Kakinada
-
ఇంతోటిదానికి పవన్ ఆదేశాలు.. కమిటీలు.. ఫోటోలకు ఫోజులు!
కాకినాడ, సాక్షి: చిత్రాడ.. మొన్నటిదాకా కాలుష్యం అనే పదానికి అల్లంత దూరాన ఉన్న గ్రామం. ఎప్పుడైతే జనసేన, ఆ పార్టీ కార్యకర్తలు అడుగు మోపారో.. ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి!!. పొరపాటున అభివృద్ధి విషయంలో అనుకునేరు!!. విపరీతమైన కాలుష్యం, ఎటు చూసినా చెత్తాచెదారం.. ఫ్లెక్సీలతోనే ఆ మార్పు అంతా!!.మొన్నీమధ్యే జరిగిన జనసేన ఆవిర్భావ సభ.. చిత్రాడ(పిఠాపురం)కు విపరీతమైన కాలుష్యాన్ని మిగిల్చింది. అందుకు కారణం.. అక్కడి చెత్తను తరలించకపోవడం ఒకటైతే.. దానిని అక్కడికక్కడే పోగేసి కాల్చేయడం. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చపోగా.. పైగా బోనస్గా కాలుష్యాన్ని అంటగట్టారంటూ జనసేనను తిట్టిపోస్తున్నారు చుట్టుపక్కల ప్రజలు.జనసేన సభ తర్వాత.. ఇవాళ్టికి అక్కడి రోడ్లపై ఇంకా జనసేనవారి ఫ్లెక్సీలు, వెల్కమ్ బ్యానర్లు.. ఆఖరికి భారీ ఆర్చ్లు కూడా అలాగే ఉండిపోయాయి. వాటిని తొలగించడానికి ఏర్పాటు చేసిన పార్టీ కమిటీ ముసుగేసి పడుకుంది. దీంతో పవన్ పర్యవేక్షణలో ఉన్న ఓ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఉపాధి హామీ కూలీలతో ఆ చెత్త ఏరివేయించారు.నాదెండ్ల స్వయంగా ప్రకటించి..తమది చాలా క్రమశిక్షణ గల పార్టీ అని, సభ తరువాత సభా ప్రాంగణాన్ని శుద్ది చేస్తామని జనసేన సీనియర్, మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ప్రకటించారు. సభ అనంతరం ప్రాంగణాన్ని శుద్ది చేసి..ఫ్లెక్సీలు తొలగించాలని తమ అధినేత పవన్ ఆదేశించినట్లు చెప్పారాయన. ఈ క్రమంలోనే..కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారాయన. అయితే మరుసటి రోజు జనసేన నేతలు సభా ప్రాంగణానికి వచ్చారు. శుద్ధి చేస్తున్నట్లు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. అదయ్యాక అక్కడి నుంచి గాయబ్ అయ్యారు. ఈలోపు.. పవన్ సొంత శాఖలోని ఉపాధి హమీ కూలీలు ఆ ప్లాస్టిక్ వ్యర్ధాలను డంపింగ్ యార్డుకు తరలించకుండా.. అక్కడే గుట్టలుగా పోసి దగ్ధం చేశారు. దీంతో విపరీతమైన కాలుష్యంతో ఆ ప్రాంతమంతా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. -
10 కేజీల వెండి సమర్పణ
కాకినాడ రూరల్: సర్పవరంలోని రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ స్వామి ఆలయానికి దాత సాతులూరి గోపాలకృష్ణమాచార్యులు సోమవారం 10 కిలోల వెండి సమర్పించారు. దీనితో మూల భావనారాయణ స్వామి వారికి మకర తోరణం తయారు చేయించాలని ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణను కోరారు. ఆలయంలో సుదర్శన హోమం ఘనంగా నిర్వహించారు. రూ.లక్ష విరాళంబోట్క్లబ్ (కాకినాడ సిటీ): స్థానిక శాంతినగర్లోని శ్రీరామకృష్ణా సేవా సమితికి ముత్తా రామన్న సత్రం ఫౌండర్ ట్రస్టీలు డాక్టర్ ముత్తా వెంకటేష్, ముత్తా ప్రసాద్బాబు సోమవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. ఈ మొత్తాన్ని సమితి అధ్యక్షుడు విఎల్ గాంధీ, కార్యదర్శి కె.సతీష్, ఉపాధ్యక్షుడు వక్కలంక రామకృష్ణకు అందజేశారు. యూట్యూబ్ చానల్పై కేసు అన్నవరం: సత్యదేవుని మూలవిరాట్ ఫొటో ప్రసారం చేసిన ఓ యూట్యూబ్ చానల్ నిర్వాహకులపై అన్నవరం దేవస్థానం అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీహరిబాబు సోమవారం తెలిపారు. రత్నగిరిపై గర్భాలయంలోని స్వామి, అమ్మవారు, శంకరుల మూలవిరాట్ల ఫొటోలు తీయడం నిషేధం. అందువల్లనే అధికారుల అనుమతి లేకుండా కెమెరాలను, సెల్ఫోన్లను ఆలయం లోపలకు అనుమతించరు. అయితే ‘మా ఇంటి భాగవతం’ యూట్యూబ్ చానల్ స్వామివారి మూలవిరాట్ ఫొటో తీసి ప్రసారం చేసింది. ఆ ఫొటోను తొలగించాలని దేవస్థానం అధికారులు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఆ చానల్ నిర్వాహకులపై పోలీసులకు దేవస్థానం అధికారులు ఫిర్యాదు చేశారు. పీజీఆర్ఎస్కు 404 అర్జీలు కాకినాడ సిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో 404 మంది వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్ఓ జె.వెంకటరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, సీపీఓ పి.త్రినాథ్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాసరావు, కేఎస్ఈజెడ్ ఎస్డీసీ కేవీ రామలక్ష్మి తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీదారుల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యాన కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ వేదిక వద్ద ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. ఇక్కడ సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు, పండ్లను ఉంచారు. సుబ్బాలమ్మ తల్లికి రూ.26 లక్షలతో వెండి మకర తోరణం అమలాపురం టౌన్: పట్టణ దేవత సుబ్బాలమ్మ అమ్మవారికి పలువురు భక్తులు రూ.26 లక్షల విలువైన 26 కిలోల వెండి మకర తోరణాన్ని సోమవారం సమర్పించారు. దేవస్థానం అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, భక్తులు ఈ మకర తోరణాన్ని ఉదయం అంతా ఆలయం వద్ద ప్రదర్శనగా ఉంచి, పూజలు చేశారు. సాయంత్రం రెండు అశ్వాల రథంపై దీనిని ఉంచి అత్యంత వైభవంగా ఊరేగించారు. అమ్మవారి జన్మదినం, దేవస్థానం సప్తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వెండి మకర తోరణాన్ని అమ్మవారి వద్ద అలంకరించారు. -
మసకబారిన అన్నవరం ప్రతిష్ట..!
అన్నవరం: రాష్ట్రంలోనే గొప్పగా పేరొందిన సత్యదేవుని సన్నిధి నేడు వరుస వివాదాలతో ప్రతిష్ట మసకబారుతోంది. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో ఏడు పుణ్యక్షేత్రాల్లో అన్నవరం చివరి ఏడో స్థానంలో దిగజారింది. మరలా ఫిబ్రవరిలో రెండో ర్యాంకుకు చేరినా, భక్తుల అసంతృప్తి గతం కంటే మరింత పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు రుజువు చేశాయి. ర్యాంకుల వ్యవహారం ముగిసి వారం కూడా కాకుండానే, కొండ దిగువన సత్యనికేతన్ సత్రంలో సిబ్బంది, పోలీసులు బస చేసిన గదుల్లో బీరు సీసాలు దొరకడం సంచలనంగా మారింది. 62 గదులున్న సత్యనికేతన్ సత్రంలో ఎప్పుడూ భక్తులు పెద్దగా బస చేసిన దాఖలాల్లేవు. ఈ సత్రంలో ఎక్కువగా ఇతర దేవస్థానాల నుంచి బదిలీపై వచ్చిన సిబ్బంది, స్థానిక పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చిన సిబ్బంది బస చేస్తుంటారు. ఆ గదుల్లో ఆదివారం రాత్రి ఈఓ వీర్ల సుబ్బారావు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో పోలీసులు బస చేస్తున్న గదుల్లో బీరు సీసాలు దొరకడం, ఆయన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీకి సమాచారం ఇవ్వడం, అదే విధంగా ఆ పోలీసులను, దేవస్థానం సిబ్బందిని వెంటనే సత్రం గదులు ఖాళీ చేయాలని ఆదేశించడం సంచలనానికి దారి తీసింది. డీఎస్పీ విచారణ సత్రంలో మద్యం సీసాలు లభించిన ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు సోమవారం విచారణ చేపట్టారు. బీరు సీసాలు లభించిన సత్రంలోని 23 నంబర్ గదిని పరిశీలించారు. అక్కడ సిబ్బందిని ప్రశ్నించారు. తర్వాత ఈఓతో మాట్లాడి, ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారు. సత్రంలో బీరు సీసాలు లభ్యమైన విషయమై రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందజేశాయి. ఇంటెలిజెన్స్ అధికారులు ఈఓని కలిసి, వివరాలు సేకరించారు. పోలీసుల అసంతృప్తి! సత్యనికేతన్ సత్రంలో పోలీసులు బస చేసిన గదుల్లోనే ఆకస్మిక తనిఖీలు చేసి, ఖాళీ బీరు బాటిళ్లున్నాయని వెంటనే కలెక్టర్, ఎస్పీలకు ఈవో సమాచారం ఇవ్వడంపై పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవి పాత సీసాలని, పోలీసులు మద్యం తాగుతూ పట్టుబడితే వేరని అంటున్నారు. ఖాళీ సీసాలు దొరికాయని చెప్పి రాద్ధాంతం చేయడం ఎంతవరకూ సబబని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ముందుగా స్థానిక పోలీసులకు లేదా పోలీస్ అధికారులకు సమాచారమిచ్చి ఉంటే, తామే చర్యలు తీసుకునేవారమని అంటున్నారు. వాస్తవానికి గతంలో కొంత మంది దేవస్థానం ఉద్యోగులు మద్యం సేవించి ఉండగా, వారిని పట్టుకుని కిందకు పంపేశామని, దేవస్థానం ప్రతిష్టని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి కేసులు నమోదు చేయలేదని వారంటున్నారు. సత్యనికేతన్ సత్రంలో బీరు సీసాలపై విచారణకు కలెక్టర్ ఆదేశం పోలీసులు బస చేసిన గదిలో డీఎస్పీ విచారణ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక -
పాడా కార్యాలయమా.. పార్టీ కార్యాలయమా...?
● గ్రీవెన్స్లో జనసేన పెత్తనమేమిటి? ● ప్రజా సంఘాల నాయకుల నిలదీత పిఠాపురం: ‘ఇది ప్రజా సమస్యల పరిష్కార వేదికా లేక పార్టీ కార్యాలయమా చెప్పాలి’ అంటూ ప్రజాసంఘాల నాయకులు పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) పీడీ ఎ.చైత్రవర్షిణిని ప్రశ్నించారు. పాడా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు సాకా రామకృష్ణ, కుంచె చిన్న తదితరులు వచ్చారు. ప్రజలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఒక ఎత్తయితే.. అధికారులకు, ప్రజలకు అసౌకర్యంగా ఉండేలా ఇరుకు గదిలో ఏర్పాటు చేశారని మండిపడ్డారు. పైగా ప్రజా సమస్యలపై అధికారుల కంటే ముందే జనసేన నాయకులు సమాధానం చెప్పడంపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు చేపట్టిన కార్యక్రమంలో అధికార పార్టీ నాయకుల పెత్తనమేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం గురించి వివరణ కోరితే జనసేన నాయకులు ‘ఇది మా అడ్డా.. మేమే సమాచారం ఇస్తాం’ అంటూ అవహేళనగా మాట్లాడారని అన్నారు. ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ కార్యక్రమం నిర్వహించడం చూస్తూంటే అధికారుల మద్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఇకముందు క్రమపద్ధతిలో ఈ కార్యక్రమం చేపట్టాలని పీడీని కోరారు. పెన్షన్ల దరఖాస్తులపై అడిగితే సైట్ ఓపెన్ అవడం లేదంటున్నారని, 9 నెలలుగా ఎదురు చూస్తున్నా ఇలా వంకలు చెప్పడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఇళ్ల స్థలాలు, ఇతర సమస్యల పరిష్కారానికి తక్షణమే సైట్ ఓపెన్ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఇకపై ఇటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు పూర్తి సమాచారం ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. -
కదిలిస్తే.. కన్నీటి వేదన
పొలానికి దారి చూపండినాకు సర్వే నంబర్ 108/1లో 60 సెంట్ల పంట భూమి ఉంది. నా స్థలానికి, మెయిన్ రోడ్డుకు మధ్య ఉన్న స్థలంలో నాగు వీరభద్రరావు అనే వ్యక్తి రాజకీయ పలుకుబడి ఉయోగించి నాకు మార్గంగా ఉన్న స్థలాన్ని కబ్జా చేసి పాక వేశాడు. దీనివలన నాకు పొలంలోకి వెళ్లే మార్గం లేకుండా పోయింది. అధికారులు చెబితే పాక కూల్చేశారే తప్ప ఆ స్థలంలోని శిథిలాలను తీయడం లేదు. వీటిని తొలగించాలని కోరుతూ కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నాను. – కోరుకొండ సత్యనారాయణ, రాజుపాలెం, పెదపూడి మండలం వీఆర్ఓ ఇబ్బందులు పెడుతున్నారు గత ప్రభుత్వ హయాంలో నా భార్య విజయకుమారి పేరిట మాకు ఒకటిన్నర సెంట్ల భూమికి పట్టా ఇచ్చారు. పట్టా కూడా నా పేరుతోనే రిజిస్ట్రేషన్ చేశారు. దీనికి సంబంధించిన కాగితం ఇవ్వకుండా వీఆర్ఓ ఇబ్బందులు పెడుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఒరిజినల్ పట్టా నా వద్దనే ఉంది. అధికారులు వీఆర్ఓపై చర్యలు తీసుకొని, రిజిస్ట్రేషన్ పట్టా ఇప్పించాలంటూ జేసీకి అర్జీ అందజేశాను. – బొల్లేజు నాగేశ్వరరావు, ఇంద్రపాలెం, కాకినాడ రూరల్ మండలం ● కలెక్టరేట్కు బాధితుల క్యూ ● పీజీఆర్ఎస్కు ఫిర్యాదుల వెల్లువ ● సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీలు ● అయినా పరిష్కారం కాలేదంటూ ఆవేదన కాకినాడ సిటీ: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్–పీజీఆర్ఎస్)లో సమస్యలు వెల్లువెత్తున్నాయి. ఈ వారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు వచ్చిన పలువురిని ‘సాక్షి’ పలుకరించింది. ఎవరిని కదిపినా సమస్య పరిష్కారం కావడం లేదంటూ కన్నీటి వేదన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా వందలాది మంది ప్రతి వారం కలెక్టరేట్కు తరలివచ్చి తమ సమస్యలపై వినతులు అందిస్తున్నారు. వీటిని పరిష్కరిస్తున్నట్లు రికార్డుల్లో అధికారులు నమోదు చేస్తున్నారే తప్ప క్షేత్ర స్థాయిలో ఏ ఒక్క సమస్యా పరిష్కారం కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీజీఆర్ఎస్కు ప్రతి నెలా 470 నుంచి 500 పైగా అర్జీలు అందుతున్నాయి. వీటి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశిస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటోందని అంటున్నారు. ఏదైనా సమస్యపై అర్జీ అందజేస్తే గ్రామ స్థాయిలో వివిధ శాఖల అధికారులు తమను కార్యాలయాలకు రప్పించుకొని, సమస్య పరిష్కారమైందంటూ తమతో సంతకాలు చేయించుకుని, ఫొటోలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి తమ సమస్య తీరడం లేదని, మళ్లీ కలెక్టరేట్కు నెలల తరబడి తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సమస్యపై ఫిర్యాదు చేస్తే అధికారులు నేరుగా ఇంటికి వచ్చి సమస్య పరిష్కరించేవారని చెబుతున్నారు. నాడు రేషన్ కార్డు, పింఛన్, ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణాలు, వివిధ సామాజికవర్గాల మహిళలకు ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ పథకాలు ఒక్కటి కూడా అమలవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లలో ఏనాడూ మహిళలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూశారని, ఇప్పుడు ప్రతి ఒక్కరూ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి, సూక్ష్మ రుణాల వైపు మొగ్గు చూపాల్సిన దుస్థితి దాపురించిందని అంటున్నారు. పింఛన్లు, ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు, భూసర్వే వంటి సమస్యలపై 9 నెలలుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కావడం లేదని చెబుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వ నిబంధనలు చూస్తే ఏ ఒక్కరికీ పింఛన్ అందే పరిస్థితి కనిపించడం లేదని నిరాశ చెందుతున్నారు. ఒక ఇంట్లో పింఛన్దారు చనిపోతేనే మరొకరికి పింఛన్ వస్తుందంటున్నారు తప్ప అర్హులైన మర్వెరికీ పింఛన్ అందే పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. ఇలా వివిధ సమస్యలపై ప్రజలు అధికారుల వద్ద ఏకరువు పెట్టుకుంటున్న దృశ్యాలు ప్రతి వారం జరుగుతున్న పీజీఆర్ఎస్లో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి.దివ్యాంగ పింఛన్ ఇప్పించండి నేను దివ్యాంగురాలిని, వితంతువును. కుడి కాలు, కుడి చెయ్యి పని చేయదు. నాకు వితంతు పింఛన్ మాత్రమే ఇస్తున్నారు. దివ్యాంగ పింఛన్ ఇప్పించాలని మూడు దఫాలుగా అధికారులకు అర్జీ అందజేస్తున్నాను. అధికారులు స్పందించి నాకు వెంటనే దివ్యాంగ పింఛన్ రూ.6 వేలు, 35 కేజీల బియ్యం ఇప్పించాలని కోరుతున్నాను. – ఒసుపల్లి వేగులమ్మ, దుమ్ములపేట, కాకినాడ అర్బన్ రేషన్ కార్డులో పేరు తొలగించండి మా అమ్మగారిది కరప మండలం ఉప్పలంక గ్రామం. నాకు పెళ్లై ఇద్దరు అబ్బాయిలు. నా భర్త వేట సాగిస్తారు. మేము యానాం అయ్యన్న నగర్లో ఉంటున్నాం. మా అమ్మగారి రేషన్ కార్డులో నా పేరు ఉండిపోవడంతో యానాంలో మాకు రేషన్ కార్డు ఇవ్వడం లేదు. ఇక్కడి రేషన్ కార్డులో నా పేరు తొలగించి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదు. దీనిపై కలెక్టర్కు వినతిపత్రం అందజేశాను. – పట్టా సునీత, ఉప్పలంక, కాకినాడ రూరల్ వితంతు పింఛన్ ఇప్పించరూ.. నా భర్త చనిపోయి రెండేళ్లయ్యింది. అప్పటి నుంచీ వితంతు పింఛన్ మంజూరు చేయాలంటూ అధికారులకు దరఖాస్తులు అందిస్తూనే ఉన్నాను. ఇప్పటికీ పెన్షన్ మంజూరు కాలేదు. బతకడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ అధికారులకు మరోసారి దరఖాస్తు చేశాను. – పాలకొండ నిర్మలాదేవి, 39వ డివిజన్, కాకినాడ అర్బన్ -
ప్రశాంతంగా ప్రారంభం
● మొదలైన పదో తరగతి పరీక్షలు ● తొలి రోజు 27,368 మంది హాజరు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 27,592 మందికిగాను తొలి రోజు నిర్వహించిన తెలుగు పరీక్షకు 27,368 మంది (97 శాతం) హాజరయ్యారు. 224 మంది పరీక్ష రాయలేదని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) పిల్లి రమేష్ తెలిపారు. విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకున్నారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 8.45 గంటల నుంచే విద్యార్థులను గేటు వద్ద పూర్తి స్థాయిలో తనిఖీ చేసి, ఆయా కేంద్రాల్లోకి అనుమతించారు. బ్యాగులు, ఎలక్ట్రానిక్స్ పరికరాలను అనుమతించలేదు. అన్ని కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు నిర్వహించారు. కాకినాడ సాలిపేటలోని పైడా సత్యరాజు మున్సిపల్ హైస్కూల్లోని పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పరిశీలించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు 35 కేంద్రాల్లోను, డీఈఓ ఐదు కేంద్రాల్లోను, అసిస్టెంట్ ఎగ్జామ్స్ కమిషనర్ నాలుగు కేంద్రాల్లోను తనిఖీలు చేశారు. దివ్యాంగ విద్యార్థుల అవస్థలు పరీక్షలు రాయడానికి వచ్చిన దివ్యాంగ విద్యార్థులు అవస్థలకు గురయ్యారు. నగరంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అవి నాలుగైదు అంతస్తుల వరకూ ఉన్నాయి. వీటిలో పై అంతస్తులు కేటాయించడంతో మెట్లు ఎక్కి వెళ్లడానికి దివ్యాంగ విద్యార్థులు నానా అవస్థలూ పడ్డారు. వారికి కింది ఫ్లోర్లలో రూములు కేటాయించకపోవడంపై వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపెన్ స్కూల్కు 27 మంది హాజరు ఓపెన్ స్కూల్ పదో తరగతి విద్యార్థులకు సోమవారం హిందీ పరీక్ష నిర్వహించారు. దీనికి 42 మంది దరఖాస్తు చేసుకోగా 27 మంది హాజరయ్యారు. 15 మంది పరీక్ష రాయలేదని డీఈఓ రమేష్ తెలిపారు. -
రత్నగిరికి భక్తుల వెల్లువ
అన్నవరం: రత్నగిరికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు కావడంతో ఉదయం నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. స్వామివారిని మొత్తం 40 వేల మంది దర్శించగా, వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్నప్రసాదాన్ని సుమారు 5 వేల మంది భక్తులు స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో సత్యదేవుని రథసేవ టేకు రథంపై ఘనంగా నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాల కవచాలు (ముత్తంగిసేవ) ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
ఎక్కడి గింజలు అక్కడే
దిగుబడి వచ్చినా కొనేవారు లేక కోకో గింజలు ఎక్కడివక్కడే ఉండిపోయాయి. కార్పొరేట్ సంస్థలు సిండికేట్గా ఏర్పడడంతో ఎప్పుడైనా వారికే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఎకరాకు 5 క్వింటాళ్లు రాగా, ఈ ఏడాది 3 క్వింటాళ్లు వస్తోంది. రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది. గత ఏడాది మార్చి నెలలో కిలో ధర రూ.1,050 ఉండగా, ప్రస్తుతం రూ.550 ఉంది. ఈ ధర నిలబడుతుందనే నమ్మకం లేదు. ఎండల తీవ్రతతో దిగుబడి తగ్గింది. దీనివల్ల ఎకరాకు ప్రస్తుత ధర ప్రకారం రూ.1.2 లక్షల వరకూ ఆదాయం తగ్గుతుంది. – యలమాటి భాస్కరరావు, కోకో రైతు, కురుకూరు, దేవరపల్లి మండలం -
జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు నిత్యశ్రీ ఎంపిక
పిఠాపురం: జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు పిఠాపురంనకు చెందిన ముమ్మిడి నిత్యశ్రీ ఎంపికై నట్టు ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 10వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో అత్యధిక స్కోరింగ్ కొట్టిన ఆధారంగా ఈ నెల 15వ తేదీన రాత్రి ఎంపికై న ఆర్చరీ లిస్టును విడుదల చేశారు. అందులో పిఠాపురం నుంచి ముమ్మిడి నిత్యశ్రీ ఎంపికయింది. ఈ నెల 22 నుంచి 29 వరకు గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న 6వ జాతీయస్థాయి అండర్ 10 ఇండియన్ రౌండ్ బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ తరపున జాతీయస్థాయిలో ఆరేళ్ల ముమ్మిడి నిత్యశ్రీ ఎంపికై నట్టు కోచ్ పి.లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ బి.శ్రీనివాస్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు కె.పద్మనాభం అభినందించారు. -
ఉమ్మడి జిల్లాలో..
సచివాలయాలు 620వలంటీర్లు 12,272సచివాలయాలు 1,644వలంటీర్లు 30,887కపిలేశ్వరపురం: సంక్షేమం, అభివృద్ధి కూటమి అజెండా, ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రానికి పేరుతెస్తా, పాతిక కేజీల బియ్యం కావాలా? పాతికేళ్ల భవిష్యత్ కావాలా.. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాల భర్తీ.. ఏటా జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ విడుదల.. వలంటీర్ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపు.. ఇవీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి నేతలు చెప్పిన మాటలు. ఆయా లక్ష్యాలను అప్పటికే సాధించే క్రమంలో కొనసాగుతున్న వైఎస్సార్ సీపీ సంక్షేమ ప్రభుత్వాన్ని ఓడించేందుకు కూటమి పన్నిన కుట్రలో భాగంగా వెదజల్లిన హామీలవి. కారణాలేవైనా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఉద్యోగాలు ఇవ్వడం సంగతి పక్కన పెట్టి అప్పటికే పేదలకు సేవలందిస్తున్న వలంటీర్లను విధుల నుంచి పక్కన పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల మంది వలంటీర్లు విధులు నిర్వహించేవారు. వారికి రూ.10 వేల వేతనం మాట దేవుడెరుగు ఉన్న ఉపాధినే ఊడపీకేశారు. వలంటీర్ల తొలగింపు కేవలం వారి కుటుంబాలకే కాదు యావత్ ఆంధ్ర ప్రజలకూ యాతనే. తెల్లవారుజామునే పింఛను అందజేత నుంచి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, దరఖాస్తు చేయించడం, మొత్తంగా లబ్ది వారి ఖాతాలకు జమ చేయించడమూ... ఇలాంటి సేవలన్నీ మూలన పడ్డాయి. దీంతో వలంటీర్లు సంఘం కట్టి తమను విధుల్లోకి తీసుకోవాలంటూ పోరాడుతున్నారు. సేవలు అమోఘం ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో 2,36,331 మంది, కాకినాడ జిల్లాలో 2,72,437, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2,37,244 మంది కలిపి మొత్తం 7,46,012 మంది వివిధ సామాజిక పింఛన్లు అందుకుంటున్నారు. వీరంతా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పింఛను మంజూరైనవారే. వారందరికీ ప్రతి నెలా 1వ తేదీ తెల్లవారుజామున 6 గంటలకే వలంటీర్లు పింఛన్లు అందజేసేవారు. దీంతో పాటు వివిధ ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా కృషి చేశారు. కరోనా విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి ప్రభుత్వం అప్పగించిన సేవా కార్యక్రమాల్లో విధులు నిర్వహించారు. తుపాన్లు, వరదల సమయాల్లో కోనసీమ, తూర్పు గోదావరి నదీతీర లంక గ్రామాల్లోని బాధితులకు తాగునీరు, నిత్యావసర సరకులు, ఆహార పొట్లాలు పడవల్లో దరి చేర్చేవారు. వలంటీర్ల తొలగింపు ప్రభావమిలా... ‘ఉమ్మడి’ జిల్లాలోని 1,644 వార్డు, గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా వలంటీర్లుండేవారు. వారు లేకపోవడంతో లబ్ధిదారులకు ఒకటో తేదీ తెల్లవారుజామునే పింఛను అందజేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నెలలో వలంటీర్లు లేకుండానే పింఛన్లు పంచగలమన్నది ప్రకటనలకే పరిమితమైంది. అప్పుడు సైతం లబ్ధిదారులను పంచాయతీ కార్యాలయానికి లేదా కూడలికి రమ్మని సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేశారు. ఇక రెండో నెల నుంచి వలంటీర్ల మాదిరిగా పింఛను ఇచ్చిన తీరు కానరాలేదు. వలంటీర్లు లేక సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగింది. చేస్తున్న సర్వేల్లో సేవల్లో నాణ్యత కొరవడుతోందన్న వాదన ఉంది. వలంటీర్లను విస్మరించిన కూటమి ప్రభుత్వం వలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామన్న హామీకి అధికారంలోకి వచ్చాక కూటమి తూట్లు పొడిచింది. వారికి ఒక్క రూపాయి కూడా మేలు చేసింది లేదు. ఐదేళ్లూ సేవలందించిన తమను విస్మరించవద్దంటూ ప్రభుత్వాన్ని వలంటీర్లు వేడుకున్నారు. ప్రభుత్వం వినకపోవడంతో పోరాటబాట పట్టారు. కూటమి అధికారంలోకి వస్తే కేవలం పాతిక కిలోల చొప్పున బియ్యం ఇవ్వడం కాదు పాతికేళ్ల భవిష్యత్ ఇస్తామన్న పవన్ కల్యాణ్ను ప్రశ్నిస్తున్నారు. పిఠాపురంలో ఈ నెల 14న నిర్వహించిన జనసేన 12వ ఆవిర్భావ సభలో తమకు ఇచ్చిన హామీ గురించి ప్రస్తావించకపోవడంపై వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్లను విధుల్లోకి తీసుకుంటే చట్టపరమైన సమస్యలొస్తాయని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో ప్రకటించడంపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చేటప్పుడు ఈ విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. 2025–26 వార్షిక బడ్జెట్లో వలంటీర్లకు సంబంధించి నిధులను కేటాయించకపోవడంపై సీఎం చంద్రబాబుపై మండిపడుతున్నారు. ‘ఉమ్మడి’ జిల్లా వలంటీర్ల ఉద్యమాలిలా..2024 నవంబర్ 9న రాష్ట్ర రాజధానిలో ‘వలంటీర్ల ఆవేదన సదస్సు’ను నిర్వహించారు. అదే ఏడాది నవంబర్ 3న అమలాపురంలో జిల్లా స్థాయి నిరసన సమావేశం నిర్వహించారు. 2024 డిసెంబర్ 10న కాకినాడ సూర్యకళా మందిరంలో వైఎస్సార్ సీపీ ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశంలో వలంటీర్ల ఆందోళనకు పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ ఏడాది జనవరి 17న విజయవాడలో నిర్వహించిన సచివాలయ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనకుండా వలంటీర్లను కూటమి ప్రభుత్వం నిర్భంధించింది. 2025 ఫిబ్రవరి 5న అమలాపురం కలెక్టరేట్ ఎదుట వలంటీర్లు ధర్నా చేశారు. ఈ నెల 12న వైఎస్సార్ సీపీ యువత పోరులో వలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సోమవారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ వద్ద ఏపీ గ్రామ, వార్డు వలంటీర్స్ యూనియన్ ఆద్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ‘ఉమ్మడి’ జిల్లాలోని వలంటీర్లు సమాయత్తమయ్యారు. సచివాలయాలు 512వలంటీర్లు 9,034సచివాలయాలు 512వలంటీర్లు 9, 581వలంటీర్లు నష్టపోయారిలా..ఫ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఒక్కో వలంటీర్కు ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇచ్చేది. దీని ప్రకారం కాకినాడ జిల్లాలో 12,272 మంది వలంటీర్లు ప్రతి నెలా రూ.6,13,60,000, కోనసీమ జిల్లాలో 9,581 మంది వలంటీర్లు రూ.4,79,05,000, తూర్పుగోదావరి జిల్లాలో 9,034 మంది వలంటీర్లు రూ.4,51,70,000 చొప్పున అందుకునేవారు. మూడు జిల్లాలు కలిపి రూ.15,44,35,000 మేర వలంటీర్లకు వేతనం అందేది. దీని ప్రకారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడచిన 9 నెలల్లో వారు రూ.138,99,15,000 మేర నష్టపోయారు. ఫ అదే చంద్రబాబు అండ్ కో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెలా రూ.10 వేల వేతనం లెక్కేసుకుంటే 9 నెలల్లో కాకినాడ జిల్లా వలంటీర్లు రూ.110,44,80,000, కోనసీమ జిల్లా వలంటీర్లు రూ.86,22,90,000, తూర్పు గోదావరి జిల్లా వలంటీర్లు రూ.81,30,60,000 కలిపి మొత్తం రూ.277,98,30,000 మేర వేతనాలు కోల్పోయారు. వలంటీర్లకు కూటమి వంచన రూ.10 వేల గౌరవ వేతనమంటూ హామీ అధికారంలోకి వచ్చాక అమలు దాటవేత ఆవిర్భావ సభలో ప్రస్తావించని పవన్ పాతికేళ్ల భవిష్యత్ అంటే ఇదేనా అంటున్న వలంటీర్లు చట్టపరమైన సమస్యలొస్తాయంటున్న మంత్రి లోకేశ్ ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వలంటీర్ల ఉద్యమాలు నేడు ‘చలో విజయవాడ’ హామీని విస్మరించడం వలంటీర్లను వంచించడమే.. ఎన్నికల సమయంలో వలంటీర్లను కొనసాగిస్తామని, రూ.10వేలకు గౌరవ వేతనం పెంచుతామంటూ కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించడం వలంటీర్లను వంచించడమే అవుతుంది. ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రకృతి విపత్తుల సమయాల్లో వలంటీర్లు విశేష సేవలందించారు. వారి సేవలను గుర్తించైనా విధుల్లోకి తీసుకోవాలి. – నూకల బలరాం, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి, కోనసీమ జిల్లా -
ఇచ్చేది పదుల్లో.. ఖర్చు వందల్లో
రాయవరం: పదవ తరగతి పరీక్షల నిర్వహణ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులకు పరీక్షగా మారుతోంది. ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు కేటాయించే సొమ్ము ఒక్కో విద్యార్థికి రూ.పదుల్లో ఉంటుండగా, ఖర్చు రూ.వందల్లో అవుతుందనే విమర్శలున్నాయి. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా పరీక్షల నిర్వహణ ఖర్చుల భారం ఉంటోందని పలువురు చీఫ్లు, డీవోలు వాపోతున్నారు. ఇప్పటికే పరీక్షల నిర్వహణ కేటా యింపులు పెంచాలని, ఇన్విజిలేటర్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ను పెంచాలని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఇంటర్ పరీక్షలకు ఇచ్చే విధంగా రెమ్యునరేషన్ ఉండాలనే డిమాండ్ ఉపాధ్యాయుల నుంచి విన్పిస్తోంది. ఒక్కో విద్యార్థికి రూ.1.42 కేటాయింపు పరీక్షల నిర్వహణకు ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.1.42 వంతున ఏడు పరీక్షలకు రూ.10 మంజూరు చేస్తున్నారు. 2018లో ఒక్కో విద్యార్థికి కంటింజెంట్ చార్జీగా రూ.5.50 ఇవ్వగా, 2023లో ఒక్కో విద్యార్థికి రూ.8 ఇస్తున్న కంటింజెంట్ చార్జీని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.8 నుంచి రూ.10కి పెంచింది. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువులను దృష్టిలో ఉంచుకుని కంటింజెంట్ చార్జీలను పెంచాలనే డిమాండ్ను ఉపాధ్యాయ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. పరీక్ష కేంద్రంలో పరీక్షలను పర్యవేక్షించే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి పోలీస్ స్టేషన్ నుంచి పరీక్షా పత్రాలు తీసుకువచ్చి పరీక్ష అనంతరం సమాధాన పత్రాలను సీల్ చేస్తారు. ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలకు వేర్వేరుగా సంచులు వాడతారు. ఒక్కో సంచికి రెండు నుంచి మూడు మీటర్ల వస్త్రాన్ని, జవాబు పత్రాలను పోస్టాఫీసుకు తీసుకుని వెళ్లడానికి రవాణా ఖర్చులను భరించాల్సి వస్తోంది. జవాబు పత్రాలను కట్టి భద్రపరిచేందుకు లక్క, కొవ్వొత్తి, దారం, స్కెచ్ పెన్నులు, స్టాప్లర్లు, గమ్, వైట్నర్ తదితర వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు పరీక్షా కేంద్రంలో మంచినీరును అందుబాటులో ఉంచాలి. ఇలా అన్ని వస్తువులను కొనాలంటే ఎంతలేదన్నా రోజుకు రూ.600కు పైగా ఖర్చవుతుందని చీఫ్లు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.1.42 ఇస్తే ఎలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. సీఎస్లపైనే ఆర్థిక భారం ప్రతి పరీక్షా కేంద్రంలో నిర్వహణ బాధ్యత చీఫ్ సూపరింటెండెంట్లదే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పదవ తరగతి పరీక్షకు 386 మంది చీఫ్లు హాజరవుతున్నారు. ప్రభుత్వం నిధులను తక్కువగా విడుదల చేస్తుండడంతో అదనంగా అయ్యే ఖర్చును వారి చేతి నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తోంది. రోజుకు రూ.200 నుంచి రూ.300 వరకు అదనంగా భరించాల్సి ఉంటుందని పలువురు చీఫ్లు చెబుతున్నారు. ఒక్కో విద్యార్థికి కనీసం రూ.15 ఇవ్వాలని, అదనంగా రవాణా చార్జీలు మంజూరు చేయాలని చీఫ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇన్విజిలేటర్లకూ అంతంత మాత్రమే ఇంటర్ పరీక్షల్లో ఇన్విజిలేటర్లకు రోజుకు రూ.150 వంతున రెమ్యూనరేషన్ ఇస్తుండగా, పదవ తరగతి ఇన్విజిలేషన్కు మాత్రం రోజుకు కేవలం రూ.33 ఇస్తున్నారు. అటెండర్కు రూ.20, వాటర్ బాయ్కి రూ.17 వంతున భృతిని చెల్లిస్తున్నారు. గత ప్రభుత్వం అంతకుముందు కంటే సీఎస్, డీవోలకు రూ.22, ఇన్విజిలేటర్లు, క్లర్క్స్కు రూ.11, అటెండర్లకు రూ.6.80, వాటర్మెన్కు రూ.6 వంతున పెంపుదల చేసింది. కాగా ఇంటర్ పరీక్షలకు, పది పరీక్షలకు పెద్దగా తేడా లేకున్నా, రెమ్యూనరేషన్ చెల్లింపులో మాత్రం తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. పెరుగుతున్న ధరలకు తోడు సరిపడా నిర్వహణ ఖర్చులు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పలువురు ఇన్విజిలేటర్లు ఆవేదన చెందుతున్నారు. ఫీజుల వసూలు విషయానికి వస్తే మాత్రం ఒక్కో విద్యార్థి నుంచి రూ.125 వంతున వసూలు చేస్తున్నారు.ఉమ్మడి జిల్లాలో ఉన్న పరీక్షా కేంద్రాలు : 386 హాజరయ్యే విద్యార్థులు : 73,329 చీఫ్, డీవో, కస్టోడియన్లకు రోజుకు ఇచ్చేది : రూ. 66 ఇన్విజిలేటర్లకు రోజుకు ఇచ్చేది : రూ.33 క్లర్కులకు రోజుకు ఇచ్చేది : రూ. 33 అటెండర్కు ఇచ్చేది : రూ.20 వాటర్ మెన్లకు రోజుకు ఇచ్చేది : రూ.17 పది పరీక్షల్లో వినియోగించే కంటింజెంట్ సామగ్రి పది పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం చిన్నచూపు 2023లో పెంచిన జగన్ సర్కార్ ఒక విద్యార్థికి ప్రస్తుతం ఇస్తున్న కంటింజెంట్ చార్జీ రూ.10 రెమ్యూనరేషన్ పెంచాలంటున్న యూనియన్లు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏదీ.. పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం చేస్తున్న కేటాయింపులు చూస్తుంటే ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుంది. ఒక విద్యార్థికి ఒక పేపరుకు రూ.1.42 కంటింజెంట్ చార్జీగా ఏ విధంగా సరిపోతాయో చెప్పాలి. కష్టమైన బాధ్యతలు నిర్వహించేవారికి గౌరవప్రదంగా రెమ్యునరేషన్ చెల్లించాలి. – పి.సురేంద్రకుమార్, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్, కపిలేశ్వరపురం ప్రస్తుత రేట్లకు అనుగుణంగా ఇవ్వాలి పెరుగుతున్న నిత్యావసర వస్తువులకు అనుగుణంగా రెమ్యునరేషన్ పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చే నామమాత్రపు కంటింజెంట్ చార్జి పరీక్షల నిర్వహణకు ఏ మూలకూ సరిపోవడం లేదు. ప్రభుత్వం వెంటనే సీఎస్, డీవోలతో పాటుగా ఇన్విజిలేటర్లకు కనీస చార్జీలు చెల్లించక పోవడం దురదృష్టకరం. వెంటనే ప్రభుత్వం రెమ్యునరేషన్ పెంచాలి. – విత్తనాల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి, గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్, అమలాపురం రెమ్యూనరేషన్ను తక్షణం పెంచాలి ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు చేస్తున్న కేటాయింపులు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇన్విజిలేటర్లకు రోజుకు కనీసం రూ.150, ఛీఫ్, డీవో, కస్టోడియన్లకు రోజుకు రూ.200 వంతున కేటాయించాలి. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలి. – నరాల కృష్ణకుమార్, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ, ద్రాక్షారామ టీఏ, డీఏలు చెల్లించాలి దూరంతో సంబంధం లేకుండా సీఎస్, డీవోలకు, ఇన్విజిలేటర్లకు టీఏ, డీఏలు చెల్లించాలి. రెమ్యూనరేషన్ కచ్చితంగా పెంచాలి. స్పాట్ వాల్యుయేషన్ చేసే స్పెషల్ అసిస్టెంట్లకు కూడా టీఏ, డీఏలు చెల్లించాలి. – పోతంశెట్టి దొరబాబు, జిల్లా అధ్యక్షుడు, ఎస్టీయూ, అమలాపురం -
ఆర్మీలో అగ్నివీర్ అవుతారా?
రాజమహేంద్రవరం రూరల్: దేశ రక్షణ కోసం సైన్యంలో చేరాలనుకునే యువతకు శుభవార్త. అగ్నివీర్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రిక్రూట్మెంట్ చరిత్రలో తొలిసారిగా ప్రవేశ పరీక్షను ఏకంగా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. మరోవైపు రాష్ట్రంలోని 13 జిల్లాల అభ్యర్థుల కోసం ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి విశాఖపట్నం మరోసారి వేదిక కానుంది. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇటీవలే విడుదలైంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ అంబేడ్కర్, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ కృష్ణా, మచిలీపట్నం జిల్లాల అభ్యర్థులకు విశాఖలో ఎంపికలు నిర్వహించాలని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం నిర్ణయించింది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఏప్రిల్ 10వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ కేటగిరీల కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నారు. అగ్నివీర్ ట్రేడ్స్మెన్కు 8వ తరగతి, జనరల్ డ్యూటీ కేటగిరీలకు 10వ తరగతి అర్హతగా నిర్ణయించారు. అలాగే 17.5 నుంచి 21 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులే అర్హులు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేవారు మాత్రమే ఈ రిక్రూట్మెంట్కు హాజరు కావాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది కీలక మార్పులు ఈసారి అగ్నివీర్ రిక్రూట్మెంట్లో పలు ముఖ్యమైన మార్పులు చేశారు. గతంలో అభ్యర్థులు ఒక కేటగిరీకి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, ఈసారి రెండు కేటగిరీల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎన్సీసీ, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లమా వంటి అదనపు విద్యార్హతలు కలిగిన వారికి బోనస్ మార్కులు లభిస్తాయి. గతంలో హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (సీఈఈ)ను ఇప్పుడు తెలుగుతో సహా 13 భాషల్లో రాసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన అడ్మిట్ కార్డులను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అడ్మిట్ కార్డులో ర్యాలీకి హాజరుకావాల్సిన తేదీ, సమయం వంటి వివరాలు ఉంటాయి. అభ్యర్థుల సౌకర్యం కోసం రిక్రూట్మెంట్ జరిగే ప్రదేశంలో ప్రత్యేక రిపోర్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో పారదర్శకంగా జరుగుతుందని రక్షణ శాఖ వర్గాలు తెలియజేశాయి. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం లైవ్ చాట్ సదుపాయంతో పాటు ‘ఆర్మీ కాలింగ్’అనే ఆన్లైన్ మొబైల్ అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మరింత సమాచారం కోసం www. joinindianarmy.nic.in వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయంలోని 0891– 2756959, 0891–2754680 నంబర్లకు ఫోన్ చేయాలని రక్షణ శాఖ అధికారులు సూచించారు. అగ్నివీర్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు 13 భాషల్లో ప్రవేశ పరీక్ష రాసే అవకాశం ఎన్సీసీ, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లమా అభ్యర్థులకు బోనస్ మార్కులు విశాఖలో మరోసారి ర్యాలీ ఏప్రిల్ 10 వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం -
22 కాసుల బంగారు ఆభరణాల చోరీ
నల్లజర్ల: స్థానికంగా గత రాత్రి భారీ చోరీ జరిగింది. నల్లజర్ల ఏఎస్ఐ సోమరాజు చెప్పిన వివరాల ప్రకారం నల్లజర్ల సొసైటీ రహదారిలో ఉన్న మారడుగల శ్రీనివాస్ ఈ నెల 15వ తేదీన బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. ఆదివారం ఇంటికి వచ్చి చూడగా ఇంటి వెనుక తలపులు పగులగొట్టి ఉండాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉన్న 22 కాసుల బంగారు ఆభరణాలు, నాలుగు తులాల వెండి చోరీకి గురైనట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ దొంగల ఆగడాలుబిక్కవోలు: మండలంలోని బలభద్రపురం గ్రామంలోని విద్యుత్ దొంగల ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. విద్యుత్ టాన్స్ఫార్మర్ పగుల గొట్టి దానిలో ఉన్న రాగి తీగ చోరీ చేస్తున్నారు. శనివారం రాత్రి మళ్లీ మూడు చోట్ల చోరీ ప్రయత్నం చేశారు. రెండు చోట్ల చోరీ జరిగింది. బలభద్రపురం గ్రామానికి చెందిన దార్వంపూడి సూర్యనారాయణరెడ్డి, మరో రైతు పొలంలో చోరీ జరిగింది. పక్కనే ఉన్న ఎస్వీవీకే రెడ్డి పొలంలో చోరీ ప్రయత్నం చేశారు. ఆయన ట్రాన్స్ఫార్మర్ బోల్టులకు వెల్డింగ్ చేయించారు. దొంగల దాన్ని బద్దలు కొట్టలేక అక్కడే వదిలి వెళ్లిపోయారు. ఈ విషయంపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. పీఎంజే జ్యూయలర్స్ ప్రారంభంబోట్క్లబ్ (కాకినాడ సిటీ): దక్షిణ భారతదేశంలో అందరికీ ప్రియమైన జ్యూయలరీ బ్రాండ్ అయిన పీఎంజే జ్యూయలర్స్ కాకినాడ దేవాలయం వీధిలో ఏర్పాటు చేసిన కొత్త షోరూంను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పీఎంజే ఆంధ్రా బిజినెస్ హెడ్ హైదర్ ఆలీ, క్లస్టర్ మేనేజర్ షేక్ గాలి షరీఫ్ ఆదివారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పీఎంజే జ్యూయలర్స్ కాకినాడలో విస్తరించడం ఆనందంగా ఉందన్నారు. షోరూమ్లో ఆభరణాల నాణ్యత, హస్తకళ పట్ల వారి నిబద్ధత ప్రశంసనీయమన్నారు. పీఎంజే ఆంధ్రా బిజినెస్ హెడ్ హైదర్ ఆలీ మాట్లాడుతూ ప్రసిద్ధి చెందిన వ్యక్తిగత ఎంపికలకు అనువైన ఆతిథ్యం అనుభవించడానికి మేము ప్రతీ ఒక్కరినీ స్వాగతిస్తున్నామన్నారు. తమ షోరూమ్లకు అమెరికాతోపాటు దక్షిణ భారతదేశంలో ప్రజల ఆదరణ ఎంతగానో లభిస్తోందన్నారు. తమ జ్యూయలర్స్లో డిజైన్లు భారతీయ స్వర్ణకారుల అద్భుతమైన కళాత్మక నైపుణ్యాలను ప్రదర్శిస్తాయన్నారు. కాకినాడ షోరూమ్ హెడ్ శేషగిరి పాల్గొన్నారు. -
పది పరీక్షల్లో మార్గదర్శకాలివే..
