Kakinada
-
అమాంతం పెరిగిన రూప్చంద్ ధర
మలికిపురం(కాకినాడ): రూప్చంద్ చేపల ధరలు భారీగా పెరిగాయి. నాలుగేళ్ల క్రితం కేజీ రూ.30కి పడిపోయిన కేజీ రూప్చంద్ చేపలను ఎగుమతిదారులు ప్రస్తుతం రూ.114కు కొనుగోలు చేస్తున్నారు. మధ్యలో కాస్త పెరుగుదల ఉన్నప్పటికీ ఈ స్థాయిలో ధర పలకడం ఇదే మొదటిసారని ఎగుమతిదారులు అంటున్నారు. 2020లో అత్యధికంగా కిలో రూ.70 పలికిన ఈ చేప ధర అనంతరం రూ.30 కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ధర అయితే పెరిగిందిగానీ, రైతుల వద్ద సరకు లేదు. చెరువుల్లో కిలో రూప్చంద్ పెంపకానికి అన్ని ఖర్చులూ కలిపి రూ.80 వరకూ అవుతోంది. నాలుగేళ్లుగా ధర లేక నష్టాల బారిన పడిన రైతులు రూప్చంద్ పెంపకం జోలికే వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ధర పెరిగినా రైతుల వద్ద సరకు లేదు. ఈ చేపలకు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, బిహార్, పశ్చిమ బెంగాల్ తదితర ఈశాన్య రాష్ట్రాల్లో బాగా డిమాండ్ ఉంది.గతంలో భారీగా ఎగుమతులుకోస్తా జిల్లాల్లో పదేళ్లుగా ఆక్వా రంగం కుదేలవుతున్న తరుణంలో రైతులు ఐదేళ్ల క్రితం ముమ్మరంగా రూప్చంద్ చేపల సాగు చేశారు. కోస్తా జిల్లాల నుంచి ఏటా 25 వేల టన్నుల రూప్చంద్ చేపలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యేవని అంచనా. అయితే, ధర పతనమైన తరువాత రైతులు దాని జోలికి వెళ్లలేదు. వేరే అవకాశం లేని ప్రాంతాల్లో తప్ప మిగిలిన ప్రాంతాలో ఈ చేపల సాగు నిలిపి వేశారు. అయినప్పటికీ ప్రస్తుతం ఏటా 5 వేల టన్నులకు పైగా ఈ చేపల ఎగుమతులు జరుగుతున్నట్లు అంచనా. ధర బాగున్న సమయంలో ఇక్కడి రైతులు సాగు చేశారు. ఎకరం చెరువులో సుమారు 4 వేల నుంచి 5 వేల వరకూ రూప్చంద్ చేప పిల్లలను పెంచుతారు. ఎకరానికి నాలుగు టన్నుల పైనే దిగుబడి వస్తుంది. తెగుళ్లను తట్టుకుని ఈ చేప పెరుగుతుంది.ఇవీ ప్రత్యేకతలుకొన్ని దేశాల్లో పిరాపింగా లేదా రెడ్–బెల్లీడ్ పాకు అని కూడా ఈ చేపను పిలుస్తారు. ఇది దక్షిణ అమెరికా మూలానికి చెందిన మంచినీటి చేప. రెడ్–బెల్లీడ్ పాకును అసోంలో సాధారణంగా శ్రీరుప్చంద్ఙ అని పిలుస్తారు. పాకు అనేది అనేక దక్షిణ అమెరికా చేప జాతులను సూచించడానికి ఉపయోగించే సాధారణ పేరు. ప్రత్యేకమైన రుచి కలిగిన చేపల్లో రూప్చంద్ ఒకటి. చెరువుల్లో పెంచుతారు కాబట్టి దీనిని కోస్తాలో చెరువు చందువా అని పిలుస్తారు. సముద్ర చందువా చేపలకు పోటీగా దీనిని మత్స్యశాఖ శాస్త్రవేత్తలు ఇక్కడ ప్రవేశపెట్టారు. కోల్కతా నుంచి సీడ్ వస్తుంది. సముద్ర చందువా చేపలు ఒక సీజన్లో మాత్రమే లభిస్తాయి. రూప్చంద్ చేప మన దేశంతో పాటు బంగ్లాదేశ్, చైనాల్లో కూడా పెరుగుతుంది. అన్ని సీజన్లలోనూ లభిస్తుంది. ఇది భిన్నమైన నిర్మాణ శైలి కలిగి ఉన్న చేప. సముద్ర చందువాతో పాటే, చెరువు చందువా చేపను చైనీస్లో ఫ్రాంఫెట్ అని పిలుస్తారు. తెలుగులో దీనిని చందువా లేదా సందువా అని అంటారు. ఈ జాతి చేపలు కొన్ని ఎరుపు, తెలుపు, నలుపు, సిల్వర్ రంగుల్లో ఉంటాయి. చెరువుల్లోనూ, నదుల్లోనూ పెరుగుతాయి. సిల్వర్ రంగు చేపలు ఉప్పునీటిలో సైతం పెరుగుతాయి. ఎముకను కలిగి ఉండటం ఈ చేప ప్రత్యేకత. అయితే ముళ్లు గుచ్చుకుంటాయనే భయం లేకుండా ఈ చేపలను ఎక్కువగా ఇష్టంగా తింటారు. రూప్చంద్ మాంసంలో ఎక్కువగా ప్రొటీన్లు, విటమిన్లు లభిస్తాయి. పోషక విలువలు అధికంగా ఉండే ఈ చేపలను ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యకరం. దీనిలో ప్రత్యేకంగా అమైనో ఆమ్లాలు, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. రూప్చంద్ చేపలో సోడియం, పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్–సి, విటమిన్–ఇ, శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే మెదడు బాగా పని చేస్తుంది. గుండె జబ్బులకు గురి కాకుండా ఉంటారు. ఇందులో ఉండే ఐరన్, మెగ్నీషియం మానవ శరీరంలోని ఎంజైముల పని తీరును మెరుగుపరుస్తాయి.పెరిగిన ధరలుప్రస్తుతం రూప్చంద్ ధరల పెరుగుదలకు పలు కారణాలు చెబుతున్నారు. ప్రధానంగా ఈ చేపల సాగు మన దేశంలోని ఆంధ్రప్రదేశ్తో పాటు బంగ్లాదేశ్, చైనాల్లో ఎక్కువగా ఉంది. చైనా, బంగ్లాదేశ్ల నుంచి దొడ్డి దారిన రూప్చంద్ చేపలను ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్కు తక్కువ ధరలకే తరలించేవారు. ఇటీవల బంగ్లాదేశ్ సరిహద్దులో వాణిజ్యం నిలిచిపోవడం వంటి కారణాలతో ప్రస్తుతం అటు నుంచి రూప్చంద్ దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో, ఆంధ్రాలో ఈ చేపలకు గిరాకీ పెరిగిందని భావిస్తున్నారు. -
● భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లావ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పండగను శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. స్థానిక పిఠాపురం రోడ్డులోని ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జామియా మసీద్ ఇమామ్ అబ్దుల్ రజాక్ రిజ్వీ ఉదయం 8 గంటలకు ఈద్ నమాజు నిర్వహించారు. బక్రీద్ ప్రాముఖ్యతను వివరించారు. నూరానీ కమిటీ తరఫున జమాల్ శేర్ తనయుడు జుబేర్ పంపిణీ చేశారు. నూరానీ కమిటీ సభ్యులు రెహ్మన్ ఖాన్, లతీఫ్ఖాన్లు ఇమామ్ అబ్దుల్ రజాక్ రిజ్వీకి నూతన వస్త్రాలు అందజేసి ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. నమాజ్ అనంతరం ముస్లింలు పరస్పరం ఆలింగనం చేసుకుని ఈద్ ముబాకర్ చెప్పుకున్నారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు ఈద్ మైదానానికి చేరుకొని నమాజ్ ఆచరించడంతో ఆ మైదానంతో పాటు పిఠాపురం రోడ్డులో సందడి నెలకొంది. -
సీలేరులో యువకుడి గల్లంతు
● నలుగురిని రక్షించిన పోలీసులు ● బాధితులు దేవరపల్లి వాసులు ● నదిలో స్నానాలు చేస్తూండగా ప్రమాదం దేవరపల్లి/మోతుగూడెం: స్నేహితులతో విహార యాత్రకు వచ్చిన యువకుల్లో ఒకరు సీలేరు నదిలో స్నానాలు చేస్తూండగా గల్లంతయ్యాడు. నలుగురు యువకులను పోలీసులు రక్షించారు. వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన సుమారు 30 మంది యువకులు శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం సమీపంలోని పొల్లూరు ప్రాంతానికి విహార యాత్రకు వచ్చారు. ఉదయం 9 గంటలకు ఇక్కడకు చేరుకున్న వారు సీలేరు నది ఒడ్డున వంటలు చేస్తూ స్నానాలు చేశారు. మధ్యాహ్నం భోజనాలు చేసిన తరువాత మళ్లీ సీలేరు నది మధ్యలోకి పి.సుధీర్, ఎ.నాగేంద్ర, రామకృష్ణ, ప్రభు, అభిలాష్ వెళ్లారు. అక్కడ స్నానాలు చేస్తూండగా అకస్మాత్తుగా ప్రవాహ ఉధృతి పెరగడంతో వారు నదిలో చిక్కుకుపోయారు. వీరిలో అభిలాష్ (18) కొట్టుకుపోయాడు. మిగిలిన నలుగురూ నది మధ్యలో బండరాయిని పట్టుకుని ఉండిపోయారు. వెంటనే స్థానికులు అందించిన సమాచారంతో ఎస్సై సాధిక్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఏపీ జెన్కో అధికారులకు సమాచారం అందించడంతో నదిలోకి నీటి విడుదలను తగ్గించారు. వెంటనే ఎస్సై ఆధ్వర్యంలో సిబ్బంది తాళ్ల సాయంతో నలుగురు యువకులనూ ఒడ్డుకు చేర్చారు. కొట్టుకుపోయిన అభిలాష్ ఆచూకీ శనివారం సాయంత్రం వరకూ లభ్యం కాలేదు. దీంతో అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విహార యాత్రకు వచ్చిన యువకులంతా తాపీమేస్త్రులుగా పని చేస్తున్నారు. -
మోసానికే ప్రాధాన్యం!
ఖరీఫ్ పెట్టుబడి ఎలా? గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాదిరిగా రైతులకు కూటమి సర్కారు ఇప్పటి వరకూ ఎటువంటి పథకాలూ అమలు చేయలేదు. దీనికితోడు ధాన్యం కొనుగోళ్లు కూడా సక్రమంగా జరపకపోవడం.. కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో రైతులు దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్ పంట సాగుకు పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాక దిక్కులు చూస్తున్నారు. పంట పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితిలోకి కూటమి ప్రభుత్వం తమను నెట్టేసిందని వాపోతున్నారు. అప్పుల కోసం రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం బకాయిలు విడుదల చేసి, తమకు అప్పుల బాధ నుంచి విముక్తి కల్పించాలని వారు కోరుతున్నారు. కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని, త్వరలోనే రైతులకు డబ్బులు జమవుతాయని వ్యవసాయ శాఖ పిఠాపురం సహాయ సంచాలకులు పి.స్వాతి చెప్పారు. పిఠాపురం: ఒకవైపు ముందస్తు సాగు పేరుతో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సాగునీరు విడుదల ఆరంభించారు. మరోవైపు ఖరీఫ్ పనులకు రైతులు సమాయత్తమవుతున్నారు. వేసవి దుక్కులు, ఆకుమడుల తయారీకి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో సాగు పెట్టుబడి దొరికే దారి కానరాక అల్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం అనుసరించి విధానాలు తమను కష్టాల్లోకి నెట్టేశాయని వాపోతున్నారు. ఏం జరిగిందంటే.. గడచిన రబీలో జిల్లావ్యాప్తంగా 1.45 లక్షల మంది రైతులు 1.62 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారు 5.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 225 కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది. మొత్తం 15,200 మంది రైతుల నుంచి 1.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. దీని విలువ సుమారు రూ.310 కోట్లు. ప్రభుత్వం ఇప్పటి వరకూ రైతులకు రూ.250 కోట్ల మేర చెల్లించింది. గొప్పలు చెప్పి.. తిప్పలు పెట్టి.. కొనుగోలు చేసిన 24 గంటల్లోనే ధాన్యం సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎంతో గొప్పగా చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రోజులు, నెలల తరబడి ధాన్యం సొమ్ములు జమయ్యేవి కావని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం సకాలంలో చెల్లిస్తున్నామని ఊదరగొట్టారు. తీరా చూస్తే క్షేత్ర స్థాయిలో కొంత మందికి మాత్రమే ధాన్యం సొమ్ము జమ చేశారు. మిగిలిన వారికి రోజులు, వారాల తరబడి పెండింగ్లో పెట్టారు. ఈవిధంగా జిల్లావ్యాప్తంగా రైతులకు ప్రభుత్వం రూ.60 కోట్లు పైగా ధాన్యం సొమ్ము బకాయి పెట్టింది. దళారులపాలు చేసి.. మరోవైపు ధాన్యంలో తేమ 22 శాతం వరకూ ఉన్నా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామని ప్రభు త్వం ఎంతో ఘనంగా చెప్పింది. కానీ, క్షేత్ర స్థాయిలో ఆవిధంగా జరగలేదు. దీంతో, రోజుల తరబడి ధా న్యం కళ్లాల్లోనే ఉండిపోయింది. అదే సమయంలో అ కాల వర్షాలు కురవడంతో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తేమ శాతం నిబంధనలను సడలించకపోవడంతో ఎక్కువ మంది రైతులు గత్యంతరం లేక దళారులకే.. అది కూడా వారు చెప్పిన తక్కువ ధరకే ధాన్యం అమ్ముకోవాల్సి వచ్చింది. ఈవిధంగా సుమారు 4.33 లక్షల మె ట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు దళారులకే అమ్ముకోవాల్సి వచ్చింది. ఫలితంగా ఎకరానికి రూ.20 వేల వరకూ నష్టపోయారు. మొత్తం మీద ఇటు కొన్న ధా న్యానికి డబ్బులివ్వకుండా.. అటు దళారులకే నష్టానికి ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో రైతు లు ఈ ఏడాది దారుణంగా నష్టాలు చవి చూశారు. 24 గంటలన్నారు.. నెల రోజులువుతున్నా అందని ధాన్యం సొమ్ము జిల్లాలో రూ.60 కోట్లకు పైగా బకాయి ఖరీఫ్ పెట్టుబడులకు డబ్బుల్లేక రైతుల ఆందోళనప్రభుత్వ విధానాలతో రైతుకు నష్టం రైతులు సాధారణంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతూంటారు. కానీ రాష్ట్రంలోని అన్నదాతలు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల నష్టపోయారు. జిల్లాలోని రైతులు 5 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం పండిస్తే ప్రభుత్వం కేవలం 1.30 లక్షల మెట్రిక్ టన్నులు. దీనికి కూడా డబ్బులివ్వకుండా రైతులకు నరకం చూపిస్తున్నారు. గత నెల 8వ తేదీ వరకూ కొందరికి ధాన్యం డబ్బులు వేసిన ప్రభుత్వం.. ఆ తరువాత నుంచి ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులకు డబ్బుల్లేక రైతులు అప్పుల పాలవుతున్నారు. ధాన్యం బకాయిలపై జిల్లా అధికారులతో మాట్లాడితే ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామని అంటున్నారు. రైతులకు ఇవ్వడానికే డబ్బుల్లేపోతే ఇక వ్యవసాయం ఎలా సాగుతుంది? ఉన్న అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని రైతులు వాపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోతే ఎలా? 24 గంటల్లో డబ్బులు వేయిస్తామన్న నేతలు స్పందించాలి. గత ఐదేళ్లలో రైతు ఏనాడూ ఇలా కంటతడి పెట్టలేదు. వారికివ్వాల్సిన డబ్బులు వెంటనే విడుదల చేయాలి. రైతు భరోసా రూ.20 వేల చొప్పున రెండేళ్లకు కలిసి వెంటనే వెయ్యాలి. – వంగా గీతా విశ్వనాథ్, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, పిఠాపురం -
తొలి తిరుపతి.. భక్తఝరి
పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే భక్తుల రద్దీ మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 20 వేల మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యాన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో వివిధ సేవల టికెట్లు, కేశఖండన, అన్నదాన విరాళాల రూపంలో స్వామివారికి రూ.3,39,087 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. నాలుగు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. కాకినాడ – సామర్లకోట మధ్య నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపుఫ్లై ఓవర్పై గడ్డర్ల ఏర్పాటు పనులు ప్రారంభం సామర్లకోట: ఏడీబీ రోడ్డులో అచ్చంపేట – సామర్లకోట రాక్ సిరామిక్స్ వరకూ భారత్ మాల జాతీయ రహదారి పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పనుల్లో భాగంగా సామర్లకోట – కాకినాడ మధ్య ముత్యాలమ్మ ఆలయం సమీపాన నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రెడీమేడ్ గడ్డర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వీటిని వంతెన వద్దకు చేర్చారు. వీటిని బ్రిడ్జి స్తంభాలకు కలుపుతూ అమరుస్తారు. ఈ పనుల నేపథ్యంలో కాకినాడ – సామర్లకోట మధ్య ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. కాకినాడ నుంచి సామర్లకోట వచ్చే వాహనాలను ఈ నెల 10వ తేదీ వరకూ వీకే రాయపురం నుంచి అచ్చంపేట ఏడీబీ రోడ్డుకు మళ్లిస్తారు. సామర్లకోట నుంచి కాకినాడ వెళ్లే వాహనాలు ఏడీబీ రోడ్డు నుంచి వీకే రాయపురం, అచ్చంపేట, పనసపాడు, సర్పవరం మీదుగా మళ్లిస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వాస్తవానికి ఈ వంతెనపై గడ్డర్ల ఏర్పాటు పనులు గత నెల 21నే ప్రారంభం కావాల్సి ఉండగా వర్షాల కారణంగా వాయిదా వేశారు. యోగా దైనందిన జీవితంలో భాగం కావాలి నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతతో విధులు సమర్థవంతంగా నిర్వర్తించవచ్చని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో కాకినాడ మెయిన్ రోడ్డు టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఎల్ఐసీ బిల్డింగ్ సెంటర్ వరకూ శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, కర్రి పద్మశ్రీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, నగర పాలక సంస్థ కమిషనర్ భావన, అదనపు ఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్ తదితర అధికారులతో పాటు వివిధ శాఖల నుంచి సుమారు 5 వేల మంది యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. యోగా శిక్షకుడు రామానంద అందరితో యోగాసనాలు వేయించారు. రేపు పీజీఆర్ఎస్ రద్దు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని సోమవారం అనివార్య కారణాలతో రద్దు చేశారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. అర్జీదారులు గమనించాలని కోరారు. -
రత్నగిరి.. భక్తజన సంద్రం
● సత్యదేవుని దర్శించిన 50 వేల మంది ● 2,300 వ్రతాల నిర్వహణ ● దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం అన్నవరం: రత్నగిరి శనివారం భక్తజన సంద్రాన్ని తలపించింది. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున రత్నగిరి, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు వేలాదిగా సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. రద్దీ అధికంగా ఉండటంతో అంతరాలయ దర్శనాన్ని కొంతసేపు నిలిపివేశారు. సుమారు 50 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. వ్రతాలు 2,300 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఆదివారం కూడా రత్నగిరిపై భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశముంది. సత్యదేవుడు, అమ్మవారిని ఉదయం పది గంటలకు టేకు రథంపై ఊరేగించనున్నారు. -
పవన్కు ఝలక్.. జనసేన నేతల దందాపై వర్మ సెటైర్లు
సాక్షి, కాకినాడ: ఏపీ డిప్యూటీ సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో యథేచ్ఛగా జనసేన నేతలు ఇసుక దందా చేస్తున్నారు. తాజాగా ఇసుక దందాను టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. దీంతో జనసేన, టీడీపీ మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ఇలాకా పిఠాపురంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఈ నేపథ్యంలో ఇసుక మాఫియాపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా మల్లివారితోటలో ఇసుక అక్రమ తవ్వకాలను వర్మ పరిశీలించారు. అనంతరం, వర్మ మీడియాతో మాట్లాడుతూ.. రాత్రి కాగానే పిఠాపురం పోలీసులకు రేచీకటి వస్తోంది. పిఠాపురం పోలీసులకు స్పెషల్ గ్లాసెస్ ఇవ్వాలి. అనుమతులు లేకుండా ఇసుక తవ్వుతున్నారు. పోలీసులు మాఫియాతో కుమ్మక్కైపోయినట్టున్నారు. రోజుకు 200 నుండి 300 లారీల ఇసుక వెళ్లిపోతుంది. రాత్రుళ్లు ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఇసుక రవాణా కనిపించడం లేదంటే వాళ్లకు కావాల్సిన మామూళ్లు వస్తున్నాయి. పోలీసులు ముందే సమాచారం ఇచ్చి సర్దుకోమంటున్నారు. ఇక్కడ దొంగతనం జరుగుతుందని చెప్పినా పట్టించుకోవడం లేదు. 20 రోజులుగా పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు. రమణక్కపేటలో అక్రమ రవాణాకు మరో శంకుస్థాపన చేశారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
కాకినాడలో సైబర్ స్కామర్లు
కాకినాడ క్రైం: అమాయకులే లక్ష్యంగా కాకినాడలో ఓ ముఠా ఖాతాలు తెరచి, వాటిని వినియోగించుకుని సైబర్ నేరాలకు పాల్పడుతోంది. ఎస్పీ బిందుమాధవ్ «శుక్రవారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన నార్ని సతీశ్ చంద్ర (37), దాసరి వీరవెంకట సత్యనారాయణ (31) కొద్ది నెలలుగా కాకినాడలోని వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపిస్తున్నారు. పాస్బుక్, చెక్బుక్, ఏటీఎం కార్డుతో కూడుకున్న బ్యాంక్ కిట్లు తమకు అప్పగిస్తే ఖాతా తెరిచేందుకు అయ్యే ఖర్చుతో పాటు మరో రూ.5 వేలు ఇస్తామని ప్రలోభ పెట్టేవారు. ఈ ఖాతాపై రెండు నెలల్లో రూ.5 లక్షల చొప్పున లోన్ ఇప్పిస్తామని నమ్మబలికారు. దీంతో పదుల సంఖ్యలో జనం ఖాతాలు తెరచి, కిట్లను వీరికి అప్పగించారు. కాకినాడకు చెందిన ఉదయ్కిరణ్కు ఈ కిట్లు అప్పగిస్తే అతను వీరికి డబ్బు ఇచ్చేవాడు. కాకినాడ సాంబమూర్తినగర్కు చెందిన కొర్రా లోవరాజు ఖాతా తెరచి కిట్ అప్పగించి రెండు నెలలైంది. లోన్ కోసం కాకినాడలోని బ్యాంక్ ఆఫ్ కర్ణాటకకు వెళ్లాడు. బ్యాంక్ అధికారులు అతని ఖాతా పరిశీలిస్తే కేవలం నెల రోజుల వ్యవధిలో రూ.50 లక్షల విలువైన లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది. దీంతో లోవరాజు పోలీసుల్ని ఆశ్రయించాడు. పోలీసులు సతీశ్ చంద్ర, వీర వెంకట సత్యనారాయణను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరు కాకినాడకు చెందిన ఉదయ్కిరణ్ అనే వ్యక్తికి ఈ ఖాతాల కిట్లు అప్పగిస్తే అతడు వీటిని దుబాయ్ పంపిస్తున్నాడని తేలింది. దుబాయ్లో ఈ బ్యాంకు వివరాలు పుట్టారామ్ అనే వ్యక్తికి పంపిస్తున్నాడని తెలిసింది. ఇందుకు ఉదయ్ కిరణ్కు ఖాతాకు రూ.30 వేల చొప్పున పుట్టారామ్ చెల్లిస్తున్నాడు. గడచిన 2 నెలల్లో సతీశ్ చంద్ర, వీర వెంకట సత్యనారాయణ కాకినాడ జిల్లాతో పాటు గుజరాత్, పశ్చిమ బెంగాల్, కర్ణాటకకు చెందిన పేర్లతో 48 ఖాతాలు తెరచి రూ.9 కోట్ల విలువైన మొత్తం జమ చేసినట్టు ఎస్పీ తెలిపారు. సతీశ్ చంద్ర, సత్యనారాయణను అరెస్టు చేయగా ఉదయ్కిరణ్ పరారీలో ఉన్నాడు. పుట్టారామ్ను పట్టుకునేందుకు కేంద్ర నిఘా విభాగాలకు సమాచారమిచ్చామని ఎస్పీ చెప్పారు. -
ముందస్తుకు నీళ్లొదిలారు!
క్లోజర్ పనులు ఇప్పుడు మొదలు పెట్టారు డెల్టా పంట కాలువలకు ఏప్రిల్ 27వ తేదీ నుంచి నీళ్లు బంద్ చేశారు. అయితే చాలాచోట్ల మే 20 తరువాత క్లోజర్ పనులు మొదలయ్యాయి. కొన్నిచోట్ల ఇప్పుడిప్పుడే పనులు మొదలు పెట్టడం గమనార్హం. ఆత్రేయపురం మండలం లొల్ల లాకు దిగువన మూడు కాలువల మీద మొదలు పెట్టిన సైఫన్ నిర్మాణాల పనులు నత్తను తలపిస్తున్నాయి. అమలాపురంలో బెండా కెనాల్ మీద ఈదరపల్లి, నడిపూడి వద్ద వంతెనల నిర్మాణాలు సైతం అనుకున్నంత వేగంగా సాగడం లేదు. ఇవి కాకుండా పి.గన్నవరం, ముక్తేశ్వరం, అమలాపురం, మండపేట, కాకినాడ కాలువల మీద ఇప్పుడిప్పుడే పూడిక తీత పనులు చేపట్టడం గమనార్హం. ఈ పనులు ఈ నెల పదవ తేదీ నాటికి పూర్తయ్యే అవకాశముందని సాగునీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన కోనసీమ జిల్లా సమావేశంలో కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ సైతం ఈ నెల పదవ తేదీకి పనులు పూర్తి చేయాలని కోరారు. అంటే ఈ నెల పది వరకు కాలువలకు పూర్తిస్థాయిలో సాగునీరందే అవకాశం లేదని తేలిపోయింది. అటువంటప్పుడు జూన్1వ తేదీన సాగు నీరు విడుదల చేయడం ఎందుకని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. జూన్ పదో తేదీన నీరు విడుదల చేసినా పంట కాలువల వ్యవస్థ అధ్వానంగా ఉండడం వల్ల ఈ నెల 20వ తేదీ వరకు ఆయకట్టుకు చేరే పరిస్థితి లేదని రైతులు పెదవి విరుస్తున్నారు. ● ఉమ్మడి జిల్లాలో ముందస్తు ఖరీఫ్ సాగు లేనట్టే ● ఒకటో తేదీన మొక్కుబడిగా నీటి విడుదల ● తూర్పు, మధ్య డెల్టాకు కలిపి 300 క్యూసెక్కులు మాత్రమే ● పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కులు ● పలుచోట్ల కాలువలపై పనులు ● మధ్య డెల్టాకు లొల్ల లాకుల వద్దనే నిలిపివేసిన అధికారులు ● ఈ మాత్రం దానికి ఎందుకు వదిలినట్టు అని రైతుల మండిపాటు సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టాలో ఖరీఫ్కు ప్రధాన అవరోధం ‘ముంపు’. సాగు ఆలస్యం అయి భారీ వర్షాలు, తుపాన్ల సమయంలో ఖరీఫ్ దిగుబడికి సిద్ధంగా కావడం వల్ల చేలు ముంపుబారిన పడి రైతులు కోట్ల రూపాయలు నష్టపోవడం పరిపాటిగా మారింది. దీనిని గుర్తించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం డెల్టాలో ముందస్తు సాగును ప్రోత్సహించింది. దీనిలో భాగంగా జూన్ ఒకటి, రెండు తేదీలలో నీరు విడుదల చేయడం మొదలు పెట్టింది. ఈసారి కూటమి ప్రభుత్వం కూడా ముందస్తు సాగుకు నీరు విడుదల చేస్తామని చెప్పి కొంత మొత్తంలో నీరు విడుదల చేసింది. దానికి కూడా పలుచోట్ల హెడ్ స్లూయిజ్ల సమీపంలోనే నిలిపివేయడం గమనార్హం. కోటి ఆశల ఖరీఫ్కు ఆదిలోనే అవరోధం ఏర్పడింది. ముందస్తు సాగుకు వీలుగా జూన్ ఒకటి, రెండు తేదీల్లో పశ్చిమ, తూర్పు, మధ్య డెల్టా ప్రధాన పంట కాలువలకు నీరు విడుదల చేశారు. కాని ఈ మూడు డెల్టాలకు కలిపి కేవలం 800 క్యూసెక్కులు మాత్రమే నీరు వదులుతున్నారు. దీంతో పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కులు, తూర్పు డెల్టాకు 200 క్యూసెక్కులు. మధ్య డెల్టాకు 100 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. దీనిలో మధ్య డెల్టాకు వదులుతున్న నీరు సమీపంలోని లొల్ల లాకుల వద్దనే నిలిపివేశారు. ఇక్కడ నిలిపివేయడం ద్వారా పి.గన్నవరం, ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్, అమలాపురం కాలువలకు నీరు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఇక తూర్పు డెల్టాకు 200 క్యూసెక్కుల వదలడం వల్ల కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. దీని మీద కాకినాడ, మండపేట, కోరంగి, కోటిపల్లి, సామర్లకోట, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) కాలువల ద్వారా ఆయకట్టుకు సాగునీరందాల్సి ఉంది. అలాగే పశ్చిమ డెల్టాలో ఏలూరు, నర్సాపురం బ్యాంకు కెనాల్ ద్వారా సాగునీరందాల్సి ఉంది. ముందస్తుతో పలు విధాలుగా మేలు ప్రకృతి వైపరీత్యాల నుంచి ఖరీఫ్ పంటను గట్టెక్కించడం, రబీ సాగు నీటి ఎద్దడి బారిన పడకుండా చూడడం, మూడవ పంటగా అపరాలు సాగు చేయించడం ద్వా రా రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చేయడం వంటి ఉన్నత లక్ష్యాలకు అనుగుణంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఖరీఫ్లో ముందస్తు సాగును ప్రోత్సహించింది. కాని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఖరీఫ్, రబీ నీటి విడుదలపై నిర్లక్ష్యం కమ్ముకుంటోంది. పంట కాలువలపై మొదలు పెట్టిన పనులు ఇంకా ప్రాథమిక దశలో ఉండడంతో నీటి విడుదల ఆలస్యమై ఆ ప్రభావం ఖరీఫ్ సాగుపై పడనుంది. కాకినాడ జిల్లా పరిధిలో తూర్పు డెల్టాకు వచ్చి మొత్తం 3,40,548.78 ఎకరాల నికర ఆయకట్టు ఉండగా, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో తూర్పు, మధ్య డెల్టాలు కలిపి 2,46,155.26 ఎకరాలు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో తూర్పు, పశ్చిమ డెల్టాలు కలిపి మొత్తం 66,692.47 ఎకరాలు ఉంది. ఇక్కడ సాగు ఆలస్యమైతే వరి దిగుబడి వచ్చే సమయానికి వర్షాలు, తుపాన్ల బారిన పడే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డెల్టా ఆయకట్టు ఇలా (ఎకరాల్లో) జిల్లా రిజిస్టర్ ఆయకట్టు నికర ఆయకట్టు కాకినాడ 2,75,765.62 2,60,192.27 కాకినాడ జిల్లా – 80,356.10 (పిఠాపురం బ్రాంచ్ కెనాల్) -
పదవుల కోసం తండ్రిపై ఆరోపణలు సరికాదు
● బార్లపూడి క్రాంతిపై మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి ఫైర్ ● పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ఇంత దిగజారి పోవాలా? సాక్షి ప్రతినిధి, కాకినాడ: పదవుల కోసం నీ తండ్రి మీద, నీ తమ్ముడుపై ఆరోపణలు చేయడం సరికాదని కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతికి మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీశివకుమారి సూచించారు. బార్లపూడి క్రాంతి ఇటీవల తండ్రి ముద్రగడపై, సోదరుడు, ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబుపై చేసిన వ్యాఖ్యలకు లక్ష్మీ శివకుమారి ఘాటుగా స్పందించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం నీవు దిగజారి పోవాలా? అని ప్రశ్నించారు. నీ రాజకీయం కోసం మా నాయకుడు గిరిబాబుపై నిందలు వేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. తన తండ్రి ఆరోగ్యం కోసం కొడుకు గిరిబాబు పడుతున్న కష్టాలు రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు తెలుసునని అన్నారు. ఎన్నికలప్పుడు నీ తండ్రి మీద ఆరోపణలు చేసి పరువు తీసినప్పుడు ఈ ప్రేమ ఏమైందన్నారు. మా నాయకుడు ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉంది. నీ తండ్రి ముద్రగడ పద్మనాభం ‘నా కూతురితో ఇంక సంబంధాలు లేవు, నాకు ఏమి జరిగినా చూడటానికి కూడా రావద్ద’ని ఎన్నికల సమయంలో మీడియా ముఖంగా చెప్పింది నీకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. మా నాయకుడు గిరిబాబుపై ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేస్తే త్వరలోనే మరిన్ని ఆధారాలతో నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ముద్రగడపై కక్షతోనే పవన్ కల్యాణ్ జనసేన నాయకురాలు క్రాంతితో వ్యాఖ్యలు చేయిస్తున్నారా? అనే అనుమానం ఉందన్నారు. క్రాంతిపై పవన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీ మామయ్య, నీ భర్త ఆరోగ్యం కోసం ట్రీట్ మెంట్ చేయించుకో అని ఆమెకు సూచించారు. -
యంత్ర రాయితీకి చంద్రగ్రహణం
శనివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 202510లో● కూలీ రేట్లు పెరగడంతో యంత్రాలపైనే ఆధారపడ్డ రైతులు ● గత ఏడాది ఒక్క పరికరమూ అందించని కూటమి ప్రభుత్వం ● ఎక్కువ రేట్లు చెల్లించి పరికరాలు అద్దెకు తెచ్చుకొంటున్న అన్నదాతలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రైతులు సాంకేతికత సహాయంతో పంటలు పండించాలని చెబుతూనే యంత్ర రాయితీ పథకానికి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి సర్కారు మంగళం పాడింది. ఏటా రైతులకు 50 శాతం రాయితీపై యంత్రసేవా పథకంలో వ్యవసాయానికి సంబంధించిన యంత్ర పరికరాలు ఇవ్వాల్సి ఉంది. ఈ యంత్ర సేవా పథకానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేస్తుంది. రైతులకు విత్తు దగ్గర నుంచి వరి కోతల వరకూ వివిధ దశల్లో ఉపయోగపడే యంత్ర పరికరాలు ఈ యంత్ర సేవా పథకం ద్వారా అందజేయాల్సి ఉంది. దుక్కులు, దమ్ములు చేసుకొనేందుకు ట్రాక్టర్లు, డ్రమ్ ఫీడర్స్, రైతులు కోతలుకు వినియోగించే వరికోత యంత్రాలతోపాటు పలు పరికరాలు ఈ పథకంలో ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఒక్క రైతుకూ రాయితీ పరికరాలు ఇచ్చిన పాపాన పోలేదు. గత ఖరీఫ్, రబీ సీజన్లో రైతులకు కనీసం టార్పాలిన్లు, స్పేయర్లు కూడా పంపిణీ చేయకపోవడంతో అద్దెలకు తెచ్చుకొని పనులు చేసుకున్నారు. కాకినాడ జిల్లాలో సుమారు 2 లక్షలకు పైగా రైతులు ఉన్నారు. జిల్లాలో 2.18 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా క్రమం తప్పకుండా రైతులకు, రైతు సంఘాలకు యంత్రసేవా పథకంలో రాయితీపై పరికరాలు అందించేవారు. రెండు సీజన్లలో తప్పని అవస్థలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడచింది. ఖరీఫ్, రబీ సీజన్లు కూడా ముగిశాయి. కానీ రైతులకు కనీసం ఒక్క టార్పాలిన్, స్ప్రేయర్లు, వరికోత యంత్రాలు, మినీ ట్రాక్టర్లు, ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు వంటివి ఏమీ మంజూరు చేయలేదు. యంత్ర సేవా పథకంలో కేంద్ర ప్రభుత్వం నిధులు సైతం ఉన్నప్పటికీ అమలు కావడం లేదు. ఆ నిధులు ఏమీ చేశారో సీఎం చంద్రబాబునాయుడికే తెలియాలి. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే పథకాల నిధులు కూడా రైతులకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రతీ గ్రామంలో సుమారు రెండునుంచి మూడు వేల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఆయా గ్రామాల్లో సీజన్లో యంత్ర పరికరాలు లేకపోవడంతో వేరే ప్రాంతాల నుంచి పరికరాలు తీసుకొచ్చి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రైతులకు వరికోత యంత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి. గత ఖరీఫ్, రబీ సీజన్లో తగిన యంత్రాలు లేకపోవడంతో ఒడిశా, బిహార్, పంజాబ్ వంటి రాష్ట్రాల నుంచి వరికోత యంత్రాలు అద్దెకు తెచ్చుకొవాల్సి వచ్చింది. గత రబీ సీజన్లో కోతలు కోసే సమయంలో వర్షసూచనల నేపథ్యంలో రైతులు యంత్రాలు లేక, కూలీలు లభించక చాలా అవస్థలు పడ్డారు. ఇదే అదనుగా పలువురు దళారులు వరికోత యంత్రాలు వేరే ప్రాంతాల నుంచి తీసుకువచ్చి అద్దెలు బాగా పెంచారు. ఎకరా పొలం వరికోత కోయడానికి రూ.3,500 చొప్పున వసూలు చేశారు. వరికోత యంత్రాలు స్థానికంగా అందుబాటులో ఉంటే రూ.2,500 తీసుకొనేవారు. వర్షసూచన నేపథ్యంలో ఎక్కువ రేటు పెట్టి అయినా సరే రైతులు కోతలు కోయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక రైతులు కోతలు పూర్తయిన తర్వాత ధాన్యం ఆరబోసుకొనేందుకు టార్పాలిన్ అవసరం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో రైతులకు కావాల్సిన టార్పాలిన్లు 50 శాతం రాయితీపై అందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఇవ్వకపోవడంతో అద్దెకు తెచ్చుకోవాల్సి వచ్చింది. వర్ష సూచన నేపథ్యంలో ఒక్కొక్క టార్పాలిన్కు రూ.50 చొప్పున అద్దె చెల్లించి తెచ్చుకోవాల్సి వచ్చింది. ధాన్యం తేమ శాతం ఎక్కువగా ఉంటే మిల్లర్లు కొనుగోలు చేయకపోవడంతో సుమారు 10 రోజుల పాటు రైతులు ధాన్యాన్ని ఎండపెట్టాల్సి వచ్చింది. ఒక ఎకరం పొలంలో ధాన్యం ఎండపోసేందుకు ఐదారు టార్పాలిన్లు అవసరం కాగా వాటిని అద్దెకు తెచ్చుకోక తప్పలేదు. ఇలా కొందరు రైతులు 20 రోజుల వరకూ ధాన్యం తరలించకపోవడంతో వాటికి అద్దెలు చెల్లించాల్సి వచ్చింది. అదే ప్రభుత్వం రాయితీపై ఇస్తే ఆ టార్పాలిన్లు రైతులకు రెండు, మూడు సంవత్సరాల వరకూ వినియోగించుకొనే అవకాశం ఉంటుంది. అద్దె బాధ తప్పుతుంది. పురుగు మందులు పిచికారీ చేసే స్ప్రేయర్లు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేని దుస్థితిలో ఉంది. రైతులు గత ఖరీఫ్, రబీ సీజన్లో అద్దెకు తెచ్చుకొనే మందులు పిచికారీ చేసుకున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ మొదలైనా రాయితీ పరికరాల ఊసే ఈ ప్రభుత్వం ఎత్తడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కొరత గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల కొరత భారీగా ఉంది. గ్రామ ఆయకట్టుకు తగిన విధంగా కూలీలు గ్రామాల్లో దొరకడం లేదు. గతంలో వేరే ప్రాంతాల నుంచి కూలీలు వలసలు వచ్చి వరినాట్లు, వరి కోతలు, కలుపుతీత వంటి పనులు చేసేవారు. దీంతో కూలీల కొరత కొంతమేర తగ్గేది. ప్రస్తుతం వలస కూలీలు అసలు రావడం లేదు. దీంతో రైతులకు స్థానిక కూలీలతో పనులు చేయించుకోవడం కష్టసాధ్యమైపోయింది. ఈ నేపథం్యలో యంత్ర పరికరాలు ఉంటే రైతులకు ఎంతో మేలు చేస్తాయి. ఎకరం వరి కోత కోయాలంటే ప్రస్తుత కూలి రేటు ప్రకారం రూ.6 వేలు చెల్లించాలి. కుప్ప నూర్పిడికి ట్రాక్టరు, కూలీలకు మరో రూ.6 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ వరికోత యంత్రం ద్వారా అయితే రూ.3,500 సరిపోతుంది. ధాన్యం ఆరబోతకు టార్పాలిన్లు, కూలికి మరో రూ.3 వేలు ఖర్చవుతుంది. ఈ విధంగా రైతుకు రూ.6 వేలు మిగులుతుంది. వైఎస్సార్ సీపీ హయాంలో.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2,431 రైతులకు, 150 రైతు సేవా సంఘాలకు రూ.27.52 కోట్లు విలువ చేసే యంత్ర సేవా పథకాలు క్రమం తప్పకుండా ఏటా అందజేశారు. గ్రామాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి రైతులకు కావాల్సిన యంత్ర పరికరాలు తక్కువ రేట్లకు అద్దెకు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ విధానానికి కూడా కూటమి సర్కార్ స్వస్తి పలికింది. దీంతో రైతులు దళారుల వద్ద యంత్ర పరికరాలు తెచ్చుకొని అధికంగా అద్దెలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.యంత్రసేవా పథకం పునరుద్ధరించాలి ఖరీఫ్, రబీ సీజన్లో ఈ యంత్ర పరికరాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో బయట నుంచి వచ్చే వరి కోత మెషీన్లపై ఆధారపడి కోతలు కోయడం వల్ల ఎకరాకు రూ.2 వేల వరకూ అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ప్రభుత్వం యంత్రాలు ఇస్తే మాకు భారం తగ్గుతుంది. – అడబాల గోవిందు, రైతు వీకేరాయపురం, సామర్లకోట మండలం టార్పాలిన్లు, స్ప్రేయర్లు ఇవ్వాలి గత సంవత్సరం స్ప్రేయర్లు, టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డాం. వీటి అద్దెలు రూ.2 వేలు చెల్లించాను. అదే ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తే రెండు, మూడు సంవత్సరాల వరకూ వీటిని వినియోగించుకోవచ్చు. ప్రభుత్వం యంత్రసేవా పథకం పునరుద్ధరించాలి. – ఎలుగుబంట్ల రవినాయుడు, రైతు కూరాడ, కరప మండలం -
వనదుర్గమ్మకు ఘనంగా చండీహోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఘనంగా చండీ హోమం నిర్వహించారు. సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి, కొండ దిగువన తొలిపావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారికి పండితులు కుంకుమ పూజలు నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు పండితులు వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చండీ హోమం ప్రారంభించారు. హోమం అనంతరం 11 గంటలకు హోమగుండంలో ద్రవ్యాలను సమర్పించి ఘనంగా పూర్ణాహుతి నిర్వహించారు. తరువాత అమ్మవార్లకు పండితులు వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాలు, నైవేద్యం సమర్పించారు. వనదుర్గ అమ్మవారికి నిర్వహించిన హోమంలో 40 మంది భక్తులు పాల్గొన్నారు. సత్యదేవుని ప్రధానాలయంలో దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు ఇంద్రగంటి నర్శింహమూర్తి ఆధ్వర్యంలో, కనకదుర్గ అమ్మవారికి అర్చకుడు చిట్టెం హరగోపాల్ ఆధ్వర్యంలో పండితులు కుంకుమ పూజలు నిర్వహించి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్గా రామస్వామి బాధ్యతలుబోట్క్లబ్ (కాకినాడసిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్గా తుమ్మల రామస్వామి (బాబు) శుక్రవారం ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ జాయింట్ కలెక్టర్ రాహుల్మీనా డీసీసీబీ ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహించారు. బ్యాంకు సీఈఓ ఆర్వీ నరసింహారావు తుమ్మల బాబుతో సంతకాలు చేయించారు. డీఎస్సీ పరీక్షలు ప్రారంభం – తొలిరోజు 893 మంది హాజరు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించి నిర్వహిస్తున్న డీఎస్సీ–25 ఆన్లైన్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 6 ఆన్లైన్ కేంద్రాల్లో ఉదయం ఐదు, మధ్యాహ్నం ఒక కేంద్రంలో పరీక్ష నిర్వహించారు. రెండు సెషన్లకు సంబంధించి 1,024 మంది హాజరుకావలసి ఉండగా 893 మంది పరీక్షలు రాయగా 131మంది గైర్హాజరయ్యారని డీఈఓ పిల్లి రమేష్ తెలిపారు. 9న షైనింగ్ స్టార్స్ కార్యక్రమంబాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల కోసం ప్రభుత్వం షైనింగ్స్టార్స్ కార్యక్రమం చేపడుతోంది. ఈ నెల 9న కుళాయిచెరువు ఆవరణలో గల ఫ్యాబ్రిక్ కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో 132 మంది పదోతరగతి, 36 మంది ఇంటర్ విద్యార్థులు కలిపి 168 మందిని ఎంపిక చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.20వేల చొప్పున నగదు పురస్కారం అందించనున్నారు. ఇప్పటికే ఆయా విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మండల స్థాయిలో 500 మార్కులు పైబడి వచ్చిన వారిని ఆరుగురిని ఎంపిక చేశారు. వీరిలో ఒసీ 2, బీసీ 2, ఎస్సీ1, ఎస్టీ1 ఎంపిక చేశారు. ఇంటర్మీడియెట్లో 830 మార్కులు పైబడి వచ్చిన వారిని ఎంపిక చేశారు. రేపటి నుంచి జిల్లా స్థాయి యోగా పోటీలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి 11 వరకు జిల్లా క్రీడామైదానంలోని యోగాహాల్లో జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్డీఓ బి.శ్రీనివాస్కుమార్ శుక్రవారం తెలిపారు. యోగాంధ్రా కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాల మేరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 60 సంవ్సరాల పైబడిన వారు సీనియర్స్ విభాగంలో, 9వ తేదీన జూనియర్స్ 10 నుంచి 18 సంవత్సరాల విభాగంలో, 10న యూత్ 19 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల విభాగంలో, 11న సీనియర్స్ విభాగంలో 36 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు వారికి, 11న సీనియర్ సిటిజన్ విభాగంలో 60 సంవత్సరాల పైబడిన వారికి ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి గల వారు ఆయా తేదీలలో యోగా సూట్ ధరించి పోటీలకు ఉదయం 8 గంటలోపు హాజరుకావాలని శ్రీనివాస్ కుమార్ తెలిపారు. జిల్లా స్థాయి పోటీలకు మండలస్థాయిలో మొదటి రెండు స్థానాలు సాధించిన వారు అర్హులన్నారు. వివరాలకు 89196 42248 నెంబర్లో సంప్రదించాలని కోరారు. -
వైభవంగా వేణుగోపాలుని కల్యాణం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి క్షేత్రంలో కొలువైన రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వార్షిక కల్యాణం శుక్రవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో, ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, విశేషార్చనలు జరిపారు. సాయంత్రం కల్యాణాన్ని ప్రారంభించారు. ప్రదానం నుంచి తలంబ్రాలు వరకూ ప్రతి క్రతువునూ వేదపండితులు, అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే వ్యాఖ్యాన పండితులు ప్రతి ఘట్టాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారు. స్వామి, అమ్మవార్లకు దేవస్థానం తరఫున డీసీ, ఈఓ చక్రధరరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కల్యాణ మహోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులకు ఈఓ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. అభివృద్ధి పనుల పరిశీలన కొత్తపేట: వాడపల్లి క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కొత్తపేట ఆర్డీఓ పి.శ్రీకర్ శుక్రవారం పరిశీలించారు. ఈ క్షేత్రానికి పెరుగుతున్న భక్తుల తాకిడికి అనుగుణంగా సౌకర్యాలు, రహదారుల ఆధునీకరణ, వాహనాల పార్కింగ్ స్థలం అభివృద్ధి, ఏడు వారాల ప్రదక్షిణకు అనుకూలంగా మాడ వీధుల విస్తరణ వంటి పనులు చేపట్టారు. ఆయా పనులపై ఆర్డీఓ శ్రీకర్, దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావుతో సమీక్షించారు. దానిలో భాగంగా స్వాతంత్య్ర సమరయోధుల స్థూపాన్ని పరిశీలించారు. అన్నప్రసాద భవనానికి విరాళాలు వాడపల్లి క్షేత్రంలో వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా భీమవరానికి చెందిన సీవీ చంటి, శాంతి దంపతులు రూ.1,15,000 విరాళంగా సమర్పించారు. వారు శుక్రవారం స్వామివారిని దర్శించుకున్నారు. దాతలకు ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్వామివారి చిత్రపటాలను అందచేశారు. -
బాలాజీ పరిణయం.. నేత్రపర్వం..
