breaking news
Kakinada
-
మరో మూడు రోజులే..
ఫ గ్యాస్ లబ్ధిదారులకు ఈ–కేవైసీ తప్పనిసరి ఫ ఈ నెల 30 వరకు మాత్రమే గడువు ఫ చేయించుకోకుంటే ఇబ్బందులు ఫ ఉమ్మడి జిల్లాలో 19,14,791 ఎల్పీజీ కనెక్షన్లు ఫ 75 శాతమే పూర్తయిన ప్రక్రియ కపిలేశ్వరపురం: గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారులందరూ ఈ నెల 30వ తేదీలోపు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈ–కేవైసీ) చేయించుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అక్రమ కనెక్షన్లు తొలగించేందుకు ఈ ప్రక్రియ చేపట్టామని చెబుతోంది. అయితే ఈ విషయంపై గ్యాస్ వినియోగదారులందరికీ పూర్తిస్థాయిలో సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఈ–కేవైసీ విషయం తెలియని వారందరూ నష్టపోయే ప్రమాదం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో 52, కాకినాడ జిల్లాలో 45, కోనసీమ జిల్లాలో 27 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ఎందుకంటే.. ఫ గ్యాస్ రాయితీ దుర్వినియోగానికి, అక్రమ కనెక్షన్లకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఈ–కేవైసీని తప్పనిసరి చేసినట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నెల 30వ తేదీ లోపు గ్యాస్ ఏజెన్సీ ద్వారా, ఆన్లైన్లో కానీ ఈ–కేవైసీ చేయించుకోవాలి. ఫ లేకపోతే గ్యాస్ సిలిండర్ ధరలో ప్రభుత్వ రాయితీ నిలిచిపోతుంది. గ్యాస్ సరఫరాను నిలిపివేయడం, సిలిండర్ను రద్దు చేయడమూ చేసే అవకాశం ఉండొచ్చు. ఫ సంబంధిత గ్యాస్ ఏజెన్సీలో ఈ–కేవైసీని ఉచితంగా చేస్తారు. అవగాహన ఉంటే ఆన్లైన్లో కూడా ఇంటిలో ఉండే చేసుకోవచ్చు. ఫ ప్లే స్టోర్ నుంచి సంబంధిత గ్యాస్ కంపెనీ అధికారిక యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. గ్యాస్ కనెక్షన్కు లింక్ అయిన మొబైల్ నంబర్తో యాప్లో లాగిన్ అవ్వాలి. ఫ ఈ– కేవైసీ ఆప్షన్పై క్లిక్ చేసి ఫేస్ స్కానింగ్ ద్వారా లేదా మొబైల్కి వచ్చే ఓటీపీ ద్వారా వినియోగదారు గుర్తింపును ధ్రువీకరించి సబ్మిట్ చేయాలి. 48 గంటల్లోపు ప్రక్రియపూర్తవుతుంది. సామాన్యుడిపై భారం కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలపై గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని మోపుతోంది. గృహ వినియోగ సిలిండర్పై ఈ ఏడాది మార్చి 7న రూ.60, ఈనెల 7న రూ.29 పెంచడంతో సిలిండర్ ధర రూ.971కి పెరిగింది. డెలివరీ ఖర్చులతో రూ.వెయ్యి అవుతోంది. వాణిజ్య సిలిండర్ ధరను గత మూడు నెలల్లో మూడు సార్లు పెంచడంతో ప్రస్తుతం దాని ధర రూ.3,406కి చేరింది. దీంతో చిరు వ్యాపారులు ప్రత్యక్షంగానూ, వారి వద్ద పదార్థాలు కొనుగోలు చేసే వినియోగదారులు పరోక్షంగానూ తీవ్ర భారాన్ని మోస్తున్నారు. ఉజ్వల పథకం ప్రారంభంలో సబ్సిడీపై ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఒక్కో సిలిండర్కు రూ.300 రాయితీని అందజేసింది. ఆ తర్వాత కాలంలో ఆ సంఖ్యను 9కి ప్రస్తుతం 4కి కుదించింది. కొత్త కనెక్షన్ల కోసం తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 10 వేల మంది రెండు నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఏడాది కాలంగా గ్యాస్ బుక్ చేసుకోకపోతే కనెక్షన్ ఇన్యాక్టివ్లోకి వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ వినియోగదారుల వివరాలు జిల్లా గ్యాస్ కనెక్షన్లు తూర్పుగోదావరి 6,92,825 కాకినాడ 6.50,000 కోనసీమ 4,79,563 పోలవరం 92,403 మొత్తం 19,14,791 సమాచారం లేక.. గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారుల ఈ–కేవైసీ ప్రక్రియ ఇప్పటి వరకూ 75 శాతం మాత్రమే పూర్తయ్యింది. చేయించుకోని వారిలో చాలామందికి దీని సమాచారం తెలియదు. తెలిసిన వారిలో కొందరు ఇతర ప్రాంతాలకు పనుల కోసం వలస వెళ్లడంతో సంబంధిత గ్యాస్ ఏజెన్సీని సంప్రదించలేని పరిస్థితి ఏర్పడింది. తెలిసిన వారు ఆన్లైన్లో చేసుకునే వీలు ఉన్నప్పటికీ దానికి సంబంధించిన సాంకేతిక అవగాహన వారికి లేదు. -
రత్నగిరిపై నీటి కొరత
ఫ శనివారం మధ్యాహ్నం 12 నుంచి 2.30 వరకూ భక్తుల అవస్థలు ఫ విద్యుత్ లేకపోవడమే కారణమంటున్న అధికారులు అన్నవరం: సత్యదేవుని దేవస్థానంలో శనివారం నీటి సమస్య ఏర్పడింది. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో భోజనం చేసిన భక్తులు చేతులు కడుక్కోవడానికి కూడా నీరు లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మొక్కలకు నీరు పోసే ట్యాంకర్ను తీసుకొచ్చి టబ్లలో ఆ నీటిని నింపారు. దేవస్థానం వాటర్ వర్క్స్ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమనే విమర్శలు వినిపించాయి. దేవస్థానంలో నాలుగు లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన వాటర్ ట్యాంకులు ఉన్నాయి. వీటికి నిరంతరం మోటార్ల ద్వారా నీటిని ఎక్కించాలి. అయితే ఏపీఈపీడీసీఎల్ నుంచి సరఫరా అయ్యే విద్యుత్ నిలిచిపోవడంతో జనరేటర్ ద్వారా నీటిని దేవస్థానానికి సరఫరా చేశామని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రికి వాటర్ ట్యాంకుల్లో సగం వరకు మాత్రమే నీరు నిల్వ ఉందని, దేవస్థానంపై పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగడంతో భక్తులు, సత్రాల్లోని పెళ్లిళ్ల బృందాలు ఈ నీటిని వాడేశాయన్నారు. అలాగే శనివారం ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో ఒక్కసారిగా నీటి వినియోగం పెరిగిందని, దీనివల్ల కొరత ఏర్పడిందన్నారు. జనరేటర్ ద్వారా నీటిని తోడినప్పటికి ఎప్పటికప్పడు వాటర్ ట్యాంకులు ఖాళీ అయిపోయాయని వివరించారు. మధ్యాహ్నం నుంచే వివిధ సత్రాల్లో కూడా కుళాయిల ద్వారా నీరు రాకపోవడంతో వాటర్ టిన్నుల ద్వారా సరఫరా చేసినట్టు తెలిపారు. అన్నదాన పథకంలో.. అన్నదాన పథకంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఉదయం పది గంటలకే అక్కడ నీటి సమస్య ఏర్పడింది. వంటలు చేయడానికి వాటర్ టిన్నులు తేవాల్సి వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి చేతులు కడుక్కోవడానికి కూడా కుళాయిల ద్వారా నీరు రాలేదు. దీంతో అన్నదానం ఏఈఓ బలువు సత్యశ్రీనివాస్ మొక్కలకు నీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంకర్ను తీసుకువచ్చి అన్నదానం హాలు బయట పెట్టి టబ్లలో నీటిని నింపించారు. మధ్యాహ్నం మూడు గంటలకు కుళాయిల ద్వారా నీరు సరఫరా అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
వాడపల్లిలో వాన కష్టాలు
● నానా అవస్థలు పడిన భక్తులు ● పార్కింగ్ స్థలంలో బురద చీదర ఆత్రేయపురం: లక్షల్లో భక్తులు.. రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా, వాడపల్లికీ వాన కష్టాలు తప్పలేదు. వర్షపునీరు ముంచెత్తడం, ఆపై బురద చేరడం భక్తుల సహనాన్ని పరీక్షించింది. కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి శనివారం ఉదయం వచ్చిన భక్తులకు వాన విసుగు పుట్టించింది. ఆలయ ఆవరణలో సైతం అడుగు మేర నీరు చేరడంతో ఇబ్బందులు పడ్డారు. వాహనాల పార్కింగ్ స్థలంలో భారీ వర్షానికి నీరు నిలిచి ఎటు వెళ్లాలో తెలియక తడిసి ముద్దయ్యారు. అలాగే కొందరి పాదరక్షలు, సామగ్రి కొట్టుకుపోయాయి. వాహనాల పార్కింగ్ స్థలంలో వర్షపు నీరు చేరడంతో కాలువను తలపించింది. అక్కడ అంతా బురదగా మారింది. మోకాలు లోతు నీరు నిలిచిపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. అలాగే ఆలయంలో భారీ వర్షం పడటంతో దర్శనాలకు నానా అవస్థలు పడ్డారు. ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ఆవరణలో నీటిని బయటకు పంపించడానికి మోటార్లను ఏర్పాటు చేయించి, పనులు చేపట్టారు. అలాగే పార్కింగ్ స్థలంలో ఆయన పర్యటించి, భక్తుల ఇబ్బందులను గమనించారు. అప్పటికప్పుడు ఏర్పాట్లు చేయడం కూడా కష్టసాధ్యంగా మారింది. ఇదిలా ఉంటే ఆలయం వద్ద వసతుల కల్పన, అభివృద్ధి పనులు నత్తనడకగా సాగుతుండటం పట్ల భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వకుళమాత అన్నదాన భవనం నిర్మాణ పనులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. తాత్కాలిక అన్నదాన షెడ్డు భక్తుల భోజనాలకు అనువుగా లేదు. ప్రధానంగా ఇక్కడ అన్నదాన భవనం నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేసి, భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి. అలాగే శ్రీనివాసమ్ వంటి ఇతర భవన నిర్మాణాలను త్వరితగతిని పూర్తి చేయాలి. పార్కింగ్ స్థలాలలో సైతం మెరక చేసే పనులు నాసిరకంగా ఉండటంతో ఇబ్బంది వస్తోంది. అక్కడ సరిచేయించాల్సి ఉంది. -
నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
సామర్లకోట: పెద్దాపురం జవహర్ నవోదయ విశ్వవిద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఆర్ట్స్ విభాగం 11వ తరగతిలో ఖాళీ సీట్లలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వర్సిటీ ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 2026 మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలలో ఉత్తీర్ణులై ఉండాలని, ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు జూన్ 1వ తేదీ, 2009 – జూలై 31, 2011 మధ్య జన్మించి ఉండాలన్నారు. విద్యార్థులకు ఉచిత భోజన వసతితో పాటు స్టేషనరీ అందించి నాణ్యమైన విద్య అందిస్తామన్నారు. అభ్యర్థులు దరఖాస్తుతో పాటు పదో తరగతి మార్కుల జాబితా జతపరచి స్వయంగా పాఠశాల కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 29 వరకు లభిస్తాయని, పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 30వ తేదీ లోగా నవోదయ పాఠశాలలో సమర్పించాలన్నారు. నేడే పల్స్ పోలియో కాకినాడ క్రైం: జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో నిర్వహించనున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ నరసింహనాయక్ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో నిర్వహించేందుకు 990 బూత్లు, 56 ట్రాన్సిట్ పాయింట్లు, 61 మొబైల్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,44,762 మంది 0–5 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ వేస్తారన్నారు. స్థానిక రామారావుపేట యూపీహెచ్సీలో అధికారికంగా ప్రారంభిస్తామని తెలిపారు. 131 రూట్ సూపర్వైజర్ల ద్వారా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తామన్నారు. ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది క్షేత్రస్థాయిలో బూత్లకు పిల్లల్ని తరలిస్తారన్నారు. తల్లిదండ్రుల్లో అవగాహన పెంపొందించేందుకు గ్రామ, పట్టణ స్థాయిల్లో విస్తృత అవగాహన కల్పించామని అన్నారు. అందులో భాగంగా కాకినాడ భానుగుడి కూడలిలో మానవహారం ఏర్పాటు చేశామన్నారు. తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. అమరావతి అన్యాయాలను ప్రశ్నిస్తే దాడులా? జమ్మలమడక నాగమణి కాకినాడ రూరల్: అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులపై టీడీపీ అకృత్యాలను గూండాల దాడిగా ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అభివర్ణించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి రైతులు తమకు జరుగుతున్న అన్యాయంపై ఇటీవల పార్టీ అధినేత జగన్ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. అందులో భాగంగా నేడు పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు సహా పలువురు ముఖ్య నేతలు అమరావతి పర్యటనకు వెళ్లారని పేర్కొన్నారు. ఉండవల్లిలో సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు, వైఎస్సార్ సీపీ బృందంపై రాళ్లు, కోడిగుడ్లతో దాడికి పాల్పడటం హేయనీయమని ఆమె అన్నారు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్పై బండరాయితో దాడి చేయగా ఆయన తృటిలో తప్పించుకున్నారని, దీంతో ఆ రాయి అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ కు తగిలి తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. గాయపడిన కానిస్టేబుల్ను వైఎస్సార్ సీపీ నేతలే ఆస్పత్రికి తరలించారని వివరించారు. ఉండవల్లి, పెనుమాక, బేతపూడి, కురగల్లు తదితర గ్రామాలతో పాటు అమరావతి రాజధాని ప్రాంతంలో బలవంతపు భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులకు న్యాయ సహాయం చేయాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ భావించారని తెలిపారు. అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్లినవారిపై టీడీపీ గూండాలు దాడి చేశారన్నారు. పోలీసులు ఉన్నది శాంతి భద్రతలను పరిరక్షించానికా, టీడీపీ వారికి ఎస్కార్టులుగా ఉండడానికా అని ఆమె ప్రశ్నంచారు. అమరావతిలో జరుగుతున్న మట్టి దందాలు, కమీషన్లు, కాంట్రాక్టర్ల అవినీతి వ్యవహారాలపై ప్రజలకు వివరిస్తామని నాగమణి తెలిపారు. -
ఈఓ పోస్టు ఇప్పించండి ప్లీజ్!
● సత్యదేవుని ఆలయంలో కుర్చీ కోసం రెవెన్యూ అధికారుల పైరవీలు ● మెట్ట ప్రాంత ప్రజా ప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు అన్నవరం: సత్యదేవుని ఆలయ ఈఓ కుర్చీ కోసం మళ్లీ జోరుగా పైరవీలు సాగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. రానున్న పుష్కరాల నాటికి రెగ్యులర్ ఈఓ నియామకం తప్పని సరి అని భావించి ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వాడపల్లి వేంకటేశ్వరుని దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు ప్రస్తుతం ఇక్కడ ఇన్చార్జి ఈఓగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెలాఖరు లేదా.. వచ్చే నెలలో.. ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో ఇక్కడ ఈఓను నియమిస్తారన్న సమాచారంతో పలు ఆలయాల అధికారులు మెట్ట ప్రాంత ఎమ్మెల్యేల సిఫార్సుల కోసం ప్రదక్షిణ చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేసిన డిప్యూటీ కమిషనర్, ఆయనతో బాటు గతంలో ఇక్కడ డీసీగా పనిచేసిన అధికారి, మరి కొందరు రెవెన్యూ అధికారులతో పాటు ప్రస్తుత ఈఓ కూడా ఇక్కడి ఈఓ పోస్టుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కరే ఆర్జేసీ.. ఐదు పోస్టులు.. ప్రస్తుతం దేవదాయశాఖలో వి.త్రినాథరావు ఒక్కరే రాజమహేంద్రవరం ఆర్జేసీగా పనిచేస్తున్నారు. గత నెలలో అడిషనల్ కమిషనర్గా ఆర్జేసీ ఎస్ఎస్ చంద్రశేఖర్ అజాద్కు పదోన్నతి కల్పించారు. దీంతో కలిపి ఐదు ఆర్జేసీ పోస్టులు ఖాళీ. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలలో అన్నవరంలోని చక్రధరరావును మినహాయిస్తే మిగిలిన ఆరు చోట్లా రెవెన్యూ అధికారులే ఈవోలుగా పనిచేస్తున్నారు. రెగ్యులర్ ఈఓ తప్పనిసరి దాదాపు రూ.150 కోట్లు పైబడి వార్షికాదాయం ఉన్న సత్యదేవుని ఆలయానికి రెగ్యులర్ ఈఓ ఉండడం చాలా అవసరం. ఆర్జేసీ హోదా ఉన్నవారే ఇక్కడి ఈఓ పోస్టుకు అర్హులు. ప్రస్తుత ఈఓ చక్రధరరావు అనుభవజ్ఞుడే అయినా ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్జేసీ పోస్టులు ఐదింటిని పదోన్నతి ద్వారా భర్తీ చేస్తే వాటిలో ఆయనకు చాన్స్ వచ్చే అవకాశం ఉంది. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 23,000 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
పవన్ ఇలాకా.. ముంపు తాలూకా
ఫ చిన్న వర్షానికే పిఠాపురం జలమయం ఫ రోడ్లపైకి చేరిన నీరు పిఠాపురం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం పట్టణంలో ప్రజల కష్టాలు తీరడం లేదు. రూ.కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నాం అంటున్న నేతలు.. ప్రజల కష్టాలను చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారు. శనివారం ఉదయం కురిసిన చిన్నపాటి వర్షానికి పిఠాపురంలోని 3వ వార్డు ముంపు బారిన పడింది. డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో వర్షం నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయింది. ఆర్టీసీ కాంప్లెక్స్, కాంప్లెక్స్ బ్యాక్ సైడ్, వన్ వే ట్రాఫిక్ రోడ్, భాష్యం స్కూల్ రోడ్డు పరిస్థితి దారుణంగా మారింది. పిఠాపురం బస్టాండ్ నుంచి స్కూల్కు వెళ్లే పిల్లలు మోకాలు లోతు నీటిలో వెళ్లడం బాధాకరమని 2, 3, 4 వార్డుల సమస్యల పరిష్కార పోరాట కమిటీ కన్వీనర్ కరణం విశ్వనాథం అన్నారు. ఈ రెండున్నరేళ్లలో అనేకసార్లు పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు ఇచ్చిన ఎటువంటి చర్యలూ తీసుకోలేదని తెలిపారు. -
తూరు్పన కాసుల పంచాయితీ!
● శానిటేషన్ పేరుతో దారి మళ్లింపు ● రూ.6.01 కోట్లు బిల్లుల మాటేమిటి ● కమీషన్లకు కక్కుర్తిపడ్డ ఈఓలు ● 203 పంచాయతీల్లో దుర్వినియోగం సాక్షి ప్రతినిధి, కాకినాడ: గ్రామ పంచాయతీల్లో డ్రా చేసిన రూ.6.5 కోట్ల బిల్లులపై పెద్ద పంచాయితీయే నడుస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 200 పైబడి గ్రామ పంచాయతీల్లో ఈ బిల్లుల బాగోతం చర్చనీయాంశమైంది. బిల్లుల విడుదలలో కొందరు ఈఓలు చేతి వాటం ప్రదర్శించారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గ్రామ పంచాయతీల్లో ఎటువంటి బిల్లులు డ్రా చేయవద్దంటూ గత ఏడాది డిసెంబరులో పంచాయతీరాజ్ శాఖ డైరక్టర్ కృష్ణతేజ ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి పంచాయతీల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కనీసం పారిశుధ్య సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. పల్లెల్లో మౌలిక వసతులు కూడా కల్పించడం లేదంటూ సదరు అధికారులపై తీవ్ర ఒత్తిడి మొదలైంది. దీంతో ఆర్థికంగా స్థితిమంతులైన సర్పంచ్లు చిన్న చితకా పనులు చేయించేవారు. ఇంతలో ఏప్రిల్లో పంచాయతీ పాలకవర్గాలు రద్దు కావడంతో సర్పంచ్లు పదవులు కోల్పోయారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో చిన్న చిన్న పనులు కూడా జరగడం లేదని, చివరకు పారిశుద్ధ్య వాహనాల నిర్వహణ కొరవడి అగమ్యగోచరంగా తయారైంది. ఆ వాహనాల నిర్వహణకు కనీసం ఇంధనం సొమ్ములు లేవని పంచాయతీ అధికారులు ఉన్నత అధికారులకు మొరపెట్టుకున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం క్షీణించడంతో పాటు, పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆ శాఖ డైరెక్టర్ కృష్ణతేజ బిల్లుల మంజూరులో కొంత వెసలుబాటు కల్పిస్తూ డీపీఓలకు ఆదేశాలు జారీచేశారు. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని గ్రామ పంచాయతీల్లో ఈఓలు 5శాతం కమీషన్లకు కక్కుర్తిపడి బిల్లులు మంజూరు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. చెత్త తరలింపు వాహనాలకు డీజిల్, పెట్రోలు బిల్లుల మంజూరుకు అనుమతించడమే వారి పాలిట కల్పతరువైంది. ఇదే అదనుగా ఈఓలు చేతివాటం చూపారనే విమర్శలు వెల్లువెత్తాయి. పంచాయతీల్లో సాధారణ నిధుల నుంచి నిర్దేశిత వాహనాలకు ఆయిల్ బిల్లులే కాకుండా ఇతర బిల్లులు, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పాత బిల్లులు కూడా డ్రా చేశారని తెలియవచ్చింది. ఈ బాగోతంపై పంచాయతీల వారీగా గడచిన రెండు నెలల కాలంలో విడుదల చేసిన బిల్లులపై అంతర్గత విచారణకు ఆయా జిల్లాల పంచాయతీ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మెజార్టీ గ్రామ పంచాయతీల్లో ఈ అవకతవకలు చోటుచేసుకున్నాయి. మొత్తం 203 పంచాయతీల్లో రూ.6.01 కోట్లకు లెక్కలు తేల్చాల్సి ఉంది. ఉదాహరణకు కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామ పంచాయతీకి ఇన్చార్జి ఈఓ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన అదే మండలం వాకలపూడి గ్రామపంచాయతీకి రెగ్యులర్ ఈఓ. రమణయ్యపేట గ్రామ పంచాయతీలో ఇప్పుడున్న ఈఓ కంటే ముందున్న ఈఓ చేసిన పనుల బిల్లులు కూడా తాజాగా విడుదల చేశారంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రమణయ్యపేట, సర్పవరం గ్రామ పంచాయతీలు గ్రేడ్–1 పరిధిలో ఉన్నాయి. అటువంటి రమణయ్యపేట గ్రామ పంచాయతీలో రూ.19.45 లక్షలు, సర్పవరం గ్రామ పంచాయతీలో రూ.15లక్షలు నుంచి రూ.20 లక్షలు వంతున డ్రా చేశారని చెబుతున్నారు. ఈ బిల్లులు విడుదలలో అవకతవకలపై అంతర్గత విచారణకు ఆదేశించడంతో గ్రామ పంచాయతీ అధికారుల్లో గుబులురేపుతోంది. జిల్లా పంచాయతీలు నిధుల విడుదల కోనసీమ 57 రూ.1.61 కోట్లు కాకినాడ 61 రూ.1.90 కోట్లు తూర్పుగోదావరి 85 రూ.2.50 కోట్లు మొత్తం 203 రూ.6.01 కోట్లు -
సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి విరాళాలు
అన్నవరం: సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి శనివారం భక్తులు రూ.7,12,232 విరాళాలు సమర్పించారు. విజయవాడకు చెందిన దీప్తి తమ కుమారుడు పి.హరికృష్ణ పేరిట రూ.2 లక్షలు, భీమవరానికి చెందిన ఈదర నాగ వెంకట సుబ్బారావు రూ.2 లక్షలు, ఖమ్మం పట్టణానికి చెందిన బోడిల్ల నాగేశ్వరరావు రూ.1,11,116, అమలాపురానికి చెందిన ఆర్వీఎల్ఎన్ఎస్ పార్వతి రూ.లక్ష, హైదరాబాద్కు చెందిన యలమంచిలి నవీన్, నాగిని దంపతులు రూ.1,01,116 విరాళంగా సమర్పించారు. దాతలకు డిప్యూటీ కమిషనర్ బాబూరావు తదితరులు అన్నదానం బాండ్లు అందజేశారు. కొనసాగిన వివాహిత ఆందోళన కొత్తపల్లి: నాగలాపల్లి గ్రామానికి చెందిన చింతపల్లి మురళీరెడ్డి ఇంటి వద్ద అతడి భార్య రామశంకరి చేపట్టిన ఆందోళన రెండో రోజు శనివారం కొనసాగింది. తనకు పిల్లలు పుట్టిలేదని మురళీకృష్ణ వేరే మహిళను వివాహం చేసుకొని తనను మోసం చేశాడంటూ ఆమె కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరువైపులా పెద్దలతో చర్చించారు. వారి మధ్య ఒప్పందం కుదరకపోవడంతో మంగ ళవారం మరోసారి మాట్లాడాలని పోలీసులు నిర్ణయించారు. తనకు న్యాయం జరగకపోవడంతో రామ శంకరి ఆందోళనను కొనసాగించింది. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి తాళ్లరేవు: మండల పరిధిలోని జి.వేమవరం గ్రామంలో విద్యుదాఘాతంతో చింతపల్లి వెంకట రమణ (60) మృతి చెందాడు. కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట రమణ తన మామిడి తోటలో విద్యుత్ మోటారు వేసే క్రమంలో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉసురు తీస్తున్న ఊబులు..
ధవళేశ్వరం/కపిలేశ్వరపురం: కాటన్ బ్యారేజ్ అందాలు వీక్షించడం ఓ మధురానుభూతి. ఓ పక్క గోదారి గలగలలు, మరో పక్క గోదారి పాయల నడుమ ఇసుక తిన్నెలు. ఇంకో పక్క పక్షుల కిలకిల రవాలు. భావుకులకు అదో అద్వితీయ దృశ్య కావ్యం. ఆస్వాదన వరకు బాగానే ఉంటుంది కానీ.. ఆ అందాలతో ఆకతాయి ఆటలాడితేనే సమస్య. గత మంగళవారం కాటన్ బ్యారేజీ దిగువున ఇసుక తిన్నెల్లో నీళ్లల్లోకి దిగి ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. గడిచిన పదేళ్లలో ఇలా సుమారు 70 మంది మునిగిపోయారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వారంతా 12 నుంచి 25 ఏళ్ల మధ్య యువకులే కావడం గమనార్హం. ఎన్ని హెచ్చరిక బోర్డులు పెట్టినా నీటిని చూసి పొంగే ఆనందంలో, ఇసుక తిన్నెల్లో ఉన్న దొంగ ఊబులను గమనించక అనంత లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇసుక గుంతలే మృత్యు కుహరాలు గోదావరి తీరం వెంబడి అనేక స్నాన ఘట్టాలున్నాయి. కపిలేశ్వరపురం మండలం కేదారిలంక, తాతపూడి, కపిలేశ్వరపురం గ్రామాల ర్యాంపుల్లో ఇసుక అక్రమ తవ్వకాలతో నదిలో లోతైన గోతులు ఏర్పడి మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. నదిలో కలసిన ప్రాణాలెన్నో ● ఒక్క ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మాత్రమే కాదు.. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గోదావరి పాయల్లో ఇటువంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. ● ఈ నెల 14న మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన జాగ్ దయాకర్ (18) కె.గంగవరం మండలం కోటిపల్లి రేవులో మృతి చెందాడు. ● ఈ నెల 23న ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు పెద్దిపాటి హేమంత్ (21), జస్వంత్ కుమార్ (18) మృతి చెందారు. ● మే 11న యానాం గౌతమీ గోదావరి పుష్కర ఘాట్లో రాజమహేంద్రవరానికి చెందిన షేక్ ఫైజన్ (17) మృతి చెందాడు. ● 2025 నవంబర్ 9న అంబాజీపేట మండలం పుల్లేటికుర్రుకు చెందిన పదో తరగతి విద్యార్థి నామాడి బన్ను (17) కపిలేశ్వరపురం మండలం కేదారిలంక గ్రామ శివారు ధనమ్మ మర్రి ప్రాంతంలో ఇసుక గుంతల్లో చిక్కుకుని చనిపోయాడు. ఇసుక తిన్నెల్లో పొంచి ఉన్న ప్రమాదాలు పదేళ్లలో సుమారు 70 మంది మృత్యువాత హెచ్చరికలను ఖాతరు చేయని సందర్శకులు -
వైభవంగా శ్రీవారి చక్రస్నానం
సుదర్శన పెరుమాళ్కు చక్రస్నానం చేయిస్తున్న రుత్విక్లు మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి దివ్య తిరు కల్యాణోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం వైనతేయ గోదావరి నదిలో శ్రీవారి చక్రస్నానం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రహ దోషాలు, అపమృత్యు దోషాలను నివారించే స్వామిగా ప్రాచుర్యం పొందిన సుదర్శన పెరుమాళ్తో పాటు గోవిందా...గోవింద అంటూ భక్తులు గోదావరిలో తలారా స్నానం చేసి పునీతమయ్యారు. దేవస్థానం ముఖ్య అర్చక గొడవర్తి శ్రీనివాసాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారి శిష్య బృందం ఆధ్వర్యంలో ఉభయ దేవేరులతో కొలువు దీరిన శ్రీవారిని ముందుగా పల్లకిలో ఊరేగిస్తూ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారితో పాటు సుదర్శన పెరుమాళ్కు నదీతీరంలో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం చక్రస్నానం జరిపించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.రాంబాబురెడ్డి, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మొల్లేటి చక్రపాణి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. -
భవన నిర్మాణ కార్మికులకు రూ.కోటి విరాళం ఏమైంది?
జూన్ 30న చలో విజయవాడకు మద్దతు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకట సుబ్బయ్య తెలిపారు. ఎన్నికల సమయంలో భవన నిర్మాణ కార్మికులకు వ్యక్తిగతంగా రూ.కోటి విరాళం ఇస్తానని ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాకినాడలోని పీఆర్ భవన్లో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల హక్కులను దెబ్బ తీసే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై జూలై 3న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యాన ధర్నాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. ఆర్టీసీ సేవలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను విరమించుకోవాలని, ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే చర్యలను నిలిపివేయాలని కోరారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకూ ఉద్యమం కొనసాగిస్తామని సుబ్బయ్య స్పష్టం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న నిర్వహించే ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. విలేకర్ల సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు కశింకోట కిషోర్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి శ్రీనివాసరావు, సీనియర్ కార్మిక నేత కె.ఆదినారాయణమూర్తి పాల్గొన్నారు. -
భర్త ఇంటి ముందు భార్య బైఠాయింపు
కొత్తపల్లి: తనను వదిలేసి, మరో పెళ్లి చేసుకున్న భర్త ఇంటి వద్ద ఓ భార్య బైఠాయించిన సంఘటన నాగు లాపల్లిలో చోటు చేసుకుంది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. నాగులాపల్లికి చెందిన చింతపల్లి మురళీరెడ్డికి, రమణక్కపేటకు చెందిన రామశంకరికి 2012లో వివాహమైంది. ఆ సమయంలో మురళీరెడ్డికి రామశంకరి తల్లిదండ్రులు రెండెకరాల భూమి, రూ.2 లక్షల నగదు, 40 కాసుల బంగారం కట్నంగా ఇచ్చా రు. ఆ దంపతులు కొన్నాళ్లు కాకినాడలో కాపురం ఉండేవారు. ఆమెకు పిల్లలు పుట్టడం లేదనే కారణంతో మురళీరెడ్డి గత ఏడాది నవంబరులో మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచీ కాకినాడ రాకపోవడంతో రామశంకరి ఆరా తీసింది. ఆమెతో కాపు రం చేయబోనని, తాను మరో వివాహం చేసుకున్నానని అతడు చెప్పాడు. దీనిపై ఇరు వర్గాల మధ్య 8 నెలలుగా వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులతో కలసి రామశంకరి శుక్రవారం మురళీరెడ్డి ఇంటికి వచ్చింది. తమను బయటకు గెంటేసి, గేటుకు తాళం వేసి, అతడు వెళ్లిపోయాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మరో పెళ్లి చేసుకుని తనకు తీవ్ర అన్యాయం చేశాడని, న్యాయం జరిగే వరకూ భర్త ఇంటి వద్ద ఆందోళన చేస్తానని చెప్పింది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రతి పంటకూ మద్దతు ధర
● 60 ఏళ్లు నిండిన ప్రతి రైతుకూ రూ.10 వేల పెన్షన్ ● కౌలుదారులకు చట్టబద్ధమైన రక్షణ ● ఏపీ రైతు సంఘం నేత సూర్యనారాయణ డిమాండ్ పిఠాపురం: స్వామినాథన్ కమిటీ సిఫార సు చేసిన విధంగా ప్రతి పంట ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం లాభం కలిపి మద్దతు ధర నిర్ణయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ డిమాండ్ చేశారు. సంఘం జిల్లా రెండో మహాసభ లు పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో శుక్రవారం జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్యనారా యణ మాట్లాడుతూ, 60 ఏళ్లు నిండిన ప్రతి రైతుకూ రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని, రుణమాఫీ చేయాలని, విద్యుత్ ప్రైవేటీకరణను ఆపాలని, కౌలు రైతులకు చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని, వ్యవసాయ కార్మికులకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనకు కార్యాచరణ రూపొందించే దిశ గా వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో ఏలూరులో సంఘం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ విధానాలు రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయని సూర్యనారాయణ అన్నారు. ఇటీవల జరిగిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లలో అమెరికా, ఇంగ్లండ్, యూరోపియన్ దేశాల నుంచి జీరో ట్యాక్స్తో వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఈ ఒప్పందంతో ధరలు మరింత పడిపోయి రైతులు దారుణంగా దెబ్బ తింటారని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 14 పంటలకు ప్రకటించిన మద్దతు ధర అందే పరిస్థితి లేదని ఆయన మండిపడ్డారు. సబ్సిడీకి కత్తెర వేసేందుకే ఎరువుల యాప్ రైతులకు ఇస్తున్న సబ్సిడీని తగ్గించుకునేందుకే ఎరువుల పంపిణీకి ప్రభుత్వా లు యాప్ తీసుకొచ్చాయని సూర్యనారాయణ అన్నారు. దీని ద్వారా ఎకరానికి మూడు విడతలుగా రెండు బస్తా లు మాత్రమే ఇస్తామంటున్నారన్నారు. గోదావరి జిల్లాల్లో మొక్కజొన్నకు ఎకరానికి 10 నుంచి 12 బస్తాల ఎరువులు వేస్తున్నారని, ప్రభుత్వం రెండు బస్తాలు మాత్రమే ఇస్తే, మిగిలింది రైతులు సొంత డబ్బుతో కొనుక్కోవాల్సి వస్తుందని చెప్పారు. సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, నాయకుడు నీలపాల సూరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఏడిపింఛెన్
శనివారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2026● కొత్త పింఛన్ల పంపిణీ అంటూ ఆర్భాటం ● ఇదిగో ఇచ్చేస్తున్నారంటూ కూటమి నేతల హడావుడి ● సచివాలయాల వద్ద అర్హుల పడిగాపులు ● ప్రభుత్వ ఆదేశాలు లేవన్న అధికారులు ● ఆశావహులకు తప్పని నిరాశ పిఠాపురం: నరాల బిగువు, కరాల సత్తువ సన్నగిల్లి, ముదిమి మీద పడి కొందరు.. అవయవాలు సక్రమంగా లేక, ఏ పనీ చేయలేక బతుకు భారంగా ఈడుస్తున్న వారు మరికొందరు.. భర్తను కోల్పోయి, నా అనే దిక్కు లేక దీనావస్థలో ఇంకొందరు.. చంద్రబాబు సర్కారు నిరాదరణతో ఇటువంటి బాధాసర్పదష్టులు కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి సర్వత్రా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛను మొత్తాన్ని రూ.4 వేలకు పెంచి అదే మహా గొప్ప అన్నట్టు హడావుడి చేశారు. తీరా చూస్తే ప్రతి నెలా లబ్ధిదారుల సంఖ్యలో కోత పెడుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం రెండేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు చేయడం లేదు. ఆ పింఛను వస్తే వృద్ధాప్యంలో, దిక్కులేని దీనావస్థలో ఊపిరి నిలబెట్టుకోవడానికి అవసరమైన మందులు మాకులు కొనుక్కోవడానికి, కడుపు నిండా కాస్త తినడానికి, ఆత్మగౌరవంతో బతకడానికి ఉపయోగపడుతుందని జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన వేలాది మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. దరఖాస్తులు చేసుకుని, సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఆశ పెట్టి.. ఏడిపిస్తారా? ఈ తరుణంలో కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 12 నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ కూటమి నేతలు ఇటీవ ల తెగ హడావుడి చేశారు. సోషల్ మీడియాలో సైతం ఆర్భాటం చేశారు. పలువురు కూటమి నేతలు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించి పింఛన్ ఆశావహుల నుంచి ధ్రువీకరణ పత్రాలు సైతం సేకరించారు. దీంతో, రెండేళ్లుగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న అభాగ్యులు గంపెడాశతో సచివాలయాలకు క్యూ కట్టారు. తీరా చూస్తే కొత్త పింఛన్లు ఇవ్వాలంటూ ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ఉత్తర్వులూ రాలేదని, అసలు వెబ్సైటే ఓపెన్ కాలేదని పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, అధికారులు చెప్పడంతో కంగు తినడం ఆ నిర్భాగ్యుల వంతయ్యింది. పింఛన్లు ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ, ఇస్తామని చెప్పి ఇలా ఏడిపించడమేమిటని వారు వాపోతున్నారు.కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న ఆశావహులుపదేపదే తిరిగినా.. కాళ్లు రెండూ చచ్చుబడిపోయి కుటుంబ పోషణ భారంగా మారింది. రెండేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. కొత్త పెన్షన్ మంజూరు చేస్తున్నారంటూ ప్రచారం చేస్తే ఆశతో సచివాలయానికి వెళ్లాను. అటువంటిదేమీ లేదు పొమ్మన్నారు. ఏ ఆధారమూ లేక కుటుంబం గడవక చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించాలి. – పెనుబోతుల రాంబాబు, దివ్యాంగుడు, జగ్గయ్య చెరువు కాలనీ, పిఠాపురం అభాగ్యులతో ఆటలా? దివ్యాంగుడిగా ఉన్న నాకు ఎటువంటి ఆధారమూ లేకపోవడంతో పింఛను మంజూరు చేయాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఈ నెల 12న కొత్త పింఛన్లు ఇస్తున్నారని ప్రచారం జరిగితే గంపెడాశతో వెళ్లాను. ఇప్పుడు అలాంటివేవీ లేవన్నారు. ఇవ్వనప్పుడు ప్రచారం చేయడం ఎందుకు? అభాగ్యులతో ఆటలాడొద్దు. వెంటనే కొత్త పింఛన్లు ఇవ్వాలి. – లంకా నాగరాజు, దివ్యాంగుడు, పిఠాపురం జిల్లాలో వివిధ కేటగిరీ పింఛన్ల పంపిణీ ఇలా.. కేటగిరీ లబ్ధిదారులు వృద్ధాప్య 1,30,826 దివ్యాంగులు 34,716 ఒంటరి మహిళలు 7,795 వితంతువులు 73,725 మత్స్యకారులు 6,236 కల్లుగీత 3,378 చేనేత 3,411 ఆరోగ్యపరమైనవి 783 మొత్తం 2,71,039 పింఛన్లుగా అందిస్తున్న మొత్తం రూ.116.88 కోట్లు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు 35,000 -
జానూ కేసులో ట్విస్ట్కి తెర!
కాకినాడ: తుని చిన్నారి జానేశ్వరి మిస్సింగ్ కేసులో ఓ ఉత్కంఠకు తెర పడింది. కీలక క్లూగా భావించిన పెంపుడు కుక్క అనూహ్యంగా మరణించగా.. ఇంతకాలం దాని పోస్టుమార్టం నివేదిక బయటకు రాకపోవడంపై అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ నివేదిక ఇప్పుడు వెలువడినట్లు తెలుస్తోంది. అందులో పెంపుడు కుక్క మృతికి స్పష్టమైన కారణం వెల్లడించారు నిపుణులు. ఆహారం తీసుకోకపోవడం.. అనారోగ్యం వల్లే అది చనిపోయినట్లు నిర్దారించారు.కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారం ప్రాంతంలో జూన్ 6న రెండున్నరేళ్ల జ్ఞానేశ్వరి (జానూ) అదృశ్యమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు కలిసి విస్తృతంగా గాలింపు చర్యలు ప్రారంభించాయి.ఈ క్రమంలో చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క.. మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చింది. ఆ తర్వాత అది విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దీంతో ఏదో జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దానికి జీపీఎస్ ట్రాకర్ కట్టి చిన్నారి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇంటి దగ్గర పోలీసుల హడావిడి చూసి అది బెదిరి పారిపోయింది. డ్యాగ్క్యాచర్ సాయంతో దానిని బంధించి.. ఇంటి ఆవరణలో ఓ బోనులో బంధించారు. ఆ సమయంలో.. బిడ్డ కోసం జానూ తల్లి ఆ కుక్కను బతిమాలడం స్థానికులను కలిచి వేసింది. వెటర్నరీ డాక్టర్ల సహాయంతో దానికి చికిత్స అందించగా.. కాస్త కోలుకున్నాక 13వ తేదీన మళ్లీ జీపీఎస్ ట్రాకర్తో దానిని వదిలారు. సుమారు 8 కిలోమీటర్ల దూరం తిరిగి వచ్చిన కుక్క.. కొన్ని గంటలకే మరణించింది. ఆ మరుసటిరోజు దానికి పోస్ట్మార్టం నిర్వహించారు. ఆ వెంటనే.. గ్రామంలోని ఓ ఆలయం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో చిన్నారి కనిపించకుండా పోయిన రోజు ఆ పెంపుడు కుక్క అటు ఇటు తిరిగిన దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో.. కుక్క మృతికి బలమైన కారణం ఏదో ఉండొచ్చని భావించారు. కుక్కపై విషప్రయోగం జరిగిందా? జంతువులేమైనా దాడి చేశాయా? అనే అనుమానాల నడుమ.. దాని శాంపిల్స్ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. విశాఖపట్నంలోని ల్యాబ్లో టెస్టులు ఆలస్యం అయ్యాయి. తాజాగా బయటకు వచ్చిన నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. నిపుణుల ప్రకారం, కుక్క శరీరంలో ఎలాంటి బాహ్య గాయాలు, దాడి ఆనవాళ్లు, అనుమానాస్పద పరిస్థితులు లేవని స్పష్టమైంది. ఆహారం తీసుకోకపోవడం వల్ల ఏర్పడిన అనారోగ్యం కారణంగానే కుక్క మృతి చెందినట్లు నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది. బహుశా చిన్నారిపై బెంగతోనే అది మరణించి ఉంటుందేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ నిర్ధారణతో కుక్క మృతిపై ఉన్న అనుమానాలు తగ్గినప్పటికీ.. చిన్నారి జానూ మిస్సింగ్ కేసు దర్యాప్తులో కీలకమైన ఒక కోణానికి స్పష్టత లభించింది. అయితే కేసులో ప్రధాన ప్రశ్న అయిన చిన్నారి ఆచూకీ మాత్రం ఇంకా తెలియరాలేదు. 20 రోజులు గడిచినా ఆచూకీ లేకపోవడంతో.. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ను ఆపేశారు. అయితే కిడ్నాప్ కోణంలో మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తుని పోలీసులు వెల్లడించారు. -
బంగారంపై యుద్ధ సంక్షోభం
పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం బంగారంపై పడింది. గడచిన మూడు వారాలుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ధరలు తగ్గిన ప్రతి సందర్భంలోనూ ప్రజలు భయపడి కొనుగోళ్లు ఆపేస్తారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ధరలు ముందుముందు ఇంకా తగ్గుతాయనే భయంతో కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితి మరో నెల రోజులుంటుందని అంచనా వేస్తున్నాం. – అనిల్ కుమార్ జైన్, రాష్ట్ర బులియన్ అసోసియేషన్ కోశాధికారి, అమలాపురం అప్పటి వరకూ ఆగాల్సిందే.. బంగారం కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి. ధర తగ్గిందని అనుకుంటే బంగారం కొనేందుకు వినియోగదారులు ముందుకు రావడం లేదు. ఒకప్పుడు రోజుకు పది పదిహేను మంది బంగారం కొనుగోలుకు వచ్చేవారు. ఇప్పుడు నలుగురైదుగురికి మించి రావడం లేదు. శ్రావణ మాసం వచ్చే వరకూ మార్కెట్లో ఈ అనిశ్చితి ఉండేలా కనిపిస్తోంది. – కొండేపూడి శివరామకృష్ణ, గోల్డ్ మర్చంట్, కరప -
సర్ వేగవంతం చేయాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో ఈ నెల 15 నుంచి జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలోని 34వ పోలింగ్ కేంద్రం భాస్కర్ నగర్లో బీఎల్ఓలు ఇంటింటా నిర్వహిస్తున్న ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీని గురువారం ఆయన అకస్మాత్తుగా పరిశీలించారు. పత్రాల పంపిణీ, వాటిని పూర్తి చేసి, ఓటర్ల తిరిగి స్వీకరిస్తున్న విధానాన్ని నేరుగా పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. చనిపోయిన, శాశ్వతంగా గ్రామం వదిలి వెళ్లిన, నాట్ ట్రేస్ అవుట్ వ్యక్తుల ఓట్ల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు. నిర్దిష్ట గడువులోగా ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఈ విధుల్లో నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సూపర్వైజర్లను కలెక్టర్ హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రియ, కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు కూడా పాల్గొన్నారు. -
అయ్యో జానూ.. పోలీసుల కీలక నిర్ణయం!
