Kakinada
-
నిత్యావసరాల ధరలు అందుబాటులో ఉండాలి
కాకినాడ సిటీ: బియ్యం, కందిపప్పు, ఇతర పప్పు ధాన్యాలు, కూరగాయలు అందుబాటు ధరల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, వ్యాపారులను జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆదేశించారు. తన చాంబర్లో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి ధరల నియంత్రణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల రోజుల ముందు, ప్రస్తుతానికి కూరగాయల ధరల్లో ఉన్న వ్యతాసాలను పరిశీలించారు. కందిపప్పు, ఇతర పప్పు ధాన్యాల ధరలు అందుబాటులో ఉన్నాయో లేవో సంబంధిత హోల్సేలర్లు, రిటైలర్లను అడిగి తెలుసుకున్నారు. వినియోదారుల సంఘం సభ్యులు మాట్లాడుతూ, కాకినాడ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరికొన్ని రైతుబజార్లు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. దీనిపై తగు నివేదిక ఇవ్వాలని మార్కెటింగ్ శాఖను జేసీ ఆదేశించారు. పాలు, బ్రెడ్ ప్యాకెట్లు, ఇతర ఆహార పదార్థాల ప్యాకింగ్పై తప్పనిసరిగా తయారీ తేదీ, వినియోగ తేదీ ముద్రించాలని స్పష్టం చేశారు. అలా లేకుంటే తన దృష్టికి తీసుకురావాలని వినియోగదారుల సంఘ సభ్యులకు జేసీ సూచించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణరాజు, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ఎం.దేవుల నాయక్, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ ఎస్.సలీం, మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి.రాఘవేంద్ర కుమార్, వాణిజ్య పన్నుల శాఖ నుంచి జి.పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన కోకో రైతులు
కొవ్వూరు: కోకో గింజల కొనుగోలు, గిట్టుబాటు ధరలపై నెల రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. కోకో గింజలను ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ కోకో కాయలు, గింజలు పట్టుకుని ఆర్డీఓ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. గేటు ఎదుట నిలబడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ కోకో రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ, కంపెనీలు సిండికేట్గా మారి కోకో గింజలు కొనుగోలు చేయడం లేదని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రైతుల వద్ద ఉన్న కోకో పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు మాట్లాడినప్పటికీ కంపెనీలు నిర్లక్ష్య ధోరణి చూపుతున్నాయని అన్నారు. అన్ సీజన్లో కోకో పంటను కొనుగోలు చేయకపోవడంతో రైతులు, కౌలు రైతులు నష్టపోతున్నారన్నారు. మరోవైపు కంపెనీలు రోజురోజుకూ ధర తగ్గించేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం కిలో కోకో గింజల ధర రూ.650 ఉండగా నేడు రూ.550 నుంచి రూ.500కు పడిపోయిందని చెప్పారు. అన్ సీజన్లో కిలో రూ.200 నుంచి రూ.240కే కొనుగోలు చేస్తున్నారని అన్నారు. కిలో కోకో గింజలకు రూ.900 చొప్పున గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రభుత్వం ద్వారా వెంటనే కొనుగోలు చేయాలని, ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేయాలని, విదేశీ కోకో గింజల దిగుమతులను నిలుపుదల చేయాలని, ఉద్యాన శాఖ నుంచి సబ్సిడీలు అందించి, రైతులను ఆదుకోవాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ రాణి సుస్మితకు రైతు సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఉప్పల కాశీ, నాయుడు లక్ష్మణరావు, ఉండవల్లి కృష్ణారావు, జిల్లా కన్వీనర్ గారపాటి వెంకట సుబ్బారావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.సుందరబాబు తదితరులు పాల్గొన్నారు. ఫ కంపెనీలు కొనుగోలు చేయకపోవడంపై నిరసన ఫ తక్షణం ప్రభుత్వం కొనాలని విన్నపం ఫ కిలోకు రూ.900 ఇవ్వాలని డిమాండ్ -
సత్యదేవునికి ఘనంగా ఏకాదశి పూజలు
అన్నవరం: ఫాల్గుణ బహుళ ఏకాదశి సందర్భంగా రత్నగిరి వాసుడు సత్యదేవునికి అర్చకులు మంగళవారం ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు స్వర్ణ పుష్పార్చన, 9 నుంచి 11 గంటల వరకూ పుష్పార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలు, వేదాశీస్సులు అందజేశారు. ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, వేద పండితులు యనమండ్ర శర్మ ఘనపాఠి, అర్చకులు వేంకటేశ్వర్లు, పరిచారకులు యడవిల్లి ప్రసాద్, కొండవీటి రాజా తదితరులు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. సత్యదేవుని దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామివారిని సుమారు 20 వేల మంది దర్శించారు. వెయ్యి వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.20 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 4 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. -
రత్నగిరిపై వింత పాలన
అధికారుల ఆగ్రహం దేవస్థానంలో నీటి సమస్య పేరుతో ఏసీ గదులు అద్దెకివ్వడాన్ని నిలిపివేశారంటూ భక్తులు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. విజయవాడలో మంగళవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఉన్న జిల్లా కలెక్టర్ షణ్మోహన్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఏసీ గదులు అద్దెకివ్వాలని ఆదేశించారు. ఇదే విషయమై దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ కూడా ఈఓ సుబ్బారావుకు ఫోన్ చేసి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు తెలియజేయకుండా గదులను అద్దెకివ్వడం నిలిపివేయడమేమిటని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఇదిలా ఉండగా, కలెక్టర్ల సదస్సు ముగిసిన వెంటనే కలెక్టర్ షణ్మోహన్ గురువారం అన్నవరం దేవస్థానానికి వచ్చే అవకాశం ఉంది. ఏసీ గదులు అద్దెకివ్వకపోవడంతో ఏర్పడిన వివాదంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. పైగా కలెక్టర్ చెప్పినందు వల్లనే గదులు అద్దెకు ఇవ్వడం లేదని అధికారులు చెబుతూండటంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అన్నవరం: బోడిగుండుకు మోకాలుకు ముడి వేయడమనే సామెత వినే ఉంటారు. అదే చందంగా అన్నవరం దేవస్థానం అధికారులు తీసుకుంటున్న వింత నిర్ణయాలు దేవస్థానం ప్రతిష్టను మరింత మసకబారేలా చేస్తున్నాయి. తాజాగా అధికారులు తీసుకున్న ఓ నిర్ణయం అటు భక్తులను ఇబ్బందులకు గురి చేయగా.. ఇటు దేవస్థానానికి ఆర్థికంగా నష్టాన్ని తీసుకువచ్చాయి. ఏం జరిగిందంటే.. అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానానికి ప్రధాన నీటి వనరు అయిన పంపా రిజర్వాయర్లో నీటి నిల్వలు అడుగంటిన విషయం తెలిసిందే. రిజర్వాయర్లో ఉన్న నీటిని పోలవరం కాలువ పనులు, బ్యారేజీ గేట్లు మరమ్మతుల పేరుతో దిగువకు వదిలేశారు. దీనివలన దేవస్థానానికి నీటి సమస్య ఉత్పన్నమవుతుందని, ఏప్రిల్లో శ్రీరామ నవమి, మే నెలలో సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలకు ఇబ్బందులు ఎదురవుతాయని ‘సాక్షి’ ఫిబ్రవరి 10న ‘అడుగంటినది’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై అన్నవరం దేవస్థానం అధికారులు నెల రోజులు ఆలస్యంగా స్పందించారు. పంపా నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయిన తరువాత, ఏలేరు నుంచి నీటిని విడుదల చేయించాలని కోరుతూ కలెక్టర్కు ఈఓ వీర్ల సుబ్బారావు మార్చి 11న లేఖ రాశారు. ఈ మేరకు కలెక్టర్ షణ్మోహన్ ఈ నెల 18న అన్నవరం వచ్చి, పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అధికారులతో సమీక్షించారు. ఈ నెల 21న ఇరిగేషన్, పోలవరం, దేవస్థానం అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలవరం అక్విడెక్ట్ పనులకు ఆటంకం లేకుండా ఏలేరు నీరు పంపాకు చేరేలా ప్రత్యేకంగా కాలువ, పైప్లైన్ ఏర్పాటు చేయాలని, దీనికి అవసరమైన నిధులు తాను విడుదల చేస్తానని తెలిపారు. ఈ మేరకు పోలవరం అధికారులు రూ.22 లక్షలతో ప్రతిపాదనలు సమర్పించారు. దీనికి కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమోదం తెలిపి, ఏప్రిల్ 15 నుంచి పంపాకు ఏలేరు నీరు విడుదల చేసేందుకు వీలుగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అదే సమయంలో దేవస్థానంలో నీటిని పొదుపుగా వాడాలని, అత్యవసర నిర్మాణాలు మినహా మిగిలినవి నిలిపివేయాలని, నీటి వృథాను అరికట్టాలని సూచించారు. చెప్పిందొకటి.. చేసింది మరొకటి ఏలేరు నీరు పంపాకు వచ్చేంత వరకూ దేవస్థానంలో నీటిని పొదుపుగా వాడాలని కలెక్టర్ షణ్మోహన్ ఆదేశిస్తే అధికారులు మరొకలా అర్థం చేసుకున్నారు. కలెక్టరేట్లో సమావేశం ముగిసిన అనంతరం ఈఓ వీర్ల సుబ్బారావు దేవస్థానానికి చేరుకున్నారు. సత్రాల్లో ఏసీ గదులు అద్దెకివ్వడం నిలిపివేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ విషయంపై దేవస్థానంలో మైకు ద్వారా ప్రచారం చేశారు. ఈ మేరకు మంగళ, బుధ, గురువారాల్లో ఏసీ గదులు అద్దెకివ్వరని ప్రచారం చేశారు. ఈ నిర్ణయంపై దేవస్థానం సిబ్బంది ఆశ్చర్యపోయారు. నీటి పొదుపునకు, సత్రాల్లో ఏసీ గదులు అద్దెకివ్వకపోవడానికి మధ్య ఉన్న సంబంధమేమిటో అర్థం కాక పలువురు తలలు పట్టుకున్నారు. పైగా ప్రస్తుతం వేసవి కావడంతో ఎక్కువ మంది భక్తులు ఏసీ గదులే అడుగుతున్నారు. దీంతో, నాన్ ఏసీ గదులు తీసుకోవాలని వారికి అధికారులు చెప్పాల్సి వచ్చింది. వాస్తవానికి ఏసీ గది అయినా, నాన్ ఏసీ గది అయినా బస చేసేవారు ఒకే విధంగా నీటిని వాడతారు. ఏసీ గదుల్లో చెమట పట్టదు. దీనివలన వాటిల్లో బస చేసే వారికి రోజుకు రెండు మూడుసార్లు స్నానాలు చేసే అవసరం ఉండదు. అందువలన ఏసీ గదుల్లో ఉన్నవారే నీటిని తక్కువగా వాడే అవకాశం ఉంది. కానీ దేవస్థానం అధికారులు ఏవిధంగా ఆలోచించి ఏసీ గదులు అద్దెకివ్వరాదనే నిర్ణయం తీసుకున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇదీ నష్టం దేవస్థానం సత్రాల్లో మొత్తం 500 గదులుండగా వీటిలో 300 ఏసీవి. పర్వదినాల్లో మొత్తం గదులన్నీ అద్దెకిచ్చేస్తారు. అన్ సీజన్లో 150 నుంచి 200 గదులు అద్దెకిస్తారు. మిగిలినవి ఖాళీగా ఉంటాయి. శివసదన్ సత్రంలో మొత్తం 135 గదులు ఏసీ. హరిహర సదన్లో 135 గదులకు 84 ఏసీవి. ప్రకాష్ సదన్లో 64 గదులు ఏసీవి. దేవస్థానంలో ఏసీ గదుల అద్దె రూ.1,000 నుంచి రూ.2 వేల వరకూ ఉంది. ఈఓ ఆదేశాలతో సోమవారం సాయంత్రం నుంచి ఈ సత్రాలన్నింటిలో ఏసీ గదులను అద్దెకివ్వడం నిలిపివేశారు. ఫలితంగా దేవస్థానానికి రూ.లక్ష వరకూ నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. మరోవైపు ఏసీ గదుల కోసం వచ్చిన భక్తులు గత్యంతరం లేక కొండ దిగువకు చేరుకున్ని అన్నవరం గ్రామంలోని ప్రైవేటు లాడ్జిలలో ఏసీ గదులు అద్దెకు తీసుకున్నారు. ఇదే అదునుగా వారిని ఆయా లాడ్జీల యజమానులు ఏసీ గదుల అద్దెలను ఒక్కసారిగా రూ.3 వేల నుంచి రూ.5 వేలకు భక్తులను దోచుకున్నారు. అన్నవరం దేవస్థానంఫ నీటి సమస్య సాకుతో ఏసీ అద్దె గదుల నిలిపివేత ఫ దేవస్థానానికి రూ.లక్ష నష్టం ఫ గత్యంతరం లేక కొండ దిగువన లాడ్జిలలో భక్తుల బస ఫ ఇదే అదునుగా రేటు పెంచేసి, దోచుకున్న నిర్వాహకులు ఫ అసౌకర్యంపై భక్తుల ఫిర్యాదు ఫ దేవదాయ శాఖ కమిషనర్, కలెక్టర్ సీరియస్ ఫ దీంతో పునరుద్ధరణ -
ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్సై
రూ.20,000 లంచం తీసుకుంటూ చిక్కిన వైనం పిఠాపురం: పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్ రూ.20,000 లంచం తీసుకుంటూ సోమవారం రాత్రి ఏసీబీకి చిక్కారు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ కిషోర్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురం మండలం పి. దొంతమూరుకు చెందిన కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు నుంచి ఒక కేసుకు సంబంధించి రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం రాత్రి బాధితులు ఎస్సైకి లంచం ఇవ్వగానే ఏసీబీ అధికారులు వలపన్ని దాడి చేసి లంచం తీసుకుంటున్న ఎస్సైతో పాటు మధ్యవర్తిగా పనిచేస్తున్న ఎస్సై వ్యక్తిగత డ్రైవర్ శివను పట్టుకున్నారు. జరిగిన ఘటనపై కాకినాడ అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ శాఖపరమైన విచారణ చేపట్టారు. -
బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు
కాకినాడ క్రైం: బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ, ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో బెట్టింగులపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నిఘా కోసం ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. యువత, విద్యార్థులు బెట్టింగ్ల జోలికి వెళ్లొద్దని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల జీవనశైలిని గమనించి బెట్టింగుల పట్ల ఆకర్షితులైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగులు జరుగుతున్నట్లు తెలిస్తే డయల్ 112, 100 లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ హెల్ప్లైన్ నంబర్ 94949 33233కు సమాచారం ఇవ్వాలన్నారు. -
మోటారు సైకిల్, ఆటో ఢీ
ప్రభుత్వం టైలర్స్ను పట్టించుకోవడం లేదుబోట్క్లబ్ (కాకినాడ): రాష్ట్ర ప్రభుత్వం టైలర్స్ను పట్టించుకోవడం లేదని ఏపీ టైలర్స్ కో– ఆపరేటివ్ సొసైటీల పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి బీఎన్ఎస్ సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక జగన్నాథపురంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.కోటి మూలధనంతో టైలర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారన్నారు. గ్రామస్థాయిలో టైలరింగ్ సొసైటీలు ఏర్పాటు చేసి చేనేత జౌళిశాఖకు అప్పగించారన్నారు. అప్పటిలో 300 సొసైటీలు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. పాదయాత్ర సమయంలో టైలర్స్ బాధలు స్వయంగా తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతీ ఏడాది ఆర్థిక సహాయం చేసేవారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం టైలర్స్ను అసలు పట్టించుకోవడం లేదన్నారు. కులవృత్తులకు రుణాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ ప్రభుత్వం టైలర్స్ని పరిగణలోనికి తీసుకోలేదన్నారు. 145 కులవృత్తులను పరిగణలోనికి తీసుకొని టైలర్స్ను పక్కన పెట్టడం చాలా దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది పరోక్షంగా ఈ టైలరింగ్ వ్యవస్థపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ప్రభుత్వం మా టైలర్స్ న్యాయం చేయాలని కోరారు. కుల వృత్తుల్లో భాగంగా మాకు కావాల్సిన టైలరింగ్ మెషీన్లు ఇవ్వాలన్నారు. ఐదుగురికి గాయాలు జగ్గంపేట: జగ్గంపేట గ్రామ పరిధిలోని జాతీయ రహదారి 16 బ్రిడ్జిపై సోమవారం మోటారు సైకిల్, ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, మరో ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్దారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం జగ్గంపేట వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న మోటారు సైకిలిస్టు బ్రేక్ వేయడంతో అతని వెనుకాల వస్తున్న ఆటో అతన్ని ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. ఆటో బ్రిడ్జి గోడను ఢీకొని పక్కకు ఒరిగిపోయిది. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని స్థానిక సీహెచ్సీకి తరలించారు. ప్రమాద స్థలిలో గాయపడ్డ ప్రయాణికులు -
క్షయ రహిత జిల్లాకు కృషి
కాకినాడ సిటీ: జిల్లాను క్షయ రహితంగా మార్చేందుకు కలసికట్టుగా కృషి చేద్దామని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పిలుపునిచ్చారు. ప్రపంచ టీబీ దినం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టరేట్లో ఆయన ప్రారంభించారు. ఈ ర్యాలీ జెడ్పీ కార్యాలయం మీదుగా జ్యోతిబా ఫూలే విగ్రహం వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, క్షయ అంటువ్యాధి అని అన్నారు. రెండు వారాలకు మించిన దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఛాతిలో నొప్పి, కఫంలో రక్తపు జీరలు, రాత్రి పూట చెమట పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, మెడ వద్ద వాపు తదితర లక్షణాలుంటే టీబీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ సోకేందుకు ఎక్కువగా అవకాశం ఉన్న 60 ఏళ్లు దాటిన వారిని గుర్తించి, బీసీజీ టీకాలు వేయిస్తామని జేసీ తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జె.నరసింహ నాయక్ మాట్లాడుతూ, వైద్యులు సూచించిన మేరకు మందులు వాడుతూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరు నెలల్లో టీబీని నయం చేయవచ్చని అన్నారు. వ్యాధిగ్రస్తులకు పోషకాహారం, ఇతర సహాయ సహకారాలు అందించేందుకు నిక్షయ మిత్రలు కృషి చేయాలని కోరారు. వ్యాధిగ్రస్తులు ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.700 ఇవ్వడం ద్వారా నిక్షయ మిత్రలుగా మారవచ్చన్నారు. ఎన్పీఐ కార్యక్రమంలో భాగంగా క్షయ రోగులకు ప్రభుత్వం రూ.1,000 చొప్పున అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా టీబీ కంట్రోల్ అధికారి డాక్టర్ ఆర్.రమేష్, డాక్టర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
గిన్నిస్ రికార్డ్స్లో మెప్మాకు చోటు
కాకినాడ సిటీ: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మెప్మా సంస్థ చోటు సంపాదించింది. మెప్మా మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను వాప్ జెని ఆన్లైన్ యాప్ ద్వారా లక్ష్యానికి మించి విక్రయించడం ద్వారా ఈ ఘనత సాధించింది. ఈ నేపథ్యంలో జిల్లా మెప్మా పీడీ బి.ప్రియంవద కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక్క రోజులో లక్షకు పైగా ఉత్పత్తులు విక్రయించి, ఈ రికార్డ్ సాధించిన మహిళలను, పీడీ ప్రియంవదను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో జేసీ రాహుల్ మీనా, డీఆర్ఓ జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
మజ్జిగ పంపిణీకి ముహూర్తమెప్పుడో!
అన్నవరం: ప్రస్తుతం సత్యదేవుని దర్శనానికి వస్తున్న భక్తులు నానాటికీ పెరుగుతున్న వేసవి ఎండలకు తాళలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 10 గంటలకే ఉష్ణోగ్రత 30 డిగ్రీలు పైబడి నమోదవుతూండటంతో అల్లాడిపోతున్నారు. పలువురు ఎక్కువ ధరలకు శీతల పానీయాలు, చల్లని మంచినీరు కొనుక్కుని తాగాల్సి వస్తోంది. గతంలో వేసవి ప్రారంభమవుతూండగానే.. రత్నగిరిపై రామాలయం ఎదురుగా సర్క్యులర్ మండపంలోను, పశ్చిమ రాజగోపురం ఎదురుగాను భక్తులకు అల్లం, కరివేపాకు కలిపిన చల్లని మజ్జిగ పంపిణీ చేసేవారు. దీంతో భక్తులు సేద తీరేవారు. ఈ ఏడాది మాదిరిగానే 2023లో కూడా ఎండలు అధికంగా ఉండటంతో మార్చి 18 నుంచే మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. గత ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీన మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. ఈ ఏడాది కూడా అదే విధంగా చేయాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి ఈ నిర్ణయం ఎండల తీవ్రతను బట్టి తీసుకోవాలి. అంతే కానీ, గత ఏడాది పంపిణీ చేసిన తేదీ ప్రాతిపదిక కారాదు. కానీ దేవస్థానం అధికారులు మాత్రం గత ఏడాది ముహూర్తానికే ఈసారి కూడా పంపిణీ చేయాలనుకోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మజ్జిగ పంపిణీ ప్రారంభించాలని కోరుతున్నారు. -
జల్సాల కోసం బైకుల చోరీలు
ఫ నిందితుడి అరెస్టు ఫ 31 వాహనాల స్వాధీనం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): చెడు వ్యసనాలు, జల్సాల కోసం ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న నిందితుడిని ప్రకాష్ నగర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేష్బాబు, సీఐ బాజీలాల్, ఎస్సై శివప్రసాద్ ఈ వివరాలు తెలిపారు. నల్లజర్ల మండలం మర్లపూడి గ్రామానికి చెందిన తూర్ల సోమయ్య ప్రస్తుతం రాజమహేంద్రవరం మంగళవారపేటలో నివాసం ఉంటున్నాడు. అతడు చెడు వ్యసనాలు, తిరుగుళ్లకు బానిసయ్యాడు. తన జల్సాలకు అవసరమైన డబ్బుల కోసం బైకులు దొంగతనం చేసేవాడు. అలా దొంగిలించిన బైకులను నల్లజర్ల మండలం జగన్నాథపురానికి చెందిన చీర్ల కిషోర్ ద్వారా తక్కువ ధరకే విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. రాజమహేంద్రవరంలో ఇటీవల బైకు దొంగతనాలు ఎక్కువగా జరుగుతూండటంతో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు.. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న తూర్ల సోమయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా బైకు చోరీల చిట్టా బయట పడింది. దొంగిలించిన బైకులు విక్రయించడానికి సహకారం అందించిన చీర్ల కిషోర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజమహేంద్రవరం, కోరుకొండ, ఏలూరు, విజయవాడ ప్రాంతాల్లో నిందితుడు చోరీ చేసిన 31 బైకులు రికవరీ చేశారు. వాటి విలువ సుమారు రూ.16 లక్షలుంటుందని సీఐ బాజీలాల్ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సీఐ బాజీలాల్, ఎస్సై శివప్రసాద్, క్రేన్ కానిస్టేబుళ్లు కె.ప్రదీప్ కుమార్, ఎస్.వీరబాబు, వి.శివప్రసాద్లను ఎస్పీ అభినందించారు. ద్విచక్ర వాహదారులు తమ బైకుల రక్షణకు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ రమేష్బాబు కోరారు. హ్యాండిల్ లాక్తో పాటు, ఫోర్క్ లాక్ ఉపయోగిస్తే బైకు దొంగతనాలను కొంతమేరకు అరికట్టవచ్చన్నారు. ప్రస్తుతం మార్కెట్లో అధునాతన తాళాలు వచ్చాయని, వాటిని ఉపయోగించడం ద్వారా బైకులకు మరింత రక్షణ లభిస్తుందని తెలిపారు. -
30 నుంచి వసంత నవరాత్ర ఉత్సవాలు
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 30 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు వసంత నవరాత్ర ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని విఘ్నేశ్వర పూజ, పంచాంగ శ్రవణం, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, కలశ స్థాపనతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. నవరాత్ర ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజూ స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజలు ఉంటాయన్నారు. భక్తులు రూ.200 చెల్లించి, తమ గోత్రనామాలతో ఈ తొమ్మిది రోజులూ పూజలు చేయించుకోవచ్చని ఈఓ తెలిపారు. లోవకు పోటెత్తిన భక్తులు తుని రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం లోవ దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో దేవస్థానం ప్రాంగణమంతా కిటకిటలాడింది. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెన్మత్స విశ్వనాథరాజు తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,81,050, పూజా టికెట్లకు రూ.1,09,860, కేశఖండన టికెట్లకు రూ.12,280, వాహన పూజలకు రూ.3,020, కాటేజీల ద్వారా రూ.73,012, ఇతర విరాళాలుగా రూ.1,21,830 కలిపి మొత్తం రూ.5,01,052 ఆదాయం వచ్చిందని వివరించారు. నేడు పీజీఆర్ఎస్ కాకినాడ సిటీ: జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకూ కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి జిల్లా అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. అలాగే, మండల స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఆయా మండలాల అధికారులందరూ విధిగా ఉదయం 9.30 గంటలకే హాజరు కావాలని అన్నారు. డెల్టాలకు 10,700 క్యూసెక్కులు ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు ఆదివారం 10,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 3,200, మధ్య డెల్టాకు 2 వేలు, పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కుల చొప్పున వదిలారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 9.80 అడుగులకు చేరింది. -
విద్యారంగ సమస్యలపై
ఫ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే బకాయిలు చెల్లించాలి ఫ ఆర్థిక సమస్యలు తక్షణం పరిష్కరించాలి ఫ యూటీఎఫ్ డిమాండ్ ఫ రాజమహేంద్రవరంలో పోరుబాట రాజమహేంద్రవరం సిటీ: విద్యారంగంలో పేరుకుపోతున్న ఆర్థిక సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ తలపెట్టిన పోరుబాటలో భాగంగా రాజమహేంద్రవరంలోని శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఆదివారం విద్యా సదస్సు నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన రూ.30 వేల కోట్లు బకాయిల చెల్లింపులపై సరైన శ్రద్ధ చూపించడం లేదని అన్నారు. 29 శాతం ఐఆర్ ప్రకటించి, 12వ ిపీఆర్సీ వేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు తక్షణమే పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయులకు డీఏలు, పీఆర్సీ ఎరియర్లు, సరెండర్ లీవులు, మెడికల్ రీయింబర్స్మెంట్ ఎప్పటిలోగా చెల్లిస్తారో రోడ్ మ్యాప్ తెలియజేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ పోరుబాట ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలలు ఉనికి కోల్పోతున్నాయన్నారు. భవిష్యత్తులో మోడల్ పాఠశాలల పేరుతో గ్రామాల్లోని చాలా పాఠశాలలను ఎత్తివేసే యోచనతో ప్రభుత్వం ఉందన్నారు. గ్రామాల్లో కామన్ పాఠశాలలు ఉండాలని, విద్యా రంగానికి జీడీపీలో 6 శాతం నిధులు ఖర్చు చేయాలని ఎన్నో సూచనలు చేసిన కొఠారి కమిషన్ నివేదికను ప్రభుత్వాలు ఆచరించటం లేదన్నారు. ఊరి బడిని బతికించుకోవటానికి ఉపాధ్యాయులంతా నడుం కట్టాలన్నారు. అందుకోసం పిల్లలు, పిల్లల తల్లిదండ్రులతో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. నూతన విద్యావిధానం–2020 అమలు చేస్తూ ప్రభుత్వ విద్యా రంగాన్ని తుంగలోకి తొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. విద్యారంగ ప్రయోజనాలతో కాకుండా పాలకవర్గ ప్రయోజనాలతో ప్రభుత్వాలు పథకాలు అమలు చేస్తున్నాయని, అందుకే ప్రభుత్వ విద్యారంగం వెనుకబడుతోందని అన్నారు. విద్యారంగానికి నిధుల కేటాయింపుల్లో ప్రభుత్వ ఉదాశీన వైఖరి ఇలాగే ఉంటే భవిష్యత్తులో వేలాది ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యా విధానానికి పాలకులు పెద్దపీట వేయాలన్నారు. పోరాటాల ద్వారా మాత్రమే ఉపాధ్యాయుల హక్కుల సాధన జరుగుతుందన్నారు. టీచర్లు మార్కిస్టు, కమ్యూనిస్టు భావాలతో ఉన్నప్పుడు మాత్రమే నూతన మానవుల్ని, నూతన సమాజాన్ని తయారు చేయగలరన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో భారీ సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందన్నారు. కులాలు, మతాలు, వర్గాలు, ఆర్థిక ప్రలోభాలు ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తోటకూర చక్రవర్తి, అరుణకుమారి, రాష్ట్ర కార్యదర్శి కె.శ్రీదేవి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఐదు జిల్లాల్లోని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిల్లా, రాష్ట్ర బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు -
రత్నగిరిపై భక్తుల సందడి
ఫ సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ఫ 1,600 వ్రతాల నిర్వహణ ఫ రూ.40 లక్షల ఆదాయం అన్నవరం: రత్నగిరికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో ఉదయం నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని ఆదివారం 40 వేల మంది దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 1,600 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి, టేకు రథంపై వేంచేయించారు. పూజల అనంతరం పండితులు రథ సేవ ప్రారంభించారు. ఆలయ ప్రాకారంలో రథంపై మూడుసార్లు సేవ అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాల కవచాలు ధరించి (ముత్తంగి సేవ) భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
పడిపోతే.. ఫట్
మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. ముఖ్యంగా శరీర నిర్మాణానికి ఆధారంగా నిలిచే ఎముకలు చాలా త్వరగా పటుత్వాన్ని కోల్పోతున్నాయి. చిన్నగా కాలు తడబడి కింద పడితే చాలు.. ఫట్మంటూ విరిగిపోతున్నాయి. ఇక ద్విచక్ర వాహనాల పైనుంచి పడితే మల్టిపుల్ ఫ్రాక్చర్లు అవడం అనేది సర్వసాధారంగా మారిపోతోంది. చిన్నారుల నుంచి మూడు పదుల వయస్సు కూడా నిండని యువతలో సైతం ఎముకలు పటుత్వం తగ్గుతోంది.ఎముకలు గుల్లబారడం, బలహీనపడటం, తేలికగా విరిగిపోయే స్థితిని వైద్య పరిభాషలో (ఆస్టియోపొరోసిస్) అంటారు. పౌష్టికాహార లోపం, వయోభారం, కాల్షియం, డి–విటమిన్ లోపం దీనికి ప్రధాన కారణాలని ఆర్థోపెడిక్ సర్జన్లు (ఎముకల శస్త్రచికిత్స నిపుణులు) చెబుతున్నారు. వీటికి తోడు హార్మోన్ల అసమతుల్యత, వారసత్వ (జెనిటిక్) ప్రభావం, మద్యపానం, ధూమపానం, శారీరక వ్యాయామం లేకపోవడం కూడా ఎముకల ఆరోగ్యంపై ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, కాకినాడయువతలో సైతం.. ఒకప్పుడు ఆరు పదుల వయస్సు మీద పడినా చాలా మందిలో ఎముకలు బలహీన పడటమనే సమస్య ఉండేది కాదు. మారిన జీవన విధానంతో ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఆహార విధానంలో వస్తున్న మార్పులు ఎముకల పటుత్వాన్ని దెబ్బ తీస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్లనే ఈ సమస్య ఇప్పుడు అన్ని వయస్సుల వారిలోనూ కనిపిస్తోందని అంటున్నారు. యువతలో ఈ సమస్య ఉంటే జువైనల్ ఆస్టియోపొరోసిస్ అని వైద్య పరిభాషలో పిలుస్తారు.ఆహారంలో పోషకాల లోపం ఉండటం, రోడ్డు పక్కన ఆహారం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, హార్మోన్లు అవసరమైన స్థాయిలో ఉత్పత్తి కాకపోవడం, స్టెరాయిడ్ల వంటి మందులు అధికంగా వినియోగించడం, రుమటాయిడ్ ఆర్ర్థరైటిస్, లూపస్ వంటి వ్యాధుల బారిన పడిన యువతీయువకులు ఎముకల పటుత్వం కోల్పోతున్నారని వైద్యులు నిర్ధారించారు. కాల్షియం లోపంతో పుట్టడం వలన కూడా ఎముకలు గుల్లబారుతుండటం ఇటీవల ఎక్కువైందని ఇటీవల కాకినాడ జీజీహెచ్ ఆర్థోపెడిక్ విభాగ వైద్యుల పరిశీలనలో తేలింది. మహిళల్లో సైతం.. యువత తరువాత ఈ సమస్య మహిళల్లో తీవ్రంగా కనిపిస్తోందని వైద్యులు నిర్ధారించారు. ప్రతి ఐదుగురు మహిళల్లో కనీసం ఇద్దరు ఆస్టియోపొరోసిస్తో బాధ పడుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన మహిళల్లో రుతుచక్రం ఆగిపోయే (మెనోపాజ్) దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతూంటుంది. దీనివలన ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. అదే పురుషుల్లో అయితే 60 సంవత్సరాలు దాటిన వారిలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. మహిళల్లోనే ఎక్కువగా ఎముకలు గుల్లబారడానికి హార్మోన్ల లోపం, శారీరక నిర్మాణం, జీవనశైలి ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు.పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎముకలు సన్నగా, సున్నితంగా ఉండటం కూడా మరో కారణమని అంటున్నారు. గర్భిణుల్లో ఉండే కొద్దిపాటి కాల్షియాన్ని గర్భంలో ఉండే బిడ్డకు కూడా అందుతుంటుంది. దీనివల్ల కూడా వారిలో ఎముకల పటుత్వం తగ్గుతుంది. అలాగే, పిల్లలకు పాలిచ్చే సమయంలో పోషకాహారం లేకపోవడంతో శరీరంలో కాల్షియం నిల్వలు తగ్గిపోయి, ఎముకలు గుల్లబారుతుంటాయి. పాలిసిస్టిక్ ఓవరీ డిజార్డర్ (పీసీఓడీ), థైరాయిడ్, గర్భాశయ తొలగింపు (హిస్టరెక్టమీ) వంటి వాటి వలన హార్మోన్లలో విపరీతమైన అసమతుల్యత ఏర్పడి, మహిళల్లో ఎముకలు గుల్లబారుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.అప్రమత్తతే ఆయుధంచిన్నచిన్న గాయాలైనప్పుడు తక్కువ ఒత్తిడితో కూడా ఎముకలు విరిగిపోతుంటాయి. నడుము, వెన్నెముక, కాళ్లలో దీర్ఘకాలిక నొప్పులు, వెన్నెముక దెబ్బతినడం, ఎముకలు కుచించికుపోయి ఎత్తు, పొడవు తగ్గడం, నడుము, మోకాళ్లు, భుజాల జాయింట్లలో నొప్పి, నిస్సత్తువ వంటి లక్షణాలున్న వారు వైద్యుల సూచనల మేరకు తప్పనిసరిగా తగిన పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా బోన్ మినరల్ డెన్సిటీ (బీఎండీ), ఎముకల క్షీణతను గుర్తించే ఎక్స్రే, ఎంఆర్ఐ స్కాన్, కాల్షియం, విటమిన్–డి స్థాయి అంచనా వేసేందుకు రక్త, మూత్ర పరీక్షల వంటివి తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు.50 ఏళ్ల వయస్సు దాటిన మహిళలు, 65 ఏళ్లు పైబడిన పురుషులు ఆరు నెలలకోసారి వైద్యులను సంప్రదించి, ఈ పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా ఆస్టియోపొరాసిస్ ఉన్నా, నీడ పట్టున, ఏసీలలో ఎక్కువ సమయం గడిపే ఉద్యోగులు, ఇతర వర్గాలు, ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్న వారు, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపంతో వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు కచ్చితంగా తగిన పరీక్షలు చేయించుకుకోవాలి.నిర్లక్ష్యం చేయకండి ఎముకల బలహీనత ఉందనే అనుమానం ఎవరికైనా ఉంటే తక్షణం కాకినాడ జీజీహెచ్కు రావాలి. బీఎండీ పరీక్షలు జీజీహెచ్లో ఉచితంగా చేస్తున్నాం. మందులు ఉచితంగా అందిస్తున్నాం. బీఎండీ పరీక్షల కోసం ప్రత్యేక క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాం. ఆస్టియోపొరాసిస్ చిన్న సమస్య అని నిర్లక్ష్యం చేయకండి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల జీవిత కాలాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. కాల్షియం, విటమిన్–డి ఉన్న పోషకాహారం తీసుకోవాలి. అధిక ప్రొటీన్ ఉండే ఆహారంతో పాటు సూర్యరశ్మిలో గడపడం, తగినంత నిద్ర మేలు చేస్తాయి. వయస్సును బట్టి కనీసం ఏడు గంటల నిద్ర ఉండాలి. వయస్సుతో సంబంధం లేకుండా వ్యాయామాలు కచ్చితంగా చేయాలి. – డాక్టర్ ఎం,పాండురంగ విఠల్, ఆర్థోపెడిక్ విభాగాధిపతి, జీజీహెచ్, కాకినాడప్రతి నెలా 3 వేల మంది పైనే.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి (జీజీహెచ్) ఎంతో ప్రధానమైనది. ఇక్కడకు కోనసీమ, రాజమహేంద్రవరం ప్రాంతాల నుంచే కాకుండా పొరుగున ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం అనేక మంది చికిత్స కోసం వçస్తుంటారు. కేవలం ఈ ఒక్క ఆసుపత్రికే ప్రతి నెలా 3 వేల మందికి పైగానే రోగులు ఎముకల సంబంధిత సమస్యలతో వస్తున్నారు. ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కూడా కలిపితే ఈ సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. దీనినిబట్టి సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. -
బలభద్రపురంలో క్యాన్సర్ కేసుల కలకలం.. కలెక్టర్ క్లారిటీ, ఏమన్నారంటే..
తూర్పుగోదావరి: బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసుల కలకలంపై కలెక్టర్ ప్రశాంతి స్పష్టతనిచ్చారు. క్యాన్సర్ కేసులు విషయంలో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. జాతీయ సగటు కంటే తక్కువగా క్యాన్సర్ పాజిటివ్ కేసులను గుర్తించామన్నారు. జాతీయ సగటు ప్రతి 10 వేలకి 30 మందికి క్యాన్సర్ కేసుల నమోదు అవుతుండగా, బలభద్రపురం గ్రామంలో 23 కేసులను గుర్తించామన్నారు. గ్రామస్థులకు అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.ఇంటింటి సర్వే ద్వారా క్యాన్సర్ లక్షణాలున్నవారిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, వైద్య నిపుణుల సూచనలు సలహాల మేరకు ప్రజలకు తగిన వైద్య చికిత్స అందజేస్తామని కలెక్టర్ అన్నారు. నిన్న (శనివారం) ఆమె బలభద్రపురంలోని ఇంటింటి సర్వేను క్ష్రేత స్థాయిలో కలెక్టర్ పర్యవేక్షించారు. గ్రామంలోని 2,492 గృహాల్లో సుమారు 10 వేలు జనాభా ఉన్నారన్నారు. వీరిలో ఎక్కువగా క్యాన్సర్ కేసుల నమోదు నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశామన్నారు.ఇందుకోసం ఏడుగురు స్పెషలిస్ట్ వైద్యులు, ఎనిమిది మంది డాక్టర్లు, 98 సిబ్బంది ఆధ్వర్యంలో 31 బృందాలను నియమించామన్నారు. వీరు ఇంటింటి ఆరోగ్య సర్వే ద్వారా ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. వైద్య నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. క్యాన్సర్ వ్యాధి వైద్య నిపుణుల సూచనలు సలహాలను అనుసరించి క్యాన్సర్ కేసుల గుర్తించి తదుపరి వైద్య పరీక్షలను చేపట్టనున్నట్లు తెలిపారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల నుంచి స్పెషలిస్ట్ వైద్యులు, ఆంకా లజిస్టుల సూచనలను అనుసరించి వైద్య పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు. -
సర్వేల భారం తగ్గించాలి
జాబ్ చార్ట్లో పేర్కొన్న పనులకు తోడు కాలానుగుణంగా ప్రభుత్వం అదనంగా అప్పగించే విధులను ఉద్యోగులు నిర్వర్తించాల్సి వస్తోంది. కొన్ని సందర్భానుసారం చేసేవి కాగా, మరికొన్ని నిరంతరం చేయాల్సిన పనులు. వీటితో ఇటు సచివాలయ ఉద్యోగులు, అటు వీఆర్ఓలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పింఛన్ల దగ్గర నుంచి ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్య పరిష్కారంలో తలమునకలవుతున్న వారిపై అదనపు సర్వేల పేరుతో భారం మోపుతున్నారు. దీంతో, ఉద్యోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారుల ఒత్తిడితో చాలా మంది వీఆర్ఓలు, సచివాలయ ఉద్యోగులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. వీరిపై సర్వేల భారం తగ్గించాలి. – దువ్వా శేషుబాబ్జీ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ -
మెగా డీఎస్సీపై మొదటి సంతకం ఏమైంది?
కూటమి హామీలపై ధ్వజమెత్తిన ఏఐవైఎఫ్ అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే తొమ్మిడి నెలలు గడస్తున్నా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు మాటే మరిచిందని ఏఐవైఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షుడు రెడ్డి సతీష్కుమార్ ధ్వజమెత్తారు. అమలాపురంలోని ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో 17వ ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల లోగోను జిల్లా శాఖ ప్రతినిధులు శనివారం ఆవిష్కరించారు. సతీష్కుమార్, కార్యదర్శి యనమదల ఉమేష్ తదితరులు కూటమి ప్రభుత్వ హామీల వైఫల్యాలను ఎండగట్టారు. మెగా డీఎస్సీ అంటూ అధికారంలోకి వచ్చిన రోజు మొదటి సంతకంగా చేసినా నేటికీ చర్యలు లేవని ఆరోపించారు. నిరుద్యోగ భృతిపై ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలోని ఓఎన్జీసీ వనరులను గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు తరలిస్తున్న పరిణామాలపై ఏఐవైఎఫ్ జిల్లా శాఖ ప్రతినిధులు దుయ్యబట్టారు. తిరుపతిలో వచ్చే మే 15వ తేదీ నుంచి ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహా సభల్లో కూటమి ప్రభుత్వం వైఫల్యాలను చర్చించనున్నట్టు వారు తెలిపారు. జతీయ మహాసభల లోగో ఆవిష్కరణలో ఏఐవైఎఫ్ జిల్లా కోశాధికారి యాండ్ర నాగరాజు, జిల్లా శాఖ సభ్యులు నిమ్మకాయల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
టెక్నిక్తో జీవితం సెట్
● ఏప్రిల్ 30న పాలిసెట్ ● జిల్లాలో 8 పాలిటెక్నిక్ కళాశాలలు ● అందుబాటులో 1820 సీట్లు రాజమహేంద్రవరం రూరల్: ప్రపంచం సాంకేతికంగా దూసుకుపోతోంది. ఆ వేగాన్ని అందుకోవాలనే లక్ష్యంతో నేటి యువత సైతం తత్సంబంధమైన విషయ పరిజ్ఞానాన్ని అభ్యసించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంజినీరింగ్లో సైతం కంప్యూటర్ ఆధారిత కోర్సుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసే విద్యార్థుల కంటే ముందుగానే ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం పాలిటెక్నిక్ ఉత్తీర్ణులకు లభిస్తుంది. దీంతో పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులపై దృష్టిపెడుతున్నారు. సాంకేతిక విద్యకు పునాది సాంకేతిక విద్యకు పునాది వేసే పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 30వ తేదీన పాలిసెట్ జరగనుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2025ను ప్రకటించింది. పాలిటెక్నిక్ ప్రవేశం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాదిగా మార్చుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. గ్రామీణ పేద విద్యార్థులకు ఇంజినీరింగ్ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. వారికి పాలిటెక్నిక్ కోర్సులు చక్కని వేదికలని పలువురు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. పాలిసెట్ ద్వారా పలు కోర్సులతో సాంకేతిక విజ్ఞాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని సూచిస్తున్నారు. ఏప్రిల్ 15 తుది గడువు పాలిసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఈ నెల పదో తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి ఈ నెల 12వ తేదీ నుంచే ఫీజులను ఆన్లైన్లో గేట్వే ద్వారా చెల్లించే సౌకర్యం అందుబాటులో ఉంచారు. పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాయదలుచుకున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువు ఉంది. 10వ తరగతి, తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు, ఈ ఏడాది అటువంటి పరీక్షలు రాస్తున్నవారు కూడా పాలిసెట్కు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్ష 120 మార్కులకు నిర్వహిస్తారు. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఈ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 30న పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష రాయడానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లభించే కోర్సులు ఇవీ.. పాలిటెక్నిక్లో వివిధ కోర్సులను జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. పలు చోట్ల ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచికి 60 నుంచి 120 వరకు సీట్లు అందుబాటులో ఉంటాయి. పాలిటెక్నిక్ కోర్సుల కాల వ్యవధి మూడేళ్ల వరకు ఉంటుంది. ఆరు నెలల పాటు విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ కూడా ఉంటుంది. విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకునే శిక్షణ సైతం ఇస్తారు. జిల్లాలో 8 కళాశాలలు జిల్లాలో విద్యార్థులకు మొత్తం 8 పాలిటెక్నిక్ కళాశాలల్లో 1820 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అనపర్తిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రాజానగరం గైట్ పాలిటెక్నిక్, రాజానగరం ఐఎస్టీఎస్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, పిడింగొయ్యిలోని రైట్ పాలిటెక్నిక్, పాలచర్లలోని బీవీసీ పాలిటెక్నిక్, కొండగుంటూరు ఎస్ఎస్ పరిమళ పాలిటెక్నిక్, బూరుగపల్లి బెన్నయ్య పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. సద్వినియోగం చేసుకోవాలి పదో తరగతి ముగిసిన వెంటనే పాలిటెక్నిక్ చదివితే చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉన్నత విద్యతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు ఉంటాయి. పాలిసెట్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బొమ్మూరులోని జీఎంఆర్ పాలిటెక్నిక్లో ఉచిత శిక్షణ తో పాటు స్టడీమెటీరియల్ ఇస్తారు. పాలిటెక్నిక్ పూర్తయిన తరువాత ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరవచ్చు. లేదా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు. – వి.నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్, బొమ్మూరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల, ఏపీ పాలిసెట్ జిల్లా కో–ఆర్డినేటర్ పాలిసెట్కు ఉచిత శిక్షణ బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్కు హాజరయ్యే విద్యార్థులకు ఏప్రిల్ మూడో తేదీ నుంచి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఉచిత శిక్షణతో పాటు ప్రవేశపరీక్షకు సంబంధించి స్టడీ మెటీరియల్ సైతం ఉచితంగా అందజేస్తారు. ఆసక్తి గల విద్యార్థులు ముందుగా పాలిటెక్నిక్ కళాశాలలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. -
ప్రజలకు ‘చేరువ’కండి
కాకినాడ క్రైం: సమాజ హితానికి, ఫ్రెండ్లీ పోలీసింగ్ను సుసాధ్యం చేసేలా ప్రజలకు పోలీసులు చేరువ కావాలని పలువురు ఉపాధ్యాయులు కోరారు. ‘చేరువ’ పేరుతో ఎస్పీ బిందుమాధవ్ అధ్యక్షతన జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం రాత్రి నిర్వహించిన సదస్సులో జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాల ఉపాధ్యాయులు 200 మంది పాల్గొన్నారు. పోలీసుల పనితీరు, రానున్న రోజుల్లో సమాజంలో మరింత మంచి మార్పు చోటు చేసుకోవడంలో పోలీసుల పాత్ర అనే అంశాలపై చర్చించారు. జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం ఎక్కువైందని అధ్యాపకులు అన్నారు. దురలవాట్లతో యువత పెడదోవ పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలు నిర్వీర్యం కాకుండా ఉండేందుకు పోలీసులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. మద్యం, మత్తులో జోగుతున్న వారి వ్యవహార శైలితో మహిళలు, బాలికలు, యువతులు నానా అగచాట్లూ పడుతున్నారన్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలతో రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని ఎస్పీ బిందుమాధవ్ అన్నారు. శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లేలా, నిబంధనలు ఉల్లంఘించే వారి వివరాలు, ఫిర్యాదులను 94949 33233, 112 నంబర్ల ద్వారా తమకు తెలియజేయాలని కోరారు.ఫ మత్తు, ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు ఫ పోలీసులకు ఉపాధ్యాయుల సూచన -
నేడు రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు
సిద్ధమైన 45 జతల ఎడ్లు సామర్లకోట: స్థానిక ఉండూరు రైల్వే గేటు వద్ద ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులో ఆదివారం రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు జరుగుతున్నాయి. ఈ మేరకు సీనియర్ విభాగం నుంచి 8 జతలు, జూనియర్ విభాగం నుంచి 37 జతల ఎడ్లు కృష్ణ, ప్రకాశం, నెల్లూరు, విశాఖ, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఉండూరుకు చేరుకున్నాయి. శ్రీ కుమారా రామ భీమేశ్వర ఎడ్ల పరుగు పోటీలు వల్లూరి సత్యేంద్రకుమార్ మెమోరియల్ పేరుతో ఎడ్ల పరుగు పోటీల్లో పాల్గొనే రైతులే ఏర్పాటు చేయడం విశేషం. మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం పోటీలను ప్రారంభిస్తారని నిర్వాహకులు వల్లూరి దొరబాబు, సీతారామరాజు, బిక్కిన రంగనాయకులు, చేకూరి రామకృష్ణ, మలిరెడ్డి వీరేంద్రలు తెలిపారు. సీనియర్ విభాగంలో మూడు, జూనియర్ విభాగంలో ఐదు బహుమతులను ఇవ్వనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. సీనియర్ విభాగంలో కిలోమీటరున్నర, జూనియర్ విభాగంలో కిలోమీటరు దూరాన్ని ఎడ్లు పరుగెత్తాల్సి ఉంటుందన్నారు. బాలికలపై అత్యాచారయత్నం పెద్దాపురం: ఇద్దరు బాలికలపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. స్థానికుల కథనం మేరకు శనివారం స్థానిక దర్గా సెంటర్లో వ్యాపారం చేసుకుంటున్న కామేశ్వరరావు రెండు, ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలికల అరుపులతో స్థానికు లు అక్కడికి చేరుకుని దేహశుద్ధి చేసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడు అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఎస్ఐ మౌనికను వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
అనర్హులే పట్టు సాధించారు
ఫ అర్హులకు అందని ప్రోత్సాహం ఫ చేబ్రోలు పట్టు పరిశ్రమ అధికారుల మాయాజాలం ఫ ఆందోళన చేపట్టిన రైతులు పిఠాపురం: అనర్హులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నా రని మల్బరీ రైతులు ఆందోళనకు దిగారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు పట్టు పరిశ్రమ అధికారులు సిఫార్సులకు ప్రాధాన్యమిచ్చి అర్హులను విస్మరించారని రైతులు ఆరోపిస్తున్నారు. 53.19 ఎకరాల్లో 26 మంది రైతులను గుర్తించి, ఇందులో 20 ఎకరాలు దాటి మల్బరీ సాగు చేయలేదని రైతులు వాపోయారు. నువ్వులు ఇతర పంటలు సాగు చేసిన వారికి కూడా మల్బరీ నర్సరీ ప్రోత్సాహం ఎకరానికి 22,500 చొప్పు న ఇస్తున్నారని, ఇందులో అర ఎకరం సాగు చేసిన వా రికి కూడా రెండు నుంచి నాలుగు ఎకరాలలో వేసినట్టు నమోదు చేశారని పట్టు రైతులు ఆరోపించారు. అనర్హులకు పరిహారం గత ఏడాది గూళ్లు నష్టపోయిన వారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.11,30,000 సహాయం అందించినప్పటికీ అధికారులకు నచ్చిన రైతులకే పరిహారం అందించారని, మిగిలిన వారిని వదిలేసారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇన్సెంటీవ్లు కూడా సీరియల్ పాటించట్లేదని వారు పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఇష్టం వచ్చిన వారి పేర్లు నమోదు చేసి, అర్హులకు మొండిచేయి చూపారని రైతులు ఓరుగంటి చక్రధర్ రావు, సూరిబాబు, ఉలవల సురేష్, చక్రి వెలుగుల మాణిక్యం తదితరులు కోరుతున్నారు. అధికారులు అన్యాయం చేశారు గత ఏడాది నాలుగు ఎకరాల్లో మల్బరీ సాగు చేపట్టాను. గూళ్లు సక్రమంగా రాకపోవడంతో పట్టు పరిశ్రమ అధికారుల సూచనతో పంట తొలగించి నువ్వు చేను వేశాను. గుళ్లు కట్టిన రైతులకు అప్పటి ప్రభుత్వం నష్టపరిహారం అందించింది. అందులో కూడా తనను గుర్తించలేదు. నర్సరీ వేసిన వెంటనే ఎకరానికి 22,500 చొప్పున ఇవ్వాల్సిన ప్రోత్సాహం కూడా అందించలేదు. అధికారుల నిర్వాకం వల్ల రూ.మూడు లక్షల వరకు నష్టపోయాను. – ఓరుగంటి సూరిబాబు, పట్టు రైతు, చేబ్రోలు అర్హులకే ఇస్తున్నాం మల్బరీ సాగు చేసిన రైతులనే నర్సరీ ప్రోత్సాహకాలు అందించడానికి గుర్తించాం. అలాగే గూళ్లు నష్టం కూడా కొంతమంది రైతులకు అందకపోవటం వాస్తవమే. వారిని రెండో జాబితాలో పెట్టాము. అది ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదని ఇన్సెంటీవ్ పాత సీరియల్ ప్రకారమే అందిస్తాం. ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో ఆ రైతులు ఎనిమిది ఎకరాలు మల్బరీ సాగు చేసినప్పటికీ ఇప్పుడు నువ్వు చేలు వేసుకున్నారు. – టి.మోసయ్య, పట్టు పరిశ్రమ అధికారి, చేబ్రోలు -
గాంధీకాలనీలో అంబేడ్కర్కు అవమానం
● విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులు ● ఆందోళన చేపట్టిన రిజర్వేషన్ల వ్యతిరేక పోరాట సమితి ● బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాజీ హోం మంత్రి వనిత డిమాండ్ నల్లజర్ల: మండలం దూబచర్ల శివారు గాంధీకాలనీలో రహదారి పక్కనున్న అంబేడ్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. శనివారం ఉదయం విగ్రహానికి చెప్పులదండ ఉండటం చూసి అంబేద్కర్ అభిమానులు, రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దూబచర్ల–లక్కవరం రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఆందోళన 11 గంటల వరకు జరుగుతూనే ఉంది. పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని చెప్పుల దండను తొలగించి క్లూస్ టీం, డాగ్స్కాడ్లను రంగంలోకి దింపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అక్కడికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడి అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేయాలంటూ పిలుపునిచ్చారు. విద్వేషాలు రెచ్చగొట్టే వారిని అరెస్ట్ చేయాలని కోరారు. అనంతరం మాజీ హోంమంత్రి, గోపాలపురం నియోకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి తానేటి వనిత సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళనకారులకు మద్దతు ప్రకటించారు. ఈ ఘటన హేయమైన చర్య అని, పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేయించి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ఇక్కడి విగ్రహాన్ని తొలగించి నూతన విగ్రహం ఏర్పాటు చేసి పైన రూఫ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వారు ఏర్పాటు చేయకపోతే తమ పార్టీ ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండలశాఖ అధ్యక్షులు వెల్లంకి వెంకట సుబ్రమణ్యం, నాయకులు బంక అప్పారావు, ముప్పిడివెంకటరత్నం, సాలి వేణు, తొమ్మండ్రు రమేష్, నక్కా పండు, పంది సత్యనారాయణ, తొమ్మండ్రు రవి, పెండ్యాల హరేరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఏఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ దేవకుమార్, నల్లజర్ల, దేవరపల్లి, కొవ్వూరు సీఐల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళులర్పించారు. ఏఎస్పీ సుబ్బరాజుకు వినతి పత్రం అందజేస్తున్న మాజీ హోంమంత్రి తానేటి వనిత -
హైవే వాహనాన్ని ఢీకొన్న లారీ
గండేపల్లి: రోడ్డును శుభ్రం చేసే విధులకు వచ్చి పనుల్లో నిమగ్నమవుతున్న ఓ వ్యక్తి ప్రమాదానికి గురై, అక్కడిక్కడే మృతి చెందిన ఘటన ఇది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని గండేపల్లికి చెందిన దోనాదుల కృష్ణ (50) హైవే మెయింటెనెన్స్ వ్యాన్లో డ్రైవర్గా పని చేస్తున్నాడు. తాను పని చేస్తున్న వాహనాన్ని శనివారం మురారి శివారులో నిలిపి, రోడ్డుపై కోన్స్ ఏర్పాటు చేస్తున్నాడు. ఈ తరుణంలో రాజమంహేంద్రవరం వైపు వెళ్తున్న లారీ హైవే మెయింటెనెన్స్ వ్యాన్ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కృష్ణ రెండు వాహనాల మధ్య ఇరుక్కుని, అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యాడు. అతడి మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదంపై హైవే అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులు మండిపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకుని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో, హైవే మెయింటెనెన్స్ అధికారులు దిగి వచ్చారు. మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ·˘ {OyðlÐ]lÆŠ‡ §ýl$Æý‡ÃÆý‡×æ… ·˘ Ð]l$–™èl$° MýS$r$…»ê°MìS న్యాయం చేయాలంటూ ఆందోళన -
అభిప్రాయ సేకరణకు క్యూఆర్ కోడ్ బోర్డులు
తుని రూరల్: భక్తులు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానంలో క్యూఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ఈ బోర్డులను శనివారం తన కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేవస్థానంలో సౌకర్యాలు, ఇతర అంశాలపై భక్తులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అభిప్రాయాలు తెలియజేయవచ్చన్నారు. ఈ అభిప్రాయాలు నేరుగా ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్కు చేరుతాయన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్లు కేవీ రమణ, మూర్తి, ఏఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సీలేరు నుంచి 9,300 క్యూసెక్కులుసీలేరు: గోదావరి డెల్టాలో రబీ సాగుకు సీలేరు కాంప్లెక్స్ నుంచి 9,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏపీ జెన్కో అధికారులు తెలిపారు. రబీ నీటి ఎద్దడి నేపథ్యంలో గోదావరి డెల్టాకు సీలేరు జలాలను విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులు గతంలో కోరారు. ఈ మేరకు డొంకరాయి నుంచి 5 వేలు, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం నుంచి 4,300 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నామని జెన్కో అధికారులు వివరించారు. గత ఫిబ్రవరి 10వ తేదీ నుంచి శనివారం వరకూ గోదావరి డెల్టాకు 10.19 టీఎంసీల నీటిని విడుదల చేశామన్నారు. ఈ నెల 31 వరకూ నీటిని విడుదల చేయనున్నారు. శృంగార వల్లభుని సన్నిధిలో రద్దీ పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభస్వామి ఆలయం శనివారం వేలాదిగా వచ్చిన భక్తులతో రద్దీగా మారింది. స్వామివారిని సుమారు 15 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు స్వామి వారిని పూలమాలలతో విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదాన విరాళాల రూపంలో స్వామి వారికి రూ.3,22,160 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. సుమారు 4 వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. కిక్కిరిసిన రత్నగిరి అన్నవరం: పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిక్కిరిసింది. పరీక్షలు ముగియడంతో ఇంటర్ విద్యార్థులు, వారికి ఇతర భక్తులు తోడవడంతో సత్యదేవుని సన్నిధిలో రద్దీ ఏర్పడింది. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు 1,600 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 4 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సెలవు రోజు కావడంతో ఆదివారం కూడా రత్నగిరిపై భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగించనున్నారు. ఘనంగా ప్రాకార సేవ సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి, తిరుచ్చి వాహనంపై వేంచేయించారు. అర్చకుల పూజల అనంతరం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు కొబ్బరికాయ కొట్టి ప్రాకార సేవ ప్రారంభించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజన, మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. -
ఘనంగా సత్యదేవుని ఆలయ వార్షికోత్సవం
అన్నవరం: సత్యదేవుని నూతన ఆలయానికి 13 సంవత్సరాలు పూర్తయి, 14వ ఏట అడుగు పెట్టిన సంద ర్భంగా రత్నగిరిపై శుక్రవారం ఘనంగా వార్షికోత్సవం నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకూ పండితులు సత్యదేవునికి లక్ష తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. వేద పండితులు యనమండ్ర శర్మ, ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, ఉప ప్రధానార్చకుడు ఇంద్రగంటి వేంకటేశ్వర్లు, పరిచారకులు యడవిల్లి ప్రసాద్, వ్రత పురోహితులు చల్లపిళ్ల ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. 2012 మార్చి 14న జరిగిన సత్యదేవుని నూతనాలయ శిఖర ప్రతిష్ఠలో పాల్గొన్న విశ్రాంత వేద పండితుడు గొర్తి సుబ్రహ్మణ్య ఘనపాఠి, అర్చకులు గాడేపల్లి సత్యనారాయణ, శేషగిరి, విశ్రాంత వ్రత పురోహితులు ఆకొండి వ్యాసమూర్తి, ప్రయాగ వేంకట రమణలను ఈఓ వీర్ల సుబ్బారావు ఘనంగా సత్కరించారు. వారికి శాలువా కప్పి, సత్యదేవుని ప్రసాదం, ఫొటో, పారితోషికం అందజేశారు. వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి ఆలయాన్ని, ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. -
నెలాఖరులోగా పల్లె పండుగ పనులు
కాకినాడ సిటీ: పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఈ పనుల పురోగతిపై అమరావతి నుంచి ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్, ఆ శాఖల ప్రధాన కార్యదర్శి శశిభూషణ్, డైరెక్టర్ కృష్ణతేజ తదితరులు శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి కలెక్టర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, శనివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఫార్మ్ పాండ్స్ పనులు ప్రారంభించాలన్నారు. జిల్లాలో 196 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణానికి గాను 138 కిలోమీటర్ల మేర పూర్తి చేశామని చెప్పారు. 804 మినీ గోకులాలు నిర్మించామన్నారు. 2,500 ఫార్మ్పాండ్స్కు గాను 823 గ్రౌండింగ్ పూర్తి చేశామని తెలిపారు. మెప్మా టీముకు రాష్ట్ర స్థాయి అవార్డు సామర్లకోట: స్థానిక మెప్మా టీముకు రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చిందని మెప్మా సిటీ మిషన్ మేనేజర్ హుస్సేన్ తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ, మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను శ్రీవావ్ జెనీశ్రీ యాప్ ద్వారా కోటి విక్రయించాలని రాష్ట్ర మెప్మా అధికారులు లక్ష్యంగా నిర్దేశించారన్నారు. అయితే సామర్లకోటకు చెందిన మెప్మా టీము రెండు కోట్ల వరకూ ఉత్పత్తులను విక్రయించడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు సామర్లకోట మెప్మా బృందానికి రాష్ట్రస్థాయి పురస్కారం అందించారని చెప్పారు. ఈ పురస్కారాన్ని రాష్ట్ర మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్.తేజ్భరత్ కాకినాడ మెప్మా కార్యాలయానికి పంపారని తెలిపారు. ఈ మేరకు కాకినాడలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ బి.ప్రియంవద చేతుల మీదుగా మెప్మా టీము తరఫున అవార్డు అందుకున్నానని హుస్సేన్ తెలిపారు. సామర్లకోట మెప్మా టీము ఇటువంటి అవార్డులు మరిన్ని సాధించాలని హుస్సేన్ ఆకాంక్షించారు. నాణ్యతా ప్రమాణాల గుర్తింపులో ఎన్ఏబీఎల్ది కీలక పాత్ర బాలాజీచెరువు (కాకినాడ సిటీ): నాణ్యతా ప్రమాణాల గుర్తింపులో నేషనల్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ కాలిబ్రేషన్ లేబొరేటరీ (ఎన్ఏబీఎల్) కీలక పాత్ర పోషిస్తోందని జేఎన్టీయూకే ఇన్చార్జి రిజిస్ట్రార్ వి.రవీంద్రనాథ్ అన్నారు. జేఎన్టీయూకేలో ఫుడ్ టెక్నాలజీ ఆధ్వర్యాన ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్, దాని ప్రయోజనాలు అనే అంశంపై ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పరిశ్రమల ప్రతినిధులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ, జేఎన్టీయూకేలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా మెరుగైన నాణ్యతా పరీక్షలు చేస్తున్నామని అన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఆహార పరిశ్రమలు తమ ఉత్పత్తుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేందుకు చేపట్టాల్సిన విధివిధానాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఎన్ఏబీఎల్ రీజినల్ హెడ్ శ్రీకాంత్ రామచంద్రయ్య మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన పరిశ్రమలు, ప్రయోగశాలలు 9 వేలకు పైగా ఉన్నాయని తెలిపారు. ఉన్నతమైన పరిశ్రమలకు, ప్రయోగశాలలకు ఎన్ఏబీఎల్ గుర్తింపు ఇస్తామన్నారు. వికసిత్ భారత్–2047లో భాగంగా నిర్మాణంలో ఉన్న భవనాలు, ఆసుపత్రుల నిర్మాణ సామగ్రి పరీక్షిస్తామని తెలిపారు. అలాగే, రైతుల కు బాసటగా నిలిచేందుకు పొలాల్లో మట్టిని పరీక్షించి, తగు సూచనలు చేయనున్నామని చెప్పా రు. స్కూల్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ డైరెక్టర్ మాలోతు రమేష్ మాట్లాడుతూ, జేఎన్టీయూకే ఫుడ్ టెస్టింగ్ ద్వారా రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలు, ప్రభు త్వ శాఖలకు చెందిన ఆహారం, నీటి పరీక్షలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం వివిధ సంస్థల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఓఎన్జీసీ, కోరమండల్, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్, గ్రీన్కో, ఎస్ఐఎఫ్టీ తదితర సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు ప్రసాద్ం
ప్రసాద్ నిర్మాణాలివీ.. ● దేవస్థానంలోని పాత టీటీడీ భవనం స్థలంలో రూ.11.09 కోట్లతో రెండంతస్తుల అన్నదాన భవనం. ● ప్రస్తుత అన్నదాన భవనం పక్కనే రూ.9 కోట్లతో క్యూ కాంప్లెక్స్. ● ప్రకాష్ సదన్ భవనం వెనుక ప్రస్తుతం పార్కింగ్ స్థలంగా వాడుతున్న ప్రదేశంలో అటు సత్య గిరి, ఇటు రత్నగిరికి దగ్గరగా ఉండేలా రూ. 61.78 లక్షలతో టాయిలెట్ బ్లాక్ల నిర్మాణం. ● రూ.1.08 కోట్లతో వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్. ● రూ.91.96 లక్షలతో క్యూ కాంప్లెక్స్ ప్రహరీ నిర్మాణం. ● సత్రాల నుంచి ఆలయానికి, వ్రత మండపాల మధ్య భక్తులను తరలించడానికి రూ.కోటితో రెండు బ్యాటరీ కార్లు. ● అయితే వీటిలో రూ.18.98 కోట్ల వ్యయమయ్యే నిర్మాణాలకు మాత్రమే టెండర్లు పిలిచారు. మిగిలిన పనులకు కూడా తరువాత టెండర్లు పిలవనున్నారు. ● ప్రస్తుత టెండర్లు 16 శాతం తక్కువకు ఖరారవడంతో రూ.3 కోట్లు ఆదా అయ్యాయి. ఈ మొత్తాన్ని కూడా దేవస్థానంలో నిర్మాణాలకు ఉపయోగించేలా అధికారులు ప్రయత్నించాలని పలువురు కోరుతున్నారు. ఫ రూ.18.98 కోట్ల అంచనాతో టెండర్లు ఫ 16 శాతం తక్కువకు దక్కించుకున్న సంస్థ ఫ త్వరలో పనులు ప్రారంభం అన్నవరం: కేంద్ర ప్రభుత్వ పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్పిరిచ్యువల్ అగ్మెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీము కింద సత్యదేవుని సన్నిధిలో వివిధ నిర్మాణాలకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. ఈ పథకం ద్వారా రూ.18.98 కోట్ల అంచనాతో చేపట్టనున్న వివిధ పనులకు టెండర్లు ఖరారయ్యాయని టూరిజం కార్పొరేషన్ అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రసాద్ పనులకు తొలిసారి అక్టోబర్ 9న రెండు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. వీటిని అదే నెల 25న ఖరారు చేయాల్సి ఉండగా, గత డిసెంబర్లో రద్దు చేశారు. తిరిగి జనవరి 9న రెండోసారి టెండర్లు పిలిచారు. ఈసారి రూ.18.98 కోట్లకు ఒకే ప్యాకేజీ కింద టెండర్లు ఆహ్వానించారు. వీటిని జనవరి 24న ఖరారు చేయాల్సి ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తదితర కారణాలతో సుమారు రెండు నెలల పాటు కాలయాపన జరిగింది. కూటమి ప్రభుత్వంలోని ఒక మంత్రి సన్నిహిత కాంట్రాక్టర్ కోసమే ఇలా జాప్యం చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఎడతెగని ఈ జాప్యంపై శ్రీసాక్షిశ్రీ పలు కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేసి, ఎట్టకేలకు టెండర్లు ఖరారు చేశారు. రెండోసారి నోటిఫికేషన్ విడుదల చేయగా ఆరుగురు కాంట్రాక్టర్లు కొటేషన్లు దాఖలు చేశారు. వీటిలో సాంకేతిక అర్హతలు లేవనే కారణంతో రెండింటిని తిరస్కరించారు. మిగిలిన నాలుగింటిలో శ్రీకాకుళానికి చెందిన అనంతరాములు కంపెనీ 18 శాతం తక్కువకు కొటేషన్ దాఖలు చేసి, టెండర్ దక్కించుకుంది. ఆ కంపెనీ అంచనా వ్యయం కన్నా దాదాపు రూ.3 కోట్ల తక్కువకు పనులు చేయనుంది. పదేళ్ల నిరీక్షణకు తెర ప్రసాద్ పథకానికి అన్నవరం దేవస్థానం ఏ ముహూర్తాన ఎంపికై ందో కానీ, ఆది నుంచీ ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను యాత్రా పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ 2015లో నిర్ణయించారు. దీనికోసం రూపొందించిన ప్రసాద్ స్కీముకు దేశవ్యాప్తంగా పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఎంపిక చేయగా, వీటిలో అన్నవరం దేవస్థానం కూడా చోటు దక్కించుకుంది. ఈ పథకం నిధుల కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి కాకినాడ ఎంపీ వంగా గీత ఎన్నోసార్లు నాటి కేంద్ర పర్యాటక మంత్రి కిషన్రెడ్డితో, ఆ శాఖ కార్యదర్శులతో సమావేశమై అనుమతి సాధించారు. పదేళ్ల కాలయాపన అనంతరం ఎట్టకేలకు ఈ పథకం పనులకు టెండర్లు ఖరారయ్యాయి. రూ.100 కోట్లతో ప్రతిపాదనలు ప్రసాద్ స్కీము కింద రత్నగిరి పైన, దిగువన వివిధ నిర్మాణాలు చేపట్టేందుక రూ.100 కోట్లతో దేవస్థానం ప్రతిపాదనలు పంపించింది. అంత మొత్తం ఇవ్వలేమని రూ.50 కోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు. ఆ మేరకు తిరిగి ప్రతిపాదనలు పంపించారు. అక్కడి నుంచి గీచిగీచి బేరాలాడినట్లు చివరకు రూ.23 కోట్లు ఇవ్వడానికి అంగీకరించారు. ఈ నిధులతో చేపట్టే పనులకు గత ఏడాది మార్చి 7న ప్రధాని మోదీ జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఇది జరిగిన ఏడాది తరువాత ఈ పనులకు టెండర్లు ఖరారు చేయడం గమనార్హం. వచ్చే నెలలో ప్రారంభం అన్నవరం దేవస్థానంలో ప్రసాద్ స్కీము పనులకు పిలిచిన రీ టెండర్లు ఖరారు చేశారు. వచ్చే నెలలో ఈ నిర్మాణాల పనులు మొదలవుతాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తదితర కారణాలతో టెండర్ల ఖరారు ఆలస్యమైంది. – ఈశ్వరయ్య, సీఈ, టూరిజం శాఖ -
ఏపీఎస్పీ సిబ్బందికి ఉగాది పురస్కారాలు
కమాండెంట్ నాగేంద్రరావుకు మహోన్నత సేవా పతకం కాకినాడ రూరల్: కాకినాడ ఏపీఎస్పీ మూడవ బెటాలియన్ ప్రస్తుత కమాండెంట్ ఎం.నాగేంద్రరావుకు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది మహోన్నత సేవా పతకం లభించింది. ఏపీ పోలీసు అండ్ ఫైర్ సర్వీసు పతకాలు– సేవా పతకాలను ఉగాది – 25కు శుక్రవారం ప్రకటించింది. నాగేంద్రరావు అక్టోపస్ ఎస్పీ (ఆపరేషన్స్ అండ్ అడ్మిన్)గా పనిచేసి ఇటీవల ఏపీఎస్సీ 3వ బెటాలియన్కు వచ్చారు. అక్టోపస్ ఎస్పీగా అందించిన సేవలకు గాను ఆయనకు ఉగాది పురస్కారం లభించింది. 13 మంది ఏపీఎస్పీ బెటాలియన్ సిబ్బందికి పురస్కారాలు కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ సిబ్బంది 13మందికి పతకాలు వరించాయి. అడిషనల్ కమాండెంట్ దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్ బి.శ్రీనివాస బాబ్జీ ఉత్తమ సేవా పతకాలు పొందారు. కఠిన సేవా పతకం హెచ్సీ బీవీ అప్పన్న, సేవా పతకాలను ఆర్ఐలు బి.శ్రీనివాసరావు, కె.రవిశంకరరావు, ఆర్ఎస్సైలు ఎం.,రాజా, డి.నిర్మలకుమార్, బి.రవిశంకరబాబు, ఏఆర్ఎస్సైలు బి.మోహనరావు, జి.ఆదియ్య, టి.సూర్యనారాయణ, డి.రామనాయుడు, ఎన్.జాకబ్రాజు పొందారు. -
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకూ పోరాటం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొత్తపల్లి: రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే వరకూ పోరాటం ఆగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. మండలంలోని కొమరగిరిలో గత ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని కొంతమంది కబ్జా చేయడంపై శుక్రవారం సీపీఐ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భూపోరాటం నిర్వహించారు. అనంతరం ఇళ్ల స్థలాలు లేని లబ్ధిదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని కబ్జా చేస్తే అధికారులు పట్టించుకోకపోవడానికి కారణమేమిటని ప్రశ్నించారు. రెవన్యూ అధికారులు సైతం కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఉద్దేశంతో ఫేజ్–2లో 72ఎకరాల భూమిని రూ.32 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారన్నారు. దానిలో కొంతవరకూ మెరక చేశారని, అయితే సుమారు 42ఎకరాల భూమి మెరక చేయకపోవడంతో కొంతమంది కబ్జాచేసి భూమిని సాగు చేసుకుంటున్నారన్నారు. కొన్ని సంవత్సరాలుగా భూమిని కబ్జా చేసి సాగు చేస్తున్నా అధికారులు కొమ్ము కాస్తున్నారన్నారు. కొమరగిరి భూమి విషయంపై త్వరలో ఉపముఖ్యమంత్రిని, రెవెన్యూ శాఖామంత్రిని కలుస్తామన్నారు. డిప్యూటీ తహసీల్దార్ మురళీకృష్ణ స్థలం వద్దకు వచ్చి పేదల నుంచి 1,400 ఇళ్ల స్థలాల దరఖాస్తులను స్వీకరించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డేగా ప్రసాద్ మాట్లాడుతూ అధికారులు భూమిని పేదలకు పంచాలని లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పి.సత్యనారాయణ, కేశవరపు అప్పలరాజు, మహిళ సమాఖ్య జిల్లా కన్వీనర్ భవాని, సమాచార హక్కుల వేదిక నాయకుడు బి.సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా కన్వీనర్ వీరబాబు పాల్గొన్నారు. -
నేత్రాలకు చల్లని నేస్తాలు!