● దివ్య కల్యాణాన్ని చూసి తరించిన భక్తజనం ● కనువిందు చేసిన రాయబారోత్సవం ● దేవేరులతో దర్శనమిచ్చిన స్వామివారు మామిడికుదురు: పవిత్ర వైనతేయ గోదావరి నదీతీరం అప్పనపల్లి క్షేత్రంలో బాలునిగా కొలువుదీరిన బాలబాలాజీస్వామి దివ్య తిరుకల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. జ్యేష్ట శుద్ధ ఏకాదశి శుభ ముహూర్తంలో రాత్రి 9.15 గంటలకు శ్రీదేవి, భూదేవిలను స్వామివారు పరిణయమాడారు. కల్యాణానికి ముందుగా స్వామి, అమ్మవార్ల గుణగణాలను భక్తులకు వివరిస్తూ నిర్వహించిన రాయబారోత్సవం (ఎదుర్కోలు సన్నాహం) భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గుణ గణాల్లో స్వామి వారికి అమ్మవార్లు సరిజోడి అంటూ సాగిన ఈ ఉత్సవాన్ని చూసిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన మంటపంలో దేవేరులతో కొలువు తీరిన స్వామివారు భక్తకోటికి సర్వమంగళ రూపంలో దర్శనమిచ్చి కనువిందు చేశారు. ఆలయ ఉప ముఖ్య అర్చక గొడవర్తి శ్రీనివాసాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి శిష్య బృందం ఆధ్వర్యంలో కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో భక్తుల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొని స్వామి వారిని దర్శించి తన్మయులయ్యారు. కన్నుల పండువగా గ్రామోత్సవం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామ స్మరణలు, బాణసంచా కాల్పుల నడుమ స్వామివారిని, దేవేరులను పురవీధుల్లో గరుడ వాహనంపై ఊరేగించారు. భక్తులు, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది గ్రామోత్సవంలో పాల్గొని పరమానందం పొందారు. భక్తులు స్వామి, అమ్మవార్లకు ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి ఆలయాన్ని పలు రకాల బెంగుళూరు పుష్పాలతో సర్వాంగ సుందరంగా ఆలంకరించారు. ప్రత్యేక ఆకర్షణగా కోలాటం స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన హరే శ్రీనివాస్ కోలాటం ఆహూతులను ఆనంద పరవశుల్ని చేసింది. అలాగే కేరళ వాయిద్యాలు భక్తుల్ని తన్మయత్వంలో ముంచెత్తాయి. అప్పనపల్లికి చెందిన వాణి మహిళా సత్సంగ మిత్ర బృందం సభ్యులు ఆలపించిన శ్రీలలితా విష్ణు సహస్రనామ పారాయణం, మామిడికుదురుకు చెందిన యింటి శ్రీరామ్కుమార్, సుజాత ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి. సంతానం కోసం పూజలు సంతానం లేక ఇబ్బంది పడుతున్న మహిళలకు శుక్రవారం ఉదయం ధ్వజారోహణం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి, స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. ఈ ప్రసాదాన్ని తినడం ద్వారా సంతాన యోగం కలుగుతుందని భక్తుల విశ్వాసం. -
సిద్ధ సమాధికి కామేశ మహర్షి
రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలి శ్రీకామాక్షీ పీఠంలో ముగిసిన అంత్యక్రియలు అమలాపురం టౌన్: శివైక్యం పొందిన స్థానిక శ్రీ కామాక్షీ పీఠాధిపతి కామేశ మహర్షి సిద్ధ సమాధి క్రతువు అదే పీఠంలో శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా జరిగింది. సిద్ధ పురుషులు, స్వామీజీలు, పీఠాధిపతులకు ఏ రకమైన సిద్ధి సమాధి నిర్వహిస్తారో అదే సంప్రదాయంలో కామేశ మహర్షికి నిర్వహించారు. పీఠం ఉత్తరాధికారి విఖనస రాఖీ ప్రేమ్ ఆధ్వర్యంలో ఈ క్రతువు నిర్వహించారు. పీఠం బ్రహ్మ బ్రహ్మశ్రీ గోవిందవజ్జుల నాగబాబు బృందం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత గణపతి పూజ, పుణ్యాహవాచనం, పరిషత్, కృచ్చాత్రయం, పంచ గ వ్య ప్రాసన వంటి పూజాదికాలు చేశారు. కామేశ మ హర్షి పార్థివ శరీరానికి పంచ వాకములతో 11 రకాల అభిషేకాలు, విరజాహోమాలు, పుష్పార్చన తర్వాత సమాధి స్థల శుద్ధి, భూత బలి నిర్వహించారు. వేద పండితులు పంచ కాటక, పంచ ఉప నిషత్తులు తదితర పూజాదికాలతో సిద్ధి సమాధి నిర్మించి చివరిగా మంగళ హారతితో ఈ క్రతువు ముగిసింది. తమను కన్న వారి కంటే మిన్నగా కంటికి రెప్పలా పెంచుతున్న పీఠంలోని ప్రేమ మందిరం అనాధ పిల్లలు కన్నీరు మున్నీరయ్యారు. చివరగా తమ గురువులు కామేశ మహర్షి పార్ధివ శరీరానికి నమస్కరించి కన్నీటి వీడ్కో లు చెప్పారు. ప్రేమ మందిరం అమ్మ వక్కలంక వాణి, పీఠం మేనేజర్ మర్రి దుర్గారావు, కామాక్షీ దేవి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, ప్రేమ మందిరం పూర్వ ఆశ్రమవాసులైన అనాథలు, పట్టణ ప్రముఖలు తమ గురు వు కామేశ మహర్షికి నివాళులర్పించారు. తమ గురువు సిద్ధ సమాధి ప్రక్రియలో పాల్గొనేందుకు అనేక మంది భక్తులు తరలి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. – కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాద్ కరప: కాలానుగుణంగా రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కలవచర్లలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) సైంటిస్ట్ డాక్టర్ కేఎల్ ప్రసాద్ అన్నారు. పెనుగుదురు రైతు సేవాకేంద్రంలో శుక్రవారం వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ, రైతులు పొలంలో మట్టి పరీక్షలు చేయించాలన్నారు. దీనివల్ల సాగులో పెట్టుబడులు తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నారు. పచ్చిరొట్ట పంటలు సాగు చేయడం వల్ల నేల సారవంతమవుతుందన్నారు. కాకినాడ జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ మాధవి మాట్లాడుతూ, పంట కాలువలకు సాగు నీరు విడుదలైందని, రైతులు ముందస్తు ఖరీఫ్ సాగుకు సిద్ధం కావాలన్నారు. అక్టోబరు నెలాఖరుకు పంటచేతికొస్తే, నవంబర్లో తుపాన్ల నుంచి గట్టెక్కవచ్చన్నారు. పెట్టుబడులు తగ్గించుకునేందుకు బెంగాల్ ఊడ్పు, వెదజల్లు పద్ధతులు అనుసరించాలన్నారు. ఖరీఫ్లో మేలైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలని, విత్తన శుద్ధి చేయాలన్నారు. ఎంఏఓ ఏవీ రాజేష్ మాట్లాడుతూ, ఆధునిక వ్యవసాయ విధానంలో డ్రోన్ టెక్నాలజీని రైతులు అందిపుచ్చుకోవాలన్నారు. 80 శాతం రాయితీతో అందిస్తున్న డ్రోన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తొలకరి పంటకు స్వర్ణ రకంతో పాటు, ఎంటీయూ–1318 రకాన్ని కూడా సాగు చేసి, అధిక వర్షాలు, ముంపు నుంచి పంటను కాపాడుకోవచ్చన్నారు. పిఠాపురం ఉద్యానవన శాఖాధికారి శైలజ మాట్లాడుతూ, పొలాల గట్లపై, ఇంటి మిద్దెలపై సాగు ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ బి.నాగేశ్వర్రెడ్డి, డాక్టర్ ఎస్.రవీంద్ర, ఏఈఓ బి.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కాకినాడ రూరల్: కాకినాడ నుంచి సామర్లకోట వెళ్లే మార్గంలో గంగనాపల్లి గ్రామ పరిధిలో కోటిపల్లి రైల్వే లైన్ దాటిన తరువాత కాల్వలో గుర్తు పట్టలేని స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 45 నుంచి 50 మధ్య ఉండవచ్చని, గులాబీ రంగు చొక్కా ధరించి ఉన్నట్టు ఇంద్రపాలెం పోలీసులు తెలిపారు. సుమారు 15 నుంచి 20 రోజుల వ్యవధిలో కాల్వ నీటిలో మునిగిపోయి ఉంటాడని, మృతదేహం ఉబ్బిపోయి చర్మం ఊడిపోయి ఉన్నట్టు ఎస్సై వీరబాబు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. -
రత్నగిరికి పోటెత్తిన భక్తజనం
● ఆలయం వద్ద నవ దంపతుల సందడి ● ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు అన్నవరం: జ్యేష్ట శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి కిక్కిరిసింది. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు భక్తులతో నిండిపోయాయి. గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున రత్నగిరిపై జరిగిన వివాహాలతో నవదంపతులు, వారి బంధుమిత్రులతో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల కూడా అవే ముహూర్తాలలో వివాహాలు చేసుకున్న భక్తులు రత్నగిరికి వచ్చి వ్రతాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా స్వామివారి వ్రతాలు 2,500 జరిగాయి. శుక్రవారం అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షలు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఏకాదశిని పురస్కరించుకుని ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన, తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు తులసి దళాలతో సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం వేదపండితులు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాలు నివేదించారు. ఈ పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నర్శింహమూర్తి, అర్చకులు సుధీర్, పరిచారకులు పవన్ తదితరులు నిర్వహించారు. నేడు తిరుచ్చి వాహనంపై సత్యదేవుని ఊరేగింపు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను శనివారం తిరుచ్చి వాహనంపై ఊరేగించనున్నారు. ఉదయం పది గంటలకు ఈ ఊరేగింపు ప్రారంభం కానుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
● చెట్టుకు ఢీకొని నుజ్జయిన కారు ● పోతవరంలో విషాద ఛాయలు నల్లజర్ల: మండలంలోని పోతవరం–యర్నగూడెం రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే పోతవరం సర్పంచ్ నూతికుర్తి లక్ష్మణరావు సోదరుడు రామకృష్ణ తన భార్య రత్నకుమారి, కుమారుడు మనోజ్ (24), మనుమరాలు ఆద్య (2) నిడదవోలులోని కలవచర్ల గ్రామానికి ఓ వివాహానికి హాజరయ్యేందుకు కారులో బయలుదేరారు. పోతవరం నుంచి బయలుదేరి కిలోమీటరు దూరం వెళ్లేసరికే అతివేగంతో చెట్టును ఢీకొని కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మనోజ్ అక్కడికక్కడే మృతి చెందగా రామకృష్ణ, రత్నకుమారి, ఆద్య తీవ్ర గాయాలపాలయ్యారు. పోతవరంలో జరుగుతున్న జాతర హడావిడిలో ఉన్న గ్రామస్తులు ఈ ప్రమాద వార్త తెలియగానే హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లి క్షతగాత్రులను ఏలూరు ఆశ్రమ్ ఆస్పత్రికి తరలించారు. రామకృష్ణ మనవరాలు (కుమార్తె అంకితకు కుమార్తె) ఆద్య చికిత్స పొందుతూ మృతి చెందగా మిగిలిన ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. పోతవరంలో జరుగుతున్న జాతర చూసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన మనోజ్ ఇలా మృతి చెందడంతో పోతవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. క్షతగాత్రలను మాజీ హోం మంత్రి తానేటి వనిత, మండల పార్టీ అధ్యక్షుడు వెల్లంకి వెంకట సుబ్రమణ్యం, మాజీ జెడ్పీటీసీ బంక అప్పారావు పరామర్శించారు. అనంతరం పోతవరం వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి బంధువులను పరామర్శించారు. కాగా ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు కాలేదు. తమ్ముడి పిల్లలే తన పిల్లలుగా.. పోతవరం సర్పంచ్ నూతికుర్తి లక్ష్మణరావుకు పిల్లలు లేకపోవడంతో తన సోదరుడు రామకృష్ణ పిల్లలనే తన పిల్లలుగా అల్లారుముద్దుగా పెంచారు. అవసాన దశలో తమ అన్నదమ్ములిద్దరికి ఆసరాగా ఉంటాడుకున్న మనోజ్ జీవితం ఇలా ముగియడంతో ఆ దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంజినీరింగ్ పూర్తిచేసిన మనోజ్ కారు కావాలంటే కొన్నామని, ఏ లోటూ రాకుండా చూసుకున్నామని వారు అతనితో జ్ఞాపకాలను గుర్తుచేసుకుని రోదిస్తున్నారు. -
ఉసురు తీసిన అతివేగం
● స్నేహుతుడి వివాహానికి వెళ్తూ ఒకరు మృతి ● మరొకరికి తీవ్ర గాయాలు పెరవలి: స్నేహితుడి పెళ్లికి వెళ్తుండగా వాహనం అదుపుతప్పి పడిపోయిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని అన్నవరప్పాడు వద్ద జరిగిన ఈ సంఘటన వివరాలను ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన మేరకు.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన కత్తుల మహేష్ (19), శీలం అంజిబాబు రైడర్ మోటార్సైకిల్పై వేగంగా వస్తుండగా సడన్ బ్రేక్ వేయటంతో వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడి సుమారు 60 మీటర్ల దూరం రోడ్డుపైనే ఈడ్చుకుపోయి డివైడర్ను ఢీకొన్నారు. ఈ సమయంలో మోటార్సైకిల్ నడుపుతున్న కత్తుల మహేష్ రోడ్డు డివైడర్పై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని స్థానికులు తెలిపారు. స్థానికులు ప్రమాదం జరిగిన వెంటనే పరుగున వచ్చి ఇద్దరినీ లేపగా మహేష్ ఎటువంటి చలనం లేకపోవటంతో శీలం అంజిబాబును లేపి రోడ్డు పక్కన కూర్చోపెట్టారు. అతడికి తీవ్రగాయాలయ్యాయని, కుడికాలు విరిగిపోయిందని స్థానికులు తెలిపారు. ఇంతలో జాతీయ రహదారుల అంబులైన్స్ వచ్చి మహేష్కు సపచర్యలు చేయగా శరీరంలో కదలిక రావడంతో వెంటనే ఆక్సిజన్ పెట్టి తణుకు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యం అందిస్తుండగా మహేష్ మృతిచెందినట్టు తెలిపారు. మహేష్ తండ్రి కత్తుల నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఫోర్జరీ పోలీస్!
కాకినాడ క్రైం: తన స్థాయిని పెంచుకుని అడ్డగోలు దందాలకు పాల్పడేందుకు ఒక హెడ్ కానిస్టేబుల్ ఏకంగా డీఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. తనకు తానే ఎస్ఐగా ఐడీ కార్డును తయారు చేసుకున్నాడు. దాన్ని చూపించి ఎస్ఐగా చెప్పుకొంటూ చెలరేగిపోతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొప్పిశెట్టి యోగి కామేశ్వరరావు గవర్నమెంట్ రైల్వే పోలీస్ విభాగం(జీఆర్పీ)లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు.రాజమహేంద్రవరం రైల్వే సబ్ డివిజన్లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన కొద్దికాలం కిందట రాష్ట్ర ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ డీఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేసి తన పేరిట ఎస్ఐగా ఐడీ కార్డు తయారు చేసుకున్నాడు. దాన్ని చూపిస్తూ రాజమహేంద్రవరం రైల్వే సబ్ డివిజన్ పరిధిలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు కాకినాడ, తుని, సామర్లకోట, అన్నవరం, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లలో ఉద్యోగులపై అజమాయిషీ చేసేవాడు. కొన్ని కేసులను ఎస్ఐ హోదాలో సొంతంగా విచారణ చేసి డబ్బులు వసూలు చేయడం, చోరీ కేసుల్లోనూ రికవరీలు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కాకినాడకు చెందిన ఓ జవాన్ తనను వేధిస్తున్నాడని అతని భార్య నగరంలోని దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జవాన్ సోదరుడైన రైల్వే కానిస్టేబుల్, అతని తల్లి పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. రైల్వే కానిస్టేబుల్పై ఫిర్యాదు చేయడంతో విచారణ కోసం జీఆర్పీ స్టేషన్కు పంపారు. దీంతో వివరాలు సేకరించేందుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ కామేశ్వరరావు... విచారణ పేరుతో రైల్వే కానిస్టేబుల్ భార్యను మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి బెదిరించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు చేసిన జవాన్ భార్యను రైల్వే గెస్ట్ హౌస్కి అనధికారికంగా తీసుకెళ్లి విచారించడం వివాదాస్పదంగా మారింది. అదే సమయంలో కామేశ్వరరావు నకిలీ ఐడీ కార్డు చూపించి తాను ఎస్ఐని అని బెదిరించాడని రైల్వే కానిస్టేబుల్ భార్య కాకినాడ టూ టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు డీఐజీ సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. మరికొందరు కూడా అతనిపై జీఆర్పీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో నకిలీ ఐడీ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.కామేశ్వరరావుపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని అనకాపల్లి జిల్లా ఎస్పీకి జీఆర్పీ అధికారులు సిఫార్సు చేశారు. రైల్వే నుంచి తిరిగి అతని మాతృవిభాగమైన అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయానికి బుధవారం పంపించారు. అతనికి సహకరించిన మరికొందరిని కూడా జీఆర్పీ నుంచి బదిలీ చేశారు. విశాఖ రేంజ్కి చెందిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఈ నెల ఒకటో తేదీన కాకినాడ వచ్చి కామేశ్వరరావుపై ఫిర్యాదు చేసిన బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కామేశ్వరరావుపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేస్తున్నామని, బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు తెలిపారు. -
అమ్మకు వంచన
స్పష్టత లేదు మా అబ్బాయి ఈ ఏడాది 8వ తరగతికి వెళ్లనున్నాడు. గత ఏడాది తల్లికి వందనం నగదు ఇవ్వలేదు. ఈ ఏడాది ఇస్తామంటున్నారు కానీ ఎటువంటి స్పష్టతా రాలేదు. ఆ డబ్బులు త్వరగా ఇస్తే పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలో నగదు జమయ్యేది. – వై.ధనలక్ష్మి, పిఠాపురం ఎన్నికల హామీ ఏమైంది? నాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్లో మూడో తరగతి చదువుకుంటున్నాడు. అమ్మాయి ఓ ప్రైవేట్ స్కూల్లో రెండో తరగతి చదవనుంది. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామని కూటమి నేతలు చెప్పారు. ఆ హామీ ఏమైంది? ఇప్పటికీ అందలేదు. ప్రభుత్వం సాయం అందిస్తే పిల్లల చదువుకు ఆసరాగా ఉంటుంది. – సీహెచ్ సుధీర్కుమార్, కాకినాడ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి లబ్ధి (రూ.కోట్లలో) సంవత్సరం లబ్ధిదారులు లబ్ధి 2019–20 1,87,654 281.48 2020–21 2,01,247 301.86 2021–22 1,88,157 282.23 2022–23 1,86,708 280.06 మొత్తం 7,63,766 1145.63 ● ఏడాదైనా అందని ‘తల్లికి వందనం’ ● 3.20 లక్షల మంది ఎదురుచూపులు ● కూటమి పాలనలో దగా పడ్డ తల్లులు, విద్యార్థులు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ‘నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. ముగ్గురుంటే రూ.45 వేలు’– ఈ మాటలు ఎక్కడో విన్నట్లుంది కదూ. సరిగ్గా ఏడాది కిందట నాటి సార్వత్రిక ఎన్నికల ముందు కూటమి నేతలైన చంద్రబాబు అండ్ కో ‘తల్లికి వందనం’ పేరిట ఊరూవాడా అమ్మలను ఊరిస్తూ చెప్పిన మాటలివి. తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పెద్దలు ఆ మాటే మరిచారు. మొదటి ఏడాది విజయవంతంగా ఎగ్గొట్టేశారు. రెండో ఏడాది ఇస్తామంటున్నారు కానీ.. ఇప్పటి వరకూ విధివిధానాలేవీ రాలేదు. పిల్లల చదువులకు పేదరికం అడ్డు కాకూడదనే సమున్నత లక్ష్యంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పట్లో ‘అమ్మ ఒడి’ పథకం అమలు చేశారు. ఏటా రూ.15 వేల చొప్పున జమ చేశారు. ఈవిధంగా జిల్లాలో రూ.1,145.63 కోట్ల మేర ‘అమ్మ ఒడి’ సాయం అందించారు. దీంతో, అప్పట్లో పేద పిల్లల చదువులకు ఢోకా ఉండేది కాదు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూటమి మేనిఫెస్టోలో ‘తల్లికి వందనం’ పేరిట పాఠశాల, ఇంటర్మీడియెట్ చదివే విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని చంద్రబాబు అండ్ కో గొప్పగా చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదే మాట తప్పారు. రెండో ఏడాది నూతన విద్యా సంవత్సరం కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నది. ఇప్పటికీ తల్లికి వందనం డబ్బులు ఎప్పుడిస్తారనే దానిపై స్పష్టత లేదు. ప్రభుత్వ తీరుతో కూలీనాలీ చేసుకునే తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించుకునేందుకు నానా అవస్థలూ పడుతున్నారు. కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని విమర్శిస్తున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో క్యాలెండర్, తేదీ విడుదల చేసి మరీ, నేరుగా ఆర్థిక సాయం జమ చేసేవారని గుర్తు చేసుకుంటున్నారు. ఎగ్గొట్టింది రూ.485 కోట్లు జిల్లాలో 2024–25 విద్యా సంవత్సరంలో 3.20 లక్షల మంది విద్యార్థులకు రూ.485.35 కోట్లు అందజేయాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే ఈ మొత్తం ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు. ప్రస్తుతం 2025–26 విద్యా సంవత్సరానికి కూడా సుమారు ఇదే మొత్తం ఇవ్వాల్సి ఉంది. అంటే, రెండేళ్లకు కలిపి సుమారు రూ.971.7 కోట్లు జమ చేయాల్సి ఉంది. రెండేళ్ల సొమ్ము ఇస్తారేమోనని తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్ నెలలోనే అమ్మ ఒడి పథకం కింద సాయం అందించేవారు. దీంతో, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులు, విద్యార్థుల పుస్తకాలు, బ్యాగులు, బెల్టుల వంటి వస్తువుల కొనుగోలుకు తల్లిదండ్రులకు వెసులుబాటు ఉండేది. కూటమి ప్రభుత్వ పాలనలో ఒక విద్యా సంవత్సరం పూర్తయి, కొత్తది ప్రారంభమవుతున్నా ఇప్పటి వరకూ తల్లికి వందనం నిధుల ఊసే లేకుండా పోయింది. దీనిపై సర్వేలు, ఎటువంటి కార్యాచరణా ప్రారంభించలేదు. ఇప్పటికే ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేపట్టలేదు. ధాన్యం సహా ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లభించలేదు. దీనికితోడు అన్ని రకాల సంక్షేమ పథకాలనూ నిలిపివేశారు. ఇటువంటి పరిస్థితుల్లో చేతుల్లో డబ్బుల్లేక బడుగు బలహీనవర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తల్లికి వందనం నిధులు త్వరగా విడుదల చేస్తేనే తమ పిల్లలను నిశ్చింతగా చదివించుకోగలమని తల్లిదండ్రులు చెబుతున్నారు. లేకుంటే వారిని చదువు మాన్పించడం తప్ప గత్యంతరం లేదని ఆవేదన చెందుతున్నారు. -
‘మీ ప్రేమకు కృతజ్ఞతలు’
కిర్లంపూడి: తమ కుటుంబంపై ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్న ప్రేమకు వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన గురువారం లేఖ రాశారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఇచ్చిన పిలుపు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమానికి ఎండను సైతం లెక్క చేయకుండా వేలాదిగా తరలివచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబంపై వెలకట్టలేని, కల్మషం లేని ప్రేమాభిమానాలు చూసి చలించిపోయానని పేర్కొన్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఎంతో ఉత్సాహంతో వచ్చిన ప్రజల చెంతకు తాను రాలేకపోయానన్నారు. నియోజకవర్గం ప్రజలతో తమ కుటుంబానికి ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉందని, ఇప్పటికీ అదే ప్రేమ చూపించడం తమ అదృష్టమని అన్నారు. ఇంతటి అభిమానం చూపిస్తున్న ప్రజల సేవకు తమ కుటుంబం మనస్ఫూర్తిగా అంకితమవుతుందని ముద్రగడ పేర్కొన్నారు. నిరసన కార్యక్రమానికి సహకరించిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. నేటి నుంచి డీఎస్సీ జిల్లాలో 41,017 మంది దరఖాస్తు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): డీఎస్సీ–25 పరీక్షలు శుక్రవారం నుం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రెండు విడతల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా 41,017 మంది ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం కాకినాడ అచ్యుతాపురం రైల్వే గేట్ వద్ద అయాన్ డిజిటల్ కేంద్రం, కాకినాడ రూరల్ రాయుడుపాలెం సెంటర్ సాఫ్ టెక్నాలజీ, సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్, ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల్లో ఆరు ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. విభిన్న ప్రతిభావంతుల కోసం 87 మంది స్క్రైబ్లను నియమించామని జిల్లా విద్యా శాఖాధికారి పి.రమేష్ తెలిపారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ఫొటో గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని సూచించారు. అభ్యర్థుల సౌకర్యార్థం 94925 16116 (అసిస్టెంట్ డైరెక్టర్), 77996 98462 (సూపరింటెండెంట్), 79897 50963 (సీనియర్ అసిస్టెంట్) హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. కార్మిక శాఖ సహాయ కమిషనర్గా శ్రీనివాస్ మహేష్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కార్మిక శాఖ కాకినాడ సహాయ కమిషనర్గా పి.శ్రీనివాస్ మహేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో కార్మిక శాఖ కమిషనర్గా పని చేస్తున్న ఆయన బదిలీపై కాకినాడ వచ్చారు. ఇప్పటి వరకూ ఇక్కడ పని చేసిన ఎస్.బుల్లిరాణి కొవ్వూరు బదిలీ అయ్యారు. సమష్టి కృషితోనే ఎన్బీఏ గుర్తింపు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సమష్టి కృషితోనే జేఎన్టీయూ కాకినాడ ఇంజినీరింగ్ కళాశాలకు నేషనల్ బోర్డు అక్రిడిటేషన్ (ఎన్బీఏ) యూజీ స్థాయి గుర్తింపు వచ్చిందని జేఎన్టీయూకే వైస్ చాన్సలర్ సీఎస్ఆర్కే ప్రసాద్ అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ మోహనరావు అధ్యక్షతన అలుమ్నీ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం జరిగిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీటెక్ కోర్సులైన ఈఈఈ, ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్, సివిల్ విభాగాలను ఎన్బీఏ బృందం గత నెలలో సందర్శించిందని, ఈ గుర్తింపు 2028 వరకూ ఉంటుందని చెప్పారు. పీజీ ప్రోగ్రామ్కు ఎన్బీఏ గుర్తింపు వచ్చేలా ఇదే తరహాలో కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ స్వరూపరాణి, ఆర్.దీక్షితులు, వివిధ విభాగాల అధిపతులు కోటేశ్వరరావు, కె.వెంకటరెడ్డి, ఆర్.మధు, ఎస్.సురేఖ, కల్యాణ్ మనోహర్, సత్యవేణి పాల్గొన్నారు. -
సేవకులకు తీరనున్న ఇక్కట్లు
● సత్యదేవుని సన్నిధిన ప్రత్యేక ఏర్పాట్లు ● సేవ చేయాలనుకునే వారి కోసం 08868–238163 నంబర్తో ఫోన్ సౌకర్యం అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో స్వచ్ఛందంగా సేవ చేద్దామనుకునే వారికి ఇకపై కష్టాలు తొలగనున్నాయి. సేవ చేద్దామనుకునే భక్తుల సౌకర్యార్థం దేవస్థానంలోని పీఆర్ఓ కార్యాలయాన్ని 08868–238163 నంబరులో సంప్రదించే అవకాశం కల్పించారు. ఈ మేరకు దేవస్థానం అధికారులు గురువారం ఆదేశాలు జారీ చేశారు. సేవ చేయడానికి వస్తున్న చాలా మంది భక్తులు ఎవరిని సంప్రదించాలో తెలిపే ఏర్పాటు దేవస్థానంలో లేక మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. వారు ఆ సేవకుల నుంచి నగదు వసూలు చేయడం ఇటీవల వివాదంగా మారింది. తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన 18 మంది మహిళా సేవకులు గత నెలలో ఇదేవిధంగా రాగా.. వారికి సేవ చేసే అవకాశం లేదంటూ ఏఈఓ కె.కొండలరావు దురుసుగా ప్రవర్తించడం, వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. దేవస్థానంలో సేవ చేసే అవకాశం కల్పించేందుకు ఆ మహిళా సేవకులు మధ్యవర్తిని ఆశ్రయించగా ఒక్కొక్కరి నుంచి రూ.500 చొప్పున వసూలు చేసినట్టు దేవస్థానం అధికారుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో రత్నగిరిపై సేవకుల ఇబ్బందులపై మే 24న ‘సేవ చేయనివ్వరు స్వామీ..’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. సేవ చేయాలనుకునే వారు సంప్రదించేందుకు టీటీడీలో మాదిరిగా అన్నవరం దేవస్థానంలో ఏర్పాట్లు లేవని ఆ కథనంలో పేర్కొనడంతో అధికారులు స్పందించారు. రత్నగిరిపై సేవ చేయాలనుకునే వారు ఇక నుంచి తమ పేరు, ఆధార్, ఫోన్ నంబర్లతో దేవస్థానం పీఆర్ఓ కార్యాలయంలో నమోదు చేయించుకునే అవకాశం కల్పించారు. అయితే, దీంతో పాటు మొబైల్ నంబర్ కూడా ఏర్పాటు చేసి, వాట్సాప్ ద్వారా వివరాలు పంపించే ఏర్పాట్లు చేయాలని పలువురు సేవా కార్యకర్తలు కోరుతున్నారు. -
ఆమైపె కక్ష గట్టి..
భావన, కమిషనర్, నగరపాలక సంస్థ సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఒక మహిళా ఐఏఎస్పై కూటమి నేతలు కక్ష కట్టారు. ఆమెను సాగనంపేందుకు తమ మధ్య ఉన్న విభేదాలన్నింటినీ పక్కన పెట్టి ఒక్కటయ్యారు. బిల్లుల కోసం వచ్చి, గద్దించి మాట్లాడిన టీడీపీ నేత కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే ఆమె చేసిన పెద్ద నేరమైంది. ఆమెను కొనసాగించవద్దని అందరూ పట్టుబడుతున్నారు. దీనికోసం జిల్లా టీడీపీలో సీనియర్ నాయకులందరూ అంతర్గతంగా ప్రత్యేక అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన బదిలీ కోసం కూటమి కట్టిన నేతల తీరు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. టీడీపీ నేత పుత్రరత్రం దుందుడుకు వ్యవహారం ప్రజాసంబంధాలతో ముడిపడి ఉన్న ఐఏఎస్ అధికారులు.. ఏ హోదాలో ఉన్నా ఏ విషయంౖపైనెనా సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిందే. అందునా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాఫిర్యాదుల వేదికలో మరింత జాగరూకతగా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. నాలుగున్నర లక్షల పైచిలుకు జనాభా కలిగిన కాకినాడ నగర పాలక సంస్థకు మహిళా ఐఏఎస్ భావన కమిషనర్గా పని చేస్తున్నారు. ఆమె కాకినాడ వచ్చి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. ప్రతి వారం మాదిరిగానే గత సోమవారం ఆమె ప్రజా ఫిర్యాదుల వేదికలో అర్జీలు స్వీకరిస్తున్నారు. ఆ క్రమంలో కమిషనర్ వద్దకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు తనయుడు, కాంట్రాక్టర్ అయిన గంగాధర రమేష్ వచ్చారు. అధికార పార్టీకి చెందిన కీలక నాయకుడి తనయుడిని కావడంతో తన మాటకు ఎదురుండదనుకున్నారో ఏమో కానీ.. పెండింగ్ బిల్లుల కోసం దుందుకుడుగా ప్రశ్నించారు. తాము చెప్పినట్టే అధికారులు, సిబ్బంది నడచుకోవాలనే మనస్తత్వాన్ని చంద్రబాబు దగ్గర నుంచి క్షేత్ర స్థాయిలో నేతల వరకూ అందరూ ఒంట పట్టించుకున్నట్టు ఈ సంఘటనతో అర్థమవుతోంది. బిల్లులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని గంగాధర రమేష్ గద్దించి మాట్లాడంతో మనస్తాపం చెందిన కమిషనర్ భావన.. దీనిపై అదనపు ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్కు ఎంహెచ్ఓ ద్వారా మొబైల్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కాస్త శ్రుతి మించి వ్యవహరించారనే విమర్శలున్నాయి. బిల్లుల విషయం పక్కన పెట్టి.. బదిలీపై పట్టుబట్టి.. తమ పార్టీ నాయకుడి తనయుడి పైనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీడీపీ నాయకుల అహం దెబ్బ తిన్నట్టుంది. ఈ నేపథ్యంలో వారు బిల్లుల విషయాన్ని పక్కన పెట్టేసి, కమిషనర్ భావనను తక్షణం బదిలీ చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ విషయంపై తాడోపేడో తేల్చేస్తామంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. ఎంహెచ్ఓ ద్వారా పోలీసులకు కమిషనర్ ఫిర్యాదు చేయడంపై కూటమి ఎమ్మెల్యేలు కాకినాడలో అంతర్గతంగా భేటీ అయ్యారు. ఇది చర్చనీయాంశమైంది. మెట్ట ప్రాంతానికి చెందిన ఒక కీలక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగిన ఈ భేటీలో కమిషనర్ భావనను కాకినాడ నుంచి సాగనంపాల్సిందేనని ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులకు అల్టిమేటం ఇచ్చారని సమాచారం. దీనికి వారం రోజులు డెడ్లైన్ పెట్టినట్లు తెలిసింది. మెట్ట ప్రాంత నేతలకు కాకినాడ సిటీ, రూరల్ నేతలు కూడా తోడయ్యారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అడ్డగోలు పనులకు అడ్డమని... వాస్తవానికి కమిషనర్ భావన, కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మధ్య ఆరు నెలల క్రితమే పలు అంశాల్లో విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచీ నగరంలో ఏ అధికారిక కార్యక్రమంలోనూ ఇద్దరూ కలిసి పాల్గొన్న దాఖలాలు లేవు. కాకినాడ దుమ్ములపేటలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ శంకుస్థాపనకు ఎమ్మెల్యే కొండబాబు చివరి నిమిషంలో డుమ్మా కొట్టేశారు. వీరిద్దరి మధ్య విభేదాల విషయం తెలియక రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వచ్చినప్పటికీ.. కొండబాబు రాలేదని తెలిసి తిరిగి వెళ్లిపోయారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్కు మాత్రమే కుర్చీ వేసి, ఎమ్మెల్యేని విస్మరించారంటూ అప్పట్లో కొండబాబు వర్గీయులు బయట రచ్చరచ్చ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అయినప్పటికీ ఇప్పటి వరకూ ఎమ్మెల్యే, కమిషనర్ కలసి అధికారులతో ఒక్క సమావేశం కూడా నిర్వహించిన దాఖలాలు లేవు. కార్పొరేషన్ కమిషనర్గా వచ్చిన తరువాత అధికార పార్టీ నేతలు చెప్పే అడ్డగోలు పనులకు భావన అడ్డు తగులుతూండటం టీడీపీ నేతలకు కంటగింపుగా మారింది. అయితే, అప్పట్లో ఆమైపె చర్యలకు సిఫారసు చేసేందుకు ధైర్యం చాలక కాకినాడ సిటీ టీడీపీ నేతలు కిమ్మనకుండా ఉండిపోయారు. ఇటీవల మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ కాకినాడ వచ్చిన సందర్భంలో సైతం టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కమిషనర్ భావనను మార్చాల్సిందేనని పట్టుబట్టారని ప్రచారం జరిగింది. తాజా ఘటనతో జిల్లాలోని టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులందరూ కూటమి కట్టి, కమిషనర్ బదిలీకి పావులు కదుపుతున్నారు. పట్టుమని పది నెలలు కూడా కాకుండానే ఆమెను సాగనంపేందుకు చేస్తున్న ప్రయత్నాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.నగరపాలక సంస్థ కార్యాలయం మహిళా ఐఏఎస్కు వ్యతిరేకంగా నేతల ‘కూటమి’ కాకినాడ కార్పొరేషన్ కమిషన్ బదిలీకి యత్నం అంతా ఒక్కటై.. బదిలీకి వారం డెడ్లైన్ అధిష్టానానికి అల్టిమేటం ఇదేం పద్ధతి? వాస్తవానికి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు అనేది ప్రభుత్వం వద్దనే పెండింగ్లో ఉంది. ఈ చెల్లింపులు సీఎంఎఫ్ పరిధిలో ఉన్నాయి. అధికారం గుప్పిట్లో ఉందని జబ్బలు చరుచుకునే అధికార పార్టీ నేతలు ఉన్నత స్థాయిలో బిల్లులు మంజూరయ్యేలా ప్రయత్నించుకోకుండా కమిషనర్పై దుందుడుకుగా మాట్లాడితే ప్రయోజనమేమిటని, ఫిర్యాదు చేయడానికి వచ్చి, ఒక మహిళా ఐఏఎస్పై అంత దురుసుగా మాట్లాడటం సమంజసమా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అధికారం చేతిలో ఉందనే అహంకారంతో ఏం చేసినా చెల్లుతుందనే తెగింపుతోనే ఇలా వ్యవహరించారని అంటున్నారు. ఈ ఉదంతంలో కమిషనర్ భావన అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేయడంలో తప్పేముందని ఉద్యోగ సంఘాలు నిలదీస్తున్నాయి. బిల్లుల మంజూరులో కమిషనర్ వైఫల్యం ఏమైనా ఉంటే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, అయినప్పటికీ దుందుడుకుగా మాట్లాడాల్సిన పనేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
చేప ముల్లు తీసి.. ప్రాణం నిలిపి..
కాకినాడ క్రైం: గుండె రక్తనాళానికి చేప ముల్లు గుచ్చుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళ ప్రాణాలను కాకినాడ వైద్యులు రక్షించారు. సంబంధిత వివరాలను కాకినాడ అపోలో ఆసుపత్రి యాజమాన్య గురువారం వెల్లడించింది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు గ్రామానికి చెందిన మహిళ జంప మంగాయమ్మ (54) ఫోన్ మాట్లాడుతూండగా గుండె నొప్పికి గురైంది. ఆమెను కుటుంబ సభ్యులు గత నెల 25వ తేదీన కాకినాడ అపోలో ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు పరీక్షించి గుండె రక్తనాళానికి చేప ముల్లు గుచ్చుకొని ఉందని తేల్చారు. ఆమెను రక్షించేందుకు ఛాతికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సర్జరీ చేయడానికి 12 గంటల సుదీర్ఘ సమయం పట్టింది. ఇది దేశంలోనే అత్యంత అరుదైన శస్త్రచికిత్స అని వైద్యులు తెలిపారు. వైద్య బృందానికి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ శస్త్రచికిత్సలో మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ గూడె వంశీ చైతన్య, వాస్క్యులర్ సర్జన్ కృష్ణ, గుండె మత్తు వైద్య నిపుణుడు ప్రగడ నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. -
ప్రవీణ్ సంస్మరణ సభకు అనుమతి
రాజమహేంద్రవరం సిటీ: హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు హైకోర్టు లైన్ క్లియర్ చేసిందని, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తరఫు న్యాయవాది బాల గురువారం విలేకర్లకు తెలి పారు. గత నెల 24న ప్రవీణ్ పడగాల సంస్మరణ సభ నిర్వహించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హర్షకుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా న్యాయవాది బాల హైకోర్టులో వాదనలు వినిపిస్తూ.. మే 28న కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడుకు అనుమతి ఇచ్చారని, అటువంటిది సామాన్య ప్రజలు సంస్మరణ సభ నిర్వహించేందుకు అనుమతులు నిరాకరించారని ప్రస్తావించారు. వాదనల అనంతరం, ప్రవీణ్ సంస్మరణ సభకు సంబంధించి కొత్తగా చేసే దరఖాస్తుపై నాలుగు వారాల్లో ఏదో ఒక రోజు అనుమతివ్వాలంటూ జిల్లా ఎస్పీని ఆదేశించిందని బాల తెలిపారు. సభ అనుమతుల కోసం త్వరలోనే జిల్లా పోలీసు కార్యాలయంలో దరఖాస్తు చేస్తానని, ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో సభ నిర్వహిస్తామని హర్షకుమార్ తెలిపారు. సెంట్రల్ జైలును సందర్శించిన అటవీ అధికారులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలును అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఎస్ఎన్ఎన్ మూర్తి, డివిజనల్ ఫారెస్ట్ అధికారి ఫణీంద్ర ధర్మ గురువారం సందర్శించారు. జైలులోని నర్సరీ గురించి వారికి కారాగార పర్యవేక్షణాధికారి ఎస్.రాహుల్ వివరించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కారాగారానికి బయో డైవర్సిటీ పురస్కారం అందజేసిందని చెప్పారు. వందేళ్ల వయస్సుకు పైబడిన వృక్షాలను అటవీ శాఖ అధికారులకు ఆయన చూపించారు. కారాగారంలో నర్సరీని అభివృద్ధి చేసిన జైలు అధికారులను అటవీ అధికారులు ప్రశంసించారు. అనంతరం కారాగారంలోని పరేడ్ మైదానంలో మొక్కలు నాటారు. -
‘కోరింగ’లో ‘స్పాట్–టెయిల్డ్ పిట్ వైపర్’
సాక్షి ప్రతినిధి, కాకినాడ: భవిష్యత్లో అంతరించిపోయే జాతుల జాబితాలో ఉన్న స్పాట్–టెయిల్డ్ పిట్ వైపర్ జాతి పాము కాకినాడ సమీపాన గుర్తించారు. దేశంలోనే మూడో అతి పెద్ద కోరంగి అభయారణ్యంలో ఈ పాము తారసపడింది. దాదాపు 40 ఏళ్ల క్రితం జనవాసాల్లో కనిపించే ఈ అరుదైన జాతిపాము సమీప భవిష్యత్లో అంతరించిపోయే జాతుల్లో ఒకటిగా చేరింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1978 ప్రకారం ఈ పాము నాలుగో షెడ్యూల్లో ఉంది. అటువంటి ఈ జాతి పాము పరిరక్షణ కోసం తక్షణం ప్రయత్నించకుంటే అంతరించిపోతున్న జాతుల్లో చేరిపోతుందని వన్యప్రాణి సంరక్షణా విభాగం గుర్తించింది. ఈ నేపథ్యంలో స్పాట్–టెయిల్డ్ పిట్ వైపర్ పామును నాలుగో షెడ్యూల్ నుంచి ఒకటో షెడ్యూల్లోకి చేర్చారు. ఈ షెడ్యూల్ మార్పు ద్వారా అత్యంత జాగ్రత్తతో ఈ జాతి పామును రక్షించాలనే సందేశాన్ని ఇచ్చినట్టు వన్యప్రాణి విభాగం అధికారులు చెబుతున్నారు. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ముందుచూపుతోనే 2022లో షెడ్యూల్ మార్చారు. పొడ పాము సంతతికి చెందిన ఈ పాము పచ్చరంగులో ఉంటుంది. ఈ జాతిలో రెండు రకాలు బాంబోపిట్ వైపర్, స్పాట్ వైల్డ్ పిట్వైపర్ ఉన్నాయి. బాంబో పిట్ వైపర్ సాధారణంగా అటవీ ప్రాంతమైన రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి, వై.రామవరం, అడ్డతీగల తదితర ప్రాంతాల్లో ఉంటుంది. స్పాట్ వైల్డ్ పిట్ వైపర్ జాతి పాములు చిత్తడి నేలల్లో (మాంగ్రూవ్స్) మాత్రమే మనగలుగుతాయి. ఈ పాము మనిషిపై దాడి చేసినప్పుడు రక్తంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి. దీంతో బ్రెయిన్ డెడ్ కావడం, హార్ట్ అటాక్, కోమాలోకి వెళ్లడంతో ప్రాణానికే ప్రమాదం ఏర్పడతాయి. అయితే, ఇంతవరకూ ఈ జాతి పామువల్ల ఇలాంటి కేసులు ఎక్కడా నమోదు కాలేదు. ఈ పాములు పగలు నిద్రావస్థలో ఉండి, రాత్రి పూట మాత్రమే సంచరిస్తుండటంతో ప్రజల ప్రాణాలకు పెద్దగా ప్రమాదం ఎదురు కాలేదు. ఈ జాతి పాములు ఎక్కువగా దక్షిణ ఆసియా, మయన్మార్లలో మాత్రమే కనిపిస్తుంటాయి. దీనిని ఒక విషపూరితమైన పాము జాతిగా తేల్చారు. ఈ పాము విషం చాలా శక్తిమంతమైనదిగా నిర్ధారించారు. ఈ పాము కాటు వేసినప్పుడు సకాలంలో వైద్య అందకపోతే ప్రాణాంతకమే. ఆకుపచ్చ రంగులో ఉండి శరీరంపై చిన్న చిన్న ఎరుపు మచ్చలు కూడా కనిపిస్తుంటాయి. తల భాగం ఒకే రీతిలో చిలకాకుపచ్చ, వెనుక ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు కలిగి ఉంటుంది. పచ్చని చెట్లపై సంచరిస్తూండటంతో ఈ పామును స్థానికులు పసర పాముగా భావించి ఉదాసీనంగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం. జీవ వైవిధ్యంలో విశేషతను సంతరించుకుందని వన్యప్రాణి విభాగ అధికారులు చెబుతున్నారు. ఈ పాముకు ఉప జాతులేమీ ఇంతవరకూ గుర్తించ లేదు. ఇటువంటి లక్షణాలున్న పాము కోరంగి అభయారణ్యంలో రికార్డు కావడంతో దీని పరిరక్షణ కోసం వన్యప్రాణి విభాగం ప్రజలకు అవగాహన కల్పించేందుకు సమాయత్తమవుతోంది. మగ పాము గరిష్టంగా 575 మిల్లీమీటర్లు (22.6 అంగుళాలు) పొడవున పెరుగుతాయని నిర్దారించారు. వీటి తోక పొడవు 120 మిల్లీమీటర్లు (4.7 అంగుళాలు) పైనే ఉంటుంది. ఆడ పాము అయితే గరిష్టంగా 1,045 మిల్లీమీటర్లు (41.1 అంగుళాలు) పొడవు, తోక చూస్తే 165 మిల్లీమీటర్లు (6.5అంగుళాలు) పొడవు ఉంటుంది. మగ పాము కంటే ఆడపాము పొడవు ఎక్కువగా ఉంటుంది. పర్యాటకులకు అవగాహన కల్పిస్తున్నాం మడ అడవులకు వచ్చే పర్యాటకులకు ఈ విషయంలో ముందు జాగ్రత్తలు చెబుతాం. చెట్లు ఎక్కవద్దు, లోపలకు వెళ్ళవద్దంటూ హెచ్చరించి పంపిస్తాం. ఒకవేళ ఈ పాము కాటు వేస్తే వెంటనే వైద్య సహాయం పొందాలి. ఈ పాము కరవగానే విరుగుడుకు ఇంజక్షన్ చేయించాలి. ఈ ఇంజక్షన్ కోరంగి అభయారణ్యం సమీపాన తాళ్లరేవు పీహెచ్సీ లేదా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో ఉంటుంది. కాలు మీద కాటేస్తే ఎక్కువగా నడవకూడదు. కట్టుకట్టకుండా ఆస్పత్రికి తరలించాలి. ఈ విషయాలపై ముందుగా అవగాహన కల్పిస్తున్నాం. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, అటవీ రేంజర్, వన్యప్రాణి విభాగం, కోరంగి అభయారణ్యం, కాకినాడ ఫ పసర పాము అనుకునేరు జాగ్రత్త సుమా! ఫ అత్యంత విషపూరితం ఫ కాటేస్తే ప్రాణానికే ప్రమాదం ఫ భవిష్యత్తులో అంతరించిపోయే జాతిగా నిర్ధారణ ఫ షెడ్యూల్ 4 నుంచి 1కి మార్పు ఫ దేశంలో మూడో అతి పెద్ద కోరింగ అభయారణ్యంలో గుర్తింపు ఫ పరిరక్షణకు నడుం బిగించిన వన్యప్రాణి విభాగం -
వెన్నుపోటుపై పోరుబాట
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఊరూ వాడా ఒక్కటైంది. గద్దె నెక్కి ఏడాదైనా ఇచ్చిన హామీలు అమలు చేయని కూటమి సర్కార్పై జనాగ్రహం పెల్లుబికింది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపునందుకున్న జనం పార్టీలు, వర్గాలు, కులాలకు అతీతంగా చంద్రబాబు కూటమి పాలనపై గళమెత్తారు. ఎన్నికల్లో వందకు పైబడే పథకాలు పేరు చెప్పి ఓట్లు వేయించుకుని తమను మోసం చేయడానికి అధికారం ఇచ్చామా అని జనం వెన్నుపోటు దినంలో నిలదీశారు. ప్రభుత్వంపై ఏడాది కాలంగా ఉన్న ప్రజా వ్యతిరేకత బుధవారం జరిగిన వెన్నుపోటు దినంలో ప్రస్ఫుటమైంది. పల్లెలు, పట్టణాల నుంచి ఉదయం 10 గంటలకే పార్టీ జెండాలు, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంతో కూడిన ప్లకార్డులతో జనం తండోపతండాలుగా తరలివచ్చి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ ఇచ్చిన పిలుపులో భాగస్వాములయ్యారు. మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు పార్టీ జెండాలు చేతపట్టి పార్టీ కార్యాలయాల నుంచి భారీ బైక్ర్యాలీలు, పాదయాత్రలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఎక్కడికక్కడే ఉదయాన్నే స్వచ్ఛందంగా ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావడంతో వెన్నుపోటు దినం కార్యక్రమం జిల్లా అంతటా సూపర్ సక్సెస్ అయ్యింది. పార్టీ శ్రేణులలో ఉత్సాహం ఉరకలు వేసింది. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్లో మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జన సందోహంతో నిరసన ర్యాలీ నిర్వహించారు.అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. తుని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో తునిలో నిరసన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. పల్లెల నుంచి వేలాదిగా తరలివచ్చిన జన సందోహంతో తుని పట్టణం కిక్కిరిసిపోయింది. తుని పట్టణంలో ఆంజనేయస్వామి ఆలయం వద్ద కొబ్బరికాయకొట్టి కాలినడకన ప్రారంభించిన నిరసన ర్యాలీ బాలాజీ సెంటర్, మెయిన్రోడ్డు, గొల్లప్పారావు సెంటర్, తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. పార్టీ నాయకులు యనమల కృష్ణుడు, లాలం బాబ్జి తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట మాజీ మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో జగ్గంపేటలో వెన్నుపోటు దినం భారీ ర్యాలీలో నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నాయి. జగ్గంపేట కోనేటి వద్ద నుంచి ప్రారంభమై మొయిన్రోడ్డు, బస్టాండ్, పోలీసుస్టేషన్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్, చంద్రబాబు వెన్నుపోటు దారుడు, మోసగాడు, ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారంటూ నినాదాలు చేశారు. అనంతరం వినతిపత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు. రాష్ట్ర యువజన విభాగం సహాయ కార్యదర్శి తోట రాంజీ, పబ్లిసిటీ విభాగం నుంచి రామకుర్తి జగాలు, లీగల్ సెల్ తరఫున గుల్లా ఏడుకొండలు, పెద్దాడ రాజబాబు, రామకుర్తి శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని పల వార్డుల నుంచి తరలివచ్చిన జనంతో కలిసి పార్టీ నేతలు నిరసన గళం వినిపించారు. సిటీలో ద్వారంపూడి సహా పార్టీ నేతలు నలుపురంగు షర్టులు, మహిళా నేతలు, సిటీ ప్రెసిడెంట్ సుంకర శివప్రసన్న, రాష్ట్ర మహిళా కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్ తదితరులు నలుపురంగు చీరలతో వినూత్నంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ సెంటర్ నుంచి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వరకు వెళ్లి ఆర్డీవో మల్లిబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అల్లి రాజబాబు, మైనార్టీ సెల్ నేతలు బాషా, బషీర్, లీగల్ సెల్ నేతలు పితాని శ్రీనివాస్, ఆదిత్యకుమార్, ప్రచార, ట్రేడ్, బీసీ విభాగాల నేతలు రావూరి వెంకటేశ్వరరావు, చక్రవర్తి, వాసుపల్లి కృష్ణ, మాజీ డిప్యుటీ మేయర్ మీసాల ఉదయకుమార్, సిటీ యూత్ ప్రసిడెంట్ రోకళ్ల సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రత్తిపాడు పార్టీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో ప్రత్తిపాడులో భారీ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కిర్లంపూడిలోని మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం ఇంటికి వచ్చి ఆయనను కలిశారు. అనంతరం అక్కడి నుంచి నేతలు, పార్టీ శ్రేణులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు కలసి గిరిబాబు ఆధ్వర్యంలో జగపతినగరం, సింహాద్రిపురం, మీదుగా ప్రత్తిపాడు వచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో పార్టీ నేతలతో పాటు సామాన్యులు సైతం స్వచ్ఛందంగా వచ్చి ‘జెండాలను జతకట్టె..జనాలను మడతపెట్టె’, ‘వెన్నుపోటుకు కేరాఫ్ చంద్రబాబు’, ‘ఉచిత బస్సు అమలులో తుస్’, ‘రైతుభరోసా భారీ మోసం’, ‘వెన్నుపోటు బాబుకు వెండి తెరపై చూపిస్తాం అసలు సినిమా’, ‘వెన్నుపోటు సూపర్హిట్’, ‘నెలనెలా రూ.1,500 అన్నావ్’, ‘50 ఏళ్లకే పింఛన్ అన్నావ్ ఓట్లు వేయించుకున్నావ్’ అనే ప్లకార్డులతో ర్యాలీలో పాల్గొనడం ఆకర్షించింది. పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు, పార్టీ నేతలు వాసిరెడి జమీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు గోళ్ల క్రాంతిసుధాకర్, గొల్లు దివానం, సిగడం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పెద్దాపురం సామర్లకోటలో వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ముందుగా మోటారు సైకిల్ ర్యాలీ ప్రారంభించగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ప్రసన్నాంజనేయస్వామి ఆలయం నుంచి మండుటెండలో ఆర్డీవో కార్యాలయం వరకు పాదయాత్రగా నాయకులు, కార్యకర్తలు, నేతలు ర్యాలీగా తరలివెళ్లారు. పార్టీ సీనియర్ నేత దవులూరి సుబ్బారావు ఆధ్వర్యంలో పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద కూటమి ప్రభుత్వం వెన్నుపోటుపై నిరసన వ్యక్తం చేసింది. అనంతరం ఆర్డీవో కె శ్రీరమణికి వినతి పత్రం అందజేశారు. పార్టీ రాష్ట్ర అయ్యరక విభాగం అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థల ప్రతినిధులు గవరసాని సూరిబాబు, ఎంపీపీలు పెంకే సత్యవతి, బొబ్బరాడ సత్తిబాబు పాల్గొన్నారు. పిఠాపురం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురంలో సైతం కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వెన్నుపోటు దినం కార్యక్రమంలో స్పష్టంగా కనిపించింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి తరలివచ్చిన జనంతో పిఠాపురం ఉప్పాడ సెంటర్ నిండిపోయింది. ప్రధానంగా పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళల ఇచ్చిన ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో పిఠాపురం మారుమోగింది. ఉప్పాడ సెంటర్లో ప్రారంభమైన నిరసన ర్యాలీ పాత బస్టాండ్, అంబేడ్కర్ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా తహసీల్దారు కార్యాలయం వరకు సాగింది. తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు వులవకాయల నాగ లోవరాజు, గుబ్బల తులసీకుమార్, పార్టీ జిల్లా మహిళ అధ్యక్షురాలు వర్థినీడి సుజాత, రాష్ట్ర యూత్ సంయుక్త కార్యదర్శి ఉలవల భూషణం, జిల్లా అధికార ప్రతినిధి పెదపాటి రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కారే శ్రీనివాసరావు, కొప్పన శివనాఽథ్ పాల్గొన్నారు. కూటమి సర్కార్పై పోటెత్తిన ప్రజాగ్రహం వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసొచ్చిన జన సందోహం భారీ మోటార్ సైకిల్ ర్యాలీలు ఉత్సాహంతో ఉరకలెత్తిన పార్టీ శ్రేణులు కాకినాడ జిల్లాలో వెన్నుపోటు దినం సూపర్ సక్సెస్ -
పసర పాము అనుకునేరు జాగ్రత్త సుమా!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: భవిష్యత్లో అంతరించిపోయే జాతుల జాబితాలో ఉన్న స్పాట్–టెయిల్డ్ పిట్ వైపర్ జాతి పాము కాకినాడ సమీపాన గుర్తించారు. దేశంలోనే మూడో అతి పెద్ద కోరంగి అభయారణ్యంలో ఈ పాము తారసపడింది. దాదాపు 40 ఏళ్ల క్రితం జనవాసాల్లో కనిపించే ఈ అరుదైన జాతిపాము సమీప భవిష్యత్లో అంతరించిపోయే జాతుల్లో ఒకటిగా చేరింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1978 ప్రకారం ఈ పాము నాలుగో షెడ్యూల్లో ఉంది. అటువంటి ఈ జాతి పాము పరిరక్షణ కోసం తక్షణం ప్రయత్నించకుంటే అంతరించిపోతున్న జాతుల్లో చేరిపోతుందని వన్యప్రాణి సంరక్షణా విభాగం గుర్తించింది. ఈ నేపథ్యంలో స్పాట్–టెయిల్డ్ పిట్ వైపర్ పామును నాలుగో షెడ్యూల్ నుంచి ఒకటో షెడ్యూల్లోకి చేర్చారు. ఈ షెడ్యూల్ మార్పు ద్వారా అత్యంత జాగ్రత్తతో ఈ జాతి పామును రక్షించాలనే సందేశాన్ని ఇచ్చినట్టు వన్యప్రాణి విభాగం అధికారులు చెబుతున్నారు. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ముందుచూపుతోనే 2022లో షెడ్యూల్ మార్చారు. పొడ పాము సంతతికి చెందిన ఈ పాము పచ్చరంగులో ఉంటుంది. ఈ జాతిలో రెండు రకాలు బాంబోపిట్ వైపర్, స్పాట్ వైల్డ్ పిట్వైపర్ ఉన్నాయి. బాంబో పిట్ వైపర్ సాధారణంగా అటవీ ప్రాంతమైన రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి, వై.రామవరం, అడ్డతీగల తదితర ప్రాంతాల్లో ఉంటుంది. స్పాట్ వైల్డ్ పిట్ వైపర్ జాతి పాములు చిత్తడి నేలల్లో (మాంగ్రూవ్స్) మాత్రమే మనగలుగుతాయి. ఈ పాము మనిషిపై దాడి చేసినప్పుడు రక్తంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి. దీంతో బ్రెయిన్ డెడ్ కావడం, హార్ట్ అటాక్, కోమాలోకి వెళ్లడంతో ప్రాణానికే ప్రమాదం ఏర్పడతాయి. అయితే, ఇంతవరకూ ఈ జాతి పామువల్ల ఇలాంటి కేసులు ఎక్కడా నమోదు కాలేదు. ఈ పాములు పగలు నిద్రావస్థలో ఉండి, రాత్రి పూట మాత్రమే సంచరిస్తుండటంతో ప్రజల ప్రాణాలకు పెద్దగా ప్రమాదం ఎదురు కాలేదు. ఈ జాతి పాములు ఎక్కువగా దక్షిణ ఆసియా, మయన్మార్లలో మాత్రమే కనిపిస్తుంటాయి. దీనిని ఒక విషపూరితమైన పాము జాతిగా తేల్చారు. ఈ పాము విషం చాలా శక్తిమంతమైనదిగా నిర్ధారించారు. ఈ పాము కాటు వేసినప్పుడు సకాలంలో వైద్య అందకపోతే ప్రాణాంతకమే. ఆకుపచ్చ రంగులో ఉండి శరీరంపై చిన్న చిన్న ఎరుపు మచ్చలు కూడా కనిపిస్తుంటాయి. తల భాగం ఒకే రీతిలో చిలకాకుపచ్చ, వెనుక ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు కలిగి ఉంటుంది. పచ్చని చెట్లపై సంచరిస్తూండటంతో ఈ పామును స్థానికులు పసర పాముగా భావించి ఉదాసీనంగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం. జీవ వైవిధ్యంలో విశేషతను సంతరించుకుందని వన్యప్రాణి విభాగ అధికారులు చెబుతున్నారు. ఈ పాముకు ఉప జాతులేమీ ఇంతవరకూ గుర్తించ లేదు. ఇటువంటి లక్షణాలున్న పాము కోరంగి అభయారణ్యంలో రికార్డు కావడంతో దీని పరిరక్షణ కోసం వన్యప్రాణి విభాగం ప్రజలకు అవగాహన కల్పించేందుకు సమాయత్తమవుతోంది. మగ పాము గరిష్టంగా 575 మిల్లీమీటర్లు (22.6 అంగుళాలు) పొడవున పెరుగుతాయని నిర్దారించారు. వీటి తోక పొడవు 120 మిల్లీమీటర్లు (4.7 అంగుళాలు) పైనే ఉంటుంది. ఆడ పాము అయితే గరిష్టంగా 1,045 మిల్లీమీటర్లు (41.1 అంగుళాలు) పొడవు, తోక చూస్తే 165 మిల్లీమీటర్లు (6.5అంగుళాలు) పొడవు ఉంటుంది. మగ పాము కంటే ఆడపాము పొడవు ఎక్కువగా ఉంటుంది.పర్యాటకులకు అవగాహన కల్పింస్తున్నాం మడ అడవులకు వచ్చే పర్యాటకులకు ఈ విషయంలో ముందు జాగ్రత్తలు చెబుతాం. చెట్లు ఎక్కవద్దు, లోపలకు వెళ్ళవద్దంటూ హెచ్చరించి పంపిస్తాం. ఒకవేళ ఈ పాము కాటు వేస్తే వెంటనే వైద్య సహాయం పొందాలి. ఈ పాము కరవగానే విరుగుడుకు ఇంజక్షన్ చేయించాలి. ఈ ఇంజక్షన్ కోరంగి అభయారణ్యం సమీపాన తాళ్లరేవు పీహెచ్సీ లేదా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో ఉంటుంది. కాలు మీద కాటేస్తే ఎక్కువగా నడవకూడదు. కట్టుకట్టకుండా ఆస్పత్రికి తరలించాలి. ఈ విషయాలపై ముందుగా అవగాహన కల్పిస్తున్నాం. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, అటవీ రేంజర్, వన్యప్రాణి విభాగం, కోరంగి అభయారణ్యం, కాకినాడ -
బిడ్డను చంపి.. తనువు చాలించి..