రాయవరం: పదవ తరగతి పరీక్షలు సోమవారం నుంచి జిల్లా అంతటా ప్రారంభం కానున్నాయి. పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు జిల్లా విద్యా శాఖ ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టింది. శనివారం మధ్యాహ్నం అన్ని పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు సమావేశాలు నిర్వహించి సూచనలు, సలహాలు అందజేశారు. సీసీఈ విధానంలో ప్రారంభం అవుతున్న పది పరీక్షల్లో 15 నిమిషాలు పరీక్ష పేపరు చదువుకునేందుకు సమయాన్ని కేటాయిస్తున్నారు. పది పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో చీఫ్, డీవోలతో పాటు ఇన్విజిలేటర్లు చేయాల్సిన విధులపై ‘సాక్షి’ కథనం.ఇన్విజిలేటర్లకు సూచనలు ● ఇన్విజిలేటర్లు ఫొటో గుర్తింపు కార్డు తీసుకోవాలి. రోజూ తప్పకుండా ఐడీ కార్డు ధరించాలి. ● పరీక్ష పేపర్ల కోడ్స్, సరైన కాంబినేషన్ గురించి విధిగా తెలుసుకోవాలి. ● పరీక్ష రోజు ఉదయం 8.30 గంటలకు కేంద్రం వద్దకు హాజరు కావాలి. ● తొమ్మిది గంటలకు విద్యార్థులను పరీక్ష గదిలో కూర్చోబెట్టాలి. 9.30 గంటల తర్వాత విద్యార్థులను అనుమతించరాదు. ● ప్రతి విద్యార్థిని సోదా చేసి, ఎటువంటి ఫర్బిడెన్ మెటీరియల్ లేదని నిర్ధారించుకోవాలి. ● విద్యార్థినులను మహిళా ఇన్విజిలేటర్లు మాత్రమే సోదా చేయాలి. ● విద్యార్థులకు ఫొటో, అన్ని వివరాలతో కూడిన హాల్ టికెట్ అందిస్తారు. విద్యార్థిని హాల్ టికెట్, అటెండెన్స్ షీట్లోని ఫొటోతో పోల్చి నిర్ధారించుకోవాలి. ● అభ్యర్థిపై అనుమానం ఉంటే వెంటనే సీఎస్ దృష్టికి తీసుకుని వెళ్లాలి. ● అన్ని పరీక్షలు బార్ కోడింగ్ విధానంలో జరుగుతాయి. ఉదయం 8.45 గంటలకు ఓఎంఆర్ ప్రధాన/అదనపు సమాధాన పత్రాలు సీఎస్ నుంచి పొందాలి. ● ప్రధాన సమాధాన పత్రంలోని సూచనలను, ఓఎంఆర్ షీట్ వెనుక భాగంలో సూచనలు విద్యార్థులకు వివరించాలి. ● ఓఎంఆర్ షీట్ మినహా ఏ పేపర్పైనా కూడా హాల్ టికెట్ నంబరు, పేరు రాయించరాదు. ● ఓఎంఆర్ షీటు ఏదైనా కారణంతో పాడైతే, వెంటనే సీఎస్ దష్టికి తీసుకుని వెళ్లి, నాన్ స్టాండర్డ్ ఓఎంఆర్ షీట్ పొందాలి. ● ఓఎంఆర్ షీట్పై ఉన్న బార్కోడ్పై రాయడం గాని, నలపడం గాని చేయకుండా విద్యార్థులను హెచ్చరించాలి. ● 9.25గంటల లోపు ఇన్విజిలేటర్ అన్ని పనులు ముగించుకుని 9.30గంటలకు కచ్చితంగా ప్రశ్నపత్రాలు ఇవ్వాలి. ● ప్రశ్న పత్రాలు తీసుకున్న వెంటనే సరిపడినన్ని ఉన్నాయా? ఆ రోజుకు సంబంధించిన సబ్జెక్టు/పేపర్కోడ్/ మీడియం సరిచూసుకోవాలి. ● పేపరు ఏ మాత్రం తప్పుగా ఇచ్చినా సంబంధిత ఇన్విజిలేటర్పై తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. – గైర్హాజరైన విద్యార్థుల ఓఎంఆర్ షీట్ను ఎర్ర సిరా పెన్తో క్యాన్సిల్ చేయాలి. ● సమాధాన పత్రాలు, అడిషనల్ షీట్స్ అన్నీ సరిచూసుకున్నాకే విద్యార్థులను పంపాలి.సీఎస్, డీవోలకు సూచనలు రోజూ ఉదయం 7.45 గంటలకు సెట్ కాన్ఫరెన్స్కు హాజరు కావాలి. నిర్దేశించిన సమయానికన్నా ముందు సీఎస్, డీవో ఇద్దరు సంతకాలతో పరీక్షల కట్టల సీల్ తెరవాలి. లాటరీ పద్దతిలోనే ఇన్విజిలేటర్లకు తరగతి గదులు కేటాయించాలి. అనుమతి లేని వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించరాదు. -
తలుపులమ్మ తల్లి దర్శనానికి తరలివచ్చిన భక్తులు
తుని రూరల్: లోవ దేవస్థానంలో వెలసిన తలుపులమ్మ తల్లి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ఆదివారం ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన 22 వేల మంది క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారని ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,49,040, పూజా టికెట్లకు రూ.91,320, కేశఖండనకు రూ.14,810, వాహన పూజలకు రూ.4,350, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.73,072, విరాళాలు రూ.1,06,485 కలిపి మొత్తం రూ.4,39,077 ఆదాయం సమకూరిందని వివరించారు. జనార్దనాచార్యులుకు అవార్డు ప్రదానం పిఠాపురం: స్థానిక రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ అర్చకుడు విజయ జనార్దనాచార్యులుకు అర్చక సేవా వైభవ రత్న పురస్కారం ప్రదానం చేశారు. హైదరాబాద్ హరిహర కళాభవన్లో సర్ సీవీ రామన్ అకాడమీ సేవా సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యాన 33వ ఉగాది వార్షికోత్సవాల సందర్భంగా ఆదివారం సువర్ణ ఘంటా కంకణం, స్వర్ణ పతకంతో జనార్దనాచార్యులును సత్కరించి, బిరుదు ప్రదానం చేశారు. వేణుగోపాలస్వామి ఆలయం, ఇతర దేవాలయాల అభివృద్ధికి, సమాజ సేవలకు గానూ ఈ పురస్కారం అందజేశారు. సంస్థ ప్రధాన కార్యదర్శి మహేంద్రవాడ వెంకటేశ్వరరావు, సినీ నటుడు కోట శంకరరావు చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందించారు. నేడు పీజీఆర్ఎస్ కాకినాడ సిటీ: జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకూ కలెక్టరేట్లో నిర్వహిస్తున్నారు. కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. దీనికి జిల్లా అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. మండల స్థాయిలో పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఆయా అధికారులు ఉదయం 9.30 గంటలకే విధిగా హాజరు కావాలని పేర్కొన్నారు. శతాధిక వృద్ధురాలి మృతి అమలాపురం టౌన్: స్థానిక 22వ వార్డు పరిధిలోని గొవ్వాలవారి వీధికి చెందిన శతాధిక వృద్ధురాలు గొవ్వాల సూర్యకాంతం (110) ఆదివారం మృతి చెందారు. ఈమె 22వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్, వైఎస్సార్ సీపీ నాయకుడు గొవ్వాల రాజేష్ నానమ్మ. మూడు నెలల కిందటి వరకూ నానమ్మ ఏ ఒక్కరి సాయం లేకుండానే తన పనులు తాను చేసుకుంటూ జీవించిందని రాజేష్ తెలిపారు. మూడు నెలలగా మంచాన పడి చివరకు వృద్ధాప్యంతో మృతి చెందిందన్నారు. సూర్యకాంతానికి ఐదుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు, కోడళ్లు, అల్లుళ్లు, దాదాపు 40 మంది వరకూ మనుమలు, ముని మనుమలు ఉన్నారు. అయినవిల్లికి భక్తుల తాకిడి అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామిని ఆదివారం ఆధిక సంఖ్యలో భక్తులు దర్శించుని, ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యాన స్వామి వారికి మేలుకొలుపు సేవ, లఘున్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ జరిపారు. స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించి, మహానివేదన చేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 56 మంది, లక్ష్మీగణపతి హోమంలో 31 జంటలు, స్వామివారి పంచామృతాభిషేకాల్లో ఒక జంట, స్వామివారి గరిక పూజలో రెండు జంటలు పాల్గొన్నాయి. పది మంది భక్తులు ఉండ్రాళ్ల పూజలు జరిపారు. 11 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు, ఐదుగురు చిన్నారులకు అన్నప్రాశనలు, ముగ్గురు చిన్నారులకు నామకరణం, 13 మందికి తులాభారం చేశారు. 16 మంది తలనీలాలు సమర్పించారు. 25 నూతన వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. 3,510 మంది అన్న ప్రసాదం స్వీకరించారు. స్వామివారికి వివిధ రూపాల్లో రూ.2,93,437 ఆదాయం లభించింది. -
SVSN Varma: నాడు ఎత్తేసి.. నేడు తొక్కేసి..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆరు నెలలు సావాసం చేస్తే వారు, వీరవుతారంటారు. కూటమిగా జత కట్టి.. అమలు కాని హామీలతో ప్రజలను నమ్మించి.. నట్టేట ముంచుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ల విషయంలో ఈ మాట నిజమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అవసరానికి వాడుకుని, పని అయిపోయాక కూరలో కరివేపాకులా తీసి పడేసే తత్వం ఇంత కాలం చంద్రబాబుకే సొంతమనుకునే వారు. ఇప్పుడు చంద్రబాబుతో చెట్టపట్టాలేసుకు తిరుగుతున్న పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు కూడా ఆ తత్వాన్ని ఒంట పట్టించుకున్నట్టు కనిపిస్తోంది. పిఠాపురం శివారు చిత్రాడలో శుక్రవారం రాత్రి జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ సోదరుడు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన వ్యాఖ్యలే దీనికి అద్దం పడుతున్నాయి. ‘పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపులో ప్రధానంగా రెండు ఫ్యాక్టర్స్ పని చేశాయి. ఒకటి జనసేన ప్రెసిడెంట్ పవన్ కల్యాణ్. రెండు జనసైనికులు, పిఠాపురం ఓటర్లు’ మరెవరైనా పవన్ గెలుపులో తమ పాత్ర ఉందని అనుకుంటే అది వారి ఖర్మ’ అని నాగబాబు నొక్కి మరీ చెప్పారు. ఆ మాటలకు అర్థాలే వేరని ఆ సభలోనే జనసేన అభిమానులు, కార్యకర్తలు గుసగుసలాడటం వినిపించింది. నాగబాబు చేసిన వ్యాఖ్యలు పిఠాపురానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను ఉద్దేశించినవేనని ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.పొగిడిన నోటితోనే.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక, భీమవరంలో పోటీ చేసి, రెండుచోట్లా ఓడిపోయారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఒకే ఒక్క స్థానం పిఠాపురంలో గెలుపొందారు. ఈ గెలుపులో జనసేన ఎంత పని చేసిందో, స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, ఆయన అనుచరగణం కూడా అంతే స్థాయిలో పని చేసిందనేది జగమెరిగిన సత్యం. పరాజయాల నేపథ్యంతో గత సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురాన్ని ఎంపిక చేసుకున్నప్పటి నుంచి, గెలుపొందే వరకూ వర్మను ఇంద్రుడు, చంద్రుడు అంటూ ఆకాశానికెత్తేయడంలో మెగా బ్రదర్స్ పవన్ కల్యాణ్, నాగబాబు పోటీ పడ్డారు. ‘ఈ విజయం జనసైనికులది. ఈ విజయం వర్మది’ అంటూ స్వయంగా పవన్ కల్యాణ్ పలు సభల్లో వర్మను ప్రశంసలతో ముంచెత్తారు. సార్వత్రిక ఎన్నికల ముందు వరకూ అన్నదమ్ములిద్దరూ వర్మను నెత్తిన పెట్టుకున్నారు. అధికారంలో భాగస్వామ్యులై, పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక అసలు స్వరూపం బయటపడిందని, వర్మను రాజకీయంగా పాతాళానికి తొక్కేయడానికి ప్రయతి్నస్తున్నారని ఆయన అనుచర వర్గం మండిపడుతోంది.విస్తృతంగా చర్చ నేడు మెగాబ్రదర్స్ వ్యాఖ్యలు చూస్తూంటే ‘ఓడ ఎక్కే వరకూ ఓడ మల్లన్న.. ఒడ్డుకు చేరాక బోడి మల్లన్న’ సామెతను తలపిస్తోందని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలయ్యేంత వరకూ వర్మను వేనోళ్ల పొగడిన మెగా సోదరులు ఇంతలోనే ఇంతలా మారిపోతారని ఊహించలేదని తెలుగు తమ్ముళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు పిఠాపురంలో జరిగిన ఒక సభలో వర్మను ఆకాశానికెత్తేస్తూ మెగా బ్రదర్స్ పొగుడుతున్న వీడియో, శుక్రవారం రాత్రి చిత్రాడ సభలో నాగబాబు వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ అంశం ఇప్పుడు కూటమి పారీ్టల మధ్య హాట్టాపిక్గా మారింది. ఎక్కడ ఏ నలుగురు కలిసినా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ తరచూ మార్పు రావాలంటున్నారని, చివరకు చిత్రాడ సభలో సైతం ఇదే విషయాన్ని ఊదరగొట్టారని, మార్పు అంటే ఇదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.చంద్రబాబు మొండిచేయి పొత్తు ధర్మంలో భాగంగా పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మకు చంద్రబాబు భారీ హామీయే ఎర వేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ పదవిని ఆయనకే ఇస్తామని గొప్పగా ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుమూడు దఫాలు ఎమ్మెల్సీల నియామకాలు జరిగినా వర్మకు మాత్రం మొండిచేయే చూపించారు. పని అయ్యే వరకూ బుజ్జగించడం.. ఆనక గాలికొదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అనే విమర్శ ఉంది. అయితే, అదే వాస్తవమని వర్మకు ఎమ్మెల్సీ పదవి విషయంలో మరోసారి రుజువైందని అంటున్నారు. అయితే, వర్మకు జెల్ల కొట్టడానికి వేరే కారణముందనే చర్చ కూడా నడుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో సీటు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వర్మ అనుచరులు పిఠాపురంలో చంద్రబాబు, లోకేష్ దిష్టి ొమ్మలు, పార్టీ జెండాలు దహనం చేశారు. చంద్రబాబు, లోకేష్ లను బూతులు తిట్టారు. దీనిని మనసులో పెట్టుకుని, చంద్రబాబు, లోకేష్లు వ్యూహాత్మకంగానే వర్మను తొక్కేస్తున్నారని, మెగాబ్రదర్స్ ద్వారా పొమ్మనకుండానే పొగ పెడుతున్నారని టీడీపీలోని ఒక వర్గం అంటోంది.లేకుంటే వర్మను నాగబాబు పదేపదే టార్గెట్ చేస్తున్నా అధినేతలు ఎందుకు మాట్లాడటం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, నాగబాబు మధ్య ఎన్నికల సమయంలో రగిలిన చిచ్చు అధికారంలోకి వచ్చాక కూడా కొనసాగుతూనే ఉంది. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోగా.. ఆయనను నిత్యం విభేదించే మెగా బ్రదర్ నాగబాబుకు ఆ పదవి ఇచ్చారు. నాగబాబును రేపోమాపో మంత్రిని కూడా చేస్తారనే ప్రచారంతో పిఠాపురంలో వర్మ అనుచరులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే నియోజకవర్గంలో టీడీపీ ఉనికే ప్రమాదంలో పడుతుందని తెలుగు తమ్ముళ్లు పేర్కొంటున్నారు. -
ఒక్క ఫోన్ చేసినా.. ఇంత అనర్థం జరిగేది కాదు
కాకినాడ రూరల్: ‘‘జరిగిన ఘటనను జీర్ణించుకోలేకపోతున్నాం. మా కుటుంబంలో అందరూ విద్యావంతులు. పెదనాన్న కొడుకు చంద్రకిశోర్ (37)ఎంబీఏ, ఎంకామ్ చదివాడు. చాలా కష్టపడి పైకి వచ్చాడు. 2014లో ఓఎన్జీసీలో ఉద్యోగంలో చేరాడు. ఒకటో తరగతి చదువుతున్న జోషిత్(7), యూకేజీ చదువుతున్న నిఖిల్(6)ను ఇటీవలే స్కూల్ మార్చాడు. ఇబ్బందులు, మానసిక ఒత్తిడి ఉన్నట్టు చెప్పలేదు. ఒక్క ఫోన్ కాల్ చేసి ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండేది కాదు’’ అని కాకినాడలో ఇద్దరు కుమారులను చంపి ఆత్మహత్య చేసుకున్న చంద్రకిశోర్ సోదరుడు, తాడేపల్లిగూడెంకు చెందిన వానపల్లి ఆదిశేషు వాపోయారు. తాడేపల్లిగూడెంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు. చంద్రకు 2017లో రాజమహేంద్రవరానికి చెందిన తనూజతో వివాహమైందని, ఆమె ఎంబీఏ చదివారని తెలిపారు. కాగా, తమ సంస్థలో అసిస్టెంట్ అకౌంటెంట్గా పని చేస్తున్న చంద్రకిశోర్ చాలా మంచి వ్యక్తి అని, ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదని, పిల్లలతో పాటు అతడూ చనిపోవడం బాధాకరమని ఓఎన్జీసీ, కాకినాడ హెచ్ఆర్ హెడ్ సునీల్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కలకలం రేపిన ఘటన.. ఇద్దరు కుమారులను కాళ్లు, చేతులు కట్టేసి, నోటికి వస్త్రం కట్టి నీటి బకెట్లో ముంచి ప్రాణం తీసి, ఆపై తానూ ఫ్యాన్కు ఉరివేసుకుని చంద్రకిశోర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. చంద్రకిశోర్ కాకినాడ రూరల్ వాకలపూడి ఓఎన్జీసీ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. భార్య తనూజ, ఇద్దరు పిల్లలతో కాకినాడ తోట సుబ్బారావు నగర్లో ఉంటున్నాడు. హోలీ పండగ కోసం ఓఎన్జీసీ కార్యాలయానికి భార్య, పిల్లలను తీసుకెళ్లిన అతడు.. భార్యను అక్కడే ఉంచి బట్టలు కుట్టించేందుకు అంటూ పిల్లలను బయటకు తీసుకొచ్చాడు. కాగా, కాకినాడలో పేరున్న పాఠశాలలో ఇద్దరు పిల్లలను ఏటా రూ.1.50 లక్షల ఫీజుతో చేర్పించాడు. బాగా చదవడం లేదని తిరిగి తక్కువ ఫీజున్న స్కూల్కు మార్పించాడు. పిల్లల చదువుపై అతడ బెంగ పెట్టుకున్నట్టు సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది. -
వినియోగదారుల ఉద్యమం మరింత పటిష్టం కావాలి
సభలో మాట్లాడుతున్న జేసీ రాహుల్ మీనా కాకినాడ సిటీ: వినియోగదారుడే దేశ ఆర్థిక ప్రగతికి సూత్రధారుడని, వినియోగదారుల ఉద్యమం మరింత పటిష్టం కావాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. శనివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా పౌర సరఫరాలు, లీగల్ మెట్రోలజీ తదితర శాఖల అధికారులతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి జేసీ రాహుల్ మీనా ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో వినియోగ ఉద్యమం ప్రథమస్థానంలో ఉండడానికి వర్కుషాప్లు, సెమినార్ల ద్వారా తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. కేసులను సత్వరమే పరిష్కరించాలన్నారు. మెంబర్ సుశి మాట్లాడుతూ ఉద్యమానికి వారధిలా పని చేస్తామన్నారు. జిల్లా సమాఖ్య చైర్మన్ భమిడి గిరిజా రమాదేవి మాట్లాడుతూ కన్జ్యూమర్ క్లబ్స్, మండల వినియోగ సమాచార కేంద్రాల్లో వినియోగ సంఘాల ద్వారా చైతన్య సదస్సులు నిర్వహిస్తామన్నారు. జిల్లా సప్లై అధికారి ఆర్ఎస్ఎస్ సీతారామరాజు మాట్లాడుతూ సభ్యులు ప్రస్తావించిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు భమిడి శివమూర్తి, చాగంటి నాగేశ్వరరావు, ఫుడ్ కంట్రోల్ అధికారి శ్రీనివాసు, లీగల్ మెట్రోలజీ అధికారుల, ఆర్డీసీ డిపో, అన్నవరం సత్యదేవా మహిళా కళాశాల అధికారులు పాల్గొన్నారు. పలువురు వినియోగదారుల సంఘాల సభ్యులను సత్కరించారు. -
శృంగార వల్లభుని సన్నిధిలో రద్దీ
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సుమారు 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. వివిధ సేవలు, కేశఖండన, అన్నదాన విరాళాలుగా స్వామి వారికి రూ.4,01,587 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఐదు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశారు. అర్జీలను నూరు శాతం పరిష్కరించాలి కాకినాడ సిటీ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను గడువులోపు నూరు శాతం పరిష్కరించాలని జిల్లా ఇన్చార్జి అధికారి జి.వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. వివిధ అంశాలపై ఆయన కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా అటవీ శాఖ అధికారి ఎ.రవీంద్రనాథ్రెడ్డి, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన తదితరులతో కలిసి పలు శాఖల జిల్లా అధికారులు, పథకాల లబ్ధిదారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో శనివారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న వివిధ కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. సమావేశంలో డీఆర్ఓ జె.వెంకటరావు, కాకినాడ, పెద్దాపురం ఆర్డీఓలు ఎస్.మల్లిబాబు, కె.శ్రీరమణి, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పీడీ చైత్రవర్షిణి, సీపీఓ పి.త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. నేడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పరీక్ష కాకినాడ సిటీ: ఏపీపీఎస్సీ ఆధ్వర్యాన ఆదివారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఆర్ఓ జె.వెంకటరావు తెలిపారు. స్థానిక ఎస్.అచ్యుతాపురంలోని అయాన్ డిజిటల్ జోన్ సాఫ్ట్ టెక్నాలజీస్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆయన, ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, ఇతర అధికారులు శనివారం పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో ఏపీపీఎస్సీ, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో డీఆర్ఓ మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగే ఈ పరీక్షకు 464 మంది హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించామన్నారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రానికి ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. స్వయం ఉపాధికి దరఖాస్తుల ఆహ్వానం కాకినాడ సిటీ: బీసీ, ఈబీసీ సామాజిక వర్గాల వారికి స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. బీసీలకు రూ.2 లక్షల వరకూ యూనిట్లకు 50 శాతం సబ్సిడీ లేదా రూ.75 వేలు మించకుండా మిగిలినది ఆర్థిక సాయంగా అందిస్తారన్నారన్నారు. జనరిక్ మెడికల్ షాపు యూనిట్కు రూ.8 లక్షలు, సబ్సిడీ రూ.4 లక్షలు పోను, మిగిలిన సొమ్ము బ్యాంకు రుణంగా అందిస్తారని తెలిపారు. మేదర, కుమ్మరి, శాలివాహన వారికి బుట్టల అల్లకం, కుండల తయారీ కింద యూనిట్ కాస్ట్ రూ.3 లక్షలు, సబ్సిడీ రూ.1.50 లక్షలు అందిస్తారని వివరించారు. ఆర్యవైశ్య, రెడ్డి, క్షత్రియ, కమ్మ, బ్రాహ్మణ, ఈబీసీ వర్గాల వారికి యూనిట్కు రూ.2 లక్షల వరకూ ఇస్తారని, ఇందులో 50 శాతం సబ్సిడీ లేదా రూ.75 వేలు మించకుండా ఆర్థిక సహాయం అందిస్తారని పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గాల వారికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ రుణం ఇస్తారని, ఇందులో 50 శాతం సబ్సిడీ ఉంటుందని తెలిపారు. ఎంఎస్ఎంఈ పథకం కింద రూ.25 లక్షల యూనిట్కు రూ.10 లక్షల బ్యాంకు రుణం, రూ.10 లక్షల సబ్సిడీ ఇస్తారని, లబ్ధిదారు రూ.5 లక్షలు భరించాలని పేర్కొన్నారు. ఈ రుణాలకు 21 నుంచి 60 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. రైస్ కార్డు కలిగి ఉండాలని కమ్యూనిటీ సర్టిఫికెట్ తప్పనిసరని తెలిపారు. మహిళలకు స్వయం ఉపాధి పథకంలో ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇచ్చి, కుట్టుమెషీన్ ఉచితంగా అందిస్తారని శ్రీనివాసరావు వెల్లడించారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 22 చివరి తేదీ అని, ఆసక్తి ఉన్నవారు గ్రామ సచివాలయాలు, నెట్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. -
రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) పిల్లి రమేష్ తెలిపారు. తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పరీక్షలు సోమవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ జరుగుతాయని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 457 పాఠశాలల నుంచి 28,963 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. వీరిలో రెగ్యులర్ 27,500 మంది ఉండగా వీరిలో బాలురు 13,765 మంది, బాలికలు 13,735 మంది ఉన్నారని తెలిపారు. మిగిలిన వారు సప్లిమెంటరీ విధానంలో రాస్తారన్నారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 142 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల తనిఖీలకు వచ్చే అధికారులు సైతం తమ ఫోన్లను గది వెలుపలే విడిచిపెట్టి లోపలకు వెళ్లాలని స్పష్టం చేశారు. పేపర్ లీకేజీలకు కారణమైన వారిని ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తామని డీఈఓ హెచ్చరించారు. ఓపెన్ పరీక్షలకు 2,248 మంది సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యాన నిర్వహించే ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలు సైతం సోమవారం ప్రారంభం కానున్నాయని డీఈఓ రమేష్ తెలిపారు. ఈ పరీక్షలకు 2,248 మంది హాజరవుతున్నారని, వీరి కోసం 26 కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. -
గిరిపై భక్తజనసాగరం
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ● రూ.40 లక్షల ఆదాయంఅన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుడు వెలసిన రత్నగిరి శనివారం భక్తజనసంద్రమే అయ్యింది. రత్నగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు తమ బంధుమిత్రులతో కలసి సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. వీరికి వేలాదిగా వచ్చిన ఇతర భక్తులు కూడా తోడయ్యారు. వీరందరూ సత్యదేవుని దర్శించి, పూజలు, వ్రతాలు ఆచరించారు. దీంతో, ఆలయం వద్ద రద్దీ ఏర్పడింది. స్వామివారి ఉచిత దర్శనానికి గంటన్నర, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని మొత్తం 40 వేల మంది దర్శించుకున్నారు. రెండు వేల వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్న ప్రసాదాన్ని సుమారు 5 వేల మంది భక్తులు స్వీకరించారు. నేడు కూడా రద్దీ సెలవు రోజు కావడంతో ఆదివారం కూడా రత్నగిరిపై భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు శనివారం రాత్రి కూడా వివాహ ముహూర్తాలున్నాయి. దీంతో, సత్యదేవుని సన్నిధిలో ఆదివారం రద్దీ ఏర్పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. సత్యదేవుడు, అమ్మవారిని ఆదివారం ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాకారంలో టేకు రథంపై ఊరేగించనున్నారు. ఘనంగా ప్రాకార సేవ సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఉద యం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి తిరుచ్చి వాహనం మీద వేంచేయించారు. స్వామి, అమ్మవార్లకు పూజల అనంతరం అర్చకులు కొబ్బరికాయ కొట్టి, ప్రాకార సేవను ప్రారంభించారు. ఆలయ ప్రాకారంలో మూడుసార్లు సేవ నిర్వహించి, స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సత్యదేవుని వ్రతాలాచరిస్తున్న భక్తులు -
స్వచ్ఛాంధ్రలో అందరూ భాగస్వాములు కావాలి
కాకినాడ సిటీ: ప్రతి నెలా మూడో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా ఇన్చార్జి అధికారి జి.వీరపాండ్యన్ అన్నారు. కలెక్టరేట్ నుంచి కొండయ్యపాలెం శారదా దేవి గుడి సెంటర్ వరకూ శనివారం నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఆయన, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కలెక్టర్ షణ్మోహన్ సగిలి జెండా ఊపి ప్రారంభించారు. వీరపాండ్యన్, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన తదితరులు ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. ఈ సందర్భంగా వీరపాండ్యన్ మాట్లాడుతూ, పారిశుధ్య నిర్వహణ బాధ్యత మున్సిపల్, పంచాయతీ కార్మికులదే కాదని, ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. కలెక్టర్ షణ్మోహన్ సగిలి కూడా ప్రసంగించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్థాలు, ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగంపై అవగాహన కల్పిస్తూ శారదా దేవి గుడి సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన స్టాల్ను ఎమ్మెల్సీ పద్మశ్రీ ప్రారంభించారు. శ్యామ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేసి, స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టరేట్ సిబ్బంది నిర్వహించిన రంగోలీ కార్యక్రమాన్ని వీరపాండ్యన్, షణ్మోహన్, డీఆర్వో వెంకటరావు పరిశీలించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నాడు ఎత్తేసి.. నేడు తొక్కేసి..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆరు నెలలు సావాసం చేస్తే వారు, వీరు ఒక్కటవుతారంటారు. కూటమిగా జత కట్టి.. అమలు కాని హామీలతో ప్రజలను నమ్మించి.. నట్టేట ముంచుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ల విషయంలో ఈ మాట నిజమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అవసరానికి వాడుకుని, పని అయిపోయాక కూరలో కరివేపాకులా తీసి పడేసే తత్వం ఇంత కాలం చంద్రబాబుకే సొంతమనుకునే వారు. ఇప్పుడు చంద్రబాబుతో చెట్టపట్టాలేసుకు తిరుగుతున్న పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు కూడా ఆ తత్వాన్ని ఒంట పట్టించుకున్నట్టు కనిపిస్తోంది. పిఠాపురం శివారు చిత్రాడలో శుక్రవారం రాత్రి జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ సోదరుడు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు చేసిన వ్యాఖ్యలే దీనికి అద్దం పడుతున్నాయి. ‘పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపులో ప్రధానంగా రెండు ఫ్యాక్టర్స్ పని చేశాయి. ఒకటి జనసేన ప్రెసిడెంట్ పవన్ కల్యాణ్. రెండు జనసైనికులు, పిఠాపురం ఓటర్లు’ మరెవరైనా పవన్ గెలుపులో తమ పాత్ర ఉందని అనుకుంటే అది వారి ఖర్మ’ అని నాగబాబు నొక్కి మరీ చెప్పారు. ఆ మాటలకు అర్థాలే వేరని ఆ సభలోనే జనసేన అభిమానులు, కార్యకర్తలు గుసగుసలాడటం వినిపించింది. నాగబాబు చేసిన వ్యాఖ్యలు పిఠాపురానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను ఉద్దేశించినవేనని ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పొగిడిన నోటితోనే.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక, భీమవరంలో పోటీ చేసి, రెండుచోట్లా ఓడిపోయారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఒకే ఒక్క స్థానం పిఠాపురంలో గెలుపొందారు. ఈ గెలుపులో జనసేన ఎంత పని చేసిందో, స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, ఆయన అనుచరగణం కూడా అంతే స్థాయిలో పని చేసిందనేది జగమెరిగిన సత్యం. పరాజయాల నేపథ్యంతో గత సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురాన్ని ఎంపిక చేసుకున్నప్పటి నుంచి, గెలుపొందే వరకూ వర్మను ఇంద్రుడు, చంద్రుడు అంటూ ఆకాశానికెత్తేయడంలో మెగా బ్రదర్స్ పవన్ కల్యాణ్, నాగబాబు పోటీ పడ్డారు. ‘ఈ విజయం జనసైనికులది. ఈ విజయం వర్మది’ అంటూ స్వయంగా పవన్ కల్యాణ్ పలు సభల్లో వర్మను ప్రశంసలతో ముంచెత్తారు. సార్వత్రిక ఎన్నికల ముందు వరకూ అన్నదమ్ములిద్దరూ వర్మను నెత్తిన పెట్టుకున్నారు. అధికారంలో భాగస్వామ్యులై, పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక అసలు స్వరూపం బయటపడిందని, వర్మను రాజకీయంగా పాతాళానికి తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అనుచర వర్గం మండిపడుతోంది. విస్తృతంగా చర్చ నేడు మెగాబ్రదర్స్ వ్యాఖ్యలు చూస్తూంటే ‘ఓడ ఎక్కే వరకూ ఓడ మల్లన్న.. ఒడ్డుకు చేరాక బోడి మల్లన్న’ సామెతను తలపిస్తోందని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలయ్యేంత వరకూ వర్మను వేనోళ్ల పొగడిన మెగా సోదరులు ఇంతలోనే ఇంతలా మారిపోతారని ఊహించలేదని తెలుగు తమ్ముళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు పిఠాపురంలో జరిగిన ఒక సభలో వర్మను ఆకాశానికెత్తేస్తూ మెగా బ్రదర్స్ పొగుడుతున్న వీడియో, శుక్రవారం రాత్రి చిత్రాడ సభలో నాగబాబు వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ అంశం ఇప్పుడు కూటమి పార్టీల మధ్య హాట్టాపిక్గా మారింది. ఎక్కడ ఏ నలుగురు కలిసినా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. పవన్ కల్యాణ్ తరచూ మార్పు రావాలంటున్నారని, చివరకు చిత్రాడ సభలో సైతం ఇదే విషయాన్ని ఊదరగొట్టారని, మార్పు అంటే ఇదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు మొండిచేయి పొత్తు ధర్మంలో భాగంగా పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మకు చంద్రబాబు భారీ హామీయే ఎర వేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ పదవిని ఆయనకే ఇస్తామని గొప్పగా ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుమూడు దఫాలు ఎమ్మెల్సీల నియామకాలు జరిగినా వర్మకు మాత్రం మొండిచేయే చూపించారు. పని అయ్యే వరకూ బుజ్జగించడం.. ఆనక గాలికొదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అనే విమర్శ ఉంది. అయితే, అదే వాస్తవమని వర్మకు ఎమ్మెల్సీ పదవి విషయంలో మరోసారి రుజువైందని అంటున్నారు. అయితే, వర్మకు జెల్ల కొట్టడానికి వేరే కారణముందనే చర్చ కూడా నడుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో సీటు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వర్మ అనుచరులు పిఠాపురంలో చంద్రబాబు, లోకేష్ దిష్టిబొమ్మలు, పార్టీ జెండాలు దహనం చేశారు. చంద్రబాబు, లోకేష్లను బూతులు తిట్టారు. దీనిని మనసులో పెట్టుకుని, చంద్రబాబు, లోకేష్లు వ్యూహాత్మకంగానే వర్మను తొక్కేస్తున్నారని, మెగాబ్రదర్స్ ద్వారా పొమ్మనకుండానే పొగ పెడుతున్నారని టీడీపీలోని ఒక వర్గం అంటోంది. లేకుంటే వర్మను నాగబాబు పదేపదే టార్గెట్ చేస్తున్నా అధినేతలు ఎందుకు మాట్లాడటం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, నాగబాబు మధ్య ఎన్నికల సమయంలో రగిలిన చిచ్చు అధికారంలోకి వచ్చాక కూడా కొనసాగుతూనే ఉంది. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోగా.. ఆయనను నిత్యం విభేదించే మెగా బ్రదర్ నాగబాబుకు ఆ పదవి ఇచ్చారు. నాగబాబును రేపోమాపో మంత్రిని కూడా చేస్తారనే ప్రచారంతో పిఠాపురంలో వర్మ అనుచరులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే నియోజకవర్గంలో టీడీపీ ఉనికే ప్రమాదంలో పడుతుందని తెలుగు తమ్ముళ్లు పేర్కొంటున్నారు.మొన్నటి వరకూ పొగిడారు.. ఇప్పుడు పొగ పెడుతున్నట్టున్నారు సార్.. కూరలో కరివేపాకులా మాజీ ఎమ్మెల్యే వర్మ పరిస్థితి నాగబాబు ‘ఖర్మ’ కామెంట్లపై తమ్ముళ్ల ఆగ్రహం వర్మనుద్దేశించే అన్నారని మండిపాటు ఇదంతా చంద్రబాబు వ్యూహమని ప్రచారం పొమ్మనకుండా పొగ పెడుతున్నారంటున్న టీడీపీలోని ఒక వర్గం పిఠాపురంలో ‘దేశా’నికి ‘చంద్ర’ గ్రహణం! -
ఎక్కువ రేటుకు ఎందుకు అమ్ముతున్నారు?
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ‘గతంలో టన్ను ఇసుక ధర రూ.475 ఉంది. ఏజెన్సీలు రూ.229కి కోట్ చేశాయి. కానీ, ఇప్పటికీ రూ.400కు పైగా అమ్ముతున్నారు. దీనికి కారణమేమిటి?’ అని మైన్స్ కమిషనర్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఇసుక సరఫరా ఏజెన్సీలు సాధ్యం కాని ధర ప్రతిపాదించి, ఎక్కువ రేటుకు ఎందుకు అమ్ముతున్నాయని నిలదీశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన డీఎల్ఎస్ఏ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇదే తీరు పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై నిర్వహించే సమావేశానికి ఓపెన్, డీసిల్టేషన్ ఏజెన్సీలు తప్పనిసరిగా హాజరు కావాలని అన్నారు. జరిగిన తప్పులు సరిచేసుకోవాలని, ఇకపై రీచ్లలో ప్రభుత్వ సిబ్బందిని కూడా నియమిస్తామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. వినియోగదారులతో నేరుగా సంభాషిస్తామన్నారు. మొదట వచ్చిన వారికి మొదట ఇసుక అందించేలా రవాణా వ్యవస్థ ఉండాలన్నారు. రవాణా వ్యవస్థపై పర్యవేక్షణ తప్పనిసరని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్పీ డి.నరసింహ కిషోర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, మైన్స్ ఈడీ డి.ఫణిభూషణ్రెడ్డి పాల్గొన్నారు. -
కలెక్టర్లు హాజరు కాకుంటే ఎలా?
కాకినాడ సిటీ: జెడ్పీ సర్వసభ్య సమావేశంలో అజెండాలోని అంశాలపై జరిగే చర్చలకు తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీన జిల్లాల కలెక్టర్లు హాజరు కాకపోవడంపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరావులతో పాటు ఆయా జిల్లాల జెడ్పీటీసీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం పనుల ద్వారా సమకూరిన మెటీరియల్ కాంపోనెంట్ నిధులను, గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ల తీర్మానాలతో ప్రమేయం లేకుండా కలెక్టర్లు తమ ప్రాధాన్యం ప్రకారం కేటాయించడంపై సభ్యులు అభ్యంతరం తెలుపుతూ, ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని చైర్మన్ వేణుగోపాలరావును కోరారు. మూడు జిల్లాలోని గోదావరి కాలువ చివరి ఆయకట్టు భూముల్లోని పంటలు సాగునీరు అందక ఎండిపోతున్న పరిస్థితిపై సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ, వంతుల వారీ విధానం, డ్రైన్ల నుంచి లిఫ్టింగ్ ద్వారా పంటలను కాపాడాలని కోరారు. కాలువల ఎగువ ప్రాంతాల్లోని రైతులకు సక్రమంగా నీటిని వదులుతున్నప్పటికీ అదనపు నీటిని అక్రమంగా తోడుతుండడం వల్ల శివారు భూములకు నీరు అందడం లేదని, ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హెచ్చరించారు. తాళ్లరేవు జెడ్పీటీసీ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ మాట్లాడుతూ యానాం–ద్రాక్షారామ ప్రధాన రహదారిలో ఆరేళ్లుగా వంతెన శిథిల స్థితికి చేరడం వల్ల కాలువకు తూరలు వేసి పైన సీసీ రోడ్డు వేశారని, ఫలితంగా నీరు సక్రమంగా పారకపోవడం, ఆ రహదారిలో రాకపోకలు సాగిస్తున్న సుమారు 40 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఇంజరం వద్ద పూర్తి స్థాయిలో వంతెన నిర్మించి రైతులను ఆదుకోవాలని, ప్రజల రాకపోకలలో ఇబ్బందులు తొలగించాలని కలెక్టర్ కోరారు. దీనిపై కలెక్టర్ షణ్మోహన్ స్పందించి ఈ విషయం పూర్తి స్థాయిలో అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే పౌరసరఫరాల ద్వారా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లకు పంపిణీ చేస్తున్న నాసిరకమైన కొత్త బియ్యం వండినప్పుడు ముద్దవుతోందని, పిల్లలు తినడానికి ఇష్టపడడం లేదని కొందరు సభ్యులు ప్రస్తావించారు. మండలాల్లో నిర్వహించిన పనులకు చెల్లింపులు జాప్యం లేకుండా జరపాలని కోరారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమాలు జిల్లాలో విస్తృతంగా నిర్వహించాలని, ఆరోగ్యంపై వ్యయాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన జనరిక్ మందుల షాపులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు కోరారు. కారుణ్య నియామకాలను వేగవంతం చేయాలని, ఉద్యోగులకు జీపీఎఫ్ స్లిప్పులు జారీ చేయాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు. గిరిజన ప్రాంత ప్రజల సమస్యలపై చర్చ, పరిష్కారానికి ఐటీడీఏ సర్వ సభ్య సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్తో పాటు, ఏఎస్ఆర్ జిల్లా పరిధి జెడ్పీటీసీ సభ్యులు కోరారు. దీనిపై ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం స్పందిస్తూ ఏప్రిల్ చివరి లేదా మే తొలివారంలో తదుపరి సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అలాగే గిరిజన ప్రాంత సమస్యలపై సభ్యులు ప్రస్తావించిన అంశాలకు ఆయన వివరణలు ఇచ్చి సమస్యలన్నింటినీ సత్వరం పరిష్కరిస్తామన్నారు. తమ జిల్లాలకు సంబంధించి సభ్యులు లేవనెత్తిన అంశాలపై చర్యలు చేపడతామని తూర్పుగోదావరి జిల్లా జేసీ చినరాముడు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డీఆర్వో రాజకుమారి సభ్యులకు వివరించారు. సమావేశం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన సభ్యులు, అధికారులకు జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన ప్రజాసమస్యలపై సత్వరం సమగ్ర పరిష్కారాలు అందించాలని నాలుగు జిల్లాల అధికారులను చైర్మన్ వేణుగోపాలరావు కోరారు. ఈ సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్లు బుర్రా అనుబాబు, మేరుగు పద్మలత, జెడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు, డిప్యూటీ సీఈవో రామ్గోపాల్, ఏవో ఎం.బుజ్జిబాబు, జెడ్పీటీసీ సభ్యులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని నాలుగు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. ఒత్తిడి లేని బోధనతో ఉత్తమ ఫలితాలు బాలాజీచెరువు: ఒత్తిడి లేని విద్యాబోధనతో ఉత్తమ ఫలితాలు సాధింవచ్చని జేఎన్టీయూకే సివిల్ ప్రొఫెసర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. స్థానిక భాష్యం బ్లూమ్స్ స్కూల్లో శనివారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య ద్వారా మంచి విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుందని, సరైన ప్రణాళికతో చదువుకోవాలనిసూచించారు. అనంతరం విద్యా ర్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. అంతకు ముందు విద్యా సంస్థల వైస్ చైర్మన్ భాష్యం హానుమంతరావు జ్యోతి ప్రజల్వన చేశారు. కార్యక్రమంలో జోనల్ ఇన్చార్జ్ గోవిందరాజు, ప్రిన్సిపాల్ ధృవీణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.రాజమండ్రిలో సీన్ తీస్తే సూపర్ హిట్టే ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): తను హీరోగా నటించిన రాబిన్ హుడ్ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఉన్నాయని, ఈ సినిమా అందరికీ నచ్చుతుందని హీరో నితిన్ అన్నారు. గతంలో వెంకీ కుడుముల దర్శకత్వంలో తను నటించిన భీష్మ సినిమా మంచి విజయం సాధించిందని చెప్పారు. ఆ సినిమాలో ఒక సన్నివేశం రాజమండ్రిలో చిత్రీకరించామని అది హిట్టని అన్నారు. ఆ సెంటిమెంటుతో రాబిన్ హుడ్ సినిమాలో ఒక సీన్ ఇక్కడ చిత్రీకరించామని, ఇది కూడా సూపర్ హిట్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 28 న విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్ కోసం రాజమండ్రి వచ్చిన చిత్ర బృందం శనివారం మధ్యాహ్నం మంజీరా హోటల్లో మీడియాతో మాట్లాడింది. నితిన్ మాట్లాడుతూ దర్శకుడు వెంకీ కుడుముల తొలి చిత్రం చలో నుంచి తనకు పరిచయం ఉందని తర్వాత తమ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన భీష్మ చిత్రం మంచి విజయం సాధించిందని గుర్తు చేశారు. దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ఇప్పటికే రాబిన్ హుడ్ టీజర్, సాంగ్స్కు మంచి స్పందన వస్తోందని సినిమా కూడా హిట్టవుతుందన్న నమ్మకం ఉందని చెప్పారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ మంచి పాటలు కంపోజ్ చేశారని చెప్పారు. శ్రీలీల ఈ చిత్రంలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు వెంకీ తెలిపారు. శ్రీలీల మాట్లాడుతూ తనకు రాజమండ్రి కొత్తకాదని తమ గ్రాండ్ ఫాదర్ ధవళేశ్వరంలో ఉండేవారని చెప్పారు. ఈ సినిమాలో తన పాత్రను ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారని, పిల్లలతో కలిసి సినిమా చూడాలని ఆమె కోరారు. రాజమండ్రి రోజ్ మిల్క్ తనకు చాలా ఇష్టమని ఆమె అన్నారు. కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 16,000 గటగట (వెయ్యి) 14,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 కిలో 260 రూ.1014 కోట్లతో బడ్జెట్కు ఆమోదం అంబాజీపేట కొబ్బరి మార్కెట్ తూర్పుగోదావరి, కోనసీమ జిల్లా అధికారులపై సభ్యుల ధ్వజం పలు అంశాలపై జెడ్పీ సమావేశంలో చర్చ రూ.70 లక్షల మిగులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.70 లక్షల మిగులుతో రూ.1,014 కోట్ల బడ్జెట్ను ఆమోదించింది. ఉమ్మడి జెడ్పీ బడ్జెట్ సర్వసభ్య సమావేశం శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, తూర్పుగోదావరి జిల్లా జేసీ ఎస్ చినరాముడు, రంపచోడవరం జేసీ కట్టా సింహాచలం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డీఆర్ఓ బీఎల్ఎస్ రాజకుమారి పాల్గొన్నారు. సమావేశాన్ని జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ప్రారంభించగా తొలుత దివంగతులైన కాట్రేనికోన ఎంపీపీ పాలెపు లక్ష్మి మృతికి సంతాపం ప్రకటిస్తూ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సమావేశంలో 2024–25 సంవత్సరానికి సవరించిన బడ్జెట్ను, 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన అంచనా బడ్జెట్ ముసాయిదాను జెడ్పీ పరిపాలనాధికారి సభ్యులకు వివరించారు. అనంతరం బడ్జెట్లో పొందుపరిచిన ప్రతిపాదనలపై సమవేశం చర్చించి 2024–25 సంవత్సరానికి సవరించిన ఆదాయం రూ. 846.60 కోట్లు, సవరించిన వ్యయం రూ. 845.95 కోట్లతో రూ.65 లక్షలు మిగులుతో సవరించిన బడ్జెట్ను ఆమోదించారు. అదే విధంగా రానున్న 2025–26 ఆర్థిక సంవత్సరానికి అన్ని పద్దులు కలిపి మొత్తం ఆదాయం అంచనా రూ.1013.80 కోట్లు కాగా, అన్ని పద్దుల కింద అంచనా వ్యయం రూ. 1013.10 కోట్లతో, రూ.70 లక్షలు మిగులు బడ్జెట్ను సమావేశం ఆమోదించింది. ఆదాయంలో జెడ్పీ సాధారణ నిధులు రూ. 28 కోట్లు, ప్రభుత్వం నుంచి కేటాయించిన శాలరీ గ్రాంటులు రూ.10.48 కోట్లు, నిర్థిష్ట ప్రయోజన గ్రాంటు రూ.46.09 కోట్లు, డ్వామా, గ్రామీణ నీటి సరఫరా, ఇతర శాఖల ద్వారా వచ్చే గ్రాంటు రూ. 922.39 కోట్లుగా ఉన్నాయి. జెడ్పీ సాధారణ నిధుల నుంచి షెడ్యూల్ కులాల సంక్షేమానికి 15 శాతం కేటాయింపు రూ. 2.97 కోట్లు, షెడ్యూల్ తెగల సంక్షేమానికి 6 శాతం కేటాయింపు రూ.1.19 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 15 శాతం కేటాయింపు, రూ.2.97 కోట్లు, అభివృద్ధి పనులకు 23 శాతంగా రూ.4.55 కోట్లు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పశుసంవర్థక, సాంఘిక సంక్షేమం తదితర సెక్టార్లకు 10 శాతంగా రూ. 2.97 కోట్లు కేటాయింపులను సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఆస్తులను పరిరక్షిస్తూ, ఆదాయ వనరులను మరింత పెంచాలని సభ్యులు కోరారు. -
ఏరు దాటాక తెప్పతో పనేంటి?
కాకినాడ, సాక్షి: ఏరు దాటాక తెప్పతో పనేముంటుంది?.. తగలెట్టేయడమే!.. కాబోయే జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు(Konidela Naga babu) ఇప్పుడు ఇదే తరహా రాజకీయం చూపించారు. తన సోదరుడు, జనసేన అధినేత అయిన పవన్ కల్యాణ్ కోసం సీటును.. ఆపై ఆత్మాభిమానం చంపేసుకుని మరీ ప్రచారం చేసి గెలిపించారు పిఠాపురం టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. అంతటి త్యాగాన్ని చేసిన వ్యక్తిని ఉద్దేశించి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో చర్చతో రచ్చ కూడా చేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే... అది వారి ‘ఖర్మ’ అంటూ కొణిదెల నాగబాబు పిఠాపురం ఆవిర్భావ సభలో అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విజయం ఎన్నికలకు ముందే ఖాయమైందని, ఆ విజయం వెనుక వర్మ చేసిందేమీ లేదన్నట్లుగా మాట్లాడారాయన. ఎన్నికల సమయంలో తనకు, తన బృందానికి పవన్ కళ్యాణ్ బాధ్యతలు అప్పగించారని, అది కేవలం తమ సంతృప్తి కోసం అప్పగించిన బాధ్యతలే అన్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్ను గెలిపించాలని ఎన్నికలకు ముందే నిశ్చయించుకున్నారని చెప్పారు. ఈ పరిస్థితిలో ఎవరైనా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పని చేశామని కానీ, విజయానికి తామే కారణమని కానీ అనుకుంటే అది వారి ‘ఖర్మ’ అని స్పష్టం చేశారు. కాగా, నాగబాబు వ్యాఖ్యలు టీడీపీలో దుమారం రేపుతున్నాయి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయానికి తాను ఎంతో కష్టపడి పని చేశానని వర్మ అనేక సందర్భాల్లో చెప్పారు. అయినా మొన్న ఎమ్మెల్సీ సీటు ఆయనకు దక్కలేదు. పైగా నాగబాబుకు టికెట్ దక్కింది. అయితే ఎమ్మెల్సీ రాకపోయినా తాను సర్దుకుపోతానని వర్మ ఒక మాట అన్నారు. దీంతో ఇటు టీడీపీలోనే కాదు.. అటు జనసేనలోనూ ఆయనపై సింపథీ ఏర్పడింది. ఇలాంటి తరుణంలోనూ నాగబాబు పిఠాపురం సభలో చేసిన వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదని సోషల్ మీడియా వేదికగా టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు. పిఠాపురంలో వ్యూహాత్మకంగా టీడీపీని, వర్మను నిర్వీర్యం చేయడానికే నాగబాబు ఇలా మాట్లాడారని, ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక ఇలా నాలుక మడతెయ్యడం తగదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. -
హైదరాబాద్ టు పిఠాపురం.. ఇదెక్కడి యూటర్న్ భయ్యా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏపీ ప్రజలకు శుక్రవారం పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో.. కొత్త పవన్ కల్యాణ్ కనిపించాడు. మునుపెన్నడూ లేని విధంగా ఆయన ప్రసంగం సాగడమే అందుకు కారణం. రాజకీయాల్లో పవన్ ఎలా ఉండకూడదని ఆయన అభిమానులు అనుకున్నారో.. సరిగ్గా అలాగే ఆయన నిన్న కనిపించారు. అసలు అంశాలన్నీ పక్కన పడేసి.. అవసరం లేకపోయినా మత, ప్రాంతీయ అంశాలను తెర మీదకు తెచ్చి మరీ ఊగిపోయారాయన. విలువలు వదిలేసి.. అధికారంలోకి వచ్చాక పవన్ రాజకీయంలో మార్పు కనిపిస్తోంది. కుల, మత, జాతి, ప్రాంతీయ రాజకీయాలకు తాను వ్యతిరేకుడినని.. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆరాధిస్తానని తొలినాళ్లలోనే ప్రకటించుకున్న పవన్.. మొత్తంగా మారిపోయారు. రాజకీయాన్ని బాగా ఒంట బట్టిచ్చుకుని మాట్లాడారు. మొన్నటి ఎన్నికల్లో 40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీని నిలబెట్టానంటూ పవన్ మాట్లాడారు. ఈ కామెంట్లు టీడీపీ పొత్తుపై అసంతృప్తితో ఉన్న కేడర్ను సంతృప్తి పరచడానికో లేదంటే.. నిజంగా మనసులోంచి వచ్చిన మాటలో తెలియదు. పనిలో పనిగా.. ఏదో తిట్టాలని కదా అని వైఎస్సార్సీపీని ఓ నాలుగు మాటలు అన్నారు. ఈ క్రమంలో తనను జనాలకు బాగా దగ్గర చేసిన సినిమాలను తక్కువ చేసి మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు సినిమా ఉపకరణం మాత్రమేనని ఇంక దానితో తనకు అవసరం లేదన్నట్లుగా ఒక్క మాటతో తేల్చేశారు. డిగ్రీ పూర్తి చేసి ఉంటేనా?.. సగటు మధ్య తరగతి మనిషిగా బతకడమే పవన్ కోరిక అట. చంటి సినిమాలో మీనాను పెంచినట్టు తనను పెంచారట. తాను డిగ్రీ పూర్తి చేసి, ఎస్సైని కావాలన్నది తన తండ్రి కోరిక అని, కానీ తాను డిగ్రీ కూడా పూర్తి చేయలేదని చెప్పారు. అటువంటి తాను బయటకు వెళ్తే ఏమవుతానో అని ఇంట్లో నిత్యం భయపడేవారన్నారు. అలాంటిది తాను సినిమాలు, రాజకీయం చేయడం కుటుంబ సభ్యులకూ ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. అయితే పవన్ కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసి ఉండేవారేమో అంటూ కొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఓట్ల కోసం కాదంట!!.. జనసేన విజయానికి ఏడు సిద్ధాంతాలే కారణమని, ఎంతో ఆలోచించి వీటిని రూపొందించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. సమాజంపై అవగాహన లేకుండానే పార్టీ పెట్టేస్తామా? పార్టీ పెట్టాలంటే నాన్న ముఖ్యమంత్రి, మామయ్య కేంద్ర మంత్రి అయ్యుండాలా? అని పవన్ ప్రశ్నించారు. దశాబ్దం పాటు పార్టీని నడపడంతో వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం ఎంతో కోల్పోయానన్నారు. సమాజంలో మార్పు కోసం వచ్చానని, ఓట్ల కోసం కాదని కామెంట్ చేశారు. అన్అపాలజెటిక్ సనాతనినే అంట.. భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేయాల్సిన సమయం ఇదేనని, సనాతన ధర్మం తన రక్తంలోనే ఉందని, దానిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్పై స్పందిస్తూ.. ఇతర మతాలను గౌరవించాలని సనాతన ధర్మం నేర్పిందన్నారు. హైదరాబాద్లో పోలీసులు 15 నిమిషాలు కళ్లు మూసుకుంటే హిందువులకు తమ సత్తా చూపుతామని ఒక నాయకుడు వ్యాఖ్యానించడం దారుణం అంటూ మండిపడ్డారు. పవర్ స్టార్ను అంత మాట అన్నారా?.. ‘మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటారు.. అన్నీ దేశ భాషలే కదా.. తమిళనాడులో హిందీ రాకూడదని అంటూంటే నాకు ఒక్కటే అనిపించింది. తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్గఢ్ నుంచి కావాలి. హిందీని మాత్రం ద్వేషిస్తామంటే ఎలా? ఇక్కడి న్యాయం. తమిళనాడులో పెరిగినప్పుడు నేను వివక్ష అనుభవించా.. గోల్టీ.. గోల్టీ.. అంటూ అవమానించారని ఆయన తెగ ఫీలైపోయారు.ఎంత మార్పు!గత జనసేన ఆవిర్భావ సభలకు.. ఈసారి సభకు జనసేనానిలో చాలా మార్పు వచ్చింది. అందుకు అధికారంలో ఉండడం, అదీ చంద్రబాబు కింద ఉండడమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో జనసేన ఆవిర్భావం రోజు నుంచి.. గత జనసేన సభల్లో.. పవన్ ఎక్కువగా ప్రజలకు కనెక్ట్ అయ్యే అంశాలపై దృష్టి పెట్టేవారు. అవసరం ఉన్నా.. లేకున్నా.. అప్పటి ప్రభుత్వాలను విమర్శిస్తూ ఆవేశంగా ఊగిపోయేవారు. అది ప్రజల్లో మాస్ హిస్టీరియాలాంటి స్థితిని తెచ్చింది. అయితే.. 👉గత మీటింగ్లలో పవన్ వ్యాఖ్యలు కొన్నిసార్లు విచిత్రంగా.. అసంబద్ధంగా ఉన్నా.. ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పడంలో మాత్రం పవన్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. కానీ, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి.. అందునా హామీలు నెరవేర్చలేని స్థితిలో ఉన్నారు. ప్చ్.. బహుశా అందుకేనేమో ఆయన వాటి ఊసెత్తలేదు. 👉ఎప్పటిలాగే సొంత విషయాల్లో ‘కొత్త కోణం’ ఆవిష్కరించిన ఆయన.. అవసరం లేకున్నా.. హిందూ, హిందీ భాష టాపిక్స్ తీసుకొచ్చి మాట్లాడారు. అలాగే.. నేషనల్ మీడియా తనపై రాసినవంటూ కొన్ని అంశాలంటూ ఊగిపోయారు. లెఫ్ట్, రైట్, సెంట్రల్ ఐడియాలజీ మార్చేశానని, చెగువేరా ఫాలోవర్ కాస్త నుంచి సడన్గా సనాతని డిఫెండర్ అయిపోయానిని కథనాలు(వాస్తవాలు) రాశారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారాయన. అయితే..గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, అధికారంలో ఉన్నా లేకున్నా.. వైఎస్ జగన్ మోహన్రెడ్డిలా విలువలుతో కూడిన రాజకీయాలు చేయడం, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడం బహుశా చంద్రబాబు & కోకు మాత్రమే కాదు తన వల్లా కాదనే విషయాన్ని పవన్ పిఠాపురం ప్రసంగంతో తేల్చేశారు. -
హోలీ వేళ కాకినాడలో విషాదం.. చదవు రాకపోతే చంపేస్తారా? నాన్న..
కాకినాడ రూరల్: అభం శుభం తెలియని ఆ పసి పిల్లల పాలిట ఆ తండ్రి కాలయముడయ్యాడు. కారణమేంటో తెలియదు కానీ.. ఇద్దరు చిన్నారులను బలిగొన్నాడు. అంతటితో ఆగక తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉలిక్కిపడేలా చేసే ఈ సంఘటన కాకినాడలోని తోట సుబ్బారావు నగర్లో శుక్రవారం చోటు చేసుకుంది. భార్యా పిల్లలతో చీకూచింతా లేని కుటుంబం. ఆర్థికంగా దన్నుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీలో ఉద్యోగం. ఏమైందో ఏమో కానీ, అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన తండ్రే పిల్లలను నిర్దాక్షిణ్యంగా నీటిలో ముంచి, ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఆపై తాను ఉరి వేసుకున్నాడు. హోలీ పండగ పూట కాకినాడ రెండో డివిజన్లోని తోట సుబ్బారావు నగర్లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి సర్పవరం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్(37) వాకలపూడి ఓఎన్జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంట్గా పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా భార్యాపిల్లలతో తోటసుబ్బారావు నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. పిల్లలు జోషిత్(7) ఒకటో తరగతి, నిఖిల్(6) యూకేజీ చదువుతున్నారు. ఇలాఉండగా తోట సుబ్బారావు నగర్లో తన ప్లాట్ నుంచి హోలీ పండగ వేడుకల కోసం భార్య తనూజ, పిల్లలతో కలిసి వాకలపూడిలో తాను పనిచేస్తున్న ఓఎన్జీసీ కార్యాలయం వద్దకు వెళ్లాడు. అక్కడ హోలీ వేడుకల్లో భార్యను ఉండమని చెప్పి, పిల్లలకు టైలర్ వద్ద కొలతలు తీయించి తెస్తానని ఇంటికి వచ్చాడు. ఇంట్లో బాత్రూం బకెట్ నీటిలో ఇద్దరు పిల్లలను ముంచి, ఊపిరాడకుండా చేసి హతaమర్చాడు. తర్వాత బెడ్రూంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంట వరకూ భర్త, పిల్లలు రాకపోయేసరికి కంగారుపడిన భార్య ఫోన్ చేసినప్పటికీ సమాధానం రాలేదు. దీంతో ఓఎన్జీసీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది తోట సుబ్బారావునగర్లో చంద్రకిశోర్ ఇంటికి వచ్చారు. తలుపులు బలవంతంగా తెరిచేసరికి బెడ్రూంలో ఉరి వేసుకుని చంద్రకిశోర్ కనిపించాడు. పిల్లలు బాత్రూంలో విగతజీవుల్లా కనిపించారు. విషయం తెలుసుకున్న భార్య, ఇతర కుటుంబ సభ్యులు, ఓఎన్జీసీ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. కళ్లెదుటే భర్త, పిల్లలు శవాలుగా పడి ఉండడంతో భార్య తనూజ స్పృహ కోల్పోయింది. బంధువుల సపర్యలతో స్పృహలోకి వచ్చిన ఆమె రోదించిన తీరు చూపరులను కలచివేసింది. ఆమెను ఓదార్చడం బంధువులకు కష్టంగా మారింది. సర్పవరం ఎస్సై శ్రీనివాస్కుమార్ కేను నమోదు చేశారు. సీఐ పెద్దిరాజు విచారణ చేపట్టారు. చంద్రకిశోర్ బెడ్రూంలో సూసైడ్ నోట్ను పోలీసులు కనుగొన్నారు. ప్రస్తుత జనరేషన్లో తన పిల్లలు సరిగ్గా చదవడం లేదని మనస్తాపం చెంది చనిపోతున్నట్టుగా రాసి ఉందని తెలిసింది. ఈమధ్యే పిల్లల స్కూలు కూడా మార్చినట్టు బంధువులు తెలిపారు. -
ఘనంగా ప్రత్యంగిర హోమం
అన్నవరం: ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ప్రత్యంగిర హోమం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ఉదయం 9 గంటలకు పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, హోమం ప్రారంభించి, 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు. వేద పండితులు యనమండ్ర శర్మ, వనదుర్గ ఆలయ అర్చకుడు కోట వంశీ, పరిచారకుడు వేణు, వ్రత పురోహితులు చెళ్లపిళ్ల ప్రసాద్ తదితరులు హోమం నిర్వహించారు. హోమంలో వంద మందికి పైగా భక్తులు రూ.750 టికెట్టుతో పాల్గొన్నారు. వారు కుటుంబ సభ్యులతో తరలి రావడంతో హోమ మండపం సరిపోక, కొంతమంది వెలుపల వేచి ఉండాల్సి వచ్చింది. వనదుర్గ ఆలయం ఎదురుగా హోమం నిర్వహించినపుడు కూడా గతంలో ఇదే సమస్య ఎదురవడంతో హోమాన్ని మండపం దిగువకు మార్చారు. అయినప్పటికీ సమస్య అలాగే ఉంది. దీంతో ఆలయానికి ఎదురుగా ఎక్కువ మంది భక్తులు పాల్గొనేందుకు వీలుగా హోమ మండపం నిర్మిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా సత్యదేవుని ప్రధానాలయంలో అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యాన, కొండ దిగువన కనకదుర్గ అమ్మవారికి అర్చకుడు చిట్టెం గోపి ఆధ్వర్యాన పండితులు ఘనంగా కుంకుమ పూజలు నిర్వహించారు. -
రత్నగిరికి భక్తుల తాకిడి
అన్నవరం: ఫాల్గుణ పౌర్ణమి, హోలీ పర్వదినం సందర్భంగా రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయం శుక్రవారం వేలాదిగా వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 30 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. రెండు వేల వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుని దర్శించుకున్న భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. అలాగే, రావిచెట్టుకు కూడా ప్రదక్షిణలు చేసి, జ్యోతులు వెలిగించారు. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్న ప్రసాదాన్ని 5 వేల మంది స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను శనివారం ఉదయం 10 గంటలకు తిరుచ్చి వాహనంపై ఆలయ ప్రాకారంలో మూడుసార్లు ఊరేగించనున్నారు. వైభవంగా చక్రస్నానం మధురపూడి: కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. నరసింహస్వామితో పాటు అనంత పద్మనాభస్వామి, చక్రపెరుమాళ్ల స్వామి వార్లకు స్థానిక స్వామి వారి కోనేటిలో ఈ ఉత్సవం జరిపారు. రాత్రి 9 గంటలకు స్వామివారికి శేష వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. దేవస్థానం వద్ద ప్రారంభమైన ఈ కార్యక్రమం గ్రామంలోని ప్రధాన వీధుల్లో కొనసాగింది. దేవస్థానం చైర్మన్ పరాశర రంగరాజభట్టర్, అన్నవరం దేవస్థానం అధికారులు, పండితులు, అర్చక స్వాములు పాల్గొన్నారు. నేటితో ఉత్సవాల ముగింపు లక్ష్మీనరసింహస్వామివారి కల్యాణ మహోత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. ఈ నెల 9న ఇవి ప్రారంభమైన విషయం తెలిసిందే. చివరి రోజు శ్రీపుష్పయాగం నిర్వహిస్తారు. డెల్టాలకు నీరు విడుదల ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు శుక్రవారం 10,250 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 3,050, మధ్య డెల్టాకు 2 వేలు, పశ్చిమ డెల్టాకు 5,200 క్యూసెక్కుల చొప్పున వదిలారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.20 అడుగులు ఉంది. -
పొలంలో స్వల్పంగా గ్యాస్ లీక్
మామిడికుదురు: పాశర్లపూడి–43 బావి నుంచి తాటిపాక జీసీఎస్కు గతంలో వేసిన పైపులైన్ నుంచి శుక్రవారం స్వల్పంగా గ్యాస్ లీకై ంది. మామిడికుదురు గ్రామంలో ఏటిగట్టు పక్కన పొలాల్లో ఈ లీకేజ్ ఏర్పడింది. లీకేజ్ ఏర్పడిన చోట నుంచి స్వల్పంగా గ్యాస్ బయటకు వచ్చింది. దీంతో పాటు కొద్దిగా ముడి చమురు కూడా లీకై ంది. దీంతో ఆ ప్రాంతమంతా ముడి చమురు వాసన వ్యాపించింది. ముడి చమురు ప్రభావంతో పొలంలో నీరు తెట్టు కట్టింది. ఓఎన్జీసీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ బావి నుంచి ఎటువంటి ఉత్పత్తి జరగడం లేదన్నారు. చాలా కాలం క్రితం ఆ బావిలో ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. పైపులైన్లో ఉన్న గ్యాస్, ముడి చమురు బయటకు వచ్చి ఉంటాయన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తామని చెప్పారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 16,000 గటగట (వెయ్యి) 14,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
జనసేన కార్యకర్తల గుండాగిరీ
పిఠాపురం: చిత్రాడలో శుక్రవారం నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన కార్యకర్తలు గుండాగిరీ చేయడంతో సామాన్యులు బెంబేలెత్తిపోయారు. ట్రాఫిక్ నిలుపుచేసి, తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అడిగిన సామాన్య ప్రయాణికులపై జనసేన జెండా కర్రలతో దాడి చేసి, గాయపరిచారు. మమ్మల్నే అడుగుతారా? అధికారం మాది.. అడిగితే చంపుతామంటూ బెదిరించి, కర్రలతో దాడి చేయడంతో ప్రయాణికులు గాయాలపాలయ్యారు. దీనిని ఆపాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం విమర్శలకు దారి తీసింది. మరోపక్క 216 జాతీయ రహదారిపై జనసేన కార్యకర్తలు బైక్లపై ప్రమాదకర ఫీట్లు చేస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపించారు. వారిని కనీసంగా కూడా నిలువరించకపోవడంతో పోలీసులపై ప్రయాణికులు దుమ్మెత్తి పోశారు. -
నేటి నుంచి ఒంటిపూట బడులు
రాయవరం/కొత్తపేట: జిల్లా అంతటా నేటి నుంచి పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. విద్యా శాఖ క్యాలండర్ ప్రకారం మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాల్సి ఉంది. అందులో భాగంగా శనివారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలంటూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వి.విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కారణంగా మండుతున్న ఎండల నుంచి విద్యార్థులకు ఉపశమనం లభించనుంది. విద్యా శాఖ క్యాలండర్ ప్రకారం ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, ఇతర ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలతో పాటు, ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలకు ఒంటిపూట బడుల నిబంధన వర్తిస్తుంది. పదో తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచి నిర్వహించనున్న నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఒంటి పూట బడులు వర్తిస్తాయి. పది పరీక్షా కేంద్రాలున్న పాఠశాలల్లో మాత్రం ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం పాఠశాల నిర్వహిస్తారు. ఒంటిపూట బడులు నిర్వహించాలంటూ జిల్లా విద్యా శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఒంటి పూట బడులను ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించాల్సి ఉంటుంది. ఉదయం 7.45 నుంచి ఎనిమిది గంటలకు అసెంబ్లీ నిర్వహించాలి. పాఠశాల ముగిసిన అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేసిన తర్వాత వారిని ఇళ్లకు పంపించాల్సి ఉంది. విద్యుదాఘాతంతో వివాహిత మృతి ముమ్మిడివరం: కర్రివానిరేవు పంచాయతీ శివారు చింతావానిరేవుకు చెందిన ఓ వివాహిత విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. గ్రామానికి చెందిన రేకాడి ధనకుమారి(23) శుక్రవారం ఉదయం నీళ్లు కాయడానికి వాటర్ హీటర్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురైంది. ఎవరూ గమనించకపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెకు భర్త కనకరాజు, మూడేళ్ల పాప ఉన్నారు. -
హక్కులకు రక్షణ కవచం
కాకినాడ వినియోగదారుల కమిషన్ పరిధిలో కేసుల వివరాలు సంవత్సరం వచ్చిన పరిష్కార విచారణలో కేసులు మైనవి ఉన్నవి 2017 48 48 0 2018 53 52 1 2019 35 35 0 2020 31 30 1 2021 48 45 3 2022 70 67 3 2023 84 72 12 2024 93 49 44 2025 22 0 22కాకినాడ లీగల్: సొంత అవసరాల కోసం పలు రకాల వస్తువులకు, సేవలకు నిర్దేశిత డబ్బు చెల్లించిన ప్రతి ఒక్కరూ వినియోగదారులే. ఆ వస్తువు, సేవలు సంతృప్తికరంగా లేకుంటే మోసపోయినట్టే. ఆ మోసాన్ని భరించి, నష్టపోవడంకన్నా, పోరాడితే పరిహారం పొందడమే కాకుండా, మరొకరు మోసపోకుండా ఉండే అవకాశం కలుగుతుంది. వస్తువుకు సంబంధించిన సమాచారం పొందడం, నచ్చిన వస్తువును ఎంచుకునే అవకాశం కల్పించడం, వినియోగదారుకు రక్షణ కల్పించడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు జేఎఫ్ కెన్నడీ తొలిసారిగా 1962 మార్చి 15న అమెరికన్ కాంగ్రెస్లో ప్రసంగించారు. తదనంతర కాలంలో ఈ అంశాలకు ప్రాధాన్యం పెరగడంతో 1983 నుంచి ఏటా మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినం నిర్వహిస్తున్నారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం 1986లో ప్రత్యేక చట్టం తీసుకువచ్చి, వినియోగదారుల కమిషన్ ఏర్పాటు చేసింది. వస్తు, సేవల్లో నష్టపోయిన వినియోగదారులు కమిషన్లో నామమాత్రపు రుసుంతో కేసు వేసి, తగిన పరిహారం పొందవచ్చు. ఏ సందర్భాల్లోనంటే.. ● కొనుగోలు చేసిన వస్తువులు, మందులు, ఇతర ఉత్పత్తులతో ప్రాణ, ఆస్తినష్టం కలిగినా.. ● ఆసుపత్రుల్లో సేవా లోపంతో ఇబ్బంది కలిగినా.. ● వినియోగించే వస్తువుల నాణ్యత, స్వచ్ఛత లోపించినా.. ● నకిలీ విత్తనాలు, ఇతల అనైతిక వాణిజ్య విధానాలు. ● వ్యాపారి లేదా డీలర్ ద్వారా నష్టపోయినా.. ● అసలు ధర కంటే ఎక్కువ వసూలు చేసినా.. ● బ్యాంకు, బీమా, రవాణా, తయారీ సేవల్లో లోపాలు జరిగినా.. ● అపార్ట్మెంట్ల విక్రయాల్లో మోసం, ఇంటి నిర్మాణంలో లోపాలు. ● వినోదం, వివిధ వృత్తి సేవల్లో లోపాలు. ● ఇతర కారణాలతో నష్టపోయినా.. నోటీసు పంపాలిలా.. ● కొనుగోలు చేసిన ఉత్పత్తి లేదా సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ పూర్తి చిరునామా రాయాలి. ● కొన్న వస్తువు లేదా సేవల వివరాలివ్వాలి. క్యాష్ మెమో నంబర్, తేదీ ఇవ్వాలి. ● సంస్థ ఇచ్చిన వారెంటీ లేదా గ్యారెంటీ వివరాలు తెలపాలి. ● వస్తువు లేదా సేవలో జరిగిన లోపం, దానివల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను విపులంగా వివరించాలి. ● ఈ ఇబ్బందులపై అప్పటి వరకూ ఎవరెవరికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేశారో పేర్కొనాలి. ఉంటే కంప్లయింట్ నంబర్ ఇవ్వాలి. ఈ సంప్రదింపులకు సంబంధించిన ఆధారాల జిరాక్స్ పత్రాలు నోటీసుకు జత చేయడం మంచిది. ● నోటీసుకు స్పందించడానికి సంబంధిత సంస్థ లేదా వ్యక్తికి 15 నుంచి 30 రోజుల వరకూ గడువు ఇవ్వాలి. ● కోరుతున్న నష్టపరిహారం, పూర్తి మొత్తం కోరితే దానికి 18 శాతం వరకూ వడ్డీ లేదా కొత్త వస్తువు ఇవ్వాలని కోరవచ్చు. దానికి నష్టపరిహారం కూడా కావాలని కోరవచ్చు. ● వినియోగదారు పూర్తి పేరు, అడ్రస్ ఇవ్వాలి. ● నోటీసు అవతలి వ్యక్తి లేదా సంస్థకు ఇచ్చినట్లు వినియోగదారు వద్ద తగిన అకనాలెడ్జ్మెంట్ లేదా కొరియర్, హ్యాండ్, ఆన్లైన్ డెలివరీ వంటి ఆధారాలు ఉండాలి. ఈ ఆధారాన్ని కోర్టులో సమర్పించాల్సి ఉంటుంది. ఫిర్యాదు ఇలా.. వస్తు, సేవల కొనుగోలు సందర్భంగా నష్టపోయిన వారు వినియోగదారుల కమిషన్లో నేరుగా లేదా న్యాయవాది ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అక్కడి సహాయ కేంద్రం సలహాలు తీసుకుని కేసు దాఖలు చేయవచ్చు. గతంలో వస్తువు కొనుగోలు చేసిన ప్రాంతంలోనే కేసు దాఖలు చేయాల్సి ఉండేది. 2019 వినియోగదారుల రక్షణ చట్టంలో మార్పు అనంతరం.. వస్తువు ఎక్కడ కొన్నా తాము నివాసం ఉంటున్న ప్రాంతంలో కేసు దాఖలు చేసే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించారు. అలాగే, ఒక వస్తువు సరిగ్గా పని చేయకపోతే గతంలో కంపెనీపై మాత్రమే కేసు వేసేవారు. చట్టంలో మార్పు అనంతరం వస్తువు విక్రయించిన షాపు యాజమాని, ఏజెన్సీ, కంపెనీపై కూడా కేసు దాఖలు చేసే అవకాశం కలిగింది. ఈ జాగ్రత్తలు మేలు ● అవసరమైన వస్తువులనే ఎంపిక చేసి, కొనుగోలు చేయాలి. ఆ వస్తువుల పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ● మోసపూరిత ప్రకటనలపై జాగ్రత్తగా ఉండాలి. ● నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. ఆఫర్లను పూర్తిగా పరిశీలించుకోవాలి. ● వస్తువులు, సేవల కొనుగోలుకు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. ● గ్యారంటీ లేదా వారంటీ కార్డులపై సంబంధిత విక్రేత సంతకం, ముద్ర సహా ఉండేలా చూసుకోవాలి. ● మోసానికి గురైతే వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించడానికి ఇవి ఉపయోగపడతాయి. వస్తు, సేవల్లో లోపాలకు పరిహారం పొందే అవకాశం నష్టం వాటిల్లితే కమిషన్ అండ అవగాహనే శ్రీరామరక్ష నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినం ఆధారాలు భద్రపరచుకోవాలి కొనుగోలు సమయంలో వినియోగదారులు బిల్లులు, గ్యారంటీ కార్డు, జాబ్కార్డు తప్పనిసరిగా తీసుకుని భద్రపరచుకోవాలి. సేవా లోపం జరిగితే కమిషన్ను ఆశ్రయించవచ్చు. కేసు స్వీకరించిన 90 రోజుల్లో పరిష్కారం లభించేలా కృషి చేస్తాం. రూ.5 లక్షలలోపు విలువగల కేసులు కమిషన్లో పూర్తిగా ఉచితం. ఆపై నిర్ణీత రుసుములుంటాయి. కమిషన్ వద్ద రూ.50 లక్షల వరకూ కూడా కేసులు వేయవచ్చు. వాటికి ఎంత వరకూ అయినా పరిహారం పొందవచ్చు. – చెరుకూరి రఘుపతి వసంత్కుమార్, అధ్యక్షుడు, కాకినాడ జిల్లా వినియోగదారుల కమిషన్–1 వెంటనే స్పందిస్తాం వినియోగదారులు ఆన్లైన్లో కూడా కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చు. ఎటువంటి సమస్యలున్నా తగిన ఆధారాలతో కమిషన్ను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుంది. – చెక్కా సుశీ, సభ్యులు, కాకినాడ జిల్లా వినియోగదారుల కమిషన్ వీరికి ఉచితం అంత్యోదయ కార్డు ఉన్న వారికి వినియోగదారుల కమిషన్లో సేవలు ఉచితంగా అందుతాయి. కేసును వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తాం. – చాగంటి నాగేశ్వరరావు, సభ్యుడు, కాకినాడ జిల్లా వినియోగదారుల కమిషన్ అదనపు వసూలు రూ.27.. కమిషన్ వడ్డన రూ.27.27 లక్షలు కాకినాడ రూరల్ గంగానపల్లి చెందిన నున్నా కుసుమ కల్యాణ్ 2023 డిసెంబర్ 8న హైదరాబాద్ బోడుప్పల్ ప్రాంతంలోని హోటల్ ట్యూలిప్స్ గ్రాండ్లో బిర్యానీలు, డ్రింకులు, మూడు మినరల్ వాటర్ బాటిళ్లు జొమాటో డైనింగ్ పే ద్వారా కొనుగోలు చేశాడు. వాటికి రూ.3,083 చెల్లించాడు. వాటర్ బాటిల్ ఎంఆర్పీ రూ.20 కాగా, ఆ హోటల్ నిర్వాహకులు రూ.29 వసూలు చేశారు. మూడు వాటర్ బాటిళ్లకు రూ.60 కాగా, అదనంగా రూ.27 కలిపి మొత్తం రూ.87 వసూలు చేశారు. దీనిపై కల్యాణ్ తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపగా హోటల్ యాజమాన్యం స్పందించలేదు. దీంతో ఆయన కాకినాడ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. విచారణ అనంతరం కల్యాణ్కు రూ.25 వేల సష్టపరిహారంతో పాటు కోర్టు ఖర్చులు రూ.2 వేలు ఇవ్వాలని, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.27 లక్షలు చెల్లించాలని గత ఫిబ్రవరి 28న కమిషన్ తీర్పు ఇచ్చింది. రూ.5కు కక్కుర్తి.. రూ.5 లక్షలు పైగా వదిలింది కాకినాడకు చెందిన న్యాయవాది లక్ష్మీనారాయణ అన్నవరం సత్యదేవుని దర్శనానికి వెళ్లి, సెల్ఫోన్ డిపాజిట్ చేశారు. మొబైల్ డిపాజిట్ కౌంటర్లో సెల్ ఫోన్ పెడితే రూ.5 తీసుకోవాలి. కానీ, రూ.10 గుంజారు. దీనిపై లక్ష్మీనారాయణ కాకినాడ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. ఆయనకు రూ.5తో పాటు మానసిక ఒత్తిడికి గురైనందుకు రూ.15 వేలు, కోర్టు ఖర్చులకు మరో రూ.5 వేలు, అలాగే, దేవస్థానానికి మరో రూ.5 లక్షల జరిమానాను సంబంధిత కాంట్రాక్టర్ చెల్లించాలంటూ గత ఫిబ్రవరి 11న కమిషన్ తీర్పు చెప్పింది. స్కూల్ సర్టిఫికెట్ ఇవ్వనందుకు.. కాకినాడ చెందిన పీవీఎస్ఎస్ శ్రీనివాస్కు ముగ్గురు కుమార్తెలు. 2018–19లో స్థానిక రామారావుపేట నారాయణ స్కూల్లో చదివేవారు. ఆ సమయంలో స్కూల్ ఫీజులతో పాటు పుస్తకాలకు కూడా శ్రీనివాస్ చెల్లించారు. ఇతర కారణాలతో ఆయన తన పిల్లలను అదే సంవత్సరం అదే ప్రాంతంలోని మున్సిపల్ స్కూల్లో చేర్చారు. పిల్లల స్కూల్ సర్టిఫికెట్ కావాలని కోరగా, మొత్తం ఫీజులు చెల్లించాలని శ్రీనివాస్కు ప్రిన్సిపాల్ చెప్పారు. దీనిపై శ్రీనివాస్ 2019లో వినియోగదారుల కమిషన్లో కేసు వేశారు. విచారణ అనంతరం శ్రీనివాస్ పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వాలని, మానసిక వ్యధకు గురి చేసినందుకు రూ.5 వేల పరిహారం, కోర్టు ఖర్చులుగా రూ.2 వేలు చెల్లించాలని నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ను ఆదేశిస్తూ 2022 మే 12న కమిషన్ అధ్యక్షుడు చెరుకూరి రఘుపతి వసంత్ కుమార్, సభ్యులు తీర్పు చెప్పారు.డాక్యుమెంట్లు ఇవ్వాల్సిందే.. రాజమహేంద్రవరం ఐిసీఐసీఐ బ్యాంక్లో కాకినాడ రూరల్, రమణయ్యపేట చెందిన జంపన చంద్రశేఖర్వర్మ 2006లో ఇంటి రుణం తీసుకున్నారు. రుణం పూర్తిగా చెల్లించినా ఇంటి ఒరిజినల్ డాక్యుమెంట్లను బ్యాంకు అధికారులు తిరిగి ఇవ్వలేదు. చంద్రశేఖర్వర్మ 2019లో వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. విచారణ అనంతరం ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాటు రూ.లక్ష పరిహారం, ఖర్చుల కింద రూ.8 వేలు చెల్లించాలని 2022 ఆగస్టులో కమిషన్ తీర్పు చెప్పింది. ల్యాబ్ తప్పుడు రిపోర్టుకు పరిహారం కాకినాడ చెందిన 85 ఏళ్ల యు.పద్మనాభరావు 2017లో స్థానిక థర్డ్ ఐ ఇమేజింగ్ డయాగ్నోస్టిక్స్లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ల్యాబ్ వారు తప్పుడు రిపోర్టు ఇవ్వడంతో పద్మనాభరావు 2018లో వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. ఆయనకు నష్టపరిహారంగా రూ.లక్ష, ఖర్చులుగా రూ.5 వేలు చెల్లించాలని 2022 అక్టోబర్లో కమిషన్ తీర్పు ఇచ్చింది. అంతర్వేది రథం దగ్ధం కేసులో.. అంతర్వేది శ్రీలక్ష్మీనరసింస్వామి దేవస్థానంలో ప్రమాదవశాత్తూ దగ్ధమైన రథానికి బీమా చెల్లించాలంటూ అధికారులు కాకినాడ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. వాదోపవాదాల అనంతరం రూ.84 లక్షల పరిహారం, ఖర్చుల కింద రూ.30 వేలు చెల్లించాల్సిందిగా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశిస్తూ గత ఏడాది జనవరిలో కమిషన్ తీర్పు ఇచ్చింది. పంటల బీమా చెల్లించాలి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో భాగంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీపీసీబీ) 14,153 మంది రైతుల నుంచి రూ.1 చొప్పున 2019లో ప్రీమియం వసూలు చేసి, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించింది. తుపాను కారణంగా పంట నష్టం జరగడంతో పంటల బీమా చెల్లించాలని కోరగా ఆ కంపెనీ నిరాకరించింది. దీనిపై వినియోగదారులు కమిషన్ను డీసీసీబీ ఆశ్రయించింది. విచారణ అనంతరం నష్టపోయిన రైతులందరికీ రూ.15.72 కోట్ల పంట నష్ట పరిహారంతో పాటు ఖర్చుల కింద రూ.50 వేలు చెల్లించాల్సిందిగా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని 2023 ఫిబ్రవరిలో కమిషన్ ఆదేశించింది. -
మాట్లాడితే జరిమానా
పదేళ్ల క్రితం యాక్సిడెంట్ అయింది. రజక వృత్తి కానీ, పొలం పని కానీ చేయలేని స్థితిలో ఉన్నాను. గ్రామంలో టిఫిన్ సెంటర్ పెట్టి జీవనం సాగిస్తున్నాను. గ్రామంలో అన్ని కులాల వాళ్లు టిఫిన్ పట్టుకెళ్లేవారు. ఇప్పుడు వివాదం కారణంగా రజకులతో గౌడ సంఘం వారు మాట్లాడడం లేదు. మాట్లాడితే జరిమానా అంటున్నారు. టిఫిన్ బకాయిల కోసం మాట్లాడలేని పరిస్థితి ఉంది. టిఫిన్ కొనుగోలుకూ ఒక వర్గం వారు రావడం లేదు. – ఆచంట వెంకటరమణ, చిడిపి, కొవ్వూరు మండలం ● -
చిడిపిలో కుల బహిష్కరణ ?