● కూలింగ్ కళ్లద్దాలతో కంటికి రక్షణ ● రోజు రోజుకూ పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు ● కూలింగ్ గ్లాస్ కళ్లజోడుతో ఎండలో ప్రయాణం శ్రేయస్కరం ● జాగ్రత్తలు సూచిస్తున్న కంటి వైద్య నిపుణులు కొత్తపేట: వేసవిలో శరీరంతో పాటు కళ్లమీద కూడా శ్రద్ధ చూపడం చాలా మంచిది. శరీరానికి వేడి చేయకుండా ఎప్పుడూ చల్లదనంలో ఆరోగ్య స్థితి మెరుగ్గా ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటాం. గొంతెండిపోతే గుక్కెడు నీరు గానీ, శీతల పానీయాలు గానీ సేవించి సేద తీరుతాం. కానీ కళ్ల గురించి మాత్రం అంతలా పట్టించుకోం. కళ్లు పట్ల అశ్రద్ధ, నిర్లక్ష్యం కంటి వ్యాధులకు కారణమవుతాయి. వేసవిలో సరైన కంటి జాగ్రత్తలు తీసుకోకపోతే అపాయమేనని నేత్ర వైద్యులు చెబుతున్నారు. అత్యవసర సమయంలో ఎండలో తిరిగే ప్రతి ఒక్కరూ కూలింగ్ గ్లాసెస్ తప్పనిసరిగా వాడాలని చెబుతున్నారు. చలువ కళ్లజోళ్లు వాడడం వల్ల ఎండ వేడిమి నుంచి కళ్లను కాపాడుకోవచ్చని నేత్ర వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చూపు మందగించే ప్రమాదం కళ్లలోని అతి సున్నితమైన భాగాలకు వేడి తగలడం వల్ల చూపు మందగించే ప్రమాదం ఉంది. శరీర భాగాల్లో కళ్లు ఎంతో సున్నితమైనవి. ప్రధానమైనవి. మిట్ట మధ్యాహ్నం లేదా ఉష్ణ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ప్రయాణం చేయడం కంటికి మంచిది కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో వాహనం నడిపితే హెల్మెట్ లేదా కళ్లజోడును తప్పనిసరిగా పెట్టుకోవాలి. దుమ్ము, ధూళి కంటిలో పడడం వల్ల విపరీతమైన కంటి దురదలు ఏర్పడతాయి. నల్లగుడ్డు చుట్టూ పొరలు రావడం. ఎరన్రి చారలు, కంటి వెంట తీగలాంటి స్రావం కారడం జరుగుతుంది. ఇటువంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి జీవితాంతం చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. నలపకూడదు మధ్యాహ్నం సమయంలో ఎండ చాలా తీవ్రంగా ఉంటుంది కళ్లకు రక్షణ కవచాలు లేకుండా తిరిగితే మంట పుట్టడంతో పాటు కళ్లు ఎరబ్రడ తాయి. ఇటువంటి సందర్భాల్లో కళ్లను చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వెంటనే సమీపంలోని ఉన్న నేత్ర వైద్యులను సంప్రదించాలి. కళ్లను నలపడం చేయరాదు. తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. బైక్, కారు లేదా మరేదైనా వాహనం నడుపుతున్నప్పుడు సన్ గ్లాసెస్ ధరించడం వల్ల దుమ్ము కణాలు లేదా వేడి గాలి కళ్లలోకి రాకుండా చేస్తుంది. ద్విచక్ర వాహనదారులు వీలైనంత వరకు క్లోజ్డ్ హెల్మెట్లను వాడటం మంచిది. 100% యూవీ రక్షణను అందించే నాణ్యమైన సన్ గ్లాసెస్ని వాడాలి. యూవీ కిరణాలు కళ్ళను దెబ్బతీస్తాయి. ఇది కంటి శుక్లం, మాక్యులార్ డీజెనరేషన్ వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి యూవీఏ, యూవీబీ కిరణాలను నిరోధించే సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. కంటి చూపు మెరుగు కోసం ఆహారం కంటి చూపు మెరుగుపరుచుకోవడానికి సమతుల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రధానంగా తీసుకునే ఆహారంలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు. ఎ, సి విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు అధికమొత్తంలో తీసుకోవాలి. ఎందుకంటే ఇవి పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. పాలకూర వంటివి కూడా కంటి ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి. అలాగే ఒమెగా–3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు తీసుకోవాలి. ఇవి కంటి చూపు మెరుగు పడేందుకు దోహదపడతాయి. జాగ్రత్తలు పాటించాలి వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వెలుగును తట్టుకోలేని స్థితి ఈ కాలానికి ఉంది. జీవన ఉపాధి దృష్ట్యా ఎక్కువగా ఎండ బారిన పడిన వారు వారి విధుల మూలంగా ద్విచక్రవాహనాలపై ప్రయాణించినప్పుడు, రోడ్లపై వెళ్లేటప్పుడు వేసవిలో ఎండ ప్రభావంతో వచ్చిన వెలుతురు, వేడికి కళ్లకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వాళ్ల కళ్లలోని రక్షణ పొర కరిగిపోయి, వారి కళ్లు ఫొటో సెన్సిటివిటీకి గురవుతాయి. దాంతో కళ్లు మరింత సున్నితమైపోయి, క్రమేపీ వెలుగును చూడలేని స్థితికి చేరుకుంటాయి. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా బయటకు వెళ్లినప్పుడల్లా చలువ కళ్లద్దాలను, హెల్మెట్ లేదా క్యాప్ ధరిస్తూ జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ కె.శేషగిరిరావు, ప్రముఖ కంటి వైద్యుడు, కొత్తపేట -
త్వరలో కొత్త ట్రస్ట్బోర్డు?
● ముగిసిన అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి కాలపరిమితి ● ఈ నెలాఖరులోగా ఏర్పాటయ్యే అవకాశం ● ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ఆశావహుల పేర్లు తీసుకున్న ప్రభుత్వం ● కొత్త ట్రస్ట్బోర్డులో చైర్మన్తో కలిసి 18 మంది సభ్యులు? ● ఇద్దరు చొప్పున అవకాశం కల్పించాలంటున్న బీజేపీ, జనసేన ● దాత, శ్రీలలితా ఇండస్ట్రీ అధినేత మట్టే సత్యప్రసాద్ పేరు సిఫారసు అన్నవరం: స్థానిక శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి త్వరలో నూతన ధర్మకర్తల మండలిని నియమించనున్నారు. కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి సారించింది. దేవస్థానం ధర్మకర్తల మండలి (ట్రస్ట్బోర్డు) కాల పరిమితి ఫిబ్రవరి ఎనిమిదో తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. నూతనంగా ఏర్పాటయ్యే ధర్మకర్తల మండలిలో సభ్యత్వాల కోసం పేర్లు పంపించాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలువురు శాసనసభ్యులను తెలుగుదేశం పార్టీ అధిష్టానం గతంలోనే కోరింది. దీంతో మంత్రులు, ఆయా శాసనసభ్యులు ఆశావహుల జాబితాలను అధిష్టానానికి అందచేశారు. ఈ నెలాఖరులోగా ట్రస్ట్బోర్డు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 18 మందికి అవకాశం కొత్త ట్రస్ట్బోర్డులో చైర్మన్తో సహా 18 మంది సభ్యులు ఉంటారని సమాచారం. దేవదాయశాఖ చట్టం ప్రకారం దేవస్థానం వ్యవస్థాపక కుటుంబానికి చెందిన ఐవీ రోహిత్ ఈ బోర్డుకు చైర్మన్గా నియమితులవ్వనున్నారు. సభ్యులుగా 17 మందిని నియమించనున్నారు. వీరిలో సుమారు 12 మంది పురుషులు, ఐదు లేదా ఆరుగురు మహిళలు ఉంటారని సమాచారం. అన్ని సామాజికవర్గాలతో బాటు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, వర్గాలకు చెందిన వారికి ట్రస్ట్బోర్డులో స్థానం కల్పించనున్నట్టు సమాచారం. గతంలో 16 మందితో.. 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం ఉండాలని, 50 శాతం మహిళలు ఉండాలని భావిస్తూ మొత్తం 16 మందితో ట్రస్ట్బోర్డు ఏర్పాటు చేసింది. వీరిలో ఏడుగురు మహిళలు. మొత్తం 15 మందిలో ఎనిమిది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కావడం విశేషం. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన హామీ ప్రకారం నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా ట్రస్ట్బోర్డులో స్థానం కల్పించారు. దేవస్థానం చరిత్రలో ఈ విధంగా సగం మంది మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పిస్తూ ఏర్పాటైన ట్రస్ట్బోర్డుగా నిలిచిపోయింది. కొత్త ట్రస్ట్బోర్డు సభ్యత్వాల కోసం మంత్రులు, ఎంఎల్ఎ లపై వత్తిడులు: అన్నవరం దేవస్థానం ట్రస్ట్బోర్డు సభ్యత్వాల కోసం పైరవీలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు, మంత్రుల పై దిగువ శ్రేణి నాయకులు ఒత్తిడులు తెస్తున్నారు. అయితే ఇప్పటికే వారు ఈ పదవుల కోసం కొన్ని పేర్లు సిఫారసు చేసినట్టు సమాచారం. ● దేవస్థానానికి ఎక్కువ మొత్తంలో విరాళాలు సమర్పించిన దాతగా, స్వామి, అమ్మవార్లకు వజ్రకిరీటాలు చేయించడం, రూ.ఐదు కోట్లు వ్యయంతో ప్రసాదం భవనం నిర్మించిన పెద్దాపురానికి చెందిన శ్రీలలితా రైస్ ఇండస్ట్రీ ఎండీ మట్టే సత్యప్రసాద్ పేరు ఆ నియోజకవర్గం నుంచి సిఫారసు చేసినట్లు సమాచారం. ● ట్రస్ట్బోర్డులో బీజేపీ, జనసేన నుంచి ఇద్దరు చొప్పున నియమించాలని ఒత్తిడి వస్తున్నా ఒక్కొక్కరికి మాత్రమే అవకాశం ఉండనుంది. ఒకవేళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గట్టిగా పట్టుబడితే రెండో వ్యక్తిని ఆ పార్టీ నుంచి నియమించే అవకాశం ఉంది. ● సత్యదేవుని ఆలయం కలిగిన ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి గతంలో మాదిరిగా ఇద్దరికి ట్రస్ట్బోర్డులో అవకాశం కల్పించనున్నారు. అయితే ఒకరు టీడీపీ, ఇంకొకరు జనసేన లేదా బీజేపీ నుంచి నియమితులవుతారని అంటున్నారు. ● జగ్గంపేట, కాకినాడ టౌన్ లేదా కాకినాడ రూరల్, తుని నియోజకవర్గాల నుంచి టీడీపీ నుంచి ఒక్కొక్కరికి ట్రస్ట్బోర్డులో అవకాశం లభించే అవకాశం ఉంది. ● అనపర్తి నియోజకవర్గం, కోనసీమ నుంచి కూడా ఒక్కొక్కరికి అవకాశం కల్పించనున్నారు. ● గతంలో గుంటూరు జిల్లా నుంచి కూడా ఒకరికి ఈ ట్రస్ట్బోర్డులో ప్రాతినిధ్యం కల్పించారు. అదే ఆనవాయితీని ఈ సారి కూడా పాటిస్తారంటున్నారు.అన్నవరం దేవస్థానం -
మెడికల్ షాపుల్లో ‘విజలెన్స్’ తనిఖీలు రికార్డులు సక్రమంగా లేని నాలుగు షాపులపై చర్యలు
అమలాపురం టౌన్: స్థానికంగా ఉన్న పలు మెడికల్ షాపులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్స్, వాణిజ్య పన్నులు, లీగల్ మెట్రాలిజీ శాఖల అధికారులు మూకుమ్మడిగా, ఆకస్మికంగా శుక్రవారం దాడులు నిర్వహించారు. పట్టణంలోని ఎ టు జెడ్, మోహన్, లీలాశ్రీ, శ్రీదేవి మెడికల్ షాపుల్లో ఆ నాలుగు శాఖలకు చెందిన అధికారుల బృందం దాడులు నిర్వహించాయి. మెడికల్ షాపుల్లో ఎక్కడా ఎలాంటి నిషేధిత మందులు లభ్యం కాలేదని విజిలెన్స్ సీఐ మధుబాబు తెలిపారు. నాలుగు మెడికల్ షాపుల్లో మందుల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని అధికారులు గుర్తించారు. వాటిపై చర్యలకు సిఫారసు చేస్తూ డ్రగ్ ఇన్స్పెక్టర్ మురళీ తమ శాఖ ఏడీకి లేఖ రాశారు. త్వరలోనే ఈ షాపులకు షోకాజ్ నోటీసులు రానున్నాయని అధికారులు తెలిపారు. తనిఖీలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిర్వహించారు. తనిఖీల్లో పోలీస్ అధికారులు కూడా పాల్గొన్నారు. అధికారుల ఆకస్మిక దాడుల భయంతో పట్టణంలోని మిగిలిన మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీలకు చెందిన షాపులను ముందు జాగ్రత్తగా మూసివేశారు. ఈ దాడుల్లో డీసీటీవో నవీన్కుమార్, లీగల్ మెట్రాలిజీ ఇన్స్పెక్టర్ మురళీ పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక
పెదవేగి: మండలంలోని విజయరాయి సీతారామ కల్యాణ మండపంలో శుక్రవారం కోకో రైతుల రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బొల్లు రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శిగా కె.శ్రీనివాస్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఎస్.గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బోళ్ల సుబ్బారావు (పశ్చిమగోదావరి), పానుగంటి అచ్యుతరామయ్య (ఏలూరు), ఉప్పుగంటి భాస్కరరావు (కోనసీమ), గుదిబండి బండి వీరారెడ్డి (ఏలూరు), మార్ని శ్రీనివాసరావు (తూర్పుగోదావరి) సహా య కార్యదర్శులుగా ఉప్పల కాశీ (తూర్పుగోదావరి), కొసరాజు రాధాకష్ణ (ఏలూరు), కొప్పిశెట్టి ఆనంద వెంకటప్రసాద్ (కోనసీమ), కోశాధికారిగా జాస్తి కాశీ బాబు (ఏలూరు) మరో 35 మందితో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. కోకో రైతుల సమస్యలను పరిష్కరించాలని 24, 25 తేదీల్లో కోకో సాగు చేస్తున్న అన్ని జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆలిండియా సపక్ తక్రా పోటీల్లో ప్రతిభఅమలాపురం టౌన్: ఆలిండియా పోలీస్ క్రీడా పోటీల్లో వరుసగా మూడోసారి పతకాలు సాధించిన యాండ్ర గౌతమ్ను ఎస్పీ బి.కృష్ణారావు తన కార్యాలయంలో శుక్రవారం అభినందించారు. ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకూ హర్యానా రాష్ట్రం మడగడలో జరిగిన 73వ ఆలిండియా పోలీస్ క్రీడా పోటీల్లో వాలీబాల్ క్లస్టర్ క్రీడా విభాగం విభాగంలో గౌతమ్ కాంస్య పతకాన్ని సాధించారు. జిల్లాకు చెందిన 2108 బ్యాచ్కు చెందిన సివిల్ కానిస్టేబుల్ గౌతమ్ సపక్ తక్రా క్రీడలో నైపుణ్యం సాధించాడు. గౌతమ్ సపక్ తక్రా క్రీడలో రాణిస్తూ ఇప్పటి వరకూ మూడు కాంస్య పతకాలు సాధించడం అభినందనీయమని ఎస్పీ కృష్ణారావు అన్నారు. 2003లో పంజాబ్ రాష్ట్రం జలంధర్లోజరిగిన, 2024లో మహారాష్ట్రలోని నాగపూర్లో జరిగిన ఆలిండియా పోలీస్ క్రీడల్లో కాంస్య పతకాలు సాధించి ఇప్పుడు మరో కాంస్య పతకాన్ని కై వసం చేసుకోవడం విశేషమని ఎస్పీ కృష్ణారావు పేర్కొన్నారు. 70 రకాల డ్రగ్స్ పట్టివేత కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డ్రగ్స్ కంట్రోల్, విజిలెన్స్, ఈగల్ టీం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 70 రకాల నార్కోటిక్ డ్రగ్స్ను పట్టుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు చేపట్టిన ఈ దాడుల్లో సుమారు రూ.3 లక్షలకు పైగా విలువైన మత్తు మందులను అధికారులు గుర్తించారు. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, రావులపాలెంతో పాటు పలు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. డ్రగ్స్ కంట్రోలర్ ఏడీ డి.నాగమణి, విజిలెన్స్ ఏఎస్పీ ఎం.స్నేహిత ఈ దాడుల్లో పాల్గొని అనధికారంగా విక్రయించిన మత్తుమందులతో పాటు, పలు రకాల ఔఽషధాలను గుర్తించారు. నార్కోటిక్ డ్రగ్స్ హోల్సేల్ దుకాణల నుంచి ఎటువంటి బిల్లులు లేకుండా నేరుగా రిటైల్ దుకాణాలకు అమ్మడం, వారు తిరిగి వినియోగదారులకు విక్రయించడం ఈ దాడుల్లో కనుగొన్నారు. డాక్టర్ చీటీ లేకుండా మందులు అమ్మడం, బిల్లులు లేకుండా అమ్మడం, కొనడం నేరాల కింద ఉమ్మడి తూర్పుగోదారి జిల్లా పరిధిలో 20 దుకాణాలపై కేసులు నమోదు చేశారు. -
స్టేషన్కు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడాలి
కాకినాడ క్రైం: స్టేషన్కు వచ్చే ఫిర్యాదీలు, ఇతరులతో మర్యాద ఇచ్చి మాట్లాడాలని ఎస్పీ బిందుమాధవ్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు, బాలికలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. శక్తి యాప్ను వారి సెల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేయించి, హెల్ప్లైన్ నంబర్లు ప్రదర్శించాలని సూచించారు. వేసవిలో రాత్రి వేళ నేరాలు అధికంగా జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తం కావాలని అన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సాంకేతికతను ఉపయోగించి కేసులు ఛేదించే వారిని ఏబీసీడీ అవార్డుకు సిఫారసు చేస్తామని చెప్పారు. చైన్ స్నాచింగ్ను నియంత్రించాలన్నారు. రౌడీ షీటర్ల రికార్డులు ఎప్పడికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై తగిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల నిఘా తప్పకుండా ఉండాలని స్పష్టం చేశారు. రహదారి భద్రతపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏలేశ్వరం బంగారం దుకాణం చోరీ కేసును ఛేదించిన, గొల్లపాలెం స్టేషన్ పరిధిలో అనుమానాస్పద వ్యక్తి నుంచి తుపాకులు స్వాధీనం చేసుకుని నేరాన్ని కట్టడి చేసిన అధికారులను, సిబ్బందిని ఎస్పి అభినందించారు. -
రైలు నుంచి జారి పడి మహిళ మృతి
సామర్లకోట: ఒడిశాకు చెందిన ఒక యువతి బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళుతున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ నుంచి గురువారం జారి పడి మృతిచెందిన సంఘటన ఇది. ఏసీ బోగీలో ప్రయాణం చేస్తున్న సుభాష్మిత దాసు (33) జి. మేడపాడు సమీపంలో బోగీ నుంచి పడిపోయింది. దీనిని గమనించిన ప్రయాణికులు వెంటనే రైలు చైన్ లాగారు. డ్రైవర్, గార్డులు రైలు నుంచి మహిళ పడిపోయిన విషయాన్ని సామర్లకోట స్టేషన్ మేనేజరు ఎం.రమేష్కు సమాచారం ఇచ్చారు. సుభాష్మిత కొన ఊపిరితో ఉన్న విషయాన్ని తెలుసుకొని వెనుక వస్తున్న సరార్ ఎక్స్ప్రెస్లో మహిళను ఎక్కించి సామర్లకోట తీసుకురావాలని మేడపాడులోని రైల్వే సిబ్బందికి సూచించారు. ఈ మేరకు స్టేషన్ మేనేజరు 108కు సామర్లకోట రైల్వే స్టేషన్కు వచ్చే విధంగా సమాచారం ఇచ్చారు. సర్కార్ ఎక్స్ప్రెస్లో సామర్లకోట చేరిన మహిళను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు 108 సిబ్బంది నిర్ధారించారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె థర్డు ఏసీలో ప్రయాణం చేస్తున్నట్లు స్టేషన్ మేనేజరు తెలిపారు. సుభాష్మిత మృతిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని విజయవాడ డీఆర్ఎం కార్యాలయం నుంచి సూచనలు వచ్చినట్లు తెలిసింది. -
అక్షర దీప్తి.. చైతన్య స్ఫూర్తి
కొరవడిన ప్రభుత్వ ప్రోత్సాహం ప్రచార మాధ్యమాలు పెరిగిన ప్రస్తుత తరుణంలో సాహిత్యం మరింతగా అందుబాటులోకి వస్తోంది. తెలుగు భాషపట్ల ఆసక్తి ఉన్నవారు కవితలు, కథలు రాసేందుకు ముందుకొస్తున్నారు. అయితే వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందడం లేదు. స్వశక్తితో తమ కవిత్వాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కవులు అనేక వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్నారు.అద్దం అరచేతిలో ఇమిడిపోయేదే అయినా.. ఆకాశాన్ని చూపిస్తుంది. చూడటానికి చిన్నగానే కనిపించినా.. జాబిల్లి జగతికి చల్లని వెలుగులను పంచుతుంది. పుస్తకం చిన్నదే అయినా మస్తిష్కానికి వికాసాన్నిస్తుంది. అక్షరం చిన్నదే అయినా నిత్య చైతన్య దీప్తిని, స్ఫూర్తిని నింపుతుంది. కవితా వాహినిగా మారి.. మనిషి లోపల దాగున్న అసలు మనిషిని నిత్యం పరిచయం చేస్తుంది. అర్థం చేసుకునే మనసుతో చదివితే.. నడవడికలో లోపాలను చక్కదిద్ది మనిషిని మనీషిగా చక్కదిద్దుతుంది. మానవ సమాజాన్ని మరో ప్రపంచ వైపు నడిపిస్తుంది.ఇదీ నేపథ్యం ఐక్యరాజ్య సమితి విద్యా, శాసీ్త్రయ, సాంస్కృతిక సంస్థ మార్చి 21వ తేదీన ప్రపంచ కవితా దినోత్సవం నిర్వహించాలని 1999లో ప్రకటించింది. ఈ నేపథ్యంలో భాషా వైవిధ్యానికి మద్దతు పలికేందుకు, అంతరించిపోతున్న భాషలను ప్రోత్సహించేందుకు, కవిత్వాన్ని ప్రోత్సహించేందుకు 27 ఏళ్లుగా కృషి సాగుతోంది. కపిలేశ్వరపురం: గోదారి నేలపై పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలనే వస్తువుగా స్వీకరించి ఎంతో మంది కవులు అపార సాహిత్యాన్ని సృజించారు. సమాజోద్ధరణకు శ్రమించారు. ఆవంత్స సోమసుందర్, బోయి భీమన్న, అద్దేపల్లి రామమోహనరావు, దాట్ల దేవదానంరాజు వంటి ప్రముఖులతో పాటు.. ఎంతో మంది కవులు ప్రపంచం నలుమూలలా సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలకు గురైన పీడితులపై ద్రవించిన హృదయంతో స్పందించారు. నేడు ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. గోదారి తీరాన కవిచంద్రులు ● పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం 6వ అధిపతి కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా విశేషంగా సాహిత్యాన్ని సృజియించారు. 1885 ఫిబ్రవరి 28న ఆయన జన్మించారు. మాతృ భాష కానప్పటికీ తెలుగులో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న కాకినాడలో ఆయన జయంతి ఘనంగా నిర్వహించారు. ● దేవులపల్లి కృష్ణశాస్త్రి సామర్లకోట మండలం చంద్రపాలెంలో 1897 నవంబరు 1న జన్మించారు. లలిత గీతాలు, నాటికలు, సినిమా పాటలు రాసి, ఎంతో ఖ్యాతి పొందారు. భావ కవిత్వానికి పెట్టింది పేరు. ● ‘బలం కలవాడు పులి, తెలివి కలవాడు నక్క, ఈ ఇరువర్గాలకో ఆహారంగా బతుకుతున్న వర్గాలు గొర్రెలు’ అంటూ చైతన్యపూరిత మాటలు రాసిన బోయి భీమన్న కోనసీమ జిల్లాలోని మామిడికుదురులో 1911 సెప్టెంబర్ 19న జన్మించారు. సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మభూషణ్తో పాటు లెక్కకు మిక్కిలిగా సన్మానాలందుకున్నారు. అంటరానితనం వంటి దురాచారాలను నిరసించారు. ● 1924 నవంబర్ 18న కాకినాడ జిల్లా శంఖవరంలో పుట్టిన ఆవంత్స సోమసుందర్ సాహిత్య రంగంలో అవిరళ కృషి చేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నాడు సాగిన ఉద్యమానికి మద్దతుగా ఆయన రచించిన ‘వజ్రాయుధం’ కవిత ఎంతో మందిని ఉత్తేజపరచింది. ● కాకినాడకు చెందిన అద్దేపల్లి రామమోహనరావు జిల్లా నలుమూలలా సాహిత్య సభలు, సమావేశాలు, కవి సమ్మేళనాలు నిర్వహించేవారు. తుది శ్వాస విడిచిన 2016 వరకూ సాహిత్య కృషి చేశారు. ‘అయినా ధైర్యంగానే’ పేరుతో అద్దేపల్లి రాసిన కవితలు సామాన్యుడి జీవన స్థితిగతులను తడుముతాయి. ● యానాంలో నివసిస్తున్న ప్రముఖ కవి, కథకుడు దాట్ల దేవదానం రాజు. అభ్యుదయవాది అయిన ఆయన అనేక కథలు, కవితా సంపుటాలు వెలువరించారు. ‘యానాం చరిత్ర’ వంటి గ్రంథాలను వెలువరించారు. అనేక పురస్కారాలు అందుకున్నారు. ● పిఠాపురానికి యువ రచయిత డాక్టర్ కిలారి గౌరి నాయుడు 40 జాతీయ అంతర్జాతీయ సదస్సులు, విశ్వ విద్యాలయాల్లో నిర్వహించిన సదస్సుల్లో తన కవితలను వినిపించారు. రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సాహిత్యంపై పరిశోధనకు గాను అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. ● పిఠాపురానికి చెందిన ర్యాలి ప్రసాద్ తెలుగు సాహిత్యంలో సాహిత్యంలో విశేష కృషి చేస్తున్నారు. పెద్దాపురం వైభవం, కాకినాడ చరిత, కోనసీమ చరిత్ర, పిఠాపుర చరిత్రలను కవితాత్మకంగా చెప్పారు. పశ్చిమ జర్మనీలోని తెలుగు భారతి, సాంస్కృతిక వేదిక నిర్వహించిన అంతర్జాతీయ అనుభూతి కవితల పోటీలో ప్రథమ బహుమతి అందుకున్నారు. సాహితీ ‘గోదారి’ ● ‘కవిత కోసమే నేను పుట్టాను.. క్రాంతి కోసము కలము పట్టాను.. ఎండమావులు చెరిపి.. పండు వెన్నెల నిలిపి.. గుండె వాకిలి తలుపు తట్టాను’ అన్న ఆరుద్రను సత్కరించిన ప్రాంతం రాజమహేంద్రవరం. ● అద్దేపల్లి రామమోహనరావు పేరిట అద్దేపల్లి ఉదయ భాస్కరరావు కన్వీనర్గా ‘అద్దేపల్లి సాహిత్య వేదిక’ను నిర్వహిస్తున్నారు. ఏటా సాహిత్య పురస్కారాలు అందజేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 8న రాజమహేంద్రవరానికి చెందిన ‘ప్రాణహిత’ కవి సాహితీవేత్త సన్నిధానం నరసింహశర్మకు ‘అద్దేపల్లి సాహిత్య పురస్కారం 2024’ను కాకినాడలో అందజేశారు. ● కొత్తపేటలో కళాసాహితి పేరుతో 37 ఏళ్లుగా సాహిత్య కృషి సాగిస్తున్నారు. 1989 నుంచి క్రమం తప్పకుండా ఉగాది రోజున కవి సమ్మేళనం నిర్వహిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ 7న నిర్వహించిన కార్యక్రమంలో కవి గిడ్డి సుబ్బారావును సత్కరించారు. ● కోనసీమకు చెందిన శ్రీశ్రీ కళావేదిక గత ఏడాది ఏప్రిల్ 7న అమలాపురంలో 132వ ఉగాది జాతీయ శతాధిక కవి సమ్మేళనం నిర్వహించగా పలు రాష్ట్రాల నుంచి 132 మంది కవులు పాల్గొన్నారు. 2024 సెప్టెంబర్ 21న కాకినాడలో 137వ జాతీయ కవి సమ్మేళనం నిర్వహించారు. ● రాజానగరం సమీపంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో గత ఏడాది మార్చి 16న కవి కుసుమ ధర్మన్న 125వ జయంతి సందర్భంగా కవితా గోష్టి నిర్వహించారు. ● గత ఏడాది ఏప్రిల్ 14న బండారులంకలో నిర్వహించిన అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జిల్లా మహాసభలో ప్రతిభ చూపిన కవులను ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకొన్న పెనుగొండ లక్ష్మీనారాయణ సత్కరించారు. ● కాకినాడకు చెందిన డాక్టర్ జోస్యుల కృష్ణబాబు పేరుగాంచిన పుస్తకాలకు సమీక్షలు రాస్తున్నారు. ● ఈ ప్రాంతానికి చెందిన ఎంతో కవులు వివిధ ప్రతిష్టాత్మక సంస్థల నుంచి పురస్కారాలు అందుకుంటున్నారు. నేడు ప్రపంచ కవితా దినోత్సవంకవుల సంఖ్య విస్తృతమైంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కవితలు రాసేవారి సంఖ్య పెరిగింది. ఆధునిక సాంకేతికత పెరిగిన నేపథ్యంలో ప్రాచుర్యం పొందిన కవితల పుస్తకాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిని అధ్యయనం చేస్తూ కవితలు రాసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. వచన కవిత్వం ప్రాచుర్యంలో ఉంది. కాకినాడ, పెద్దాపురం తదితర ప్రాంతాల్లోని యువ కవులను ప్రోత్సహిస్తున్నాం. సామాన్యుల జీవన శైలినే కవితా వస్తువుగా తీసుకుని కవితలు రాయడం ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేయవచ్చు. – అద్దేపల్లి ప్రభు, కవి, కాకినాడ క్రమం తప్పకుండా.. యానాం వేదికగా కవి సంధ్య, స్ఫూ ర్తి సాహితీ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో ఏడేళ్లుగా క్రమం తప్పకుండా ప్రపంచ కవితా దినోత్సవం నిర్వహిస్తున్నాం. కార్యక్రమ విస్తృతి ఆవశ్యకత నేపథ్యంలో ఈ నెల 23న హైదరాబాద్లో నిర్వహించనున్నాం. ఆధునిక కాలంలో సైతం కవిత్వ రచన పట్ల ఆసక్తి పుష్కలంగా ఉంది. అయితే పదబంధాలు, మెళకువలు నేర్పే యంత్రాంగం అందుబా టులో లేదు. సామాజిక పరిస్థితులను అర్థం చేసుకుంటూ ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూండాలి. పఠనాసక్తి పెంపొందించేందుకు కృషి చేయాలి. – దాట్ల దేవదానం రాజు, కవి, తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కార గ్రహీత, యానాం మనిషిలో మనీషిని పరిచయం చేస్తున్న కవులు గోదారి నేలపై కవితా వాహిని సామాజిక సమస్యలపై స్పందిస్తున్న కవులెందరో..సామాన్యుల జీవితాలే కవితా వస్తువు ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మండపేటలో అరసం, సంగమం వేదిక సంయుక్త ఆధ్వర్యాన శుక్రవారం కవి సమ్మేళనం నిర్వహిస్తున్నాం. మనిషి శ్రమ నుంచి సాహిత్యం పుట్టింది. శ్రమకు విలువ ఉన్నంత కాలం కవిత్వానికి ప్రాధాన్యం తప్పనిసరిగా కొనసాగుతుంది. ప్రస్తుత కాలంలో యువతీ యువకులు సాహిత్య కృషిపై ఆసక్తి చూపుతున్నారు. – డాక్టర్ చల్లా రవికుమార్, సంగమం వేదిక నిర్వాహకుడు, మండపేట -
అమలాపురం జెడ్పీ హైస్కూల్కు 150 ఏళ్లు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థాపించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వచ్చే ఆగస్టు నెలలో ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ పాఠశాల పూర్వపు విద్యార్థి, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు తెలిపారు. 1876లో ఈ పాఠశాలను స్థాపించారని పేర్కొన్నారు. పాఠశాల భవనాలు 1863లో నిర్మితమైనట్లు, ఈ ప్రదేశంలో గుర్రపు శాల, పెద్ద గంటతో చర్చి , పలు భవనాలు, ఖాళీ స్థలంతో ఉండేదని అప్పటి కలెక్టర్ పెడరిక్ రికెట్స్ హెమింగ్ తమ గెజిటీర్లో ప్రచురించారని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. 1876లో ఆ స్థలం, భవనాలు ఉన్నత పాఠశాలగా మార్పు చెందాయని పేర్కొన్నారు. పాఠశాల 150 సంవత్సరాల ఉత్సవాలను పలువురు ప్రముఖులు, పూర్వ విద్యార్థులతో ఘనంగా నిర్వహించాలనుకుంటున్నామని చెప్పారు. ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఎక్కడున్నా ఫోన్ల నంబర్లు పంపించాలని ఎమ్మెల్సీ విజ్ఞప్తి చేశారు. పాఠశాలకు సంబంధించి మీ దగ్గర పొటోల రూపంలో జ్ఞాపకాలు, పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల పేర్లు ఉంటే వాటిని కూడా పంపించాలని కోరారు. 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముద్రించే సావనీర్లో వాటిని పొందపరిచాలని నిర్ణయించామని తెలిపారు. పూర్వ విద్యార్థుల వివరాలు, సమాచారాన్ని 63052 08010 ఫోన్ నంబర్కు వాట్సాప్ చేయాలని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు విజ్ఞప్తి చేశారు. కొంతమంది పాఠశాల పూర్వ విద్యార్థులు స్థానిక జెడ్పీ ఉన్నత బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల క్రీడా స్థలంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అధ్యక్షతన గురువారం ఉదయం సమావేశమై 150 సంవత్సరాల ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. వచ్చే ఆగస్టులో ఉత్సవాల నిర్వహణకు సన్నాహాలు పూర్వపు విద్యార్థి, ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు -
సీలింగ్ భూములు ఎస్సీ, ఎస్టీలకు పంచాలి
జైపాల్ సింగ్ ముండాకు ఆదివాసి మహాసభ నివాళులు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో భూసంస్కరణలు అమలు చేసి సీలింగ్ చట్ట ప్రకారం 50 శాతం భూమి ఎస్సీ, ఎస్టీలకు పంపిణీ చేయాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేసింది. భారత రాజ్యాంగ సభ సభ్యులు, ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకుడు జైపాల్ సింగ్ ముండా 55వ వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక ప్రెస్క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయనకు ఆదివాసీ మహాసభ తరఫున ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసి మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 34,348 ఎకరాల సీలింల్ మిగులు భూములు ఉన్నాయని, వాటిలో 15,500 ఎకరాల పంపిణీ జరిగిందన్నారు. సుమారు 18,848 ఎకరాలు కోర్టు వివాదాలలో ఉన్నాయన్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభించిన భూ పంపిణీ కార్యక్రమంలో సీలింగ్ భూములు వెయ్యి ఎకరాలు పంచారన్నారు. ఇప్పటికై నా తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు బాధ్యత వహించి సీలింగు భూములన్నీ వేరే పార్టీకి రిజిస్ట్రేషన్న్ జరుగకుండా 22ఎ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేస్తోందన్నారు. నాయకులు జక్కల పాండవులు, సభ్యులు గూన అప్పన్న, అర్జన, మల్లేశ్వరి పాల్గొన్నారు. -
కువైట్లో గుండెపోటుతో యువకుడి మృతి
సఖినేటిపల్లి: మండల పరిధిలోని గొంది గ్రామానికి చెందిన చింతా సాగర్(34) ఈ నెల 18వ తేదీన గుండె పోటుతో కువైట్లో మృతి చెందారు. 19వ తేదీన ఆ దేశం నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. సాగర్కు భార్య, ఒక బాబు ఉన్నారు. సేఠ్ వద్ద కారు డ్రైవర్గా మొదటిగా 2022లో గల్ఫ్ వెళ్లారు. రెండేళ్లు అనంతరం స్వగ్రామం వచ్చిన సాగర్, గత జూలైలో తిరిగి రెండో దఫా గల్ఫ్ వెళ్లారు. ఎన్నో ఆశలతో బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లి ఎప్పటి మాదిరిగానే మళ్లీ తిరిగి వచ్చి తమను కలుస్తారు అనుకుంటున్న కుటుంబ సభ్యులు జరిగిన ఘటనతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిన్న వయసులోనే తమకు అందనంత దూరాలకు వెళ్లిపోవడం జీర్ణించుకోలేక పోతున్నామని రోదిస్తున్నారు. మృతదేహం శనివారం నాటికి స్వగ్రామానికి రానున్నట్టు స్థానికులు తెలిపారు. వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు నిడదవోలు రూరల్: మండలంలోని పురుషోత్తపల్లి గ్రామంలో వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు సమిశ్రగూడెం ఎస్సై కె.వీరబాబు గురువారం తెలిపారు. పురుషోత్తపల్లికి చెందిన యడ్ల మధుసాగర్ ఈ నెల 15వ తేదీన శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని భార్య షేక్ చాందిని ఇచ్చిన ఫిర్యాదుపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
మహాశివరాత్రి ఆదాయం రూ 29.66 లక్షలు
సామర్లకోట: మహాశివరాత్రి సందర్భంగా స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయానికి రూ.29,66,406 ఆదాయం సమకూరిందని ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 6 నుంచి మార్చి 20 వరకూ ఆలయంలో హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని గురువారం లెక్కించారు. హుండీల ద్వారా రూ.16,15,788 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. 67 గ్రాముల బంగారు, 600 గ్రాముల వెండి వస్తువులు లభించాయని ఈఓ తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1 వరకూ దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.7,05,960, వివిధ సేవా టిక్కెట్ల ద్వారా రూ.65,747, ప్రసాద విక్రయాల ద్వారా రూ.2,66,215, అన్నదాన విరాళాలు రూ.3,12,696 వచ్చాయని వివరించారు. హుండీల ద్వారా గత ఏడాది కంటే రూ.6 లక్షలు అదనంగా ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. దేవదాయ శాఖ తనిఖీదారు ఫణికుమార్ పర్యవేక్షణలో హుండీల లెక్కింపు జరిగింది. ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే బాబు, ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వరరావు, మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, ఆర్యవైశ్య సంఘం, భక్త సంఘం, ఉండూరు లక్ష్మీనారాయణ సేవా సంఘం సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు కాకినాడ సిటీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), వీవీ ప్యాట్ల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం గోదామును ఆయన గురువారం పరిశీలించారు. అక్కడి భద్రతా చర్యలు అడిగి తెలుసుకున్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలా ఈవీఎంల గోదామును పరిశీలించి, నివేదిక పంపిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అలాగే, ప్రతి మూడు నెలలకోసారి జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గోదామును పరిశీలిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్వో జె.వెంకటరావు, జిల్లా అగ్నిమాపక అధికారి పీవీఎస్ రాజేష్, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి.జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డీటీ ఎం జగన్నాధం, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆలిండియా ఖోఖో జట్టుకు తులసి ఎంపిక
పెదపూడి: జి.మామిడాడ గ్రామంలో జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల్లో గ్రేడ్–2 ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న కోరుమిల్లి తులసి ఆలిండియా సివిల్ సర్వీసెస్ గేమ్స్ జాతీయ స్థాయి ఖోఖో జట్టుకు క్రీడాకారిణిగా ఎంపికయ్యారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్తి వెంకటరెడ్డి గురువారం మాట్లాడుతూ ఆల్ ఇండియా సవిల్ సర్వీసెస్ గేమ్స్ మీట్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ఖోఖో జట్టుకు క్రీడాకారిణిగా ప్రాతినిధ్యం వహించనున్నారన్నారు. ఆమె ఈ నెల 19 నుంచి 24 వరకు ఢిల్లీలో జరుగుతున్న పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. ఆమె 2024 నవంబర్7న విజయవాడలో జరిగిన ఖోఖో పోటీల్లో ఉత్తమ ప్రతిభతో జాతీయ జట్టులో స్థానం సంపాదించారని తెలిపారు. ఆమెను పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. గేట్లో శ్రీగౌతమ్కు నాలుగో ర్యాంక్ పెదపూడి: జి.మామిడాడ గ్రామానికి చెందిన పోతురాజు శ్రీగౌతమ్ బుధవారం విడుదలైన గేట్–2025 ఫలితాల్లో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆల్ఇండియాలో నాలుగో ర్యాక్ సాధించాడని తండ్రి సాయి వెంకటేశం తెలిపారు. ఆయన గురువారం జి.మామిడాడలో మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్లో మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పట్టుదలగా చదివాడన్నారు. సంవత్సరం నుంచి చేస్తున్న ఉద్యోగానికి ఐదు నెలల క్రితం రాజీనామా చేసి ఇంటికి వచ్చాడన్నారు. ఈ ఐదు నెలలుగా ఇంటి వద్ద ఉండి ప్రణాళిక బద్ధంగా చదివి ఈ ర్యాంక్ సాధించాడన్నారు. తల్లి గృహిణి కాగా తాను పైన గ్రామంలో ఎస్జీటి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నానని తండ్రి తెలిపారు. వాసుకు పదో ర్యాంకు అమలాపురం రూరల్: అమలాపురం రూరల్ మండలం బండారులంక చెందిన చేనేత కుటుంబానికి చెందిన పిచ్చిక కుమార్ వాసు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)–2025 ఫలితాల్లో పదో ర్యాంకు సాధించాడు. జాతీయస్థాయిలో వాసు మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో 10 ర్యాంకు సాధించడంతో బండారులంకలో చేనేత కార్మికులు గురువారం బాణనంచా కాల్చి సంబరాలు చేశారు. చేనేత కార్మికులైన పిచ్చిక మల్లేశ్వరరావు, రేణుక వాణి కుమారుడు వాసు కష్టపడి రెండుసార్లు గేట్ రాసి ఈ ర్యాంకు సాధించాడు. 1 నుంచి 4వ తరగతి వరకు బండారులంక విజడమ్ స్కూలులో చదివి, భూపతిపాలెం గురుకుల పాఠశాలలో 10 తరగతి పూర్తి చేసి రాజమహేంద్రవరం శ్రీచైతన్యలో ఇంటర్మీడియెట్, నర్సారావుపేట జేఎన్టీయూలో బీటెక్ పూర్తిచేశానని వాసు తెలిపాడు. ఐఐటీ, ఎన్ఐటీలో ఎంటెక్ పూర్తిచేసి మంచి ఇంజీనీరుగా దేశానికి సేవలు అందిస్తానని అన్నాడు. గ్రామస్తులు వాసు తల్లిదండ్రులను ఊరేగించి వీరభద్రస్వామి ఆలయం వద్ద సత్కరించారు. శ్రీశైలం దేవస్థానం మాజీ ట్రస్టీ చింతా శంకర మూర్తి, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పిచ్చిక శ్యామ్, ఉప్పుగుంటి భాస్కరరావు బళ్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కోటనందూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ గురువారం తెలిపారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చినగొలుగొండేకు చెందిన కాళ్ల వెంకటేశ్వర్లు(59) డీజిల్ తెచ్చుకునేందుకు టీవీఎస్ మోపెడ్పై కోటనందూరు బయలుదేరాడు. అల్లిపూడిలో బర్ల వరలక్ష్మికి లిఫ్ట్ ఇవ్వడం కోసం బండి ఎక్కించుకున్నాడు. అల్లిపూడి–కాకరాపల్లి రోడ్డులో జీడిపిక్కల ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేసరికి ఎదురుగా ధాన్యం లోడుతో వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందగా, వరలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను 108 అంబులెన్స్లో నర్సీపట్నంలో ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడి కుమార్తె బొడ్డు నారాయణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 15,500 గటగట (వెయ్యి) 14,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 14,500 గటగట (వెయ్యి) 13,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
కొత్త కోవెల @ 13 వసంతాలు
● నేడు 14వ సంవత్సరంలోకి అడుగు ● సత్యదేవునికి ఘనంగా పూజలు ● 2011లో నూతన ఆలయ నిర్మాణం అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుని నూతన ఆలయం 13 వసంతాలు పూర్తి చేసుకొని శుక్రవారం 14వ వత్సరంలోకి అడుగిడుతోంది. ఈ సందర్భంగా రత్నగిరి ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. సత్యదేవుని ఆవిర్భావం శతాబ్దానికి పైబడిన చరిత్ర సత్యదేవుని సొంతం. అప్పటికి అన్నవరం ఓ కుగ్రామం. ఆ రోజుల్లో రత్నగిరిపై దట్టమైన అడవి ఉండేది. 1891లో ఖర నామ సంవత్సర శ్రావణ శుద్ధ విదియ ముందు రోజు రాత్రి అప్పటి గోర్స ఎస్టేట్ జమీందార్ అయిన రాజా ఇనుగంటి వేంకట రామారాయణం కలలో సత్యదేవుడు ప్రత్యక్షమయ్యారు. తాను అన్నవరంలోని రత్నగిరిపై వెలిశానని, తనకు ఆలయం కట్టించాలని చెప్పారు. అన్నవరం గ్రామానికి చెందిన ఈరంకి ప్రకాశరావుకు కూడా ఇదేవిధంగా కల వచ్చింది. దీంతో వారిద్దరు, మరికొంత మంది గ్రామస్తులు కలిసి రత్నగిరిపై సత్యదేవుని కోసం వెతికారు. అన్నవరం గ్రామ దేవత నేరేళ్లమ్మ తల్లి ఆలయం పక్కన ఉన్న కొండ మీద అంకుడు చెట్టు కింద స్వామివారి విగ్రహం దర్శనమిచ్చింది. దీంతో తొలుత చిన్న పందిరి నిర్మించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తరువాత చిన్న ఆలయం, మరి కొన్నాళ్లకు పెద్ద ఆలయాన్ని రెండంతస్తుల్లో నిర్మించారు. కింది అంతస్తులో మహా నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతనంతో ప్రతిష్ఠించారు. మధ్యలో సత్యదేవుడు, ఎడమ వైపు అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, కుడివైపు లింగాకారంలో పరమేశ్వరుడు ఈ ఆలయంలోనే 2011 వరకూ భక్తులకు భక్తులకు దర్శనమిచ్చారు. నూతన ఆలయ నిర్మించారిలా.. పాత ఆలయం శిథిలావస్థకు చేరడంతో నూతన ఆలయాన్ని నిర్మించాలని 2011లో అప్పటి కార్యనిర్వహణాధికారి, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ సంకల్పించారు. దీనికి అప్పట్లో చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. కొంతమంది పాత ఆలయం తొలగించడానికి వీలు లేదని హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. నూతన ఆలయ నిర్మాణం సుమారు ఏడాది పాటు సాగింది. మూలవిరాట్టులపై టేకు చెక్కతో తయారు చేసిన పెద్ద పెట్టెను ఉంచి, దానిపై ఇనుప గడ్డర్లతో రక్షణ ఏర్పాటు చేసి, పాత ఆలయాన్ని తొలగించారు. తమిళనాడులోని నమ్మక్కల్ గ్రానైట్ క్వారీల నుంచి సేకరించిన శిలలతో పాత ఆలయం మాదిరిగానే రెండంతస్తుల్లో నూతన ఆలయ నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం జరిగినన్నాళ్లూ సత్యదేవుడు, అమ్మవారు, శంకరుల ఉత్సవ మూర్తులను ధ్వజస్తంభం వద్ద బాలాలయంలో ఉంచి పూజలు నిర్వహించారు. జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా.. నూతన ఆలయ శిఖరంపై కలశ స్థాపన కార్యక్రమాన్ని 2012 మార్చి 14, ఫాల్గుణ బహుళ సప్తమి నాడు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు జయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. అప్పటి నుంచి తెలుగు తిథుల ప్రకారం ఏటా ఫాల్గుణ బహుళ సప్తమి నాడు నూతన ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. నేడు ప్రత్యేక పూజలు నూతన ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున సత్యదేవుడు, అమ్మవారికి, శంకరులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బూరెలు, పులిహోర, రవ్వకేసరి ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేస్తారు. అలాగే, స్వామివారి కదంబ ప్రసాదం కూడా పంపిణీ చేస్తారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి ఆలయాన్ని, ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. అటకెక్కిన ‘స్వర్ణ’ ప్రాజెక్ట్ సత్యదేవుని ఆలయ శిఖరానికి బంగారు రేకు తాపడం చేయాలనే ప్రతిపాదన ఆరు నెలలుగా కాగితాలకే పరిమితమైంది. ఈ ప్రతిపాదనపై అంచనాలు రూపొందించాలని గత ఏడాది టీటీడీని కోరారు. దీనికి 50 కిలోలకు పైగా బంగారం అవసరమవుతుందని టీటీడీ నిపుణులు ప్రాథమిక నివేదిక సమర్పించారు. ప్రస్తుతం బంగారం ధరతో పోల్చితే ఇది దేవస్థానానికి సాధ్యం కాదు. దీంతో రాగి రేకుపై బంగారు కోటింగ్తో చేయించేందుకు నివేదిక ఇవ్వాలని అప్పటి ఈఓ కె.రామచంద్ర మోహన్ కోరారు. ఆయన గత నవంబర్లో కమిషనర్ కార్యాలయానికి బదిలీ అయ్యాక దీనిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా దీనిపై చర్యలు తీసుకుని, దాతల విరాళాలతో ఆలయ శిఖరాన్ని స్వర్ణ రేకు తాపడం చేయించాలని భక్తులు కోరుతున్నారు. -
మతాతీతంగా మాతకు ఆరాధన
దేవరపల్లి: ఉభయగోదావరి జిల్లాల్లో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది నిర్మలగిరి పుణ్యక్షేత్రం. ఇక్కడి మేరీమాతను నిత్య నిష్కళంక మాతగా, మత భేదమెరుగని తల్లిగా అన్ని మతాల వారు ఆరాధిస్తున్నారు. ఈ నెల 22 నుంచి 25 వరకు మేరీ మాత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏలూరు పీఠాధిపతి జయరావు పొలిమెర పర్యవేక్షణలో పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఫాదర్ ఎస్.జాన్పీటర్, ఉత్సవాల నిర్వహణ కమిటీ, సహాయక ఫాదర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామానికి ఆనుకుని ఈ క్షేత్రం ఉంది. క్షేత్రం ఆవిర్భావానికి 1978లో అప్పటి ఏలూరు పీఠాధిపతి జాన్ ములగాడ నాంది పలకగా పలువురు ఫాదర్లు పుణ్యక్షేత్రం అభివృద్ధికి పాటుపడ్డారు. ప్రస్తుత డెరెక్టర్ ఫాదర్ జాన్పీటర్ పుణ్యక్షేత్రాన్ని సర్వాగ సుందరంగా తీర్చిదిద్దారు. కులమతాలకు అతీతంగా భక్తులు మేరీమాతను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చి తమ కోర్కెలను మరియతల్లికి విన్నవించుకుంటారు. 1978లో బిషప్ జాన్ములగాడ గౌరీపట్నంలో నిర్మలగిరి క్షేతాన్ని నిర్మించాలని సంకల్పించారు. 1976లో ఏలూరు బలిపీఠం ఏర్పడింది. జాన్ ములగాడ తొలి పీఠాధిపతిగా నియమితులయ్యారు. అనంతరం బిషప్ ములగాడ కారులో విశాఖపట్నం వెళుతుండగా గౌరీపట్నం వద్ద కారు మరమ్మతులకు గురైయింది. కారు దిగి జాన్ములగాడ చుట్టూ పరిశీలించారు. ఎత్తైన కొండలు, కారుచీకటి, ముళ్లపొదలతో నిండి ఉన్న చిట్టడవి. భయంకర వాతావరణం. అంతలోనే ములగాడ మనసులో ప్రేరణ. ఈ ప్రాంతంలో ఆలయం నిర్మించవా అంటూ ప్రేరణ కలిగింది. కారు మరమ్మతులు చేయించుకుని విశాఖపట్నం బయలుదేరారు. 1978లో గౌరీపట్నం ప్రాంతంలో మేరీమాత ఆలయం నిర్మణానికి సంకల్పం చేశారు. 1979లో ఆలయ నిర్మాణం చేసి ఫాదర్ మైకేల్ను తొలి డైరెక్టర్గా నియమించారు.1982 నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 1992లో ఫాదర్ దిరిసిన ఆరోన్ పుణ్యక్షేత్రం డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. 1995లో పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణం కల్పించడానికి ప్రేమసేవా ఆశ్రమం ఏర్పాటు చేశారు. 2000లో అఖండ దేవాలయం నిర్మాణం క్షేత్రంలో అఖండ దేవాలయం నిర్మాణానికి 1992లో శంకుస్థాపన చేశారు. 2000లో ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. ఒకేసారి దాదాపు 5,000 మంది ప్రార్థనలు చేసుకొనేందురు వీలుగా దేవాలయం నిర్మించారు. క్షేత్రంలో కళాత్మకంగా పలు కట్టడాలను ఏర్పాటు చేశారు. ప్రేమ సేవా ఆశ్రమం 1995 జూలైలో ప్రేమసేవా ఆశ్రమాన్ని నిర్మలగిరిలో నెలకొల్పారు. మఠవాసులను తీర్చిదిద్దే బాధ్యత జేసురాజన్ చేపట్టారు. బ్రహ్మచర్య వ్రత నియమాలు పాటిస్తూ ప్రభువు సువార్తను ప్రకటించే పరిచర్య ఇక్కడే ఆరంభమవుతుంది. సేవ చేయాలనే ఉత్సహం ఉన్న యువతీ, యువకులు ఏడాది పాటు మఠంలో ఉండవచ్చును. 1997లో నిర్మల హృదయ మహిళా కళాశాలను బిషప్ ములగాడ ప్రారంభించారు. అనురాగ ఆశ్రమం ఏర్పాటు నిర్మలగిరి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా పుణ్యక్షేత్రానికి ఎదురుగా సుమారు 100 అడుగుల ఎత్తున సుందరమైన క్రీస్తు మందిరాన్ని నిర్మాణం చేశారు. చరిత్రలోని వివిధ ఘట్టాలను కళాత్మకంగా గోపురంలో పొందుపర్చారు. నిత్య అన్నదానం పుణ్యక్షేత్రానికి నిరంతరం వస్తున్న భక్తులకు నిత్య అన్నదానం చేస్తున్నారు. ప్రతి రోజు సుమారు 2 వేల మంది భక్తులకు ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. అన్నదానం కాంట్రాక్టర్ కళ్ళే నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరుగుతుంది. గౌరీపట్నం నిర్మలగిరి పుణ్యక్షేత్రంలోని అఖండ దేవాలయం రేపటి నుంచి నిర్మలగిరి మేరీ మాత ఉత్సవాలు సుందరంగా ముస్తాబైన పుణ్యక్షేత్రం అఖండ దేవాలయం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు అగ్ర పీఠాధిపతుల రాక 10 లక్షల మంది భక్తుల వచ్చే అవకాశం వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏటా మార్చిలో ఉత్సవాలు ఏటా మార్చి 22 నుంచి 25 వరకు మేరీమాత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో పుణ్యక్షేత్రంలోని పలు ప్రదేశాల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. భక్తుల రక్షణకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. మతాలకు అతీతంగా భక్తులు ఉత్సవాల్లో పాల్గొని కొబ్బరికాయలు కొట్టి, కొవ్వొత్తులను వెలిగించి, తలనీలాలు సమర్పించి దైవదూత అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు. ఉత్సవాల్లో భాగంగా దివ్య బలిపూజలు, దివ్య సత్ప్రసాద ఆరాధనలు నిర్వహిస్తారు. వాటికన్ భారత రాయబారి, ప్రాన్సిస్ మోస్ట్ రెవరెండ్ లియోపోల్డో జిరెల్లి పుణ్యక్షేత్రంలో 2022లో జరిగిన ఉత్సవాల్లో పాల్గొని ప్రార్థనలు చేశారు. ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. -
రిలయన్స్ మార్ట్పై కేసు నమోదు
రాజమహేంద్రవరం సిటీ: నగరంలోని పుష్కర్ ఘాట్ వద్ద గల రిలయన్స్ మార్ట్ పై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా గురువారం లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ శామ్యూల్ రాజు ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తయారీ తేదీ, గడువు తేదీని ట్యాంపర్ చేసినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. వినియోగదారులు వస్తువుల కొనుగోలు సమయంలో ప్యాకేజీ ఎక్స్పెయిరీ డేట్, ఎంఆర్పీ ధరను పరిశీలించాలని జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు విజ్ఞప్తి చేశారు. ఎంఆర్పీ కన్నా అధిక ధరలకు విక్రయించినా, యూజ్ బై డేట్ ముగిసినవి అమ్మినా లీగల్ మెట్రాలజీ అధికారులకు తెలియజేయాలని కోరారు. ఈ తనిఖీలో పాల్గొన్న అనంతరావు మాట్లాడుతూ వినియోగదారులు తగిన జాగ్రత్తలతో మెలగాలని, ఫిర్యాదులు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఇటువంటి వ్యవహారాలపై అధికారులు కేసు నమోదు చేస్తారని తెలిపారు. -
స్వచ్ఛ ఓటర్ల జాబితాకు సహకరించాలి
కాకినాడ సిటీ: జిల్లాలో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ కోరారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలోనే కాకుండా ముందుగానే ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ, మార్పులు, చేర్పులు, ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనల వంటి అంశాలపై చర్యలకు భారత ఎన్నికల సంఘం ఆదేశించిందని తెలిపారు. ఈ మేరకు సూచనలు, సలహాలు అందించాలని కోరారు. రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ బూత్ స్థాయి అధికారులను (బీఎల్వో) నియమించి, ఏప్రిల్ 15 నాటికి అందరికీ శిక్షణ పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకర్గాల్లోని 1,640 పోలింగ్ కేంద్రాల్లో 16,36,916 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ప్రతి వెయ్యి నుంచి 12 వందల మంది ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి విభజించనున్నామన్నారు. పోలింగ్ కేంద్రం ఓటర్లకు రెండు కిలోమీటర్లకు మించి దూరంగా ఉండకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో డీఆర్వో వెంకటరావు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారి ఎం.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. -
కన్న బిడ్డలను కాలువలో తోసేసిన తండ్రి లొంగుబాటు
రామచంద్రపురం రూరల్: కన్న బిడ్డలను తండ్రే కాలువలోకి తోసేసి ఊపిరి తీయాలని చూసిన ఘటన పాఠకులకు తెలిసిందే. ఈ సంఘటనలో ఏడేళ్ల కుమార్తె కారుణ్యశ్రీ మృతి చెందగా, 10 ఏళ్ల కుమారుడు రామ సందీప్ ప్రాణాలతో బయట పడ్డాడు.. ఆ తరువాత అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అందరూ భావించారు. పోలీసులూ అదే కోణంలో కాలువలు, గోదావరిలో గాలించారు. దీనికితోడు నిందితుడు పిల్లి రాజు ఉపయోగించే స్కూటర్ యానాం బ్రిడ్జిపై లభించడంతో గోదావరిలో దూకేశాడని మరింత తీవ్రంగా గోదావరిలో బోట్లు వేసుకుని గాలించారు. అయితే అనూహ్యంగా అతడు మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో బుధవారం లొంగిపోయాడు. దీంతో రామచంద్రపురం డీఎస్పీ బి.రఘువీర్ గురువారం తన కార్యాలయంలో ప్రెస్మీట్ పెట్టి నిందితుడిని మీడియా ముందుకు తీసుకువచ్చారు. డీఎస్పీ మాట్లాడుతూ అప్పుల ఒత్తిడితోనే తాను చనిపోతే తన పిల్లలు అనాథలు అయిపోతారని భావించి ముందుగా పిల్లలను నెలపర్తిపాడు శివారు గణపతినగరం వద్ద పంట కాలువలోకి తోసేసి, తానూ ఆత్మహత్య చేసుకోవడానికి యానాం గోదావరి బ్రిడ్జిపై నుంచి దూకేయాలని వెళ్లాడని, అయితే అక్కడ మనసు మార్చకొని రాథేయపాలెంలో బంధువుల ఇంటికి వెళ్లాడు. బంధువులు పోలీసులకు లొంగిపోవాలని సూచించడంతో మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో బుధవారం వెళ్లి లొంగిపోయాడు. ప్రెస్మీట్లో రామచంద్రపురం సీఐ ఎం.వెంకటనారాయణ, ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్, రామచంద్రపురం ఎస్సై ఎస్.నాగేశ్వరరావు, కె.గంగవరం ఎస్సై ఎస్కే జానీబాషా, సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు. మీడియా ముందుకు తీసుకుని వచ్చిన పోలీసులు అప్పుల బాధతోనే అఘాయిత్యానికి పాల్పడినట్లు వెల్లడి -
పోలీసుల అదుపులో కర్కశ తండ్రి!
