breaking news
Kakinada
-
ఆరని బ్లో అవుట్ చిచ్చు
సాక్షి, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: మలికిపురం మండలం ఇరుసుమండ ఓఎన్జీసీ మోరి బావి నంబరు ఐదులో సంభవించిన బ్లో అవుట్ కొనసాగుతోంది. భూగర్భం నుంచి వచ్చే గ్యాస్ ఒత్తిడి తగ్గడం వల్ల మంటల తీవ్రత మంగళవారం మధ్యాహా్ననికి చాలా వరకూ తగ్గింది. అయితే గ్యాస్ ఒత్తిడి పెరిగినప్పుడు మళ్లీ మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఈ బావికి పూర్తి స్థాయిలో వెల్ క్యాపింగ్ (మూసేయడం) చేయడంపై అధికారులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు.పన్నెండేళ్ల క్రితం కూడా ఇలాగే డ్రిల్లింగ్ సమయంలో గ్యాస్ ఒత్తిడి నిలకడగా లేక ఇబ్బంది పడిన ఇంజినీర్లు ఈ బావిని అప్పట్లో మూసివేశారు. ఇప్పుడు కూడా నిలకడ లేకుండా గ్యాస్ ఉబికి వస్తుండటంతో వారు తలలు పట్టుకుంటున్నారు.రాజమహేంద్రవరం, నరసాపురం, తూర్పుపాలెం గ్యాస్ కలెక్షన్ స్టేషన్ల (జీసీఎస్) నుంచి విపత్తు నివారణ బృందాలు ఘటన ప్రాంతానికి చేరుకున్నాయి. గ్యాస్, చమురు కలిసి మండుతున్నందున మంటల తీవ్రత, చుట్టూ అలముకున్న వేడిని తగ్గించేందుకు ఫైర్ ఇంజిన్ల ద్వారా నీటిని జల్లుతున్నారు.మంటల తీవ్రతకు బావి వద్ద రిగ్ పడిపోవడంతో పాటు, పైపులూ కరిగిపోయాయి. మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో అధికారులు, ఇంజినీర్లు దూరం నుంచే పర్యవేక్షిస్తున్నారు. ఈ బావిలో సుమారు 40 వేల మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉందని భావిస్తున్నారు. భూగర్భంలో పరిస్థితిని అంచనా వేయడంలో ఇంజినీరింగ్ నిపుణులు నిమగ్నమయ్యారు. ఎన్ని మీటర్ల లోతు నుంచి పైప్లైన్ దెబ్బ తిందనే దానిపై అంచనా వేస్తున్నారు. ఈలోపు ప్రత్యేక జాకెట్లతో నిపుణులు మంటల్లోనే బావి వద్దకు వెళ్లే అవకాశం ఉంది. బావి వద్ద కరిగిపోయిన ఐరన్ పైపులు, రిగ్ మెటీరియల్ తొలగించి, వెల్కు సరిపడే క్యాప్ డిజైన్ చేయాల్సి ఉంది. దీనికి అణుగుణంగా ఘటన స్థలానికి వెల్క్యాప్, భారీ క్రేన్లను తరలించారు.ఒకేసారి అదుపు చేయడం వల్ల ఇబ్బందులు ఒకేసారి మంటలు అదుపు చేయడం వల్ల శాస్త్రీయంగా, పర్యావరణపరంగా ఇబ్బందులు తలెత్తుతాయని, ఈ నేపథ్యంలో క్రమక్రమంగా నాలుగు రోజుల్లో మంటలను అదుపు చేయనున్నట్టు ఓఎన్జీసీ వర్గాలు చెబుతున్నాయి. బోరు బావికి వారం రోజుల్లో క్యాపింగు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు పేర్కొంటున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రత్యేక నిపుణులతో కూడిన గ్యాస్ లీకేజీ నియంత్రణ బృందాలు రెండు ముంబై నుంచి డ్రిల్లింగ్ ప్రాంతానికి చేరుకున్నాయి.పునరావాస కేంద్రాల్లోనే రెండు గ్రామాల ప్రజలు మరోవైపు సమీపంలోని రెండు గ్రామాల ప్రజలు చాలా మంది ఇంకా పునరావాస కేంద్రాల్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇళ్లకు తాళాలు వేసుకుని వస్తే రాత్రి దొంగలు పడి దోచేశారని ఒకరు, తమ పెంపుడు మేకలను దొంగలు ఎత్తుకు పోయారని మరొకరు చెప్పారు. ప్రాణాలు అర చేతుల్లో పట్టుకుని కట్టుబట్టలతో వస్తే పునరావాస కేంద్రాల్లో అరకొర సౌకర్యాలు ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. బ్లో అవుట్ జరిగిన ప్రాంతాన్ని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలోని బృందం పరిశీలించింది. బ్లో అవుట్ జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకుంది. పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ), పార్టీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు పాల్గొన్నారు.ప్రైవేట్ కంపెనీలతోనే ముప్పుఓఎన్జీసీ పరిధిలోని బావుల డ్రిల్లింగ్ను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం వల్లే తరచూ కోనసీమలో బ్లో అవుట్లు చోటుచేసుకుంటున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇరుసుమండ ఓఎన్జీసీ మోరి బావి–5లో జరిగిన ప్రమాదంతో ఈ వాదన తెర మీదకు వచి్చంది. ఇక్కడ డ్రిల్లింగ్ పనులను గుజరాత్కు చెందిన డీప్ ఇండస్ట్రీకి ఓఎన్జీసీ అప్పగించింది. ప్రమాదం జరిగే అవకాశముందని పన్నెండేళ్ల క్రితం మూసివేసిన ఈ బావిలో తిరిగి డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో భయపడినట్టుగానే మంటలు ఎగసిపడ్డాయి. గతంలో కాట్రేనికోన మండలం ఉప్పూడిలోనూ కోల్కతాకు చెందిన పీఎఫ్హెచ్ సంస్థ లీజుకు తీసుకుని డ్రిల్లింగ్ చేస్తున్న బావి వద్దనే బ్లో అవుట్ చెలరేగింది.48 గంటల పాటు శ్రమిస్తేనే కానీ మంటలను అదుపు చేయలేకపోయారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఓఎన్జీసీ సంస్థ బావుల్లో సుమారు 2,600 మీటర్ల వరకూ డ్రిల్లింగ్ చేసి, ఆ పరిధిలో ఉన్న చమురు, సహజ వాయువులు వెలికితీస్తోంది. ఆ తరువాత వాటిని మూసివేస్తోంది. కొంత కాలం తరువాత వాటిని ప్రైవేట్ కంపెనీలకు లీజుకు ఇస్తోంది. పెద్దగా అనుభవం లేని ఆ సంస్థలు మరింత లోతుగా డ్రిల్లింగ్ చేపడుతున్న సమయంలో సాంకేతిక కారణాల వల్ల బ్లో అవుట్లతో మంటలు రేగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
పూల షోయగం
● యానాంలో ఆకట్టుకున్న ఫల, పుష్ప ప్రదర్శన ● ప్రారంభించిన పుదుచ్చేరి మంత్రి కౌమార్ యానాం: డాక్టర్ వైఎస్సార్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం ఆవరణలోని బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మంగళవారం రాత్రి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 24వ ఫల, పుష్ప ప్రదర్శన ప్రారంభమైంది. పుదుచ్చేరి వ్యవసాయశాఖ మంత్రి సీడీజే కౌమార్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బెంగళూరు, పూణె, కడియం తదితర నర్సరీలతో పాటు యానాం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పెంచుతున్న వివిధ రకాల ఫల, పుష్పాలను ప్రదర్శనలో ఉంచారు. ముఖ్యంగా హంసరథం, దేవకన్య, ట్రైహార్ట్స్, పాండా, గిటార్, నెమలి తదితర ఆకృతులు ఆకట్టుకున్నాయి. యానాం పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన పుష్ప ప్రేమికులతో బాలయోగి క్రీడా మైదానం కిక్కిరిసి పోయింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ఆర్ఏఒ, ఐఏఎస్ అధికారి అంకిత్ కుమార్, వ్యవసాయశాఖ డీడీ సీహెచ్ జోగిరాజు పాల్గొన్నారు. ఆకట్టుకుంటున్న పాండా సూపర్ డాల్ఫిన్స్ -
● అరటి గెల.. ఆకట్టుకునేలా..
మామిడికుదురు: అరటి చెట్టు చివరి భాగంలో గెల వేయడం సర్వ సాధారణం. కానీ దానికి భిన్నంగా చెట్టు మధ్యలో వేసిన గెల ఆకట్టుకుంటోంది. పెదపట్నంలంక గ్రామంలో బండారు మాణిక్యాలరావు ఇంటి పెరట్లో బొంత అరటి చెట్టుకు మధ్యలో గెల వేసింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న ఈ చెట్టును పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు. దీనిపై మండల ఉద్యానశాఖాధికారి దిలీప్ను మంగళవారం వివరణ కోరగా.. నేలలో తగిన తేమ లేకపోవడం, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాల లోపం వల్ల ఈ విధంగా జరగుతుందన్నారు. దీనిని వ్యవసాయ పరిభాషలో చోకింగ్ లేదా అంతర్గత ఒత్తిడి అని పిలుస్తారని చెప్పారు. -
చదువుతో పాటు క్రీడలకూ ప్రాధాన్యం
రాజానగరం: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకూ ప్రాధాన్యం ఇవ్వాలని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ అన్నారు. స్థానిక జీఎస్ఎల్ వైద్య కళాశాలలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వుమెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 వరకూ జరిగే ఈ పోటీలకు దేశంలోని 94 యూనివర్సిటీల నుంచి 450 మంది క్రీడాకారిణులు, 120 మంది కోచ్లు, మేనేజర్లు హాజరయ్యారన్నారు. బయోస్కిల్ ల్యాబ్ ప్రారంభం వైద్య కళాశాలలోని అడ్వాన్స్డ్ బయోస్కిల్ ల్యాబ్ను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ లాంఛనంగా ప్రారంభించారు. మృతదేహాల (కెడావర్స్)పై వైద్య విద్యార్థులు నేరుగా రోబోటిక్ సర్జరీలు సాధన చేసి, నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈ ల్యాబ్ ఉపయోగపడుతుందని చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ గురునాథ్, అంతర్జాతీయ రిఫరీ పున్నయ్య చౌదరి, జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ సూర్య చరిష్మా తదితరులు పాల్గొన్నారు. -
గిరి.. కొబ్బరి సిరి
రంపచోడవరం: కొబ్బరి.. అనగానే మనకు కోనసీమ గుర్తొస్తుంది.. కానీ ఇప్పుడు ఆ పచ్చదనం మన్యం కొండల్లోనూ కనువిందు చేయనుంది.. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాన్ని కొబ్బరి సాగుకు కేంద్ర బిందువుగా మార్చేందుకు పందిరిమామిడి ఉద్యాన పరిశోధన స్థానం ( హెచ్ఆర్ఎస్) సంకల్పించింది. కొబ్బరి అభివృద్ధి సంస్థ సహకారంతో గిరిజన రైతుల జీవితాల్లో వెలుగులు నింపేలా సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేసింది. వీరి కృషి ఫలిస్తే ఏజెన్సీ ప్రాంతం త్వరలోనే మన్యపు కోనసీమగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. గతంలో ఏజెన్సీ రైతులు కొబ్బరి మొక్కల కోసం మైదాన ప్రాంతాలపై ఆధారపడాల్సి వచ్చేది. ఈ కష్టాలను తీరుస్తూ పందిరిమామిడి హెచ్ఆర్ఎస్లోనే సొంతంగా నర్సరీని ఏర్పాటు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట నుంచి నాణ్యమైన విత్తన కాయలను సేకరించి, ఇక్కడ 10 నెలల పాటు పెంచి రైతులకు అందిస్తున్నారు. ఒక్కో మొక్క ధర రూ. 100 కాగా, కొనుగోలు చేసిన రైతు ఖాతాలో కొబ్బరి అభివృద్ధి సంస్థ ద్వారా రూ.70 రాయితీ జమ అవుతుంది. అంటే కేవలం రూ.30కే రైతుకు ఒక మేలైన మొక్క అందుతోంది. గత ఏడాది మూడు వేల మొక్కలు పంపిణీ చేయగా, ఈ ఏడాది ఏకంగా ఏడు వేల మొక్కలు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొబ్బరి చిప్పలు.. కళాఖండాలు కేవలం సాగుకే పరిమితం కాకుండా, కొబ్బరి ఆధారిత పరిశ్రమలపై కూడా శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్లోనే తొలిసారిగా కొబ్బరి చిప్పలతో అలంకరణ వస్తువుల తయారీపై గిరిజన యువతులకు శిక్షణ ఇచ్చారు. పర్యాటక ప్రాంతమైన ఏజెన్సీలో ఈ వస్తువులకు మంచి డిమాండ్ ఉంటుంది. శిక్షణ పొందిన వారికి రూ. 5 వేల విలువైన టూల్ కిట్లు కూడా అందజేశామని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగాత్మకం.. గంగా బొండాం సాధారణ రకాలతో పాటు, త్వరగా దిగుబడినిచ్చే గంగా బొండం రకం మొక్కలను కూడా హెచ్ఆర్ఎస్లో ప్రయోగాత్మకంగా నాటారు. వీటి పెరుగుదల, దిగుబడి ఇక్కడి వాతావరణానికి అనుకూలిస్తే, రాబోయే రోజుల్లో రైతులకు ఈ రకాన్ని కూడా పెద్ద ఎత్తున పంపిణీ చేయనున్నారు. దీనివల్ల రైతులకు మంచి ఆదాయం సమకూరనుంది. ఏజెన్సీ ప్రాంతం కొబ్బరికి నాన్ ట్రేడేషనల్ ప్రాంతం కావడంతో రాబోయే రెండేళ్ల కాలంలో కొబ్బరిని 2 వేల ఎకరాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గిరిజన రైతులు కొబ్బరి సాగుపై ఆసక్తి చూపడంతో విస్తరణం ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గిరిసీమకు కొబ్బరి సిరి వస్తోంది.. ఇక్కడ సాగు ఊపిరి పోసుకుంటోంది.. పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో పందిరిమామిడి ఉద్యాన పరిశోధన స్థానం, కొబ్బరి అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాన్ని కొబ్బరి సాగుకు కేంద్ర బిందువుగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. తక్కువ ధరకే నాణ్యమైన మొక్కలను అందించడమే కాకుండా, కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల ద్వారా గిరిజన యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సరికొత్త ప్రణాళికలు రూపుదిద్దుకుంది. త్వరలోనే మన్యపు కోనసీమ ఆవిష్కృతం కానుంది. పొలం గట్లపై నాటుకున్నాం పందిరిమామిడి పరిశోధన స్థానం నుంచి తీసుకువచ్చిన కొబ్బరి మొక్కలను పొలం గట్లు, ఇంటి ఆవరణలో ఖాళీగా ఉన్నచోట నాటుకున్నాం. వాతావరణం అనుకూలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇవి మాకు అదనపు ఆదాయాన్ని ఇస్తాయనే నమ్మకం ఉంది. –పండా నాగన్నదొర, ఎర్రంపాలెం, రంపచోడవరం మండలం కొబ్బరి విస్తరణకు చర్యలు ఏజెన్సీ ప్రాంతంలో కొబ్బరి సాగు విస్తరణకు కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు సహకారంతో చర్యలు చేపట్టాం. రైతులు ముందుగా మొక్కలు కొనుగోలు చేసుకుంటే బోర్డు 70 శాతం రాయితీ ఇస్తుంది. గంగాబొండం రకం పెరుగుదల బాగుంటే క్షేత్ర స్థాయిలో పంపిణీకి చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ పీసీ వెంగయ్య, ప్రధాన శాస్త్రవేత్త, పందిరిమామిడి ఉద్యాన పరిశోధన స్థానం సాగుకు మన్యంలో ఊపిరి రంపచోడవరం ఏజెన్సీలో శ్రీకారం పందిరిమామిడి ఉద్యాన పరిశోధన స్థానం, కొబ్బరి అభివృద్ధి సంస్థ ప్రోత్సాహం తక్కువ ధరకు నాణ్యమైన మొక్కల పంపిణీ కొబ్బరి ఆధారిత ఉత్పత్తులపై గిరి యువతకు శిక్షణ -
జీఎస్టీ పెంపుపై పొగాకు రైతుల నిరసన
● దేవరపల్లిలో భారీ ర్యాలీ ● మూడు రోడ్ల జంక్షన్లో మానవహారం పొగాకుపై పెంచిన జీఎస్టీని తగ్గించాలని దేవరపల్లిలో భారీ ర్యాలీ చేస్తున్న పొగాకు రైతులు మార్కెట్లో దొరుకుతున్న అక్రమ విదేశీ సిగరెట్లను చూపిస్తున్న రైతులు దేవరపల్లి: సిగరెట్లపై కేంద్ర ప్రభుత్వం విధించిన భారీ జీఎస్టీ పెంపును నిరసిస్తూ మంగళవారం దేవరపల్లిలో పొగాకు రైతులు ధర్నా చేశారు. తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల పొగాకు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా దేవరపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించి, మూడు రోడ్ల జంక్షన్లో మానవహారంగా ఏర్పడ్డారు. టుబాకో బోర్డు కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ప్రదర్శన జరిపి, బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. పెంచిన ఎకై ్సజ్ డ్యూటీ, జీఎస్టీ తగ్గించాలని, రైతులను, రైతు కూలీలను ఆదుకోవాలని, అక్రమ సిగరెట్లను అరికట్టాలని, పొగాకు పంటను కాపాడాలని నినాదాలు చేశారు. రైతుల జీవనానికి ముప్పు రైతు సంఘం నాయకులు కరుటూరి శ్రీనివాస్, కాట్రు సత్యనారాయణ, గద్దే శేషగిరి, పిన్నమనేని మధుమోహన్, యాగంటి సాయిబాబు, ఈలపోలు చిన్ని, పలువురు రైతులు మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులపై 28 శాతం ఉన్న జీఎస్టీని 40 శాతానికి పెంచడం వల్ల పొగాకు రైతుల జీవనానికి తీవ్రమైన ముప్పు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో సిగరెట్లపై 22 శాతం పన్ను పెంచినప్పుడు పరిశ్రమ కొనుగోళ్లు తగ్గి పొగాకు ధరలు దాదాపు 25 శాతం పడిపోయాయన్నారు. అప్పట్లో కిలోకు రూ.23 వరకూ రైతులు నష్టపోయారని, ప్రస్తుతం ప్రకటించిన పన్ను పెంపు 50 నుంచి 60 శాతం వరకు ఉంటుందని నాయకులు తెలిపారు. ఇటువంటి పెరుగుదల భారతదేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. దీని వల్ల అక్రమ సిగరెట్లు మార్కెట్లో విచ్చలవిడిగా అందుబాటులోని వస్తాయన్నారు. పెంచిన జీఎస్టీ వల్ల ప్రస్తుతం రూ.17 ఉన్న సిగరెట్ ధర రూ.25 అవుతుందన్నారు. వెయ్యి సిగరెట్లపై రూ.2 వేల నుంచి రూ.4,500 వరకూ ఉన్న పన్ను.. ఇప్పుడు రూ.8 వేలకు పెరుగుతుందన్నారు. అక్రమ సిగరెట్లకు ఊతం భారీ పన్నుల వల్ల అక్రమ సిగరెట్ వ్యాపారం పెరుగుతుందని రైతులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దేశంలో దాదాపు 26 శాతం సిగరెట్లు అక్రమంగా విక్రయాలు జరుగుతున్నాయన్నారు. దీని వల్ల ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.23 వేల కోట్ల నష్టం వాటిల్లుతోందని వివరించారు. కాగా.. మూడు వేలం కేంద్రాల నుంచి వందల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధం ఫేమ్ వర్క్ కన్వర్షన్ ఆఫ్ టుబాకో క్రాప్ (ఎఫ్సీటీసీ) నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతులను దెబ్బతీస్తున్నాయి. జీఎస్టీని 40 శాతానికి పెంచడం వల్ల దేశీయ సిగరెట్ల వినియోగం తగ్గి, నాన్ టాక్స్బుల్ (అక్రమ) సిగరెట్ల వినియోగం పెరుగుతుంది. పొగాకు ఉత్పత్తులు, సాగు చేస్తున్న రైతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. పొగాకు పంటకు సమాన ఆర్థిక శక్తి గల ప్రత్యామ్నాయ పంటలు, దీర్ఘకాలిక అవసరాలు తీర్చే పంటలను ప్రభుత్వాలు పొగాకు రైతులకు చూపించాలి. లక్షల మంది కార్మికులు, వేల మంది రైతులు పొగాకు పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ఈ జీఎస్టీని సరళం చేసి పొగాకు పరిశ్రమను ముందుకు తీసుకు వెళ్లాలి. – వల్లభనేని సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు -
చోరీ కేసులో ముగ్గురికి జైలు
జగ్గంపేట: బంగారం చోరీ కేసులో ముగ్గురికి 12 నెలల జైలు, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ పెద్దాపురం సివిల్ జడ్డి, జ్యుడీషియిల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఐ.దేవీరత్న కుమారి మంగళవారం తీర్పు ఇచ్చారు. ఎస్సై రఘునాఽథరావు తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గంపేట శివారు యానాదుల కాలనీలో నివసించే ఎద్దుపాటి శ్రీనివాస్ 2025 ఫిబ్రవరి 26వ (శివరాత్రి)తేదీ తెల్లవారుజామున తన ఇంటికి తాళం వేసి గోనాడ గ్రామంలోని ఏలేరు కాలువలో స్నానానికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికీ ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా, ఇంటిలోని 20 గ్రాముల బంగారం మాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గుడ్ల సతీష్, తమ్మిశెట్టి సాయి, బొండపల్లి అచ్యుత సతీష్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. విచారణలో వారు నేరం చేసినట్టు రుజువు కావడంతో పైవిధంగా న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు. 104 కిలోల గంజాయి స్వాధీనం తొండంగి: ఒడిశా, విశాఖ ఏజెన్సీ నుంచి బెంగళూరుకు తరలిస్తున్న గంజాయిని జాతీయ రహదారిపై బెండపూడి వై.జంక్షన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా కేరళకు చెందిన ఇద్దరిని అరెస్టు చేసి, 104 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, తొండంగి ఎస్సై జగన్మోహనరావు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేస్తుండగా, ఓ లారీపై గంజాయిని గుర్తించారు. దాని డ్రైవర్ కేరళ రాష్ట్రం కన్నూర్ జిల్లా పుతాపరాకు చెందిన పుడియపురల్ సమీద్ను అదుపులోకి తీసుకున్నారు. వీరికి సంబంధించిన ఓ కారును కూడా అదుపులోకి తీసుకున్నారు. దానిలో కేరళ రాష్ట్రం ఎర్నాకులం నావెల్ ఆర్నమెంట్ నదపొలువకు చెందిన కేపీ సలీమ్ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 104 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, లారీ, కారును సీజ్ చేశారు. గంజాయి విలువ రూ. 52 లక్షలు ఉంటుందని, దీనిపై ఎన్డీపీఎస్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. ట్రైబల్ క్రీడలకు 8న జట్ల ఎంపిక నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ స్కీం పథకంలో భాగంగా ట్రైబల్ క్రీడాకారుల్లో నైపుణ్యాలు వెలికితీసేందుకు మొదటిసారిగా ఖేలో ఇండియా ట్రైబల్ క్రీడలు పేరుతో జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు. డీఎస్డీఓ వి.సతీష్ కుమార్ మంగళవారం ఈ విషయం తెలిపారు. పురుషులు, మహిళలకు ఓపెన్ కేటగిరిలో అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, హాకీ, ఫుట్బాల్ పోటీలు జరుగుతాయన్నారు. వీటిని జిల్లాలో అర్హులైన ట్రైబల్ క్రీడాకారులను ఎంపికను గురువారం డీఎస్ఏలో ఎంపిక నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి కలవారు ఆ రోజు ఉదయం 9 గంటలకు డీఎస్ఏలో రిపోర్టు చేయాలని కోరారు. -
రేగే జ్వాలలపై ఊగిసలాట
సాక్షి, అమలాపురం/ మలికిపురం: చమురు, సహజ వాయువు వెలికితీత కోసం ఓఎన్జీసీ చేసే అన్వేషణలో తరచూ బ్లో అవుట్లు.. గ్యాస్ పైప్లైన్ల లీకేజీలు చోటు చేసుకుంటున్నాయి. పచ్చని కోనసీమలో చమురు సంస్థలు తమ కార్యకలాపాలతో పెను విపత్తులకు కారణమవుతున్నాయి. ఇటువంటి విపత్తులు జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల గ్రామాల వాసులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కట్టుబట్టలతో పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఈ విపత్తులన్నీ మానవ తప్పిదాలే కాగా.. బ్లో అవుట్, గ్యాస్ పైప్లైన్ లీకుల తరువాత విపత్తులను ఎదుర్కొనే విషయంలో ఓఎన్జీసీ వ్యవహరిస్తున్న తీరు.. అలసత్వం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ముందు జాగ్రత చర్యలు శూన్యం ప్రభుత్వ, ప్రైవేటు రంగ చమురు సంస్థలకు కోనసీమ అక్షయపాత్రగా మారింది. అపారమైన చమురు, సహజ వాయువులను నిక్షిప్తం చేసుకున్న కేజీ (కృష్ణా, గోదావరి) బేసిన్ గడచిన నాలుగు దశాబ్దాలుగా చమురు సంస్థలకు వేల కోట్ల రూపాయలు అందిస్తోంది. దీనికోసం వారు చేస్తున్న కార్యకలాపాల వల్ల జిల్లాలో తరచూ ఏదో ఒకచోట భారీ విపత్తు చోటు చేసుకుంటోంది. ఇక చిన్న చిన్న గ్యాస్ లీకేజీలు, మంటలు రావడం సర్వ సాధారణంగా మారింది. అయితే భారీ బ్లో అవుట్లు జరుగుతున్న సమయంలో ఓఎన్జీసీతోపాటు చమురు సంస్థల స్పందన అత్యంత పేలవంగా ఉంటోంది. భారీ మంటలు చేలరేగిన సమయంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మాత్రమే కాకుండా చుట్టుపక్కల నివాసముంటున్న వారు కూడా ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. ఇది తప్పనిసరి. అయితే డ్రిల్లింగ్, ఇతర కార్యకలాపాలు చేసే చోట ప్రమాదం జరిగితే ఎదుర్కొనే ముందు జాగ్రత చర్యలు మాత్రం పాటించడం లేదు. తాజాగా మలికిపురం మండలం ఇరుసుమండ ఓఎన్జీసీ మోరి బావి–5వ వద్ద సోమవారం బ్లో అవుట్ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం ఉదయం 11 గంటలకు జరిగితే ఒంటి గంటకు మంటలు చెలరేగాయి. అయితే సాయంత్రం ఆరు గంటల వరకు కనీసం మంటలు ఆర్పే చర్యలను చేపట్టలేదు. మంటలను ఎలా అదుపు చేయాలనేది ఇక్కడ బావి వద్ద ఉన్నవారికే కాదు.. ఓఎన్జీసీ ఉన్నతాధికారులకు కూడా పాలుపోలేదు. రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థకు చెందిన ఫైర్ ఇంజిన్లు, ఓఎన్జీసీ ఫైర్ ఇంజిన్లు వచ్చినా ఘటనా ప్రాంతానికి వెళ్లే సాహసం చేయలేకపోయాయి. నరసాపురం, రాజమహేంద్రవరంలలో ఉన్న క్రైసిస్ మేనేజ్మెంట్ (సంక్షోభ నివారణ) బృందాలు వచ్చే వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. అప్పటి వరకు చేష్టలుడిగి చూడాల్సిన దుస్థితి నెలకొంది. వారు వచ్చి మంటల అదుపునకు చేపట్టాల్సిన చర్యల గురించి వివరించిన తరువాతనే మంటల మీదకు నీటి పంపింగ్ చేపట్టారు. స్థానికంగా వచ్చిన ఫైర్ ఇంజిన్లకు అందుబాటులో పెద్దగా నీరు లేదు. సమీపంలో ఉన్న పంట బోదెల నుంచి పెద్దగా నీరు సేకరించే అవకాశం లేకపోవడంతో ట్యాంకర్లతో ముందస్తుగా నీరు తరలించాల్సి వచ్చింది. అలసత్వంపై కోనసీమ వాసుల మండిపాటు కేజీ బేసిన్లో కార్యకలాపాలు అన్నీ జరిగేవి కోనసీమ, కాకినాడ జిల్లాల తీర ప్రాంతాల్లోనే. ఆఫ్ షోర్ (సముద్రంలో), ఆన్షోర్ (ఒడ్డున) జరిగే కార్యకలాపాలు ఈ రెండు జిల్లాలోనే ఉన్నాయి. ఇక్కడ డ్రిల్లింగ్, చమురు, సహజ వాయువుల వెలికితీత, పైప్లైన్ల ద్వారా తరలింపు జరుగుతోంది. ఓడలరేవు, తాటిపాక, గాడిమొగ, కేశనపల్లి వంటి ప్రాంతాల్లో చమురు, సహజ వాయువుల నిల్వ చేయడం, తరలించడం చేస్తుంటారు. ఇక్కడ భారీ కార్యకలాపాలు జరగుతుంటాయి. ఈ కార్యకలాపాల వల్లే ఇక్కడ తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టం కూడా సంభవిస్తోంది. ఇంత జరుగుతున్నా ఈ జిల్లాలో కనీసం క్రైసిస్ మేనేజ్మెంట్ బృందాన్ని, వారికి అవసరమైన అధునాతన సామగ్రిని అందుబాటులో ఉంచడంలో ఓఎన్జీసీ, ఇతర చమురు సంస్థలు ఉదాసీన వైఖరితో ఉన్నాయి. వీటిని ఏర్పాటు చేయాలని స్థానికులు దశాబ్దకాలంగా డిమాండ్ చేస్తున్నా లెక్క చేయడం లేదు. అల్లవరం మండలం దేవర్లంక (పాశర్లపూడి)లో బ్లో అవుట్ జరిగినప్పుడే ఈ డిమాండ్ తెర మీదకు వచ్చింది. నాటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. దీనివల్లే ప్రమాదాలు జరుగుతున్న సమయంలో మంటలు ఆర్పేందుకు, గ్యాస్ను కట్టడి చేసేందుకు రోజులపాటు ఎదురు తెన్నులు చూడాల్సి వస్తోంది. ఓఎన్జీసీ, చమురు సంస్థలు అవలంబిస్తున్న ఈ నిర్లక్ష్య వైఖరిపైనే కోనసీమ వాసులు మండిపడుతున్నారు. బ్లో అవుట్ జరిగిన చోట సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో పైపులు సద్దుతున్న ఫైర్ సిబ్బందిఇరుసుమండలో బ్లో అవుట్ జరిగిన చోట సోమవారం సాయంత్రం మంటలపై నీళ్లు జల్లుతున్న ఫైర్ సిబ్బంది భారీ ప్రమాదాలకు కారణమవుతున్న ఓఎన్జీసీ ఉదాసీన వైఖరి ఆపత్కాలంలో చేష్టలుడిగి చూస్తున్న స్థానిక సిబ్బంది నరసాపురం, రాజమహేంద్రవరం నుంచి విపత్తు నివారణ బృందాలు రావాల్సిందే కేజీ బేసిన్ కార్యకలాపాలన్నీ కోనసీమ గడ్డ మీద కార్యాలయాలు, నిపుణుల బృందాలు ఉండేది రాజమహేంద్రవరంలో.. స్థానికంగా సౌకర్యాలు కల్పించాలని దశాబ్దాలుగా జనం డిమాండ్ ఏమాత్రం పట్టించుకోని ఓఎన్జీసీ -
అతిథిలా వచ్చి వెళ్తున్న పవన్
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో ఏటా సంక్రాంతి సంబరాలు జరుపుకొంటున్నామని, అటువంటిది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వచ్చి కొత్తగా ఈ సంబరాలు నిర్వహించడమేమిటని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు ప్రశ్నించారు. కాకినాడలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాను అభివృద్ధి చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన పవన్.. ఇక్కడకు ఓ అతిథిలా వచ్చి, వెళ్తున్నారని విమర్శించారు. కీలకమైన కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్గా ఐఏఎస్ అధికారిని కాకుండా.. తన మాట వినే డమ్మీ అధికారులను ఎంపీ సానా సతీష్ నియమిస్తున్నారని ఆరోపించారు. పక్కనే ఉన్న రాజమహేంద్రవరానికి ఐఏఎస్ను నియమించి, కాకినాడలో అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. నగరం ప్రస్తుతం చాలా అధ్వానంగా తయారైందని అన్నారు. ఓఎన్జీసీ నిర్లక్ష్యం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు ప్రాణాలతో ఆ సంస్థ చెలగాటమాడుతోందని ఆరోపించారు. సామ్రాజ్యవాద అహంకారంతో చిన్నచిన్న దేశాలపై ఆర్థిక, సైనిక, వైమానిక దాడులకు పాల్పడుతూ ప్రపంచ శాంతికి అమెరికా ముప్పుగా మారిందని మధు అన్నారు. వివిధ అంతర్జాతీయ సమస్యలను సాకుగా చూపుతూ వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మధురోను, ఆయన భార్య సిలియో ఫ్లోర్స్ను అరెస్టు చేసి నిర్బంధించడం ఒక స్వతంత్ర దేశాధ్యక్షుడిపై చేసిన ఘోర దాడిగా అభివర్ణించారు. ఇది అంతర్జాతీయ చట్టాలకు, ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధమన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ ట్రంప్ ఘాతుకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ, మన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ స్పందించకపోవడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికై నా ట్రంప్ విధానాలను ప్రధాని మోదీ ఖండించాలని, అమెరికా సామ్రాజ్యవాద దౌర్జన్యానికి వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు వచ్చే నెల 16 ,17, 18 తేదీల్లో కాకినాడలో నిర్వహిస్తున్నట్లు మధు తెలిపారు. అలాగే, సీపీఐ శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 18న ఖమ్మంలో లక్షలాది మందితో బహిరంగ సభ జరగనుందని, దీనికి అన్ని వర్గాల ప్రజలూ తరలి రావాలని పిలుపునిచ్చారు. విలేకర్ల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సత్యనారాయణ, సాక రామకృష్ణ, టి.అన్నవరం, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఎం.పద్మ పాల్గొన్నారు. ఫ కొత్తగా ఆయన సంక్రాంతి సంబరాలు జరపడమేమిటి? ఫ సీపీఐ నేత మధు విమర్శ -
జీఎస్టీ.. ఎగ్గొట్టి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తెలంగాణతో పాటు మన రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన వారి ఆధార్ కార్డులతో కొంత మంది మాయగాళ్లు కాకినాడ పరిసర ప్రాంతాల్లోని చిరునామాలతో తుక్కు ఇనుము (ఐరన్ స్క్రాప్), జీడిపప్పు తదితర వ్యాపారాలు నిర్వహించే కంపెనీలు పెట్టారు. ఈ ప్రబుద్ధులు జీఎస్టీకి ఎగనామం పెడుతున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అనుమానం వచ్చింది. దీనిపై వారు తీగ లాగడంతో బినామీల డొంక కదిలింది. ఆ మాయగాళ్లు భారీగా జీఎస్టీ ఎగ్గొట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ బాగోతం ఏడాది క్రితమే జరిగినప్పటికీ.. కాకినాడ డివిజన్ జాయింట్ కమిషనర్ పరిధిలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఎగవేతదారుల ఫొటోలతో ఫ్లెక్సీలు వేయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. 12 మంది పేరిట జీఎస్టీ ఎగ్గొట్టినట్టుగా వాణిజ్య పన్నుల శాఖ కాకినాడ డివిజన్ జాయింట్ కమిషనర్ కార్యాలయం బహిరంగ ప్రకటన విడుదల చేసింది. జీఎస్టీ ఎగవేసిన కంపెనీలు ఎవరెవరి పేరున ఉన్నాయో వారి పాస్పోర్టు సైజ్ ఫొటోలు, అడ్రస్లతో కూడిన ఫ్లెక్సీలను జాయింట్ కమిషనర్ కార్యాలయంతో పాటు కాకినాడ కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు. ఇవి కొన్ని మాత్రమేనని, వీరందరూ వివిధ కంపెనీల పేరిట కాకినాడలో లావాదేవీలు నిర్వహించి, జీఎస్టీ ఎగ్గొట్టేశారన్నది ఆ ప్రకటన సారాంశం. నోటీసు బోర్డులో పేర్లున్న వారిలో కొందరు.. అసలు ఆ కంపెనీ ఏమిటి, జీఎస్టీ అంటే ఏమిటి, తామెందుకు చెల్లించాలని ఎదురు ప్రశ్నలు వేయడం సంబంధిత అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రూ.20 కోట్లు పైగా.. జీఎస్టీ ఎగవేసిన ప్రబుద్ధులు మొదట అమాయకుల ఆధార్ కార్డులు సంపాదించి.. వాటి ఆధారంగా కాకినాడ ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు ఆటోనగర్, రమణయ్యపేట, పెద్దాపురం ఇండస్ట్రియల్ ఏరియా, తుని తదితర ప్రాంతాల్లో కంపెనీలు ప్రారంభించారు. ఆ కంపెనీల పేరుతో పాత ఇనుము టెండర్లలో పాల్గొని, పెద్ద ఎత్తున లావాదేవీలు నిర్వహించారు. ప్రధానంగా ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలైన కాకినాడ పోర్టు, షిప్పింగ్ కంపెనీల వంటి వాటిల్లో పాత ఇనుము కొనుగోలు టెండర్లలో వీరు బినామీ కంపెనీల పేర్లతో పాల్గొని, జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గుర్తించారు. పేరుకు ఏడెనిమిది కంపెనీలు టెండర్లలో పాల్గొన్నట్టు చూపించి.. అంతా సిండికేట్ అయి, ఒకరి పేరునే ఖాయం చేసుకోవడం ఈ టెండర్లలో పరిపాటి అని చెబుతున్నారు. టెండర్లు దక్కించుకున్న కంపెనీల పేరిట వ్యాపార లావాదేవీలు జరిపి, జీఎస్టీకి ఎగనామం పెట్టారు. ఈవిధంగా కాకినాడతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎగ్గొట్టిన జీఎస్టీ రూ.20 కోట్లు పైనే ఉంటుందని వాణిజ్య పన్నుల శాఖ ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ 12 మందిపై కాకినాడ, తునిలోని పోలీసు స్టేషన్లలో ఆ శాఖ అధికారులు ఫిర్యాదులు చేశారు. అక్రమాల గుట్టు రట్టు చేయాలని.. ఈ జీఎస్టీ అక్రమాల గుట్టును రట్టు చేసేందుకు కాకినాడ వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ కార్యాలయం అధికారులు సిద్ధమయ్యారు. జీఎస్టీ ఎగవేసిన కంపెనీలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణకు కూడా వెళ్లారు. ఈ క్రమంలోనే బినామీ ఆధార్ కార్డులతో కంపెనీలు రిజిస్టర్ చేయించి, లావాదేవీలు జరిపిన విషయం గుర్తించినట్లు సమాచారం. తమ జాబితాలో ఉన్న ఫొటోలు, ఆధార్ నంబర్ల ఆధారంగా వివిధ ప్రాంతాల్లో పరిశీలన జరపగా.. వారిలో అసలు కొంత మంది అడ్రస్సులే దొరకడం లేదు. దీంతో, జీఎస్టీ ఎగ్గొట్టి, ఉడాయించిన అసలు ప్రబుద్ధులను పోలీసు విచారణ ద్వారా గుర్తించి, చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అనుమతి ఎలా ఇచ్చారో.. ఏ కంపెనీ ఏర్పాటుకై నా దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ కార్డు తప్పనిసరిగా జత చేయాలి. అందులోని వివరాలను అధికారులు సరి చూసుకున్న తరువాత ఆ కంపెనీ రిజిస్ట్రేషన్కు సంబంధిత అధికారులు అనుమతి ఇస్తారు. ఆవిధమైన పరిశీలన లేకుండానే ఈ కంపెనీలను రిజిస్టర్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతి ఇచ్చే క్రమంలో ఏదో ఒక స్థాయిలో ఎవరో ఒకరి పాత్ర లేకుండా ఈ వ్యవహారం జరగదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కంపెనీ రిజిస్టర్ అయిన తరువాత దాదాపు ఏడాదిన్నరగా లావాదేవీలు జరుపుతున్నా జీఎస్టీ జమ కావడం లేదనే విషయాన్ని ఆలస్యంగా గుర్తించడం కూడా పలు సందేహాలకు తావిస్తోంది. లావాదేవీలపై 18 శాతం వంతున జీఎస్టీ చెల్లించాలి. కేవలం పాత ఇనుము కొనుగోలు, అమ్మకాల్లోనే రూ.కోట్లలో జీఎస్టీ ఎగవేసిన వ్యవహారం వాణిజ్య పన్నుల శాఖకు తలపోటుగా మారింది. మొత్తంగా ఈ అక్రమ వ్యవహారంలో వ్యాపార లావాదేవీలు నిర్వహించి, ఆర్థికంగా లాభపడి, పన్ను ఎగవేసిన వారు అడ్రస్ లేకుండా పోయారు. తమ ప్రమేయం లేకున్నా తమ ఆధార్లతో ఆయా కంపెనీలను ప్రారంభించడంతో ఈ వ్యవహారం ఎక్కడ తమ పీకకు చుట్టుకుంటుందోననే భయంతో అమాయకులైన ఆయా కార్డుదారులు కలత చెందుతున్నారు. ·˘ ¼¯éÒ$ B«§éÆŠ‡ M>Æý‡$zÌS™ø స్క్రాప్ కంపెనీల ఏర్పాటు ·˘ Æý‡*.20 MørÏMýS$ Oò³V> iGïÜt GVýSÐól™èl ·˘ BOò³ A{yýl‹Ü ÌôæMýS$…yé ç³Æ>ÆŠ‡ ·˘ 12 Ð]l$…¨ Ð]l*Ķæ$V>âýæÏ¯]l$ గుర్తించిన వాణిజ్య పన్నుల శాఖ ·˘ ç³Ë$ ´ùÎ‹Ü õÜtçÙ¯]lÏÌZ íœÆ>ŧýl$ -
అమెరికా యుద్ధోన్మాదం నశించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్న అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాదం నశించాలనే ఆకాంక్షతో వామపక్షాల ఆధ్వర్యాన స్థానిక మసీదు సెంటర్లో మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ, వెనెజువెలా అధ్యక్షుడిగా చావేజ్ ఎన్నికై నప్పటి నుంచి ఆ దేశంపై అమెరికా కక్ష కట్టిందన్నారు. చావేజ్ వారసుడిగా అధికారం చేపట్టిన నికోలస్ మధురో కూడా అమెరికా ఆగడాలకు అడ్డుకట్ట వేశారన్నారు. ఇది ఆ దేశానికి కంటగింపుగా మారిందన్నారు. పెద్ద ఎత్తున చమురు నిక్షేపాలున్న వెనెజువెలాను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి అమెరికన్ కార్పొరేట్ ఆయిల్ కంపెనీల ఒత్తిడితో ట్రంప్ మధురోను చెరబట్టారని ఆరోపించారు. గతంలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ను, లిబియా అధ్యక్షుడు అమెరికన్ సామ్రాజ్యవాదం హతమార్చిందని విమర్శించారు. తాజాగా ఈ నెల 3న వెనెజువెలా దేశాధ్యక్షుడు మధురోతో పాటు ఆయన భార్యను కూడా అమెరికా కిడ్నాప్ చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచానికి నీతులు చెప్పే అమెరికా.. అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘిస్తోందన్నారు. భారత ప్రధాని మోదీ కూడా తనను సంతోషపరచాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని మండిపడ్డారు. ట్రంప్ వ్యాఖ్యలకు భారత్ దీటుగా సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధురో దంపతులను వెంటనే విడుదల చేయాలని, ప్రపంచ దేశాలతో భారత ప్రభుత్వం గొంతు కలపాలని కోరారు. ప్రజలందరూ అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదాన్ని ఖండించాలని, ప్రపంచ శాంతి కోసం నిలబడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా నాయకుడు సీహెచ్ నాగేశ్వరరావు, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో మరో బస్సు ప్రమాదం
సాక్షి, తూర్పుగోదావరి: కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జి వద్ద ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఖమ్మం నుంచి వైజాగ్ వెళ్తున్న ఆర్ఆర్ఆర్ ట్రావెల్ బస్సుగా గుర్తించారు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూటే కారణమని డ్రైవర్ తెలిపాడు. సుమారు అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఘటన జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు. -
అనపర్తిలో తిరుమల ఎక్స్ప్రెస్ నిలిపివేత
సాక్షి, తూర్పుగోదావరి: అనపర్తి వద్ద తిరుమల ఎక్స్ప్రెస్ నిలిపివేశారు. విశాఖపట్నం నుంచి కడప వెళ్లే తిరుమల ఎక్స్ ప్రెస్ (18521) బోగీ కింద పొగలు రావడంతో ట్రైన్ను అధికారుల నిలివేశారు. బ్రేకులు ఫెయిల్ కావడంతో పొగలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. తాత్కాలికంగా రిపేర్ చేసి ట్రైన్ను రాజమండ్రికి తరలించారు. -
మరో వారం పాటు బ్లో అవుట్: కలెక్టర్
సాక్షి, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: ఇరుసుమండలో మరో వారం పాటు బ్లో అవుట్ కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి, ప్రాణం నష్టం జరగలేదన్నారు. ధ్వంసమైన కొబ్బరి చెట్లకు, దెబ్బతిన్న పంటలకు సమీపంలో పంట పొలాలకు పరిహారం చెల్లిస్తామన్నారు. బ్లో అవుట్ ఒకేసారి కాకుండా క్రీమేపి తగ్గించే ప్రయత్నం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.ఐదు వైపులా పైపులతో వాటర్ అంబ్రెల్లా కొనసాగుతుంది. పూర్తిస్థాయిలో బ్లోట్ అదుపులోకి రావడానికి వారం రోజులు పడుతుందన్నారు. టెక్నాలజీ అండ్ ఫీల్డ్ సర్వీసెస్ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా మాట్లాడుతూ.. బ్లో అవుట్ సంభవించిన మోరి- 5 వెల్ను డీప్ ఇండస్ట్రీకి 15 ఏళ్లకు లీజుకి ఇచ్చామని తెలిపారు. బ్లో అవుట్ వల్ల ఎటువంటి సమస్య తలెత్తదన్నారు. -
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026
పచ్చని కోనసీమ మరోసారి అంటుకుంది. చమురు సంస్థలు పెడుతున్న చిచ్చు రాజుకుంటూనే ఉంది. ఓఎన్జీసీ డ్రిల్లింగ్లు, చమురు, సహజవాయువుల వెలికితీత, గ్యాస్ పైప్ లైన్లు, ఇతర చమురు సంస్థల కార్యకలాపాలతో గడచిన మూడు దశాబ్దాలుగా కోనసీమ మందుపాతరగా మారిపోయింది. ఎప్పుడు ఏ క్షణాన, ఏ మూలన గ్యాస్ లీకేజీలు.. బ్లో అవుట్లు చోటు చేసుకుంటాయో తెలియక ఈ ప్రాంతవాసులు మందుపాతరల మీద జీవిస్తూ నిత్యం భయం భయంగా బతుకుతున్నారు. సాక్షి, అమలాపురం/ మలికిపురం/ అమలాపురం టౌన్/ అంబాజీపేట: కోనసీమ పచ్చదనంపై వరుస బ్లో అవుట్లు పగబట్టాయి. కోనసీమ గుండెలపై బ్లో అవుట్లు కుంపట్లు అవుతున్నాయి. చమురు సంస్థలకు చెందిన రిగ్ల లోంచి అప్పుడప్పుడూ బ్లో అవుట్లు అనివార్యమై మంటలు, సెగలు, పొగలు కక్కుతున్నాయి. భరించలేని శబ్దాలతో కోనసీమ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బ్లో అవుట్లతో భద్రత లేని కారణాలపై చమురు సంస్థల మీద ముఖ్యంగా ఓఎన్జీసీపై ఈ ప్రాంత ప్రజలు, ప్రజా ప్రతినిధులు తర చూ ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నా ఆ సంస్థలకు కనువిప్పు కావడం లేదు. స్పందన మచ్చుకై నా కనిపించడం లేదు. తాజాగా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో సోమవారం సంభవించిన బ్లో అవుట్ నుంచి గతంలోకి ఓసారి తొంగి చూస్తే అనేక చేదు అనుభవాలు, చేదు జ్ఞాపకాలు కళ్ల ముందు కదలాడుతాయి. ఒక్కొక్క బ్లో అవుట్ కథను వింటే నాడు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు గుర్తుకు వస్తాయి. ● 1995 జనవరి 8న అల్లవరం మండలం దేవరలంక (పాశర్లపూడి) గ్రామంలో సంభవించిన బ్లోఅవుట్ అతి పెద్దది. మార్చి 15వ తేదీ వరకు ఇది కొనసాగింది. ప్రాణనష్టం లేకపోయినప్పటికీ ఆస్తి నష్టం ఎక్కువే. ఈ బ్లో అవుట్తో 65 రోజులపాటు సుమారు 30 నుంచి 60 అడుగుల ఎత్తులో మంటలు నిరంతరాయంగా మండాయి. దాదాపు పది కిలోమీటర్ల మేర ఆ పెనుమంటల వెలుగు విరజిమ్మింది. సుమారు 15 కిలోమీటర్ల మేర పెను శబ్దం ప్రజల చెవులను గింగిర్లు ఎత్తించాయి. విపరీత శబ్దానికి, పేలుడు ధాటికి దేవరలంక, గోపాయలంక తదితర గ్రామాల్లో పలు ఇళ్ల గోడలు బీటలు వారాయి. ఇదీ విస్ఫోటాల చరిత్ర ● 1997 ఫిబ్రవరి 19న రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో బ్లో అవుట్ జరిగింది. ● 2006 సెప్టెంబర్ 19న అమలాపురం రూరల్ మండ లం తాండపల్లిలో మరో బ్లో అవుట్ సంభవించింది. ● 2014 జూన్ 27న మామిడికుదురు మండలం నగరంలో గెయిల్కు చెందిన గ్యాస్ పైపులైన్ల బ్లాస్ట్ ( విస్ఫోటం) అయ్యాయి. ఆ రోజు తెలతెలవారుతుండగా అనేక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ప్రమాదంలో 22 మంది మృత్యువాత పడ్డారు. కోనసీమ చరిత్రలో చమురు సంస్థల ప్రమాదాలలో ఇది అత్యంత విషాదకరమైనది. తీవ్రమైనది. ● 1992లో మామిడికుదురు మండలం కొమరాడలో బ్లో అవుట్ సంభవించింది. ● 2020 ఫిబ్రవరి 2న కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో బ్లో అవుట్ జరిగింది. ప్రాణాలు అరచేత పట్టుకొని పొరుగు ఊళ్లకు.. బ్లో అవుట్ జరిగిన ప్రతిసారీ ఆ పరిసర గ్రామాల ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీయడం, తమ ఇళ్లకు తాళాలు వేసి పొరుగు ఊళ్లు వెళ్లిపోవడం సాధారణమైపోయింది. పొరుగు ఊళ్లు వెళ్లి తలదాచుకుంటున్నారు. బ్లో అవుట్లు జరిగిన గ్రామాల్లో ప్రజలు తమ ఇంట్లో పొయ్యిలు వెలిగించకుండా పస్తులు ఉండటం సాధారణమైపోయింది. ఎందుకంటే అప్పటికే బ్లో అవుట్ వల్ల గ్రామం అంతటా గ్యాస్ గాలిలో కలిసిపోయి ఉంటుంది. ఆ సమయంలో ఏ చిన్న నిప్పు ముట్టించినా ఘోర ప్రమాదం జరుగుతుంది. అందుకే అగ్గిపుల్ల వెలిగించేందుకు కూడా భయపడిపోతారు. చేష్టలుడిగి చూస్తున్న చమురు సంస్థలు ప్రమాదం జరిగిన వెంటనే తేరుకుని నివారణా చర్యలు చేపట్టడంలో ఓఎన్జీసీ, గెయిల్, ఇతర ప్రైవేట్ సంస్థలు అనుసరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. వెంటనే స్పందించడంలో ఆ సంస్థ సంక్షోభ నివారణ జట్టు వచ్చే వరకు స్థానిక సిబ్బంది కళ్లప్పగించి చూడాల్సి వస్తోంది. ప్రమాదాలు ఎదుర్కొనే సామగ్రి, ఇతర వస్తువులు వారికి అందుబాటులో ఉండడం లేదు. కోనసీమ నుంచి కోట్లాది రూపాయలు తరలించుకుపోతున్న చమురు సంస్థలు అంతర్జాతీయంగా సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా అందిపుచ్చుకోవడం లేదు. కనీసం ప్రమాదాల నుంచి అనుభవాలు కూడా నేర్చుకోకపోవడంపై ఈ ప్రాంత వాసుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్లో అవుట్ అదుపునకు విదేశీ, స్వదేశీ నిపుణులు బ్లో అవుట్ను అదుపు చేసేందుకు విదేశీ, స్వదేశీ నిపుణులు రావలసి ఉందని అధికారులు అంటున్నారు. ఇతర దేశాలతో పాటు ముంబయి, గుజరాత్ నుంచి ప్రత్యేక బృందాలను రప్పించేందుకు ఓన్ఎన్జీసీ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. యంత్రాలు, రసాయనాలు, ఆధునిక సాంకేతిక పరికరాలు కూడా విదేశాల నుంచి రావలసి ఉంది. రాజమహేంద్రవరం. తూర్పుపాలెంకు చెందిన క్రైసిస్ మేనేజ్మెంట్ బృందాలు ప్రమాద స్థలానికి మంగళవారం చేరుకుంటాయని ఓన్ఎన్జీసీ అధికారులు తెలిపారు. ఇప్పటికే మంటలు ఆర్పే కొన్ని యంత్రాలు అక్కడకు చేరుకున్నాయి. ఇరుసుమండ గ్రామంలోని కొంతమంది రాత్రి సమయంలో ఇళ్లకు చేరుకున్నారు. గ్యాస్ మండిపోవడంతో పెద్దగా ప్రమాదం ఉండదని భావించి గ్రామస్తులను పోలీసులు, అధికారులు, ఇళ్లలోకి అనుమతిస్తున్నారు. డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ రిగ్ వద్ద ఎగసి పడుతున్న మంటలు సీమ గుండెల్లో చిచ్చుసాక్షి, అమలాపురం/ మలికిపురం/ అంబాజీపేట: మొన్న దేవరపల్లి... నిన్న నగరం.. నేడు ఇరుసుమండ. కోనసీమలో ప్రాంతాలు మారుతున్నాయి కాని.. చమురు సంస్థలు చేస్తున్న విధ్వంసం మారడం లేదు. ఈ ప్రాంతం నుంచి కోట్ల రూపాయల చమురు, సహజ వాయువు కొల్లగొట్టుకుపోతున్నా స్థానిక అభివృద్ధి.. ప్రజలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. చమురు సంస్థల కార్యకలాపాల వల్ల జరుగుతున్న బ్లో అవుట్లు.. గ్యాస్ లీకేజుల వల్ల ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందో తెలియని దుర్భర పరిస్థితులలో కోనసీమ జిల్లా ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు. ముఖ్యంగా రాజోలు, పి.గన్నవరం కొత్తపేట, అమలాపురం నియోజకవర్గాల ప్రజలు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. గతం నుంచీ ఇలా లీకేజీలు, బ్లో అవుట్ల ఘటనలు జరగడం వల్ల వీటితో సహజ జీవనం తప్పదని వారు మానసికంగా సిద్ధపడిపోయారు. అలా భయపడినట్లే తాజాగా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో సోమవారం సంభవించిన భారీ బ్లో అవుట్తో ఈ ప్రాంతాల ప్రజలు భీతావహులయ్యారు. ఉదయం 11 గంటలకు ఇంటి పెద్దలు ఎవరి పనులకు వారు వెళ్లిపోయిన తరువాత సంభవించిన ఘటనతో ప్రజలు షాక్ తిన్నారు. భారీ శబ్దాలు, విస్తరించిన తెల్లని పొగ ఉదయం పదకొండు గంటల సమయంలో సిబ్బంది డ్రిల్లింగ్ చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ ఎగదన్నుకు వచ్చింది. సిబ్బంది దీనిని అదుపు చేసేందుకు చేసిన యత్నాలు విఫలం కావడం, రానురానూ గ్యాస్ తీవ్ర పీడనంతో బయటకు ఎగదన్నడంతో వారు రిగ్ను వదిలి కేకలు వేసుకుంటూ ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో రిగ్ వద్ద పదిమంది వరకు సిబ్బంది ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్యాస్ ఎగదన్నుకు వస్తూనే ఉంది. ఈ సమయంలో భారీ శబ్దాలు రావడం, గ్యాస్ తెల్లని పొగలా చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడం చూసి సమీప గ్రామాల వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. వృద్ధులు, చిన్న పిల్లలను చంకన వేసుకుని తల్లిదండ్రులు పరుగులు పెట్టారు. డ్రిల్ సైటుకు సమీపంలో నాట్లు వేస్తున్న కూలీలు పేలుడు ధాటికి పొలాల్లో పడిపోయారు. స్థానిక రైతులు తమ పాడి పశువులను దూర ప్రాంతాలకు తరలించారు. వెంటనే లేని అక్కడి నుంచి పరుగు అందుకున్నారు. రెండు గంటల పాటు గ్యాస్ ఎగజిమ్ముతున్న సమయంలో రెవెన్యూ, పంచాయతీ, పోలీసులు చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశారు. ఇరుసుమండతోపాటు లక్కవరం గ్రామస్తులను ఖాళీ చేయించారు. స్థానికులను విద్యుత్ వినియోగించవద్దని, నిప్పు రాజేయవద్దని మైకులతో ప్రచారం చేశారు. రెండు గంటల తరువాత మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక్కసారిగా మంటలు రాజుకుని భారీ పేలుడు సంభవించింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో వీరిని కట్టడి చేయడం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. అర్ధరాత్రి వరకు మంటలు అదుపులోకి రాలేదు. రాత్రి ఆరు గంటల సమయంలో రాజమహేంద్రవరం నుంచి వచ్చిన సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే మంటలను ఎప్పుడు అదుపులోకి తీసుకువస్తారనే దానిపై ఓఎన్జీసీ వర్గాలు, డ్రిల్లింగ్ చేస్తున్న కంపెనీ ప్రతినిధులు తేల్చిచెప్పలేకపోతున్నారు. అయితే పగటిపూట ప్రమాదం జరగడం వల్ల ప్రాణనష్టం లేదని స్థానికులు కొంత వరకు ఊరట చెందుతున్నారు. ఇళ్లు వదిలి రోడ్డుపైకి వచ్చిన లక్కవరం గ్రామస్తులు8 కోనసీమలో నిత్యకృత్యంగా మారిన ప్రమాదాలు తరచు బ్లో అవుట్లు.. గ్యాస్ లీకేజ్లు మందుపాతరల మీద జన జీవనం ప్రమాదం జరిగితే చేష్టలుడిగి చూస్తున్న చమురు సంస్థలు -
● అలా.. హిమదారిలో..