● చెరువు గట్టు ఆక్రమణతో రెండు వర్గాల మధ్య వివాదం ● మాట్లాడితే రూ.2 వేల జరిమానాకు నిర్ణయం ● పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం కొవ్వూరు: ఆధునిక సమాజంలో కొన్ని పల్లెల్లో నేటికీ కుల బహిష్కరణ దూరాచారం పడగ విప్పుతోంది. కొవ్వూరు మండలం చిడిపి గ్రామంలో రెండు వర్గాల మధ్య కార్చిచ్చు రేగింది. గ్రామంలో ఉన్న రజకుల చెరువు గట్టు ఆక్రమణ వ్యవహారంతో రజకులు, గౌడ సంఘం మధ్య వివాదం తలెత్తింది. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో, ఒక వర్గాన్ని మరో వర్గం వారు బహిష్కరించే వరకు వెళ్లింది. ఒకే ప్రాంతంలో కొన్నేళ్లుగా కులమతాలకతీతంగా, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న మిత్రులంతా ఇప్పుడు విరోధులుగా మారారు. రజకులతో మాట్లాడవద్దని, పెళ్లిళ్లు, విందులకు వెళ్లరాదని, మాట్లాడిన వారికి రూ.2 వేల జరిమానా విధిస్తామని, సమాచారం ఇచ్చిన వారికి రూ.200 బహుమానం ఇస్తామని గౌడ సంఘం తీర్మానం చేసినట్టు చెబుతున్నారు. చెరువు గట్టు ఆక్రమణలు తొలగించాలని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని సక్రమంగా అమలు చేయని అధికారులపై చర్యలు కోరుతూ కోర్టును ఆశ్రయిస్తామని అనంతపురం జిల్లాకు చెందిన రజక సంఘ నాయకులు, న్యాయవాది హనుమన్న తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాకు విడుదల చేసిన వీడియోతో కుల బహిష్కరణ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలు వివాదం ఇదీ.. గ్రామాన్ని ఆనుకుని రజకులకు 1.24 ఎకరాల వృత్తి చెరువు ఉంది. దీని గట్టు ఆక్రమించుకుని కొందరు గడ్డిమేనులు వేశారు. గౌడ సంఘం చెరువు గట్టున పాపయ్య గౌడ విగ్రహాన్ని నెలకొల్పింది. చిన్న షెడ్డు వేసి, అందులో దేవీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రజకులు ఆక్రమణలపై కోర్టును ఆశ్రయించారు. దీంతో అధికారులు కోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణల తొలగింపునకు పూనుకున్నారు. దీనిని గౌడ సంఘం అడ్డుకోవడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని, ఆక్రమణలను అసంపూర్తిగా తొలగించి అధికారులు చేతులు దులుపుకొన్నారు. అప్పటి నుంచి ఆయా వర్గాల మధ్య చిచ్చురేగింది. చివరికి రజకులను బహిష్కరించి, వారి వద్ద నుంచి క్రయవిక్రయాలు సైతం మానేశారు. ఈ దురాచారంపై ఏ ఒక్క అధికారి కానీ, రాజకీయ పార్టీలు కానీ పట్టించుకోవడం లేదని రజకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నువ్వులు.. రైతన్న మోములో నవ్వులు
పిఠాపురం: గతంలో ఖాళీగా ఉన్న భూముల్లో ప్రత్యామ్నాయంగా సాగు చేసే నువ్వుల పంటను ఇప్పుడు ప్రధానంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం నవ్వుల పంట ఆశాజనకంగా ఉందని రైతులు చెబుతున్నారు. గతంలో కేవలం ఎకరాకు రెండు బస్తాలు కూడా రాని దిగుబడి.. ఇప్పుడు ఎకరాకు 8 నుంచి 12 బస్తాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొక్కజొన్న, మిరప, వంగ, టమాటా వంటి పంటలను తగ్గించి, ఎక్కువ మంది రైతులు నువ్వుల సాగు చేపట్టారు. దీంతో కాకినాడ జిల్లాలో నువ్వుల సాగు గణనీయంగా పెరిగింది. గతంలో కేవలం 100 ఎకరాల్లో మాత్రమే ఉండే ఈ పంట సాగు, ప్రస్తుతం రికార్డు స్థాయిలో కేవలం ఒక్క గొల్లప్రోలు మండలంలోనే సుమారు 450 ఎకరాల్లో కొనసాగుతోంది. జిల్లాలో 590 ఎకరాల్లో సుమారు 350 మంది రైతులు నువ్వుల సాగు చేపట్టారు. సాధారణంగా ఏటా 3,540 క్వింటాళ్ల దిగుబడిని సాధిస్తున్నారు. ఉష్ణోగ్రతే దీనికి ప్రాధాన్యం ఈ పంటకు 25 డిగ్రీల నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమవుతుంది. నీరు నిలవని, మురుగు నీరు రాని ప్రాంతాలు వీటికి అనుకూలం కావడంతో, రేగడి నేలలున్న ప్రాంతాల్లో 90 శాతం మంది రైతులు వీటిని సాగు చేస్తున్నారు. ఆమ్మ, క్షార నేలలు అంతగా అనుకూలం కాదు. గౌరి, మాధవి, వైఎల్ఎం 11, 17, 66 రకాలు మంచి దిగుబడులు ఇస్తాయని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రకాలనే జిల్లాలో అత్యధికంగా సాగు చేపట్టారు. కేవలం 85 నుంచి 90 రోజుల్లో పంట చేతికందుతుంది. ఇందులో 50 శాతం నూనె దిగుబడి వస్తుంది. ఎకరాకు వరుసల్లో విత్తుకుంటే 2 కిలోలు, వెదజల్లితే 4 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తన శుద్ధి చేయడం ద్వారా తెగుళ్లు, పురుగుల దాడి నుంచి పంటను కాపాడుకోవచ్చు. మొక్కలకు మధ్య కనీసం అరడుగు దూరం ఉండేలా నాటడం వల్ల అధిక దిగుబడి వస్తుందని అధికారులు సూచిస్తున్నారు. కలుపు నివారణకు ప్రాధాన్యమివ్వాలి. ఆకు ముడత, కాయ తొలుచు పరుగుల నుంచి రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించే అవకాశాలున్నాయి. ఆకు ఎండు, ఆకు కుళ్లు తెగుళ్ల దాడి చేసే అవకాశం ఉండడంతో, ముందుగానే సస్యరక్షణ చర్యలు పాటించాల్సి ఉంటుంది. ఆకు కాయలు 75 శాతం పసుపు రంగుకు మారితే కోత దశకు చేరుకున్నట్టు గుర్తించి, కోతలు చేపట్టాలని అధికారులు అంటున్నారు. కోసిన పంటను కట్టలుగా కట్టి, అదే పొలంలో ఎండకు ఎండేలా నిలబెట్టి, ఐదు రోజుల తర్వాత నూర్చుకోవాలి. ప్రస్తుతం క్వింటాల్ నువ్వుల ధర రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు ఉంది. ఎకరాకు ఆరు క్వాంటాళ్లకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్టు రైతులు చెబుతున్నారు. కేవలం ఆరుతడి, విత్తనం ఎరువులు తదితర అవసరాలకు ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడి అవుతున్నట్టు తెలిపారు. కరోనాతో నువ్వుల నూనెకు డిమాండ్ పెరిగిన నువ్వుల సాగు ఆశాజనకంగా పంట ఎకరాకు ఆరు క్వింటాళ్ల వరకు దిగుబడి! తెలుగు రాష్ట్రాల్లో నూనె గింజల పంటల్లో నువ్వులు ఒకటి. తక్కువ పెట్టుబడితో స్వల్ప కాలంలో అంది వచ్చే నూనె గింజల పంటల్లో నువ్వుల సాగు మేలైనది. ఖరీఫ్లో వేసిన వివిధ పంటలను తొలగించాక, రెండో పంటగా డిసెంబర్ నెలాఖరు నుంచి జనవరి చివరి వరకు రైతులు ఈ పంట సాగు చేపట్టారు. తక్కువ పెట్టుబడి, తక్కువ వనరులతో నికర లాభాలందించే పంటగా నువ్వులకు గుర్తింపు ఉంది. కేవలం రెండు, మూడు తడులు మాత్రమే ఇస్తే సరిపోయే పంట కావడంతో, వేసవిలో ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఆరుతడి పంటగా వేసవిలో వేయడం వల్ల చీడపీడల బెడద చాలా తక్కువ. కరోనా సమయంలో నువ్వుల నూనెకు డిమాండ్ పెరగడంతో, ఇప్పుడు నువ్వుల పంటను భారీగా సాగు చేస్తున్నారు.సాగు విస్తీర్ణం పెరిగింది ఈ ఏడాది నువ్వుల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. గతంలో 100 ఎకరాలు కూడా ఉండని పంట, ఈ ఏడాది ఒక్క గొల్లప్రోలు మండలంలోనే 400 ఎకరాల వరకు వేశారు. ప్రస్తుతం ఎండలు బాగా ఉండడంతో పంట దిగుబడి పెరిగి, ఆదాయం బాగుంటుంది. ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు రైతులకు వివరిస్తున్నాం. నీటి వసతితో పెద్దగా పని లేకపోవడం వల్ల ఇతర పంటల కంటే పెట్టుబడి తక్కువ కావడంతో రైతులు ఎక్కువ మంది ఈ పంట సాగు చేశారు. పంట అన్నిచోట్లా ఆశాజనకంగా ఉంది. – సత్యనారాయణ, వ్యవసాయ శాఖాధికారి, గొల్లప్రోలు ఆశాజనకంగా ఉంది అన్ని పంటలు పూర్తయ్యాక మామూలుగా విత్తనాలు చల్లి వదిలేసేవాళ్లం. ఇప్పుడు ఇదే ప్రధాన పంటగా వేశాం. ప్రస్తుతం మార్కెట్లో నువ్వులకు మంచి డిమాండ్ ఉంది. వాతావరణం కలిసి రావడంతో ఈ ఏడాది మంచి దిగుబడి వచ్చేలా కనిపిస్తోంది. పెట్టుబడి తక్కువ కావడంతో పాటు, ఆరుతడి పంట కావడం వల్ల రేగడి నేలల్లో మంచి అనుకూలమైన పంట కావడంతో దీనిని సాగు చేస్తున్నాం. ఆదాయం బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. – సోమిశెట్టి జగ్గారావు, నువ్వుల రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం -
కోర్టుకు వెళ్లామని ఇబ్బంది
చెరువును 40 ఏళ్ల నుంచి కుల వృత్తికి వినియోగించుకుంటున్నాం. పంచాయతీ నుంచి లీజుకి తీసుకున్నాం. చెరువు గట్టు ఆక్రమణలు తొలగించాలని హైకోర్టుకు వెళ్లాం. కోర్టు ఆదేశించినా ఆక్రమణలు తొలగించడం లేదు. రజకులతో మాట్లాడకూడదని, మాట్లాడితే జరిమానా విధిస్తామని చెబుతున్నారు. – కొండపల్లి వెంకటరత్నం, చిడిపి ఒప్పకోవడం లేదు రెండు వర్గాల మధ్య మాటల్లేవు. 2011 నుంచి చెరువు ఆక్రమణ తొలగించాలని వివాదం నడుస్తుంది. గ్రామ పెద్దలంతా కలిసి ఇరు పక్షాల మధ్య సఖ్యత కుదిర్చేందుకు ప్రయత్నించాం. పలుమార్లు చర్చలు జరిపాం. రజకుల కుల బహిష్కరణ అంశం నా దృష్టికి వచ్చింది. పరిష్కారానికి ఇరు పక్షాలు ఒప్పుకోవడం లేదు. – పాలగుడుల లక్ష్మణరావు, సర్పంచ్, చిడిపి ● -
దైవ కార్యానికి బయలుదేరి.. తిరిగిరాని లోకాలకు
తాడేపల్లిగూడెం రూరల్: దైవకార్యంలో పాల్గొనా లన్న సంకల్పంతో కుటుంబ సమేతంగా పొరుగు రాష్ట్రం నుంచి కారులో బయలుదేరారు. అయితే.. లారీ రూపంలో మృత్యువు వారిని మార్గం మధ్యలోనే కబళించింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు, వారి ఐదేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద సంఘటన శుక్రవారం తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్లోని ఓ ఐటీ కంపెనీకి చెందిన హెచ్ఆర్ ఉద్యోగి భోగిళ్ల వెంకట సత్య సురేన్(37), తన భార్య నవ్య(35), కుమార్తె వాసుకి కృష్ణ(5), బంధువు కారులో కోనసీమ జిల్లా మండపేటలో జరగనున్న ఓ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి బయలుదేరారు. శుక్రవారం మధ్యాహ్నం 12.45 ప్రాంతంలో తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై సత్యసురేన్ డ్రైవ్ చేస్తున్న కారు హైవే మెయింటెనెన్స్ పనులు చేస్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో సత్య సురేన్, అతని భార్య నవ్య అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తె వాసుకి కృష్ణ, బంధువు శ్రీరమ్యను తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వాసుకి కృష్ణ మృతి చెందగా, శ్రీరమ్యను మెరు గైన వైద్యం కోసం రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రూరల్ ఏఎస్సై పీవీకే దుర్గారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాస్పత్రికి తరలించి, రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విషాద ఛాయలు మండపేట: కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మండపేటకు చెందిన భార్యా భర్తలు, ఐదేళ్ల చిన్నారి మృతి చెందడంతో పట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి. హైదరాబాద్ నుంచి మండపేటకు వస్తూ వీరు ఈ దుర్ఘటనలో మర ణించారు. సత్యసురేన్ తండ్రి భోగిళ్ల పాపారావు స్థాని క రావుపేటలో నివసిస్తున్నారు. ఆయన బీమా కంపెనీ రిటైర్డ్ ఉద్యోగి. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా, సత్య సురేన్ చిన్నవాడు. ఈ ఘటనలో పాపారావు చెల్లెలు కుమార్తె ఉప్పులూరి శ్రీరమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. యూఎస్లో ఉంటున్న ఈమె ఇటీవల గృహ ప్రవేశ శుభకార్యానికి హైదరాబాద్ వచ్చారు. ఆమె తండ్రి పాలచర్ల బాబ్జి మండపేటలో ఉంటున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురిని మృత్యువు కాటేయడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. కంచకచర్ల వద్ద రోడ్డు ప్రమాదం ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు ఒకే కుటుంబంలో ముగ్గురి దుర్మరణం మృతులు మండపేట వాసులు -
నాగబాబు వ్యంగ్యాస్త్రాలు.. మరింత అగ్గి రాజేసేలా!
పిఠాపురం: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి టీడీపీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పాత్ర ఏమీ లేదని జనసేన నేత నాగబాబు ఒక్క దెబ్బలో తేల్చి పారేశారు. అసలు పవన్ గెలుపునకు ఏ నేతైనా కారణం అనుకుంటే అది వారి ‘ఖర్మ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది కూడా పిఠాపురం వేదికగా ఈరోజు(శుక్రవారం) జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో నాగబాబు పరోక్షంగా చురకలు అంటించారు. కేవలం పవన్ విజయానికి పిఠాపురం ప్రజలు, జన సైనికులే కారణమని ఒక్క ముక్కలో చెప్పేశారు నాగబాబు. ఇక్కడ పవన్ గెలుపునకు పవనే ప్రధాన కారణంగా చెప్పుకొచ్చారు. వర్మ సీటు త్యాగం సంగతి ఏంటో..?అసెంబ్లీలో అడుగు పెట్టడమే కలగా మారిన పవన్ కళ్యాణ్కు సహకరించి.. ఆ కల నెరవేరేలా చేసింది పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ. ఇక్కడ తన సీటును త్యాగం చేసి మరీ పవన్ ను భుజాన వేసుకున్నారు వర్మ, అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని చంద్రబాబు ఆశ చూపడంతో పాటు దానికి పవన్ కళ్యాణ్ కూడా వంత పాడటం కూడా జరిగింది. సర్లే.. చంద్రబాబు మన నాయకుడే.. పవన్ కూడా మన వాడే అనుకున్నాడో ఏమో వర్మ.. ఎమ్మెల్సీ టికెట్ అన్నారు కదా అని ఆ ఎమ్మెల్యే సీటను త్యాగం చేశారు వర్మ,. మరి తీరా చూస్తే వర్మకు ఊహంచని పరిణామం ఎదురైంది. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకుండా పెద్ద షాకిచ్చారు చంద్రబాబు..పవనే దెబ్బ కొట్టారా..?ఆయనే రాజకీయంగా దెబ్బకొట్టారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ సీటు రాకుండా పవన్ అడ్డుపడ్డారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురంలో తనకు ఇబ్బందులు వస్తాయని ఆయన చంద్రబాబుకు చెప్పడం వల్లే పక్కన పెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు.తనకు ప్రొటోకాల్ సమస్యలు వస్తాయని, వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వవద్దని స్వయంగా పవనే .. చంద్రబాబుకు చెప్పారని రెండు పార్టీల్లోనూ చర్చించుకుంటున్నారు. అలాగే వర్మకు పదవి లభిస్తే పిఠాపురంలో ఆయన ప్రాధాన్యత పెరిగి రెండు అధికార కేంద్రాలు ఏర్పాటవుతాయనే ఆందోళనలోనూ పవన్ కళ్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు.అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ తాను అక్కడి నుంచి పోటీ చేయడం కష్టమవుతుందనే భావనలో ఆయన ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. వర్మ ఎమ్మెల్సీ అయితే నియోజక వర్గానికి చెందిన కూటమి నేతలు ఆయన వద్దకే వెళతారని, ఇది రాజకీయంగా తమకు నష్టమని పవన్ అంచనా వేస్తున్నట్లు సమాచారం. మరింత అగ్గి రాజేసేలా..పవన్ కూడా వర్మ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తానని అంతర్గతంగా చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో పవన్ను గెలిపించేందుకు వర్మ అహర్నిశలు పనిచేశారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆయనను తిట్టినా లెక్క చేయకుండా తిరిగి పవన్ను గెలిపించారు. రెండుచోట్ల ఓడిపోయిన వ్యక్తికి తన సీటును త్యాగం చేసి గెలిపించి అసెంబ్లీకి పంపడంలో కీలకపాత్ర పోషించారు.ఇప్పుడు ఆయనకే పవన్ అడ్డుపడడం ఏమిటని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వర్మను పవన్ దెబ్బకొట్టడం దారుణమని వాపోతున్నాయి. ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో ఆయనకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నాయి. ఇప్పుడు ఏకంగా నాగబాబు నోటి వెంట వర్మ పేరు రాలేదు.. కదా పరోక్షంగా సెటైర్లు వేయడం ఇప్పుడు మరో చర్చకు దారి తీసింది. ఇప్పటికే టీడీపీ-జనసేనలపై ఆగ్రహంగా ఉన్న వర్మ వర్గంలో మరింత అగ్గి రాజేశారనే వాదన తెరపైకి వచ్చింది. -
మేం ‘పిఠాపురం’ తాలుకా.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది!
సాక్షి, కాకినాడ: జనసేన (Janasena) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఒకవైపు యువ కార్యకర్తలు రోడ్లపై బైకులతో ప్రమాదకరమైన స్టంట్లతో వాహనదారుల్ని హడాలెత్తించగా.. ఇంకోవైపు ట్రాఫిక్కు అంతరాయం కలిగించి మరీ వాహనదారులతో వాగ్వాదానికి దిగారు మరికొందరు.పిఠాపురం శివారు ప్రాంతమైన చిత్రాడలో ‘జయకేతనం’(JSP JayaKethanam Sabha) పేరిట సభ నిర్వహిస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం కావడంతో ఆ పార్టీ శ్రేణులు అతి చేష్టలకు దిగాయి. ‘‘పిఠాపురం డిప్యూటీ సీఎం తాలుకా.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది?’’ అంటూ నినాదాలు చేస్తూ.. దారినపోయేవాళ్లను దుర్భాషలాడుతున్నారు.ఈ క్రమంలో.. జనసేన స్టికర్లు, జెండాలతో ఉన్న బైకులు, కార్లతో రోడ్లపై హల్ చల్ చేశాయి. కత్తిపూడి-కాకినాడ 216 జాతీయ రహదారిపై జనసైనిక్స్ బైక్లతో ప్రమాదకర ఫీట్లు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దీంతో ఆ దారి గుండా వెళ్లే పలువురు వాహనదారులు హడలెత్తిపోతున్నారు. ఇంకోవైపు.. ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ జనసేన నేతలు సామాన్యులకు చుక్కలు చూపించారు.ఈ క్రమంలో చిత్రాడ వద్ద బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తికి.. జనసేన నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ట్రాఫిక్ క్లియర్ చేయాలని కోరాడతను. ఈలోపు వెనక నుంచి జెండాతో వచ్చిన ఓ వ్యక్తి అతన్ని చితకబాదాడు. సదరు వ్యక్తిని బూతులు తిట్టాడు. ఆ వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. అయితే పిఠాపురంలో ఎర్ర టవల్ బ్యాచ్ ఇంత చేస్తున్నా.. అక్కడి పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోవడం గమనార్హం -
కొత్త సోపాన మార్గం
● సత్యదేవుని సన్నిధికి రెండో మెట్ల మార్గం ● రూ.90 లక్షలతో నిర్మాణం ● చురుకుగా సాగుతున్న పనులు ● గత ఏడాదే టెండర్ల ఖరారు అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయానికి వెళ్లేందుకు గాను రెండో మెట్ల మార్గం నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయి. మొదటి ఘాట్ రోడ్డు వద్ద ఉన్న దేవస్థానం హైస్కూల్ పక్క నుంచి దీనిని నిర్మిస్తున్నారు. నూతన మెట్ల మార్గం నిర్మాణానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.90 లక్షల వ్యయంతో గత ఏడాదే టెండర్ పిలిచి ఖరారు చేశారు. ఆ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. కొత్త మెట్ల దారి ఎందుకంటే.. ప్రస్తుతం సత్యదేవుని ఆలయానికి వెళ్లేందుకు తొలి పావంచా వద్ద నుంచి రత్నగిరి పైకి 400 మెట్లతో ఒక మార్గం ఉంది. ఇది మొదటి ఘాట్ రోడ్డుకు సుమారు అర కిలోమీటరు దూరంలో ఉంది. చాలా సంవత్సరాల కిందట అన్నవరంలో పెద్దగా రద్దీ ఉండేది కాదు. దీంతో ప్రస్తుతం ఉన్న మెట్ల దారికి దగ్గర్లోనే గతంలో ఆర్టీసీ బస్సులు, ఇతర టూరిస్టు బస్సులు నిలిపేవారు. ఇప్పుడు కూడా ఆర్టీసీ బస్సులు ఇక్కడ నిలుపుతున్నా.. కాకినాడ, రాజమహేంద్రవరం వైపు నుంచి వచ్చే భక్తులు తొలుత ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకుని, అక్కడి నుంచే కొండ పైకి ఆటోలు, దేవస్థానం బస్సులలో వెళ్తున్నారు. ఎవరైనా ఇప్పుడున్న మెట్ల మార్గంలో వెళ్లాలనుకున్నా.. అది ఆర్టీసీ బస్టాండ్కు దూరంగా ఉంది. మరోవైపు అన్నవరం గ్రామంలో రద్దీ పెరగడంతో టూరిస్టు బస్సులను ఆర్టీసీ బస్టాండ్కు సమీపాన దేవస్థానం కళాశాల మైదానంలో నిలుపు చేస్తున్నారు. ఆ బస్సులలో వస్తున్న భక్తులు తొలి పావంచా వద్ద ఉన్న మెట్ల దారి వద్దకు వచ్చి, అక్కడి నుంచి కొండ పైకి చేరుకోవడం ఇబ్బందిగా ఉంటోంది. అందువలన మొదటి ఘాట్ రోడ్డు వద్ద నుంచి రెండో మెట్ల దారి నిర్మిస్తే అక్కడి నుంచి స్వామివారి ఆలయానికి చేరుకోవడానికి వీలుగా ఉంటుందని భావించి, ఆ మేరకు నూతన సోపాన మార్గానికి నేటి కమిషనర్, అప్పటి ఈఓ రామచంద్ర మోహన్ ప్రతిపాదనలు రూపొందించారు. ఆ తరువాత ఆయన ఇక్కడి నుంచి బదిలీ అవడంతో ఆ ప్రతిపాదన కాస్తా మూలన పడింది. 2023లో తిరిగి ఆయన అన్నవరం దేవస్థానం ఈఓగా నియమితులయ్యారు. అనంతరం, నూతన మెట్ల దారి నిర్మాణానికి తాజాగా అంచనాలు రూపొందించి, రూ.90 లక్షల వ్యయంతో టెండర్లు పిలిచి, ఖరారు చేశారు. మూడు మలుపులు.. 210 మెట్లు నూతన సోపాన మార్గాన్ని మూడు మలుపులతో నిర్మిస్తున్నారు. దీనిలో 210 మెట్లు వస్తాయన్నది అంచనా. ఇది మొదటి ఘాట్ రోడ్డు వద్ద ప్రారంభమై, రత్నగిరిపై ఓల్డ్ సీసీ, న్యూ సీసీ సత్రాల మధ్య రోడ్డులో ముగుస్తుంది. అక్కడి నుంచి సత్యదేవుని ఆలయం 200 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఇప్పుడున్న మెట్ల మార్గం నిర్మాణంలో మాదిరిగానే ఇసుక రాయినే కొత్త మార్గంలో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ రాయి త్వరగా వేడెక్కదు. అలాగే, త్వరగా చల్లబడుతుంది. అందువలన ఎండలో భక్తుల కాళ్లు కాలే అవకాశం ఉండదని అధికారులు తెలిపారు. వీరికి ఉపయోగం టూరిస్టు బస్సులు, ఇతర వాహనాల్లో వచ్చే భక్తులు తమ వాహనాలను దేవస్థానం కళాశాల మైదానంలో నిలుపుకొనేలా 2023లో అప్పటి ఈఓ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ ఏర్పాట్లు చేశారు. ఈ మైదానంలో ఆరు షెడ్లు నిర్మించి, భక్తులకు అన్ని వసతులూ కల్పించారు. దీంతో ఆ షెడ్ల వద్ద గతంలో కంటే ఎక్కువగానే టూరిస్టు బస్సులు ఆగుతున్నాయి. అక్కడ భక్తులు స్నానాలు చేసి, రత్నగిరికి చేరుకుంటున్నారు. వీరికి నూతన మెట్ల మార్గం బాగా ఉపయోగపడనుంది. ప్రధానంగా నవంబర్ నుంచి జనవరి వరకూ రత్నగిరికి వచ్చే ఉత్తరాది భక్తులకు కూడా ఈ మెట్ల దారి ఉపయోగకరంగా ఉండనుంది. అలాగే, ఆర్టీసీ బస్టాండ్లో బస్సు దిగి వచ్చే భక్తులకు కూడా ఈ మార్గం ఉపయోగపడుతుంది. వచ్చే నెలలో కమిషనర్ పరిశీలన దేవస్థానంలో జరుగుతున్న నిర్మాణ పనులపై రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ ఇన్చార్జి కమిషనర్ కె.రామచంద్ర మోహన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన మెట్ల మార్గం పనులపై ఆరా తీశారు. తాను ఏప్రిల్ 30న జరిగే సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవానికి వెళ్తానని, ఆ సందర్భంగా అన్నవరం దేవస్థానానికి వచ్చి, పనుల పురోగతిని పరిశీలిస్తానని చెప్పారు. జూన్ నెలాఖరుకు రెడీ అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు ఆదేశాల మేరకు జూన్ నెలాఖరుకల్లా నూతన మెట్ల మార్గం నిర్మాణ పనులు పూర్తి చేసి, భక్తులకు అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం ఈ మెట్ల దారి నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయి. సుమారు 15 అడుగుల వెడల్పున మెట్లు నిర్మిస్తున్నాం. ఈ మార్గానికి ఇరువైపులా రెండున్నర అడుగుల ఎత్తున రక్షణ గోడ, దాని పక్కనే విద్యుత్ స్తంభాలు, వాటికి విద్యుద్దీపాలు కూడా ఏర్పాటు చేస్తాం. – వి.రామకృష్ణ, ఈఈ, అన్నవరం దేవస్థానం చురుకుగా జరుగుతున్న రెండో మెట్ల మార్గం పనులు -
పౌల్ట్రీ.. నష్టాల పల్టీ
పెరవలి: గత నెలలో వ్యాప్తి చెందిన బర్డ్ప్లూ వ్యాధితో తూర్పు గోదావరి జిల్లాలో కోళ్ల పరిశ్రమ కుదేలైంది. ఈ వ్యాధి సోకిన కోళ్లు మృత్యువాత పడటంతో ప్రస్తుతం కోళ్లఫామ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం మిగిలి ఉన్న కోళ్లకు బర్డ్ఫ్లూ సోకకపోయినా చికెన్, గుడ్ల వినియోగంపై ప్రజల్లో ఒక విధమైన ఆందోళన నెలకొంది. దీంతో వీటి వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం మిగిలి ఉన్న కోళ్ల నుంచి జిల్లాలో రోజుకు 80 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నా, వినియోగం లేక, ధర పెరగక రోజుకు రూ.కోటి పైగా నష్టపోతున్నారు. కోళ్ల ఫామ్ల వద్ద గత డిసెంబర్లో గుడ్డు ధర రూ.6.15 ఉండగా.. ఈ నెల మొదటి వారంలో అది రూ.4.50కి, గురువారం నాటికి రూ.4.20కి పడిపోయింది. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలోని పౌల్ట్రీల్లో సుమారు 1.50 కోట్ల కోళ్లు పెంచుతూంటారు. చాలా వరకూ 50 వేలకు పైగా కోళ్లను పెంచగలిగే సామర్థ్యం కలిగిన పౌల్ట్రీలు ఉన్నాయి. ఇవి కాకుండా 5 వేల నుంచి 40 వేల కోళ్ల సామర్థ్యం కలిగిన మరికొన్ని ఫామ్లలో మరో కోటి కోళ్లను పెంచుతున్నారు. గత నెలలో బర్డ్ప్లూ బారిన పడి 40 లక్షలు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో ప్రజలు చికెన్, గుడ్ల వినియోగం బాగా తగ్గించారు. దీంతో ఒకవైపు బ్రాయిలర్ కోళ్ల పెంపకం నిలిచిపోయింది. మరోవైపు గుడ్ల కోళ్ల ఉత్పత్తి జరుగుతున్నా వినియోగం తగ్గిపోవడంతో ఎక్కడికక్కడ గుడ్లు పేరుకుపోతున్నాయి. బ్రాయిలర్ కోళ్లు పెంచిన రైతులు బర్డ్ఫ్లూతో రూ.2 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ, లేయర్ కోళ్ల రైతులు రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో వారు మళ్లీ కోళ్ల పెంపకం చేపట్టడానికి ధైర్యం చేయడం లేదు. చాలాచోట్ల బ్రాయిలర్ కోళ్లు వేయకుండా షెడ్లను ఖాళీగా వదిలేశారు. -
భావనారాయణ స్వామికి రూ.8.53 లక్షల ఆదాయం
కాకినాడ రూరల్: సర్పవరంలోని రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ స్వామి ఆలయంలో గురువారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. సీఎఫ్ఓ గ్రేడ్–1 ఈఓ వీరభద్రరావు పర్యవేక్షణలో గ్రామస్తులు, అర్చకులు, సిబ్బంది, సేవాదళ్ కార్యకర్తల సమక్షంలో 10 హుండీలు తెరచి, ఆదాయం లెక్కించారు. మొత్తం రూ.8,52,983 ఆదాయం లభించిందని ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. నగదు రూపంలో రూ.7,53,512, నాణేలుగా రూ.99,471 వచ్చాయన్నారు. ఘనంగా మొల్లమాంబ జయంతికాకినాడ రూరల్: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యాన కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. సర్పవరం జంక్షన్ బోట్క్లబ్ వద్ద మొల్ల విగ్రహానికి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, బీసీ కార్పొరేషన్ అధికారి కె.లిల్లీ, ఈడీ శ్రీనివాసరావు, జిల్లా పౌర సంబంధాల అధికారి డి.నాగార్జున, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, తహసీల్దార్ కుమారి, శాలివాహన సంఘ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, వాల్మీకి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో తెలుగులో రచించిన మొట్టమొదటి కవయిత్రిగా మొల్ల ప్రసిద్ధికెక్కారని అన్నారు. అనంతరం శాలివాహన సంఘం ప్రతినిధుల ఆధ్వర్యాన మహిళలకు చీరలు పంపిణీ చేశారు. నేడు ప్రత్యంగిర హోమంఅన్నవరం: ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ప్రత్యంగిర హోమం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హోమం ప్రారంభిస్తారు. భక్తులు రూ.750 టికెట్టుతో హోమంలో పాల్గొనవచ్చునని అధికారులు తెలిపారు. వెబ్ ఆప్షన్లకు రేపటి వరకూ అవకాశం కాకినాడ సిటీ: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణకు జ్ఞానభూమి పోర్టల్, ఇతర వెబ్ పోర్టల్లో వెబ్ ఆప్షన్ల సేవలు ప్రారంభమయ్యాయని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకుడు జి.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వెబ్ ఆప్షన్ల గడువు శనివారంతో ముగుస్తుందన్నారు. డీఎస్సీ ఉచిత కోచింగ్కు నమోదు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను ప్రస్తుతం షార్ట్ లిస్ట్ చేశామన్నారు. ఇందులో ఉన్న వెయ్యి మంది అభ్యర్థులు ఇప్పటికే తమ వెబ్ ఆప్షన్లు పూర్తి చేశారన్నారు. మిగిలిన వారు గడువులోగా వెబ్ ఆప్షన్లు పూర్తి చేయాలని సూచించారు. -
ఆ ‘పప్పు’లేం ఉడకవు
పంపిణీకి బ్రేక్..! రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో మార్చి నెల నుంచి కందిపప్పు సరఫరా నిలిచిపోయిందని తెలుస్తోంది. ఈ నెలలో కందిపప్పు కోసం డీడీలు తీయవద్దని పౌర సరఫరాల శాఖ అధికారులు ముందుగానే సమాచారం ఇచ్చినట్టు డీలర్లు చెబుతున్నారు. రెండు నెలలుగా పూర్తి స్థాయిలో కందిపప్పు రాకపోవడంతో ఆసరాగా తీసుకున్న కొందరు రేషన్ సరకులను పక్కదారి పట్టించారనే ఆరోపణలూ లేకపోలేదు. బియ్యం, పంచదారతో పాటు, కందిపప్పు కోసం ఎండీయూ వాహనాల ఆపరేటర్లను అడుగుతుంటే, నో స్టాక్ అనే సమాధానం వస్తుందని లబ్ధిదారులు చెబుతున్నారు. రేషన్ దుకాణాల్లో కందిపప్పు సరఫరా నిలిపివేయడంతో బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పును అధికంగా రూ.150 వరకూ కొనుగోలు చేయాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే కందిపప్పు పంపిణీని పూర్తిగా ఎత్తివేసేలా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.● కందిపప్పు సరఫరాలో కూటమి సర్కారుది ఆరంభ శూరత్వం ● రేషన్ దుకాణాల్లో పూర్తిగా నిలిపివేత ● మూడు నెలల నుంచి బియ్యం, పంచదారతోనే సరి ● ఉగాదికీ పప్పన్నం పెట్టలేని పాలకులు ఆలమూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. నిత్యావసరాలను రాయితీపై అందిస్తామంటూ నేటి పాలకులు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. ప్రజలందరూ నిజమేనని నమ్మారు కూడా. తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి తొమ్మిది నెలలైనా, ఇంకా అనేక పథకాలు ఆచరణకు నోచుకోలేదు. అమలులో ఉన్న పథకాలూ ఇప్పటికే అర్ధాంతరంగా నిలిచిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాది మార్చి నుంచి రేషన్ డిపోల ద్వారా కందిపప్పు సరఫరాను నిలిపివేసి ప్రభుత్వం తన అసమర్థతను చాటుకుంది. బహిరంగ మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ధరల నియంత్రణ కోసం కృషి చేయాల్సిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. రేషన్ దుకాణాల్లో కందిపప్పును కూడా రాయితీపై అందిస్తామన్న హామీనీ అపహాస్యం చేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాదిరిగానే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కంది పప్పును కేజీ రూ.67కే ప్రతి నెలా పంపిణీ చేస్తామని గత ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సుమారు 30 శాతం మందికి మాత్రమే సరఫరా చేశారు. ఈ నెలలో కందిపప్పు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. నిత్యావసర సరకుల ధరల నియంత్రణ పేరిట పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లు సైతం మూతపడ్డాయి. ప్రజలపై తీవ్ర ప్రభావం రేషన్ దుకాణాల్లో కందిపప్పు సరఫరా నిలిచిపోవడంతో ఆ ప్రభావం పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్రంగా పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలను కూటమి ప్రభుత్వం ఏమాత్రం అదుపు చేయలేకపోవడం ప్రజలకు పెనుశాపంగా పరిణమించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 966 రేషన్ డిపోల ద్వారా 355 మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ల(ఎండీయూ)తో 5.48 లక్షల మందికి ప్రతి నెలా రేషన్ సరకులను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ప్రతి నెలా 20లోపు రేషన్ డీలర్లు డీడీలు తీసి, అవసరమైన సరకులను దిగుమతి చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జిల్లా పౌర సరఫరాల శాఖ మాత్రం గతేడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో సక్రమంగానే కందిపప్పు సరఫరా చేసింది. జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి కందిపప్పు కోసం డీలర్లు డీడీలు తీయగా, 523 టన్నులకు గానూ ప్రభుత్వం కేవలం 112 టన్నులే సరఫరా చేసింది. డీడీల్లో మిగిలిన సొమ్మును ఇతర సరకులకు సర్దుబాటు చేశారు. దీంతో ఆ రెండు నెలలు కూడా వినియోగదారులకు పూర్తి స్థాయిలో కందిపప్పు సరఫరా జరగలేదు. -
‘ఉల్లాస్’పై 23న పరీక్ష
మండలాల వారీగా ఉల్లాస్ పరీక్ష రాసే వారి వివరాలు మండలం అభ్యర్థులు తొండంగి 800 యు.కొత్తపల్లి 900 తాళ్లరేవు 750 కాకినాడ రూరల్ 900 రౌతులపూడి 580 శంఖవరం 576 కోటనందూరు 500 తుని 700 ఏలేశ్వరం 450 ప్రత్తిపాడు 650 పరీక్ష కేంద్రాలు 681 ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య 3 గంటల వ్యవధిలో రాయాలి. ● హాజరు కానున్న 6,806 మంది ● ఎన్ఐఓఎస్ ద్వారా నిర్వహణ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ (ఉల్లాస్) పేరిట కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అక్షరాస్యతా శిక్షణ పొందుతున్న వారికి ఈ నెల 23న ప్రాథమిక అక్షరాస్యత పరీక్ష నిర్వహించనున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (ఎన్ఐఓఎస్) ద్వారా నిర్వహించే ఈ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ధ్రువపత్రాలు అందజేస్తారు. జిల్లాలో 6,806 మంది మహిళలను ఈ పరీక్షకు సంసిద్ధుల్ని చేశారు. ఉల్లాస్ ఎందుకంటే.. మహిళల్లో అక్షరాస్యత పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమాన్ని నవంబర్ 5న ప్రారంభించింది. పదిహేను సంవత్సరాలకు పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న వారికి ప్రాథమిక, డిజిటల్, ఆర్థిక విద్యను అందిస్తూ, ఈ నెలాఖరులోగా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడం ఈ కార్యక్రమం లక్ష్యం. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం ప్రారంభించారు. ప్రస్తుతం ప్రతి రంగంలోనూ సాంకేతికత, డిజిటల్ విధానం, నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. ఈ నేపథ్యంలో మహిళలు పొదుపు సంఘాల్లో ఉండేలా చూడటం, బ్యాంక్ ఖాతాలున్న వారికి వాటిని నిర్వహించే విధానాన్ని ఉల్లాస్ ద్వారా తెలియజేశారు. చదువు రాని వారు పక్క వారిపై ఆధారపడుతున్న పరిస్థితులను అధిగమించేలా అవగాహన కల్పించారు. గ్రామాల్లో 15 ఏళ్లు దాటిన వారికి విద్యను అందించే వ్యవస్థ ఏదీ ప్రస్తుతం లేదు. అందుకే ప్రత్యామాయంగా మరోసారి గ్రామీణ ప్రాంతాల్లో వయోజన విద్యా కేంద్రాలు ప్రారంభించేందుకు ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. అక్షర జ్ఞానం లేని వారిని గుర్తించేందుకు ఏపీ సెర్ప్ ఆధ్వర్యాన జిల్లా వ్యాప్తంగా సర్వే చేయగా, కనీస అక్షర జ్ఞానం లేని వారు దాదాపు 70 వేల మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఆరు ఏజెన్సీ మండలాలు, నాలుగు సముద్ర తీర మండలాల్లోని 6,806 మందికి తొలి విడతలో ఉల్లాస్ శిక్షణ ఇచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలు.. వారు అందుబాటులో లేకపోతే పొదుపు సంఘాల్లో చదువుకున్న వారిని, ఉపాధ్యాయులను వలంటీర్లుగా నియమించి బోధించారు. అవసరమైన విద్యా సామగ్రి అందజేశారు.చకచకా ఏర్పాట్లు ఉల్లాస్ పరీక్ష నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్షించాం. ఇన్విజిలేషన్కు, మూల్యాంకనానికి అర్హులను నియమించాం. పరిశీలకులుగా వెలుగు ఏపీఏంలు వ్యవహరిస్తారు. పరీక్ష అనంతరం జవాబు పత్రాలు, రిజిస్ట్రేషన్, హాజరు పత్రాలు, మార్కుల జాబితాలను నిర్దేశిత నమునాల్లో అప్లోడ్ చేస్తాం. – ఎ.వెంకటరెడ్డి, నోడల్ అధికారి, వయోజన విద్య, కాకినాడ -
సత్యదేవునికి జన్మ నక్షత్ర పూజలు
అన్నవరం: సత్యదేవుని జన్మనక్షత్రం ‘మఖ’ సందర్భంగా బుధవారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ దేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారి ఆలయం తెరచి స్వామి, అమ్మవార్లకు అర్చక స్వాములు సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్లకు, శివ లింగానికి పండితులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పళ్లరసాలతో మహాన్యాశ పూర్వక అభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం సుగంధ భరిత పుష్పాలతో, స్వామి, అమ్మవార్లను అలంకరించి పూజించారు. ఉదయం ఆరు గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. యాగశాలలో ఘనంగా ఆయుష్య హోమం స్వామివారి యాగశాలలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు అయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆయుష్య హోమం ప్రారంభించి 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. వేద పండితులు గొల్లపల్లి గణపతి ఘనపాఠి, యనమండ్ర శర్మ ఘనపాఠి, అర్చకులు నిట్టల కామేశ్వరరావు, వ్రత పురోహితుడు పాలంకి పట్టాభి, తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్యదేవుని దర్శించిన 20 వేల మంది భక్తులు బుధవారం సుమారు 20 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. స్వామివారి దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు గోశాలలో సప్తగోవులకు ప్రదక్షణ చేసి శ్రీకృష్ణుడిని దర్శించి పూజలు చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు వేయి నిర్వహించగా అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.20 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో నాలుగు వేల మందికి భోజనం పెట్టారు. నేడు స్వామివారి నిజరూప దర్శనం గురువారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారు, శంకరులు ఏ ఆభరణాలు ధరించకుండా (మూల విరాట్లుగా) నిజరూపులో భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
ప్రాణం తీస్తున్న వేగం
ప్రాణాలు పోతుంటే బాధేస్తోంది ఎంతో భవిష్యత్ ఉన్న కొందరు యువకులు రోడ్డు ప్రమాదాల్లో కేవలం అతివేగంతో ప్రాణాలు కోల్పోవడాన్ని చూస్తున్నప్పుడు బాధేస్తోంది. ట్రాఫిక్ నిబంధనలపై, హెల్మెట్ ధారణపై, అతివేగం వద్దని, విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని పోలీస్ శాఖ యువతకు నిత్యం కౌన్సెలింగ్లు ఇస్తోంది. ముఖ్యంగా యానాం –ఎదుర్లంక వారిధిపై జరగుతున్న యువకుల రోడ్డు ప్రమాదాలపై అధ్యయనం చేస్తున్నాం. యువకుల బైక్ల డ్రైవింగ్లపై ప్రత్యేక నిఘా పెట్టి, వారు అతివేగం తగ్గించేలా చర్యలు చేపడతాం. – టీఎస్ఆర్కే ప్రసాద్, డీఎస్పీ, అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ అమలాపురం టౌన్: చదువుకుని ఉద్యోగాలు సాధించి ఉన్నతమైన జీవితాన్ని చవిచూడక ముందే... తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న ఆశలు నెరవేరకుండానే కొందరు యువకులు రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని నిమిషాలు ఆలస్యమైనా గమ్యాన్ని చేరుకుంటాం, అతి వేగంతో జరగరానిది ఏదైనా జరిగితే మన వెనక ఉన్న కుటుంబం ఏమైయిపోతుందనే కనీస ఆలోచన, ముందుచూపు లేకుండా యువకులు రోడ్లపై రయ్ రయ్ మంటూ బైక్లను నడుపుతున్నారు. గత ఏడాది కాలంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అతి వేగంతో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 34 మంది వరకూ యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెలలోనే ఉమ్మడి జిల్లాలో ఏడుగురు వరకూ రోడ్డు ప్రమాదాల్లో యువకులు మృత్యువాత పడ్డారు. ఐ.పోలవరం మండలం బాలయోగి వారధి (ఎదుర్లంక –యానాం వంతెన)పై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి యువకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయంటే అతి వేగమే కారణం. మన జాగ్రత్తలో మనం ఉండి..ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే చాలా వరకూ రోడ్డు ప్రమాదాలు మన దరిచేరవు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో యువకులు రైడింగ్ మాదిరిగా బైక్ను అతివేగంగా నడపడం ఫ్యాషన్ అయిపోయింది. ఆధునాతన బైక్లను యమ స్పీడుగా నడుపుతూ మృత్యు కుహరాల్లోకి వెళుతున్నారు. యానాం –ద్రాక్షారామ రహదారిలో ఎకై ్సజ్ అధికారులు వెంబడించడంతో ఓ యువకుడు అతి వేగంతో వెళ్లి ఓ లారీని ఢీకొట్టి ప్రాణాలు విడిచాడు. పి.గన్నవరం మండల ఎల్.గన్నవరం శివారు జొన్నల్లంకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇలా చెప్పకుంటూ పోతే ఈ ఏడాదిలో అతివేగమనే అనర్థంతో అర్ధంతరంగా యువకులు ప్రాణాలు పొట్టన పెట్టుకున్న రోడ్డు ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి. యువకులు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న సమయంలో వారు కనీసం హెల్మెట్ ధరించకపోవడం గమనార్హం. ప్రమాదాలకు కారణాలు అనేకం యువకులు రోడ్డు ప్రమాదాల్లో బలి అయిపోతున్న సంఘటనలకు కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. అతి వేగం ప్రధాన కారమవుతుంటే దానికితోడు బైక్లతో రైడింగ్లకు దిగడం, మద్యం సేవించడం, డ్రైవింగ్ లైసెన్స్లు లేకుండా వచ్చీ రానీ డ్రైవింగ్తో కొందరు యువకులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. యువకులను బైక్ల డ్రైవింగ్ పరంగా కంట్రోల్ చేయక పోవడంలో తల్లిదండ్రులు ప్రధాన కారకులవుతున్నారు. గొప్పల కోసం వెళ్లి కొందరు తల్లిదండ్రులు తమ పిల్లోడికి ఖరీదైన, అధునాతన బైక్ కొనిచ్చామని ఆనందిస్తున్నారే తప్ప ఆ బైక్తో తమ బిడ్డ ఎన్ని తప్పిదాలు చేస్తున్నాడో ప్రాణాలు పోయాక గ్రహించి విలపిస్తున్నారు. డ్రైవింగ్లో నిష్ణాతులైన తర్వాతే బైక్ కొనిద్దామని ఆదిలోనే తల్లిదండ్రులు ఆలోచిస్తే ఇన్ని అనర్ధాలు జరవగవని పోలీసులు అంటున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా బైక్ డ్రైవింగ్పై తమ పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.పోలీసుల కౌన్సెలింగ్లను పెడచెవిన పెడుతున్న యువతజిల్లా పోలీస్ శాఖ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, ముఖ్యంగా అతి వేగంతో వెళుతున్న యువతను నిరోధించేందుకు అనేక కౌన్సెలింగ్లు ఇస్తోంది. అలాగే ప్రతీ పట్టణం, గ్రామాల్లో హెల్మెట్ ధారణ ఎంత విలువనైదో, ప్రాణాలను ఎలా కాపాడుతుందో వివరిస్తూ ఫ్లెక్సీలను ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సరికొత్త ట్రాఫిక్ రూల్స్, పెరిగిన జరిమానాలపై యువకులను రోడ్డు చెంతే పోలీసులు ఆపి కౌన్సెలింగ్ ఇస్తున్నా వారు వాటిని పెడచెవిని పెడుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే ఆ కుటుంబం ఎంత తల్లడిల్లుతుందో, ఎంత క్షోభను అనుభవిస్తుందో జిల్లా పోలీసులు వీడియోలు, ఆడియోలు, ఫ్లెక్సీలు ఎన్నో విడుదల చేస్తున్నా అవి కూడా యువకుల చెవులెక్కడం లేదు. ట్రాఫిక్ రూల్స్ పాటించని నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను తీస్తోంది. ర్యాష్ రైడింగ్, డ్రైవింగ్లతో యువత కన్నవారికి కడుపు కోత బైక్లపై విపరీతమైన వేగంతో ప్రయాణం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో ఘోర ప్రమాదాలు తొలి తప్పిదం తల్లిదండ్రులదే అంటున్న పోలీసులు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 16,000 గటగట (వెయ్యి) 14,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ఐ.పోలవరం: ఐ.పోలవరం మండలం ఎదుర్లంక జీఎంసీ బాలయోగి వారధిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యానాం సుంకరపాలెం నుంచి ముమ్మిడివరం వైపు బైక్పై వస్తున్న ఇద్దరి వ్యక్తులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన ఇద్దరూ తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన యాళ్ల వీరేంద్ర(26), ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందిన వేమవరపు సాంబశివ(14)గా పోలీసులు గుర్తించారు. పోతుకుర్రులో జరిగే పుట్టినరోజు వేడుకలకు బంధువుతో కలసి వారు మోటారు సైకిల్పై వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి స్థానిక ఎస్సై మల్లికార్జునరెడ్డి సిబ్బందితో కలసి వెళ్లి మృతదేహాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సుంకరపాలెం గ్రామానికి చెందిన యాళ్ల వీరేంద్ర లోడ్ ఆటో నడుపుతూ తండ్రి సూరిబాబుకు అండగా ఉండేవాడు. సూరిబాబుకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఉన్న ఒక్క కొడుకూ ఆటో నడుపూతూ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. వీరేంద్ర మృతితో సుంకరపాలెంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. సాంబశివ కొత్తలంక హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. కౌలు రైతు ఆత్మహత్య తాళ్లరేవు: మండల పరిధిలోని పి.మల్లవరం పంచాయతీ పత్తిగొంది గ్రామానికి చెందిన కౌలు రైతు పశ్చెట్టి వెంకటేశ్వరరావు(45) ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలో సొంత భూమితోపాటు కొంత కౌలుకి తీసుకుని వ్యవసాయం చేశాడు. వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పులు తీర్చలేక కొంతకాలం హైదరాబాద్లో పనిచేశాడు. ఇటీవల తిరిగి వచ్చి కాకినాడలో కూలిపని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి యానాం బీచ్కు వెళ్లి గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేశ్వరరావును యానాం పోలీసుల సహకారంతో కాకినాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. యానాం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతునికి భార్య నాగలక్ష్మి, వివాహమైన కుమార్తెలు శ్రీదేవి, జ్యోతిశ్రీ ఉన్నారు. వెంకటేశ్వరరావు ఆకస్మిక మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువకుడి ఆత్మహత్యఅల్లవరం: ఎంట్రుకోన పంచాయతీ పరిధిలో వాసర్లవారిపాలేనికి చెందిన వాసర్ల వెంకట సాయి సునంద్ (24) బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఇంటిలో ఫ్యాన్కు ఊరి వేసుకుని మృతి చెందాడు. ఫంక్షన్ నిమిత్తం వేరే ఊరు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే లోగా ఫ్యాన్కు వేలాడుతున్నాడని తండ్రి వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. కొన ఊపిరితో ఉన్న వెంకట సాయిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడి తండ్రి వీర వెంకట సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్సై హరీష్కుమార్ కేసు నమోదు చేశారు. మృతదేహం స్వాధీనంపెరవలి: పెరవలి మండలం లంకమాలపల్లి గ్రామం వద్ద బ్యాంక్ కెనాల్లో ఒక మృతదేహాన్ని బుధవారం స్వాధీనం చేసుకున్నామని పెరవలి ఎస్ఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. కొవ్వూరు మండలం పంగిడి గ్రామానికి ఆవుగడ్డ మల్లికార్జున(40)గా అతనిని గుర్తించామని చెప్పారు. కాలువలో మృతదేహం కొట్టుకుంటూ ఇక్కడకు వచ్చి తుప్పల్లో ఆగిపోయిందని చెడు వాసన రావటంతో గ్రామస్తులు పరిశీలించి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వచ్చి మృతదేహాన్ని పైకి తీసి పోస్టుమార్టం కోసం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెంకటేశ్వరరావు తెలిపారు. బీరు బాటిళ్లతో దాడికి పాల్పడిన నలుగురి అరెస్టుకాకినాడ రూరల్: కాకినాడ అర్బన్ 3వ డివిజన్ పరిధిలోని గుడారిగుంటలో ఒక మద్యం దుకాణం వద్ద ఈ నెల 9న రాత్రి జరిగిన గొడవ హింసాత్మకంగా మారడంతో ఇద్దరు వ్యక్తులపై బీరు బాటిళ్లతో దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులను సర్పవరం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి ఎస్సై పి.శ్రీనివాస్కుమార్ వివరాల ప్రకారం గుడారిగుంటలో మద్యం దుకాణం వద్దకు వీరు 9న రాత్రి 8గంటల సమయంలో వెళ్లారు. చిన్న విషయమై గొడవ పడి బీరు బాటిళ్లతో ఇద్దరిపై దాడికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరిన బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులు గుడారిగుంటకు చెందిన సీకోటి రాజు, పెయ్యల ప్రసాద్, సీకోటి ప్రసాద్, కలాడి అర్జునరావుపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. -
ఆలోచన లేకుండా చేసే పనులతో ఇబ్బందులు