రామచంద్రపురం రూరల్(కాకినాడ): కన్న బిడ్డలను పంట కాలువలోకి తోసేసిన కర్కశ తండ్రి పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం. రాయవరం మండలం వెంటూరుకు చెందిన పిల్లి రాజు సోమవారం రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు శివారు గణపతినగరం సమీపంలోని పంట కాలువలో తన బిడ్డలు పదేళ్ల రామసందీప్, ఏడేళ్ల కారుణ్యశ్రీని తోసేసిన ఘటనలో, సందీప్ బతికి బయటపడగా, కారుణ్య నీటమునిగి చనిపోయిన సంగతి విదితమే. అప్పుల నేపథ్యంలో పిల్లలను చంపి, తానూ ఆత్మహత్య చేసుకునేందుకు ఇలా చేసి ఉండొచ్చనే కోణంలో పోలీసులు కాలువలు, గోదావరి వెంబడి పిల్లి రాజు ఆచూకీ కోసం రెండు రోజులుగా గాలించారు. ఈ క్రమంలో యానాం బ్రిడ్జిపై రాజు స్కూటర్ కనిపించడంతో, వారి అనుమానం బలపడింది. రామచంద్రపురం సీఐ వెంకటనారాయణ, ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ బోటుపై గోదావరిలో విస్తృతంగా గాలించారు. అయితే నిందితుడు రాజు మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టు తెలిసింది. పోలీసులు దీనిని గోప్యంగా ఉంచడం గమనార్హం.‘‘నాన్నా చంపొద్దు.. ప్లీజ్’’ -
మాలలపై కక్ష గట్టిన చంద్రబాబు
అమలాపురం టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు మాలలపై కక్షతో ఎస్సీ వర్గీకరణను అడ్డగోలుగా చేయడానికి కుట్ర పన్నుతున్నారని జిల్లా మాల సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ జంగా బాబూరావు ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎస్సీల్లో ఓ వర్గానికి లబ్ధి చేకూర్చేలా పావులు కదుపుతున్నారని విమర్శించారు. స్థానిక ప్రెస్ క్లబ్ భవనంలో ఐక్య వేదిక ప్రతినిధులు బుధవారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 22 మండలాల మాల ముఖ్య నాయకులు పాల్గొని, కార్యాచరణపై చర్చించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్ధం కావాలని సమావేశం పిలుపునిచ్చింది. దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. 2021 జనాభా లెక్కల ప్రకారం ఏకసభ్య కమిషన్ నివేదికను రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం సిగ్గుచేటని నాయకులు దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణే ధ్యేయంగా పనిచేస్తోందని ఆరోపించారు. వర్గీకరణ వల్ల మాల, ఎస్సీల్లోని 59 ఉప కులాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి ఇసుకపట్ల రఘుబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఏకసభ్య కమిషన్ నివేదికను రద్దు చేసి, హైకోర్టు సిట్టింగ్ జడ్జిలతో త్రిసభ్య కమిషన్ను నియమించి, న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 2025 కుల గణనను పరిగణనలోకి తీసుకుని, ఉప కులాల అభిప్రాయాలు విన్న తర్వాతే వర్గీకరణ జోలికి వెళ్లాలని సూచించారు. మాలల ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో తీవ్రతరం చేస్తామని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని ఐక్యవేదిక ప్రతినిధి, అముడా మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్రాజు హెచ్చరించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా అనంతరం ఐక్య వేదిక నాయకులు జిల్లా కలెక్టరేట్కు ప్రదర్శనగా వెళ్లి, అక్కడ ధర్నా నిర్వహించారు. మాలల పంతం.. చంద్రబాబు అంతం, ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని డీఆర్వోకు అందజేశారు. ఐక్యవేదిక నాయకులు రేవు తిరుపతిరావు, గెడ్డం సురేష్కుమార్, పొలమూరి మోహన్బాబు, పెనుమాల చిట్టిబాబు, దేవరపల్లి శాంతికుమార్, జిత్తుక సత్యనారాయణ, ఉబ్బన శ్రీను, నెల్లి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. కమిషన్ నివేదికను రద్దు చేయాలని డిమాండ్ కలెక్టరేట్ వద్ద జిల్లా మాల సంఘాల ఐక్య వేదిక ధర్నా -
స్పందించిన న్యాయమూర్తి
సింగిల్ నంబర్ లాటరీ కేరాఫ్ కాకినాడసాక్షి ప్రతినిధి, కాకినాడ: సింగిల్ నంబర్ లాటరీకి కేరాఫ్గా కాకినాడ నిలుస్తోంది. బెంగళూరు నగరంలోని రెండు ముఖ్య కూడళ్లు కేంద్రంగా సాగుతున్న ఈ దందా వెనుక పెద్దల హస్తం ఉండటం విస్మయానికి గురి చేస్తోంది. ఈ లాటరీతో నిరుపేదలు, రోజువారీ శ్రమజీవుల బతుకులు గుల్లవుతున్నాయి. ఒకటికి ఏడు, ఎనిమిదింతలు వస్తుందనే ఆశ చూపి, నిర్వాహకులు నిలువు దోపిడీ చేస్తున్నారు. సింగిల్ నంబర్ లాటరీపై నిషేధం ఉన్నా కూటమి ప్రభుత్వం గద్దెనెక్కాక కాకినాడలో మాత్రం తలుపులు బార్లా తెరిచారు. నెలవారీగా ఎవరి వాటాలు వారి జేబుల్లోకి వెళ్లిపోతూండటంతో గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా సాగిస్తున్నారు. ఈ సింగిల్ నంబర్ లాటరీకి కాకినాడ నగరంలోని మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు డెన్లు నడుస్తున్నాయి. ఒకో డెన్ను ఇద్దరు తెలుగు తమ్ముళ్లు నిర్వహించుకునేందుకు ఒప్పందాలు జరిగాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సింగిల్ నంబర్ లాటరీలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కాక తెలుగు తమ్ముళ్లు అధికారం దన్నుతో ఈ జూద క్రీడను తిరిగి పట్టాలెక్కించారు. సుమారు ఆరు నెలలుగా సాగుతున్న సింగిల్ నంబర్ లాటరీతో రోజూ రూ.లక్షలు చేతులు మారుతున్నా కన్నెత్తి చూసే నాథుడే లేకుండా పోయాడనే విమర్శలు వస్తున్నాయి. సింగిల్ నంబర్ లాటరీ ఉదయం 8 గంటలకు మొదలై రాత్రి 8 లేదా 9 గంటల వరకూ నిర్వహిస్తున్నారు. వీధుల్లో కర్రా బిళ్ల ఆడినట్లుగా బహిరంగంగానే ఆడేస్తున్నారు. దీనిని కట్టడి చేయాల్సిన పోలీసులు అధికార పార్టీలోని ముఖ్య నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గాల్సి వస్తోందని అంటున్నారు. సింగిల్ నంబర్ లాటరీ కొడితే ఒకటికి ఏడెనిమిది రెట్లు అధికంగా వస్తుందనే ఆశతో రెక్కల కష్టాన్నే నమ్ముకున్న శ్రమజీవులు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, ఇతర పేదల బతుకులు గుల్లయిపోతున్నాయి. ఇవీ డెన్లు కాకినాడ సంజయ్నగర్ లారీ సీరియల్ ఆఫీసు సమీపాన సింగిల్ నంబర్ లాటరీ నడుస్తోంది. ఈ డెన్ కాకినాడ పోర్టు పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తోంది. కాకినాడ రాగంపేట పరిధిలో మూడో పట్టణ పోలీసు స్టేషన్కు కూతవేటు దూరంలో కల్పనా సెంటర్ ఫ్లై ఓవర్ కింద మరో డెన్ నిర్వహిస్తున్నారు. మూడో డెన్ జగన్నాథపురం చారిటీస్ వద్ద నూకాలమ్మ టెంపుల్ వెనుక ఉన్న పార్కు సమీపాన జరుగుతోంది. ఈ ప్రాంతం వన్టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ మూడు కేంద్రాల్లోనూ కూటమికి చెందిన ద్వితీయ శ్రేణి నేతల కనుసన్నల్లోనే సింగిల్ నంబర్ లాటరీ జరుగుతోంది. ఇలా జరుగుతోంది బెంగళూరుకు చెందిన లాటరీ నిర్వాహకులు ఒకటి నుంచి తొమ్మిది నంబర్లు (సింగిల్ డిజిట్) మొబైల్లో డిస్ప్లే చేస్తారు. కాకినాడలో లాటరీ డెన్ నడుపుతున్న నిర్వాహకుడు మొబైల్లో ఒకటి నుంచి తొమ్మిది నంబర్లలో ఏదో ఒక నంబర్ను లాటరీ వేసే వ్యక్తికి సూచిస్తాడు. గంటగంటకూ బెంగళూరు నుంచి నంబర్ షో ఉంటుంది. ఉదాహరణకు ఉదయం 8 గంటలకు సంజయ్ నగర్లోని లాటరీ డెన్ వద్దకు వచ్చిన సుబ్బారావు అనే వ్యక్తి ఐదో నంబర్పై రూ.వెయ్యి కాశాడని అనుకుంటే.. ఈ విషయాన్ని ఒక కాగితంపై రాసి ఇస్తారు. తొమ్మిది గంటలకు నిర్వాహకుడు మొబైల్లో ఏ నంబర్కు షో వచ్చిందో చూపిస్తాడు. లాటరీ షోలో ఐదో నంబర్ చూపిస్తే రూ.8 వేలు (రూ.వెయ్యికి ఎనిమిది రెట్లు) తిరిగిస్తారు. అంటే గంటలోనే లాటరీ ఫలితం తేలిపోతుందన్న మాట. మిగిలిందంతా నిర్వాహకులకే. ఇలా ఒక డెన్లో రోజుకు 100 నుంచి 200 మంది సింగిల్ నంబర్ లాటరీ ఉచ్చులో పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. మూడు డెన్లలో కలిపి ప్రతి రోజూ తక్కువలో తక్కువ రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ చేతులు మారుతున్నాయని తెలుస్తోంది. ఇందులో 5 శాతం కూటమి ముఖ్య నేతలకు, పోలీసులకు ముట్టజెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగిల్ నంబర్ లాటరీలు జరిగే డెన్ల వద్ద జనం పెద్ద ఎత్తున గుమిగూడుతూ, గంజాయి, మద్యం మత్తులో తూగుతూ తరచూ ఘర్షణలకు దిగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతాలు అసాంఘిక శక్తులకు అడ్డాగా తయారయ్యాయని అంటున్నారు. మతి స్థిమితం లేని యువతికి వైద్యంఫ మూడు డెన్లు.. రూ.30 లక్షలు ఫ గంట గంటకూ నంబర్ షో ఫ ఒకటికి ఎనిమిది రెట్లు ఫ బెంగళూరు కేంద్రంగా కాయ్ రాజా కాయ్! ఫ ‘తమ్ముళ్ల’ కనుసన్నల్లో లాటరీ ఫ శ్రమజీవుల బతుకులు గుల్ల ఫ పోలీసుల ప్రేక్షక పాత్ర ఫ ముఖ్య నేతల జేబుల్లోకి నాలుగో వంతు -
గేట్ పరీక్షలో వన్నెపూడి విద్యార్థికి 111వ ర్యాంకు
పిఠాపురం: గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామానికి చెందిన కంద చల్లారావు బుధవారం విడుదల చేసిన గేట్ పరీక్షలో ఆల్ ఇండియాలో 111 ర్యాంకు సాధించాడు. ఇతను త్రిబుల్ ఐటీ నూజివీడులో మెట్రాలజీ డిపార్ట్మెంట్లో 9.7 జీపీఏతో ఉత్తీర్ణుడయ్యాడు. వన్నెపూడి జెడ్పీ హైస్కూల్లో పదవ తరగతి 10/10 ర్యాంకుతో ఉత్తీర్ణత సాధించాడు. తండ్రి దత్తాత్రేయుడు వ్యవసాయం, తల్లి వరలక్ష్మి గృహిణి. ఈ సందర్భంగా విద్యార్థిని వన్నెపూడి గ్రామ ప్రజలతోపాటు నాయకులు, అధికారులు అభినందించారు. మహా సంస్థానం హుండీ ఆదాయం రూ.18,57,246 పిఠాపురం: శ్రీపాద శ్రీవల్లభ మహసంస్థానం హుండీ ఆదాయం రూ.18,57,246 సమకూరినట్లు ఆలయ ఈఓ సౌజన్య తెలిపారు. బుధవారం ఆలయంలో హుండీలను లెక్కించారు. గత ఏడాది డిసెంబర్ 20వ తేదీ నుంచి బుధవారం వరకు ఈ ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు. హుండీల లెక్కింపులో దేవదాయ, ధర్మాదాయ శాఖ తనిఖీదారుడు ఫణీంద్ర కుమార్, స్వచ్ఛంద సంస్థల మహిళలు, అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లు నిలుపుదల చేస్తే చర్యలు కాకినాడ సిటీ: పరీక్షలు పాసైన విద్యార్థులకు ఉత్తీర్ణతా సర్టిఫికెట్ల జారీ నిలుపుదల చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని కలెక్టర్ షణ్మోహన్ సగిలి బుధవారం జిల్లాలోని కళాశాల యాజమాన్యాలకు సూచించారు. విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతన పథకం పరిధిలో ఉన్న కళాశాలలు అన్నింటికి ఫీజు రియంబర్స్మెంటు సొమ్మును నేరుగా ఆయా కళాశాలలకు విడుదల చేయడంతోపాటు, దశల వారీగా పాత బకాయిలను కూడా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాల మంజూరు కాని కారణంగా విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్లు నిరాకరించడం, పరీక్షలు పాసైన విద్యార్థులకు ఉత్తీర్ణతా సర్టిఫికెట్ల జారీ ఆపు చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని కలెక్టర్ షణ్మోహన్ కళాశాల యాజమాన్యాలను మరోమారు కోరారు. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే కళాశాలలపై చర్యలు చేపట్టడంతో బాటు, వాటి వ్యవహార శైలిపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. -
ఎన్టీఆర్ వసూళ్ల సేవ!
సాక్షి, రాజమహేంద్రవరం: పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ పథకంలోని కొన్ని నెట్వర్క్ ఆస్పత్రులు అడ్డగోలు వ్యవహారానికి తెర తీశాయి. రోగుల భయాన్ని, ఆరోగ్య సమస్యలను ఆసరాగా చేసుకుని అదనపు వసూళ్లకు అర్రులు చాస్తున్నాయి. ప్రభుత్వం అందించే నిధులు ఏ మూలకూ సరిపోవంటూ నమ్మబలికి కో–పేమెంట్లతో అందినకాడికి దోచేస్తున్నాయి. అదనంగా చెల్లిస్తే మెరుగైన వైద్యం, మంచి పరికరాలు వేస్తామంటూ వైద్యులు నమ్మబలుకుతున్నారు. తమకు ఆర్థిక స్థోమత లేదన్నా.. వదలడం లేదు.. ఏదోవిధంగా సర్దుకోవాలని.. అలా చేస్తే ఆరోగ్యం బాగుంటుందని, లేదంటే మీ ఇష్టమంటూ బ్లాక్మెయిలింగ్కు దిగుతున్నారు. వైద్యుల మాటను కాదనలేని రోగులు అప్పులు చేసి మరీ అదనంగా డబ్బు చెల్లించేస్తున్నారు. ఆర్థో(ఎముకలు), న్యూరో విభాగం శస్త్రచికిత్సలు జరిగే ఆస్పత్రుల్లో ఈ తరహా దందా యథేచ్ఛగా జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే కొంతమంది రోగులను ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులకు తరలించి అక్కడ శస్త్రచికిత్సలు చేసి అదనపు వసూళ్లు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భయమే పెట్టుబడిగా..! అదనపు వసూళ్ల విషయం బయటకు చెప్పుకుంటే.. వైద్యులు మెరుగైన చికిత్స అందించరేమో అన్న భయంతో రోగులు మిన్నకుండిపోతున్నారు. దీంతో కొన్ని ఆస్పత్రులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిపోయింది. కంటి, న్యూరో, ఆర్థో ఇలా ఏ శస్త్రచికిత్స అయినా.. స్థాయిని బట్టి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు, మరికొన్ని ఆస్పత్రులు రూ.20 వేల నుంచి రూ.50 వేలు. కొన్ని ప్రముఖ ఆస్పత్రులైతే రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు దండుకుంటున్నట్లు సమాచారం. కో–పేమెంట్లు వసూలు చేస్తున్నారిలా.. ఎన్టీఆర్ వైద్యసేవలో ఓ వ్యక్తి సింగిల్ స్టంట్ వేయించుకోవాలంటే రూ.60 వేలు, డబుల్ స్టంట్కు రూ.90 వేలు ప్రభుత్వం ఇస్తుంది. ఇందుకు గాను పేషెంట్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న అనంతరం ఆస్పత్రికి వెళ్లాలి. అలా చేయకుండా నేరుగా ఆస్పత్రికి వెళుతుండటంతో ఓపీ రూ.500 కట్టించేస్తున్నారు. వైద్య పరీక్షలు, యాంజీయోగ్రామ్ చేయాలని రూ.15 వేలు లాగేస్తున్నారు. స్టంట్ వేయాల్సి వస్తే రూ.15 వేలు వెనక్కు ఇస్తాం, లేదంటే లేదంటున్నారు. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. ప్రభుత్వం సరఫరా చేసే స్టంట్ చాలా నాసిరకం అని, అది వేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని భయపెడుతున్నారు. లోపల పౌడర్ కోటెడ్, గోల్డ్ కోటెడ్, ప్రీమియం కోటెడ్ , మెటల్ కోటెడ్ స్టంట్ వేస్తే మరో పదేళ్ల పాటు ఆరోగ్యానికి ఢోకా లేదని, ఇందుకు ప్రభుత్వం ఇచ్చే రూ.60 వేలతో పాటు మరో రూ.60 వేలు అదనంగా లాక్కుంటున్నారు. కానీ ఎలాంటి స్టంట్ వేస్తున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ప్రభుత్వ పరికరాలు నాసిరకమా..? ఎన్టీఆర్ వైద్యసేవ పథకానికి ప్రభుత్వం నేరుగా పరికరాలను పంపిణీ చేస్తుంది. వీటికి ఆశ (ఆంధ్రప్రదేశ్ మెడికల్ అసోసియేషన్) సభ్యులు, వైద్యులు నిర్ధారించిన ధరల ప్రకారమే చెల్లింపులు చేస్తుంది. అలాంటప్పుడు నాసిరకం ఎలా అవుతాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేవలం ధనార్జనే ధేయ్యంగా ఇలాంటి చర్యలకు దిగుతున్నట్లు ఆరోపణలున్నాయి. మామూళ్ల మత్తులో అధికారులు..? తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్యసేవ ఆస్పత్రులు 78 ఉన్నాయి. అందులో ప్రైవేటు ఆస్పత్రులు 43, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 5, ప్రైమరీ హెల్త్ సెంటర్లు 28, జీజీహెచ్ 1, ఏరియా హాస్పిటల్ 1 ఉన్నాయి. ఇవి కాకుండా మరో 16 దంద వైద్య శాలలు (ఈహెచ్ఎస్) సైతం వైద్య సేవలు అందిస్తున్నాయి. సుమారుగా 5.12 లక్షల మంది ఆరోగ్య శ్రీ కార్డుదారులున్నారు. వీటిపై పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కోఆర్డినేటర్తో పాటు, టీమ్ లీడర్, ఆరోగ్య మిత్రలు ఉన్నారు. రోగుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న విషయం తెలిసినా.. అరికట్టడంలో ఆ శాఖ ఉద్యోగులు శ్రద్ధ చూపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రతి నెలా ఇచ్చే ముడుపులు తీసుకుని మిన్నకుండిపోతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతన్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులను ప్రతి నెలా తనిఖీలు చేయాల్సి ఉన్నా.. అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలున్నాయి. అమలు అస్తవ్యస్తం పథకం అమలు అస్తవ్యస్తంగా మారింది. కొన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలు ఉండటం లేదు. 24 గంటల సేవలు అందించే ఆస్పత్రుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలిసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు మాత్రమే విధుల్లో ఉంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఫలితంగా తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. విజిలెన్స్ విచారణకు డిమాండ్ ఎన్టీఆర్ వైద్య సేవలపై విజిలెన్స్ అధికారులు సమగ్ర విచారణ జరిపితే దోపిడీ వ్యవహారం బట్టబయలవుతుందన్న డిమాండ్ ప్రజల నుంచి వెల్లువెత్తుతోంది. ప్రభుత్వం స్పందించి ఆ దిశగా చర్యలు చేపడితే సామాన్యులకు న్యాయం జరుగుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవలో కో–పేమెంట్ల కోసం వైద్యుల తహతహ మంచి పరికరాలు అమర్చుతామంటూ రోగులను నమ్మిస్తున్న వైనం పరికరాల పేరుతో రూ.వేలల్లో అదనపు వసూళ్లు తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని నెట్వర్క్ ఆస్పత్రుల్లో నయా దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమ వ్యవహారం ఆరోగ్యశ్రీ అధికారులకు తెలిసినా పట్టించుకోని వైనం -
త్వరలో అసంపూర్తి భవనాలను పూర్తి చేస్తాం
ఇన్ఫ్రా జాయింట్ డైరెక్టర్ రామలింగం రాయవరం: మనబడి–మన భవిష్యత్తు పథకంలో అసంపూర్తిగా ఉన్న భవనాలను త్వరలోనే పూర్తి చేయనున్నట్టు కమిషనర్ ఆఫ్ స్కూల్స్(ఇన్ఫ్రాస్ట్రక్చర్) ప్రోగ్రాం డైరెక్టర్ మువ్వా రామలింగం తెలిపారు. విద్యారంగ సంస్కరణల్లో భాగంగా ప్రాధాన్య క్రమంలో నిధులను కేటాయించి, పనులను పూర్తి చేయనున్నట్టు చెప్పారు. మండలంలో పదో తరగతి పాఠశాలల తనిఖీ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం సీబీఎస్ఈ, హైస్కూల్ ప్లస్ పాఠశాలలను విరమించుకునే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో, ప్రస్తుత సంస్కరణలకు అనుగుణంగా పనులను పూర్తి చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేసేందుకు శాయశక్తులా కృషి చేయనున్నట్టు తెలిపారు. మనబడి–మన భవిష్యత్తులో తాగునీరు, విద్యుద్దీకరణ, కిచెన్ షెడ్లు, టాయిలెట్లు, మేజర్, మైనర్ రిపేర్లు, గ్రీన్చాక్ బోర్డు, పెయింటింగ్ వంటి పనులను విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా పూర్తి చేస్తామని వివరించారు. అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పూర్తి చేస్తామన్నారు. సిమెంట్ అవసరమైన పాఠశాలల్లో నిర్మాణాలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లాలో పది పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేనట్టు నిర్వహిస్తున్నట్టు పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు రామలింగం తెలిపారు. చెల్లూరు, పసలపూడి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారన్నారు. కింద కూర్చుని పరీక్షలు రాయకుండా, అన్నిచోట్ల ఫర్నిచర్ను ఏర్పాటు చేశారన్నారు. -
వందేళ్ల వృద్ధురాలి కన్నుమూత
నల్లజర్ల: ప్రకాశరావుపాలెంలో వృద్ధురాలు గోగులమండ సుందరమ్మ(100) బుధవారం ఉదయం కన్నుమూశారు. మరణించే వరకూ ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని బంధువులు తెలిపారు. ఆమెకు ఐదుగురు మగ, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నలుగురు కుమారులు వివిధ శాఖల్లో గెజిటెడ్ హోదాల్లో పనిచేస్తున్నారు. నాలుగో కుమారుడు గోగుల మండబాబ్జీ వైఎస్సార్ సీపీ లీగల్సెల్ మండల అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆమె భర్త వీరాస్వామి కమ్యూనిస్టు ఉద్యమ నేతగా వ్యవహరించారు. ప్రాణం బలిగొన్న సెల్ఫోన్ రైలు కిందపడి వ్యక్తి దుర్మరణం సామర్లకోట: భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళుతున్న విశాఖ ఎక్స్ప్రెస్లో సామర్లకోటలో దిగిన ప్రయాణికుడు.. సెల్ఫోన్ కోసం వెళ్లి అదే రైలు కింద పడి మృతి చెందిన సంఘటన ఇది. రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం.రమేష్ వివరాల మేరకు, బుధవారం రాత్రి విశాఖపట్నం నుంచి పెద్దాపురానికి చెందిన ప్రయాణికులు సామర్లకోట రైల్వే స్టేషన్లో రైలు దిగారు. రైలు బోగీలో సెల్ఫోన్ మరచిపోవడంతో, కదులుతున్న రైలు ఎక్కేందుకు యత్నించిన త్రిమూర్తుల త్రినాథ్(35) అదుపుతప్పి అదే రైలు కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఓ పత్రిక ఏజెంట్గా అతడు పని చేస్తున్నట్టు బంధువులు తెలిపారు. సెల్ఫోన్ కోసం అతడు ప్రాణాలను కోల్పోయాడని బంధువులు విలపించారు. పెద్దాపురంలోని మిరపాకాల వీధికి చెందిన ఈ కుటుంబం మరికొద్ది సమయంలో ఇంటికి చేరుతామనుకునేసరికి ఈ ఘటన చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై పి.వాసు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 23న జాతీయ సాహిత్య సదస్సు సఖినేటిపల్లి: మహాకవి, పద్మభూషణ్ బోయి భీమన్న జీవితం, సాహిత్యంపై ఈ నెల 23న రాజమహేంద్రవరంలో జాతీయ సాహిత్య సదస్సు నిర్వహిస్తున్నట్టు శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ సీఈఓ కత్తిమండ ప్రతాప్ బుధవారం ఇక్కడ తెలిపారు. ఆ సదస్సులో వంద మంది కవులు పత్ర సమర్పణ చేయనున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఈ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యఅతిథిగా బోయి భీమన్న సతీమణి బోయి హైమవతి హాజరవుతారని తెలిపారు. సదస్సులో పాల్గొనే కవులందరినీ సత్కరిస్తామని చెప్పారు. -
గంజాయి విక్రేతల ముఠా అరెస్టు
నిడదవోలు: గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు యువకుల ముఠాను నిడదవోలు పోలీసులు అరెస్టు చేశారు. నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ బుధవారం విలేకర్లకు ఈ వివరాలు వెల్లడించారు. పట్టణంలో వైఎస్సార్ కాలనీలోని మానే గాంధీ పొలంలో పంపు షెడ్డు వద్ద కొందరు యువకులు గంజాయిని కలిగి ఉన్నారనే సమాచారంతో మంగళవారం సాయంత్రం పట్టణ ఎస్సై జీఎస్ఆర్కే పరమహంస తన సిబ్బందితో దాడి చేశారు. పట్టణానికి చెందిన కొందరు యువకులు ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా కామన్గూడ ప్రాంతం నుంచి కేజీ గంజాయిని రూ.3 వేల చొప్పున కొనుగోలు చేసి, నిడదవోలుకు తీసుకొచ్చారు. మానే గాంధీ పొలంలో పంపు షెడ్డు వద్ద వేయింగ్ మెషీన్పై తూచి, ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు దాడి చేసి, పట్టణంలోని కుమ్మరి వీధికి చెందిన దాసరి పృథ్వీవెంకటసాయి నితీష్, జగనన్న కాలనీకి చెందిన గడిచుకోట భానుప్రకాష్, వైఎస్సార్ కాలనీకి చెందిన షేక్ బషీర్, చర్చిపేటకు చెందిన అక్కాబత్తుల బాలు, సింగవరం గ్రామానికి చెందిన మద్దాల భానుప్రకాష్, తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన పడాల భాగ్య శివసుబ్రహ్మణ్యంను అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్కు పంపించినట్టు సీఐ తిలక్ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.55 వేల విలువైన 11 కేజీల గంజాయి, నాలుగు సెల్ఫోన్లు, మోటార్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ నిడదవోలు పోలీసులను అభినందించారు. నిందితుల్లో ఆరుగురు యువకులు 11 కేజీల సరకు, ఇతర వస్తువులు స్వాధీనం -
నదీ పాయలో బాట నిర్మాణం
పి.గన్నవరం: పెదకందాలపాలెం ర్యాంపు నుంచి మానేపల్లి లంక వరకూ సుమారు 2 కి.మీ మేర నదీపాయలో తువ్వ మట్టి లారీల రాకపోకల కోసం పొక్లెయిన్లతో బాటలు నిర్మిస్తున్నారు. నేషనల్ హైవే పనుల కోసం తువ్వ మట్టిని తరలించేందుకు ఈ బాటలు ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఇందుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతులు తెచ్చుకున్నామని చెబుతున్న నిర్వాహకులు మాత్రం వాటిని ఎవ్వరికీ చూపడం లేదు. ఇంతవరకూ స్థానిక రెవెన్యూ అధికారులకు కూడా అనుమతి పత్రాలు అందలేదు. కూటమి నేతల కనుసన్నల్లో మట్టి తరలింపునకు సన్నాహాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూతపడిన ర్యాంపు! ఇటీవల పెదకందాలపాలెం నుంచి అనుమతులు లేకుండా కూటమి నాయకులు ఇసుక, మట్టిని కొల్లగొట్టడంపై పత్రికల్లో కథనాలు రావడంతో ఈ ర్యాంపు మూతబడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా పెదకందాలపాలెం ర్యాంపు నుంచి మానేపల్లి పల్లిపాలెం లంక వరకూ నదీపాయ వెంబడి పొక్లెయిన్లతో బాటలు వేస్తున్నారు. అనుమతులు లేకుండా టిప్పర్లలో తువ్వ మట్టిని తరలించుకుపోతున్నారని బుధవారం స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్ఐ వి.డాంగే, వీఆర్వో వి.సత్యనారాయణ ర్యాంపులోకి వెళ్లారు. నేషనల్ హైవే పనుల కోసం మట్టిని తరలించేందుకు అనుమతులు తెచ్చుకున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ర్యాంపులోకి వెళ్లే ముందు రోడ్డుపై మట్టి లోడుతో వెళ్తున్న లారీని అధికారులు నిలిపి వీఆర్ఏని కాపలా ఉంచారు. ఈలోగా ర్యాంపు నిర్వాహకులు అక్కడికి వెళ్లి బిల్లు ఉందంటూ లారీని పంపించేశారు. ఈ క్రమంలో స్వల్ప వివాదం కూడా జరిగింది. ఇలాఉండగా మానేపల్లిలంక నుంచి మట్టిని తీసే అనుమతులతో.. పెదకందాలపాలెం లంక పరిసరాల్లో కూడా పెద్దఎత్తున మట్టిని తరలించుకుపోయేందుకు కూటమి నేతలు సన్నాహాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకే నదీపాయలో రెండు కి.మీ. మేర బాట నిర్మించారని చెబుతున్నారు. అనుమతి పత్రాలు రావాలి మానేపల్లి లంక నుంచి హైవే పనుల కోసం మట్టిని తరలించేందుకు అనుమతి ఇచ్చినట్టు మైన్స్ అధికారులు తనకు చెప్పారని తహసీల్దార్ పి.శ్రీపల్లవి తెలిపారు. వారి నుంచి సంబంధిత పత్రాలు రావాల్సి ఉందన్నారు. మానేపల్లిలంక వద్ద పొక్లెయిన్లతో 2 కి.మీ. ఏర్పాటు కూటమి నేతల కనుసన్నల్లో ర్యాంపు నిర్వహణ! -
బాణసంచా తయారీలో నిబంధనలు పాటించాలి
కరప: బాణసంచా తయారీదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కాకినాడ ఏడీఎఫ్ఓ పి.ఏసుబాబు అన్నారు. వేళంగిలో బుధవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాణసంచా తయారీదారుల సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాణసంచా తయారీ, విక్రయదారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. తయారు చేసే ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు, అగ్నిప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా బాణసంచా తయారీదారుల సంక్షేమ సంఘ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షునిగా వెలుగుబంట్ల సత్యనారాయణ, అధ్యక్షుడిగా కొప్పిశెట్టి శ్రీనివాసరావు, కోశాధికారిగా జీవీవీ సత్యనారాయణ, కార్యదర్శిగా కె.విజయ్కుమార్, కె.దుర్గారావు, ఉపాధ్యక్షులుగా విన్నకోటి శ్రీనివాసరావు, సయ్యద్ బాజీబేగ్, ఎన్.దుర్గాప్రసాద్ ఎన్నికయ్యారు. హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు ధవళేశ్వరం: నేరం రుజువు కావడంతో హత్య కేసులో నిందితుడు దాడి గణేష్కు జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఐదో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి డి.విజయగౌతమ్ బుధవారం తీర్పు ఇచ్చారు. పోలీసుల వివరాల మేరకు, నర్సిపట్నం మండలం చెట్టిపల్లి గ్రామానికి చెందిన దాడి గణేష్ 12 ఏళ్ల క్రితం ధవళేశ్వరం గ్రామానికి చెందిన వరలక్ష్మిని ప్రేమించి, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. ధవళేశ్వరం ఎర్రకొండలో నివాసం ఉండేవారు. 2019 జనవరి 28న తన భార్య ఎవరితోనే ఫోన్ మాట్లాడుతుందనే అనుమానంతో పీటతో తలపై మోది, చాకుతో పొడిచి ఆమెను హతమార్చాడు. ఆమె సోదరుడు కుంచాల శ్రీను ఫిర్యాదు మేరకు అప్పటి సీఐలు బాలశౌరి, ఎ.శ్రీను, ఎస్సై ఎస్.వెంకయ్య చార్జిషీట్లు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున గ్రేడ్–1 స్పెషల్ పీపీ కె.లక్ష్మానాయక్ వాదించారు. కేసును పర్యవేక్షించిన ధవళేశ్వరం సీఐ టి.గణేష్ ,హెచ్సీ బి.జయరామ్రాజును ఎస్పీ బి.నరసింహ కిషోర్ అభినందించారు. రైతు బలవన్మరణం నల్లజర్ల: కారణమేంటో తెలియదు కానీ మండలంలోని తెలికిచెర్లలో బుధవారం తెల్లవారుజామున రైతు బుడిగిన శ్రీను(48) తన పొలంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. పొలంలో మామిడిచెట్టుకు ఉరి వేసుకున్నాడు. అతడికి భార్య, ఇద్దరు మగ పిల్లలున్నారు. అతడి మరణానికి కారణం తెలియదని బంధువులు తెలిపారు. పామాయిల్ తోట వద్ద మామిడి చెట్టుకు అతడి మృతదేహం వేలాడుతుండడాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్సై శోభనాద్రి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ఐడీఎస్పీ బృందం పర్యటన
డయేరియా రోగుల నుంచి వివరాల సేకరణ గోపాలపురం: ‘పల్లెల్లో పారిచోద్యం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు బుధవారం వైద్యారోగ్య శాఖ, పంచాయతీ అధికారులు స్పందించారు. గోపాలపురం, పెద్దగూడెం, చిట్యాల, తొక్కిరెడ్డిగూడెం తదితర డయేరియా ప్రభావిత గ్రామాల్లో పారిశుధ్య పనులు వేగవంతం చేశారు. పెద్దగూడెం, ఉప్పరగూడెం గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాలను యంత్రాల సాయంతో ట్రాక్టర్లు, లారీలపై డంపింగ్ యార్డుకు తరలించారు. వివిధ గ్రామాల్లో శానిటేషన్ పనులు చేపట్టారు. నాలుగు రోజులుగా డయేరియా కేసులు నమోదైన నేపథ్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వల్ల కొత్త కేసులు నమోదు కాలేదని గోపాలపురం సీహెచ్సీ సూపరింటెండెంట్ కె.చైతన్యరాజు తెలిపారు. ఐడీఎస్పీ బృందం పర్యటన అతిసారంతో సుమారు 30 మంది డయేరియా బారిన పడిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రాం బృందం(ఐడీఎస్పీ) గోపాలపురం సీహెచ్సీని సందర్శించింది. ఆస్పత్రిలో చికిత్స పొందిన వారి వివరాలు సేకరించి, బాధితుల ఇళ్లకు వెళ్లి ఆరా తీసింది. అతిసారానికి కారణాలు, పారిశుధ్యం, తాగునీరు వంటి అంశాలపై బృంద సభ్యులు ప్రజలతో మాట్లాడారు. గోపాలపురం, పెద్దగూడెం, వేళ్లచింతలగూడెం, చిట్యాల, గుడ్డిగూడెం, పెద్దాపురం గ్రామాల్లో స్థితిగతులను పరిశీలించారు. వీరి వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ కె.చైతన్యరాజు, వైద్యారోగ్య, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నారు. -
చెత్త పనులను ప్రశ్నించే వారేరీ..?
పర్యావరణానికి ‘మంట’ జనసేన ఆవిర్భావ సభ అనంతరం పేరుకుపోయిన ప్లాస్టిక్ చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉండగా, జనసేన నేతలు ఎక్కడికక్కడ పోగేసి, మంట పెట్టేశారు. దీంతో పచ్చని చెట్లతో ఆహ్లాదంగా ఉండే చిత్రాడ, పరిసర ప్రాంతాలు కాలుష్యంతో నిండిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్య పనులకు కమిటీ వేసినట్టు చెప్పుకొన్న జనసేన నేతలు.. నిజానికి వారు పెత్తనం చేసి, ఇతరులతో పని చేయించడమే కాకుండా, పర్యావరణానికి మంట పెట్టారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించేస్తామని ఒంటికాలిపై నిలబడే నేతలున్న పార్టీ అది. అవసరమైతే నింగీనేలా ఏకం చేసేస్తామంటే.. జనాలు కూడా నిజమేననుకున్నారు. ఆ పార్టీ ఆవిర్భావ సభ ముగిస్తే కానీ వాస్తవం బోధపడలేదు ప్రజలకు. పార్టీ కార్యక్రమాలకు ప్రజాధనం దుర్వినియోగం, స్థానికసంస్థల సిబ్బందితో పారిశుధ్య పనులు.. తుదకు భావి పౌరులైన విద్యార్థులతో కూడా ‘చెత్త’ పనులు చేయించి.. వారి నిజ స్వరూపమేమిటో కళ్లకు కట్టినట్టు చూపించారు.పిఠాపురం: పాఠశాలల్లో పేరుకుపోయిన చెత్తను అపాయకర పరిస్థితుల్లో విద్యార్థులతో తొలగించిన అధికారుల తీరును మరువక మునుపే.. పిఠాపురంలో మరిన్ని వింత పోకడలు వెలుగుచూశాయి. ఇటీవల పిఠాపురం మండలం చిత్రాడలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభా ప్రాంగణంలో భారీగా చెత్త పేరుకుపోయింది. దీనిని తొలగించడానికి పార్టీ నేతలు శ్రమిస్తున్నట్టుగా ఫొటోలకు ఫోజులిస్తున్నారు. వాస్తవానికి పిఠాపురం మున్సిపల్ పారిశుధ్య కార్మికులను, ఉపాధి కూలీలను, మున్సిపల్ వాహనాలను వినియోగించి చెత్తను తొలగించారు. ఓ పార్టీ కార్యక్రమానికి పోగైన చెత్తను తొలగించడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడాన్ని వారు తప్పుబడుతున్నారు. పార్టీ కార్యక్రమానికి పారిశుధ్య కార్మికులతో పని చేయించడం స్వర్ణాంధ్ర.. పాఠశాల విద్యార్థులతో పారిశుధ్య పనులు చేయించడం స్వచ్ఛాంధ్ర అన్నట్టుగా ఉంది పిఠాపురంలో అధికారుల తీరు. రాజకీయ పార్టీ కార్యక్రమానికి వచ్చిన చెత్తను మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో తీయించి, పాఠశాలలో చెత్తను విద్యార్థులతో తీయించిన ఘనత పవన్ అడ్డాగా చెబుతున్న పిఠాపురం నేతలకే దక్కింది. ఇటీవల పిఠాపురం మండలం చిత్రాడలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా టన్నుల కొద్దీ చెత్త వెలువడింది. ఓ రాజకీయ పార్టీకి చెందిన కార్యక్రమం అయినందున, వారి సొంత సొమ్ముతో సభా ప్రాంగణాన్ని శుభ్రం చేయించాల్సి ఉంది. కానీ అధికార దుర్వినియోగం కావాల్సినంత చేసిన జనసేన నేతలు.. మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో, ఉపాధి కూలీలతో అంతా శుభ్రం చేయించడం విమర్శలకు దారితీసింది. పట్టణంలో పేరుకుపోయిన చెత్తను వదిలి, మున్సిపల్ సిబ్బంది జనసేన సభా ప్రాంగణంలో పేరుకున్న చెత్తను తొలగించడంపై పట్టణవాసులు మండిపడుతున్నారు. ఇంతవరకు ఎలా ఉన్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అడ్డాగా చెబుతున్న పిఠాపురంలో విద్యా ప్రదాతగా పేరొందిన పిఠాపురం మహారాజా కలల సౌధమైన ఆర్ఆర్బీహెచ్ఆర్ పాఠశాలలో విద్యార్థులతో పారిశుధ్య పనులు చేయించిన సంఘటనపై ఏ ఒక్క అధికారీ నోరు మెదపకపోవడాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఇదేనా అభివృద్ధి అంటే అంటూ ప్రశ్నిస్తున్నారు. చదువుకునే పిల్లలతో ప్రమాదకర పరిస్థితుల్లో పనులు చేయించినా.. ఏఒక్క అధికారి పట్టించుకోకపోవడమేనా పవన్ పర్యావరణ పరిరక్షణ సిద్ధాంతం అని స్థానికులు నిలదీస్తున్నారు. ఏం చేసినా మమ్మల్ని అడిగేదెవరు అన్నట్టుగా ప్రజాప్రతినిధుల తీరు ఉంటే, వారి అండ చూసుకుని ప్రవర్తిస్తున్నారు అధికారులు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, ఎన్నికల ప్రచారం చేసిన మున్సిపల్ కమిషనర్ కనకారావుపై చర్యలు లేవు. ఉన్నతాధికారి నిర్వహించే గ్రీవెన్స్లో జనసేన నేతలు హల్చల్ చేసినా చర్యలు శూన్యం. ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులతో పని చేయించిన ఉపాధ్యాయులపై చర్యలు అసలు లేవు.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ప్రతి నేత చట్టాన్ని ఉల్లంఘిస్తున్నా.. అధికారులు తమ పరిధిని దాటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నా.. ఎవరూ పట్టించుకునే వారు లేరు. జనసేన బహిరంగ సభ తర్వాత కానీ బోధపడని వాస్తవం పార్టీ చెత్త.. కార్మికులతో, పాఠశాల చెత్త.. విద్యార్థులతో క్లీనింగ్ ఉపాధి కూలీలతో పారిశుధ్య పనులు మున్సిపల్ కార్మికులు, వాహనాల వినియోగం ప్రజాధనం దుర్వినియోగంపై పట్టణవాసుల మండిపాటు పార్టీ పనులకు ఉపాధి కూలీలు చిత్రాడ జనసేన సభా ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్త తొలగించడానికి రోజుకు 80 మంది చొప్పున ఉపాధి కూలీలను వినియోగించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఉపాధి కూలీలను ప్రైవేటు పనులకు ఉపయోగించరాదన్న కీలక నియమాన్ని తుంగలోకి తొక్కిన జనసేన నేతలు.. ఉపాధి కూలీలతో పారిశుధ్య పనులు చేయించారు. ఐదు రోజులుగా పని చేయించుకున్న జనసేన నేతలు కూలీలకు దగ్గరుండి మస్టర్లు వేయించడం, ఉపాధి సిబ్బందితో దగ్గరుండి పనులు చేయించడం వారి అధికార దుర్వినియోగానికి అద్దం పడుతోందని స్థానికులు పెదవి విరుస్తున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 15,500 గటగట (వెయ్యి) 14,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 14,500 గటగట (వెయ్యి) 13,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
పురమిత్ర యాప్తో మరిన్ని సేవలు
ఏలేశ్వరం: పురమిత్ర యాప్తో మరిన్ని సేవలు అందిస్తామని మున్సిపల్ రీజనల్ డైరెక్టర్(ఆర్డీ) నాగనరసింహరావు అన్నారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో బుధవారం జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల కమిషనర్లు, మేనేజర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు పురమిత్ర యాప్ ప్రారంభిస్తామన్నారు. దీని ద్వారా ఫిర్యాదు చేస్తే ఆ శాఖకు సమాచారం వెళుతుందన్నారు. దీంతో పాటు పన్నులు చెల్లించవచ్చన్నారు. తడిపొడి చెత్తల సేకరణపై ప్రజల్లో విస్త్రతంగా ప్రచారం చేశారు. వేసవికి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కుక్కల నివారణలో భాగంగా వాటి శస్త్రచికిత్సలకు తునిలో కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీలో 63శాతం పన్నులు వసూలు చేశామన్నారు. కమిషనర్ ఎం సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. ప్రశాంతంగా హిందీ పరీక్ష బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా రెండవ రోజు బుధవారం హిందీ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 27,394 దరఖాస్తు చేసుకోగా 27,186మంది హాజరుకాగా 208మంది గైర్హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి 6 కేంద్రాలు, పరిశీలకులు 8 కేంద్రాలు, తనిఖీ అధికారులు 40 కేంద్రాలు తనిఖీ చేశారని డీఈఓ రమేష్ తెలిపారు. -
స్పందించిన న్యాయమూర్తి
సింగిల్ నంబర్ లాటరీ కేరాఫ్ కాకినాడసాక్షి ప్రతినిధి, కాకినాడ: సింగిల్ నంబర్ లాటరీకి కేరాఫ్గా కాకినాడ నిలుస్తోంది. బెంగళూరు నగరంలోని రెండు ముఖ్య కూడళ్లు కేంద్రంగా సాగుతున్న ఈ దందా వెనుక పెద్దల హస్తం ఉండటం విస్మయానికి గురి చేస్తోంది. ఈ లాటరీతో నిరుపేదలు, రోజువారీ శ్రమజీవుల బతుకులు గుల్లవుతున్నాయి. ఒకటికి ఏడు, ఎనిమిదింతలు వస్తుందనే ఆశ చూపి, నిర్వాహకులు నిలువు దోపిడీ చేస్తున్నారు. సింగిల్ నంబర్ లాటరీపై నిషేధం ఉన్నా కూటమి ప్రభుత్వం గద్దెనెక్కాక కాకినాడలో మాత్రం తలుపులు బార్లా తెరిచారు. నెలవారీగా ఎవరి వాటాలు వారి జేబుల్లోకి వెళ్లిపోతూండటంతో గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా సాగిస్తున్నారు. ఈ సింగిల్ నంబర్ లాటరీకి కాకినాడ నగరంలోని మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు డెన్లు నడుస్తున్నాయి. ఒకో డెన్ను ఇద్దరు తెలుగు తమ్ముళ్లు నిర్వహించుకునేందుకు ఒప్పందాలు జరిగాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సింగిల్ నంబర్ లాటరీలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కాక తెలుగు తమ్ముళ్లు అధికారం దన్నుతో ఈ జూద క్రీడను తిరిగి పట్టాలెక్కించారు. సుమారు ఆరు నెలలుగా సాగుతున్న సింగిల్ నంబర్ లాటరీతో రోజూ రూ.లక్షలు చేతులు మారుతున్నా కన్నెత్తి చూసే నాథుడే లేకుండా పోయాడనే విమర్శలు వస్తున్నాయి. సింగిల్ నంబర్ లాటరీ ఉదయం 8 గంటలకు మొదలై రాత్రి 8 లేదా 9 గంటల వరకూ నిర్వహిస్తున్నారు. వీధుల్లో కర్రా బిళ్ల ఆడినట్లుగా బహిరంగంగానే ఆడేస్తున్నారు. దీనిని కట్టడి చేయాల్సిన పోలీసులు అధికార పార్టీలోని ముఖ్య నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గాల్సి వస్తోందని అంటున్నారు. సింగిల్ నంబర్ లాటరీ కొడితే ఒకటికి ఏడెనిమిది రెట్లు అధికంగా వస్తుందనే ఆశతో రెక్కల కష్టాన్నే నమ్ముకున్న శ్రమజీవులు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, ఇతర పేదల బతుకులు గుల్లయిపోతున్నాయి. ఇవీ డెన్లు కాకినాడ సంజయ్నగర్ లారీ సీరియల్ ఆఫీసు సమీపాన సింగిల్ నంబర్ లాటరీ నడుస్తోంది. ఈ డెన్ కాకినాడ పోర్టు పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తోంది. కాకినాడ రాగంపేట పరిధిలో మూడో పట్టణ పోలీసు స్టేషన్కు కూతవేటు దూరంలో కల్పనా సెంటర్ ఫ్లై ఓవర్ కింద మరో డెన్ నిర్వహిస్తున్నారు. మూడో డెన్ జగన్నాథపురం చారిటీస్ వద్ద నూకాలమ్మ టెంపుల్ వెనుక ఉన్న పార్కు సమీపాన జరుగుతోంది. ఈ ప్రాంతం వన్టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ మూడు కేంద్రాల్లోనూ కూటమికి చెందిన ద్వితీయ శ్రేణి నేతల కనుసన్నల్లోనే సింగిల్ నంబర్ లాటరీ జరుగుతోంది. ఇలా జరుగుతోంది బెంగళూరుకు చెందిన లాటరీ నిర్వాహకులు ఒకటి నుంచి తొమ్మిది నంబర్లు (సింగిల్ డిజిట్) మొబైల్లో డిస్ప్లే చేస్తారు. కాకినాడలో లాటరీ డెన్ నడుపుతున్న నిర్వాహకుడు మొబైల్లో ఒకటి నుంచి తొమ్మిది నంబర్లలో ఏదో ఒక నంబర్ను లాటరీ వేసే వ్యక్తికి సూచిస్తాడు. గంటగంటకూ బెంగళూరు నుంచి నంబర్ షో ఉంటుంది. ఉదాహరణకు ఉదయం 8 గంటలకు సంజయ్ నగర్లోని లాటరీ డెన్ వద్దకు వచ్చిన సుబ్బారావు అనే వ్యక్తి ఐదో నంబర్పై రూ.వెయ్యి కాశాడని అనుకుంటే.. ఈ విషయాన్ని ఒక కాగితంపై రాసి ఇస్తారు. తొమ్మిది గంటలకు నిర్వాహకుడు మొబైల్లో ఏ నంబర్కు షో వచ్చిందో చూపిస్తాడు. లాటరీ షోలో ఐదో నంబర్ చూపిస్తే రూ.8 వేలు (రూ.వెయ్యికి ఎనిమిది రెట్లు) తిరిగిస్తారు. అంటే గంటలోనే లాటరీ ఫలితం తేలిపోతుందన్న మాట. మిగిలిందంతా నిర్వాహకులకే. ఇలా ఒక డెన్లో రోజుకు 100 నుంచి 200 మంది సింగిల్ నంబర్ లాటరీ ఉచ్చులో పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. మూడు డెన్లలో కలిపి ప్రతి రోజూ తక్కువలో తక్కువ రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ చేతులు మారుతున్నాయని తెలుస్తోంది. ఇందులో 5 శాతం కూటమి ముఖ్య నేతలకు, పోలీసులకు ముట్టజెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగిల్ నంబర్ లాటరీలు జరిగే డెన్ల వద్ద జనం పెద్ద ఎత్తున గుమిగూడుతూ, గంజాయి, మద్యం మత్తులో తూగుతూ తరచూ ఘర్షణలకు దిగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతాలు అసాంఘిక శక్తులకు అడ్డాగా తయారయ్యాయని అంటున్నారు. మతి స్థిమితం లేని యువతికి వైద్యంఫ మూడు డెన్లు.. రూ.30 లక్షలు ఫ గంట గంటకూ నంబర్ షో ఫ ఒకటికి ఎనిమిది రెట్లు ఫ బెంగళూరు కేంద్రంగా కాయ్ రాజా కాయ్! ఫ ‘తమ్ముళ్ల’ కనుసన్నల్లో లాటరీ ఫ శ్రమజీవుల బతుకులు గుల్ల ఫ పోలీసుల ప్రేక్షక పాత్ర ఫ ముఖ్య నేతల జేబుల్లోకి నాలుగో వంతు -
మాలలపై కక్ష గట్టిన చంద్రబాబు
అమలాపురం టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు మాలలపై కక్షతో ఎస్సీ వర్గీకరణను అడ్డగోలుగా చేయడానికి కుట్ర పన్నుతున్నారని జిల్లా మాల సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ జంగా బాబూరావు ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎస్సీల్లో ఓ వర్గానికి లబ్ధి చేకూర్చేలా పావులు కదుపుతున్నారని విమర్శించారు. స్థానిక ప్రెస్ క్లబ్ భవనంలో ఐక్య వేదిక ప్రతినిధులు బుధవారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 22 మండలాల మాల ముఖ్య నాయకులు పాల్గొని, కార్యాచరణపై చర్చించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్ధం కావాలని సమావేశం పిలుపునిచ్చింది. దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. 2021 జనాభా లెక్కల ప్రకారం ఏకసభ్య కమిషన్ నివేదికను రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం సిగ్గుచేటని నాయకులు దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణే ధ్యేయంగా పనిచేస్తోందని ఆరోపించారు. వర్గీకరణ వల్ల మాల, ఎస్సీల్లోని 59 ఉప కులాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి ఇసుకపట్ల రఘుబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఏకసభ్య కమిషన్ నివేదికను రద్దు చేసి, హైకోర్టు సిట్టింగ్ జడ్జిలతో త్రిసభ్య కమిషన్ను నియమించి, న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 2025 కుల గణనను పరిగణనలోకి తీసుకుని, ఉప కులాల అభిప్రాయాలు విన్న తర్వాతే వర్గీకరణ జోలికి వెళ్లాలని సూచించారు. మాలల ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో తీవ్రతరం చేస్తామని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని ఐక్యవేదిక ప్రతినిధి, అముడా మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్రాజు హెచ్చరించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా అనంతరం ఐక్య వేదిక నాయకులు జిల్లా కలెక్టరేట్కు ప్రదర్శనగా వెళ్లి, అక్కడ ధర్నా నిర్వహించారు. మాలల పంతం.. చంద్రబాబు అంతం, ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని డీఆర్వోకు అందజేశారు. ఐక్యవేదిక నాయకులు రేవు తిరుపతిరావు, గెడ్డం సురేష్కుమార్, పొలమూరి మోహన్బాబు, పెనుమాల చిట్టిబాబు, దేవరపల్లి శాంతికుమార్, జిత్తుక సత్యనారాయణ, ఉబ్బన శ్రీను, నెల్లి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. కమిషన్ నివేదికను రద్దు చేయాలని డిమాండ్ కలెక్టరేట్ వద్ద జిల్లా మాల సంఘాల ఐక్య వేదిక ధర్నా -
ఎన్టీఆర్ వసూళ్ల సేవ!
