలో కొత్త వెలుగులు నిండేవి. అలాంటి రోజు గురువారం కావడం, ఆ వెలుగులు, సందడి నేడు దూరమవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. దీనికి కారణం ఏమిటోనని ఆ యూనివర్సిటీలోని కొందరు ప్రొఫెసర్లు చర్చించుకోవడం కనిపించింది. వ్యవస్థాపక దినోత్సవాన్ని ఇలా వెలగబెట్టారంటూ అంతా నిట్టూర్పు వదలడం శోచనీయం. అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కాకినాడ నగరంలో దాదాపు 100 ఎకరాలకు పైబడి విస్తీర్ణంలో 1946లో జేఎన్టీయూ–కాకినాడ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత 1972లో హైదరాబాద్లో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) ఏర్పడింది. దీనికి హైదరాబాద్, అనంతపురం కాకినాడల్లోని ఇంజినీరింగ్ కళాశాలలు అనుబంధంగా ఉండేవి. వాణిజ్య, వ్యాపార పరంగా అభివృద్ధి చెందిన కాకినాడలో విద్యా రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో సంకల్పించారు. ఈ మేరకు 2008 ఆగస్టు 20న కాకినాడ ఇంజినీరింగ్ కళాశాలలోనే జేఎన్టీయూ–కాకినాడ ఏర్పాటు చేశారు. ఇది జరిగి ఇప్పటికి 18 ఏళ్లు గడిచింది. ఇప్పటి వరకూ ఏటా వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవాలు నిర్వహిస్తూ వచ్చారు. ఎందుకో ఏమిటో కానీ ఈ ఏడాది ఈ ఉత్సవం గురించి కనీసం పట్టించుకోకపోవడంపై వర్సిటీ ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ ప్రొఫెసర్ల వాట్సాప్ గ్రూపుల్లో తమ ఆవేదన వ్యక్తం చేస్తూ చేసుకున్న చాటింగ్లను బట్టి వారు ఏవిధంగా ఆవేదన చెందుతున్నారో అర్థమవుతోందని పలువురు అంటున్నారు. కనీసం వర్సిటీ ప్రవేశ ద్వారంలో బ్యానర్ కూడా పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ రూ.కోట్ల నిధులున్నా, వాటిని ప్రభుత్వానికి ఇవ్వడానికి చూపించిన ఆసక్తి వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం చేయడంలో కనిపించలేదని మండిపడుతున్నారు. విస్తరించిన పరిధి పాత ఉమ్మడి తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 264 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు విజయనగరం, నరసారావుపేట, కాకినాడ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు జేఎన్టీయూకేకి అనుబంధంగా పని చేస్తున్నాయి. 2021 నుంచి ఈ వర్సిటీ పరిధిలో ఉన్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు విజయనగరం యూనివర్సిటీ పరిధిలోకి మారిపోయాయి. వర్సిటీ ప్రారంభంలో తొలి ఉప కులపతిగా అల్లం అప్పారావు పనిచేయగా, తరువాత తులసీరామ్దాస్, వీఎస్ఎస్ కుమార్, రామలింగరాజు, జీవీఆర్ ప్రసాదరాజు సేవలందించారు. ప్రస్తుతం వరంగల్ నిట్ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ ఈ వర్సిటీ ఉప కులపతిగా ఉన్నారు. ఫ కానరాని జేఎన్టీయూకే వ్యవస్థాపక దినోత్సవం ఫ గతంలో ఎంతో వైభవంగా నిర్వహణ ఫ ఇప్పుడు ఆ వేడుకలకు దూరం అన్నీ ఉన్నా.. వేడుకలు సున్నా ఆవిర్భావం అనంతరం ఈ వర్సిటీ ప్రాంగణంలో దాదాపు రూ.100 కోట్లకు పైబడి నిధులతో వివిధ భవనాలు నిర్మించారు. ఇన్నోవేషన్ సెంటర్, ఐఈటీలు, స్టూడెంట్ ఎమినిటీ సెంటర్, ఎగ్జామ్స్ సెల్, బాలురు, బాలికల వసతి గృహాల వంటి నిర్మాణాలతో పాటు వర్సిటీ ఆవరణలో రోడ్లు నిర్మించారు. అప్పటి వరకూ కళాశాలగా ఉన్న ప్రాంగణం వర్సిటీగా మారడంలో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోయాయి. వర్సిటీ నాలుగు వైపులా గేట్లతో పాటు ముఖద్వారాల్లో వైఎస్సార్, నెహ్రూ, గాంధీజీ వంటి ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. వర్సిటీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకూ 12 స్నాతకోత్సవాలు నిర్వహించారు. 10 లక్షల మందికి పైగా డిగ్రీ పట్టాలు, 2 వేల మందికి పైగా పీహెచ్డీలు ప్రదానం చేశారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవానికి దూరమవ్వడం విమర్శలకు తావిస్తోంది. -
అసలేం జరిగింది!
కాకినాడ: పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ముందుగా నూకరాజు, ఆయన కూతురు సౌజన్య రాసిన మరణ వాంగ్మూలాలు, అనంతరం వియ్యంకుడు భాస్కరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నూకరాజు, సౌజన్యల సెల్ ఫోన్లలో డిలీట్ చేసిన డేటాను రికవరీ చేయడం ద్వారా కీలక ఆధారాలు లభిస్తాయనే కోణంలో వారి సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించే పనిలో ఉన్నారు. మరో పక్క ఈ కేసులో నిందితుడైన సాధిక్ ఖాన్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. అతడు కర్ణాటకకు పారి పోయినట్లు గుర్తించి, నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే గోదావరిలో గల్లంతైన నూకరాజు భార్య మీనా, కూతురు సౌజన్యల ఆచూకీ మూడో రోజూ లభ్యం కాలేదు. ఫోన్ సంభాషణలే ఆధారం నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు యత్నించిన ఆదివారం రాత్రి ఏం జరిగింది అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. కుటుంబ సభ్యులతో కలిసి కారులో రాజమహేంద్రవరం బయలు దేరిన ఆయన.. దారిలో ఎవరిని కలిశారు, ఎక్కడెక్కడ ఆగారు, ఏ ప్రాంతంలో ఎంత సేపు ఉన్నారు, ఎవరితో మాట్లాడారు తదితర వాటిపై ఆరా తీస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి గోదావరిలోకి దూకే వరకు ఫోన్ సంభాషణలను విశ్లేషిస్తున్నట్లు సమాచారం. కాకినాడ నుంచి బయలుదేరి రాజమహేంద్రవరం వెళ్లే వరకు సాధిక్ పలు మార్లు కాల్ చేసి బెదిరించినట్లు నూకరాజు మనవడు కార్తికేయరెడ్డి ఇచ్చిన సమాచారంపైనా పోలీసులు దృష్టి సారించారు. మెసేజ్లపై దృష్టినూకరాజు కుటుంబ సభ్యులకు సంబంధించిన సామగ్రిని, వారి సెల్ఫోన్లను పోలీసులు ఆయన కారులో స్వా«దీనం చేసుకున్నారు. అయితే వారి సెల్ఫోన్లలో వాట్సాప్ మెసేజ్లను ఆత్మహత్యలకు ముందు డిలీట్ చేసినట్లు గుర్తించారు. వాటిని రికవరీ చేస్తే కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని భావించి, ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. లేఖల పరిశీలన నూకరాజు, సౌజన్య రాసిన లేఖలను విశ్లేషిస్తున్న పోలీసులు నూకరాజు వియ్యంకుడు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా దృష్టి సారించారు. తన కుమారుడిపై కోచ్ సాధిక్ ఖాన్ విష ప్రయోగం చేసి చంపేశాడని ఆయన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మృతుడు జగదీశ్వరరెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రాంతాలను పరిశీలించారు. అయితే దాదాపు రెండు నెలల క్రితం జరిగిన సంఘటన కావడం, జగదీశ్వరరెడ్డి మృతదేహాన్ని దహనం చేయడంతో ఆధారాలు లభించే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే జగదీశ్వరరెడ్డి చనిపోవడానికి ముందు తీవ్ర అస్వస్థతకు గురై సుమారు 20 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినట్టు చెబుతున్నారు. విష ప్రయోగం జరిగి ఉంటే అప్పటి మెడికల్ రిపోర్టుల్లో విషయం బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.కర్ణాటకకు పారిపోయిననిందితుడు!నిందితుడు సాధిక్ ఖాన్పై రాజమహేంద్రవరం టూటౌన్, కాకినాడ సర్పవరం పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతడి కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. అయితే సాధిక్ ఖాన్ సోమవారం తెల్లవారుజామునే పారిపోయినట్లు గుర్తించి, సాంకేతిక ఆధారాలతో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాకినాడలోని అతడి ఇల్లు, రైఫిల్ షూటింగ్ అకాడమీ, బంధువుల ఇళ్ల వద్ద నిఘా ఏర్పాటు చేశారు. కాగా.. సాధిక్ ఖాన్ తన సెల్ఫోన్ వదిలేసి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా అతడు కర్ణాటక పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు, నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను అక్కడకు పంపినట్టు సమాచారం.మూడో రోజూ లభించని ఆచూకీకంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో దూకి గల్లంతైన నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆచూకీ బుధవారానికి మూడు రోజులవుతున్నా లభించలేదు. ఈ ఘటనలో నూకరాజు మృతదేహం లభ్యం కాగా, భార్య, కుమార్తె ఆచూకీ తెలియలేదు. గల్లంతైన వారి కోసం రెండో పట్టణ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, జాలర్లు బోట్లపై తిరుగుతూ గాలిస్తున్నారు. అయితే ఎక్కడా ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. గోదావరిలో వరద నీరు అధికంగా ఉండడంతో గల్లంతైన వారి ఆచూకీ కనిపెట్టడం ఇబ్బందిగా మారింది. కాగా.. ఇప్పటికే నూకరాజు కారు డ్రైవర్ రాజు నుంచి రాజమహేంద్రవరం టూటౌన్ పోలీసులు పలు ఆధారాలను సేకరించారు.డబ్బున్న పిల్లల తల్లులే టార్గెట్!కాకినాడ రూరల్: సాధిక్ ఖాన్ వృత్తి రైఫిల్ షూటింగ్ కోచింగ్ అయినా, శిక్షణకు వచ్చే డబ్బున్న పిల్లల తల్లులే అతడి లక్ష్యమని పలువురు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నూకరాజు కుమార్తె సౌజన్యను టార్గెట్ చేశాడని తెలుస్తోంది. కాకినాడలోని గుడారిగుంట సమీపంలో ప్రో షూటింగ్ అకాడమీ పేరిట సాధిక్ ఖాన్ పిల్లలకు శిక్షణ ఇస్తున్నాడు. అంతకు ముందు అకాడమీని రాయుడుపాలెం జంక్షన్ వద్ద ఓ భవనంలో నిర్వహించేవాడు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనతో అతడు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాధిక్ ఖాన్ తల్లి, సోదరుడు, సోదరిని పోలీసులు విచారణ చేసి, కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. మరో వైపు రైఫిల్ షూటింగ్ శిక్షణ పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కూడా ఆరా తీస్తున్నారు. అలాగే నూకరాజు నివాసంలో సోదాలు జరిపి ఆధారాలు సేకరిస్తున్నారు. సౌజన్యది ప్రేమ వివాహం నూకరాజు కుమార్తె సౌజన్య, జగదీశ్వరరెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కార్తికేయ రెడ్డి కుమారుడు. కాంట్రాక్టర్ అయిన జగదీశ్వరరెడ్డి కాకినాడలోనే భార్య, కుమారుడితో నివాసం ఉండేవారు. ఆయన గత జూలై 2న మృతి చెందారు. కాగా.. నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయ రెడ్డి కలిసి ఆదివారం ఉదయమే కాకినాడ అశోక్ నగర్లో నివాసం నుంచి బయటకు వెళ్లారని స్థానికులు తెలిపారు. ఆ రోజు సాయంత్రం పలుమార్లు సాధిక్ ఖాన్ ఆ అపార్టుమెంట్ వద్ద కంగారుగా తిరుగుతూ కనిపించాడన్నారు. -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
పెరవలి: మండలం ముక్కామల వద్ద బాపన్న కాలువలో మంగళవారం గల్లంతైన ఏడిద రవితేజ (41) మృతదేహం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం రామన్నపాలెంలో లభ్యమైనట్టు ఎసై అలెగ్జాండర్ తెలిపారు. కాలువలో స్నానానికి దిగి ప్రమాదశాస్తూ కాలువలో కొట్టుకుపోయిన రవితేజ మంగళవారం ఉదయం నుండి రాత్రి వరకు గాలించినా దొరకని విషయం తెలిసిందే. మంగళవారం కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని ఎస్సై తెలిపారు. రూ.లక్ష విలువైన గడ్డి వామి దగ్ధం ˘ దేవరపల్లి: మండలంలోని బుచ్చియపాలెంలో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో కాట్రు వీరవెంకటసత్యనారాయణకు చెందిన గడ్డివామి దగ్ధమైంది. గ్రామ శివారున ఉన్న తన పొలంలో సుమారు రూ.1 లక్ష విలువైన వెయ్యి కట్టల ఎండుగడ్డి పూర్తిగా కాలిపోయినట్టు రైతు వీర వెంకటసత్యనారాయణ తెలిపారు. కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గడ్డివామి సమీపంలో పొగాకు బ్యారన్లు, రూ.లక్షల విలువ గల పొగాకు బేళ్లు ఉన్నాయని, ప్రమాద సమయంలో గాలి లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని ఆయన తెలిపారు. 22 నుంచి వనదుర్గ జాతర అన్నవరం: రత్నగిరి వనదేవత శ్రావణమాస జాతర మహోత్సవాలు 22వ తేదీ శ్రావణ శుద్ధ దశమి శనివారం నుంచి ప్రారంభమై 28వ తేదీ వరకు సాగనున్నాయి. 22న అమ్మవారిని బాల త్రిపురసుందరిగా, 23 సరస్వతిగా, 24న అన్నపూర్ణగా, 25 న మహాలక్ష్మిగా, 26న గాయత్రీదేవిగా, 27న వారాహిగా, 28న రాజరాజేశ్వరిగా అలంకరించి దర్శనాలు కల్పించనున్నారు. 28న అమ్మవారికి చండీ, ప్రత్యంగిర హోమాలు నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమాలు ముగించనున్నారు. బాధల బడిబాట! చాగల్లు: విద్యార్థులే కూలీలుగా మారిన ఘటన వాడపల్లి చంద్రవరం రహదారిలో చోటుచేసుకుంది. కూటమి ప్రభత్వం వచ్చిన తరువాత రహదారుల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. వాడపల్లి, చంద్రవరం రహదారిలో ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు గుంతలో దిగపడిపోయింది. విధిలేని పరిస్థితుల్లో విద్యార్థులే రాళ్లు తీసుకువచ్చి టైర్ కింద వేసి బస్సు కదిలేలా చేశారు. అధికారులు స్పందించి ఈ పుంత రోడ్డును నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కొనసాగుతున్న జూనియర్ వైద్యుల నిరసన కాకినాడ క్రైం: కాకినాడలో జూనియర్ వైద్యుల నిరసన దీక్ష కొనసాగుతోంది. ఎనిమిదో రోజుకు చేరిన దీక్షలో జూడాలు తమ డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. జీజీహెచ్ ఎదుట ఉన్న పీజీ వసతి గృహ ఆవరణలో రిలే దీక్షలు చేశారు. బుధవారం నాటి నిరసనలో 500 మందికి పైగా జూనియర్ వైద్యులు పాల్గొన్నారు. శిక్షణ భృతి, వయోపరిమితి 65కి పెంచడాన్ని ఉపసంహరించుకోవడం, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో ఎండి, ఎంఎస్ చేసిన వైద్యులకే ప్రాధాన్యం ఇవ్వడం తమ ప్రధాన డిమాండ్లని నాయకులు తెలిపారు. నిందితుడికి రెండేళ్ల జైలు తుని: ఓ కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు, రూ.రెండు వేల జరిమాన విధించినట్లు సీఐ గీతారామకృష్ణ బుధవారం తెలిపారు. సీఐ కథనం ప్రకారం కాకినాడ రూరల్ పెనుమర్తి గ్రామానికి చెందిన విజ్జం నాగరాజు 2019లో జరిగిన ఓ కేసులో ముద్దాయి. అప్పటి ఎస్సై వి.శేషుకుమార్ కేసు నమోదు చేశారు. సమగ్ర విచారణ అనంతరం కోర్టులో ఇరువైపుల వాదనలు విన్న జేఎఫ్సీఎం జడ్జి వి.గోపాలకృష్ణపై శిక్ష విధించారు. -
అలరించిన గాతా రహే మేరా దిల్
● ఉర్రూతలూగించిన ఎస్పీ శైలజ సినీ గీతాలు ● ముగిసిన శ్రీప్రకాష్ వ్యవస్థాపక దినోత్సవాలు తుని: శ్రీప్రకాష్ విద్యా సంస్థల వ్యవస్థాపక దినోత్సవాలు సంగీత స్వరాలు, విద్యార్థుల కేరంతల నడుమ బుధవారం ఘనంగా ముగిసాయి. విద్యాసంస్థలు ఏర్పడి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంస్థ సంయుక్త కార్యదర్శి సీహెచ్.విజయ్ప్రకాష్ ఆధ్వర్యంలో గాతా రహే మేరా దిల్ కార్యక్రమానికి సినీ నేపథ్య గాయని ఎస్పీ శైలజ ముఖ్య అతిథిగా హాజరై న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. తుని, పాయకారావుపేట, అన్నవరం, కాకినాడ, పెద్దాపురం, రాజమహేంద్రవరం శ్రీప్రకాష్ విద్యా సంస్థల విద్యార్థులు హాజరయ్యారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో విజేతలకు విద్యాసంస్థల అధినేత సీహెచ్వీకె నరసింహారావు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శైలజ పాడిన పాటలు యువతను ఉర్రూతలూగించాయి. విద్యాసంస్థల తరఫున ఆమెను నరసింహారావు, రామసీత దంపతులు సత్కరించారు. డాక్టర్ నరేంద్రబాబు, ఎస్.సూర్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల పూర్వ విద్యార్థులు 400 మంది రక్తదానం చేసినట్టు విజయప్రకాష్ తెలిపారు. 40 కంటే ఎక్కువ సార్లు రక్తదానం చేసిన విద్యార్థులను ఆయన సత్కరించారు. -
గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి చర్యలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడ పోర్టు దక్షిణ ద్వారం నుంచి ఉప్పలంక వద్ద ఉన్న జాతీయ రహదారి వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర కొత్త రహదారిని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. పోర్టు నుంచి జాతీయ రహదారి 216 వరకు నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించేందుకు బుధవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమా వేశం నిర్వహించారు. సంస్థ అధికారి బి.కృష్ణమూర్తి నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించే ప్రాజెక్టు నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం పోర్టు నుంచి వచ్చే సరుకు రవాణా వాహనాలు కాకినాడ నగరం మీదుగా సుమారు 27 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందన్నారు. కొత్తగా నిర్మించనున్న ఈ ఐదు కిలోమీటర్ల రహదారితో రవాణా దూరం 22 కిలోమీటర్లు తగ్గడమే కాకుండా, ప్రయాణ సమయం 30 నుంచి 40 నిమిషాల వరకు ఆదా అవుతుందన్నారు. తద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని, రహదారి భద్రత పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు. పనులు వేగవంతం చేయాలి జిల్లా పరిధిలో చేపట్టిన సివిల్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వివిధ శాఖల ఇంజినీర్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇనన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీపీ), ఆర్అండ్బీ, కాకినాడ నగరపాలక సంస్థకు చెందిన ఇంజినీర్లతో వివిధ నిధుల కింద చేపట్టిన సివిల్ పనుల పురోగతిపై సమీక్షించారు. అలాగే ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో సర్ ప్రక్రియలో భాగంగా అభ్యంతరాలు స్వీకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. బూత్ లెవల్ అధికారులు ఆ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ తమ పోలింగ్ కేంద్రాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. -
గోదావరి పుష్కర ప్రాజెక్టు సిద్ధం
రాజానగరం: వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలను సమర్ధంగా నిర్వహించేందుకుగాను గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జిజియు)తో కలిసి ‘గోదావరి పుష్కర ప్రాజెక్టు’ను రూపొందించినట్టు అమెరికాకు చెందిన ‘ఎక్స్ట్రాన్స్ సొల్యూషన్స్’ సంస్థ సీఈఓ శివకుమార్ మతపతి, కాలిఫోర్నియాలోని సొనోమా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఫరీద్ ఫర్హ్మాండ్ తెలిపారు. ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు అమలుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బుధవారం జీజీయూను సందర్శించిన వారు ఈ విషయాలను తెలియజేశారు. నగర మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాతో ఇప్పటికే వివిధ అంశాలపై చర్చించామన్నారు. వర్సిటీ ప్రొఫెసర్ వీసీ డాక్టర్ కేవీబీ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంఎంఎస్ శర్మ, డైరెక్టర్ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ఉజ్వల భవితకు.. విద్యార్థులకు ఉజ్వల భవిత అందించే సంకల్పంతో తమ వర్సిటీ అమెరికాకు చెందిన ‘ఎక్స్ట్రాన్స్ సొల్యూషన్స్’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) ప్రొఫెసర్ వీసీ డాక్టర్ కేవీబీ రాజు తెలిపారు. ఇందుకు సంబంధించి బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఉభయ సంస్థల ప్రతినిధులు చర్చించుకుని, పరస్పర అవగాహన పత్రాలను మార్చుకున్నారు. కార్యక్రమంలో ఎక్స్ట్రాన్స్ సొల్యూషన్స్ సంస్థ సీఈఓ శివకుమార్ మతపతి, ప్రొఫెసర్ డాక్టర్ ఫరీద్ ఫర్హ్మాండ్, జీజీయూ రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంఎంఎస్ శర్మ, డైరెక్టర్ డాక్టర్ ఎం. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
జానూ జ్ఞాపకాలతో చానల్
తుని రూరల్: తుని మండలం దొండవాక శివారు సీహెచ్.అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఙానేశ్వరి అదృశ్యమై 75 రోజులు గడిచినా నేటికీ ఆచూకీ లభించలేదు. అధికార యంత్రంగంతో పాటు తల్లిదండ్రులు సుంకర గణేష్, భవానీ, బంధువులు ఆమె ఆచూకీ కోసం చేయని ప్రయత్నం లేదు. తమ చిన్నారి ఎప్పటికై నా వస్తుందన్న ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. రోజులు గడిచిన తర్వాత గుర్తించేందుకు, తమ అనుబంధం, ఆప్యాయతలను గుర్తించేందుకు వీలుగా బుధవారం జాను పేరుతో యూట్యూబ్ చానల్ను ప్రారంభించినట్టు గణేష్, భవాని తెలిపారు. ఈ చానల్లో రెండేళ్లలో ఆమెతో ఉన్న ఫొటోలు, వీడియోలను అప్లోడ్ చేశారు. ఆ చానల్లో పెట్టిన ఫొటోలు చూసి ఆమె తన చెంతకు ఎప్పటికై నా రాకపోతుందా అనే ఆశతో ఉన్నట్టు వారు తెలిపారు. కాగా మంగళరం హైకోర్టు జ్ఞానేశ్వరి ఆచూకీపై ఆరా తీసి ఆమె దొరికే వరకు మరిన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. -
సుమబాలకు శ్రావణ శోభ
కడియం: శ్రావణమాసం రావడంతోనే మండలంలోని కడియపులంక పూవుల మార్కెట్కు కొత్త కళ సంతరించుకుంది. జనవరి నుంచి అంతంత మాత్రంగా సాగిన క్రయ విక్రయాలతో కళతప్పిన ఈ మార్కెట్ శ్రావణం నుంచి ప్రారంభమైన శుభ ముహూర్తాలతో సందడి నెలకొంది. శుక్రవారం వరలక్ష్మీవ్రతం నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొనుగోలుదారులతో స్థానిక మార్కెట్లో రద్దీ నెలకొంది. దిగుబడి లేక దిగుమతి.. సీజన్ ప్రారంభమైనప్పటికీ స్థానికంగా పువ్వుల దిగుబడులు లేవని రైతులు చెబుతున్నారు. లిల్లీ, మల్లి, జాజులు, కనకాంబరం, దేశవాళీ గులాబీలు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వరలక్ష్మీ వ్రతాలకు ప్రధానంగా వినియోగించే బంతి, చామంతులకు తీవ్రమైన కొరత ఏర్పడడంతో తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి దిగుమతి చేస్తున్నారు. వాటి ధరలు సైతం అలాగే ఆకాశాన్నంటుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. బుధవారం పూల ధరలు ఇలా.. చామంతి కేజీ రూ.300–450 పసుపు బంతి రూ.80–100 ఆరెంజ్ బంతి రూ.90–110 లిల్లీ రూ.300, మల్లి రూ.1200 జాజులు రూ.800 కాగడాలు రూ.1200 స్టార్ గులాబీ రూ.350–450 కనకాంబరాల బారు రూ.350–400 సంపంగి (వంద) రూ.1000 కడియపులంక మార్కెట్కు కొత్త కళ శుభ ముహూర్తాల వేళ జోరుగా విక్రయాలు స్థానిక దిగుబడి లేక ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి డిమాండ్ మేరకు పెరుగుతున్న ధరలు -
బైక్ దొంగల అరెస్టు
● పోలీసుల అదుపులో ఏడుగురు నిందితులు ● పరారీలో ముగ్గురు.. ● రూ.12 లక్షల విలువైన పది వాహనాల స్వాధీనం నిడదవోలు: ఇళ్ల వద్ద పార్క్ చేసిన మోటార్ సైకిళ్లను రాత్రి వేళలో దొంగిలిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీఐ పీవీజీ తిలక్ ఆ వివరాలను వెల్లడించారు. తణుకు పట్టణానికి చెందిన అబ్దుల్లా ఆదీబ్ రెహ్మాన్, తాళ్లపూడి సతీష్, ఉండ్రాజవరం మండలం వేలువెన్ను గ్రామానికి చెందిన గాలింకి మనోజ్ కుమార్, మన్యం సందీప్, మోర్త గ్రామానికి చెందిన వెలగట్ల జస్వంత్, పెరవలి మండలం ముక్కామలకు చెందిన దొంగ ప్రవీణ్కుమార్, నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన షేక్ ఉమర్ అలీషాలను అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు. ఈ బృందంలో గౌతం, రావులపాలెం మండలం ఈతకోటకు చెందిన విఘ్నేష్, తణుకు పట్టణానికి చెందిన పెట్ట శ్యామ్ ఆస్టియన్ పరారీలు ఉన్నారని ఆయన తెలిపారు. ఆయా ప్రాంతాల్లో నిందితులు రాత్రిపూట మూడు బైక్లపై తిరుగుతూ ఇళ్లల్లో తాళం వేసి ఉన్న మోటార్సైకిళ్లను గుర్తించి అపహరిస్తారని సీఐ వెల్లడించారు. ఈ బృందంలోని గౌతమ్ ఉండ్రాజవరం మండలం కాల్దరి గ్రామంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో ముద్దాయిగా ఉన్నాడని, అతడిని పట్టుకుని బంగారు ఆభరణాలను రికవరీ చేయాల్సి ఉందని తెలిపారు. ఏడుగురిని అదుపులోకి తీసుకోవడంలో కృషి చేసిన ఉండ్రాజవరం, సమిశ్రగూడెం ఎస్సైలు డి.రవికుమార్, బాలాజీ సుందరరావులను ఎస్పీ డి.నరసింహ కిశోర్ రివార్డులు ప్రకటించారని సీఐ తిలక్ తెలిపారు. -
పుర పోరుకు సిద్ధం!