కాకినాడ క్రైం: కన్న పేగుని చిదిమేసి తానూ తనువు చాలించిన తల్లి హృదయ విదారక సంఘటన కాకినాడలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు, రాజమహేంద్రవరానికి చెందిన గుడేటి రమ్యదీప్తి(30)కి ఐదేళ్ల క్రితం కాకినాడ రేచర్లపేట దౌర్లవారి వీధికి చెందిన రాజాల శరత్తో వివాహమైంది. ఈ దంపతులు అబుదాబీలో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు కియాన్ ప్రశాంత్ ఉన్నాడు. రెండు నెలల క్రితం రమ్యదీప్తి అబుదాబి నుంచి తన కుమారుడితో కలిసి రాజమహేంద్రవరానికి వచ్చింది. అక్కడ ఒకటిన్నర నెలల పాటు ఉండి, సుమారు పది రోజుల క్రితం కాకినాడలోని అత్తయ్య ఇంటికి వచ్చి ఉంటోంది. ఏమైందో, ఏమో మంగళవారం రాత్రి నిద్రపోయేందుకు కుమారుడితో కలిసి తన గదిలోకి వెళ్లింది. ఉదయం ఎంతకూ తలుపు తీయకపోయేసరికి దీప్తి అత్తయ్య, ఆడపడుచు కిటికీ నుంచి గదిలోకి చూశారు. దీప్తి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఆమె కుమారుడు మంచంపై నిర్జీవంగా పడి ఉన్నాడు. పొరుగు వారి సాయంతో తలుపులు తెరిచిచూడగా.. దీప్తి అప్పటికే చనిపోయి ఉంది. బాలుడు ప్రశాంత్కు ముక్కు, నోటికి ప్లాస్టర్లు వేసి ఉన్నాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. టూ టౌన్ ఇన్చార్జి సీఐ సత్యనారాయణ, ఎస్సై తులసీరామ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీప్తి ఆత్మహత్యకు పాల్పడిందని, అంతకు ముందు తన కుమారుడి ముక్కు, నోటికి ప్లాస్టర్లు వేసి, ఊపిరాడకుండా చేసి ఉంటుందని గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో దీప్తి ఈ ఘాతుకానికి పాల్పడిందని భావిస్తున్నామని, విచారణలో వాస్తవాలు తెలుస్తాయని సీఐ చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇలాఉంటే, అత్త, ఆడపడుచు, భర్త వేధింపులు తాళలేకున్నానని దీప్తి తమకు వాయిస్ మెజేస్లు పెట్టి ఈ ఘాతుకానికి పాల్పడిందని దీప్తి తల్లి అరుణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాకినాడ టూ టౌన్ పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. -
కన్నూమిన్నూకాన‘కొండ’..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తెలుగు తమ్ముళ్ల కన్నుపడితే కొండలు కూడా పిండైపోతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఆ పార్టీ నేతలు బరి తెగిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 2014–19 మధ్య ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పెద్దాపురం సమీపాన ఏడీబీ రోడ్డులోని రామేశంమెట్ట కొండను తెలుగుతమ్ముళ్లు గుల్లచేసేశారు. నాడు దాదాపు మూడున్నరేళ్లు ఏకబిగిన రాత్రి, పగలు తేడా లేకుండా గ్రావెల్ మాఫియా రాజ్యమేలింది. రూ.కోట్లు కొల్లగొట్టింది. ఇంకా మిగిలి ఉన్న కొండను ఇప్పుడు టీడీపీ నేతలు, వారి అనుచరులు తవ్వేస్తున్నారు. మీకు సగం, నాకు సగం అంటూ పంపకాలు వేసుకుని మరీ సొమ్ము చేసుకుంటున్నారు.టీడీపీ, జనసేన కుమ్మక్కై..రామేశంమెట్టలో సర్వే నంబర్ 1 నుంచి 90 వరకూ 823 ఎకరాల్లో కొండలు ఉన్నాయి. 800 మంది నిరుపేద దళితుల స్వయం ఉపాధి కోసం 1975లో అప్పటి ప్రభుత్వం రామేశంమెట్టను కేటాయించింది. 2014–19 మధ్య ఈ కొండలపై టీడీపీ నేతల కళ్లు పడ్డాయి. అంతే పది పదిహేను అడుగుల లోతున తవ్వేసి దోచుకున్నారు. అప్పట్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి అప్పటి కేబినెట్లో ప్రాతినిధ్యం వహించిన కీలక మంత్రి కనుసన్నల్లో ఆయన బంధుగణం రామేశంమెట్ట కొండను గుల్ల చేసేసింది. రూ.కోట్లు కొల్లగొట్టింది. నిత్యం వందలాది టిప్పర్లు, లారీల్లో వేల టన్నుల గ్రావెల్ను జిల్లా సరిహద్దులు దాటించేయడం అప్పట్లో రాష్ట్ర స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. 2019లో అధికారం కోల్పోవడంతో ఆ తర్వాత ఐదేళ్ల పాటు ఆ మెట్టపై పెద్దగా కార్యకలాపాలు జరగలేదు. 2024లో మళ్లీ కూటమికి అధికారం దక్కడంతో ఇప్పుడు టీడీపీ, జనసేన నేతలు కుమ్మక్కై వాటాలు వేసుకుని మరీ మిగిలిన కొండను కొల్లగొడుతున్నారు.రోజుకు రూ.15 లక్షల వరకూ దోపిడీ..! కాకినాడ జిల్లా జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల సరిహద్దులో రామేశంమెట్ట ఉంది. ఈ రెండు నియోజకవర్గాలకు టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రామేశంమెట్ట కొండను పెద్దాపురం నియోజకవర్గం వైపు 2014–19 మధ్య అడ్డంగా తవ్వేశారు. మిగిలిన కొండను ఇప్పుడు తవ్వేస్తున్నారు. కొండకు రెండోవైపు ప్రాంతం జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోకి రావడంతో అక్కడ స్థానిక సంస్థలకు చెందిన ఒక ప్రజాప్రతినిధి గ్రావెల్ దందా నడిపిస్తున్నాడు. మెట్ట ప్రాంతంలోని ఒక ప్రజాప్రతినిధితో ఉన్న బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని రాత్రి, పగలు పదుల సంఖ్యలో టిప్పర్లతో గ్రావెల్ను తరలించేసి రామేశంమెట్ట కొండను గుల్ల చేసేస్తున్నారు. టిప్పర్లలో గ్రావెల్ తరలించేసి రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ తెలుగు తమ్ముళ్లు దోచుకుంటున్నట్టు సమాచారం. -
పవన్కళ్యాణ్ ఇలాకాలో 85 ఏళ్ల అవ్వ ఆవేదన
పిఠాపురం: ‘వృద్ధాప్య పింఛనే ఇప్పటివరకు నన్ను బతికించింది. ఇప్పుడు ఆ పింఛన్ కూడా ఆపేసి ఏవో కారణాలు చెబుతున్నారు. నేను బతికున్నట్టు నిరూపించుకోమంటున్నారు. నేను కాలు కదపలేను. ఎక్కడికీ వెళ్లలేను. పింఛన్ లేకపోతే నాకు దిక్కులేదు. దాన్ని కూడా తీసేసి బతికుండగానే చంపేస్తున్నారు’ అంటూ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఇలాకాలో 85 ఏళ్ల అవ్వ కన్నీటిపర్యంతమైంది. కాకినాడ జిల్లా పిఠాపురం డ్రైవర్స్ కాలనీకి చెందిన చోడిశెట్టి సుబ్బారావు(85) కొన్నేళ్లుగా వృద్ధాప్య పింఛన్ అందుకుంటూ.. కుమార్తె పార్వతి వద్ద నివసిస్తోంది. వైఎస్ జగన్ సర్కార్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా వలంటీర్ ద్వారా ఇంటి వద్దే పింఛన్ అందుకున్న ఆమెకు కూటమి ప్రభుత్వంలో కష్టాలు ఎదురయ్యాయి. ఈ నెల పింఛన్ను ఆపేసిన కూటమి సర్కార్.. బతికున్నట్లుగా నిరూపించుకోవాలంటూ ఆమెకు అగ్ని పరీక్ష పెట్టింది. దీంతో తనను ఆదుకోవాలంటూ ఆ వృద్ధురాలు విలపిస్తోంది. నేను బతికే ఉన్నా కదా.. ‘గతంలో ఏ ఇబ్బంది లేకుండా వలంటీరే అన్నీ చూసుకునేవాడు. ఇప్పుడు ఎవరూ రావట్లేదు. వృద్ధాప్యం వల్ల వేలిముద్రలు పడడం లేదంటున్నారు. నా కళ్లు మసకబారడంతో ఐరిస్ కూడా పడటం లేదంటున్నారు. ఏది పడకపోయినా నేను బతికే ఉన్నా కదా. నాకు పింఛనే ఆధారం అని చెబుతున్నా ఎవరూ కనికరించడం లేదు. నాకు పింఛనైనా ఇప్పించండి లేదా నన్ను చంపేయండి’ అంటూ వృద్ధురాలు విలపించింది. ‘మా అమ్మకు నెలనెలా వచ్చే పింఛన్ డబ్బులతోనే మందులు కొంటున్నా. పవన్కళ్యాణ్కు ఓటు వేసినందుకు ఇప్పుడు పింఛన్ గురించి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది’ అంటూ ఆమె కుమార్తె పార్వతి వాపోయింది. తమకు న్యాయం చేయాలని కోరింది. -
సూపర్సిక్స్తో మోసం
సూపర్ సిక్స్ సహా గత ఎన్నికల్లో 130 హామీలు ఇచ్చి, మోసం చేసిన చంద్రబాబు సర్కార్పై జనం తిరగబడే రోజులు వచ్చేశాయి. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఏ ఒక్క హామీ అమలు చేయకుండా జనాన్ని నిలువునా దగా చేశారు. అందుకే ప్రజాపక్షంగా ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు వైఎస్సార్ సీపీ వెన్నుపోటు దినం నిర్వహిస్తోంది. బలహీనవర్గాలకు రాయితీ రుణాలని గొప్పగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి ఏడాదైపోయినా ఒక్కరికై నా రుణం ఇచ్చారేమో చెప్పాలి. తీరని అన్యాయానికి గురైన బీసీలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. – అల్లి రాజబాబు, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు, బీసీ జేఏసీ కో కన్వీనర్, కాకినాడ అన్ని వర్గాలకూ హ్యాండిచ్చారు కూటమి సర్కార్ అన్ని వర్గాలకు హ్యాండిచ్చింది. ఏడాది పాలనలో అన్ని రంగాలనూ భ్రష్టు పట్టించింది. ఇచ్చిన హామీలన్నింటినీ గాలికొదిలేసింది. ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి, చివరకు ప్రజలను మోసం చేసింది. – సుంకర విద్యాసాగర్, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, కాకినాడ జిల్లా -
అక్రమాలు.. దందాలు
● కూటమి పాలనలో మట్టి, గ్రావెల్ మాఫియా, భూకబ్జాలు, ఆక్రమణలు, దందాలు, అక్రమ వసూళ్లతో తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. ● తుని, పిఠాపురం ప్రాంతాల్లో దేవదాయ భూములకు వేలం జరగకుండా అడ్డం పడి దొడ్డిదారిన దోచుకునేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. ● పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు ఎర్ర గ్రావెల్ కొండలను పిండి చేసి, వాటాలు వేసుకుంటున్నారు. ● కొత్త మద్యం పాలసీ పేరుతో ఊరూరా బెల్టు షాపులు, పర్మిట్ రూములకు అనుమతులిచ్చి జిల్లాను మత్తులో ముంచుతున్నారు. యువత మద్యం, గంజాయికి బానిసైపోయినా సర్కారు చెవికెక్కడం లేదు. మద్యాన్ని ఏరులై పారిస్తోంది. జిల్లాలో అధికారిక మద్యం దుకాణాలు 171 ఉండగా, సందుగొందుల్లో సుమారు 500 బెల్ట్ షాపులు అడ్డగోలుగా ఏర్పాటు చేశారు. ● జిల్లాలో ఇంటింటికీ రేషన్ తీసుకువచ్చిన 428 ఎండీయూ వాహనాలను తొలగించి, తిరిగి పాత రోజుల్లోకి తీసుకుపోయారు. -
సిద్ధేశ్వరి పీఠం ఉత్తరాధికారిగా సూర్య అరవింద్
తుని: తమిళనాడులోని కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠం ఉత్తరాధికారిగా తునికి చెందిన డాక్టర్ కాదంబరి సూర్య అరవింద్ నియమితులయ్యారు. ఆయన సోదరుడు కాదంబరి రామకృష్ణ ఈ విషయం తెలిపారు. అరవింద్ చిన్నప్పటి నుంచీ ఆధ్యాత్మిక చింతన, భక్తి భావనతో ఉండేవాడని, ఎంబీబీఎస్ చదివి, శ్రీ సిద్ధేశ్వరి పీఠంలో చేరారని చెప్పారు. భక్తిశ్రద్ధలతో సేవలందించిన అరవింద్కు పీఠాధిపతి, జగద్గురువు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి.. దత్తేశ్వరానంద భారతి స్వామిగా సన్యాస నామం ఇచ్చి, ఉత్తరాధికారిగా నియమించారని వివరించారు. ఈ నెల 6న కుర్తాళంలో ఆయన పట్టాభిషేకం జరుగుతుందని తెలిపారు. పీఎం సూర్యఘర్కు సహకరించాలి కాకినాడ సిటీ: పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారుల ఇళ్లపై సోలార్ రూఫ్టాప్ ప్యానల్ ఏర్పాటుకు అధికారులు, బ్యాంకర్లు చొరవ చూపాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశించారు. వివిధ అంశాలపై కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పీఎం సూర్యఘర్ పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ సకాలంలో సోలార్ రూఫ్టాప్ ప్యానల్ ఏర్పాటు చేయాలన్నారు. సోలార్ రూఫ్టాప్ ప్యానల్ ఏర్పాటుకు బ్యాంకర్ల ద్వారా రుణ మంజూరులో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దీనికోసం జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, వారం వారం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ప్రక్రియ సజావుగా సాగేలా చూస్తామని చెప్పారు. మండలాలు, పట్టణాల వారీగా సోలార్ రూఫ్టాప్ ప్యానెల్ ఏర్పాటు చేసే వారితో డీఆర్డీఏ, మెప్మా సిబ్బంది సమన్వయం చేసుకొని, లబ్ధిదారులతో సమావేశాలు ఏర్పాటు చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ జి.ప్రసాద్, డీఆర్డీఏ పీడీ జి.శ్రీనివాసరావు, ఎల్డీఎం సీహెచ్ఎస్వీ ప్రసాద్ పాల్గొన్నారు. -
వంకర పాదాలు సరి చేయొచ్చు
కాకినాడ క్రైం: పుట్టుకతో వచ్చే వంకర పాదాలను సరి చేయవచ్చని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ్ (ఆర్బీఎస్కే) జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ వి.అరుణ తెలిపారు. వరల్డ్ క్లబ్ ఫుట్ డే సందర్భంగా కాకినాడ జీజీహెచ్ ఆర్థోపెడిక్ లెక్చర్ గ్యాలరీలో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డీఈఐసీ), క్యూర్ ఇండియా సంయుక్త ఆధ్వర్యాన మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ, పుట్టుకతో వంకర పాదాలను గుర్తిస్తే వైద్యులు, సామాన్యులు జీజీహెచ్లో ఉన్న డీఈఐసీకి సిఫారసు చేయాలని సూచించారు. ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి డాక్టర్ ఎంపీఆర్ విఠల్ మాట్లాడుతూ, పుట్టిన 21 రోజుల్లోగా చికిత్స అందించగలిగితే వంకర పాదాలు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ నిపుణుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే చికిత్సా విధానాల ద్వారా శిశువు జీవన ప్రమాణాలు మెరుగు పడతాయన్నారు. అవసరానికి అనుగుణంగా టినోటమీ అనే మైనర్ శస్త్రచికిత్స నిర్వహిస్తామని డాక్టర్ విఠల్ అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, తల్లిదండ్రులతో పాటు, క్యూర్ ఇండియా ప్రతినిధులు, డీఈఐసీ సిబ్బంది, ఆర్దోపెడిక్, పీడియాట్రిక్స్, ఫిజియోథెరపీ నిపుణులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం, వరల్డ్ క్లబ్ ఫుట్ డే సందర్భంగా డాక్టర్ విఠల్ కేక్ కట్ చేసి, పిల్లలకు అందించారు. స్కూటీపై వెళ్తూంటే.. చైన్ లాక్కుపోయారు కరప: గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై వెంబడించి, విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి తిరిగి వెళ్తున్న మహిళా ఉద్యోగి మెడలోని బంగారు గొలుసు లాక్కుని పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన కొండేపూడి శాంతి శివకుమారి కరప మండలం వేళంగిలోని ఎస్బీఐ బ్రాంచిలో టెంపరరీ వర్కర్గా పని చేస్తున్నారు. ఆమె సోమవారం సాయంత్రం తన స్కూటీపై గొల్లపాలెం వెళ్తూండగా సిరిగలపల్లిలంక గ్రామం దాటిన తర్వాత దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టి, వేగంగా పరారయ్యారు. బాధితురాలు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరప పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ పర్యవేక్షణలో కరప ఎస్సై టి.సునీత కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సచివాలయ సెక్రటరీపై ఫిర్యాదు
రాజమహేంద్రవరం రూరల్: రాజానగరం మండలం రాధేయపాలెం గ్రామ సచివాలయంలో జయబున్నీసా బేగం గ్రేడ్–5 హోదాలో సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆ సచివాలయంలో వారంతా ఒకే నోటిఫికేషన్లో నియమితులయ్యారు. దీంతో వారి మధ్య సీనియారిటీ సమస్య కూడా లేదు. అయితే, బేగంకు కొన్నాళ్ల క్రితం డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్(డీడీవో)గా అదనపు బాధ్యతలు కేటాయించారు. డీడీవోగా సిబ్బంది జీతాల ఫైల్ సిద్ధం చేయడం ఆమె చేతిలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తమను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని ఆ సచివాలయ సిబ్బంది రాజమహేంద్రవరం కలెక్టరేట్లోని డీఎల్డీవో, వార్డు, గ్రామ సచివాలయాల ఇన్చార్జి వీణాదేవిని కలిసి తమ గోడును వెళ్లబోసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మే నెల జీతాలు నేటికీ రాలేదని బేగం ఫైల్ సిద్ధం చేయకపోవడమే అందుకు కారణమని డీఎల్డీవో దృష్టికి తీసుకెళ్లారు. బేగం వైఖరి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన డీఎల్డీవో సిబ్బంది ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలకు సిఫారసు చేస్తామని హామీ ఇచ్చారు. -
అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలకు జట్టు ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): విజయనగరం జిల్లాలో 4 నుంచి 7 వరకు జరిగే ఏసీఏ నార్త్ జోన్ క్రికెట్ పోటీలలో పాల్గొనే పురుషుల జిల్లా జట్టు ఎంపి కను మంగళవారం నిర్వహించినట్లు తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ సంఘ కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. స్థానిక ఆర్ఎంసీ క్రీడామైదానంలో నిర్వహించిన సెలెక్షన్స్లో 15 మందిని ఎంపిక చేశామన్నారు. ఈ నెల 9 నుంచి 12 వరకు జరిగే ఏసీఏ నార్త్ జోన్ మ హిళల అంతర్ జిల్లా క్రికెట్ పోటీలకు జిల్లా మహిళా క్రికెట్ జట్టు ఎంపికను నిర్వహించామని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులకు జిల్లా క్రికెట్ సంఘం తరఫున క్రీడాదుస్తులు అందజేశామని తెలిపారు. -
ఇద్దరు లారీ డ్రైవర్ల దుర్మరణం
తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు మండలం కాపవరం వద్ద హైవే పై మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు లారీ డ్రైవర్లు మృతి చెందారు. కొవ్వూరు ఎస్సై శ్రీహరిరావు తెలిపిన వివరాల ప్రకారం లారీ డ్రైవర్ బత్తుల శీనయ్య(40) హైదరాబాద్ నుంచి మండపేటకు ధాన్యం లోడుతో వస్తున్నాడు. కాపవరం వద్దకు వచ్చే సరికి కునుకుపాటుకు గురై ముందు వెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టి అనంతరం రోడ్డు డివైడర్ను ఢీ కొట్టడంతో లారీ ఆగిపోయింది. ఈ లారీని ఇతర వాహనాలకు ఢీకొనకుండా, శీనయ్య కిందకు దిగి డైరెక్షన్ ఇస్తూ దారి చూపుతున్నాడు. ఇంతలో జంగారెడ్డిగూడెం నుంచి ధాన్యం లోడుతో వస్తున్న మరో లారీ.. శీనయ్య లారీని బలంగా ఢీకొట్టడంతో అందులోని డ్రైవర్ కొయ్యే బాబూరావు(40) లారీ క్యాబిన్లో ఇరుకుపోయి మృతి చెందాడు. డైరెక్షన్ ఇస్తున్న బత్తుల శీనయ్య కూడా ఐచర్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై శ్రీహరి తెలిపారు. -
రైల్వే బ్రిడ్జిల పరిరక్షణకు చర్యలు
రాజమహేంద్రవరం సిటీ: గోదావరి నదిపై గల ప్రతిష్టాత్మకమైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి, ఆర్చ్ బిడ్జిల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ పీఈ ఎడ్విన్ పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరంలో గల రెండు బ్రిడ్జిలను అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైల్వే వంతెనలపై జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల నాణ్యత, భద్రతా తనిఖీని నిర్వహించామన్నారు. 2027 నాటికి సురక్షితమైన, బలమైన వంతెనలుగా తీర్చిదిద్దడానికి, రూ.115 కోట్ల మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ పై సురక్షితమైన ఫుట్పాత్లు ఏర్పాటు చేశామన్నారు. ఐకానిక్ ఆర్చ్ బ్రిడ్జ్పై రూ.70 కోట్లతో కేబుల్ రీ ప్లేస్మెంట్ వర్క్ పూర్తి చేస్తున్నామన్నారు. భారతీయ రైల్వేలతో అవగాహన ఒప్పందం కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల మద్దతును ఆశిస్తున్నామన్నారు. పలువురు రైల్వే అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆదేశాలు భేఖాతర్
మునికూడలి ర్యాంపులో ఆగని ఇసుక రవాణా సీతానగరం: జిల్లాలో 28 ఇసుక ర్యాంపులు నిలిపివేస్తున్నట్లు అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను భేఖాతరు చేస్తూ మునికూడలి ర్యాంపు నుంచి ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. మండలంలోని ములకల్లంక రెవెన్యూ భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపి కాటవరం ర్యాంప్ నుంచి, పక్కిలంక రెవెన్యూ భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపి మునికూడలి ర్యాంపు నుంచి, రఘుదేవపురం, వంగలపూడి ర్యాంపుల నుంచి ఇసుక రవాణా జరుగుతోంది. ర్యాంపులను అక్టోబర్ వరకు నిలిపివేస్తున్నట్లు, ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని సోమవారం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే పక్కిలంక భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపి లారీలపై మునికూడలి ర్యాంపు నుంచి రవాణా చేస్తున్నారు. గోదావరి నదీ గర్భంలో మూడు భారీ పొక్లెయిన్లతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. రాత్రి సమయంలో కూడా ఇసుక రవాణా జరుగుతోందని స్దానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ ఎ.శ్రీనివాస్ను వివరణ కోరగా తక్షణమే ర్యాంపును నిలిపివేస్తామని తెలిపారు. అయితే మంగళవారం రాత్రి కూడా యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరిగాయి. -
ఉత్కంఠగా సీనియర్ ఓపెన్ చెస్ పోటీలు
అమలాపురం టౌన్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విద్యానిధి విద్యాసంస్థల ప్రాంగణంలో మంగళవారం జరిగిన సీనియర్ ఓపెన్ చెస్ జిల్లా స్థాయి పోటీలు ఉత్కంఠగా జరిగాయి. ఈ జిల్లా స్థాయి పోటీల్లో మొదటి నాలుగు స్థానాలు సాధించిన విజేతలను రాష్ట్ర స్థాయి సీనియర్ ఓపెన్ చెస్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ తాడి వెంకట సురేష్ తెలిపారు. ద్రాక్షారామ సాత్విక్ (ప్రథమ), తాడి వెంకటేష్ (ద్వితీయ), బండారు నానిబాబు (తృతీయ), పి.ధరణి (4వ స్థానం) సాధించారని చెప్పారు. ఈ నలుగురు విజేతలు ఈనెల 6వ తేదీన విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి సీనియర్ ఓపెన్ చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటారని వెంకట సురేష్ తెలిపారు. విజేతలకు విద్యానిధి స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి బహుమతులు అందజేశారు. -
నాణ్యమైన విద్యకు నవోదయం
రాయవరం: జవహర్ నవోదయ విద్యాసమితిలో 6వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు 1986లో జవహర్ నవోదయ విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 661 నవోదయ విద్యాలయాలు ఉండగా..కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఉంది. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని విద్యార్థులు ఇక్కడ దరఖాస్తుకు అర్హులు. 2026–27 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఉచిత విద్యను ఇక్కడ అందిస్తారు. విద్యతో పాటు అధునాతన సౌకర్యాల కల్పన, ప్రయోగాత్మక విద్య, క్రీడలు, క్రమశిక్షణ, ప్రతిభకు పెద్దపీట వేయడం ఈ విద్యా సంస్థల ప్రత్యేకత. పరీక్షకు ఎవరు అర్హులు, పరీక్షా విధానం, రిజర్వేషన్ తదితర వివరాలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఒక్కసారే అవకాశం ఈ ఏడాది డిసెంబర్ 13న నిర్వహించే ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి విద్యాలయలో ప్రవేశం లభిస్తుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయాల్లో మొత్తం 80 సీట్లు ఉంటాయి. ఆరవ తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం ఆయా మండలాల్లో ఐదో తరగతి చదువుతున్న బాలబాలికలు అర్హులు. ఈ ప్రవేశ పరీక్షకు ఒక్కసారి మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. 2026–27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ పొందగోరే బాలబాలికలు 2014 మే ఒకటో తేదీ నుంచి 2016 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన పాఠశాలల్లో 3,4 తరగతులు ఉత్తీర్ణత సాధించి ఐదో తరగతి చదువుతున్న వారు మాత్రమే అర్హులు. రిజర్వేషన్ విధానం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం తగ్గకుండా సీట్లు కేటాయిస్తారు. షెడ్యూల్ కులాలకు 15 శాతం, షెడ్యూల్ తరగతులకు ఏడు శాతం, దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. ప్రవేశాల్లో బాలికలకు 33 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తారు. వసతులు బాలబాలికలకు వసతి గృహాలు, భోజనం, విద్య, నోట్బుక్స్, స్కూల్ యూనిఫామ్, షూస్, టాయిలెట్ సామగ్రి ఉచితం. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు నవోదయ విద్యాలయాల్లో బోధన చేస్తారు. శాస్త్ర, సాంకేతికతతో కూడిన విద్య, క్రీడలు, యోగా ద్వారా విద్యార్థికి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కల్పిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు నామమాత్రపు రుసుం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, బాలికలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేసిన తర్వాత దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకుని దగ్గర ఉంచుకోవాలి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. జూలై 29వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తులు అందజేయాల్సి ఉంది. దరఖాస్తుకు రుసుం చెల్లించనవసరం లేదు. 2026–27 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల జూలై 29 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు ఈ ఏడాది డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష గతేడాది జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులు ఇలా.. జిల్లా వచ్చిన దరఖాస్తులు కోనసీమ 3,869 తూర్పుగోదావరి 1,741 కాకినాడ 3,361పరీక్షా విధానమిదీ.. నవోదయ ప్రవేశ పరీక్షను 2025 డిసెంబరు 13న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు భాషను(తెలుగు/ఇంగ్లీషు) ఎంచుకొని పరీక్ష రాసే వీలుంది. ప్రవేశ పరీక్షలో 80 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు పరీక్ష నిర్వహియిస్తారు. మూడు విభాగాల్లో ప్రశ్నలు కేటాయిస్తారు. మేధాశక్తిపై 40 ప్రశ్నలు 50 మార్కులకు, గణితం(అర్ధమెటిక్), ఎంచుకున్న భాషపై ఒక్కొక్క విభాగానికి 20 ప్రశ్నలు వంతున 40 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. తప్పుడు సమాధానాలకు నెగిటివ్ మార్కులు ఉండవు. దివ్యాంగులకు 40 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయిస్తారు. పరీక్షలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్వహిస్తుంది. ఎంపికై న వారికి మొదటి రెండు సంవత్సరాలు తెలుగు/ఇంగ్లిషు భాషల్లో బోధిస్తారు. అనంతరం ఇంగ్లిషులోనే బోధన చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు హెచ్టీటీపీఎస్://నవోదయ.జీవోవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు అవగాహన కల్పించాలి అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యేలా విద్యాశాఖ అధికారులు అవగాహన కల్పించాలి. గతేడాదికి మించి దరఖాస్తులు వచ్చేలా ఎంఈవోలు పర్యవేక్షణ చేయాలి – బి.సీతాలక్ష్మి, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయ, పెద్దాపురం -
‘వక్ఫ్ చట్టం ఎవరికి చుట్టం’ పుస్తకావిష్కరణ
కపిలేశ్వరపురం (మండపేట): ‘వక్ఫ్ చట్టం ఎవరికి చుట్టం’ అనే పుస్తకాన్ని జమాత్–ఎ–ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ రఫీఖ్ ఆవిష్కరించారు. మండపేట పట్టణం గాంధీనగర్ అల్–ఆమీన్ మస్జిద్లో మంగళవారం జమాత్–ఎ–ఇస్లామీ హింద్ మండపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక సమావేశంలో రక్షీఖ్ పలు అంశాలను ప్రస్తావించారు. దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు జరుపుకునే బక్రీద్ పండగ పాడిరైతులకు ఆర్థిక చేయూతనిస్తుందన్నారు. వక్ఫ్ చట్టంపై కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారాన్ని చేస్తోందని, మేధావులు, ధార్మిక సంస్థలు, ప్రజాసంఘాలు శాసీ్త్రయ దృక్పథంతో వక్ఫ్ చట్టాన్ని సమీక్షించాలని కోరారు. చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘వక్ఫ్ చట్టం ఎవరికి చుట్టం’ పేరుతో ప్రచురితమైన పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో జమాత్–ఎ–ఇస్లామీ హింద్ స్థానిక కమిటీ అధ్యక్షుడు ఫారుఖ్ అలీ, జిల్లా అధ్యక్షుడు అబుల్ ఆలా, అల్– ఆమీన్ మస్జిద్ అధ్యక్షుడు రహీం, జమియా మస్జిద్ అధ్యక్షుడు అల్తాఫ్, ముస్లిం జేఏసీ నాయకులు ఎండీ కరీం, సయ్యద్ ఇబ్రాహీం షరీఫ్, షేక్ ఇబ్రాహీం, కరీం పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
జేఈఈలో ప్రవీణ్కుమార్కు 328వ ర్యాంకు
మామిడికుదురు: ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో పాశర్లపూడిలంకకు చెందిన కోలా ప్రవీణ్కుమార్ సత్తా చాటాడు. ఇతను జాతీయ స్థాయిలో 328వ ర్యాంకు సాధించాడు. విజయవాడ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ప్రవీణ్కుమార్కు ముంబయి సీఎస్ఈలో సీటు వచ్చింది. తండ్రి గోపాలకృష్ణ రైతు, తల్లి జ్యోతి గృహిణి. పేరెంట్స్ ఎంతో కష్టపడి కొడుకును చదివించారు. ప్రతి రోజు 14 గంటలు చదవడం వల్ల మంచి ర్యాంకు వచ్చిందని ప్రవీణ్కుమార్ మంగళవారం తెలిపాడు. సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలన్నదే తన లక్ష్యమని తెలిపాడు. అతడిని స్థానికులు అభినందించారు. మద్యం తాగి బైక్ నడిపిన వారికి జైలు కాకినాడ లీగల్: మద్యం తాగి బైక్ నడిపిన కేసుల్లో ఒకరికి ఐదురోజులు, తొమ్మిది మందికి రెండు రోజుల చొప్పున జైలు, 17 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా విఽధిస్తూ కాకినాడ మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ డి.శ్రీదేవి తీర్పు చెప్పారు. కాకినాడ ట్రాఫిక్–1, 2 పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. మంగళవారం కోర్టులో 27 మందిని హాజరుపర్చగా వారికి పై విధంగా జైలు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పోలీసుల అదుపులో కారు యజమాని అమలాపురం టౌన్: స్థానిక ఏఎస్ఏ ఆస్పత్రి వద్ద 216 జాతీయ రహదారిపై ఓ మోటారు సైకిలిస్ట్ను ఢీకొట్టి తీవ్రంగా గాయపరచడమే కాకుండా అక్కడ నుంచి కారుతో సహా పరారైన వ్యక్తిని పట్టణ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఆ కారు యజమాని దీపక్ను అదుపులోకి తీసుకుని రోడ్డు ప్రమాదంలో ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్సై ఎన్ఆర్ కిషోర్బాబు తెలిపారు. స్థానిక పితానివానిపాలేనికి చెందిన దీపక్ స్థానికంగా రోల్స్ ఆన్ రోడ్డు పేరుతో హోటల్ నిర్వహిస్తున్నాడని ఎస్సై పేర్కొన్నారు. పట్టణ సీఐ పి.వీరబాబు పర్యవేక్షణలో కేసును విచారిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి అమలాపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
బతికుండగానే చంపేస్తున్నారు కదయ్యా.. పిఠాపురంలో ఇదేం దారుణం పవనూ..
సాక్షి, కాకినాడ జిల్లా: ‘కాలు కదపలేను నోరు విడిచి అడగలేను శరీరం సహకరించడం లేదు. అయినా నాకు వచ్చే వృద్ధాప్య పింఛనే ఇప్పటి వరకూ నన్ను బతికించింది. గతంలో వలంటీర్ వచ్చి నాకు ప్రతి నెలా పింఛన్ ఇచ్చేవాడు. ఇప్పుడు తెచ్చి ఇచ్చే వారే లేరు. ఎవరినైనా అడుగుదామంటే ఎక్కడికీ వెళ్లలేను. ఇప్పుడు నా పింఛన్ ఆపేసి ఏవో కారణాలు చెబుతున్నారు. నేను బతికి ఉన్నట్టు నిరూపించుకోమంటున్నారు. పింఛన్ లేకపోతే నాకు దిక్కు లేదు. నా మొర వినే వారు కనిపించడం లేదు’ అంటూ కన్నీటి పర్యంతమవుతోంది కాకినాడ జిల్లా పిఠాపురం డ్రైవర్స్ కాలనీకి చెందిన వృద్ధురాలు చోడిశెట్టి సుబ్బారావు (85).‘గతంలో ఎప్పుడూ ఏ ఇబ్బందీ లేకుండా వలంటీరే అన్నీ చూసుకునే వాడు. ఇప్పుడు ఎవరూ రావడం లేదు. వృద్ధాప్యం వల్ల నా చర్మం పటుత్వం తప్పింది. వేలిముద్రలు పడడం లేదంటున్నారు. నా కళ్లు మసకబారాయి. ఐరిస్ పడటం లేదంటున్నారు. ఏది పడినా పడక పోయినా నేను బతికే ఉన్నాను బాబోయ్ అంటున్నా నమ్మకం లేదంటున్నారు. ఇలా కారణాలు చెప్పి నా పింఛన్ ఆపేశారు. దానికి ప్రత్యామ్నాయం మాత్రం చెప్పడం లేదు. మరి నేను బతికేదెలా? ఇక నువ్వు బతకడం అనవసరం అన్నట్టుగా చెబుతున్నారు.ఇన్నేళ్లూ లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకొచ్చింది? నేను బతికే ఉన్నాను కదా! నాకు పింఛనే ఆధారం, బతుకుతెరువు అంటూ కాళ్లు పట్టుకుంటున్నా ఎవరూ కనికరించడం లేదు. నాకు పింఛనైనా ఇప్పించండి లేదా నన్ను చంపేయండి’ అంటూ ఆమె కనికరించమని కన్నీటితో అధికారులను వేడుకుంటోంది. తన తల్లి పింఛను కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని సుబ్బారావు కుమార్తె పార్వతి చెప్పారు. తన తల్లికి నెలనెలా పెన్షన్ డబ్బులతో మందులు కొంటున్నానని, ఆమె పింఛను గురించి అడిగితే అక్కడికెళ్లు.. ఇక్కడికెళ్లు అంటూ తెగ తిప్పారని, ఆడదానిని తానేం చేయగలనని, అందరికీ పింఛను ఇచ్చి తమను ఇబ్బంది పెడతారా అని రోదించారు. అందరూ ఏదో కక్ష కట్టినట్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.👉వీడియో: -
ఉచిత బస్సు అంటే నిజమనుకున్నాం
అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని అంటే ఎంతో సంబరపడ్డాం. మాలాంటి పేదవారికి ఎంతో మేలు జరుగుతుందనుకున్నాం. నిజమనుకుని, నమ్మి ఓట్లు వేశాం. కానీ, అధికారంలోకి వచ్చాక తెలిసింది అదంతా నాటకమని.. కేవలం మహిళలను మోసం చేయడానికే ఆ హామీ ఇచ్చారని. ఏడాది పూర్తవుతున్నా ఉచిత బస్సు గురించి మాట్లాడడం లేదు. ఇంకా ఇస్తున్నాం అంటున్నారు తప్ప ఇవ్వడం లేదు. మహిళలను మభ్యపెట్టడానికే ఈ హామీ ఇచ్చారని అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో మహిళలు తగిన బుద్ధి చెబుతారు. – యేడిద సునీత, జీవన్నగర్, పిఠాపురం కలగానే.. ఏడాది కావస్తున్నా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం హామీ ఇప్ప టి వరకూ నెరవేరలేదు. మూ డు నెలలకోసారి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తామని నాయకులు చెబుతున్నారు తప్ప ఆచరణలోకి మాత్రం రావడం లేదు. – వేల్పూరి రత్నకుమారి, గండేపల్లి విధివిధానాలు రావాలి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం నుంచి విధివిధానాలు రావాల్సి ఉంది. ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే ఆచరణలో పెడతాం. – పి.శ్రీనివాసరావు, జిల్లా ప్రజా రవాణా అధికారి, కాకినాడ -
రహదారిపై మృత్యుఘోష
ఆధార్ ఇబ్బందులు తొలగిపోతాయనుకుంటే.. మృతుడు శివన్నారాయణ కుమార్తెలు హర్షిత, వర్షితలు కవల పిల్లలు. 13వ సంవత్సరంలోకి వచ్చారు. ఇద్దరూ ఒకే రూపంలో ఉండటంతో ఆధార్ అయ్యేది కాదు. ఈ క్రమంలో కాకినాడలో ఇందుకు సంబంధించిన పని చేసే వారున్నారని వారికి తెలిసింది. బీచ్లో సరదాగా గడిపిన అనంతరం వారు హర్షిత ఆధార్ పని పూర్తి చేసుకోవాలని వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో ఈ కవలల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఆధార్ ఇబ్బందులు తొలగిపోతాయనుకుంటే ఇలా జరిగిందంటూ వారి బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు.అతివేగం అనర్థదాయకమని అందరికీ తెలిసిందే. కానీ, ఆచరణలో చూపుతున్న నిర్లక్ష్యం పలుచోట్ల ప్రమాదాలకు కారణమవుతోంది. వారం రోజుల క్రితం గామన్ బ్రిడ్జి హైవేపై మలుపు తిరుగుతున్న లారీని కారు ఢీకొని కొవ్వూరు ప్రాంతానికి చెందిన నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కన్నీటి తడి ఇంకా ఆరక ముందే.. రంగంపేట మండలం వడిశలేరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదు నిండు ప్రాణాలు బలైపోయాయి. ఈ రెండు ప్రమాదాలకూ ప్రధాన కారణం అతివేగమే కావడం బాధాకరం.రంగంపేట/రాజానగరం/రాజమహేంద్రవరం రూరల్: అప్పటి వరకూ ఆనంద సాగరంలో ఓలలాడిన వారిని విధి చిన్నచూపు చూసింది.. కొద్దిసేపటిలో ఇంటికి చేరుకునేవారే.. అయినవారితో సంతోషంగా గడిపేవారే.. కానీ, అంతలోనే వారిపై మృత్యువు పంజా విసింది.. రహదారిపై మృత్యుఘోష ప్రతిధ్వనించింది.. రంగంపేట మండలం వడిశలేరు వద్ద ఏడీబీ రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదం రెండు కుటుంబాల్లో ఎప్పటికీ తీరని విషాదాన్ని నింపింది. అయినవారందరినీ శోక సంద్రంలో ముంచింది. ఏం జరిగిందంటే.. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు, గాయపడిన వారు దగ్గర బంధువులు. రాజానగరం మండలం రఘుదేవపురానికి చెందిన రేలంగి శివన్నారాయణ (40), ఆయన భార్య దేవీ లలిత (34), కుమార్తెలు వర్షిత (13), హర్షితతో పాటు.. రాజమహేంద్రవరం రూరల్ మండలం కవలగొయ్యి గ్రామానికి చెందిన శివన్నారాయణ బావమరిది తీగిరెడ్డి శివ (30), ఆయన భార్య భవాని, వారి కుమార్తె సాన్వి (4) కలసి కారులో సోమవారం కాకినాడ బీచ్కు వెళ్లారు. అక్కడ ఆనందంగా గడిపారు. తిరిగి వస్తున్న క్రమంలో వడిశలేరు గ్రామ సమీపాన హెచ్పీ పెట్రోలు బంకు వద్ద వారు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న పాల ట్యాంకర్ను వేగంగా ఢీకొంది. ఆ వేగానికి కారు సగ భాగం ట్యాంకర్లోనికి చొచ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శివన్నారాయణ, దేవీ లలిత దంపతులు, వారి కుమార్తె వర్షిత, తీగిరెడ్డి శివ, ఆయన కుమార్తె సాన్వి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వెనుక సీటులో కూర్చున్న శివ భార్య భవాని, శివన్నారాయణ కుమార్తె హర్షిత తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కల్లు గీతపై ఆధారపడి ఈ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. శివ తండ్రి సూరిబాబు గత ఏడాది తాటిచెట్టు పైనుంచి పడి, మంచాన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఘోరం జరగడం ఆయా కుటుంబాలను తీవ్రంగా కలచివేస్తోంది. సరదాగా బీచ్కు వెళ్లి వస్తామని చెప్పి వెళ్లిన వారు ఇలా కనుమరుగైపోతారనుకోలేదంటూ మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ప్రమాదంతో రెండు గ్రామాల్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. డైవర్షన్ గమనించలేదా? ఏడీబీ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరిస్తున్నారు. ఈ పనుల నేపథ్యంలో వడిశలేరు హెచ్పీ పెట్రోల్ బంకు వద్ద అటుగా వెళ్లాల్సిన ట్రాఫిక్ను పక్క మార్గంలోకి డైవర్షన్ ఇచ్చారు. దీనికి కొద్ది దూరంలోనే పాల ట్యాంకర్ ఆగి ఉంది. ప్రమాద సమయానికి శివన్నారాయణ కారు నడుపుతున్నారు. ఆయన ఆగి ఉన్న ట్యాంకర్ను, డైవర్షన్ను గమనించకుండా వేగంగా దూసుకుని రావడం వల్లనే ఈ ఘోరం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జయిపోయింది. రహదారిపై డైవర్షన్ను గమనించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండకపోవచ్చని స్థానికులు భావిస్తున్నారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వడిశలేరు వద్ద ట్యాంకర్ను ఢీకొన్న కారు ఐదుగురి దుర్మరణం ఇద్దరికి తీవ్ర గాయాలు కాకినాడ వెళ్లి వస్తూండగా ఘోరం రెండు కుటుంబాల్లో పెను విషాదం అతి వేగమే బలిగొందా? -
ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా పెద్దిరాజు
కాకినాడ సిటీ: జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా డి.పెద్దిరాజు కాకినాడ ప్రగతి భవన్లోని కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శ్రీశైలం ఈఓగా పని చేస్తున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా బదిలీ చేసింది. 2.33 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక కాకినాడ సిటీ: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అటవీ శాఖ, నేషనల్ గ్రీన్కోర్ ఆధ్వర్యాన ఈ నెల 5న జిల్లాలో 2.33 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థల కార్యాలయాల వద్ద మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రూపొందించిన వాల్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో జేసీ రాహుల్ మీనా, జిల్లా అటవీ శాఖ అధికారి డి.రవీంద్రనాథ్రెడ్డి, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన, డీఆర్ఓ జె.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈగల్ టోల్ఫ్రీ నంబర్ 1972పై విస్తృత ప్రచారం కాకినాడ సిటీ: మత్తు పదార్థాల నివారణ, సహాయానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఫోర్స్మెంట్)కు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్మీనా, డీఆర్వో వెంకటరావు, జెడ్పీ సీఈవో లక్ష్మణరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ తదితరులు కలెక్టరేట్లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డ్రగ్స్పై నిఘా, నియంత్రణకు ఈగల్ డిపార్టుమెంట్ పని చేస్తుందన్నారు. దీనిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈగల్ టోల్ఫ్రీ నంబర్ 1972పై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. పీజీఆర్ఎస్కు 408 అర్జీలు కాకినాడ సిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 408 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్ఓ జె.వెంకటరావు, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యకు తగిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. సొంత వారికి కట్టబెట్టేందుకే రేషన్ షాపులు ప్రారంభం కాకినాడ రూరల్: సొంత వారికి కట్టబెట్టేందుకే రేషన్ షాపులను కూటమి ప్రభుత్వం పునఃప్రారంభించిందని, ఇది పేదలకు మంచి చేసే కార్యక్రమం కాదని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అన్నారు. గైగోలుపాడులోని తన నివాసంలో సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఎండీయూ ఆపరేటర్ల పొట్టకొట్టి సొంత పార్టీ వారికి రేషన్ షాపులు కట్టబెట్టేందుకు పేదలను ఇబ్బందిపాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు గంటల తరబడి రేషన్ షాపుల వద్ద క్యూలో నిలబడి ఇబ్బందులు పడకుండా ఉండేందుకే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండీయూ వాహనాల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారన్నారు. రేషన్ సరకులు ఇంటి వద్దకే రావడంతో ప్రజలు సంతోషించారని, మంచి లక్ష్యంతో ప్రారంభించిన ఈ విధానాన్ని రాజకీయ కక్షతో కూటమి ప్రభుత్వం తొలగించడం సబబు కాదని అన్నారు. -
ఫ్రీ బస్సు.. హోల్డాన్
● ఏపీకి వచ్చేది ఎప్పుడో! ● అంతా ఉత్తుత్తి హామీనే.. ● మహిళలను వంచించిన బాబు ● ఉచిత ప్రయాణం హామీ గాలికి.. సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ఏరుదాటే వరకు ఓడ మల్లన్న ఏరుదాటక బోడి మల్లన్న’ అన్న సామెత ముఖ్యమంత్రి చంద్రబాబుకు సరిపోలుతుంది. ఆయన చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతనే ఉండదనే విషయం ప్రతి సందర్భంలోనూ స్పష్టమవుతూనే ఉంటుంది. అధికారం కోసం సార్వత్రిక ఎన్నికల్లో ఎడాపెడా హామీలు గుప్పించిన చంద్రబాబు.. వాటిని అమలు చేయాల్సి వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తున్నా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేసిన దాఖలాల్లేవు. నాటి ఎన్నికల్లో ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ ఊరూవాడా ఊదరగొట్టారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటే ఆశ ఉన్నా.. గత అనుభవాల రీత్యా చంద్రబాబు దీనిని అమలు చేస్తారా అనే సంశయం వెంటాడుతూనే ఉంది. ఊహించినట్టుగానే గద్దెనెక్కి ఏడాది కావస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై ఇంతవరకూ చంద్రబాబు ఎటువంటి స్పష్టతా లేకుండా చేశారని మహిళలు మండిపడుతున్నారు. అక్కడ రైట్రైట్.. పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించారు. కానీ, మన రాష్ట్రంలో దీనిని అమలు చేస్తారా లేదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణాన్ని మొత్తానికే తూచ్ అనేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని మహిళా సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సంపద సృష్టిస్తామన్న బాబు ఇప్పుడు ఉచిత బస్సు హామీపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే భయమేస్తోందంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ఆయన.. ఇప్పుడు ఈ హామీలన్నింటినీ అసలు అమలు చేస్తారా అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్రంగా ఉన్నప్పటి నుంచీ కాకినాడ.. ఇంటర్, డిగ్రీ కాలేజీలతో పాటు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ, రంగరాయ వైద్య కళాశాల, ప్రైవేటు నర్సింగ్ కాలేజీలతో పాటు అన్ని రకాల బ్రాండెడ్ వస్తువుల మార్కెట్కు కేంద్రం. విద్య, వైద్యంతో పాటు ఇతర అవసరాల కోసం మహిళలు, పెద్ద సంఖ్యలో విద్యార్థినులు గ్రామీణ ప్రాంతాల నుంచి కాకినాడకు రాకపోకలు సాగిస్తూంటారు. జిల్లాల పునర్విభజన తరువాత కూడా కాకినాడకు మహిళల రాకపోకల విషయంలో పెద్దగా వ్యత్యాసం లేదు. జిల్లావ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది మహిళలున్నారు. ఏలేశ్వరం, తుని, కాకినాడల్లో ఆర్టీసీ డిపోలున్నాయి. ఈ మూడు డిపోల పరిధిలో 321 బస్సులను జిల్లా ప్రజా రవాణా శాఖ నిర్వహిస్తోంది. ఇందులో 250 సొంత, 71 అద్దె బస్సులున్నాయి. ఆయా డిపోల నుంచి ఈ బస్సులు ప్రతి రోజూ లక్షా 14 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 78 ఉంటోంది. మొత్తం బస్సుల్లో 156 పల్లె వెలుగు బస్సులున్నాయి. మొత్తం ప్రయాణికుల్లో సగం మంది ఈ పల్లె వెలుగు బస్సుల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారని అంచనా. మొత్తం బస్సులలో రోజుకు సగటున 66,379 మంది ప్రయాణిస్తూండగా.. వీరిలో సగం మంది మహిళలే ఉంటారని లెక్కలు వేస్తున్నారు. గత మే నెలలో ఆర్టీసికి రూ.20.58 లక్షల ఆదాయం వచ్చింది. ఇందులో సగం మంది మహిళా ప్రయాణికుల ద్వారా రూ.10.25 లక్షలు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 12 నెలలకు రూ.1.23 కోట్ల ఆదాయం మహిళా ప్రయాణికుల ద్వారానే వస్తోంది. చంద్రబాబు గద్దెనెక్కి ఏడాది కావస్తోంది. ఉచిత బస్సు ప్రయాణ హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన అమలు చేయకపోవడంతో ఏడాది కాలంగా జిల్లాలోని మహిళలు రూ.1.23 కోట్ల మేర నష్టపోయారు. ఈ హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా మంత్రులు ఉచిత ప్రయాణంపై ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. తాజాగా ఆగస్ట్ 15 నుంచి అమలు చేస్తామని ఓ ఫీలర్ వదిలారు. అయితే, దీని విధివిధానాలేమిటనే దానిపై ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటనా లేదు. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణం హామీని అసలు అమలు చేస్తారా లేక మిగిలిన హామీల మాదిరిగానే చాప చుట్టేస్తారా అని మహిళలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం మహిళలు తుని 1,11,800 ప్రత్తిపాడు 1,08,207పిఠాపురం 1,14,819 కాకినాడ రూరల్ 1,31,591 పెద్దాపురం 1,07,478 కాకినాడ సిటీ 1,23,166 జగ్గంపేట 1,13,720 ఇంత మోసమా బాబూ! కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పథకాలను కాపీ కొట్టి, ఇక్కడి మహిళలను నమ్మించి ఓట్లేయించుకున్నారు. ఆ రాష్ట్రాల్లో అమలైనట్టే ఇక్కడ కూడా అమలు చేస్తారనే నమ్మకంతోనే మహిళలు ఓట్లేసి కూటమిని గెలిపించారు. అక్కడి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం అమలు చేశాయి. ఇక్కడ గారడీ బాబు ఏడాదైనా అమలు చేయలేదు. ఆగస్టు 15న అమలు చేస్తానంటున్న ఆయన మాటలను మహిళలు నమ్మలేకపోతున్నారు. చంద్రబాబుకు ఏదీ ఉచితంగా ఇచ్చే మనస్తత్వం లేదు. పేదలంటే ఆయనకు అస్సలు పడదు. మహిళలను నమ్మించి ఓట్లేయించుకుని ఇంత మోసం చేస్తారా? మీకు న్యాయమనిపిస్తోందా? ఎన్నికల్లో ఊరూవాడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడాదైపోయింది. ఇన్ని నెలల పాటు మీరిచ్చిన హామీ అమలు చేసి ఉంటే మహిళలకు ఆ మేరకు బస్సు చార్జీలు తగ్గి న్యాయం జరిగేది కదా! – వంగా గీత, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, పిఠాపురం -
ఘనంగా జన్మనక్షత్ర పూజలు
అన్నవరం: సత్యదేవుని జన్మనక్షత్రం మఖను పురస్కరించుకుని స్వామి, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున 2 గంటలకు ఆలయం తెరచి స్వామి, అమ్మవార్లకు అర్చకులు సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్లకు, శివలింగానికి పంచామృతాలతో మహన్యాస పూర్వక అభిషేకం నిర్వహించారు. అనంతరం సుగంధభరిత పుష్పాలతో స్వామి, అమ్మవార్లను అలంకరించి పూజించారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. యాగశాలలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ సత్యదేవుడు, అమ్మవార్లకు ఆయుష్య హోమం నిర్వహించారు. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుడు, అమ్మవారు, శంకరులను ముత్యాల కవచాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. -
కడతేరి.. కన్నీరు మిగిల్చి..