సాక్షి, రాజమహేంద్రవరం: పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ పథకంలోని కొన్ని నెట్వర్క్ ఆస్పత్రులు అడ్డగోలు వ్యవహారానికి తెర తీశాయి. రోగుల భయాన్ని, ఆరోగ్య సమస్యలను ఆసరాగా చేసుకుని అదనపు వసూళ్లకు అర్రులు చాస్తున్నాయి. ప్రభుత్వం అందించే నిధులు ఏ మూలకూ సరిపోవంటూ నమ్మబలికి కో–పేమెంట్లతో అందినకాడికి దోచేస్తున్నాయి. అదనంగా చెల్లిస్తే మెరుగైన వైద్యం, మంచి పరికరాలు వేస్తామంటూ వైద్యులు నమ్మబలుకుతున్నారు. తమకు ఆర్థిక స్థోమత లేదన్నా.. వదలడం లేదు.. ఏదోవిధంగా సర్దుకోవాలని.. అలా చేస్తే ఆరోగ్యం బాగుంటుందని, లేదంటే మీ ఇష్టమంటూ బ్లాక్మెయిలింగ్కు దిగుతున్నారు. వైద్యుల మాటను కాదనలేని రోగులు అప్పులు చేసి మరీ అదనంగా డబ్బు చెల్లించేస్తున్నారు. ఆర్థో(ఎముకలు), న్యూరో విభాగం శస్త్రచికిత్సలు జరిగే ఆస్పత్రుల్లో ఈ తరహా దందా యథేచ్ఛగా జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే కొంతమంది రోగులను ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులకు తరలించి అక్కడ శస్త్రచికిత్సలు చేసి అదనపు వసూళ్లు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భయమే పెట్టుబడిగా..! అదనపు వసూళ్ల విషయం బయటకు చెప్పుకుంటే.. వైద్యులు మెరుగైన చికిత్స అందించరేమో అన్న భయంతో రోగులు మిన్నకుండిపోతున్నారు. దీంతో కొన్ని ఆస్పత్రులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిపోయింది. కంటి, న్యూరో, ఆర్థో ఇలా ఏ శస్త్రచికిత్స అయినా.. స్థాయిని బట్టి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు, మరికొన్ని ఆస్పత్రులు రూ.20 వేల నుంచి రూ.50 వేలు. కొన్ని ప్రముఖ ఆస్పత్రులైతే రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు దండుకుంటున్నట్లు సమాచారం. కో–పేమెంట్లు వసూలు చేస్తున్నారిలా.. ఎన్టీఆర్ వైద్యసేవలో ఓ వ్యక్తి సింగిల్ స్టంట్ వేయించుకోవాలంటే రూ.60 వేలు, డబుల్ స్టంట్కు రూ.90 వేలు ప్రభుత్వం ఇస్తుంది. ఇందుకు గాను పేషెంట్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న అనంతరం ఆస్పత్రికి వెళ్లాలి. అలా చేయకుండా నేరుగా ఆస్పత్రికి వెళుతుండటంతో ఓపీ రూ.500 కట్టించేస్తున్నారు. వైద్య పరీక్షలు, యాంజీయోగ్రామ్ చేయాలని రూ.15 వేలు లాగేస్తున్నారు. స్టంట్ వేయాల్సి వస్తే రూ.15 వేలు వెనక్కు ఇస్తాం, లేదంటే లేదంటున్నారు. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. ప్రభుత్వం సరఫరా చేసే స్టంట్ చాలా నాసిరకం అని, అది వేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని భయపెడుతున్నారు. లోపల పౌడర్ కోటెడ్, గోల్డ్ కోటెడ్, ప్రీమియం కోటెడ్ , మెటల్ కోటెడ్ స్టంట్ వేస్తే మరో పదేళ్ల పాటు ఆరోగ్యానికి ఢోకా లేదని, ఇందుకు ప్రభుత్వం ఇచ్చే రూ.60 వేలతో పాటు మరో రూ.60 వేలు అదనంగా లాక్కుంటున్నారు. కానీ ఎలాంటి స్టంట్ వేస్తున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ప్రభుత్వ పరికరాలు నాసిరకమా..? ఎన్టీఆర్ వైద్యసేవ పథకానికి ప్రభుత్వం నేరుగా పరికరాలను పంపిణీ చేస్తుంది. వీటికి ఆశ (ఆంధ్రప్రదేశ్ మెడికల్ అసోసియేషన్) సభ్యులు, వైద్యులు నిర్ధారించిన ధరల ప్రకారమే చెల్లింపులు చేస్తుంది. అలాంటప్పుడు నాసిరకం ఎలా అవుతాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేవలం ధనార్జనే ధేయ్యంగా ఇలాంటి చర్యలకు దిగుతున్నట్లు ఆరోపణలున్నాయి. మామూళ్ల మత్తులో అధికారులు..? తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్యసేవ ఆస్పత్రులు 78 ఉన్నాయి. అందులో ప్రైవేటు ఆస్పత్రులు 43, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 5, ప్రైమరీ హెల్త్ సెంటర్లు 28, జీజీహెచ్ 1, ఏరియా హాస్పిటల్ 1 ఉన్నాయి. ఇవి కాకుండా మరో 16 దంద వైద్య శాలలు (ఈహెచ్ఎస్) సైతం వైద్య సేవలు అందిస్తున్నాయి. సుమారుగా 5.12 లక్షల మంది ఆరోగ్య శ్రీ కార్డుదారులున్నారు. వీటిపై పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కోఆర్డినేటర్తో పాటు, టీమ్ లీడర్, ఆరోగ్య మిత్రలు ఉన్నారు. రోగుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న విషయం తెలిసినా.. అరికట్టడంలో ఆ శాఖ ఉద్యోగులు శ్రద్ధ చూపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రతి నెలా ఇచ్చే ముడుపులు తీసుకుని మిన్నకుండిపోతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతన్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులను ప్రతి నెలా తనిఖీలు చేయాల్సి ఉన్నా.. అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలున్నాయి. అమలు అస్తవ్యస్తం పథకం అమలు అస్తవ్యస్తంగా మారింది. కొన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలు ఉండటం లేదు. 24 గంటల సేవలు అందించే ఆస్పత్రుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలిసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు మాత్రమే విధుల్లో ఉంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఫలితంగా తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. విజిలెన్స్ విచారణకు డిమాండ్ ఎన్టీఆర్ వైద్య సేవలపై విజిలెన్స్ అధికారులు సమగ్ర విచారణ జరిపితే దోపిడీ వ్యవహారం బట్టబయలవుతుందన్న డిమాండ్ ప్రజల నుంచి వెల్లువెత్తుతోంది. ప్రభుత్వం స్పందించి ఆ దిశగా చర్యలు చేపడితే సామాన్యులకు న్యాయం జరుగుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవలో కో–పేమెంట్ల కోసం వైద్యుల తహతహ మంచి పరికరాలు అమర్చుతామంటూ రోగులను నమ్మిస్తున్న వైనం పరికరాల పేరుతో రూ.వేలల్లో అదనపు వసూళ్లు తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని నెట్వర్క్ ఆస్పత్రుల్లో నయా దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమ వ్యవహారం ఆరోగ్యశ్రీ అధికారులకు తెలిసినా పట్టించుకోని వైనం -
శృంగార వల్లభునికి రూ.28.10 లక్షల ఆదాయం
పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి వారికి అన్నదానం, హుండీల ద్వారా రూ.28,10,646 ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వడ్డి శ్రీనివాస్ తెలిపారు. దేవదాయ శాఖ కాకినాడ డివిజనల్ ఇన్స్పెక్టర్ వి.ఫణీంద్రకుమార్, గ్రామ సర్పంచ్ మొయిళ్ల కృష్ణమూర్తి సమక్షంలో ఆలయంలోని హుండీలను మంగళవారం తెరచి, ఆదాయం లెక్కించారు. మొత్తం 90 రోజులకు గాను హుండీల ద్వారా రూ.21,40,696, అన్నదానం హుండీ ద్వారా రూ.6,69,950 ఆదాయం సమకూరిందని ఈఓ వివరించారు. కార్యక్రమంలో అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహిళలను మోసగించిన సర్కార్ ˘ శాసన మండలిలో ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ అల్లవరం: అధికారంలోకి వస్తే 50 ఏళ్ల వయస్సు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నెలకు రూ.4 వేల పింఛన్ పథకాన్ని వర్తింపజేస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం విస్మరించిందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. ప్రభుత్వ తీరును శాసన మండలిలో మంగళవారం ఆయన ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలవుతున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పింఛన్లు ఏవని ప్రశ్నించారు. ఈ పథకం కింద బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా మహిళలను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 65,49,864 మందికి పింఛన్లు పంపిణీ చేయగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఖ్య 63,53,907కు తగ్గిందని తెలిపారు. రెండు లక్షల పెన్షన్లు కోత పెట్టారని విమర్శించారు. ప్రతి నెలా పెన్షన్లు తీసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో పింఛన్ల పంపిణీకి రూ.32,634 కోట్లు అవసరం కాగా, బడ్జెట్లో రూ.27,512 కోట్లు మాత్రమే కేటాయించారని, దీనినిబట్టి భవిష్యత్లో చాలా పెన్షన్లను తొలగించే అవకాశం ఉందని చెప్పకనే చెబుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలనే ఉద్దేశంతో చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు దాటిన వారికి ఏడాదికి రూ.18,750 చొప్పున ఐదేళ్ల పాటు అందించి వేలాది కుటుంబాలకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారని తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మహిళలను అన్ని విధాలా ఆదుకుంటే, కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోందని ఇజ్రాయిల్ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సేవాభావంతో వైద్య వృత్తి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వైద్య విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని, వైద్య వృత్తి సేవాభావంతో ఉండాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. మంగళవారం జరిగిన రాజమహేద్రవరం మెడికల్ కళాశాల ప్రథమ వార్షికోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కళాశాలలో గత ఏడాది వైద్య విద్యార్థులు 99 శాతం ఉత్తీర్ణత సాధించడం శుభపరిణామమని అన్నారు. కష్టపడి చదివి, వైద్యులైన తరువాత అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ‘సౌభాగ్య రక్త మిత్ర‘ లోగోను కలెక్టర్ ఆవిష్కరించారు. ఒకరు రక్తాన్ని దానం చేయడం వలన ముగ్గురికి ప్రాణ దానం చేయవచ్చని అన్నారు. వైద్యాధికారులు, వైద్య విద్యార్థులతో రక్తదాన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, అడిషనల్ డీఎంఈ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.సూర్యప్రభ, వైస్ ప్రిన్సిపాల్, కె.శివప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ కె.సూర్యారావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వీవీ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.9 వేల కనీస పెన్షన్ ఇవ్వాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): దేశవ్యాప్తంగా 75 లక్షల మంది ఈపీఎఫ్ పెన్షనర్లకు డీఏతో కలిపి కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలనే డిమాండ్తో కాకినాడ ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని పెన్షనర్లు మంగళవారం ముట్టడించారు. ఆలిండియా కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ ఆర్గనైజేషన్ల పిలుపు మేరకు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు మాట్లాడుతూ, 13 సంవత్సరాలుగా ఈపీఎఫ్ పెన్షనర్ల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని అన్నారు. 36 లక్షల మంది కనీసం రూ.వెయ్యి పెన్షన్ కూడా పొందలేని పరిస్థితులు దేశంలో ఉన్నాయన్నారు. ఈపీఎఫ్ వద్ద రూ.8.88 లక్షల కోట్ల కార్పస్ ఫండ్ ఉందని, దీనిపై ఏటా రూ.52 వేల కోట్ల వడ్డీ వస్తోందని చెప్పారు. అయినప్పటికీ పెన్షన్ల రూపంలో కేవలం రూ.14 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. మిగిలిన రూ.38 వేల కోట్లు తిరిగి కార్పస్ ఫండ్కు జమవుతోందని తెలిపారు. ఒకవైపు కార్పొరేట్లకు కేంద్రం రాయితీలు ప్రకటిస్తూ, రూ.వేల కోట్ల బ్యాంకు రుణాలు రద్దు చేస్తోందని, మరోవైపు ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ మంజూరు చేయాలంటే సాకులు చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు బాబూరావు, సీనియర్ నాయకుడు రాందాస్ మాట్లాడుతూ, ఈపీఎఫ్ పెన్షనర్లకు సామాజిక పింఛన్లు ఇవ్వాలని, ఉచిత హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, రైలు ప్రయాణాల్లో సీనియర్ సిటిజన్లకు రాయితీలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ ఎం.రామారావుకు వినతి పత్రం అందజేశారు. -
ప్రభుత్వం చేయూతనివ్వాలి
మనం మాత్రమే తయారు చేసిన ఈ అరుదైన పొట్టి మిర్చి విత్తనాన్ని తీసుకెళ్లి ఇతర రాష్ట్రాల్లో పండిస్తున్నారు. మన ఘనతను వారు సొంతం చేసుకుంటున్నారు. ఇక్కడి పంటను వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు తరలించేశారు. ఇతర దేశాల్లో అప్పట్లో గొల్లప్రోలు పేరు మార్మోగేది. ఇప్పుడు ఇక్కడ ఒక్క ఎకరం కూడా సాగు లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అరుదైన ఈ పంటను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం రైతుకు చేయూతనివ్వాలి. – వెలుగుల బాబ్జీ, మిరప రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం ప్రకృతి సాగుకు చర్యలు కేవలం రైతు ఆలోచన నుంచి పుట్టింది పొట్టి మిరప. దీనిలో డిమాండ్కు తగ్గట్టుగా లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. మారిన వాతావరణ పరిస్థితుల్లో తెగుళ్లు, పురుగులు దాడి చేయడంతో ఇక్కడి రైతులు ఈ పంట సాగు నిలిపివేశారు. అన్ని తెగుళ్లనూ తట్టుకునేలా ప్రకృతి వ్యవసాయ విధానంలో పొట్టి మిర్చి సాగుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి నుంచే రైతులను సన్నద్ధం చేస్తున్నాం. – ఎలియాజర్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్, ప్రకృతి వ్యవసాయ విభాగం, కాకినాడ -
ఇంతోటిదానికి పవన్ ఆదేశాలు.. కమిటీలు.. ఫోటోలకు ఫోజులు!
కాకినాడ, సాక్షి: చిత్రాడ.. మొన్నటిదాకా కాలుష్యం అనే పదానికి అల్లంత దూరాన ఉన్న గ్రామం. ఎప్పుడైతే జనసేన, ఆ పార్టీ కార్యకర్తలు అడుగు మోపారో.. ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి!!. పొరపాటున అభివృద్ధి విషయంలో అనుకునేరు!!. విపరీతమైన కాలుష్యం, ఎటు చూసినా చెత్తాచెదారం.. ఫ్లెక్సీలతోనే ఆ మార్పు అంతా!!.మొన్నీమధ్యే జరిగిన జనసేన ఆవిర్భావ సభ.. చిత్రాడ(పిఠాపురం)కు విపరీతమైన కాలుష్యాన్ని మిగిల్చింది. అందుకు కారణం.. అక్కడి చెత్తను తరలించకపోవడం ఒకటైతే.. దానిని అక్కడికక్కడే పోగేసి కాల్చేయడం. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చపోగా.. పైగా బోనస్గా కాలుష్యాన్ని అంటగట్టారంటూ జనసేనను తిట్టిపోస్తున్నారు చుట్టుపక్కల ప్రజలు.జనసేన సభ తర్వాత.. ఇవాళ్టికి అక్కడి రోడ్లపై ఇంకా జనసేనవారి ఫ్లెక్సీలు, వెల్కమ్ బ్యానర్లు.. ఆఖరికి భారీ ఆర్చ్లు కూడా అలాగే ఉండిపోయాయి. వాటిని తొలగించడానికి ఏర్పాటు చేసిన పార్టీ కమిటీ ముసుగేసి పడుకుంది. దీంతో పవన్ పర్యవేక్షణలో ఉన్న ఓ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఉపాధి హామీ కూలీలతో ఆ చెత్త ఏరివేయించారు.నాదెండ్ల స్వయంగా ప్రకటించి..తమది చాలా క్రమశిక్షణ గల పార్టీ అని, సభ తరువాత సభా ప్రాంగణాన్ని శుద్ది చేస్తామని జనసేన సీనియర్, మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ప్రకటించారు. సభ అనంతరం ప్రాంగణాన్ని శుద్ది చేసి..ఫ్లెక్సీలు తొలగించాలని తమ అధినేత పవన్ ఆదేశించినట్లు చెప్పారాయన. ఈ క్రమంలోనే..కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారాయన. అయితే మరుసటి రోజు జనసేన నేతలు సభా ప్రాంగణానికి వచ్చారు. శుద్ధి చేస్తున్నట్లు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. అదయ్యాక అక్కడి నుంచి గాయబ్ అయ్యారు. ఈలోపు.. పవన్ సొంత శాఖలోని ఉపాధి హమీ కూలీలు ఆ ప్లాస్టిక్ వ్యర్ధాలను డంపింగ్ యార్డుకు తరలించకుండా.. అక్కడే గుట్టలుగా పోసి దగ్ధం చేశారు. దీంతో విపరీతమైన కాలుష్యంతో ఆ ప్రాంతమంతా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. -
10 కేజీల వెండి సమర్పణ
కాకినాడ రూరల్: సర్పవరంలోని రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ స్వామి ఆలయానికి దాత సాతులూరి గోపాలకృష్ణమాచార్యులు సోమవారం 10 కిలోల వెండి సమర్పించారు. దీనితో మూల భావనారాయణ స్వామి వారికి మకర తోరణం తయారు చేయించాలని ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణను కోరారు. ఆలయంలో సుదర్శన హోమం ఘనంగా నిర్వహించారు. రూ.లక్ష విరాళంబోట్క్లబ్ (కాకినాడ సిటీ): స్థానిక శాంతినగర్లోని శ్రీరామకృష్ణా సేవా సమితికి ముత్తా రామన్న సత్రం ఫౌండర్ ట్రస్టీలు డాక్టర్ ముత్తా వెంకటేష్, ముత్తా ప్రసాద్బాబు సోమవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. ఈ మొత్తాన్ని సమితి అధ్యక్షుడు విఎల్ గాంధీ, కార్యదర్శి కె.సతీష్, ఉపాధ్యక్షుడు వక్కలంక రామకృష్ణకు అందజేశారు. యూట్యూబ్ చానల్పై కేసు అన్నవరం: సత్యదేవుని మూలవిరాట్ ఫొటో ప్రసారం చేసిన ఓ యూట్యూబ్ చానల్ నిర్వాహకులపై అన్నవరం దేవస్థానం అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీహరిబాబు సోమవారం తెలిపారు. రత్నగిరిపై గర్భాలయంలోని స్వామి, అమ్మవారు, శంకరుల మూలవిరాట్ల ఫొటోలు తీయడం నిషేధం. అందువల్లనే అధికారుల అనుమతి లేకుండా కెమెరాలను, సెల్ఫోన్లను ఆలయం లోపలకు అనుమతించరు. అయితే ‘మా ఇంటి భాగవతం’ యూట్యూబ్ చానల్ స్వామివారి మూలవిరాట్ ఫొటో తీసి ప్రసారం చేసింది. ఆ ఫొటోను తొలగించాలని దేవస్థానం అధికారులు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఆ చానల్ నిర్వాహకులపై పోలీసులకు దేవస్థానం అధికారులు ఫిర్యాదు చేశారు. పీజీఆర్ఎస్కు 404 అర్జీలు కాకినాడ సిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో 404 మంది వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్ఓ జె.వెంకటరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, సీపీఓ పి.త్రినాథ్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాసరావు, కేఎస్ఈజెడ్ ఎస్డీసీ కేవీ రామలక్ష్మి తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీదారుల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యాన కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ వేదిక వద్ద ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు, పండ్లను ఉంచారు. సుబ్బాలమ్మ తల్లికి రూ.26 లక్షలతో వెండి మకర తోరణం అమలాపురం టౌన్: పట్టణ దేవత సుబ్బాలమ్మ అమ్మవారికి పలువురు భక్తులు రూ.26 లక్షల విలువైన 26 కిలోల వెండి మకర తోరణాన్ని సోమవారం సమర్పించారు. దేవస్థానం అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, భక్తులు ఈ మకర తోరణాన్ని ఉదయం అంతా ఆలయం వద్ద ప్రదర్శనగా ఉంచి, పూజలు చేశారు. సాయంత్రం రెండు అశ్వాల రథంపై దీనిని ఉంచి అత్యంత వైభవంగా ఊరేగించారు. అమ్మవారి జన్మదినం, దేవస్థానం సప్తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వెండి మకర తోరణాన్ని అమ్మవారి వద్ద అలంకరించారు. -
మసకబారిన అన్నవరం ప్రతిష్ట..!
అన్నవరం: రాష్ట్రంలోనే గొప్పగా పేరొందిన సత్యదేవుని సన్నిధి నేడు వరుస వివాదాలతో ప్రతిష్ట మసకబారుతోంది. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో ఏడు పుణ్యక్షేత్రాల్లో అన్నవరం చివరి ఏడో స్థానంలో దిగజారింది. మరలా ఫిబ్రవరిలో రెండో ర్యాంకుకు చేరినా, భక్తుల అసంతృప్తి గతం కంటే మరింత పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు రుజువు చేశాయి. ర్యాంకుల వ్యవహారం ముగిసి వారం కూడా కాకుండానే, కొండ దిగువన సత్యనికేతన్ సత్రంలో సిబ్బంది, పోలీసులు బస చేసిన గదుల్లో బీరు సీసాలు దొరకడం సంచలనంగా మారింది. 62 గదులున్న సత్యనికేతన్ సత్రంలో ఎప్పుడూ భక్తులు పెద్దగా బస చేసిన దాఖలాల్లేవు. ఈ సత్రంలో ఎక్కువగా ఇతర దేవస్థానాల నుంచి బదిలీపై వచ్చిన సిబ్బంది, స్థానిక పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చిన సిబ్బంది బస చేస్తుంటారు. ఆ గదుల్లో ఆదివారం రాత్రి ఈఓ వీర్ల సుబ్బారావు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో పోలీసులు బస చేస్తున్న గదుల్లో బీరు సీసాలు దొరకడం, ఆయన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీకి సమాచారం ఇవ్వడం, అదే విధంగా ఆ పోలీసులను, దేవస్థానం సిబ్బందిని వెంటనే సత్రం గదులు ఖాళీ చేయాలని ఆదేశించడం సంచలనానికి దారి తీసింది. డీఎస్పీ విచారణ సత్రంలో మద్యం సీసాలు లభించిన ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు సోమవారం విచారణ చేపట్టారు. బీరు సీసాలు లభించిన సత్రంలోని 23 నంబర్ గదిని పరిశీలించారు. అక్కడ సిబ్బందిని ప్రశ్నించారు. తర్వాత ఈఓతో మాట్లాడి, ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారు. సత్రంలో బీరు సీసాలు లభ్యమైన విషయమై రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందజేశాయి. ఇంటెలిజెన్స్ అధికారులు ఈఓని కలిసి, వివరాలు సేకరించారు. పోలీసుల అసంతృప్తి! సత్యనికేతన్ సత్రంలో పోలీసులు బస చేసిన గదుల్లోనే ఆకస్మిక తనిఖీలు చేసి, ఖాళీ బీరు బాటిళ్లున్నాయని వెంటనే కలెక్టర్, ఎస్పీలకు ఈవో సమాచారం ఇవ్వడంపై పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవి పాత సీసాలని, పోలీసులు మద్యం తాగుతూ పట్టుబడితే వేరని అంటున్నారు. ఖాళీ సీసాలు దొరికాయని చెప్పి రాద్ధాంతం చేయడం ఎంతవరకూ సబబని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ముందుగా స్థానిక పోలీసులకు లేదా పోలీస్ అధికారులకు సమాచారమిచ్చి ఉంటే, తామే చర్యలు తీసుకునేవారమని అంటున్నారు. వాస్తవానికి గతంలో కొంత మంది దేవస్థానం ఉద్యోగులు మద్యం సేవించి ఉండగా, వారిని పట్టుకుని కిందకు పంపేశామని, దేవస్థానం ప్రతిష్టని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి కేసులు నమోదు చేయలేదని వారంటున్నారు. సత్యనికేతన్ సత్రంలో బీరు సీసాలపై విచారణకు కలెక్టర్ ఆదేశం పోలీసులు బస చేసిన గదిలో డీఎస్పీ విచారణ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక -
పాడా కార్యాలయమా.. పార్టీ కార్యాలయమా...?
● గ్రీవెన్స్లో జనసేన పెత్తనమేమిటి? ● ప్రజా సంఘాల నాయకుల నిలదీత పిఠాపురం: ‘ఇది ప్రజా సమస్యల పరిష్కార వేదికా లేక పార్టీ కార్యాలయమా చెప్పాలి’ అంటూ ప్రజాసంఘాల నాయకులు పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) పీడీ ఎ.చైత్రవర్షిణిని ప్రశ్నించారు. పాడా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు సాకా రామకృష్ణ, కుంచె చిన్న తదితరులు వచ్చారు. ప్రజలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఒక ఎత్తయితే.. అధికారులకు, ప్రజలకు అసౌకర్యంగా ఉండేలా ఇరుకు గదిలో ఏర్పాటు చేశారని మండిపడ్డారు. పైగా ప్రజా సమస్యలపై అధికారుల కంటే ముందే జనసేన నాయకులు సమాధానం చెప్పడంపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు చేపట్టిన కార్యక్రమంలో అధికార పార్టీ నాయకుల పెత్తనమేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం గురించి వివరణ కోరితే జనసేన నాయకులు ‘ఇది మా అడ్డా.. మేమే సమాచారం ఇస్తాం’ అంటూ అవహేళనగా మాట్లాడారని అన్నారు. ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ కార్యక్రమం నిర్వహించడం చూస్తూంటే అధికారుల మద్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఇకముందు క్రమపద్ధతిలో ఈ కార్యక్రమం చేపట్టాలని పీడీని కోరారు. పెన్షన్ల దరఖాస్తులపై అడిగితే సైట్ ఓపెన్ అవడం లేదంటున్నారని, 9 నెలలుగా ఎదురు చూస్తున్నా ఇలా వంకలు చెప్పడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఇళ్ల స్థలాలు, ఇతర సమస్యల పరిష్కారానికి తక్షణమే సైట్ ఓపెన్ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఇకపై ఇటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు పూర్తి సమాచారం ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. -
కదిలిస్తే.. కన్నీటి వేదన
పొలానికి దారి చూపండినాకు సర్వే నంబర్ 108/1లో 60 సెంట్ల పంట భూమి ఉంది. నా స్థలానికి, మెయిన్ రోడ్డుకు మధ్య ఉన్న స్థలంలో నాగు వీరభద్రరావు అనే వ్యక్తి రాజకీయ పలుకుబడి ఉయోగించి నాకు మార్గంగా ఉన్న స్థలాన్ని కబ్జా చేసి పాక వేశాడు. దీనివలన నాకు పొలంలోకి వెళ్లే మార్గం లేకుండా పోయింది. అధికారులు చెబితే పాక కూల్చేశారే తప్ప ఆ స్థలంలోని శిథిలాలను తీయడం లేదు. వీటిని తొలగించాలని కోరుతూ కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నాను. – కోరుకొండ సత్యనారాయణ, రాజుపాలెం, పెదపూడి మండలం వీఆర్ఓ ఇబ్బందులు పెడుతున్నారు గత ప్రభుత్వ హయాంలో నా భార్య విజయకుమారి పేరిట మాకు ఒకటిన్నర సెంట్ల భూమికి పట్టా ఇచ్చారు. పట్టా కూడా నా పేరుతోనే రిజిస్ట్రేషన్ చేశారు. దీనికి సంబంధించిన కాగితం ఇవ్వకుండా వీఆర్ఓ ఇబ్బందులు పెడుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఒరిజినల్ పట్టా నా వద్దనే ఉంది. అధికారులు వీఆర్ఓపై చర్యలు తీసుకొని, రిజిస్ట్రేషన్ పట్టా ఇప్పించాలంటూ జేసీకి అర్జీ అందజేశాను. – బొల్లేజు నాగేశ్వరరావు, ఇంద్రపాలెం, కాకినాడ రూరల్ మండలం ● కలెక్టరేట్కు బాధితుల క్యూ ● పీజీఆర్ఎస్కు ఫిర్యాదుల వెల్లువ ● సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీలు ● అయినా పరిష్కారం కాలేదంటూ ఆవేదన కాకినాడ సిటీ: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్–పీజీఆర్ఎస్)లో సమస్యలు వెల్లువెత్తున్నాయి. ఈ వారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు వచ్చిన పలువురిని ‘సాక్షి’ పలుకరించింది. ఎవరిని కదిపినా సమస్య పరిష్కారం కావడం లేదంటూ కన్నీటి వేదన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా వందలాది మంది ప్రతి వారం కలెక్టరేట్కు తరలివచ్చి తమ సమస్యలపై వినతులు అందిస్తున్నారు. వీటిని పరిష్కరిస్తున్నట్లు రికార్డుల్లో అధికారులు నమోదు చేస్తున్నారే తప్ప క్షేత్ర స్థాయిలో ఏ ఒక్క సమస్యా పరిష్కారం కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీజీఆర్ఎస్కు ప్రతి నెలా 470 నుంచి 500 పైగా అర్జీలు అందుతున్నాయి. వీటి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశిస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటోందని అంటున్నారు. ఏదైనా సమస్యపై అర్జీ అందజేస్తే గ్రామ స్థాయిలో వివిధ శాఖల అధికారులు తమను కార్యాలయాలకు రప్పించుకొని, సమస్య పరిష్కారమైందంటూ తమతో సంతకాలు చేయించుకుని, ఫొటోలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి తమ సమస్య తీరడం లేదని, మళ్లీ కలెక్టరేట్కు నెలల తరబడి తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సమస్యపై ఫిర్యాదు చేస్తే అధికారులు నేరుగా ఇంటికి వచ్చి సమస్య పరిష్కరించేవారని చెబుతున్నారు. నాడు రేషన్ కార్డు, పింఛన్, ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణాలు, వివిధ సామాజికవర్గాల మహిళలకు ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ పథకాలు ఒక్కటి కూడా అమలవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లలో ఏనాడూ మహిళలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూశారని, ఇప్పుడు ప్రతి ఒక్కరూ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి, సూక్ష్మ రుణాల వైపు మొగ్గు చూపాల్సిన దుస్థితి దాపురించిందని అంటున్నారు. పింఛన్లు, ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు, భూసర్వే వంటి సమస్యలపై 9 నెలలుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కావడం లేదని చెబుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వ నిబంధనలు చూస్తే ఏ ఒక్కరికీ పింఛన్ అందే పరిస్థితి కనిపించడం లేదని నిరాశ చెందుతున్నారు. ఒక ఇంట్లో పింఛన్దారు చనిపోతేనే మరొకరికి పింఛన్ వస్తుందంటున్నారు తప్ప అర్హులైన మర్వెరికీ పింఛన్ అందే పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. ఇలా వివిధ సమస్యలపై ప్రజలు అధికారుల వద్ద ఏకరువు పెట్టుకుంటున్న దృశ్యాలు ప్రతి వారం జరుగుతున్న పీజీఆర్ఎస్లో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి.దివ్యాంగ పింఛన్ ఇప్పించండి నేను దివ్యాంగురాలిని, వితంతువును. కుడి కాలు, కుడి చెయ్యి పని చేయదు. నాకు వితంతు పింఛన్ మాత్రమే ఇస్తున్నారు. దివ్యాంగ పింఛన్ ఇప్పించాలని మూడు దఫాలుగా అధికారులకు అర్జీ అందజేస్తున్నాను. అధికారులు స్పందించి నాకు వెంటనే దివ్యాంగ పింఛన్ రూ.6 వేలు, 35 కేజీల బియ్యం ఇప్పించాలని కోరుతున్నాను. – ఒసుపల్లి వేగులమ్మ, దుమ్ములపేట, కాకినాడ అర్బన్ రేషన్ కార్డులో పేరు తొలగించండి మా అమ్మగారిది కరప మండలం ఉప్పలంక గ్రామం. నాకు పెళ్లై ఇద్దరు అబ్బాయిలు. నా భర్త వేట సాగిస్తారు. మేము యానాం అయ్యన్న నగర్లో ఉంటున్నాం. మా అమ్మగారి రేషన్ కార్డులో నా పేరు ఉండిపోవడంతో యానాంలో మాకు రేషన్ కార్డు ఇవ్వడం లేదు. ఇక్కడి రేషన్ కార్డులో నా పేరు తొలగించి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదు. దీనిపై కలెక్టర్కు వినతిపత్రం అందజేశాను. – పట్టా సునీత, ఉప్పలంక, కాకినాడ రూరల్ వితంతు పింఛన్ ఇప్పించరూ.. నా భర్త చనిపోయి రెండేళ్లయ్యింది. అప్పటి నుంచీ వితంతు పింఛన్ మంజూరు చేయాలంటూ అధికారులకు దరఖాస్తులు అందిస్తూనే ఉన్నాను. ఇప్పటికీ పెన్షన్ మంజూరు కాలేదు. బతకడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ అధికారులకు మరోసారి దరఖాస్తు చేశాను. – పాలకొండ నిర్మలాదేవి, 39వ డివిజన్, కాకినాడ అర్బన్ -
ప్రశాంతంగా ప్రారంభం
● మొదలైన పదో తరగతి పరీక్షలు ● తొలి రోజు 27,368 మంది హాజరు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 27,592 మందికిగాను తొలి రోజు నిర్వహించిన తెలుగు పరీక్షకు 27,368 మంది (97 శాతం) హాజరయ్యారు. 224 మంది పరీక్ష రాయలేదని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) పిల్లి రమేష్ తెలిపారు. విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకున్నారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 8.45 గంటల నుంచే విద్యార్థులను గేటు వద్ద పూర్తి స్థాయిలో తనిఖీ చేసి, ఆయా కేంద్రాల్లోకి అనుమతించారు. బ్యాగులు, ఎలక్ట్రానిక్స్ పరికరాలను అనుమతించలేదు. అన్ని కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు నిర్వహించారు. కాకినాడ సాలిపేటలోని పైడా సత్యరాజు మున్సిపల్ హైస్కూల్లోని పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పరిశీలించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు 35 కేంద్రాల్లోను, డీఈఓ ఐదు కేంద్రాల్లోను, అసిస్టెంట్ ఎగ్జామ్స్ కమిషనర్ నాలుగు కేంద్రాల్లోను తనిఖీలు చేశారు. దివ్యాంగ విద్యార్థుల అవస్థలు పరీక్షలు రాయడానికి వచ్చిన దివ్యాంగ విద్యార్థులు అవస్థలకు గురయ్యారు. నగరంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అవి నాలుగైదు అంతస్తుల వరకూ ఉన్నాయి. వీటిలో పై అంతస్తులు కేటాయించడంతో మెట్లు ఎక్కి వెళ్లడానికి దివ్యాంగ విద్యార్థులు నానా అవస్థలూ పడ్డారు. వారికి కింది ఫ్లోర్లలో రూములు కేటాయించకపోవడంపై వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపెన్ స్కూల్కు 27 మంది హాజరు ఓపెన్ స్కూల్ పదో తరగతి విద్యార్థులకు సోమవారం హిందీ పరీక్ష నిర్వహించారు. దీనికి 42 మంది దరఖాస్తు చేసుకోగా 27 మంది హాజరయ్యారు. 15 మంది పరీక్ష రాయలేదని డీఈఓ రమేష్ తెలిపారు. -
రత్నగిరికి భక్తుల వెల్లువ
అన్నవరం: రత్నగిరికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు కావడంతో ఉదయం నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. స్వామివారిని మొత్తం 40 వేల మంది దర్శించగా, వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్నప్రసాదాన్ని సుమారు 5 వేల మంది భక్తులు స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో సత్యదేవుని రథసేవ టేకు రథంపై ఘనంగా నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాల కవచాలు (ముత్తంగిసేవ) ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
ఎక్కడి గింజలు అక్కడే
దిగుబడి వచ్చినా కొనేవారు లేక కోకో గింజలు ఎక్కడివక్కడే ఉండిపోయాయి. కార్పొరేట్ సంస్థలు సిండికేట్గా ఏర్పడడంతో ఎప్పుడైనా వారికే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఎకరాకు 5 క్వింటాళ్లు రాగా, ఈ ఏడాది 3 క్వింటాళ్లు వస్తోంది. రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది. గత ఏడాది మార్చి నెలలో కిలో ధర రూ.1,050 ఉండగా, ప్రస్తుతం రూ.550 ఉంది. ఈ ధర నిలబడుతుందనే నమ్మకం లేదు. ఎండల తీవ్రతతో దిగుబడి తగ్గింది. దీనివల్ల ఎకరాకు ప్రస్తుత ధర ప్రకారం రూ.1.2 లక్షల వరకూ ఆదాయం తగ్గుతుంది. – యలమాటి భాస్కరరావు, కోకో రైతు, కురుకూరు, దేవరపల్లి మండలం -
జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు నిత్యశ్రీ ఎంపిక
పిఠాపురం: జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు పిఠాపురంనకు చెందిన ముమ్మిడి నిత్యశ్రీ ఎంపికై నట్టు ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 10వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో అత్యధిక స్కోరింగ్ కొట్టిన ఆధారంగా ఈ నెల 15వ తేదీన రాత్రి ఎంపికై న ఆర్చరీ లిస్టును విడుదల చేశారు. అందులో పిఠాపురం నుంచి ముమ్మిడి నిత్యశ్రీ ఎంపికయింది. ఈ నెల 22 నుంచి 29 వరకు గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న 6వ జాతీయస్థాయి అండర్ 10 ఇండియన్ రౌండ్ బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ తరపున జాతీయస్థాయిలో ఆరేళ్ల ముమ్మిడి నిత్యశ్రీ ఎంపికై నట్టు కోచ్ పి.లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ బి.శ్రీనివాస్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు కె.పద్మనాభం అభినందించారు. -
ఉమ్మడి జిల్లాలో..
సచివాలయాలు 620వలంటీర్లు 12,272సచివాలయాలు 1,644వలంటీర్లు 30,887కపిలేశ్వరపురం: సంక్షేమం, అభివృద్ధి కూటమి అజెండా, ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రానికి పేరుతెస్తా, పాతిక కేజీల బియ్యం కావాలా? పాతికేళ్ల భవిష్యత్ కావాలా.. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాల భర్తీ.. ఏటా జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ విడుదల.. వలంటీర్ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపు.. ఇవీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి నేతలు చెప్పిన మాటలు. ఆయా లక్ష్యాలను అప్పటికే సాధించే క్రమంలో కొనసాగుతున్న వైఎస్సార్ సీపీ సంక్షేమ ప్రభుత్వాన్ని ఓడించేందుకు కూటమి పన్నిన కుట్రలో భాగంగా వెదజల్లిన హామీలవి. కారణాలేవైనా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఉద్యోగాలు ఇవ్వడం సంగతి పక్కన పెట్టి అప్పటికే పేదలకు సేవలందిస్తున్న వలంటీర్లను విధుల నుంచి పక్కన పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల మంది వలంటీర్లు విధులు నిర్వహించేవారు. వారికి రూ.10 వేల వేతనం మాట దేవుడెరుగు ఉన్న ఉపాధినే ఊడపీకేశారు. వలంటీర్ల తొలగింపు కేవలం వారి కుటుంబాలకే కాదు యావత్ ఆంధ్ర ప్రజలకూ యాతనే. తెల్లవారుజామునే పింఛను అందజేత నుంచి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, దరఖాస్తు చేయించడం, మొత్తంగా లబ్ది వారి ఖాతాలకు జమ చేయించడమూ... ఇలాంటి సేవలన్నీ మూలన పడ్డాయి. దీంతో వలంటీర్లు సంఘం కట్టి తమను విధుల్లోకి తీసుకోవాలంటూ పోరాడుతున్నారు. సేవలు అమోఘం ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో 2,36,331 మంది, కాకినాడ జిల్లాలో 2,72,437, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2,37,244 మంది కలిపి మొత్తం 7,46,012 మంది వివిధ సామాజిక పింఛన్లు అందుకుంటున్నారు. వీరంతా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పింఛను మంజూరైనవారే. వారందరికీ ప్రతి నెలా 1వ తేదీ తెల్లవారుజామున 6 గంటలకే వలంటీర్లు పింఛన్లు అందజేసేవారు. దీంతో పాటు వివిధ ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా కృషి చేశారు. కరోనా విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి ప్రభుత్వం అప్పగించిన సేవా కార్యక్రమాల్లో విధులు నిర్వహించారు. తుపాన్లు, వరదల సమయాల్లో కోనసీమ, తూర్పు గోదావరి నదీతీర లంక గ్రామాల్లోని బాధితులకు తాగునీరు, నిత్యావసర సరకులు, ఆహార పొట్లాలు పడవల్లో దరి చేర్చేవారు. వలంటీర్ల తొలగింపు ప్రభావమిలా... ‘ఉమ్మడి’ జిల్లాలోని 1,644 వార్డు, గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా వలంటీర్లుండేవారు. వారు లేకపోవడంతో లబ్ధిదారులకు ఒకటో తేదీ తెల్లవారుజామునే పింఛను అందజేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నెలలో వలంటీర్లు లేకుండానే పింఛన్లు పంచగలమన్నది ప్రకటనలకే పరిమితమైంది. అప్పుడు సైతం లబ్ధిదారులను పంచాయతీ కార్యాలయానికి లేదా కూడలికి రమ్మని సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేశారు. ఇక రెండో నెల నుంచి వలంటీర్ల మాదిరిగా పింఛను ఇచ్చిన తీరు కానరాలేదు. వలంటీర్లు లేక సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగింది. చేస్తున్న సర్వేల్లో సేవల్లో నాణ్యత కొరవడుతోందన్న వాదన ఉంది. వలంటీర్లను విస్మరించిన కూటమి ప్రభుత్వం వలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామన్న హామీకి అధికారంలోకి వచ్చాక కూటమి తూట్లు పొడిచింది. వారికి ఒక్క రూపాయి కూడా మేలు చేసింది లేదు. ఐదేళ్లూ సేవలందించిన తమను విస్మరించవద్దంటూ ప్రభుత్వాన్ని వలంటీర్లు వేడుకున్నారు. ప్రభుత్వం వినకపోవడంతో పోరాటబాట పట్టారు. కూటమి అధికారంలోకి వస్తే కేవలం పాతిక కిలోల చొప్పున బియ్యం ఇవ్వడం కాదు పాతికేళ్ల భవిష్యత్ ఇస్తామన్న పవన్ కల్యాణ్ను ప్రశ్నిస్తున్నారు. పిఠాపురంలో ఈ నెల 14న నిర్వహించిన జనసేన 12వ ఆవిర్భావ సభలో తమకు ఇచ్చిన హామీ గురించి ప్రస్తావించకపోవడంపై వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్లను విధుల్లోకి తీసుకుంటే చట్టపరమైన సమస్యలొస్తాయని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో ప్రకటించడంపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చేటప్పుడు ఈ విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. 2025–26 వార్షిక బడ్జెట్లో వలంటీర్లకు సంబంధించి నిధులను కేటాయించకపోవడంపై సీఎం చంద్రబాబుపై మండిపడుతున్నారు. ‘ఉమ్మడి’ జిల్లా వలంటీర్ల ఉద్యమాలిలా..2024 నవంబర్ 9న రాష్ట్ర రాజధానిలో ‘వలంటీర్ల ఆవేదన సదస్సు’ను నిర్వహించారు. అదే ఏడాది నవంబర్ 3న అమలాపురంలో జిల్లా స్థాయి నిరసన సమావేశం నిర్వహించారు. 2024 డిసెంబర్ 10న కాకినాడ సూర్యకళా మందిరంలో వైఎస్సార్ సీపీ ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశంలో వలంటీర్ల ఆందోళనకు పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ ఏడాది జనవరి 17న విజయవాడలో నిర్వహించిన సచివాలయ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనకుండా వలంటీర్లను కూటమి ప్రభుత్వం నిర్భంధించింది. 2025 ఫిబ్రవరి 5న అమలాపురం కలెక్టరేట్ ఎదుట వలంటీర్లు ధర్నా చేశారు. ఈ నెల 12న వైఎస్సార్ సీపీ యువత పోరులో వలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సోమవారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ వద్ద ఏపీ గ్రామ, వార్డు వలంటీర్స్ యూనియన్ ఆద్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ‘ఉమ్మడి’ జిల్లాలోని వలంటీర్లు సమాయత్తమయ్యారు. సచివాలయాలు 512వలంటీర్లు 9,034సచివాలయాలు 512వలంటీర్లు 9, 581వలంటీర్లు నష్టపోయారిలా..ఫ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఒక్కో వలంటీర్కు ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చేది. దీని ప్రకారం కాకినాడ జిల్లాలో 12,272 మంది వలంటీర్లు ప్రతి నెలా రూ.6,13,60,000, కోనసీమ జిల్లాలో 9,581 మంది వలంటీర్లు రూ.4,79,05,000, తూర్పుగోదావరి జిల్లాలో 9,034 మంది వలంటీర్లు రూ.4,51,70,000 చొప్పున అందుకునేవారు. మూడు జిల్లాలు కలిపి రూ.15,44,35,000 మేర వలంటీర్లకు వేతనం అందేది. దీని ప్రకారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడచిన 9 నెలల్లో వారు రూ.138,99,15,000 మేర నష్టపోయారు. ఫ అదే చంద్రబాబు అండ్ కో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెలా రూ.10 వేల వేతనం లెక్కేసుకుంటే 9 నెలల్లో కాకినాడ జిల్లా వలంటీర్లు రూ.110,44,80,000, కోనసీమ జిల్లా వలంటీర్లు రూ.86,22,90,000, తూర్పు గోదావరి జిల్లా వలంటీర్లు రూ.81,30,60,000 కలిపి మొత్తం రూ.277,98,30,000 మేర వేతనాలు కోల్పోయారు. వలంటీర్లకు కూటమి వంచన రూ.10 వేల గౌరవ వేతనమంటూ హామీ అధికారంలోకి వచ్చాక అమలు దాటవేత ఆవిర్భావ సభలో ప్రస్తావించని పవన్ పాతికేళ్ల భవిష్యత్ అంటే ఇదేనా అంటున్న వలంటీర్లు చట్టపరమైన సమస్యలొస్తాయంటున్న మంత్రి లోకేశ్ ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వలంటీర్ల ఉద్యమాలు నేడు ‘చలో విజయవాడ’ హామీని విస్మరించడం వలంటీర్లను వంచించడమే.. ఎన్నికల సమయంలో వలంటీర్లను కొనసాగిస్తామని, రూ.10వేలకు గౌరవ వేతనం పెంచుతామంటూ కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించడం వలంటీర్లను వంచించడమే అవుతుంది. ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రకృతి విపత్తుల సమయాల్లో వలంటీర్లు విశేష సేవలందించారు. వారి సేవలను గుర్తించైనా విధుల్లోకి తీసుకోవాలి. – నూకల బలరాం, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి, కోనసీమ జిల్లా -
ఇచ్చేది పదుల్లో.. ఖర్చు వందల్లో
రాయవరం: పదవ తరగతి పరీక్షల నిర్వహణ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులకు పరీక్షగా మారుతోంది. ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు కేటాయించే సొమ్ము ఒక్కో విద్యార్థికి రూ.పదుల్లో ఉంటుండగా, ఖర్చు రూ.వందల్లో అవుతుందనే విమర్శలున్నాయి. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా పరీక్షల నిర్వహణ ఖర్చుల భారం ఉంటోందని పలువురు చీఫ్లు, డీవోలు వాపోతున్నారు. ఇప్పటికే పరీక్షల నిర్వహణ కేటా యింపులు పెంచాలని, ఇన్విజిలేటర్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ను పెంచాలని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఇంటర్ పరీక్షలకు ఇచ్చే విధంగా రెమ్యునరేషన్ ఉండాలనే డిమాండ్ ఉపాధ్యాయుల నుంచి విన్పిస్తోంది. ఒక్కో విద్యార్థికి రూ.1.42 కేటాయింపు పరీక్షల నిర్వహణకు ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.1.42 వంతున ఏడు పరీక్షలకు రూ.10 మంజూరు చేస్తున్నారు. 2018లో ఒక్కో విద్యార్థికి కంటింజెంట్ చార్జీగా రూ.5.50 ఇవ్వగా, 2023లో ఒక్కో విద్యార్థికి రూ.8 ఇస్తున్న కంటింజెంట్ చార్జీని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.8 నుంచి రూ.10కి పెంచింది. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువులను దృష్టిలో ఉంచుకుని కంటింజెంట్ చార్జీలను పెంచాలనే డిమాండ్ను ఉపాధ్యాయ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. పరీక్ష కేంద్రంలో పరీక్షలను పర్యవేక్షించే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి పోలీస్ స్టేషన్ నుంచి పరీక్షా పత్రాలు తీసుకువచ్చి పరీక్ష అనంతరం సమాధాన పత్రాలను సీల్ చేస్తారు. ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలకు వేర్వేరుగా సంచులు వాడతారు. ఒక్కో సంచికి రెండు నుంచి మూడు మీటర్ల వస్త్రాన్ని, జవాబు పత్రాలను పోస్టాఫీసుకు తీసుకుని వెళ్లడానికి రవాణా ఖర్చులను భరించాల్సి వస్తోంది. జవాబు పత్రాలను కట్టి భద్రపరిచేందుకు లక్క, కొవ్వొత్తి, దారం, స్కెచ్ పెన్నులు, స్టాప్లర్లు, గమ్, వైట్నర్ తదితర వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు పరీక్షా కేంద్రంలో మంచినీరును అందుబాటులో ఉంచాలి. ఇలా అన్ని వస్తువులను కొనాలంటే ఎంతలేదన్నా రోజుకు రూ.600కు పైగా ఖర్చవుతుందని చీఫ్లు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.1.42 ఇస్తే ఎలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. సీఎస్లపైనే ఆర్థిక భారం ప్రతి పరీక్షా కేంద్రంలో నిర్వహణ బాధ్యత చీఫ్ సూపరింటెండెంట్లదే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పదవ తరగతి పరీక్షకు 386 మంది చీఫ్లు హాజరవుతున్నారు. ప్రభుత్వం నిధులను తక్కువగా విడుదల చేస్తుండడంతో అదనంగా అయ్యే ఖర్చును వారి చేతి నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తోంది. రోజుకు రూ.200 నుంచి రూ.300 వరకు అదనంగా భరించాల్సి ఉంటుందని పలువురు చీఫ్లు చెబుతున్నారు. ఒక్కో విద్యార్థికి కనీసం రూ.15 ఇవ్వాలని, అదనంగా రవాణా చార్జీలు మంజూరు చేయాలని చీఫ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇన్విజిలేటర్లకూ అంతంత మాత్రమే ఇంటర్ పరీక్షల్లో ఇన్విజిలేటర్లకు రోజుకు రూ.150 వంతున రెమ్యూనరేషన్ ఇస్తుండగా, పదవ తరగతి ఇన్విజిలేషన్కు మాత్రం రోజుకు కేవలం రూ.33 ఇస్తున్నారు. అటెండర్కు రూ.20, వాటర్ బాయ్కి రూ.17 వంతున భృతిని చెల్లిస్తున్నారు. గత ప్రభుత్వం అంతకుముందు కంటే సీఎస్, డీవోలకు రూ.22, ఇన్విజిలేటర్లు, క్లర్క్స్కు రూ.11, అటెండర్లకు రూ.6.80, వాటర్మెన్కు రూ.6 వంతున పెంపుదల చేసింది. కాగా ఇంటర్ పరీక్షలకు, పది పరీక్షలకు పెద్దగా తేడా లేకున్నా, రెమ్యూనరేషన్ చెల్లింపులో మాత్రం తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. పెరుగుతున్న ధరలకు తోడు సరిపడా నిర్వహణ ఖర్చులు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పలువురు ఇన్విజిలేటర్లు ఆవేదన చెందుతున్నారు. ఫీజుల వసూలు విషయానికి వస్తే మాత్రం ఒక్కో విద్యార్థి నుంచి రూ.125 వంతున వసూలు చేస్తున్నారు.ఉమ్మడి జిల్లాలో ఉన్న పరీక్షా కేంద్రాలు : 386 హాజరయ్యే విద్యార్థులు : 73,329 చీఫ్, డీవో, కస్టోడియన్లకు రోజుకు ఇచ్చేది : రూ. 66 ఇన్విజిలేటర్లకు రోజుకు ఇచ్చేది : రూ.33 క్లర్కులకు రోజుకు ఇచ్చేది : రూ. 33 అటెండర్కు ఇచ్చేది : రూ.20 వాటర్ మెన్లకు రోజుకు ఇచ్చేది : రూ.17 పది పరీక్షల్లో వినియోగించే కంటింజెంట్ సామగ్రి పది పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం చిన్నచూపు 2023లో పెంచిన జగన్ సర్కార్ ఒక విద్యార్థికి ప్రస్తుతం ఇస్తున్న కంటింజెంట్ చార్జీ రూ.10 రెమ్యూనరేషన్ పెంచాలంటున్న యూనియన్లు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏదీ.. పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం చేస్తున్న కేటాయింపులు చూస్తుంటే ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుంది. ఒక విద్యార్థికి ఒక పేపరుకు రూ.1.42 కంటింజెంట్ చార్జీగా ఏ విధంగా సరిపోతాయో చెప్పాలి. కష్టమైన బాధ్యతలు నిర్వహించేవారికి గౌరవప్రదంగా రెమ్యునరేషన్ చెల్లించాలి. – పి.సురేంద్రకుమార్, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్, కపిలేశ్వరపురం ప్రస్తుత రేట్లకు అనుగుణంగా ఇవ్వాలి పెరుగుతున్న నిత్యావసర వస్తువులకు అనుగుణంగా రెమ్యునరేషన్ పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చే నామమాత్రపు కంటింజెంట్ చార్జి పరీక్షల నిర్వహణకు ఏ మూలకూ సరిపోవడం లేదు. ప్రభుత్వం వెంటనే సీఎస్, డీవోలతో పాటుగా ఇన్విజిలేటర్లకు కనీస చార్జీలు చెల్లించక పోవడం దురదృష్టకరం. వెంటనే ప్రభుత్వం రెమ్యునరేషన్ పెంచాలి. – విత్తనాల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి, గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్, అమలాపురం రెమ్యూనరేషన్ను తక్షణం పెంచాలి ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు చేస్తున్న కేటాయింపులు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇన్విజిలేటర్లకు రోజుకు కనీసం రూ.150, ఛీఫ్, డీవో, కస్టోడియన్లకు రోజుకు రూ.200 వంతున కేటాయించాలి. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలి. – నరాల కృష్ణకుమార్, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ, ద్రాక్షారామ టీఏ, డీఏలు చెల్లించాలి దూరంతో సంబంధం లేకుండా సీఎస్, డీవోలకు, ఇన్విజిలేటర్లకు టీఏ, డీఏలు చెల్లించాలి. రెమ్యూనరేషన్ కచ్చితంగా పెంచాలి. స్పాట్ వాల్యుయేషన్ చేసే స్పెషల్ అసిస్టెంట్లకు కూడా టీఏ, డీఏలు చెల్లించాలి. – పోతంశెట్టి దొరబాబు, జిల్లా అధ్యక్షుడు, ఎస్టీయూ, అమలాపురం -
ఆర్మీలో అగ్నివీర్ అవుతారా?