కాకినాడ నగరం (ఫైల్) జిల్లా పరిషత్ కార్యాలయంసాక్షి ప్రతినిధి, కాకినాడ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష పోరుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర పడింది. మేయర్, మున్సిపల్ చైర్మన్లను పజలే నేరుగా ఎన్నుకునే విధానానికి ఆమోదం లభించింది. 30 ఏళ్ల తర్వాత ఈ విధానం తెరపైకి వచ్చింది. ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చితే మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ఎన్నికల విధానంలో ప్రజలే ఎన్నుకోనున్నారు. అర్బన్ ఎన్నికలకు సిద్ధమవుతుండటంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇదీ సంగతి స్థానిక సంస్థల్లో మున్సిపల్ చైర్మన్, మేయర్ను గతంలో నేరుగా ప్రజలు ఓటు వేసి ఎన్నుకునేవారు. 30 ఏళ్ల క్రితం నుంచి పరోక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానానికి శ్రీకారం చుట్టారు. అనంతరం రాజ్యాంగ సవరణలు చేపట్టడంతో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి మున్సిపల్ చైర్ పర్సన్లను కౌన్సిలర్లు, మేయర్లను కార్పొరేటర్లు ఎన్నుకునే విధానం అమలవుతోంది. ప్రత్యక్షం అంటే.. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నికలు తీసుకుంటే సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లను ప్రజలు ఓట్లు వేసి ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఒకసారి ఎన్నికై న సర్పంచ్ ఐదేళ్ల పాటు పదవిలో ఉంటారు. వారిని అభిశంసనతో తొలగించే అవకాశం ఉండదు. పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోవడంతో రెండేళ్లకో, రెండున్నరేళ్లకో అభిశంసన ప్రక్రియ ద్వారా పదవుల్లో మార్పు చేసే అవకాశం ఉంటుంది. ప్రత్యక్ష ఎన్నికలు జరిపితే ఎన్నికై న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఐదేళ్ల పాటుపదవిలో ఉండే అవకాశం ఉంటుంది. జిల్లా పరిషత్ల విభజన! జిల్లా పరిషత్ల విభజనపై సైతం మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతమున్న 13 జిల్లా పరిషత్లను 28గా విభజించనున్నట్లు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే ఒక్కో జిల్లాకు ఒక్కో జిల్లా పరిషత్ కార్యాలయంలో కొలువుదీరనుంది. ఉమ్మడి తూర్పుగోదావరిలో 62 మండలాలు ఉన్నాయి. 62 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. 58 స్థానాలకు జెడ్పీటీసీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, 4 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీళ్లంతా కాకినాడ జెడ్పీ కార్యాలయానికే వస్తున్నారు. ఉమ్మడి తూర్పు నాలుగు జిల్లాలుగా (కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పోలవరం) విడిపోయింది. జిల్లా పరిషత్ విభజనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరుణంలో నాలుగు జిల్లా కేంద్రాల్లో నాలుగు జెడ్పీ కార్యాలయాలు ఆవిర్భవించనున్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు 22 మండలాలు, పోలవరం జిల్లాలో 12, కోనసీమ 19, కాకినాడ జిల్లాలోకి 21 మండలాలు వెళ్లనున్నాయి. ప్రస్తుత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లోని మండలాలు కలవడంతో మండలాల సంఖ్య 74కు చేరింది. ఆ ప్రకారం నాలుగు జిల్లా పరిషత్లు, 74 జెడ్పీటీసీ స్థానాలు ఏర్పడనున్నాయి. టీడీపీ నేతల్లో గుబులు ప్రత్యక్ష ఎన్నికల ప్రకటనతో టీడీపీ ఆశావహుల్లో గుబులు రేగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా విశ్వాసాన్ని కోల్పోతూనే వస్తోంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, టీడీపీ నేతలు మద్యం, ఇసుక మాఫియా అవతారం ఎత్తి అవినీతికి పాల్పడటం, ప్రశ్నించే వారిపై దాడులకు దిగడం పరిపాటిగా మారింది. ఈ పరిణామం ప్రజల్లో టీడీపీ నేతలపై తీవ్ర వ్యతిరేకతను తీసుకువస్తోంది.ఉమ్మడి ‘తూర్పు’లో... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 2 మున్సిపల్ కార్పొరేషన్లు (రాజమహేంద్రవరం, కాకినాడ), 9 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఉమ్మ డి జిల్లాలో మార్చి 14న అన్ని మున్సిపాలిటీల ఐదేళ్ల పదవీకాలం పూర్తయింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. ఎన్నికలు నిర్వహిస్తే పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. మున్సిపాలిటీలకు 1987లో ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. మండపేట మున్సిపాలిటీకి బిక్కిని విజయ మున్సిపల్ చైర్ పర్సన్ గా గెలుపొందారు. 1995, 2000లో మున్సిపాలిటీల్లో డైరెక్టర్గా ఎన్నికలు జరిగాయి. 2005, 2014, 2020లో పరోక్ష ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్లోగా నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లను గుర్తించేందుకు మంగళవారం నుంచి ఇంటింటి సర్వే ప్రారంభించింది.వైఎస్సార్ సీపీకే ప్రజల మద్దతు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నిక విధానం తీసుకువచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్లో ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఎలాంటి ఎన్నికల విధానం అమలు చేసినా ప్రజా సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తున్న వైఎస్సార్ సీపీకే ప్రజల మద్దతు ఉంటుంది. స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికలైనా ప్రజలు వైఎస్సార్ సీపీకి అండగా నిలుస్తారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎదుర్కొనేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో సిద్ధంగా ఉన్నాం. – విప్పర్తి వేణుగోపాలరావు, జిల్లా పరిషత్ చైర్మన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ప్రత్యక్ష పద్ధతిలో జరగనున్న మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఇప్పటి వరకు పరోక్ష విధానం అమలు -
పూతలకొద్దీ మేతలు!
పిఠాపురం రూరల్: కోట్లాది రూపాయల ప్రజా ధనంతో నిర్మించిన రహదారులు కొద్ది నెలల్లోనే గోతులు, ప్యాచ్ వర్క్లతో దర్శనమివ్వడంతో నాణ్యత ప్రమాణాలపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. పిఠాపురం–సామర్లకోట ప్రధాన రహదారిని 8.2 కిలోమీటర్ల మేర 8 నెలల క్రితం సుమారు రూ.15 కోట్లతో నిర్మించారు. ఇంతలోనే ఈ రహదారిపై గోతుల పడి, వాటికి ప్యాచ్ వర్కులు చేయడం, కొద్దిరోజులకే మళ్లీ అవి కంకర తేలి గోతులు పడి అస్తవ్యస్తంగా మారింది. రహదారి మొత్తంలో 48 ప్యాచ్లు.. 8.2 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిలో 48 చోట్ల గోతులు ఏర్పడి వాటికి మరమ్మతుల పేరుతో వేసిన కంకరతో చూసిన వారికి అది రహదారా లేక అతుకుల బొంతా అన్నట్టు తయారైంది. కల్వర్టులపైనే అధికం ఈ మొత్తం రహదారిలో చాలా మటుకు దెబ్బతిన్న భాగాలన్నీ కల్వర్టులపైనే కావడం గమనార్హం. పాత కల్వర్టులు కావడం వల్లే ఆయా ప్రాంతాల్లో వేసిన రహదారులు సరిగా అమరక, అతుక్కోక ఇలా దెబ్బ తిన్నట్టు చెప్తున్నారు. ఇందుకు కారణాలను సంబంధిత అధికారులు, సాంకేతిక నిపుణులే చెప్పాల్సి ఉంటుంది. పిఠాపురం–సామర్లకోట ప్రధాన రహదారి కావడంతో దీనిపై వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. దీని వల్ల ఒరిపిడి ఎక్కువై తరచూ గోతులు పడుతున్నట్టు వాహన చోదకులు చెప్తున్నారు. రాత్రి వేళల్లో కల్వర్టుల వద్ద గోతులు కనపడక మరిన్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని ద్విచక్ర వాహన చోదకులు అంటున్నారు. పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఏళ్ల తరబడి ఒకేచోట పాతుకుపోయిన ఆర్అండ్బీ అధికారులు గుత్తేదారులతో పెనవేసుకున్న బలమైన బంధాల వల్ల ఆయా నిర్మాణాల సమయంలో పర్యవేక్షణ ఉండడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రూ.15 కోట్లతో రహదారి నిర్మిస్తున్నారంటే గ్రావెల్ పొరలు, వాటికి నీరు పెట్టడాలు, వాటిపై కంకర పొరలు, వాటిపై రోలర్తో అణగదొక్కి దానిపై తారు కంకర మిక్స్చర్ ఎంత మందాన వేయాలో సరైన పర్యవేక్షణ జరిగిందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అంత మొత్తంలో నిధులు వెచ్చించినా చివరికి పై పూతలు మాత్రం తప్పలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర విచారణ చేపట్టాలని... ఈ రహదారిపై ఉన్నతాధికారులు సమగ్ర సాంకేతిక తనిఖీ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. రహదారిలోని కల్వర్టులన్నింటినీ అధికారులు పరిశీలించి, వాటిపై వేసిన రహదారి నాణ్యతను పరీక్షించాల్సి ఉంది. లోపాలున్నట్టు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. రూ.15 కోట్లతో రహదారి నిర్మాణం 8 నెలల్లో 48 చోట్ల రాళ్లు తేలి గోతులు వాటిపై అతుకుల బొంతలా కంకర పూతలు పిఠాపురం–సామర్లకోట రహదారి దుస్థితి -
సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.7 కోట్ల విలువైన భూమి వితరణ
రాజమహేంద్రవరం రూరల్: హుకుంపేట గ్రామానికి చెందిన స్వర్గీయ సత్యవోలు పాపారావు చిన్న కోడలు వడ్డాది గౌరి హుకుంపేటలో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి సుమారు రూ.7 కోట్ల విలువైన 2,400 చదరపు గజాల స్థలాన్ని విరాళంగా అందజేశారు. ఈపీ డీసీఎల్ పర్యవేక్షక ఇంజినీర్ కె. తిలక్ కుమార్, రాజమహేంద్రవరం టౌన్ డివిజన్ కార్యనిర్వహక ఇంజినీర్ నక్కపల్లి శామ్యూల్ ప్రతిపాదన మేరకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, హుకుంపేట గ్రామానికి చెందిన వల్లేపల్లి సుబ్రహ్మణ్యం అభ్యర్థన మేరకు ఈ స్థలాన్ని వితరణ చేశారు. ఈ మేరకు బుధవారం కడియం సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసి ఈఈ శామ్యూల్కు గౌరి సదరు పత్రాలను అందజేశారు. ఈ మేరకు దాత గౌరికి సీఎండీ పృథ్వీతేజ్ కృతజ్ఞతలు తెలిపారు. వాడపల్లి వెంకన్న హుండీల ఆదాయం రూ.2.97 కోట్లు ఆత్రేయపురం: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వేంకటేశ్వరస్వామికి హుండీల ద్వారా 35 రోజులకు రూ.2,97,95,990 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. గతంలో కంటే ఆదాయం గణనీయంగా పెరిగినట్లు గతంలో రోజుకు హుండీల ద్వారా రూ.7,93,823 ఉండగా ఇప్పుడు రోజుకు రూ.8,51,314 సరాసరి ఆదాయంగా లభించినట్లు తెలిపారు. కాగా వాడపల్లి ఆలయ ఆవరణలో ఆలయ హుండీలను బుధవారం దేవదాయ శాఖ పర్యవేక్షణ అధికారులు, జిల్లా దేవదాయ శాఖ అధికారి వి.సత్యనారాయణ, రాజమహేంద్రవరం దేవదాయ శాఖ తనిఖీదారు ఎస్టీపీటీ శ్రీనివాస్, గ్రూపు దేవాలయాల ఈవోలు బి.కిరణ్(గోపాలపురం), మడికి గ్రూపు దేవాలయాల ఈవో ఎం.శివరామకృష్ణల సమక్షంలో లెక్కింపు నిర్వహించినట్లు తెలిపారు. స్వామివారి ప్రధాన హుండీల ద్వారా విశ్వేశ్వరస్వామి హుండీలతో కలిపి రూ.1,81,93,365, అన్న ప్రసాదం హుండీల ద్వారా రూ.1,16,02,625 రూపాయలు లభించాయన్నారు. -
అయ్యోరు చెప్పారని మళ్లీ మనువు!
అన్నవరం: మీ జీవిత భాగస్వామిని మళ్లీ మనువాడితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని జ్యోతిష్యుడు చెప్పడంతో తొమ్మిది జంటలు సత్యదేవుని సాక్షిగా మళ్లీ పెళ్లిళ్లు చేసుకున్నారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం, ఆనందపురాలకు చెందిన ఆ జంటలు వారి జ్యోతిష్యుడు కూర్మేశ్వరరావు సూచన మేరకు బుధవారం ఉదయం 9–30 గంటలకు రత్నగిరిపై ఒకటయ్యారు. అనుకున్న పనులు కావడం లేదని, ఏవేవో వారి సమస్యలు ఆయనకు చెప్పడంతో వారి ఇళ్ల వాస్తులను, జాతకాలను పరిశీలించి మీకు సరైన ముహూర్తాల్లో వివాహాలు జరగకపోవడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని, మంచి ముహూర్తంలో మళ్లీ మీ భాగస్వాములను వివాహమాడితే సమస్యలు తొలగుతాయని సెలవిచ్చారు. దీంతో ఆయన సలహా మేరకు వారంతా స్వామివారి సన్నిధిలో ఒకటయ్యారు. జ్యోతిష్కుని సలహా మేరకే మాది ఆనందపురం. కొంత కాలంగా మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. దీనిపై జ్యోతిష్కుడు కూర్మేశ్వరరావును సంప్రదించాం. మా జాతకాలు, వాస్తు చూసి ఆయన ఇచ్చిన సలహాతో ఇలా స్వామివారి సన్నిధిలో వివాహం చేసుకున్నాం. – సత్తిబాబు, లక్ష్మి సత్యదేవుని సన్నిధిలో పునఃవివాహం చేసుకున్న తొమ్మిది జంటలు -
బీసీలకు దాడిశెట్టి రాజా ప్రాధాన్యం
● ఇంటి ముట్టడిని అడ్డుకుంటాం ● స్పష్టం చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు తుని రూరల్: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా బీసీలకు వెన్నెముకగా నిలుస్తున్నారని, అటువంటి నాయకుడి ఇంటిని ముట్టడిస్తామని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. తుని మండలం ఎస్.అన్నవరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జెడ్పీ వైస్ చైర్మన్ మెరుగు పద్మలత, ఎంపీపీ లగుడు శ్రీను, పెరిక కార్పొరేషన్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ పురుషోత్తం గంగాభవాని, నాయకులు రేలంగి రమణ గౌడ్, దుంగల నాగేశ్వరరావు, సత్యనారాయణ తదితరులు విలేకర్లతో మాట్లాడారు. తెలుగు జనతా పార్టీ నాయకుడి ఆధ్వర్యంలో బీసీలతో ఈ నెల 23న దాడిశెటి రాజా ఇంటిని ముట్టడిస్తామని పి.వెంకటేశ్వరరావు అనడం విడ్డూరంగా ఉందన్నారు. కాపునాడు ఉద్యమంలో టీడీపీ ప్రభుత్వం సంబంధం లేని బీసీలను అరెస్ట్ చేసినప్పుడు పెద్దన్నగా చెప్పుకుంటున్న వెంకటేశ్వరరావు కనీసం పరామర్శించారా అని ప్రశ్నించారు. తుని మున్సిపల్ చైర్ పర్సన్, పార్టీ పట్టణ అధ్యక్ష, కోటనందూరు ఎంపీపీ, రాష్ట్ర పెరికి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవులు ఇచ్చి బీసీలపై తనకు ఉన్న ఆప్యాయతను దాడిశెట్టి రాజా చాటుకున్నార న్నారు. అటువంటి నాయకుడిపై బీసీ వ్యతిరేకని ముద్రవేయడం వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీలో కీలక పదవులన్నీ బీసీలకు, ఎస్టీల కు ఇచ్చారన్నారు. ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వా రా పరిష్కరించుకుందామన్నారు. అంతేగానీ ముట్టడిస్తాం, బీసీ వ్యతిరేకి అంటూ చేసే ప్రయత్నాలను బీసీలుగా తామంతా అడ్డుకుంటామన్నారు. నియోజకర్గంలో 1.20 లక్షల మంది బీసీలు ఉన్నారని, వారంతా దాడిశెట్టి రాజా వెంటే నడుస్తారన్నారు. -
అసలేం జరిగింది!