కంబాలచెరువు: ఆలోచన లేకుండా చేసే పనులతో ఇబ్బందులు ఎదురవుతాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి అన్నారు. రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. అక్కడి బాలురు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉచితంగా న్యాయవాదిని పొందే అవకాశం ఉందని తెలిపి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను వివరించారు. వసతి గృహంలో ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలన్నారు. బాలురతో స్నేహ పూర్వకంగా ఉండాలని, వారికి మంచి ఆహారాన్ని అందించడంతో పాటు వారికి ఎలాంటి వైద్య సహాయం అవసరమైన వెంటనే చర్యలు తీసుకోవాలని సిబ్బందికి చెప్పారు. అనంతరం కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని బీసీ బాలికల సమీకృత సంక్షేమ వసతి గృహంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. అన్యాయం జరిగితే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. మంచి చెడు స్పర్శలకు తేడాలను విద్యార్థినులకు తెలియజేశారు. -
పారదర్శకంగా పరీక్షల నిర్వహణ
రాజానగరం: పరీక్షల నిర్వహణ, సర్టిఫికెట్ల మంజూరు వంటి విషయాలలో పారదర్శకంగా ఉండాలని, ఎక్కడ తేడా వచ్చినా క్షమించేది లేదని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ హెచ్చరించారు. యూనివర్సిటీలో యూజీ, పీజీ పరీక్షల విభాగాలను బుధవారం ఆమె నిశితంగా పరిశీలించారు. అనంతరం డీన్ అండ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కార్యాలయంలో పరీక్ష విభాగానికి చెందిన అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న విధానం గురించి తెలుసుకుంటూనే ఆటోమేషన్ విధానాన్ని అమలు చేయడంపై ఆరా తీశారు. అనుబంధ కళాశాలలు ఎక్కువగా ఉన్నందున ఎక్కడా, ఎటువంటి సమస్య ఎదురుకాకుండా సమర్థంగా పరీక్షలు నిర్వహించడం కష్టతరమైన చర్యే అయినా సమష్టిగా పనిచేస్తే ఎటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా చూడవచ్చన్నారు. డీన్ ఆచార్య డి.కల్యాణి, ప్రత్యేకాధికారి డాక్టర్ కె.దీప్తి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ విజయకుమారి, సిస్టమ్ మేనేజర్ జ్యోతి పాల్గొన్నారు.‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ -
ఘనంగా పండిత సదస్యం
మధురపూడి: కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా మూడవరోజు బుధవారం సదస్యం నిర్వహించారు. మధ్యాహ్నం స్వామివారి కల్యాణ మండపంలో వేద పండితులు, ఉభయ వేదాంత పండితుల సమక్షంలో సదస్యం జరిగింది. ఉదయం గ్రామబలిహరణ, సాయంత్రం ఆరాధన, సర్వదర్శనములకు అనుమతి, సేవాకాలం జరిగింది. తీర్థ ప్రసాద గోష్ఠి కార్యక్రమంలో భాగంగా భక్తులకు బూరెలు అందజేశారు. రాత్రి శ్రీఆంజనేయ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పరాసర రంగరాజభట్టర్, అన్నవరం దేవస్థానం అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు.ఆంజనేయ వాహనంపై లక్ష్మీ నరసింహుని గ్రామోత్సవం -
కంటిపూడి సుజుకి శాటిలైట్ డీలర్షిప్ ప్రారంభం
రావులపాలెం: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజమైన సుజుకి మోటార్ సైకిల్ అధీకృత డీలర్ కంటిపూడి సుజుకి నూతన శాటిలైట్ డీలర్ షిప్ను బుధవారం రావులపాలెంలో ప్రారంభించారు. కంటిపూడి సుజుకి షోరూమ్ అండ్ సర్వీస్ను సుజుకి సేల్స్ రీజినల్ మేనేజర్ శివరామకృష్ణ, కంటిపూడి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠమనేని వినయ్బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటిపూడి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠమనేని వినయ్బాబు మాట్లాడుతూ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి అత్యాధునిక ఆటోమేటిక్ పరికరాలు కలిగిన వర్క్షాప్ను రూపొందించినట్టు తెలిపారు. కంటిపూడి గ్రూప్ చైర్మన్ కంటిపూడి సర్వారాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఎం.జగన్, సీహెచ్ సత్యనారాయణమూర్తి (చినబాబు), కె.మన్మోహన్రామ్, సేల్స్ ఏఎం బాలకృష్ణ, సర్వీస్ ఏఎం సాయి, కంటిపూడి సుజుకి జీఎం రాజారావు, బ్రాంచ్ మేనేజర్ వంశీ, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే ధ్యేయం
●● జిల్లాలో ఘనంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం ● కేక్ కట్ చేసి, జెండా ఆవిష్కరించిన నేతలు సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాడే పార్టీగా వైఎస్సార్ సీపీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. పార్టీ ఆవిర్భవించి ఒకటిన్నర దశాబ్దాల కాలం గడిచినా కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరి గుండె చప్పుడై నిలుస్తోంది. నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తున్న వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా ప్రజలు బుధవారం పండగలా నిర్వహించారు. ● జిల్లా కేంద్రం కాకినాడలోని పార్టీ సిటీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యాన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సహా ముఖ్య నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా బడుగు, బలహీన వర్గాలు, నిరుపేదల సంక్షేమమే అజెండాగా వైఎస్సార్ సీపీ పని చేస్తోందని ఈ సందర్భంగా నేతలు అన్నారు. పేదల గుండె చప్పుడు వైఎస్సార్ సీపీ అని అన్నారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. ● పిఠాపురంలో వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద మాజీ ఎంపీ, నియోజకవర్గ కో ఆర్డినేటర్ వంగా గీత పార్టీ జెండా ఎగురవేసి, నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంచారు. జగ్గంపేటలోని పార్టీ కార్యాలయం వద్ద వైఎస్సార్ సీపీ జెండాను నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి తోట నరసింహం ఎగురవేశారు. కార్యకర్తలకు స్వీట్లు పంచారు. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలోని కార్యాలయం వద్ద నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండా ఎగురవేశారు. తుని శ్రీరామా సెంటర్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. నాయకులు, కార్యకర్తలు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. కాకినాడ రూరల్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకుడు కురసాల సత్యనారాయణ ఆధ్వర్యాన ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, జై జగన్, జై వైఎస్సార్ సీపీ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ అంగులూరి లక్ష్మీ శివకుమారి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్, కాకినాడ నగరాభివృద్ధిసంస్థ మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, జెడ్పీటీసీ సభ్యుడు గుబ్బల తులసి కుమార్, నేతలు యనమల కృష్ణుడు, వాసిరెడ్డి జమీలు, ఒమ్మి రఘురాం, అల్లి రాజబాబు, ముదునూరి మురళీ కృష్ణంరాజు, మాజీ మేయర్ పోలసపల్లి సరోజ తదితరులు పాల్గొన్నారు. -
హామీలు అమలు చేయని చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, తొమ్మిది నెలలైయినప్పటికీ ఇప్పటి వరకూ నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కళాశాలలను రాష్ట్రంలో ఏర్పాటు చేసి, భవన నిర్మాణాలు చేపట్టి, నాలుగు కాలేజీలు ప్రారంభించారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కూడా తన మనుషులకు అప్పగించేలా చంద్రబాబు ప్రయత్నించడాన్ని వైఎస్సార్ సీపీ తరఫున నిరసిస్తున్నాం. ఎకరం రూపాయి చొప్పున 33 సంవత్సరాలకు కట్టబెట్టేలా వారి ఆలోచనలున్నాయి. కళాశాలకు 50 నుంచి 60 ఎకరాల భూమి చూసుకున్నా.. ఒక్కొక్కటి రూ.1,000 కోట్ల విలువ చేస్తుంది. 17 మెడికల్ కళాశాలలంటే రూ.17 వేల కోట్ల విలువైన ప్రజల ఆస్తి. దీనిని తన మనుషులకు ధారాదత్తం చేసేలా చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువా త ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వారిని ఆదుకోవాలి. – దాడిశెట్టి రాజా, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి హామీలు నెరవేర్చాల్సిందే.. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా ఇప్పటి వరకూ ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో, కేంద్రంలో 2014 నుంచి 2019 వరకూ వాళ్లే అధికారంలో ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో వారే అధికారంలో ఉన్నారు. కలిసి పని చేస్తున్నారు. కొంత మందిని కేంద్ర మంత్రులుగా కూడా తీసుకున్నారు. వాళ్లు తేలేనిది మేం తెచ్చాం. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంతో కలిసి లేము, పోరాడాము. నేను కూడా పార్లమెంట్లో అనేక సమస్యలు ప్రస్తావించా. 2024 ఎన్నికల ముందు అన్ని విద్యా సంస్థలకు పెండింగ్ నిధులన్నీ అందజేశాం. ఎలక్షన్ కోడ్ వచ్చిన తరువాతే ఫైనాన్షియల్ నిబంధనల ప్రకారం నిధులు విడుదల చేయలేదు. ఆ నిధులు అలాగే ఉన్నాయి. మా నాయకుడు జగన్మోహన్రెడ్డి చెబుతున్నట్టు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల వెంటే ఉంటాం. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, నిరుద్యోగ భృతి నిధులు వెంటనే ఇవ్వాలి. ఉద్యోగ కేలండర్ విడుదల చేయాలి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను తక్షణం నిలుపు చేయాలి. – వంగా గీత, కాకినాడ మాజీ ఎంపీ -
జిల్లా దేవదాయ శాఖ అధికారిగా సుబ్బారావు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా దేవదాయ శాఖ అధికారిగా ఇ.సుబ్బారావు కాకినాడలోని కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనను జిల్లాలోని పలు దేవస్థానాలు, సత్రాల ఈఓలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో జిల్లాలో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్గా, జిల్లా దేవదాయ శాఖ కార్యాలయంలో ఏఓగా పని చేసిన అనుభవం ఉందన్నారు. అర్చకులకు, ఈఓలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అర్జీదారుల ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి కాకినాడ సిటీ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారుల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టరేట్ నుంచి బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమస్య పరిష్కారంపై లబ్ధిదారు సంతృప్తి చెందారా లేదా అనే విషయంపై అభిప్రాయం తీసుకోవాలన్నారు. సమావేశంలో జేసీ రాహుల్ మీనా, డీఆర్ఓ జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. 17న వలంటీర్ల ‘చలో విజయవాడ’ కాకినాడ సిటీ: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లందరినీ కొనసాగించాలని, రూ.10 వేల వేతనం చెల్లించాలని, 9 నెలల బకాయిలు చెల్లించాలనే డిమాండ్లతో గ్రామ, వార్డు వలంటీర్లు ఈ నెల 17న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వాల్పోస్టర్ను కాకినాడ కచేరిపేటలోని సీఐటీయూ కార్యాలయం వద్ద బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వలంటీర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైనా తమకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష మంది మహిళలు పని చేసే వలంటీర్ల కడుపు కొట్టే ఉద్దేశం తనకు లేదని ఎన్నికల ముందు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమను కొనసాగించకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలుకు వలంటీర్ వ్యవస్థ ఉండాలని, ఈ హామీలను అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు కాబట్టి వలంటీర్లను కొనసాగించడం లేదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు ఈ నెల 17న వేలాదిగా వలంటీర్లు విజయవాడ తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, వలంటీర్ల సంఘం జిల్లా కో కన్వీనర్ ఇనుకోటి వరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అసంపూర్తి ఇళ్లకు అదనపు సాయం కాకినాడ సిటీ: పీఎంఏవై గ్రామీణ్, అర్బన్ 1.0లలో మంజూరై, వివిధ దశల్లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు అదనపు ఆర్థిక సాయం అందించనున్నామని కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. గృహ నిర్మాణ పథకంపై వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టరేట్ నుంచి బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో దాదాపు 7,108 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ గృహాల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. బీసీలు 4,852 మంది, ఎస్సీలు 2,131, ఎస్టీలు 125 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీ, బీసీలకు అదనంగా రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, ఆదివాసీ గిరిజనులకు రూ.లక్ష చొప్పున అదనపు సాయం అందిస్తామని చెప్పారు. వీటి నిర్మాణాలను ఏప్రిల్లోగా పూర్తి చేసుకోవాలన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణను కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ప్రతి లబ్ధిదారు ఇంటికి వెళ్లి, ఇళ్లు నిర్మించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
ద్రాక్షారామలో పేలుడు కలకలం
రామచంద్రపురం రూరల్: రామచంద్రపురం మండలంలోని ద్రాక్షారామలో పేలుడు కలకలం చోటు చేసుకుంది. ద్రాక్షారామ ఎస్సై ఎం. లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం బాధిత కుటుంబం ఎండీ జాఫర్ హుస్సేన్ అతని భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడుతో కలసి ద్రాక్షారామ నున్నవారి వీధిలో నివాసం ఉంటున్నారు. జాఫర్ మార్కెట్లో మటన్ దుకాణం నడుపుకుంటున్నాడు. సోమవారం రాత్రి భోజనం చేసి భార్య, కుమార్తెలు పెంకుటింటిలో నిద్రపోగా, జాఫర్, అతడి కుమారుడు ఇంటి పెరటిలో ఉన్న రేకుల షెడ్డులో నిద్రపోయారు. అర్ధరాత్రి 1.15 గంటలకు పేలుడు శబ్దం, మంటలు రావడంతో భయపడి లేచి బయటకు వచ్చి చూసేసరికి అదే గ్రామానికి చెందిన మహమ్మద్ రోషన్ అబ్బాస్, మరో ఇద్దరు గుర్తు తెలియని యువకులు వీరిని చూసి మోటారు సైకిళ్లపై పారిపోయారు. గాజు సీసాలకు చుట్టిన ఔట్లు, పేలుడు పదార్థాలతో ఇంటిపై దాడి చేశారని, గతంలో రోషన్ అబ్బాస్ బావ మహ్మద్ అలీహుస్సేన్కి తనకి మసీదు విషయంలో ఉన్న గొడవలను దృష్టిలో పెట్టుకుని తమ కుటుంబాన్ని చంపాలని, ఇంటిని నాశనం చేసి ఆస్తి నష్టం కలిగించాలనే ఉద్దేశంతో తమపై దాడికి పాల్పడ్డారని జాఫర్ హుస్సేన్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. ఘటనా స్థలాన్ని సీఐ వెంకట నారాయణ సిబ్బందితో కలసి పరిశీలించారు. -
ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా
13 మంది విద్యార్థులకు గాయాలు జగ్గంపేట: జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామంలో మంగళవారం ఉదయం విద్యార్థులతో జగ్గంపేట వస్తున్న ఒక ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 13 మంది విద్యార్థులు ఉండగా వీరిలో 9 మందికి స్వల్పంగాను, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తెలిపిన వివరాల మేర కు ఉదయం జగ్గంపేట వస్తున్న బస్సు కాండ్రేగుల గ్రామ శివారులో బోల్తాపడింది. స్థానికుల సహకారంతో విద్యార్థులను బయటకు తీసి జగ్గంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. వీరిలో 9 మందిని ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు పంపించేశారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురు తోటకూర కార్తీక్ నాగేంద్ర, అనితా రామచక్ర, ద్వారపూడి ధనలక్ష్మి, బొదిరెడ్డి శ్రావణిలను మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. స్కూల్ కరస్పాండెట్, వైఎస్సార్ సీపీ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడు ఒమ్మి రఘురాంఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విద్యార్థులందరూ 6 నుంచి 9 తరగతి చెందిన వారని, డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై తెలిపా రు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రణీత్ విద్యార్థులకు వైద్య సేవలందించారు. -
బ్లడ్ బ్యాంక్లో తనిఖీలు
కాకినాడ క్రైం: కాకినాడలోని శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. డీఎంహెచ్వో డాక్టర్ నరసింహనాయక్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాధారణ తనిఖీలలో భాగంగా బ్లడ్ బ్యాంక్ను పరిశీలించినట్లు తెలిపారు. రిజిస్టర్లు పరిశీలించామని, రిక్విజేషన్ ఫాంలోని వివరాల ఆధారంగా దాతలు, గ్రహీతలతో మాట్లాడి నిర్ధారించుకున్నట్లు తెలిపారు. బ్లడ్ స్టాక్ రికార్డు, డోనార్ రికార్డు, క్యాంప్ రిజిస్టర్స్, క్రాస్ మ్యాచింగ్, డిస్కార్ట్ రిజిస్టర్, బ్లడ్ ఇష్యూ రిజిస్టర్, పేమెంట్ రిక్విజేషన్ ఫాం, పేమెంట్ రిసీప్ట్స్, ఫిజికల్ స్టాక్, బ్లడ్ కలెక్షన్, మ్యాచింగ్, కాంపోనెంట్ ప్రిపరేషన్, వైరల్ స్క్రీనింగ్ రూంలను తనిఖీ చేసినట్లు తెలిపారు. శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో నిబంధనలకు అనుగుణంగానే రక్తదాన సేవలు కొనసాగుతున్నాయని నిర్ధారించినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ వ్యాధుల నియంత్రణాధికారి(డీఎల్వో) డాక్టర్ రోణంకి రమేష్ పాల్గొన్నారు. -
మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో మండపేట యువకుడి మృతి
మండపేట: పొట్టకూటికి మహారాష్ట్ర పనికి వెళ్లిన మండపేట యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నాలుగు రోజలు క్రితం జరిగిన ఈ విషాద ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు, స్నేహితులు తెలిపిని వివరాలిలా వున్నాయి. పట్టణంలోని కొండపల్లివారి వీధికి చెందిన పరమటి జితేంద్ర (33) మహారాష్ట్రలోని ఉద్గార్లోని ఓ ఫైనాన్స్ సంస్థలో కొంత కాలంగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి 7వ తేదీ ఉదయం ద్విచక్ర వాహనంపై లైన్కు బయలుదేరాడు. హల్నీ రహదారిపై వెళ్తున్న జితేంద్ర గండోపత్ దప్కా ప్రాంతానికి వచ్చేసరికి ప్రమాదానికి గురయ్యాడు. ఎదురుగా వేగంగా వస్తున్న నాలుగు చక్రాల గూడ్స్వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రుణ్ణి స్థానికులు ఆసుపత్రికి చేర్చించారు. అక్కడ వైద్యం పొందుతుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడని చెప్పారు. ఘటనపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. పంచనామా పూర్తయ్యాక అక్కడి పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా మహారాష్ట్ర నుంచి అంబులెన్స్లో సోమవారం రాత్రి మండపేట తీసుకువచ్చారు. కాగా మృతునికి భార్య, మూడు నెలల పసిపాప వున్నారు. కుటుంబం కోసం కష్టపడటానికి వెళ్లి ఎప్పుడూ క్షేమంగా ఇంటికి చేరుకునే తన భర్త ఈసారి ఎవరికీ అందనంత దూరం వెళ్లిపోయారని గుండెలవిసేలా రోదించిన భార్యను చూటి చుట్టుపక్కల వారు కంటతడి పెట్టారు. ఉపాధి హామీ పని చేస్తూ మహిళా కూలి మృతి దేవరపల్లి: ఉపాధి పని చేస్తూ అస్వస్థతకు గురై పని ప్రదేశంలోనే మహిళా కూలీ మృతి చెందిన ఘటన దేవరపల్లి మండలం పల్లంట్లలో మంగళవారం జరిగింది. ఏపీఓ జీవీ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పల్లంట్లకు చెందిన బొందల చంద్రమ్మ(53) 15 ఏళ్లుగా ఉపాధి పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. మంగళవారం ఉదయం గ్రామంలోని రైతు పొలంలో ఫార్మ్ చెరువు తవ్వకం పనులకు వెళ్లిన చంద్రమ్మ కొద్దిసేపటికి అస్వస్థతకు గురైంది. వెంటనే వైద్యం కోసం గ్రామానికి తీసుకువస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,000 గటగట (వెయ్యి) 15,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ర్యాంకు పెరిగినా.. పెరగని సంతృప్తి
అన్నవరం: గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అభిప్రాయ సేకరణలో అన్నవరం దేవస్థానానికి సంబంధించి విచిత్రమైన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో జనవరిలో నిర్వహించిన అభిప్రాయ సేకరణ ప్రకారం అన్నవరం దేవస్థానానికి చిట్టచివరిగా ఏడో ర్యాంకు రాగా, గత నెలలో చేపట్టిన అభిప్రాయ సేకరణ ప్రకారం పరిస్థితి మెరుగుపడి, రెండో ర్యాంకు వచ్చింది. అయితే, జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో ఇక్కడ అందిస్తున్న సేవలపై భక్తులో అసంతృప్తి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన దేవస్థానాల కన్నా ఇక్కడ తక్కువ అసంతృప్తి ఉండటం ద్వారా అన్నవరం రెండో స్థానంలో నిలిచిందని తెలుస్తోంది. అభిప్రాయ సేకరణ జరిపారిలా.. ఫ కాణిపాకం, శ్రీకాళహస్తి, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గ గుడి, విశాఖ జిల్లా సింహాచలం, శ్రీశైలం, అన్నవరం దేవస్థానాల్లో భక్తులకు సేవలు, ప్రసాదం నాణ్యత, ఇతర ఏర్పాట్లపై జనవరి 25 – ఫిబ్రవరి 24 తేదీల మధ్య వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు తెలుసుకుని తాజా ర్యాంకులు ప్రకటించారు. ఫ సత్యదేవుని సన్నిధిలో ‘దర్శనం మీరు భావించిన సమయంలో జరిగిందా?’ అనే ప్రశ్నకు 70 శాతం మంది అవునని బదులిచ్చారు. 30 శాతం మంది అలా జరగలేదని చెప్పారు. జనవరిలో సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు 78 శాతం మంది ఉండగా ఫిబ్రవరిలో 8 శాతం మంది ఎక్కువగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ దేవస్థానంలో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, వాష్ రూములు, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలు, చెప్పులు భద్రపరిచే చోటు తదితర అంశాలపై 65 శాతం భక్తులు సంతృప్తి, 35 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాల్లో అన్నవరం దేవస్థానానికి మూడో ర్యాంకు వచ్చింది. జనవరిలో 67 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. దీంతో పోలిస్తే ఫిబ్రవరిలో ఇది 2 శాతం తగ్గింది. ఫ సత్యదేవుని ప్రసాదం రుచి, నాణ్యతలో 82.4 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయడం ద్వారా రెండో ర్యాంకు వచ్చింది. జనవరిలో 87 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఫ మొత్తం మీద దేవస్థానం అందిస్తున్న సేవల్లో ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వే ప్రకారం భక్తుల్లో అసంతృప్తి శాతం పెరిగినట్లు తెలుస్తోంది. కనీసం ఈ నెలలోనైనా భక్తుల సంతృప్తి శాతం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ అన్నవరం దేవస్థానానికి ఫిబ్రవరిలో రెండో ర్యాంకు ఫ దర్శనం, మౌలిక వసతులు, ప్రసాదంపై ఇంకా భక్తుల్లో అసంతృప్తి -
బ్యాంకు రుణాల పంపిణీ ముమ్మరం చేయాలి
కాకినాడ సిటీ: జిల్లాలోని వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు బ్యాంకు రుణాల పంపిణీ మరింత ముమ్మరం చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కోరారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన బ్యాంకర్లు, జిల్లా అధికారులతో కూడిన జిల్లా కన్సల్టేటివ్ కమిటీ, జిల్లా స్థాయి రివ్యూ కమిటీ సమావేశాలకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ఏడాది డిసెంబర్తో ముగిసిన త్రైమాసానికి సంబంధించి వ్యవసాయ రంగానికి రూ.11,460 కోట్ల రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, రూ.4,102 కోట్లు పంపిణీ చేశారన్నారు. ప్రాధాన్యేతర రంగాలకు రూ.4,184 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా, లక్ష్యానికి మించి రూ.5,872 కోట్లు పంపిణీ చేశారని చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకూ 15,599 మంది కౌలు రైతులకు వ్యక్తిగతంగా రూ.55.48 కోట్లు, 20,495 మంది కౌలు రైతులకు ఆర్ఎంజీ, జీఎల్జీ గ్రూపుల ద్వారా మరో రూ.79.48 కోట్ల మేర పంట రుణాలు మంజూరు చేశారన్నారు. వివిధ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా 3,704 మందికి రూ.4,568 కోట్ల రుణాలు అందించాలనేది లక్ష్యంగా నిర్దేశించారన్నారు. దీనిని సమన్వయంతో పూర్తి చేయాలని జేసీ కోరారు. ఆయా సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా 57 జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు 50 శాతం బ్యాంకు రుణాలుగా రూ.228 కోట్లు అందించాలన్నారు. డీఆర్డీఏ ద్వారా ఇప్పటి వరకూ 14,315 డ్వాక్రా గ్రూపులకు రూ.1,075 కోట్లు, మెప్మా ద్వారా 4,312 డ్వాక్రా గ్రూపులకు రూ.508 కోట్ల మేర బ్యాంకు రుణాల లింకేజీ అందించారని తెలిపారు. పీఎం విశ్వకర్మ యోజన ద్వారా 3,801 మందికి నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. పీఎంఈజీపీ పథకం ద్వారా రూ.538 కోట్ల బ్యాంకు రుణంతో ఇప్పటి వరకూ 140 యూనిట్లు ఏర్పాటయ్యాయన్నారు. పీఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ష్యూరిటీ లేకుండా రూ.10 లక్షల వరకూ రుణాలు అందించాలని బ్యాంకర్లను జేసీ రాహుల్ మీనా కోరారు. కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కమిటీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ కాకి సాయి మనోహర్, ఎల్డీఎం సీహెచ్ఎస్వీ ప్రసాద్, రిజర్వు బ్యాంకు ఎల్డీఓ పూర్ణిమ, నాబార్డు ఏజీఎం వై.సోమునాయుడు, డీఆర్ఓ జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
రూ.166 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జాబు కావాలంటే బాబు రావాలి.. జనవరి 1నే జాబ్ క్యాలెండర్.. పరిశ్రమల ఏర్పాటు.. వర్క్ ఫ్రం హోం కోసం హైటెక్ టవర్లు.. 20 లక్షల ఉద్యోగాలు.. ఉద్యోగాలు రాకుంటే నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి.. అంటూ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పెద్దలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఊరూవాడా ఊదరగొట్టేశారు. తీరా అధికారం పగ్గాలు చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను గాల్లో కలిపేసి, నమ్మిన జనాన్ని నిట్టనిలువునా నట్టేట ముంచేశారు. తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లో సైతం అరకొర నిధులతో మరోసారి దగా చేశారు. తల్లికి వందనం అని చెప్పి తల్లికి వంచన చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఊసే లేదు. తొమ్మిది నెలల పాలనలో కొత్త ఉద్యోగాలివ్వకపోగా.. ఉన్నవి ఊడబీకారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న దగాపై యువత, విద్యార్థులు కన్నెర్ర చేస్తున్నారు. వారికి మద్దతుగా ఉద్యమించేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటలు నమ్మి మోసపోయిన యువత పక్షాన పార్టీ నేతలు, కార్యకర్తలు బుధవారం కాకినాడలో యువత పోరు పేరిట పోరాటానికి సిద్ధమయ్యారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్కు భారీ ర్యాలీగా తరలి వెళ్లి, కలెక్టర్కు వినతిపత్రం అందజేయనున్నారు. ఈ దిశగా పార్టీ శ్రేణులతో పాటు, విద్యార్థులు, నిరుద్యోగులు కూడా ముందుకు కదులుతున్నారు. జిల్లావ్యాప్తంగా పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు 170 వరకూ ఉన్నాయి. వీటన్నింటిలో 50 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం క్రమం తప్పకుండా జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ అందించేది. దీనికితోడు వసతి దీవెన నిధులు కూడా ఇచ్చేది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో చివరిలో ఫీజు రీయింబర్స్మెంట్కు నిబంధనలు అడ్డం పడ్డాయి. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో 2023–24 విద్యా సంవత్సరానికి మూడు విడతలు, 2024–25లో రెండు విడతలుగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సి ఉండగా.. ఒక విడత మాత్రమే ఇటీవల విడుదల చేశారు. మొత్తం మూడు విడతలకు సంబంధించి రూ.90 కోట్ల మేర కూటమి సర్కార్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి పెట్టేసింది. విద్యార్థులకు మెయింటెనెన్స్ ఫీజు కింద మొక్కుబడిగా రూ.2 కోట్లు విడుదల చేసి, రూ.76 కోట్లు బకాయిలు పెట్టేసింది. మొత్తం అన్నీ కలిపి రూ.166 కోట్ల మేర విద్యార్థులకు బకాయి పెట్టింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో కళాశాలలకు ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కళాశాలల యాజమాన్యాలు కూడా విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాయి. తల్లికి వందనం పేరిట కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ ఏడాదికి రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు అండ్ కో నమ్మించారు. తీరా గద్దెనెక్కాక ‘తల్లికి మాత్రమే రూ.15 వేలు’ అని మెలిక పెడుతూ జీఓ ఇచ్చారు. దీనిపై పెద్ద ప్రజలు అగ్గి మీద గుగ్గిలమవ్వడంతో తూచ్ అంటూ మాట మార్చారు. కానీ, నెలలు గడుస్తున్నా ఇంతవరకూ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో చిల్లిగవ్వ కూడా జమ చేయలేదు. జిల్లాలో యీ పథకానికి అర్హులైన విద్యార్థులు 1,86,708 మంది ఉన్నారు. వీరికి తల్లికి వందనం కింద రూ.250.30 కోట్లు చెల్లించాలి. కానీ, పైసా కూడా చంద్రబాబు విదల్చలేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అదే, గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.13 వేల చొప్పున విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. మిగిలిన రూ.2 వేలలో రూ.వెయ్యి డిస్ట్రిక్ టాయిలెట్స్ మెయింటెనెన్స్కు, మరో రూ.వెయ్యి డిస్ట్రిక్ట్ స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్కు జమ చేశారు. తల్లికి వంచన యువత పోరుకు సర్వం సిద్ధం కాకినాడ బాలా త్రిపుర సుందరి ఆలయం వెనుక ఉన్న వైఎస్సార్ సీపీ సిటీ కార్యాలయంలో పార్టీ జిల్లా స్థాయి ఆవిర్భావ దినోత్సవం అనంతరం యువత పోరు కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి జిల్లా నలుమూలల నుంచీ తరలివచ్చే విద్యార్థులు, యువతకు మద్దతుగా పార్టీ నేతలు, శ్రేణులు ముందు నిలిచి జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహిస్తాం. విద్యార్థులు, యువతకు కూటమి సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేస్తాం. – దాడిశెట్టి రాజా, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి -
లక్ష్యానికి మించి ‘ఉపాధి’
కరప: జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యాన్ని గడువుకు ముందే అధిగమించామని డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి తెలిపారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. ఉపాధి హామీ పథకం రికార్డులను తనిఖీ చేసి, కార్యాలయ ఆధునీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం ద్వారా ఈ నెలాఖరుకు 69 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉండగా ఫిబ్రవరి నెలాఖరుకే లక్ష్యాన్ని పూర్తి చేశామని చెప్పారు. రెండు లక్షల పని దినాలు పొడిగించగా ఈ నెల మొదటి వారంలోనే పూర్తి చేశామన్నారు. మరో 10 లక్షల పని దినాలు మంజూరయ్యాయని, వీటిని ఈ నెలాఖరు పూర్తి చేస్తామని చెప్పారు. రోజుకు 50 వేల మందితో పని చేయించాల్సి ఉండగా, 30 వేల మందే పని చేస్తున్నారని, రోజువారీ పనుల్లో వేతనదారుల సంఖ్యను పెంచేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. వేసవి ఎండల నేపథ్యంలో ఉదయం 5.30 గంటలకే పనులు ప్రారంభించి, 10.30 గంటలకే ముగించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సిబ్బందిని ఆదేశించామన్నారు. వేతనదారులు స్వయంగా 2 లీటర్ల తాగునీరు తెచ్చుకోవాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, పని చేసేచోట ఎండ తగలకుండా పందిళ్లు లేదా షామియానాలు వేయించాలని చెప్పారు. గ్రామ పంచాయతీల పరిధిలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, మినీ గోకులాల నిర్మాణాలు చేయిస్తున్నామన్నారు. ప్రతి ఇంట్లో కంపోస్ట్ పిట్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో 2,115 నీటిగుంతలు తవ్వించాలన్నది లక్ష్యం కాగా ఇంతవరకూ 600 గుంతల పనులు జరుగుతున్నాయని తెలిపారు. వీటిని జూన్ నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. జిల్లాకు 750 మినీ గోకులాలు మంజూరవగా ఇంతవరకూ 700 పూర్తి చేశామన్నారు. జిల్లాలో ఈ ఏడాది 4,330 సోక్పిట్స్ తవ్వించేందుకు ప్రతిపాదించామని వెంకటలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం.అనుపమ, ఏపీఓ జీవీ రమణకుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ వీవీ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
అన్ని వర్గాలకూ చంద్రబాబు సర్కార్ మోసం
ఉద్యోగాలు హుళక్కి ఫ అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలిస్తామని కూటమి పెద్దలు చెప్పడంతో డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన వేలాది మంది డీఎస్సీ, గ్రూప్, పోలీస్ రిక్రూట్మెంట్, ఏపీపీఎస్సీ తదితర కొలువుల కోసం వేలాది మంది ప్రయత్నాలు చేస్తున్నారు. వారి భవిష్యత్తు కోసం అయినకాడికి అప్పులు చేసి కోచింగ్ సెంటర్లలో శిక్షణ ఇప్పిస్తున్న తల్లిదండ్రులు కూడా ఎంతో మంది ఉన్నారు. ఉన్నత చదువులు చదివి కుటుంబ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా అరకొర జీతంపై స్థానికంగా, హైదరాబాద్, బెంగళూరు, చైన్నె తదితర ప్రాంతాలకు వలస వెళ్లి ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న వారి సంఖ్య లక్షన్నర పైనే ఉంది. వీరిలో కూడా మూడు వంతుల మంది తమ చదువుకు తగిన ఉద్యోగం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం ఉద్యోగాల భర్తీ హామీని తుంగలో తొక్కేసింది. ఫ కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు.. ఉన్నవి ఊడబీకేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించి రూ.5 వేల జీతాన్ని రూ.10 వేలకు పెంచుతామన్నారు. తీరా చూస్తే మొత్తం వ్యవస్థనే లేకుండా చేసేశారు. ఫలితంగా జిల్లాలోని 11,990 మంది వలంటీర్లు రోడ్డున పడ్డారు. ఫ కూటమి నేతలకు మద్యం షాపులు కట్టబెట్టేందుకు ప్రైవేటు మద్యం పాలసీని కూటమి ప్రభుత్వం తీసుకుని వచ్చింది. దీని ఫలితంగా గత వైఎస్సార్ సీపీ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పని చేసిన సుమారు 1,000 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. ఫ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలివ్వకపోగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లను దగా చేశారు. ఫ ఉద్యోగాలు ఇవ్వలేకుంటే అప్పటి వరకూ 18 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న వారికి ప్రతి నెలా నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. జిల్లాలో ఈ వయస్సులో ఉన్న యువత 3.15 లక్షల పైనే. వీరికి ప్రతి నెలా రూ.3 వేల చొప్పున రూ.94,50,00,000, తొమ్మిది నెలలకు రూ.850,50,00,000 చెల్లించాల్సి ఉంది. కానీ, 2014లో రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మించి, వంచించినట్టుగానే ఇప్పుడు కూడా చంద్రబాబు రూ.3 వేల భృతి హామీని గాల్లో కలిపేశారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఫ ఉద్యోగాల భర్తీ లేదు.. నిరుద్యోగ భృతీ లేదు ఫ 11,990 మంది వలంటీర్లను రోడ్డున పడేశారు ఫ పైగా లక్షల ఉద్యోగాలిచ్చినట్లు బిల్డప్లు ఫ అరకొరగా ఫీజు రీయింబర్స్మెంట్ ఫ కూటమి ప్రభుత్వ కుయుక్తులపై వైఎస్సార్ సీపీ ఉద్యమ బాట ఫ నేడు కాకినాడలో ‘యువత పోరు’ ఉద్యోగాల భర్తీ నిరుద్యోగ భృతి కాకినాడ రూరల్: హామీలు నెరవేర్చకుండా మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత, నిరుద్యోగులు.. ఇలా రాష్ట్రంలోని అన్ని వర్గాలనూ మోసగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీయడానికి వైఎస్సార్ సీపీ నిరంతరం సిద్ధంగా ఉంటుందని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద బుధవారం యువత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కాకినాడ రమణయ్యపేట వైద్య నగర్లోని కార్యాలయంలో యువత పోరు పోస్టర్ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్మెంట్ అంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకొస్తారని, ఆయన తరువాత మొత్తం ఫీజు చెల్లించే ప్రక్రియకు గత సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ రోజు సుమారు రూ.4,600 కోట్ల మేర బకాయి పెట్టి విద్యార్థుల భవిష్యత్తుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటాలాడుతున్నారని దుయ్యబట్టారు. కళాశాలల అకౌంట్లలో డబ్బులు వేస్తామని ప్రభుత్వం చెబుతూండగా.. తమకు డబ్బులు రాలేదంటూ విద్యార్థులను యాజమాన్యాలు బెదిరిస్తున్నాయని చెప్పారు. దీంతో, హాల్ టికెట్లు ఇస్తారో, లేదోనని, పరీక్ష హాలులో కూర్చోనిస్తారో, లేదోనని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారన్నారు. చంద్రబాబు మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేశారని, ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని, ఈ హామీలకు ఇప్పటికీ అతీగతీ లేదని కన్నబాబు విమర్శించారు. అధికారమే చంద్రబాబు పరమాధి అని అన్నారు. గత సీఎం వైఎస్ జగన్ హయాంలో 17 వైద్య కళాశాలల నిర్మాణం ప్రారంభించగా 5 కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయన్నారు. పూర్తయిన పులివెందుల సహా అన్ని కళాశాలలనూ ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్య, వైద్యం పట్ల ఇంత చులకన దేనికని, పూర్తిగా వ్యాపారంగా మార్చాలని ఎందుకనుకుంటున్నారని ప్రశ్నించారు. పీపీపీ పేరిట రూ.వేల కోట్లతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వైద్య కళాశాలలను అస్తవ్యస్తం చేస్తున్నారన్నారు. తమకు మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి లేఖ రాసిన తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఖ్యాతి దక్కిందని ఎద్దేవా చేశారు. పేదలకు మంచి జరుగుతుందంటే అడ్డుకుంటున్నారన్నారు. అందుకే యువత పోరు పేరిట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి, కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పీపీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కన్నబాబు కోరారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు కురసాల సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ, సర్పంచ్లు బెజవాడ సత్యనారాయణ, రామదేవు సూర్యప్రకాశరావు, పార్టీ విద్యార్థి, బీసీ విభాగాల జిల్లా అధ్యక్షులు పూసల అనిల్, అల్లి రాజబాబు తదితరులు పాల్గొన్నారు. ఫ నేడు యువత పోరు ఫ పోస్టర్ ఆవిష్కరించిన వైఎస్సార్ సీపీ నేత కురసాల కన్నబాబు -
150 కేజీల గంజాయి పట్టివేత
● రూ.7లక్షల 50 వేలు విలువైన సరకు స్వాధీనం ● ఐదుగురి అరెస్టు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): లక్షల రూపాయల గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. వారి నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనిని రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి జైలుకు పంపారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ డి.నరసింహకిశోర్ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ వివరాలను వెల్లడించారు. పట్టుబడిందిలా... ఉదయం 11 గంటల సమయం. ఏజెన్సీ నుంచి రాజమహేంద్రవరం మీదుగా గంజాయి రవాణా అవుతుందని పక్కా సమాచారం ఉండడంతో రూరల్ ప్రాంతంలోని కొంతమూరు గామన్ ఇండియా బ్రిడ్జి వద్ద పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. అయితే నిందితులు ముందస్తుగా గంజాయి తరలించే వాహనానికి ఒక ఆటోను పైలట్గా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఆటోలో వారు గంజాయి తీసుకెళ్తున్న మార్గంలో పోలీసులు తనిఖీలు చేస్తుంటే ఆ సమాచారాన్ని వారికి సమాచారం ఇస్తారు. అలా రంపచోడవరం నుంచి ఎయిర్పోర్టు రోడ్డులో వస్తూ వంతెన కింద నుంచి నేషనల్ హైవే 16 పైకి ఎక్కుతుండగా పైలట్ ఆటోలో వారు పోలీసులను గమనించి ఆ సమాచారం గంజాయి రవాణా అవుతున్న వాహనంలో ఉన్న వారికి సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన గంజాయి రవాణాదారులు పారిపోతుండగా రాజానగరం పోలీస్స్టేషన్ ఎస్సై మనోహర్, పోలీసు సిబ్బంది ఆ కారును, ఆటోను వెంబడించి పట్టుకున్నారు. మొత్తం రెండు కేజీల చొప్పున 75 ప్యాకెట్లలో కారు ఢిక్కీలో గంజాయి దొరికింది. పట్టుకున్న గంజాయి విలువ రూ.7 లక్షల 50 వేలు ఉంటుందని పోలీసుల తెలిపారు. దీనిని రవాణా చేస్తున్న ప్రకాశం జిల్లా కంభం గ్రామానికి చెందిన షేక్ ఇంతియాజ్, సింగరాయికొండకు చెందిన షేక్ అబ్దుల్, ఏఎస్ఆర్ జిల్లా రంపచోడవరం మండలం సీతంశెట్టినగర్కు చెందిన సంకురు బుచ్చిరెడ్డి, రెడ్డీపేట సంతమార్కెట్కు చెందిన ముర్ల చిన్నారెడ్డి, బూసిగ్రామానికి చెందిన ఉలుగుల రవికిరణ్రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 సెల్ఫోన్లను స్వాఽఽధీనం చేసుకున్నారు. గంజాయి ఎవరు సరఫరా చేస్తున్నారు, ఎవరికి అమ్ముతున్నారు అనే విషయాలను దర్యాప్తు చేస్తామని ఎస్పీ డి.నరసింహాకిశోర్ తెలిపారు. నార్త్జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ పర్యవేక్షణలో గంజాయి పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రాజానగరం సీఐ వీరయ్యగౌడ్, ఎస్సై పి.మనోహర్, కానిస్టేబుల్స్ రమణ, నాగేశ్వరరావు, కరీముల్లాఖాదర్లను ఎస్పీ అభినందించారు. -
నిమ్మకు తెగుళ్ల బెడద
పెరవలి: జిల్లాలో నిమ్మపంట 720 హెక్టార్లలో సాగు జరుగుతుండగా వివిధ రకాల తెగుళ్లు ఆశించి ఉండటంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడి, తోటలు పాడైపోతున్నాయి. ముఖ్యంగా ఈ పంటపై ఆకు ముడత, పండ్ల రసాన్ని పీల్చే రెక్కల పురుగులు, బంక, వేరుకుళ్లు, గజ్జి, మొజాయిక్ తెగుళ్లు ఆశించి ఉన్నాయి. ఈ తెగుళ్ల నివారణకు రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు గురించి కొవ్వూరు ఉద్యాన అధికారి (ఏడీఏ) సీహెచ్ శ్రీనివాస్ వివరించారు. ఆకుముడత : ఈ తెగులు ఎక్కువగా లేత చిగుర్లపై ఆశించి ఆకులపై తెల్లటి పొరలు వంకర టింకరగా ఏర్పడి ఆకులు ముడుచుకునేలా చేస్తుంది. తద్వారా ఆకులపై గజ్జి తెగులు ఎక్కువగా వ్యాప్తి చెంది ఆకులు రాలిపోతాయి. నివారణ చర్యలు : ఆకులు ముడతలు పడినట్లు గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. డైమిథోయేట్ 2 మిల్లీ లీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.5మిల్లీ లీటర్లు మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉంటే 10 రోజుల వ్యవధిలో రెండవసారి పిచికారీ చేయాలి. తెల్లపొలుసు పురుగులు : ఈ పొలుసు పురుగులు ఎక్కువగా కాండంపై ఆశించి సున్నం పూసినట్లుగా కనపడతాయి. ఇవి కాండం, కొమ్మలలో రసాన్ని పీల్చివేయటం వల్ల అవి ఎండిపోతాయి. నివారణ చర్యలు : ఈ పురుగులు ఆశించిన చోట గోనె సంచితో బాగా రుద్ది మిధైల్డెమటాన్ లేదా డైమిథోయేట్ 2 మిల్లీ లీటర్లు మందును లీటరు నీటిలో కలిపి కాండం, కొమ్మలపై పిచికారీ చేయాలి. నల్లి పురుగులు : నల్లి పురుగుల్లో ఆకుపచ్చ నల్లి, మంగు నల్లి ముఖ్యమైనవి. ఆకునల్లి ఆకులపైన, మంగునల్లి కాయలపైన ఆశించి రసాన్ని పీల్చివేస్తాయి. దీనివల్ల కాయలపై చిన్న చిన్న తెల్లని మచ్చలు లేదా ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కాయ అంతటా మంగు ఏర్పడుతుంది. నివారణ చర్యలు : నీటిలో కరిగే గంధకం 3గ్రాములు లేదా డైకోఫాల్ 5.0 మిల్లీ లీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే నివారణ అవుతుంది. రసం పీల్చే రెక్కల పురుగులు : ఈ రెక్కల పురుగులు పండ్లపై రంథ్రాలు చేసి కాయలో ఉండే రసాన్ని పీల్చుతాయి. దీంతో కాయలకు చేసిన రంథ్రాల ద్వారా శిలీంద్రాలు, బ్యాక్టీరియా చేరి పండ్లు కుళ్లి, రాలిపోతాయి. పండ్లపై డాగు ఏర్పడుతుంది. నివారణ చర్యలు : ఈ పురుగులు ఆశించి కుళ్లి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. పురుగులను నాశనం చేయటానికి మలాథియాన్ ఒక మిల్లీలీటరు మందుకు ఒక శాతం పంచదార, పండ్ల రసం కలిపి చెట్ల కింద అమర్చాలి. పురుగులను ఆకర్షించటానికి బల్బులను ఏర్పాటు చేయాలి. దీని ద్వారా పురుగులను అరికట్టవచ్చు. పురుగుల నుంచి కాయలను రక్షించటానికి కాయలకు బుట్టలను ఏర్పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బంక తెగులు : బంక తెగులు రెండు రకాలు ఒకటి ఫెటోఫ్తోరా, రెండు డిఫ్లోడియా. మొదటి తెగులు ఆశించిన చెట్టు నుంచి ధారాళంగా బంక కారుతుంది. ఇది చెట్టు వేళ్లకు, మొదలు కింది భాగానికి పరిమితమై ఉంటుంది. డిఫ్లోడియా బంక తెగులు చెట్టు మొదలు పైభాగాన కొమ్మల పంగల్లో ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు ఎక్కువగా ఉంటే బంక కారటం, బెరడు కుళ్లటం జరుగుతుంది. నీరు త్వరగా ఇంకని భూముల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుంది. నివారణ చర్యలు : బంక కారి కుళ్లిన బెరడును పూర్తిగా తొలగించి బోర్డోపేస్టు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ పేస్టు పూయాలి. ఈ పేస్టును మొదలు చుట్టూ పూయాలి. కొమ్మలపై వచ్చే బంక తెగులు నివారణకు లీటరు నీటికి 1గ్రాము కార్బండజిమ్ కలిపి చెట్టు మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి. మెటలాక్సిల్ 2 గ్రాములు లీటరు నీటిలో కలిపి చెట్టు మొదలులో పోయాలి. వేరుకుళ్లు తెగులు : వేరుకుళ్లు తెగులు ఆశించిన చెట్టుకు పోషక పదార్థాలు అందక చెట్లు ఎండిపోతాయి. ఈ తెగులు ఆశించిన చెట్లు ఎక్కువ పూతపూసి కాయలు ముదిరే లోగా చెట్లు వాడి ఎండిపోతాయి. ఎండిన చెట్ల వేర్లను పరీక్షిస్తే కుళ్లిన వాసన వస్తుంది. నివారణ చర్యలు : వ్యాధి సోకిన తొలి దశలోనే గమనించి చెట్టుకు ఎక్కువగా నీరు కట్టి మరుసటి రోజు కార్బండజిమ్ 2 గ్రాములు లేదా మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా చెషంట్ 3 గ్రాములు లేదా ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి చెట్టు చుట్టూ నేల తడిసేలా పిచికారీ చేయాలి. చెట్టుకి కావలిసిన పోషక పదార్థాలు సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్ట ద్వారా అందించాలి. ఒక కిలో ట్రైకోడెర్మా మందును 90 కిలోల పశువుల ఎరువు 10 కిలోల వేపపిండితో కలిపి 15 రోజులు మాగపెట్టి చెట్టు మొదలు చుట్టూ వేయాలి. ఇలా చేస్తే చెట్టును ఈ తెగులు నుంచి కాపాడవచ్చు. గజ్జి తెగులు (కాంకర్ మచ్చ) : నిమ్మ పంటపై ఎక్కుగా ఆశించే తెగులు ఈ గజ్జి తెగులు. ఇది కాయలు, ఆకులు, చిన్న, పెద్ద కొమ్మలను ఆశిస్తుంది. తెగులు ప్రభావం అధికంగా ఉంటే చెట్లు ఎండిపోయి చనిపోతాయి. నివారణ చర్యలు : ఈ తెగులు సోకి ఎండిన కొమ్మలను కత్తిరించి స్ట్రెప్టోసైక్లిన్ ఒక గ్రాము, 30 గ్రాములు బ్లైటాక్స్ మందును 10 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. గజ్జి ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని గోకి బెరడును తీసి వేసి బోర్డోపేస్టును పూయాలి. -
బెట్టింగ్ల మోజులో యువత