● మాయాసీత్రంభోగి పండగ అంటే పిల్లలకు సందడే.. ఆ మంటలను చూసి వారికి సంబరమే.. అందుకే చిన్నారులు ఇప్పటి నుంచే భోగి మంటలకు దుంగలను సిద్ధం చేస్తూ, భోగి పిడకలు తయారు చేస్తూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం పల్లెల్లో ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యలే కనిపిస్తున్నారు. పెదపట్నంలంకలో చిన్నారులు ఇలా దుంగలను సేకరిస్తున్నారు. – మామిడికుదురు పచ్చని పొలాలు, పచ్చిక బయళ్లను పాల సముద్రం ముంచెత్తిందా అనేట్టు కనిపిస్తున్న ఈ చిత్రం కనువిందు చేస్తోంది. గొల్లపాలెంలో తెల్లవారే సమయంలో మంచు తెరలు ఇలా మాయ చేస్తున్నాయి. ఇళ్లు, పొలాలను సముద్రం ముంచెత్తినట్లు కనిపిస్తున్న ఈ దృశ్యం హిమసోయగమే. – కాజులూరు పోలవరం జిల్లా మన్యం మంచు దుప్పటిలో ఒదిగిపోతోంది.. ఓ వైపు చలి, మరోవైపు ఉదయం 9 గంటల వరకూ దట్టమైన పొగ మంచు కమ్మేస్తోంది. రాజవొమ్మంగిలో ఆది, సోమవారాల్లో 9 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి పూట కూడా ఇలా లైట్లు వేసుకుని వాహనదారులు వెళ్లాల్సి వస్తోంది. – రాజవొమ్మంగి పెదపట్నంలంకలో భోగి మంటలకు దుంగలను సిద్ధం చేస్తున్న చిన్నారులు -
రాష్ట్ర స్థాయి సైకిల్ పోలోలో తృతీయ స్థానం
తుని రూరల్: సైకిల్ పోలో సబ్ జూనియర్ పోటీల్లో వి.కొత్తూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల విద్యార్థినులు తృతీయ స్థానం సాధించారు. ప్రిన్సిపాల్ డి.ప్రసన్నరాణి ఈ విషయం తెలిపారు. ఈ నెల 3, 4 తేదీల్లో వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మేథ డిఫెన్స్ అకాడమీలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ పోటీలు జరిగాయన్నారు. ఈ పోటీల్లో తమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఎం.చరిష్మా, జి.ధనుశ్రీ, జె.సుచిత్ర, ఆర్.భవిత, జి.సుస్మిత, పి.హర్షిణి, ఎం.నవ్య, పి.స్వరూప తృతీయ స్థానాన్ని కై వసం చేసుకున్నారని వివరించారు. వీరిలో పి.స్వరూప విశేష ప్రతిభ చూపడంతోజాతీయ స్థాయి సైకిల్ పోలో పోటీలకు ఎంపికై ందన్నారు. స్వరూప జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు. విద్యాలయంలో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ ఆర్.జయలక్ష్మి, పీఈటీ జి.సుజాత, బాలికలను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అభినందించారు. సనాతన ధర్మ పరమ భక్తులు ఏమయ్యారు? కాకినాడ రూరల్: చంద్రబాబు సర్కార్లో హిందూ ఆలయాలపై అరాచాలు జరుగుతుంటే రాష్ట్రంలో సనాతన ధర్మ పరిరక్షకులుగా ప్రచారం చేసుకున్న పరమ భక్తులు ఏమయ్యారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ప్రశ్నించారు. హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై సోమవారం ఆమె మండిపడ్డారు. గత ఏడాది ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురి మృతితో ప్రారంభమైన అరాచకం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని విమర్శించారు. సింహాచలం దేవస్థానం ప్రసాదంలో నత్త కనిపించిందని చెప్పిన వారిపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్వేది రథం ఘటన నుంచి పవిత్ర తిరుమల ప్రసాదం వరకూ రాజకీయం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. తిరుమల ప్రసాదంపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చే వరకూ జగన్ను ఆడిపోసుకున్నారని ధ్వజమెత్తారు. ద్రాక్షారామలో శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటనను ఆమె గుర్తు చేశారు. సనాతన ధర్మమంటూ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ మెట్లు కడిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడెక్కడున్నారో అర్థం కావడం లేదన్నారు. పక్క రాష్ట్రంలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి చొరవ చూపిన ఆయన.. మన రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న అరాచకంపై దృష్టి సారించాలని సూచించారు. ఇన్ని అకృత్యాలు జరుగుతున్నా హిందూ ధర్మంపై మాట్లాడే బీజేపీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. అమరావతి విషయంలో చంద్రబాబు హడావుడి చేస్తున్నారని, వధూవరులకు అరుంధతి నక్షత్రం చూపించినట్టుగానే.. రాష్ట్రంలో అమరావతిని చూపిస్తున్నారని నాగమణి విమర్శించారు. పీజీఆర్ఎస్కు 441 అర్జీలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 441 అర్జీలు సమర్పించారు. వారి నుంచి ఇన్చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్తో పాటు వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. బియ్యం కార్డుల మంజూరు, ఇళ్ల స్థలాలు, ఆన్లైన్లో భూమి వివరాల నమోదు, పూడికల తొలగింపు, పారిశుధ్యం, వివిధ సంక్షేమ పథకాల లబ్ధి వంటి అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ఈ అర్జీలను గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు. సంక్రాంతికి ప్రత్యేక బస్సులు రాజమహేంద్రవరం సిటీ: సంక్రాంతికి తెలంగాణ నుంచి తూర్పు గోదావరి జిల్లాకు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుపుతు న్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వైఎస్ఎన్ మూర్తి సోమవారం ప్రకటించారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకూ హైదరాబాద్ నుంచి 31 స్పెషల్ బస్సులు నడుపుతున్నామన్నారు. జిల్లా నుంచి 36 షెడ్యూల్ బస్సులతో పాటు రాజమహేంద్రవరం డిపో నుంచి 7, కొవ్వూరు డిపో 2, నిడదవోలు డిపో నుంచి 1 చొప్పున స్పెషల్ బస్సులు నడుపుతున్నామన్నారు. -
వక్క సాగు రైతులకు లాభసాటి
కపిలేశ్వరపురం (మండపేట): వక్క సాగు చేయడం ద్వారా రైతులు లాభాలను ఆర్జించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, దీనికోసం రైతులు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడాలని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి చిరంజీవ్ చౌదరి అన్నారు. మండపేట మండలం వేములపల్లిలోని భవానీ గార్డెన్స్లో సోమవారం శ్రీప్రకాష్ ఆయుష్ చారిటబుల్ అండ్ రీసెర్చ్ ట్రస్టు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వక్క రైతుల సదస్సు నిర్వహించారు. స్థానికంగా వక్క సాగుకు ఉన్న సానుకూల అంశాలను రైతులకు వివరించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది రైతులు హాజరయ్యి తమ అనుభవాలను వెల్లడించారు. స్థానిక పంటలను పరిశీలించారు. సీపీసీఆర్ఐ పూర్వ డైరెక్టర్ డాక్టర్ పి.చౌడప్ప మాట్లాడుతూ వక్క వాడటం ద్వారా క్యాన్సర్ వస్తుందన్నది కేవలం అపోహ మాత్రమే అన్నారు. ఆదర్శ రైతు చిలుకూరి దొరయ్య చౌదరి సేద్య ప్రస్థానంపై రాసిన సృజనాత్మక రైతు పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. -
అణువణువూ జల్లెడ
కోరింగ అభయారణ్యంలో పక్షుల గణన తాళ్లరేవు: కోరింగ అభయారణ్యంలో పక్షుల లెక్క తేల్చేందుకు ప్రత్యేక బృంద సభ్యులు శ్రమించారు. ప్రత్యేక కెమెరాలతో అభయారణ్యం, సముద్ర తీర ప్రాంతంలో అణువణువూ జల్లెడ పట్టారు. ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సెస్– 2026లో భాగంగా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన 12 బృందాల సభ్యులు ఇందులో పాల్గొని పక్షుల సంఖ్యను లెక్కించారు. పర్యావరణంలోని ప్రస్తుత పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వలస పక్షుల సంఖ్యను లెక్కించేందుకు ప్రభుత్వం ఏటా జనవరిలో పక్షుల గణన చేపడుతోంది. దీనికోసం ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ నేతృత్వంలో సుమారు 100 మందితో కూడిన బృందానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అటవీ సిబ్బందితో పాటు ఒక వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్, ఒక సైంటిస్ట్, ఒక స్టూడెంట్తో పాటు ఒక వలంటీర్ ఈ లెక్కింపులో పాల్గొన్నారు. సోమవారం తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి ప్రత్యేక కెమెరాలతో కోరింగ మడ అటవీ ప్రాంతం, సముద్ర తీర ప్రాంతంలో సంచరించే వివిధ రకాల పక్షులు, దూర ప్రాంతాల నుంచి వలస వచ్చే పక్షులను లెక్కించారు. నేషనల్ బయో డైవర్సిటీ అథారిటీ, సీనియర్ సైంటిస్ట్లు, బీఎన్హెచ్ఎస్ ప్రతినిధుల నేతృత్వంలో ఈ లెక్కింపు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కోరంగి బయో డైవర్సటీ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పక్షి గణనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ వరప్రసాద్, సత్య సెల్వం చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. అన్నీ పరిశీలించిన తరువాత పక్షుల సంఖ్యను ప్రకటించనున్నట్లు వరప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో అటవీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
నేటి నుంచి యానాం ప్రజా ఉత్సవాలు
● ఫల, పుష్ప ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి ● అలరించనున్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజా ఉత్సవాలకు సిద్ధమవుతున్న ప్రధాన వేదిక యానాంలో విద్యుత్ కాంతులతో సిద్ధమైన ఫల, పుష్ప ప్రదర్శన ముఖద్వారం యానాం: పుదుచ్చేరి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 22వ యానాం ప్రజా ఉత్సవాలు మంగళవారం నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. స్థానిక డాక్టర్ వైఎస్సార్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం వద్ద బాలయోగి క్రీడా ప్రాంగణంలో ఈ నెల 8 వరకు మూడు రోజుల పాటు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పర్యవేక్షణలో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్అశోక్ అధ్యక్షతన జరగనున్న ప్రజా ఉత్సవాలతో పాటు 9 వరకూ ఫల, పుష్ప ప్రదర్శనను సైతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె.కై లాషనాథన్ ప్రారంభించనున్నారు. అదేవిధంగా స్పీకర్ సెల్వం, వ్యవసాయ మంత్రి సీడీజే కౌమార్, డిప్యూటీ స్పీకర్ రాజవేలు తదితరులు వస్తుండగా, ముగింపు వేడుకలకు పుదుచ్చేరి సీఎం రంగసామి, పర్యాటక మంత్రి కె.లక్ష్మీనారాయణన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శరత్చౌహాన్, కలెక్టర్ కులోఽథుంగన్, కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ తదితరులు హాజరవుతారు. కార్యక్రమాలు ఇలా.. మంగళవారం జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా ఒడిశా కళాకారులచే ప్రత్యేక ప్రదర్శన, విశాఖ కళాకారులచే ఎల్ఈడీ లేజర్ మేస్ యాక్ట్, బిగ్బాస్ ఫేమ్ రాము రాథోడ్చే జానపద గీతాలు, విశాఖ డీజే టిల్లు టీమ్ కార్యక్రమాలు, మధ్యప్రదేశ్ కళాకారులచే విజయేంద్ర ప్రత్యేక ప్రదర్శన ఉంటాయి. 7న కోల్కతా, పీఆర్ ఈవెంట్స్ ఫ్యాషన్ షో, పాశ్చాత్య నృత్య ప్రదర్శన, రష్యన్ కళాకారుల ప్రదర్శన, కోల్కతా కళాకారులచే గారడీ ప్రదర్శన, యానాం కళాకారుల తెలుగు సంప్రదాయ కళల ప్రదర్శన, 8న శాంతకుమార్ మిమిక్రీ, రింగ్ రిబ్బన్ డ్యాన్స్, సినీ ఆర్కెస్ట్రా, స్కైల్యాంట్రన్ నిర్వహించనున్నారు. ఆర్ఏఓ అంకిత్కుమార్, వ్యవసాయశాఖ డీడీ సీహెచ్ జోగిరాజు వివరాలను వెల్లడించారు. ఉత్సవాలకు ముస్తాబు ప్రజా ఉత్సవాలు, ఫల, పుష్ప ప్రదర్శనకు బాలయోగి మైదానం ముస్తాబయ్యింది. ఇప్పటికే వేదిక, ముఖద్వారాలు సిద్ధమయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి పలువురు కళాకారులు చేరుకున్నారు. పోలీసులు సైతం విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మల్లాడి కృష్ణారావు పిలుపునిచ్చారు. -
ప్రతి కుటుంబానికీఉపాధి కల్పించాలి
రంపచోడవరం: జిల్లాలో వికసిత్ భారత్–రోజ్గార్, అజీవికా మిషన్ ద్వారా జాబ్ కార్డులున్న ప్రతి కుటుంబానికీ 125 రోజుల పనిదినాలు కల్పించాలని పోలవరం జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ సమావేశ భవనంలో కొత్త చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 125 రోజుల ఉపాధి పనులు కల్పించే విధంగా అవగాహన పోస్టర్ను కలెక్టర్, జేసీ శ్రీపూజతిరుమణి, పీఓ స్మరణ్రాజ్, సబ్ కలెక్టర్ సాహిత్, ఎస్టీ కమిషన్ సభ్యులు గొర్లె సునీత, పీడీ విద్యాసాగర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వంద రోజుల నుంచి 125 రోజులకు పెంచిన ఉపాధి పనులకు సంబంధించిన వివరాలపై ప్రతి కుటుంబానికి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయా గ్రామాల్లో తీర్మానాలు చేసుకుని నివేదికలు సమర్పిస్తే పరిశీలించి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీడీ తూతిక శ్రీనివాస్విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారులపై చా..ర్్జ
● ‘పురోహితుని చేతివాటం’పై సీరియస్ ● 8 మంది సిబ్బందికి చార్జి మెమోలు ● అన్నవరం దేవస్థానం ఈఓ ఆదేశాలుఅన్నవరం: వ్రత పురోహితుల పారితోషికం బిల్లుల్లో 17 నెలలుగా చేతివాటం చూపుతూ ఓ పురోహితుడు రూ.28.54 లక్షలు దారి మళ్లించిన వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆ పురోహితుడు ఆ మొత్తాన్ని తిరిగి జమ చేసినప్పటికీ ఆ 17 నెలల్లో ఆ విభాగంలో పని చేసిన సిబ్బంది పర్యవేక్షణ లోపం వల్లనే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని అన్నవరం దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు భావించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఎనిమిది మంది దేవస్థానం సిబ్బందికి సోమవారం చార్జి మెమోలు జారీ చేశారు. వీరిలో ఆ కాలంలో వ్రత విభాగం వ్యవహారాలను పర్యవేక్షించిన విశ్రాంత అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ రామ్మోహనరావు, ఏఈఓలు పాలంకి జగ్గారావు, ఎల్.శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు కంచి సత్యనారాయణమూర్తి, కోటమర్తి సతీష్, పెండ్యాల భాస్కర్, ప్రస్తుత సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, సీనియర్ అసిస్టెంట్ వెలగా రమేష్ ఉన్నారు. పారితోషికం పక్కదారి పట్టిన వ్యవహారంపై వీరందరూ 14 రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ఈఓ ఆదేశించారు. పదేళ్ల వ్యవహారాలపై తనిఖీలు మరోవైపు ఈఓ ఆదేశాల మేరకు గత పదేళ్లుగా వ్రత విభాగంలో పురోహితుల పారితోషికం, ఇతర బిల్లుల్లో కూడా ఏమైనా చేతివాటం చూపారా అనే అంశంపై కూడా తనిఖీ ప్రారంభించారు. అలాగే, వ్రత విభాగానికి తమలపాకులు, వక్కలు, గావంచాలు, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం తదితర వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు జారీ చేసిన చెక్కులను కూడా పరిశీలిస్తున్నారు. ఆ చెక్కు మొత్తం నేరుగా వారికే వెళ్లిందా, అంతే మొత్తం డ్రా చేశారా లేక ఎక్కువ డ్రా అయ్యిందా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. దేవస్థానం చెక్కుల చెల్లింపులు కఠినతరం చేతివాటం వ్యవహారానికి సంబంధించి తమపై కూడా విమర్శలు రావడంతో స్టేట్ బ్యాంక్ అధికారులు దేవస్థానం చెక్కులపై చెల్లింపులను కఠినతరం చేశారు. ఇప్పటి వరకూ ఈఓ ఇచ్చే చెక్కు మొత్తం సిబ్బంది వేతనాలు, పురోహితుల పారితోషికానికి సరిపోతే వెంటనే చెల్లించేవారు. అయితే, పురోహితుల హార్డ్ కాపీ జాబితాకు, ఆన్లైన్లో వచ్చిన జాబితాకు తేడా ఉందన్న విషయం వీరికి మూడు నెలల క్రితం వరకూ తెలియదు. పురోహితులు లోన్ కోసం వెళ్లిన సందర్భంలో కంప్యూటర్లో జాబితాను పరిశీలించే క్రమంలో ఈ వ్యవహారం బట్టబయలైంది. దీనిపై లోతుగా పరిశీలిస్తే గతంలో కూడా ఇలా జరిగినట్లు వెల్లడైంది. అప్పటి నుంచీ ప్రింట్ జాబితా, ఆన్లైన్లో వచ్చిన జాబితాను పరిశీలించాకనే పారితోషికాలు చెల్లిస్తున్నామని బ్యాంకు అధికారులు తెలిపారు. అలాగే, సిబ్బంది జీతాల జాబితాను కూడా మూడు రోజులు పరిశీలించాక మాత్రమే చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు. ఇతర అధికారుల సంతకాలతో.. దేవస్థానం చెక్కు మీద ఈఓ సంతకం మాత్రమే ఉంటుంది. ఆ సంతకం స్పెసిమెన్ సిగ్నేచర్ బ్యాంకు వద్ద కూడా ఉంటుంది కనుక దీనిని బ్యాంకు సిబ్బంది వెరిఫై చేయగలుగుతున్నారు. అయితే, ఆ చెక్కుతో వచ్చే ఓచర్ మీద ఈఓ సంతకం ఉండదు. సూపరింటెండెంట్ సంతకం ఉంటుంది. అది ఒరిజనలో కాదో తమకు తెలిసే అవకాశం లేదని, అయినప్పటికీ పదేళ్లుగా చెక్కులకు చెల్లింపులు చేస్తున్నామని బ్యాంకు అధికారులు చెప్పారు. అలాగే, సిబ్బంది జీతాలు, పురోహితుల పారితోషికం జాబితాలు కూడా దేవస్థానం అధికారిక మెయిల్ నుంచి కాకుండా సిబ్బంది పర్సనల్ మెయిల్ నుంచి బ్యాంకుకు వస్తున్నాయి. పదేళ్లుగా ఇలాగే జరుగుతోంది. దీనిపై బ్యాంకు అధికారులు మొదట అభ్యంతరం చెప్పారు. అయితే, దేవస్థానం సిబ్బంది ఫర్వాలేదని చెప్పడంతో అంగీకరించి చెల్లింపులు జరిపారు. అయితే ఇప్పటి వరకూ దీనిపై ఎటువంటి ఫిర్యాదులూ రాలేదు. ఇటీవల జరిగిన ‘చేతివాటం’ వ్యవహారంతో దేవస్థానం చెక్కులను ఒకటికి పదిసార్లు పరిశీలించిన తరువాతే చెల్లింపులు చేస్తున్నామని బ్యాంకు అధికారులు చెప్పారు. ఓచర్లపై కూడా ఈఓ సంతకం ఉంటే ఇబ్బంది ఉండదని వారంటున్నారు. -
‘ఉత్తరాయణంలో మరణించిన పాపులకు ఉత్తమ గతులుండవు’
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘ఉత్తరాయనం ప్రశస్తమయిన కాలమే. కానీ, ఉత్తరాయణంలో మరణించిన పాపులకు ఉత్తమ గతులు కలగవు. అలాగే, దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములకు ఉత్తమ గతులు కలుగుతాయి’ అని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో చేస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా సోమవారం ఆయన ద్రోణపర్వంలోని యుద్ధ సన్నివేశాలను వివరించారు. ‘జీవన్ముక్తులకు ఏ అయనమూ అవసరం లేదు. వారు బ్రహ్మంతో తాదాత్మ్యం చెంది ఉంటారు. నిష్కామ కర్మానుష్ఠానపరులు, యోగులు, ఉపాసకులు ఏ యానంలో మరణించినా, దేవయాన మార్గంలో సగుణబ్రహ్మ లోకానికి వెళ్తారు. కామ్యకర్మానుష్ఠానపరులు కోరికతో సత్కర్మలు చేస్తే, ఊర్థ్వ లోకాలకు వెళ్లి, పుణ్యబలం క్షీణించాక, తిరిగి జన్మిస్తారు. ఇక లోకంలో ఎక్కువ సంఖ్యలో ఉండే నిషిద్ధ కర్మానుష్ఠానపరులు అధోలోకాలకు వెళ్తారు’ అని వివరించారు. మనం భారత యుద్ధం జరిగిన సమయంలోనే ప్రవచనం చెప్పుకుంటున్నామన్నారు. దక్షిణాయన సమయంలో మరణించిన అనేకమంది వీరులు దేవ, బ్రహ్మ, వరుణ లోకాలకు వెళ్లడాన్ని ఆశ్రమవాస పర్వంలో వ్యాసుడు వివరించాడని చెప్పారు. అయితే, స్వచ్ఛంద మరణం వరంగా ఉన్న భీష్ముడు ఉత్తరాయనం ప్రశస్తమయిన కాలం కనుక, ఆ సమయం వచ్చే వరకూ నిరీక్షించసాగాడని తెలిపారు. జ్ఞానం, భక్తి, యోగాలు మూడింటినీ తనలో నింపుకొన్నవాడు భీష్ముడని, తాను చేస్తున్నాననే అహంకారం లేని నిస్సంగుడని, అన్నారు. శాంతి, అనుశాసన పర్వాల్లో భీష్ముడు చెప్పిన నీతులు, ధర్మాలు పురాణ వాఙ్మయంలో మరెక్కడా కనపడవని సామవేదం అన్నారు. ‘‘భీష్ముడు శర తల్పం చేరాక, కర్ణుడు సంగ్రామానికి వచ్చాడు. ద్రోణుడు సర్వసైన్యాధిపతి అయ్యాడు. ధర్మరాజును బంధించి తీసుకు రమ్మని ద్రోణుడిని దుర్యోధనుడు కోరాడు. ధర్మరాజును వధించి తీసుకు రమ్మనకుండా, బంధించి తీసుకు రమ్మనడంలో దుర్యోధనుని అంతరంగంలో మంచి భావాలు కలిగాయని భావించరాదు. పాండవుల్లో ఏ ఒక్కరు మిగిలినా పోరు తప్పదు. వారిలో ఎవరూ మిగలకపోయినా, కౌరవులదరినీ కృష్ణుడు బంధించి రాజ్యాన్ని ద్రౌపదికి ధారాదత్తం చేస్తాడు. ధర్మరాజును బంధించి, తిరిగి ద్యూతానికి ఆహ్వానించి, పాండవులందరినీ వనవాసానికి, అజ్ఞాతవాసానికి పంపాలన్నది దుర్యోధనుడి కుటిల భావం. అర్జునుడు సమీపంలో లేకపోతే, ధర్మరాజును బంధించి తీసుకువస్తానని ద్రోణుడు దుర్యోధనునికి మాట ఇస్తాడని సామవేదం అన్నారు. ద్రోణపర్వంలోని యుద్ధ వ్యూహ ప్రతివ్యూహాలను సామవేదం వివరించారు. -
చుట్టుముట్టి.. చేతులతో మెడను బిగించి..
కపిలేశ్వరపురం (మండపేట): మండపేటలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పట్ల పోలీసుల దురుసుగా ప్రవర్తించారు. ప్రజా సమస్యలపై ధర్నా చేసేందుకు బయలుదేరిన ఆయనను పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు. తెల్లవారు జామునే పెద్ద ఎత్తున పోలీసులు మండపేట పట్టణంలో మోహరించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద, బస్టాండ్లోని రిక్షా స్టాండ్ వద్ద, ప్రధాన కూడళ్లలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. సామాన్య ప్రజల సమస్యల పట్ల అధికార పార్టీ నేతలు, వారికి వత్తాసు పలుకుతున్న మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు స్పందిస్తున్న తీరును ప్రశ్నించేందుకు బయలుదేరిన ఎమ్మెల్సీ తోటను పోలీసులు నిర్బంధించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పార్టీ కార్యాలయం వద్ద తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. మండపేట మున్సిపల్ కమిషనర్ అధికార పార్టీ నేతలా వ్యవహరిస్తూ సామాన్యుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ పట్టణ ప్రజలు ఎమ్మెల్సీ తోటకు విన్నవించుకున్నారు. అతి సులువుగా పరిష్కారమయ్యే సమస్యలకు సైతం రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని, విపక్షానికి చెందిన వారిని వేధిస్తున్నారంటూ తమ గోడును ఎమ్మెల్సీ తోటకు తెలిపారు. దీనిపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అనేక సార్లు మున్సిపల్ కమిషనర్కు తన తీరును మార్చుకోవాలని సూచించారు. పరిపాలనా పరమైన నియమ నిబంధనల మేరకే నడుచుకోవాలని చెప్పి చూశారు. అయితే కమిషనర్ తన వైఖరిని మార్చుకోకుండా మరింత పేట్రేగిపోతున్నారంటూ పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ సాధారణ నిధులు రూ.10 లక్షలతో బస్టాండ్ వద్ద రిక్షా కార్మికుల నీడ కోసం రేకుల షెడ్డు నిర్మించారు. ఆ అభిమానంతో కార్మికులు అప్పట్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఫొటోలతో కూడిన రిక్షాస్టాండ్ బోర్డును ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల మున్సిపల్ కమినషర్ రంగారావు తన సిబ్బందితో ఆ బోర్డును తొలగించారు. ఆ స్థానంలో పసుపు పచ్చ రంగుతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఫొటోలతో ఉన్న బోర్డు ఏర్పాటు చేశారు. ఇలా చేయడం కమిషనర్ నియంతృత్వానికి పరాకాష్ట అంటూ సోమవారం ధర్నాకు ఎమ్మెల్సీ తోట పిలుపునిచ్చారు. సంఘీభావంగా నియోజకవర్గంలోని ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రణరంగంగా మార్చిన పోలీసులు ధర్నాలో పాల్గొనేందుకు ఉదయమే ఎమ్మెల్సీ తోట, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, దూలం వెంకన్నబాబు, సీనియర్ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాజుబాబు, కొవ్వూరి త్రినాథరెడ్డి తదితరులు కార్యాలయానికి వచ్చారు. మండపేట పట్టణ, రూరల్ సీఐలు ఐ.సురేష్, పి.దొరరాజు ఆధ్వర్యంలోని పోలీసులు కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఎమ్మెల్సీ త్రిమూర్తులు బయటకు వస్తుండగా గుమ్మం వద్దనే నిలువరించారు. తాను ప్రజాస్వామ్యయుతంగానే ఆందోళన చేస్తున్నానని, సామాన్య ప్రజలు కోసమే వెళ్తున్నానని, రాజకీయ ప్రయోజనాలు ఏమీ లేవని పోలీసులకు ఎమ్మెల్సీ స్పష్టత ఇచ్చారు. అనుమతి లేదన్న కారణంతో పోలీసులు బలగంతో దౌర్జన్యంగా అడ్డుకున్నారు. ప్రజా క్షేత్రానికి వెళ్లడం తన హక్కు, బాధ్యత అంటూ ఎమ్మెల్సీ తోట ముందుకు సాగగా ఆయన్ను చుట్టుముట్టి, చేతులతో మెడను బిగించి బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించేందుకు పోలీసులు ప్రయత్నించారు. పార్టీ శ్రేణులు ముఖ్యంగా మహిళా నాయకులు పోలీసుల చర్యను చైతన్యంతో అడ్డుకున్నారు. డీఎస్పీ రఘువీర్ వచ్చి ఎమ్మెల్సీ తోటతో చర్చలు జరిపారు. సమస్యలు చెప్పేందుకు పరిమిత సంఖ్యలో వస్తానంటే కమిషనర్ వద్దకు తీసుకెళ్తానన్నారు. కమిషనర్ దౌర్జన్యాలకు బలైపోతున్నది నలుగురు కాదని, వేలాది మంది ఉన్నారని, అందరూ మున్సిపల్ కార్యాలయానికి వస్తామని ఎమ్మెల్సీ తోట అన్నారు. పోలీసులుగా ప్రజల తరఫున నిలబడదలచుకుంటే కమిషనర్నే ప్రజలు వద్దకు వచ్చి సమాధానం చెప్పేలా చూడాలని కోరారు. మున్సిపాలిటీకి చెందిన రూ.నాలుగు కోట్ల విలువైన స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలో తాను కాపాడి తిరిగి మున్సిపాలిటీకి అప్పగించానన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే గతంలో ఆక్రమించిన వ్యక్తే మరోసారి కబ్జాచేసి గోడ నిర్మించడం వెనుక కమిషనర్ హస్తం ఉందన్నారు. పట్టణంలో కొంతమందిని లక్ష్యంగా పెట్టుకుని వారి భవనాలను కూల్చేయిస్తున్నారంటూ కమిషనర్ తీరును పోలీసులకు వివరించారు. అలాంటి కమిషనర్కి వ్యతిరేకంగా ప్రజలు ప్రశ్నిస్తామని వెళ్తుండగా ఆపుతామనడం ధర్మం కాదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటో ఉన్న రిక్షాస్టాండ్ బోర్డును అదే స్థలంలో పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తర్జనభర్జనల అనంతరం 20 రోజుల్లో బోర్డును పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. నిర్దేశించిన సమయంలోపు బోర్డు పునరుద్ధరించకపోతే జిల్లా వ్యాప్తంగా ప్రజలు కమిషనర్కు తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్సీ తోట హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ పట్టణ, మండలాల అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్, అడబాల బాబ్జి, గూటం సత్యనారాయణ, వెలగల సత్యనారాయణరెడ్డి, ఎంపీపీలు జుత్తుక వెంకటలక్ష్మి, నౌడు వెంకటరమణ, నియోజకవర్గంలోని నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ తోటను నిలువరిస్తున్న పోలీసులు మండపేటలో వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని చుట్టుముట్టిన పోలీసులు ఎమ్మెల్సీ తోట పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన ధర్నాకు వెళ్తామన్నందుకు దౌర్జన్యం రాజకీయ నేతను తలపిస్తున్న మున్సిపల్ కమిషనర్ మాజీ సీఎం జగన్ ఫ్లెక్సీ ఉన్న బోర్డు తొలగింపు పునరుద్ధరించాలంటూ వైఎస్సార్ సీపీ ఆందోళన -
బిల్లు పెంచి.. నిధులు మళ్లించి..
స్వాహా నిజమే.. ఆ పురోహితుడు వ్రత పారితోషికం పోస్టింగ్లలో అవకతవకలకు పాల్పడి రూ.28,54,397 స్వాహా చేసినట్లు వ్రత విభాగం అధికారులు మూడు రోజుల క్రితం నాకు చెప్పారు. ఆ మొత్తం తిరిగి జమ చేయించామన్నారు. నేను 2022 అక్టోబర్ వరకూ ఈఓగా పని చేశాను. తిరిగి గత నెలలో ఈ బాధ్యతలు స్వీకరించాను. నా హయాంలో ఇటువంటివి జరగలేదు. ఆ పురోహితుడు పదిహేనేళ్లుగా ఇక్కడ పని చేస్తున్నందున గత పదేళ్ల రికార్డులన్నీ తనిఖీ చేయాలని ఆదేశించాను. – వి.త్రినాథరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం ● అన్నవరం దేవస్థానంలో వ్రత పురోహితుని చేతివాటం ● తప్పుడు లెక్కలతో పారితోషికం సొమ్ము స్వాహా ● రూ.28.54 లక్షల దారి మళ్లింపు ● గత నెల 26న సంఘానికి తిరిగి జమ ● ఆ మర్నాడే గుండెపోటుతో ఆకస్మిక మృతి అన్నవరం: రత్నగిరిపై ఓ వ్రత పురోహితుని చేతివాటం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలివీ.. సత్యదేవుని వ్రతాల ఆదాయంలో 40 శాతాన్ని వ్రత పురోహితులకు పారితోషికంగా అన్నవరం దేవస్థానం చెల్లిస్తోంది. రత్నగిరిపై 250 మంది వ్రత పురోహితులు నాలుగు గ్రేడులుగా పని చేస్తున్నారు. వీరిలో స్పెషల్ గ్రేడ్ పురోహితులకు నెలకు రూ.48 వేలు, మొదటి గ్రేడ్ వారికి రూ.45 వేలు, రెండో గ్రేడ్ వారికి రూ.42 వేలు, మూడో గ్రేడ్ వారికి రూ.25 వేల చొప్పున చెల్లిస్తారు. మిగిలిన మొత్తంలో 40 శాతాన్ని పురోహితుల సంక్షేమ నిధికి మినహాయిస్తారు. మిగిలిన 60 శాతం మొత్తాన్ని ఏరియర్స్ రూపంలో ఏడాది చివరన చెల్లిస్తారు. బిల్లు మొత్తం పెంచుతూ.. నెలంతా విధులకు హాజరైతే వ్రత పురోహితులకు పారితోషికంగా సుమారు రూ.96 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఆవిధంగా అందరూ హాజరు కారు. కొంతమంది సెలవు పెడతారు. ఇంకొంతమంది సకాలంలో హాజరు కాకపోవడంతో ఆబ్సెంట్ వేస్తా రు. అటువంటి వారికి పారితోషికం కట్ అవుతుంది. కొంత మందికి రుణ బకాయిలు, పీఎఫ్ మినహాయింపులు ఉంటాయి. దీంతో, ప్రతి నెలా పురోహితులకు రూ.90 లక్షల నుంచి రూ.92 లక్షల వరకూ మాత్రమే పారితోషికం బిల్లు ఉంటుంది. ఈ బిల్లుల తయారీ, సెలవులు, గైర్హాజర్ అయిన వారికి పారితోషికం తగ్గింపు, పీఎఫ్, మెడికల్ అడ్వాన్సులు తదితర వ్యవహారాలను రత్నగిరిపై వ్రత పురోహితుడుగా ఉన్న ఓ వ్యక్తి పదిహేనేళ్లుగా చూసేవారు. ఇదే అవకాశంగా అతడు కొత్త రకం మోసానికి తెర తీశాడు. తొలుత 250 మంది పురోహితుల పేర్లు, గ్రేడ్లు, పారితోషికం వివరాలను ఎక్సెల్ షీట్లో ఎంటర్ చేసేవాడు. ఈ మొత్తం రూ.90 లక్షలుంటే రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకూ కలిపి, గ్రాండ్ టోటల్ వేసేవాడు. ఆయన తయారు చేసిన బిల్లులను పూర్తిగా పరిశీలించకుండానే సంబంధిత గుమస్తా, సూపరింటెండెంట్, ఏఈఓ, డీసీ సంతకాలు చేసి, ఈఓకు పంపించేవారు. ఆ బిల్లులను ఆయన కూడా ఆమోదించి, సంబంధిత మొత్తానికి చెక్కుల మీద సంతకాలు చేసేవారు. ఈ క్రమంలో 250 మంది పారితోషికాల మొత్తానికి, దిగు వ గ్రాండ్ టోటల్కు సరిపోయిందా లేదా అనే విషయాన్ని ఏ ఒక్కరూ పరిశీలించేవారే కాదు. అనంతరం, ఆ ఎక్సెల్ షీట్ను తన జీమెయిల్కు ఆ పురోహితుడు ట్రాన్స్ఫర్ చేయించుకునేవాడు. తనవద్ద ఉన్న కొత్త సాఫ్ట్వేర్ ఉపయోగించి తాను ముందుగా తయారు చేసిన బిల్లు మొత్తానికి సరిపోయేలా కొన్ని కొత్త పేర్లు కలిపి, వాటికి పారితోషికం జమ చేసేవాడు. తన భార్య, అత్తగారి పేరిట కూడా విడిగా బ్యాంకు అకౌంట్లు తెరచి, ఆ వివరాలను తన వద్ద ఉన్న ఎక్సెల్ షీటులో కలిపేవాడు. అలాగే, కొంతమంది పురోహితులకు రెట్టింపు పారితోషికం వేసేవాడు. ఆవిధంగా గ్రాండ్ టోటల్ సరిపోయేలా చేసి, ఈఓ సంతకం చేసిన చెక్కు, తను మార్పు చేసిన పారితోషికం లిస్ట్ను స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచికి పంపించేవారు. బ్యాంక్ అధికారులు కూడా చెక్కు మొత్తం గ్రాండ్ టోటల్కు సరిపోయిందో లేదో పరిశీలించి, వ్రత పురోహితులకు పారితోషికం జమ చేసేవారు. ఇదే క్రమంలో ఆ పురోహితుడి భార్య, అత్తగారి అకౌంట్లలో కూడా పారితోషికం సొమ్ము జమయ్యేది. కొంత మంది ఖాతాల్లో వేసిన అధిక మొత్తాలకు సంబంధించి ‘తమలపాకులు, వక్కలు, గావంచాల సరఫరా కాంట్రాక్టర్లు స్టాఫ్కు ఇచ్చే మామూళ్లు మీ అకౌంట్లకు పంపిస్తారు. ఆ మొత్తాన్ని మీరు తిరిగి ఈ నంబర్కు పంపించండి’ అని ఆయా పురోహితులకు చెప్పి, ఇంకో నంబర్కు జమ చేయించేవాడు. ఈవిధంగా 2024 మే నెల నుంచి గత ఏడాది సెప్టెంబర్ వరకూ రూ.28,54,397 మేర దారి మళ్లించాడు. బ్యాంక్ అధికారులపై విమర్శలు ఈ వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ అధికారుల తప్పిదం కూడా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దేవస్థానం పంపిన జాబితా ప్రకారం కాకుండా.. ఆ పురోహితుడి మెయిల్ నుంచి వచ్చిన జాబితా ప్రకారం పారితోషకాలు జమ చేశారని అంటున్నారు. అయితే, గతంలో మాదిరిగానే తాము చేశామని, ఇంతకంటే తానేమీ చెప్పలేనని స్టేట్ బ్యాంకు బ్రాంచి మేనేజర్ ఎ.భరద్వాజ్ చెప్పారు. మోసం బయటపడిందిలా.. గత ఏడాది సెప్టెంబర్ నెలలో కొంత మంది పురోహితులు లోన్ కోసం స్టేట్ బ్యాంకుకు వెళ్లారు. తమ కు ఎంత రుణం వస్తుందో తెలుసుకునేందుకు పారితోషికాల జాబితాను పరిశీలించారు. ఆ సందర్భంగా కొంతమందికి రూ.80 వేలు, రూ.70 వేలు జమయినట్లు కనిపించింది. తమకు గ్రేడ్ ప్రకారం రావాల్సిన దానికన్నా అధికంగా పారితోషికం రావడంతో వారికి అనుమానం మొదలైంది. దీనిపై బిల్లులు చూస్తున్న పురోహితుడిని వారు వ్రత పురోహిత పెద్దల సమక్షంలో గత నెల 25న నిలదీశారు. అడ్డంగా దొరికిపోవడంతో, తప్పు జరిగిందని, ఇంక చేయనని అతడు చెప్పాడు. అన్నట్టుగానే అక్టోబర్ నుంచి అతడు ఇటువంటి తప్పు లు తిరిగి చేయలేదు. అయితే విషయం ఆ నోటా ఈ నోటా సంబంధిత విభాగం సిబ్బందికి తెలిసింది. దీంతో, వారు తనిఖీ చేయగా ఆ పురోహితుడు నెలల తరబడి చేస్తున్న మోసం బట్టబయలైంది. స్వాహా చేసిన రూ.28.54 లక్షలు తిరిగి చెల్లించకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పురోహిత పెద్దలు హెచ్చరించడంతో అతడు గత నెల 26న ఆ మొత్తాన్ని చెల్లించాడు. ఈ నేపథ్యంలో 27వ తేదీ అర్ధరాత్రి గుండె నొప్పితో హఠాత్తుగా మృతి చెందాడు. -
ఇన్చార్జి కలెక్టర్గా అపూర్వ భరత్
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా ఇన్చార్జి కలెక్టర్గా అపూర్వ భరత్ నియమితులయ్యారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సోమవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకూ ముస్సోరిలో జరిగే శిక్షణకు వెళ్తున్నారు. ఆయన తిరిగి విధుల్లో చేరేంత వరకూ అపూర్వ భరత్ ఇన్చార్జి కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఐటీఐ బ్రిడ్జి కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఐటీఐలో రెండేళ్ల కోర్సు ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ రెండో ఏడాదిలో ప్రవేశాలకు చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు సంబంధించిన బ్రిడ్జి కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ వేణుగోపాలవర్మ ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికెట్లతో కాకినాడ ఐటీఐలో సంప్రదించాలని, ఇతర వివరాలకు 87907 98431 నంబరులో సంప్రదించాలని సూచించారు. రత్నగిరిపై రద్దీఅన్నవరం: సెలవు రోజు కావడంతో రత్నగిరికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు మూడు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను ఆలయ ప్రాకారంలో టేకు రథంపై ఘనంగా ఊరేగించారు. రేపు జాబ్ మేళా బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో మంగళవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి జి.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరుణ్ మోటార్స్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్, టెలికాలర్, కస్టమర్ మేనేజర్, అడ్వైజర్ సర్వీస్, అడ్వైజర్ బాడీషాప్ ఉద్యోగాలకు డిగ్రీ లేదా బీటెక్ మెకానికల్ ఉత్తీర్ణులైన వారు అర్హులని వివరించారు. వొడాఫోన్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల ఇంటర్వ్యూకు పదో తరగతి ఉతీర్ణులైన వారు హాజరు కావచ్చన్నారు. ఇతర వివరాలకు 86398 46568 నంబరులో సంప్రదించాలని సూచించారు. -
విశేషాలంకరణలో తలుపులమ్మ తల్లి
తుని రూరల్: భక్త వరదాయినిగా ఖ్యాతికెక్కిన తలుపులమ్మ అమ్మవారు ఆదివారం విశేష పుష్పాలంకరణలో దర్శనమిచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 5 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, లోవ దేవస్థానం ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.61,005, పూజా టికెట్లకు రూ.44,430, కేశఖండన శాలకు రూ.1,960, వాహన పూజలకు రూ.4,450, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.23,375, విరాళాలు రూ.47,790 కలిపి మొత్తం రూ.1,82,919 ఆదాయం సమకూరిందని వివరించారు. విశేష పుష్పాలంకరణలో అమ్మవారు -
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026
● చెత్తపట్టాల్ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారం ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ పేరిట అట్టహాసంగా స్వచ్ఛతా కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తూంటుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు చీపుర్లు చేతబట్టి ఫొటోలకు పోజులిచ్చి కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు ప్రకటనలిస్తూంటారు. తీరా చూస్తే ఎక్కడి చెత్త అక్కడే ఉంటోంది. ఈ ఫొటోల్లో కనిపిస్తున్న చెత్త ఎక్కడో ఇళ్ల మధ్యనో.. లేక గ్రామాల శివారు ప్రాంతమో అనుకుంటే పొరపాటు పడినట్లే.. గ్రామాలను స్వచ్ఛంగా ఉంచాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని నిత్యం చెప్పే మండలాధికారుల కార్యాలయాల వద్ద నెలకొన్న పరిస్థితి ఇది. మండల కేంద్రమైన కరపలో కార్యాలయాల పక్కనే ఇలా అపరిశుభ్రత తాండవిస్తున్నా, పిచ్చి మొక్కలు అడవిలా పెరిగిపోతున్నా ఏ ఒక్క అధికారీ పట్టించుకోకపోవడం చూసి.. అక్కడకు వెళ్తున్న ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. – కరప -
అమాయక విద్యార్థులకు కరెంట్ షాక్!
కాకినాడ క్రైం: స్థానిక రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) మెన్స్ హాస్టల్ ఆవరణలో నిర్మాణాలు చేపడుతున్న ఓ కాంట్రాక్టు సంస్థ నిర్వాకంతో తమకు భారీ మొత్తంలో కరెంట్ షాక్ తగిలిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలివీ.. పీజీ యూజీ మెన్స్ హాస్టల్ నిర్మాణాన్ని నాగార్జునా కన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్సీసీ) మూడేళ్ల క్రితం చేపట్టింది. దీనికి అవసరమైన విద్యుత్ సరఫరాకు ఆ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ, అలా కాకుండా, సమీపాన ఉన్న పాత పీజీ యూజీ హాస్టల్ నుంచి విద్యుత్ తీసుకుంది. ఈ హాస్టల్లో సుమారు 300 మంది విద్యార్థులుండగా.. దీనికి వచ్చే విద్యుత్ బిల్లును ప్రతి నెలా అందరూ సమానంగా పంచుకుని చెల్లిస్తూంటారు. హాస్టల్ నిర్వహణను ఇక్కడి విద్యార్థి నాయకులే చూస్తారు. ఈ నేపథ్యంలో వారితో ఆ నిర్మాణ సంస్థ ప్రతినిధులు చర్చించారు. భవన నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు సహకరించాలని, వేరే విద్యుత్ లైన్ వేయడం వలన సమయం వృథా అవుతుందని, ప్రత్యేక సబ్ మీటర్ పెట్టుకొని తాము వినియోగించిన విద్యుత్కు తామే బిల్లు చెల్లిస్తామని అప్పట్లో చెప్పారు. కళాశాల విద్యార్థి బృందం అందుకు సమ్మతించింది. ఒప్పందం ప్రకారం తొలి మూడు నెలలూ ఆ సంస్థ విద్యుత్ బిల్లులు చెల్లించింది. ఆ తర్వాత నుంచి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేస్తూ వచ్చిందని, కొన్నాళ్ల తర్వాత చెల్లింపులను పూర్తిగా నిలిపివేసిందన్నది విద్యార్థుల ఫిర్యాదు. ఆ సంస్థ సకాలంలో బిల్లు చెల్లించకపోవడంతో పేరుకుపోయిన రూ.లక్షల భారమంతా వారిపై పడింది. అప్పటి వరకూ ఒక్కో విద్యార్థి ప్రతి నెలా రూ.300 నుంచి రూ.400 వరకూ మాత్రమే విద్యుత్ బిల్లులు చెల్లించేవారు. ఆ సంస్థ చెల్లించకపోవడంతో ఒక్కొక్కరికి నెలకు కనీసం రూ.2 వేల వరకూ బిల్లుల రూపంలో వదిలిపోయేది. మరోవైపు యూనిట్ల వినియోగం పెరగడంతో స్లాబ్ పరిమితి దాటిపోయింది. ఫలితంగా యూనిట్ ధర మరింత పెరగడం విద్యార్థులకు తలకు మించిన భారమైంది. ఎటువంటి ఆదాయం లేక, తల్లిదండ్రుల సంపాదన పైనే ఆధారపడి చదువుకుంటున్న ఈ విద్యార్థులు.. రూ.లక్షల్లో వస్తున్న ఆ సంస్థ బిల్లులను ప్రతి నెలా పంచుకుని చెల్లించలేక నానా అగచాట్లూ పడ్డారు. ట్యాంపరింగ్ ఆరోపణలు ఇదిలా ఉండగా, ఆ సంస్థ విద్యుత్ బిల్లు ప్రతి నెలా రూ.లక్ష వరకూ వస్తూండేది. ఆశ్చర్యకరంగా 2024 మే నెలలో రూ.120 మాత్రమే రావడంతో ఏదో జరుగుతోందని మెడికోలు అనుమానించారు. దీనిపై అప్పటి రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ), ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ డీఎస్వీఎల్ నరసింహానికి ఫిర్యాదు చేశారు. విచారణలో ఆ సంస్థ సబ్ మీటర్ను ట్యాంపరింగ్ చేసిందనే ఆరోపణలు వచ్చాయని విద్యార్థులు అంటున్నారు. లెక్క చేయని యాజమాన్యం ఓవైపు తాము నష్టపోయిన రూ.4 లక్షల మొత్తాన్ని వెనక్కి ఇప్పించాలని విద్యార్థులు నానాటికీ ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు ఎన్సీసీ యాజమాన్యం కనీసంగా కూడా పట్టించుకోలేదు. కళాశాలకు రావాలని, బకాయిలు వెంటనే చెల్లించాలని ఆర్ఎంసీ అధికారులు ఎన్నిసార్లు చెబుతున్నా లెక్క చేయ లేదని, కళాశాల ఇచ్చిన నోటీసుకు బదులివ్వలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే, విద్యార్థులవన్నీ వట్టి ఆరోపణలేనని ఎన్సీసీ అధికారులు కొట్టి పారేస్తున్నారు. ఆ సంస్థను నియంత్రించే అవకాశం ఆర్ఎంసీ అధికారులకు లేకపోవడం.. వారికి బిల్లులు పాస్ చేసే ఏపీఎంఎస్ఐడీసీ సంస్థ అసలు సమస్యను పట్టించుకోకపోవడం తమకు శాపంగా మారిందని వైద్య విద్యార్థులు వాపోతున్నారు.పాత హాస్టల్ నుంచి విద్యుత్ తీసుకునేందుకు సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక యూనిట్ 15 శాతం మాత్రమే జరిగిన హాస్టల్ భవన నిర్మాణంవిద్యార్థులు ఫిర్యాదు చేశారు ఎన్సీసీ వ్యవహారంపై వైద్య విద్యార్థులు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కళాశాల నుంచి ఆ సంస్థకు నోటీసులు వెళ్లాయి. 20 నెలల క్రితం నెలవారీ రూ.40 వేల చొప్పున చెల్లించాలని ఆదేశించాం. దీనికి అనుగుణంగా డబ్బులు చెల్లించాలి. కానీ, అలా జమ కాకపోవడంతో ఆ సంస్థతో సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నాం. – డాక్టర్ విష్ణువర్ధన్, ప్రిన్సిపాల్, ఆర్ఎంసీ కేవలం ఆరోపణలే.. బిల్లులు చెల్లించలేదన్నది కేవలం ఆరోపణలే. మేం అన్ని బిల్లులూ చెల్లించాం. విద్యార్థుల అనుమతితోనే పవర్ తీసుకున్నాం. అధికారుల ఆదేశాల మేరకు హాజరయ్యాం. సమావేశం అంటూ పదుల సంఖ్యలో చాంబర్లో చుట్టుముడుతూంటే ఇబ్బంది పడి అదే విషయాన్ని అధికారులకు చెప్పాం. బిల్లుల సమస్యపై చర్చిస్తున్నాం. అధికారులకు టచ్లో ఉన్నాం. కళాశాల ఇచ్చిన నోటీసులకు స్పందించాం. – ఆర్.భాస్కర్, ఎన్సీసీ మేనేజర్ వాళ్లు వినియోగిస్తే మేం బిల్లు కట్టాం ఎన్సీసీ మా హాస్టల్ నుంచి విద్యుత్ తీసుకొని మాపై బిల్లుల భారం మోపింది. మాకు సొంత సంపాదనల్లేవు. తల్లిదండ్రులు పంపిస్తున్న ఆ మాత్రం డబ్బుల నుంచే వారి బిల్లులు మేమే చెల్లిస్తూ కొన్ని నెలలుగా సతమతమవుతున్నాం. దీనిపై పూర్వపు ప్రిన్సిపాల్ డాక్టర్ నరసింహానికి ఫిర్యాదు చేశాం. నోటీసులిచ్చి 20 నెలలవుతున్నా ఆ సంస్థ ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తోంది. తన వద్ద రూ.4 లక్షలు పెట్టుకొని మమ్మల్ని ముప్పుతిప్పలు పెడుతోంది. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని, మా డబ్బులు వెనక్కి ఇప్పించాలి. కళాశాల యాజమాన్యం కఠినంగా వ్యవహరించి, బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలి. – పి.కుమార్ సాయి, ప్రధాన కార్యదర్శి, ఆర్ఎంసీ మెన్స్ హాస్టల్ ఆర్ఎంసీలో ఓ కంపెనీ నిర్వాకం పీజీ యూజీ మెన్స్ హాస్టల్ నిర్మాణం చేపట్టిన సంస్థ పాత హాస్టల్ నుంచి విద్యుత్ వాడకం సక్రమంగా బిల్లులు చెల్లించని వైనం విద్యార్థులపై భారం అధికారులు హెచ్చరిస్తున్నా పట్టించుకోని యాజమాన్యం 20 నెలలుగా సమాధానం లేదు దీనిపై మండిపడిన డాక్టర్ నరసింహం ఆ సంస్థ ప్రతినిధులను తీవ్రంగా హెచ్చరించారు. సంస్థ ప్రతినిధుల విన్నపం మేరకు, ఇన్నాళ్లూ చెల్లించకుండా మిగిలిపోయిన రూ.4 లక్షల బిల్లును ప్రతి నెలా రూ.40 వేల చొప్పున చెల్లించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలిచ్చి 20 నెలలు గడచినా ఇప్పటికీ ఆ సంస్థ ప్రతినిధులు కనీసంగా కూడా స్పందించలేదు. మూడేళ్లుగా భవన నిర్మాణ పనిని కేవలం 15 శాతం పూర్తి చేశారు. ఏడాది కాలంగా పని పూర్తిగా నిలిపేసి మాయమయ్యారు. కళాశాల యాజమాన్యం ఒత్తిడితో ఆ సంస్థ ఏడాది కాలంలో రెండు చెక్కులు ఇవ్వగా అవి బౌన్స్ అయ్యాయి. -
సమస్యలు పరిష్కరించకుంటే 19 నుంచి సహాయ నిరాకరణ
● ఏపీ గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు ● కాకినాడలో రాష్ట్ర కౌన్సిల్ మహాసభ కాకినాడ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రీ సర్వే ప్రాజెక్ట్లో పని చేస్తున్న తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 19 నుంచి సహాయ నిరాకరణ చేస్తామని ఏపీ గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు బూరాడ హెచ్చరించారు. కాకినాడ కేఎంసీ ఫంక్షన్ హాలులో సంఘం 5వ రాష్ట్ర కౌన్సిల్ మహాసభ ఆదివారం జరిగింది. దీనికి అన్ని జిల్లాల నుంచి సంఘ ప్రతినిధులు, గ్రామ సర్వేయర్లు సుమారు 150 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ, ఇతర సచివాలయ ఉద్యోగుల మాదిరిగానే ప్రమోషన్ చానల్లో బేసిక్ పే రూ.30 వేల పైచిలుకు ఉండాలని, నోషనల్ ఇంక్రిమెంట్, టీఏ, డీఏ పెండింగ్ బిల్లులు చెల్లించాలని, రీ సర్వేలో ఉన్న సర్వేయర్లకు సచివాలయ పరిధిలోని ఇతర సర్వేల నుంచి మినహాయింపు ఇవ్వాలని, రీ సర్వేలో ఆఫ్లైన్, ఆన్లైన్ సబ్ డివిజన్ తదితర పనుల ఒత్తిడి ఉన్నందుకు చాలినంత సమయం ఇవ్వాలని, వీఆర్వోలు, డీటీలు కూడా రీ సర్వేలో పని చేసేలా చర్యలు తీసుకోవాలని, సర్వే, భూమి రికార్డుల శాఖలో కనీస అర్హతను ఐటీఐ నుంచి డిప్లొమాగా మార్చాలని, ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సహాయ నిరాకరణలో భాగంగా కార్యాలయ పని వేళల్లో మాత్రమే విధులకు హాజరవుతామని స్పష్టం చేశారు. అధిక వేళల్లో విధులు నిర్వహించడమనేది వ్యక్తిగత హక్కులను కాలరాయడమేనని అన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోజ్కుమార్, నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
తండ్రి రుణం తీర్చుకునేందుకు..
కె.గంగవరం: మండల పరిధిలోని కోటిపల్లి గ్రామంలో పేకేటి సత్యనారాయణ (కాంతారావు) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు కుమారులు లేకపోవడంతో ఉన్న ముగ్గురు కుమార్తెల్లో ఒక కుమార్తె అనుషా తండ్రి మృతదేహానికి హిందు సంప్రదాయం ప్రకారం తలకొరివి పెట్టారు. కాంతారావు స్థానికంగా ఉన్న పీడబ్ల్యూడీ కార్యాలయంలో గుమస్తాగా పని చేస్తున్నారు. ఆయన ఆకస్మిక మృతికి కార్యాలయ సిబ్బంది సంతాపం ప్రకటించి దహన సంస్కారాలకు రూ. 10 వేలు అందించారు. తండ్రి మృతదేహానికి కూతురు తలకొరిపెట్టడం చూసి స్థానికులు, బంధువులు, గ్రామస్తులు కంటతడి పెట్టు కున్నారు. 8X3 -
ఎవరేమనుకుంటే మాకేంటి..
ఫ ప్రభుత్వ భవనంపై టీడీపీ ఫ్లెక్సీలు ఫ వివాదస్పదంగా మారిన వైనం రామచంద్రపురం రూరల్: ప్రభుత్వ భవనం... దానిపై టీడీపీకి చెందిన నేతలు శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీ.. ఇవేమీ పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తున్న తీరు.. ఇదంతా రామచంద్రపురం రూరల్ మండలం వెల్లలో చోటు చేసుకుంది. ఆ గ్రామ సంతపేటలో డ్వాక్రా మహిళలకు చెందిన భవనాన్ని గతంలో నిర్మించారు. ఇదే భవనంలో డ్వాక్రా గ్రూప్ సభ్యులు సమావేశాలతో పాటు వివిధ ప్రభుత్వ కార్యకలాపాలు సాగిస్తుంటారు. ఇది ప్రభుత్వానికి చెందిన భవనం. దీనిపై ఎటువంటి ప్రైవేట్ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేయకూడదు. అలా ఏర్పాటు చేస్తే పంచాయతీ చట్టం ప్రకారం శిక్షార్హులు. కానీ టీడీపీకి చెందిన ఒక నేత దర్జాగా మంత్రి సుభాష్ ఉన్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీని ఈ ప్రభుత్వ భవనంపై ఏర్పాటు చేశారు. దీంతో వివాదస్పదంగా మారింది. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన ఒక నేత ఇప్పటికే పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా స్పందించకపోవటం గమనార్హం. దీనిపై పంచాయతీ సెక్రటరీ వి.సూర్య సుబ్రహ్మణ్యంను వివరణ కోరగా ఇప్పటికే ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారికి తీసివేయాలని చెప్పామని వివరణ ఇచ్చారు. -
మనస్తాపంతో గోదావరిలో దూకేసిన తల్లి
ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు తాళ్లపూడి: కుమార్తె కాపురం సరిగ్గా లేదనే మనస్తాపంతో ఓ తల్లి గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన ఈగల ధనలక్ష్మి (40), ఆమె కుమార్తె, మనుమరాలితో కలసి రాజమహేంద్రవరం వైపు నుంచి కొవ్వూరు వైపు ఆటోలో వస్తూ శుక్రవారం రాత్రి కొవ్వూరులోని రోడ్డు కం రైల్ బ్రిడ్జిపై దిగారు. ముందు ధనలక్ష్మి గోదావరిలోకి దూకేసింది. ఇంతలో ధనలక్ష్మి కుమార్తె భూసాల విజయకుమారి, ఏడాదిన్నర కుమార్తె లక్ష్మీప్రసన్నతో దూకుతుండగా అటుగా వెళుతున్న వారు రక్షించారు. ఆమె ఆచూకీ కోసం శనివారం ఉదయం నుంచి పట్టణ పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. అసలేం జరిగిందంటే.. భూసాల విజయ కుమారికి 2020లో మండపేటకు చెందిన లారీ డ్రైవర్ వినయ్కుమార్తో వివాహం జరిగింది. వారికి నాలుగేళ్ల కుమారుడు మోక్షిత్, ఏడాదిన్న కుమార్తె లక్ష్మీప్రసన్న ఉన్నారు. భర్త వినయ్కుమార్ భార్యను అనుమానిస్తూ చాలా రోజుల నుంచి వేధించడంతో శుక్రవారం ఉదయం గొడవ జరిగింది. అత్త ధనలకి్ష్మ్ని మండపేట పిలిపించుకుని నీ కూతురిని తీసుకుపో అని చెప్పడంతో ఆమె భూసాల విజయకుమారి, లక్ష్మీప్రసన్నలను మండపేట నుంచి రాజమహేంద్రవరం వచ్చారు. కొంతసేపు అక్కడే ఉండి మాట్లాడుకున్నారు. నీ భర్త నిన్ను ఎలాగైనా చంపేస్తాడని, అతని చేతిలో చచ్చేది ఏంటని అందరూ కలసి చచ్చిపోదామని ముగ్గురు ఆటోలో కొవ్వూరు వైపు వస్తూ బ్రిడ్జిపై దిగారు. ముందు అనుకున్న ప్రకారం తల్లి ఈగల ధనలక్ష్మి గోదావరిలో దూకేసింది. అటుగా వెళుతున్న వాహనదారులు ఇది గమనించి విజయకుమారితో పాటు లక్ష్మీప్రసన్నను కాపాడారు. 112కు ఫోన్ సమాచారంతో కొవ్వూరు పట్టణ పోలీసులు అక్కడకు వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ విశ్వం తెలిపారు. -
అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు
పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు పోటెత్తారు. స్వామి, అమ్మవార్లకు వివిద రకాల పూలతో విశేష అలంకరణ చేయటంతో స్వామివారిని చూసిన భక్తులు పులకించిపోయారు. స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 12,500 మందికి ఉచిత అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. శనైశ్చరునికి ప్రత్యేక పూజలుకొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమామందేశ్వర (శనైశ్చర) స్వామివారిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం కిక్కిరిసింది. దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్బాబు ఆధ్వర్యంలో భక్తుల పూజలకు ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆలయ అర్చకులు, వేదపండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించారు. భక్తుల ప్రత్యక్ష పూజలు, తైలాభిషేకాల టిక్కెట్ల ద్వారా దేవస్థానానికి రూ.1,60,160, పరోక్ష పూజలు, మనియార్డర్ల ద్వారా రూ.1,79,800, అన్నప్రసా దం విరాళాలు రూపంలో రూ.51,207 ఆదాయం వచ్చినట్టు ఈఓ సురేష్బాబు తెలిపారు. -
స్కూల్ బస్ భద్రమేనా?
● పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో తల్లిదండ్రుల ఆందోళన ● తనిఖీలు నిర్వహిస్తున్న రవాణా శాఖ అధికారులు ● నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పిల్లలు స్కూల్ బస్సు ఎక్కిన దగ్గర నుంచి తిరిగి ఇంటికి చేరే వరకు తల్లిదండ్రుల్లో ఏదో తెలియని టెన్షన్. మరోవైపు తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన వాహనాలు ఎంతమేరకు భద్రతతో కూడి ఉంటున్నాయి అంటే కరెక్టు సమాధానం ఉండదు. రవాణాశాఖ నిబంధనల మేరకే విద్యార్థులను తరలిస్తున్నారా ? ఎమర్జెన్సీ ఎగ్జిట్.. ఫైర్ సేఫ్టీ, ఇతర భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా అంటే దేనిపైనా స్పష్టత ఉండదు. అందుకే రవాణాశాఖ అధికారులు ప్రైవేటు స్కూళ్ల బస్సుల సామర్థ్యంపై దృష్టి సారించి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భద్రత లేని బస్సుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నారు. గడువు ఇచ్చి సరి చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. లేదంటే భారీ జరిమానాలతో పాటు బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలతో కలవరం ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కలవర పెడుతున్నాయి. ఘోర రోడ్డు ప్రమాదాలు అధికార యంత్రాంగాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ దశలో రవాణాశాఖ అధికారులు తొలుత ప్రైవేటు బస్సులు లొసుగులను వెలికితీశారు. వాటి వేగం, అక్రమాలకు కళ్లెం వేసే దిశగా అడుగులు వేశారు. తర్వాత ప్రైవేటు విద్యాసంస్థల వాహనాల సామర్థ్యంపై నిఘా పెట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి ఆట కట్టిస్తున్నారు. భారీ జరిమానాలు విధిస్తున్నారు. మరోమారు తనిఖీలు ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. తరచుగా స్కూల్ బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థల బస్సులను మరోమారు తనిఖీ చేయాలని ఉన్నత అధికారులు ఆదేశించడంతో రవాణా శాఖ అధికారులు జిల్లాలో తనిఖీలు చేపడుతున్నారు. జిల్లాలోని కాకినాడ, పెద్దాపురం, కత్తిపూడి యూనిట్ పరిధిలో 1,016 బస్సులు ఉన్నాయి. ప్రతి ఏడాది మే నెలలో స్కూల్బస్ ఫిట్నెస్ క్యాంప్ నిర్వహిస్తారు. ఈ ఏడాది 850 బస్సుల యజమానులు మాత్రమే తనిఖీ చేయించుకున్నారు. మిగతా బస్సులు ఫిట్నెస్ క్యాంప్నకు రాకపోగా అధికారులు ఈ ఏడాది చేపట్టిన తనిఖీల్లో దాదాపు 30 బస్సులను గుర్తించి చర్యలు తీసుకున్నారు. వాటికి మరమ్మతులు చేయించి తిరిగి ఫిట్నెస్ పొందాలని విద్యాసంస్థల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు. ప్రధానంగా ఫైర్ సేఫ్టీ లేకపోవడం, అత్యవసర ద్వారం, ఇతరత్రా సమస్యలను గుర్తించినట్టు రవాణాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. క్లీనర్ లేకుండానే.. స్కూల్ బస్సులకు క్లీనర్ ఉండడం లేదు. దీంతో కొన్ని సంస్థలకు చెందిన బస్సుల్లో పిల్లలే క్లీనర్ అవతారం ఎత్తుతున్నారు. విద్యార్థులను కిందకు దించడం, బస్సు ఎక్కించడం తోటి విద్యార్థులే చేస్తున్నారు. చాలా బస్సుల్లో క్లీనర్ లేక విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రతి బస్సులో క్లీనర్, లేదా సహాయకులు ఉండేలా చూడాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పరిమితికి మించి.. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థ బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారు. ఇద్దరు విద్యార్థులు కూర్చొనే సీటులో ముగ్గురు లేక నలుగురిని కూర్చో పెడుతున్నారు. వీటిపై రవాణాశాఖ అధికారులు దృష్టి పెట్టి ఉదయం, సాయంత్రం సమయాల్లో తనిఖీలు చేస్తే బాగుంటుదని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇవీ నిబంధనలు.. ● ప్రతి బడి బస్సుకు స్పీడు గవర్నెన్స్ ఉండాలి. ● 2019 తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాహనానికి తప్పనిసరిగా ఫైర్ అలారం ఉండాలి. ● 2020 తర్వాత రిజిస్ట్రేషన్ అయిన బస్సుకు డ్రైవర్ దగ్గర ఫైర్ పరికరాలు ఉండాలి. ● ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు ఉండాలి. ● డ్రైవర్కు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ● సిటింగ్ సామర్థ్య మేరకే విద్యార్థులను కూర్చోబెట్టాలి. ● పాఠశాల బస్సు నడిపే డ్రైవర్కు బీపీ, సుగర్, కంటి సంబంధిత సమస్యలు లేవని సర్టిఫికెట్ సమర్పించాలి. ఈ సర్టిఫికెట్ బస్సులో ఒకటి, యాజమాని దగ్గర ఒకటి ఉండాలి. ● డ్రైవర్ నియామకాన్ని ఆర్టీఓ అధికారులకు తెలియజేయడంతో పాటు ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి. ● కళాశాలల, స్కూల్స్ ప్రిన్సిపాల్ విద్యార్థుల తల్లిదండ్రులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి నెలా వాహన స్థితిగతులు రిజిస్టర్ చేయాలి. ఫిర్యాదు పుస్తకం బస్లో ఉంచాలి. ● అన్ని లైట్లు, సిగ్నల్స్ కచ్చితంగా పనిచేయాలి. రిప్లెక్టివ్ టేపును బస్సుకు నాలుగు వైపులా అతికించాలి. బస్ అద్దాలన్నీ పటిష్టంగా ఉండాలి. వాహనం నుంచి పొగ అధికంగా రాకూడదు. ● బ్రేక్లు కండిషన్లో ఉండి పెయింటింగ్ కొత్తగా వేయించాలి. ఫస్ట్ ఎయిడ్ పరికరం తప్పనిసరిగా ఉండాలి. బస్సు కండిషన్లో ఉండాల్సిందే బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం. తనిఖీలో బండి లోటుపాట్లను గుర్తిస్తున్నాం. వాటిని సరి చేసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నోటీసులు కూడా ఇచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో బడి బస్సుల నిర్వహణలో నిర్లక్ష్యం ఉంటే ఊరుకోం. ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిందే. ప్రమాదాల నివారణకు చేపడుతున్న ఈ తనిఖీలకు పాఠశాల యాజమాన్యాలు సహకరించాలి. లోటుపాట్లను సరిదిద్దుకోవాలి. నిబంధనలు పాటించకపోతే బస్సులు సీజ్ చేయడంతో పాటు జరిమానా విధిస్తాం. – కె.శ్రీధర్, డీటీవో, కాకినాడ -
సంపూర్ణ ఉపనిషత్సారం గీత
సమన్వయ సరస్వతి సామవేదం ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): సంపూర్ణ ఉపనిషత్సారం గీత. గంగ, గాయత్రి, గీత ఎవరి హృదయంలో ఉంటాయో వారికి పునర్జన్మ ఉండదని సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. శనివారం హిందూ సమాజంలో ఆయన వేదవ్యాసుడు ప్రసాదించిన భారతం, భీష్మపర్వంలోని యుద్ధ విశేషాలను వివరించారు. వర్షం మంచిదే, ఎప్పుడు ఎక్కడ పడాలో, ఎంత పడాలో అలా పడినప్పుడే మంచి ఫలితం వస్తుంది. దయ అనేది కూడా సర్వదా అభిలషనీయం కాదు, సమయం, సందర్భాన్ని పట్టి దయ అనేది చూపాలని సామవేదం అన్నారు. ఇరుపక్షాలు కురుక్షేత్రంలో మోహరించినప్పుడు ధర్మరాజు కవచం, ఆయుధాలు విసర్జించి భీష్ముని వద్దకు వెళ్లాడు. ఎవరికీ ఆయన అంతరంగం అర్థం కాలేదు. తాతా! యుద్ధంలో మాకు జయం కలగాలని దీవించమని ధర్మరాజు కోరాడు. నీవు ఇలా రాకపోతే, నిన్ను శపించేవాడినని భీష్ముడు అన్నాడు. ద్రోణ, కృపాచార్య, శల్యుల వద్దకు ఈ రీతిగానే వెళ్లి వారి ఆశీస్సులు తీసుకున్నాడు ధర్మరాజు. ఆ తరువాత ఉభయ పక్షాల మధ్య నిలబడి, యుద్ధంలో మా పక్షాన నిలబడి పోరాడాలని ఎవరయినా రావాలనుకుంటే, రమ్మని ఆహ్వానిస్తున్నామని ఆయన ప్రకటించాడు. ధృతరాష్ట్రునికి ఒక వైశ్య కాంత వలన జన్మించిన యుయుత్సుడు పాండవ పక్షానికి వచ్చాడు. యుద్ధం ముగిసాక, ధార్తరాష్ట్రులకు పిండోదకాలు సమర్పించడం నీ బాధ్యతలాగా కనిపిస్తున్నది అని ధర్మరాజు అన్నాడు. అనేక యుద్ధ వ్యూహాలను సామవేదం వివరించారు. యుద్ధ సమయం నాటికి ద్రోణుని వయసు 400 సంవత్సరాలు. ‘యతో ధర్మస్తతః జయః, యతః కృష్ణస్తతో జయః–అన్న ద్రోణుని మాటలను భారత నినాదంగా పరిగణించాలని సామవేదం అన్నారు. యుద్ధ సమయంలో ధర్మరాజు చూపిన నీతిని మ్లేచ్ఛులు, ఆర్యులు సైతం అభినందించారు. ఆర్యులు, ద్రావిడులు అనే విభాగాలు పాశ్చాత్యుల సృష్టి మాత్రమేనని భారతదేశమంతా ఆర్యావర్తమేనని సామవేదం అన్నారు. విరాటరాజు కుమారుడు ఉత్తరుడు శల్యునితో వీరోచితంగా యుద్ధం చేసి మరణిస్తాడని సామవేదం అన్నారు. దుర్యోధనుని పరుషమైన మాటలతో కలత చెంది భీష్ముడు మండలాకారంలో బాణాలు ప్రయోగించి, రథం మీద నాట్యం చేస్తున్నట్టు కనపడతాడు. స్మరణ మాత్రాన సుదర్శన చక్రం కృష్ణుని చేతికి వచ్చింది. పార్థుని కోర్కైపె చక్రాన్ని కృష్ణుడు ఉపసంహరించుకుంటాడు. ముందుగా భాగవత విరించి డాక్టర్ టీ వీ నారాయణరావు పోతనామాత్య విరచితమైన ‘వేదాంత వీధుల విహరించు విన్నాణి..’ పద్యాన్ని ఆలపించి సభకు శుభారంభం పలికారు. -
అన్నవరం ఆలయ శానిటరీ కాంట్రాక్ట్ సిబ్బంది నిరసన
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఈఓ మారినా, పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం వచ్చినా వివాదాలు మాత్రం కొనసాగుతున్నాయి. తాజాగా దేవస్థానంలో శానిటరీ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న పద్మావతి హాస్పిటాలిటీ, బుక్ కీపింగ్ అండ్ శానిటరీ సంస్థలో పనిచేస్తున్న సుమారు 200 మంది మహిళా సిబ్బందిని శనివారం దేవస్థానంలో ఇతర ప్రదేశాలకు బదిలీ చేయడం వివాదాస్పదమైంది. తమను కావాలనే మార్చారని సిబ్బంది శనివారం సాయంత్రం టోల్గేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కొంతసేపు రత్నగిరికి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా శానిటరీ వర్కర్స్ దడాల నానితల్లి, పెండ్యాల నాగలక్ష్మి మాట్లాడుతూ తాము ఆలయ ప్రాంగణం, రోడ్లు, టాయిలెట్స్ తదితర ప్రాంతాలలో పని చేస్తున్నామని, మళ్లీ అటువంటి ప్రదేశాలకే మార్చారని వీరు ఆరోపించారు. తాము మూడు నెలలుగా ఒకే చోట పనిచేస్తున్నామని తెలిపారు. తాము 15 సంవత్సరాలుగా దేవస్థానంలో శానిటరీ విభాగంలో కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నామని, గతంలో ఎప్పుడు ఇలా మార్చలేదని తెలిపారు. కొన్ని నెలలు ఆలయం, వ్రత మండపాలు వద్ద పనిచేసేవారమని తెలిపారు. అయితే పద్మావతి సంస్థలో కొత్తగా నియమించిన సిబ్బందిని వ్రత మండపాలు, స్వామివారి ఆలయం, అతిథి గృహాలు తదితర చోట్ల కొనసాగిస్తున్నారని తెలిపారు. వారు మూడు నెలలు దాటినా అక్కడే పనిచేస్తున్నారని తమని మాత్రం బాత్రూమ్స్ క్లీనింగ్, రోడ్లు క్లీనింగ్ పనులకే పరిమితం చేస్తున్నారని ఆరోపించారు. సూపర్వైజర్ సతీష్ తమను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. దేవస్థానం శానిటరీ ఇనస్పెక్టర్ వేంకటేష్ వారితో మాట్లాడి ఈ విషయం కాంట్రాక్టర్ దృష్టికి తీసుకువెడతానని తెలపడంతో ఆందోళన విరమించారు. అందరినీ మార్చాలని సూపర్ వైజర్ను ఆదేశించాం అన్నవరం దేవస్థానంలో మా సంస్థ తరఫున 413 మంది శానిటరీ విధులు నిర్వహిస్తున్నారు. అందరినీ విడతల వారీగా మార్చాలని సూపర్వైజర్ను ఆదేశించాం. ఈ నెల కొంతమందిని మార్చితే, వచ్చేనెల మిగిలిన వారిని మార్చుతారు. ఎవరి మీదా కక్ష లేదు. అందరినీ సమానంగా చూస్తున్నాం. – భాస్కరనాయుడు, ఎండీ, పద్మావతి సంస్థ -
పొల్యూషన్ శాఖ ఈఈగా సూర్యకళ
కాకినాడ రూరల్: కాలుష్య నియంత్రణ మండలి కాకినాడ రీజనల్ కార్యాలయం ఈఈగా ఐ.సూర్యకళ నియమితులయ్యారు. విశాఖలోని ఏపీపీసీబీ కార్యాలయంలో పనిచేసిన ఆమె పదోన్నతిపై కాకినాడ బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు పనిచేసిన శంకరరావు సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరుగా పదోన్నతిపై కర్నూలు జోనల్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చిన సూర్యకళకు రమణయ్యపేటలోని కార్యాలయంలో శనివారం ఆయన బాధ్యతలు అప్పగించి రిలీవ్ అయ్యారు. ఆమెకు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. రత్నగిరిపై భక్తుల రద్దీ అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి ఆలయం, వ్రత మండపాలు, క్యూ లు భక్తులతో నిండిపోయాయి. ఆలయాన్ని తెల్లవారుజామున నాలుగు గంటలకు తెరిచి పూజలు చేశారు. అనంతరం వ్రతాల నిర్వహణ ప్రారంభించారు. ఉదయం ఆరు గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. అప్పటి నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణునికి పూజలు చేశారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. నేడు సత్యదేవుని రథ సేవ ఆదివారం రత్నగిరి ఆలయ ప్రాకారంలో ఉదయం పది గంటలకు టేకు రథంపై సత్యదేవుడు, అమ్మవారిని ఊరేగిస్తారు. భక్తులు రూ.2,500 టిక్కెట్తో ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఒక టిక్కెట్ మీద నలుగురిని అనుమతిస్తారు. ఊరేగింపు అనంతరం ఆ భక్తులకు స్వామివారి అంతరాలయ దర్శనం, పండితులతో వేదాశీర్వచనం, స్వామివారి కండువా, జాకెట్టు ముక్క, ప్రసాదం అందజేస్తారని అధికారులు తెలిపారు. శృంగార వల్లభస్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలంలోని తిరుపతి గ్రామంలో వేంచేసి యున్న శృంగార వల్లభ స్వామిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ధనుర్మాసం సందర్భంగా ధ్వజస్తంభంతో పాటు ఆలయ ప్రాంగణం పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు వచ్చారు. కొందరు కాలినడకన ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 10వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,00,620 అన్నదాన విరాళాలకు రూ.63,611, కేశ ఖండన ద్వారా రూ.1,720, తులాభారం ద్వారా రూ.350, లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ.12,630లతో కలిపి రూ.1,78,931 ఆదాయం వచ్చిందని చెప్పారు. 3,200 మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారని ఈఓ తెలిపారు. యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో రబీ సీజన్లో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, మండల స్థాయి వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి యూరియా వినియోగంపై అవగాహన కల్పించాలని జేసీ అపూర్వ భరత్ ఆదేశించారు. కలెక్టరేట్ లో శనివారం జేసీ వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారులు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి, కృత్రిమ కొరత, ఎమ్మార్పీ, ఎరువులు మళ్లింపు వంటి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ మెరుగుపడే విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలని జేసీ సూచించారు. -
మేకప్.. బోధనకు పేకప్!
● బడుల్లో ముస్తాబు కార్నర్లు తప్పనిసరి ● ప్రత్యేక జీఓ విడుదల ● కార్నర్లో అద్దం, దువ్వెన, సబ్బు ● విద్యార్థుల పరిశుభ్రత బాధ్యత గురువులదే! ● నాడు బోధనేతర పనులకు వినియోగించనన్న చంద్రబాబు ● నేడు క్రమంగా పెంచేస్తుండడంపై ఉపాధ్యాయుల ఆగ్రహం సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రతిపక్షంలో ఉండగా ఒకమాట గద్దె నెక్కాక మరొకమాట చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కోసం ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తూ ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించనని గొప్పలకు పోయారు. తీరా గద్దె నెక్కాక ఆ మాటలు గాలికొదిలేసి బోధనేతర పనులు పెంచేస్తున్నారని ఉపాధ్యాయులు చంద్రబాబు సర్కార్పై నిప్పులు చెరుగుతున్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగిస్తున్నారంటూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాటి ప్రతిపక్ష టీడీపీ నానా రాద్ధాంతం చేసింది. ఇప్పుడు అధికారం చేపట్టిన తరువాత ఆ మాటలకు అర్థాలే వేరంటోంది. చంద్రబాబు సర్కార్ బోధనేతర పనులు అప్పగిస్తుండటంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న వంద రోజుల యాక్షన్ ప్లాన్ పర్యవేక్షణ కోసం ఇతర శాఖల అధికారుల నియామకంతో తమపై ఒత్తిడి పెంచారని ఉపాధ్యాయులు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఒక్కో పాఠశాలకు వివిధ శాఖల నుంచి నోడల్ అధికారుల నియామకంపై గురువులు కారాలూ మిరియాలు నూరుతున్నారు. విద్యావ్యవస్థలో ఇతర శాఖల అధికారుల కర పెత్తనం ఏమిటంటూ రగిలిపోతున్న ఉపాధ్యాయులపై చంద్రబాబు సర్కారు మరో పిడుగు పడేసింది. ముస్తాబు పేరుతో మరో అదనపు పనిభారం మోపిందని మండిపడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక జీఓ కూడా విడుదల చేయడాన్ని తప్పుపడుతున్నారు. విద్యార్థులను ‘ముస్తాబు’ చేయలేక చంద్రబాబు ప్రభుత్వం తీరుపై ఉపాధ్యాయులు మూకుమ్మడిగా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు ఉత్తర్వులపై ఆశ్చర్యం ప్రభుత్వ పాఠశాలలో డైలీ హైజిన్ అండ్ డిసిప్లేన్ పేరుతో ముస్తాబు కార్యక్రమానికి ఇటీవల శ్రీకారం చుట్టారు. ఇందుకోసం జీఓ నంబర్ 43 విడుదల చేశారు. ప్రతి తరగతి గదిలో అనివార్యంగా ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేయాలని ఆ జీఓలో నిర్దేశించారు. ఆ కార్నర్లో అద్దం, దువ్వెన, సబ్బు, హ్యాండ్ వాష్, నెయిల్ కట్టర్ ఏర్పాటు చేయాలి. విద్యార్థులు పరిశుభ్రంగా, క్రమశిక్షణగా ఉండేలా చూడాలన్నది ఆ జీవో సారాంశం. చేతులు శుభ్రం చేసుకునే దశల చార్టులు, గోర్లు, జుత్తు, వ్యక్తిగత పరిశుభ్రత చార్టు, టాయిలెట్ వినియోగం, సురక్షిత నీటిపై విద్యార్థులకు అవగాహన కల్పించే మెటీరియల్ కూడా ప్రదర్శించాలి. ఎంపిక చేసిన ఇద్దరు విద్యార్థులకు తొలుత శిక్షణ ఇవ్వాలి. వారం వారం ముస్తాబు స్టార్ ఆఫ్ ది వీక్ను ఎంపిక చేయడం, రివార్డులు ఇవ్వడం క్రమం తప్పకుండా జరగాలి. ఇదంతా ఉపాధ్యాయులే చేయాలి. పాఠశాలకు అపరిశుభ్రంగా వచ్చే వారిని, తల దువ్వుకోకుండా వచ్చే వారిని గుర్తించాలి. వారితో బడిలోనే తలదువ్వడం లేదా, దువ్వించడం చేయించాలి. ఈ కార్యక్రమంపై ఉపాధ్యాయ వర్గాలు మండిపడుతున్నాయి. బడికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించాలా లేక పాఠాలు మానేసి విద్యార్థులను ముస్తాబు చేస్తూ కూర్చోవాలా? అంటూ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అవసరమే. అయితే విద్యాలయాల్లో దువ్వెన, అద్దం, సబ్బు వంటివి ఉంచడం వల్ల విద్యార్థులు చదువు కన్నా వ్యక్తిగత సౌందర్యంపైనే శ్రద్ధ చూపే అవకాశాలు లేకపోలేదు. ప్రాథమిక పాఠశాలల స్థాయిల్లో ఎలా ఉన్నా ఆ ప్రభావం హైస్కూల్స్పై పడే ప్రమాదం లేకపోలేదంటున్నారు. తల్లిదండ్రులు, గురువులు సర్కార్ ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చిందేమిటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఉపాధ్యాయుల్లో తీవ్ర అసహనం ఈ కార్యక్రమం ఆగమేఘాలపై ప్రారంభం కావాలనే ఆదేశాలతో పలు పాఠశాలల్లో నామ్కేవాస్తేగా ముస్తాబు కార్నర్లు ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు వరకు చంద్రబాబు ఉపాధ్యాయులకు అనుకూలంగా ఆర్భాటపు ప్రచారం చేశారు. తమను బోధనేతర పనులకు వినియోగించేది లేదంటూ గొప్పలకు పోయారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటలు గాలిలో కలిపేసి విద్యాయేతర పనులు అప్పగిస్తున్నారని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు: 1,285ప్రాథమిక పాఠశాలలు: 933ప్రాథమికోన్నత పాఠశాలలు: 105హైస్కూళ్లు: 247జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు: 573 ప్రాథమిక పాఠశాలలు: 152ప్రాథమికోన్నత పాఠశాలలు: 202హైస్కూళ్లు: 219ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య: 1,93,356ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య: 1,11,137ఎయిడెడ్ బడుల్లో విద్యార్థులు: 5,520బోధన మరుగున పడుతుంది ఒకదాని వెంట ఒకటి బోధనేతర కార్యక్రమాలను అప్పగిస్తున్నారు. ఉపాధ్యాయులను బోధనకు పరిమితం చేయకుండా ముస్తాబు వంటి బోధనేతర కార్యక్రమాల బాధ్యతలు మోపడం వల్ల అసలు విషయం మరుగునపడుతుంది. ఇప్పటికై నా ప్రభుత్వం ఈ నిర్ణయాలపై పునరాలోచన చేయాలి. – చింతాడ ప్రదీప్కుమార్, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ ఒత్తిడికి గురి చేయడమే ఎల్లుండి నుంచి ఎఫ్–3 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ముస్తాబు కార్యక్రమానికి సంబంధించి ప్రతీ రోజూ రిజిస్టర్లు తయారు చేయాల్సి ఉంటుంది. ఈ పనులతో కలిగే ప్రయోజనం కంటే బోధన సమయం తగ్గిపోవడం వల్ల విద్యార్థులకు తీరని నష్టమే జరుగుతుంది. టీచర్లను మానసికంగా ఇబ్బంది పెట్టడమే అవుతుంది. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులకు బోధించే పనిగంటలు తగ్గిపోతాయే తప్ప ఆశించినంత ప్రయోజనం ఉంటుందనుకోవడం లేదు. – మోర్త శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎస్టీయూ -
మంత్రి కందుల దుర్గేష్ పైరవీలు.. జనసేన నేతల అసంతృప్తి
సాక్షి,కాకినాడ: జనసేన పార్టీలో కాకినాడ జిల్లా రాజకీయాలు రోజు రోజుకు మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) చైర్మన్ పదవి ఎవరికి కేటాయించాలన్న అంశంపై జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ పాత్రపై పార్టీ లోపలే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.మంత్రి దుర్గేష్ పైరవీలపై అసంతృప్తికుడా చైర్మన్ పదవిని ముత్తా శశిధర్ ముఖ్య అనుచరుడైన తలాటం సత్యకు కేటాయించాలంటూ మంత్రి కందుల దుర్గేష్ పైరవీలు చేయడం జనసేన వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో దుర్గేష్కు సంబంధించిన లేఅవుట్లు, వ్యాపార ప్రయోజనాలే ఇందుకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దుర్గేష్కు అనుకూలమైన వ్యక్తిని ముందుంచి నిర్ణయాలపై ప్రభావం చూపాలన్న ప్రయత్నం జరుగుతోందని కొందరు నేతలు బహిరంగంగానే వారి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి ఇప్పుడు కీలక పదవులు ఎలా ఇస్తారు? అని ఇతర నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు దుర్గేష్ను ప్రశ్నిస్తున్నారు. జగ్గంపేట, ప్రత్తిపాడు వంటి ప్రాంతాల్లో పార్టీ కోసం కష్టపడ్డ నేతలను పక్కన పెట్టి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటే సహించబోమని వారు హెచ్చరిస్తున్నారు.ఒకే పార్టీ నుంచి ఒకే సామాజిక వర్గానికి, ఒకే నియోజకవర్గానికి రెండు కీలక పదవులు ఇవ్వకూడదన్న పార్టీ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే కాకినాడ సిటీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన తోట సుధీర్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగుతున్నారు. గతంలో కుడా చైర్మన్ పదవి విషయంలో ఏర్పడిన వివాదాన్ని నివారించేందుకు పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన తుమ్మల బాబుకు ఆ బాధ్యతలు అప్పగించిన విషయం గుర్తు చేస్తున్నారు.తలాటం సత్య కాకినాడ సిటీకి చెందినవారే కావడంతో మరోసారి సిటీ నుంచే పదవి ఇస్తే సమస్యలు తలెత్తవచ్చని పార్టీ పెద్దలకు సూచిస్తున్నారు. కుడా చైర్మన్ పదవిని కాపు సామాజిక వర్గానికే కేటాయించాల్సి వస్తే ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలకు అవకాశం ఇవ్వాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. జగ్గంపేట ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, ప్రత్తిపాడు జనసేన నేత కత్తిపూడి బాబీ, లేదా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఓదూరి నాగేశ్వరరావు పేర్లు చర్చలో ఉన్నాయి. -
● రయ్ రొయ్య మంటూ..
రయ్ రొయ్యమంటూ మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళుతున్నారు. పల్లిపాలెం కేంద్రంగా సముద్రంపై వేట సాగించే వారికి అరుదైన భారీ సైజు ల్యాబ్స్టర్ రకం రొయ్యలు చిక్కుడమే దీనికి కారణం. వలకు చిక్కి ఫిషింగ్ హార్బర్కు చేరిన వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు పోటీపడుతున్నారు. ఒక్కో ల్యాబ్స్టర్ రొయ్య సుమారు 750 గ్రాములు బరువు తూగుతూ, రూ.800కు తక్కువ గాకుండా అమ్ముడుపోతోంది. సాధారణంగా ఈ రకమైన ల్యాబ్స్టర్ రొయ్యలు కన్యాకుమారి, మండపం, కేరళ వంటి కొన్ని తీర ప్రాంతాల్లో మాత్రమే లభిస్తాయని, అంతర్వేది సముద్ర తీరంలో ఈ రకం భారీ సైజులో రొయ్యలు దొరకడం అరుదని వారు చెబుతున్నారు. - సఖినేటిపల్లి -
త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రారంభం
అనపర్తి: అనపర్తి శారదా సంగీత కళా సమితి ఆధ్వర్యంలో 27వ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక టీటీడీ కల్యాణ మండపం ప్రాంగణంలో 8 రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. రాజమహేంద్రవరానికి చెందిన వీఎల్ తులసీ విశ్వనాథ్ గాత్ర కచేరీతో మొదటి రోజు కార్యక్రమాలు మొదలయ్యాయి. మారెళ్ల పురుషోత్తమశర్మ, సీతామహాలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం, వారి కుమారుడు, ఆడిటర్ మారెళ్ల గంగరాజుశర్మ సౌజన్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. మల్లిడి మాలతి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కుమారి వి.నీరజ సహకార గానంతో పి.నందకుమార్ వయోలిన్, బి.సురేష్ బాబు మృదంగం సహకారం అందించారు. కార్యక్రమంలో కళాసమితి అధ్యక్షుడు తమలంపూడి చిన ఆదిరెడ్డి, ఉపాధ్యక్షుడు నల్లమిల్లి మురళీమోహన్ బాలకృష్ణారెడ్డి, సహాయ కార్యదర్శులు కొవ్వూరి సత్యనారాయణరెడ్డి, మారెళ్ల శ్రీకృష్ణ ఫణీంద్ర, సభ్యులు పాల్గొన్నారు. -
చా...ర్జ్!
అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు సంక్రాంతి పండుగ సీజన్లో ప్రైవేటు ట్రావెల్ యాజమాన్యాలు అధిక చార్జీలకు టిక్కెట్లు విక్రయించకూడదు. రవాణాశాఖ అధికారులను బృందాలుగా ఏర్పాటు చేసి ముఖ్యమైన కూడళ్లలో బస్సులను ఆపి ప్రయాణికుల నుంచి టిక్కెట్ చార్జీల వివరాలను తెలుసుకుంటారని, ఏ ప్రాంతం నుంచైనా ప్రయాణికుల నుంచి నిర్దేశించిన చార్జీల కంటే అధిక ధరలకు విక్రయించినట్టు ఎవరైనా ఫిర్యాదు చేస్తే బస్సు యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాం. – కె.శ్రీధర్, డీటీఓ, కాకినాడ స్నేహితులతో కారులో వస్తున్నాం హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండగకు సొంతూరు వచ్చేందుకు కుటుంబమంతా బస్సులో బయలుదేరదామనుకున్నాం. ప్రైవేటు బస్సుల్లో చార్జీలు రెండింతలు పెరిగిపోయాయి. కుటుంబమంతా కలిసి ఊరు రావడానికి రూ.15 వేలు పైనే అవుతుంది. రానూ, పోను బస్సు చార్జీలకే సుమారు రూ.30 వేలు అవుతోంది. ఇంత భరించలేక పొరుగున ఉన్న స్నేహితుల కుటుంబంతో కలిసి కారులో రావాలని నిర్ణయించుకున్నాం. కారులో రావడానికి రూ.10 వేలతో సరిపోతుంది. – ఎన్.లావణ్య, హైదరాబాద్ చార్జీల మోత మోగించే వ్యవస్థలు రెండే రెండు. ఒకటి పోలీసు వ్యవస్థ.. రెండోది రవాణా వ్యవస్థలు. శాంతిభద్రలకు భంగం కలిగిస్తున్నారనో.. మరే కారణంగానో పోలీసులు చా..ర్జ్ అని అరిస్తే.. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని పండగలు.. పబ్బాలు.. వేసవి సెలవులు.. ఐదేళ్ల క్రితం కరోనా కష్టకాలమని కూడా చూడకుండా రవాణా సంస్థలు చా..ర్జ్ అని అరిచి భారీ దోపిడీలకు పాల్పడుతుంటాయి. పండగలు.. పుట్టిళ్లు.. బంధువర్గాల కలయికలు.. భావోద్వేగాలే ఆయా ఆపరేటర్ల పెట్టుబడి. రాకరాక వచ్చే సెలవులను అయినవాళ్లతో గడపాలని ఒకరు.. రాకరాక వచ్చే అవకాశాన్ని సొమ్ముచేసుకోవాలని మరొకరు.. వారి నడుమ నడ్డి విరిగి నలిగిపోతున్న సగటు జీతగాడి పరిస్థితి.. అతగాడు మాత్రమే కుటుంబ ప్రేమల మాటున జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నాడు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంక్రాంతికి సొంతూరు రావాలంటే జేబులు గుల్లవడం ఖాయం. బస్సులు, రైళ్లు సీట్లన్నీ ఫుల్ అయిపోయాయి. పెద్ద పండగ సంక్రాంతి మూడు రోజులు సొంతూరులో సరాదాగా బంధువులతో గడుపుదామంటే టిక్కెట్ చార్జీలు గుండెలు గుభిల్లుమనిపిస్తున్నాయి. సంక్రాంతికి రెండు వారాల ముందే ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ మొదలైపోయింది. ఏ ట్రావెల్స్లో అడిగినా అడ్వాన్స్ బుకింగ్లు అయిపోయాయనే సమాధానం ఎదురవుతోంది. సహజంగా సంక్రాంతి పండగకు వారం రోజుల ముందు అంటే వారాంతం సెలవులు చూసుకుని ఈ నెల 9న ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చిరుద్యోగుల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగుల వరకు, చిరు వ్యాపారుల నుంచి బడా వ్యాపారుల వరకు జిల్లా వాసులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే స్థిరపడ్డారు. హైదరాబాద్ తరువాత బెంగుళూరు, ఆ తరువాత స్థానంలో చైన్నె ఉంటాయి. అత్యధికులు హైదరాబాద్ నుంచే రావాల్సి ఉంది. వీరంతా సంక్రాంతి పండగకు పిల్లా పాపలతో కలసి వస్తుంటారు. ఇలా 20 వేల మంది వరకు జిల్లాకు వస్తుంటారని అంచనా. వీరిలో మూడు వంతుల మంది ఒక్క హైదరాబాద్, పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వారే ఉంటారు. మిగిలిన వారు బెంగళూరు, చైన్నె, నెల్లూరు, కృష్ణా, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వస్తారు. ఏటా మాదిరిగానే ప్రైవేటు ట్రావెల్ ఏజెన్సీలు బస్సు చార్జీలను రెండు నుంచి మూడింతలు పెంచేసి ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి. వేలాదిగా వచ్చే వారితో బస్సులు, రైళ్లలో విపరీతమైన రద్దీ ఉంటాయి. టిక్కెట్టు చార్జి ఎంత పెంచినా అవసరాన్ని బట్టి తప్పడం లేదంటున్నారు. ప్రతి పండగకూ ప్రైవేటు బస్సులలో సీటుపై 10 నుంచి 15 శాతం పెంచుకోవడం సహజం. ఇందుకు ప్రయాణికులు కూడా మానసికంగా సిద్ధపడిపోయారు. ఈసారి సంక్రాంతి పండగకు 15 రోజుల ముందుగానే 60 నుంచి 80 శాతం వరకూ అడ్డగోలుగా రేట్లు పెంచేశారు. ఏసీ, స్లీపర్ కోచ్లలో సీట్లను డబుల్ రేట్లకు అమ్ముకుంటున్నారు. ఇవేం చార్జీలు అని అడుగుతుంటే వాహనాల తనిఖీలు, ఇతర ఖర్చులు భరించడం ఎలా అని ఎదురు ప్రశిస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ అడ్డగోలుగా చార్జీల పెంచేస్తున్నా రవాణా శాఖ చూసీచూడనట్టు పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ నుంచి కుటుంబం అంతా కలిసి బయలుదేరడమంటే రూ.15 వేల పై మాటగానే కనిపిస్తోంది. ఒక కుటుంబం రాను, పోను రూ.30 వేలు భరించడం మాటలా అంటున్నారు. పక్షం రోజుల క్రితమే సీట్లు ముందస్తు రిజర్వేషన్లు చేసుకున్నా చార్జీల మోత తప్పలేదని హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులు చెబుతున్నారు. విమాన టిక్కెట్ ధరలతో పోటీ పడుతూ టిక్కెట్ ధరలను అమాంతం పెంచేశారు. ఆర్టీసీ సర్వీసులు, రైళ్లు ఖాళీ లేక ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. సంక్రాంతికి ముందు వారాంతం శనివారం 10 తేదీ కావడంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి రావడానికి ఆ రోజుకే ఎక్కువగా రిజర్వేషన్లు చేయించుకున్నారు. ఆ రోజు ప్రైవేటు ట్రావెల్స్లో సీటు దొరకడమే గగనమైపోయింది. ఏ ట్రావెల్స్లో సీటు అడిగినా ఫుల్ అయిపోయాయి.. ఖాళీ లేవనే సమాధానం చెబుతున్నారు. సంక్రాంతి మూడు రోజులు 14, 15, 16 తేదీల్లో భోగి, సంక్రాంతి, కనుమ, వారాంతం శనివారం 17, ఆదివారం 18 వచ్చింది. జిల్లా నుంచి తిరుగు ప్రయాణానికి 18 తేదీకే డిమాండ్ ఎక్కువగా ఉంది. కారణాలేవైనా ఎక్కువ మంది ఆర్టీసీ కంటే ప్రైవేటు ట్రావెల్స్కే మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు ట్రావెల్స్ అడ్డగోలుగా చార్జీలు పెంచేసి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. నలుగురు సభ్యులున్న కుటుంబం బస్సు ఎక్కాలంటే చార్జీలకు రూ.15 వేలు పెట్టుకోవాల్సి వస్తోందని పలువురు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు తిరుగు ప్రయాణానికి అప్పుడే అడ్వాన్స్ బుకింగులు పెరిగిపోయాయని, టిక్కెట్లు లేవని ట్రావెల్స్ నిర్వా హకులు చెప్పేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ కాకినాడ–హైదరాబాద్ మధ్య ప్రతి రోజూ 30 బస్సులు నడు పుతున్నాయి. బెంగళూరు, చైన్నె వంటి ప్రాంతాలకు ఆరేడు సర్వీసులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా జిల్లా నుంచి ప్రతి రోజూ 1,500 నుంచి 2,000 మంది హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. సంక్రాంతి సీజన్లో ఇంతకు ఆరేడు రెట్లు అదనంగా ప్రయాణిస్తుంటారు. సాధారణ రోజుల్లో ప్రైవేటు ట్రావెల్స్ చార్జీలు నాన్ ఏసీ రూ.900, ఏసీ రూ.1,100, స్లీపర్ రూ.1,500 చార్జీలు ఉండేవి. సంక్రాంతి పండుగ పేరు చెప్పి నాన్ ఏసీ రూ.1,500 నుంచి రూ.2000, ఏసీకి రూ.2,500, స్లీపర్ రూ.3,500, అవకాశాన్ని బట్టి రూ.4000 వరకూ పెంచేశారు. ఇలా బస్సులు చార్జీలు చూసి రైళు ఎక్కుదామంటే అక్కడ కూడా బెర్త్లు నిండుకున్నాయంటున్నారు. సామర్లకోట జంక్షన్ మీదుగా రాకపోకలు సాగించే గౌతమి, గోదావరి సహా అన్ని రైళ్లలో ఈ నెల తొమ్మిది నుంచి 18 తేదీ వరకు దాదాపు రిజర్వేషన్లు క్లోజ్ అయిపోయాయి. ప్రత్యేక రైళ్ల పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ప్రయాణికులపై పండగ మోత ప్రభుత్వ ప్రజా రవాణా ఒకలా.. ప్రైవేటు ఆపరేటర్లు మరోలా.. రైళ్లు ఇంకొకలా బాదుడే బాదుడు ఓ కుటుంబానికి రాను పోను ప్రయాణ ఖర్చు రూ.30 వేల పైమాటే! -
ముదురుతున్న రజకుల చెరువు వివాదం
● చేప పిల్లలను వేయడాన్ని అడ్డుకున్న ఓ వర్గం ● రూ.1.50 లక్షల విలువైన చేప పిల్లల మృతి దేవరపల్లి: పేరం చెరువు వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ఈ చెరువులో శుక్రవారం చేప పిల్లలను వేయడానికి రజకులు ఏర్పాట్లు చేయగా, దళితులు అడ్డుకున్నారు. దీంతో రజకులు చనిపోయిన ఆ చేప పిల్లలను పంచాయతీ కార్యాలయం ప్రధాన ద్వారం ముందు రాశిగా పోసి ఆందోళన చేశారు. రజక నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరపల్లి – బుచ్చియపాలెం రోడ్డులో సుమారు 3.96 ఎకరాల విస్తీర్ణంలో పేరం చెరువు ఉంది. దీన్ని దాదాపు 20 ఏళ్ల క్రితం రజకులకు ప్రభుత్వం కేటాయించింది. చెరువులో రజక వృత్తితో పాటు చేపలు పెంచుకుని ఫలసాయం పొందడానికి డివిజినల్ పంచాయతీ అధికారి ఉత్తర్వులు ఇచ్చారు. అయితే చెరువులో చేపల పెంపకం విషయంలో రజకులు, దళితులకు మధ్య వివాదం ఏర్పడింది. చెరువులో దుస్తులు ఉతకటానికి మాత్రమే హక్కు ఉందని, చేపలు పెంచడానికి వీలు లేదని చెరువు సమీపంలోని దళితులు అభ్యంతరం తెలిపారు. దీంతో రెండు వర్గాల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంది. కాగా.. రజక సంఘం అధ్యక్షులు కొంజర్ల పాలిరాజు, గౌరవాధ్యక్షులు కడెల్లి సుబ్బయ్య, కార్యదర్శి నేతునూరి సుబ్బారావు మాట్లాడుతూ చెరువును శుభ్రం చేసుకుని చేపపిల్లలను వేయడానికి వెళ్లగా, కొందరు అడ్డుకుని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఈ చెరువులో చేపలు పెంచుకోవడానికి, బట్టలు ఉతకడానికి పూర్తి హక్కులు తమకు ఉన్నాయని తెలిపారు. సుమారు 1.50 లక్షల విలువైన 1.5 టన్నుల చేపపిల్లలు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎన్.రవి కిషోర్ను ‘సాక్షి’ వివరణ కోరగా చెరువులో రజక వృత్తి చేసుకోవడానికి, చేపలు పెంచుకుని ఫలసాయం అనుభవించడానికి రజకులను హక్కు ఉందని చెప్పారు. ఈ సమస్యను రెండు సామాజక వర్గాలూ సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు. -
వెలుగు చుక్కలు
విద్యాబోధన మామూలు విద్యార్థులకూ అంధులైన ఉపాధ్యాయులు పాఠాలు చెప్పగలరు. సాధారణ ఉపాధ్యాయుల మాదిరిగానే సేవలు అందించగలరు. వీరి కోసం పాఠ్య పుస్తకాలను ప్రత్యేక బ్రెయిలీ లిపిలోకి ముద్రిస్తారు. వాటిని స్పర్శిస్తూ విద్యార్థులకు పాఠాలు చెబుతారు. వారి సందేహాలను నివృత్తి చేస్తారు. ● అంధులకు ఆసరాగా బ్రెయిలీ లిపి ● ఆరు చుక్కలతో సమస్త విజ్ఞానం ● అన్ని రంగాల్లో ముందంజ ● రేపు ప్రపంచ బ్రెయిలీ లిపి దినోత్సవం రాయవరం: వారంతా అంధులు. పుట్టుకతోనే కొందరు, ప్రమాదవశాత్తూ మరి కొందరు చూపు పోగొట్టుకున్నారు. అయితే కళ్లు లేవని కలత చెందకుండా కేవలం స్పర్శ, శబ్దం, వాసనల ఆధారంగానే వారు అన్ని పనులు సమర్థంగా చేసుకుంటున్నారు. నేత్రాలను కోల్పోయినా తమ జ్ఞాన నేత్రానికి పదును పెడుతూ అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. ఆరు చుక్కల లిపితో తమ జీవితాల్లో వెలుగులు నింపుకొంటున్నారు. అంచలంచెలుగా.. సాధారణంగా చదువు కోవాలంటే పుస్తకాలు తప్పనిసరి. కానీ అంధులు చూడలేని కాబట్టి వారికి స్పర్శతో చదువు చెప్పే విధానం కావాలి. దీని కోసం స్పెయిన్కు చెందిన ఫ్రాన్సిస్కో లూకాస్ 16వ శతాబ్దంలో చెక్క మీద ఎత్తుగా ఉబ్బి ఉండే అక్షరాలను చెక్కే పద్ధతిని రూపొందించాడు. అనంతరం పారథస్ అనే అంధుడైన సంగీతజ్ఞుడు, అతడి మిత్రుడు హెయిలీ కలిసి పేపరు మీద ఎత్తుగా ప్రింటు చేసే విధానం కనుగొన్నారు. అయితే అంధులకు లిపిని కనుగొన్న ఘనత బ్రెయిలీకి దక్కింది. ఆరు చుక్కల లిపి కేవలం చేతి వేళ్లతో ఆరు చుక్కలను స్పర్శించి అక్షర జ్ఞానాన్ని పొందడానికి అనువుగా లూయిస్ బ్రెయిలీ ఈ లిపిని రూపొందించారు. అన్ని భాషలకు ఆరు చుక్కలే ఆధారం. కుడి పక్కన 1, 2, 3 చుక్కలు, ఎడమ వైపున 4, 5, 6 చుక్కలు ఉంటాయి. ఈ ఆరు చుక్కల్లోనే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నంబరు ఉంటుంది. అంధులు ఆ నంబర్లను గుర్తు పెట్టుకుని, మనో నేత్రంతో చదువుతూ విద్యను అభ్యసిస్తున్నారు. లూయిస్ బ్రెయిలీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరుపుకొంటున్నారు. పట్టుదలతో.. పారిస్ సమీపంలోని కూపేవ్రేలో 1809 జనవరి 4న లూయిస్ బ్రెయిలీ జన్మించారు. మూడేళ్ల వయసులో తండ్రి దుకాణంలో పనిముట్లతో ఆడుకుంటుండగా, ఒక పనిముట్టు ఆయన కుడి కంటికి తగలడంతో చూపును కోల్పోయారు. అయినా పట్టుదలతో ప్రసిద్ధ సంగీత విద్వాంసుడిగా మారాడు. తనలా బాధపడుతున్న వారి కోసం బ్రెయిలీ ఒక లిపిని కనిపెట్టారు. కేవలం పదిహేనేళ్ల వయసులో ఫ్రెంచ్ వర్ణమాల ఆధారంగా బ్రెయిలీ కోడ్ను అభివృద్ధి చేశారు. ఆత్మ విశ్వాసంతో.. పుట్టుకతోనే అంధత్వంతో జన్మించాను. తల్లిదండ్రులైన మంగమ్మ, వెంకన్నలు నన్ను కంటి పాపలా కాపాడారు. మండపేట అంధుల పాఠశాలలో బ్రెయిలీ లిపి ద్వారా విద్యాభ్యాసం చేశాను. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం టీచర్ శిక్షణ పొంది ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాను. బ్రెయిలీ లిపితో నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. – వేల్పూరి వీరబాబు, ఎంపీయూపీ స్కూల్ ఉపాధ్యాయుడు, వెదురుమూడి, కపిలేశ్వరపురం మండలం కళ్లు లేవని బాధపడలేదు కళ్లు లేవని బాధపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాను. పుట్టుకతోనే నా రెండు కళ్లకూ చూపు లేదు. లూయిస్ బ్రెయిలీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలనే పట్టుదలతో చదివాను. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. – పి.దొరబాబు, ఉపాధ్యాయుడు, ఎస్పీఎస్ఆర్ మున్సిపల్ స్కూల్, రాజకోట, రామచంద్రపురం, -
శివలింగం ఘటనపై బీజేపీ మాట్లాడదేం?
● దేవదాయశాఖ మంత్రి విచారణ జరపాలి ● మాజీ ఎంపీ భరత్ రామ్ రామచంద్రపురం రూరల్: ప్రసిద్ధ శివాలయంలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కపాలేశ్వరస్వామి శివలింగం ధ్వంసమైతే బీజేపీ ఎందుకు నోరు మెదపడం లేదని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు. ఆయన శుక్రవారం ద్రాక్షారామ భీమేశ్వరాలయ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో శ్రీకాకుళంలోని శ్రీరామపాద క్షేత్రంలో శివలింగం ధ్వంసమైనప్పుడు, అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటనల్లో తెలుగుదేశం పార్టీ రాద్ధాంతం చేసిందన్నారు. ప్రస్తుతం శివలింగం ధ్వంసమైతే కాతేరు నుంచి మరో శివలింగాన్ని తీసుకుని వచ్చి మూఢంలో నిబంధనలు పాటించకుండా ప్రతిష్ఠించడం సరికాదన్నారు. దీనిపై హిందువులకు ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేవదాయశాఖ మంత్రి ఇక్కడికి వచ్చి, సమగ్ర విచారణ చేసి ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రామచంద్రపురం కో ఆర్డినేటర్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పిల్లి సూర్యప్రకాశ్, వైస్ ఎంపీపీ శాకా బాబీ, ఉప సర్పంచ్ వల్లు శివ, నాయకులు కర్రి రవీంద్ర, రెడ్డింశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
రత్నగిరి వనదుర్గ ఆలయంలో ఖడ్గమాల పూజ
● ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభం ● ప్రతి శుక్రవారం నిర్వహణ ● టిక్కెట్ ధర రూ.1,116గా నిర్ణయం అన్నవరం: స్థానిక వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలోని వనదుర్గ అమ్మవారి ఆలయంలో మరో కొత్త పూజకు శ్రీకారం చుడుతున్నారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఖడ్గమాల స్తోత్రంతో శ్రీచక్రంపై కుంకుమపూజ నిర్వహించే కార్యక్రమాన్ని (ఖడ్గమాల పూజ) ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభించనున్నట్లు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వేండ్ర త్రినాథరావు శుక్రవారం తెలిపారు. వనదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం ఉదయం 7.30 నుంచి 8.30 వరకూ ఈ పూజ జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు నిర్వహించే చండీహోమం, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో నిర్వహించే ప్రత్యంగిర హోమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఖడ్గమాల పూజలకు టిక్కెట్ ధరను రూ.1,116గా నిర్ణయించారు. ఈ పూజలో భార్యాభర్తలు పాల్గొనవచ్చు. విధి విధానాలపై చర్చ ఖడ్గమాల పూజ విఽధి విధానాల రూపకల్పనపై పండితులతో చర్చిస్తున్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరిగే ఖడ్గమాల పూజ మాదిరిగానే నలుచదరంగా ఉండే పలక మీద గల శ్రీచక్రానికి భక్తులతో పూజలు చేయించి, అనంతరం రాగి శ్రీచక్రం గల డాలర్, పూజ చేసిన కుంకుమ, ప్రసాదం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. శ్రీచక్రం గల పలకను దేవస్థానం వెనక్కి తీసుకుని మరో భక్తుని పూజలో ఉపయోగిస్తారు. అయితే దీనిపై దేవస్థానం ఆస్థాన సిద్దాంతి తంగిరాల వెంకటకృష్ణ పూర్ణ ప్రసాద్, ఆగమ సలహదారు త్రివేది కపిలవాయి రామశాస్త్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని దేవస్థానం అధికారులు తెలిపారు. -
అన్నవరం @ 4వ స్థానం
● ఐవీఆర్ఎస్ సర్వేలో మెరుగుపడిన ర్యాంకు ● భక్తులకు అందించే సేవలలో పుంజుకున్న వృద్ధి ● డిసెంబర్లో 67.9 శాతం మంది సంతృప్తి అన్నవరం: రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్య క్షేత్రాలలో భక్తులకు అందుతున్న సేవలపై గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అభిప్రాయ సేకరణలో అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నాలుగో స్థానంలో నిలిచింది. నవంబర్లో నిర్వహించిన సర్వేలో ఆరో స్థానంలో నిలిచిన దేవస్థానం ఈ సారి నాలుగో స్థానానికి ఎగబాకింది. ఆ స్థానాన్ని దక్కించుకున్నప్పటికీ దేవస్థానంలో నవంబర్లో నిర్వహించిన సర్వేలో 33 శాతం మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేయగా ఈ సారి 32.1 శాతం మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేశారు. ● గత ఏప్రిల్ నెలలో నిర్వహించిన సర్వేలో దేవస్థానం అట్టడుగు స్థానం పొందడంతో జిల్లా లెక్టర్ షణ్మోహన్ ఆలయంలో తనిఖీలు చేసి ఎలాగైనా ఆలయాన్ని మొదటి స్థానంలో నిలపాలని సిబ్బందిని ఆదేశించిన విషయం తెలిసిందే. తరువాత కొంత మెరుగుపడినా మళ్లీ ఆరో స్థానానికి పడిపోయింది. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలవడం కూడా ఆలయ ప్రతిష్టను దిగజార్చినట్టు చెప్తున్నారు. ● గత నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు వాట్సాప్, ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం దేవస్థానాలలో నిర్వహించిన ఈ సర్వేలో శ్రీకాళహస్తి 71.2 శాతంతో ప్రధమ స్థానంలో నిలవగా 67.9 శాతం భక్తుల సానుకూల స్పందనతో అన్నవరం నాలుగో స్థానంలో నిలిచింది. 66 శాతం సానుకూల స్పందనతో కాణిపాకం ఏడో స్థానంలో నిలిచింది. నెల వారీగా భక్తుల సంతృప్త స్థాయిలు ఇవీ ● సత్యదేవుని దర్శనం విషయంలో డిసెంబర్లో 69.9 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. జూన్లో 73, జూలైలో 74, ఆగస్టులో 75.8, సెప్టెంబర్లో 74.1, అక్టోబర్లో 68, నవంబర్లో 69.7 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ● మౌలిక వసతుల కల్పనలో డిసెంబర్ నెలలో 61.9 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. జూన్లో 66 శాతం, జూలైలో 65, ఆగస్టులో 64.9, సెప్టెంబర్లో 66, అక్టోబర్లో 63, నవంబర్లో 61.6 శాతం సానుకూలంగా స్పందించారు. ● స్వామివారి గోధుమ నూక ప్రసాదం నాణ్యతపై డిసెంబర్ నెలలో 78.6 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. జూన్లో 77, జూలైలో 78, ఆగష్టులో 76.9, సెప్టెంబర్లో 79.2, అక్టోబర్లో 76, నవంబర్లో 77.6 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ● పారిశుధ్య నిర్వహణలో డిసెంబర్లో 63.1 శాతం మాత్రమే సంతృప్తి వ్యక్తం చేవారు. జూన్లో 70, జూలైలో 68, ఆగస్టులో 66.5, సెప్టెంబర్లో 64.5, అక్టోబర్లో 63, నవంబర్లో 64.2 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం మీద డిసెంబర్లో 67.9 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, 32.1 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుధ్యం, మౌలిక వసతులపై అసంతృప్తి దేవస్థానంలో పారిశుద్యం, మౌలిక వసతుల కల్పన ఆశించిన మేర లేదని భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవస్థానంలో గత మూడు నెలలుగా చిత్తూరుకు చెందిన పద్మావతి సంస్థ పారిశుధ్య నిర్వహణను చూస్తోంది. వయోపరిమితి పేరుతో అనుభవజ్ఞులైన 50 మంది సిబ్బందిని తొలగించారు. వారి స్థానంలో రాజకీయ ఒత్తిళ్లతో నియామకమైన కొత్తవారి అనుభవ లేమి వల్ల ఈ అసంతృప్తి నెలకొన్నట్టు చెప్తున్నారు. ధోబీలతో దుప్పట్లు ఉతికిస్తున్నారు ఆలయంలోని సత్రాలలొని మంచాలపై దుప్పట్లు, గలేబులు తదితర వస్త్రాలను వాషింగ్ మెషీన్లతో కాకుండా ధోబీలతో ఉతికిస్తుండడం వల్ల శుభ్రత లోపిస్తోందని తెలుస్తోంది. గతంలో కేఎల్టీసీ సంస్థ శానిటరీ మిషన్లతో వాటిని ఉతికేవారు. అలాగే నాణ్యమైన మెటీరియల్తో పారిశుధ్య పనులు చేస్తుండడం వల్ల కూడా నాణ్యత లోపానికి కారణంగా తెలుస్తోంది. ఈ విషయమై పద్మావతి సంస్థ ప్రతినిధులు వాషింగ్ మెషీన్ ఏర్పాటుకు తాము సిద్ధమేనని కానీ అందుకు అవసరమైన షెడ్డు లేదని చెప్తున్నారు. దీనిపై ఆలయ ఈఈ రామకృష్ణ వివరణ ఇస్తూ షెడ్డు నిర్మాణం పూర్తయ్యిందని త్వరలో ఆ సంస్థకు షెడ్డును అప్పగిస్తామని తెలిపారు. ప్రసాదం విషయంలో ఊరట స్వామివారి ప్రసాదం విషయంలో భక్తులు 78.6 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయడం కొంత ఊరట కలిగే విషయం. వాస్తవానికి గోధుమ నూక ప్రసాదంలో నూటికి నూరు శాతం భక్తులు సంతృప్తి వ్యక్తం చేయాల్సినంత నాణ్యతగా ఉంటుంది. కాని 21 శాతం మంది అసంతృప్తికి కారణం ఎవరికి అర్ధం కావడం లేదు. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఎక్కువ సేపు క్యూ లైన్లలో నించోవడం వల్ల అసంతృప్తి, మౌలికవసతులు, పారిశుధ్యం బాగా లేకపోవడం వంటి వాటి ప్రభావం ప్రసాదంపై పడి ఉండవచ్చనే అభిప్రాయం అధికారులలో వ్యక్తమవుతోంది. వయసు మీరిందనే తొలగించాం శానిటేషన్ విభాగంలో 55 ఏళ్లు దాటిన వారిని కొనసాగించ వద్దని ప్రభుత్వం నిబంధన విధించడంతో ఆలయంలో 50 మందిని తొలగించాం. వారి వారసులలో ఎవరైనా సమర్ధులుంటే వారి స్థానంలో నియమిస్తాం. అటువంటి వారు ఉంటే దేవస్థానంలో తమ సూపర్వైజర్లను కలిస్తే పరిశీలిస్తాం. – భాస్కరనాయుడు, ఎండీ, పద్మావతి శానిటరీ సంస్థ -
ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి
రామచంద్రపురం రూరల్: అనేక మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలని రామచంద్రపురం మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ రెడ్డి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. రామచంద్రపురం ఆర్టీసీ డిపో గ్యారేజీలో శుక్రవారం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. డిపో మేనేజర్ పేపకాయల భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంవీఐ రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డిపో మేనేజర్ భాస్కరరావు మాట్లాడుతూ డ్రైవర్లకు మంచి శిక్షణతో కూడిన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదాలను ఎలా నివారించవచ్చు అనే అంశంపై వివరించారు. బస్సు కండిషన్ను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలన్నారు. సమావేశంలో సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.రవికుమార్, అసిస్టెంట్ మెకానిక్ ఫోర్మెన్ జి.రవిబాబు తదితరులు పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
‘మాటలే కోటలు దాటుతున్నాయ్.. చేతలు మాత్రం ఇళ్లు దాటడం లేదు’
కాకినాడ: ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాటలు మాత్రం కోటలు దాటుతూనే ఉన్నాయి కానీ చేతలు మాత్రం ఇళ్లు దాటడం లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. గత ఏడాదిగా పాలన గాలికొదిలేసి.. అరాచకం, విధ్వంసం, మోసం, వంచన, క్రెడిట్ చోరీతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. ఈరోజు(శుక్రవారం, జనవరి 2వ తేదీ) కాకినాడ నుంచి మాట్లాడిన కురసాల.. ‘చంద్రబాబు, లోకేష్ పాలన గాలికి వదిలేసి విదేశి పర్యాటనలకు వెళ్ళారు. అధికారంకంగా వెళ్తున్నామా? వ్యక్తిగతంగా వెళ్ళారో ఎవరికి తెలియదు. ప్రజల్ని ఎందుకు ఇంత అయోమంకు గురి చెసి... పర్యటనలను రహస్యంగా ఉంచారు. వైఎస్ జగన్ గతంలో తన కుమార్తె దగ్గరకు లండన్ వెళ్తే లోకేష్ ఎంతో హేళన చేశారు. నోరు విప్పితే చంద్రబాబు, లోకేష్ అబద్దాలు. .పిట్ట కధలు వల్లిస్తారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి అప్పులు చేసేస్తున్నారని టిడిపి వీపరితమైన ప్రచారం చేసింది.గత 18 నెలల కాలంలో అత్యధిక అప్పులు కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆర్బీఐ చెబుతోంది. ఇప్పటి వరకు చంద్రబాబు రూ.2.9 లక్షలు కోట్లు అప్పు చేశారు. సంపద సృష్టి లేదు..ఉద్యోగ కల్పన లేదు.. పారిశ్రామిక వేత్తలు రావడం లేదని ఆబద్దాలను ప్రజల మీదకు వదులుతున్నారు. ఆర్బీఐ నివేదిక ఆధారంగా వైఎస్ జగన్ చేసిన ట్వీట్కి ఇప్పటి వరకు చంద్రబాబు సమాధానం చెప్పలేదు. 2019-24 లో తయారీ రంగంలో సౌత్ లో మొదటి స్ధానంలోను, దేశంలో ఐదవ స్ధానంలో ఉందని ఆర్బీఐ నివేదిక ఇచ్చింది. ఈ ఎనిమిది నెలల కాలంలో జిఎస్టీ 3.48% పెరిగింది. సగటున 10% పెరగాలి. స్టేట్ సేల్స్ టాక్స్ పడిపోయింది. ఊళ్ళల్లో నిర్మాణ పనులు జరగడం లేదు. పండుగ పూట రోడ్లు, దుకాణాలు కాళీగా ఉన్నాయి.చంద్రబాబు చేసిన అప్పుల సొమ్ములను ఏం చేశారు?, పధకాలు అమలు చేయడం లేదు...ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వడం లేదు. దేశ విదేశాలకు పాఠాలు చెబుతాననే చంద్రబాబు. ఏపీకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పలేకపోతున్నాడు. అమరావతి రైతులు చంద్రబాబు ద్రోహనికి బలైపోయే రోజులు వస్తాయి. ఈ ఏడాదిన్నర కాలంలో అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుండి ఒక్క గ్రాంట్ తీసుకువచ్చారా?, అమరావతిలో వందల కోట్లతో నీళ్లు తోడుతున్నారు. అమరావతి రైతు చనిపోతే చంద్రబాబుకు చీమ కుట్టినట్లు లేదు. రైతు కూల్గా మాట్లాడి చనిపోయాడని అబద్దపు ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు. -
ఎలా చేస్కోవాలి పండగ?
● జిల్లాలో 5.60 లక్షల రేషన్ కార్డులు ● అమలాపురం పట్టణానికే గోధుమపిండి పరిమితం ● 11,634 కార్డుదారులకు మాత్రమే.. ● చంద్రబాబు ప్రభుత్వ వచ్చిన తర్వాత నిలిచిన కందిపప్పు పంపిణీ ● ఆగిపోయిన ఇంటింటికీ రేషన్ సరఫరాప్రతి ఒక్కరికీ గోధుమపిండి అందించాలి పేద, మధ్య తరగతికి మేలు చేసే ప్రతి నిత్యావసర వస్తువును ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందరికీ అందించాలి. కేరళ ప్రభుత్వం 16 రకాల నిత్యావసర వస్తువులను అందిస్తోంది. గోధుమ పిండి ప్రతి లబ్ధిదారునికి అందించాలి. మేలైన బియ్యంతోపాటు కందిపప్పు ఇతర వస్తువులు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. – కారెం వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడురేషన్ దుకాణాల్లో కందిపప్పు కనుమరుగుసాక్షి, అమలాపురం: పావలా పనికి.. ముప్పావలా ప్రచారం అనే నానుడికి చంద్రబాబు ప్రభుత్వ పాలన నిదర్శనమనే విమర్శలు వస్తున్నాయి. పండగ సమయంలో చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు, మధ్య తరగతి వర్గాలకు మేలు చేసేందుకు చెక్కి గోధుమ పిండి పంపిణీ చేస్తామని ప్రభుత్వ పక్షం రోజులుగా ఊదరగొడుతోంది. దీనిపై అధికారుల సమీక్షలు సాగిస్తుండగా, సొంత మీడియా, సామాజిక మాధ్యమాలలో ప్రచారం హోరెత్తిస్తోంది. ఇంతా చేసి కేవలం జిల్లా ప్రధాన కేంద్రం ఉన్న నగరాలకు, పట్టణాలకు మాత్రమే గోధుమపిండి పంపిణీ అని ఇప్పుడు చల్లగా చెబుతోంది. ప్రచారానికే పరిమితం సంక్రాంతి పండగనాడు పేదలకు చెక్కి గోధుమ పిండి ఇస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుపై కేజీ చొప్పున గోధుమ పిండి ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. కేజీ రూ.20 చొప్పున ఇస్తామని ప్రకటించింది. బహిరంగ మార్కెట్లో కేజీ క్వాలిటీ గోధుమ పిండి రూ.60 నుంచి రూ.65 వరకు పలుకుతోంది. సంక్రాంతి నాడు పేదలకు మేలు చేసేందుకు ఇలా పంపిణీ చేస్తున్నామని చెప్పుకొచ్చింది. దీనిపై పక్షం రోజులుగా ప్రచారం హోరెత్తిస్తోంది. తీరా అమలు చేయాల్సిన సమయానికి వచ్చేసరికి జిల్లా కేంద్రమైన అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోనే ఇస్తామని చెప్పడం గమనార్హం. మున్సిపాలిటీ పరిధిలో కేవలం 11,634 కార్డు దారులకు మాత్రమే పరిమితం చేశారు. దీనికి కూడా శుక్రవారం పట్టణ పరిధిలో ఉన్న 19 రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తామని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి ప్రకటించారు. అయితే అమలాపురం పట్టణంలో గురువారం నుంచి పంపిణీ మొదలయ్యింది. మండిపడుతున్న వినియోగదారులు చెక్కి గోధుమపిండి కేవలం అమలాపురం పట్టణవాసులకు మాత్రమే పరిమితం అని తెలిసి జిల్లాలోని రేషన్ కార్డుదారులు కంగుతిన్నారు. జిల్లాలో మండపేట నియోజకవర్గంతో కలిపి సుమారు 5.60 లక్షల రేషన్ కార్డుదారులు ఉన్నారు. అంటే మొత్తం లబ్ధిదారులలో కేవలం 2 శాతం మందికి మాత్రమే గోధుమ పిండి అందుతుందని అంచనా. జిల్లాలో మండపేట, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీతోపాటు 23 మండలాల్లో ఈ గోధుమ పిండి పంపిణీ లేదు. దీనిపై వినియోగదారులు మండిపడుతున్నారు. పండగ అమలాపురం పట్టణవాసులకేనా అని ప్రశ్నిస్తున్నారు. బాబు ప్రభుత్వంలో రేషన్ వ్యవస్థ చిన్నాభిన్నం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజా పంపిణీ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాణ్యమైన బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్) అందించేవారు. అరకేజీ పంచదార, కేజీ చొప్పున కందిపప్పు, గోధుమ పిండిని వినియోగదారులకు అందజేసేవారు. రేషన్ను ఇంటింటికీ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్(ఎండీయూ)ల ద్వారా పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత నెమ్మది నెమ్మదిగా ఈ వ్యవస్థను తొలగించారు. ఇప్పుడు వృద్ధులు, వితంతువులు కూడా రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఎండీయూలను తొలగించడంతో సుమారు 250 మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. వీరు రోడ్డు ఎక్కి ఆందోళన చేసినా బాబు ప్రభుత్వం కనికరం చూపలేదు. పలు సందర్భాలలో రేషన్ ద్వారా ముతక బియ్యం ఇస్తుండడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే కందిపప్పును నిలిపివేశారు. కేవలం గత ఏడాది జనవరి కందిపప్పు రూ.67 చొప్పున అందించారు. ఇప్పుడు ఇది నిలిపివేయగా బహిరంగ మార్కెట్లో కేజీ కందిపప్పును రూ.120 నుంచి రూ.135 చేసి కొనుగోలు చేయాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో గోధుమపిండి ప్రతి లబ్ధిదారునికి అందించగా, బాబు ప్రభుత్వం నిలిపివేసింది. తాజాగా దీనిని అమలాపురం పట్టణ పరిధిలో కేజీ రూ.20 చేసి అందించాలని నిర్ణయించారు. -
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా రత్నగిరికి గురువారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సత్యదేవుని ఆలయానికి భక్తుల రాక కొనసాగింది. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. సత్యదేవుని వ్రతాలు 1,800 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఉదయం 9 గంటలకు చండీహోమం నిర్వహించనున్నారు. రూ.750 టికెట్టుతో భక్తులు ఈ హోమంలో పాల్గొనవచ్చు. ఉత్సాహంగా సైన్స్ రంగోలీ పోటీలు పెద్దాపురం (సామర్లకోట): నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకొని పట్టణ చిల్ట్రన్స్ క్లబ్ ఆధ్వర్యాన పెద్దాపురం యాసలపు సూర్యారావు భవనంలో విద్యార్థులకు గురువారం జిల్లా స్థాయి సైన్స్ ముగ్గుల పోటీలు నిర్వహించారు. జూనియర్, సీనియర్స్, సూపర్ సీనియర్స్ విభాగాల్లో 300 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని క్లబ్ గౌరవాధ్యక్షుడు బుద్దా శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షురాలు కూనిరెడ్డి అరుణ, ప్రతినిధులు అనూష, అంజలి, జస్విత, సాయి బంగారం, నేహా, రేణుకా, పవన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. రాచపల్లిలో స్క్రబ్ టైఫస్ కేసు ప్రత్తిపాడు రూరల్: మండలంలోని రాచపల్లిలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదైంది. స్థానిక నంది సెంటర్కు చెందిన 64 ఏళ్ల నాగభూషణం అనే మహిళకు ఈ వ్యాధి సోకినట్లు గుర్తించామని రాచపల్లి పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ గీతా సుధ గురువారం తెలిపారు. బాధిత మహిళను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జిల్లా వ్యవసాయ అధికారిగా రాబర్ట్ పాల్ రాజమహేంద్రవరం రూరల్: జిల్లా వ్యవసాయ అధికారిగా కె.రాబర్ట్ పాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఈ స్థానంలో ఉన్న మాధవరావు బుధవారం ఉద్యోగ విరమణ చేశారు. పాల్ ఉమ్మడి జిల్లా ఆత్మ ప్రాజెక్ట్ మేనేజర్గా వ్యవహరిస్తూ, ఇన్చార్జి జిల్లా వ్యవసాయ అధికారిగా నియమితులయ్యారు. ఆయనకు రాజమహేంద్రవరం ఏడీఏ సూర్యరమేష్, ఏఈఓ సంఘం అధ్యక్షుడు వేణుమాధవ్, పలువురు వ్యవసాయ అధికారులు అభినందనలు తెలిపారు. -
● ప్రకృతి మ‘హిమ’
సొంత కాన్వాసుపై ప్రకృతి స్వయంగా గీచిన చిత్రం నేత్రానందాన్ని కలిగిస్తుంది. నూతన సంవత్సరం ప్రారంభం రోజైన గురువారం.. గోకవరంలో అటువంటి చిత్రమే ఆవిష్కృతమైంది. దట్టంగా కమ్ముకున్న పొగమంచు తెరలు.. శీతల వాతావరణం ప్రజలను గిలిగింతలు పెట్టింది. ఉదయం పది గంటలవుతున్నా మంచు పరదాలను ఛేదించలేక సూర్యుడు సైతం చిన్నబోయాడు. – గోకవరం -
ఉత్తరాది భక్తులదక్షిణాయనం
● వందలాది టూరిస్టు బస్సులలో వేలాదిగా రాక ● అన్నవరంలో సందడి● బస్సుల వద్దనే బస.. నిత్యకృత్యాలుఅన్నవరం: సూర్యుడి గమనం ఉత్తర దిశగా ఉంటే ఉత్తరాయనమని.. దక్షిణ దిశగా జరుగుతూంటే దక్షిణాయనమని వ్యవహరిస్తారు. సరిగ్గా ఇదే విధంగా ఉత్తరాది భక్తులు ప్రస్తుతం దక్షిణాయనం మొదలుపెట్టారు. దక్షిణ భారతదేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ.. ఆ క్రమంలో అన్నవరం పుణ్యక్షేత్రానికి వేలాదిగా తరలి వస్తున్నారు. ఉత్తర ప్రదేశ్లోని వారణాశి, అయోధ్య, ప్రయాగరాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, రుషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్ వంటి పుణ్యక్షేత్రాలకు దక్షిణాది భక్తులు ముఖ్యంగా తెలుగువారు ఎక్కువ సంఖ్యలో వెళ్తూంటారు. అటువంటిది.. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాల సందర్శనకు టూరిస్టు బస్సులలో తరలి వస్తున్నారు. పది రోజులుగా వారు వస్తున్న బస్సులతో రత్నగిరి దిగువన ఉన్న కళాశాల మైదానం సందడిగా మారుతోంది. ఫిబ్రవరి వరకూ.. ఉత్తర భారతంలోని హర్యానా, రాజస్థాన్, బిహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్తో పాటు మధ్య భారత్లోని ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో పంటల సాగు సాధారణంగా డిసెంబర్లో పూర్తవుతుంది. అనంతరం, అక్కడి భక్తులు అధిక సంఖ్యలో ప్రత్యేక బస్సులలో దక్షిణ భారత తీర్థయాత్రలకు బయలుదేరుతారు. ఎక్కువగా మధ్య తరగతికి చెందిన నడి వయస్కులే ఈ యాత్రలు చేస్తూండటం విశేషం. రత్నగిరికి డిసెంబర్లో మొదలైన ఉత్తరాది భక్తుల రాక ఫిబ్రవరి వరకూ కొనసాగుతుంది. గతంలో భక్తులు సాధారణంగా టూరిస్టు బస్సులలోనే తీర్థయాత్రలు చేసేవారు. కొన్నేళ్లుగా రైళ్లు, కార్లలో యాత్రలు చేసేవారు ఎక్కువయ్యారు. కానీ, ఉత్తరాది భక్తులు మాత్రం ఇప్పటికీ టూరిస్టు బస్సులలోనే యాత్రలు చేస్తూండటం విశేషం. వీరు సమూహాలుగా వందల వేల కిలోమీటర్లు బస్సులలోనే ప్రయాణిస్తూంటారు. కనీసం పదికి తక్కువ కాకుండా గరిష్టంగా 50 వరకూ కూడా టూరిస్టు బస్సులలో భక్తులు వచ్చిన సందర్భాలున్నాయి. సొంతంగా వంట వీరు వంట సామగ్రి, పొయ్యిలు, గ్యాస్ సిలిండర్లు తమ వెంట తెచ్చుకుంటున్నారు. బస్సులు ఆగినచోటనే వంటలు చేసుకుని, అందరూ కలసి, ఒక వరుసలో కూర్చుని భోజనాలు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా బయటి హోటళ్లలో కొనుక్కుని తినరు. ఫలహారమైనా, చపాతీలైనా, పూరీలైనా సొంతంగా తయారు చేసుకోవలసిందే. ప్రతి బస్సులో ఒక వంట మేస్త్రి, ఇద్దరు సహాయకులు ఉంటారు. వీరికి మరి కొంత మంది భక్తులు సహాయం చేస్తారు. ఎక్కువగా చపాతీలు, పూరీలు, టమాటా, బంగాళాదుంప కూర తయారు చేసుకుంటారు. దీనికి అవసరమైన గోధుమ పిండి, నూనె, బంగాళా దుంపలు, టమాటాలు, ఇతర కూరగాయలు కూడా తమ వెంట తెచ్చుకుంటారు. ఇవి అయిపోతే స్థానికంగా కొనుక్కుంటారు. దగ్గరలో సత్రాలుంటే వాటిలో హాల్స్ అద్దెకు తీసుకుని బస చేస్తారు. లేకపోతే బస్సుల వద్దనే విశ్రమించడం వీరికి అలవాటు. వారి వస్త్రాలు కూడా బస చేసిన ప్రదేశం వద్దనే ఉతుక్కుని ఆరబెట్టుకుంటారు. దర్శనానికి కాలి నడకనే.. గతంలో ఉత్తరాది భక్తులు తమ బస్సులను రత్నగిరిపై నిలుపు చేసి సత్యదేవుని దర్శనానికి వెళ్లేవారు. అయితే, కొండ దిగువన కళాశాల మైదానంలో దేవస్థానం అన్ని వసతులూ కల్పించడంతో వీరు కొన్నాళ్లుగా కొండ దిగువనే తమ బస్సులు నిలిపి, సత్యదేవుని దర్శనానికి వెళ్తుతున్నారు. ఎక్కువ మంది కళాశాల మైదానంలోని బాత్ రూములలో స్నానాలు చేసి, ఘాట్ రోడ్ మీదుగా కాలి నడకనే ఆలయానికి చేరుకుంటున్నారు. సత్యదేవుని దర్శనానంతరం, తిరిగి తమ బస్సుల వద్దకు వస్తూంటారు. ఉపయోగపడుతున్న షెడ్లు టూరిస్టు బస్సులలో వచ్చే భక్తుల కోసం కళాశాల మైదానం వద్ద 2023లో అప్పటి ఈఓ చంద్రశేఖర్ అజాద్ హయాంలో 5 విశ్రాంతి షెడ్లు, ఒక వంట షెడ్డు నిర్మించారు. వీటిలో అవసరమైన సౌకర్యాలను ఆ తరువాతి ఈఓ కె.రామచంద్ర మోహన్ హయాంలో కల్పించారు. ఇప్పుడు ఆ షెడ్లు ఉత్తరాది భక్తులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఆ మెట్ల దారి ప్రారంభిస్తే వీరికి మేలు ప్రస్తుతం ఉన్న మెట్ల దారిని తొలి పావంచా నుంచి రత్నగిరిపై ఆలయం వరకూ గతంలో నిర్మించారు. కళాశాల మైదానం నుంచి ఆ మెట్ల దారికి చేరుకోవాలంటే సుమారు కిలోమీటరు దూరం నడవాల్సి వ స్తోంది. ఈ నేపథ్యంలో కళాశాల మైదానంలోని మొద టి ఘాట్ రోడ్డు నుంచి రత్నగిరి పైకి కొత్త మెట్ల మా ర్గం నిర్మించారు. దీని ప్రారంభంలో ఆర్చి, మెట్లకు ఇ రువైపులా పిట్ట గోడ నిర్మాణానికి త్వరలో టెండర్లు పి లవనున్నారు. ఆ పనులు పూర్తయి, నూతన మెట్ల మా ర్గం ప్రారంభమైతే ఉత్తరాది భక్తులతో పాటు దేవస్థా నం కళాశాల మైదానంలో వాహనాలను నిలుపు చేసి, కాలి నడకన వచ్చే భక్తులకు ఎంతో మేలు జరుగుతుంది. టూరిస్టు బస్సులలో వచ్చే భక్తుల కోసం దేవస్థానం నిర్మించిన షెడ్లు కళాశాల మైదానంలో ఉత్తరాది భక్తుల టూరిస్టు బస్సులు -
ఆధ్యాత్మిక జ్ఞానశక్తితో ఆశయ సాధన
పిఠాపురం: జీవితాశయ సాధనకు మానసిక శక్తి, మనోధైర్యం, సంకల్పంతో కూడిన ఆధ్యాత్మిక, తాత్త్విక జ్ఞానశక్తి అవసరమని విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ ఆలీషా అన్నారు. నూతన ఆంగ్ల సంవత్సర ఆరంభం సందర్భంగా పీఠంలో గురువారం నిర్వహించిన జ్ఞాన మహాసభలో ఆయన అనుగ్రహ భాషణం చేశారు. మనసును స్థిరపరచుకునే తత్వమే ఆధ్యాత్మిక తత్వమని, దీని ద్వారా జీవితంలో చిన్న చిన్న వివాదాలు తొలగించుకుని, నిరంతరం సుఖసంతోషాలతో జీవించడానికి, మంచి చెడుల విశ్లేషణతో కూడిన మానసిక స్థితిని ఏర్పరచుకోవాలని అన్నారు. మనలోని లోపాలను సవరించుకోకుండా ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదన్నారు. ఆ లోపాలను తొలగించుకునే విధానమే ఆధ్యాత్మిక తత్త్వమన్నారు. మానవత్వాన్ని బోధించేదే మతమని, మానవత్వాన్ని హరించేది మతం కాదని, రాక్షసత్వమని అభివర్ణించారు. మనసును తాత్త్విక జ్ఞానశక్తితో నింపుకోవడానికి సద్గురు మార్గంలో త్రయీ సాధన ఆచరించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి, గురు దక్షిణగా ప్రకృతిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అమెరికాకు చెందిన కిరణ్ ప్రభ మాట్లాడుతూ, పీఠం నిర్వహిస్తున్న బాలవికాస్ కార్యక్రమాలను కొనియాడారు. డాక్టర్ కొండా నరసింహారావు, అలివేలు మంగాదేవి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో తాత్త్విక బాల వికాస్ చిన్నారుల ప్రసంగాలు అందరినీ అలరించాయి. ఉమా ముకుంద నేతృత్వంలో సంగీత విభావరి రంజింపజేసింది. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఉమర్ ఆలీషా మహిళా యువతకు వస్త్రాలు, దంగేటి రామకృష్ణ సహకారంతో పీఠాధిపతి చేతుల మీదుగా ధాన్యపు కుచ్చులు పంపిణీ చేశారు. -
కలెక్టరేట్లో నూతన సంవత్సర వేడుకలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి తూ ర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ అపూ ర్వ భరత్, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, డీఆర్వో జె.వెంకటరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దేవదాయ శాఖ ఆధ్వర్యాన అన్నవరం దేవస్థానం పు రోహితులు, వేద పండితులు కలెక్టర్కు వేదాశీర్వచనా లు అందించారు. అనంతరం రాయుడుపా లెం ఉమా మనోవికాస కేంద్రం, సామర్లకోట సిరి మానసిక దివ్యాంగుల పాఠశాల చిన్నారులతో కలసి కలెక్టర్ నూ తన సంవత్సర వేడుకలు జరుపుకొన్నారు. కేక్ కట్ చేసి, చిన్నారులకు పంచారు. నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు కనీస వసతులు కల్పించే ఉద్దేశంతో తాను చేసిన విజ్ఞప్తి మేరకు జిల్లాలోని దాతలు, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలు, అధికారులు, ఉద్యోగ సంఘాలు సుమారు రూ.30 లక్షల విరాళాలు అందించారన్నారు. తన సంకల్పానికి సహకరించిన అందరికీ కలెక్టర్ షణ్మోహన్ ధన్యవాదాలు తెలిపారు. రత్నగిరిపై... అన్నవరం: రత్నగిరిపై నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది అందరికీ శుభం జరగాలని వేద పండితులు ఉదయం స్వామి, అమ్మవార్ల సమక్షంలో వేదాశీస్సులు అందజేశారు. కొండ దిగువన ఉన్న దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ బంగ్లాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించా రు. రోహిత్, ఈఓ వేండ్ర త్రినాథరావులకు దేవస్థానం సిబ్బంది, గ్రామస్తులు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు. -
పగలు రెక్కీ... రాత్రి నక్కి...