● కోనేటిలో మునిగి కొడుకు, మనవడు మృతి ● తల్లడిల్లిన వృద్ధ దంపతుల కన్నపేగు ● తండ్రీకొడుకుల మృతితో బొర్రంపాలెంలో విషాదం గండేపల్లి: వృద్ధాప్యంలో తోడుగా ఉంటాడనుకున్న కొడుకు, మనవడు మృత్యువాత పడడం ఆ ముసలి దంపతులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. కన్న కొడుకు, మనవడు ఒకేసారి దూరమవడంతో ఆ కన్నపేగు తల్లడిల్లింది. ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బొర్రంపాలేనికి చెందిన సాగి శ్రీరామమూర్తి (బూరయ్య), నాగరత్నం దంపతులకు కొడుకు నల్లబాబు(46), కుమార్తెలు సీతఆదిలక్ష్మి, సుగుణ ఉన్నారు. వీరికి వివాహాలు కాగా, నల్లబాబు వ్యాపారం కోసం భార్య నాగతులసి, కుమారుడు సంజయ్ శ్రీరామ్(19), కుమార్తె సరస్వతితో హైదరాబాద్లో ఉంటున్నాడు. సరస్వతి ఈ ఏడాది టెన్త్ పరీక్షలు రాసింది. ఇటీవల కాలంలో నల్లబాబు ఒంటరిగా సొంతూరు వచ్చి తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ, వ్యవసాయం చేస్తున్నాడు. సంజయ్ శ్రీరామ్ చదువు కోసం విశాఖపట్నంలో ఉంటున్నాడు. ఇటీవల అతడు ఇంటికి వచ్చాడు. కాగా సోమవారం వలసపాకల గ్రామానికి పరామర్శకు వెళ్లిన నల్లబాబు, సంజయ్ శ్రీరామ్ మైలు శుద్ధి స్నానానికి సాయంత్రం తాళ్లూరు వచ్చారు. కోనేరులో దిగిన సంజయ్ శ్రీరామ్ మునిగిపోతుండగా నల్లబాబు రక్షించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీట మునిగి మృతి చెందారు. ఆ సమయంలో ఎవరూ గుర్తించకపోవడంతో కాపాడేందుకు వీల్లేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు. తల్లి వద్దకు వెళ్లాల్సి ఉండగా.. హైదరాబాద్లో ఇంటర్ పూర్తి చేసిన సంజయ్ శ్రీరామ్ విశాఖపట్నంలో హాస్టల్లో ఉంటూ, రఘు ఇంజినీరింగ్ కాలేజ్లో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. సోమవారం రాత్రి హైదరాబాద్లో ఉన్న తల్లి, చెల్లి వద్దకు వెళ్లాల్సి ఉందని, ఇంతలోనే ఇలా జరిగిపోయిందని బంధువులు, స్నేహితులు వాపోయారు. మృదుస్వభావి, సౌమ్యుడు, అందరితో కలిసిమెలిసి ఉండే నల్లబాబు ఇలా దూరం కావడం బాధాకరంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చదువు, ఇల్లు తప్ప వేరే ధ్యాస లేని సంజయ్ చిన్న వయస్సులోనే దూరమయ్యాడని స్నేహితులు వాపోయారు. బొర్రంపాలెం గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో కోనేరు నుంచి మృతదేహాలను వెలికితీశారు. సంఘటనా స్థలాన్ని సీఐ వైఆర్కే శ్రీనివాస్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కడసారి చూపు కోసం.. కొడుకు, మనవడు ఒకేసారి శాశ్వతంగా దూరమవ్వడంతో కదల్లేని స్థితిలో ఉన్న శ్రీరామమూర్తి, నాగరత్నం వద్దకు అంబులెన్స్లో మృతదేహాలను బొర్రంపాలెం తీసుకువెళ్లారు. కొడుకు, మనవడిని చూసి ఆ వృద్ధ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన గ్రామస్తులను కంటతడి పెట్టించింది. తమ్ముడూ.. అప్పుడే నీకు నూరేళ్లూ నిండాయా.. నన్ను అక్క అని ఎవరు పిలుస్తారురా.. నన్ను అత్తా అని ఎవరు పిలుస్తారురా...అంటూ మృతదేహాలను పట్టుకుని సుగుణ విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. -
బండారులంకలో రేషన్ బియ్యం పట్టివేత
డ్రైవర్, ఇద్దరు డీలర్లపై కేసు నమోదు అమలాపురం రూరల్: బండారులంక గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 55 బస్తాల బియ్యం లోడుతో వెళుతున్న వ్యాన్ను పోలీసులు పట్టుకున్నారు. సరకును స్వాధీనం చేసుకుని, వ్యాన్ సీజ్ చేసి, డ్రైవర్తో పాటు, ఇద్దరు రేషన్ డీలర్లపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు, రూరల్ మండలం బండారులంక గ్రామంలో రేషన్ షాపుల వద్ద బియ్యాన్ని వ్యాన్లో లోడ్ చేసి తరలిస్తుండగా, సోమవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించారు. వాహనాన్ని అడ్డగించి, పోలీసులకు, సివిల్ సప్లైస్ అధికారులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని, విచారణ చేపట్టారు. ఈ వ్యాన్లో 50 కేజీల వంతున 55 బస్తాల్లో రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు. వాహనాన్ని తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేశారు. డ్రైవర్ ఎ.సత్యనారాయణ, రేషన్ డీలర్లు సుగ్గు మాణిక్యాలరావు, కాశిన సుబ్రహ్మణ్యంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శేఖర్బాబు తెలిపారు. -
బైక్లు ఢీకొని యువకుడి మృతి
నిడదవోలు రూరల్: కోరుమామిడి గ్రామంలో ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొని ఓ యువకుడు మృతి చెందినట్టు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు, కోరుమామిడి గ్రామానికి చెందిన ఆరుగొల్లు చంద్రరావు కుమారుడు పండు(21) గేదెల వ్యాపారం చేస్తుంటాడు. సోమవారం మధ్యాహ్నం నిడదవోలు నుంచి బైక్పై ఇంటికి వెళుతుండగా, ఎదురుగా మరో బైక్పై వస్తున్న అదే గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి పిట్టా సందీప్ కోరుమామిడి కంచాలమ్మ అమ్మవారి గుడి సమీపంలో పండును వేగంగా ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన పండును నిడదవోలు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ మేరకు అతడి తండ్రి చంద్రరావు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
తిరుమల విద్యార్థుల ప్రభంజనం
రాజమహేంద్రవరం రూరల్: ప్రతిష్టాత్మక జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో రాజమహేంద్రవరంలోని తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించినట్టు విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. వివిధ కేటగిరీల్లో జాతీయ స్థాయిలో తమ విద్యార్థులు కె.ప్రణీత్ రెండో ర్యాంకు, కె.యశ్వంత్ సాత్విక్ ఎనిమిది, ఇ.వర్షిత్ 12, ఎం.సుమంత్దొర 38, కె.అభినవ్ 42, జి.సుజోష్రాజ 43, జి.అఖిల్సాయి 45, తుమాటిపూజిత అఖిల్రాజ్కుమార్ 85, కప్పల వెంకటరామవినీష్ 127, పాతపాటి వెంకటవివేక్వర్మ 132, మువ్వల లిఖిత 137 ర్యాంకులు సాధించారని వివరించారు. ఇంకా 165, 174, 193, 195, 231, 238, 246, 270, 275, 276 ర్యాంకులు సాధించారన్నారు. వెయ్యిలోపు 69, మూడు వేలలోపు 201, ఐదు వేలలోపు 333, పది వేలలోపు 456 మంది ర్యాంకులు సాధించారని చెప్పారు. 260 మంది పైన విద్యార్థులు ఐఐటీలో సీట్లు సాధించగలరని తెలిపారు. ర్యాంకర్లను తిరుమలరావు, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు. -
రైతు బిడ్డకు 1911 ర్యాంకు
ఆలమూరు: మండలంలోని చెముడులంకకు చెందిన రైతు బిడ్డ నాగిరెడ్డి తేజ చంద్రనారాయణ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో ఆలిండియా 1911 ర్యాంకు సాధించాడు. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివిన అతడు ఇంటి వద్దే స్వీయ శిక్షణ పొందాడు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివి, అత్యున్నత ఉద్యోగం సాధించేందుకు కృషి చేస్తానని అతను తెలిపాడు. ఇదే కుటుంబంలో తేజ చంద్రనారాయణ సోదరి శ్రావణి 2022లో జేఈఈ అడ్వాన్స్డ్లో 1800వ ర్యాంకును సాధించి, ప్రస్తుతం మద్రాసు ఐఐటీలో తృతీయ సంవత్సరం చదువుతోంది. సరస్వతీ కటాక్షం కలిగిన విద్యార్థుల తల్లిదండ్రులు శ్రీనివాసు, నాగ అరుణ దంపతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. -
కరుణకు ఆలిండియా నాలుగో ర్యాంక్
బాలాజీచెరువు (కాకినాడ): నగరానికి చెందిన దామలంక కరుణ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితా ల్లో ఆలిండియా రిజర్వ్ కేటగిరీలో నాలుగో ర్యాంకు సాధించింది. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడు తూ, ఐఐటీ ముంబైలో సీఎస్ఈ అభ్యసించాలనేది తన లక్ష్యమని పేర్కొంది. ఆలిండియా రిజర్వ్ కేటగిరీ లో నాలుగో ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉందని చెప్పింది. ఇంటర్మీడియెట్లో రెగ్యులర్ సిలబస్తో పాటు, ఈ పరీక్షకు సంబంధించి ప్రతిరోజు సమయం కేటాయించి సాధన చేయడం తన విజయానికి కారణమని తెలిపింది. ఆమె తండ్రి సుబ్బారావు వ్యవసా యం చేస్తుండగా, తల్లి మంగాదేవి గృహిణి. -
పారిశుధ్య కార్మికులకు వేతనాలు జమ
● దేవస్థానం అధికారుల ఒత్తిడితో కాంట్రాక్టర్ చెల్లింపు ● ఊపిరి పీల్చుకున్న 349 మంది సిబ్బంది అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో 349 మంది పారిశుధ్య సిబ్బందికి ఏప్రిల్ నెల వేతనాలు ఎట్టకేలకు చెల్లించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు సిబ్బంది ఖాతాలకు సొమ్ము జమ అయింది. మే నెల గడిచినా ఏప్రిల్ వేతనాలను పారిశుధ్య సిబ్బందికి చెల్లించకపోవడంపై శ్రీవీరి కష్టం తుడిచే వారేరిశ్రీ శీర్షికన మే 26న వార్త ప్రచురితమైన విషయం విదితమే. దీంతో స్పందించిన దేవస్థానం అధికారులు మే 28న సంబంధిత కనకదుర్గా ఏజెన్సీస్ కాంట్రాక్టర్కు జీతాలు చెల్లించేందుకు రూ.58 లక్షలు చెల్లించారు. మరో రూ.లక్ష తనకు రావాల్సి ఉందని, అది వస్తే కానీ తాను జీతాలు చెల్లించనంటూ కాంట్రాక్టర్ భీష్మించడంతో.. కార్మికుల వేతనాలు మరింత ఆలస్యమయ్యాయి. దీనిపై ఇలాగైతే మేమెలా బతకాలి శీర్షికన సోమవారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. అధికారుల ఒత్తిడి పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంపై దేవస్థానం అధికారులు కాంట్రాక్టర్పై ఒత్తిడి తెచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆదివారమే కార్మికుల అకౌంట్లకు వేతనాలు జమ కావాలని కాంట్రాక్టర్కు స్పష్టం చేయడంతో.. గత్యంతరం లేక ఆదివారం రాత్రి 11 నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు సిబ్బంది అకౌంట్లలో నగదు జమ అయింది. వరుసగా రెండు నెలల జీతాలు ఆలస్యం కావడంపై దేవస్థానం అధికారుల నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. మే నెల జీతాలైనా జూన్ పది కల్లా చెల్లించేలా చూడాలని పారిశుధ్య కార్మికులు కోరుతున్నారు. నలుగురికి అందని వేతనాలు కాగా, దేవస్థానంలో నలుగురు పారిశుధ్య కార్మికులకు మార్చి వేతనాలు ఇంకా చెల్లించలేదు. గత నెలలో అందరికీ మార్చి వేతనాలు చెల్లించగా, వీరికి అందలేదు. సాంకేతిక కారణాలతో జమ కాలేదని, వచ్చే నెల చెల్లిస్తామని చెప్పినట్లు వారు తెలిపారు. వీరికి మార్చి బకాయి చెల్లంచకుండా, ఏప్రిల్ వేతనాలు మాత్రమే చెల్లించారు. -
చిరంజీవిని కుమారి మృతికి ప్రముఖుల సంతాపం
వైద్య కళాశాలకు భౌతికదేహం అందజేత బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రముఖ విద్యావేత్త డాక్టర్ పి.చిరంజీవిని కుమారి భౌతికదేహాన్ని సోమవారం పలువురు ప్రముఖులు సందర్శించారు. అభిమానులు, పూర్వ విద్యార్థులు. ప్రజాప్రతినిధుల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని ప్రతాప్నగర్లోని ఆమె స్వగృహం నుంచి ఇంద్రపాలెం లాకుల వద్దనున్న ఐడియల్ కళాశాలకు ఉదయం 11 గంటలకు తీసుకువచ్చారు. పలువురు ప్రజాప్రతినిధులు ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం వైద్య విద్యార్థుల పరిశోధన కోసం ఆమె భౌతికకాయాన్ని రంగరాయ వైద్య కళాశాలకు ఊరేగింపుగా తీసుకెళ్లి అందజేవారు. ఆమెకు సంతాపం తెలిపిన వారిలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, మాజీ వీసీలు డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, కె.పద్మరాజు, మురళీకృష్ణ, ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ పి.కృష్ణారావు, మాజీ రిజిస్ట్రార్ వి.రవీంద్ర, కుడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, సీపోర్టు సీఈఓ మురళీధర్, జెడ్పీ చైర్మన్ దున్నా జనార్దనరావు, పూర్వ విద్యార్థులు, సాహిత్యాభిమానులు ఉన్నారు. -
సత్తా చాటిన అన్నదమ్ములు
కె.గంగవరం: ప్రముఖ ఐఐటీల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో కె.గంగవరానికి చెందిన కొడవటి ప్రసాద్చౌదరి (విశ్రాంత ఉపాధ్యాయుడు) మనవడు సువర్ణ రామ్ప్రత్యూష్కు అత్యుత్తమమైన ఆలిండియా 510 ర్యాంక్ సాధించినట్టు కుటుంబ సభ్యులు సోమవారం విలేకరులకు తెలిపారు. గతేడాది నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో అతని అన్నయ్య కొడవటి సాయిప్రణీత్ ఆలిండియా 565 ర్యాంక్ సాధించడం గమనార్హం. తమ ఇద్దరు కుమారులు ప్రఖ్యాత ఐఐటీ కాలేజీల్లో సీట్లు సాధించడంపై తండ్రి కొడవటి సురేష్ (డీఈ, ఏపీ ట్రాన్స్కో), తల్లి వసుధ (సాఫ్ట్వేర్ ఇంజినీర్)తో పాటు, తాతయ్య కొడవటి ప్రసాద్చౌదరి, సుశీల, ఇతర కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యూష్ మీడియాతో మాట్లాడుతూ, ప్రతి వారం పరీక్ష రాసి, పొరపాట్లు సరిదిద్దుకోవటం, సందేహాల నివృత్తి, సమయ పాలన, రోజుకు 14 గంటలు శ్రమించడం వంటివి తన విజయానికి ప్రధాన కారణాలుగా తెలిపారు. -
‘అధికారాన్ని అనుభవించడం కోసమే బాబు పనిచేస్తున్నారు’
కాకినాడ జిల్లా గత ఏడాది కాలంలో ఇచ్చిన హామాలను అమలు చేయకుండా కుడి, ఎడమలగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల్ని దగా చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. ఈ రోజు(సోమవారం, జూన్2) కాకినాడ రూరల్లో వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించారు కురసాల కన్నబాబు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు ఎన్ని మంచి పనులు చేసినా వాటిని చంద్రబాబు దుర్మార్గంగా చిత్రీకరించారు. చెప్పిన హమీని ఒక్కటైనా నెరవేర్చారా అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పధకాలను నిలిపివేశారు. వైఎస్ జగన్ పై ఉన్న కోపాన్ని ప్రజలపై చూపిస్తున్నారు. అధికారాన్ని అనుభవించడం కోసమే గత ఏడాదిగా చంద్రబాబు పని చేశారు. డా.బి.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి..రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు* అని విమర్శించారు. -
అయిపోయిన పెళ్లికి బాజాలెందుకని!
పిఠాపురం: అయిపోయిన పెళ్లికి బాజాలెందుకనుకున్నారో ఏమో! పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఆర్ఓ ప్లాంట్ల ప్రారంభోత్సవాన్ని అర్ధాంతరంగా రద్దు చేశారు అధికారులు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాదగయ క్షేత్రంలో ఆర్ఓ ప్లాంట్లను ఆదివారం ప్రారంభిస్తారని అధికారికంగా ప్రకటించారు. మూడు రోజులుగా అక్కడ ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేపట్టారు. వాటిని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికార కూటమిలోని జనసేన నేతలు శనివారం రాత్రి వరకూ ఏర్పాట్లు చేశారు. వీటిని గతంలోనే ప్రారంభించేసిన విషయాన్ని ‘అమాత్యులొస్తున్నారు మళ్లీ మొదలెట్టండి’ శీర్షికన ప్రచురించిన కథనంతో ‘సాక్షి’ శనివారం వెలుగులోకి తెచ్చింది. ఇది చర్చనీయాంశంగా మారడంతో కంగు తిన్న జనసేన నేతలు, అధికారులు చివరి నిమిషంలో దీని పునఃప్రారంభోత్సవాన్ని ఎట్టకేలకు రద్దు చేశారు. -
ఇలాగైతే మేమెలా బతకాలి?
అన్నవరం: ‘యాడ దొరికిన సంతరా ఇది’ పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ చెప్పిన పాపులర్ డైలాగ్ ఇది. అన్నవరం దేవస్థానంలో జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తూంటే ఈ డైలాగ్ గుర్తుకు రాక మానదు. అధికారులే కాదు.. దేవస్థానం పారిశుధ్య కాంట్రాక్టర్ వైఖరి కూడా ఒకే రీతిలో ఉండటమే దీనికి కారణం. దేవస్థానంలో పని చేస్తున్న 349 మంది పారిశుధ్య కార్మికులకు ఏప్రిల్ నుంచి జీతాలు చెల్లించకపోవడంతో.. వారు పడుతున్న కష్టాలను వెలుగులోకి తెస్తూ గత నెల 26న ‘వీరి కష్టం తుడిచేవారేరీ!’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై దేవస్థానం అధికారులు స్పందించి, జీతాల చెల్లింపునకు గాను పారిశుధ్య కాంట్రాక్టర్కు గత నెల 28న రూ.58 లక్షలు చెల్లించారు. ఈ మొత్తంతో పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించవచ్చు. కానీ, తనకు ఇంకో రూ.లక్ష రావాల్సి ఉందని, ఆ మొత్తం వస్తే తప్ప జీతాలు చెల్లించనని కాంట్రాక్టర్ భీష్మించారు. ఇది జరిగి రోజులు గడుస్తున్నా దేవస్థానం అధికారులు ఆ కాంట్రాక్టర్తో ఇప్పటి వరకూ చర్చించలేదు. గట్టిగా హెచ్చరించలేదు. జూన్ 1వ తేదీ వచ్చినా ఏప్రిల్ జీతాలు కూడా ఇవ్వకపోతే తామెలా బతకాలని పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ తీరును తప్పు పడుతున్నారు.జీతాల్లో జాప్యం.. ఇది రెండోసారిదేవస్థానం పారిశుధ్య సిబ్బందికి జీతాలు ఆలస్యం కావడం వరుసగా ఇది రెండోసారి. గతంలో మార్చి నెల జీతాలు చాలా రోజులు చెల్లించలేదు. అప్పట్లో కూడా ‘మాకు జీతాలు ఎప్పుడిస్తారు స్వామీ?’ శీర్షికన ‘సాక్షి’ ఏప్రిల్ 25న కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన అధికారులు కాంట్రాక్టర్కు ఏప్రిల్ 29న బిల్లు చెల్లించారు. దీంతో, ఏప్రిల్ 30న పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇచ్చారు. తాజాగా మళ్లీ ఇదే పునరావృతమైంది. ఈ రెండు సందర్భాల్లోనూ దేవస్థానానికి పారిశుధ్య సిబ్బందిని సమకూరుస్తున్న కనకదుర్గా ఏజెన్సీ (గుంటూరు) పీఎఫ్ మొత్తాన్ని ఆలస్యంగా బ్యాంకులో జమ చేసిందని, అందువల్లనే జీతాల చెల్లింపులో జాప్యం జరిగిందని చెప్పారు. అంతే తప్ప జీతాలు సకాలంలో చెల్లించేందుకు తీసుకుంటున్న చర్యలు శూన్యం.కారణం అదేనా?దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణను గతంలో కేఎల్టీఎస్ సంస్థ (హైదరాబాద్) రెండేళ్లకు పైగా నిర్వహించింది. ఆ సంస్థ ప్రతి నెలా 10వ తేదీన సిబ్బందికి జీతాలు చెల్లించేది. గత నవంబర్తో ఆ సంస్థ గడువు ముగిసింది. టెండర్ ద్వారా కొత్త సంస్థను ఎంపిక చేసేంత వరకూ విధులు నిర్వహించాలన్న దేవస్థానం విజ్ఞప్తి మేరకు ఫిబ్రవరి నెలాఖరు వరకూ కేఎల్టీఎస్ సంస్థే పారిశుధ్య పనులు నిర్వహించింది. మార్చి 1 నుంచి పారిశుధ్య సిబ్బందిని సమకూర్చే కాంట్రాక్టును గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీకి అప్పగించారు. ప్రతి నెలా 349 మంది సిబ్బందికి వేతనాలుగా సుమారు రూ.58 లక్షలు చెల్లించాలి. దీనికి గాను సిబ్బంది పీఎఫ్ కింద 10 శాతం అంటే సుమారు రూ.6 లక్షలు ముందుగానే ఆ సంస్థ చెల్లించాలి. ఆ తరువాతే దేవస్థానం రూ.58 లక్షల బిల్లు చెల్లిస్తుంది. దాని నుంచి రూ.6 లక్షలు మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని ఆ సంస్థ సిబ్బంది ఖాతాల్లో జీతం కింద జమ చేయాలి. అయితే, ముందుగా పీఎఫ్ చెల్లించే స్తోమత ఆ సంస్థకు లేనందువల్లనే జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా దేవస్థానం అధికారులు ఆ కాంట్రాక్టర్ను పిలిపించి మాట్లాడి, వెంటనే తమకు జీతాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు. అలాగే, మే నెల జీతాలు ఈ నెల 10వ తేదీలోగా అందించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
ప్రజల్లోకి కూటమి వైఫల్యాలు
● హామీలపై సర్కార్ మోసం ● 4న వెన్నుపోటు దినంసాక్షి ప్రతినిధి, కాకినాడ: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను నిలువునా మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 4న చేపడుతున్న వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ నేతలు నిర్ణయించారు. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అధ్యక్షతన కాకినాడలో ఆదివారం ముఖ్య నేతల సమావేశం జరిగింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటు దినాన్ని పార్టీ నాయకులు, శ్రేణులు విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. కూటమి నేతలు ప్రజలను వంచించి ఓట్లు వేయించుకుని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ కాకినాడ పార్లమెంటరీ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు సూచించారు. జిల్లా అధ్యక్షుడు రాజా మాట్లాడుతూ, అధికార పార్టీ ఆగడాలను ఉపేక్షించకుండా పార్టీ నాయకులు శ్రేణులతో కలిసి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ మంత్రి తోట నరసింహం, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాంజీ, పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర సాగర్, రాష్ట్ర కార్యదర్శి వెలమల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించారు. -
తూకాల్లో తేడాలుంటే డీలర్లపై చర్యలు
అమ్మ ఒడి.. ఆశలు ఆవిరి ఆర్థిక ఇబ్బందుల కారణంగా పేద కుటుంబాలు తమ పిల్లలను చదువు మాన్పించకూడదనే ఉద్దేశంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేల చొప్పున జమ చేసేది. ఇది పేద పిల్లల చదువులకు ఎంతో ఆసరాగా ఉండేది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న చదువుతున్న అర్హులైన విద్యార్థుల తల్లులకు ఈ పథకం వర్తిపజేసేవారు. జిల్లావ్యాప్తంగా 1,86,708 విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.280.06 కోట్లు జమ చేసేవారు. అమ్మ ఒడి పథకాన్ని కూటమి ప్రభుత్వం తల్లికి వందనంగా మార్చింది. కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని గత సార్వత్రిక ఎన్నికల్లో ఊరూవాడా ఊదరగొట్టింది. తీరా చూస్తే గత ఏడాది ఎగ్గొట్టింది. ఇప్పుడు స్కూళ్లు తెరిచే నాటికి ఇస్తామని చెబుతున్నారు. అయితే, దీనిని చదువుకునే పిల్లలందరికీ వర్తింపజేస్తారా లేదా అనే దానిపై ఇప్పటి వరకూ స్పష్టంగా చెప్పడం లేదు. అమ్మ చేతి ‘గోరుముద్ద’లా.. ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదువుతారని భావించిన గత ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పేరిట విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించింది. రోజుకో మెనూతో వైరెటీ వంటకాలు, వారానికి మూడు రోజులు చిక్కీ, మూడు రోజులు రాగి జావ, వారానికి ఐదు రోజులు కోడిగుడ్డు ఇచ్చేవారు. విద్యార్థులు జావ తాగేందుకు వీలుగా స్టీలు గ్లాసులు సైతం నాటి ప్రభుత్వం సమకూర్చింది. ఈ పథకం పేరును కూటమి ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా మార్చింది. కానీ, నాణ్యతను పట్టించుకోకపోవడంతో విద్యార్థులు మధ్యాహ్న భోజనం ఇష్టంగా తినని పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులకు స్మార్ట్ బోధన చేస్తున్న ఉపాధ్యాయిని పిఠాపురం: తూకాల్లో వ్యత్యాసం ఉన్నా, సరకులు లేవని తిప్పి పంపినా రేషన్ డీలర్లపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పిఠాపురం పట్టణంలోని 18వ వార్డు గాంధీ బొమ్మ సెంటర్ నూకాలమ్మ గుడి వీధి వద్ద ఉన్న రేషన్ షాపు ద్వారా ప్రజలకు ఆయన ఆదివారం రేషన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, డీలర్లు ఈ–పోస్, వేయింగ్ మెషీన్ల పని తీరును ముందుగానే పరిశీలించుకోవాలని, సాంకేతిక సమస్యలు ఎదురైతే ప్రత్యామ్నాయ మార్గాల్లో సరకులు పంపిణీ చేయాలని అన్నారు. సరకుల పంపిణీ సమాచారం కోసం కొత్తగా యాప్ రూపొందిస్తున్నామని, ఏ రోజు ఎంత రేషన్ పంపిణీ చేశాం, ఎంత మందికి అందించామనే విషయాలు ఎప్పటికప్పుడు నమోదయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. రేషన్ దుకాణాల ద్వారా సరకుల పంపిణీతో దాదాపు రూ.385 కోట్లు ఆదా చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29,761 రేషన్ షాపులకు గాను ఆదివారం 24,795 షాపుల్లో సరకుల పంపిణీ ప్రారంభమైందన్నారు. ఆదివారాలు కూడా సరకులు పంపిణీ చేయాలని, ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకూ, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకూ రేషన్ దుకాణాలు తెరచి ఉంచాలని ఆదేశించారు. దివ్యాంగులకు, 65 ఏళ్లు నిండిన వృద్ధులకు ప్రతి నెలా 5వ తేదీలోపు ఇళ్ల వద్దే సరుకులు అందిస్తామన్నారు. ఈ బాధ్యత రేషన్ డీలర్లదేనని మంత్రి స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశామని, సరకు అందిన వెంటనే అందులో ఫొటో అప్లోడ్ చేసేలా డీలర్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అన్ని పోర్టుల్లోనూ భద్రత కట్టుదిట్టం చేశామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్, ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యుడు పిడుగు హరిప్రసాద్, కలెక్టర్ షణ్మోహన్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ జిల్లాల హాకీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈ నెల 6 నుంచి 8 వరకు జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్స్ బాలికల హాకీ పోటీలలో పాల్గొనే జిల్లా జట్టును ఆదివారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఎంపిక చేశారు. హాకీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఎంపికల్లో 25 మంది పాల్గొనగా 18 మందిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశామని హాకీ సంఘ కార్యదర్శి నంబు శ్రీనివాస్ తెలిపారు. ఎంపికల నిర్వహణలో డీఎస్ఏ హాకీ కోచ్ నాగేంద్ర, హాకీ సంఘ ప్రతినిధి రవిరాజు పాల్గొన్నారు. తలుపులమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువైయున్న తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్యూ ద్వారా అమ్మవారిని 30 వేల మంది భక్తులు దర్శించుకున్నట్టు కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,11,455, పూజా టికెట్లకు రూ.2,13,300, కేశఖండన శాలకు రూ.24,040, వాహన పూజలకు రూ.5,010, వసతి గదులు, పొంగలి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.85,956, విరాళాలు రూ.1,44,033 కలిపి మొత్తం రూ.6,83,794 ఆదాయం లభించిందని వివరించారు. నేడు పీజీఆర్ఎస్ కాకినాడ సిటీ: జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలులో సోమవారం ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకూ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. మండల స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఆయా మండలాల అధికారులందరూ విధిగా ఉదయ 9.30 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు. ప్రశాంతంగా కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు కాకినాడ క్రైం: కానిస్టేబుల్ అభ్యర్థుల మెయిన్స్ పరీక్షలు జిల్లావ్యాప్తంగా ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఏపీఎస్ఎల్పీఆర్బీ ఆధ్వర్యాన జిల్లా పోలీస్ శాఖ పర్యవేక్షణలో జరిగిన ఈ పరీక్షలకు 6,302 మందికి గాను 6,021 మంది హాజరయ్యారు. పరీక్షల నిర్వహణను ఎస్పీ బిందుమాధవ్ పరిశీలించారు. అయినవిల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు అయినవిల్లి: శ్రీవర సిద్ధి వినాయక స్వామి ఆలయానికి ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామి వారి సన్నిధిలో భక్తులు లఘున్యాస అభిషేకాలు, ఉండ్రాళ్ల పూజ, శ్రీలక్ష్మీ గణపతి హోమం జరిపించుకున్నారు. అక్షరాభ్యాసం, అన్న ప్రాసన, తులాభారం, ఆశీర్వచనం పూజలు కూడా చేయించుకున్నారు. వివిధ సేవల ద్వారా స్వామి వారికి రూ.3,77,996 ఆదాయం వచ్చిందని ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. స్వామి వారి నిత్యాన్న దాన పథకానికి రూ.1,95,295 విరాళాలుగా అందించారన్నారు. అన్న ప్రసాద భవనానికి విరాళాలు కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి క్షేత్రంలో వకుళమాత అన్న ప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా హైదరాబాద్కు చెందిన ఎన్.చైతన్య జనార్దన్, సిందూరి దంపతులు, కుటుంబ సభ్యులు రూ.50,307, వి.వినోద్, సులోచనారాణి దంపతులు రూ.50,307 చొప్పున ఆదివారం విరాళాలు సమర్పించారు. దాతలకు దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్వామివారి చిత్రపటాలను అందజేశారు. -
పవన్ నియోజవర్గంలో టీడీపీ, జనసేన బాహాబాహీ
పిఠాపురం: టీడీపీ, జనసేనలు పొత్తు పరంగా కలిసి ఉన్నా, కార్యకర్తల దగ్గరకు వచ్చే సరికి ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత లేదనేది మరోసారి బయటపడింది. ఈరోజు(ఆదివారం, జూన్1) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య రగడ చోటు చేసుకుంది. పిఠాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో టీడీపీ, జనసేన శ్రేణులు రెచ్చిపోయి మరీ ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగారు.పిఠాపురం జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ సమక్షంలోనే ఇరు పార్టీల విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆ కార్యాక్రమానికి హాజరైన రెండు పార్టీల శ్రేణులు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నారు. జై జనసేన, జై టీడీపీ అంటూ ఇరు వర్గాల నినాదాలు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇరు పార్టీల కార్యకర్తల్లో సఖ్యత అనేది లేకపోవడంతో ఏ కార్యక్రమం జరిగినా అక్కడ పరిస్థితులు గందరగోళానికి దారి తీసిన సందర్బాల్లో తరచు జరుగుతూనే ఉన్నాయి. ఇదీ చదవండి: పొత్తుపై పవన్ పునరాలోచన!.. వైరాగ్యమా.. వికారమా!! -
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి
భార్యకు తీవ్ర గాయాలు రాజానగరం: జాతీయ రహదారిపై రాజానగరం ఏడీబీ రోడ్డు జంక్షన్ వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు గ్రామానికి చెందిన బిక్కన సత్యభాస్కరరావు (69), అతని భార్య పాపాయమ్మతో కలసి స్కూటీపై పెద్దాపురం మండలం కట్టమూరుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ఏడీబీ రోడ్డు జంక్షన్ వద్ద మలుపు తిరుగుతుండగా, వీరి వెనుక నుంచి వ్యాన్ వచ్చి ఢీకొంది. దీంతో సత్యభాస్కరరావు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్యకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ కేసును రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదేం?
సామర్లకోట: ప్రతి నెలా జరగాల్సిన కౌన్సిల్ సాధారణ సమావేశం మే నెలలో నిర్వహించకపోవడంపై సామర్లకోట మున్సిపల్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు 24 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు నల్లబ్యాడ్జీలు ధరించి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యం నశించాలంటూ నినాదాలు చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఉబా జాన్ మోజెస్ మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా నిర్వహించిన కౌన్సిల్ సమావేశం మే నెలలో నిర్వహించకపోవడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. మే 15న మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ తన పదవికి రాజీనామా చేశారని, అదే రోజు ఆమైపె 25 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారని గుర్తు చేశారు. అదే సమయంలో సభ్యులందరూ కలిసి అత్యవసర సమావేశం నిర్వహించాలని కోరినా కమిషనర్ ఇప్పటి వరకూ ఏర్పాటు చేయలేదన్నారు. సాధారణ సమావేశం నిర్వహణకు నాలుగు రోజుల ముందు, అత్యవసర సమావేశానికి 24 గంటల ముందుగా అజెండా రావాల్సి ఉండగా శనివారం వరకూ అందలేదని, దీంతో సమావేశం జరిగే అవకాశం లేదని తెలిసి, నిరసన తెలియజేస్తున్నామని చెప్పారు. మున్సిపాలిటీకి వచ్చిన నిధులతో అభివృద్ధి పనుల ఆమోదానికి కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని, అలా జరగకపోవడంతో అభివృద్ధి కుంటుబడే అవకాశం ఉందని అన్నారు. సభ్యులు ఆయా వార్డుల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించడానికి కౌన్సిల్ సమావేశం దోహదపడుతుందన్నారు. కౌన్సిల్ సమావేశం ఏర్పాటు కాకపోవడానికి కారకులపై చర్యలు తీసుకోవాలని జాన్ మోజెస్ డిమాండ్ చేశారు. కమిషనర్కు వినతి మే నెలలో సాధారణ లేదా అత్యవసర సమావేశం ఏర్పాటు చేయకపోవడానికి కారణమేమిటని 24 మంది కౌన్సిలర్లు కమిషనర్ ఎ.శ్రీవిద్యను నిలదీశారు. ఈ మేరకు వారందరి సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ఆమెకు అందజేశారు. కమిషనర్ బదులిస్తూ చైర్పర్సన్ అంశం కోర్టులో ఉన్నందున సమావేశం నిర్వహించలేకపోయామని చెప్పారు. సీడీఎంఎ నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని అన్నారు. రాజీనామా అనంతరం మరుసటి రోజునే చైర్పర్సన్ రాజీనామాను ఉపసంహరించుకున్నారని, మెజార్టీ సభ్యులు వైస్ చైర్మన్ జాన్ మోజెస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించాలని అదే రోజు కోరారని చెప్పారు. ఈ విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లానని, తాను స్వయంగా నిర్ణయం తీసుకునే అంశం కాదని అన్నారు. సమావేశం జరగకపోవడంతో మే నెల గౌరవ వేతనం ఉండదని సభ్యులు అడిగి ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. 15 రోజుల గడువు ఉన్నా అధికారులు నిర్ణయం తీసుకోకపోవడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో వైస్ చైర్మన్–2 గోకిన సునేత్రాదేవి, 22 మంది సభ్యులు పాల్గొన్నారు.ఫ సామర్లకోటలో మున్సిపల్ కౌన్సిలర్ల నిరసన ఫ కమిషనర్ నిలదీత -
మాల మహానాడు జేఏసీ నాయకుల అరెస్ట్
పామర్రు పోలీస్ స్టేషన్కు తరలింపు ముమ్మిడివరం: నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం వచ్చిన సీఎం చంద్రబాబుకు ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు అన్యాయం జరిగిందని తెలపాలని మాల మహానాడు పిలుపునిచ్చిన నేపథ్యంలో మాల మహానాడు జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమలాపురం రూరల్, క్రైమ్ సీఐల ఆధ్వర్యంలో శనివారం ఉదయం బందరుపాలెం సమీపంలో కర్రివానిరేవుకు చెందిన జేఏసీ నాయకుడు కాశి జగపతిరావు, ఎదుర్లంక గ్రామానికి చెందిన దుక్కిపాటి సత్యనారాయణ, ముమ్మిడివరానికి చెందిన దేవరపల్లి ఏడుకొండలు, మెండి కృష్ణబాబు, ఉచ్చుల సాల్మన్రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పామర్రు పోలీస్ స్టేషన్కు తరలించారు. జేఏసీ నాయకులతో పాటు వైఎస్సార్ సీపీ జిల్లా నాయకురాలు కాశి బాలమునికుమారిని ముమ్మిడివరం బాలయోగి ఆశ్రమం వద్ద గృహ నిర్బంధం చేశారు.అలాగే కాట్రేనికోనకు చెందిన వడ్డి శ్యాంప్రసాద్, గల్లా రాజేందర్లను గృహ నిర్బంధం చేశారు. శనివారం రాత్రి ముమ్మిడివరం పోలీస్ స్టేషన్కు జేఏసీ నాయకులను తీసుకు వచ్చి అప్పగించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు) 14,500 – 15,000 కాయ (వెయ్యి) కొత్త (పచ్చి) కాయ 14,500– 15,000 (వెయ్యి) కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
అక్రమ కేసులకు బెదరొద్దు
తుని రూరల్: చంద్రబాబు నాయుడి ఏడాది పాలన అక్రమ కేసుల నమోదుకే సరిపోయిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. ఎస్.అన్నవరంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 12 వేల మంది వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిందన్నారు. దీనికి బెదరాల్సిన పని లేదని, కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని, కేసులు ఎత్తివేయకపోతే న్యాయ పోరాటం చేద్దామని అన్నారు. పార్టీ నాయకత్వం న్యాయ సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా ప్రజలను చంద్రబాబు మోసగించారని అన్నారు. జనం తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, అప్పుడు అక్రమ కేసులు పెట్టిన నాయకులు, హామీలిచ్చిన నాయకులు పారిపోయే రోజులు వస్తాయని చెప్పారు. మూడు రోజుల మహా డ్రామా నడిచిందని, జగన్మోహన్రెడ్డిని తిట్టడమే అజెండాగా కడపలో టీడీపీ మహానాడు నిర్వహించారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాష్ట్రం తలసరి ఆదాయంలో మొదటి ఐదు స్థానాల్లో నిలవగా ఇప్పుడు అధ్వానంగా ఉందని రాజా చెప్పారు. వైద్య విద్యను ఖరీదైనదిగా మార్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. జగన్ నాయకత్వంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఒక్కో వైద్య కళాశాలను రూ.500 కోట్లతో నిర్మిస్తే వాటిని తన అనుయాయులకు కారుచౌకగా కట్టబెట్టేందుకు రూ.5 వేలకే అద్దెకు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోందని అన్నారు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఉంటే ప్రజలకు ఉచిత వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు. మద్యం అక్రమ కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే, డిస్టిలరీలన్నీ టీడీపీ నాయకులకు చెందినవే ఉన్నాయని అన్నారు. రోజులో ఎక్కువ సమయాన్ని వైఎస్సార్ సీపీ పటిష్టత కోసమే అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కేటాయిస్తున్నారన్నారు. నమ్మకంగా పని చేస్తున్న కార్యకర్తలకు పార్టీ పదవులు అప్పగిస్తున్నామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడిన కార్యకర్తలకు, పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యం ఇస్తామని రాజా స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా కమిటీల నాయకులు చోడ్రాజు రాంబాబురాజు, రాయి మేరీ అవినాష్, నాగం దొరబాబు, లంక కృపానందం, డొంక వెంకట బెనర్జీ, కీర్తి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫ కార్యకర్తలకు అండగా ఉంటాం ఫ న్యాయ పోరాటం చేద్దాం ఫ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా -
ఇసుక తవ్వకాలపై ఎన్జీటీకి సమాచారం
సీతానగరం: మండలంలోని సింగవరం ర్యాంపు వద్ద ఇసుక అక్రమ తవ్వకాలపై చైన్నె, ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ)కు మెయిల్ ద్వారా సమాచా రం ఇచ్చానని వంగలపూడికి చెందిన మాజీ సైనికుడు, న్యాయ వాది సూరెడ్డి శివకుమార్ తెలిపారు. శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం అర్ధరాత్రి వంగలపూడి ర్యాంపు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీలను అడ్డుకుని, వాటిని వీడియోలు, ఫొటోలు తీసి జిల్లా కలెక్టర్, ఏడీ మైన్స్, తహసీల్దార్, ఎస్సైలకు సామాజిక మాధ్య మాల ద్వారా తెలియపర్చానని తెలిపారు. దీంతో ఎస్సై స్పందించి లారీలను నిలిపివేశారని అన్నా రు. శనివారం ఉదయం మైన్స్ ఏడీ నుంచి లిఖిత పూర్వక మెసేజ్ ఇచ్చారని, అందులో జిల్లా కలెక్టర్కు గాని, తనకు గాని సంబంధం లేదని తెలిపారన్నారు. అనకాపల్లి కలెక్టర్, మైన్స్ డిపార్ట్మెంట్కు మాత్రమే సంబంధం ఉందని తెలియపర్చారని వివరించారు. జిల్లాలో తవ్వకాలపై వారికి సంబంధం లేదని అనడం హాస్యాస్పదంగా ఉందని, ఎన్జీటీకి తెలిపర్చిన తరువాత తనకు సమాచారం అందించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. సింగవరం లంక భూముల్లో తవ్వకాలు జరపాల్సి ఉండగా, వంగలపూడి లంక భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపి, సింగవరం ర్యాంపు నుంచి కాకుండా వంగలపూడి ర్యాంపు నుంచి ఇసుక లారీలపై తరలిస్తున్నారని అన్నారు. సోమవారం గ్రామస్తులంతా లారీలను అడ్డుకుంటారని, అనకాపల్లి కలెక్టర్, ఏడీ మైన్స్ వారు వచ్చి పూర్తి వివరాలు తెలియజేసే వరకూ ఆ లారీలను అడ్డుకుంటామని శివకుమార్ హెచ్చరించారు. -
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారథులు
ఐదేళ్ల పాటు ప్రభుత్వానికి – ప్రజలకు మధ్య వారథులుగా మేం ఎన్నో రకాల సేవలందించాం. గౌరవ వేతనంతో సంబంధం లేకుండా ప్రజలకు నిష్పక్షపాతంగా సాయం అందించడం చాలా సంతృప్తినిచ్చింది. స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలన్న తపనతో కోవిడ్ సమయంలో ఎంతో చేశాం. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లళ్లో ఉండిపోతే మేమే వెళ్లి వారికి నిత్యావసర వస్తువులు, మందులు, కిరాణా సరకులు అందించాం. అనారోగ్యాలతో ఆస్పత్రి పాలైన రోగులకు ఆస్పత్రికి వెళ్లి మరీ పింఛన్లు అందించే వాళ్లం. వరదల సమయంలో ప్రతి ఇంటికీ పీకల్లోతు నీటిలో వెళ్లి ప్రజలకు నిత్యావసర సరకులు, మంచినీరు అందించాం. దురుద్దేశంతోనే వలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. అప్పుడు మేం చేసిన సేవలను ప్రజలు ఇప్పుడు గుర్తిస్తున్నారు. చాలా సంతోషం. – వలీ బాబా, వలంటీర్, పిఠాపురం -
అలా స్పాగిపోతున్నారు..!
హెయిర్ కటింగ్తో ప్రారంభమై.. ముందుగా హెయిర్ కటింగ్తో కస్టమర్లను ఆకర్షించే నిర్వాహకులు కస్టమర్లు అడగకపోయినా హెడ్ మసాజ్ వంటివి చేస్తారు. వారు చూపిస్తున్న ఆసక్తిని బట్టి తమ వద్ద బాడీ మసాజ్ కూడా ఉందని చెబుతారు. అలా ముగ్గులోకి వచ్చిన కస్టమర్లతో మసాజ్ ప్రక్రియలో భాగంగా పరిచయం పెంచుకుంటారు. చీకటి మాటున జరిగే ఈ మసాజ్ ప్రక్రియలో ఫుల్ మసాజ్, బాడీ టూ బాడీ మసాజ్ వంటి పేర్లతో యువతులతో మగ కస్టమర్లను ఆకర్షిస్తారు. ఇలా ప్రత్యేక గదిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం కూడా జరిగిపోతుంది. అలవాటు పడిన కస్టమర్లు వారానికి ఒకసారైనా ఇక్కడకు వస్తున్నారని అంటున్నారు. ఇటీవల ఓ మసాజ్ సెంటర్ నిర్వాహకురాలి ఫోన్లో బ్యూటీపార్లర్కు వచ్చే ఆడవారికి మగ వ్యభిచారులను కూడా సమకూరుస్తున్నట్టు రికార్డింగ్ బయటపడటం విష సంస్కృతికి అద్దంపడుతోంది. ఫ మసాజ్ పేరుతో మగువలతో వల ఫ రాజమహేంద్రవరంలో స్పా సెంటర్లు ఫ గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం ఫ దృష్టి సారించిన పోలీసు యంత్రాంగం కంబాలచెరువు: (రాజమహేంద్రవరం): సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో నయా సంస్కృతి మొదలైంది. ఎక్కడో హైదరాబాద్, బెంగళూరు వంటి కాస్మోపాలిటిన్ నగరాల్లో ఉండే స్పా సెంటర్ల కల్చర్ ఇక్కడకు విస్తరించింది. మసాజ్ పేరుతో హైటెక్ వ్యభిచారం అధికమైంది. ఉపాధి పేరుతో ఆయా స్పా సెంటర్లలో చేరిన యువతులను నిర్వాహకులు పడుపు వృత్తిలోకి దింపుతున్నారు. ఏడాది కాలంలో నగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్న సుమారు 14 స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేసి పట్టుకోవడం చూస్తే.. జిల్లాలో చాపకింద నీరులా విష సంస్కృతి పెరిగిందని చెప్పకనే అర్థమవుతోంది. ఎక్కడే ఎందుకంటే.. రాజమహేంద్రవరంలో ధనిక వర్గాలు ఎక్కువగా ఉండే ఏవీ అప్పారావు రోడ్డు, జేఎన్ రోడ్డు, దానవాయిపేట వంటి ప్రాంతాల్లో ఇటీవల స్పా సెంటర్లు పెరుగుతున్నాయి. నిరుద్యోగ యువత ఉపాధి వేటలో భాగంగా బ్యూటీ కోర్సులు, మసాజ్ కోర్సులు వంటివి చేసి స్పా సెంటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. వ్యాపారం బాగుంటుండటంతో అసాంఘిక శక్తులు ఈ రంగంలోకి ప్రవేశించి పెట్టుబడి పెడుతూ తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాందించేందుకు పథక రచన చేస్తున్నారు. బ్యూటీపార్లర్లతో కూడిన మసాజ్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడికి వచ్చే కస్టమర్లను వ్యభిచారం వైపు లాగుతున్నారు. ఆయా సెంటర్లకు వెళ్లే విటులలో ఎక్కువ వ్యాపార వర్గాలు, యువత ఉంటున్నారు. కొద్దినెలల కిందట ఏవీ అప్పారావు రోడ్డులో పట్టుబడిన స్పా సెంటర్ నిర్వాహకురాలు బ్యూటీ పార్లర్లకు వచ్చే మహిళలకు వారి అభిరుచి మేరకు మగ వ్యభిచారులను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఓ వాయిస్ రికార్డింగు బయటపడటం చూస్తే పరిస్థితి చేయిదాటిందని అర్థమవుతోంది. ఎక్కడో మెట్రోపాలిటిన్ సిటీల్లో బయటపడే ఇటువంటి ఘటనలు జిల్లాలో విస్తరించడం చూస్తే అసాంఘిక శక్తులు ఏ మేరకు చొచ్చుకు వస్తున్నాయో స్పష్టమవుతోంది. ఉద్యోగం పేరుతో.. బ్యూటీపార్లర్, సెలూన్, స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారాలు ప్రారంభించే నిర్వాహకులు ముందుగా బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి మసాజ్ సెంటర్లలో అనుభవం ఉన్న ఒకరిద్దరు యువతులను ఆకర్షణీయమైన ప్యాకేజీతో నియమించుకుంటారు. జన సంచారం తక్కువగా ఉండే ధనిక వర్గాలు నివసించే ప్రాంతాల్లో అట్టహాసంగా స్పా, సెలూన్ సెంటర్లు ప్రారంభించి రిసెప్షన్, హెల్పర్ల పేరుతో అందమైన యువతులను పనిలో పెట్టుకుంటారు. ముందే అనుభవం ఉన్న యువతులు కొత్తగా చేరిన వారితో సన్నిహితంగా ఉంటారు. వారికి ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తూ తమవైపు తిప్పుకుంటారు. వారి అవసరాలకు డబ్బులు ఇస్తూ పూర్తిగా వీరి ఉచ్చులో పడే విధంగా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటారు. కొత్తగా చేరిన యువతులకు పాత యువతులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తూ వారిని కూడా మసాజ్ ప్రక్రియకు ఉపయోగించుకుని కమీషన్ ఇస్తారు. నిర్వాహకులు ఆ యువతులతో చనువుగా ఉంటూ ఫోటోలు దిగడం చేస్తుంటారు. అవి నిర్వాహకుల వద్ద ఉండటంతో ఆ యువతులు పూర్తిగా విధేయతతో ఉంటారు. వారితో గొడవ పెట్టుకునేందుకు సాహసించరు. ఇలా గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం సాగిపోతోంది. ఏడాదిలో 14 సెంటర్లపై దాడి ఏడాది కాలంలో జిల్లాలోని రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో మసాజ్ సెంటర్లు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లలో అసాంఘిక కార్యకలాలు నిర్వహిస్తున్న 14 సెంటర్లపై పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. అక్కడ దొరికే యువతులను సాక్షులుగా పరిగణిస్తూ విటులపై, నిర్వాహకులపై కేసులు నమోదు చేశాం. స్పాలు, బ్యూటీపార్లర్లపై నిరంతరం నిఘా పెడుతున్నాం. ప్రజలు కూడా తమ ప్రాంతాల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా సమాచారం ఇవ్వాలి. –డి.నరసింహకిశోర్, ఎస్పీ, తూర్పుగోదావరి జిల్లా -
పర్యాటకుల కోసం ప్రత్యేక రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: ఉత్తర భారత దేశంలో ప్రముఖ దేవాలయాలను సందర్శించుకునేలా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ హలో సంయుక్త ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక పర్యాటక రైళ్లను నడుపుతున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ ఎం.రాజా తెలిపారు. శనివారం రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో ఆయన మీడియా సమావేశంలో బ్రోచర్ను విడుదల చేసి మాట్లాడారు. ఈ నెల 14న భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా సికింద్రాబాద్ నుంచి అయోధ్య కాశీ పుణ్యక్షేత్రాలు మీదుగా వారణాసి, ప్రయోగరాజ్, రామ జన్మభూమి, త్రివేణి సంగమం నైమిశా శరణ్యం సందర్శించుకోవచ్చన్నారు. 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ పర్యటన ఎకానమీ, స్టాండర్డ్, కంఫర్ట్ ప్యాకేజీల్లో ఉందన్నారు. ఈ రైలుకు విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, తుని బోర్డింగ్ సౌకర్యం ఉంటుందన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి జూలై 5న పంచ జ్యోతిర్లింగ దర్శన్ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రారంభమై అదే నెల 13న యాత్ర ముగుస్తుందన్నారు. నాగపూర్, ఉజ్జయిని, నాసిక్, పూణే ఔరంగాబాద్, డాక్టర్ అంబేడ్కర్ జన్మస్థలం మహా పుణ్యస్థలాల సందర్శన ఉంటుందన్నారు. ఈ రైలుకు కామారెడ్డి, నిజామాబాద్, నాందేడు, పూర్ణ స్టేషన్లో బోర్డింగ్ ఉంటుందన్నారు. హైదరాబాద్ నుంచి లేహ్, లడఖ్, చారుదాం, గోవాలకు విమాన ప్యాకేజీలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. సమావేశంలో ఐసీటీసీ అసిస్టెంట్ మేనేజర్ బాలాజీ పాల్గొన్నారు. -
రత్నగిరి.. కిక్కిరిసి..
