breaking news
Kakinada
-
మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, సెర్ప్, మెప్మా విభాగాల సౌజన్యంతో స్థానిక కుళాయి చెరువు పార్కు వద్ద కళాక్షేత్రంలో ఆదివారం జరిగిన జిల్లా స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ సమగ్రాభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే ఆర్థిక స్వావలంబన పెరగడంతో పాటు కుటుంబ, సమాజ అభివృద్ధి వేగవంతమవుతాయని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు రుణాలు, సబ్సిడీలు, శిక్షణలు, మార్కెటింగ్ సహాయం వంటి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చి, పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ, బాలికల చదువు పట్ల ఉన్న ఆలోచనా దృక్పథాన్ని తల్లిదండ్రులు మార్చుకోవాలని, వారిని కేవలం పదో తరగతి, ఇంటర్మీడియెట్ వరకే పరిమితం చేయకుండా ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచిన మహిళలను సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం రౌతులపూడి: మండలంలోని ఎస్.పైడిపాల ఆర్అండ్బీ రోడ్డులో గుమ్మరేగుల వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఎస్.పైడిపాల గ్రామానికి చెందిన గొల్లు వరహాలు (45) మండలంలోని బీబీ పట్నంలో శనివారం రాత్రి జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరయ్యాడు. తిరిగి స్కూటీపై స్వగ్రామం ఎస్.పైడిపాల వెళ్తూండగా.. గుమ్మరేగుల వద్ద ఎదురుగా రౌతులపూడి వైపు వస్తున్న ఎర్రమట్టిని లారీ వేగంగా దూసుకువచ్చి, అతడిని బలంగా ఢీకొంది. రోడ్డుపై పడిపోయిన వరహాలు తలపై నుంచి లారీ చక్రాలు దూసుకుపోయాయి. దీంతో, తల నుజ్జునుజ్జయి అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. రౌతులపూడి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, వరహాలు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని ఎస్సై జి.వెంకటేశ్వరరావు తెలిపారు. మృతుడు వరహాలుకు భార్య రామలక్ష్మి ఉన్నారు. బైక్ ఢీకొని వ్యక్తి మృతిశంఖవరం: కత్తిపూడి వద్ద పదహారో నంబర్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కత్తిపూడికి చెందిన బోడపాటి త్రిమూర్తులు (50) ఆదివారం రాత్రి నెల్లిపూడి జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో గొల్లప్రోలు మండలం చెందుర్తికి చెందిన బానుబోయిన స్వామి మోటార్ బైక్పై చెందుర్తి నుంచి అన్నవరం వెళ్తున్నాడు. అదే సమయంలో రోడ్డు దాటుతున్న త్రిమూర్తులును అతడు బైక్తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో త్రిమూర్తులు అక్కడికక్కడే మృతి చెందాడు. స్వామికి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు వెంటనే అంబులెన్స్పై ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై శ్రీహరిబాబు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు త్రిమూర్తులుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతడి మృతదేహం వద్ద బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రత్నగిరికి పోటెత్తిన భక్తులు అన్నవరం: రత్నగిరికి ఆదివారం భక్తులు వేలాదిగా పోటెత్తారు. సత్యదేవుని సన్నిధిలోను, ఇతర ప్రాంతాల్లోను శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజాము ముహూర్తాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులు, ఇతర భక్తులు వేలాదిగా సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. స్వామివారిని సుమారు 40 వేల మంది దర్శించుకున్నారు. వ్రతాలు 3,200 జరిగాయి. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం కాకినాడ రూరల్: కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు స్పృహ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ (ఎస్ఈఈటీ) నిర్వహకులు ఎం.కూర్మారావు, ఎన్.పెద్దిరాజు, ఎన్.ఏసుదాస్, ఎన్.చిన్నారావు, ఎల్.జార్జి, సుజ్ఞాన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కృషితో లబ్ధి పొంది, ఆయన ఆశయం ‘సే బ్యాక్ టు సొసైటీ’ సాధనకు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2025–26లో పదో తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ–సి కేటగిరీల విద్యార్థులు ప్రీ ఫైనల్ పరీక్షలో 500 పైగా మార్కులు సాధించాల్సి ఉంటుందని వివరించారు. వీరికి వివిధ కార్పొరేట్ విద్యా సంస్థల్లో రెసిడెన్షియల్ విధానంలో జేఈఈ/ఐఐటీ, నీట్ విభాగాల్లో ఉచితంగా ఇంటర్ చదివించేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అర్హులైన వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పదో తరగతి ప్రీ ఫైనల్ మార్కులు జాబితా జత చేయాలని సూచించారు. ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్ 2న రాజమహేంద్రవరంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. వివరాలకు 99595 07507, 93940 78228 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
బతుకు పయనం.. పూలబాటలో..
సుమ సౌందర్యం: గుత్తులుగా విరబూసిన తెలుపు రంగు ఆర్కిడ్లుకలర్ఫుల్గా..: ఆకర్షించే రంగుల్లో ఆర్కిడ్లు● అనువుగానిచోట ఆర్కిడ్స్ సాగు ● నర్సింగపురంలో యువ రైతు ప్రయోగం ● గుబాళిస్తున్న బ్యాంకాక్ సుమాలు ● విరబూస్తున్న లాభాలుపిఠాపురం మండలం నర్సింగపురం గ్రామానికి చెందిన జవ్వాది వీరబాబు పదో తరగతి వరకూ చదువుకున్నాడు. ప్లంబింగ్ పనులు చేస్తూంటాడు. వస్తున్న ఆదాయంతో బతుకు బండి సాఫీగా సాగడం లేదు. దీంతో, కాస్త విభిన్నంగా ఆలోచించాడు. తనకున్న మూడెకరాల పొలంలో అరుదైన పూలు సాగు చేయాలని సంకల్పించాడు. పెళ్లి వేదికలకు వినూత్న శోభను అద్దే ఆర్కిడ్స్ పుష్పాలపై అతడి దృష్టి పడింది. వాటి గురించి ఆరా తీశాడు. ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాడు. సలహాలు, సూచనలు తీసుకున్నాడు. తెలిసిన స్నేహితుల ద్వారా ఆర్కిడ్స్ మొక్కలు కొనుగోలు చేశాడు. అక్కడితో ఆగలేదు. ఏకంగా థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచే పూల మొక్కలు తెప్పించాడు. తన పొలంలో అరెకరంలో పాలీహౌస్ నిర్మించాడు. దానిలో ప్రత్యేక వాతావరణంలో రకరకాల ఆర్కిడ్స్ సాగు నాలుగేళ్ల క్రితం ప్రారంభించాడు. వీటి సాగు మొదలు పెట్టిన ఏడాది నుంచే కోతకు రావడంతో పూల వ్యాపారం మూడు పువ్వులు ఆరు పుష్పగుచ్ఛాలుగా విరాజిల్లుతోంది. ఖరీదైన వ్యవహారం సాధారణంగా మనం నిత్యం వాడటానికి రకరకాల పుష్పాలు వాడుతూంటాం. కానీ, సౌకుమార్యం, అందం, సౌరభం కలబోసిన ఆకర్షణీయమైన పూలనిచ్చే మొక్కలు ఆర్కిడ్స్. వీటిని ఎక్కువగా శుభకార్యాల్లో వేదికల అలంకరణకు వాడుతూంటారు. ఆర్కిడ్స్ పూల ఉత్పత్తిలో థాయ్లాండ్ అగ్రగామిగా ఉంది. ఇక్కడి నుంచే అధిక శాతం పూలు మన దేశానికి దిగుమతి అవుతున్నాయి. మన దేశంలో ఆర్కిడ్స్ సాగులో మహారాష్ట్ర ముందంజలో ఉంది. మన ప్రాంతాల్లో వ్యాపారపరంగా ఆర్కిడ్స్ సాగు అరుదే. ఇది చాలా ఖరీదైన వ్యవహారం. అధిక తేమతో కూడిన వాతావరణం కావాలి. అందుకే సాధారణంగా వీటిని పాలీహౌస్లోనే పెంచుతూంటారు. విస్తీర్ణాన్ని బట్టి ఈ పాలీహౌస్ ఏర్పాటు, మొక్కల కొనుగోలుకే ఏకంగా రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షల వరకూ ఖర్చవుతుంది. అందుకే సంపన్న రైతులు సైతం వీటి పెంపకానికి వెనుకాడుతూంటారు. కానీ, వీరబాబు మాత్రం ‘తగ్గేదేలే.. అన్నాడు. ఖరీదైన ఈ పుష్పాలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. ఆర్కిడ్స్లో ఎన్నో రకాలున్నాయి. వీరబాబు లిల్లీ జాతికి చెందిన ఏషియాటిక్ లిల్లీ పూలను సాగు చేస్తున్నాడు. గాలిలో పెంపకం ఆర్కిడ్స్ సాగు ఎంతో విభిన్నంగా ఉంటుంది. ఈ మొక్క మట్టిలో పెరగదు. బ్యాంకాక్ నుంచి ట్రేలలో వచ్చిన మొక్కలను మూడంగుళాల కుండీల్లోకి మారుస్తారు. ఆ కుండీలో మట్టి లేకుండా బొగ్గు, గులకరాయి, కంకర, లోహపు రాళ్లను వాడుతూంటారు. వీటి కంటే కొబ్బరి డొక్కల్లో ఎక్కువ ఫలితాలు వస్తున్నట్లు గమనించారు. దీంతో, ప్రస్తుతం కొబ్బరి డొక్కల్లో ఈ మొక్కలను పెంచుతున్నారు. కొబ్బరి డొక్కను చీల్చి నీటిలో నానబెడతారు. వాటిని కుండీల్లో పెట్టి, మొక్కలు నాటుతారు. అనంతరం, ఆ కుండీలను ప్రత్యేకంగా తయారు చేసిన బెడ్లపై వరుసగా పేర్చుతారు. అవి పెరుగుతూ వాటి వేర్లు బెడ్ల నుంచి కిందకు గాల్లో వేలాడుతూంటాయి. ఈ క్రమంలో గాలిలో తేమను ఆ మొక్కలు పీల్చుకుంటాయి. దీనివలన పువ్వులు బాగా తయారవుతాయి.చూస్తే ఫిదా కావాల్సిందే..: పసుపు రంగు ఆర్కిడ్లుఆదాయానికి తగ్గట్టుగానే పెట్టుబడి ఒక్కో మొక్క రూ.60 చొప్పున బ్యాంకాక్ నుంచి 60 వేల మొక్కలు తెప్పించాను. వీటికి ఎండ వేడి తగలకూడదు. తేమ అధికంగా ఉండాలి. దీనికోసం అరెకరంలో సన్షేడ్లు నిర్మించి, ఈ మొక్కలు నాటాను. మొత్తం రూ.40 లక్షల వరకూ పెట్టుబడి అయ్యింది. రెండో దఫా గత ఏడాది నాటగా ప్రస్తుతం పూలు కోతకు వచ్చాయి. ప్రతి నెలా మంచి దిగుబడి వస్తోంది. పెట్టుబడికి తగినట్టుగానే ఆదాయం కూడా వస్తోంది. వస్తున్న పూలను స్థానిక వ్యాపారులతో పాటు బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ఆర్డర్లపై విక్రయిస్తున్నాను. తెలుపు, పసుపు, ఎరుపు రంగు పూలు సాగు చేశాను. వీటికే మంచి గిరాకీ ఉంది. – జవ్వాది వీరబాబు ధైర్యంతో విజయం సాధించారు నర్సింగపురంలో ఆర్కిడ్స్ సాగు ఆశాజనకంగా ఉంది. వీరబాబు ధైర్యం చేసి వీటి సాగు ప్రారంభించగా, మా సలహాలతో మంచి దిగుబడులు సాధిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం ఈ పూలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ప్రతి శుభకార్యంలోను వీటికి ప్రాధాన్యం ఇస్తూండటంతో అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వ్యాపారం బాగుంది. మరింత మంది రైతులు ముందుకు వచ్చేలా అవగాహన కల్పిస్తున్నాం. – వై.సోమరాజశేఖర్, ఉద్యాన శాఖాధికారి, పిఠాపురం -
వంట గ్యాస్ ధరలు తగ్గించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యాన కాకినాడలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద ఆదివారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం సీనియర్ నేత దువ్వ శేషుబాబ్జీ మాట్లాడుతూ, మహిళా సాధికారత గురించి ప్రగల్భాలు పలికే పాలకులు మహిళా దినోత్సవం నాడే వంట గ్యాస్ ధరలు పెంచారని ఎద్దేవా చేశారు. ఒకవైపు దేశంలో ఆయిల్, గ్యాస్ నిల్వలకు కొదవ లేదంటున్నారని, అటువంటప్పుడు ధరలు పెంచాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. యుద్ధం పేరుతో అదానీ వంటి కార్పొరేట్ ఆయిల్ కంపెనీల లాభాల కోసమే ప్రజలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని విమర్శించి, అధికారం చేపట్టిన చంద్రబాబు, పవన్ కల్యాణ్లు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల శ్రేయస్సు కోసం చిత్తశుద్ధితో నిలబడాలని అన్నారు. వంట గ్యాస్ ధరలు తగ్గించడానికి కేంద్రంపై టీడీపీ, జనసేన నాయకులు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సీహెచ్ రాజ్కుమార్, నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలక వెంకట రమణ, నాగాబత్తుల సూర్యనారాయణ, సీహెచ్ వేణు, మేడిశెట్టి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం
● కాకినాడలో ఓ మహిళ నిర్వాకం ● కాంట్రాక్టు ఉద్యోగి చనిపోతే భార్యకు రెగ్యులర్ ఉద్యోగం ● కీలకంగా వ్యవహరించిన సీనియర్ అసిస్టెంట్ ● కాకినాడ, ‘తూర్పు’ కలెక్టర్లు సీరియస్ ● మహిళ సస్పెన్షన్ ● అమర్కాంత్ సరెండర్కు ఆదేశాలు కాకినాడ క్రైం: కారుణ్య నియామకాల కోటాలో.. నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన ఓ మహిళ పైన, ఆమెకు సహకరించిన ఓ ప్రభుత్వ ఉద్యోగి పైన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తీవ్ర చర్యలు తీసుకున్నారు. వివరాలివీ.. కాకినాడకు చెందిన చెరుకూరి (పోల) హేమలత భర్త వినయ్ సంపత్ ఐదేళ్ల క్రితం కోవిడ్ సోకి మృతి చెందాడు. ఆయన కాకినాడలో ప్రభుత్వ కాంట్రాక్టు విధానంలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేసేవాడు. భర్త చనిపోయిన కొద్ది రోజులకు హేమలత జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్)ను ఆశ్రయించింది. తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరింది. అప్పట్లో డీఎంహెచ్వో కార్యాలయం పీఓడీటీటీ విభాగంలో పని చేస్తూ, డెప్యూటేషన్పై రాజమహేంద్రవరంలోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్కు వెళ్లిన సీనియర్ అసిస్టెంట్ కేశవ అమర్కాంత్ అగస్త్యకు ఈ విషయం తెలిసింది. ఆమె అవసరాన్ని ఆసరాగా తీసుకున్న అతడు.. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. వారి పరిచయం కాస్తా ద్విచక్ర వాహనాలపై కలిసి తిరిగేంత వరకూ వెళ్లింది. అర్జీదారుతో ఎందుకంత ఉన్నతాధికారులు చనువని ప్రశ్నిస్తే తన మేనకోడలని అమర్కాంత్ బదులు చెప్పేవాడు. ఈ నేపథ్యంలో అతడు కాకినాడలోని డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు బదిలీ అయ్యాడు. ఆ కళాశాలలో అప్పటికి 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదే అదనుగా అమర్కాంత్ కారుణ్య నియామక కోటాలో హేమలతకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని భావించాడు. అయితే, నిబంధనల ప్రకారం కారుణ్య నియామకం కేవలం ప్రభుత్వ ఉద్యోగి భాగస్వామికే తప్ప కాంట్రాక్టు ఉద్యోగి భాగస్వామికి వర్తించదు. దీంతో, హేమలతకు ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు అమర్కాంత్ పథకం వేశాడు. కలెక్టర్కే బురిడీ... ఆమె పేరిట నకిలీ పత్రాలు సృష్టించి, హేమలత భర్త సంపత్ది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగమని ఉన్నతాధికారులను అమర్కాంత్ నమ్మించాడు. అతడిది ప్రభుత్వ నియామకమన్నట్లు, ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు అందుకున్నట్లు, ఉన్నతాధికారులకు రిపోర్టింగ్ చేసినట్లు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డు, ఎస్ఆర్ ఎంట్రీ.. ఇలా ప్రతి ఒక్కటీ నకిలీవి తయారు చేశాడు. ఈ పత్రాలతో ఏకంగా అప్పటి కలెక్టర్నే బురిడీ కొట్టించాడు. చివరకు సుమారు రెండేళ్ల క్రితం అప్పటి కలెక్టర్ సంతకంతోనే హేమలతకు ప్రభుత్వ ఉద్యోగం వేయించాడు. నిరుద్యోగుల ఫిర్యాదుతో వెలుగులోకి... ఓవైపు ప్రభుత్వ ఉద్యోగులు లేక జీవితాలు దుర్భరమవుతున్న పరిస్థితుల్లో.. హేమలత నకిలీ పత్రాలతో ఉద్యోగం పొందిన విషయం ఎలాగోలా బయటకు పొక్కింది. ఈ అక్రమంపై రగిలిన కొందరు నిరుద్యోగులు ఓ సంఘ నాయకుల సాయంతో గత ఏడాది అక్టోబర్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపై విచారణకు డీఎంహెచ్ఓ నరసింహ నాయక్ త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీ రాజమహేంద్రవరంలో పని చేస్తున్న హేమలతను కాకినాడ పిలిపించి విచారించింది. దీంతో, అసలు విషయం బట్టబయలైంది. హేమలత అందించిన ప్రతి పత్రం నకిలీదేనని, అసలు ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగే కాదని, ఇదంతా అమర్కాంత్ ఆడించిన నాటకమని, ప్రతి పత్రానికీ అతడే నకిలీ సృష్టించాడని విచారణ కమిటీ గుర్తించింది. ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా డీఎంహెచ్ఓ ఆధ్వర్యాన కలెక్టర్కు నివేదించింది.చర్యలకు ఆదేశం విచారణ అనంతరం, డీఎంహెచ్ఓ నరసింహ నాయక్ ద్వారా త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ బాధ్యులిద్దరి పైనా తక్షణ చర్యలకు సిఫారసు చేశారు. ఈ విచారణ నివేదికను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కేవీ శివప్రసాద్కు పంపారు. ఈ నేపథ్యంలో అమర్కాంత్ను ‘తూర్పు’ కలెక్టర్ కీర్తి ప్రభుత్వానికి సరెండర్ చేశారు. మోసపూరితంగా ప్రభుత్వ ఉద్యోగం పొందిన హేమలతను సస్పెండ్ చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం చర్యలు చేపట్టనున్నట్లు రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల అధికారులు తెలిపారు. -
భాగ్యలక్ష్మీ ఆటో సర్వీస్
పట్టుదల ఉంటే పరాజయాలు ఆమడ దూరం పరుగెడతాయి. విజయాలు పలకరిస్తాయి. కన్నీరు పెట్టుకుంటే కడుపు నిండదు. ఈ సూత్రాన్నే నమ్ముకున్నారు యు.కొత్తపల్లి మండలం గోర్స గ్రామానికి చెందిన జి.భాగ్యలక్ష్మి. భర్త, ఇద్దరు పిల్లలు బేబీ సౌమ్య (14), అఖిల్ కుమార్(12)లతో జీవితం ఆనందంగా సాగిపోయేది. ఉన్నట్టుంది పెద్ద కుదుపు. విధి వక్రించి, కుటుంబ భారాన్ని మోసే భర్త దూరమయ్యాడు. కుటుంబ భారం ఆమె పైనే పడింది. ఎదురొచ్చిన కష్టాన్ని ఆమె గుండెల్లోనే దాచుకున్నారు. హైదరాబాద్ వెళ్లి, ఒక బ్యూటీ పార్లర్లో బ్యూటీషియన్గా పని చేశారు. విధి మరోసారి పరీక్ష పెట్టింది. హైదరాబాద్లో పని చేస్తూండగా కాలు జారి మెట్ల మీద నుంచి పడిపోయారు. కాలు విరిగిపోవడంతో రాడ్లు వేశారు. దీంతో, ఎక్కువసేపు నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. బ్యూటీషియన్ పనిలో ఎక్కువ సమయం నిలబడి ఉండాలి. దీంతో, ఆ పని చేయలేక అక్కడి నుంచి భాగ్యలక్ష్మి సొంతూరు గోర్స వచ్చేశారు. కుటుంబం గడవడానికి ఆటో నడపడం నేర్చుకున్నారు. ఎలక్ట్రిక్ ఆటో అయితే కాలుతో ఎక్కువగా పని ఉండదు. అందుకే ఈ–ఆటో కొనుక్కుని స్వశక్తితో బతుకు బండిని నడిపించుకుంటున్నారు. ఆటోలు ఎక్కువగా పురుషులే నడుపుతూంటారు. ఈ రంగంలోకి వచ్చినప్పుడు మొదట్లో కొందరు హేళన చేశారు. మరికొందరు వెకిలిగా, సూటిపోటి మాటలు మాట్లాడేవారు. ఇవేవీ పట్టించుకోకుండా పట్టుదలతో ఆమె ముందకు సాగడం చూశాక అందరూ సహకరించసాగారు. వర్తమాన పరిస్థితుల్లో జరుగుతున్న వివిధ సంఘటనలను చూస్తున్న మహిళలు.. మగవారు లేకుండా ఆటోలో ప్రయాణించడానికి ఒకింత భయపడుతూంటారు. రాత్రి వేళల్లో అయితే ఈ భయం మరింతగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడి మహిళలకు భాగ్యలక్ష్మీ ఆటో సర్వీస్ ఒక వరంగా మారింది. ఆమె ఆటో ఎక్కితే ధైర్యంగా గమ్యం చేరుకోవచ్చని మహిళలు చెబుతూంటారు. ‘చిన్నప్పుడు సైకిల్ తొక్కడానికే భయపడేదానిని. ఇక ఆటోలు ఎక్కి ప్రయాణం చేయాలంటే దిగే వరకూ ఊపిరి బిగబట్టి ఉండేదానిని. అలాంటిది ఆ ఆటోనే నా కుటుంబానికి జీవనాధారం అవుతుందని కలలో కూడా అనుకోలేదు. తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలను నేనే చూసుకోవాలి. నా పిల్లల భవిష్యత్తు కన్నా వేరేదీ ముఖ్యం కాదనుకుని ముందుకు సాగుతున్నాను’ అని భాగ్యలక్ష్మి గర్వంగా చెబుతున్నారు. -
కలెక్టరేట్లో లీగల్ ఎయిడ్ క్లినిక్
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): హైకోర్టు ఆదేశాల మేరకు మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యాన కలెక్టరేట్లో లీగల్ ఎయిడెడ్ క్లినిక్ను మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి జి.ఆనంది శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలకు న్యాయ సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ ఉచిత న్యాయ సలహాలు ఇచ్చేందుకు ఒక ప్యానల్ అడ్వొకేట్ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ నెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్లో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కేసులను ఇరు వర్గాల పరస్పర ఒప్పందంతో పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ, ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ లీగల్ ఎయిడ్ క్లినిక్ కలెక్టరేట్లో పని చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ టి.తిప్పేనాయక్, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎస్.రామ్మోహన్రావు, ప్యానల్ అడ్వొకేట్ ఎ.సునీల్కాంత్ కుమార్ పాల్గొన్నారు. -
ఊరంతటికీ వంటిల్లు
గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన అడపా అమ్మాజీ, ఆమె కుమార్తె ఎర్రంశెట్టి దేవి కలసి కొన్నేళ్లుగా పిండి వంటలు చేసే పనిని కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్నారు. వీరు తయారు చేసిన మిఠాయిలు, ఇతర పిండి వంటలను వివిధ జిల్లాలకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో, ఈ తల్లీకూతుళ్లిద్దరూ ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా.. ప్రతి రోజూ 10 నుంచి 15 మంది వరకూ మహిళలకు ఉపాధి కూడా కల్పిస్తున్నారు. దుర్గాభవాని మహిళా శక్తి సంఘం డ్వాక్రా గ్రూపు నుంచి రుణం పొందిన వీరు రెండేళ్ల క్రితం క్యాటరింగ్ రంగంలోకి అడుగు పెట్టారు. పండగ సమయంలో ఆర్డర్ ప్రకారం రకరకాల పిండివంటలు తయారు చేస్తారు. అంతేకాదు.. ఒకప్పుడు పొట్టకూటి కోసం చిన్నచిన్న జంతికలు తయారు చేసి అమ్ముకున్న వీరు.. ఇప్పుడు ఏకంగా వివిధ రకాల పిండి వంటలు, రుచికరమైన భోజనాలు కూడా సరఫరా చేసే స్థాయికి ఎదిగారు. ఆ ఊరిలో ఏ శుభకార్యం జరిగినా పిండి వంటలు ఈ ఇంట్లోనే తయారు చేస్తూంటారు. శుభకార్యాలతో పాటు పండగలకు సైతం బూరెలు, గారెలు, చలివిడి, లడ్డూలు, వడియాలు, సున్నుండల వంటి పిండి వంటలు ఎక్కువ మంది ఇక్కడి నుంచే కొనుగోలు చేయడం విశేషం. వివాహాది శుభకార్యాలకు స్వయంగా వండి, రుచికరమైన భోజనాలు సరఫరా చేస్తున్నారు. అందుకే ఆ ఊరంతటికీ ఆ ఇల్లే వంటిల్లుగా పేరొందింది. ఇంట్లో పండగలకు వండుకునే వంటలే ఇప్పుడు తన వ్యాపారంగా మారిందని, తాను తయారు చేసే పిండి వంటలు నచ్చడంతో అందరూ తనవద్ద కొనుగోలు చేస్తున్నారని అమ్మాజీ తెలిపారు. గతంలో ఇంటి వద్దనే అమ్మేవారమని, రెండేళ్లుగా కొనుగోలుదార్లు ఎక్కువగా వస్తూండటంతో కొంత మంది మహిళలను పెట్టుకుని వంటలు వండుతూ సరఫరా చేస్తున్నామని చెప్పారు. పిండి వంటలతో పాటు భోజనాలు కూడా తయారు చేసి ఇవ్వాలని అడుగుతూండటంతో క్యాటరింగ్ కూడా ప్రారంభించామని తెలిపారు. చిన్నప్పుడు మాకు.. ఇప్పుడు అందరికీ వండి పెడుతున్న మా అమ్మకు చేదోడుగా తాను కూడా ఇదే పని చేస్తున్నానని అమ్మాజీ కుమార్తె ఎర్రంశెట్టి దేవి చెప్పారు. -
తప్పుడు కేసులకు భయపడేది లేదు
కాకినాడ రూరల్: తప్పుడు కేసులకు భయపడేది లేదని, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా తిమ్మాపురం శివాలయం వద్ద చోటు చేసుకున్న వివాదంలో కేవలం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిన సంగతి విదితమే. ఈ కేసులో సబ్ జైలులో రిమాండులో ఉండి బెయిల్పై విడుదలైన తిమ్మాపురం సర్పంచ్, వైఎస్సార్ సీపీ ఎస్ఈసీ సభ్యుడు బెజవాడ సత్యనారాయణను పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు తదితరులతో కలసి రాజా శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా శివాలయం వద్ద జరిగిన సంఘటనను సత్యనారాయణ వివరించారు. పోలీసులు తమ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా 10 మందిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారని చెప్పారు. రాజా మాట్లాడుతూ, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపులు మానుకోవాలని, ఒక వర్గానికి కొమ్ము కాయడం పోలీసులకు సరికాదని అన్నారు. కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి వాసిరెడ్డి జమీలు, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, మాకినీడి శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు. -
కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరవు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరవైందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నిలువునా దగా చేశారని ఆక్షేపించారు. కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ వివిధ పథకాల పేరుతో మహిళలను నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకు షరా మామూలేనని అన్నారు. ఇందులో భాగంగానే ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 ఇస్తానని మోసం చేసిన బాబు ఏ ముఖం పెట్టుకుని మహిళా దినోత్సవానికి హాజరవుతారో చూస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి మహిళలు సరైన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు మహిళలు ఎదురు చూస్తున్నారని, అయితే, రెడ్బుక్ రాజ్యాంగానికి భయపడి బయట పడటం లేదని రాజా అన్నారు. ఈ సందర్భంగా పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాతకు పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ మంత్రి తోట నరసింహం, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కో ఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, ముద్రగడ గిరిబాబు, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీలు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి దీప్తికుమార్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, కాకినాడ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, నాయకులు కృష్ట్రపియ, శేషుకుమారి పాల్గొన్నారు. -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
ఏలేశ్వరం: ఏలేరు ప్రాజెక్టు నుంచి విశాఖపట్నానికి నీరందిస్తున్న ఎడవ కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం శనివారం లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏలేశ్వరం క్వారీ ప్రాంతానికి చెందిన బంగర్తి విజయ్, గిడుతూరి లోవరాజులు శుక్రవారం ఉదయం అడ్డతీగల మండలం గొంటువానిపాలెం క్వారీ పనులకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా సిరాయవరం వచ్చేసరికి బైక్ అదుపుతప్పి ఏలేరు ఎడమ కాలువలో పడిపోయారు. స్థానికులు కాలువలో దిగి వెతకగా విజయ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. లోవరాజు గల్లంతు కాగా, శనివారం ప్రమాద సమీపంలోనే మృతదేహం లభ్యమైంది. లోవరాజుకు భార్య నాగమణితోపాటు కుమారైలు నవ్య, లోవకుమారి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు ఇసుక లారీల సీజ్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అధిక లోడుతో ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలను అధికారులు శనివారం సీజ్ చేశారు. రూ.1.70 లక్షల జరిమానా విధించారు. జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ కథనం ప్రకారం.. రాజానగరం హైవే పరిధి, లాలాచెరువు సమీపంలో పరిమితికి మించి ఇసుక లోడ్తో వెళ్తున్న రెండు లారీలను రవాణా అధికారులు పట్టుకున్నారు. సీజ్ చేసిన వాహనాలను అపరాధ రుసుము చెల్లించిన తర్వాత విడుదల చేశామన్నారు. పరిమితికి మించి ఇసుక రవాణా చేయడం వల్ల రహదారులపై ఇసుక పడి ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగాయన్నారు. ఇసుక రవాణా చేసే వాహన యజమానులు, డ్రైవర్లు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. 9న అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ అమలాపురం రూరల్: భారతీయ వాయుసేన నిర్వహిస్తున్న అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీని సద్వినియోగం చేసుకోవాలని కోనసీమ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి.హరిశేషు అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థుల కోసం ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీని గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ నెల 9న ఏపీ, తెలంగాణ మహిళా అభ్యర్థులకు, 12న ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులకు, 15న తెలంగాణ పురుష అభ్యర్థులకు జరుగుతాయన్నారు. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు 2005 ఫిబ్రవరి 5 నుంచి 2009 జనవరి మధ్యలో జన్మించి ఉండాలని, ఎత్తు కనీసం 152 సెంటీమీటర్లు, ఏదైనా స్ట్రీమ్లో ఇంటర్, తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత తేదా మూడేళ్ల డిప్లొమా ఇంజినీరింగ్ లేక, రెండేళ్ల ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలన్నారు. తెలంగాణ పురుష అభ్యర్థులకు ర్యాలీకి ముందస్తు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదని, సర్టిఫికెట్ కాపీలతో నేరుగా హాజరు కావొచ్చన్నారు. అభ్యర్థులు https://agnipathvayu.cdac.in వెబ్సైట్లో చూడాలని, లేకుంటే జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖను సంప్రదించాలని తెలిపారు. కలప స్వాధీనంఅడ్డతీగల: స్థానిక అటవీ క్షేత్రం పరిధిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో రవాణాకు సిద్ధం చేసిన కలపను అటవీ అధికారులు శనివారం పట్టుకున్నారు. ఆ వివరాల ప్రకారం.. దేవరమడుగుల గ్రామ సరిహద్దుల్లో రెండు బొలేరో ట్రక్లలో రవాణాకు సిద్ధం చేసిన సుమారు రూ.70 వేల విలువైన టేకు, సిందుగ రకం దుంగలను పట్టుకున్నారు. అలాగే మట్లపాడు వద్ద చెక్క దువ్వెనల తయారీకి ఉపయోగించే కొంటెచింత రకం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.25 వేల వరకూ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా స్వాధీనపర్చుకున్న కలపను సీజ్ చేసి అడ్డతీగల అటవీక్షేత్రాధికారి కార్యాలయానికి తరలించారు. -
సత్యదేవునిపై భక్తి గీతాలు రాస్తా..