● ఒక్కడే... 13 దొంగతనాలు ● పోలీసులకు చిక్కిన దొంగ కాకినాడ క్రైం: ఒక్కడే దొంగ, 13 దొంగతనాలు అవలీలగా చేసేశాడు. అన్ని చోట్ల కేసులు నమోదవడమే కానీ, ఎక్కడా పట్టుబడలేదు. తాజా చోరీలో మాత్రం కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ డీఎస్ చైతన్యకృష్ణ బృందానికి చిక్కి కటకటాల పాలయ్యాడు. సంబంధిత వివరాలను కాకినాడ ఏఎస్పీ, ఎస్డీపీవో దేవరాజ్ మనీష్ పాటిల్ బుధవారం కాకినాడలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. కరపలోని నీలయ్యతోట ప్రాంతంలో ఓ భారీ చోరీ జరిగింది. ఇన్స్పెక్టర్ చైతన్యకృష్ణ బృందం కేవలం ఒక్క రోజులోనే కేసు ఛేదించి నిందితుడ్ని పట్టుకొని నగలు, నగదు రికవరీ చేసింది. కాకినాడ పర్లోవపేటకు చెందిన 22 ఏళ్ల సుంకర తేజ ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. చిన్న వయసులోనే దొంగతనాల్లో ఆరితేరిన తేజ పగలు రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో నక్కి ఇళ్లు కొల్లగొట్టేవాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లే ఇతడి లక్ష్యం. ముందు అక్కడే ఉన్న కిటికీలు, షూలో తాళం చెవులు వెతుకుతాడు. దొరకకపోతే దొడ్డి దారిలో వెళ్లి తలుపులు బద్దలు కొట్టి తెరుస్తాడు. లోపలికి చొరబడి ఇళ్లు గుల్ల చేస్తాడు. ఇదే తీరులో 13 దొంగతనాలు చేశాడు. కాకినాడ అర్బన్, గ్రామీణ మండలాల్లోని దాదాపు అన్ని స్టేషన్లలోనూ అతడిపై కేసులు ఉన్నాయి. నిందితుడిని సాంకేతికత సాయంతో ఒక్క రోజులోనే పర్లోవపేటలో పట్టుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. సీఐ చైతన్యకృష్ణ బృందానికి ఎస్ఐ టి.సునీత, క్రైం బృందం సహకరించాయని ఏఎస్పీ అన్నారు. -
మహిళపై కత్తితో దాడి
సామర్లకోట: కొంత కాలంగా తనతో సహజీవనం చేస్తున్న మహిళపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటనపై కేసు నమోదైంది. స్థానికుల కథనం ప్రకారం స్థానిక రైల్వే స్టేషన్లో సమోసాలు విక్రయించే కాయ రాజుతో స్టేషన్లో పువ్వులు విక్రయించే లక్ష్మి ఏడాదిగా సహజీవనం చేస్తోంది. స్థానిక సత్యనారాయణపురంలో ఒక అద్దె ఇంటిలో రాజు నివసిస్తున్నాడు. నర్సీపట్నానికి చెందిన లక్ష్మి ప్రతి మూడు రోజులకు రాజు ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం హోటల్ నుంచి భోజనం తెచ్చుకుని ఇద్దరు ఇంటిలోకి వెళ్లిన తరువాత కేకలు వినిపించాయి. అంతలోనే రాజు రక్తం వస్తున్న కత్తితో రైలు పట్టాలపై నుంచి పరుగుతీసి పారిపోయాడని స్థానికులు తెలిపారు. రాజు ఉంటున్న ఇల్లు కౌన్సిలర్ సేసెని సురేష్కు చెందినది కావడంతో స్థానికులు ఆయనకు సమాచారం ఇచ్చారు. స్థానికులు, కౌన్సిలర్ ఇంటిలోకి వెళ్లి చూసే సరికి లక్ష్మి రక్తపు మడుగులో పడి ఉంది. కౌన్సిలర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని లక్ష్మిని ఆటోలో సామర్లకోట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రెండు కాళ్లు నరికి వేయడంతో పాటు మెడపై కత్తి వేటు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పరిస్థితి విషయంగా ఉండటంతో ఆమెకు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లక్ష్మికి ఇద్దరు పిల్లలు ఉన్నారని, భర్త వృద్ధుడు కావడంతో రాజుతో ఉంటున్నట్టు స్థానికులు తెలిపారు. సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వన విహారికో విడిది..
● పర్యాటకుల కోసం ప్రత్యేక హట్లు ● ఆధునిక వసతులతో నిర్మాణం ● సర్వాంగ సుందరంగా వసతి గృహాలు తాళ్లరేవు: తూర్పున ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఖ్యాతి గడించిన కోరంగి అభయారణ్యాన్ని సందర్శించే పర్యాటకుల కోసం అటవీ శాఖ ప్రత్యేక హట్లను (వసతి గృహాలు) అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలో పశ్చిమ బెంగాల్లోని సుందరబన్ అడవుల తరువాత రెండో అతిపెద్ద మడ అటవీ ప్రాంతమైన కోరంగి అభయారణ్యాన్ని వేలాది పర్యాటకులు సందర్శిస్తుంటారు. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు విడిది చేసేందుకు అటు కాకినాడ కానీ, ఇటు యానాం, అమలాపురం కానీ వెళ్లవలసి వచ్చేది. అయితే కోరంగిలోనే పర్యాటకులు సేద తీరడంతో పాటు అక్కడ బస చేసేలా అత్యాధునిక సౌకర్యాలతో అటవీ శాఖ వసతి గృహాలను ప్రారంభించింది. కోరంగి పంచాయతీలోని ఫారెస్ట్ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఉన్న మూడు హట్లతో పాటు మరొక అటవీ శాఖ భవనాన్ని సైతం పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతి రూములోనూ డబుల్ కాట్ బెడ్, ఏసీ, టీవీ, ఇన్వర్టర్ సౌకర్యాలను కల్పించారు. పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు పూర్తిస్థాయిలో రక్షణ ఉండేలా చర్యలు చేపట్టారు. అంతే కాకుండా ప్రాంగణంలో ఉన్న బయో డైవర్సటీ భవనాన్ని సందర్శిస్తే కోరంగి మడ అభయారణ్యం విశేషాలను తెలుసుకోవచ్చు. ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే వారికి ఈ హట్లు ఒక వరంగా చెప్పవచ్చు. అందుబాటు ధరలలోనే అద్దెలు.. అటవీశాఖ ఏర్పాటు చేసిన ఈ హట్లలో ఒక రోజు బస చేసేందకు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఫారెస్ట్ కాంప్లెక్స్లో ఉన్న అటవీ శాఖ అధికారులను సంప్రదిస్తే ఈ రూములను కేటాయిస్తారు. పిల్లా, పాపలు, కుటుంబ సభ్యులతో అధిక సంఖ్యలో వచ్చే పర్యాటకుల సౌకర్యార్ధం ఒకప్పటి ఫారెస్ట్ బంగ్లాను వీఐపీ రూముగా సాధారణ పర్యాటకులకు సైతం అద్దెకు ఇవ్వనున్నారు. ఈ బంగ్లాకు రోజుకు రూ.3,000 చార్జి చేస్తారు. కోరంగి మడ అటవీ ప్రాంతాన్ని సందర్శించి ఒకరోజు ప్రకృతి ఒడిలో సేదతీరడం మరపురాని అనుభూతినిస్తుందని చెపుతున్నారు. కోరంగిలో సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేసిన పర్యాటక హట్లు కోరంగి ఫారెస్ట్ కాంప్లెక్స్ హట్లలో ఏసీ, టీవీ తదితర సౌకర్యాలు ఆన్లైన్లో సైతం బుకింగ్ కోరంగి ఫారెస్ట్ కాంప్లెక్స్ ప్రాంగణంలో పర్యాటకుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన హట్లను ఆన్లైన్లో కూడా బుక్ చేసుకునే సౌకర్యాన్ని అటవీశాఖ కల్పించింది. నేరుగా వచ్చిన పర్యాటకులకు తమ సిబ్బంది ద్వారా గదులను కేటాయిస్తున్నాం. అలాగే ఏపీ టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునే వీలు కల్పించాం. జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలను సందర్శించి అక్కడ బస చేయాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం. ఇతర వివరాల కోసం 89859 52875 నెంబరులో సంప్రదించగలరు. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కోరంగి అభయారణ్యం -
పార్కింగ్ చేసిన కార్లే అతడి లక్ష్యం
రూ.25 లక్షల విలువైన ఆభరణాల స్వాధీనం లబ్బీపేట (విజయవాడ తూర్పు): దేవాలయాల వద్ద పార్క్ చేసిన కార్ల డోర్లు చాకచక్యంగా తెరిచి లోపల ఉన్న ఆభరణాలు చోరీ చేసే అంతర్ జిల్లా నేరస్తుడిని సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతని నుంచి రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ స్టేషన్లో ఏడీసీపీ ఎం.రాజారావు తెలిపిన వివరాల మేరకు కోనసీమ అంబేడ్కర్ జిల్లా అల్లవరం మండలం మొగళ్లమూరు గ్రామానికి చెందిన చింత గణేష్ ఏడో తరగతి వరకూ చదివి కారు డ్రైవర్గా పనిచేసేవాడు. 15 ఏళ్లు ఖతార్ దేశంలో డ్రైవర్గా చేసి 2019లో దేశానికి తిరిగి వచ్చాడు. ఇక్కడ డ్రైవర్గా చేస్తూ దురలవాట్లకు బానిస కావడంతో వచ్చే డబ్బులు చాలక సులభంగా డబ్బులు సంపాదించేందుకు నేరాలకు పాల్పడుతున్నారు. తారాపేటలో అరెస్టు 2025 ఏప్రిల్లో దుర్గగుడి ఓం టర్నింగ్ వద్ద పార్క్ చేసి ఉన్న కారు డోర్లు తెరిచి లోపల బ్యాక్ సీట్లో ఉన్న ఆభరణాలు చోరీ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో అక్కడ సేకరించిన ఆధారాలు, సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి చింత గణేష్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు నేరం అంగీకరించడంతో అతని నుంచి రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు రికవరీ చేశామన్నారు. -
అలుపెరగని బోధకునికి అభినందన
ఒక్క సెలవూ పెట్టని ఉపాధ్యాయినికి డీఈఓ సత్కారం అయినవిల్లి: మండలంలోని ముక్తేశ్వరం మండల ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు కుడుపూడి నాగేశ్వరరావును జిల్లా విద్యాశాఖ అధికారి పి.నాగేశ్వరరావు అభినందించారు. పాఠశాల పర్యవేక్షణకు బుధవారం వచ్చిన డీఈఓ సదరు ఉపాధ్యాయుడు కుడుపూడి నాగేశ్వరరావు ఐదేళ్లుగా ఒక సెలవు తీసుకోకపోవడాన్ని తెలుసుకుని అభినందించారు. డీఈఓ మాట్లాడుతూ వృత్తి పట్ల అంకిత భావం, నిబద్ధతలతో పనిచేసే ఉపాధ్యాయుల్లో నాగేశ్వరరావు ఒకరన్నారు. ఇలాంటి ఉపాధ్యాయుల వల్లే ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్ల సమాజంలో గౌరవం ఉందన్నారు. అనంతరం నాగేశ్వరరావును దుశ్శాలువాతో సత్కరించి, పూల మొక్కను బహూకరించారు. ఆయన వెంట డీసీసీబీ కార్యదర్శి బి హనుమంతరావు, ఎంఈఓ మెల్లం శ్రీనివాసరావు, పెచ్చెట్టి శ్రీనివాసు తదితరులు ఉన్నారు. -
ఇంటర్మీడియెట్ బోర్డు ఆర్ఐవోగా శారద
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లా ఇంటర్బోర్డు రీజినల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్గా (ఆర్ఐవో) ఐ.శారద నియమితులయ్యారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కమిషనరేట్ నుంచి ఆమెకు బుధవారం ఉత్తర్వులు అందాయి. రాజమహేంద్రవరంలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఆమె గురువారం విధుల్లో చేరనున్నారు. ఆమె ఇప్పటి వరకు కాకినాడ జిల్లా డీవీఈవో గా పని చేశారు. గతంలో జోన్ 2 పరిధిలో ఇంటర్బోర్డు ఆర్జేడీగా విధులు నిర్వర్తించారు. శారద నియామకంపై జిల్లాలోని అధ్యాపకులు, కళాశాల యాజమాన్యాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆమె సాక్షితో మాట్లాడుతూ తాను గతంలో మాదిరే పనిచేస్తానని, కొద్ది నెలల్లో రాబోతున్న ఇంటర్ పరీక్షల నిర్వహణలో పూర్తి అంకితభావంతో పనిచేస్తూ, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ర్యాంకులు సాఽధించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. -
ప్రలోభాలతో పరమాత్ముని వశం చేసుకోలేము
సమన్వయ సరస్వతి సామవేదం ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): పాండవుల పక్షాన ద్యూతగా వస్తున్న కృష్ణపరమాత్మకు రత్నాలు, వాహనాలు, ఇతర సంపదలు ఏమడినా ఇవ్వాలని ధృతరాష్ట్రుడు విదురుని ఆదేశిస్తాడు. దానికి సమాధానంగా విదురుడు ప్రలోభాలతో పరమాత్మను వశం చేసుకోలేమని ధృతరాష్ట్రునికి వివరించినట్టు సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. బుధవారం హిందూ సమాజంలో ఆయన కృష్ణరాయబారం ఇతివృత్తాన్ని వివరించారు. నీవు ఇచ్చే పూర్ణకలశంతోనో, పాదోదకంతోనే, కుశల ప్రశ్నలతోనో తప్పించి కృష్ణుడు ఇతర సంపదలవైపు కన్నెత్తి కూడా చూడడని విదురుడు చెబుతాడు. దుర్యోధనుడు కృష్ణునితో నీ కోసం ఏర్పాటు చేసిన అన్నపానీయాలను, శయ్యను అంగీకరించమని కోరతాడు. కృష్ణుడు దుర్యోధనుని ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ పాండవులను ద్వేషించిన వాడు నన్ను ద్వేషించినట్టే, వారిని ఆదరిస్తే నన్ను సత్కరించినట్టేనని చెబుతాడు. భగవంతునికీ, భాగవతులకీ తేడా లేదని ఆయన మాటల నుంచి మనం గ్రహించాలని సామవేదం అన్నారు. బాల్యం నుంచి వారి పట్ల దుర్భావంతో ఉన్న నీవు పెట్టే అన్నం కలుషితమైనదని చెప్పి, విదురిని ఇంటికి వెడతాడు శ్రీకృష్ణుడు. దుర్యోధనుడు మూఢుడు, వాడి పట్ల నీవు చెప్పే మంచి మాటలు వ్యర్థం అవుతాయని విదురుడు కృష్ణునితో చెబుతాడు. ఇరుపక్షాల వారికీ నేను కావలసినవాడిని, జ్ఞాతుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడితే సరిద్దిడానికి ప్రయత్నించకపోతే, లోకం నన్ను నిందిస్తుంది. నేను నిష్కపటంగా సంధి కోసం ప్రయత్నిస్తానని చెప్పాడు కృష్ణుడు. విదురుడు ప్రీతితో పెట్టిన అన్నాన్ని స్వీకరిస్తాడు. అనంతరం కృష్ణుడు కుంతిని కలసి పాండవుల క్షేమవార్తను తెలియచేస్తాడు. క్షత్రియకాంత ఏ ప్రయోజనాన్ని ఆశించి సంతానాన్ని కంటుందో, ఆ ప్రయోజనం నెరవేర్చే సమయం ఆసన్నమయిందని ధర్మరాజుకు చెప్పమని కుంతి కృష్ణుని కోరుతుంది. అనేక మంది మహర్షులు, రాజర్షులు, దేవర్షులు కృష్ణుని సందేశం వినడానికి సభకు వస్తారు. ముందుగా వారికి ఆసనాలు ఏర్పాటు చేయండి, వారు కూర్చోకుండా మనం ఆసీనులం కారాదని కృష్ణుడు సూచిస్తాడని సామవేదం అన్నారు. -
కోడి కత్తుల తయారీదారు అరెస్టు
దేవరపల్లి: గోపాలపురం మండలం హుకుంపేటలో కోడి కత్తులు తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని నుంచి 40 కత్తులను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ బీఎన్ నాయక్ బుధవారం తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కోడి కత్తులను తయారు చేసి విక్రయిస్తున్నట్టు ఎస్సై మనోహార్, ట్రైనీ ఎస్సై శివగణేష్కు అందిన సమాచారం మేరకు హుకుంపేటలో కోడికత్తులు తయారు చేస్తున్న బొల్లం హరికృష్ణను అదుపలోకి తీసుకున్నట్టు ఆయన తెలిపారు. అతని నుంచి 40 కోడి కత్తులు, కత్తులను సానపట్టే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వివరించారు. సంక్రాంతి సందర్భంగా వీటిని తయారు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. గతంలో కోడిపందేల్లో అరెస్టయిన వారిని, కోడిపందాలు, పేకాటలు నిర్వహించి కేసులు నమోదైన వారందని బైండోవర్ చేసినట్టు ఆయన చెప్పారు. గోపాలపురం పోలీస్ స్టేషన్లో 350 మంది, దేవరపల్లి పోలీస్ స్టేషన్లో 350 మంది పాత నేరస్తులు ఉన్నట్టు ఆయన చెప్పారు. మూడు రోజులుగా పాత నేరస్తులను బైండోవర్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఇప్పటికి 70 మందిని బైండోవర్ చేసినట్టు ఆయన తెలిపారు. 21 కిలోల గంజాయి స్వాధీనం -
పోలీసుల అదుపులో పాత నేరస్తుడు
కాకినాడ క్రైం: స్థానిక గంజాం వారి వీధిలో ఉన్న అన్నపూర్ణ మార్కెటింగ్ దుకాణంలో రూ.19 లక్షల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. క్రైం సీఐ కృష్ణ, కాకినాడ వన్ టౌన్ సీఐ నాగదుర్గారావు బృందాలు నిందితుడిని పట్టుకున్నాయి. సంబంధిత వివరాలను ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ బుధవారం నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు, కాకినాడ సూర్యనారాయణపురానికి చెందిన పాత నేరస్తుడు కాకర్ల లోవరాజుపై 19 కేసులు ఉన్నాయి. పోలీసు రికార్డుల్లో ఉండడంతో పట్టుబడతానన్న భయంతో తన బంధువైన నగరానికి చెందిన 14 ఏళ్ల బాలుడిని చేరదీసి దొంగతనాలు చేయడం, గంజాయి విక్రయించడం నేర్పాడు. ఈ నేపథ్యంలో చేసిన దొంగతనం దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజీలు, సాంకేతికత ఉపయోగించి బుధవారం బుడంపేటలో నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.19 లక్షల నగదుతో పాటు రూ.55 వేల విలువైన 22 కిలోల గంజాయిని పట్టుకున్నామని అన్నారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన ఏఎస్పీ పాటిల్, ఎస్బీ డీఎస్పీ కేవీవీ సత్యనాయణ, సీఐలు కృష్ణ, నాగదుర్గారావు, ఎస్ఐలు వినయ్ ప్రతాప్, స్వామినాయుడు ఎస్పి బిందుమాధవ్ అభినందించారు. అన్నపూర్ణ మార్కెటింగ్ దుకాణంలో చోరీ అతడి పనే 14 ఏళ్ల బాలుడితో కలిపి చోరీలు రూ.19 లక్షల నగదు.. 55 కిలోల గంజాయి స్వాధీనం -
విగ్రహం ఏర్పాటుతో ఉద్రిక్తత
రావులపాలెం: స్థానిక ఎంకేఆర్ సెంటర్లో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వివాదం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే వరకు దారితీసింది. వివరాల్లోకి వెళితే టీడీపీ నాయకుడు ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆ సామాజిక వర్గ నాయకులు స్థానిక ఎంకేఆర్ కల్యాణ మండపం సెంటర్లో మంగళవారం రాత్రి ఇటుకలతో దిమ్మ నిర్మించి శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం పెటేందుకు యత్నించారు. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీకి 100 ద్వారా ఫోన్ చేసి వివరించారు. ఆయన ఆదేశాలతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తదుపరి నిర్మాణ పనులు నిలిపివేసి పికెట్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ బుధవారం ఉదయం రామకృష్ణ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల ఫొటో పెట్టి దండ వేశారు. సాయంత్రం స్థానికులు ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డికి వివరించగా ఆయన వచ్చి ఏ విగ్రహాలు పెట్టకూడదని పంచాయతీ తీర్మానించాక ఆ ప్రాంతంలో విగ్రహం పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం పెట్టాలనే ప్రతిపాదన రాగా స్థానికులు మారుతీ నగర్గా నామకరణంచేసి ఆంజనేయస్వామి విగ్రహం పెట్టాలని కోరారన్నారు. ఆ మేరకు ఆంజనేయస్వామి బొమ్మను, అంబేడ్కర్ చిత్రపటాన్ని తీసుకుని వెళ్లి వాటిని కూడా పెట్టాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ గందరగోళంలో కొందరు శ్రీకృష్ణ దేవరాయలు బొమ్మను దిమ్మపై పెట్టేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరగకుండా పోలీసులు జగ్గిరెడ్డిని పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు రావులపాలెం పోలీస్ స్టేషన్కు చేరుకుని జగ్గిరెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈలోగా డీఎస్పీ సుంకర మురళీమోహన్ అక్కడకు చేరుకుని జగ్గిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులతో చర్చించి ఆ ప్రాంతం తమ అధీనంలో ఉందని తెలిపారు. అయినప్పటికీ చిత్రపటాన్ని, ఇప్పుడు ఏకంగా విగ్రహాన్నీ పెట్టారంటే ఇదంతా మీ మద్దతుతోనే జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు పోలీసులు విగ్రహానికి ముసుగు వేశామని, సంక్రాంతి పండగ వరకు అలానే ఉంచుతామని, ఆ తరువాత కోర్టు నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకోవచ్చని సర్దిచెప్పారు. చర్చల్లో మాజీ ఎంపీ చింతా అనూరాధ, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకటసతీష్, పాముల రాజేశ్వరి, కోర్డినేటర్లు పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, నేతలు జున్నూరి బాబి, గొల్లపల్లి డేవిడ్రాజు, కర్రి పాపారాయుడు, కర్రి నాగిరెడ్డి, ముసునూరి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాస్, తహసీల్దార్ ముక్తేశ్వరరావు, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీసులే దగ్గరుండి విగ్రహం పెట్టించారని ధ్వజం పోలీస్ స్టేషన్ను ముట్టడించిన పార్టీ శ్రేణులు -
తగ్గిన న్యూ ఇయర్ జోష్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: 2025కు వీడ్కోలు పలుకుతూ 2026కు స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర వేడుకలు ఒక మోస్తరుగా సాగాయి. నగదు మారకం తగ్గి జనంలో కొనుగోలు శక్తి పడిపోవడంతో నూతన సంవత్సర వేడుకలలో జోష్ తగ్గింది. కొత్త సంవత్సరంతో పాటు సంక్రాంతికి రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో వస్త్ర వ్యాపారంలో కొంతలో కొంత ఊపు కనిపించింది. జిల్లా కేంద్రం కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ సహా పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, తుని పట్టణాలు, మండలాల్లో డిసెంబరు 31 బుధవారం రాత్రి మందుబాబులు అప్పులు చేసి మరీ మద్యం మత్తులో ఊగిపోయారు. మందు, ముక్క లేకుండా నూతన సంవత్సర వేడుకలు ఏమిటంటూ మద్యం దుకాణాల వద్ద ఎగబడ్డారు. స్వీట్ షాపులు, న్యూ ఇయన్ గ్రీటింగ్స్ దుకాణాలలో అమ్మకాలు ఒక మోస్తరుగానే జరిగాయి. ఎక్కడా లేని హడావుడి, హంగామా మద్యం దుకాణాల వద్ద స్పష్టంగా కనిపించింది. లిక్కర్ షాపుల నిర్వాహకులు మూడు రోజులు ముందుగానే ఇండెంట్లు పెట్టుకుని మద్యం నిల్వ చేసుకున్నారు. జిల్లాలో కాకినాడ నగరం, కాకినాడ రూరల్, తుని, పిఠాపురం నియోజకవర్గాల్లో లిక్కర్ షాపుల్లో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరిగాయి. పొగమంచును సైతం మందుబాబులు లెక్క చేయలేదు. బుధవారం సాయంత్రం ఐదు గంటల నుంచే మద్యం దుకాణాల వద్ద హడావుడి మొదలైంది. మందుబాబుల హంగామా అర్ధరాత్రి 12 గంటల నుంచి ఒంటి గంట వరకు మద్యం దుకాణాల వద్ద కనిపించింది. నూతన సంవత్సర వేడుకల్లో రోడ్లపై ఇష్టమొచ్చినట్టు బైక్ రేస్లు చేస్తే తాటతీస్తామంటూ ఎస్పీ బిందుమాధవ్ హెచ్చరించారు. అయినా యువకులు అర్ధరాత్రి సమయంలో బైక్లపై హల్చల్ చేశారు. పీకల దాకా మందు తాగి యువకులు మెయిన్రోడ్డు, టెంపుల్ స్ట్రీట్ తదితర రోడ్లపై బైక్ రేస్లతో హంగామా చేశారు. ‘మూడు బ్రాందీ బాటిళ్లు, ఆరు బీరు బాటిళ్లు’ అన్న చందంగా మద్యం వ్యాపారం సాగింది. జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాల వద్ద అర్ధరాత్రి వరకు మందుబాబులు బారులు తీరి కనిపించారు. మద్యం షాపుల వద్ద కోలాహలం కాకినాడ నగరం, కాకినాడ రూరల్లో కొండయ్యపాలెం ఫ్లై ఓవర్ జంక్షన్, టీటీడీ కల్యాణ మండపం, సర్పవరం, వలసపాకలు, ఏటిమొగ తదితర ప్రాంతాల్లో బ్రాందీషాపులు కోలాహలంగా కనిపించాయి. జిల్లాలో బ్రాందీ షాపుల నిర్వాహకులు సామర్లకోట డిస్టిలరీ నుంచి మూడు రోజులు ముందు నుంచే దుకాణాలకు బ్రాందీ, బీర్లు తరలించారు. గడచిన మూడు రోజులుగా డిస్టిలరీ నుంచి జరిగిన లావాదేవీలు గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. కల్లుగీత కార్మికులకు కేటాయించిన దుకాణాలతో కలిపి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన మద్యం దుకాణాలు 170 వరకు ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా 37 దుకాణాలు కాకినాడ నగరంలోనే ఉన్నాయి. కాకినాడ సిటీతో కలసి ఉన్న కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో 12 మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. వాస్తవానికి రోజు వారీ రూ.3 లక్షలకు తగ్గకుండా కౌంటర్ సేల్ ఉంటేనే దుకాణాలు లాభదాయకంగా ఉంటాయి. సాధారణ రోజు ల్లో ఈ బెంచ్ మార్క్ దాటే దుకాణాలు జిల్లాలో 20 నుంచి 30 షాపులు మాత్రమే ఉంటాయని చెబుతున్నా రు. మిగిలిన షాపుల్లో డైలీ కౌంటర్ సేల్ రూ.2లక్షలు లోపేనంటున్నారు. డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకల పేరుతో మద్యం ఏరులై పారింది. మద్యం దుకాణాల వద్ద సాయంత్రం నుంచే సందడి వాతావరణం మొదలై రాత్రి 9 గంటలకు ఊపందుకుని అమ్మకాలు పెరిగాయి. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో షాపులలో బాటిల్పై రూ.10 పెంచి అమ్మకాలు చేశారని బ్రాందీ షాపుల వద్ద మందుబాబులు కిక్కెక ్కిన తరువాత శాపనార్థాలు పెట్టడం కనిపించింది. కాగా, నూతన సంవత్సర వేడుకల కోసం జిల్లా కేంద్రం కాకినాడ సహా ఎక్కడబడితే అక్కడ ఇన్స్టెంట్ బిర్యానీ సెంటర్లు పుట్టుకొచ్చాయి. రోడ్లపక్కన కాంబో ప్యాక్ అంటూ ప్రత్యేక ఆఫర్లతో కౌంటర్లు పెట్టి వివిధ రకాల బిర్యానీలు విక్రయించారు. జనంలో కొనుగోలు శక్తి పడిపోవడమే కారణం తగ్గిన నగదు మారకం అయినా మద్యం అమ్మకాలదే పైచేయి! మూడు రోజుల ముందే నిల్వలు అప్పోసొప్పో చేసి మందుబాబుల జల్సా మూడు రోజులుగా జిల్లాలో అమ్మకాలు ఇలా (కేస్లలో).. తేదీ ఐఎంఎల్ బీర్లు రాబడి (రూ.కోట్లలో) 29–12–25 8,607 3,392 6.96 30–12–25 8,213 3,874 6.91 31–12–25 7,041 3545 6.13 -
బుచ్చయ్య వ్యాఖ్యలు హాస్యాస్పదం
● పొట్టేళ్ల నరికివేత మొదలైంది చంద్రబాబు ప్రభుత్వంలోనే.. ● విలేకరులతో మాజీ మంత్రి వేణు రాజమహేంద్రవరం రూరల్: సోషల్ మీడియా, ఏఐను అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ జనసేన పార్టీకి చెందిన దేవరాజ్ ఆయన వదినను తోస్తే దానిని వైఎస్సార్ సీపీ నాయకుడు చేశాడంటూ హోంమంత్రి అనిత తప్పుడు ప్రచారం చేశారన్నారు. మరుసటిరోజు స్వయాన అతని అక్క తన తమ్ముడు దేవరాజ్ జనసేన పార్టీ కార్యకర్త అని, చేతిపై పవన్ కల్యాణ్ టాటూ ఉంటుందని తెలిపిందన్నారు. అలాగే వైఎస్సార్ సీపీకి చెందిన రవిచంద్రారెడ్డి బీజేపీలో చేరితే అతడి మూడేళ్ల క్రితం కేక్ కటింగ్ వీడియోను చూపించి హోంమంత్రి తప్పుడు ప్రచారం చేశారన్నారు. పొట్టేళ్ల నరికివేత మొదలైంది చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడేనన్నారు. 2024 జూన్ ఏడున బాలకృష్ణ చిత్రపటానికి 25 పొట్టేళ్ల తలకాయలను దండగా వేశారన్నారు. అలాగే చంద్రబాబు, పవన్ కల్యాణ్ చిత్రపటాలకు గొర్రె, పొట్టేలును నరికి రక్తాభిషేకం చేసిన వీడియోలను సైతం చెల్లుబోయిన వేణు చూపించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజున గొర్రెపోతును నరికారని చట్ట ప్రకారం కొందరిని అరెస్టు చేశారన్నారు. కానీ పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని వారిని కొట్టి హోంమంత్రికి వీడియో చూపించడంతో పాటు రోడ్డుపై నడిపించడం జరిగిందన్నారు. చివరకు వెహికల్స్ లేకపోవడంతో నడిపించాల్సి వచ్చిందని డీజీపీతో చెప్పించారన్నారు. మేము కానీ తలుచుకుంటే రోడ్డుమీద తిరగగలరా అంటూ బుచ్చయ్య వ్యాఖ్యానించడం దారుణమన్నారు. చెలరేగిపోతున్న మాఫియా నియోజకవర్గంలో మట్టి, ఇసుక, మద్యం, రేషన్ బియ్యం మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోందన్నారు. ఉచిత ఇసుక ఎక్కడా లభించడం లేదన్నారు. ఏ ఇసుక లారీని అడిగిన బుచ్చయ్య తాలూకా అంటూ సమాధానం ఇస్తున్నారన్నారు. అలాగే మధ్యం ధరలు అధికంగా అమ్మడంతో బెల్టుషాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయన్నారు. గంజాయిని అరికట్టామంటూ చెబుతున్నారని, కానీ విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. దీని వల్ల సమాజ వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోయాయన్నారు. వైఎస్ జగన్ను తిడితే లోకేష్ దృష్టిలో పడి ఉన్నతమైన అవకాశం వస్తుందని గోరంట్ల ఆశపడుతున్నారన్నారు. యువత నిరుద్యోగభృతి, మహిళలు ఆడబిడ్డ నిధి, రైతులు పంటకు గిట్టుబాటు ధర కోసం ఎదురుచూస్తున్నారన్నారు. -
తమిళ బెల్లం.. రుచి అమోఘం
పిఠాపురం: తమిళనాడు అనగానే మనకు నోరూరించే సాంబారు గుర్తుకువస్తుంది. ఒక్కసారి తింటే మరిచిపోలేని అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు దానికి పోటీగా తాటిబెల్లం వచ్చింది. ప్రస్తుతం తాటిబెల్లం సీజన్ కావడంతో ఎక్కడ చూసినా వీటి అమ్మకాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన వ్యాపారులు పిఠాపురం, గొల్లప్రోలు, కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో తాటి బెల్లాన్ని విక్రయిస్తున్నారు. మామూలు బెల్లం కేజీ రూ.50 వరకూ, తమిళ తాటిబెల్లాన్ని కేజీ రూ.140, మిరియాలు, అల్లం వంటివి కలిపి తయారు చేసిన దాన్ని కేజీ రూ.250 వరకు విక్రయిస్తున్నారు. కన్యాకుమారి ఏరియాలో ఈ బెల్లం తయారు చేస్తారని, అక్కడి నుంచి లారీలపై తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్టు ఆ ప్రాంతానికి చెందిన పరమేశన్ తెలిపాడు. -
బాబు మనసు మారాలి
రైతుల ప్రభుత్వమంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాకు తీరని అన్యాయం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా అమలు చేశారు. ప్రీమియాన్ని నాటి ప్రభుత్వమే చెల్లించేది. ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం సైతం సకాలంలో అందేవి. చంద్రబాబు ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం భారాన్ని మాపై మోపారు. కొత్త సంవత్సరంలోనైనా బాబు పెద్ద మనసు చేసుకుని ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలి. ప్రీమియం చెల్లించకపోవడంతో పంట నష్టపరిహారం కోల్పోతున్నాం. మోంథా తుపానుతో నష్టపోయిన పంటకు కొత్త సంవత్సరంలోనైనా పరిహారం ఇవ్వాలి. కొత్త సంవత్సరంలోనైనా బాబు మనసు మారి మాబోటి రైతులకు మేలు జరగాలని కోరుకుంటున్నాం. – మిరియాల లోవరాజు, రైతు, మర్లావ, పెద్దాపురం మండలం మా ఆశలకు ఊపిరి పోయండి ఏడాదిన్నరగా నిరుద్యోగుల ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఉద్యోగం ఇస్తాను లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్న మాటనే చంద్రబాబు ప్రభుత్వం మరచిపోయింది. కనీసం కొత్త సంవత్సరంలోనైనా గత ఏడాది నిరుద్యోగ భృతి బకాయిలు విడుదల చేసి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఎంతవరకూ చదువుకున్నా ఉద్యోగాలు లేకపోవడంతో నిరుద్యోగులు కూలీలుగా మారుతున్నారు. హాస్టళ్లలోని విద్యార్థులకు కనీస మెస్ చార్జీలను కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. ప్రభుత్వ ఐటీఐలో చదువుతున్న విద్యార్థులకు వారి ట్రేడ్లతో సంబంధం లేకుండా ఇంటర్న్షిప్ ఇస్తున్నారు. వారి ట్రేడ్లకు సంబంధించి మాత్రమే పరిశ్రమల్లో మాత్రమే ఇంటర్న్షిప్ ఇవ్వాలి. కొత్త సంవత్సరంలోనైనా నిరుద్యోగుల ఆశలకు చంద్రబాబు ప్రభుత్వం ఊపిరి పోయాలి. – పెంకే రవితేజ, నిరుద్యోగ జేఏసీ జిల్లా కన్వీనర్, కాకినాడ 2026లోనైనా రూ.1,500 ఇవ్వు బాబూ ఆడబిడ్డ నిధి పేరిట 18 నుంచి 59 ఏళ్ల వయసున్న ప్రతి మహిళకూ రూ.1,500 భృతి ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి 19 నెలలైనా ఇంత వరకూ ఇవ్వలేదు. కనీసం కొత్త సంవత్సరంలోనైనా చంద్రబాబు ఈ మాట నిలబెట్టుకోవాలి. కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళల స్వయం ఉపాధి కోసం కుట్టు మెషీన్లు ఇస్తామన్న మాటను ఇంతవరకూ నెరవేర్చలేదు. ఈ ఏడాదైనా ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా పథకాలు అమలు చేసి, మహిళల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. – కమిడి మంగాదేవి, సర్పంచ్, వేములవాడ, కరప మండలం ఉద్యోగుల ఆశలు చివురించాలి నూతన సంవత్సరంలో పీఆర్సీ కమిటీ త్వరగా వేసి, ఆ నివేదిక ఆధారంగా జీతాలు పెంచాలి. ఉద్యోగులకు రావలసిన సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి. సీపీఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీం అమలు చేయాలి. పని ప్రదేశాల్లో ఉద్యోగులకు భద్రత కల్పించాలి. ఉద్యోగులపై దాడులు చేసే వారిపై చర్యల కోసం రూపొందించిన చట్టాలు కట్టుదిట్టంగా అమలు చేయాలి. ఆస్పత్రుల్లో పని చేసే వైద్య, వైద్యేతర ఉద్యోగులపై దాడులు జరగకుండా ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాలి. విశ్రాంత ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ త్వరితగతిన అందేలా చొరవ చూపాలి. – పసుపులేటి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీఎన్జీజీవో సంఘం -
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం (సామర్లకోట): ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని,, పెద్దాపురం మండలంలో తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి మంగళవారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు జిల్లా నలుమూల నుంచీ ఆలయానికి చేరుకోవడం ప్రారంభమైంది. వేకువజామున 3.30 నుంచి 4 గంటల వరకూ స్వామి వారికి అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు ఆధ్వర్యాన సుప్రభాత సేవ, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఉచిత, రూ.20, రూ.50 క్యూలలో భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామున 4.30 గంటల నుంచి స్వామి వారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులను అనుమతించారు. స్వామివారిని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు దర్శించుకుని, పూజలు చేశారు. సుమారు 18 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. భక్తులకు చక్కెర పొంగలి, పులిహోర ప్రసాదాలుగా అందజేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయాన్ని పూలతో అలంకరించారు. -
అమ్మవార్లను ఆకట్టుకునేలా..
రాయవరం: దేవుడిపై ఉన్న భక్తిని పలువురు వివిధ రకాలుగా ప్రదర్శిస్తుంటారు. దానిలో భాగంగా లొల్ల గ్రామానికి చెందిన సుతాపల్లి శిరీష వినూత్నంగా తన భక్తిని చాటుకున్నారు. చీరపై అష్టోత్తరం, గోవింద నామాలను రాసి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయానికి సమర్పించారు. ఈ చీరను అమ్మవార్లకు అలంకరించేందుకు వినియోగించాలన్నారు. ఇప్పటి వరకు కాకినాడలోని కన్యకా పరమేశ్వరి, పిఠాపురంలోని పురూహుతికా అమ్మవారు, మండపేటలోని కన్యకా పరమేశ్వరి, లొల్లలోని శివాలయం, కాకినాడలో శ్రీపీఠం.. ఇలా తొమ్మిది ఆలయాల్లో అమ్మవార్లకు లలితా సహస్ర నామాలు రాసిన చీర్లను సమర్పించినట్లు తెలిపారు. రాయవరంలోని శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు రెండు చీరలు, శ్రీవారికి పంచెను బహూకరిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆమెను సర్పంచ్ చంద్రమళ్ల రామకృష్ణ, ఎంపీపీ నౌడు వెంకట రమణ, స్థానిక నేతలు పీఎస్ఆర్, తాడి రామచంద్రారెడ్డి, సత్తి వెంకట సుబ్బారెడ్డి, పులగం శ్రీనివాసరెడ్డి, మంతెన అచ్యుత రామరాజు తదితరులు అభినందించారు. -
కొత్త ఆశలతో..
● కొద్ది గంటల్లో గతించనున్న 2025 ● కొత్త సంవత్సరానికి స్వాగతం పలకనున్న జనం ● ఈ ఏడాదైనా తమ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్ష సాక్షి ప్రతినిధి, కాకినాడ: మరికొద్ది గంటల్లో 2025 కాలగర్భంలో కలసిపోనుంది. సరికొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలికేందుకు ప్రజలు ఆనందోత్సాహాలతో ఎదురు చూస్తున్నారు. గత కాలం పంచిన చేదు కషాయాన్ని బలవంతంగా దిగమింగుకుంటూనే.. అది పంచిన విషాదాన్ని జ్ఞాపకాల పొరల్లో దాచుకుంటూనే.. రానున్న కాలమైనా తమ ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చేదిగా ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా జనజీవితంపై నిత్యం ప్రభావం చూపే ప్రభుత్వ పాలన ఇకనైనా ప్రజారంజకంగా మారాలని కోరుకుంటున్నారు. గద్దెనెక్కి ఏడాదిన్నరయినా అరకొర పథకాలకే పరిమితమై.. తమ సంక్షేమాన్ని గాలికొదిలేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మనసు మారాలని, ఎన్నికల వేళ తమకిచ్చిన మాటలు ఈ ఏడాదైనా పూర్తి స్థాయిలో నిజం చేయాలని వివిధ వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. వ్యవసాయ ఆధారమైన జిల్లాలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాదిరిగానే ఉచిత పంటల బీమా అమలు చేయాలని 2 లక్షల మందికి పైగా రైతులు కోరుకుంటున్నారు. మోంథా తుపానుతో 40 వేల ఎకరాల్లో పంట నష్టపోయిన అన్నదాతలకు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా పరిహారం ఇవ్వలేదు. కొత్త సంవత్సరంలోనైనా తమపై కనికరం చూపాలని బాధిత రైతులు అభ్యర్థిస్తున్నారు. 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని ఎన్నికల్లో చెప్పి, ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వచ్చే సంవత్సరమైనా ఆ మాట నిలబెట్టుకుంటారని మహిళలు ఆశ పడుతున్నారు. ప్రతి నిరుద్యోగికీ ఉద్యోగం ఇస్తామని, అలా ఇవ్వకుంటే ప్రతి నెలా రూ.3 వేల చొప్పున భృతి ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఏడాది బకాయి రూ.1,800 కోట్లయినా విడుదల చేసి తమ హృదయాలు గెలుచుకోవాలని అభిలషిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేసేలా ప్రభుత్వ పెద్దలకు ఆ భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని, కొత్త సంవత్సరంలోనైనా తమ జీవితాల్లో వెలుగులు నింపే ఆలోచనలు కలిగించాలని ప్రార్థిస్తున్నారు. -
క్యాన్సర్ రోగులకు అత్యాధునిక టోమోథెరపీ సేవలు
ఎంవీపీ కాలనీ (విశాఖపట్నంవిశ): క్యాన్సర్ చికిత్సలో రాష్ట్రంలో తొలిసారిగా అత్యాధునిక టోమోథెరపీ వైద్యసేవలను విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చింది. ఆ హాస్పటల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎండీ డాక్టర్ వున్నా మురళీకృష్ణతో కలిసి ఆ యూనిట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించేలా మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఏపీలోనే తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ సాంకేతిక అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. దీని ద్వారా మెరుగైన వైద్యసేవలు క్యాన్సర్ రోగులకు అందించడం సాధ్యమవుతుందన్నారు. హాస్పటల్ ఎండీ మురళీకృష్ణ మాట్లాడుతూ రూ.32 కోట్ల విలువైన ఈ యూనిట్ కొనుగోలుతో మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ దేశంలో లెవల్ 3 కేటగిరి హాస్పటల్స్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ సాంకేతికత ద్వారా క్యాన్సర్ ట్యూమర్ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి నిమిషాల వ్యవధిలో చికిత్స అందించవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు హాస్పటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కట్టెదుట వైకుంఠం..
● రత్నగిరిపై ఘనంగా ‘ముక్కోటి’ వేడుకలు ● ఉత్తర ద్వారం నుంచి సత్యదేవుడు, అమ్మవారి దర్శనం ● వేకువజాము నుంచే వేచి ఉన్న భక్తులు ● సాయంత్రం వరకూ రద్దీ అన్నవరం: పాల కడలిలో శేషశయ్యపై ఉత్తరాభిముఖంగా తల పెట్టి పవళించిన శ్రీమహావిష్ణువులా సత్యదేవుడు.. ఆయన పాదాలు ఒత్తుతూ శ్రీమహాలక్ష్మిగా అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు.. సర్వాలంకార భూషితులై భక్తులకు దర్శనమిచ్చిన ముక్కోటి ఏకాదశి పర్వదినమైన మంగళవారం.. రత్నగిరి అపర వైకుంఠంలా శోభిల్లింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు వేకువజామున 3 గంటల నుంచే ఉత్తర ద్వార దర్శనానికి బారులు తీరారు. స్వామివారి ప్రధానాలయంలో ఉత్తర ద్వారం వద్ద సుగంధభరిత పుష్పాలంకరణతో శోభిల్లుతున్న మండపంలో స్వామి, అమ్మవార్లకు తెల్లవారుజామున 4 గంటలకు పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గర్భాలయంలోని సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్టుకు స్వర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించి, పంచహారతులు, నీరాజన మంత్రపుష్పాదులు సమర్పించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులను స్వామి, అమ్మవార్ల ఉత్తర ద్వార దర్శనానికి అనుమతించారు. ఉత్తర ద్వారం వద్ద స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు సుమారు 2 గంటల సమయం పట్టింది. ఉత్తర ద్వార దర్శనానంతరం భక్తులు తూర్పు ద్వారం నుంచి ప్రధానాలయంలోకి ప్రవేశించి సత్యదేవుడు, అమ్మవార్లను, దక్షిణ ద్వారం నుంచి వెలుపలకు వచ్చి, దిగువన యంత్రాలయాన్ని దర్శించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ ఉత్తర ద్వార దర్శనం కొనసాగింది. అనంతరం, భక్తులను యథావిధిగా గర్భాలయంలోకి దక్షిణ ద్వారం నుంచి సత్యదేవుని దర్శనానికి అనుమతించారు. కూరగాయలతో ప్రత్యేకంగా వండిన కదంబం ప్రసాదాన్ని స్వామి, అమ్మవార్లకు నివేదించిన అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. ఉత్తర ద్వార దర్శనం నేపథ్యంలో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. ఆకట్టుకున్న పుష్పాలంకరణ ముక్కోటి ఏకాదశి సందర్భంగా సత్యదేవుని ప్రధానాలయంలో చేసిన పుష్పాలంకరణ అందరినీ ఆకట్టుకుంది. స్వామివారి ఆలయానికి దారి తీసే ఉత్తరం వైపు మెట్లను రంగురంగుల విద్యుద్దీపాలు, పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్తర ద్వారం వద్ద స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చిన మండపాన్ని కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధానాలయం, అనివేటి మండపం ముందు సత్యదేవుడు, అమ్మవారి నమూనా విగ్రహాల వద్ద పుష్పాలంకరణ పలువురిని ఆకర్షించింది. ఈ రెండుచోట్లా చాలా మంది భక్తులు ఫొటోలు దిగారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని సత్యదేవుడు, అమ్మవార్లను ఆలయ ప్రాకారంలో వెండి రథంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం 11 గంటలకు పండితుల ప్రత్యేక పూజల అనంతరం, ఈఓ త్రినాథరావు దంపతులు ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. రథం లాగేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు. -
‘యుద్ధం.. కుక్కల కొట్లాట వంటిది’
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): యుద్ధం అంటే మాంసం కోసం కుక్కల కొట్లాట వంటిదని కృష్ణుడికి ధర్మరాజు విన్నవించుకుంటాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నా రు. హిందూ సమాజంలో చేస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా ఆయన మంగళవారం ఉద్యోగ పర్వంలోని పలు అంశాలను వివరించారు. ‘‘తమ తరఫున ద్యూత కార్యం నిర్వహించాల్సిందిగా సోదరులు, భార్యతో కలసి కృష్ణ పరమాత్మకు ధర్మరాజు విన్నవించుకుంటాడు. అయితే, రాజ్యం కోల్పోయి సంపాదించుకునే శాంతి మరణంతో సమానమని అంటాడు. కనీసం ఐదు ఊళ్లు ఇవ్వా లని మేం అడిగాం. కానీ, మేం యుద్ధానికి భయపడ్డా మని దుర్యోధనుడు భావించి, దానికి కూడా సిద్ధపడటం లేదు. క్షత్రియ వంశం నాశనం కాకూడదని భావించి, మేము ఐదు ఊళ్లు ఇవ్వాలని అడుగుతున్నాం. కృష్ణా, మమ్మల్ని ఆపదల నుంచి గట్టెక్కించడానికి నీవు తప్ప మరొకరు లేరు’’ అని ధర్మరాజు అంటాడని చెప్పారు. ధర్మజుడి మాటల్లో ఆయన శరణాగతి కనపడుతోందని, ఇలా ప్రతివారూ భగవంతుడిని ప్రార్థించాలని అన్నారు. ఇక కర్ణ దుర్యోధనులది ఆదర్శ మైత్రి కాదని, అవసరార్థం మైత్రి అని వ్యాఖ్యానించారు. ‘‘అర్జునుడిని ఎదుర్కోవడానికి తగిన వాడని భావించే కర్ణుడిని దుర్యోధనుడు చేరదీశాడు. అర్జునుడిని నిగ్రహించడానికి రాజాశ్రయం కావాలనే తలంపుతో దుర్యోధనుడి అండ చేరాడు కర్ణుడు. సినిమాలో చూపినట్లు వీరు ఆదర్శ స్నేహితులు కారు’’ అని సామవేదం వివరించారు. కులవివక్ష లేని నాటి కాలాన్ని కుల విద్వేషంతో నేడు కొందరు విమర్శిస్తున్నారని, సంజయుడు, విదురుడు ఏ కులానికి చెందిన వారైనా, వారిని ‘రాజర్షి’ అని, మహాప్రాజ్ఞ అని ధృతరాష్ట్రుడు సంబోధించడాన్ని గమనించాలని చెప్పారు. కృష్ణుడు ద్యూత కార్య నిర్వహణకు వస్తున్నాడన్న వార్త సంజయుని ద్వారా విన్న ధృతరాష్ట్రుడు ‘కళ్లున్న వారు ఎంత అదష్టవంతులు’ అని ఆవేదన చెందుతాడని, పరమాత్మ మీద దృష్టి లేని వారందరూ అంధులేనని సామవేదం అన్నారు. సంజయునికి ధృతరాష్ట్రుడు కృష్ణ తత్త్వాన్ని వివరిస్తాడన్నారు. ‘ధృతరాష్ట్రునిలో రెండు ప్రవృత్తులున్నాయి. అంతఃకరణంలో ఉన్న జీవుడు ఒకరు, ఇంద్రియాలను అంటిపెట్టుకున్న జీవుడు మరొకరు. ఇటువంటి స్వభావం అనేక మందిలో ఉంటుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయి హాకీకి ఎంపికచాగల్లు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) అండర్–19 జాతీయ స్థాయి హాకీ పోటీలకు చాగ ల్లు గ్రామానికి చెందిన ఉయ్యూరు శాంతి ఎంపికైంది. స్థానిక వ్యాయామోపాధ్యాయిని జె.విజయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో ఈ విష యం తెలిపారు. గత నెల 19 నుంచి 22వ తేదీ వరకూ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జరిగిన ఎస్జీఎఫ్ఐ అండర్–19 రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో శాంతి అత్యద్భుత ప్రతిభ చూపింది. తద్వారా జనవరి 2 నుంచి 6వ తేదీ వరకూ గ్వాలియర్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. -
రత్నగిరి.. వివాదాలే సరి..