రాజమహేంద్రవరం రూరల్: దేశ రక్షణ కోసం సైన్యంలో చేరాలనుకునే యువతకు శుభవార్త. అగ్నివీర్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రిక్రూట్మెంట్ చరిత్రలో తొలిసారిగా ప్రవేశ పరీక్షను ఏకంగా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. మరోవైపు రాష్ట్రంలోని 13 జిల్లాల అభ్యర్థుల కోసం ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి విశాఖపట్నం మరోసారి వేదిక కానుంది. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇటీవలే విడుదలైంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ అంబేడ్కర్, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ కృష్ణా, మచిలీపట్నం జిల్లాల అభ్యర్థులకు విశాఖలో ఎంపికలు నిర్వహించాలని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం నిర్ణయించింది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఏప్రిల్ 10వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ కేటగిరీల కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నారు. అగ్నివీర్ ట్రేడ్స్మెన్కు 8వ తరగతి, జనరల్ డ్యూటీ కేటగిరీలకు 10వ తరగతి అర్హతగా నిర్ణయించారు. అలాగే 17.5 నుంచి 21 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులే అర్హులు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేవారు మాత్రమే ఈ రిక్రూట్మెంట్కు హాజరు కావాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది కీలక మార్పులు ఈసారి అగ్నివీర్ రిక్రూట్మెంట్లో పలు ముఖ్యమైన మార్పులు చేశారు. గతంలో అభ్యర్థులు ఒక కేటగిరీకి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, ఈసారి రెండు కేటగిరీల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎన్సీసీ, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లమా వంటి అదనపు విద్యార్హతలు కలిగిన వారికి బోనస్ మార్కులు లభిస్తాయి. గతంలో హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (సీఈఈ)ను ఇప్పుడు తెలుగుతో సహా 13 భాషల్లో రాసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన అడ్మిట్ కార్డులను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అడ్మిట్ కార్డులో ర్యాలీకి హాజరుకావాల్సిన తేదీ, సమయం వంటి వివరాలు ఉంటాయి. అభ్యర్థుల సౌకర్యం కోసం రిక్రూట్మెంట్ జరిగే ప్రదేశంలో ప్రత్యేక రిపోర్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో పారదర్శకంగా జరుగుతుందని రక్షణ శాఖ వర్గాలు తెలియజేశాయి. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం లైవ్ చాట్ సదుపాయంతో పాటు ‘ఆర్మీ కాలింగ్’అనే ఆన్లైన్ మొబైల్ అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మరింత సమాచారం కోసం www. joinindianarmy.nic.in వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయంలోని 0891– 2756959, 0891–2754680 నంబర్లకు ఫోన్ చేయాలని రక్షణ శాఖ అధికారులు సూచించారు. అగ్నివీర్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు 13 భాషల్లో ప్రవేశ పరీక్ష రాసే అవకాశం ఎన్సీసీ, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లమా అభ్యర్థులకు బోనస్ మార్కులు విశాఖలో మరోసారి ర్యాలీ ఏప్రిల్ 10 వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం -
22 కాసుల బంగారు ఆభరణాల చోరీ
నల్లజర్ల: స్థానికంగా గత రాత్రి భారీ చోరీ జరిగింది. నల్లజర్ల ఏఎస్ఐ సోమరాజు చెప్పిన వివరాల ప్రకారం నల్లజర్ల సొసైటీ రహదారిలో ఉన్న మారడుగల శ్రీనివాస్ ఈ నెల 15వ తేదీన బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. ఆదివారం ఇంటికి వచ్చి చూడగా ఇంటి వెనుక తలపులు పగులగొట్టి ఉండాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉన్న 22 కాసుల బంగారు ఆభరణాలు, నాలుగు తులాల వెండి చోరీకి గురైనట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ దొంగల ఆగడాలుబిక్కవోలు: మండలంలోని బలభద్రపురం గ్రామంలోని విద్యుత్ దొంగల ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. విద్యుత్ టాన్స్ఫార్మర్ పగుల గొట్టి దానిలో ఉన్న రాగి తీగ చోరీ చేస్తున్నారు. శనివారం రాత్రి మళ్లీ మూడు చోట్ల చోరీ ప్రయత్నం చేశారు. రెండు చోట్ల చోరీ జరిగింది. బలభద్రపురం గ్రామానికి చెందిన దార్వంపూడి సూర్యనారాయణరెడ్డి, మరో రైతు పొలంలో చోరీ జరిగింది. పక్కనే ఉన్న ఎస్వీవీకే రెడ్డి పొలంలో చోరీ ప్రయత్నం చేశారు. ఆయన ట్రాన్స్ఫార్మర్ బోల్టులకు వెల్డింగ్ చేయించారు. దొంగల దాన్ని బద్దలు కొట్టలేక అక్కడే వదిలి వెళ్లిపోయారు. ఈ విషయంపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. పీఎంజే జ్యూయలర్స్ ప్రారంభంబోట్క్లబ్ (కాకినాడ సిటీ): దక్షిణ భారతదేశంలో అందరికీ ప్రియమైన జ్యూయలరీ బ్రాండ్ అయిన పీఎంజే జ్యూయలర్స్ కాకినాడ దేవాలయం వీధిలో ఏర్పాటు చేసిన కొత్త షోరూంను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పీఎంజే ఆంధ్రా బిజినెస్ హెడ్ హైదర్ ఆలీ, క్లస్టర్ మేనేజర్ షేక్ గాలి షరీఫ్ ఆదివారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పీఎంజే జ్యూయలర్స్ కాకినాడలో విస్తరించడం ఆనందంగా ఉందన్నారు. షోరూమ్లో ఆభరణాల నాణ్యత, హస్తకళ పట్ల వారి నిబద్ధత ప్రశంసనీయమన్నారు. పీఎంజే ఆంధ్రా బిజినెస్ హెడ్ హైదర్ ఆలీ మాట్లాడుతూ ప్రసిద్ధి చెందిన వ్యక్తిగత ఎంపికలకు అనువైన ఆతిథ్యం అనుభవించడానికి మేము ప్రతీ ఒక్కరినీ స్వాగతిస్తున్నామన్నారు. తమ షోరూమ్లకు అమెరికాతోపాటు దక్షిణ భారతదేశంలో ప్రజల ఆదరణ ఎంతగానో లభిస్తోందన్నారు. తమ జ్యూయలర్స్లో డిజైన్లు భారతీయ స్వర్ణకారుల అద్భుతమైన కళాత్మక నైపుణ్యాలను ప్రదర్శిస్తాయన్నారు. కాకినాడ షోరూమ్ హెడ్ శేషగిరి పాల్గొన్నారు. -
పది పరీక్షల్లో మార్గదర్శకాలివే..
రాయవరం: పదవ తరగతి పరీక్షలు సోమవారం నుంచి జిల్లా అంతటా ప్రారంభం కానున్నాయి. పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు జిల్లా విద్యా శాఖ ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టింది. శనివారం మధ్యాహ్నం అన్ని పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు సమావేశాలు నిర్వహించి సూచనలు, సలహాలు అందజేశారు. సీసీఈ విధానంలో ప్రారంభం అవుతున్న పది పరీక్షల్లో 15 నిమిషాలు పరీక్ష పేపరు చదువుకునేందుకు సమయాన్ని కేటాయిస్తున్నారు. పది పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో చీఫ్, డీవోలతో పాటు ఇన్విజిలేటర్లు చేయాల్సిన విధులపై ‘సాక్షి’ కథనం.ఇన్విజిలేటర్లకు సూచనలు ● ఇన్విజిలేటర్లు ఫొటో గుర్తింపు కార్డు తీసుకోవాలి. రోజూ తప్పకుండా ఐడీ కార్డు ధరించాలి. ● పరీక్ష పేపర్ల కోడ్స్, సరైన కాంబినేషన్ గురించి విధిగా తెలుసుకోవాలి. ● పరీక్ష రోజు ఉదయం 8.30 గంటలకు కేంద్రం వద్దకు హాజరు కావాలి. ● తొమ్మిది గంటలకు విద్యార్థులను పరీక్ష గదిలో కూర్చోబెట్టాలి. 9.30 గంటల తర్వాత విద్యార్థులను అనుమతించరాదు. ● ప్రతి విద్యార్థిని సోదా చేసి, ఎటువంటి ఫర్బిడెన్ మెటీరియల్ లేదని నిర్ధారించుకోవాలి. ● విద్యార్థినులను మహిళా ఇన్విజిలేటర్లు మాత్రమే సోదా చేయాలి. ● విద్యార్థులకు ఫొటో, అన్ని వివరాలతో కూడిన హాల్ టికెట్ అందిస్తారు. విద్యార్థిని హాల్ టికెట్, అటెండెన్స్ షీట్లోని ఫొటోతో పోల్చి నిర్ధారించుకోవాలి. ● అభ్యర్థిపై అనుమానం ఉంటే వెంటనే సీఎస్ దృష్టికి తీసుకుని వెళ్లాలి. ● అన్ని పరీక్షలు బార్ కోడింగ్ విధానంలో జరుగుతాయి. ఉదయం 8.45 గంటలకు ఓఎంఆర్ ప్రధాన/అదనపు సమాధాన పత్రాలు సీఎస్ నుంచి పొందాలి. ● ప్రధాన సమాధాన పత్రంలోని సూచనలను, ఓఎంఆర్ షీట్ వెనుక భాగంలో సూచనలు విద్యార్థులకు వివరించాలి. ● ఓఎంఆర్ షీట్ మినహా ఏ పేపర్పైనా కూడా హాల్ టికెట్ నంబరు, పేరు రాయించరాదు. ● ఓఎంఆర్ షీటు ఏదైనా కారణంతో పాడైతే, వెంటనే సీఎస్ దష్టికి తీసుకుని వెళ్లి, నాన్ స్టాండర్డ్ ఓఎంఆర్ షీట్ పొందాలి. ● ఓఎంఆర్ షీట్పై ఉన్న బార్కోడ్పై రాయడం గాని, నలపడం గాని చేయకుండా విద్యార్థులను హెచ్చరించాలి. ● 9.25గంటల లోపు ఇన్విజిలేటర్ అన్ని పనులు ముగించుకుని 9.30గంటలకు కచ్చితంగా ప్రశ్నపత్రాలు ఇవ్వాలి. ● ప్రశ్న పత్రాలు తీసుకున్న వెంటనే సరిపడినన్ని ఉన్నాయా? ఆ రోజుకు సంబంధించిన సబ్జెక్టు/పేపర్కోడ్/ మీడియం సరిచూసుకోవాలి. ● పేపరు ఏ మాత్రం తప్పుగా ఇచ్చినా సంబంధిత ఇన్విజిలేటర్పై తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. – గైర్హాజరైన విద్యార్థుల ఓఎంఆర్ షీట్ను ఎర్ర సిరా పెన్తో క్యాన్సిల్ చేయాలి. ● సమాధాన పత్రాలు, అడిషనల్ షీట్స్ అన్నీ సరిచూసుకున్నాకే విద్యార్థులను పంపాలి.సీఎస్, డీవోలకు సూచనలు రోజూ ఉదయం 7.45 గంటలకు సెట్ కాన్ఫరెన్స్కు హాజరు కావాలి. నిర్దేశించిన సమయానికన్నా ముందు సీఎస్, డీవో ఇద్దరు సంతకాలతో పరీక్షల కట్టల సీల్ తెరవాలి. లాటరీ పద్దతిలోనే ఇన్విజిలేటర్లకు తరగతి గదులు కేటాయించాలి. అనుమతి లేని వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించరాదు. -
తలుపులమ్మ తల్లి దర్శనానికి తరలివచ్చిన భక్తులు
తుని రూరల్: లోవ దేవస్థానంలో వెలసిన తలుపులమ్మ తల్లి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ఆదివారం ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన 22 వేల మంది క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారని ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,49,040, పూజా టికెట్లకు రూ.91,320, కేశఖండనకు రూ.14,810, వాహన పూజలకు రూ.4,350, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.73,072, విరాళాలు రూ.1,06,485 కలిపి మొత్తం రూ.4,39,077 ఆదాయం సమకూరిందని వివరించారు. జనార్దనాచార్యులుకు అవార్డు ప్రదానం పిఠాపురం: స్థానిక రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ అర్చకుడు విజయ జనార్దనాచార్యులుకు అర్చక సేవా వైభవ రత్న పురస్కారం ప్రదానం చేశారు. హైదరాబాద్ హరిహర కళాభవన్లో సర్ సీవీ రామన్ అకాడమీ సేవా సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యాన 33వ ఉగాది వార్షికోత్సవాల సందర్భంగా ఆదివారం సువర్ణ ఘంటా కంకణం, స్వర్ణ పతకంతో జనార్దనాచార్యులును సత్కరించి, బిరుదు ప్రదానం చేశారు. వేణుగోపాలస్వామి ఆలయం, ఇతర దేవాలయాల అభివృద్ధికి, సమాజ సేవలకు గానూ ఈ పురస్కారం అందజేశారు. సంస్థ ప్రధాన కార్యదర్శి మహేంద్రవాడ వెంకటేశ్వరరావు, సినీ నటుడు కోట శంకరరావు చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందించారు. నేడు పీజీఆర్ఎస్ కాకినాడ సిటీ: జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకూ కలెక్టరేట్లో నిర్వహిస్తున్నారు. కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. దీనికి జిల్లా అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. మండల స్థాయిలో పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఆయా అధికారులు ఉదయం 9.30 గంటలకే విధిగా హాజరు కావాలని పేర్కొన్నారు. శతాధిక వృద్ధురాలి మృతి అమలాపురం టౌన్: స్థానిక 22వ వార్డు పరిధిలోని గొవ్వాలవారి వీధికి చెందిన శతాధిక వృద్ధురాలు గొవ్వాల సూర్యకాంతం (110) ఆదివారం మృతి చెందారు. ఈమె 22వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్, వైఎస్సార్ సీపీ నాయకుడు గొవ్వాల రాజేష్ నానమ్మ. మూడు నెలల కిందటి వరకూ నానమ్మ ఏ ఒక్కరి సాయం లేకుండానే తన పనులు తాను చేసుకుంటూ జీవించిందని రాజేష్ తెలిపారు. మూడు నెలలగా మంచాన పడి చివరకు వృద్ధాప్యంతో మృతి చెందిందన్నారు. సూర్యకాంతానికి ఐదుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు, కోడళ్లు, అల్లుళ్లు, దాదాపు 40 మంది వరకూ మనుమలు, ముని మనుమలు ఉన్నారు. అయినవిల్లికి భక్తుల తాకిడి అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామిని ఆదివారం ఆధిక సంఖ్యలో భక్తులు దర్శించుని, ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యాన స్వామి వారికి మేలుకొలుపు సేవ, లఘున్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ జరిపారు. స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించి, మహానివేదన చేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 56 మంది, లక్ష్మీగణపతి హోమంలో 31 జంటలు, స్వామివారి పంచామృతాభిషేకాల్లో ఒక జంట, స్వామివారి గరిక పూజలో రెండు జంటలు పాల్గొన్నాయి. పది మంది భక్తులు ఉండ్రాళ్ల పూజలు జరిపారు. 11 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు, ఐదుగురు చిన్నారులకు అన్నప్రాశనలు, ముగ్గురు చిన్నారులకు నామకరణం, 13 మందికి తులాభారం చేశారు. 16 మంది తలనీలాలు సమర్పించారు. 25 నూతన వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. 3,510 మంది అన్న ప్రసాదం స్వీకరించారు. స్వామివారికి వివిధ రూపాల్లో రూ.2,93,437 ఆదాయం లభించింది. -
SVSN Varma: నాడు ఎత్తేసి.. నేడు తొక్కేసి..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆరు నెలలు సావాసం చేస్తే వారు, వీరవుతారంటారు. కూటమిగా జత కట్టి.. అమలు కాని హామీలతో ప్రజలను నమ్మించి.. నట్టేట ముంచుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ల విషయంలో ఈ మాట నిజమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అవసరానికి వాడుకుని, పని అయిపోయాక కూరలో కరివేపాకులా తీసి పడేసే తత్వం ఇంత కాలం చంద్రబాబుకే సొంతమనుకునే వారు. ఇప్పుడు చంద్రబాబుతో చెట్టపట్టాలేసుకు తిరుగుతున్న పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు కూడా ఆ తత్వాన్ని ఒంట పట్టించుకున్నట్టు కనిపిస్తోంది. పిఠాపురం శివారు చిత్రాడలో శుక్రవారం రాత్రి జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ సోదరుడు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన వ్యాఖ్యలే దీనికి అద్దం పడుతున్నాయి. ‘పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపులో ప్రధానంగా రెండు ఫ్యాక్టర్స్ పని చేశాయి. ఒకటి జనసేన ప్రెసిడెంట్ పవన్ కల్యాణ్. రెండు జనసైనికులు, పిఠాపురం ఓటర్లు’ మరెవరైనా పవన్ గెలుపులో తమ పాత్ర ఉందని అనుకుంటే అది వారి ఖర్మ’ అని నాగబాబు నొక్కి మరీ చెప్పారు. ఆ మాటలకు అర్థాలే వేరని ఆ సభలోనే జనసేన అభిమానులు, కార్యకర్తలు గుసగుసలాడటం వినిపించింది. నాగబాబు చేసిన వ్యాఖ్యలు పిఠాపురానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను ఉద్దేశించినవేనని ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.పొగిడిన నోటితోనే.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక, భీమవరంలో పోటీ చేసి, రెండుచోట్లా ఓడిపోయారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఒకే ఒక్క స్థానం పిఠాపురంలో గెలుపొందారు. ఈ గెలుపులో జనసేన ఎంత పని చేసిందో, స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, ఆయన అనుచరగణం కూడా అంతే స్థాయిలో పని చేసిందనేది జగమెరిగిన సత్యం. పరాజయాల నేపథ్యంతో గత సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురాన్ని ఎంపిక చేసుకున్నప్పటి నుంచి, గెలుపొందే వరకూ వర్మను ఇంద్రుడు, చంద్రుడు అంటూ ఆకాశానికెత్తేయడంలో మెగా బ్రదర్స్ పవన్ కల్యాణ్, నాగబాబు పోటీ పడ్డారు. ‘ఈ విజయం జనసైనికులది. ఈ విజయం వర్మది’ అంటూ స్వయంగా పవన్ కల్యాణ్ పలు సభల్లో వర్మను ప్రశంసలతో ముంచెత్తారు. సార్వత్రిక ఎన్నికల ముందు వరకూ అన్నదమ్ములిద్దరూ వర్మను నెత్తిన పెట్టుకున్నారు. అధికారంలో భాగస్వామ్యులై, పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక అసలు స్వరూపం బయటపడిందని, వర్మను రాజకీయంగా పాతాళానికి తొక్కేయడానికి ప్రయతి్నస్తున్నారని ఆయన అనుచర వర్గం మండిపడుతోంది.విస్తృతంగా చర్చ నేడు మెగాబ్రదర్స్ వ్యాఖ్యలు చూస్తూంటే ‘ఓడ ఎక్కే వరకూ ఓడ మల్లన్న.. ఒడ్డుకు చేరాక బోడి మల్లన్న’ సామెతను తలపిస్తోందని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలయ్యేంత వరకూ వర్మను వేనోళ్ల పొగడిన మెగా సోదరులు ఇంతలోనే ఇంతలా మారిపోతారని ఊహించలేదని తెలుగు తమ్ముళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు పిఠాపురంలో జరిగిన ఒక సభలో వర్మను ఆకాశానికెత్తేస్తూ మెగా బ్రదర్స్ పొగుడుతున్న వీడియో, శుక్రవారం రాత్రి చిత్రాడ సభలో నాగబాబు వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ అంశం ఇప్పుడు కూటమి పారీ్టల మధ్య హాట్టాపిక్గా మారింది. ఎక్కడ ఏ నలుగురు కలిసినా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ తరచూ మార్పు రావాలంటున్నారని, చివరకు చిత్రాడ సభలో సైతం ఇదే విషయాన్ని ఊదరగొట్టారని, మార్పు అంటే ఇదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.చంద్రబాబు మొండిచేయి పొత్తు ధర్మంలో భాగంగా పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మకు చంద్రబాబు భారీ హామీయే ఎర వేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ పదవిని ఆయనకే ఇస్తామని గొప్పగా ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుమూడు దఫాలు ఎమ్మెల్సీల నియామకాలు జరిగినా వర్మకు మాత్రం మొండిచేయే చూపించారు. పని అయ్యే వరకూ బుజ్జగించడం.. ఆనక గాలికొదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అనే విమర్శ ఉంది. అయితే, అదే వాస్తవమని వర్మకు ఎమ్మెల్సీ పదవి విషయంలో మరోసారి రుజువైందని అంటున్నారు. అయితే, వర్మకు జెల్ల కొట్టడానికి వేరే కారణముందనే చర్చ కూడా నడుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో సీటు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వర్మ అనుచరులు పిఠాపురంలో చంద్రబాబు, లోకేష్ దిష్టి ొమ్మలు, పార్టీ జెండాలు దహనం చేశారు. చంద్రబాబు, లోకేష్ లను బూతులు తిట్టారు. దీనిని మనసులో పెట్టుకుని, చంద్రబాబు, లోకేష్లు వ్యూహాత్మకంగానే వర్మను తొక్కేస్తున్నారని, మెగాబ్రదర్స్ ద్వారా పొమ్మనకుండానే పొగ పెడుతున్నారని టీడీపీలోని ఒక వర్గం అంటోంది.లేకుంటే వర్మను నాగబాబు పదేపదే టార్గెట్ చేస్తున్నా అధినేతలు ఎందుకు మాట్లాడటం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, నాగబాబు మధ్య ఎన్నికల సమయంలో రగిలిన చిచ్చు అధికారంలోకి వచ్చాక కూడా కొనసాగుతూనే ఉంది. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోగా.. ఆయనను నిత్యం విభేదించే మెగా బ్రదర్ నాగబాబుకు ఆ పదవి ఇచ్చారు. నాగబాబును రేపోమాపో మంత్రిని కూడా చేస్తారనే ప్రచారంతో పిఠాపురంలో వర్మ అనుచరులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే నియోజకవర్గంలో టీడీపీ ఉనికే ప్రమాదంలో పడుతుందని తెలుగు తమ్ముళ్లు పేర్కొంటున్నారు. -
ఒక్క ఫోన్ చేసినా.. ఇంత అనర్థం జరిగేది కాదు
కాకినాడ రూరల్: ‘‘జరిగిన ఘటనను జీర్ణించుకోలేకపోతున్నాం. మా కుటుంబంలో అందరూ విద్యావంతులు. పెదనాన్న కొడుకు చంద్రకిశోర్ (37)ఎంబీఏ, ఎంకామ్ చదివాడు. చాలా కష్టపడి పైకి వచ్చాడు. 2014లో ఓఎన్జీసీలో ఉద్యోగంలో చేరాడు. ఒకటో తరగతి చదువుతున్న జోషిత్(7), యూకేజీ చదువుతున్న నిఖిల్(6)ను ఇటీవలే స్కూల్ మార్చాడు. ఇబ్బందులు, మానసిక ఒత్తిడి ఉన్నట్టు చెప్పలేదు. ఒక్క ఫోన్ కాల్ చేసి ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండేది కాదు’’ అని కాకినాడలో ఇద్దరు కుమారులను చంపి ఆత్మహత్య చేసుకున్న చంద్రకిశోర్ సోదరుడు, తాడేపల్లిగూడెంకు చెందిన వానపల్లి ఆదిశేషు వాపోయారు. తాడేపల్లిగూడెంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు. చంద్రకు 2017లో రాజమహేంద్రవరానికి చెందిన తనూజతో వివాహమైందని, ఆమె ఎంబీఏ చదివారని తెలిపారు. కాగా, తమ సంస్థలో అసిస్టెంట్ అకౌంటెంట్గా పని చేస్తున్న చంద్రకిశోర్ చాలా మంచి వ్యక్తి అని, ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదని, పిల్లలతో పాటు అతడూ చనిపోవడం బాధాకరమని ఓఎన్జీసీ, కాకినాడ హెచ్ఆర్ హెడ్ సునీల్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కలకలం రేపిన ఘటన.. ఇద్దరు కుమారులను కాళ్లు, చేతులు కట్టేసి, నోటికి వస్త్రం కట్టి నీటి బకెట్లో ముంచి ప్రాణం తీసి, ఆపై తానూ ఫ్యాన్కు ఉరివేసుకుని చంద్రకిశోర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. చంద్రకిశోర్ కాకినాడ రూరల్ వాకలపూడి ఓఎన్జీసీ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. భార్య తనూజ, ఇద్దరు పిల్లలతో కాకినాడ తోట సుబ్బారావు నగర్లో ఉంటున్నాడు. హోలీ పండగ కోసం ఓఎన్జీసీ కార్యాలయానికి భార్య, పిల్లలను తీసుకెళ్లిన అతడు.. భార్యను అక్కడే ఉంచి బట్టలు కుట్టించేందుకు అంటూ పిల్లలను బయటకు తీసుకొచ్చాడు. కాగా, కాకినాడలో పేరున్న పాఠశాలలో ఇద్దరు పిల్లలను ఏటా రూ.1.50 లక్షల ఫీజుతో చేర్పించాడు. బాగా చదవడం లేదని తిరిగి తక్కువ ఫీజున్న స్కూల్కు మార్పించాడు. పిల్లల చదువుపై అతడ బెంగ పెట్టుకున్నట్టు సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది. -
వినియోగదారుల ఉద్యమం మరింత పటిష్టం కావాలి
సభలో మాట్లాడుతున్న జేసీ రాహుల్ మీనా కాకినాడ సిటీ: వినియోగదారుడే దేశ ఆర్థిక ప్రగతికి సూత్రధారుడని, వినియోగదారుల ఉద్యమం మరింత పటిష్టం కావాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. శనివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా పౌర సరఫరాలు, లీగల్ మెట్రోలజీ తదితర శాఖల అధికారులతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి జేసీ రాహుల్ మీనా ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో వినియోగ ఉద్యమం ప్రథమస్థానంలో ఉండడానికి వర్కుషాప్లు, సెమినార్ల ద్వారా తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. కేసులను సత్వరమే పరిష్కరించాలన్నారు. మెంబర్ సుశి మాట్లాడుతూ ఉద్యమానికి వారధిలా పని చేస్తామన్నారు. జిల్లా సమాఖ్య చైర్మన్ భమిడి గిరిజా రమాదేవి మాట్లాడుతూ కన్జ్యూమర్ క్లబ్స్, మండల వినియోగ సమాచార కేంద్రాల్లో వినియోగ సంఘాల ద్వారా చైతన్య సదస్సులు నిర్వహిస్తామన్నారు. జిల్లా సప్లై అధికారి ఆర్ఎస్ఎస్ సీతారామరాజు మాట్లాడుతూ సభ్యులు ప్రస్తావించిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు భమిడి శివమూర్తి, చాగంటి నాగేశ్వరరావు, ఫుడ్ కంట్రోల్ అధికారి శ్రీనివాసు, లీగల్ మెట్రోలజీ అధికారుల, ఆర్డీసీ డిపో, అన్నవరం సత్యదేవా మహిళా కళాశాల అధికారులు పాల్గొన్నారు. పలువురు వినియోగదారుల సంఘాల సభ్యులను సత్కరించారు. -
శృంగార వల్లభుని సన్నిధిలో రద్దీ
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సుమారు 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. వివిధ సేవలు, కేశఖండన, అన్నదాన విరాళాలుగా స్వామి వారికి రూ.4,01,587 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఐదు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశారు. అర్జీలను నూరు శాతం పరిష్కరించాలి కాకినాడ సిటీ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను గడువులోపు నూరు శాతం పరిష్కరించాలని జిల్లా ఇన్చార్జి అధికారి జి.వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. వివిధ అంశాలపై ఆయన కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా అటవీ శాఖ అధికారి ఎ.రవీంద్రనాథ్రెడ్డి, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన తదితరులతో కలిసి పలు శాఖల జిల్లా అధికారులు, పథకాల లబ్ధిదారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో శనివారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న వివిధ కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. సమావేశంలో డీఆర్ఓ జె.వెంకటరావు, కాకినాడ, పెద్దాపురం ఆర్డీఓలు ఎస్.మల్లిబాబు, కె.శ్రీరమణి, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పీడీ చైత్రవర్షిణి, సీపీఓ పి.త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. నేడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పరీక్ష కాకినాడ సిటీ: ఏపీపీఎస్సీ ఆధ్వర్యాన ఆదివారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఆర్ఓ జె.వెంకటరావు తెలిపారు. స్థానిక ఎస్.అచ్యుతాపురంలోని అయాన్ డిజిటల్ జోన్ సాఫ్ట్ టెక్నాలజీస్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆయన, ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, ఇతర అధికారులు శనివారం పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో ఏపీపీఎస్సీ, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో డీఆర్ఓ మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగే ఈ పరీక్షకు 464 మంది హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించామన్నారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రానికి ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. స్వయం ఉపాధికి దరఖాస్తుల ఆహ్వానం కాకినాడ సిటీ: బీసీ, ఈబీసీ సామాజిక వర్గాల వారికి స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. బీసీలకు రూ.2 లక్షల వరకూ యూనిట్లకు 50 శాతం సబ్సిడీ లేదా రూ.75 వేలు మించకుండా మిగిలినది ఆర్థిక సాయంగా అందిస్తారన్నారన్నారు. జనరిక్ మెడికల్ షాపు యూనిట్కు రూ.8 లక్షలు, సబ్సిడీ రూ.4 లక్షలు పోను, మిగిలిన సొమ్ము బ్యాంకు రుణంగా అందిస్తారని తెలిపారు. మేదర, కుమ్మరి, శాలివాహన వారికి బుట్టల అల్లకం, కుండల తయారీ కింద యూనిట్ కాస్ట్ రూ.3 లక్షలు, సబ్సిడీ రూ.1.50 లక్షలు అందిస్తారని వివరించారు. ఆర్యవైశ్య, రెడ్డి, క్షత్రియ, కమ్మ, బ్రాహ్మణ, ఈబీసీ వర్గాల వారికి యూనిట్కు రూ.2 లక్షల వరకూ ఇస్తారని, ఇందులో 50 శాతం సబ్సిడీ లేదా రూ.75 వేలు మించకుండా ఆర్థిక సహాయం అందిస్తారని పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గాల వారికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ రుణం ఇస్తారని, ఇందులో 50 శాతం సబ్సిడీ ఉంటుందని తెలిపారు. ఎంఎస్ఎంఈ పథకం కింద రూ.25 లక్షల యూనిట్కు రూ.10 లక్షల బ్యాంకు రుణం, రూ.10 లక్షల సబ్సిడీ ఇస్తారని, లబ్ధిదారు రూ.5 లక్షలు భరించాలని పేర్కొన్నారు. ఈ రుణాలకు 21 నుంచి 60 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. రైస్ కార్డు కలిగి ఉండాలని కమ్యూనిటీ సర్టిఫికెట్ తప్పనిసరని తెలిపారు. మహిళలకు స్వయం ఉపాధి పథకంలో ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇచ్చి, కుట్టుమెషీన్ ఉచితంగా అందిస్తారని శ్రీనివాసరావు వెల్లడించారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 22 చివరి తేదీ అని, ఆసక్తి ఉన్నవారు గ్రామ సచివాలయాలు, నెట్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. -
రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) పిల్లి రమేష్ తెలిపారు. తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పరీక్షలు సోమవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ జరుగుతాయని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 457 పాఠశాలల నుంచి 28,963 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. వీరిలో రెగ్యులర్ 27,500 మంది ఉండగా వీరిలో బాలురు 13,765 మంది, బాలికలు 13,735 మంది ఉన్నారని తెలిపారు. మిగిలిన వారు సప్లిమెంటరీ విధానంలో రాస్తారన్నారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 142 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల తనిఖీలకు వచ్చే అధికారులు సైతం తమ ఫోన్లను గది వెలుపలే విడిచిపెట్టి లోపలకు వెళ్లాలని స్పష్టం చేశారు. పేపర్ లీకేజీలకు కారణమైన వారిని ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తామని డీఈఓ హెచ్చరించారు. ఓపెన్ పరీక్షలకు 2,248 మంది సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యాన నిర్వహించే ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలు సైతం సోమవారం ప్రారంభం కానున్నాయని డీఈఓ రమేష్ తెలిపారు. ఈ పరీక్షలకు 2,248 మంది హాజరవుతున్నారని, వీరి కోసం 26 కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. -
గిరిపై భక్తజనసాగరం
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ● రూ.40 లక్షల ఆదాయంఅన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుడు వెలసిన రత్నగిరి శనివారం భక్తజనసంద్రమే అయ్యింది. రత్నగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు తమ బంధుమిత్రులతో కలసి సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. వీరికి వేలాదిగా వచ్చిన ఇతర భక్తులు కూడా తోడయ్యారు. వీరందరూ సత్యదేవుని దర్శించి, పూజలు, వ్రతాలు ఆచరించారు. దీంతో, ఆలయం వద్ద రద్దీ ఏర్పడింది. స్వామివారి ఉచిత దర్శనానికి గంటన్నర, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని మొత్తం 40 వేల మంది దర్శించుకున్నారు. రెండు వేల వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్న ప్రసాదాన్ని సుమారు 5 వేల మంది భక్తులు స్వీకరించారు. నేడు కూడా రద్దీ సెలవు రోజు కావడంతో ఆదివారం కూడా రత్నగిరిపై భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు శనివారం రాత్రి కూడా వివాహ ముహూర్తాలున్నాయి. దీంతో, సత్యదేవుని సన్నిధిలో ఆదివారం రద్దీ ఏర్పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. సత్యదేవుడు, అమ్మవారిని ఆదివారం ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాకారంలో టేకు రథంపై ఊరేగించనున్నారు. ఘనంగా ప్రాకార సేవ సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఉద యం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి తిరుచ్చి వాహనం మీద వేంచేయించారు. స్వామి, అమ్మవార్లకు పూజల అనంతరం అర్చకులు కొబ్బరికాయ కొట్టి, ప్రాకార సేవను ప్రారంభించారు. ఆలయ ప్రాకారంలో మూడుసార్లు సేవ నిర్వహించి, స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సత్యదేవుని వ్రతాలాచరిస్తున్న భక్తులు -
స్వచ్ఛాంధ్రలో అందరూ భాగస్వాములు కావాలి
కాకినాడ సిటీ: ప్రతి నెలా మూడో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా ఇన్చార్జి అధికారి జి.వీరపాండ్యన్ అన్నారు. కలెక్టరేట్ నుంచి కొండయ్యపాలెం శారదా దేవి గుడి సెంటర్ వరకూ శనివారం నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఆయన, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కలెక్టర్ షణ్మోహన్ సగిలి జెండా ఊపి ప్రారంభించారు. వీరపాండ్యన్, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన తదితరులు ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. ఈ సందర్భంగా వీరపాండ్యన్ మాట్లాడుతూ, పారిశుధ్య నిర్వహణ బాధ్యత మున్సిపల్, పంచాయతీ కార్మికులదే కాదని, ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. కలెక్టర్ షణ్మోహన్ సగిలి కూడా ప్రసంగించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్థాలు, ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగంపై అవగాహన కల్పిస్తూ శారదా దేవి గుడి సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన స్టాల్ను ఎమ్మెల్సీ పద్మశ్రీ ప్రారంభించారు. శ్యామ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేసి, స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టరేట్ సిబ్బంది నిర్వహించిన రంగోలీ కార్యక్రమాన్ని వీరపాండ్యన్, షణ్మోహన్, డీఆర్వో వెంకటరావు పరిశీలించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నాడు ఎత్తేసి.. నేడు తొక్కేసి..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆరు నెలలు సావాసం చేస్తే వారు, వీరు ఒక్కటవుతారంటారు. కూటమిగా జత కట్టి.. అమలు కాని హామీలతో ప్రజలను నమ్మించి.. నట్టేట ముంచుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ల విషయంలో ఈ మాట నిజమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అవసరానికి వాడుకుని, పని అయిపోయాక కూరలో కరివేపాకులా తీసి పడేసే తత్వం ఇంత కాలం చంద్రబాబుకే సొంతమనుకునే వారు. ఇప్పుడు చంద్రబాబుతో చెట్టపట్టాలేసుకు తిరుగుతున్న పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు కూడా ఆ తత్వాన్ని ఒంట పట్టించుకున్నట్టు కనిపిస్తోంది. పిఠాపురం శివారు చిత్రాడలో శుక్రవారం రాత్రి జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ సోదరుడు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన వ్యాఖ్యలే దీనికి అద్దం పడుతున్నాయి. ‘పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపులో ప్రధానంగా రెండు ఫ్యాక్టర్స్ పని చేశాయి. ఒకటి జనసేన ప్రెసిడెంట్ పవన్ కల్యాణ్. రెండు జనసైనికులు, పిఠాపురం ఓటర్లు’ మరెవరైనా పవన్ గెలుపులో తమ పాత్ర ఉందని అనుకుంటే అది వారి ఖర్మ’ అని నాగబాబు నొక్కి మరీ చెప్పారు. ఆ మాటలకు అర్థాలే వేరని ఆ సభలోనే జనసేన అభిమానులు, కార్యకర్తలు గుసగుసలాడటం వినిపించింది. నాగబాబు చేసిన వ్యాఖ్యలు పిఠాపురానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను ఉద్దేశించినవేనని ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పొగిడిన నోటితోనే.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక, భీమవరంలో పోటీ చేసి, రెండుచోట్లా ఓడిపోయారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఒకే ఒక్క స్థానం పిఠాపురంలో గెలుపొందారు. ఈ గెలుపులో జనసేన ఎంత పని చేసిందో, స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, ఆయన అనుచరగణం కూడా అంతే స్థాయిలో పని చేసిందనేది జగమెరిగిన సత్యం. పరాజయాల నేపథ్యంతో గత సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురాన్ని ఎంపిక చేసుకున్నప్పటి నుంచి, గెలుపొందే వరకూ వర్మను ఇంద్రుడు, చంద్రుడు అంటూ ఆకాశానికెత్తేయడంలో మెగా బ్రదర్స్ పవన్ కల్యాణ్, నాగబాబు పోటీ పడ్డారు. ‘ఈ విజయం జనసైనికులది. ఈ విజయం వర్మది’ అంటూ స్వయంగా పవన్ కల్యాణ్ పలు సభల్లో వర్మను ప్రశంసలతో ముంచెత్తారు. సార్వత్రిక ఎన్నికల ముందు వరకూ అన్నదమ్ములిద్దరూ వర్మను నెత్తిన పెట్టుకున్నారు. అధికారంలో భాగస్వామ్యులై, పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక అసలు స్వరూపం బయటపడిందని, వర్మను రాజకీయంగా పాతాళానికి తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అనుచర వర్గం మండిపడుతోంది. విస్తృతంగా చర్చ నేడు మెగాబ్రదర్స్ వ్యాఖ్యలు చూస్తూంటే ‘ఓడ ఎక్కే వరకూ ఓడ మల్లన్న.. ఒడ్డుకు చేరాక బోడి మల్లన్న’ సామెతను తలపిస్తోందని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలయ్యేంత వరకూ వర్మను వేనోళ్ల పొగడిన మెగా సోదరులు ఇంతలోనే ఇంతలా మారిపోతారని ఊహించలేదని తెలుగు తమ్ముళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు పిఠాపురంలో జరిగిన ఒక సభలో వర్మను ఆకాశానికెత్తేస్తూ మెగా బ్రదర్స్ పొగుడుతున్న వీడియో, శుక్రవారం రాత్రి చిత్రాడ సభలో నాగబాబు వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ అంశం ఇప్పుడు కూటమి పార్టీల మధ్య హాట్టాపిక్గా మారింది. ఎక్కడ ఏ నలుగురు కలిసినా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ తరచూ మార్పు రావాలంటున్నారని, చివరకు చిత్రాడ సభలో సైతం ఇదే విషయాన్ని ఊదరగొట్టారని, మార్పు అంటే ఇదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు మొండిచేయి పొత్తు ధర్మంలో భాగంగా పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మకు చంద్రబాబు భారీ హామీయే ఎర వేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ పదవిని ఆయనకే ఇస్తామని గొప్పగా ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుమూడు దఫాలు ఎమ్మెల్సీల నియామకాలు జరిగినా వర్మకు మాత్రం మొండిచేయే చూపించారు. పని అయ్యే వరకూ బుజ్జగించడం.. ఆనక గాలికొదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అనే విమర్శ ఉంది. అయితే, అదే వాస్తవమని వర్మకు ఎమ్మెల్సీ పదవి విషయంలో మరోసారి రుజువైందని అంటున్నారు. అయితే, వర్మకు జెల్ల కొట్టడానికి వేరే కారణముందనే చర్చ కూడా నడుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో సీటు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వర్మ అనుచరులు పిఠాపురంలో చంద్రబాబు, లోకేష్ దిష్టిబొమ్మలు, పార్టీ జెండాలు దహనం చేశారు. చంద్రబాబు, లోకేష్లను బూతులు తిట్టారు. దీనిని మనసులో పెట్టుకుని, చంద్రబాబు, లోకేష్లు వ్యూహాత్మకంగానే వర్మను తొక్కేస్తున్నారని, మెగాబ్రదర్స్ ద్వారా పొమ్మనకుండానే పొగ పెడుతున్నారని టీడీపీలోని ఒక వర్గం అంటోంది. లేకుంటే వర్మను నాగబాబు పదేపదే టార్గెట్ చేస్తున్నా అధినేతలు ఎందుకు మాట్లాడటం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, నాగబాబు మధ్య ఎన్నికల సమయంలో రగిలిన చిచ్చు అధికారంలోకి వచ్చాక కూడా కొనసాగుతూనే ఉంది. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోగా.. ఆయనను నిత్యం విభేదించే మెగా బ్రదర్ నాగబాబుకు ఆ పదవి ఇచ్చారు. నాగబాబును రేపోమాపో మంత్రిని కూడా చేస్తారనే ప్రచారంతో పిఠాపురంలో వర్మ అనుచరులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే నియోజకవర్గంలో టీడీపీ ఉనికే ప్రమాదంలో పడుతుందని తెలుగు తమ్ముళ్లు పేర్కొంటున్నారు.మొన్నటి వరకూ పొగిడారు.. ఇప్పుడు పొగ పెడుతున్నట్టున్నారు సార్.. కూరలో కరివేపాకులా మాజీ ఎమ్మెల్యే వర్మ పరిస్థితి నాగబాబు ‘ఖర్మ’ కామెంట్లపై తమ్ముళ్ల ఆగ్రహం వర్మనుద్దేశించే అన్నారని మండిపాటు ఇదంతా చంద్రబాబు వ్యూహమని ప్రచారం పొమ్మనకుండా పొగ పెడుతున్నారంటున్న టీడీపీలోని ఒక వర్గం పిఠాపురంలో ‘దేశా’నికి ‘చంద్ర’ గ్రహణం! -
ఎక్కువ రేటుకు ఎందుకు అమ్ముతున్నారు?
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ‘గతంలో టన్ను ఇసుక ధర రూ.475 ఉంది. ఏజెన్సీలు రూ.229కి కోట్ చేశాయి. కానీ, ఇప్పటికీ రూ.400కు పైగా అమ్ముతున్నారు. దీనికి కారణమేమిటి?’ అని మైన్స్ కమిషనర్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఇసుక సరఫరా ఏజెన్సీలు సాధ్యం కాని ధర ప్రతిపాదించి, ఎక్కువ రేటుకు ఎందుకు అమ్ముతున్నాయని నిలదీశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన డీఎల్ఎస్ఏ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇదే తీరు పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై నిర్వహించే సమావేశానికి ఓపెన్, డీసిల్టేషన్ ఏజెన్సీలు తప్పనిసరిగా హాజరు కావాలని అన్నారు. జరిగిన తప్పులు సరిచేసుకోవాలని, ఇకపై రీచ్లలో ప్రభుత్వ సిబ్బందిని కూడా నియమిస్తామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. వినియోగదారులతో నేరుగా సంభాషిస్తామన్నారు. మొదట వచ్చిన వారికి మొదట ఇసుక అందించేలా రవాణా వ్యవస్థ ఉండాలన్నారు. రవాణా వ్యవస్థపై పర్యవేక్షణ తప్పనిసరని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్పీ డి.నరసింహ కిషోర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, మైన్స్ ఈడీ డి.ఫణిభూషణ్రెడ్డి పాల్గొన్నారు. -
కలెక్టర్లు హాజరు కాకుంటే ఎలా?
కాకినాడ సిటీ: జెడ్పీ సర్వసభ్య సమావేశంలో అజెండాలోని అంశాలపై జరిగే చర్చలకు తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీన జిల్లాల కలెక్టర్లు హాజరు కాకపోవడంపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరావులతో పాటు ఆయా జిల్లాల జెడ్పీటీసీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం పనుల ద్వారా సమకూరిన మెటీరియల్ కాంపోనెంట్ నిధులను, గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ల తీర్మానాలతో ప్రమేయం లేకుండా కలెక్టర్లు తమ ప్రాధాన్యం ప్రకారం కేటాయించడంపై సభ్యులు అభ్యంతరం తెలుపుతూ, ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని చైర్మన్ వేణుగోపాలరావును కోరారు. మూడు జిల్లాలోని గోదావరి కాలువ చివరి ఆయకట్టు భూముల్లోని పంటలు సాగునీరు అందక ఎండిపోతున్న పరిస్థితిపై సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ, వంతుల వారీ విధానం, డ్రైన్ల నుంచి లిఫ్టింగ్ ద్వారా పంటలను కాపాడాలని కోరారు. కాలువల ఎగువ ప్రాంతాల్లోని రైతులకు సక్రమంగా నీటిని వదులుతున్నప్పటికీ అదనపు నీటిని అక్రమంగా తోడుతుండడం వల్ల శివారు భూములకు నీరు అందడం లేదని, ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హెచ్చరించారు. తాళ్లరేవు జెడ్పీటీసీ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ మాట్లాడుతూ యానాం–ద్రాక్షారామ ప్రధాన రహదారిలో ఆరేళ్లుగా వంతెన శిథిల స్థితికి చేరడం వల్ల కాలువకు తూరలు వేసి పైన సీసీ రోడ్డు వేశారని, ఫలితంగా నీరు సక్రమంగా పారకపోవడం, ఆ రహదారిలో రాకపోకలు సాగిస్తున్న సుమారు 40 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఇంజరం వద్ద పూర్తి స్థాయిలో వంతెన నిర్మించి రైతులను ఆదుకోవాలని, ప్రజల రాకపోకలలో ఇబ్బందులు తొలగించాలని కలెక్టర్ కోరారు. దీనిపై కలెక్టర్ షణ్మోహన్ స్పందించి ఈ విషయం పూర్తి స్థాయిలో అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే పౌరసరఫరాల ద్వారా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లకు పంపిణీ చేస్తున్న నాసిరకమైన కొత్త బియ్యం వండినప్పుడు ముద్దవుతోందని, పిల్లలు తినడానికి ఇష్టపడడం లేదని కొందరు సభ్యులు ప్రస్తావించారు. మండలాల్లో నిర్వహించిన పనులకు చెల్లింపులు జాప్యం లేకుండా జరపాలని కోరారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమాలు జిల్లాలో విస్తృతంగా నిర్వహించాలని, ఆరోగ్యంపై వ్యయాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన జనరిక్ మందుల షాపులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు కోరారు. కారుణ్య నియామకాలను వేగవంతం చేయాలని, ఉద్యోగులకు జీపీఎఫ్ స్లిప్పులు జారీ చేయాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు. గిరిజన ప్రాంత ప్రజల సమస్యలపై చర్చ, పరిష్కారానికి ఐటీడీఏ సర్వ సభ్య సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్తో పాటు, ఏఎస్ఆర్ జిల్లా పరిధి జెడ్పీటీసీ సభ్యులు కోరారు. దీనిపై ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం స్పందిస్తూ ఏప్రిల్ చివరి లేదా మే తొలివారంలో తదుపరి సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అలాగే గిరిజన ప్రాంత సమస్యలపై సభ్యులు ప్రస్తావించిన అంశాలకు ఆయన వివరణలు ఇచ్చి సమస్యలన్నింటినీ సత్వరం పరిష్కరిస్తామన్నారు. తమ జిల్లాలకు సంబంధించి సభ్యులు లేవనెత్తిన అంశాలపై చర్యలు చేపడతామని తూర్పుగోదావరి జిల్లా జేసీ చినరాముడు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డీఆర్వో రాజకుమారి సభ్యులకు వివరించారు. సమావేశం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన సభ్యులు, అధికారులకు జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన ప్రజాసమస్యలపై సత్వరం సమగ్ర పరిష్కారాలు అందించాలని నాలుగు జిల్లాల అధికారులను చైర్మన్ వేణుగోపాలరావు కోరారు. ఈ సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్లు బుర్రా అనుబాబు, మేరుగు పద్మలత, జెడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు, డిప్యూటీ సీఈవో రామ్గోపాల్, ఏవో ఎం.బుజ్జిబాబు, జెడ్పీటీసీ సభ్యులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని నాలుగు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. ఒత్తిడి లేని బోధనతో ఉత్తమ ఫలితాలు బాలాజీచెరువు: ఒత్తిడి లేని విద్యాబోధనతో ఉత్తమ ఫలితాలు సాధింవచ్చని జేఎన్టీయూకే సివిల్ ప్రొఫెసర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. స్థానిక భాష్యం బ్లూమ్స్ స్కూల్లో శనివారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య ద్వారా మంచి విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుందని, సరైన ప్రణాళికతో చదువుకోవాలనిసూచించారు. అనంతరం విద్యా ర్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. అంతకు ముందు విద్యా సంస్థల వైస్ చైర్మన్ భాష్యం హానుమంతరావు జ్యోతి ప్రజల్వన చేశారు. కార్యక్రమంలో జోనల్ ఇన్చార్జ్ గోవిందరాజు, ప్రిన్సిపాల్ ధృవీణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.రాజమండ్రిలో సీన్ తీస్తే సూపర్ హిట్టే ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): తను హీరోగా నటించిన రాబిన్ హుడ్ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఉన్నాయని, ఈ సినిమా అందరికీ నచ్చుతుందని హీరో నితిన్ అన్నారు. గతంలో వెంకీ కుడుముల దర్శకత్వంలో తను నటించిన భీష్మ సినిమా మంచి విజయం సాధించిందని చెప్పారు. ఆ సినిమాలో ఒక సన్నివేశం రాజమండ్రిలో చిత్రీకరించామని అది హిట్టని అన్నారు. ఆ సెంటిమెంటుతో రాబిన్ హుడ్ సినిమాలో ఒక సీన్ ఇక్కడ చిత్రీకరించామని, ఇది కూడా సూపర్ హిట్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 28 న విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్ కోసం రాజమండ్రి వచ్చిన చిత్ర బృందం శనివారం మధ్యాహ్నం మంజీరా హోటల్లో మీడియాతో మాట్లాడింది. నితిన్ మాట్లాడుతూ దర్శకుడు వెంకీ కుడుముల తొలి చిత్రం చలో నుంచి తనకు పరిచయం ఉందని తర్వాత తమ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన భీష్మ చిత్రం మంచి విజయం సాధించిందని గుర్తు చేశారు. దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ఇప్పటికే రాబిన్ హుడ్ టీజర్, సాంగ్స్కు మంచి స్పందన వస్తోందని సినిమా కూడా హిట్టవుతుందన్న నమ్మకం ఉందని చెప్పారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ మంచి పాటలు కంపోజ్ చేశారని చెప్పారు. శ్రీలీల ఈ చిత్రంలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు వెంకీ తెలిపారు. శ్రీలీల మాట్లాడుతూ తనకు రాజమండ్రి కొత్తకాదని తమ గ్రాండ్ ఫాదర్ ధవళేశ్వరంలో ఉండేవారని చెప్పారు. ఈ సినిమాలో తన పాత్రను ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారని, పిల్లలతో కలిసి సినిమా చూడాలని ఆమె కోరారు. రాజమండ్రి రోజ్ మిల్క్ తనకు చాలా ఇష్టమని ఆమె అన్నారు. కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 16,000 గటగట (వెయ్యి) 14,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 కిలో 260 రూ.1014 కోట్లతో బడ్జెట్కు ఆమోదం అంబాజీపేట కొబ్బరి మార్కెట్ తూర్పుగోదావరి, కోనసీమ జిల్లా అధికారులపై సభ్యుల ధ్వజం పలు అంశాలపై జెడ్పీ సమావేశంలో చర్చ రూ.70 లక్షల మిగులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.70 లక్షల మిగులుతో రూ.1,014 కోట్ల బడ్జెట్ను ఆమోదించింది. ఉమ్మడి జెడ్పీ బడ్జెట్ సర్వసభ్య సమావేశం శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, తూర్పుగోదావరి జిల్లా జేసీ ఎస్ చినరాముడు, రంపచోడవరం జేసీ కట్టా సింహాచలం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డీఆర్ఓ బీఎల్ఎస్ రాజకుమారి పాల్గొన్నారు. సమావేశాన్ని జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ప్రారంభించగా తొలుత దివంగతులైన కాట్రేనికోన ఎంపీపీ పాలెపు లక్ష్మి మృతికి సంతాపం ప్రకటిస్తూ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సమావేశంలో 2024–25 సంవత్సరానికి సవరించిన బడ్జెట్ను, 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన అంచనా బడ్జెట్ ముసాయిదాను జెడ్పీ పరిపాలనాధికారి సభ్యులకు వివరించారు. అనంతరం బడ్జెట్లో పొందుపరిచిన ప్రతిపాదనలపై సమవేశం చర్చించి 2024–25 సంవత్సరానికి సవరించిన ఆదాయం రూ. 846.60 కోట్లు, సవరించిన వ్యయం రూ. 845.95 కోట్లతో రూ.65 లక్షలు మిగులుతో సవరించిన బడ్జెట్ను ఆమోదించారు. అదే విధంగా రానున్న 2025–26 ఆర్థిక సంవత్సరానికి అన్ని పద్దులు కలిపి మొత్తం ఆదాయం అంచనా రూ.1013.80 కోట్లు కాగా, అన్ని పద్దుల కింద అంచనా వ్యయం రూ. 1013.10 కోట్లతో, రూ.70 లక్షలు మిగులు బడ్జెట్ను సమావేశం ఆమోదించింది. ఆదాయంలో జెడ్పీ సాధారణ నిధులు రూ. 28 కోట్లు, ప్రభుత్వం నుంచి కేటాయించిన శాలరీ గ్రాంటులు రూ.10.48 కోట్లు, నిర్థిష్ట ప్రయోజన గ్రాంటు రూ.46.09 కోట్లు, డ్వామా, గ్రామీణ నీటి సరఫరా, ఇతర శాఖల ద్వారా వచ్చే గ్రాంటు రూ. 922.39 కోట్లుగా ఉన్నాయి. జెడ్పీ సాధారణ నిధుల నుంచి షెడ్యూల్ కులాల సంక్షేమానికి 15 శాతం కేటాయింపు రూ. 2.97 కోట్లు, షెడ్యూల్ తెగల సంక్షేమానికి 6 శాతం కేటాయింపు రూ.1.19 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 15 శాతం కేటాయింపు, రూ.2.97 కోట్లు, అభివృద్ధి పనులకు 23 శాతంగా రూ.4.55 కోట్లు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పశుసంవర్థక, సాంఘిక సంక్షేమం తదితర సెక్టార్లకు 10 శాతంగా రూ. 2.97 కోట్లు కేటాయింపులను సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఆస్తులను పరిరక్షిస్తూ, ఆదాయ వనరులను మరింత పెంచాలని సభ్యులు కోరారు. -
ఏరు దాటాక తెప్పతో పనేంటి?