అన్నవరం: సత్యదేవుడు తనకు ఎంతో ఇష్టమైన దైవమని, స్వామివారిపై త్వరలో భక్తిగీతాలు రాస్తానని ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ తెలిపారు. శనివారం ఆయన తన భార్య సుచిత్రతో కలసి రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. వారికి ఆలయం వద్ద అర్చకులు సుధీర్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి జిల్లాలకు విచ్చేసిన ప్రతిసారీ సత్యదేవుని దర్శనం చేసుకుంటానని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతోనే తాను మంచి గీతాలు రాయగలిగానని అన్నారు. సినీ గేయ రచయిత చంద్రబోస్ దంపతులకు పండితులు వేదాశీస్సులు అందజేసి, స్వామివారి ప్రసాదాలు బహూకరించారు. సినీ గేయ రచయిత చంద్రబోస్ -
సుదీర్ఘ పరిశోధనకు పట్టం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఏం చేయాలో తెలియదు. ఆ నొప్పిని నివారించేందుకు ఆ సమయంలో బీపీ తగ్గిపోవాలి. అది వెంటనే జరగాలి. అలా జరగాలంటే దానికి సంబంధించిన మందు వెంటనే నోటిలో బుగ్గకు పెడితే సెకన్లలో ఆ మందు లోపలకు వెళ్లి బీపీ అదుపులోకి వస్తుంది. అటువంటి మందుపై పరిశోధనలు చేసి విజయం సాధించారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం డ్రగ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) డి.నాగమణి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు జిల్లా వర్తనాపల్లి గ్రామానికి చెందిన నాగమణి సాధారణ ఏపీ రెసిడెన్షియల్ స్కూలు, చోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్నారు. ఆమె ప్రతిభకు ఔషధ నియంత్రణ శాఖలో ఉద్యోగం వచ్చింది. డ్రగ్ ఇన్స్పెక్టర్గా పలు జిల్లాల్లో పని చేసి, అంచెలంచెలుగా ఏడీగా ఎదిగారు. నిరంతరం తీవ్ర ఒత్తిడితో కూడిన ఉద్యోగం చేస్తూనే పరిశోధనలపై వైపు దృష్టి సారించారు. 2016లో తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్గా చేరారు. ‘డిజైన్, ఫ్యాబ్రికేషన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ బల్క్ డ్రగ్స్ డెలివరీ సిస్టమ్ ఆఫ్ సెలక్టెడ్ డ్రగ్స్’ అనే అంశంపై యూనివర్సిటీ ఫార్మసీ విభాగం ప్రొఫెసర్ వై.ఇందిరా ముజిజ్ నేతృత్వంలో పరిశోధనలు చేశారు. పరిశోధనల అనంతరం తాను తయారు చేసిన మందును ముందుగా కుందేళ్లపై ప్రయోగించి, పరీక్షించారు. ఆ పరీక్షలు విజయవంతమయ్యార ుు. జనవరి 24న యూనివర్సిటీ కమిటీ సమావేశం నిర్వహించి, ఆమె పరిశోధనలను పరిశీలించి, ఫార్మసీ పీహెచ్డీ ప్రదానం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నాగమణికి యూనివర్సిటీలో శనివారం పీహెచ్డీ ప్రదానం చేశారు. నాగమణి తూర్పు గోదావరితో పాటు కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో చేసిన సేవలకు గాను బెస్ట్ డ్రగ్ ఇన్స్పెక్టర్, బెస్ట్ డ్రగ్స్ ఏడీగా పలుమార్లు అవార్డులు అందుకున్నారు. ఫ హార్ట్ ఎటాక్ వచ్చే ముందు దానిని నివారించే చూయింగ్ టాబ్లెట్ తయారీ ఫ కుందేళ్లపై పరీక్షలు విజయవంతం ఫ డాక్టరేట్ అందుకున్న రాజమహేంద్రవరం డ్రగ్స్ ఏడీ నాగమణి కుటుంబ సహకారంతోనే.. ఫార్మసీలో పీహెచ్డీ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంలో రాష్ట్రంలోనే ఔషధ నియంత్రణ శాఖ నుంచి ఏకై క మహిళను అయినందుకు సంతోషంగా ఉంది. గుండె నొప్పి సమయంలో వెంటనే ఉపయోగించే విధంగా, తక్షణమే ఉపశమనం కలిగే విధంగా తయారు చేసిన మందు విజయం సాధించింది. ఇది నాకెంతో గర్వకారణం. ఇది నా ఒక్కరి విజయం కాదు. నా వెనుక ఉండి, నన్ను ప్రోత్సహించిన కుటుంబ సభ్యులందరిదీ. – డి.నాగమణి, డ్రగ్స్ ఏడీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా -
15 నుంచి రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు
నల్లజర్ల: మాస్టర్స్ చెస్ అకాడమీ, ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి రాష్ట్ర స్థాయి ఓపెన్ రాపిడ్ చదరంగం పోటీలు జరుగుతాయని టోర్నమెంట్ కమిటీ కన్వీనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం నల్లజర్లలోని కింగ్స్ ఉడ్ స్కూల్లో పోటీలకు సంబంధించిన బ్రోచర్ను జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఆవిష్కరించారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ పోటీలకు రాష్ట్రంలోని 20 జిల్లాల నుంచి 300 మంది చెస్ క్రీడాకారులు హాజరవుతారన్నారు. పాల్గొనే క్రీడాకారులు ఏపీచెస్.ఓఆర్జీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 94408 67370, 89787 82501 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో కింగ్స్ ఉడ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ దాపర్తి శివ, సెక్రటరీ, కరస్పాండెంట్ నిఖిలదేవి, ప్రిన్సిపాల్ డాక్టర్ సాయికుమార్, సొసైటీ అధ్యక్షులు రావూరి వెంకటరమణ, మార్ని దుర్గారావు, సవలం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
11లోగా అభ్యంతరాలు తెలపండి
కాకినాడ క్రైం: కొద్ది రోజుల క్రితం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ విడుదల ఉద్యోగ ప్రకటనలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈ మేరకు కాకినాడ డీఎంహెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్ఐసీ మెరిట్ లిస్టులో అభ్యంతరాలు ఉంటే ఈ నెల 9 నుంచి 11వ తేదీ మధ్య కాకినాడ డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి 5 గంటల మధ్య దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఎన్ఐజీ మెరిట్ జాబితా ఈస్ట్గోదావరి.ఏపీ.జీఓవీ.ఇన్, కాకినాడ.ఏపీ.జీఓవీ.ఇన్, కోనసీమ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లలో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
పెదపూడి: చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై ఎస్.తులసిరామ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. 2016లో రామేశ్వరంలో ఒక మూగ వ్యక్తి అనారోగ్యం, ఆకలితో ఉన్నప్పుడు అదే గ్రామానికి చెందిన కె.రామలింగేశ్వరరావు చేరదీశారు. అప్పటి నుంచి రామలింగేశ్వరరావు ఇంటి వద్ద ఆ వ్యక్తి ఉంటున్నాడు. మృతునికి వివరాలు అవసరమని రామలింగేశ్వరరావు ఇంటి వద్ద పని చేస్తున్న గుండు కామరాజు ఇంటి పేరుపై గుండు శివుడు (30)గా ఆధార్కార్డు తయారు చేయించారు. శివుడికి అప్పుడప్పుడు పిట్స్ వస్తుంటాయి. ఈ నేపథ్యంలో గత నెల 19న శివుడు దుస్తులు ఉతికి మేడపై ఆరబెట్టడానికి వెళుతున్నప్పుడు పిట్స్ వచ్చి పడిపోయాడు. ఆ విషయం రామలింగేశ్వరరావు, కామరాజు తదితరులు కొంత సమయం వరకూ చూడలేదు. అనంతరం చూసిన వారు శివుడ్ని కాకినాడ జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. -
డివైడర్ను ఢీకొన్న వ్యాన్
ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు నల్లజర్ల: అతి వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం నగరానికి క్యాటరింగ్కు సంబంధించిన మెటీరియల్ను వ్యాన్లో శుక్రవారం గుడివాడకు చెందిన కొండ్రు శ్రీనివాస్ (51), విజయవాడకు చెందిన శేషాద్రి, డ్రైవర్ కర్రి శివ తీసుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అతి వేగంగా వెళ్తున్న వ్యాన్ అనంతపల్లి ఎస్వీఆర్ కల్యాణ మండపం వద్ద జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొంది. ఈ సంఘటనలో డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న కొండ్రు శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన శేషాద్రి, శివలను చికిత్స నిమిత్తం హైవే అంబులెన్స్లో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన కొండ్రు శ్రీనివాస్ భార్య శైలజ ఉపాధి నిమిత్తం కువైట్లో ఉంటోంది. కుమారుడు కరుణకుమార్, కుమార్తె శ్వేతల బాగోగులు చూసుకుంటూ క్యాటరింగ్ పనులకు వెళ్లి తిరిగి వస్తుంటాడు. ఇదే క్రమంలో రాజమహేంద్రవరం వెళ్తూ మార్గం మధ్యలో చనిపోయాడు. ఎస్సై ఆంజనేయబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారు మకర తోరణం సమర్పణ
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరుని ఆలయంలో స్వామివారికి తణుకుకు చెందిన పుణ్యమూర్తుల రామచంద్రస్వామి, సావిత్రి దంపతులు రూ.60 లక్షల విలువైన బంగారు మకర తోరణాన్ని సమ ర్పించారు. దీనిని ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావుకు అందజేశారు. అనంతరం అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా సంప్రోక్షణ నిర్వహించి స్వామివారికి అలంకరించారు. దాతలకు తీర్థ ప్రసాదాలు, స్వామివారి ఫొటో అందజేశారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, ఉప సర్పంచ్ పోచిరాజు బాబూరావు, సర్పంచ్ సూర్యకుమారి దంపతులు, అయ్యగారి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
10న క్రికెట్ క్రీడాకారుల ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10న కాకినాడ ఆర్ఎంసీ క్రీడా మైదానంలోని క్రికెట్ నెట్స్లో క్రీడాకారుల ఎంపికలు జరుపనున్నట్లు సంఘ కార్యదర్శి వెంకటేష్ శుక్రవారం తెలిపారు. క్రికెట్ సంఘ అధ్యక్షుడు తలాటం హరీష్ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎంపికల్లో అండర్–23 బాలుర, బాలికలు, సీనియర్స్ విభాగంలో జట్టు ఎంపిక జరుగుతుందన్నారు. 2003 సెప్టెంబరు 1వ తేదీ తర్వాత పుట్టిన వారు అండర్–23 విభాగానికి అర్హులన్నారు. ఆసక్తి గల వారు సంబంధిత ఽఅర్హత పత్రాలు, తెల్ల దుస్తులు, తెల్లబూట్లు ధరించి ఎంపికలకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 90631 68999 నంబరులో సంప్రదించాలని కోరారు. రైలు ఢీకొని వ్యక్తి మృతి తుని: రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానిక రైల్వే ఎస్సై జి.శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. తుని రైల్వే స్టేషన్ లో ఒకటో నంబర్ ప్లాట్ఫారం శివారులో రైలు బండి ఢీకొనడంతో 30 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. రైల్వే సిబ్బంది అతనిని గుర్తించి 108 అంబులెన్స్లో తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు నలుపు రంగు ప్యాంటు, కాకీ రంగు చొక్కా ధరించి ఉన్నాడు. ఇతడి కుడి చేయి దండపై ఆంజనేయస్వామి పచ్చబొట్టు, కుడిచాతిపై ఓం అనే పచ్చబొ ట్టు ఉంది. మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్లో భద్రపరిచారు. వివరాలు తెలిసిన వారు 92475 85731 ఫోన్ నంబరులో సంప్రదించాలని ఎస్సై అన్నారు. -
ప్రగతిలో చెట్టాపట్టాల్
ఫ నిడదవోలు రైల్వే స్టేషన్కు కొత్త హంగులు ఫ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో ఏర్పాటు ఫ నూతనంగా 4, 5 ప్లాట్ఫామ్ల నిర్మాణం ఫ రెండు లిఫ్ట్లు, ఎస్క్లేటర్ల ఏర్పాటు నిడదవోలు: రైల్వే స్టేషన్లో అభివృద్ధి కూత పెట్టింది.. చకచకా కొత్తరూపు దిద్దుకుంది.. కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో సర్వ హంగులతో రెడీ అయ్యింది.. విజయవాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య కీలకమైన జంక్షన్గా పేరొందిన నిడదవోలు రైల్వే స్టేషన్ కొత్తరూపును సంతరించుకుంది. అమృత్ భారత్ పథకానికి దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో తొలి విడతగా 11 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. ఇందులో నిడదవోలు ఒకటి. ఈ పథకం కింద రూ.28 కోట్లతో ఈ రైల్వే స్టేషన్లో అధునాతన సౌకర్యాలు కల్పించారు. ఇప్పటికే ఈ పనులను పూర్తి చేశారు. ఇన్నేళ్లలో ఎన్నడూ చూడని అభివృద్ధి పనులు రైల్వే అధికారులు పూర్తి చేయడంతో ప్రయాణికుల అవసరాలు తీరుతున్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్న పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్లాట్ఫామ్లకు చేరుకోవడానికి రెండు లిఫ్ట్లు, ఒక ఎస్క్లేటర్ను నిర్మించారు. చేపట్టిన పనులివీ.. నిడదవోలు రైల్వే స్టేషన్లో ప్రస్తుతం మూడు ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇందులో 200 మీటర్ల మేర ఫ్లోర్ను గ్రానైట్తో ఆధునీకరించారు. ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ను రూ.3.91 కోట్లతో తాడేపల్లిగూడెం వైపు విస్తరించారు. దీనిని 600 మీటర్ల పొడవున కాంక్రీట్, గ్రానైట్తో నిర్మించారు. ప్లాట్ఫామ్ రక్షణ గోడ, ఇతర పనులు చేపట్టారు. ఇదే ప్లాట్ఫామ్లో రూ.3.28 కోట్లతో 600 మీటర్ల పొడవున అధునాతన షెడ్డు నిర్మించారు. రూ.6 కోట్లతో కొత్తగా 4, 5 ప్లాట్ఫామ్లు పూర్తి చేశారు. దీనివల్ల మరిన్ని రైళ్ల రాకపోకలకు వీలు కలుగుతుంది. ప్లాట్ఫామ్ల మధ్య ప్రయాణికుల రాకపోకలకు రెండు లిఫ్ట్లు నిర్మించారు. ఒక ఎస్క్లేటర్ కూడా నిర్మించడంతో ప్రయాణికులు ఎంతో సులువుగా ఇతర ఫ్లాట్ఫామ్లకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం స్టేషన్లో 1, 2, 3 ప్లాట్ఫామ్ల మధ్య ఒకే కాలిబాట వంతెన ఉంది. దీనికి అదనంగా రాజమహేంద్రవరం వైపు ఆక్సిజన్ పార్కు వద్ద రూ. 12 కోట్లతో 45 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఎండ్ టూ ఎండ్ ఫుట్పాత్ ఓవర్ బ్రిడ్జి నిర్మించడంతో అన్ని ప్లాట్ఫామ్లకు ప్రయాణికులు సులువుగా చేరుకుంటున్నారు. ఇదే ప్రాంతంలో రెండు లిఫ్ట్లు, ఒక ఎస్క్లేటర్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. స్టేషన్లో విద్యుద్దీపాల వ్యవస్థను ఆధునీకరించారు. స్టేషన్ మొత్తం రూ.1.90 కోట్లతో అత్యాధునిక మరుగుదొడ్లను నిర్మించారు. ఇక్కడ మహిళలకు 8, పురుషులకు 8, దివ్యాంగులకు 2 చొప్పున మరుగుదొడ్లు నిర్మించారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి విశాలమైన ఏసీ వెయిటింగ్ హాలు, సాధారణ ప్రయాణికులకు విశ్రాంతి వెయిటింగ్ హాలును నిర్మించారు. ప్రయాణికులు సులభంగా గుర్తించేలా రాకపోకల సంకేతాలు, పార్కింగ్ ప్రదేశాల మార్గాలు, వ్యర్థాల నిర్వహణ, భవన నిర్వహణ పనులు చేపట్టారు. రైళ్ల రాకపోకలు తెలుసుకోవడానికి ప్రత్యేక డిస్ప్లే బోర్డును ఏర్పాటు చేశారు. ఎంతో మందికి ఆసరా.. నిడదవోలు రైల్వే జంక్షన్ స్టేషన్ను 1935లో బ్రిటిష్ హయాంలో నిర్మించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏజెన్సీ ముఖద్వారంగా ఉండటంతో జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వంటి ప్రాంతాలతో పాటు నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల నుంచి ప్రయాణికులు నిడదవోలు రైల్వే స్టేషన్పైనే ఆధారపడతారు. ఇక్కడి నుంచి నిత్యం వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు వివిధ ప్రాంతాలకు రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. విశాఖపట్నం – విజయవాడ మార్గంలో ఉన్న ఈ రైల్వే జంక్షన్ నుంచి పలు రైళ్లు భీమవరం, నర్సాపురం, గుడివాడ పట్టణాలకు రాకపోకలు సాగిస్తాయి. ప్రతి రోజు ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు 3,800 మంది సుమారు 68 రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రోజుకు రూ.1.50 లక్షల ఆదాయం వస్తోంది. ప్రతి రోజూ సుమారు 30 గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. నిడదవోలు పరిసర ప్రాంతాల్లోని వ్యాపార సంస్థలు గూడ్స్ రైళ్ల ద్వారా సరకులు రవాణా చేసుకుంటారు. ప్రధానంగా ఎఫ్సీఐ గోడౌన్లకు ధాన్యం నిల్వలను ఇక్కడి నుంచి తరలిస్తుంటారు. ప్రస్తుతం సి–గ్రేడ్లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ ద్వారా నెలకు సుమారు రూ. కోటి ఆదాయం రైల్వే శాఖకు సమకూరుతోంది. ముఖద్వారం.. ఆకర్షణీయం రైల్వే స్టేషన్ భవనం ముఖద్వారంలో 50 మీటర్ల పొడవున నిర్మించిన ఎలివేషన్ ఆకట్టుకుంటోంది. దీని నిర్మాణంతో స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎంతో ఆకర్షణీయంగాల ఇది ఉంది. రైల్వే స్టేషన్ ముందు భాగంలో కర్షక కష్టం అద్దం పట్టేలా స్వాగత ద్వారం దాటిన తర్వాత స్టేషన్లోకి అడుగుపెట్టే సమయంలో ప్రయాణికులకు ఆహ్లాదం కలిగే విధంగా ఈ ప్రాంత వ్యవసాయ ప్రాధాన్యం తెలిపేలా రెండు ఎద్దులతో రైతు నాగలి పట్టి పొలం దున్నుతున్నట్టుగా ఏర్పాటు చేసిన విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. -
ఐదేళ్లలో 120 మందికి పైగా ఆత్మహత్యలు
అమలాపురం రూరల్: ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 120 మందికి పైగా వైద్య విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కిమ్స్ మానసిక వైద్య విభాగాధిపతి డాక్టర్ అబ్దుల్ సలాం తెలిపారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, క్యూపీక్యూఐ ఇండియా సంస్థల ఆధ్వర్యాన అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఆత్మహత్యల నివారణ – గేట్కీపర్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సలాం మాట్లాడుతూ, ఆత్మహత్యకు ముందు కొందరు మానసిక వైద్య సహాయం కోరుతున్నారన్నారు. మానసిక క్షోభకు గురైన వారిని తోటి విద్యార్థులు లేదా ఉపాధ్యాయులు వెంటనే గుర్తిస్తే ఆత్మహత్యలను ఆపగలమని అన్నారు. ఇటువంటి వారికి సహాయం చేసేందుకు 14416 హెల్ప్లైన్ నంబర్ ఏర్పాటు చేశారని తెలిపారు. యూనివర్సిటీ వైద్యులు తేజోవతి, గిరీష మాట్లాడుతూ, పరీక్షల్లో ఒత్తిడి నిర్వహణ, మానసిక క్షోభకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలను గుర్తించడం, సహాయం కోరడం, భావోద్వేగ ప్రథమ చికిత్స, సానుకూల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం వంటి అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తామని వివరించారు. డీన్ డాక్టర్ ఆనంద్ ఆచార్య, కిమ్స్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రేణు మాట్లాడుతూ మన దేశంలో ప్రధానంగా 15–39 ఏళ్ల మధ్య వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వివరించారు. కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ రేఖాకుమారి మాట్లాడుతూ, 2023 నుంచి ఇప్పటి వరకూ 10 వేల మంది మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులు ఆత్మహత్యల నివారణ – గేట్కీపర్ శిక్షణ పొందారని తెలిపారు. కార్యక్రమంలో 200 మంది కిమ్స్ ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు. -
జీజీహెచ్లో సెక్యూరిటీ గార్డులపై దాడి
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి జరిగింది. సహోద్యోగి అయిన ఓ మహిళ తన కుటుంబ సభ్యులు, అనుచరులతో కలసి ఈ దాడికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. కాకినాడ జీజీహెచ్లో కాటూరి రాజు పదహారేళ్లుగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురువారం అక్కడే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న పోతుల దుర్గాదేవితో మాట్లాడుతూ, ఆర్ఎంసీలో పనిచేస్తున్న నీ భర్త తన సహోద్యోగి అయిన మరో మహిళతో చనువుగా ఉంటున్నాడన్న ప్రచారం జరుగుతోందని, జాగ్రత్త అని సూచించాడు. ఈ విషయాన్ని దుర్గాదేవి కాకినాడ జీజీహెచ్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సేరు దుర్గకు చెప్పింది. మీ చెల్లి నా భర్తపై రాజు అసభ్యంగా మాట్లాడుతున్నాడని అంది. దీంతో సేరు దుర్గ తన కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు, అనుచరులు మొత్తం 40 మందితో కలిసి శుక్రవారం మెడికల్ వార్డు ఎదుట విధుల్లో ఉన్న రాజుపై దాడి చేయించింది. రాజును తీవ్రంగా కొడుతుండగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్న రామలక్ష్మి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. వారంతా రామలక్ష్మిపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో ఆమెకు శ్వాస ఆడక కుప్పకూలిపోగా, రాజు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇరువురినీ ఆసుపత్రి సిబ్బంది సాయంతో అత్యవసర విభాగంలో చేర్చారు. ఆసుపత్రి అధికారులు దాడికి కారణాలపై ఆరా తీశారు. సేరు దుర్గ ఆమె కుమారులు, అనుచరులపై కాకినాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మంటలకు కాలిపోయిన బైక్ రాజానగరం: జాతీయ రహదారిపై రాజానగరం గైట్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. బొమ్మూరు పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం శానిటోరియం ప్రాంతానికి చెందిన అందె అఖిల్ కుమార్ (30) వై–నాట్ షోరూమ్లో పనిచేస్తున్నాడు. అతను తన బైక్పై రాజానగరంలోని బంధువుల ఇంటికి వచ్చి, తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. స్థానిక గైట్ ఇంజినీరింగ్ కళాశాల దాటిన తరువాత అతను ప్రయాణిస్తున్న బైకును వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో అతని తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతన్ని ఢీకొన్న వాహనం బైక్ను కొద్దిదూరం ఈడ్చుకుపోయింది. దీంతో రోడ్డు రాపిడికి ట్యాంకులో పెట్రోలు లీకై , మంటలు వ్యాపించి, బైకు పూర్తిగా కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న 108 సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నా ప్రయోజనం లేకపోయింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బొమ్మూరు పోలీసులు తెలిపారు. -
అప్పులపై సమాధానం చెప్పండి
కాకినాడ రూరల్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని వైఎస్సార్ సీపీ మహిళా నేత జమ్మలమడక నాగమణి శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వల్లే రాష్ట్రం అప్పుల పాలైందని అనడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని, రెవెన్యూ లోటు రూ.60,480 కోట్లకు చేరడం ఈ ప్రభుత్వ అసమర్థత కాదా అని ప్రశ్నించారు. సాకులు వెతకడం మాని, కూటమి ప్రభుత్వం చేసిన అప్పులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఎన్టీఆర్ జిల్లాలో జల్ జీవన్ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పైపులైన్లు వేసినా నీళ్లు రావు. సంపులు కట్టినా కనెక్షన్లుండవు. 181 పనులకు గాను 71 పనులు అసలు మొదలే కాలేదు. దీనికి పవన్ కల్యాణ్ ఏం సమాధానం చెబుతారు’ అని ప్రశ్నించారు. మదనపల్లి వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అధికారులే చందాల పేరిట ప్రజలు, వ్యాపారుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇది కూటమి పారదర్శక పాలనకు నిదర్శనమా అని ఎద్దేవా చేశారు. విజయవాడ వంటి నగరాల్లోని అర్బన్ హెల్త్ సెంటర్లలో కూడా డాక్టర్లు, సిబ్బంది లేక రోగులు అల్లాడుతున్నారని, మందుల కొరత వేధిస్తూంటే పాలకులు ఏం చేస్తున్నారని నిలదీశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో పవన్ కల్యాణ్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. మినీ గోకులాలు, సిమెంట్ రోడ్ల బిల్లులు రాక రైతులు, కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఊదరగొడుతున్న పాలకులు, వాస్తవానికి గ్రౌండ్ అయిన ప్రాజెక్టులు ఎన్నో చెప్పలేకపోతున్నారన్నారు. అసెంబ్లీలో వైఎస్సార్ సీపీపై విమర్శలు మాని, ముందుగా తమ శాఖల్లో జరుగుతున్న అవినీతి, క్షేత్రస్థాయిలో పనుల జాప్యాన్ని అరికట్టేందుకు పవన్ కల్యాణ్ చర్యలు చేపట్టాలని హితవు పలికారు. శ్వేతపత్రాల పేరిట కాలక్షేపం చేయకుండా, పెండింగ్ బిల్లులు విడుదల చేసి, పేదలకు న్యాయం చేయాలని నాగమణి డిమాండ్ చేశారు. ఏలేరు కాలువలో వ్యక్తి గల్లంతు ఏలేశ్వరం: ఏలేరు రిజర్వాయర్ నుంచి విశాఖపట్నానికి నీరందిస్తున్న కాలువలో ప్రమాదవశాత్తూ పడిపోయి ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. మరొకరు సురక్షితంగా బయటపడ్డాడు. ఏలేశ్వరం క్వారీ ప్రాంతానికి చెందిన బంగర్తి విజయ్, గిడుతూరి లోవరాజులు శుక్రవారం ఉదయం క్వారీ పనులకు గొంటువానిపాలెం వెళ్లారు. సాయంత్రం బైక్పై తిరిగి వస్తున్నారు. సి.రాయవరం వద్దకు వచ్చేసరికి వారి మోటార్ సైకిల్ అదుపు తప్పడంతో ఇద్దరూ బైక్తో సహా ఏలేరు ఎడమ కాలువలో పడ్డారు. గమనించిన స్థానికులు కాలువలో గాలించారు. లోవరాజు గల్లంతవగా, విజయ్ను రక్షించారు. స్వల్పంగా గాయపడిన అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లోవరాజుకు భార్య నాగమణి, కుమార్తెలు నవ్య, లోవకుమారి ఉన్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోవరాజు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
దే..వుడా!
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): దేవదాయ శాఖలో వింత పొగడ సాగుతోంది. కొంత మంది తక్కువ క్యాడర్ కార్యనిర్వహణాధికారుల(ఈఓ)కు పెద్ద దేవాలయాలను అప్పగిస్తున్నారు. అదే సమయంలో అర్హులైన అధికారులను చిన్నచిన్న ఆలయాలకు ఈఓలుగా నియమిస్తున్నారు. దీనిపై ఆ శాఖ అధికారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం వార్షికాదాయం రూ.కోటి పైబడిన ఆలయాల్లో డిప్యూటీ కమిషనర్ (డీసీ), రూ.50 లక్షల నుంచి రూ.కోటి లోపు ఆదాయం వచ్చే ఆలయాల్లో అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) హోదా కలిగిన వారిని ఈఓలుగా నియమించాలి. అలాగే, రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు ఆదాయం వచ్చే ఆలయాల్లో గ్రేడ్–1, రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల ఆదాయం వచ్చే ఆలయాల్లో గ్రేడ్–2, రూ.15 లక్షలలోపు ఆదాయం వచ్చే ఆలయాలకు గ్రేడ్–3 ఈఓలను నియమించాలి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఈ నిబంధనలు ఏమాత్రం అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా ఇష్టానుసారం ఈఓల నియామకాలు జరుగుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా చిన్న ఆలయాల్లో పని చేస్తున్న ఈఓలను పెద్ద దేవస్థానాలకు నియమిస్తున్నారు. ● ఎంతో పేరొందిన తుని రూరల్ తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానానికి నిత్యం వేలాదిగా భక్తులు వస్తూంటారు. ఇక్కడ డీసీ స్థాయి అధికారిని ఈఓగా నియమించాలి. కానీ, ఏసీ హోదా కలిగిన పి.విశ్వనాథరాజును ఈఓగా నియమించారు. ● అలాగే, వేలాది మంది భక్తులు వచ్చే ఆలయాల్లో పిఠాపురం పాదగయ క్షేత్రం ఒకటి. ఇక్కడి కుక్కుటేశ్వర స్వామి దేవస్థానానికి ఏసీ హోదా కలిగిన అధికారిని ఈఓగా నియమించాలి. కానీ, పెద్దాపురం మహారాణి సత్రం ఈఓగా పని చేస్తున్న కాట్నం జగన్మోహన శ్రీనివాస్ను ఇక్కడ ఈఓగా నియమించారు. ఆయన గ్రేడ్–2 ఈఓ అయినప్పటికీ ఇక్కడ ఈఓగా నియమించడం గమనార్హం. గతంలో ఏసీ హోదా కలిగిన అల్లు గంగాభవాని ఈ ఆలయంలో ఈఓగా ఉండేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమెను వేరే ఆలయానికి బదిలీ చేశారు. ప్రస్తుత ఈఓకు, సిబ్బందికి మధ్య సమన్వయం లేకపోవడంతో ఇక్కడ భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందనే విమర్శలు తరచుగా వస్తున్నాయి. ఇటీవల మహాశివరాత్రి వేడుకల్లో కలెక్టర్, ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి ఇక్కడి వ్యవహారాలు చక్కబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ● కాకినాడ సినిమా రోడ్డులోని మంత్రిప్రగడ వారి సత్రానికి గ్రేడ్–1 ఈఓను నియమించాలి. కానీ, గ్రేడ్–2 ఈఓగా పని చేస్తున్న శ్రీనివాస్ను ఇక్కడ నియమించారు. కాకినాడ రూరల్ కొవ్వూరులోని వారాహి అమ్మవారి దేవస్థానం ఇన్చార్జి బాధ్యతలు సైతం ఆయనకే అప్పగించారు. ఈ ఆలయంలో గ్రేడ్–1 ఈఓగా పని చేస్తున్న సౌజన్యను తొలగించి గ్రేడ్–2 అయిన శ్రీనివాస్కు అదనపు బాధ్యతలు అప్పగించడం విశేషం. ● కాకినాడ బాలాత్రిపురసుందరీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఈఓగా పని చేస్తున్న ఉండవల్లి వీర్రాజు చౌదరి గ్రేడ్–2 ఈఓ. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ పని చేస్తున్న చింతపల్లి విజయభాస్కర్రెడ్డిని తొలగించి, కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం ఈఓగా పని చేస్తున్న చౌదరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. దేవదాయ శాఖలో వింత పోకడ పెద్ద దేవస్థానాల్లో తక్కువ క్యాడర్ అధికారుల నియామకం అర్హత ఉన్న ఈఓలకు చిన్న దేవాలయాలు రెండేళ్లుగా పదోన్నతుల ఊసే లేదుఅర్హులకు చిన్న ఆలయాలతో సరి.. జిల్లాలో గ్రేడ్–1 ఈఓలున్నప్పటికీ వారికి చిన్నచిన్న ఆలయాలే కేటాయిస్తున్నారు. కాకినాడ తూరంగేశ్వర స్వామి ఆలయ ఈఓ శివబాబు గ్రేడ్–1 ఈఓ అయినప్పటికీ ఆయనకు గ్రేడ్–2 ఆలయం కేటాయించారు. ఆయన ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్ పదోన్నతికి సైతం అర్హుడైనప్పటికీ చిన్న ఆలయం మాత్రమే కేటాయించారు. కాకినాడ పెద్ద మార్కెట్లోని నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం గ్రేడ్–2 ఆలయం. కానీ, ఇక్కడ గ్రేడ్–1 ఈఓ ఎం.మురళీ వీరభద్రరావు ఈఓగా పని చేస్తున్నారు. నడకుదురు గ్రూప్ టెంపుల్ ఈఓగా పని చేస్తున్న టీవీ సూర్యనారాయణ సైతం గ్రేడ్–1 అయినప్పటికీ గ్రేడ్–2 ఆలయాలే కేటాయించారు. అన్ని అర్హతలూ ఉన్న్పటికీ తమకు చిన్నచిన్న ఆలయాలు మాత్రమే కేటాయించడంపై గ్రేడ్–1 ఈఓలు మండిపడుతున్నారు. దీనిపై దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు సైతం నివేదించినప్పటికీ ఎటువంటి ప్రయోజనమూ ఉండటం లేదని మధనపడుతున్నారు. గ్రేడ్–1 ఈఓలు రిటైరైనప్పటికీ ఆయా ఆలయాలకు అదే స్థాయి అధికారులను నియమించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సిఫారసు లేఖల ఆధారంగా ఆ స్థానాలను గ్రేడ్–2, గ్రేడ్–3 ఈఓలకు కేటాయిస్తున్నారని గ్రేడ్–1 ఈఓలు మండిపడుతున్నారు. -
కిక్కిరిసిన రత్నగిరి
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శుక్రవారం కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజాము ముహూర్తాల్లో రత్నగిరితో పాటు ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులకు తోడు ఇతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. దీంతో, ఆలయంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. భక్తుల వాహనాలతో ఘాట్ రోడ్లు, పార్కింగ్ స్థలాలు నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి రెండు గంటలు, రూ.200 టికెట్టుతో అంతరాలయ దర్శనానికి గంట సమయం పట్టింది. నిత్య కల్యాణ మండపంలో 30 మంది స్వామివారి నిత్య కల్యాణంలో పాల్గొన్నారు. సుమారు 40 వేల మంది భక్తులు రాగా, దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సత్యదేవుని వ్రతాలు 2,500 జరిగాయి. రత్నగిరితో పాటు పలు ప్రాంతాల్లో శనివారం నుంచి సోమవారం వరకూ పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు రోజులూ కూడా ఆలయంలో రద్దీ నెలకొనే అవకాశం ఉంది. పకడ్బందీగా జనగణన బోట్క్లబ్ (కాకినాడ సిటీ): భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 16వ జనగణన ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అన్నారు. జనగణనలో భాగంగా మొదటి దశలో చేపట్టనున్న ‘గృహాల జాబితా, గృహ వసతుల గణన’పై కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన శిక్షణను ఆయన పరిశీలించారు. మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ శిక్షణలో అధికారులు జనగణనపై పూర్తి అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. గృహ నిర్మాణం, తాగునీరు, మరుగుదొడ్డి, విద్యుత్, ఇంటర్నెట్ వంటి 33 కీలక అంశాలపై సమగ్ర సమాచారం సేకరించాల్సి ఉంటుందన్నారు. ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచడం చట్టరీత్యా బాధ్యతని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ టి.తిప్పేనాయక్, జనగణన జాయింట్ డైరెక్టర్ సాయి శేఖర్ పాల్గొన్నారు. 9న అప్రెంటీస్ మేళా బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్థానిక ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 9న ప్రైమ్ మినిస్టర్ నేషనల్ అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నారు. ఐటీఐ ప్రిన్సిపాల్ వేణుగోపాలవర్మ శుక్రవారం ఈ విషయం తెలిపారు. పాత ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో వివిధ ట్రేడ్లలో శిక్షణ పూర్తి చేసుకుని, ఎన్టీసీ సర్టిఫికెట్ పొందిన అభ్యర్థులు ఆ రోజు ఉదయం 8 గంటలకు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 94404 08182 నంబరులో సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా రబీ ధాన్యం సేకరణ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో రబీ ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రణాళికబద్ధంగా నిర్వహించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశించారు. రబీ ధాన్యం సేకరణకు అనుసరించాల్సిన విధానాలపై రెవెన్యూ, వ్యవసాయం, పౌర సరఫరాలు, మార్కెటింగ్, సహకార, రవాణా, తూనికలు – కొలతలు, ఎఫ్సీఐ అధికారులు, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడి అంచనా, సేకరణ కేంద్రాలు, సీఎంఆర్ రైస్, కనీస మద్దతు ధర వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. రబీలో గ్రేడ్–ఎ రకం ధాన్యం క్వింటాల్కు రూ.2,389 (75 కేజీలకు రూ.1,792), సాధారణ రకానికి రూ.2,369 (75 కేజీలకు రూ.1,777)గా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించిందని జేసీ తెలిపారు. జిల్లావ్యాప్తంగా రబీలో 6,76,773 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఇందులో స్థానిక వినియోగం 67,677 మెట్రిక్ టన్నులు పోను సుమారు 6,09,096 మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు రానున్నదని తెలిపారు. ఈ ధాన్యం కొనుగోలుకు జిల్లాలోని 225 రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. -
చిక్కదు.. దొరకదు
భయం గుప్పిట్లో ప్రజలు గోకవరం: అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో గోకవరం మండలం మల్లవరం వాసులు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. గంగవరం మండలంలో పులి సంచరిస్తుండటంతో తమ గ్రామంలోకి పులి ప్రవేశిస్తుందని ఆందోళన చెందుతున్నారు. మరోపక్క మండలంలో పలు గ్రామాల్లో శుక్రవారం పులి సంచరిస్తుందని పుకార్లు షికార్లు చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చాలామంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు. మరోపక్క అటవీశాఖ అధికారులు పులిని బంధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఫ పులికొండ వద్ద పులి మకాం! ఫ బంధించేందుకు అధికారుల యత్నం అడ్డతీగల: పులి జాడ అంతు చిక్కకుండా పోతోంది.. అందరినీ పరుగులు తీయిస్తోంది.. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా చివరికి కన్నుగప్పి మయం అవుతోంది.. కొద్ది రోజులుగా మన్యంలో పెద్ద పులి సంచారంతో అందరిలో ఆందోళన రేగుతోంది. జిల్లాలోని ఏలేరు జలాశయం పరివాహక ప్రాంతమైన పులికొండ వద్ద పెద్ద పులి రెండు రోజులుగా మకాం చేసింది. తన ఉనికిపై అటవీ అధికారులను ఆలోచనలో పడేసింది. గంగవరం మండలం ట్యాంకుబీడు ప్రాంతంలో నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాంతాల నుంచి వచ్చిన అటవీ శాఖ రెస్క్యూ టీం సభ్యులు డ్రోన్లు, ట్రాకింగ్ కెమెరాలతో పులి సంచారాన్ని ట్రాకింగ్ చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ముఖ్యమైన చోట్ల అమర్చారు. పులి సంచరిస్తే ఆ దృశ్యాలు, ఈ కెమెరాల్లో నిక్షిప్తమవుయనే ఆలోచనతో వీలైనన్ని ట్రాప్ కెమెరాలను రప్పించి నిర్దేశిత ప్రాంతాల్లో అమర్చారు. మరోవైపు పులిని బంధించేందుకు కొన్ని ఆవులను అటవీ ప్రాంతంలో విడిచి పెట్టినట్లు తెలియవచ్చింది. రాత్రి సమయాల్లో 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం ఆ పెద్ద పులి ప్రయాణిస్తుంది. ఏలేరు జలాశయం బ్యాక్ వాటర్కు చేరువలో ఉన్న పులికొండ తన ఆవాసానికి అనువుగా ఉన్న నేపథ్యంలో పులి ఆ ప్రాంతంలో తిష్ట వేసిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పులి ఎటువైపు వెళ్తుందో తెలియక అధికారులు డోలాయమానంలో ఉన్నారు. ఈ పరిస్థితిలో గంగవరం మండలం ట్యాంక్బీడు, మొల్లేరు, మల్లవరం, రాముల్దేవపురం, వడ్డిచెరువు, అడ్డతీగల మండలం గడిచిన్నంపాలెం, డి.కృష్ణవరం వంటి ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సూదికొండ అటవీ క్షేత్రం పరిధి నుంచి రాజవొమ్మంగి అటవీ క్షేత్రం పరిధిలోకి పులి ప్రవేశించవచ్చని భావిస్తున్నాయి. దీంతో అడ్డతీగల, రాజవొమ్మంగి అటవీ క్షేత్రాల పరిధిలోని అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. -
వైభవంగా మహా కుంభాభిషేకం
● శ్రీపీఠానికి భారీగా తరలివచ్చిన భక్తులు ● పరిపూర్ణానంద స్వామి చేతుల మీదుగా ఆలయ గోపురానికి అభిషేకం ● హెలికాప్టర్ ద్వారా పూలవాన కాకినాడ రూరల్: రమణయ్యపేట శ్రీపీఠంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామీజీ ఆధ్వర్యాన ఈ నెల 4 నుంచి ఐదు రోజుల పాటు ఇక్కడ మహా కుంభాభిషేకం, దివ్య ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మహాకుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ నెల 4వ తేదీ ఉదయం మూలమంత్ర సహిత లలితా కుంకుమార్చనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అదే రోజు సాయంత్రం విశేషాభిషేకం నిర్వహించారు. గురువారం లలితా కుంకుమార్చన, సాయంత్రం మహా యంత్రేశ్వరి దేవికి భక్తులతో పుష్పార్చన జరిగాయి. శుక్రవారం ఉదయం మూలమంత్ర సహిత లలితా కుంకుమార్చన అనంతరం పవిత్ర జలాలలో కూడిన ఐశ్వర్య కలశాలతో ఐశ్వర్యాంబిక సమేత సుందరేశ్వరస్వామి ఆలయ గోపురంపై మహాకుంభాభిషేకం నిర్వహించారు. వేద పండితుల మంత్రఘోష నడుమ పరిపూర్ణానంద స్వామి పవిత్ర జలాలతో తొలుత కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం కల్పించారు. మధ్యలో హెలికాప్టర్ నుంచి ఆలయ గోపురంపై పూలవాన కురిపించారు. భారీగా తరలివచ్చిన భక్తులు మహాకుంభాభిషేకంలో పాల్గొన్నారు. సాయంత్రం భగవతి సేవ నిర్వహించారు. కేరళలో ప్రసిద్ధి గాంచిన అమ్మవారి ఆరాధనను శ్రీపీఠంలో నిర్వహించి, సకలాభీష్టాలూ నెరవేరాలని, శుభాలు, సంపదలు తప్పక కలగాలని పండితులు ఆశీర్వదించారు.హెలికాప్టర్తో పూలవానచందన అలంకరణలో సుందరేశ్వర సమేత ఐశ్వర్యాంబిక అమ్మవారు -
కోనసీమ స్నోబగులు!