అన్నవరం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో రత్నగిరిపై సత్యదేవుని ఆలయం శనివారం కిక్కిరిసిపోయింది. రత్నగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధువులతో పాటు ఇతర భక్తులు కూడా సత్యదేవుని దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయం వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది. ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట పట్టింది. తీవ్రమైన రద్దీ కారణంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకూ అంతరాలయ దర్శనం రద్దు చేశారు. సత్యదేవుని 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు 5,200 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 6 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఉదయం వాతావరణం మేఘావృతమై వర్ష సూచనలు ఉండటంతో సత్యదేవుని ప్రాకార సేవ పల్లకీ మీద ఆలయం లోపలి ప్రాకారంలో నిర్వహించారు. సత్యదేవుని సన్నిధిలో ఆదివారం కూడా రద్దీ కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాకారంలో టేకు రథంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని ఊరేగించనున్నారు. రూ.2,500 చెల్లించిన భక్తులు ఈ రథ సేవలో పాల్గొనవచ్చు. ఆ రుసుం చెల్లించిన వారి కుటుంబ సభ్యులు నలుగురికి స్వామివారి అంతరాలయ దర్శనం, ప్రసాదం, వేదాశీర్వచనం, దంపతులకు కండువా, జాకెట్టు ముక్క అందజేస్తారు. ఫ సత్యదేవుని దర్శించిన 50 వేల మంది ఫ 5,200 వ్రతాలు ఫ దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం -
వలంటీరుతోనే విద్యా దీవెన
వలంటీరు ఇంటి ముంగిటకే వచ్చి దరఖాస్తు పూర్తి చేసి తీసుకుని అవగాహన కల్పించడంతోనే మాకు విద్యాదీవెన వచ్చింది. అందువల్లనే మా పిల్లలు ఈ రోజు బాగా చదువుకోగలుగుతున్నారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విద్యా దీవెన పథకం తీసుకురావడమే కాకుండా ఆ పథకాన్ని వలంటీరు ద్వారా ఇంటికి పంపించి మరీ మంజూరు చేయించారు. మొదట్లో వలంటీర్లను చూసి వీళ్లేం చేస్తారనుకునే వాళ్లం. కానీ, వారు చేసిన సేవలు మాటలు కాదు. వారి మేలును జీవితంలో ఎప్పటికీ మరచిపోలేం. ఇల్లు లేని వారికి జగనన్న కాలనీలో ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేయించడంలో వలంటీర్లు చాలానే చేశారు. – ఆలమూరు దుర్గ, నవరత్నాల లబ్ధిదారు, పవర, సామర్లకోట మండలం ప్రాణాలు లెక్క చేయకుండా.. కరోనా మహమ్మారితో బాధ పడుతున్న వారికి మా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా సేవలందించాం. అప్పట్లో మా కుటుంబాల్లోని వారి కంటే మాకు కేటాయించిన 50 కుటుంబాల్లో ఉన్న వారి ప్రాణాలే ముఖ్యమనుకుని పని చేశాం. కోవిడ్ బాధితుల వద్దకు వెళ్లేందుకు వారి కుటుంబ సభ్యులే ప్రాణాలు అరచేత పట్టుకుని భయపడిపోయే వారు. అటువంటిది కోవిడ్తో బాధ పడుతున్న వారు హోం ఐసోలేషన్, క్వారంటైన్లో ఉన్నా లెక్క చేయకుండా వలంటీర్లుగా మేము ఎంతో చేశాం. అటువంటి మమ్మల్ని అర్ధాంతరంగా రోడ్డున పడేశారు. వేతనం రూ.10 వేలు చేస్తామని చెబితే నిజమే అనుకున్నాం. తీరా మొత్తం వ్యవస్థనే రద్దు చేయడం అన్యాయం. – కడియాల కిరణ్, వలంటీర్, వాకలపూడి -
రైతు ప్రాణం తీసిన కలుపు మందు
నల్లజర్ల: పంట పొలాల్లో కలుపు నివారణకు వినియోగించే గడ్డి మందు ఓ యువ రైతు ప్రాణం తీసింది. ఆ వివరాల ప్రకారం.. మండలంలోని చీపురుగూడెం గ్రామానికి చెందిన యువ రైతు చెల్లు లీలాకృష్ణ ప్రసాద్ (30) పదిహేను రోజుల కిందట పొలాల్లో కలుపు నివారణకు ఇంటి వద్ద ఉన్న గడ్డి మందు డబ్బాను పొలానికి తీసుకెళ్లాడు. ఆ డబ్బాను బైక్ ముందు కవర్లో పెట్టాడు. మార్గ మధ్యంలో డబ్బా మూత లీకై అతని ప్యాంట్పై పడింది. ఏమీకాదులే అని కడిగేసుకుని ఆ మందు స్ప్రే చేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఒక్కరోజు వ్యవధిలోనే ఒంటిపై పడిన మందు ద్రావణం వృషణాల నుంచి శరీరంలోని కిడ్నీ, లివర్ తదితర అవయవాలకు సోకింది. అతను తొలుత ఏలూరు, తర్వాత విజయవాడ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు మృతుడి తండ్రి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఏడాది క్రితమే ప్రసాద్కు ఆవపాడుకు చెందిన మౌనికతో వివాహం కాగా, ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. ప్రసాద్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. అటవీ భూమిలో చెట్ల నరికివేత గోపాలపురం: మండలంలోని కోమటికుంట అటవీ భూమిలో ఉన్న చెట్లు నరికివేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు రెండు ట్రాక్టర్ల పుల్లలను స్వాధీనం చేసుకున్నామని డీఆర్ఓ కె.వేణుగోపాల్ శనివారం విలేకరులకు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. అటవీ శాఖకు చెందిన భూమిలో ఉన్న వేప, జీడిమామిడి చెట్లు అక్రమార్కులు నరుకుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. అక్కడ రెండు ట్రాక్టర్లతో ఉన్న సుమారు 12 టన్నుల పుల్లలను స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేసినట్లు డీఆర్ఓ తెలిపారు. -
తొలి తిరుపతిలో భక్తుల రద్దీ
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన సుమారు 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవలు, కేశఖండన టికెట్లు, అన్నదాన విరాళాలుగా ఆలయానికి రూ.3,34,407 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. సుమారు 3,500 మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. 36 యూనిట్లకు రూ.1.28 కోట్ల రాయితీలు కాకినాడ సిటీ: సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహ రాయితీల కింద ఉత్పాదన, సేవా రంగాల్లోని 36 యూనిట్లకు సుమారు రూ.1.28 కోట్ల మేర రాయితీలు కల్పించనున్నామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశాన్ని జూమ్ ద్వారా శనివారం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గడచిన మూడు నెలల్లో వివిధ పరిశ్రమల స్థాపనకు 386 దరఖాస్తులు అందగా, సింగిల్ డెస్క్ విధానంలో ఆయా శాఖల ద్వారా 333 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. మిగిలిన 53 దరఖాస్తులు వివిధ శాఖల వద్ద పరిశీలనలో ఉన్నాయన్నారు. ఎంఎస్ఎంఈ క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం ద్వారా జిల్లాలో అర్హత కలిగిన క్లస్టర్లు త్వరితగతిన ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధానంగా సూక్ష్మ, చిన్న పరిశ్రమల క్లస్టర్ అభివృద్ధి పథకం (ఎంఎస్ఈసీడీపీ) కింద జిల్లాలో ప్రతిపాదించిన మ్యాంగో జెల్లీ క్లస్టర్ ప్రతిపాదనలను జూన్ నెలాఖరుకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సీహెచ్ గణపతి, ఏడీ ఎస్.విజయ్ కుమార్, రవాణా శాఖ అధికారి జీవీ శివరెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎ.రమణారెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి.రాధాకృష్ణ, ఎల్డీఎం సీహెచ్వీ ప్రసాద్, గ్రౌండ్ వాటర్ డీడీ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఐటీఐలలో ప్రవేశాలకు 3 నుంచి ఇంటర్వ్యూలు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2025–26 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం జూన్ 3 నుంచి 10వ తేదీ వరకూ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్, కన్వీనర్ ఎం.వేణుగోపాలవర్మ తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కేటాయించిన షెడ్యూలు ప్రకారం హాజరు కావాలని సూచించారు. 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మెరిట్ నంబర్లు 1 నుంచి 80 వరకూ, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 81 నుంచి 159 వరకూ ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 160 – 242 వరకూ, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 243 – 325 మెరిట్ లిస్ట్ వరకూ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు. పైన పేర్కొన్న షెడ్యూల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి జనరల్ కేటగిరీలో జూన్ 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. తొమ్మిదో తేదీ ఉదయం 8 గంటలకు మెరిట్ లిస్ట్ 1 – 159, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 160 – 325 వరకూ, 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 326 – 484 వరకూ, మధ్యాహ్నం 485 నుంచి 634 వరకూ ఇంటర్వ్యూలు జరుగుతాయని వేణుగోపాలవర్మ వివరించారు. కూటమి పాలనలో విలేకర్లపై పెరిగిన దాడులు అమలాపురం రూరల్: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో విలేకర్లపై దాడులు పెరిగిపోయాయని జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. అయినవిల్లి మండల సాక్షి విలేకరి బావిశెట్టి నాగేశ్వరరావుపై అయినవిల్లిలో శుక్రవారం రాత్రి ఇద్దరు యువకులు ముసుగులు ధరించి హత్యాయత్నానికి పాల్పడటం దారుణమని అన్నారు. అమలాపురంలో ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగేశ్వరావును ఆయన శనివారం పరామర్శించారు. దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాక్షి విలేకరిపై హత్యాయత్నానికి పాల్పడిన దుండగులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నాగేశ్వరరావును వైఎస్సార్ సీపీ పి.గన్నవరం నియోజవర్గ ఇన్చార్జి గన్నవరం శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, వైఎస్సార్ సీపీ నాయకుడు నేలపూడి స్టాలిన్బాబు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మెండగుదిటి శిరీష్, విఘ్నేశ్వరస్వామి ఆలయం మాజీ చైర్మన్ గుత్తుల నాగబాబు, నాయకులు సలాది బుచ్చిరాజు, మద్దాల చంటిబాబు, గుర్రాల రాంబాబు, వర్రే శ్రీనివాసరావు, కొప్పనాతి శ్రీరామచంద్రమూర్తి తదితరులు పరామర్శించారు. -
సీఎం స్థాయిలో ఉండి ఇంత దిగజారుడు వ్యాఖ్యలా?: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డగోలు హామీలిచ్చి, ఏడాది గడుస్తున్నా ఏ ఒక్కటీ అమలు చేయకుండా, ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్తో నెట్టుకొస్తున్న సీఎం చంద్రబాబు, పెన్షన్ పంపిణీ పేరుతో డ్రామా చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపించారు. శనివారం ఆయన రాజమహేంద్రవరంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ ఒక్క మాటకు కట్టుబడక, చెప్పుకోవడానికి ఏమీ లేక.. వేదిక ఏదైనా జగన్ను నిందించడమే పనిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మార్గాని భరత్ ఇంకా ఏమన్నారంటే..మహానాడు మొత్తం ఆత్మస్తుతి, పరనిందలే:మహానాడు పేరుతో ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ ఆత్మని క్షోభకు గురిచేస్తున్నారు. చంద్రబాబుని ఎన్టీఆర్ ఔరంగజేబు, రావణాసురుడుతో పోల్చితే ఏఐ టెక్నాలజీ వాడుకుని పొగిడించుకోవడం సిగ్గుచేటు. వారి దిగజారుడుతనానికి నిదర్శనం. నందమూరి కుటుంబ సభ్యులెవర్నీ మహానాడుకి పిలవకుండా ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారు. ప్రజలు ఇదంతా తెలియని అమాయకులని తండ్రీకొడుకులు భావిస్తే అంతకన్నా అవివేకం ఉండదు.మూడు రోజుల మహానాడు మొత్తం ఆత్మస్తుతి, పరనింద తప్ప, ప్రజలకు ఏడాదిలో ఏం చేశామో చెప్పుకోలేని దుస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఏడాది గడిచినా సూపర్ సిక్స్లో ఒక్క హామీని కూడా నెరవేర్చింది లేకపోయినా 30 ఏళ్లు మనమే ఉంటామని చెప్పడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. టీడీపీ నాయకులకు ప్రజల గడప వద్దకు వెళ్లే ధైర్యం కూడా లేదు. మహానాడుకి జనం కరువైపోతే డ్వాక్రా మహిళలు రాకపోతే పథకాలు కట్ చేస్తామని బెదిరించారు.ఆ నిర్ణయాన్ని సమర్థించుకోలేక..:ప్రతినెలా రూ.4 వేల పింఛన్ పంపిణీ కార్యక్రమం పేరుతో చంద్రబాబు లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నాడు. వేదిక మీదకు నలుగురు పేదవారిని పిలిచి వారికి మైకులు పెట్టి డ్రామా నడుపుతున్నాడు. ఏడాదిగా కనీసం ఒక్క కొత్త పింఛన్ కూడా పంపిణీ చేయకుండా ఇలాగే కాలక్షేపం చేశాడు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పింఛన్ పంపిణీ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు, ఎండీయూ వాహనాలు నడుపుకునే పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల మీద దారుణమైన ఆరోపణలు చేశాడు. నెలకు రూ.10 వేల వేతనం తీసుకునే రేషన్ వాహనాల డ్రైవర్లు లంచాలు ఇవ్వడానికి తన వద్దకే వచ్చినట్టు చంద్రబాబు దారుణమైన అభాండాలు వేయడం సిగ్గుచేటు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి దిగజారి ఆరోపణలు చేయడం బాధాకరం.పేదలపై చంద్రబాబు వ్యాఖ్యలు దారుణం:వేల కోట్ల విలువైన బియ్యం కాకినాడ పోర్టుకి వెళ్తున్నాయని సీఎం చంద్రబాబు ఆరోపిస్తున్నారు. సీఎంగా ఉన్న వ్యక్తి చేయాల్సిన ఆరోపణలు ఇవేనా? బియ్యం అక్రమంగా తరలిపోతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నట్టు? అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా అలాంటి అక్రమార్కులను ఎందుకు పట్టుకోలేకపోయారు? రేషన్ వాహనాలు ఎత్తేయాలని తీసుకున్న దిక్కుమాలిన నిర్ణయాన్ని సమర్థించుకోలేక అమాయకుల మీద దారుణమైన ఆరోపణలు చేస్తున్నాడు. వెనుకబడిన వర్గాల వారిని, నిరుపేదలను కొవ్వెక్కిపోయారని మాట్లాడటం దారుణమైన విషయం.అది అహంకార నిర్ణయం:వెనుకబడిన వర్గాల మీద ఇంత చులకనభావం పనికిరాదు. 18 నెలల కాలపరిమితి ఉన్నా ఎండీయూ ఆపరేటర్లను తొలగించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ అహంకారపూరిత నిర్ణయంతో వారు తీసుకున్న వాహనాలకు నెలనెలా కిస్తీలు కట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎండీయూ ఆపరేటర్లను ఆర్థిక నేరస్తులని, టెర్రరిస్టులుగా చెప్పడం ఎంత దారుణం? చంద్రబాబు తన వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎండీయూ ఆపరేటర్లు న్యాయస్ధానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఎండీయూ ఆపరేటర్లకి వైయస్సార్సీపీ కూడా అండగా ఉంటుంది.పింఛన్ డోర్ డెలివరీ ఇవ్వలేనివారు, రేషన్ ఇస్తారా?:కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్లే డోర్ డెలవరీ చేయలేకపోతున్నారు. అలాంటిది వికలాంగులు, వృద్ధులకు ఇంటికే రేషన్ సరుకులు తీసుకొచ్చి ఇస్తామంటే నమ్మడానికి ప్రజలెవరూ సిద్ధంగా లేరు. ఒకపక్క కొత్తగా 6 వేల రేషన్ షాపులు మంజూరు చేస్తామని చెప్పుకుంటూ, చంద్రబాబు తన ప్రసంగంలో మాత్రం రేషన్కి బదులు డీబీటీ ద్వారా డబ్బులిస్తామని చెబుతున్నాడు. ఈ రేషన్ షాపులను ఒక్కోటి రూ.5 లక్షలకు వేలంపాట ద్వారా అమ్మడానికి ఇప్పటికే ఎమ్మెల్యేలు సిద్ధమైపోయారు. అదే జరిగితే ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ గుర్తు చేశారు. -
అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
సాక్షి, అన్నవరం: అన్నవరం దేవస్థానం ఏఈఓ కొండలరావు.. మహిళా భక్తులతో అనుచితంగా ప్రవర్తించడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇలా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా కొండలరావును ఆలయ విభాగం నుండి గోశాల, గార్డెన్స్ విభాగాలకు బదిలీ చేశారు. ఇక, కొండలరావుపై ఇప్పటి వరకు ఇద్దరు మహిళా భక్తులు ఫిర్యాదు చేయడం గమనార్హం.వివరాల ప్రకారం.. తెలంగాణలోని మంచిర్యాల నుంచి సత్యదేవుని సన్నిధిలో సేవ చేయడానికి వచ్చిన తమ పట్ల కొండలరావు దురుసుగా ప్రవర్తించారని మహిళా సేవకులు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై మండిపడిన దేవదాయ శాఖ కమిషనర్ ఈ వ్యవహారంపై విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావును ఆదేశించారు. ఈ మేరకు కొండలరావుకు షోకాజ్ నోటీసు కూడా జారీ అయ్యింది. ఈ వివాదం ఇంకా ముగియక ముందే ఆయనపై మరో భక్తుడు తీవ్ర స్థాయి ఆరోపణలతో ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంవో) ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది.ఏం జరిగిందంటే..హైదరాబాద్కు చెందిన భక్తుడు హోతా కామేశ్వరశాస్త్రి ఈ నెల 13వ తేదీ రాత్రి జరిగిన సత్యదేవుని శ్రీపుష్పయాగం కార్యక్రమానికి అన్నవరం వచ్చారు. రూ.రెండు వేల టికెట్తో సత్యదేవుని వ్రతం ఆచరించి, స్వామివారిని దర్శించుకోవాలని అనుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి పురోహితుడు రాత్రి స్వామివారి శ్రీపుష్పయాగ మహోత్సవం జరుగుతుందని చెప్పడంతో కామేశ్వరశాస్త్రి దంపతులు హైదరాబాద్ ప్రయాణం రద్దు చేసుకున్నారు. అనంతరం, సత్యదేవుని శ్రీపుష్పయాగానికి హాజరయ్యారు. ఈ ఉత్సవం ముగిసిన తరువాత ప్రసాదం తీసుకునేందుకు అర్చకుని వద్దకు వెళ్లగా, తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి తన భార్య భుజంపై చేయి వేసి అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు.దీంతో, తాను ఒక్కసారిగా షాక్కు గురైనట్టు తెలిపారు. అయితే, ఆ వ్యక్తి దేవస్థానం ఏఈఓ కొండలరావుగా అక్కడి సిబ్బంది ద్వారా తెలుసుకున్నానని పేర్కొన్నారు. వెంటనే ఈ విషయమై ఈవోకు ఫిర్యాదు చేద్దామనుకున్నాను. కానీ, అప్పటికే ఈవో కొండ దిగువకు వెళ్లిపోయారని తెలిసి హైదరాబాద్ వచ్చేశామని పేర్కొన్నారు. తన భార్యతో పాటు ఇతర భక్తుల పట్ల అతడి ప్రవర్తన అదేవిధంగా ఉందని ఆ ఫిర్యాదులో కామేశ్వరశాస్త్రి చెప్పుకొచ్చారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో తెలిపారు. ఈ ఫిర్యాదు కాపీని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి గురువారం దేవస్థానానికి పంపించి, దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఈవోను ఆదేశించారు. దీనిపై విచారణాధికారి ద్వారా విచారణ చేయించనున్నట్లు ఈవో తెలిపారు. -
అమలాపురంలో తొలిసారిగా బాక్స్ క్రికెట్ పోటీలు
ఎన్హెచ్ఆర్సీ కౌన్సెలింగ్తో ఒక్కటైన దంపతులు ఆలమూరు: మండలంలోని బడుగువానిలంకలో మూడేళ్ల క్రితం విడిపోయిన దంపతులు జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) చొరవతో ఒక్కటయ్యారు. స్థానికుల కథనం ప్రకారం బడుగువానిలంకకు చెందిన పాలూరి వెంకటేష్తో పెదపళ్లకు చెందిన దేవి గౌతమికి 2014 లో వివాహమైంది. మూడవ కాన్పులో ఆడపిల్ల పుట్టిందనే కారణంతో 2022 మార్చిలో దేవి గౌతమిని పిల్లలతో సహా భర్త వెంకటేష్ పుట్టింటికి పంపించి వేశాడు. అప్పట్లో పెద్దల వద్దకు, ప్రజా ప్రతినిధుల వద్దకు వెళ్లి కాపురాన్ని నిలబెట్టాలని వేడుకున్నా ఫలితం లేకపోయింది. ఇటీవల ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర వైస్ చైర్మన్గా ఆలమూరు మండలంలోని పెదపళ్లకు చెందిన గారపాటి శ్రీనివాసరావు నియమితులు కావడంతో దేవి గౌతమి ఆయనకు తన పరిస్థితి వివరించింది. దీనిపై స్పందించిన వైస్ చైర్మన్ గారపాటి భర్త వెంకటేష్ నివాసానికి వెళ్లి, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధుల సాయంతో కౌన్సెలింగ్ ఇచ్చి భార్యాభర్తలిద్దరితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి కాపురానికి ఒప్పించడంతో కథ సుఖాంతమైంది. ఎన్హెచ్ఆర్సీ కృషిని ఇరు గ్రామాల ప్రజలు అభినందించారు. అమలాపురం టౌన్: గుర్రాల విజయ కృష్ణ మెమోరియల్ పేరిట అమలాపురంలో మొట్టమొదటిసారిగా బాక్స్ క్రికెట్ పోటీలు స్థానిక గండువీధిలో ఈ నెల 28వ తేదీన మొదలయ్యాయి. జూన్ 3వ తేదీతో ఈ పోటీలు ముగిస్తాయని నిర్వాహకుడు కన్నా చెప్పారు. వారం రోజుల పాటు పోటీలను తమ సోదరుడి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నామన్నారు. మొదటి బహుమతిగా రూ.30 వేలు, రెండో బహుమతిగా రూ.15 వేలు ఇవ్వనున్నారు. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో మొత్తం 40 జట్లు తలపడనున్నాయన్నారు. ప్రతీ మ్యాచ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రోఫీని విజేత జట్టుకు అందజేస్తున్నారు. -
చెరువు గుట్కాయస్వాహా!
● బియ్యపుగుంట చెరువును పూడ్చేసిన ఆక్రమణదారులు ● అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ● పట్టించుకోని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నిడదవోలు: ఆక్రమణకు కాదేది అనర్హం అన్నట్లు కొందరు రెచ్చిపోతున్నారు. ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపిస్తుందా.. పాగా వేసేద్దామా అంటూ ఎదురుచూస్తున్నారు. అధికార పార్టీ అండదండలు ఉండడంతో ఆక్రమణదారులకు అడ్డు అదుపూ లేకుండాపోతోంది. ఆక్రమణలపై రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు చీమకుట్టినట్లు కూడా ఉండడం లేదు. దీనికి తాజా ఉదాహరణగా నిడదవోలులోని బాలాజీనగర్లో మున్సిపాలిటికి చెందిన బియ్యపుగుంట చెరువును ఆక్రమణదారులు పూడ్చివేశారు. బుధవారం రాత్రికి రాత్రే లారీలతో మంటి తరలించి 80 సెంట్ల ఉన్న చెరువును పూడ్చివేశారు. దీని విలువ రూ.4 కోట్ల వరకు ఉంటుంది. రెండేళ్ల క్రితం మున్సిపల్ అధికారులు చెరువు విస్తీర్ణాన్ని కొలిచి సరిహద్దు స్తంభాలను కూడా ఏర్పాటు చేశారు. విలువైన భూమి పట్టణ శివారున బాలాజీనగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంజోరుగా సాగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల నుంచి పొలాలు కొని వెంచర్లు వేసి అధిక ధరలకు విక్రయించి లాభపడుతున్నారు. ఈ ప్రాంతంలో మున్సిపాలిటీకి చెందిన 80 సెంట్ల బియ్యపుగుంట చెరువుపై అక్రమార్కుల కన్ను పడింది. ఇక్కడ గజం భూమి రూ.10 వేలు పలుకుతోంది. సెంటు భూమి సుమారు 4.80 లక్షలు అయితే 80 సెంట్ల భూమి విలువ సుమారు రూ.4 కోట్లు పలుకుతోంది. రైతులకు ఈ చెరువు ఎంతో ఉపయోగంగా ఉండేది. ఎక్కువగా చాగల్లు మండలం ధారవరం, బ్రాహ్మణగూడెం గ్రామాలకు చెందిన రైతులకు చెందిన 300కి పైగా పశువులు చెరువులో దాహం తీర్చుకునేవి. సుమారు 50 ఎకరాలకు సంబంధించిన మురుగునీరు చెరువుకు చేరడంతో పొలాలకు నష్టం లేకుండా ఉండేది. అయితే చెరువును పూడ్చివేయడంతో వర్షపునీరు, పంట మురుగునీరు వెళ్లే దారిలేక భవిష్యత్తో పొలాలు ముంపునకు గురవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పశువులకు తాగునీరు కరువవుతుందని వాపోతున్నారు. -
ఇసుక లారీల వేగాన్ని నియంత్రించాలంటూ ధర్నా
రామచంద్రపురం రూరల్: ప్రమాదాలకు కారణమవుతున్న ఇసుక లారీల వేగాన్ని నియంత్రించాలని కోరుతూ వెంకటాయపాలెం, వేగాయమ్మపేట గ్రామాల సర్పంచ్లు, ప్రజలు, అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఇసుక లారీలను అడ్డగించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటాయపాలెం గ్రామ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అధ్యక్షురాలు యల్లమిల్లి సతీష్కుమారి, వేగాయమ్మపేట సర్పంచ్ అంబటి తుకారం, రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వాసంశెట్టి శ్యామ్, అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి గోదావరి జిల్లాల నాయకుడు వెంటపల్లి భీమశంకరం, ఐఎఫ్టీయూ నాయకుడు చింతా రాజారెడ్డి తదితరులు మాట్లాడుతూ లారీలు, ముఖ్యంగా ఇసుక లారీలు మితిమీరిన వేగంతో వెళుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని మండి పడ్డారు. ఈ నెల 28న మహిళపై నుంచి లారీ వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె మృతితో అప్పటికే తండ్రిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులు తల్లిని కూడా కోల్పోయి అనాథలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాయపాలెం ప్రధాన రహదారి నుంచి వేగాయమ్మపేట, యర్రపోతవరం, యానాంలకు దగ్గరి దారిగా ఉండటంతో చీమలదిబ్బ గ్రామం నుంచి కాలువ గట్టు రహదారిపై నుంచి లారీలు రాకపోకలు సాగించడం ప్రమాదాలకు కారణమవుతోందన్నారు. ఈ రహదారి ఇరుకుగా ఉండటం రెండు పక్కలా కాలువలు ఉండటంతో అధిక బరువు కలిగిన లారీల వల్ల రోడ్డు కూడా కుంగిపోయి మరింత ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక లోడులు వేస్తున్న ఇసుక లారీలకు కనీసం బరకాలు కూడా కప్పకపోవడంతో లారీల వేగానికి ఇసుక ఎగిరి ప్రయాణికుల కళ్లల్లో పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. ఆర్అండ్బీ అధికారులు లారీల వేగాన్ని నియంత్రించేలా స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, చీమలదిబ్బ దారిలో లారీలు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుసూరి వెంకటరమణ, ఇళ్ల సత్యనారాయణ, రాయుడు కృష్ణ, కోడి అర్జునుడు, ఇళ్ల గణపతి, అనుసూరి దుర్గ, దంగేటి జ్యోతి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దడాల రవికుమార్ పాల్గొన్నారు. -
బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన సీఐ
సామర్లకోట: పట్టణ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బుధవారం సంతమార్కెట్ సెంటర్లో ఒక బాలుడు సెల్ఫోన్ చూస్తూ నడుచుకొంటూ వెళ్లిపోతున్నాడు. దానిని గమనించిన సీఐ ఎ.కృష్ణభగవాన్ బాలుడి నుంచి వివరాలు సేకరించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ బాలుడు మూగవానిగా తెలుసుకున్నారు. దాంతో సెల్ఫోన్లో నంబర్కు ఫోన్ చేయడంతో ఆ బాలుడిని వేదాంశ్ కార్తికేయగా గుర్తించారు. సీఐ సమాచారం మేరకు తల్లి పోతుల తులసీ, తండ్రి శరత్కుమార్ ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. తాము విశాఖపట్నం నుంచి వేసవి సెలవుల కారణంగా కోట్లమ్మ చెరువు వద్ద బంధువుల ఇంటికి వచ్చామని తెలిపారు. రెండో తరగతి చదువుతున్న ఆరేళ్ల తమ కుమారుడు వేదాంశ్ కార్తికేయ సెల్ఫోన్లో గేమ్స్ ఆడుకొంటూ బయటకు వచ్చేయడాన్ని తాము గమనించలేదని చెప్పారు. క్షేమంగా తమ కుమారుడిని అప్పగించినందుకు బాలుడి తల్లిదండ్రులు సీఐకి, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
పెట్టుబడి సాయం ఎప్పుడు?
గత సంవత్సరం రైతు భరోసా నిధులు పడలేదు. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సన్నాహాలు చేస్తున్నాం. వరి విత్తనాలు, ఎరువులకు డబ్బులు లేకపోవడంతో బయట అప్పులు తెచ్చుకొంటున్నాం. రైతులకు ఇస్తామన్న పెట్టుబడి సాయాన్ని ఈ ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. – తుమ్మలపల్లి తాతాజీ, రైతు, కరప ఈ ఏడాదైనా ఇస్తారా? అధికారంలోకి వస్తే రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున సాయం అందిస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. గత సంవత్సరం ఇవ్వలేదు. ఈ ఏడాదైనా ఇస్తే రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. బయటి వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఎరువులు, పురుగు మందులు కొంటున్నాం. – ఎర్నీడి సత్తిరాజు, రైతు జి.మేడపాడు, సామర్లకోట మండలం -
వైఎస్సార్ సీపీ యువజన విభాగంలో 11 మందికి స్థానం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర యువజన విభాగంలో జిల్లా నుంచి 11 మంది నేతలకు పదవులు దక్కాయి. పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది. పార్టీ యువజన విభాగం జోనల్ ప్రెసిడెంట్గా దాడిశెట్టి శ్రీనివాస్ (తుని నియోజకవర్గం), ప్రధాన కార్యదర్శిగా తోట రాంజీ (జగ్గంపేట), కార్యదర్శులుగా బదిరెడ్డి సతీష్ గోవిందుబాబు (ప్రత్తిపాడు), మధిరెడ్డి దొరబాబు (పిఠాపురం), సంయుక్త కార్యదర్శులుగా కరణం భాను (పెద్దాపురం), ఎంజీకే కిషోర్ (కాకినాడ సిటీ), ఎం.హేమంత్ కుమార్ (తుని), వలవల భూషణం (పిఠాపురం); ప్రధాన కార్యదర్శిగా సూర్రెడ్డి తిరుమల రాయుడు (ప్రత్తిపాడు), సంయుక్త కార్యదర్శులుగా తోట అయ్యన్న (జగ్గంపేట), అక్షింతల లక్ష్మణమూర్తి రాజా (జగ్గంపేట నియోజకవర్గం) నియమితులయ్యారు.ఆలయ బాధ్యతల నుంచి ఏఈఓ తొలగింపుఅన్నవరం: ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నవరం దేవస్థానం ఏఈఓ కె.కొండలరావును సత్యదేవుని ఆలయ బాధ్యతల నుంచి తప్పించి గోశాల, గార్డెన్స్ విభాగానికి మార్చారు. ఆయన స్థానంలో గోశాల, గార్డెన్స్ విభాగం ఏఈఓ పి.జగ్గారావును నియమించారు. ఈ మేరకు ఈఓ వీర్ల సుబ్బారావు శుక్రవారం ఆదేశాలిచ్చారు. ఈ నెల 13న సత్యదేవుని శ్రీపుష్పయాగానికి వచ్చిన తమపై కొండలరావు అనుచితంగా ప్రవర్తించారని, తన భార్యను తోసివేయడంతో ఆమె కింద పడిపోయిందని హైదరాబాద్కు చెందిన భక్తుడు హోతా కామేశ్వరశాస్త్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసిన విషయం విదితమే. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఈఓను సీఎంఓ అధికారులు ఆదేశించారు. దీనిపై విచారణాధికారిగా ఆలయ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ను ఈఓ నియమించారు.12 కేంద్రాల్లో కానిస్టేబుల్స్ మెయిన్స్కాకినాడ క్రైం: జిల్లావ్యాప్తంగా ఆదివారం జరిగే కానిస్టేబుల్స్ మెయిన్స్ పరీక్షల కోసం 12 కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎస్పీ బిందుమాధవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఈ పరీక్ష జరుగుతుందన్నారు. సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ, కాకినాడలోని ప్రభుత్వ ఐటీఐ, టెక్నాలజీ కాలేజీ, మోహన్ కాలేజీ, ఐడియల్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, వీఎస్ లక్ష్మీ కాలేజీల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. హాల్ టికెట్టుతో పాటు ఒరిజినల్ గుర్తింపు పత్రాలు తప్పకుండా తీసుకురావాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లు అనుమతించబోమని స్పష్టం చేశారు. హెల్ప్ లైన్ నంబర్లు 94949 33233 (వాట్సాప్), డయల్ 112, 94407 96501, 94407 96513 సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.రేపటి నుంచి 500 క్యూసెక్కుల విడుదలకాకినాడ సిటీ: తూర్పు డెల్టాలోని రైతులు ఖరీఫ్ విత్తనాలు వేసుకొనేందుకు వీలుగా గోదావరి కాకినాడ, సామర్లకోట, బ్యాంక్ కాలువలకు ఆదివారం నుంచి రోజుకు 500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయనున్నారు. కలెక్టర్ షణ్మోహన్ సగిలి శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. అలాగే, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం, ఏలేరు రిజర్వాయర్ల నుంచి జూలై మొదటి వారంలోను, పంపా రిజర్వాయర్ నుంచి ఆగస్టు మొదటి వారంలోను నీటిని విడుదల చేస్తామని వివరించారు.సత్యదేవుని సన్నిధిలో పాట్నా హైకోర్టు న్యాయమూర్తిఅన్నవరం: పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్రాయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం సత్యదేవుని దర్శించి, పూజలు చేశారు. ఆలయం వద్ద వారికి పండితులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం పండితులు వేదాశీస్సులు, స్వామివారి ఫొటో, ప్రసాదాలను ఈఓ వీర్ల సుబ్బారావు అందజేశారు. -
చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు
డిగ్రీ పూర్తి చేశాను. అయినా ఉద్యోగం రాలేదు. అయినా అక్కడితో ఆగిపోకుండా ఎంబీఏ, పీజీ కూడా చేశాను. ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. ఇంతలో సరిగ్గా ఏడాది క్రితం ఎన్నికలు వచ్చాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని కూటమి నేతలు చెప్పారు. ఆ మాటలు నమ్మా. అయినా ఉద్యోగం రాలేదు. పోనీ ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి అయినా ఇస్తారని ఎదురు చూశాను. కూటమి అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడాదైంది. ఒక్క రూపాయి కూడా భృతి ఇవ్వలేదు. 2014లో కూడా చంద్రబాబు ఇలాగే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి గాలికొదిలేశారు. – బొండాడ సుధాకర్, సర్పవరం, కాకినాడ రూరల్ అబద్ధాలతో బాబు మరో మోసం ఎప్పుడూ చెప్పే అబద్ధాలతో చంద్రబాబు నిరుద్యోగులను మరోసారి మోసం చేశారు. 2014లో నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి తూతూ మంత్రంగా ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. ప్రస్తుతం ఉద్యోగం వస్తే కుటుంబాన్ని పోషించుకోవచ్చునని ఎదురు చూస్తున్న వారు లక్షల్లో ఉన్నారు. ఉద్యోగాలు కల్పించడం లేదు. అలాగని భృతి కూడా ఇవ్వడం లేదు. ఇలా దగా చేయడం అన్యాయం. బాబు అబద్ధాలు నమ్మి యువత మోసపోయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోని చంద్రబాబును ఇకపై ఎవ్వరూ నమ్మరు. – పెంకే రవితేజ, కన్వీనర్, నిరుద్యోగ యువత జేఏసీ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బాబు వచ్చే.. జాబు పోయే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఉన్న ఉద్యోగాలు ఊడబెరికేస్తూంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అధికారంలోకి రాగానే 20 లక్షల కొత్త ఉద్యోగాలిస్తామని నమ్మించారు. తీరా గద్దెనెక్కాక మద్యం దుకాణాల్లో పని చేసే 12 వేల మంది ఉద్యోగులను తొలగించి, 25 వేల కుటుంబాల పొట్ట కొట్టారు. ప్రజలకు వారి ఇళ్ల వద్దనే నిత్యావసర సరకులు అందజేయడానికి ఏర్పాటు చేసిన రేషన్ వాహనాలను ఎత్తేశారు. రాష్ట్రవ్యాప్తంగా 18 వేల మంది ఉద్యోగులను ఒక్క కలంపోటుతో తొలగించి, వారి ఉసురు పోసుకున్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు అండగా నిలిచింది. నేటి కూటమి ప్రభుత్వం ఉన్న ఉద్యోగులను తొలగించి నిరుద్యోగ యువతను దగా చేస్తోంది. – తాటిపాక మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, కాకినాడ -
చంద్రబాబు సర్కార్పై సమర శంఖం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని నేపథ్యంలో జూన్ 4న వెన్నుపోటు దినంగా పాటించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పార్టీలోని అన్ని స్థాయిల్లో నాయకులు, శ్రేణులు వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తనను కలిసిన మీడియాతో రాజా మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను వంచించి, వందకు పైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని ఆక్షేపించారు. తీరా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా చంద్రబాబు, కూటమి నేతలు ఏ ఒక్క హామీ అయినా అమలు చేసి ఉంటే ముందుకు వచ్చి చెప్పాలని డిమాండ్ చేశారు. మే నెల ముగిసిపోతోందని, ఖరీఫ్ సీజన్ మొదలవుతూండటంతో రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారని అన్నారు. అయినప్పటికీ వారికి పెట్టుబడి సాయం ఇవ్వాలనే కనీస ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకపోవడం అన్యాయమన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా పీఎం కిసాన్తో కలిపి రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా ఏటా రూ.13,500 రైతుకు అందించారన్నారు. చంద్రబాబు గద్దెనెక్కాక రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్చడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఖరీఫ్ ప్రారంభమైనా రైతుల ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా పెట్టుబడి సాయంగా జమ చేశారా అని నిలదీశారు. అన్ని వర్గాలకూ చంద్రబాబు, కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకూ పార్టీ యావత్తూ ప్రజలు, బాధితులను సమన్వయం చేసుకుంటూ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే జూన్ 4న వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం పోస్టర్లను ఒకటి రెండు రోజుల్లో కాకినాడలో ఆవిష్కరిస్తామని రాజా చెప్పారు. ఫ ఒక్క హామీనైనా అమలు చేశారా? ఫ వెన్నుపోటు దినం విజయవంతం చేయాలి ఫ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పిలుపు -
అమాత్యులొస్తున్నారు.. మళ్లీ మొదలు పెట్టండి!
‘అయ్యగారొస్తున్నారు మళ్లీ మొదలెట్టండి’ అన్నట్లుగా ఉంది పిఠాపురంలో కూటమి నేతల తీరు. స్థానిక పాదగయ క్షేత్రంలో భక్తులకు స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకు దివీస్ సంస్థ గతంలో రెండు ఆర్ఓ ప్లాంట్లు నిర్మించింది. నెల రోజుల క్రితమే ప్రత్యేక పూజలు నిర్వహించి మరీ జిల్లా దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారి ఈవీ సుబ్బారావు, స్థానిక ఈఓ కాట్నం జగన్మోహన శ్రీనివాస్, దివీస్ సిబ్బంది వీటిని ప్రారంభించారు. ప్రస్తుతం, వీటి వద్ద భక్తులు మంచినీరు తాగుతున్నారు. ఇప్పుడు ఇదే ఆర్ఓ ప్లాంటును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఆదివారం మళ్లీ ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనసేన నేతల ఆదేశాలకు తలొగ్గే అధికారులు ఇలా చేస్తున్నారని, లేకపోతే ఎప్పుడో ప్రారంభించిన వాటర్ ప్లాంటును మళ్లీ ఇప్పుడు మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడమేమిటని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. – పిఠాపురం -
బలసిరి.. కొత్త వరి
పిఠాపురం: రంగు.. రుచి.. వాసన.. ఇదేదో వాణిజ్య ప్రకటన అనుకుంటే పొరపాటే. వరిలోనూ ఇటువంటి లక్షణాలున్న బియ్యం అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఇటువంటి బియ్యం ఉన్నాయని చెబితే.. ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు. ఇటువంటి అనేక రకాల కొత్త వంగడాలను ఇక్కడి రైతులు పండిస్తూ అందుబాటులోకి తెస్తున్నారు. అత్యధిక పోషక విలువలున్న వరి వంగడాలను ఉత్పత్తి చేయడానికి ప్రకృతి వ్యవసాయ రైతులు నడుం బిగించారు. అరుదైన వరి రకాలు గతంలో రాష్ట్రేతర ప్రాంతాల నుంచి తెచ్చే స్థానిక రైతులు.. ఇప్పుడు కాకినాడ జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు పలు రకాల వరి వంగడాలను ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. ఇక్కడ పండించిన అరుదైన వరి రకాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వర స్వామివారి నైవేద్యానికి సైతం ఉపయోగిస్తుండడం విశేషం. ఈ అరుదైన రకాల్లో నవారా, ఇంద్రాణి, కాలపట్టి, డెహ్రాడూన్ రెడ్ రైస్, పరిమళ సన్న, బర్మా బ్లాక్, రత్నచొడి, రక్తసాలి, చింతలూరు సన్నాలు, కూజి, పాటలియా, బాస్బోగ్, కామిని బోగ్, మైసూర్ మల్లిగ, సిద్ధ సన్నాలు, కోమల్ సాల్ వంటి రకాలున్నాయి. జిల్లాలో సుమారు 25 హెక్టార్లలో 30 మంది రైతులు సేంద్రియ పద్ధతిలో అరుదైన వరి రకాలను పండిస్తున్నారు. చాలా డిమాండ్ ఉందిపన్నెండేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రాణప్రదంగా చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో పండించిన అరుదైన రకాల ధాన్యం తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వర స్వామివారికి నైవేద్యంగా ఉపయోగించడానికి ఇస్తున్నాను. సాధారణ రకాల కంటే.. మంచి డిమాండ్ ఉన్న అరుదైన రకాలను సాగు చేస్తున్నాను. ఇతర ప్రాంతాల నుంచి వివిధ రకాల విత్తనాలు తెచ్చి, విత్తనాభివృద్ధి చేస్తున్నాను. కేవలం విత్తనాలకు మాత్రమే వీటిని పండిస్తున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కొనుగోలు చేస్తున్నారు. వీటిని ఆన్లైన్ ద్వారా పంపిస్తున్నాం. ఈ బియ్యానికి మంచి డిమాండ్ ఉండడంతో ఆదాయం బాగుంటుంది. నాతో పాటు జిల్లాలో చాలా మంది రైతులు వీటి సాగు ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల రైతులూ నా వద్ద విత్తనాలు తీసుకుంటున్నారు. – అడపా వెంకటరమణ, ప్రకృతి వ్యవసాయ రైతు, భోగాపురం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా విత్తనం కోసమే పండిస్తున్నా...ప్రకృతి వ్యవసాయంలో పలు రకాల ధాన్యాన్ని పండిస్తున్నాను. కేవలం విత్తనాల కోసం కొన్ని అరుదైన రకాలు పండిస్తున్నాను. ఎవరైనా విత్తనాలకు అడిగితే ఉచితంగా ఇస్తున్నాను. ఇతర రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.ఎకరం పొలంలో పది రకాల అరుదైన రకాలను పండిస్తున్నాను. ఈ సాగంతా పాతకాల పద్ధతిలోనే చేయాలి. యంత్రాలతో సాధ్యం కాదు. – ఉల్లి సురేష్, ప్రకృతి వ్యవసాయ యువ రైతు, కొత్తపల్లి, కాకినాడ జిల్లాఅరుదైన రకాలివే.. » రక్తసాలి రక్త హీనతతో బాధపడుతున్న వారికి మంచి ఆహారం. ఈ బియ్యం తినడం వల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది. మూడు వేల ఏళ్ల నుంచి ఇది వాడుకలో ఉంది. » కూచి పట్టాలియా బాగా సన్నగా ఉంటుంది. తినడానికి బాగుంటుంది. పోషకాలు ఎక్కువ. » నవరను కింగ్ ఆఫ్ రైస్ అంటారు. ప్రస్తుతం దేశంలో లభించే బియ్యంలో అత్యంత పోషక విలువలున్న ఆహారం. సుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచి ఆహారం. దీనిని రోజూ తింటే సుగర్ నార్మల్కు వస్తుంది. మోకాళ్ల నొప్పులూ తగ్గిస్తుంది. » ధూదేశ్వర్ అనే దేశీయ వరి విత్తనం. గాలులకు పడిపోని సన్న రకం. పంటకాలం సుమారు 120 రోజులు. ఇది తెలుపు రంగులో ఉంటుంది, బాలింతలకు శక్తినిచ్చి, తల్లులకు, పిల్లలకు అధిక పోషకాలు అందిస్తుంది. పాల వృద్ధి, పిల్లల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. » ఇంద్రాణి అనేది దేశీయ వరిరకం. సువాసన ఉండే ఈ రకం పంట కాలం సుమారు 130 రోజులు. పాయసం, పులిహోర, పలావు, దద్దోజనానికి అనుకూలమైంది. » రత్నచొడి అనే దేశీయ వరి విత్తనం. తెలుపు రంగులో ఉండే సన్న రకం. పంట కాలం సుమారు 135 రోజులు. అధిక పోషక విలువలు కలిగి, కండపుష్టి, శరీర ధారుడ్యం పెంచి, మంచి పోషకాలు కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తి కలిగిస్తుంది. పూర్వకాలంలో సైనికులకు ఆహారంగా ఇచ్చేవారు. » కుజీపటాలియా అనేది దేశీయ విత్తనం. సన్న రకం. పంటకాలం సుమారు 120 రోజులు. గాలులకు పడిపోదు. కొవ్వు రహిత, సోడియం లేనివి. తక్కువ కేలరీలు, గ్లూకోజ్ తక్కువగా ఉండి, రోగ నిరోధక శక్తి పెంచుతుంది. » కేత్రీ మహరాజ్ సెంటెడ్ వెరైటీ. గింజ పొడవుగా ఉంటుంది. పంటకాలం సుమారు 130 రోజులు. పాయసం, దద్దోజనం, పులిహోర పలావులకు బాగుంటుంది. » మైసూరు మల్లిగ దేశీయ విత్తనం. తెల్లని రంగు, గాలులకు పడిపోని సన్నని గింజ. పంట కాలం సుమారు 120 రోజులు. ఎదిగే పిల్లలకు అధిక పోషకాలు, ప్రొటీన్లు అందిస్తుంది. » ఘని అనే దేశీయ వరి రకం. చిన్న గింజ. పంటకాలం సుమారు 130 రోజులు. అధిక ఫైబర్, కాల్షియం కలిగి ఉంటుంది. స్పాండిలైటిస్, మోకాళ్ల నొప్పులు తగ్గించే ఆహార ఔషధంగా గుర్తింపు పొందింది. » కుంకుమసాలి.. కుంకుమ పువ్వు, రక్తసాలి మొదలైన విత్తనాలు ఒకే కోవకు చెందిన దివ్యమైన ఔషధాలు. ఇవి రక్తంలోని మలినాలను శుభ్రం చేసి, వాత, పిత్త, కఫాలను సమపాళ్లలో ఉంచే దివ్యమైన ఆహార ఔషధాలు. -
అన్నదాతకు అండగా ఆర్కేలు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్నదాతలకు అండగా ఆర్బీకే వ్యవస్థను తీసుకువచ్చారు. సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రైతు భరోసా, పంట రుణాలు, విపత్తుల సమయంలో ఇన్పుట్ సబ్సిడీ, బీమా పరిహారం, పంట దిగుబడుల కొనుగోళ్ల వంటి వాటిలో ఈ ఆర్బీకేలు కీలక పాత్ర పోషించాయి. వీటి పేరును కూటమి సర్కార్ రైతు సేవా కేంద్రాలుగా మార్చి, అరకొర సేవలకే పరిమితం చేసింది. కొన్ని ఆర్బీకే భవనాలను ఇతర కార్యాలయాలకు వినియోగిస్తూండగా, మరికొన్ని తాళం వేసి కనిపిస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఆరేళ్ల క్రితం మాదిరిగానే మండల కేంద్రాలకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు కోటనందూరు మండలంలో 14 ఆర్బీకేలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇవి రైతులతో కళకళలాడుతూ ఉండేవి. ఖరీఫ్కు ముందు ఈ కేంద్రాల్లో రైతులతో సమావేశాలు, విత్తనాలు, ఎరువుల విక్రయాలు, సాగుపై అవగాహన, సేంద్రియ సాగు ప్రయోజనాలు, రైతు బీమా, పంట నష్టపరిహారం తదితర అనేక అంశాలపై రైతులను చైతన్యపరిచే వారు. అటువంటి కేంద్రాలు ఇప్పుడు కూటమి సర్కార్ నిర్వాకంతో తరచుగా మూతపడే కనిపిస్తున్నాయి. -
‘నా భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించారు’
● ఏఈఓపై మరో ఆరోపణ ● సీఎంఓకు ఫిర్యాదు చేసిన భక్తుడు ● విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఈఓకు ఉన్నతాధికారుల ఆదేశం అన్నవరం: ఏఈఓ కె.కొండలరావుపై మరోసారి ఆరోపణలు రావడం అన్నవరం దేవస్థానంలో కలకలం రేపింది. తెలంగాణలోని మంచిర్యాల నుంచి సత్యదేవుని సన్నిధిలో సేవ చేయడానికి వచ్చిన తమ పట్ల కొండలరావు దురుసుగా ప్రవర్తించారని మహిళా సేవకులు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై మండిపడిన దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఈ వ్యవహారంపై విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావును ఆదేశించారు. ఈ మేరకు కొండలరావుకు షోకాజ్ నోటీసు కూడా జారీ అయ్యింది. ఈ వివాదం ఇంకా ముగియక ముందే ఆయనపై మరో భక్తుడు తీవ్ర స్థాయి ఆరోపణలతో ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంఓ) ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఆయన ఫిర్యాదు ప్రకారం.. ఏం జరిగిందంటే.. హైదరాబాద్కు చెందిన భక్తుడు హోతా కామేశ్వరశాస్త్రి ఈ నెల 13వ తేదీ రాత్రి జరిగిన సత్యదేవుని శ్రీపుష్పయాగం కార్యక్రమానికి అన్నవరం వచ్చారు. రూ.2 వేల టికెట్టుతో సత్యదేవుని వ్రతమాచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా అక్కడి పురోహితుడు రాత్రి స్వామివారి శ్రీపుష్పయాగ మహోత్సవం జరుగుతుందని చెప్పడంతో కామేశ్వరశాస్త్రి దంపతులు హైదరాబాద్ ప్రయాణం రద్దు చేసుకున్నారు. సత్యదేవుని శ్రీపుష్పయాగానికి హాజరయ్యారు. ఈ ఉత్సవం ముగిసిన తరువాత ప్రసాదం తీసుకునేందుకు అర్చకుని వద్దకు వెళ్లగా, తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి తన భార్య భుజంపై చేయి వేసి తోసేశారని, అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. దీంతో, తాను ఒక్కసారిగా షాక్కు గురయ్యానన్నారు. ఆ వ్యక్తి దేవస్థానం ఉద్యోగి కె.కొండలరావుగా అక్కడి సిబ్బంది ద్వారా తెలుసుకున్నానని పేర్కొన్నారు. వెంటనే కింద పడిపోయిన తన భార్యను లేవదీసి, ఈఓకు ఫిర్యాదు చేద్దామనుకున్నానన్నారు. అప్పటికే ఈఓ కొండ దిగువకు వెళ్లిపోయారని తెలిసి హైదరాబాద్ వచ్చేశామని పేర్కొన్నారు. తన భార్యతో పాటు ఇతర భక్తుల పట్ల అతడి ప్రవర్తన అదేవిధంగా ఉందని ఆ ఫిర్యాదులో కామేశ్వరశాస్త్రి పేర్కొన్నారు. ఆయనపై చర్య తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు కాపీని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి గురువారం దేవస్థానానికి పంపించి, దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఈఓను ఆదేశించారు. దీనిపై విచారణాధికారి ద్వారా విచారణ చేయించనున్నట్లు ఈఓ తెలిపారు. -
గత ప్రభుత్వంలో రైతులకు ఎంతో మేలు
ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా రైతులకు ఎటువంటి లబ్ధీ చేకూర లేదు. ఖరీఫ్ మొదలవుతోంది. ఇంతవరకూ సర్కార్ నుంచి చిల్లిగవ్వ పెట్టుబడి సాయం అందుకోలేకపోయాం. కనీసం రబీలో నష్టపోయిన పంటలకు కూడా పరిహారం ఇంతవరకూ ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఖరీఫ్కు ముందు ఏటా మే నెలలో రైతుభరోసా సాయం సకాలంలో అందించేది. దీంతో పెట్టుబడికి ఢోకా ఉండేది కాదు. రైతుభరోసా కేంద్రాల్లో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేవి. – యల్లపు రామ సూరి సత్యనారాయణ, రైతు, బొద్దవరం, కోటనందూరు మండలం ఏడాదిగా కనిపించని సంక్షేమం కూటమి అధికారం చేపట్టిన ఏడాది కాలంలో సంక్షేమానికి దూరమయ్యాం. గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ద్వారా అధికారులు ప్రజల ఇళ్లకే వచ్చి, సంక్షేమం అందించేవారు. ప్రస్తుతం సమస్యలు పరిష్కరించాలని, సంక్షేమ పథకాలు అందించాలని ప్రజలే అధికారులు, నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. ఈ–గవర్నెన్స్ పేరుతో వాట్సాప్ ద్వారా 165 సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. అవి అమలు కావడం లేదు. సంక్షేమ పథకాలంటూ ఊకదంపుడు ప్రసంగాలే తప్ప ఒక్క పథకం కూడా ఆచరణలో కనిపించడం లేదు. – నున్నం రాంబాబు, గోకవరం మండలం -
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: రత్నగిరికి గురువారం భక్తులు వేలాదిగా పోటెత్తారు. పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగడంతో నవదంపతులు, వారి బంధుమిత్రులకు ఇతర భక్తులు తోడవడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సాయంత్రం 4 గంటల వరకూ రద్దీ కొనసాగింది. సత్యదేవుని సుమారు 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు 2,100 జరిగాయి. ఉచిత దర్శనానికి గంట, ప్రదక్షిణ దర్శనానికి అరగంట పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరులు నిజరూపంలో దర్శనమిచ్చారు. రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఉదయం 9 గంటలకు చండీహోమం నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న భక్తులు రూ.750 టికెట్టుతో హోమంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. వెన్నుపోటు దినంతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిద్దాం తుని రూరల్: ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసగిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి వెన్నుపోటు దినంతో కనువిప్పు కలిగిద్దామని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. ఎస్.అన్నవరంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వచ్చే నెల 4న నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమంపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, ప్రజలకు న్యాయం చేసేలా పోరాటం చేద్దామని అన్నారు. నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా కూటమి పాలన సాగుతోందని విమర్శించారు. ఇటువంటి అరాచకాలను ఎండగట్టేందుకు నాయకులు, కార్యకర్తలు ప్రజలను భాగస్వాముల్ని చేయాలన్నారు. సమావేశంలో నాయకులు లాలం బాబ్జీ, రేలంగి రమణగౌడ్, రాయి మేరీ అవినాష్, చోడ్రాజు రామచంద్రరాజు, సకురు నాగేంద్ర నెహ్రూ, నాగం దొరబాబు, నాగం గంగబాబు, గొర్లి రామచంద్రరావు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. పదోన్నతులకు ఉపాధ్యాయుల నిరీక్షణ రాత్రి 7 దాటినా నిర్వహించని వైనం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించడానికి చేపట్టిన కౌన్సెలింగ్ గురువారం రాత్రి ఏడు గంటలు దాటినా ప్రారంభం కాలేదు. దీంతో, ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ కేంద్రం వద్దనే గంటల తరబడి పడిగాపులు పడ్డారు. పదోన్నతుల కౌన్సెలింగ్కు ఉదయం 9 గంటలకే స్థానిక సాలిపేట బాలికల ఉన్నత పాఠశాలకు రావాలని సమాచారం ఇవ్వడంతో అందరూ ఉదయమే అక్కడకు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం ఈ కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉండగా ఆప్షన్ల నమోదులో జాప్యం చోటు చేసుకుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 96 మంది జిల్లా పరిషత్, 16 మంది ప్రభుత్వ, ఏడుగురు మున్సిపల్ పాఠశాలలల్లో ఉద్యోగోన్నతి పొందనున్నారు. తీవ్ర ఆలస్యంగా ప్రారంభమైన ఈ కౌన్సెలింగ్ రాత్రి సుమారు 10 గంటల సమయానికి పూర్తయ్యింది. బదిలీలకు 8,836 మంది ఉపాధ్యాయుల దరఖాస్తు రాయవరం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా బదిలీల కోసం 8,836 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. కంపల్సరీ దరఖాస్తులతో పాటు, ఇష్టపూర్వకంగా ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు 245, పీఎస్ హెచ్ఎంలు 215, ఎల్పీ హిందీ 41, ఎల్పీ సంస్కృతం 3, ఎల్పీ తెలుగు 93, ఎల్పీ ఉర్దూ 3, పీఈటీలు 42, ఎస్ఏ తెలుగు 524 మంది, ఎస్ఏ ఇంగ్లిష్ 729, ఎస్ఏ హిందీ 396, ఎస్ఏ సంస్కృతం 9, ఎస్ఏ ఉర్దూ 2, ఎస్ఏ బయలాజికల్ సైన్స్ 479, ఎస్ఏ గణితం 873, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 615, ఎస్ఏ సోషల్ స్టడీస్ 471, ఎస్ఏ ఫిజికల్ డైరెక్టర్ 260, ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ 10, సెకండరీ గ్రేడ్ టీచర్లు 3,826 మంది ఉన్నారు. -
అయ్యో.. అసలే వద్దంటారా..!