● అన్నవరం దేవస్థానానికి చేదు జ్ఞాపకాలు ● కలిసిరాని 2025 ● పెరగని ఆదాయం, కానరాని అభివృద్ధి ● పాత ఈఓ వివాదాస్పద నిర్ణయాలుఅన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి 2025 పెద్దగా కలిసి రాలేదు. ఏడాది ప్రారంభం నుంచి చివరి వరకు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచింది. ఆదాయంలో కానీ, నిర్మాణాలలో కానీ పెద్దగా పురోగతి లేకుండానే ఏడాది జరిగిపోయింది. దీనికి తోడు రాజకీయ జోక్యం పెరిగిపోయింది. ముఖ్యంగా పాత ఈఓ సుబ్బారావు వైఖరిపై అనేక విమర్శలు వచ్చాయి. ఆయన 2024 డిసెంబర్ 14న అన్నవరం దేవస్థానం ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం దేవస్థానంలో ఆయన కుటుంబ సభ్యుల జోక్యం పెరిగింది. ప్రొటోకాల్తో సంబంధం లేకుండా సినిమా, టీవీ, జబర్దస్ నటులతో పాటు, కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల బంధువులకూ బ్రహ్మరథం పట్టడం, పాలనలో అనుభవ లేమి దేవస్థానాన్ని వివాదాల పాలు చేశాయి. భక్తులకు కొంచెం ఊరట 2025లో దేవస్థానంలో పూర్తి చేసిన ఏకై క నిర్మాణం రూ.కోటితో చేపట్టిన రెండో మెట్లదారి ఒకటే అని చెప్పవచ్చు. మిగిలిన పనులన్నీ భక్తుల రద్దీకి అనుగుణంగా చేసిన ఏర్పాట్లే. దాదాపు పదేళ్లుగా ఇదిగో.. అదిగో అంటూ సాగిన కేంద్ర ‘ప్రసాద్ ’ స్కీం నిర్మాణాలకు ఈ ఏడాది టెండర్లు ఖరారయ్యాయి. సుమారు రూ.20 కోట్ల కేంద్ర నిధులతో అన్నదాన భవనం, భక్తులు వేచి ఉండే భవనం, టాయిలెట్ల బ్లాకుల నిర్మాణాలు జరుగుతున్నాయి. విశాఖపట్నానికి చెందిన లారస్ కంపెనీ 2023లో వాగ్దానం చేసిన విశ్రాంతి షెడ్డును.. రెండేళ్ల తరువాత ఈ ఏడాది నిర్మించడం భక్తులకు ఊరట నిచ్చే విషయం. ఆదాయంలోనూ వెనుకంజ శిథిలావస్థకు చేరిన సీతారామ సత్రాన్ని 2024లోనే కూల్చివేసి నూతన సత్రం నిర్మించాల్సి ఉంది. కానీ దాన్ని కూల్చివేయాలా, వద్దా అనే మీమాంసలోనే 2025 ఏడాది గడిచిపోయింది. చివరకు గత నెలలోనే ఈ సత్రాన్ని కూల్చివేసి, దాని స్థానంలో కొత్త సత్రం నిర్మాణానికి అనుమతి రావడంతో ఆ పనులు మొదలయ్యాయి. ఆదాయ పరంగా దేవస్థానం పెద్డగా ముందడుగు వేయలేదు. గతేడాది రూ.135 కోట్ల ఆదాయం, రూ.134 కోట్ల వ్యయం ఉంటే, ఈసారి కూడా ఆదాయానికి సమానంగా వ్యయం పెరిగింది. సేవల్లో చివరి ర్యాంకు రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు విచ్చేసిన భక్తులకు ఆయా దేవస్థానాలు అందించిన సేవలపై రాష్ట్ర ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే నిర్వహించింది. దానిలో అన్నవరం దేవస్థానానికి గత ఫిబ్రవరిలో చివరాఖరు ఏడో ర్యాంకు వచ్చింది. దీంతో జిల్లా కలెక్టర్.. అన్నవరం దేవస్థానంలో తనిఖీలు నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం కార్తిక మాసం ఏర్పాట్లను దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ స్వయంగా పర్యవేక్షించడంతో ఏ వివాదాలు లేకుండా జరిగాయి. ఆవు నెయ్యిపై.. స్వామి వారి ప్రసాదం తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యిని 2024 ఆగస్టు నుంచి సహకార డైయిరీ నుంచి కొటేషన్లపై కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది జూన్ నుంచి టెండర్ పిలవాలని కమిషనర్ ఆదేశాలివ్వగా ఈఓ అమలు చేయలేదు. దీంతో ఈఓపై దేవదాయశాఖ కార్యదర్శి హరి జవహర్లాల్, కమిషనర్ రామచంద్రమోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ నెల ఒకటిన టెండర్ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రోక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. సంగం డైయిరీ కేజీ రూ.639.90కు ఆవు నెయ్యి సరఫరా చేయడానికి లోయెస్ట్ టెండర్ కోట్ చేసి దక్కించుకుంది. ప్రజాప్రతినిధుల జోక్యం అన్నవరం దేవస్థానాన్ని ఏడాది కాలంగా ప్రజాప్రతినిధుల చేతుల్లో పెట్టారన్న విమర్శలు బలంగా వినిపించాయి. దేవస్థానంలో ఉన్న చిన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను సైతం ప్రజాప్రతినిధులకు చెప్పడం, వారి సూచించిన వారినే నియమించడం జరిగింది. వివాదాస్పదం ఈఓ సుబ్బారావు ఇక్కడ నుంచి బదిలీ అయ్యాక కూడా ఆయన ఇచ్చిన ఉత్తర్వులు వివాదస్పదమయ్యాయి. గో ఆధారిత ఉత్పత్తులు, స్వామివారి పూజలు, వ్రతాలలో వాడిన పత్రి పూలతో చేసినవి అంటూ ఫినాయిల్, కాళ్ల పగుళ్ల నివారణ ఆయిల్ అమ్మకాలు చేస్తుండడం దుమారం రేపింది. దీనిపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమవడంతో వాటి విక్రయాలను దేవస్థానం నిలిపివేసింది. అలాగే పాలకొల్లులో నిర్వహించిన సత్యదేవుని వ్రతాలలో కానుకలు డిమాండ్ చేశారనే ఆరోపణలపై ఆరుగురు పురోహితులను సస్పెండ్ చేయడం సంచలనం రేపింది. ఈఓగా త్రినాథరావు దేవస్థానం ఈఓ (ఫుల్ అడిషనల్ చార్జి)గా ఈ నెల పదో తేదీన రాజమహేంద్రవరం ఆర్జేసీ వి.త్రినాథరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయన దేవస్థానంలో పాలనను గాడిలో పెట్టడంతో పాటు సీతారామసత్రం నిర్మాణం ప్రారంభించడం, మెట్లదారి పెండింగ్ పనులు పూర్తి చేసి దానిని భక్తులకు అందుబాటులోకి తేవడం, ఇంకా దాతల సహకారంతో సత్యగిరిపై భక్తులకు ఉచితంగా వసతి ఇచ్చేందుకు డార్మెట్రీ నిర్మించడం తదితర పనులు చేపట్టాల్సి ఉంది. 2027 పుష్కరాల కోసం ఇప్పటి నుంచి ప్రణాళిక రూపొందించి ఆ మేరకు పనిచేయాలి.పాలనా వైఫల్యాలు గత ఈఓ పాలనా వైఫల్యాలపై ఈ ఏడాది ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా దేవస్థానంలో నీటి సమస్య పరిష్కారానికి గాను వసతి సత్రాలలో ఏసీ గదులు అద్దెకు ఇవ్వొద్దంటూ మార్చిలో ఈఓ ఇచ్చిన ఆదేశాలు తీవ్ర దుమారం రేపాయి. అలాగే ఈఓ కుమారుడు దేవస్థానంలో షాడో ఈఓగా వ్యవహరించేవారు. దానిపై వార్త రావడంపై సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. దేవస్థానం సిబ్బందిని ఈఓ వేధిస్తున్నారన్న ఆరోపణలపై పలువురు అధికారులు సెలవు పెట్టడం, కొందరు వలంటరీ రిటైర్మెంట్కు దరఖాస్తు చేసుకోవడం సంచలనం రేకెత్తించింది. దీనిపై కూడా ‘సాక్షి’లో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. దేవస్థానంలో పారిశుధ్య సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. దీనిపై కూడా వార్త రావడంతో ఆ సమస్య పరిష్కారమైంది. -
సూర్యబలిజల ఐక్యత కోసం వెబ్సైట్
సామర్లకోట: రాష్ట్రంలో ఐదు సంఘాలుగా ఉన్న సూర్యబలిజలను ఒకే తాటిపైకి తీసుకు రావడానికి సూర్యబలిజ వెబ్సైట్ను ప్రారంభిస్తున్నట్లు ఆ సామాజికవర్గ ఐక్య వేదిక నాయకులు అన్నారు. ఈ మేరకు స్థానిక గణపతినగరం వాటర్ ట్యాంకుల వద్ద మంగళవారం రాష్ట్ర సూర్యబలిజ సంఘ నాయకుడు జీవీకే మోహనరావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్యబలిజ సంఘ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ఏలూరి సుబ్రహ్మణ్యం.. సూర్యబలిజ వెబ్సైట్ను ప్రారంభించారు. అనంతరం ఏలూరి సుబ్రహ్మణ్యం, జీవీకే మోహనరావు, వైబ్సైట్ రూపకర్త పైడిముక్కల ఆనంద్ మాట్లాడుతూ సూర్యబలిజ కులస్తులకు చంద్రబాబు ఇచ్చిన హామీ 18 నెలలు గడిచినా అమలు చేయలేదన్నారు. ఈ వెబ్సైట్లో సూర్యబలిజ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కులస్తుల పేర్ల నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండు రాష్ట్రాల కమిటీల ఎన్నికలను ముఖ్య నాయకులు సమక్షంలో నిర్వహిస్తామన్నారు. సామాజికవర్గీయులందరూ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.రాష్ట్ర సూర్యబలిజ.కమ్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా సంఘ అధికార ప్రతినిధి కాలే వెంకటరత్నం, ప్రముఖులు యండమూరి ఈశ్వరరావు, అల్లు భాస్కరరావు, కాకరపల్లి శ్రీధర్, బి.కామేశ్వరరావు, కాలే సతీష్ ప్రసాద్, పెండ్యాల ధర్మ తదతరులు పాల్గొన్నారు -
నర్సరీ రైతుల సమస్యలు పరిష్కరించాలి
కడియం: నర్సరీ రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కీర్తి చేకూరికి సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో ఆమెను అసోసియేషన్ అధ్యక్షుడు రత్నం అయ్యప్ప, పాలకవర్గ సభ్యులు కలిశారు. మొక్కలను అంతర్జాతీయంగా ఎగుమతి చేసేటప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ప్రభుత్వం నుంచి మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తే అంతర్జాతీయ ఎగుమతులకు అవకాశాలు పెరుగుతాయన్నారు. సాయిల్ లెస్ మీడియాపై కోకోపిట్ స్టబిలైజేషన్, టిష్యూకల్చర్ ల్యాబ్ వంటి తదితర అంశాలపై చర్చించారు. కాగా.. తాము వివరించిన పలు అంశాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని అయ్యప్ప తెలిపారు. జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, జిల్లా ఉద్యానశాఖ అధికారి మల్లికార్జున, కడియం ఉద్యానశాఖ అధికారి లావణ్య, అసోసియేషన్ పాలకవర్గం బోడపాటి గోపి, కొండేపూడి నాగు, తాడాల నాగేశ్వరరావు, బాబ్జీ, పిల్లా శ్రీనివాస్, బోడపాటి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ నొడగల బుచ్చిరాజు పాల్గొన్నారు. రమ్యసుధకు జాతీయ ఉత్తమ పరిశోధన అవార్డురంగంపేట: అహ్మదాబాద్ సైన్స్ సిటీలో ఈ నెల 21న ఆల్ ఇండియా రామానుజన్ మ్యాథ్స్ క్లబ్, గుజరాత్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ సదస్సులో రంగంపేట జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయురాలు రమ్యసుధ జాతీయ ఉత్తమ పరిశోధన ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు అయిన ఆమె అనేక పరిశోధనా వ్యాసాలు రాసి, పలు శాసీ్త్రయ ప్రాజెక్టులు తయారు చేసి, పలు ప్రదర్శనలలో ఉత్తమ బహుమతులు పొందుతున్నారు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో పదికి పైగా పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. రమ్యసుధ పరిశోధనలు మన దేశంతో పాటు జపాన్, మలేషియా, నేపాల్ వంటి దేశాల్లో ప్రదర్శింపబడి సందర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. కాగా.. రమ్యసుధను రంగంపేట హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వి.పార్థసారథి, ఉపాధ్యాయులు వీసీ జాకబ్, వరలక్ష్మి అభినందించారు. -
హైదరాబాదులో హత్య.. కోనసీమలో మృతదేహం
● వీడిన మహిళ అదృశ్యం మిస్టరీ ● ముగ్గురు నిందితుల అరెస్టు మామిడికుదురు: హైదరాబాద్లో హత్యకు గురైన ఓ మహిళ మృతదేహాన్ని జిల్లాలో పోలీసులు గుర్తించారు. నాచారం సీఐ కె.ధనుంజయ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని మల్లాపూర్ బాబానగర్లో సూరెడ్డి సుజాత (65) నివాసం ఉంటోంది. డ్రైవర్గా పనిచేస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపల్లికి చెందిన ఎం.అంజిబాబు ఆమె ఇంట్లో రెండు నెలల క్రితం అద్దెకు దిగాడు. సుజాత ఒంటరిగా ఉండడం, ఆమె ఒంటిపై బంగారాన్ని చూసిన అంజిబాబుకు దుర్బుద్ధి పుట్టింది. బంగారాన్ని కాజేయాలన్న ఉద్దేశంతో ఈ నెల 19న వంటగదిలో ఉన్న సుజాతపై వెనుక నుంచి దుప్పటి కప్పి, ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. అనంతరం పెరవలి మండలం ఖండవిల్లికి చెందిన స్నేహితుడు యువరాజు, అనకాపల్లికి చెందిన నూకల దుర్గారావు సహాయంతో ఈనెల 20వ తేదీన ఆ మృతదేహాన్ని అద్దె కారులో తీసుకువచ్చి గోదావరిలో పడేశాడు. కాగా.. సుజాత కనిపించడం లేదంటూ ఈ నెల 24న ఆమె బంధువులు ఇచ్చిన ఫిర్యాదుపై నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానంతో అంజిబాబును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడి సమాచారం మేరకు పెదపట్నం గ్రామంలోని మధ్యలంకలో సుజాత మృతదేహాన్ని గుర్తించారు. బాగా పాడైపోవడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
రహదారులు రక్తసిక్తం
కాకినాడ క్రైం: జిల్లా పోలీసు శాఖ వార్షిక నేర నివేదిక విడుదల చేసింది. కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ జి.బిందుమాధవ్ ఈ వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం ఈ ఏడాది జిల్లాలోని రహదారులు రక్తసిక్తమయ్యాయి. వివిధ రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. రహదారి ప్రమాదాల్లో జనవరి నుంచి జూన్ వరకూ 170, జూలై నుంచి డిసెంబర్ వరకూ 130 మరణాలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది 859 రోడ్డు ప్రమాదాలు జరగగా ఈ ఏడాది ఆ సంఖ్య 787కు తగ్గిందని, 8.38 శాతం మేర రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ఎస్పీ తెలిపారు. రహదారులపై జూలై నుంచి ఏర్పాటు చేసిన అధునాతన స్మార్ట్ పార్కింగ్ అలెర్ట్ సిస్టం ద్వారా రెండో అర్ధ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించగలిగామని చెప్పారు. మెడలో గొలుసులు జాగ్రత్త జిల్లాలో చైన్ స్నాచింగ్లు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది 31 కేసులు నమోదవగా, ఈ ఏడాది ఆ సంఖ్య ఏకంగా 57కు పెరిగింది. ఈ నేరాలు ఏకంగా 83.87 శాతం మేర పెరిగి బెంబేలెత్తిస్తున్నాయి. ద్విచక్ర వాహనాల చోరీలు కూడా గణనీయంగా పెరిగాయి. గత ఏడాది 301 వాహనాలు చోరీ కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 480 వాహనాలను దొంగలు అపహరించారు. ఏకంగా 59.47 శాతం మేర బైక్ దొంగతనాలు పెరిగాయి. రాత్రయితే ఇల్లు గుల్లే.. జిల్లాలో రాత్రి వేళ దొంగతనాలు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ తరహా చోరీలు గత ఏడాది 110 నమోదవగా.. ఈ ఏడాది 151 కేసులు వచ్చాయి. వీటి పెరుగుదల 37.27 శాతంగా నమోదైంది. సమయంతో నిమిత్తం లేకుండా ఆస్తులు కొల్లగొట్టి దోచుకెళుతున్న కేసులు గత ఏడాది 738 నమోదైతే ఈ ఏడాది ఏకంగా వెయ్యికి (+35.50 శాతం) పెరిగాయి. తగ్గిన అత్యాచారాలు మహిళలపై అత్యాచారాలు, అత్యాచార యత్నాలు ఈ ఏడాది తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది 19 అత్యాచార కేసులు నమోదైతే ఈ ఏడాది ఆ సంఖ్య 10కి పరిమితమై, 47.37 శాతం మేర తగ్గాయి. అలాగే, మహిళల మరణాలకు సైతం కారణమవుతున్న వరకట్న వేధింపు కేసులు గత ఏడాది 383 న మోదవగా.. ఈ ఏడాది 336కు తగ్గాయి. వీటి తగ్గుదల 12.27 శాతం ఉందని ఎస్పీ చెప్పారు. గత ఏడాది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 65 రాగా, ఈ ఏడాది 46 (29.23 శాతం తగ్గుదల) నమోదయ్యాయి. హత్యలు.. మాదక ద్రవ్యాలు జిల్లాలో హత్యలు గత ఏడాది కంటే పెరిగాయి. 2024లో 28 హత్యలు జరగగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 33కు (+17.86 శాతం) పెరిగింది. మరోవైపు గత ఏడాది గంజాయి కేసులు 35 నమోదవగా.. ఈ ఏడాది గంజాయి అనుబంధ మాదకద్రవ్యాల కేసులు 43 (+22.86 శాతం) నమోదయ్యాయి. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల మృతులు 300 మంది పెరిగిన చైన్ స్నాచింగ్లు, సైబర్ నేరాలు తగ్గిన వరకట్న వేధింపులు, దళితులపై నేరాలు 2025 వార్షిక నేర నివేదిక విడుదల రికవరీలు అంతంత మాత్రం చోరీ కేసులలో సొత్తు రికవరీ అంతంత మాత్రంగానే ఉంది. బంగారం 60 శాతం, వెండి 64 శా తం, నగదు 62 శాతం మేర మాత్రమే పోలీసులు రికవరీ చేయగలిగారు. వివిధ కేసులలో రూ.9.01 కోట్ల నగదు చోరీ కాగా.. రూ.5.60 కోట్లు రికవరీ చేయగలిగారు. మొత్తం మీద ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. సీసీ కెమెరాల వినియోగం, నేరాల నియంత్రణకు చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, ప్రత్యేక బృందాల పని తీరు, సాంకేతికత వినియోగం ఈ పురోగతికి కారణమని చెప్పారు. గత ఏడాది 7,947 నేరాలు జరగగా.. ఈ ఏడాది 171 తగ్గి (2.15 శాతం) 7,776 నమోదయ్యాయన్నారు. 5.2 కిలోల బంగారం, 92.40 కిలోల వెండి, రూ.8.52 కోట్ల నగదు, మూడు లారీలు, 21 ఆటోలు, 360 బైకులు, 1,541 సెల్ఫోన్లు రికవరీ చేసి, 813 మందిని అరెస్టు చేశామని వివరించారు. వచ్చే ఏడాది కూడా ప్రత్యేక ప్రణాళికతో నేర నియంత్రణలో సానుకూల ఫలితాలు రాబడతామని చెప్పారు. జిల్లా ప్రజలకు ఎస్పీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
జనసేన నాయకుడి దాడి కేసుపై విచారణ
రాజోలు: ప్రజా సంఘాల నేతలపై దాడి, కుల దూషణకు పాల్పడిన జనసేన నాయకుడిపై కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ మంగళవారం విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 25న జరిగిన శివకోటి ముసలమ్మ తల్లి ఉత్సవాల్లో నృత్య ప్రదర్శన కోసం రాజమహేంద్రవరం నుంచి వచ్చిన పాలపర్తి భవ్యశ్రీ ఇక్కడ మెట్లపై నుంచి పడి మృతి చెందింది. మృతదేహాన్ని రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో భవ్యశ్రీ కుటుంబానికి మద్దతుగా రాజోలు ప్రభుత్వాస్పత్రి వద్దకు జిల్లా మానవ హక్కుల వేదిక కార్యవర్గ సభ్యుడు జనుపల్లి సత్యానందం (నాని), రాజోలు నియోజకవర్గ బహుజన సమాజ్వాది పార్టీ ఇన్చార్జి ఆకుమర్తి భూషణం వచ్చారు. అక్కడ వారిపై జనసేన నాయకుడు పినిశెట్టి వెంకటస్వామి (బుజ్జి) దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణాధికారి అయిన కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్ రాజోలు ప్రభుత్వాస్పత్రి వద్ద నేరస్థలాన్ని, ఫిర్యాదు దారుడు, కేసులో కొందరు సాక్షుల నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. -
హాస్టల్ విద్యార్థులకు.. సహాయం చేయండి ప్లీజ్..
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు కనీస వసతులు కల్పించేందుకు దాతలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పారిశ్రామికవేత్తలు, అధికారులు, ప్రజలు ధన, వస్తు రూపంలో సహాయం అందించాలని కలెక్టర్ షణ్మోహణ్ సగిలి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలోని 100 సంక్షేమ హాస్టళ్లలో దాదాపు 15 వేల మంది పేద విద్యార్థులు చదువుతున్నారన్నారు. వీరందరికీ మంచి విద్య, ఆరోగ్యం, బంగారు భవిత అందించేందుకు హాస్టళ్లలో కనీస వసతుల అభివృద్ధి చేపడుతున్నామన్నారు. దీనికి భూరి విరాళాలు అందించాలని కోరారు. నూతన సంవత్సర వేళ తనకు శుభాకాంక్షలు తెలియజేసేవారు ధన రూపంలో లేదా దోమతెరలు, ఆర్ఓ ప్లాంట్లు, లైట్లు, ఫ్యాన్లు, మోడ్రన్ లైబ్రరీ తదితర వస్తు రూపంలో కానీ సహాయం అందజేయాలని సూచించారు. నేడు హుండీల ఆదాయం లెక్కింపు అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ఈ నెల హుండీల ఆదాయం లెక్కింపు బుధవారం నిర్వహించనున్నారు. కార్తిక మాసం అనంతరం స్వామివారి హుండీల ఆదాయాన్ని గత నెల 24న లెక్కించారు. అప్పటి నుంచి తెరవకపోవడంతో ఆలయంలోని ప్రధాన హుండీతో పాటు ఇతర హుండీలు చాలావరకూ నిండిపోవడంతో వాటికి సీల్ వేశారు. స్వామివారి నిత్య కల్యాణ మండపంలో ఉదయం 7 గంటల నుంచి లెక్కింపు జరగనుంది. దీనికి సిబ్బంది అందరూ హాజరు కావాలని అన్నవరం దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు ఆదేశించారు. ఈసారి రూ.1.50 కోట్లు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మాఘంలో కోటి తులసి పూజఅన్నవరం: వచ్చే మాఘ మాసంలో సత్యదేవుని సన్నిధిలో కోటి తులసి పూజ నిర్వహించాలని భావిస్తున్నట్లు అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు మంగళవారం తెలిపారు. ఈ పూజల నిర్వహణకు రెండు ముహూర్తాలు పెట్టాల్సిందిగా వైదిక కమిటీని కోరామన్నారు. పండితులతో చర్చించి ఆ రెండు ముహూర్తాల్లో దేవస్థానానికి అనుకూలమైన తేదీల్లో కోటి తులసి పూజ నిర్వహిస్తామని చెప్పారు. లోక కల్యాణార్థం, సత్యదేవుని భక్తులకు మంచి జరగాలని, తెలిసీ తెలియక చేసిన అపచారాలు తొలగిపోవాలని ఈ పూజలు తలపెట్టామని వివరించారు. 2022, 2023 సంవత్సరాల్లో అప్పటి ఈఓ త్రినాథరావు హయాంలోనే దేవస్థానంలో మహా నారాయణ యాగం, కోటి తులసి పూజ నిర్వహించారు. ఆ తర్వాత ఇటువంటి కార్యక్రమాలు జరగలేదు. దీంతో, గత రెండేళ్లలో రెండు అగ్ని ప్ర మాదాలు, ఆలయ ప్రాంగణంలో పలువురు మృతి చెందడంతో పాటు పలు అవాంఛనీయ సంఘటనలు, వివాదాలు దేవస్థానంలో చోటు చేసుకున్నాయనే వాదనలున్నాయి. అయినప్పటికీ, దే వస్థానంలో సంప్రోక్షణ, హోమాల వంటివి జరగలేదు. దీనిపై ‘అపశృతులు అందుకేనా..?’ శీర్షికన ‘సాక్షి’ అక్టోబర్ 7న కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు స్పందించి, సంప్రోక్షణ పూజలు చేశారు. ఇప్పుడు కోటి తులసి పూజ నిర్వహించాలని నిర్ణయించారు. పలువురికి ఉద్యోగోన్నతులు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా పరిషత్లో ఆఫీసు సబార్డినేట్లుగా పని చేస్తున్న పలువురికి రికార్డు అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించారు. వారికి జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మంగళవారం నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రమోషన్లు పొందిన ఉద్యోగులు సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజాసేవ చేసి జిల్లా పరిషత్కు మంచి పేరు తేవాలని అన్నారు. ఎంతో కాలంగా ఆఫీస్ సబార్డినేట్లుగా సేవలందించామని, ఉద్యోగోన్నతి పొందడం ఎంతో ఆనందంగా ఉందని ప్రమోషన్ పొందిన ఉద్యోగులు అన్నారు. జెడ్పీ చైర్మన్కు, సీఈఓ లక్ష్మణరావుకు కృతజ్ఞతలు తెలిపారు. జనవరి 24న నాటిక పోటీలుసామర్లకోట: పెద్దాపురం మండలం చంద్రమాంపల్లిలో జనవరి 24 నుంచి 26వ తేదీ వరకూ ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు స్నేహ ఆర్ట్స్ నాటక పరిషత్ అధ్యక్షుడు గొందేసి రాజా తెలిపారు. సంబంధిత బ్రోచర్లను పెద్దాపురం ఎస్సై వి.మౌనిక ఆధ్వర్యాన మంగళవారం ఆవిష్కరించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో రెండు రాష్ట్రాల నుంచి 8 నాటికలు ప్రదర్శిస్తారని రాజా చెప్పారు. ఆరేళ్లుగా ఈ నాటిక పోటీలు నిర్వహిస్తున్నారని, ఇప్పుడు ఏడో సంవత్సరం మరింత ఉత్సాహంగా ఈ పోటీలు జరగాలని ఆశిస్తున్నట్లు ఎస్సై మౌనిక అన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేలా సందేశాత్మక నాటికలు ప్రదర్శించాలని సూచించారు. కార్యక్రమంలో పరిషత్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. -
‘ముక్కోటి’కి ముస్తాబు
● రత్నగిరిపై పూర్తయిన ఏర్పాట్లు ● ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనంఅన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుడు వెలసిన రత్నగిరి మంగళవారం జరగనున్న ముక్కోటి ఏకాదశి పర్వదినానికి ముస్తాబైంది. సత్యదేవుని ప్రధానాలయంతో పాటు తూర్పు రాజగోపురం, ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల పూలమాలలు, విద్యుద్దీప తోరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సత్యదేవుని ఉత్తర ద్వార దర్శనాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకూ యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రధానాలయం ఉత్తర ద్వారం వద్ద ఉత్తరాభిముఖంగా మండపం ఏర్పాటు చేశారు. అందులో శేషపాన్పు మీద పవళిస్తున్న విష్ణుమూర్తి, లక్షీదేవి అలంకరణలో సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించారు. తెల్లవారుజామున 4 గంటలకు పండితులు స్వామి, అమ్మవార్లకు పంచ హారతి, నీరాజన మంత్రపుష్పాదులు సమర్పిస్తారు. అనంతరం ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. భక్తుల రద్దీని అనుసరించి సాయంత్రం వరకూ ఉత్తర ద్వార దర్శనం కొనసాగిస్తారు. దీనికోసం ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ భక్తులు దిగువ నుంచి ఆలయ ప్రాకారంలోకి క్యూలో ప్రవేశించాక.. దక్షిణ ద్వారం నుంచి లోపలకు వెళ్లి, స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ఉత్తర ద్వారం నుంచి వెలుపలకు వచ్చేవారు. ముక్కోటి సందర్భంగా దక్షిణ ద్వారం నుంచి కాకుండా ఉత్తర ద్వారం వద్దనే ఏర్పాటు చేసిన స్వామి, అమ్మవార్లను దర్శించి, అక్కడి నుంచి తూర్పు ద్వారం వైపు వెళ్లి, గర్భాలయంలో సత్యదేవుడు, అమ్మవారిని దర్శించుకుని, దక్షిణ ద్వారం వద్ద ఉన్న క్యూ లైనులో వెలుపలకు వచ్చేలా ఏర్పాటు చేశారు. ఉత్తర ద్వారం ద్వారా రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దర్శనానంతరం భక్తులకు కదంబం ప్రసాదం పంపిణీ చేస్తారు. ఉదయం 11 గంటలకు స్వామి, అమ్మవార్లను వెండి రధంపై ఆలయ ప్రాకారంలో ఊరేగిస్తారు. అలాగే, రాత్రి 7 గంటల నుంచి వెండి గరుడ వాహనంపై అన్నవరం గ్రామంలో ఊరేగించనున్నారు. ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు సోమవారం పరిశీలించారు. ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చకుడు సుధీర్ తదితరులతో ఆలయంలో ఏర్పాట్లపై సమీక్షించారు. దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ, ఏఈఓ పెండ్యాల భాస్కర్, సూపరింటెండెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నేర నామ సంవత్సరం
గంజాయి బ్యాచ్ల స్వైరవిహారం గంజాయిని అరికడతామంటూ ప్రభుత్వం గొప్పగా చెప్పడం మినహా.. వాస్తవానికి ఈ మత్తు ఈ ఏడాది మరింత ఎక్కువగా పట్టణాలతో పాటు పల్లెల్లోకీ విస్తరిస్తోంది. జిల్లా కేంద్రమైన కాకినాడలో అయితే గంజాయి లభించని ప్రాంతం లేదంటే అతిశయోక్తి కాదు. గంజాయి ముఠాలు విద్యార్థులను ఈ మత్తులో ముంచుతూ సొమ్ము చేసుకుంటున్నాయి. టన్నులకొద్దీ గంజాయిని పోలీసులు పట్టుకుంటున్నా.. అనేక మందిని అరెస్టు చేస్తున్నా.. అవేవీ ఈ మత్తును నియంత్రించలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. పైగా గంజాయి ముఠాలు బరితెగించి నడి రోడ్డుపై వీరంగం వేస్తూండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కాకినాడ రామారావుపేటలో ఈ ఏడాది అక్టోబర్లో రాత్రి విధులు ముగించుకొని వస్తున్న ఓ వైద్యుడిపై ముగ్గురు గంజాయి నిందితులు దాడి చేసి డబ్బులు లాక్కున్నారు. స్నేహితుడు సకాలంలో స్పందించడంతో వైద్యుడికి ముప్పు తప్పింది. అప్పటికి కొద్ది రోజుల ముందు మల్లయ్య అగ్రహారం సమీపాన ఓ విలేకరిపై గంజాయి మత్తులో ఉన్న మైనర్లు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆ విలేకరి చావు అంచుల వరకూ వెళ్లొచ్చాడు. ఇక చైన్స్నాచర్ల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. దోపిడీ దొంగలు చెలరేగిపోతూండటం ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది.కాకినాడ క్రైం: జిల్లా ప్రజలకు 2025 సంవత్సరం చేదు అనుభవాలను చవిచూపింది. అనుకోని ప్రమాదాలు కొన్ని.. అనుకొని చేసిన దారుణాలు ఇంకొన్ని.. కక్షలు, కార్పణ్యాలు.. వ్యామోహాలతో రక్తం చిందిన ఉదంతాలు.. వావివరుసలు మరచి, విచక్షణ విడిచేసిన మృగాల అఘాయిత్యాలు.. ఇంకా దొంగతనాలు.. గంజాయి బ్యాచ్ల దాడులు.. మందుబాబుల వీరంగాలు.. సైబర్ నేరాల వంటివి ఈ ఏడాది యథేచ్ఛగా కొనసాగాయి. సోషల్ మీడియా పరిచయాలు వివాహేతర సంబంధాలకు దారి తీసి పచ్చని సంసారాల్లో చిచ్చులు రేపాయి. ఇలా ఎన్నో వివాదాలు, మరెన్నో విషాదాలకు నిలయమైన 2025.. నేర నామ సంవత్సరంగా నిలిచింది. హత్యలతో అట్టుడికి.. వివాహేతర సంబంధా లు, ప్రేమ వ్యవహారాలు, ఆర్థిక కారణాలు, రియల్ ఎస్టేట్ వివాదాలు, క్షణికావేశం వంటి కారణాలతో జరిగిన హత్యలతో జిల్లా ఈ ఏడాది అట్టుడికిపోయింది. గొల్లప్రోలులోని ఓ ప్రాంతంలో కుళ్లిన స్థితిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం మే నెలలో కనిపించింది. దేహంపై గాయాలుండటంతో పోలీసులు లోతుగా విచారణ జరిపారు. మొత్తం 7 వేల మిస్సింగ్ కేసులు పరిశీలించారు. అనకాపల్లికి చెందిన ఓ వృద్ధురాలు తన కుమారుడు కనిపించడం లేదంటూ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆ వ్యక్తిని తంగెళ్ల లోవరాజు(38)గా గుర్తించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య, ఆమె ప్రియుడు, మరో వ్యక్తి సహకారంతో సర్జికల్ బ్లేడ్తో లోవరాజు గొంతు కోసి హతమా ర్చి, మృతదేహాన్ని కత్తిపూడి – కాకినాడ మధ్య ఓ కాలువలో పడేసినట్లు తేలింది. సామర్లకోట సీతారాం కాలనీలో ఓ భర్త.. తన భార్య మాధురిని, 4, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు పుష్పకుమారి, జెస్సీలను ఆగస్టులో దారుణంగా హతమార్చడం సంచలనం రేపింది. ఈ ఏడాది అక్టోబర్లో ఇద్దరు మైనర్ల మధ్య ఓ అమ్మాయి కోసం గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో గంటా శామ్యూల్ను అభివర్ధన్ అనే స్నేహితుడితో పాటు శ్రీనివాస్ అనే యువకుడు బ్లేడ్తో గొంతు కోసి, ఆపై కాళ్లు చేతులు తాళ్లతో కట్టి, డ్రైనేజీ నీటిలో ముంచి హతమార్చారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఆ డ్రైనేజీలోనే మృతదేహాన్ని వదిలేశారు. ఈ సంఘటనతో కాకినాడ నగర వాసులు ఉలిక్కిపడ్డారు. కాకినాడ ఇంద్రపాలెంలో భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి నాపరాయితో ఆమె తల పగులగొట్టి చంపాడు. మరో వ్యక్తి తన తమ్ముడి చెప్పుడు మాటలు విని భార్య గొంతు కోసి, తానూ పురుగు మందు తాగాడు. భార్య బతికింది, భర్త చనిపోయాడు. ఈ నెలలో కాకినాడ సంతచెరువు వద్ద చెప్పులు కుట్టే ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. అంతకు ముందు రోజు ఘర్షణ పడ్డ వ్యక్తి తనను, తన తల్లిని తిడతావా అంటూ చెప్పులు కుట్టే పదునైన పరికరంతో అతడి గుండెల్లో గుచ్చాడు. ఆ గాయంతోనే బాధితుడు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లగా.. పోలీసులు అతడిని ఆస్పత్రికి పంపించారు. అక్కడకు వెళ్లేసరికే అపస్మారక స్థితి లో ఉన్న బాధితుడు మృతి చెందాడు. ఇలా మరెన్నో హత్యలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. ‘మృత్యు’రాదారులు ఈ ఏడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగాయి. అతి వేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, నిద్ర మత్తు, దారుణంగా ఛిద్రమైన రహదారులు ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఘటనల్లో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా సత్ఫలితాలనివ్వడం లేదు. ఫిబ్రవరిలో కాకినాడ – సామర్లకోట రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వృద్ధ జంట గోతుల వల్ల కుదుపులకు గురయ్యారు. ఈ క్రమంలో వెనుక కూర్చున్న వృద్ధురాలు కింద పడిపోయి, తలకు తీవ్ర గాయమై, అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మృతదేహం వద్ద భర్త రోదించిన తీరు చూపరులను కంట తడి పెట్టించింది. ఏప్రిల్ 5న జగ్గంపేట మండలం కాట్రావులపల్లికి చెందిన మల్లేపల్లి శ్రీను తన పెళ్లి బట్టలు కొనుక్కునేందుకు కాకినాడ వచ్చి వెళ్తూండగా లారీ ఢీకొని ప్రాణాలు కోల్పోవడం స్థానికులను, కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురి చేసింది. మే 17న విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఓ కారు తుని వద్ద హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. నవంబర్ 8వ తేదీ ఉదయం 7 గంటల సమయంలో కిర్లంపూడి మండలం సోమవరం గ్రామం వద్ద హైవేపై అతి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు కనిపించిన వాహనాలనల్లా ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లింది. ఈ దారుణ ఘటనలో బస్టాప్లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇంకా మరిన్ని ప్రమాదాల్లో ఎంతోమంది అర్ధాంతరంగా తనువు చాలించారు. సైబర్ నేరాలు ఈ ఏడాది సైబర్ నేరాలు సైతం గణనీయంగా పెరిగాయి. కంటికి కనిపించని చీకటి దొంగలు ఆన్లైన్లో వివిధ నేరాలకు పాల్పడుతూ పోలీసుల మతులు పోగొడుతున్నారు. ప్రతాప్ నగర్కు చెందిన ఓ విశ్రాంత అధికారి ఈ ఏడాది ఆరంభంలో డిజిటల్ అరెస్టు పన్నాగంలో చిక్కుకోబోయి త్రుటిలో తప్పించుకుని, సుమారు రూ.40 లక్షల సొత్తు కాపాడుకున్నాడు. పెద్దాపురానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తికి వలపు వల విరిసిన సైబర్ నేరగాళ్లు ఫొటోలు మార్ఫింగ్ చేసి, బ్లాక్ మెయిల్కు పాల్పడ్డారు. డబ్బు ముట్టజెప్పినా వేధింపులు ఆగలేదు. చివరకు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కాకినాడ మెయిన్ రోడ్లో ఓ డీటీపీ సెంటర్ నిర్వాహకుడు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి వ్యాపారం పేరిట రూ.2 లక్షలు కోల్పోయాడు. జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కితే ఎక్కడ, ఎవరికి, ఎలా ఫిర్యాదు చేయాలనే అంశాలపై బాధితులకు కనీస అవగాహన కూడా ఉండటం లేదు. పోలీసు శాఖలో సైబర్ సెల్ లేకపోవడం, ఉన్న ఐటీ కోర్ విభాగ మే ఈ నేరాలపై పని చేయడంతో తగిన ఫలితాలు రావడం లేదనే విమర్శలకు తావిస్తోంది. జిల్లాను కుదిపేసిన హత్యలు ఆయువు తీసిన ప్రమాదాలు అమ్మాయిలపై అఘాయిత్యాలు మూలమూలలకూ గంజాయి మత్తు వివాదాలు, విషాదాలకు నిలయంగా 2025 అమ్మాయిలపై అఘాయిత్యాలు మహిళలు, బాలికలపై ఈ ఏడాది అఘాయిత్యాలు పెరిగాయి. మృగాల బారిన పడి మైనర్లు చివురుటాకుల్లా వణికిపోయారు. కాకినాడ వెంకట్ నగర్లో పదకొండేళ్ల బాలికపై బాబాయి.. 13 ఏళ్ల మైనర్పై తాతయ్య అఘాయిత్యానికి పాల్పడ్డారు. తునిలో ఓ వృద్దుడు తాతయ్యనంటూ టీచర్లకు చెప్పి, ఓ విద్యార్థినిని పాఠశాల నుంచి బయటకు తీసుకెళ్లి తోటల్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతకు ముందు నుంచే వృద్ధుడు ఈ దురాగతానికి పాల్పడుతూ వచ్చాడు. చివరకు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదాల నివారణకు స్మార్ట్ పార్కింగ్ అలర్ట్ సిస్టం హైవేలపై నిలిపి ఉంచే వాహనాల వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. జూలైలో ఒకే కుటుంబంలో ఐదుగురు మరణించిన విషాద ఘటన అనంతరం జిల్లా పోలీస్ శాఖ ప్రయోగాత్మకంగా స్మార్ట్ పార్కింగ్ అలర్ట్ సిస్టం విధానాన్ని అమలు చేసింది. ప్రత్యేక లేజర్ సాంకేతికత ఆధారంగా రోడ్డుపై నిలిపి ఉంచిన వాహనాల సమాచారం 45 సెకండ్లలోనే స్థానిక పోలీస్ స్టేషన్కు చేరుతుంది. తద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించే ఆస్కారం కలిగింది. ఈ విధానం ప్రారంభించాక రోడ్లపై నిలిపి ఉంచిన వాహనాల వల్ల ఇప్పటి వరకూ ఒక్క ప్రమాదం కూడా జరగలేదు. పొరుగు జిల్లాలు కూడా దీనిని అవలంబిస్తున్నాయి. గతం కంటే గంజాయి నియంత్రణ మెరుగ్గా ఉంది. ఈగల్ టీంలు అందుకు పని చేస్తున్నాయి. క్షణికావేశాలే హత్యలకు కారణం. ప్లాన్ చేసి హత్య చేసిన ఉదంతాలు లేవు. మహిళలపై నేరాలు తగ్గాయి. మైనర్లపై జరుగుతున్న అకృత్యాలను ఉపేక్షించడం లేదు. త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నాం. – జి.బిందుమాధవ్, జిల్లా ఎస్పీ, కాకినాడ -
థర్టీ ఫస్ట్ ధమాకా
● క్వార్టర్పై రూ.10 అదనం ● ముమ్మిడివరం నియోజకవర్గంలో దోపిడీ ● కీలక నేత వత్తాసు ● సిండికేట్లో 30 షాపులు వారివే సాక్షి, అమలాపురం: ‘డిసెంబర్ థర్టీ ఫస్ట్’... పాత సంవత్సరానికి ముగింపు రోజు. అంతేకాదు మందు బాబులకు పండగ రోజు. మరీ ముఖ్యంగా మద్యం వ్యాపారులు రెండు చేతులా సంపాదించే రోజు. సాధారణ రోజుల కన్నా సంవత్సరాంతం రెండు, మూడు రెట్లు సాగే వ్యాపారం కోసం మద్యం వ్యాపారులు చేసుకునే ఏర్పాట్లు అన్నీ ఇన్నీ కావు. సందట్లో సడేమియాగా జిల్లాలో మద్యం వ్యాపారులు దోపిడీకి సిద్ధమయ్యారు. ఎమ్మార్పీ కన్నా క్వార్టర్ బాటిల్కు అదనంగా సొమ్ము వసూలుకు తెగబడ్డారు. జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం కేంద్రంగా ఇప్పటికే మొదలైన ఈ దోపిడీ జిల్లా అంతా విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాల్లో మద్యాన్ని అదనపు ధరలకు విక్రయిస్తున్నారు. గడచిన మూడు రోజులుగా ఈ దందా సాగుతోంది. క్వార్టర్ బాటిల్కు అదనంగా రూ.పది చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ దందాపై ఒక మద్యం ప్రియుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడిది హల్చల్ చేస్తోంది. మద్యం విక్రయాలు జరిపే ఒక వ్యక్తి మాట్లాడుతూ ‘అదనపు ధర ముమ్మిడివరం నియోజకవర్గానికి ప్రత్యేకమని’ చెప్పడం గమనార్హం. సాధారణంగా బెల్టు షాపుల్లో మద్యం దుకాణాల కన్నా రూ.20 అదనంగా చేసి అమ్మకాలు చేస్తున్నారు. మద్యం వ్యాపారులు ధరలు పెంచడంతో వీరు కూడా అదనంగా రూ.30 నుంచి రూ.40 పెంచి విక్రయిస్తున్నారు. ఆ నేత సోదరుడి హవా.. నియోజకవర్గానికి చెందిన ఒక అధికార పార్టీ కీలక నేత సోదరుడి ఆధ్వర్యంలో ఇక్కడ సిండికేట్ నడుస్తోంది. వీరి ఆధ్వర్యంలో ముమ్మిడివరం, అమలాపురం నియోజకవర్గాల్లో సుమారు 30 మద్యం దుకాణాల వరకూ ఉన్నాయని అంచనా. దీనిని అడ్డు పెట్టుకుని మద్యం ధరలు పెంచేశారు. మద్యం దుకాణాల కనుసన్నల్లోనే బెల్టుషాపులు కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మద్యం వ్యాపారం కాస్తా మాఫియాగా మారిపోయింది. గతంలో తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో బెల్టు షాపులకు వేలం పాటలు నిర్వహించిన విషయం గమనార్హం. మిగతా చోట్లా.. అదే బాట డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున జరిగే వ్యాపారంలో భారీ లబ్ధి ఆశిస్తున్న జిల్లాలోని మిగిలిన మద్యం వ్యాపారులు కూడా ముమ్మిడివరం బాట పట్టే అవకాశముంది. జిల్లా వ్యాప్తంగా మండలాలు, నియోజకవర్గాల వారీగా సిండికేట్లు ఏర్పడిన విషయం తెలిసిందే. అంబాజీపేటలో ఒక సిండికేట్ ఆధ్వర్యంలో మద్యం డోర్ డెలివరీ జరుగుతోంది. గత దసరా పండగ సమయంలో ఇక్కడ జరిగే భేతాళస్వామి ఉత్సవాలకు మద్యం దుకాణాలను బంద్ చేశారు. ఇదే అదునుగా మద్యం వ్యాపారులు క్వార్టర్కు రూ.50 చొప్పున పెంచి మద్యాన్ని డోర్ డెలివరీ చేశారు. అప్పటి నుంచి ఇక్కడ డోర్ డెలివరీ వ్యాపారం జోరందుకుంది. -
నేడు రమణ మహర్షి జయంతి
ప్రత్తిపాడు రూరల్: ఆంధ్రా అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన ప్రత్తిపాడు మండలం రాచపల్లిలోని శ్రీ రమణ సేవాశ్రమంలో రమణ మహర్షి 146వ జయంతి వేడుకలు మంగళవారం నిర్వహించనున్నారు. దీనికి 15 వేల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. సత్యసాయి సేవా సంస్థలు సహా పలు స్వచ్ఛంద సంస్థలు, భక్తుల సహకారంతో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 7 గంటలకు కంఠం వేణుస్వామి అఖండ జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ఉపనిషత్ పారాయణ, ప్రణవ పతాక ప్రతిష్ఠాపన, గోపూజ, రమణ అష్టోత్తర శతనామావళి, మూలమంత్ర హోమం, అర్చన, లక్ష్మీ గణపతి హోమం అనంతరం 10.30 గంటలకు ఆధ్యాత్మిక సభ నిర్వహించనున్నట్లు ఆశ్రమ వ్యవస్థాపకుడు స్వామి రామానంద తెలిపారు. యాగశాల పక్కన మెట్లదారి విస్తరణ అన్నవరం దేవస్థానం చైర్మన్ ఆదేశం అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని యాగశాల పక్క నుంచి దిగువకు వెళ్లేందుకు ఉన్న మెట్లను మరింత వెడల్పుగా విస్తరించాలని అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆ మెట్ల దారిని సోమవారం ఆయన పరిశీలించారు. కార్తిక మాసంలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, సత్యదేవుని దర్శనానంతరం వారు దిగేందుకు తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న మెట్లు మాత్రమే సరిపోవని 2023లో అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ భావించారు. ఈ మేరకు రావిచెట్టు పక్క నుంచి యాగశాల వద్దకు చేరుకునేలా అదనంగా మెట్లు నిర్మించారు. అక్కడి నుంచి రామాలయ ప్రాంగణంలోకి వెళ్లడం సులువవుతుందని ఆయన భావించారు. అయితే ఈ మెట్లు 10 అడుగుల వెడల్పు మాత్రమే ఉండటంతో సరిపోవడం లేదు. గత కార్తిక మాసంలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు భక్తుల తోపులాట జరిగింది. దీంతో ఈ మెట్లను మరో 10 అడుగుల వెడల్పున విస్తరించాలని చైర్మన్ ఆదేశించారు. అయితే, దీనివలన యాగశాల దక్షిణం వైపు మెట్లు సగం వరకూ పోయే అవకాశముంది. ఈ విషయమై సిద్ధాంతితో మాట్లాడగా.. దక్షిణం వైపు మెట్లు సగం తొలగించి, వాటికి బదులు ఎల్ ఆకారంలో తూర్పునకు మెట్లు నిర్మించి, వాటిని మిగిలిన వాటికి అనుసంధానం చేయాల్సిందిగా సూచించారని ఈఈ రామకృష్ణ తెలిపారు. త్వరలోనే ఈ మెట్ల వెడల్పునకు అంచనాలు రూపొందించి, టెండర్లు పిలవనున్నారు. రాష్ట్ర స్థాయి కబడ్డీలో జిల్లా జయకేతనం సామర్లకోట: కర్నూలులో ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకూ జరిగిన రాష్ట్ర స్థాయి పురుషుల కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు జయకేతనం ఎగురవేసి, ప్రథమ బహుమతి సాధించింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం విలేకర్లకు ఈ విషయం తెలిపారు. పశ్చిమ గోదావరితో జరిగిన తుది పోటీలో జిల్లా జట్టు అత్యంత ఉత్తమ ప్రదర్శన చేయడం ద్వారా చాంపియన్షిప్ సాధించిందన్నారు. జట్టు సభ్యులను అంతర్జాతీయ కోచ్ పోతుల సాయి, ప్రో కబడ్డీ రిఫరీ బోగిళ్ల మురళీ కుమార్, ఉపాధ్యక్షుడు నిమ్మకాయల కిరణ్, అంతర్జాతీయ క్రీడాకారిణి శ్వేత, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వీవీ శ్రీనివాస్, కోశాధికారి తాళ్లూరి వైకుంఠం అభినందించారు. ఈ–కామర్స్ డెలివరీ కోర్సు ట్రైనర్లకు దరఖాస్తుల ఆహ్వానం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ఈ–కామర్స్ డెలీవరీ అసోసియేట్ కోర్సు ట్రైనర్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఎస్.గోపీకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై, 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారు అర్హులన్నారు. దరఖాస్తుతో పాటు ఇతర వివరాలకు ప్రభుత్వ ఐటీఐ లేదా స్కిల్ హబ్ కో ఆర్డినేటర్ రేవతిని 86399 51441 నంబరులో సంప్రదింవచ్చని సూచించారు. -
రత్నగిరిపై రద్దీ
అన్నవరం: రత్నగిరిపై ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 25 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని వ్రతాలు 2 వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్న ప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను టేకు రథంపై ఉదయం ఘనంగా ఊరేగించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ కొబ్బరికాయ కొట్టి రథ సేవను ప్రారంభించారు. 1న భారీ త్రిముఖ సాయి విగ్రహావిష్కరణ తుని రూరల్: మండలంలోని మరువాడ శివారున నిర్మించిన 120 అడుగుల త్రిముఖ సాయిబాబా విగ్రహావిష్కరణకు అంకురార్పణ జరిగింది. భక్తులు నిర్వహిస్తున్న సాయి నామ స్మరణలు, భజనలు (24/7) ఆదివారం ప్రారంభమయ్యాయి. కాకినాడకు చెందిన గురువు అంబూరి సాంబశివరావు పర్యవేక్షణలో సాయిదాసిని సత్యవేణి ఆధ్వర్యాన మందిరం, 120 అడుగుల త్రిముఖ సాయి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే నెల 1న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నలుమూల నుంచీ ఇప్పటికే సాయిబాబా భక్తుల రాక ఆరంభమైంది. వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని తుని – నర్సీపట్నం రోడ్డు పై నుంచి స్పష్టంగా చూడవచ్చని సాయి భక్తులు తెలిపారు. కొన్నేళ్లుగా ఇక్కడ సాయిబాబా మందిరాన్ని నిర్వహిస్తూండగా.. ఇప్పుడు స్థూపం నిర్మించి, దానిపై భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇదే అత్యంత ఎత్తయిన త్రిముఖ సాయిబాబా విగ్రహమని చెప్పారు. లోవలో ఆన్లైన్ సేవలు ప్రారంభం తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారి లోవ దేవ స్థానంలో ఆదివారం నుంచి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. aptemples.ap.gov.in వెబ్సైట్లో లాగిన్ అయి ఆన్లైన్ సేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి నాడు నిర్వహించే మహాచండీ హోమం, అమ్మవారి తిరు నక్షత్రం స్వాతి సందర్భంగా ని ర్వహించే పంచామృతాభిషేకాలతో పాటు ఊయ ల సేవ, వాహన పూజలు తదితర నిత్య సేవలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని వివరించారు. ఆన్లైన్లో నమోదు చేసుకుని వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ ఏర్పాటు చేశామన్నారు. కాటేజీలు, వసతి గదులు సైతం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. భక్తుల సౌలభ్యం కోసం క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచామన్నారు. వేలాదిగా భక్తుల రాక తలుపులమ్మ అమ్మవారిని ఆదివారం వివిధ జిల్లాల నుంచి వచ్చిన 8 వేల మంది భక్తులు క్యూలో దర్శించుకున్నారని డిప్యూటీ కమిషనర్, లోవ దేవస్థానం ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల ద్వారా రూ.61775, పూజా టికెట్లకు రూ.91960, కేశఖండన శాలకు రూ.3,080, వాహన పూజలకు రూ.4,750, వసతి గదులు, కాటేజీల అద్దెలు రూ.36,020, విరాళాలు రూ.33,867, కలిపి మొత్తం రూ.2,31,452 ఆదాయం సమకూరిందని వివరించారు. -
మహిళల ఆశలు నీరుగార్చారు
చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజా సంక్షేమ పట్ల ముఖ్యంగా మహిళా పథకాలు అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదు. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు రూ.1,500 ఇస్తామన్న హామీ ఏడాదిన్నర అవుతున్నా అమలు కాలేదు. అనేక కొర్రీలతో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు నేటికీ మెషీన్లు ఇవ్వకపోడం దారుణం. వారు ఈ శిక్షణ ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోగలం అని ఆశించారు. ఆలస్యం కావడంతో వారు వేరే ఉపాధి మార్గాలను వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. మహిళల ఆశలను ప్రభుత్వం నీరుగార్చింది. – గూడపాటి రమాదేవి, జెడ్పీటీసీ సభ్యురాలు, కొత్తపేట మహిళల స్వయం ఉపాధిలో భాగంగా కుట్టు మెషీన్ల ద్వారా జీవనోపాధి పొందుతూ, కుటుంబ ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకు సంక్షేమ పథకాల అమలులో భాగంగా ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చాం. అయితే ప్రభుత్వంలో కొన్ని బిల్లులు పండింగ్ ఉన్నాయి. అవి క్లియర్ అయ్యాక మెషీన్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అర్హులైన అందరికీ మెషీన్లు ఇస్తాం. – ఎ.శ్రీనివాసరావు, ఈడీ, బీసీ కార్పొరేషన్, కాకినాడ -
కన్నుల పండువగా త్యాగరాజ ఆరాధనోత్సవం
500 మంది కళాకారులతో పంచరత్న సేవ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): త్యాగరాజ స్వామి పంచరత్న కీర్తనలతో కాకినాడ నగరం పులకించిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సంగీత కళాకారుల తమ గాత్రం, వాద్య పరికరాలతో అలరించారు. దాదాపు 500 మందికి పైగా కళాకారులు సంప్రదాయ వస్త్రధారణలో చేసిన ఈ అద్భుత ప్రదర్శన నగర ప్రజలను సుస్వరానంద సాగరంలో ఓలలాడించింది. సంగీత, నృత్య, నాటక రంగాల్లో వందేళ్లకు పైగా విశిష్ట సేవలందిస్తున్న సరస్వతీ గానసభ 122 వసంతాల మహోజ్వల ప్రస్థానాన్ని పురస్కరించుకొని త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాన్ని ఆదివారం రాత్రి వేడుకగా నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, చైన్నె తదితర ప్రాంతాల నుంచి 500 మందికి పైగా లబ్ధప్రతిష్టులైన కళాకారులు పంచరత్న కీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. గాత్రం, వయోలిన్, వీణ, వేణునాదం, మృదంగం, ఘటం, కంజీర, మోర్సింగ్ వంటి వాద్యాలతో కళాకారులు అద్భుతమైన సహకారం అందించారు. ప్రఖ్యాత మృదంగ విద్వాంసుడు ఎల్లా వెంకటేశ్వరరావు శిష్య బృందం కచేరీ ఆహూతులను ఎంతో ఆనంద పారవశ్యంలో ముంచెత్తింది. పంచరత్న సేవను ప్రారంభించిన ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు.. త్యాగరాజ స్వామిపై చేసిన ప్రవచనం విశేషంగా ఆకట్టుకుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 500 మంది కళాకారులు ఒకే వేదికపై ఇటువంటి అద్భుత ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి అని సరస్వతీ గాన సభ గౌరవాధ్యక్షురాలు పెద్దాడ సూర్యకుమారి తెలిపారు. సరస్వతీ గానసభ జీవితకాల చైర్మన్ కొమిరెడ్డి శ్రీరామ నరసింగరావు, అధ్యక్షుడు డాక్టర్ ముళ్లపూడి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు లక్కరాజు సత్యనారాయణ, కార్యదర్శి పేపకాయల రామకృష్ణ, సహాయ కార్యదర్శి చెరుకువాడ సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
అలా ఆటాడుకుంటున్నారు
● జీఎంసీలో వివాదాస్పదంగా పోస్టుల భర్తీ ప్రక్రియ ● మొత్తం ఖాళీలు 162 ● గత ఏడాది మొదటి నోటిఫికేషన్లో చూపినవి 77 ● రెండో విడతలో 79కి పెంపు ● వేర్వేరు కారణాలతో మొదటి రెండు నోటిఫికేషన్లూ రద్దు ● మూడోసారి పోస్టులు 60కి కుదింపు ● అధికారులు తమతో ఆటలాడుకుంటున్నారని అర్హుల ఆగ్రహంకాకినాడ క్రైం: రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ) ద్వారా రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల(జీజీహెచ్)లో వివిధ కేడర్లలో పారామెడికల్ సిబ్బంది నియామకానికి చేపట్టిన ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు సంబంధించి 350కి పైగా పారామెడికల్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలోని రాజమహేంద్రవరం జీఎంసీ, కాకినాడ జీజీహెచ్, రంగరాయ వైద్య కళాశాల(ఆర్ఎంసీ)తో పాటు వివిధ పీహెచ్సీలు, యూహెచ్సీలు, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వివిధ పారామెడికల్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. కాకినాడలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) కార్యాలయం ద్వారానే ఉమ్మడి జిల్లా పోస్టుల భర్తీ చేపట్టారు. అన్నిచోట్లా నియామకాలూ పూర్తయిపోయాయి. అయితే, రాజమహేంద్రవరం జీఎంసీ, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల (జీజీహెచ్) పరిధిలోని 79 పోస్టులను తామే భర్తీ చేసుకుంటామని అధికారులు దాదాపు ఏడాదిన్నర కిందట చెప్పారు. కానీ, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను సంబంధిత అధికారులు ఇప్పటి వరకూ పూర్తి చేయలేదు. ఈ పోస్టులకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అర్హులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కలెక్టర్నే తప్పుదోవ పట్టించారా.. ఉమ్మడి జిల్లా ఉద్యోగాల నోటిఫికేషన్ కావడం వల్ల నియామక ప్రక్రియ ఆసాంతం కాకినాడ జిల్లా కలెక్టర్ పరిధిలోకే వస్తుంది. జీఎంసీలో పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటి వరకూ మూడుసార్లు నోటిఫికేషన్ ఇచ్చారు. గత ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కొద్ది కాలం ముందు మొదటిసారి ఇచ్చిన నోటిఫికేషన్లో 77 ఖాళీలు చూపించారు. అభ్యర్థుల అభ్యంతరాల పేరుతో దానిని రద్దు చేసి, గత ఏడాది డిసెంబర్లో రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం 79 పోస్టులు చూపారు. అనివార్య కారణాలంటూ దీనినీ రద్దు చేసినట్లు ప్రకటించారు. అయితే, రోస్టర్ నిర్వహణలో లోపం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడం వంటి కారణాలతోనే రెండో నోటిఫికేషన్ రద్దు చేశారన్నది అభ్యర్థుల వాదన. తాజాగా ఈ నెలలో మూడోసారి ఇచ్చిన నోటిఫికేషన్లో 60 మాత్రమే ఖాళీలున్నాయని తెలిపారు. కొన్ని ఉద్యోగాలకు విద్యార్హతలు నిర్ణయించలేదని, అందువలన మూడో నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య కుదించామని చెబుతున్నారు. అదే నిజమైతే అంతకు ముందు రెండుసార్లు అవే పోస్టులకు నోటిఫికేషన్లు ఎలా ఇచ్చారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మూడుసార్లు వేర్వేరుగా ఖాళీలు చూపుతూ, కలెక్టర్నే తప్పుదోవ పట్టించి మరీ ఆయా నోటిఫికేషన్లపై సంతకాలు చేయించారని ఆరోపిస్తున్నారు. మొత్తం 162 ఖాళీలు రాజమహేంద్రవరం జీజీహెచ్, జీఎంసీలలో మొత్తం 162 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతానివే 79 కాగా, తాజాగా జీజీహెచ్లో మరో 83 ఖాళీలు ఏర్పడ్డాయి. రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు ఈ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ఆస్పత్రి అధికారులు కోరినా జీఎంసీ అధికారులు పట్టించుకోలేదని చెబుతున్నారు. ఈ 162 పోస్టులను గత నెల నాటికే భర్తీ చేయాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించినా ఫలితం లేకపోయింది. కేవలం 60 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు. పాతవి 19, కొత్తవి 83 కలిపి మిగిలిన 102 పోస్టులు ఎందుకు భర్తీ చేయకుండా నిలిపివేశారనేది జవాబు లేని ప్రశ్నగానే ఉంది. 11 కేడర్లకు ఎగనామం మొత్తం 21 కేడర్లలో సిబ్బందిని నియమించాల్సి ఉండగా.. 10 కేడర్ల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. మిగిలిన 11 కేడర్లలోని కంప్యూటర్ ప్రోగ్రామర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్, ఎలక్ట్రికల్ హెల్పర్, మార్చురీ అటెండెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సైకియాట్రీ సోషల్ వర్కర్, స్పీచ్ థెరపిస్ట్, సిస్టం అడ్మినిస్ట్రేటర్, చైల్డ్ సైకాలజిస్టు, క్లినికల్ సైకాలజిస్టు పోస్టులను పక్కన పెట్టేశారు. విద్యార్హతలు నిర్ణయించలేదు ఖాళీలు ఎక్కువగా ఉన్న మాట నిజమే. అన్ని పోస్టుల భర్తీకీ బదులు 60 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చాం. కొన్ని పోస్టులకు విద్యార్హతలు ఇంకా నిర్ణయించలేదు. సూపర్స్పెషాలిటీ పోస్టులు ఇవ్వొద్దని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) ఆదేశించారు. అందుకే నోటిఫికేషన్లో ఇవ్వలేదు. అన్నీ నెమ్మదిగా అవుతాయి. కొత్త కాలేజీలకు ఇంకా ఉద్యోగ నియామకాలు జరగలేదు. – డాక్టర్ కేవీ శివప్రసాద్, ప్రిన్సిపాల్, రాజమహేంద్రవరం జీఎంసీ పోస్టులు తగ్గించాలని చెప్పలేదు సూపర్స్పెషాలిటీ సహా ఏ పోస్టులూ తగ్గించాలని లేదా పెంచాలని మేం ఎటువంటి ఆదేశాలూ ఇవ్వలేదు. భర్తీకి అనుమతి మాత్రమే ఇచ్చాం. ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా అది పూర్తిగా వారి బాధ్యతే. జీఓ ప్రకారం ఎప్పటికప్పుడు పోస్టులు భర్తీ చేయాలి. పోస్టుల కుదింపునకు గల కారణాలపై రాజమహేంద్రవరం జీఎంసీ అధికారులు మాకు ఎటువంటి సమాచారమూ ఇవ్వలేదు. – డాక్టర్ రఘునందన్ గంభీర, డీఎంఈ నా జీవితంతో ఆడుకున్నారు నిరుద్యోగినైన నా జీవితంతో జీఎంసీ అధికారులు ఆడుకున్నారు. నా వయసు 48 ఏళ్లు. మూడోసారి విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ నాటికి నా వయో పరిమితి ముగిసింది. రెండో నోటిఫికేషన్ సమయానికి వయసు ఉన్నా, అకారణంగా నోటిఫికేషన్ రద్దు చేశారు. నేను మంచి మార్కులతో ఐటీఐ ఎలక్ట్రికల్ ఉత్తీర్ణుడినయ్యాను. మెరిట్లోనూ ముందున్నాను. రెండో నోటిఫికేషన్ కొనసాగి ఉంటే, మెరిట్ ఆధారంగా నాకే ఉద్యోగం వచ్చేది. అధికారుల నిర్వాకంతో ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగానికి దూరమయ్యాను. నాకు భార్య, పిల్లలు ఉన్నారు. వారిని పోషించడానికి ఇంటింటికీ కేబుల్ వైర్లు వేస్తూ పూట గడుపుకొంటున్నాను. – పి.అశోక్, అభ్యర్థి, కాకినాడ -
మున్సిపల్ డీఈ రీకాల్
● రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం ● 17 మంది ఏకగ్రీవ ఆమోదం ● డీసెంట్ తెలిపిన ఏడుగురు కౌన్సిలర్లు రామచంద్రపురం: మున్సిపాలిటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ డీఈనీ రీకాల్ చేస్తూ ఆదివారం కౌన్సిలర్లు తీర్మానం చేశారు. కొంతకాలంగా కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ డీఈ శ్రీకాంత్ను రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గత నెలలో జరిగిన సమావేశంలో కూడా సభ్యులు ఆయనను రీకాల్ చేయాలని కోరారు. ఈ మేరకు స్థానిక మంత్రి సుభాష్కు, మున్సిపల్ ఆర్డీ, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాలు అందజేశారు. తాజాగా శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో టేబుల్ అజెండాగా డీఈ శ్రీకాంత్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కౌన్సిల్ తీర్మానించింది. మున్సిపల్ చైర్పర్సన్తో సహా 17 మంది కౌన్సిలర్లు దీనికి మద్దతు తెలపగా ఏడుగురు మాత్రం డీసెంట్ తెలిపారు. సమావేశంలో అజెండాలోని తొమ్మిది అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం కౌన్సిలర్లు మాట్లాడుతూ డీఈ శ్రీకాంత్ పట్టణాభివృద్ధికి ఆటంకంగా మారారని, కౌన్సిల్ సభ్యులను అవమానపర్చడం, పనులు పూర్తి చేసినా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం, నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనికి నలుగురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సమావేశం రసాభాసగా మారింది. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవితో సహా 17 మంది సభ్యులు డీఈని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఒక కౌన్సిలర్ వాడిన పదజాలాన్ని తప్పుపడుతూ పలువురు కౌన్సిలర్లు బైఠాయించారు. దీంతో చైర్పర్సన్ వారికి నచ్చచెప్పి అతి కష్టం మీద సమావేశాన్ని అదుపులోకి తీసుకొచ్చి డీఈని సరెండర్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. అదే సమయంలో ఏడుగురు కౌన్సిలర్లు డీసెంట్ తెలుపుతూ రాసిన పత్రాన్ని కమిషనర్ రాజుకు అందజేశారు. ఈ అంశంపై వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ వాడ్రేవు సాయి ప్రసాద్ విప్ జారీ చేసినప్పటికీ, ఆ పార్టీ నలుగురు కౌన్సిలర్లు విప్ను ధిక్కరించి డీసెంట్పై సంతకాలు చేయడం గమనార్హం. -
కోట నృత్య కళాకారులకు గిన్నిస్లో చోటు
సామర్లకోట: స్థానిక చిన్నారి నృత్య కళాకారులు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. హైదరాబాద్కు చెందిన భారత్ ఆర్ట్ ఆకాడమీ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో ఏడు వేల నృత్య కళాకారులతో కూచిపూడి కళా వైభవాన్ని నిర్వహించి ఈ రికార్డు సాధించారు. ఆ బృందంలో సామర్లకోటకు చెందిన 30 మంది చిన్నారులు పాల్గొన్నారు. నాట్యాచార్యుడు బేత సత్యనారాయణ వద్ద వారు నృత్యాన్ని అభ్యసించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ మంత్రి, ప్రముఖుల సమక్షంలో వారికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్ుడ్స ప్రతినిధులు సర్టిఫికెట్లు అందుకున్నారు. ఆదివారం పట్టణ ప్రముఖులు ఆ చిన్నారులను అభినందించారు. -
నకిలీ వే బిల్లులతో ఇసుక తరలింపు
● రెండు లారీల సీజ్ తాళ్లపూడి: మండలం ప్రక్కిలంకలో ఆదివారం తెల్లవారుజామున జిల్లా గనులు, భూగర్భశాఖ, టాస్క్ఫోర్స్ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేసి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను సీజ్ చేశాయి. ఇసుక రీచ్ ఏజెన్సీలు నకిలీ వే బిల్లులతో ఇసుక తరలిస్తున్నట్టు తేలితే ఆ ఏజెన్సీని రద్దు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మైనింగ్ ఏడీ డి.ఫణిభూషణ్రెడ్డి హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఇసుకను తరలిస్తున్న ఏపీ 39 టీక్యూ 0007, ఏపీ 37 టీఈ 6979 నంబర్లు ఉన్న రెండు వాహనాలను తనిఖీ చేసి వే బిల్లులను స్కాన్ చేశారు. ఏపీఎస్ఎంఎస్ పోర్టల్లో ఎటువంటి డిస్పాచ్ వివరాలు లేవని గుర్తించి బిల్లులు నకిలీవని గుర్తించి రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు అప్పగించారు. అలాగే ప్రక్కిలంక–1 డీసిల్టేషన్ రీచ్లో ఇసుక రవాణాకు ఏజెన్సీగా ఎంపికై న ‘ది గణేష్ బోట్స్మెన్ – శాండ్ వర్కర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’ సంస్థ నకిలీ ఇసుక వే బిల్లులు జారీ చేసినట్లు గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎస్సై రామకృష్ణకు సూచించారు. అనంతరం సొసైటీకి కేటాయించిన శాండ్ సప్లై పాయింట్ లాగిన్ ఐడీని ఏపీఎస్ఎంఎస్ పోర్టల్లో బ్లాక్ చేశారు. ఈ దాడుల్లో జిల్లా మైనింగ్ సర్వేయర్ పట్నాల శ్రీనివాస్, జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్సై కె.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
గోదావరిలో పడి వృద్ధుడి మృతి
మామిడికుదురు: పెదపట్నంలంక గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. స్థానిక గెడ్డంవారి పేటకు చెందిన గెడ్డం సంజీవరావు (65) స్థానిక గోదావరి వద్దకు బహిర్భూమికి వెళ్లి మృతి చెందాడు. సంజీవరావు కుమారుడు రాజారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిన సంజీవరావు కనిపించక పోవడంతో అతని కోసం గాలించగా గోదావరిలో మృతదేహం లభ్యమైందన్నారు. మృతుడు సంజీవరావుకు భార్య గవరమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంజీవరావు మృతితో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించారు. -
విశ్వబ్రాహ్మణులను చట్ట సభలకు పంపాలి
● సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు అమలాపురం టౌన్: విశ్వ బ్రాహ్మణులకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవుల్లో ఏదో ఒకటి ఇచ్చి చట్ట సభలకు పంపించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక దుడ్డివాని అగ్రహారంలోని విశ్వబ్రాహ్మణ కల్యాణ మండపంలో జిల్లా సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తమ వర్గానికి రాజకీయ పదవులు వచ్చినపుడే మనకు గుర్తింపు, హోదా వస్తాయని పేర్కొన్నారు. విద్యా, ఉద్యోగ, ఆర్థిక సామాజిక, రాజకీయ రంగాల్లో తమ వర్గం అభివృద్ధికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఆ దిశగానే కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. యువజన నాయకుడు ఆవుపాటి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆ సామాజిక వర్గ పెద్దలు, అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్ కట్టోజు సన్నయ్యదాసు, వరద సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమంతరావు, ఆ వర్గం పెద్దలను సంఘీయులు గజమాలతో సత్కరించారు. అనంతరం వారంతా ఎమ్మెల్యే ఆనందరావు వద్దకు వెళ్లి తమ వర్గీయులకు రాజకీయ అవకాశాలు కల్పించాలని వినతి ప్రతాన్ని అందించారు. -
ఇదేం శిక్షణ బాబూ!