జీవితాలు బలైపోతాయని హెచ్చరిస్తున్న పోలీసులు రాజానగరం: అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పొందుతున్న విజ్ఞానాన్ని సమాజ హితం కోసం కాకుండా తప్పుడు మార్గాలలో సంపాదనలకు కొంతమంది స్వార్థపరులు ఉపయోగిస్తుంటే, వాటికి ఆకర్షితులై కొంతమంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా తమ బిడ్డలు ఉన్నతంగా ఉండాలి, ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేయాలనే ఆశతో చాలామంది తల్లిదండ్రులు తమ కడుపులు మాడ్చుకుని, అప్పులు చేసి మరీ పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో దూర ప్రాంతాలలోని కళాశాలలలో చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు హాస్టల్స్లో ఉంటూ చదువులు సాగిస్తుంటారు. అయితే ఇటువంటి వారిలో కొంతమంది చెడు స్నేహాలతో కన్నవారి ఆశలను వమ్ము చేయడమే కాకుండా, తమ బంగారు జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. బ్రిడ్జి కౌంటీ కేంద్రంగా ... విద్యా, వ్యాపార రంగాలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న రాజమహేంద్రవరం సమీపంలో ఇంజినీరింగ్, వైద్య కళాశాలలు అనేక ఉండటంతో యాప్ల ద్వారా బెట్టింగ్లు నిర్వహించే వ్యక్తులు ఈ ప్రాంతాన్నే తమ కేంద్రంగా చేసుకుని, బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న బ్రిడ్జి కౌంటీలో 12 మంది నిందితులు పట్టుబడ్డారు. చేపల చెరువుల ద్వారా ఆర్థికంగా నష్టపోయిన భీమవరానికి చెందిన దండు వెంకటవర్మ అనే సంతోష్ (31), కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్కు చెందిన ఇమ్మంది భరత్కుమార్ (34)తో కలిసి బ్రిడ్జి కౌంటీలోని బి–12 విల్లాను అద్దెకు తీసుకుని, కొన్ని నెలలుగా క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరినీ అడ్మిన్లుగా చేసుకుని, భీమవరం నుంచి దుబాయ్ వెళ్లిన వినీత్ అనే మరో వ్యక్తి కీ రోల్ పోషిస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బ్రిడ్జి కౌంటీలో ఇటువంటి కార్యకలాపాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి వాటి గురించి సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేసి, సహకరించాలని నార్త్ జోన్ డీఎస్పీ వై. శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. తప్పుడు మార్గాలలో పయనించి, జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు ఆయన హితవు పలికారు. హాస్టల్స్లో ఉంచి చదివిస్తున్న తమ పిల్లల ప్రవర్తనలపై తల్లిదండ్రులు కూడా నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. క్రికెట్ బెట్టింగ్లే అధికం సమాచారం కోసం కనుగొన్న సెల్ఫోన్ నేడు అందరికీ జీవితంలో ఒక భాగమైపోయింది. చిన్నపిల్లల నుంచి పండు ముదుసలి వరకు సెల్ఫోన్ ముట్టుకోకుండా రోజుగడవడం లేదనడం అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో ఇక విద్యార్థుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో పేకాట, గుండాటల తరహాలోనే ఆన్లైన్లో అనేక రకాల యాప్లు హల్చల్ చేస్తున్నాయి. అనేక మంది వాటికి ఆకర్షితులవుతున్నారు. తెలిసీ తెలియని పరిజ్ఞానంతో వారి బ్యాంకు అకౌంట్ల వివరాలు అపరిచితులకు తెలియజేయడమే కాకుండా తల్లిదండ్రుల అకౌంట్లను కూడా కొల్లగొట్టేందుకు తోడ్పడుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది అమాయకులు భయంతో బయటకు చెప్పుకోలేక, తల్లిదండ్రులకు తెలిస్తే ఏమవుతుందోననే భయంతో జీవితాలను అర్ధంతరంగా ముగించుకునే పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. ఇటువంటి వాటిలో క్రికెట్ బెట్టింగ్లే ఎక్కువగా ఉన్నాయి. బార్బర్ షాపులలో కూడా టీవీలను పెట్టుకుని, యాప్ల ద్వారా బెట్టింగులు నిర్వహిస్తున్నారు. వీటిని నిరోధించేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నించినా, సరైన ఫలితాలు కనిపించడం లేదు. -
నేడు వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. జిల్లాలో ఎక్కడికక్కడ పార్టీ జెండాలను నేతలు ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా సభలు, సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వైఎస్సార్ సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రతి గ్రామంలోను ప్రజాప్రతినిధులు, నేతలు, శ్రేణులు సమష్టిగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నాయకులు దగ్గరుండి పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడలోని వైఎస్సార్ సీపీ సిటీ కార్యాలయంలో జిల్లా స్థాయిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ బలోపేతానికి సలహాలివ్వాలి కాకినాడ సిటీ: ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు అవసరమైన సలహాలు, సూచనలు ఈ నెల 31వ తేదీ నాటికి అందజేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో నూతన సంస్కరణలు తీసుకొచ్చే లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నుంచి సూచనలు సలహాలు ఆహ్వానించిందన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, 1951, ఓటర్ల నమోదు నియమాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి వంటి అంశాలపై సూచనలు అందజేయవచ్చన్నారు. వచ్చిన సూచనలు, సలహాలపై భారతీయ ఎన్నికల సంఘం ఏప్రిల్ 30న అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చిస్తుందని కలెక్టర్ తెలిపారు. టెన్త్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకూ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. విద్యార్థులు వారి హాల్ టికెట్టు చూపించి, పరీక్ష తేదీల్లో ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జనసేన నాయకుడి దాడిపై నివేదిక ఇవ్వండి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశం కరప: స్థానిక మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయం విద్యార్థులపై జనసేన పార్టీ నాయకుడు భోగిరెడ్డి గంగాధర్ దాడి చేసిన ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. ఈ నెల 4న గురుకుల విద్యాలయం విద్యార్థులపై గంగాధర్ పిడిగుద్దులతో దాడి చేయడం, బూటు కాలితో తన్నడంపై రెండు రోజులుగా పత్రికల్లో వస్తున్న వార్తలపై కమిషన్ చైర్మన్ కె.అప్పారావు, సభ్యురాలు టి.ఆదిలక్ష్మి స్పందించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి, నివేదిక ఇవ్వాలని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి (డీసీపీఓ) వెంకట్, ఐసీడీఎస్ సీడీపీఓ వై.లక్ష్మి, పీఓ ఎన్ఐసీ శ్రీనివాస్లను ఆదేశించారు. ఈ మేరకు ఆ అధికారులు మంగళవారం గురుకుల విద్యాలయానికి చేరుకుని, టెన్త్ విద్యార్థులను, సిబ్బందిని విచారించారు. ప్రిన్సిపాల్ కృష్ణారావు సమక్షంలో గంగాధర్, పోలీసు కానిస్టేబుల్తో కలసి వచ్చి తమపై దాడి చేసి, బూటు కాలితో తన్నాడని విద్యార్థులు చెప్పారు. విద్యార్థులను కొట్టడం చూశామని కొంత మంది సిబ్బంది చెప్పగా, చూడలేదని మరి కొంత మంది చెప్పారు. విచారణ అనంతరం సంబంధిత నివేదికను ఆయా అధికారులు కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారులకు అందజేశారని తెలిసింది. -
పీజీఆర్ఎస్కు 594 అర్జీలు
కాకినాడ సిటీ: ప్రతి వారం ప్రజల నుంచి అందుతున్న వినతులకు అధిక ప్రాధాన్యమిచ్చి సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ రాహుల్మీనా అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (పీజీఆర్ఎస్) సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో జరిగింది. ఆయన అధికారులనుద్దేశించి మాట్లాడారు. అందిన వినతులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. వివిధ శాఖల్లో నమోదైన అర్జీలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అర్జీదారుని సమస్యకు పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. రెవెన్యూ, పింఛన్లు, బియ్యం కార్డు మంజూరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు, ఆక్రమణలు తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, సదరం సర్టిఫికెట్ మంజూరు వంటి అంశాలకు చెందిన మొత్తం 594 అర్జీలు అధికారులు స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, కేఎస్ఈజెడ్ ఎస్డీసీ కేవీ రామలక్ష్మి, సీపీవో పి త్రినాథ్, పీడీ శ్రీధర్ పాల్గొని అర్జీలు స్వీకరించారు. సత్యదేవుని ఆలయానికి భక్తుల తాకిడిఅన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయం ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం వేలాదిగా వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, విశ్రాంతి మండపాలు అన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా స్వామివారి వ్రతాలు 1,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 30 లక్షలు ఆదాయం సమకూరింది. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో నాలుగు వేల మందికి భోజన సౌకర్యం కల్పించారు. సత్యదేవునికి ఘనంగా ఏకాదశి పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన, ఉదయం తొమిది గంటల నుంచి 11 గంటల వరకు పుష్పార్చన నిర్వహించారు. ముత్యాల కవచాల అలంకరణలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతీ రోజు స్వర్ణాభరణాలు, వజ్ర కిరీటాలతో భక్తులకు దర్శనమిచ్చే స్వామి, అమ్మవారు ప్రతీ సోమవారం ముత్యాల కవచాలతోను, ప్రతీ గురువారం ఏ విధమైన ఆలంకరణలు లేకుండా నిజరూపంలో దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. -
ప్రభుత్వానికి కనువిప్పు కలిగిద్దాం
తుని రూరల్: యువత పోరుతో చంద్రబాబునాయుడి ప్రభుత్వానికి కనువిప్పు కలిగిద్దామని, ఈ నెల 12న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యువత పోరు జయప్రదం చేయాలని ఆ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. సోమవారం తుని మండలం ఎస్.అన్నవరం పార్టీ కార్యాలయంలో నాయకులతో కలసి ఆయన యువత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు తరపున వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో అన్ని జిల్లాల కేంద్రాల్లో యువత పోరు నిరసన గళం వినిపిస్తామన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళమెత్తుతామన్నారు. యువత పోరు విజయవంతం చేసేందుకు మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఐదు త్రైమాసికాల ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు భృతి, తల్లికి వందనం బకాయిలు రాబట్టేందుకు ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా వెంట నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా నడుద్దామని ఆ పార్టీ నాయకుడు యనమల కృష్ణుడు అన్నారు. విద్యార్థులను, ప్రజలను, రైతులను మోసగించేలా చంద్రబాబు పాలన సాగుతోందన్నారు. నాయకులు పోతల రమణ, సకురు నాగేంద్ర నెహ్రూ, నాగం దొరబాబు, అంగుళూరి సుశీల రాణి. పార్టీ,మూడు మండలాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. బాబు అనుయాయులకు మెడికల్ కాలేజీలు కట్టబెట్టే యత్నం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో వైద్య విద్యార్థుల భవిష్యత్ కోసం తలపెట్టిన 17 మెడికల్ కాలేజీలను తన మనుషులకు (అనుయాయులకు) కట్టబెట్టేందుకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాకినాడ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆరోపించారు. సోమవారం కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరంలో తన కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైద్య విద్యార్థుల భవిష్యత్ కోసం ఒక్కొక్కటి రూ.వెయ్యి కోట్ల చొప్పున మొత్తం రూ.17వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే 17 వైద్య కళాశాలల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. 50శాతానికి పైగా నిర్మాణ పనులు జరిగాయన్నారు. చంద్రబాబు తన సొంత ఆస్తిలా తన మనుషులకు కారు చౌకగా కట్టబెట్టేందుకు యత్నిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతున్నా మేధావులు, విద్యావేత్తలు ఏం చేస్తున్నారని, ఎందుకు మౌనంగా ఉంటున్నారని అన్నారు. ఎల్లో మీడియాను చూసి నిర్లిప్తంగా ఉంటున్నారన్నారు. 17 మెడికల్ కళాశాలలు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు చెందిన ఆస్తి. ఆ ఆస్తిని తన తాబేదార్లకు కారుచౌకగా కట్టబెందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేధావులు, విద్యావంతులు, ప్రజలు గళమెత్తి, బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో ఉంచాలన్నారు. ప్రైవేటీకరణ విధానాన్ని అడ్డుకునేందుకు వైఎస్సార్ సీపీ ముందుంటుందన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఎస్.అన్నవరంలో యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ -
తలుపులమ్మకు బంగారు హారం
తుని రూరల్: లోవ తలుపులమ్మ అమ్మవారికి కాకినాడకు చెందిన భక్తులు కోకా వెంకట కోటేశ్వరఫణి, మైథిలి దంపతులు బంగారు హారాన్ని సమర్పించారు. సోమవారం లోవ దేవస్థానానికి వచ్చిన వారు ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజుకు 102 గ్రాముల 575 మిల్లీ గ్రాముల బరువుగల హారాన్ని అందజేశారు. వేద పండితులు, ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదాశీర్వచనం చేశారు. వీరిని అమ్మవారి శేషవస్త్రాలతో ఈఓ సత్కరించి, ప్రసాదాలు అందజేశారు. రాయచోటి ఘటనలో బాధ్యులను శిక్షించాలి కాకినాడ సిటీ: హిందూవుల ఉత్సవాల్లో పోలీసుల జోక్యం, ఆంక్షలు పెంచడాన్ని సహించబోమని, రాయచోటి సంఘటనలో బాధ్యులను శిక్షంచాలంటూ కాకినాడ జిల్లా వీహెచ్పీ, హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి, కలెక్టర్ షణ్మోహన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈనెల 4వ తేదీన వీరభద్రస్వామి ఉత్సవంలో హిందూవులపై ముస్లింలు చేసిన దాడిలో ముస్లింలను అదుపు చేయడంలో పోలీసులు హిందువులపై లాఠీ చార్జీ చేయడం దారుణమన్నారు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరించి హిందూవులపై కేసులు బనాయించారన్నారు. దీనిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో నిరసన ర్యాలీలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రికి అందేలా కలెక్టర్ షణ్మోహన్కు వినతిపత్రం అందజేసినట్టు ఆందోళనకారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రాంత సేవా ప్రముఖ్ కేశవయ్య మాట్లాడారు. విశ్వహిందూ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు రవిశంకర్ పట్నాయక్, బిక్కిన విశ్వేశ్వరరావు, గట్టి సత్యనాఆరయణ, మాలకొండయ్య, కృష్ణమోహన్, తుమ్మల పద్మజ, చోడిశెట్టి రమేష్బాబు, పైడా రవీంద్ర వెంకట్, కె అప్పాజీ, చెక్కా రమేష్, పద్మ, కమల, ఉమామహేశ్వరి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టర్ షణ్మోహన్ స్పందిస్తూ మంచి పనులకు ఎప్పుడూ సహకరిస్తామన్నారు. ఇకపై డ్రోన్ భద్రత పోలీస్ శాఖ సేవల కోసం 13 డ్రోన్లు కాకినాడ క్రైం: జిల్లా పోలీస్ శాఖ శాంతి భద్రతల పర్యవేక్షణలో కీలక ముందడుగు వేసింది. భద్రతను డ్రోన్ల సాయంతో మరింత బలోపేతం చేయనుంది. అందులో భాగంగా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడలోని జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ షణ్మోహన్ ముఖ్య అతిఽథిగా హాజరై విభాగాల వారీగా ఎస్హెచ్వోలు, ఇన్స్పెక్టర్లకు డ్రోన్లు అందజేశారు. ఈ డ్రోన్లు ఆయా స్టేషన్ల పరిధిలో భద్రత, నిఘా కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించనున్నాయి. రూ.24 లక్షల వ్యయంతో ఈ డ్రోన్లు అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు. విజిబుల్ పోలీసింగ్ విత్ ఇన్విజిబుల్ పోలీస్ నినాదంతో డ్రోన్ల పాత్ర శాంతిభద్రతల పర్యవేక్షణలో కీలకం కానుందని కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. -
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
సామర్లకోట: న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ సమస్యలను, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని చలో విజయవాడకు అంగన్వాడీ కార్యకర్తలు పిలుపునిస్తే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని సీఐ ఎ కృష్ణభగవాన్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం సామర్లకోటలో అడ్డుకున్నారు. పట్టణ, మండలంలోని ముఖ్య కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ చలో అమరావతి కార్యక్రమం నిర్వహిస్తే పోలీసులతో తమను అడ్డుకోవడం దారణమన్నారు. ఎన్నికల ముందు 42 రోజుల పాటు సుదీర్ఘ నిరాహార దీక్షల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరిస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోనికి వచ్చి 10 నెలలు గడుస్తున్నా తమ సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కనీస వేతనాలు, గ్రాడ్యూటీ అమలు చేయాలని, యాప్ల పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల ధర్నా కాకినాడ సిటీ: అంగన్వాడీలకు కనీస వేతనాలు చెల్లించాలంటూ విజయవాడలో జరిగే శాంతియుత ధర్నాకు బయలుదేరిన అంగన్వాడీలను తుని, సామర్లకోట ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు దువ్వా శేషుబాబ్జీ, శంఖవరం రాజేశ్వరి, పిఠాపురం గంగాభవానిలు మాట్లాడుతూ చారిత్రక 42 రోజుల అంగన్వాడీల సమ్మె సందర్భంగా శిబిరాల వద్దకు వచ్చి కూటమి ప్రభుత్వం రాగానే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి పది నెలలు గడుస్తున్నా జీతాలు పెంచకపోవడాన్ని తప్పుపట్టారు. బతికుండగా వేతనాలు పెంచకుండా, చనిపోయాక మట్టి ఖర్చులు రూ.20 వేలు ఇస్తామని అంగీకరించి, రూ. 15 వేలు చెల్లించేలా జీవో ఇచ్చినందుకు కూటమి నేతలు సిగ్గుపడాలన్నారు. సుప్రీంకోర్టు చెప్పినట్లు అంగన్వాడీలకు గ్రాడ్యూటీ చట్టాన్ని అమలు చేయకుండా, రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రకటించి చేతులు దులుపుకుంటామంటే ఒప్పుకునేది లేదన్నారు. సెంటర్ అద్దెలు, వంట ఖర్చులు నెలల తరబడి బకాయిలు పెడితే ఇచ్చే 11 వేల వేతనం వీటికి సరిపోతుండగా, కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. తక్షణం అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, మొబైల్ యాప్ పనిభారాన్ని తగ్గించాలని, సుప్రీంకోర్టు చెప్పినట్లుగా గ్రాడ్యూటీ చట్టాన్ని అమలు చేయాలని, మినిట్స్లో అంగీకరించిన అంశాలన్నింటికీ జీవోలు విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకులు చెక్కల రాజ్కమార్, మలకా రమణ, పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, అంగన్వాడీలు సత్యవతి, వీరవేణి, నారాయణమ్మ, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి పాల్గొన్నారు. చలో విజయవాడను అడ్డుకున్న పోలీసులు అనేకమంది హౌస్ అరెస్టులు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,000 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక
కాకినాడ సిటీ: హోప్ ఐలాండ్లో ఎకో టూరిజంని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందుమాధవ్, అటవీశాఖ అధికారి ఎ.రవీంద్రనాథ్రెడ్డి, పోరుట అధికారి కెప్టెన్ ధర్మశాస్త్ర, అటవీ, పర్యాటక, మత్స్య, మైరెన్ పోలీస్ శాఖల అధికారులతో కలిసి హోప్ ఐలాండ్లో పర్యటించిన సందర్భంగా ఆయన అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాకినాడ సముద్ర తీరంలో ఉన్న రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం కార్యాలయం నుంచి హోప్ఐలాండ్కు చేరుకుని అక్కడి ప్రదేశాలను పరిశీలించారు. ఎకో టూరిజం అభివృద్ధికి అనువుగా ఉన్న పరిస్థితులు, హోప్ఐలాండ్ పరిధి, మడ అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, సందర్శకులకు బోటింగ్ సౌకర్యం ఇతర అంశాలనుకలెక్టర్ షణ్మోహన్ ఆయా శాఖల అధికారులతో చర్చించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. హోప్ఐలాండ్ ప్రాంతాన్ని పర్యాటక రంగానికి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. ఇందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి కె.కరుణాకర్బాబు, ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, సెక్షన్ అధికారి ఎం. నాగార్జున, అసిస్టెంట్ టూరిజం అధికారి వి.త్రిమూర్తులు, వాటర్ ప్లీట్ అసిస్టెంట్ మేనేజర్ గంగాబాబు, పోర్ట్ సీఐ పి సునీల్కుమార్, మైరెన్ ఎస్ఐ పి సురేష్ పాల్గొన్నారు. కలెక్టర్ షణ్మోహన్ -
ఆ ఇద్దరికీ ఆశాభంగం!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తెలుగుదేశం పార్టీలో కొమ్ములు తిరిగిన జిల్లా నేతలకు చంద్రబాబు, పవన్కల్యాణ్ కూడబలుక్కుని చెక్ పెట్టారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కేటాయింపులో ఇద్దరు నేతలకు నిరాశ ఎదురైంది. టీడీపీలో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, పవన్ కోసం పిఠాపురాన్ని త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మను రాజకీయంగా తొక్కేస్తున్నారు. మాటల గారడీతో నమ్మించి, పని అయిపోగానే కరివేపాకులా తీసి పడేసే చంద్రబాబు తీరుతో ఎమ్మెల్సీ పదవి పందేరంలో ఆ ఇద్దరికీ మొండిచేయి చూపారు. సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి వీరిద్దరు పదవుల కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలానే చంద్రబాబు నమ్మించి నట్టేట ముంచేశారని పార్టీ శ్రేణులే మండిపడుతున్నాయి. వారి ఆశలు సమాధి చేసేందుకు ఒక్కొక్కరికి ఒక కారణం చూపించడంపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. యనమలకు ఇచ్చే గౌరవం ఇదేనా? యనమలను ఎమ్మెల్సీగా కొనసాగిస్తారనుకున్న ఆయన అనుచరవర్గం డీలా పడింది. యనమల కుటుంబంలో ముగ్గురు వివిధ పదవులలో ఉన్నారని సాకు చూపి రామకృష్ణుడిని దూరం పెట్టడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. అలా అనుకుంటే తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రి, కుమారుడు లోకేష్ మంత్రిగా లేరా అని నిలదీస్తున్నారు. కాకినాడ సీపోర్ట్సు లిమిటెడ్ కేవీ రావుకు వ్యతిరేకంగా యనమల లేఖ రాయడం చినబాబు కోపానికి కారణమై చివరకు ఎమ్మెల్సీ రాకుండా చేసిందంటున్నారు. పార్టీకి ఇన్నేళ్లుగా చేసిన సేవలకు ఇప్పుడు ఇచ్చే గౌరవం ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. మరో త్యాగరాజుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ మిగిలిపోయారు. ఈయన పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం సీటును త్యాగం చేశారు. అలా చేయడమే వర్మకు రాజకీయ ప్లాట్ఫాం లేకుండా చేసిందని ఆయన అనుచర వర్గం వాపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ గెలుపొంది, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి టీడీపీలో వర్మ రాజకీయ ప్రాధాన్యాన్ని తగ్గించేస్తూ చివరకు ఉనికే లేకుండా చేశారని వర్మ అనుచరగణం ఆక్షేపిస్తోంది. పిఠాపురం నుంచి పవన్ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి అయ్యాక వర్మను రాజకీయంగా అణగదొక్కేస్తున్నారని టీడీపీ ద్వితీయశ్రేణి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి వ్యూహంతో పావులు కదుపుతున్నారనే విమర్శలున్నాయి. జనసేన శ్రేణులు మొదటి నుంచి వర్మకు పిఠాపురంలో రాజకీయంగా ఉనికి లేకుండా చేస్తామని బహిరంగంగా చెబుతూనే వస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో విజయవాడ పిలిపించుకుని పవన్ కోసం సీటు త్యాగం చేసినందుకు తొలి ఎమ్మెల్సీ ఖాయమని హామీ ఇచ్చారు. ఇప్పటికి రెండు, మూడు పర్యాయాలు ఎమ్మెల్సీల ఎంపిక జరిగినా వర్మకు అవకాశం లేకుండా చేశారంటున్నారు. వర్మ ముందరికాళ్లకు బంధమేస్తూ రాజకీయంగా ఉనికి కోల్పోయే పరిస్థితి తీసుకువస్తున్నారు. ఒకప్పుడు వర్మతో చెట్టపట్టాలేసుకు తిరిగి మారిన రాజకీయ సమీకరణల్లో జనసేనలో చేరిన నేతలు వర్మకు వ్యతిరేకంగా పావులు కదిపి ఎమ్మెల్సీకి మోకాలడ్డారంటున్నారు. వర్మకు ఎమ్మెల్సీ రాకపోవడమనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని పౌరసరఫరాలశాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో వివరణ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదే సందర్భంలో పిఠాపురం పవన్ కల్యాణ్ అడ్డా అని ప్రకటించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎందుకొచ్చిందనే సందేహం పార్టీ కేడర్లో వ్యక్తమవుతోంది. వర్మ వ్యవహారంలో జనసేనకు సంబంధం లేదని నాదెండ్ల సోమవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. పైకి చెబుతున్నదంతా వాస్తవమా కాదా అనేది పక్కనబెడితే వర్మకు రాజకీయంగా ముకుతాడు వేయడమనేది కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నదేనంటున్నారు. దీని వెనుక చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి వ్యూహం లేకపోలేదనే వాదన కూటమిగా జతకట్టిన మూడు పార్టీల్లో బలంగా వినిపిస్తోంది. కేవలం తన సోదరుడు, సినీ నటుడు నాగబాబుకు పిఠాపురంపై పెత్తనానికి లైన్ క్లియర్ చేయడంలో భాగమే ఇదంతా అంటున్నారు. అధ్యక్షుడిగా పార్టీ వ్యవహారాలు, ఉప ముఖ్యమంత్రిగా పరిపాలనా అవసరాలు దృష్ట్యా పిఠాపురాన్ని గాలికొదిలేస్తున్నారనే విమర్శల నేపథ్యంలో సోదరుడిని ఎమ్మెల్సీ చేయడం ద్వారా పిఠాపురం బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో వర్మకు ప్రొటోకాల్ పదవి కల్పిస్తే నియోజకవర్గంలో జనసేన నేతలకు ఎదురయ్యే పరిణామాలపై చంద్రబాబు, పవన్ మధ్య ఒక అవగాహన కుదిరిందనే ప్రచారం పార్టీలో విస్తృతంగా సాగుతోంది. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా మర్రెడ్డి శ్రీనివాస్ నాయకత్వ పటిమపై అపనమ్మకం వెరసి నాగబాబుకే అప్పగించాలనే యోచనతోనే వర్మకు పై స్థాయిలోనే మోకాలడ్డారనే బలమైన వాదన ప్రచారంలో ఉంది. వర్మకు అన్యాయం చేశారంటూ టీడీపీలో ఆయన అనుచరవర్గం మండిపడుతోంది. అసలు పిఠాపురంలో టీడీపీని లేకుండా చేసే కుట్ర జరుగుతోందంటూ పార్టీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఎమ్మెల్సీ ఇస్తామని అన్యాయం చేయడంపై వర్మ అంతర్గతంగా మధనపడుతున్నా పైకి మాత్రం చంద్రబాబుతో 23 ఏళ్లలో ఎన్నో సమస్యలతో పనిచేశానని చెప్పుకొచ్చారు. లోకేష్ ఆదేశాలకు తాను, తన కుటుంబం, పార్టీ నేతలు అండగా ఉంటామని ప్రకటించడం గమనార్హం. ‘బాబు’–పవన్ సమష్టి వ్యూహం వర్మను అడ్డుతొలగించిన జనసేన అంతా పిఠాపురం పెత్తనం కోసమే నాగబాబుకు లైన్ క్లియర్ యనమలకు చెక్ పెట్టిన ‘చినబాబు’ -
ఆకట్టుకున్న సూక్ష్మ బంగారు వరల్డ్ కప్
పెద్దాపురం: ఐసీసీ ఛాంపియన్షిప్లో టీమిండియా మూడోసారి విజేతగా నిలిచిన సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ అవార్డు గ్రహీత, పట్టణంలోని బంగారు శిల్పి తాళాబత్తుల సాయి సూక్ష్మ బంగారు వరల్డ్ కప్ను రూపొందించారు. కేవలం 40 నిమిషాల సమయంలో 0.100 మిల్లీ గ్రాముల బంగారంతో 10 మిల్లీమీటర్ల పొడవు కలిగిన వరల్డ్ కప్ను తయారు చేసి, పలువురి మనన్నలు అందుకున్నారు. మూల్యాంకన విధులపై సమావేశం బాలాజీచెరువు(కాకినాడ): పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనంపై సోమవారం విద్యా శాఖ ఆర్జేడీ నాగమణి సమావేశం నిర్వహించారు. స్థానిక రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో జోన్–2కు సంబంధించి కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల డీఈఓలు, పరీక్షల విభాగ ఏసీ, సీసీలతో సమావేశం జరిగింది. మూల్యాంకన విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ సమావేశంలో డీఈవోలు పిల్లి రమేష్, నారాయణ పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
పిఠాపురం: మండలంలోని మాదాపురంలో విద్యుదాఘాతానికి గురై రైతు చిన్నారి సత్యనారాయణ(65) సోమవారం మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు, పశువులకు మేతకు పొలం నుంచి గడ్డి కోసుకొస్తుండగా, కిందకు వేలాడుతున్న కరెంట్ వైరు తగిలి అతడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. గట్టుపై 11 కేవీ వైరు నాలుగు అడుగుల ఎత్తులో అతడికి తగలడంతో అక్కడికక్కడే చనిపోయినట్టు మృతుని బంధువులు ఆరోపించారు. మృతుడి కుమారుడు పొలంలో సత్యనారాయణ మృతదేహాన్ని చూసి, బంధువులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అధికారుల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం పోయిందని మృతుని బంధువులు ఆరోపించారు. పిఠాపురం రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చోరీ కేసుల్లో ఇద్దరు నిందితుల అరెస్టు
కాకినాడ రూరల్: మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి 78 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక మోటార్ బైక్తో పాటు, సుమారు రూ.6.50 లక్షల విలువైన చోరీ సొత్తును కాకినాడ ఇంద్రపాలెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ సోమవారం ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాకినాడ రూరల్ తూరంగి సత్యదేవనగర్ ప్రాంతానికి చెందిన గంపల సతీష్, కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామానికి చెందిన పట్టిం వరప్రసాద్ అనే అనుమానితుల్ని పోలీసులు అదుపులో తీసుకుని విచారించారు. వారు ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో రెండు దొంగతనాలు, కరప, కాకినాడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన దొంగతనం కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు గుర్తించారు. కాకినాడ రూరల్, పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచర్లపై నిఘా ఉంచి, తనిఖీలు చేస్తుండగా, సోమవారం కాకినాడ రూరల్ మండలంలోని ఇంద్రపాలెం గ్రామంలో ఉన్న ముసలమ్మ తల్లి గుడికి సమీపంలో ఇంద్రపాలెం ఎస్సై ఎం వీరబాబు, సిబ్బందితో వీరిని పట్టుకున్నామన్నారు. వారిని విచారణ చేయగా.. దొంగతనాల విషయం వెలుగు చేసినట్టు డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ చెప్పారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, వారికి రిమాండ్ విధించినట్టు తెలిపారు. సమావేశంలో కాకినాడ రూరల్ సీఐ డీఎస్ చైతన్యకృష్ణ, కాకినాడ క్రైమ్ సీఐ వి.కృష్ణ, ఇంద్రపాలెం ఎస్సై ఎం.వీరబాబు, ఏఎస్సైలు గోవిందు, పుల్లయ్య, పీసీలు పాల్గొన్నారు. రూ.6.50 లక్షల సొత్తు స్వాధీనం డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ వెల్లడి -
మిత్రుల అంకురం.. రైతులకు సంబరం
పిఠాపురం: పంటకు మేలు చేసి, రైతులకు పురుగు మందుల ఖర్చు తగ్గించే మిత్రులుగా భావించే మిత్ర పురుగులు సేంద్రియ వ్యవసాయం పుణ్యమా అని మళ్లీ వాటికి జవజీవాలు సంతరించుకున్నాయి. విచ్చలవిడిగా రసాయనాల వినియోగంతో కనుమరుగైన మిత్ర పురుగులు.. సేంద్రియ వ్యవసాయంతో ఉనికిలోకి వస్తున్నాయి. వీటివల్ల పంటలకు ఎంతో మేలు కలిగి, రైతుకు పైసా ఖర్చు లేకుండానే క్రిమికీటకాలు నివారించబడతాయి. అలాంటి మిత్ర పురుగులు పొలాల్లో కనిపించకుండా పోవడంతో, కీటకాలు పెరిగి, పంటలకు తెగుళ్లు సోకి రైతుకు నష్టాలను మిగులుస్తున్నాయి. ఈ తరుణంలో ప్రకృతి వ్యవసాయం వల్ల పంటలకు మిత్రులు మళ్లీ వస్తుండడంతో రైతులను ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు మేలు సాలీడు, అక్షింతల పురుగు, తూనీగలు, అల్లిక రెక్కల పురుగు, గొల్లభామలను పంటలకు మిత్రులుగా చెబుతారు. ఇవి పంటలకు రక్షణ కవచాలుగా రైతులు పరిగణిస్తుంటారు. కొన్నేళ్లుగా సాగులో రసాయనాలను గణనీయంగా వినియోగించడంతో కనుమరుగైన ఈ పురుగులు.. ప్రకృతి వ్యవసాయం వల్ల, రసాయనాల వినియోగం తగ్గి, మళ్లీ భూమిపై సంచరిస్తూ పంటలకు మేలు చేస్తున్నాయి. ఈ మిత్ర పురుగులు పొలంలో లేకుంటే పంటకు కీడు చేసే పురుగుల తీవ్రత పెరిగి, పంటలకు తీవ్ర నష్టాలను కలిగిస్తాయి. అక్షింతల పురుగు పంటలకు అక్షింతల పురుగు (లేడీ బర్డ్ బీటిల్) చాలా ప్రయోజనకరంగా చెబుతారు. అనేక రకాల కీటకాలను, పేను బంక లాంటి రసం పీల్చే పురుగులకు ఇవి సహజ శత్రువులు. ఒక అక్షింతల పురుగు తన జీవిత కాలంలో సుమారు ఐదు వేల పేనుబంక పురుగులను తింటుంది. గుండ్రంగా కుంభాకారం కలిగి ఉంటుంది. పసుపు, గులాబీ, నారింజ, ఎరుపు, నలుపు రంగుల్లో మచ్చలు కలిగి ఉంటుంది. వీటి లార్వాలు సైతం కీటకాలను వేటాడుతాయి. ఆడ పురుగులు ప్రతి మూడు నెలలకోసారి సుమారు వెయ్యి గుడ్లు పెడతాయి. ఇవి ప్రకాశవంతమైన మచ్చలతో, నలుపు రంగులో ఉండి, ప్రమాదకరమైన దానిగా కనిపించినప్పటికీ పంటకు మాత్రం ఎంతో మేలు చేస్తుంది. ఇవి వదిలే లార్వా ఎటువంటి ప్రమాదకరం కాకపోవడంతో పంటకు మేలు మినహా, కీడు అనేది ఉండదు. అనేక వారాల పాటు పంటలపై ఉండి కీటకాలను తినడం ద్వారా రైతులు కీటకాల నివారణకు పురుగు మందులు పిచికారీ చేసే అవసరం లేకుండా, పెట్టుబడి, శ్రమ చాలా తగ్గుతుంది. అల్లిక రెక్కల పురుగు ప్రకృతిలో అల్లిక రెక్కల పురుగు (గ్రీన్ లేస్ వింగ్ బగ్) విరివిగా కనిపించే ఓ సాధారణ రెక్కల పురుగు. కానీ ఇది పంటలకు చేసే మేలు అంతా ఇంతా కాదు. గొంగళి పురుగులు, లీవ్ ఆఫర్స్, బిలివర్స్, వైట్ ఫ్లైస్ వంటి ఇతర మృదువైన శరీరం కలిగిన కీటకాలను నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. లేత ఆకుపచ్చ రంగులో, సున్నితమైన రెక్కలతో ఉండే ఈ పురుగు వదిలే లార్వా ఇతర కీటకాలను నాశనం చేస్తాయి. పంటలు నాశనం చేసే కీటకాలకు దీనిని బద్ధ శత్రువుగా చెబుతారు. తూనీగ పొడవైన శరీరం కలిగి, కళ్లు, రెండు జతల బలమైన రెక్కలు కలిగి, వివిధ రంగుల మచ్చలతో ఉండే తూనీగ (డ్రాగన్ ఫ్లై) 95 శాతం కీటకాలను వేటాడతాయి. అందుకే దీనిని డెడ్లీ హంటర్ అని కూడా అంటారు. కచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించేవిగా చెబుతారు. ఇవి ఒకే వేసవిలో వేలాది కీటకాలను పట్టుకుని తింటాయి. దోమలు, ఈగలు, తెల్లదోమలను తిని పంటలకు మేలు చేకూరుస్తాయి. సాలీడు సాధారణ పంటలకు సోకే తెగుళ్ల నియంత్రణకు సాలీడు (స్పైడర్) జీవ ఏజెంట్లుగా పని చేస్తాయి. ఇవి అనేక సజీవ కీటకాలను తింటాయి. చీడపీడలను నియంత్రించడంలో వీటిని మించిన పురుగు మరొకటి లేదంటారు. కేవలం శత్రు కీటకాలను తినడం మినహా, పంటకు కానీ, మొక్కలకు కానీ ఎటువంటి హానీ చేయకపోవడం వల్ల మిత్ర పురుగుల్లో ఇది తొలి స్థానంలో ఉంది. దోమలు, ఈగలు, తెల్లదోమలు, ఎగిరే కీటకాలను పట్టుకుని తినడం ద్వారా ఇవి పంటలకు మేలు చేస్తాయి. గొల్లభామ పంటలకు గొల్లభామ (ప్రేయింగ్ మ్యాంటీస్)లను ఆస్తులుగా చెబుతారు. తెగుళ్ల నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. పునుబంక, ఆస్త్రరాగస్ బీటిల్స్, గొంగళి పురుగు, బీటిల్స్, తేనెమంచు పురుగు తదితర వాటిని తిని పంటలకు హాని కలగకుండా నివారిస్తాయి. ఇవి పుప్పొడి మకరందాన్ని తీసుకోవు. కానీ వీటిని ఉత్పత్తి చేసే మొక్కలు గొల్లభామలు తినే ఆహారాలైన కీటకాలను ఆకర్షిస్తాయి. వీటివల్ల పంటలకు చాలా మేలు కలుగుతుంది. పంటకు రక్షకులు.. కీటకాలకు శత్రువులు రసాయనాల వినియోగంతో కనుమరుగు ప్రకృతి వ్యవసాయంతో మిత్ర పురుగులకు జీవం సేంద్రియ పంటల్లో వాటి ప్రాముఖ్యమెంతో.. మిత్ర పురుగులు మళ్లీ వచ్చాయి గతంలో ఎక్కడ చూసినా మిత్ర పురుగులు కనిపించేవి. కానీ రసాయనాల వినియోగం వల్ల అవి కనుమరుగయ్యాయి. ముఖ్యంగా పొలాల్లో అస్సలు కనిపించడం లేదు. కానీ సేంద్రియ వ్యవసాయం మొదలయ్యాక వాటి మనుగడ మళ్లీ ప్రారంభమైంది. రైతు ఎటువంటి పురుగు మందులు వాడకుండా, 70 శాతం వరకు ఇవి పంటలకు హాని చేసే కీటకాలను నాశనం చేసి, పంటకు మేలు చేస్తాయి. ఇప్పుడు ఇవి భారీగా కనిపిస్తున్నాయి. తెగుళ్లు తగ్గుముఖం పట్టాయి. రైతుకు పెట్టుబడి తగ్గింది. ఇది చాలా శుభపరిణామంగా చెప్పవచ్చు. – గుండ్ర శివచక్రం, ప్రకృతి వ్యవసాయ రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం ప్రకృతి వ్యవసాయ ఫలితమే.. కొన్నేళ్లుగా చేపట్టిన ప్రకృతి వ్యవసాయ సాగు ఫలితమే మిత్ర పురుగుల మనుగడకు అంకురం. ప్రస్తుతం సేంద్రియ పంటలన్నింటి పైనా ఈ పురుగులు సంచరిస్తున్నాయి. తద్వారా కీటకాల బెడద గణనీయంగా తగ్గింది. పురుగు మందుల అవసరం లేకుండా పోయింది. పంటలకు మంచి రోజులు వచ్చాయనడానికి నిదర్శనమే మిత్ర పురుగుల సంచారం. ఇది మారుతున్న వ్యవసాయ విధానాల్లో శుభపరిణామంగా చెప్పవచ్చు. – ఎలియాజరు, డీపీఎం, ప్రకృతి వ్యవసాయ శాఖ, కాకినాడ -
రహదార్లపై మృత్యు తాండవం
కిర్లంపూడి: ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఆగి ఉన్న టిప్పర్ను బైకిస్ట్ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందినట్టు కేసు నమోదు చేశామని కిర్లంపూడి ఏఎస్సై కుమార్ తెలిపారు. ఆయన వివరాల మేరకు, చిల్లంగా గ్రామానికి చెందిన కొప్పన అప్పారావు(29) తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి వీరవరంలో అత్తారింటికి మోటార్ బైక్పై బయలుదేరాడు. రాజుపాలెం వంతెన అవతల వైపు మోటార్ బైక్ అదుపుతప్పి ఆగి ఉన్న టిప్పర్ వెనుక భాగంలో ఢీకొనడంతో, అతడి తలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య, పాప, బాబు ఉన్నారు. భార్య విశాలాక్షి ఇచ్చిన ఫిర్యాదు మేకు కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై తెలిపారు. రోడ్డుపై ఆందోళన కగా నిబంధనలకు విరుద్ధంగా టిప్పర్ను రోడ్డుపై ఆపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని మృతుడి బంధువులు, గ్రామస్తులు ఆరోపించారు. మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఆందోళనకు ఉపక్రమించారు. దీంతో కిర్లంపూడి–సామర్లకోట రోడ్డుపై సుమారు 4 గంటల సేపు ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పెద్దాపురం ఎస్డీపీఓ శ్రీహరిరాజు, జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్సై రాఘనాథరావు అక్కడకు చేరుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. బైక్ అదుపుతప్పి.. ముమ్మిడివరం: మోటార్ సైకిల్పై వెళుతున్న ఇద్దరు యువకులు రోడ్డుపై ఆబోతు అడ్డురావడంతో అదుపు తప్పి కిందపడ్డారు. దీంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని అనాతవరం 216 జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన మల్లిపూడి ప్రవీణ్కుమార్ (28), సత్యప్రకాష్ ద్విచక్ర వాహనంపై కాకినాడ నుంచి సొంతూరుకు పయనమయ్యారు. అనాతవరం వద్ద జాతీయ రహదారిపై అడ్డొచ్చిన ఆబోతును బైక్తో ఢీకొన్నారు. ఈ ఘటనలో ప్రవీణ్కుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాల పాలైన సత్యప్రకాష్ను అమలాపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. లారీ ఢీకొని వివాహిత మృతి రావులపాలెం: ఊబలంకలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వందే విజయకుమారి(40) మృతి చెందారు. ఎస్సై నాయుడు రాము వివరాల మేరకు, ఆత్రేయపురం మండలంలోని కట్టుంగకు చెందిన విజయకుమారి భర్త రమేష్బాబుతో కలిసి అమలాపురంలో చదువుతున్న తన కుమార్తెను చూసేందుకు మోటార్ బైక్పై వెళ్లారు. సోమవారం సాయంత్రం తిరుగు పయనమయ్యారు, స్థానిక వినాయకుని ఆలయం వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి లారీ వారి బైక్ను ఢీకొంది. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోగా, విజయకుమారి పైనుంచి లారీ దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. సీఐ సీహెచ్ విద్యాసాగర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి మృతి పరీక్ష రాయడానికి వెళ్తూ విద్యార్థి.. ఆబోతు అడ్డొచ్చి ఓ యువకుడు అత్తారింటికి వెళుతూ మరో వ్యక్తి పరీక్షకు వెళుతూ మృత్యుఒడికి.. సామర్లకోట: ఇంటర్మీడియెట్ పరీక్ష రాయడానికి సోమవారం ఇంటి నుంచి మోటార్ బైక్పై బయలుదేరిన విద్యార్థి మార్గం మధ్యలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన విషాద సంఘటన ఇది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు, మండలంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన ప్రగడ వంశీ(19) ఇంటర్ సెకండియర్ పరీక్ష రాయడానికి ఇంటి నుంచి కాకినాడకు బైక్పై బయలు దేరాడు. గొంచాల గ్రామంలోని మలుపులో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ అతడి బైక్ను ఢీకొనడంతో వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై రాంబాబు తన సిబ్బందితో సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి చనిపోవడంతో, ఒక్కగానొక్క కుమారుడిని తల్లి గారాబంగా పెంచుతూ, చదివిస్తోంది. పరీక్ష రాయడానికి వెళ్లిన కుమారుడు ఇక శాశ్వతంగా తిరిగిరాడని తెలుసుకుని ఆ తల్లి సంఘటన స్థలంలో గుండెలవిసేలా రోదించింది. తాను ఎవరి కోసం బతకాలంటూ ఆమె రోదించిన తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది. అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఎస్సై రాంబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కమనీయం నరసన్న కల్యాణం
మధురపూడి: శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా కోరుకొండ గోవింద, హరి నామస్మరణతో మార్మోగింది. స్వయంభు శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం రథోత్సవం, రాత్రి 9 గంటలకు కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగాయి. దేవస్థానంలోని కల్యాణ మండపంలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. కోరుకొండ నవనరసింహ క్షేత్రం కావడంతో సుదూర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కోరుకొండ పరిసరాలన్నీ భక్తజనంతో కిక్కిరిసింది. రథోత్సవంతో కోరుకొండ మీదుగా గోకవరం, భద్రాచలం, విశాఖపట్నం, విజయనగరం వెళ్లాల్సిన వాహనాలు నిలిచిపోయాయి. ప్రధాన వీధుల మీదుగా కొనసాగిన రథోత్సవం సాయంత్రం 5.30కు తిరిగి దేవస్థానానికి చేరింది. అక్కడ స్వామి, అమ్మవార్లను మేళతాళాలు, మంగళవాయిద్యాలతో ఆలయానికి తోడ్కొనివచ్చారు. వధూవరులకు మంగళస్నానాలు నిర్వహించారు. పట్టువస్త్రాలను అలంకరించిన స్వామి, అమ్మవారు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. వధూవరులకు వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం వేద పండితులు పాణింగపల్లి పవన్కుమార్ ఆచార్యులు కల్యాణం నిర్వహించారు. దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త ఎస్పీ రంగరాజబట్టర్, అర్చకస్వాములు పెద్దింటి, పెదపాటి వారి పర్యవేక్షణలో కల్యాణ వేడుక కమనీయంగా జరిగింది. మాలధారణ భక్తుల ప్రదర్శనలు రథోత్సవంలో మాలధారణ చేసిన భక్తుల ప్రదర్శనలు ఆధ్యాత్మకతను సంతరించుకున్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన 220 మంది భక్తులు స్వామివారి మాలధారణ వేశారు. ఉత్సవాల సందర్భంగా స్వాములు 9 రోజుల పాటు నిష్ఠతో పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. వీరికి స్వామివారి మాలధారణ ట్రస్టు ద్వారా వడి, భిక్షలను ఏర్పాటు చేశారు. బుధవారం దీక్షను విరమిస్తారు. భక్తజన సందోహం నడుమ.. సోమవారం స్వామివారి రథోత్సవం భక్తజన సందోహం నడుమ వైభవంగా జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 1.56 గంటలకు వేద మంత్రోచ్ఛరణతో స్వామి, అమ్మవార్లు ఆశీనులైన రథం బయలుదేరింది. కొండ నుంచి ప్రారంభమైన రథం దేవస్థానం రోడ్డు, వాటర్ ప్లాంట్, రెడ్డి పంతులు సత్రం, పాత సంత మార్కెట్, వడ్టీలపేట, మత్స్యకారుల వాడ, ఎయిర్టెల్ టవర్, సాయిబాబా గుడి, అంకాలమ్మ గుడి, శివాలయం మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా గరగ నృత్యాలు, బ్యాండ్మేళాలు, కోలాటం, తీన్మార్, శక్తి వేషధారణలు, కేరళ డ్రమ్స్ వాయిద్యాలతో రథానికి స్వాగతం పలికారు. సాయంత్రం 5.40కు రథం తిరిగి దేవస్థానానికి చేరింది. భక్తులు అరటి పండ్లను స్వామి రథంపైకి వేస్తూ, దర్శించుకున్నారు. దేవస్థానానికి చేరుకున్న రథానికి ఎదుర్కోలు కార్యక్రమంలో భాగంగా మేళతాళాలతో నరసింహస్వామి, లక్ష్మీదేవిని ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆయా కార్యక్రమాల్లో అన్నవరం దేవస్థాన ఈఓ వీర్ల సుబ్బారావు, దేవస్థానం అధికారులు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణచౌదరి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, నార్త్జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్, కోరుకొండ తహసీల్దార్ సుస్వాగతం, ఎంపీడీఓ బత్తిన అశోక్కుమార్ పాల్గొన్నారు. కోరుకొండ సీఐ సత్యకిషోర్, ఎస్సై శ్యామ్సుందర్ బందోబస్తు నిర్వహించారు. శ్రీలక్ష్మీ నరసింహుని రథోత్సవం భక్తజన సందోహం కన్నుల పండువగా కల్యాణోత్సవాలు -
రెండో ర్యాంకుకు అన్నవరం దేవస్థానం !
ఇతర పుణ్యక్షేత్రాల స్థానం దిగజారడంతో ఎగబాకిన వైనం అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం భక్తులకు అందిస్తున్న సేవల్లో రెండో ర్యాంకును సాధించింది. గత నెలలో రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో చివరగా ఏడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 25 మధ్య సేకరించిన అభిప్రాయ సేకరణలో రెండో స్థానంలో ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన దేవస్థానాల భక్తుల అసంతృప్తి శాతం తక్కువగా ఉండడంతో రెండో స్థానంలో నిలిచినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గతంలో ఈ దేవస్థానం ఏడో ర్యాంకులో ఉండడంతో కలెక్టర్ షణ్మోహన్ గత నెల 24న అన్నవరం విచ్చేసి, విస్తృత తనిఖీలు నిర్వహించి, దేవస్థానం మొదటి ర్యాంకులో రావాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. భక్తులకు సేవలందించడం, ప్రసాదం నాణ్యత, ఇతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరించి తాజా ర్యాంకులు ప్రకటించింది. భక్తులకు దర్శనంలో రెండో ర్యాంకు, మౌలిక వసతుల్లో మూడో ర్యాంకు, ప్రసాదం రుచిలో రెండో ర్యాంకు సాధించింది. అన్నవరం దేవస్థానం -
‘వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్.. కానీ’: నాదెండ్ల మనోహర్
కాకినాడ: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు..ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారు. దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే రెండు సార్లు మోసపోయిన వర్మ.. మరోసారి దానికి గురి కాకతప్పలేదు. తాజాగా టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు.పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఎమ్మెల్యే సీటును వర్మ వదులుకున్న క్రమంలో ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు తీరా చూస్తే వర్మ కి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదుజఈ అంశంపై పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ఎస్పీఎస్ఎన్ వర్మ ఒక సీనియర్ పొలిటిషియన్ అంటూనే, ఆయన ఎమ్మెల్సీ టికెట్ అంశమనేది వారి పార్టీనే నిర్ణయిస్తుందన్నారు మనోహర్. ఇక్కడ తాము వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం ఏముంటందన్నారు మనోహర్.‘పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా. వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్. వాళ్ళ పార్టీ ఆయన విషయం లో నిర్ణయం తీసుకుంటుంది, అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. వర్మ ని గౌరవించడం లో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉంటుంది’ అని అన్నారు.ఇక ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు మనోహర్ పేర్కొన్నారు. పవన్ సెక్యూరిటీ విషయంలో డిపార్ట్మెంట్ తో పాటు పార్టీ పరంగా మేము కూడా చూసుకుంటాం. సభా ప్రాంగణం లో 75 సి సి కెమెరా లు ఏర్పాటు చేస్తాం. పిఠాపురం ప్రజలకి కృతజ్ఞతలు చెప్పడానికి ఈ సభ ఏర్పాటు చేశాం. ఈ నెల 14 న సాయంత్రం 4 గంటలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ప్రారంభమవుతుంది’ అని పేర్కొన్నారు మంత్రి మనోహర్. -
నువ్వు డాక్టర్వా.. గేదెలు కాస్తున్నావా?