కాకినాడ, సాక్షి: ఏరు దాటాక తెప్పతో పనేముంటుంది?.. తగలెట్టేయడమే!.. కాబోయే జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు(Konidela Naga babu) ఇప్పుడు ఇదే తరహా రాజకీయం చూపించారు. తన సోదరుడు, జనసేన అధినేత అయిన పవన్ కల్యాణ్ కోసం సీటును.. ఆపై ఆత్మాభిమానం చంపేసుకుని మరీ ప్రచారం చేసి గెలిపించారు పిఠాపురం టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. అంతటి త్యాగాన్ని చేసిన వ్యక్తిని ఉద్దేశించి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో చర్చతో రచ్చ కూడా చేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే... అది వారి ‘ఖర్మ’ అంటూ కొణిదెల నాగబాబు పిఠాపురం ఆవిర్భావ సభలో అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విజయం ఎన్నికలకు ముందే ఖాయమైందని, ఆ విజయం వెనుక వర్మ చేసిందేమీ లేదన్నట్లుగా మాట్లాడారాయన. ఎన్నికల సమయంలో తనకు, తన బృందానికి పవన్ కళ్యాణ్ బాధ్యతలు అప్పగించారని, అది కేవలం తమ సంతృప్తి కోసం అప్పగించిన బాధ్యతలే అన్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్ను గెలిపించాలని ఎన్నికలకు ముందే నిశ్చయించుకున్నారని చెప్పారు. ఈ పరిస్థితిలో ఎవరైనా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పని చేశామని కానీ, విజయానికి తామే కారణమని కానీ అనుకుంటే అది వారి ‘ఖర్మ’ అని స్పష్టం చేశారు. కాగా, నాగబాబు వ్యాఖ్యలు టీడీపీలో దుమారం రేపుతున్నాయి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయానికి తాను ఎంతో కష్టపడి పని చేశానని వర్మ అనేక సందర్భాల్లో చెప్పారు. అయినా మొన్న ఎమ్మెల్సీ సీటు ఆయనకు దక్కలేదు. పైగా నాగబాబుకు టికెట్ దక్కింది. అయితే ఎమ్మెల్సీ రాకపోయినా తాను సర్దుకుపోతానని వర్మ ఒక మాట అన్నారు. దీంతో ఇటు టీడీపీలోనే కాదు.. అటు జనసేనలోనూ ఆయనపై సింపథీ ఏర్పడింది. ఇలాంటి తరుణంలోనూ నాగబాబు పిఠాపురం సభలో చేసిన వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదని సోషల్ మీడియా వేదికగా టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు. పిఠాపురంలో వ్యూహాత్మకంగా టీడీపీని, వర్మను నిర్వీర్యం చేయడానికే నాగబాబు ఇలా మాట్లాడారని, ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక ఇలా నాలుక మడతెయ్యడం తగదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. -
హైదరాబాద్ టు పిఠాపురం.. ఇదెక్కడి యూటర్న్ భయ్యా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏపీ ప్రజలకు శుక్రవారం పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో.. కొత్త పవన్ కల్యాణ్ కనిపించాడు. మునుపెన్నడూ లేని విధంగా ఆయన ప్రసంగం సాగడమే అందుకు కారణం. రాజకీయాల్లో పవన్ ఎలా ఉండకూడదని ఆయన అభిమానులు అనుకున్నారో.. సరిగ్గా అలాగే ఆయన నిన్న కనిపించారు. అసలు అంశాలన్నీ పక్కన పడేసి.. అవసరం లేకపోయినా మత, ప్రాంతీయ అంశాలను తెర మీదకు తెచ్చి మరీ ఊగిపోయారాయన. విలువలు వదిలేసి.. అధికారంలోకి వచ్చాక పవన్ రాజకీయంలో మార్పు కనిపిస్తోంది. కుల, మత, జాతి, ప్రాంతీయ రాజకీయాలకు తాను వ్యతిరేకుడినని.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆరాధిస్తానని తొలినాళ్లలోనే ప్రకటించుకున్న పవన్.. మొత్తంగా మారిపోయారు. రాజకీయాన్ని బాగా ఒంట బట్టిచ్చుకుని మాట్లాడారు. మొన్నటి ఎన్నికల్లో 40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీని నిలబెట్టానంటూ పవన్ మాట్లాడారు. ఈ కామెంట్లు టీడీపీ పొత్తుపై అసంతృప్తితో ఉన్న కేడర్ను సంతృప్తి పరచడానికో లేదంటే.. నిజంగా మనసులోంచి వచ్చిన మాటలో తెలియదు. పనిలో పనిగా.. ఏదో తిట్టాలని కదా అని వైఎస్సార్సీపీని ఓ నాలుగు మాటలు అన్నారు. ఈ క్రమంలో తనను జనాలకు బాగా దగ్గర చేసిన సినిమాలను తక్కువ చేసి మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు సినిమా ఉపకరణం మాత్రమేనని ఇంక దానితో తనకు అవసరం లేదన్నట్లుగా ఒక్క మాటతో తేల్చేశారు. డిగ్రీ పూర్తి చేసి ఉంటేనా?.. సగటు మధ్య తరగతి మనిషిగా బతకడమే పవన్ కోరిక అట. చంటి సినిమాలో మీనాను పెంచినట్టు తనను పెంచారట. తాను డిగ్రీ పూర్తి చేసి, ఎస్సైని కావాలన్నది తన తండ్రి కోరిక అని, కానీ తాను డిగ్రీ కూడా పూర్తి చేయలేదని చెప్పారు. అటువంటి తాను బయటకు వెళ్తే ఏమవుతానో అని ఇంట్లో నిత్యం భయపడేవారన్నారు. అలాంటిది తాను సినిమాలు, రాజకీయం చేయడం కుటుంబ సభ్యులకూ ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. అయితే పవన్ కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసి ఉండేవారేమో అంటూ కొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఓట్ల కోసం కాదంట!!.. జనసేన విజయానికి ఏడు సిద్ధాంతాలే కారణమని, ఎంతో ఆలోచించి వీటిని రూపొందించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. సమాజంపై అవగాహన లేకుండానే పార్టీ పెట్టేస్తామా? పార్టీ పెట్టాలంటే నాన్న ముఖ్యమంత్రి, మామయ్య కేంద్ర మంత్రి అయ్యుండాలా? అని పవన్ ప్రశ్నించారు. దశాబ్దం పాటు పార్టీని నడపడంతో వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం ఎంతో కోల్పోయానన్నారు. సమాజంలో మార్పు కోసం వచ్చానని, ఓట్ల కోసం కాదని కామెంట్ చేశారు. అన్అపాలజెటిక్ సనాతనినే అంట.. భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేయాల్సిన సమయం ఇదేనని, సనాతన ధర్మం తన రక్తంలోనే ఉందని, దానిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్పై స్పందిస్తూ.. ఇతర మతాలను గౌరవించాలని సనాతన ధర్మం నేర్పిందన్నారు. హైదరాబాద్లో పోలీసులు 15 నిమిషాలు కళ్లు మూసుకుంటే హిందువులకు తమ సత్తా చూపుతామని ఒక నాయకుడు వ్యాఖ్యానించడం దారుణం అంటూ మండిపడ్డారు. పవర్ స్టార్ను అంత మాట అన్నారా?.. ‘మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటారు.. అన్నీ దేశ భాషలే కదా.. తమిళనాడులో హిందీ రాకూడదని అంటూంటే నాకు ఒక్కటే అనిపించింది. తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్గఢ్ నుంచి కావాలి. హిందీని మాత్రం ద్వేషిస్తామంటే ఎలా? ఇక్కడి న్యాయం. తమిళనాడులో పెరిగినప్పుడు నేను వివక్ష అనుభవించా.. గోల్టీ.. గోల్టీ.. అంటూ అవమానించారని ఆయన తెగ ఫీలైపోయారు.ఎంత మార్పు!గత జనసేన ఆవిర్భావ సభలకు.. ఈసారి సభకు జనసేనానిలో చాలా మార్పు వచ్చింది. అందుకు అధికారంలో ఉండడం, అదీ చంద్రబాబు కింద ఉండడమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో జనసేన ఆవిర్భావం రోజు నుంచి.. గత జనసేన సభల్లో.. పవన్ ఎక్కువగా ప్రజలకు కనెక్ట్ అయ్యే అంశాలపై దృష్టి పెట్టేవారు. అవసరం ఉన్నా.. లేకున్నా.. అప్పటి ప్రభుత్వాలను విమర్శిస్తూ ఆవేశంగా ఊగిపోయేవారు. అది ప్రజల్లో మాస్ హిస్టీరియాలాంటి స్థితిని తెచ్చింది. అయితే.. 👉గత మీటింగ్లలో పవన్ వ్యాఖ్యలు కొన్నిసార్లు విచిత్రంగా.. అసంబద్ధంగా ఉన్నా.. ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పడంలో మాత్రం పవన్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. కానీ, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి.. అందునా హామీలు నెరవేర్చలేని స్థితిలో ఉన్నారు. ప్చ్.. బహుశా అందుకేనేమో ఆయన వాటి ఊసెత్తలేదు. 👉ఎప్పటిలాగే సొంత విషయాల్లో ‘కొత్త కోణం’ ఆవిష్కరించిన ఆయన.. అవసరం లేకున్నా.. హిందూ, హిందీ భాష టాపిక్స్ తీసుకొచ్చి మాట్లాడారు. అలాగే.. నేషనల్ మీడియా తనపై రాసినవంటూ కొన్ని అంశాలంటూ ఊగిపోయారు. లెఫ్ట్, రైట్, సెంట్రల్ ఐడియాలజీ మార్చేశానని, చెగువేరా ఫాలోవర్ కాస్త నుంచి సడన్గా సనాతని డిఫెండర్ అయిపోయానిని కథనాలు(వాస్తవాలు) రాశారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారాయన. అయితే..గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, అధికారంలో ఉన్నా లేకున్నా.. వైఎస్ జగన్ మోహన్రెడ్డిలా విలువలుతో కూడిన రాజకీయాలు చేయడం, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడం బహుశా చంద్రబాబు & కోకు మాత్రమే కాదు తన వల్లా కాదనే విషయాన్ని పవన్ పిఠాపురం ప్రసంగంతో తేల్చేశారు. -
హోలీ వేళ కాకినాడలో విషాదం.. చదవు రాకపోతే చంపేస్తారా? నాన్న..
కాకినాడ రూరల్: అభం శుభం తెలియని ఆ పసి పిల్లల పాలిట ఆ తండ్రి కాలయముడయ్యాడు. కారణమేంటో తెలియదు కానీ.. ఇద్దరు చిన్నారులను బలిగొన్నాడు. అంతటితో ఆగక తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉలిక్కిపడేలా చేసే ఈ సంఘటన కాకినాడలోని తోట సుబ్బారావు నగర్లో శుక్రవారం చోటు చేసుకుంది. భార్యా పిల్లలతో చీకూచింతా లేని కుటుంబం. ఆర్థికంగా దన్నుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీలో ఉద్యోగం. ఏమైందో ఏమో కానీ, అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన తండ్రే పిల్లలను నిర్దాక్షిణ్యంగా నీటిలో ముంచి, ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఆపై తాను ఉరి వేసుకున్నాడు. హోలీ పండగ పూట కాకినాడ రెండో డివిజన్లోని తోట సుబ్బారావు నగర్లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి సర్పవరం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్(37) వాకలపూడి ఓఎన్జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంట్గా పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా భార్యాపిల్లలతో తోటసుబ్బారావు నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. పిల్లలు జోషిత్(7) ఒకటో తరగతి, నిఖిల్(6) యూకేజీ చదువుతున్నారు. ఇలాఉండగా తోట సుబ్బారావు నగర్లో తన ప్లాట్ నుంచి హోలీ పండగ వేడుకల కోసం భార్య తనూజ, పిల్లలతో కలిసి వాకలపూడిలో తాను పనిచేస్తున్న ఓఎన్జీసీ కార్యాలయం వద్దకు వెళ్లాడు. అక్కడ హోలీ వేడుకల్లో భార్యను ఉండమని చెప్పి, పిల్లలకు టైలర్ వద్ద కొలతలు తీయించి తెస్తానని ఇంటికి వచ్చాడు. ఇంట్లో బాత్రూం బకెట్ నీటిలో ఇద్దరు పిల్లలను ముంచి, ఊపిరాడకుండా చేసి హతaమర్చాడు. తర్వాత బెడ్రూంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంట వరకూ భర్త, పిల్లలు రాకపోయేసరికి కంగారుపడిన భార్య ఫోన్ చేసినప్పటికీ సమాధానం రాలేదు. దీంతో ఓఎన్జీసీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది తోట సుబ్బారావునగర్లో చంద్రకిశోర్ ఇంటికి వచ్చారు. తలుపులు బలవంతంగా తెరిచేసరికి బెడ్రూంలో ఉరి వేసుకుని చంద్రకిశోర్ కనిపించాడు. పిల్లలు బాత్రూంలో విగతజీవుల్లా కనిపించారు. విషయం తెలుసుకున్న భార్య, ఇతర కుటుంబ సభ్యులు, ఓఎన్జీసీ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. కళ్లెదుటే భర్త, పిల్లలు శవాలుగా పడి ఉండడంతో భార్య తనూజ స్పృహ కోల్పోయింది. బంధువుల సపర్యలతో స్పృహలోకి వచ్చిన ఆమె రోదించిన తీరు చూపరులను కలచివేసింది. ఆమెను ఓదార్చడం బంధువులకు కష్టంగా మారింది. సర్పవరం ఎస్సై శ్రీనివాస్కుమార్ కేను నమోదు చేశారు. సీఐ పెద్దిరాజు విచారణ చేపట్టారు. చంద్రకిశోర్ బెడ్రూంలో సూసైడ్ నోట్ను పోలీసులు కనుగొన్నారు. ప్రస్తుత జనరేషన్లో తన పిల్లలు సరిగ్గా చదవడం లేదని మనస్తాపం చెంది చనిపోతున్నట్టుగా రాసి ఉందని తెలిసింది. ఈమధ్యే పిల్లల స్కూలు కూడా మార్చినట్టు బంధువులు తెలిపారు. -
ఘనంగా ప్రత్యంగిర హోమం
అన్నవరం: ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ప్రత్యంగిర హోమం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ఉదయం 9 గంటలకు పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, హోమం ప్రారంభించి, 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు. వేద పండితులు యనమండ్ర శర్మ, వనదుర్గ ఆలయ అర్చకుడు కోట వంశీ, పరిచారకుడు వేణు, వ్రత పురోహితులు చెళ్లపిళ్ల ప్రసాద్ తదితరులు హోమం నిర్వహించారు. హోమంలో వంద మందికి పైగా భక్తులు రూ.750 టికెట్టుతో పాల్గొన్నారు. వారు కుటుంబ సభ్యులతో తరలి రావడంతో హోమ మండపం సరిపోక, కొంతమంది వెలుపల వేచి ఉండాల్సి వచ్చింది. వనదుర్గ ఆలయం ఎదురుగా హోమం నిర్వహించినపుడు కూడా గతంలో ఇదే సమస్య ఎదురవడంతో హోమాన్ని మండపం దిగువకు మార్చారు. అయినప్పటికీ సమస్య అలాగే ఉంది. దీంతో ఆలయానికి ఎదురుగా ఎక్కువ మంది భక్తులు పాల్గొనేందుకు వీలుగా హోమ మండపం నిర్మిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా సత్యదేవుని ప్రధానాలయంలో అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యాన, కొండ దిగువన కనకదుర్గ అమ్మవారికి అర్చకుడు చిట్టెం గోపి ఆధ్వర్యాన పండితులు ఘనంగా కుంకుమ పూజలు నిర్వహించారు. -
రత్నగిరికి భక్తుల తాకిడి
అన్నవరం: ఫాల్గుణ పౌర్ణమి, హోలీ పర్వదినం సందర్భంగా రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయం శుక్రవారం వేలాదిగా వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 30 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. రెండు వేల వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుని దర్శించుకున్న భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. అలాగే, రావిచెట్టుకు కూడా ప్రదక్షిణలు చేసి, జ్యోతులు వెలిగించారు. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్న ప్రసాదాన్ని 5 వేల మంది స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను శనివారం ఉదయం 10 గంటలకు తిరుచ్చి వాహనంపై ఆలయ ప్రాకారంలో మూడుసార్లు ఊరేగించనున్నారు. వైభవంగా చక్రస్నానం మధురపూడి: కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. నరసింహస్వామితో పాటు అనంత పద్మనాభస్వామి, చక్రపెరుమాళ్ల స్వామి వార్లకు స్థానిక స్వామి వారి కోనేటిలో ఈ ఉత్సవం జరిపారు. రాత్రి 9 గంటలకు స్వామివారికి శేష వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. దేవస్థానం వద్ద ప్రారంభమైన ఈ కార్యక్రమం గ్రామంలోని ప్రధాన వీధుల్లో కొనసాగింది. దేవస్థానం చైర్మన్ పరాశర రంగరాజభట్టర్, అన్నవరం దేవస్థానం అధికారులు, పండితులు, అర్చక స్వాములు పాల్గొన్నారు. నేటితో ఉత్సవాల ముగింపు లక్ష్మీనరసింహస్వామివారి కల్యాణ మహోత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. ఈ నెల 9న ఇవి ప్రారంభమైన విషయం తెలిసిందే. చివరి రోజు శ్రీపుష్పయాగం నిర్వహిస్తారు. డెల్టాలకు నీరు విడుదల ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు శుక్రవారం 10,250 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 3,050, మధ్య డెల్టాకు 2 వేలు, పశ్చిమ డెల్టాకు 5,200 క్యూసెక్కుల చొప్పున వదిలారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.20 అడుగులు ఉంది. -
పొలంలో స్వల్పంగా గ్యాస్ లీక్
మామిడికుదురు: పాశర్లపూడి–43 బావి నుంచి తాటిపాక జీసీఎస్కు గతంలో వేసిన పైపులైన్ నుంచి శుక్రవారం స్వల్పంగా గ్యాస్ లీకై ంది. మామిడికుదురు గ్రామంలో ఏటిగట్టు పక్కన పొలాల్లో ఈ లీకేజ్ ఏర్పడింది. లీకేజ్ ఏర్పడిన చోట నుంచి స్వల్పంగా గ్యాస్ బయటకు వచ్చింది. దీంతో పాటు కొద్దిగా ముడి చమురు కూడా లీకై ంది. దీంతో ఆ ప్రాంతమంతా ముడి చమురు వాసన వ్యాపించింది. ముడి చమురు ప్రభావంతో పొలంలో నీరు తెట్టు కట్టింది. ఓఎన్జీసీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ బావి నుంచి ఎటువంటి ఉత్పత్తి జరగడం లేదన్నారు. చాలా కాలం క్రితం ఆ బావిలో ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. పైపులైన్లో ఉన్న గ్యాస్, ముడి చమురు బయటకు వచ్చి ఉంటాయన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తామని చెప్పారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 16,000 గటగట (వెయ్యి) 14,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
జనసేన కార్యకర్తల గుండాగిరీ
పిఠాపురం: చిత్రాడలో శుక్రవారం నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన కార్యకర్తలు గుండాగిరీ చేయడంతో సామాన్యులు బెంబేలెత్తిపోయారు. ట్రాఫిక్ నిలుపుచేసి, తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అడిగిన సామాన్య ప్రయాణికులపై జనసేన జెండా కర్రలతో దాడి చేసి, గాయపరిచారు. మమ్మల్నే అడుగుతారా? అధికారం మాది.. అడిగితే చంపుతామంటూ బెదిరించి, కర్రలతో దాడి చేయడంతో ప్రయాణికులు గాయాలపాలయ్యారు. దీనిని ఆపాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం విమర్శలకు దారి తీసింది. మరోపక్క 216 జాతీయ రహదారిపై జనసేన కార్యకర్తలు బైక్లపై ప్రమాదకర ఫీట్లు చేస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపించారు. వారిని కనీసంగా కూడా నిలువరించకపోవడంతో పోలీసులపై ప్రయాణికులు దుమ్మెత్తి పోశారు. -
నేటి నుంచి ఒంటిపూట బడులు
రాయవరం/కొత్తపేట: జిల్లా అంతటా నేటి నుంచి పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. విద్యా శాఖ క్యాలండర్ ప్రకారం మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాల్సి ఉంది. అందులో భాగంగా శనివారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలంటూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వి.విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కారణంగా మండుతున్న ఎండల నుంచి విద్యార్థులకు ఉపశమనం లభించనుంది. విద్యా శాఖ క్యాలండర్ ప్రకారం ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, ఇతర ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలతో పాటు, ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలకు ఒంటిపూట బడుల నిబంధన వర్తిస్తుంది. పదో తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచి నిర్వహించనున్న నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఒంటి పూట బడులు వర్తిస్తాయి. పది పరీక్షా కేంద్రాలున్న పాఠశాలల్లో మాత్రం ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం పాఠశాల నిర్వహిస్తారు. ఒంటిపూట బడులు నిర్వహించాలంటూ జిల్లా విద్యా శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఒంటి పూట బడులను ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించాల్సి ఉంటుంది. ఉదయం 7.45 నుంచి ఎనిమిది గంటలకు అసెంబ్లీ నిర్వహించాలి. పాఠశాల ముగిసిన అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేసిన తర్వాత వారిని ఇళ్లకు పంపించాల్సి ఉంది. విద్యుదాఘాతంతో వివాహిత మృతి ముమ్మిడివరం: కర్రివానిరేవు పంచాయతీ శివారు చింతావానిరేవుకు చెందిన ఓ వివాహిత విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. గ్రామానికి చెందిన రేకాడి ధనకుమారి(23) శుక్రవారం ఉదయం నీళ్లు కాయడానికి వాటర్ హీటర్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురైంది. ఎవరూ గమనించకపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెకు భర్త కనకరాజు, మూడేళ్ల పాప ఉన్నారు. -
హక్కులకు రక్షణ కవచం
కాకినాడ వినియోగదారుల కమిషన్ పరిధిలో కేసుల వివరాలు సంవత్సరం వచ్చిన పరిష్కార విచారణలో కేసులు మైనవి ఉన్నవి 2017 48 48 0 2018 53 52 1 2019 35 35 0 2020 31 30 1 2021 48 45 3 2022 70 67 3 2023 84 72 12 2024 93 49 44 2025 22 0 22కాకినాడ లీగల్: సొంత అవసరాల కోసం పలు రకాల వస్తువులకు, సేవలకు నిర్దేశిత డబ్బు చెల్లించిన ప్రతి ఒక్కరూ వినియోగదారులే. ఆ వస్తువు, సేవలు సంతృప్తికరంగా లేకుంటే మోసపోయినట్టే. ఆ మోసాన్ని భరించి, నష్టపోవడంకన్నా, పోరాడితే పరిహారం పొందడమే కాకుండా, మరొకరు మోసపోకుండా ఉండే అవకాశం కలుగుతుంది. వస్తువుకు సంబంధించిన సమాచారం పొందడం, నచ్చిన వస్తువును ఎంచుకునే అవకాశం కల్పించడం, వినియోగదారుకు రక్షణ కల్పించడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు జేఎఫ్ కెన్నడీ తొలిసారిగా 1962 మార్చి 15న అమెరికన్ కాంగ్రెస్లో ప్రసంగించారు. తదనంతర కాలంలో ఈ అంశాలకు ప్రాధాన్యం పెరగడంతో 1983 నుంచి ఏటా మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినం నిర్వహిస్తున్నారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం 1986లో ప్రత్యేక చట్టం తీసుకువచ్చి, వినియోగదారుల కమిషన్ ఏర్పాటు చేసింది. వస్తు, సేవల్లో నష్టపోయిన వినియోగదారులు కమిషన్లో నామమాత్రపు రుసుంతో కేసు వేసి, తగిన పరిహారం పొందవచ్చు. ఏ సందర్భాల్లోనంటే.. ● కొనుగోలు చేసిన వస్తువులు, మందులు, ఇతర ఉత్పత్తులతో ప్రాణ, ఆస్తినష్టం కలిగినా.. ● ఆసుపత్రుల్లో సేవా లోపంతో ఇబ్బంది కలిగినా.. ● వినియోగించే వస్తువుల నాణ్యత, స్వచ్ఛత లోపించినా.. ● నకిలీ విత్తనాలు, ఇతల అనైతిక వాణిజ్య విధానాలు. ● వ్యాపారి లేదా డీలర్ ద్వారా నష్టపోయినా.. ● అసలు ధర కంటే ఎక్కువ వసూలు చేసినా.. ● బ్యాంకు, బీమా, రవాణా, తయారీ సేవల్లో లోపాలు జరిగినా.. ● అపార్ట్మెంట్ల విక్రయాల్లో మోసం, ఇంటి నిర్మాణంలో లోపాలు. ● వినోదం, వివిధ వృత్తి సేవల్లో లోపాలు. ● ఇతర కారణాలతో నష్టపోయినా.. నోటీసు పంపాలిలా.. ● కొనుగోలు చేసిన ఉత్పత్తి లేదా సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ పూర్తి చిరునామా రాయాలి. ● కొన్న వస్తువు లేదా సేవల వివరాలివ్వాలి. క్యాష్ మెమో నంబర్, తేదీ ఇవ్వాలి. ● సంస్థ ఇచ్చిన వారెంటీ లేదా గ్యారెంటీ వివరాలు తెలపాలి. ● వస్తువు లేదా సేవలో జరిగిన లోపం, దానివల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను విపులంగా వివరించాలి. ● ఈ ఇబ్బందులపై అప్పటి వరకూ ఎవరెవరికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేశారో పేర్కొనాలి. ఉంటే కంప్లయింట్ నంబర్ ఇవ్వాలి. ఈ సంప్రదింపులకు సంబంధించిన ఆధారాల జిరాక్స్ పత్రాలు నోటీసుకు జత చేయడం మంచిది. ● నోటీసుకు స్పందించడానికి సంబంధిత సంస్థ లేదా వ్యక్తికి 15 నుంచి 30 రోజుల వరకూ గడువు ఇవ్వాలి. ● కోరుతున్న నష్టపరిహారం, పూర్తి మొత్తం కోరితే దానికి 18 శాతం వరకూ వడ్డీ లేదా కొత్త వస్తువు ఇవ్వాలని కోరవచ్చు. దానికి నష్టపరిహారం కూడా కావాలని కోరవచ్చు. ● వినియోగదారు పూర్తి పేరు, అడ్రస్ ఇవ్వాలి. ● నోటీసు అవతలి వ్యక్తి లేదా సంస్థకు ఇచ్చినట్లు వినియోగదారు వద్ద తగిన అకనాలెడ్జ్మెంట్ లేదా కొరియర్, హ్యాండ్, ఆన్లైన్ డెలివరీ వంటి ఆధారాలు ఉండాలి. ఈ ఆధారాన్ని కోర్టులో సమర్పించాల్సి ఉంటుంది. ఫిర్యాదు ఇలా.. వస్తు, సేవల కొనుగోలు సందర్భంగా నష్టపోయిన వారు వినియోగదారుల కమిషన్లో నేరుగా లేదా న్యాయవాది ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అక్కడి సహాయ కేంద్రం సలహాలు తీసుకుని కేసు దాఖలు చేయవచ్చు. గతంలో వస్తువు కొనుగోలు చేసిన ప్రాంతంలోనే కేసు దాఖలు చేయాల్సి ఉండేది. 2019 వినియోగదారుల రక్షణ చట్టంలో మార్పు అనంతరం.. వస్తువు ఎక్కడ కొన్నా తాము నివాసం ఉంటున్న ప్రాంతంలో కేసు దాఖలు చేసే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించారు. అలాగే, ఒక వస్తువు సరిగ్గా పని చేయకపోతే గతంలో కంపెనీపై మాత్రమే కేసు వేసేవారు. చట్టంలో మార్పు అనంతరం వస్తువు విక్రయించిన షాపు యాజమాని, ఏజెన్సీ, కంపెనీపై కూడా కేసు దాఖలు చేసే అవకాశం కలిగింది. ఈ జాగ్రత్తలు మేలు ● అవసరమైన వస్తువులనే ఎంపిక చేసి, కొనుగోలు చేయాలి. ఆ వస్తువుల పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ● మోసపూరిత ప్రకటనలపై జాగ్రత్తగా ఉండాలి. ● నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. ఆఫర్లను పూర్తిగా పరిశీలించుకోవాలి. ● వస్తువులు, సేవల కొనుగోలుకు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. ● గ్యారంటీ లేదా వారంటీ కార్డులపై సంబంధిత విక్రేత సంతకం, ముద్ర సహా ఉండేలా చూసుకోవాలి. ● మోసానికి గురైతే వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించడానికి ఇవి ఉపయోగపడతాయి. వస్తు, సేవల్లో లోపాలకు పరిహారం పొందే అవకాశం నష్టం వాటిల్లితే కమిషన్ అండ అవగాహనే శ్రీరామరక్ష నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినం ఆధారాలు భద్రపరచుకోవాలి కొనుగోలు సమయంలో వినియోగదారులు బిల్లులు, గ్యారంటీ కార్డు, జాబ్కార్డు తప్పనిసరిగా తీసుకుని భద్రపరచుకోవాలి. సేవా లోపం జరిగితే కమిషన్ను ఆశ్రయించవచ్చు. కేసు స్వీకరించిన 90 రోజుల్లో పరిష్కారం లభించేలా కృషి చేస్తాం. రూ.5 లక్షలలోపు విలువగల కేసులు కమిషన్లో పూర్తిగా ఉచితం. ఆపై నిర్ణీత రుసుములుంటాయి. కమిషన్ వద్ద రూ.50 లక్షల వరకూ కూడా కేసులు వేయవచ్చు. వాటికి ఎంత వరకూ అయినా పరిహారం పొందవచ్చు. – చెరుకూరి రఘుపతి వసంత్కుమార్, అధ్యక్షుడు, కాకినాడ జిల్లా వినియోగదారుల కమిషన్–1 వెంటనే స్పందిస్తాం వినియోగదారులు ఆన్లైన్లో కూడా కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చు. ఎటువంటి సమస్యలున్నా తగిన ఆధారాలతో కమిషన్ను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుంది. – చెక్కా సుశీ, సభ్యులు, కాకినాడ జిల్లా వినియోగదారుల కమిషన్ వీరికి ఉచితం అంత్యోదయ కార్డు ఉన్న వారికి వినియోగదారుల కమిషన్లో సేవలు ఉచితంగా అందుతాయి. కేసును వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తాం. – చాగంటి నాగేశ్వరరావు, సభ్యుడు, కాకినాడ జిల్లా వినియోగదారుల కమిషన్ అదనపు వసూలు రూ.27.. కమిషన్ వడ్డన రూ.27.27 లక్షలు కాకినాడ రూరల్ గంగానపల్లి చెందిన నున్నా కుసుమ కల్యాణ్ 2023 డిసెంబర్ 8న హైదరాబాద్ బోడుప్పల్ ప్రాంతంలోని హోటల్ ట్యూలిప్స్ గ్రాండ్లో బిర్యానీలు, డ్రింకులు, మూడు మినరల్ వాటర్ బాటిళ్లు జొమాటో డైనింగ్ పే ద్వారా కొనుగోలు చేశాడు. వాటికి రూ.3,083 చెల్లించాడు. వాటర్ బాటిల్ ఎంఆర్పీ రూ.20 కాగా, ఆ హోటల్ నిర్వాహకులు రూ.29 వసూలు చేశారు. మూడు వాటర్ బాటిళ్లకు రూ.60 కాగా, అదనంగా రూ.27 కలిపి మొత్తం రూ.87 వసూలు చేశారు. దీనిపై కల్యాణ్ తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపగా హోటల్ యాజమాన్యం స్పందించలేదు. దీంతో ఆయన కాకినాడ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. విచారణ అనంతరం కల్యాణ్కు రూ.25 వేల సష్టపరిహారంతో పాటు కోర్టు ఖర్చులు రూ.2 వేలు ఇవ్వాలని, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.27 లక్షలు చెల్లించాలని గత ఫిబ్రవరి 28న కమిషన్ తీర్పు ఇచ్చింది. రూ.5కు కక్కుర్తి.. రూ.5 లక్షలు పైగా వదిలింది కాకినాడకు చెందిన న్యాయవాది లక్ష్మీనారాయణ అన్నవరం సత్యదేవుని దర్శనానికి వెళ్లి, సెల్ఫోన్ డిపాజిట్ చేశారు. మొబైల్ డిపాజిట్ కౌంటర్లో సెల్ ఫోన్ పెడితే రూ.5 తీసుకోవాలి. కానీ, రూ.10 గుంజారు. దీనిపై లక్ష్మీనారాయణ కాకినాడ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. ఆయనకు రూ.5తో పాటు మానసిక ఒత్తిడికి గురైనందుకు రూ.15 వేలు, కోర్టు ఖర్చులకు మరో రూ.5 వేలు, అలాగే, దేవస్థానానికి మరో రూ.5 లక్షల జరిమానాను సంబంధిత కాంట్రాక్టర్ చెల్లించాలంటూ గత ఫిబ్రవరి 11న కమిషన్ తీర్పు చెప్పింది. స్కూల్ సర్టిఫికెట్ ఇవ్వనందుకు.. కాకినాడ చెందిన పీవీఎస్ఎస్ శ్రీనివాస్కు ముగ్గురు కుమార్తెలు. 2018–19లో స్థానిక రామారావుపేట నారాయణ స్కూల్లో చదివేవారు. ఆ సమయంలో స్కూల్ ఫీజులతో పాటు పుస్తకాలకు కూడా శ్రీనివాస్ చెల్లించారు. ఇతర కారణాలతో ఆయన తన పిల్లలను అదే సంవత్సరం అదే ప్రాంతంలోని మున్సిపల్ స్కూల్లో చేర్చారు. పిల్లల స్కూల్ సర్టిఫికెట్ కావాలని కోరగా, మొత్తం ఫీజులు చెల్లించాలని శ్రీనివాస్కు ప్రిన్సిపాల్ చెప్పారు. దీనిపై శ్రీనివాస్ 2019లో వినియోగదారుల కమిషన్లో కేసు వేశారు. విచారణ అనంతరం శ్రీనివాస్ పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వాలని, మానసిక వ్యధకు గురి చేసినందుకు రూ.5 వేల పరిహారం, కోర్టు ఖర్చులుగా రూ.2 వేలు చెల్లించాలని నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ను ఆదేశిస్తూ 2022 మే 12న కమిషన్ అధ్యక్షుడు చెరుకూరి రఘుపతి వసంత్ కుమార్, సభ్యులు తీర్పు చెప్పారు.డాక్యుమెంట్లు ఇవ్వాల్సిందే.. రాజమహేంద్రవరం ఐిసీఐసీఐ బ్యాంక్లో కాకినాడ రూరల్, రమణయ్యపేట చెందిన జంపన చంద్రశేఖర్వర్మ 2006లో ఇంటి రుణం తీసుకున్నారు. రుణం పూర్తిగా చెల్లించినా ఇంటి ఒరిజినల్ డాక్యుమెంట్లను బ్యాంకు అధికారులు తిరిగి ఇవ్వలేదు. చంద్రశేఖర్వర్మ 2019లో వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. విచారణ అనంతరం ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాటు రూ.లక్ష పరిహారం, ఖర్చుల కింద రూ.8 వేలు చెల్లించాలని 2022 ఆగస్టులో కమిషన్ తీర్పు చెప్పింది. ల్యాబ్ తప్పుడు రిపోర్టుకు పరిహారం కాకినాడ చెందిన 85 ఏళ్ల యు.పద్మనాభరావు 2017లో స్థానిక థర్డ్ ఐ ఇమేజింగ్ డయాగ్నోస్టిక్స్లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ల్యాబ్ వారు తప్పుడు రిపోర్టు ఇవ్వడంతో పద్మనాభరావు 2018లో వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. ఆయనకు నష్టపరిహారంగా రూ.లక్ష, ఖర్చులుగా రూ.5 వేలు చెల్లించాలని 2022 అక్టోబర్లో కమిషన్ తీర్పు ఇచ్చింది. అంతర్వేది రథం దగ్ధం కేసులో.. అంతర్వేది శ్రీలక్ష్మీనరసింస్వామి దేవస్థానంలో ప్రమాదవశాత్తూ దగ్ధమైన రథానికి బీమా చెల్లించాలంటూ అధికారులు కాకినాడ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. వాదోపవాదాల అనంతరం రూ.84 లక్షల పరిహారం, ఖర్చుల కింద రూ.30 వేలు చెల్లించాల్సిందిగా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశిస్తూ గత ఏడాది జనవరిలో కమిషన్ తీర్పు ఇచ్చింది. పంటల బీమా చెల్లించాలి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో భాగంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీపీసీబీ) 14,153 మంది రైతుల నుంచి రూ.1 చొప్పున 2019లో ప్రీమియం వసూలు చేసి, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించింది. తుపాను కారణంగా పంట నష్టం జరగడంతో పంటల బీమా చెల్లించాలని కోరగా ఆ కంపెనీ నిరాకరించింది. దీనిపై వినియోగదారులు కమిషన్ను డీసీసీబీ ఆశ్రయించింది. విచారణ అనంతరం నష్టపోయిన రైతులందరికీ రూ.15.72 కోట్ల పంట నష్ట పరిహారంతో పాటు ఖర్చుల కింద రూ.50 వేలు చెల్లించాల్సిందిగా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని 2023 ఫిబ్రవరిలో కమిషన్ ఆదేశించింది. -
మాట్లాడితే జరిమానా
పదేళ్ల క్రితం యాక్సిడెంట్ అయింది. రజక వృత్తి కానీ, పొలం పని కానీ చేయలేని స్థితిలో ఉన్నాను. గ్రామంలో టిఫిన్ సెంటర్ పెట్టి జీవనం సాగిస్తున్నాను. గ్రామంలో అన్ని కులాల వాళ్లు టిఫిన్ పట్టుకెళ్లేవారు. ఇప్పుడు వివాదం కారణంగా రజకులతో గౌడ సంఘం వారు మాట్లాడడం లేదు. మాట్లాడితే జరిమానా అంటున్నారు. టిఫిన్ బకాయిల కోసం మాట్లాడలేని పరిస్థితి ఉంది. టిఫిన్ కొనుగోలుకూ ఒక వర్గం వారు రావడం లేదు. – ఆచంట వెంకటరమణ, చిడిపి, కొవ్వూరు మండలం ● -
చిడిపిలో కుల బహిష్కరణ ?
● చెరువు గట్టు ఆక్రమణతో రెండు వర్గాల మధ్య వివాదం ● మాట్లాడితే రూ.2 వేల జరిమానాకు నిర్ణయం ● పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం కొవ్వూరు: ఆధునిక సమాజంలో కొన్ని పల్లెల్లో నేటికీ కుల బహిష్కరణ దూరాచారం పడగ విప్పుతోంది. కొవ్వూరు మండలం చిడిపి గ్రామంలో రెండు వర్గాల మధ్య కార్చిచ్చు రేగింది. గ్రామంలో ఉన్న రజకుల చెరువు గట్టు ఆక్రమణ వ్యవహారంతో రజకులు, గౌడ సంఘం మధ్య వివాదం తలెత్తింది. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో, ఒక వర్గాన్ని మరో వర్గం వారు బహిష్కరించే వరకు వెళ్లింది. ఒకే ప్రాంతంలో కొన్నేళ్లుగా కులమతాలకతీతంగా, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న మిత్రులంతా ఇప్పుడు విరోధులుగా మారారు. రజకులతో మాట్లాడవద్దని, పెళ్లిళ్లు, విందులకు వెళ్లరాదని, మాట్లాడిన వారికి రూ.2 వేల జరిమానా విధిస్తామని, సమాచారం ఇచ్చిన వారికి రూ.200 బహుమానం ఇస్తామని గౌడ సంఘం తీర్మానం చేసినట్టు చెబుతున్నారు. చెరువు గట్టు ఆక్రమణలు తొలగించాలని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని సక్రమంగా అమలు చేయని అధికారులపై చర్యలు కోరుతూ కోర్టును ఆశ్రయిస్తామని అనంతపురం జిల్లాకు చెందిన రజక సంఘ నాయకులు, న్యాయవాది హనుమన్న తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాకు విడుదల చేసిన వీడియోతో కుల బహిష్కరణ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలు వివాదం ఇదీ.. గ్రామాన్ని ఆనుకుని రజకులకు 1.24 ఎకరాల వృత్తి చెరువు ఉంది. దీని గట్టు ఆక్రమించుకుని కొందరు గడ్డిమేనులు వేశారు. గౌడ సంఘం చెరువు గట్టున పాపయ్య గౌడ విగ్రహాన్ని నెలకొల్పింది. చిన్న షెడ్డు వేసి, అందులో దేవీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రజకులు ఆక్రమణలపై కోర్టును ఆశ్రయించారు. దీంతో అధికారులు కోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణల తొలగింపునకు పూనుకున్నారు. దీనిని గౌడ సంఘం అడ్డుకోవడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని, ఆక్రమణలను అసంపూర్తిగా తొలగించి అధికారులు చేతులు దులుపుకొన్నారు. అప్పటి నుంచి ఆయా వర్గాల మధ్య చిచ్చురేగింది. చివరికి రజకులను బహిష్కరించి, వారి వద్ద నుంచి క్రయవిక్రయాలు సైతం మానేశారు. ఈ దురాచారంపై ఏ ఒక్క అధికారి కానీ, రాజకీయ పార్టీలు కానీ పట్టించుకోవడం లేదని రజకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నువ్వులు.. రైతన్న మోములో నవ్వులు
పిఠాపురం: గతంలో ఖాళీగా ఉన్న భూముల్లో ప్రత్యామ్నాయంగా సాగు చేసే నువ్వుల పంటను ఇప్పుడు ప్రధానంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం నవ్వుల పంట ఆశాజనకంగా ఉందని రైతులు చెబుతున్నారు. గతంలో కేవలం ఎకరాకు రెండు బస్తాలు కూడా రాని దిగుబడి.. ఇప్పుడు ఎకరాకు 8 నుంచి 12 బస్తాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొక్కజొన్న, మిరప, వంగ, టమాటా వంటి పంటలను తగ్గించి, ఎక్కువ మంది రైతులు నువ్వుల సాగు చేపట్టారు. దీంతో కాకినాడ జిల్లాలో నువ్వుల సాగు గణనీయంగా పెరిగింది. గతంలో కేవలం 100 ఎకరాల్లో మాత్రమే ఉండే ఈ పంట సాగు, ప్రస్తుతం రికార్డు స్థాయిలో కేవలం ఒక్క గొల్లప్రోలు మండలంలోనే సుమారు 450 ఎకరాల్లో కొనసాగుతోంది. జిల్లాలో 590 ఎకరాల్లో సుమారు 350 మంది రైతులు నువ్వుల సాగు చేపట్టారు. సాధారణంగా ఏటా 3,540 క్వింటాళ్ల దిగుబడిని సాధిస్తున్నారు. ఉష్ణోగ్రతే దీనికి ప్రాధాన్యం ఈ పంటకు 25 డిగ్రీల నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమవుతుంది. నీరు నిలవని, మురుగు నీరు రాని ప్రాంతాలు వీటికి అనుకూలం కావడంతో, రేగడి నేలలున్న ప్రాంతాల్లో 90 శాతం మంది రైతులు వీటిని సాగు చేస్తున్నారు. ఆమ్మ, క్షార నేలలు అంతగా అనుకూలం కాదు. గౌరి, మాధవి, వైఎల్ఎం 11, 17, 66 రకాలు మంచి దిగుబడులు ఇస్తాయని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రకాలనే జిల్లాలో అత్యధికంగా సాగు చేపట్టారు. కేవలం 85 నుంచి 90 రోజుల్లో పంట చేతికందుతుంది. ఇందులో 50 శాతం నూనె దిగుబడి వస్తుంది. ఎకరాకు వరుసల్లో విత్తుకుంటే 2 కిలోలు, వెదజల్లితే 4 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తన శుద్ధి చేయడం ద్వారా తెగుళ్లు, పురుగుల దాడి నుంచి పంటను కాపాడుకోవచ్చు. మొక్కలకు మధ్య కనీసం అరడుగు దూరం ఉండేలా నాటడం వల్ల అధిక దిగుబడి వస్తుందని అధికారులు సూచిస్తున్నారు. కలుపు నివారణకు ప్రాధాన్యమివ్వాలి. ఆకు ముడత, కాయ తొలుచు పరుగుల నుంచి రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించే అవకాశాలున్నాయి. ఆకు ఎండు, ఆకు కుళ్లు తెగుళ్ల దాడి చేసే అవకాశం ఉండడంతో, ముందుగానే సస్యరక్షణ చర్యలు పాటించాల్సి ఉంటుంది. ఆకు కాయలు 75 శాతం పసుపు రంగుకు మారితే కోత దశకు చేరుకున్నట్టు గుర్తించి, కోతలు చేపట్టాలని అధికారులు అంటున్నారు. కోసిన పంటను కట్టలుగా కట్టి, అదే పొలంలో ఎండకు ఎండేలా నిలబెట్టి, ఐదు రోజుల తర్వాత నూర్చుకోవాలి. ప్రస్తుతం క్వింటాల్ నువ్వుల ధర రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు ఉంది. ఎకరాకు ఆరు క్వాంటాళ్లకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్టు రైతులు చెబుతున్నారు. కేవలం ఆరుతడి, విత్తనం ఎరువులు తదితర అవసరాలకు ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడి అవుతున్నట్టు తెలిపారు. కరోనాతో నువ్వుల నూనెకు డిమాండ్ పెరిగిన నువ్వుల సాగు ఆశాజనకంగా పంట ఎకరాకు ఆరు క్వింటాళ్ల వరకు దిగుబడి! తెలుగు రాష్ట్రాల్లో నూనె గింజల పంటల్లో నువ్వులు ఒకటి. తక్కువ పెట్టుబడితో స్వల్ప కాలంలో అంది వచ్చే నూనె గింజల పంటల్లో నువ్వుల సాగు మేలైనది. ఖరీఫ్లో వేసిన వివిధ పంటలను తొలగించాక, రెండో పంటగా డిసెంబర్ నెలాఖరు నుంచి జనవరి చివరి వరకు రైతులు ఈ పంట సాగు చేపట్టారు. తక్కువ పెట్టుబడి, తక్కువ వనరులతో నికర లాభాలందించే పంటగా నువ్వులకు గుర్తింపు ఉంది. కేవలం రెండు, మూడు తడులు మాత్రమే ఇస్తే సరిపోయే పంట కావడంతో, వేసవిలో ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఆరుతడి పంటగా వేసవిలో వేయడం వల్ల చీడపీడల బెడద చాలా తక్కువ. కరోనా సమయంలో నువ్వుల నూనెకు డిమాండ్ పెరగడంతో, ఇప్పుడు నువ్వుల పంటను భారీగా సాగు చేస్తున్నారు.సాగు విస్తీర్ణం పెరిగింది ఈ ఏడాది నువ్వుల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. గతంలో 100 ఎకరాలు కూడా ఉండని పంట, ఈ ఏడాది ఒక్క గొల్లప్రోలు మండలంలోనే 400 ఎకరాల వరకు వేశారు. ప్రస్తుతం ఎండలు బాగా ఉండడంతో పంట దిగుబడి పెరిగి, ఆదాయం బాగుంటుంది. ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు రైతులకు వివరిస్తున్నాం. నీటి వసతితో పెద్దగా పని లేకపోవడం వల్ల ఇతర పంటల కంటే పెట్టుబడి తక్కువ కావడంతో రైతులు ఎక్కువ మంది ఈ పంట సాగు చేశారు. పంట అన్నిచోట్లా ఆశాజనకంగా ఉంది. – సత్యనారాయణ, వ్యవసాయ శాఖాధికారి, గొల్లప్రోలు ఆశాజనకంగా ఉంది అన్ని పంటలు పూర్తయ్యాక మామూలుగా విత్తనాలు చల్లి వదిలేసేవాళ్లం. ఇప్పుడు ఇదే ప్రధాన పంటగా వేశాం. ప్రస్తుతం మార్కెట్లో నువ్వులకు మంచి డిమాండ్ ఉంది. వాతావరణం కలిసి రావడంతో ఈ ఏడాది మంచి దిగుబడి వచ్చేలా కనిపిస్తోంది. పెట్టుబడి తక్కువ కావడంతో పాటు, ఆరుతడి పంట కావడం వల్ల రేగడి నేలల్లో మంచి అనుకూలమైన పంట కావడంతో దీనిని సాగు చేస్తున్నాం. ఆదాయం బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. – సోమిశెట్టి జగ్గారావు, నువ్వుల రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం -
కోర్టుకు వెళ్లామని ఇబ్బంది
చెరువును 40 ఏళ్ల నుంచి కుల వృత్తికి వినియోగించుకుంటున్నాం. పంచాయతీ నుంచి లీజుకి తీసుకున్నాం. చెరువు గట్టు ఆక్రమణలు తొలగించాలని హైకోర్టుకు వెళ్లాం. కోర్టు ఆదేశించినా ఆక్రమణలు తొలగించడం లేదు. రజకులతో మాట్లాడకూడదని, మాట్లాడితే జరిమానా విధిస్తామని చెబుతున్నారు. – కొండపల్లి వెంకటరత్నం, చిడిపి ఒప్పకోవడం లేదు రెండు వర్గాల మధ్య మాటల్లేవు. 2011 నుంచి చెరువు ఆక్రమణ తొలగించాలని వివాదం నడుస్తుంది. గ్రామ పెద్దలంతా కలిసి ఇరు పక్షాల మధ్య సఖ్యత కుదిర్చేందుకు ప్రయత్నించాం. పలుమార్లు చర్చలు జరిపాం. రజకుల కుల బహిష్కరణ అంశం నా దృష్టికి వచ్చింది. పరిష్కారానికి ఇరు పక్షాలు ఒప్పుకోవడం లేదు. – పాలగుడుల లక్ష్మణరావు, సర్పంచ్, చిడిపి ● -
దైవ కార్యానికి బయలుదేరి.. తిరిగిరాని లోకాలకు
తాడేపల్లిగూడెం రూరల్: దైవకార్యంలో పాల్గొనా లన్న సంకల్పంతో కుటుంబ సమేతంగా పొరుగు రాష్ట్రం నుంచి కారులో బయలుదేరారు. అయితే.. లారీ రూపంలో మృత్యువు వారిని మార్గం మధ్యలోనే కబళించింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు, వారి ఐదేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద సంఘటన శుక్రవారం తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్లోని ఓ ఐటీ కంపెనీకి చెందిన హెచ్ఆర్ ఉద్యోగి భోగిళ్ల వెంకట సత్య సురేన్(37), తన భార్య నవ్య(35), కుమార్తె వాసుకి కృష్ణ(5), బంధువు కారులో కోనసీమ జిల్లా మండపేటలో జరగనున్న ఓ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి బయలుదేరారు. శుక్రవారం మధ్యాహ్నం 12.45 ప్రాంతంలో తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై సత్యసురేన్ డ్రైవ్ చేస్తున్న కారు హైవే మెయింటెనెన్స్ పనులు చేస్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో సత్య సురేన్, అతని భార్య నవ్య అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తె వాసుకి కృష్ణ, బంధువు శ్రీరమ్యను తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వాసుకి కృష్ణ మృతి చెందగా, శ్రీరమ్యను మెరు గైన వైద్యం కోసం రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రూరల్ ఏఎస్సై పీవీకే దుర్గారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాస్పత్రికి తరలించి, రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విషాద ఛాయలు మండపేట: కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మండపేటకు చెందిన భార్యా భర్తలు, ఐదేళ్ల చిన్నారి మృతి చెందడంతో పట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి. హైదరాబాద్ నుంచి మండపేటకు వస్తూ వీరు ఈ దుర్ఘటనలో మర ణించారు. సత్యసురేన్ తండ్రి భోగిళ్ల పాపారావు స్థాని క రావుపేటలో నివసిస్తున్నారు. ఆయన బీమా కంపెనీ రిటైర్డ్ ఉద్యోగి. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా, సత్య సురేన్ చిన్నవాడు. ఈ ఘటనలో పాపారావు చెల్లెలు కుమార్తె ఉప్పులూరి శ్రీరమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. యూఎస్లో ఉంటున్న ఈమె ఇటీవల గృహ ప్రవేశ శుభకార్యానికి హైదరాబాద్ వచ్చారు. ఆమె తండ్రి పాలచర్ల బాబ్జి మండపేటలో ఉంటున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురిని మృత్యువు కాటేయడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. కంచకచర్ల వద్ద రోడ్డు ప్రమాదం ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు ఒకే కుటుంబంలో ముగ్గురి దుర్మరణం మృతులు మండపేట వాసులు -
నాగబాబు వ్యంగ్యాస్త్రాలు.. మరింత అగ్గి రాజేసేలా!
పిఠాపురం: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి టీడీపీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పాత్ర ఏమీ లేదని జనసేన నేత నాగబాబు ఒక్క దెబ్బలో తేల్చి పారేశారు. అసలు పవన్ గెలుపునకు ఏ నేతైనా కారణం అనుకుంటే అది వారి ‘ఖర్మ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది కూడా పిఠాపురం వేదికగా ఈరోజు(శుక్రవారం) జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో నాగబాబు పరోక్షంగా చురకలు అంటించారు. కేవలం పవన్ విజయానికి పిఠాపురం ప్రజలు, జన సైనికులే కారణమని ఒక్క ముక్కలో చెప్పేశారు నాగబాబు. ఇక్కడ పవన్ గెలుపునకు పవనే ప్రధాన కారణంగా చెప్పుకొచ్చారు. వర్మ సీటు త్యాగం సంగతి ఏంటో..?అసెంబ్లీలో అడుగు పెట్టడమే కలగా మారిన పవన్ కళ్యాణ్కు సహకరించి.. ఆ కల నెరవేరేలా చేసింది పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ. ఇక్కడ తన సీటును త్యాగం చేసి మరీ పవన్ ను భుజాన వేసుకున్నారు వర్మ, అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని చంద్రబాబు ఆశ చూపడంతో పాటు దానికి పవన్ కళ్యాణ్ కూడా వంత పాడటం కూడా జరిగింది. సర్లే.. చంద్రబాబు మన నాయకుడే.. పవన్ కూడా మన వాడే అనుకున్నాడో ఏమో వర్మ.. ఎమ్మెల్సీ టికెట్ అన్నారు కదా అని ఆ ఎమ్మెల్యే సీటను త్యాగం చేశారు వర్మ,. మరి తీరా చూస్తే వర్మకు ఊహంచని పరిణామం ఎదురైంది. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకుండా పెద్ద షాకిచ్చారు చంద్రబాబు..పవనే దెబ్బ కొట్టారా..?ఆయనే రాజకీయంగా దెబ్బకొట్టారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ సీటు రాకుండా పవన్ అడ్డుపడ్డారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురంలో తనకు ఇబ్బందులు వస్తాయని ఆయన చంద్రబాబుకు చెప్పడం వల్లే పక్కన పెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు.తనకు ప్రొటోకాల్ సమస్యలు వస్తాయని, వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వవద్దని స్వయంగా పవనే .. చంద్రబాబుకు చెప్పారని రెండు పార్టీల్లోనూ చర్చించుకుంటున్నారు. అలాగే వర్మకు పదవి లభిస్తే పిఠాపురంలో ఆయన ప్రాధాన్యత పెరిగి రెండు అధికార కేంద్రాలు ఏర్పాటవుతాయనే ఆందోళనలోనూ పవన్ కళ్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు.అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ తాను అక్కడి నుంచి పోటీ చేయడం కష్టమవుతుందనే భావనలో ఆయన ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. వర్మ ఎమ్మెల్సీ అయితే నియోజక వర్గానికి చెందిన కూటమి నేతలు ఆయన వద్దకే వెళతారని, ఇది రాజకీయంగా తమకు నష్టమని పవన్ అంచనా వేస్తున్నట్లు సమాచారం. మరింత అగ్గి రాజేసేలా..పవన్ కూడా వర్మ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తానని అంతర్గతంగా చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో పవన్ను గెలిపించేందుకు వర్మ అహర్నిశలు పనిచేశారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆయనను తిట్టినా లెక్క చేయకుండా తిరిగి పవన్ను గెలిపించారు. రెండుచోట్ల ఓడిపోయిన వ్యక్తికి తన సీటును త్యాగం చేసి గెలిపించి అసెంబ్లీకి పంపడంలో కీలకపాత్ర పోషించారు.ఇప్పుడు ఆయనకే పవన్ అడ్డుపడడం ఏమిటని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వర్మను పవన్ దెబ్బకొట్టడం దారుణమని వాపోతున్నాయి. ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో ఆయనకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నాయి. ఇప్పుడు ఏకంగా నాగబాబు నోటి వెంట వర్మ పేరు రాలేదు.. కదా పరోక్షంగా సెటైర్లు వేయడం ఇప్పుడు మరో చర్చకు దారి తీసింది. ఇప్పటికే టీడీపీ-జనసేనలపై ఆగ్రహంగా ఉన్న వర్మ వర్గంలో మరింత అగ్గి రాజేశారనే వాదన తెరపైకి వచ్చింది. -
మేం ‘పిఠాపురం’ తాలుకా.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది!