● ఏఈ నూకరాజు ఘటనపై పోలీసుల ముమ్మర దర్యాప్తు ● డిలీట్ అయిన సెల్ఫోన్ మెసేజ్లే కీలకం ● వాటిని రికవరీ చేసేందుకు చర్యలు ● నిందితుడు సాధిక్ ఖాన్పై నిఘా పిఠాపురం: పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ముందుగా నూకరాజు, ఆయన కూతురు సౌజన్య రాసిన మరణ వాంగ్మూలాలు, అనంతరం వియ్యంకుడు భాస్కరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నూకరాజు, సౌజన్యల సెల్ ఫోన్లలో డిలీట్ చేసిన డేటాను రికవరీ చేయడం ద్వారా కీలక ఆధారాలు లభిస్తాయనే కోణంలో వారి సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించే పనిలో ఉన్నారు. మరో పక్క ఈ కేసులో నిందితుడైన సాధిక్ ఖాన్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. అతడు కర్ణాటకకు పారి పోయినట్లు గుర్తించి, నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే గోదావరిలో గల్లంతైన నూకరాజు భార్య మీనా, కూతురు సౌజన్యల ఆచూకీ మూడో రోజూ లభ్యం కాలేదు. ఫోన్ సంభాషణలే ఆధారం నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు యత్నించిన ఆదివారం రాత్రి ఏం జరిగింది అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. కుటుంబ సభ్యులతో కలిసి కారులో రాజమహేంద్రవరం బయలు దేరిన ఆయన.. దారిలో ఎవరిని కలిశారు, ఎక్కడెక్కడ ఆగారు, ఏ ప్రాంతంలో ఎంత సేపు ఉన్నారు, ఎవరితో మాట్లాడారు తదితర వాటిపై ఆరా తీస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి గోదావరిలోకి దూకే వరకు ఫోన్ సంభాషణలను విశ్లేషిస్తున్నట్లు సమాచారం. కాకినాడ నుంచి బయలుదేరి రాజమహేంద్రవరం వెళ్లే వరకు సాధిక్ పలు మార్లు కాల్ చేసి బెదిరించినట్లు నూకరాజు మనవడు కార్తికేయరెడ్డి ఇచ్చిన సమాచారంపైనా పోలీసులు దృష్టి సారించారు. మెసేజ్లపై దృష్టి నూకరాజు కుటుంబ సభ్యులకు సంబంధించిన సామగ్రిని, వారి సెల్ఫోన్లను పోలీసులు ఆయన కారులో స్వాధీనం చేసుకున్నారు. అయితే వారి సెల్ఫోన్లలో వాట్సాప్ మెసేజ్లను ఆత్మహత్యలకు ముందు డిలీట్ చేసినట్లు గుర్తించారు. వాటిని రికవరీ చేస్తే కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని భావించి, ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. లేఖల పరిశీలన నూకరాజు, సౌజన్య రాసిన లేఖలను విశ్లేషిస్తున్న పోలీసులు నూకరాజు వియ్యంకుడు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా దృష్టి సారించారు. తన కుమారుడిపై కోచ్ సాధిక్ ఖాన్ విష ప్రయోగం చేసి చంపేశాడని ఆయన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మృతుడు జగదీశ్వరరెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రాంతాలను పరిశీలించారు. అయితే దాదాపు రెండు నెలల క్రితం జరిగిన సంఘటన కావడం, జగదీశ్వరరెడ్డి మృతదేహాన్ని దహనం చేయడంతో ఆధారాలు లభించే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే జగదీశ్వరరెడ్డి చనిపోవడానికి ముందు తీవ్ర అస్వస్థతకు గురై సుమారు 20 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినట్టు చెబుతున్నారు. విష ప్రయోగం జరిగి ఉంటే అప్పటి మెడికల్ రిపోర్టుల్లో విషయం బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కర్ణాటకకు పారిపోయిన నిందితుడు! నిందితుడు సాధిక్ ఖాన్పై రాజమహేంద్రవరం టూటౌన్, కాకినాడ సర్పవరం పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతడి కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. అయితే సాధిక్ ఖాన్ సోమవారం తెల్లవారుజామునే పారిపోయినట్లు గుర్తించి, సాంకేతిక ఆధారాలతో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాకినాడలోని అతడి ఇల్లు, రైఫిల్ షూటింగ్ అకాడమీ, బంధువుల ఇళ్ల వద్ద నిఘా ఏర్పాటు చేశారు. కాగా.. సాధిక్ ఖాన్ తన సెల్ఫోన్ వదిలేసి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా అతడు కర్ణాటక పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు, నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను అక్కడకు పంపినట్టు సమాచారం. -
నా భర్తను చంపేశాడు!
పిఠాపురం: స్థానిక పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక విషయాలు బయట పడుతున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న షేక్ సాధిక్ ఖాన్.. తన కుటుంబానికి సహాయం చేస్తున్నట్టుగా నటించి, తమను హింసించాడని, తన భర్తను హత్య చేశాడని, తన కుటుంబాన్ని చంపుతానంటూ బెదిరించాడంటూ నూకరాజు కుమార్తె రాసినట్లు చెబుతున్న లేఖలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీంతో, ఈ కేసు కీలక మలుపు తిరిగింది. సాధిక్ ఖాన్ వేధింపులు భరించలేక నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయరెడ్డి కలసి రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్వే బ్రిడ్జి మీద నుంచి ఆదివారం రాత్రి గోదావరి నదిలో దూకిన విషయం తెలిసిందే. ఈ విషయం సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నూకరాజు మృతదేహం సోమవారం రాత్రి లభ్యం కాగా.. మీనా, సౌజన్యల ఆచూకీ మంగళవారం సాయంత్రానికి కూడా లభించలేదు. వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో కార్తికేయరెడ్డి ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డాడు. సాధిక్ ఖాన్పై మరో ఫిర్యాదు తన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడేందుకు సాధిక్ ఖాన్ కారణమంటూ నూకరాజు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు సాధిక్ ఖాన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, అతడిపై తాజాగా హత్య కేసు కూడా నమోదైంది. తన కుమారుడు జగదీశ్వరరెడ్డికి సాధిక్ ఖాన్ పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి, హత్య చేశాడంటూ నూకరాజు వియ్యంకుడు, సౌజన్య మామ భాస్కరరెడ్డి మంగళవారం సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో మరో వ్యక్తి ప్రమేయం కూడా ఉందని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సాధిక్ ఖాన్పై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. పోలీసులు ఇప్పటికే నూకరాజు కారు డ్రైవర్ రాజు నుంచి సమాచారం సేకరిస్తున్నారు. నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. జగదీశ్వరరెడ్డి హత్యలో ఉన్న మరో వ్యక్తి ఎవరనే అంశంపై విచారణ చేపట్టారు. ‘నన్ను బెదిరించాడు’ నూకరాజు మనవడు కార్తికేయరెడ్డితో పాటు తన కోడలు సౌజన్య స్కూటీలో ఆధారాలున్నాయంటూ భాస్కరరెడ్డి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు ఆమె స్కూటీని తనిఖీ చేసి మూడు కవర్లను గుర్తించారు. వాటిలో తన భర్త జగదీశ్వరరెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. సాధిక్ ఖాన్ తనను బెదిరించి, తన ఆస్తిని, ఫోన్, ఏటీఎం కార్డులు, బ్యాంకు లాకరు వివరాలన్నీ తీసుకున్నాడని, చివరకు తన భర్తను పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశాడని, మాట వినకపోతే తన కుటుంబాన్ని చంపుతానంటూ బెదిరించాడని సౌజన్య ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అతడి బెదిరింపులు, వేధింపులు భరించలేకే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది.చనిపోవాలని ముందే నిర్ణయం!కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆయన కారు డ్రైవర్ రాజును రాజమహేంద్రవరం ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి, పలు ఆధారాలు సేకరించారు. సాధిక్ ఖాన్ వేధింపులు అధికం కావడంతో తాళలేక చనిపోవాలని నూకరాజు కుటుంబం ముందే నిర్ణయించుకుందని, దీనికి ఆదివారం ఉదయం ప్లాన్ వేసుకుందని సమాచారం. ఈ క్రమంలో కారు డ్రైవర్ రాజును ఆ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి రావాలని నూకరాజు చెప్పారు. ఆలోగా ఆస్తిపత్రాలన్నీ తీసుకుని సిద్ధంగా ఉంచుకున్నారు. ఇంటికి వచ్చిన డ్రైవర్ రాజుకు ఆస్తి డాక్యుమెంట్లు ఇచ్చి, తమ సమీప బంధువు మహేష్కు ఇవ్వాలని పంపించారు.డ్రైవర్ ఆ పని పూర్తి చేసుకుని వచ్చిన తరువాత ఆదివారం రాత్రికి రాజమహేంద్రవరం చేరుకున్నారు. డ్రైవర్ రాజు ద్వారా రాజమండ్రి రైల్వే స్టేషన్లో టిఫిన్లు తెప్పించుకున్నారు. అనంతరం, కారులో కొవ్వూరు చేరుకుని, డ్రైవర్ రాజుకు కొంత డబ్బులు ఇచ్చి వెళ్లిపోవాలని చెప్పారు. ఆ తర్వాత నూకరాజు కుమార్తె సౌజన్య కారు నడుపుతూండగా.. గంటకు పైగా కొవ్వూరు, రోడ్డు కం రైల్వే బ్రిడ్జి సమీపంలో తిరిగారు. సరిగ్గా 88వ నంబర్ పిల్లర్ వద్దకు వచ్చి, కారు దిగి, గోదావరిలో దూకేశారు. నూకరాజు మృతదేహానికి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
దారిలో బెదిరించి.. బలవంతంగా వసూలు
అనపర్తి: దారి తప్పి ఇబ్బంది పడుతున్న వారిని బెదిరించి, బలవంతంగా డబ్బు వసూలు చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై వాసంశెట్టి రవిచంద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన మిరియాల సుబ్రహ్మణ్యం, పలివెల వీరబాబు ఆదివారం పందలపాకలో జరిగిన తమ తోటి తాపీమేస్త్రి యల్ల సింహాద్రి వివాహానికి మోటారు సైకిల్పై వచ్చారు. వివాహం ముగిసిన తర్వాత స్వగ్రామానికి బయలుదేరారు. అయితే దారి తప్పి రాత్రి సుమారు 10:30 గంటలకు ఆ గ్రామంలోని వైన్ షాప్ వద్ద తిరగసాగారు. ఇంతలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు స్కూటర్పై వచ్చి వీరిని అడ్డగించారు. బైక్ తాళాన్ని, సుబ్రహ్మణ్యం సెల్ ఫోన్ను బలవంతంగా లాక్కున్నారు. నిందితులలో ఒక వ్యక్తి వీరబాబును బెదిరించి, మద్యం కోసం డబ్బులు అడిగాడు. లేవంటే బెదిరించి, స్కానర్ ద్వారా వైన్ షాప్కు ఫోన్పేలో డబ్బు చెల్లించేలా బలవంతం చేశారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం జేబులోని రూ.500 తీసుకుని, సెల్ఫోన్తో సహా అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యా స్థలం పరిశీలన రాజానగరం: మండలంలోని చక్రద్వారబంధంలో వివాహిత హత్యకు గురైన ప్రాంతాన్ని ఎస్సై జీవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ నిపుణులు మంగళవారం పరిశీలించారు. తాగుడుకు బానిసైన మట్టపర్తి నాగబాబు తన భార్య కుమారి పీక నులిమి, ఆపై గొంతును తాడుతో బిగించి హతమార్చిన సంగతి విదితమే. మృతురాలి తల్లి వనుం రాధ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన రాజానగరం పోలీసులు, హత్యకు దారితీసిన కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. నేడు పోలీసు కస్టడీకి ప్రియాంక కేసు నిందితులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో కారుతో ఢీకొట్టి డాక్టర్ ప్రియాంక మృతికి కారణమైన నిందితులను పోలీసులు బుధవారం కస్టడీకి తీసుకోనున్నారు. ఈ మేరకు న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు నిందితులు సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసఫ్ ఎడ్వర్డ్లను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. -
కూరాడ పీఏసీఎస్ శిలాఫలకం ధ్వంసం
కరప: కూరాడలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం (పీఏసీఎస్) కార్యాలయ భవన ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గతంలో ఆ పీఏసీఎస్ భవనం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు, రైతుల వినతి మేరకు 2023లో అప్పటి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు నిధులు మంజూరు చేసి, అదే సంవత్సరం మే 13న కొత్త భవనానికి ప్రారంభోత్సవం చేశారు. కాగా.. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. సీఈఓ బి.పరశురాముడు మంగళవారం ఉదయం 10 గంటలకు కార్యాలయానికి వెళ్లగా భవన ప్రారంభోత్సవ శిలాఫలకం ముక్కలై ఉంది. ఇదే విషయాన్ని పీఏసీఎస్ చైర్మన్ వెలుగుబంట్ల సూరిబాబుకు ఆయన తెలియజేశారు. ఆయన ఆదేశాల మేరకు కరప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే స్థానంలో కొత్త శిలాఫలకం ఏర్పాటు చేస్తామని పీఏసీఎస్ చైర్మన్ సూరిబాబు చెప్పినట్టు సీఈఓ తెలిపారు. కాగా.. దీనిపై పీఏసీఎస్ మాజీ చైర్మన్, మాజీ సర్పంచ్ రావుల ప్రసాద్ మాట్లాడుతూ దీనిపై విచారణ చేసి, తగిన చర్యలు తీసుకోకపోతే కార్యాలయం వద్ద రైతులతో కలిసి ఆందోళన చేపడతామన్నారు. కూరాడ సచివాలయంపై ఏర్పాటు చేసిన వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చిత్రపటాలను 2024 జూన్ 10న ధ్వంసం చేశారన్నారు. ఇలాగే వదిలేస్తే గ్రామంలోని శిలాఫలకాలన్నింటినీ ధ్వంసం చేసే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేశారు. -
కొనసాగుతున్న జూడాల నిరసన
కాకినాడ క్రైం: జూనియర్ డాక్టర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని నాయకులు డిమాండ్ చేశారు. రంగరాయ వైద్య కళాశాల జూనియర్ డాక్టర్ల ఆందోళన మంగళవారం ఏడో రోజుకు చేరింది. జీజీహెచ్ ఎదుట ఉన్న పీజీ వసతి గృహ ఆవరణలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సుమారు 700 మందికి పైగా హౌస్ సర్జన్లు, పీజీలు విధులు బహిష్కరించి నిరసన గళాన్ని వినిపించడంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా వివిధ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్లు సహా అసిస్టెంట్ ప్రొఫెసర్లు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రిలో కొనసాగుతున్న వైద్య సేవల్ని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మంగళవారం పరిశీలించారు. కాగా..శిక్షణ భృతి (స్టైఫండ్)ని 15–30 శాతం మేర పెంచాలని, 65 ఏళ్ల ఉద్యోగ విరమణ నిర్ణయాన్ని విరమించుకోవాలని, నియామకాల్లో ఎండీ, ఎంఎస్ చదివిన మెడికోలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయమైన తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం దిగి వచ్చి జూడాలతో చర్చలు జరపాలని నాయకులు కోరారు. సీపీఎం మద్దతు జూనియర్ వైద్యుల సమ్మెకు సీపీఎం మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ నగర కన్వీనర్ పలివెల వీరబాబు మంగళవారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల మంది జూనియర్ డాక్టర్లు సమ్మెలో ఉంటే అందులో 700 మందికి పైగా కాకినాడలోనే ఉన్నారన్నారు. ప్రభుత్వం మొండిపట్టు వీడి తక్షణమే జూడాలతో చర్చలు జరిపాలన్నారు. -
వినాయక చవితికి పగడ్బందీ ఏర్పాట్లు
ఫ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఫ అధికారులు, ఉత్సవ కమిటీలతో సమావేశం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వినాయక చవితి పండగ సందర్భంగా విగ్రహాల నిమజ్జనానికి జిల్లాలో పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. గణపతి నవరాత్రులు, నిమజ్జనం ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో మంగళవారం కలెక్టరేట్లో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతిని పూజించాలని, విగ్రహాల తయారీలో రసాయన రంగులకు బదులుగా సహజ రంగులను ఉపయోగించాలన్నారు. బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై గణేశ్ మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు సంబంధిత శాఖల నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలన్నారు. మండపాల వద్ద ఉత్సవ కమిటీలు అగ్ని ప్రమాద నివారణ పరికరాలను అందుబాటులో ఉంచాలన్నారు. రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ, అగ్నిమాపక, పోలీసు అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి, గ్రామీణ ప్రాంతాలతో సహా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గణేశ విగ్రహాల నిమజ్జనానికి అనువైన ప్రదేశాలను గుర్తించాలన్నారు. ఆ వివరాలను రెండు రోజుల్లో అందజేయాలని కోరారు. ఫ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 389 గ్రామాల్లో 75 గ్రామాలను హర్ ఘర్ జల్ గ్రామాలుగా గుర్తించడం జరిగిందని, వాటిలో ఇప్పటి వరకు 61 గ్రామాలను ప్రకటించామన్నారు. మిగిలిన గ్రామాల్లోని పనులు వేగవంతం చేసి సురక్షిత తాగునీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోడౌన్లను కలెక్టర్ పరిశీలించారు. -
భార్యను వేధిస్తున్న వ్యక్తి హత్య
● కత్తితో నరికి చంపిన భర్త ● శృంగధార గ్రామంలో ఘటన శంఖవరం: మండలంలోని పెద మల్లాపురం పంచాయతీ పరిధిలోని శృంగధారలో ఒక వ్యక్తి హత్యకు గురైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. తన భార్యను వేధిస్తున్నాడనే కారణంతో రాజవొమ్మంగి మండలం వాతంగి పంచాయతీ ఓంపాలెం గ్రామానికి చెందిన ఎస్.మణికుమార్ (32)ను కాకూరి చంద్రయ్య కత్తితో నరికి హత్య చేశాడు. వీరిద్దరూ సమీప బంధువులు కావడం విశేషం. వివరాల్లోకి వెళితే.. గతంలో శృంగధారలో చంద్రయ్య భార్యతో మణికుమార్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆమె మణికుమార్ను వదిలించుకుని భర్తతో ఉండసాగింది. దీంతో అతడు నాటు తుపాకీతో చంద్రయ్య, అతడి భార్యను కాల్చాడు. అప్పుడు పోలీసులు మణికుమార్పై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ మహిళను వేధింపులకు గురి చేశాడు. దీంతో మణికుమార్పై కాకూరి చంద్రయ్య కత్తితో దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో నిందితుడిని అన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రత్తిపాడు సీహెచ్సీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైశ్రీహరిబాబు తెలిపారు. -
ప్రగతి వెలుగుకు పోస్టుమార్ట్మ్
● మూతపడిన నిడదవోలు మహిళా మార్ట్ ● కూటమి మహిళా నేత పెత్తనంతో అస్తవ్యస్తం నిడదవోలు రూరల్: వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన నిడదవోలులోని వెలుగు మహిళా మార్ట్ లాభాల బాటలో పయనించింది. అతి తక్కువ కాలంలోనే కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఆ పార్టీ మహిళ పెత్తనంతో మూతబడింది. వివరాల్లోకి వెళితే.. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉన్నత ఆశయంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయంలో నిడదవోలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మండల సమాఖ్య పరిధిలో వెలుగు మహిళా మార్ట్ను 2022 నవంబర్ 10న ప్రారంభించారు. 1700 గ్రూపుల పరిధిలోని ఒక్కొక్క సభ్యురాలు నుంచి రూ.220 చొప్పున మూలధన పెట్టుబడితో రూ.38.35 లక్షలతో దీన్ని ఏర్పాటు చేశారు. నాణ్యమైన సరుకులను బయట మార్కెట్ కంటే ఇక్కడి తక్కువ ధరలకే విక్రయించడంతో ప్రజల ఆదరణ పెరిగింది. తద్వారా స్టాక్ సేల్లో రాష్ట్రంలోని తొలి పది స్థానాల్లో ప్రతిరోజు నిలిచేది. రోజుకు రూ.లక్షకు పైగా వ్యాపారం చేయడంతో రూ.3 కోట్ల టర్నోవర్ సాధించింది. ఆమెదే పెత్తనం మండల సమాఖ్య సభ్యుల పారదర్శక పర్యవేక్షణలో సాగాల్సిన మహిళా మార్ట్ నిర్వహణను టీడీపీ నియోజకవర్గ మహిళా నేత తన గుప్పెట్లోకి తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే 2024 డిసెంబర్లో మండల సమాఖ్య అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి, నిబంధనలకు విరుద్ధంగా ఆమె కుటుంబ సభ్యులు మార్ట్ రోజువారీ వ్యవహారాల్లో తలదూర్చారు. నగదు లావాదేవీల్లో వారి జోక్యం విపరీతంగా పెరిగింది. స్టాక్ రిజిస్టర్లో తప్పులు లెక్కలు చూపిస్తూ విక్రయాలు జరిపేవారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ మహిళా నేత భర్తతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ మార్ట్లోనే పనిచేస్తున్నట్లు జీతాలు తీసుకున్నారని డ్వాక్రా సభ్యులు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో మార్ట్ కార్యకలాపాల కోసం కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనాన్ని సైతం ఆమె భర్త నడుపుతున్నారని తెలుస్తోంది. చివరకు మూతపడి.. నిడదవోలులోని ఓ ప్రైవేటు భవనంలో మహిళా మార్ట్ను ఏర్పాటు చేసి, నెలకు రూ.21 వేల అద్దె చెల్లించేవారు. ఈ ఏడాది జనవరి 10న మూసివేసిన మార్ట్ తిరిగి తెరవలేదు. భవన యజమానికి 8 నెలలు అద్దె చెల్లించాల్సి ఉండటంతో ఆయన అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో జూన్లో మార్ట్ ఫర్నిచర్ను సూరాపురంలోని గ్రామ సమాఖ్య భవనానికి తరలించారు. -
ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో జూలై 31న ప్రచురించిన డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై ప్రజలకు అవగాహన కల్పించి, అత్యంత కచ్చితత్వంతో కూడిన ఓటర్ల జాబితాను రూపకల్పన చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని డీఆర్వో డి.తిప్పే నాయక్ కోరారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పురోగతిని వివరించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా గత జూలై 31న డ్రాఫ్ట్ ఓటరు జాబితాను ప్రచురించామన్నారు. అప్పటి నుంచి ఆగస్టు 30 వరకు డ్రాఫ్ట్ జాబితాపై అభ్యంతరాలు స్వీకరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో వివిధ కారణాలతో 1,95,602 ఓట్లను తొలగించడం జరిగిందని, వాటిలో 31,695 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశామన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజలకు అవగాహన, క్లెయిమ్స్, అభ్యంతరాల నమోదుకు సహకరించాలని సూచించారు. -
నా భర్తను చంపేశాడు!