ప్రత్తిపాడు: రాష్ట్రంలో కూటమి నేతల దాడులు, దౌర్జన్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాజాగా.. జనసేన పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్చార్జి వరుపుల తమ్మయ్యబాబు ఏకంగా మహిళా డాక్టర్పై విరుచుకుపడి నానా రాద్ధాంతం సృష్టించారు. ఎప్పటిలాగే పోలీసులు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చోటుచేసుకున్న ఈ ఘటన పూర్వాపరాలు ఏమిటంటే.. ఏలేశ్వరం మండలం లింగంపర్తికి చెందిన కాపవరపు చంద్రకళ పదేళ్ల కుమారుడు చంద్ర శేఖర్తో కలిసి ఆటోలో లింగంపర్తి వస్తోంది.ఆమె ప్రయాణిస్తున్న ఆటోను తునివైపు వెళ్తున్న కారు రామవరం వద్ద ఢీకొట్టి బోల్తా పడింది. చికిత్స నిమిత్తం తల్లీకొడుకును హైవే అంబు లెన్సులో స్థానిక సీహెచ్సీకి తీసుకొచ్చారు. డ్యూటీ డాక్టర్ శ్వేత వెంటనే స్పందించి, సిబ్బంది సహాయంతో వైద్యసేవలు అందించారు. అదే సమయంలో తమ గ్రామానికి చెందిన క్షత గాత్రులను పరామర్శించేందుకు లింగంపర్తి నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు ఆస్పత్రిలోకి దూసు కొచ్చి, బాధితులను తీసుకొచ్చిందెవరంటూ నానా యాగీ చేశారు. గాయపడిన వారిని ఎవరైనా తీసుకొస్తే వివరాలు లేకుండానే చికిత్స చేస్తారా అంటూ వారు వైద్యురాలితో ఘర్షణకు దిగారు. సిబ్బంది వారిస్తున్నా వినకుండా వారిపై ఎదురుదాడికి దిగారు. హైవే అంబులెన్సులో తీసుకొచ్చారని, పోలీసులకు సమాచారం అందించామని ఎంత చెబుతున్నా వినకుండా ఆçస్పత్రికి తీసుకొచ్చిన వారి వివరాలు చెప్పాలని రాద్ధాంతం చేశారు. అలాగే, తమ నాయకుడు వరుపుల తమ్మయ్యబాబుతో మాట్లాడాలంటూ డాక్టర్ శ్వేతకు సెల్ఫోన్ ఇచ్చారు. దీంతో అవతలి వ్యక్తి ఎవరో తెలియని డాక్టర్ బాధితులకు వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. అంతే.. ఆగ్రహావేశాలతో ఊగిపోతూ వరుపుల తమ్మయ్యబాబు ఆస్పత్రికి చేరుకున్నారు. ‘తమ్మయ్యబాబు అంటే తెలీదా.. జీతాలు తీసుకోవడంలేదా.. నువ్వు డాక్టర్వా.. గేదెలు కాస్తున్నావా’.. అని నోటికొచ్చినట్లు అరుస్తూ ఆస్పత్రిలో హడావుడి చేశారు. దీంతో రోగులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. సెల్ఫోన్ లాక్కుని.. నగదు దోచుకుని..ఈ తతంగమంతా ఓ పారిశుధ్య కార్మికురాలు తన సెల్లో వీడియో తీస్తుండగా జనసేన కార్య కర్తలు ఆమె సెల్ఫోన్ను లాక్కుని వెళ్లిపోయారు. ఆ తర్వాత దాన్నుంచి రూ.2,700 నగదును ట్రాన్సఫర్ చేసుకుని, వీడియోలన్నీ తొలగించి రాత్రి 11 గంటలకు తిరిగిచ్చారు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర పోషించారు. మరోవైపు.. తమకు స్వేచ్ఛ, రక్షణ కల్పించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన హామీ కావాలనివైద్యులు డిమాండ్ చేశారు. కాగా, డాక్టర్ శ్వేత పట్ల అనుచితంగా ప్రవర్తించిన తమ్మయ్యబాబు ను సస్పెండ్ చేస్తున్నట్లు జనసేన తెలిపింది. -
రత్నగిరిపై భక్తుల సందడి
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది ● ఘనంగా సత్యదేవుని రథ సేవ అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుడిని ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించి పూజలు చేశారు. సెలవు దినం కావడంతో ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వీరంతా స్వామివారి వ్రతాలాచరించి దర్శనం చేసుకున్నారు. దీంతో సత్యదేవుని ఆలయం వద్ద రద్దీ ఏర్పడింది. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. ఆదివారం స్వామివారిని 30 వేల మంది దర్శించగా, వ్రతాలు 1,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదు వేల మంది భక్తులకు సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో ఉచిత భోజన సౌకర్యం కలుగచేశారు. ఆదివారం సత్యదేవుని రథసేవ ఆలయ ప్రాకారంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి టేకు రథంపై ఉంచారు. స్వామి, అమ్మవార్లకు పూజలు చేసిననంతరం పండితులు రథసేవ ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛాటన మధ్య, మంగళవాయిద్యాల నడుమ మూడుసార్లు రథంపై ఆలయ ప్రాకారంలో సేవ నిర్వహించారు. సేవ అనంతరం పండితులు స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి ఇచ్చారు. వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠీ, శివ, యనమండ్ర శర్మ, గంగాధరబట్ల గంగబాబు, అర్చకులు సుధీర్. పరిచారకులు పవన్ తదితరులు కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తరకంచికి చెందిన భక్తులు రూ.2,500 చెల్లించి రథసేవలో పాల్గొన్నారు. సోమవారం సత్యదేవుడు, అమ్మవారు ముత్యాల కవచాలను (ముత్తంగిసేవ) ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
12న ఫీజు పోరును విజయవంతం చేయండి
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీత పిఠాపురం: రాష్ట్ర వైఎస్సార్ సీపీ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈనెల 12న నిర్వహించనున్న ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వంగా గీత పిలుపు నిచ్చారు. ఆమె ఆదివారం మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టించిందని ఆమె విమర్శించారు. విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అండగా జిల్లా కేంద్రం కాకినాడలో ఫీజు పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తరపున చేపట్టనున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అదే రోజు పిఠాపురం పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని ఆమె పిలుపు నిచ్చారు. లోవ దేవస్థానంలో భక్తుల సందడి రూ.3.65 లక్షల ఆదాయం తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో సందడి నెలకొంది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన 18వేల మంది భక్తులు క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నట్టు ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,39,305, పూజా టికెట్లకు రూ.86,900, కేశఖండన శాలకు రూ.13,960, వాహన పూజలకు రూ.3,890, వసతి గదులు, పొంగిలి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.43,756, విరాళాలు రూ.77,609 వెరసి మొత్తం రూ.3,65,420లు ఆదాయం సమకూరినట్టు ఈఓ వివరించారు. మోరి చేనేత వస్త్రాలకు రాష్ట్రపతి ప్రశంస సఖినేటిపల్లి: జిల్లాలోని మోరి చేనేత సొసైటీ వస్త్రాలను ఆదివారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. నేషనల్ డిజైన్ సెంటర్(సెట్ అప్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్) ఆధ్వర్యంలో సౌత్ ఇండియా అమృత్ మహోత్సవ్లో ఏపీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మోరి చేనేత స్టాల్ను న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోరి చేనేత సొసైటీ స్టాల్లోని చేనేత వస్త్రాలను రాష్ట్రపతి పరిశీలించారు. ఆమె వెంట ఏపీ గవర్నర్ ఉన్నారు. చేనేత చీరల తయారీలో కార్మికుల నైపుణ్యాన్ని రాష్ట్రపతి ప్రసంశించినట్టు స్టాల్ సేల్స్మన్, మోరికి చెందిన నల్లా ప్రసాద్ తెలిపారు. -
మెట్టకు సాగునీటి కష్టం
ఇవీ లెక్కలు.. ● జిల్లాలో పంట భూములు– 1,77,030 ఎకరాలు ● గోదావరి డెల్టా – (10 మండలాలు) 1,24,798 ఎకరాలు ● ఏలేరు కాలువ భూములు – (6 మండలాలు) 44,250 ఎకరాలు ● ఏలేరు నిల్వ సామర్థ్యం – 86.56 మీటర్లు ● నీటి నిల్వ సామర్థ్యం– 24.11 టీఎంసీలు ● డెడ్స్టోరేజ్ – 6.16 టీఎంసీలు ● కాలువల ద్వారా సరఫరా – 17.95 టీఎంసీలు ● ప్రస్తుతం రిజర్వాయర్లో నిల్వ – 12.98 టీఎంసీలు ● ఇన్ఫ్లో రోజుకు సగటున – 266 క్యూసెక్కులు ● ఎడమ కాలువకు – 200 క్యూసెక్కులు ● డీసీఆర్కు – 500 క్యూసెక్కులు ● స్పిల్వే విడుదల – 900 క్యూసెక్కులు ● రైతు గోడు పట్టని పవన్ ● సొంత నియోజకవర్గంలో నీటి ఎద్దడి ● సందిగ్ధంలో శివారు ఆయకట్టు ● సాగునీరు అందక మెట్ట రైతు పాట్లు ● పీబీసీ శివారున ఇదే దుస్థితి ● నిండుకున్న ఏలేరు జలాలు సాక్షి ప్రతినిధి, కాకినాడ: సాగునీటి ఎద్దడితో జిల్లాలో మెట్ట ప్రాంత రైతులు గొల్లుమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రబీ సాగునీటి సరఫరాపై ముందుచూపు లేకపోవడం ఈ ప్రాంత రైతులకు శాపంగా పరిణమించింది. ఏలేరులో నీటి కొరతను అధిగమించడంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని రైతు సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అంతా ఒక ఎత్తు పిఠాపురం నియోజకవర్గం పరిస్థితి మరో ఎత్తు అన్నట్టుగా ఉంది. స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలోనే రైతులు సాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో సాగునీటి ఎద్దడితో రైతుల గోడు కనీసం పట్టించుకోకుండా జనసేన పార్టీ 12వ వార్షికోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా చేసుకోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏలేరు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్స్పై ఆధారపడ్డ ఆయకట్టు శివారున ఉన్న పలు ప్రాంతాల్లో రబీ సాగు సందిగ్ధంలో పడింది. జనసేనలో నంబర్–2గా ఉన్న నాదెండ్ల మనోహర్ వారం తిరగకుండానే ఒక పర్యాయం పిఠాపురం, రెండు పర్యాయాలు కాకినాడలో పర్యటించినా నియోజకవర్గ రైతుల రబీ కష్టాల వైపు కన్నెత్తి చూడకపోవడాన్ని రైతు సంఘాల ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు ఇచ్చే ప్రాధాన్యం శివారు ఆయకట్టులో ఇబ్బందులకు ఇవ్వరా అని రైతులు నిలదీస్తున్నారు. రబీ సన్నాహానికి ముందు మాత్రం అధికార యంత్రాంగం పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో 32,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేస్తామని ప్రకటించింది. ఇందులో 22,260 ఎకరాల్లో వరి, 10,240 ఎకరాల్లో అపరాల సాగుకు ఢోకా లేదనడంతో రైతులు గంపెడాశలతో రబీ సాగుకు సమాయత్తమయ్యారు. ఇంతలో ఏలేరులో ఎదురైన నీటి కొరత రైతులకు గుదిబండగా మారింది. శివారు రైతుల గగ్గోలు రబీ సీజన్లో రైతులు సాగుకు సమాయత్తమయ్యే సమయానికి ఏలేరులో 20 టీఎంసీలు ఉంది. ప్రస్తుతం 12.98 టీఎంసీలు మాత్రమే కనిపిస్తోంది. వీటిలో 4.50 టీఎంసీలు విశాఖ స్టీల్ ప్లాంట్కు పోగా మిగిలిన 6.16 టీఎంసీలు డెడ్ స్టోరేజ్గా పరిగణిస్తున్నారు. మరో 1.31 టీఎంసీలు ఏలేరు ప్రాంత ఆయకట్టు భూములు 53 వేల ఎకరాలకు అందించాల్సి ఉంది. 28 వేల ఎకరాల్లో వరి, 25 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలకు సాగు నీరు అందించాలి. ఏలేరు పరిధిలో రబీకి సాగునీటి ఎద్దడి కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో శివారు ఆయకట్టు ప్రాంతాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు. పంట చేతికందే దశలో సా గునీటికి కటకటలాడిపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. అసలే ఎండల తీవ్రతతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతోన్న తరుణంలో సాగునీరు లేక పంట భూములు నెర్రలు బారడంతో ఏలేరు రైతు కంటకన్నీరు పెడుతున్నారు. ఏలేరు రిజర్వాయర్లో నిలువలు అడుగంటడంతో శివారు ఆయకట్టు రైతుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కను తలపిస్తోంది. రిజర్వాయర్లో ఉన్న అరకొర నీటిని కాలువల ద్వారా సరఫరా చేసినా ఏలేరుకు ఎగువనున్న ప్రత్తిపాడు, పెద్దాపురం తదితర మండలాల ఆయకట్టుకే సరిపోతోందని చెబుతున్నారు. దిగువన ఉన్న తమ పొలాలకు చుక్కనీరు రావడం లేదని స్థానిక రైతులు మదనపడుతున్నారు. సర్కారు తీరుపై రైతుల ఆగ్రహం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో రబీ సీజన్లో డెడ్ స్టోరేజీ 6.16 టీఎంసీలు ఉంది. అయినప్పటికీ పంపింగ్ చేసి సాగుకు సరిపడా రెండు టీఎంసీలు సరఫరా చేసి రైతుల కడగండ్లకు పుల్స్టాప్ పెట్టారు. ఫలితంగా నాడు రబీ పంటకు ఎటువంటి సాగునీటి ఎద్దడి ఎదురు కాకుండా రైతులు పంట పండించారు. ఇప్పుడు ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతులపై మానవత్వం చూపని ప్రభుత్వం ఏలేరు శివారు ఆయకట్టు రైతుల గోడు పట్టించుకోలేదు. ప్రస్తుతం ఏలేరు డెడ్ స్టోరేజ్ 6.16 టీఎంసీలలో 2 టీఎంసీలు పంపింగ్ చేయాలన్న రైతుల డిమాండ్ను పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. పైకి మాత్రం రైతులంటే వల్లమాలిన అభిమానం ఉన్నట్టుగా చంద్రబాబు సర్కార్ ప్రచారం చేసుకుంటోందని రైతు సంఘాల ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. ఏలేరు ఆయకట్టు పరిధి రైతుల్లో 70 శాతం మంది కౌలు రైతులే. కౌలుకు తీసుకుని రూ.లక్షలు పెట్టుబడులు పెట్టారు. రబీలో ఎకరాకు రూ.20 వేల వరకు కౌలు చెల్లించి మరో రూ.25 వేలు పెట్టుబడులు పెట్టిన కౌలు రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతులపై కపట ప్రేమ చూపించే కూటమి నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. నెర్రలు తీసిన పొలాలు పిఠాపురం మండలం రాపర్తి, రాయవరం, భోగాపురం, కొత్తపల్లి మండలం ఎండపల్లి, గోల్లప్రోలు మండలంలో శివారు ఆయకట్టుకు సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. బోగాపురం, రాయవరం, రాపర్తి గ్రామాల్లోని ఆయకట్టుకు సాగునీరందడం లేదు. వారం పది రోజులుగా ఇదే దుస్థితి కొనసాగుతోంది. రైతుల మొర ఆలకించే ఓపిక ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు లేకుండా పోయింది. వంతుల వారీగా విడుదల చేసిన నీరు ఎంత మాత్రం సరిపోవడం లేదని రైతులు అంటున్నారు. పంట ఇప్పుడిప్పుడే గింజ గట్టిపడే దశలో ఉంది. సాగు నీటి అవసరం ఇప్పుడే ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో సాగునీరు అందక పంట పొలాలు నెర్రలు తీసి రైతులు కన్నీరు పెడుతున్నారు. తొండంగి మండలంలోని శివారు ప్రాంత ఆయకట్టు రైతులు సాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పై ఆధారపడ్డ తొండంగి మండలంలోని దిగువ ప్రాంత ఆయకట్టుకు అరకొరగా నీరు అందుతోంది. గొల్లప్రోలు మండలం మల్లవరం చెరువు(ఆర్ఆర్బీ ట్యాంక్) నుంచి పిఠాపురం బ్రాంచి కెనాల్ ద్వారా తొండంగి మండలం రావికంపాడు, ఏవి నగరం, కొమ్మనాపల్లి మీదుగా కోదాడ ఉప్పుచెరువుకు సాగునీరు సరఫరా అవుతుంది. ఈ చెరువు ఆయకట్టు కింద శృంగవృక్షంపేట, శృంగవృక్షం, పాత కోదాడ, కొత్తకోదాడ గ్రామాల్లో రబీ సాగవుతోంది. ఈ గ్రామాల్లోని శివారు ఆయకట్టుకు సాగునీటి ఎద్దడి ఏర్పడటంతో ఇటీవల రైతులు ఆందోళనకు దిగారు. విషయం తెలిసి జిల్లా వ్యవసాయాధికారి వచ్చి సమస్య పరిష్కారిస్తామని చెప్పి వెళ్లారు. రెండు, మూడు రోజులు నీటి ఎద్దడి తీరిందనుకుంటుండగా ఇప్పుడు మళ్లీ ఇబ్బంది ఎదురవుతోందని రైతులు చెబుతున్నారు. చిరు పొట్ట దశలో ఉన్న తరుణంలో సాగునీటి ఎద్దడితో నష్టపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. గోడు వినే నాధుడేడి సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా నీరు ఇవ్వడం లేదు. పంటలు ఎండిపోతుంటే ఏమి చేయాలో తెలియక గుడ్లు అప్పగించి చూస్తున్నాం. సుమారు 40 వేల పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశా. ఇప్పుడు పంట ఎండిపోతే పెట్టుబడి కూడా రాదు. అన్ని అప్పు చేసి పెట్టినవే పంటలకు నీరు ఇచ్చి ఆదుకోక పోతే ఇక చావే శరణ్యం. – పోతుల తాతారావు, కౌలు రైతు, భోగాపురం, పిఠాపురం మండలం వంతులవారీతో కొంత ఆలస్యం ఏలేరు శివారు ప్రాంతాలకు వంతుల వారీ విధానం వల్ల కొంత ఆలస్యం అవుతుంది. వంతు వచ్చే సరికి భూమి నెర్రలు తీస్తోంది. తేమ ఉండడం వల్ల పంటలు ఎండిపోవు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వేసవికాలం ముందుగా రావడంతో నీటి ఎద్దడి ఏర్పడింది. ఏలేరు రిజర్వాయర్లో తగినంత నీరు ఉంది. కాలువలు బాగోక సరఫరా ఇబ్బంది అవుతోంది. ఉపాధి హామీ పథకంలో కాలువలు శుభ్రం చేయించి నీరు వదులుతున్నాం. – శేషగిరిరావు, ఈఈ, నీటిపారుదల శాఖ, ఏలేరు08కేకేడీ 04:మరమ్మతులతో రబీకి నష్టం ఈ సీజన్లో రైతులకు పంపా ఆయకట్టు పరిధిలో రబీ సాగే లేకుండా పోయింది. పంపా ఆయకట్టు రైతులకు గడచిన నాలుగు సంవత్సరాలు స్వర్ణ యుగమనే చెప్పాలి. ప్రతి ఏటా రబీకి ఇబ్బంది లేకుండా అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసింది. స్థానిక ప్రజాప్రతినిధులు పట్టుబట్టి రబీలో సాగునీటికి ఇబ్బంది లేకుండా చూశారు. అటువంటిది చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో పంపా ఆయకట్టు రైతులకు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. పంపా ప్రాజెక్ట్ కింద 12,500 ఎకరాలు సాగవుతోంది. బ్యారేజీ ఆధునీకరణ పేరుతో రబీ నీరు విడుదలకు బ్రేక్లు వేశారు. నాలుగేళ్లుగా రబీలో సాగుచేస్తోన్న రైతులు ఈ రబీలో సాగునీరు లేక పంట గాలికొదిలేశారు. గేట్లు మరమ్మతులకని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 3.36 కోట్లు ప్రకటించారు. ఈ నిధులతో గేట్లు మరమ్మతులు నెలాఖరులోపు పూర్తి చేయాలి. లేకపోతే ఆ నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. ఈ మరమ్మతుల పేరుతో రబీ కోల్పోవాల్సి వచ్చిందని ఆయకట్టు రైతులు లబోదిబోమంటున్నారు. -
ప్రజలు కమ్యూనిస్టులను ఆదరిస్తారు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కాకినాడ సిటీ: అమరవీరుల స్ఫూర్తితో నిరంతరం ప్రజాసేవ చేస్తే ప్రజలు కమ్యూనిస్టులను తప్పనిసరిగా ఆదరిస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ అన్నదాన సమాజంలో నవ సమాజం కోసం పుస్తకావిష్కరణ సభ సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో శ్రీనివాసరావు ముఖ్యవక్తగా మాట్లాడారు. కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర అంటే ఆ కాలంలో ప్రజా పోరాటాల చరిత్రే అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్వాతంత్రోద్యమ కాలంలోనే కమ్యూనిస్టు బీజాలు పడ్డాయన్నారు. ఆనాడు కాకినాడ అన్నదాన సమాజంలో రహస్యంగా పార్టీ ఏర్పడిందన్నారు. 1934–1964 మధ్య జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ ఘట్టాలను వివరిస్తూ సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వా శేషుబాబ్జీ నవ సమాజం కోసం పేరుతో పుస్తకం రచించడం అభినందనీయమన్నారు. కమ్యూనిజం అంతరించిపోయిందని ప్రచారం జరిగిన అమెరికాలోనే కమ్యూనిస్టు పేరు వింటేనే ట్రంప్ ఉలిక్కి పడతున్నారన్నారు. దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎర్రజెండా వైపు చూస్తారన్నారు. అమరుల స్ఫూర్తితో ప్రజల నుంచి నేర్చుకుని ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవాలన్నారు. డాక్టర్ చెలికాని స్టాలిన్, డాక్టర్ పి.చిరంజీవినీకుమారిలతో పాటు సీపీఐ నాయకులు తాటిపాక మధు, బోడకొండ, కె.సత్తిబాబు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు, లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయ, చిన్నిబిల్లి నాగేశ్వరరావు, సీపీఐ ఎంఎల్ నాయకులు నాగరాజు, కొండ దుర్గారావు, సీపీఎం నాయకులు టి.అరుణ్ తదితరులు సమావేశంలో మాట్లాడారు. దేశాన్ని మతోన్మాద శక్తుల బారి నుంచి కాపాడుకోవాలన్నారు. ఐక్య ఉద్యమాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. శేషుబాబ్జీ కృషిని నాయకులు అభినందించారు. కమ్యూనిస్టు ఉద్యమంలో అమరులైన నాయకుల కుటుంబ సభ్యులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో అమరుల ఫొటోలతో పాటు వారి గురించి క్లుప్తంగా తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సభకు ముందుగా అమరులకు నివాళులర్పించారు. సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏవీ నాగేశ్వరరావుతో పాటు రచయిత దువ్వా శేషుబాబ్జీ, నాయకులు జి బేబీరాణి, కేఎస్ శ్రీనివాస్, పలివెల వీరబాబు, సీహెచ్ రమణి, సీహెచ్ రాజ్కుమార్, నీలపాల సూరిబాబు, కె సత్తిరాజు, మలక వెంకటరమణ, దుంపల ప్రసాద్, కె నాగజ్యోతి, చంద్రమళ్ల పద్మ, చంద్రావతి, రాణి, నాగలక్ష్మి పాల్గొన్నారు. -
వినిపించని ఆకలి కేకలు
కాకినాడ క్రైం: మహిళా దినోత్సవం ముగిసింది, జిల్లాలో ఈ సంబరాలు అంబరాన్ని తాకాయి. వారోత్సవాలతో వారం రోజులూ పండగ వాతావరణం నెలకొంది. ర్యాలీలు, మారథాన్లు, ఆటలు, పాటలు, ఉపన్యాసాలు, మానవహారాలు ఒకటా, రెండా.. విమెన్స్ డే వేడుకలతో జిల్లా దద్దరిల్లింది. ఇది నాణానికి ఓ వైపు మాత్రమే. మరోవైపు సదరు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగులు ఎవరికీ జీతాలు లేవు. ఊకదంపుడు ఉపన్యాసాల్లో మాటలన్నీ ముఖస్తుతికేనన్న విషయం తేలిపోయింది. గతేడాది ఆగస్టు నుంచి గొడ్డు చాకిరీ చేస్తున్నా జీతాలకు మాత్రం వారు నోచుకోలేదు. కష్టపడి పని చేసినా వారికి జీతం ఇవ్వడం లేదు. ఈ దుస్థితి ఇంకేదో డిపార్టుమెంట్లో కాదు. మహిళా భద్రత, భవిత, భరోసా కోసం నిర్దేశించిన సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులదే. పేరుకు తగ్గట్టుగానే జిల్లాలో ఈ శాఖలో మహిళా ఉద్యోగులే ఎక్కువ. ఈ డిపార్టుమెంట్లో ఉన్న మూడు కీలక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న సుమారు 800 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు నెలల తరబడి జీతాల్లేకపోవడంతో, అప్పులపాలై వారి కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి నెలకొంది. శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. కానీ సిబ్బంది ఆకలి కేకలు వారిలో ఏ ఒక్కరికీ వినిపించ లేదు. విమెన్ అండ్ చైల్డ్ డెవలెప్మెంట్ డిపార్టుమెంట్లో ఉన్న రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు అందుతుండగా, వారంతా అధికార హోదాలో కొనసాగుతున్నారు. క్షేత్ర స్థాయిలో వారు నిర్దేశించే ప్రతి పని పూర్తి చేయాల్సిన కష్టం.. చిరుద్యోగులైన కాంట్రాక్టు సిబ్బందిదే. ఈ డిపార్టుమెంట్ పరిధిలో సేవలందిస్తున్న ఐసీడీఎస్కు చెందిన అంగన్వాడీలకు ఈ నెలలో నేటికీ జీతాలే పడలేదు. వీరంతా మహిళలే, కనీసం 600 మంది ఉంటారు. అంగన్వాడీ కేంద్రాల అద్దెలను కూడా వీరు తమ జీతాల నుంచే చెల్లిస్తారు. ఈ అద్దెలు విడుదల చేసి ఆరు నెలలకు పైగా అయింది. సీమంతాల కోసం ప్రతి అంగన్వాడీ కార్యకర్త చేతిలో సొంత డబ్బు వెచ్చిస్తారు. నెలవారీ రూ.500 చొప్పున ఖర్చు చేస్తారు. ఇవి తిరిగి చెల్లించి ఏడాది కావస్తోంది. తప్పని నరకయాతన మహిళా దినోత్సవాల పేరుతో అంగన్వాడీలు ప్రత్యక్ష నరకం చూశారు. అధికారులు వీరితో ఓ ఆటాడుకున్నారు. జీతాలు నేటికీ రాకపోయినా చాకిరీ చేయించారు. ఠంచనుగా జీతాలు తీసుకుంటున్న రెగ్యులర్ హోదాలో కొనసాగుతున్న ఉద్యోగులకు విధి నిర్వహణలో ఇంతటి కష్టం లేదు. అఽధికార హోదాలో వారు తీవ్రమైన పని ఒత్తిడిని అంగన్వాడీలపై పెడుతున్నారు. వారోత్సవాలంటూ రేయింబవళ్లు తేడా లేకుండా పోయింది. ర్యాలీలు, మారథాన్లకు ఉదయాన్నే వచ్చి వాలిపోవాలన్నారు. రానివారికి మెమోలు ఇస్తామని బెదిరించారు. వచ్చి పడిగాపులు కాస్తే అఽధికారులు ఎప్పటికో తీరికగా కార్లు దిగేవారు. పోషకాహార గొప్పతనాన్ని చెబుతూ, ప్రతి అంగన్వాడీ సిబ్బంది రెండు, మూడు రకాల చిరుధాన్యాల వంటలు వండి తేవాలన్నారు. ఆకలి పస్తులున్నా, ఆటల్లో పాల్గొనక తప్పదని ఒత్తిడి తెచ్చారు. వీటన్నింటినీ మించి ఇల్లూ వాకిలి వదిలి, పిల్లలు, భర్తను విడిచి ఉదయాన్నే వాలిపోవాలంటూ హుకుం జారీ చేశారు. ఉన్నతాధికార్లకు నివేదించాం సిబ్బందికి జీతాలు చెల్లించలేదనేది వాస్తవమే. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం. ఫైల్ కూడా పంపించాం. త్వరలో పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం. – కె.విజయకుమారి, పీడీ, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, కాకినాడ మహిళా దినోత్సవం నాటికీ అందని వేతనాలు ఉసూరుమంటున్న మహిళా సిబ్బంది సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలో దయనీయ స్థితి వారోత్సవాల పేరుతో అంగన్వాడీలకు ప్రత్యక్ష నరకం మూడు నెలలు దాటినా.. అలాగే ఐసీపీఎస్, శిశు గృహ పరిఽధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు చేతికంది మూడు నెలలు దాటింది. ఇదే పరిధిలో ఉన్న దిశ వన్స్టాప్ సెంటర్ ఉద్యోగులకు గతేడాది ఆగస్టు తర్వాత జీతాలే లేవు. వీరంతా ఆకలి పస్తులుంటూ, అప్పులు చేసుకుంటూ, వారి జీవితాలను నెట్టుకొస్తున్నారు. కష్టాన్నంతా పంటికింద బిగువపట్టి ఉద్యోగాలు చేస్తున్నారు. కనీసం తమ ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్కై నా చేతిలో చిల్లిగవ్వ ఉండడం లేదంటూ తమ ఆవేదనను వెళ్లబోసుకుంటున్నారు. జీతాలు ఇవ్వకున్నా ఫీల్డ్ వర్క్ తప్పడం లేదని చెబుతున్నారు. -
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి చంద్రబాబు షాక్
అమరావతి: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు..ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారు. దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే రెండు సార్లు మోసపోయిన వర్మ.. మరోసారి దానికి గురి కాకతప్పలేదు. తాజాగా టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు.పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఎమ్మెల్యే సీటును వర్మ వదులుకున్న క్రమంలో ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు తీరా చూస్తే వర్మ కి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు చంద్రబాబు. దాంతో చంద్రబాబు తీరుపై వర్మ వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరొకవైపు వర్మ రాజకీయ భవిష్యత్ ముగిసిందనే ప్రచారం కూడా సాగుతోంది. చంద్రబాబు ఇచ్చిన షాక్ తో వర్మ వర్గం అయోమయంలో పడింది. తమనేత రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఏం చేయాలనే దానిపై వారు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. -
జనసేన నేత వీరంగం.. వైద్యురాలిపై దౌర్జన్యం
సాక్షి, కాకినాడ జిల్లా: అధికారం చేతిలో ఉంది కదా అని కూటమి నేతలు బరితెగిస్తున్నారు. జనసేన నాయకుడు రెచ్చిపోయాడు. ప్రత్తిపాడు సిహెచ్సీ వైద్య సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేయాలంటూ వేలు చూపిస్తూ వైద్యులకు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు వార్నింగ్ ఇచ్చాడు.రోగులకు వైద్యం చేస్తున్న సమయంలో డాక్టర్ శ్వేతకు తమ్మయ్యబాబు ఫోన్ చేశారు. ఆయనెవరో తెలియదని.. వేరొకరికి వైద్యం చేస్తున్నానని వైద్యురాలు చెప్పారు. ఫోన్లో మాట్లాడడానికి వైద్యురాలు నిరాకరించడంతో తమ్మయ్య బాబు.. నేరుగా ఆసుపత్రికి వచ్చి డాక్టర్ శ్వేతతో పాటుగా అక్కడున్న వైద్య సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. జ్ఞానం ఉందా?.. నోర్మూయ్ అంటూ వైదురాలిపై అరుపులతో వీరంగం సృష్టించారు. -
మహిళలతోనే సమాజాభివృద్ధి
కాకినాడ రూరల్: మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్ సీపీ మహిళా నేత, పిఠాపురం నియోజవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎంపీ వంగా గీత అన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే మహిళలకు సంపూర్ణ గౌరవం దక్కిందని గుర్తు చేశారు. కాకినాడ వైద్య నగర్లోని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు నివాసం వద్ద పార్టీ మహిళా నేత వంగా గీత, మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత ఆధ్వర్యాన అంతర్జాతీయ మహిళా దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. గీత కేక్ కట్ చేసి పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, కన్నబాబు, కాకినాడ సిటీ, జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం కో ఆర్టినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, తోట నరసింహం, ముద్రగడ గిరిబాబు, దవులూరి దొరబాబులతో పాటు మహిళా నేతలకు తినిపించారు. జై జగన్ అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినదించారు. వారికి కన్నబాబు, దాడిశెట్టి రాజా తదితరులు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ, అన్ని రంగాల్లోనూ మహిళలు ముందుండాలని, వారు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుందని నమ్మి, వారి అభివృద్ధిని చేతల్లో చూపిన నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అని అన్నారు. పిల్లల చదువు కోసం అమ్మ ఎక్కడా చేయి చాచకూడదనే సమున్నత లక్ష్యంతో అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టారన్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చారని, మహిళల రక్షణకు దిశా చట్టం తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించారని చెప్పారు. మహిళలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారన్నారు. ప్రజల కోసం పోరాటం చేసే జగన్ కోసం ముందుకు నడుస్తామని అన్నారు. వర్ధినీడి సుజాత మాట్లాడుతూ, ఇప్పటి ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మహిళల పేరిట జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చారని చెప్పారు. పార్టీ బలోపేతానికి మహిళలు కృషి చేయాలని కోరారు. కన్నబాబు మాట్లాడుతూ, జగన్మోహన్రెడ్డి మహిళా పక్షపాతిగా మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించారని అన్నారు. మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్రతి నెలా రూ.1,500, ఉచిత బస్సు అంటూ చంద్రబాబు అబద్ధాలు చెప్పారన్నారు. మాట ఇస్తే నిలబెట్టుకునే జగన్మోహన్రెడ్డి వెనుక ఉండటం మనందరి అదృష్టమని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మహిళా నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు పెదపాటి అమ్మాజీ, జమ్మలమడక నాగమణి, సుంకర శివప్రసన్న, రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, లక్ష్మీశివకుమారి, కవికొండల సరోజ, జెడ్పీ వైస్చైర్పర్సన్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఫ జగన్ ప్రభుత్వంలోనే వారికి సంపూర్ణ గౌరవం ఫ వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎంపీ వంగా గీత ఫ కాకినాడలో ఘనంగా మహిళా దినోత్సవం -
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి ˘
కాకినాడ సిటీ: ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా ఎదగాలని జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, డీఆర్డీఏ, మెప్మా శాఖల సంయుక్త ఆధ్వర్యాన రాజా ట్యాంక్ ప్రాంగణంలో శనివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని తమ ప్రభుత్వం త్వరలోనే కల్పిస్తుందని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మే నెలలో చదువుకునే పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున వారి తల్లుల ఖాతాలో జమ చేస్తుందని చెప్పారు. డీఆర్డీఏ ద్వారా ఈ ఏడాది బ్యాంకు లింకేజీ కార్యక్రమం కింద 588 మహిళా స్వయం సహాయ బృందాలకు రూ.100 కోట్లు అందించామన్నారు. దీనికి సంబంధించిన మెగా చెక్ను అందజేశారు. ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ మిషన్ ద్వారా 78 వేల మంది మహిళలకు రూ.39 లక్షల మేర లబ్ధి చేకూర్చామన్నారు. కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎస్పీ జి.బిందుమాధవ్, నగరపాలక సంస్థ కమిషనర్ భావన తదితరులు పాల్గొన్నారు. స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి కాకినాడ రూరల్: మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ఆధ్వర్యాన కాకినాడ ఒకటో డివిజన్ వినాయక కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టైలరింగ్పై మహిళలకు మూడు నెలల శిక్షణ అనంతరం ఉచితంగా కుట్టు మెషీన్లు అందిస్తామన్నారు. ఈ పథకం కింద జిల్లాలో 3,789 మందికి రూ.9.47 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బాల బాలాజీకి రూ.3.36 లక్షల ఆదాయం మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయానికి శనివారం భారీగా భక్తులు తరలి వచ్చారు. తెల్లవారు జామున సుప్రభాత సేవ, తొలి హారతితో దర్శనాలు ప్రారంభమయ్యాయి. వివిధ సేవల ద్వారా రూ.3,36,594 ఆదాయం వచ్చింది. స్వామి వారిని ఐదు వేల మంది భక్తులు దర్శించుకున్నారు. మూడు వేల మంది అన్న ప్రసాదం స్వీకరించారు. -
యువతకు అండగా పోరుబాట
కాకినాడ రూరల్: నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం, వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం తదితర కూటమి ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ యువతకు అండగా వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టనుంది. ‘యువత పోరు’ పేరిట ఈ ఆందోళనకు సంబంధించిన కార్యాచరణపై పార్టీ నేతలు శనివారం కాకినాడలోని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు నివాసంలో శనివారం సమావేశమయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అధ్యక్షతన జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్టినేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ కాకినాడ సిటీ కార్యాలయంలో ఈ 12వ తేదీ ఉదయం వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన అనంతరం, యువత పోరు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పార్టీ కాకినాడ సిటీ కార్యాలయం నుంచి కలెక్టరేట్కు ర్యాలీగా చేరుకోవాలని నిర్ణయించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణం చెల్లించి, విద్యార్థుల్లో ఆందోళన తగ్గించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారు. సమావేశం అనంతరం ఈ వివరాలను కన్నబాబు, దాడిశెట్టి రాజా మీడియాకు వెల్లడించారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 12న యువత పోరు పేరిట పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించనున్నామని చెప్పారు. ఏరుదాటాక తెప్ప తగలేస్తున్న చందంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరును ఎండగట్టనున్నామన్నారు. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత మెరుగుపరచి అమలు చేశారని, నేడు ఆ పథకాన్ని కూటమి ప్రభుత్వం ఆపేసిందని చెప్పారు. ఇప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు హాల్ టికెట్ ఇస్తాయో, ఇవ్వవో, పరీక్షలకు కూర్చోనిస్తారో లేదో తెలియని పరిస్థితి సృష్టించారని దుయ్యబట్టారు. విద్యార్థులపై కళాశాలలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయని, ఈ విషయాలు టీడీపీ అనుకూల మీడియాలో ఎక్కడా రావని దుయ్యబట్టారు. ఒత్తిడి ఉంటే విద్యార్థులు ఏవిధంగా పరీక్షలు రాయగలుగుతారని వారు ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలిస్తామని, లేకుంటే రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పటి వరకూ ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని నిలదీశారు. మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ వంటి వాటికీ అతీగతీ లేదన్నారు. గత సీఎం జగన్ రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు తీసుకురావడం చరిత్రాత్మకమన్నారు. వీటన్నింటినీ ప్రైవేటు పరం చేస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం నిస్సిగ్గుగా చెబుతోందని దుయ్యబట్టారు. వైద్య కళాశాలలకు అనుబంధంగా పెద్ద ఎత్తున ఆస్పత్రులు వస్తాయని, తద్వారా ప్రజలకు మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వైద్య కళాశాలను ప్రైవేటుపరం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. జగన్మోహన్రెడ్డి చెప్పింది చేస్తారనేది ప్రజల నమ్మకమని, చంద్రబాబు చెప్పింది చేయరనే విషయాన్ని ఆయన పాలన చెబుతోందని కన్నబాబు, రాజా విమర్శించారు. సమావేశంలో కాకినాడ సిటీ, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, వంగా గీత, దవులూరి దొరబాబు, తోట నరసింహం, ముద్రగడ గిరి బాబు, జెడ్పీ వైస్ చైర్మన్ గుబ్బల తులసీరామ్, పార్టీ వివిధ విభాగాల ప్రతినిధులు, నాయకులు కురసాల సత్యనారాయణ, రావూరి వెంకటేశ్వరరావు, కొప్పన శివ, సుంకర విద్యాసాగర్, కాకినాడ రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ, సర్పంచ్ రామదేవు చిన్నా, పెదపాటి అమ్మాజీ, మురళీరాజు, వాసిరెడ్డి జమీలు తదితరులు పాల్గొన్నారు. ఫ 12న కాకినాడలో వైఎస్సార్ సీపీ ఆందోళన ఫ కన్నబాబు నివాసంలో కో– ఆర్డినేటర్ల సమావేశం ఫ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అధ్యక్షతన కార్యాచరణ -
రత్నగిరి.. భక్తజనసిరి
అన్నవరం: సత్యదేవుడిని శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించి, పూజలు చేశారు. రత్నగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు తమ బంధుమిత్రులతో కలసి సత్యదేవుని ఆలయానికి తరలివచ్చారు. వీరందరూ స్వామివారి వ్రతాలాచరించి, దర్శనాలు చేసుకున్నారు. దీంతో ఆలయం వద్ద రద్దీ ఏర్పడింది. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారిని 40 వేల మంది దర్శించుకున్నారు. వ్రతాలు 1,800 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్న ప్రసాదాన్ని సుమారు 4 వేల మంది స్వీకరించారు. ఆలయంలో సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. సెలవు కావడంతో ఆదివారం కూడా రత్నగిరిపై భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగించనున్నారు. -
బాధితులకు రూ.18.34 కోట్ల నష్టపరిహారం పంపిణీ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి జిల్లా పరిధిలో 42 బెంచ్లలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో రూ.18,33,80,798 నష్ట పరిహారాన్ని బాధితులకు అందజేశారు. రాజమహేంద్రవరం కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా ఇరు పార్టీలకు డబ్బు, సమయం వృథా కాకుండా చూడడమే ముఖ్య ఉద్దేశమన్నారు. ఉమ్మడి జిల్లాలో రాత్రి 9 గంటల వరకూ 5,297 క్రిమినల్, 474 సివిల్, 147 ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించామన్నారు. డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి మాట్లాడుతూ కేసుల పరిష్కారం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం జరిగేలా న్యాయమూర్తులు, కోర్టులు పనిచేస్తాయన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,000 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
పొలాలను వదిలి.. రోడ్డుపై బైఠాయించి..
● సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతన్నలు ● జాతీయ రహదారి 216పై రాస్తారోకో ● అధికారుల హామీతో ఆందోళన విరమణ తాళ్లరేవు: సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. జాతీయ రహదారి 216పై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పి.మల్లవరం పంచాయతీ పరిధిలోని శివారు భూములకు కొన్ని రోజులుగా సాగునీరు అందక వరి చేలు ఎండిపోతుండడంతో శనివారం రైతులు పోలేకుర్రు ఇరిగేషన్ కార్యాలయం వద్దకు వచ్చారు. అయితే కార్యాలయంలో ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. చెంతనే ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఆందోళకారులతో చర్చలు విషయం తెలుసుకున్న కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. రైతులు తమ సమస్యలను ఎస్సైతో పాటు రెవెన్యూ అధికారులకూ మొరపెట్టుకున్నారు. పి.మల్లవరం పంచాయతీ శివారు మూలపొలం, గ్రాంటు, రాంజీనగర్ గ్రామాలకు 20 రోజులుగా సాగునీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వరిచేలు పొట్టదశలో ఉన్నాయని, ఈ సమయంలో సరిపడా నీరు లేకపోతే తీవ్రంగా నష్టపోతామన్నారు. వంతుల వారీ విధానం పెట్టినప్పటి నుంచి సాగునీరు సరఫరా కావడం లేదన్నారు. ఎగువ రైతులకు మేలు జరుగుతుందని, తమ వంతు వచ్చేసరికి కాలువ చివరికే నీరు రావడం లేదన్నారు. తూతూమంత్రంగా.. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు ఈ సమస్యను విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని రైతులు వాపోయారు. అధికారులు తూతూ మంత్రంగా వచ్చి వెళుతున్నారని, అయితే సాగునీరు మాత్రం వరిచేలోకి రావడం లేదన్నారు. సాగు ప్రారంభంలో అధికారులను సంప్రదిస్తే ప్రతి ఎకరాకు నీరిస్తామని చెప్పారని అయితే ప్రస్తుతం నీరు అందక సుమారు 600 ఎకరాలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. కాగా.. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేస్తామని అధికారులు చెప్పడంతో ఆందోళన విరమించారు. తక్షణమే సరఫరా చేయాలి సాగునీరు లేక ఎండిపోతున్న శివారు ప్రాంత భూములకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా మండలంలో పర్యటిస్తున్న ఆయన రైతుల ఆందోళన విషయం తెలుసుకుని అక్కడకు వచ్చారు. రైతుల సమస్యలు తెలుసుకుని ధవళేశ్వరం సర్కిల్ ఇరిగేషన్ ఈఈ రామకృష్ణతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ పంటలు కళ్లెదుటే ఎండిపోతుంటే చూడలేక రైతులు రోడ్డు మీదకు వచ్చారననారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సాగునీటి సమస్య వచ్చిందన్నారు. దీన్ని అత్యవసర పరిస్థితిగా భావించి అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన కదిలి, ప్రత్యేక అధికారిని వేయడంతో పాటు, ఎత్తిపోతల ద్వారానైనా ప్రతి ఎకరాకు సాగునీరందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం ప్రతినిధులు మోర్త రాజశేఖర్, వల్లు రాజబాబు, టి.ఈశ్వరరావు, రైతులు మేడిశెట్టి శ్రీనివాసరావు, పితాని సత్తిబాబు, కె.వెంకన్నబాబు రాజు, కాదా సాయిబాబు, కావూరి వెంకన్న, పేరాబత్తుల సాయి తదితరులు పాల్గొన్నారు. -
హెల్త్ సిటీలో రక్త రుగ్మతల కేంద్రం
ఆరిలోవ (విశాఖపట్నం): మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని హెల్త్ సిటీ యునిక్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రక్త రుగ్మతుల కేంద్రాన్ని హెమటాలజీ పితామహుడు డాక్టర్ మామ్మెన్ చాందీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సికిల్ సెల్, తలసేమియాతో బాధపడుతున్నవారికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణను అభినందించారు. నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సదాశివుడు మాట్లాడుతూ విశాఖలో రక్త రుగ్మతుల కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆరోగ్య సంరక్షణలో కీలక ముందుడుగు పడిందన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఏపీతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఎక్కడా రక్త వ్యాధులను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా హెమటాలజీ కేంద్రం లేదన్నారు. ఈ లోటును భర్తీ చేయడానికి ఇక్కడ సమగ్ర రక్త రుగ్మతల కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
ఆ మృతదేహం ఎవరిదో..
పిఠాపురం: మృతుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో వారికి దొరికిన రాగి కడియం, మొలతాడే కీలక ఆధారాలుగా మారాయి. హత్య జరిగిందని నిర్ధారించినా అసలు హతుడు ఎవరో తెలియక దర్యాప్తు ముందుకు కదలడం లేదు. వివర్లాలోకి వెళితే.. గొల్లప్రోలు మండలం చేబ్రోలు 216 జాతీయ రహదారి పక్కన ఈ నెల 3వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ఆ కేసు దర్యాపు చేస్తున్నారు. అన్ని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలలోను మిస్సింగ్ కేసులను వెతుకుతున్నారు. హతుడి వద్ద లభించిన రాగి కడియం, మొలతాడు ఆధారంగా ఆచూకీ తెలుసుకోవడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు మృతుడి ఫోటోలు పంపారు. ఘటనా స్థలం సమీపంలోని ప్రాంతాలలో సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. అయితే ఆరు రోజులు గడుస్తున్నా ఎటువంటి చిన్న ఆధారం ఆచూకీ దొరకలేదు.● ముమ్మరంగా పోలీసుల దర్యాప్తు ● రాగి కడియం, మొలతాడే కీలక ఆధారాలు ● ఆరు రోజులైనా దొరకని ఆచూకీ -
ప్రాజెక్ట్.. పర్ఫెక్ట్
● ఇన్స్పైర్ మనక్లో సత్తా చాటిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ● ఉత్తమ ప్రాజెక్టులుగా 305 ఎంపిక ● ఎంపికై న ప్రాజెక్టుకు రూ.10 వేల కేటాయింపు ● మెరుగులు దిద్దుకునేందుకు అవకాశం రాయవరం: వినూత్న ఆలోచనలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యార్థులు సైన్స్ ప్రయోగాల్లో దూసుకుపోతున్నారు. సరికొత్త ఆలోచనలతో తమ మెదళ్లకు పదును పెడుతూ నూతన ఆవిష్కరణలకు జీవం పోస్తున్నారు. విద్యార్థుల్లో సైన్స్పై అభిరుచి, ఆసక్తి కలిగేలా ఉపాధ్యాయులు బోధన చేస్తుంటే, దానికి అనుగుణంగా విద్యార్థులు కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏటా ఇన్స్పైర్ మనక్ పురస్కారాలతో విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. 2024–25 విద్యా సంవత్సరంలో మనక్ నామినేషన్లకు అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 3,200 నామినేషన్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. వాటిలో ఉత్తమ ప్రాజెక్టులుగా 305 నామినేషన్లు ఎంపికయ్యాయి. వీటిలో కోనసీమ జిల్లా నుంచి 85, తూర్పుగోదావరి జిల్లా నుంచి 100, కాకినాడ జిల్లా నుంచి 120 నుంచి ఉన్నాయి. ప్రాజెక్టులకు ప్రోత్సాహకం : డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్నోవేషన్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్స్పైర్ మనక్ 2024–25 పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 305 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. గతేడాది 397 ప్రాజెక్టులు జిల్లా స్థాయిలో ఎంపిక కాగా, ఉమ్మడి జిల్లా నుంచి 27 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం గమనార్హం. జాతీయ స్థాయికి మూడు జిల్లాల నుంచి మూడు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఇదిలా ఉంటే జిల్లా స్థాయికి ఎంపికై న 305 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10 వేల వంతున ప్రతి ప్రాజెక్టుకు ప్రోత్సాహకం అందజేయనున్నారు. సైన్స్ సాంకేతిక రంగాలపై విద్యార్థులకు ఆసక్తి పెంచేలా కేంద్ర ప్రభుత్వం ఈ పోటీలను నిర్వహిస్తోంది. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులను వీటిలో భాగస్వాములను చేశారు. ప్రాథమికోన్నత పాఠశాల నుంచి మూడు, ఉన్నత పాఠశాల నుంచి ఐదు వంతున నామినేషన్లను పంపించారు. పర్యావరణ పరిరక్షణ, అధునాతన వ్యవసాయ విధానాలు, హెల్త్ న్యూట్రిషన్ వంటి అంశాలపై నూతన ఆవిష్కరణలు రూపొందించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి జాతీయ స్థాయికి ఎంపికై న ప్రాజెక్టు -
ప్లేట్లెట్లు తగ్గిపోయిన గర్భిణికి ప్రసవం
అమలాపురం టౌన్: మనిషి శరీరంలో రక్త కణాలు (ప్లేట్లెట్లు) లక్షల్లోంచి వేలల్లోకి పడిపోతే మనం కంగారు పడతాం. అలాంటిది ఓ గర్భిణికి ప్లేట్లెట్లు 15 వేలకు పడపోవడమే కాకుండా మధుమేహం కూడా తోడవడంతో ఆమె ప్రసవం కష్టమైంది. ఈ తరుణంలో వైద్యులు రిస్క్తో శస్త్ర చికిత్స చేశారు. ఇప్పుడు తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి నెలల నిండడంతో ప్రసవం కోసం అమలాపురంలోని సాయి రవీంద్ర హాస్పిటల్లో చేరింది. చేరే సమయానికే ఆమె ఇమ్యూన్ థ్రోంబోసైటోపెనియా (ఐటీపీ) ప్లేట్లెట్లు 15 వేలకు పడిపోయి మధుమేహంతో బాధపడుతోంది. హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ గంధం భవానీ ..ఆమె ప్రసవం ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ఫిజిషియన్ డాక్టర్ శ్రీహరి, మత్తు వైద్యుడు సందీప్, పిల్లల డాక్టర్ యోగానంద్, ఆర్థోపెడిక్ రవీంద్రలతో కూడిన వైద్య బృందం శస్త్ర చికత్స చేసి ప్రసవం చేశారు. ఇప్పుడు తల్లీ బిడ్డ ఆరోగ్యంగా కోలుకుంటున్నారని డాక్టర్ భవాని తెలిపారు. -
వెంబడించిన ఎక్సైజ్ పోలీసులు
● బైక్ పై వేగంగా వెళుతూ లారీని ఢీకొన్న యువకులు ● ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం తాళ్లరేవు: యానాం – ద్రాక్షారామ రహదారిలోని ఇంజరం వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరప మండలం గురజనాపల్లి శివారు అడివిపూడి గ్రామానికి చెందిన కోట శ్రీరామ్ (21), పిఠాపురానికి చెందిన మరో యువకుడు పెద్దాపురంలోని ఒక కళాశాలలో చదువుతున్నారు. వీరు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం వచ్చి తిరిగి వెళుతుండగా మద్యం తరలిస్తున్నారనే అనుమానంతో సుంకరపాలెం ఎకై ్సజ్ చెక్పోస్టు వద్ద పోలీసులు ఆపారు. అయితే వీరు బైక్ ఆపకుండా వెళ్లిపోవడంతో ఎకై ్సజ్ పోలీసులు వెంబడించారు. దీంతో వేగంగా బైక్ నడుపుతూ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కోట శ్రీరామ్కు తీవ్రగాయాలై రక్తస్రావమైంది. స్థానికులు హుటాహుటీన యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మరో యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఎకై ్సజ్ చెక్ పోస్టు ముట్టడి యువకుడు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న స్థానికులు ఎకై ్సజ్ చెక్పోస్టు వద్దకు చేరుకుని ముట్టడించారు. ఎకై ్సజ్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే నిండుప్రాణం బలై పోయిందని సిబ్బందిని నిలదీశారు. డిపార్ట్మెంట్కు సంబంధం లేని ఒక ప్రైవేటు వ్యక్తిని మద్యం దుకాణాల వద్ద నిఘా పెట్టి.. అతడు ఇచ్చిన సమాచారంతో ప్రతి రోజూ ఇదే మాదిరిగా వేధిస్తున్నారన్నారని ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ సుంకరపాలెం చెక్పోస్టు వద్ద పరిస్థితిని సమీక్షించారు. తీవ్ర ఉద్రిక్తత సుంకరపాలెం పరిసర గ్రామాల నుంచి అనేక మంది ప్రజలు ఎకై ్సజ్ చెక్పోస్టును ముట్టడించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోట శ్రీకాంత్ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. వారితో కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్య మురళి, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరెంటెండెంట్ మౌనిక, ఎకై ్సజ్ సీఐ స్వామి చర్చిస్తున్నారు. ఇంద్రపాలెం, గొల్లపాలెం, తిమ్మాపురం ఎస్సైలు వీరబాబు, మోహన్కుమార్, రవీంద్ర శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. -
గౌరవిస్తేనే సంపూర్ణ మహిళా సాధికారిత
– జేఎన్టీయూకే వీసీ డాక్టర్ ప్రసాద్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సీ్త్రలను గౌరవించినప్పుడే సంపూర్ణ మహిళా సాధికారిత సాధ్యమవుతుందని జేఎన్టీయూకే వీసీ డాక్టర్ సీఎస్ఆర్కే ప్రసాద్ పేర్కొన్నారు. జేఎన్టీయూకేలో వుమెన్ ఎంపవర్మెంట్ గ్రీవెన్స్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద్ మాట్లాడుతూ కాలం ఎంతో విలువైందని, మహిళలు తమ కంటూ లక్ష్యం ఏర్పరచుకుని ఆ లక్ష్యాన్ని చేరేవరకూ నిరంతరం శ్రమించాలన్నారు. ఫిలిప్పీన్ దేశ జనాభాలో అత్యధికంగా మహిళలే ఉద్యోగం చేస్తున్నారన్నారు. మహనీయులను ఆదర్శంగా తీసుకుని నలుగురికి ఉపయోగపడేలా సేవలందిస్తూ ఉన్నత శిఖారాలు అధిరోహించాలన్నారు. వర్సిటీలో మహిళా సాఽధికారత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని, మహిళలు విద్యార్థి దశలో విద్యకు అధిక ప్రాధాన్యమివ్వడంతో పాటు ఇతరులకు విద్యపట్ల అవగాహన కల్పించాలన్నారు. మరో ముఖ్యఅతిథి నన్నయ వర్సిటీ వీసీ ప్రసన్నశ్రీ మాట్లాడుతూ సమాజంలో మహిళను బలపరిస్తే ఆమె ఒక కుటుంబాన్ని బలపరుస్తుందని, ఒక కుటుంబం బలంగా ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. సమాజంలో ప్రతి మనిషికి ఆత్మ గౌరవం ఉంటుందని, మహిళలు ఆ ఆత్మగౌరవంతో అవకాశాలు చేజిక్కించుకోవాలన్నారు. అనంతరం లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు రూ.20 వేలు ఉపకార వేతనం ఇస్తుండగా వచ్చే విద్యాసంవత్సరం ప్రతి విద్యార్థికి స్కాలర్ షిప్ ఇవ్వడానికి ముందుకు రావడంపై అభినందించారు. అనంతరం నన్నయ వీసీ ప్రసన్నశ్రీని సత్కరించారు. రెక్టార్ కేవీ రమణ, ఇన్చార్జి రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, డైరెక్టర్ రత్నకుమారి పాల్గొన్నారు. -
సాగులో వనితర సాధ్యులు
ప్రేమాదరణకు ‘సిరి’ సామర్లకోట: పట్టణంలోని సిరి మానసిక దివ్యాంగుల కేంద్రం అక్కడి విద్యార్థులకు ప్రేమాదరణలతో విరాజిల్లుతోంది. సుమారు వంద మంది మానసిక దివ్యాంగులకు వివిధ రకాల సేవలు అందించడమే కాకుండా, వారు ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి వృత్తి శిక్షణ ఇస్తున్నారు సంస్థ నిర్వాహకురాలు గోపీదేవి. సాధారణ మహిళగా 1994లో పెద్దాపురం రోడ్డు బడేలమ్మ చెరువు ఎదురుగా మానసిక దివ్యాంగుల సేవా సంస్థ సిరి స్థాపించారు. అనేక మందికి ఈ సంస్థ సేవలందిస్తూ, మానసిక పరిస్థితి సక్రమంగా లేనివారికి ఆమె ఆధ్వర్యంలో సేవలందిస్తున్నారు. దాంతో ఆమె ఇప్పటి వరకు అనేక సేవా పథకాలను అందుకున్నారు. నిరుపేద మహిళలకు ఉచితంగా విద్య, వసతి, ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా మానసిక వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆ వెలుగుల్లో తానూ ప్రకాశిస్తూ తన జీవితానికి అర్థం పరమార్థం సేవలోనే లభిస్తుందని ఎంతో ఆనందం వెలిబుచ్చారు గోపీదేవి. శ్రీకాకుళంలో బీఏ పట్టా తీసుకున్న అనంతరం మానసిక వికలాంగులకు సేవ చేయాలనే కోరికతో మెంటల్ రిటార్డేషన్లో డిప్లామా కోర్సు చేశారు. తండ్రి దాశెట్టి సూర్యకుమార్ ఇచ్చిన రూ.రెండు లక్షలతో తాత అప్పలరాజు స్వస్థలమైన సామర్ల కోటలో మానసిక వికలాంగుల సేవాసంస్థ ‘సిరి’ని స్థాపించారు. తల్లిదండ్రుల ఆర్థిక సహాయంతోనూ, ప్రజల నుంచి సేకరించిన విరాళాలతోనూ సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. 2000 సంవత్సరంలో సిరికి ప్రభుత్వ గుర్తింపు లభించింది. మతిస్థిమితం లేని బాలబాలికలకు ఉచిత విద్య, భోజనం, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, శారీ పెయింటింగ్, సర్ఫ్ తయారీ, రీడింగ్, రైటింగ్, ప్రవర్తనా సర్దుబాటు, వృత్తి విద్యల్లో నాణ్యమైన శిక్షణ ఇస్తున్నారు. ఆమె సేవలకు రాష్ట్ర ప్రభుత్వం 10 సార్లు ‘బెస్ట్ సోషల్ వర్కర్’ అవార్డులు ఇచ్చింది. కేవలం అవార్డుల కోసం కాకుండా మానసిక పరిపక్వత లేని 5–15 సంవత్సరాల వయస్సు కలిగిన బాలబాలికలకు శిక్షణ ఇస్తున్నట్టు గోపీదేవి తెలిపారు.● ఇంటి పని నుంచి పంట పనిలోకి.. ● అగ్రి‘కల్చర్’లో దూసుకుపోతున్న మహిళలు ● ప్రకృతి వ్యవసాయ రంగంలో మహిళామణులు పిఠాపురం: ఈ వనితలు చెట్టూ పుట్టా గట్టూ దాటుకుంటూ చేలల్లో కలియతిరుగుతూ పురుషులకు దీటుగా పని చేసి చూపిస్తున్నారు. పురుషులు మాత్రమే చేయగలరనే వ్యవసాయ రంగంలోను తమకు సాటి లేరని నిరూపిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ శాఖలోని మహిళలు వ్యవసాయ రంగంలో ఇష్టపడి మరీ అడుగు పెట్టి రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. దుక్కి దున్నే నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులకు తలలో నాలుకగా ఉంటున్నారు. కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్గా పనిచేస్తున్న మహిళలు రైతుల పొలాలు, ఇంటి పరిసరాల పరిశీలించి కిచెన్ గార్డెన్లు, సూర్య మండలం మోడల్స్, ఏటీఎం మోడల్స్, ఏ గ్రేడ్ మోడల్స్ రైతులతో వేయిస్తూ ప్రకృతి వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రైతులు పొలంలో పంటకు ముందు పచ్చి రొట్ట ఎరువులు వేయించి భూమిలో కర్పన శాతం పెంచేలా చేస్తున్నారు. రైతులు పొలాల్లో కెమికల్స్ స్ప్రే చేయకుండా కషాయాలపై ఒక అవగాహనా కల్పిస్తూ, రక్షక పంటలు అంతర పంటలు వేయిస్తూ రైతు ఆదాయం పెంచడంతోపాటు, రైతు కుటుంబాల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. గతంలో వ్యవసాయ రంగంలో కేవలం మహిళలు కూలీలుగా మాత్రమే కనిపించే వారు. కానీ ఇప్పుడు పకృతి వ్యవసాయ శాఖలో సీఆర్పీలు 90 శాతం మంది మహిళలే ఉండడం మారిన పరిస్థితికి అద్దం పడుతుంది. అలాంటి వనితల్లో కొందరిని పలకరిస్తే ...ఇంటి పంటపై మహిళలకు అవగాహన కల్పిస్తూవ్యవ‘సాయం’ చేయాలనే నేను ఇంటర్ వరకు చదువుకున్నా. మాది రైతు కుటుంబం. చిన్నప్పటి నుంచి మానాన్న వ్యవసాయం చేయడం చూస్తుండే దానిని. సరదాగా మాఇంటికి దగ్గరలో ఉన్న పంట పొలాల్లో ఆడుకుంటూ వ్యవసాయం చూసి ముచ్చటపడి మా నాన్నకు చేదోడువాదోడుగా ఉండే దాన్ని. అలా వ్యవసాయంపై మక్కువ ఏర్పడి అవకాశం కోసం ఎదురు చూస్తుండగా కమ్యూనిటీ రిసోర్సు పర్సన్గా ఐసీఆర్పీగా అవకాశం వచ్చింది. దీంతో ప్రకృతి వ్యవసాయం పట్ల రైతుల్లో, మహిళల్లో అవగాహన కల్పిస్తూ ఆరోగ్యకరమైన పంటలు పండించడానికి కృషి చేస్తున్నాను. ఉద్యోగం చేయాలన్న కోరిక తీరడంతో పాటు ఆసక్తి ఉన్న వ్యవసాయంలో పని చేయడం చాలా సంతృప్తినిస్తోంది. – శ్రీరంగ రామేశ్వరి, ప్రకృతి వ్యవసాయ శాఖ సీఆర్పీ, దుర్గాడ, గొల్లప్రోలు మండలం ఆనందంగా ఉంది పొలాల్లో తిరిగే ఉద్యోగంలోకి అడుగు పెట్టేటప్పుడు నేను చేయగలనా అనే భయాందోళన కలిగింది. కానీ ప్రకృతిని కాపాడుకునే ఉద్యోగం అని తెలిసి పట్టుదలతో చేసి తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను సాధించి నా సత్తా నిరూపించుకుంటున్నాను. అందరూ తెలుసున్న వారే కావడంతో రైతులు పూర్తి సహకారం అందిస్తున్నారు. మా గ్రామంలో ఇంటి పంటలు వేయిస్తూ ఎవరికి ఎక్కడా కూరగాయల ఇబ్బంది లేకుండా చేయగలిగాం. అటు రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని పరుగులు పెట్టిస్తున్నాం. – రోజా, ప్రకృతి వ్యవసాయ శాఖ సీఆర్పీ దుర్గాడ, గొల్లప్రోలు మండలం -
ప్రకృతి మాత ఒడిలో పని చేయడం ఆనందంగా ఉంది
నేను ఒక తల్లిగా ప్రకృతి మాత ఒడిలో పని చేయడం ఆనందంగా ఉంది. వ్యవసాయం ఆడవారు ఏమి చేస్తారు అనే వారే ఇప్పుడు ఏది చేసినా మీరే చేయాలి అంటూ ప్రశంసిస్తున్నారు. వ్యవసాయం అంతా రసాయనాల మయంగా మారిన తరుణంలో రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మరల్చడానికి మేము చేసిన ప్రయత్నం విజయవంతం అయ్యింది. అందరికీ ఆరోగ్యకరమైన పంటలను అందించడంలో మా పాత్ర ఉండడం చాలా గర్వంగా ఉంది. – కర్రి సత్య, ప్రకృతి వ్యవసాయ శాఖ, ఐసీఆర్పీ, గుమ్మరేగల ఉద్యోగంలా కాదు ఉత్సాహంగా చేస్తున్నాం ఆడవారికి వ్యవసాయం ఏమిటీ అనే పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయంలో అడుగు పెట్టాను. నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయ శాఖలో సీఆర్పీగా పని చేస్తూ ఎందరో రైతులకు సలహాలు ఇస్తూ వారితో పాటు పొలంలో పని చేస్తుండడం ఎక్కడ లేని ఆనందాన్నిస్తోంది. ఇది ఒక ఉద్యోగంలా కాకుండా ఉత్సాహంగా మనసు పెట్టి పని చేస్తున్నాం. మగ వారితో సమానంగా పొలాల్లో తిరుగుతూ భూమి సారవంతంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. – సోమాల సునీత, ప్రకృతి వ్యవసాయ శాఖ సీఆర్పీ దుర్గాడ, గొల్లప్రోలు మండలం చాలెంజ్గా పని చేస్తున్నా మీకేం తెలుసు మీరేం చేయగలరు అనే మనుషుల మధ్య పకృతి వ్యవసాయంలోకి అడుగు పెట్టి ఇప్పుడు అలా అన్నవారికే వ్యవసాయంలో మెళుకువలు చెప్పే స్థాయిలో ఉన్నాను. ఇంటి పని, వంట పని తప్ప ఏమీ చేయలేరనే నానుడి నుంచి పంట పని కూడా వీళ్లు చేయగలరు అనిపించుకున్నాం. ముఖ్యంగా మహిళల్లో ప్రకృతి వ్యవసాయం పట్ల మక్కువ పెంచి ప్రతీ ఇంటి పెరట్లోను ఇంటి పంటలు వేయించి వారికి సరిపడా ఆహారం వారే పండించుకుని తినడంతో పాటు ఆదాయం కూడా పొందేలా చేస్తున్నాం. – శివకోటి పాప, ప్రకృతి వ్యవసాయ శాఖ సీఆర్పీ దుర్గాడ, గొల్లప్రోలు మండలం వంట శాల నుంచి పంట శాలకు నేను పదవ తరగతి వరకు చదువుకున్నా వివాహం అయ్యాకా ఇంటి పని వంట పనికి పరిమితమయ్యా. కాని ఏదో ఒక చిన్న ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉండేది. ఇంతలో ప్రకృతి వ్యవసాయంలో సీఆర్పీగా అవకాశం ఉందని తెలిసి ప్రయత్నం చేశా. తొలుత చాలా భయమేసింది. కాని రంగంలోకి దిగాకా చాలా సులువుగా అనిపించింది. మనం తినే తిండిని ఆరోగ్యకరంగా మార్చే బాధ్యత నేను తీసుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది. – పి.గంగా పార్వతి, ప్రకృతి వ్యవసాయ శాఖ సీఆర్పీ దుర్గాడ, గొల్లప్రోలు మండలం -