గోదావరి తీరంలో ఆకట్టుకునే మంచు అందాలు వైనతేయ తీరంలో మంచు అందాల నడుమ పడవ ప్రయాణం మామిడికుదురు: వైనతేయ గోదావరి నదీ తీరం పెదపట్నంలంకలో గురువారం ఉదయం మంచు ముసుగులో అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. మంచు అందాల నడుమ గోదావరి నదిలో పడవపై తిరిగి ఇంటికి వస్తున్న రైతులు, గోదావరి నదీ తీరంలో లంగరు వేసిన పడవలు, వర్షం తరహాలో కురుస్తున్న మంచు అందాల నడుమ పచ్చని కొబ్బరి చెట్లు, పంట పొలాలు, పంట కాలువలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేశాయి. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 29,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 16,000 – 17,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)16,000 – 17,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
92 కేజీల గంజాయి పట్టివేత
పిఠాపురం రూరల్: పిఠాపురం మండలం పి.దొంతమూరు శివారున జగనన్న కాలనీ ఎదురుగా ఉన్న పామాయిల్ తోటలో 92 కేజీల గంజాయిని పట్టుకున్నట్టు పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయి ఉందని వచ్చిన సమాచారం మేరకు పిఠాపురం రూరల్ ఎస్సై, సిబ్బంది, పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ, వీఆర్వోల సమక్షంలో పామాయిల్ తోట వద్ద గాలింపు చేపట్టామన్నారు. పామాయిల్ తోటలో ఒక చోట గంజాయి బస్తాలను గుర్తించామని దాని బరువు 92 కేజీలు ఉందన్నారు. ఆ గంజాయిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఏదైనా వాహనంలో తీసుకుని వచ్చి అక్కడ దాచి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. దొరికిన గంజాయిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. -
భారం లేని ఉపాధి ద్వారం!
● పాలిసెట్కు నోటిఫికేషన్ విడుదల ● ’పది’ విద్యార్థులకు చక్కని అవకాశం ● ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష రాయవరం: సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చు. పదో తరగతి పరీక్షలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగానే సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు పాలిసెట్–2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు, సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్బీఏ గుర్తింపు పాలిటెక్నిక్ డిప్లమా కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దరి చేర్చేలా కళాశాలలకు అనుబంధంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరిశ్రమలతో కళాశాలలను అనుసంధానం చేయడం ద్వారా ఏటా కళాశాలల్లో క్యాంపస్ సెలెక్షన్స్ నిర్వహించారు. నైపుణ్యం ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు కూడా దక్కాయి. గత ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్బీఏ) గుర్తింపు లభించింది. భావిజీవితానికి బాటలు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాదిగా చేసుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంజినీరింగ్ వంటి ఉన్నత సాంకేతిక చదువులను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. అటువంటి వారికి పాలిటెక్నిక్ కోర్సులు చక్కని వేదికలు. పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సు్ోల్ల చేరి విలువైన సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందే వీలుంటుంది. పాలిసెట్–2026 కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 4వ తేదీన దరఖాస్తుల స్వీకరణకు తుది గడువుగా ప్రకటించారు. పాలిసెట్ ఎంట్రెన్స్ ఇలా.. 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గణితం 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 మార్కులకు పరీక్ష ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఎంట్రెన్స్ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 30న పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.400గా నిర్ణయించారు. విద్యార్థులకు ప్రయోజనాలెన్నో.. పాలిటెక్నిక్లో ఏ కోర్సు పూర్తి చేసినా ఉద్యోగం, ఉపాధి సులభంగా దొరుకుతుంది. ఈ కళాశాలల్లో ఇటీవల తరచూ ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కోర్సు చేయడానికి మూడేళ్లకు కేవలం రూ.13 వేలు అవుతుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ సెకండియర్లో చేరవచ్చు. లేదా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు.లభించే కోర్సులివీ.. పాలిటెక్నిక్ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. పలుచోట్ల ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచ్కు 60 నుంచి 120 వరకూ సీట్లు అందుబాటులో ఉంటాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉండగా, జిల్లా వ్యాప్తంగా మరో ఐదు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. జిల్లాలో 1,560 వరకు వివిధ ట్రేడ్స్లో సీట్లు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, అనపర్తిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలుండగా, కాకినాడ జిల్లాలో కాకినాడలో రెండు, పిఠాపురంలో ఒకటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా 17 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలుండగా, దాదాపుగా 4,500 సీట్లు ఉన్నట్లు సమాచారం. ఈ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. ఇందులో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థుల నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు. పాలిసెట్ ఎంట్రన్స్ల క్వాలిఫై మార్కులు 35 గా నిర్ణయించారు. కోచింగ్, మెటీరియల్ ఉచితం త్వరితగతిన ఉపాధి పొందేందుకు పాలిటెక్నిక్ చక్కని అవకాశం. ప్రతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత కోచింగ్తో పాటు, సంబంధిత మెటీరియల్ కూడా ఉచితంగా సరఫరా చేస్తున్నాం. – ఆకుల మురళి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, పాలిసెట్–2026, రాజమహేంద్రవరం హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు పాలిటెక్నిక్ కోర్సులు చేసిన వారికి మంచి అవకాశాలున్నాయి. పాలిసెట్కు సంబంధించిన వివరాల కోసం కళాశాలలో హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు చేశాం. అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రవేశాలు పొందేలా విస్తృతంగా ప్రచారం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం – జీవీవీఎల్ సత్యనారాయణ, ప్రిన్సిపాల్, ప్రభుత్వ పాలిటెక్నిక్, అనపర్తి -
‘నన్నయ’లో ఖోఖో పోటీలు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఖోఖో వుమెన్ ఇంటర్ కాలేజీయేట్ కం చాంపియన్ షిప్ అండ్ యూనివర్సిటీ టీమ్ సెలెక్షన్స్ గురువారం జరిగాయి. గోదావరి జిల్లాలోని అనుబంధ కాలేజీల నుంచి 16 జట్లు, 240 మంది క్రీడాకారుల మధ్య పోటీ రసవత్తరంగా జరిగింది. ఈ పోటీలో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా ద్వితీయ స్థానంలో గొల్లల మామిడాడలోని డీఆర్ రెడ్డి కళాశాల, తృతీయ స్థానంలో ఏలూరులోని సెయింట్ థెరిసా కళాశాల జట్లు నిలిచాయని రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి తెలిపారు. వీరి నుంచి యూనివర్సిటీ టీమ్ని ఎంపిక చేసి, కర్ణాటకలోని దేవాంగరే యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ పోటీలకు పంపిస్తామన్నారు. ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పి.విజయనిర్మల, సెక్రటరీ డాక్టర్ ఎంవీవీఎంయూ ఫణీంద్ర, పరిశీలకులు డాక్టర్ ప్రమీలారాణి, సెలెక్షన్ కమిటీ సభ్యులు ధర్మేంద్ర, పట్టాభి పాల్గొన్నారు. ప్రథమ స్థానంలో నిలిచిన రాజమండ్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాల -
నిరాధార ఆరోపణలు తగవు
ఎమ్మెల్సీ సోము వ్యాఖ్యలపై జయలక్ష్మి సొసైటీ చైర్మన్ త్రినాథరావు కాకినాడ రూరల్: వేలాది మంది డిపాజిటర్లతో ముడిపడి ఉన్న జయలక్ష్మి సొసైటీపై శాసనమండలిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిరాధార ఆరోపణలు చేయడం తగదని చైర్మన్ గంగిరెడ్డి త్రినాథరావు తెలియజేశారు. సర్పవరం జంక్షన్ వద్ద జయలక్ష్మి సొసైటీ మెయిన్ బ్రాంచ్ వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జయలక్ష్మి ఎంఏఎం కో ఆపరేటివ్ సొసైటీ ప్రస్తుత పాలకవర్గం రూ.7కోట్లు దుర్వినియోగం చేసినట్టు తీవ్రమైన ఆరోపణలను ఎమ్మెల్సీ మండలిలో చేశారన్నారు. పెద్దల సభలో నిజాలు మాట్లాడాలని, జయలక్ష్మి సొసైటీపై చేసిన ఆరోపణలకు సంబంధించి సమాచారం మీరు ఎవరు వద్ద తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారుల సమాచారం తీసుకున్నారా లేదా సొసైటీ ఆఫీసులో సమాచారం తీసుకున్నారా తెలియజేయాలన్నారు. ఇటు వంటి ఆరోపణలు వలన మా మనోభావాలు దెబ్బతిన్నాయని, 20వేల మంది సభ్యులు, డిపాజిట్లరు మనో వేదనకు గురవుతున్నారన్నారు. మీకు తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. జయలక్ష్మి సొసైటీ గత పాలకవర్గం బోర్డు తిప్పేయడంతో కేసులు సీఐడీ వద్ద పెండింగ్లో ఉన్నాయన్నారు. తమ పాలకవర్గం 67మంది సభ్యుల నుంచి వసూలు చేసిన రూ.7.60 కోట్లు ఉన్నాయని, వారి నుంచి మరో రూ.3కోట్లు వరకు రావల్సి ఉందన్నారు. రూ.7కోట్లు సీఐడీ కేసుల వలన సీజ్ చేసిన వాటిలో ఉన్నాయన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, గౌరవ ఎమ్మెల్సీ వీర్రాజుకు తాము వివరాలు అందజేస్తామన్నారు. జయలక్ష్మి కో ఆపరేటివ్ సొసైటీ మెంబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం మా బాధలు గుర్తించి ట్రిబ్యునల్లో కేసులు పరిష్కారం చేసి ముందుగా సొమ్ము చెల్లించాలన్నారు. సొసైటీ పాలక వర్గ వైస్ చైర్మన్ పీవీ రమణమూర్తి, డైరెక్టర్లు గౌరీ శంకరరావు, సీహెచ్. సుబ్బారావు, శరణార్థి రవిశంకర్ పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతున్న జయలక్ష్మి సొసైటీ చైర్మన్ త్రినాథరావు -
నా భర్త మృతికి కారకులైన వారిని శిక్షించాలి
తాళ్లరేవు: తమపై దౌర్జన్యం చేసి, తన భర్త పాలెపు సత్యనారాయణపై దాడి చేసి గాయపరచి, అతని మృతికి కారకులైన బాధ్యులను కఠినంగా శిక్షించాలని పాలెపు మధులత డిమాండ్ చేసింది. గురువారం కోరంగి పంచాయతీ సీతారామపురంలో మధులత తనకు జరిగిన అన్యాయాన్ని విలేకరులకు మొర పెట్టుకుంది. చినబొడ్డు వెంకటాయపాలెంలో తమకు ఉమ్మడి ఇల్లు ఉందని, అయితే ఆ ఇంటిలోకి రానీయకుండా తమ మరిది పాలెపు లక్ష్మణరావు, అతని భార్య కుమారి, కుమారుడు నాని తదితరులు అడ్డుకుని తన భర్తను తోసివేయడంతో కిందపడి గాయపడ్డాడని తెలిపింది. చికిత్స పొందుతూ మృతి చెందాడని, మృతదేహాన్ని తమ సొంత ఇంటి వద్దకు తీసుకురాకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కొడుకును కడసారి చూసుకునే అవకాశం ఇవ్వకుండా తన మామ పాలెపు గురవయ్యను వేధించారని వాపోయింది. గ్రామ పెద్దల సహకారంతో చూసే అవకాశం కల్పించి, అంత్యక్రియలు నిర్వహించారని తెలిపింది. తన భర్త చావుకు కారకులైన వారిపై చర్యలు చేపట్టి, న్యాయం చేయాలని మృతుని కుటుంబ సభ్యులు కోరారు. -
వివాహిత ఆత్మహత్య
ధవళేశ్వరం: స్థానిక బత్తిన సుబ్బారావు కాలనీకి చెందిన వివాహిత శీలంశెట్టి నాగవర్ష(30) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బత్తిన సుబ్బారావు కాలనీకి చెందిన శీలంశెట్టి శరత్, నాగవర్షకు 14 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం రాత్రి స్నానానికి వెళ్ళిన నాగవర్ష ఎంతకీ తిరిగి రాకపోవడంతో వెళ్ళి చూడగా సీలింగ్కు ఉరివేసుకొని ఉంది. ఉరి వేసుకొని ఉన్న నాగవర్షను భర్త, అటుగా వెళుతున్న మరొక వ్యక్తి కిందకు దించి స్థానిక డాక్టర్ను పిలవగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలు అన్నయ్య బైరిశెట్టి శివరామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధవళేశ్వరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సీఐ టి.గణేష్ దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం స్వాధీనం తాళ్లపూడి: కొవ్వూరు పట్టణంలోని గోష్పాద క్షేత్రం పక్కన గల రజకులు దుస్తులు ఉతికే రేవులో గోదావరి నది ఒడ్డున మృతదేహాన్ని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ పి విశ్వం ఘటనా ప్రదేశంలో వివరాలను సేకరించారు. మృతదేహానికి సమీపంలో మోటార్ సైకిల్ ఉండగా దానిపై పి వెంకటేశ్వరరావు అని రాసి ఉందని చెప్పారు. అతని వివరాల కోసం ఇతర సేష్టన్లకు సమాచారం పంపామని తెలిపారు. మృతుడు పొకలి వెంకటేశ్వరావుగా అతనిది కృష్ణా జిల్లా కృటివేణు మండలం సీతనపల్లిగా తెలిసిందని తెలిపారు. అతని బంధువులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. మోసగించిన కేసులో పురోగతి లేక నష్టపోతున్నాం కపిలేశ్వరపురం (మండపేట): మండపేట ఐశ్వర్య నగర్లో కార్యకలాపాలు సాగిస్తున్న గుప్తా చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థ తమతో డిపాజిట్లు చేయించుకుని మోసగించిందని, ఆ నేపథ్యంలో తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి నాలుగు నెలలు కావస్తున్నా కేసులో పురోగతి లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసులో నిందితులను అదుపులోకి తీసుకోలేదని పోలీసుల తీరును బాధితులు తప్పుబట్టారు. మండపేట పట్టణంలో గురువారం బాధితుడు గ్రంధి సూర్య వెంకట ప్రకాష్రావు విలేకరులకు తన గోడు చెప్పుకున్నారు. చిట్ అండ్ ఫైనాన్స్ సంస్థలో చేసిన డిపాజిట్లు కాలపరిమితి ముగిసిందని, త్వరలో మీ సొమ్ము తిరిగి ఇస్తామని తమ వద్ద నుంచి డిపాజిట్లు బాండ్లను సంస్థ నిర్వాహకులు వాకచర్ల గుప్తా బంధువు చెక్కా సత్యనారాయణ తీసుకెళ్లారన్నారు. తమ సొమ్ము తిరిగి ఇవ్వకపోవడంతో ఫిర్యాదు చేయగా మండపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. కేసు నమోదు చేసి నాలుగు నెలలు అయినప్పటికీ నిందితులను అదుపులోకి తీసుకోలేదన్నారు. 90 రోజుల్లో విచారణ జరిపి నివేదిక సమర్పించాలన్న హైకోర్టు ఉత్తర్వులను కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి బాధితులు సుమారు రూ.ఏడు కోట్లు నష్టపోయారని, ఆ సొమ్మును నిందితులు వేర్వేరు ప్రాంతాలకు తరలించారని ఆరోపించారు. కేసును త్వరితగతిన విచారించి బాధితులకు న్యాయం చేయాలని సూర్య వెంకట ప్రకాష్రావు పోలీసులను కోరారు. -
తూర్పు సరిహద్దుకు చేరిన పులి
● మల్లవరం సమీపాన సంచారం ● పులికొండ వద్ద మకాం ● మళ్లీ విశాఖ జూ పార్కుకు తరలించేందుకు యత్నం గోకవరం/అడ్డతీగల: పోలవరం జిల్లాలో గత 15 రోజులుగా సంచరిస్తూ అటవీ శాఖ అధికారులకు చుక్కలు చూపిస్తూ, గిరిజనులను హడలెత్తిస్తున్న పులి తూర్పు గోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతానికి చేరింది. ఇక్కడి ఏలేరు పరీవాహక ప్రాంతంలోని పులికొండ వద్ద మకాం వేసిందని అటవీ అధికారులు నిర్ధారించారు. అడ్డతీగల సబ్ డివిజన్ సూదికొండ అటవీ క్షేత్రం పరిధిలోని మొల్లేరు – తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం మల్లవరం శివారు అటవీ ప్రాంతం వద్ద గంగవరం మండలం ట్యాంకుబీడు వద్ద పులి పాదముద్రలను గురువారం ఉదయం గుర్తించారు. దీంతో, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మల్లవరం శివారు ఏలేరు పరీవాహక ప్రాంతం కావడంతో నీటి కోసం పులి తమ గ్రామానికి వస్తోందని భావిస్తున్నారు. మొల్లేరు, మల్లవరం, భూపతిపాలెం, సూరంపాలెం, వడ్డిచెరువు, రాముల్దేవపురం ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. మరోవైపు మల్లవరం అటవీ ప్రాంతాన్ని ఆనుకుని కొలువైన సింగారమ్మ తీర్థం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పులికి ఇదివరకే అమర్చిన జీపీఎస్ ట్రాకర్ ద్వారా దాని కదలికలను ఎప్పటికప్పుడు అటవీ అధికారులు గుర్తిస్తున్నారు. పులి కదలికలను బట్టి ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో మాత్రమే ఎక్కువగా సంచరించే పులి ఎటువైపు వెళ్తుందనే విషయాన్ని ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు. సూదికొండ అటవీ క్షేత్రంతో పాటు అడ్డతీగల, రాజవొమ్మంగి, గోకవరం అటవీ క్షేత్రాల సిబ్బంది అప్రమత్తంంగా ఉండాలని రంపచోడవరం డీఎఫ్ఓ శివకుమార్ గంగల్, అడ్డతీగల సబ్ డీఎఫ్ఓ సుబ్బారెడ్డి ఆదేశించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తమ సూచనలు పాటించాలని ఫోక్స్పేట రేంజర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. పట్టుకునేందుకు యత్నం ఇదిలా ఉండగా, నెల రోజులకు పైగా తూర్పు గోదావరి, పోలవరం జిల్లాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ పులిని మళ్లీ పట్టుకునేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు ఆరంభించారు. ఈ మేరకు పులిని పట్టుకునేందుకు శ్రీశైలం నుంచి ప్రత్యేకంగా అటవీ సిబ్బందిని రప్పిస్తున్నారు. ఈ పులిని పట్టి, బంధించి తిరిగి విశాఖ జూ పార్కుకు తరలించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
ఆగని మృత్యువేట
● మరణ మృదంగం మోగిస్తున్న వేట్లపాలెం బాణసంచా పేలుడు ● ఇప్పటి వరకూ 28 మంది బలి ● మృతుల్లో 17 మంది వేట్లపాలెం వాసులే ● వరుస మరణాలతో పెను విషాదం సాక్షి ప్రతినిధి, కాకినాడ: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మృత్యుదేవత వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక్కడి సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో గత శనివారం సంభవించిన భారీ బాణసంచా విస్ఫోటం ఇంకా మరణమృదంగాన్ని మోగిస్తూనే ఉంది. ఆ రోజున సంఘటన స్థలంలోనే 20 మంది సజీవదహనమైపోయారు. తీవ్రంగా ఒళ్లు కాలిపోయిన తొమ్మిది మందిని అదే రోజు కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ఆ రోజు నుంచి మంగళవారం వరకూ రోజుకొకరు చొప్పున.. బుధవారం ముగ్గురు, తాజాగా గురువారం ఇద్దరు మృత్యు ఒడికి చేరుకున్నారు. ఇలా క్షతగాత్రుల్లో ఎనిమిది మరణించడంతో ఈ ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 28కి పెరిగింది. తమవారు కోలుకుని తిరిగి వస్తారని ఆశ పడిన వారి కుటుంబాలకు చివరకు కన్నీటి వేదనే మిగిలింది. రాష్ట్ర చరిత్రలోనే ఇంత మంది ప్రాణాలు బలైపోయిన అత్యంత భారీ బాణసంచా విస్ఫోటం ఇదే కావడం గమనార్హం. సగానికి పైగా వేట్లపాలెం వారే.. ఈ ప్రమాద మృతులందరూ సామర్లకోట, పెద్దాపురం మండలాలకు చెందిన వారే. వీరిలో కూడా సామర్లకోట మండలంలోని రెండు ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటి వరకూ మొత్తం 28 మంది ఈ ప్రమాదంలో మరణించగా.. వీరిలో సగానికి పైగా అంటే.. 17 మంది వేట్లపాలెం వాసులే కావడం గమనార్హం. నిత్యం కళ్ల ముందే తిరిగిన వారందరూ ఐదారు రోజుల వ్యవధిలోనే తమను విడిచి వెళ్లిపోయారనే విషయాన్ని మృతుల కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వేట్లపాలెం తరువాత అత్యధికంగా సామర్లకోటలోని కుమ్మర వీధికి చెందిన ఏడుగురిని ఈ బాణసంచా విస్ఫోటం పొట్టన పెట్టుకుంది. దీంతో, ఆ వీధిలోని వారి ఆవేదనకు అంతే లేకుండా పోతోంది. ఆస్పత్రిలో కోలుకుని, క్షతగాత్రులు ఇళ్లకు తిరిగొస్తారనుకుంటే అంతలోనే చావు కబురు వినాల్సి వస్తోందంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. పొట్టకూటి కోసం బాణసంచా తయారీ పనికి వెళ్లడమే వారు చేసిన పాపం అన్నట్టుగా మారిందని చెమ్మగిల్లిన కళ్లతో చెబుతున్నారు. ఏ కుటుంబాన్ని కదిలించినా పొంగుకొస్తున్న కన్నీటితో గుండెలు బద్దలయ్యేలా విలపిస్తున్నారు. అందరూ రోజు కూలీలే కావడంతో వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. మృతులందరూ 25 నుంచి 55 సంవత్సరాల వయస్సు వారే. దీంతో, అందరూ దాదాపు అర్ధాయుష్షుతోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటూ వేట్లపాలెం, కుమ్మర వీధితో పాటు జి.మేడపాడు, పెదబ్రహ్మదేవం, పెద్దాపురం వాసులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మేడపాడుకు చెందిన భార్యాభర్తలు గంపల నాగరాజు, గంపల మంగ ఈ ప్రమాదంలో మృతి చెందారు. దీంతో, గడచిన నాలుగు రోజులుగా వారి కుమారుడు, ఇద్దరు కుమార్తెలను ఓదార్చడం ఎవ్వరి వల్లా కావడం లేదు. మృత్యువుతో పోరాడుతున్న దావీదు ఈ సంఘటన జరిగిన శనివారం నుంచి గడచిన ఆరు రోజులుగా సామర్లకోట కుమ్మర వీధికి చెందిన 39 ఏళ్ల వేమగిరి దావీదు కాకినాడ జీజీహెచ్లో మృత్యువుతో పోరాడుతున్నాడు. అతడినైనా క్షేమంగా తిరిగి పంపించు దేవుడా అంటూ ఆ వీధిలోని స్థానికులు ప్రార్థిస్తున్నారు. 70 నుంచి 80 శాతం కాలిన గాయాలతో జీజీహెచ్లో చికిత్స పొందుతున్న ఎనిమిది మంది ఇప్పటి వరకూ మృతి చెందారు. మరో క్షతగాత్రుడు దావీదు ఆరోగ్యం మెరుగు పరిచేందుకు జీజీహెచ్ వైద్యులు శ్రమిస్తున్నారు. వైద్య పరీక్షల్లో అతడి ఊపిరితిత్తుల్లో న్యూమోనియా ఉన్నట్టు గుర్తించి, ఆ మేరకు చికిత్స చేస్తున్నారు. వాస్తవానికి దావీదుకు సోమవారం ప్లాస్టిక్ సర్జరీ చేయాలని జీజీహెచ్ వైద్యులు భావించారు. అయితే, ఆ సర్జరీ అవసరం లేకుండా మందులతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మెరుగుపడిన ‘ఆమె’ ఆరోగ్యం ఈ ప్రమాదంలో గాయపడి, కాకినాడ రామారావుపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పచ్చిగళ్ల నూకరత్నం ఆరోగ్యం మెరుగు పడింది. ఆమెను గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయాలని భావించారు. అయితే, మరో 48 గంటలు ఆస్పత్రిలో ఉంచడమే మంచిదన్న యాజమాన్య సూచనతో డిశ్చార్జి ప్రక్రియను వాయిదా వేశారు. సామర్లకోట తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈమె కాకుండా పేలుడు జరిగిన రోజున పెద్దాపురం కొండయ్యపేటకు చెందిన చాపల శామ్యూల్ స్వల్ప గాయాలతో బయటపడి, మృత్యుంజయుడిగా నిలిచాడు. సామర్లకోట సీహెచ్సీలో చికిత్స అనంతరం అతడిని ఈ నెల 3న డిశ్చార్జి చేసి, ఇంటికి పంపించారు. మరో ఇద్దరి మృతి సామర్లకోట: వేట్లపాలెం బాణసంచా పేలుడు బాధితులు మరో ఇద్దరు.. మృత్యువుతో పోరాడలేక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో, వారి కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో గత శనివారం జరిగిన భారీ విస్ఫోటంలో వేట్లపాలెం గ్రామానికి చెందిన సప్ప సత్యవేణి (34), పెద్దాపురానికి చెందిన మోర్త శ్రీను (30) తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచీ కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వారు గురువారం మృతి చెందారు. మృతురాలు సత్యవేణికి భర్త లేడు. 18 సంవత్సరాల కుమారుడు రాజేష్, 16 సంవత్సరాల కుమార్తె నాగలక్ష్మి ఉన్నారు. తల్లి మృతితో వారిద్దరూ అనాథలుగా మిగిలారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయం చెక్కును పిల్లలిద్దరి పేరిట ఇస్తామని తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. మరో మృతుడు మోర్త శ్రీనుకు భార్య అనిత, మూడేళ్ల కుమారుడు హర్ష ఉన్నారు. శ్రీను మరణ వార్త తెలియడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ముగినిపోయింది. ప్రమాదం జరిగి ఐదు రోజులు గడచిపోవడంతో ప్రాణాలతో బయట పడతాడనుకున్నామని, మృత్యువుతో పోరాడి, తన భర్త ఓడిపోయాడని అనిత రోదించింది. తమకు దిక్కు లేకుండా పోయిందని రోదించింది. -
అసెంబ్లీ సాక్షిగా యనమల అబద్ధాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు వల్లె వేయడం తుని ఎమ్మెల్యే యనమల దివ్య అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని వైఎస్సార్ సీపీ అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు తొమ్మిది అంశాలపై సమాధానాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని పక్కదోవ పట్టించే ఉద్దేశంతోనే తుని ఎమ్మెల్యే చంద్రబాబు మాదిరి డైవర్షన్ రాజకీయాలు ఆచరిస్తున్నట్లున్నారని విమర్శించారు. ఈ మేరకు లక్ష్మీ శివకుమారి గురువారం ఒక వీడియో విడుదల చేశారు. ఎమ్మెల్యే అయి రెండేళ్లవుతున్నా తన నియోజకవర్గంలో అంగన్వాడీ భవనాల నిర్మాణం, అనుమతులు ఎలా వస్తాయి, ఎవరిస్తారనే కనీస అవగాహన దివ్యకు లేకపోవడం అన్యాయమన్నారు. ఒక పంచాయతీలో అంగన్వాడీ భవనం మంజూరుకు అక్కడి సర్పంచ్తో పాటు పాలకవర్గం సీడీపీవో ద్వారా జిల్లా కలెక్టర్కు విజ్ఞాపన అందజేయాలని, స్థలం మంజూరు నుంచి పనులు అప్పగించే వరకూ కలెక్టర్దే తుది నిర్ణయమనే విషయాలు తెలియనందువల్లనే దివ్య అసెంబ్లీలో అలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నామన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన నాటి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై లేని పోని రాజకీయ ఆరోపణలు చేయడం సమంజసం కాదని శివకుమారి హితవు పలికారు. నియోజకవర్గంలో నలుగురికి ఉపయోగపడే అంగన్వాడీ భవనాలు నిర్మిస్తే పేరు చిరస్థాయిగా ఉండిపోతుందని అభిలషించే రాజా.. అసంపూర్తి భవనాలతో నిధులు కాజేశారంటూ సత్యదూరమైన ఆరోపణలు చేయడం అవివేకమన్నారు. చిన్నారులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీలకు మంచి చేయాల్సిందిపోయి అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. వాస్తవాలపై అవగాహన పెంచుకోవాలని దివ్యకు హితవు పలికారు. వైఎస్సార్ సీపీపై లేని పోని ఆరోపణలు చేయడం బాధ్యత అనిపించుకోదని, ఇప్పటికై నా ఆ పద్ధతి మార్చుకోవాలని ఆమె సూచించారు. -