● మెషీన్ల పంపిణీ ఏదీ? ● 8 నెలలుగా ఎదురుచూపులు ● ఉమ్మడి జిల్లాలో 11,014 మందికి మొండిచేయి కొత్తపేట: మహిళల స్వయం ఉపాధి కల్పనలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చింది. శిక్షణ అనంతరం ఇవ్వాల్సిన ఉచిత కుట్టు మెషీన్లను మాత్రం ఇవ్వలేదు. అసలు ఇస్తారా? ఇవ్వరా? అంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి నుంచి ఉచిత కుట్టు శిక్షణ ప్రారంభించారు. వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన కులాల వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. బీసీ, ఈడబ్ల్యూఎస్ శాఖల ద్వారా మండల కేంద్రాల్లో శిక్షణ ఇచ్చారు. ఎంపీడీవోలు ఈ కేంద్రాల్లో వసతులను పర్యవేక్షించారు. మూడు నెలల చొప్పున దశల వారీగా అన్ని మండలాల్లో శిక్షణ పూర్తి చేశారు కానీ. శిక్షణ పొందిన మహిళలకు ఇవ్వాల్సిన కుట్టు మెషీన్లను ఆరేడు నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఇవ్వలేదు. హాజరు బాగుంటేనే మెషీన్ మహిళలకు ఉచిత కుట్టు మెషీన్ల పంపిణీ పథకానికి ఆయా గ్రామ సచివాలయాల ద్వారా మూడు వేలకుపైగా దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుదారులు 3 నెలల పాటు కుట్టు శిక్షణ పొందితేనే ధ్రువీకరణ పత్రంతో పాటు, ఉచిత కుట్టు మెషీన్ అందిస్తామని చంద్రబాబు ప్రభుత్వం మెలిక పెట్టింది. ప్రజా ప్రతినిధుల సిఫారసుల నేపథ్యంలో మహిళలకు ఈ శిక్షణ ఇచ్చేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఎంపికై న వారి హాజరు 75 శాతం కచ్చితంగా ఉండాలనడంతో 445 మంది మాత్రమే ఉచిత కుట్టు మెషీన్ పొందేందుకు అర్హత సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇంతవరకు ఏమీ లేదు ఉచిత కుట్టు శిక్షణకు మూడు నెలల పాటు హాజరై, 75 శాతం హాజరు పొంది అర్హత సాధించి 6, 7 నెలలు గడుస్తున్నా ధ్రువీకరణ పత్రాలు, ఉచిత కుట్టు మెషీన్ల పంపిణీపై ప్రభుత్వం నేటి వరకూ ఎటువంటి స్పందనా లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. శిక్షణ పూర్తయి నెలలు గడుస్తున్నా కుట్టు యంత్రాలు ఆందకపోవడంతో రోజూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదు. ఉచిత కుట్టు మెషీన్లతో పాటు నేరుగా దర్జీ దుకాణాల ఏర్పాటుకు అవసరమైన బ్యాంక్ రుణాలు ఇస్తామని శిక్షణ సమయంలో అధికారులు భరోసా ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో బీసీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న స్వయం ఊపాధి సోపానం రుణాల పైనా చంద్రబాబు సర్కారు నేటీకీ ఏ విధమైన ప్రకటన చేయడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేటి పాలకులు నాడు ఎన్నికల్లో అన్ని వర్గాలను ముఖ్యంగా మహిళాలోకాన్ని ఉద్దరిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు చేసిందేమీ లేదని మహిళలు పెదవి విరుస్తున్నారు. కుట్టు మెషీన్లకు అర్హత పొందిన లబ్ధిదారుల వివరాలు ఇలా.. జిల్లా శిక్షణకు వచ్చిన శిక్షణ దరఖాస్తులు పొందినవారు కోనసీమ 21,908 3,190 తూర్పు గోదావరి 12,118 2,904 కాకినాడ 27,722 4,920 మొత్తం 61,718 11,014 -
భవితకు భద్రత బీమా..
● ఆరు పథకాలతో ఎన్నో ప్రయోజనాలు ● విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న వైనం ● ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న తపాలా శాఖ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): తపాలా శాఖ అందించే బీమా పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ధీమానిస్తున్నాయి. పీఎస్ఐ (పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్) పేరిట ప్రవేశపెట్టిన పలు రకాల పథకాలు ఎంతోమంది గ్రాడ్యుయేట్లకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. వీటిని మొదట్లో తపాలా శాఖ ఉద్యోగుల సంక్షేమ పథకాలుగా ప్రవేశపెట్టారు. తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, భద్రతా సిబ్బందికి వర్తింపజేశారు. కాలక్రమేణా ఈ పథకాన్ని వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, సీఏ వంటి ప్రొఫెషనల్స్తో పాటు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో నమోదు చేసుకున్న కంపెనీల ఉద్యోగులకూ వర్తింపజేశారు. ఇటీవల గ్రాడ్యుయేట్లకు పీఎల్ఎస్ఐ సౌకర్యాన్ని విస్తరించారు. దీంతో ఈ పథకాల వైపు గ్రాడ్యుయేట్లు ఆసక్తి చూపుతున్నారు. యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అస్యూరెన్స్ దీనిని మనీ బ్యాక్ పాలసీ అంటారు. 19 నుంచి 25 ఏళ్ల మధ్య గలవారు ఈ పాలసీకి అర్హులు. బీమా రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది. పాలసీ కాలపరిమితి 15 నుంచి 20 ఏళ్లుగా నిర్ణయించారు. 15 ఏళ్ల పాలసీపై 6, 9, 12 ఏళ్లు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం బోనస్ లభిస్తుంది. 20 ఏళ్ల పాలసీపై 8, 12, 16 ఏళ్లు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం చొప్పున బోనస్ లభిస్తుంది. ఈ పథకంలో ఉన్న లబ్ధిదారులకు ఏడాదికి ఒకసారి రూ.వెయ్యికి రూ.48 చొప్పున బోనస్ లభిస్తుంది. హోల్ లైఫ్ అస్యూరెన్స్ ఈ పాలసీకి 19 నుంచి 55 ఏళ్ల మధ్య గలవారు అర్హులు. బీమా రూ.20 వేల నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. ప్రీమియం చెల్లించే వయసును 55, 58, 60 ఏళ్లుగా ఎంచుకునే అవకాశం కల్పించారు. నాలుగేళ్ల తర్వాత రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. మూడేళ్లు దాటితే పాలసీ సరెండర్ చేసుకోవచ్చు. ఐదేళ్ల లోపు సరెండర్ చేస్తే ఎలాంటి బోనస్లు వర్తించవు. ఏటా రూ.వెయ్యికి రూ.76 చొప్పున బోనస్ లభిస్తుంది. పాలసీదారునికి 80 ఏళ్లు దాటినా లేదా మరణించినా వారసులకు బీమా సొమ్ము బోనస్ ప్రయోజనాలను చెల్లిస్తారు. కన్వర్టబుల్ హోల్ లైవ్ అస్యూరెన్స్ ఈ పాలసీకి 19 నుంచి 50 ఏళ్ల వారు అర్హులు. రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు బీమా చెల్లింపులు చేయవచ్చు. మూడేళ్లు దాటితే ఎప్పుడైనా పాలసీ సరెండర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఐదేళ్ల లోపు సరెండర్ చేస్తే బోనస్ రాకపోగా కోతలు విధించే నిబంధనలు ఉన్నాయి. ఏటా రూ.వెయ్యికి రూ.76 చొప్పున బోనస్ లభిస్తుంది.. ఎండోమెంట్ అస్యూరెన్స్ ఈ పాలసీకి 18 నుంచి 50 ఏళ్ల వారు అర్హులు. కనీస బీమా రూ.20 వేలు కాగా గరిష్టంగా రూ.50 లక్షలు ఉంటుంది. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత రుణ సదుపాయం, పాలసీ సరెండర్కు అవకాశం ఉం టుంది. ఐదేళ్లు దాటిన పాలసీల సరెండర్పై బోనస్లలో కోతలు తప్పవు. ఏటా రూ.వెయ్యికి రూ.52 చొప్పున బోనస్ లభిస్తుంది. జాయింట్ లైఫ్ అస్యూరెన్స్ ఈ పాలసీకి 21 నుంచి 45 ఏళ్ల వయసు గల దంపతులు అర్హులు. బీమా రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది. పాలసీ కాల పరిమితి ఐదు నుంచి 20 ఏళ్లు. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత రుణ సదుపాయం ఉంటుంది. ఐదేళ్లు దాటిన పాలసీలు సరెండర్పై బోనస్లలో కోత ఉంటుంది. పాలసీ దారుడి మరణానంతరం ప్రయోజనాలు భాగస్వామి లేదా వారసులకు లభిస్తాయి. ఏటా రూ.వెయ్యికి రూ.52 చొప్పున బోనస్ లభిస్తుంది. సింగిల్ ప్రీమియంతో దంపతులు బీమా కవరేజి పొడిగించుకోవచ్చు. చిల్డ్రన్ పాలసీ.. పాలసీదారుల పిల్లల కోసమే ఈ పథకాన్ని తీసుకువచ్చారు. గరిష్టంగా ఇద్దరు పిల్లలకు బీమా చేసుకోవచ్చు. పిల్లల వయసు ఐదు నుంచి 20 ఏళ్ల లోపు ఉండాలి. పిల్లలకు గరిష్టంగా రూ.3 లక్షలు లేదా పాలసీదారు వయసు ప్రకారం బీమా తీసుకోవచ్చు. పాలసీదారు ( పిల్లల తండ్రి) వయసు 40 ఏళ్లు దాటి ఉండకూడదు. పాలసీదారు చనిపోతే పిల్లలపై తీసుకున్న బీమాకు ప్రీమియం చెల్లించనక్కర్లేదు. కాల పరిమితి తీరాక బీమా సొమ్ము బోనస్లు వర్తిస్తాయి. రుణ సదుపాయం సరెండర్ సౌకర్యాలు ఈ స్కీమ్లో ఉండవు. ప్రీమియం తల్లిదండ్రులు చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. వీరికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించరు. ఎండోమెంట్ పాలసీ ప్రకారం బోనస్లు వర్తిస్తాయి. దరఖాస్తు ఇలా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకునేవారు కావాల్సిన పత్రాలను విధిగా సంబంధిత అధికారులకు సమర్పించాలి. గ్రాడ్యుయేట్, పదో తరగతి, డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. పాలసీని బట్టి వివిధ వైద్య పరీక్షలు ఉంటాయి. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు పోస్ట్ ఇన్ఫో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా సమీప పోస్ట్ ఆఫీస్ను సంప్రదించి పథకంలో భాగస్వాములు కావచ్చు. -
విద్యారంగం డీలా
● ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై శీతకన్ను ● ‘తల్లికి వందనం’లో కోతలు ● ఫీజు రీయింబర్స్మెంట్కు ఎగనామం ● గురువులకిచ్చిన హామీలు గాలికి.. ● బోధనేతర పనులతో ఒత్తిడి బాలాజీచెరువు (కాకినాడ): గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగా నేడు సర్కారీ పాఠశాలల అభివృద్ధికి కానరాని చేయూత.. ప్రభుత్వ చదువులకు కరవవుతున్న ప్రోత్సాహం.. విద్యారంగంలో సంక్షేమానికీ దాదాపు తిలోదకాలు ఇస్తున్న ధోరణి.. మరోవైపు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులపై విపరీతమైన బోధనేతర భారం.. పదో తరగతి పరీక్షల్లో 82.24 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 15వ స్థానంతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి.. ఇలా అన్ని రూపాల్లోనూ ప్రభుత్వ విద్యారంగం ఈ ఏడాది డీలా పడిన పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. కొద్ది రోజుల్లో 2025వ సంవత్సరం కాలగర్భంలో కలసిపోతున్న తరుణంలో జిల్లాలో విద్యారంగ పరిస్థితులపై విహంగ వీక్షణం.. తల్లికి ‘వంచన’ పేదింటి పిల్లలను బడికి పంపించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకం పేరును ‘తల్లికి వందనం’గా మార్చింది. ప్రతి ఇంట్లోను చదువుకునే పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున పూర్తి స్థాయిలో అందిస్తామని ప్రకటించింది. తీరా చూస్తే తొలి ఏడాది ఈ సాయాన్ని ఎగ్గొట్టారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ ఏడాది ఈ పథకాన్ని అమలు చేసినా.. లబ్ధిదారుల్లో.. వారికిచ్చే సాయంలో భారీగా కోత పెట్టారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలోని 2,80 లక్షల మంది తల్లులకు రూ.330.17 కోట్లు జమ చేశారు. అయితే, క్షేత్ర స్థాయిలో కొందరు తల్లులకు రూ.8 వేలు, మరి కొందరికి రూ.9 వేలు, ఇంకొందరికి రూ.11 వేల చొప్పున మాత్రమే ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే మిగిలిన మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో వేస్తామంటూ మెలిక పెట్టి, తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం పంగనామం పెట్టింది. ఉన్నత విద్య భారం పేద విద్యార్థులు ఎటువంటి ఆటంకమూ లేకుండా ఉన్నత విద్య అభ్యసించాలనే ఉన్నతాశయంతో ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఈ ఏడాదైనా నిధులు విడుదల చేస్తారని ఎదురు చూసిన విద్యార్థులకు నిరాశే ఎదురైంది. కంటితుడుపుగా కొందరు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. వాస్తవానికి చాలామంది విద్యార్థులు నిధులు విడుదల కాక మధ్యలోనే చదువులు ఆపేయాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నారు. కొంతమంది తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు చెల్లించాల్సి వచ్చింది. జిల్లావ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు రూ.38 కోట్ల మేర ఉన్నాయి. ఏడాదంతా అడ్మిషన్లే.. డిసెంబర్ నెలలో సైతం డిగ్రీ, పీజీ కోర్సులకు వివిధ కళాశాలల్లో ఈ ఏడాది స్పాట్ అడ్మిషన్లు నిర్వహించారు. ఇంజినీరింగ్ అడ్మిషన్లు సైతం ఇదేవిధంగా కొనసాగిస్తూ వచ్చారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తేదీలు కేటాయించినా ఈ ఏడాది వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో, మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాదంతా అడ్మిషన్లే అనే పరిస్థితి ఏర్పడింది. నాణ్యత లేని ‘విద్యార్థి మిత్ర’ కార్పొరేట్కు దీటుగా పేద విద్యార్థులు చదువుకోవాలనే ఉన్నతాశయంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వినూత్న రీతిలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరచిన రోజున విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలు, డిక్షనరీలు, యూనిఫాం, బెల్టు, షూ, సాక్సులు, నాణ్యమైన స్కూల్ బ్యాగ్ వంటివి అందించింది. ఈ పథకం పేరును చంద్రబాబు ప్రభుత్వం ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’గా మార్చింది. తీరా ఆచరణకు వచ్చేసరికి ఆ మహనీయునికే మచ్చ తెచ్చేలా విద్యార్థులకు ఇచ్చే వస్తువుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చింది. స్కూల్ బ్యాగులు రెండు నెలలకే చిరిగిపోయాయి. బూట్లు ఇప్పటికే పాడైపోయాయి. దీంతో, విద్యార్థులు తరగతులకు చెప్పులతోనే హాజరవుతున్నారు. ట్యాబ్లు గోవిందా.. విద్యార్థుల్లో డిజిటల్ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూజ్ కంటెంట్తో ట్యాబులు పంపిణీ చేసింది. తద్వారా విద్యార్థులు తరగతిలో పాఠంతో పాటు ఇంటికి వెళ్లాక కూడా ఆ ట్యాబ్ల ద్వారా ఆ పాఠాలకు సంబంధించి మరిన్ని విషయాలను లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఉండేది. అర్థం కాని విషయాలను కూడా వాటి ద్వారా సులభంగా గ్రహించేవారు. ఈ ట్యాబుల పంపిణీకి చంద్రబాబు ప్రభుత్వం తిలోదకాలిచ్చింది. ఎక్కడి నిర్మాణాలు అక్కడే.. మన బడి నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ పథకం పేరును ప్రస్తుత ప్రభుత్వం ‘మన బడి – మన భవిష్యత్తు’గా మార్చిందే తప్ప ఒక్క రూపాయి ఇచ్చిందీ లేదు.. ఒక్క ఇటుక కూడా పేర్చిందీ లేదు. మొత్తం రూ.188 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడంతో చేసిన పనులకు వడ్డీలు కట్టలేక కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. మరో మూడు నెలల్లో ఆర్థికం సంవత్సరం ముగిసిపోనుండగా.. ఈ నిధుల విడుదలపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఫలితంగా గత ప్రభుత్వం వివిధ పాఠశాలల్లో చేపట్టిన పలు నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దాతల సహకారంతో పనులు పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం కొత్త విధానం తెచ్చింది. బోధనేతర భారం మరోవైపు ఉపాధ్యాయులు బోధనేతర భారంతో సతమతమవుతున్నారు. ఫలితంగా విద్యార్థులు చదువులకు దూరమవుతున్న పరిస్థితి నెలకొందని ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల నాయకులు వాపోతున్నారు. యాప్ల భారాన్ని తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. టీచర్లపై హాజరు నమోదు, ఇన్స్పెక్షన్, యూనిఫాం, పరిశుభ్రత, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం, సాసా, కర్మయోగి తదితర పలు రకాల యాప్ల బాధ్యతలు అప్పగించింది. దీంతో పాటు పేరెంట్స్ – టీచర్స్ కమిటీ సమావేశాలు ఉపాధ్యాయులకు భారంగా మారాయి. ఈ సమావేశాల కోసం గురువులు తమ జేబులోని సొమ్ము వెచ్చించాల్సి వస్తోంది. మరోవైపు ఎంఈఓల నుంచి ప్రధానోపాధ్యాయుల వరకూ అందరికీ సమయం సమీక్షలకే సరిపోతోంది. పరీక్షల మార్కుల వివరాలు ఆన్లైన్ చేయడం వంటి పనుల పర్యవేక్షణతో వారు సతమతమవుతున్నారు. హామీల అమలెప్పుడో! ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలును చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది కూడా గాలికొదిలేసింది. 12వ పీఆర్సీ కోసం గత ప్రభుత్వం వేసిన కమిటీని రద్దు చేసిన సర్కారు.. ఇప్పటి వరకూ కొత్త కమిటీని వేయలేదు. కనీసం ఐఆర్ కూడా ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు డీఏల చెల్లింపుపై కూడా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024 జూలై, 2025 జనవరి, 2025 జూలైకి సంబంధించి ఉపాధ్యాయులకు డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉంది. మూడు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో మరో డీఏ.. అంటే మొత్తం నాలుగు డీఏలను ప్రభుత్వం చెల్లించాలని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రభుత్వం విఫలం ప్రతి నెలా ఏదో ఒక సమస్యపై విద్యా రంగ సమస్యలపై పోరాడుతున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్, అందరికీ తల్లికి వందనం రాకపోవడం, సకాలంలో అడ్మిషన్లు నిర్వహించకపోవడం వంటి అంశాలపై పోరాటాలు చేస్తున్నాం. తల్లిదండ్రుల కమిటీ సమావేశాలను రాజకీయ వేదికలుగా మార్చి వీటికి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ ప్రభుత్వం విఫలమవుతోంది. – సీహెచ్ లోవరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చిరిగిన బ్యాగుతో విద్యార్థి -
అటు రంకెలేస్తూ.. ఇటు దౌడు తీస్తూ..
● రసవత్తరంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల బళ్లు, గుర్రపు స్వారీ పోటీలు ● వివిధ జిల్లాల నుంచి వచ్చిన 67 జతల ఎడ్లు, 23 గుర్రాలు ● సందడిగా మారిన ఏడీబీ రోడ్డు రంగంపేట: మండలం వడిశలేరు సమీపంలో గన్ని వ్యవసాయ క్షేత్రం వద్ద ఆదివారం నిర్వహించిన 7వ రాష్ట్రస్థాయి ఎడ్లబళ్లు, గుర్రాల పోటీలు రసవత్తంరంగా సాగాయి. దివంగత ఆదర్శరైతు గన్ని సత్యనారాయణమూర్తి స్మారకార్థం ఆయన కుమారుడు, రాజానగరం జీఎస్ఎల్ వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు సహకారంతో కూటి కోటేశ్వరరావు, బొప్పన బ్రహ్మాజీరావుల నిర్వహణలో ఈ పోటీలు జరిగాయి. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు వరకు సాగిన ఈ పోటీలను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించగా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు చూడడానికి వచ్చారు. రాష్ట్రలోని వివిధ జిల్లాల నుంచి 67 జతల ఎడ్లు, 23 గుర్రాలు పోటీలకు హాజరు కాగా, సీనియర్స్ 1600 మీటర్ల విభాగంలో 11 జతలు, జూనియర్స్ విభాగం వెయ్యి మీటర్లలో 56 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ పోటీల వల్ల వడిశలేరు నుంచి రంగంపేట వరకు గల ఏడీబీ రోడ్డు కోలాహలంగా మారింది. పోలీసు బందోబస్తు నడుమ పోటీలు ప్రశాంతంగా ముగిసాయి. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పోటీలు తిలకించారు. విజేతలు వీరే... సీనియర్స్ విభాగంలో 11 జతల ఎడ్లు పాల్గొనగా మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ను జి.మేడపాడుకి చెందిన మలిరెడ్డి అన్నపూర్ణ, గుమ్మిలేరుకు చెందిన కోరా శృతి చౌదరి ద్వితీయ, తృతీయ బహుమతులుగా బైక్లను గెలుచుకున్నారు. మరికొందరు కన్సొలేషన్ బహుమతులు గెలుచుకున్నారు. విజేతలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బహుమతులు అందజేశారు. జూనియర్స్ విభాగంలో 56 జతల ఎడ్లు పాల్గొనగా మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ను చౌడవాడకు చెందిన గెడ్డం అప్పారావు, ద్వితీయ బహుమతిని కంకటపాలేనికి చెందిన కొండేటి పద్మ, తృతీయ బహుమతిని బి.కొత్తూరుకు చెందిన మురుకుర్తి శంకరరావు గెలుచుకున్నారు. గుర్రాల పందెం విజేతలు వీరే.. మొదటి బహుమతి రూ.40 వేలను అగ్రహారానికి చెందిన చేమల మణికంఠ, ద్వితీయ బహుమతి రూ.30 వేలను యలమంచిలికి చెందిన ఎల్లపు జగదీష్, తృతీయ బహుమతి రూ.25 వేలను రామన్నపాలేనికి చెందిన చోడమాంచిక విక్రమ్ సాధించారు. నాల్గవ బహుమతి సాధించిన సింగపూర్ సత్యనారాయణకు రూ.20 వేలు, ఐదో బహుమతిని అరకుపాలేనికి చెందిన మోదమాంబ మురుగన్కు రూ.15 వేలు, ఆరో బహుమతి సాధించిన సోమలింగంపాలేనికి చెందిన యల్లపు జగదీష్కు రూ.10 వేలు, ఏడో బహుమతి సాధించిన కోటనందూరుకు చెందిన శివరాజుకు రూ.10 వేల చొప్పున నగదు అందించారు. విజేతలకు గన్ని కృష్ణ నగదు బహుమతులు అందజేశారు. -
అగ్ని ప్రమాదంలో తాటాకిల్లు దగ్ధం
● రూ.4.5 లక్షల ఆస్తి నష్టం కడియం: మండలంలోని కడియపులంక పంచాయతీ పరిధిలోని దోసాలమ్మకాలనీలో తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో ఎల్లంశెట్టి సముద్రుడుకు చెందిన తాటాకిల్లు దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి, ఇంటిని చుట్టుముట్టడంతో ఇల్లు, అందులోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయని బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంలో రూ.4.5 లక్షల విలువైన ఆస్తి నష్టం సంభవించిందని వారు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక శకటం అక్కడికి చేరుకుని మంటలు పక్క ఇళ్లకు వ్యాపించకుండా సిబ్బంది ఆర్పారు. బాధితులను ఆదివారం పలువురు పరామర్శించి సాయం అందజేశారు. కడియపులంక ఉప సర్పంచ్ పాటంశెట్టి రాంజీ రూ.10వేలు, ఏపీఐఐసీ సభ్యుడు మార్గాని సత్యనారాయణ నగదు సాయం అందజేశారు. అలాగే తహసీల్దార్ ఆదేశాల మేరకు 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులను వీఆర్వో జ్యోతి బాధితులకు ఇచ్చారు. కష్టకాలంలో ఆపన్నహస్తంకరప: బాల్య స్నేహితునికి పూర్వ విద్యార్థులు అండగా నిలిచి ఆపన్నహస్తం అందించారు. స్థానిక నక్కా సూర్యనారాయణమూర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1990–91 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆ బ్యాచ్లోని పెదపూడి మండలం కాండ్రేగుల గ్రామానికి చెందిన బత్తుల వీరవెంకట సత్యనారాయణ చిన్న కుమార్తె కిడ్నీ డయాలసిస్ కోసం ఆర్థిక సాయం చేశారు. బాల్య స్నేహితుని కుమార్తె అనారోగ్యం సమాచారాన్ని తెలుసుకున్న ఆ బ్యాచ్ విద్యార్థులు పెద్దిరెడ్డి శ్రీరామకృష్ణ, కూనపరెడ్డి వీర్రాజు తమతో చదువుకున్న సహచరులతో చర్చించి రూ.3,02,116 సేకరించారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ, జనసేన నాయకులు పెంకే సత్తిబాబు, దేవు వెంకటేశ్వరరావు, పురుషోత్తమ శ్రీనివాస్ తమ ద్వారా సేకరించిన రూ.56 వేలు వెరసి రూ.3,58,216 ఆదివారం కరప హైస్కూలులో తమ స్నేహితుడు, కుమార్తెకు అందజేశారు. అవసరమైతే మరింత సాయం అందిస్తామని వారు హామీ ఇచ్చారు. కోడి పందేలు ఆడుతున్న ముగ్గురి అరెస్టు జగ్గంపేట: మండలంలోని గొల్లలగుంట గ్రామ శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న కోడి పందేల శిబిరంపై ఎస్సై రఘునాథరావు ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో కోడి పందేలు ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.5.6 వేలు, వీటితో పాటు 2 పందెం కోళ్లు, కత్తులను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై తెలిపారు. మండలంలో జూద క్రీడలు ఎక్కడ నిర్వహించినట్టు కనిపించినా, తెలిసినా 94949 33233కి నంబర్కు కానీ, 100కు కానీ, 112 నంబర్కు కాల్ చేసి కానీ ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజల సహకారంతోనే జూదాలు నిరోధించగలమని తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
పార్థుని సంస్కారం ప్రశంసనీయం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): పార్థుని సంస్కారం ప్రశంసనీయమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఆయన శనివారం హిందూ సమాజంలో 31వ రోజు విరాట పర్వ ప్రవచనం ముగించి, ఉద్యోగ పర్వంలోకి ప్రవేశించారు. పాండవులు తన వద్దనే అజ్ఞాతవాసం ముగించారని తెలుసుకున్న విరాటరాజు అనందభరితుడవుతాడు. తన కుమార్తె ఉత్తరను వివాహం చేసుకోవాలని అర్జునుడిని కోరతాడు. అర్జునుడు దానిని అంగీకరించక, ఉత్తరను కోడలిగా చేసుకుంటానని తన అభిప్రాయాన్ని వెల్లడిస్తాడు. ‘ఏడాది పాటు ఉత్తరకు నాట్యం నేర్పాను, ఆమె నన్ను ఆచార్యునిగా, తండ్రిగా భావించింది. ఇప్పుడు ఆమెను వివాహం చేసుకుంటే లోకం నా నడవడిని శంకిస్తుంది. ఆమెను కోడలిగా చేసుకుంటే నన్నుగానీ, నీ కుమార్తెను గానీ ఎవరూ శంకించరు. నేనులోకాపవాదుకు భయపడతాను’ అన్న అర్జునుని ఉత్తమ సంస్కారం మనకు ఆదర్శం కావాలని సామవేదం అన్నారు. ఉత్తరాభిమన్యుల వివాహంతో విరాట పర్వం ముగిసింది. సినిమాల్లో చూపినట్లు వివాహానికి ముందు ఉత్తరాభిమన్యులు యుగళగీతాలను పాడుకోలేదని ఆయన అన్నారు. నేడు సామవేదంకు బ్రహ్మజోస్యుల పురస్కారం ప్రముఖ స్వాతంత్య్ర పోరాట యోధుడు, గాంధేయవాది, సీతానగరం ఆశ్రమ వ్యవస్థాపకుడు డాక్టర్ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం స్మారక పురస్కారాన్ని సామవేదం షణ్ముఖశర్మ అందుకోనున్నారు. ఆదివారం ఉదయం 10.45 గంటలకు సీతానగరం కస్తూర్బా ఆశ్రమంలో సామవేదం పురస్కారాన్ని అందుకుంటారని భగవత విరించి టీవీ నారాయణరావు వేదికపై వివరాలను వెల్లడించారు. -
ఎదురీతే..
కరప మండలం జెడ్.భావారంలో మోంఽథా తుపాన్కు నీట మునిగిన పంట (ఫైల్) పాత పెద్దాపురంలో నీటిలో కుళ్లిపోయిన పంటను చూపుతున్న రైతులు (ఫైల్)● ఈ ఏడాదంతా రైతులకు కష్టాలే ● కలసిరాని కాలం ● చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం ● పెరిగిన పెట్టుబడులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: పట్టెడన్నం పెట్టే రైతన్న ఈ ఏడాది కష్టాల కడలిలో ఎదురీదాడు. ఆరుగాలం పడిన రెక్కల కష్టం ప్రకృతి కన్నెర్రకు తోడు చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో నీటి పాలైంది. రబీ సీజన్ ఒక రకంగా నష్టపోతే ఖరీఫ్ సీజన్లో ముందుచూపులేని ప్రణాళిక సాగులో జాప్యానికి కారణమై రైతులు గుండెలు బాదుకుంటున్నారు. అకాల వర్షాలు రైతులను నిండా ముంచేశాయి. చేతికొచ్చిన ధాన్యాన్ని కనీస మద్ధతు ధర దక్కిందా అంటే అదీ లేదు. ధాన్యం సేకరణ లక్ష్యాన్ని ప్రభుత్వం కుదించడం దళారీ వ్యవస్థకు గేట్లు తెరిచినట్లైంది. తేమ శాతం అనే కుంటి సాకులతో రైతులకు మద్దతు లేకుండా పోయింది. పోనీ రబీ సీజన్లో అయినా సంతోషంగా సాగు జరుగుతుందా అంటే అదీ కొరవడింది. మొత్తంగా చూస్తే ఈ ఏడాది (2025) రైతులకు కలిసి రాలేదు. ఎరువుల బ్లాక్ 2025 ప్రారంభంలో రబీని గంపెడాశతో స్వాగతించిన రైతులకు ప్రారంభంలోనే చంద్రబాబు ప్రభుత్వంలో కొందరు పెద్దలు ఎరువులను బ్లాక్ చేసి చుక్కలు చూపించారు. దీంతో ప్రతి ఎకరాకు రూ.500 తక్కువ కాకుండా అదనపు భారం పడింది. పెట్టుబడి ఎక్కువై రైతు కుదేలయ్యాడు. జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. సవాలక్ష ప్రతి బంధకాల మధ్య సాగు చేసిన రైతుల నుంచి కనీస మద్ధతు ధరకు ప్రభుత్వం పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయలేదు. జిల్లాలో ఎంఎస్పీకి 3 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, కేవలం 2.60 లక్షల మెట్రిక్ టన్నులకే సరి పెట్టేసి రైతుల నెత్తిన పిడుగు పడేసింది. మాసూళ్లు సమయంలో అకాల వర్షాలకు తోడు గోనె సంచుల కొరత కూడా వేధించింది. తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో ప్రతి బస్తా ధాన్యం కొనుగోలుపై సుమారు రూ.400ను కమీషన్ ఏజెంట్లు, దళారులు కోత పెట్టడంతో రైతులు నష్టాలపాలయ్యారు. 80 వేల మంది రైతులు వద్ద ధాన్యం కొనుగోలు చేసి సక్రమంగా సకాలంలో వారి ఖాతాలో నగదు జమ చేసిన దాఖలాలు లేవు. మోంథా తుపానుతో భారీ నష్టం ఖరీఫ్లో సాగునీటి ఎద్దడి, ప్రకృతి విపత్తులకు తోడు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాభావ పరిస్థితులతో సాగును ఆలస్యం కాగా, జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో సాగుకు చేశారు. పంట పాలుపోసుకునే, గింజ గట్టిపడే దశల్లో మోంథా తుపాను తీవ్ర నష్టం కలిగింది. స్వర్ణ, సంపద స్వర్ణ సాగు చేసిన పొలాల్లో పంట నేలకొరిగి రైతులు కకావికలం అయ్యారు. ఎంటీయూ 1318, పీఎల్ఏ 1100 తదితర రకాల్లో తాలు గింజలు పెరిగి దిగుబడులు తగ్గిపోయాయి. నేలనంటిన వరి సామర్లకోట, పిఠాపురం, కొత్తపల్లి, కాకినాడ రూరల్ తదితర మండలాల్లో పంట పొలాలు నేలనంటాయి. మోంథా తుపానుతో జిల్లాలో సుమారు 70 వేల ఎకరాలలో వరి ముంపునకు గురైందని అధికారులు అంచనాలు రూపొందించారు. తీరా చివరకు నష్టం అంచనాలు కాస్తా బక్కచిక్కిపోయి 40 వేల ఎకరాలు మాత్రమే పంట నష్టం సంభవించినట్టు రికార్డులకెక్కాయి. దిగుబడి పరంగానూ రైతులకు ఖరీఫ్ కలిసి రాలేదు. ఎకరాకు సుమారు 35 బస్తాలు చొప్పున వస్తుందన్న అంచనాలు తల్లకిందులై కేవలం 25 బస్తాలు మాత్రమే వచ్చింది. తేమ శాతం ఎక్కువగా ఉందనే కుంటి సాకులతో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. దళారుల దందా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తివేసి.. రైతుల నెత్తిన ప్రీమియం భారం మోపింది. అలాగే జిల్లాలో 60 వేల మంది పైచిలుకు కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కూడా దూరం చేసింది. దాని కింద రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పి, మొదటి ఏడాది ఎగనామం పెట్టారు. ధాన్యం కొనుగోలులో దళారులకు గేట్లు తెరిచారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉన్న ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం చేశారు. అయితే చంద్రబాబు సర్కారు మాత్రం ప్రచార యావతో ‘రైతన్నా.. మీకోసం’ అంటూ గ్రామాల్లో సభలు నిర్వహించి హడావుడి చేసింది. రైతులకు అండగా జగన్ ప్రభుత్వం జగన్ సర్కార్ సాగుకు ముందే పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు అండగా నిలిచింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఇచ్చే రూ.6 వేలకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.7500 కలిపి మొత్తం రూ.13,500 చొప్పున రైతు ఖాతాలో జమ చేస్తూ వచ్చింది. జిల్లాలో రెండు లక్షల మంది రైతులకు ఏటా రూ.200 కోట్లకు పైగా రైతు భరోసా ద్వారా అందించింది. దీనితో పాటు వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఇన్పుడ్ సబ్సిడీ ఇలా పలు పథకాల ద్వారా రైతులకు ఆర్థికంగా అండగా నిలిచింది. ఉచిత పంటల బీమాకు మంగళం రైతులపై ప్రీమియం భారం లేకుండా 2019 ఖరీఫ్ నుంచి వైఎస్సార్ ప్రభుత్వం ఉచిత పంటల బీమాను తీసుకువచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తివేసి ప్రీమియం భారాన్ని రైతులపై మోపింది. జిల్లాలో 2,15,068 ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేయగా రైతులు ఎకరాకు రూ.210 చొప్పున 72,766 ఎకరాలకు మాత్రమే ప్రీమియం చెల్లించారు. మిగిలిన 1,42,302 ఎకరాలు క్రాఫ్ ఇన్స్యూరెన్స్కు దూరంగా ఉండటం గమనార్హం. ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం విత్తు నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకు సాగులో రైతుకు అన్ని విధాలా అండగా ఉండేందుకు అప్పటి జగన్ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం వాటి పేర్లను రైతు సేవా కేంద్రాలుగా మార్చిందే తప్ప.. అన్నదాతలకు ఒక్క ప్రయోజనం కల్పించలేదు. ప్రస్తుతం కొన్ని ఆర్బీకే భవనాలను ఇతర కార్యాలయాలకు వినియోగిస్తుండగా, మరికొన్ని తాళం వేసి కనిపిస్తున్నాయి. ఏడాది పొడవునా ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతూనే 2025ను అతి భారంగా వీడుతున్నారు. యూరియా ఇవ్వలేని దుస్థితి చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయం కుంటుపడింది. రైతును ఆదుకోవడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారు. కనీసం యూరియా ఇవ్వలేని దయనీయ స్థితిలో ఈ ప్రభుత్వం నడుస్తోంది. రైతులందరికీ ఈ – క్రాప్ చేయలేదు. కౌలు రైతులకు కౌలు కార్డులు లేవు. పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. గత జగన్ ప్రభుత్వంలో విత్తనాలు, ఎరువులు, ఈ– క్రాప్ చక్కగా జరిగింది. ధాన్యం కొనుగోలులో హమాలీ, రవాణా చార్జీలను చెల్లించారు. గిట్టుబాటుఽ ధర కంటే రైతులకు ఎక్కువ లభించేలా చర్యలు తీసుకున్నారు. – లంక ప్రసాద్, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు -
పదోన్నతుల్లో సీనియారిటీకే ప్రాధాన్యమివ్వాలి
● విద్యుత్ ఓసీ ఉద్యోగుల డిమాండ్ ● కాకినాడలో సంఘ వార్షికోత్సవం కాకినాడ రూరల్: పదోన్నతుల్లో సీనియారిటీకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్డలోని జి.కన్వెన్షన్ హాల్లో శనివారం రాష్ట్ర స్థాయిలో సంఘ 17వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు దూళిపాల వెంకట రంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో 2026 సంవత్సర కేలండర్, డైరీలను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి హాజరయ్యారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓసీల ప్రయోజనాల కోసం పోరాటానికి విద్యుత్ సంస్థలో విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని ప్రారంభించామన్నారు. ముఖ్యంగా ఓసీలకు ప్రతిభ ఉన్నా ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల వలన అన్యాయం జరుగుతోందన్నారు. పదోన్నతుల్లో రిజర్వేషన్ల కంటే సీనియారిటీకే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉద్యోగుల పీఆర్సీ, న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫారం నేషనల్ ప్రెసిడెంట్ ఎం.నాగరాజు, ఓసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్ రెడ్డి, సౌత్జోన్ ఏఐఈఎఫ్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నజీర్ డల్, ఈపీడీసీఎల్ కంపెనీ ప్రెసిడెంట్ అప్పలరాజు, కంపెనీ సెక్రటరీ త్వరగా రామకృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ప్రాంతీయ అధ్యక్షుడు కేవీవీ రమణ, కాకినాడ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు డి.సురేష్బాబు, జ్యోతుల వీరబాబు, బొజ్జా వాసు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
ఉపాధికి వెళ్లి గుండెపోటుతో మృతి
అమలాపురం రూరల్: అమలాపురం మండలం వన్నెచింతలపూడికి చెందిన ఓ యువకుడు ఉపాధి నిమిత్తం దేశం కాని దేశం వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. కేసీఎం అధికారుల చొరవతో అతని మృతదేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకు వచ్చారు. అధికారుల వివరాల ప్రకారం.. వన్నెచింతలపూడి గ్రామానికి చెందిన ముంగండ రవితేజ (33) ఉపాధి నిమిత్తం ఈ ఏడాది సెప్టెంబర్ 11న ఖతార్ దేశానికి వెళ్లి హౌస్ కేరింగ్ వర్క్ చేస్తున్నాడు. అయితే ఈ నెల 16న రాత్రి అక్కడ గుండెపోటుతో మరణించాడు. దీనిపై మృతుని కుటుంబ సభ్యులు ఈ నెల 17న కలెక్టర్ మహేష్ కుమార్ను సంప్రదించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నోడల్ అధికారి కె.మాధవి, సమన్వయ అధికారి గోళ్ల రమేష్, సిబ్బంది ఎంఎం సఫియా, కడియాల సత్తిబాబు, బద్రి దుర్గా అమ్మాజీలు బాధిత కుటుంబాన్ని కలుసుకుని వివరాలు సేకరించారు. అనంతరం భారత రాయబార కార్యాలయంతో పాటు ఖతార్లోని ప్రతినిధులు శ్రీనివాస్, రాజ్కుమార్, విజయ్ చార్లీ, సోలామాన్, రమణ, శశిలతో నిరంతరం సమన్వయం జరిపారు. అనంతరం మృతదేహాన్ని వన్నెచింతలపూడికి శనివారం చేర్చారు. వ్యక్తి ఆత్మహత్య సామర్లకోట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సామర్లకోట సీఐ ఎ.కృష్ణభగవాన్ కథనం ప్రకారం.. స్థానిక గాంధీనగర్కు చెందిన సిరికి రవికుమార్ (49) లారీ స్టాండ్ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ఆర్థిక ఇబ్బందులు కారణమని పోలీసులు భావిస్తున్నారు. వీఆర్వో సమాచారం మేరకు సీఐ కృష్ణభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పరుగు పందెంలో బంగారు పతకం
బాలాజీచెరువు: ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంలో కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఏ ప్రథమ సంవత్సర విద్యార్థిని బి.నాగవిహారిక ప్రతిభ కనబరిచింది. ప్రో స్పోర్ట్స్ 100 ప్లస్ టీం, హైదరాబాద్ డిస్ట్రిక్ అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వహించిన ఈ పోటీల్లో 12 సెకన్లలో పరుగు పూర్తి చేసి గోల్డ్ మెడల్తో పాటు రూ.30 వేల నగదు సాధించారు. అలాగే గత నెలలో నన్నయ వర్సిటీలో నిర్వహించిన అథ్లెటిక్స్ నన్నయవర్సిటీ చాంపియన్షిప్ పోటీల్లో పాస్టెస్ట్ ఉమెన్ టైటిల్ సాఽధించారు. కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో బీఏ విద్యార్థి వి.రేష్మయాదవ్ ప్రతిభ చూపి బంగారు పతకంతో పాటు నొయిడాలో జనవరి 3 నుంచి నిర్వహించే జాతీయ పోటీలకు అర్హత పొందారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ కందుల ఆంజనేయులు, ఇన్చార్జి ప్రిన్సిపాల్ సంజీవ్కుమార్, పీడీ రమణ, డాక్టర్ పసుపులేటి హరిరామప్రసాద్ అభినందించారు. -
ఏపీఎన్జీవో జిల్లా కార్యవర్గం ఎన్నిక
కాకినాడ క్రైం: ఏపీఎన్జీవో జిల్లా కార్యవర్గ ఎన్నిక శనివారం ఏకగ్రీవమైంది. కాకినాడలోని ఏపీఎన్జీవో హోంలో శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఇందులో 17 స్థానాలకు గాను ఒక్కో నామినేషనే దాఖలు చేయడం వల్ల ఆయా స్థానాలన్నీ ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా ఏపీఎన్జీవో అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాసరావు, సహాయ ఎన్నికల అధికారి, సంఘ కార్యదర్శి ఎన్వీ రామారావు తెలిపారు. మూడేళ్ల పదవీ కాలానికి గాను కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా గుద్దటి రామ్మోహనరావు, కార్యదర్శిగా పాలపర్తి మూర్తిబాబు, కోశాఽధికారిగా యండమూరి పద్మ మీనాక్షి ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎం.వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్లుగా చంద్రరావు, ప్రసాద్, పాండురంగారావు, సత్యనారాయణ, జయకృష్ణ, భారతి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రామకృష్ణ, జాయింట్ సెక్రటరీలుగా శ్రీనివాసరావు, వీరబాబు, చార్లెస్ పాల్, లోకమాన్య పరిమళ కుమార్, వెంకటరమణ, జయలక్ష్మి ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎన్నికల పర్యవేక్షణాధికారిగా సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎ.రంజిత్ కుమార్ నాయుడు వ్యవహరించారు. నూతన కార్యవర్గాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్, సంఘ మాజీ అధ్యక్షులు ఆచంట రామానాయుడు, బూరిగ ఆశీర్వాదం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ అభినందించారు. శృంగార వల్లభస్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలోని శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచీ వచ్చిన సుమారు 12 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,20,860, అన్నదాన విరాళాలు రూ.61,519, కేశ ఖండన ద్వారా రూ.3 వేలు, తులాభారం ద్వారా రూ.300, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.19,035లతో కలిపి రూ.2,04,714 ఆదాయం వచ్చిందని చెప్పారు. సుమారు 3,200 మంది భక్తులు ఆలయంలో అన్న ప్రసాదం స్వీకరించారన్నారు. స్వామి వారికి ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మొయిలి కృష్ణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్మన్ మొయిలి సంధ్య, దేవస్థానం సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు సేవలందించారు. బ్రిడ్జి నిర్మాణాలకు భూసేకరణ వేగవంతం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ), రోడ్డు అండర్ బ్రిడ్జి (ఆర్యూబీబీ) నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం జేసీ అపూర్వ భరత్తో కలిసి రెవెన్యూ, రోడ్డు భవనాలు, రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పీఎం గతిశక్తి పథకం కింద రైల్వే లైన్ల మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా జిల్లాలో పరిధిలో వివిధ ప్రదేశాల్లో రైల్వే లైనులకు అవసరమైన ఆర్ఓబీ, ఆర్యూబీ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రాథమిక దశలో వీటి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. ఇందుకు రెవెన్యూ, సర్వే, రోడ్డు భవనాల శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి, ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, కాకినాడ ఆర్డీవో ఎస్.మల్లిబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీలు ప్రారంభం
రావులపాలెం: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితరులు అన్నారు. రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామంలో శనివారం మాజీ వైస్ ఎంపీపీ దండు సుబ్రహ్మణ్యేశ్వర వర్మ ఆధ్వర్యంలో దండు సాయిఆకాష్వర్మ మెమెరబుల్ టోర్నమెంట్ 10వ రాష్ట్ర స్థాయి నెట్బాల్ సీనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయి నెట్బాల్ ఆటలో అత్యున్నత ప్రతిభ కనబరిచి దురదృష్టవశాత్తూ మరణించిన దండు సాయిఆకాష్ వర్మ ఆసక్తి మేరకు అతని తండ్రి దండు సుబ్రహ్మణ్యేశ్వరవర్మ, సుజాత దంపతులు ఈ రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం జగ్గిరెడ్డి టాస్ వేసి తూర్పుగోదావరి– నెల్లూరు జట్ల మధ్య మ్యాచ్ను ప్రారంభించారు. అలాగే క్రీడాకారులకు టీషర్ట్లు పంపిణీ చేశారు. 13 జిల్లాల నుంచి మెన్, ఉమెన్ కేటగిరీల్లో మొత్తం 26 టీమ్లు పాల్గొనగా లీగ్ కమ్ నాకౌట్ విధానంలో తొలి రోజు పోటీలు జరిగాయి. పురుషుల విభాగంలో పది మ్యాచ్లు, మహిళల విభాగంలో నాలుగు మ్యాచ్లు హోరాహోరీగా సాగాయి. రెండో రోజు క్వార్టర్స్, సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయని నెట్బాల్ రాష్ట్ర సెక్రటరీ పల్లా శ్రీను తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధరరావు, అముడా మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్రాజు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు బొక్కా వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ గన్నవరపు వెంకట్రావు, సర్పంచులు బొక్కా కరుణాకరం, సబ్బితి మోహనరావు, కొత్తపేట వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు పాల్గొన్నారు. -
వృత్తిని వదులుకోవాల్సిన పరిస్థితి
గతంలో మాదిరిగా గంగిరెద్దుల ప్రదర్శనకు ఆదరణ అంతగా ఉండడం లేదు. కుల వృత్తిని వీడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం గంగిరెద్దుల సామాజిక వర్గాన్ని గుర్తించి ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఈ వృత్తిని కొనసాగించగలం. –బొడ్డు రాజు, పసలపూడి, రాయవరం మండలం పండగ సమయంలోనే.. ఒకప్పుడు అన్ని కాలాల్లో గంగిరెద్దుల ఆటను ప్రతి ఒక్కరూ ఆదరించేవారు. ఇప్పుడు కేవలం సంక్రాంతి సమయంలోనే ఆట ఉంటుంది. ఆదరణ తగ్గుతుండడంతో యువత ఈ వృత్తిని స్వీకరించడం లేదు. ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునేందుకు, కూలి పనులకు వెళ్లిపోతున్నారు. –బొడ్డు ప్రకాష్, కందరాడ, పిఠాపురం మండలం ఆర్థికంగా ఆదుకోవాలి గంగిరెడ్ల సామాజిక వర్గం అనాది నుంచి సంచార జాతి ఉంటుంంది. ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్లి గంగిరెద్దులను ఆడించుకుని పోషణ పొందుతున్నాం. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోకుంటే మా జీవితాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి. –జానపాటి ఏసు, మాధవపట్నం, కాకినాడ రూరల్ ఎస్టీ జాబితాలో చేర్చాలి ఊరూరా తిరుగుతూ ఉండే సంచార జాతులమైన గంగిరెడ్ల సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి. ఇప్పటికీ అధిక సంఖ్యలో ఉన్న గంగిరెడ్ల సామాజిక వర్గానికి కనీసం పక్కా ఇళ్లు లేవు. వృత్తి కూడు పెట్టకపోవడంతో చిన్న చిన్న సామాన్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం. –బొమ్మన పరంజ్యోతి, అధ్యక్షుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గంగిరెడ్ల సంక్షేమ సంఘం -
రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో కలపాలి
అమలాపురం రూరల్: రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని, ప్రజల సంకల్పాన్ని నీరుగార్చేలా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ, రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ, పీడీఎస్యూ, ఏఐకేఎంఎస్, ఐఎఫ్టీయూ ప్రజా సంఘాలు శనివారం అమలాపురం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాయి. సీపీఐ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కోకన్వీనర్, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏఐకేఎంఎస్ నాయకుడు వెంటపల్లి భీమశంకరం, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్కుమార్, బీఎస్పీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అభివృద్ధి ముసుగులో జిల్లాల పునర్విభజన చేయడంతో ప్రజల మధ్య అనేక చీలికలు, అయోమయం, పరిపాలనా సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. భౌగోళికంగా, చారిత్రకంగా, పరిపాలనా పరంగా శతాబ్దాలుగా కాకినాడ జిల్లాతో అనుసంధానమైన రామచంద్రపురం నియోజకవర్గాన్ని, గోదావరి నదిని దాటి వెళ్లాల్సిన దూర ప్రాంతంతో అనుసంధానం చేయడం ప్రజలకు మేలు చేసే నిర్ణయం కాదని అన్నారు. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి పదవి అందుకున్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నోరు మెదపకపోవడం దారుణమన్నారు. అఖిలపక్ష జేఏసీ గౌరవ అధ్యక్షుడు దొమ్మలపాటి సత్యనారాయణ, ఐఎఫ్టీయూ నాయకులు చింతా రాజారెడ్డి, నాయకులు నాగరాజు, అలీ, కె.నవీన్, బుల్లి రాజు, పట్టాభి, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
హిందువులందరూ ఏకం కావాలి
కరప: భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు హిందువులందరకూ ఏకం కావాలని కాకినాడ గీతాశ్రమం స్వామీజీ దివ్యానంద సరస్వతి పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాల్లో భాగంగా శనివారం నీలయ్య తోటలోని ఒకలే అవుట్లో మండల సహ కన్వీనర్ కొక్కెరమట్ల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 2.50 లక్షల హిందూ సమ్మేళనాలు నిర్వహించాలన్న ఆశయంలో ఇంత వరకూ 1.50 లక్షల సమ్మేళనాలు జరిగాయన్నారు. హిందూ ధర్మాన్ని దశ దిశలా వ్యాపింపజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. యానాంఖండ పూర్వ కార్యనిర్వాహక్ రామారావు మాట్లాడుతూ హిందువులందరూ బంధువులేనన్న నినాదాన్ని ప్రజలకు తెలియజెప్పాలన్నారు. సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక్ పడాల రఘు, ఆధ్యాత్మికవేత్త చాగంటి సూరిబాబు, జిల్లా మహిళా సహ కన్వీనర్ వాసంశెట్టి సూర్యవతి, మండల మహిళా కన్వీనర్ పేకేటి లక్ష్మీకాంతం పాల్గొన్నారు. -
డూడూ బసవన్నా.. ఆదరణ ఏదన్నా!
ఫ వైభవాన్ని కోల్పోతున్న గంగిరెద్దులాట ఫ ఇతర వృత్తులకు మళ్లుతున్న కళాకారులు రాయవరం: అయ్యవారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల కళాకారులు గ్రామాల్లో సందడి చేస్తుంటారు. తలకు పాగా ధరించి, వివిధ రకాల దుస్తులను ధరించి, బూర ఊదుతూ గంగిరెద్దులను తీసుకు వస్తారు. అందంగా అలంకరించిన గంగిరెద్దును తీసుకుని ఇంటింటికీ వెళ్లి వారి వంశ ప్రతిష్టను కీర్తించే గంగిరెద్దుల వారికి గ్రామాల్లో గంగిరెద్దులాటకు రానురానూ ఆదరణ తగ్గుతోంది. సాధారణ రోజుల్లో గంగిరెద్దులను ఆడిస్తూ గ్రామాల్లో తిరిగినా సంక్రాంతి సమయంలోనే కళాకారులకు ఓ ప్రత్యేకత ఉంటుంది. హరిదాసులతో పాటు డూడూ బసవన్నల రాకతోనే సంక్రాంతి పండగకు పరిపూర్ణత వస్తుందని చెప్పవచ్చు. ధనుర్మాసం ప్రారంభం నుంచి ఇళ్ల ముంగిట్లో ఎక్కడ చూసినా గంగిరెద్దులు దర్శనమిచ్చేవి. ఈ కళాకారులు ప్రతి ఇంటికి వచ్చి సన్నాయితో పాటలు పాడుతూ.. ఇంటి యజమానుల వంశాన్ని కీర్తిస్తూ.. బసవన్నను ఆడిస్తూ యజమానులు ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు. నిర్వాహకులు సన్నాయితో పాడే పాటలకు అనుగుణంగా గంగిరెద్దుతో నాట్యం, విన్యాసాలు చేయిస్తారు. గ్రామాల్లో చిన్న పిల్లలు గంగిరెద్దుల వెంట తిరుగుతూ సెలవు దినాలను ఆనందోత్సాహాలతో గడిపేవారు. ఉమ్మడి జిల్లాలో 15 వేల మంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 15 వేల మంది గంగిరెద్దుల సామాజిక వర్గం వారు ఉన్నారు. వీరు 25 సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. అమలాపురం, కొత్తపేట, రాయవరం, పసలపూడి, రాజమహేంద్రవరం, వెదురుమూడి, ముక్కామల, భీమనపల్లి, మురమళ్ల, నీలపల్లి, కాకినాడ, అనపర్తి, ద్వారపూడి తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో గంగిరెడ్ల సామాజిక వర్గం వారు జీవిస్తున్నారు. ఈ వృత్తిలో ఆదరణ తగ్గిపోవడంతో ఇతర వృత్తుల్లోకి మరలిపోతున్నారు. కొందరు ఇంకా పక్కా ఇళ్లకు కూడా నోచుకోలేక పోతున్నారు. ఇప్పటికీ మార్కెట్ షెడ్లలో నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ కొందరు గంగిరెద్దులను తీసుకుని సంక్రాంతికి జిల్లాలోని కందికుప్ప, అమలాపురం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు తరలివెళ్లారు. తగ్గుతున్న ఆదరణ గంగిరెద్దులకు కాలక్రమంలో ఆదరణ తగ్గుతుంది. ఇదే విషయాన్ని గంగిరెద్దుల కళాకారులు చెబుతున్నారు. ప్రజల్లో ఆదరణ తగ్గడానికి ఇంటింటికి ఉన్న టీవీలు కూడా ఒక కారణమని అంటున్నారు. టీవీలతోనే పిల్లలు, పెద్దలు కాలక్షేపం చేస్తూ గంగిరెద్దుల ఆటను తనివితీరా ఆస్వాదించ లేకపోతున్నారని, ఆట చూడడానికి కూడా తీరిక ఉండడం లేదని కళాకారులు అంటున్నారు. గతంలో గంగిరెద్దుల ఆటలు జనరంజకంగా ఉండేవి. గంగిరెద్దుల ఆటను చూసిన అనంతరం ఇంటి యజమానుల నుంచి కానుకలు స్వీకరించే ముందు వారిని ఆశీర్వదించేవారు. -
బస్సులు పెంచకుండా ఉచిత ప్రయాణమా!