ఫ వెలుగులోకి పిఠాపురం ఏఈ కుమార్తె లేఖలు ఫ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు పిఠాపురం: స్థానిక పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక విషయాలు బయట పడుతున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సాధిక్ ఖాన్.. తన కుటుంబానికి సహాయం చేస్తున్నట్టుగా నటించి, తమను హింసించాడని, తన భర్తను హత్య చేశాడని, తన కుటుంబాన్ని చంపుతానంటూ బెదిరించాడంటూ నూకరాజు కుమార్తె రాసినట్లు చెబుతున్న లేఖలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీంతో, ఈ కేసు కీలక మలుపు తిరిగింది. సాధిక్ ఖాన్ వేధింపులు భరించలేక నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయరెడ్డి కలసి రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్వే బ్రిడ్జి మీద నుంచి ఆదివారం రాత్రి గోదావరి నదిలో దూకిన విషయం తెలిసిందే. ఈ విషయం సోమవా రం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నూకరాజు మృతదేహం సోమవారం రాత్రి లభ్యం కాగా.. మీనా, సౌజన్యల ఆచూకీ మంగళవారం సాయంత్రానికి కూడా లభించలేదు. వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు గజ ఈతగాళ్ల సా యంతో గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో కార్తికేయరెడ్డి ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డాడు. ‘నన్ను బెదిరించాడు’ మృత్యుంజయుడిగా బతికి బయటపడిన నూకరాజు మనవడు కార్తికేయరెడ్డి, తన కోడలు సౌజన్య స్కూటీలో ఆధారాలున్నాయంటూ భాస్కరరెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు ఆమె స్కూటీని తనిఖీ చేసి మూడు కవర్లను గుర్తించారు. వాటిలో తన భర్త జగదీశ్వరరెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాధిక్ ఖాన్ తనను బెదిరించి, తన ఆస్తిని, ఫోన్, ఏటీఎం కార్డులు, బ్యాంకు లాకరు వివరాలన్నీ తీసుకున్నాడని, చివరకు తన భర్తను పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశాడని, మాట వినకపోతే తన కుటుంబాన్ని చంపుతానంటూ బెదిరించాడని సౌజన్య ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అతడి బెదిరింపులు, వేధింపులు భరించలేకే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. లలసాధిక్ ఖాన్పై మరో ఫిర్యాదు తన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడేందుకు సాధిక్ ఖాన్ కారణమంటూ నూకరాజు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు సాధిక్ ఖాన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, అతడిపై తాజాగా హత్య కేసు కూడా నమోదైంది. తన కుమారుడు జగదీశ్వరరెడ్డికి సాధిక్ ఖాన్ పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి, హత్య చేశాడంటూ నూకరాజు వియ్యంకుడు, సౌజన్య మామ భాస్కరరెడ్డి మంగళవారం సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో మరో వ్యక్తి ప్రమేయం కూడా ఉందని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సాధిక్ ఖాన్పై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. పోలీసులు ఇప్పటికే నూకరాజు కారు డ్రైవర్ రాజు నుంచి సమాచారం సేకరిస్తున్నారు. నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. జగదీశ్వరరెడ్డి హత్యలో ఉన్న మరో వ్యక్తి ఎవరనే అంశంపై విచారణ చేపట్టారు. -
కిక్కురుమనరే!
అధిక ధరలకు విక్రయం! మద్యం షాపుల్లో ధరలు పెరగడంతో దానికి అనుగుణంగా నడుస్తున్న బెల్ట్ షాపుల్లో సైతం మరింత బాదుడు తప్పడం లేదు. ప్రతి మద్యం షాపునకు అనుబంధంగా ఉన్న బెల్ట్ షాపుల్లో రూ.30 నుంచి రూ.50 పెంచి మందుబాబుల జేబులకు చిల్లు పెడుతున్నారు. మందుబాబుల అభిరుచులకు అనుగుణంగా డోర్ డెలివరీ సైతం చేస్తున్నారు. వారికి కావాల్సిన బ్రాండ్లకు ఫోన్లో ఆర్డర్ ఇస్తే చాలు, అనుకున్న సమయానికి చేరిపోతున్నాయి. పండగలు, పుట్టిన రోజు, పెళ్లిరోజు తదితర పార్టీలకు ఎక్కువ మొత్తం ఆర్డర్లు ఇస్తున్నారు. గతంలో ఎమ్మార్పీ కంటే ఒక్కో బాటిల్ఊపై రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేసేవారు. ప్రస్తుతం బాటిల్పై రూ.10 పెరగడంతో వారి ధర సైతం పెంచేశారు. ప్రస్తుతం రూ.50 నుంచి రూ.60 అదనంగా తీసుకుంటున్నారు. ఫ జోరుగా మద్యం అమ్మకాలు ఫ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఫ ధరలను పెంచి దందా ఫ మందుబాబుల జేబులు గుల్ల ఫ పట్టించుకోని అధికారులు! ఫ తూతూమంత్రంగా దాడులు ఫ జిల్లాలో 170 మద్యం దుకాణాలు ఫ ఒక్కో షాపు పరిధిలో ఐదు బెల్ట్ షాపులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతూ అన్ని సమయాల్లో మందు అందుబాటులో ఉంటోంది. ప్రభుత్వ ప్రోత్సాహం, మద్యం మాఫియా రెచ్చిపోతుండటంతో అనధికారిక విక్రయాలు పెరిగిపోయాయి. నియంత్రించాల్సిన ఎకై ్సజ్, పోలీసులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు బెల్టు షాపులను ఎక్కడపడితే అక్కడే ఏర్పాటు చేసేశారు. ఊరూరా బెల్టు జోరు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మద్యం విక్రయాలను ప్రైవేటుకు కట్టబెట్టారు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే మద్యం సిండికేట్ కొనసాగుతోంది. అధికారం ఉంది కదా అని అడ్డగోలు వ్యవహారానికి తెర తీస్తున్నారు. మద్యం షాపు అందుబాటులో లేని గ్రామాలను ఎంపిక చేసుకుని బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారు. వెరసి గ్రామీణ ప్రాంతాల్లో గల్లీకో బెల్టు దుకాణాం వెలిసింది. వాటిని అరికడుతున్నామని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోందే తప్ప, నియంత్రించిన దాఖలాలు లేవు. మద్యం షాపులకు అనుగుణంగా.. జిల్లా వ్యాప్తంగా 170 మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. వీటికి సామర్లకోట ఐఎంఎల్ డిపో నుంచి మద్యం సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే క్వార్టర్పై రూ.10 నుంచి రూ.20 వరకు పెంచి విక్రయాలు చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు అక్రమార్జన కోసం అర్రులు చాస్తున్నారు. ఒక్కొ మద్యం షాపునకు అనుగుణంగా కనీసం మూడు నుంచి ఐదు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు సగటున మూడు లెక్కవేసుకున్నా 510 బెల్ట్ షాపులు ఉన్నట్లు సమాచారం. దాదాపు ప్రతి గ్రామంలో నాలుగేసి బెల్టు షాపులు వెలుస్తున్నాయి. యథేచ్ఛగా విక్రయాలు మండల కేంద్రాల్లోని మద్యం షాపుల ద్వారా బెల్ట్ షాపులకు మద్యం తరలిస్తున్నారు. ఏ గ్రామంలో ఎవరు బెల్ట్ షాపు నిర్వహించాలి? ఎంత మొత్తం చెల్లించాలన్న విషయమై మద్యం షాపు యజమానులు నిర్వహించిన ధరను చెల్లించి మరీ గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డబ్బులు తీసుకుని బెల్ట్ షాపులను మద్యం యజమానులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వారు నిర్ణయించిన వ్యక్తి కాకుండా ఇతరులు ఎవరైనా విక్రయస్తే మాత్రం ఎకై ్సజ్, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చి దాడులు చేయిస్తున్నట్లు తెలిసింది. -
ఫఇంత నిర్లక్ష్యమా..
తూర్పుగోదావరి కలెక్టరేట్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాలలో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ సమయంలో మైదానమంతా మువ్వన్నెల జెండాలతో మెరిసిపోయింది. వేడుకలు ముగిసిన అనంతరం జెండాలను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం మైదానంలో ఎక్కడ చూసినా కింద పడిపోయిన జెండాలు, ఇతర వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. వాటిని మంగళవారానికి కూడా తొలగించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజమహేంద్రవరం -
‘మత్తు’ మాయలో పడొద్దు
కాకినాడ క్రైం: మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, మత్తు మాయలో పడొద్దని జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంరక్షణ అధికారి జాగరపు విజయ అన్నారు. నగరంలో సీబీఎం కళాశాలలో మంగళవారం నషా ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పీడీ చెరుకూరి లక్ష్మి ఆదేశాల మేరకు సీడీపీవో చెదలవాడ వెంకట్రావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బాలలకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. వాటికి అలవాటు పడితే మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు కుటుంబ, సామాజిక బంధాల్లో సమస్యలు తలెత్తుతాయన్నారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా కాకినాడను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. సోషల్ వర్కర్ చినబాబు మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, బాలల సంక్షేమం కోసం శాఖ ద్వారా అందుతున్న అవకాశాలు, పిల్లలకు దక్కే చట్టపరమైన రక్షణపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలను విక్రయించిన వారితో పాటు బానిసలైన వారిపైనా న్యాయపరమైన చర్యలు తప్పవని ప్యానల్ అడ్వకేట్ సునీల్కాంత్ తెలిపారు. సదస్సులో నాయవాదులు ఏసుబాబు, బషీర్, వసంత కుమారి, కళ్యాణి, పారా లీగల్ వలంటీర్లు మల్లికార్జున్, అబ్దుల్ ఎస్ రెడ్డి, ప్రిన్సిపాల్ క్రాంతిరేఖ పాల్గొన్నారు. -
కలకాలం గుర్తుండేలా..
● జీవితంలో ఫొటోలకు అత్యంత ప్రాధాన్యం ● జ్ఞాపకాలకు మధుర రూపం ● అనుబంధాలను తెలిపే అద్భుతం ● నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం కపిలేశ్వరపురం: మానవుడు ఎంత డబ్బు ఖర్చు చేసినా, ఎన్ని పరిశోధనలు చేసినా గతించిన కాలంలోని ఒక్క క్షణాన్ని వెనక్కి తీసుకురాలేడు. కానీ ఒక్క ఫొటో మాత్రం గత కాలపు ఆనందాన్ని, వేడుకలను, ఆహ్లాదకర సమయాలను గుర్తుకు తెస్తుంది. మన జీవితంలో ఫొటోకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ముత్తాతల రూపం, తాతయ్య ఉమ్మడి ఇల్లు, నాన్న చిన్నప్పటి అల్లరి, మన బుడిబుడి అడుగులు.. ఇలా ప్రతి క్షణాన్ని తన గుండెలో దాచుకుని, కొత్త తరానికి పంచుతుంది. ప్రకృతి అందాలను తనలో బంధించి, ఆనందాన్నిస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి గలగలలు, సముద్ర తీరం, కొబ్బరి తోటలు, పచ్చిక మైదానాలు ఇవన్నీ ఫొటోగ్రఫీకి చాలా బాగుంటాయి. నేపథ్యమిదే.. రాయడం, చిత్రించడమని అర్థం కలిగిన గ్రాఫోన్ అనే పదం నుంచి ఫొటోగ్రఫీ వచ్చింది. ఇది కమర్షియల్గా 1839 జనవరి తొమ్మిదిన ప్రపంచానికి పరిచయమైంది. మెటల్ ఆధారిత పరికరాలతో డాగ్యురియోటైప్ పద్ధతిలో ఫొటోగ్రఫీని లూయిస్ డాగ్యురీ, జోసఫ్ నైస్ఫోర్ రూపకల్పన చేశారు. 1839 ఆగస్టు 19న ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ద్వారా ఫ్రెంచ్ ప్రభుత్వం పేటెంట్ హక్కులను దక్కించుకుని ప్రపంచానికి ఫొటోగ్రఫీని అందించింది. పెరిగిన సాంకేతికత వ్యవసాయమే జీవనాధారం గల ఆ రోజుల్లో ఫొటోగ్రఫీ ఓ అద్భుతమైన కళగా మారింది. ఎవరికీ అంతుచిక్కని గొప్ప విచిత్రమైన వృత్తిగా ఉండేది. అధునాతనమైన నేటి రోజుల్లో అదే పెరిగిన సాంకేతికత ఫొటోగ్రాఫర్లను సుడిగుండంలోకి పడేసింది. డిజిటల్ పరికరాలు వచ్చాక వినియోగదారులే ఫొటో రూపకర్తలుగా మారడం వృత్తిదారులను ఇబ్బందుల్లోకి నెట్టింది. సెల్ ఫోన్లలో ఫొటోల నాణ్యతను అనేక రెట్లు పెంచిన నేపథ్యంలో ఈవెంట్ల సమయంలో తప్ప మిగిలిన ఏ సందర్భంలోనూ ప్రజలు స్టూడియోలకు వెళ్లడం లేదు. యాప్లు, వెబ్సైట్లలో డిజిటల్ అప్లోడ్స్ విధానం వచ్చాక ఫొటోప్రింట్ల అవసరం కూడా లేకుండా పోయింది. ఏఐ సహకారంతో ఫొటో, బ్యానర్, ఫ్లెక్సీల డిజైన్లు చేసేసుకుంటున్నారు. కెమెరానే నమ్ముకున్న జీవితాలెన్నో.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు నాలుగు వేల స్టూడియోలున్నాయి. అధునాతన, ఖరీదైన ఫొటోగ్రఫీ పరికరాలతో నడుస్తున్న స్టూడియోలు సుమారు 25 వరకు ఉంటాయి. సామాజిక అంశాలపై స్పందించిన రాజమహేంద్రవరానికి చెందిన జీవీవీ ప్రసాద్, ఎస్బీ రాజేశ్వరరావు పాన్ ఇండియా సోషియో కల్చరల్ అసోసియేషన్ గోదావరి బెస్ట్ ఫోటో జర్నలిస్ట్ అవార్డులు 2025 పొందారు. కాకినాడ జిల్లా గొర్రిపూడి గ్రామానికి చెందిన మేరేటి సోమరాజు తాను క్లిక్ మనిపించిన చిత్రాలకు 2016, 2017, 2019లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన పద్మాలయా స్టూడియోను 1986 ఆగస్టు 16న ప్రారంభించారు. ముగ్గురు అన్నదమ్ములు కుటుంబ సభ్యుల సమేతంగా ఆ వృత్తిలో శ్రమిస్తున్నారు. 40 ఏళ్లుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కెమెరాను వదలకుండా ముందుకు సాగుతున్నామని చిక్కం నరసింహారావు, శ్రీనివాస్, కాశీ విశ్వనాథం చెబుతున్నారు. శ్రీనివాస్ తీసిన పలు ఫొటోలకు మండపేటలో జోనల్ స్థాయి ఫొటో టేకింగ్ పోటీల్లో ప్రథమ బహుమతులు దక్కాయి. ఫొటో అంటే కేవలం ప్రకృతి అందాలు, కుటుంబాల ఆప్యాయతలను మాత్రమే చూపించదు. యుద్ధాల సమయంలో జరిగే దారుణాలకు నిదర్శనంగా నిలుస్తోంది. అక్కడి ప్రజలు పడే ఇబ్బందులను ప్రపంచానికి తెలియజేసే ఆయుధంగా మారుతోంది. వరదలు, కరవు కాటకాల సమయంలో జరిగిన నష్టానికి సాక్ష్యంగా కూడా నిలుస్తోంది. ఇలా సంతోషం, బాధ, కష్టాలు, కన్నీరు ఇలా అన్నింటికీ ఆధారమవుతోంది. అన్నింటికీ ఆధారం -
కూలి పనికి వచ్చి కాలువలో గల్లంతు
పెరవలి: ముక్కామలలోని బాపన్న కాలువలో స్నానం చేస్తున్న వ్యవసాయ కూలీ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా ఏలేశ్వరం గ్రామానికి చెందిన ఏడిద రవితేజ (41) మరికొందరితో కలిసి వ్యవసాయ పనుల కోసం గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ముగ్గురు కాలువలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ మునిగిపోబోయారు. గమనించిన స్థానికుడు వెంటనే కాలువలోకి దూకి ఇద్దరికి కాపాడాడు. కానీ రవితేజ మాత్రం నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. విషయం తెలిసిన వెంటనే రెవెన్యూ అధికారులు, పోలీసులు స్థానిక గజ ఈతగాళ్లతో కాలువలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. తహసీల్దార్ కె.నిరంజన్ ప్రమాద స్థలానికి వెళ్లి అక్కడ పరిస్థితి పరిశీలించారు. కాలువలో గాలింపునకు ఎన్డీఆర్ఎఫ్ బృందం కావాలని ఉన్నతాధికారులను కోరారు. వారు వచ్చిన వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేస్తామని ఆయన తెలిపారు. రైలు ఢీకొని వృద్ధుడి మృతి రాజమహేంద్రవరం సిటీ: గోదావరి రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని రైలు ఢీకొని సుమారు 65 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడని రాజమహేంద్రవం జీఆర్పీ స్టేషన్ ఎస్ఐ సతీష్ మంగళవారం తెలిపారు. అతడి ఎత్తు దాదాపు 5.2 అడుగులు ఉంటుందని, ఒంటిపై ఆకుపచ్చ రంగు లుంగీ ఉందన్నారు. మరే ఇతర ఆధారాలు లభ్యం కాలేదని, ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే జీఆర్పీ స్టేషన్ 94948 19898, 0883 244282కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆర్టీసీ బస్సు చక్రం ఎక్కడంతో మహిళ కాలు ఛిద్రం కడియం: మండలంలోని వేమగిరిలో బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ ఒక మహిళ జారిపడిపోయింది. అదే బస్సు చక్రం ఆమె ఎడమకాలి మీదుగా వెళ్లడంతో కాలిభాగం నుజ్జునుజ్జయిపోయింది. కడియం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేమగిరి తోట ప్రాంతానికి చెందిన వాసంశెట్టి మంగ మంగళవారం బస్సు ఎక్కుతూ జారి పడింది. అప్పటికే బస్సు కదిలిపోవడంతో ఆమె కాలు మీదుగా బస్సు వెనుక చక్రం వెళ్లిపోయింది. స్థానికులు వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కడియం ఇన్స్పెక్టర్ అల్లు వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి ఘటనలో వ్యక్తికి జైలు తొండంగి: అక్రమంగా ఇంట్లోకి చొరబడి, వ్యక్తిని గాయపరిచిన కేసులో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ తుని అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ వి.గోపాలకృష్ణ మంగళవారం తీర్పు ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2018 జనవరిలో తొండంగి మండలం బెండపూడి శివారు సుబ్బరాయపురం గ్రామానికి చెందిన ఈర్లు శ్రీనువాస్ ఇంట్లోకి అన్నవరం గ్రామానికి చెందిన మెరపల నాగ కన్నయ్య అక్రమంగా ప్రవేశించాడు. శ్రీనువాస్తో గొడవపడి అతడి దవడపై బలంగా కొట్టడంతో పాటు చంపుతానని బెదిరించాడు. ఈ ఘటనలో బాధితుడి చెవి నుంచి రక్తస్రావం జరిగింది. అతడి ఫిర్యాదు మేరకు అప్పట్లో తొండంగి ఎస్సై బి.కృష్ణమాచారి దర్యాప్తు పూర్తి చేసి చార్జ్షీట్ దాఖలు చేశారు. విచారణలో నిందితుడిపై నమోదైన అభియోగాలు రుజువు కావడంతో ఏడాది సాధారణ జైలు, మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.ఆరు వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ఆలమూరు: మండలంలోని పెదపళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బండారు ఆది శేషుబాబు (36) మృతి చెందాడు. ఆలమూరు ఎస్సై జి.నరేష్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఆది శేషుబాబు సోమవారం వేకువజామున వ్యక్తిగత పని నిమిత్తం తన బైక్పై వెళుతున్నాడు. అంతలో కుక్క అడ్డుగా రావడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న మెట్లపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రమైన గాయం కావడంతో తొలుత ఆలమూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం రాజమహేంద్రవరం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈమేరకు ఎస్సై నరేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. సురక్షితంగా కువైట్ నుంచి కోనసీమకు.. అమలాపురం రూరల్: కువైట్లో ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళను మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్(ఎంఎంసీ) సమన్వయంతో సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చారు. అయినవిల్లి మండలం కొండుకుదురులంకకు చెందిన పెట్టా అనంతలక్ష్మి కువైట్ దేశంలో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ విషయాన్ని ఆమె భర్తకు తెలిపింది. భర్త ఎంఎంసీ, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దాంతో కలెక్టర్ మహేష్కుమార్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం, ఎంఎంసీ కలసి ఆమెను సురక్షితంగా కోనసీమకు తీసుకువచ్చారు. -
మూడో యువకుడి మృతదేహం గుర్తింపు