విద్యా శాఖలో పదినిసలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విద్యా శాఖలో వింత పోకడ రాజ్యమేలుతోంది. చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉపాధ్యాయులపై అదనపు భారాలు మోపుతోంది. ఇప్పటికే పదో తరగతి ప్రత్యేక తరగతుల పర్యవేక్షణకు ఇతర శాఖల అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించింది. తాజాగా పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్ బాధ్యతల విషయంలోనూ ప్రభుత్వం వింత నిర్ణయం తీసుకుంది. ఏటా టెన్త్ పరీక్షల ఇన్విజిలేషన్ బాధ్యతలను జిల్లా స్థాయిలో విద్యా శాఖ అధికారుల ద్వారా చేపట్టడం పరిపాటి. ఈసారి అలా కాకుండా ఆటోమేషన్ విధానంతో రాష్ట్ర స్థాయిలో ఇన్విజిలేషన్ నియామకాలు జరపాలని నిశ్చయించింది. దీనివలన దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధ పడుతున్న వారు, కుటుంబ సమస్యలతో ఉన్నవారికి సైతం టెన్త్ ఇన్విజిలేషన్ విధులు పడే అవకాశాలుంటాయి. అలాగే, సుదూర ప్రాంతాల్లో ఇన్విజిలేషన్ విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధానం పూర్తి అసంబద్ధమని ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో డీఈఓ ఆధ్వర్యాన.. జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 29,637 మంది హాజరు కానున్నారు. వీరిలో బాలురు 14,634 మంది, బాలికలు 15,003 మంది ఉన్నారు. దశాబ్దాలుగా టెన్త్ పరీక్షల ఇన్విజిలేషన్ విధులను జిల్లా విద్యా శాఖాధికారి (డీఈఓ) పర్యవేక్షణలో ఉపాధ్యాయుల సీనియారిటీ ఆధారంగా కేటాయిస్తున్నారు. పదో తరగతి పరీక్ష కేంద్రాల నిర్వహణ సీఎస్ పర్యవేక్షణలో ఉంటుంది. సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు డీఓలుగా, జూనియర్ స్కూల్ అసిస్టెంట్లకు ఏడీఓలుగా విధుల కేటాయింపు దశాబ్దాలుగా జరుగుతోంది. డీఓగా పని చేసిన అనుభవం ఉన్న హెచ్ఎంకే సీఎస్ డ్యూటీలివ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఈ ఏడాది కొత్తగా డీఈఓకు సంబంధం లేకుండా రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాల మేరకు విజయవాడ కమిషనర్ కార్యాలయం నుంచే ఇన్విజిలేషన్ విధులు కేటాయించాలని నిర్ణయించారు. ఉపాధ్యాయులకు, చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్మెంటల్ ఆఫీసర్ (డీఓ), అసిస్టెంట్ డీఓ(ఏడీఓ)లకు లీప్ యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా విధులు కేటాయించారు. వారిది కీలకపాత్ర పరీక్ష నిర్వహణలో సీఎస్, డీఓలదే కీలక పాత్ర. పరీక్ష కేంద్రంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసుకోవడం, పరీక్షలు జరిగే రోజుల్లో విద్యా శాఖ రోజువారీ నిర్వహించే సెట్ కాన్ఫరెన్స్కు హాజరవడం, ఉన్నతాధికారుల సూచనలు, ఆదేశాల అమలుకు కేంద్రంలో ఏర్పాట్లు చేయడం, ముఖ్యంగా పరీక్ష ప్రారంభ సమయానికి ముందుగా సంబంధిత పోలీసు స్టేషన్లకు వెళ్లి, ప్రశ్నపత్రాల బండిళ్లను పరీక్ష కేంద్రానికి భద్రంగా తీసుకు రావడంలో వ్యక్తిగత బాధ్యత తీసుకోవడం, పరీక్ష నిర్వహించే ఇన్విజిలేటర్ల నుంచి వివరాలు తీసుకోవడం, మిగతా శాఖలైన పోలీసు, వైద్య, ఆరోగ్య శాఖ, శానిటేషన్, మున్సిపల్/పంచాయతీరాజ్ సిబ్బంది విధులను పర్యవేక్షించడం, సమన్వయం చేసుకోవడం తదితర పనులన్నీ సీఎస్లు, డీఓలే చూస్తూంటారు. విజయవాడ నుంచి నేరుగా టెన్త్ ఇన్విజిలేషన్ విధుల కేటాయింపు ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులకు అతీతంగా డ్యూటీలు దూర ప్రాంతాల్లో నియమించే అవకాశం అసంబద్ధ విధానమంటూ ఉపాధ్యాయుల ఆగ్రహం జిల్లా విద్యా శాఖను డమ్మీ చేయడమే... పదో తరగతి పరీక్షల్లో సీఎస్, డీఓ, ఇన్విజిలెటర్ల డ్యూటీలు కమిషనర్ కార్యాలయం నుంచి కేటాయించడమంటే డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓలను డమ్మీలను చేయడమే. ఆ జిల్లాలపై వారికే పట్టు ఉంటుంది. పరీక్షలు ఎలా నిర్వహించాలో అనుభవం ఉంటుంది. అలాంటిది వారికి సంబంధం లేకుండా పరీక్షలు నిర్వహించడమంటే నేల విడిచి సాము చేయడమే. జిల్లా విద్యా శాఖ అధికారులపై నమ్మకం లేకనే ఈ విధంగా ఉత్తర్వులిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఎవరు చేయాల్సిన పనిని వారితో చేయిస్తేనే వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. – చింతాడ ప్రదీప్ కుమార్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జిల్లా స్థాయి అధికారి ప్రాధాన్యం లేకుండా.. విద్యా శాఖలో డీఈఓ, ఎంఈఓలు తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా కమిషనరేట్ నుంచే తీసుకోవడం మంచి సంప్రదాయం కాదు. ఇంతవరకూ టెన్త్ పరీక్షల విధులపై ఎలాంటి అవగాహనా లేని వారికి ఆర్డర్లు ఇవ్వడం, కొన్నిచోట్ల సీనియర్లను విస్మరించి, జూనియర్లకు డ్యూటీలు వేసే విధానం మంచిది కాదు. అనారోగ్య కారణాలతో బాధ పడే వారికి డ్యూటీలు కేటాయించడం సహేతుకం కాదు. – మోర్త శ్రీనివాస్, ఎస్టీయూ రాష్ట అదనపు ప్రధాన కార్యదర్శి పొరపాటు సవరించాలి టెన్త్ పరీక్షలకు రాష్ట్ర స్థాయి నుంచి కేటాయించిన డ్యూటీల్లో పారదర్శకత కనిపించడం లేదు. జూనియర్ ఉపాధ్యాయులకు సీఎస్ ఇచ్చారు. సీనియర్లకు డీఓలు, ఏడీఓలుగా ఇచ్చారు. ఇది సరికాదు. కమిషనర్ ఆధ్వర్యాన డ్యూటీల కేటాయింపులో తికమకలు చోటు చేసుకున్నాయి. ఈ పొరపాటును సవరించాలి. – ఎస్.సత్యనారాయణ, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పరీక్ష ముగిసిన తర్వాత... జవాబుపత్రాలను పోస్టాఫీసులో పార్సిల్ చేసేంత వరకూ సీఎస్, డీఓలిద్దరూ పరస్పర సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా పరీక్షలు జరిగే రోజుల్లో మిగిలిన సిబ్బంది కంటే ముందుగానే ఉదయం 6 నుంచి 7 గంటల్లోగా వీరు తమతమ కేంద్రాలకు చేరుకోవాలి. ఇన్ని కీలక బాధ్యతలున్న సీఎస్, డీఓలను సాధారణంగా ప్రస్తుతం పని చేస్తున్న స్కూలు నుంచి గరిష్టంగా 30 కిలోమీటర్ల పరిధికి లోబడి నియమిస్తూంటారు. కానీ, విద్యా శాఖ టెన్త్ పరీక్షల సిబ్బంది విధుల కేటాయింపునకు ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టిన ఆటోమేషన్ విధానం దీనికి భిన్నంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా తన వద్ద ఉన్న టీచర్ల సమాచారం (టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం – టిస్) ఆధారంగా జిల్లా విద్యా శాఖతో సంబంధం లేకుండా, క్షేత్ర స్థాయిలో దూరాభారంతో నిమిత్తం లేకుండా అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేయడంపై ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
టిడ్కో ఇంటికి రూ.2 కోట్ల కరెంటు బిల్లు
సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట జగ్గమ్మగారిపేటలో 18–9–70 డోర్ నంబరు గల టిడ్కో ఇంట్లో దాసరి దుర్గ నివాసం ఉంటున్నారు. ఆమె ఇంటికి రూ.1,99,91,809 కరెంటు బిల్లు వచ్చింది. అది చూసి దుర్గ ఒక్కసారిగా అవాక్కయ్యింది. తన ఇంటికి కరెంటు బిల్లు ఎప్పుడూ రూ.200 కూడా రాదని, అటువంటిది రూ.2 కోట్లు రావడమేమిటని ఆమె విలేకర్ల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఏపీఈపీడీసీఎల్ ఏడీఈ కిరణ్ను ‘సాక్షి’ వివరణ కోరగా మీటర్ నంబరుతో రీడింగ్ పొరపాటున తీయడం వల్ల అంతమొత్తంలో బిల్లు వచ్చినట్లు గుర్తించామని చెప్పారు. వెంటనే సరిచేసి రూ.147కు బిల్లు ఇచ్చామని వివరించారు. -
వేట్లపాలెం ఘటనలో మరో ఇద్దరి మృతి
సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్వర్క్స్లో ఇటీవల జరిగిన ఘోర విస్ఫోటనంలో మృతుల సంఖ్య 28కి పెరిగింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ పెద్దాపురానికి చెందిన మోర్త శ్రీను (30), వేట్లపాలేనికి చెందిన సప్ప సత్యవేణి (34) గురువారం మృతి చెందారు. బాణసంచా తయారీ కేంద్రంలో గత శనివారం జరిగిన పేలుడులో అక్కడికక్కడే 20 మంది సజీవ దహనమైన విషయం విదితమే. ఇదే ప్రమాదంలో గాయపడిన 9 మందిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ఇప్పటి వరకూ 8 మంది మృతి చెందారు. సామర్లకోట కుమ్మర వీధికి చెందిన వేమగిరి దావీదు మృత్యువుతో పోరాడుతున్నాడు. -
మాదిగలపై అక్రమ కేసులు ఎత్తివేయాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): మాదిగలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతూ బుధవారం కలెక్టర్ షణ్మోహన్కు ఎమ్మార్పీఎస్ నాయకులు కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు. సామర్లకోట మండలం బోయినపూడి గ్రామంలో మాదిగలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, మాదిగలపై దౌర్జన్యం చేసి, కులం పేరుతో దూషించిన అగ్రవర్ణాల వారిని అరెస్ట్ చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కొండేపూడి ఉదయ్కుమార్, మందపల్లి సత్యనారాయణ, కొడతా విజయ్కుమార్ కోరారు. సత్యదేవుని దర్శించిన కాశీ పీఠాధిపతి శ్రీ శివనాగేంద్ర సరస్వతి స్వామి అన్నవరం: కాశీ పీఠాధిపతి శ్రీ శివ నాగేంద్ర సరస్వతి గౌడపాదాచార్య స్వామీజీ బుధవారం రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. వారికి ఆలయం వద్ద పండితులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం పండితులు వేదాశీస్సులు అందచేసి స్వామివారి ప్రసాదాలు బహూకరించారు. హత్య కేసులో నిందితుల అరెస్టు సీతానగరం: బొబ్బిల్లంక గ్రామంలోని సుబ్బారావు పేటలో సోమవారం అర్ధరాత్రి జరిగిన మాజీ భార్య, అత్త హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పర్చుతున్నట్లు కోరుకొండ సీఐ ఎస్వీవీఎస్ మూర్తి తెలిపారు. ఆయన బుధవారం సీతానగరం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. హత్యకు పాల్పడిన చోడదాసి సీతారామరాజు (పండు), అతడికి సహకరించిన స్నేహితులు, అదే గ్రామానికి చెందిన చోడదాసి రమేష్ (చిన్న), చిత్రపు అజయ్ కుమార్, కన్నెం సురేష్ (పెద్ద)లను అరెస్ట్ చేశామన్నారు. ఎస్సై డి.రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
భీమేశ్వరుని జల ప్రసాదంలో పిల్లి కళేబరం
రామచంద్రపురం రూరల్: పంచారామాల్లో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో 12వ శక్తి పీఠంగాను ప్రసిద్ధి చెందిన ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్య ధోరణి తరచూ చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆలయ ప్రాంగణంలోని జల ప్రసాదం ట్యాంకులో పిల్లి కళేబరం లభించడంతో ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. దివీస్ ల్యాబ్ సంస్థ రూ.లక్షలతో ఆలయ ముఖద్వారం వద్ద సురక్షిత తాగునీటి ప్లాంట్ను ఏర్పాటు చేసింది. దాని వద్ద విపరీతమైన దుర్వాసన వస్తూండడంతో బుధవారం సిబ్బంది పరిశీలించగా, వాటర్ ట్యాంకులో పిల్లి కళేబరం కనిపించింది. వెంటనే దాన్ని తొలగించి ట్యాంకు శుభ్రం చేశారు. దీనిపై ఆలయ ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని వివరణ కోరగా పిల్లి వాటర్ ట్యాంకులో పడి చనిపోయిన సంఘటన వాస్తవమేనని, దానిని తొలగించి శుభ్రం చేయించడం జరిగిందన్నారు. తాను కూడా అదే నీరు తెప్పించుకుని తాగుతానని వివరణ ఇచ్చారు. కాగా.. ఇటీవల ఆలయ ప్రాంగణంలో విద్యుత్ షాక్కు గురై ద్రాక్షారామ వాసి మృతి చెందారు. అత్యంత ప్రాచీనమైన కపాలేశ్వరస్వామి శివలింగం ధ్వంసమైంది. అలాగే సప్త గోదావరిలో వృద్ధుడు మునిగి చనిపోయాడు. -
ఆగని మరణ మృదంగం
● బాణసంచా ప్రమాదంలో 26కి చేరిన మృతులు ● చికిత్స పొందుతూ ముగ్గురి మృతి ● మరో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరం సామర్లకోట: వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఘటనా ప్రదేశంలో 20 మంది సజీవ దహనం అయిన విషయం విదితమే. మంగళవారం నాటికి మృతుల సంఖ్య 23 కాగా, బుధవారం ముగ్గురు మృతి చెందారు. సామర్లకోట, కుమ్మర వీధికి చెందిన పల్లపాటి వీరశ్రీనివాసు(45), కాతేటి శ్రీను (35) వేట్లపాలెంకు చెందిన చిటికెల లక్ష్మి(45)తో ముగ్గురు మృతి చెందారు. దాంతో మృతుల సంఖ్య 26కు చేరింది. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న తొమ్మిది మందిలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందగా, మరో మగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిసింది. పల్లపాటి వీర శ్రీనివాసుకు భార్య రోజా మాత్రమే ఉంది. పిల్లలు లేరు. కాతేటి శ్రీనుకు భార్య కాతేటి రోజా, ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. చిటికెల లక్ష్మి భర్త గతంలోనే మరణించడంతో బంధువులతో ఉంటోంది. పోషణ నిమిత్తం తెలిసిన విద్య అయిన బాణసంచా తయారీ పనికి వెళుతోంది. లక్ష్మి మృతితో వేట్లపాలెంలో మృతుల సంఖ్య 16కు చేరింది. సామర్లకోట కుమ్మర వీధికి చెందిన ఏడుగురు ఇప్పటి వరకు మృతి చెందారు. జి. మేడపాడుకు చెందిన ఇద్దరు, పీబీ దేవంకు చెందిన ఒకరితో కలిపి మొత్తం 26 మంది బాణా సంచా ప్రమాదంలో మృతి చెందారు.కుమ్మరవీధికి చెందిన పల్లపాటి వీర శ్రీనివాసు మృతి చెందిన వార్త తెలిసిన వెంటనే భార్య గుండెలు బాదుకొంటూ రోధిస్తూ నన్ను కాకినాడ తీసుకు వెళ్డండి అంటూ అటు ఇటూ పరుగులు తీయడంతో స్థానికులు చలించి పోయారు. పిల్లలు లేక పోవడంలో పోస్టుమార్టమ్ వద్దకు భౠర్య రోజా వెళ్లవలసి ఉండటంతో ఆ ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు ఆమెను కాకినాడ తీసుకువెళ్లారు. కాగ కాతేటి శ్రీనుకు భార్య రోజా ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. శ్రీను మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు కాకినాడ పరుగులు తీశారు. నాకు అండ లేకుండా పోయింది పెళ్లి అయినా మాకు పిల్లలు లేరు. దాంతో ఒకరికి ఒకరు తోడుగా జీవిస్తున్నాం. నా భర్త మృతితో నాకు తోడు లేకుండా పోయింది. నా భర్త నన్ను ఎంతో ప్రేమగా చూసుకొనేవారు. అత్త, మామలు ఉన్నా వారు ఎంత కాలం చూస్తారు. ఒంటరి జీవితం నరక యాతనగా ఉంటుంది. – రోజా, పల్లపాటి వీర శ్రీనివాసు భార్య -
బాబూ.. అంగన్వాడి చూపుతాం
కపిలేశ్వరపురం/సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అరచేతిలో వైకుంఠాన్ని చూపించి ఓట్లు దండుకునే వైఖరి సీఎం చంద్రబాబుది. 2000 సంవత్సరంలో శ్రామిక మహిళలను గుర్రాలతో తొక్కించిన ఆయన మరోసారి కూటమి ప్రభుత్వంలో మహిళలపై విరుచుకుపడ్డారు. ఎన్నికల హామీ అమలు చేయాలన్న డిమాండ్తో ‘చలో విజయవాడ’ చేపట్టిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంగన్వాడీలను పలు పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పి వారిని కష్టాలు పెట్టారు. ఉద్యమానికి ఊపిరి ప్రధానంగా వేతనాలు పెంచాలని, ఐసీడీఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేయాలన్న డిమాండ్లతో ఆందోళనకు పిలుపు నిచ్చిన అంగన్వాడీలను విజయవాడకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. అయినప్పటికీ ఏ మాత్రం వెరవకుండా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి సుమారు ఐదు వేల మంది విజయవాడ ధర్నా చౌక్కు తరలివెళ్లారు. అక్కడి శిబిరంలో పోలీసులు చేపట్టిన దమనకాండలో కాకినాడకు చెందిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి, మండపేటకు చెందిన కె.కృష్ణవేణిలతో పాటు అనేక మంది తీవ్ర అణచివేతకు గురయ్యారు. ప్రతిఘటిస్తున్న అంగన్వాడీలను పోలీసులు పిన్నులతో గుచ్చారు. ఈడ్చుకెళ్తుండగా జి.బేబీరాణి చేతికి తీవ్ర గాయమైంది. ఆమెను ఆసుపత్రికి కాకుండా ఆమెతో పాటు మండపేటకు చెందిన కె.కృష్ణవేణి తదితరులను అమానవీయంగా బస్సులలో ఎక్కించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. వేమగిరికి చెందిన అంగన్వాడీ బేబీరాణి, మరి కొందరిని పోలవరం, బుట్టాయగూడెం ప్రాంతాలకు తరలించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ మొబైల్ను లాక్కున్నారు. ఆమె అప్పటికే తన మొబైల్లో పోలీసుల దురుసు ప్రవర్తనను చిత్రీకరించి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడంతో సమాజానికి చంద్రబాబు ప్రభుత్వ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఉమ్మడి జిల్లా అంతటా నిరసనలతో దద్దరిల్లింది. కాకినాడలోని సుందరయ్య భవన్ నుంచి కలెక్టరేట్ వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రవరం, అమలాపురం, రామచంద్రపురం, తదితర ప్రాంతాల్లోనూ, రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం వద్ద మానవహారం, ర్యాలీ, ధర్నాలు నిర్వహించారు. యాప్లతో పని భారం కేంద్ర ప్రభుత్వ యాప్ పోషణ ట్రాకర్లో వివిధ శాఖల వివరాలు నమోదు చేయడం కష్టతరంగా మారుతోంది. నెట్వర్క్ సరిగా లేకపోవడం, సర్వర్లు సరిగా పనిచేయకపోవడం వల్ల ఫేస్ రిజిస్ట్రేషన్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రోజంతా ఈ యాప్ల నమోదుతోనే సరిపోతుంది. ఇది కాకుండా అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లు చేయవలసి రావడంతో అంగన్వాడీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలు పెంచాలి రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో 400 మంది, రూరల్ పరిధిలో 250 మంది అంగన్వాడీలు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 3 వేల మంది అంగన్వాడీలు పనిచేస్తున్నారు. తక్షణ ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది.. 2000 మార్చి 30న హైదరాబాద్లో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం గుర్రాలతో తొక్కించింది. బాష్పవాయువు ప్రయోగించారు. ఆ ఉద్యమంలో మండపేట నియోజకవర్గానికి చెందిన అంగన్వాడీ గాయాలపాలైంది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించే సమయంలోనూ అంగన్వాడీలపై లాఠీ చార్జి చేయించారు. గెలిస్తే జీతాలు పెంచుతానన్న జగన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే అంగన్వాడీల వేతనాలను రూ.11,500కు పెంచారు. తన పాలనాకాలంలో సమ్మె చేసిన అంగన్వాడీల పట్ల ఆయన సానుకూలంగా స్పందించి ఇచ్చిన హామీ మేరకు వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచారు. ఉద్యోగ విరమణ ప్రోత్సాహకాలను రూ.లక్షకు పెంచుతూ జీవో జారీ చేశారు. 2024లో అధికారంలోకి వస్తే 2024 జూన్ నుంచి వేతనాలు పెంచుతానని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే అందలం ఎక్కిస్తామని ప్రలోభ పెట్టిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాకా అంగన్వాడీలపై దమణకాండకు పాల్పడ్డారు. దగాకోరు హామీలు ఇక చెల్లవు నాడు గుర్రాలతో తొక్కించి.. నేడు పోలీసులతో ఈడ్పించారు మహిళా దినోత్సవానికి ముందు మంచి బహుమతే ఇచ్చారు అంగన్వాడీల అణచివేతపై ఉమ్మడి జిల్లా నాయకుల ఆగ్రహం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా అంగన్వాడీలపై దాడికి దిగుతున్నారు. 2000లో హైదరాబాద్లో గుర్రాలతో తొక్కించారు. విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిలో అక్రమంగా అరెస్టు చేయించారు. ప్రస్తుత ఉద్యమంలో చర్చలు జరుపుతున్నట్టు నటిస్తూ అర్ధరాత్రి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతాం. – జి.బేబీరాణి, అధ్యక్షురాలు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, కాకినాడ -
గోప్యత గాలికి
వాట్సాప్ గ్రూపుల్లో పది పరీక్షల ఛీప్లు, డీవోల వివరాలు బాలాజీచెరువు (కాకినాడ): ఈ ఏడాది పదోతరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి సిబ్బంది కేటాయింపులన్నీ రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచే చేపట్టారు. పక్కాగా పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యంతో ఎవరూ ఏ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారో ముందుగా బయటకు తెలియకుండా ఉండేందుకు ఈ విధానం అవలంబించారు. నేరుగా సదరు ఉపాధ్యాయుల మొబైల్కే ఎక్కడ విధులు నిర్వహించాలన్న సమాచారం ఇస్తారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులుగా నియమితులైనవారికి మంగళవారం ఉత్తర్వులందాయి. అత్యంత గోప్యంగా పేర్కొంటూ పనిచేసే పాఠశాల, కేటాయించిన పరీక్ష కేంద్రం, ఫోన్ నంబర్ వివరాలన్నీ గోప్యంగా డీఈఓ కార్యాలయం లాగిన్కు పంపారు. ఇంతవరకూ బాగానే ఉన్న కార్యాలయంలో కొందరు సిబ్బంది ఈ వివరాలను బయటకు పంపడంతో ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపుల్లో ఈ వివరాలు హల్చల్ చేస్తున్నాయి. దూరంగా విధులు ఉపాధ్యాయులు పనిచేసే స్థానం నుంచి పది కిలోమీటర్ల లోపు ఉన్న కేంద్రంలో విధులు కేటాయించాలి. కానీ కొందరిని దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్లకు పైబడి దూరంలో ఉన్న కేంద్రాలకు డ్యూటీలు వేశారు. చాలామంది ఉపాధ్యాయులకు ఈ విధంగా దూరంగా వేయడంతో ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీన పరీక్షలు ప్రారంభం కానున్నాయి. -
వేట్లపాలెం ఘటన.. 26కు చేరిన మృతుల సంఖ్య
సాక్షి, కాకినాడ జిల్లా: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 26కి చేరుకుంది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతు కాతేటి శ్రీను(33) మృతిచెందాడు. ఇవాళ ఒక్కరోజే(బుధవారం, మార్చి 4) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందారు. 70-100 శాతం కాలిన గాయాలు, మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్తో బాధితుల ఆరోగ్యం విషమిస్తోంది. జీజీహెచ్లో మరో ముగ్గురు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.వేట్లపాలెంలో గత నెల ఫిబ్రవరి 28న(శనివారం) భారీ విస్ఫోటనం సంభవించిన సంగతి తెలిసిందే. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రం.. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలిపోయి భస్మీపటలమైంది. 20 మంది కూలీలు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మృతులందరూ పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం, సామర్లకోట, వేట్లపాలెం, పెదబ్రహ్మదేవం, గూడపర్తి గ్రామాలకు చెందిన వారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు.సామర్లకోట – పెదపూడి రోడ్డును ఆనుకుని పంట పొలాల మధ్య సుమారు మూడెకరాల్లో ఈ బాణసంచా తయారీ కేంద్రం ఉంది. ఉదయం బాణసంచా కేంద్రంలోని నాలుగు షెడ్లలో 60 మంది వరకూ కూలీలు మందు గుండు తయారీలో నిమగ్నమయ్యారు. సహజంగా ప్రతి రోజూ ఈ కేంద్రంలో 10–15 మంది పని చేస్తూంటారు. అయితే జగ్గంపేట మండలం మల్లిశాలలో జాతరకు భారీ ఆర్డర్ రావడంతో పాటు పెళ్లిళ్లు కూడా ఎక్కువగా ఉండటంతో బాణసంచాకు డిమాండ్ పెరిగింది. దీంతో 60 మందికి పైగా కూలీలతో పని చేయిస్తున్నారు. రాకెట్లు, జువ్వలు, సెర్చ్లైట్లు, మిడతల దండు, డిస్కో బుడ్లు, చిచ్చు బుడ్లు తయారు చేస్తున్నారు.మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. నాలుగు షెడ్లలో ఉన్న బాణసంచా ఒకదాని తర్వాత మరొకటి పేలిపోవడంతో చెవులు చిల్లులు పడేలా భయంకరమైన శబ్దం వినిపించింది. పేలుడు ధాటికి షెడ్లలో ఉన్న కూలీలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు మృతుల శరీర భాగాలు 20–30 అడుగుల ఎత్తున ఎగిరిపడ్డాయి. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో కాలిపోయిన మృతదేహాలు తునాతునకలైపోయాయి. -
కాలువలో మహిళ మృతదేహం
అనపర్తి: అనపర్తి కొత్తూరు శివారు కై లాస భూమి ఎదురుగా ఉన్న ఎర్ర కాలువలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే.. అనపర్తికి చెందిన పడాల వెంకట రామకృష్ణారెడ్డి తండ్రి ఏడాది క్రితం చనిపోయారు. అప్పటి నుంచీ తల్లి పుష్పవతి (75) శేషయ్య నగర్లోని సొంత ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె చాలా కాలంగా గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతూ కాకినాడ జీజీహెచ్లో మందులు వాడుతున్నారు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం కనబడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. కాగా.. ఈ నెల ఒకటిన రామకృష్ణారెడ్డి తన తల్లికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో ఇంటికి వెళ్లి చూడగా కనిపించలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో అనపర్తి కొత్తూరు శివారు కై లాస భూమి ఎదురుగా ఉన్న ఎర్ర కాలువలో ఆమె మృతదేహం ఉన్నట్టు సమాచారం అందింది. -
మందలించారని మాయమైంది
ఫ ఇంటి నుంచి వెళ్లి పోయిన బాలిక ఫ ఐదు గంటల్లోనే పోలీసుల గుర్తింపు ఫ తల్లిదండ్రులకు అప్పగింత అనపర్తి: ఇంటి నుంచి అదృశ్యమైన మల్లిడి విహారికారెడ్డి అనే 14 ఏళ్ల బాలికను పోలీసులు క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఫిర్యాదు అందిన ఐదు గంటల్లోనే ఆమెను గుర్తించినట్టు ఎస్సై వి.రవిచంద్ర కుమార్ మంగళవారం విలేకరులకు తెలిపారు. వివరాలు ఇవీ.. బలభద్రపురానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని విహారికారెడ్డి నెల రోజులుగా స్కూల్కు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటోంది. అలాగే ఎక్కువ సమయం సెల్ఫోన్ చూస్తూ గడుపుతోంది. దీంతో ఆ బాలికను తండ్రి సత్యనారాయణరెడ్డి సోమవారం మందలించాడు. అనంతరం పని మీద రాజమహేంద్రవరం వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చేసరికీ విహారికారెడ్డి కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో బిక్కవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో అనపర్తి సీఐ వీఎల్వీకే సుమంత్ సారథ్యంలో రంగంపేట, బిక్కవోలు ఎస్సై లు శివ ప్రసాద్, రవిచంద్ర కుమార్ మూడు టీములుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానం, బలబద్రపురం గ్రామస్తులు ఇచ్చిన సమాచారంపై దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ బాలిక విశాఖపట్నం వెళ్లినట్టు గుర్తించి, అక్కడి నుంచి బిక్కవోలు తీసుకుని వచ్చి మంగళవారం తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. -
రంగుల పండగ వేళ తీరని విషాదం
ఫ కాలువలో స్నానానికి దిగిన బాలురు ఫ నీటి ఉధృతికి ఒకరి గల్లంతు అనపర్తి: రంగుల పండగ హోలీని చిన్నారులందరూ సరదాగా జరుపుకొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. అనంతరం ఒంటిపై రంగులను కడుక్కుందామని కాలువలో దిగిన చిన్నారుల్లో ఒక బాలుడు నీటి ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిక్కవోలు మండలం రంగాపురం గ్రామానికి చెందిన కొమరపు దేవా అలియాస్ విజయ కుమార్ పెయింటర్గా పనిచేస్తూ అనపర్తిలో కాపురం ఉంటున్నాడు. ఆయనకు రాహుల్ (9), బన్ను అనే ఇద్దరు కుమారులు, ఒక పాప ఉన్నారు. హోలీని పురస్కరించుకుని మంగళవారం అన్నదమ్ములు, మరో ఇద్దరు బాలురతో కలసి రంగులు చల్లుకున్నారు. అనంతరం ధరణికోట శివాలయం వద్ద ఉన్న కాలువ రేవులో స్నానానికి దిగారు. కాలువలో నీటి ఉధృతికి శేఖర్, రాహుల్ కొట్టుకుపోయారు. శేఖర్ను గుడి దగ్గర ఉన్న సత్తిబాబు అనే వ్యక్తి బయటకు లాగి కాపాడాడు. రాహుల్ నీటిలో కొట్టుకుపోతుండగా అతడి అన్న బన్ను కేకలు వేస్తూ కాలువ గట్టు మీద కొద్ది దూరం పరిగెత్తాడు. విషయం తెలుసుకున్న రాహుల్ తండ్రి దేవ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే కాలువలో నీరు ఉధృతి ఎక్కువగా ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అదనపు ఎస్ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. రాహుల్ ఆచూకీ కోసం ఎస్ఎఫ్వో జీరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది కాలువలో దిగి గాలింపు చేపడుతున్నారు. ఇప్పటి వరకు బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. నీటి ఉధృతి నేపథ్యంలో నీటిపారుదలశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు ఎస్సై ఎల్.శ్రీను నాయక్ తెలిపారు. -
గుర్తుకొచ్చింది
కొన్ని ప్రదేశాలు కొండ గుర్తులతో ప్రాచుర్యం పొందుతుంటాయి. వాటిలో రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరులోని చింతచెట్టు సెంటర్ ఒకటి. ఆ ప్రాంతంలో దాదాపు 50 ఏళ్లుగా ఓ చింతచెట్టు ఉండేది. ఆటో, బస్సుల్లో వచ్చిన వారికి అదే కొండగుర్తుగా ఉండేది. ఆర్అండ్బీ రోడ్డు విస్తరణలో భాగంగా 2015 మార్చి 4వ తేదీన ఆ చెట్టును తొలగించారు. అయినా ఇప్పటికీ ఆ సెంటర్ను చింతచెట్టు సెంటర్గానే పిలుస్తారు. ఆ చెట్టును తొలగించినప్పుడు ప్రతి ఒక్కరూ ఎంతో బాధపడ్డారని మాజీ సర్పంచ్ అత్తిలి భీమశంకరం గుర్తు చేసుకున్నారు. – రాజమహేంద్రవరం రూరల్ ఇలా.. రీవర్స్ రఘుదేవపురం ర్యాంపు నుంచి ఇసుక లారీలు మంగళవారం రాజమహేంద్రవరం – సీతానగరం నాలుగు లేన్ల రోడ్డు ఎక్కాయి. అదే రోడ్డులో మైన్స్ డిపార్ట్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో వెంటనే ర్యాంపు నుంచి తిరిగి గోదావరి పరివాహక ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. దీంతో సాయంత్రం 4 గంటల నుంచి ఇసుక ఎగుమతులను ర్యాంపు నిర్వాహకులు నిలిపేశారు. ప్రక్కిల్లంక, సీతానగరం రెవెన్యూ లంక భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు పొంది, నిబంధనలను తుంగలో తొక్కి అధిక లోడుతో లారీలపై ఇసుక తరలిస్తున్నారు. బిల్లులు లేకుండా అమ్మకాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో మైన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారని తెలిసి ఇలా వెనక్కి తిప్పేశారు. అనంతరం రాత్రి సమయంలో తరలించారు. – సీతానగరం రఘుదేవపురం ర్యాంపు వద్ద గోదావరి తీరంలోనిలిపిన ఇసుక లారీలు -
ఎన్నాళ్లీ మరమ్మత్తులు!