సాక్షి, కాకినాడ: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జానూ) మిస్సింగ్ కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 20 రోజులుగా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కొనసాగుతున్న గాలింపు చర్యలు ఫలితం ఇవ్వలేదని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్ను నిలిపివేయాలని నిర్ణయించారు.ఇప్పటివరకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు కలిసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. కాలువలు, అటవీ ప్రాంతాలు, గ్రామ పరిసరాల్లో సోదాలు నిర్వహించినప్పటికీ చిన్నారి జాడ దొరకలేదు. దీంతో గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. గాలింపు ఆగిపోవడంతో జానూ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చిన్నారి ఆచూకీపై ఇంకా ఆశలు పెట్టుకున్న కుటుంబం ఈ నిర్ణయంతో కన్నీరుమున్నీరవుతోంది. అయితే..అయితే కేసు సాధారణ మిస్సింగ్గా కాకుండా కిడ్నాప్ కోణంలో కూడా కొనసాగుతోంది. తుని రూరల్ పోలీసులు సాంకేతిక ఆధారాలపై దృష్టి సారిస్తూ కాల్డేటా, సీసీటీవీ ఫుటేజ్, ఇతర డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ఈ ఆధారాల ఆధారంగా కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.ఇదే సమయంలో చిన్నారి ఇంట్లో పెంపుడు కుక్కకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా అందకపోవడం కూడా విచారణలో కీలకంగా మారింది. ఈ రిపోర్ట్ ఆధారంగా ఘటన జరిగిన సమయంలో ఏదైనా అసాధారణ పరిస్థితి ఉందా? అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు! ఎప్పుడు ఏం జరిగిందంటే..జూన్ 6, 2026కాకినాడ జిల్లా తుని రూరల్ మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో రెండున్నరేళ్ల జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. చిన్నారి తండ్రి పనిచేస్తున్న పామాయిల్ తోట ప్రాంతం నుంచి కనిపించకుండా పోయింది.జూన్ 7–9తుని రూరల్ పోలీసులు, స్థానికులు, అటవీ శాఖ సిబ్బంది గాలింపు ప్రారంభించారు. కాలువలు, తోటలు, సమీప కొండ ప్రాంతాలు, పొదల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.జూన్ 10కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోలీసులు ప్రజలకు హెల్ప్లైన్ నంబర్లు విడుదల చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.జూన్ 11–12చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన కుటుంబ పెంపుడు కుక్క తిరిగి ఇంటికి వచ్చింది. కుక్క ప్రవర్తన అసాధారణంగా ఉండటంతో దానిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.జూన్ 12హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కుక్కకు GPS ట్రాకర్ కాలర్ అమర్చింది. కుక్క వెళ్లే మార్గాల ఆధారంగా చిన్నారి జాడ దొరకవచ్చని భావించారు. జూన్ 13కుక్కను ట్రాక్ చేస్తుండగా అది సుమారు 8 కిలోమీటర్లు పరిగెత్తినట్లు గుర్తించారు. అదే సమయంలో కుక్క అకస్మాత్తుగా మృతి చెందింది. కుక్క మృతితో కేసులో కొత్త మిస్టరీ ఏర్పడింది.జూన్ 14ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. థర్మల్ డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్, ప్రత్యేక సెర్చ్ టీమ్స్తో గాలించాయి. హనుమాన్ టీమ్ సహా ప్రత్యేక నిపుణుల బృందాలు కూడా సహకరించాయి.జూన్ 15–19జానూ కనిపించకుండాపోయి.. పదిరోజులైనా ఎలాంటి కీలక ఆధారాలు లభించలేదు. పోలీసులు CCTV ఫుటేజ్లు, కాల్ డేటా రికార్డులు, మొబైల్ టవర్ డంప్ డేటా విశ్లేషించడం ప్రారంభించారు. అపహరణ కోణాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అలాగే.. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని పోలీసులు కోరారు. జూన్ 20–23గాలింపు మరింత విస్తరించినప్పటికీ చిన్నారి ఆచూకీ లభించలేదు. కేసు పురోగతిపై ప్రజా ఆందోళన పెరిగింది. చిన్నారి కుటుంబ సభ్యులు, స్థానికులు మరింత దర్యాప్తు కోరారు.జూన్ 24 కేసుపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దర్యాప్తు పురోగతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించారా అనే అంశంపై కూడా వివరణ కోరింది. జూన్ 25.. దాదాపు 20 రోజుల గాలింపు తర్వాత ప్రత్యక్ష సెర్చ్ ఆపరేషన్ను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. అయితే కిడ్నాప్ యాంగిల్లో మాత్రం దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలు, డిజిటల్ ఆధారాలు, కాల్ డేటా, కుక్క పోస్టుమార్టం నివేదిక(ఇంకా రాలేదు) తదితర అంశాలపై పోలీసులు ఇంకా పరిశీలన చేస్తున్నారు.జ్ఞానేశ్వరి చివరిసారిగా ఎక్కడ కనిపించింది?పెంపుడు కుక్క నాలుగు రోజుల తర్వాత ఎలా తిరిగి వచ్చింది?కుక్క మరణానికి అసలు కారణం ఏమిటి?ఇది ప్రమాదమా? అపహరణా? లేక మరో కోణం ఉందా?ఇంత పెద్ద సెర్చ్ ఆపరేషన్ తర్వాత కూడా చిన్నారి జాడ ఎందుకు దొరకలేదు?ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలు దొరికితేనే జానూ మిస్సింగ్ కేసు మిస్టరీ వీడే అవకాశం ఉంది.ఈ కేసుపై హైకోర్టు కూడా స్పందిస్తూ, జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు దర్యాప్తుపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం కూడా కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతున్నా, చిన్నారి ఆచూకీ మాత్రం ఇంకా లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ సభ్యులు మాత్రం జానూ సురక్షితంగా తిరిగి వస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. -
ఒకరికి ఏకంగా రూ.12 వేల కటింగ్
అన్నవరం: పులికి లేడి లాంటి చిన్న జంతువులే లోకువ.. అది సాధారణంగా ఏనుగుల్లాంటి పెద్ద జంతువుల జోలికి వెళ్లదు. అది ఆటవిక న్యాయం. నాగరిక సమాజంలో కూడా పెద్ద ఉద్యోగుల జోలికి సాధారణంగా ఎవరూ వెళ్లరు. చిరుద్యోగులే ఎప్పుడు టార్గెట్ అవుతూంటారు. అన్నవరం దేవస్థానంలో సరిగ్గా ఇలాగే జరిగింది. దేవస్థానంలో రెగ్యులర్ ఉద్యోగులు సుమారు 215 మంది ఉన్నారు. వీరికి జీతభత్యాలు ఒక్కొక్కరికి నెలకు సుమారు రూ.లక్ష వరకూ ఉంటుంది. కాగా, దేవస్థానంలో ఎన్ఎంఆర్, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, సెక్యూరిటీ, శానిటేషన్, స్వామివారి పల్లకీ బోయీలు, ఆలయాల్లో వైదికపరమైన పనులు చేసే పరిచారకులు సుమారు వెయ్యి మంది ఉంటారు. వీరి జీతాలు నెలకు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకూ ఉంటాయి. వీరు రోజూ బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలనే నిబంధన ఉంది. వీరిలో చాలా మంది సంబంధిత సెక్షన్ సూపరింటెండెంట్ల అనుమతితో వ్యక్తిగత కారణాల వలన తమ విధులను వేరొకరికి అప్పగించి, తరువాత వారి విధులను వీరు చేస్తూంటారు. తద్వారా పనులు, సేవల్లో లోటు లేకుండా చూసుకుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కోసారి బయోమెట్రిక్ అటెండెన్స్ వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి సందర్భాల్లో ఆ సూపరింటెండెంట్లు అటెండెన్స్ రిజిస్టర్లో విధులకు హాజరైనట్టు ‘పి’ అని నమోదు చేస్తారు. సూపరింటెండెంట్లు ఆవిధంగా నమోదు చేసినప్పటికీ సత్యదేవుని సన్నిధిలో పని చేస్తున్న 83 మంది చిరుద్యోగులకు మే నెల జీతాల్లో ఒకటి, రెండు రోజుల చొప్పున కోత విధించడం వివాదాస్పదమైంది. బయోమెట్రిక్ అటెండెన్స్ వేయకపోవడంతో గైర్హాజరైనట్లు భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈవిధంగా ఒక్కొక్కరి జీతాల్లో రూ.600, రూ.వెయ్యి చొప్పున కటింగ్ చేశారు. కట్ చేసిన మొత్తం రూ.3.5 లక్షలు దేవస్థానానికి జమ చేశారు. దీనిపై ఈఓ వద్ద పలువురు సూపరింటెండెంట్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆయన వెనక్కి తగ్గకుండా కట్ చేయాల్సిందేనని ఆదేశాలు ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ ఉద్యోగులకు వచ్చే నెల జీతమే తక్కువ. అందులోనూ కోత పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పల్లకీ మోసినా తప్పని జీతం కోత దేవస్థానంలో 26 మంది పల్లకీ బోయీలకు ప్రస్తుతం 20 మంది పని చేస్తున్నారు. వీరందరూ రజకులే. శతాబ్దాల నుంచి నాలుగు ఇంటి పేర్ల వారే స్వామివారి పల్లకీ సేవలో పాల్గొంటారు. వీరు లేనిదే దేవుని సేవ జరగదు. వీరికి ఒక్కొక్కరికి అన్ని కటింగ్లూ పోనూ చేతికి రూ.18 వేల జీతం వస్తోంది. గత ఏప్రిల్ 26 నుంచి మే రెండో తేదీ వరకూ జరిగిన సత్యదేవుని వార్షిక కల్యాణోత్సవాల్లో ఈ బోయీలంతా పని చేశారు. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ జరిగిన వివిధ ఉత్సవాల్లో స్వామి, అమ్మవారిని వీరు ఆయా వాహనాల్లో ఊరేగించారు. ఇవి కాకుండా స్వామివారికి ప్రతి రోజూ ఏదో ఒక సేవ ఉండనే ఉంది. ఈ క్రమంలో ఆరుగురు బయోమెట్రిక్ అటెండెన్స్ సరిగా వేయలేదు. ఈ కారణంతో తమకు రూ.600 నుంచి రూ.3 వేల వరకూ జీతం కట్ చేశారని వారు వాపోయారు. ఈఓ లేనప్పుడు అందరూ పని చేస్తున్నారా? వాడపల్లి దేవస్థానం ఈఓగా ఉన్న నల్లం సూర్యచక్రధరరావు అన్నవరం దేవస్థానానికి ఇన్చార్జి ఈఓగా ఉన్నారు. ఆయన వారానికి మూడు నాలుగు రోజులు ఇక్కడ, మిగిలిన రోజుల్లో వాడపల్లిలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఇక్కడ లేనప్పుడు బయోమెట్రిక్ అటెండెన్స్ వేసి, ఏ ఉద్యోగి ఎక్కడకు వెళ్తున్నారో ఎలా తెలుస్తుందని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.·˘ ºÄñæ*-Ððl$-{sìæMŠS Asñæ…-yðl¯ŒSÞ వేయలేదని 83 మందికి జీతం కట్ ·˘ JMöPMýSP-Ç i™èl… ¯ðlÌSMýS$ రూ.12 వేల నుంచి రూ.18 వేలు ·˘ A…§ýl$ÌZ¯ól Æý‡*.600 ¯]l$…_ రూ.1,000 వరకూ కోత ·˘ çÜ™èlÅ-§ólÐ]l#° çܰ²-«¨ÌZ అధికారుల తీరుపై విమర్శలుపల్లకీ బోయీల్లో ఎవరైనా వృద్ధులైతే తమ కొడుకులు, అల్లుళ్లను ఈ పనిలో పెట్టుకుంటూంటారు. అలాగే, మైలు, ఇతర కారణాలతో ఎవరైనా విధులకు రాలేని పరిస్థితి ఏర్పడితే మరొకరిని ఆ సేవకు పంపిస్తారు. ఇదే విధంగా వృద్ధుడైన ఒక బోయీ తను రాలేని పరిస్థితిలో వేరొకరిని సేవకు పంపించాడు. అతడు రోజూ పల్లకీ సేవ చేశాడు. కానీ, బయోమెట్రిక్ అటెండెన్స్ వేయలేదనే కారణంతో ఆ వృద్ధ బోయీ జీతం నుంచి ఏకంగా రూ.12 వేలు కట్ చేసి, రూ.6 వేల జీతం మాత్రమే ఇచ్చారు. తనకు బదులు పని చేసిన వారికి అందులో నుంచి ఎంత మొత్తం ఇవ్వాలో తెలియక ఆ వృద్ధుడు ఇబ్బంది పడుతున్నాడు. జీతంలో కోత పడిన 83 మంది చిరుద్యోగుల పరిస్థితి ఇదేవిధంగా ఉంది. -
ధ్వజస్తంభంపై సుదర్శన చక్రం తొలగింపు
అన్నవరం: ఇటీవల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి సత్యదేవుని ఆలయ ధ్వజస్తంభంపై సుదర్శన చక్రం ఒకవైపు ఒరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గత ఆదివారం గుర్తించారు. దీనిని కిందికి దించి, సంప్రోక్షణ అనంతరం తిరిగి ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒరిగిన ఆ చక్రాన్ని అర్చకుడు సుధీర్, పరిచారకుడు పవన్లు పండితుల మంత్రోచ్చారణల నడుమ బుధవారం తొలగించి, కిందకు దించారు. అనంతరం దర్బారు మండపంలో ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యాన పూజలు చేసి ఒంగిన సుదర్శన చక్రాన్ని సరి చేశారు. దీనికి గురువారం ఉదయం ప్రత్యేక పూజలు చేయనున్నారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పండ్ల రసాలతో అభిషేకం చేసిన అనంతరం, 9 గంటలకు పండితుల మంత్రోచ్చారణల నడుమ దానిని తిరిగి ధ్వజస్తంభంపై అమర్చుతారు. అక్కడ కూడా అభిషేకం చేసి, సుదర్శన చక్రానికి బూర్లు నివేదిస్తారని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొంటారని అధికారులు తెలిపారు. నేడు సంప్రోక్షణ, పునఃప్రతిష్ఠ -
బాలబాలాజీకి కల్యాణ తిలకం
మామిడికుదురు: జ్యేష్ఠ శుద్ధ దశమి శుభ ముహూర్తంలో వేద మంత్రాలు, భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, కర్పూర పరిమళ సుగంధ ద్రవ్యాల నడుమ అప్పనపల్లి బాలబాలాజీ స్వామి వారి తిరు కల్యాణోత్సవాలకు బుధవారం అంకురార్పణ జరిగింది. పాంచరాత్ర ఆగమానుసారం స్వామి వారి వార్షిక దివ్య తిరు కల్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టారు. అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్స్వామి శిష్యులు, యాజ్ఞిక బ్రహ్మ చలమచర్ల వేణుగోపాలాచార్యులు బృందం ఆధ్వర్యాన శ్రీవారి వార్షిక కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బాలబాలాజీ స్వామితో పాటు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను సుందరంగా ముస్తాబు చేశారు. బుగ్గన చుక్క పెట్టి, నుదుటన కల్యాణం తిలకం దిద్ది, పెండ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా అలంకరించారు. ఎటువంటి ఆటంకాలూ కలగకుండా కల్యాణోత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని కోరుతూ విష్వక్సేనారాధన చేశారు. ఆలయ ఈఓ ఎం.రాంబాబురెడ్డి దంపతులు, వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ మొల్లేటి లక్ష్మీనారాయణ 108 కలశాలతో పాటు బ్రహ్మ కలశంలో పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పసుపు, కుంకుమతో స్నపన తిరు మంజన సేవను వైభవోపేతంగా జరిపించారు. సేకరించిన పుట్టమన్నును తొమ్మిది పాత్రల్లో నింపి అంకురార్పణ నయనానందకరంగా జరిపించారు. పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశన, పరిషదక్షిణ, మృత్సంగ్రహణం, హోమం తదితర కార్యక్రమాలు వైభవోపేతంగా నిర్వహించారు. కల్యాణోత్సవ కార్యక్రమాలను వీక్షించేందుకు విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తిరు కల్యాణ మహోత్సవ పూజా కైంకర్యాలను వీక్షించి మహదానందం పొందారు. -
మీ రాజకీయాల కోసం ముద్రగడను కించపర్చొద్దు: వైఎస్సార్సీపీ
సాక్షి, కాకినాడ: ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో బాధపడుతుంటే, కూటమి సర్కార్ ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యుల్ని మానసికంగా క్షోభపెట్టేలా వ్యవహరించడం దారుణమని వైఎస్సార్సీపీ కాపు సామాజిక వర్గ నేతలు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీలు వంగా గీత, తోటనర్సింహం, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు.ముద్రగడ ఆరోగ్యంపై వైఎస్ జగన్ రోజూ ఆరా తీస్తున్నారని, కానీ కూటమి నేతలు మాత్రం మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలనలో విఫలమైన చంద్రబాబు కుల రాజకీయాలతో దాన్ని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆక్షేపించారు.ముద్రగడపై ట్రోల్స్ సరికాదు: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుముద్రగడ పద్మనాభం ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకుని ఇంటికి రావాలని అందరూ కోరుకోవాలి. రాష్ట్రంలో కాపు సామాజికవర్గంలో వంగవీటి మోహన రంగా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే నాయకుడిగా ముద్రగడ పద్మనాభం ఉండే వారు. ఆయన ఎక్కడా అవినీతి మరకలు అంటని వ్యక్తి. అలాంటి వ్యక్తిపై ట్రోల్స్ చేయడం ఎంతవరకూ ధర్మం అన్నది ఆలోచించాలి. మేం అంతా ఆయన్ను పరామర్శించడానికి వెళ్లాలని భావించినా ఆస్పత్రిలో హడావిడి ఎందుకని రావొద్దని సూచించారు.చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేగా ఉండగానే ముద్రగడ పద్మనాభం మంత్రిగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని కించపర్చేలా మాట్లాడటం సరికాదు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గమే కాదు అన్ని వర్గాల్లోనూ ముద్రగడకు అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గురించి మా నాయకులు ఎవరూ వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాలపైనే మాట్లాడాం. మేం కులాల గురించి ఎక్కడా మాట్లాడలేదు. రాజకీయంగా కాపులకు మేలు చేయడానికి మా ప్రయత్నం చేస్తున్నాంజఇతర రాజకీయ పార్టీల్లో ఉన్న కాపు నాయకులు కూడా వారి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప కులాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టే ప్రయత్నం జనసేన తప్ప ఎవరూ చేయలేదు. కులాల గురించి మాట్లాడొద్దంటూనే చంద్రబాబు విజయవాడలో లాకప్ డెత్పై స్పందిస్తూ సీఐ కాపు, హతుడు కాపు అంటున్నారు. మీ స్థాయికి ఇది తగునా చెప్పండి. మీరు కులాల గురించి మాట్లాడుతూ మేం మాట్లాడుతున్నామని ఎదురుదాడి చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనించాలని కోరుతున్నాం.ముద్రగడ సాయం తీసుకునే వ్యక్తి కాదు: కురసాల కన్నబాబువైఎస్సార్సీపీలో కాపు నాయకుల్ని తన ఇంటికి రమ్మని.. తాజా పరిణామాలపై మాట్లాడుకుందామని తోట త్రిమూర్తులు తన ఇంటికి పిలిస్తే చంద్రబాబు దీనిపై అందరినీ రెచ్చగొట్టారు. చనిపోయిన వారికి కులాలు ఆపాదిస్తారా అని ఇవాళ మళ్లీ అదే చంద్రబాబు అడుగుతున్నారు. కులాన్ని నరనరానా జీర్ణించుకుని మాట్లాడుతోంది ఎవరు? ఇవాళ చంద్రబాబు ఓపెన్ చేసిన బంగారు గనికీ, కులానికీ సంబంధం ఉందా? పవన్ కళ్యాణ్ను ఖబర్దార్ అని మేం అన్నామా? రౌడీలకు కులాలు ఉంటాయా అని మీరే ప్రశ్నిస్తున్నారు. కానీ ఇవాళ మళ్లీ కాపు కులం అని ప్రస్తావిస్తూ మిమ్మల్ని ఖబర్దార్ అంటున్నారు.సాయికృష్ణ హత్యను మేం శాంతిభద్రతల సమస్యగానే చూస్తున్నాం. సిట్ కోర్టుకు ఇచ్చిన నివేదికలో సాయికృష్ణది కస్టడియల్ డెత్ అని చెప్పింది. తీసుకొచ్చి కొట్టడం, చంపడం, తల్లి అడిగినా స్పందించినా స్పందించకపోవడం, సీసీ ఫుటేడ్ ఇవ్వకపోవడం ఇలా అన్నీ నేరాలే చేశారు. టాస్క్ ఫోర్స్ పట్టుకొస్తే, పోలీసులు చంపేసి బూడిద చేసేశారు. ఈ ఘటనను మేం కాపుల కోణంలో చూడటం లేదు శాంతిభద్రతల కోణంలోనే చూస్తున్నాం.కాకినాడ రూరల్తో మొదలుపెట్టి రాష్ట్రమంతా పోలీసులు తమకు ఓ ప్రత్యేక రాజ్యాంగం ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అక్రమంగా నిర్బంధాలు చేయడం, పచ్చిబూతులు తిట్టడం చేస్తున్నారు. పోలీసులు వైఖరి మార్చుకోకపోతే ప్రతిఘటన తప్పదు. ఇది చంద్రబాబు తప్పు అయితే మేం పవన్ కళ్యాణ్ ను ఎందుకు అడుగుతాం? నాలుగైదు రోజులుగా సాయికృష్ణను చంపిన నాగరాజుకు పూలదండలు వేసి హీరోలా కీర్తిస్తూ ప్రదర్శనలు చేస్తున్నారు.ఇదేమైనా సినిమానా? మా ప్రభుత్వంలో కాళహస్తిలో ఓ కార్యకర్తను పోలీసు కొడితే నానా హంగామా చేశారు. ఇప్పుడు కాల్చి బూడిద చేసేస్తే మేం ప్రశ్నించకూడదా? ఇది కాపుల తగువు కాదు చంద్రబాబు తగువే. దీనికి కారణం ఆయన రెడ్ బుక్కే. ఈ ఘటనను కాపులపై రుద్దేసి తప్పించుకుందామనుకుంటున్నారు. కాపుల స్వాభిమానాన్ని దెబ్బతీయొద్దు. జీవితకాలం ఓ లక్ష్యంతో పనిచేసిన ముద్రగడ పద్మనాభం వంటి వ్యక్తిని ఎలా కించపరుస్తారు ? గతంలో అనారోగ్యానికి గురైతే ముద్రగడకు జగన్మోహన్ రెడ్డి ఎయిర్ అంబులెన్స్ పంపుతామంటే ఆయన ఒప్పుకోలేదు.డైవర్షన్ కోసమే చంద్రబాబు కుల ప్రస్తావనలు: దాడిశెట్టి రాజారాష్ట్ర పాలనపై చంద్రబాబు పట్టు కోల్పోయారు. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు కులాల ప్రస్తావన తెస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను ఏదో అన్నామని పదే పదే ప్రస్తావన తెస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ను మేం ఏమీ అనలేదు. ముద్రగడ పద్మనాభం వంటి మీ పాత రాజకీయ సహచరుడు వెంటిలేటర్పై ఉంటే మీరు కుటుంబాన్ని వీధిలోకి లాగడం ధర్మంగా ఉందా? గతంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా వాటిలో చలనం తీసుకొచ్చింది ముద్రగడ పద్మనాభం ఉద్యమాలు, నిరసనలే. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంయమనం పాటించండి. ఆయన ఎవరూ సాయం చేస్తానన్నా తీసుకునే వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గుడి ప్రతిష్టకు వెళ్తే ఆయన గురించి చంద్రబాబు అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఇంతకన్నా పెద్ద సమస్య వస్తే మరోసారి తిరుపతి లడ్డూ ప్రస్తావన కూడా తెస్తారు.కాపులు పరస్పరం కొట్టుకోవాలా ?: తోట నర్సింహంచంద్రబాబు రాష్ట్రంలో అనేక రాజకీయాలతో పాటు కుల ప్రస్తావనలు కూడా తెచ్చే దౌర్బాగ్య స్థితికి చేరారు. మాలో ఎవరికీ అలాంటి ఉద్దేశాలు లేవు. అందరూ ఐకమత్యంగా ఉండాలి. కాపు సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడిగేందుకు తోట త్రిమూర్తులు తన ఇంట్లో సమావేశం పెడితే దానికి పెడార్ధాలు తీస్తున్నారు. గతంలో ఇతర సామాజిక వర్గాలతో పాటు కాపులకు కూడా ఎన్నో పథకాలు తెచ్చి మేలు చేశారు.ఇప్పుడు వాటిని ఆపేస్తున్నారనే దానిపైనే మా అభ్యంతరాలు. చంద్రబాబు ఇవాళ సీఐని ఓ ఉద్యోగిగా కాకుండా కాపు అని ప్రస్తావించడం దారుణం. అంటే కాపులు తమలో తాము కొట్టుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లుంది. ముఖ్యమంత్రి స్ధాయిలో ఉండి పవన్ కళ్యాణ్ను ఏమైనా అంటే ఖబడ్డార్ అని చెప్పడం దారుణం. అంటే పవన్ కళ్యాణ్ను ఏదో ఒకటి అనాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. గతంలో చంద్రబాబు వైఎస్సార్సీపీ వ్యక్తులు వస్తే ఏ పనీ చేయొద్దంటూ కార్యకర్తలకు, అధికారులకు చెప్పాలంటే అంత కన్నా దారుణం దేశంలో ఎక్కడా ఉండదు. అలా మాట్లాడిన వ్యక్తి మళ్లీ ఇవాళ కాపుల గురించి మాట్లాడుతున్నారు.పద్దతి మార్చుకోండి: జక్కంపూడి రాజారాష్ట్రంలో క్యారెక్టర్ లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ముందుగా చెప్పుకోవాల్సిన పేరు చంద్రబాబు. రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి ఆయన. గతంలో ఎన్టీఆర్కూ, ఆయన పిల్లలకూ చిచ్చుపెట్టి ఆయన్ను మానసికంగా వేధించి చంపేశారు. వైఎస్ జగన్ ఇంట్లో కూడా తగవులు పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఇవాళ ముద్రగడ పద్మనాభం ఇంట్లోనూ అదే పని చేస్తున్నారు. పద్మనాభం మీద కూతురితో రోజూ ఏదో ఒక ఆరోపణ చేయిస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారు.ముద్రగడ దగ్గర డబ్బుల్లేవని, వైద్యం చేయించుకునే పరిస్ధితి లేదని.. వైఎస్ జగన్కు ఫోన్ చేస్తే స్పందించడం లేదని తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు. ముద్రగడ అందరికీ పెట్టే వ్యక్తే కానీ, తీసుకునే వ్యక్తి కాదు. ఎవరైనా ఏదైనా ఇస్తామన్నా తీసుకోరు. పద్మనాభం ఇంటికెళ్తే పొట్టపగిలిపోయేలా వేల మందికి సంవత్సరాల తరబడి తినిపించిన వ్యక్తి. ఆస్తులు అమ్ముకున్నాడు కానీ ప్రభుత్వాల సాయం తీసుకోలేదు.మా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి ఆరోగ్యం బాగోలేకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నుంచి 50 లక్షలు ఇచ్చి విదేశాలకు పంపి వైద్యసాయం అందించారు. పద్మనాభం కూడా ఎయిర్ అంబులెన్స్ ఇస్తామంటే వద్దని చెప్పానని గతంలో స్వయంగా లేఖలో చెప్పారు. పద్మనాభం కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. చంద్రబాబు మాత్రం కడుపు మంటతో ఆయన ఇంటిపైకి గతంలో పోలీసుల్ని పంపారు. ఇకనైనా చంద్రబాబుతో పాటు కూటమి నాయకులు తమ పద్దతి మార్చుకోండి.చంద్రబాబువి దిగజారుడు వ్యాఖ్యలు: వంగా గీతముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి రావాలని మేం కోరుకుంటున్నాం. కొన్ని మీడియా ఛానళ్లు రెండు, మూడు రోజులుగా ఓ ఉద్యమ కారుడి గురించి, వాటి కుటుంబాన్ని మానసికంగా వేధించేలా కథనాలు ప్రసారం చేస్తూ చర్చలు పెడుతున్నాయి. పెద్ద ఆస్పత్రిలో ఎవరూ పట్టించుకోకపోతే చిన్న ఆస్పత్రికి తరలించామని చెప్తున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఓపెన్ చేసిన ఆస్పత్రి చిన్న క్లినిక్ అని ఎలా అంటారు. ఇంతకీ మీరంతా ఏం ఆశిస్తున్నారు? అంబేద్కర్ ఆశయాలకు భిన్నంగా విడదీయండి. ముక్కలు చేయండి అని చెప్తున్నట్లుంది. శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యక్తి, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి కులాల గురించి మాట్లాడి తనను తాను దిగజార్చుకుంటున్నారు. వైఎస్ జగన్ను అవమానించే క్రమంలో మొత్తం కాపు జాతిని అవమానించాలనుకుంటున్నారు. కాపు జాతిలో పుట్టిన మాకు అందరూ సమానమే. అన్ని కుటుంబాలు మిమ్మల్ని ఆదరించాయి. కులాల రహితంగా మేం కూడా సేవలందించాం. దయచేసి ఎవరి మెప్పు కోసమో కాపు జాతిని తిట్టకండి. వైఎస్ జగన్ ముద్రగడ పద్మనాభం గారిని ఎంత గౌరవంగా చూస్తారో అందరికీ తెలుసు. ప్రతీ రోజూ ఆయన ఆరోగ్యంపై పర్యవేక్షణ చేస్తున్నారు. -
జెడ్పీలో పలువురికి ఉద్యోగోన్నతి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ పరిధిలో పని చేస్తున్న పలువురికి మంగళవారం ఉద్యోగోన్నతి కల్పించారు. ఈ మేరకు వారికి జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు నియామక పత్రాలు అందించారు. నలుగురు సీనియర్ అసిస్టెంట్లకు పరిపాలనాధికారులుగా, ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి లభించింది. కారుణ్య నియామకాల ద్వారా ఆరుగురు అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో లక్ష్మణరావు పాల్గొన్నారు. ప్రాణం తీసిన స్నానం సరదా గోదావరిలో మునిగి అన్నదమ్ముల మృతి ధవళేశ్వరం: సెలవులకు ఇంటికి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు గోదావరిలో స్నానానికి దిగి మృతి చెందారు. సరదాగా స్నానం చేయడానికి వచ్చి మృత్యువాత పడ్డారు. ప్రభువా.. నువ్విచ్చిన పిల్లలను నువ్వే తీసుకుపోయావా అంటూ వారి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే.. ధవళేశ్వరం రాఘవేంద్రస్వామి గుడి సమీపంలో నివసిస్తున్న పెద్దిపాటి శేషుకుమార్ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఐటీఐలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆయన ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హేమంత్ కుమార్ (21) తాడేపల్లిగూడెంలో హోమియోపతి కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చిన్న కుమారుడు జశ్వంత్ కుమార్ (18) రామచంద్రపురంలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాడు. ఇటీవల సెలవులకు ధవళేశ్వరం వచ్చిన వీరు మంగళవారం సాయంత్రం స్నానం చేసేందుకు కాటన్ బ్యారేజీ దిగువన ఉన్న ఇసుక తిన్నెలకు వెళ్లారు. వారితో పాటు సావిత్రీ నగర్కు చెందిన స్నేహితుడు మహ్మద్ హసన్ రాజాకు వెళ్లాడు. ఇసుక తిన్నెల వద్ద స్నానానికి దిగిన వీరు టెన్నిస్ బాల్తో నీటిలో క్యాచ్లు ఆడుతుండగా హేమంత్ కుమార్ నీటిలో మునిగిపోతుండడంతో, అతడిని కాపాడబోయిన జశ్వంత్ కుమార్ కూడా గల్లంతయ్యాడు. దీంతో అక్కడే ఉన్న స్నేహితుడు మహ్మద్ హసన్ రాజా నీటి నుంచి బయటకు వచ్చి సమీపంలోని వారికి విషయాన్ని చెప్పాడు. సమాచారం తెలిసిన వెంటనే సీఐ టి.గణేష్, ఎస్సై హరిబాబు ఘటనా స్థలానికి చేరుకొని హేమంత్, జశ్వంత్ కోసం నీటిలో మత్స్యకారులతో గాలింపు చేపట్టగా వారి మృతదేహాలు లభించాయి. వ్యసనాలకు బానిసై చోరీలు అమలాపురం రూరల్: వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు చాక చక్యంగా పట్టుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో మోటార్ సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు అంతర్ జిల్లాల దొంగల ముఠాను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 38 లక్షల విలులైన 38 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఈ వివరాలను అమలాపురం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. గత నెల 22న రాత్రి రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో ఓ ఇంటి బయట పార్క్ చేసిన మోటారు సైకిల్ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీనిపై రావులపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు పెదపూడి మండలం రాజుపాలేనికి చెందిన లక్కోజు రాజేష్ కుమార్, జి.మామిడాడ చెందిన కళ్యాణం నరేష్ (బజి), గుండుపల్లి సూర్యతేజ, గండేపల్లి మండలం యర్రంపాలేనికి చెందిన రొట్టె నాగచైతన్య సంతోష్కుమార్, ఓ బాలుడు కలసి ఈ చోరీలు చేస్తున్నారు. రాజేష్కుమార్, నాగచైతన్యపై మోటార్ సైకిళ్ల చోరీ కేసులు, నరేష్పై పోక్సో కేసులు ఉన్నాయి. -
పల్స్ పోలియోను విజయవంతం చేయాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జేసీ అపూర్వ భరత్ అన్నారు. ఆ కార్యక్రమం నిర్వహణపై మంగళవారం కలెక్టరేట్లో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల లోపు పిల్లలందరికీ విధిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,44,762 మంది పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు 990 బూతులు, 56 ట్రాన్సిట్ పాయింట్లు, 61 మొబైల్ టీమ్లను ఏర్పాటు చేశామని, 131 మంది రూట్ సూపర్ వైజర్ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తామన్నారు. పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. దీనిలో భాగంగా ఈనెల 27న మైక్ ప్రచారం, ర్యాలీలు, పీహెచ్సీల పరిధిలో అవగాహన కల్పించాలన్నారు. -
బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
శంఖవరం: మండలంలోని కత్తిపూడి వద్ద జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. శంఖవరం గ్రామానికి చెందిన రోకల కార్తీక్ (19), మెరుగుల స్వరూప్ కుమార్ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ, కత్తిపూడి నుంచి అన్నవరం వైపు వెళ్లే మార్గంలో పెట్రోల్ బంకు సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కార్తిక్ తలకు, శరీరంలోని పలుచోట్ల తీవ్ర గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని, తీవ్రంగా గాయపడిన స్వరూప్ కుమార్ను 108లో ప్రత్తిపాడు కమ్యునిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అన్నవరం ఎస్సై ప్రసాద్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అన్నవరం పోలీసులు కేసు నమోదు చసి దర్యప్తు చేపడుతున్నారు. గాయపడిన స్వరూప్ మృతుడు కార్తిక్మరొకరికి తీవ్ర గాయాలు -
నేడు అన్నవరం ట్రస్ట్బోర్డు సమావేశం
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలో బుధవారం జరగనున్న ట్రస్ట్బోర్డు సమావేశంలో రూ.నాలుగు కోట్లతో చేపట్టే వివిధ నిర్మాణాలపై చర్చ జరుగనుంది. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 2027లో జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా సత్యదేవుని ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు వివిధ పనులు ప్రతిపాదించారు. అయితే అన్నవరం దేవస్థానం 2026–27 వార్షిక బడ్జెట్లో వివిధ నిర్మాణాలకు రూ. ఏడు కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పటికే దేవస్థానంలో రూ.15 కోట్లతో 105 గదుల సీతారామ సత్రం మొదటి దశ నిర్మాణం జరుగుతోంది. గోదావరి పుష్కరాల కల్లా ఈ సత్రం నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆ సత్రం నిర్మాణానికే బడ్జెట్లో పూర్తిగా నిధులు కేటాయించని పరిస్థితిలో అదనంగా రూ.నాలుగు కోట్లతో ఎలా నిర్మాణాలు చేపడతారనే దానిపై కొంతమంది ట్రస్ట్బోర్డు సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బుఽధవారం జరగనున్న ట్రస్ట్బోర్డు సమావేశం అజెండా కాపీలు అందుకున్న ట్రస్ట్బోర్డు సభ్యుల్లో కొందరు మంగళవారం దేవస్థానంలో సమావేశమై ఈ నిర్మాణ పనులపై చర్చించినట్టు సమాచారం. -
బీఎల్వోలు అప్రమత్తంగా ఉండాలి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే నేపథ్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ సీపీ కాకినాడ సిటీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. స్థానిక డి కన్వెన్షన్న్హాల్లో మంగళవారం వైఎస్సార్ సీపీకి చెందిన బీఎల్ఏలతో సమావేశం నిర్వహించారు. పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివ ప్రసన్న, బూత్ కమిటీల ఇన్చార్జి చౌదరి తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ సమగ్ర సర్వేలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను అధికార పార్టీ తొలగించే అవకాశం ఉంటుందన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటును తొలగిపోకుండా తగిన జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రతి ఓటరు వద్దకు వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. 2002 ఓటర్ల జాబితాను సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు పార్టీ కార్యాలయం వద్ద అవసరమైన ఏర్పాట్లు చేశామని ద్వారంపూడి చెప్పారు. ప్రతి 10 బూత్లకు ఒక్కొక్క టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామని, ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకుని ఓటర్లలో చైతన్యం కలిగిస్తూ పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తూ భరోసా కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన పార్టీ నాయకులు అంగటి అంజి, అడబాల నాగు, వాసంశెట్టి శ్రీనివాస్లకు సమావేశంలో సంతాపం తెలిపారు. కార్యక్రమంలో పలువురు మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కాకినాడలో ఘనంగా ఒలింపిక్ డే రన్
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ): అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నగరంలో ఒలింపిక్ డే రన్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం పిలుపు మేరకు కాకినాడ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీవో) వీవీ సతీష్ కుమార్ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు పట్టుదల, కష్టపడే తత్వాన్ని అలవర్చుకుని, భవిష్యత్తులో ఒలింపిక్స్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జేఎన్న్టీయూకే వరకు పరుగు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ (డీఎస్ఏ) మైదానం నుంచి ప్రారంభమైన ఈ రన్ స్థానిక జేఎన్టీయూకే వరకు సాగి, తిరిగి స్పోర్ట్స్ అథారిటీ మైదానానికి చేరుకుంది. కాకినాడ జిల్లా ఒలింపిక్ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ, రన్ కన్వీనర్ వి.రవి రాజు నేతృత్వంలో ఈ పరుగును పక్కా ప్రణాళికతో నిర్వహించారు. రన్ ముగిసిన వెంటనే పాల్గొన్న క్రీడాకారులందరికీ దివంగత డాక్టర్ పి.చిరంజీవిని జ్ఞాపకార్థం ప్రత్యేక ప్రశంసాపత్రాలను (సర్టిఫికెట్లు) అందజేశారు. కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు అర్జునరావు, పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వర్మ, జిల్లా వ్యాయామ సంఘం అధ్యక్షుడు పి.శ్రీనివాస్, కార్యదర్శి వి.మాచరిరావు, కోశాధికారి నాగలింగేశ్వరరావు, ఖోఖో సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కె.పట్టాభిరామం, శ్రీనివాస్ కుమార్, వెటరన్ అథ్లెట్ కాంతారావు, ఫిజికల్ డైరెక్టర్లు కేఎల్ నాగమణి, రాజు మంగ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఫ జేఎన్టీయూకే వరకు ఉత్సాహంగా సాగిన పరుగు ఫ విజేతలకు సర్టిఫికెట్ల ప్రదానం -
కూలికి వెళ్లి కనుమరుగు
రంగంపేట/సామర్లకోట: వారందరూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే పేదలు. బతుకుతెరువు కోసం దూర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాకు పనికి వెళ్లారు. దాన్ని పూర్తి చేసి సంతోషంగా స్వగ్రామాలకు బయలుదేరారు. ఇంకో 20 కిలోమీటర్లు అంటే అరగంటలో గమ్యానికి చేసుకుంటారనగా మృత్యువు కబళించింది. వ్యాన్ బోల్తా పడడంతో ముగ్గురు మృతి చెందారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పనుల కోసం గుంటూరు జిల్లాకు.. కాకినాడ జిల్లా సామర్లకోట, పిఠాపురం మండలం జల్లూరు తదితర గ్రామాలకు చెందిన 11 మంది కూలీలు ఈ నెల 16వ తేదీన గుంటూరు జిల్లా కొల్లూరు ప్రాంతంలో సిమెంట్ పలకలతో గోడల ఫెన్సింగ్ పనులకు వెళ్లారు. వాటిని పూర్తి చేసుకుని సోమవారం రాత్రి ట్రక్కు ఆటోలో స్వగ్రామాలకు తిరుగు ప్రయాణమయ్యారు. వారి వాహనం రంగంపేట మండలం వడిశలేరు గ్రామ సమీపానికి చేరుకున్న సమయంలో డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఏడీబీ రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కూలీలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోగా, వాహనంలోని సిమెంట్ పలకలు పడడంతో ముగ్గురు మృతి చెందారు. వారిని సామర్లకోటకు చెందిన మసకపల్లి బాలు (21), మురముళ్ల రాజ్ కుమార్ (25), తాతపూడి రాజేష్ (22)గా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిని 108 అంబులెనన్స్లో పెద్దాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ సుమంత్ తెలిపారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం కోసం అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనపర్తి సీఐ సుమంత్ ఆధ్వర్యంలో రంగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబాల్లో విషాదం మృతుల్లో మసకపల్లి బాలు (20)కు ఐదేళ్ల క్రితమే చైతన్యతో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల పూజ అనే కుమార్తె ఉంది. నాన్న వస్తాడు, మనకు బట్టలు తెస్తాడు అని ఆ పసిపాపకు తల్లి చెబుతున్న సమయంలోనే, తండ్రి ఇక లేడన్న వార్త వచ్చింది. ఇప్పుడు మాకు దిక్కెవరు అంటూ చైతన్య, కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఇక రాజేష్, రాజ్ కుమార్ల మరణాలు ఆయా కుటుంబాల్లో చీకట్లను నింపాయి. వరుస మరణాలు సామర్లకోటలోని కుమ్మరి వీధిని మరణాలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న జరిగిన ఘోర బాణసంచా ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన జరిగి నెలలు గడవక ముందే రోడ్డు ప్రమాదంలో ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందడం స్థానికులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. తరచూ మా వీధినే ఎందుకు ప్రమాదాలు వెంటాడుతున్నాయి అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాద స్థలం వద్ద యువకుడి మృతదేహంక్షతగాత్రులను 108లోకి ఎక్కిస్తున్న సిబ్బంది ఫ వడిశలేరు సమీపంలో రోడ్డు ప్రమాదం ఫ కూలీలతో వెళుతున్న ట్రాక్కు ఆటో బోల్తా ఫ ముగ్గురి మృతి, ఎనిమిది మందికి గాయాలు ఫ గుంటూరు జిల్లాలో పనికి వెళ్లి వస్తుండగా ఘటన -
చిన్నారి జ్ఞానేశ్వరి కేసు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
కాకినాడ జిల్లాలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో స్టేటస్ రిపోర్ట్ తమ ముందు ఉంచాలని హైకోర్టు చెప్పింది. అదృశ్యమైన చిన్నారి ఆచూకీ తెలియజేసేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన ఎస్ఓపీ విధానాన్ని అనుసరించారో లేదో కూడా తెలియచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది.గంగమ్మ లాకప్ డెత్ కేసులో ఆదేశాలుకర్నూలు జిల్లా దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ కేసులో హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యక్ష సాక్షి దుర్గప్ప మెడికల్ రికార్డులన్నీ తమ ముందు ఉంచాలని ఆదేశించింది. స్వయంగా జైలుకు వెళ్లి దుర్గప్ప ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని చెప్పింది. చికిత్స అవసరమైతే అతడిని మరో ఆసుపత్రికి తరలించాలని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దుర్గప్ప వాంగ్మూలాన్ని పరిశీలించిన ధర్మాసనం.. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. -
అంతర్జాతీయ జర్నల్లో కాకినాడ వైద్యుడి పరిశోధన
కాకినాడ క్రైం: కోవిడ్ వేళ వ్యాధి నివారణకు తాను చేసిన మూడు మాత్రల పరిఽశోధన అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమైందని కాకినాడ వైద్యుడు యనమదల మురళీకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జర్నల్ ఆఫ్ ప్రైమరీ కేర్ స్పెషాలిటీస్ మే–ఆగస్టు 2026 సంచికలో తాను ప్రయోగాత్మకంగా రూపొందించిన ఆస్ప్రిన్, ప్రెడ్నిసోలాన్, అజిత్రోమైసిన్ వైద్య విధానం ఎంతో సత్ఫలితాలనిచ్చిందని పేర్కొన్నారు. 2021లో అప్పటి వైద్య రీతులను అనుసరించిన 60 మందితో తన వైద్య విధానాన్ని సరిపోల్చితే ఉత్తమ ఫలితాలు వచ్చాయన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన నిపుణులు తన పరిశోధనను అంతర్జాతీయ జర్నల్లో ప్రచురించారని మురళీకృష్ణ ప్రకటనలో పేర్కొన్నారు. -
కాళ్లరిగేలా తిరుగుతున్నా..
రెండు కాళ్లు చచ్చుబడిపోయినా అధికారులు స్పందించడం లేదు. గత రెండేళ్లుగా అనేకసార్లు ఫిర్యాదు చేసినా నాకు వికలాంగ పింఛన్ ఇవ్వడం లేదు. సదరం సర్టిఫికెట్ కావాలని అధికారులు చెబుతున్నారు. ఆ సదరం సర్టిఫికెట్ కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అనేక సార్లు తిరిగాను, అయినా ఎవరూ స్పందించడం లేదు. – పసుపులేటి నరసింహమూర్తి, రాజుపాలెం, కిర్లంపూడి మండలం ఆన్లైన్లో తప్పు సరిచేయడం లేదు నా వ్యవసాయ భూమి 4.43 ఎకరాలను ఆన్లైన్లో దేవదాయ భూమిగా చూపిస్తోంది. దీంతో ప్రభుత్వం నుంచి నాకు ఏ విధమైన సహాయం అందడం లేదు. ఆ భూమి కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూమి. ఆన్లైన్ తప్పును సరిచేయాలని గత రెండేళ్లుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నాను. ఎటువంటి ప్రయోజనం కనిపించడం లేదు. తిరిగి తిరిగి విసుగు చెందాను. – వి.వెంకన్నదొర, రావికంపాడు, తొండంగి మండలం -
అన్ని శాఖల సమన్వయంతో జాతర ఉత్సవాలు
సామర్లకోట: పెద్దాపురంలో వేంచేసిన మరిడమ్మ అమ్మవారి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు సహకరించాలని పెద్దాపురం ఆర్డీఓ పి.కృష్ణమూర్తి అన్నారు. వచ్చే నెల 14 నుంచి పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర పురస్కరించుకొని సోమవారం సాయంత్రం ఆలయ మండపంలో నిర్వహించిన ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆలయ ఈఓ, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. గతంలో జరిగిన ఏర్పాట్లు, భక్తుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. భక్తుల రద్దీని పురస్కరించుకొని ఆయా శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త చింతపల్లి శ్రీహర్ష మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి భక్తులు సహకరించాలన్నారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. మరిడమ్మ జాతర ఉత్సవాలు వచ్చే నెల 14 నుంచి ఆగస్టు 19 వరకు జరుగుతాయని దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్(ఈఓ) కె.విజయలక్ష్మి తెలిపారు. జాతరలో భాగంగా ఈనెల 29న ఉయాల తాళ్లోత్సవం, వచ్చే నెల 13న జాగరణ జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ మాట్లాడుతూ ఉత్సవాలకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు. సీఐలు వైఆర్కే శ్రీనివాసు, ఎ.కృష్ణభగవాన్, అగ్నిమాపక శాఖ అధికారులు, ఆర్అండ్బీ, మున్సిపల్, ఎలక్ట్రికల్, మెడికల్ అండ్ హెల్త్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఫ పెద్దాపురం ఆర్డీఓ కృష్ణమూర్తి ఫ జూలై 14 నుంచి మరిడమ్మ జాతర ఫ 37 రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు -
ఎన్నిసార్లు తిరిగినా నిరాశే..
బోట్క్లబ్ (కాకినాడసిటీ): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో సమస్యలు పరిష్కారమవుతాయని ఎంతో వ్యయప్రయాసలకోర్చి వస్తున్న అర్జీదారులకు నిరాశే ఎదురవుతోంది. మండల కేంద్రాల్లో సమస్య పరిష్కారం కాక జిల్లా కేంద్రమైన కాకినాడకు వచ్చి అర్జీదారులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేస్తున్నారు. అయినప్పటికీ వాటికి ఏ విధమైన పరిష్కారం లభించడం లేదు. ఇచ్చిన అర్జీకి పరిష్కారం లభించకపోగా పరిష్కారం అయినట్లు మాత్రమే మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్లు వస్తున్నాయని అర్జీదారులు మండిపడుతున్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 321 ప్రజలు అర్జీలు సమర్పించారు. ఫ పరిష్కారం కానీ సమస్యలు ఫ అర్జీదారులు తప్పని అవస్థలు ఫ పీజీఆర్ఎస్ నిర్వహణపై పెదవి విరుపు -
ఊపిరితిత్తుల విభాగం తరలింపుపై స్పష్టతనివ్వాలి
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్లో భాగంగా స్థానిక వార్ఫ్ రోడ్లో ఉన్న ఊపిరితిత్తుల విభాగాన్ని ఎక్కడికి తరలిస్తున్నారో స్పష్టతనివ్వాలని సంబంఽధిత స్పెషాలిటీ వైద్యులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఇటీవల కాకినాడకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి నివేదించామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాకినాడ జీజీహెచ్లో నూతన ఓపీ భవంతి నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేశారని, వార్ఫ్ రోడ్లో ఉన్న పల్మనాలజీ భవంతి విభాగాన్ని కూడా తొలగించాలని నిర్ణయించారని తెలిపారు. అయితే ఊపిరితిత్తుల విభాగం సాధారణ వైద్య సేవలకు దూరంగా ఉండాలని నూతనంగా నిర్మిస్తున్న ఓపీ భవంతిలోనే ఈ సేవలను కూడా కొనసాగించనున్నారన్న ప్రచారం సాగుతోందని తెలిపారు. ఇదే నిజమైతే సాధారణ రోగులు, వారి సహాయకులకు మరిన్ని అనారోగ్య పరిస్థితులు తప్పవని అన్నారు. నూతన ఓపీ భవంతిలో నిర్మాణం చేపట్టకపోతే, ఎక్కడ నిర్మిస్తున్నారో సంబంధిత అధికారులు స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. చినవెంకన్న హుండీ ఆదాయం రూ.1.70 కోట్లు ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ప్రమోద కల్యాణ మండపంలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, మద్ది ఆంజనేయస్వామి ఆలయ ఈఓ ఆర్వీ చందన, పోలీసుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. గడచిన 14 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ. 1,70,53,076 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 147 గ్రాముల బంగారం, 2.510 కిలోల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని పాత రూ. 2 వేలు, రూ. 500 నోట్ల ద్వారా రూ.7,500 వచ్చిందన్నారు. ఈ లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు. 1న డీసెట్ రాజమహేంద్రవరం రూరల్: డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీసెట్) 2026ను జూలై ఒకటిన నిర్వహించనున్నట్లు బొమ్మూరులోని జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ (డైట్) ప్రిన్సిపాల్ ఆర్జేడీ రాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏపీడీఈఈసీఈటీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ లేదా సీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ల నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. -
నా భూమి నాకు ఇవ్వడం లేదు
తనకు తల్లిదండ్రులు పసుపు–కుంకుమ మాన్యం కింద ఇచ్చిన భూమిని కాజేసేందుకు కాకినాడ డీసీసీబీ చైర్మన్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ఎత్తుగడ వేస్తున్నారని వరుసకు సోదరి అయిన అమలకంటి తులసి కిరణ్మయి వాపోయారు. కాకినాడ జిల్లా ఎర్రవరంలోని సర్వే నంబర్ 234, 253లో ఉన్న సుమారు 94 సెంట్లు భూమిని తన ఆధీనంలో పెట్టుకుని తుమ్మల బాబు వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె ఫిర్యాదు చేశారు. తన భర్త కిడ్నీ పేషెంట్ కావడంతో ఆ భూమి వ్యవహారం తాను చూసుకొంటానని నమ్మించి ప్రస్తుతం భూమికి సంబంధించిన పాస్ పుస్తకాలు తుమ్మల బాబు పేరుతో తయారు చేయించుకొన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే పెద్దాపురం మండలం పులిమేరులో ఉన్న తన తండ్రికి చెందిన ఐదు సెంట్ల స్థలాన్ని కూడా తుమ్మల బాబు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. -
సత్యదేవునికి భారీగా హుండీ ఆదాయం
ఫ 33 రోజుల ఆదాయం రూ.1.96 కోట్లు ఫ సరాసరిన రోజుకు రూ.5.96 లక్షల ఆదాయం అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా 33 రోజులకు గాను రికార్డు స్థాయిలో రూ.1,96,59,883 ఆదాయం సమకూరింది. స్వామివారి హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ఈనెల 12 వరకు విద్యాసంస్ధలకు వేసవి సెలవులు వలన విద్యార్థులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయం భక్తులతో కళకళలాడింది. భక్తులంతా సమర్పించిన కానుకలతో భారీగా హుండీ ఆదాయం సమకూరింది. ఈ కానుకల్లో నగదు రూ.1,84,99,620 కాగా, చిల్లర నాణేలు రూ.11,60,263 వచ్చాయని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. వీటితో పాటు బంగారం 22.500 గ్రాములు, వెండి 567 గ్రాములు వచ్చినట్లు వారు తెలిపారు. సరాసరిన రోజుకి రూ.5,95,754 హుండీ ఆదాయం వచ్చినట్లు వారు తెలిపారు. హుండీల ద్వారా విదేశీ కరెన్సీ సత్యదేవుని హుండీల ద్వారా విదేశీ కరెన్సీ కూడా భారీగా లభించింది. 230 అమెరికా డాలర్లు, పది యూఏఈ దీనార్లు, పది కెనడా డాలర్లు, 119 సింగపూర్ డాలర్లు, ఒక మలేషియా రింగిట్, 55 యూరోలు, పది ఇంగ్లాండ్ పౌండ్లు, వంద డెన్మార్క్ క్రోనార్లు, వంద శ్రీలంక రూపాయలు, 200 సౌతాఫ్రికా ర్యాండ్స్ లభించాయని తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో చైర్మన్, ఈఓలతో పాటు దేవస్థానం ట్రస్ట్బోర్డు సభ్యులు పర్వత సురేష్, కామర్స్ చిరంజీవి, దేవస్థానం సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సిబ్బంది పాల్గొన్నారు. -
మంచినీళ్లు ఇవ్వలేదని మాతృమూర్తినే కడతేర్చాడు
పిఠాపురం: మంచినీళ్లివ్వలేదనే కోపంతో ఓ కొడుకు తన తల్లిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె పది రోజుల పాటు మంచాన పడి, నరక యాతన అనుభవించి, చివరకు కన్ను మూసింది. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు..పిఠాపురం మండలం చిత్రాడకు చెందిన పెంటా త్రిమూర్తులు, నాగమణి (45) దంపతులకు ఇద్దరు కుమారులు. త్రిమూర్తులు కూరగాయల వ్యాపారి. వీరి పెద్ద కుమారుడు గతంలో ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చిన్న కుమారుడు రాజబాబు జులాయిగా తిరుగుతున్నాడు. ఈ నెల 9న మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రాజబాబుకు తల్లి నాగమణి భోజనం వడ్డించగా..తింటూ ఫ్రిజ్లో చల్లటి మంచినీళ్లు తేవాలని ఆమెకు చెప్పాడు. ఆమె మరో గదిలో ఉన్న ఫ్రిజ్ వద్దకు వెళ్లి, మంచినీటి బాటిల్ తేవడానికి ప్రయత్నిస్తుండగా..చెప్పిన వెంటనే తేలేదని ఆమెను పట్టుకుని గోడకు కొట్టి ఆపై ఫ్రిజ్కు వేసి బాదడంతో తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో∙చికిత్స పొందుతూ నాగమణి శనివారం మృతి చెందింది. పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. -
ప్రశాంతంగా ‘నీట్’
90.02 శాతం హాజరు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వైద్య విద్యా కోర్సులలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని 11 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 3,232 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2,922 హాజరయ్యారు. ప్రశ్నపత్రం లీకవడంతో గత మే నెలలో నిర్వహించిన ఈ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకూ ఈ పరీక్షమరోసారి నిర్వహించారు. స్థానిక గాంధీనగర్ మున్సిపల్ స్కూల్, జేఎన్టీయూకేలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో నీట్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగిందని అన్నారు. మొత్తం 90.02 శాతం విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. లోవకు పోటెత్తిన భక్తులు తుని రూరల్: లోవ దేవస్థానానికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన 32 వేల మంది భక్తులు తలుపులమ్మ అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,61,690, పూజా టికెట్లకు రూ.4,65,646, కేశఖండన శాలకు రూ.20,880, వాహన పూజలకు రూ.7,416, కాటేజీలు. పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.98,430, విరాళాలు రూ.10,602 కలిపి మొత్తం రూ.8,89,014 ఆదాయం లభించిందని కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై నేతల ఆరా గోకవరం: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం కుమారుడు, ఆ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబును ఆదివారం పలువురు నేతలు పరామర్శించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ ముఖ్య నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి గిరిబాబును పరామర్శించారు. పద్మనాభం ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అలాగే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కూడా గిరిబాబును పరామర్శించారు. ముద్రగడ ఆరోగ్యంపై వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి, శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఫోన్ ద్వారా గిరిబాబును అడిగి తెలుసుకున్నారు. స్వగ్రామంలో ‘పెద్ది’ దర్శకుడి సందడి కొత్తపల్లి: ఉప్పెన, పెద్ది చిత్రాల దర్శకుడు సానా బుచ్చిబాబు ఆదివారం స్వగ్రామం కొత్తపల్లి వచ్చారు. తన నివాసంలో కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి కేక్ కట్ చేసి, పెద్ది సినిమా విజయానందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి పలు విషయాలపై ఆయన ముచ్చటించారు. పెద్ది సినిమా తన జీవితంలో మరపురాని విజయాన్ని అందించిందని ఆనందం వ్యక్తం చేశారు. మరిన్ని మంచి చిత్రాలకు దర్శకత్వం వహించడానికి ప్రేరణ కలిగించిందన్నారు. త్వరలో మరో మంచి చిత్రానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. నేడు ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని డీఎస్సీ 1998, 2008 జీఎస్టీ (ఎమ్టీఎస్) ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారందరికీ ఈ నెల 22న కాకినాడలోని సమగ్ర శిక్షా హాలులో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్ల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ ఆదివారం తెలిపారు. డీఈవో.ఈజీ.ఆర్గ్లో పొందుపర్చిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా కౌన్సెలింగ్కు హాజరుకావాలన్నారు. -
సత్యదేవుని ధ్వజస్తంభంపై ఒరిగిన సుదర్శన చక్రం
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయ ధ్వజస్తంభం మీది సుదర్శన చక్రం ఇటీవల ఈదురు గాలులకు ఒకవైపు ఒరిగిపోయింది. దీంతో, ఆ చక్రాన్ని ఈ నెల 24న కిందకు దించి, ఆలయంలో భద్రపరచి, 25వ తేదీ ఉదయం సంప్రోక్షణ నిర్వహించి, తిరిగి పండితుల మంత్రోచ్చారణల నడుమ దానిని ధ్వజస్తంభంపై అమర్చనున్నట్లు అధికారులు తెలిపారు. సత్యదేవుని ఆలయంలో పాత ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరడంతో.. 2024 మే నెలలో కొత్తది ప్రతిష్ఠించారు. దీనికి బంగారు రేకును అదే ఏడాది ఆగస్టులో అమర్చారు. ఆ సమయంలోనే స్వర్ణ సుదర్శన చక్రాన్ని కూడా కలశలతో పాటు ధ్వజస్తంభంపై అమర్చారు. గత వారం భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలకు ఈ సుదర్శన చక్రం ఉత్తరం వైపు ఒరిగిపోయింది. ఈ విషయాన్ని అధికారులు ఈ నెల 16వ తేదీన గుర్తించి, దేవస్థానం ఆగమ పండితుల కమిటీతో చర్చించారు. వారి సూచన మేరకు ఆ చక్రానికి సంప్రోక్షణ చేయాలని నిర్ణయించారు. -
సమతుల జీవన విధానానికి యోగా
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆర్యోగకరమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు, సమతుల జీవన విధానాన్ని అందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కాకినాడలోని జిల్లా క్రీడా మైదానం ఇండోర్ హాలులో ఆదివారం జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్య పరిరక్షణకు, జీవన నాణ్యతను మెరుగు పరచుకోవడానికి యోగా ఎంతో ఉపయోగిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల విజేతలు వేదుల శ్రీకృష్ణ, ఫణీంద్రలను ఆయన అభినందించారు. చిన్నారులు చైత్ర శివ వాసుకి, ఐ.ఎరిక్, కె.మిథున ప్రదర్శించిన నృత్య యోగా అందరినీ అలరించింది. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వేటుకూరు ఏవీఎస్ సూర్యనారాయణరాజు, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జెడ్పీ సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు, పెద్దాపురం ఆర్డీఓ కృష్ణమూర్తి అతిథులుగా పాల్గొన్నారు. తొలుత పతంజలి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి వేడుకలు ప్రారంభించారు. యోగాచార్యులు రాఘవానంద, బ్రహ్మకుమారి దీదీలు ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ప్రజలతో యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన ప్రక్రియలు చేయించారు. కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఎంఎస్ అలీ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డీఎస్డీఓ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు.. కార్పొరేటు.. ఫీజులుం..