● పంపాలో స్నానాలు వద్దంటున్న దేవస్థానం ● యువకుడి మృతితో చర్యలు ● అప్రమత్తం చేసే బదులు ఇదేం పని? ● ఘాట్లలో రక్షణ ఏర్పాట్లు చేయాలని భక్తుల విన్నపంఅన్నవరం: భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి దర్శనానికి వెళ్లిన వారు గోదావరిలో స్నానం చేయకూడదని బోర్డులు ఏర్పాటు చేసి, సెక్యూరిటీ గార్డులను కాపలా పెడితే ఎలా ఉంటుంది? అన్నవరం పంపా జలాశయం వద్ద ఇటువంటి పరిస్థితే భక్తులకు ఎదురవుతోంది. పంపా జలాశయంలో శ్రీచక్ర స్నానం గొయ్యిలో మునిగిపోయి బుధవారం ఒక యువకుడు మృతి చెందిన విషయం విదితమే. అక్కడ గొయ్యి ఉందని తెలియక, పెద్దగా లోతుండదని భావించి వెళ్లిన అతడు ఆ గోతిలో పడి మృతి చెందాడు. అక్కడ దేవస్థానం అధికారులు ఎటువంటి హెచ్చరిక బోర్డులూ ఏర్పాటు చేయలేదు. కనీసం ఆ గొయ్యి చుట్టూ మెష్ ఏర్పాటు చేసి, కర్రలు పాతి, జెండాలు అమర్చినా గొయ్యి ఉందనే విషయం అందరికీ తెలిసి ఉండేది. అటువంటి చర్యలేవీ తీసుకోకపోవడంతో ఓ యువకుడి నిండు ప్రాణాలు బలయ్యాయి. ఈ విషాద సంఘటనతో మేల్కొన్న అధికారులు విచిత్రమైన చర్య తీసుకున్నారు. అసలు పంపా జలాశయం వద్దకే వెళ్లవద్దని, అక్కడ స్నానం చేయవద్దని బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఏటా వేసవిలో మార్చి లేదా ఏప్రిల్లో శ్రీరామ నవమి వేడుకలు, మే నెలలో సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు జరుగుతాయి. అప్పుడు పంపాలో పెద్దగా నీరుండదు. ఈ సందర్భంగా నిర్వహించే చక్రస్నానం కోసం పంపా స్నానఘట్టాలకు కొద్ది దూరంలో నాలుగేళ్ల క్రితం నలు చదరంగా సుమారు ఆరడుగుల లోతున గొయ్యి తవ్వారు. ఏటా ఆ గోతిని నీటితో నింపి చక్రస్నానం నిర్వహిస్తున్నారు. ఈ నెల 12న కూడా ఈ గోతిలోనే సత్యదేవుని చక్రస్నానం నిర్వహించారు. అయితే, పంపాలోకి నీరు వస్తే ఆ గొయ్యి పూర్తిగా మునిగిపోతుంది. ఒడ్డు నుంచి చూస్తే అక్కడ గొయ్యి ఉందనే విషయమే ఎవ్వరికీ తెలియదు. ఈ విషయం తెలియకే కిర్లంపూడి మండలం జగపతినగరానికి చెందిన వాసంశెట్టి చరణ్తేజ్ ఆ గోతిలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ విషాద సంఘటన నేపథ్యంలో ‘గేట్లు దాటి లోపలకు వెళ్లేందుకు ప్రవేశం లేదు’ అంటూ అధికారులు పంపా గేట్లకు గురువారం ఫ్లెక్సీలు తగిలించారు. అలాగే, నది వద్ద ‘ఇచ్చట నీటిలో దిగుట ప్రమాదకరం’ అని బోర్డు ఏర్పాటు చేశారు. అలాగే, పంపాలో స్నానం చేయడం నిషిద్ధమని బోర్డులు పెట్టారు. దీంతో, పంపా జలాశయానికి స్నానం చేయడానికి వస్తున్న భక్తులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పుణ్యస్నానాలకు వందలాదిగా.. పవిత్ర పంపా నదిలో స్నానం చేసి, సత్యదేవుని దర్శించుకోవాలని చాలా మంది భక్తులు భావిస్తూంటారు. అలాగే, అన్నవరం చుట్టుపక్కల ప్రజలు కూడా పండగలు, ఇతర పర్వదినాలు, గణపతి నవరాత్రుల్లో నిమజ్జనాలు, దసరా నవరాత్రుల్లో భవానీ మాలలు వేసిన వారితో పాటు కార్తిక మాసం నెల పొడవునా ఉదయం, సాయంత్రం వందలాది మంది పంపాలో పుణ్యస్నానాలు ఆచరిస్తూంటారు. పంపాలో స్నానం చేయకుండా వీరిని నియంత్రించడం సాధ్యం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో దేవస్థానం అధికారులు తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలి. ప్రమాదం గురించి అందరికీ తెలిసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే కానీ మొత్తానికే స్నానం చేయవద్దంటే ఎలాగని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ చర్యలు మేలు ● స్నానం చేయవద్దని కాకుండా స్నానఘట్టాల వద్ద కొద్ది దూరంలో సత్యదేవుని చక్రస్నానం కోసం తీసిన గొయ్యి ఉందని, అందువలన స్నానం చేసేందుకు అక్కడి వరకూ వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరిక బోర్డులు పెట్టాలి. ● చక్రస్నానం గొయ్యి చుట్టూ కర్రలు పాతి, వాటికి జెండాలు కట్టాలి. ● ప్రస్తుతం పంపా నీటిమట్టం 88 అడుగులకు చేరింది. వర్షాలు ఇంకా పడుతున్నాయి కనుక నీటిమట్టం త్వరలోనే 90 అడుగులకు చేరుతుంది. అప్పుడు స్నానఘట్టాల వరకూ నీరు వస్తుంది. అప్పుడు భక్తులు ఒడ్డునే స్నానం చేసే అవకాశం ఉంటుంది. ● గోదావరి, కృష్ణా నదుల స్నాన ఘట్టాల మాదిరిగా పంపా స్నాన ఘట్టాలకు కొద్ది దూరం వరకూ మాత్రమే భక్తులు వెళ్లేలా ఇనుప స్తంభాలు పాతి, ఇనుప గొలుసులు లేదా మెష్లు ఏర్పాటు చేయాలి. అలా చేస్తే, భక్తులు అవి దాటి నది లోపలకు వెళ్లే అవకాశం ఉండదు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
అనాథలైన ఇద్దరు చిన్నారులు రామచంద్రపురం రూరల్: మండలంలోని వెంకటాయపాలెం శివారు చీమలదిబ్బ గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కుయ్యేరు గ్రామానికి చెందిన శీలం కమల(43) మృతి చెందినట్టు ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ గురువారం విలేకరులకు తెలిపారు. శీలం కమల బుధవారం వెంకటాయపాలెంలోని పేపకాయల బాబ్జీ కల్యాణ మండపంలో జరుగుతున్న బంధువుల అమ్మాయి ఓణీల ఫంక్షన్కి కుటుంబీకులు, బంధువులతో కలసి 5 మోటారు సైకిళ్లపై బయలుదేరారు. మరొక 5 నిమిషాల్లో కల్యాణ మండపానికి చేరుకుంటారన్న సమయంలో ఈమె ప్రయాణిస్తున్న వాహనం గోతిలో పడటంతో వెనుక కూర్చున్న కమల జారి రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో ద్రాక్షారామ నుంచి కుయ్యేరు వైపుగా వెళ్తున్న కోళ్లు సరఫరా చేసే లారీ చక్రాలు ఆమె పైనుంచి వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త సుమారు 2 సంవత్సరాలు క్రితం గుండెపోటుతో మృతి చెందారు. వీరి పెద్ద కుమార్తెకు వివాహం చేశారు. ఇంకా 9 ఏళ్ల కుమారుడు, 6 ఏళ్ల కుమార్తె ఆమైపె ఆధారపడి ఉన్నారు. ఆమె ద్రాక్షారామలో వస్త్ర దుకాణంలోలో పనిచేస్తూ పిల్లలను పోషించుకుంటోంది. ఆమె కుమారుడు చిన్నతనం నుంచీ కీళ్లవాతంతో బాధపడుతున్నాడు. కుమార్తెకు చిన్న వయస్సులోనే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది, తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన ఆ చిన్నారుల పరిస్థితి తలచుకుని బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆసుపత్రి సమాచారం, బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సామర్లకోటలో బార్పై కేసు నమోదు
సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న అశ్విన్ రెస్టారెంట్ అండ్ బార్పై కేసు నమోదు చేసినట్టు ఎకై ్సజ్ సీఐ కె. రామోహనరావు ఒక ప్రకటనలో తెలిపారు. సాక్షి దినపత్రికలో ‘బార్ తెగించి అమ్మకాలు’ అనే శీర్షికతో గురువారం ప్రచురితమైన కథనానికి స్పందించి కాకినాడ నార్త్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉదయాన్నే బార్లో అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. ఆయనతోపాటు ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. బార్ను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తెరచి ఉంచవలసి ఉండగా తెల్లవారు జాము నుంచీ బహిరంగంగా అమ్మకాలు చేస్తున్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. బాలికపై అత్యాచారం పోక్సో కేసు నమోదు కె.గంగవరం: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికను మోసం చేసి, ఆనక ముఖం చాటేసిన యువకుడిపై కె.గంగవరం పోలీసులు కేసు నమోదు చేశారు. రామచంద్రపురం డీఎస్పీ బి.రఘువీర్ చెప్పిన వివరాల ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని పామర్రుకు చెందిన మందపల్లి సాగర్ అనే యువకుడు అదే పేటకు చెందిన బాలికతో సంబంధం ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం బాలిక ఏడవ నెల గర్భవతిగా ఉంది. కొంతకాలంగా సాగర్ను పెళ్లి చేసుకోవాలని బాలిక అడుగుతుండడంతో ముఖం చాటేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు స్థానిక పెద్దలను అశ్రయించారు. అక్కడ ఫలితం లేకపోవడంతో కె.గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గురువారం డీఎస్పీ రఘువీర్, అమలాపురం మహిళా ఎస్సై గంగాభవాని, కె.గంగవరం ఎస్సై జానీబాషా పామర్రు గ్రామానికి వచ్చి విచారణ నిర్వహించి బాధితురాలు, వారి కుటుంబ సభ్యుల వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ సదరు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశామని, ప్రసుత్తం యువకుడు పరారీలో ఉన్నాడని, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
లారీ డ్రైవర్ హల్చల్
జగ్గంపేట: జగ్గంపేట పోలీసు స్టేషన్ వద్ద మద్యం తాగిన ఒక డ్రైవర్ గాజుముక్కతో శరీరాన్ని కోసుకుంటూ రక్తం ఓడుతుండగా పోలీసులను తిడుతూ గురువారం రాత్రి నానా హంగామా సృష్టించాడు. అతని వద్దకు వెళ్లడానికి స్థానికులు భయపడ్డారు. కొద్దిసేపటి తరువాత పోలీసులు అతన్ని పట్టుకుని ఆసుపత్రికి తరలించారు. గుర్రంపాలెం రోడ్డులో వున్న ఒక రైసు మిల్లు వద్ద రోడ్డుపై ఒక వ్యక్తి దుస్తులు విప్పేసి వచ్చి వెళ్లే వాహనాలను ఆపి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని 100కి స్థానికులు ఫోన్లో ఫిర్యాదు చేశారు. దీంతో జగ్గంపేట ఎస్సై రఘునాథరావు అక్కడకు కానిస్టేబుల్స్ను పంపారు.మద్యం మత్తులో హల్చల్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు వారించినా అతను వినకపోవడంతో పోలీసులు అతని వద్ద వున్న సెల్ఫోన్ తీసుకున్నారు. మద్యం మత్తులో వున్న వ్యక్తి లారీ డ్రైవర్ అని, ఎక్కడి నుంచో స్థానిక రైసు మిల్లుకు లోడ్ తీసుకువచ్చినట్లు స్థానికులు చెప్పారు. సెల్ఫోన్ తీసుకోవడంతో మద్యం సేవించిన డ్రైవర్ పోలీసులను తిడుతూ, చచ్చిపోతానని బెదిరిస్తూ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నాడు. నా సెల్ఫోన్తో పాటు నా దగ్గర నగదు కూడా తీసుకున్నారని ఆరోపణలు చేశాడు. మీరు పోలీసులా రౌడీలా అంటూ కేకలు వేశాడు. అక్కడ దొరికిన బీరు బాటిల్ బద్దలు కొట్టి గాజుముక్కతో శరీరంపై గాట్లు పెట్టుకున్నాడు. దీంతో శరీరం రక్తంతో తడిసిపోయింది. గాజుముక్కతో బెదిరించడంతో ఎవరూ దగ్గరకు వెళ్లడానికి సాహసం చేయలేదు. కొద్దిసేపటి తరువాత పోలీసుల అతనిని పట్టుకుని ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో పోలీసులపై తిట్ల పురాణం సెల్ఫోను, నగదు తీసుకున్నారని ఆరోపణ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి...
గండేపల్లి: హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని చికిత్సకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్టు గండేపల్లి ఎస్సై యూవీ శివ నాగబాబు తెలిపారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాద వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఒడిశాకు చెందిన చంద్రశేఖర్ ప్రధాన్ (27), త్రిలోచన్ ప్రధాన్ పనుల కోసం కారులో ముంబయి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరి కారు మండలంలోని నీలాద్రిరావుపేట పరిధి చక్రవర్తినగర్ వద్ద రోడ్డుపై నిలిపిన కంటైనర్ లారీని వెనక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ పక్క సీట్లో ఉన్న చంద్రశేఖర్ ప్రధాన్ తీవ్రంగా గాయపడటంతో అతనిని చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు 108 అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్టు పేర్కొన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్టు తెలియజేశారు. విద్యుత్ షాక్తో... పిఠాపురం: గొల్లప్రోలు మండలం ఏ విజయనగరంలో హెచ్డీ కరెంట్ పనులు చేస్తున్న కూలి గురువారం కరెంట్ షాక్తో మృతి చెందినట్లు గొల్లప్రోలు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం అడ్డతీగల మండలం జీ కొత్తూరుకు చెందిన బూడిద మహేష్బాబు విద్యుత్ పనులు చేస్తుంటాడు. గురువారం గొల్లప్రోలు మండలం ఏ విజయనగరంలో హెచ్డీ కరెంట్ పనులు చేస్తూ విద్యుత్ స్తంభాన్ని పైకి లేపగా పైన ఉన్న విద్యుత్ వైర్లు తగిలి విద్యుత్ షాక్కు గురయ్యాడు. తీవ్ర గాయాలైన అతనిని పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి బంధువు బూడిద మరియ ఇచ్చిన ఫిర్యాదుపై గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉరేసుకుని వివాహిత..పిఠాపురం: గొల్లప్రోలు మండలం కొడవలి పాత హరిజనపేటకు చెందిన నామా నాగమణి బుధవారం రాత్రి ఉరి వేసుకుని మృతి చెందినట్టు గొల్లప్రోలు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం తన భర్తకు గల అనారోగ్య సమస్యలు, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె చనిపోవాలని నిర్ణయించుకుంది. గురువారం రాత్రి కొడవలిలో ఆమె అద్దెకు ఉంటున్న ఇంటిలో ఉరి వేసుకుని చనిపోయింది. ఈమెకు భర్త, కుమార్తె మౌనిక, కుమారుడు నిఖిల్ ఉన్నారు. మృతురాలి అక్క పుప్పాల సూర్యమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
గోపాలపురం: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోపాలపురం ఉప్పరగూడెం గ్రామానికి చెందిన తుంగా వంశీ (25) బుధవారం రాత్రి గోపాలపురం గ్రామ శివారు పొగాకు బోర్డు సమీపంలో ఉన్న వేప చెట్టుకు వేలాడుతూ మృతిచెంది ఉన్నాడు. విషయం తెలుసుకున్న వంశీ మేనమామ కూనపోం వెంకట్రావు వెళ్లి చూసి గురువారం గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశీ తల్లి 10 సంవత్సరాల వయసులో మృతిచెందింది. తండ్రి వేరే పెళ్లి చేసుకుని వెళ్లపోవడంతో వంశీ, అతని అక్క వందన మేనమామ ఇంటి వద్ద ఉంటూ జీవనం సాగించారు. అయిదు సంవత్సరాల క్రితం అక్క వందన మలకపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకొని వెళ్లిపోయింది. దీంతో అతను తన మేనమామ వద్ద ఉంటూ కూలి పనులు చేస్తుండేవాడు. వంశీ చెడు వ్యసనాలకు బానిస కావడంతో మేనమామ పట్టించుకోవడం మానేశాడు. దీంతో ఒంటరి జీవితాన్ని గడప లేక మనస్తాపానికి గురైన వంశీ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. మేనమామ వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై యెగ్గేపల్లి సత్యనారాయణ చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్
కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు సాధారణ బదిలీల్లో భాగంగా గురువారం కాకినాడ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జి రాహుల్మీనా కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు బదిలీ దరఖాస్తులు పరిశీలించి ఐదు సంవత్సరాలు నిండిన ఉద్యోగులను, వివిధ కారణాలతో రిక్వెస్ట్ బదిలీలు కోరిన 15 మంది ఉద్యోగులను వారు ఎంచుకున్న ఆప్షన్ల ప్రకారం వివాదాలకు తావివ్వకుండా బదిలీ చేశామన్నారు. ఆయన బదిలీ ఉత్తర్వులు అందజేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్చార్జి కార్యదర్శి పాలంకి నాగరాజు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్స్, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు టి.జయకృష్ణ పాల్గొన్నారు. -
ఫుట్పాత్ బ్రిడ్జి నిర్మాణానికి స్థల పరిశీలన
నిడదవోలు : పట్టణంలో ఇందిరానగర్ నుంచి బసివిరెడ్డిపేట వెళ్లడానికి అనువైన ఫుట్పాత్ బ్రిడ్జి నిర్మాణం కోసం శుక్రవారం వివిధ ప్రాంతాల్లో రైల్వే, మున్సిపల్ అధికారులు పర్యటించారు. ఇందిరానగర్ నుంచి బసివిరెడ్డిపేట వెళ్లడానికి ప్రజలు రైల్వేట్రాక్ దాటవలసి వస్తోంది. అయితే ఇందిరానగర్ వద్ద ఉన్న రైల్వేగోడకు ఉన్న మార్గాన్ని రైల్వే అధికారులు మూసివేసే ప్రక్రియను ప్రారంభించారు. దీంతో అక్కడి స్థానికులు గోడను మూయడానికి వీలు లేదని గతంలో అడ్డుకున్నారు. దీంతో అధికారులు గోడ మార్గాన్ని మూసివేసే పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఫుట్పాత్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు రావడంతో విజయవాడ రైల్వే డివిజినల్ ఆపరేటింగ్ మేనేజర్ సోమశేఖర్నాయుడు తన సిబ్బందితో కలిసి ఫుట్పాత్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. పట్టణంలో చినకాశిరేవు వద్ద కూడా మరో ఫుట్పాత్ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి రైల్వే ఉన్నతాధికారులకు నివేదిస్తామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ టి.కృష్ణవేణి, నిడదవోలు రైల్వే ఐవోబీ అధికారి కిషోర్, టౌన్ఫ్లానింగ్ అధికారి సుప్రియ పాల్గొన్నారు. -
వంగవీటి మోహనరంగా విగ్రహం ధ్వంసం
కొత్తపల్లి: స్థానిక ఊర చెరువు సెంటర్లో ఉన్న దివంగత వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు గురువారం ధ్వంసం చేశారు. దీంతో మోహనరంగా అభిమానులు పిఠాపురం– ఉప్పాడ రోడ్డులో ఊరచెరువు సెంటర్లో బైఠాయించి ఆందోళన నిర్వహించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద కూడా బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దీంతో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. ఘటనా స్థలానికి ఎస్సై వెంకటేష్ చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అభిమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశామని ఎస్ తెలిపారు. గురువారం తెల్లవారు జామున కొత్తపల్లి ఎస్సీ పేటకు చెందిన పెట్టా శ్రీకాంత్ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు గుర్తించామన్నారు. విగ్రహానికి సంబంధించి చేతులను విరగ్గొట్టి పక్కనే ఉన్న చెరువులో పడవేశాడు. పలువురు సాక్షుల చెప్పిన సమాచారం ఆధారంగా శ్రీకాంత్పై కేసు నమెదు చేసి అరెస్ట్ చేశామన్నారు. పిఠాపురం–ఉప్పాడ రోడ్డులో బైఠాయించిన అభిమానులు ముద్దాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు -
సర్కారు వారి ఆయిల్బామ్!
కాకినాడ జిల్లాలో సాగు వివరాలు వరి సాగు చేసే భూములు – 1.58 లక్షల ఎకరాలు సాగు చేసే రైతులు – 1.45 లక్షల మంది ఏటా ధాన్యం దిగుబడి – 5.70 లక్షల టన్నులు (ఒక పంటకు) పట్టు సాగు చేస్తున్న మండలాలు – 19 పట్టు సాగు చేస్తున్న గ్రామాలు – 155 పట్టు సాగు చేస్తున్న రైతులు – 1,150 మంది పట్టు సాగు చేస్తున్న భూమి –4,500 ఎకరాలు పట్టుగూళ్ల దిగుబడి –రోజుకు 5 టన్నులు వాణిజ్య పంటలు సాగు చేస్తున్న భూములు – 36,738 హెక్టార్లు వాణిజ్య పంటలు సాగు చేస్తున్న రైతులు – సుమారు 40 వేల మంది పామాయిల్ సాగవుతున్న భూములు – 12,679 హెక్టార్లు పామాయిల్ సాగు చేస్తున్న రైతులు – సుమారు 10 వేల మంది పిఠాపురం: పంట చేతికందితే రైతుకు ఏటా ఆదాయం వస్తుంది. అది ఒక్క వార్షిక పంటలకే సాధ్యమవుతుంది. అదే బహు వార్షిక పంటలైతే పంట నాటిన కొన్నేళ్ల వరకు రైతుకు ఆదాయం రాదు. వార్షిక పంటలైతే ఏటా లాభాలతో పాటు నష్టాలు ఉంటాయి. అలా నష్టాలు వస్తే పరిహారం కోసం రైతు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాడు. రాయితీలు, నష్ట పరిహారాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇలా ఒకటేమిటి అన్నీ ప్రభుత్వం రైతుకు కల్పించాల్సి ఉంటుంది. వీటికితోడు సాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించాలి. వరదలు వచ్చినా, వానలు వచ్చినా తెగుళ్లు విజృంభించినా రైతుకు నష్ట పరిహారం ఇవ్వక తప్పదు. ఇలాంటి బాధలు తప్పించుకోవడానికి, భారం తగ్గించుకోవడానికి కూటమి ప్రభుత్వం బహు వార్షిక పంటల సాగును తెరపైకి తెచ్చింది. దీని కోసం ప్రతి జిల్లాకు టార్గెట్లు నిర్ణయించింది. దీనిలో భాగంగా కాకినాడ జిల్లాకు 10 వేల ఎకరాల ఆయిల్పామ్ వంటి పంటలు సాగు చేయించాలని టార్గెట్ పెట్టారు. దీంతో అధికార యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించింది. ఇటీవల పట్టు రైతులు తమకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని అడగడానికి వెళితే జిల్లా ఉన్నతాధికారులు నష్టం వచ్చే పంటలకు బదులు ఆయిల్ పామ్ వంటివి సాగు చేసుకోండి అని ఇచ్చిన సలహా ఇప్పుడు వరి, ఇతర వాణిజ్య పంటలు సాగు చేస్తున్న రైతులకు ఇస్తున్నారు. అగ్రికల్చర్, సెరీ కల్చర్, హార్టి కల్చర్కు జిల్లా అధికారులు లక్ష్యాలు నిర్ణయించడంతో ఆయా శాఖల అధికారులు ప్రస్తుతం రైతులను ఒప్పించే పనిలో బిజీగా మారారు. ముందుగా ఖాళీ భూములను గుర్తించి వాటిలో ఆయిల్పామ్ సాగు చేయాలని చెబుతున్నారు. ఇతర పంటలను సైతం నిలిపివేసి ఆయిల్పామ్ సాగు చేసుకుంటే మంచి లాభాలు వస్తాయని రైతులకు నచ్చజెబుతున్నారు. బహు వార్షిక పంటలను సాగు చేయమని చెబుతున్నామని అధికారులు అంటున్నప్పటికీ ఎక్కువ శాతం ఆయిల్పామ్ను ప్రోత్సహిస్తున్నారు. ఆయిల్పామ్ లాభదాయకమేనా? సాధారణంగా ఆయిల్పామ్ సాగు ఎక్కువగా మెట్ట ప్రాంతాల్లో నీటి వసతి తక్కువగా ఉన్న ఏరియాల్లో చేస్తుంటారు. నీటి వసతి ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ వీటి సాగుకు రైతులు ముందుకు రారు. ఆయిల్పామ్ ఒక్కో ఏడాది మంచి లాభాలు ఇచ్చినా కొన్నేళ్ల పాటు తీవ్ర నష్టాలనే చూపించిందంటున్నారు రైతులు. గత ఐదేళ్లుగా టన్ను రూ.10 వేలు మాత్రమే ఉండడంతో పెట్టుబడి కూడా రాలేదని రైతు ఆందోళన వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి. గతంలో థాయిలాండ్ నుంచి పామాయిల్ దిగుమతి కావడం, అది తక్కువ రేటు ఉండడంతో ఇక్కడ ఆయిల్పామ్కు డిమాండ్ లేకపోయింది. దీంతో రేటు అమాంతం పడిపోయి జిల్లాలో ఉన్న ఒక పామాయిల్ కంపెనీ సైతం మూతపడినట్లు రైతులు చెబుతున్నారు. అలాంటిది ఈ ఏడాది థాయిలాండ్ నుంచి దిగుమతులు లేక ఇక్కడి వాటికి డిమాండ్ పెరిగి టన్ను రూ.21 వేలకు చేరడంతో ప్రస్తుతం లాభాలు వస్తున్నాయంటున్నారు. ఇలా ఒక్కో ఏడాది ఒక్కో మాదిరిగా డిమాండ్ ఉండే ఆయిల్పామ్ను లాభదాయక పంటగా అధికారులు చెబుతుండడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్పామ్ సాగు చేస్తే కనీసం నాలుగేళ్ల పాటు ఎటువంటి ఆదాయం ఉండదు. అంతర పంటలు సాగు చేసుకుంటే తప్ప ఆదాయం రాదదని రైతులు చెబుతున్నారు. అంతర పంటలు కూడా అంతగా ఆదాయాన్ని ఇవ్వవని, ఏ పంటా వీలు లేని పొలాల్లో మాత్రమే ఆయిల్పామ్కు ప్రాధాన్యం ఇస్తారని రైతులు చెబుతున్నారు. రైతు ఎలా ఉన్నా తమపై భారం పడకుండా, ఎప్పుడు పడితే అప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తేకుండా ఉండాలన్న ఒకే ఒక్క ఆలోచనతో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రస్తుతం బహువార్షిక పంటల పేరుతో వరితో సహా ఇతర పంటల సాగును నిలిపివేయించి ఆయిల్పామ్ సాగును పెంచే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకంగా ఆయిల్పామ్ సాగుకు జిల్లాలకు టార్గెట్లు వరి, పట్టు వంటి పంటలకు ప్రత్యామ్నాయం అంటూ ప్రచారం రాయితీలు, నష్ట పరిహారాల భారం తగ్గించుకోవాలని సర్కారు ఎత్తుగడ రైతులను ఒప్పించే పనిలో నిమగ్నమైన అధికార యంత్రాంగం నష్టాలు రాకుండా చూడాలనే.. విచ్చల విడిగా రసాయనాలు వాడడం వల్ల పంటలు దెబ్బతిని రైతు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. వారికి మేలు చేయడానికే ప్రభుత్వం బహు వార్షిక పంటలను వేసుకునేలా చర్యలు తీసుకుంటోంది. ఆయిల్పామ్ వంటి పంటలకు ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. పంటల మార్పిడి జరిగితే రైతుకే మంచిది. అందువల్లే బహవార్షిక పంటల సాగుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. – చైత్రవర్షిణి, పాడా పీడీ, పిఠాపురం -
పోలీసులమని చెప్పి బెదిరిస్తున్న ఇద్దరి అరెస్టు
రూ.1,000 నగదు, రాయల్ ఎన్ఫీల్డ్, బటన్ చాకు స్వాధీనం రాజమహేంద్రవరం రూరల్: పోలీసులం అని చెప్పి హైవేపై వాహనాలను ఆపి డబ్బు దోచుకుంటున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసి,. వారి వద్ద నుంచి రూ.1,000 నగదు, రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం, బటన్ చాకును స్వాధీనం చేసుకున్నారు. బొమ్మూరు పోలీస్స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్జోన్ డీఎస్పీ బి.విద్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి 12.10 గంటలకు దివాన్చెరువు ఫారెస్టు ఏరియాలో ఇద్దరు వ్యక్తులు రాయల్ ఎన్ఫీల్డ్పై వచ్చి బొలెరో వాహనాన్ని నిలుపుదల చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ను బొలెరో వాహనానికి అడ్డుగా పెట్టి తాము పోలీసులమని చెప్పి కత్తి చూపించి బెదిరించారు. బొలెరో వాహనం డ్రైవర్ను కొట్టి జేబులోని రూ.1,000 నగదు దోపీడీ చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా పెదమానాపురంనకు చెందిన బొలెరో డ్రైవర్ కూరడ శివరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఆర్ మురళీమోహన్ కేసు నమోదు చేశారు. అనంతరం ఈస్ట్జోన్ డీఎస్పీ బి.విద్య పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. దివాన్చెరువు గ్రామశివారు పాలచర్ల రోడ్డులో మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో రాజవోలు గ్రామానికి చెందిన సిర్ర జాస్పర్ప్రిన్స్ ఎలియాస్ జాస్పర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఆదుర్రు గ్రామానికి చెందిన గుడిసెరాబిన్లను అరెస్టు చేశారు. నిందితులు గతంలో ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారని డీఎస్పీ విద్య తెలిపారు. వీరిపై దారి దోపిడీ, గంజాయి కేసులు వివిధ పోలీసు స్టేషన్లలో ఉన్నాయని చెప్పారు. బొమ్మూరు ఇన్స్పెక్టర్ పి.కాశీవిశ్వనాథం పాల్గొన్నారు. -
సీఎం పర్యటన కోసం చెట్ల నరికివేత
కాట్రేనికోన: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 31 పర్యటించనున్న నేపథ్యంలో సందర్భంగా చెయ్యేరులో రోడ్డు వెంబడి చెట్లను నరికి వేస్తున్నారు. పచ్చదనం కోసం రోడ్డుకు ఇరువైపులా మహిపాలచెరువు నుంచి పల్లంకుర్రు వరకు ప్రభుత్వం మొక్కలు నాటింది. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కల రక్షణ బాధ్యతలను మండల మహిళా సమాఖ్య చేపట్టింది. అయితే సీఎం పర్యటన సందర్భంగా రోడ్డు వెంబడి పచ్చదనంగా ఉండి ప్రయాణికులకు నీడను అందిస్తున్న చెట్లు నరివేస్తుండటంతో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెయ్యేరులో రోడ్డు వెంబడి నరికి వేసిన చెట్లు -
ద్విచక్ర వాహనదారునికి ఫైన్ షాక్
డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు రూ.10 వేల జరిమానా కొత్తపేట: లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనం డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి రూ.10 వేలు ఫైన్ పడింది. వివరాలిలా ఉన్నాయి... కొత్తపేట ఎస్సై జి.సురేంద్ర సోమవారం స్థానిక కమ్మిరెడ్డిపాలెం మలుపు వద్ద సిబ్బందితో కలిసి ట్రాఫిక్ బీట్ వేశారు. ఆ సందర్భంగా స్థానిక బాలయోగిపేటకి చెందిన ఒక యువకుడు మరో ఇద్దరు వ్యక్తులను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని డ్రైవ్ చేస్తూ వెళుతుండగా ఎస్సై సురేంద్ర ఆపారు. లైసెన్స్ ఏది? అని అడగ్గా లేదని చెప్పడంతో నంబరుతోపాటు మోటార్ సైకిల్తో సహా అతని ఫొటో తీసి నేషనల్ ఎంవీ యాక్ట్ యాప్లో నమోదు చేసి ఆ వాహనదారు ని పంపించేశారు. అయితే రాత్రి అతని సెల్ఫోన్కు మోటార్సైకిల్ డీటెయిల్స్తో పాటు లైసెన్స్ లేనందుకు రూ.10,035 ఫైన్ పడినట్టు మెసేజ్ వచ్చింది. ఆ ఫైన్ను ఆన్లైన్లో చెల్లించాలని ఆ చలానాలో పేర్కొన్నారు. దీంతో ఆ వాహనదారుడు నిర్ఘాంతపోయాడు. -
మా ఆందోళన ఎవరికీ పట్టదా?
పవన్కల్యాణ్ ఇచ్చిన హామీ నెరవేర్చాలి వారాహి యాత్ర సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు వినతిపత్రం ఇవ్వగా మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు. కాని అధికారంలోకి వచ్చాక మమ్మల్ని పట్టించుకోలేదు. దీంతో మేము ఆందోళనకు దిగాల్సి వచ్చింది. నేరుగా కలుద్దాం అని కాకినాడ నుంచి పిఠాపురంలో జనసేన కార్యాలయానికి పాదయాత్రగా వెళితే ఆయన అందుబాటులో లేరు సరికదా బాధ్యులు కూడా కనిపించలేదు. మా సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం. – ఎస్.వెంకటరమణ, యూనియన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి, కాకినాడ శ్రమ దోపిడీకి గురవుతున్నాం మున్సిపాలిటీ, కార్పొరేషన్ల లో ఇంజినీరింగ్ సిబ్బంది శ్రమ దోపిడీకి గురవుతున్నా రు. అన్ని అత్యవసర విభాగాల్లోనూ మేమే సేవలందిస్తున్నాం. పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచారు.. మాకు మాత్రం పెంచడం లేదు. మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెలో పాల్గొంటాం. – ఉండవల్లి వీరవెంకటరమణరాజు, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు, సామర్లకోట మున్సిపాలిటీ ● మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల ఆవేదన ● సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 20 రోజులుగా సమ్మె ● హామీ ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేశ్ పట్టించుకోని వైనం పిఠాపురం: మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఇంజినీరింగ్ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 7వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్కు వినతిపత్రం అందజేయాలని వారు చేసిన ప్రయత్నం విఫలమయినట్లు కార్మికులు చెబుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని 20 రోజులుగా సమ్మె చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న తమకు సరైన జీత భత్యాలు లేవంటున్నారు. తాము శ్రమ దోపిడీకి గురవుతున్నామని, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశామని కార్మికులు చెబుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 4,500 మంది ఇంజినీరింగ్ విభాగంలో టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బందిగా పని చేస్తున్నారు. విద్యుత్, తాగునీటి సరఫరా, మంచినీటి పథకాల నిర్వహణ తదితర పనులు చేస్తుంటారు. అయితే తమకు పనికి తగ్గ వేతనాలు లేవని, దీంతో జీవనోపాధి కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు నెలకు రూ.13,087 మాత్రమే వేతనం ఇస్తున్నారని చెబుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గతంలో వారాహి యాత్రకు వచ్చిన సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు, యువగళంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు వినతిపత్రాలు ఇచ్చామని అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారని చెప్పారు. కానీ మా సంగతి పట్టించుకోలేదు. డిమాండ్లు ఇవీ.. కార్మిక చట్టాల ప్రకారం ఇంజినీరింగ్ కార్మికులకు రూ.29,200, టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బందికి రూ. 24,500 చొప్పున జీతాలు చెల్లించాలి. 15 ఏళ్లు పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలి ప్రభుత్వం ప్రకటించే 52 ఆదివారాలు, 17 దేశ జాతీయ, రాష్ట్ర పండగ దినాలను సెలవు రోజులుగా ప్రకటించాలి లేదా వేతన దినాలుగా అయినా పేర్కొనాలి. విధి నిర్వహణలో చనిపోయిన కార్మికులకు రూ.10 లక్షలు, అంగవైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు నష్టపరిహారం, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. విధి నిర్వహణ భారంగా మారి శరీరం సహకరించని వారికి, దీర్ఘకాలిక వ్యాధులకు గురైన వారికి ప్రభుత్వం వైద్య సేవలందించాలి. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. లేబర్ యాక్టు ప్రకారం సీనియారిటీని ఎటువంటి సర్టిఫికెట్లు లేకుండా గుర్తించి టెక్నికల్ ఉద్యోగులుగా నిర్ణయించి వారికి తగిన జీతాలు ఇవ్వాలి. కార్మిక చట్టాల ద్వారా సంక్షేమ పథకాలు, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ఇంజినీరింగ్ విభాగంలో వాటర్ బోర్డును ఏ ర్పాటు చేయాలి. స్వయం ప్రతిపత్తి కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలి. –పదవీ విరమణ తరువాత ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా గ్రాడ్యూటీతో పాటు కనీసం రూ.10వేలు పెన్షన్ ఇవ్వాలి, లేదా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. -
మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
జెడ్పీ చైర్మన్ వేణుగోపాల్ అమలాపురం రూరల్: ముమ్మిడివరం మండలం కమిని గ్రామం వద్ద గోదావరిలో మృతిచెందిన యువకుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, అండగా నిలవాలని జెడ్పీ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు అన్నారు. వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు అమలాపురంలో మంగళవారం యువకుల మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు మాట్లాడుతూ గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఇటీవల చాలామంది విద్యార్థులు, స్థానికులు మృతి చెందుతున్నారని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కోనసీమ జెడ్పీటీసీ సభ్యులు, పందిరిశ్రీహరి రామ్గోపాల్, గెడ్డం సంపదరావు, కోనుకు గౌతమి, మట్టాశైలజ, కసిరెడ్డి అంజిబాబు, బూడిద వరలక్ష్మి, కూడుపూడి శ్రీనివాస్, కూడుపూడి భారతి, పుట్టి కూడివీర వెంకట సూర్యనారాయణ (అబ్బు), బోణం సాయిబాబా సంతాపం తెలిపారు. -
రత్నగిరిపై పడకేసిన రక్షణ
కీలకమైన ప్రదేశాలలో కనిపించని సెక్యూరిటీ గార్డులు అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సెక్యూరిటీ పడకేసింది. దేవస్థానంలో కీలక ప్రాంతాలలో ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా కనిపించడం లేదు. దీంతో ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపివేస్తుండడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. అయినా పట్టించుకునే నాథుడు లేడు. సెక్యూరిటీ కోసం దేవస్థానం ఏడాదికి సుమారు రూ.నాలుగు కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందులో ప్రయివేట్ సెక్యూరిటీ గార్డులు వివిధ చోట్ల దాదాపు 60 మంది పనిచేస్తున్నారు. వీరిపై దేవస్థానం నియమించిన సెక్యూరిటీ సూపర్వైజర్ కూడా ఉన్నారు. కాని వీరెవరూ సరిగా విధులు నిర్వహించకపోయినా అడిగే నాథుడు లేడు. టోల్గేట్ వద్ద, రత్నగిరిపై, వై.జంక్షన్ల వద్ద మాత్రమే సెక్యూరిటీ గార్డులు కనిపిస్తారు. పశ్చిమ రాజగోపురం వద్ద కానరాని సెక్యూరిటీ దేవస్థానంలో పశ్చిమ రాజగోపురం చాలా కీలకమైన చోటు. స్వామివారి ఆలయానికి వచ్చే భక్తుల్లో 80 శాతం మంది పశ్చిమ రాజగోపురం రోడ్డు ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు. అక్కడ నుంచి వంద మీటర్లు దూరంలో అన్నదానం భవనం ఉంటుంది. వాహనాల పార్కింగ్ స్థలం అక్కడకు 150 మీటర్ల దూరం. పశ్చిమ రాజగోపురం వద్దనే దేవస్థానం బస్సులు ఆగుతాయి. ఇంత ప్రాధాన్యం కలిగిన స్థలంలో కనీసం నలుగురు అయినా సెక్యూరిటీ గార్డులు ఉండాలి. కాని ఒక్కరూ కూడా ఉండడం లేదు. వ్రతాలు, కల్యాణం, ఇతర సేవా టిక్కెట్లు ఇచ్చే కౌంటర్ వద్ద కూడా ప్రయివేట్ షాపుల వద్ద పనిచేసేవారే భక్తులను నియంత్రిస్తున్నారు. అక్కడ కూడా సెక్యూరిటీ గార్డులు ఎవరూ ఉండడం లేదు. గత శనివారం విపరీతమైన రద్దీ ఉన్న సమయంలో వ్రతాల టిక్కెట్లను ఒక వ్యక్తి బ్లాక్లో అమ్ముతుండగా హోమ్గార్డు పట్టుకుని మందలించి వదిలేశారు. ఈ విషయం గుర్తు పెట్టుకుని అయినా అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి. కాని సోమవారం ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా అక్కడ కనిపించలేదు. రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డులో... రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డు వద్ద కూడా అదే పరిస్థితి. ఇక్కడ గతంలో ఒక సెక్యూరిటీ గార్డు ఉండేవాడు. ఇప్పుడు ఒక్కరు కూడా ఉండడం లేదు. స్వామివారి సన్నిధికి విచ్చేసే సామాన్య భక్తులు స్వామివారి వ్రతాలు, దర్శనం, అన్నదానం పథకంలో భోజనం చేశాక రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డులో సేద తీరుతారు. కొంతమంది మహిళా భక్తులు వ్రతాల సమయంలో తాము ధరించిన పట్టుచీరలు, నూతన చీరలను అక్కడ ఆరబెట్టి కొంతసేపు నిద్రపోతుండగా అదను చూసి కొంతమంది దొంగలు ఆ చీరలను పట్టుకుపోతున్నారు. ఆ షెడ్డుకు గల సెల్ఫోన్ చార్జింగ్ పాయింట్ల వద్ద కూడా సెల్ఫోన్ చార్జింగ్ పెట్టి కొంత సేపు ఆదమరిస్తే చాలు ఆ ఫోన్లు ఉండవక్కడ. ఇవే కాదు భక్తుల బ్యాగ్లు, విలువైన వస్తువులు కూడా దొంగలు అపహరిస్తున్నారు. ఎదురుగా ఈఓ కార్యాలయం ఉన్నప్పటికీ ఈ విశ్రాంతి షెడ్డులో దొంగతనం జరగని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ రాత్రివేళల్లో వివాహాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో పెళ్లి బృందాలలోని మహిళల ఆభరణాలు, నగదు కూడా చోరీ జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. శ్రీవనదుర్గ అమ్మవారి ఆలయం ఎదురుగా గల ఉచిత డార్మెట్రీ వద్ద కూడా సెక్యూరిటీ లేదు. ఇలా చాలాచోట్ల సెక్యూరిటీ లేకపోవడంతో దొంగలు చెలరేగిపోతున్నారు. దేవస్థానం అధికారులు పశ్చిమ రాజగోపురం వద్ద, రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డు వద్ద, ఉచిత డార్మెట్రీ వద్ద సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలి. పోలీసులు కూడా ఈ ప్రాంతాలలో రద్దీ సమయాల్లో హోం గార్డులతో తనిఖీలు నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. -
కోనసీమ విషాదం: ఏడు మృతదేహాలు లభ్యం
కోనసీమ జిల్లా: గోదావరిలో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గొదావరిలో గల్లంతైన ఎనిమిది మందిలో ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ పోలీస్, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు జరుగుతున్నాయి. రాజేష్, మహేష్, క్రాంతి, పాల్ మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నిన్న(సోమవారం) కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక పంచాయతీ శివారు సలాదివారిపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎనిమిది మంది యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. గ్రామంలో శుభకార్యం కోసం వచ్చిన వారిలో 11మంది యువకులు సోమవారం మధ్యాహ్నం సరదాగా నదీస్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తూ ఎనిమిది మంది మునిగిపోయారు.కాకినాడకు చెందిన సబ్బిత క్రాంతి మాన్యూల్ (19), సబ్బిత పాల్ మాన్యూల్ (18), తాతపూడి నితీష్ (19), ఎలుపర్తి సాయి (18), మండపేట మండలానికి చెందిన కాలపాక రోహిత్ (18), కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన ఎలిపే మహేష్ (14), ఐ.పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన వడ్డి మహేష్ (15), వడ్డి రాజేష్ (18) గల్లంతయ్యారు. వారిలో ఏడు మృతదేహాలు ఇవాళ లభ్యమయ్యాయి.కె.గంగవరం మండలం శేరిలంకలో పోలిశెట్టి నాగరాజు, చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమ జ్యోతి ఓణీ ఫంక్షన్ జరిగింది. ఇందుకోసం ఇక్కడకొచ్చిన 11 మంది యువకులు భోజనాల అనంతరం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గౌతమి గోదావరిని చూసేందుకు వెళ్లారు. స్నానానికి దిగారు. వీరిలో స్థానికంగా నివాసముంటున్న ఎలిపే మహేష్ లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి దిగాడు. అతనిని రక్షించేందుకు నలుగురు వెళ్లి వారు కూడా మునిగిపోయారు. మరో ముగ్గురూ వారిని కాపాడేందుకు వెళ్లి గల్లంతయ్యారు. అర్థరాత్రి వరకు వీరి ఆచూకీ లభ్యంకాలేదు. స్నానానికి దిగిన వారిలో ముగ్గురు మాత్రమే గట్టు మీదకు చేరారు. వీరిలో కాకినాడకు చెండిన డి.కరుణ్కుమార్ ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులకు తెలిపారు. -
మనవరాలిని చూద్దామనుకొని మరలిరాని లోకాలకు..