ఫ పూర్తికాని వంతెనల మరమ్మతులు ఫ పట్టించుకోని చంద్రబాబు సర్కార్ ఫ వాహనాల రాకపోకలకు అవస్థలు ఫ ఎగుమతి, దిగుమతులపై తీవ్ర ప్రభావం ఫ కంకర లారీపై రూ.3 వేల అదనపు భారం ఫ కొబ్బరి కాయకు రూ.2 తగ్గించి వ్యాపారుల కొనుగోలు మలికిపురం: గోదావరి పాయలు, సముద్ర తీరంతో కనువిందు చేసే రాజోలు దీవిలో ప్రజల రాకపోకలతో పాటు సరకుల రవాణాకు వంతెనలు ఎంతో కీలకం. బయటకు రావాలన్నా, లోపలకు వెళ్లాలన్నా వీటి మీదగానే ప్రయాణం సాగిస్తారు. అయితే ఈ వంతెనలను కొన్ని రోజులుగా మరమ్మతుల పేరుతో మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దిండి – చించినాడ వంతెన ఎనిమిది నెలలు, పి.గన్నవరం వంతెన రెండు నెలల పాటు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల రవాణాతో పాటు వాణిజ్య పంటల ఎగుమతులకు కష్టం కలుగుతోంది. నెలలు గడుస్తున్నా పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో ఇప్పటికే ప్రజలు రూ.లక్షల అదనపు భారం మోశారు. ఇంకా మోస్తూనే ఉన్నారు. దూరాభారం రాజోలు దీవికి ఐరన్, ఎలక్ట్రికల్ తదితర వస్తువులు విజయవాడ, పాలకొల్లు, తణుకు తదితర ప్రాంతాల నుంచి వస్తాయి. కంకర, ఇనుము, నిత్యావసరాలు, దుస్తులు రాజమహేంద్రవరం, పంగిడి నుంచి దిగుమతి అవుతాయి. ఇవన్నీ రావాలంటే దిండి – చించినాడ, పి.గన్నవరం వంతెనలే దిక్కు. అలాగే ఇసుక రావాలన్నా ఈ రెండు వంతెనలే ఆధారం. ప్రస్తుతం ఈ వంతెనలను మరమ్మతుల పేరుతో నిలిపివేయడంతో పాలకొల్లు నుంచి రావులపాలెం, సిద్ధాంతం వంతెనల మీదుగా అమలాపురం సమీపంలోని పాశర్లపూడి వంతెన నుంచి రావాల్సి వస్తోంది. దీంతో దూరాభారం, లోల్గేట్ ఖర్చు అధికమై తడిసి మోపెడు అవుతుంది. ఇదంతా వినియోగదారులపైనే పడడంతో సాధారణ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇక రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లు వంతెనలు బాగాయ్యే దాకా పనులు చేయలేమని చేతులెత్తేశారు. ఇప్పటికే గిట్టుబాటు కాక, బిల్లులు రాక సతమతం అవుతున్న తమకు తీవ్ర నష్టం వస్తుందని స్పష్టం చేశారు. రైతుల అవస్థలు వంతెనల మరమ్మతుల ప్రభావం రాజోలు దీవిలో వాణిజ్య పంటలైన కొబ్బరి, సరుగుడు ఎగుమతులపై కూడా పడింది. కొబ్బరి కాయకు రూ.రెండు తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇదేమంటే వంతెనల వల్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని, గతంలో ఇచ్చిన ధర తమకు గిట్టుబాటు కాదని చెబుతున్నారు. సరుగుడు రైతులదీ ఇదే పరిస్థితి. మూసివేతతో.. దిండి – చించినాడ వంతెన మూసివేత వల్ల అమలాపురం తదితర ప్రాంతాలపై కూడా భారం పడుతోంది. సాధారణంగా పశ్చిమ గోదావరి వైపు నుంచి వచ్చే లారీలు దిండి వంతెన మీదుగా పాశర్లపూడి వంతెన దాటి అమలాపురం వైపు వెళతాయి. ఇక్కడ వంతెన మూసివేతతో ఇవన్నీ సిద్ధాంతం వైపు వెళ్లి, తిరిగి అమలాపురం రావాల్సి వస్తోంది. ప్రధానంగా కొబ్బరి లారీల లోడ్ విషయంలో ఈ ఇబ్బంది కలుగుతోంది. అలాగే పాలకొల్లు – అమలాపురం మధ్య జరిగే వస్తు రవాణాకు కూడా అవస్థలు కలుగుతున్నాయి. ఇక విద్యార్థుల ఇబ్బందులు షరా మమూలే. వంతెనపై అరగంటకు పైగా ఎండ, మంచులలో నడవాల్సి వస్తోంది. ప్రజలపై అదనపు భారం వంతెనలను ఇలా ఒకేసారి మూసివేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వాహనాల రాకపోకలకు అడ్డంకితో పాటు, దిగుమతి చేసుకునే వస్తువులపై పెనుభారం పడుతోంది. సిమెంట్, ఇనుము, ఇసుక, కంకర వంటి నిర్మాణ వస్తువుల దిగుమతి విషయంలో లారీకి సుమారు రూ.3 వేల అదనపు భారం పడుతోంది. – సుందర పండు, గూడపల్లి కొబ్బరి రైతులకు నష్టం వంతెనల మూసివేత భారం రైతులపై పడింది. ముఖ్యంగా కొబ్బరి కాయకు రూ.2 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఇది చాలా దారుణం. వంతెనల మూసి వేత కారణంగా పాశర్లపూడి వంతెన నుంచి దూరం తిరిగి లారీలు వెళ్లాల్సి రావడమే దీనికి కారణమని చెబుతున్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. – దేశినీడి ఉదయ భాస్కరరావు, రామరాజులంక ఎనిమితి నెలలుగా మరమ్మతులు పూర్తి కాని దిండి – చించినాడ వంతెన ఆలస్యానికి కారణం వివాదమేనా! అధికారులు చెప్పిన ప్రకారం వంతెన మరమ్మతులు పూర్తి అవడానికి మరో రెండు నెలల సమయం పడుతుంది. అలాగే వారు ప్రతిసారీ గడువు పొడిగిస్తున్నారు. చించినాడ వంతెనకు ఎనిమిది నెలలుగా మరమ్మతులు పూర్తి కాలేదు. ప్రస్తుతం వంతెన పిల్లర్లకు అమర్చాల్సిన బేరింగ్ల కొలతలు తీసి ఆర్డర్ ఇచ్చిన కారణంగా అవి వంతెన వద్దకు చేరుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వంతెన నిర్మించిన సంస్థకూ ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఇలా వాయిదా పడినట్లు తెలుస్తోంది. -
టీడీపీ నాయకుడి భార్య ఆత్మహత్య
రాజమహేంద్రవరం రూరల్: హుకుంపేట గణేష్నగర్ జీవీకే సిగ్నేచర్స్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నెంబర్ 202లో టీడీపీ నేత, ఏపీ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ సంక్షేమ సభ్యుడు తమ్మా రవి భార్య తమ్మా విజయలక్ష్మి(40) సోమవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే అల్లుడి వేధింపులతోనే తన కుమార్తె చనిపోయిందని విజయలక్ష్మి తల్లి, కొత్తపేటకు చెందిన కాసా సూర్యకుమారి మంగళవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాల ప్రకారం.. 2002లో తమ్మా రవితో విజయలక్ష్మికి వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే విజయలక్ష్మితో తల్లి మాట్లాడటానికి రవి అనుమతించేవాడు కాదు. పైగా కట్నం తీసుకు రావాలని వేధించడంతో పాటు వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. రవి తండ్రి సత్యనారాయణ కూడా మానసికంగా వేధించేవాడు. ఈ కారణాల వల్లే విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని సూర్యకుమారి ఫిర్యాదు చేశారు. బొమ్మూరు ఎస్సై కె.రమేష్ కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫ ఫ్లాట్లో ఉరి వేసుకుని మృతి ఫ అల్లుడి వేధింపులే కారణమని మృతురాలి తల్లి ఫిర్యాదు -
వ్యాన్ ఢీకొని యువకుడి మృతి
ఫ ఆటో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలు ఫ బాసవాగు వద్ద ఘటన ఎటపాక: వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఆటోలో వస్తున్న యువకుడు మృతి చెందాడు. 30వ నంబర్ జాతీయ రహదారిపై బాసవాగు వద్ద మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. ఎస్సై అప్పలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరీదేవిపేటకు చెందిన పైల రమేష్, సీత దంపతుల కుమారుడు పైల సాయి (26) విస్సాపురం పంచాయతీ పరిధిలోని బండిరేవు గ్రామంలో బైక్ మెకానిక్ షెడ్డు నడుపుతున్నాడు. రోజూ మాదిరిగానే ఉదయం తన ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై మెకానిక్ షెడ్డుకు వెళ్లాడు. అయితే ద్విచక్ర వాహనాల స్పేర్ పార్టులు, ఇంజిన్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు బండిరేవు గ్రామంలోని ఈశ్వర్ ఆటోలో భద్రాచలం వెళ్లాడు. అక్కడ సామగ్రి కొనుగోలు చేసుకుని అదే ఆటోలో మరో ఇద్దరు ప్రయాణికులతో కలిసి బండిరేవు వస్తున్నాడు. ఈ క్రమంలో బాసవాగు సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న టోల్ప్లాజా వద్ద ఇరుకు రహదారిలో చింతూరు నుంచి భద్రాచలం వైపు వస్తున్న వ్యాన్ అతివేగంగా ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న సాయికి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ ఈశ్వర్తో పాటు దుమ్ముగూడెం మండలం గద్దమడుగు గ్రామానికి చెందిన మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. వారిని స్థానికులు 108లో భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు. స్థానికులు ఆ వ్యాన్ డ్రైవర్ను పట్టుకుని ఘటన ప్రాంతానికి వచ్చిన పోలీసులకు అప్పగించారు. సాయి మృతదేహానికి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పంచనామా నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. -
పెరుగుతున్న మరణాలు
సామర్లకోట: వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో శనివారం జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కు పెరిగింది. సంఘటన జరిగిన రోజున అక్కడిక్కడే 20 మంది సజీవ దహనం కాగా, సామర్లకోట కుమ్మర వీధికి దర్శిపాటి లోవరాజు, దర్శిపాటి రాజు ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా అదే ప్రాంతానికి చెందిన వేమగిరి లోవరాజు (35) కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దీంతో, ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 23కు చేరింది. లోవరాజు ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి అతడి భార్య బుజ్జిని బంధువులు కాకినాడ జీజీహెచ్కు తీసుకువెళ్లారు. అతడు మరణించాడని వైద్యులు చెప్పడంతో అనారోగ్యంతో ఉన్న బుజ్జిని సాయంత్రం ఆరు గంటల సమయంలో తిరిగి ఇంటికి తీసుకు వచ్చారు. ఇంటికి వచ్చిన వెంటనే కుప్ప కూలిపోయి బుజ్జి రోదించిన తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది. ఆమె ఓదార్చడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. భర్త లేని తాను ఎందుకు బతకాలంటూ ఆమె గుండెలు బద్దలయ్యేలా విలపించింది. పలు కుటుంబాల్లో పెను విషాదం నింపిన ఈ పేలుడు ఘటనలో సామర్లకోట కుమ్మర వీధికే చెందిన ఐదుగురు మృతి చెందడంతో ఆ ప్రాంత ప్రజల ఆవేదనకు అంతే లేకుండా పోయింది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న మరో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాను. నా భర్త లోవరాజు పదేళ్లుగా బాణసంచా తయారీలో కష్టపడి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన రెక్కల కష్టంతోనే ఇటీవల మా కుమార్తె రాజీ పెళ్లి చేశాం. మా ఇద్దరు కుమారులు బద్రి, నానిలకు ఇంకా ఉద్యోగాలు లేవు. పని చేసే పరిశ్రమే నా భర్తను తీసుకుపోయింది. మా కుటుంబానికి ఆధారం లేకుండా పోయింది. ఆరోగ్యం బాగోలేని నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వమే నా పిల్లలకు దారి చూపాలి. – బుజ్జి, వేమగిరి లోవరాజు భార్య, సామర్లకోటఫ వేట్లపాలెం పేలుడు ఘటనలో మరొకరి మృతి ఫ 23కు చేరిన మృతులు ఫ మరో ఆరుగురి పరిస్థితి విషమం -
కనీస వేతనం ఇచ్చేంత వరకూ పోరాటం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అంగన్వాడీ ఉద్యోగులకు రూ.26 వేల కనీస వేతనం ఇచ్చేంత వరకూ పోరాటం ఆగదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ అన్నారు. వేతనాలు పెంచాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ స్థానిక కచేరీపేట సుందరయ్య భవన్ నుంచి కలెక్టరేట్ వరకూ మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఇంద్రపాలెం లాకుల వద్ద రహదారి దిగ్బంధం చేసి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ, ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను చర్చలకు పిలిచి, అర్ధాంతరంగా తెల్లవారుజామున అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామంటూ ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చి ఓట్లు దండుకున్నారన్నారు. హక్కుల కోసం పోరాడుతూంటే అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, అరెస్టు చేసిన అంగన్వాడీ నాయకులను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే యూనియన్ ఆధ్వర్యాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీల ఆందోళనకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర నాయకురాలు సీహెచ్ రమణి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు టేకుముడి ఈశ్వరరావు, రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, జిల్లా కోశాధికారి మలకా రమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ పాల్గొన్నారు. -
ప్రాణాలతో చెలగాటం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: లాభాల వేటలో పడి.. బాణసంచా తయారీ పరిశ్రమల యజమానులు భద్రతను గాలికొదిలేస్తూండటం నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. యాజమాన్యాల నిర్లక్ష్యం వల్లనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా ఏటా ఏదో ఒక ప్రాంతంలో బాణసంచా తయారీ కేంద్రాల్లో ఘోర ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్పలోని బాణసంచా తయారీ కేంద్రంలో 2014లో జరిగిన పేలుడులో దాదాపు 18 మంది మరణించారు. గత ఏడాది అక్టోబర్ 8న రాయవరంలో జరిగిన బాణసంచా విస్ఫోటంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల సామర్లకోట మండలం వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో సంభవించిన భారీ పేలుడులో ఇప్పటి వరకూ 23 మంది మృతి చెందారు. ఈ అన్ని సంఘటనలకూ మానవ తప్పిదాలు, అధికారుల పర్యవేక్షణ లోపాలే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. పక్కా చర్యలేవీ? ఈ ప్రమాదాల్లో బలైపోతున్న వారందరూ నిరుపేదలే. రోజంతా కష్టపడితేనే కానీ కుటుంబం గడవని వారే. ఈ ప్రమాదాల్లో తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు.. భర్తలను, పిల్లలను కోల్పోయి భార్యలు అనాథలుగా మిగులుతున్నారు. కుటుంబాలకు కుటుంబాలే రోడ్డున పడుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వాధినేతలు హడావుడిగా వచ్చి, ఆర్థిక సాయం చేసి, అధికారులను బాధ్యులను చేసి చేతులు దులుపేసుకుని వెళ్లిపోతున్నారు. అంతే తప్ప ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామ్ కే వాస్తేగానే ఉంటున్నాయి. బాణసంచా తయారీ కేంద్రాల యాజమాన్యాలు పూర్తి భద్రతా చర్యలు పాటించేలా, నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం ఉదాసీనంగా ఉంటున్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదు. సర్కారు ఇటువంటి పక్కా చర్యలు తీసుకోనందువల్లనే వేట్లపాలెం విస్ఫోటం సంభవించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరంతర పర్యవేక్షణతో పాటు ప్రతి బాణసంచా తయారీ కేంద్రంలో తరచూ తనిఖీలు నిర్వహిస్తే ఇటువంటి ఘోరాలకు అడ్డుకట్ట వేయవచ్చు. కలత చెందుతూ.. కన్నీరు పెట్టుకుంటూ.. ఏకంగా 20 మంది సజీవ దహనానికి కారణమైన వేట్లపాలెం పేలుడు ఉమ్మడి జిల్లా చరిత్రలోనే అతి పెద్ద విషాద సంఘటన. మరో 11 మంది అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి బయటపడినా.. వారిలో తొమ్మిది మందిని 60 నుంచి 80 శాతం కాలిన గాయాలతో కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో సామర్లకోట కుమ్మర వీధికి చెందిన దర్శిపాటి రాజు, దర్శిపాటి లోవరాజు, వేమగిరి లోవరాజు గడచిన మూడు రోజుల్లో మృతి చెందారు. దీంతో, ఆ కుటుంబాల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ఈ ముగ్గురి మృతితో ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కు పెరిగింది. ప్రస్తుతం జీజీహెచ్లో చిటికల లక్ష్మి, సప్పా సత్య వెంకట లక్ష్మి, మోర్తా శ్రీను, వేమగిరి దావీదు, కాతేటి శ్రీను, పల్లపాటి వేదశ్రీను ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ ఆరుగురినీ కాపాడేందుకు జీజీహెచ్ వైద్యులు, సిబ్బంది అహోరాత్రాలు శ్రమిస్తున్నారు. వైద్యం అందుతోంది.. వారం పది రోజుల్లో తమ వారు క్షేమంగా ఇంటికి తిరిగొస్తారని కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ, జీజీహెచ్లో సంభవిస్తున్న వరుస మరణాలతో వారిలో ధైర్యం సన్నగిల్లిపోతున్న పరిస్థితి. రోజులు గడిచేకొద్దీ ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందోననే భయంతో వారు వణికిపోతున్నారు. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. మొబైల్ రింగ్ అయితే చాలు.. ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని కలత చెందుతున్నారు. అయినప్పటికీ, ఉదయం నుంచి సాయంత్రం వరకూ జీజీహెచ్ వద్దనే వేచి చూస్తూ, తమ వారి ఆరోగ్యంపై వైద్యులను, సిబ్బందిని వారు కన్నీటితో ఆరా తీస్తున్న తీరు ఆస్పత్రిలోని వారిని సైతం కలచివేస్తోంది. కాగా, వేట్లపాలేనికి చెందిన మరో మహిళ పంచగళ్ల నూకరత్నం సంఘటన జరిగిన శనివారం నుంచి కాకినాడ రామారావుపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం మెరుగైందని బంధువులు చెబుతున్నారు. దీంతో, మిగిలిన క్షతగాత్రుల కుటుంబ సభ్యులు తమ వారికి కూడా ప్రైవేటు ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించి ఉంటే ప్రాణాలు దక్కేవేమోనని భావిస్తున్నారు. ఇప్పుడున్న వారికై నా మంచి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించాలని కోరుకుంటున్నారు. మరణాలు అందుకేనా!?ఫ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న బాణసంచా తయారీ ఫ బలైపోతున్న నిరుపేదలు ఫ సంఘటన జరిగినప్పుడే సర్కారు హడావుడి ఫ ఆ తర్వాత ఉదాసీనత ఫ అందువల్లనే తరచుగా విస్ఫోటాలు తారాజువ్వల వంటి పేలుడు పదార్థాలు ఆకాశంలోకి వెళ్లాక రంగురంగుల కాంతులు విరజిమ్ముతూ, భారీ శబ్దాలు రావడానికి పలు రసాయనాలు వినియోగిస్తారు. వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో వినియోగించిన ముడి సరకుల్లో రసాయనాలు కలిపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవి శరీర భాగాల్లోకి చొచ్చుకుపోవడం, మందుగుండు ప్రభావంతో శరీరమంతా మంటలు ఒకేసారి అంటుకుపోవడంతో క్షతగాత్రుల శరీరంలో ముఖ్యమైన వ్యవస్థలు దెబ్బ తిన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఫ బర్న్ షాక్ అనే స్థితిలో చర్మం కాలిపోయి, రక్తంలోని ద్రవాలు బయటకు పోతాయి. దీనివలన రక్తపోటు తీవ్రంగా పడిపోతుంది. మెదడు, గుండెకు సరైన రక్తప్రవాహం జరకపోవడంతో ప్రాణాపాయం ఏర్పడుతుంది. ఫ శరీరానికి రక్షణ కవచం చర్మం. అది కాలిపోతే బ్యాక్టీరియా లోపలకు సులభంగా ప్రవేశించి, రక్తంలో ఇన్ఫెక్షన్ (సెప్సిస్) వచ్చి, మరణానికి దారి తీస్తుంది. ఫ వీటితో పాటు క్షతగాత్రులకు శ్వాసకోశ సమస్యలు కూడా త్వరగా వస్తూంటాయి. భారీ విస్ఫోట సమయంలో వెలువడే పొగ, వేడి గాలి పీల్చితే ఊపిరితిత్తులు దెబ్బ తిని శ్వాస తీసుకోవడం కష్టమై, ప్రాణాపాయ పరిస్థితి తలెత్తుతుంది. ఫ కాలి, తీవ్రంగా గాయపడిన వారిలో గుండె, మూత్రపిండాల వంటి ముఖ్య అవయవాల పనితీరుపై ప్రభావం పడుతుంది. వాటి పనితీరు నెమ్మదించడం కూడా మరణానికి కారణమవుతుంది. ఫ తీవ్రమైన నొప్పితో పాటు శరీరంలోని ద్రవాలు తగ్గిపోతూండటం కూడా ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఫ క్షతగాత్రుల శరీరం 50 శాతం కన్నా ఎక్కువ కాలిపోతే ప్రాణాపాయం చాలా ఎక్కువగా ఉంటుంది. వేట్లపాలెం విస్ఫోటంలో జీజీహెచ్కు వచ్చిన తొమ్మిది మంది క్షతగాత్రుల్లో దాదాపు అందరూ 70 శాతం పైగా కాలిపోయిన వారే. ఫ మొదటి స్థాయి కాలిన గాయాలతో పెద్దగా ప్రమాదం ఉండదు. చర్మం పై పొర (ఎపిడెర్మిస్) మాత్రమే దెబ్బ తింటుంది. చర్మం ఎర్రబడి నొప్పి తక్కువగా ఉంటుంది. చర్మంపై నీటి బుడగలు ఏర్పడవు. సూర్యకిరణాల వల్ల చర్మం కాలినప్పుడే ఈ సమస్య ఉంటుంది. ఇది ప్రాణాపాయం కాదు. ఫ రెండో స్థాయి కాలిన గాయాలు కూడా పెద్దగా ప్రమాదకరమైనవి కావు. వీటి వలన చర్మం పై పొరతో పాటు లోపలి పొర (డెర్మిస్) కూడా దెబ్బ తింటుంది. నీటి బుడగలు వచ్చి, నొప్పి ఎక్కువగా ఉంటుంది. చర్మం తడిగా కనిపిస్తుంది. రెండు మూడు వారాల్లో మానిపోతుంది. కొన్నిసార్లు మచ్చలు మాత్రం మిగులుతాయి. ఫ మూడో స్థాయి కాలిన గాయాలతో చర్మం పొరలు మొత్తం నాశనమవుతాయి. లోపలి కండరాలు, నరాలు కూడా దెబ్బ తింటాయి. చర్మం తెలుపు, గోధుమ లేదా నలుపు రంగులోకి మారుతుంది. నరాలు కాలిపోవడంతో నొప్పి ఉండకపోవచ్చు. కానీ, ఇది అత్యంత ప్రమాదకరం. ఒక్కోసారి శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది. ఎక్కువ భాగం కాలిపోతే ప్రాణాపాయం ఎక్కువ. వేట్లపాలెం విస్ఫోటంలో ఈ స్థాయిని మించే క్షతగాత్రుల శరీరాలు కాలిపోయాయి. అందువల్లనే వారి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని వైద్యులు చెబుతున్నారు. -
చంద్రగ్రహణం ఎఫెక్ట్
ఈ ఆలయానికి మినహాయింపుఅన్నవరం: చంద్రగ్రహణం కారణంగా జిల్లాలోని ఆలయాలను మంగళవారం మూసివేశారు. ఉదయం పూజల అనంతరం ఆయా ఆలయాలను మూసివేశారు. అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయాన్ని ఉదయం 10 గంటలకు మూసివేశారు. అంతకు ముందు స్వామి, అమ్మవార్లకు అర్చకులు లఘు పూజ నిర్వహించారు. అనంతరం ఈఓ వి.త్రినాథరావు ఆధ్వర్యాన ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకులు సుధీర్, దత్తాత్రేయశర్మ తదితరుల సమక్షంలో సెక్యూరిటీ సిబ్బంది స్వామివారి ప్రధానాలయాన్ని, తూర్పు, పశ్చిమ రాజగోపురాల ద్వారాలను మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ ద్వారాలకు నోటీసులు అతికించారు. దీంతో, ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, క్యూలు నిర్మాన్యుషంగా దర్శనమిచ్చాయి. దేవస్థానంలోని వివిధ కౌంటర్లు, దుకాణాలను కూడా మూసివేశారు. గ్రహణం కారణంగా ఉదయం భక్తులు కూడా చాలా తక్కువగా వచ్చారు. సత్యదేవుని వ్రతాలు సుమారు వంద జరిగాయి. ముందుగా ప్రకటించిన విధంగా ఉదయం 9.30 గంటల వరకూ మాత్రమే సత్యదేవుని వ్రతాలు నిర్వహించారు. వ్రతాలు, ఆయుష్య హోమం, నిత్య కల్యాణం, కేశఖండన టిక్కెట్లు ఉదయం 7 గంటల వరకూ మాత్రమే విక్రయించారు. భక్తులను స్వామివారి దర్శనాలను ఉదయం 10 గంటల వరకూ అనుమతించారు. పౌర్ణమి సందర్భంగా వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం, సత్యదేవుని జన్మ నక్షత్రం మఖ సందర్భంగా ఆయుష్య హోమాన్ని ఉదయం 7 గంటలకే ప్రారంభించి, 9.30 గంటల్లోగా ముగించారు. సత్యదేవుని నిత్య కల్యాణం కూడా ఉదయం 7 గంటలకు ప్రారంభించి 9.30 గంటలకు పూర్తి చేశారు. సత్యదేవుని ప్రధానాలయంతో పాటు స్వామివారి యంత్రాలయం, రామాలయం, వనదుర్గ, కనకదుర్గ, నేరేళ్లమ్మ తల్లి ఆలయాలను కూడా ఉదయం 10 గంటలకే మూసివేశారు. గ్రహణానంతరం ఆలయాలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసి, బుధవారం ఉదయం నుంచి స్వామి, అమ్మవార్ల దర్శనాలు, వ్రతాలు, ఇతర కార్యక్రమాలు యథావిధిగా నిర్వహిస్తామని ఈఓ తెలిపారు. పంచారామ క్షేత్రం మూసివేత సామర్లకోట: చంద్రగ్రహణం సందర్భంగా పంచారామ క్షేత్రమైన సామర్లకోట బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయాన్ని ఉదయం 10 గంటలకు మూసివేశారు. పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వరరావు ఆధ్వర్యాన శ్రీచక్ర పండితుడు వేమూరి సోమేశ్వరశర్మ, అభిషేక పండితుడు అళ్లకి రాజ్గోపాల్శర్మ, ప్రధానార్చకుడు సన్నిధిరాజు వెంకట రమణలు తెల్లవారుజామునే స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన, ఉపాలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం ఈఓ బళ్ల నీలకంఠం, చైర్మన్ కంటే జగదీష్ మోహన్ల పర్యవేక్షణలో ఆలయ ప్రధాన ద్వారానికి తాళం వేశారు. బుధవారం తెల్లవారుజామున సంప్రోక్షణ అనంతరం ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఈఓ తెలిపారు. దూర ప్రాంతాల నుంచి బస్సులలో వచ్చిన భక్తులకు చంద్రగ్రహణం కారణంగా స్వామివారిని దర్శించే అవకాశం లభించలేదు. పట్టణంలోని నూకాలమ్మ, వేణుగోపాలస్వామి, జగదీశ్వరస్వామి ఆలయాలతో పాటు ఇతర ఆలయాలను కూడా మూసివేశారు. ఫ జిల్లాలో ఆలయాల మూసివేత ఫ నేటి ఉదయం నుంచి తిరిగి దర్శనాలు పిఠాపురం: గ్రహణం వేళ రాష్ట్రంలో దాదాపు అన్ని దేవాలయాలూ మూసివేయడం పరిపాటి కాగా.. పిఠాపురం పాదగయ క్షేత్రంలో మాత్రం ఆలయం తెరిచే ఉంచడం విశేషం. ఇక్కడ వెలసిన కుక్కుటేశ్వరస్వామి వారికి మంగళవారం చంద్రగ్రహణ సమయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు, పురోహితులు జపాలు చేశారు. పలువురు భక్తులు గ్రహణ సమయంలో స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాటిపర్తిలో అపర్ణాదేవి ఆలయ అర్చకులు గ్రహణ సమయంలో తమ ఇంట్లో రోకలి నిలబెట్టి జపాలు చేశారు. -
వేట్లపాలెం బాధితులను ఆదుకోవాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలెక్టర్ షణ్మోహన్ను కాకినాడలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 23 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమని, మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, మృతుల కుటుంబ సభ్యులకు ఉపాధి, పింఛను సదుపాయాలు కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. బాధిత కుటుంబాలకు జిల్లా అధికార యంత్రాంగం అండగా నిలిచి, అవసరమైన అన్ని సహాయ సహకారాలూ అందిస్తుందని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు, డోకుబుర్ర భద్రం మాస్టారు తదితరులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగుల సంఘానికి నూతన కార్యవర్గం కాకినాడ లీగల్: జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం, సబ్ రిజిస్ట్రార్ల సంఘం కార్యవర్గ సభ్యుల ఎన్నిక రాజమహేంద్రవరంలో మంగళవారం ఏకగ్రీవంగా జరిగింది. అమలాపురం జాయింట్ సబ్ రిజిస్ట్రార్–2 పి.లక్ష్మణ్రాజు ఎలక్షన్ అబ్జర్వర్గా వ్యవహరించారు. ఎన్నిక అనంతరం సబ్ రిజిస్ట్రార్ల సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 14న రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక విశాఖపట్నంలో జరుగుతుందని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ల సంఘం జిల్లా ఈసీ సభ్యులుగా రాయుడు వెంకట రామారావు (కాకినాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్–1), టి.సుబ్బారెడ్డి (తుని), బీవీవీ సత్యనారాయణ (సామర్లకోట), పీవీవీఎస్ వీరభద్రరావు (కాకినాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్–2) ఎన్నికయ్యారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా వైవీవీ సురేష్ (సీనియర్ అసిస్టెంట్, కాకినాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం), ఉపాధ్యక్షుడిగా ఎస్.నరసింహారావు (జానియర్ అసిస్టెంట్, కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం), ప్రధాన కార్యదర్శిగా ఎస్.భాస్కర్రెడ్డి (జూనియర్ అసిస్టెంట్, తాళ్లరేవు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం), సంయుక్త కార్యదర్శిగా పి.గణేష్ కుమార్ (జానియర్ అసిస్టెంట్, జగ్గంపేట), కోశాధికారిగా కేవీ ప్రసాద్ (సీనియర్ అసిస్టెంట్, సర్పవరం), మహిళా ప్రతినిధిగా సీహెచ్ అనూష (జూనియర్ అసిస్టెంట్, సర్పవరం), ఈసీ సభ్యులుగా జేయూ సామ్రాట్ (జానియర్ అసిస్టెంట్, కాకినాడ), పి.శాలినీదేవి (జూనియర్ అసిస్టెంట్, కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాయలం), వి.స్రవంతి (ఆఫీస్ సబార్డినేట్, సామర్లకోట) ఎన్నికయ్యారు. -
నేడు సత్యదేవుని ఆలయం మూసివేత
అన్నవరం: చంద్రగ్రహణం కారణంగా అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయాన్ని మంగళవారం ఉదయం 10 గంటలకు మూసివేయనున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులను ఉదయం 10 గంటల వరకూ మాత్రమే అనుమతిస్తారు. మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 గంటల వరకూ ఏర్పడనున్న చంద్రగ్రహణం కారణంగా సత్యదేవుని వ్రతాలను ఉదయం 9.30 గంటల వరకూ మాత్రమే నిర్వహిస్తారు. వ్రతాలు, ఆయుష్య హోమం, నిత్యకల్యాణం, కేశఖండన టిక్కెట్లు ఉదయం 7 గంటల వరకూ మాత్రమే విక్రయిస్తారు. అలాగే, స్వామివారి ప్రసాదాలు ఉదయం 9.30 గంటల వరకూ మాత్రమే విక్రయిస్తారు. పౌర్ణమి సందర్భంగా వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం, సత్యదేవుని జన్మ నక్షత్రం మఖ సందర్భంగా నిర్వహించే ఆయుష్య హోమం, స్వామివారి నిత్య కల్యాణం ఉదయం 9 గంటలకు బదులు ఉదయం 7 గంటలకూ ప్రారంభించి, 9.30 గంటల్లోపు పూర్తి చేస్తారు. గ్రహణానంతరం స్వామివారి ఆలయం, వ్రతమండపాలు, ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసి బుధవారం తెల్లవారుజాము నుంచి యథావిదిగా స్వామివారి దర్శనాలు, వ్రతాలు, పూజలు, కల్యాణం, ఆయుష్య హోమం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. నేడే చంద్ర గ్రహణం వీరేశ్వరస్వామి ఆలయం మూసివేత ఐ.పోలవరం: ఫాల్గుణ శుక్ల పౌర్ణమి మంగళవారం చంద్ర గ్రహణం సందర్భంగా రాత్రి జరిగే భక్తుల కల్యాణాలు రద్దు చేసినట్లు మురమళ్ల వీరేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్, ఈఓ వి.సత్యనారాయణ సోమవారం తెలిపారు. దేవస్థానం అనుసరించే పంచాంగం ప్రకారం ఆలయ అర్చకులు, పురోహితుల సూచనల మేరకు ఉదయం జరగాల్సిన అభిషేకాలు, దర్శనాలు, చండీ హోమం తదితర పూజలు జరిపించి ఉదయం 11.30 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేస్తామన్నారు. స్పర్శ సూర్యాస్తమయం 6.09 నుంచి సాయంత్రం 6.48 వరకూ గ్రహణ మోక్ష కాలం ఉంటుందన్నారు. మోక్ష కాలం అనంతరం ఆలయ మహా సంప్రోక్షణ, అభిషేకం, మహానివేదన, ధూప సేవ చేసి అనంతరం స్వామివారికి అర్చకులచే ఏకాంతంగా నిత్య కల్యాణం జరుగుతుందన్నారు. ఈ సమయంలో భక్తుల దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి యథావిధిగా దర్శనాలు, అభిషేకాలు ఉంటాయన్నారు. ప్రాజెక్టుకు జాతీయ స్థాయి గుర్తింపుఅల్లవరం: గోదావరి జిల్లాలోని సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులను సమగ్రంగా విశ్లేషించి, వాటి సామాజిక, సాంస్కృతిక ప్రభావాలను అధ్యయనం చేయడమే లక్ష్యంగా చేసిన పరిశోధన ప్రాజెక్టుకు గాను అల్లవరం మండలం ఓడలరేవు బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయిలో చోటు దక్కింది. ఆ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న అయ్యగారి నాగేశ్వరరావు, శ్రీపాద రామకృష్ణ, ఆకుల ప్రవీణ్లు చేసిన ‘గోదావరి జిల్లాల వైదిక వారసత్వంపై విశ్లేషణాత్మక అధ్యయనం’ ప్రాజెక్టుకు గుర్తింపు దక్కింది. ఈ మేరకు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు ఇచ్చిందని బీవీసీ చైర్ పర్సన్ బోనం కనకదుర్గ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాజెక్టుల్లో గోదావరి జిల్లాల వైదిక వారసత్వం మేటిగా నిలిచిందన్నారు. ఈ ప్రాజెక్టుతో తమ కళాశాల విద్యా పరిశోధన రంగాల్లో మైలురాయిని అధిగమించిందని ప్రిన్సిపాల్ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఆ అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. -
మార్పు మన నుంచే రావాలి
సదస్సులో చాగంటి కోటేశ్వరరావు రాజమహేంద్రవరం రూరల్: ముందు మన నుంచే మార్పు వస్తే, సమాజం మారుతుందని ప్రవచన వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. సోమవారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని తిరుమల విద్యా సంస్థల ప్రాంగణంలో విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించాలనే లక్ష్యంతో నైతిక విద్యా సదస్సు నిర్వహించారు. దీనిని చాగంటి కోటేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనకి మనం కట్టుబాటుతో బతకడం అనేది కేవలం విద్యతో మాత్రమే వస్తుందన్నారు. సెల్ఫోన్ అధిక వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక సామాజిక దుష్ప్రభావాలను వివరించి, సమయాన్ని వృఽథా చేయకుండా పుస్తక పఠనం, క్రీడలు, యోగాభ్యాసం వంటి మంచి అలవాట్లను అలవరచుకోవాలని సూచించారు. నైతిక విలువలు లేని ఏపనైనా విషంతో సమానమని స్పష్టం చేస్తూ, సత్యం, క్రమశిక్షణ, గౌరవం, సేవాభావం వంటి సద్గుణాలు ప్రతి విద్యార్థి జీవితానికి పునాది కావాలని తెలిపారు. పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు చాగంటి కోటేశ్వరరావు సమాధానలిచ్చారు. తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు మాట్లాడుతూ ఈ ప్రవచనాలను విద్యార్థులు పెద్దవారైనా పాటించాలన్నారు. పాఠ్యాంశాల బోధనతో పాటు విలువల విద్యను సమానంగా అందించడం అవసరమని తెలిపారు. విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ఇలాంటి సదస్సులు దోహదపడతాయన్నారు. ఈ సదస్సులో తిరుమల విద్యా సంస్థల డైరెక్టర్ సరోజినీదేవి, వైస్ చైర్పర్సన్ శ్రీరష్మి, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, దాదాపు 1,200 మంది విద్యార్థులు, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. -
విషాదం కుమ్మరించిన వేళ..