● ప్రైవేట్ విదాసంస్థల్లో భారీ దోపిడీ ● నియంత్రణలో విద్యాశాఖ విఫలం ● తల్లిదండ్రుల కన్నీటీతో విద్యా వ్యాపారం ● ఖాతాలకు జమకాని తల్లికి వందనం ఆలమూరు: రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల కార్పొరేట్, ప్రైవేటు విద్య మాఫియాగా తయారైంది. సగటు జీవి చదువును కొనలేని స్థితి ఏర్పడింది. నిబంధనల ఉల్లంఘన, ఫీజుల దోపిడీ, బలవంతపు స్టేషనరీ కొనుగోళ్లు యథేచ్ఛగా సాగుతున్నాయి. పాఠశాల ఫీజులు, బస్ ఫీజులను ప్రైవేటు యాజమాన్యాలు బాగా పెంచేశాయి. ఫీజుల నియంత్రణ కమిటీలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. ఈ దోపిడీని నియంత్రించడంలో విద్యాశాఖ పూర్తిగా విఫలమైంది. జిల్లాలోని 19 మండలాల్లో 2,275 పాఠశాలలు ఉండగా 1.93 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 1551 ప్రభుత్వ పాఠశాలల్లో 87 వేల మంది 724 ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 1.96 లక్షల మంది ఉన్నారు. వారందరికీ విద్యా సంవత్సరం ప్రారంభించిన రోజే తల్లికి వందనం సొమ్ము పడాల్సి ఉంది. అయితే ఆ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి పూర్తి స్పష్టత లేకపోవడంతో తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అ‘ధన’పు తరగతులు కూటమి నేతల ప్రొద్బలంతో అధికార పార్టీ సానుభూతి పరుగులుగా ప్రసిద్ధిగాంచిన కొంతమంది ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు జిల్లాలో అనేక చోట్ల అనుమతులు లేకుండా 8, 9, 10 తరగతులు నిర్వహిస్తున్నారు. వాటిపై జిల్లా విద్యాశాఖకు ఫిర్యాదు చేసినా తూతూ మంత్రంగా దాడులు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలమూరు మండలంలోని చెముడులంకలోని నేతాజీ ఇంగ్లీషు మీడియం స్కూల్లో వారం రోజుల క్రితం అదనపు తరగతులు నిర్వహిస్తున్నారంటూ కేసును నమోదు చేసి షోకాజ్ నోటీసు జారీ చేసినా ఇంకా స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలకు సంబంధించిన విద్యాసంస్థలే అధికంగా ఉండటంతో ఈ దోపిడీ పేట్రేగి పోతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి విద్యాసంస్థల దోపిడి పర్వం ఇలా ● ప్రైవేట్ విద్యాసంస్థలు ఎలాంటి అనుమతులు లేకుండా యేటా ట్యూషన్ ఫీజులను 30 శాతం నుంచి 50 శాతం వరకూ పెంచుతున్నారు. ● విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే సీట్ల కేటాయింపు పేరిట భారీ వసూళ్లకు పాల్పడుతున్నారు. ● ఏసీ క్లాస్ రూమ్స్, డిజిటల్ తరగతులు, ప్రత్యేక ఫీజుల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ● బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు దొరికే పాఠ్య, నోట్ పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం విద్యాసంస్థల్లోనే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పాటించాల్సిన నిబంధనలివీ ● ప్రైవేట్ విద్యాసంస్థలన్ని ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని (2009) కచ్చితంగా అమలు చేయాలి. ● ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే స్టార్ ర్యాంకింగ్ ఆధారంగా నిర్ణయించిన ఫీజుకు అదనంగా ఒక రూపాయి కూడా వసూలు చేయరాదు. ● ప్రైవేట్ విద్యాసంస్థల్లో తప్పనిసరిగా విద్యాశాఖ సహకారంతో తల్లిదండ్రుల కమిటీ ఏర్పాటు చేయాలి. ● విద్యాసంస్థలన్నింటి వద్ద ఫీజుల వసూలు వివరాలతో కూడిన నోటీసు బోర్డులను ప్రదర్శించాలి. ● పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫాం ఇతర స్టేషనరీని సంబంధిత విద్యాసంస్థల్లో విక్రయించరాదు. ● విద్యాసంస్థలోనే కొనుగోలు చేయాలని లేదా సంబంధిత దుకాణం వద్దే కొనాలని బలవంతం చేయరాదు. ● ప్రభుత్వ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు అమలు చేసి విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించాలి. ● ఫీజుల బకాయి పేరుతో విద్యార్థుల టీసీలను ఎట్టి పరిస్థితుల్లోను ఆపకూడదు. యాజమాన్యం ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు 1237 85 229 86.000 ప్రైవేట్ పాఠశాలలు 125 167 432 1.07.00 తల్లిదండ్రుల కమిటీకి తిలోదకాలు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతి ప్రైవేట్ విద్యాసంస్థలో తప్పనిసరిగా తల్లిదండ్రుల కమిటీని ఏర్పాటు చేయాలి. తరగతి గదులు, తాగునీటి వసతి, మరుగుదొడ్ల వంటి సౌకర్యాలను వారు పరిశీలించాలి. యాజమాన్యంతో తల్లిదండ్రుల కమిటీ చర్చించి ఫీజులను నిర్థారించి దానికి అనుగుణంగా తీర్మానాలు చేసి ఉన్నతాధికారుల ఆమోదం పొందాలి. వాటిని ప్రైవేటు పాఠశాల నోటీసు బోర్డులో ప్రదర్శించాలి. జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అటువంటివేవీ కనపడవు. కారణం వాటికి విద్యాశాఖ దాసోహం కావడమే. ప్రైవేటు పాఠశాలలు ఇంతగా దోచుకుంటున్నా వాటిలోనే విద్యార్థుల చేరికలు అత్యధికంగా ఉంటున్నాయంటే ప్రభుత్వ విద్యపై ప్రజల్లో ఎంత ప్రతికూలత ఉందో అర్ధమవుతోంది. ఫీజుల మోత–ధరల వాత ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా లభించే పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, నిఘంటువులు, యూనిఫాం తదితర వస్తువులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నాయి. జిల్లాలో ప్రాంతాన్ని బట్టి ఎల్కెజీ విద్యార్థికి ఏడాదికి పుస్తకాలు, బస్సు ఫీజు, ఏకరూప దుస్తులు, టై, సాక్సులు, బ్యాగుల కొనుగోలుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ ఖర్చు అవుతుంది. ఇదే క్రమంలో పదో తరగతి విద్యార్థికి రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకూ అవుతుంది. విద్యార్థుల సౌకర్యాలు, ఫీజుల నియంత్రణకు విద్యాశాఖ చేపట్టాల్సిన తనిఖీలు భూతద్దం వేసి చూసినా కనిపించడం లేదు. మార్కెట్లో ఉన్న పాఠ్య పుస్తకాల ధరలకు ప్రైవేట్ విద్యాసంస్థల కొనుగోలు చేసే పుస్తకాల ధరలకు భారీ వ్యత్యాసం ఉందని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలను నియంత్రించాలి సామాన్య, మధ్య తరగతి ప్రజలను దోచుకుంటున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై ప్రభుత్వం నియంత్రణ ఉండాలి. ప్రతి ప్రైవేట్ పాఠశాలలో తప్పనిసరిగా ఫీజుల బోర్డులు ఏర్పాటు చేయాలి. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి. – జి.రవికుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాఽధికారి, ఆలమూరు -
చెదురుతున్న బాల్యం
వదలని జాడ్యం.. ఇలా చేస్తే విముక్తి ● పిల్లలను బిచ్చమెత్తించే వ్యక్తులు, ముఠాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. కన్న తల్లిదండ్రులైనా ఉపేక్షించకూడదు. ● పిల్లల భిక్షాటనను నివారించడంలో రక్షణ, పునరావాసం అత్యంత కీలకం. భిక్షాటన చేసే పిల్లల్ని గుర్తించి ఆశ్రయ గృహాలు, విద్యా సంస్థలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలకు పంపాలి. నిర్బంధ విద్య కచ్చితంగా అమలు చేయాలి. ● పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేసి, ఉపాధి అవకాశాలు కల్పించి, పిల్లలను భిక్షాటనకు పంపించే పరిస్థితి నుంచి దూరం చేయాలి. ● స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పిల్లల సంక్షేమం కోసం పని చేయాలి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ప్రత్యేక నిఘా, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలి. ● బాలల భిక్షాటన ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో నిరంతర తనిఖీలు నిర్వహించాలి. ● బాల కార్మికత్వం, అక్రమ రవాణా కూడా బాలల భిక్షాటనకు ప్రధాన కారణాలు, వీటిని నిర్మూలించాలి. కాకినాడ క్రైం: బడి వయస్సు పిల్లలందరూ బడిలోనే ఉండాలంటూ.. ఏటా వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే సమయంలో ప్రభుత్వ యంత్రాంగం తెగ హడావుడి చేస్తూంటుంది. కానీ, జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ భావిభారత పౌరులైన బాలలు బిచ్చమెత్తుకుంటూనే కనిపిస్తున్నారు. బాలల భిక్షాటన నిర్మూలనకు అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనివ్వడం లేదనడానికి కాకినాడ నగరంతో పాటు జిల్లాలోని పలు పట్టణాల్లో నిత్యం రోడ్లపై కనిపిస్తున్న బాలలే సాక్ష్యం. బాలలను గుర్తిస్తున్నా.. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన బిచ్చమెత్తుతున్న బాలలను గుర్తిస్తున్నారు. గత రెండేళ్లలో 57 మంది బాల భిక్షకులు పట్టుబడ్డారు. 2024లో 13 మంది, 2025లో 32, 2026 మే నెలాఖరు వరకూ 12 మందిని గుర్తించారు. వీరిలో కేవలం నలుగురినే పాఠశాలల్లో చేర్చారు. మిగిలిన 53 మందికి, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ పేరుతో ఇలా చేయొద్దు.. పోయి చదువుకోండని నాలుగు మాటలు చెప్పి వదిలేశారు. విచిత్రమేమిటంటే.. ఏడాది, రెండేళ్ల క్రితం పాఠశాలల్లో చేర్చిన ఆ నలుగురు పిల్లలూ ఇప్పుడు స్కూళ్లకు వెళ్తున్నారా లేక మళ్లీ జోలె పట్టి భిక్షాటన మొదలు పెట్టారా అనే విషయంపై అధికారుల వద్ద ఎటువంటి సమాచారం లేదు. వీరు కాకుండా మరో 120 మందికి పైగా పిల్లలు జిల్లాలో భిక్షకులుగా సంచరిస్తున్నారని సమాచారం. మూడు హాట్స్పాట్లు జిల్లాలో పిల్లల భిక్షాటన జరుగుతున్న మూడు హాట్స్పాట్లను అధికారులు గుర్తించారు. సామర్లకోటలో రోడ్డు పక్కన పెట్రోలు బంక్, కాకినాడ అచ్చంపేట జంక్షన్లో వద్ద పి.కొత్తూరు, తాళ్లరేవు మండలం పి.మల్లవరం వద్ద హైవే వీటిల్లో ఉన్నాయి. ఈ మూడు ప్రాంతాల్లో సంచార జాతులు, వలస కుటుంబాలు ఎక్కువగా నివాసం ఉంటున్నాయి. వారి పిల్లలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్నారని చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన వారు ఇక్కడ ఉంటున్నారని అధికారులు అంటున్నారు. ఫ బిచ్చమెత్తుకుంటున్న భావిభారతం ఫ జిల్లాలో రెండేళ్లలో గుర్తించిన పిల్లలు 57 మంది ఫ వారిలో బడికి పంపిన వారు నలుగురు ఫ వారి సమాచారంపై సమాధానం నిల్ ఫ గుర్తించని వారు 120 మందికి పైగా ఉంటారని అంచనా ఫ సత్ఫలితాలనివ్వని నియంత్రణ చర్యలు ఇవీ కారణాలు బాల్యం భిక్షాటనలో మగ్గిపోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, పేదరికం. అలాగే, పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠాలు వారిని బలవంతంగా భిక్షాటనలోకి దింపుతున్నాయి. మరోవైపు దానం రూపంలో సునాయాసంగా డబ్బు లభించడం, విద్య, భవితపై అవగాహన లోపం, పునరావాస సమస్యలు, సంచార జాతులు, వలస కుటుంబాల వంటివి పిల్లల భిక్షాటనకు కారణాలవుతున్నాయి. చట్టాల అమలులో లోపం వల్ల కూడా ఈ జాడ్యం వదలడం లేదు. అంతే కాదు.. గుర్తించిన పిల్లల చదువు, పునరావాసం వంటి చర్యలను ప్రభుత్వ యంత్రాంగం పక్కాగా చేపట్టడం లేదు. దీంతో, ఆ పిల్లలు ఆ మరుసటి రోజే జోలె పట్టి మరో ప్రాంతంలో భిక్షాటన చేస్తున్నారు. డబ్బులు కాదు.. సమాచారం ఇవ్వాలి బాలలకు భిక్షాటన నుంచి విముక్తి కల్పించేందుకు ప్రతి వ్యక్తీ తన వంతు బాధ్యతను పోషించాలని అధికారులు కోరుతున్నారు. బిచ్చమెత్తుకుంటున్న బాలలు చేతులు చాచి చిల్లర కోసం అడిగినప్పుడు డబ్బులు కాకుండా 1098కి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. తద్వారా తమ సిబ్బంది వచ్చి, ఆ పిల్లల్ని రెస్క్యూ చేసి, సన్మార్గం వైపు నడిపిస్తారని అంటున్నారు. అక్షర భిక్ష యాచించాల్సిన చేతులు.. కన్నీటి చారలతో బిచ్చమెత్తుతున్నాయి.. పలకా బలపం పట్టాల్సిన వేళ్లు.. పళ్లెం పట్టుకుని ఆకలి తీర్చాలంటూ అర్థిస్తున్నాయి. అందమైన యూనిఫాం ధరించి బడికెళ్ళాల్సిన బాల్యం.. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ.. ఒక పూట తిండి కోసం దేహీ.. అంటూ వీధిన‘బడి’ంది. దానం.. ధర్మం అంటూ జోలె పడుతోంది. పుట్టుకతోనే శాపగ్రస్తమై, వెనుకబాటుతనపు చీకట్లో మగ్గిపోతున్న బాల్యంపై.. వెలుగులు ప్రసరింపజేయడంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం నిత్యం వెక్కిరిస్తూనే కనిపిస్తోంది. -
కానిస్టేబుల్ మృతదేహం లభ్యం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మనస్తాపంతో గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఏపీఎస్ఎఫ్ కానిస్టేబుల్ వంశీ (33) మృతదేహం శనివారం లభ్యమైంది. పెళ్లి విషయంలో వేరే మహిళతో వాగ్వాదం అనంతరం, వంశీ శుక్రవారం తెల్లవారు జామున రోడ్డు కం రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి తన తండ్రి వెంకట్రావుకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. తాను చాలా ఇబ్బంది పడుతున్నానని, ఇంక జీవించలేనని, గోదావరిలో దూకేస్తున్నానంటూ చెప్పి ఫోన్ స్విచాఫ్ చేశాడు. దీనిపై రెండో పట్టణ పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వంశీ మృతదేహం స్థానిక దోభీ ఘాట్ వద్ద ఉన్న గోదావరి నదిలో కనిపించింది. పోలీసులు వచ్చి మృతదేహాన్ని వెలికితీసి పోస్టు మార్టంనిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బుల్లెట్ నుంచి మంటలు అంబాజీపేట: స్థానిక నాలుగు రోడ్ల సెంటర్కు సమీపంలో సూర్యప్రభ డెంటల్ హాస్పిటల్ వద్ద శనివారం బుల్లెట్ నుంచి ఆకస్మికంగా మంటలు ఎగసిపడ్డాయి. ఆ హాస్పటల్ వైద్యుడు బిల్ల నీరజ్కుమార్కు చెందిన బుల్లెట్ను బయట నిలుపుదల చేశారు. బుల్లెట్ నుంచి మంటలు వస్తున్నాయని బయట నుంచి స్థానికులు కేకలు వేశారు. దాంతో ఆ మంటలను అదుపు చేసేందుకు స్థానికులు, నీరజ్కుమార్లు ప్రయత్నించారు. కూతవేటు దూరంలో ఉన్న పెట్రోల్ బంక్ నుంచి ఫైర్ ఫోమ్ను తీసుకువచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రేపు కాకినాడలో ఎంటీఎస్ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ కొత్తపేట: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డీఎస్సీ 2008, 1998 ఎస్జీటీ మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్)గా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు ఆ జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ తెలిపారు. ఆ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. డీఎస్సీ – 2008 ఎస్జీటీ (ఎంటీఎస్)గా పనిచేస్తున్న 196 మంది ఉపాధ్యాయులకు, డీఎస్సీ– 1998 ఎస్జీటీ (ఎంటీఎస్)గా పనిచేస్తున్న 184 మంది ఉపాధ్యాయులకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ సమగ్ర శిక్ష మీటింగ్ హాల్ నందు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. డీఈఓఈజీ.ఓఆర్జీ వెబ్సైట్ నందు పొందుపరిచిన జాబితాలో ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. -
రైలు నుంచి జారిపడిన కష్టజీవి
కాలు తెగిపోయి రక్తస్రావమై మృతి అనపర్తి: రోజూ రైళ్లలో సమోసాలు విక్రయించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ చిరు వ్యాపారి జీవితం విషాదాంతమైంది. అనపర్తి రైల్వే స్టేషన్లో శనివారం జరిగిన ప్రమాదంలో అతను మృత్యువాత పడడం అందరినీ కలచివేసింది. స్థానికులు, 108 సిబ్బంది కథనం ప్రకారం.. చిరు వ్యాపారి సత్యబాబు (55) రైళ్లలో సమోసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ పోషణ కోసం రోజూ రైలు బోగీల్లో తిరుగుతూ ప్రయాణికులకు సమోసాలు విక్రయించేవాడు. అదే జీవన పోరాటం చివరకు అతని ప్రాణాలను బలిగొంది. శనివారం సింహాద్రి ఎక్స్ప్రెస్ రైలు అనపర్తి స్టేషన్లో నెమ్మదిగా వెళ్తున్న సమయంలో సత్యబాబు రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ జారి రైల్వే ట్రాక్పై పడిపోయాడు. ప్రమాదంలో అతని కుడి కాలు తెగిపోగా తీవ్ర గాయాలయ్యాయి. రక్తసిక్తమైన సత్యబాబును చూసి ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ ఈఎంటీ దుర్గాభవానీ, పైలెట్ ఆనందరావులు హుటాహుటిన అతికష్టంపై సత్యబాబును ప్లాట్ఫారమ్పైకి చేర్చి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం క్షతగాత్రుడిని అనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావం కారణంగా సత్యబాబు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
యోగక్షేమం ఇదేనా!
ఫ యోగాపై ప్రచారానికే ప్రభుత్వం పెద్దపీట ఫ కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునేందుకు రూ.కోట్ల ఖర్చు ఫ ఆనక ఆ ఊసెత్తని వైనం ఫ నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం కపిలేశ్వరపురం: గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సాటి ఎవరూ రారు. యోగాంధ్ర 2025 పేరుతో గతేడాది జూన్లో ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు సుమారు రూ.350 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసింది. రాష్ట్రంలో 3,03,654 మందితో విశాఖ తీరాన యోగాసనాలు వేయించి గిన్నిస్ బుక్ సంస్థ నుంచి ప్రపంచ రికార్డు పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. 22,122 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు చేసిన సూర్య నమస్కారాలతో రెండో గిన్నిస్ రికార్డు దక్కింది. 61,266 పాఠశాలల్లో యోగాంధ్ర నిర్వహించినట్టు సమగ్ర శిక్షా ఏఎస్పీడీ శ్రీనివాసరావు గతేడాది ప్రకటించారు. అప్పుడు మాత్రమే చెప్పిన ఈ లెక్కలు అంతకు ముందూ లేవు, ఇప్పుడూ లేవు. యోగా కేవలం ప్రచార ఆయుధం మాత్రమే అన్న చందంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. పురాతన కాలం నుంచీ యోగాకు ప్రత్యేక స్థానం ఉంది. దాని ప్రాశస్త్యాన్ని ప్రచారం చేయడమే జీవిత లక్ష్యంగా అనేక సంస్థలు, వ్యక్తులు ఎలాంటి ప్రచారాన్ని కోరుకోకుండా యోగా కోసం పాటుపడుతున్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నం యోగా డే నెలలో మాత్రమే ఆర్భాటం చేస్తుంది. ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకు గతేడాది విశాఖలో యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని నిర్వహించిందన్న వాదన ఉంది. జిల్లాలో సుమారు రూ.కోటి పైగా ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. సకల సమస్యలకు యోగానే మందు అనే రీతిలో చంద్రబాబు ఉపన్యాసాల్లో చెప్పారు. జిల్లాలో 8,72,916 మంది యోగా చేసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు, వారికి యోగా శిక్షకులను కేటాయిస్తూ మ్యాపింగ్ చేసినట్టు, 4,600 ప్రాంతాల్లో యోగా శిబిరాలను నిర్వహించినట్టు గతేడాది ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంది. రాజమహేంద్రవరంలోని గ్రాండ్ ట్రంక్ రోడ్డులో 2 కిలోమీటర్ల మేర ప్రాంతంలో యోగాసనాలు చేయించింది. పాలన, ఇతర ప్రజావసరాలను పక్కన పెట్టి నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ప్రజలకు సమాచారం ఇవ్వకుండానే సిబ్బంది కార్యాలయాల్లో కూర్చుని యోగా చేసుకునేందుకు అంగీకరిస్తున్నానంటూ ప్రజల పేరుతో రిజిస్ట్రేషన్లు చేసేశారు. మీ విజ్ఞప్తి మేరకు పలానా చోట యోగా చేసేందుకు అనుమతిస్తున్నామంటూ ప్రజలకు మెస్సేజ్ రావడాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. విశాఖకు జనాన్ని తరలించేందుకు జిల్లాలోని విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. దూరాన ఉన్న విశాఖకు వెళ్లేందుకు అర్ధరాత్రి 12 గంటలకే బస్సుల్లోకి ఎక్కించారు. కార్యక్రమం పూర్తయ్యాక అందిస్తామన్న ఆహార ప్యాకెట్లు అందక ఆకలితో అలమటించిన వారెందరో ఉన్నారు. ఆ రోజు గడిచాక నేటి వరకూ యోగాపై తీసుకున్న చర్యలేవీ లేవు. ఈ ఏడాది జిల్లాలో కార్యక్రమాలు ఇలా.. జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థ, ఆయుష్ సంస్థ, పర్యాటక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో యోగాంధ్ర–2026ను నిర్వహిస్తున్నాయి. ఈ నెల 8న రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో యోగాభ్యాసన కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి, పలు ప్రభుత్వ శాఖల, నగర పాలక సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 11న కడియంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, జేసీ మేఘ స్వరూప్ పాల్గొన్నారు. 14న రాజమహేంద్రవరం గౌతమీ ఘాట్ ప్రయాణ ప్రదేశంలో జిల్లా స్థాయి సామూహిక యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం యోగా దినోత్సవ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని రాజమహేంద్రవరంతో పాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. యోగా.. వ్యాధులను తరిమికొట్టే దివ్యౌషధం.. నిశ్చలమైన మనసుతో నిండుగా జీవించేందుకు ఓ ఆయుధం.. మన ‘యోగ’క్షేమాలకు ఇదో శక్తివంతమైన పురాతన చికిత్సా విధానం.. అలాంటి యోగాను సైతం చంద్రబాబు ప్రభుత్వం ప్రచార ఆయుధంగా మార్చుకుంది.. యోగాకు ప్రాధాన్యం ఇస్తున్నామంటూ చెప్పుకొంటూ రూ.కోట్లు ఖర్చు చేసి, ప్రచార హంగామా చేస్తోంది.. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..ప్రాధాన్యం ఇదీ.. ఆధునిక కాలంలో తలెత్తుతున్న రుగ్మతల నేపథ్యంలో ధ్యానం, యోగా వంటి ప్రాచీన విధానాలకు ప్రాధాన్యం పెరిగింది. యోగా అనేది సంస్కృతంలోని ‘యుజ్’ అనే పదం నుంచి వచ్చింది. ‘యుజ్’ అనే పదానికి ఐక్యం కావడమని అర్థం. మనసు, శరీరమూ ఒకదానితో మరొకటి ప్రభావితమై ఉంటాయి. ఆ రెండింటినీ ఏకం చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు. యోగాలోని 84 ఆసనాల్లో 32 అతి ముఖ్యమైనవి. క్రమం తప్పకుండా యోగాసనాలను వేయడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్రమశిక్షణ అలవడుతుంది. మానసిక, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆలోచనలను నియంత్రించుకోగలుగుతారు. సూర్య నమస్కారాల్లోని పదకొండు ఆసనాల్లో ఆరోగ్య, ఆధ్యాత్మిక అంశాలు ఒదిగి ఉంటాయి. వాటిని చేయడం ద్వారా కదలికలు ఏర్పడి శరీర అవయవాల్లోని భాగాలకు రక్త ప్రసరణ వృద్ధి చెందుతుంది. -
కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు శంకుస్థాపన
తుని: విద్యతో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, సంపాదన పట్ల అవగాహన ఉండాలని పతంజలి గ్రూప్ ఎండీ, పతంజలి విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య బాలకృష్ణ అన్నారు. తునికి వచ్చిన ఆయన పొరుగునే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట శ్రీప్రకాష్ విద్యా సంస్థల్లో నిర్మించనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు శనివారం శంకుస్థాపన చేశారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, వ్యర్థాలను పునర్వినియోగం చేసే విధానంపై తమ యాజమాన్యంతో పతంజలి సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుందని శ్రీప్రకాష్ విద్యా సంస్థల అధినేత సీహెచ్వీకే నరసింహారావు తెలిపారు. ఆయుర్వేద చికిత్సాలయం, ఔషధ వనం, పరిపాలన విభాగం నూతన భవనాలను ఆచార్య బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి యోగా శక్తిని, ఐక్యతను చాటి చెప్పాలని కోరారు. త్వరలో శ్రీప్రకాష్ విద్యా సంస్థల సహకారంతో సర్క్యులర్ ఎకానమీ ప్రాజెక్టు మోడల్ అమలుకు నిర్ణయం తీసుకున్నట్టు ఆచార్య బాలకృష్ణ ప్రకటించారు. ఆయనను నరసింహారావు జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో కంటిపూడి నరేంద్రబాబు, విజయ్ ప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కొంపముంచిన ఫోన్పే
ఫ రూ.ఐదు లక్షలు ఉన్నాయని తెలుసుకుని హత్య ఫ ఆక్వా రైతు హత్య కేసులో కూలీలే నిందితులు ఫ ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు ఐ.పోలవరం: ఫోన్ పే కొంపముంచింది.. బ్యాంక్ అకౌంట్లో రూ. 5 లక్షలు ఉన్నాయని తెలుసుకుని ఓ ఆక్వా రైతును కూలీలే హత్య చేయడం చర్చనీయాంశమైంది. ఐ.పోలవరం మండలం మురమళ్ల ఆక్వా చెరువు వద్ద రైతు దాట్ల కృష్ణంరాజు (64) హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను శనివారం పాత ఇంజరం పోలీస్ స్టేషన్ వద్ద అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, ముమ్మిడివరం సీఐ మోహన్కుమార్ విలేకరులకు తెలిపారు. ఈ నెల 17న మురమళ్లకు చెందిన దాట్ల కృష్ణంరాజు తన ఆక్వా చెరువు వద్ద హత్యకు గురయ్యారు. చెరువు వద్ద పనిచేసే ఇద్దరు కూలీలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది. నిందితుల్లో ఒకరు విశాఖ జిల్లా కొయ్యూరు గ్రామానికి చెందిన సలాపరెడ్డి బాబ్జీ కాగా, మరొకరు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన బాలుడు. వారం రోజుల క్రితం వీరిద్దరూ కృష్ణంరాజు చెరువు వద్ద పనికి కుదిరారు. పని చేయకపోతే రైతు కృష్ణంరాజు ఊరుకునేవారు కాదని, ఇక్కడ పని చేయలేమని నిర్ధారించుకుని వారు మానేయాలని నిర్ణయించుకున్నారు. వారం రోజుల కూలీ డబ్బులు ఇచ్చేయండి, మేం వెళ్లిపోతామని కృష్ణంరాజుతో వారు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో 14న బాబ్జీ భార్య సెల్ఫోన్కు రూ.వెయ్యి ఫోన్పే చేయించుకున్నారు. అప్పుడే యజమాని కృష్ణంరాజు ఫోన్పేలో రూ.5 లక్షలు ఉన్నట్లు నిందితులు గుర్తించారు. 17న మధ్యాహ్నం కృష్ణంరాజు చెరువు వద్ద కుర్చీలో కూర్చుని ఫోన్ చూస్తుండగా, నిందితులు ఏరియేటర్ రాడ్డుతో ఆయన తలపై కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహం కాళ్లకు నైలాన్ తాడు చుట్టి, ఆ తాడుకు నాలుగు ఫెన్సింగ్ రాళ్లు కట్టి ఎవరికీ కనిపించకుండా చెరువులో పడేశారు. మృతుడు కుర్చీని, షెడ్డు వెనుక మురికి కాలువలో పడేశారు. మోటార్ సైకిల్ను ఎవరికీ కనిపించకుండా రేకుల షెడ్డు పక్కన బాత్రూమ్ గోడకు ఆనుకుని ఉంచి, రాడ్ను సెప్టిక్ ట్యాంక్పై ఉన్న నల్లని బరకల్లో దాచిపెట్టారు. సాయంత్రం 4 గంటల సమయంలో మృతుడి ఫోన్, హత్య సమయంలో రక్తపు మరకలు అంటిన తమ దుస్తులు తీసుకుని నిందితులు కాకినాడకు వెళ్లిపోయారు. నిందితులను పట్టుకున్న పోలీసులు మృతుడి ఫోన్ స్వాధీనం చేసుకుని, ఫోన్పే ద్వారా రూ.90 వేలు ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించారు. కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న సీఐ మోహన్ కుమార్, ఎస్సై రవీంద్రబాబును డీఎస్పీ అభినందించారు. -
గోవింద.. హరి గోవింద
ఫ వెంకన్న నామస్మరణతో మార్మోగిన వాడపల్లి క్షేత్రం ఫ వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆత్రేయపురం: గోవింద.. హరి గోవింద నామస్మరణ మార్మోగింది. శనివారం కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం కిక్కిరిసింది. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. కాలినడకన సైతం అనేక మంది ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వద్ద ఎటు చూసినా జనమే కనిపించింది. స్వామివారికి వేకువ జామునే సుప్రభాత సేవ, తొలి హారతి, నీరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాలభోగం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే ఆలయ ఆవరణలో వేంచేసి ఉన్న క్షేత్రపాలకులు, అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి వారిని భక్తులు దర్శించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి ఉచిత అన్న ప్రసాదం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేవస్థానం ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ, నీరు అందించారు. ఆర్యవైశ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ ఒక్కరోజు సుమారు లక్ష మంది ఆలయాన్ని దర్శించుకున్నారని ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. స్వామివారిని కొత్తపేట ఆర్డీఓ జీవీవీ సత్యనారాయణ దర్శించుకున్నారు. ఆలయంలో ఏర్పాట్లను ఈఓతో పాటు ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు, సిబ్బంది పర్యవేక్షించారు. ఈ ఒక్కరోజే ఆలయానికి రూ.61,16,327 సమకూరింది. -
ఇన్స్పైర్ మానక్ రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక
సామర్లకోట: ఇన్స్పైర్ మానక్ రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు స్థానిక బొడ్డు భాస్కర రామారావు మున్సిపల్ హైస్కూల్ విద్యార్థిని మట్టా యశ్విజ ఎంపికై ంది. పాఠశాల ఉపాధ్యాయుడు జీవీవీ సత్యనారాయణ శనివారం ఈ విషయం తెలిపారు. కేంద్ర విజ్ఞాన, సాంకేతిక శాఖ ఆధ్వర్యాన ఈ నెల 4న ఆన్లైన్లో నిర్వహించిన ఇన్స్పైర్ మానక్ జిల్లా స్థాయి పోటీల ఫలితాలను జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ విడుదల చేశారు. జిల్లా స్థాయి పోటీల్లో 93 మంది విద్యార్థులు పాల్గొనగా 9 మంది రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. దీనిలో భాగంగా యశ్విజ రూపొందించిన ఆటోమెటిక్ సీవింగ్ మెషీన్ (జల్లెడ యంత్రం) ప్రదర్శన రాష్ట్ర స్థాయికి ఎంపికై ందని సత్యనారాయణ తెలిపారు. ఆయన సూచనలతోనే యశ్విజ ప్రతిభ చాటుకుందని పాఠశాల ప్రధానోపాధ్యాయిని లలిత మాణిక్యాంబ అన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఎప్పుడు జరిగేదీ త్వరలోనే తెలియజేస్తామని జిల్లా సైన్స్ అధికారి కేసరి శ్రీనివాసరావు తెలిపారు. యశ్విజను హెచ్ఎం మాణిక్యాంబ, ఎంపీఓలు ఎన్.లక్ష్మీతులసి, పి.పుల్లయ్య, ఉపాధ్యాయులు అభినందించారు. రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తమ సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నల్లా వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన నాయకులు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్కు శనివారం వినతిపత్రం అందజేశారు. గత ఏడాది మోంథా తుపాను సమయంలో డీలర్లకు కేటాయించిన పంచదార, కందిపప్పు ఇంకా తమ వద్దనే ఉండిపోయాయని, వాటిని వెనక్కి తీసుకోవాలని కోరారు. కొన్ని మండలాల్లో తుపాను ప్రభావం లేకపోయినా అక్కడి డీలర్లకు ఇచ్చిన స్టాకు అలాగే ఉండిపోయిందని తెలిపారు. ఈ–పోస్ యంత్రాలకు గత ఆరు నెలలుగా పేపర్ రోల్స్ ఇవ్వడం లేదన్నారు. కొంత మంది డీలర్లను వారి మండలాల్లోని ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి కాకినాడ పాయింట్కు మార్చడంతో డీలర్లకు ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు. కన్న తండ్రికి కన్నీటి వీడ్కోలు అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తెలు అయినవిల్లి: కని, పెంచి, పెద్ద చేసి.. అనారోగ్యంతో మంచం పట్టి.. తనువు చాలించిన తండ్రికి కుమార్తెలే అంత్యక్రియలు నిర్వహించి, కన్నీటి వీడ్కోలు పలికిన సంఘటన అయినవిల్లి మండలం కె.జగన్నాథపురంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన పిచ్చిక సత్యనారాయణ (52)కు భార్య, ముగ్గురు కుమార్తెలు ప్రసన్న, జ్యోతిక, జ్యోత్స్న ఉన్నారు. క్యాటరింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సత్యనారాయణ భార్య సరస్వతి మానసిక దివ్యాంగురాలు. ఏడాది క్రితం సత్యనారాయణకు పక్షవాతం రావడంతో పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో, కుటుంబ భారం పెద్ద కుమార్తె ప్రసన్నపై పడింది. ఆమె ముమ్మిడివరంలోని ఐస్క్రీమ్ పార్లర్లో పని చేస్తూనే కుటుంబాన్ని పోషిస్తోంది. మిగిలిన ఇద్దరు కుమార్తెలు జ్యోతిక, జ్యోత్స్న కవలలు. వీరు అదే గ్రామంలో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నారు. ఈ పరిస్థితుల్లో సత్యనారాయణ శుక్రవారం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. సత్యనారాయణకు అక్క, తమ్ముడు ఉన్నారు. వారి కుటుంబాల్లో శుభకార్యాలు జరుగుతూండటంతో మృతి చెందిన సోదరుడి ఇంటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తండ్రి సత్యనారాయణ మృతదేహానికి కుమార్తెలు ప్రసన్న, జ్యోతిక, జ్యోత్స్నలు అంత్యక్రియలు నిర్వహించారు. వారి పరిస్థితిని చూసి, చలించిన గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. తల్లికి మతిస్థిమితం లేకపోవడం, తండ్రి మృతి చెందడంతో.. ఆ అక్కాచెల్లెళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
తొలి తిరుపతిలో భక్తుల రద్దీ
సామర్లకోట: పెద్దాపురం మండలం తొలి తిరుపతి గ్రామంలో వెలసిన శ్రీదేవి, భూదేవీ సమేత శృంగార వల్లభ స్వామి ఆలయానికి ఽశనివారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు కాలి నడకన సైతం వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో, ఆల యం రద్దీగా మారింది. తెల్లవారుజామున స్వామి వారికి ఇచ్చిన తొలి హారతిని తిలకించడానికి భక్తులు పోటీ పడ్డారు. అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. సుమారు 18 వేల మంది భక్తులు స్వామి వారి దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.1,62,680, అన్నదాన విరాళాలు రూ.63,525, కేశ ఖండన ద్వారా రూ.6,080, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.20,460, ఇతరత్రా కలిపి దేవస్థానానికి రూ.2,53,495 ఆదాయం సమకూరిందని వివరించారు. స్వామివారి అన్నప్రసాదాన్ని 3,500 మంది భక్తులు స్వీకరించారని తెలిపారు. స్వామివారిని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, నిమ్మకాయల రంగనాగ్ దర్శించుకున్నారు. ఆలయంలో జరుగుతున్న గోపురం అభివృద్ధి పనులను పరిశీలించారు. -
బీచ్ షాక్స్తో యువత భవిష్యత్తు నాశనం చేస్తారా?
కాకినాడ రూరల్: సంస్కృతీ సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షు రాలు జమ్మలమడక నాగమణి అన్నారు. ఒకవైపు సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ డాంబికా లు పలుకుతున్నారని.. మరోవైపు ప్రజలకు ఆహాదాన్ని పంచే బీచ్లలో బీచ్ షాక్స్ పేరిట మద్యం అమ్మకాలకు తెర తీస్తున్నారని విమర్శించారు. కాకినాడలో ఆమె శనివారం మాట్లాడుతూ, రా ష్ట్రంలోని ఎనిమిది బీచ్లలో మద్యం అమ్మకాల కోసం చంద్రబాబు సర్కార్ ప్రత్యేక జీఓ విడుదల చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆదా యం కోసం ఇంతలా దిగజారిపోవాలా అని నిలదీశారు. పైలట్ ప్రాజెక్టుగా సూర్యలంక, విశాఖ రుషికొండ, కాకినాడ బీచ్లలో మద్యం విక్రయాలకు తలుపులు బార్లా తెరుస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతూండటంతో ప్రధానంగా యువత పెడదో వ పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యా లు పెరిగిపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పచ్చ పార్టీలోని ప్రతి ఒక్కరూ బా ధ్యత వహించాలన్నారు. పిల్లాపాపలతో ఉల్లా సంగా గడిపేందుకు ప్రజలు వచ్చే బీచ్లలో మ ద్యం పారించి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మా ర్చాలనుకుంటున్నారా అని చంద్రబాబును నిలదీశారు. గతంలో ఆయన సీఎంగా ఉండగా విశా ఖ బీచ్లో బికినీ పండగ చేయాలనుకున్నారని గుర్తు చేశారు. గోవా, ముంబై మాదిరిగా ఇక్కడి బీచ్లలో కూడా మద్యం అమ్మాలనుకోవడం సిగ్గుచేటన్నారు. పెట్టుబడులు ఆకర్షించే పేరుతో చంద్రబాబు, లోకేష్లు సింగపూర్, బ్యాంకాక్, హాంకాంగ్ వంటి దేశాలకు వెళ్లి వస్తూ అక్కడి దు ష్ట సంప్రదాయాలను ఇక్కడకు తీసుకురావాలను కోవడం అవివేకమని మండిపడ్డారు. ఒక మహి ళగా, ఒక తల్లిగా బీచ్లలో మద్యం విక్రయించాల నే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని స్ప ష్టం చేశారు. చంద్రబాబుకు మహిళలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీచ్లను బార్లుగా మార్చే జీఓను వెనక్కు తీసుకోవాలని నాగమణి డిమాండ్ చేశారు. -
మోగిన పెళ్లిబాజా
ఫ మోగిన పెళ్లి బాజా ఫ నెల రోజుల తర్వాత రత్నగిరిపై తిరిగి సందడి ఫ నవ దంపతులతో కళకళలాడుతున్న సత్యదేవుని ఆలయం అన్నవరం: మూడు ముళ్ల బంధానికి లగ్గం కుదిరింది.. ఏడడుగులతో సాగే పయనానికి మంచి గడియ రానే వచ్చింది.. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో పెళ్లి బాజాలు తిరిగి మోగుతున్నాయి. అధిక జ్యేష్ట మాసం కారణంగా నెల రోజులు పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. అది కాస్తా ముగిసి, నిజ జ్యేష్ట మాసం ప్రారంభం కావడంతో రత్నగిరిపై నవ దంపతుల సందడి మొదలైంది. ఈ మాసంలో సుమారు 600 వివాహాలు జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఏటా చైత్ర మాసం నుంచి అంటే మార్చి – ఏప్రిల్ నుంచి జ్యేష్ట మాసం అంటే జూలై వరకూ వివాహాలు జరుగుతాయి. ఈ ఏడాది చైత్ర, వైశాఖ మాసాల్లో అంటే మార్చి 9 నుంచి మే 11వ తేదీ వరకూ వివాహాలు జరిగాయి. ఆ తరువాత అధిక జ్యేష్ట మాసం వివాహాది శుభకార్యాలకు మంచిది కాదన్న పండితుల సూచనలతో మే 17 నుంచి జూన్ 15 వరకూ వివాహాది శుభకార్యాలేవీ జరగలేదు. ఈ నెల 15 నుంచి నిజ జ్యేష్ట మాసం ప్రారంభమైంది. దీంతో, శుక్రవారం నుంచి వివాహ శుభకార్యాలు ప్రారంభమయ్యాయి. పెళ్లిళ్లన్నీ కల్యాణ మండపాల్లోనే.. ● అన్నవరం దేవస్థానంలో ఏటా చైత్ర మాసం నుంచి జ్యేష్టం వరకూ ఆలయ ప్రాంగణంతో పాటు కల్యాణ మండపాల్లో వివాహాలు జరుగుతాయి. అయితే, వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈసారి వివాహాలన్నీ కల్యాణ మండపాలు, విశ్రాంతి షెడ్లలోనే జరుగనున్నాయి. ● సత్యగిరిపై దాత, పెద్దాపురానికి చెందిన శ్రీలలితా రైస్ ఇండస్ట్రీస్ ఎండీ మట్టే శ్రీనివాస్ దంపతులు నిర్మించిన శ్రీ సత్య శ్రీనివాసా కల్యాణ మండపంలో 12 చిన్న వివాహ మండపాలున్నాయి. అలాగే, విశాఖపట్నానికి చెందిన పారిశ్రామికవేత్త ఎంఎస్ రెడ్డి నిర్మించిన శ్రీ ఎంఎస్ రెడ్డి అంజనీ వివాహ వేదికలో కూడా 12 చిన్న కల్యాణ మండపాలున్నాయి. ఈ రెండు చోట్ల ఆయా ముహూర్తాల్లో 24 వివాహాలు జరగనున్నాయి. ఈ మండపాలను పెళ్లి బృందాలు ఇప్పటికే రిజర్వ్ చేసుకున్నాయి. ● దేవస్థానంలో సత్యగిరిపై విష్ణు సదన్ సత్రంలోని 36 మ్యారేజ్ హాళ్లలో కూడా ఆయా ముహూర్తాల్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. వీటితో పాటు రత్నగిరి రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డులో కూడా వివాహాలు జరుగుతున్నాయి. ● అన్నవరంలోని సుమారు 20 లాడ్జీల్లోని కల్యాణ మండపాల్లో కూడా వివాహాలు జరగనున్నాయి. సందడే సందడి.. పెళ్లిళ్ల సందడి మొదలు కావడంతో క్యాటరింగ్, సన్నాయి మేళం, పురోహితులకు డిమాండ్ ఏర్పడింది. వివాహ ముహూర్తాలతో సత్యదేవుని ఆలయానికి కూడా భక్తుల తాకిడి పెరగనుంది. రత్నగిరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న నవ దంపతులు, వారి బంధువులు కూడా సత్యదేవుని ఆలయానికి తరలి రానున్నారు.ఆషాఢంలో మళ్లీ విరామం ఆషాఢ మాసం వివాహాది శుభకార్యాలకు మంచిది కాదనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో జూలై 15 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ వివాహాది శుభ కార్యాలకు మళ్లీ బ్రేక్ పడనుంది. తిరిగి శ్రావణ మాసం అంటే ఆగస్టు 15 నుంచి మళ్లీ పెళ్లి బాజాలు మోగుతాయి.వచ్చే నెల 9 వరకూ.. శుక్ర, శనివారాల్లో వివాహ ముహూర్తాలున్నాయి. వీటితో పాటు ఈ నెల 21, 22, 24, 25, 26, 27, జూలై 1 తేదీ నుంచి 9వ తేదీ వరకూ పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. -
ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026
రత్నగిరి కిటకిట అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిటకిటలాడింది. సత్యదేవుని సన్నిధిలోను, వివిధ ప్రాంతాల్లోను శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు. పార్కింగ్ స్థలాలన్నీ భక్తుల వాహనాలతో నిండిపోయాయి. ఘాట్ రోడ్డుకు ఇరువైపులా భక్తులు తమ వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్కు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. వ్రతాలు 2,400 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఆరు వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుని జన్మ నక్షత్రం మఖ సందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి, శంకరునికి పంచామృతాభిషేకం, ఉదయం 9 గంటలకు ఆయుష్య హోమం నిర్వహించారు. న్యాయసేవలు వినియోగించుకోండి కాకినాడ లీగల్: ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలను రిమాండ్ ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, రాజమహేంద్రవరం సీనియర్ సివిల్ జడ్జి వై.శ్రీలక్ష్మి అన్నారు. కాకినాడలోని స్పెషల్ సబ్ జైలును శనివారం ఆమె సందర్శించారు. వంటశాల, మహిళా ఖైదీల బ్యారక్, ఫిర్యాదుల పెట్టె, రికార్డులను పరిశీలించారు. రిమాండ్ ఖైదీలతో మాట్లాడి, వారి ఆర్యోగ పరిస్థితి, వసతి, భోజనం ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఎన్ని రోజుల నుంచి జైలులో ఉన్నారో ఆరా తీశారు. వారికి అందుతున్న లీగల్ ఎయిడ్ సేవలపై అడిగి తెలుసుకున్నారు. -
‘సర్’కు సహకరించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో ఈ నెల 15 నుంచి ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఆయా పార్టీల ప్రతినిధులు, అన్ని నియోజకవర్గ ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్ కార్యక్రమం గురించి వివరించారు. జిల్లావ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1,640 పోలింగ్ కేంద్రాల్లో 16,50,811 మంది ఓటర్లు ఉన్నారన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ప్రతి ఇంటికీ ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేస్తారని తెలిపారు. ఇప్పటి వరకూ 9,96,656 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణి చేశామన్నారు. దీని ద్వారా 2002లోని ఓటర్ల జాబితాను ప్రస్తుత జాబితాతో మ్యాపింగ్ చేయడం పూరయ్యిందన్నారు. బీఎల్ఓలు ఇంటికి వచ్చినప్పుడు ఓటర్లు తమ పాస్పోర్టు సైజు ఫొటోతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు అందుబాటులో పెట్టుకునేలా ఆయా పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 1,200 మంది ఓటర్లు ఉండేలా, జిల్లాలో కొత్తగా 183 కేంద్రాలను ప్రతిపాదించామని, వీటిపై సలహాలు సూచనలు అందించాలని కలెక్టర్ కోరారు. -
రోడ్డున పడేస్తారా?
● వార్ఫు రోడ్డులో ఫుడ్హబ్ ఏర్పాటుకు సన్నాహాలు ● అక్కడే చిరు వ్యాపారాలతో జీవిస్తున్న 120 కుటుంబాలు ● వారి దుకాణాలను తొలగిస్తున్న అధికారులు ● జీవనోపాధి కోల్పోతున్న బాధితులు న్యాయం చేయాలని డిమాండ్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అభివృద్ధి పేరుతో ప్రభుత్వం తమ పొట్ట కొడుతోందని చిరు వ్యాపారులు వాపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా రోడ్ల పక్కన చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ పలువురు జీవనం సాగిస్తున్నారు. వారు ఏర్పాటు చేసుకున్న చిన్నచిన్న దుకాణాలను ఫుడ్హబ్ ఏర్పాటు చేస్తామనే పేరుతో అధికారులు తొలగిస్తున్నారు. దీంతో, తాము బతుకుతెరువు కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తోందని ఆ చిరు వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఇదీ సంగతి.. కాకినాడ 30వ డివిజన్ వార్ఫు రోడ్డులో సుమారు 100 నుంచి 120కి పైగా కుటుంబాల వారు చాలా సంవత్సరాలుగా చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. పశువులు మేపుకొని పాలు, టిఫిన్లు, టీలు విక్రయించుకుంటూ కొందరు, పాత ఇనుప సామాన్లు కొనుగోలు చేస్తూ మరికొందరు జీవనం సాగిస్తున్నారు. పాత సామాన్ల విక్రయాల వంటి సుమారు 80కి పైగా షాపులు ఇక్కడున్నాయి. కొందరు పదేళ్లు, మరికొందరు 20 ఏళ్లుగా రోడ్డు పక్కనే బతుకుబండి లాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.4 కోట్లతో మంజూరు చేసిన మోడల్ స్ట్రీట్ ఫుడ్హబ్ను నగర పాలక సంస్థ అధికారులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిధులతో ఈ ప్రాంతాన్ని పర్యటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో సుమారు కిలోమీటరు పొడవునా రోడ్డు పక్కన ఉన్న చిన్న దుకాణాలను గత రెండు రోజులుగా తొలగిస్తున్నారు. ఇక్కడ చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న చిన్న పాకలతో పాటు దుకాణాలను ఖాళీ చేయిస్తున్నారు. దీంతో, తాము రోడ్డున పడ్డామని, అర్ధాంతరంగా తమ బతుకుతెరువు కూల్చేయడంతో ఏవిధంగా జీవించాలో అర్థం కావడం లేదని బాధిత కుటుంబాల వారు ఆవేదన చెందుతున్నారు. అభివృద్ధికి తాము అడ్డు కాదని, ఎప్పటి నుంచో ఉన్న జీవనాధారాన్ని తొలగిస్తే రెండు పూటలా ఏం తిని బతకాలని కన్నీరు మున్నీరవుతున్నారు. తమకు పునరావాసం కల్పించాలని, లేదా వేరే ప్రాంతంలోనైనా జీవనోపాధి పొందేందుకు అవకాశం ఇవ్వాలని, కనీసం ఇక్కడ ఏర్పాటు చేసే ఫుడ్పార్కులోనైనా ఏదో ఒక వ్యాపారం చేసుకునేందుకు అనుమంతించి న్యాయం చేయాలని కోరుతున్నారు. కుటుంబ పోషణ కోసం చిన్న వ్యాపారాలు చేసుకునే తమను రోడ్డు మీద పడేసి పెద్ద వ్యాపారులకు ఇక్కడ అవకాశం కల్పించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యామ్నాయం చూపాలి ఎన్నో సంవత్సరాలుగా చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న వీరిని హఠాత్తుగా ఖాళీ చేయించడం దారుణం. వీరి కుటుంబాలు రోడ్డున పడిపోతాయి. కనీసం కొన్ని రోజులు సమయం ఇవ్వాలి. వీరికి ప్రత్యామ్నయంగా వేరే ప్రాంతంలో వసతి కల్పించాలి. – రాగిరెడ్డి అరుణ్ కుమార్, మాజీ కార్పొరేటర్, వైఎస్పార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కుటుంబాన్ని ఎలా పోషించాలి? పదేళ్లుగా రోడ్డు పక్కన చిన్న వ్యాపా రం చేసుకుంటూ బతుకుతున్నాం. కార్పొరేషన్ అధికారులు వచ్చి మా షాపును పూర్తిగా తొలగించేశారు. ఏం చేయాలో పాలు పోవడం లేదు. కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కావడం లేదు. – కొయ్యా గోవిందమ్మ, వార్ఫు రోడ్డు చాలా దారుణం ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నాం. అటువంటిది ఇప్పుడు ఫుడ్హబ్ పేరు తో మా పొట్ట కొట్టడం ఈ ప్రభుత్వానికి తగదు. జీవనాధారం కోల్పోతే చాలా ఇబ్బందులు పడతాం. ఫుడ్హబ్లో మాకు ఏదైనా చిన్న షాపు ఏ ర్పాటు చేస్తే కుటుంబం షోషించుకునే వీలుంటుంది. – కె.సత్య, వార్ఫు రోడ్డు -
సుగాలి ప్రీతి కేసుపై పవన్ కల్యాణ్ పచ్చి అబద్ధాలు
సాక్షి, కాకినాడ: సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు వల్లె వేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో సాక్ష్యాలు తారుమారు కాగా, గత ప్రభుత్వంలో తారుమారు చేశారంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. సుగాలి ప్రీతి తల్లిని వంచించేలా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్లోనే చెరిపేశారు. పోయిన సాక్ష్యాధారాలను మనం తిరిగి తీసుకురాలేం. ఫాల్స్ డీఎన్ఏ పెట్టేశారు. క్రైమ్ సీన్లో సాక్ష్యాధారాలు కీలకం. నిర్థారించడానికి కోర్టులు అడిగేవి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్.. ఎవిడెన్స్ లేకపోతే మాత్రం మనం ఎవరిని కూడా మన కళ్ల ముందు తెలిసినా సరే మనం ఏమీ చేయలేం’’ అంటూ సుగాలి ప్రీతి కేసు విచారణపై పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నారు. -
కొత్త మలుపు తిరిగిన చిన్నారి జానూ కేసు!