సఖినేటిపల్లి: పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల వద్ద శనివారం అర్ధరాత్రి కాలువలోకి కారు దూసుకువెళ్లిన ఘటనలో సఖినేటిపల్లి మండలం మోరికి చెందిన మూడో ఇంజినీరింగ్ విద్యార్థి చెరుకూరి రాజారామ్ మృతదేహం ఎట్టకేలకు మంగళవారం గుర్తించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, అగ్నిమాపక బృందాలు చేపట్టిన గాలింపు చర్యల్లో పెనుగొండ వద్ద కాలువలో రాజారామ్ మృత దేహాన్ని కనుగొన్నారు. సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపోడు, ఉయ్యూరువారి మెరక గ్రామాలకు చెందిన చెరుకూరి రాజారామ్ (17), పోతుల లక్ష్మీభానువికాస్ (18), నాగిరెడ్డి దుష్యంత్ (18)లు పై దుర్ఘటనలో ప్రమాదం బారిన పడ్డారు. ఈ మేరకు ఐతంపూడి వద్ద ఘటనలో నీటి ప్రవాహానికి గల్లంతైన ఐదుగురులో నలుగురి మృతదేహాలు ఆదివారం వెలికితీశారు. వీరిలో మండలానికి చెందిన పోతుల లక్ష్మీభాను వికాస్, నాగిరెడ్డి దుష్యంత్ మృతదేహాలకు అదే రోజున పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అయితే అప్పటి నుంచి రాజారామ్ ఆచూకీ దొరకలేదు. దీంతో తండ్రి ప్రసాద్, తల్లి సత్యకుమారి పడ్డ వేదన వర్ణనాతీతం. కాగా రాజారామ్ మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించనున్నారు. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు రెండు రోజులుగా నీటిలోనే ఉండిపోవడంతో రాజారామ్ మృతదేహం ఉబ్బిపోయి, గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. కొడుకు కోసం నిద్రాహారాలు మాని సహాయక చర్యల్లో పాల్గొన్న తండ్రి దుర్గాప్రసాద్ విగతజీవిగా మారిన కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. బంధువుల రోదనలతో పెనుగొండ–మార్టేరు రహదారిపై తీవ్ర విషాదం అలముకుంది. రాజారామ్ తండ్రి దుర్గాప్రసాద్ గల్ఫ్లో ఉపాధి పొందుతూ, ఇటీవల సెలవుపై స్వగ్రామానికి వచ్చారు. రాజారామ్ను సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో బీటెక్ ఫస్టియర్లో చేర్పించారు. బుధవారం నుంచే తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం ఆ కుటుంబాన్ని తీవ్ర శోకంలోకి నెట్టింది. ఆటోడ్రైవర్ మానవత్వం మృతదేహం చెట్టుకొమ్మల్లో ఇరుక్కుపోయి, దుర్వాసన వస్తుండటంతో వెలుపలికి తీయడం పోలీసులకు సవాలుగా మారింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న పెనుగొండకు చెందిన ఆటోడ్రైవర్ చిట్టిబాబు తన ఆటోను ఆపి సహాయంగా నిలిచారు. ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో అతడు ధైర్యంగా వెళ్లి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి మృతదేహాన్ని అంబులెన్స్లోకి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. చిట్టిబాబు ప్రదర్శించిన మానవత్వానికి పోలీసులతో పాటు స్థానికులు అభినందనలు తెలిపారు. ఐతంపూడి వద్ద ఘటన -
12 జాతీయ లోక్ అదాలత్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో వచ్చే నెల 15న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైధ్ అహ్మద్ మౌలానా మంగళవారం తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి శ్రీలక్ష్మి యార్లగడ్డ ఆధ్వర్యాన జాతీయ లోక్ అదాలత్, అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ సమావేశాలను మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్లో పరిష్కరించేందుకు వీలున్న పెండింగ్ సివిల్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసుల వివరాలను న్యాయమూ ర్తులు అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరిష్కారానికి అనుకూలమైన కేసుల వివరాలను డీఎల్ఎస్ఏకి అందజేయాలని సూచించారు. అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ సమావేశంలో విచారణలో ఉన్న ఖైదీల కేసుల దర్యాప్తు, చార్జిషీట్ల దాఖలు అంశాలపై పోలీసు అధికారులకు సూచనలు చేశారు. బెయిల్, జామీను పొందడంలో ఖైదీలు ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సిఫారసు చేశారు. కార్యక్రమంలో ఎస్పీ, ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులు, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్, కార్మిక శాఖలు, సెంట్రల్ జైలు, ప్రత్యేక జైలు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులు పాల్గొన్నారు. మరింత కట్టుదిట్టంగా నైట్ పెట్రోలింగ్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా నైట్ పెట్రోలింగ్ను మరింత పటిష్టం చేసి, నేరాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజలకు రాత్రి వేళల్లో పూర్తి భద్రత కల్పించేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా పని చేస్తోందని ఎస్పీ డి.నరసింహ కిశోర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి గస్తీ సమయంలో నేరాలకు అవకాశమున్న ప్రాంతాలు, ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు, మార్కెట్లు, లాడ్జిలు, నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని వివరించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. అనుమానాస్పద వ్యక్తులను పాత నేరస్తుల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. సున్నిత ప్రాంతాలు, నేరాలకు అవకాశమున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ పెట్రోలింగ్ మరింత పెంచామని తెలిపారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అత్యవసర సహాయానికి 112, సైబర్ మోసాల ఫిర్యాదులకు 1930, మహిళల సహాయానికి 181, బాలల సహాయానికి 1098 డ్రగ్స్పై 1933 నంబర్లను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. -
వివాదాల సుడి.. సత్యదేవుని గుడి
ఫ షాపుల నుంచి లీజు వసూలులో లోపించిన పారదర్శకత ఫ నిబంధనలకు తిలోదకాలు ఫ పోస్ట్ డేటెడ్ చెక్కులతో నిర్వహణకు అనుమతి అన్నవరం: సత్యదేవుని దేవస్థానంలో వేలం ద్వారా షాపులను లీజుకు తీసుకున్న వ్యాపారుల విషయంలో అధికారులు ద్వంద వైఖరి పాటిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. రెండు నెలల క్రితం దేవస్థానంలోని పశ్చిమ రాజగోపురం వద్ద రెండు పండ్ల దుకాణాలకు వేలం నిర్వహించారు. దానిలో మొదటి షాపునకు నెలకు రూ.16.70 లక్షలు, రెండో నెంబర్ షాపునకు నెలకు రూ.18.33 లక్షలకు వేలం ఖరారైంది. నిబంధనల ప్రకారం లీజుదారులు ఆరు నెలల సొమ్మును జీఎస్టీ కలిపి దేవస్థానానికి చెల్లించాలి. ఆ ప్రకారమే రెండో నంబర్ షాపు లీజుదారు సుమారు రూ.1.30 కోట్లు చెల్లించి వ్యాపారం ప్రారంభించాడు. ఒకటో నంబర్ షాపు లీజుదారు కూడా అదేలా చెల్లించి షాపు ప్రారంభించాలి. కానీ రూ.55 లక్షలు చెల్లించి, మిగిలిన మొత్తానికి రెండు పోస్ట్ డేటెడ్ చెక్కులిస్తే అధికారులు అనుమతిచ్చేశారు. చెక్కులు బౌన్స్ అవుతున్నా.. ఇప్పటికే దేవస్థానంలో వివిధ వ్యాపారాలకు సంబంధించి లీజుదారులిచ్చిన రూ.3 కోట్ల విలువైన 20 చెక్కులు బౌన్స్ అయ్యాయి. వాటిలో ఐదు చెక్కులకు సంబంధించి లీగల్ నోటీసులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ పోస్ట్ డేటెడ్ చెక్కులు ఎలా అంగీకరించారనేది వారికే తెలియాలి. షాపులు వెనక్కి జరపాలని.. పశ్చిమ రాజగోపురం వద్ద గల షాపులను వెనక్కి జరపాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు కక్షగట్టి అధికారుల ద్వారా తమపై ఒత్తిడి తెస్తున్నారని వ్యాపారులు విమర్శిస్తున్నారు. ఈ నెల 20 లోగా నాలుగడుగులు వెనక్కి జరపాలని సి సెక్షన్ అధికారులు వ్యాపారులను సోమవారం ఆదేశించిన నేపథ్యంలో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాపులు గత నాలుగేళ్ల నుంచి ఒకే లైన్లో ఉన్నాయని, కార్తిక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు కూడా వెనక్కి జరిపించలేదని చెబుతున్నారు. కాగా.. పోస్ట్ డేటెడ్ చెక్కులు క్యాష్ కాకపోతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఈవో ఎన్.సూర్యచక్రధరరావు అన్నారు. దీనిపై ఆయనను వివరణ కోరగా పైవిధంగా స్పందించారు. ఇంకెవరికీ ఇలా అవకాశమివ్వబోమని చెప్పారు. -
బాధితులకు అండగా వైఎస్సార్ సీపీ
పెద్దాపురం: కట్టమూరులో పచ్చకామెర్ల బాధితులను హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు పరామర్శించారు. సోమవారం ఆ గ్రామ ఎస్సీ పేటలో బాధిత చిన్నారులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాధి ప్రబలడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయా బాధిత కుటుంబ సభ్యులు, కాలనీ మహిళలు మాట్లాడుతూ తమ ఎస్సీ పేటకు సక్రమంగా తాగునీరు రావడం లేదని వాపోయారు. కలుషిత నీటి సరఫరాపై అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. గ్రామంలో చాలామంది చిన్నారులు, వృద్ధులు కామెర్లు, టైఫాయిడ్తో బాధపడుతున్నారని వాపోయారు. తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్నారని, పూర్తి స్థాయిలో సురక్షిత నీరు రావడం లేదని చెప్పారు. ఈ విషయంపై దవులూరి దొరబాబు మాట్లాడుతూ గ్రామంలో సమస్యలను జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళతామని భరోసా ఇచ్చారు. కట్టమూరు గ్రామ ప్రజలకు వైఎస్సార్ సీపీ ఉంటుందని, తాను ప్రజల పక్షాన ఉండి పోరాటాలు సాగిస్తామని అన్నారు. గ్రామానికి రక్షిత నీరు సరఫరా చేసి, పూర్తి స్థాయిలో పారిశుధ్యం మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఎంపీటీసీ సభ్యులు నల్లల గోవిందు సూర్యకుమారి, ఉప్పటి ప్రసాద్, గ్రామ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు రంగనాథ్ శ్రీనివాసరావు, పార్టీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు ఏలేటి అనంతలక్ష్మి, మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు జ్వోతుల నాగు, జెస్సీ, భూషణం, జీను వెంకటరమణ, జి.రాజు, జి.ఆనంద పాల్గొన్నారు.హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దవులూరి దొరబాబు -
తట్టుకోలేక..
తనువు చాలించాలని..పిఠాపురం: స్థానిక పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబంతో సహా ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం.. దానికి కారణాలు తెలుపుతూ సూసైడ్ నోట్ రాయడం అందరినీ కలచివేసింది. ఈ ఘటన పిఠాపురంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. నూకరాజుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారిని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఆనందంగా ఉంటున్న ఆ కుటుంబంలో విధి వక్రించింది. కుమారుడు కొన్నేళ్ల క్రితమే మృతి చెందడంతో విషాదం అలుముకుంది. దాని నుంచి తేరుకుని కుమార్తెకు జగదీశ్వరరావుతో పెళ్లి చేయగా, పండంటి మనువడు కార్తికేయరెడ్డి పుట్టడంతో వారింట్లో మళ్లీ ఆనందం వెల్లివిరిసింది. కుమార్తెను అల్లుడిని మనువడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ, కొడుకు చనిపోయిన లోటును మర్చిపోయి ఆనందంగా ఉంటున్న వారి కుటుంబంలోకి షేక్ సాధిక్ఖాన్ అనే వ్యక్తి వేధింపులు అల్లుడిని కూడా పొట్టన పెట్టుకున్నట్లు చెబుతున్నారు. గత జూలైలో అల్లుడు చనిపోవడం, షేక్ షాధిక్ఖాన్ వేధింపులు రోజురోజుకూ రెట్టింపు కావడంతో కుటుంబం అంతా ప్రతి రోజూ నరకం అనుభవించేదని బంధువులు అంటున్నారు. సమాజంలో బాధ్యతాయుతమైన పదవిలో (పంచాయతీరాజ్ ఏఈగా) ఉంటూ కంటికి రెప్పలా చూసుకునే కన్న కూతురికి ఎదురైన వేధింపుల నుంచి ఆమెను కాపాడలేని నిస్సాయస్థితిలో సమాజంలో తలదించుకుని బతకాల్సి వస్తుందన్న భయంతో తండ్రిగా నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనువడు కార్తికేయరెడ్డి బలవన్మరణానికి తెగించేలా చేసిందంటున్నారు. రాజమహేంద్రవరంలో గోదావరిలోకి దూకిన నూకరాజు, ఆయన భార్య, కుమార్తె గల్లంతు కావడం.. ఆయన మనువడికి మాత్రం ఈత రావడంతో ప్రాణాలతో బయటపడడం జరిగింది. ఇంకా సూసైడ్ నోట్లు ఉన్నాయా! నూకరాజుతో పాటు ఆయన కుమార్తె, భార్య సైతం తాము చనిపోతున్నట్లు దానికి కారణాలను తెలుపుతూ మరో రెండు సూసైడ్ నోట్లు రాసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అవి బయటపడలేదంటున్నారు. వారు కూడా తమ బాధను వ్యక్తం చేస్తూ లెటర్లు రాసి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు వారు రాసినట్లు చెబుతున్న సూసైడ్నోట్లు బయటపడలేదు. అటువంటివి ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దిగ్భ్రాంతిలో పిఠాపురం పిఠాపురంలో పంచాయతీ రాజ్ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తను పిఠాపురంలో సహచర ఉద్యోగులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు జీర్ణించుకోలేక పోతున్నారు. అందరితో కలుపుగోరుతనంగా ఉంటూ ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా తన పని తాను చేసుకుపోయే మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తిగా పేరున్న నూకరాజు హఠాత్తుగా ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తెలియడంతో పిఠాపురంలో నేతలు అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 12 ఏళ్లుగా ఒకేచోట అదీ పిఠాపురంలో ఆయన పని చేస్తున్నారంటే ఆయన మంచితనమే ఇక్కడ ఇంతకాలం పనిచేసేలా చేసిందని సహచర ఉద్యోగులు చెబుతున్నారు. పిఠాపురంలో పోలీసుల విచారణ పిఠాపురం పంచాయతీరాజ్ విభాగంలో ఏఈగా పని చేస్తున్న నూకరాజు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కార్యాలయంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన ఆత్మహత్యకు సూసైడ్ నోట్లో రాసిన కారణంతో పాటు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఆయన పని చేసేటప్పుడు ఎలా ఉండేవారు, ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లో సహచర ఉద్యోగులను అడిగి వివరాలు సేకరించారు. పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు వివరాలు తీసుకున్నారు. మరణ శాసనం రాసుకుని.. కాపాడాలని ప్రయత్నించినా.. నూకరాజు సూసైడ్ నోట్ తమ గ్రూప్లో పోస్టు చేసిన వెంటనే స్పందించి నూకరాజు కుటుంబం ఎక్కడ ఉందనే విషయాలను తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాం. సూసైడ్ నోట్ చూసిన వెంటనే కాకినాడలో ఆయన ఇంటికి వెళ్లి చూడగా, తాళాలు వేసి ఉండడంతో కంగారు వచ్చి ఆయన కోసం ఫోన్లో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చివరకు ఆయన కుటుంబంతో సహా ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించి గోదావరిలోకి దూకినట్లు తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాం. ఆయన ఒక వ్యక్తి వల్ల అవమానాలను వేధింపులను భరించలేక ఇంత దారుణమైన నిర్ణయం తీసుకున్నారని ఆయనే రాశారు. కానీ కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అందుకే అవమానం భరించలేకపోయారు. అంతేగాని ఆయన తప్పుడు మనిషి కాదు. ఆయనపై ఎవరు ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేయవద్దని వేడుకుంటున్నాం. – ఎన్.కాశీవిశ్వనాథ్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, పిఠాపురంకంటికి రెప్పలా పెంచుకున్న కన్న కూతురి జీవితం ఎలా వెళ్తుందో.. కుటుంబ పరువు ఏమవుతుందోనని కలత ఆ తండ్రిని కుంగదీసింది. ఆ కుటుంబానికి అనుకోని ఓ వ్యక్తి బెదిరింపులు అసలు ఈ జీవితం ఎందుకనే స్థాయికి తీసుకెళ్లాయి.. అవి తట్టుకోలేక తనువు చాలించాలని పంచాయతీరాజ్లో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు తన భార్య, కుమార్తెతో పాటు మనువడిని తీసుకుని రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో దూకేయడం కలకలం రేపింది. ఈ ఘటన పిఠాపురంలో విషాదాన్ని నింపింది. ఆ హృదయవిదారక ఘటనను తట్టిచూస్తే.. ఫ పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం ఫ సూసైడ్ నోట్లో వివరాలు వెల్లడి ఫ పిఠాపురంలో విషాదఛాయలు ఎంత కాలం నుంచి ఇబ్బంది పడుతున్నారో ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చిన నూకరాజు చివరకు తన మరణ శాసనాన్ని తానే రాసుకుని అవమానం, భయం ముంచెత్తిన వేళ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. చివరి క్షణాల్లో తాను రాసిన సూసైడ్ నోట్ను తన సహచర ఉద్యోగుల వాట్సాప్ గ్రూప్లో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో పోస్టు చేసినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. అది చూసిన సహచర ఉద్యోగులు కంగారు పడి కాకినాడలో ఆయన ఇంటికి వెళ్లి చూడగా, ఇంటికి తాళం వేసి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆయన సెల్కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆయన కారు డ్రైవర్కు ఫోన్ చేయగా.. నూకరాజు కుటుంబ సభ్యులను తాను కారులో రాజమహేంద్రవరం తీసుకెళ్లానని అక్కడకు వెళ్లాక.. మా తమ్ముడి ఇంటికి వెళుతున్నాం.. నువ్వు కారు వదిలేసి రైలు ఎక్కి ఇంటికి వెళ్లిపోమని డ్రైవర్కు ఆయన చెప్పినట్లు సహచర ఉద్యోగులు వివరించారు. -
రూ.30 కోట్లు మింగేసినా పట్టించుకోరా!
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రూ.30 కోట్లు మింగేసినా పట్టించుకోరా.. టీడీపీ నాయకుడు కావడంతోనే వెనుకంజ వేస్తున్నారా అంటూ వినాయక్ ఈస్ట్ చిట్స్ ఫండ్ బాధితులు మండిపడ్డారు. ఎంతో కష్టపడి అవసరాలకు ఉపయోగపడతాయని రూపాయి, రూపాయి పోగుచేసుకొని చీటి కడితే.. తమ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ హరేంధిర ప్రసాద్కు బాధితుల సంఘ నాయకులు రాఘవులు, సక్కుబాయ్, అనసూరి రాజకుమారి వినతి పత్రం సమర్పించారు. వందలాది మంది వద్ద చీటీలు కట్టించుకుని రూ.30 కోట్లకు టోకరా వేసిన చిట్స్ యాజమాన్యం, డైరెక్టర్లందరినీ తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల బాధలు పట్టించుకోకుండా చిట్స్ ఫండ్ యాజమాన్యానికి సహకరిస్తున్న అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలని, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరారు. చిట్స్ ఫండ్ చైర్మన్ శేతుమాధవరావు టీడీపీ నాయకుడు కావడం వల్లే పోలీసులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అతనిపై చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోయారు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసుల సహకారంతో అతను ప్రస్తుతం బెయిల్పై తిరుగుతున్నట్లు చెప్పారు. చిట్స్ ఫండ్ డైరెక్టర్లపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, తాము ఇప్పటికే పలుమార్లు పోలీసులు, వివిధ శాఖల అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో బాధితులు సలాది కుమారి, త్రినాథ్, ఎర్రంశెట్టి సత్యనారాయణమూర్తి, కోటిపల్లి విజయశ్రీ, కోటిపల్లి వీరరాఘవులు, కృష్ణవేణి, సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.ఫ టీడీపీ నాయకుడు కావడంతోనే వెనుకంజా! ఫ వినాయక్ ఈస్ట్ చిట్స్ బాధితుల మండిపాటు -
గంటన్నరకు పైగా ఈతకొట్టి..
కారులో ఊరికి వెళుతున్నామని బయలుదేరాం. చుట్టాలింటికి అనుకున్నాను. కానీ రాజమహేంద్రవరం బ్రిడ్జిపై కారు ఆపి అందరం దిగాం. నేను చూస్తుండగానే మా తాత, అమ్మమ్మ గోదావరిలోకి దూకేశారు. వారి వెనుక మా అమ్మ నా చేయి పట్టుకుని దూకేసింది. కానీ నేను బ్రిడ్జి రెయిలింగ్ పట్టుకుని ఉండిపోయాను. కానీ కొంతసేపటికి చేయిజారి పోయి గోదావరిలో పడిపోయాను. నాకు ఈత రావడం వల్ల సుమారు గంటన్నరకు పైగా కిలోమీటరు దూరం వరకు ఈత కొడుతూ పైకి తేలాను. ఇంతలో ఒక బోటు వచ్చి, నన్ను కాపాడిందని మృత్యుంజయుడిగా బయటపడిన కార్తికేయరెడ్డి చెబుతున్న మాటలు విన్న వారిని కలిచివేశాయి. -
కాళ్లు అరుగుతున్నాయ్!