ప్రభుత్వానికి, వ్యాపారులకు వారధిగా సీఏలు
బోట్క్లబ్ (కాకినాడ) : ప్రభుత్వానికి, వ్యాపారులకు మధ్య వారధులుగా సీఏలు పనిచేస్తున్నారని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు డి.ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ చార్టర్డ్ అకౌంట్స్ కాకినాడ చాప్టర్ కార్యాలయంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ కాకినాడ బ్రాంచ్ చైర్మన్ తాలూరి శ్రీనివాసరాజు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ దేశ ఆర్థిక అభివృద్ధిలో సీఏలు కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. 1956లో ఇన్కమ్టాక్స్ వ్యవస్థ ఏర్పడిందని అప్పటి నుంచి ఇప్పటి వరకూ సీఏలు ఎంతగానో సేవలందిస్తున్నారన్నారు. జీఎస్టీ బిల్లును ప్రవేశ పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్న ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తమ అవార్డు సైతం అందించిందన్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా 11 సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్స్ కార్యాలయాలను తీసుకువస్తుందన్నారు. త్వరలోనే విజయవాడ కేంద్రంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కాకినాడ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు టి.పవన్కుమార్, సెక్రటరీ పాండురంగమూర్తి, ట్రెజరర్ సూర్యనారాయణమూర్తి పాల్గొన్నారు. 10న అప్రెంటిస్ మేళా బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వివిధ కంపెనీల్లో ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఈ నెల 10వ తేదీన కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాలవర్మ శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఐటీఐలో ఉత్తీర్ణులై ఎన్టీసీ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు ఉదయం 9గంటలకు కళాశాలకు హాజరుకావాలని, ఇతర వివరాలకు 86392 30775 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. అధికారుల 2కే రన్ కాకినాడ క్రైం: మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. శుక్రవారం నాగమల్లితోట నుంచి ప్రారంభమైన ఈ రన్ భానుగుడి కూడలి వరకు సాగింది. అక్కడ మానవహారాన్ని ఏర్పాటు చేసి మహిళల భద్రత, రక్షణపై నినాదాలు చేశారు. కార్యక్రమంలో పోలీస్శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పారదర్శకంగా పి–4 సర్వే : కలెక్టర్ షణ్మోహన్
కాకినాడ సిటీ: జిల్లాలో పి–4 సమగ్ర సర్వే ప్రక్రియను పారదర్శక రీతిలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశపు హాలులో కలెక్టర్ షణ్మోహన్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో శనివారం నుంచి నిర్వహించనున్న పి–4 సర్వే, సాగునీటి ఎద్దడి నుంచి రబీ పంటలను కాపాడటం, ల్యాండ్ కన్వర్షన్, మ్యూటేషన్ల ప్రక్రియలో దళారులను అరికట్టడం, లారీ రవాణా రంగంలో స్వేచ్ఛాయుత వాతావరణం, కాకినాడ ఎన్టీయార్ బీచ్ ఫ్రంట్లో పరిశుభ్రమైన ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పడం అంశాలలో చేపట్టిన చర్యలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టిసిపేషన్–4 విధానం చేపట్టిందని, ఇప్పటికే 10 జిల్లాల్లో ఈ సర్వే ప్రక్రియ జరుగుతుందన్నారు. కాకినాడ జిల్లాలో ఈ సర్వే ప్రక్రియను ఎంపీడీవోల ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది నిర్వహిస్తారని, డీఆర్వో మొత్తం ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారన్నారు. మండల అధికారులకు ఇందుకు అవసరమైన శిక్షణ, అవగాహన కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించామన్నారు. ఆరు అంచెల అర్హతా ప్రామాణికాల కింద అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటికీ సచివాలయ సిబ్బంది వెళ్లి 25 అంశాల సమాచారాన్ని సేకరిస్తారన్నారు. దాదాపు 4 నుంచి 5 లక్షల కుటుంబాల నుంచి సేకరించిన ఈ సర్వే ఆధారిత సమాచారాన్ని గ్రామసభలో ప్రదర్శించి, పారదర్శకమైన రీతిలో పేదలను గుర్తిస్తామని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. జిల్లాలో తాళ్లరేవు, పిఠాపురం మండలాల్లో రబీ పంటలకు ఎదురవుతున్న నీటి ఎద్దడి నివారణకు చేపట్టిన చర్యలను వివరించారు. రైతులు వంతుల వారీ విధానానికి కట్టుబడక మోటార్లతో అక్రమంగా నీటిని వాడుకోవడం వల్లే ఈ కృత్రిమ నీటి ఎద్దడి తలెత్తినట్టు గమనించామని కలెక్టర్ అన్నారు. క్షేత్రస్థాయిలో విస్తృతమైన తనిఖీలు నిర్వహించి అక్రమంగా నీరు తరలిస్తున్న మోటార్లను సీజ్ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కాకినాడలోని లారీ యజమానులు, పరిశ్రమల మధ్య సరుకు రవాణా లావాదేవీలు, చార్జీల అంశాలలో నెలకొన్న అవాంఛనీయ వివాదంపై మాట్లాడుతూ ఇరు వర్గాలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ కార్యకలాపాలను నిర్వహించుకోవాలని ఆదేశించారు. -
సీఆర్వో కార్యాలయ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు
అన్నవరం: రత్నగిరి గదుల రిజర్వేషన్ కార్యాలయ (సీఆర్వో) సిబ్బందిపై ఈఓ వీర్ల సుబ్బారావు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. హరిహరసదన్ పక్కన గల స్థలం ఈ నెల 22న వివాహానికి అద్దెకి తీసుకున్న పెళ్లిబృందం వివాహం అనంతరం ఆ స్థలం ఖాళీ చేసినప్పటికీ సిబ్బంది పది రోజుల వరకు కంప్యూటర్లో చెకౌట్ చేయని విషయం విదితమే. దీని ఫలితంగా ఈ స్థలం ఒక రోజు అద్దె రూ.29 వేలు కాగా, పది రోజులకు రూ.2.90 లక్షలు చెల్లించాలని కంప్యూటర్లో నమోదైంది. దీనికి బాధ్యులుగా భావిస్తూ సీఆర్వో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ పెన్నాడ వేంకటేశ్వరరావుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆ కార్యాలయంలో కౌంటర్ క్లర్క్గా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి శ్రీకృష్ణను సస్పెండ్ చేస్తూ ఈఓ శుక్రవారం ఆదేశాలిచ్చారు. -
గేట్లు.. పాట్లు
అన్నవరం: పంపా రిజర్వాయర్ వద్ద కొత్త గేట్ల ఏర్పాటుకు రూ.3.36 కోట్లు మంజూరై దాదాపు మూడు నెలలైనా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. నెలాఖరులోగా ఖర్చు చేయకపోతే ఈ నిధులు మురిగిపోయే అవకాశం ఉండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇదీ పరిస్థితి పంపా జలాశయం కింద తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో 12,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ఒకసారి ఆయకట్టు మొత్తం సాగు జరగాలంటే 1.5 టీఎంసీల నీరు అవసరం. పంపా గర్భంలో నుంచి పుష్కర కాలువ నిర్మాణం జరగక ముందు ఈ రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 105 అడుగులుండేది. 105 ఆ స్థాయికి నీటిమట్టం చేరితే రిజర్వాయర్లో 0.5 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. అయితే పుష్కర కాలువను రిజర్వాయర్కు 103 అడుగుల ఎత్తులో నిర్మించారు. దీంతో పంపా రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టాన్ని 103 అడుగులకు పరిమితం చేశారు. దీంతో దీని నీటినిల్వ సామర్థ్యం 0.44 టీఎంసీలకు పరిమితమైపోయింది. ఇప్పుడు పంపా బ్యారేజీ గేట్లు బలహీనంగా ఉండటంతో నీటిమట్టాన్ని 99 అడుగులకే పరిమితం చేశారు. దీంతో రిజర్వాయర్లో 0.26 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయడం సాధ్యమవుతోంది. ఫలితంగా ఖరీఫ్ పంట కాలంలో రిజర్వాయర్ నాలుగుసార్లు నిండితే తప్ప ఆయకట్టు రైతులు గట్టెక్కలేని దుస్థితి ఏర్పడింది. తాత్కాలిక మరమ్మతులతో సరి అన్నవరం వద్ద పంపా రిజర్వాయర్ నిర్మించి దాదాపు 56 ఏళ్లు పూర్తయింది. అప్పట్లో ఏర్పాటు చేసిన ఐదు గేట్లకు సమస్యలు ఎదురైనపుడు ఎప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతులు మాత్రమే చేస్తున్నారు. రిజర్వాయర్ గేట్లను అప్పటి సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం అర్ధచంద్రాకారంగా అంటే సినిమా స్కోప్ తెర మాదిరిగా నిర్మించారు. ఈ గేట్లు కాస్త వంపుగా ఉండటంతో భారీ వర్షాలు, తుపాన్ల సమయంలో రిజర్వాయర్ నుంచి మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గేట్లు ఎత్తడం, దించడం సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో పాత గేట్లు మార్చాలనే ప్రతిపాదన సుమారు పదేళ్లుగా ఉంది. వైఎస్సార్ సీపీ హయాంలోనే మంజూరు రైతుల ఇబ్బందిని గుర్తించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పంపా బ్యాకేజీకి పాత గేట్ల స్థానంలో కొత్తవి అమర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు 2023 జూలై నెలలో ఇరిగేషన్ అధికారులు బ్యారేజీ గేట్లు పరిశీలించారు. వీటిని మార్చి కొత్త గేట్లు అమర్చాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనికి నాటి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2023 డిసెంబర్లోనే కొత్త గేట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తరువాత ఎన్నికల కోడ్ కారణంగా నిధులు విడుదల కాలేదు. ఆ తరువాత ఏర్పడిన కూటమి ప్రభుత్వం మళ్లీ ఈ ప్రతిపాదనలను పరిశీలించి కేంద్రానికి పంపించింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఏడాది డిసెంబర్లో విపత్తు రక్షణ నిధుల నుంచి రూ.3.36 కోట్లు విడుదల చేశాయి. మరోవైపు గేట్ల పనులకు ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో రిజర్వాయర్లోని నీటిని దిగువకు వదిలేశారు. దీంతో జలాశయం అడుగంటి కనిపిస్తోంది. మళ్లీ వర్షాలు కురిస్తే తప్ప నిండే పరిస్థితి కనిపించడం లేదు. ఫ పంపా రిజర్వాయర్ కొత్త గేట్లకు ఖరారవని టెండర్లు ఫ నీరుగారుతున్న రూ.3.36 కోట్లు ఫ నెలాఖరులోగా ఖర్చు చేయకపోతే మురిగిపోయే అవకాశం త్వరలోనే కొత్త గేట్లు నీటి సంఘాల ఎన్నికలు తదితర కారణాలతో పంపా రిజర్వాయర్ కొత్త గేట్ల ఏర్పాటుకు టెండర్లు పిలవడం ఆలస్యమైంది. గత నెలలోనే టెండర్లు పిలిచాం. వాటిని ఖరారు చేసి పనులు ప్రారంభించాల్సి ఉంది. మార్చి నెలాఖరులోగా ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. అందువలన త్వరలోనే పనులు ప్రారంభించి కొత్త గేట్లు ఏర్పాటు చేస్తాం. – జి.శేషగిరిరావు, ఇరిగేషన్ ఈఈ -
టీచర్లకు రెండు రోజుల అవకాశం
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సీనియార్టీ జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపాలని జిల్లా విద్యాశాఖదికారి వారి వెబ్సైట్లో ఉంచినట్టు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాల్లో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్ తత్సమానమైన ఉపాధ్యాయులు, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు. పీఈటీ ఉపాధ్యాయులు, లాంగ్వేజ్ పండిట్ ఉపాధ్యాయులు తదితర ఉపాధ్యాయులు సీనియార్టీ వివరాలు జిల్లా విద్యాశాఖాధికారి వెబ్సైట్లో ఉంచినట్టు డీఈవో తెలిపారు. వెబ్సైట్లో ఉన్న సీనియార్టీ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత నమూనా ప్రొఫార్మాతో శని, ఆదివారాలలో కార్యాలయ పని వేళలలో సమర్పించేందుకు అవకాశం ఉందన్నారు. -
పాల దుకాణంపై ఫుడ్సేఫ్టీ అధికారుల దాడులు
బోట్క్లబ్: స్థానిక అచ్యుతాపురం రైల్వే గేటు సమీపంలోని శ్రీసాయి శ్రీనివాస్ మిల్క్ షాప్పై శుక్రవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. పాలు, పెరుగు నిల్వ ఉండడానికి స్పైడ్రైయ్ మిల్క్పౌడర్, బెంజోయాక్ యాసిడ్ వినిగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పాలు ఎక్కువ రోజు నిల్వ ఉంచేందకు ఈ యాసిడ్ వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పాలు తోడుపెట్టే క్రమంలో ఈ పౌడర్ను వినియోగిస్తున్నట్టు ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు నిర్వాహకునిపై కేసు నమోదు చేస్తున్నామన్నారు. ఇతని వద్ద స్వాధీనం చేసుకొన్న పాలు, పెరుగు ల్యాబ్కు పంపుతామన్నారు. ఇవి హానికరమని తేలితే మరో కేసు నమోదు చేస్తామన్నారు. పాలు, పెరుగు, రసాయనాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు తెలిపారు. యాసిడ్ వినియోగించి నిల్వ ఉంచి పాలు మనం తాగితే జీర్ణకోశ సమస్యలు వస్తాయని ఆయన తెలిపారు. గొర్రిపూడి హెచ్ఎంపై పోక్సో కేసు కరప: విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడిన గొర్రిపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం అడబాల కాశీవిశ్వేశ్వరరావుపై పోక్సో కేసు నమోదైంది. అధికారుల విచారణలో ఫిర్యాదులు నిర్థారణ కావడంతో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ సునీత శుక్రవారం తెలిపారు. కేసు విచారణలో ఉన్నందున నిందితుడిని అరెస్టు చేయలేదని, విచారణ నివేదికతో కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
వ్యక్తి అదృశ్యం
కొవ్వూరు: వాడపల్లి గ్రామానికి చెందిన డొంకిన నాగర్జున (28) శుక్రవారం ఇంటి నుంచి అదృశ్యమైనట్టు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పి.విశ్వం తెలిపారు. పలుచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదన్నారు. భార్య దుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేశామన్నారు. నాగార్జున లారీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. తన గురించి వెతకవద్దని మెసేజ్ పెట్టినట్టు ఆ ఫిర్యాదులో దుర్గ పేర్కొన్నారు. నాగార్జునకు వేరోకరితో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా చెబుతున్నారు. వివరాల తెలిసిన వారు 94407 96622 నంబర్కు కాల్ చేయాలని ఆయన సూచించారు. -
యూనియన్ బ్యాంక్ ఉద్యోగుల వాక్థాన్
బాలాజీచెరువు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో మహిళా సాధికారత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వాక్థాన్ నిర్వహించారు. బ్యాంక్ మహిళా ఉద్యోగులు మెయిన్రోడ్ మీదుగా ప్లకార్డులు చేతపట్టుకుని, ర్యాలీ నిర్వహించారు. అన్ని రంగాల్లో మహిళల ప్రతిభను తెలియజేస్తూ ప్రదర్శన కొనసాగించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ రీజనల్ హెడ్ కాకి సాయిమనోహర్, కృష్ణమాచారి, నారాయణ, అర్చన, యూనియన్ నాయకులు జేఎన్వీ శ్రీనివాస్, ఆకుల సాంబశివరావు, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
గురుకుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
రంగంపేట: గురుకుల విద్యాలయాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు లక్ష్మీ నరసాపురం బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వై.లక్ష్మణకుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ సాంఘిక, సంక్షేమ గురుకుల విద్యాలయాల ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న 21 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాలలో 2025–26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్మీడియెట్ (ఇంగ్లిషు మీడియం)లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు. ఈ నెల 13వ తేదీ నాటికి దరఖాస్తులు అందించాలన్నారు. ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేయవచ్చునని తెలిపారు. ఈ గురుకుల విద్యాలయాలు ప్రత్యేకంగా పేద, నిరుపేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం ఉందని, వీటిలో విద్యార్థులు సెల్ఫోన్ సంస్కృతి నుంచి దూరంగా క్రమ శిక్షణ, ఆత్మస్థైర్యం, మంచి ఆరోగ్యం, మంచి జీవన శైలి నేర్చుకోవచ్చునని తెలిపారు. ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్య, పౌష్టికాహారం, ఉచిత పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, స్టూడెంట్ స్టేషనరీ, స్పోర్ట్స్ తదితర సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి
● అటవీశాఖ ఉద్యోగినికి తీవ్ర గాయాలు ● బైక్ను కారు ఢీకొట్టడంతో ఘటన గోకవరం: గోకవరం మండలం కొత్తపల్లి శివారున పెట్రోల్బంక్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి చెందగా అటవీశాఖ ఉద్యోగిని తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం దొలిపాడుకు చెందిన వలాల చిన్నబ్బాయి (52) జగ్గంపేట మండలం గోవిందపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో 2023 నుంచి సాంఘిక శాస్తం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. కొంత కాలంగా గోకవరంలో నివాసం ఉంటూ బైక్పై వెళ్లి వస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆయన వెళ్తుండగా అటవీశాఖలో గార్డుగా పని చేస్తున్న రెడ్డి విజయదుర్గ లిఫ్ట్ అడగడంతో ఆమెను ఎక్కించుకుని మళ్లీ ముందుకు సాగిపోయారు. కొత్తపల్లి శివారున పెట్రోల్ బంకు సమీపంలో వారు ప్రయాణిస్తున్న బైక్ను జగ్గంపేట వైపు నుంచి ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నబ్బాయి అక్కడికక్కడే మృతి చెందగా విజయదుర్గ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న గోకవరం ఎస్సై పవన్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లలను పాఠశాల వద్ద దించి.. చిన్నబ్బాయికి భార్య పార్వతి, తొమ్మిదో తరగతి చదువుతున్న మేఘవర్షిణి, ఎనిమిదో తరగతి చదువుతున్న స్నేహిత ఉన్నారు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న వారిని పాఠశాల వద్ద దించి, అనంతరం ఇంటి నుంచి బయలుదేరి కొద్దిసేపటికే ఆయన మృత్యువాతపడ్డారు. యాన్యువల్ డేకి వెళ్లాలి డాడి లే.. ఆ చిన్నారులు చదువుతున్న పాఠశాల వార్షికోత్సవం శనివారం జరగనుంది. తన పిల్లలు ఆ కార్యక్రమానికి రావాలి డాడీ అని పిలవగా నేను రాను అన్న ఆయన మాటే నిజమైందని చిన్నబ్బాయి భార్య రోదించారు. యాన్యువల్డేకి వెళ్లాలి లే డాడీ అంటూ చిన్నారులు పోలీసులు వద్ద రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పోలీస్స్టేషన్ వద్ద నుంచి ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడానికి వాహనాన్ని నిలపగా భార్య, కుమార్తెలు మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. ఈ క్రమంలో వారిని ఎవరూ వారించలేకపోయారు. హెల్మెట్ ఉన్నా.. బైక్ నడిపే సమయంలో చిన్నబ్బాయి హెల్మెట్ కచ్చితంగా వాడతారు. ప్రమాదం జరిగినపుడు కూడా హెల్మెట్ ధరించినప్పటికీ కారు ఢీకొట్టిన వేగానికి హెల్మెట్ ముక్కలైపోయి తలకు గట్టి దెబ్బ తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఉపాధ్యాయుడి మృతి విషయం తెలుసుకున్న సహచర ఉపాధ్యాయులు భారీగా అక్కడకు చేరుకుని విచారం వ్యక్తం చేశారు. -
సంక్షేమం నుంచి సంక్షోభం
కూటమి పాలనలో మహిళా ఉద్యమాలిలా.. కూటమి ప్రభుత్వం రాగానే మహిళా శ్రామికులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా దగాపడ్డారు. 8 నెలల వేతన బకాయిలు ఇవ్వాలని వీఓఏలు జనవరి 27, 28, 29లలో నిరసన కార్యక్రమాలు చేశారు. కోనసీమ జిల్లాలో 1,726, తూర్పుగోదావరి జిల్లాలో 1,556 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో విస్తారంగా అంగన్వాడీలున్నారు. కాకినాడ జిల్లాలో సుమారు 3500 మంది అంగన్వాడీలు సేవలందిస్తున్నారు. వారంతా కూటమి సర్కార్ ఇచ్చిన హామీలుకు గత నెల 18న ఐసీడీఎస్ కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. అదే నెల 24న కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నాకు దిగారు. వలంటీర్లకు రూ.10వేలు గౌరవ వేతనమిస్తూ విధుల్లో చేర్చుకుంటామన్న కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ మూడు జిల్లాల్లో వివిధ స్థాయిల్లో ఆందోళన చేపట్టారు. పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతామంటూ ఒక మంత్రి, విధుల్లోకి తీసుకుంటే న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయంటూ మరో మంత్రి అనడంపై నిరసన వ్యక్తం చేశారు. ● మహిళను మరచిన కూటమి సర్కార్ ● అడుగడుగునా అవమానాలు ● హామీలన్నీ నీటి మూటలు ● ప్రతి విషయంలో తప్పని ప్రతిఘటన ● నిత్యం ఎదురవుతున్న ఉద్యమ నినాదాలు ● ఆమెకు అందలం వేసిన జగన్ ప్రభుత్వం కపిలేశ్వరపురం: అమ్మ గర్భంలో ఊపిరి తీసుకున్న బిడ్డ ఆ ఊపిరి ఉన్నతంతకాలం ఆమెకు రుణపడి బతకాల్సిందే. అమ్మగా, జీవిత భాగస్వామిగా, కుమార్తెగా బంధమేదైనా బతుకు ఆమెతోనే. సంపద సృష్టి నుంచి సమాజ ప్రగతి వరకు ఎంతో ప్రాధాన్యమున్న మహిళ గౌరవం, రక్షణ ఇవ్వడంలో ప్రభుత్వం శాసీ్త్రయ పద్ధతిని అనుసరించాలి. ఇది వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో కచ్చితంగా అమలైంది. అనంతరం వచ్చిన కూటమి సర్కార్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళలను దగా చేస్తూనే ఉన్నారు. అందుకు ప్రతిగా వారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు నిరసనలు చేస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెకు జరుగుతున్న అన్యాయంపై ప్రత్యేక కథనం. ఉపాధి కరవు ఉమ్మడి జిల్లాలో మహిళా విద్యా వంతులు ఎందరో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు ఉపాధి కల్పనపై ఎన్నో హామీలిచ్చి 9 నెలలు గడుస్తున్నా సమీక్షలు, సర్వేలు పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఒక్క నోటిఫికేషనూ విడుదల చేయలేదు. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న హామీని తుంగలో తొక్కారు. అలాగే డీఎస్సీ ప్రకటించేస్తామని, 25 వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటనలు గుప్పించేశారు. తీరా చూస్తే 16,347 ఖాళీ పోస్టులను చూపిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యా శాఖ వెబ్సైట్లో కేవలం 1,146 మాత్రమే చూపిస్తున్నట్టు సమాచారం. జూలైలో నోటిఫికేషన్ ఇచ్చి, ఆగస్టులో పరీక్ష నిర్వహిస్తామన్న ప్రకటన అమలుకు నోచుకోలేదు. సుమారు 60 వేల మంది పోస్టుల భర్తీకై ఎదురు చూస్తున్నారు. మహిళాభ్యుదయం గాలికి.... మహిళాభ్యుదయం కూటమితోనే సాధ్యమంటూ ఆ నేతలు ఉపన్యాసాలు ఊదరగొట్టారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50 ఏళ్లకే పింఛను అన్నారు. దాని ఊసే లేదు. కొత్త పింఛన్లు ఇస్తామని తొలగింపులకు దిగారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వితంతు పింఛను లబ్ధిదారులు 49,906 మంది, ఒంటరి మహిళ పింఛను దారులు 4,557 ఉండగా తూర్పు గోదావరి జిల్లాలో వితంతు 64,376 మంది, ఒంటరి మహిళ పింఛను లబ్దిదారులు 9,107 మంది వైఎస్ జగన్ సర్కార్ నుంచి పింఛను పొదుతున్నారు. వాటిలో చాలా వరకు రద్దు చేస్తున్నారు. దివ్యాంగ పింఛన్ల సర్వే ఆ వర్గాల్లో ఆందోళన నింపుతోంది. ఏరులైపారుతున్న మద్యం... మద్యం ధరలు తగ్గిస్తామంటూ పురుషులను, నాణ్యతలేని మద్యం విక్రయిస్తూ మీ మగవారి ఆరోగ్యాలను వైఎస్సార్ సీపీ పాడుచేస్తోంది, మేలుకోండంటూ మహిళలను ఆకట్టుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చి దండిగా ఆర్జిస్తున్నారు. మహిళా ప్రగతికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ వైఎస్ జగన్ సర్కార్ రాగానే ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసింది. నిబంధనలను కఠినతరం చేస్తూ ప్రభుత్వం ద్వారా పరిమిత సంఖ్యలో మద్యం దుకాణాలకు అనుమతినిస్తూ మద్యం విక్రయాలను పరిమితం చేసింది. మహిహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచింది. ఊరికి ఒకటి నుంచి రెండు చొప్పున సచివాలయం, ఆర్బీకే, హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసి స్థానికంగానే మహిళకు ఉద్యోగాలిచ్చింది. కాకినాడ జిల్లాలో 620, కోనసీమలో 384, తూర్పుగోదావరిలో 512 సచివాలయాల్లో అత్యధిక సంఖ్యలో మహిళలకు ఉద్యోగాలు ఇచ్చింది. అక్క చెల్లెమ్మలకు రూ.5 లక్షలు విలువైన ఇంటి స్థలాన్ని అందజేసింది. తాజా ప్రభుత్వం వాటిని రద్దుచేసే యోచనలో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో 431, కాకినాడ జిల్లాలో 241 లేఅవుట్లలో సుమారు 90 వేల ఇళ్ల పట్టాలను జగన్ సర్కార్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజకీయ, సామాజిక రంగాల్లో.. గత ప్రభుత్వంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేసింది. వైఎస్సార్ సీపీలో అంతకంటే ఎక్కువ శాతం పదవులను మహిళలకు కట్టపెట్టింది. దేశంలో తొలిసారిగా దళిత మహిళను హోమ్ మినిస్టర్ను చేసింది. శాసన మండలి చరిత్రలో తొలిసారిగా మైనారిటీ మహిళను డిప్యూటీ చైర్ పర్సన్ను చేసింది. దాదాపు స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్సార్ సీపీ మద్దతుదారులు కావడంతో క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవకుండా అవమానిస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి. -
వ్రత పురోహితులకు పారితోషికం పెంపు
దేవస్థానం ధర్మకర్తల మండలి తరఫున చైర్మన్ ఐవీ రోహిత్ తీర్మానాలు అన్నవరం: రత్నగిరి వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని 260 మంది వ్రత పురోహితుల పారితోషికాన్ని నెలకు రూ. రెండు వేలు చొప్పున, విశ్రాంత వ్రతపురోహితుల పెన్షన్ను రూ.వేయి చొప్పున పెంచేందుకు దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త, ఆలయ చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన గల ఏకసభ్య ధర్మకర్తల మండలి శుక్రవారం తీర్మానించింది. ధర్మకర్తల మండలి పదవీ కాలం గత ఫిబ్రవరితో ముగిసింది. దీంతో ఆలయ చైర్మన్ హోదాలో రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావుతో కలిసి శుక్రవారం ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. గతంలో దేవస్థానం వ్రతపురోహిత సంఘం అధ్యక్షుడు, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు ఆధ్వర్యంలో వ్రత పురోహితులు దేవస్థానం చైర్మన్, ఈఓలకు సమర్పించిన వినతి మేరకు తీర్మానం చేసి కమిషనర్ ఆమోదానికి పంపించినట్టు చైర్మన్ రోహిత్ తెలిపారు. మిగిలిన తీర్మానాలివీ.. ● సత్యదేవుని ప్రసాదం తయారీకి ఆవునెయ్యి కిలో రూ.590 చొప్పున విజయ డైరీ, సంగం డైరీల నుంచి కొనుగోలు చేయడం. ● రూ.1.2 కోట్లతో ప్రకాష్సదన్, న్యూ సెంటినరీ, ఓల్డ్ సెంటినరీ కాటేజీల మరమ్మత్తులు. ● దేవస్థానంలో 123 సీసీ కెమేరాల ఏర్పాటుకు కొటేషన్ల ఆమోదం. ● దేవస్థానం ఆసుపత్రి కి రూ.3.75 లక్షలతో రంగులు, కేశఖండన శాలలో రూ.తొమ్మిది లక్షల అంచనా వ్యయంతో మరమ్మత్తులు. ● మే నెలలో జరుగనున్న సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలకు రూ.22 లక్షలతో ఆలయం, ఇతర భవనాలు, మండపాలకు రంగులు వేయించడం. ● ఆదివారం నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న అన్నవరం దేవస్థానం దత్తత ఆలయం కోరుకొండ లక్ష్మీ నర్శింహస్వామి వారి కల్యాణ మహోత్సవాలకు రూ.11.40 లక్షలతో ఏర్పాట్లు. సమావేశంలో దేవస్థానం డీసీ చంద్రశేఖర్, ఏసీ రామ్మోహన్రావు, ఏఈఓలు జగ్గారావు, కొండలరావు, కృష్ణారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు 2కే రన్
కాకినాడ సిటీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటలకు కాకినాడ భానుగుడి జంక్షన్ నుంచి సర్పవరం జంక్షన్ వరకూ 2కే రన్ నిర్వహిస్తున్నారు. కలెక్టర్ షణ్మోహన్ గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, మహిళలు తదితరులు పాల్గొంటారన్నారు. కూటమి సిండికేట్కే గీత కార్మికుల మద్యం షాపులు అమలాపురం రూరల్: జిల్లాలో కల్లు గీత కార్మికులకు కేటాయించిన మద్యం షాపులను కూటమి సిండికేట్లే దక్కించుకున్నారు. జిల్లాలో మొత్తం 13 మద్యం షాపులను గీత కార్మికులకు కేటాయించారు. అమలాపురం మున్సిపాలిటీ, అమలాపురం మండలం, ఆలమూరు, అయినవిల్లి, ఐ.పోలవరం, కె.గంగవరం, కపిలేశ్వరపురం, కొత్తపేట, మండపేట మున్సిపాలిటీ, ముమ్మిడివరం రూరల్, పి.గన్నవరం, రామచంద్రపురం మున్సిపాలిటీ, రామచంద్రపురం రూరల్ ప్రాంతాల్లోని ఈ షాపుల్లో ఒకటి గౌడ కులస్తులకు, 12 శెట్టిబలిజలకు కేటాయించి, టెండర్లు పిలిచారు. గీత కార్మికుల ముసుగులో కూటమి సిండికేట్లు ఒక్కో దుకాణానికి 5 నుంచి 15 వరకూ టెండర్లు వేశారు. మొత్తం 261 టెండర్లు దాఖలయ్యాయి. వీటికి కలెక్టరేట్లో జేసీ నిషాంతి, డీఆర్ఓ రాజకుమారి, అమలాపురం ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎస్కేడీవీ ప్రసాద్ పర్యవేక్షణలో గురువారం లక్కీ డ్రా తీసి, షాపులు కేటాయించారు. గ్రహణం మొర్రికి నేడు ఉచిత వైద్య శిబిరం ముమ్మిడివరం: ఏపీ సమగ్ర శిక్ష, హైదరాబాద్ బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యాన గ్రహణం మొర్రి, గ్రహణ శూలతో బాధ పడుతున్న చిన్నారులకు శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్ష అదనపు పథక సంచాలకుడు షేక్ సలీం బాషా గురువారం ఒక ప్రకటన లో ఈ విషయం తెలిపారు. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిర్వహించే ఈ శిబిరంలో చిన్నారులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నారు. శిబిరానికి వచ్చే చిన్నారులకు ఉచిత రవాణా ఖర్చులు ఇస్తారు. జిల్లాలోని చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అదనపు సమాచారానికి జిల్లా సహిత విద్య కో ఆర్డినేటర్ మర్రెడ్డి వెంకట సత్యనారాయణను 99636 54283 మొబైల్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. విపత్కర పరిస్థితిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి అమలాపురం టౌన్: ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలని విద్యార్థినులకు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు సూచించారు. పోలీసు విధులు, ఆయుధాలు, మహిళా పోలీసు స్టేషన్ పనితీరు, ఎఫ్ఐఆర్ నమోదు, దర్యాప్తు, విచారణలపై విద్యార్థినులు, మహిళలు అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులకు తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. పోలీసు విధుల పట్ల అవగాహన కల్పించారు. సమస్యల్లో చిక్కుకున్న మహిళలు, యువతులు మహిళా పోలీస్ స్టేషన్ సేవలను సద్వినియోగం చేసుకునే విధానాన్ని వివరించారు. పోలీసు విధులపై జిల్లా ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్ కూడా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచి సీఐ బి.రాజశేఖర్, డీసీఆర్బీ సీఐ వి.శ్రీనివాస్, అమలాపురం పట్టణ సీఐ కిషోర్బాబు పాల్గొన్నారు. మహిళల సమగ్రాభివృద్ధికి కృషిఅమలాపురం రూరల్: ప్రభుత్వ పథకాల ద్వారా మహిళల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. డీఆర్డీఏ, మెప్మా, వైద్య, ఆరోగ్యం, సీ్త్ర, శిశు సంక్షేమం, పరిశ్రమల శాఖల అధికారులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సత్యనారాయణ గార్డెన్స్లో నిర్వహించే జిల్లా స్థాయి మహిళా దినోత్సవాన్ని ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని సూచించారు. మహిళా సాధికారతను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యాన సూర్యఘర్, డ్వాక్రా ఉత్పత్తులు, విశ్వకర్మ యోజన, పోషకాహారం వంటి ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. స్వీయ రక్షణపై మహిళలకు అవగాహన కల్పించడంపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ శివశంకర్ ప్రసాద్, జిల్లా పరిశ్రమల కేంద్రం ఏడీ శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బతుకు పూలబాట కాదు..
పోలీసు ఇన్ఫార్మర్ అనుకునే వారు మొదట్లో గిరిజనులు నాతో మాట్లాడేవారు కాదు. బయటి నుంచి వచ్చానని, నన్నో పోలీసు ఇన్ఫార్మర్గా భావించి భయపడేవారు. రకరకాలుగా ఇబ్బంది పెట్టేవారు. వారు చెప్పేది అర్థమయ్యేది కాదు. ఆ సమయంలోనే ముందుగా వారి భాష నేర్చుకోవాలని అనుకున్నాను. అలా వారి భాష నేర్చుకుని వారిలో ఒకరిగా కలిసిపోయాను. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలనే తపనతో పని చేశాను. ‘ఈ పని నేనే చేయగలనని అనుకుంటే ఏదైనా సాధించగలరు. నేను చేయగలనా? అనుకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు’. నా ద్వారా ఆ గిరిజనులకు భాషాపరంగా మేలు జరగాలనే తలంపుతోనే ముందుకు వెళ్లాను. ఆ సమయంలో ప్రొఫెసర్ సింథియా వెస్లీతో పాటు చాలా మంది విదేశీయుల నుంచి ప్రోత్సాహం నన్ను మరింత కార్యోన్ముఖురాలిని చేసింది. ఆల్ఫా, బీటా ఏవిధంగా రాయాలో వారి నుంచి నేర్చుకున్నాను. అంతరించి పోతున్న బగత, గదబ, కొలామి, కొండదొర వంటి 19 గిరిజన భాషలకు లిపిని రూపొందించడంలో విజయం సాధించాను. తద్వారా 2022లో అప్పటి భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారం అందుకున్నాను.● నా దారిలో ఎన్నో ముళ్లు గుచ్చుకున్నాయి ● ఎవరిని ఉద్ధరించాలని అంటూ హేళన చేశారు ● అయినా వెనుకడుగు వేయలేదు ● అలా 19 గిరిజన భాషలకు లిపి రూపొందించా.. ● ‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ వ్యక్తిగతం.. గుంటూరు జిల్లా సీతానగరంలో 1964 సెప్టెంబరు 2న జన్మించాను. నాన్న సత్తుపాటి ప్రసాదరావుది రైల్వేలో ఉద్యోగం కావడంతో విజయవాడ, కోల్కతా, మిరాజ్(మహారాష్ట్ర)లో చదువుకున్నాను. విజయవాడలో పదో తరగతి, కేబీఎన్ కళాశాలలో ఇంటర్, మాంటిస్సోరి మహిళా కళాశాలలో డిగ్రీ (1982–84) చదివాను. తరువాత విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ(ఏయూ)లో ఎంఏ, తిరుపతి పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేశాను. అమ్మ వసుంధరాదేవి గృహిణి. అయినా పేపర్, పుస్తకాలు ఎక్కువగా చదివేది. నాకు ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. పెద్ద చెల్లెలు విజయవాడ, చిన్న చెల్లెలు కాకినాడ, తమ్ముడు రామచంద్రపురంలో ఉద్యోగాలు చేస్తున్నారు. వృత్తిగతం.. 1987లో పద్మావతి మహిళా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా బోధనా వృత్తి చేపట్టి, 14 ఏళ్లు పని చేశాను. అక్కడి నుంచి విశాఖపట్నం ఏయూకు వచ్చాను. పాత సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవడంతో 2002లో అక్కడ ప్రొఫెసర్ చేరాను. ఆవిధంగా ప్రొఫెసర్గా ఆంధ్రప్రదేశ్లో 23 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించిన ఏకై క మహిళగా గుర్తింపు పొందాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 10 సెమినార్లు నిర్వహించి, 60 సెమినార్లలో పాల్గొన్నాను. నేను రాసిన 125 పరిశోధన వ్యాసాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రచురితమయ్యాయి. అలా.. గోదారి బిడ్డనయ్యా.. నా భర్త హరి వెంకట లక్ష్మణ్, మాది ప్రేమ వివాహం. మమ్మల్ని ఏయూనే కలిపింది. నేను ఇంగ్లిష్, ఆయన సోషియాలజీలో పీజీ చేస్తూండగా మా మనసులు కలిశాయి. మొదట పెద్దలు అంగీకరించకపోయినా, తరువాత ఓకే అన్నారు. ఆవిధంగా ఈ ప్రాంతానికి చెందిన అల్లు ఎరకయ్య కోడలిగా గోదావరి ప్రాంత బిడ్డనయ్యాను. మా అమ్మాయిని కూడా ఈ ప్రాంతంలోనే ఇచ్చాం. గోదావరి వాసే. నా ఎదుగుదలకు ఆయన దివిటీ ప్రస్తుతం నేనీ ఉన్నత స్థితిలో ఉండటానికి ప్రధాన కారణం నా భర్త హరి వెంకట లక్ష్మణ్ అని గర్వంగా చెబుతా. ఆయన ఓ కొవ్వొత్తిలా కరిగిపోతూ నా ఎదుగుదలకు దివిటీలా నిలిచారు. గిరిజన భాషలకు లిపిని రూపొందించే క్రమంలో ఎంతో బిజీగా ఉండేదాన్ని, ఆ సమయంలో మాకున్న ఒకే ఒక్క పాప హర్షిత ఆలనా పాలనా ఆయనే చూసుకుంటూ, కార్యోన్ముఖురాలిని కావాలని ప్రోత్సహించారు. హర్షిత ప్రస్తుతం మెకానికల్ ఇంజినీర్గా వర్క్ ఫ్రమ్ హోం చేస్తోంది. ఒక బాబు ఉన్నాడు. పుట్టింటి వారు ఉన్నత స్థాయిలో ఉన్నవారే.. అమ్మ, నాన్న వైపు వారంతా ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్–1 ఉద్యోగాలు చేసిన వారే. నలుగురు మావయ్యలలో ఇద్దరు ఐపీఎస్, ఒకరు ఐఏఎస్. చిన్నమ్మలిద్దరూ వైద్యులు. మా తాతయ్య వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు, ధనవంతుడు కూడా. ఆ సమయంలో ధనాన్ని బానల్లో దాచుకునేవారంటారు. ఒక విద్యార్థి నమ్మకంగా ఉంటూనే కొంత ధనాన్ని దోచుకున్నాడట. నాకు 6 నెలల వయసులోనే తాతయ్య చనిపోయారు. నా ఎదుగుదల ఎక్కువగా కోల్కతాలోనే. ఆ తరువాత మహారాష్ట్ర, విజయవాడల్లో పెరిగాను. అందుకనే 23 భాషలు మాట్లాడతాను. అన్నయ్య ఆశయం నెరవేరింది మా అన్నయ్య (కజిన్) ఐజీగా పని చేస్తూ చనిపోయా రు. కొన్నేళ్ల క్రితం ఆయన నాకు ఒక చీర బహుమతిగా ఇస్తూ, ‘నువ్వు కచ్చితంగా వైస్ చాన్సలర్ అవుతావు. అప్పుడు కట్టుకో’ అన్నాడు. ఆయన నమ్మకం నిజమైంది. అందుకే ఆ చీరను నన్నయ వీసీగా బాధ్యతలు తీసుకునే సమయంలో కట్టుకున్నాను. స్టూవర్టుపురం అంటూ ఇంకా వదిలిపెట్టరా? తాతగారి ఊరి పేరు స్టూవర్టుపురం అని చెప్పడమే గానీ, నేను ఏనాడూ అక్కడ లేను. ఊహ తెలిసిన తరువాత స్టూవర్టుపురం అంటే దొంగల ఊరు అంటారని కాస్త భయపడ్డాను. కానీ అక్కడి వారు చాలా మంచివారు. నిజానికి ఏ ఊళ్లో దొంగలు లేరు చెప్పండి? ‘పూర్వం చదువుకోనందు వల్లనే చాలా మంది దొంగలుగా తయారయ్యారు. కానీ నేటి కాలంలో చదువుకున్న వాళ్లు కూడా దొంగలుగా మారుతున్నారు, దీన్ని ఏమనాలి?’ అని మా నాన్నమ్మ అంటూండేది. ఆచార్య ప్రసన్నశ్రీ ఎలా ఎదిగిందనేది వదిలేసి, స్టూవర్టుపురానికి చెందిన.. అంటూ ఆ గ్రామం మూలాలున్న వారిని ఇంకా వదిలిపెట్టరా? ‘జీవితం పూలబాట కాదు. దారిలో ఎన్నో ముళ్లు గుచ్చుకున్నాయి. ఏనాడూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ఎంచుకున్న లక్ష్యం వైపు అడుగులు వేశాను. ఆడ పిల్లలకు పెద్ద చదువులు ఎందుకనే సమాజం నుంచి.. ఆడపిల్లలు తలచుకుంటే దేనిలోనూ తీసిపోరనే నమ్మకంతో పయనించాను. ఉనికి కోల్పోతున్న 19 గిరిజన భాషలకు లిపి రూపొందించి.. ఆయా వర్గాలకు ఎంతో కొంత మేలు చేసేందుకు ప్రయత్నించాను. ఈ క్రమంలో కన్నవారితో పాటు కట్టుకున్న భర్త ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. గిరిజన భాషలకు లిపిని కూర్చే క్రమంలో ఒకసారి నాటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ను కలిసే అవకాశం వచ్చింది. నా ప్రయత్నం గురించి తెలుసుకున్న ఆయన.. ‘నీ కాళ్లలో ఎన్ని ముళ్లు గుచ్చుకున్నాయ్ ప్రసన్నా’ అని అన్న మాటలు మరువలేను’ అన్నారు ‘నారీ శక్తి’ పురస్కార గ్రహీత.. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది, సమాజానికి అందించే నన్నయ వర్సిటీకి ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన ఈ తొలి గిరిజన మహిళ.. మార్చి 8– అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన జీవనపథంలోని వెలుగుచీకట్లను తనను కలసిన ‘సాక్షి’తో పంచుకున్నారు. – రాజానగరం భగత గిరిజన భాషకు ఆచార్య ప్రసన్నశ్రీ రూపొందించిన లిపి పిచ్చిగీతలంటూ హేళన 1982లో ఇంటర్మీడియెట్ అయిన తరువాత అటవీ ప్రాంతానికి వెళ్లాను. అక్కడి వారిని చూసి, వారి కోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను. ఉద్యోగం వచ్చిన తరువాత వాచకంగా ఉన్న భాషకు లిపిని అందించాలనే సంకల్పించాను. శూన్యం నుంచి ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని ఎదగడానికి ప్రయత్నించాను. నా ప్రయత్నాన్ని కొందరు ఉన్నతాధికారులు, నాయకులు ప్రోత్సహించకపోగా ఏమిటీ పిచ్చి గీతలు, ఎవరిని ఉద్ధరించాలని అంటూ అవమానించారు. ఆ సమయంలో నిజంగా నరకం చూశాను. చాలా బాధ వేసేది. వాటన్నిటినీ భరిస్తూనే నా ప్రయత్నాన్ని వదలలేదు. మనిషి మనుగడ అభివృద్ధి వైపు అడుగులు వేయాలంటే అక్షరం అవసరం. దానిని గుర్తించి, నా ప్రయత్నాన్ని కొనసాగించాను. -
మృత్యు శకటం
శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025పల్లిపాలెంలో విషాద ఛాయలుకాజులూరు: ఏలూరు బస్సు ప్రమాదంలో జుత్తుగ భవాని దుర్మరణం పాలవడంతో ఆమె స్వగ్రామం కాజులూరు మండలం పల్లిపాలెం శివారు కళావారిపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన జుత్తుగ అప్పారావు, భవాని దంపతులకు ఇద్దరు కుమారులు. భార్యాభర్తలిద్దరూ జీవనోపాధి నిమిత్తం కొంత కాలంగా హైదరాబాద్లో ఉంటున్నారు. అప్పారావు ఒక అపార్టుమెంట్లో వాచ్మన్గా చేస్తూండగా భవాని పలువురి ఇళ్లలో పని చేస్తోంది. పెద్ద కుమారుడు ఇంజినీరింగ్, చిన్న కుమారుడు ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు భవాని కాకినాడ బయలుదేరింది. ఈ క్రమంలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె మరణ వార్త తెలియగానే గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్లో ఉంటున్నప్పటికీ భవాని తరచూ గ్రామానికి వచ్చి వెళ్లేదని, వచ్చిన ప్రతిసారీ అందరితో కలివిడిగా మసులుతూండటంతో అసలు ఆమె ఎప్పుడూ గ్రామంలోనే ఉన్నట్టుండేదని స్థానికులు చెబుతున్నారు. బస్సును పక్కకు తీస్తున్న క్రేన్ ● ఏలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ● లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు ● వేకువజామున ఘటన ● ఘటనా స్థలంలో ముగ్గురు, చికిత్స పొందుతూ మరొకరు మృతి ● 21 మందికి గాయాలు ● మృతులు, క్షతగాత్రుల్లో అత్యధికులు ఉమ్మడి జిల్లా వాసులు ఏలూరు రూరల్: తెల్లవారకముందే వారి జీవితాలు తెల్లారిపోయాయి. కొద్ది గంటల్లోనే గమ్య స్థానాలకు చేరుకోవాల్సిన వారిని మృత్యువు కబళించింది. జిల్లా కేంద్రం ఏలూరులోని చొదిమెళ్ల వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై రత్నాస్ హోటల్ సమీపాన ఆగి ఉన్న ఓ లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలోనే ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల్లో అత్యధికులు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వారు. ప్రమాదం అనంతరం బస్సు నుంచి కారిన రక్తధారలు చూసిన వారు భయభ్రాంతులకు గురయ్యారు. సంఘటన స్థలంలో క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి. ప్రమాదం జరిగిందిలా.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న సిమెంట్ లారీ మరమ్మతులతో నిలిచిపోయింది. గురువారం వేకువజామున 5 గంటల సమయంలో రమణ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తోంది. బస్సును అతి వేగంగా నడుపుతున్న డ్రైవర్ మధు.. పొగమంచు కమ్ముకోవడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న సిమెంట్ లారీని గుర్తించలేకపోయాడు. చివరి నిమిషంలో గమనించి, తప్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో లారీ వెనుక భాగాన్ని బస్సు ఢీకొంది. ఆ వేగానికి కండక్టర్ వైపు భాగాన్ని బస్సు చీల్చుకుంటూ వెళ్లి డివైడర్ను ఢీకొట్టి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో బస్సులో నిద్రిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. ఘోర ప్రమాదంతో ఉలిక్కిపడిన స్థానికులు, ఇతర వాహనాల డ్రైవర్లు హుటాహుటిన వచ్చి ప్రయాణికులను రక్షించేందుకు ప్రయత్నించారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని 108 అంబులెన్సులో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదంతో ఘటనా స్థలం రక్తసిక్తం కాగా.. పరిసరాల్లో బస్సులోని విడి భాగాలు చెల్లాచెదురుగా పడి, ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. శకలాల మధ్య ఇరుక్కుపోయి.. నుజ్జునుజ్జయిన బస్సులో కండక్టర్ సీటు వైపు కూర్చున్న మహిళలు మట్టపర్తి భవాని, జుత్తుగ భవాని (38), బొంతు భీమేశ్వరరావు చిక్కుకుపోయి విలవిలలాడారు. బస్సు డ్రైవర్ మధు సైతం స్టీరింగ్ వద్ద ఇరుక్కుపోయాడు. పోలీసులు క్రేన్తో బస్సును లేపి పక్కకు చేర్చారు. బస్సులో చిక్కుకుపోయిన ఈ నలుగురినీ ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మట్టపర్తి భవాని, జుత్తుగ భవాని, భీమేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్ మధుకు అత్యవసర చికిత్స అందించారు. నాలుగు గంటల పాటు మృత్యువుతో పోరాడిన అనంతరం అతడు మృతి చెందాడు. మధు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. క్షత్రగాత్రులు వీరే.. ఈ ప్రమాదంలో కాకినాడకు చెందిన కోలా సురేఖ, కోలా రాజబాబు, కోలా లిఖిత, వనమనీడి ఆదిలక్ష్మి, పి.అక్కమ్మ, కోట వేణి, రాజమహేంద్రవరానికి చెందిన పి.హేమలత, మాచర్ల సుజాత, పాలకొల్లుకు చెందిన మండపాక శ్రీదేవి, మండపాక శశిరేఖతో పాటు మద్దాల కీర్తి, మాచర్ల సుజాత, మండపాక బాలాజీ, మండపాక హరిణి, ఆర్నాలకంటి శ్రీలక్ష్మి, పువ్వుల శ్యామ్కుమార్, శీలం ప్రకాష్, ఎం.ప్రతాప్, గోణజ విజయకుమార్, రామిశెట్టి సోమ సత్యనారాయణ, టి.రవికుమార్, జి.మణికంఠ (క్లీనర్) ఉన్నారు. క్షతగాత్రులకు అధికారులు చికిత్స చేయించి గమ్యస్థానాలకు పంపించారు. అతి వేగం.. పొగమంచు ఈ ఘోర ప్రమాదానికి అతి వేగం, పొగమంచు కారణమని స్థానికులు భావిస్తున్నారు. వేకువజామున పొగమంచు కమ్ముకోవడంతో బస్సు డ్రైవర్ ఆగి ఉన్న లారీని గుర్తించలేకపోయాడు. అదే సమయంలో బస్సును అతి వేగంగా నడుపుతూండటంతో దగ్గరకొచ్చిన తర్వాత లారీని గుర్తించాడు. వెంటనే బస్సును అదుపు చేసే ప్రయత్నం చేసినా అప్పటికే ఘోరం జరిగిపోయింది. మరోవైపు ప్రమాద స్థలానికి 30 మీటర్ల దూరంలో పార్కింగ్ లేన్ ఉండగా.. సిమెంట్ లారీని జాతీయ రహదారి పక్కన నిలపడం కూడా ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. శోకసంద్రంలో భవానీ కుటుంబం జగ్గంపేట: ఈ ప్రమాదంలో మృతురాలు మట్టపర్తి భవానీ స్వస్థలం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తోంది. ఆమె తండ్రి రాజు కౌలు రైతు. ఆమెకు ఓ తమ్ముడు ఉన్నాడు. కష్టపడి చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన భవాని.. వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా స్వగ్రామానికి వస్తోంది. ఈ క్రమంలో ఏలూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృత్యువాత పడింది. తమ గారాలపట్టి అయిన భవాని.. తమ కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంటుందనుకుంటే.. దేవుడు తమపై దయ చూపలేదంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భవానీ మృతితో ఆమె కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. -
గురువుకే పంగనామాలు పెట్టే పనిలో వర్మ..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిన్న మొన్నటి వరకు ఆ ఇద్దరూ గురుశిష్యులని గొప్పగా చెప్పుకునే వారు. రాజకీయాల్లో విడదీయలేని దశాబ్దాల బంధం వారిది. గురువు చెప్పినట్టు శిష్యుడు నడుచుకోవడమే తప్ప ఎదురు ప్రశ్నించిన రోజే లేదు. అటువంటి గురుశిష్యులు పెద్దల సభలో చోటు కోసం తలోదారి వెతుక్కుంటున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికై న ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసిపోతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ స్థానాల ఎన్నికకు షెడ్యూల్ను విడుదల చేసింది. ఫలితంగా కూటమిలో ఎమ్మెల్సీ ఆశావహులు పైరవీలకు తెరతీశారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాలలో(MLC Elections) ఉమ్మడి తూర్పుగోదావరికి ఒక్క స్థానం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం, జనసేన, బీజేపీల నుంచి ఆశావహులు క్యూలో ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నాయకుడైన యనమల రామకృష్ణుడు(Yanamala Rama Krishnudu)తన స్థానాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలనే ప్రయత్నాలు షురూ చేశారు. ఖాళీ అవుతోన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో యనమల ఖాళీ చేసే స్థానం కూడా ఒకటి కావడం గమనార్హం. తెలుగుదేశం పార్టీలో పార్టీ సీనియర్ అయిన యనమల రామకృష్ణుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ(SVSN Varma), పిల్లి అనంతలక్ష్మి, బీజేపీ నుంచి రాజమహేంద్రవరానికి చెందిన సోము వీర్రాజు తదితరులు ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నారు. జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్(Pawan Kalyan) సోదరుడైన నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తారంటున్నారు. ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటామని నెలన్నర క్రితం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే(Chandrababu Naidu) ప్రకటించారు. ఫలితంగా నాగబాబుకు ఎమ్మెల్సీ, మంత్రి కావడం ఖాయమనుకుని సామాజిక మాధ్యమాల్లో జనసేన శ్రేణులు హల్చల్ చేశాయి. కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీలో నాగబాబుకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తాజాగా తెరమీదకు వచ్చిన సమాచారం. ఇదే విషయం టీడీపీ అనుకూల మీడియాలో విస్తృతంగా జరుగుతోన్న ప్రచారంతో నాగబాబుకు ఇక ఎమ్మెల్సీ లేదనే నిర్ధారణకు పార్టీ వర్గాలు వచ్చేశాయి.ఈ పరిస్థితుల్లో ఉమ్మడి తూర్పున తెలుగుదేశంపార్టీ(TDP) ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కోసం గట్టి పట్టుబడుతోంది. ఈ స్థానం కోసం నిన్నమొన్నటి వరకు చెట్టపట్టాలేసుకు తిరిగిన గురు, శిష్యులు యనమల, వర్మ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. చంద్రబాబు తరువాత అంతటి ప్రాధాన్యం కలిగిన నేతగా టీడీపీలో రామకృష్ణుడుకు పేరుంది. జనసేన, కమలనాధులతో కలిసి కూటమిగా టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతోంది. అయినా వీసమెత్తు గుర్తింపు, హోదా దక్కలేదని టీడీపీ సీనియర్ నేత యనమల అంతర్మథనం చెందుతున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో పార్టీలో ఇంతలా ప్రాధాన్యం లేని రోజులు ఎప్పుడూ చూడలేదనే ఆవేదన అనుచరవర్గం బాహాటంగానే వ్యక్తం చేస్తోంది. తునిలో వరుస పరాజయాలతో ప్రజాక్షేత్రానికి దూరమైన యనమలను పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీని చేసింది. కూటమి గద్దె నెక్కడంతో సీనియర్గా తన సేవలు కేబినెట్లో వినియోగించుకుంటారను కున్నా ఆ ఆశలు కూడా ఆవిరైపోయిన సంగతి విదితమే. వాస్తవానికి ఇవేమీ కాకున్నా రాజ్యసభకు వెళ్లాలనేది యనమల చిరకాల వాంఛ. సీనియర్నైన తనను పక్కనబెట్టి ఎవరెవరినో రాజ్యసభకు పంపిన దగ్గర నుంచి యనమల తీవ్ర అంతర్మథనం చెందుతున్నారని పార్టీ వర్గాల మధ్య చర్చ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో పదవీకాలం ముగిసిపోతున్న ఎమ్మెల్సీ స్థానాన్ని పునరుద్ధరిస్తారని యనమల అనుచరవర్గం లెక్కలేసుకుంటోంది. కుమార్తె దివ్యకు తుని అసెంబ్లీ, వియ్యంకుడైన పుట్టా సుధాకర్యాదవ్కు మైదుకూరు అసెంబ్లీ, ఒక అల్లుడు పుట్టా మహేష్కుమార్కు ఏలూరు ఎంపీ..ఇలా యనమల కుటుంబంలో మూడు కీలక పదవులు అనుభవిస్తున్న పరిస్థితుల్లో రామకృష్ణుడును ఎమ్మెల్సీ కొనసాగించడం కష్టమేనంటున్నారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన యనమల ఎమ్మెల్సీ చాన్స్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నారంటున్నారు. కానీ చాన్స్ మాత్రం తక్కువనే ప్రచారం పార్టీలో జరుగుతోంది.టీడీపీలో యనమల శిష్యుడిగా చెప్పుకునే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ఈసారి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. యనమల మాట జవదాటరని పార్టీ నేతలు చెప్పుకునే దానికి భిన్నంగా గురువుకే పంగనామాలు పెట్టే పనిలో వర్మ ఉన్నారంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేయడమే కాకుండా గెలుపు కోసం అనుచరులంతా పడ్డ కష్టానికి తగిన ఫలం దక్కలేదనేది వర్మ ఆవేదన. పిఠాపురం సీటు త్యాగం చేసినందుకు కూటమి అధికారంలోకి వచ్చాక తొలి ఎమ్మెల్సీ వర్మకేనని చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రకటించారు. కూటమి గద్దె నెక్కాక వచ్చిన తొలి ఎమ్మెల్సీ అవకాశాన్ని రాకుండా పవన్ అండ్ కో మోకాలడ్డిందని వర్మ అనుచరులు బాహాటంగానే ప్రచారం చేశారు. రెండు పర్యాయాలు వచ్చిన అవకాశాన్ని ఎగరేసుకుపోయిన పరిస్థితుల్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదనే ప్రయత్నాల్లో వర్మ ఉన్నారు. ఈసారి ఎమ్మెల్సీ దక్కించుకోకపోతే జిల్లాలోనే కాకుండా చివరకు పిఠాపురంలో అనుచరుల వద్ద తలెత్తుకు తిరిగే పరిస్థితి ఉండదనే ఆందోళన చెందుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే చినబాబు ద్వారా వర్మ గట్టి లాబీయింగ్ చేస్తున్నారని అనుచరులు చెబుతున్నారు. పదవుల పందేరంలో చాణక్య నీతిని ప్రదర్శించే టీడీపీలో ఉద్దండుడైన గురువు యనమలకు కాకుండా వర్మకు అవకాశం దక్కుతుందా అని కొందర సందేహం వ్యక్తం చేస్తున్నారు. గురుశిష్యుల్లో చివరకు చాన్స్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే! -
వేసవిలో విద్యుత్ సమస్యలపై దృష్టి
అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వేసవిలో విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, కోనసీమకు 6 పవర్ ట్రాన్స్ఫార్మర్లు కేటాయిస్తామని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ తెలిపారు. అమలాపురం మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లాలోని విద్యుత్ శాఖ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎక్కడా లోఓల్టేజీ సమస్య లేకుండా చూడాలని, ట్రాన్స్ఫార్మర్ల ఓవర్ లోడ్ను గుర్తించి అందుకు తగిన యాక్షన్ ప్లాన్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. వేసవిలో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ బిల్లుల బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్యానల్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని, వినియోగదారులకు చౌకగా సోలార్ విద్యుత్ అందించే విధానంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సర్కిల్ కార్యాలయం ఏర్పాటుకు నల్లవంతెన వద్ద అనువైన భవనాలను పరిశీలించారు. తొలుత ఈదరపల్లిలోని విద్యుత్ కార్యాలయం వద్ద లైన్మెన్ దివస్ కార్యక్రమంలో లైన్మన్లను సత్కరించారు. సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్.రాజబాబు, టెక్నికల్ డీఈ ఎస్.నాగేశ్వరరావు, ఈఈలు కె.రాంబాబు, కె.రత్నాలరాజు, అక్కౌంట్ ఆఫీసర్ సత్యకిషోర్, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
హాకీ జట్టు ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): అంతర్ జిల్లాల హాకీ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపిక స్థానిక జిల్లా క్రీడా మైదానంలో మంగళవారం జరిగింది. జిల్లా హాకీ సంఘం ఆధ్వర్యాన జరిగిన ఈ ఎంపికలకు 25 మంది హాజరయ్యారు. డీఎస్ఏ హాకీ కోచ్ నాగేంద్ర పర్యవేక్షణలో 18 మందిని జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకూ గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరిగే అంతర్ జిల్లాల హాకీ పోటీలో పాల్గొంటారు. ఈ జట్టుకు కోచ్గా దుర్గాప్రసాద్, మేనేజర్గా బాబ్జీ వ్యవహరిస్తారని హాకీ సంఘం ప్రతినిధి రవిరాజు తెలిపారు. ‘మన మిత్ర’ నుంచి టెన్త్ హాల్ టికెట్లు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను మన మిత్ర వాట్సాప్ (వాట్సాప్ గ్రీవెన్స్) ద్వారా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకూ ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకూ ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు మన మిత్ర వాట్సాప్ యాప్ ద్వారా హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేయవచ్చునని తెలిపారు. అభ్యర్థులు తమ వాట్సాప్ ద్వారా 95523 00009 నంబర్కు హాయ్ అనే సందేశం పంపించి, సేవ, పదో తరగతి హాల్ టికెట్ ఎంపిక చేసుకోవాలన్నారు. అనంతరం అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుందని డీఈఓ వాసుదేవరావు తెలిపారు. -
ఎమ్మెల్సీగా పేరాబత్తుల విజయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజేశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులు మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. మరో 33 మంది స్వతంత్రులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ఎన్నికల్లో పేరాబత్తుల తన సమీప ప్రత్యర్థి, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులుపై 77,461 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొదట ప్రాధాన్య ఓట్లు 50 శాతం పైచిలుకు సాధించడంతో ఆయనను విజేతగా ప్రకటించారు. ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకూ బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను కట్టలు కట్టడానికే సమయం సరిపోయింది. 28 టేబుల్స్ ఏర్పాటు చేసి 17 రౌండ్లు నిర్వహించేలా కట్టలు కట్టారు. ఎట్టకేలకు రాత్రి 10 గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. ప్రతి టేబుల్కు వెయ్యి చొప్పున సగటున ప్రతి రౌండ్లో 28 వేల ఓట్లు లెక్కించి, 8 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియను ముగించారు. మొత్తం 2,18,997 ఓట్లు పోలవగా వాటిలో 19,789 ఓట్లు చెల్లనివిగా నిర్ధారించారు. మిగిలిన 1,99,208 ఓట్లను లెక్కించారు. ప్రతి రౌండ్లోనూ కూటమి అభ్యర్థి ఆధిక్యం కొనసాగింది. మొదటి రౌండ్లో 28 వేల ఓట్లు లెక్కించగా కూటమి అభ్యర్థికి 16,520, పీడీఎఫ్ అభ్యర్థి 5,815 చొప్పున ఓట్లు దక్కాయి. ఎనిమిది రౌండ్లు కలిపి టీడీపీ అభ్యర్థికి 1,24,702 మొదటి ప్రాధాన్య ఓట్లు రాగా.. పీడీఎఫ్ అభ్యర్థి 47,241 ఓట్లు దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడు జీవీ సుందర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, మెరుగైన ఓట్లు సాధించారు. ఎనిమిది రౌండ్లలో ఆయనకు 16,183 ఓట్లు దక్కాయి. మిగిలిన అభ్యర్థులు తక్కువ ఓట్లతో సరిపెట్టుకున్నారు. విజేత పేరాబత్తులకు రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి ధ్రువీకరణ పత్రం అందించారు. ·˘ 77,461 KrÏ Ððl$gêÈt™ø VðSË$ç³# ·˘ ï³yîlG‹œ A¿ýæÅÇ®MìS 47,241 Kr$Ï ·˘ 8 Æú…yýlÏÌZ Ð]l¬Wíܯ]l KrÏ ÌñæMìSP…ç³# -
భయం గుప్పెట్లో వేట్లపాలెం ప్రజలు