సాక్షి, కాకినాడ: తుని మండలం ఎస్.అగ్రహారంలో కనిపించకుండా పోయిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కేసు కొత్త మలుపు తిరిగింది. అధికారిక బృందాలు దాదాపు రెండు వారాలు సెర్చ్ ఆపరేషన్ పేరిట అణువణువు జల్లెడ పట్టినా ప్రయోజనం కనిపించలేదు. దీంతో.. పోలీసులు మరో కోణంలో ఈ కేసును దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 6వ తేదీన ఇంటి బయట ఆడుకుంటూ.. పెంపుడు కుక్కతో పాటే కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి తల్లిదండ్రులు, పోలీసులు, స్థానికులు, ప్రత్యేక బృందాలు గాలిస్తున్నా ఇప్పటికీ జానూ ఆచూకీ లభించలేదు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ప్రధానంగా సీసీ ఫుటేజ్, సెల్ఫోన్ డేటా ఆధారంగా సాగుతున్న విచారణలో తాజాగా ‘కిడ్నాప్ కోణం’పై కూడా పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా.. ఓ కొత్త సీసీ కెమెరా ఫుటేజ్ను పోలీసులు చిన్న క్లూగా భావిస్తున్నారు. చిన్నారితో పాటు కనిపించకుండాపోయిన పెంపుడు శునకం అదే రోజు గ్రామంలోని వినాయకుని ఆలయం వద్ద తిరుగుతూ కనిపించింది. మధ్యాహ్నం 1.02 గంటల సమయంలో అది ఆందోళనగా అటు ఇటు సంచరిస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. అయితే ఆ తర్వాత అది ఎటు వెళ్లిందో స్పష్టత రాలేదు.మూడు రోజుల తర్వాత అదే శునకం ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి అది కనిపించన వాళ్ల మీద దాడి చేస్తూ.. విచిత్రంగా ప్రవర్తించసాగింది. వైద్యం తర్వాత అది కోలుకున్నాక జీపీఎస్ ట్రాకర్ కట్టి వదిలినా.. ఫలితం దక్కలేదు. చివరకు.. అది చనిపోయిందని పోలీసులు చెబుతున్నారు. అయితే.. కిడ్నాప్ కోణంలోనూ కేసును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 6 వేలకుపైగా ఫోన్ కాల్స్ను విశ్లేషించినట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అనుమానాస్పద వ్యక్తులపై కూడా దృష్టి పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే కొండ మీద ఉండే ముఠాల గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వాళ్లు పెట్టిన కరెంట్ ఉచ్చుకి చిన్నారి చిక్కుకుందా? మరేమైనా జరిగి ఉంటుందా? అనే కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరంగా జరుపుతున్నారు. అలాగే.. జిల్లాలో ఇలాంటి కేసుల గత రికార్డులు, అనుమానితుల కదలికలు కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సంచార జాతులు, వ్యక్తులపై కూడా బృందాలు విచారణ జరుపుతున్నాయి. పిఠాపురం, కోటవురట్ల, దివి పోలవరం ప్రాంతాల్లో కూడా ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో క్లూ దక్కుతుందేమోనన్న ఆశతో.. ఏ సీసీటీవీ కెమెరాను వదిలిపెట్టడం లేదు.మరోవైపు శునకం అనారోగ్యంతో మరణించిందని చెబుతున్నా.. శవపంచనామా, పోస్టుమార్టం నివేదిక ఇంకా అందాల్సి ఉంది. ఇన్నిరోజులు గడుస్తున్నా.. ఆ రిపోర్ట్ రాకపోవడంపై స్థానికుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అది నిజంగా చనిపోయిందా? ఎవరైనా చంపేశారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం పోలీసులే తేల్చాలంటూ జానూ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆ నివేదిక వస్తే కేసులో మరికొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ చిన్నారి జానూ కాదు!ఇదిలా ఉంటే.. తుని మార్కెట్ యార్డ్ దగ్గర గుర్తుతెలియని ఓ చిన్నారి కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. ఏడ్చుకుంటూ ఆమె ఓ మహిళ దగ్గరకు వెళ్లగా.. అనుమానంతో ఆమె పోలీసులకు అప్పగించింది. అయితే ఆ చిన్నారి జానూ కాదని పోలీసులు నిర్ధారించారు. ఈ చిన్నారి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇక.. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. అదే సమయంలో కొందరు వ్యక్తులు మంత్రాలు, తంత్రాల పేరుతో ఇంటికి వచ్చి తమను అయోమయానికి గురిచేస్తున్నారని చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పెంపుడు శునకం కదలికల నుంచి మొదలైన అనుమానాలు.. ఇప్పుడు కిడ్నాప్ కోణం వరకు చేరుకున్నాయి. కానీ చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం ఇంకా చిక్కని మిస్టరీగానే మిగిలింది. ఈ కేసులో అసలు నిజం ఎప్పుడు బయటపడుతుందన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఉత్కంఠగా మారింది.ఇదీ చదవండి: పోలీసులే హంతకులైతే..? -
హఠాత్తుగా లాగేసుకున్నారు
రెండో విడతలో ఇళ్లు నిర్మించుకోవాలని మేమంతా అనుకుంటున్నాం. ఈలోగా హఠాత్తుగా మా స్థలాల నుంచి ఖాళీ చేయించారు. మా స్థలాల్లో వృద్ధాశ్రమం నిర్మించారు. మా స్థలాల కోసం అడిగితే పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పించుకున్నారు. చివరకు స్థలాలు చూపించారు కానీ, మా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించలేదు. గతంలో ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా రిజిస్ట్రేషన్ కూడా చేయించింది. రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తేనే మాకు ఓ నమ్మకం ఉంటుంది. అలాగే, ఇళ్లు నిర్మించుకునేందుకు బ్యాంక్ రుణం కూడా వస్తుంది. – కోనాల ఆనంద్, జి.రాగంపేట, పెద్దాపురం -
వృద్ధాశ్రమం ముసుగులో..
ఇందులో భాగంగా జి.రాగంపేట జగనన్న కాలనీలో ఖాళీగా ఉన్న స్థలాలపై అధికార పార్టీ నేతలు కన్ను వేశారు. ఇక్కడ రెండో విడతలో ఇళ్లు నిర్మించుకోవాల్సిన లబ్ధిదారులను అధికారం అండతో నయానో భయానో దారికి తెచ్చుకుని ఉన్న ఫళంగా ఖాళీ చేయించారు. సమాజ సేవ ముసుగులో జిల్లాలోని పలువురు ప్రముఖుల నుంచి భారీగా సేకరించిన విరాళాలతో అక్కడ వృద్ధాశ్రమం నిర్మాణం చేపట్టారు. ఈ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. దీనికి ఆనుకుని ఉపాధి హామీ పథకంలో కొత్తగా 40 అడుగుల సీసీ రోడ్డు కూడా వేశారు. ప్రజలు, సమాజ సేవపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే దాదాపు మూడేళ్లుగా 160 కుటుంబాలు నివాసం ఉంటున్న జగనన్న కాలనీలో రోడ్లు, డ్రైన్ల వంటి కనీస వసతులు కల్పిస్తే బాగుండేదని, అటువంటిది ఇంకా ప్రారంభం కూడా కాని వృద్ధాశ్రమానికి 40 అడుగుల రోడ్డు వేయడంలో ఔచిత్యమేమిటని పలువురు ప్రశ్ని స్తున్నారు. వృద్ధాశ్రమ నిర్మాణాన్ని ఏ ఒక్కరూ తప్పు పట్టడం లేదు. కానీ, నిరుపేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ఖాళీ చేయించడం, అంతగా ప్రజోపయోగం లేనిచోట ప్రభుత్వ నిధులతో 40 అడుగుల రోడ్డు నిర్మించడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ రోడ్డును చూపించి ఇప్పుడు 30 ఎకరాలు, భవిష్యత్లో 150 ఎకరాలకు వేసే లే అవుట్కు లైన్ క్లియర్ చేసుకోవాలనేదే ఈ సేవ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ అని ఆరోపిస్తున్నారు. ఇదంతా రియల్టర్లు, అధికార పార్టీ నేతల మధ్య కుదిరిన వందల కోట్ల రూపాయల రహస్య ఒప్పందంలో భాగమే తప్ప మరొకటి కాదని అంటున్నారు. -
వృద్ధాశ్రమం పేరుతో
ఎమ్మెల్యే కొడుకు లే అవుట్ వృద్ధాశ్రమం పేరుతో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కుమారుడు వేసిన 30 ఎకరాల లే అవుట్కు లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. జగనన్న లే అవుట్ను కబ్జా చేసి, పేదలను బలవంతంగా వెళ్లగొట్టి రూ.కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. వృద్ధాశ్రమం నిర్మాణాన్ని నాతో సహా అందరం స్వాగతిస్తున్నాం. అవసరమైతే తోడ్పాటు కూడా అందిస్తాం. జి.రాగంపేటకు చెందిన 200 మందికి పైగా పేదలున్న జగనన్న కాలనీలో కనీస సదుపాయాలు కల్పించలేని ఎమ్మెల్యే చినరాజప్ప.. వృద్ధాశ్రమం నిర్మాణం పేరుతో సుమారు రూ.20 లక్షల ప్రభుత్వ నిధులతో 40 అడుగుల సీసీ రోడ్డు నిర్మించడంలో ఆంతర్యమేమిటో సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యే కుమారుడి లే అవుట్ కోసమే ఈ రోడ్డు వేశారు. చంద్రబాబు మాదిరిగానే సంపద సృష్టిస్తామంటూ ఎమ్మెల్యే దోచుకు తింటున్నారు. వృద్ధాశ్రమంతో ఇళ్ల స్థలాలు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయం చూపించాలి. న్యాయం కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. – దవులూరి దొరబాబు, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, పెద్దాపురం -
ఏం ఉద్ధరించారని విజయోత్సవాలు?
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి జిల్లా లో విజయోత్సవ సభలు నిర్వహిస్తు న్నారని, ఈ రెండేళ్లలో ప్రజలను ఏం ఉద్ధరించారని ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారో బహిరంగంగా చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు ప్రశ్నించారు. సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పెన్షన్లు, జీతాలు ఇవ్వడం ప్రతి ప్రభుత్వమూ చేస్తుంది. ఈ రెండేళ్లలో చంద్రబాబు ఓ ప్రాజెక్టు పూర్తి చేశారా? ఒక్క ప్రభుత్వ కళాశాలయినా నిర్మించారా? ఒక్క ప్రభుత్వ సంస్థనైనా నిర్మించారా? విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించారా? కడప స్టీల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చారా? సాగునీటి ప్రాజెక్టులు కట్టారా? నిరంతరం పని చేసే కార్మికుల జీతాలు రూపాయి అయినా పెంచారా? ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులతో తల్లిదండ్రులను దోచుకుంటూంటే అరికట్టరా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచక పాలనే సాగుతోందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని దుయ్యబట్టారు. బీచ్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి, యువతను పక్కదోవ పట్టించడమే అభివృద్ధి అని ఎద్దేవా చేశారు. ‘మీరే బార్లు పెడతారు. తాగి రోడ్ల మీద తిరిగితే మళ్లీ మీరే కేసులు పెడతారు. తాగమనేది మీరే.. మా దగ్గర డబ్బులు దోచుకునేదీ మీరే. ఇదెక్కడి అన్యాయం?’ అని ఆయన నిలదీశారు. రైతు సమస్యలపై 30న చలో విజయవాడ రాష్ట్రంలోని రైతులు రెండేళ్లుగా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని, ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉందని మధు అన్నారు. పంటలకు కనీస మద్దతు ధర లేక సిండికేట్ మార్కెట్ మాయాజాలంలో రైతులు విలవిలలాడుతున్నారని చెప్పారు. అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క కౌలు రైతుకూ ఏ బ్యాంకూ వ్యవసాయ, ఉద్యాన పథకాలు ఇవ్వడం లేదని విమర్శించారు. గత ఎన్నికల ముందు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులు అమలు చేస్తామంటూ మోదీ చెప్పారని, ఇప్పటి వరకూ ఆ ఊసే లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా మన రాష్ట్రంలో కూడా రూ.2 లక్షల వరకూ పంట రుణాలు మాఫీ చేసి, రైతులను ఆత్మహత్యల నుంచి కాపాడాలని, పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇటీవల పెరిగిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, పెట్రోలు, డీజిల్, వ్యవసాయ యంత్ర పరికరాల ధరలను వెంటనే తగ్గించాలని, ఆక్వా రైతులకు రొయ్యల ఫీడ్, సీడ్, మందుల ధరలను తగ్గించాలని, జోన్, నాన్ జోన్ పరిమితులు లేకుండా ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తును 50 పైసలకే అందించాలని, రొయ్యలకు మద్దతు ధర ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పాలకుల కళ్లు తెరిపించడానికి, హక్కుల సాధనకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఈ నెల 30న నిర్వహిస్తున్న చలో విజయవాడ కార్యక్రమానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు, కౌలు రైతులు తరలి రావాలని కోరారు. విలేకర్ల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పి.సత్యనారాయణ పాల్గొన్నారు. ఫ ఈ రెండేళ్లలో ఏమి సాధించారని విజయోత్సవ సభలు ఫ ఎక్కడ చూసినా అరాచకమే.. ఫ కూటమి పాలనపై సీపీఐ నేత మధు విమర్శ -
మైక్రో ఫైనాన్స్ ఏజెంట్ల నుంచి కాపాడాలి
ప్రత్తిపాడు: మైక్రో ఫైనాన్స్ కంపెనీల ఏజెంట్ల వేధింపుల నుంచి తమను కాపాడాలని లంపకలోవ గ్రామానికి చెందిన దశిత మహిళలు ప్రత్తిపాడులో శుక్రవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. రుణాలిప్పిస్తామంటే గ్రామానికి చెందిన రాజాల ఏసురత్నంకు ఆధార్ కార్డుల నకళ్ళు ఇచ్చామని పులగపూరి మరియమ్మ, బొడ్డు సూర్యకళ, మాసా నాగలక్ష్మి, చిన్నం అప్పలరాజు, బొర్రా అర్జమ్మ తదితరులు తెలిపారు. ఏసురత్నం ఇటీవల మృతి చెందడంతో కిర్లంపూడి బంధన్ బ్యాంకు, ప్రత్తిపాడు స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్, ఏలేశ్వరం యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ముథూట్ మైక్రోఫిన్ కంపెనీల ఏజెంట్లు తమ ఇళ్లకు వచ్చి, తాము రుణాలు తీసుకున్నామని, తిరిగి చెల్లించకపోతే అరెస్టు చేయిస్తామంటూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి వేధింపుల నుంచి తమకు విముక్తి కలిగించాలని కోరారు. -
సికిల్సెల్ అనీమియాపై అవగాహన
కాకినాడ క్రైం: ప్రపంచ సికిల్సెల్ అనీమియా నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన డీఎంహెచ్ఓ నరసింహ నాయక్, సిబ్బంది శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత డీఎంహెచ్ఓ కార్యాలయ ఆవరణలో అవగాహన ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. ఎర్రరక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారి రక్తనాళాల్లో అడ్డుగా ఏర్పడతాయని డాక్టర్ నాయక్ ఈ సందర్భంగా తెలిపారు. దీనివలన నొప్పి, రక్తహీనత, అవయవ నష్టం వాటిల్లుతాయని చెప్పారు. గిరిజనుల్లో ఈ సమస్య అధికంగా ఉంటోందన్నారు. సికిల్సెల్ అనీమియా జిల్లా నోడల్ అధికారి డాక్టర్ ఐ.ప్రభాకర్ మాట్లాడుతూ, జిల్లాలో ఏడాది కాలంలో 11,800 మందికి సికిల్సెల్ పరీక్షలు నిర్వహించగా, ఐదుగురిలో వ్యాధి నిర్ధారణ అయిందని చెప్పారు. 63 మందిని వ్యాధి వాహకులుగా గుర్తించామన్నారు. బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ర్యాలీలో డీఎల్ఏటీఓ డాక్టర్ చలమయ్య, డీఐఓ డాక్టర్ కేవీ సుబ్బరాజు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వి.అరుణ, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. -
అదనపు ఎస్పీగా కిషోర్ కుమార్
కాకినాడ క్రైం: జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్)గా మహంతి కిషోర్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎస్పీ బిందుమాధవ్ను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. కాకినాడ ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) డీఎస్పీ వీజీ శ్రీహరి, స్పెషల్ బ్రాంచి డీఎఎస్పీ కేవీవీ సత్యనారాయణ, పరిపాలనాధికారి ఎంవీవీ సత్యనారాయణమూర్తి తదితరులు అదనపు ఎస్పీని కలిసి, అభినందనలు తెలిపారు. టెన్త్ సప్లిమెంటరీలో 97.94 శాతం ఉత్తీర్ణత బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 4,043 మంది హాజరవగా 3,951 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 2,290 హాజరు కాగా 2,248 మంది, బాలికలు 1,744 మందికి 1,703 మంది ఉత్తీర్ణులయ్యారని జిల్లా విద్యా శాఖ అధికారి పిల్లి రమేష్ తెలిపారు. కాగా, ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలకు 1,292 హాజరవగా, 1,068 మంది.. ఇంటర్మీడియెట్ పరీక్షలు 3,087 మంది రాయగా 2,773 మంది ఉత్తీర్ణత సాధించారు. కూటమి ప్రభుత్వానికి బీసీలంటే చిన్నచూపు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వానికి బీసీలంటే చిన్నచూపని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అల్లి రాజబాబు అన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ కుమార్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ యాదవ, బీసీ సంఘాల ఆధ్వర్యాన శుక్రవారం జ్యోతిరావు ఫూలే విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ, రెడ్బుక్ రాజ్యంగంలో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకులకు అణగదొక్కుతున్నారని, ప్రశ్నించే బీసీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ఇటువంటి అక్రమ అరెస్టులకు కేరాఫ్గా నిలుస్తోందని దుయ్యబట్టారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ రోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకూ కాకినాడలోని జిల్లా క్రీడా మైదానంలో యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుందన్నారు. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణ, తాగునీరు తదితర ఏర్పాట్లను పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తొమ్మిది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు రావులపాలెం: ఈతకోట టోల్ప్లాజా వద్ద హైవేపై శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో 9 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసి, రూ.9 వేల అపరాధ రుసుం విధించినట్టు డీటీఓ డి.శ్రీనివాసరావు తెలిపారు. రవాణా శాఖ అధికారులు మొత్తం 22 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు నిర్వహించారన్నారు. -
‘ఫిర్యాదు చేసినప్పుడే సీపీ, డీజీపీ ఎందుకు స్పందించలేదు?’
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీతో పాటు ప్రశ్నించిన వారిని టార్గెట్ చేయడమే మీ పనా? అంటూ కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల భాష సంస్కార హీనంగా ఉందన్నారు. రాజకీయ నాయకుల చెప్పుచేతల్లోకి వెళ్ళిపోయామని పోలీస్ అధికారులే చెబుతున్న పరిస్ధితి నెలకొందని ఆయన ధ్వజమెత్తారు.‘‘సాయికృష్ణ తల్లిదండ్రులు సీపీకి ఫిర్యాదు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు?. సాయికృష్ణ లాకప్ డెత్పై సీఎం, హోం మంత్రి ఎందుకు స్పందించలేదు?. వైఎస్ జగన్ బాధిత కుటుంబం దగ్గరకు వెళ్తే తెల్లారేలోపు ఎఫ్ఐఆర్ వేశారు. మేకప్ కోసం మాజీ మంత్రి అమర్నాథ్కు నోటీసు ఇచ్చిన హోంమంత్రి.. సాయికృష్ణ లాకప్ డెత్ మీద డీజీపీ,సీపీకి ఎందుకు నోటీసు ఇవ్వలేదు’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.‘‘ఆక్వా రంగంలో ఒక మాఫియా తయారైంది. ఫీడ్, సీడ్, ఎగుమతుల్లో మాఫియా. రైతు పరిస్ధితి చాలా దయనీయంగా ఉంది. వైఎస్ జగన్ రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం.. అన్నదాత సుఖీభవ మొదటి సంవత్సరం ఎగొట్టింది. రెండో ఏడాది 7 లక్షల మందికి కోత విధించారు. ఒక్క కౌలు రైతుకు కూడా పెట్టుబడి సాయం అందలేదు. మోంథా తుపాను బాధితులకు ఇవాళ్టీకి సాయం అందించలేదు...రైతులకు సున్నా వడ్డీ ఏదీ?. 393 మంది రైతులు ఒక ఏడాదిలో చనిపోయారని ప్రభుత్వం చెబుతోంది. ఉచిత పంటల బీమా పథకం ఎత్తేశారు. పొగాకు రైతులు ఇవాళ ఒంగోలులో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేస్తున్నారు. రైతులకు కార్డు ఇచ్చి.. యూరియా, ఎరువులకు కోత పెట్టారు. కౌలు రైతులు, గిరిజన రైతులు, దేవాదాయ శాఖ రైతులకు కార్డులు లేవు. వైఎస్ జగన్ తీసుకు వచ్చిన కౌలు గుర్తింపు కార్డులను చంద్రబాబు తుంగలోకి తొక్కేశారు. ఎరువులు కావాలంటే.. రూ.15-20 వేలు పెట్టి రైతులు స్మార్ట్ ఫోన్ కొనాలి. రైతును రోడ్డున పడేశారు. ఎరువు కావాలన్న.. విత్తనం కావాలన్న ఎవర్నికలవాలో తెలియదు. రైతులకు ఏం కావాలో తెలుసుకోకుండా.. మేకప్లపై డిస్కషన్లు పెడుతున్నారు’’ అంటూ కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఈ యాప్ వద్దు
గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీవీ నరసింహరావు ఉన్న సమయంలో యూరియా లేదు. రైతుల పరిస్థితి అప్పటి కంటే ఇప్పుడు మరింత అధ్వానంగా ఉంది. ఒకవైపు ప్రకృతి ఇబ్బందులకు గురి చేస్తూంటే.. వారిని మరిన్ని కష్టాల్లోకి నెట్టేలా యాప్ ప్రవేశపెట్టడం సరికాదు. చదువుకోని రైతులకు యాప్ ఏవిధంగా అర్థమవుతుంది? ఈ యాప్ వద్దు. ప్రభుత్వం మొండిగా దీనిని కొనసాగిస్తే ఎరువుల కొనుగోలు బంద్ చేసి, క్రాప్ హాలిడే ప్రకటిస్తాం. మద్దతు ధర మొక్కుబడిగా పెంచి, ఎరువుల ధరలను విపరీతంగా పెంచుతున్నారు. – పైణ్ని చిట్టియ్య, రైతు, సామర్లకోట ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం ఏ విషయంలోనూ రైతుల నుంచి ఇంత వ్యతిరేకత రాలేదు. ఈ యాప్ను రైతులు వ్యతిరేకిస్తున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. యాప్పై అవగాహన పెంచుకుంటే మేలు జరుగుతుంది. రైతులు కోరుకుంటే సిబ్బందిని సొసైటీ వద్ద ఉంచి యాప్పై అవగాహన కల్పిస్తాం. ఇతర రాష్ట్రాల్లో ఉండే రైతుల ఓటీపీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. స్మార్ట్ఫోన్ లేకపోయినా ఇబ్బంది లేదు. – వి.మురళీధర్, వ్యవసాయాధికారి, సామర్లకోట -
జీజీహెచ్లో అనుమానాస్పదంగా రోగి మృతి
కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్లో చికిత్స పొందుతున్న ఓ రోగి అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ గ్రామీణం మండలం పనసపాడు గ్రామంలో తన పెద్ద కుమారుడు రమేష్ ఇంట్లో నివాసం ఉంటున్న నర్ల వెంకటరమణ (71) జ్యూట్మిల్ కార్మికుడిగా పనిచేసేవాడు. అనారోగ్యానికి గురికావడంతో ఈ నెల 12న చిన్న కుమారుడు సతీష్ కాకినాడ జీజీహెచ్కు తీసుకువచ్చాడు. వైద్యులు పరీక్షించి టీబీ ఉందని నిర్ధారించి అడ్మిట్ అవ్వాలని చెప్పారు. దీంతో వెంకటరమణను 13న ఈఎన్టీ భవంతిలో ఉన్న టీబీ వార్డులో చేర్చారు. అప్పటి నుంచి తండ్రికి సతీష్ సాయంగా ఉంటున్నాడు. బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వెంకటరమణ అచేతనంగా తన మంచంపై నుంచి కింద పడి ఉండడం, అతడి మెడకు ఆక్సిజన్ ట్రాన్స్ (ప్రాణవాయువు అందించే సైలెన్ వంటి పైపు) బిగించి ఉండడాన్ని సహ రోగులు గమనించారు. అప్పటికి కుమారుడు సతీష్ వార్డు బయట ఉన్నాడు. దీంతో వారు సతీష్కి సమాచారం అందించారు. వైద్యులు వచ్చి పరీక్షించే సరికి అప్పటికే వెంకటరమణ మృతి చెందాడని నిర్ధారించారు. ఈ మృతి అనుమానాస్పదంగా ఉండడంతో ఆసుపత్రి అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్ఎంఓ డాక్టర్ మెహర్ వార్డును సందర్శించి సహ రోగులను ఆరా తీశారు. తనకు ఆక్సిజన్ అందిస్తున్న ట్రాన్స్ (పైప్)ను సైలెన్ స్టాండ్కు కట్టి మెడకు చుట్టుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అత్యంత బలహీనంగా ఉన్న ప్లాస్టిక్ పైప్తో మెడకు బిగించి ఉరి వేసుకోవడం, అందుకు తన కంటే తక్కువ ఎత్తు ఉన్న స్టాండ్ ఉపయోగించినట్లు కనిపించడం, అప్పటివరకు కుమారుడు అక్కడే ఉండడం, రాత్రి 1.30 సమయానికి అతడికి ఫోన్ రావడం, వార్డు నుంచి బయటకు వెళ్లి మాట్లాడడం వంటి అంశాలు సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలాయని వారన్నారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని తెలిపారు. మృతుడికి భార్య మణి ఉంది. -
ఆక్వా రైతులను ఆదుకోవాలి
● మేత ధరలు తగ్గించాలి ● మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్ కాకినాడ రూరల్: రొయ్యల మేత ధరలను తక్షణం పూర్తి స్థాయిలో తగ్గించి, ఆక్వా రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాల సమన్వయకర్త కురసాల కన్నబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ రమణయ్యపేట వైద్యనగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఫీడ్, సీడ్, ఎగుమతుల వరకూ కొంత మంది చేతిలో మాఫియాలా ఆక్వా రంగం మారిపోయిందని మండిపడ్డారు. ఫిబ్రవరిలో కేజీ మేతపై రూ.4, జూన్లో ఏకంగా రూ.10 పెంచారని, దీనిపై ఆక్వా రైతులు ఆందోళన చేస్తున్నారని అన్నారు. వారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి, తమ గోడు వెళ్లబోసుకున్నారని చెప్పారు. జూలైలోగా మేత రేట్లు తగ్గించకుంటే ఆందోళనకు దిగుతామని ఆ సందర్భంగా జగన్ అల్టిమేటమ్ ఇచ్చారన్నారు. కృష్ణలంకలో లాకప్ డెత్ జరిగితే, ఆ కుటుంబంతో బేరాలాడుతున్నారని, ఇక్కడేమో రొయ్యల మేత కంపెనీలతో బేరాలాడి ధర కేజీకి కేవలం రూ.4 తగ్గించారని అన్నారు. కిలోకు రూ.14 పెంచి ఆక్వా రైతులను నాశనం చేస్తున్నారని, పెంచిన ధరలు వెంటనే పూర్తి స్థాయిలో తగ్గించాలని, కేవలం రూ.4 తగ్గించామని, అదే ఘన విజయమని ప్రభుత్వం చెప్తే కుదరదని స్పష్టం చేశారు. ఆక్వా రంగం ప్రభుత్వ సహాయంతో ఎదిగిన పరిశ్రమ కాదని, దానిని కూడా బేరసారాలకు దింపేసి రైతులను మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నింటికీ డైవర్షన్ పాలిటిక్సే ప్రస్తుతం రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ న్యూస్ మాత్రమే చూస్తున్నామని కన్నబాబు అన్నారు. చిన్న సమస్య వస్తేనే తల్లడిల్లిపోయే చంద్రబాబు మీడియా, వారి మద్దతుదారులు.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘటన జరిగేసరికి రకరకాలుగా స్పందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోం మంత్రి మేకప్ గురించి ఏదో అన్నారంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై విరుచుకు పడ్డారని, రికార్డులు తీస్తే చింతమనేని నుంచి బండారు సత్యనారాయణమూర్తి వరకూ అందరూ బయటకు రావడంతో ఆ విషయాన్ని వదిలేశారని అన్నారు. లాకప్ డెత్ గురించి మాట్లాడవల్సిన వారు పేకప్ గురించి మాట్లాడారన్నారు. డీఎస్సీ అక్రమాలను వెలుగులోకి తెస్తే జగన్మోహన్రెడ్డి ఇంటి ముందుకు వచ్చి, తొడ కొడుతున్నానన్నట్టుగా లోకేష్ ప్రగల్భాలు పలికారన్నారు. డీఎస్సీ అక్రమాలపై లోకేష్తో చర్చకు సిద్ధమని తాను చెప్పి 24 గంటలు గడిచినా విద్యా శాఖ మంత్రిగా లోకేష్ ఎందుకు స్పందించలేదని కన్నబాబు ప్రశ్నించారు. -
ఉర్రూతలూగించిన నాటక ప్రదర్శనలు
ఫ వానపల్లిలో ప్రముఖ రంగస్థల నటుల సందడి ఫ వందలాదిగా తరలివచ్చిన కళాభిమానులు కొత్తపేట: మండలంలోని వానపల్లి శ్రీభద్రాద్రి సీతారామస్వామివారి ఆలయం వద్ద బుధవారం రాత్రి పౌరాణిక నాటక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, పళ్లాలమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ కామిశెట్టి అమ్మన్న నాయుడు, పద్మావతి దంపతులు సుమారు రూ.20 లక్షలతో రామాలయాన్ని పునర్నిర్మించారు. బుధవారం విగ్రహాల ప్రతిష్ఠను పురస్కరించుకుని పౌరాణిక నాటకాలను, ఆ కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా ఆలయ నిర్మాత అమ్మన్న నాయుడు ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్న ప్రముఖ నటులను ఏరికోరి ఆయా పాత్రలకు కూర్చారు. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పౌరాణిక రంగస్థల కళాకారులుగా రాణిస్తున్న నటీనటులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ వ్యయంతో సత్యహరిశ్చంద్ర (వారణాసి, కాటి సన్నివేశం), రామాంజనేయ యుద్ధం నాటక ప్రదర్శనలు ఇచ్చారు. వారణాసి సన్నివేశం నుంచి ప్రస్తుత మూడో తరం నటుల్లో రంగస్థల రారాజుగా గుర్తింపు పొందిన జూనియర్ డీవీ సుబ్బారావు హరిశ్చంద్రునిగా, రంగస్థల కోకిలగా ఖ్యాతి పొందిన రత్నశ్రీ చంద్రమతిగా, నక్షత్రకునిగా లతాశ్రీ , వీరబాహుడిగా సత్యప్రసాద్ తదితరులు తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. యువకులు సైతం ఆ రాగాలాపనలో లీనమైపోయి ఈలలు, కేరింతలతో కళాకారులను ఉత్సాహపరిచారు. డీవీ సుబ్బారావు, రత్నశ్రీ ఉన్నత శృతిలో ఆలపించిన పద్యాలను గమనిస్తే రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాలను తలపించాయి. ఇవి అందరినీ ఆకట్టుకున్నాయి. పోటాపోటీగా తండ్రీ తనయులు రామాజంజనేయ యుద్ధం నాటకంలో ఆంజనేయుడి పాత్ర అంటే గుర్తువచ్చే పేరు పేపకాయల లక్ష్మణరావు (సంపత్ నగర్). నంది అవార్డు గ్రహీత, అభినవ ఆంజనేయునిగా పేరొందిన లక్ష్మణరావు తనయుడు రామాంజనేయులు రాముడిగా, మనుమడు జూనియర్ లక్ష్మణరావు ఆంజనేయుడిగా యుద్ధ సన్నివేశంలో నువ్వా.. నేనా అన్నట్టు పోటాపోటీగా నటించారు. పద్యాలు ఆలపించి ప్రేక్షకులను మెప్పించారు. కళాభిమానులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి గురువారం ఉదయం వరకూ ఉండి ప్రదర్శనలను తిలకించారు. అనంతరం రంగస్థల నటులను అమ్మన్న నాయుడు ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల ప్రముఖులు ఘనంగా సత్కరించారు. బిళ్లకుర్రు మాజీ సర్పంచ్ నెల్లి లక్ష్మీపతిరావు, ట్రాన్స్కో డీఈఈ రామకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి బండారు దొరబాబు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం, ప్రముఖ వ్యాపారవేత్తలు గొలకోటి సోమరాజు, సింగిరెడ్డి గోవిందస్వామి, చీకట్ల నాని తదితరులు పాల్గొన్నారు. -
రాళ్లు కట్టి చెరువులో పడేసి..
ఫ ఆక్వా రైతు దారుణ హత్య ఫ కూలీలపైనే అనుమానం ఫ కోనసీమ జిల్లాలో కలకలం ఐ.పోలవరం: దాడి చేసి, ఆపై రాళ్లతో కట్టి చెరువులో ఓ ఆక్వా రైతును పడేసి దారుణంగా హత్య చేశారు. అక్కడ పనికి వచ్చిన వారే ఈ ఘటనకు పాల్పడినట్టు స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మురమళ్లకు చెందిన ఆక్వా రైతు దాట్ల కృష్ణంరాజు అనే లొల్ల కృష్ణ (64) బుధవారం రాత్రి తన సొంత చెరువుల వద్ద హత్యకు గురయ్యాడు. కొత్త మురమళ్ల వద్ద ఉన్న తన సొంత ఆక్వా చెరువుల వద్దకు సాయంత్రం నాలుగు గంటలకు వెళ్లాడు. ఎంత సేపటికీ రాకపోవడం, సెల్ఫోన్ స్విచ్ఛాప్ అని వస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సహకారంతో అతని వెతికేందుకు ఆక్వా చెరువుల వద్దకు వెళ్లారు. అక్కడ చెప్పులు, రక్తపు మరకలు కనిపించాయి. కాని రైతు కృష్ణంరాజు జాడ తెలియలేదు. ఇదే సమయంలో చెరువుల వద్ద పనిచేస్తున్న కూలీలు కనిపించలేదు. వారికి ఫోన్ చేయగా, రైతు కృష్ణంరాజు తమకు రూ.ఏడు వేల సొమ్ము ఇచ్చేశారని, ఇంటికి వెళ్లిపోతున్నామని, ఆయన గురించి తమకేమీ తెలియదని చెప్పారు. కృష్ణంరాజు మోటారు సైకిల్ మురమళ్ల ఇరిగేషన్ రెగ్యులేటర్ వద్ద కనిపించింది. ఇవన్నీ చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, వారికి అనుమానం వచ్చి చెరువులో వెతుకులాట ప్రారంభించారు. చెరువులో అతని మృతదేహం లభ్యమైంది. అన్ని కోణాల్లో విచారణ కృష్ణంరాజు మృతదేహాన్ని చూస్తే కొట్టి చంపి, రాళ్లు కట్టి రొయ్యల చెరువులో పడేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక్కడ పనికి వచ్చిన వారే ఈ దుర్ఘటనకు పాల్పడినట్టు ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం. పది రోజుల క్రితమే ఆ కూలీలు ఇక్కడ పనిచేసేందుకు వచ్చినట్టు తెలిసింది. పైగా వీరికి గంజాయి తాగే అలవాటు ఉందని అనుమానంతో పోలీసులు ఆ కోణంలోనూ విచారిస్తున్నారు. విశాఖ జిల్లా కొయ్యూరు ప్రాంతానికి చెందిన కూలీలుగా పోలీసులు నిర్ధారించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చెరువు వద్ద కృష్ణంరాజుకు పని చేసేందుకు వచ్చిన వారి మధ్య అరుపులు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్ కుమార్, ఐ.పోలవరం ఎస్సై రవీంద్రబాబు ఘటనా స్థలానికి వచ్చి హత్య జరిగిన తీరును పరిశీలించారు. కృష్ణంరాజు హత్య ఘటనలో కూలీలపైనే బలమైన అనుమానం ఉందని జిల్లా డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. ఘటన అనంతరం పనివారు తమ నివాసాన్ని ఖాళీ చేసి పరారైనట్లు గుర్తించామన్నారు. వారిని పట్టుకునేందుకు విజయవాడ నుంచి ఎఫ్ఎస్ఎల్ బృందాన్ని రప్పించామన్నారు. బయటి వ్యక్తులే అధికం ఈ హత్య ఘటన జిల్లాలో ఆక్వా రైతుల్లో కలవరం రేపింది. ఆక్వా చెరువుల వద్ద స్థానిక కూలీల కన్నా కాకినాడ జిల్లాతో పాటు ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన వారు, ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన స్థానికేతరులు అధికంగా ఉంటున్నారు. 90 శాతానికి పైగా వీరే కావడం గమనార్హం. గత ఏడాది నవంబరు 19న రావులపాలెంలో మావోయిస్టు సరోజ్ మడవి (మాడ్వీ హాంధా)ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతను మావోయిస్టు అగ్రనేత మాద్వి హిడ్మాకు అనుచరుడు. అదే సమయంలో మావోయిస్టుల కమ్యూనికేషన్ కమాండర్గా పనిచేశాడు. కోనసీమలో దాచుకోవడానికి వచ్చిన ఆయన సఖినేటిపల్లిలో ఆక్వా చెరువుల వద్ద సుమారు ఆరు నెలల పాటు పనిచేశాడు. అతని అరెస్టుతో అప్పట్లో ఆక్వా రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తాజాగా కృష్ణంరాజు హత్యతో మరోసారి ఉలిక్కిపడ్డారు. స్థానిక కూలీల కంటే సగం ధరకే ఇతర ప్రాంతాల వాసులు చెరువుల వద్ద పనులకు రావడం, వారు 24/7 చెరువుల వద్దనే నివాసముండి పనిచేయడంతో ఆక్వా రైతులతో పాటు పీచు ఉత్పత్తిదారులు వీరిపైనా ఆధారపడుతున్నారు. అయితే పనులకు పెట్టుకుంటున్న వారి ఆధార్, ఇతర గుర్తింపు కార్డు లు చూడకుండా, కనీసం తెలుసున్న జట్టు మేస్త్రితో సంబంధం లేకుండా నేరుగా కూలీలను నియమిస్తే ప్రమాదమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై కలేక్టరేట్లో గురువారం జరిగిన జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఇటుక బట్టీలు, క్వారీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో ముమ్మరంగా తనిఖీలు చేయాలన్నారు. రైల్వే స్టేషన్లు, ప్రధాన దేవాలయాల వద్ద భిక్షాటన చేస్తున్న బాలబాలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. గత ఏడాది 14 ఏళ్ల లోపు 9 మంది బాల కార్మికులను, 34 మంది కౌమారదశ కార్మికులను గుర్తించామని తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకూ నలుగురు బాల కార్మికులను, ఐదుగురు కౌమారదశ కార్మికులను గుర్తించి, పునరావాసం కల్పించామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎన్.బుల్లిరాణి, విద్య, పోలీస్, మహిళా, శిశు సంక్షేమ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఫస్టియర్ పరీక్షలకు 2,131 మంది విద్యార్థులు హాజరవగా 1,015 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం జనరల్ 60 శాతం ఒకేషనల్ 76 శాతం ఉత్తీర్ణత సాధించారని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యా శాఖ అధికారి వి.కేశవరావు తెలిపారు.ద్వారకా తిరుమల.. అ‘ద్వితీయం’ ద్వారకా తిరుమల: రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాలకు వచ్చే భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సర్వేలో ద్వారకా తిరుమల దేవస్థానానికి రెండో ర్యాంకు దక్కింది. ప్రతి నెలా వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా దర్శనం, తాగునీటి వసతులు, ప్రసాదం రుచి, పారిశుధ్యం అంశాలపై ప్రభుత్వం సర్వే చేస్తోంది. ఇందులో గత నెల అన్ని అంశాల్లోనూ మొదటి ర్యాంక్ సాధించిన ద్వారకా తిరుమల దేవస్థానం, జూన్ నెలకు సంబంధించి ఈ నెల 16న వెలువడిన సర్వేలో ఓ మెట్టు దిగి, ద్వితీయ స్థానంలో నిలిచింది. దర్శనం, సౌకర్యాల కల్పన, ఇతర అంశాల్లో శ్రీకాళహస్తి 1, ద్వారకా తిరుమల 2, 3, సింహాచలం 4, 5, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం 6, శ్రీశైలం 7 (చివరి) స్థానాలు సాధించాయి. -
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ కవి మృతి
పి.గన్నవరం : రాజవరం – పొదలాడ రోడ్డులో బెల్లంపూడి గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రావులపాలెం ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న ప్రముఖ కవి కొప్పాడి శ్రీనివాస్ (47) మృతి చెందారు. పి.గన్నవరం మండలం పోతవరం గ్రామానికి చెందిన శ్రీనివాస్ ముమ్మిడివరం ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆయన పలు కవిత్వాలు రాశారు. కొన్ని తెలుగు ఆల్బమ్స్కు పాటలు కూడా రాశారు. గురువారం రాజమహేంద్రవరం నుంచి నుంచి పోతవరం గ్రామంలోని స్వగృహానికి మోటార్ సైకిల్పై వస్తుండగా, బెల్లంపూడి వద్ద అదుపుతప్పి కొబ్బరి చెట్టును ఢీకొని పడిపోయారు. దీంతో అతనికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు భార్య ఉషారాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరితో మంచిగా ఉండే కవి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ తెలిపారు. -
యాప్సోపాలు
సామర్లకోట: ‘‘మాలో సగం మంది నిరక్షరాస్యులే.. అధిక శాతం కౌలు చేస్తున్న వాళ్లే.. స్మార్ట్ ఫోన్లపై మాలో చాలా మందికి అవగాహలేదు. అటువంటి మాకు అవసరమైన మొబైల్ యాప్ ద్వారానే ఎరువులు ఇస్తామనడమేమిటి? ఈ ‘యాప్’సోపాలు మావల్ల కాదు. ఇదే విధానం కొనసాగిస్తే క్రాప్ హాలిడే ప్రకటించడం తప్ప మరో మార్గం లేదు’’ అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్స్ సేల్స్’ పేరిట ఓ మొబైల్ యాప్ను రూపొందించింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. శాస్త్రవేత్తలు సూచించినప్పుడు వారు చెప్పిన పరిమాణంలో ఈ యాప్ ద్వారా మాత్రమే రైతులకు ఎరువులు సరఫరా చేస్తామని స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం రైతులు ఖరీఫ్ సాగు సన్నాహాల్లో ఉన్నారు. పలువురు నారుమళ్లు, దమ్ముల్లో బిజీగా ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఎరువుల యాప్పై అవగాహన పెంచుకోవాలంటూ వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ప్రభుత్వం రైతులపై ఒత్తిడి తెస్తోంది. సర్కారు తీరుపై మండిపడుతున్న రైతులు సామర్లకోటలో రోడ్డెక్కారు. యాప్ ద్వారా ఎరువుల విక్రయానికి వ్యతిరేకంగా సామర్లకోటలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ) వద్ద గురువారం ధర్నా చేశారు. అక్కడి నుంచి నీలమ్మ చెరువు, మఠం సెంటర్ మీదుగా స్థానిక స్టేషన్ సెంటర్లోని గడియారం స్తంభం వద్దకు పాదయాత్ర నిర్వహించారు. గడియారం స్తంభం వద్ద మూడు రోడ్ల కూడలిలో దాదాపు అరగంట పాటు రాస్తారోకో చేశారు. రైతుల ఆందోళనతో పెద్దాపురం – పిఠాపురం, కాకినాడ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం తెలియడంతో ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వ్యవసాయ అధికారులు వచ్చేంత వరకూ ఆందోళన విరమించేంది లేదని రైతులు స్పష్టం చేశారు. ఏఓ రావాలని నినాదాలు చేశారు. అనంతరం అక్కడకు వచ్చిన సామర్లకోట వ్యవసాయాధికారి (ఏఓ) వి.మురళీధర్కు వినతిపత్రం అందజేశారు. ఎన్నో ఇబ్బందులు ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ, సాగుదార్లలో 50 శాతం మంది నిరక్షరాస్యులేనని అన్నారు. వీరికి టచ్ ఫోన్లు ఉపయోగించడంపై అవగాహన లేదని చెప్పారు. అలాగే, కౌలు రైతులే ఎక్కువగా ఉన్నారని, అసలైన రైతులు ఇతర ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్నారని తెలిపారు. యాప్ ద్వారా ఎరువులు బుక్ చేస్తే ఓటీపీ ఎక్కడో ఉన్న రైతులకు వెళ్తుందని, వారు ఏవిధంగా ఓటీపీ చెబుతారని ఏఓను నిలదీశారు. ఈ పరిస్థితుల్లో యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు తమకు సమస్యగా మారుతుందని చెప్పారు. యాప్ వద్దని, పాత పద్ధతే ముద్దని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. గతంలో మాదిరిగానే ఎకరానికి ఐదు బస్తాల యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరితో పాటు గడ్డి పండించుకోవడానికి ఎకరాకు మూడు బస్తాలిస్తే ఏవిధంగా సరిపోతాయని ప్రశ్నించారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఆందోళనలో రైతులు వల్లూరి వెంకట రమణ, బోళ్ల అప్పారావు, కోడూరి సూరిబాబు, నేతల హరిబాబు, మూతిన రాజు, చలికి వెంకట్రావు, బలుసు వీరభద్రరావు, మున్నియ్య, వట్టికూటి గోపి, సత్తి కొండలరావు, సిరట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. మావల్ల కాదు ఎరువులకు యాప్ వద్దు పాత పద్ధతిలోనే ఇవ్వాలి లేకపోతే క్రాప్ హాలిడే రైతుల హెచ్చరిక సామర్లకోటలో నిరసనాగ్రహం -
వెంకన్న హుండీ ఆదాయం రూ.2.44 కోట్లు
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా 34 రోజులకు రూ.2.44 కోట్ల ఆదాయం లభించిందని ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరావు తెలిపారు. దేవదాయ శాఖ పర్యవేక్షణాధికారులు సహాయ కమిషనర్, మందేశ్వర స్వామి ఆలయ ఈఓ దారపు రెడ్డి సురేష్బాబు, దేవదాయ శాఖ రాజమహేంద్రవరం తనిఖీదారు ఎస్టీపీటీ శ్రీనివాస్, గ్రూపు దేవాలయాల ఈఓలు, ఆత్రేయపురం బి.నరేంద్ర, వెలిచేరు ఎం.సత్యనారాయణల సమక్షంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించామని పేర్కొన్నారు. ప్రధాన హుండీలు, విశ్వేశ్వరస్వామి ఆలయ హుండీలతో కలిపి రూ.1.77 కోట్లు, అన్నప్రసాద హుండీల ద్వారా రూ.66.55 లక్షల ఆదాయం లభించిందని వివరించారు. అలాగే, 52 గ్రాముల బంగారం, 1.588 కిలోల వెండి, 18 దేశాలకు చెందిన 77 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయని తెలిపారు. -
గ్యాస్లో రాష్ట్రానికి 50 శాతం ఇవ్వాలి
మామిడికుదురు: రూ.లక్షల కోట్లు కార్పొరేట్కు, నిద్ర లేని రాత్రులు కోనసీమ ప్రజలకు అన్నట్లు పరిస్థితి తయారైందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక కన్వీనర్ యరసూరి మహదేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా – గోదావరి బేసిన్ సహజ వాయువు – సహజ వనరుల పరిరక్షణ ఐక్య వేదిక పేరిట వారు నగరం గ్రామంలో గురువారం పర్యటించారు. ఓఎన్జీసీ గ్యాస్ కలెక్షన్ స్టేషన్ (జీసీఎస్) గేటు ఎదుట ధర్నా చేశారు. నగరం గ్రామాన్ని దత్తత తీసుకోవాలని, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని, గ్రామానికి 8 శాతం రాయల్టీ ఇవ్వాలని, పీహెచ్సీని 100 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ, నాటి పాశర్లపూడి బ్లో అవుట్, నగరం విస్ఫోటం, ఇరుసుమండ గ్యాస్ ప్రమాదం వంటి సంఘటనలతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఈ ప్రాంత, రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా రాజకీయ పార్టీలకు అతీతంగా తాము పోరాటం చేస్తున్నామన్నారు. గ్యాస్ వల్ల వస్తున్న సంపదలో 50 శాతం మన రాష్ట్రానికి ఇవ్వాలని, ఇటువంటి సహజ వనరులు ప్రభుత్వాల చేతుల్లో ఉండాలని, కార్పొరేట్ సంస్థల కబంధ హస్తాల్లో ఉండకూడదన్నదే తమ పోరాటం ఉద్దేశమని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్రానికి 8 శాతం రాయల్టీ ఇవ్వాలన్నారు. దీనిపై ప్రధాని మోదీకి వేదిక తరఫున అర్జీ పంపించామన్నారు. ఈ సందర్భంగా ‘ఆంధ్ర చమురు నిక్షేపాలు – అంబానీ పాలు’, ‘కృష్ణా – గోదావరి గ్యాస్ మన హక్కు’ పుస్తకాలను నాయకులు ఆవిష్కరించారు. -
బీచ్ షాక్స్ వద్దు
సాగర తీరంలో బీచ్ షాక్స్ పేరిట మద్యం విక్రయాలకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కాకినాడకు చెందిన సామాజిక కార్యకర్త దూరస్లపూడి రమణరాజు నిరసించారు. కాకినాడ సూర్యారావుపేట న్యూ ఎన్టీఆర్ బీచ్లో ‘బీచ్ షాక్స్ వద్దు! సముద్ర తీరాల్లో యువత భవిష్యత్తు పాడు చేయవద్దు’ అంటూ ఫ్లెక్సీ ప్రదర్శించి, గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2024–25లో 362 లక్షల కేసులు 2025–26లో 414 లక్షల కేసుల మేర మద్యం అమ్మకాలు జరిగాయన్నారు. మద్యం ఆదాయం రూ.44 వేల కోట్లు దాటిందని, సిండికేట్ అధిక ధరలకు మద్యం విక్రయిస్తోందని, సరిహద్దు నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగిపోయిందని చెప్పారు. మద్యం వలన 15 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్కులు ఎక్కువ ప్రభావితమవుతున్నారని, బీచ్ రోడ్లు, జాతీయ రహదారుల్లో మద్యం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. కాకినాడ మీదుగా రూ.150 కోట్లు పైగా గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో బీచ్ షాక్స్ ఏర్పాటు వలన పరిస్థితి మరింత దిగజారుతుందని రమణరాజు ఆందోళన వ్యక్తం చేశారు. – కాకినాడ రూరల్ -
డిగ్రీ ఖాళీశాలలు
పిఠాపురం ప్రభుత్వం డిగ్రీ కళాశాలజిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 7విద్యార్థులు 6,500కంప్యూటర్ కోర్సులు చదువుతున్న వారు 1,200● ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో గురువుల కరువు ● కోర్సులు ప్రారంభించిన పోస్టులు మంజూరు చేయని సర్కారు ● సరైన బోధన లేక విద్యార్థుల అవస్థలు పిఠాపురం: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టుగా తయారైంది ప్రభుత్వ విద్యా విధానం. ఉన్నత విద్యలో ఆర్భాటంగా కొత్త కోర్సులు ప్రారంభించేస్తున్న ప్రభుత్వం.. అందుకు తగినట్టుగా బోధన సిబ్బందిని మాత్రం నియమించడం లేదు. తాళము వేసితిని.. గొళ్లెము మరచితిని అన్న చందంగా అధ్యాపక పోస్టుల మంజూరులో మీనమేషాలు లెక్కిస్తోంది. ఫలితంగా బోధించే గురువులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా కాకినాడ, పిఠాపురం, పెరుమాళ్లపురం, తుని, ఏలేశ్వరం, జగ్గంపేట, పెద్దాపురాల్లో ఏడు డిగ్రీ కళాశాలలున్నాయి. వీటితో పాటు పెద్దాపురం ఎంఆర్, కాకినాడలో ఎంఎసెన్ చారిటీస్ ఎయిడెడ్ కళాశాలలు కూడా ఉన్నాయి. వీటిల్లో సుమారు 7 వేల మంది విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. ఈ కళాశాలల్లో బీఏ ఆనర్స్ ఎకనామిక్స్, బీకాం ఆనర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ ఆనర్స్ కెమిస్ట్రీ, బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ ఆనర్స్ జువాలజీ తదితర గ్రూపులు నిర్వహిస్తున్నారు. అయితే, చాలా కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా అధ్యాపకులు లేరు. మామూలు కోర్సులకే అరకొరగా అధ్యాపకులు ఉండగా.. కంప్యూటర్ కోర్సులకు చాలా కళాశాలల్లో అసలు అధ్యాపకులే లేని దుస్థితి నెలకొంది. దీంతో, సరైన బోధన లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కోర్సులున్నా పోస్టులు సున్నా ● డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సులు ప్రారంభిస్తున్న ప్రభుత్వం వాటిని బోధించే అధ్యాపక పోస్టులు మాత్రం మంజూరు చేయడం లేదు. ● పిఠాపురం డిగ్రీ కళాశాలలో బీకాం ఆనర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులకు ముగ్గురు అధ్యాపకులుండాలి. కానీ, ఒక్కరు కూడా లేరు. అసలు ఈ కోర్సులకు అధ్యాపక పోస్టులు మంజూరు చేయకపోవడం విచిత్రం. గత్యంతరం లేక ఫ్యాకల్టీలతో బోధించాల్సిన దుస్థితి నెలకొంది. పోస్టులు మంజూరు చేస్తే తప్ప ఇక్కడ అధ్యాపకుల నియామకం సాధ్యం కాదు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదే కళాశాలలో బీఎస్సీలో ప్రతి మేజర్ కోర్సుకు కనీసం మూడు పోస్టులుండాలి. కానీ, ఒక్క పోస్టు మాత్రమే ఉంది. బీఏలో ప్రతి మేజర్ కోర్సుకు రెండు పోస్టులకు గాను ఒక్కటి మాత్రమే ఉంది. ● ఏలేశ్వరం, జగ్గంపేటల్లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కంప్యూటర్ కోర్సులకు 9 పోస్టులు ఉండాలి. కానీ, ప్రభుత్వం ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. బీఎస్సీలో 6, బీఏలో 3 చొప్పున పోస్టులు మంజూరు కావాల్సి ఉంది. ● ఇక స్వీపర్లు, స్కావెంజర్లు, వాచ్మెన్ వంటి నాన్ టీచింగ్ సిబ్బంది ఒక్కో కళాశాలకు కనీసం ఆరుగురు అవసరం. వారిని నియమించకపోవడంతో ఆయా కళాశాలల్లో విద్యార్థులే ఈ పనులు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి పలుమార్లు నివేదికలు పంపినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బోధించే వారు లేకపోతే నేర్చుకునేదెలా? ప్రైవేటు విద్యాసంస్థలను ప్రోత్సహించేలా ప్రభుత్వ విద్యా విధానాలున్నాయి. కంప్యూటర్ కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీల్లో అధ్యాపకులు లేకపోవడం సిగ్గుచేటు. మామూలు కోర్సులైతే పుస్తకాలు చదివి నేర్చుకోవచ్చు. కంప్యూటర్ కోర్సులు బోధించే వారు కూడా లేకపోతే విద్యార్థులు ఎలా నేర్చుకుంటారు? పరీక్షలు ఎలా రాయగలుగుతారు? కాలేజీల్లో కోర్సులు ప్రవేశపెడుతున్న ప్రభుత్వం.. వాటికి సంబంధించిన పోస్టులు మంజూరు చేయకపోతే చదువెలా సాగుతుంది? కాలేజీల్లో నాన్ టీచింగ్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడంతో విద్యార్థులే ఇతర పనులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే తగినన్ని పోస్టులు మంజూరు చేయకపోతే ఉద్యమించక తప్పదు. – ఎం గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి, కాకినాడ ప్రభుత్వానికి నివేదించాం నూతన కళాశాల భవనం అందుబాటులోకి వచ్చాక పూర్తి స్థాయిలో క్లాసులు ప్రారంభించాం. కళాశాలలో కంప్యూటర్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు సుమారు 130 మంది ఉన్నారు. ఈ కోర్సుకు అధ్యాపకులు లేక ఫ్యాకల్టీల ద్వారా బోధన చేయిస్తున్నాం. ఇతర కోర్సుల్లోనూ అధ్యాపకుల కొరత ఉంది. అధ్యాపకులను నియమించాలని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. త్వరలోనే పోస్టులు మంజూరు చేస్తారని భావిస్తున్నాం. నాన్ టీచింగ్ సిబ్బంది ఎవరూ లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. – డాక్టర్ పి.సుభాషిణి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పిఠాపురం -
‘రెడ్బుక్ రాజ్యాంగం నిజ స్వరూపం బయటపడింది’
సాక్షి, కాకినాడ జిల్లా: రెడ్ బుక్ రాజ్యాంగం నిజ స్వరూపం బయటపడిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులను విచ్చలవిడిగా చేతిలో అస్త్రంలా టీడీపీ వాడుకొంటోంది. విజయవాడ లాకప్ డెత్ ఘటన.. చట్టాలు, మానవ హక్కులు లేవని చెప్పింది. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ మాట్లాడితే కులం రంగు పులుముతున్నారని ఆయన మండిపడ్డారు.‘‘లాకప్ డెత్ మానవ హక్కులకు సంబంధించిన విషయం. దీంట్లో కులాల్ని, మతాలను తీసుకువచ్చి ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా సొంత మీడియా రంగంలోకి వచ్చేసింది. లాకప్ డెత్ ఇష్యూలో పవన్ కళ్యాణ్ను ఇరికించాలని వైఎస్ జగన్ మాకు ఆదేశించినట్లు.. దానికి పర్యవేక్షణ బాధ్యత నాకు ఇచ్చినట్లుగా ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. పవన్ను ఇరికించాలని వైఎస్ జగన్ ఎందుకు అంటారు?. వైఎస్సార్సీపీకి ఏం సంబంధం?’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు చూసే హోం మంత్రి, ముఖ్యమంత్రి లాకప్ డెత్ ఘటనకు బాధ్యులు. వీరితో పాటుగా డీజీపీ, సీపీ, ఏసీపీ, సీఐ, ఇతర స్టాప్ బాధ్యులు. చంపేసి బూడిద చేయడం పోలీసుల పరాకాష్ట. లాకప్ డెత్పై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ను ఆమోదించాలి. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా పని చేస్తున్నారన్న వాస్తవం లాకప్ డెత్ కళ్లకు కట్టినట్లుగా చెప్పింది. చట్టాన్ని అమలు చేయాలనే గౌరవం, భయం పోలీసులకు పోయింది’’ అని కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. -
అమ్మా నీ బిడ్డ.. జ్ఞానేశ్వరి ఇంటి వద్ద జ్యోతిష్యుడి హల్చల్
సాక్షి, కాకినాడ: రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులు గడిచినా ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో కేసు మిస్టరీ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో ఓ జ్యోతిష్కుడు హల్ చల్ చేయడం చర్చనీయాంశంగా మారింది.తెలంగాణ గద్వాల్ నుంచి వచ్చినట్లు చెప్పుకున్న ఓ అజ్ఞాత వ్యక్తి జ్ఞానేశ్వరి ఇంటి వద్ద హడావిడి చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను జ్యోతిష్యుడినని పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి, ‘‘పాప భూదేవతలో ఉంది.. త్వరలో తిరిగి వస్తుంది’’ అంటూ చెప్పాడట. అదే సమయంలో.. కుటుంబ సభ్యులను భయపెట్టేలా, అలాగే ఆశ కలిగించేలా మాటలు చెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.జ్ఞానేశ్వరి ఇంటి వద్ద గత రెండు రోజులుగా అతను అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో అతని ప్రవర్తనపై అనుమానాలు పెరిగాయి. “అమ్మా నీ బిడ్డ ఎక్కడ ఉంది చెప్పు” అంటూ జ్యోతిష్యుడు తరహాలో వ్యాఖ్యలు చేస్తూ కుటుంబాన్ని మరింత భావోద్వేగానికి గురిచేసినట్లు సమాచారం. దీంతో ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో జ్ఞానేశ్వరి తల్లి భవాని, కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బాధను అర్థం చేసుకోకుండా ఇలా భయపెట్టే మాటలు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. కొంతసేపు వాగ్వాదం జరిగినట్లు కూడా తెలుస్తోంది.మరోవైపు, యువతి అదృశ్యంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జ్యోతిష్యుడి హావభావాలు, అతని నేపథ్యంపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. మొత్తానికి, జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఒక్కసారిగా జ్యోతిష్యుడి హడావిడితో కొత్త మలుపు తిరిగి, స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. -
అన్నవరం.. తృతీయం
● ఐవీఆర్ఎస్ సర్వేలో దేవస్థానానికి మూడో స్థానం ● వెల్లడించిన ప్రభుత్వం అన్నవరం: రాష్ట్రంలోని ఏడు ప్రముఖ ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వస్తున్న భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం ఈ నెలలో నిర్వహించిన సర్వేలో 73 శాతం భక్తుల సంతృప్తితో అన్నవరం దేవస్థానం మూడో స్థానంలో నిలిచింది. గత నెలలో అయితే 70.7 శాతంతో ఏకంగా ఐదో స్థానానికి పడిపోగా.. ఈసారి రెండు స్థానాలు అధిగమించి మూడో స్థానానికి ఎగబాకింది. గత నెల కన్నా 2.3 శాతం ఎక్కువగా మాత్రమే భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. గత మార్చి నెలలో నిర్వహించిన సర్వేలో 75 శాతం భక్తుల సంతృప్తితో అన్నవరం దేవస్థానం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత నుంచి ఆ ర్యాంకు క్రమంగా తగ్గుతూ వచ్చింది. గత నెల 15 నుంచి ఈ నెల 15వ తేదీ వరకూ వాట్సాప్ యాప్, ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం ఈ సర్వే నిర్వహించింది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం దేవస్థానాలపై నిర్వహించిన ఈ సర్వేలో 75.8 శాతం భక్తుల సంతృప్తితో శ్రీకాళహస్తి మొదటి, 74.2 శాతంతో ద్వారకా తిరుమల రెండు స్థానాల్లో నిలిచాయి. వరుసగా తరువాతి స్థానాల్లో సింహాచలం, కాణిపాకం, విజయవాడ, శ్రీశ్రీలం దేవస్థానాలు నిలిచాయి. ఏరియా ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స తుని: కడుపు నొప్పితో బాధ పడుతున్న ఓ మహిళకు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి, 5.4 కిలోల కణితి తొలగించారు. డీసీహెచ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ మహేష్ కథనం ప్రకారం.. తుని పట్టణానికి చెందిన ప్రియ అనే మహిళ కొన్ని రోజులుగా నొప్పి, కడుపు పొంగడం, విరేచనం మందగించడం, నీరుడు ఇబ్బందితో బాధపడుతోంది. ఈ నెల 8న ఏరియా ఆస్పత్రికి వచ్చిన ఆమెకు జనరల్ సర్జరీ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. గర్భాశయం నుంచి 30x25x20 పరిమాణంలో భారీ కణితి ఉందని, ఇది రక్తనాళం, యూరినరీ ట్యూబ్, పేగులపై పడి పై సమస్యలు వచ్చాయని గుర్తించారు. వెంటనే ఆస్పత్రిలో చేర్చుకున్నారు. రక్తం తక్కువగా ఉండటంతో నాలుగు ప్యాకెట్లు ఎక్కించి, బుధవారం డాక్టర్ మహేష్ ఆధ్వర్యాన ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించి, కణితి తొలగించారు. మత్తు వైద్యుడు డాక్టర్ సత్యనారాయణ, దినేష్, జనరల్ సర్జన్ అమల, గణపతిరావు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రియ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్ మహేష్ చెప్పారు. వేద పండితుల పరీక్షలు విజయవంతం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రముఖ ఆలయాల్లో వేద పండితుల నియామకానికి విజయవంతంగా పరీక్షలు నిర్వహించినట్లు దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్వీ రమేష్బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు జోన్లకు కలిపి 262 మంది ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 230 హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ పరీక్షల ఫలితాలు రెండు నెలల్లో విడుదలవుతాయన్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని అన్నవరం, సింహాచలం, వాడపల్లి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో వేద పండితులుగా, వేద పారాయణదారులుగా నియమిస్తామని తెలిపారు. రత్నగిరిపై భక్తుల రద్దీ అన్నవరం: పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో రత్నగిరి బుధవారం రద్దీగా మారింది. సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శనానికి తరలివచ్చారు. దీంతో, క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం సందడిగా మారాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణునికి, గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షిణలు చేశారు. సత్యదేవుని వ్రతాలు 2 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుని అన్నప్రసాదాన్ని సుమారు 5 వేల మంది భక్తులు స్వీకరించారు. -
చివరికి నెట్టేస్తున్నారా!
● ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ● ఆయిల్పామ్, సరుగుడు సాగుపై ప్రచారం ● వరి సాగును తగ్గించేలా అడుగులు ● రెండేళ్లుగా జిల్లాలో తగ్గుతున్న వరి విస్తీర్ణం పిఠాపురం: ఆంధ్రుల అన్నపూర్ణగా పేరొందిన గోదారి సీమ వరి సాగులో వెనుకబడే పరిస్థితులు పొంచి ఉన్నాయా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయని అంటున్నారు. గోదావరి, తాండవ, ఏలేరు, పంపా జలాలతో వరి సాగులో రాష్ట్రంలోనే గోదారి సీమ ప్రథమ స్థానంలో ఉంది. అటువంటిది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వివిధ కారణాలతో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తోంది. ఫలితంగా వరి సాగులో ఈ ప్రాంతం వెనుకబడే పరిస్థితులు తలెత్తుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. భారం దించుకోవాలని.. జిల్లాలో గత ఏడాది సుమారు 1.45 లక్షల మంది రైతులు దాదాపు 94 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. జిల్లాలో ఒక పంటకు సుమారు 6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది. వరి రైతులకు ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై అందిస్తూంటుంది. అలాగే, ఇతర రాయితీలు కూడా ఇస్తుంది. వీటితో పాటు ప్రతి పంటకూ అదునుకు సాగునీరు అందించాలి. దీనికోసం కాలువల్లో పూడికల తొలగింపు, ఇతర నిర్వహణ పరమైన పనులు చేయాలి. అలాగే, ఉచితంగా వ్యవసాయ విద్యుత్ అందించాలి. దీనికితోడు ఈ ప్రాంత రైతులు అధిక వరి దిగుబడులు సాధిస్తూంటారు. వారు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలి. ఊహించని విధంగా తెగుళ్లు విజృంభించినా, ప్రకృతి విపత్తులు సంభవించినా పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి. ప్రస్తుతం ఇవన్నీ భారమని భావిస్తున్న ప్రభుత్వం, దీని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. పొమ్మనకుండానే పొగ పెట్టినట్టు.. వరి సాగుకు ఇస్తున్న సహకారాన్ని క్రమంగా తగ్గిస్తూ.. రైతులు ఆయిల్పామ్, సరుగుడు వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారమే గత రెండేళ్లలో వరి సాగు విస్తీర్ణం 9 వేల ఎకరాలకు పైగా పడిపోయింది. అనధికారికంగా ఇది మరింత అధికంగా ఉందని తెలుస్తోంది. లాభదాయకమేనా? వరి వంటి ఏక వార్షిక పంటలైతే పంట దిగుబడులు చేతికందిన వెంటనే రైతుకు ఎప్పటికప్పుడు ఆదాయం వస్తుంది. అదే బహు వార్షిక పంటలయిన ఆయిల్పా మ్, సరుగుడు వంటివి నాటిన తర్వాత కొన్నేళ్ల పాటు దమ్మిడీ ఆదాయం రాదు. అయినప్పటికీ వీటిని సాగు చేయాలంటూ రైతులపై రప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ఈ నెలలో తుని మండలం చామవరం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆయిల్పామ్ సాగును ప్రో త్సహించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముందుగా ఖాళీ భూములను గుర్తించి ఆయిల్పామ్ సాగు చేయాలని అధికారులు చెబుతున్నారు. మరోవైపు వరి, ఇతర పంటలను సైతం నిలిపివేసి ఆయిల్పామ్ సాగు చేసుకుంటే మంచి లాభాలు వస్తాయంటూ రైతులకు నచ్చజెప్పే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సాధారణంగా ఆయిల్పామ్, సరుగుడు సాగును నీటి వసతి తక్కువగా ఉన్న మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తూంటారు. ఆయిల్పామ్ ఓ ఏడాది మంచి లాభాలు ఇచ్చినా.. కొన్నేళ్ల పాటు తీవ్ర నష్టాలనే మిగిల్చిందని రైతులు చెబుతున్నారు. ఆయిల్పామ్ సాగు చేస్తే నాలుగేళ్ల పాటు నయాపైసా ఆదాయం కూడా రాదు. దీనిలో అదనపు పెట్టుబడి పెట్టి అంతర పంటలు సైతం సాగు చేయాల్సి ఉంటుంది. అంత పెట్టుబడి తమ వల్ల కాదని చాలా మంది రైతులు మొత్తుకుంటున్నారు. పైగా అంతర పంటలు కూడా అంతగా ఆదాయం ఇవ్వవని చెబుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం తన స్వార్థం కోసం వరితో పాటు ఇతర పంటల సాగును నిలిపివేయించి ఆయిల్పామ్, సరుగుడు సాగును పెంచే పనిలో ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. వరి సాగు వదిలేసుకున్నా ఎన్నో ఏళ్ల నుంచి వరి సాగు చేస్తున్నాను. ఏటా సాగునీటి ఇబ్బందులు, నకిలీ విత్తనాల బెడద, తెగుళ్లు, ఎరువుల కొరత వంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఇన్ని కష్టాలు పడి ధాన్యం పండిస్తే ప్రభుత్వం సక్రమంగా కొనుగోలు చేయడం లేదు. ఈ బాధలు పడలేక నా వరి పొలాన్ని సరుగుడు సాగుకు కౌలుకు ఇచ్చేశాను. ఎకరాకు ఏడాదికి రూ.31 వేలు ఇస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా ఆదాయం వస్తోంది. ప్రభుత్వ విధానాలు వరి సాగుకు చాలా ఇబ్బందికరంగా మారడంతో ఇతర పంటల సాగుకు తమ భూమిని రైతులు ఇచ్చేస్తున్నారు. ఎక్కడో మెట్ట ప్రాంతాల్లో మాత్రమే సాగు చేసే సరుగుడును ఇక్కడి పొలాల్లో వేస్తున్నారంటేనే వరి సాగుకు రైతులు ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. – ఓదూరి వెంకటరమణ, రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం నష్టాలు రాకుండా చూడాలనే విచ్చలవిడిగా రసాయనాలు వాడటం వల్ల పంటలు దెబ్బ తిని రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. వారికి మేలు చేయడానికే ఆయిల్పామ్ బహు వార్షిక పంటలకు రాయితీలు ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పంటల మార్పిడి జరిగితే రైతుకే మంచిది. దీని అమలుకు చర్యలు తీసుకుంటున్నాం. – ఎన్.విజయ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి, కాకినాడ జిల్లాలో వరి సాగు విస్తీర్ణం తగ్గిందిలా.. 2025లో విస్తీర్ణం 93,944 హెక్టార్లు 2026లో విస్తీర్ణం 90,298 హెక్టార్లు ఏడాదిలో తగ్గిన వరి సాగు విస్తీర్ణం 3,646 హెక్టార్లు 2025లో వరి సాగు చేసిన రైతులు సుమారు 1,45,000 వరి సాగు వదిలేసిన వారు 22,000 -
దంచి కొట్టిన వాన
● పలకరించిన వరుణుడు ● పెనుగాలుల బీభత్సం ● కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కొన్నాళ్లుగా దోబూచులాడుతున్న రుతుపవనాలు ఎట్టకేలకు కాస్త చురుకుదనాన్ని అందుకున్నట్టున్నాయి. జిల్లావ్యాప్తంగా బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆకాశం మేఘావృతమై, పలు ప్రాంతాలను వరుణుడు పలకరించాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ తీవ్రమైన ఎండవేడి, ఉక్కపోతతో జిల్లా ప్రజలు ఆపసోపాలు పడ్డారు. ఆ తరువాత వాతావరణం మారిపోయింది. హఠాత్తుగా పెనుగాలులు ఆరంభమై, అంతలోనే ఉరుములు, మెరుపులు, పిడుగులతో జిల్లా కేంద్రం కాకినాడతో పాటు ఏలేశ్వరం, ప్రత్తిపాడు, సామర్లకోట, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు, తుని, తొండంగి, పిఠాపురం తదితర ప్రాంతాల్లో తీవ్రమైన ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. గాలుల తాకిడికి పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గాలుల బీభత్సం చూసి ప్రజలు భీతిల్లారు. అనేకచోట్ల మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామంలో విద్యుత్ స్తంభాలు నేల కూలిపోయాయి. గాలుల వేగానికి అనేక చెట్లు విరిగి విద్యుత్ వైర్లపై పడిపోయాయి. ఫ్లెక్సీలు చిరిగిపోయి, ఎగిరిపోయాయి. ఏలేశ్వరంలో సుమారు రెండు గంటలకు పూగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఏలేశ్వరం – యర్రవరం ప్రధాన రహదారిపై చెట్లు నేలకొరగడంతో రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. శంఖవరం మండలంలో భారీ వర్షం, ఈదురు గాలులకు అరటి తోటలు నేలకొరిగాయి. అక్కడక్కడ ఉన్న మామిడి కాయలు గాలుల వేగానికి నేల రాలాయి. కొత్తపల్లి మండలం ఉప్పాడ బీచ్ రోడ్డు సెంటర్లో మోకాలు ఎత్తున నీరు నిలిచిపోయింది. ఉప్పాడ – పిఠాపురం రోడ్డులో పలుచోట్ల నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.శంఖవరం మండలం జి.కొత్తపల్లిలో వాన నీటి ప్రవాహం -
‘బిడ్డను మోసే తల్లే వీవీఐపీ’
● చాగంటి కోటేశ్వరరావు ● మాతాశిశు విభాగ భవన నిర్మాణ దాతలకు సత్కారం కాకినాడ క్రైం: కడుపులో బిడ్డను మోసే తల్లే వీవీఐపీ అని, ఆమెను కాదని ప్రాధాన్యం ఇవ్వాల్సిన వ్యక్తులెవరూ ఉండరని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. కాకినాడ ప్రభుత్వాస్పత్రి(జీజీహెచ్)లో కొత్తగా నిర్మించిన బొల్లినేని వెంకమ్మ, రమణయ్య మాతా శిశు విభాగం (ఎంసీహెచ్) నిర్మాణానికి రూ.62 కోట్ల విరాళాలిచ్చిన దాతలను రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) ఆడిటోరియంలో బుధవారం రాత్రి ఘనంగా సత్కరించారు. రంగరాయ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ (రామ్కోసా) ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో చాగంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నూతన భవంతిలో ప్రసవించే ప్రతి తల్లి ఆశీస్సులు దాతలకు, వారి కుటుంబాలకు దక్కుతాయని అన్నారు. ఎన్నోచోట్ల శిశువులను ఎలుకలు కొరకడం, ప్రసవానంతరం సదుపాయాలు లేక తల్లి కష్టాలు పడటం, ఒకే మంచంపై ఇద్దరు గర్భిణులను ఉంచి, చికిత్స చేయడం తనను కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ముఖ్య అతిథి రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ అత్తలూరి విష్ణువర్ధన్ మాట్లాడుతూ, ఎందరో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు నూతన ఎంసీహెచ్ బ్లాక్, అందులోని పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. శాసన సభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్ బొల్లినేని బొల్లినేని భాస్కరరావు కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో కలెక్టర్ హరీంధర్ ప్రసాద్, ఎంసీహెచ్ కమిటీ చైర్మన్ ఎ.వెంకట సుబ్బరాయ చౌదరి, రామ్కానా బోర్డ్ చైర్మన్ కలిదిండి విష్ణువర్మ, జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్య కుమారి, ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ ఉషాకిరణ్, రామ్కోసా అధ్యక్ష కార్యదర్శులు ఎంవీ ఆనంద్, ఆదిత్య సత్య ప్రసన్న, విశ్రాంత డీఎంఈ డీఎస్వీఎల్ నరసింహం తదితరులు పాల్గొన్నారు. నీట్ అభ్యర్థులకు ఉచిత ప్రయాణం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వైద్య విద్యా కోర్సులలో ప్రవేశానికి ఈ నెల 21న జరిగే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నారు. జిల్లా ప్రజా రవాణా అధికారి ఎంయూవీ మనోహర్ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డీనరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సదుపాయం ఉంటుందన్నారు. విద్యార్థులు హాల్ టికెట్టు చూపించి ప్రయాణించవచ్చని మనోహర్ తెలిపారు. -
పశ్చిమ రాజగోపురం వద్ద హెల్త్ సెంటర్
● 24 గంటలు వైద్య సహాయం అందేలా ఏర్పాటు ● ఈఓ ఆదేశం అన్నవరం: సత్యదేవుని భక్తులకు 24 గంటలూ వైద్య సేవలు అందించేందుకు గాను రత్నగిరిపై పశ్చిమ రాజగోపురం ఎదురుగా ఉన్న విశ్రాంతి షెడ్డు వద్ద హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆదేశించారు. రత్నగిరిపై సకాలంలో వైద్యం అందక భక్తులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ ‘దివ్యక్షేత్రం.. వైద్యం పూజ్యం’ శీర్షికన ‘సాక్షి’ ఈ నెల 5న కథనం ప్రచురించింది. 50 సంవత్సరాలు దాటిన పలువురు భక్తులు ఉపవాసంతో సత్యదేవుని వ్రతాలాచరించి స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు రాగానే డీ హైడ్రేషన్కు లోనై తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. దీనికితోడు గుండెపోటు, షుగర్, బీపీ తదితర వ్యాధిగ్రస్తులు వెంటనే అపస్మారక స్థితికి చేరుకుంటున్నారు. వారికి తక్షణ వైద్యం అందించే ఏర్పాటు దేవస్థానంలో లేదు. కొండ దిగువన దేవస్థానం వైద్యశాలకు తరలించినా అక్కడ సరైన వైద్యం అందడం లేదు. దీంతో, మార్గం మధ్యలోనే కొంత మంది భక్తులు మృతి చెందుతున్నారు. గడచిన ఆరు నెలల్లో ఇద్దరు ఇదే విధంగా రత్నగిరిపై గుండెపోటుకు గురై మృతి చెందారు. ఈ అంశాలను ‘సాక్షి’ కథనం ప్రస్తావించింది. దీనిపై స్పందించిన ఈఓ దేవస్థానంలో కార్పొరేట్ ఆస్పత్రికి కేటాయించిన హెల్త్ సెంటర్లో ప్రతి రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ దేవస్థానం వైద్యాధికారి హరికృష్ణతో పాటు ఇద్దరు నరులలో ఒకరిని షిఫ్టుల వారీగా భక్తులకు సేవలందించాలని ఆదేశించారు. ఈ మేరకు వారు అక్కడ సేవలందిస్తున్నారు. దీనిపై ‘రత్నగిరిపై ఎట్టకేలకు వైద్య సేవలు’ శీర్షికన ‘సాక్షి ఈ నెల 14న కథనం ప్రచురించింది. రత్నగిరిపై 24 గంటలూ వైద్య సేవలు అందించేందుకు శాశ్వత ఆస్పత్రి ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని అందులో ప్రస్తావించింది. దీంతోపాటు హెల్త్ సెంటర్లో వైద్య సేవల వలన కలిగే ఇతర ఇబ్బందులను వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన ఈఓ సూర్యచక్రధరరావు పశ్చిమ రాజగోపురం ఎదురుగా లారెల్స్ విశ్రాంతి షెడ్డు వద్ద ఉన్న ఖాళీ స్థలంలో 24 గంటలూ పని చేసేలా హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. భక్తులకు అందుబాటులో ఉండేలా, అత్యవసరమైతే దిగువకు తరలించేలా ఘాట్ రోడ్డుకు దగ్గరగా దీనిని ఏర్పాటు చేయాలని సూచించారు. -
ఇప్పటికీ రూపాయి రాలేదు
నా పేరు నాగిరెడ్డి శివన్నారాయణ. మాది సంపర గ్రామం. ఐదు ఎకరాల సాగు చేశాను. నెలరోజుల క్రితం 250 బస్తాలు షావుకారికి విక్రయించాను. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆయనను డబ్బులు అడుగుతుంటే సీఎంఆర్ డబ్బులు పడినప్పుడు ఇస్తామంటున్నారు. నెలరోజులైనా డబ్బులు రాక ఖరీఫ్ పనుల ప్రారంభానికి ఇబ్బందులు పడుతున్నాను. సీఎంఆర్ పడితే ఇస్తారుట నా పేరు అద్దంకి సీతారామయ్య. 400 బస్తాల ధాన్యం విక్రయించాను. అప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ధాన్యం విక్రయించి నెల రోజులైంది. సీఎంఆర్ నగదు ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు ఇస్తామని షావుకారు చెప్తున్నారు. ప్రస్తుతం నా దగ్గర సొమ్ము లేకపోవడంతో ఖరీఫ్ పనులు చేయలేకపోతున్నాను. -
హెల్దీ క్యాంపస్లుగా వసతిగృహాలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో, ఆశ్రమ పాఠశాలల హాస్టళ్లను ‘నెట్ జీరో – హెల్తీ క్యాంపస్లుగా అభివృద్ధి చేయడంతో పాటు సంతృప్త స్థాయిని పెంచేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమం వసతి గృహాల అధికారులతో ఆయన సమీక్షించారు. సోక్ పిట్స్ ద్వారా ఉపయోగించిన నీటిని తిరిగి వినియోగించే చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి నాణ్యత, పరిశుభ్రత ఆర్ఓ వ్యవస్థల ద్వారా తాగునీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ, నీటి నమూనాలను పరీక్షించాలన్నారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించాలన్నారు. సమావేశంలో బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ అధికారి ఎ.శ్యామల కుమారి, గురుకుల పాఠశాల సమన్వయకర్త రాజకుమారి, మైనారిటీ సంక్షేమ అధికారి షేక్ మహబూబ్ షరీఫ్ పాల్గొన్నారు. ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలి జిల్లా కేంద్రం కాకినాడతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో డివైడర్లు, కూడళ్లలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలన్నిటినీ వెంటనే తొలగించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మున్సిపల్ కమిషనర్లను మంగళవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. పట్టణాల్లోని రహదారుల మధ్య స్తంభాలపైన, రద్దీగా ఉండే కూడళ్లలో స్థానిక సంస్థల నుంచి ఎటువంటి అనుమతి లేకుండా అస్తవ్యస్తంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు వాహన చోదకులకు, పాదచారులకు పరిసరాలు కనబడకుండా అవరోధంగా నిలిచి ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు. నిత్యం వీటిపై ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఫ్లెక్సీలన్నిటినీ వెంటనే తొలగించి అందుకు అయిన ఖర్చును, అనుమతి లేకుండా ఫ్లెక్సీలను ప్రదర్శించినందుకు జరిమానాలను వాటిని ఏర్పాటు చేసిన వారి నుంచి వసూలు చేయాలని కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. -
అన్నవరానికి ‘భారత్మాల’
అన్నవరం: భారతమాల పథకం కింద కాకినాడ సమీపంలోని వాకలపూడి లైట్హౌస్ నుంచి అన్నవరం వరకూ 41 కిలోమీటర్ల పొడవున కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ రహదారి (ఎన్హెచ్– 516ఎఫ్) నిర్మాణం చురుకుగా సాగుతోంది. దీని నిర్మాణానికి అన్నవరంలో సేకరించిన భూమికి రైతులు కోరిన విధంగా కాకుండా గతంలో నిర్ణయించినట్టు 9 శాతం వడ్డీతో పరిహారం చెల్లించారు. దీంతో, పనులు ఊపందుకున్నాయి. అన్నవరం, తొండంగి మండలంలోని ఎ.కొత్తపల్లి, కోదాడ, యు.కొత్తపల్లి మండలాల మీదుగా నాలుగు లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవేగా ఈ హైవే నిర్మిస్తున్నారు. 2021లోనే శ్రీకారం సాగర తీరం వెంబడి పారిశ్రామికాభివృద్ధికి భారత్మాల పరియోజన ఫేజ్–1 రహదారిని రూ.1,040 కోట్లతో నిర్మించేందుకు 2020లోనే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) 2021లో ఒకసారి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి రద్దు చేసింది. తిరిగి గత ఏడాది జూలైలో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పట్లో అరవిందో రియాల్టీ కంపెనీ టెండర్ అత్యంత తక్కువకు టెండర్ దాఖలు చేసింది. అయినప్పటికీ సాంకేతిక కారణాలతో దానిని రద్దు చేసి, అదే సంవత్సరం ఆగస్టులో మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈసారి 9 సంస్థలు టెండర్లు దాఖలు చేయగా రాయలసీమలోని కూటమి ఎమ్మెల్యేకి చెందిన కాంట్రాక్టు సంస్థ దీనిని దక్కించుకుంది. 225 హెక్టార్ల భూ సేకరణ ఈ రహదారి నిర్మాణానికి రైతుల నుంచి 195 హెక్టార్లు సేకరించారు. మరో 45 హెక్టార్లు ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 225 హెక్టార్ల భూమి సేకరించారు. ఇందులో అన్నవరం, ఆరెంపూడి రైతులకు చెందిన 12 ఎకరాలున్నాయి. ఆరెంపూడి రైతులకు పరిహారం చెల్లించినా, అన్నవరం రైతులకు చెల్లించడానికి ఐదేళ్లు పట్టింది. రహదారి నిర్మాణం ఇలా.. వాకలపూడి లైట్హౌస్ నుంచి కాకినాడ రూరల్, యు.కొత్తపల్లి, తొండంగి మండలాల మీదుగా 516ఎఫ్ రహదారి నిర్మిస్తున్నారు. ఇది అన్నవరం సమీపాన రాజమహేంద్రవరం – విశాఖపట్నం మార్గంలోని సత్యదేవుని నమూనా ఆలయం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారికి కలుస్తుంది. మొత్తం 21 గ్రామాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. రహదారి పొడవునా 169 బ్రిడ్జిలు, అండర్పాస్లు, ఓవర్ పాస్లు నిర్మించనున్నారు. అలాగే, చైన్నె – హౌరా రైల్వే లైన్ మీద అన్నవరం వద్ద ఫ్లై ఓవర్ నిర్మిస్తారు. యు.కొత్తపల్లి వద్ద టోల్ ప్లాజా నిర్మించనున్నారు. 2027 డిసెంబర్ నాటికి దీని నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. చురుగ్గా అన్నవరం–వాకలపూడి రహదారి నిర్మాణం ఎన్హెచ్–516ఎఫ్ గ్రీన్ఫీల్డు రోడ్డుగా నామకరణం రూ.1,040 కోట్లతో 41 కిలోమీటర్ల పొడవున నిర్మాణం అన్నవరం వద్ద హైవేను కలుపుతూ భారీ ఫ్లై ఓవర్ 2027 డిసెంబర్కు పూర్తి చేసేలా కసరత్తు -
మా బాబే..! దాతలంటే ఎంత గౌరవమో!!
కాకినాడ క్రైం: రంగరాయ వైద్య కళాశాలలో చదువుకుని, విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు కళాశాల రుణం తీర్చుకోవాలనుకున్నారు. తాము సంపాదించిన దానిలో రూ.కోట్లు దానమిచ్చి స్థానిక జీజీహెచ్లో మాతాశిశు విభాగం నిర్మించారు. అటువంటి దాతలకు ప్రభుత్వం విలువ లేకుండా చేసి, తీవ్ర నిరాశను మిగిల్చింది. ఏం జరిగిందంటే.. జీజీహెచ్లో ఎకరం విస్తీర్ణంలో నిర్మించిన మాతా శిశు విభాగం బ్లాక్కు ప్రభుత్వం కేవలం రూ.11 కోట్ల అరకొర నిధులిచ్చి అసంపూర్తి నిర్మాణంగా వదిలేసింది. దీంతో, రంగరాయ మెడికల్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ (రామ్కోసా) అనుబంధ రామ్కానా ప్రతినిధులు 260 మంది ముందుకు వచ్చి ఏకంగా రూ.62 కోట్లు అందించి దీని నిర్మాణం పూర్తి చేశారు. ఈ భవనం ప్రారంభోత్సవానికి ఈ నెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నట్టు రామ్కానా ప్రతినిధులకు సీఎంఓ నుంచి సమాచారం ఇచ్చారు. దీంతో, రూ.కోట్ల విరాళాలు ఇచ్చిన వారిలో 140 మంది కుటుంబాలతో కలసి ఈ కార్యక్రమానికి విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. నాలుగైదు రోజులు ముందే జిల్లాకు వచ్చి, అయిన వారి ఇళ్లు, హోటళ్లలో దిగారు. దీనికి గాను వారికి సుమారు రూ.2.50 కోట్ల మేర చేతి చమురు వదిలిపోయింది. తీరా చూస్తే ఈ భవనం ప్రారంభోత్సవానికి సీఎం రావడం లేదని చూచాయగా తెలియడంతో వారంతా కంగుతిన్నారు. భవన నిర్మాణం 80 శాతం మేర మాత్రమే పూర్తికావడంతో సీఎం రావడం లేదని తెలుస్తోంది. అయితే, ఈ విషయం ప్రారంభోత్సవ తేదీ ఖరారైనప్పుడు తెలియలేదా, వ్యయ ప్రయాసలకోర్చి వచ్చిన తామంటే సీఎంకు ఏమాత్రం విలువలేదా అని దాతలు ప్రశ్నిస్తున్నారు. సన్మానించి పంపాలని... ముఖ్యమంత్రి నిర్వాకంతో రామ్కోసా పెద్దలు రగిలిపోతున్నారు. ఎన్ఆర్ఐల ఎదుట తలెత్తుకోలేని పరిస్థితి దాపురించిందని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన దాతలకు బుధవారం సాయంత్రం కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో సన్మానం ఏర్పాటు చేశారు. రూ.కోట్లు వెచ్చించి ప్రారంభోత్సవానికి వచ్చిన వారిని చివరకు సన్మానంతో బుజ్జగించి పంపాల్సిన పరిస్థితి ఎదురైంది. సీఎం చంద్రబాబు నిర్ణయంతో దాతల్లో అసంతృప్తి కాకినాడ జీజీహెచ్లో 18న జరగాల్సిన ఎంసీహెచ్ బ్లాక్ ప్రారంభోత్సవం వాయిదా నిర్మాణానికి రూ.62 కోట్ల సాయం చేసిన పూర్వ విద్యార్థులు కార్యక్రమానికి నాలుగైదు రోజుల ముందుగానే చేరుకున్న దాతలు ఇందుకోసం రూ.2.5 కోట్లు వెచ్చించిన ఎన్ఆర్ఐలు నేడు దాతలకు సన్మానంతో సరిపెడుతున్న నిర్వాహకులు -
జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ట్విస్ట్
సాక్షి,కాకినాడ: దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటలో తండ్రి కోసం వెళ్లి అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సీహెచ్ అగ్రహారంలో చిన్నారి నివసిస్తున్న ప్రదేశం చుట్టూ 500 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. అందులో తాను 40 ఎకరాల్లో ఉన్న పామాయిల్ తోట ఉంది. ఆ పామాయిల్ తోటలో చిన్నారి దాటిన కంచె వద్ద రెండు ఆట బొమ్మలు దర్శనమిస్తున్నాయి. ఈ బొమ్మలు అక్కడ కట్టిందెవరనేది ప్రశ్నార్ధకంగా మారింది. వందల ఎకరాలు గాలింపు చర్యల్లో భాగంగా సెర్చ్ ఆపరేషన్ ఎంతవరకు చేశారనేది నిర్ధారించుకునేందుకు పోలీసులు ఆ బొమ్మల్ని కంచెకు కట్టినట్లు తెలుస్తోంది. ఈ బొమ్మలపై స్పష్టత రావాల్సి ఉండగా.. జ్ఞానేశ్వరి తల్లి భవానీ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. జూన్ 6న తుని సమీపంలోని చిన్న అగ్రహారం గ్రామంలో జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయింది. పోలీసులు విస్తృతంగా శోధన చేపడుతున్నప్పటికీ, ఇప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు. ఈ ఘటనలో బాధితురాలి తల్లి సుంకర భవానీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ను ఎదుర్కొంటున్నారు. మీడియా ఎదుట ఆమె ఏడవకపోవడంపై కొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘కెమెరా ముందు ఏడవడం లేదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు’ అని ఆమె వాపోయారు. సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలు తనను మనోవేదనకు గురి చేస్తున్నాయి అని తెలిపారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వరి తల్లి మాట్లాడుతూ.. జనం సూటి పోటి మాటలతో చిత్రవధ చేస్తున్నారు. నిందలు వేయడం కాదు, ఇక్కడికి వచ్చి చూడండి. సోషల్ మీడియాలో కామెంట్లు మనో వేధనకు గురి చేస్తున్నాయి’అని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు ఇంకా పరిష్కారం కాని పరిస్థితిలో, కుటుంబం ఆందోళనతో పాటు సోషల్ మీడియా ఒత్తిడిని కూడా ఎదుర్కొంటోంది.ప్రస్తుత జ్ఞానేశ్వరి కేసు వివరాలుజ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన రోజు అదే కుటుంబానికి చెందిన పెట్ డాగ్ కూడా కనిపించకుండా పోయింది. మూడు రోజుల తర్వాత కుక్క తిరిగి వచ్చింది కానీ అసాధారణ ప్రవర్తన చూపించింది. పోలీసులు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. కానీ కుక్క ఆరోగ్యం క్షీణించి జూన్ 13న చికిత్సలో మరణించింది. దీంతో గ్రామ పరిసర ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు,ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్ని కొనసాగిస్తున్నాయి.అడవి జంతువుల ప్రమేయం ఉందేమో తెలుసుకోవడానికి మాంసంతో నింపిన బొమ్మలను పొలాల వద్ద అమర్చారు. కుటుంబ సభ్యులు, పొరుగువారు, సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. పామాయిల్ తోటల్లో ట్రాక్టర్లతో గడ్డిని తొలగిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్లను బయటకు పంపుతున్నారు. -
వృథాతథం!
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ పర్యవేక్షిస్తున్న విద్యాశాఖలో నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. క్రమం తప్పకుండా విద్యా క్యాలండర్ ప్రకటిస్తున్నా అమలు చేయడంలో ఆ శాఖ పూర్తిగా విఫలమవుతోంది. గత ఏడాది నవంబర్ వరకూ ఇంజినీరింగ్, డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించిన ప్రభుత్వం ఈ ఏడాది అదే పంథా కొనసాగించేలా కనిపిస్తోంది. దీంతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన అభ్యర్థుల సమయం దాదాపు ఆరు నెలల పాటు వృథా అవుతోంది. ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక చాలామంది అభ్యసించే విద్య ఇంజినీరింగ్. ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ మే నెలలో నిర్వహించారు. ఇప్పటి వరకూ ఫలితాలు విడుదల కాకపోవడంతో అభ్యర్థులు నిరుత్సాహ పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మశీ విభాగానికి సంబంధించి 25వేల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు నిర్వహించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సూచించింది. ఈ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో తరగతులు ప్రారంభమయ్యే సూచనలు ఎక్కడా కనిపించడంలేదు. ఈ నెల 10వ తేదీలోపు అనుబంధ గుర్తింపు చేయాలని, ప్రవేశాలు పొంది, వాటిని రద్దు చేసుకున్న విద్యార్థులకు జూలై 20లోపు ఫీజు తిరిగి ఇచ్చేయాలని ఏఐసీటీ సూచించింది. మిగిలిపోయిన సీట్లలో విద్యార్థులను చేర్చుకోవడానికి ఆగస్టు 14 చివరి తేదీగా ప్రకటించింది. అయితే ఏపీలో ఇంకా ఏపీఈఏపీసెట్ ఫలితాలే విడుదల కాలేదు. కళాశాలల అఫిలియేషనూ పూర్తికాలేదు. దీంతో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కొత్త ఫీజుల నిర్ణయంలో తీవ్ర జాప్యం మూడేళ్లకోసారి డిగ్రీ, సాంకేతిక విద్య, ఫార్మశీ, వైద్య విద్య కళాశాలలకు ఫీజు నిర్ణయించాలి. మూడేళ్ల కాలపరిమితి 2025–26తో ముగిసింది. ప్రస్తుత విద్యాసంవత్సరం 2026–27 నుంచి మూడేళ్లకు ఫీజులు నిర్ణయించాల్సి ఉండగా ఇంతవరకూ ఉన్నత విద్య ఫీజుల నియంత్రణ, కమిషన్ చైర్మన్, సభ్యులనే నియమించలేదు. సభ్యుల ఎంపికకు తాజాగా నోటిఫికేషన్ రాగా పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటయితే కొత్త ఫీజుల ఖరారుకు నోటిఫికేషన్ జారీ అవుతుంది. యాజమాన్య కోటా ప్రవేశాలకు ఈ ఫీజులే ప్రామాణికం. కొత్త ఫీజులు నిర్ణయించకపోతే పాత ఫీజులతోనే ప్రవేశాలు నిర్వహించాల్సి వస్తుంది. ఇంప్రూవ్మెంట్తో ఆలస్యం ఇంటర్మీడియెట్ రెండో ఏడాదిలో మార్కుల మెరుగుకోసం ఇంప్రూవ్మెంట్ రాసుకునే ఈ ఏడాది అవకాశం కల్పించారు. ఈఏపీ సెట్లో 25 శాతం ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ ఉన్నందున ఈ మార్కులకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నెల ఐదవ తేదీతో అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ జవాబు పత్రాల మూల్యంకనానికి 12 రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. వీటి ఆధారంగా ఈఏపీ సెట్లో ర్యాంకులు కేటాయించాలి. ఫలితాలు సిద్ధం ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాం. ఇంటర్మీడియెట్ ఇంప్రూవ్మెంట్ ఫలితా లు వచ్చిన వెంటనే ర్యాంకులు సిద్ధం చేసి, ప్రభు త్వం నుంచి అనుమతి రాగానే విడుదల చేస్తాం. – ప్రొఫెసర్ ఎన్.మోహనరావు, కన్వీనర్ ఈఏపీ సెట్ ఈఏపీ ఫలితాలకు ఎదురుచూపులు మరింత ఆలస్యం కానున్న ఇంజినీరింగ్ తరగతులు గతేడాది నవంబర్ వరకూ సాగిన అడ్మిషన్ల ప్రక్రియ ఆరునెలల పాటు వృథా కానున్న విద్యార్థుల సమయం ఈ సంవత్సరమూ అదే తంతు ఉమ్మడి జిల్లాలో 25 వేల మంది అభ్యర్థుల నిరీక్షణ కళాశాలల అఫిలియేషన్లోనూ.. ఇంజినీరింగ్ కళాశాలలకు సంబంధిత పరిధిలోగల యూనివర్సిటీలు అఫిలియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏఐసీటీఈ అనుమతులు పొందిన యాజమాన్యాలు అఫిలియేషన్ కోసం వర్సిటీకి దరఖాస్తు చేసుకుంటాయి. కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు తనిఖీ చేసి అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. ఏఐసీటీ సూచనల ప్రకారం ఈనెల 10వ తేదీతో ఈ ప్రక్రియ పూర్తికావాలి. కానీ ఇంతవరకూ ఒక్క అడుగు ముందుకు పడలేదు. రాష్ట్రంలో కీలకంగా ఉన్న జేన్టీయూ కాకినాడ పరిధిలో అత్యధికంగా ఐదు జిల్లాలకు సంబంధించి 160 కళాశాలల ఉన్నాయి. ఈ వర్సిటీకి సంబంధిత కళాశాలలు చెల్లించాల్సిన రుసుములు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. వీటిలో కనీసం సగం అయినా చెల్లించాలని వర్సిటీ అధికారులు కోరుతున్నా స్పందించడం లేదు. -
సముద్రంలో చేపల వేట ప్రారంభం
కాకినాడ రూరల్: జిల్లాలోని తీర ప్రాంత మత్స్యకార గ్రామాలలో సందడి నెలకొంది. సముద్రంలో చేపల వేటకు సోమవారం నుంచి అనుమతించడంతో తెల్లవారు జాము నుంచి మత్స్యకారులు తమ బోట్లతో చేపల వేటకు వెళ్లారు. కొందరు అర్ధరాత్రి వెళ్లి ఉదయమే చేపలతో తిరిగి వచ్చారు. ఏప్రిల్ 15న చేపల వేట నిషేధం అమలు నుంచి 61 రోజుల పాటు ఇంటికి పరిమితమైన మత్స్యకారుల్లో ఉత్సాహం నెలకొంది. తమ వలలకు చేపలు చిక్కాలని గంగమ్మకు పూజలు చేసి వేటకు పయనమవుతున్నారు. కాకినాడ ఫిషింగ్ హార్బర్, కుంభాభిషేకం, ఉప్పాడ తదితర చోట్ల మత్స్యకారులు, మత్స్యకార మహిళలు, వ్యాపారులతో సందడి నెలకొంది. -
కూటమిలో ఓటమి భయం!