బోట్క్లబ్ (కాకినాడసిటీ): వారం వారం వస్తున్నాం.. కాళ్లు అరిగేలా తిరుగుతున్నాం.. అయినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని అర్జీదారులు నిటూర్పు వదులుతున్నారు. మండల కేంద్రాల్లోని కార్యాలయాల్లో పనులు కాకపోవడంతో కాకినాడ కలెక్టరేట్కు వచ్చి పీజీఆర్ఎస్లో అర్జీలు ఇస్తున్నా ఫలితం లేదని వాపోతున్నారు. ప్రతి సోమవారం ప్రభుత్వం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్పై వారు పెదవి విరుస్తున్నారు. అర్జీలకు సరైన పరిష్కారం లభించడం లేదని అంటున్నారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు 292 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ క్లీనిక్కు 32 అర్జీలు సమర్పించారు. వీటిని కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ అపూర్వ భరత్తో పాటు వివిధ శాఖల అధికారులు స్వీకరించారు. అయితే పరిష్కారం కాని పలు సమస్యలు పరిశీలిస్తే.. పింఛను కోసం అగచాట్లు గత రెండేళ్లుగా పింఛను ఇవ్వాలని తిరుగుతున్నా, ఎవరూ స్పందించడం లేదు. రోడ్డు ప్రమాదంతో నా కాళ్లు చచ్చుబడిపోయాయి. దీంతో బయటకు వెళ్లాలంటే వేరొకరి సహాయం అవసరం. నాకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం కుటుంబ పోషణ భారంగా ఉంది. 70 శాతం వైకల్యం ఉందని సదరం సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అయినా పింఛన్ ఇవ్వడం లేదు. – జువ్వ సత్యనారాయణ, శృంగవృక్షం, తొండంగి మండలంఫ పీజీఆర్ఎస్పై అర్జీదారుల పెదవివిరుపు ఫ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన -
డాక్టర్ ప్రియాంక కేసులో మరో మలుపు
ఫ విచారణ అధికారిగా ఐపీఎస్ అధికారి పాటిల్ ఫ ఫైల్స్ను అప్పగించిన ప్రకాశ్నగర్ పోలీసులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక మృతి ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తునకు తూర్పుగోదావరి జిల్లా అదనపు ఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ను విచారణ అధికారిగా ప్రభుత్వం నియమించింది. దీంతో డాక్టర్ ప్రియాంక కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశాలపై అనేక అనుమానాలు, ప్రశ్నలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా స్థానిక ప్రసాదిత్య మాల్ వద్ద ఘటన జరిగిన తేదీ నుంచి విషయం అధికారికంగా వెలుగులోకి వచ్చే వరకు గడిచిన సమయం ఏమిటి? ఆ మధ్యలో అసలు ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు ఎప్పుడు చేరింది? చేరిన వెంటనే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే ప్రశ్నలకు స్పష్టమైన ఆధారాలను సేకరించనున్నారు. అదేవిధంగా ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీ, మృతురాలి కాల్స్ డేటా, ఆమెతో చివరిగా మాట్లాడిన వ్యక్తులు, నిందితుల కదలికలు, వాహనాల ప్రయాణ వివరాలు, ఫోరెన్సిక్ ఆధారాలు, పోస్ట్మార్టం నివేదికతో పాటు ఇప్పటివరకు సేకరించిన ప్రతి ఆధారాన్ని విచారణ అధికారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. అసలు పరీక్ష ఇక్కడే.. ఇప్పటికే బయటకు వచ్చిన సమాచారాన్ని మాత్రమే ఽధ్రువీకరించడమా? లేకుంటే ఘటనకు ముందు నుంచి, ఘటన జరిగిన సమయం నుంచి, ఆ తర్వాత విషయం వెలుగులోకి వచ్చే వరకు జరిగిన ప్రతి పరిణామాన్ని స్వతంత్రంగా పరిశీలించడమా? అనేది కీలకం. ఈ విచారణలో ప్రతి అనుమానానికి ఆధారాలతో సమాధానం లభిస్తేనే ప్రజల్లో నెలకొన్న సందేహాలు తొలగుతాయి. ఎవరి తప్పు ఉన్నా బయటపెట్టడం, దర్యాప్తులో ఎక్కడైనా లోపం జరిగి ఉంటే దానిని కూడా స్పష్టంగా వెల్లడించడం ఈ విచారణకు అసలు సవాల్. -
పారదర్శకంగా రీసర్వే చేపట్టాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రీసర్వే నాలుగో దశకు సంబంధించిన డేటా ఎంట్రీని ఈ నెల 20వ తేదీలోగా పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి సోమవారం తహసీల్దార్లు, రెవెన్యూ, సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రీసర్వే ప్రక్రియను అత్యంత కచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. భూములపై వాస్తవ అనుభవదారులకు హక్కులు కల్పించే విధంగా రీసర్వే ప్రక్రియను నిష్పక్షపాతంగా చేపట్టాలని స్పష్టం చేశారు. రీ సర్వేకు సంబంధించి సర్వే నంబర్లు, ఆధార్ నంబర్ల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలలకు సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ఇప్పటి నుంచే ఈకేవైసీ, బుక్ ఫర్ ప్రింటింగ్ ప్రక్రియలపై దృష్టి సారించాలని ఆదేశించారు. అనంతరం కౌడా పరిధిలోని అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కౌడా పరిధిలో చేపట్టాల్సిన అన్ని సివిల్ పనులను ఈ నెల 24 నాటికి ప్రారంభించాలని అన్నారు. సమావేశంలో జేసీ అపూర్వ భరత్, ట్రైనీ కలెక్టర్ ప్రియా పాల్గొన్నారు. అనుమతి మేరకే పొగాకు సాగు చేయాలి దేవరపల్లి: పొగాకు బోర్డు అనుమతించిన మేరకే పంట సాగు చేయాలని బోర్డు కార్యదర్శి డి.వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. సోమవారం గోపాలపురం పొగాకు వేలం కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. అనంతరం వేలం కేంద్రం వద్ద రైతులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పొగాకు సాగులో కొత్త నిబంధనలను వివరించారు. 2025–26 సీజన్లో అధిక ఉత్పత్తి కారణంగా మార్కెట్లో ధరలు తగ్గి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. 2026–27 సీజన్లో పొగాకు (ఎఫ్సీవీ) సాగు విస్తీర్ణం, ఉత్పత్తిని పరిమితం చేయాలని బోర్డు నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తిని 170 మిలియన్ల కిలోల నుంచి 81 మిలియన్ల కిలోలకు పరిమితం చేయాలని అధికారులు తేల్చారన్నారు. అధిక ఉత్పత్తి వల్ల ధరలు పడిపోకుండా రైతులకు ముందస్తుగా అవగాహన కల్పించనున్నట్టు ఆయన తెలిపారు. తక్కువ నాణ్యత గల పొగాకుకు గిట్టుబాటు ధర వచ్చేలా కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం సూచించిందన్నారు. గ్రామీణ, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా రైతు సంక్షేమ పథకంలో ప్రభుత్వ రుసుం రూ. 500 నుంచి రూ.1,325కు పెంచినట్టు వేణుగోపాల్ తెలిపారు. మరణించిన రైతు కుటుంబానికి ఆర్థిక సాయాన్ని పెంచారన్నారు. విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా పథకాన్ని అమలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. బోర్డు రీజినల్ మేనేజర్ జె.సురేంద్రకుమార్, వేలం నిర్వహణాధికారి బి.శ్రీహరి, ఐటీసీ మేనేజర్ కొట్రేషి, పీఎస్ఎస్హెచ్ కంపెనీ ప్రతినిధి రఘురామరాజు, జీపీఐ కంపెనీ ప్రతినిధి జనార్దన్రెడ్డి, బోర్డు మాజీ వైస్ చైర్మన్ గద్దే శేషగిరిరావు పాల్గొన్నారు. ప్రభుత్వానికి ఏటీఎంలా పోలవరం ప్రాజెక్టు రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును డబ్బులు సంపాదించే ఏటీఎం మెషీన్లా వాడుకుంటోందని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్రం నిర్మించేలా ఒప్పందం జరిగినా, రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యత తీసుకుని, ఇంకా పూర్తి చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాజమహేంద్రవరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మొదట రూ.6 వేల కోట్లుగా ప్రకటించగా, ప్రస్తుతం రూ.66 వేల కోట్లు దాటిందన్నారు. ముంపు ప్రాంతాల్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో భూసేకరణ జరగలేదన్నారు. ఛత్తీస్గఢ్లో 4 గ్రామాలు, ఒడిశాలో 8 గ్రామాలు ముంపునకు గురయ్యే పరిస్థితి ఉండటంతో రెండు ప్రభుత్వాల అనుమతులు అవసరం ఉందన్నారు. నిర్వాసితుల కోసం నిర్మించిన కొన్ని కాలనీలు శిథిలావస్థకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణంలో లోపభూయిష్టమైన విధానాలు ఉన్నాయని, పోలవరం భూములు 5వ షెడ్యూల్, ఏపీ ఎల్పీఆర్ చట్ట పరిధిలో ఉన్నాయని చెప్పారు. షెడ్యూల్ ప్రాంతాల భూములను ప్రైవేట్ సంస్థలకు కేటాయించడం చట్టవిరుద్ధమన్నారు. పోలవరం హైడ్రో పవర్ను ప్రభుత్వ సంస్థ ఏపీ జెన్కోకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన రైతుల నుంచి తీసుకున్న భూములను గ్రీన్కో, మెగా సంస్థలకు పవర్ ఉత్పత్తి కోసం కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు జాతీయ గిరిజన కమిషన్, సంబంధిత గిరిజన సంక్షేమ సంస్థలు రంగంలోకి దిగాయన్నారు. ఈ భూముల కేటాయింపు విషయంలో చివరి వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన భూములను ప్రభుత్వమే వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. -
నా భూమిని ఆక్రమించారు
మా గ్రామంలో టీడీపీకి చెందిన ఓ వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి, నేను సాగు చేసుకుంటున్న కొంత భూమిని ఆక్రమించుకున్నాడు. 4.92 సెంట్ల భూమిని మూడు నెలల క్రితం టీడీపీ నాయకులు అధికారులతో కుమ్మకై ్క ఇలా చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా, పట్టించుకోలేదు. మూడు నెలలుగా తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. – ఎన్.సత్యవతి, శ్రీరామపురం, కొత్తపల్లి మండలం సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు కాకినాడ భానుగుడి సెంటర్లోని ఓ కళాశాలలో చదివాను. ఆ యాజమాన్యం నా విద్యార్హత సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. నేను ఫీజు చెల్లించినా మళ్లీ రూ.60 వేలు కట్టాలని లేకుంటే సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని చెబుతున్నారు. ఇప్పటికే మూడు నెలలుగా తిరుగుతున్నా, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. – వి.దొరబాబు, విద్యార్థి, కాకినాడ జగన్నాథపురం -
మొత్తమోంథా వదిలేసి..
దేశానికే అన్నం పెడుతున్న రైతన్నల నోటికాడ కూడును చంద్రబాబు ప్రభుత్వం దూరం చేస్తోంది.. ప్రకృతి కన్నెర్ర జేసి పొలాలను తుడిచి పెట్టేసినా, కనీసం అటువైపు చూడకుంది.. నెలల కిందట సంభవించిన మోంథా తుపానుతో అనేక మంది రైతులు నష్టపోయినా, పరిహారం అందించాల్సిన ప్రభుత్వం పరిహాసం చేస్తోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ: రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతుందే తప్ప.. ఆచరణలో మాత్రం ఆమడ దూరం ఉంటోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను దగా చేస్తూనే ఉంది. అన్నదాత సుఖీభవ నిధుల్లో కోత విధించింది. ఉచిత పంటల బీమాను ఎత్తివేసింది. మోంథా తుపాను నష్ట పరిహారం మంజూరులోనూ అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. గతేడాది అక్టోబర్లో సంభవించిన మోంథా తుపాను కర్షకులను నిండా ముంచేసింది. అప్పట్లో భారీ ఈదురు గాలులు, వర్షాలకు వరి, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేల ఎకరాల్లో వరి నేలకొరిగింది. వరి పొలాల్లో నీరు చేరి సింహభాగం పంటను నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇలాంటి విపత్కర సమయంలో అండగా ఉండాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. తూతూ మంత్రంగా పంట నష్టం అంచనాలు రూపొందించి మమ అనిపించేసింది. నష్టం అంచనా వేసి అనేక నెలలు కావొస్తున్నా.. నేటికీ పరిహారం మంజూరు చేసిన దాఖలాలు లేవు. పరిహారం ఊసేలేదు. అంతా అతలాకుతలం మోంథా తుపాను దెబ్బకు రైతులు అతలాకుతలం అయ్యారు. జిల్లా వ్యాప్తంగా తుపాను నష్టాలపై కసరత్తు చేసిన అధికారులు తుది నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపారు. జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి 46,929 మంది రైతులు నష్టపోయారు. మొత్తం 50,815 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతినగా.. వాటి విలువ రూ.52.17 కోట్లుగా నిర్ధారించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం, పిఠాపురం రూరల్, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలాలతో పాటు సామర్లకోట, పెద్దాపురం, కిర్లంపూడి, గోకవరం, కాకినాడ రూరల్, కరప తదితర మండలాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రతి రైతూ ఎకరానికి రూ.36 వేలకు పైగా నష్టపోయారు. అలాగే ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న 64 ఎకరాలు, తీపి మొక్కజొన్న 64.715 ఎకరాల్లో నష్టం వాటిలినట్లు తేల్చారు. అంచనాలు రూపొందించి పదకొండు నెలలు దాటుతున్నా.. నయాపైసా నష్టపరిహారం అందించిన దాఖలాలు లేవు. పరిహారం చెల్లింపులోనూ కుట్ర తుపాను కారణంగా దెబ్బతిన్న వరికి ఎకరానికి రూ.10 వేలు, మిగిలిన పంటలకు రూ.6 వేల చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి అన్ని పంటలూ కలిపి జిల్లా వ్యాప్తంగా రైతులకు రూ.150 కోట్లకు పైనే నష్టపోగా.. ప్రభుత్వం మాత్రం రూ.52.17 కోట్లుగా తేల్చింది. ఈ పరిణామం రైతుల్లో ఆగ్రహావేశాలు నింపుతోంది. జరిగిన నష్టాన్ని సైతం తక్కువగా చూపి.. పరిహారంలో కోత విధించేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల కొర్రి పెట్టి.. తుపాను ప్రభావంతో నష్టపోయిన పంట నమోదులో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. పంట నష్టపోయిన రైతులందరి పేర్లు నమోదు చేయలేదు. 33 శాతం కంటే ఎక్కువ నష్టపోతే మాత్రమే నమోదు చేసింది. జిల్లాలో అత్యధికంగా 33 శాతం కంటే తక్కువగా పంట నష్టం వాటిల్లింది. సుమారు 10 వేల హెక్టార్లకు పైగా ఇదే పరిస్థితి నెలకొంది. వీరి పరిస్థితేంటో అర్థం కావడం లేదు. ఉచిత పంటల బీమాకు మంగళం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడింది. ప్రీమియం సొమ్ము చెల్లింపులు నిలిపివేసింది. ఆ భారం రైతులపైనే మోపింది. ఈ మేరకు 2024–25 రబీ సీజన్లో ఉత్తర్వులు సైతం వెలువరించింది. వరి పంట హెక్టారు రూ.1.05 లక్షలుగా విలువ నిర్ధారించి రైతు వాటాగా 1.50 శాతం అంటే రూ.1,575 ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఇది రైతులే చెల్లించుకునేలా మార్గదర్శకాలు రూపొందించి అమలు చేసింది. జిల్లా వ్యాప్తంగా 2,15,068 ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేయగా.. రైతులు ఎకరాకు రూ.210 చొప్పున 72,766 ఎకరాలకు మాత్రమే ప్రీమియం చెల్లించారు. మిగిలిన 1,42,302 ఎకరాలు క్రాఫ్ ఇన్సూరెన్స్కు దూరంగా ఉండటం గమనార్హం. ఫలితంగా మోంథా తుపానుకు నష్టపోయిన రైతులు బీమా పరిహారం పొందలేని పరిస్థితి తలెత్తింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వ్యవసాయం, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. మిచాంగ్ తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన కర్షకుల కన్నీళ్లు తుడిచింది. నెలల వ్యవధిలోనే పంటలకు పరిహారం మంజూరు చేసింది. ఆదుకోవడంలో విఫలం రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. నష్టపోయిన పంటలకు సైతం నెలలు దాటుతున్నా, నేటికీ పరిహారం ఇవ్వకపోవడం దారుణం. పంటలకు కనీసం యూరియా సైతం ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందంటే, రైతుల సంక్షేమానికి ఏ మాత్రం పాటుపడుతుందో అర్థం అవుతోంది. –లంకా ప్రసాద్, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఇంకా పరిహారం ఇవ్వలేదు వేమవరం రెవెన్యూ పంచాయతీ పరిధిలో ఎకరంన్నర భూమి ఉంది. అందులో వరి వేయగా, మోంథా తుపానుతో నీట మునిగింది. రూ.40 వేల పెట్టుబడి పెట్టాను. రూ.60 వేల ఆదాయం వచ్చేది. గతంలో అధికారులు నష్టపరిహారం నమోదు చేసుకున్నారు. నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వం ఇంత వరకు పరిహారం చెల్లించలేదు. – అనసూరి రాజు, రైతు, కొత్తపేట, తొండంగి మండలం పంట నష్టం ఇలా.. పంట నష్టపోయిన నష్టం నష్టం పెట్టుబడి రాయితీ రైతులు ఎకరాలు (రూ.కోట్లలో) (రూ.కోట్లలో) మొక్కజొన్న 79 64 1.72 0.03వరి 44,522 49,473 144.60 50.05 మినుము 578 797.81 13.13 0.48 తీపి మొక్కజొన్న 65 64.715 1.73 0.03 తుపాను బాధితులకు అందని పరిహారం జిల్లాలో రూ.52.17 కోట్ల నష్టం నెలలు గడుస్తున్నా పైసా విదల్చని చంద్రబాబు సర్కారు పరిహారం కోసం రైతులకు తప్పని నిరీక్షణ -
రత్నగిరిపై భక్తజన సందడి
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం ఆదివారం భక్తులతో నిండిపోయింది. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున సత్యదేవుని సన్నిధిలో, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ పెళ్లి బృందాలు, నవ దంపతుల రాకతో ఆలయం కిటకిటలాడింది. సుమారు 30 వేల మంది భక్తులు తరలిరాగా, 2 వేల వ్రతాలు జరిగాయి. స్వామివారి దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్తో అంతరాలయం దర్శనానికి గంట సమయం పట్టింది. దేవస్థానానికి రూ.35 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులు ప్రసాదం స్వీకరించారు. రూ. 367.98 కోట్ల పొగాకు విక్రయాలు దేవరపల్లి: టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 367.98 కోట్ల విలువైన 15.14 మిలియన్ల కిలోల వర్జీనియా పొగాకు విక్రయాలు జరిగినట్టు రీజినల్ మేనేజర్ జె.సురేంద్రకుమార్ తెలిపారు. శుక్రవారం వేలం కేంద్రాలకు 4,449 బేళ్లు అమ్మకానికి రాగా, 2,628 బేళ్లు కొనుగోలు చేశారు. కొనుగోలుదారులు 1,821 బేళ్లను తిరస్కరించారు. కిలో గరిష్ట ధర రూ.292, కనిష్ట ధర రూ. 150, సగటు ధర రూ. 248.37 లభించినట్టు ఆయన తెలిపారు. ఐదు వేలం కేంద్రాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు కిలో సగటు ధర రూ. 243.06 ఉందని ఆయన వివరించారు. దేవరపల్లి వేలం కేంద్రంలో ఇప్పటి వరకు 2.28 మిలియన్ల కిలోల విక్రయాలు జరగ్గా, కిలో సగటు ధర రూ.238.12, జంగారెడ్డిగూడెం–1 వేలం కేంద్రంలో 3.23 మిలియన్ల కిలోలు విక్రయాలు జరగ్గా, కిలో సగటు ధర రూ. 243.24, జంగారెడ్డిగూడెం–2 కేంద్రంలో 3.59 మిలియన్ల కిలోలు విక్రయం సరగ్గా, కిలో సగటు ధర రూ. 242.45, కొయ్యలగూడెం వేలం కేంద్రంలో 3.13 మిలియన్ల కిలోల పొగాకు విక్రయం జరగ్గా, కిలో సగటు ధర రూ. 242.52, గోపాలపురం వేలం కేంద్రంలో 2.88 మిలియన్ల కిలోల విక్రయం జరగ్గా, కిలో సగటు ధర రూ. 248.15 పలికినట్టు సురేంద్రకుమార్ తెలిపారు. -
స్ఫూర్తి ప్రదాత ముద్రగడ
కిర్లంపూడి: రాజకీయాల్లో స్ఫూర్తి ప్రదాతగా మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు దివంగత ముద్రగడ పద్మనాభం నిలుస్తారని, ఆయన మృతి తీరని లోటని వైఎస్సార్ సీపీ పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి చేరుకుని ముద్రగడ పద్మనాభం సతీమణి ముద్రగడ పద్మావతి, వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, ఆయన పెద్ద కుమారుడు ముద్రగడ వీరరాఘవరావు (బాలు)ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలసి ముద్రగడ సమాధికి గజమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ దివంగత ముద్రగడ పద్మనాభంతో తనకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ముద్రగడను ఎప్పుడు కలిసినా, ఎంతోగానో గౌరవించేవారని, ఆయన వైఎస్సార్ సీపీలోకి వచ్చిన తరువాత మరింత అనుబంధాలు బలపడ్డాయని తెలిపారు. ఆయన ఎప్పుడు తిరుపతి వచ్చినా తనను కలిసేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణవార్త తనను కలిచి వేసిందన్నారు. స్వామి మాల ధరించి ఉండడంతో ఇప్పటి వరకు రాలేకపోయామని తెలిపారు. ముద్రగడ కుటుంబానికి ఆయన లేనిలోటు ఎవరూ తీర్చలేనిదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, మాజీ మంత్రులు తోట నరసింహం, కురసాల కన్నబాబు, పేర్ని నాని, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు, జక్కంపూడి రాజా, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, పెద్దాపురం, పి.గన్నవరం, రామచంద్రపురం, రాజోలు, అమలాపురం నియోజకవర్గాల పార్టీ కోఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, గన్నవరపు శ్రీనివాసరావు, పిల్లి సూర్యప్రకాష్, పాముల రాజేశ్వరీదేవి, పినిపే శ్రీకాంత్, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీరాంజీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి మురళీ కృష్ణంరాజు, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు పోకల అశోక్కుమార్, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, రాజానగరం, తుని నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు తోట రామకృష్ణ, వాసిరెడ్డి జమీల్, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు ఉన్నారు. -
కారుచీకటిలో ఆఖరి మజిలీ
సఖినేటిపల్లి/ఇరగవరం: స్నేహితుడి బంధువు ఇంట వివాహానికి వెళ్లి సందడి చేసి తిరిగి వచ్చేటప్పుడు వారు చెప్పినదే తుది వీడ్కోలు అవుతుందని వారికి తెలీదు. తిరుగు పయనంలో వారిని గోదారమ్మ మింగేస్తుందని వారికేం తెలుసు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం అయితంపూడి లాకుల వద్ద శనివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో కారు అదుపు తప్పి నరసాపురం కాలువలోకి దూసుకువెళ్లి నలుగురు బీటెక్ విద్యార్థులు మృతి చెందగా ఒకరు గల్లంతై, ఒక విద్యార్థి ప్రాణాలు దక్కించుకున్నాడు. వివరాల్లోకి వెళితే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపోడు, ఉయూరివారి మెరక గ్రామాలకు చెందిన చెరుకువాడ రామ్చరణ్ అలియాస్ రాజారామ్ (17), పోతుల లక్ష్మీభాను వికాస్ (19), నాగిరెడ్డి దుస్వంత్ సాయి (18), నరసాపురానికి చెందిన నాగాబత్తుల సాయిసూర్యతేజ (19), మట్టా సంతోష్, పాలకొల్లు మండలం చింతపర్రుకు చెందిన వీరమల్లు వెంకట సాయికిరణ్ (19) నరసాపురంలోని స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. వారంతా స్నేహితుడి బంధువు ఇంట జరిగిన వివాహానికి కారులో తూర్పుగోదావరి జిల్లా పెరవలి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అయితంపూడి లాకుల వద్ద కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది. కారులోని వారంతా గల్లంతవగా స్థానికుల సాయంతో ప్రమాదం నుంచి బయటపడిన సంతోష్ ఆ విషయాలు వెల్లడించాడు. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహకారంతో హుటాహుటిన సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాదస్థలికి రెండు కిలోమీటర్ల దూరంలో లక్ష్మీభాను వికాస్, దుస్వంత్సాయి, సాయిసూర్యతేజ, సాయికిరణ్ మృతదేహాలు లభ్యం కాగా, రామ్చరణ్ కోసం గాలిస్తున్నారు. ఒక్కడే కొడుకు.. ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మీభాను స్వస్థలం సఖినేటిపల్లి మండలం మోరిపోడు. అతని తల్లిదండ్రులు పోతుల శ్రీనివాసరావు, దేవి. శ్రీనివాసరావు జీడిపప్పు వ్యాపారం చేస్తున్నాడు. వీరిది మధ్యతరగతి కుటుంబం. వారి కుమార్తె ప్రవల్లిక కిమ్స్ ఆసుపత్రిలో వైద్య విభాగంలో పనిచేస్తోంది. ఇంజినీర్ అయ్యి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడనుకున్న కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేక వారు బోరున విలపిస్తున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత.. మరో విద్యార్థి దుస్వంత్ స్వస్థలం సఖినేటిపల్లి మండలం ఉయ్యూరువారి మెరక. అతని తల్లిదండ్రులు నాగిరెడ్డి సురేష్, శ్యామల. సురేష్ మలికిపురం ఎల్ఎస్ ల్యాండ్మార్క్లో ఉద్యోగి. వీరిదీ మధ్య తరగతి కుటుంబమే. వారి ఇద్దరి కుమారుల్లో దుస్వంత్ రెండవ వాడు. పెద్ద కొడుకు నెహేన్ సాయి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగి. దస్వంత్ మరణాన్ని తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రయోజకుడవుడాడనుకున్నంతలో కడుపుకోత మిగిల్చాడని గుండెలవిసేలా రోదిస్తున్నారు. చెట్టుకొమ్మల ఆసరాగా బయటపడి.. ప్రమాదం నుంచి బయటపడిన సంతోష్ తాను బయటపడిన విధానాన్ని వివరిస్తూ ప్రమాదం జరిగిన వెంటనే తనకు దొరికిన చెట్టుకొమ్మలను పట్టుకొని కారు పైకి ఎక్కానని, తనకు ఈత రావడంతో అక్కడి నుంచి ఒడ్డుకు చేరుకున్నానని తెలిపాడు. అర్ధరాత్రి కావడంతో తాము ఎక్కడ ఉన్నామో తెలియలేదని చెప్పాడు. మృతులు లక్ష్మీ భానువికాస్ దుస్వంత్సాయి సాయి సూర్యతేజ వెంకట సాయికిరణ్ కాలువలోకి కారు దూసుకువెళ్లి నలుగురి మృతి ప్రమాద సమయంలో ఆరుగురు విద్యార్థులు ఒకరు గల్లంతు, సురక్షితంగా బయటపడ్డ ఓ విద్యార్థి స్నేహితుని బంధువు ఇంట వివాహానికి వెళ్లి వస్తుండగా ఘటన -