● వేట్లపాలెం పేలుడు మృతుల్లో నలుగురు కుమ్మర వీధి వాసులే ● సంఘటన స్థలంలో ఇద్దరు సజీవదహనం ● చికిత్స పొందుతూ మరో ఇద్దరి మృతి ● నలుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ● గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న కుటుంబ సభ్యులు సామర్లకోట: పట్టణంలోని కుమ్మర వీధిలో విధి పెను విషాదాన్ని కుమ్మరించింది. ఈ ప్రాంతంలో మాదిగ సామాజికవర్గీయులు ఎక్కువగా నివాసం ఉంటారు. అందరూ రోజు కూలి చేసుకుంటూ జీవనం గడుపుతారు. వారికి తెలిసిన విద్య బాణసంచా తయారీయే. ఈ నేపథ్యంలో శనివారం వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో పని చేయడానికి వెళ్లి.. ఈ ప్రాంతానికి చెందిన నలుగురు మృతి చెందారు. సంఘటన స్థలంలో కుమ్మర వీధికి చెందిన దర్శిపాటి నాని, ఏడిద శ్యామ్ కుమార్ సజీవ దహనం కాగా.. అదే ప్రాంతానికి చెందిన దర్శిపాటి లోవరాజు, దర్శిపాటి రాజు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. మొత్తం కుమ్మర వీధికి చెందిన నలుగురు మృతుల్లో ముగ్గురు దర్శిపాటి కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి దుఃఖానికి అంతే లేకుండా ఉంది. దర్శిపాటి రాజు మృతదేహాన్ని మహాప్రస్థానం వాహనంలో సోమవారం తీసుకు వచ్చిన వెంటనే ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలు బాదుకుంటూ రోదించారు.ఆస్పత్రి నుంచి క్షేమంగా వస్తాడన్నారు బాణసంచా ప్రమాదం జరిగిన వెంటనే నా భర్త గురించి ఆరా తీశాను. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నడని, త్వరలోనే ఇంటికి వస్తాడని బంధువులు, స్థానికులు చెప్పారు. 48 గంటలు గడవక ముందే నా భర్త మృతి వార్త వచ్చింది. ఆయన శవాన్ని సోమవారం అప్పగించారు. చివరి చూపు చూసుకునే అవకాశం కూడా దక్కలేదు. నా ఇద్దరు ఆడ పిల్లలకు ఆధారం లేకుండా పోయింది. మరిది, మామగారితో పాటు నా కుటుంబాన్ని నా భర్తే పోషించే వాడు. నేను ఇంటర్ వరకూ చదువుకున్నాను. కుటుంబ పోషణకు ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలి. – రాజేశ్వరి, దర్శిపాటి రాజు భార్య, సామర్లకోట ఇద్దరు పిల్లలు, మామగారిని పోషించాలి నా భర్త బాణసంచా షాపులో సజీవ దహనమయ్యాడు. అతని తండ్రితో పాటు కుటుంబాన్ని నా భర్త పోషించే వాడు. ఆయన చనిపోవడంతో ఇద్దరు పిల్లలు మానస, అఖిలలను ఏవిధంగా పోషించాలో అర్థం కావడం లేదు. వారిని చదివించుకోవాల్సి ఉంది. కుటుంబాన్ని నడిపే నాథుడు లేకుండా పోయాడు. ఎటువంటి ఆధారం లేకపోవడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నాం. – గంగాభవాని, దర్శిపాటి నాని భార్య, సామర్లకోట -
చెరకు సాగుకు.. పద ముందుకు
ఫ ఇదే అనుకూల సమయం ఫ సస్యరక్షణ చర్యలు అవశ్యం పెరవలి: తియ్యని దిగుబడులను ఇచ్చే చెరకు సాగుకు ఇదే అనుకూలం.. సరైన సమయంలో సాగు చేస్తే సిరుల పంటే. తూర్పు గోదావరి జిల్లాలో 850 హెక్టార్లలో చెరకు పంట వేస్తున్నారు. ఇందులో పెరవలి, నిడదవోలు, ఉండ్రాజవరం, కొవ్వూరు, చాగల్లు, నల్లజర్ల, దేవరపల్లి, ద్వారకాతిరుమల, రాజమహేంద్రవరం రూరల్, కడియం, సీతానగరం మండలాలు ఉన్నాయి. ఈ సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యల గురించి కొవ్వూరు వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ) సీహెచ్ శ్రీనివాసరావు వివరించారు. ఆ వివరాలు ఇలా.. నేలల స్వభావం చెరకు పంటకు నీటి సదుపాయం ఉన్న మెరక భూములు అనుకూలం. ఈ భూముల్లో 25 నుంచి 30 సెంటీమీటర్ల లోతు వరకూ మెత్తని దుక్కు చేయాలి. ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువును వేసి ఆఖరి దుక్కులో కలియ దున్నాలి. చేనును సమాంతరంగా చేయాలి. నాటే సమయం ఉభయ గోదావరి జిల్లాల్లో చెరకు పంటను జూన్ నుంచి జూలై వరకూ, డిసెంబర్ నుంచి మార్చి నెలాఖరు వరకూ నాటుకోవచ్చు. మొదటిసారి పంట వేసే రైతులు చేలో పూర్తిగా నీరు పెట్టి నీరు ఇంకిన 3 రోజుల తరువాత విత్తనం చెరకు గడలను ముక్కలుగా చేసి 2.5 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి. కార్సీ తోటల రైతులు చేలో ఉన్న చెత్తకు నిప్పుపెట్టి అంటించిన తరువాత నీరు పెట్టాలి. నీటి యాజమాన్యం పంట వేసిన తరువాత ఆరు రోజులకు ఒకసారి 4 నెలల పాటు సాగునీటిని అందించాలి. పక్వానికి వచ్చిన దశలో 3 వారాలకొకసారి నీరు అందించవచ్చు. ఎరువులు ఇలా.. చెరకు తోట వేసిన 45 రోజులు, 90 రోజులు, 120 రోజులకు ఎరువులను వేయాలి. నత్రజని 67 కిలోలు, భాస్వరం 40 కిలోలు, పొటాష్ 48 కిలోలు మూడు సమ భాగాలుగా చేసి వీటిని అందించాలి. వీటితో పాటు నత్రజనిని అందించే జీవన ఎరువులైన అజటోబాక్టర్ ఎకరానికి రెండు కిలోల చొప్పున పశువుల ఎరువుతో కలిపి రెండు దఫాలుగా వేయాలి. నాటిన మూడో రోజు ఒకసారి, 45 రోజులకు మరోసారి వేసుకుంటే నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే ఎకరానికి 4 కిలోలు పాస్ఫా బ్యాక్టీరియాను నాటిన ఆరో రోజున వేసుకుంటే భాస్వరం ఎరువును కూడా తగ్గించుకోవచ్చు. కార్సి తోటల సాగు మొక్కతోటల కన్నా కార్సి తోటలు త్వరగా పక్వానికి వస్తాయి. సాగులో ఖర్చు కూడా తగ్గుతుంది. నీటిని తట్టుకునే గుణం ఈ తోటలకు ఉంటుంది. కార్సి తోటల్లో దుబ్బుల నుంచి మొలకెత్తేటప్పుడు కలుపు నివారణ కోసం మందులను వాడకూడదు. కార్సి తోటలున్న రైతులు చేలో ఉన్న చెత్తను కాల్చడం కానీ లేదా ఆ చెత్తను కుళ్లబెట్టడానికి ట్రై కోడెర్మావిరిడి మందును పేడనీళ్లతో కలిపి చెత్తపై చల్లాలి. దీనితో పాటు 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 8 కిలోల యూరియా రెండు కలిపి చెత్తపై చల్లాలి. దీనివల్ల భూమిలో తేమశాతం నిలబడటమే కాకుండా చెత్త బాగా చివికి ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ పంటలపై ఎక్కువగా పీక పురుగు, కాండం తొలిచే పురుగు, పొలుసు పురుగు, తెల్లనల్లి, లద్ది పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు పంటను ఆశించకుండా చేలల్లో కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకుంటే కొంతవరకు అరికట్టవచ్చు. పంటపై కాటుక తెగులు, ఎర్రకుళ్లు తెగులు, మొవ్వకుళ్లు తెగులు ప్రభావం అధికంగా ఉంటుంది. ఇవి ఆశించినప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. -
నిప్పుతో చెలగాఢాం..
ఫ బాణసంచా తయారీలో నిబంధనలు గాలికి ఫ వరుస ప్రమాదాలతో ఆరని నిప్పు ఫ ప్రమాదకర వృత్తిలో పేద కుటుంబాలు ఫ అవగాహన లేక ప్రాణాలకే ముప్పు పిఠాపురం: మిరుమిట్లు గొలిపే వెలుగులు.. భారీ శబ్దాలతో పేలే టపాసులు కొందరికి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి.. వాటి తయారీలో మాత్రం పేదల బతుకులు ‘కూలి’పోతున్నాయి.. లాభాల్లో మునిగి యజమానులు, పర్యవేక్షణా లోపంతో అధికారులు ఉండడంతో బడుగుల జీవుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.. ఒకప్పుడు బాణసంచా కేవలం దీపావళికి మాత్రమే కాల్చేవారు. రానురానూ ఏ శుభకార్యం, పండగ, జాతర చివరకు అంతిమయాత్రల్లోనూ వాడుతున్నారు. దీనివల్ల టపాసుల తయారీ ఏడాది పొడవునా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా ఫైర్ వర్క్స్లో పేదలు జీవనోపాధి పొందుతూ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ జీవితాలను మంటల్లోకి నెట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘటనలు చూస్తే పరిస్థితి అర్ధమవుతోంది. కొన్ని నెలల కిందట రాయవరం, ఇటీవల వేట్లపాలెంలో జరిగిన ఘటనల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయి అయినవారికి విషాదాన్ని మిగిల్చారు. ఈ పనిలోకి వెళ్తే తిరిగి వచ్చే వరకూ వారి ప్రాణాలకు రక్షణ ఉండడం లేదు. అయినా అదే వృత్తిని కొనసాగించడం వారి కుటుంబాలకు శాపంగా మారుతోంది. అన్నీ తెలిసినా తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రాణాన్ని ఫణంగా పెట్టి వచ్చే కొద్దిపాటి కూలి డబ్బుల కోసం వెళ్లి విలువైన తమ ప్రాణాలు కోల్పోయి వెనుక ఉన్న కుటుంబానికి ఆసరా లేకుండా చేసుకుంటున్నారు. దీంతో అనేక కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అధికారికంగా 20 బాణసంచా తయారీ కేంద్రాలు ఉండగా, అనధికారికంగా 50కు పైనే ఉన్నట్లు సమాచారం. కడచూపు కరువాయే.. మూడు రోజుల కిందట వేట్లపాలెంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ వద్ద జరిగిన విస్ఫోటం కూలీల కుటుంబాలను కుదిపేసింది. కూలి డబ్బులు తెస్తా.. నీకు సామాన్లు తీసుకొస్తానంటూ కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లిన వారు ఇంటికి రాకుండా పోయారు. కడసారి చూపునకు కూడా వీల్లేకుండా కాలి బూడిదయ్యారు. గుండెలకు హత్తుకుని గుండెలవిసేలా ఏడుద్దామన్నా ఏ శవం ఎవరిదో తెలియని హృదయ విదారకమైన పరిస్థితి. మృతదేహాలను నేరుగా మరుభూమికే తరలించడంతో బంధువులు గుండెలు బాదుకుంటూ రోదిస్తుంటే ఆపడం ఎవరితరం కాలేకపోయ్యింది. ఒకరా ఇద్దరా ఏకంగా 22 మంది చూడటానికి ఆకారం లేదు.. ఎవరో తెలుసుకుందామంటే ముఖాలు కనిపించడం లేదు.. గుర్తు పడదామంటే ఆనవాళ్లు లేవు.. ఈ పరిస్థితుల్లో తెల్లవస్త్రంలో కట్టిచ్చిన మూటలే వారి మృతదేహాలుగా భావించి ఖననం చేసుకోవాల్సిన దుర్భర పరిస్థితి వచ్చింది. తల్లి.. తండ్రి.. భర్త.. భార్య, పిల్లలు ఇలా ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరిని కోల్పోయి పుట్టెడు దుఖఃలో బాధిత కుటుంబాలు ఉన్నాయి. అవగాహనా లోపమే శాపం బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగితే తొలుత బలైపోతున్నది కార్మికులే. ఇక్కడ పనిచేసే వారిలో 90 శాతం మంది రోజువారీ కూలీలే. అనుభవం ఉన్న కార్మికులకు సైతం బాణసంచాకు ఉపయోగించే ముడిసరకుపై అవగాహన ఉండదు. ఎటువంటి రసాయనాల సమ్మేళనం వల్ల పేలుడు సంభవిస్తుందనే అవగాహన సైతం వారికి లేదు. బాణసంచాలో పెద్ద శబ్దాలు వచ్చేందుకు అమోనియం నైట్రేట్ను అధికంగా వినియోగిస్తున్నారు. ఇది కొద్దిపాటి ఒత్తిడి పెరిగితే పేలే స్వభావం ఉంటుంది. అయితే పనిచేసే వారికి ఈ అవగాహన ఉండదు. బాణసంచా తయారు చేస్తున్నప్పుడు కార్మికులు, కూలీల ఒంటికి రసాయనాలు దట్టంగా పట్టేస్తున్నాయి. కాళ్లు, చేతులు, ముఖం, వేసుకున్న దుస్తులకు రసాయనాలు పట్టడం వల్ల పేలుడు సమయంలో వారు కూడా పూర్తిగా కాలిపోతున్నారు. ఒకవేళ తీవ్ర గాయాలై ప్రాణాలతో బయటపడినా రసాయనాల వల్ల మండిపోయిన శరీరంతో జీవచ్ఛవాలుగా మారిపోతున్నారు. రసాయనాలతో బాణసంచా తయారు చేసేటప్పుడు ప్రతి కార్మికుడి ముఖానికి మాస్క్ తప్పనిసరి ఉండాలి. అయితే ఒక్కచోట కూడా ఈ పద్ధతి అవలంబించట్లేదు. దీనివల్ల కార్మికులు తీవ్ర రోగాల బారిన పడుతున్నారు. పొటాషియం నైట్రేట్, మెగ్నీషియం పౌడర్, సల్ఫర్ రసాయనాలు అధికంగా వాడతారు. ఇవి వాడేటప్పుడు కనీస రక్షణ చర్యలు తీసుకోవాలి. బాణసంచా తయారు కేంద్రాల్లో అన్ని రసాయనాలు కలిపి నూరడం వల్ల పేలుడుకు దారి తీస్తున్నాయి. విడివిడిగా ఫార్ములా తయారు చేయాలి. అవగాహన కల్పించకుండా కూలీలతో పనులు చేయించడం పేలుళ్లకు దారి తీస్తోంది. అగ్ని బారిన పడకుండా ప్రత్యేక వస్త్రాలు వేసుకోవడంతో పాటు తలకు హెల్మెట్ పెట్టుకోవాలి. ముఖానికి మాస్క్ తప్పనిసరి. కానీ ఎక్కడా అది జరగడం లేదు. వరుస ఘటనలు.. కలవరపాట్లు బాణసంచా తయారీ కేంద్రాల్లో వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాల్లో అనేక మంది జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. సాధారణంగా మందుగుండు సామగ్రి అతి తక్కువ పేలుడు పదార్థాలతో మాత్రమే తయారు చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కాల్చే విధంగా, ప్రమాదం జరిగినా ప్రాణనష్టం లేకుండా చేయాలి. కానీ విదేశీ మందుగుండు రాకతో వాటిని పోటీగా చేసుకుని రంగు రంగుల బాణసంచా తయారీతో పాటు శక్తివంతమైన అతి పెద్ద శబ్దాలు వచ్చే పోటాపోటీగా మందుగుండు కొత్త పద్ధతుల్లో తయారీ చేస్తున్నారు. దీంతో వీటి పవర్ మందు పాతర మాదిరిగా తయారవుతోంది. ఎక్కడైనా బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగితే అది మందుగుండు పేలినట్లు కాకుండా మందు పాతర పేలినట్లు విస్ఫోటం సృష్టిస్తుంది. తద్వారా భారీ ప్రాణ నష్టం సంభవిస్తోంది. అధికారులు ‘మామూళ్లు’ తనిఖీలే తప్ప పూర్తిగా దృష్టి సారించకోవడం పెను ప్రమాదాలకు కారణమవుతోంది. -
రూ.50 లక్షల పరిహారం, ఐదెకరాల భూమి ఇవ్వాలి
● కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి ● వేట్లపాలెం బాణసంచా బాధితులకు ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ పరామర్శ ● క్షతగాత్రులకు మైరుగైన వైద్యం అందించాలని డిమాండ్ సామర్లకోట: వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రం పేలుడు మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం, ఐదెకరాల భూమితో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు. బాణసంచా పేలుడులో మృతి చెందిన వారి కుటుంబాలను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబుతో కలసి సామర్లకోట, వేట్లపాలెం, మేడపాడుల్లో సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, అధికారుల అవినీతి కారణంగానే ఈ ప్రమాదం జరిగిందన్నారు. భారీ ఎత్తున బాణసంచా తయారు చేస్తూంటే ఇంటెలిజెన్స్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బాణసంచా ఘటనలో అమాయకులు మృతి చెందడం, వారి కుటుంబాల వారు నిరాశ్రయులు కావడం దురదృష్టకరమన్నారు. బాణసంచా నిర్వాహకుల ధనాపేక్ష కారణంగానే ఇంత మంది మృతి చెందారని ఆరోపించారు. ఈ సంఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. కింది స్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో 50 మందితో పని చేయిస్తున్నట్లు తెలిసిందన్నారు. అనుమతికి మించి మెటీరియల్ తయారు చేస్తున్నా అడ్డుకోవాల్సిన కొందరు అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోలేదని ఆరోపించారు. పేలుడు ఘటన బాధితుల్లో అత్యధికులు దళితులు, బీసీలే ఉన్నారని తెలిపారు. గతంలో రాయవరంలోను, వేట్లపాలెంలోను ఇటువంటి ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. వరుస ఘటనల్లో పెద్ద సంఖ్యలో అమాయకులు మృత్యువాత పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చెక్కులిచ్చి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఇజ్రాయిల్ చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు ఉబా జాన్మోజెస్, నెక్కంటి సాయిప్రసాద్, వైఎస్సార్ సీపీ ఆర్టీఐ వింగ్ అధ్యక్షుడు దర్శిపాటి సత్యానందం, బొమ్ము బుజ్జి, ఎంఆర్పీఎస్ నాయకుడు గొడతా విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టణాల్లో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని పట్టణాలు, వాటి ప్రవేశ రహదార్లను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ముమ్మరంగా ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్, పబ్లిక్ హెల్త్, ఇరిగేషన్ ఇంజినీర్లుతో కలెక్టరేట్ కోర్టు హాలులో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ, సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం పట్టణాల్లో అంతర్గత పారిశుధ్యం, ఆయా పట్టణాల ప్రవేశ మార్గాల్లో చెత్త తొలగింపు కార్యక్రమాలపై స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. కాకినాడ నగరంలోకి నాలుగు వైపుల నుంచి ప్రవేశించే ప్రధాన మార్గాలను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి ఎక్కడెక్కడ, ఏయే పనులు చేపట్టాలో గుర్తించాలని, అంచనాలు సిద్ధం చేసి, అవసరమైన జేసీబీలు, టిప్పర్లు, ఇతర యంత్రాలను సమకూర్చుకోవాలని ఆదేశించారు. తొలగించిన చెత్తను తరలించేందుకు స్థానికంగా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ కూడా పాల్గొన్నారు. పశు సంవర్ధక శాఖ జేడీగా శ్రీధర్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా పశు సంవర్ధక శాఖ ఇన్చార్జ్ జేడీగా వడ్డి శ్రీధర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఈ స్థానంలో పని చేసిన కృష్ణమూర్తి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో కాకినాడ వెటర్నరీ పోలి క్లినిక్ డీడీగా పని చేస్తున్న శ్రీధర్కు ప్రభుత్వం ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. శ్రీధర్ గతంలో పాయకరావుపేట, తునిల్లో పశు సంవర్ధక శాఖ డీడీగా పని చేశారు. ఇన్చార్జి జేడీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ను జిల్లాలోని పశు సంవర్ధక శాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమిని కూకటి వేళ్లతో పెకలిస్తున్న ఏడుకొండల స్వామికాకినాడ రూరల్: తిరుమల పుణ్యక్షేత్రంతో ఆటలాడిన కూటమి ప్రభుత్వాన్ని ఆ ఏడుకొండల స్వామి కూకటివేళ్లతో పెకలిస్తున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండేళ్ల కూటమి పాలనలో అన్నీ స్కాములేనని విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు విషప్రచారం చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బ తీశారని మండిపడ్డారు. కలియుగ ప్రత్యక్ష దైవం ప్రతిష్టను దిగజార్చిన చంద్రబాబు ఆ స్వామి నుంచి తప్పించుకోలేరన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారంలో చంద్రబాబు కుటుంబ సభ్యులకు చెందిన హెరిటేజ్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డెయిరీ పాత్ర తేటతెల్లమైందన్నారు. తాజాగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలల వ్యవహారం బయట పడిందన్నారు. వేంకటేశ్వరస్వామితో రాజకీయం చేస్తే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలనే చిత్తశుద్ధి ఉంటే బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ పదవి నుంచి తక్షణమే తొలగించాలని నాగమణి డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో శ్రీ వైష్ణవి డెయిరీ పాత్ర ఉందని తేలడంతో రాత్రికి రాత్రే బోర్డులను మార్చింది నిజం కదా అని ప్రశ్నించారు. శ్రీ వైష్ణవి డెయిరీకి టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకు చెందిన సంగం డైరీతో లింకులున్నట్లు స్పష్టమైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎమ్మెల్యేల రహస్య వీడియోలు, సంబంధాలు తప్ప ప్రజలకు చేసిన ఒక్క మంచి పనయినా ఉందా అని ప్రశ్నించారు. కమీషన్ల కోసం ప్రభుత్వ భూములను కారుచౌకగా అనుయాయులకు కట్టబెట్టారని నాగమణి విమర్శించారు. పీజీఆర్ఎస్కు 576 అర్జీలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 576 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్తో పాటు వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
రంగులో గెలచి.. ప్రత్యేకంగా నిలిచి
సాధారణంగా ఎర్ర చక్కెరకేళి అరటి చెట్టుకు ఎరుపు రంగుతో ఉన్న అరటి గెలలే కాస్తాయి. అయితే అమలాపురంలోని గాయత్రీ గార్డెన్స్లో ఎర్ర చక్కెర కేళి అరటి చెట్టుకు పచ్చ రంగుతో (అరటి పంట సాధారణ రంగు) అరటి గెల వచ్చి ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అమలాపురానికి చెందిన గాయత్రీ గార్డెన్స్ యజమాని, గోఆధారిత వ్యవసాయ రైతు బూరగాయల శివరామకృష్ణ మాట్లాడుతూ ఇది అరుదైన విషయమేనని చెప్పారు. జన్యు లోపం వల్లే ఇలా జరిగిందన్నారు. –అమలాపురం టౌన్ ఎర్ర చక్కెరకేళి అరటి చెట్టుకు వచ్చిన పచ్చ రంగు గెల -
అడ్డు తొలగించుకోవడానికే హత్య
ఫ ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన భార్య ఫ అనపర్తిలో ఆసుపత్రి వద్ద నిందితుల అరెస్ట్ రంగంపేట: వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య తన ప్రియుడితో కలసి భర్తనే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. గత నెల 27న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన చిక్కుముడిని పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలను రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య సోమవారం రంగంపేట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం.. రంగంపేట మండలం పెద్ద దొడ్డిగుంట గ్రామానికి చెందిన బక్క నాగేంద్రకు ఎనిమిదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన బక్క వీరలక్ష్మితో వివాహం జరిగింది. ఆ దంపతులకు ఓ పాప ఉంది. గత కొద్దికాలంగా రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామానికి చెందిన తోరాటి శివతో నాగేంద్ర భార్య వీరలక్ష్మి వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా గత నెల 27న రాత్రి ప్రియుడు శివతో కలసి వీరలక్ష్మి తమ పుట్టింట్లో ఉంది. దీనిని గమనించిన భర్త నాగేంద్ర వారిని నిలదీశాడు. వారిద్దరూ ఆగ్రహానికి గురయ్యి నాగేంద్రపై కత్తితో దాడి చేసి హతమార్చారు. అనంతర తోరాటి శివ పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా, బంధువులు అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న శివ, వీరలక్ష్మితో కలసి ఆదివారం పరారు కావడానికి ప్రయత్నించగా, పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు డీఎస్పీ వివరించారు. సమావేశంలో అనపర్తి సీఐ వీఎల్వీకే సుమంత్, రంగంపేట ఎస్సై ఎస్.శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ సిలిండర్ల ఆటోను ఢీకొన్న లారీ
ఒకరి మృతిపెరవలి: ఉసులుమర్రు వద్ద గ్యాస్ సిలిండర్ల ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పెరవలి పోలీస్ స్టేషన్ ఏఎస్సై ప్రసాదరావు కథనం ప్రకారం.. నిడదవోలుకు చెందిన అంగర కృష్ణ ధనప్రసాద్ (38) అక్కడి హెచ్పీ గ్యాస్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం గ్యాస్ సిలిండర్లతో ఆటోను కానూరు తీసుకొచ్చి వినియోగదారులకు పంపిణీ చేసి, అనంతరం ఉసులుమర్రు వచ్చారు. అక్కడ సిలిండర్లు దింపి తిరిగి వెళ్తుండగా వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి ఆటోను ఢీకొంది. ఈ నేపథ్యంలో ఆటో బోల్తా పడింది. రోడ్డుపై పడిపోయిన ధనప్రసాద్పై గ్యాస్ సిలిండర్లు పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని హుటాహుటిన నిడదవోలులో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అతని భార్య సాయి రామతులసి ఆసుపత్రికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఉదయం వరకూ కళ్లముందే తిరుగాడిన వ్యక్తి సాయంత్రానికి అచేతనంగా మారడంతో బంధువులు కన్నీటి పర్యంతం అయ్యారు. రామతులసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై వివరించారు. యువకుడి దుర్మరణం అమలాపురం టౌన్: స్థానికంగా సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పట్టణ ఎస్సై టి.శ్రీనివాస్ కథనం ప్రకారం.. అల్లవరం మండలం గోడి గ్రామానికి చెందిన రేవు దినేష్కుమార్ (27) బైక్ వెళ్తుండగా, స్థానిక ఎత్తు రోడ్డులోని హెచ్పీ గ్యాస్ గొడౌన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అమలాపురం నుంచి రాజోలు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు అతని బైక్ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై గ్యాస్ సిలిండర్ పెట్టుకుని రాంగ్ రూట్లో వెళుతున్న దినేష్ కుమార్ ఈ ప్రమాదానికి గురైనట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న దినేష్ కుమార్ కారు డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య, ఏడేళ్ల లోపు ఇద్దరి పిల్లలతో అమలాపురం పట్టణం నారాయణపేటలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
● పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి ● ఎమ్మెల్సీ గోపీ మూర్తితొండంగి: పేదలు, ఉపాధ్యాయుల సమస్యలపై కనీస చర్చ కూడా లేకుండా శాసన మండలి సమావేశాలు నిర్వహించడం అత్యంత దుర్మార్గమని ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బి.గోపీ మూర్తి అన్నారు. మండలంలోని బెండపూడి, తొండంగి, పెరుమాళ్లపురం, అద్దరిపేట తదితర గ్రామాల్లోని ఉన్నత పాఠశాలలతో పాటు వాకదారిపేట కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని (కేజీబీవీ) సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తొండంగిలో విలేకర్లతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల మీద తీవ్రమైన పని ఒత్తిడి పెట్టారన్నారు. బోధనేతర పనులు రద్దు చేసి, విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించే పరిస్ధితులు కల్పించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఐచ్ఛిక సెలవులు, స్ధానిక సెలవులపై నిర్ణయాధికారాన్ని ఎంఈఓలు, హెచ్ఎంలకు కల్పించాలన్నారు. మధ్యతరగతి ఉద్యోగులు, పేదల సమస్యలపై చర్చించకుండానే శాసన మండలి బడ్జెట్ సమావేశాలు జరపడం దుర్మార్గమన్నారు. అలాగే, 11వ పీఆర్సీ గడువు ముగిసి 32 నెలలవుతున్నా 12 పీఆర్సీ కమిటీ చైర్మన్ను ముఖ్యమంత్రి నియమించలేదని దుయ్యబట్టారు. వెంటనే పీఆర్సీ వేసి 29 శాతం ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు ఇవ్వాలని, రూ.30 వేల కోట్ల బకాయిల చెల్లింపునకు రూట్ మ్యాప్ ప్రకటించాలని, సీపీఎస్ రద్దు చేయాలని, 2003 డీఎస్సీ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని, ఎంటీఎస్, కేజీబీవీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అప్గ్రేడ్ అయిన పాఠశాలల్లో తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని గోపీ మూర్తి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు టి.సత్తిబాబు, టీవీ రామకృష్ణ, పి.సత్యనారాయణ, ప్రసన్నకుమార్, గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
ఇంతైనా లెక్క లేదా?
● వేట్లపాలెం పేలుడు జరిగి 3 రోజులు ● ఆ రోజు అక్కడ ఎంతమంది ఉన్నారనేదానిపై ఇప్పటికీ అయోమయం ● 70 మంది వరకూ ఉన్నారనేది ప్రాథమిక సమాచారం ● ఇప్పటి వరకూ మృతులు 22 మంది ● ఆస్పత్రిలో ఏడుగురు ● మృత్యుంజయుడిగా ఒకరు ● మిగిలిన వారేమయ్యారనేది ప్రశ్నార్థకం సాక్షి ప్రతినిధి, కాకినాడ: సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో 22 నిండుప్రాణాలను బలిగొన్న పెను విస్ఫోటం సంభవించి సోమవారానికి మూడు రోజులైంది. ఈ విస్ఫోటం మిగిల్చిన విషాదం నుంచి వేట్లపాలెం, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతాల ప్రజలు ఇంకా కోలుకోలేదు. రోజులు గడుస్తున్నా శనివారం నాటి దృశ్యాలే కళ్లెదుటే కనిపిస్తున్నాయని స్థానికులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మరోవైపు ఈ విషాద ఘటనకు సంబంధించి ఇప్పటికీ అనేక ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు. ఆ రోజు పేలుడు జరిగిన సమయంలో అక్కడ అసలు ఎంత మంది పని చేస్తున్నారు? మృతులు, క్షతగాత్రులను మినహాయిస్తే మిగిలిన వారేమయ్యారు? అనే ప్రశ్నలకు అధికారులు ఇప్పటి వరకూ స్పష్టమైన జవాబు చెప్పలేకపోతున్నారు. దీంతో, ప్రజలు ఎవరికి తోచిన రీతిలో వారు విశ్లేషణలు చేస్తున్నారు. ప్రాథమిక అంచనా ఇదీ.. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు శనివారం మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల మధ్యలో జరిగిందని అధికారులు అంచనాకు వచ్చారు. ఆ సమయంలో ఎంత మంది మందుగుండు తయారీలో పని చేస్తున్నారనేదానిపై ఇంకా స్పష్టతకు రాలేకపోతున్నారు. అధికార యంత్రాంగం ప్రాథమిక సమాచారం ప్రకారం.. పేలుడు సమయంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో 70 మంది వరకూ పని చేస్తున్నారు. పేలుడు ధాటికి సంఘటన స్థలంలోనే 20 మంది మృతి చెందారు. 70 నుంచి 80 శాతం కాలిన గాయాలతో ఉన్న మరో 9 మందిని కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ఈ తొమ్మిది మందిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆదివారం మృతి చెందారు. మిగిలిన ఏడుగురు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగానే ఉంది. ఇంతటి భారీ విస్ఫోటం నుంచి స్వల్ప గాయాలతో.. ఒక విధంగా మృత్యుంజయుడిగా పెద్దాపురానికి చెందిన చాపల శామ్యూల్ బయట పడ్డాడు. వీరందరినీ కలిపితే మొత్తం 30 మంది లెక్క తేలింది. బల్క్ ఆర్డర్ రావడంతో పేలుడు జరిగిన రోజున సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో వేట్లపాలెం, పెద్దాపురం, సామర్లకోట కుమ్మర వీధి, పెదబ్రహ్మదేవం తదితర గ్రామాల నుంచి 70 మందికి పైగానే పనిలో పెట్టుకున్నారని స్థానికులతో పాటు అధికారులు కూడా మొదటి నుంచీ చెబుతున్నారు. అయితే, పేలుడు జరిగినప్పుడు ఆ 70 మందీ ఉన్నారా లేక కొంత మంది మాత్రమే ఉన్నారా అనేది మాత్రం ఇప్పటికీ తేలడం లేదు. వారు ఇళ్లకు వెళ్లారా! వేట్లపాలెం, గూడపర్తి గ్రామాల నుంచి వచ్చిన కూలీల్లో కొందరు మధ్యాహ్న భోజనం కోసం, మరికొందరు పింఛన్లు తీసుకునేందుకు ఆ సమయంలో ఇళ్లకు వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. వారు తిరిగి బాణసంచా తయారీకి వెళ్లేందుకు సిద్ధపడుతున్న క్రమంలో భారీ విస్ఫోటం సంభవించడంతో ఇళ్ల వద్దనే ఆగిపోయారని అంటున్నారు. ఆవిధంగా 30 మంది వరకూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని తెలుస్తోంది. వీరితో పాటు మృతులు, క్షతగాత్రులు, మృత్యుంజయుడితో కలిపి 60 మంది వరకూ లెక్క తేలుతోంది. మిగిలిన 10 మంది ఎక్కడున్నారనే దానిపై చర్చ నడుస్తోంది. వారు కూడా మధ్యాహ్న భోజనం తరువాత పనికి వెళ్లలేదనే వాదన బలంగా వినిపిస్తోంది. వీరిలో నలుగురైదుగురు ఇతర గ్రామాల నుంచి చుట్టపుచూపుగా వచ్చిన వారు కూడా ఉన్నారని అంటున్నారు. కళ్లెదుట భారీ విస్ఫోటం సంభవించడంతో ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయి ఉంటారని చెబుతున్నారు. పోలీసు విచారణతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే భయంతోనే వారు కనిపించకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పెద్దాపురం ఆర్డీఓ సస్పెన్షన్ ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ ఆర్డీఓ, డీఎస్పీ, అగ్నిమాపక, కార్మిక శాఖ అధికారులను సస్పెండ్ చేస్తున్నట్టు శనివారం జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు కాకినాడ జీజీహెచ్ వద్ద ప్రకటించారు. దీనిపై కూడా అయోమయం నెలకొంది. సీఎం ఆదేశాలు ఇప్పటి వరకూ అమలు కాకపోవడంపై భిన్న వాదనలు వినిపించాయి. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఉంది. ఆ మండలం ఇటీవలే కాకినాడ రెవెన్యూ డివిజన్ నుంచి పెద్దాపురం రెవెన్యూ డివిజన్లో విలీనమైంది. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్కు అనుమతులిచ్చింది అప్పటి కాకినాడ ఆర్డీఓ. పర్యవేక్షించాల్సింది కూడా ఆయనే. దీనిపై స్పష్టత లేకుండా ఆర్డీఓను సస్పెండ్ చేస్తున్నట్టు సీఎం ప్రకటించడంతో ఎవరిపై చర్యలు తీసుకోవాలో ఉన్నతాధికారులు తేల్చుకోలేకపోయారు. చివరకు పెద్దాపురం ఆర్డీఓ కె.శ్రీరమణిని సస్పెండ్ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులిచ్చారు. పర్యవేక్షణ లేకే.. బాణసంచా తయారీ కేంద్రాన్ని సంబంధిత ఎస్సై రోజువారీ, సీఐ 15 రోజులకోసారి, డీఎస్పీ నెలకోసారి పర్యవేక్షించాల్సి ఉంటుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇదేవిధంగా వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్పై పర్యవేక్షణ ఉండి ఉంటే ఇలాంటి దుర్ఘటనకు తావుండేది కాదు. ఇక బాణసంచా తయారీ కేంద్రంలో సీసీ కెమెరాలపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి బాణసంచా తయారీ కేంద్రాలు, షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఆవిధంగా విస్ఫోటం జరిగిన సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో సీసీ కెమెరాలున్నాయా అనే విషయంపై ఇప్పటి వరకూ అధికారులు ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. వాస్తవానికి అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయనే పలువురు చెబుతున్నారు. తయారీ కేంద్రం యజమాని ఎక్కడున్నా సీసీ కెమెరాల్లోని దృశ్యాలు ఆయన సెల్ ఫోన్లో రికార్డు అవుతాయి. ఈ ప్రమాదంలో సీసీ కెమెరాలు కాలిపోయినా.. ఆ వీడియోలు మాత్రం లభించే అవకాశం ఉంది. వీటిని పరిశీలిస్తే తొలుత విస్ఫోటం ఎక్కడ ఎందుకు సంభవించింది.. ఎక్కడి నుంచి, ఏవిధంగా మంటలు చెలరేగాయనే విషయాన్ని పోలీసులు వేగంగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో అక్కడ ఎంతమంది పని చేస్తున్నారనే అంశాలపై కూడా స్పష్టత వస్తుందని అంటున్నారు.వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో జరిగిన పేలుడులో చెలరేగుతున్న మంటలు, దట్టమైన పొగలు (ఫైల్) -
వేట్లపాలెం ఘటనకు కారణాలేమిటో!
సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో 22 మంది ప్రాణాలను బలిగొన్న భారీ విస్ఫోటనం ఘటన జరిగి మూడు రోజులైంది. ఇంతటి భారీ పేలుడు సంభవించడానికి కారణాలేమిటి? ప్రమాద సమయంలో అక్కడ ఎంతమంది ఉన్నారు? మృతులు, క్షతగాత్రులు కాకుండా మిగిలిన వారు ఏమయ్యారనే ప్రశ్నలకు ఇప్పటివరకూ జవాబులు లభించడం లేదు. దర్యాప్తు సరైన దిశగా సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీసీ కెమెరా దృశ్యాలపై దృష్టి పెట్టలేదేం? నిబంధనల ప్రకారం ప్రతీ బాణసంచా తయారీ కేంద్రం, షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఈ నిబంధన ప్రకారం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు సమాచారం. తయారీ కేంద్రం యజమాని ఎక్కడున్నా సీసీ కెమెరాల్లోని దృశ్యాలు ఆయన సెల్ఫోన్లో రికార్డవుతాయి. ఈ ప్రమాదంలో సీసీ కెమెరాలు పూర్తిగా కాలిపోయినా.. సెల్ఫోన్లో నిక్షిప్తమైన వీడియో దృశ్యాలు లభించే అవకాశం ఉంది. ఈ రికార్డులను పరిశీలిస్తే తొలుత విస్ఫోటనం ఎక్కడ జరిగింది.. ఎక్కడి నుంచి, ఏవిధంగా మంటలు చెలరేగాయి.. ఆ సమయంలో అక్కడ ఎంతమంది పని చేస్తున్నారనే అంశాలపై స్పష్టత వస్తుంది. అంతా గోప్యమే సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లైసెన్స్ అడబాల అర్జున్ పేరిట ఉంది. దీని నిర్వహణలో అర్జున్తో పాటు ఆయన సోదరుడు నాని, తండ్రి శ్రీనివాసరావు కూడా పాలుపంచుకుంటున్నారు. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు మరణించగా.. అర్జున్, నానిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి మరణించిన నేపథ్యంలో వారికి నోటీసు ఇచ్చి విడిచిపెట్టామని పోలీసులు చెబుతుండగా.. అది అవాస్తవమని, తండ్రికి తలకొరివి పెట్టేందుకు కూడా వారిని అనుమతించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు అన్నదమ్ములిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ఏ సమాచారం రాబట్టారనే విషయాన్ని ఇప్పటివరకూ గోప్యంగానే ఉంచారు. విషమంగా నలుగురి పరిస్థితి పేలుడు ఘటనలో కాలిన గాయాలతో కాకినాడ జీజీహెచ్లో ఇంకా ఏడుగురు చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బాధితులకు చికిత్స కొనసాగుతోంది.మహిళ తల గుర్తింపు ఇలావుండగా.. ఘటనా స్థలానికి సమీపంలోని పొలంలో మొండెం లేని మహిళ తలను సోమవారం గుర్తించారు. ఘటన జరిగిన రోజున తలలు లేకుండా దొరికిన రెండు మొండేలను కుటుంబ సభ్యులు గుర్తించడంతో వారికి అప్పగించారు. వారి మతాచారం ప్రకారం ఆ మొండేలను ఖననం చేసేశారు. ఇప్పుడు దొరికిన ఈ తల.. ఆ రెండు మొండేల్లో ఒకటైన సక్కుమళ్ల రాఘవ(50)దిగా గుర్తించినట్టు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. అయినప్పటికీ, ఈ తలకు డీఎన్ఏ పరీక్ష చేయిస్తామని చెబుతున్నారు. ఆ 10 మందీ ఏమయ్యారో! స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పేలుడు జరిగిన సమయంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో 40 మంది పని చేస్తున్నట్టు తెలుస్తోంది. శనివారం ఘటనా స్థలంలో 20 మంది సజీవ దహనం కాగా.. చికిత్స పొందుతూ ఆదివారం ఇద్దరు మరణించారు. మరో ఏడుగురు కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఒకరు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ 30 మంది కాకుండా మిగిలిన 10 మంది ఏమయ్యారనే ప్రశ్నకు ఇప్పటివరకూ జవాబు దొరకడం లేదు. వీరు ఆ రోజు ఘటనా స్థలంలోనే ఉన్నారా లేక ప్రమాదం నుంచి తప్పించుకుని ఇళ్లకు వెళ్లిపోయారా అనే ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. దీనిని నిర్ధారించాలంటే సీసీ కెమెరాల ఫుటేజే ఆధారం. ఆ దిశగా అధికారులు దర్యాప్తు చేస్తారో లేదో వేచిచూడాలి. -
విలాపాగ్నులు.. విషాదాశ్రులు
పిల్లలను ఎలా పోషించాలి? మాకు 17 సంవత్సరాల కుమార్తె లలిత, 15 సంవత్సరాల కుమారుడు ప్రేమ్కుమార్ ఉన్నారు. ఇద్దరూ మానసిక దివ్యాంగులు. ఏమీ చదువుకోలేదు. వారికి అన్ని పరిచర్యలూ నేనే చేయాలి. కుటుంబాన్ని పోషించుకోవడానికి నా భర్త లోవరాజు పదేళ్లుగా బాణసంచా తయారీ షాపుల్లో పని చేస్తున్నాడు. ప్రమాదం జరిగిన సూర్యశ్రీ ఫైర్వర్ుక్సలో మూడేళ్లుగా పని చేస్తూ రోజుకు రూ.700 సంపాదించే వాడు. అతడి సంపాదనపైనే మా కుటుంబం ఆధారపడి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగి ఆయన చనిపోయారు. ఇప్పుడు మా పిల్లలను ఏవిధంగా పోషించుకోవాలో అర్థం కావడం లేదు. నేను పదో తరగతి చదువుకున్నానను. ఎవరైనా దయ తలచి ఉపాధి అవకాశం కల్పించాలి. అధికారులు వచ్చి పరామర్శించారు. ఇంకా ఆర్థిక సహాయం అందలేదు. – దర్శిపాటి వెంకటలక్ష్మి, మృతుడు లోవరాజు భార్య సామర్లకోట/పిఠాపురం/కాకినాడ క్రైం: వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్వర్క్స్లో శనివారం సంభవించిన భారీ బాణసంచా విస్ఫోటంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. పేలుడు జరిగిన రోజున ఈ ప్రమాదంలో 20 మంది సజీవదహనం కాగా.. అగ్నికీలల్లో శరీరం కాలిపోయి, మందుగుండు పేలుడు సమయంలో చెలరేగిన వేడికి తీవ్రంగా ఉడికిపోయిన తొమ్మిది మందిని కాకినాడ జీజీహెచ్కు తరలించిన విషయం తెలిసిందే. అక్కడ చికిత్స పొందుతూ సామర్లకోటకు చెందిన దర్శిపాటి లోవరాజు (40) ఆదివారం తెల్లవారుజామున, దర్శిపాటి రాజు (28) రాత్రి మృతి చెందారు. వీరితో కలిపి ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కి పెరిగింది. కాగా, తీవ్రమైన కాలిన గాయాలతో మరో ఏడుగురు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి మరింత విషమంగా మారిందని వైద్యులు చెబుతున్నారు. వారికి క్యాజువాలిటీ ఐసీయూ, బర్న్స్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. బాధితులందరూ నూరు శాతం కాలిన గాయాలతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కి గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. తమ వారి స్థితిని చూస్తున్న కుటుంబ సభ్యులు జీజీహెచ్ ఆవరణలో గుండెలవిసేలా రోదిస్తున్నారు. కాకినాడ తరలించే వీలు లేక.. సామర్లకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)లో శవాలను భద్రపరిచేందుకు కొత్తగా మార్చురీ నిర్మించారు. దీనిని ఇంకా ప్రారంభించాల్సి ఉంది. వేట్లపాలెం పేలుడులో తొలి రోజు ప్రాణాలు కోల్పోయిన 20 మంది మృతదేహాలు ఛిద్రమైపోవడంతో కాకినాడ తరలించడంలో ఇబ్బంది ఎదురైంది. దీంతో, ఈ మృతదేహాలను, పేలుడులో తెగిపడిన అవయవాలను అధికారులు సామర్లకోట సీహెచ్సీలోని మార్చురీకే తరలించారు. దీంతో, మార్చురీ మృతదేహాలతో నిండిపోయింది. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, ఆ మృతదేహాలను అంబులెన్సులు, మహాప్రస్థానం వాహనాల్లో వారి వారి గ్రామాలకు తరలించి, కుటుంబ సభ్యులకు ఆదివారం అప్పగించారు. మిన్నంటిన మృత్యుఘోష మృతదేహాల అప్పగింత సందర్భంగా సామర్లకోట సీహెచ్సీ మార్చురీ వద్ద అక్కడ మృత్యుఘోష మిన్నంటింది. మందుగుండు పేలుడు తీవ్రతకు కొంత మంది మృతదేహాలు ఛిద్రమైపోయాయి. కొంత మంది శరీర అవయవాలు తెగిపోయి ఎగిరి పడ్డాయి. దీంతో, సీహెచ్సీ వద్ద ఏ మృతదేహం ఎవరిదో తెలియని హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి. చూద్దామంటే కొంతమందికి ఆకారం లేదు. మరికొంత మందికి ముఖాలు కనిపించని దారుణమైన పరిస్థితి. మరికొందరిని గుర్తు పడదామన్నా ఆనవాళ్లు లేవు. అధికారులు తెల్లని వస్త్రాల్లో కట్టి ఇచ్చిన మూటలనే తమవారి మృతదేహాలుగా భావించి అంత్యక్రియలు నిర్వహించాల్సిన దుర్భర పరిస్థితులు ఎదురవడంతో పలువురు గొల్లుమంటూ విలపించారు. కడసారి చూపు చూసే వీలు కూడా లేకుండా తమవారు కానరాని లోకాలకు చేరుకున్నారంటూ పలువురు మృతుల కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ రోదించారు. ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో తమవారి మృతదేహాలను మరుభూమికి తరలిస్తున్న వేళ.. అయినవారి కన్నీటికి అడ్డుకట్ట వేయడం ఎవ్వరి తరమూ కాలేదు. ఆయా గ్రామాల్లో సాధారణంగా వారానికో నెలకో ఒకరిద్దరి మృతదేహాలు మాత్రమే వచ్చేవి. అటువంటి చోట్ల ఒకేసారి అధిక సంఖ్యలో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడం చూసి, పలువురు కన్నీటిపర్యంతమయ్యారు. వేట్లపాలెం శ్మశానవాటిక వద్ద మృతుల బంధువుల రోదనలు ఫ వేట్లపాలెం బాణసంచా విస్ఫోటంలో మరో ఇద్దరి మృతి ఫ 22కి పెరిగిన మరణాలు ఫ కాకినాడ జీజీహెచ్లో ఏడుగురికి చికిత్స ఫ వీరిలో పలువురి పరిస్థితి విషమం ఫ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కు గురవుతున్న క్షతగాత్రులు ఫ బంధువులకు మృతదేహాల అప్పగింతవివిధ ప్రాంతాల్లో జాతరలు, వివాహాది వేడుకలు, రాజకీయ నాయకుల ర్యాలీలకు కొత్త వెలుగుల్ని అద్దే ఆ నిరుపేదల కుటుంబాల్లో ఎన్నటికీ తీరని విషాదం మిగిలింది. ఒకరూ ఇద్దరూ కాదు. ఏకంగా 22 మంది ప్రాణాలను బలి తీసుకున్న వేట్లపాలెం బాణసంచా పేలుడు అనంతరం.. ఆ గ్రామాల్లో చితిమంటలు రగిలాయి. ఆ జ్వాలలు ఆ కుటుంబాల్లో మాత్రం పెనుచీకట్లు నింపాయి. వారానికో నెలకో ఒకరిద్దరి మృతదేహాలు ఆ మరుభూములకు వచ్చేవి. అటువంటిది ఒకేసారి ఎక్కువ సంఖ్యలో మృతదేహాలు రావడంతో అక్కడ ఒక్కసారిగా మృత్యు రోదనలు మిన్నంటాయి. మిగిలిన వారేమయ్యారు? బాణసంచా తయారీ కేంద్రంలో విస్ఫోటం జరిగిన సమయంలో 40 నుంచి 45 మంది వరకూ పని చేస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని బట్టి తెలుస్తోంది. వీరిలో 22 మంది మరణించగా మరో ఏడుగురు ఆస్పత్రిలో ఉన్నారు. ఒక కార్మికుడు శామ్యూల్ ప్రమాదం నుంచి తప్పించుకుని బతికి బయట పడ్డాడు. ఈ 30 మంది కాకుండా మిగిలిన వారు ఏమయ్యారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై ఫైర్వర్క్స్ నిర్వాహకుడు అడబాల అర్జున్ను విచారిస్తేనే ప్రమాద సమయంలో అక్కడ ఎంత మంది ఉన్నారనే విషయంపై స్పష్టత వస్తుంది. అయితే, అర్జున్ పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. -
అడుగడుగునా ఉల్లంఘనలు
ఫ అమలుకు నోచని నిబంధనలు ఫ అందుకే ఇంతటి ఘోరం ఫ కాసుల కక్కుర్తిలో అధికారులు కాకినాడ క్రైం: వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.. పర్యవేక్షణలో ప్రభుత్వ నిర్లక్ష్యమే భారీ పేలుడుకు, 22 మంది దుర్మరణానికి, పలువురు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడటానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. అగ్నిమాపక, పంచాయతీ, పోలీసు, కార్మిక శాఖ అధికారులెవ్వరూ తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం బాణసంచా తయారీ కేంద్రంలో నలుగురు కార్మికులు మాత్రమే ఉండాలి. కానీ, పేలుడు జరిగిన చోట 45 మంది కూలీలున్నారని అధికారులే చెబుతున్నారు. పొట్టకూటి కోసం వచ్చిన ఈ కూలీలు పనిలో నిమగ్నమై ఉండగా.. ఓ పేలుడు పదార్థం చుడుతున్న క్రమంలో ఒత్తిడి ఎక్కువై విస్ఫోటం సంభవించిందని అంటున్నారు. అలాగే, షెడ్లను 5 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మాత్రమే నిర్మించాలి. దీనివలన తక్కువ పరిమాణంలోనే అక్కడ మందుగుండు నిల్వ చేసే అవకాశం ఉంటుంది. కానీ, సూర్యశ్రీ ఫైర్వర్క్స్లో ఏకంగా 10 చదరపు మీటర్ల విస్తీర్ణంలో షెడ్లు నిర్మించారు. ఇలాంటివి అక్కడ నాలుగున్నాయి. నిజానికి నాలుగు షెడ్ల నిర్మాణానికి అక్కడ అసలు అనుమతులే లేవు. బాణసంచా తయారీ కేంద్రం కాలువకు అవతల వైపు పొలాల్లో ఉండటంతో కార్లు వెళ్లే అవకాశం లేదు. దీంతో, అక్కడకు అధికారులు తనిఖీలకే వెళ్లేవారు కాదని ఆయా శాఖల్లో చర్చ జరుగుతోంది. అప్పుడప్పుడు ద్విచక్ర వాహనాలపై వెళ్లే సిబ్బంది అన్నీ చూసి, జేబులు నింపుకొని వెళ్లిపోయేవారని అక్కడ గతంలో సూపర్వైజర్గా పని చేసిన ఓ వ్యక్తి చెప్పాడు. సస్పెన్షన్లపై గందరగోళం వేట్లపాలెం పేలుడుకు బాధ్యుల్ని చేస్తూ రెవెన్యూ అధికారి, డీఎస్పీ, అగ్నిమాపక అధికారి, కార్మిక శాఖ అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే, వీరి పేర్లు స్పష్టంగా పేర్కొనకపోవడం చర్చనీయాంశమైంది. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, కార్మిక శాఖ జిల్లా అధికారి బీఎస్ఎం వల్లీ, జిల్లా ఫైర్ అధికారి పీవీ రాజేష్లు సస్పెన్షన్ జాబితాలో ఉండగా, రెవెన్యూ పరిధిలో ఆర్డీవోనా, తహసీల్దారా అనే విషయం స్పష్టం కాలేదు. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అనుమతులు 2025లో రెన్యువల్ చేశారు. దీనికి ముందు తగిన పరిశీలన చేయాలి. కానీ, అటువంటి పరిశీలన కూడా లేకుండానే కొంత మంది అధికారులు లంచాలు పుచ్చుకుని, రెన్యువల్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల సస్పెన్షన్పై ఆదివారం సాయంత్రం వరకూ ఎటువంటి ఉత్తర్వులూ విడుదల కాలేదు. -
అనుమతి లేని బాణసంచా తయారీ కేంద్రాల మూసివేత
పిఠాపురం: జరగాల్సిన నష్టం జరిగిపోయాక అధికారులు ఇప్పుడు తీరికగా తనిఖీలు ప్రారంభించారు. సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగిన నేపథ్యంలో వివిధ బాణసంచా తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. అనుమతులు లేవంటూ గొల్లప్రోలు, పిఠాపురం మండలం జల్లూరు సమీపంలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రాలను మూసివేశారు. ఈ కేంద్రాల్లో ప్రతి రోజూ బాణసంచా అమ్మకాలు జరుగుతున్నా ఏనాడూ పట్టించుకోని అధికారులకు.. వాటికి అనుమతి లేదని ఇప్పుడు తెలిసిందా అని స్థానికులు విమర్శిస్తున్నారు. -
అత్యంత విషమంగా క్షతగాత్రుల ఆరోగ్యం
కాకినాడ క్రైం/సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో విస్ఫోటనం ఘటనలో తీవ్రంగా గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. శనివారం జరిగిన పేలుడులో 20 మంది మృతి చెందడం, మరో 11 మంది మంది గాయపడటం తెలిసిందే. వీరిలో తొమ్మిది మందిని చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు తరలించగా, వీరిలో సామర్లకోట కుమ్మరి వీధికి చెందిన దర్శిపాటి లోవరాజు (40) ఆదివారం తెల్లవారుజామున, దర్శిపర్తి రాజు (28) ఆదివారం రాత్రి మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కు చేరింది. భార్యాపిల్లలతో లోవరాజు మిగిలిన క్షతగాత్రుల్లో సప్పా సత్య వెంకట లక్ష్మి, మోర్తా శ్రీను, చిటికెల లక్ష్మిలను క్యాజువాలిటీ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరి ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది. మిగిలిన క్షతగాత్రులు కాతేటి శ్రీను, వేమగిరి లోవరాజు, వేమగిరి దావీదు, పల్లాపాటి వేద శ్రీనులను బర్న్ వార్డుకు తరలించారు. బాధితులు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కు గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక్కడ కేవలం నలుగురు మాత్రమే పని చేయాల్సి ఉండగా, ప్రమాదం జరిగిన సమయంలో కనీసం 45 మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పేలుడు ఘటనలో కొందరు అక్కడికక్కడే మరణించగా, కొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. మరికొందరు షెడ్ల నుంచి బయటకు వచ్చి ద్విచక్ర వాహనాల్లో అక్కడి నుంచి తప్పించుకున్నారని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ కేవలం 5 కిలోల ముడి సరుకు మాత్రమే ఉంచేందుకు అనుమతి ఉండగా, 100–150 కిలోల మందు గుండు ఉంచడం వల్లే ఇంతటి భారీ విస్ఫోటనం సంభవించిందన్నారు. మృతదేహాల అప్పగింత 21 మంది మృతదేహాలకు ఆదివారం పంచనామా, పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆ మృతదేహాలను మహాప్రస్థానం వాహనాలు, అంబులెన్సుల్లో ఆయా గ్రామాలకు తరలించి, కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. బాణసంచా తయారీకి వెళ్లవద్దని చెప్పినా వినకుండా వెళ్లి కుటుంబానికి ఆసరా లేకుండా చేశారని మృతుల కుటుంబ సభ్యులు రోదించారు. ఆయా గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, ప్రమాదానికి గురైన సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లైసెన్సుదారు అడబాల అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను శనివారం బాణసంచా ఆర్డర్ల కోసం బయటకు వెళ్లానని, ఆ సమయంలో తయారీ కేంద్రంలో ఉన్న తన తండ్రి శ్రీను కూడా చనిపోయారని అర్జున్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపథ్యంలో అర్జున్కు నోటీసు ఇచ్చి, తండ్రి అంత్యక్రియలకు అనుమతించామని సీఐ చెప్పారు. కాగా, ఆదివారం ఉదయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జీజీహెచ్ వద్ద మృతుల కుటుంబాలను పరామర్శించారు. పర్యవేక్షణ లేకపోవడం వల్లే ప్రమాదం బాణసంచా పేలుడులో ప్రాణాలు కోల్పోయిన 20 మంది కుటుంబాలను రాష్ట్ర మంత్రులు అనిత, పి.నారాయణ, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్ ఆదివారం పరామర్శించారు. వారికి ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల చొప్పున ఆరి్థక సాయం చెక్కులు అందజేశారు. బాణసంచా తయారీ కేంద్రాన్ని పరిశీలించి, ప్రమాదంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. అనుమతించిన పరిమాణం కంటే ఎక్కువ మోతాదులో పేలుడు పదార్థాలను నిల్వ చేయడం, కార్మిక శాఖలో నమోదు చేసిన వారి కంటే ఎక్కువ మందిని పనిలో పెట్టడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఇప్పటికే నలుగురు అధికారులను సస్పెండ్ చేసి, సమగ్ర విచారణకు ఆదేశించామని చెప్పారు. ఇళ్లు లేని కుటుంబాలకు ఇళ్లు కట్టించడంతో పాటు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. -
గ్రామీణ ఆవిష్కరణలేప్రగతికి మూలం
తుని: గ్రామీణ ఆవిష్కరణలే దేశ ప్రగతికి మూలం అని అగ్రిలైఫ్ సీఈఓ డాక్టర్ వెంకటేష్ దేవనార్ అన్నారు. శనివారం స్థానిక శ్రీప్రకాష్ స్పేసెస్ డిగ్రీ కళాశాలలో సైక్వస్ట్ 2026 జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత ముఖ్య అతిథి వెంకటేష్ దేవనార్కు విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్ప్రకాష్ స్వాగతం పలికారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. విద్యార్థులు సృజనాత్మకతతో కూడిన ఆవిష్కరణలకు ముందుకు రావాలని, శ్రీప్రకాష్ విద్యా సంస్థ రెండు రోజుల పాటు జాతీయ వర్క్షాప్ నిర్వహించడం అభినందనీయమని దేవనార్ అన్నారు. విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టినప్పుడే అన్నింటా సఫలీకృతులు అవుతారన్నారు. గౌరవ అతిథి పల్లె సృజన కో ఆర్డినేటర్ బి.సుభాష్ చందర్ మాట్లాడుతూ కొత్త ఆవిష్కరణల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. ముఖ్య అతిథులను విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కంటిపూడి నరేంద్రబాబు, విద్యాసంస్థల అధినేత సీహెచ్వీకే నరసింహారావులు సత్కరించారు. ఈ సైన్స్ వేడుకులకు కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. క్విజ్ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. శ్రీప్రకాష్ విద్యాసంస్థల ప్రిన్సిపాల్ ఎ.రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నూరేళ్లూ చల్లగా ఉండాలని..
ఫ చల్లని వివాహ వేదికలకు క్రేజ్ ఫ ఏసీ కల్యాణ మండపాలకే ప్రాధాన్యం ఫ ఖర్చుకు వెనుకాడని పెళ్లి బృందాలు రాయవరం: ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు.. ఒకప్పుడు గోదావరి జిల్లాల్లో పెళ్లిళ్లంటే ఇలానే మాట్లాడే వారు. ఫలానా వారి తోటలో కొబ్బరాకులు, పూలంటూ పురమాయించేవారు. ఇంటి వద్దే చలువ పందిళ్లు, మండపాల ఏర్పాటుతో ఐదు రోజుల పాటు చేసే పెళ్లిని పది కాలాల పాటు చెప్పుకొనేవారు. మళ్లీ ఇప్పుడు ఆ రోజులను గుర్తు చేస్తూనే.. హంగూ ఆర్భాటాలు, అంగరంగ వైభోగాలతో దక్షిణాది సంప్రదాయానికి ఉత్తరాది మెరుగులు అద్ది, ఖర్చుకు వెనుకాడకుండా జరిపిస్తున్నారు. ముఖ్యంగా ఏ శుభకార్యం చేయాలన్నా ముందుగా ఏసీ కల్యాణ మండపాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జాబితా తయారీలో వధూవరులు పెళ్లి ఎక్కడ చేసుకోవాలి? ఏ మండపంలో చేయాలి.. మెనూ ఏంటనేది వధూవరులే ఓ పెద్ద జాబితా తయారు చేసుకుంటున్నారు. జీవితకాలం గుర్తుండి పోయేలా వివాహాన్ని చేసుకోవాలని ఆశించే వధూవరులు పెళ్లికి వచ్చే స్నేహితులు, కుటుంబ సభ్యుల రాకను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక ఏసీ కల్యాణ మండపంలోనే చేసుకోవాలని భావిస్తున్నారు. వాటి అద్దె, లంచ్, డిన్నర్, అలంకరణకు కనీసం రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు చేస్తున్నారని రాయవరం గ్రామానికి కల్యాణ మండపం నిర్వాహకుడొకరు చెప్పారు. ముందుగానే బుకింగ్ వివాహం నిశ్చయమైన వెంటనే ముందుగా పెళ్లి ఎక్కడ చేయాలనే దానిపై అధికంగా చర్చించుకుంటున్నారు. ఆలయాల వద్ద కాకుంటే కల్యాణ మండపాలకే ప్రాధాన్యం ఇస్తూ.. వెంటనే మండపాల బుకింగ్ చేస్తున్నారు. రెండు, మూడు నెలల ముందుగా మండపం బుక్ చేసుకోకుంటే దొరకని పరిస్థితి ఉంది. విదేశాల్లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అద్దె రెట్టింపు ఇస్తామని ఫోన్లు చేసి అడుగుతున్నారని మండపాల నిర్వాహకులు చెబుతున్నారు. పల్లెల్లో సైతం.. వాతావరణంలో వస్తున్న మార్పులు.. ఇప్పుడు కాకుంటే ఎప్పుడంటూ వివాహ వేడుకలకు ఇస్తున్న ప్రాధాన్యం నేపథ్యంలో పల్లెల్లో సైతం కల్యాణ మండపాల నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరు కొత్త భవనాలను నిర్మిస్తుంటే.. మరికొందరు పాత భవనాలను కల్యాణ మండపాలుగా మార్చేస్తున్నారు. ఏ చిన్న శుభ కార్యం చేయాలనుకున్నా.. సమావేశాలు నిర్వహించాలనుకున్నా.. ఏసీ కల్యాణ మండపాలకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. వివాహ ఆహ్వాన పత్రికల్లో సైతం ఏసీ కల్యాణ మండపం అనే విషయాన్ని స్పష్టంగా పేర్కొంటున్నారు. వచ్చిన బంధువులు, స్నేహితులు అధిక సమయం ఉండాలంటే ఏసీ కల్యాణ మండపాలే ఉండాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న కల్యాణ మండపాల్ని ఏసీ కల్యాణ మండపాలుగా మార్చేస్తున్నారు. ఆర్భాటానికే ప్రాధాన్యం ఓ కల్యాణ మండపంలో ఓ వ్యాపారి తన కుమారుడికి ఇటీవల పెళ్లి జరిపించారు. సుమారు 10 రకాల స్వీట్లు, నాలుగైదు రకాల స్పెషల్ రైస్, ఆకుపై 20 రకాల కూరలు (పొడులు, పచ్చళ్లతో కలిపి) ఉండాలని చెప్పారు. 2 వేల మందికి ఆర్డర్ ఇచ్చారు. ప్లేటు రూ.500 అయ్యిందని కల్యాణ మండపం నిర్వాహకుడు చెప్పారు. ఒక్క భోజనాలకే ఖర్చు రూ.10 లక్షలు అయ్యిందని చెప్పుకొనే విధంగా చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో పెద్ద, చిన్న కలిపి 200 వరకూ కల్యాణ మండపాలున్నాయి. అతి పెద్ద ఏసీ మండపమైతే అద్దె రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు ఉంటోంది. భోజనాలకు మెనూను బట్టి ఆకుపై వేసిన రకాలను బట్టి రూ.300 నుంచి 450 వరకూ పడుతుంది. ఇక కల్యాణ మండపంలో పచ్చిపూల మండపం ఏర్పాటుకు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ తదితర నగరాల నుంచి నుంచి తీసుకొచ్చిన పూలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ఖర్చు చేస్తున్నారు. విద్యుద్దీపాలంకరణకు మరో రూ.లక్షన్నర వరకూ పెడుతున్నారు. ఇవి కాకుండా బాజాభజంత్రీలకు ఖర్చులు అదనం. -
జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక
రాజోలు: ఇంజినీరింగ్ ఇంటర్ యూనివర్సిటీ జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు రాజోలుకు చెందిన గెద్దాడ తేజోమయి హేమ శ్రీదేవి అర్హత సాధించినట్లు కోచ్ రాయుడు మణికుమార్ శనివారం తెలిపారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న తేజోమయి ఈ నెల 27న కాకినాడ జేఎన్టీయూలో జరిగిన తైక్వాండో పోటీల ఎంపికలో అర్హత సాధించిందన్నారు. మార్చి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ ఒడిశాలోని ఫకీర్మోహన్ యూనివర్సిటీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతుందన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో జేఎన్టీయూకే యూనివర్సిటీ తరఫున తైక్వాండో పోటీల్లో పాల్గొనే అవకాశం సాధించిన తేజోమయిని మణికుమార్ అభినందించారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
బీవీసీలో ముగిసిన యువజనోత్సవం అమలాపురం రూరల్: అమలాపురం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి యువజనోత్సవం మయూక–2026 ఘనంగా ముగిసింది. రెండో రోజు శనివారం జరిగిన కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి, సినీ హీరో నిఖిల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ మేనేజ్మెంట్ విభాగాల్లో వివిధ క్రీడా, సాంస్కృతిక పోటీల్లో విజేతలకు రూ. 5 లక్షల విలువైన నగదు బహుమతులు, ట్రోఫీలను కళాశాల చైర్మన్ బోనం కృష్ణ సతీష్, బీవీసీ అక్షర్ ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ బోనం విజయలక్ష్మి ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో బీవీసీ ఓడలరేవు ప్రథమ స్థానం, కిమ్స్ అమలాపురం జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. బాస్కెట్ బాల్లో సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ ప్రథమ, ఆదిత్య డిగ్రీ కళాశాల ద్వితీయ, త్రోబాల్ మహిళా విభాగంలో బీవీసీ ఓడలరేవు ప్రథమ, బీవీసీ భట్లపాలెం ద్వితీయ స్థానాలు, కోకో మహిళా విభాగంలో సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ప్రథమ, బీవీసీ భట్లపాలెం ద్వితీయ స్థానాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ జేవీసీ రామారావు తెలిపారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలో ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల బృందం ఆలపించిన పాటలు అలరించాయి. బ్యాండు మేళం సినీ బృందం, హీరోయిన్ శ్రీదేవి, హీరో రోషన్, నిర్మాత కోన వెంకట్, దర్శకుడు సతీష్ పాల్గొని సందడి చేశారు. బీవీసీ గ్రూప్ అధినేత బోనం కనకయ్య, ప్రిన్సిపాల్స్ మహేశ్వర దత్తు, టీవీ జనార్దనరావు, మయూక కన్వీనర్లు కె.శ్రీనివాస్, బీఎస్ఎస్ ఫణిశంకర్, క్రీడా, సాంస్కృతిక విభాగాల కోఆర్డినేటర్లు, వివిధ విభాగాల అధిపతులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జక్కం కృష్ణారావు పాల్గొన్నారు. -
రోడ్డుపై పడిన రియాక్టర్
ఫ జనం లేని సమయంలో ఘటన ఫ కెమికల్స్ లేకపోవడంతో తప్పిన ముప్పు తుని: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలోని డెక్కన్ కెమికల్ పరిశ్రమకు చెందిన రెండు రియాక్టర్లను ట్రాలీపై తరలిస్తుండగా ఒకటి రోడ్డుపై జారిపడిన సంఘటన శనివారం తుని రాజా రాజబాబు మున్సిపల్ పార్కు సెంటర్లో చోటు చేసుకుంది. మధ్యాహ్నం కావడంతో వాహన రాకపోకలు లేని సమయంలో జరగడం వల్ల ప్రమాదం తప్పిందని లేకపోతే విషాదం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న తుని పట్టణ ఎస్సై పాపారావు సంఘటన స్థలానికి చేరుకుని రియాక్టర్ను రోడ్డుపై నుంచి జేసీబీ సహాయంతో తొలగించి ట్రాలీపైకి ఎక్కించారు. మందుల తయారీకి రియాక్టర్లను వినియోగిస్తుంటారు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే పేలిపోయే ప్రమాదం ఉంది. డెక్కన్ కెమికల్స్ పరిశ్రమలో వినియోగించిన ఖాళీ రియాక్టర్లను వేరే ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో జరగడం వల్ల పెను ప్రమాదం తప్పింది. కెమికల్స్ ఉంటే రియాక్టర్ పేలిపోయే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. ఇలాంటివి తరలించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని, ఇప్పుడు ఇందుకు భిన్నంగా ట్రాలీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదం జరిగిందని ఎస్సై పాపారావు తెలిపారు. -
ట్యూనా.. చూడముచ్చటేనా!