● సందిగ్ధంలో సం‘గ్రామం’ ● ఎన్నికల నిర్వహణపై తేలని పంచాయితీ ● వచ్చే ఏడాది వరకు లేనట్టేనా? ● అధికారుల పాలనపై అసంతృప్తితో ప్రజలు పిఠాపురం: ఇచ్చిన హామీలు నెరవేర్చక పోగా ప్రజలపై పన్నులు, పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు వంటి మోయలేని భారాన్ని మోపిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడానికి భయపడుతోందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే పూర్తి కావాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత ఇవ్వలేక పోతోంది. ఇప్పటికే కొన్ని నెలలుగా అధికారుల పాలనతో ఉన్న గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారుల పాలనపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం పూర్తయ్యింది. ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన జరుగుతోంది. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితాలు సిద్ధం అయ్యాయి. ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలు సిద్ధం కాక ఎన్నికలు ఆలస్యం అవుతున్నట్లు అనుకున్నారు. కాని ఓటర్ల జాబితా సిద్ధం అయినా ఎన్నికల నిర్వహణపై ఇప్పటికి ప్రకటన రాలేదు. దీంతో వచ్చే ఆరు నెలల్లో ఎన్నికలు జరుగుతాయని కలలు గన్న ఆశావహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ప్రత్యేకాధికారుల పాలనపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్త మవుతోంది. వెనుకాడుతున్న అధికార పక్షం ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీల ఎన్నికలపై అధికార పార్టీల నేతలు ఉత్సాహం చూపించడం లేదనే వాదన వినిపిస్తోంది. ఇటీవల వైఎస్సార్ సీపీ నిర్వహించిన చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు తిరుగుబాటు కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ప్రత్యక్షంగా వెల్లడయ్యిందంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి తప్పదని భావించిన అధికార పక్షం వాయిదాకే మొగ్గు చూపుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నికల కమిషన్ గత ఏడాది సెప్టెంబర్లో విడుదల చేసిన ప్రీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం గత ఏడాది అక్టోబర్ 15లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ, అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15 లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు, నవంబర్ 1 నుంచి 15 లోగా ఎన్నికల అధికారుల నియామకం, డిసెంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాల ఖరారు, డిసెంబర్ 15 లోగా రిజర్వేషన్లు ఖరారు, జనవరిలో ఎన్నికల నిర్వహణ పూర్తి కావాల్సి ఉంది. కాని ఇప్పటికి ఓటర్ల జాబితా మాత్రమే పూర్తయ్యింది. కాని ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు విడుదల కాలేదు. ఈలోపు జరుగుతున్న జనాభా లెక్కలు, ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ కార్యక్రమాలను సాకుగా చూపిస్తు ఎన్నికలను వాయిదాలు వేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇవన్నీ ఈ ఏడాది చివరి వరకు పూర్తి అయ్యే అవకాశం లేకపోవడంతో ఈ ఏడాది ఎన్నికలు జరిగే అవకాశం లేనట్టే కనిపిస్తోంది. వచ్చే ఏడాది అయినా ఎన్నికలు జరుగుతాయని నమ్మకం లేదు. ఎందుకంటే వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రానుండడంతో అవి పూర్తయ్యే వరకు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పాలయితే అది సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతుందని అధికార పక్షం ఎన్నికలకు వెనుకాడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఖరారు కాని రిజర్వేషన్లు పంచాయతీలలో వార్డులు, గ్రామాల రిజర్వేషన్లు ఖరారు కావాల్సి ఉంది. ఈసారి తమకు అనుకూలంగా రిజర్వేషన్లు వస్తాయని కొందరు భావిస్తున్నారు. మరోవైపు ఆశావాహులు రిజర్వేషన్లను తమ వైపునకు మార్చుకునే ప్రయత్నాలలో ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల వ్యవహారం కోర్టులో పెండింగ్లో ఉండగా దానిపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో ఎన్నికలపె ప్రభుత్వానికి ఆసక్తి లేదనేది అర్థమవుతోందంటున్నారు. జిల్లా వివరాలు గ్రామ పంచాయతీలు – 385 వార్డులు – 4,328 ఓటర్లు – 12,58,458 మహిళా ఓటర్లు – 6,34,864 పురుష ఓటర్లు – 6,23,547 ఇతరులు – 47 మంది గ్రామాల్లో పడకేసిన పాలన ఏప్రిల్ 3వ తేదీ నుంచి అన్ని గ్రామాలలో ప్రత్యేక అధికారులు పాలన మొదలైంది. ఇప్పటికే వివిధ హోదాల్లో ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న అధికారులు తమకు అదనంగా అప్పగించిన పంచాయతీల పాలనపై దృష్టి సారించలేని పరిస్థితి నెలకొంది. దీంతో అటు పాలక వర్గాలు లేక ఇటు ప్రత్యేకాధికారుల పాలనా సక్రమంగా లేక గ్రామాల్లో పాలన పడకేసింది. తమ అవసరాలు తీర్చడంలో అధికారులు విఫలమవుతున్నారని స్థానికులు వాపోతున్నారు. గ్రామాలలో తాగునీరు, పారిశుధ్యం సమస్యలు ప్రజలను ప్రధానంగా వేధిస్తున్నాయి. ప్రస్తుతం వేసవి నేపథ్యంలో పలు గ్రామాలలో తాగునీటి సమస్య పెరుగుతోంది. జల్ జీవన్ మిషన్ పనులు నిధుల కొరతతో నత్తనడకన సాగుతున్నాయి. దాంతో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాగునీటి సమస్య అధికమైంది. పాలకవర్గాలు ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులను సరి చేసే వారు. ప్రస్తుతం ప్రత్యేక అధికారులు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ప్రభుత్వం పాట్లు చూస్తుంటే నవ్వొస్తోంది
● డీఎస్సీలో మీ తప్పు లేనప్పుడు విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు ● భయపడే విద్యాశాఖ అధికారులతో సమావేశాల ఏర్పాటు ● మాజీ మంత్రి కురసాల కన్నబాబు కాకినాడ రూరల్: డీఎస్సీలో మీ తప్పు లేనప్పుడు విచారణకు ఎందుకు ఆదేశించడంలేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. సోమవారం ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడారు. డీఎస్సీలో అవకతవకలు జరగలేదని, అదేదో పవిత్ర కార్యక్రమంలా చెప్పుకోవడానికి ప్రభుత్వం పడుతున్న పాట్లు చూస్తే నవ్వు వస్తోందన్నారు. అడ్డంగా దొరికిపోయి తప్పించుకునే కార్యక్రమంలో క్షేత్ర స్థాయి వరకు చివరకు ఉపాధ్యాయులతో ఖండించే కార్యక్రమం చేపడుతున్నారన్నారు. ఆదివారం జిల్లా విద్యాశాఖ అధికారులు ఒక వాయిస్ మెసేజ్ను గ్రూపుల్లో పంపించి సోమవారం కుళాయి చెరువు వద్ద కన్వెన్షన్ హాలులో మీటింగ్కు రావాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉపాధ్యాయులు, 2025 డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారిని ఆహ్వానించారన్నారు. తెలుగుదేశం నాయకులు, ప్రజా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన మీటింగ్లో వైఎస్సార్ సీపీపై బురద జల్లే కార్యక్రమం చేపట్టారన్నారు. డీఎస్సీ అక్రమాలపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక అధికారులతో మాట్లాడిస్తున్నారని, మంత్రులు ఎవరూ మాట్లాడలేని పరిస్థితి ఉందన్నారు. స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలు ఆధారాలతో బయట పడ్డాయని, ఇంకా కొందరికి మేలు చేయడం కోసం ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఇన్వాల్వ్ అయ్యారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందన్నారు. మీ తప్పులేనప్పుడు ఎందుకు విచారణకు ఆదేశించలేదన్నారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలతో పెద్ద పెద్ద సభలు ఎందుకు పెడుతున్నారు? ఇది భయపడడం కాదా.. మీ చేతకాని తనం కాదా అని కన్నబాబు ప్రశ్నించారు. తప్పు జరగలేదని అనిపిస్తే జ్యూడిషియల్ లేదా సీబీఐ విచారణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి మద్దతుగా అందరినీ కూడగట్టడానికి విద్యాశాఖ అధికారులకు ఏం సంబంధమన్నారు. తప్పు జరగలేదని చెప్పలేకపోతున్నారని, డీఎస్సీ అనేది తప్పకుండా ఒక దగా స్కామ్ అని జగన్ చెప్పింది వాస్తవమన్నారు. డీఎస్సీలో అవకతవకలపై ‘సాక్షి’తో మాట్లాడు తున్న మాజీ మంత్రి కన్నబాబు -
అరణ్య రోదన
● పీజీఆర్ఎస్లో అర్జీలు పెట్టినా ఉపయోగం సున్నా ● గడువులోగా దేవుడెరుగు అసలు సమస్యలు పరిష్కారమే కాని వైనం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పీజీఆర్ఎస్లో ఇచ్చిన అర్జీలకు దిక్కూమొక్కూ ఉండడం లేదు. సమస్య చిన్నదైనా పరిష్కారం లభించడం లేదు. అటు మండల కేంద్రాల్లోనూ అర్జీలకు పరిష్కారం లభించకపోవడంతో దూరాభారమైనా జిల్లా కేంద్రానికి వచ్చి అర్జీలు సమర్పిస్తున్నారు. వాటికీ పరిష్కారం లభించడం లేదు. అర్జీలు ఇచ్చినప్పుడు పరిష్కారానికి ఇచ్చిన గడువు తేదీలోపు ఏ సమస్యా పరిష్కారం అవ్వడం లేదు. కొన్నిసార్లు మీ సమస్య పరిష్కారం అయ్యిందని సెల్ఫోన్కు మెసేజ్లు వస్తున్నాయి. కానీ వాస్తవంగా సమస్య మాత్రం అలాగే ఉంటోంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ హరేంధిరప్రసాద్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నా భూమి సర్వే చేయడం లేదు నా భూమిని పక్కనే ఉన్న బంధువులు కొందరు ఆక్రమించుకొన్నారు. సర్వే చేసి ఆక్రమణకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. రెండు సంవత్సరాలుగా ఇదే సమస్యపై పెద్దాపురం తహసీల్దార్ కార్యాలయానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. – ఉప్పిడి దొంగయ్య, రైతు, కట్టమూరు, పెద్దాపురం మండలం పింఛన్ ఇవ్వడం లేదు నడవ లేని స్థితిలో ఉన్న నాకు పింఛన్ ఇవ్వకుండా అధికారులు పలుసార్లు తిప్పుకుంటున్నారు. గత ఏడాది కాలంగా పలుమార్లు అర్జీలు ఇచ్చినా నాకు పింఛన్ ఇవ్వడం లేదు. నేను నడిచే స్థితిలో లేను. ప్రతీ సారి ప్రత్యేకంగా ఆటోలో కాకినాడ రావాల్సి వస్తోంది. చాలా ఖర్చవుతోంది. అధికారులు స్పందించి పింఛన్ ఇవ్వాలి. – గారపాటి పెద్ద అప్పన, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం విద్యుత్ సరఫరా ఎప్పుడు ఇస్తారు? నా ఇంటికి ఉన్న విద్యుత్ సరఫరా అధికారులు నిలిపివేశారు. ఇప్పటికి సంవత్సరం నుంచి విద్యుత్శాఖ అధికారులు చుట్టూ తిరుగుతున్నా. అయినప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదు. గొల్లప్రోలు మండలంలో జరిగిన మండల గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదు. కరెంటు సరఫరా లేకపోవడంతో మొత్తం కుటుంబ సభ్యులం ఇబ్బంది పడుతున్నాం. – ఉలవల సుబ్బయ్య, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం -
ధాన్యం డబ్బు ఇవ్వడం లేదని ఫిర్యాదు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం విక్రయించి నెలలు గడిచినా రైస్మిల్లు యజమాని వాటికి సంబంధించిన డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని పలువురు రైతులు వాపోయారు. తమకు వెంటనే డబ్బు ఇప్పించాలని కోరుతూ సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ హరేంధిరప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు పాట్నీడి అప్పారావు, పేకేటి గోవిందు, మద్దూరి వెంకన్నబాబు మాట్లాడుతూ పెదపూడి మండలం చింతపల్లిలోని రైస్మిల్ యజమాన్యం తమ వద్ద నుంచి 22,560 క్వింటాళ్ల బొండాలు రకం ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. వీటికి రూ. 5 కోట్లకుపైగా సొమ్ము చెల్లించాల్సి ఉందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బు చెల్లించకుండా మిల్లు యజమాని ఇబ్బంది పెడుతున్నట్టు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంపర, వాకాడ, కాండ్రేగుల, కుమారప్రియం గ్రామాలకు చెందిన రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారన్నారు. డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తే బస్తా ధాన్యానికి రూ. 1,770 బదులు రూ.1,550 ఇస్తామంటూ బెదిరిస్తున్నట్లు చెప్పారు. మద్దతు ధర ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు ధర ఇప్పిస్తామని జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజర్ దేవుల నాయక్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో తొలి స్ట్రీట్ ఫుడ్ హబ్గా కాకినాడకాకినాడ లీగల్: కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేపట్టిన స్ట్రీట్ ఫుడ్ హబ్ ప్రాజెక్టు అమలులో ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి నగరంగా కాకినాడ ఎంపికై ంది. ఈ ఎంపికతో నగరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుండగా, వీధి ఆహార విక్రేతలకు కొత్త అవకాశాలు, ప్రజలకు పరిశుభ్రమైన ఆహార సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని పట్టణ స్థానిక సంస్థలతో కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్లో ఆ విషయాన్ని వెల్లడించారు. సమావేశంలో ఒడిశాలోని పూరి, హిమాచల్ప్రదేశ్లోని మనాలి, జమ్మూ–కాశ్మీర్లోని తాన్మార్గ్, రాజస్థాన్లోని నాథ్ద్వారా, మధ్యప్రదేశ్లోని ఇండోర్తో పాటు కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. స్ట్రీట్ ఫుడ్ హబ్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, అమలు విధానాలపై ప్రజెంటేషన్లు సమర్పించారు. సమావేశంలో మాట్లాడిన ఇన్చార్జి కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ నగరంలో అనువైన ప్రదేశాన్ని గుర్తించి పరిశుభ్రమైన ఆహార విక్రయ కేంద్రాలు, తాగునీటి సదుపాయం, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థతో కూడిన ఆధునిక మౌలిక వసతులు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. పీఎం స్వనిధి పథకం లబ్ధిదారులకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. అదనపు కమిషనర్ కే.టి.సుధాకర్, డీసీపీ కృష్ణారావు, పీపీఆర్వో శైలజ, స్మార్ట్ సిటీ ఇంజినీర్ మణికంఠేశ్వర, ఆర్కిటెక్ట్ రాజశేఖర్ పాల్గొన్నారు. ఆత్మహత్య కేసులో యువకుడిపై కేసు కాకినాడ రూరల్: ప్రేమ పేరుతో మోసపోయి కాకినాడ రూరల్ స్వామినగర్లోని అద్దెంట్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నర్సు వైరాల ప్రమీల (23) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మృతురాలి అమ్మమ్మ దూలపల్లి ఆశ్వీరం ఫిర్యాదు మేరకు ఇంటి యజమాని కుమారుడు భరత్ నందన్పై ఇంద్రపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. తన మనమరాలిని మోసం చేసి, ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినట్టు భరత్ నందన్పై కేసు నమోదు చేసిన ఎస్సై వీరబాబు దర్యాప్తు చేపడుతున్నారు. శనివారం రాత్రి ప్రమీల ఆత్మహత్యకు పాల్పడగా, జీజీహెచ్ మార్చరీలో మృతదేహం ఉంచడంతో బంధువులు ఆస్పత్రి వద్ద పడిగాపులు గాస్తున్నారు. ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ వద్ద మృతురాలి బంధువులు ఆదివారం ఆందోళన చేసిన సంగతి విదితమే. మంగళవారం పీఎం పూర్తయ్యాక కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. -
ఘనంగా సత్యదేవుని రథసేవ
అన్నవరం: రత్నగిరిపై ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని టేకు రథంపై ఆదివారం ఘనంగా ఊరేగించారు. ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి రథంపై వేంచేయించారు. అనంతరం, అర్చకులు పూజలు చేసి రథసేవ ప్రారంభించారు. రథం లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల ఘోష నడుమ స్వామి, అమ్మవార్లను రథంపై ఆలయ ప్రాకారంలో మూడుసార్లు ఊరేగించారు. అనంతరం స్వామి, అమ్మవారిని తిరిగి ఆలయానికి చేర్చారు. ఆలయ ఏఈఓ భాస్కర్, భక్తులు రథసేవలో పాల్గొన్నారు. నేడు ప్రత్యంగిర హోమం అధిక జ్యేష్ట మాస అమావాస్య సందర్భంగా రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి సోమవారం ఉదయం 9 గంటలకు ప్రత్యంగిర హోమం నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న భక్తులు రూ.1,116 టికెట్టుతో హోమంలో పాల్గొనవచ్చు. మందకొడిగా పొగాకు కొనుగోళ్లు దేవరపల్లి: రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని టొబాకో బోర్డు రీజినల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కిలో పొగాకుకు గరిష్టంగా రూ.265, కనిష్టంగా రూ.179, సగటున రూ.255.98 చొప్పున ధర పలుకుతోందని వివరించారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 33.01 లక్షల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయని తెలిపారు. లో గ్రేడ్ పొగాకు కొనుగోలుకు ట్రేడర్లు ఆసక్తి చూపడం లేదన్నారు. -
సిద్ధమేనా సర్!
● నేటి నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ● ఇప్పటికే ఓటర్ల మ్యాపింగ్ పూర్తి ● జిల్లాలో మ్యాపింగ్ కాని ఓట్లు 3,25,800పిఠాపురం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సిఫైడ్ రివిజన్ – ఎస్ఐఆర్) ప్రక్రియ జిల్లాలో సోమవారం ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఓటు హక్కుకు సంబంధించి ఈ ప్రక్రియ ఎన్నో ఆరోపణలు, మరెన్నో సందేహాలు, సంచలనాలు రేపింది. లక్షలాదిగా ఓట్లు తొలగించారనే ఆరోపణలు అనేక రాష్ట్రాల్లో వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న సర్పై ఓటర్లు, రాజకీయ పార్టీల్లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. దీనిపై ఆయా పార్టీల ప్రతిధులతో అధికారులు ఇప్పటికే సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సర్ నిర్వహణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే తొలి దశ ఓటర్ల మ్యాపింగ్ పూర్తవగా.. జిల్లాలో మ్యాపింగ్ కాని ఓట్లు 3,25,800 ఉన్నాయి. ఇదీ ప్రక్రియ జిల్లావ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1,640 పోలింగ్ బూత్ల పరిధిలో 16.50 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సర్ నిర్వహణ కోసం బూత్ లెవెల్ అధికారులకు (బీఎల్ఓ) ఈ నెల 5 నుంచి శిక్షణ ఇచ్చారు. వీరు సోమవారం నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకూ ఇంటింటా సర్వే నిర్వహిస్తారు. అనంతరం, జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. జూలై 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను సెప్టెంబర్ 18లోగా పరిష్కరించి, అదే నెల 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ఓటర్లు సిద్ధం కావాలిలా.. చనిపోయిన, శాశ్వతంగా తరలిపోయిన, నకిలీ, అనర్హుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే పేరుతో ఎన్నికల సంఘం సర్ ప్రక్రియ నిర్వహిస్తోంది. సర్వేలో భాగంగా ఇంటికి వచ్చే బీఎల్ఓలు ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. అందులో రెండు కాలమ్లు ఉంటాయి. మొదటి కాలమ్లో 2002 ఓటర్ల లిస్టు వివరాలు, పాత ఫొటో ఉంటాయి. దాని పక్కన కొత్త ఫొటో అతికించాల్సి ఉంటుంది. అందులోనే ఓటరు పేరు, ఫొటో గుర్తింపు కార్డు (ఎపిక్) నంబరు ఉంటాయి. వీటితో పాటు ఆ ఫామ్లోని ఇతర వివరాలు పూర్తి చేయాలి. రెండో కాలంలో పుట్టిన తేదీ, మొబైల్, ఆధార్ నంబర్లు, ఇతర వివరాలు పూర్తి చేయాలి. ఇలా రెండు ఫామ్లు పూర్తి చేశాక బీఎల్ఓలు ఒకటి రసీదుగా ఓటరుకు ఇచ్చి, రెండోది తీసుకువెళ్తారు. కొత్త ఓటర్లు ఫామ్–6, డిక్లరేషన్లో కచ్చితమైన వివరాలు అందించాలి. ఈ వివరాల ధ్రువీకరణకు ప్రతి ఓటరును బీఎల్ఓలు మూడు దఫాలు కలుస్తారు. ఇతర ప్రాంతాల్లో ఉంటే..! ఎవరైనా ఏదైనా కారణంతో ఇతర ప్రాంతాల్లో నివాసముండవచ్చు. ఆ సమయంలో బీఎల్ఓలు ఇంటికి వచ్చినప్పుడు వారు అందుబాటులో లేకపోతే వలస వెళ్లిన వారిగా గుర్తిస్తారు. కానీ ఓటు మాత్రం తొలగించే అధికారం బీఎల్ఓలకు ఉండదు. స్వస్థలం వదిలి ఇతర ప్రాంతాల్లో ఉంటున్న స్థానిక ఓటర్లకు చట్టపరంగా నోటీసు జారీ చేస్తారు. ఆ నోటీసుకు గడువు లోగా స్పందించి వివరాలు అందించాలి. లేకపోతే ఇక్కడి ఓటు రద్దవుతుంది. మొత్తమ్మీద సర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉంటే ఎవ్వరి ఓటూ రద్దయ్యే చాన్స్ ఉండదని అధికారులు చెబుతున్నారు. అందువలన ఓటర్లందరూ అవసరమైన డాక్యుమెంట్లతో సర్ ప్రక్రియకు సిద్ధంగా ఉండాలని కోరుతున్నారు. ఒకటికి మించి ఓట్లు ఉంటే..! ఏ ఓటరయినా దేశంలో ఒక్కచోట మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలి. రెండు మూడు చోట్ల ఓట్లు ఉంటే సాంకేతిక సమాచారం ద్వారా వాటిని తొలగిస్తున్నారు. రెండుచోట్ల ఓట్లు ఉన్నవారు స్వయంగా ఒకచోట ఓటు తొలగించుకోవాల్సి ఉంటుంది. ఓటు వద్దనుకుంటున్న ప్రాంతంలో ఫామ్–7 పూర్తి చేసి బీఎల్ఓకు అందజేయాలి.నియోజకవర్గాల వారీగా జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ నియోజకవర్గం మొత్తం మ్యాపింగ్ మ్యాపింగ్ ఓటర్లు అయినవి కానివి తుని 2,26,071 1,94,000 32,071 ప్రత్తిపాడు 2,19,988 1,83,771 36,217 పిఠాపురం 2,40,773 2,11,678 29,095 కాకినాడ రూరల్ 2,71,318 1,89,861 8,1487 పెద్దాపురం 2,18,002 1,84,851 33,151 కాకినాడ సిటీ 2,42,514 1,62,881 79,633 జగ్గంపేట 2,32,145 1,97,969 34,176 మొత్తం 16,50,811 13,25,011 3,25,800 -
ఇదేం క్రెడిట్ చోరీ!
● 322 పారా మెడికల్ పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం నోటిఫికేషన్ ● ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన విడుదల ● కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పూర్తయిన ప్రక్రియ ● ‘తూర్పు’న 162 పోస్టులు తామే భర్తీ చేసుకుంటామన్న అధికారులు ● తొలుత 77, తరువాత 79 పోస్టుల భర్తీకి ప్రత్యేకంగా నోటిఫికేషన్లు, రద్దు ● గత ఏడాది డిసెంబర్లో 60 పోస్టులకు మరోసారి నోటిఫికేషన్ ● ఈ ఏడాది ఏప్రిల్లో 39 పోస్టులకు మరొకటి.. ● ఇవన్నీ తామే ఇచ్చామంటూ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గొప్పలు కాకినాడ క్రైం: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని సామెత. గత ప్రభుత్వం సాధించిన ఘనతలను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు తన గొప్పగా తరచూ చెప్పుకుంటూంటారు. దీనికి తానేమీ తక్కువ కాదన్నట్టుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తీరు ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఏం జరిగిందంటే.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 322 పారామెడికల్ పోస్టుల భర్తీకి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2022లో నోటిఫికేషన్ ఇచ్చారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ), డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్) పరిధిలో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి 162 పోస్టులున్నాయి. వీటికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అప్పట్లోనే కాకినాడలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) కార్యాలయంలో నియామక ప్రక్రియ చేపట్టారు. కాకినాడ, కోనసీమ జిల్లాలకు సంబంధించి 160 మందినీ నియమించారు. కానీ, రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి, కళాశాలకు సంబంధించిన ఉద్యోగాలను తామే భర్తీ చేసుకుంటామని అప్పట్లో అధికారులు చెప్పారు. ఈ మేరకు నియామక ప్రక్రియను రాజమహేంద్రవరంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఆలోగా ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇదీ రద్దుల పద్దు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి, కళాశాల పరిధిలో మొత్తం పోస్టులు 162. అయితే, ఎన్నికల అనంతరం, అక్కడి అధికారులు మొదట కేవలం 77 పోస్టులకే ఉద్యోగ ప్రకటన ఇచ్చారు. తరువాత వివిధ కారణాలతో దానిని రద్దు చేసి, రెండో నోటిఫికేషన్ 79 పోస్టులకు ఇచ్చారు. అనంతరం, దానిని కూడా రద్దు చేసి, గత ఏడాది డిసెంబర్ 22న 60 పోస్టులతో మూడో నోటిఫికేషన్ విడుదల చేశారు. తరువాత మరో 39 ఉద్యోగాలకు ఈ ఏడాది ఏప్రిల్ 7న నాలుగో నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం మూడు, నాలుగు నోటిఫికేషన్ల కింద 99 పోస్టుల భర్తీ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ పోస్టులన్నీ గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినవే కావడం గమనార్హం. కలెక్టర్కే టోకరా! వాస్తవానికి ఈ పోస్టుల భర్తీ ఉమ్మడి జిల్లా పరిధిలో జరగాలి. నియామక ప్రక్రియను డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఆధ్వర్యాన చేపడతారు. ఈ కమిటీ చైర్మన్ కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంఽధిర ప్రసాద్. అయితే, ఇన్నిసార్లు నోటిఫికేషన్ ఇచ్చి, రద్దు చేసిన విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టకుండానే.. అధికారులు మరోసారి ఆయన సంతకాలతోనే నోటిఫికేషన్లు విడుదల చేయడం గమనార్హం. దీని వెనుక జరిగిన అసంబద్ధత కలెక్టర్కు తెలిసి ఉంటే తప్పకుండా ఆరా తీసేవారని నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కొత్త కలెక్టర్ కావడంతో విషయం ఆయనకు తెలియకుండా రాజమహేంద్రవరం వైద్య కళాశాల అధికారులు జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు. ఈసారైనా నియామక ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా కలెక్టర్ నేరుగా జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. బేరం పెట్టడానికేనా! ఈ పోస్టుల భర్తీకి బేరసారాలు సాగుతున్నాయని, అందువల్లనే నియామక ప్రక్రియను ముందుకు సాగనీయకుండా నోటిఫికేషన్ల రద్దుతో కుట్ర చేస్తున్నారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. రాజమహేంద్రవరం వైద్య కళాశాలలో అవుట్సోర్సింగ్ ఉద్యోగానికై నా అర్హత లేని తన ప్రియురాలికి రెగ్యులర్ పోస్టు ఇచ్చి ఓ సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్ అయ్యాడు. నిజాయితీగా పని చేస్తున్న మహిళా ఏఓ సీటు మార్చిన ఘనులు, ఉద్యోగాలు హోల్సేల్గా అమ్ముకున్న ఉద్దండులు ఇక్కడే కొలువై ఉన్నారు. వీటన్నింటి నేపథ్యంలో 3, 4 నోటిఫికేషన్లలోనూ జాప్యం కొనసాగుతూండటంపై అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాము చెప్పిన వారికే ఉద్యోగాలివ్వాలనే రాజకీయ ఒత్తిళ్లు నియామక ప్రక్రియను ఏమాత్రం ముందుకు కదలనీయడం లేదని ఆరోపిస్తున్నారు. నియామక ప్రక్రియలో జాప్యంపై ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎంఎస్ రాజును ‘సాక్షి’, నిరుద్యోగులు వివరణ కోరగా స్పందించలేదు. దీనిపై తాము ప్రిన్సిపాల్ను కలవగా.. బయటకు వెళ్లమంటూ విసుక్కున్నారని కొందరు నిరుద్యోగులు ఆరోపించారు. వాసూ.. ఇదేంటి బాసూ.. ఇన్ని అవాంతరాల మధ్య నియామక ప్రక్రియ ముందుకు సాగకపోవడంపై నిరుద్యోగులు ఆందోళన చెందుతూండగా.. దీనిపై అబద్ధాలు చెప్పి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నవ్వులపాయ్యారు. ఈ నెల 10న రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఆయన.. ఈ పోస్టులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన నోటిఫికేషన్ పరిధిలోనివనే విషయాన్ని తొక్కిపెట్టి, తాము వచ్చాకే నోటిఫికేషన్లు ఓపెన్ చేశామని, తాము వచ్చాకే 99 మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నామని చెప్పారు. తద్వారా గత ప్రభుత్వ క్రెడిట్ను చోరీ చేసేందుకు ప్రయత్నించారనే విమర్శలు వెల్లువెత్తాయి. -
వెన్నుపోటు పొడిచి.. విజయోత్సవాలా?
● ఆ అర్హత కూటమి ప్రభుత్వానికి లేదు ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాకోటనందూరు: అన్ని వర్గాల ప్రజలకూ వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వానికి విజయోత్సవ సభలు నిర్వహించే అర్హత లేదని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై కోటనందూరు మండలం ఇండుగపల్లిలో పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మొదటిదైన ఆడబిడ్డ నిధి పథకాన్ని చంద్రబాబు ఎగ్గొట్టారని అన్నారు. రెండో పథకమైన రూ.3 వేల నిరుద్యోగ భృతి, మూడో పథకం 50 ఏళ్లకే పెన్షన్ సైతం అమలు చేయలేదని, అయినప్పటికీ రెండేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని చంద్రబాబు తెలుగు తమ్ముళ్లకు చెప్పడం విడ్డూరంగా ఉందని రాజా దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణంలో కూటమి నాయకులు భారీ కుంభకోణానికి తెర లేపారని అన్నారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాలనూ మోసం చేసి ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కూటమి పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటికీ వెళ్లి, వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేస్తే.. ప్రస్తుత కూటమి పాలనలో ప్రభుత్వాస్పత్రులకు వెళ్లినా పేదలకు వైద్యం అందడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసం చేయడం తప్ప చేసిందేమి లేదని దుయ్యబట్టారు. ఓట్లు తొలగించే ప్రమాదం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – సర్ పేరుతో నిర్వహించే సర్వేలో ఓట్లు తొలగించే ప్రమాదముందని, దీనిపై పార్టీ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏ) అప్రమత్తంగా ఉండాలని రాజా అన్నారు. సర్వే ప్రతినిధుల వెంట వైఎస్సార్ సీపీ బీఎల్ఏలు విధిగా ఉండాలని, అర్హులైన ఏ ఒక్కరి ఓటూ తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకసారి ఓటు తొలగిస్తే తిరిగి వచ్చే అవకాశం ఉండదని, అందువలన అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అర్హులైన యువతీ, యువకులను ఓటర్లుగా చేర్పించాలన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ నాయకులు సమావేశాలు నిర్వహించి, ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. విజయమే లక్ష్యం కావాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని రాజా దిశానిర్దేశం చేశారు. నాయకులు, కార్యకర్తలు పక్కా ప్రణాళికతో సైనికుల్లా పని చేసి, విజయం సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ లగుడు శ్రీనివాస్, నాయకులు గొర్లి రామచంద్రరావు, నల్లమిల్లి గోవిందు, లంక ప్రసాద్, మేముల రాజబాబు తదితరులు పాల్గొన్నారు. అయినవిల్లి.. భక్తులతో శోభిల్లి అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ఒక జంట పంచామృతాభిషేకం చేసింది. 23 మంది లఘున్యాస అభిషేకాలు, ఏడుగురు లక్ష్మీగణపతి హోమం, ఒక చిన్నారికి అక్షరాభ్యాసం, 11 మంది భక్తులు తమ నూతన వాహనాలకు పూజలు చేశారు. 1,706 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయానికి రూ.1,75,313 సమకూరింది. -
యాప్డూ కష్టాలే!
ఇదేం బాధరా బాబూ!: సెల్ఫోన్లో యాప్ డౌన్లోడ్ గురించి తెలియక ఇబ్బంది పడుతున్న రైతు నూకరాజు పిఠాపురం: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఎరువుల కోసం రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బస్తా ఎరువు కోసం సొసైటీలు, రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) వద్ద వారు రేయింబవళ్లు పడిగాపులు పడిన దృశ్యాలు ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఇన్ని ఇక్కట్లు పడినా అదునుకు ఎరువు దొరకక కన్నీరు పెట్టుకున్న రైతులెందరో! ప్రభుత్వ నిర్వాకంపై కడుపు మండిన రైతులు పలుచోట్ల రోడ్లెక్కి ఆందోళనలు సైతం చేశారు. ఈ నరకం చాలదన్నట్లు.. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం–2.0 (ఏపీఏఐఎంఎస్) పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్లో రైతుల ధ్రువీకరణ జరిగితేనే ఎరువులు విక్రయించాలని హోల్సేల్, రిటైల్ డీలర్లకు, సహకార సొసైటీలకు ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ భూములన్నిటికీ ఎరువుల పంపిణీ జరుగుతుందని అంటూనే వాటి విక్రయాలకు యాప్లో పలు నిబంధనలు పొందుపరిచింది. దీంతో, ఎరువుల కోసం తమకు ప్రతిసారీ కష్టాలు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. యాప్ ద్వారా ఇలా.. వరి, పత్తి, ఆయిల్పామ్, మామిడి, జీడిమామిడి, మల్బరీ తదితర పంటలకు ఈ యాప్ ద్వారానే ఎరువులు పంపిణీ చేస్తారు. దీని కోసం రైతులు దగ్గర్లోని ఉన్న ఆర్ఎస్కేలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకుని యూనిక్ నంబర్ పొందాలి. వారికి మాత్రమే ఆర్ఎస్కేలు, సొసైటీలు, ప్రైవేటు డీలర్ల వద్ద యాప్ ద్వారా ఎరువులు విక్రయిస్తారు. ఈ విధానాన్ని కాకినాడ, కృష్ణా జిల్లాల్లో ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా గురువారం నుంచి అమలు చేస్తోంది. ఎరువుల వృథా నియంత్రణ పేరుతో ప్రభుత్వం ఈ విధానం తీసుకొచ్చింది. రైతులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, తమ ఆధార్, పాస్ పుస్తకాల వివరాలు, తాజాగా జారీ చేసిన డిజిటల్ నంబరును, భూమి, అందులో వేసే పంట వివరాలు నమోదు చేసుకోవాలి. అనంతరం, ఆ రైతులు ఆ పంటకు ఏయే ఎరువులు ఎంత మోతాదులో వాడాలనేది యాప్ ద్వారా నిర్ణయించి, ఆ మేరకు మాత్రమే ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఇప్పటికే ఈ యాప్పై జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించారు. రైతుల్లో ఆందోళన జిల్లావ్యాప్తంగా సుమారు 3 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్లో అన్ని రకాల ఎరువులూ కలిపి సుమారు 66 వేల మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా. ఇందులో ఒక్క యూరియానే 35,576 మెట్రిక్ టన్నులు అవసరమని అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్లో యాప్ ద్వారానే ఎరువులు విక్రయించాలనే విధానాన్ని ప్రభుత్వం తీసుకుని రావడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ విధానం ప్రకారం ప్రతి రైతు తప్పనిసరిగా ఆండ్రాయిడ్ ఫోన్ కలిగి ఉండాలి. దాని వాడకం తెలిసి ఉండాలి. నెట్ బ్యాలన్స్ కలిగి, వెబ్ల్యాండ్లో నమోదై ఉండాలి. అయితే, జిల్లావ్యాప్తంగా స్మార్ట్ఫోన్లు లేని రైతులే అధికం. ఎక్కువ శాతం మంది కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారు. వీరికి కౌలు కార్డులు ఇవ్వడానికే రైతులు అభ్యంతరాలు చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు ఏకంగా ఆ కౌలు రైతు పేరున యాప్లో వివరాలు నమోదు చేస్తే.. అసలు రైతులు ఊరుకుంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతే కాదు.. చాలా గ్రామాల్లో ఇంటర్నెట్ సిగ్నల్ సమస్య అధికంగా ఉంటుంది. ఎరువులు కావాల్సిన సమయంలో ఆన్లైన్ ఇబ్బందులు వస్తే.. గంటల తరబడి దుకాణాల వద్ద పడిగాపులు పడాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. అలాగే, తమకు కేటాయించిన దుకాణాలకు సరైన సమయంలో స్టాకు వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ఎరువులు, పురుగు మందులు కొనడానికే అప్పులు చేస్తూంటే ఇక స్మార్ట్ఫోన్లు కూడా ఎక్కడ కొనగలుగుతామని అంటున్నారు. అసంపూర్తిగా మ్యాపింగ్ మరోవైపు యాప్తో రైతుల అనుసంధాన ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. కానీ, ఇప్పటికీ చాలామంది రైతులు యాప్తో మ్యాపింగ్ కాలేదు. వారికి గత ఏడాది ఈ–క్రాప్ నమోదు ఆధారంగా ఎరువులు ఇస్తామని ప్రభు త్వం చెబుతోంది. దీని ప్రకారం ఇటు యాప్లో మ్యాపింగ్ జరగక, అటు గత ఏడాది ఈ–ప్ నమోదు కాని రైతులకు ఎరువులు లభించే అవకాశం లేదన్నది స్పష్టమవుతోంది. పైగా ఈ–క్రాప్ కూడా పొలం యజమానుల పేరిట జరిగింది. ఇక కౌలు రైతుల్లో చాలా మందికి కౌలు గుర్తింపు కార్డులే ఇవ్వలేదు. ఇప్పుడు వారి యాప్ మ్యాపింగ్ కూడా భూమి యజమానుల పేరిటే జరుగుతోంది. ఫలితంగా ఎరువులు బుక్ చేస్తే ఓటీపీ భూ యజమానులకే వెళ్తుంది. మరోవైపు సర్వర్ సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. వీటన్నింటికీ తోడు రీ సర్వే, జాయింట్ ఎల్పీ నంబర్లతో అనేక సమస్యలుండగా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ ఎలా సాధ్యమవుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా, డీఏపీ ఎరువుల వాడకాన్ని నియంత్రించడానికే యాప్ను అందుబాటులోకి తెచ్చామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఎరువుల సబ్సిడీలను తగ్గించే ఎత్తుగడ ఈ యాప్ విధానం వెనుక ఉందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గత ఖరీఫ్ కంటే ఎరువుల వాడకం తగ్గి తీరాలని ఇప్పటికే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. యాతన తప్పదు ఈ–క్రాప్ నమోదు ప్రకారం పంటల వివరాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. ఒకసారి ఎంటర్ చేస్తే అదే పంట పండించాలి తప్ప సీజనల్గా పంట మార్చుకునే అవకాశం ఉండదు. ఏ షాపులున్నాయనేది తెలియని పరిస్థితి. మూడు రోజులు ముందుగా ఎరువులు బుక్ చేసుకోవాలి. తీరా మూడో రోజు ఎరువుల స్టాకు అందుబాటులో ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఈ యాప్పై రైతులకు ఎటువంటి అవగాహనా లేదు. గత రెండు సీజన్లలో ఎరువుల కోసం రైతులు యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వ్యవసాయంపై విరక్తి కలిగే పరిస్థితులు వస్తాయి. – ఉలవకాయల నాగ లోవరాజు,జెడ్పీటీసీ సభ్యుడు, గొల్లప్రోలు యాప్ ద్వారా ఎరువుల పంపిణీ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం రైతులకు మ్యాపింగ్ సమస్య కౌలు రైతులకు ఓటీపీ కష్టాలు సాంకేతిక ఇబ్బందులు తప్పవని ఆందోళన -
కుక్కకు పోస్టుమార్టం పూర్తి.. ల్యాబ్ నివేదికపై ఉత్కంఠ
కాకినాడ: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క మృతిపై దర్యాప్తు చేపట్టారు అధికారులు. ఈ క్రమంలోనే నిన్న(శనివారం, జూన్ 13వ తేదీ) మృతి చెందిన కుక్కకు.. ఈరోజు(ఆదివారం, జూన్ 14వ తేదీ) పోస్టుమార్టం నిర్వహించారు. ఎన్.సూరవరం వెటర్నరీ అధికారుల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించారు. కుక్కకు పోస్టుమార్టం నిర్ర్వహించిన అనంతరం నమూనాలను సేకరించి విశాఖ వరుణ్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. దాంతో ల్యాబ్ నివేదికపై ఉత్కంఠ నెలకొంది. సహజ మరణమా..? విష ప్రయోగమా? అనేది ల్యాబ్ రిపోర్ట్ అనంతరం తేలనుంది. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని చిక్కుళ్ల అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో క్లూ అనుకున్న కుక్క మృతిచెందడంతో ఇప్పుడు టాపిక్ అంతా కుక్కపైకి డైవర్ట్ అయ్యింది. చిన్నారి ఆచూకీని కనిపెట్టడానికి అడవులు, కొండల్ని కొన్ని రోజులుగా జల్లెడ పట్టిన కుక్క. తిరిగి ఇంటికొచ్చిన తర్వాత మృత్యువాత పడింది. ఇంటికొచ్చిన తర్వాత ఆ పెంపుడు కుక్క వింతగా ప్రవర్తిస్తూ చివరకు మృతిచెందింది. అదంతా అబద్ధం.. జ్ఞానేశ్వరి తండ్రి కీలక వ్యాఖ్యలు -
అదంతా అబద్ధం.. జ్ఞానేశ్వరి తండ్రి కీలక వ్యాఖ్యలు
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. బాలిక అదృశ్యమై తొమ్మిది రోజులు గడిచినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కేసులో కీలకంగా భావిస్తున్న పెంపుడు కుక్క మృతి చెందడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో చిన్నారి తండ్రి గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. చిన్నారి జ్ఞానేశ్వరి జాడ కోసం ఎన్డీఆర్ఎఫ్ టీమ్ రంగంలోకి దిగింది. జ్ఞానేశ్వరి ఇంటి వెనుక ఉన్న పామాయిల్ తోట, నల్లకొండ మీద గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా జ్ఞానేశ్వరి తండ్రి గణేష్ మాట్లాడుతూ.. తమ కుమార్తె ఇంటికి చాలా దగ్గరలోనే ఆడుకునేదని, ఇంటి నుంచి 20 మీటర్ల దూరం కూడా ఒంటరిగా వెళ్లే అలవాటు లేదని తెలిపారు. మా పాప అంత దూరం వెళ్లే పిల్ల కాదు. ఆమెను ఎవరో అపహరించి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేశారు. జ్ఞానేశ్వరి ఎక్కడికి వెళ్లినా ఆమె పెంపుడు కుక్క ఎప్పుడూ వెంటే ఉంటుంది. ఇంటి సమీపంలోని తోటలో, పరిసర ప్రాంతాల్లో ఆ కుక్కతో కలిసి ఆడుకోవడం ఆమెకు అలవాటని తెలిపారు. అందుకే బాలిక అదృశ్యమైన తర్వాత ఆ కుక్క కదలికలు కేసులో కీలక ఆధారంగా మారుతాయని భావించారు.ఇదిలా ఉండగా.. జ్ఞానేశ్వరి ఇంటి నుండి పోస్టుమార్టం కోసం పెంపుడు కుక్క మృతదేహాన్ని తరలిస్తున్నారు. మరికాసేపట్లో ఎన్.సూరవరం పశువుల ఆసుపత్రిలో కుక్కకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అయితే, కుక్క మృతదేహన్ని తరలిస్తుండగా పాప తల్లి భవాని కన్నీరుపెట్టుకుంది. గత ఆరు నెలలుగా కుక్కను పెంచుకుంటున్నామని.. జ్ఞానేశ్వరి ఆ కుక్కతోనే ఆడుకునేదని రోదించింది. జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఉన్న ఒక్క ఆధారం పోయిందని కంటతడి పెట్టుకుంది. అయితే ఇటీవల ఆ పెంపుడు కుక్క కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు మరింత ఆందోళన చెందుతున్నారు. కుక్క మృతిపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయని జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటన సహజమా? లేక బాలిక అదృశ్యానికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరగాలని కోరుతున్నారు. కుక్క మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే కుక్క ఎలా చనిపోయిందనే విషయంపై స్పష్టత ఇస్తామని అధికారులు తెలిపారు.అదంతా అబద్దం..ఇదిలా ఉండగా.. "పాపను తోట బయట చూశాను" అని పాపారావు అనే వ్యక్తి చెప్పిన వాదనను జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు పూర్తిగా తిరస్కరిస్తున్నారు. తమ కుమార్తె ఒంటరిగా తోట దాటి బయటకు వెళ్లే అవకాశం లేదని, ఆ వాదనను తాము నమ్మడం లేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. బాలిక అదృశ్యానికి సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, అపహరణ కోణంతో పాటు ఇతర అన్ని అవకాశాలపైనా దర్యాప్తు సాగుతోందని అధికారులు చెబుతున్నారు. అయితే రోజులు గడుస్తున్నా చిన్నారి జాడ లభించకపోవడం, కేసులో కీలకంగా భావిస్తున్న పెంపుడు కుక్క కూడా మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
శ్రీగోకులం.. అధ్వానం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ గోకులం రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసి ముద్దయింది. గోకులం పైన రెల్లుగడ్డితో నేసిన కప్పు నుంచి నీరు కారిపోవడంతో సప్త గోవులతో బాటు మధ్యలోని శ్రీకృష్ణుడి విగ్రహం కూడా తడిసిపోయింది. రెండేళ్ల క్రితం కప్పుపై తడికలు పేర్చి దానిపై రెల్లు గడ్డి వేశారు. అయితే రత్నగిరిపై తిరుగుతున్న కోతుల కారణంగా రెల్లుగడ్డి ఊడిపోవడంతో లోపలకు వర్షం కారిపోతోంది. దీంతో గోవులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కాగా.. 2007లో దేవదాయశాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా రత్నగిరిపై శ్రీగోకులాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత మిగిలిన దేవస్థానాలలో కూడా ప్రారంభమైనా అన్నవరంలోని శ్రీగోకులం బాగా ప్రాచుర్యం పొందింది. సత్యదేవుని దర్శించుకున్న భక్తులందరూ ఇక్కడకు వచ్చిన గోవులకు పూజలు చేస్తారు. శ్రీగోకులంలో నిత్యం ఉదయం ఏడు గంటల నుంచి గోపూజ నిర్వహిస్తున్నారు. వీటితో బాటు గో సంరక్షణార్థం విరాళాలు స్వీకరిస్తున్నారు. రూ.1,116 నుంచి ఎంత మొత్తమైనా విరాళంగా చెల్లించవచ్చు. గోవులకు మేత పెట్టేందుకు రూ.పదితో పచ్చగడ్డి, తర్వాత దాణాను విక్రయిస్తున్నారు. ఇలా గోపూజ, మే త విక్రయాలు, హుండీ ద్వారా ఏటా రూ.50 లక్షలకు పైగా ఆదాయం వస్తోందని అధికారులు తెలిపారు. ఫ వర్షం కురిస్తే కారిపోతున్న నీరు ఫ తడుస్తున్న గోవులు -
సర్కారు వారి కుట్టు కథ
ప్రతిపాదనలు పంపించాం జిల్లాలో గత ఏడాది పలువురు మహిళలు టైలరింగ్ శిక్షణ పొంది, పరీక్షలు కూడా రాశారు. 75 శాతం హాజరున్న వారికి ఉచితంగా కుట్టు మెషీన్లు అందజేయాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. బడ్జెట్ విడుదల చేస్తే త్వరలోనే పంపిణీ చేసే అవకాశముంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన తర్వాత ట్రైనర్లకు, ఆపరేటర్లకు వేతన బకాయిలు అందజేస్తాం. – శ్రీనివాస్, బీసీ కార్పొరేషన్ ఈడీ, కాకినాడ ఫ టైలరింగ్ శిక్షణ పేరుతో ఆర్భాటం ఫ ఉచితంగా కుట్టు మెషీన్లుఇస్తామంటూ గొప్పలు ఫ శిక్షణ ఇచ్చి చేతులు దులుపేసుకున్న ప్రభుత్వం ఫ ఏడాదైనా అందని కుట్టు మెషీన్లు ఫ మహిళల ఆగ్రహం పిఠాపురం: మహిళలు స్వయం శక్తితో ఎదిగేందుకు కుట్టు శిక్షణ ఇచ్చి, ఉచితంగా మెషీన్లు ఇస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటం చేసింది. ఆ మాటలను నమ్మి వేలాది మంది మహిళలు ఎంతో ఆశతో శిక్షణ పొందారు. తీరా చూస్తే ప్రభుత్వం శిక్షణతో సరిపెట్టేసి, కుట్టు మెషీన్లు ఇవ్వకుండా చేతులు దులుపేసుకుంది. ఇదంతా చంద్రబాబు మార్కు కట్టు కథలా ఉందంటూ ప్రభుత్వ తీరుపై మహిళలు మండిపడుతున్నారు. రెండు విడతలుగా.. బీసీ కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్ శాఖల ఆధ్వర్యాన బీసీ, ఆర్థికంగా వెనుక బడిన తరగతి (ఈబీసీ), కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, కాపు సామాజికవర్గాల్లో అర్హులైన మహిళలకు 2024–25 కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గత ఏడాది ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చారు. దీనికోసం సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (సీయూఆర్డీ), సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్ (ఎస్ఏపీఈ) ఆధ్వర్యాన శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో ఒక ట్రైనర్, ఒక కంప్యూటర్ ఆపరేటర్ను నియమించారు. శిక్షణ, కేంద్రం అద్దె, కుట్టు మెషీన్, ఇతర పరికరాల కోసం ఒక్కో మహిళకు సుమారు రూ.22 వేల చొప్పున కేటాయించారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ రెండు విడతలుగా పలువురు మహిళలు ఆయా కేంద్రాల్లో శిక్షణ పొందారు. మెషీన్లు ఇవ్వకుండా పరీక్షలు నాలుగు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న వెంటనే 75 శాతం హాజరు నమోదైన మహిళలకు సర్టిఫికెట్తో పాటు ఉచితంగా కుట్టు మెషీన్ అందజేస్తామని అప్పట్లో ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ అలా జరగలేదు. పైగా 75 శాతం హాజరు ఉన్న మొదటి బ్యాచ్ మహిళలకు ఇటీవల పరీక్షలు నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఉచితంగా కుట్టు మెషీన్లు అందిస్తామని చెప్పుకొచ్చారు. శిక్షణ పొందితే మెషీన్లు ఇస్తారని ఆశతో ఎదురు చూస్తూంటే తమకివేం పరీక్షలంటూ మహిళలు మండిపడుతున్నారు. కేవలం మెషీన్లు ఇవ్వకుండా కాలయాపన చేయడానికే ఇలా సాకులు చెబుతున్నారని మండిపడుతున్నారు. శిక్షణ పూర్తయి ఏడాది గడుస్తున్నా కుట్టు మెషీన్లు ఎందుకివ్వడం లేదో చెప్పాలని, కనీసం ఎప్పుడిస్తారో స్పష్టత ఇవ్వాలని నిలదీస్తున్నారు. అలాగే శిక్షణ ఇచ్చిన సిబ్బందికి సైతం ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవడం గమనార్హం.కుట్టుశిక్షణ కేంద్రాల వివరాలు జిల్లా కేంద్రాలు శిక్షణ పొందిన వారు కాకినాడ 50 4,920 తూర్పుగోదావరి 25 2,904 కోనసీమ 29 3,190 పోలవరం 5 566 మొత్తం 104 11,104 -
రత్నగిరిపై ఎట్టకేలకు వైద్య సేవలు
అన్నవరం: సత్యదేవుని భక్తులకు ఎట్టకేలకు రత్నగిరిపై వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. రత్నగిరిపై వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రత్నగిరిపై వైద్య సేవల ఆవశ్యకతను వెలుగులోకి తెచ్చేలా ‘దివ్యక్షేత్రం.. వైద్యం పూజ్యం!’ శీర్షికన ఈ నెల 5న ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్పందించారు. ప్రతి రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ దేవస్థానం వైద్యాధికారి వంశీకృష్ణతో పాటు ఇద్దరు నర్సులలో ఒకరు షిఫ్టుల వారీగా రత్నగిరిపై భక్తులకు సేవలందించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి రావడంతో డాక్టర్ వంశీకృష్ణ, సీనియర్ నర్సు సరోజిని శనివారం రామాలయం ఎదురుగా కార్పొరేట్ ఆసుపత్రికి కేటాయించిన హెల్త్ సెంటర్లో సేవలందించారు. శాశ్వత వైద్యశాల మేలు రత్నగిరిపై వైద్య సేవలు అందుబాటులోకి తీసుకుని రావడం బాగానే ఉన్నప్పటికీ.. భక్తులకు 24 గంటలూ అందుబాటులో ఉండేలా శాశ్వత ప్రాతిపదికన ఆసుపత్రి ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. వాస్తవానికి భక్తులకు ప్రథమ చికిత్స అందించేందుకు రత్నగిరి రామాలయం ఎదురుగా కార్పొరేట్ ఆసుపత్రికి గది కేటాయించడంపై విమర్శలున్నాయి. కొన్నిసార్లు దేవస్థానంలోను, మరికొన్నిసార్లు ఆసుపత్రికి తరలించగానే భక్తులు మృతి చెందుతున్నారు. అక్కడే పలువురు భక్తులు సేద తీరుతారు. అక్కడే ప్రసాదాల విక్రయ కేంద్రం ఉంది. అటువంటి చోట మృతులను తరలించడం కొంత ఇబ్బందితో కూడుకున్న పని. ఇలా జరిగినప్పుడు సంప్రోక్షణ చేయాల్సి ఉంటుంది. అందువలన ప్రకాష్ సదన్ సత్రం వెనుక స్థలంలో శాశ్వత ఆసుపత్రి నిర్మిస్తే సత్యగిరి, రత్నగిరికి అందుబాటులో ఉంటుందనే అభిప్రాయం వస్తోంది. ఇది ఆలయానికి దూరంగా ఉండటం వలన ఎవరైనా మృతి చెందినా ఘాట్ రోడ్డు ద్వారా దిగువకు తీసుకువెళ్లే వెసులుబాటు ఉంటుంది. ఇదిలా ఉండగా దేవస్థానం వైద్యుడిని మధ్యాహ్నం వరకూ రత్నగిరిపై పని చేయాలని ఆదేశించడంతో ఆ సమయంలో కొండ దిగువన మరో వైద్యుడిని నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పస్తులు పెట్టి.. పరిహారం ఎగ్గొట్టి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సముద్రంలో వేట నిషేధం అమలులో ఉన్న సమయంలో మత్స్యకారులకు అందిస్తున్న భృతిని రూ.10 వేల నుంచి రూ.20 వేలు చేస్తామని గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు అండ్ కో గొప్పగా చెప్పారు. గద్దెనెక్కిన తొలి ఏడాదే అంటే 2024లో వేట నిషేధ భృతిని పూర్తిగా ఎగ్గొట్టేశారు. గత సంవత్సరం అరకొరగా విదిల్చి, చేతులు దులిపేసుకున్నారు. సవాలక్ష కొర్రీలతో కోతలు పెట్టారు. చంద్రబాబు సర్కారు తీరుపై మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 61 రోజులు నిషేధం బంగాళాఖాతంలో చేపల వేటపై నిషేధం ఈ ఏడాది ఏప్రిల్ 15న అమలులోకి వచ్చింది. సముద్రంలో చేపల పునరుత్పత్తి కోసం ఏటా 61 రోజుల పాటు వేట నిషేధం అమలు చేస్తున్నారు. ఆ సయయంలో ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు ప్రభుత్వం చాలా ఏళ్లుగా వేట నిషేధ భృతి అందిస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ భృతి రూ.10 వేలు ఉండగా.. దీనిని రూ.20 వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించారు. పెంపుదల అయితే చేశారు కానీ, రకరకాల సాకులతో లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టారు. ఈ ఏడాది నిషేధం శనివారం అర్ధరాత్రితో ముగిసిపోతోంది. అయినప్పటికీ ఇస్తామన్న భృతిని ప్రభుత్వం ఇప్పటి వరకూ అందించలేదు. కోత పెట్టారిలా.. వేట నిషేధ భృతి లబ్ధిదారులను గుర్తించేందుకు ఏప్రిల్ 18న సర్వే (బోట్లు, మత్స్యకారుల నమోదు) నిర్వహించారు. కాకినాడ జిల్లాలో తొండంగి నుంచి తాళ్లరేవు వరకూ ఆరు సముద్ర తీర మండలాల్లోని 58 మత్స్యకార గ్రామాల్లో 1,95,184 మంది మత్స్యకారులున్నారు. వీరిలో 27,070 మంది 387 మెకనైజ్డ్ బోట్లు, 3,826 మోటారైజ్డ్ బోట్లు, 389 సంప్రదాయ ఇంజిన్ లేని బోట్లపై సముద్రంలో చేపల వేట సాగిస్తూ ఉపాధి పొందుతున్నారు. ప్రాథమికంగా గుర్తించిన ఈ 27,070 మందిలో సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ నిబంధనల పేరిట 2,140 మందిని తొలగించి, లబ్ధిదారుల సంఖ్యను 24,930కి తగ్గించేశారు. అలాగే, కోనసీమ జిల్లాలో 483 మంది మత్స్యకారులకు కోత పెట్టారు. సముద్రంలో వేటకు వెళ్లే మెకనైజ్డ్ బోట్లకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ డీజిల్ వినియోగించ లేదనే సాకుతో సైతం ఎగనామం పెట్టారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా దాదాపు 3 వేల మంది మత్స్యకారులకు సుమారు రూ.6 కోట్ల మేర వేట నిషేధ భృతిని ప్రభుత్వం ఎగ్గొట్టింది. నిషేధ సమయంలో నిజాయితీగా సముద్రంలో వేటకు వెళ్లకుండా ఇళ్ల వద్దనే కూర్చున్నందుకు చంద్రబాబు సర్కారు తమకు తగిన గుణపాఠమే చెప్పిందని మత్స్యకారులు మండిపడుతున్నారు. వేట నిషేధ భృతి కోసం కాకినాడ సహా పలు ప్రాంతాల్లోని మత్స్యశాఖ కార్యాలయాల వద్ద మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ఆ సమయంలో సమస్య పరిష్కరిస్తామన్న అధికారులు ఇప్పుడు పత్తా లేకుండా పోయారని వారు మండిపడుతున్నారు. రెండో విడతలో తమ జాబితాకు అనుమతి వస్తుందని నమ్మించి, వేట నిషేధ గడువు ముగిసే సమయానికి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేసిందని వాపోతున్నారు. వేటపై ముగిసిన నిషేధం మత్స్యకారులకు భృతి ఇవ్వని ప్రభుత్వం కొర్రీలు పెట్టి కోతలు 3 వేల మందికి రూ.6 కోట్ల మేర ఎగనామం నేడు సముద్రంలో వేట పునఃప్రారఃభం -
టేబుల్ టెన్నిస్ పోటీల రెండో రోజు విజేతలు వీరే..