సాక్షి, కాకినాడ: జనసేన (Janasena) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఒకవైపు యువ కార్యకర్తలు రోడ్లపై బైకులతో ప్రమాదకరమైన స్టంట్లతో వాహనదారుల్ని హడాలెత్తించగా.. ఇంకోవైపు ట్రాఫిక్కు అంతరాయం కలిగించి మరీ వాహనదారులతో వాగ్వాదానికి దిగారు మరికొందరు.పిఠాపురం శివారు ప్రాంతమైన చిత్రాడలో ‘జయకేతనం’(JSP JayaKethanam Sabha) పేరిట సభ నిర్వహిస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం కావడంతో ఆ పార్టీ శ్రేణులు అతి చేష్టలకు దిగాయి. ‘‘పిఠాపురం డిప్యూటీ సీఎం తాలుకా.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది?’’ అంటూ నినాదాలు చేస్తూ.. దారినపోయేవాళ్లను దుర్భాషలాడుతున్నారు.ఈ క్రమంలో.. జనసేన స్టికర్లు, జెండాలతో ఉన్న బైకులు, కార్లతో రోడ్లపై హల్ చల్ చేశాయి. కత్తిపూడి-కాకినాడ 216 జాతీయ రహదారిపై జనసైనిక్స్ బైక్లతో ప్రమాదకర ఫీట్లు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దీంతో ఆ దారి గుండా వెళ్లే పలువురు వాహనదారులు హడలెత్తిపోతున్నారు. ఇంకోవైపు.. ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ జనసేన నేతలు సామాన్యులకు చుక్కలు చూపించారు.ఈ క్రమంలో చిత్రాడ వద్ద బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తికి.. జనసేన నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ట్రాఫిక్ క్లియర్ చేయాలని కోరాడతను. ఈలోపు వెనక నుంచి జెండాతో వచ్చిన ఓ వ్యక్తి అతన్ని చితకబాదాడు. సదరు వ్యక్తిని బూతులు తిట్టాడు. ఆ వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. అయితే పిఠాపురంలో ఎర్ర టవల్ బ్యాచ్ ఇంత చేస్తున్నా.. అక్కడి పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోవడం గమనార్హం -
కొత్త సోపాన మార్గం
● సత్యదేవుని సన్నిధికి రెండో మెట్ల మార్గం ● రూ.90 లక్షలతో నిర్మాణం ● చురుకుగా సాగుతున్న పనులు ● గత ఏడాదే టెండర్ల ఖరారు అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయానికి వెళ్లేందుకు గాను రెండో మెట్ల మార్గం నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయి. మొదటి ఘాట్ రోడ్డు వద్ద ఉన్న దేవస్థానం హైస్కూల్ పక్క నుంచి దీనిని నిర్మిస్తున్నారు. నూతన మెట్ల మార్గం నిర్మాణానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.90 లక్షల వ్యయంతో గత ఏడాదే టెండర్ పిలిచి ఖరారు చేశారు. ఆ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. కొత్త మెట్ల దారి ఎందుకంటే.. ప్రస్తుతం సత్యదేవుని ఆలయానికి వెళ్లేందుకు తొలి పావంచా వద్ద నుంచి రత్నగిరి పైకి 400 మెట్లతో ఒక మార్గం ఉంది. ఇది మొదటి ఘాట్ రోడ్డుకు సుమారు అర కిలోమీటరు దూరంలో ఉంది. చాలా సంవత్సరాల కిందట అన్నవరంలో పెద్దగా రద్దీ ఉండేది కాదు. దీంతో ప్రస్తుతం ఉన్న మెట్ల దారికి దగ్గర్లోనే గతంలో ఆర్టీసీ బస్సులు, ఇతర టూరిస్టు బస్సులు నిలిపేవారు. ఇప్పుడు కూడా ఆర్టీసీ బస్సులు ఇక్కడ నిలుపుతున్నా.. కాకినాడ, రాజమహేంద్రవరం వైపు నుంచి వచ్చే భక్తులు తొలుత ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకుని, అక్కడి నుంచే కొండ పైకి ఆటోలు, దేవస్థానం బస్సులలో వెళ్తున్నారు. ఎవరైనా ఇప్పుడున్న మెట్ల మార్గంలో వెళ్లాలనుకున్నా.. అది ఆర్టీసీ బస్టాండ్కు దూరంగా ఉంది. మరోవైపు అన్నవరం గ్రామంలో రద్దీ పెరగడంతో టూరిస్టు బస్సులను ఆర్టీసీ బస్టాండ్కు సమీపాన దేవస్థానం కళాశాల మైదానంలో నిలుపు చేస్తున్నారు. ఆ బస్సులలో వస్తున్న భక్తులు తొలి పావంచా వద్ద ఉన్న మెట్ల దారి వద్దకు వచ్చి, అక్కడి నుంచి కొండ పైకి చేరుకోవడం ఇబ్బందిగా ఉంటోంది. అందువలన మొదటి ఘాట్ రోడ్డు వద్ద నుంచి రెండో మెట్ల దారి నిర్మిస్తే అక్కడి నుంచి స్వామివారి ఆలయానికి చేరుకోవడానికి వీలుగా ఉంటుందని భావించి, ఆ మేరకు నూతన సోపాన మార్గానికి నేటి కమిషనర్, అప్పటి ఈఓ రామచంద్ర మోహన్ ప్రతిపాదనలు రూపొందించారు. ఆ తరువాత ఆయన ఇక్కడి నుంచి బదిలీ అవడంతో ఆ ప్రతిపాదన కాస్తా మూలన పడింది. 2023లో తిరిగి ఆయన అన్నవరం దేవస్థానం ఈఓగా నియమితులయ్యారు. అనంతరం, నూతన మెట్ల దారి నిర్మాణానికి తాజాగా అంచనాలు రూపొందించి, రూ.90 లక్షల వ్యయంతో టెండర్లు పిలిచి, ఖరారు చేశారు. మూడు మలుపులు.. 210 మెట్లు నూతన సోపాన మార్గాన్ని మూడు మలుపులతో నిర్మిస్తున్నారు. దీనిలో 210 మెట్లు వస్తాయన్నది అంచనా. ఇది మొదటి ఘాట్ రోడ్డు వద్ద ప్రారంభమై, రత్నగిరిపై ఓల్డ్ సీసీ, న్యూ సీసీ సత్రాల మధ్య రోడ్డులో ముగుస్తుంది. అక్కడి నుంచి సత్యదేవుని ఆలయం 200 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఇప్పుడున్న మెట్ల మార్గం నిర్మాణంలో మాదిరిగానే ఇసుక రాయినే కొత్త మార్గంలో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ రాయి త్వరగా వేడెక్కదు. అలాగే, త్వరగా చల్లబడుతుంది. అందువలన ఎండలో భక్తుల కాళ్లు కాలే అవకాశం ఉండదని అధికారులు తెలిపారు. వీరికి ఉపయోగం టూరిస్టు బస్సులు, ఇతర వాహనాల్లో వచ్చే భక్తులు తమ వాహనాలను దేవస్థానం కళాశాల మైదానంలో నిలుపుకొనేలా 2023లో అప్పటి ఈఓ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ ఏర్పాట్లు చేశారు. ఈ మైదానంలో ఆరు షెడ్లు నిర్మించి, భక్తులకు అన్ని వసతులూ కల్పించారు. దీంతో ఆ షెడ్ల వద్ద గతంలో కంటే ఎక్కువగానే టూరిస్టు బస్సులు ఆగుతున్నాయి. అక్కడ భక్తులు స్నానాలు చేసి, రత్నగిరికి చేరుకుంటున్నారు. వీరికి నూతన మెట్ల మార్గం బాగా ఉపయోగపడనుంది. ప్రధానంగా నవంబర్ నుంచి జనవరి వరకూ రత్నగిరికి వచ్చే ఉత్తరాది భక్తులకు కూడా ఈ మెట్ల దారి ఉపయోగకరంగా ఉండనుంది. అలాగే, ఆర్టీసీ బస్టాండ్లో బస్సు దిగి వచ్చే భక్తులకు కూడా ఈ మార్గం ఉపయోగపడుతుంది. వచ్చే నెలలో కమిషనర్ పరిశీలన దేవస్థానంలో జరుగుతున్న నిర్మాణ పనులపై రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ ఇన్చార్జి కమిషనర్ కె.రామచంద్ర మోహన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన మెట్ల మార్గం పనులపై ఆరా తీశారు. తాను ఏప్రిల్ 30న జరిగే సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవానికి వెళ్తానని, ఆ సందర్భంగా అన్నవరం దేవస్థానానికి వచ్చి, పనుల పురోగతిని పరిశీలిస్తానని చెప్పారు. జూన్ నెలాఖరుకు రెడీ అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు ఆదేశాల మేరకు జూన్ నెలాఖరుకల్లా నూతన మెట్ల మార్గం నిర్మాణ పనులు పూర్తి చేసి, భక్తులకు అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం ఈ మెట్ల దారి నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయి. సుమారు 15 అడుగుల వెడల్పున మెట్లు నిర్మిస్తున్నాం. ఈ మార్గానికి ఇరువైపులా రెండున్నర అడుగుల ఎత్తున రక్షణ గోడ, దాని పక్కనే విద్యుత్ స్తంభాలు, వాటికి విద్యుద్దీపాలు కూడా ఏర్పాటు చేస్తాం. – వి.రామకృష్ణ, ఈఈ, అన్నవరం దేవస్థానం చురుకుగా జరుగుతున్న రెండో మెట్ల మార్గం పనులు -
పౌల్ట్రీ.. నష్టాల పల్టీ
పెరవలి: గత నెలలో వ్యాప్తి చెందిన బర్డ్ప్లూ వ్యాధితో తూర్పు గోదావరి జిల్లాలో కోళ్ల పరిశ్రమ కుదేలైంది. ఈ వ్యాధి సోకిన కోళ్లు మృత్యువాత పడటంతో ప్రస్తుతం కోళ్లఫామ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం మిగిలి ఉన్న కోళ్లకు బర్డ్ఫ్లూ సోకకపోయినా చికెన్, గుడ్ల వినియోగంపై ప్రజల్లో ఒక విధమైన ఆందోళన నెలకొంది. దీంతో వీటి వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం మిగిలి ఉన్న కోళ్ల నుంచి జిల్లాలో రోజుకు 80 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నా, వినియోగం లేక, ధర పెరగక రోజుకు రూ.కోటి పైగా నష్టపోతున్నారు. కోళ్ల ఫామ్ల వద్ద గత డిసెంబర్లో గుడ్డు ధర రూ.6.15 ఉండగా.. ఈ నెల మొదటి వారంలో అది రూ.4.50కి, గురువారం నాటికి రూ.4.20కి పడిపోయింది. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలోని పౌల్ట్రీల్లో సుమారు 1.50 కోట్ల కోళ్లు పెంచుతూంటారు. చాలా వరకూ 50 వేలకు పైగా కోళ్లను పెంచగలిగే సామర్థ్యం కలిగిన పౌల్ట్రీలు ఉన్నాయి. ఇవి కాకుండా 5 వేల నుంచి 40 వేల కోళ్ల సామర్థ్యం కలిగిన మరికొన్ని ఫామ్లలో మరో కోటి కోళ్లను పెంచుతున్నారు. గత నెలలో బర్డ్ప్లూ బారిన పడి 40 లక్షలు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో ప్రజలు చికెన్, గుడ్ల వినియోగం బాగా తగ్గించారు. దీంతో ఒకవైపు బ్రాయిలర్ కోళ్ల పెంపకం నిలిచిపోయింది. మరోవైపు గుడ్ల కోళ్ల ఉత్పత్తి జరుగుతున్నా వినియోగం తగ్గిపోవడంతో ఎక్కడికక్కడ గుడ్లు పేరుకుపోతున్నాయి. బ్రాయిలర్ కోళ్లు పెంచిన రైతులు బర్డ్ఫ్లూతో రూ.2 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ, లేయర్ కోళ్ల రైతులు రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో వారు మళ్లీ కోళ్ల పెంపకం చేపట్టడానికి ధైర్యం చేయడం లేదు. చాలాచోట్ల బ్రాయిలర్ కోళ్లు వేయకుండా షెడ్లను ఖాళీగా వదిలేశారు. -
భావనారాయణ స్వామికి రూ.8.53 లక్షల ఆదాయం
కాకినాడ రూరల్: సర్పవరంలోని రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ స్వామి ఆలయంలో గురువారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. సీఎఫ్ఓ గ్రేడ్–1 ఈఓ వీరభద్రరావు పర్యవేక్షణలో గ్రామస్తులు, అర్చకులు, సిబ్బంది, సేవాదళ్ కార్యకర్తల సమక్షంలో 10 హుండీలు తెరచి, ఆదాయం లెక్కించారు. మొత్తం రూ.8,52,983 ఆదాయం లభించిందని ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. నగదు రూపంలో రూ.7,53,512, నాణేలుగా రూ.99,471 వచ్చాయన్నారు. ఘనంగా మొల్లమాంబ జయంతికాకినాడ రూరల్: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యాన కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. సర్పవరం జంక్షన్ బోట్క్లబ్ వద్ద మొల్ల విగ్రహానికి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, బీసీ కార్పొరేషన్ అధికారి కె.లిల్లీ, ఈడీ శ్రీనివాసరావు, జిల్లా పౌర సంబంధాల అధికారి డి.నాగార్జున, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, తహసీల్దార్ కుమారి, శాలివాహన సంఘ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, వాల్మీకి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో తెలుగులో రచించిన మొట్టమొదటి కవయిత్రిగా మొల్ల ప్రసిద్ధికెక్కారని అన్నారు. అనంతరం శాలివాహన సంఘం ప్రతినిధుల ఆధ్వర్యాన మహిళలకు చీరలు పంపిణీ చేశారు. నేడు ప్రత్యంగిర హోమంఅన్నవరం: ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ప్రత్యంగిర హోమం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హోమం ప్రారంభిస్తారు. భక్తులు రూ.750 టికెట్టుతో హోమంలో పాల్గొనవచ్చునని అధికారులు తెలిపారు. వెబ్ ఆప్షన్లకు రేపటి వరకూ అవకాశం కాకినాడ సిటీ: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణకు జ్ఞానభూమి పోర్టల్, ఇతర వెబ్ పోర్టల్లో వెబ్ ఆప్షన్ల సేవలు ప్రారంభమయ్యాయని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకుడు జి.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వెబ్ ఆప్షన్ల గడువు శనివారంతో ముగుస్తుందన్నారు. డీఎస్సీ ఉచిత కోచింగ్కు నమోదు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను ప్రస్తుతం షార్ట్ లిస్ట్ చేశామన్నారు. ఇందులో ఉన్న వెయ్యి మంది అభ్యర్థులు ఇప్పటికే తమ వెబ్ ఆప్షన్లు పూర్తి చేశారన్నారు. మిగిలిన వారు గడువులోగా వెబ్ ఆప్షన్లు పూర్తి చేయాలని సూచించారు. -
ఆ ‘పప్పు’లేం ఉడకవు
పంపిణీకి బ్రేక్..! రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో మార్చి నెల నుంచి కందిపప్పు సరఫరా నిలిచిపోయిందని తెలుస్తోంది. ఈ నెలలో కందిపప్పు కోసం డీడీలు తీయవద్దని పౌర సరఫరాల శాఖ అధికారులు ముందుగానే సమాచారం ఇచ్చినట్టు డీలర్లు చెబుతున్నారు. రెండు నెలలుగా పూర్తి స్థాయిలో కందిపప్పు రాకపోవడంతో ఆసరాగా తీసుకున్న కొందరు రేషన్ సరకులను పక్కదారి పట్టించారనే ఆరోపణలూ లేకపోలేదు. బియ్యం, పంచదారతో పాటు, కందిపప్పు కోసం ఎండీయూ వాహనాల ఆపరేటర్లను అడుగుతుంటే, నో స్టాక్ అనే సమాధానం వస్తుందని లబ్ధిదారులు చెబుతున్నారు. రేషన్ దుకాణాల్లో కందిపప్పు సరఫరా నిలిపివేయడంతో బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పును అధికంగా రూ.150 వరకూ కొనుగోలు చేయాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే కందిపప్పు పంపిణీని పూర్తిగా ఎత్తివేసేలా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.● కందిపప్పు సరఫరాలో కూటమి సర్కారుది ఆరంభ శూరత్వం ● రేషన్ దుకాణాల్లో పూర్తిగా నిలిపివేత ● మూడు నెలల నుంచి బియ్యం, పంచదారతోనే సరి ● ఉగాదికీ పప్పన్నం పెట్టలేని పాలకులు ఆలమూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. నిత్యావసరాలను రాయితీపై అందిస్తామంటూ నేటి పాలకులు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. ప్రజలందరూ నిజమేనని నమ్మారు కూడా. తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి తొమ్మిది నెలలైనా, ఇంకా అనేక పథకాలు ఆచరణకు నోచుకోలేదు. అమలులో ఉన్న పథకాలూ ఇప్పటికే అర్ధాంతరంగా నిలిచిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాది మార్చి నుంచి రేషన్ డిపోల ద్వారా కందిపప్పు సరఫరాను నిలిపివేసి ప్రభుత్వం తన అసమర్థతను చాటుకుంది. బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరల నియంత్రణ కోసం కృషి చేయాల్సిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. రేషన్ దుకాణాల్లో కందిపప్పును కూడా రాయితీపై అందిస్తామన్న హామీనీ అపహాస్యం చేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాదిరిగానే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కంది పప్పును కేజీ రూ.67కే ప్రతి నెలా పంపిణీ చేస్తామని గత ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సుమారు 30 శాతం మందికి మాత్రమే సరఫరా చేశారు. ఈ నెలలో కందిపప్పు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. నిత్యావసర సరకుల ధరల నియంత్రణ పేరిట పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లు సైతం మూతపడ్డాయి. ప్రజలపై తీవ్ర ప్రభావం రేషన్ దుకాణాల్లో కందిపప్పు సరఫరా నిలిచిపోవడంతో ఆ ప్రభావం పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్రంగా పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలను కూటమి ప్రభుత్వం ఏమాత్రం అదుపు చేయలేకపోవడం ప్రజలకు పెనుశాపంగా పరిణమించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 966 రేషన్ డిపోల ద్వారా 355 మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ల(ఎండీయూ)తో 5.48 లక్షల మందికి ప్రతి నెలా రేషన్ సరకులను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ప్రతి నెలా 20లోపు రేషన్ డీలర్లు డీడీలు తీసి, అవసరమైన సరకులను దిగుమతి చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జిల్లా పౌర సరఫరాల శాఖ మాత్రం గతేడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో సక్రమంగానే కందిపప్పు సరఫరా చేసింది. జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి కందిపప్పు కోసం డీలర్లు డీడీలు తీయగా, 523 టన్నులకు గానూ ప్రభుత్వం కేవలం 112 టన్నులే సరఫరా చేసింది. డీడీల్లో మిగిలిన సొమ్మును ఇతర సరకులకు సర్దుబాటు చేశారు. దీంతో ఆ రెండు నెలలు కూడా వినియోగదారులకు పూర్తి స్థాయిలో కందిపప్పు సరఫరా జరగలేదు. -
‘ఉల్లాస్’పై 23న పరీక్ష
మండలాల వారీగా ఉల్లాస్ పరీక్ష రాసే వారి వివరాలు మండలం అభ్యర్థులు తొండంగి 800 యు.కొత్తపల్లి 900 తాళ్లరేవు 750 కాకినాడ రూరల్ 900 రౌతులపూడి 580 శంఖవరం 576 కోటనందూరు 500 తుని 700 ఏలేశ్వరం 450 ప్రత్తిపాడు 650 పరీక్ష కేంద్రాలు 681 ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య 3 గంటల వ్యవధిలో రాయాలి. ● హాజరు కానున్న 6,806 మంది ● ఎన్ఐఓఎస్ ద్వారా నిర్వహణ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ (ఉల్లాస్) పేరిట కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అక్షరాస్యతా శిక్షణ పొందుతున్న వారికి ఈ నెల 23న ప్రాథమిక అక్షరాస్యత పరీక్ష నిర్వహించనున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (ఎన్ఐఓఎస్) ద్వారా నిర్వహించే ఈ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ధ్రువపత్రాలు అందజేస్తారు. జిల్లాలో 6,806 మంది మహిళలను ఈ పరీక్షకు సంసిద్ధుల్ని చేశారు. ఉల్లాస్ ఎందుకంటే.. మహిళల్లో అక్షరాస్యత పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమాన్ని నవంబర్ 5న ప్రారంభించింది. పదిహేను సంవత్సరాలకు పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న వారికి ప్రాథమిక, డిజిటల్, ఆర్థిక విద్యను అందిస్తూ, ఈ నెలాఖరులోగా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడం ఈ కార్యక్రమం లక్ష్యం. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం ప్రారంభించారు. ప్రస్తుతం ప్రతి రంగంలోనూ సాంకేతికత, డిజిటల్ విధానం, నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. ఈ నేపథ్యంలో మహిళలు పొదుపు సంఘాల్లో ఉండేలా చూడటం, బ్యాంక్ ఖాతాలున్న వారికి వాటిని నిర్వహించే విధానాన్ని ఉల్లాస్ ద్వారా తెలియజేశారు. చదువు రాని వారు పక్క వారిపై ఆధారపడుతున్న పరిస్థితులను అధిగమించేలా అవగాహన కల్పించారు. గ్రామాల్లో 15 ఏళ్లు దాటిన వారికి విద్యను అందించే వ్యవస్థ ఏదీ ప్రస్తుతం లేదు. అందుకే ప్రత్యామాయంగా మరోసారి గ్రామీణ ప్రాంతాల్లో వయోజన విద్యా కేంద్రాలు ప్రారంభించేందుకు ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. అక్షర జ్ఞానం లేని వారిని గుర్తించేందుకు ఏపీ సెర్ప్ ఆధ్వర్యాన జిల్లా వ్యాప్తంగా సర్వే చేయగా, కనీస అక్షర జ్ఞానం లేని వారు దాదాపు 70 వేల మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఆరు ఏజెన్సీ మండలాలు, నాలుగు సముద్ర తీర మండలాల్లోని 6,806 మందికి తొలి విడతలో ఉల్లాస్ శిక్షణ ఇచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలు.. వారు అందుబాటులో లేకపోతే పొదుపు సంఘాల్లో చదువుకున్న వారిని, ఉపాధ్యాయులను వలంటీర్లుగా నియమించి బోధించారు. అవసరమైన విద్యా సామగ్రి అందజేశారు.చకచకా ఏర్పాట్లు ఉల్లాస్ పరీక్ష నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్షించాం. ఇన్విజిలేషన్కు, మూల్యాంకనానికి అర్హులను నియమించాం. పరిశీలకులుగా వెలుగు ఏపీఏంలు వ్యవహరిస్తారు. పరీక్ష అనంతరం జవాబు పత్రాలు, రిజిస్ట్రేషన్, హాజరు పత్రాలు, మార్కుల జాబితాలను నిర్దేశిత నమునాల్లో అప్లోడ్ చేస్తాం. – ఎ.వెంకటరెడ్డి, నోడల్ అధికారి, వయోజన విద్య, కాకినాడ -
సత్యదేవునికి జన్మ నక్షత్ర పూజలు
అన్నవరం: సత్యదేవుని జన్మనక్షత్రం ‘మఖ’ సందర్భంగా బుధవారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ దేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారి ఆలయం తెరచి స్వామి, అమ్మవార్లకు అర్చక స్వాములు సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్లకు, శివ లింగానికి పండితులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పళ్లరసాలతో మహాన్యాశ పూర్వక అభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం సుగంధ భరిత పుష్పాలతో, స్వామి, అమ్మవార్లను అలంకరించి పూజించారు. ఉదయం ఆరు గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. యాగశాలలో ఘనంగా ఆయుష్య హోమం స్వామివారి యాగశాలలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు అయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆయుష్య హోమం ప్రారంభించి 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. వేద పండితులు గొల్లపల్లి గణపతి ఘనపాఠి, యనమండ్ర శర్మ ఘనపాఠి, అర్చకులు నిట్టల కామేశ్వరరావు, వ్రత పురోహితుడు పాలంకి పట్టాభి, తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్యదేవుని దర్శించిన 20 వేల మంది భక్తులు బుధవారం సుమారు 20 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. స్వామివారి దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు గోశాలలో సప్తగోవులకు ప్రదక్షణ చేసి శ్రీకృష్ణుడిని దర్శించి పూజలు చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు వేయి నిర్వహించగా అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.20 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో నాలుగు వేల మందికి భోజనం పెట్టారు. నేడు స్వామివారి నిజరూప దర్శనం గురువారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారు, శంకరులు ఏ ఆభరణాలు ధరించకుండా (మూల విరాట్లుగా) నిజరూపులో భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
ప్రాణం తీస్తున్న వేగం
ప్రాణాలు పోతుంటే బాధేస్తోంది ఎంతో భవిష్యత్ ఉన్న కొందరు యువకులు రోడ్డు ప్రమాదాల్లో కేవలం అతివేగంతో ప్రాణాలు కోల్పోవడాన్ని చూస్తున్నప్పుడు బాధేస్తోంది. ట్రాఫిక్ నిబంధనలపై, హెల్మెట్ ధారణపై, అతివేగం వద్దని, విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని పోలీస్ శాఖ యువతకు నిత్యం కౌన్సెలింగ్లు ఇస్తోంది. ముఖ్యంగా యానాం –ఎదుర్లంక వారిధిపై జరగుతున్న యువకుల రోడ్డు ప్రమాదాలపై అధ్యయనం చేస్తున్నాం. యువకుల బైక్ల డ్రైవింగ్లపై ప్రత్యేక నిఘా పెట్టి, వారు అతివేగం తగ్గించేలా చర్యలు చేపడతాం. – టీఎస్ఆర్కే ప్రసాద్, డీఎస్పీ, అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ అమలాపురం టౌన్: చదువుకుని ఉద్యోగాలు సాధించి ఉన్నతమైన జీవితాన్ని చవిచూడక ముందే... తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న ఆశలు నెరవేరకుండానే కొందరు యువకులు రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని నిమిషాలు ఆలస్యమైనా గమ్యాన్ని చేరుకుంటాం, అతి వేగంతో జరగరానిది ఏదైనా జరిగితే మన వెనక ఉన్న కుటుంబం ఏమైయిపోతుందనే కనీస ఆలోచన, ముందుచూపు లేకుండా యువకులు రోడ్లపై రయ్ రయ్ మంటూ బైక్లను నడుపుతున్నారు. గత ఏడాది కాలంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అతి వేగంతో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 34 మంది వరకూ యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెలలోనే ఉమ్మడి జిల్లాలో ఏడుగురు వరకూ రోడ్డు ప్రమాదాల్లో యువకులు మృత్యువాత పడ్డారు. ఐ.పోలవరం మండలం బాలయోగి వారధి (ఎదుర్లంక –యానాం వంతెన)పై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి యువకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయంటే అతి వేగమే కారణం. మన జాగ్రత్తలో మనం ఉండి..ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే చాలా వరకూ రోడ్డు ప్రమాదాలు మన దరిచేరవు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో యువకులు రైడింగ్ మాదిరిగా బైక్ను అతివేగంగా నడపడం ఫ్యాషన్ అయిపోయింది. ఆధునాతన బైక్లను యమ స్పీడుగా నడుపుతూ మృత్యు కుహరాల్లోకి వెళుతున్నారు. యానాం –ద్రాక్షారామ రహదారిలో ఎకై ్సజ్ అధికారులు వెంబడించడంతో ఓ యువకుడు అతి వేగంతో వెళ్లి ఓ లారీని ఢీకొట్టి ప్రాణాలు విడిచాడు. పి.గన్నవరం మండల ఎల్.గన్నవరం శివారు జొన్నల్లంకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇలా చెప్పకుంటూ పోతే ఈ ఏడాదిలో అతివేగమనే అనర్థంతో అర్ధంతరంగా యువకులు ప్రాణాలు పొట్టన పెట్టుకున్న రోడ్డు ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి. యువకులు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న సమయంలో వారు కనీసం హెల్మెట్ ధరించకపోవడం గమనార్హం. ప్రమాదాలకు కారణాలు అనేకం యువకులు రోడ్డు ప్రమాదాల్లో బలి అయిపోతున్న సంఘటనలకు కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. అతి వేగం ప్రధాన కారమవుతుంటే దానికితోడు బైక్లతో రైడింగ్లకు దిగడం, మద్యం సేవించడం, డ్రైవింగ్ లైసెన్స్లు లేకుండా వచ్చీ రానీ డ్రైవింగ్తో కొందరు యువకులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. యువకులను బైక్ల డ్రైవింగ్ పరంగా కంట్రోల్ చేయక పోవడంలో తల్లిదండ్రులు ప్రధాన కారకులవుతున్నారు. గొప్పల కోసం వెళ్లి కొందరు తల్లిదండ్రులు తమ పిల్లోడికి ఖరీదైన, అధునాతన బైక్ కొనిచ్చామని ఆనందిస్తున్నారే తప్ప ఆ బైక్తో తమ బిడ్డ ఎన్ని తప్పిదాలు చేస్తున్నాడో ప్రాణాలు పోయాక గ్రహించి విలపిస్తున్నారు. డ్రైవింగ్లో నిష్ణాతులైన తర్వాతే బైక్ కొనిద్దామని ఆదిలోనే తల్లిదండ్రులు ఆలోచిస్తే ఇన్ని అనర్ధాలు జరవగవని పోలీసులు అంటున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా బైక్ డ్రైవింగ్పై తమ పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.పోలీసుల కౌన్సెలింగ్లను పెడచెవిన పెడుతున్న యువతజిల్లా పోలీస్ శాఖ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, ముఖ్యంగా అతి వేగంతో వెళుతున్న యువతను నిరోధించేందుకు అనేక కౌన్సెలింగ్లు ఇస్తోంది. అలాగే ప్రతీ పట్టణం, గ్రామాల్లో హెల్మెట్ ధారణ ఎంత విలువనైదో, ప్రాణాలను ఎలా కాపాడుతుందో వివరిస్తూ ఫ్లెక్సీలను ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సరికొత్త ట్రాఫిక్ రూల్స్, పెరిగిన జరిమానాలపై యువకులను రోడ్డు చెంతే పోలీసులు ఆపి కౌన్సెలింగ్ ఇస్తున్నా వారు వాటిని పెడచెవిని పెడుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే ఆ కుటుంబం ఎంత తల్లడిల్లుతుందో, ఎంత క్షోభను అనుభవిస్తుందో జిల్లా పోలీసులు వీడియోలు, ఆడియోలు, ఫ్లెక్సీలు ఎన్నో విడుదల చేస్తున్నా అవి కూడా యువకుల చెవులెక్కడం లేదు. ట్రాఫిక్ రూల్స్ పాటించని నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను తీస్తోంది. ర్యాష్ రైడింగ్, డ్రైవింగ్లతో యువత కన్నవారికి కడుపు కోత బైక్లపై విపరీతమైన వేగంతో ప్రయాణం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో ఘోర ప్రమాదాలు తొలి తప్పిదం తల్లిదండ్రులదే అంటున్న పోలీసులు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 16,000 గటగట (వెయ్యి) 14,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ఐ.పోలవరం: ఐ.పోలవరం మండలం ఎదుర్లంక జీఎంసీ బాలయోగి వారధిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యానాం సుంకరపాలెం నుంచి ముమ్మిడివరం వైపు బైక్పై వస్తున్న ఇద్దరి వ్యక్తులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన ఇద్దరూ తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన యాళ్ల వీరేంద్ర(26), ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందిన వేమవరపు సాంబశివ(14)గా పోలీసులు గుర్తించారు. పోతుకుర్రులో జరిగే పుట్టినరోజు వేడుకలకు బంధువుతో కలసి వారు మోటారు సైకిల్పై వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి స్థానిక ఎస్సై మల్లికార్జునరెడ్డి సిబ్బందితో కలసి వెళ్లి మృతదేహాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సుంకరపాలెం గ్రామానికి చెందిన యాళ్ల వీరేంద్ర లోడ్ ఆటో నడుపుతూ తండ్రి సూరిబాబుకు అండగా ఉండేవాడు. సూరిబాబుకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఉన్న ఒక్క కొడుకూ ఆటో నడుపూతూ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. వీరేంద్ర మృతితో సుంకరపాలెంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. సాంబశివ కొత్తలంక హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. కౌలు రైతు ఆత్మహత్య తాళ్లరేవు: మండల పరిధిలోని పి.మల్లవరం పంచాయతీ పత్తిగొంది గ్రామానికి చెందిన కౌలు రైతు పశ్చెట్టి వెంకటేశ్వరరావు(45) ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలో సొంత భూమితోపాటు కొంత కౌలుకి తీసుకుని వ్యవసాయం చేశాడు. వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పులు తీర్చలేక కొంతకాలం హైదరాబాద్లో పనిచేశాడు. ఇటీవల తిరిగి వచ్చి కాకినాడలో కూలిపని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి యానాం బీచ్కు వెళ్లి గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేశ్వరరావును యానాం పోలీసుల సహకారంతో కాకినాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. యానాం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతునికి భార్య నాగలక్ష్మి, వివాహమైన కుమార్తెలు శ్రీదేవి, జ్యోతిశ్రీ ఉన్నారు. వెంకటేశ్వరరావు ఆకస్మిక మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువకుడి ఆత్మహత్యఅల్లవరం: ఎంట్రుకోన పంచాయతీ పరిధిలో వాసర్లవారిపాలేనికి చెందిన వాసర్ల వెంకట సాయి సునంద్ (24) బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఇంటిలో ఫ్యాన్కు ఊరి వేసుకుని మృతి చెందాడు. ఫంక్షన్ నిమిత్తం వేరే ఊరు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే లోగా ఫ్యాన్కు వేలాడుతున్నాడని తండ్రి వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. కొన ఊపిరితో ఉన్న వెంకట సాయిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడి తండ్రి వీర వెంకట సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్సై హరీష్కుమార్ కేసు నమోదు చేశారు. మృతదేహం స్వాధీనంపెరవలి: పెరవలి మండలం లంకమాలపల్లి గ్రామం వద్ద బ్యాంక్ కెనాల్లో ఒక మృతదేహాన్ని బుధవారం స్వాధీనం చేసుకున్నామని పెరవలి ఎస్ఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. కొవ్వూరు మండలం పంగిడి గ్రామానికి ఆవుగడ్డ మల్లికార్జున(40)గా అతనిని గుర్తించామని చెప్పారు. కాలువలో మృతదేహం కొట్టుకుంటూ ఇక్కడకు వచ్చి తుప్పల్లో ఆగిపోయిందని చెడు వాసన రావటంతో గ్రామస్తులు పరిశీలించి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వచ్చి మృతదేహాన్ని పైకి తీసి పోస్టుమార్టం కోసం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెంకటేశ్వరరావు తెలిపారు. బీరు బాటిళ్లతో దాడికి పాల్పడిన నలుగురి అరెస్టుకాకినాడ రూరల్: కాకినాడ అర్బన్ 3వ డివిజన్ పరిధిలోని గుడారిగుంటలో ఒక మద్యం దుకాణం వద్ద ఈ నెల 9న రాత్రి జరిగిన గొడవ హింసాత్మకంగా మారడంతో ఇద్దరు వ్యక్తులపై బీరు బాటిళ్లతో దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులను సర్పవరం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి ఎస్సై పి.శ్రీనివాస్కుమార్ వివరాల ప్రకారం గుడారిగుంటలో మద్యం దుకాణం వద్దకు వీరు 9న రాత్రి 8గంటల సమయంలో వెళ్లారు. చిన్న విషయమై గొడవ పడి బీరు బాటిళ్లతో ఇద్దరిపై దాడికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరిన బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులు గుడారిగుంటకు చెందిన సీకోటి రాజు, పెయ్యల ప్రసాద్, సీకోటి ప్రసాద్, కలాడి అర్జునరావుపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. -
ఆలోచన లేకుండా చేసే పనులతో ఇబ్బందులు
కంబాలచెరువు: ఆలోచన లేకుండా చేసే పనులతో ఇబ్బందులు ఎదురవుతాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి అన్నారు. రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. అక్కడి బాలురు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉచితంగా న్యాయవాదిని పొందే అవకాశం ఉందని తెలిపి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను వివరించారు. వసతి గృహంలో ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలన్నారు. బాలురతో స్నేహ పూర్వకంగా ఉండాలని, వారికి మంచి ఆహారాన్ని అందించడంతో పాటు వారికి ఎలాంటి వైద్య సహాయం అవసరమైన వెంటనే చర్యలు తీసుకోవాలని సిబ్బందికి చెప్పారు. అనంతరం కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని బీసీ బాలికల సమీకృత సంక్షేమ వసతి గృహంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. అన్యాయం జరిగితే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. మంచి చెడు స్పర్శలకు తేడాలను విద్యార్థినులకు తెలియజేశారు. -
పారదర్శకంగా పరీక్షల నిర్వహణ
రాజానగరం: పరీక్షల నిర్వహణ, సర్టిఫికెట్ల మంజూరు వంటి విషయాలలో పారదర్శకంగా ఉండాలని, ఎక్కడ తేడా వచ్చినా క్షమించేది లేదని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ హెచ్చరించారు. యూనివర్సిటీలో యూజీ, పీజీ పరీక్షల విభాగాలను బుధవారం ఆమె నిశితంగా పరిశీలించారు. అనంతరం డీన్ అండ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కార్యాలయంలో పరీక్ష విభాగానికి చెందిన అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న విధానం గురించి తెలుసుకుంటూనే ఆటోమేషన్ విధానాన్ని అమలు చేయడంపై ఆరా తీశారు. అనుబంధ కళాశాలలు ఎక్కువగా ఉన్నందున ఎక్కడా, ఎటువంటి సమస్య ఎదురుకాకుండా సమర్థంగా పరీక్షలు నిర్వహించడం కష్టతరమైన చర్యే అయినా సమష్టిగా పనిచేస్తే ఎటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా చూడవచ్చన్నారు. డీన్ ఆచార్య డి.కల్యాణి, ప్రత్యేకాధికారి డాక్టర్ కె.దీప్తి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ విజయకుమారి, సిస్టమ్ మేనేజర్ జ్యోతి పాల్గొన్నారు.‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ -
ఘనంగా పండిత సదస్యం
మధురపూడి: కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా మూడవరోజు బుధవారం సదస్యం నిర్వహించారు. మధ్యాహ్నం స్వామివారి కల్యాణ మండపంలో వేద పండితులు, ఉభయ వేదాంత పండితుల సమక్షంలో సదస్యం జరిగింది. ఉదయం గ్రామబలిహరణ, సాయంత్రం ఆరాధన, సర్వదర్శనములకు అనుమతి, సేవాకాలం జరిగింది. తీర్థ ప్రసాద గోష్ఠి కార్యక్రమంలో భాగంగా భక్తులకు బూరెలు అందజేశారు. రాత్రి శ్రీఆంజనేయ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పరాసర రంగరాజభట్టర్, అన్నవరం దేవస్థానం అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు.ఆంజనేయ వాహనంపై లక్ష్మీ నరసింహుని గ్రామోత్సవం -
కంటిపూడి సుజుకి శాటిలైట్ డీలర్షిప్ ప్రారంభం
రావులపాలెం: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజమైన సుజుకి మోటార్ సైకిల్ అధీకృత డీలర్ కంటిపూడి సుజుకి నూతన శాటిలైట్ డీలర్ షిప్ను బుధవారం రావులపాలెంలో ప్రారంభించారు. కంటిపూడి సుజుకి షోరూమ్ అండ్ సర్వీస్ను సుజుకి సేల్స్ రీజినల్ మేనేజర్ శివరామకృష్ణ, కంటిపూడి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠమనేని వినయ్బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటిపూడి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠమనేని వినయ్బాబు మాట్లాడుతూ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి అత్యాధునిక ఆటోమేటిక్ పరికరాలు కలిగిన వర్క్షాప్ను రూపొందించినట్టు తెలిపారు. కంటిపూడి గ్రూప్ చైర్మన్ కంటిపూడి సర్వారాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఎం.జగన్, సీహెచ్ సత్యనారాయణమూర్తి (చినబాబు), కె.మన్మోహన్రామ్, సేల్స్ ఏఎం బాలకృష్ణ, సర్వీస్ ఏఎం సాయి, కంటిపూడి సుజుకి జీఎం రాజారావు, బ్రాంచ్ మేనేజర్ వంశీ, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే ధ్యేయం
●● జిల్లాలో ఘనంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం ● కేక్ కట్ చేసి, జెండా ఆవిష్కరించిన నేతలు సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాడే పార్టీగా వైఎస్సార్ సీపీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. పార్టీ ఆవిర్భవించి ఒకటిన్నర దశాబ్దాల కాలం గడిచినా కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరి గుండె చప్పుడై నిలుస్తోంది. నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తున్న వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా ప్రజలు బుధవారం పండగలా నిర్వహించారు. ● జిల్లా కేంద్రం కాకినాడలోని పార్టీ సిటీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యాన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సహా ముఖ్య నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా బడుగు, బలహీన వర్గాలు, నిరుపేదల సంక్షేమమే అజెండాగా వైఎస్సార్ సీపీ పని చేస్తోందని ఈ సందర్భంగా నేతలు అన్నారు. పేదల గుండె చప్పుడు వైఎస్సార్ సీపీ అని అన్నారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. ● పిఠాపురంలో వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద మాజీ ఎంపీ, నియోజకవర్గ కో ఆర్డినేటర్ వంగా గీత పార్టీ జెండా ఎగురవేసి, నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంచారు. జగ్గంపేటలోని పార్టీ కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ జెండాను నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి తోట నరసింహం ఎగురవేశారు. కార్యకర్తలకు స్వీట్లు పంచారు. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలోని కార్యాలయం వద్ద నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండా ఎగురవేశారు. తుని శ్రీరామా సెంటర్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. నాయకులు, కార్యకర్తలు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. కాకినాడ రూరల్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకుడు కురసాల సత్యనారాయణ ఆధ్వర్యాన ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, జై జగన్, జై వైఎస్సార్ సీపీ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ అంగులూరి లక్ష్మీ శివకుమారి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్, కాకినాడ నగరాభివృద్ధిసంస్థ మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, జెడ్పీటీసీ సభ్యుడు గుబ్బల తులసి కుమార్, నేతలు యనమల కృష్ణుడు, వాసిరెడ్డి జమీలు, ఒమ్మి రఘురాం, అల్లి రాజబాబు, ముదునూరి మురళీ కృష్ణంరాజు, మాజీ మేయర్ పోలసపల్లి సరోజ తదితరులు పాల్గొన్నారు. -
హామీలు అమలు చేయని చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, తొమ్మిది నెలలైయినప్పటికీ ఇప్పటి వరకూ నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కళాశాలలను రాష్ట్రంలో ఏర్పాటు చేసి, భవన నిర్మాణాలు చేపట్టి, నాలుగు కాలేజీలు ప్రారంభించారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కూడా తన మనుషులకు అప్పగించేలా చంద్రబాబు ప్రయత్నించడాన్ని వైఎస్సార్ సీపీ తరఫున నిరసిస్తున్నాం. ఎకరం రూపాయి చొప్పున 33 సంవత్సరాలకు కట్టబెట్టేలా వారి ఆలోచనలున్నాయి. కళాశాలకు 50 నుంచి 60 ఎకరాల భూమి చూసుకున్నా.. ఒక్కొక్కటి రూ.1,000 కోట్ల విలువ చేస్తుంది. 17 మెడికల్ కళాశాలలంటే రూ.17 వేల కోట్ల విలువైన ప్రజల ఆస్తి. దీనిని తన మనుషులకు ధారాదత్తం చేసేలా చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువా త ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వారిని ఆదుకోవాలి. – దాడిశెట్టి రాజా, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి హామీలు నెరవేర్చాల్సిందే.. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా ఇప్పటి వరకూ ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో, కేంద్రంలో 2014 నుంచి 2019 వరకూ వాళ్లే అధికారంలో ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో వారే అధికారంలో ఉన్నారు. కలిసి పని చేస్తున్నారు. కొంత మందిని కేంద్ర మంత్రులుగా కూడా తీసుకున్నారు. వాళ్లు తేలేనిది మేం తెచ్చాం. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంతో కలిసి లేము, పోరాడాము. నేను కూడా పార్లమెంట్లో అనేక సమస్యలు ప్రస్తావించా. 2024 ఎన్నికల ముందు అన్ని విద్యా సంస్థలకు పెండింగ్ నిధులన్నీ అందజేశాం. ఎలక్షన్ కోడ్ వచ్చిన తరువాతే ఫైనాన్షియల్ నిబంధనల ప్రకారం నిధులు విడుదల చేయలేదు. ఆ నిధులు అలాగే ఉన్నాయి. మా నాయకుడు జగన్మోహన్రెడ్డి చెబుతున్నట్టు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల వెంటే ఉంటాం. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, నిరుద్యోగ భృతి నిధులు వెంటనే ఇవ్వాలి. ఉద్యోగ కేలండర్ విడుదల చేయాలి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను తక్షణం నిలుపు చేయాలి. – వంగా గీత, కాకినాడ మాజీ ఎంపీ -
జిల్లా దేవదాయ శాఖ అధికారిగా సుబ్బారావు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా దేవదాయ శాఖ అధికారిగా ఇ.సుబ్బారావు కాకినాడలోని కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనను జిల్లాలోని పలు దేవస్థానాలు, సత్రాల ఈఓలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో జిల్లాలో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్గా, జిల్లా దేవదాయ శాఖ కార్యాలయంలో ఏఓగా పని చేసిన అనుభవం ఉందన్నారు. అర్చకులకు, ఈఓలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అర్జీదారుల ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి కాకినాడ సిటీ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారుల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టరేట్ నుంచి బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమస్య పరిష్కారంపై లబ్ధిదారు సంతృప్తి చెందారా లేదా అనే విషయంపై అభిప్రాయం తీసుకోవాలన్నారు. సమావేశంలో జేసీ రాహుల్ మీనా, డీఆర్ఓ జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. 17న వలంటీర్ల ‘చలో విజయవాడ’ కాకినాడ సిటీ: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లందరినీ కొనసాగించాలని, రూ.10 వేల వేతనం చెల్లించాలని, 9 నెలల బకాయిలు చెల్లించాలనే డిమాండ్లతో గ్రామ, వార్డు వలంటీర్లు ఈ నెల 17న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వాల్పోస్టర్ను కాకినాడ కచేరిపేటలోని సీఐటీయూ కార్యాలయం వద్ద బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వలంటీర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైనా తమకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష మంది మహిళలు పని చేసే వలంటీర్ల కడుపు కొట్టే ఉద్దేశం తనకు లేదని ఎన్నికల ముందు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమను కొనసాగించకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలుకు వలంటీర్ వ్యవస్థ ఉండాలని, ఈ హామీలను అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు కాబట్టి వలంటీర్లను కొనసాగించడం లేదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు ఈ నెల 17న వేలాదిగా వలంటీర్లు విజయవాడ తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, వలంటీర్ల సంఘం జిల్లా కో కన్వీనర్ ఇనుకోటి వరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అసంపూర్తి ఇళ్లకు అదనపు సాయం కాకినాడ సిటీ: పీఎంఏవై గ్రామీణ్, అర్బన్ 1.0లలో మంజూరై, వివిధ దశల్లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు అదనపు ఆర్థిక సాయం అందించనున్నామని కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. గృహ నిర్మాణ పథకంపై వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టరేట్ నుంచి బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో దాదాపు 7,108 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ గృహాల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. బీసీలు 4,852 మంది, ఎస్సీలు 2,131, ఎస్టీలు 125 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీ, బీసీలకు అదనంగా రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, ఆదివాసీ గిరిజనులకు రూ.లక్ష చొప్పున అదనపు సాయం అందిస్తామని చెప్పారు. వీటి నిర్మాణాలను ఏప్రిల్లోగా పూర్తి చేసుకోవాలన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణను కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ప్రతి లబ్ధిదారు ఇంటికి వెళ్లి, ఇళ్లు నిర్మించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
ద్రాక్షారామలో పేలుడు కలకలం
రామచంద్రపురం రూరల్: రామచంద్రపురం మండలంలోని ద్రాక్షారామలో పేలుడు కలకలం చోటు చేసుకుంది. ద్రాక్షారామ ఎస్సై ఎం. లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం బాధిత కుటుంబం ఎండీ జాఫర్ హుస్సేన్ అతని భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడుతో కలసి ద్రాక్షారామ నున్నవారి వీధిలో నివాసం ఉంటున్నారు. జాఫర్ మార్కెట్లో మటన్ దుకాణం నడుపుకుంటున్నాడు. సోమవారం రాత్రి భోజనం చేసి భార్య, కుమార్తెలు పెంకుటింటిలో నిద్రపోగా, జాఫర్, అతడి కుమారుడు ఇంటి పెరటిలో ఉన్న రేకుల షెడ్డులో నిద్రపోయారు. అర్ధరాత్రి 1.15 గంటలకు పేలుడు శబ్దం, మంటలు రావడంతో భయపడి లేచి బయటకు వచ్చి చూసేసరికి అదే గ్రామానికి చెందిన మహమ్మద్ రోషన్ అబ్బాస్, మరో ఇద్దరు గుర్తు తెలియని యువకులు వీరిని చూసి మోటారు సైకిళ్లపై పారిపోయారు. గాజు సీసాలకు చుట్టిన ఔట్లు, పేలుడు పదార్థాలతో ఇంటిపై దాడి చేశారని, గతంలో రోషన్ అబ్బాస్ బావ మహ్మద్ అలీహుస్సేన్కి తనకి మసీదు విషయంలో ఉన్న గొడవలను దృష్టిలో పెట్టుకుని తమ కుటుంబాన్ని చంపాలని, ఇంటిని నాశనం చేసి ఆస్తి నష్టం కలిగించాలనే ఉద్దేశంతో తమపై దాడికి పాల్పడ్డారని జాఫర్ హుస్సేన్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. ఘటనా స్థలాన్ని సీఐ వెంకట నారాయణ సిబ్బందితో కలసి పరిశీలించారు. -
ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా
13 మంది విద్యార్థులకు గాయాలు జగ్గంపేట: జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామంలో మంగళవారం ఉదయం విద్యార్థులతో జగ్గంపేట వస్తున్న ఒక ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 13 మంది విద్యార్థులు ఉండగా వీరిలో 9 మందికి స్వల్పంగాను, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తెలిపిన వివరాల మేర కు ఉదయం జగ్గంపేట వస్తున్న బస్సు కాండ్రేగుల గ్రామ శివారులో బోల్తాపడింది. స్థానికుల సహకారంతో విద్యార్థులను బయటకు తీసి జగ్గంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. వీరిలో 9 మందిని ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు పంపించేశారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురు తోటకూర కార్తీక్ నాగేంద్ర, అనితా రామచక్ర, ద్వారపూడి ధనలక్ష్మి, బొదిరెడ్డి శ్రావణిలను మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. స్కూల్ కరస్పాండెట్, వైఎస్సార్ సీపీ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడు ఒమ్మి రఘురాంఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విద్యార్థులందరూ 6 నుంచి 9 తరగతి చెందిన వారని, డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై తెలిపా రు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రణీత్ విద్యార్థులకు వైద్య సేవలందించారు. -
బ్లడ్ బ్యాంక్లో తనిఖీలు
కాకినాడ క్రైం: కాకినాడలోని శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. డీఎంహెచ్వో డాక్టర్ నరసింహనాయక్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాధారణ తనిఖీలలో భాగంగా బ్లడ్ బ్యాంక్ను పరిశీలించినట్లు తెలిపారు. రిజిస్టర్లు పరిశీలించామని, రిక్విజేషన్ ఫాంలోని వివరాల ఆధారంగా దాతలు, గ్రహీతలతో మాట్లాడి నిర్ధారించుకున్నట్లు తెలిపారు. బ్లడ్ స్టాక్ రికార్డు, డోనార్ రికార్డు, క్యాంప్ రిజిస్టర్స్, క్రాస్ మ్యాచింగ్, డిస్కార్ట్ రిజిస్టర్, బ్లడ్ ఇష్యూ రిజిస్టర్, పేమెంట్ రిక్విజేషన్ ఫాం, పేమెంట్ రిసీప్ట్స్, ఫిజికల్ స్టాక్, బ్లడ్ కలెక్షన్, మ్యాచింగ్, కాంపోనెంట్ ప్రిపరేషన్, వైరల్ స్క్రీనింగ్ రూంలను తనిఖీ చేసినట్లు తెలిపారు. శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో నిబంధనలకు అనుగుణంగానే రక్తదాన సేవలు కొనసాగుతున్నాయని నిర్ధారించినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ వ్యాధుల నియంత్రణాధికారి(డీఎల్వో) డాక్టర్ రోణంకి రమేష్ పాల్గొన్నారు. -
మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో మండపేట యువకుడి మృతి
మండపేట: పొట్టకూటికి మహారాష్ట్ర పనికి వెళ్లిన మండపేట యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నాలుగు రోజలు క్రితం జరిగిన ఈ విషాద ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు, స్నేహితులు తెలిపిని వివరాలిలా వున్నాయి. పట్టణంలోని కొండపల్లివారి వీధికి చెందిన పరమటి జితేంద్ర (33) మహారాష్ట్రలోని ఉద్గార్లోని ఓ ఫైనాన్స్ సంస్థలో కొంత కాలంగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి 7వ తేదీ ఉదయం ద్విచక్ర వాహనంపై లైన్కు బయలుదేరాడు. హల్నీ రహదారిపై వెళ్తున్న జితేంద్ర గండోపత్ దప్కా ప్రాంతానికి వచ్చేసరికి ప్రమాదానికి గురయ్యాడు. ఎదురుగా వేగంగా వస్తున్న నాలుగు చక్రాల గూడ్స్వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రుణ్ణి స్థానికులు ఆసుపత్రికి చేర్చించారు. అక్కడ వైద్యం పొందుతుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడని చెప్పారు. ఘటనపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. పంచనామా పూర్తయ్యాక అక్కడి పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా మహారాష్ట్ర నుంచి అంబులెన్స్లో సోమవారం రాత్రి మండపేట తీసుకువచ్చారు. కాగా మృతునికి భార్య, మూడు నెలల పసిపాప వున్నారు. కుటుంబం కోసం కష్టపడటానికి వెళ్లి ఎప్పుడూ క్షేమంగా ఇంటికి చేరుకునే తన భర్త ఈసారి ఎవరికీ అందనంత దూరం వెళ్లిపోయారని గుండెలవిసేలా రోదించిన భార్యను చూటి చుట్టుపక్కల వారు కంటతడి పెట్టారు. ఉపాధి హామీ పని చేస్తూ మహిళా కూలి మృతి దేవరపల్లి: ఉపాధి పని చేస్తూ అస్వస్థతకు గురై పని ప్రదేశంలోనే మహిళా కూలీ మృతి చెందిన ఘటన దేవరపల్లి మండలం పల్లంట్లలో మంగళవారం జరిగింది. ఏపీఓ జీవీ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పల్లంట్లకు చెందిన బొందల చంద్రమ్మ(53) 15 ఏళ్లుగా ఉపాధి పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. మంగళవారం ఉదయం గ్రామంలోని రైతు పొలంలో ఫార్మ్ చెరువు తవ్వకం పనులకు వెళ్లిన చంద్రమ్మ కొద్దిసేపటికి అస్వస్థతకు గురైంది. వెంటనే వైద్యం కోసం గ్రామానికి తీసుకువస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,000 గటగట (వెయ్యి) 15,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ర్యాంకు పెరిగినా.. పెరగని సంతృప్తి
అన్నవరం: గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అభిప్రాయ సేకరణలో అన్నవరం దేవస్థానానికి సంబంధించి విచిత్రమైన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో జనవరిలో నిర్వహించిన అభిప్రాయ సేకరణ ప్రకారం అన్నవరం దేవస్థానానికి చిట్టచివరిగా ఏడో ర్యాంకు రాగా, గత నెలలో చేపట్టిన అభిప్రాయ సేకరణ ప్రకారం పరిస్థితి మెరుగుపడి, రెండో ర్యాంకు వచ్చింది. అయితే, జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో ఇక్కడ అందిస్తున్న సేవలపై భక్తులో అసంతృప్తి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన దేవస్థానాల కన్నా ఇక్కడ తక్కువ అసంతృప్తి ఉండటం ద్వారా అన్నవరం రెండో స్థానంలో నిలిచిందని తెలుస్తోంది. అభిప్రాయ సేకరణ జరిపారిలా.. ఫ కాణిపాకం, శ్రీకాళహస్తి, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గ గుడి, విశాఖ జిల్లా సింహాచలం, శ్రీశైలం, అన్నవరం దేవస్థానాల్లో భక్తులకు సేవలు, ప్రసాదం నాణ్యత, ఇతర ఏర్పాట్లపై జనవరి 25 – ఫిబ్రవరి 24 తేదీల మధ్య వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు తెలుసుకుని తాజా ర్యాంకులు ప్రకటించారు. ఫ సత్యదేవుని సన్నిధిలో ‘దర్శనం మీరు భావించిన సమయంలో జరిగిందా?’ అనే ప్రశ్నకు 70 శాతం మంది అవునని బదులిచ్చారు. 30 శాతం మంది అలా జరగలేదని చెప్పారు. జనవరిలో సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు 78 శాతం మంది ఉండగా ఫిబ్రవరిలో 8 శాతం మంది ఎక్కువగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ దేవస్థానంలో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, వాష్ రూములు, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలు, చెప్పులు భద్రపరిచే చోటు తదితర అంశాలపై 65 శాతం భక్తులు సంతృప్తి, 35 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాల్లో అన్నవరం దేవస్థానానికి మూడో ర్యాంకు వచ్చింది. జనవరిలో 67 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. దీంతో పోలిస్తే ఫిబ్రవరిలో ఇది 2 శాతం తగ్గింది. ఫ సత్యదేవుని ప్రసాదం రుచి, నాణ్యతలో 82.4 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయడం ద్వారా రెండో ర్యాంకు వచ్చింది. జనవరిలో 87 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఫ మొత్తం మీద దేవస్థానం అందిస్తున్న సేవల్లో ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వే ప్రకారం భక్తుల్లో అసంతృప్తి శాతం పెరిగినట్లు తెలుస్తోంది. కనీసం ఈ నెలలోనైనా భక్తుల సంతృప్తి శాతం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ అన్నవరం దేవస్థానానికి ఫిబ్రవరిలో రెండో ర్యాంకు ఫ దర్శనం, మౌలిక వసతులు, ప్రసాదంపై ఇంకా భక్తుల్లో అసంతృప్తి -
బ్యాంకు రుణాల పంపిణీ ముమ్మరం చేయాలి
కాకినాడ సిటీ: జిల్లాలోని వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు బ్యాంకు రుణాల పంపిణీ మరింత ముమ్మరం చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కోరారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన బ్యాంకర్లు, జిల్లా అధికారులతో కూడిన జిల్లా కన్సల్టేటివ్ కమిటీ, జిల్లా స్థాయి రివ్యూ కమిటీ సమావేశాలకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ఏడాది డిసెంబర్తో ముగిసిన త్రైమాసానికి సంబంధించి వ్యవసాయ రంగానికి రూ.11,460 కోట్ల రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, రూ.4,102 కోట్లు పంపిణీ చేశారన్నారు. ప్రాధాన్యేతర రంగాలకు రూ.4,184 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా, లక్ష్యానికి మించి రూ.5,872 కోట్లు పంపిణీ చేశారని చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకూ 15,599 మంది కౌలు రైతులకు వ్యక్తిగతంగా రూ.55.48 కోట్లు, 20,495 మంది కౌలు రైతులకు ఆర్ఎంజీ, జీఎల్జీ గ్రూపుల ద్వారా మరో రూ.79.48 కోట్ల మేర పంట రుణాలు మంజూరు చేశారన్నారు. వివిధ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా 3,704 మందికి రూ.4,568 కోట్ల రుణాలు అందించాలనేది లక్ష్యంగా నిర్దేశించారన్నారు. దీనిని సమన్వయంతో పూర్తి చేయాలని జేసీ కోరారు. ఆయా సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా 57 జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు 50 శాతం బ్యాంకు రుణాలుగా రూ.228 కోట్లు అందించాలన్నారు. డీఆర్డీఏ ద్వారా ఇప్పటి వరకూ 14,315 డ్వాక్రా గ్రూపులకు రూ.1,075 కోట్లు, మెప్మా ద్వారా 4,312 డ్వాక్రా గ్రూపులకు రూ.508 కోట్ల మేర బ్యాంకు రుణాల లింకేజీ అందించారని తెలిపారు. పీఎం విశ్వకర్మ యోజన ద్వారా 3,801 మందికి నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. పీఎంఈజీపీ పథకం ద్వారా రూ.538 కోట్ల బ్యాంకు రుణంతో ఇప్పటి వరకూ 140 యూనిట్లు ఏర్పాటయ్యాయన్నారు. పీఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ష్యూరిటీ లేకుండా రూ.10 లక్షల వరకూ రుణాలు అందించాలని బ్యాంకర్లను జేసీ రాహుల్ మీనా కోరారు. కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కమిటీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ కాకి సాయి మనోహర్, ఎల్డీఎం సీహెచ్ఎస్వీ ప్రసాద్, రిజర్వు బ్యాంకు ఎల్డీఓ పూర్ణిమ, నాబార్డు ఏజీఎం వై.సోమునాయుడు, డీఆర్ఓ జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
రూ.166 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జాబు కావాలంటే బాబు రావాలి.. జనవరి 1నే జాబ్ క్యాలెండర్.. పరిశ్రమల ఏర్పాటు.. వర్క్ ఫ్రం హోం కోసం హైటెక్ టవర్లు.. 20 లక్షల ఉద్యోగాలు.. ఉద్యోగాలు రాకుంటే నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి.. అంటూ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పెద్దలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఊరూవాడా ఊదరగొట్టేశారు. తీరా అధికారం పగ్గాలు చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను గాల్లో కలిపేసి, నమ్మిన జనాన్ని నిట్టనిలువునా నట్టేట ముంచేశారు. తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లో సైతం అరకొర నిధులతో మరోసారి దగా చేశారు. తల్లికి వందనం అని చెప్పి తల్లికి వంచన చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఊసే లేదు. తొమ్మిది నెలల పాలనలో కొత్త ఉద్యోగాలివ్వకపోగా.. ఉన్నవి ఊడబీకారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న దగాపై యువత, విద్యార్థులు కన్నెర్ర చేస్తున్నారు. వారికి మద్దతుగా ఉద్యమించేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటలు నమ్మి మోసపోయిన యువత పక్షాన పార్టీ నేతలు, కార్యకర్తలు బుధవారం కాకినాడలో యువత పోరు పేరిట పోరాటానికి సిద్ధమయ్యారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్కు భారీ ర్యాలీగా తరలి వెళ్లి, కలెక్టర్కు వినతిపత్రం అందజేయనున్నారు. ఈ దిశగా పార్టీ శ్రేణులతో పాటు, విద్యార్థులు, నిరుద్యోగులు కూడా ముందుకు కదులుతున్నారు. జిల్లావ్యాప్తంగా పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు 170 వరకూ ఉన్నాయి. వీటన్నింటిలో 50 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం క్రమం తప్పకుండా జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ అందించేది. దీనికితోడు వసతి దీవెన నిధులు కూడా ఇచ్చేది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో చివరిలో ఫీజు రీయింబర్స్మెంట్కు నిబంధనలు అడ్డం పడ్డాయి. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో 2023–24 విద్యా సంవత్సరానికి మూడు విడతలు, 2024–25లో రెండు విడతలుగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సి ఉండగా.. ఒక విడత మాత్రమే ఇటీవల విడుదల చేశారు. మొత్తం మూడు విడతలకు సంబంధించి రూ.90 కోట్ల మేర కూటమి సర్కార్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి పెట్టేసింది. విద్యార్థులకు మెయింటెనెన్స్ ఫీజు కింద మొక్కుబడిగా రూ.2 కోట్లు విడుదల చేసి, రూ.76 కోట్లు బకాయిలు పెట్టేసింది. మొత్తం అన్నీ కలిపి రూ.166 కోట్ల మేర విద్యార్థులకు బకాయి పెట్టింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో కళాశాలలకు ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కళాశాలల యాజమాన్యాలు కూడా విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాయి. తల్లికి వందనం పేరిట కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ ఏడాదికి రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు అండ్ కో నమ్మించారు. తీరా గద్దెనెక్కాక ‘తల్లికి మాత్రమే రూ.15 వేలు’ అని మెలిక పెడుతూ జీఓ ఇచ్చారు. దీనిపై పెద్ద ప్రజలు అగ్గి మీద గుగ్గిలమవ్వడంతో తూచ్ అంటూ మాట మార్చారు. కానీ, నెలలు గడుస్తున్నా ఇంతవరకూ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో చిల్లిగవ్వ కూడా జమ చేయలేదు. జిల్లాలో యీ పథకానికి అర్హులైన విద్యార్థులు 1,86,708 మంది ఉన్నారు. వీరికి తల్లికి వందనం కింద రూ.250.30 కోట్లు చెల్లించాలి. కానీ, పైసా కూడా చంద్రబాబు విదల్చలేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అదే, గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.13 వేల చొప్పున విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. మిగిలిన రూ.2 వేలలో రూ.వెయ్యి డిస్ట్రిక్ టాయిలెట్స్ మెయింటెనెన్స్కు, మరో రూ.వెయ్యి డిస్ట్రిక్ట్ స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్కు జమ చేశారు. తల్లికి వంచన యువత పోరుకు సర్వం సిద్ధం కాకినాడ బాలా త్రిపుర సుందరి ఆలయం వెనుక ఉన్న వైఎస్సార్ సీపీ సిటీ కార్యాలయంలో పార్టీ జిల్లా స్థాయి ఆవిర్భావ దినోత్సవం అనంతరం యువత పోరు కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి జిల్లా నలుమూలల నుంచీ తరలివచ్చే విద్యార్థులు, యువతకు మద్దతుగా పార్టీ నేతలు, శ్రేణులు ముందు నిలిచి జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహిస్తాం. విద్యార్థులు, యువతకు కూటమి సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేస్తాం. – దాడిశెట్టి రాజా, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి -
లక్ష్యానికి మించి ‘ఉపాధి’
కరప: జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యాన్ని గడువుకు ముందే అధిగమించామని డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి తెలిపారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. ఉపాధి హామీ పథకం రికార్డులను తనిఖీ చేసి, కార్యాలయ ఆధునీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం ద్వారా ఈ నెలాఖరుకు 69 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉండగా ఫిబ్రవరి నెలాఖరుకే లక్ష్యాన్ని పూర్తి చేశామని చెప్పారు. రెండు లక్షల పని దినాలు పొడిగించగా ఈ నెల మొదటి వారంలోనే పూర్తి చేశామన్నారు. మరో 10 లక్షల పని దినాలు మంజూరయ్యాయని, వీటిని ఈ నెలాఖరు పూర్తి చేస్తామని చెప్పారు. రోజుకు 50 వేల మందితో పని చేయించాల్సి ఉండగా, 30 వేల మందే పని చేస్తున్నారని, రోజువారీ పనుల్లో వేతనదారుల సంఖ్యను పెంచేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. వేసవి ఎండల నేపథ్యంలో ఉదయం 5.30 గంటలకే పనులు ప్రారంభించి, 10.30 గంటలకే ముగించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సిబ్బందిని ఆదేశించామన్నారు. వేతనదారులు స్వయంగా 2 లీటర్ల తాగునీరు తెచ్చుకోవాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, పని చేసేచోట ఎండ తగలకుండా పందిళ్లు లేదా షామియానాలు వేయించాలని చెప్పారు. గ్రామ పంచాయతీల పరిధిలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, మినీ గోకులాల నిర్మాణాలు చేయిస్తున్నామన్నారు. ప్రతి ఇంట్లో కంపోస్ట్ పిట్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో 2,115 నీటిగుంతలు తవ్వించాలన్నది లక్ష్యం కాగా ఇంతవరకూ 600 గుంతల పనులు జరుగుతున్నాయని తెలిపారు. వీటిని జూన్ నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. జిల్లాకు 750 మినీ గోకులాలు మంజూరవగా ఇంతవరకూ 700 పూర్తి చేశామన్నారు. జిల్లాలో ఈ ఏడాది 4,330 సోక్పిట్స్ తవ్వించేందుకు ప్రతిపాదించామని వెంకటలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం.అనుపమ, ఏపీఓ జీవీ రమణకుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ వీవీ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
అన్ని వర్గాలకూ చంద్రబాబు సర్కార్ మోసం
ఉద్యోగాలు హుళక్కి ఫ అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలిస్తామని కూటమి పెద్దలు చెప్పడంతో డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన వేలాది మంది డీఎస్సీ, గ్రూప్, పోలీస్ రిక్రూట్మెంట్, ఏపీపీఎస్సీ తదితర కొలువుల కోసం వేలాది మంది ప్రయత్నాలు చేస్తున్నారు. వారి భవిష్యత్తు కోసం అయినకాడికి అప్పులు చేసి కోచింగ్ సెంటర్లలో శిక్షణ ఇప్పిస్తున్న తల్లిదండ్రులు కూడా ఎంతో మంది ఉన్నారు. ఉన్నత చదువులు చదివి కుటుంబ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా అరకొర జీతంపై స్థానికంగా, హైదరాబాద్, బెంగళూరు, చైన్నె తదితర ప్రాంతాలకు వలస వెళ్లి ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న వారి సంఖ్య లక్షన్నర పైనే ఉంది. వీరిలో కూడా మూడు వంతుల మంది తమ చదువుకు తగిన ఉద్యోగం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం ఉద్యోగాల భర్తీ హామీని తుంగలో తొక్కేసింది. ఫ కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు.. ఉన్నవి ఊడబీకేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించి రూ.5 వేల జీతాన్ని రూ.10 వేలకు పెంచుతామన్నారు. తీరా చూస్తే మొత్తం వ్యవస్థనే లేకుండా చేసేశారు. ఫలితంగా జిల్లాలోని 11,990 మంది వలంటీర్లు రోడ్డున పడ్డారు. ఫ కూటమి నేతలకు మద్యం షాపులు కట్టబెట్టేందుకు ప్రైవేటు మద్యం పాలసీని కూటమి ప్రభుత్వం తీసుకుని వచ్చింది. దీని ఫలితంగా గత వైఎస్సార్ సీపీ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పని చేసిన సుమారు 1,000 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. ఫ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలివ్వకపోగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లను దగా చేశారు. ఫ ఉద్యోగాలు ఇవ్వలేకుంటే అప్పటి వరకూ 18 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న వారికి ప్రతి నెలా నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. జిల్లాలో ఈ వయస్సులో ఉన్న యువత 3.15 లక్షల పైనే. వీరికి ప్రతి నెలా రూ.3 వేల చొప్పున రూ.94,50,00,000, తొమ్మిది నెలలకు రూ.850,50,00,000 చెల్లించాల్సి ఉంది. కానీ, 2014లో రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మించి, వంచించినట్టుగానే ఇప్పుడు కూడా చంద్రబాబు రూ.3 వేల భృతి హామీని గాల్లో కలిపేశారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఫ ఉద్యోగాల భర్తీ లేదు.. నిరుద్యోగ భృతీ లేదు ఫ 11,990 మంది వలంటీర్లను రోడ్డున పడేశారు ఫ పైగా లక్షల ఉద్యోగాలిచ్చినట్లు బిల్డప్లు ఫ అరకొరగా ఫీజు రీయింబర్స్మెంట్ ఫ కూటమి ప్రభుత్వ కుయుక్తులపై వైఎస్సార్ సీపీ ఉద్యమ బాట ఫ నేడు కాకినాడలో ‘యువత పోరు’ ఉద్యోగాల భర్తీ నిరుద్యోగ భృతి కాకినాడ రూరల్: హామీలు నెరవేర్చకుండా మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత, నిరుద్యోగులు.. ఇలా రాష్ట్రంలోని అన్ని వర్గాలనూ మోసగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీయడానికి వైఎస్సార్ సీపీ నిరంతరం సిద్ధంగా ఉంటుందని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద బుధవారం యువత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కాకినాడ రమణయ్యపేట వైద్య నగర్లోని కార్యాలయంలో యువత పోరు పోస్టర్ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్మెంట్ అంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకొస్తారని, ఆయన తరువాత మొత్తం ఫీజు చెల్లించే ప్రక్రియకు గత సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ రోజు సుమారు రూ.4,600 కోట్ల మేర బకాయి పెట్టి విద్యార్థుల భవిష్యత్తుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటాలాడుతున్నారని దుయ్యబట్టారు. కళాశాలల అకౌంట్లలో డబ్బులు వేస్తామని ప్రభుత్వం చెబుతూండగా.. తమకు డబ్బులు రాలేదంటూ విద్యార్థులను యాజమాన్యాలు బెదిరిస్తున్నాయని చెప్పారు. దీంతో, హాల్ టికెట్లు ఇస్తారో, లేదోనని, పరీక్ష హాలులో కూర్చోనిస్తారో, లేదోనని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారన్నారు. చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేశారని, ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని, ఈ హామీలకు ఇప్పటికీ అతీగతీ లేదని కన్నబాబు విమర్శించారు. అధికారమే చంద్రబాబు పరమాధి అని అన్నారు. గత సీఎం వైఎస్ జగన్ హయాంలో 17 వైద్య కళాశాలల నిర్మాణం ప్రారంభించగా 5 కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయన్నారు. పూర్తయిన పులివెందుల సహా అన్ని కళాశాలలనూ ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్య, వైద్యం పట్ల ఇంత చులకన దేనికని, పూర్తిగా వ్యాపారంగా మార్చాలని ఎందుకనుకుంటున్నారని ప్రశ్నించారు. పీపీపీ పేరిట రూ.వేల కోట్లతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వైద్య కళాశాలలను అస్తవ్యస్తం చేస్తున్నారన్నారు. తమకు మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి లేఖ రాసిన తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఖ్యాతి దక్కిందని ఎద్దేవా చేశారు. పేదలకు మంచి జరుగుతుందంటే అడ్డుకుంటున్నారన్నారు. అందుకే యువత పోరు పేరిట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి, కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పీపీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కన్నబాబు కోరారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు కురసాల సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ, సర్పంచ్లు బెజవాడ సత్యనారాయణ, రామదేవు సూర్యప్రకాశరావు, పార్టీ విద్యార్థి, బీసీ విభాగాల జిల్లా అధ్యక్షులు పూసల అనిల్, అల్లి రాజబాబు తదితరులు పాల్గొన్నారు. ఫ నేడు యువత పోరు ఫ పోస్టర్ ఆవిష్కరించిన వైఎస్సార్ సీపీ నేత కురసాల కన్నబాబు -
150 కేజీల గంజాయి పట్టివేత
● రూ.7లక్షల 50 వేలు విలువైన సరకు స్వాధీనం ● ఐదుగురి అరెస్టు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): లక్షల రూపాయల గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. వారి నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనిని రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి జైలుకు పంపారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ డి.నరసింహకిశోర్ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ వివరాలను వెల్లడించారు. పట్టుబడిందిలా... ఉదయం 11 గంటల సమయం. ఏజెన్సీ నుంచి రాజమహేంద్రవరం మీదుగా గంజాయి రవాణా అవుతుందని పక్కా సమాచారం ఉండడంతో రూరల్ ప్రాంతంలోని కొంతమూరు గామన్ ఇండియా బ్రిడ్జి వద్ద పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. అయితే నిందితులు ముందస్తుగా గంజాయి తరలించే వాహనానికి ఒక ఆటోను పైలట్గా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఆటోలో వారు గంజాయి తీసుకెళ్తున్న మార్గంలో పోలీసులు తనిఖీలు చేస్తుంటే ఆ సమాచారాన్ని వారికి సమాచారం ఇస్తారు. అలా రంపచోడవరం నుంచి ఎయిర్పోర్టు రోడ్డులో వస్తూ వంతెన కింద నుంచి నేషనల్ హైవే 16 పైకి ఎక్కుతుండగా పైలట్ ఆటోలో వారు పోలీసులను గమనించి ఆ సమాచారం గంజాయి రవాణా అవుతున్న వాహనంలో ఉన్న వారికి సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన గంజాయి రవాణాదారులు పారిపోతుండగా రాజానగరం పోలీస్స్టేషన్ ఎస్సై మనోహర్, పోలీసు సిబ్బంది ఆ కారును, ఆటోను వెంబడించి పట్టుకున్నారు. మొత్తం రెండు కేజీల చొప్పున 75 ప్యాకెట్లలో కారు ఢిక్కీలో గంజాయి దొరికింది. పట్టుకున్న గంజాయి విలువ రూ.7 లక్షల 50 వేలు ఉంటుందని పోలీసుల తెలిపారు. దీనిని రవాణా చేస్తున్న ప్రకాశం జిల్లా కంభం గ్రామానికి చెందిన షేక్ ఇంతియాజ్, సింగరాయికొండకు చెందిన షేక్ అబ్దుల్, ఏఎస్ఆర్ జిల్లా రంపచోడవరం మండలం సీతంశెట్టినగర్కు చెందిన సంకురు బుచ్చిరెడ్డి, రెడ్డీపేట సంతమార్కెట్కు చెందిన ముర్ల చిన్నారెడ్డి, బూసిగ్రామానికి చెందిన ఉలుగుల రవికిరణ్రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 సెల్ఫోన్లను స్వాఽఽధీనం చేసుకున్నారు. గంజాయి ఎవరు సరఫరా చేస్తున్నారు, ఎవరికి అమ్ముతున్నారు అనే విషయాలను దర్యాప్తు చేస్తామని ఎస్పీ డి.నరసింహాకిశోర్ తెలిపారు. నార్త్జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ పర్యవేక్షణలో గంజాయి పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రాజానగరం సీఐ వీరయ్యగౌడ్, ఎస్సై పి.మనోహర్, కానిస్టేబుల్స్ రమణ, నాగేశ్వరరావు, కరీముల్లాఖాదర్లను ఎస్పీ అభినందించారు. -
నిమ్మకు తెగుళ్ల బెడద
పెరవలి: జిల్లాలో నిమ్మపంట 720 హెక్టార్లలో సాగు జరుగుతుండగా వివిధ రకాల తెగుళ్లు ఆశించి ఉండటంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడి, తోటలు పాడైపోతున్నాయి. ముఖ్యంగా ఈ పంటపై ఆకు ముడత, పండ్ల రసాన్ని పీల్చే రెక్కల పురుగులు, బంక, వేరుకుళ్లు, గజ్జి, మొజాయిక్ తెగుళ్లు ఆశించి ఉన్నాయి. ఈ తెగుళ్ల నివారణకు రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు గురించి కొవ్వూరు ఉద్యాన అధికారి (ఏడీఏ) సీహెచ్ శ్రీనివాస్ వివరించారు. ఆకుముడత : ఈ తెగులు ఎక్కువగా లేత చిగుర్లపై ఆశించి ఆకులపై తెల్లటి పొరలు వంకర టింకరగా ఏర్పడి ఆకులు ముడుచుకునేలా చేస్తుంది. తద్వారా ఆకులపై గజ్జి తెగులు ఎక్కువగా వ్యాప్తి చెంది ఆకులు రాలిపోతాయి. నివారణ చర్యలు : ఆకులు ముడతలు పడినట్లు గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. డైమిథోయేట్ 2 మిల్లీ లీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.5మిల్లీ లీటర్లు మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉంటే 10 రోజుల వ్యవధిలో రెండవసారి పిచికారీ చేయాలి. తెల్లపొలుసు పురుగులు : ఈ పొలుసు పురుగులు ఎక్కువగా కాండంపై ఆశించి సున్నం పూసినట్లుగా కనపడతాయి. ఇవి కాండం, కొమ్మలలో రసాన్ని పీల్చివేయటం వల్ల అవి ఎండిపోతాయి. నివారణ చర్యలు : ఈ పురుగులు ఆశించిన చోట గోనె సంచితో బాగా రుద్ది మిధైల్డెమటాన్ లేదా డైమిథోయేట్ 2 మిల్లీ లీటర్లు మందును లీటరు నీటిలో కలిపి కాండం, కొమ్మలపై పిచికారీ చేయాలి. నల్లి పురుగులు : నల్లి పురుగుల్లో ఆకుపచ్చ నల్లి, మంగు నల్లి ముఖ్యమైనవి. ఆకునల్లి ఆకులపైన, మంగునల్లి కాయలపైన ఆశించి రసాన్ని పీల్చివేస్తాయి. దీనివల్ల కాయలపై చిన్న చిన్న తెల్లని మచ్చలు లేదా ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కాయ అంతటా మంగు ఏర్పడుతుంది. నివారణ చర్యలు : నీటిలో కరిగే గంధకం 3గ్రాములు లేదా డైకోఫాల్ 5.0 మిల్లీ లీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే నివారణ అవుతుంది. రసం పీల్చే రెక్కల పురుగులు : ఈ రెక్కల పురుగులు పండ్లపై రంథ్రాలు చేసి కాయలో ఉండే రసాన్ని పీల్చుతాయి. దీంతో కాయలకు చేసిన రంథ్రాల ద్వారా శిలీంద్రాలు, బ్యాక్టీరియా చేరి పండ్లు కుళ్లి, రాలిపోతాయి. పండ్లపై డాగు ఏర్పడుతుంది. నివారణ చర్యలు : ఈ పురుగులు ఆశించి కుళ్లి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. పురుగులను నాశనం చేయటానికి మలాథియాన్ ఒక మిల్లీలీటరు మందుకు ఒక శాతం పంచదార, పండ్ల రసం కలిపి చెట్ల కింద అమర్చాలి. పురుగులను ఆకర్షించటానికి బల్బులను ఏర్పాటు చేయాలి. దీని ద్వారా పురుగులను అరికట్టవచ్చు. పురుగుల నుంచి కాయలను రక్షించటానికి కాయలకు బుట్టలను ఏర్పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బంక తెగులు : బంక తెగులు రెండు రకాలు ఒకటి ఫెటోఫ్తోరా, రెండు డిఫ్లోడియా. మొదటి తెగులు ఆశించిన చెట్టు నుంచి ధారాళంగా బంక కారుతుంది. ఇది చెట్టు వేళ్లకు, మొదలు కింది భాగానికి పరిమితమై ఉంటుంది. డిఫ్లోడియా బంక తెగులు చెట్టు మొదలు పైభాగాన కొమ్మల పంగల్లో ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు ఎక్కువగా ఉంటే బంక కారటం, బెరడు కుళ్లటం జరుగుతుంది. నీరు త్వరగా ఇంకని భూముల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుంది. నివారణ చర్యలు : బంక కారి కుళ్లిన బెరడును పూర్తిగా తొలగించి బోర్డోపేస్టు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ పేస్టు పూయాలి. ఈ పేస్టును మొదలు చుట్టూ పూయాలి. కొమ్మలపై వచ్చే బంక తెగులు నివారణకు లీటరు నీటికి 1గ్రాము కార్బండజిమ్ కలిపి చెట్టు మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి. మెటలాక్సిల్ 2 గ్రాములు లీటరు నీటిలో కలిపి చెట్టు మొదలులో పోయాలి. వేరుకుళ్లు తెగులు : వేరుకుళ్లు తెగులు ఆశించిన చెట్టుకు పోషక పదార్థాలు అందక చెట్లు ఎండిపోతాయి. ఈ తెగులు ఆశించిన చెట్లు ఎక్కువ పూతపూసి కాయలు ముదిరే లోగా చెట్లు వాడి ఎండిపోతాయి. ఎండిన చెట్ల వేర్లను పరీక్షిస్తే కుళ్లిన వాసన వస్తుంది. నివారణ చర్యలు : వ్యాధి సోకిన తొలి దశలోనే గమనించి చెట్టుకు ఎక్కువగా నీరు కట్టి మరుసటి రోజు కార్బండజిమ్ 2 గ్రాములు లేదా మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా చెషంట్ 3 గ్రాములు లేదా ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి చెట్టు చుట్టూ నేల తడిసేలా పిచికారీ చేయాలి. చెట్టుకి కావలిసిన పోషక పదార్థాలు సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్ట ద్వారా అందించాలి. ఒక కిలో ట్రైకోడెర్మా మందును 90 కిలోల పశువుల ఎరువు 10 కిలోల వేపపిండితో కలిపి 15 రోజులు మాగపెట్టి చెట్టు మొదలు చుట్టూ వేయాలి. ఇలా చేస్తే చెట్టును ఈ తెగులు నుంచి కాపాడవచ్చు. గజ్జి తెగులు (కాంకర్ మచ్చ) : నిమ్మ పంటపై ఎక్కుగా ఆశించే తెగులు ఈ గజ్జి తెగులు. ఇది కాయలు, ఆకులు, చిన్న, పెద్ద కొమ్మలను ఆశిస్తుంది. తెగులు ప్రభావం అధికంగా ఉంటే చెట్లు ఎండిపోయి చనిపోతాయి. నివారణ చర్యలు : ఈ తెగులు సోకి ఎండిన కొమ్మలను కత్తిరించి స్ట్రెప్టోసైక్లిన్ ఒక గ్రాము, 30 గ్రాములు బ్లైటాక్స్ మందును 10 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. గజ్జి ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని గోకి బెరడును తీసి వేసి బోర్డోపేస్టును పూయాలి. -
బెట్టింగ్ల మోజులో యువత
జీవితాలు బలైపోతాయని హెచ్చరిస్తున్న పోలీసులు రాజానగరం: అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పొందుతున్న విజ్ఞానాన్ని సమాజ హితం కోసం కాకుండా తప్పుడు మార్గాలలో సంపాదనలకు కొంతమంది స్వార్థపరులు ఉపయోగిస్తుంటే, వాటికి ఆకర్షితులై కొంతమంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా తమ బిడ్డలు ఉన్నతంగా ఉండాలి, ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేయాలనే ఆశతో చాలామంది తల్లిదండ్రులు తమ కడుపులు మాడ్చుకుని, అప్పులు చేసి మరీ పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో దూర ప్రాంతాలలోని కళాశాలలలో చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు హాస్టల్స్లో ఉంటూ చదువులు సాగిస్తుంటారు. అయితే ఇటువంటి వారిలో కొంతమంది చెడు స్నేహాలతో కన్నవారి ఆశలను వమ్ము చేయడమే కాకుండా, తమ బంగారు జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. బ్రిడ్జి కౌంటీ కేంద్రంగా ... విద్యా, వ్యాపార రంగాలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న రాజమహేంద్రవరం సమీపంలో ఇంజినీరింగ్, వైద్య కళాశాలలు అనేక ఉండటంతో యాప్ల ద్వారా బెట్టింగ్లు నిర్వహించే వ్యక్తులు ఈ ప్రాంతాన్నే తమ కేంద్రంగా చేసుకుని, బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న బ్రిడ్జి కౌంటీలో 12 మంది నిందితులు పట్టుబడ్డారు. చేపల చెరువుల ద్వారా ఆర్థికంగా నష్టపోయిన భీమవరానికి చెందిన దండు వెంకటవర్మ అనే సంతోష్ (31), కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్కు చెందిన ఇమ్మంది భరత్కుమార్ (34)తో కలిసి బ్రిడ్జి కౌంటీలోని బి–12 విల్లాను అద్దెకు తీసుకుని, కొన్ని నెలలుగా క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరినీ అడ్మిన్లుగా చేసుకుని, భీమవరం నుంచి దుబాయ్ వెళ్లిన వినీత్ అనే మరో వ్యక్తి కీ రోల్ పోషిస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బ్రిడ్జి కౌంటీలో ఇటువంటి కార్యకలాపాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి వాటి గురించి సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేసి, సహకరించాలని నార్త్ జోన్ డీఎస్పీ వై. శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. తప్పుడు మార్గాలలో పయనించి, జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు ఆయన హితవు పలికారు. హాస్టల్స్లో ఉంచి చదివిస్తున్న తమ పిల్లల ప్రవర్తనలపై తల్లిదండ్రులు కూడా నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. క్రికెట్ బెట్టింగ్లే అధికం సమాచారం కోసం కనుగొన్న సెల్ఫోన్ నేడు అందరికీ జీవితంలో ఒక భాగమైపోయింది. చిన్నపిల్లల నుంచి పండు ముదుసలి వరకు సెల్ఫోన్ ముట్టుకోకుండా రోజుగడవడం లేదనడం అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో ఇక విద్యార్థుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో పేకాట, గుండాటల తరహాలోనే ఆన్లైన్లో అనేక రకాల యాప్లు హల్చల్ చేస్తున్నాయి. అనేక మంది వాటికి ఆకర్షితులవుతున్నారు. తెలిసీ తెలియని పరిజ్ఞానంతో వారి బ్యాంకు అకౌంట్ల వివరాలు అపరిచితులకు తెలియజేయడమే కాకుండా తల్లిదండ్రుల అకౌంట్లను కూడా కొల్లగొట్టేందుకు తోడ్పడుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది అమాయకులు భయంతో బయటకు చెప్పుకోలేక, తల్లిదండ్రులకు తెలిస్తే ఏమవుతుందోననే భయంతో జీవితాలను అర్ధంతరంగా ముగించుకునే పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. ఇటువంటి వాటిలో క్రికెట్ బెట్టింగ్లే ఎక్కువగా ఉన్నాయి. బార్బర్ షాపులలో కూడా టీవీలను పెట్టుకుని, యాప్ల ద్వారా బెట్టింగులు నిర్వహిస్తున్నారు. వీటిని నిరోధించేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నించినా, సరైన ఫలితాలు కనిపించడం లేదు. -
నేడు వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. జిల్లాలో ఎక్కడికక్కడ పార్టీ జెండాలను నేతలు ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా సభలు, సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వైఎస్సార్ సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రతి గ్రామంలోను ప్రజాప్రతినిధులు, నేతలు, శ్రేణులు సమష్టిగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నాయకులు దగ్గరుండి పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడలోని వైఎస్సార్ సీపీ సిటీ కార్యాలయంలో జిల్లా స్థాయిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ బలోపేతానికి సలహాలివ్వాలి కాకినాడ సిటీ: ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు అవసరమైన సలహాలు, సూచనలు ఈ నెల 31వ తేదీ నాటికి అందజేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో నూతన సంస్కరణలు తీసుకొచ్చే లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నుంచి సూచనలు సలహాలు ఆహ్వానించిందన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, 1951, ఓటర్ల నమోదు నియమాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి వంటి అంశాలపై సూచనలు అందజేయవచ్చన్నారు. వచ్చిన సూచనలు, సలహాలపై భారతీయ ఎన్నికల సంఘం ఏప్రిల్ 30న అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చిస్తుందని కలెక్టర్ తెలిపారు. టెన్త్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకూ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. విద్యార్థులు వారి హాల్ టికెట్టు చూపించి, పరీక్ష తేదీల్లో ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జనసేన నాయకుడి దాడిపై నివేదిక ఇవ్వండి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశం కరప: స్థానిక మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయం విద్యార్థులపై జనసేన పార్టీ నాయకుడు భోగిరెడ్డి గంగాధర్ దాడి చేసిన ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. ఈ నెల 4న గురుకుల విద్యాలయం విద్యార్థులపై గంగాధర్ పిడిగుద్దులతో దాడి చేయడం, బూటు కాలితో తన్నడంపై రెండు రోజులుగా పత్రికల్లో వస్తున్న వార్తలపై కమిషన్ చైర్మన్ కె.అప్పారావు, సభ్యురాలు టి.ఆదిలక్ష్మి స్పందించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి, నివేదిక ఇవ్వాలని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి (డీసీపీఓ) వెంకట్, ఐసీడీఎస్ సీడీపీఓ వై.లక్ష్మి, పీఓ ఎన్ఐసీ శ్రీనివాస్లను ఆదేశించారు. ఈ మేరకు ఆ అధికారులు మంగళవారం గురుకుల విద్యాలయానికి చేరుకుని, టెన్త్ విద్యార్థులను, సిబ్బందిని విచారించారు. ప్రిన్సిపాల్ కృష్ణారావు సమక్షంలో గంగాధర్, పోలీసు కానిస్టేబుల్తో కలసి వచ్చి తమపై దాడి చేసి, బూటు కాలితో తన్నాడని విద్యార్థులు చెప్పారు. విద్యార్థులను కొట్టడం చూశామని కొంత మంది సిబ్బంది చెప్పగా, చూడలేదని మరి కొంత మంది చెప్పారు. విచారణ అనంతరం సంబంధిత నివేదికను ఆయా అధికారులు కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారులకు అందజేశారని తెలిసింది. -
పీజీఆర్ఎస్కు 594 అర్జీలు
కాకినాడ సిటీ: ప్రతి వారం ప్రజల నుంచి అందుతున్న వినతులకు అధిక ప్రాధాన్యమిచ్చి సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ రాహుల్మీనా అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (పీజీఆర్ఎస్) సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో జరిగింది. ఆయన అధికారులనుద్దేశించి మాట్లాడారు. అందిన వినతులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. వివిధ శాఖల్లో నమోదైన అర్జీలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అర్జీదారుని సమస్యకు పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. రెవెన్యూ, పింఛన్లు, బియ్యం కార్డు మంజూరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు, ఆక్రమణలు తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, సదరం సర్టిఫికెట్ మంజూరు వంటి అంశాలకు చెందిన మొత్తం 594 అర్జీలు అధికారులు స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, కేఎస్ఈజెడ్ ఎస్డీసీ కేవీ రామలక్ష్మి, సీపీవో పి త్రినాథ్, పీడీ శ్రీధర్ పాల్గొని అర్జీలు స్వీకరించారు. సత్యదేవుని ఆలయానికి భక్తుల తాకిడిఅన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయం ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం వేలాదిగా వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, విశ్రాంతి మండపాలు అన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా స్వామివారి వ్రతాలు 1,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 30 లక్షలు ఆదాయం సమకూరింది. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో నాలుగు వేల మందికి భోజన సౌకర్యం కల్పించారు. సత్యదేవునికి ఘనంగా ఏకాదశి పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన, ఉదయం తొమిది గంటల నుంచి 11 గంటల వరకు పుష్పార్చన నిర్వహించారు. ముత్యాల కవచాల అలంకరణలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతీ రోజు స్వర్ణాభరణాలు, వజ్ర కిరీటాలతో భక్తులకు దర్శనమిచ్చే స్వామి, అమ్మవారు ప్రతీ సోమవారం ముత్యాల కవచాలతోను, ప్రతీ గురువారం ఏ విధమైన ఆలంకరణలు లేకుండా నిజరూపంలో దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. -
ప్రభుత్వానికి కనువిప్పు కలిగిద్దాం
తుని రూరల్: యువత పోరుతో చంద్రబాబునాయుడి ప్రభుత్వానికి కనువిప్పు కలిగిద్దామని, ఈ నెల 12న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యువత పోరు జయప్రదం చేయాలని ఆ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. సోమవారం తుని మండలం ఎస్.అన్నవరం పార్టీ కార్యాలయంలో నాయకులతో కలసి ఆయన యువత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు తరపున వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో అన్ని జిల్లాల కేంద్రాల్లో యువత పోరు నిరసన గళం వినిపిస్తామన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళమెత్తుతామన్నారు. యువత పోరు విజయవంతం చేసేందుకు మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఐదు త్రైమాసికాల ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు భృతి, తల్లికి వందనం బకాయిలు రాబట్టేందుకు ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా వెంట నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా నడుద్దామని ఆ పార్టీ నాయకుడు యనమల కృష్ణుడు అన్నారు. విద్యార్థులను, ప్రజలను, రైతులను మోసగించేలా చంద్రబాబు పాలన సాగుతోందన్నారు. నాయకులు పోతల రమణ, సకురు నాగేంద్ర నెహ్రూ, నాగం దొరబాబు, అంగుళూరి సుశీల రాణి. పార్టీ,మూడు మండలాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. బాబు అనుయాయులకు మెడికల్ కాలేజీలు కట్టబెట్టే యత్నం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో వైద్య విద్యార్థుల భవిష్యత్ కోసం తలపెట్టిన 17 మెడికల్ కాలేజీలను తన మనుషులకు (అనుయాయులకు) కట్టబెట్టేందుకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాకినాడ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆరోపించారు. సోమవారం కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరంలో తన కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైద్య విద్యార్థుల భవిష్యత్ కోసం ఒక్కొక్కటి రూ.వెయ్యి కోట్ల చొప్పున మొత్తం రూ.17వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే 17 వైద్య కళాశాలల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. 50శాతానికి పైగా నిర్మాణ పనులు జరిగాయన్నారు. చంద్రబాబు తన సొంత ఆస్తిలా తన మనుషులకు కారు చౌకగా కట్టబెట్టేందుకు యత్నిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతున్నా మేధావులు, విద్యావేత్తలు ఏం చేస్తున్నారని, ఎందుకు మౌనంగా ఉంటున్నారని అన్నారు. ఎల్లో మీడియాను చూసి నిర్లిప్తంగా ఉంటున్నారన్నారు. 17 మెడికల్ కళాశాలలు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు చెందిన ఆస్తి. ఆ ఆస్తిని తన తాబేదార్లకు కారుచౌకగా కట్టబెందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేధావులు, విద్యావంతులు, ప్రజలు గళమెత్తి, బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో ఉంచాలన్నారు. ప్రైవేటీకరణ విధానాన్ని అడ్డుకునేందుకు వైఎస్సార్ సీపీ ముందుంటుందన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఎస్.అన్నవరంలో యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ -
తలుపులమ్మకు బంగారు హారం
తుని రూరల్: లోవ తలుపులమ్మ అమ్మవారికి కాకినాడకు చెందిన భక్తులు కోకా వెంకట కోటేశ్వరఫణి, మైథిలి దంపతులు బంగారు హారాన్ని సమర్పించారు. సోమవారం లోవ దేవస్థానానికి వచ్చిన వారు ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజుకు 102 గ్రాముల 575 మిల్లీ గ్రాముల బరువుగల హారాన్ని అందజేశారు. వేద పండితులు, ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదాశీర్వచనం చేశారు. వీరిని అమ్మవారి శేషవస్త్రాలతో ఈఓ సత్కరించి, ప్రసాదాలు అందజేశారు. రాయచోటి ఘటనలో బాధ్యులను శిక్షించాలి కాకినాడ సిటీ: హిందూవుల ఉత్సవాల్లో పోలీసుల జోక్యం, ఆంక్షలు పెంచడాన్ని సహించబోమని, రాయచోటి సంఘటనలో బాధ్యులను శిక్షంచాలంటూ కాకినాడ జిల్లా వీహెచ్పీ, హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి, కలెక్టర్ షణ్మోహన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈనెల 4వ తేదీన వీరభద్రస్వామి ఉత్సవంలో హిందూవులపై ముస్లింలు చేసిన దాడిలో ముస్లింలను అదుపు చేయడంలో పోలీసులు హిందువులపై లాఠీ చార్జీ చేయడం దారుణమన్నారు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరించి హిందూవులపై కేసులు బనాయించారన్నారు. దీనిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో నిరసన ర్యాలీలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రికి అందేలా కలెక్టర్ షణ్మోహన్కు వినతిపత్రం అందజేసినట్టు ఆందోళనకారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రాంత సేవా ప్రముఖ్ కేశవయ్య మాట్లాడారు. విశ్వహిందూ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు రవిశంకర్ పట్నాయక్, బిక్కిన విశ్వేశ్వరరావు, గట్టి సత్యనాఆరయణ, మాలకొండయ్య, కృష్ణమోహన్, తుమ్మల పద్మజ, చోడిశెట్టి రమేష్బాబు, పైడా రవీంద్ర వెంకట్, కె అప్పాజీ, చెక్కా రమేష్, పద్మ, కమల, ఉమామహేశ్వరి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టర్ షణ్మోహన్ స్పందిస్తూ మంచి పనులకు ఎప్పుడూ సహకరిస్తామన్నారు. ఇకపై డ్రోన్ భద్రత పోలీస్ శాఖ సేవల కోసం 13 డ్రోన్లు కాకినాడ క్రైం: జిల్లా పోలీస్ శాఖ శాంతి భద్రతల పర్యవేక్షణలో కీలక ముందడుగు వేసింది. భద్రతను డ్రోన్ల సాయంతో మరింత బలోపేతం చేయనుంది. అందులో భాగంగా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడలోని జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ షణ్మోహన్ ముఖ్య అతిఽథిగా హాజరై విభాగాల వారీగా ఎస్హెచ్వోలు, ఇన్స్పెక్టర్లకు డ్రోన్లు అందజేశారు. ఈ డ్రోన్లు ఆయా స్టేషన్ల పరిధిలో భద్రత, నిఘా కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించనున్నాయి. రూ.24 లక్షల వ్యయంతో ఈ డ్రోన్లు అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు. విజిబుల్ పోలీసింగ్ విత్ ఇన్విజిబుల్ పోలీస్ నినాదంతో డ్రోన్ల పాత్ర శాంతిభద్రతల పర్యవేక్షణలో కీలకం కానుందని కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. -
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
సామర్లకోట: న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ సమస్యలను, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని చలో విజయవాడకు అంగన్వాడీ కార్యకర్తలు పిలుపునిస్తే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని సీఐ ఎ కృష్ణభగవాన్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం సామర్లకోటలో అడ్డుకున్నారు. పట్టణ, మండలంలోని ముఖ్య కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ చలో అమరావతి కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులతో తమను అడ్డుకోవడం దారణమన్నారు. ఎన్నికల ముందు 42 రోజుల పాటు సుదీర్ఘ నిరాహార దీక్షల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరిస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోనికి వచ్చి 10 నెలలు గడుస్తున్నా తమ సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కనీస వేతనాలు, గ్రాడ్యూటీ అమలు చేయాలని, యాప్ల పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల ధర్నా కాకినాడ సిటీ: అంగన్వాడీలకు కనీస వేతనాలు చెల్లించాలంటూ విజయవాడలో జరిగే శాంతియుత ధర్నాకు బయలుదేరిన అంగన్వాడీలను తుని, సామర్లకోట ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు దువ్వా శేషుబాబ్జీ, శంఖవరం రాజేశ్వరి, పిఠాపురం గంగాభవానిలు మాట్లాడుతూ చారిత్రక 42 రోజుల అంగన్వాడీల సమ్మె సందర్భంగా శిబిరాల వద్దకు వచ్చి కూటమి ప్రభుత్వం రాగానే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి పది నెలలు గడుస్తున్నా జీతాలు పెంచకపోవడాన్ని తప్పుపట్టారు. బతికుండగా వేతనాలు పెంచకుండా, చనిపోయాక మట్టి ఖర్చులు రూ.20 వేలు ఇస్తామని అంగీకరించి, రూ. 15 వేలు చెల్లించేలా జీవో ఇచ్చినందుకు కూటమి నేతలు సిగ్గుపడాలన్నారు. సుప్రీంకోర్టు చెప్పినట్లు అంగన్వాడీలకు గ్రాడ్యూటీ చట్టాన్ని అమలు చేయకుండా, రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రకటించి చేతులు దులుపుకుంటామంటే ఒప్పుకునేది లేదన్నారు. సెంటర్ అద్దెలు, వంట ఖర్చులు నెలల తరబడి బకాయిలు పెడితే ఇచ్చే 11 వేల వేతనం వీటికి సరిపోతుండగా, కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. తక్షణం అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, మొబైల్ యాప్ పనిభారాన్ని తగ్గించాలని, సుప్రీంకోర్టు చెప్పినట్లుగా గ్రాడ్యూటీ చట్టాన్ని అమలు చేయాలని, మినిట్స్లో అంగీకరించిన అంశాలన్నింటికీ జీవోలు విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకులు చెక్కల రాజ్కమార్, మలకా రమణ, పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, అంగన్వాడీలు సత్యవతి, వీరవేణి, నారాయణమ్మ, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి పాల్గొన్నారు. చలో విజయవాడను అడ్డుకున్న పోలీసులు అనేకమంది హౌస్ అరెస్టులు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,000 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక
కాకినాడ సిటీ: హోప్ ఐలాండ్లో ఎకో టూరిజంని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందుమాధవ్, అటవీశాఖ అధికారి ఎ.రవీంద్రనాథ్రెడ్డి, పోరుట అధికారి కెప్టెన్ ధర్మశాస్త్ర, అటవీ, పర్యాటక, మత్స్య, మైరెన్ పోలీస్ శాఖల అధికారులతో కలిసి హోప్ ఐలాండ్లో పర్యటించిన సందర్భంగా ఆయన అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాకినాడ సముద్ర తీరంలో ఉన్న రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం కార్యాలయం నుంచి హోప్ఐలాండ్కు చేరుకుని అక్కడి ప్రదేశాలను పరిశీలించారు. ఎకో టూరిజం అభివృద్ధికి అనువుగా ఉన్న పరిస్థితులు, హోప్ఐలాండ్ పరిధి, మడ అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, సందర్శకులకు బోటింగ్ సౌకర్యం ఇతర అంశాలనుకలెక్టర్ షణ్మోహన్ ఆయా శాఖల అధికారులతో చర్చించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. హోప్ఐలాండ్ ప్రాంతాన్ని పర్యాటక రంగానికి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. ఇందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి కె.కరుణాకర్బాబు, ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, సెక్షన్ అధికారి ఎం. నాగార్జున, అసిస్టెంట్ టూరిజం అధికారి వి.త్రిమూర్తులు, వాటర్ ప్లీట్ అసిస్టెంట్ మేనేజర్ గంగాబాబు, పోర్ట్ సీఐ పి సునీల్కుమార్, మైరెన్ ఎస్ఐ పి సురేష్ పాల్గొన్నారు. కలెక్టర్ షణ్మోహన్ -
ఆ ఇద్దరికీ ఆశాభంగం!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తెలుగుదేశం పార్టీలో కొమ్ములు తిరిగిన జిల్లా నేతలకు చంద్రబాబు, పవన్కల్యాణ్ కూడబలుక్కుని చెక్ పెట్టారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కేటాయింపులో ఇద్దరు నేతలకు నిరాశ ఎదురైంది. టీడీపీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, పవన్ కోసం పిఠాపురాన్ని త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మను రాజకీయంగా తొక్కేస్తున్నారు. మాటల గారడీతో నమ్మించి, పని అయిపోగానే కరివేపాకులా తీసి పడేసే చంద్రబాబు తీరుతో ఎమ్మెల్సీ పదవి పందేరంలో ఆ ఇద్దరికీ మొండిచేయి చూపారు. సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి వీరిద్దరు పదవుల కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలానే చంద్రబాబు నమ్మించి నట్టేట ముంచేశారని పార్టీ శ్రేణులే మండిపడుతున్నాయి. వారి ఆశలు సమాధి చేసేందుకు ఒక్కొక్కరికి ఒక కారణం చూపించడంపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. యనమలకు ఇచ్చే గౌరవం ఇదేనా? యనమలను ఎమ్మెల్సీగా కొనసాగిస్తారనుకున్న ఆయన అనుచరవర్గం డీలా పడింది. యనమల కుటుంబంలో ముగ్గురు వివిధ పదవులలో ఉన్నారని సాకు చూపి రామకృష్ణుడిని దూరం పెట్టడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. అలా అనుకుంటే తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రి, కుమారుడు లోకేష్ మంత్రిగా లేరా అని నిలదీస్తున్నారు. కాకినాడ సీపోర్ట్సు లిమిటెడ్ కేవీ రావుకు వ్యతిరేకంగా యనమల లేఖ రాయడం చినబాబు కోపానికి కారణమై చివరకు ఎమ్మెల్సీ రాకుండా చేసిందంటున్నారు. పార్టీకి ఇన్నేళ్లుగా చేసిన సేవలకు ఇప్పుడు ఇచ్చే గౌరవం ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. మరో త్యాగరాజుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ మిగిలిపోయారు. ఈయన పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం సీటును త్యాగం చేశారు. అలా చేయడమే వర్మకు రాజకీయ ప్లాట్ఫాం లేకుండా చేసిందని ఆయన అనుచర వర్గం వాపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ గెలుపొంది, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి టీడీపీలో వర్మ రాజకీయ ప్రాధాన్యాన్ని తగ్గించేస్తూ చివరకు ఉనికే లేకుండా చేశారని వర్మ అనుచరగణం ఆక్షేపిస్తోంది. పిఠాపురం నుంచి పవన్ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి అయ్యాక వర్మను రాజకీయంగా అణగదొక్కేస్తున్నారని టీడీపీ ద్వితీయశ్రేణి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి వ్యూహంతో పావులు కదుపుతున్నారనే విమర్శలున్నాయి. జనసేన శ్రేణులు మొదటి నుంచి వర్మకు పిఠాపురంలో రాజకీయంగా ఉనికి లేకుండా చేస్తామని బహిరంగంగా చెబుతూనే వస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో విజయవాడ పిలిపించుకుని పవన్ కోసం సీటు త్యాగం చేసినందుకు తొలి ఎమ్మెల్సీ ఖాయమని హామీ ఇచ్చారు. ఇప్పటికి రెండు, మూడు పర్యాయాలు ఎమ్మెల్సీల ఎంపిక జరిగినా వర్మకు అవకాశం లేకుండా చేశారంటున్నారు. వర్మ ముందరికాళ్లకు బంధమేస్తూ రాజకీయంగా ఉనికి కోల్పోయే పరిస్థితి తీసుకువస్తున్నారు. ఒకప్పుడు వర్మతో చెట్టపట్టాలేసుకు తిరిగి మారిన రాజకీయ సమీకరణల్లో జనసేనలో చేరిన నేతలు వర్మకు వ్యతిరేకంగా పావులు కదిపి ఎమ్మెల్సీకి మోకాలడ్డారంటున్నారు. వర్మకు ఎమ్మెల్సీ రాకపోవడమనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని పౌరసరఫరాలశాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో వివరణ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదే సందర్భంలో పిఠాపురం పవన్ కల్యాణ్ అడ్డా అని ప్రకటించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎందుకొచ్చిందనే సందేహం పార్టీ కేడర్లో వ్యక్తమవుతోంది. వర్మ వ్యవహారంలో జనసేనకు సంబంధం లేదని నాదెండ్ల సోమవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. పైకి చెబుతున్నదంతా వాస్తవమా కాదా అనేది పక్కనబెడితే వర్మకు రాజకీయంగా ముకుతాడు వేయడమనేది కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నదేనంటున్నారు. దీని వెనుక చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి వ్యూహం లేకపోలేదనే వాదన కూటమిగా జతకట్టిన మూడు పార్టీల్లో బలంగా వినిపిస్తోంది. కేవలం తన సోదరుడు, సినీ నటుడు నాగబాబుకు పిఠాపురంపై పెత్తనానికి లైన్ క్లియర్ చేయడంలో భాగమే ఇదంతా అంటున్నారు. అధ్యక్షుడిగా పార్టీ వ్యవహారాలు, ఉప ముఖ్యమంత్రిగా పరిపాలనా అవసరాలు దృష్ట్యా పిఠాపురాన్ని గాలికొదిలేస్తున్నారనే విమర్శల నేపథ్యంలో సోదరుడిని ఎమ్మెల్సీ చేయడం ద్వారా పిఠాపురం బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో వర్మకు ప్రొటోకాల్ పదవి కల్పిస్తే నియోజకవర్గంలో జనసేన నేతలకు ఎదురయ్యే పరిణామాలపై చంద్రబాబు, పవన్ మధ్య ఒక అవగాహన కుదిరిందనే ప్రచారం పార్టీలో విస్తృతంగా సాగుతోంది. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా మర్రెడ్డి శ్రీనివాస్ నాయకత్వ పటిమపై అపనమ్మకం వెరసి నాగబాబుకే అప్పగించాలనే యోచనతోనే వర్మకు పై స్థాయిలోనే మోకాలడ్డారనే బలమైన వాదన ప్రచారంలో ఉంది. వర్మకు అన్యాయం చేశారంటూ టీడీపీలో ఆయన అనుచరవర్గం మండిపడుతోంది. అసలు పిఠాపురంలో టీడీపీని లేకుండా చేసే కుట్ర జరుగుతోందంటూ పార్టీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఎమ్మెల్సీ ఇస్తామని అన్యాయం చేయడంపై వర్మ అంతర్గతంగా మధనపడుతున్నా పైకి మాత్రం చంద్రబాబుతో 23 ఏళ్లలో ఎన్నో సమస్యలతో పనిచేశానని చెప్పుకొచ్చారు. లోకేష్ ఆదేశాలకు తాను, తన కుటుంబం, పార్టీ నేతలు అండగా ఉంటామని ప్రకటించడం గమనార్హం. ‘బాబు’–పవన్ సమష్టి వ్యూహం వర్మను అడ్డుతొలగించిన జనసేన అంతా పిఠాపురం పెత్తనం కోసమే నాగబాబుకు లైన్ క్లియర్ యనమలకు చెక్ పెట్టిన ‘చినబాబు’ -
మిత్రుల అంకురం.. రైతులకు సంబరం
పిఠాపురం: పంటకు మేలు చేసి, రైతులకు పురుగు మందుల ఖర్చు తగ్గించే మిత్రులుగా భావించే మిత్ర పురుగులు సేంద్రియ వ్యవసాయం పుణ్యమా అని మళ్లీ వాటికి జవజీవాలు సంతరించుకున్నాయి. విచ్చలవిడిగా రసాయనాల వినియోగంతో కనుమరుగైన మిత్ర పురుగులు.. సేంద్రియ వ్యవసాయంతో ఉనికిలోకి వస్తున్నాయి. వీటివల్ల పంటలకు ఎంతో మేలు కలిగి, రైతుకు పైసా ఖర్చు లేకుండానే క్రిమికీటకాలు నివారించబడతాయి. అలాంటి మిత్ర పురుగులు పొలాల్లో కనిపించకుండా పోవడంతో, కీటకాలు పెరిగి, పంటలకు తెగుళ్లు సోకి రైతుకు నష్టాలను మిగులుస్తున్నాయి. ఈ తరుణంలో ప్రకృతి వ్యవసాయం వల్ల పంటలకు మిత్రులు మళ్లీ వస్తుండడంతో రైతులను ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు మేలు సాలీడు, అక్షింతల పురుగు, తూనీగలు, అల్లిక రెక్కల పురుగు, గొల్లభామలను పంటలకు మిత్రులుగా చెబుతారు. ఇవి పంటలకు రక్షణ కవచాలుగా రైతులు పరిగణిస్తుంటారు. కొన్నేళ్లుగా సాగులో రసాయనాలను గణనీయంగా వినియోగించడంతో కనుమరుగైన ఈ పురుగులు.. ప్రకృతి వ్యవసాయం వల్ల, రసాయనాల వినియోగం తగ్గి, మళ్లీ భూమిపై సంచరిస్తూ పంటలకు మేలు చేస్తున్నాయి. ఈ మిత్ర పురుగులు పొలంలో లేకుంటే పంటకు కీడు చేసే పురుగుల తీవ్రత పెరిగి, పంటలకు తీవ్ర నష్టాలను కలిగిస్తాయి. అక్షింతల పురుగు పంటలకు అక్షింతల పురుగు (లేడీ బర్డ్ బీటిల్) చాలా ప్రయోజనకరంగా చెబుతారు. అనేక రకాల కీటకాలను, పేను బంక లాంటి రసం పీల్చే పురుగులకు ఇవి సహజ శత్రువులు. ఒక అక్షింతల పురుగు తన జీవిత కాలంలో సుమారు ఐదు వేల పేనుబంక పురుగులను తింటుంది. గుండ్రంగా కుంభాకారం కలిగి ఉంటుంది. పసుపు, గులాబీ, నారింజ, ఎరుపు, నలుపు రంగుల్లో మచ్చలు కలిగి ఉంటుంది. వీటి లార్వాలు సైతం కీటకాలను వేటాడుతాయి. ఆడ పురుగులు ప్రతి మూడు నెలలకోసారి సుమారు వెయ్యి గుడ్లు పెడతాయి. ఇవి ప్రకాశవంతమైన మచ్చలతో, నలుపు రంగులో ఉండి, ప్రమాదకరమైన దానిగా కనిపించినప్పటికీ పంటకు మాత్రం ఎంతో మేలు చేస్తుంది. ఇవి వదిలే లార్వా ఎటువంటి ప్రమాదకరం కాకపోవడంతో పంటకు మేలు మినహా, కీడు అనేది ఉండదు. అనేక వారాల పాటు పంటలపై ఉండి కీటకాలను తినడం ద్వారా రైతులు కీటకాల నివారణకు పురుగు మందులు పిచికారీ చేసే అవసరం లేకుండా, పెట్టుబడి, శ్రమ చాలా తగ్గుతుంది. అల్లిక రెక్కల పురుగు ప్రకృతిలో అల్లిక రెక్కల పురుగు (గ్రీన్ లేస్ వింగ్ బగ్) విరివిగా కనిపించే ఓ సాధారణ రెక్కల పురుగు. కానీ ఇది పంటలకు చేసే మేలు అంతా ఇంతా కాదు. గొంగళి పురుగులు, లీవ్ ఆఫర్స్, బిలివర్స్, వైట్ ఫ్లైస్ వంటి ఇతర మృదువైన శరీరం కలిగిన కీటకాలను నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. లేత ఆకుపచ్చ రంగులో, సున్నితమైన రెక్కలతో ఉండే ఈ పురుగు వదిలే లార్వా ఇతర కీటకాలను నాశనం చేస్తాయి. పంటలు నాశనం చేసే కీటకాలకు దీనిని బద్ధ శత్రువుగా చెబుతారు. తూనీగ పొడవైన శరీరం కలిగి, కళ్లు, రెండు జతల బలమైన రెక్కలు కలిగి, వివిధ రంగుల మచ్చలతో ఉండే తూనీగ (డ్రాగన్ ఫ్లై) 95 శాతం కీటకాలను వేటాడతాయి. అందుకే దీనిని డెడ్లీ హంటర్ అని కూడా అంటారు. కచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించేవిగా చెబుతారు. ఇవి ఒకే వేసవిలో వేలాది కీటకాలను పట్టుకుని తింటాయి. దోమలు, ఈగలు, తెల్లదోమలను తిని పంటలకు మేలు చేకూరుస్తాయి. సాలీడు సాధారణ పంటలకు సోకే తెగుళ్ల నియంత్రణకు సాలీడు (స్పైడర్) జీవ ఏజెంట్లుగా పని చేస్తాయి. ఇవి అనేక సజీవ కీటకాలను తింటాయి. చీడపీడలను నియంత్రించడంలో వీటిని మించిన పురుగు మరొకటి లేదంటారు. కేవలం శత్రు కీటకాలను తినడం మినహా, పంటకు కానీ, మొక్కలకు కానీ ఎటువంటి హానీ చేయకపోవడం వల్ల మిత్ర పురుగుల్లో ఇది తొలి స్థానంలో ఉంది. దోమలు, ఈగలు, తెల్లదోమలు, ఎగిరే కీటకాలను పట్టుకుని తినడం ద్వారా ఇవి పంటలకు మేలు చేస్తాయి. గొల్లభామ పంటలకు గొల్లభామ (ప్రేయింగ్ మ్యాంటీస్)లను ఆస్తులుగా చెబుతారు. తెగుళ్ల నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. పునుబంక, ఆస్త్రరాగస్ బీటిల్స్, గొంగళి పురుగు, బీటిల్స్, తేనెమంచు పురుగు తదితర వాటిని తిని పంటలకు హాని కలగకుండా నివారిస్తాయి. ఇవి పుప్పొడి మకరందాన్ని తీసుకోవు. కానీ వీటిని ఉత్పత్తి చేసే మొక్కలు గొల్లభామలు తినే ఆహారాలైన కీటకాలను ఆకర్షిస్తాయి. వీటివల్ల పంటలకు చాలా మేలు కలుగుతుంది. పంటకు రక్షకులు.. కీటకాలకు శత్రువులు రసాయనాల వినియోగంతో కనుమరుగు ప్రకృతి వ్యవసాయంతో మిత్ర పురుగులకు జీవం సేంద్రియ పంటల్లో వాటి ప్రాముఖ్యమెంతో.. మిత్ర పురుగులు మళ్లీ వచ్చాయి గతంలో ఎక్కడ చూసినా మిత్ర పురుగులు కనిపించేవి. కానీ రసాయనాల వినియోగం వల్ల అవి కనుమరుగయ్యాయి. ముఖ్యంగా పొలాల్లో అస్సలు కనిపించడం లేదు. కానీ సేంద్రియ వ్యవసాయం మొదలయ్యాక వాటి మనుగడ మళ్లీ ప్రారంభమైంది. రైతు ఎటువంటి పురుగు మందులు వాడకుండా, 70 శాతం వరకు ఇవి పంటలకు హాని చేసే కీటకాలను నాశనం చేసి, పంటకు మేలు చేస్తాయి. ఇప్పుడు ఇవి భారీగా కనిపిస్తున్నాయి. తెగుళ్లు తగ్గుముఖం పట్టాయి. రైతుకు పెట్టుబడి తగ్గింది. ఇది చాలా శుభపరిణామంగా చెప్పవచ్చు. – గుండ్ర శివచక్రం, ప్రకృతి వ్యవసాయ రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం ప్రకృతి వ్యవసాయ ఫలితమే.. కొన్నేళ్లుగా చేపట్టిన ప్రకృతి వ్యవసాయ సాగు ఫలితమే మిత్ర పురుగుల మనుగడకు అంకురం. ప్రస్తుతం సేంద్రియ పంటలన్నింటి పైనా ఈ పురుగులు సంచరిస్తున్నాయి. తద్వారా కీటకాల బెడద గణనీయంగా తగ్గింది. పురుగు మందుల అవసరం లేకుండా పోయింది. పంటలకు మంచి రోజులు వచ్చాయనడానికి నిదర్శనమే మిత్ర పురుగుల సంచారం. ఇది మారుతున్న వ్యవసాయ విధానాల్లో శుభపరిణామంగా చెప్పవచ్చు. – ఎలియాజరు, డీపీఎం, ప్రకృతి వ్యవసాయ శాఖ, కాకినాడ -
రహదార్లపై మృత్యు తాండవం
కిర్లంపూడి: ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఆగి ఉన్న టిప్పర్ను బైకిస్ట్ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందినట్టు కేసు నమోదు చేశామని కిర్లంపూడి ఏఎస్సై కుమార్ తెలిపారు. ఆయన వివరాల మేరకు, చిల్లంగా గ్రామానికి చెందిన కొప్పన అప్పారావు(29) తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి వీరవరంలో అత్తారింటికి మోటార్ బైక్పై బయలుదేరాడు. రాజుపాలెం వంతెన అవతల వైపు మోటార్ బైక్ అదుపుతప్పి ఆగి ఉన్న టిప్పర్ వెనుక భాగంలో ఢీకొనడంతో, అతడి తలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య, పాప, బాబు ఉన్నారు. భార్య విశాలాక్షి ఇచ్చిన ఫిర్యాదు మేకు కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై తెలిపారు. రోడ్డుపై ఆందోళన కగా నిబంధనలకు విరుద్ధంగా టిప్పర్ను రోడ్డుపై ఆపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని మృతుడి బంధువులు, గ్రామస్తులు ఆరోపించారు. మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఆందోళనకు ఉపక్రమించారు. దీంతో కిర్లంపూడి–సామర్లకోట రోడ్డుపై సుమారు 4 గంటల సేపు ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పెద్దాపురం ఎస్డీపీఓ శ్రీహరిరాజు, జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్సై రాఘనాథరావు అక్కడకు చేరుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. బైక్ అదుపుతప్పి.. ముమ్మిడివరం: మోటార్ సైకిల్పై వెళుతున్న ఇద్దరు యువకులు రోడ్డుపై ఆబోతు అడ్డురావడంతో అదుపు తప్పి కిందపడ్డారు. దీంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని అనాతవరం 216 జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన మల్లిపూడి ప్రవీణ్కుమార్ (28), సత్యప్రకాష్ ద్విచక్ర వాహనంపై కాకినాడ నుంచి సొంతూరుకు పయనమయ్యారు. అనాతవరం వద్ద జాతీయ రహదారిపై అడ్డొచ్చిన ఆబోతును బైక్తో ఢీకొన్నారు. ఈ ఘటనలో ప్రవీణ్కుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాల పాలైన సత్యప్రకాష్ను అమలాపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. లారీ ఢీకొని వివాహిత మృతి రావులపాలెం: ఊబలంకలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వందే విజయకుమారి(40) మృతి చెందారు. ఎస్సై నాయుడు రాము వివరాల మేరకు, ఆత్రేయపురం మండలంలోని కట్టుంగకు చెందిన విజయకుమారి భర్త రమేష్బాబుతో కలిసి అమలాపురంలో చదువుతున్న తన కుమార్తెను చూసేందుకు మోటార్ బైక్పై వెళ్లారు. సోమవారం సాయంత్రం తిరుగు పయనమయ్యారు, స్థానిక వినాయకుని ఆలయం వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి లారీ వారి బైక్ను ఢీకొంది. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోగా, విజయకుమారి పైనుంచి లారీ దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. సీఐ సీహెచ్ విద్యాసాగర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి మృతి పరీక్ష రాయడానికి వెళ్తూ విద్యార్థి.. ఆబోతు అడ్డొచ్చి ఓ యువకుడు అత్తారింటికి వెళుతూ మరో వ్యక్తి పరీక్షకు వెళుతూ మృత్యుఒడికి.. సామర్లకోట: ఇంటర్మీడియెట్ పరీక్ష రాయడానికి సోమవారం ఇంటి నుంచి మోటార్ బైక్పై బయలుదేరిన విద్యార్థి మార్గం మధ్యలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన విషాద సంఘటన ఇది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు, మండలంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన ప్రగడ వంశీ(19) ఇంటర్ సెకండియర్ పరీక్ష రాయడానికి ఇంటి నుంచి కాకినాడకు బైక్పై బయలు దేరాడు. గొంచాల గ్రామంలోని మలుపులో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ అతడి బైక్ను ఢీకొనడంతో వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై రాంబాబు తన సిబ్బందితో సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి చనిపోవడంతో, ఒక్కగానొక్క కుమారుడిని తల్లి గారాబంగా పెంచుతూ, చదివిస్తోంది. పరీక్ష రాయడానికి వెళ్లిన కుమారుడు ఇక శాశ్వతంగా తిరిగిరాడని తెలుసుకుని ఆ తల్లి సంఘటన స్థలంలో గుండెలవిసేలా రోదించింది. తాను ఎవరి కోసం బతకాలంటూ ఆమె రోదించిన తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది. అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఎస్సై రాంబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కమనీయం నరసన్న కల్యాణం
మధురపూడి: శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా కోరుకొండ గోవింద, హరి నామస్మరణతో మార్మోగింది. స్వయంభు శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం రథోత్సవం, రాత్రి 9 గంటలకు కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగాయి. దేవస్థానంలోని కల్యాణ మండపంలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. కోరుకొండ నవనరసింహ క్షేత్రం కావడంతో సుదూర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కోరుకొండ పరిసరాలన్నీ భక్తజనంతో కిక్కిరిసింది. రథోత్సవంతో కోరుకొండ మీదుగా గోకవరం, భద్రాచలం, విశాఖపట్నం, విజయనగరం వెళ్లాల్సిన వాహనాలు నిలిచిపోయాయి. ప్రధాన వీధుల మీదుగా కొనసాగిన రథోత్సవం సాయంత్రం 5.30కు తిరిగి దేవస్థానానికి చేరింది. అక్కడ స్వామి, అమ్మవార్లను మేళతాళాలు, మంగళవాయిద్యాలతో ఆలయానికి తోడ్కొనివచ్చారు. వధూవరులకు మంగళస్నానాలు నిర్వహించారు. పట్టువస్త్రాలను అలంకరించిన స్వామి, అమ్మవారు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. వధూవరులకు వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం వేద పండితులు పాణింగపల్లి పవన్కుమార్ ఆచార్యులు కల్యాణం నిర్వహించారు. దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త ఎస్పీ రంగరాజబట్టర్, అర్చకస్వాములు పెద్దింటి, పెదపాటి వారి పర్యవేక్షణలో కల్యాణ వేడుక కమనీయంగా జరిగింది. మాలధారణ భక్తుల ప్రదర్శనలు రథోత్సవంలో మాలధారణ చేసిన భక్తుల ప్రదర్శనలు ఆధ్యాత్మకతను సంతరించుకున్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన 220 మంది భక్తులు స్వామివారి మాలధారణ వేశారు. ఉత్సవాల సందర్భంగా స్వాములు 9 రోజుల పాటు నిష్ఠతో పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. వీరికి స్వామివారి మాలధారణ ట్రస్టు ద్వారా వడి, భిక్షలను ఏర్పాటు చేశారు. బుధవారం దీక్షను విరమిస్తారు. భక్తజన సందోహం నడుమ.. సోమవారం స్వామివారి రథోత్సవం భక్తజన సందోహం నడుమ వైభవంగా జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 1.56 గంటలకు వేద మంత్రోచ్ఛరణతో స్వామి, అమ్మవార్లు ఆశీనులైన రథం బయలుదేరింది. కొండ నుంచి ప్రారంభమైన రథం దేవస్థానం రోడ్డు, వాటర్ ప్లాంట్, రెడ్డి పంతులు సత్రం, పాత సంత మార్కెట్, వడ్టీలపేట, మత్స్యకారుల వాడ, ఎయిర్టెల్ టవర్, సాయిబాబా గుడి, అంకాలమ్మ గుడి, శివాలయం మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా గరగ నృత్యాలు, బ్యాండ్మేళాలు, కోలాటం, తీన్మార్, శక్తి వేషధారణలు, కేరళ డ్రమ్స్ వాయిద్యాలతో రథానికి స్వాగతం పలికారు. సాయంత్రం 5.40కు రథం తిరిగి దేవస్థానానికి చేరింది. భక్తులు అరటి పండ్లను స్వామి రథంపైకి వేస్తూ, దర్శించుకున్నారు. దేవస్థానానికి చేరుకున్న రథానికి ఎదుర్కోలు కార్యక్రమంలో భాగంగా మేళతాళాలతో నరసింహస్వామి, లక్ష్మీదేవిని ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆయా కార్యక్రమాల్లో అన్నవరం దేవస్థాన ఈఓ వీర్ల సుబ్బారావు, దేవస్థానం అధికారులు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణచౌదరి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, నార్త్జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్, కోరుకొండ తహసీల్దార్ సుస్వాగతం, ఎంపీడీఓ బత్తిన అశోక్కుమార్ పాల్గొన్నారు. కోరుకొండ సీఐ సత్యకిషోర్, ఎస్సై శ్యామ్సుందర్ బందోబస్తు నిర్వహించారు. శ్రీలక్ష్మీ నరసింహుని రథోత్సవం భక్తజన సందోహం కన్నుల పండువగా కల్యాణోత్సవాలు