మనవరాలిని చూడడానికి బయలుదేరిన వారు... ఆమెను కలవకుండానే అనంత లోకాల కు చేరుకున్నారు. వీరిని తమ కారులో తీసుకువెళుతున్న వారు కూడా ప్రమాదంలో చిక్కుకోవడంతో మరో ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రాజానగరం/చాగల్లు/తాళ్లపూడి(కొవ్వూరు)/కంబాలచెరువు(రాజమహేంద్రవరం): రాజానగరం మండలం, దివాన్చెరువు శివారు గామన్ బ్రిడ్జి హైవేపై కొంతమూరు కేశవస్వామి ఆస్పత్రి వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన నలుగురు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో కొవ్వూరు, చాగల్లు మండలాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. దారవరం గ్రామానికి చెందిన లకంసాని సురేష్ భార్య బిందు (34), కొవ్వూరుకు చెందిన ఉప్పులూరి ప్రసాద్ (60), భార్య శివ లీలావతి (56)తో పాటు లీలావతి తల్లి చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామానికి చెందిన ఇమ్మణి వీరవెంకట సత్యవతి(75) కలిసి సోమవారం ఉదయం కారులో కొవ్వూరు నుంచి కాకినాడ వెళుతుండగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లకంసాని సురేష్ తో పాటు భార్య బిందు కొవ్వూరులో నివాసం ఉంటున్నారు. పక్కపక్కనే నివాసం ఉంటున్న సురేష్ ప్రసాద్ కుటుంబ సభ్యులు బంధువులు కూడా. వీరంతా సురేష్ కారులో ఇంటి నుంచి బయలుదేరిన 30 నిమిషాల్లోనే మృత్యువాత పడటంతో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మనవరాలు కన్నీరు మున్నీరు..మార్కొండపాడుకు చెందిన ఇమ్మణి సత్యవతి 20 రోజులు క్రితం కుమార్తె శివ లీలావతి అస్వస్థతకు గురి కావడంతో చూడ్డానికి వెళ్లారు. ఉప్పులూరి ప్రసాద్ కొవ్వూరులోని యువరాజ్ కేబుల్ ఆఫీసు వీధిలో ఇంట్లో నివాసం ఉంటున్నారు. ట్రక్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ప్రసాద్ హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడు. దీనికితోడు అతని భార్య శివ లీలావతి అనారోగ్యంతో బాధపడుతోంది. వీరి ఒక్కగానొక్క అమ్మాయి వివాహితైన భవాని సుమారు 15 ఏళ్ల కిందట విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. భవాని కుమార్తె పూజ (సిరి) కాకినాడలో ఇంజినీరింగ్ చదువుతోంది. దీంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మనవరాలి పూజను చూసేందుకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ముది అమ్మమ్మ, తాత, అమ్మమ్మలు ఒక్కసారిగా మృతిచెందడంతో పూజ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఏ నిమిషానికి ఏమీ జరుగునో.. మృత్యువు ఎప్పుడు, ఏ విధంగా కబళించుకుపోతుందో ఎవరికీ తెలీదు .. అంటే ఇదేనేమో? మండలంలోని దివాన్చెరువు గామన్ బ్రిడ్జి జాతీయ రహదారిపై కేశవస్వామి ఆస్పత్రికి సమీపంలో సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో లారీ, కారు ఢీ కొన్న ప్రమాదాన్ని చూస్తే నిజమనిపిస్తుంది. నాలుగు లేన్లతో టు వే గా ఉన్న ఈ రహదారిపై ఒక వైపు కారు, రెండో వైపు లారీ ప్రయాణిస్తూ పై ప్రాంతంలో ఒకదానిని ఒకటి ఢీ కొనడం చూస్తుంటే .. భగవంతుని రాతను ఎవ్వరూ తప్పించలేరని ఈ ప్రమాదాన్ని చూసిన వారంతా అంటున్నారు. కేశవస్వామి ఆస్పత్రికి సమీపంలో ఉన్న జంక్షన్ వద్ద లారీని మలుపు తిప్పే క్రమంలో అటుగా వచ్చిన కారును ఢీ కొనడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. దీనితో అందులో ప్రయాణిస్తున్న వారంతా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదం గురించి లారీ డ్రైవర్ రాజానగరం పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో నార్త్ జోన్ డీఎస్పీ వై. శ్రీకాంత్, సీఐ వీరయ్యగౌడ్, ఎస్సైలు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ని క్రమబదీ్ధకరించి, ప్రమాదానికి గురైన రెండు వాహనాలను క్రేన్ల సాయంతో పక్కకు తొలగించారు. ప్రమాదానికి గురైన వారి వివరాలను తెలుసుకోవడంతోపాటు ప్రమాదానికి గల కారణాల పై ఆరా తీస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉందని సీఐ వీరయ్యగౌడ్ తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ లకంసాని ప్రసాద్కు కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో వెటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద విషయం తెలియగానే మృతుల కుటుంబీకులు, బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. మృతిచెందిన లకంసాని బిందు, ఉప్పులూరి ప్రసాద్, అతని భార్య లీలావతి, ఇమ్మని వీరవెంకటసత్యవతి మృతదేహాలకు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. టైర్ పంక్చర్ కాలేదు లారీ టైర్ పంక్చర్ కావడంతోనే కారుని ఢీకొట్టిందని చెబుతున్న మాటలు పూర్తి అవాస్తమని జిల్లా రవాణాశాఖాధికారి ఆర్.సురేష్ ఈ సందర్భంగా తెలిపారు. ఎక్కడా లారీ టైరు పేలిన దాఖలాలు లేవన్నారు. ప్రమాద స్థలికి సమీపంలో రవాణాశాఖాధికారులు వాహన తనిఖీలు చేస్తున్నారన్నారు. దాన్ని చూసి సడన్గా డ్రైవర్ లారీని తిప్పాడా...లేక క్లీనర్ లారీ డ్రైవ్ చేస్తున్నాడా అనేది తెలియాల్సి వుందని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 71 మీటర్ల మేర లారీ టైరు జారిపోయినట్లు గుర్తులు ఉన్నాయన్నారు. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి నివేదికను కలెక్టర్కు అందజేస్తామన్నారు. తెల్లారేసరికే మా కూతురు బతుకు తెల్లారిపోయింది దారవరానికి చెందిన లకంసాని సురేష్ కొవ్వూరులో అవంతి ఫీడ్స్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. దీంతో భార్య బిందుతో కలిసి కొవ్వూరులో అద్దెకు నివాసం ఉంటున్నాడు. ఈ ప్రమాదంలో సురేష్ కు తీవ్ర గాయాలు కాగా రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆసుపత్రిలో అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నారు. భార్య బిందు ఘటనా స్థలంలోనే మృతిచెందింది. చాగల్లుకు చెందిన బిందుకు, సురే‹Ùకు సుమారు ఆరేళ్ల క్రితం వివాహమైంది. మూడురోజుల క్రితం చాగల్లులో ఒక శుభాకార్యానికి హాజరై పుట్టింటికి వచ్చిందని, ఆదివారం రాత్రి ఫోన్ చేసి మాట్లాడిందని, సోమవారం అల్లుడు సురే‹Ùకు సెలవు కావడంతో బయటకు వెళ్లామని తనకు చెప్పిందని, తెల్లారిసరికి అనంతలోకాలకు తన కూతురు వెళ్లిపోయిందని తల్లి వెంకటలక్ష్మి, తండ్రి కొఠారు శ్రీను హృదయ విదారకంగా రోదిస్తున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
లక్షణంగా బదిలీలు
కార్యదర్శి స్థానానికి రూ.లక్ష కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలకు ఆనుకుని ఉన్న సెమీ అర్బన్ ప్రాంతాల్లో పోస్టుల కోసం ఉద్యోగులు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసుల కోసం వారి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పైరవీలు చేసుకుంటున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు తమ చేతికి మట్టి అంటకుండా షాడోలను రంగంలోకి దింపి పని చక్కబెడుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో ముఖ్య నేతల క్యాంపు కార్యాలయాల వద్ద సచివాలయ ఉద్యోగుల నుంచి వివిధ శాఖల ఉద్యోగుల వరకూ సిఫారసు లేఖల కోసం పడిగాపులు పడుతున్నారు. ఆ ప్రజాప్రతినిధులు కూడా అనుకూలమైన అధికారులను, సిబ్బంది తమ తమ నియోజకవర్గాల్లో కొలువుదీరేలా కుస్తీ పడుతున్నారు. చోటామోటా నేతలు కూడా సిఫారసు లేఖలు ఇప్పిస్తామంటూ ఉద్యోగుల నుంచి సొమ్ము గుంజుతున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో కార్యదర్శి సీటు కోసమే కూటమి నేతలు రూ.లక్ష వరకు రేటు ఫిక్స్ చేసి లాగేస్తున్నారు. ● చేయి తడపందే పోస్టింగ్లు లేవు ● సిఫారసు లేఖల్లో సిత్రాలెన్నో.. ● సెమీ అర్బన్కు డిమాండ్ ● చక్రం తిప్పుతోన్న షాడోలు సాక్షి ప్రతినిధి, కాకినాడ: నేతల సిఫారసు లేఖలు (ఉత్తరం), సొమ్ము ముట్టజెప్పడం (దక్షిణం) లేకుండా బదిలీల ఫైళ్లు ముందుకు కదలడం లేదు. కూటమి ప్రభుత్వం బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దగ్గర నుంచి కోరుకున్న చోటు కోసం ఉద్యోగులు నేతలను ప్రసన్నం చేసుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు. నేతల సిఫారసు లేఖల కోసం క్యాంపు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బదిలీల వ్యవహారాల్లో నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధుల అనుచరులు చక్రం తిప్పుతున్నారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, భార్యాభర్తలకు బదిలీల్లో వెసులుబాటు కల్పించారు. ఈ నేపథ్యంలో బదిలీలు అనివార్యం అనుకున్న వివిధ శాఖల ఉద్యోగులు జిల్లా కేంద్రానికి అందుబాటులో ఉన్న కేంద్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఉదాహరణకు జిల్లా కేంద్రం కాకినాడలో పనిచేస్తున్న ఉద్యోగులు సమీప మండలాలైన కరప, కాకినాడ, పెదపూడి, సామర్లకోట వంటి ప్రాంతాల్లో బదిలీలు ఆశిస్తున్నారు. ఇందుకు ఆయా మండలాల్లో అధికార కూటమి నేతలు, ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకోవడంలో బిజీబిజీగా కనిపిస్తున్నారు. చేయి తడపందే నేతల సిఫారసు లేఖలు చేతిలో పెట్టడం లేదంటున్నారు. 2వ తేదీ వరకూ అవకాశం రెండేళ్లు నిండిన వారు బదిలీలకు అర్హులు కాగా, ఐదేళ్లు నిండినవారు తప్పనిసరిగా బదిలీ కావాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. అన్ని శాఖల్లో బదిలీలకు వచ్చే నెల 2వ తేదీ వరకూ అవకాశం ఇస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో ఉద్యోగులు తమకు అనువైన ప్రాంతాల్లో పోస్టు దక్కించుకోవటం కోసం నానా పాట్లు పడుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు, కూటమి నేతలను ప్రసన్నం చేసుకోవడం ద్వారా అనుకున్న ప్రాంతాల్లో పోస్టింగులను ఖాయం చేసుకుంటున్నారు. పలు నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు తమకు ఎటువంటి ప్రమేయం లేదన్నట్టు బిల్డప్ ఇస్తూ అనుచరుల ద్వారా సిఫారసు లేఖలు చేతిలో పెడుతున్నారు. ఈ వ్యవహారంలో అందినంతా జేబులో వేసుకుంటున్నారంటున్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని విభాగాలు కలిపి సుమారు 54 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 10 నుంచి 15 శాతం అంటే ఏడేనిమిది వేల మందికి బదిలీలు జరుగుతున్నాయని అంచనా. మొత్తం బదిలీల్లో సింహభాగం వైద్య, ఆరోగ్య శాఖలోనే జరుగుతున్నా యి. తరువాతి స్థానంలో ఉపాధ్యాయులున్నారు. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు నేటితో ముగియనున్న గడువు ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో ఇన్ని చిత్రాలు జరుగుతుంటే ఉపాధ్యాయుల బదిలీలు కూడా ఊపందుకున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 15,400 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 2023 తరువాత బదిలీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్, ప్రధానోపాధ్యాయులకు బదిలీలు జరుగుతున్నాయి. ఇందులో ఒకేచోట ఐదేళ్లు దాటి పనిచేస్తున్న వారికి బదిలీలు చేస్తున్నారు. మొత్తం అన్ని విభాగాలకు సంబంధించి సుమారు 3,696 మంది బదిలీలకు అర్హులుగా విద్యాశాఖ తేల్చింది. ఉపాధ్యాయులు, గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల బదిలీల దరఖాస్తుల గడువు ఈ నెల 22తో ముగిసింది. ప్రస్తుతం జరుగుతున్న స్కూల్ అసిస్టెంట్లు బదిలీ దరఖాస్తుల ప్రక్రియ కూడా వాస్తవంగా శనివారంతో ముగియాలి. ఒక్క రోజు గడువు ఇవ్వడంతో ఆదివారం రాత్రితో ముగిసింది. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీలకు దరఖాస్తు గడువు ఈ నెల 27 తేదీ ముగియనుంది. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకున్నారు. కౌన్సెలింగ్ మాత్రం మాన్యువల్గానే నిర్వహించనున్నారు. ఈ నెల 27 తేదీ అర్ధరాత్రికి ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో బదిలీల ప్రక్రియను నిర్వహిస్తున్న కాకినాడ జిల్లా విద్యాశాఖ వద్ద నిర్ధారణ కానుంది. అనంతరం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారిని కాకినాడ డీఈఓ కార్యాలయానికి పిలుస్తారు. మొదట మండలం, తరువాత స్కూల్ను స్క్రీన్పై ప్రదర్శిస్తే ఉపాధ్యాయులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు మరో రెండు రోజులు మిగిలి ఉంది. సామాజికవర్గాల వారీగా యత్నాలు ప్రధానంగా కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలకు ఆనుకుని ఉన్న ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీల్లో పోస్టింగ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో సామాజికంగా తమ వర్గం వారిని నియమించుకునేందుకు నియోజకవర్గ నేతలు పట్టుబడుతున్నారు. కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పెద్దాపురం, రాజమహేంద్రవరం సిటీ, రూరల్తో పాటు అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం, సామర్లకోట తదితర మున్సిపాలిటీల్లో పోస్టింగ్లకు డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. రెండు బలమైన సామాజికవర్గాల నేతలు తమ వారి కోసం ఎమ్మెల్యేల వద్దకు సిఫారసు లేఖల కోసం క్యూ కడుతున్నారు. అర్హతలతో పాటుగా పని విధానం, సీనియార్టీ చూడకుండా కేవలం సామాజిక అంశాన్ని ప్రామాణికంగా సిఫారసు రావడంతో అధికారులు విస్తుపోతున్నారు. -
సహజ వనరుల పరిరక్షణకు కమిటీ ఏర్పాటు
అమలాపురం టౌన్: సహజ వనరులు, ప్రకృతి సహజ సంపద పరిరక్షణకు జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటైంది. గ్యాస్, చమురు, ఖనిజ, ప్రకృతి వనరుల పరిరక్షణ సమితి ఈ జిల్లా కమిటీని నియమించింది. జిల్లా నూతన కమిటీని సమితి కన్వీనర్, ఏపీ రైతు సంఘం జిల్లా కో–ఆర్డినేటర్ కె.సత్తిబాబుతో పాటు, ప్రతినిధులు స్థానిక ప్రెస్ క్లబ్లో భవనంలో సోమవారం సాయంత్రం ప్రకటించారు. కమిటీ జిల్లా కన్వీనర్గా ఉండవిల్లి గోపాలరావు, కో–కన్వీనర్లుగా గండి ఏసుదాసు, జాలెం సుబ్బారావు, సభ్యులుగా రాపాక రత్నరాజు, ఒంటెద్దు వెంకన్నాయుడు, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, బండారు రామమోహనరావు, దేవ రాజేంద్రప్రసాద్, పులపర్తి సురేష్ నియమితులయ్యారు. జిల్లాలోని సహజ వనరు లు ప్రజల ఆస్తి యాజమాన్య హక్కుగా ఉండాలని నూతన కమిటీ సమవేశం తీర్మానించింది. పలు అంశాలపై చర్చించి, వాటి కార్యాచరణపై ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించింది. -
రోడ్డెక్కిన ఎండీయూ ఆపరేటర్లు
● వాహనాలతో గడియార స్తంభం వద్ద ధర్నా ● అన్యాయంగా పొట్ట కొట్టారంటూ ఆవేదన సామర్లకోట: బడుగు, బలహీన వర్గాలలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి గత ప్రభుత్వం ఎండీయూ వాహనాలను ఏర్పాటు చేస్తే వాటిని కూటమి ప్రభుత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఎండీయూ వాహనదారులు సోమవారం రోడ్డెక్కారు. జూన్ ఒకటి నుంచి రేషన్ వాహనాలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. స్థానిక మెహర్ కాంప్లెక్స్ నుంచి ఎండీయూ వాహనాల సైరన్తో స్థానిక గడియారం స్తంభం వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. ఎండీయూ ఆపరేటర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. తమ వాహనాల ద్వారా రేషన్ సరకులు ఇచ్చే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన చేయడం తమ పొట్ట కొట్టడమేనని ఎండీయు వాహనాల సంఘ అధ్యక్షుడు దర్శిపాటి సత్యానందం ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తరువాత తమతో ఒక సమావేశం ఏర్పాటు చేసి రేషన్ వాహనాలను తొలగిస్తున్నట్లు చెప్పారన్నారు. అయితే మాకు వాహనాల ద్వారా సరకులు పంపే హక్కు ఫిబ్రవరి 2027 వరకు ఉందని చెప్పామన్నారు. ఎండీయూ వాహనాల ద్వారా సరకులు సరఫరా సక్రమంగా జరగడం లేదనే ఆరోపణలు సరికాదన్నారు. తాము అవకతవకలకు పాల్పడుతున్నట్లు రుజువు అయితే తామే స్వచ్ఛందంగా తొలగిపోతామని చెప్పారు. రేషన్ వినియోగదారులల్లో 78 శాతం మంది వాహనాల ద్వారా సరకులు సరఫరా చేయాలని కొరుకొంటున్నారనే విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వాహనాల రద్దుకు జీఓ చేయడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని ఎండీయూ వాహన యజమానులు ధర్నాలో పాల్గొన్నారు. ముఖ్యకూడలి ప్రదేశంలో ఽవాహనాలతో ధర్నా చేయడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
ఏయూ డిగ్రీ ఫలితాల్లో ‘ఆదిత్య’ ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆంధ్రా యూనివర్సిటీ విడుదల చేసిన డిగ్రీ ఫలితాల్లో తమ విద్యార్థులు 1, 2, 3 ర్యాంకులతో పాటు, నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి సోమవారం తెలిపారు. బీసీఏ విభాగంలో దున్నా ధనలక్ష్మి మొదటి ర్యాంక్, ఎ.పావని ఏ.క్యాతిశ్రీ రెండో ర్యాంక్, బి.శిరీష మూడో ర్యాంక్, జి.రిపిక మూడో ర్యాంక్ సాధించారన్నారు. బీబీఏ నుంచి కె.మహిత రెండో ర్యాంక్, వి.మౌనిక మూడో ర్యాంక్, జి.వెంకటసాయికీర్తి మూడో ర్యాంక్, బీఎస్సీలో ఎం.యమున ఫస్ట్ ర్యాంక్, సత్తి మోనిక విషాల్ మూడో ర్యాంక్, బీకామ్ నుంచి పి.హరిప్రియ రెండో ర్యాంక్, పి.పల్లవి మూడో ర్యాంక్ సాధించారని చెప్పారు. యూనివర్సిటీ తరఫున ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఏయూ రిజిస్ట్రార్ ఈఎన్ ధనుంజయరావు అభినందనలు తెలిపారు. ఆదిత్య కళాశాల ఉన్నత విద్యా ప్రమాణాలు, అధ్యాపకుల కార్యదక్షతను కొనియాడారు. విద్యాసంస్థల కార్యదర్శి ఎన్.సుగుణారెడ్డి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. 2024–25లో ఇప్పటి వరకూ జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 15,120 మంది విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. యువతి ఆత్మహత్య ఉప్పలగుప్తం: పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వ్యక్తి మోసం చేయడంతో మనస్తాపానికి గురైన యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇది. మండలంలోని ఎస్.యానం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై సీహెచ్ రాజేష్ వివరాల మేరకు, ఎస్.యానం పెదపేటకు చెందిన మట్టా సునీత(24) ఆదివారం సాయంత్రం ఇంటి పక్కనున్న రేకుల షెడ్డులో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సూసైడ్ నోట్, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన ఓ వివాహితుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేయడంతో మనస్తాపానికి గురై తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆమె తండ్రి నకులుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పోలీసులు అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేష్ తెలిపారు. యువకుడిని బలిగొన్న లారీ పెరవలి: లారీ రూపంలో రహదారిపై చీకట్లో పొంచి ఉన్న మృత్యువును ఆ యువకుడు గమనించలేకపోయాడు. ఫలితంగా రాంగ్ రూట్లో, హెడ్లైట్లు కూడా వేయకుండా దూసుకొచ్చిన లారీ అతడి ప్రాణాన్ని కబళించింది. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు, పెరవలి మండలం తీపర్రు గ్రామానికి చెందిన కుంపట్ల పెద వీరన్న(24) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ, కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఆదివారం కాకరపర్రులో పనికి వెళ్లి, రాత్రి 10.30 సమయంలో మోటార్ బైక్పై స్వగ్రామానికి తిరిగి పయనమయ్యాడు. మార్గం మధ్యలో రహదారిపై ఓ లారీ హెడ్ లైట్లు వేయకుండా రాంగ్ రూట్లో ఆగి ఉంది. లైట్లు వేయకుండానే ఆకస్మికంగా ఆ లారీని ముందుకు దూసుకురావడంతో.. అటుగా మోటార్ బైక్పై వచ్చిన పెద వీరన్న అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు అతడి తండ్రి కుంపట్ల వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబాన్ని మంత్రి కందుల దుర్గేష్ పరామర్శించారు. -
స్ట్రాంగ్మన్గా జగన్.. స్ట్రాంగ్ వుమన్గా వందన
ఉభయ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలుఅమలాపురం టౌన్: అమలాపురం హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్, స్పోర్ట్స్ క్లబ్ అసోసియేషన్ సంయుక్తాధ్వర్యంలో స్థానిక సర్ సీవీ రామన్ స్కూలు ప్రాంగణంలో ఆదివారం జరిగిన మూడో యునైటెడ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరీస్ పవర్ లిఫ్టింగ్ పోటీలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. కేటగిరీల వారీగా విజేతలకు బహుమతీ ప్రదానం జరిగింది. తుది ఫలితాలను హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు సోమవారం వెల్లడించారు. స్ట్రాంగ్మన్ విన్నర్గా ఎం.జగన్ (కాకినాడ), స్ట్రాంగ్మన్ రన్నర్గా కె.శివకుమార్ (కాకినాడ), స్ట్రాంగ్ వుమన్ విన్నర్గా పి.వందన (అమలాపురం), స్ట్రాంగ్ వుమన్ రన్నర్గా బి.అఖిల (రామచంద్రపురం) నిలిచారు. అలాగే స్ట్రాంగ్ మాస్టర్ విన్నర్గా డి.నాగేశ్వరరావు (రామచంద్రపురం), స్ట్రాంగ్ మాస్టర్ రన్నర్గా బి.అప్పన్న (అమలాపురం) సాధించారు. టీమ్ చాంపియన్షిప్ విన్నర్గా కాకినాడ, టీమ్ చాంపియన్షిప్ రన్నర్గా అమలాపురం కై వసం చేసుకున్నాయి. ఈ పోటీల్లో విజేతలు 24 మంది వచ్చే నెల ఒంగోలులో జరిగే రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికై నట్టు కోచ్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. -
బలసిరి.. కొత్త వరి
పిఠాపురం: రంగు.. రుచి.. వాసన.. ఇదేదో వాణిజ్య ప్రకటన అనుకుంటే పొరపాటే. వరిలోనూ ఇటువంటి లక్షణాలున్న బియ్యం అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఇటువంటి బియ్యం ఉన్నాయని చెబితే.. ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు. ఇటువంటి అనేక రకాల కొత్త వంగడాలను ఇక్కడి రైతులు పండిస్తూ అందుబాటులోకి తెస్తున్నారు. అత్యధిక పోషక విలువలున్న వరి వంగడాలను ఉత్పత్తి చేయడానికి ప్రకృతి వ్యవసాయ రైతులు నడుం బిగించారు. అరుదైన వరి రకాలు గతంలో రాష్ట్రేతర ప్రాంతాల నుంచి తెచ్చే స్థానిక రైతులు.. ఇప్పుడు కాకినాడ జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు పలు రకాల వరి వంగడాలను ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. ఇక్కడ పండించిన అరుదైన వరి రకాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వర స్వామివారి నైవేద్యానికి సైతం ఉపయోగిస్తుండడం విశేషం. ఈ అరుదైన రకాల్లో నవారా, ఇంద్రాణి, కాలపట్టి, డెహ్రాడూన్ రెడ్ రైస్, పరిమళ సన్న, బర్మా బ్లాక్, రత్నచొడి, రక్తసాలి, చింతలూరు సన్నాలు, కూజి, పాటలియా, బాస్బోగ్, కామిని బోగ్, మైసూర్ మల్లిగ, సిద్ధ సన్నాలు, కోమల్ సాల్ వంటి రకాలున్నాయి. జిల్లాలో సుమారు 25 హెక్టార్లలో 30 మంది రైతులు సేంద్రియ పద్ధతిలో అరుదైన వరి రకాలను పండిస్తున్నారు. జిల్లాలో అరుదైన రకాలివే.. ● రక్తసాలి రక్త హీనతతో బాధపడుతున్న వారికి మంచి ఆహారం. ఈ బియ్యం తినడం వల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది. మూడు వేల ఏళ్ల నుంచి ఇది వాడుకలో ఉంది. ● కూచి పట్టాలియా బాగా సన్నగా ఉంటుంది. తినడానికి బాగుంటుంది. పోషకాలు ఎక్కువ. ● నవరను కింగ్ ఆఫ్ రైస్ అంటారు. ప్రస్తుతం దేశంలో లభించే బియ్యంలో అత్యంత పోషక విలువలున్న ఆహారం. సుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచి ఆహారం. దీనిని రోజూ తింటే సుగర్ నార్మల్కు వస్తుంది. మోకాళ్ల నొప్పులూ తగ్గిస్తుంది. ● ధూదేశ్వర్ అనే దేశీయ వరి విత్తనం. గాలులకు పడిపోని సన్న రకం. పంటకాలం సుమారు 120 రోజులు. ఇది తెలుపు రంగులో ఉంటుంది, బాలింతలకు శక్తినిచ్చి, తల్లులకు, పిల్లలకు అధిక పోషకాలు అందిస్తుంది. పాల వృద్ధి, పిల్లల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ● ఇంద్రాణి అనేది దేశీయ వరిరకం. సువాసన ఉండే ఈ రకం పంట కాలం సుమారు 130 రోజులు. పాయసం, పులిహోర, పలావు, దద్దోజనానికి అనుకూలమైంది. ● రత్నచొడి అనే దేశీయ వరి విత్తనం. తెలుపు రంగులో ఉండే సన్న రకం. పంట కాలం సుమారు 135 రోజులు. అధిక పోషక విలువలు కలిగి, కండపుష్ఠి, శరీర ధారుడ్యం పెంచి, మంచి పోషకాలు కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తి కలిగిస్తుంది. పూర్వకాలంలో సైనికులకు ఆహారంగా ఇచ్చేవారు. ● కుజీపటాలియా అనేది దేశీయ విత్తనం. సన్న రకం. పంటకాలం సుమారు 120 రోజులు. గాలులకు పడిపోదు. కొవ్వు రహిత, సోడియం లేనివి. తక్కువ కేలరీలు, గ్లూకోజ్ తక్కువగా ఉండి, రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ● కేత్రీ మహరాజ్ సెంటెడ్ వైరెటీ. గింజ పొడవుగా ఉంటుంది. పంటకాలం సుమారు 130 రోజులు. పాయసం, దద్దోజనం, పులిహోర పలావులకు బాగుంటుంది. ● మైసూరు మల్లిగ దేశీయ విత్తనం. తెల్లని రంగు, గాలులకు పడిపోని సన్నని గింజ. పంట కాలం సుమారు 120 రోజులు. ఎదిగే పిల్లలకు అధిక పోషకాలు, ప్రొటీన్లు అందిస్తుంది. ● ఘని అనే దేశీయ వరి రకం. చిన్న గింజ. పంటకాలం సుమారు 130 రోజులు. అధిక ఫైబర్, కాల్షియం కలిగి ఉంటుంది. స్పాండిలైటిస్, మోకాళ్ల నొప్పులు తగ్గించే ఆహార ఔషధంగా గుర్తింపు పొందింది. ● కుంకుమసాలి.. కుంకుమ పువ్వు, రక్తసాలి మొదలైన విత్తనాలు ఒకే కోవకు చెందిన దివ్యమైన ఔషధాలు. ఇవి రక్తంలోని మలినాలను శుభ్రం చేసి, వాత, పిత్త, కఫాలను సమపాళ్లలో ఉంచే దివ్యమైన ఆహార ఔషధాలు. జిల్లాలో పెరిగిన కొత్త విత్తనాభివృద్ధి అందుబాటులోకి ఆధునిక వరి వంగడాలు విత్తనాభివృద్ధికి ప్రా‘ధాన్యం’ ఆన్లైన్లోనూ విక్రయాలు ఆరోగ్యదాయక సాగుపై ప్రకృతి రైతుల ఆసక్తి చాలా డిమాండ్ ఉంది పన్నెండేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రాణప్రదంగా చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో పండించిన అరుదైన రకాల ధాన్యం తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వర స్వామివారికి నైవేద్యంగా ఉపయోగించడానికి ఇస్తున్నాను. సాధారణ రకాల కంటే.. మంచి డిమాండ్ ఉన్న అరుదైన రకాలను సాగు చేస్తున్నాను. ఇతర ప్రాంతాల నుంచి వివిధ రకాల విత్తనాలు తెచ్చి, విత్తనాభివృద్ధి చేస్తున్నాను. కేవలం విత్తనాలకు మాత్రమే వీటిని పండిస్తున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కొనుగోలు చేస్తున్నారు. వీటిని ఆన్లైన్ ద్వారా పంపిస్తున్నాం. ఈ బియ్యానికి మంచి డిమాండ్ ఉండడంతో ఆదాయం బాగుంటుంది. నాతో పాటు జిల్లాలో చాలా మంది రైతులు వీటి సాగు ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల రైతులూ నా వద్ద విత్తనాలు తీసుకుంటున్నారు. – అడపా వెంకటరమణ, ప్రకృతి వ్యవసాయ రైతు, భోగాపురం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా విత్తనం కోసమే పండిస్తున్నా... ప్రకృతి వ్యవసాయంలో పలు రకాల ధాన్యాన్ని పండిస్తున్నాను. కేవలం విత్తనాల కోసం కొన్ని అరుదైన రకాలు పండిస్తున్నాను. ఎవరైనా విత్తనాలకు అడిగితే ఉచితంగా ఇస్తున్నాను. అరుదైన రకాలు మంచి ఫలితాలు ఇస్తుండడంతో చాలా మంది ఆన్లైన్ ద్వారా తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. చాలా మంది రైతులు వీటి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఎకరం పొలంలో పది రకాల అరుదైన రకాలను పండిస్తున్నాను. మన ప్రాంతంలో వీటిని పరిచయం చేయాలన్న ఆలోచనతో సాగు చేస్తున్నాను. ఈ సాగంతా పాతకాల పద్ధతిలోనే చేయాలి. యంత్రాలతో సాధ్యం కాదు. కేవలం చేతితో కొట్టి, నూర్చి, ఆరబెట్టడం ద్వారా మంచి విత్తనం తయారవుతుంది. – ఉల్లి సురేష్, ప్రకృతి వ్యవసాయ యువ రైతు, కొత్తపల్లి, కాకినాడ జిల్లా -
పంట కొనే నాథుడే లేడు
ప్రకృతి కన్నెర్రకు, కూటమి ప్రభుత్వ నిర్వాకం తోడవడంతో రబీ రైతులు కుదేలయ్యారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ సీజన్లో దిగుబడులు బాగున్నాయనుకున్న తరుణంలో ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం రైతన్నకు పెను శాపమైంది. ఎక్కడి ధాన్యం అక్కడే రోడ్ల పైన, కళ్లాల్లో ఉండిపోవడంతో అకాల వర్షాలకు తడిసి ముద్దయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఖరీఫ్ సీజన్ ఆసన్నమై సాగుకు సమాయత్తమయ్యే తరుణంలో ఇంకా కళ్లాల్లో కనిపిస్తున్న తడిసిన ధాన్యం చూసి రైతులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తడిసిన ధాన్యంతో రైతులు రోడ్డెక్కి ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగడంతో ప్రభుత్వం అదనంగా ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ జిల్లా జగ్గంపేట, పెద్దాపురం మండలాలు సహా పలు ప్రాంతాల్లో కళ్లాల్లో ఉన్న తడిసిన ధాన్యం వద్ద ఫొటోలకు పోజులిచ్చారే తప్ప అదనంగా ఒక్క గింజ కొంటే ఒట్టని రైతులు మండిపడుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కాకినాడజగన్ హయాంలో తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోళ్లురబీలో వరి కోతలు ముమ్మరంగా జరిగినప్పుడు ధాన్యాన్ని అక్కడక్కడ కొద్దోగొప్పో కొనుగోలు చేసిన ప్రభుత్వం.. వర్షాలు పడి తడిసి ముద్దయ్యే సరికి చేతులెత్తేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాదిరిగా తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేసి ఉంటే రబీ సీజన్ ముగుస్తున్నా రోడ్లపైన, కళ్లాల్లోను ధాన్యం కనిపించేదే కాదని రైతులు అభిప్రాయపడుతున్నారు.జిల్లాల వారీగా పరిస్థితి ఇదీ... కాకినాడ జిల్లాలో రబీలో 1.60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఐదున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో రబీ సీజన్ చివరి దశకు వచ్చేసరికి 3.40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు జిల్లా యంత్రాంగం చెబుతోంది. మిగిలిన ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో 2.50 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలనేది లక్ష్యం కాగా 2,63,076 మెట్రిక్ టన్నులతో లక్ష్యాలను అధిగమించామని కొనుగోళ్ళు ఆపేశారు. కోనసీమ జిల్లాలో 5,86,616 మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా కాగా, రెండు లక్షల మెట్రిక్టన్నుల కొనుగోలుకు మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. ఆరబెట్టుకున్న ధాన్యానికి..మొలకలు గడచిన ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై ఆరబెట్టుకున్న ధాన్యం మొలకలెత్తడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇక కొనుగోలు చేసిన కొద్దో గొప్పో ధాన్యం విషయానికి వస్తే, 75 కేజీల బస్తా ధాన్యం రూ.1,725కు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రచారార్భాటమే తప్ప క్షేత్ర స్థాయిలో రూ.1,250 మించి ఎక్కడా కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. అటుకులు ఆడించుకోవాల్సిన దుస్థితి ఆరబెట్టుకుంటుండగా కురిసిన అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి మొలకలు వచ్చాయి. కొనడానికి దళారులు కూడా రావడం లేదు. దిక్కుతోచని పరిస్థిథతుల్లో తడిసిన ధాన్యాన్ని అటుకులు ఆడించుకోవాల్సిన దుస్థితి దాపురిస్తుందనే భయమేస్తోంది. – టి.సత్యనారాయణ, రైతు, తిమ్మాపురం, కాకినాడ రూరల్ మండలంతక్కువ రేటుకైనా కొనడం లేదు వర్షం కారణంగా రాశుల్లో ఉన్న దానితో పాటు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం కూడా తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని కనీసం తక్కువ రేటుకైనా కొనుగోలు చేసేందుకు ఏ కమీషన్ ఏజెంటూ ముందుకు రావడం లేదు. – కె.అప్పారావు, రైతు, అచ్చంపేట, సామర్లకోట మండలం, కాకినాడ జిల్లా -
సినీ పరిశ్రమ వివాదంలోకి నన్ను లాగొద్దు: ద్వారంపూడి
సాక్షి, కాకినాడ జిల్లా: సినీ పరిశ్రమ వివాదంలోకి తనను లాగొద్దంటూ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. సినిమా థియేటర్ల బంద్ తో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆరోపణలొద్దు.. ఆధారాలు ఉంటే చూపించండి’’ అని తేల్చి చెప్పారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రం విడుదల కాకుండా తనతో పాటుగా కొంత మంది సిని నిర్మాతలు కుట్ర పన్నారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు.‘‘నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలను ఏ మాత్రం ధ్రువీకరించు కోకుండా కొన్ని మీడియా సంస్థలు వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాజకీయాలలో ఉన్నాననే అక్కసుతో ఏదో వివాదంలోకి లాగడం ఎంత వరకు సమాంజసం?’’ అంటూ చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. -
తొలి తిరుపతిలో భక్తుల రద్దీ
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. సుమారు 12 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన టికెట్ల ద్వారా స్వామివారికి రూ.2,71,118 ఆదాయం సమకూరిందని ఈఓ వివరించారు. వైభవం.. నారసింహుని కల్యాణం సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహుని ఆలయంలో శనివారం ఆర్జీత సేవగా స్వామివారి శాంతి కల్యాణం వైభవంగా జరిగింది. తొలుత ఆలయంలోని కల్యాణ మండపంలో ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. అనంతరం స్వామివారి శాంతి కల్యాణం విష్వక్సేన పూజతో అర్చకులు ప్రారంభించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యాన స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, అర్చకుడు పెద్దింటి వెంకట శ్రీనివాస్ ఈ కల్యాణం జరిపించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ పర్యవేక్షించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తులకు దేవస్థానం లడ్డూ ప్రసాదం ఇచ్చి, భోజన సౌకర్యం కల్పించింది. మహా జ్యేష్టాభిషేకం ఏర్పాట్లపై సమీక్ష అంతర్వేది క్షేత్రంలో లక్ష్మీనరసింహ స్వామివారి మూలవరులకు వచ్చే నెల 11న జ్యేష్ట నక్షత్రం సందర్భంగా నిర్వహించనున్న మహా జ్యేష్టాభిషేక ఏర్పాట్లపై ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ, అర్చకులతో సమీక్షించారు. ఈ మేరకు శనివారం అంతర్వేది దేవస్థానం కార్యాలయంలో అర్చకులతో చర్చించారు. సప్త నదులైన గంగ, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, గోదావరి జలాలతో స్వామి మూలవర్లకు మహా జ్యేష్టాభిషేకం వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ అభిషేకంలో పాల్గొనేందుకు టిక్కెట్ రూ.400గా నిర్ణయించామన్నారు. సూపరింటెండెంట్ పి.విజయ సారథి, ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, వేద పండితుడు చింతా వెంకటశాస్త్రి, అర్చకులు పెద్దింటి వెంకట శ్రీనివాస్, ఎస్బీఎం రమేష్ పాల్గొన్నారు. స్వామిని చూసి.. మది మురిసిమామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయం శనివారం భక్తులతో కోలాహలంగా మారింది. స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. తెల్లవారు జామున అర్చకులు సుప్రభాత సేవ, వేద మంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తొలి హారతిని కనుల పండువలా జరిపించారు. విశేష సంఖ్యలో హాజరైన భక్తులు తొలి హారతిని దర్శించుకున్నారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.3.49,554 ఆదాయం వచ్చిందని ఈఓ ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. స్వామి వారిని 5,500 మంది స్వామి దర్శించుకోగా, నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.93,351 ఆదాయం వచ్చిందని తెలిపారు. -
ఎక్కడ కలవాలి.. వినతి ఎవరికివ్వాలి..
మున్సిపల్ కార్మికులకు పిఠాపురంలో భంగపాటు పిఠాపురం: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్కు పిఠాపురంలో శనివారం వింత పరిస్థితి ఎదురైంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు వినతిపత్రం అందజేయడానికి మున్సిపల్ కార్మికులు కాకినాడ నుంచి గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని పవన్ కల్యాణ్ తాత్కాలిక నివాసానికి పాదయాత్రగా బయలుదేరారు. అయితే, పిఠాపురం వచ్చేసరికి చేబ్రోలులోని ఇంటిని పవన్ కల్యాణ్ ఖాళీ చేసేశారని తెలిసింది. దీంతో, ఎవరిని, ఎక్కడ కలవాలంటూ వారు తర్జనభర్జనలు పడ్డారు. పిఠాపురంలో కూడా పవన్ కల్యాణ్కు అధికారిక కార్యాలయం లేదని తెలియడంతో అవాక్కయ్యారు. అంత కష్టపడి వచ్చి, కనీసం జనసేన ఇన్చార్జికై నా వినతిపత్రం ఇద్దామనుకుంటే ఆయన కూడా అందుబాటులో లేరని తెలిసి తలలు పట్టుకున్నారు. చేసేదేమీ లేక పిఠాపురంలోని జనసేన పార్టీ పట్టణ కార్యాలయంలో స్థానిక నాయకుడికి వినతిపత్రం ఇచ్చి వెనుదిరిగారు. ఏ నియోజకవర్గంలో చూసినా ప్రతి ఎమ్మెల్యేకూ అధికారిక కార్యాలయం ఉంటుంది. అలాంటిది ఉప ముఖ్యమంత్రికి ఆయన ఎన్నికై న నియోజకవర్గం పిఠాపురంలో కార్యాలయం లేకపోవడమేమిటంటూ కార్మికులు అసహనం వ్యక్తం చేశారు. కార్యాలయం లేకపోతే ప్రజలు తమ సమస్యలపై ఎక్కడ ఎవరిని కలవాలని ప్రశ్నించారు. తమ బాధలు చెప్పుకుని ఆదుకోవాలని అడుగుదామంటే చెప్పుకోవడానికి సరైన నాయకుడు లేక నిరాశతో వెళ్తున్నామని అసహనం వ్యక్తం చేశారు. -
6 వేల హెక్టార్లలో ఆయిల్పామ్ సాగు
కాకినాడ సిటీ: జిల్లా వ్యాప్తంగా 6 వేల హెక్టార్లలో ఆయిల్పామ్ సాగుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులతో కలెక్టరేట్ నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఆయిల్పామ్ సాగు చేసే రైతులు తప్పనిసరిగా నీటిగుంతలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. ఐదెకరాల్లోపు సాగు చేసే చిన్న రైతులకు ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటేందుకు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ఆయిల్పామ్ రైతులకు విద్యుత్తు కనెక్షన్లు త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. బోర్ల ద్వారా వరి, మల్బరీ సాగు చేసే రైతులు ఆయిల్పామ్ సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని అన్నారు. గృహ నిర్మాణంపై దృష్టి పెట్టాలని, లబ్ధిదారులకు ఆప్షన్–3 కింద ఇళ్లు నిర్మిస్తున్న కాంట్రాక్టర్లు నిర్దేశిత నిర్మించకపోతే మెమోలు జారీ చేసి, బ్లాక్లిస్టులో పెడతామని హెచ్చరించారు. అర్హులైన కౌలుదారులందరికీ సీసీఆర్ కార్డులు మంజూరు చేయాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీ వర్గాల ప్రజలకు ఉచితంగా సోలార్ రూఫ్టాప్ ప్యానల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి జేసీ రాహుల్ మీనా, డీఆర్ఓ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. ఈఏపీ సెట్కు 95.67 శాతం హాజరు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఈఏసీ సెట్ ఆన్లైన్ పరీక్ష ఆరో రోజైన శనివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి నిర్వహించిన ఈ పరీక్షకు 862 మంది హాజరు కాగా 39 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీ డియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉన్నందున ఇంటర్ బోర్డు లేదా సెంట్రల్ బోర్డు విడుదల చేసిన మార్కుల జాబితాను ఈ నెల 30వ తేదీలోగా ఈఏపీ సెట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కన్వీనస్ వీవీ సుబ్బారావు సూచించారు. -
పట్టుంచుకోవడం మానేసారు
● వినతి ఇద్దామంటే అపాయింట్మెంటు ఇవ్వని జనసేన నేతలు ● అగమ్యగోచరంగా పట్టు రైతుల పరిస్థితి పిఠాపురం: తమ సమస్యలు పరిష్కరించాలంటూ పట్టు రైతులు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూండగా.. మరోవైపు అధికారులు, ప్రజాప్రతినిధులు వారిని పట్టించుకోవడం మానేశారు. దీంతో ఎవరి వద్దకు వెళ్లాలో తెలియక పట్టు రైతులు నానా ఇబ్బందులూ పడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన పట్టు రైతులు ఇటీవల జిల్లా ఉన్నతాధికారులకు గ్రీవెన్సులో వినతిపత్రం ఇస్తే.. లాభసాటిగా లేనప్పుడు వేరే పంట సాగు చేసుకోవచ్చు కదా అంటూ సలహా ఇచ్చారు. దీంతో, ఆందోళనకు గురైన పట్టు రైతులు నాలుగు రోజులుగా సమావేశాలు నిర్వహించుకుని, తమ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. తొలుత జనసేన పిఠాపురం ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్కు సమస్యను వివరించిన తరువాత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని భావించారు. ఈ క్రమంలో నాలుగు రోజులుగా కలిసేందుకు ప్రయత్నిస్తున్నా మర్రెడ్డి శ్రీనివాస్ అపాయింట్మెంటు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే అందుబాటులో లేరంటూ తప్పించుకుంటున్నారని విమర్శిస్తున్నారు. చేబ్రోలును సిల్క్ హబ్. సిల్క్ సిటీ చేస్తానని హామీ ఇచ్చిన పవన్ ముందు తమ బాధలు వినిపించడానికి అవకాశం ఇవ్వాలనుకుంటే కనీసం కలవడానికి కూడా ఇష్టపడకపోవడం చూస్తూంటే సమాధానం చెప్పలేని పరిస్థితిలో జనసేన నేతలున్నట్లు అర్థమవుతోందని పట్టు రైతులు విమర్శిస్తున్నారు. పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చాక ప్రతి రోజూ తమకు గండంగానే ఉందని వాపోతున్నారు. రూ.లక్షల పెట్టుబడితో చేపట్టిన పట్టు సాగును ఇప్పుడు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలోకి నెట్టేసి, తమతో ఆటలాడుతున్నారని, ఇక ప్రత్యక్ష పోరాటమే శరణ్యమని అంటున్నారు. -
కూటమి ప్లాన్.. అట్టర్ఫ్లాప్
● ఉమ్మడి జిల్లాలో నిలిచిపోయిన నిర్మాణాలు ● ప్లాన్లు ఇవ్వడానికి సర్వేయర్ల నిరాకరణ ● పుర ప్రజలకు గుదిబండగా జీఓ–20 సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి సర్కారు అనాలోచిత నిర్ణయాలు ప్రజలకు గుదిబండగా మారుతున్నాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందనే చందంగా సర్కారు నిర్ణయాలు తయారయ్యాయనే విమర్శ వస్తోంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వ్యవస్థల్లో ప్రభుత్వం తెస్తున్న మార్పులతో మొదటికే మోసం వస్తోంది. మూడు నెలల క్రితం సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ (ఎస్సీఎస్) కోసం విడుదల చేసిన జీఓ–20 నగరాలు, పట్టణాల్లో నిర్మాణాలకు అవరోధంగా మారింది. ఈ జీఓ దెబ్బకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, నగరాల్లో ఎక్కడి ప్లాన్లు అక్కడే చతికిలపడ్డాయి. ఈ జీఓ అమలులోకి వచ్చినప్పటి నుంచి భవన నిర్మాణదారులు లబోదిబోమంటున్నారు. సంపన్నుల నుంచి మధ్య తరగతి వరకూ వారి స్థాయికి తగ్గట్టుగా నిర్మించుకునే ఇళ్లకు ముహూర్తాలు చూసుకుంటారు. అన్నీ చూసుకుని పనులు మొదలు పెట్టాలంటే ముందుగా బిల్డింగ్ ప్లాన్లకు అనుమతి రావాలి. దీనిని ప్రభుత్వం ఇప్పుడు పట్టణాలు, నగరాల్లో నిర్మాణదారులకు పెద్ద సమస్యగా మార్చేసి, చుక్కలు చూపిస్తోంది. కొత్తగా భవనాలు నిర్మించుకోవాలనే వారికి మున్సిపల్ ప్లాన్లు ఇచ్చేందుకు సర్వేయర్లు ముందుకు రావడం లేదు. గతంలో ఇలా.. పట్టణాలు, నగరాల్లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలంటే ముందుగా లైసెన్స్డ్ సర్వేయర్ లేదా ఇంజినీర్ను సంప్రదించి, ప్లాన్ రెడీ చేసుకుంటారు. దరఖాస్తు, ప్లాన్తో పాటు సంబంధిత సొమ్మును కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీకి చెల్లించిన అనంతరం ఆ ఫైల్ ఆన్లైన్లో పట్టణ ప్రణాళికా విభాగానికి చేరుతుంది. న్యాయ, సాంకేతికపరమైన అంశాలతో పాటు నిబంధనలను పరిశీలించిన తర్వాత టౌన్ప్లానింగ్ విభాగం భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే భవనం నిర్మిస్తున్న వారిపై టౌన్ ప్లానింగ్ విభాగం చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు సర్వేయర్దే బాధ్యత కూటమి సర్కారు కొత్తగా జారీ చేసిన జీఓ–20 ప్రకారం ఈ నిబంధనలన్నీ పక్కన పెట్టారు. ప్లాన్ గీసిన సర్వేయర్ లేదా ఇంజినీర్ పైనే మొత్తం బాధ్యత పెట్టారు. ప్లాన్ వేసిన అనంతరం సర్వేయర్లు బేస్మెంట్, లింటల్, స్లాబ్లు.. ఇలా వివిధ దశల్లో ఫొటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్లాన్ ప్రకారం నిర్మాణం జరగకపోతే ఆ విషయాన్ని కూడా ప్లాన్ వేసిన సర్వేయరే అప్లోడ్ చేయాలి. వాస్తవానికి ఈ ప్రక్రియను మున్సిపల్ యంత్రాంగం పర్యవేక్షించాలి. అన్ని అధికారాలూ ఉండే మున్సిపల్ అధికారులకు కాకుండా తమపై ఈ బాధ్యత పెడితే ఎలాగని సర్వేయర్లు ప్రశ్నిస్తున్నారు. నిర్మాణాల్లో ఎక్కడైనా ఉల్లంఘనలుంటే ప్లాన్ వేసిన సర్వేయర్ లైసెన్సును ఐదేళ్ల పాటు రద్దు చేస్తారు. భారత న్యాయ సంహిత (బీఎన్ఎస్) ప్రకారం వారిని బాధ్యులను చేస్తారు. ఇదెంతవరకూ సహేతుకమని సర్వేయర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ జీఓ పుణ్యమా అని సర్వేయర్లు ప్లాన్లు ఇచ్చేందుకు మూడు నెలలుగా ముందుకు రావడం లేదు. ప్లాన్ వేస్తే ఎక్కడ చిక్కుల్లో పడతామోననే భయంతో వారు ఒకవిధంగా పెన్డౌన్ చేస్తున్నారనే చెప్పవచ్చు. ఒక ప్లాన్ తయారు చేసి, అప్లోడ్ చేసి, అనుమతి లభిస్తే భవన యజమాని నుంచి రూ.ఐదారు వేలు, మరీ ఎక్కువైతే రూ.10 వేలు వస్తాయి. ఈ జీఓ అమలు పుణ్యమా అని చేయని తప్పునకు తామెందుకు బాధ్యత వహించాలని సర్వేయర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ జీఓ ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని నగరాలు, పట్టణాల్లో మూడు నెలలుగా ప్లాన్లు నిలిచిపోయాయి. దీనిపై భవన నిర్మాణదారులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ నగరంజీఓలో నిబంధనలు సడలించాలి జీఓ–20లోని కొన్ని నిబంధనలను మార్పు చేయాల్సి ఉంది. లైసెన్స్ హోల్డర్లకు అనుకూలంగా మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం మా సూచనలను పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నాం. కొన్ని సాంకేతిక సమస్యలు సవరించడం ద్వారా ఈ జీఓ మరింత ఫలవంతమవుతుంది. భవన నిర్మాణాల్లో యజమానులు ఉల్లంఘనలకు పాల్పడితే అందుకు లైసెన్స్ సర్వేయర్లను బాధ్యులను చేయడం సరైంది కాదు. ఈ విషయాన్ని మున్సిపల్ మంత్రి నారాయణకు విన్నవించాం. జీఓ అమలులో లైసెన్స్ హోల్డర్ల హక్కులు, బాధ్యతలు సమతుల్యంగా ఉండేలా చూడాలి. – సత్తి రాంబాబు, అధ్యక్షుడు, వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ ఇది పరిస్థితి కాకినాడ నగరపాలక సంస్థలో సుమారు 100 మంది సర్వేయర్లున్నారు. ప్లాన్ల ద్వారా కార్పొరేషన్కు ప్రతి నెలా తక్కువలో తక్కువ రూ.40 లక్షల ఆదాయం వస్తూంటుంది. గడచిన మూడు నెలలుగా రూ.రెండు మూడు లక్షలు కూడా రావడం లేదు. సుమారు వెయ్యి ప్లాన్లు ఆగిపోయాయని చెబుతున్నారు. సామర్లకోట మున్సిపాలిటీలో నలుగురు లైసెన్స్డ్ సర్వేయర్ల వద్దకు గతంలో నెలకు 10 నుంచి 15 దరఖాస్తులు వచ్చేవి. ఏడాదికి సుమారు 120 ప్లాన్లు అప్లోడ్ అవడంతో రూ.52 లక్షల ఆదాయం వచ్చేది. జీఓ–20 కారణంగా దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదు. పెద్దాపురం మున్సిపాలిటీలో నలుగురు సర్వేయర్లున్నారు. ప్లానింగ్ ద్వారా నెలకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ఆదాయం వచ్చేది. ఇప్పుడు రూ.లక్ష వస్తే గొప్పన్నట్టుగా ఉంది. ప్రస్తుతం ప్లాన్లు ఇవ్వడం లేదు. తుని మున్సిపాలిటీలో 20 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు ప్రతి నెలా 60 వరకూ ప్లాన్లు ఇచ్చేవారు. అప్పట్లో నెలకు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ ఆదాయం వచ్చేది. జీఓ–20 అమలులోకి వచ్చాక ప్లాన్లు నిలిచిపోయాయి. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) పరిధిలో సుమారు 250 మంది ప్రైవేట్ సర్వేయర్లు ఉన్నారు. ప్రస్తుతం నెలకు 20 నుంచి 30కి మించి దరఖాస్తులు రావడం లేదు. నిడదవోలు మున్సిపాలిటీలో నలుగురు ప్రైవేటు సర్వేయర్లున్నారు. ఏటా ప్లాన్ల కోసం 10 దరఖాస్తులు వచ్చేవి. జీఓ–20 విడుదలైన తరువాత ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. అమలాపురం మున్సిపాలిటీలో 20 మంది ప్రైవేటు సర్వేయర్ల వద్దకు జీఓ–20కి ముందు ప్రతి నెలా 25 నుంచి 35 బిల్డింగ్ ప్లాన్ దరఖాస్తులు వచ్చేవి. ఈ జీఓ వచ్చిన తరువాత సర్వేయర్లు ప్లాన్లు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. మండపేట మున్సిపాలిటీలోని 15 మంది ప్రైవేటు సర్వేయర్లు నెలకు సుమారు 20 ప్లాన్లు ఇస్తూంటారు. మున్సిపాలిటీకి నెలకు రూ.40 వేల ఆదాయం వస్తుంది. జీఓ–20తో నెలకు కేవలం మూడంటే మూడే దరఖాస్తులు వస్తున్నాయి. సర్వేయర్లు ప్లాన్లు తయారు చేయడం ఆపేశారు. -
రత్నగిరి.. భక్తజన సంద్రం●
● సత్యదేవుని దర్శించిన 60 వేల మంది ● 5 వేల వ్రతాల నిర్వహణ ● దేవస్థానానికి రూ.60 లక్షల ఆదాయంఅన్నవరం: ఒకవైపు వేసవి సెలవులు, మరోవైపు వివాహాల సందడితో రత్నగిరి శనివారం భక్తజనసాగరాన్ని తలపించింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట పట్టింది. భక్తుల రద్దీ తట్టుకోలేక మధ్యాహ్నం ఒంటిగంట వరకూ అంతరాలయ దర్శనం రద్దు చేశారు. మొత్తం 60 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. ఐదు వేల వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.60 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 6 వేల మంది సత్యదేవుని అన్న ప్రసాదం స్వీకరించారు. సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో సాయంత్రం 4 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా అనివేటి మండపం వద్దకు తీసుకువచ్చి పల్లకీలో వేంచేయించి, పూజలు చేశారు. అనంతరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ ప్రాకార సేవ ప్రారంభించారు. భక్తులకు ఇక్కట్లు భక్తులు రూ.300 వ్రతాల నుంచి రూ.2 వేల వ్రతాల వరకూ గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో పిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రూ.1,500 వ్రతాలాచరించే భక్తులను అనివేటి మండపం లోపలకు అనుమతించకపోవడంతో గుమ్మం వద్దనే సుమారు గంటసేపు నిలబడాల్సి వచ్చింది. దేవస్థానంలో వైఫై పని చేయకపోవడంతో ఫోన్పే, పేటీఎం వంటి డిజిటల్ యాప్స్, క్రెడిట్ కార్డుల ద్వారా వివిధ సేవా టికెట్లు కొనుగోలు చేసే భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సెల్ఫోన్ నెట్వర్క్లు కూడా పని చేయకపోవడంతో నగదుతోనే లావాదేవీలు నిర్వహించారు. వ్రతాల టిక్కెట్ల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడటంతో ఇదే అదనుగా కొంతమంది ముందుగా వ్రతాల టికెట్లు కొనుగోలు చేసి, బ్లాక్లో అధిక ధరలకు విక్రయించారు. అలా విక్రయిస్తున్న వ్యక్తిని ఓ హోంగార్డు పట్టుకుని, మందలించి వదిలేశారు. అప్పటికే అతడు సుమారు 20 వరకూ టికెట్లు విక్రయించాడు. కౌంటర్లోని సిబ్బంది ప్రమేయం లేకుండా ఇది సాధ్యం కాదని ఆరోపించారు. పశ్చిమ రాజగోపురం వద్ద తగినంత సెక్యూరిటీ లేకపోవడంతో పలువురు భక్తులు ఇష్టానుసారం తమ వాహనాలను నిలిపివేశారు. దీంతో ట్రాఫిక్కు కొంతసేపు అంతరాయం కలిగింది. గతంలో తీవ్ర రద్దీ ఉన్నప్పుడు ఈఓ, దిగువ స్థాయి అధికారులు ఆలయం వద్దనే ఉండేవారు. దీంతో సిబ్బంది కూడా చురుకుగా పని చేసేవారు. తప్పు చేయడానికి భయపడేవారు. ఇప్పుడు ఎంత రద్దీ ఉన్నా అధికారులు ఆఫీసులకే పరిమితమవుతేండటంతో సరైన నియంత్రణ లేక భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. -
థియేటర్లు మూసివేత.. చంద్రబాబు సర్కార్పై చెల్లుబోయిన వేణు ఫైర్
సాక్షి, తూర్పుగోదావరి: థియేటర్లు మూసివేత విషయంపై ప్రభుత్వ పెద్దలు ఎందుకు దృష్టి పెట్టడం లేదంటూ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వినోదం పేరిట పేదవారికి నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎగ్జిబిటర్ల స్వేచ్ఛ హరించే ప్రయత్నం చేయకూడదు. ప్రభుత్వం సమస్యను సరిదిద్ద లేక నెపాన్ని ఎదుటివారిపై నెడుతుంది. అసలు సినిమా వ్యక్తులు ప్రభుత్వం వద్దకు ఎందుకు వెళ్లాలంటూ గతంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు కదా’’ అంటూ వేణు గుర్తు చేశారు.‘‘ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు జవాబు దారీగా ఉండాలి. కూటమి నేతలు అధికారంలోకి రావడానికి అనేక అబద్ధాలు వండి వార్చారు. అబద్దాన్ని ప్రజలకు చేరవేయడానికి చాలా ప్రయాసపడ్డారు. కోవిడ్ సమయంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయినా, ప్రజలను ఆదుకోవడానికి మాజీ సీఎం జగన్ ఎక్కడ రాజీ పడలేదు. ప్రతి పక్షంలో ఉండగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపి నిత్యం ఒక అబద్ధాన్ని వండివార్చేవారు. అప్పట్లో రాష్ట్రం అప్పులపాలు అయిపోతుందని గగ్గోలు పెట్టారు. ఇప్పుడు అడ్డు అదుపు లేకుండా అప్పులు చేస్తున్నారు. అప్పులను కప్పి పుచ్చటానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’’ అంటూ వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘తిరుమల లడ్డూపై చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి ఇప్పటివరకు అమలు చేయలేదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై గతంలో తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు మీ కేంద్రమంత్రే దానిని అమలు చేస్తామని చెబుతున్నారు. ఉచిత ఇసుక స్కీమ్ కాదు.. స్కామ్. గోదావరిలో ఇసుక అక్రమ దారి అంటూ ఈనాడు పేపర్ లోనే ఐటం వచ్చింది. గోదావరిలో పెద్ద ఎత్తున డ్రెడ్జింగ్ జరుగుతుంది. 80 డ్రెడ్జర్లతో పనిచేస్తుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు. దీనికి అధికారులు బాధ్యత వహించాలి. అధికారులు పనిచేస్తున్నట్టా లేనట్టా?బోట్స్మెన్ సొసైటీలకు చెల్లించాల్సిన డబ్బులు యంత్రాలకు చెల్లిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక వల్ల ప్రభుత్వ ఖజానాకు మూడు వేల కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఈ మొత్తం అధికార పార్టీ నేతల ఖాతాల్లోకి వెళ్తుంది. గత ప్రభుత్వంలో మద్యం వినియోగం తగ్గింది. ఆదాయం పెరిగింది. ఇప్పుడు విక్రయాలు విపరీతంగా పెరిగాయి. ఆదాయం తగ్గింది. తప్పు ఎక్కడ జరుగుతుంది?. కేవలం ఏడాది కాలంలో లక్షా 59 వేల కోట్లు కూటమి ప్రభుత్వం అప్పులు చేసింది. ఇసుక, మద్యంపై ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాలి. రాజమండ్రి పరిధిలో గోదావరిలో 80 డ్రెడ్జర్లతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటే మీ నాయకుల ప్రమేయం లేదా?. గోదావరి లో 80 డ్రెడ్జర్లతో జరుగుతున్న తవ్వకాలు వెనుక ఎవరున్నారు? స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు ఇక్కడున్నా, విదేశాల్లో ఉన్నా.. ఇసుక వ్యవహారంపై కచ్చితంగా చర్యలు చేపట్టాలి. లేదంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతాం’’ అని వేణుగోపాలకృష్ణ హెచ్చరించారు. -
నా బిడ్డలను చూస్తాననుకోలేదు
అంబాజీపేట(తూర్పు గోదావరి): కుటుంబ అవసరాల నిమిత్తం జీవనోపాధికి ఇతర దేశానికి వెళ్లిన ఓ మహిళకు అక్కడి వారు పెట్టిన టార్చర్ తట్టుకోలేక నరకం అనుభవించింది. అక్కడ పడుతున్న ఇబ్బందులను రిస్క్ చేసి తన భర్తకు వీడియో, వాయిస్ మెసేజ్ ద్వారా సమాచారం అందించింది. దాంతో తన భర్త ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సహకారంతో స్వగ్రామానికి క్షేమంగా చేరుకుంది ఆ మహిళ. వివరాల్లోకి వెళితే... అంబాజీపేట మండలం తొండవరం సత్యవతికాలనీకి చెందిన ఉందుర్తి నాగదుర్గ ఈ గత ఏడాది ఆగస్టు 29న తన సమీప బంధువుల సహకారంతో ఖతార్ బయలుదేరింది. 31న ఖతార్ చేరుకుని అక్కడ ఉన్న ఓ మేడం వద్ద వంటపనికి చేరింది. ఆ యజమానురాలి వద్ద నాలుగు నెలల పాటు సజావుగా గడిచింది. అనంతరం ఆమె కుమార్తె వచ్చి తన పని నచ్చడంతో ఖతార్లో ఓ సిటీలో ఉంటున్న తన ఇంటికి తీసుకువెళ్లింది. రెండు నెలలు బాగానే చూసుకున్నారు. అనంతరం తిండి పెట్టకుండా, భర్త ప్రశాంత్, పిల్లలతో, బంధువులతో ఫోన్ మాట్లాడకుండా చిత్రహింసలు పెట్టారు. ఆమె వద్ద ఉన్న ఫోన్ను, పాస్పోర్టును తీసేకుని హింసించారు. అక్కడ పెట్టే చిత్రహింసలు భరించలేక తన భర్త ప్రశాంత్ వాట్సాప్కు వీడియో, వాయిస్ మెసేజ్లను పంపించింది. వారి వద్ద ఉన్న సెల్ఫోన్ను రిస్క్ చేసి తీసుకుని, మెసేజ్ పెట్టింది. స్థానిక సర్పంచ్ పేరాబత్తుల దొరబాబు, ఉప సర్పంచ్ దిగుమర్తి చిట్టిబాబులకు ఆమె భర్త విషయం తెలియపర్చారు. ఖతార్లో ఉన్న ఓ బాబా ద్వారా పోలీస్ స్టేషన్కు వెళ్లగా వారు ఇండియన్ ఎంబాసీని సంప్రదించారు. అక్కడ నుంచి వారు ఇండియాకు పంపారు. ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు విషయాన్ని తెలియపరచి వారి సహకారంతో ఈ నెల 22 అర్ధరాత్రి స్వగ్రామానికి ఆమె చేరుకుంది. అందరికీ కృతజ్ఞతలు ఖతార్ వెళ్లి సుమారు 9 నెలలు కావస్తోంది. వెళ్లిన తరువాత ఐదు నెలలు నా బిడ్డలతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే సంతృప్తి కలిగేది. వారి యోగ క్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే దానిని. అనంతరం ఓ ఇంటిలో కుక్గా చేరడంతో ఫోన్, పాస్పోర్టు తీసేసుకుని నన్ను చిత్రహింసలు పెట్టారు. ఇండియాకు వెళ్లాలంటే రూ.1.80 లక్షలు కట్టాలని యజమానురాలు బెదిరించేది. అసలు నా బిడ్డలను చూడగలనా, ఎలా ఇంటికి వెళ్లాలో అర్థంకాని పరిస్థితుల్లో కాలం వెళ్లదీశాను. స్వగ్రామం వచ్చేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు. – నాగదుర్గ -
ఐఏఎస్, ఐపీఎస్లుగా రైతు బిడ్డలు
సాక్షి, చెన్నై: 2004లో సునామీ సృష్టించిన విలయతాండవం సమయంలో కడలూరులో ఐఏఎస్ అధికారిగా గగన్దీప్సింగ్ బేడీ పనితీరును చిన్న పిల్లలుగా ఉన్న ఇద్దరు సిస్టర్స్ కనులార చూశారు. సునామీ విలయం నుంచి బయటపడిన జీడి పప్పు రైతు కుటుంబంలోని ఈ ఇద్దరు తాము సైతం ఐఏఎస్ కావాలన్న కలతో ముందుకు సాగారు. ఇందులో ఒకరు ఐఏఎస్గా, మరొకరు ఐపీఎస్గా విధుల్లో చేరి రాణిస్తున్నారు. కడలూరు జిల్లా బన్రూట్టి సమీపంలోని మరుంగూర్ గ్రామానికి చెందిన రామనాథన్, ఇలవరసి దంపతుల కుమార్తెలు సుస్మిత, ఐశ్వర్య. ఈ ఇద్దరి మధ్య ఏడాదిన్నర వయస్సు తేడా. 2004లో జరిగిన సునామీ తాండవం సమయంలో ప్రస్తుతం ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్గా ఉన్న గగన్దీప్సింగ్ బేడి అప్పట్లో కడలూరులో వీరోచితంగా సేవలు అందించడంలో శ్రమించారు. దీనిని చిన్న పిల్లలుగా ఉన్న సుస్మిత, ఐశ్వర్య చూసి, తాము సైతం ఐఏఎస్లు కావాలన్న లక్ష్యంతో చదివారు. అన్నావర్సిటీలో పట్టభద్రులయ్యారు. కల సాకారం యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యారు. తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం వీరిలో సుస్మిత ఆంధ్రప్రదేశ్ బ్యాచ్ ఐపీఎస్గా కాకినాడలో ఏఎస్పీగా వ్యవహరిస్తున్నారు. ఐశ్వర్య తమిళనాడులోని తూత్తుకుడి అదనపు కలెక్టర్గా పనిచేస్తున్నారు. ఏదో ఒక రోజున ఒక జిల్లాకు ఎస్పీగా ఒకరు, ఒక జిల్లాకు కలెక్టర్గా మరొకరు బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఒకే ఇంటికి చెందిన ఈ ఇద్దరు సిస్టర్స్ విధుల్లో రాణిస్తున్నారు. తన కుమార్తెల గురించి రామనాథన్ మాట్లాడుతూ తన పిల్లలు ఇద్దరు ఐపీఎస్, ఐఏఎస్లుగా ఉండడంతో ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్ గగన్ దీప్ సింగ్బేడి పనితీరును తన ఇద్దరు పిల్లలు ఆదర్శంగా తీసుకున్నారని పేర్కొన్నారు. సివిల్ సర్వీసులో రాణించి వారి కలను సాకారం చేసుకున్నారని, ఇద్దరు గెలిచారని ఆనందం వ్యక్తం చేశారు. -
ఫ జై ఆంజనేయం.. జామకాయల హారం
మహాకాయుడిగా రూపుదాల్చి.. సాగర తరణానికి వాయువేగంతో.. ఒక్కుదుటన బయలుదేరిన ఆంజనేయ స్వామి వారిపై.. మహేంద్రగిరిన ఉన్న చెట్ల పూలన్నీ జలజలా రాలాయట. పర్వత సదృశమైన ఆయన దేహం రంగురంగుల పూల సోయగాలతో మెరిసిపోయిందట. ఇదంతా శ్రీరామాయణం సుందర కాండలో మహర్షి వాల్మీకి వర్ణన. ఆ స్థాయిలో కాకపోయినా.. రాజమహేంద్రవరం ఐదు బళ్ల మార్కెట్ సెంటర్లో వేంచేసియున్న ప్రసన్నాంజనేయస్వామి వారు శుక్రవారం నవ్యశోభతో దర్శనమిచ్చారు. ఆలయ 31వ వార్షికోత్సవం.. హనుమజ్జయంతి సందర్భంగా స్వామి వారిని శుక్రవారం జామకాయలతో విశేషంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారికి ఆకు పూజలు, సిందూర పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. – ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్) -
సేవ చేయనీయవా స్వామీ..
అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుని సన్నిధిలో స్వచ్ఛందంగా సేవలు చేద్దామని.. కాస్తంత పుణ్యం మూటగట్టుకుందామని ఎక్కడెక్కడి నుంచో వస్తున్న భక్తులు.. అన్నవరం దేవస్థానంలో చుక్కలు చూస్తున్నారు. సేవ చేద్దామనే ఆశ.. చేయడానికి శక్తి ఉన్నా.. ఎవరిని సంప్రదించాలో.. ఏం చేయాలో తెలియక ఇక్కట్లు పడుతున్నారు. సేవ చేయడానికి వచ్చిన తమను ఏఈఓ కె.కొండలరావు దూషించారంటూ మంచిర్యాల భక్తులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రత్నగిరిపై వివిధ ప్రాంతాల్లో కాషాయ రంగు చీరలు ధరించిన మహిళా సేవకులు.. భక్తులకు కనిపిస్తూంటారు. వీరందరూ తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, మంచిర్యాల, మన రాష్ట్రంలోని గుంటూరు, నెల్లూరు తదితర దూర ప్రాంతాల నుంచి వస్తున్న స్వచ్ఛంద సేవకులు. వీరందరూ దేవస్థానంలో తమకు నిర్దేశించిన సేవలు ఉచితంగా అందిస్తూంటారు. ఇదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా స్వామి సన్నిధిలో సేవ చేద్దామనే ఆశతో వస్తున్నా.. రత్నగిరిపై ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి నెలకొందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. సేవా విభాగం లేక.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి రోజూ వేలాదిగా మహిళా సేవకులు వివిధ చోట్ల సేవలందిస్తూంటారు. అలాగే, పరకామణి అంటే హుండీ లెక్కింపుతో పాటు ఇతర సేవలను పురుషులు అందిస్తూంటారు. భక్తులు స్వచ్ఛందంగా సేవ చేయడానికి అనుమతి ఇచ్చేందుకు టీటీడీలో ప్రత్యేకంగా ఒక విభాగం ఉంది. దాని ఫోన్ నంబర్ టీటీడీ వెబ్సైట్లో ఉంటుంది. సేవకు వెళ్లాలనుకునేవారు ఆ నంబర్కు ఫోన్ చేస్తే వారు పూర్తి వివరాలు చెబుతారు. దాని ప్రకారం ఆ సేవా కార్యకర్తలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఎప్పుడు సేవకు రావాలి, ఎవరిని కలవాలనే వివరాలు తెలియజేస్తారు. దాని ప్రకారం భక్తులు అక్కడకు వెళ్లి సేవ చేయవచ్చు. ఇటువంటి ఏర్పాటు అన్నవరం దేవస్థానంలో లేదు. గతంలో సేవ చేసిన వారైతే దేవస్థానంలో పరిచయం ఉన్నవారికి ఫోన్ చేసి వస్తున్నారు. కొత్తవారైతే మధ్యవర్తులను ఆశ్రయించి, మోసపోవాల్సిన పరిస్థితి. మంచిర్యాలకు చెందిన 18 మంది మహిళా సేవా కార్యకర్తలు ఇదేవిధంగా మోసపోయారు. అన్నవరం దేవస్థానంలో సేవ చేసేందుకు మధ్యవర్తిని ఆశ్రయించగా, అతడు మరో మహిళకు ఈ పని అప్పగించాడు. ఆమె అన్నవరం దేవస్థానానికి పంపిస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.500 చొప్పున వసూలు చేసింది. తీరా ఇక్కడకు వస్తే సేవ చేయడానికి ఖాళీ లేదని, వెళ్లిపోవాలని ఏఈఓ చిరాకుపడ్డారని వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ భక్తుల నుంచి రూ.500 చొప్పున వసూలు చేసిన మహిళ.. ఆ తరువాత రూ.300 చొప్పున వెనక్కి ఇచ్చి, మిగిలిన రూ.200 ఉంచుకున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఇటువంటి అవస్థలు భక్తులకు ఎదురవకుండా ఉండాలంటే అన్నవరం దేవస్థానంలో కూడా టీటీడీ తరహాలో ప్రత్యేకంగా విభాగం ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు. అనంతరం, సేవ చేయాలనుకునేవారు ఆ విభాగాన్ని సంప్రదించేలా ఫోన్ నంబర్ను దేవస్థానం వెబ్సైట్లో పొందుపరచాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ·˘ Æý‡™èl²WÇOò³ çÜÓ^èle…§ýl õÜÐ]lMýS$ÌSMýS$ Cº¾…§ýl$Ë$ ఫ సేవకు దేవస్థానంలో ఎవరి అనుమతి తీసుకోవాలో తెలియని పరిస్థితి ·˘ {ç³™ólÅMýS Ñ¿êVýS… HÆ>µr$ చేయాలని భక్తుల డిమాండ్ మాకూ ఇలాగే జరిగింది సత్యదేవుని దీక్ష, ఉత్సవాల గురించి ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రచారం చేస్తూంటాను. మా ప్రాంతం నుంచి సేవా కార్యకర్తలను అన్నవరం దేవస్థానానికి తీసుకువెళ్తే ఇప్పుడు ఖాళీ లేదని చెప్పారు. దాంతో వెనక్కి వచ్చేశాం. దీనికోసం దేవస్థానంలో ఒక విభాగం ఏర్పాటు చేసి, స్వచ్ఛంద సేవ చేసే భక్తులకు సమయం నిర్దేశిస్తే మేలు. – కృష్ణ, సేవా కార్యకర్త -
పవన్ కల్యాణ్ స్పందించాలి
వేలాది మందికి మేలు చేసేలా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానం ప్రారంభించారు. దీనిని దెబ్బ తీసేలా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించాలి. మాకు, మా కుటుంబాలకు న్యాయం చేయడానికి ఆయన ముందుకు రాక పోవడం చాలా దారుణం. ఆయన నియోజకవర్గం పిఠాపురం నుంచే పోరాటం ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకునేలా ఆయన చర్యలు తీసుకోవాలి. – సీహెచ్ సునీల్, ఎండీయూ ఆపరేటర్, పిఠాపురం మా జీవితాలను నాశనం చెయ్యొద్దు ఏ దారీ లేని మాకు గత ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జీవనోపాధి కల్పించారు. వేలాది కుటుంబాలకు దారి చూపించారు. ప్రజాసేవగా భావించి మేము ఈ వృత్తి నిర్వహిస్తున్నాం. అలాంటి మాకు అన్యాయం చేయడం దారుణం. మా జీవితాలను నాశనం చేయకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెంటనే స్పందించాలి. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం. న్యాయం చేయకపోతే ప్రాణాలు వదలడం తప్ప వేరే దారి లేదు. – ఎన్.గంగాధరరావు, ఎండీయూ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు, కరప మా పొట్ట కొట్టొద్దు నిరుద్యోగులుగా ఉన్న మేము మా సొంత గ్రామాల్లో మా కాళ్లపై మేము బతికేలా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దారి చూపించారు. ఆయన పెట్టిన భిక్షతో వేల కుటుంబాలు బతుకుతున్నాయి. వీలు కుదిరితే మరి కొంత మందికి బతుకుతెరువు చూపించాలి తప్ప ఉన్న ఉపాధి తీసేయకూడదు. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. చావోరేవో తేల్చుకుంటాం. – సిద్ధాంతపు రవికుమార్, ఎండీయూ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు, కాకినాడ జిల్లా -
ఆర్టీసీ కాంప్లెక్స్లో తనిఖీలు
కాకినాడ సిటీ: స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్లో జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీఓ) ఎం.శ్రీనివాసరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. క్యాంటీన్, కార్గో సెక్షన్, స్టాల్స్, టాయిలెట్లను పరిశీలించారు. క్యాంటీన్లో అల్పాహారం భుజిస్తున్న ప్రయాణికులను నాణ్యతపై అడిగి తెలుసుకున్నారు. కార్గో సెక్షన్లో వినియోగదారుల ఇబ్బందులపై ఆరా తీశారు. అన్ని స్టాల్స్లో ఎమ్మార్పీకే విక్రయిస్తున్నట్లు బోర్డు ఉంచాలని, నిబంధనలు కచ్చితంగా పాటించాలని దుకాణ యాజమానులకు సూచించారు. ప్రయాణికులకు అందించే సేవల మెరుగుదలపై బస్ స్టేషన్ మేనేజర్ ఎంయూవీ మనోహర్కు సూచనలు చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ టి.బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు తప్పని బదిలీలు రాయవరం: బదిలీ దరఖాస్తుల ప్రక్రియలో ఉపాధ్యాయులు తలమునకలయ్యారు. ఈ నెల 21 నుంచి ఉపాధ్యాయుల బదిలీలకు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన విషయం పాఠకులకు విదితమే. ఇప్పటికే ప్రధానోపాధ్యాయుల బదిలీ దరఖాస్తుల గడువు ముగియగా, స్కూల్ అసిస్టెంట్ల ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించే గడువు శనివారం అర్ధరాత్రితో ముగుస్తుంది. ఈ నెల 27వ తేదీ వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీ దరఖాస్తులకు గడువు ఉంది. అయితే బదిలీ దరఖాస్తులు ఆన్లైన్లో సబ్మిషన్ చేసే సమయంలో సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తుతున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఆన్లైన్ బదిలీ దరఖాస్తుల సబ్మిషన్ సమయంలో ఓటీపీ రావడంలో సమస్యలు తలెత్తుతున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం సర్వర్ మొరాయించగా, మధ్యాహ్నం నుంచి సర్వర్ పనిచేయడంతో దరఖాస్తులు చేసుకున్నారు. పీడీలు దరఖాస్తు చేసుకునేందుకు సర్వర్లో ఓపెన్ కాగా, పీఈటీలకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు ఓపెన్ కాలేదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. పూర్వపు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 64 మండలాల పరిధిలో 3,696 మంది ఉపాధ్యాయులకు తప్పనిసరి స్థానచలనం ఉంది. ఈ జాబితాలో గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ, తత్సమాన క్యాడర్ ఉపాధ్యాయులున్నారు. వీరిలో రెండేళ్ల లోపు ఉద్యోగ విరమణ అయ్యే ఉపాధ్యాయులు, దివ్యాంగ ఉపాధ్యాయులకు వారు కోరుకుంటే తప్ప బదిలీ చేపట్టరు. ఖాళీలపై రావాల్సిన స్పష్టత క్యాడర్ల వారీగా ఉపాధ్యాయుల ఖాళీలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు బదిలీ దరఖాస్తులు సమర్పించగా, స్కూల్ అసిస్టెంట్లకు ఈ నెల 24 అర్ధరాత్రితో గడువు ముగియనుంది. దరఖాస్తులను సమర్పించిన తర్వాత బదిలీ కోరుకునే ప్రాంతాన్ని ఎంపిక చేసుకునే ఆప్షన్ ఇస్తారు. ఆ సమయానికి పూర్తి స్థాయిలో ఖాళీలను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఖాళీలపై స్పష్టత వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు ప్రాధాన్యతా క్రమంలో వారు బదిలీ కోరుకునే స్థానాలను ఆన్లైన్లో ఎంపిక చేసుకుంటారు. ఇప్పటికే గ్రేడ్–2 హెచ్ఎంల బదిలీ దరఖాస్తుల గడువు ముగియగా, ప్రొవిజినల్ సీనియారిటీ జాబితాలను ఈ నెల 24న విడుదల చేయాల్సి ఉంది. దీనిపై అభ్యంతరాలను 25న స్వీకరిస్తారు. 27న ఫైనల్ సీనియారిటీ జాబితాను ప్రదర్శించి, ఖాళీలను తెలియజేస్తారు. 28న గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు బదిలీ కోరుకునే ప్రాంతానికి ఆప్షన్స్ ఎంపిక చేసుకుంటారు. ఈ నెల 30 గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు విడుదల కానున్నాయి.ఆన్లైన్లో బదిలీ దరఖాస్తు చేసుకుంటున్న ఉపాధ్యాయులు -
జీవితాలు మారడమంటే.. ఇదా!
‘నేను అధికారంలోకి వస్తే మీ జీవితాలు మారిపోతాయి’ అని పవన్ కల్యాణ్ చెప్తే నమ్మామని.. జీవితాలు మారడమంటే మాకున్న ఉపాధిని ఊడగొట్టడమా అని ఎండీయూ ఆపరేటర్లు ప్రశ్నిస్తున్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న కూటమి సర్కారు ఇప్పుడు తమను నట్టేట ముంచుతున్నా.. పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవితాలు మారడమంటే ఇలా తలకిందులు చేయడమా అని ప్రశ్నిస్తున్నారు. పిఠాపురం: ఇంటింటికీ రేషన్ సరకులు పంపిణీ చేస్తున్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) వ్యవస్థను నిలిపివేయాలని కూటమి ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 9,760 వాహనాల సేవలు నిలిచిపోనున్నాయి. దీనిని నమ్ముకుని బతుకుతున్న దాదాపు 18 వేల కుటుంబాలు రోడ్డున పడనున్నాయి. జిల్లావ్యాప్తంగా కూడా 428 రేషన్ వాహనాలున్నాయి. ఒక్కో వాహనానికి డ్రైవర్, ఆపరేటర్, హెల్పర్ పోస్టులను గత ప్రభుత్వం మంజూరు చేసింది. తద్వారా జిల్లాలో ఎండీయూ వాహనాల ద్వారా 1,284 మంది ఉపాధి పొందుతున్నారు. సర్కారు నిర్ణయంతో వీరి కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. రేషన్ వాహనాల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా ఎండీయూ ఆపరేటర్లు పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రేషన్ వాహనాలు నిలిపివేయాలనే నిర్ణయం బడుగు, బలహీన వర్గాల మీద కూటమి ప్రభుత్వం చేపట్టిన కక్ష సాధింపు చర్యేనని పేర్కొంటున్నారు. లక్షల మందికి నేరుగా రేషన్ అందించే ఈ వ్యవస్థను రద్దు చేయడం పేదలను ఇబ్బంది పెట్టడమేనని అంటున్నారు. వైఎస్సార్ సీపీపై ఉన్న కోపంతో ఈ మంచి కార్యక్రమాన్ని రద్దు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. సంపద సృష్టిస్తామని, పేదలకు ఉపాధి కల్పిస్తామని మాయ మాటలు చెప్పి, ఓట్లేయించుకుని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగులపై కక్ష కట్టినట్లు.. ఉన్న ఉపాధి, ఉద్యోగాలు రద్దు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఏ ఒక్కరూ ముందుకు రాకపోతే.. రేషన్ వాహనదారులే బాధితులకు అన్నపానీయాలు అందించారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇటువంటి సేవలను రద్దు చేయడమేమిటని, ప్రభుత్వం పునరాలోచించి వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ బతుకు తల్లకిందులు చేస్తారా! ఫ నట్టేట ముంచుతారా! ఫ పవన్.. మా పొట్ట కొట్టొద్దు ఫ ఎండీయూ ఆపరేటర్ల ఆందోళన -
రత్నగిరికి భక్తుల తాకిడి
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శుక్రవారం సందడిగా మారింది. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివాని దర్శించుకున్నారు. రెండు వేల వ్రతాలు నిర్వహించారు. సత్యదేవుని దర్శించిన అనంతరం, భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. రావిచెట్టుకు ప్రదక్షిణ చేసి, జ్యోతులు వెలిగించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఏకాదశి పర్వదినం కావడంతో సత్యదేవునికి ఉదయం 7 గంటలకు స్వర్ణ పుష్పార్చన, 9 నుంచి 11 గంటల వరకూ స్వామి, అమ్మవార్లకు తులసి దళాలతో సహస్ర నామార్చన నిర్వహించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను శనివారం ఉదయం 10 గంటలకు తిరుచ్చి వాహనంపై ఊరేగించనున్నారు. ఏకాదశి సందర్భంగా సత్యదేవునికి ప్రత్యేక పూజలు స్వామిని దర్శించిన 40 వేల మంది రూ.40 లక్షల ఆదాయం -
డబ్బు తీసుకొని టీమ్ తయారు
ది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుల ఆరోపణ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రతిభ ఉన్న క్రీడాకారులను తయారు చేయాల్సిన కోచ్లు, అసోసియేషన్ సభ్యులు డబ్బు తీసుకొని క్రికెట్ టీమ్ను తయారు చేస్తున్నారని ది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. కాకినాడలోని ఒక హోటల్లో శుక్రవారం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ జోన్ల నుంచి అధ్యక్షులు, సెక్రటరీలు హాజరయ్యారు. శివకుమార్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా ఏ ఫార్మెట్లోనూ టోర్నమెంట్లు నిర్వహించలేదని, క్రీడాకారులు వారి ప్రాక్టీస్ కోసం ఇతర టోర్నమెంట్లలో పాల్గొంటే వారిని పక్కన పెట్టడం దారుణమన్నారు. ప్రతిభను పక్కన పెట్టి ఎవరైతే డబ్బు ఇస్తున్నారో వారిని జట్టులోకి తీసుకున్నారన్నారు. అసోసియేషన్ కాలపరిమితి ఆగస్టుతో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల తేదీని ఖరారు చేయనున్నట్లు చెప్పారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్లో నియంతృత్వ ధోరణి కారణంగా క్రికెట్ క్రీడాకారులు భవిష్యత్ కుంటుపడుతోందని, ఈ విషయంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జోక్యం చేసుకొని అసోసియేషన్లో జరిగిన అవినీతిపై విచారణ నిర్వహించి దోషులపై చర్యలు తీసుకోవాలని సభ్యులు తీర్మానించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 40 సభ్యులు హాజరై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. అసోసియేషన్ మాజీ సెక్రటరీ కె.బాపిరాజు, మాజీ ఉపాధ్యక్షుడు ఏఎస్ స్వరూప్, రాజమహేంద్రవరం ఇన్చార్జి విజయ్కుమార్, కోనసీమ ఇన్చార్జి ఏవీటీ వర్మ, పెద్దాపురం ఇన్చార్జి ఎ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
జేఈఈ మెయిన్, బి–ఆర్క్, బి–ప్లాన్ ఫలితాలలో తిరుమల విద్యార్థుల సంచలనం
రాజమహేంద్రవరం రూరల్: జేఈఈ మెయిన్, బి–ఆర్క్, బి–ప్లాన్ ఫలితాలలో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు ప్రకటనలో తెలిపారు. బి.ఆర్క్ జనరల్ ఈడబ్ల్యూఎస్ విభాగంలో కె.యశ్వంత్సాత్విక్ ఆల్ఇండియా 1వ ర్యాంకు, వి.రామసాయివరుణ్రెడ్డి 4వ ర్యాంకు సాధించారని తెలిపారు. బి.ప్లానింగ్ విభాగంలో వివిధ కేటగిరీలలో జాతీయస్థాయిలో కె.యశ్వంత్సాత్విక్ 3వ ర్యాంకు, వి.రామసాయి వరుణ్రెడ్డి 3వ ర్యాంకు, టి.షణ్ముఖ శ్రీనివాస్ 24వ ర్యాంకు, టి.జశ్వంత్దొర 63వ ర్యాంకు, వై.సాయితేజ, టి.పవన్శ్రీకుమార్చౌదరి 78వ ర్యాంకు, సుంకర జోషిచంద్ 99వ ర్యాంకు సాధించారని ఆయన తెలిపారు. విద్యార్థులను నున్న తిరుమలరావు, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
కాట్రేనికోన: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల కేంద్రం సుబ్బారాయుడు గుడి వద్ద శుక్రవారం ఉదయం పల్లం నుంచి కాకినాడ వెళ్లే ఆర్టీసీ బస్సు మోటారు సైకిల్ను ఢీ కొట్టడంతో సాగిరాజు శ్రీనివాస నరసింహరాజు (49) మృతి చెందారు. కాట్రేనికోన ఎస్సై అవినాష్ తెలిపిన సమాచారం ప్రకారం అమలాపురం డిపో ఆర్టీసీ బస్సు పల్లం నుంచి కాకినాడ వెళుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్ను ఢీ కొట్టింది. నరసింహరాజును స్థానికులు 108 అంబులెన్సులో అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయినవిల్లి మండలం పోతుకుర్రుకు చెందిన సాగిరాజు శ్రీనివాస నరసింహరాజు కోనపాకపేట ఆనంద హేచరీలో పని చేస్తున్నాడు. అక్కడకు వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈయనకు భార్య రాజేశ్వరి, ఇద్దరు పిల్లలు యూకేలో ఉన్నారు. యూకేలో కుమార్తె ఉద్యోగం చేస్తుండగా, కుమారుడు ఎంఎస్ చదువుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాట్రేనికోన ఎస్సై అవినాష్ తెలిపారు. చికిత్స పొందుతూ...కె.గంగవరం: మండలంలోని అముజూరుకి చెందిన పాలపర్తి శేషగిరిరావు(60) కాకినాడలో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. శేషగిరిరావు రామచంద్రపురం నుంచి స్వగ్రామం అముజూరు వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో స్థానికులు అతడిని పామర్రు పీహెచ్సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కె.గంగవరం ఎస్సై జానీ బాషా శుక్రవారం విలేకరులకు తెలిపారు. -
గోపాయిలంక గడ్డి రేవులో మృతదేహం
అల్లవరం: మండలంలోని గోడితిప్ప పంచాయతీ పరిధిలో గోపాయిలంక గడ్డిరేవు వద్ద శుక్రవారం అంబాజీపేట మండలం వాకలగరువు గ్రామానికి చెందిన సుంకర దుర్గాప్రసాద్ (44) మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. నాలుగు రోజులుగా గడ్డి రేవులో మోటార్ సైకిల్ను పార్క్ చేసి ఉంచడంతో స్థానికులకు అనుమానం వచ్చి అల్లవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారంతో పోలీసులు మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే శుక్రవారం ఉదయం గడ్డి రేవులో దుర్గాప్రసాద్ మృతదేహం తేలియాడటంతో స్థానికులు గుర్తించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వాకలగరువులో వాటర్ ప్లాంట్ నిర్వహించే దుర్గాప్రసాద్ లైన్కి వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. గోపాయిలంక గడ్డిరేవులో బహిర్భూమికి వెళ్లిన దుర్గాప్రసాద్ ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అల్లవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. దుళ్ల శివార్లలో అగ్ని ప్రమాదం – రూ.5 లక్షల మేర ఆస్తినష్టం కడియం: Ð]l$…yýl-ÌS…ÌZ° §ýl$âýæÏ {V>Ð]l$ ÕÐé-Æý‡ÏÌZ° çÜ™èlÅ-ÝëÆ‡$$ C…yýl[ïÜt-‹ÜÌZ VýS$Æý‡$-ÐéÆý‡… Æ>{† AW² {ç³Ð]l*§ýl… çÜ…¿ýæ-Ñ…-_…-¨. D {ç³Ð]l*-§ýl…ÌZ Möº¾Ç ™éâýæÏ E™èlµ-†¢MìS çÜ…º…-«¨…-_¯]l OòœºÆŠ‡ Ððl$sîæ-Ç-Ķæ$ÌŒæ, ѧýl$Å™Œæ Eç³-MýS-Æý‡-×êË$ ç³NÇ¢V> §ýlVýS®-OÐðl$-´ùĶæ*Ƈ$$. {ç³Ð]l*§ýl… M>Æý‡-׿…V> çÜ$Ð]l*Æý‡$ Æý‡*.5ÌS-„ýSÌS Ðól$Æý‡ ¯]lçÙt… HÆý‡µ-yìl…§ýl° ¸ëÅMýStÈ A«¨-¯ól™èl MýS–çÙ~-ÝëÆ‡$$ ™ðlÍ´ëÆý‡$. M>Ç-Ã-MýS$Ë$ òÜÌSÐ]l# ò³rtyýl…™ø Mö¨ª-Æøk-Ë$V> E™èlµ†¢ °Í-í³Ðól-Ô>-Ð]l$-¯é²Æý‡$. ¯ðlÌê-QÆý‡$MýS$ E™èlµ†¢° {´ëÆý‡…-À…-^ól…-§ýl$MýS$ HÆ>µr$Ï ^ólçÜ$¢-¯é²-Ð]l$-¯é²Æý‡$. A…§ýl$ÌZ ¿êVýS…V> Æ> Ððl$sîæÇ-Ķæ$-ÌŒæ¯]l$ ¡çÜ$-MýS$Ð]l_a °ÌSÓ ^ólÔ>Ð]l$° ÑÐ]lÇ…^éÆý‡$. Æ> Ððl$sîæ-Ç-Ķæ$ÌŒæ M>Ð]l-yýl…™ø §é°MìS C¯ŒS{çÜ*-ె¯ŒSÞ MýS*yé Ìôæ§ýl-¯é²Æý‡$. AƇ$$™ól {ç³Ð]l*§ýl… H Ñ«§ýl…V> çÜ…¿ýæÑ…_…§ø AÆý‡¦… M>Ð]lyýl… Ìôæ§ýl-¯é²Æý‡$. ¸ëÅMýStÈ ¯]l$…_ Ð]l$…rË$ Æ>Ð]lyýl… VýS$Ç¢…-_¯]l Ý린-MýS$Ë$ çÜÐ]l*-^éÆý‡… CÐ]lÓyýl…™ø Ð]l_a ^èl*õÜ¢ OòœºÆŠ‡ Ððl$sîæ-ÇĶæ$-ÌŒæ-™ø-´ër$, GÌS-[MìStMýSÌŒæ ç³Ç-MýSÆ>Ë$, ¸ëÅMýStÈ Æó‡MýS$Ë$ OòÜ™èl… Ð]l$…rÌZÏ _MýS$P-MýS$¯é²Ä¶æ$° ÑÐ]l-Ç…-^éÆý‡$. Ð]l$…yýl-õ³-rMýS$ ^ðl…¨¯]l AW-²Ð]l*-ç³MýS MóS…{§é°MìS çÜÐ]l*-^éÆý‡… CÐ]lÓyýl…™ø ÐéÆö_a ç³MýSP¯ól E¯]l² C™èlÆý‡ Ð]l¬yìl ç³§é-Æ>¦-ÌSMýS$ Ð]l$…rË$ ÐéÅí³…-^èlMýS$…yé Ayýl$z-MýS$-¯é²Æý‡-¯é²Æý‡$. గ్యాస్ సిలిండర్ లీకై ... తాళ్లపూడి: మండలంలోని రావూరుపాడులో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు రావడంతో ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మేకా వెంకన్న భార్య మేక సత్తెమ్మ కొత్త ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి సమీపంలో చిన్న షెడ్డు వేసుకుని నివాసం ఉంటున్నారు. గ్యాస్ సిలిండర్ లీకై మంటలు వ్యాపించడంతో ఇంట్లోని వస్తువులతో పాటు, ఇంటి నిర్మాణం కోసం పెట్టుకున్న నగదు కూడా కాలిపోయిందని తెలిపారు. రెవెన్యూ సిబ్బంది వివరాలు సేకరించారు. -
కళ్లముందే కన్నతల్లి మృత్యువాత
● బైక్ను ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం ● మహిళ మృతి, ఇద్దరికి గాయాలు ● తండ్రిని ఆసుపత్రి నుంచి తీసుకువస్తుండగా ఘటన తొండంగి: తండ్రిని ఆసుపత్రిలో చూపించి తిరుగు ప్రయాణంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని బైకు అదుపు తప్పడంతో మహిళ మృత్యువాత పడగా భర్త, కుమారుడు తీవ్రగాయాలపాలైన సంఘటన బెండ పూడి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తొండంగి మండలం గోపాలపట్నం గ్రామానికి చెందిన సాగి ఆనంద్ తన తండ్రి సూరిబాబు అనారోగ్యం కారణంగా కాకినాడ ఆసుపత్రికి తల్లి అమ్మాజీ(45)తో కలిసి ముగ్గురు బైక్ పై వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం తిరుగు ప్రయాణంలో బెండపూడి జాతీయ రహదారిపై వీరి బైకును గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో బైకు అదుపుతప్పి రోడ్డు పక్కన గోతిలో పడిపోయారు. ఈ ఘటనలో అమ్మాజీ తలకు రాయి తగలడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఆనంద్, తండ్రి సూరిబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకుని అంబులెన్స్ రప్పించారు. తీవ్రగాయాలైన ఆనంద్, సూరిబాబుల కు అంబులెన్స్ సిబ్బంది మెరుగైన వైద్యం కోసం తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బి.జగన్మోహన్రావు తె లిపారు. కళ్లముందే కన్నతల్లి మృత్యువాత పడటంతో భర్త, కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
గ్రేడ్–2 హెచ్ఎం బదిలీలకు 245 దరఖాస్తులు
రాయవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల బదిలీలకు 245 దరఖాస్తులు వచ్చాయి. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల బదిలీలకు ఈ నెల 21, 22 తేదీల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ బదిలీ దరఖాస్తుల్లో రిక్వెస్ట్ బదిలీలకు 181 దరఖాస్తులు రాగా, తప్పనిసరి బదిలీలకు 64 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను రెండు దశల్లో వెరిఫికేషన్ చేస్తున్నారు. 44 సమ్మర్ వీక్లీ స్పెషల్ రైళ్లు రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జూన్ ఒకటో తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు రాకపోకలు సాగించేందుకు 44 సమ్మర్ వీక్లీ స్పెషల్ రైళ్లను ప్రకటిస్తూ రైల్వే అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం– ఎస్ఎంబీటీ బెంగళూరు, ఎస్ఎంబీటీ బెంగళూరు (08581/ 08582) రైళ్లు జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రతీ సోమ, మంగళ వారాల్లో రాకపోకలు సాగించనున్నాయి. విశాఖపట్నం –తిరుపతి, తిరుపతి విశాఖపట్నం (08547/ 08548) రైళ్లు జూన్ 6వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ప్రతీ బుధ,గురువారాల్లో రాకపోకలు సాగించనున్నాయి. విశాఖపట్నం– చర్లపల్లి, చర్లపల్లి –విశాఖపట్నం (08579/ 08580) రైళ్లు జూన్ 6వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు ప్రతీ శుక్ర, శనివారాలలో రాకపోకలు సాగించనున్నాయని అధికారులు తెలిపారు. ఈ రైళ్లు సామర్లకోట, రాజమహేంద్రవరం, అన్నవరం, తుని స్టేషన్లలో ఆగనున్నాయని తెలిపారు. -
ఈసారి ట్రావెల్ సర్వే!
● అన్నవరం దేవస్థానం, ఇరిగేషన్ అధికారుల మధ్య 15 ఏళ్లుగా స్థల వివాదం ● ఇప్పటికి మూడుసార్లు సర్వే చేసినా తేలని సమస్య అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఘాట్రోడ్ పక్కనే పంపా రిజర్వాయర్ను ఆనుకుని ఉన్న స్థలంపై నెలకొన్న వివాదం తేల్చేందుకు ట్రావెల్ సర్వే చేయించాలని నిర్ణయించారు. ఈ స్థలం దేవస్థానానిదా లేక, ఇరిగేషన్ శాఖకు చెందుతుందా అనే దానిపై 15 సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోంది. ఈ స్థలం హక్కుదారులను తేల్చేందుకు ఇప్పటికి మూడుసార్లు సర్వే చేశారు. తాజాగా మొత్తం దేవస్థానానికి సంబంధించిన స్థలాన్ని కూడా కలిపి ట్రావెల్ సర్వే చేయించాలని నిర్ణయించినట్లు పెద్దాపురం ఆర్డీఓ రమణి తెలిపారు. దేవస్థానం రికార్డుల ప్రకారం రత్నగిరి నుంచి పంపా వరకు దేవస్థానానిదే... అన్నవరం దేవస్థానానికి ఆరెంపూడి గ్రామ సర్వే నంబర్ 24.బి లో 54.69 ఎకరాల కొండ ఉంది. దేవస్థా నం క్వార్టర్స్ నుంచి ప్రారంభమై రత్నగిరి రామాలయం నుంచి పంపా రిజర్వాయర్ వరకు ఉన్న స్థలం రికార్డులలో దేవస్థానానికి చెందినదిగా నమోదై ఉంది. ఇందులో రెండో ఘాట్రోడ్ను ఆనుకుని పవర్హౌస్ వరకు ఉన్న పంపా రిజర్వాయర్ స్థలం కూడా తమదేనని దేవస్థానం అధికారులు అంటున్నారు. ప్రస్తుతం పంపా రిజర్వాయర్ను ఆనుకుని ఉన్న ఆ స్థలంలో 25 సంవత్సరాలుగా హరిణి బోట్ షికార్, అభయ హోటల్ పేరుతో ప్రయివేట్ నిర్మాణాలు ఉన్నాయి. ఈ స్థలాన్ని ఇరిగేషన్ శాఖ నుంచి లీజుకు తీసుకున్నట్లు ఆ నిర్మాణాల నిర్వాహకులు చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆక్రమణలు ఖాళీ చేయించాలని ఆర్డినెన్స్ 2023లో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ –5 ప్రకారం దేవస్థానం స్థలం ఆక్రమించిన వారికి నోటీసు ఇచ్చి, తగు సమాధానం చెప్పకపోతే ఆక్రమణలు కూల్చి వేయాలని పేర్కొన్నారు. దాని ప్రకారం దేవస్థానం అధికారులు హరిణి బోట్ షికార్, అభయ్ హోటల్ అక్రమ నిర్మాణాలని గుర్తించామని ఇరిగేషన్ అధికారులకు గత ఏడాది జూలైలో నోటీసు ఇచ్చారు. ఆ నోటీస్కు ఇరిగేషన్ అధికారులు స్పందిస్తూ అది తమ స్ధలమేనని తెలిపారు. దీనిపై అప్పటి దేవస్థానం ఈఓ కే రామచంద్రమోహన్ కలెక్టర్కు నివేదిక పంపడంతో దీనిపై జాయింట్ సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. గతేడాది ఆగస్టులో జాయింట్ సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో ఆ స్థలం దేవస్థానానిదేనని తేలింది. దానిపై ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మళ్లీ జాయింట్ సర్వేకు కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. అధికారుల సమక్షంలో జాయింట్ సర్వే ఏప్రిల్ ఒకటో తేదీన పంపా రిజర్వాయర్ స్లూయిజ్ గేట్లు ఎదురుగా గల కొండ వద్ద నుంచి పవర్ హౌస్ కు వెళ్లే మార్గంలోని హరిణి బోట్ షికార్ నిర్మాణాల వరకు జాయింట్ సర్వే నిర్వహించారు. లాండ్ ప్రొటెక్షన్ సెల్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ డి.భారతి, డిస్ట్రిక్ట్ లాండ్ రికార్డ్స్ అండ్ సర్వే డీఈ కే శ్రీనివాస్, అన్నవరం దేవస్థానం డీసీ చంద్రశేఖర్, ఏసీ రామ్మోహన్రావు, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు హాజరయ్యా రు. పెద్దాపురం ఆర్డీఓ కే రమణి పంపా ఒడ్డున గల నిర్మాణాలను పరిశీలించారు. దేవస్థానం, ఇరిగేషన్ అధికారుల వాదనలను విన్నారు. అయితే 50 రోజులు దాటినా ఈ సర్వే నివేదిక వెలుగు చూడలేదు. ట్రావెల్ సర్వే చేయించాలని నిర్ణయించాం కాగా ఈ వివాదం సంక్లిష్టంగా మారినందున 24 బీ సర్వే నంబర్లో ఉన్న దేవస్థానం లాండ్ అంతా కలిపి ట్రావెల్ సర్వే చేయించాలని నిర్ణయించాం. త్వరలోనే ఈ సర్వే చేయిస్తాం. – కే రమణి, ఆర్డీఓ, పెద్దాపురం 2011లో తొలిసారి సర్వే 2011లో అప్పటి ఈఓ కే రామచంద్రమోహన్ తమ రికార్డుల ప్రకారం ఆ స్థలమంతా దేవస్థానానిదేనని, అందువలన సర్వే చేయించాలని ప్రభుత్వాన్ని కోరడంతో సర్వే ప్రారంభించారు. అయితే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు ఉండడంతో ఆ సర్వే మధ్యలోనే నిలిచిపోయింది. -
మహానాడుకు వస్తే ఎకరం పొలం!
తెలుగుదేశం పార్టీ సభలు, సమావేశాలప్పుడు జన సమీకరణకు తలా ఒక బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్, పచ్చనోట్లు ఇవ్వడం ఇంతవరకు చూశాం. కానీ, ఇప్పుడు ఏకంగా భూములే ఇచ్చేస్తామంటున్నారు. అధికారం చేతిలో ఉందనే తెగింపుతో మహానాడుకు వస్తే ఎకరం పొలం లీజుకిస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు ఆ పార్టీ నేతలు. ఇప్పుడీ ఆఫర్ టీడీపీ నేతల మధ్య హాట్టాపిక్గా మారింది. ఎన్నో ఏళ్ల క్రితం పిఠాపురం మహారాజా రావువేంకట కుమారమహీపతి సూర్యారావు బహద్దూర్ 513 ఎకరాలు దానం చేయగా.. దేవదాయశాఖ పరిధిలో ఉన్న ఈ విలువైన భూములను ఇప్పుడు అప్పనంగా దోచిపెట్టేందుకు టీడీపీ మహానాడును సాకుగా వాడుకుంటున్నారు. వచ్చేవారం కడపలో జరిగే మహానాడు ఆహ్వాన కమిటీ సభ్యుల్లో ఒకరైన టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు సొంత ఇలాకా తునిలో తెలుగుదేశం నేతలు ఈ భూ పందేరానికి తెరతీశారు. మహానాడుకు సిద్ధపడి వచ్చేవారి పేరు, ఆధార్ నంబరు వంటి వాటిని సమన్వయం చేసేందుకు ఆరుగురు నేతలతో ఓ ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఈ కమిటీ మహానాడుకు జనం తరలింపులో సమన్వయం చేసేందుకేనని పైకి చెబుతున్నా.. వాస్తవంగా కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ దేవస్థానానికి చెందిన 508 ఎకరాల సాగు భూములను వేలం వేయకుండా దొడ్డిదారిన తెలుగు తమ్ముళ్లకు దోచిపెట్టే ఎత్తుగడని తునికి చెందిన వారు స్పష్టంగా చెబుతున్నారు. –సాక్షి ప్రతినిధి, కాకినాడజనసమీకరణ కోసం ఎర..అనంతరం.. టీడీపీ నేతలు అసలు కథ మొదలెట్టారు. టీడీపీ మహానాడుకు తుని నియోజకవర్గం నుంచి కనీసం వెయ్యి మందినైనా తీసుకెళ్లాలన్నది ఆ పార్టీ నేతల లక్ష్యం. కానీ, వ్యవసాయ సీజన్ మొదలవుతుండడంతో జన సమీకరణ పెద్ద సమస్యగా మారింది. ఇంతలో ఆ పార్టీ పెద్దలకు ఓ ఐడియా తట్టింది. తమ అనుచరులైన రైతుల పేర్లతో వేలం జరిగినట్లుగా రికార్డులు తయారుచేయాలనేది ప్లాన్. ఇందులో భాగంగా.. ప్రస్తుతం ఈ భూములు సాగుచేస్తున్న రైతులను వేలానికి రాకుండా అడ్డుకుని పోలీసు కేసులతో బెదరగొట్టాలని స్కెచ్వేశారు. ఈ క్రమంలో.. మహానాడుకు వస్తే ఎకరం భూమి లీజుకు ఇస్తామని పార్టీ పెద్దాయన చెప్పారని ద్వితీయశ్రేణి నేతలు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇప్పుడు మహానాడుకు వచ్చిన వారికే తిరిగొచ్చాక ఎకరం వంతున లీజుకిచ్చే బాధ్యత తమదంటూ తెలుగు తమ్ముళ్లు తొండంగి పరిసర ప్రాంతాల్లో జనాన్ని సమీకరించడం చర్చనీయాంశంగా మారింది. సత్రం పిఠాపురంలో.. భూములు యనమల ఇలాకాలో..నిజానికి.. శ్రీ సంస్థానం సత్రం పిఠాపురంలో ఉన్నప్పటికీ ఈ భూములు మాత్రం యనమల రామకృష్ణుడు సొంత ఇలాకా తొండంగి మండలంలో ఉన్నాయి. మూడేళ్లకోసారి ఈ భూములకు వేలం వేస్తుంటారు. ఈ నేపథ్యంలో.. 538, 545, 553, 535, 623, 565, 690 సర్వే నంబర్లలోని ఈ భూముల లీజు గడువు ముగియడంతో ఇటీవల దేవదాయ శాఖ ఈఓ శ్రీరాములు పేరుతో వేలం ప్రకటన విడుదలైంది. దీంతో.. టీడీపీ నేతలు ఈ భూములపై వాలిపోయారు. ఈనెల 23 నుంచి 29 తేదీల మధ్య జరపాల్సిన వేలం ప్రక్రియ జరగకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చి నిలిపివేశారు.రంగంలోకి జనసేన.. ఈ భూముల వ్యవహారం జనసేన నేతల చెవిలో పడింది. శ్రీ సంస్థానం సత్రం కార్యాలయం, కార్యకలాపాలన్నీ పిఠాపురం కేంద్రంగానే జరుగుతున్నాయని.. సత్రం భూములను తుని నియోజకవర్గంలో వారి అనుచరులకు ధారాదత్తం చేయడానికి వారికి అధికారం ఎవరిచ్చారని జనసేన నేతలు రగిలిపోతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సత్రం ఆదాయం కోల్పోతుంటే చూస్తూ ఊరుకుంటామా అని వారు మండిపడుతున్నారు.కొందరి విజ్ఞప్తితోనే వేలం వాయిదా..ఈనెల 23 నుంచి 29 వరకు మొత్తం 508 ఎకరాలకు వేలం వేస్తామని ప్రకటించాం. ఇంతలో.. టీడీపీ మహానాడుకు వెళ్తున్నందున రైతులు అందుబాటులో ఉండటంలేదని, వేలం వాయిదా వేయాలని కొందరు కోరడంతో వేలం వాయిదా వేశాం. ఎప్పుడు వేలం నిర్వహించేది వచ్చేనెల 6 తర్వాత ప్రకటిస్తాం. – నున్న శ్రీరాములు, కార్యనిర్వహణ అధికారి, శ్రీ సంస్థానం సత్రం గ్రూపు దేవాలయాలు, పిఠాపురం, కాకినాడ జిల్లా -
పెట్టుబడి ఘనం.. గిట్టుబాటు గగనం
సఖినేటిపల్లి: జీడిపప్పు తయారీలో కేరళది అగ్రస్థానం కాగా తర్వాతి స్థానం కోనసీమలోని మోరిదే. అందులోనూ మోరి జీడిపప్పు కేరళ పప్పు కంటే మంచి రుచిగా ఉండడం వల్ల డిమాండ్ ఉంది. కేవలం ఇక్కడ తయారీ విధానం ద్వారా మాత్రమే ప్రసిద్ధి. రెండు శాతం మినహా గింజలు మాత్రం పూర్తిగా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నవే. గతంలో మోరికి పరిమితమైన ఈ పరిశ్రమ ఇతర ప్రాంతాలకు విస్తరించింది. అయితే సీజన్ ప్రారంభమయ్యే మార్చి నెలాఖరులో ఉగాదికి అందుబాటులో ఉన్న గింజల ధర కాస్తా అమాంతంగా పెరగడం, పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ మార్కెట్లో అమ్మకాలు మందకొడిగా సాగడం చిరు వ్యాపారస్తులను డీలా పర్చాయి. రాజోలు దీవిలో.. రాజోలు దీవిలో ప్రప్రథమంగా మోరిలో తయారైన జీడిపప్పు తదనంతర కాలంలో దీవిలో సుమారు 25 గ్రామాలకు ఎగబాకింది. ఈ నేపథ్యంలో ఏడాదికి మోరి తదితర ప్రాంతాల్లో తయారయ్యే జీడి పప్పు సుమారుగా 8 నుంచి 9 లక్షల టన్నులు ఉంటుందని అంచనా. ఈ పరిశ్రమపై ఆధార పడిన కుటుంబాలు 25 వేలు వరకూ ఉంటాయి. పరిశ్రమ ద్వారా ఏడాది టర్నోవర్ సుమారు రూ.480 కోట్ల నుంచి రూ.500 కోట్లు వరకూ ఉంటుంది. కొత్త గింజలతో వ్యాపారం ఏటా మార్చి నెలాఖరు నుంచి కొత్తగా మార్కెట్లోకి వచ్చే దేశవాళీ గింజలతో సీజన్ ప్రారంభమవుతుంది. హైదరాబాద్, విజయవాడ, రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రాలుగా జీడిపప్పు ఎగుమతితో పాటు, సమీపంలోని పాలకొల్లు, భీమవరం, నర్సాపురం పట్టణాలకు ఎగుమతి చేస్తున్నారు. కాగా జీడిగింజలు హెచ్చు రేటుకు కొనుగోలు చేసుకుని వ్యాపారం చేసే చిరు వ్యాపారులు మాత్రం అధిక పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని వాపోతున్నారు. స్వదేశీ గింజలతో వ్యాపారం సీజన్ స్వదేశీ గింజలతో వ్యాపారం ప్రారంభమవుతుంది. ఇక్కడి వ్యాపారులు జీడిగింజలను రాజానగరం, మధురపూడి, ఎల్లవరం, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, గోపాలపురం, దూబచర్ల, కొయ్యలగూడెం నుంచి దిగుమతి చేసుకుంటారు. సీజన్ ప్రారంభంలో మార్కెట్లో 80 కిలోల దేశవాళీ బస్తా గింజలు రవాణా చార్జీలతో కలిపి రూ.10 వేలు పలికింది. ఆ రేటు కాస్తా ప్రస్తుతం రూ.12 వేలుకు చేరింది. కాగా 80 కిలోల గింజలను పప్పుగా తయారు చేయడానికి వ్యాపారస్తులకు రూ.1,500 వెచ్చించాల్సి వస్తుంది. స్వదేశీ గింజల్లో లభించే ముడిపప్పు 20 కిలోలను మూడు రకాలుగా గ్రేడింగ్ చేస్తారు. 10 కిలోల గుండు మొదటి రకం, 8 కిలోల ముక్కబద్ద రెండో రకం, 2 కిలోల నలిముక్క మూడో రకం. ప్రస్తుతం మార్కెట్లో కేజీ గుండు ధర రూ.820, కేజీ బద్దముక్క రూ.770, నలిముక్క రూ.400 పలుకుతోంది. ఈ ప్రకారంగా గుండుకు రూ.8,200, ముక్కబద్దకు రూ.6,160, నలి ముక్కకు రూ.800 లభిస్తోంది. ఇలా చూసుకుంటే ఈ గింజల ద్వారా ఆదాయం రూ.15,160 వస్తోంది. గిట్టుబాటు స్వల్పమే మార్కెట్లో 80 కిలోల గింజలను తయారీలో పప్పుగా మార్చడానికి అయ్యే ఖర్చులతో కలిపి గింజలపై రూ.13,500 పెట్టుబడిగా ఉంది. మార్కెట్లో తెల్లపప్పు అమ్మకాల ద్వారా వస్తున్నది రూ.15,160. ఈ రకంగా చూసుకుంటే వ్యాపారస్తుడికి చేతికి మిగిలేది కేవలం రూ.1,660. ఇందులో ఇతర ఖర్చులు పోను రాబడి లెక్కిస్తే ఆటుపోట్లు మధ్య వ్యాపారం కష్టంగా మారింది. జీడిపప్పు చిరు వ్యాపారుల డీలా కలసిరాని పెళ్లిళ్ల సీజన్ అమాంతంగా పెరిగిన గింజల ధర పెరిగిన గింజల ధర కుటీర పరిశ్రమగా విరాజిల్లిన జీడిపప్పు వ్యాపారం ఇప్పుడు ఆటుపోట్ల మధ్య ఊగిసలాడుతోంది. సీజన్ ప్రారంభంలో రూ.10 వేలు ఉన్న బస్తా గింజల ధర ఇప్పుడు రూ.12 వేలుకు చేరింది. దీంతో పెట్టుబడి భారం ఎక్కువ అయింది. – ముప్పర్తి ఆదినారాయణమూర్తి, చిరువ్యాపారి, మోరి మందకొడిగా వ్యాపారం పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ వ్యాపారం మందకొడిగా ఉంది. గింజల ధర కూడా ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయింది. సీజన్ ప్రారంభంలో అందుబాటులో రేటుకు గింజలు లభిస్తే పెట్టుబడి భారం తగ్గేది. – జె.మాణిక్యాలరావు, చిరువ్యాపారి, మోరి