సామర్లకోట: పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ పోటీల్లో రెండో రోజు శనివారం విజేతల వివరాలను ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి పి.విశ్వనాథ్ ప్రకటించారు. అండర్ – 11 బాలికల విభాగంలో మిషిక గోవిందరాజు (డీటీటీఎ) ప్రథమ, గీతి ఆప్రోజ్ (ఫన్ టైమ్స్) ద్వితీయ, బాలుర విభాగంలో వీర సాత్విక్ (ఫన్ టైమ్స్) ప్రథమ, పల్లా మహాసవిన్ (ఫన్ టైమ్స్) ద్వితీయ స్థానాల్లో నిలిచారు. ఫ అండర్ – 13 బాలిక విభాగంలో శ్రీకర లాస్య, కొల్లి హైత్విక (ఫన్ టైమ్స్), బాలుర విభాగంలో జె.వైభవ్, జి.తరుణ్ తేజ (ఫన్టైమ్స్) వరుస స్థానాల్లో నిలిచారు. ఫ అండర్ – 15 విభాగంలో శ్రీకర లాస్య, కొల్లి హైత్విక (ఫన్ టైమ్స్), బాలుర విభాగంలో ఎన్.వేదాంశ్ (ఫన్టైమ్స్), నల్ల మోక్షజ్ఞ తేజ (రైజ్) ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. విజేతలకు ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ సీహెచ్ విజయ్ ప్రకాష్, కార్యదర్శి విశ్వనాథ్ బహుమతులు అందజేశారు. ఈ పోటీలను నిర్ణీత సమయంలో పూర్తి చేసిన చీఫ్ రిఫరీ సింగరాజు, అసిస్టెంట్ చీఫ్ రిఫరీ డీవైఎస్వై శర్మ, ఇతర అంపైర్లను అభినందించారు. -
పర్యాటక బోట్ల రాకపోకలకు తాత్కాలికంగా బ్రేక్
రంపచోడవరం: నిర్వహణ తీరుపై పలు ఆరోపణలు, భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా గోదావరిలో పర్యాటక బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. రంపచోడవరం ఆర్డీఓ కె.స్వాతి శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. కలెక్టర్ కె.దినేష్ కుమార్ ఆదేశాల మేరకు పర్యాటక బోట్ల ఫిట్నెస్, సాంకేతిక పరిస్థితి, ప్రయాణికుల సామర్థ్యం, భద్రతా ప్రమాణాలు, లైఫ్ జాకెట్లు, అత్యవసర రక్షణ పరికరాలు, పర్యాటకుల భద్రతకు తీసుకున్న చర్యలు తదితర అంశాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నామని తెలిపారు. రెవెన్యూ, పోలీసు, పర్యాటక, మత్స్యశాఖ, విపత్తు నిర్వహణ, ఇరిగేషన్ శాఖల అధికారులతో కూడిన బృందం ఈ తనిఖీలు నిర్వహిస్తుందన్నారు. ఆ బృందం నివేదిక ఆధారంగా అన్ని భద్రతా ప్రమాణాలూ పాటిస్తున్నట్లు నిర్ధారణ అయిన అనంతరం, సంబంధిత బోట్లకు అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని, తనిఖీలు పూర్తయ్యే వరకూ గోదావరిలో పర్యాటక బోట్లు నడపరాదని యాజమాన్యాలను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ స్వాతి హెచ్చరించారు. -
వెన్నుపోటు పొడిచారు
చేపల వేట ద్వారా జీవనోపాఽధి పొందుతున్న మత్స్యకారులు రెండు నెలల పాటు ఇంట్లో ఖాళీగా ఉండి పస్తులున్నారు. వేట విరామ సమయంలో ఇచ్చే భృతికి ప్రభుత్వం 2024లో ఎగనామం పెట్టింది. తరువాతి సంవత్సరం కోత విధించింది. ఈ ఏడాది చాలా మందికి భృతి అందలేదు. పెద్ద బోట్లకు రాయితీ డీజిల్ వినియోగించలేదనే కారణంతో చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. – బొడ్డు సత్యనారాయణ, మత్స్యకార నాయకుడు, తూరంగి రాయితీ డీజిల్ సాకుతో... రాయితీ డీజిల్ను సాకుగా చూపిస్తూ సముద్రంపై చేపల వేట చేస్తున్న అసలైన లబ్ధిదారులకు మొండిచేయి చూపించారు. చేపల వేట నిషేదం ముగుస్తున్నా నేటికీ కొంతమందికి మత్స్యకార సేవ లబ్ధి అందలేదు. కోనసీమ జిల్లాలో మత్స్యశాఖ అధికారులు బోటు ఫొటో గుర్తింపు సర్వే చేపట్టి 12,016 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్థిదారులు, కరెంటు బిల్లులను సాకుగా చూపించి కనీస సమాచారం లేకుండా 388 మందిని తొలగించారు. జిల్లాలోని 67 మెకనైజ్డ్ బోట్లకు చెందిన 483 మంది లబ్ధిదారులకు మత్స్యకార భరోసా జమ చేయలేదు. – మల్లాడి వీరబాబ్జీ, మత్స్యకార నాయకుడు, మాజీ సర్పంచ్, పల్లం ● -
‘ఆడబిడ్డ’కు బాబు మంగళం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆడబిడ్డ నిధికి మంగళం పాడిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు త్వరలో మహిళలే బుద్ధి చెబుతారని వైఎస్సార్ సీపీ మహిళా నేతలు హెచ్చరించారు. ఆడబిడ్డ నిధికి నిధులు లేవని తిరుపతి సభలో చంద్రబాబు స్పష్టం చేసిన నేపథ్యంలో కాకినాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్, పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి శనివారం మీడియా సమావేశంలో స్పందించారు. విజనరీ అని, సంపద సృష్టిస్తానని చెప్పుకుంటూ గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబుకు.. గద్దెనెక్కి రెండేళ్లు దాటిపోతున్నా ఆడబిడ్డ నిధి అమలు చేత కాలేదని విమర్శించారు. ఇప్పుడు నిధుల్లేవంటూ యూటర్న్ తీసుకుని మరో మోసానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా సున్నా వడ్డీ అంటూ అలవి కాని హామీలతో మహిళలను ఓటు బ్యాంక్ రాజకీయాలకు వినియోగించుకుని, మోసం చేశారని విమర్శించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేయకపోవడం అన్యాయమన్నారు. సంపద సృష్టించడం సంగతలా ఉంచితే, అప్పుల్లో చంద్రబాబు ప్రపంచ రికార్డు సృష్టించారని విమర్శించారు. కోట్లాది రూపాయల అప్పులు చేస్తున్నా మహిళలకు కనీసం ఒక్క పథకం కూడా అమలు చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేస్తున్న అప్పులు ఎక్కడికి పోతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క పథకాన్ని కూడా చంద్రబాబు సక్రమంగా అమలు చేయని విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ఉచిత గ్యాస్ అరకొరగానే అమలు చేశారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు కల్లబొల్లి హామీలతో నమ్మించి, అధికారంలోకి వచ్చాక మహిళలకు వెన్నుపోటు పొడిచారని, ప్రతిసారీ చంద్రబాబు చేస్తున్న మోసాలను మహిళలు గమనిస్తున్నారని అన్నారు. రెండేళ్లు సక్రమంగా పాలించలేని చంద్రబాబు మిగిలిన మూడేళ్లు ఏవిధంగా పాలన సాగిస్తారో ప్రజలకు అంతుబట్టనిదిగా ఉందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా, అధికారంలోకి వచ్చాక చెప్పని పథకాలను సైతం అమలు చేసి, మహిళల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి కృషి చేసిన ఏకై క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. దగా పడిన ఆడబిడ్డకు ఆయన మాత్రమే న్యాయం చేస్తారన్నారు. అబద్ధాలు చెప్పి, మోసం చేసి గద్దెనెక్కిన చంద్రబాబుకు ప్రజలు 2029లో బుద్ధి చెప్పి జగన్ను అధికారంలోకి తీసుకురావడం ఖాయమని వైఎస్సార్ సీపీ మహిళా నేతలు స్పష్టం చేశారు. ‘ఆక్వా’ సేవకు జాతీయ స్థాయి అవార్డు కాకినాడ రూరల్: నగరానికి చెందిన ఆక్వా నిపుణుడు, గోదావరి ఆక్వా గ్లోబల్ గ్రూప్ వ్యవస్థాపకుడు పీడీబీఎస్ఎన్ వెంకటేశ్వరరావుకు బెస్ట్ ఆక్వాకల్చర్ టెక్నికల్ అవేర్నెస్ అవార్డు–2026 లభించింది. ఆక్వా రైతులకు సాంకేతిక అవగాహన కల్పించడం, ఆధునిక సాగు పద్ధతులను ప్రోత్సహించడం, రొయ్యలు, చేపల సాగులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి నిరంతర మార్గదర్శకత్వం అందించడం, పరిశ్రమకు సంబంధించిన కీలక సమాచారాన్ని రైతులకు చేరవేయడంలో చేసిన కృషికి గాను ఈ అవార్డు అందజేశారు. భీమవరంలో జరిగిన ఆక్వా ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్–2026 కార్యక్రమంలో ఈ అవార్డును ఆయన అందుకున్నారు. గోదావరి ఆక్వా గ్లోబల్ గ్రూప్ ద్వారా వేలాది మంది రైతులు, ఆక్వా టెక్నీషియన్లు, పరిశ్రమకు చెందిన వ్యక్తులకు సాంకేతిక సమాచారం, అవగాహన సందేశాలు, వ్యాధి నివారణ సూచనలు, మార్కెట్ విశ్లేషణలు, నిపుణుల సలహాలు అందిస్తూ ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. వెంకటేశ్వరరావును రాష్ట్రంలోని పలువురు ఆక్వా రైతులు, పరిశ్రమ ప్రముఖులు అభినందించారు. -
కన్నూమన్ను కానకుండా..
కరప: ‘అధికారం మాది.. మమ్మల్నెవడ్రా ఆపేది?’ అంటూ కూటమి నాయకులు మట్టి మాఫియా అవతారమెత్తారు. కన్నూమిన్నూ కానకుండా దొరికిన చోటల్లా మట్టి కొల్లగొడుతున్నారు. దేవస్ధానం భూములు.. పంట కాలువ, మురుగు కాలువ గట్లపై యథేచ్ఛగా మట్టి తవ్వేస్తూ రాత్రికి రాత్రే తరలించుకుని పోయి, సొమ్ము చేసుకుంటున్నారు. మండల కేంద్రమైన కరప వేణుగోపాలస్వామి, రామలింగేశ్వరస్వామి ఆలయాలకు చెందిన భూముల్లో ఇటీవల వెయ్యి ట్రాక్టర్లకు పైగా మట్టి తరలించుకుపోయారు. పేపకాయలపాలెంలో ఇరిగేషన్, మురుగు కాలువ గట్లను తవ్వేసి, ఆ మట్టిని అమ్మేసుకున్నారు. ఈ వ్యవహారంలో సుమారు ఆరేడు లక్షల రూపాయలు వెనకేసుకుని ఉంటారని రైతులు ఆరోపిస్తున్నారు. మట్టి మాఫియా ఆగడాలపై ‘సాక్షి’ ఇటీవల కథనాలు ప్రచురించింది. అప్పట్లోనే అధికారులు స్పందించకపోవడంతో మాఫియా మరింత చెలరేగిపోతోంది. తెర వెనుక ‘ఆ నలుగురు..’ తాజాగా దేవదాయ శాఖ భూమిలోని మట్టిని కూటమి నాయకులు రూ.15 లక్షలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. దేవదాయ శాఖ పరిధిలోని కాకినాడ పైండా వారి సత్రానికి నడకుదురులో 7.50 ఎకరాల పంట భూమి ఉంది. ఇందులోని 3 కుంచాల దిబ్బను ఓ రైతు కౌలుకు చేస్తున్నారు. ఆ మట్టి దిబ్బపై కూటమి నాయకుల కన్ను పడింది. అక్కడి నుంచి 10 ట్రాక్టర్ల మట్టిని పల్లపు ప్రాంతంలో వేసుకోవడానికి అనుమతించాలంటూ ఆ కౌలు రైతుతో దేవదాయ అధికారులకు విజ్ఞప్తి చేయించారు. దీనికి అధికారులు కూడా అనుమతించారు. అంతే.. గురువారం రాత్రికి రాత్రే 3 కుంచాల దిబ్బను తవ్వేందుకు 6 జేసీబీలు, మట్టిని తరలించేందుకు 20 ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. నలుగురు కూటమి నాయకులు తెర వెనుక ఉండి ఈ తతంగమంతా నడిపించారు. ఈ భూమి పక్కనే ఒక నాయకుడు ఏడెకరాల పంట భూమిని పూడ్చి, లే అవుట్ వేస్తున్నాడు. అతడితో కూటమి నాయకులు డీల్ కుదుర్చుకుని గురువారం రాత్రి మట్టి తవ్వకం ప్రారంభించారు. మట్టి తవ్వకం విషయం తెలుసుకున్న నడకుదురు మాజీ ఎంపీటీసీ సభ్యుడు పబ్బినీడి చక్రరావు రాత్రి వేళ అక్కడకు వెళ్లి రహస్యంగా ఫొటోలు తీశారు. అది పసిగట్టిన కూటమి నాయకులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. అప్పటికే కుంచెడు విస్తీర్ణంలోని మట్టిని తరలించేశారు. లే అవుట్లో వేసిన మట్టి కనబడకుండా శుక్రవారం ఉదయానికల్లా గ్రావెల్తో కప్పేశారు. దేవదాయ శాఖ భూమిలోని పల్లపు ప్రాంతంలో అక్కడక్కడ నాలుగైదు ట్రాక్టర్ల మట్టి వేయించారు. చూస్తున్న వారికి దేవస్ధానం భూమిలో మిట్టపల్లాలు సరి చేస్తున్నట్లు కనిపించేలా కవరింగ్ ఇచ్చారు. విషయం రచ్చ అవడంతో రెవెన్యూ అధికారులు మొక్కుబడిగా దేవస్ధానం భూములు పరిశీలించి, అంతా బాగానే ఉందని, మట్టి అమ్మకాలు అసలు జరగలేదని ప్రకటించి, చేతులు దులిపేసుకున్నారు. విచిత్రంగా వారు కూటమి నాయకులను వెంట పెట్టుకుని పరిశీలనకు వెళ్లడం గమనార్హం. అధికారులు స్పందించరేం? సాధారణంగా దేవస్ధానం భూముల సాగుకు బహిరంగ వేలం పాట నిర్వహించేటప్పుడు ఎలా ఉన్న భూమిని అలాగే సాగు చేసుకోవాలనే నిబంధన ఉంటుంది. అందులోని మట్టి తవ్వినా, పొలం గట్లపై చెట్లు నరికినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తారు. ఆ మేరకు పైండా సత్రం భూమిలో మట్టి తవ్వి, అమ్మేసుకున్న కౌలు రైతుపై దేవదాయ అధికారులు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఆ రైతు కౌలును రద్దు చేసి, తిరిగి వేలం నిర్వహించాలి. కానీ, కూటమి నాయకులకు అధికారులు వత్తాసు పలకడం విమర్శలకు తావిస్తోంది. మట్టి మాఫియా ఆగడాలు దేవదాయ భూమిలో యథేచ్ఛగా తవ్వకాలు కూటమి నాయకుల బరితెగింపు పట్టించుకోని అధికారులు -
చిన్నారి మిస్సింగ్ మిస్టరీ.. అసలేం జరుగుతోంది..?
కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని చిక్కుళ్ల అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ట్విస్ట్లు మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి,. చిన్నారి అన్వేషణలో కీలకంగా మారిన కుక్క ఎపిసోడ్ విషాదాంతమైంది. చిన్నారి ఆచూకీని కనిపెట్టడానికి అడవులు, కొండల్ని కొన్ని రోజులుగా జల్లెడ పట్టిన కుక్క. తిరిగి ఇంటికొచ్చిన తర్వాత మృత్యువాత పడింది. ఇంటికొచ్చిన తర్వాత ఆ పెంపుడు కుక్క వింతగా ప్రవర్తిస్తూ చివరకు మృతిచెందింది.గాలింపు ఇలా..!సుమారు వారం రోజుల నుంచి పెద్దాపురం డీఎస్పీ తిలక్ పర్యవేక్షణలో పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, ఏఎన్ఎస్, క్యూఆర్టీ బృందాలు విస్తృత గాలింపు చేపట్టారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన జీపీఎస్ ట్రాకర్ను కుక్కకు అమర్చి వదిలారు. ట్రాకర్ ద్వారా కుక్క సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర సంచరించినట్లు గుర్తించారు. ఆ ప్రాంతాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ, ఎక్కడా ఏ క్లూ లభించలేదు.ఇక చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలను గుర్తించేందుకు సిల్వర్ మెటల్ డిటెక్టర్లను వినియోగించారు. జ్ఞానేశ్వరి చివరిసారిగా కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే చిన్నారి ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు ఆపబోమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.అదే సమయంలో కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ టవర్ డంప్ డేటా, కాల్ డిటైల్ రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులకు సన్నిహితులైన వ్యక్తులతో పాటు చుట్టుపక్కలకు కొత్తగా వచ్చిన వ్యక్తులు, గంజాయి అలవాటు ఉన్న వారిపై కూడా నిఘా పెట్టారు. పగలు, రాత్రి తేడా లేకుండా గాలింపు కొనసాగుతున్న సమయంలో కుక్క చనిపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.కుక్కలో వింత ప్రవర్తన..!ఈనెల 6 వ తేదిన జ్ఞానేశ్వరి వెంట వెళ్ళి అదృశ్యమైన పెంపుడు కుక్క... *మూడు రోజుల తరువాత ఇంటికి వచ్చింది. వచ్చిన దగ్గర్నుంచీ కుక్కలో వింత ప్రవర్తన మొదలైంది. జ్ఞానేశ్వరి తల్లితో పాటుగా పలువురిని మొరుగుతూ కరిచే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే రెండోసారి కూడా అదృశ్యమై, మళ్లీ ఇంటికి వచ్చింది. ఈసారి కుక్కకు జీపీఎస్ అమర్చి.. చిన్నారి ఆచూకీ కోసం కుక్కను కీలకంగా చేసుకున్నారు అధికారులు. అయితే ఇది కూడా ఉపయోగం లేకుండానే పోయింది. తిరిగి, తిరిగి ఇంటికి చేరిన కుక్క.. అనూహ్యంగా మృత్యువాత పడింది. చిన్నారి ఆచూకీ మాత్రం కుక్కకు తెలిసే ఉండవచ్చని, కుక్క వింతగా ప్రవర్తించడం వెనుకు ఏదో భయంకరమైన కారణం ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు గ్రామస్థులు, బంధువులు కూడా కుక్క వింత ప్రవర్తన వెనుక ఏదో భయంకరమైన కారణం ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఎటువంటి ఆధారాలు లభించకపోగా, ఇప్పుడు కీలకం అనుకున్న కుక్క మృతి చెందడంతో చిన్నారి మిస్సింగ్ కేసులో ఏం జరుగుతుంది? అనే చర్చ మొదలైంది. -
కుక్కే క్లూ అనుకున్నారు.. కానీ!
రెండేళ్ల చిన్నారి. పెంపుడు కుక్కతో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ వారమైనా తిరిగి రాలేదు. తల్లిదండ్రుల కన్నీళ్లు, బంధవులు.. గ్రామస్తుల ఆందోళన, పోలీసుల విస్తృత గాలింపు.. ఏదీ ఇప్పటివరకు జ్ఞానేశ్వరి ఆచూకీని కనిపెట్టలేకపోయాయి. పెంపుడు కుక్క తిరిగి వచ్చినా.. దానికి హైటైక్ టెక్నాలజీ తగిలించి ఆచూకీ కనిపెట్టాలని ప్రయత్నించినా.. పాప జాడ మాత్రం దొరక్కపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని చిక్కుళ్ల అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ వారమైనా చిక్కలేదు. తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు..చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అలాగే 10 పోలీసు టీంలు, 40 మంది ఎస్డీఆర్ఎఫ్ బృందం.. మరికొందరు అధికారులు పాప కోసం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో భాగమయ్యారు. అడవులు, కొండలు, గ్రామాలన్నీ నిర్విర్వామంగా జల్లెడ పడుతున్నారు. దీంతో ఈ కేసు దేశం దృష్టిని ఆకర్షించింది.ఈ నెల 6న ఇంటి బయట ఆడుకుంటూ అదృశ్యమైంది. పెంపుడు కుక్కతో కలిసి బయటకు వెళ్లిన పాప తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే.. ఈ కేసులో పెంపుడు కుక్క కీలక ఆధారంగా మారొచ్చని పోలీసులు భావించారు. అదృశ్యమైన మూడు రోజుల తర్వాత కుక్క గ్రామానికి తిరిగి వచ్చింది. అయితే ఇంటి వద్ద ఉన్న హడావుడి చూసి మళ్లీ పారిపోయింది. ఈ క్రమంలో అది పలువురిపై దాడి చేసింది. అనంతరం డాగ్ క్యాచర్ సాయంతో అతికష్టం మీద దానిని పట్టుకుని ఇంటికి తీసుకువచ్చారు. ఓ తాడుతో కట్టేసి.. దానికి పోలీసును కాపలా ఉంచారు. నీరసంగా ఉన్న దానికి.. వెటర్నరీ సిబ్బంది వైద్య సేవలు అందించి కోలుకున్న తర్వాత పోలీసులు ప్రత్యేక చర్యలకు దిగారు.పెద్దాపురం డీఎస్పీ తిలక్ పర్యవేక్షణలో పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, ఏఎన్ఎస్, క్యూఆర్టీ బృందాలు విస్తృత గాలింపు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన జీపీఎస్ ట్రాకర్ను కుక్కకు అమర్చి వదిలారు. ట్రాకర్ ద్వారా కుక్క సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర సంచరించినట్లు గుర్తించారు. ఆ ప్రాంతాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ, ఎక్కడా ఏ క్లూ లభించలేదు!.ఇక చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలను గుర్తించేందుకు సిల్వర్ మెటల్ డిటెక్టర్లను వినియోగిస్తున్నారు. జ్ఞానేశ్వరి చివరిసారిగా కనిపించిన ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే చిన్నారి ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు ఆపబోమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.అదే సమయంలో కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ టవర్ డంప్ డేటా, కాల్ డిటైల్ రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులకు సన్నిహితులైన వ్యక్తులతో పాటు చుట్టుపక్కలకు కొత్తగా వచ్చిన వ్యక్తులు, గంజాయి అలవాటు ఉన్న వారిపై కూడా నిఘా పెట్టారు. పగలు, రాత్రి తేడా లేకుండా గాలింపు కొనసాగుతోంది.ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నారి క్షేమంగా తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరాలని ప్రజలు ప్రార్థిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా స్పందిస్తూ, జ్ఞానేశ్వరి ఆయురారోగ్యాలతో ఇంటికి చేరాలని ఆకాంక్షించారు. -
ఏమైందో ఏమో..
కాకినాడ క్రైం: ఏమైందో ఏమో.. ప్రియుడి ఇంటి వద్ద ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. కంపా లాఫీ (17) అనే బాలిక తల్లిదండ్రులు పీతా నాగదేవి, కంపా బంగారయ్యలు విడిపోయి కుమార్తెను స్థానిక తారకరామ నగర్లో పిన్ని జయవాణి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. మూడేళ్ల క్రితం నరసింహ రోడ్డుకు చెందిన తన వయసున్న బాలుడితో లాఫీకి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం పిన్ని, బాబాయ్లకు తెలియడంతో వారు మందలించారు. మనస్తాపం చెందిన బాలిక ప్రియుడి ఇంటికి వెళ్లిపోయింది. కొద్ది నెలలుగా అక్కడే ఉంటోంది. ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తున్న ఆ బాలుడితో పాటు అతని తల్లి లోవలక్ష్మి ఓ టైలరింగ్ షాప్లో, తండ్రి శివకుమార్రాజు దుస్తుల దుకాణంలో పనిచేస్తున్నాడు. వీరితో పాటే లాఫీ నివసిస్తోంది. గురువారం రాత్రి శివకుమార్రాజు ఇంటికి వచ్చి చూసేసరికి అప్పటికి కుమారుడు, భార్య ఇంటికి చేరలేదు. లాఫీ ఇంట్లో ఉండడంతో తలుపు కొట్టాడు. ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చి వంట గది కిటికీ లోంచి చూస్తే ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని లాఫీ వేలాడుతోంది. కంగారు పడిన శివకుమార్రాజు స్థానికుల సాయంతో తలుపులు తెరిచి చూసేసరికి బాలిక అచేతనంగా ఉంది. ఆమెను జీజీహెచ్కు తరలించాడు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. లాఫీ మృతికి ఆ బాలుడితో పాటు అతడి తల్లిదండ్రులు, మరో వ్యక్తి కారణమని బాబాయ్, పిన్ని ఆరోపించారు. మృతురాలి బాబాయ్ నూకరాజు ఫిర్యాదుతో కాకినాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికల అదృశ్యం పెరవలి (కొవ్వూరు): తండ్రి మందలించాడని ఇద్దరు కుమార్తెలు అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. నేటికీ ఇంటికి రాకపోవడంతో ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ విశ్వం కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరి కుమార్తెలు. వారి వ్యవహార శైలి బాగోలేదని 11న కుమార్తెలను మందలించాడు. మనస్తాపం చెందిన వారు ఆ రోజు రాత్రి ఇంటి బయటకు వెళ్లిపోయారు. ఫ ప్రియుడి ఇంటి వద్ద బాలిక ఆత్మహత్య ఫ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు -
అమ్మో.. హాస్టల్
మామిడికుదురు ప్రభుత్వ బాలుర వసతి గృహంలో సమస్యలు వెక్కిరిస్తున్నాయి. 68 మంది విద్యార్థులకు ఆసరాగా ఉన్న ఇక్కడి గదుల్లోని కిటికీలు, తలుపుల మెస్లు పాడయ్యాయి. ట్యూబ్ లైట్లు కిందకు వేలాడుతున్నాయి. ఐదు బాత్రూమ్లు, ఐదు లెట్రిన్లకు నీటి సరఫరా జరగడం లేదు. మరో 12 బాత్రూమ్లు, మరో 12 లెట్రిన్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ సమస్యలపై ఏఎస్ డబ్ల్యూఓ ఎస్.సత్యనారాయణ దృష్టికి ‘సాక్షి’ తీసుకువెళ్లగా సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. –మామిడికుదురు అసంపూర్తిగా ఉన్న లెట్రిన్, బాత్రూమ్లు బాలుర హాస్టల్లో వేలాడుతున్న ట్యూబ్లైట్ -
ప్రియుడితో కలసి భర్త హత్య
కాకినాడ రూరల్: మూడు నెలల క్రితం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, పోలీసుల విచారణలో అది హత్యగా తేలింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడి సహాయంతో భర్తను ఓ మహిళ కడతేర్చింది. పోలీసుల కథనం ప్రకారం.. సర్పవరం గ్రామానికి చెందిన కారు డ్రైవర్ పుల్ల దుర్గాప్రసాద్ (38) మృతికి సంబంధించి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై పోలీసులు వాట్సాప్ చాట్స్, స్కీన్ షాట్లు, మొబైల్ ఫోన్ డేటా, ఫొటోలు, ఇతర సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టారు. ఈ విచారణలో దుర్గాప్రసాద్ హత్యకు గురయ్యాడని తేలింది. దుర్గాప్రసాద్కు రమాదేవితో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. రమాదేవికి బాపట్లకు చెందిన ప్రసాదం గోపిసాయితో ఇన్స్ట్రాగామ్లో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధం నడిచింది. వీరి సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని ఆ ఇద్దరూ కలసి హత్యకు కుట్ర పన్నారు. దుర్గాప్రసాద్ను హత్య చేసేందుకు గోపిసాయి నిద్రమాత్రలు తెచ్చి రమాదేవికి ఇచ్చాడు. వాటిని భర్తకు జ్యూస్లో కలిపి మార్చి 13న రాత్రి అందజేయడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. తర్వాత అతడిని దిండుతో ఊపిరాడకుండా చేసి రమాదేవి హత్య చేసింది. అనంతరం గుండెపోటుతో భర్త చనిపోయినట్టు బంధువులను నమ్మించడంతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మే 31న మృతుడి కుమార్తెకు గోపిసాయి వాట్సాప్ సందేశాలు పంపి, హత్యకు సంబంధించి వివరాలు, మాత్రల కొనుగోలు బిల్లుల ఫొటోలు పంపడంతో అనుమానం పెంచుకున్న కుటుంబ సభ్యులు ఈ నెల 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి సోదరుడు పుల్ల సత్యబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, హత్యగా తేలిందని సీఐ రమేష్ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు తెలిపారు. మూడు నెలల తర్వాత బయటపడిన ఘటన -
గోదావరిలో దూకిన వ్యక్తి : కాపాడిన పోలీసులు
ఐ.పోలవరం: మురమళ్లలోని రాఘవేంద్ర వారధిపై నుంచి గోదావరిలోకి దూకిన వ్యక్తిని హైవే పెట్రోలింగ్ పోలీసులు కాపాడారు. ముమ్మిడివరానికి చెందిన దేశంశెట్టి సతీష్కుమార్ గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత రాఘవేంద్ర వారిధి నుంచి గోదావరిలోకి దూకాడు. దీనిపై స్థానికుల నుంచి సమాచారం అందిన వెంటనే ముమ్మిడివరం – పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే నిఘా విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, హోంగార్డు రామ్కుమార్లు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో పడవ నడిపేవారు లేకపోవడంతో, తమ ప్రాణాలకు తెగించి నదిలోకి వెళ్లి సతీష్కుమార్ను కాపాడారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులను స్థానికులు అభినందించారు. దేవీపట్నంలో పెద్ద పులి సంచారం దేవీపట్నం: పెద్దపులి దేవీపట్నం వైపునకు తన గమనాన్ని మార్చింది. ఈ నెల 2న గంగంపాలెం వద్ద 14 లేగ దూడలను చంపేసిన పులి అటు నుంచి నేలకోట వైపు పయనించింది. గురువారం సాయంత్రం రామదుర్గం మీదుగా దండంగి, పరగసానిపాడు వైపు సంచరించిన పులి శుక్రవారం ఉదయం దండంగి వాగును దాటింది. తర్వాత చినరమణయ్యపేట వైపునకు వెళ్లింది. పులి మెడకు అమర్చిన ట్రాకర్ ద్వారా పులి గమనాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ముత్యాలరాయుడుగారి గొంది, దేవీపట్నం మధ్య పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. రాత్రికి గోదావరి నదిని దాటుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. వింత దూడ మరణం మలికిపురం: మండలంలోని గుడిమెళ్లంకలో శుక్రవారం జెర్సీ క్రాస్ ఆవుకు పుట్టిన లేగ దూడ, పుట్టిన కొద్ది సేపటికే మృతి చెందింది. ఈ వివరాలను పశు వైద్యాధికారి డి.శివకుమార్ తెలిపారు. గ్రామానికి చెందిన గెడ్డం శ్రీనుకు చెందిన జెర్సీ క్రాస్ ఆవు ఈనడంలో అవస్థలు పడుతుంటే డాక్టర్ శివకుమార్ వైద్య సేవలందించారు. అయితే ఒకే కన్ను, గ్రహణం మొర్రి, నాసిక రంధ్రాలు లేని చనిపోయిన దూడను బయటకు ఆయన తీశారు. ఈ కోవకు చెందిన దూడను వైద్య పరిభాషలో సైక్లోపియా అంటారని చెప్పారు. జన్యులోపం వల్ల, తల, ముఖం అభివృద్ధికి కావాల్సిన క్రోమోజోమ్స్ అచేతన స్థితిలో ఉండడం, ఇన్బ్రీడింగ్, విటమిన్ ఏ, జింక్ లాంటి పౌష్టికాహార లోపంతో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయన్నారు. కాగా ఆవు ఆరోగ్యంగానే ఉందని, ఇలాంటి దూడలు 16 వేల ఈతల్లో ఒకసారి మాత్రమే జన్మించే అవకాశం ఉందని శివకుమార్ అన్నారు. వ్యక్తిపై దాడి యానాం: ఇవ్వాల్సిన సొమ్ము అడిగినందుకు ఓ వ్యక్తిపై దాడి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నియోజకవర్గంలోని మెట్టకూరు వంశీకృష్ణా కాలనీకి చెందిన ఈగల మల్లికార్జునరావుపై అదే గ్రామానికి చెందిన కొప్పనాతి వెంకటరమణ ఐరన్ నకల్ (హ్యాండ్ పంచ్)తో దాడి చేశాడు. దీంతో మల్లికార్జునరావు దవడ పళ్లు విరిగిపోయాయి. ఈ ఘటనపై యానాం పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేయగా, నిందితుడు వెంకటరమణపై కేసు నమోదు చేసి యానాం సబ్ కోర్టులో హాజరుపరచగా ఆరు రోజుల రిమాండ్ విధించారు. మల్లికార్జునరావు టైలర్. అతని వద్ద దుస్తులు కుట్టించుకున్న వెంకటరమణ రూ.20 బకాయి ఉన్నాడు. ఆ సొమ్ము గురించి తరచూ మల్లికార్జునరావు అడుగుతున్నాడనే ఆగ్రహంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న నిందితుల అరెస్టు మోతుగూడెం: గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు డొంకరాయి ఎస్సై చరణ్నాయక్ తెలిపారు. బొడ్డగండి పంచాయతీ డొంకరాయి గ్రామం వద్ద రెండు కిలోల గంజాయిని, ముగ్గురు నిందితులను, ఒక మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఒడిశా రాష్ట్రం పసుపులంక నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్నారని సమాచారంతో వాహనాలు తనిఖీ చేస్తుండగా, వారు పట్టుబడ్డారన్నారు. హైదరాబాద్కు చెందిన బొడ్డు అభిషేక్, చింతపల్లి మండలానికి చెందిన మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
క్రీడాకారులకు క్రమశిక్షణ ముఖ్యం
సామర్లకోట: క్రీడాకారులకు క్రమశిక్షణ ముఖ్యమని రాష్ట్ర టేబుల్ టెన్నిస్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ సీహెచ్ విజయ్ప్రకాష్ అన్నారు. శుక్రవారం పెద్దాపురం శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్లో రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 230 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో బాల బాలికలకు ఈ పోటీలు జరుగుతున్నాయని విజయ్కుమార్ చెప్పారు. క్రీడా కారులకు అన్ని సదుపాయాలను పాఠశాల నుంచి కల్పిస్తున్నామన్నారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసు (ఐఆర్టీఎస్) అధికారి డాక్టర్ చిలుకా ప్రదీప్కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రీడాకారులు ఎప్పటికప్పుడు వారి ఆట తీరును మెరుగుపరుచుకోవాలన్నారు. టెబుల్ టెన్నీస్పై రోజు రోజుకూ విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుందని రాష్ట్ర టెబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి పి.విశ్వనాథ్ తదితరులు అన్నారు. -
ఊడిపోయిన స్కూల్ బస్సు అత్యవసర ద్వారం
అమలాపురం టౌన్: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచిన రోజునే ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అత్యవసర ద్వారం ఊడిపడిన సంఘటన అమలాపురంలో శుక్రవారం జరిగింది. ఆ వివరాలివీ.. పరిసర గ్రామాల్లోని విద్యార్థులను శ్రీచైతన్య స్కూల్ సిబ్బంది బస్సులో ఎక్కించుకుని పట్టణంలోని స్కూల్కు తీసుకు వస్తున్నారు. ఆ సమయంలో స్థానిక నల్ల వంతెన వద్ద బస్సు అత్యవసర తలుపు ఒక్కసారిగా ఊడి రోడ్డుపై పడింది. బస్సు తక్కువ వేగంతో వెళ్తూండటంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. అదే కనుక బస్సు వేగంగా వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగి ఉంటే బస్సులోని కొందరు కిందపడి ఉండేవారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల పునః ప్రారంభానికి ముందే స్కూల్ బస్సుల ఫిట్నెస్ను, భద్రతా ప్రమాణాలను తనిఖీ చేశామని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, ఆ తనిఖీలు సక్రమంగా జరిగి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు అంటున్నారు. రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి, జిల్లాలోని అన్ని ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులను మరోసారి పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న శ్రీచైతన్య స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రవాణా శాఖ కూడా స్కూల్ బస్సుల ఫిట్నెస్ విషయంలో కాగితాలకు పరిమితమవుతోందే తప్ప స్కూల్ బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. బస్సు సీజ్ అత్యవసర తలుపు ఊడిపోయిన శ్రీచైతన్య స్కూల్ బస్సును సీజ్ చేసినట్లు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఘటన జరిగిన వెంటనే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ విచారణ చేసి బస్సును సీజ్ చేశారన్నారు. ఈ బస్సు రాజమహేంద్రవరం అడ్రస్తో రిజిస్టర్ అయ్యిందన్నారు. స్కూల్ బస్సు స్థానిక ఏటీఎస్ సెంటరులో ఈ నెల 4న ఫిట్నెస్ పొందిందని, అయినప్పటికీ బస్సును సీజ్ చేసి, ఫిట్నెస్ను రద్దు చేసి, బస్సు యాజమాన్యానికి సీఎఫ్ఎక్స్ నోటీసు జారీ చేశామని వెల్లడించారు. బస్సు పర్మిట్పై తదుపరి చర్యలకు రాజమహేంద్రవరం డీటీఓను సంప్రదించామన్నారు. మోటారు వెహికల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని శ్రీనివాసరావు తెలిపారు. -
మన్నుకుండిపోయారు!
కూటమిగా ఏర్పడ్డారు.. ఉన్నమట్టుకు దోచేస్తున్నారు.. ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు.. అనుమతులు లేకుండా మట్టి తవ్వేసి తరలించుకుపోతున్నారు.. ఈ దందా అధికారుల కళ్లెదుటే జరుగుతున్నా, మిన్నకుండిపోతున్నారు.. ఇలా అక్రమార్కులు రూ.లక్షల్లో ఆర్జిస్తూ మాకెవరు అడ్డు అన్నట్టు చెలరేగిపోతున్నారు. ఫ మట్టి దందాను పట్టించుకోని అధికారులు ఫ చెలరేగిపోతున్న మాఫియా ఫ రూ.లక్షల్లో ఆర్జిస్తున్న వైనం తాళ్లపూడి: అక్రమార్కులు కొండలను కరిగించేస్తున్నారు. తాళ్లపూడి మండలంలోని పరిసర గ్రామాలైన పోచవరం, రాగోలపల్లి, తుపాకులగూడేనికి చెందిన రెవెన్యూ పరిధిలోని గోపాలపురం వైపు సగ్గొండ వెళ్లే దారిలో కొండలను తవ్వేస్తున్నారు. కొంతమంది సిండికేట్గా ఏర్పడి పగలు, రాత్రి అనే తేడా లేకుండా మట్టిని తరలించుకుపోతున్నారు. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు. తాళ్లపూడి, గోపాలపురం మండలాల్లో అధికార పార్టీ నేతలు ఈ దందాకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మట్టి లారీ లోడు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకూ అమ్మకాలు సాగిస్తున్నారు. వందల లారీల్లో గ్రావెల్ బయటకు పోతోంది. ఆయా గ్రామాల్లోని కొండలపై ఉన్న జామాయిల్, భారీ చెట్లను నిర్ధాక్షిణ్యంగా తొలగించి, తవ్వకాలు సాగిస్తున్నారు. రోడ్డు లెవెలింగ్కు అనుమతులు తీసుకుని, ఆ ముసుగులో గ్రావెల్ను లేఅవుట్లకు తరలిస్తున్నారు. ఈ దందాపై ప్రశ్నించిన వారిని మాఫియా బెదిరిస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుపోతున్నారు. దీనిపై మండల బీజేపీ అధ్యక్షుడు ఇండుగుల రామకృష్ణ స్థానిక నాయకులతో కలసి కొవ్వూరులో శుక్రవారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో మైనింగ్ ఏడీ ఫణిభూషన్రెడ్డి ఇతర అధికారులతో కలసి గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. -
మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
ఐ.పోలవరం: యానాం నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. ఎదుర్లంక ఎకై ్సజ్ చెక్పోస్ట్ వద్ద అక్రమంగా మద్యం తరలిస్తున్న కారును ఎకై ్సజ్ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి ఆదేశాల మేరకు నిర్వహించిన తనిఖీల్లో యానాం నుంచి అక్రమంగా తరలిస్తున్న 500 మిల్లీలీటర్ల 54 టిన్ బీర్లను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం రామవరప్పాడు గ్రామానికి చెందిన దాకరపు లీలాశివరాం, బంటుమిల్లి మండలం ముంజులూరు గ్రామానికి చెందిన గాడే రాజేష్ కుమార్లను అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎదుర్లంక చెక్పోస్ట్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. -
అనువణువూ జల్లెడ
తుని రూరల్: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ చిక్కుళ్ల అగ్రహారంలో ఈ నెల 6న అదృశ్యమైన చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ ఏడు రోజులైనా లభించలేదు. శుక్రవారం పెద్దాపురం డీఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, ఫారెస్ట్, ఏఎన్ఎస్ కూంబింగ్, క్యూఆర్టీ బృందాలతో గాలింపు చర్యలు కొనసాగించారు. హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన జీపీఎస్ ట్రాకర్ను పెంపుడు కుక్కకు అమర్చి బయటకు వదిలారు. దీంతో పరిసర ప్రాంతాల్లో కుక్క ఎనిమిది కిలోమీటర్లు సంచరించినట్టు ట్రాకర్ ద్వారా గుర్తించారు. ఆ ప్రాంతాలను దర్యాప్తు బృందాలు అణువణువూ పరిశీలిస్తున్నారు. అంతకు ముందు కుక్క నిరసంగా ఉండడంతో వెటర్నరీ సిబ్బందితో వైద్య సేవలు అందించారు. అదేవిధంగా చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలను గుర్తించేందుకు సిల్వర్ మెటల్ డిటెక్టర్ (డివైజ్) నిపుణులతో జ్ఞానేశ్వరి చివరిసారిగా కనిపించిన ప్రాంతంలో తనిఖీలు చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ తిలక్ మాట్లాడుతూ చిన్నారి ఆచూకీ తెలిసేవరకూ గాలింపు చర్యలు కొనసాగిస్తామన్నారు. చిన్నారి తండ్రి సుంకర గణేష్కు ఉన్న విరోధులు, ఆర్థిక లావాదేవీలు, సెల్ఫోన్ సిగ్నల్స్, గతంలో పనిచేసి మానేసిన కూలీలు, ఇతరేతర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. టవర్ డంప్, సీడీఆర్లు, సీసీ కెమెరాల సీపీ ఫుటేజీలు, తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. అనుమానితులు, గంజాయికి అలవాటుపడిన వ్యక్తులపై దృష్టి సారించామన్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా గాలింపు కొనసాగిస్తున్నట్టు ఆయన తెలిపారు. పురోగతిపై సంబంధిత అధికారులతో డీఎస్పీ సమీక్షించారు. తల్లిదండ్రుల చెంతకు చేరాలి చిక్కుళ్ల అగ్రహారంలో అదృశ్యమైన జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు వద్దకు చేరాలని మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్సార్ సీసీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆకాంక్షించారు. ఎస్.అన్నవరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. చిన్నారి ఆయురారోగ్యాలతో తల్లిదండ్రుల వద్దకు రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. పాప కోసం అధికారులు గాలిస్తున్నారన్నారు. ఇటువంటి మనోవేదన మరెవరికి రాకూడదని అన్నారు. ఫ చిన్నారి కోసం ముమ్మరంగా గాలింపు ఫ 8 కిలోమీటర్లు సంచరించిన పెంపుడు కుక్క ఫ ఆయా ప్రాంతాల్లో బృందాల తనిఖీలు -
వెను్నపోటుపై తిరుగుబాటు
పిఠాపురం: నమ్మి ఓట్లు వేశాం, అధికారంలోకి వచ్చాక మమ్మల్ని నట్టేట ముంచారు అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెన్నుపోటుపై తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో శుక్రవారం వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు జిల్లాలో భారీ ర్యాలీలు, ప్రదర్శనలతో కదం తొక్కారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా భారీగా తరలివచ్చిన జనం ర్యాలీల్లో పాల్గొన్నారు. దీంతో అన్ని నియోజకవర్గాల కేంద్రాలు జనమయంగా మారాయి. ముఖ్యంగా తమకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని, తమకు రక్షణ లేకుండా పోయిందంటూ మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో జిల్లా మారుమోగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వివిధ వర్గాలను మోసగించిన తీరును ఎండగట్టారు. పెద్దాపురం వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో పెద్దాపురం అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ నుంచి మెయిన్రోడ్ మీదుగా వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు పాదయాత్ర జరిగింది. ఈ పాదయాత్రలో నియోజకవర్గంలో నుంచి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ శ్రేణులు తరలిరావడంతో మెయిన్ రోడ్డు వైఎస్సార్ సీపీ జెండాలు, బెలూన్లతో నిండిపోయింది. కదం తొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు చంద్రబాబు సర్కారు మోసాలపై ర్యాలీలు, ప్రదర్శనలు భారీగా తరలివచ్చిన వివిధ వర్గాల జనం, మహిళలు -
ప్రత్తిపాడు
వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో ప్రత్తిపాడులో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. పత్తిపాడులోని ఫైర్ స్టేషన్ నుంచి ప్రధాన రహదారి మీదుగా అల్లూరి సీతారామరాజు సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి సుమారు 2,000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. కార్యక్రమంలో కాకినాడ పార్టీ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు, ప్రత్తిపాడు తుని పార్టీ పరిశీలకులు ఒమ్మి రఘురాం, వాసిరెడ్డి జమీలు, జెడ్పీటీసీ సభ్యులు గొల్లు చిన్న దిమానం, బెహరా రాజేశ్వరి, సామంతుల సూర్యకుమార్, సుంకర రాంబాబు, శిడగం వెంకటేశ్వరరావు, రామిశెట్టి నాని, నరాల శీను పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్ సీపీ సమన్వయ కర్త తోట నరసింహం ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుపై నిరసన ర్యాలీ జరిగింది. జగ్గంపేటలో స్థానిక బాలాజీ నగర్లో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి సుమారు 1,500 మందితో ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి తోట రామ్జీ ర్యాలీని ముందుండి నడిపించారు. చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ర్యాలీ సుమారు రెండు కిలోమీటర్లు కొనసాగి జగ్గంపేట బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరింది. వైఎస్సార్ విగ్రహానికి పార్టీకి చెందిన ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కూటమి వైఫల్యాలపై, వెన్నుపోటు హామీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమన్వయకర్త తోట నరసింహం, ఇతర నాయకులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. కాకినాడ సిటీ పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, కౌడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి ఆధ్వర్యంలో స్థానిక డీ కన్వెన్షన్ నుంచి భానుగుడి సెంటర్, మెయిన్రోడ్డు మీదుగా జగన్నాథపురం అన్నమ్మఘాటీ సెంటర్ వరకూ ఈ బైక్ ర్యాలీ నిర్వహించారు. సుమారు 700 మంది కార్యకర్తలు, నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దాదాపు 200 బైక్లు 10 జీపులతో ఈ ర్యాలీ నిర్వహించారు. అన్నమ్మఘాటీ సెంటర్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, పార్టీ బీసీ సెల్ నాయకుడు అల్లి రాజుబాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్కుమార్, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
మోగిన బడిగంట
● మొదలైన చదువుల సందడి ● తొలిరోజు అంతంత మాత్రంగా హాజరు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): వేసవి సెలవుల్లో ఆటపాటలతో మునిగి తేలిన చిన్నారులు ఇక చదువులకు స్వాగతం చెప్పారు. బుద్ధిగా పుస్తకాల బ్యాగు భూజానవేసుకుని బడిబాట పట్టారు. జిల్లావ్యాప్తంగా శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలు పున ప్రారంభమయ్యాయి. దీంతో చిన్నారులు ఆటపాటలతో సందడి చేసిన క్రీడామైదానాలు, వీధులు ఒక్కసారిగా బోసిపోయాయి. తొలిరోజు కొంత మంది పిల్లలు మారం చేయగా తల్లిదండ్రులు బుజ్జగిస్తూ పాఠశాలకు తీసుకెళ్లారు. మరికొంతమంది ఉత్సాహంగా వెళ్తూ కనిపించారు. ఉదయం 9 గంటలకు బడిగంట మోగే సరికి బడికి చేరుకున్నారు. తరగతి గదుల్లో కూర్చుని, స్నేహితులను కలుసుకుని సంబరపడ్డారు. దాదాపు 50 రోజల తరువాత విద్యార్థులు పాఠశాలకు రావడంతో ఉపాధ్యాయులు తొలుత కుశల ప్రశ్నలు వేస్తూ సరదాగా గడిపారు. జిల్లాలో 12,85 ప్రభుత్వ, 581 ప్రైవేట్ పాఠశాలలు జిల్లాలో ప్రభుత్వ 1,285, ప్రైవేట్ 581 పాఠశాలలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యా సంవత్సరంలో దాదాపుగా 1.25 లక్షల మంది విద్యాభ్యాసం చేశారు. తొలిరోజు విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే ఉంది. జిల్లా విద్యాశాఖ 94.5శాతం హాజరయ్యారని ప్రకటించినా వాస్తవంగా అంతమంది రాలేదు. అందని కిట్లు వేసవి సెలవుల నేపథ్యంలో 50 రోజుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ విద్యార్థుల హాజరు తక్కువగా ఉంది. జిల్లా వ్యాప్తంగా బడి బయట పిల్లల గుర్తింపునకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పాఠశాలలు పునఃప్రారంభించే నాటికి విద్యార్థుల చేతిలో స్కూల్ బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, షూస్, రెండు జతల సాక్సులు, యూనిఫామ్, బెల్టులు, డిక్షనరీలతో కూడిన కిట్ను అందజేయాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థి చేతికి కిట్ అందివ్వగా నేడు ఆ పరిస్థితి లేదు. జిల్లాకు 1,21,268 కిట్లకు ఇండెంట్ పెట్టారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు అందజేయాల్సి ఉంది. ఇప్పటి వరకు బ్యాగ్లు, యూనిఫామ్, ఒకటి కూడా రాలేదు. కేవలం నోట్పుస్తకాలు, డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, వర్క్బుక్స్ మాత్రమే జిల్లాకు చేరాయి. దీంతో పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు కిట్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఘూస్ 25,341 ,బెల్టులు 16,878 మాత్రమే వచ్చాయి. -
శనివారం శ్రీ 13 శ్రీ జూన్ శ్రీ 2026
తుని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో స్థానిక రాజా కళాశాల మైదానం నుంచి ఆంజనేయస్వామి గుడి, బాలాజీ సెంటర్, మెయిన్ రోడ్డు మీదుగా గొల్ల అప్పారావు సెంటర్ వరకు ర్యాలీ సాగింది. రెండేళ్ల కాలంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్ల కార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. తుని, తొండంగి, కోటనందూరు మండలాలతో పాటు తుని పట్టణానికి చెందిన సుమారు పదివేల మంది ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులు జనంతో నిండిపోయాయి. వైఎస్సార్ సీపీ తుని, తొండంగి, కోటనందూరు, తుని పట్టణ పార్టీ అధ్యక్షులు డి నాగేశ్వరరావు, బత్తుల వీరబాబు, చింతకాయల చిన్నబాబు, మున్సిపల్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి రేలంగి రమణ గౌడ్, అనుబంధ విభాగాల నాయకులు బోడపాటి సతీష్, బి ఉమారావు, ఎంపీపీ లగుడు శ్రీనివాస్, పోతల రమణ, హేమంత్, నాగేంద్ర నెహ్రూ, నాగం దొరబాబు, సీహెచ్ రాంబాబు రాజు పాల్గొన్నారు. -
చంద్రబాబు వెన్నుపోటుపై ప్రజల తిరుగుబాటు
– దాడిశెట్టి రాజా హెచ్చరిక తుని: అధికారం కోసం ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం, ఆ తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడవటం చంద్రబాబునాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని, వెన్నుపోటుపై ప్రజలు తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా హెచ్చరించారు. శుక్రవారం తుని పట్టణంలో జరిగిన వైఎస్సార్ సీపీ ర్యాలీ సందర్భంగా రాజా మాట్లాడుతూ చంద్రబాబును నమ్మి ఓటు వేసి అధికారం కల్పించిన మహిళలను నిలువునా మోసం చేశారన్నారు. సూపర్ సిక్స్ అట్టర్ఫ్లాప్ అయ్యిందని, మహిళలు, విద్యార్థులు, రైతులు, విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. చంద్రబాబు రెండేళ్ల పాలన వంచనతో కొనసాగిందని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందనడానికి నిరసన ర్యాలీకి వేల సంఖ్యలో జనం తరలిరావడం సాక్ష్యమన్నారు. డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను వంచించి, స్పోర్ట్స్ కోటా పేరుతో అమ్ముకున్నారని ఆరోపించారు. 2029లో చంద్రబాబును గద్దె దింపి, వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాజా అనడంతో ఒక్కసారిగా ప్రజలు ఔను ఔను అంటూ చప్పట్లు కొట్టారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి గ్రామస్థాయిలో హామీల అమలుపై గట్టిగా నిలదీయాలన్నారు. మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా జనం రోడ్లపైకి వచ్చారంటే కూటమి ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారని అర్థమని అన్నారు. -
వలసపాకల పంచాయతీ గ్రేడ్ 5 సెక్రటరీ సస్పెన్షన్
కాకినాడ రూరల్: ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించారనే కారణంతో మండలంలోని వలసపాకల గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రేడ్ – 5 సెక్రటరీగా పనిచేస్తున్న ఎం.స్నేహలతను సస్పెండ్ చేస్తూ కలెక్టరు హరేంధిర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక ఓటర్ల సమగ్ర సంక్షిప్త నిర్వహణ కార్యక్రమంలో భాగంగా సర్ ప్రక్రియలో సెక్రటరీ స్నేహలత విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, ఆర్డీఓ మల్లిబాబు కలెక్టరుకు నివేదించారు. బీఎల్ఓ విధులు హాజరయ్యేందుకు ఆమె నిరాకరించడంతో చర్యలకు ప్రతిపాదించినట్టు మల్లిబాబు తెలియజేశారు. బీఎల్ఓ విధులకు హాజరు కాకపోవడానికి ఆమె సరైన కారణం చూపకపోవడంతో కలెక్టరు చర్యలు తీసుకున్నట్టు మల్లిబాబు తెలియజేశారు. 17 మైనింగ్ లారీలపై కేసులురౌతులపూడి: కలెక్టరు హరేంధిర ప్రసాద్ ఆదేశాల మేరకు మండల కేంద్రమైన రౌతులపూడి ప్రధాన రహదారిలో మైనింగ్, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో నిబంధనలు పాటించని 17 క్వారీ లారీలపై కేసులు నమోదు చేశారు. మైనింగ్శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నల్లరాయిని తరలించే వాహనాలకు సంబంధించి రికార్డులు సక్రమంగా లేని ఆరు వాహనాలను సీజ్ చేసి స్వాధీన పరచుకున్నారు. అధిక లోడుతో రవాణా సాగిస్తున్న మూడు వాహనాలు, భద్రతా ప్రమాణాలను పాటించని మరో ఎనిమిది వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.3,36,000 అపరాధ రుసుం విధించారు. తనిఖీల్లో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ డి.సోనీప్రియ, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ గౌరీశంకర్, మైనింగ్ టెక్నికల్ సిబ్బంది సత్యతేజ, రవీంద్ర, కాకినా ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. ఓఎన్జీసీ సైట్ వద్ద మంటలు ఆందోళన చెందిన కరప గ్రామస్తులు కరప: గ్రామ శివారు పంట పొలాల మధ్య ఉన్న ఓఎన్జీసీ సైట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం దట్టంగా పొగలు వ్యాపించి, మంటలు చెలరేగడంతో ఏ ప్రమాదం ముంచుకొస్తోందోనని గ్రా మస్తులు ఆందోళన చెందారు. కాకినాడ–రామచంద్రపురం ప్రధాన రహదారికి ఆనుకుని పంటపొలాల మధ్య ఖాళీగా ఓఎన్జీసీ సైట్ ఉంది. అక్కడ పాత టైర్లు, చెత్త, చెదారం వేశారు. ఓఎన్ జీసీ సైట్ సమీపంలోని పంటపొలాల్లో కోసిన వరిగడ్డిని రైతులు తగులపెట్టారు. ఈ మంటలు ఒక్కసారిగా వ్యాప్తిచెంది, ఓఎన్జీసీ సైట్వద్ద ఉన్న పాతటైర్లు, చెత్త అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా నల్లటి పొగ దట్టంగా అలుపుకుని పై కి లేచింది. అక్కడి చెత్త,చెదారానికి మంటలు ఎగబాగడంతో ఆకాశమంతా నల్లగా కనబడటంతో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని గ్రామస్తులు ఆందోళన చెందారు. దారిన వెళ్లేవారు ఏమి జరుగుతోందో తెలియక అయోమయానికి గురయ్యా రు. కాకినాడ నుంచి ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పివేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రత్నగిరికి భక్తుల రద్దీ అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి విచ్చేశారు. క్యూ లు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. స్వామి దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. -
పిఠాపురం
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీత ఆధ్వర్యంలో పిఠాపురం పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా భారీ ర్యాలీగా బయలుదేరిన వైఎస్సార్ సీపీ శ్రేణులు రాజుగారికోట నుంచి కోటగుమ్మం సెంటర్, పెద్ద బజారు, చర్చి సెంటర్, రామా టాకీస్ సెంటర్, స్టేట్బ్యాంకు సెంటర్, వన్ వే రోడ్డు, స్టూవర్టుపేట మీదుగా ఉప్పాడ సెంటర్కు చేరుకున్నారు. అక్కడి నుంచి పాదయాత్రగా అంబేడ్కర్ సెంటర్కు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నివాళులర్పించి ర్యాలీ నుద్దేశించి వంగా గీత మాట్లాడారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పార్టీ ఎస్ఈసీ సభ్యులు రావు చిన్నారావు, గండేపల్లి బాబీ, జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, రాష్ట్ర నాయకులు మాదిరెడ్డి దొరబాబు, ఉలవల భూషణం, వడిశెట్టి నారాయణరెడ్డి, మొగలి అయ్యారావు, జ్యోతుల భీముడు, కారే శ్రీనివాసరావు, జడ్పీటీసీ ఉలవకాయల నాగ లోవరాజు, గండ్రేటి రామచంద్రమూర్తి నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
చంద్రబాబూ.. మీది కోతల ప్రభుత్వం : కురసాల కన్నబాబు
కాకినాడ రూరల్: పథకాల లబ్ధిదారుల్లో కోత విధించి రెండేళ్లుగా దుర్మార్గపు పాలన అందిస్తున్న చంద్రబాబూ మీది కోతల ప్రభుత్వమని మాజీ మంతి, వైఎస్సార్ సీపీ ఉమ్మడి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల రీజనల్ కో ఆర్డినేటరు కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడ రూరల్లో నిర్వహించిన బైక్ ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ అనే శక్తిని ఓడించేందుకు చంద్రబాబు కూటమి కట్టి అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. మా నాయకుడు జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు చేపడుతున్నామన్నారు. సూపర్ సిక్స్ అని చెప్పి అమలు చేయకుండానే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, ఆడబిడ్డ నిధి ప్రతి నెలా రూ.1,500 ఇస్తామని ఇచ్చారా అని నిలదీశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 6 లక్షల పింఛన్లు తగ్గించారని చెప్పారు. 7 లక్షల అన్నదాత సుఖీభవ, 20 లక్షల మంది తల్లికి వందనం లబ్ధిదారులను కూడ తగ్గించారని, అందుకే మీది కోతల ప్రభుత్వమని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. పబ్లిసిటీ, మీడియాతో నెట్టుకువస్తూ దుర్మార్గపు పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ, వలంటీర్లను తీసుకువచ్చి ప్రజల వద్దకు నిజమైన సంక్షేమం తీసుకువస్తే దానిని నీరు గార్చేశారన్నారు. సుపరిపాలన లేదన్నారు. నిలదీస్తే బెదిరిస్తున్నారని, మీ బెదిరింపులకు భయపడమన్నారు. గురువారం రాత్రి నుంచి పోలీసులు తమ పార్టీ నాయకులకు ఫోన్లు చేస్తున్నారని, ఆంక్షలు పెడుతున్నారని అన్నారు. డీఎస్సీ పోస్టులను అమ్ముకోవడం దుర్మార్గమన్నారు. మీ సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అని, అయినా తిరుపతిలో విజయోత్సవ సభ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కార్పొరేట్లకు ఎకరం 99 పైసలకే భూములు కట్టబెడుతున్నారన్నారు. -
కాకినాడ రూరల్
కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఉమ్మడి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వైద్యనగర్లోని క్యాంపు కార్యాలయం వద్ద ప్రారంభమైన బైక్ ర్యాలీ నాగమల్లితోట జంక్షన్, ఆశ్రమం పబ్లిక్ స్కూల్, బోట్క్లబ్ మీదుగా సర్పవరం జంక్షన్కు చేరుకుంది. అక్కడ రోడ్డుపై కన్నబాబు పార్టీ నాయకులు బైఠాయించి చంద్రబాబు వెన్నుపోటుపై నిరసన వ్యక్తం చేశారు. మ్యానిఫెస్టో ప్రతులను దహనం చేసి చంద్రబాబు మోసాలను తెలియజేశారు. కాకినాడ రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ. వైఎస్సార్ సీపీ ఎస్ఈసీ సభ్యులు సత్యనారాయణ, గోపిశెట్టి బాబ్జి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, పబ్బినీడి పాపారావు, చింతా ఈశ్వరరావు పాల్గొన్నారు. -
కుక్క దొరికింది.. చిన్నారి ఏమైందో..?