● పీతలు.. ఎగుమతుల్లో పరుగులు
ఉప్పాడ పీతలకు గిరాకీ పెరిగింది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతుల్లో పరుగులు పెడుతోంది. కొత్తపల్లి మండలం అమీనాబాద్ తీర ప్రాంతంలోని మత్స్యకార వ్యాపారులు పీతల వ్యాపారంతో బిజీబిజీ అయ్యారు. ఇక్కడి నుంచి తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు తరలిస్తున్నారు. వారానికి 4 నుంచి 5 టన్నుల వరకూ ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో పీతలు రూ.200 నుంచి 250 వరకూ విక్రయిస్తున్నారు. వీటి విలువ ఇతర రాష్ట్రాల్లో రూ. 5 వందల నుంచి రూ.8 వందలు ఉంటోంది. ఉడకబెట్టి.. ప్యాక్ చేసి మత్స్యకారుల వలలకు చిక్కిన పీతలను కొనుగోలు చేసిన వ్యాపారులు వాటిని పెద్ద పాత్రల్లో ఉడకబెడుతున్నారు. ఇలా ఉడకబెట్టిన పీతలను చల్లారిన తరువాత వాటిని శుభ్రపరిచి, పెంకు తీసి కవర్లలో వేసి ఐస్ పెట్టెల్లో పెట్టి ప్యాకింగ్ చేస్తున్నారు. తర్వాత ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. తాజాగా ఉంచడం కోసమే పీతలను ఉడకబెడుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. – కొత్తపల్లి -
రత్నగిరి వాసా.. చిద్విలాసా
అన్నవరం: రత్నగిరి వాసా.. చిద్విలాసా అంటూ ఆ సత్యనారాయణ స్వామివారిని భక్తులు కొలిచారు. అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం శనివారం భక్తులతో కిక్కిరిసింది. శ్రావణమాసం సందర్భంగా తిరిగి వివాహాలు ప్రారంభం కావడంతో వధూవరులు, వివాహ బృందాలతో రద్దీగా మారింది. సుమారు 50 వేల మంది భక్తులు రాగా, రూ.200 టిక్కెట్తో ప్రత్యేక దర్శనానికి గంట సమయం, సాధారణ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. రావిచెట్టు వద్ద జ్యోతులను వెలిగించి పూజలు చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. శృంగారవల్లభ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు సామర్లకోట: పెద్దాపురం మండల పరిధిలోని తిరుపతి గ్రామంలో కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత శృంగారవల్లభ స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. స్వామివారికి అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. స్వామివారిని, ఆలయాన్ని పూలమాలలతో అలంకరించారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.1,84,440, అన్నదాన విరాళాలుగా రూ.45,663, కేశ ఖండన ద్వారా రూ.6,400, తులాభారాలతో రూ.550, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.20,400 కలిపి మొత్తం రూ.2.57,453 ఆదాయం వచ్చిందని ఈఓ వివరించారు. ఆలయంలో నాలుగు వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని ఈఓ తెలిపారు. మాజీ సర్పంచ్ మొయిలి కృష్ణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్మన్ మొయిలి సంధ్య, దేవస్థాన సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు సేవలందించారు. జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కరించండి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జూనియర్ డాక్టర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో మూడు రోజులుగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెకు శనివారం ఆయన సంఘీభావం ప్రకటించారు. సమ్మె శిబిరం వద్దకు వెళ్లి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ వైద్యులకు ప్రతి రెండేళ్లకు స్టైఫండ్ పెంచాలని, ఈ ఏడాది 30 శాతం పెంచాల్సి ఉన్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. జూనియర్ వైద్యులు పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదన్నారు. అలాగే వైద్యుల ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు కొనసాగించాలన్నారు. జూనియర్ వైద్యులు సమ్మెలో ఉన్నా, అత్యవసర సేవలకు ఎటువంటి ఆటంకం లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారని, దీనిని తాను అభినందిస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో వారితో కలిసి పోరాటం చేస్తామన్నారు. వేలాది మంది రోగులకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న జూనియర్ డాక్టర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్ల శ్రమకు తగిన విధంగా స్టైఫండ్ను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించాలన్నారు. ఈ పోరాటానికి పీడీఎస్యూ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. -
పూర్తి కావొస్తున్న డైవర్షన్ పనులు
తొండంగి: మండలంలోని బెండపూడి జాతీయ రహదారిపై పోలవరం, పుష్కర కాలువ వద్ద డైవర్షన్ వంతెనల నిర్మాణ పనులు పూర్తి కావొస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రధాన రహదారికి రాజమహేంద్రవరం, విశాఖ రెండు వైపులా వాహనాల మళ్లింపు కోసం డైవర్షన్ వంతెనలు నిర్మించారు. ప్రస్తుతం అప్రోచ్ రోడ్ల పనులు జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో డైవర్షన్ వంతెనలపై నుంచి వాహనాల రాకపోకలకు అనుమతించనున్నారు. అనంతరం ప్రధాన రహదారిని తొలగించి వంతెనల నిర్మాణం ప్రారంభించనున్నారు. అయితే ఈ ప్రాంతంలోనే బెండపూడి గ్రామంలోకి వెళ్లే ప్రధాన జంక్షన్ కావడంతో ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగే ప్రదేశంగా ఉంది. ఈ నేపథ్యంలో డైవర్షన్ వంతెనల అప్రోచ్ కూడా రావడంతో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పోలవరం, నేషనల్ హైవే అధికారులు ఈ ప్రాంతంలో తగిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా తమ్మయ్యపేట శివారు విద్యుత్ సబ్ స్టేషన్ జంక్షన్ జాతీయ రహదారి నుంచి రావికంపాడు వెళ్లే రహదారిలో కూడా వంతెన పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ రహదారిలో కూడా వాహనాల రాకపోకలు నిలిపివేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. త్వరలో ఈ పనులు పూర్తయితే వాహనాల రాకపోకలను యథావిధిగా అనుమతించనున్నారు. -
మరిడమ్మకు పసుపు కొమ్ముల సమర్పణ
సామర్లకోట: అమ్మవార్లకు పసుపు, కుంకుమ సమర్పించడం వలన మంచి జరుగుతుందని మహిళల నమ్మకం. ఈనెల 13 నుంచి 28 వరకు పెద్దాపురం మరిడమ్మ ఆలయంలో పసుపు కొమ్ములు స్వీకరించే కార్యక్రమాన్ని దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఆలయ ఆవరణలో కలశం ఏర్పాటు చేసి వాటిలో మహిళలు పసుపు కొమ్ములు సమర్పించే ఏర్పాటు చేశారు. మహిళలు సమర్పించిన పసుపు కొమ్ములను ఆలయంలో నిర్వహించే సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు ఉపయోగిస్తామని తెలిపారు. శనివారం పెద్దాపురం పట్టణానికి చెందిన లలితా సంకీర్తన భక్త మండలి సభ్యులు పసుపు కొమ్ములు ఆలయానికి తీసుకొచ్చారు. పసుపు కొమ్ములను కలశంలో సమర్పించి ఆలయ ప్రాంగణంలో పారాయణ నిర్వహించారు. దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ భక్తులకు అమ్మవారి ప్రసాదం అందజేశారు. -
మహనీయుల త్యాగ ఫలమే స్వాతంత్య్రం
వైఎస్సార్ సీపీ కార్యాలయంలో స్వాతంత్య్ర దిన వేడుకలుసాక్షి ప్రతినిధి, కాకినాడ: స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు త్యాగాలు చేశారని, వారిని స్మరించుకుంటూ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ముందుకు సాగుదామని వైఎస్సార్ సీపీ శ్రేణులు అన్నారు. కాకినాడలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దిన వేడుకలు నిర్వహించారు. తొలుత రాజా పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు ఎందరో త్యాగధనులు ఎన్నో త్యాగాలు చేశారన్నారు. వారిని స్మరించుకోవడం మన బాధ్యతని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ మంత్రి తోట నరసింహం, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎంపీ వంగా గీత, పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జి దవులూరి దొరబాబు, కుడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ మేయర్, నగర అధ్యక్షురాలు సుంకర ప్రసన్న శివప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
త్యాగధనుల స్ఫూర్తిగా..
● ఎగిరిన త్రివర్ణ పతాకం ● కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్య్ర దినోత్సవం ● ఆకట్టుకున్న ప్రదర్శనలు, శకటాలు ● 242 మందికి ఉత్తమ సేవా పురస్కారాలు సాక్షి ప్రతినిధి, కాకినాడ, కాకినాడ క్రైం: దేశానికి స్వేచ్ఛా వాయువులు తీసుకొచ్చిన త్యాగధనుల స్ఫూర్తి గా.. త్రివర్ణ పతాకం నింగిన ఎగసింది.. స్వాతంత్య్ర దినోత్సవ వేళ అందరిలో దేశభక్తిని నింపింది.. వందే మాతర గీతం అందరి నోటా ప్రతిధ్వనించింది.. దీనికి కాకినాడ వేదికై ంది. గురువారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా స్థాయి 80వ స్వాతంత్య్ర దిన వేడుకలు నిర్వహించారు. దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీసమేతంగా హాజరయ్యారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్పీ బిందుమాధవ్ భద్రతా పర్యవేక్షణలో జాతీయ జెండాను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, పోలీస్ జాగిలాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కట్టిపడేసిన ప్రదర్శనలు సర్పవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు గగన వీధిలో రెపరెపలాడే జెండా, కాకినాడ గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ విద్యార్థులు ఇదే మన భారతం ఇలలో పూల రథం, కోటనందూరు మండలం అల్లిపూడి కేజీవీబీ పాఠశాల విద్యార్థులు వందేమాతం, యర్రవరం పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు భారతమాతకి జయహో, సుభానికేతన్, శ్రీప్రకాష్ ఎన్సీసీ యూనిట్ విద్యార్థులు సుజలం సుఫలాం మలయజ శీతలం పాటలకు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇందులో అల్లిపూడి కేజీబీవీ విద్యార్థులకు ప్రథమ, సర్పవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ద్వితీయ, సుభానికేతన్, శ్రీప్రకాష్ ఎన్సీసీ యూనిట్కు తృతీయ స్థానాలు దక్కాయి. ప్రాజెక్ట్ హనుమాన్ ప్రథమం వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి, వందేభారత్ ట్రైన్ పైలెట్, వీబీజీ రామ్జీ పల్లె పండగ, గ్రేట్ గ్రీన్ వాల్, వ్యవసాయ, ఉద్యానవన, రైతన్న మీకోసం, ప్రాజెక్టు హనుమాన్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అడవి తల్లి బాట, జిల్లా ప్రజా పరిషత్– స్వచ్ఛ రథం, జిల్లా విద్యాశాఖ– పీఎంశ్రీ పాఠశాల శకటాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఇందులో అటవీశాఖ ప్రదర్శించిన ప్రాజెక్ట్ హనుమాన్కు ప్రథమ స్థానం దక్కింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ అడవితల్లి బాటకు ద్వితీయ, జిల్లా విద్యా శాఖ పీఎంశ్రీ పాఠశాలకు తృతీయ స్థానాలు దక్కాయి. ఆయా శాఖల ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జ్ఞాపికలు అందజేశారు. మెరిసిన స్టాల్స్ సృజనాత్మకత ఉట్టిపడేలా వివిధ స్టాల్స్ ఏర్పాటయ్యాఇయి. గ్రామీణ అభివృద్ధి సంస్థ, ఏపీఎంఐపీ, మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మత్స్య శాఖ స్టాళ్ల ద్వారా కార్యకలాపాలను ప్రతిబింబించారు. స్టాళ్ల కేటగిరిలో పోలీస్ శాఖకు ప్రథమ, మహిళా శిశు సంక్షేమ శాఖకు ద్వితీయ, జిల్లా మత్స్య శాఖకు తృతీయ స్థానాలు దక్కాయి. ఆకట్టుకున్న కవాతు పోలీస్ గౌరవ వందన స్వీకరణతో మొదలైన వేడుక కవాతుతో ముగిసింది. పోలీస్, ఎన్సీసీ దళాలు సంయుక్తంగా నిర్వహించిన సంప్రదాయ కవాతు అలరించింది. ఉత్తమ కవాతు కేటగిరీలో 3 ఆంధ్ర ఎన్సీసీ బాలికల బెటాలియన్కు ప్రథమ స్థానం, 18 ఆంధ్ర ఎన్సీసీ బాలురకు ద్వితీయ స్థానం, సమ్మన్ గార్డ్ డీఏఆర్ కంటిన్జెంట్కు తృతీయ స్థానాలు దక్కాయి. 242 మందికి పురస్కారాలు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న 242 మంది ఉద్యోగులకు ఉత్తమ సేవా పురస్కారాలు దక్కాయి. వీరిలో అధికారులు, సిబ్బంది ఉన్నారు. 21 మంది జిల్లా స్థాయి అధికారులు ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో ఉన్నారు. వీరంతా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. వీరితో పాటు సిబ్బందికి ఇచ్చారు. ఈ వేడుకల్లో పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తలాటం నాగవెంకటసత్య, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
ఘనంగా సత్యదేవుని జయంత్యుత్సవం
అన్నవరం: పవిత్ర శ్రావణ మాసం తొలి శుక్రవారం.. అందునా సత్యదేవుని 136వ జయంత్యుత్సవం కావడంతో రత్నగిరి నూతన శోభను సంతరించుకుంది. సత్యదేవుని జన్మ నక్షత్రం మఖ సందర్భంగా తెల్లవారుజామున రెండు గంటలకు ఆలయం తెరచి, పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లతో పాటు శంకరుని మూలవిరాట్టులకు పంచామృతాలతో మహాన్యాస పూర్వక అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో, స్వర్ణ, వజ్రకర్ణాభరణాలతో, సుగంధభరిత పుష్పాలతో అలంకరించి పూజించారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని వెండి రథంపై ఘనంగా ఊరేగించారు. 11 గంటలకు నిర్వహించిన ఆయుష్య హోమం పూర్ణాహుతిలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా 19 మంది పండితులను దేవస్థానం చైర్మన్, ఈవో ఘనంగా సత్కరించారు. కార్యక్రమాలను దేవస్థానం వేద పండితులు గంగాధరభట్ల గంగబాబు, చిట్టి శివ, గొల్లపల్లి ఘనపాఠి తదితరులు నిర్వహించారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వ్రతాలు 2,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుని అన్నప్రసాదాన్ని సుమారు 5 వేల మంది భక్తులు స్వీకరించారు. సత్యదేవుని జయంత్యుత్సవం సందర్భంగా ప్రధానాలయాన్ని, ద్వారాలను ఫలపుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు.స్వామి, అమ్మవార్లకు పూజలు చేస్తున్న పండితులు. చిత్రంలో దేవస్థానం చైర్మన్, ఈఓ తదితరులుఆలయం వద్ద ఫలపుష్పాలతో చేసిన అలంకరణ -
మువ్వన్నెల వేడుకలకు ముస్తాబు
కాకినాడ క్రైం: స్వాతంత్య్ర దినోత్సవానికి జిల్లా ముసాబైంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు త్రివర్ణ కాంతులను అద్దుకున్నాయి. రైల్వే స్టేషన్, బస్టాండ్, జీజీహెచ్, కలెక్టరేట్, ఎస్పీ, ఆర్టీఏ సహా పలు జిల్లా స్థాయి కార్యాలయాలు పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమయ్యాయి. కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యాన ఎస్పీ బిందుమాధవ్ భద్రతా పర్యవేక్షణలో కాకినాడలోని పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా స్థాయి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆయన ప్రసంగం అనంతరం పోలీస్ కవాతు, ప్రగతి శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేస్తారు. ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యాన శుక్రవారం వేడుకల రిహార్సల్స్ నిర్వహించారు. ఎస్పీ కార్యాలయం నుంచి భానుగుడి సెంటర్ వరకూ జరిగిన ర్యాలీలో విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తన కార్యాలయ ఆవరణలో ఆర్డీవో మల్లిబాబు చొరవతో ఏర్పాటు చేసిన వందేమాతరం జాతీయ గీతం తెలుగు భావానువాదం ఎంతో ఆకట్టుకుంది. ట్రాఫిక్ ఆంక్షలు పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో పోలీస్ పరేడ్ మైదానం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ వాహనాలను మళ్లిస్తున్నారు. వేడుకల పేరుతో రోడ్లపై వాహనాల ప్రయాణాలకు ఆటంకం కలిగించేలా ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించరాదని, ద్విచక్ర వాహనాలపై జెండాలు ప్రదర్శిస్తూ మితిమీరిన వేగంతో వెళ్లడాన్ని సహించబోమని పోలీసులు హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడపడం, ఇతర ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.అవార్డులకు కత్తెర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితి, భద్రతా కారణాలతో ఉత్తమ సేవల అవార్డులకు అధికారులు కత్తెర వేశారు. ఒక్కో ప్రభుత్వ విభాగం నుంచి తొలుత 5 నుంచి 10 మంది వరకూ ఎంపిక చేయగా.. శుక్రవారం సాయంత్రానికి దీనిని ముగ్గురి నుంచి ఐదుగురికి పరిమితం చేశారు. -
గుర్రపుడెక్కతో స్వయం ఉపాధి
కరప: గుర్రపుడెక్కతో డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అన్నారు. డీఆర్డీఏ, సెర్ప్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన కరప, కాజులూరు మండలాల్లోని 40 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు కరప మండలం గొర్రిపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాలువల్లో నీటి ప్రవాహానికి ఆటంకంగా మారుతున్న గుర్రపుడెక్కను ఎండబెట్టి, దానితో వివిధ వస్తువులు, కళాకృతులు తయారు చేసి లబ్ధి పొందేలా ఈ శిక్షణ ఏర్పాటు చేశామని చెప్పారు. గుర్రపుడెక్క దొరకని సమయంలో జూట్, ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేసేలా మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళలు తయారు చేసే వస్తువుల మార్కెటింగ్కు చర్యలు తీసుకుంటామన్నారు. ‘స్వయం’ అనే బ్రాండ్ ద్వారా ఈ వస్తువుల విక్రయానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని తెలిపారు. ఈ ఉత్పత్తులను అమెజాన్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో విక్రయించడం ద్వారా దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా ప్రాంతాలకు గ్రామాల నుంచే వస్తువులను పంపిణీ చేసే అవకాశం ఉంటుందని వివరించారు. బ్యాగుల తయారీకి అవసరమైన ఫోల్డింగ్, ప్రెస్సింగ్ మెషీన్ల వంటి ఉపకరణాలను సబ్సిడీపై అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రియ, డీఆర్డీఏ పీడీ జి.శ్రీనివాసరావు, డీపీఎం టి.బాబూరావు, తహసీల్దార్ ఏఎల్ లక్ష్మి, ఎంపీడీఓ జె.శ్రీనివాస్, ఏపీఎం ఎన్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సత్యదేవునికి కొత్త వెండి రథం
అన్నవరం: సత్యదేవునికి కొత్త వెండి రథం సమకూరనుంది. ప్రస్తుతం స్వామివారి ఊరేగింపులో ఉపయోగిస్తున్న వెండి రథాన్ని 50 సంవత్సరాల క్రితం తయారు చేయించారు. ఇది శిథిలావస్థకు చేరడంతో రథసేవ నిర్వహించడం ఇబ్బందికరంగా మారింది. దీనిపై ‘ఏ తేరుగ ఊరేగెదవో స్వామీ..’ శీర్షికన సాక్షి శుక్రవారం ప్రచురించిన కథనానికి అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్పందించారు. ఊరేగింపు అనంతరం శుక్రవారం ఆ రథాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దాతలు లేదా దేవస్థానం నిధులతో సత్యదేవునికి కొత్త రథం తయారు చేయిస్తామని తెలిపారు. వచ్చే నెలలో జరిగే ట్రస్ట్బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
జూడాల రిలే నిరాహార దీక్ష
కాకినాడ క్రైం: స్థానిక వైద్య విద్యార్థుల పీజీ వసతి గృహం ఆవరణలో జూనియర్ డాక్టర్లు (జూడా) మూడో రోజైన శుక్రవారం కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. స్టైపెండ్ పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచడానికి వీల్లేదని, ఉద్యోగ నియామకాల్లో ఎండీ, ఎంఎస్ చదివిన అభ్యర్థులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జీజీహెచ్లో అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవల్ని జూడాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 16 నుంచి పూర్తి స్థాయిలో సేవల నిలుపుదలకు జూడాల అసోసియేషన్ నాయకులు పిలుపునిచ్చారు. ప్రేమను నిరాకరించిందని యువకుడి ఆత్మహత్యకరప: తన ప్రేమను ఓ యువతి నిరాకరించిందన్న బాధతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరప మండలం గురజనాపల్లిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆ గ్రామానికి చెందిన అడ్డూరి సూర్య (21) కాకినాడలోని ఒక గ్యాస్ కంపెనీలో డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. అతడికి తల్లి, సోదరుడు ఉన్నారు. సూర్య తండ్రి నానాజీ 15 ఏళ్ల క్రితమే మృతి చెందగా కూలి పనులు చేసుకుంటూ ఒకరికొకరు చేదోడువాదోడుగా జీవిస్తున్నారు. కొంత కాలం క్రితం ఇన్స్ట్రాగామ్లో పరిచయమైన వేరే గ్రామానికి చెందిన యువతిని సూర్య ప్రేమిస్తున్నాడు. అయితే, ఆ అమ్మాయి శ్రీనిన్ను ప్రేమించడం లేదు. నువ్వు నాకు సోదరుడివవుతావుశ్రీ అని చెప్పింది. దీంతో, మనస్తాపం చెందిన సూర్య గురువారం రాత్రి క్షణికావేశంలో తన ఇంటి ఎదురుగా ఉన్న వేపచెట్టుకు ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి సోదరుడు అనిల్ శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై వెంకట రమణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం సూర్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిధులు సమకూర్చుకుంటూ సమస్యల పరిష్కారంబోట్క్లబ్ (కాకినాడ సిటీ): దశలవారీగా నిధులు సమకూర్చుంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పురపాలక శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి పి.నారాయణ అన్నారు. కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రితో సంప్రదించి, పంటల బీమా గడువు పెంచేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వ్యవసాయ, జలవనరుల శాఖలు పూర్తి సమన్వయంతో పంటలను కాపాడాలని సూచించారు. ముద్రా, తదితర రుణాల కల్పనపై బ్యాంకర్లతో రుణమేళా ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్బాబు సూచించారు. పోలవరం ఎడమ కాలువ వెంబడి ఖాళీగా ఉన్న వరద కరకట్ట స్థలాలను ఇళ్ల స్థలాలకు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. దీనివల్ల భూసేకరణ నిధులు ఆదా అవుతాయని అన్నారు. జగ్గంపేట సీహెచ్సీలో ఎముకల వైద్య నిపుణులను నియమించాలని కోరారు. ఇటీవల కామెర్ల వ్యాధితో పెద్దాపురం ప్రజలు భయాందోళనలకు గురయ్యారని, ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాకినాడ జీజీహెచ్లో కార్డియాలజిను నియమించాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్, తుని ఎమ్మెల్యేలు పంతం నానాజీ, యనమల దివ్య, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు కూడా పాల్గొన్నారు. సముద్రంలోకి 1.47 లక్షల క్యూసెక్కులుధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి శుక్రవారం 1,47,180 క్యూసెక్కుల గోదావరి మిగులు జలాలను సముద్రంలోకి విడిచి పెట్టారు. తూర్పు డెల్టాకు 5 వేలు, మధ్య డెల్టాకు 2,600, పశ్చిమ డెల్టాకు 7 వేలు కలిపి, డెల్టా కాలువలకు 14,600 క్యూసెక్కు ల నీటిని విడుదల చేశారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులుంది. ఎగువన కాళేశ్వరంలో 6.09 మీటర్లు, పేరూరు 9.44, దుమ్ముగూడెం 7.05 మీటర్లు, భద్రాచలం 20.80 అడుగులు, కూనవరం 9.07 మీటర్లు, కుంట 4.85, పోలవరం 6.25, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 14.04 మీటర్లుగా నీటిమట్టాలు నమోదయ్యాయి. -
డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే అరెస్టులా?