● సీ్త్రశక్తి పథకంతో తీవ్ర ఇబ్బందులు ● ఆర్టీసీ సిబ్బందికి పెరిగిన పనిభారం గోకవరం: బస్సులను పెంచకుండా సీ్త్రశక్తి పథకం అమలు చేయడంతో ప్రయాణికులకు, ఆర్టీసీ సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు అన్నారు. ఈ మేరకు శనివారం గోకవరం ఆర్టీసీ డిపో ఎదుట రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గేటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏఎస్ నారాయణ, డిపో అధ్యక్షుడు జీఎస్ రావు, ప్రధాన కార్యదర్శి కేఎస్పీ రావు మాట్లాడుతూ ఉచిత బస్సు పథకంతో సిబ్బందిపై పని భారం పెరిగిపోయిందని, కండక్టర్లకు పొరపాట్లు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటి వల్ల వారి ఉద్యోగ భద్రత ముప్పు వాటిల్లుతుందన్నారు. బస్సుల్లో రెండు రకాల టిక్కెట్లు ఇచ్చే విధానాన్ని తీసి వేసి, డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే టిక్కెట్లు ఇచ్చేలా నిబంధన మార్చాలని డిమాండ్ చేశారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం బస్సులకు డోర్లు ఏర్పాటు చేసి బస్సుల్లో 70 మంది ప్రయాణికులకు మాత్రమే అనుమతించేలా చూడాలన్నారు. తక్షణమే బస్సుల సంఖ్యను పెంచాలని, బస్సులకు హైడ్రాలిక్ డోర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎంఎన్వీఎస్ నారాయణ, జిల్లా కార్యదర్శి ఎన్ఎన్ రావు, జీఎస్రావు, సెక్రటరీ రమణ, ఎంఎం కృష్ణ, సూర్యచంద్రరావు, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి తీవ్ర గాయాలు
సామర్లకోట: గొంచాల–అచ్చంపేట రోడ్డులో జరిగిన ప్రమాదంలో పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. నక్కపల్లి యూనియన్ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్గా పని చేస్తున్న సందీప్రాజు కారు అతి వేగంగా రావడంతో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరర చదువుతున్న బెహరా రాజు తీవ్రంగా గాయపడ్డాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తాను ఏమి చేయలేనని సందీప్రాజు చెప్పడంతో విద్యార్థులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. దాంతో సీఐ ఎ.కృష్ణభగవాన్ శనివారం రాత్రి ఇరువర్గాలను పిలిచి చర్చలు జరిపారు. బాధితుడి కాలు పూర్తిగా తీసి వేయడంతో ఇబ్బంది పడాల్సి వస్తోందని, నష్ట పరిహారం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దానికి కారు యజమానికి చెందిన బంధువులు అంగీకరించక పోవడంతో బ్యాంకు వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకు సీఐ సూచించారు. అయితే రాత్రి వరకూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. -
కాకినాడ టు శబరిమల
ఇరుముడి ధరించి 1,470 కిలోమీటర్ల పాదయాత్ర నగరి: సాధారణంగా అయ్యప్ప భక్తులు పంబ నుంచి, లేకుంటే ఎరిమేలి నుంచి పెద్ద పాదలో గానీ పాదయాత్రగా శబరి కొండపైకి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం పరిపాటి. అయితే కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఇద్దరు భక్తులు 1,470 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అయ్యప్ప దర్శనానికి వెళ్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా, తణుకు మండలం మండపాక గ్రామానికి చెందిన అర్జున్ (63), కాకినాడ రూరల్ రేపూరు గ్రామానికి చెందిన ముమ్మిడి భవానిశంకర్ (44) అయ్యప్ప స్వామి మాల ధరించారు. 18 ఏళ్ల క్రితం అర్జున్ స్వామి తన 18వ శబరియాత్రను చేపట్టగా, ముమ్మిడి భవాని శంకర్ కన్నెస్వామిగా మాల ధరించి ఆయన వెంట కాకినాడ నుంచి శబరికొండ వరకు పాదయాత్రగా వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఆపై ఇరువురు సొంతంగా అయ్యప్ప ఆలయాలను నిర్మించి కలసి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఆపై ఇద్దరూ పాదయాత్ర చేసినా కలసి వెళ్లలేదు. మరో 18 ఏళ్లకు వారి ఆశయం నెరవేరింది. ఇద్దరూ వారి ప్రాంతాల్లో నూతన అయ్యప్ప ఆలయాల నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఏడాది కలసి పాదయాత్ర ప్రారంభించారు. భవానీ శంకర్ 18వ సారి శబరి యాత్ర చేస్తుండగా, అర్జున్ స్వామి 36వ సారి తన యాత్రను కొనసాగిస్తున్నారు. వారు శుక్రవారం చిత్తూరు జిల్లా నగరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ యాత్ర వివరాలను మీడియాకు తెలియజేశారు. ప్రజా సంక్షేమం కోరుతూ ఇరుముడి ధరించి 1,470 కిలోమీటర్ల పాదయాత్రను కొనసాగిస్తున్నామన్నారు. భవానీ శంకర్ నవంబరు 30న రేపూరు నుంచి యాత్రను ప్రారంభించగా, అర్జున్ స్వామి డిసెంబరు 4వ తేదీ తణుకు నుంచి యాత్రను ప్రారంభించారు. 22 రోజులుగా కలసి యాత్ర కొనసాగిస్తున్నామని మకర జ్యోతికి శబరిమలకు చేరుకుంటామని వారు తెలిపారు. వేల కిలోమీటర్ల యాత్రలో.. శబరి కొండకు వీరు చేసే యాత్రలు విని అందరూ నోరెళ్లబెడుతున్నారు. వీరిలో అర్జున్ స్వామి ఏడుసార్లు ఇలా తణుకు నుంచి శబరి కొండకు ఇరుముడితో పాదయాత్ర చేశారు. ఇందులో నాయుడుపేట మీదుగా మూడు సార్లు, సేలం, దిండిగల్ మీదుగా రెండు సార్లు, తిరుత్తణి, అరకోణం మీదుగా రెండు సార్లు పాదయాత్రగా వెళ్లగా, మోటారుసైకిల్ మీదుగా మూడుసార్లు, సైకిల్పై ఐదుసార్లు యాత్ర కొనసాగించారు. ప్రస్తుతం 62 సంవత్సరాల వయస్సులో ఇరుముడి ధరించి పాదయాత్ర చేస్తున్న ఈయన భక్తికి పరవశించి అందరూ ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. గణపతి గురుస్వామి ద్వారా తాను ఈ భక్తిమార్గంలో నడుస్తున్నానని ఆయన తెలిపారు. ముమ్మిడి భవానీశంకర్ నాలుగు సార్లు పాదయాత్రగా వెళ్లగా, ఒకసారి బైక్యాత్ర చేశారు. ప్రస్తుతం ఐదవసారి యాత్ర చేస్తున్నారు. వేలు గురుస్వామి ద్వారా తాను ఈ భక్తిమార్గంలో నడుస్తున్నాని ఆయన తెలిపారు. పెట్రోలు బంకులు, ఆశ్రమాలు, గుళ్ల వద్ద తలదాచుకుంటూ మార్గంలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాలు దర్శించుకుంటూ యాత్రను కొనసాగిస్తున్నారు. -
కల్తీ పెట్రోలు విక్రయంపై ఆందోళన
జగ్గంపేట: కాట్రావులపల్లి గ్రామంలోని శ్రీజయలక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్లో కల్తీ పెట్రోల్ కొడుతున్నారంటూ వినియోగదారులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజు పరిశీలించి తేడాలు గుర్తించి బంక్ను సీజ్ చేశారు. ఆ వివరాల ప్రకారం.. కాట్రావులపల్లిలో ఆ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోలు కొట్టించుకున్న మోటార్ సైకిళ్లు కొద్దిరోజులుగా మరమ్మతులకు గురవుతున్నాయి. ఒక్కసారిగా చాలా మోటారు సైకిళ్లు పాడవడంతో మెకానిక్లు పెట్రోల్లో తేడా వల్లే ఇలా జరిగిందని వివరించడంతో సుమారు 28 మంది వాహనదారులు పెట్రోల్ బంక్ వద్ద సాయంత్రం ఆందోళనకు దిగారు. తమ వాహనాల మరమ్మతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనితో యాజమాన్యానికి, వినియోగదారుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో జగ్గంపేట ఎస్సై రఘునాధరావు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట ఎంఎస్ఓ కృష్ణ సమాచారంతో జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి సత్యనారాయణ రాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రికార్డులు పరిశీలించడంతో పాటు, పెట్రోల్ సాంద్రత, నిల్వలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాంద్రతలో చాలా తేడాలు గుర్తించామని చెప్పారు. దీని ప్రకారం కల్తీ జరిగిందని నిర్ధారణకు వచ్చి బంక్ సీజ్ చేశామని, అలాగే యజమాని కనిగిరి వెంకట రమణమూర్తి, గుమస్తా వాకాడ రమేష్పై 6ఏ కేసు నమోదు చేశామని తెలిపారు. కాట్రావులపల్లి పెట్రోల్ బంక్ను తాత్కాలికంగా జగ్గంపేటలోని ఎస్ఆర్ బంక్ అప్పగించామని చెప్పారు. జగ్గంపేట ఎంఎస్ఓ కృష్ణ, వీఆర్వో కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బాలా.. భళా
ఫ ఆంగ్లంలో 20వ ఎక్కం వరకూ చెబుతున్న ఒకటో తరగతి విద్యార్థి ఫ చిరుప్రాయంలోనే ప్రతిభ కొత్తపేట: ఒకటో తరగతి బాలుడు.. ఎక్కాలు ఆంగ్లంలో గణగణా చెప్పేస్తున్నాడు.. ఆ చిన్నారి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో చదువుకుంటున్నాడని అనుకుంటున్నారా? కాదు.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలుడే.. అతని జ్ఞాపకశక్తి అమోఘమని అందరూ ఆశ్చర్యపోతున్నారు. భవిష్యత్ మేధావి అని ఆకాంక్షిస్తున్నారు.. ఈ బాలుడి పేరు అడపా మోహన్సాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఎ.దుర్గాప్రసాద్ ఎక్కాలు సులభ రీతిలో ఆంగ్లంలో చదవడంపై శిక్షణ ఇచ్చారు. దాని ఫలితంగా మోహన్సాయి అందరి కంటే మించి ఒకటో ఎక్కం నుంచి 20వ ఎక్కం వరకూ 20 స్టెప్పులు అనర్గళంగా చూడకుండా చెప్పేస్తున్నాడు. ఎంఈఓ మట్టపర్తి హరిప్రసాద్ ఆ పాఠశాల సందర్శన సందర్భంగా ఏ ఎక్కం గురించి అడిగినా భయం లేకుండా, తడుముకోకుండా అప్పచెప్పేశాడు. బాలుడి మేథస్సుకు ముచ్చటపడి ఆయన అభినందించారు. నేటి బాల మేథావి అని ఆకాంక్షించారు. ఇదిలాఉంటే అతని తల్లిదండ్రులు పెద్ద చదువులు చదివిన విద్యాధికులు కాదు.. తండ్రి శ్రీనివాసరావు సాధారణ రైతు కాగా, తల్లి గృహిణి. అతని అన్న రెండో తరగతి చదువుతున్నాడు. జ్ఞాపకశక్తి అమోఘం చిరుప్రాయంలోనే ఇంత మేథస్సు గల మోహన్సాయి గురించి ఉపాధ్యాయుడు దుర్గాప్రసాద్ను ‘సాక్షి’ అడగ్గా, ఆయన ఇలా తెలిపారు. ఒకటో తరగతి బాలలు రెండు పదులు, మూడు పదులు వరకూ చెప్తారు. కానీ సాయి 20వ ఎక్కం వరకూ 20 స్టెప్పులు ఆంగ్లంలో ధారాళంగా చూడకుండా చెబుతున్నాడు. ఇతని జ్ఞాపకశక్తి అద్భుతం, అమోఘమని అన్నారు. తన 40 ఏళ్ల సర్వీసులో ఒకటో తరగతి విద్యార్థి ఇలా చెప్పడం చూడలేదని చెప్పారు. గత ప్రభుత్వ కృషికి ఫలితంమోహన్సాయి అనర్గళంగా ఆంగ్లంలో 20 ఎక్కాలు చెప్పడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లిషు మీడియం ఓ కారణంగా చెప్పవచ్చు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణలే పునాది అయ్యింది. ‘మనబడి నాడు – నేడు’ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు, అన్ని సౌకర్యాలు కల్పించిన విషయం తెలిసిందే. ఇంగ్లిషు మీడియం ఆప్షన్ అమలు చేయడంతో ఈ పాఠశాలల్లో చదువుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులు ఈ మీడియం పట్ల మక్కువ చూపారు. మాతృభాష తెలుగుతో పాటు దేశ, విదేశాల్లో ఉన్నత చదువులకు దోహదపడే ఇంగ్లిషును కూడా మాట్లాడగలుగుతున్నారు. నాడు జగన్ ప్రభుత్వం విద్యా సంస్కరణలే నేటి ఈ మార్పులకు పునాది అని పలువురు విద్యాధికులు, మేధావులు పేర్కొంటున్నారు. -
ప్రజాస్వామిక శక్తులను బలోపేతం చేయాలి
● రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవాలి ● సీపీఐ నేత మధు ● ఘనంగా ఆ పార్టీ శతజయంతి ఉత్సవాల ముగింపు సభ సామర్లకోట: రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుతూ, లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలను, శక్తులను బలోపేతం చేయాల్సిన అవసరముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు అన్నారు. సీపీఐ శత జయంతి ఉత్సవాల జిల్లా స్థాయి ముగింపు సభ శుక్రవారం సామర్లకోటలో జరిగింది. ఈ సందర్భంగా స్థానిక మెహర్ కాంప్లెక్స్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా లారీ స్టాండ్ వద్ద ఉన్న సీపీఐ కార్యాలయం వరకూ ప్రజా ప్రదర్శన నిర్వహించారు. అక్కడ సీపీఐ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకుడు చెరుకూరి సుబ్బారావు మాస్టారు ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయాన్ని మధు ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, ప్రస్తుతం దేశం సంక్షోభంలో ఉందని, క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాకర్టీ ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. కేంద్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న మతతత్వ శక్తులు అంబేడ్కర్ వంటి మహనీయులు అందించిన రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు.. రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన లౌకిక, ప్రజాస్వామ్య, సంక్షేమ దేశాన్ని మత రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. దీనిలో భాగంగానే దేశాన్ని, దేశ చరిత్రను మార్చేందుకు రాజ్యాంగం నుంచి సెక్యులరిజం పదాన్ని తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య, ఫెడరల్ వ్యవస్థలు మతతత్వ శక్తుల దాడికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయి ప్రజల జీవితాలు దుర్భరంగా మారిపోయాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత లౌకిక, ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులపై ఉందని మధు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చిన తరువాత ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఏర్పడిందన్నారు. కమ్యూనిస్టుల లక్ష్యమైన కుల, మత రహిత సోషలిస్టు సమాజ నిర్మాణానికి నిరంతరం పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. సీపీఐ వందేళ్ల పోరాట వారసత్వాన్ని యువత ముందుకు తీసుకు వెళ్లాలని కోరారు. సీపీఐ పట్టణ కార్యదర్శి పెదిరెడ్ల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పప్పు ఆదినారాయణ, సీనియర్ నాయకులు చింతపల్లి సుబ్బారావు, కట్ట సత్యనారాయణ, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వై.బాబు, ఏఐఎస్ఎఫ్ నేత నాని స్టాలిన్, మున్సిపల్ యూనియన్ నాయకులు నందకిషోర, బొత్స శ్రీనివాసు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలను సత్కరించారు. -
ఎగ్నామం పెట్టేందుకా?
బాలాజీచెరువు (కాకినాడ): మధ్యాహ్న భోజన పథకం అపహాస్యం అవుతోంది.. సంబంధిత ప్రైవేట్ ఏజెన్సీలు మధ్యాహ్న భోజనంలో మెనూలో భాగంగా ఉడకబెట్టిన గుడ్లను నిర్వాహకులకు పంపిస్తుండగా, ఇందులో రోజుకు 10 నుంచి 20 వరకూ పాడైపోతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. కాకినాడ పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పాడైన గుడ్లు వచ్చాయి. వాటిని వారు తినకుండా వదిలేశారు. ఇక్కడ మొత్తం 240 మంది మధ్యాహ్న భోజనం చేస్తారు. ఇందులో రోజూ సుమారు పది వరకూ గుడ్లు పాడవుతున్నాయని చెబుతున్నారు. ఈ విషయమై అధికారులకు చెబుతున్నా మార్పు ఉండటం లేదని పలువురు వాపోతున్నారు. స్నేహితుడిపై దాడి: వ్యక్తికి జైలు కాకినాడ లీగల్: స్నేహితుడిపై దాడి చేసిన వ్యక్తికి 9 నెలల జైలు, రూ.మూడు వేల జరిమానా విధిస్తూ కాకినాడ నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ నిరూప భంజ్ డియో శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. తిమ్మాపురానికి చెందిన కొప్పిశెట్టి రాజేష్ అదే ప్రాంతానికి చెందిన జియ్యన శ్రీమన్నారాయణ స్నేహితులు. వారి మధ్య కక్షలు ఉండడంతో శ్రీమన్నారాయణపై రాజేష్ రాయితో దాడి చేశాడు. దీనిపై తిమ్మాపురం పోలీసులు 2022లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో రాజేష్పై నేరం రుజువు కావడంతో 9 నెలల జైలు, రూ.మూడు వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
చిన్నారి ప్రాణాలు కాపాడిన జీజీహెచ్ వైద్యులు
కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్ వైద్యులు ఒక పసివాడి ప్రాణాలు కాపాడారు. ఆ వివరాల్లోకి వెళితే.. పండా విజయదుర్గ అనే మహిళ మూడు రోజుల నుంచి జీజీహెచ్లోని న్యూరో మెడిసిన్ విభాగంలో ఫిట్స్తో చికిత్స పొందుతుంది. ఆమెకు ఎనిమిది నెలల కుమారుడు. ఆస్పత్రిలో తల్లితో పాటు ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం ఆ చిన్నారి ఆడుకుంటూ అక్కడే ఉన్న మెంథోప్లస్ బామ్ డబ్బా ప్రమాదవశాత్తూ మింగేశాడు. డబ్బా బయటకు రాక ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయం గుర్తించిన తల్లి విజయదుర్గ తోటి రోగుల సహాయంతో బాలుడిని కింద అంతస్తులోని అత్యవసర విభాగంలో చేర్చింది. అప్పటికే బాలుడి నోటి నుంచి రక్తం కారడం మొదలైంది. తక్షణమే స్పందించిన క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుష్మ, సహ వైద్యులు సత్యవాణి, మాణిక్యం, కాంతిమ సహకారంతో అరగంట పాటు శ్రమించి బాలుడి గొంతు నుంచి మెంథోప్లస్ బామ్ డబ్బాను బయటకు తీసి ప్రాణాలు నిలిపారు. వైద్యుల కృషిని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి అభినందించడంతో పాటు బాలుడి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
30న రత్నగిరిపై ఉత్తర ద్వార దర్శనం
అన్నవరం: ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిలో ఉత్తర ద్వార దర్శనం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు అన్నవరం దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు శుక్రవారం తెలిపారు. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకు సత్యదేవుని ఆలయంలో ఉత్తర ద్వారం వద్ద శ్రీమహావిష్డువు, శ్రీమహాలక్ష్మి అలంకరణలో సత్యదేవుడు, అమ్మవార్లను కొలువుదీరుస్తారు. పండితులు వివిధ పూజలు నిర్వహిస్తారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులను ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిస్తారు. భక్తుల రద్దీని అనుసరించి సాయంత్రం 5 గంటల వరకూ ఈ దర్శనం కొనసాగుతుంది. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అమ్మవారిని వెండి రథంపై ఊరేగిస్తారు. రాత్రి 7 గంటల నుంచి కొండ దిగువన గరుడ వాహనంపై స్వామి, అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహిస్తామని ఈఓ తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవస్థానంలో చేస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం ఏర్పాటు చేసే క్యూ లైన్లపై ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. స్వామివారి ప్రసాద విభాగాన్ని పరిశీలించారు. ప్రసాదం తయారీలో ఉపయోగిస్తున్న నెయ్యి, పంచదార, ఇతర దినుసులను పరిశీలించారు. అక్కడి సిబ్బంది సమస్యలపై ఆరా తీశారు. భక్తులు మెచ్చే విధంగా ప్రసాదం తయారు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ, ఏఈఓలు భాస్కర్, ఎలక్ట్రికల్ డీఈ సత్యనారాయణ, ప్రసాదం విభాగం సూపరింటెండెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తొలి తిరుపతిలో.. పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలంలో తొలి తిరుపతి గ్రామంలోని శృంగార వల్లభ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నెల 30న ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. స్వామివారికి 29న ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. మంగళవారం తెల్లవారుజామున 3.30 నుంచి 4.30 గంటల వరకూ మేలుకొలుపు హారతి, సుప్రభాత సేవ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం 4.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకూ భక్తులకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తామని చెప్పారు. భక్తులకు ఉచిత దర్శనం ఏర్పాట్లు చేస్తున్నామని ఈఓ శ్రీనివాసరావు, చైర్పర్సన్ మొయిల సంధ్య తెలిపారు. భక్తులకు ప్రసాద వితరణ ఉంటుందన్నారు. పోస్టాఫీసుల పనివేళల పెంపు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ డివిజన్లోని పోస్టాఫీసుల పని వేళలను పొడిగించినట్లు కాకినాడ పోస్టల్ సూపరింటెండెంట్ కె.కృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీఎస్పీ క్యాంపస్ ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ.. గాంధీ నగర్, జగన్నాయక్పూర్, పెద్దాపురం పోస్టాఫీసులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ.. జేఎన్టీయూకే తపాలా కార్యాలయం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకూ.. జగ్గంపేట పోస్టాఫీసు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకూ పని చేస్తాయని వివరించారు. -
రూ.150 నాణెం సేకరణ
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వందేమాతర గీతం రూపుదిద్దుకొని 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముంబై టంకసాల ద్వారా రూ.150 ప్రత్యేక స్మారక నాణెం విడుదల చేసింది. దీనిని కాకినాడకు చెందిన ప్రముఖ నాణేల సేకర్త మార్ని జానకిరామ చౌదరి సేకరించారు. 32 గ్రాముల బరువైన ఈ నాణేన్ని రాగి, నికెల్, జింక్ మిశ్రమ లోహాలతో తయారు చేశారు. దీనికి ఒకవైపు రూ.150 ముఖవిలువను, మరోవైపు తుపాకీ ఎక్కుపెట్టి బ్రిటిష్ సైనికుల అరాచకాలను నిరసిస్తూ భారతీయులు ఏకతాటిపై నిలిచి ‘వందేమాతరం’ అంటూ నినదిస్తున్న చారిత్రక దృశ్యాన్ని ముద్రించారు. భారత స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని, దేశభక్తిని చాటే ఇలాంటి అరుదైన నాణెం సేకరించటం గర్వంగా ఉందని జానకిరామ చౌదరి శుక్రవారం విలేకర్లకు తెలిపారు. చంద్రబాబుది ట్రబుల్ ఇంజిన్ సర్కార్ కాకినాడ రూరల్: చంద్రబాబుది డబుల్ ఇంజిన్ సర్కారు కాదని, ట్రబుల్ ఇంజిన్ సర్కార్ అని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. శుక్రవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర సంపదను కొందరికి దోచి పెట్టడానికే చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోందని దుయ్యబట్టారు. గడచిన 8 నెలల్లో రాష్ట్ర ఆర్థిక లోటు 163 శాతానికి చేరిందంటూ కాగ్ నివేదిక ఇవ్వడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ శాతం కొంత మంది కాంట్రాక్టర్లకు దోచి పెట్టడమే ప్రభుత్వ విధానంలా మారిందని దుయ్యబట్టారు. చేస్తున్న అప్పులు ఎక్కడికి పోతున్నాయో కూడా చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసేందుకు కంకణం కట్టుకోవడం దారుణమన్నారు. ఆయుష్ ఆస్పత్రిలో కీలకమైన అధ్యాయం మొదలైందని చెబుతున్న ప్రభుత్వం.. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సూచనల మేరకు ముఖ్యమంత్రి, మంత్రులు అక్కడ చికిత్స చేయించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరుగుతోందంటూ కాగ్ పదేపదే చెబుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికై నా కుప్పలు తెప్పలుగా అప్పులు చేయడం మానుకుని, ఆదాయం పెంపుపై దృష్టి సారించాలని నాగమణి హితవు పలికారు. ‘కేవల మర్త్యుడె ధర్మసుతుడు?’ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్) ధర్మరాజును కేవలం మానవమాత్రుడేనని అనుకోరాదని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో కొనసాగిస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా కీచక వధ వృత్తాంతాన్ని శుక్రవారం ఆయన వివరించారు. ‘‘నిండు సభలో కామరోగ పీడితుడైన కీచకుడు.. ద్రౌపదిని కాలితో తన్ని అవమానిస్తాడు. ఆ రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో భీముని వద్దకు వెళ్లి ద్రౌపది తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ‘యుధిష్టిరుని భర్తగా పొందిన సీ్త్ర.. శోకం లేనిదెలా అవుతుంది? – అశోచ్యత్వం కుతస్తస్యాః యస్యా భర్తా యుధిష్ఠిరః’ అని తీవ్ర దుఃఖంతో అంటుంది. భీముడు సాంత్వనవచనాలతో ఆమెను ఓదార్చి, కీచకుడిని నర్తనశాలకు రాత్రి వేళ రావాల్సిందిగా ఆహ్వానించాలని, వాడిని అక్కడే గుట్టుగా మట్టు పెడతానని చెబుతాడు. ద్రౌపది తన తొందరపాటును నిందించుకుంటూ, ఆవేశంలో, దుఃఖాన్ని తట్టుకోలేక, ధర్మరాజు గురించి పరుషమైన పదాలు పలికానని, ఆ మహానుభావుని దివ్యత్వం తనకు తెలుసునని అంటుంది. ‘ఎవని చరిత్రము ఎల్ల లోకాలకు గురుస్థానంలో నిలచి పూజనీయమవుతుందో, ఎవని కడగంటి చూపు మానిత సంపదలు కలగచేస్తుందో, అట్టి మహానుభావుడు ధర్మరాజును కేవలం మానవమాత్రుడని అనుకోరాదు. కేవల మర్త్యుడె ధర్మసుతుడు?’ అని తన అంతరంగాన్ని వెల్లడిస్తుంది. చక్కగా అలంకరించుకుని నర్తనశాలకు వచ్చిన కీచకుడిని భీముడు గుట్టుగా మట్టు పెడతాడు. అతడి పార్థివ శరీరంతో పాటు ద్రౌపదిని దహనం చేయాలనుకున్న ఉపకీచకులు 105 మందిని భీముడు వధిస్తాడు. హస్తినలో వేగుల ద్వారా కీచకుని మరణ వార్త విన్న దుర్యోధనుడు ఈ పని చేసింది భీముడేనని, కీచకుడు మనసు పడ్డ సైరంధ్రి ద్రౌపది అనే నిర్ణయానికి వస్తాడు. ధర్మరాజు ఉన్న రాజ్యం సుఖశాంతులతో ఉంటుందని భీష్ముడు చెబుతాడు’’ అంటూ సామవేదం వివరించారు. అప్పటికే పాండవుల అజ్ఞాతవాస గడువు పూర్తయిందని అన్నారు. -
● మంచి మార్కులకు దోహదం
దస్తూరి అందంగా ఉంటేనే మంచి మార్కులు వస్తాయి. ప్రజెంటేషన్ బాగా చేయడానికి దస్తూరి ఒక కారణంగా చెప్పవచ్చు. ఏకాగ్రతతో 10 రోజులు సాధన చేస్తే కచ్చితంగా అద్భుతమైన చేతిరాతను సొంతం చేసుకోవచ్చు. వేల మందికి చేతిరాతను తీర్చిదిద్దడంలో తర్ఫీదునిచ్చాను. –కుంచే బాలకృష్ణ, కాలిగ్రాఫర్, స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ), జెడ్పీహెచ్ఎస్, తొండవరం ● మెళకువలు నేర్చుకోవాలి చేతిరాతను అందంగా తీర్చిదిద్దుకోవాలంటే కొన్ని మెళకువలు తప్పనిసరిగా పాటించాలి. పెన్ను పట్టుకునే విధానం కూడా చేతిరాతను మారుస్తుంది. ప్రతి రోజూ కొంత సమయాన్ని చేతిరాతను తీర్చిదిద్దుకునేందుకు కేటాయించాలి. చేతిరాత బాగుంటే తలరాత కూడా మారుతుంది. –టి.గణేశ్వరరావు, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవర్, స్కూల్ అసిస్టెంట్ (హిందీ), కాండ్రకోట, పెద్దాపురం మండలం ● తప్పుల్లేకుండా రాయాలి అందమైన అక్షరాలతో మంచి మార్కులను సంపాదించవచ్చు. చేతిరాత మెరుగుపర్చేందుకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. సమాధానాలు దిద్దేవారికి సులభంగా అర్థమైనప్పుడే మంచి మార్కులకు అవకాశం ఉంటుంది. తక్కువ రాసినా తప్పుల్లేకుండా అందంగా రాయడం వల్ల మంచి మార్కులు సాధించవచ్చు. –సీహెచ్ జాన్ప్రసాద్, జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం, ప్రత్తిపాడు -
100
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025రో జు లగందరగోళం● టెన్త్ ప్రత్యేక తరగతులపై ‘పరాయి’ పెత్తనం ● ఇతర శాఖలకు పర్యవేక్షణ బాధ్యతలు ● ఇది టీచర్లను అవమానించడమేనంటున్న ఉపాధ్యాయ సంఘాలు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): మరో మూడు నెలల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కొద్ది రోజులుగా వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తోంది. దీని ద్వారా డిసెంబర్ మొదటి వారానికే మొత్తం సిలబస్ పూర్తి చేసి, వంద రోజుల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి, పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను ఉపాధ్యాయులు సన్నద్ధం చేయాల్సి ఉంది. ఆలోచన గొప్పగానే ఉన్నా.. అమలుకు వచ్చేసరికి ఈ ప్రణాళిక మొత్తం గందరగోళంగా మారింది. టీచర్లపై ‘బోధనేతర’ భారం జిల్లాలోని 476 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 29,637 మంది విద్యార్థులు ఈసారి పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరిలో 251 ప్రభుత్వ పాఠశాలల నుంచి 18,097 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు గాను ప్రభుత్వం వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోంది. దీనికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన ప్రణాళిక తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. వాస్తవానికి విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ఉపాధ్యాయులకు ప్రభుత్వం అనేక బోధనేతర పనులు అప్పగించింది. దీంతో, వారు సిలబస్ సకాలంలో పూర్తి చేసేందుకు అనేక ఇబ్బందులు పడ్డారు. మరోవైపు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఒక ఎత్తయితే.. మూల్యాంకనం, మార్కుల అప్లోడ్ చేయడంతోనే వారికి సమయం అయిపోతోంది. మరోవైపు రకరకాల యాప్లు.. వాటిల్లో సమాచారం అప్లోడ్ వంటి వాటితో వారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే పదో తరగతి విద్యార్థులకు డిసెంబర్ 6 నుంచి మార్చి 15వ తేదీ వరకూ వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని విద్యా శాఖ ఆదేశించింది. దీని అమలు పర్యవేక్షణను ఆ శాఖతో ఎటువంటి సంబంధమూ లేని అధికారులకు అప్పగించింది. ఈ ఇన్చార్జి అధికారుల కనుసన్నల్లోనే ఈ ప్రణాళిక మొత్తం అమలవుతుందని చెప్పింది. దీనిపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. తమ శాఖపై ఇతరులకు పెత్తనం అప్పగించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. వివిధ శాఖలు అధికారులు ఇలా.. వంద రోజుల ప్రణాళిక అమలుకు ఇన్చార్జ్లుగా రెవె న్యూ, పంచాయతీరాజ్, వైద్య – ఆరోగ్యం, ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్, వ్యవసాయం, ఇరిగేషన్, మున్సిపల్ కమిషనర్, వెటర్నరీ తదితర అధికారులను ప్రభుత్వం నియమించింది. వీరందరూ కలిసి ఆయా మండలాల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వెళ్లి, ఈ ప్రణాళిక అమలును పూర్తిగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్లిప్ టెస్టుల నిర్వహణ, మార్కుల నమోదు, ఉపాధ్యాయుల హాజరు, షైనింగ్, రైజింగ్ స్టార్లుగా టెన్త్ విద్యార్థులను విభజించి పాఠాలు బోధిస్తున్నారా లేదా తదితర అంశాలను ప్రతి రోజూ పరిశీలించాలి. శని ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో ఈ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారో లేదో చూడాల్సిన బాధ్యత కూడా వీరిపై ఉంటుంది. మావాళ్లుండగా వారితో పనేంటి? వాస్తవానికి ప్రతి మండలానికీ ఎంఈఓ–1, 2లతో పాటు జిల్లావ్యాప్తంగా డిప్యూటీ డీఈఓలు, ప్రతి పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు ఉన్నారు. విద్యా శాఖలోనే ఇంత మంది ఉండగా.. వేరే శాఖల వారిని ఇన్చార్జులుగా నియమించడం దేనికనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వీరికి పాఠశాల విద్య అమలు తీరుపై ఏవిధంగా అవగాహన ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం ఉపాధ్యాయులను అవమానించడమేనని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కరప మండలం వేళంగిలో వంద రోజుల ప్రణాళిక అమలును పరిశీలిస్తున్న డీఈఓ రమేష్ (ఫైల్) ఇతర శాఖల పెత్తనం తగదు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో విద్యా శాఖ నిర్ణయాలు విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయి. వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి ఆంక్షలు విధించడం అశాసీ్త్రయం. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో, నిబద్ధతతో పని చేస్తూంటే ఇతర శాఖల అధికారులను తనిఖీల పేరుతో నియమించడం తగదు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. – చింతాడ ప్రదీప్ కుమార్,పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ నిర్ణయం సరికాదు వంద రోజుల ప్రణాళిక ఏవిధంగా అమలవుతోందో పరిశీలించడానికి ఇతర శాఖల ఉద్యోగులను నియమించాలనే ప్రభుత్వ నిర్ణయం సరి కాదు. దీనివలన ఉపాధ్యాయుల ఆత్మాభిమానం దెబ్బ తింటోంది. ప్రణాళికను పక్కాగా అమలు చేసేందుకు జిల్లా విద్యా శాఖ అధికారి, ఉప విద్యా శాఖ అధికారులు, ఎంఈఓలు ఉన్నారు. – మోర్త శ్రీనివాస్, ఎస్టీయూ రాష్ట అదనపు ప్రధాన కార్యదర్శి విద్యార్థులు, ఉపాధ్యాయులపై ఒత్తిడి వంద రోజుల ప్రణాళికలో భాగంగా పండగ సెలవులు కూడా ఇవ్వకుండా విద్యార్థులు, ఉపాధ్యాయులపై ఒత్తిడి పెట్టడం సరైన విధానం కాదు. రోజూ పరీక్షలు నిర్వహించడం, మర్నాడు మార్కులు అప్ లోడ్ చేయాలని ఆదేశించడం, విద్యా శాఖపై అవగాహ న లేని వారిని పర్యవేక్షకులుగా నియమించడం సమంజసం కాదు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. – శేశెట్టి సత్యనారాయణ, అధ్యక్షుడు, ఎస్టీయూ, కాకినాడ -
కాకినాడలో బిగ్బాస్ విజేత సందడి
బోట్క్లబ్ (కాకినాడ): స్థానిక శ్యామ్ ఇనిస్టిట్యూట్లో బిగ్బాస్ సీజన్– 9 విజేత, భారతదేశ సైనికుడు కళ్యాణ్ పడాల సందడి చేశారు. ఆ సంస్థతో జ్ఞాపకాలను నెమర వేసుకుంటూ, తన ఎదుగుదలలో శ్యామ్ ఇనిస్టిట్యూట్ పాత్రను ఆయన కొనియాడారు. బిగ్బాస్ ట్రోఫీతో విచ్చేసిన కళ్యాణ్ పడాలకు ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ శ్యామ్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కళ్యాణ్ మాట్లాడుతూ ఈ ఇనిస్టిట్యూట్ విద్యార్థిగా నేర్చుకున్న క్రమశిక్షణ, పట్టుదలే తనను ఈ స్థాయిలో నిలబెట్టాయన్నారు. బిగ్బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ నేర్చుకున్న పాఠాలు ధైర్యాన్ని ఇచ్చాయని భావోద్వేగంతో వివరించారు. శ్యామ్ ఇనిస్టిట్యూట్ అధినేత గుంటూరు శ్యామ్ మాట్లాడుతూ ఇనిస్టిట్యూట్ విద్యార్థిగా కళ్యాణ్ ఎంతో అంకితభావంతో ఉండేవారన్నారు. అనంతరం కళ్యాణ్ను సత్కరించారు. పోటీ పరీక్షలకు కేరాఫ్ అడ్రస్గా.. పోటీ పరీక్షలకు శ్యామ్ ఇనిస్టిట్యూట్ కేరాఫ్ అడ్రస్గా నిలిచిందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. స్థానిక శ్యామ్ ఇనిస్టిట్యూట్ ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫిజికల్ ఈవెంట్ గ్రౌండ్ను ఎంపీతో పాటు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని రకాల పోటీ పరీక్షల్లో శ్యామ్ ఇనిస్టిట్యూట్ అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. అడిషనల్ ఎస్పీ ఎ.శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న శ్యామ్ ఇనిస్టిట్యూట్ అధినేత శ్యామ్ను అభినందనీయులన్నారు. కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రాతనాల్లా మార్చుకుందామా..
ఫ మంచి దస్తూరితో భవితకు బాట ఫ పదో తరగతిలో మంచి మార్కులకు దోహదం ఫ విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులు రాయవరం/ ప్రత్తిపాడు: మా అబ్బాయి చాలా బాగా చదువుతాడు.. కానీ అందుకు తగ్గట్టుగా మార్కులు రావడం లేదు.. మా అమ్మాయి లెక్కలు బాగా చేస్తోంది. సూత్రాలు, ఫార్ములాలు మాత్రం ఎందుకో తప్పుగా కనిపిస్తుంటాయని ఉపాధ్యాయులు తరచూ చెప్పే మాటలివి.. ఇందుకు కారణం చేతిరాతే. ‘రాత బాగుంటే గీత బాగుంటుంది’ అన్న నానుడి పరీక్ష రాసే విద్యార్థికి ‘అక్షరాలా’ సరిపోతుంది. మంచి దస్తూరి ఉంటే మూల్యాంకనం సమయంలో సమాధాన పత్రాలు దిద్దే ఉపాధ్యాయుడికి మంచి భావన కలుగుతుంది. ఆ ప్రభావం మార్కులపై ఉంటుంది. అందుకే పరీక్షల్లో తెలివితో పాటు అక్షరాలు కూడా ఆయుధాలుగా పనిచేస్తాయని ఉపాధ్యాయులు చెబుతారు. ఇవి పాటిస్తే మంచిది ఫ పేజీ పైభాగంలో ఒక అంగుళం, ఎడమ వైపు అంగుళం మార్జిన్ విడిచి పెట్టాలి. ఫ సమాధాన పత్రంలో రాసే జవాబు సూటిగా ఉండటంతో పాటు అక్షరాలు పొందికగా రాయాలి. ఫ అక్షరాలు వంకర టింకరగా, గజిబిజిగా ఉంటే మార్కులు తగ్గినట్టే. ఫ పేజీకి 16 నుంచి 20 లైన్లకు మించకుండా రాయాలి. ఫ సమాధానాలు రాసే సమయంలో ప్యాడ్పైకి వాలిపోకుండా సాధ్యమైనంత వరకూ కూర్చుని రాయాలి. ఫ రెండు పదాల మధ్య ఒక అక్షరం లేదా ‘0’ పట్టేంత ఖాళీ స్థలం ఉండాలి. రెండు వరుసల మధ్య అర అంగుళం దూరం వదలాలి. ఫ కంటికి పేపరుకు 30–35 సెంటీమీటర్ల దూరం ఉండాలి. ఫ అక్షరాలన్నీ ఒకే సైజులో, ఒకే లైనులో ఉంటేనే రాత అందంగా వస్తుంది. ముందుగా ఫోర్ రూల్, తర్వాత డబుల్ రూల్, అనంతరం సింగిల్ రూల్పై ప్రాక్టీస్ చేయాలి. ఫ ఇంగ్లిష్లో కర్సివ్, లుసిడా రైటింగ్ను ప్రాక్టీస్ చేయాలి. వరుస క్రమంలో కనీసం పది రోజులు తర్ఫీదు తీసుకోవాలి. ఫ మొదటగా లెటరింగ్, తర్వాత వర్డింగ్, అనంతరం సెంటెన్సెస్ రాయడం నేర్చుకోవాలి. ఫ గొలుసుకట్టు రాత ఉండకూడదు. ప్రతి అక్షరం ఒకే పరిమాణంలో రాయాలి. ఫ పెన్నును మామూలుగా పట్టుకోవాలి. బిగుసుగా పట్టుకుంటే వేగంగా రాయలేం. అక్షరాల స్పష్టతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఫ ప్రాథమిక స్థాయి నుంచే మంచి రాత అలవాటు చేసుకోవాలి. తెల్ల కాగితంపై వరుస తప్పకుండా రాయగలగాలి. సాధనతోనే సాధ్యంప్రతి విద్యార్థికి తెలివి తేటలకు తోడు, సమయ పాలనకు, సహనానికి దస్తూరి ఓ సూచికగా చెప్పవచ్చు. అందుకే మంచి దస్తూరి ఉన్న విద్యార్థులే దాదాపు టాపర్లుగా నిలుస్తున్నారు. మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి దిద్దుబాట్లు, కొట్టివేతలు లేకుండా రెండున్నర గంటల్లో స్పష్టంగా పరీక్ష రాయాలి. అందుకే ఇప్పుడు అందరి దృష్టి చేతిరాతపై పడింది. ఇందుకు తగిన తర్ఫీదును ఉపాధ్యాయులు ఇస్తూ సాధన చేయిస్తున్నారు. పరీక్ష నెమ్మదిగా రాస్తే సమయం సరిపోదు. వేగంగా రాసేటప్పుడు తప్పులు దొర్లకుండా చూసుకోవాలి.ఇలా చేయాలంటే ముందుగా ప్రత్యేక తరగతులు, స్లిప్, గ్రాండ్ టెస్టులు సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ముత్యాల్లాంటి అక్షరాలు మంచి మార్కులు తెచ్చిపెడతాయి.. విద్యార్థి భవితకు బాటలు వేస్తాయి.. సమయాన్ని వృథా చేయకుండా ప్రణాళిక ప్రకారం అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధించడంతో పాటు, మంచి దస్తూరితో అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.. మనం ఏం రాశామన్నది పేపర్లు మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులకు అర్థం అయ్యేట్టు ఉంటేనే ఎక్కువ మార్కులు వస్తాయి.. దీనికోసం మంచి దస్తూరిపై ఇప్పటి నుంచే దృష్టి సారిస్తే పదో తరగతి పరీక్షల్లో ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు. -
రత్నగిరిపై రద్దీ
అన్నవరం: రత్నగిరికి శుక్రవారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. దీంతో, ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని సుమారు 30 వేల మంది దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. సత్యదేవుని వ్రతాలు 2,100 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. -
ఇదేం యాపారం సామీ..!
● రత్నగిరిపై షాపులో రకరకాల వస్తువుల విక్రయాలు ● టాయిలెట్లకు వాడే ఫినాయిల్, కాళ్ల పగుళ్లకు తైలం కూడా అమ్మకం ● ‘దేవుని నిర్మాల్యాలతో తయారీ’ పేరిట ఎర ● భక్తుల నమ్మకంతో వ్యాపారం ● అలా చేయడం సరైనదో కాదో పరిశీలించకుండానే అనుమతులు అన్నవరం: గో ఆధారిత ఉత్పత్తులు.. సత్యదేవుని నిర్మాల్యంతో (పూజలు, వ్రతాల్లో ఉపయోగించిన పూలు, పత్రి) తయారు చేసిన ఉత్పత్తులు.. అంటూ భక్తుల నమ్మకంతో రత్నగిరిపై జరుగుతున్న వ్యాపారం చూస్తూంటే ఆశ్చర్యం కలగకమానదు. ప్రజల్లో నానాటికీ పెరుగుతున్న భక్తి.. గో ఆరాధన.. పూజలు, వ్రతాల్లో ఉపయోగించిన పూలు, పత్రికి ఉన్న పవిత్ర భావన.. కొత్త కొత్త ఆలోచనలకు, వ్యాపారాలకు ఊతమిస్తున్నాయి. దీనిని అవకాశంగా తీసుకుంటున్న కొంత మంది.. గోమయంతో తయారు చేసిన విభూది, దేవుని నిర్మాల్యంతో తయారు చేసిన అగరువత్తులు, ప్రమిదల వంటి అనేక వస్తువులను వివిధ దేవస్థానాల్లో ఇబ్బడిముబ్బడిగా విక్రయిస్తున్నారు. లాభమే పరమావధిగా భక్తులను దోపిడీ చేస్తున్నారు. రత్నగిరిపై బీజం పడిందిలా.. మూడు నెలల క్రితం ఓ వ్యాపారి అన్నవరం దేవస్థానం అధికారులను కలిసి గో ఆధారిత ఉత్పత్తులు, దేవుని నిర్మాల్యంతో తయారు చేసే వివిధ వస్తువుల విక్రయానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. ఇతర దేవస్థానాల్లో కూడా తాను ఇదే విధంగా దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పాడు. ఇదే అదునుగా అన్నవరం దేవస్థానంలోని కొంత మంది ఉద్యోగులు ఆ వ్యాపారితో కుమ్మక్కయ్యారు. తమదైన శైలిలో చక్రం తిప్పి.. ఆ వ్యాపారి ప్రతిపాదనను దేవదాయ శాఖ కమిషనర్కు పంపించారు. దేవస్థానంలో పూజల్లో ఉపయోగించిన పూలు, పత్రి, బియ్యం, వక్కలను కేజీల లెక్కన కొనుగోలు చేస్తామని, వాటినే తిరిగి ఈ ఉత్పత్తుల తయారీకి వాడతామని ఆ వ్యాపారి చెప్పినట్లు ఆ ప్రతిపాదనలో పేర్కొన్నారు. దీంతో, ఈ ఉత్పత్తుల విక్రయాలకు వేలం నిర్వహించాలంటూ కమిషనర్ అనుమతి మంజూరు చేశారు. ఈ ఉత్పత్తుల విక్రయాల్లో ఏడాది అనుభవం ఉన్నవారే వేలంలో పాల్గొనాలంటూ టెండర్ షరతుల్లో పేర్కొన్నారు. ఫలితంగా స్థానిక వ్యాపారులెవరూ ఇందులో పాల్గొనలేదు. దీంతో, నెలకు కేవలం రూ.45 వేల అద్దెకే దేవస్థానంలోని తూర్పు, పశ్చిమ రాజగోపురాల వద్ద రెండు స్టాల్స్ ఏర్పాటుకు ఆ వ్యాపారి వేలం పాడుకున్నారు. చిన్న వ్యాపారానికీ రూ.లక్ష పైనే.. విచిత్రమేమిటంటే దేవస్థానంలో ప్రతి వ్యాపారానికి వేలం పాట ద్వారానే అనుమతి మంజూరు చేస్తారు. చిన్నపాటి వ్యాపారానికి కూడా అద్దె రూ.లక్షకు పైబడే ఉంటుంది. కొబ్బరి కాయలు అరటిపండ్లు తదితర పూజాద్రవ్యాలు, ఆవు నేతి దీపాల వంటి వ్యాపారాలకు ఏడాదికి సుమారు రూ.70 లక్షల నుంచి రూ.కోటి వరకూ వేలం పాట ఖరారవుతోంది. ఫ్యాన్సీ షాపులు, క్యాంటీన్ల వేలం ఏడాదికి రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఉంటోంది. చిన్నపాటి కాఫీ, టీ స్టాల్కు కూడా నెలకు రూ.50 వేలు పైనే ఉంటోంది. అటువంటిది స్వామివారి ఆలయానికి అతి తక్కువ దూరంలో ఈ రెండు స్టాల్స్ను కేవలం రూ.45 వేలకే ఏర్పాటు చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అపచారమో కాదో చూడకుండానే.. ఈ స్టాల్స్లో సంప్రదాయ కాటుక, సహజ కుంకుమ, పంచగవ్య సబ్బు, బిల్వ పత్రాలతో చేసిన సబ్బు, బిల్వ పత్రాలతో చేసిన షాంపూ, తులసి పౌడర్, తులసి సోప్, పంచతులసి డ్రాప్, బిల్వదళ పౌడర్, తులసి వాటర్, తులసి టీ, బిల్వ సోప్, తులసి నాజిల్ డ్రాప్స్, దశపత్రి కషాయం. నిర్మాల్య పత్రితో ఫినాయిల్, నిర్మాల్య పత్రితో ఫేస్ ప్యాక్, నిర్మాల్య పత్రితో కాళ్ల పగుళ్ల క్రీమ్, నిర్మాల్య పత్రితో మాయిశ్చరైజింగ్ క్రీమ్, నిర్మాల్య పత్రితో నొప్పి నివారణ తైలం, కామధేను హారతి, గోక్షీరాది తైలం, సహజ సున్నిపిండి విక్రయించడానికి అనుమతులిచ్చారు. వీటిల్లో దేవుని నిర్మాల్యంతో తయారు చేసిన ఫినాయిల్, ‘కాళ్ల పగుళ్లకు రాసుకునే తైలం’ కూడా ఉన్నాయి. దేవుని నిర్మాల్యంతో ఇటువంటి వస్తువుల తయారీయే తప్పని అనుకుంటే.. వీటి విక్రయాలకు సైతం గత ఈఓ వీర్ల సుబ్బారావు అనుమతివ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇటువంటి వస్తువులు విక్రయించడం సరైనదో కాదో పరిశీలించకుండానే అనుమతులిచ్చారా.. లేక ఎవరి ఒత్తిళ్లయినా ఉన్నాయా అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం ఆవరణలో చెప్పులతోనే నడవకూడదని మైకులో రోజుకు వందసార్లు చెబుతారు. దేవుని పూజలో వాడిన పత్రి, పుష్పాలు, ప్రసాదాలు కింద పడితే వాటిని కాళ్లతో తొక్కడాన్ని అపచారంగానే భక్తులు భావిస్తారు. చెప్పులతో తొక్కడం మరింత అపచారం. అటువంటిది ఈ స్టాల్స్లో నిర్మాల్యంతో తయారు చేసిన ఫినాయిల్, కాళ్ల పగుళ్ల క్రీమ్ వంటి వాటి విక్రయాలకు అనుమతి ఇవ్వడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఈ జాబితాల్లో పేర్కొన్న మిగిలిన ఉత్పత్తులు ఎక్కడ తయారు చేస్తున్నారు.. తయారీకి సత్యదేవుని నిర్మాల్యమే ఉపయోగిస్తున్నారా వంటి అంశాలను అధికారులెవ్వరూ పరిశీలించిన దాఖలాల్లేవు. ఈఓ ఆరా ఈ స్టాల్స్ అనుమతులను దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు శుక్రవారం పరిశీలించారు. ఈ ఉత్పత్తుల విక్రయాలకు గత ఈఓ అనుమతిచ్చిన విషయం ఈ సందర్భంగా తేటతెల్లమైంది. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా, దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉండే ఉత్పత్తులను ఇక్కడ విక్రయించరాదని ఈఓ ఆదేశించారు. దీనిపై కమిషనర్కు ఆయన నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం. ఆ ఫినాయిల్ బాటిల్స్ మాయం ‘సత్యదేవుని నిర్మాల్య పత్రితో తయారైన ఫినాయిల్’ అంటూ రత్నగిరిపై షాపులో సాగిస్తున్న అమ్మకాలపై ‘సత్యదేవుని సన్నిధిలో మహాపచారం’ శీర్షికన ‘సాక్షి’ శుక్రవారం ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఆ షాపులో ‘సత్యదేవుని నిర్యాల్య పత్రితో ఫినాయిల్’ అని స్టిక్కర్ అతికించి అమ్ముతున్న బాటిల్స్ను తీసేశారు. మిగిలిన ఉత్పత్తులను మాత్రం యథాతథంగా విక్రయిస్తున్నారు. -
సత్యదేవుని సన్నిధిలో మహాపచారం
● పూజలో వాడిన పూలతో ఫినాయిల్ తయారీ! ● అన్నవరం దేవస్థానంలో విక్రయాలు ● ఆవేదన చెందుతున్న భక్తులుఅన్నవరం: ‘సంపద సృష్టి’ంచే నేటి పాలకుల హయాంలో ప్రతిదీ వ్యాపార మయమైపోతోంది. దాదాపు అన్ని వ్యవస్థలూ ప్రతి అంశాన్నీ డబ్బుతోనే లెక్కిస్తున్న దురవస్థలో కూరుకుపోతున్నాయి. ఈ క్రమంలో దేవుని సన్నిధిలో అపచారం చేస్తున్నామనే ఆలోచన కూడా వదిలేసినట్లు కనిపిస్తోంది. సాధారణంగా పూజ పూర్తి చేసిన అనంతరం.. ఏ దేవుడు/దేవతను అర్చిస్తున్నారో వారి పేరు స్మరించుకుని, ‘... ప్రసాదం శిరసా గృహ్ణామి’ అని చెప్పుకొంటూ.. ఆ స్వామి/అమ్మవారిని అర్చించిన పూలను భక్తులు భక్తితో కళ్లకు అద్దుకుని, శిరస్సున పెట్టుకుంటారు. ఆ తరువాతో.. ఆ మర్నాడో పూజ చేసి పూలు, పత్రిని (నిర్మాల్యం) ఎవ్వరూ కాలితో తొక్కని చోట వేస్తారు. లేదా నదులు, చెరువుల్లో కలుపుతారు. కానీ, అన్నవరం దేవస్థానంలో మాత్రం దీనికి భిన్నంగా చేస్తున్నారు. ‘నిర్మాల్య పత్రితో’ అని రాసి మరీ.. సత్యదేవుని వ్రతాలు, ఇతర పూజల్లో ఉపయోగించిన పూలు, పత్రి, ఇతర నిర్మాల్యంతో వివిధ రకాల పొడులు, నూనెలు, అగరుబత్తీలు తయారు చేస్తున్నారు. వీటిని భక్తులకు విక్రయించేందుకు దుకాణాలు ఏర్పాటు చేశారు. వీటికి ప్రతి నెలా రూ.50 వేల అద్దె వసూలు చేస్తున్నారు. వీటిల్లో గోమయంతో తయారు విభూతి కూడా విక్రయిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, ఎవరి ఆలోచనో కానీ.. స్వామివారి నిర్మాల్యంతో ఏకంగా ఫినాయిల్ తయారు చేసేస్తున్నారు. పైగా ఆ బాటిల్పై భక్తవరదుడైన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఫొటోతో కూడిన లేబుల్ సైతం అతికించేశారు. దానిపై ‘అన్నవరం సత్యనారాయణ స్వామి వారి నిర్మాల్య పత్రితో ఫినాయిల్’ అని స్పష్టంగా రాసి ఉంది. ఈ ఫినాయిల్ లీటర్ బాటిల్ను రూ.100కు విక్రయిస్తున్నారు. ఈ దుకాణాన్ని బుధవారం ప్రారంభించారు. అయితే, ఫినాయిల్ బాటిల్పై స్వామివారి ఫొటో ఉన్న లేబుల్ అతికించడంపై కొంతమంది భక్తులు అభ్యంతరం చెప్పారు. దీంతో, ఆ ఫొటోపై ‘ద్వారకా తిరుమల’ అనే స్టిక్కర్ అతికించి విక్రయిస్తున్నారు. సాధారణంగా ఫినాయిల్ను టాయిలెట్స్ కడగడానికి ఉపయోగిస్తారు. అటువంటి ఫినాయిల్ను దేవుని నిర్మాల్యంతో తయారు చేయడమేమిటో.. దానిని విక్రయించడానికి అనుమతించడమేమిటో.. ఇదేమి అపచారమోనని భక్తులు ఆవేదన చెందుతున్నారు. గతంలోనూ అపచారాలు అన్నవరం దేవస్థానంలో అధికారులు మారినా అపచారాలు మాత్రం జరిగిపోతూనే ఉన్నాయి. ఈఓలతో సంబంధం లేకుండా కింది స్థాయి అధికారులు చేపడుతున్న చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. గత ఈఓ వీర్ల సుబ్బారావు హయాంలో రత్నగిరిపై రామాలయం పక్కన స్వామివారి వార్షిక కల్యాణ మండపం ఎదురుగా ఉన్న షెడ్డులో వివాహం కోసం పెద్ద కల్యాణ మండపం సెట్టింగ్ వేశారు. అదే రోజు వార్షిక కల్యాణ మండపంలో జరిగిన సూర్య నమస్కారాలను తిలకించడానికి ఈ సెట్టింగ్ అడ్డంగా ఉందంటూ అప్పట్లో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, గత మే నెలలో సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల సందర్భంగా వనదుర్గ అమ్మవారికి శుక్రవారం జరిగే చండీ హోమం, పౌర్ణమి నాడు జరిగే ప్రత్యంగిర హోమాలు చేయలేదు. అంతకు ముందెన్నడూ ఇలా జరగకపోవడంతో దీనిని అపచారమనే భక్తులు భావించారు. తాజాగా స్వామివారి నిర్మాల్యంతో తయారు చేసిన ఫినాయిల్ విక్రయించడం పెద్ద అపచారంగా చెప్పవచ్చు. అటువంటివి విక్రయించనీయం దేవస్థానంలోని పూజలు, వ్రతాల్లో వచ్చిన నిర్మాల్యం, పత్రితో తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి గతంలో ఈఓ అనుమతి ఇచ్చారు. ఆ షాపు బుధవారమే ప్రారంభించారు. అందులో ఏయే ఉత్పత్తులు విక్రయిస్తున్నారో ఇంకా పరిశీలించలేదు. భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా, దేవస్థానం పవిత్రతకు భంగం వాటిల్లేలా ఉండే వస్తువులను ఇక్కడ విక్రయించనీయం. ఆ షాపు అగ్రిమెంట్ను శుక్రవారం పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటాం. – వి.త్రినాథరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
న్యాయం కావాలి
● మహిళా పోలీస్ స్టేషన్ ఎదుటే వివాహిత ధర్నా ● ఏడాదిన్నర బిడ్డతో నిరసన ● వదిలి వెళ్లిపోయిన భర్త నిర్వాకంపై ఫిర్యాదు కాకినాడ క్రైం: తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ ఏడాదిన్నర బిడ్డతో కలసి కాకినాడ మహిళా పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలపడం సంచలనం రేపింది. వివరాలివీ.. స్థానిక జగన్నాథపురానికి చెందిన మల్లాడి సునీత(24)కు కోటిపల్లికి చెందిన కార్పెంటర్ సూర్యప్రకాష్తో వివాహమైంది. వారికి ఏడాదిన్నర వయసున్న బాబు ఉన్నాడు. అయితే, అదనపు కట్నం రూ.3 లక్షలు తేవాలంటూ భర్త తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ సునీత ఏడాదిన్నర క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాటి నుంచి నేటి వరకూ ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదని, తన భర్త నుంచి డబ్బులు తీసుకుని, రేపుమాపు, కౌన్సెలింగ్ అంటూ ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తున్నారని సునీత ఆరోపించింది. తన భర్త తరఫున రాజకీయ నాయకులు వత్తాసు పలుకుతున్నారని, పోలీసులు కేసు నమోదు చేయకుండా వారు అడ్డు పడుతున్నారని వాపోయింది. తాను తల్లిదండ్రులు లేని అనాథనని, ఏ ఆధారమూ లేక, తినేందుకై నా గత్యంతరం లేని స్థితిలో చంటి బిడ్డతో బతుకుతున్నానని చెప్పింది. డబ్బు కోసం పోలీసులు తన జీవితంతో ఆడుకుంటున్నారని కన్నీటి పర్యంతమైంది. కేసు నమోదు చేసి, తనకు న్యాయం చేయాలనే డిమాండుతో సునీత నిరాహార దీక్షకు దిగి, గురువారం ఉదయం నుంచీ స్టేషన్ బయటనే బైఠాయించింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది చెప్పారని, తాను వెళ్లకపోవడంతో వారు తనను బలవంతంగా స్టేషన్లోకి లాక్కెళ్లారని చెప్పింది. చంటిబిడ్డతో ఉన్న తనను తీవ్రంగా బెదిరించారని, తన ఫోన్ బలవంతంగా లాక్కున్నారని ఆరోపించింది. తనను లాక్కెళ్లే క్రమంలో బిడ్డకు దెబ్బలు తగులుతున్నా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారని, కనీసం తనను వాష్ రూముకు కూడా పంపకుండా చిత్రహింసలకు గురి చేశారని సునీత చెప్పింది. తాను, తన బిడ్డ ఉదయం నుంచీ ఆహారం ముట్టుకోలేదని, తన బిడ్డ నీరసించి తల వెనక్కి వాల్చేస్తే భయపడి గట్టిగా ఏడ్చానని, బాబు పరిస్థితి చూసిన పోలీసులు అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామంటూ హడావుడి చేశారని తెలిపింది. తాను అక్కడి నుంచి బలవంతంగా బయటపడి తన బిడ్డను ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లానని సునీత చెప్పింది. కాగా, గురువారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేసే సమయానికి సునీత తన బిడ్డతో స్టేషన్ నుంచి వెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు. -
నేత కార్మికులకిచ్చిన హామీలు అమలు చేయాలి
● రూ.170 కోట్ల బకాయిలు చెల్లించాలి ● ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ నేత డిమాండ్ పిఠాపురం: నేత కార్మికులకిచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పప్పు దుర్గా రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫెడరేషన్, చేనేత సహకార సంఘాల జేఏసీ ఆధ్వర్యాన పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆప్కో ద్వారా గత ఆరేళ్ల నుంచి కొన్ని చేనేత సహకార సంఘాలకు, 12 సంవత్సరాల నుంచి మరికొన్నింటికి రావాల్సిన సుమారు రూ.170 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో నిలిచిపోయిన త్రిఫ్ట్ ఫండ్, నూలు సబ్సిడీ, 30 శాతం రిబేటు బకాయిలను కూడా చెల్లించాలని కోరారు. చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాల కొనుగోలును కొనసాగించాలని, పావలా వడ్డీ రుణ పథకం వెంటనే ప్రారంభించాలని, చేనేతలకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.25 వేల నేతన్న భరోసా పథకాలను వెంటనే అమలు చేయాలని దుర్గా రమేష్ డిమాండ్ చేశారు. న్యాయపరమైన అడ్డంకులను తొలగించి, చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని వివిధ సంఘాల నాయకులు కోరారు. బోగస్ చేనేత సొసైటీలపై విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలన్నారు. సంక్రాంతిలోగా వంద శాతం బకాయిలను ఆప్కో చెల్లించకుంటే చేనేత సహకార సంఘాలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18 చేనేత కుల సంఘాలతో కలిపి రిలే నిరాహార దీక్షలు చేపడతామని, అవసరమైతే ఆమరణ దీక్ష నిర్వహించేలా కార్యాచరణ రూపొందించామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చేనేతలకు, ప్రభుత్వానికి మధ్య అడ్డంకిగా మారిన హ్యాండ్లూమ్ కమిషనర్, ఆప్కో ఎండీ రేఖారాణిని వేరే శాఖకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు, విలేకర్ల సమావేశంలో సీనియర్ చేనేత నాయకుడు కోమాకుల సత్యనారాయణ, చేనేత సహకార సంఘాల సీనియర్ నాయకుడు పడాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