తుని రూరల్: కాకినాడ జిల్లా తుని మండలం చిక్కుళ్ల అగ్రహారం గ్రామంలో ఆరు రోజుల కిందట అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి (జాహ్నవి) ఆచూకీ ఇప్పటి వరకూ తెలియరాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు భవాని, గణేష్ తోపాటు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆ చిన్నారితోపాటు అదృశ్యమై మూడు రోజుల అనంతరం మంగళవారం ప్రత్యక్షమై, మళ్లీ పరారైన పెంపుడు కుక్క బుధవారం అర్ధరాత్రి ఎట్టకేలకు డాగ్ క్యాచర్ బృందానికి చిక్కింది. దీంతో కీలక ఆధారం లభించిందని పోలీసులు భావించారు.ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి... దానిని వదిలిపెడితే.. అది సంచరించే మార్గంలో పోలీసులు గాలించి చిన్నారి ఆచూకీ కనిపెట్టాలని భావించారు. అయితే, ట్రాకర్ అందుబాటులో లేకపోవడంతో గురువారం అది సాధ్యం కాలేదు. ఆ కుక్కను రోజంతా గణేష్ ఇంటి ముందర మామిడి చెట్టు వద్ద కట్టి, పోలీసుల సంరక్షణలో ఉంచారు. కొంతసేపు ప్రశాంతంగా ఉంటున్న ఆ కుక్క అప్పుడప్పుడు సమీపంలోని వ్యక్తులపై దాడికి యత్నిస్తోంది.పెద్దాపురం డీఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు, యాంటీ నక్సల్ స్క్వాడ్స్, ఎన్డీఆర్ఎఫ్, అటవీ అధికారుల బృందాలు గాలింపు చర్యలు కొనసాగించాయి. అనుమానిత ప్రాంతాలపై నిఘా ఉంచి, డ్రోన్తో జల్లెడ పట్టారు. సీసీ టీవీ ఫుటేజ్లు సేకరించి పరిశీలిస్తున్నారు. మరోవైపు గ్రామంలోని ఇంటింటా ఎన్యూమరేషన్ చేశారు. కొండ ప్రాంతంలో చిన్నారి లేకపోవచ్చని, కిడ్నాప్ లేదా గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకుపోయి ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. జ్ఞానేశ్వరి ఆరు రోజులుగా ఎక్కడుందో, ఎలా ఉందో, ఏమైపోయిందోనని కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురవుతున్నారు. -
మిథ్యారంభం కరిష్యామి!
● ముగిసిన వేసవి సెలవులు ● నేడు మోగనున్న బడి గంట ● ప్రారంభం కానున్న నూతన విద్యా సంవత్సరం ● కానరాని సందడిబాలాజీచెరువు (కాకినాడ సిటీ): వేసవి సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులు శుక్రవారం నుంచి బడిబాట పట్టనున్నారు. గత ప్రభుత్వ హయాంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభాన్ని పండగ వాతావరణంలో నిర్వహించేవారు. స్వాగత తోరణాలు కట్టి ఎంతో సందడి చేసేవారు. ఈ ఏడాది అటువంటి వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. ప్రైవేటు పాఠశాలలు సకల సౌకర్యాలతో విద్యార్థులకు స్వాగతం పలుకుతుండగా.. కూటమి ప్రభుత్వం పుణ్యమా అని సర్కారీ బడులు సౌకర్యాల లేమితోనే ఆహ్వానిస్తున్నాయి. దీంతో, ప్రభుత్వ విద్య మిథ్యగా మారుతుందనే విమర్శలు ఉపాధ్యాయుల నుంచే వస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం శుక్రవారం నుంచి 2026–27 విద్యా సంవత్సరానికి బడి గంటలు మోగనున్నాయి. ఈ ఏడాది 229 పనిదినాలు కాగా, 87 రోజులు సెలవులుగా పేర్కొంటూ.. పరీక్షల షెడ్యూల్ను సైతం పేర్కొంటూ విద్యా శాఖ గురువారం క్యాలెండర్ విడుదల చేసింది. అడ్మిషన్లు పెరిగేనా! జిల్లావ్యాప్తంగా 21 మండలాల్లో ప్రభుత్వ, మండల/జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్ యాజమాన్యాల పరిధిలో 1,285 పాఠశాలలున్నాయి. వీటితో పాటు 573 ప్రైవేటు పాఠశాలు కూడా ఉన్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సర్కారీ పాఠశాలలు విద్యార్థులతో కిక్కిరిసిపోయేవి. ప్రభుత్వ విద్యా రంగంపై నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. నాడు – నేడు పథకం కింద పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దారు. డిజిటల్ బోధన, ఆంగ్ల మాధ్యమం వంటి అపూర్వ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద వంటి వినూత్న పథకాలను పక్కాగా అమలు చేశారు. వీటన్నింటి ఫలితంగా నాడు పెద్ద సంఖ్యలో విద్యార్థులు బడి బాట పట్టేవారు. దీంతో, అడ్మిషన్ల సమయంలో పలు ప్రభుత్వ పాఠశాలల వద్ద అంతకు మునుపెన్నడూ చూడని విధంగా హౌస్ఫుల్ బోర్డులు కూడా పెట్టేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. చంద్రబాబు సర్కారు ప్రభుత్వ విద్యారంగాన్ని చిన్నచూపు చూస్తూండటంతో అడ్మిషన్లు కూడా తగ్గుతున్న పరిస్థితి. విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కార్పొరేట్కు దీటుగా కరపత్రాలు, ఫ్లెక్సీలతో ప్రచారం చేశారు. అయితే, ఎంత మేర అడ్మిషన్లు వస్తాయనేది వారం రోజులు గడిస్తేనే కానీ చెప్పలేని పరిస్థితి నెలకొంది. అరకొరగా విద్యార్థి మిత్ర కిట్లు ఏటా పాఠశాలలు పునఃప్రారంభించిన రోజునే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం.. స్కూల్ బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, షూస్, రెండు జతల సాక్సులు, యూనిఫామ్, బెల్టులు, డిక్షనరీలతో కూడిన విద్యా కానుక కిట్ను విద్యార్థుల చేతికి క్రమం తప్పకుండా అందించేది. నేడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆ పరిస్థితి కానరావడం లేదు. విద్యా కానుక పథకం పేరును సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రగా కూటమి ప్రభుత్వం మార్చింది. పేరైతే ఘనంగా పెట్టారు కానీ.. ఆ మహనీయుని ఖ్యాతికి వన్నె తెచ్చే రీతిలో మాత్రం వ్యవహరించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా అధికారులు 1,21,268 విద్యార్థి మిత్ర కిట్లకు ఇండెంట్ పెట్టారు. ఇప్పటి వరకూ బ్యాగ్లు, యూనిఫామ్ ఒక్కటి కూడా జిల్లాకు చేరలేదు. కేవలం నోట్ పుస్తకాలు, డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్ మాత్రమే వచ్చాయి. షూస్ 25,341, బెల్టులు 16,878 మాత్రమే వచ్చాయి. ఫలితంగా పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు పూర్తి స్థాయిలో కిట్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. పూర్తి కాని ‘మన బడి’ పనులు ‘మన బడి – మన భవిష్యత్తు’ రెండో దశ పనులు.. పాఠశాలలు పునఃప్రారంభించే నాటికే పూర్తి కావాల్సి ఉండగా.. ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. ఈ పథకం రెండో దశ కింద పాఠశాలల్లో నిరంతర నీటి సరఫరాతో కూడిన టాయిలెట్ల నిర్మాణం, తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, తాగునీటి సరఫరా, విద్యార్థులను ఆకట్టుకునేలా పాఠశాలల ప్రహరీలపై పెయింటింగ్స్, భవనాల మరమ్మతులు, గ్రీన్ చాక్బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. రెండో దశలో 881 పాఠశాలలను రూ.334 కోట్లతో అభివృద్ధి చేయాల్సి ఉండగా, చాలాచోట్ల ఈ పనులు నిలిచిపోయాయి. తల్లికి వందనంపై స్పష్టత ఏదీ? గత ప్రభుత్వం అమ్మ ఒడి పథకం కింద ఏటా క్రమం తప్పకుండా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు జమ చేసేది. ఈ పథకం పేరును చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనంగా మార్చింది. పాఠశాలల పునఃప్రారంభం రోజునే ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తామని చెప్పినా దీనిపై నేటికీ స్పష్టత లేదు. అడ్మిషన్లకు డ్రైవ్ వేసవి సెలవుల తర్వాత పాఠశాలల పునఃప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. మొదటి రోజు నుంచే మధ్యాహ్న భోజనం అందించనున్నాం. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమష్టి కృషితో విద్యార్థుల అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. – పిల్లి రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ -
ఉద్యోగులు పోరాటాలకు సిద్ధం కావాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తమ సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం పరిష్కరించనందున ఉద్యోగులందరూ పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఏపీ జేఏసీ అమరావతి.. జిల్లా యూనిట్ చైర్మన్ పితాని త్రినాథ్ అన్నారు. స్థానిక రెవెన్యూ భవన్లో జిల్లా యూనిట్ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా త్రినాథ్ మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం దీనిపై ఇప్పటి వరకూ స్పందించలేదని అన్నారు. పన్నెండో పీఆర్సీ ఇవ్వకపోవడంతో ఉద్యోగులు రూ.లక్ష మేర ఆర్థిక ప్రయోజనాలు కోల్పోయారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడటానికి రాష్ట్ర కార్యవర్గం ప్రకటించే ఎలాంటి కార్యాచరణకై నా అందరూ కట్టుబడి ఉండాలని కోరారు. ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం విపరీతంగా పెరుగుతున్న మార్కెట్ ధరలకు అనుగుణంగా ఉద్యోగుల పే రివిజన్ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. రెండు మూడు నెలల జీతాన్ని పన్నుల రూపంలో ఉద్యోగులు కోల్పోతున్నప్పటికీ సరెండర్ లీవ్లు కూడా చెల్లించడం లేదని, ఈ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. ఏపీ జేఏసీ అమరావతి కోరిన విధంగా ప్రతి ఉద్యోగి పేస్లిప్లో వారికి రావాల్సిన పీఆర్సీ, డీఏ బకాయిలు చూపించాలని అన్నారు. రాష్ట్ర కో చైర్మన్ పీఎస్ఎస్ఎన్ శాస్త్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగితో పాటు సమానంగా చైల్ట్కేర్ లీవ్ కూడా రెండు సంవత్సరాలకు పెంచాలని కోరారు. -
ట్యాంకర్ ఢీకొని వివాహిత మృతి
ప్రత్తిపాడు: పదహారో నంబర్ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వివాహిత మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. కరప మండలం నడకుదురు గ్రామానికి చెందిన బొడ్డు వెంకట రామకృష్ణ, భార్య పద్మావతి (51) బైక్పై ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామంలో పొలం పనులు చూసుకుని తిరిగి వెళ్తున్నారు. స్థానిక సంతోషిమాత గుడి వద్ద జాతీయ రహదారి దాటుతుండగా, వారి బైక్ను వెనుక నుంచి వస్తున్న పాల డెయిరీకి చెందిన ట్యాంకర్ ఢీకొంది. పద్మావతి కింద పడిపోగా, ఆమె తలపై నుంచి ట్యాంకర్ దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో పద్మావతి అక్కడికక్కడే మృతి చెందింది. వెంకట రామకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని హైవే అంబులెన్స్లో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఆదాయానికి మించి ఆస్తులు కలిగి.. ఏసీబీ దాడిలో పట్టుబడిన కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ చోడపురెడ్డి శివరామ్ కుమార్ను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ గురువారం సస్పెండ్ చేశారు. శివరామ్ కుమార్తో పాటు ఆయన బంధువుల ఇళ్లు, ఆస్తులు, కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఈ నెల 5న ఏకకాలంలో దాడులు చేశారు. సుమారు రూ.10 కోట్ల ఆస్తులున్నట్లు గుర్తించారు. శివరామ్ కుమార్ను అరెస్టు చేసి, రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఆయనకు కోర్టు రిమాండు విధించింది. ఈ నేపథ్యంలో శివరామ్ కుమార్ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఐజీ తనిఖీలు కాకినాడ క్రైం: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ గురువారం తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యాన పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి, రికార్డులు పరిశీలించారు. నేర నియంత్రణ, మహిళలు, బాలికల భద్రత, పెండింగ్ కేసుల దర్యాప్తు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రోడ్డు భద్రత, మత్తు పదార్థాల అక్రమ రవాణా, నివారణపై పలు సూచనలు చేశారు. జిల్లా పోలీసు శాఖ కార్యకలాపాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. -
పేదలకు ఇళ్ల స్థలాలివ్వరా?
మీరు మాత్రం రెండు స్థలాలు తీసుకుంటారా? బోట్క్లబ్ (కాకినాడ సిటీ): టీడీపీ జిల్లా కార్యాలయానికి కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ సమీపాన 1.45 ఎకరాల భూమిని ప్రభుత్వం లీజుకు కేటాయించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇళ్లు లేని పేదలకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్ల చొప్పున స్థలాలిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఎవ్వరికీ ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదని, అటువంటిది టీడీపీ జిల్లా కార్యాలయానికి ప్రభుత్వ స్థలం కేటాయించడం దారుణమని మండిపడ్డారు. ఓవైపు టీడీపీ జిల్లా కార్యాలయం లీజులో ఉండగా మళ్లీ ప్రభుత్వ భూమి తీసుకోవడం అన్యాయమని ధ్వజమెత్తారు. దీనిపై రాష్ట్ర పార్టీ నాయకత్వంతో చర్చించి, టీడీపీ కార్యాలయం భూమి పూజను అడ్డుకుంటామని మధు హెచ్చరించారు. పొరపాట్లు లేకుండా భూ రికార్డుల పోర్టింగ్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఎటువంటి పొరపాట్లూ లేకుండా భూ రికార్డుల పోర్టింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని జేసీ అపూర్వ భరత్ అన్నారు. ప్రత్తిపాడు మండలం పి.జగన్నాథపురం, తొండంగి మండలం కృష్ణాపురం గ్రామాల్లో జరుగుతున్న పోర్టింగ్ ప్రక్రియకు సంబంధించిన భూ రికార్డులను ఆయన కలెక్టరేట్లో గురువారం క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా గ్రామాలకు సంబంధించిన 22ఏ జాబితాలు, ఫ్రీ హోల్డ్ భూములు, ఇతర భూ సమాచార వివరాలను వీఆర్ఓలు, ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ సమక్షంలో నిశితంగా పరిశీలించి, నమోదైన వివరాల కచ్చితత్వాన్ని ధ్రువీకరించారు. జాయింట్ ఎల్పీఎంలు 2 శాతానికి మించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. పూర్తి పారదర్శకత, కచ్చితత్వంతో భూ రికార్డుల నవీకరణను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు జేసీ దిశానిర్దేశం చేశారు. విలువలతో కూడిన విద్య అందించాలిబోట్క్లబ్ (కాకినాడ సిటీ): విలువలతో కూడిన విద్య అందించాలని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, రాష్ట్ర నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అన్నారు. స్థానిక మధురా నగర్లో ఇస్కాన్ – బెంగళూరు ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన బాసిల్ వుడ్ స్కూల్ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం చదువుకు సంపాదనే లక్ష్యంగా ఉందని, విలువలకు ప్రాధాన్యం ఉండటం లేదని అన్నారు. ఇస్కాన్ సంస్థ నిర్వాహకుడు ప్రభుదాస్ మాట్లాడుతూ, బాసిల్ వుడ్ స్కూల్ మొదటి శాఖ బెంగళూరులో ఉందని, ఇప్పుడు కాకినాడలో ప్రారంభించామని చెప్పారు. ఈ స్కూల్లో విద్యార్థులకు ఆడుతూ పాడుతూ చదువు చెప్పడమే కాకుండా, భాగవతం, భగవద్గీత వంటి గ్రంథాలపై అవగాహన పెంపొందిస్తామని తెలిపారు. చదువు పూర్తయిన తర్వాత జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా మనోధైర్యంతో ఎదుర్కొనేలా విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను నేర్పిస్తామని అన్నారు. లింగ నిర్ధారణ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ కాకినాడ క్రైం: గర్భస్థ శిశు లింగ నిర్థారణ పరీక్షలపై ఫిర్యాదులకు ఉచిత టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి వచ్చిందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి నరసింహ నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లింగ నిర్థారణ చేసినా, చేయాలని కోరడం పీసీపీఎన్డీటీ చట్టం ప్రకారం తీవ్ర నేరమని స్పష్టం చేశారు. అటువంటి ఉదంతాలు గుర్తిస్తే 1800 233 2447 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. -
ఆ అడుగులు.. సంక్షేమానికి బాటలు
● నేడు జగన్ పాదయాత్ర ఉమ్మడి జిల్లాలో అడుగిడిన రోజు ● నేటికీ మరపురాని ఆ జ్ఞాపకాలు కపిలేశ్వరపురం: నడుస్తున్న చరిత్రలో లిఖించదగిన అరుదైన ఘటనల్లో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఒకటి. జనం చూపిన మార్గంలో పయనించాలన్న సంకల్పం నుంచి వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయడం ఓ రికార్డు. 2017 నవంబర్ 6న ఇడుపులపాయలో ప్రారంభించిన ఆయన పాదయాత్ర.. 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకూ సాగి విజయవంతంగా ముగిసింది. అంతటి మహా యాత్ర 2018 జూన్ 12న అప్పటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రోడ్ కం రైల్వే బ్రిడ్జి మీదుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోకి అడుగు పెట్టింది. గోదారమ్మ చలువతో యాత్ర విజయవంతమై, ఆగస్టు 14న విశాఖ జిల్లా మీదుగా ముందుకు సాగింది. అడుగడుగునా నీరాజనం పాదయాత్ర 187వ రోజైన 2018 జూన్ 12న రోడ్ కం రైల్వే బ్రిడ్జి మీదుగా రాజమహేంద్రవరం చేరింది. కింద జలగోదారి.. వంతెనపై జనగోదారి అనే రీతిలో అశేష ప్రజానీకం జననేతతో అడుగులో అడుగేయడం చూసి యావత్ రాష్ట్రం పులకించిపోయింది. జనం తాకిడికి బ్రిడ్జి పలుమార్లు ఊగడంతో అప్పట్లో టీడీపీ ప్రభుత్వం గుండెల్లో ప్రకంపనలు కలిగాయంటూ అభిమానులు చమత్కరించారు. దిగువన గోదావరిలో 600 పడవలు ఆకర్షణీయంగా నిలిచాయి. జగన్ పాదయాత్ర అదే నెల 13న కోనసీమలో ప్రవేశించింది. బొబ్బర్లంక – రావులపాలెం రహదారి జనగోదారిలా మారింది. ఈ యాత్ర సాగిన ధవళేశ్వరం, యానాం తదితర వంతెనలు ఆకర్షణీయంగా మారాయి. బొబ్బర్లంక – రావులపాలెం రహదారి వెంబడి కాలువలో నవరత్నాల నావలు ఆకట్టుకున్నాయి. జగన్ హృదయంలో నుంచి జనం వెళ్లేటట్టుగా కాకినాడ రూరల్, తునిల్లో ఏర్పాటు చేసిన ద్వారాలు విశేషంగా ఆకట్టుకుంది. పలు ప్రాంతాల్లో కొబ్బరి మట్టలు, కాయలు, ధాన్యం గుత్తులతో తమ ప్రియ నేతకు జనం ఘన స్వాగతం పలికారు. అమలాపురం, రౌతులపూడి మండలం గిడజాం, ఎస్.అగ్రహారం తదితర ప్రాంతాల్లో పూలతో పలికిన స్వాగతం ఎంతో ఆకట్టుకుంది. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గం పారుపాక క్రాస్ వద్ద గిరిజనులు అభిమానంతో ఇచ్చిన కొమ్ము తలపాగాను జగన్ ధరించారు. పాదయాత్ర ఆగస్టు 14న విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. అప్పటి దుష్టపాలనలో చెప్పుకొన్న సమస్యలనేకం అప్పటి చంద్రబాబు ప్రభుత్వ పాలనతో తాము ఎలా సతమతమవుతున్నామో సామాన్య జనం వైఎస్ జగన్కు చెప్పుకొన్నారు. నిలువ నీడ లేకున్నా ఇళ్ల స్థలం ఇవ్వడం లేదని, వైకల్యం కళ్లకు కనిపిస్తున్నా పింఛను ఇచ్చేందుకు కనికరం చూపడం లేదని, తమను ఆదరించడం లేదని వృత్తిదారులు సమస్యలు చెప్పుకొన్నారు. కుటీర పరిశ్రమల నిర్వహణ కష్టమవుతోందని పలు ప్రాంతాల్లో నిర్వాహకులు గోడు వెళ్లబోసుకున్నారు. భరోసాగా నిలిచి.. నాడు జగన్ వేసిన ఆ అడుగులే తదనంతర కాలంలో జన సంక్షేమానికి బాటలు పరిచాయి. నాటి పాదయాత్రలో జనం చేసిన విన్నపాలే 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోగా రూపాంతరం చెందాయి. రెండే రెండు పేజీలతో మొత్తం నవ్యాంధ్రప్రదేశ్ పేద, మధ్య తరగతి ప్రజలకు ఆశాజ్యోతిగా ఈ మేనిఫెస్టో నిలిచింది. నాటి ఎన్నికల్లో ప్రజల దీవెనలతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మేనిఫెస్టోను పరిపూర్ణంగా అమలు చేసి, దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా విపత్కర పరిస్థితులను సైతం అధిగమించి.. ఖర్చుకు వెనుకాడకుండా పేద, మధ్య తరగతి ప్రజలకు సంక్షేమాన్ని అందించిన ఘనత నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. అంతటి సంకల్ప బలాన్ని ఇచ్చింది ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రే. -
పిల్ల కొంచెం.. ప్రతిభ ఘనం
23 నెలల చిన్నారికి నోబుల్ వరల్డ్ రికార్డ్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్టుగా.. ఆ చిన్నారి పిల్ల కొంచెం.. ప్రతిభ ఘనమని నిరూపించుకుంది. నగరంలోని రామకృష్ణారావుపేట కొత్తూరు వీధికి చెందిన షేక్ ఖాజా మొహిదీన్ దంపతుల కుమార్తె 23 నెలల షేక్ ఆమైరా ఖాదరి నవాజ్ అద్భుత ప్రతిభతో నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకొంది. చిన్న వయస్సులోనే పండ్లు, కూరగాయలు, ఇంగ్లిషు అక్షరాలు, వాటి ఫోనెటిక్ పదాలు, 1 నుంచి 10 అంకెలు, శరీర భాగాలు, ఆకారాలు, పక్షులు, వ్యతిరేక పదాలు, బొమ్మలు, రుతువులు, గృహోపకరణాలను గుర్తించి చెబుతోంది. వివిధ రైమ్స్ కూడా చక్కగా వల్లె వేస్తూ ‘వన్ ఇన్ ఎ మిలియన్’గా గుర్తింపు పొందింది. ఆ చిన్నారి ప్రతిభ గురించి తెలుసుకున్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆమెను, తల్లిదండ్రులను గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్కు పిలిపించారు. వరల్డ్ రికార్డు సర్టిఫికెట్లు పరిశీలించి, 23 నెలల వయస్సులోనే ఖాదరి నవాజ్ ప్రపంచ రికార్డు సాధించడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఆమె అసాధారణ ప్రతిభ పట్ల కలెక్టర్తో పాటు పలువురు ప్రముఖులు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ఖాదరి నవాజ్ తల్లి మహమ్మద్ బషీర్ మహమ్మద్ గృహిణి కాగా, తండ్రి సయ్యక్ ఖాజా మొహిద్దీన్ చైన్నెలో వైర్లెస్ సిస్టమ్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. -
● హైలెస్సో.. హైలెస్సా
అలల కెరటాల్లో బతుకు పోరాటానికి ఎదురెళ్లారు.. బోట్లపై పోటాపోటీగా ముందుకు సాగారు.. కొన్ని రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న సాగర తలాన్ని బోట్లతో హోరెత్తించారు. చేపల వేట నిషేధం పూర్తి కావడంతో వందల బోట్లు ఒకేసారి కడలి వైపు సాగాయి. ఉప్పాడ, కోనపాపపేట, అమీనాబాద్, మూలపేట సమీపం నుంచి సముద్రమంతా బోట్లతో సందడిగా మారింది. హైలెస్సో హైలెస్సా అంటూ మత్స్యకారులు వలలు లాగుతూ మత్స్య సంపదను చాలా కాలం తర్వాత కళ్లారా చూసి సంబరపడ్డారు. బుధవారం ఉదయం వేటకు ఉపక్రమించిన వారు.. గురువారం జోరుగా వేట సాగించారు. రాత్రి వేళ లైట్లు వేసి మరీ వేట సాగించారు. – పిఠాపురం -
వెన్నుపోటుపై నేడు నిరసన ర్యాలీలు
పిఠాపురం: ఎన్నికల్లో అనేక హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిన తీరును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన శుక్రవారం జిల్లావ్యాప్తంగా భారీ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు, ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ముఖ్య కేంద్రాల్లో ఆయా కో ఆర్డినేటర్ల ఆధ్వర్యాన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే నిరసన ర్యాలీలకు జనం భారీగా తరలిరానున్నారు. వీటిని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
అమలాపురంలో గోల్డ్ స్కాం కలకలం
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: అమలాపురంలో గోల్డ్ స్కాం కలకలం రేపుతోంది. సిద్ధేశ్వరి జ్యువెలర్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. న్యాయం చేస్తానని చెప్పిన నగల దుకాణం నిర్వహకుడు అందుబాటులోకి రాకపోవడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రోడ్డుపై బైఠాయించారు.కష్టపడి కూడబెట్టిన సొమ్మును సంస్థలో పెట్టుబడిగా పెట్టామని.. ఇప్పుడు తమ డబ్బులు తిరిగి వస్తాయో లేదో తెలియని పరిస్థితి నెలకొందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు వెంటనే న్యాయం చేసి, బంగారం ఆభరణాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో స్థానిక నేతలు సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. పూర్తి స్థాయిలో బంగారం తిరిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని బాధితులు తేల్చి చెప్పారు. -
ఏమైపోయావ్ చిట్టితల్లీ!
తుని రూరల్: మండలంలోని చిక్కుళ్ల అగ్రహారం గ్రామంలో ఐదు రోజుల కిందట అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి (జాహ్నవి) ఆచూకీ ఇప్పటి వరకూ తెలియరాలేదు. రోజులు గడుస్తున్నా.. డ్రోన్లు, ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న తమ ముద్దులపట్టి జాడ చిక్కకపోవడంతో తల్లిదండ్రులు భవాని, గణేష్లతో పాటు వారి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. తండ్రి కోసం అతడు కాపలా ఉన్న మామిడి తోటకు గత శనివారం బయల్దేరిన జాహ్నవి మధ్యలో దారి తప్పిపోయి అదృశ్యమైపోయింది. గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంలో వెళుతున్న జ్ఞానేశ్వరిని, వారి పెంపుడు కుక్కను అదే గ్రామానికి చెందిన మతి స్థిమితం లేని ఓ వ్యక్తి చూశాడు. ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు అతడు ప్రయత్నించగా.. పెంపుడు కుక్క దాడికి యత్నించింది. దీంతో, అతడు ఆ బాలికను, కుక్కను వదిలేసి గ్రామానికి చేరుకుని, తల్లి భవానీకి విషయం చెప్పాడు. కుమార్తెను తీసుకువచ్చేందుకు తల్లి వెళ్లగా అక్కడ జ్ఞానేశ్వరి కనిపించలేదు. ఈ విషయాన్ని భర్త గణేష్కు ఆమె చెప్పింది. వారి ద్వారా విషయం తెలియడంతో గ్రామస్తులు వెంటనే అప్రమత్తమయ్యారు. చిన్నారి వెళ్లిన దారి వెంబడి, కొండ ప్రాంతంలో గాలించినా ఫలితం లేకపోవడంతో తుని రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అటవీ సిబ్బంది, గ్రామస్తులు కలసి బృందాలుగా కొండ ప్రాంతంలో ఆ రోజు అర్ధరాత్రి వరకూ.. ఆది, సోమ, మంగళ, బుధవారాలు గాలించినా బాలిక, పెంపుడు కుక్క ఆచూకీ తెలియరాలేదు. డ్రోన్, డాగ్ స్క్వాడ్ సాయంతో కొండ ప్రాంతాన్ని జల్లెడ పట్టినా ప్రయోజనం లేకపోయింది. సమీప గ్రామాల్లోను తుని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, ఇతర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్లు పరిశీలించినా ఎటువంటి ఫలితం లేదు. దీంతో, జ్ఞానేశ్వరి ఆచూకీ తెలియజేస్తే రూ.లక్ష బహుమతి అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. బాలిక ఆచూకీ లేదా సమాచారం తెలిసిన వారు తుని రూరల్ ఎస్సై 94407 96573, రూరల్ సీఐ 94407 96531, పెద్దాపురం డీఎస్పీ 94407 96508 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని కోరారు. ఇది కూడా ఇప్పటి వరకూ ఎటువంటి ఫలితం ఇవ్వలేదు. చిన్నారితో పాటు అదృశ్యమైన పెంపుడు కుక్క మంగళవారం సాయంత్రం ఇంటికి చేరింది. జ్ఞానేశ్వరి తల్లి భవానీ వ్రస్తాన్ని నోటితో పట్టుకుంది. దీంతో, బాలిక ఆచూకీ తెలుస్తుందేమోననే ఆశ చిగురించింది. కానీ, అక్కడే ఉన్న స్థానికులు, పోలీసులు సమీపించడంతో భయంతో ఆ కుక్క స్థానికులపై దాడి చేస్తూ మళ్లీ ఆయిల్పామ్ తోటలోకి పరుగు తీసి, తప్పించుకుని కొండ పైకి పారిపోయింది. అణువణువూ జల్లెడ పట్టినా.. ఐదో రోజైన బుధవారం పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ ఆధ్వర్యాన తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట సీఐల పర్యవేక్షణలో డివిజన్లో పలువురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు, ఇతర బృందాలు గ్రామ సమీపంలోని వివిధ తోటలను, గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండ ప్రాంతాన్ని ముమ్మరంగా జల్లెడ పట్టారు. సీసీ ఫుటేజ్లు మరోసారి పరిశీలించారు. డ్రోన్, డాగ్ స్క్వాడ్తో గాలింపును, గ్రామంలో ఎన్యూమరేషన్ సెర్చింగ్ కొనసాగించారు. పంట పొలాల్లోని బావులు, కుంటలు, బోరు బావుల వద్ద జల్లెడ పట్టారు. పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠా చేతికి జ్ఞానేశ్వరి చిక్కిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆ చిన్నారి కొండ పైకి వెళ్తే ఇప్పటి వరకూ నీరు, ఆహారం లేకుండా బతకడం దాదాపు అసాధ్యమని స్థానికులు భావిస్తున్నారు. ఎంత విస్తృతంగా వెతికినా జ్ఞానేశ్వరి ఆచూకీ లభించకపోవడం గాలింపు బృందాలకు అంతు చిక్కడం లేదు. బాలిక అదృశ్యం మిస్టరీ వీడకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
కడలిన మత్స్యకారులు
పిఠాపురం: సుదీర్ఘ వేట విరామం తరువాత గంగపుత్రులు బోట్లకు లంగరు తీసి కడలి ఒడిలోకి బుధవారం పయనమయ్యారు. వాస్తవానికి ఈ నెల 14వ తేదీ నుంచి చేపల వేట పునఃప్రారంభం కావాల్సి ఉంది. కానీ, నాలుగు చేపలు వెనకేసుకోవాలనే గంపెడాశతో మత్స్యకారులు నాలుగు రోజులు ముందుగానే తమ జీవన పోరాటాన్ని పునఃప్రారంభించారు. రెండు రోజులుగా తమ బోట్లు, వలలను సిద్దం చేసుకున్న మత్స్యకారులు బుధవారం తెల్లవారుజాము నుంచి తమ ఇష్ట దైవాలకు పూజలు, ప్రార్థనలు చేసుకుని సముద్రంపై వేటకు బయలుదేరారు. ఇటు ఐస్ ఫ్యాక్టరీలు, ఆయిల్ అమ్మకాలు కూడా ప్రారంభమయ్యాయి. మరోవైపు నిత్యం చేపల రవాణా చేసే వందలాది వాహనాలు సాగర తీరానికి ఇప్పటికే చేరుకున్నాయి. దీంతో, గత 55 రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న సాగరతీరం మళ్లీ పూర్వ కళను సంతరించుకుంది. ఈ ఏడాది డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో తమపై మోయలేనంత ఆర్థిక భారం పడిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలలపై సయ్యాటలాడుతూ.. బోట్లపై వేటకు పయనమవుతున్న గంగపుత్రులుఉప్పాడ వద్ద లంగరు తీసి వేటకు బయలుదేరుతున్న బోట్లు -
రేపటి నుంచి రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు
సామర్లకోట: పెద్దాపురం రామారావుపేటలోని శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్లో శుక్రవారం నుంచి ఆదివారం వరకూ రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ ర్యాకింగ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఆ పాఠశాల డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ సీహెచ్ విజయ ప్రకాష్ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు రాష్ట్ర అసోసియేషన్లో నమోదైన క్రీడాకారులు మాత్రమే అర్హులన్నారు. కాకినాడ టెబుల్ టెన్నిస్ అసోసియేషన్ పర్యవేక్షణలో.. బాల, బాలికల విభాగాల్లో అండర్–11, 13, 15, 17, 19 కేటగిరీల్లో పోటీలు జరుగుతాయని వివరించారు. మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం తుని రూరల్: హంసవరంలోని ఏపీ మోడల్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను వివిధ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రిన్సిపాల్ కె.ధర్మకుమార్ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. 6, 7, 8, 9, ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ లోగా ఆన్లైలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆరు నుంచి తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు ఈ నెల 24న పాఠశాల స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. 25న ఎంపికలు, 26న సర్టిఫికెట్ల పరిశీలన, అడ్మిషన్లు కల్పిస్తామని, వివరాలకు పాఠశాల పని వేళల్లో సంప్రదించాలని ధర్మకుమార్ సూచించారు. ఎదురెదురుగా ఢీకొన్న మోటార్ సైకిళ్లు ఒకరి మృతి గండేపల్లి: ఎదురెదురుగా వస్తున్న మోటార్ సైకిళ్లు ఢీకొని ఒకరు మృతి చెందారు. ఎస్సై యూవీ శివనాగబాబు కథనం ప్రకారం.. గండేపల్లికి చెందిన కట్టుమోతు శ్రీను (52) బుధవారం మోటార్ సైకిల్పై సింగరంపాలెం వైపు వెళ్తున్నాడు. గ్రామంలోని దుర్గమ్మ ఆలయం ఎదురుగా వచ్చేసరికి అదే మార్గంలో ఎదురుగా వస్తున్న మరో మోటార్ సైకిల్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీను అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రత్నగిరిపై భక్తుల రద్దీ -
ధాన్యం డబ్బులెప్పుడిస్తారు?
జగ్గంపేట: ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే రైతులకు డబ్బులు జమ చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటూండగా.. క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ధాన్యాన్ని మిల్లులకు పంపించి 15 రోజులవుతున్నా ఇప్పటి వరకూ సంబంధిత సొమ్ము ఇవ్వలేదని ఆగ్రహిస్తూ కాట్రావులపల్లి వద్ద రైతులు బుధవారం రాస్తారోకో చేయడమే దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. రైతుల కథనం ప్రకారం.. కాట్రావులపల్లి, రామవరం గ్రామాలకు చెందిన అన్నదాతలు గత నెల 19కి ముందు సుమారు 10 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించారు. తామంతా వేరే పనుల్లో బిజీగా ఉన్నామని.. మిల్లులకు ధాన్యం తరలించాలని, మిగిలిన ప్రొక్యూర్మెంట్ పని తాము పూర్తి చేస్తామని రైతు సేవా కేంద్రం సిబ్బంది, వ్యవసాయ అధికారులు ఆ సమయంలో చెప్పారు. ఆ మేరకు తాము మిల్లులకు ధాన్యం తరలించామని, ఆ డబ్బుల కోసం అధికారులను అడిగితే, తమ ధాన్యం ప్రొక్యూర్మెంట్ జరగలేదని, సివిల్ సప్లయిస్ టార్గెట్ అయిపోయిందని ఇప్పుడు చెబుతున్నారని రైతులు మండిపడ్డారు. మిల్లులకు పంపిన ధాన్యానికి ఎవరు డబ్బులిస్తారని ప్రశ్నించారు. రైతుల ఆందోళనతో కాట్రావులపల్లి – పెద్దాపురం రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది. జగ్గంపేట ఎస్సై రఘునాథరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తహసీల్దార్ జేవీఆర్ రమేష్, మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ) ఎస్.నరసింహం తదితరులు రైతులతో చర్చించారు. ఈ రైతులు రైతు సేవా కేంద్రాలతో సంబంధం లేకుండా మధ్యవర్తుల ద్వారా మిల్లులకు ధాన్యం తరలించారని ఎంఏఓ నరసింహం తెలిపారు. సీఎంఆర్ రైస్ జిల్లా టార్గెట్ పూర్తవడంతో సివిల్ సప్లయిస్ అధికారులు ఆ ధాన్యం సేకరించలేదని చెప్పారు. ఈ రైతుల సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతామని అన్నారు. ఫ కాట్రావులపల్లి వద్ద రైతుల ఆందోళన ఫ అధికారులు సంబంధం లేదంటున్నారని ఆగ్రహం -
పిడుగుపాటుకు ఆవుల కాపరి మృతి
కోటనందూరు: పిడుగుపాటుకు ఓ ఆవుల కాపరి మృతి చెందాడు. మండలంలోని పాత కొట్టాం గ్రామానికి చెందిన యడ్ల జానీ ప్రసాద్ (40) రెండు ఆవులను మేపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే బుధవారం సాయంత్రం ఆవులను మేపేందుకు వ్యవసాయ మకాం దగ్గర్లోని పంట పొలాలకు వెళ్లాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో పిడుగు పడటంతో చెవి నుంచి రక్తస్రావమై పొలంలోనే కుప్పకూలిపోయాడు. స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే జానీప్రసాద్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చెవి నుంచి రక్తస్రావం కావడం, ఫోన్ పాడైపోవడంతో.. ఫోన్ మాట్లాడుతూంటుండగా పిడుగుపాటుకు గురైననట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు జానీ ప్రసాద్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతితో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా కొత్త కొట్టాం గ్రామంలో లగుడు బాపన్న దొరకు చెందిన గెదే పిడుగుపాటుతో మృతి చెందింది. -
తాగునీరు కలుషితమవుతున్నా పట్టించుకోరా?
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): గ్రామాల్లో తాగునీరు కలుషితమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు జెడ్పీటీసీ సభ్యులు నిలదీశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజాపరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. తొలుత చైర్మన్ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పథకాలపై సమీక్షించారు. ఆర్థిక, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, రహదారులు, విద్య, వైద్యం, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, జాతీయ ఉపాధి హామీ పథకం, హౌసింగ్, విద్యుత్ తదితర శాఖల్లో వివిధ పనుల పురోగతి, కొత్త ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో చర్చించారు. గొల్లప్రోలు, ప్రతిపాడు, జగ్గంపేట గ్రామాల్లో సరఫరా చేస్తున్న తాగునీరు మట్టి వాసన వస్తోందని, రంగు మారుతోందని, అయినప్పటికీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు సభ్యులు నిలదీశారు. రావులపాలెం, యు.కొత్తపల్లి గ్రామాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ లోతుకు మట్టి తవ్వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు మాట్లాడుతూ, ధాన్యానికి గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనిపై పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వీవీవీఎస్ లక్ష్మణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వాయు బీభత్సం.. వరుణ తాండవం
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో మధ్యాహ్నం వరకూ సూర్య దేవుడు ప్రతాపం చూపగా.. సాయంత్రం వాయు దేవుడు, వరుణ దేవుడు కలసి బీభత్సం సృష్టించారు. బలమైన ఈదురు గాలులతో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. పెనుగాలులు మంగళవారమే బీభత్సం సృష్టించగా.. రత్నగిరి నుంచి దిగువకు వచ్చే ఘాట్ రోడ్డులో పలుచోట్ల చెట్లు విరిగి రోడ్డు మీద కూలాయి. అన్నదానం భవనం, శ్రీ సీతారామ సత్రం, సత్యగిరి మీద కూడా పెద్ద సంఖ్యలో చెట్లు కూలిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్ల కొమ్మలు విరిగి పడటంతో విద్యుత్ తీగలు తెగిపోయి, సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కూలిపోయిన చెట్లను దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ ఆధ్వర్యాన సిబ్బంది యుద్ధప్రాతిపదికన తొలగించారు. ప్రధానంగా ఘాట్ రోడ్ల మీద పడిన చెట్లను నరికి వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు. విద్యుత్ స్తంభాలు, తీగల మీద పడిన చెట్లను తొలగించే కార్యక్రమం కూడా చేపట్టారు. రాత్రి 8 గంటల సమయానికి చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని రామకృష్ణ తెలిపారు. ఈదురు గాలుల తాకిడికి అన్నవరం గ్రామంలోని కొత్తపేట సహా పలుచోట్ల చెట్లు విరిగిపడి, విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీంతో, గ్రామంలో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పాయకరావుపేట సబ్ స్టేషన్ నుంచి అన్నవరం సబ్ స్టేషన్కు ఉన్న 33 కేవీ లైన్ మీద చెట్ల కొమ్మలు విరిగి పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఈపీడీసీఎల్ ఏఈ పి.ప్రసాద్ తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను సిబ్బంది చేపట్టారు. తొండంగిలో.. తొండంగి: మండలంలోని పలు గ్రామాల్లో సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో ఈదుర గాలులు వీచి, కుండపోత వర్షం కురిసింది. తొండంగి – శృంగవృక్షం, ఎ.కొత్తపల్లి – కొమ్మనాపల్లి సీతారాంపురం రహదారులతో పాటు పెరుమాళ్లపురం బీచ్ రోడ్డులో భారీ వృక్షాలు కూలిపోయాయి. దీంతో, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మెట్ట గ్రామాల్లోని అరటి తోటల్లో చెట్లు నేలకూలడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. పెరుమాళ్లపురం పంచాయతీ అవల్దార్పాడులో పిడుగు పడి కొబ్బరి చెట్టు కాలిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులు రావడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగి, వైర్లు తెగిపోవడంతో ఎ.కొత్తపల్లి, కొమ్మనాపల్లి, రావికంపాడు, సీతారాంపురం, బెండపూడి, కోన తీర ప్రాంత గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. విద్యుత్ శాఖ సిబ్బంది సరఫరాను పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కుండపోత వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. రావికంపాడులో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రధాన రహదారి పంట కాలువను తలపించింది. పంచాయతీ అధికారులు ప్రధాన డ్రైనేజీలో పూడిక తీయకపోవడంతో మురుగు నీరు, వాన నీరు కలసి ఇళ్లల్లోకి వస్తున్నాయని స్థానిక బీసీ కాలనీ, ఓసీ కాలనీ వాసులు వాపోయారు. తొండంగిలో ఈదురు గాలులకు దెబ్బ తిన్న అరటి తోటచెట్లు విరగడంతో నిలిచిపోయిన వాహనాల రాకపోకలురత్నగిరి ఘాట్ రోడ్డులో విరిగిపడిన చెట్టుఫ రత్నగిరిపై పెనుగాలులు, భారీ వర్షం ఫ ఽఘాట్ రోడ్డులో విరిగిన చెట్లు ఫ తెగిన విద్యుత్ తీగలు