ప్రత్తిపాడు రూరల్: డీఎస్సీ అవకతవకలపై ప్రశ్నిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి మురళీకృష్ణంరాజు మండిపడ్డారు. మండలంలోని ధర్మవరంలో గురువారం ఆయన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేశారని, కేవలం 16 వేల ఉద్యోగాల భర్తీకి చేపట్టిన డీఎస్సీలోనూ భారీగా అవకతవకలకు పాల్పడిందని విమర్శించారు. అందుకే ఇది దగా డీఎస్సీ అని ఎద్దేవా చేశారు. ఈ దగాపై శాంతియుతంగా నిరసనలు, నిరాహార దీక్షలు చేస్తుంటే పార్టీ శ్రేణులను అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. యువతకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి -
సత్యదేవుని జయంత్యుత్సవాలకు శ్రీకారం
● వేద ఘోషతో మార్మోగిన రత్నగిరి ● నేడు సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవం అన్నవరం: రత్నగిరీశుడు సత్యదేవుని 135వ సత్యవిదియ (ఆవిర్భావ దినోత్సవం) వేడుకలు శ్రావణ శుద్ధ పాడ్యమి, గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం నిర్వహించనున్న ఈ వేడుకను పురస్కరించుకుని ఉదయం ఎనిమిది గంటలకు విఘ్నేశ్వరపూజతో జయంత్యుత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం పండితుల వేదాశీస్సులు అందజేసి ప్రసాదాలు నివేదించారు. ఈ సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ రెండు రోజుల పాటు జపతపాలు చేసే 50 మంది రుత్విక్కులకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్య చక్రధరరావు దీక్షా వస్త్రాలను అందజేశారు. రుత్విక్కుల వేద మంత్రాలతో అనివేటి మండపం, ఆలయ ప్రాంగణం మార్మోగాయి. ఈ సందర్భంగా సూర్యనమస్కారాలు, లింగాష్టకం, నవావరణ అర్చన, రామాయణ, భాగవతాల పారాయణ, శ్రీసూక్త, పురుష సూక్త పారాయణ, బాల, కౌమారీ, సువాసిని పూజలు నిర్వహించారు. సాయంత్రం దర్బారు మండపంలో మండపారాధన, కలశస్థాపన ఆయుష్యహోమానికి అంకురార్పణ నిర్వహించారు. ఆస్థాన వేద పండితులు గంగాధరభట్ల గంగబాబు, శివ ఘనపాఠీ, గొల్లపల్లి ఘనపాఠీ, యనమండ్ర శర్మ, ముష్టి పురుషోత్తం, రమేష్, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి తదితరులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ట్రస్ట్బోర్డు సభ్యులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని సత్యదేవుని ఆలయం, రాజగోపురాలు, రామాలయం, ఆలయ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. నేడు ప్రత్యేక పూజలు సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. అలాగే పలువురు వేద పండితులను సత్కరించనున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఊరేగించనున్నారు. -
జూనియర్ వైద్యుల సమ్మెబాట
● స్టైపెండ్ పెంపుతో పాటు డిమాండ్ల సాధనకు పోరు ● జీజీహెచ్లో విధుల బహిష్కరణ సాక్షి, రాజమహేంద్రవరం: డిమాండ్ల పరిష్కారం కోరుతూ జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లు, పీజీ విద్యార్థులు, సూపర్ స్పెషాలిటీ వైద్యులు సమ్మె బాట పట్టారు. వైద్య ఆరోగ్య శాఖ, వైద్య విద్య డైరెక్టర్తో జరిపిన చర్చలు విఫలం కావడంతో వారు సమ్మెలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఫలితంగా గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో వైద్య సేవలకు కొంత విఘాతం కలిగే ప్రమాదం ఉంది. సుమారు 40 మందికి పైగా సమ్మెలో పాల్గొంటున్నారు. పేద రోగులకు ఇబ్బందే.. సమ్మెలో భాగంగా ఓపీ సేవలకు దూరంగా ఉన్నప్పటికీ అత్యవసర వైద్య సేవలకు అందుబాటులో ఉంటామని జూడాలు తెలిపారు. అయితే ఆస్పత్రిలో రోజూ వార్డుల నిర్వహణ, శస్త్రచికిత్సలు చేయడం, పరీక్షల నిర్వహణలో పీజీ వైద్యులు, జూడాలదే కీలక పాత్ర. ప్రస్తుతం వీరంతా విధులకు దూరం కావడంతో దూర ప్రాంతాల నుంచి జీజీహెచ్కు వచ్చే వేలాది రోగులు, వృద్ధులు, గర్భిణులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి. ఇప్పటికే ఓపీ కోసం గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రెండున్నరేళ్ల చిన్నారికి బ్రాంకోస్కోపీ
● శ్వాసనాళంలో ఇరుక్కున్న వేరుశనగపప్పు ● అరుదైన శస్త్రచికిత్స చేసిన వైద్యులు ● ప్రాణాపాయం నుంచి బయటపడ్డ చిన్నారి బీచ్రోడ్డు (విశాఖ): వేరుశనగపప్పు తింటుండగా ప్రమాదవశాత్తు శ్వాసనాళంలో ఇరుక్కుపోయిన రెండున్నరేళ్ల చిన్నారి విశాఖపట్టణంలోని ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి వైద్యులు అరుదైన బ్రాంకోస్కోపీ శస్త్రచికిత్స చేశారు. కాకినాడకు చెందిన కరుణప్రియకు 20 రోజుల క్రితం వేరుశనగపప్పు శ్వాసనాళంలో ఇరుక్కుపోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కాకినాడలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా సమస్య గుర్తించలేదు. ఈనెల 10న కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పరీక్షించి శ్వాసనాళంలో పప్పు ఉన్నట్లు గుర్తించి విశాఖ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు 14 ఏళ్లకు పైబడిన వారికే బ్రాంకోస్కోపీ చేసిన ఆస్పత్రిలో తొలిసారిగా చిన్నారికి ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్కుమార్ ఆధ్వర్యంలోని వైద్య బృందం సుమారు 3 గంటలపాటు శస్త్రచికిత్స చేసి శ్వాసనాళంలోని వేరుశనగపప్పును విజయవంతంగా తొలగించింది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ పిన్న వయసు చిన్నారికి బ్రాంకోస్కోపీ చేయలేదని, ఈ కేసును సవాల్గా తీసుకుని వైద్య బృందం సమష్టి కృషితో శ్వాసనాళంలోని వేరుశనగపప్పును విజయవంతంగా తొలగించామని తెలిపారు. చిన్నారి కరుణ ప్రియశ్వాసనాళం నుంచి తొలగించిన వేరుశనగపప్పు -
మోదీ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు
సామర్లకోట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక అన్నారు. ఈనెల 6వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పాదయాత్రల ముగింపు సందర్భంగా స్థానిక నీలమ్మ చెరువు నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక పాదయాత్రను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ మతోన్మాధ విధానాలతో దేశం ప్రమాద స్థితిలోకి చేరిందని హెచ్చరించారు. దేశ సమైకత్య సమగ్ర అభివృద్ధి సాధన లక్ష్యంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనెల 6 నుంచి 14 వరకు ప్రజల కోసం, ప్రజలతో కలిసి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పాదయాత్ర చేపడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిరసనగా సెప్టెంబరు 1న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి, సహాయ కార్యదర్శులు కె.బోడకొండ, తోకల ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ నుంచి అమలాపురం వరకు ఉన్న గ్యాస్ నిక్షేపాలను పైపులైన్ ద్వారా మహారాష్ట్ర, గుజరాత్కు తరలిస్తున్నారన్నారు. స్థానికంగా లభించే గ్యాస్, పెట్రోలు నిక్షేపాలను స్థానికంగా అందజేస్తే గ్యాస్ సిలిండరు రూ.100కే వస్తుందన్నారు. అనంతరం పాదయాత్ర నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మధు -
గడువులోగా సర్ పూర్తి చేయాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో మొత్తం 31,695 నోటీసులు జారీ చేయగా, ఇప్పటివరకు 7,335 నోటీసులు డెలివరీ అయ్యాయని, మిగిలిన 24,360 నోటీసుల డెలివరీ వేగవంతంగా జరుగుతోందన్నారు. ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో బూత్ స్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అర్హులైన పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటు హక్కు పొందాలని సూచించారు. క్లెయిమలు, అభ్యంతరాల నమోదుకు తుది గడువు 30వ తేదీ అని, వీటిని సెప్టెంబరు 28 లోపు పరిష్కరిస్తారన్నారు. అక్టోబర్ 3న తుది జాబితా ప్రచురితమవుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో డి.తిప్పే నాయక్, ఆర్డీవోలు ఎస్.మల్లిబాబు, పి.కృష్ణమూర్తి పాల్గొన్నారు. సంతృప్త స్థాయి పెంచాలి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని మరింత వేగవంతం చేసి ప్రజల సంతృప్త స్థాయిని పెంచాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు తదితర అధికారులతో సమీక్షించారు. పింఛన్ల పంపిణీ సమయంలో లబ్ధిదారులతో మంచిగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. పింఛన్ నిధులతో అక్రమాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రికార్డులను కలెక్టరేట్కు సమర్పించాలన్నారు. తగ్గని పచ్చకామెర్లు ● కట్టమూరులో వైద్య శిబిరం ● ఇంటింటా ఆరోగ్య సిబ్బంది సర్వే పెద్దాపురం: మండలంలో కట్టమూరు గ్రామంలో వారం రోజులుగా కలుషిత నీరు, ఆహారం వల్ల చిన్నారులు, వృద్ధులు పచ్చకామెర్లతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ మేరకు స్థానిక సీహెచ్సీలో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. చాలా మంది గ్రామంలో ఆర్ఎంపీల వద్ద, ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. జిల్లా వైద్యశాఖ అధికారులు ఆదేశాల మేరకు స్థానిక డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ప్రశాంతి పర్యవేక్షణలో కాండ్రకోట పీహెచ్సీ వైద్యులు డాక్టర్ చంద్రకిరణ్బాబు తదితరులు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటా తిరుగుతూ ఫీవర్ సర్వే నిర్వహించారు. అనుమానితులకు రక్షపరీక్షలు నిర్వహించి వాటిని ల్యాబ్కు పంపించారు. ఎంపీడీవో కె.సూర్యనారాయణ పర్యవేక్షణలో గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టారు. క్లోరినైజేషన్ చేసిన రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామంలో ఎవరూ ఫాస్ట్ఫుడ్ సెంటర్ల వద్ద ఆహారం తినకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రేషన్ బియ్యం పట్టివేత పిఠాపురం: రేషన్ బియాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న లారీని సీజ్ చేసి, 29.640 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు. స్థానిక మోహన్నగర్ – గోర్స రోడ్డులో లారీలో తరలిస్తున్న 29.640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లయిస్ డీటీ సమక్షంలో పట్టుకున్నామన్నారు. దీని విలువ సుమారు రూ.14.22 లక్షలు ఉంటుందని తెలిపారు. లారీని సీజ్ చేసి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. డీసెట్ రెండో దశ కౌన్సెలింగ్ ప్రారంభం రాజమహేంద్రవరం రూరల్: ఏపీ డీసెట్– 2026లో అర్హులైన అభ్యర్థులకు ప్రైవేట్ డీఎల్ఎడ్ కళాశాలలో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి గురువారం నుంచి రెండో దశ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని బొమ్మూరులోని డైట్ ప్రిన్సిపాల్ ఆర్జేడీ రాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16న వెబ్ ఆధారిత ఆప్షన్ల్ల నమోదుకు అవకాశం ఇచ్చారన్నారు. శుక్రవారం నుంచి 20వ తేదీ వరకు సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. -
క్రమశిక్షణ చర్యల రద్దుపై 20న విచారణ
అన్నవరం: ఈ నెల 20న తన కార్యాలయంలో అన్నవరం దేవస్థానం ప్రథమ శ్రేణి వ్రత పురోహితుడు మల్లాది గురుమూర్తి విచారణకు హాజరు కావాలని దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఆదేశించారు. ఈ మేరకు అడిషనల్ కమిషనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది డిసెంబర్ 21 పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సత్యదేవుని సామూహిక వ్రతాల నిర్వహణకు వెళ్లిన సందర్భంలో ఆయన వ్యవహార శైలిపై ఫిర్యాదులు రావడంతో అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం, ఆ తరువాత గత నెల 24న ఆ చర్యలను రద్దు చేస్తూ ట్రస్ట్ బోర్డు తీర్మానం చేయడం తెలిసిందే. దీంతో జూలై 3న ‘ఒట్టి అమాయకుడు గురూ’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంతో ఆ తీర్మానాన్ని కమిషనర్ సస్పెండ్ చేశారు. దీనిపై గత నెల 29న విచారణకు రావాలని ఆదేశించారు. వ్యక్తిగత కారణాలతో రాలేనని గురుమూర్తి చెప్పడంతో వాయిదా వేశారు. తాజాగా దీనికి సంబంధించిన రికార్డులతో ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని గురుమూర్తితో పాటు ఈఓను కమిషనర్ ఆదేశించారు. -
ఏ తేరుగ ఊరేగెదవో స్వామీ
● కళావిహీనమైన రథంలోనే సత్యదేవుని ఊరేగింపు! ● కొత్త రథం చేయించడంలో అధికారుల అలసత్వం అన్నవరం: స్వామివారి జయంత్యుత్సవాలు వస్తున్నాయి.. వెళ్తున్నాయి కానీ దేవేరులతో ఆయన ఊరేగడానికి వెండి రథాన్ని బాగుచేయించడానికి మాత్రం చేయించడానికి అధికారులకు తీరిక దొరకడం లేదు. ప్రస్తుతం ఊరేగుతున్నది 50 క్రితం నాటిది, జీర్ణావస్థకు చేరినప్పటికీ దానినే ఉత్సవాలకు వినియోగించడం శోచనీయం. ఈ రథం స్థానంలో స్వామి ఊరేగింపునకు 2023లో అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ రెండు టేకు రథాలను చేయించారు. చిన్న రథాన్ని కొండపైన ఉత్సవాలకు తిప్పడానికి, రెండో పెద్ద రథాన్ని కొండ కింద తిప్పడానికి ఉద్దేశించారు. చిన్నరథానికే వెండి తాపడం చేయించాలని నిర్ణయించారు. అయితే ఆయన బదిలీతో ఆ ప్రతిపాదన ఆగిపోగా ఆ రథాన్ని మాత్రం నేడు పర్వదినాల్లో స్వామి సేవకు వినియోగిస్తున్నారు. తాజాగా ఆనవాయితీ ప్రకారం జయంత్య్త్సువాలకు వెండి రథాన్నే వినియోగిస్తుండడంతో దానిని తూర్పు రాజగోపురం ముందు ప్రాకారంలోకి తీసుకువచ్చి సిద్ధం చేస్తున్నారు. అపచారాన్ని మన్నించు దేవా స్వామివారి ఊరేగింపునకు తీసుకువచ్చిన రథాన్ని చూస్తే కడుపు తరుక్కుపోక మానదు. రథంపై సుదర్శన చక్రం ఒరిగిపోయి, మువ్వలు సగానికి పైగా రాలిపోయి, అరటి చెట్లు, ఆకులు తాళ్లతో కట్టబడి, మకర తోరణాలు అస్తవ్యస్తంగా తయారై, వెండి తాపడాల అతుకులు ఊడిపోయి చెక్కలు కనిపిస్తూ, రథ చక్రాలు ఊడిపోయి అధ్వానంగా ఉన్న రథాన్ని నేడు స్వామివారి సేవకు వినియోగిస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం నిర్వహించే బృహత్కార్యానికై నా కొత్త రథాన్ని స్వామివారికి అమరుస్తారో లేదో వేచి చూడాల్సిందే. -
తలుపులమ్మకు సహస్ర ఘటాభిషేకం
తుని రూరల్: స్థానిక లోవ దేవస్థానంలోని తలుపులమ్మ తల్లికి సప్తనదీ జలాలతో ఘనంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఆషాఢ అమావాస్యను పురష్కరించుకుని బుధవారం పంచలోహ విగ్రహాల ప్రాంగణంలో వేదపండితులు, అర్చకులు విఘ్నేశ్వరపూజ, మండపారాధన, పవిత్ర సప్తనదీ జలాల ఆవాహన పునఃపూజలు మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో ఆలయ ప్రాకారం చుట్టూ ప్రదక్షణలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. మూలవిరాట్కు ఘటాభిషేకాల అనంతరం అమ్మవారి పంచలోహ విగ్రహాలకు ధర్మకర్తలు, భక్తులు సప్తనదీ జలాలతో అభిషేకించారు. నీరాజన మంత్రపుష్పాల అనంతరం భక్తులకు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంతో తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాలు పూర్తయినట్టు ప్రకటించారు. ధర్మకర్తలు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ముగిసిన ఆషాఢ మాసోత్సవాలు