కోఢీ.. రెడీ!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంక్రాంతి సంబరాలకు సమయం సమీపిస్తూండటంతో రూ.కోట్లు కొల్లగొట్టే కోడి పందేలకు నిర్వాహకులు ఇప్పటి నుంచే కాలు దువ్వుతున్నారు. బరుల కోసం ఇప్పటికే వెతుకులాట ప్రారంభించారు. ఎక్కడెక్కడ బరులు ఏర్పాటు చేయాలి, పందేల నిర్వహణకు సంబంధించి ఎవరెవరికి ఎంతెంత ముట్టచెప్పాలనే దానిపై అంచనాలు వేసుకోవడంలో తలమునకలవుతున్నారు. బేరసారాలకు తలుపులు బార్లా తెరిచారు. ప్రతి ఏడాది మాదిరిగానే కోడి పందేలు వేస్తే తోలు తీస్తామంటూ పోలీసులు భీకర హెచ్చరికలు చేస్తున్నా.. వాటిని నిర్వాహకులు షరా మామూలుగానే తేలికగా తీసుకుంటున్నారు. గత ఏడాది కంటే రెట్టింపు బరులు వేయాలనే పట్టుదలతో పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మూడు పుంజులు.. ఆరు పందేలు ఏటా సంక్రాంతి పండగ వస్తోందంటే చాలు.. జిల్లాలోని జగ్గంపేట, గోకవరం, గండేపల్లి, తుని రూరల్, తొండంగి, పిఠాపురం, గొల్లప్రోలు, కాకినాడ రూరల్, కరప మండలాల్లో కోడి పందేలు యమ జోరుగా సాగుతూంటాయి. కోడి పందేల ముసుగులో గుండాట, నంబర్ లాటరీలకు కూడా ఈ మండలాలు పెట్టింది పేరుగా నిలుస్తున్నాయి. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కాక కాకినాడ సిటీ, రూరల్ సహా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ గంజాయి, పేకాట, సింగిల్ నంబర్ లాటరీలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే సంక్రాంతి పండగ నాటికి కోడి పందేలు నిర్వహించి తీరుతామని ఇప్పటికే నిర్వాహకులు చాలెంజ్లు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో ‘మూడు పుంజులు.. ఆరు పందేలు’ అనే రీతిలో కోడిపందేలు నిర్వహించడం ఖాయమని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. పండగ పూట కోడికి కత్తి కట్టకుండా సరదాగా పందేలు వేసుకుంటే ఎటువంటి అభ్యంతరం ఉండదని, కత్తి కడితే మాత్రం పందేలను అడ్డుకుని తీరుతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఇప్పుడలానే అంటారని, పండగ దగ్గర చేసి ఈ మాటలేవీ చెల్లవని, ఏమైనా తేడా వస్తే తమ నాయకులే చూసుకుంటారని పందేల నిర్వాహకులు అంటున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులతో సైతం బేరసారాల్లో మునిగితేలుతున్నారు. రోజుకు రూ.30 లక్షల మేర.. జిల్లాలో ఈసారి ప్రధానంగా కాకినాడ రూరల్, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాలు కోడి పందేలకు కేరాఫ్గా నిలవనున్నాయి. ప్రతి బరిలో రోజుకు ఐదారు పెద్ద పందేలు, రెండు మూడు కొసరు పందేలు వేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో బరిలో రోజుకు తక్కువలో తక్కువ రూ.30 లక్షల విలువైన కోడి పందేలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీనికి ఎంత ఖర్చవుతుంది, ఎంత మిగులుతుందనే లెక్కలేస్తున్నారు. కాకినాడ రూరల్, కరప మండలాల్లో ఈసారి జనసేన గ్రామ స్థాయి నేతలు గ్రామాల వారీగా బరులు వేసే ఏర్పాట్లలో ఉన్నారు. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ మండలంలో విచ్చలవిడిగా జరిగిన పందేల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. ఈసారి కూడా ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ లేకుండా పార్టీ నియోజకవర్గ ముఖ్య నేత మాట తీసుకుని మరీ నిర్వాహకులు ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులతో ద్వితీయ శ్రేణి నేతలు ముందస్తు మంతనాలు సాగిస్తున్నారు. జరిగే పందేలను బట్టి బరులకు రేట్లు నిర్ధారించాలనే నిర్ణయానికి వచ్చారు. ముఖ్య నేతల కనుసన్నల్లో.. నిర్వాహకులు మారుతున్నారే తప్ప పందేలు మాత్రం ఎప్పటి మాదిరిగానే జరిపే ఏర్పాట్లలో ఉన్నారు. ఉదాహరణకు మండల కేంద్రమైన కరప, గురజనాపల్లి, గొర్రిపూడి, కొంగోడు, విజయరాయుడుపాలెం, వేళంగి, వేములవాడ గ్రామాల్లో గత ఏడాది వేసిన భారీ బరుల్లో రూ.లక్షలు చేతులు మారాయి. ఈసారి సంక్రాంతికి వేళంగి, గురజనాపల్లి మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ పందేలకు బరిలు సిద్ధమవుతున్నాయి. గత ఏడాది గురజనాపల్లిలో నష్టం వచ్చిందనే కారణంతో ఈసారి నిర్వహించేందుకు వెనకడుగు వేశారని అంటున్నారు. కరపలో మాత్రం ఈసారి రెండు బరులు వేసేందుకు సిద్ధపడుతున్నారు. ఒక్కో బరిలో గుండాట నిర్వాహకులు రూ.40 లక్షలకు తక్కువ కాకుండా ముట్టజెప్పేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారని చెబుతున్నారు. ఇక్కడ జనసేనలో రెండు వర్గాలు రెండు బరులకు ఏర్పాట్లు చేస్తున్నాయి. కరప – పెనుగుదురు మధ్య ఒక ప్రైవేట్ లే అవుట్లో బరి ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. కాకినాడ రూరల్ తిమ్మాపురం, సర్పవరం ప్రాంతాల్లో సైతం భారీ బరుల ఏర్పాటుకు బేరసారాలు కుదిరాయి. ఒక్కో బరికి రూ.30 లక్షల మేర ఒప్పందానికి వచ్చారని అంటున్నారు. అలాగే, తూరంగి, వాకలపూడి, వలసపాకలు, గొడారిగుంటల్లో ద్వితీయ శ్రేణి బరులు ఏర్పాటు చేసే పనిలో నిర్వాహకులున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ముఖ్య నేతల కనుసన్నల్లోనే బేరసారాలు సాగుతూండటం విశేషం. పందేలకు పుంజులను సిద్ధం చేస్తున్న నిర్వాహకులు (ఫైల్)బరిలో తలపడుతున్న పందెం పుంజులు (ఫైల్) కాలు దువ్వుతున్న పందెం కోడి పందెం బరులకు ముఖ్య నేతల కనుసన్నల్లో ఒప్పందాలు జోరుగా బేరసారాలు బరుల వేటలో పందెంరాయుళ్లు ఆ మూడు నియోజకవర్గాలే కీలకం -
బాధితుడికి ఆర్థిక సాయం
కాకినాడ క్రైం: ‘నీ చేయి పని చేయదు.. పెన్షన్ రాద్దాంలే’ శీర్షికన ‘సాక్షి’ ఈ నెల 16న ప్రచురించిన కథనానికి స్పందన వచ్చింది. పెదపూడి మండలం కైకవోలు గ్రామానికి చెందిన 42 ఏళ్ల పెరుగుల వెంకట రమణ ఈ ఏడాది మార్చి 18న ద్విచక్ర వాహనం స్టాండ్ వేస్తూ పడిపోయాడు. ఈ ఘటనలో అతడి కుడి చేతికి గాయమైంది. కాకినా డ జీజీహెచ్ వైద్యులు అతడికి తొలుత కట్టు కట్టి, డిశ్చార్జి చేశారు. ఏప్రిల్ 7న శస్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచీ వెంకట రమణ కుడి చేయి మెల్లగా అచేతనంగా మారుతూ కదల్లేని స్థితికి చేరింది. సర్జరీ సమయంలో జీజీహెచ్ వైద్యులు మోచేతిలో బాల్ వంటి నిర్మాణం తీసేశారని ఓ ప్రైవేటు వైద్యుడు చెప్పడంతో తనకు జరిగిన అన్యాయంపై వెంకట రమణ ఈ నెల 8న జీజీహెచ్ సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేశారు. అనంతరం అక్కడి ఆర్థోపెడిక్ వైద్యుడు శివానందం కూడా సర్జరీలో తేడా జరిగిందని, చేయి రాదని, కావాలంటే పెన్షన్ పెడదామని అన్నారు. దీనిపై బాధితుడు కలెక్టరేట్ గ్రీవెన్స్లో నేరుగా కలెక్టర్కు తన సమస్యను నివేదించాడు. దీనిపై ఈ నెల 16న ‘సాక్షి’ దినపత్రిక కథనం ప్రచురించింది. దీని ద్వారా వెంకట రమణ కష్టం తెలుసుకుని విశ్రాంత డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ వి.శ్రీనివాసరావు చలించిపోయారు. అతడికి సామాజికవేత్త, కరప మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు సాయంతో రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. కష్ట కాలంలో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. హిందువులు మౌనం వీడాలి ● ఇస్కాన్ దక్షిణ భారత డివిజినల్ కౌన్సిల్ పూర్వ చైర్మన్ సత్యగోపీనాథ్ దాస్ ● భగవద్గీతను అర్థం చేసుకోవాలని పిలుపు ఆలమూరు: హిందువులందరూ మౌనం వీడి సంఘటితం కావాల్సిన సమయం వచ్చిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఇస్కాన్ దక్షిణ భారతదేశ డివిజినల్ కౌన్సిల్ పూర్వపు చైర్మన్ పరవస్తు సత్యగోపీనాథ్ దాస్ ప్రభూజీ అన్నారు. మండలంలోని చెముడులంక రామాలయం వద్ద గురువారం జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజకీయ నాయకుల నుంచి ప్రతి ఒక్కరికీ హిందువులంటే అలుసుగా మారిందన్నారు. అవమానాలు చేసినా నోరు తెరవరని ఇతరులకు ధీమా ఏర్పడినందువల్లే తరచూ హిందూమతంపై దాడి జరుగుతోందన్నారు. హిందూ ధర్మాన్ని అవమానించిన వారికి హిందువులు ఓట్లు వేయడం సిగ్గు చేటన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశంలో అనేక ప్రాంతాల్లో హిందువులపై ఎన్ని దౌర్జన్యాలు జరుగుతున్నా ఒక్క హిందువు కూడా రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపిన దాఖలాలు లేవన్నారు. ఇప్పటికైనా అందరూ సంఘటితమై జై శ్రీరామ్ అంటూ రోడ్ల మీదకు రావాలన్నారు. ధర్మాన్ని ఆచరించడం, భావితరాలకు అందించడం ద్వారా మాత్రమే హిందూ ధర్మ రక్షణ సాధ్యమవుతుందన్నారు. శ్రీమద్రామాయణం బాటలో మనం నడిచినంత కాలం సంస్కృతీ సంప్రదాయాలు, కుటుంబ, మానవ సంబంధాలు ఉన్నతంగా వెలుగొందాయని చెప్పారు. పాశ్చాత్య సంస్కతిని అనుసరించడం మొదలుపెట్టాక సంఘంలోనే కాదు, కుటుంబాల్లో సైతం ఐక్యత దెబ్బ తిందన్నారు. గతంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలు నిర్వహిస్తే నెల్లూరుకు చెందిన ముస్లిం యువకునికి మొదటి బహుమతి వచ్చిందన్నారు. తాను పోటీల కోసమే భగవద్గీత చదివానని అయితే భగవద్గీత మొత్తం చదివాక మొత్తం 700 శ్లోకాలలో ఎక్కడా మతం అన్న పదం లేదని, ఇది సర్వమానవాళికి ఉపయోగపడే సందేశంగా తెలుసుకున్నానని, మానవులు అందరూ భగవద్గీత చదవడం మొదలుపెడితే అశాంతి, కొట్లాటలు ఉండవని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హిందూ ధర్మం గొప్పతనం తెలుసుకోలేక కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా నేడు ప్రవర్తిస్తున్నామని సత్యగోపీనాథ్ దాస్ ప్రభూజీ అన్నారు. ఆర్ఎస్ఎస్ గోదావరి జిల్లా సహకార్యవాహ్ గెడ్డం రాంబాబు, వీహెచ్పీ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి దూలం వెంకట గనిరాజు పాల్గొన్నారు. -
ఐక్యత లేకనే హిందూ మతంపై దాడులు
● రాధామనోహర్ దాస్ ● వాకలపూడిలో హిందూ సమ్మేళనం కాకినాడ రూరల్: హిందువుల్లో ఐక్యత లేకనే హిందూ మతంపై దాడులు జరుగుతున్నాయని ఆధ్యాత్మికవేత్త రాధామనోహర్ దాస్ అన్నారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా వాకలపూడిలో గురువారం ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచంలోని అన్ని మతాల కన్నా హిందూ మతం చాలా గొప్పదని అన్నారు. దేశంలోని వారు మతం మారినంత మాత్రాన మానవత్వం మరచిపోరాదని కోరారు. భారతదేశానికి జన్మించిన పాకిస్థాన్, బంగ్లాదేశ్లు నేడు హిందూ మతానికి వ్యతిరేకంగా యుద్ధాలు చేస్తున్నాయని, వారి పీచం అణచివేయాలని పిలుపునిచ్చారు. హిందూ సంస్కృతీ సంప్రదాయాలను నాశనం చేయాలని చూస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వెయ్యి సంవత్సరాలుగా హిందూ మతంపై అనేక దాడులు జరిగాయని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు దంగేటి సత్యనారాయణ, సాధుల శేషపాన్పు, బిందుశ్రీ తదితరులు కూడా ప్రసంగించారు. తొలుత సాంస్కృతిక కార్యక్రమాలు, వేద మంత్ర పఠనం నిర్వహించారు. కార్యక్రమంలో కాకినాడ హిందూ సమ్మేళన నిర్వహణ సమితి నాయకులు సుబ్రహ్మణ్యం, రామరాజు, అప్పాజీ తదితరులతో పాటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
నాన్న ఆదేశాలతో దీక్ష స్వీకరించా
నాపేరు అన్యం రాంబాబు. మాది కోనసీమ జిల్లా కె.గంగవరం మండలంలోని అముజూరు గ్రామం. నేను డిగ్రీ వరకూ చదువుకున్నాను. ప్రస్తుతం బట్టల వ్యాపారం చేస్తున్నాను. మా ముత్తాత, మాతాత, మానాన్న ఈ దీక్ష స్వీకరించి కొన్ని గ్రామాల్లో సంచరించారు. మా నాన్నకు మోకాళ్ల గుజ్జు అరిగిపోయి ఆరోగ్యం క్షీణించింది. అందుకే వారసత్వం, సాంప్రదాయం కాపాడటానికి ఆయన ఆదేశాలతో ఈ దీక్షను స్వీకరించి నేను మోటారు సైకిల్పై కొనసాగిస్తున్నాను. మా ఈ ఆచారంలో చాలా ఉన్నతమైన ఉద్యోగం చేసుకునే వారు సైతం వారి అవకాశాన్ని బట్టి కనీసం రెండు రోజులైనా ఈ దీక్షను స్వీకరిస్తారు. రేపటి తరంలో నా కుమారుడు సైతం ఏ హోదాలో ఉన్న మా పూర్వీకులు తిరిగిన ప్రాంతాల్లో ఈ దీక్షను ఆచరించాలి. నేను కార్తికమాసంలో దీక్షను తీసుకున్నాను. సుబ్రహ్మణ్య షష్టికి దీక్షను విరమిస్తాను. -
పాటల పల్లకిలో లెక్కల పాఠాలు
● వినూత్న బోధనతో ఆకట్టుకుంటున్న మా‘స్టార్’ ● రాగాలాపనతో చిక్కుముడులకు విడుపులు ● వి.సావరంలో నాగేశ్వరరావు ప్రతిభ రాయవరం: విద్యార్థికి అర్థమయ్యేలా బోధించడమే గురువు పరమ కర్తవ్యం. అందుకు ఒక్కొక్కరిది ఒక్కో శైలి. రాయవరం మండలం వి.సావరం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు పి.నాగేశ్వరరావు శైలి విభిన్నం. పాటతో గణితంలో పీటముడులు విప్పించడం ఆయన ప్రత్యేకత. రాష్ట్ర ఉన్నతాధికారులను సైతం ఆకట్టుకున్న ఆయన శైలిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం గణితం గజిబిజి కాదంటూ గణితంలో కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలపై విద్యార్థులు గజిబిజి అవుతుంటారు. వారు అలా అవస్థ పడకుండా ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ప్రతి పాఠాన్ని పేరడీ పాటలతో బోధిస్తూ లెక్కను సులువు చేస్తున్నారాయన. రోజా చిత్రంలోని పరువం వానగా.. అన్న పాటను రియల్ నంబర్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ రేషనల్ ఇర్రేషనల్ నంబర్గా పాడారు. అలాగే చిన్నారి తల్లి.. చిన్నారి తల్లి అనే పాటను సైన్ ఏ ఫ్లస్ బి ఈజ్ అంటూ పేరడీగా పాడారు. ఇలా ప్రతి గణిత పాఠానికి పేరడీ పాటలు సృష్టించి పిల్లల నోళ్లలో నానుతున్నారు. సోషల్ మీడియాలోనూ సోషల్ మీడియా ద్వారా కూడా నాగేశ్వరరావు తనదైన శైలిలో బోధిస్తున్నారు. ప్రత్యేకంగా ‘పాలెపు నాగేశ్వరరావు’ పేరుతో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి, దాని ద్వారా గణితం బోధిస్తున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్ల ద్వారా తన గణిత పాఠాలను అప్లోడ్ చేసి బోధిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు కోట్ల మంది వీక్షకులు చూసినట్లు నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటి వరకు 72 వేల మంది ఇన్స్ర్ట్రాగామ్లో సభ్యులుగా ఉన్నారన్నారు. అలాగే తెలుగు సబ్జెక్టులో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న పద్య రత్నాల్లో 50 పద్యాలను తనదైన శైలిలో గానం చేసి ఆకట్టుకున్నారు. ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి ఇంటర్ పాఠ్యాంశాలపై చేసిన పేరడీలకు ఇన్స్టాలో 50 లక్షల వీక్షణలు రావడం గమనార్హం. ఉన్నతాధికారుల నుంచి పిలుపు సోషల్ మీడియా ద్వారా గణితాన్ని సులువుగా బోధిస్తున్న తీరును గుర్తించిన సమగ్ర శిక్షా రాష్ట్ర ఉన్నతాధికారులు నాగేశ్వరరావును ప్రత్యేకంగా విజయవాడకు ఆహ్వానించారు. రాష్ట్ర వ్యాప్తంగా విన్నూత్నంగా బోధిస్తున్న 41 మందిని బెస్ట్ ప్రాక్టీసెస్ వర్క్షాప్కు ఆహ్వానించగా, జిల్లాలోని మండపేట మండలం నుంచి అమలదాసు కావేరి, ఆలమూరు మండలం చింతలూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుంచి వి.వెంకటేశ్వరరావు, రాయవరం మండలం వెదురుపాక నుంచి పి.నాగేశ్వరరావు ఉన్నారు. వర్క్షాప్లో నాగేశ్వరరావు కృషిని అభినందించి, ప్రశంసాపత్రాన్ని, వీడియోలు షూట్ చేయడానికి అవసరమైన పరికరాలను సమగ్ర శిక్షా రాష్ట్ర ఎస్పీడీ శ్రీనివాసరావు అందజేశారు. -
హైటెక్ దాసులు
ఉప్పలగుప్తం: ధనుర్మాసం వస్తూనే వేకువ జామునే శిరస్సున అక్షయ పాత్ర.. మెడలో చామంతుల మాల.. ఓ చేతిన చిడతలు.. మరో చేతిన తంబుర.. పాదాలకు మంజీరాలు.. నోట సుస్వర హరినామ సంకీర్తనలు.. పెద్దపెద్ద అంగలతో ఇంటింటికీ తిరిగి వారిచ్చిన స్వయంపాకాన్ని స్వీకరించి నమస్కరించినవారిని దీవించి వడివడిగా ముందుకు సాగే హరిదాసు ఓ నాటి దృశ్యకావ్యం. తెలుగువారి సంస్కృతిని తరతరాలుగా కొనసాగిస్తూ.. మారిన కాలంతో పోటీ పడి తానూ మారుతూ వాహనధారియై.. దాని హెడ్లైట్పై అక్షయ పాత్ర.. హ్యాండిల్కి మైక్.. దాని నుంచి హరినామ సంకీర్తనలు.. ఇదీ ఆధునిక హరిదాసు జీవన చిత్రం. మున్ముందు ఇంకెంత ఆధునీకత సంతరించుకుంటారో చూడాలి మరి. వీరికీ ఓ ఘన చరిత్ర.. కఠోర దీక్ష.. సంప్రదాయాన్ని ముందు తరాలకు తీసుకువెళ్లాలనే అంకితభావం ఉండడం చెప్పుకోదగ్గ విషయం. వైష్ణవులలో ఓ వర్గం నియమ నిబద్ధతలతో కూడిన మహావిష్ణు దీక్షను భక్తితో స్వీకరిస్తారు. కృష్ణ బలిజలు, శాతానాలు, వైష్ణవులు, దాసరులు పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాన్ని కాపాడటానికి అవలంబించే 41 రోజుల కఠోర దీక్ష ఇది. ఈ దీక్షలను కార్తికం, ధనుర్మాసం, మాఘమాసాల్లో సంబంధిత గురువుల వద్ద స్వీకరిస్తారు. ఈ హరిదాసు దీక్షలకు సంబంధించి భద్రాచలంలో ప్రత్యేక శిక్షణ క్షేత్రం ఉంది. దీక్ష ఆరంభం నుంచి విరామం వరకూ వారి తమ పూర్వీకులు తిరిగిన గ్రామాల్లో పీఠం పెట్టుకుని భక్తిశ్రద్ధలతో కుటుంబాలకు దూరంగా ఉంటూ ఇల్లిల్లూ హరి నామ కీర్తన చేసుకుంటూ భిక్షాటన చేస్తారు. కటిక నేలపై పడుకుని నిత్యం ఉదయం, సాయంత్రం తల స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసుకుని అక్షయపాత్రకు అభిషేకం చేస్తారు. గ్రామాల్లో తిరుగుతూ సాయంత్రానికి పీఠం వద్దకు చేరుకుంటారు. ఉదయం వేళ అల్పాహారం తీసుకుంటూ సాయంత్రం ఒంటిపూట భోజనం చేస్తుంటారు. నెత్తిన అక్షయపాత్ర పెట్టుకుంటే అది దింపే వరకూ దైవ సంకీర్తన తప్ప వేరే మాట నోటి నుంచి రాకూడదన్నది నియమం. దీక్షాకాలం అనంతరం విష్ణు, శివాలయాల్లో దీక్షను విరమిస్తారు. దీక్షలో స్వీకరించిన భిక్షను తమ అవసరాలకు కొంత మిగుల్చుకుని భధ్రాచలం రాముల వారి కల్యాణంలో జరిగే అన్నదానానికి పంపిస్తారు. సాధారణ సమయంలో ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి వృత్తులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటారు. ఇంత కఠిన దీక్షను నేటి తరం ఆచరించే శారీరక సామర్థ్యం లేక ఆధునిక వసతులను వినియోగించుకుంటూ సంస్కృతిని ముందు తరాలకు అందజేస్తున్నారు. ఈ పయనంలో భాగంగా మోటారు సైకిళ్లను వారి ఆహార్యానికి అనుగుణంగా మార్పులు చేసుకుని చకచకా సాగిపోతున్నారు. వీరు సుమారు 4, 5 గ్రామాలను ఎంపిక చేసుకుంటారు. ఈ గ్రామాల్లో సంచరిస్తే వచ్చేది రోజకు కేవలం నాలుగైదు కుంచాల బియ్యం మాత్రమే. ప్రస్తుతం మోటారు సైకిల్పై తిరగటంతో దాని ఇంధనంతో పాటు ఇతర ఖర్చులకు 3 నుంచి 4 వందలు ఖర్చవుతుంది. ఇంతటి పురాతన సంస్కృతిని ముందు తరాలకు అందిస్తున్న ఈ వృత్తి కళాకారులకు ప్రభుత్వాల పరంగా ఎటువంటి గుర్తింపూ లేకపోవడం గమనార్హం. కొంతమంది దృష్టిలో వీరు భక్తులా, లేక ఒక వృత్తినే నమ్ముకున్న వారా అనే సందేహాలు కొంతమంది వ్యక్తం చేస్తుంటారు. కృష్ణ బలిజలు, శాతానాలు, వైష్ణవులు, దాసరి సామాజిక వర్గాలకు చెందిన వీరు బిసీ–డీ కేటగిరీగా పరిగణించబడుతున్నారు. వీరు ఎక్కువగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, కృష్ణ, అనకాపల్లి జిల్లాలో నివసిస్తుంటారు. వీరికి రిజర్వేషన్ కోటాలో తక్కువగా ప్రాధాన్యత ఉండి వారి పిల్లలు విద్యారంగంలో అవకాశాలు కోల్పోతున్నప్పటికీ బీసీ–ఏ గా మార్చాలని ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తూ వారి గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన మాజీ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో వారిని బీసీ–ఏగా మార్చడానికి సన్నాహాలు చేసినప్పటికీ కొందరి అభ్యంతరాలతో పిటిషన్లు పెట్టి అడ్డుకున్నారని ఆ సామాజిక వర్గాల వారు ఆవేదన చేస్తున్నారు. మారుతున్న కాలంతో మున్ముందుకు సంస్కృతిని, వారసత్వాన్ని కొనసాగిస్తున్న వైనం ఆదాయాన్ని వదులుకుని ఆచారానికి పెద్దపీట ఎంతటి వారైనా గజ్జెకట్టి అక్షయ పాత్ర పట్టాల్సిందే భక్తి శ్రద్ధలతో.. హరినామ సంకీర్తనతో కఠోర దీక్ష -
కోకపై పాశుర భాసురాలు!
చీరపై బొమ్మలు వేస్తున్న లీలా పూర్ణిమ అమ్మవారికి సమర్పించిన చీరను ప్రదర్శిస్తున్న లీలా పూర్ణిమ ● బొమ్మలతో కళాత్మకంగా అల్లిక ● ఉపాధ్యాయిని లీలా పూర్ణిమ ప్రతిభ మామిడికుదురు: కళోపాసన ఆ భగవంతుని ప్రసాదం. చేతిలో కళ ఉండాలే కానీ దానిని వ్యక్తపరిచే ప్రతి చర్యలోనూ ఆధ్యాత్మికత నిండి ఉంటుంది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని సందర్భోచితంగా తనలోని కుట్టు కళను అత్యంత సుందరంగా ఆవిష్కరించారు శ్రీఘాకోళపు లీలా పూర్ణిమ. మండలంలోని అప్పనపల్లికి చెందిన ఆమె ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తూ తీరిక సమయంలో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంటారు. ధనుర్మాసం సందర్భంగా ఆమె గోదాదేవి తిరుప్పావై పాశురాలను చీరపై అత్యంత సుందరంగా అల్లి ఔరా అనిపించారు. పాశురాలతో పాటు చీరపై గోదాదేవి అమ్మవారి చిత్రం, నెమలి పింఛాలు, వెంకటేశుని నామాలు, వేణువు, కలువ పూలు, శంఖు, చక్రాలను రమణీయంగా కుట్టి తన ప్రతిభను చాటుకున్నారు. పది రోజుల పాటు 30 తిరుప్పావై పాశురాలు, 10 తిరుపుళ్లియ్యెచ్చి (శ్రీరంగనాథుని మేల్కొలుపు శ్లోకం) పాశురాలు, ప్రార్థనా శ్లోకాన్ని చీరపై అల్లారు. 1,493 పదాలను 320 వాక్యాల్లో అల్లినట్టు లీలా పూర్ణిమ తెలిపారు. ఎటువంటి తప్పులు దొర్లకుండా అక్షరాల మధ్య సమతౌల్యం పాటిస్తూ చీరకు ప్రాణం పోసినట్లు అక్షరాలను, బొమ్మలను తీర్చిదిద్దారు. పవిత్రతను చాటాలన్న లక్ష్యంతో.. సంక్రాంతి పండుగలో వచ్చే ధనుర్మాసానికి ఎంతో విశిష్టత ఉంది. దాని పవిత్రతను ప్రతి ఒక్కరికి చాటాలన్న లక్ష్యంతోనే పాశురాలు (శ్లోకాలు) రాశానని లీలా పూర్ణిమ తెలిపారు. నేటి తరం మరిచిపోతున్న లిపి కళను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నదే తన ఆలోచన అని ఆమె చెప్పారు. భక్తి, సంప్రదాయం, సహనం, సృజనాత్మకతకు ప్రతి రూపంగా ఆమె అల్లిన శ్లోకాలు, బొమ్మలతో కూడిన చీరను అప్పనపల్లి బాల బాలాజీ స్వామి వారికి సమర్పించారు. ఆ చీరను అర్చకులు అమ్మవారికి అలంకరించి నిత్యం ‘తిరుప్పావై’ సేవ నిర్వహిస్తున్నారు. -
కాకినాడలో నటి మీనాక్షి సందడి
లక్కీ సిగ్నేచర్ మాల్ ప్రారంభం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన నటించిన నటి మీనాక్షి చౌదరి నగరంలో సందడి చేశారు. కాకినాడ మెయిన్రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లక్కీ సిగ్నేచర్ ఫ్యామిలీ షోరూంను ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రేక్షకులను తన అభివాదాలు ముద్దు ముద్దు మాటలతో ముంచెత్తారు. పూర్తిగా మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ షోరూమ్కు అందరి శుభాశీస్సులు అందించాలని మీనాక్షి కోరారు. మహిళల కోసం చీరలు, గాగ్రాలు, లెహంగాలు, ఎన్నో రకాలను అందుబాటు ధరలో అందిస్తోందన్నారు. ఆమెను చూసేందుకు హాజరైన ప్రజలు ఎగబడ్డారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. షోరూమ్ అంతా తిరిగి రకరకాల చీరలను ఆమె తిలకించగా వాటి వివరాలను సిబ్బంది ఆమెకు వివరించారు. షోరూం అధినేతలు రత్తయ్య, శ్రీను, స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ఫ్యామిలీ కనెక్షన్ల్లో తిరుగులేని ఆదరణ పొందుతున్న లక్కీషాపింగ్ మాల్ను కాకినాడలో ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి కొండబాబు పాల్గొన్నారు. -
మెట్ల పైనుంచి పడి కళాకారిణి మృతి
ముసలమ్మతల్లి ఉత్సవ ప్రారంభంలో అపశృతి రాజోలు: పొట్టకూటి కోసం ఉత్సవాల్లో వేషధారణలు వేసి భక్తులను ఆనందింపజేసే కళాకారిణి ప్రమాదవశాత్తు భవనం మెట్లపై నుంచి జారిపడి మృతి చెందింది. ఈ ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన పాలపర్తి భవ్యశ్రీ (17) ప్రాణాలు కోల్పోయింది. రాజోలు మండలం శివకోటి ములసమ్మతల్లి ఉత్సవాల ప్రారంభంలో ఈ అపశృతి చోటుచేసుకుంది. గురువారం శివకోటి ముసలమ్మతల్లి అమ్మవారి ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం నుంచి పలువురు కళాకారులు శివకోటి చేరుకున్నారు. వీరంతా వేషధారణల కోసం ఆలయానికి ఎదురుగా ఉన్న మూడు అంతస్తుల కల్యాణ మండప భవనంలోనికి వెళ్లారు. ఈ క్రమంలో తెల్లవారుజామున భవ్యశ్రీ ప్రమాదవశాత్తు కల్యాణ మండపం మెట్లపై నుంచి జారిపడి తలకు బలమైన గాయమైంది. ఆమెను హుటాహుటీన రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సహ కళాకారిణి మృతిపై సహచరులు, మృతురాలి తల్లి చినపాప ఆస్పత్రి వద్ద రోదించిన తీరు కంటతడి పెట్టించింది. యువతి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేష్కుమార్ తెలిపారు. యువతి మృతదేహానికి రాజోలు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించారు. అసంపూర్తి భవనంలో బసపై అగ్రహం అసంపూర్తిగా నిర్మించిన కల్యాణమండపంలో కళాకారులకు బస ఏర్పాటు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం మెట్లకు రెయిలింగ్ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఉత్సవ కమిటీ నిర్లక్ష్యం వల్లే కళాకారిణి మృతి చెందిందని వారు వాపోయారు. సగరుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వావి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న సగర కులస్తులకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడంతో పాటు, ఒక ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంఘం అధ్యక్షుడు గుర్రం మహాలక్ష్మి డిమాండ్ చేశారు. స్థానిక సూర్యకళా మందిరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గురువారం ఘనంగా జరిగింది. సంఘం గౌరవ అధ్యక్షుడిగా ములికి సత్యనారాయణ, అధ్యక్షుడిగా కుర్ర మహాలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్గా నక్క కిశోర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా తన్నాటి అప్పలస్వామి డిప్యూటీ ప్రధాన కార్యదర్శులుగా నక్క వీర వెంకట్రావు, శ్రీను, కోశాధికారి తంగెళ్ల అప్పారావుతో పాటు 151 మంది ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గాన్ని సభ్యులు సత్కరించారు. కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సగరులు కలిసికట్టుగా ఉంటే అనుకున్నది సాధించవచ్చునన్నారు. త్వరలోనే కత్తిపూడి నుంచి కాకినాడ వరకూ భారీ ర్యాలీ నిర్వహించి, సగరుల సత్తా ఏమిటో తెలియజేయాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలన్నారు. తొలుత భగీరథుడు చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సగర కుల నాయకులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద మృతిపై విచారణ
కాకినాడ క్రైం: కాకినాడలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. మల్లయ్య అగ్రహారానికి చెందిన కుడుపూడి సత్యనారాయణ(29) ఈ నెల 22న అర్థరాత్రి ఇంట్లో దుప్పటితో ఫ్యాన్కు ఉరి వేసుకుని వేళాడుతూ ఉండడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. చేతులు వెనక్కి కట్టేసి ఉండడంతో పాటు మరి కొన్ని కారణాల నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కుటుంబసభ్యులు భావించారు. ఈ అంశాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా, మృతిపై విచారణ కొనసాగుతోందని సీఐ మజ్జి అప్పలనాయుడు తెలిపారు. సత్యనారాయణకు తల్లిదండ్రులు లేరు. బాబాయి, పిన్నే కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. పెయింటింగ్ పనిచేసే సత్యనారాయణ కుటుంబసభ్యులతో ఎంతో అన్యోన్యంగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో అతడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
కరుణామయునికి వందనాలు.. సర్వ మానవాళికి శాంతి.. ప్రేమ.. దయ బోధించిన క్రీస్తు కరుణామయుడు.. చిరస్మరణీయుడు. శాంతిదూత జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా చర్చిలు ముస్తాబయ్యాయి. క్రిస్మస్ను జిల్లా ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. కాకినాడ లాల్బహదూర్నగర్లో విద్యుల్లతల నడుమ దేదీప్యమానంగా సిద్ధమైన షియోను ప్రార్థనా మందిరం -
మూడో పంటకు మంగళం!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఈ సారి రైతులు మూడో పంటకు మంగళం పాడక తప్పని పరిస్థితి. ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చూపించిన ఉదాసీనత రైతులకు శాపమైంది. దెబ్బమీద దెబ్బగా ప్రకృతి కన్నెర్రజేయడంతో తడిసిన ధాన్యాన్ని రబీ రైతులు కళ్లాల్లో ఆరబెట్టుకుని అమ్ముకున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సవాలక్ష సాకులు వెతకడంతో కనీస మద్దతు ధర అందక రైతులు లబోదిబోమంటున్నారు. ఈ పరిణామంతో ఖరీఫ్లో ధాన్యం విక్రయించడానికి రైతులు నానా కష్టాలు పడ్డారు. ఖరీఫ్ చివరిలో వర్షాలు పడడం, పండిన ధాన్యం ఆలస్యంగా కొనుగోలు చేయడంతో రైతులు రబీ పనులు చేసుకునేందుకు అన్నదాత సతమతమవుతున్నాడు. తేమ శాతం వల్ల రైతులు తాము కోసిన వరి పంటను కళ్లాల్లోనే సుమారు 10 నుంచి 15 రోజులు ఉంచేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీని ప్రభావం రబీ సాగు జాప్యానికి కారణమైంది. ఫలితంగా ఈ ఏడాది మూడో పంట అపరాలు వేసే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో రబీ సీజన్లో 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలనేది జిల్లా వ్యవసాయశాఖ నిర్దేశించిన లక్ష్యం. ముందస్తు ప్రణాళిక ప్రకారం రబీలో నాట్లు డిసెంబరు నెలాఖరుకు పూర్తి చేయాల్సి ఉంటుంది. లక్ష్యాలు నిర్దేశించడంలో చూపుతోన్న శ్రద్ధ వాటిని అధిగమించడంపై పెట్టడం లేదనే పలువురు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. రబీ సీజన్ మొదలై నెల దాటిపోతున్నా ఇంత వరకు కనీసం 20 శాతం వరి నాట్లు కూడా పూర్తి కాలేదు. వాస్తవానికి ఈ నెలాఖరు నాటికే నాట్లు పూర్తి కావాల్సి ఉంది. సాగు నీటి సలహా మండలి సమావేశంలో ఈ ఏడాది రబీ సాగు లక్ష్యాలను నిర్దేశించారు. 2026 మార్చి 31 కల్లా రబీ పంట కాలం పూర్తయ్యేలా నాటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లాలో 1.8 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయాలనేది లక్ష్యం. కానీ అధికారిక లెక్కల ప్రకారం ఇంతవరకు జిల్లాలో కేవలం 23 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. మిగిలిన 1.6 లక్షల ఎకరాల్లో నెలాఖరు నాటికి పూర్తి కావడం సాధ్యం కాదంటున్నారు. వచ్చే జనవరి మూడో వారానికి కూడా పూర్తికాావడం గగనమే అంటున్నారు. ఎప్పటిలాగే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశామని వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం గొప్పగా సెలవిస్తున్నారు. ఈ సారి రబీ సన్నాహాలు బాగా ఆలస్యమైపోయాయి. నాట్లు వేసిన దగ్గర నుంచి సుమారు వంద రోజులకు గానీ వరిపంట చేతికి రాదు. రబీ త్వరగా పూర్తయితే మూడో పంటగా రైతులు మినుములు, పెసలు వంటి అపరాలు సాగు చేస్తారు. అపరాలు సాగు అంటేనే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుంది. ఒక ఎకరాలో రైతు పెసలు, మినుములు కానీ సాగుచేస్తే మూడు నుంచి నాలుగు బస్తాలు దిగుబడి వస్తుంది. ఎకరాకు కనీసం రెండు, మూడు బస్తాలు పండినా రైతులకు సుమారు రూ.15 వేలు లాభం వచ్చేది. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రస్తుత రబీలో అపరాల సాగు దాదాపు లేనట్టే అంటున్నారు. ఖరీఫ్ సీజన్లో చంద్రబాబు ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో కుంటిసాకులతో ఈ ఏడాది రబీ మరింత ఆలస్యమవడమే ఇందుకు కారణం. సుమారు నెల రోజుల పైనే రబీ ఆలస్యం కావడంతో జనవరి నెలాఖరుకు కానీ వరినాట్లు పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం జిల్లాలో కాకినాడ రూరల్, కరప, సామర్లకోట, పెద్దాపురం, గండేపల్లి, జగ్గంపేట తదితర మండలాల్లో ఇప్పుడిప్పుడే దమ్ములు చేస్తున్నారు. రబీ సాగు ఆలస్యం కావడంతో పంట చివర్లో ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీకి నీరు వదిలే సమయంలో గుర్రపు డెక్క తొలగింపు, కాలువల్లో పూడిక తీత పనులంటూ సాగునీరు వదలకుండా నీటిసంఘాల నాయకులు తాత్సారం చేశారు. డిసెంబర్ మూడో వారం నాటికే 70 శాతం రబీనాట్లు పూర్తయ్యేవి. ఈ ఏడాది ప్రభుత్వ నిర్వాకానికి సాగునీరందక రబీ ఆలస్యమవుతోందని రైతులు పేర్కొంటున్నారు. రబీ చివర్లో వరి పంట ఈనిక, పాలు పోసుకునే దశలో నీరందక తప్పతాలు గింజలు మారి, దిగుబడులు తగ్గిపోతాయంటున్నారు. మే నెలలో కూడా రబీ కోతలు పూర్తి కావంటున్నారు. మూడో పంటగా వేసే అపరాలసాగుపై ఆశలు వదులు కోవాల్సిందేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడో పంటను పక్కన పెడితే రబీకై నా పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలాఖరు నాటికి ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. సరిగ్గా అదే సమయంలో మార్చి నెలాఖరున గోదావరి కాలువలు మూసివేస్తారు. ఆయకట్టు శివారున ఉన్న పంట పొలాలకు సాగునీటి ఇబ్బందులు తప్పవన్నది రైతుల వాదన. డిసెంబర్ నెలాఖరు లోగా రబీ వరినాట్లు వేసుకుంటే ఫిబ్రవరి నెలాఖరులోగా పంట చేతికి వచ్చేది. ఇలా క్రమ పద్ధతిలో సాగు జరిగి ఉంటే అపరాలు సాగు చేసుకునే అవకాశం దక్కేదని రైతులు చెబుతున్నారు. సాగు జాప్యంతో మూడో పంటగా అపరాల మాట ఎలా ఉన్నా రబీకి కూడా నీరు అందడం కష్టమవుతుందని రైతులు ఇప్పటి నుంచే దిగులు చెందుతున్నారు. ఏలేరు రైతు కన్నీరు జిల్లాలోని ఏలేరు సాగునీటి వ్యవస్థపై ఆధారపడ్డ 60 వేల ఎకరాల ఆయకట్టు రైతుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. సాగునీటి వ్యవస్థలో లోపాలతో ఏలేరు పరిధిలో పిఠాపురం, గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో అనుకున్న ప్రకారం రబీ సాగు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. డిసెంబర్ 1 నుంచే రబీ సాగుకు నీరు వదిలినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఎక్కడా సాగు నీరందిన ఆనవాళ్లు కనిపించడం లేదు. కేవలం కాలువల్లో ఊట నీటిని మోటార్ల ద్వారా తోడుకుని అక్కడక్కడా నారుమళ్లు వేశారు తప్ప కాలువ ద్వారా సాగునీరు అందిన దాఖలాలు ఏలేరు పరీవాహక ప్రాంత ఆయకట్టులో ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వ తీరుతో కాలువల ఆధునీకరణ పనులు సక్రమంగా ముందుకు సాగక రబీ సాగుకు ప్రతిబంధకంగా పరిణమించింది. ఏలేరు వంటి ప్రధాన ప్రాజెక్టుకు ఆధునీకరణ పనులు చేపట్టకపోవడంతో రైతులు ఏటా నష్టపోతూనే ఉన్నా సర్కార్ పట్టించుకోవడం లేదు. గడచిన రెండు సీజన్లుగా ఇదే పునరావృతమవుతోంది. అందుకే వెదజల్లు విధానంలో రబీలో ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. తుపాన్తో ఆలస్యం ఖరీఫ్ సాగు నుంచి వర్షాలు కురియడంతో వరి నాట్లు మునిగిపోయి రెండు పర్యాయాలు నాట్లు వేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. పంట చేతికి వచ్చే సమయంతో మోంథా తుపాను పంటను ముంచేసింది. అదే సమయంలో గ్రామం లోని ఏలేరు కాలువలో ఉన్న కాజ్వే కొట్టుకుపోవడంతో పంట రవాణాకు అవకాశం లేని పరిస్థితిలో ప్రభుత్వం నుంచి కాజ్వే నిర్మాణానికి సహకారం లభించలేదు. దాంతో దాత సహకారంతో కాజ్వేను పూర్తి చేసి కోతలు చేసుకున్నాం. దీని వల్ల రబీకి ఆలస్యం అవుతోంది. జనవరిలో పండగ వెళ్లిన తరువాత వరినాట్లు వేస్తాం. గ్రామంలో 30 శాతం మంది నాట్లు వేస్తున్నారు. – ఇంటి వెంకట్రావు, రైతు, వీకే రాయపురం ఆలస్యంగా రబీ సాగు ఈ నెలాఖరు తుది గడువైనా మూడో వారానికీ 20 శాతమే పూర్తి 1.8 లక్షల ఎకరాల సాగు లక్ష్యం 23 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు -
విరి విలాపం
పెరవలి: మార్కెట్లో పూల ధరలు పతనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది మూఢం ముందే రావడంతో శుభ ముహూర్తాలు లేక వినియోగం తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీని వల్ల రైతులకు నష్టం వస్తుంటే పూలతోటలపై ఆధారపడిన కూలీలకు పనులు లేక ఉపాధి కరువై విలవిలలాడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు తలమానికంగా ఉన్న కడియం, కాకరపర్రు పూల మార్కెట్లు నేడు కొనుగోలుదారులు లేక కళావిహీనంగా కనిపిస్తున్నాయి. వ్యాపారులకు విక్రయాలు లేక.. దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర లేక.. కూలీలకు ఉపాధి దొరకక.. రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం శుభ ముహూర్తాలు, పండుగలు లేకపోవటం వలన పూల వినియోగం తక్కువగా ఉందని వ్యాపారులు చెప్తున్నారు. 20 రోజుల క్రితం చామంతి కిలో రూ.300, కాగడాలు కిలో రూ.900, కనకాంబరాలు రూ.1200 పలికితే నేడు పూల రకాలు, నాణ్యతను బట్టి కిలో రూ.20 నుంచి రూ.150కి కొనుగోలు చేస్తున్నారని రైతులు చెప్తున్నారు. రైతులు మార్కెట్కు పట్టుకువచ్చిన పూలు రెండు మూడు రోజుల వరకు విక్రయాలు జరగకపోవడంతో వ్యాపారుల దగ్గరే రెండు నుంచి మూడు రోజులు నిల్వ ఉండిపోతున్నాయి. నాలుగు రోజులు దాటితో పూలు వసి వాడిపోయి రోడ్డు పక్కన పాడేయాల్సిన పరిస్థితి నెలకొందని వ్యాపారులు వాపోతున్నారు. వాతావరణం అనుకూలించడంతో పూల దిగుబడి చాలా బాగుందని, మార్కెట్లో పూల ధరలు లేకపోవటం వల్ల వారానికి రెండు కోతలు కోయాల్సిన పూలు నేడు ఒక్కకోతే కోస్తున్నామని రైతులు చెప్తున్నారు. తీరా కోసిన తరువాత కనీసం కూలీల ఖర్చులు కూడ రావడం లేదని, దీంతో కోయకుండానే నష్టపోతున్నామని రైతులు చెప్తున్నారు. పూల రైతులు గ్రామాల బాట బట్టి కిలో పూలు సమయాన్ని బట్టి రూ.30 నుంచి రూ.50కి విక్రయిస్తున్నారు. మార్కెట్లకు పూలను తీసుకువెళ్తుంటే వ్యాపారులు కొనుగోలు చేయడం లేదని.. దీంతో మళ్లీ తామే తమ గ్రామాలకు తీసుకువెళ్లి వచ్చినకాడికి విక్రయిస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పూలసాగు ఇలా.. జిల్లాలో 4897 ఎకరాల్లో పూల సాగు చేస్తుంటే దీనిపై ప్రత్యక్షంగాను, పరోక్షంగాను 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. పూలకు మార్కెట్లో ధరలు పలకకపోవడం వల్ల సగానికి సగం మందికి ఉపాధి కరువైయ్యిందని రైతులు అంటున్నారు. చిరు వ్యాపారులు సైతం కూలి ఖర్చులు రావడం లేదంటున్నారు. పనులు లేక ఇబ్బంది పూల కోతలు, పూల తోటలకు ఎరువులు, పురుగు మందులు కొట్టే కూలీలకు, దండలు కట్టే కూలీలకు, చిరు వ్యాపారాలు చేసే సైకిల్ వ్యాపారులకు పని అంతంతమాత్రంగా లభించడంలో వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. నిత్యం పూలు కోసే కూలీలకు వారానికి ఒక్కరోజు మాత్రమే పనులు లభిస్తుంటే, పూల దండలు కట్టే మహిళలు పనులు లేక అల్లాడిపోతున్నారు. మార్కెట్లో ధరలు ఇలా.. పూల మార్కెట్లో 20 రోజుల వ్యవధిలో ధరలు పరిశీలిస్తే సగానికి సగం పడిపోయాయి. పూల రకం 20 రోజుల ప్రస్తుత క్రితం (రూ.) ధర (రూ.) బంతి పూలు 80 20 చామంతి 300 30-50 గులాబీలు 250 140 లిల్లీ పూలు 300 80 కాగడాలు 900 400 కనకాంబరాలు 1200 600 తోటలోనే మగ్గిపోతున్న పూలు పూలధరలు తగ్గడంతో వాటిని కోయకుండా రైతుల చేలల్లోనే వదలేస్తున్నారు. ఎందుకంటే కోయిస్తే కనీసం కూలీ ఖర్చులు కూడా రావటం లేదని, దీనితో పూల కోసేకంటే వదిలేయడమే మేలని చెప్తున్నారు. నిత్యం పదిమందితో పూలు కోయించే రైతులు నేడు వారానికి ఒక్కసారి మాత్రమే కోయిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు బంతి పూలు ఒక్కకోతకు 10 కూలీలు అవసరం వస్తే వీరికి రోజుకు రూ.350 కూలి ఇవ్వాలి. మార్కెట్లో కిలో పూలు రూ.20 పలుకుతున్నాయి. ఒక్క కోతకు సుమారు 100 కిలోలు కోయిస్తే కూలీలకు రూ.3500, కాఫీ, టిఫిన్లు, సంచులు, రవాణా కలిపి రూ.వెయ్యి ఖర్చు అవుతుంది. దీనితో పూలకు మార్కెట్లో వంద కిలోలకు రూ.రెండు వేలు వస్తే ఖర్చు రూ.4500 అవుతోందని రైతులు చెప్తున్నారు. అందుకే పూలను కోయకుండా వదలివేస్తున్నామని వాపోతున్నారు. అన్ని రకాల పూల సాగు పరిస్థితీ ఇలానే ఉందని రైతులు అంటున్నారు. విరివిగా పూసినా సిరులు అంతంతే ధరలు లేక మందగించిన వ్యాపారాలు గగ్గోలు పెడుతున్న రైతులు పనులు లేక కూలీలు.. ఉపాధి దొరక్క పనివారు విలవిల ‘తూర్పు’న 4897 ఎకరాల్లో పూల సాగు ప్రత్యక్షంగా,‘ పరోక్షంగా 15వేల మందిపై ప్రభావం -
నేతి చమురు వదిలిపోయేలా..
అన్నవరం: సత్యదేవునికి ‘నేతి’ చమురు భారీగానే వదిలిపోనుంది. స్వామివారి ప్రసాదం తయారీకి అవసరమైన ఆవు నేతిని ఇప్పటి వరకూ కొటేషన్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే నెల నుంచి టెండర్ ద్వారా నెయ్యి కొనుగోలు చేయనున్నారు. ఈ మేరకు ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా నెయ్యి కొనుగోలుకు గత నెల 30న దేవస్థానం అధికారులు టెండర్లు పిలిచారు. ఇందులో సంగం డెయిరీ (గుంటూరు), విజయా డెయిరీ (విజయవాడ) టెండర్లో పాల్గొని టెక్నికల్ బిడ్కు అర్హత సాధించాయి. ప్రైస్ బిడ్ మంగళవారం తెరవగా.. సంగం డెయిరీ కిలో రూ.639.90కి, విజయా డెయిరీ కేజీ రూ.660కి కోట్ చేశాయి. దీంతో, అతి తక్కువ ధర కోట్ చేసిన సంగం డెయిరీ ఈ టెండర్ను దక్కించుకుంది. ఈ డెయిరీ జనవరి 1 తేదీ నుంచి జూన్ 30 వరకూ ఆరు నెలల పాటు అన్నవరం దేవస్థానానికి ఆవు నెయ్యి సరఫరా చేయాల్సి ఉంటుంది. కిలోకు రూ.50 అధికం గత ప్రభుత్వ హయాంలో టెండర్ పిలిచి నెయ్యి కొనుగోలు చేసేవారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి వరకూ ఉన్న టెండర్లను రద్దు చేసి సహకార డెయిరీల నుంచి కొటేషన్లు పిలిచి నెయ్యి కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఆ మేరకు సంగం, విజయా డైరీల నుంచి కిలో సుమారు రూ.590కి కొంటున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి టెండర్లు పిలిచి ఆవు నెయ్యి కొనుగోలు చేయాలని గత ఆగస్టులో కమిషనర్ ఆదేశించారు. అయినప్పటికీ నవంబర్ వరకూ కొటేషన్ ద్వారానే కొనుగోలు చేశారు. దీనిపై దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు అప్పటి ఈఓ వీర్ల సుబ్బారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే టెండర్ పిలిచి కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు టెండర్ పిలవగా దీనిని సంగం డెయిరీ దక్కించుకుంది. సత్యదేవుని ప్రసాదం తయారీకి ప్రతి నెలా 18 వేల నుంచి 20 వేల కిలోల వరకూ నెయ్యి ఉపయోగిస్తారు. ఇప్పుడు టెండర్ దక్కించుకున్న సంగం డెయిరీ జనవరి 1 నుంచి జూన్ 30 వరకూ సుమారు 1.10 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయాలి. కిలో రూ.639.90 చొప్పున నేతి కొనుగోలుకు సుమారు రూ.7.04 కోట్ల మేర దేవస్థానం సంగం డెయిరీకి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొటేషన్పై కొనుగోలు చేస్తున్న దానికన్నా సంగం డెయిరీ రూ.50 ఎక్కువకు కోట్ చేయడం గమనార్హం. దీని ప్రకారం 1.10 లక్షల కిలోల నేతికి దేవస్థానం అదనంగా రూ.55 లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ ‘సంగం’కే ఆవునేతి టెండర్ ఫ కిలో రూ.639.90కి కోట్ చేసిన డెయిరీ ఫ ఇప్పటి వరకూ కొటేషన్ ద్వారా కిలో రూ.590కే కొనుగోలు ఫ ప్రస్తుతం 6 నెలలకు రూ.7.04 కోట్ల వ్యయం ఫ తాజా ధరతో 6 నెలలకు రూ.55 లక్షల భారం -
ఈ కుర్చీకో దండం
అన్నవరం: ఒకప్పుడు అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా పని చేయడానికి దేవదాయ శాఖ అధికారులు పోటీ పడేవారు. ఈ కుర్చీ కోసం ప్రజాప్రతినిధులతో పెద్ద ఎత్తున సిఫారసులు చేయించుకునేవారు. కానీ, నేడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఈఓ కుర్చీ అంటే.. వద్దు బాబోయ్.. దీనికో దండమని అంటున్నారు. ఏడాది కాలంగా దేవస్థానంలో నెలకొన్న పరిస్థితులు, పరిపాలనలో మితిమీరిన రాజకీయ జోక్యంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఇన్చార్జి ఈఓగా బాధ్యతలు చేపట్టిన వి.త్రినాథరావు సైతం తనను ఈ బాధ్యతల నుంచి తప్పించాలంటూ సంబంధిత శాఖ మంత్రిని వేడుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అదే కనుక నిజమైతే రత్నగిరిపై పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరం లేదు. ప్రస్తుతం రాజకీయ జోక్యం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత దేవస్థానం ఈఓగా దేవదాయ శాఖ అధికారుల స్థానంలో గ్రూప్–1 అధికారి, డిప్యూటీ కలెక్టర్ వీర్ల సుబ్బారావును గత ఏడాది డిసెంబర్లో నియమించారు. దేవస్థానంపై ఆయనకు పెద్దగా అవగాహన లేకపోవడానికి తోడు దేవస్థానం పరిపాలన అంతా ప్రజాప్రతినిధుల చేతుల్లో పెట్టడం, పని చిన్నదైనా, పెద్దదైనా వారు చెప్తే చేయడమే పరిపాలననే విధంగా పరిస్థితులు దిగజారిపోయాయి. అలాగే, ఆయన కుటుంబ సభ్యుల జోక్యం బాగా పెరిగిపోవడం దేవస్థానం సిబ్బందిలో అసంతృప్తికి కారణమైంది. సుబ్బారావు నియామకంపై ఈ ఏడాది మార్చి నాటికే దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ, రాజకీయ జోక్యంతో కొనసాగించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కాలంలో ఉన్నతాధికారులు తరచూ జోక్యం చేసుకుని, పరిపాలనను చక్కదిద్దాల్సి వచ్చింది. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో అన్నవరం ఐదు, ఆరు, ఏడు ర్యాంకులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈఓ మారినా.. శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాలకు ఈఓలుగా నియమించిన డిప్యూటీ కలెక్టర్ల పదవీ కాలాన్ని ఇటీవల మరో ఏడాది పొడిగించారు. అన్నవరం దేవస్థానం ఈఓ సుబ్బారావును మాత్రం రెవెన్యూ విభాగానికి సరెండర్ చేశారు. ఆయన స్థానంలో దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ) త్రినాథరావును ఇన్చార్జిగా నియమించారు. గతంలో మూడుసార్లు ఈఓగా పని చేసిన అనుభవం ఉండటంతో ఆయన పరిస్థితులను చక్కదిద్దుతారని ఉన్నతాధికారులు భావించారు. కానీ, ఎవ్వరూ చక్కదిద్దలేనంతగా ఇక్కడి పరిస్థితులు దిగజారిపోయాయనే విషయం ఇప్పుడిప్పుడే తేటతెల్లమవుతోంది. ఇక్కడ ఏ పని చేయాలన్నా ప్రజాప్రతినిధుల జోక్యం చేసుకుంటున్నారు. ప్రతి పనీ తమకు చెప్పిన తర్వాతే చేయాలనే విధంగా పరిస్థితులు మారిపోయాయి. దీంతో, ఇక్కడ స్వేచ్ఛగా ఏ పనీ చేయలేమనే నిర్ణయానికి అధికారులు వచ్చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఈ సీటు ఆశించిన వారందరూ ఇప్పుడు మిన్నకున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఈఓ త్రినాథరావు కూడా తనను ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని సంబంధిత మంత్రిని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్నవరం దేవస్థానం అభివృద్ధి పథంలో పయనించింది. 2021–22 మధ్య కూడా త్రినాథరావు ఇక్కడ ఈఓగా ఉన్నారు. ఆ సమయంలో రత్నగిరి రామాలయం ముందు భక్తుల కోసం దాతల సహకారంతో సుమారు రూ.కోటితో విశ్రాంతి షెడ్డు నిర్మించారు. స్వామివారి వార్షిక కల్యాణ మండపం, ప్రసాద తయారీ భవనం నిర్మించి, ప్రారంభించారు. అలాగే, 2022–23లో కూడా దాతల సహకారంతో వనదుర్గ ఆలయం వద్ద డార్మెట్రీ నిర్మించారు. చంద్రశేఖర్ ఆజాద్ ఈఓగా ఉన్న సమయంలో కేవలం 8 నెలల్లోనే సత్యగిరి రోడ్డు నుంచి నేరుగా మూడో ఘాట్ రోడ్డు మలుపులోకి చేరేలా ఆదిశంకర మార్గ్ రోడ్డు, కొండ దిగువన టూరిస్టు బస్సులలో వచ్చే భక్తుల కోసం 5 విశ్రాంతి షెడ్లు నిర్మించారు. జాతీయ రహదారి వద్ద ఆక్రమణలో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకుని, అందులో సత్యదేవుని నూతన నమూనా ఆలయం, రత్నగిరిపై పార్కింగ్ స్థలాల అభివృద్ధి, సహజ, ప్రకాష్ సదన్ సత్రాల మధ్య నుంచి పశ్చిమ రాజగోపురం సమీపానికి వాహనాలు చేరుకునేలా రోడ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టి పూర్తి చేశారు. శివసదన్ సత్రం కూడా 135 గదులతో త్వరితగతిన నిర్మించి, భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. దూర ప్రాంతాల భక్తులకు కనిపించేలా విద్యుద్దీపాలతో శంఖచక్ర నామాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ రాజగోపురం ముందు విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి లారెస్ ఫార్మా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని, సత్యదేవ అతిథి గృహాన్ని కూల్చేశారు. వివిధ కారణాలతో ఆ షెడ్డు నిర్మాణం ఆలస్యమైనప్పటికీ ఇటీవల పూర్తి చేశారు. సుమారు 45 వ్రత పురోహిత పోస్టులు భర్తీ చేశారు. వ్రత పురోహితుల పారితోషికాన్ని 30 నుంచి 40 శాతానికి పెంచారు. ఆ ఐదేళ్లూ ఎటువంటి వివాదాలూ లేకుండా దేవస్థానం పరిపాలన సాఫీగా సాగిపోయింది. ఫ రత్నగిరిపై మితిమీరిన రాజకీయ జోక్యం ఫ ఏ పనైనా తమకు చెప్పి చేయాల్సిందే నంటున్న ప్రజాప్రతినిధులు ఫ బెంబేలెత్తిపోతున్న అధికారులు ఫ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని కోరిన ఈఓ ఫ మళ్లీ డిప్యూటీ కలెక్టర్నే నియమిస్తారంటూ ప్రచారం బలమైన అధికారి ఉండాల్సిందే.. పాలకొల్లులో ఆదివారం జరిగిన సామూహిక సత్యదేవుని వ్రతాల నిర్వహణకు వెళ్లిన పురోహిత బృందం అక్కడి భక్తుల నుంచి బలవంతంగా కానుకలు డిమాండ్ చేశారనే ఫిర్యాదు అందింది. దీంతో, ఆరుగురు పురోహితులను ఈఓ త్రినాథరావు సస్పెండ్ చేశారు. ఈ ఆరుగురిలో కీలకమైన ఓ పురోహితుడు తాను ప్రజాప్రతినిధులకు అత్యంత సన్నిహితుడనని, తననెవరూ ఏమీ చేయలేరంటూ చెప్పుకునేవాడని సాటి పురోహితులే చెబుతున్నారు. దీనికి తోడు ఇటీవల ఒక ప్రజాప్రతినిధిని మర్యాద పూర్వకంగా కలవడానికి ఈఓ వెళ్లినపుడు.. అక్కడ ఆ పురోహితుడు కూడా ప్రత్యక్షమయ్యారు. దీంతో, దేవస్థానంలో మారిన పరిస్థితి తేటతెల్లమైందని అంటున్నారు. ఏదేమైనా దేవస్థానంలో పరిస్థితులను చక్కదిద్దడానికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే బలమైన అధికారిని నియమించాలని పలువురు అంటున్నారు. మెతకగా ఉండే అధికారిని నియమిస్తే పరిస్థితి మరింత దిగజారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ త్రినాథరావు విన్నపాన్ని మన్నిస్తే.. తిరిగి డిప్యూటీ కలెక్టర్నే ఈఓగా నియమిస్తారనే ప్రచారం దేవస్థానంలో జరుగుతోంది. -
శాసీ్త్రయ ప్రతిభను వెలికి తీసేందుకే కౌశల్ పరీక్షలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ѧéÅÆý‡$¦ÌZÏ §éW E¯]l² {糆¿ýæ¯]l$ ÐðlÍMìS ¡Ä¶æ$-yýl…ÌZ MúÔèæÌŒæ ç³È-„ýSË$ MîSÌSMýS ´ë{™èl ´ùíÙ-çÜ$¢-¯é²Ä¶æ$° hÌêÏ Ñ§éÅ-Ô>Rê-«¨M>Ç (yîlDK) í³.Æý‡Ðól$‹Ù A¯é²Æý‡$. Ý린MýS çÜÐ]l${VýS Õ„ýS çÜÐ]l*-ÐólÔèæ Ð]l$…¨Æý‡…ÌZ Ð]l$…VýS-âýæÐéÆý‡… °Æý‡Ó-íßæ…-_¯]l hÌêÏ Ýë¦Æ‡$$ MúÔèæÌŒæ ç³È„ýSÌS ºçßæ$Ð]l$† {ç³§é-¯ø-™èlÞ-Ð]l…ÌZ BĶæ$¯]l Ð]l¬QÅ A†¤V> ´ëÌŸY-¯é²Æý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> ѧéÅ-Æý‡$¦-ÌS-¯]l$§ólªÕ…_ Ð]l*sêÏ-yýl$™èl*, ´ùsîæ ç³È-„ýS-ÌSMýS$ çܯ]l²§ýl®… ^ólĶæ$-yé°MìS MúÔèæÌŒæ ç³È„ýSË$ G…™ø §øçßæ§ýlç³-yýl-™éĶæ$° A¯é²Æý‡$. ¿êÆý‡-¡Ä¶æ$ Ñgêq¯]l Ð]l$…yýl-Í, Æ>çÙ‰ Ô>ç܈, Ýë…MóS-†MýS Ð]l$…yýl-Í, OòܯŒSÞ íÜsîæ B‹œ B…{«§ýl{ç³§ólÔŒæ ç܅Ķæ¬MýS¢ B«§ýlÓÆý‡Å…ÌZ °Æý‡Ó-íßæ…_¯]l D ç³È„ýSÌZÏ hÌêÏ-ÐéÅ-ç³¢…V> 3,084 Ð]l$…¨ ѧéÅ-Æý‡$¦Ë$ ´ëÌŸY-¯é²Æý‡° ™ðlÍ-´ëÆý‡$. D ç³È-„ýSÌZÏ E™èl¢Ð]l$ {糆¿ýæ ^èl*í³¯]l ѧéÅ-Æý‡$¦ÌSMýS$ ¯]lVýS§ýl$ ºçßæ$-Ð]l$™èl$Ë$, {ç³Ôèæ…-Ýëç³-{™éË$, gêqí³-MýSË$ A…§ýl-gôæ-Ô>Æý‡$. {ç³£ýlÐ]l$ Ý릯]l… ´÷…¨¯]l ѧéÅ-Æý‡$¦-ÌSMýS$ Æý‡*.1,500, ¨Ó-¡Ä¶æ$ Ý릯]l… Ý뫨…-_¯]l ÐéÇMìS Æý‡*.1,000 ^ö糚¯]l ¯]lVýS§ýl$ ºçßæ$Ð]l$™èl$Ë$ A…¨…-^éÆý‡$. M>Æý‡Å-{MýSÐ]l$…ÌZ Eç³ Ñ§éÅÔ>Rꫨ-M>Æý‡$Ë$ MóSÒÒ çÜ™èlůé-Æ>-Ķæ$׿, {糿ê-MýS-Æý‡-ÔèæÆý‡Ã, yîlïÜ-D½ M>Æý‡Å-§ýlÇØ MðS.Ððl…-MýS-r-Æ> Ð]l#, MúÔèæÌŒæ gêÆ‡$$…sŒæ Mø BÇŠేyýl²-rÆŠ‡ ¼.çÜ*Æý‡Å-Ððl*-çßæ-¯ŒSÆð‡yìlz, hÌêÏ çÜÐ]l$-¯]lÓ-Ķæ$-MýSÆý‡¢ MóSçÜÇ }°-Ðé-çÜ-Æ>Ð]l#, G…DKË$, E´ë«§éÅ-Ķæ¬Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. జిల్లా స్థాయి విజేతలు వీరే.. ● క్విజ్లో ఎస్డీ ఆఫియా తబస్సుం (8వ తరగతి, పీఆర్జీ బాలికల ఉన్నత పాఠశాల, కాకినాడ), జి.విజయలక్ష్మి (9వ తరగతి), వి.కుసుమ (10వ తరగతి, జెడ్పీ హైస్కూల్, పెద్దనాపల్లి) ప్రథమ స్థానం సాధించారు. కె.శివగణేష్ (8వ తరగతి, జెడ్పీ హైస్కూల్, ఇంజరం), డీఎల్వీఎన్ఎస్ఎం లహరి (9వ తరగతి, ఏపీ మోడల్ స్కూల్, శంఖవరం), కె.కిశోర్ (10వ తరగతి, జెడ్పీ హైస్కూల్, తేటగుంట) ద్వితీయ స్థానంలో నిలిచారు. ● పోస్టర్ పోటీలో జి.మేఘన (8వ తరగతి, మున్సిపల్ ఉన్నత పాఠశాల, సీతారామపురం, తుని), పీజీవీ ఆశ (9వ తరగతి, ఏపీ మోడల్ స్కూల్, శంఖవరం) ప్రథమ స్థానం సాధించారు. కె.గణేష్ (8వ తరగతి, జెడ్పీ హైస్కూల్, సర్పవరం), సీహెచ్. లోహిత సుధ (9వ తరగతి, జెడ్పీ హైస్కూల్,ఎ.కొత్తపల్లి)ద్వితీయస్థానం పొందారు. ● రీల్స్ పోటీలో ఎం.లక్ష్మీ పూర్ణిమ (10వ తరగతి, జెడ్పీ హైస్కూల్, నాయకంపల్లి) ప్రథమ, ఎన్.తేజస్విని (10వ తరగతి, జెడ్పీ హైస్కూల్, పవర) ద్వితీయ స్థానం సాధించారు. ● వీరు ఈ నెల 27న తిరుపతిలోని నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని కేసరి శ్రీనివాసరావు తెలిపారు.