సామర్లకోట: వేట్లపాలెంలో గత ఏడాది డిసెంబరు 15న రెండు (కల్దారి, బత్సల) కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు వ్యక్తు లు హత్యకు గురి కావడంతో 23 మంది నిందితులను గుర్తించి కేసు నమోదు చేసిన విషయం విదితమే. 23 మందిని కోర్టుకు హాజరు పర్చగా జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. వీరిలో 20 మంది బెయిల్పై సోమవారం సాయంత్రం విడుదల కావడంతో మంగాయమ్మ కాలనీ వాసులు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. కత్తులతో దాడి చేయడంతో కాల్దారి చంద్రరావు(60, కాల్దారి ప్రకాశరావు(55) కల్దారి ఏసు (45) చనిపోయిన విషయం తెలిసిందే. హత్య జరిగినప్పటి నుంచి మంగాయ్మమ్మ కాలనీలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు తక్కువగా ఉండటంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు. పోలీసులను పెంచి పికెట్ కొనసాగించి గ్రామంలో ప్రశాంత వాతావరణం ఏర్పడే విధంగా కృషి చేయాలని వేట్లపాలెం గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఆ ప్రాంతంలో ఎప్పటికప్పుడు నిఘా ఉండే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరావు ఆధ్వర్యంలో సీఐ ఎ.కృష్ణభగవాన్ ప్రత్యేక నిఽఘా ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలు శాంతంగా ఉండాలని సీఐ రెండు వర్గాలకు సూచించారు. హత్య కేసులో 20 మంది నిందితులు విడుదల పోలీసు పికెట్ కొనసాగించాలని డిమాండ్ -
కాకినాడకు మినీ రెస్క్యూ టెండర్లు
కాకినాడ క్రైం: కాకినాడ పరిధిలో అగ్నిప్రమాదాలతో పాటు నీటి వనరులు ఎక్కువగా ఉండటంతో జల ప్రమాదాలకు సంబంధించిన కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని రాష్ట్ర అగ్నిమాపక శాఖ నార్త్ రీజియన్ అదనపు డైరెక్టర్ జి.శ్రీనివాసులు తెలిపారు. వీటి నిర్వహణకు గాను కాకినాడకు మినీ రెస్క్యూ టెండర్లు మంజూరు చేస్తామని చెప్పారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన స్థానిక వివేకానంద పార్క్ ఎదురుగా ఉన్న జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయంతో పాటు, సాలిపేట ఫైర్ స్టేషన్ను మంగళవారం సందర్శించి, రికార్డులు పరిశీలించారు. సిబ్బంది కార్యకలాపాలు, పరికరాలు, స్టేషన్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా సహాయ ఫైర్ అధికారి వి.సుబ్బారావును అభినందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ, మినీ రెస్క్యూ టెండర్లలో ప్రత్యేక నైపుణ్యంతో కూడిన సిబ్బందితో పాటు అవసరమైన పరికరాలు ఉంటాయని చెప్పారు. జిల్లాలో పరిశ్రమలు అధికమని, రసాయనాల వల్ల అనుకోని దుర్ఘటనలు జరిగితే ప్రాణ నష్టాన్ని ఊహించలేమని అన్నారు. అటువంటి రసాయన ప్రమాదాల నివారణకు గాను త్వరలో కాకినాడకు హజ్మత్ వాహనాన్ని కేటాయించనున్నామని తెలిపారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే తక్షణమే బయట పడేందుకు అక్కడి భద్రతా సిబ్బందికి ప్రత్యేక రెస్క్యూ శిక్షణ ఇస్తామని శ్రీనివాసులు తెలిపారు. దీనికోసం స్థానిక జగన్నాథపురంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో ప్రత్యేక శిక్షణా విభాగం ఏర్పాటు చేస్తామని చెప్పారు. దట్టమైన పొగలో సిబ్బంది ఎటువంటి ప్రమాదానికీ గురి కాకుండా త్వరలో జిల్లాకు బ్రీతింగ్ ఆపరేటర్లు ఇస్తున్నామని తెలిపారు. సాలిపేట అగ్నిమాపక కార్యాలయానికి త్వరలో కొత్త భవనం నిర్మాణం ప్రారంభం కానుందన్నారు. దీనికి అన్ని అనుమతులూ పూర్తయ్యాయని వెల్లడించారు. జగన్నాథపురం ఫైర్ స్టేషన్లో నిర్మాణం, మరమ్మతు పనులు పూర్తి చేసేందుకు మంగళవారం టెండర్లు పిలిచామని శ్రీనివాసులు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఫైర్ అధికారి పీవీఎస్ రాజేష్, ఏడీఎఫ్వో సుబ్బారావు కూడా పాల్గొన్నారు.ఫ హజ్మత్ వాహనం కూడా త్వరలో మంజూరు ఫ అగ్నిమాపక శాఖ ఏడీ శ్రీనివాసులు -
బస్సులో సూట్ కేసు చోరీ
తస్కరించిన మహిళ నుంచి 117 గ్రాముల బంగారు నగల రికవరీ అమలాపురం టౌన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న దంపతులకు చెందిన బంగారు నగలతో ఉన్న సూట్ కేసును వారితో ప్రయాణించిన ఓ మహిళ కాజేసిన కేసును అమలాపురం పట్టణ పోలీసులు ఛేదించారు. దాదాపు రూ.6 లక్షల విలువైన 117 గ్రాముల బంగారు నగలను ఆ మహిళ నుంచి రికవరీ చేయడంతోపాటు ఆమెను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. ఈ కేసు వివరాలను ఆయన వివరించారు. గత నెల 17వ తేదీన విశాఖపట్నం జిల్లా కూర్మన్నపాలేనికి చెందిన దుర్గమ రామకృష్ణ దంపతులు కాకినాడ ఆర్టీసీ బస్స్టేషన్లో అమలాపురం నాన్ స్టాప్ బస్సు ఎక్కారు. బస్సులో రామకృష్ణ భార్య పక్కనే ఓ మహిళ కూర్చుంది. బస్సులో కాళ్ల దగ్గర బంగారు నగలతో ఉన్న సూట్ కేసును ఆ దంపతులు పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఆ మహిళ ముమ్మిడివరంలో దిగిపోయింది. రామకృష్ణ దంపతులు అమలాపురంలోని తమ బంధువులు ఇంటికి వెళ్లిన తర్వాత బస్సులో సూట్ కేసు పోయినట్లు గుర్తించారు. ఆ సూట్ కేసులో ఒక బంగారు తెల్ల రాళ్ల నక్లెస్, ఎరుపు ఆకుపచ్చ రాళ్ల బంగారు నక్లస్, బంగారపు ఆకు పచ్చ రాళ్ల నక్లెస్, రెండు బంగారపు లాకెట్లు మొత్తం 117 గ్రాముల బంగారు నగలు ఉన్నట్లు అదే రోజు పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రామకృష్ణ పేర్కొన్నారు. బస్సులో తన భార్య చెంతన కూర్చున్న మహిళపైనే తమకు అనుమానం ఉందని ఆ ఫిర్యాదులో రాశారు. ఈ కేసును డీఎస్సీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ వీరబాబు, క్రైమ్ ఎం.గజేంద్రకుమార్ పర్యవేక్షణలో పట్టణ ఎస్సై ఎస్ఆర్ కిషోర్బాబు, క్రైమ్ సిబ్బంది లోతుగా దర్యాప్తు చేశారు. ఆ రోజు బస్సులో బంగారు నగలతో ఉన్న సూట్ కేసును గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం ఎర్ర చెరువు గ్రామానికి చెందిన ఆవుల యశోద దొంగిలించినట్లు తమ దర్యాప్తులో పోలీసులు గర్తించారు. అమలాపురం ఆర్టీసీ బస్సు స్టేషన్లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న యశోదను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి 117 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. దొంగను రెండు వారాల్లో అరెస్ట్ చేయడమే కాకుండా నూరు శాతం సొత్తును రికవరీ చేసిన సీఐలు వీరబాబు, గజేంద్రకుమార్, ఎస్సై కిషోర్బాబు, క్రైమ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ చోరీలో మహిళా దొంగ యశోదకు సహకరించిన మరో నిందితురాలిని అరెస్ట్ చేయాల్సి ఉందని సీఐ వీరబాబు తెలిపారు. -
తండ్రి మందలించాడని ఆత్మహత్యాయత్నం
అమలాపురం టౌన్: ఉప్పలగుప్తానికి చెందిన బి.ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని అమలాపురంలో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్యహత్యాయత్నం చేసిన ఘటన పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది, స్థానికులకు ముచ్చెమటలు పట్టించింది. అమలాపురం గాంధీనగర్ శివారులో నిర్మాణం పూర్తయి ఇంకా ప్రారంభం కాని దాదాపు 60 అడుగుల ఎత్తు ఉన్న వాటర్ ట్యాంక్పై ఆ యువతి ప్రమాదకర పరిస్థితుల్లో నిలబడి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ యువతి భీమవరం విష్ణు కళాశాలలో బి.ఫార్మసి చివరి సంవత్సరం చదువుతోంది. 15 రోజులకోసారి ఇంటికి రావడం, చదువుపై అంతగా దృష్టి పెట్టకపోవడంపై తల్లిదండ్రులు ఆమెను తరుచూ మందలిస్తున్నారు. భీమవరం నుంచి ఇంటికి వచ్చిన విద్యార్థిని వైఖరిపై తండ్రి సోమవారం అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం విద్యార్థిని తన ల్యాప్ ట్యాప్లో సినిమా చూస్తోంది. ఇది గమనించిన ఆమె తండ్రి మందలించి పొలం వెళ్లిపోయాడు. తండ్రి మందలింపులతో మనస్తాపం చెందిన ఆ విద్యార్థిని తన బ్యాగ్ తీసుకుని ఉప్పలగుప్తం నుంచి అమలాపురం వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో గల తమ బంధువుల ఇంటికి చేరుకుంది. ఆ బ్యాగ్ను బంధువుల ఇంట్లో పడేసి విద్యార్థిని నేరుగా వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లి ట్యాంక్ ఎక్కేసింది. యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంటోందని గమనించిన స్థానికులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో ఆ ట్యాంక్ వద్దకు స్థానికులు చేరకున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి వచ్చారు. పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది తాళ్లు, వలలు కూడా సిద్ధం చేశారు. ఆమెను ట్యాంక్ నుంచి దూకితే రక్షించేందుకు సన్నాహాలు కూడా చేశారు. విద్యార్థినిని ట్యాంక్ దిగాలని అటు స్థానికులు, ఇటు పోలీసులు పదే పదే చెప్పారు. ఇలా గంటకు పైగా సమయం గడిచిపోయింది. ఎట్టకేలకు ట్యాంక్ నుంచి విద్యార్థిని ఏడుస్తూ కిందకు దిగడంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టణ సీఐ పి.వీరబాబు, పట్టణ ఎస్సైలు, అగ్నిమాపక సిబ్బంది విద్యార్థిని ట్యాంక్ నుంచి దింపడంతో సఫలీకృతులయ్యారు. విద్యార్థినికి కౌన్సెలింగ్ నిర్వహించి ఆమె తల్లికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది. వాటర్ ట్యాంక్ ఎక్కిన బి.ఫార్మసీ విద్యార్థిని గంటన్నర సేపు పోలీసులు, స్థానికుల్లో ఉత్కంఠ ఎట్టకేలకు విద్యార్థిని ట్యాంక్ దిగడంతో కథ సుఖాంతం -
రత్నగిరిపై రూ.1.60 కోట్లతో అభివృద్ది పనులు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో రూ.1.60 కోట్లతో పలు అభివృద్ది పనులు చేపట్టనున్నారు. రూ.40 లక్షలతో రెండో ఘాట్ రోడ్డుపై బీటీ రోడ్డు నిర్మాణం, రూ.1.20 కోట్లతో న్యూ సీసీ, ఓల్డ్ సీసీ సత్రాలు, ప్రకాష్ సదన్ సత్రాల గదుల మరమ్మతులు నిర్వహించనున్నారు. ఈ పనులకు త్వరలో టెండర్లు పిలవనున్న నేపథ్యంలో దేవదాయ శాఖ సాంకేతిక సలహాదారు కొండలరావు, చీఫ్ ఇంజినీర్ జీవీ శేఖర్ తదితరులు ఆయా సత్రాలను మంగళవారం సందర్శించి, పనుల ఆవశ్యకతను పరిశీలించారు. రెండో ఘాట్ రోడ్డు నిర్మాణ పనులకు టెండర్లు పిలిచారు. మిగిలిన మూడింటికీ టెండర్లు పిలవాల్సి ఉంది. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈలు రామకృష్ణ, నూకరత్నం, డీఈలు రాంబాబు, గుర్రాజు, ఎలక్ట్రికల్ డీఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ కేంద్రాల్లో తనిఖీలు కాకినాడ క్రైం: బాణసంచా అక్రమ తరలింపు నేపథ్యంలో సోమవారం కాకినాడలో చోటు చేసుకున్న పేలుడుతో జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. నగరంలోని పలు కొరియర్, ట్రాన్స్పోర్ట్ కేంద్రాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పార్శిళ్లను బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీ చేస్తోంది. సంస్థ యాజమాన్యాలకు బాణసంచా, ఇతర పేలుడు పదార్థాలు, రసాయనాలు, మాదక ద్రవ్యాలు బుక్ చేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చారు. అనుమానాస్పద పార్సిళ్లను గుర్తిస్తే తక్షణమే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ తనిఖీల్లో కాకినాడ వన్టౌన్ సీఐ నాగదుర్గారావు, టూటౌన్ సీఐ మజ్జి అప్పలనాయుడు, డాగ్ స్క్వాడ్ బృందాలు పాల్గొన్నాయి. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్షలు జిల్లాలో మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షకు 21,502, మంది హాజరు కాగా, 732 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,673 మంది హాజరవగా 135 మంది గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి నూకరాజు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి శిక్షణ కాకినాడ రూరల్: రమణయ్యపేటలోని ఏపీఎస్పీ మూడో బెటాలియన్ కార్యాలయంలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బందికి రెండు వారాల శిక్షణను కమాండెంట్ ఎం.నాగేంద్రరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమాండెంట్ ఎస్.దేవానందరావు మాట్లాడుతూ, పోలీస్ శాఖలో ఎస్డీఆర్ఎఫ్ పాత్ర ఎంతో కీలకమైనదని అన్నారు. ఆపదలో ఉన్నవారిని ముందుండి రక్షించే లక్ష్యంతో తొలిసారిగా మూడో బెటాలియన్లోనే ఎస్డీఆర్ఎఫ్ను ప్రారంభించారని తెలిపారు. కమాండెంట్ నాగేంద్రరావు మాట్లాడుతూ, తిత్లీ తుపాను, దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు బోల్తా, ఇటీవల విజయవాడ సింధు నగర్ అర్బన్ ప్లాంట్లో జరిగిన ప్రమాద ఘటనల్లో ఏపీఎస్పీ మూడో బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మంచి ప్రతిభ చూపారన్నారు. ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రత్యేకంగా రివార్డులు ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తాము ఉపయోగించే వివిధ పరికరాలను కమాండెంట్కు చూపించి, వాటి పనితీరును వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు మోహన్రావు, బి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పాదగయకు రూ.11.75 లక్షల ఆదాయం పిఠాపురం: పాదగయ క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయం హుండీని మంగళవారం తెరచి ఆదాయం లెక్కించారు. సీఎస్ఓ సీహెచ్ రామ్మోహనరావు, ఇన్స్పెక్టర్లు వడ్డి ఫణీంద్రకుమార్, జోగా సత్యనారాయణ పర్యవేక్షణలో ఆలయ ఈఓ కె.జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరిగింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని 17 రోజులకు గాను హుండీల ద్వారా రూ.11,74,660 ఆదాయం లభించిందని ఈఓ తెలిపారు. -
సత్రం భవనం నిర్మాణంపై సందిగ్ధం
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో రూ.11.40 కోట్లతో నిర్మించనున్న శ్రీ సీతారామ సత్రం (ఎస్ఆర్సీ) నిర్మాణం సందిగ్ధంలో పడింది. దీని టెండర్లను ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉండగా.. మంగళవారం దేవదాయ శాఖ సాంకేతిక సలహాదారు పి.కొండలరావు, చీఫ్ ఇంజినీర్ జీవీ శేఖర్, సాంకేతిక కమిటీ సభ్యులు దేవస్థానానికి వచ్చారు. ఈ సత్రాన్ని పడగొట్టి కొత్త భవనం నిర్మించేకన్నా పాత భవనానికి మరమ్మతులు చేసే విషయం పరిశీలించాలని సూచించారు. అయితే, పాత సత్రాన్ని కూల్చివేసి ఇనుము, కలప తీసుకు వెళ్లడానికి, సత్రం కూల్చివేయగా వచ్చిన వ్యర్థాలను బయటకు తరలించడానికి గాను దేవస్థానానికి రూ.4.50 లక్షలు చెల్లించేలా టెండర్ ఇప్పటికే ఖరారైంది. ఈ పరిస్థితుల్లో పాత భవనానికి మరమ్మతులు చేయాలంటూ నిపుణులు, ఉన్నతాధికారులు చేసిన సూచనలతో స్థానిక అధికారులు డోలాయమానంలో పడ్డారు. గతంలోనే నిర్ణయం రత్నగిరిపై భక్తుల వసతి గదుల సమస్య పరిష్కారానికి గాను సీతారామ సత్రం స్థలంలో రెండు బ్లాకులతో నూతన భవనం నిర్మాణానికి గత ఏడాదే ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మేరకు అప్పట్లో అన్నవరం దేవస్థానం ఈఓగా పని చేసిన ప్రస్తుత దేవదాయ శాఖ ఇన్చార్జి కమిషనర్ కె.రామచంద్ర మోహన్ గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. శిథిలావస్థకు చేరిన పాత సత్రాన్ని కూల్చివేయాలంటూ ఆర్అండ్బీ అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు ఆ నిర్ణయం తీస్కున్నారు. నూతన సత్రాన్ని రెండు దశల్లో నిర్మించాలని నిర్ణయించారు. తొలి దశలో దక్షిణం వైపు నాలుగంతస్తుల్లో 105 గదులతో బ్లాక్–ఎ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. దీనికి అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేశారు. ఈ మేరకు గత జనవరిలో టెండర్లు పిలిచారు. గ్రౌండ్ ఫ్లోర్ వాహనాల పార్కింగ్కు వదిలేయాలని, 1, 2, 3 అంతస్తుల్లో ఫ్లోర్కు 35 చొప్పున 105 గదులు నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి 12 మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయగా ఈ వారంలో ఖరారు చేయాలని నిర్ణయించారు. ఈ పరిస్థితుల్లో దేవదాయ శాఖ అధికారులు, నిపుణులు పాత సత్రాన్ని కూల్చకుండా తాత్కాలిక మరమ్మతులు చేయిస్తే ఇంకో పదేళ్లు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సత్రంలో కొన్ని గదులు వర్షానికి కారిపోతున్నాయని చెప్పగా.. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో లీకేజీలు అరికట్టాలని సూచించారు. రూ.11.40 కోట్లతో మరోచోట సత్రం 105 గదుల సత్రం నిర్మించాలని చెప్పారు. దీంతో సీతారామ సత్రం నూతన భవనం నిర్మాణంపై సందిగ్ధత ఏర్పడింది. ఈ విషయాన్ని కమిషనర్ రామచంద్రమోహన్ దృష్టికి తీసుకువెళ్లి ఆయన ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈలు రామకృష్ణ, నూకరత్నం, డీఈలు గుర్రాజు, రాంబాబు, ఎలక్ట్రికల్ డీఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫ పరిశీలించిన అధికారులు ఫ మరమ్మతులకు అవకాశాలను పరిశీలించాలన్న నిపుణులు ఫ ఇప్పటికే రూ.11.40 కోట్లతో కొత్త సత్రం నిర్మాణానికి టెండర్లు ఫ నిపుణుల సలహాతో డోలాయమానం -
నైతిక విలువలు లేకుంటే ఎన్ని డిగ్రీలు ఉన్నా వృథాయే
● ‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ ● నారీ ఫెస్ట్ 2025 ఉత్సవాలు ప్రారంభం రాజానగరం: సమాజంలో నైతిక విలువలు పాటించని వారికి ఎన్ని డిగ్రీలు ఉన్నా వృథాయేనని, వాటికి విలువ కూడా ఉండదని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీ మూడు రోజులపాటు నిర్వహించే ‘నారీ ఫెస్ట్ 2025’ ఉత్సవాలను మంగళవారం ఒక చిన్నారితో జ్యోతిని వెలిగింపజేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సభలో వీసీ మాట్లాడుతూ ఆడవారిని ఆకాశంలో సగం, అవకాశాలలో సగం అంటే సరిపోదని, ఆదరించడంలో కూడా సగం కావాలన్నారు. ఆడవారికి ఆదరణే ఆధారమని, ఆ ఆదరణ తల్లిదండ్రుల నుంచి, జీవిత భాగాస్వామి నుంచి, పిల్లల నుంచి లభిస్తుందన్నారు. గతంలో ఆడవారి పట్ల వివక్ష చూపేవారని, ఆధునిక సమాజంలో కొంత మార్పు వచ్చిందన్నారు. ఇదే క్రమంలో రాబోయే కాలంలో వివక్ష లేని సమాజం వైపు అడుగులు వేయాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. తరాలు మారుతున్నా అంతరాలు మారకూడదనే ఉద్దేశంతో బామ్మ – మనుమరాలి షో నిర్వహిస్తున్నామన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచే బామ్మలను స్ఫూర్తినగా మార్గదర్శకంగా తీసుకుని ఆమె చేయి పట్టుకుని మనుమరాళ్లు నడుస్తుంటే ముచ్చటగొలుపుతుందన్నారు. పెద్దలను ఎల్లప్పుడూ గౌరవించాలని, వృద్ధాశ్రమాల అవసరం లేని సమాజం వైపు పయనించాలన్నారు. అలరించిన వెల్ బేబీ షో బామ్మ – మనుమరాలు షోతోపాటు నిర్వహించిన వెల్ బేబీ షోకు కూడా అపూర్వ స్పందన లభించింది. రాజమహేంద్రవరం పరిసరాల నుంచి తరలివచ్చిన అనేక మంది తల్లిదండ్రులు తమ చిన్నారులను వేదిక పైకి తీసుకువచ్చి, బుడగలతో పోటీలు నిర్వహించడంలో ఎంజాయ్ చేశారు. అలాగే గ్రూప్ సింగింగ్, గ్రూప్ డాన్స్, ఫ్యాషన్ షో, స్కిట్స్లలో పోటీలు జరిగాయి. పరిసరాలలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉమెన్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. ఉమామహేశ్వరిదేవి, ప్రిసైడింగ్ అధికారి డాక్టర్ వి.పెర్సిస్, డాక్టర్ ఎన్.సజనారాజ్, డాక్టర్ కె.దీప్తి, డాక్టర్ డి. లతా, డాక్టర్ బి.విజయకుమారి, ఆచార్య డి.జ్యోతిర్మయి, డాక్టర్ పి.విజయనిర్మల, డాక్టర్ కె.సుబ్బారావు, డాక్టర్ కె.నూకరత్నం, డాక్టర్ పద్మావతి, డాక్టర్ కె.రమణేశ్వరి పాల్గొన్నారు. -
ఫెన్సింగ్లో జాతీయస్థాయికి ‘లక్ష్య’ విద్యార్థులు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఈనెల ఒకటో తేదీన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో జరిగిన 11వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ ఫెన్సింగ్ పోటీలలో స్థానిక లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు నల్లమిల్లి శేషు రిషిత్ రెడ్డి, ఆప్తి వర్ణిక శేఖర్ ప్రతిభ చూపి వ్యక్తిగత విభాగంలో జాతీయస్థాయికి ఎంపికయ్యారని పాఠశాల డైరెక్టర్ డాక్టర్ సుగుణ మంగళవారం తెలిపారు. జట్టు విభాగంలో రిషిత్ రెడ్డి బంగారు, ఆప్తి వర్ణికశేఖర్ రజత, భవ్య సహజ రెడ్డి రజత, బృహతి ఖడ్గ కాంస్య, బి.లక్ష్మీ కృతిక కాంస్య, ఆన్యజైన్ రజత, వర్ణిక రజత, కె.నిహాంత్ కాంస్య, విరాజ్ బంగారు, హితేష్ బంగారు పతకాలు గెలుచుకున్నారన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి, లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ వందన బొహరా, కోచ్ సతీష్ అభినందించారు. -
నాలుగేళ్లుగా జిల్లాలో మంజూరు చేసిన కౌలు కార్డులు, కౌలు రైతులకిచ్చిన రుణాలు (రూ.కోట్లలో)
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వ హయాంలో తమకు తీరని అన్యాయం జరుగుతోందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం పండగ మాదిరిగా ఉండేది. గ్రామ స్థాయిలో విత్తనాలు మొదలుకొని ధాన్యం అమ్మకాల వరకూ రైతులకు వారి చెంతనే సేవలు అందజేసేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యవసాయంపై నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోందని చెబుతున్నారు. అన్నదాతా సుఖీభవ పేరిట ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సాయం హామీని గాల్లో కలిపేశారు. మరోవైపు కౌలు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. గుర్తింపు కార్డులతో సరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఖరీఫ్లో కౌలు రైతుల గుర్తింపులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ఎట్టకేలకు జిల్లాలో 35 వేల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. కానీ వారికి ప్రభుత్వం నుంచి ఒక్క పథకం కూడా దక్కలేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు విత్తనాలు, ఎరువులు, పంట నష్టపరిహారంతో పాటు బ్యాంకుల్లో రుణాలు కూడా ఇచ్చేవారు. ప్రస్తుతం ఖరీఫ్ ముగిసి, రబీ సీజన్ కూడా మొదలై నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ కౌలు రైతులకు ప్రభుత్వం పంట నష్టపరిహారం కానీ, ఎరువులు, విత్తనాలు, రుణాలు ఇవ్వడం లేదు. కౌలు రైతులపై రుణపాశం ప్రస్తుతం ఎకరా భూమికి యజమానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ కౌలు చెల్లించాల్సి వస్తోంది. ఆ మొత్తం చెల్లించిన అనంతరమే కౌలు రైతులు సాగు చేపడుతున్నారు. దీనికి తోడు విత్తనాల కొనుగోలు మొదలు, పంట దమ్ము, వరి నాట్లు, ఎరువులు, పురుగు మందుల వంటి వాటికి మరో రూ.25 వేలు పైగా పెట్టుబడి అవుతోంది. మొత్తం మీద ఎకరం భూమి కౌలుకు చేయాలంటే రూ.50 వేల వరకూ అవసరం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కౌలు గుర్తింపు కార్డు ఉన్న ప్రతి రైతుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ ఎటువంటి హామీ లేకుండా పంట రుణాలు ఇచ్చేవారు. ప్రస్తుతం గుర్తింపు కార్డులు ఇచ్చినా ఎటువంటి రుణాలూ ఇవ్వకుండానే చేతులు దులుపుకొన్నారు. గత్యంతరం లేక కౌలు రైతులు బయటి వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పడిన శ్రమంతా కౌలుకు, పెట్టుబడులు, వడ్డీలకే పోతోందని, తమకు మిగులుతున్నదేమీ ఉండటం లేదని కౌలు రైతులు వాపోతున్నారు. కనీసం ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తే తక్కువ వడ్డీ కావడంతో కనీసం ఆ మొత్తమైనా మిగిలేదని అంటున్నారు. గత ప్రభుత్వంలోనే తమకు ఎంతో మేలు జరిగిందని, ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు. పరిహారం.. పరిహాసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేసేవారు. వైఎస్సార్ రైతు భరోసా కింద నిరుపేద ఎస్సీ, బీసీ కౌలు రైతుల ఖాతాల్లో ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్ల పాటు పెట్టుబడి సాయం జమ చేశారు. ప్రకృతి వైపరీత్యాలకు పంట దెబ్బ తింటే కౌలు రైతులకు కూడా నష్ట పరిహారం అందించేవారు. గత ఏడాది అధిక వర్షాలకు భారీగా పంట నష్టం జరిగినా కౌలు రైతులకు కూటమి ప్రభుత్వం ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. భూమి సర్వే నంబర్ల ఆధారంగా ప్రతి ఎకరాకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం ఆయా రైతుల ఖాతాల్లో పంట నష్ట పరిహారం జమ చేసింది. ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు భూమి యజమానులు ససేమిరా అనడంతో కౌలు రైతులు నిండా మునిగారు. ఫ గుర్తింపుతో సరి.. రుణాలేవీ మరి! ఫ పట్టించుకోని కూటమి సర్కారు ఫ కౌలు రైతులకు అందని పథకాలు సంవత్సరం కౌలు కార్డులు రుణాలు 2020–21 36,795 18.73 2021–22 44,580 47.17 2022–23 41,322 46.46 2023–24 56,399 53.80 రుణాలిచ్చి ఆదుకోవాలి ఈ ఏడాది కౌలు రైతులకు బ్యాంకుల నుంచి రుణాలివ్వలేదు. బయటి వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని తొలకరి సీజన్లో ఇబ్బందులు పడ్డాం. కనీసం దాళ్వాలోనైనా బ్యాంకు రుణాలిప్పించాలి. లేకుంటే కౌలు రైతులు సాగు చేయడం కష్టమే. – రాయుడు శ్రీనివాస్, కౌలు రైతు, యండమూరు, కరప మండలం కౌలు రైతులను పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం కౌలు రైతులను అసలు గుర్తించడం లేదు. ఎటువంటి సహాయమూ చేయడం లేదు. గత ప్రభుత్వం కౌలు రైతులను ఎంతగానో ఆదుకొంది. గుర్తింపు కార్డులివ్వడమే కాకుండా బ్యాంకుల ద్వారా పంట రుణాలు కూడా ఇచ్చింది. – తుమ్మల అచ్చియ్య, కౌలు రైతు, పులిమేరు, పెద్దాపురం మండలం -
బోటురైడర్, హెల్పర్పై హత్యాయత్నం కేసు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): బోటులో అనధికారికంగా తీసుకువెళ్లి మళ్లీ సోమవారం రాత్రి తిరిగి వస్తుండగా బోటు తిరగబడి ఇద్దరు మృతిచెందిన ఘటనపై త్రీటౌన్ పోలీసులు సుబ్బారావుపేటకు చెందిన బెజవాడ సత్తిబాబు ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సుబ్బారావుపేటకు చెందిన బెజవాడసత్తిబాబు, సింహాచలనగర్కు చెందిన చవల అన్నవరం(54), కాతేరు మిలటరీకాలనీకి చెందిన గాడారాజు(24), కోట రాంబాబు, భవానీపురానికి చెందిన మరికొందరుతో కలిసి కోటిలింగాలరేవు నుంచి సోమవారం మధ్యాహ్నం బోటులో బ్రిడ్జిలంక వెళ్లారు. రాత్రి తిరిగి వస్తుండగా బోటులోకి నీరు రావడంతో తిరగబడింది. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
అగ్ని ప్రమాదానికి పశువుల శాల ఆహుతి
● కాలిపోయిన 4 గేదెలు, రెండు ఆవులు, నాలుగు దూడలు ● రూ.ఐదు లక్షల నష్టం సామర్లకోట: మండల పరిధిలో వీకే రాయపురంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు గేదెలు, రెండు ఆవులు, నాలుగు దూడలు పూర్తిగా కాలిపోయాయి. వీటిలో రూ.1.50 లక్షల విలువ కలిగిన గేదె అక్కడికక్కడే మృతి చెందింది. రైతులు, బాధితుల కథనం ప్రకారం వీకే రాయపురం సమీపంలోని మామిళ్లదొడ్డిలోని పశువుల పాకపై విద్యుత్తు వైరు తెగి పడిపోవడంతో మంటలు చెలరేగి పశువుల పాక పూర్తిగా కాలి బూడిద అయింది. ఆ పాకలో ఉన్న పశువులు పూర్తిగా కాలిపోయాయి. మూగజీవాల ఆర్తనాదాలకు సమీపంలో ఉన్న రైతులు పశువుల పాక వద్దకు చేరుకొని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసి పశువుల యజమాని రంగనాథం వీరభద్రరావుకు సమాచారం ఇచ్చారు. మంగళవారం ఉదయం పశువైద్యాధికారి మాకినీడి సౌమ్య ఘటనా ప్రదేశానికి చేరుకొని కాలిపోయిన పశువులను పరిశీలించారు. కాలిపోయిన పశువులు జీవించే అవకాశం లేదన్నారు. సుమారు రూ.5 లక్షల వరకు నష్టం ఉంటుందని చెప్పారు. కాలిపొయిన పశువుల ఆర్తనాదాలు రైతుల హృదయాలను కదిలించి వేశాయి. పశువుల పరిస్థితిని చూచి వైఎస్సార్ సీపీ మండల పార్టీ అధ్యక్షుడు తలారి దొరబాబు, రైతు సంఘ నాయకుడు ఇంటి వెంకట్రావులు కంటతడి పెట్టుకున్నారు. వైద్యం అందించినా పశువులు జీవించే అవకాశం లేదని వైద్యాధికారి సౌమ్య తెలిపారు. రెండు పశువులకు మాత్రమే బీమా ఉన్నదని ఆమె చెప్పారు. పశువులకు జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన రిపోర్టును ఉన్నతాధికారులకు పంపుతానని చెప్పారు. వీఆర్వో రైతుల నుంచి సమాచారం సేకరించి తహసీల్దార్ను నివేదిక సమర్పించారు. స్విమ్మింగ్ పూల్లో తప్పిన ప్రమాదం నీట మునిగి సీపీఆర్తో బతికిన స్విమ్మర్ నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడామైదానంలోని స్విమ్మింగ్ పూల్లో ప్రమాదవశాత్తూ మునిగిపోయి ఓ వ్యక్తి స్పృహ కోల్పోగా స్విమ్మింగ్ పూల్ సిబ్బంది సకాలంలో స్పందించడంలో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే జిల్లా క్రీడామైదానంలోని స్విమ్మింగ్ పూల్లో ఉదయం 8 నుంచి 9 గంటల బ్యాచ్లో శంఖవరం గ్రామానికి చెందిన ప్రదీప్కుమార్ నెల రోజుల నుంచి కాకినాడ స్విమ్మింగ్ చేస్తున్నాడు. రోజులాగే మంగళవారం కూడా స్విమ్మింగ్ పూల్కు వచ్చిన ఆయన ఈత కొడుతున్న సమయంలో ముక్కులోకి నీరు వెళ్లి ఊపిరి ఆడక అస్మారక ిస్థితిలోకి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న స్విమ్మింగ్ కోచ్ అప్పలనాయుడు, సీనియర్ స్విమ్మర్లు దానిని గమనించి ప్రదీప్కుమార్ను కొలనులోనుంచి బయటకు తీసి సీపీఆర్ చేసి అంబులెన్సులో దగ్గర ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి ప్రదీప్కు ఆస్తమా ఉన్న కారణంగా ఊపిరి సమ్యస్య వచ్చిందని తెలిపి చికిత్సను ప్రారంభించారు. స్విమ్మింగ్ పూల్ వద్ద లైఫ్గార్డుల స్థానంలో సీనియర్ స్విమ్మర్లను డీఎస్ఏ అధికారులు కొనసాగిస్తున్నారు. లైఫ్గార్డుల నియామకానికి శాప్కు లేఖ రాసినా ఇంతవరకు అనుమతి రాకపోవడంతో సీనియర్లను కొనసాగించాల్సి వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. డీఎస్డీఓ శ్రీనివాస్కుమార్ను వివరణ కోరగా త్వరలోనే లైఫ్గార్డులను నియమిస్తామని తెలిపారు. క్షతగాత్రులకు కొనసాగుతున్న చికిత్స కాకినాడ క్రైం: కాకినాడలోని జై బాలాజీ ట్రాన్స్పోర్ట్లో సోమవారం చోటు చేసుకున్న బాణసంచా పేలుడు ఘటనలో క్షతగాత్రులకు కాకినాడ జీజీహెచ్లో చికిత్స కొనసాగుతోంది. కాకినాడ వన్టౌన్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేయగా విచారణ కొనసాగుతోంది. మంగళగిరి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ బృందం పేలుడు జరిగిన ప్రదేశంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. పలు నమూనాలు సేకరించింది. -
ఆశాభంగం
ప్రభుత్వం ప్రకటించిన వరాలు పనికిరావు జిల్లాలో ఎన్నికల కోడ్ ఉన్నా హడావుడిగా ఆశా కార్యకర్తలను సంతృప్తి పరచేందుకు పలు రాయితీలను అందిస్తుందంటూ ప్రభుత్వం ఇచ్చిన లీకేజీల వల్ల ఆశా కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. 2006లో పూర్తి స్థాయిలో ఆశా కార్యకర్తలను పోస్టులు భర్తీ చేయగా మధ్యలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసుకుంటూ వచ్చారు. గత పదేళ్ల నుంచి ఆశా కార్యకర్తల పోస్తుల భర్తీకి అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన ప్రసూతి సెలవులు ఉపయోగించుకొనే అవకాశం లేదని ఆశా కార్యకర్తలు చెబుతున్నారు. గ్రాడ్యుటీని ప్రవేశపెట్టి రూ.1.50 లక్షలు పదవీ విరమణ అనంతరం ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటన కూడా బూటకమని వారు చెబుతున్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ సర్వీసు ఉంటేనే గ్రాడ్యుటీ అమలు చేస్తామని మెలిక పెట్టడం ఆశా కార్యకర్తలను వంచించడమేనని మండిపడుతున్నారు. వేతనాల పెంపు లేకుండా కేవలం పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంలో ఆశా కార్యకర్తలకు ఒరిగేదేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాటి వైఎస్సార్ సీపీ సర్కారులో స్వర్ణయుగం 2019–24 మధ్య కాలంలో పాలించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంది. చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితం అనుభవించిన ఆశా కార్యకర్తలకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు చేసిన పాదయాత్రలో ఆశా కార్యకర్తల దుస్థితిని గుర్తించారు. అందుకనుగుణంగా వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన వెంటనే అప్పటి వరకూ రూ.మూడు వేలు ఉన్న వేతనాన్ని ఒక్కసారిగా 2019 ఆగస్టు 12న రూ.పది వేలకు పెంచారు. ఆశా కార్యకర్తల కులం, మతం, ప్రాంతం, వర్గం చూడకుండా సజావుగా విధులు నిర్వహించేందుకు భరోసా కల్పించారు. నేటి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పోల్చుకుంటున్న ఆశా కార్యకర్తలు నాటి స్వర్ణయుగాన్ని తలుచుకుంటున్నారు. ఆలమూరు: రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతకు అహర్నిశలు శ్రమిస్తున్న ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పిచడంతో పాటు దీర్ఘకాలిక డిమాండ్లు పరిష్కరిస్తామన్న కూటమి ప్రభుత్వం హామీ నీటిమూటగా మారింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అలవి కాని హామీలిచ్చి అమలు చేయలేక అన్ని వర్గాల ప్రజలు మాదిరిగానే ఆశా కార్యకర్తలను కూడా నయవంచనకు గురిచేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అఽధికారం చేపట్టి 9నెలలు అయినా ఇంకా హామీలు అమలు చేయకపోవడంతో రాష్ట్ర ఆశా కార్యకర్తల సమాఖ్య పిలుపు మేరకు గత ఏడాది నవంబర్ 18న ఆశా కార్యకర్తలు జిల్లా కేంద్రమైన అమలాపురంలోని డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద తమ నిరసనలను తెలియజేశారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం ఆశా కార్యకర్తల డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిష్కారిస్తామని ఆ సమయంలో హామీ ఇచ్చింది. ప్రభుత్వం మాట తప్పిన వైనాన్ని జీర్ణించుకోలేని ఆశా కార్యకర్తలు తాడోపేడో తేల్చుకునేందుకు ఈ నెల ఆరవ తేదీన చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పోలీసులు ధర్నాకు వెళ్లే వారిని గుర్తించే పనిలో నిమగ్నమై బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుకాడవద్దని ఆశా కార్యకర్తలు తీర్మానించుకున్నారు. ఆశా కార్యకర్తలపై పెరిగిన పని ఒత్తిడి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనున్న 56 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రస్తుతం 1395 మంది ఆశా కార్యకర్తలు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యి జనాభాకు ఒక ఆశా కార్యకర్తను ప్రభుత్వం నియమించవలసి ఉంది. జిల్లాలో 2011 జనాభా గణాంకాల ప్రకారం 17.19 లక్షల మంది జనాభా ఉండగా ఆశా కార్యకర్తలను దాదాపు 1,700 మందిని నియమించవలసి ఉంది. ప్రస్తుతం వివిధ కారణాల రీత్యా ఖాళీ అయిన ఆశా కార్యకర్తల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. దీంతో ప్రస్తుతం ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలపైనే అదనపు భారం పడుతోంది. రోజు రోజుకు ప్రవేశపెడుతున్న యాప్లతో పాటు పని ఒత్తిడితో ఆశా కార్యకర్తలు సతమతమవుతున్నారు. దైనందిన జీవితంలో నిత్యవసరాల ధరలతో పాటు ఖర్చులు పెరిగినట్లుగా వేతనం పెరగక ఆశా కార్యకర్తలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఆశా కార్యకర్తల డిమాండ్లు ఇవీ కనీస వేతనం రూ.20 వేలు చెల్లించాలి. ఒప్పంద జీవోలన్నింటిని విడుదల చేయాలి. ఏఎన్ఎం శిక్షణ పొందిన వారందరికి పర్మి నెంట్ పోస్టుల భర్తీ సమయంలో తగిన ప్రాధాన్యం కల్పించాలి. అర్హతను బట్టి దశల వారీగా ఏఎన్ఎం శిక్షణను ఇచ్చి ధ్రువపత్రాలను మంజూరు చేయాలి. ఆరోగ్య రంగానికి బడ్జెట్లో ప్రకటించిన వాటి కంటే అధికంగా నిధులు పెంచాలి. ఆరోగ్య భద్రతా చట్టం చేయాలి. ప్రతి యేటా రెండు జతలకు యూనిఫామ్ అలావెన్స్ ఇవ్వాలి. లెప్రసీ సర్వేకు సంబంధించిన పారితోషికాలు వెంటనే చెల్లించాలి.న్యాయబద్ధమైన డిమాండ్లు అంగీకరించాలి రాష్ట్ర ప్రభుత్వం గత సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆశా కార్యకర్తల న్యాయబద్ధమైన డిమాండ్లను అంగీకరించాలి. ఏఎన్ఎంలుగా పదోన్నతికి అవకాశం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఆశా కార్యకర్తల డిమాండ్లను ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలి. – కె.కృష్ణవేణి, కోనసీమ జిల్లా ఆశా కార్యకర్తల సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు ఆశా కార్యకర్తలను నయవంచన చేస్తున్న ప్రభుత్వం గత వైఎస్సార్ సీపీలో వేతనం రూ.పది వేలకు పెంపు రేపు చలో విజయవాడకు పిలుపునిచ్చిన సీఐటీయూ పోలీసు కేసులకు, వేధింపులకు భయపడేది లేదు -
వాటర్ బాటిల్పై రూ.7 అదనం.. 27 లక్షల ఫైన్ విధించిన కన్జ్యూమర్ కోర్టు
సాక్షి,అమరావతి : కాకినాడ వినియోగదారులు కోర్టు కీలక తీర్పును వెలవరించింది. ఓ కస్టమర్ నుంచి ఒక్కో వాటర్ బాటిల్పై అదనంగా రూ.7వసూలు చేసినందుకు గాను హైదరాబాద్ నగరంలోని ప్రముఖ హోటల్కు రూ.27లక్షల 27వేలు పెనాల్టీ విధించింది.వివరాల్లోకి వెళితే.. 2023 డిసెంబర్ 8న హైదరాబాద్ బోడుప్పల్లోని ఓ హోటల్లో ఓ మహిళ మూడు వాటర్ బాటిళ్లను కొనుగోలు చేశారు. అయితే, తాను కొనుగోలు చేసిన ఒక్కో వాటర్ బాటిల్ ధరపై అదనంగా రూ.7వసూలు చేసినట్లు గుర్తించారు. దీంతో ఆ మహిళ సదరు హోటల్ నిర్వాకంపై కాకినాడ వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశారు.మహిళ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలంటూ కాకినాడ వినియోదారుల కోర్టు హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దీంతో హోటల్పై కాకినాడ వినియోగదారుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటల్ యాజమాన్యానికి రూ.27లక్షల 27వేలు ఫైన్ విధించింది. రూ.27 లక్షలు తెలంగాణ సీఎం సహాయ నిధికి, ఫిర్యాదు చేసిన మహిళకు రూ.25000, కోర్టుకి రూ2000 చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
మా అభివృద్ధిని వివరించాం
మేం చిన్నప్పుడు ఈ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకూ చదువుకున్నాం. మా గ్రామంలోని ఉన్నత పాఠశాలలో సౌకర్యాలు లేక వేరే ఊరిలోని ప్రైవేటు పాఠశాలలో చేరాలనుకునే వాళ్లం. కానీ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు–నేడుతో మా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. సకల సౌకర్యాలూ వచ్చాయి. విద్యా బోధనలోనూ మార్పులు రావడంతో ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడుతున్నాం. అందుకే మా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మా ఉన్నతిని వివరించి, వారు ఇదే పాఠశాలలో చేరే విధంగా అవగాహన కల్పించాలని భావించాం. – ఎలుగుబంటి నందిని, 9వ తరగతి విద్యార్థిని, పి.దొంతమూరు మంచి అనుభూతి చిన్నప్పుడు చదువుకున్న స్కూలుకు వెళ్లి మేం పాఠాలు చెప్పడం మంచి అనుభూతిని కలిగించింది. మా గ్రామ ప్రాథమిక పాఠశాలలోని చిన్నారులను మా పాఠశాలకు ఆహ్వానించాలని అనిపించింది. చాక్లెట్లు తీసుకుని వెళ్లి, వారితో కొంతసేపు గడిపాం. పాఠాలు చెప్పి, మా పాఠశాలలో జాయిన్ అవ్వాలనే ఆసక్తిని పెంచాం. మమ్మల్ని చూసి వారు చాలా ఆనందపడ్డారు. తామూ అదే స్కూలులో చదువుకుంటామన్నారు. మేం మాట్లాడుతున్న ఇంగ్లిషు విని తాము కూడా అలా నేర్చుకుంటామంటూ ఆసక్తి చూపారు. – కిల్లాడి సంధ్యారాణి, 9వ తరగతి విద్యార్థిని, పి.దొంతమూరు -
విద్యార్థులే.. ఉపాధ్యాయులై..
●● స్వీట్లు పెట్టి.. పాఠాలు చెప్పి.. ● ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలని ప్రచారం ● పి.దొంతమూరు హైస్కూల్ విద్యార్థుల వినూత్న ప్రయత్నం పిఠాపురం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఎంతటి ఉత్తమ ఫలితాలను ఇచ్చాయో పిఠాపురం మండలం పి.దొంతమూరు ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులను చూస్తే అర్థమవుతోంది. నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలను కార్పొరేట్కు దీటుగా మార్చడంతో పాటు, ఆంగ్ల మాధ్యమం, విద్యా కానుక, బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, ఇంగ్లిష్ మీడియం వంటి వినూత్న కార్యక్రమాలను నాటి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేసింది. దీనిని అందిపుచ్చుకున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాఠాలు వినే స్థాయి నుంచి.. ఏకంగా ఉపాధ్యాయులుగా మారి పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు. అది కూడా ఆంగ్లంలో. ఈ పాఠశాల విద్యార్థులు కర్నీడి సత్యకృష్ణ, దొడ్డి సిరి, అడపా జీవమణి, ఎలుగుబంటి నందిని, ఎస్.రేవతి తదితరులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరాలంటూ ఇటీవల వినూత్న ప్రచారం నిర్వహించారు. తమ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలు ఏవిధంగా మారాయో స్వయంగా వివరించారు. కొంతసేపు ఆ పిల్లలకు పాఠాలు చెప్పారు. వారికి స్వీట్లు పంచి, వచ్చే ఏడాది తమ స్కూల్లోనే చేరాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన ఏవిధంగా ఉందో ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడి, ఆ చిన్నారులకు అవగాహన కల్పించారు. ఇలా ప్రతి వారం ఆయా పాఠశాలలకు వెళ్లి, ఈ ప్రచారాన్ని కొనసాగించనున్నారు. ఆశ్చర్యం కలిగింది ఇంకా పదో తరగతిలోకి కూడా రాని విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు చెప్పడం, ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడటం చూసి ఆశ్చర్యం కలిగింది. వీరు బెండపూడి విద్యార్థులనే మించిపోయారు. చాలా బాగా చదువుతున్నారు. ఇతర పాఠశాలలకు వెళ్లి విద్యా బోధన చేయడం, వారితో ముచ్చటించడం వంటివి చేస్తే, పది మందిలో మర్యాదగా మాట్లాడటం అలవాటవుతుంది. పి.దొంతమూరు హైస్కూలు విద్యార్థులు ఇప్పుడదే చేస్తున్నారు. వారితో మాట్లాడి అభినందించా. – నాగమణి, రీజినల్ జాయింట్ డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ -
రత్నగిరిపై కనకవర్షం
● సత్యదేవునికి రికార్డు స్థాయి ఆదాయం ● 30 రోజులకు హుండీల ద్వారా రూ.1.89 కోట్ల రాబడి అన్నవరం: మాఘ మాసం పుణ్యమా అని రత్నగిరిపై కనకవర్షం కురిసింది. గడచిన 30 రోజులకు గాను అన్నవరం దేవస్థానానికి హుండీల ద్వారా రికార్డు స్థాయిలో రూ. 1,88,91,940 ఆదాయం సమకూరింది. దేవస్థానంలోని హుండీలను సోమవారం తెరచి, భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. నగదు రూ. 1,80,63,749, చిల్లర నాణేలు రూ.8,28,191 వచ్చా యని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సు బ్బారావు తెలిపారు. వీటితో పాటు బంగారం 66.010 గ్రాములు, వెండి 693 గ్రాములు వచ్చాయని చెప్పారు. విదేశీ కరెన్సీ హుండీల ద్వారా సత్యదేవునికి పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా లభించింది. అమెరికన్ డాలర్లు 129, సింగపూర్ డాలర్లు 50, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ దీనార్ 21, ఇంగ్లండ్ పౌండ్లు 10, ఖతార్ రియల్స్ 28, ఆస్ట్రేలియా డాలర్లు 25, యూఏఈ దీరామ్స్ 530, యూరోలు 5, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ బైసా 100, మలేషియా రింగిట్స్ 6 లభించాయి. కలిసొచ్చిన మాఘం గడచిన మాఘ మాసంలో రత్నగిరిపై పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. అలాగే ఫాల్గుణ మాసంలో కూడా గత మూడు రోజులుగా రత్నగిరిపై జోరుగా వివాహాలు జరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న వారు కూడా అధిక సంఖ్యలో సత్యదేవుని ఆలయానికి తరలి వస్తున్నారు. అలాగే, గత నెలలో భీష్మ ఏకాదశి సందర్భంగా సుమారు లక్ష మంది భక్తులు సత్యదేవుని దర్శనానికి వచ్చారు. ఇలా వచ్చిన భక్తులందరూ పెద్ద మొత్తంలో హుండీల్లో కానుకలు సమర్పించారు. దీంతో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని, హుండీల ద్వారా రోజుకు సగటున రూ.6,09,412 రాబడి వచ్చిందని చైర్మన్, ఈఓ తెలిపారు. వచ్చిన నగదును స్థానిక స్టేట్ బ్యాంకుకు తరలించారు. -
ఉద్యోగినులకు రేపు క్రీడా పోటీలు
కాకినాడ సిటీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యోగినులకు సాంస్కృతిక, ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎన్జీవో సంఘం మహిళా విభా గం చైర్పర్సన్ బి.సుజాత తెలిపారు. ఈ పోటీలకు క లెక్టర్ షణ్మోహన్ను ఎన్జీవో సంఘం నేతలు సోమ వారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారితో కలసి క్రీడా పోటీల పోస్టర్ను కలెక్టర్ కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ, ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ క్రీడా మైదానంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి జరిగే క్రీడా పోటీల్లో మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ఉమ్మ డి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు గుద్దటి రామ మోహన్రావు, కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ, కోశాధికారి వై.పద్మమీనాక్షి తదితరులు పాల్గొన్నారు. నెలాఖరు వరకూ గాలికుంటు నివారణ టీకాలు కాకినాడ సిటీ: పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు ఈ నెలాఖరు వరకూ టీకాలు వేస్తామని జిల్లా పశు సంవర్ధక శాఖ అదనపు సంయుక్త సంచాలకుడు డాక్టర్ ఆర్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ ష ణ్మోహన్ను సోమవారం మర్యాద పూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆరో విడత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఈ నెల 31వ తేదీ వర కూ వేస్తామని చెప్పారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెంకటేశ్వరరావు కోరారు. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లాలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలుంటే ఈ నెల 10వ తేదీలోగా తన కార్యాలయంలో సమర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా విద్యా శాఖ వెబ్సైట్లో సీనియారిటీ జాబితా ఉందని, అభ్యంతరం తెలిపేవారు ఉపాధ్యాయుడి పూ ర్తి పేరు, అభ్యంతరానికి కారణాన్ని సాక్ష్యాలతో సహా వివరించాలని సూచించారు. గడువు తరువాత వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని తెలిపారు. డ్వామా పీడీగా శ్రీనివాసరావు కాకినాడ సిటీ: డీఆర్డీఏ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్గా జి.శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నెల్లూరు జిల్లా డ్వామా పీడీగా పని చేస్తూ బదిలీపై ఇక్కడకు వస్తున్నారు. -
మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తుని రూరల్: హంసవరంలోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ విద్యాలయంలో (ఏపీ మోడల్ స్కూల్) 2025–26 విద్యా సంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ పుల్లా పద్మజ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరిగే ప్రవేశ పరీక్షకు హాజరు కావాలని తెలిపారు. ప్రతిభవంతులైన విద్యార్థులను ఎంపిక చేసి, జాబితా 27న ప్రకటిస్తామన్నారు. ఏప్రిల్ 30 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన, కౌన్సెలింగ్ జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.cse.ap.gov.in లేదా www.apms.apcfss.in వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవాలని పద్మజ సూచించారు. ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలి తుని: జీవాత్మకు పరమాత్మను అనుసంధానం చేసేదే ధర్మమని, ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య, ఆధ్మాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని కహెన్ షా వలీ దర్గాలో సోమవారం జరిగిన 28వ వార్షిక సర్వధర్మ సమ్మేళన సభకు ఆయన అధ్యక్షత వహించారు. సికింద్రాబాద్ యోగాలయ నిర్వహకుడు డాక్టర్ వాసిలి వసంత్ కుమార్, హిందూ ధర్మ ప్రతినిధి స్వామి విజయానంద, ఇస్లాం ప్రతినిధి సూఫీ షేక్ అహ్మద్ జానీ, క్రైస్తవ ప్రతినిధి ఎస్.బాలశౌరి, బౌద్ధం ప్రతినిధి పూజ్య భంతే, సిక్కు మత ప్రతినిధి గురుచరణ్ సింగ్తో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి, సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమాజంలో శాంతి, మానవత్వం విలువలను తెలియజేయడానికి సర్వధర్మ సమ్మేళన సభలు నిర్వహిస్తున్నామని అన్నారు. మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ఆధ్యాత్మికతను అలవరచుకోవాలని సూచించారు. మానవత్వమే మతమని గ్రహించాలని, ఈశ్వర తత్వాన్ని పాటించాలని అన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ ట్రస్ట్ ఆధ్వర్యాన పక్షుల ఆహారానికి ధాన్యం వరి కుచ్చులు, మహిళలకు కుట్టు మెషీన్లు, విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేశారు. ఉమర్ ఆలీషాను తుని కమిటీ ఆధ్వర్యంలో సత్కరించారు. కార్యక్రమంలో జి.సత్యనారాయణ, ప్రసాదవర్మ, పింగళి ఆనందకుమార్, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా ఫైరింగ్ ప్రాక్టీస్ పెద్దాపురం: స్థానిక ఫైరింగ్ రేంజ్లో జిల్లా సాయిధ దళాల వార్షిక మొబలైజేషన్ ఫైరింగ్ ప్రాక్టీస్ సోమవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ బింధుమాధవ్ పాల్గొని, ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. పోలీసులు ఉపయోగింగే అత్యాధునిక ఏకే–47, ఎస్ఎల్ఆర్, ఎం–5 తదితర ఆయుధాలతో లాంగ్రేంజ్, 9 ఎంఎం పిస్టల్స్తో షార్ట్ రేంజ్లో ప్రాక్టీస్ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తెలుగు, హిందీ, సంస్కృతం పరీక్షలకు 17,748 మంది విద్యార్థులు హాజరు కాగా 461 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,493 మంది పరీక్ష రాయగా, 52 మంది హాజరు కాలేదని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి నూకరాజు తెలిపారు. పరక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు. నేడు మద్యం అమ్మకాల నిషేధం కాకినాడ సిటీ: ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా మంగళవారం మద్యం అమ్మకాలను నిషేధిస్తూ కలెక్టర్ షణ్మోహన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. లిక్కర్ షాపులతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్లలో కూడా మద్యం అమ్మరాదని స్పష్టం చేశారు. -
సత్యదేవునికే శఠగోపం!
● షార్ట్ టెండర్ లేకుండానే కాంట్రాక్ట్ ● ఇప్పటి వరకూ రూ.49 లక్షలకే పనులు ● ఇప్పుడు ఆరింటిగా విభజించి రూ.70 లక్షలకు పెంపు ● చక్రం తిప్పిన ఓ ఇన్స్పెక్టర్ ● అన్నవరం దేవస్థానంపై ప్రతి నెలా రూ.21 లక్షల భారంసాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికారం అండతో అక్రమార్కులు ఏకంగా అన్నవరం సత్యదేవుడికే శఠగోపం పెట్టేశారు. నిబంధనలకు పాతరేసి తస్మదీయులకు రూ.లక్షల విలువైన కాంట్రాక్ట్ కట్టబెట్టేశారు. నిబంధనల ప్రకారం రూ.5 లక్షలు దాటే పనులకు టెండర్లు పిలవాలి. ఒకవేళ టెండర్లకు సమయం తక్కువగా ఉంటే కనీసం షార్ట్ టెండర్ అయినా ఆహ్వానించాలి. కానీ, అన్నవరం దేవస్థానంలో కొందరు అధికారులు, టీడీపీ నేతలు కుమ్మకై ్క అటువంటి నిబంధనలకు మంగళం పాడేశారు. ఏం జరిగిందంటే.. సత్యదేవుని సన్నిధికి వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బంది కలగకూడదని పారిశుధ్యం, హౌస్ కీపింగ్, ధోబీ, ఎలక్ట్రికల్ వంటి పనులను కాంట్రాక్ట్కు ఇచ్చేందుకు రెండేళ్లకోసారి టెండర్లు పిలుస్తూంటారు. దేవస్థానంలో ఈ పనులను రెండేళ్లుగా ఒక సంస్థ నిర్వహించేది. దీనికి గాను ఆ సంస్థకు ప్రతి నెలా రూ.49 లక్షల చొప్పున చెల్లించేవారు. దీని కాంట్రాక్టు గడువు గత నవంబర్తో ముగిసింది. అయినప్పటికీ ప్రభుత్వం టెండర్ ద్వారా కొత్త ఏజెన్సీని ఎంపిక చేయలేదు. దీంతో దేవస్థానం అధికారుల అభ్యర్థన మేరకు ఆ ఏజెన్సీ గత నెల 28వ తేదీ వరకూ సేవలు కొనసాగించింది. గడువు ముగిసినా కాంట్రాక్ట్ కొనసాగిస్తూ పోతే ప్రతి నెలా తాము రూ.10 లక్షల మేర నష్టపోతామని నెలన్నర క్రితమే ఆ సంస్థ దేవస్థానం అధికారులకు తెలియజేసింది. చక్రం తిప్పిన ‘నంబర్–2’! గడువు ముగిసినా సేవలు కొనసాగిస్తున్న ఆ సంస్థను తప్పించి, తమ అనుయాయుడికి కట్టబెట్టేందుకు టీడీపీలో నంబర్–2గా చెప్పుకొనే ఓ నేత గట్టి ప్రయత్నమే చేశారు. అయితే, ఆ అనుయాయుడికి ఈ పనుల్లో కనీస అనుభవం కూడా లేకపోవడంతో చివరకు వెనుకడుగు వేశారు. అయినప్పటికీ పాత సంస్థ కాంట్రాక్ట్ గడువు ముగిసిపోవడంతో.. తాత్కాలిక సర్దుబాటు అనే సాకుతో ఇన్నాళ్లూ ఒకే ఏజెన్సీ నిర్వహించిన పనులను ఆరింటిగా విభజించి, తన అనుయాయులకు కట్టబెట్టారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. పారిశుధ్య కార్మికుల సరఫరా, పారిశుధ్య పనుల నిర్వహణ, శానిటేషన్ మెటీరియల్ సరఫరా, పెస్ట్ కంట్రోల్, గార్బేజ్ తరలింపు, ధోబీ, ఎలక్ట్రిసిటీ.. ఇలా పనులను విభజించేసి, షార్ట్ టెండర్లు పిలవకుండానే గుంటూరుకు చెందిన ఓ కాంట్రాక్టర్తో పాటు పలువురికి కట్టబెట్టేయడం విస్మయానికి గురి చేస్తోంది. దీనికోసం సంబంధిత ఏజెన్సీలతో ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారని అంటున్నారు. అంతేకాదు.. నిన్న మొన్నటి వరకూ నెలకు రూ.49 లక్షలకే జరిగిన ఈ పనులను ఇప్పుడు రూ.70 లక్షలకు పెంచేశారు. దీనంతటి వెనుక టీడీపీలో నంబర్–2గా చెప్పుకొనే ఓ సీనియర్ నేత చక్రం తిప్పారని, అందువల్లనే టెండర్లతో ప్రమేయం లేకుండానే పనులు కట్టబెట్టేశారని అంటున్నారు. దీనంతటి ఫలితంగా దేవస్థానంపై ప్రతి నెలా రూ.21 లక్షల మేర అదనపు భారం పడుతోంది. ఈ అంశం అన్నవరం కొండపై ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ముఖ్య నేత ఆదేశాలతో.. ‘దేశం’ ముఖ్య నేత ఆదేశాలతో దేవస్థానం అధికారులు దేవదాయ శాఖ కమిషనర్కు నోట్ ఫైల్ పంపించి, ఆగమేఘాలపై అనుమతులు రప్పించారనే ఆరోపణలు వస్తున్నాయి. విజయవాడ నుండి డెప్యూటేషన్పై వచ్చి, గడువు కూడా ముగిసినా దేవస్థానాన్ని వదిలిపెట్టని ఓ ఇన్స్పెక్టర్ ఈ వ్యవహారంలో చక్రం తిప్పారని కొండపై ప్రచారం జరుగుతోంది. పైగా ఆయన కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన తన సన్నిహితుడికి ఒక విభాగాన్ని ఇప్పించుకున్నారని తెలిసింది. స్వామి సన్నిధిలో సేవలన్నింటినీ ఒకే ఏజెన్సీ నిర్వహిస్తే బాధ్యతగా ఉంటుందనే ఉద్దేశంతో గతంలో తీసుకున్న నిర్ణయాన్ని గాలికొదిలేసి.. అనుయాయులకు అయాచిత లబ్ధి చేకూర్చే పన్నాగం పన్నారని అంటున్నారు. రెండేళ్లుగా ప్రతి నెలా రూ.49 లక్షలకే జరిగిన పనులను.. ఇప్పుడు ఆరింటిగా విభజించి రూ.70 లక్షలు చెల్లించేందుకు దేవదాయ శాఖ ఏవిధంగా ఆమోదం తెలిపిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేవలం తమ వారికి లబ్ధి చేకూర్చాలనే దుర్బుద్ధితోనే ఇలా చేశారని పలువురు విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఇన్ని లక్షల రూపాయల విలువైన కాంట్రాక్ట్ను కనీసం షార్ట్ టెండరయినా పిలవకుండా.. అధికారం చేతిలో ఉందనే ధైర్యంతో ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి వరకూ గట్టి లాబీయింగ్ చేసి పని చక్కబెట్టేశారని అంటున్నారు. పాత సంస్థ కాంట్రాక్ట్ కాలపరిమితి గత నవంబర్లోనే ముగిసింది. ఇన్ని నెలలైనా దేవస్థానం అధికారులు షార్ట్ టెండర్ పిలవాలనే ఆలోచన చేయకపోవడం వెనుక.. తమ వారికి కాంట్రాక్ట్ కట్టబెట్టాలనే టీడీపీ నేత వ్యూహం ఉందని కొండపై చర్చ జరుగుతోంది. అన్నవరం దేవస్థానంలో వస్తున్న ఆదాయానికి, ఖర్చులకు పొంతన లేకుండా పోతోందని కొంత కాలంగా భక్తుల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో దేవస్థానం అధికారులు ఖర్చులు తగ్గించుకుని, ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలి. అలా కాకుండా అధికార పార్టీ నేతలకు అయాచిత లబ్ధి చేకూర్చేలా చర్యలు చేపట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. -
కట్టలు కట్టేందుకే 12 గంటలు
●● ఉదయం 8 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం ● రాత్రి 8.30 గంటల వరకూ కట్టలతోనే సరి ● రాత్రి 9 గంటలకు ప్రారంభమైన చెల్లిన, చెల్లని ఓట్ల లెక్కింపు ● తొలిసారి ఏలూరు జిల్లాలో కౌంటింగ్ తంతుసాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రహసనంలా మారింది. పోలయిన ఓట్లను కట్టలు కట్టడానికే 12 గంటలకు పైగా సమయం పట్టింది. మూడు షిఫ్టుల్లో 700 మంది సిబ్బందిని నియమించినా కౌంటింగ్ ప్రక్రియ వేగంగా సాగడం లేదు. 2.18 లక్షల ఓట్లు గత నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ జరిగింది. ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. కౌంటింగ్ ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమును ఏలూరులోని సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. మొత్తం ఆరు జిల్లాల్లోని 456 పోలింగ్ కేంద్రాల్లో 3,14,984 మందికి గాను 2,18,997 మంది ఓటు వేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఉదయం 6.30 గంటలకే దాదాపు 250 మంది సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. మొత్తం 1,368 బ్యాలెట్ బాక్సులను 17 రౌండ్లుగా విభజించి కట్టలు కట్టే ప్రక్రియ ప్రారంభించారు. ఈ ప్రక్రియ రాత్రి 8.30 గంటల వరకూ సాగింది. 28 టేబుళ్లు ఏర్పాటు చేసి, 17 రౌండ్లుగా విభజించి, కట్టలు కట్టి, ఓట్ల లెక్కింపునకు సిద్ధం చేశారు. రాత్రి 9 గంటల నుంచి చెల్లిన, చెల్లని ఓట్లను వేరు చేసి, లెక్కింపు మొదలు పెట్టారు. ఈ ప్రక్రియకు సుమారు 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో రాత్రి సుమారు 11 గంటల తర్వాత కానీ మొదటి రౌండ్ లెక్కింపు ప్రారంభం కాలేదు. 28 టేబుళ్లకు సగటున 10 వేల నుంచి 15 వేల ఓట్లు కేటాయించి, చెల్లిన, చెల్లని ఓట్లు, మొదటి ప్రాధాన్యతా క్రమంలో ఓట్లను వేరు చేసి లెక్కింపు ప్రారంభించారు. మొదటి రౌండ్లో 10,783, రెండో రౌండ్లో 13,929, మూడో రౌండ్ 11,870, నాలుగో రౌండ్ 13,777, ఐదో రౌండ్ 13,168, ఆరో రౌండ్ 14,783, ఏడో రౌండ్ 12,841, ఎనిమిదో రౌండ్ 14,296, తొమ్మిదో రౌండ్లో 14,162, పదో రౌండ్ 11,654, పదకొండో రౌండ్ 13,674, పన్నెండో రౌండ్ 12,296, పదమూడో రౌండ్ 12,523, పధ్నాలుగో రౌండ్లో 13,876, పదిహేనో రౌండ్ 14,668, పదహారో రౌండ్ 15,823, పదిహేడో రౌండ్లో 4,879 చొప్పున ఓట్లను లెక్కించనున్నారు. ఆరు జిల్లాల అధికారులున్నా.. ఆరు జిల్లాల్లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించిన డీఆర్వోలు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో పాటు తహసీల్దార్లు, వివిధ విభాగాల అధికారులు కౌంటింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్నా ఓట్ల లెక్కింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉదయం 6 గంటలకు విధుల్లోకి వచ్చిన సిబ్బంది మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లిపోతారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకూ, రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకూ మూడు షిఫ్టుల్లో లెక్కింపు జరుగుతోంది. కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గుంటూరులో జరుగుతూండగా, అక్కడి సిబ్బంది రాత్రి 8.30 గంటలకే మూడో రౌండ్ లెక్కింపు పూర్తి చేశారు. గతంలో నాలుగుసార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ గుంటూరులో నిర్వహించడం తదితర కారణాలతో అక్కడ ఓట్ల లెక్కింపు వేగంగా సాగుతోంది. ఏలూరు జిల్లాకు తొలిసారి కావడం, అధికారులకు అనుభవం తక్కువగా ఉండటం వంటి కారణాలతో ఇక్కడ మాత్రం జాప్యం జరుగుతోంది. కౌంటింగ్ సిబ్బంది మొత్తానికి భోజనాలతో సహా అన్ని ఏర్పాట్లూ కౌంటింగ్ కేంద్రం వద్దే చేశారు. ఉదయం 8 గంటల నుంచే ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు మొదటి రౌండ్ కౌంటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. కూటమి పార్టీల మద్దతుతో టీడీపీ నేత పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులుతో పాటు మరో 33 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచి విషయం తెలిసిందే.