లోతైన సముద్ర జలాల్లో లభ్యమయ్యే ట్యూనా చేపల వేటకు కాకినాడ ప్రసిద్ధి. ఇక్కడ మత్స్యకారులు వలలతో పాటు గాలం కమ్మెల ద్వారా ఈ చేపలను వేటాడతారు. ప్రస్తుతం గాలం ద్వారా ఎల్లోపిన్ రకం ట్యూనా చేపలు లభ్యమవుతుండడంతో వాటిని కాకినాడలో విక్రయిస్తున్నారు. కుంభాభిషేకం వద్ద వీటి ధర కిలో రూ.130 వరకూ పలుకుతోంది. శనివారం విక్రయం కోసం మత్స్యకారులు ఇలా ఉంచారు. ఈ చేపలకు విదేశాల్లో మంచి కిరాకీ ఉంది. –కాకినాడ రూరల్ అపురూపం అమ్మా.. మురమళ్లలో భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామివారి ఆలయంలో మాణిక్యాంబ అమ్మవారిని వివిధ రకాల పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. శివరాత్రి నుంచి మొదలై ఉగాది వరకూ ఇక్కడ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం పండ్లతో అమ్మవారిని అలంకరించారు. పుచ్చకాయలు, స్వీట్కార్న్ మొక్క జొన్న, ద్రాక్ష, కమలా ఫలాలతో అలంకరణ విశేషంగా ఆకర్షించింది. –ఐ.పోలవరం ఆనప కాదు మారేడు పోతవరంలో పిచ్చుకల సత్తిబాబు (సత్యనారాయణ) వ్యవసాయ క్షేత్రంలో మారేడు చెట్టుకు కాసిన కాయలు అబ్బురపరుస్తున్నాయి. వీటిని ఆ గ్రామానికి చెందిన యేలేటి రాజశేఖర్ తీసుకువచ్చారు. సాధారణంగా మారేడు చెట్టుకు చిన్నసైజు కాయలు కాయడం చూస్తుంటాం. కానీ ఆనబకాయ సైజులో ఐదు కిలోల నుంచి తొమ్మిది కిలోల వరకూ ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. –నల్లజర్ల పోతవరంలో కాసిన మారేడు కాయలు బాగుందిరొయ్య పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా సముద్రంపై వేటకు వెళ్లిన మత్స్యకారుల కు శనివారం మత్స్య సంపద తో పాటు రెండు మెగా రొయ్యలు చిక్కాయి. అర కేజీ చొప్పున బరువున్న ఈ రొయ్యలు వేలం పాటలో ఓ వ్యక్తి రూ.2 వేలకు చేజిక్కించుకున్నాడు. కాగా ఒడ్డుకు వచ్చే వరకూ ఇవి బతికి ఉండడం కష్టమని, బతికి ఉంటే ఈ రకం రొయ్యలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని మత్స్యకారులు అన్నారు. –సఖినేటిపల్లి పండ్లతో మాణిక్యాంబ అమ్మవారికి అలంకరణ -
బడ్జెట్ అధికమైనా తప్పదు
ఏ శుభకార్యమైనా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఏసీ కల్యాణ మండపాల్లోనే నిర్వహిస్తున్నాం. ఇటీవల మా మనమరాలి ఓణీ ఫంక్షన్ను ఏసీ కల్యాణ మండపంలోనే నిర్వహించాం. ఒకప్పటి పరిస్థితికి, నేటి పరిస్థితికి చాలా మార్పు వచ్చింది. ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా శుభకార్యాలు చేయాల్సిందే. –ద్విభాష్యం విజయప్రభాకర్, విశ్రాంత ఉద్యోగి, రాజమహేంద్రవరం ఇళ్ల వద్ద నిర్వహించే పరిస్థితి లేదు ఏ కార్యక్రమమైనా ఇళ్ల వద్ద నిర్వహించే పరిస్థితి లేదు. చిన్న, మధ్య తరగతి కుటుంబాలు కూడా ఆర్థిక పరిస్థితిని వెరవకుండా ఏసీ కల్యాణ మండపాల్లోనే నిర్వహిస్తున్నారు. నాన్ ఏసీ అయితే ఏసీ కా దా.. అంటూ వచ్చిన వారు పెదవి విరుస్తున్నారు. –కొప్పిశెట్టి శ్రీనివాస్, వ్యాపారి, రాజమహేంద్రవరం డిమాండ్ ఎక్కువగానే ఉంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా కల్యాణ మండపాలకు డిమాండ్ అధికంగానే ఉంది. రైస్ మిల్లును కల్యాణ మండపంగా మార్చాం. ముహూర్తాల సమయంలో డిమాండ్ మరింత అధికంగా ఉంటుంది. రెండు, మూడు నెలల ముందుగానే కల్యాణ మండపాన్ని బుక్ చేసుకుంటున్నారు. –మూర్తినీడి వెంకటరాజు, కల్యాణ మండపం నిర్వాహకుడు, రాయవరం -
హాహాకారాలు.. ఆర్తనాదాలు
పిఠాపురం: తల ఒకచోట.. మొండెం మరోచోట.. కాలు ఒకచోట.. చెయ్యి మరోచోట.. ఇలా ఏ అవయవం ఎక్కడుందో.. అది ఎవరిదో తెలీనంత అతి దారుణంగా బాణాసంచా పేలుడులో మృతుల శరీరాలు ఛిద్రమయ్యాయి. ఏది ఎవరి అవయవమో కూడా తెలీనంతగా కాలిపోయాయి. తమ వారి మృతదేహం ఎక్కడుందో తెలుసుకోడానికి మృతుల బంధువులు పడుతున్న వేదన.. చేస్తున్న ఆర్తనాదాలు అంతాఇంతా కాదు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం సంభవించిన బాణసంచా పేలుడు ఘటనలో అసలు అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు.. ఎంతమంది చనిపోయారు అనేది కూడా చెప్పడానికి ఎవరు లేకపోవడంతో అంతా అయోమయ పరిస్థితి నెలకొంది.మా వాళ్లు బతికుండేలా చూడు దేవుడా..సంఘటన స్థలానికి చేరుకున్న మృతుల బంధువులు తమ వాళ్లు బతికున్నారో చనిపోయారో తెలీక ‘మా వాళ్లు బతికుండేలా చూడు దేవుడా’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఒకపక్క అధికారులు, సిబ్బంది మృతదేహాల భాగాలను పోగుచేస్తుంటే.. ఆ పోగులో తమ వారెవరైనా ఉన్నారా అంటూ వెతుక్కోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. బాణసంచా తయారీ పనికి వెళ్లిన వారి బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని తమ వారి జాడకోసం కాలువలు, చెట్లు, పుట్టలు, పొలాల్లో వెతుక్కుంటూ కనిపించారు. సంఘటన స్థలానికి దూరంగా ఉన్న కాలువల్లోనూ మృతదేహాల భాగాలు దొరకడంతో ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లోనూ అధికారులు గాలింపు చేపట్టారు. మొత్తం మీద 20 మృతదేహాలను గుర్తించినట్లు అధికారికంగా వెల్లడించగా.. తమవారి ఆచూకీ తెలీలేదంటూ కొందరు అధికారులకు సమాచారం ఇస్తున్నారు.అప్పుడు తప్పించుకుని.. ఇప్పుడు కాలిపోయాడు..గతంలో గ్రామంలో జరిగిన కొట్లాటలో గంపల నాగరాజు (55)ను కత్తులతో చంపడానికి కొందరు ప్రయత్నించగా అతను ఎలాగోలా తప్పించుకున్నాడు. బతుకు జీవుడా అంటూ మళ్లీ తన బతుకు తాను బతుకుతుంటే మృత్యువు పేలుడు రూపంలో అతడ్ని దహించేసిందని నాగరాజు బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన గంపల నాగరాజు, గంపల మంగ భార్యాభర్తలు. వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో వీరు పనిచేస్తున్నారు. శనివారం జరిగిన విస్ఫోటంలో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. అంత పెద్ద గొడవలోనూ బతికి బయటపడ్డాడనుకుంటే ఇప్పుడు మంటల్లో ఆహుతయ్యాడని.. తండ్రితో పాటు తల్లి కూడా కానరాని లోకాలకు వెళ్లిపోయిందని.. ఇక తమకు పెద్ద దిక్కెవరంటూ నాగరాజు కుమారుడు వెంకటన్న రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.నా మాట వినుంటే అల్లుడు బతికేవాడు..ఆ పని ప్రమాదకరమైంది.. ఆ పనిలోకి వెళ్లొద్దని ఎంత మొత్తుకున్నా వినకుండా బాణసంచా తయారీకి వెళ్లి చివరకు మృత్యువాతపడ్డాడని.. తన మాట వినుంటే తన అల్లుడు బతికేవాడని బాణసంచా ప్రమాదంలో మృతిచెందిన వల్లూరి రవి అత్త ముప్పిడి భద్రమ్మ కన్నీరుమున్నీరవుతోంది. పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన భద్రమ్మ కుమార్తె లక్ష్మికి, వేట్లపాలేనికి చెందిన రవితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమార్తె సోఫియా ఉంది. రోదిస్తున్న మృతుడు రవి అత్త భద్రమ్మ అయితే, మృతుడు రవికి కుట్టు మెషీన్, పెయిటింగ్ వంటి పనులు వచ్చు. కానీ, ఆ పనులు చేయకుండా బాణసంచా తయారీకి మాత్రమే వెళ్లేవాడు. దీంతో, ఆ పనికి వెళ్లొద్దంటూ తాను చాలాసార్లు వారించానని భద్రమ్మ రోదిస్తూ చెప్పింది. కావాలంటే కొత్త మెషీన్ కొనిస్తానని, దానిని కుట్టుకుని బతకమని ఎన్నోసార్లు చెప్పానని, అయినా తన మాట వినకుండా ఆ పనిలోకి వెళ్లి, తన అల్లుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడని, ఇక తన కూతురుకు మనవరాలికి దిక్కెవరంటూ భద్రమ్మ గుండెలవిసేలా రోదిస్తుంటే ఆపడం ఎవ్వరి తరం కాలేదు.మా అమ్మను చూపించండి..‘మా అమ్మ మందుగుండు సామగ్రి తయారుచేయడానికి వెళ్లింది. అందరూ చనిపోయారంటున్నారు.. మా అమ్మ కనిపిస్తే చూపించండి’.. అంటూ ఈ దుర్ఘటనలో అసువులు బాసిన వేట్లపాలేనికి చెందిన దూకెళ్ల దేవి కుమార్తె చంద్రకళ శోకతప్త హృదయంతో దీనంగా అడుగుతోంది. దీంతో ఏం చెప్పాలో తెలీక ఆమె బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు.. పేలుడులో మృతిచెందిన దేవి మృతదేహాన్ని సామర్లకోట ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంచడంతో అక్కడ తన తల్లిని చూపించడంటూ చంద్రకళ గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. -
శ్రమజీవుల జీవితాల్లో చిచ్చు
సాక్షి నెట్వర్క్: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా విస్ఫోట ఘటనతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ప్రమాదాలు అత్యధికంగా ఈ జిల్లాలోనే జరుగుతుండడం విషాదకరం. ఇక ఇప్పటి వరకూ జరిగిన ప్రమాదాల్లో చిచ్చుబుడ్లు కూరుతుండగా జరిగిన ప్రమాదాలే అధికం. వెరసి పొట్టకూటి కోసం పనిచేస్తున్న కూలీల కుటుంబాల్లో విషాదం అలముకుంటోంది. బాణాసంచా పేలుళ్లకు సంబంధించి విషాద ఘటనల్లో కొన్ని...ఉమ్మడి జిల్లాలో ప్రమాదాలుఅక్టోబర్ 2025: చిచ్చుబుడ్లు కూరే క్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో బాణసంచా విస్ఫోటం. గణపతి గ్రాండ్ ఫైర్వర్క్స్ యజమానితో పాటు పది మంది మృతి. సెప్టెంబర్ 2025: అయినవిల్లి మండలం విలసలో ఎలాంటి అనుమతులూ లేకుండా అనధికారికంగా బాణసంచా విక్రయించేందుకు సిద్ధమవుతుండగా మందుగుండు పేలిపోయి దంపతులు కంచర్ల శ్రీనివాసరావు, సీతామహలక్ష్మి మృతి.అక్టోబర్ 2019: తాళ్లరేవు మండలం వేమవరం బాణసంచా తయారీ కేంద్రంలో చిచ్చుబుడ్డి కూరుతుండగా ప్రమాదం. ముగ్గురు మృతి. ఎనిమిది మందికి గాయాలు. అక్టోబర్ 2019: సామర్లకోట మండలం జి.మేడపాడు బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన ప్రమాదంలో ఆరుగురు మృతిఅక్టోబర్ 2014: ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలోని మణికంఠ ఫైర్ వర్క్స్లో విస్ఫోటం. 18 మంది దుర్మరణం. లైసెన్స్ లేకుండా అనధికారికంగా బాణసంచా తయారు చేయడం, మందుగుండు భారీగా నిల్వ కారణం. అక్టోబర్ 2014: మండపేట మండలం ఏడిదలో బాణసంచా తయారు చేస్తూండగా ప్రమాదం. ఒకరు మృతి.అనకాపల్లి జిల్లాలో.. ఏప్రిల్ 2025: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో గల ‘విజయలక్ష్మీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలు.నెల్లూరు జిల్లాలో..సెప్టెంబర్ 2024: నెల్లూరు రూరల్ మండలం కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో గల భవానీ ట్రేడర్స్ బాణసంచా విక్రయ దుకాణం/ గోదాములో జరిగిన అగ్నిప్రమాదంలో వాచ్మెన్ సుబ్బయ్య సజీవదహనం.ఎన్టీఆర్ జిల్లాలో...సెప్టెంబర్ 2025: ఇబ్రహీంపట్నం మండలం జూపూడి భీమేశ్వర కాలనీలో రెంటపల్లి కోటమ్మ ఇంట్లో భారీ పేలుడు. గుట్టుచప్పుడు కాకుండా కాలనీలోని కొన్ని ఇళ్లల్లో గుంటూరుకు చెందిన కొందరు వ్యక్తులు దీపావళి సామాగ్రి తయారు చేయిస్తున్నట్లు అప్పట్లో బయటపడిన నిజం. పేలుడు ధాటికి చుట్టుపక్కల కొన్ని ఇళ్ల గోడలు అద్దాలు, కిటికీలు, రేకులు షెడ్లు ధ్వంసం. గోపి అనే ఒక వెల్డర్ మృతి. మరో వ్యక్తికి అంగవైకల్యం. పరిహారం కోసం గోపి భార్య ఏడాది వయస్సు బిడ్డతో పేలుడు జరిగిన ఇంటి వద్ద జరిగిన ఆందోళన అప్పట్లో సంచలనం. స్పందించని చంద్రబాబు ప్రభుత్వం.ప్రాణాలు హరిస్తున్న నిర్లక్ష్యం» నిబంధనలకు నీళ్లొదలడం ప్రమాదాలకు కారణమవుతోంది. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..» బాణసంచా తయారీ కేంద్రం చుట్టూ 9 మీటర్ల మేర ఖాళీ స్థలం ఉండాలి. అగ్ని నిరోధక పరికరాలు సిద్ధంగా ఉండాలి.» షెడ్ల నిర్మాణానికి ఉపయోగించే మెటీరియల్ కనీసం రెండు గంటల పాటు అగ్నిని నిరోధించగలగాలి.» షెడ్ల గుమ్మాలు 100 సెంటీమీటర్ల వెడల్పు, 200 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి.» పనిచేసే కార్మికులు ఫైర్ ఫైటింగ్ కోర్సులో తర్ఫీదు పొందాలి.» అగ్నిమాపక సిలిండర్లు, ఐదు ట్రక్కుల పొడి ఇసుక, నీరు, పొడి ఇసుకను నింపిన బకెట్లు అందుబాటులో ఉండాలి.» మండుతున్న బాణసంచాను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపల ఉంచకూడదు.» ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అందులో మందులు సిద్ధంగా ఉంచాలి. ఎక్స్ప్లోజివ్ యాక్టు ప్రకారం బాణసంచా తయారు చేసే షెడ్లు, ప్లాట్ఫాం తగినంత దూరంలో ఉండాలి. -
మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా
సాక్షి ప్రతినిధి, కాకినాడ: బాణసంచా పేలుడు ఘటనలో క్షతగాత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు సామర్లకోట సీహెచ్సీ, కాకినాడ జీజీహెచ్లో పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కాకినాడ జీజీహెచ్లో మీడియాతో మాట్లాడారు. ‘బాణసంచా పేలుడు ఘటన చాలా దురదృష్టకరం. హృదయ విదారక ఘటన. ఇప్పటి వరకు 20 మంది చనిపోగా, 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరికి ప్రమాదం తప్పింది’ అని చెప్పారు. 12 మంది ఎస్సీలు, 9 మంది మహిళలు బాధితుల్లో ఉన్నారన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందన్నారు. రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.అధికారుల సస్పెన్షన్ పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణి, డీఎస్పీ శ్రీహరిరాజుతోపాటు జిల్లా కార్మిక అధికారి, జిల్లా అగ్నిమాపక అధికారులను సస్పెండ్ చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. విచారణ అనంతరం సంబంధిత అధికారులపైనా చర్యలు తీసుకుంటామన్నారు. కొందరు విచ్చలవిడితనానికి అలవాటు పడి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని, వారిని అరెస్ట్ చేయడమే కాకుండా ప్రాసిక్యూషన్ చేస్తామన్నారు. వాళ్ల ఆస్తులు కూడా జప్తు చేసి బాధితులకు అప్పగిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ పరంగా ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల ఆరి్థక సాయం చేస్తామని, కేంద్రం రూ.2 లక్షల చొప్పున సాయం ప్రకటించిందన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని కూడా ఆదుకుంటామని, చిన్న పిల్లలుండి, చదువుకునే వారికి రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివిస్తామని, ఇళ్లు లేని వారికి ఇళ్లు నిరి్మస్తామని చెప్పారు. ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. బాణసంచా కేంద్రాలకు అనుమతులు కఠినతరం చేస్తామని చెప్పారు. క్షతగాత్రులకు వైఎస్సార్సీపీ పరామర్శ సంఘటన స్థలాన్ని వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో పార్టీ పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, నేతలు సందర్శించారు. సామర్లకోట, కాకినాడ జీజీహెచ్లలో క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. -
నేను బతికే ఉన్నానా!
పిఠాపురం: ‘నేను బతికే ఉన్నానా. బతికి ఉన్నానంటే నాకే నమ్మకం కుదరటం లేదు’అంటూ భయం నిండిన కళ్లతో వణికిపోతూ అడిగాడు సామర్లకోట మండలం వేట్లపాలెంలో పెను విస్ఫోటనం నుంచి బయటపడ్డ చాపల శామ్యూల్. పెద్దాపురానికి చెందిన శామ్యూల్ జరిగిన ఘోరాన్ని కళ్లారా చూసి.. పడిపోతూనే పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకుని మృత్యుంజయుడిగా మిగిలాడు. నిద్ర ముంచుకురావడంతో పడుకునేందుకు వెళ్తున్న శామ్యూల్ ప్రమాదం నుంచి తప్పించుకుని.. సామర్లకోట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ పెను విషాదంలో అక్కడ ఏం జరిగిందో చెప్పడానికి అతడు తప్ప మిగిలిన వారెవరూ మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ‘సాక్షి’తో శామ్యూల్ మాట్లాడుతూ.. ‘నేను పని చేస్తున్న బాణసంచా షెడ్లో నాతోపాటు ఆరుగురం ఉన్నాం. ఆర్డర్ ఎక్కువగా ఉంది. ఎక్కువ సరుకు కావాలన్న ఉద్దేశంతో మందుగుండు సామగ్రి ఎక్కువగా తయారు చేయిస్తున్నారు. అందుకే రోజూ కంటే శనివారం ఎక్కువ మంది పనిలో ఉన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అందరం భోజనాలకు లేచాం. భోజనాలు పూర్తయ్యాక కొందరు ఒకచోట కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. నాతో సహా మరి కొందరు షెడ్లలోనే ఉన్నారు. ఇంతలో నాకు నిద్ర వచ్చింది. కునుకుపాట్లు పడుతుండటంతో అందరితో మాట్లాడుతున్న నేను సెల్ఫోన్ తీసుకుని పాటలు పెట్టుకుందాంమని పైకి లేచాను. షెడ్ చూరుకు తగిలించి ఉన్న నా చొక్కా జేబులో ఉన్న సెల్ తీసుకుందామని వెళ్లబోతుండగా నా వెనుక నుంచి భారీ శబ్దాలతో మంటలు ఎగసిపడటం కనిపించింది. వెంటనే పరుగు తీశాను. అప్పటికే నాకు మంటల వేడి తగిలి పరుగెత్తలేక కిందపడ్డాను. అయినా తెగించి మళ్లీ లేచి పరుగెత్తాను. కొంత దూరం వచ్చి పడిపోయాను. ఇంతలో నేను పని చేస్తున్న షెడ్లో ఉన్నవారు వారంతా మంటల్లో చిక్కుకుపోయారు. వారు కూర్చున్న చోటు నుంచి లేచే అవకాశం కూడా లేకుండా మంటల్లో కాలిపోయారు. నాకు నిద్ర రాకపోతే మంటల్లో కాలిపోయేవాడిని. ఎలా పరుగెత్తానో నాకే తెలియదు. నేను బతికి ఉన్నానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను’అని శామ్యూల్ చెప్పాడు. -
భారీ విస్ఫోటనం.. మాటలకందని విషాదం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం సంభవించింది. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రం శనివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలిపోయి భస్మీపటలమైంది. 20 మంది కూలీలు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో 11 మంది కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మృతులందరూ పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం, సామర్లకోట, వేట్లపాలెం, పెదబ్రహ్మదేవం, గూడపర్తి గ్రామాలకు చెందిన వారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు. సామర్లకోట – పెదపూడి రోడ్డును ఆనుకుని పంట పొలాల మధ్య సుమారు మూడెకరాల్లో ఈ బాణసంచా తయారీ కేంద్రం ఉంది. ఉదయం బాణసంచా కేంద్రంలోని నాలుగు షెడ్లలో 60 మంది వరకూ కూలీలు మందు గుండు తయారీలో నిమగ్నమయ్యారు. సహజంగా ప్రతి రోజూ ఈ కేంద్రంలో 10–15 మంది పని చేస్తూంటారు. అయితే జగ్గంపేట మండలం మల్లిశాలలో జాతరకు భారీ ఆర్డర్ రావడంతో పాటు పెళ్లిళ్లు కూడా ఎక్కువగా ఉండటంతో బాణసంచాకు డిమాండ్ పెరిగింది. దీంతో 60 మందికి పైగా కూలీలతో పని చేయిస్తున్నారు. రాకెట్లు, జువ్వలు, సెర్చ్లైట్లు, మిడతల దండు, డిస్కో బుడ్లు, చిచ్చు బుడ్లు తయారు చేస్తున్నారు. పైగా మల్లిశాలలో జాతర కోసం సిద్ధమైన మందు గుండును కూడా ఇక్కడున్న గోడౌన్లోనే నిల్వ చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అందరూ భోజనాలకు బయటకు వచ్చారు. 1.30 గంటలకంతా భోజనం ముగించుకున్న కూలీల్లో 30–40 మంది తిరిగి ఆ నాలుగు షెడ్లలోకి వెళ్లి పనిలో నిమగ్నం అయ్యారు. మరికొందరు బయటే సేద తీరారు. ఇంకొందరు సమీపంలోనే ఊరు ఉండటంతో భోజనానికి ఇంటికెళ్లి తిరిగి వస్తున్నారు. వేట్లపాలెం వద్ద జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలు పేద్ద శబ్దం.. ఎగిరిపడ్డ దేహాలుమధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. నాలుగు షెడ్లలో ఉన్న బాణసంచా ఒకదాని తర్వాత మరొకటి పేలిపోవడంతో చెవులు చిల్లులు పడేలా భయంకరమైన శబ్దం వినిపించింది. పేలుడు ధాటికి షెడ్లలో ఉన్న కూలీలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు మృతుల శరీర భాగాలు 20–30 అడుగుల ఎత్తున ఎగిరిపడ్డాయి. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో కాలిపోయిన మృతదేహాలు తునాతునకలైపోయాయి. శరీరాలు గుర్తు పట్టలేని రీతిలో చిధ్రమైపోయాయి. కొందరి తలా, మొండెం, కాళ్లు, చేతులు వేర్వేరు ప్రాంతాల్లో, సమీపంలోని పంట కాలువలు, పచ్చని వరి పొలాల్లో దూరంగా పడ్డాయి. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా భీతావహంగా మారిపోయింది. సంఘటన ప్రాంతమంతా మృతులు, క్షతగాత్రుల బంధువుల ఆర్తనాదాలతో హృదయ విదారకరంగా మారింది. భీతావహ దృశ్యంపేలుడు ధాటికి ఘటన స్థలి ఎటుచూసినా మంటల్లో కాలిపోయిన కూలీల మృతదేహాలతో భయానక వాతావరణం కనిపించింది. ఆ సమయంలో పనిలో ఉన్నవారెవరు, ఎంత మంది మృతి చెందారు, ఎవరు మిగిలి ఉన్నారనేది తెలియక గందరగోళ పరిస్థితి నెలకొంది. చుటు్టపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధువులు తరలివచ్చారు. పేలుడు ధాటికి సంఘటన స్థలానికి రెండు కిలోమీటర్ల దూరాన సామర్లకోట–రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డులో ఉన్న గూడపర్తిలోని ఇళ్లల్లో ఉన్న వారు భూకంపం వచ్చినట్టు భయపడి బయటకు పరుగులు తీశారు. ఇంటిపై ఉన్న ఇనుప రేకుల నుంచి సైతం శబ్దం వచ్చిందని స్థానికులు తెలిపారు. వేట్లపాలెం, గూడపర్తి, పెదబ్రహ్మదేవం, జి.మేడిపాడు గ్రామాలకు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కాగా, మృతదేహాలను సేకరించేందుకు స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అష్టకష్టాలు పడ్డారు. కాలువలు, చేలల్లో గాలింపు చేపట్టి నుజ్జునుజ్జు అయిన శరీర భాగాలను సేకరించి ఒక చోటకు చేర్చారు. ఏది ఎవరి అవయవమో గుర్తించలేక కొన్నింటిని మూటలు కట్టారు. ఇలా అన్ని మృతదేహాలను, మూటలను అతి కష్టం మీద సామర్లకోట ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఇదిలా ఉండగా బాణసంచా నాణ్యత కోసం అధిక మోతాదులో సల్ఫర్, సూరేకారం కూరడం వల్లే ఒత్తిడికి గురై విస్ఫోటనం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు.సూర్యశ్రీ ఫైర్వర్క్స్లో మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది 11 మంది క్షతగాత్రులు వీరేసప్పా సత్య వెంకట లక్ష్మి, మోర్తా శ్రీను, కాతేటి శ్రీను, చిటికెల లక్ష్మి, దర్శిపర్తి రాజు, వేమగిరి లోవరాజు, వేమగిరి దావీదు, పల్లాపాటి వేద శ్రీను, దర్శిపాటి లోవరాజు, పెద్దాపురానికి చెందిన చాపల శామ్యూల్, వేట్లపాలేనికి చెందిన పచ్చిగళ్ల నూకరాజు తీవ్రంగా గాయపడ్డారు. 70 శాతం కాలిన గాయాలతో వీరు కాకినాడ జీజీహెచ్ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు .20 మంది మృతులు వీరేవేట్లపాలేనికి చెందిన గంధి మంగ (43), వల్లూరి రవి (35), కడింపల్లి కృపమ్మ, గంపల మంగ, గంపల నాగరాజు, బిక్కిన కరుణ సుబ్బారావు (45), సాధనాల సత్యవేణి (44), గొడతా నాని (26), సంకుమళ్ల రాఘవ (50), ఫైర్క్స్ యజమాని అర్జున్ తండ్రి అడబాల శ్రీనివాసరావు (55), దుర్గానగర్కు చెందిన తుంపల లోవ (38), నూకెళ్ల దేవి (45), జొన్నలదొడ్డికి చెందిన చింతల రమణ (60), గూడపర్తికి చెందిన మందపల్లి చిన్ని (44), గొడత మహేష్ (41), గొడత వీర వెంకట రమణ (48), కడింపల్లి ధనరాజు (55), కుమ్మరి వీధికి చెందిన దర్శిపాటి నాని (38), యేడిద సంపత్ కుమార్ (25), పెదబ్రహ్మదేవం గ్రామానికి చెందిన మాకర రాఘవమ్మ (55) మృతి చెందారు.ఫైరింజన్లు వెళ్లలేక... పెరిగిన ప్రమాద తీవ్రతసంఘటన స్థలానికి సామర్లకోట–రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డు నుంచి వెళ్లాలంటే సింగిల్ రోడ్డు. అది చాలా ఇరుకుగా ఉండటంతో ఆ సమయానికి అంబులెన్సులు చేరుకోలేకపోయాయి. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. విస్ఫోటనం తీవ్ర స్థాయిలో ఉండటం, రెండు గంటల పాటు పేలుళ్లు కొనసాగడంతో స్థానికులు కూడా ఘటన స్థలి దగ్గరి వరకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. చివరకు ధైర్యం చేసి కొందరు స్థానికులు పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకున్నారు. కానీ, అప్పటికే చాలా మంది అగ్నికి ఆహుతయ్యారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బాణసంచా తయారీ కేంద్రం పొలాల మధ్య ఉండటంతో అక్కడకు ఫైరింజన్, అంబులెన్స్ వెళ్లే మార్గం కూడా లేదు. వరి పొలాలు బురద మయంగా ఉండటంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉండగా జీజీహెచ్లో క్షతగ్రాత్రులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అంతకు ముందు హోం మంత్రి అనిత సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ ఘటనపై సామర్లకోట తహశీల్దార్ కొవ్వూరు చంద్రశేఖర్రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫైర్ వర్క్స్ యజమాని అడబాల అర్జున్పై కేసు నమోదు చేశారు. శ్మశానంలా మారిన ప్రమాద స్థలం వద్ద గుమిగూడిన వేట్లపాలెం ప్రాంత ప్రజలు నా మనసును కలచివేసింది సాక్షి, అమరావతి: కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగి, పలువురు మృతి చెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారందరికీ అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలని, బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు అవుతున్నాయా? లేదా? అన్నదానిపై పరిశీలన చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ ‘ఎక్స్’లోనూ పోస్టు చేశారు. -
వేట్లపాలెం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి భారీ ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాన సానుభూతి తెలిపారు మోదీ. మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు రూ. 50వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కాగా, వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటు చేసుకుని 23 మంది వరకూ మరణించారు. ఆ ప్రమాద సమయంలో 70 మంది వరకూ ఆ తయారీ కేంద్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇవీ చదవండివేట్లపాలెంలో భారీ పేలుడు.. భారీ ప్రాణనష్టంవేట్లపాలెం అగ్ని ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి -
వేట్లపాలెం అగ్నిప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
తాడేపల్లి : కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత విషాదకరమన్న వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడంపై ఆవేదన వ్య క్తం చేశారు వైఎస్ జగన్.‘వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో పలువురు కార్మికులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలి’ అని వైఎస్ జగన్ సూచించారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన పరిహారం ప్రకటించి అండగా నిలవాలి. గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం…— YS Jagan Mohan Reddy (@ysjagan) February 28, 2026 కాకినాడ: వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం -
గౌరవం ఏదీ?
● స్థానిక ప్రజాప్రతినిధులకు వేతన యాతన ● గౌరవ వేతనం చెల్లించని ప్రభుత్వం ● రూ.కోట్లలో బకాయిలు ● త్వరలో ముగియనున్న పదవీ కాలం ● అయినా స్పందించని సర్కారు ● మండిపడుతున్న ప్రజాప్రతినిధులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజకీయాలను ఎన్నికల వరకే పరిమితం చేయాలి. ఎన్నికలై ఫలితాలు వచ్చేశాక పార్టీలను పక్కన పెట్టి అందరినీ ఒకే రీతిన చూడాలి. కానీ చంద్రబాబు గద్దెనెక్కాక మండల, జిల్లా పరిషత్ ప్రజాప్రతినిధులకు వేతనాలు ఇవ్వకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. గౌరవ వేతనాలు ఇలా.. మండల సమావేశాలు, ఇతర కార్యక్రమాల ఖర్చుల నిమిత్తం గౌరవ వేతనంగా ఎంపీటీసీ సభ్యులకు నెలకు రూ.3 వేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు రూ.6 వేల వంతున ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ మేరకు మండల, జెడ్పీ వార్షిక బడ్జెట్లలో నిధులు కేటాయిస్తూంటారు. ఎప్పటికప్పుడు గౌరవ వేతనం కోసం బిల్లులు పెడితే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూంటుంది. మండల, జెడ్పీ సమావేశాల్లో సభ్యులకు ఈ గౌరవ వేతనం అందజేస్తూంటారు. ఉమ్మడి జిల్లాలో 61 మంది జెడ్పీటీసీ సభ్యులు, 980 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా, ఇతర ప్రజాప్రతినిధులుగా 90 శాతం పైగా స్థానాల్లో వైఎస్సార్ సీపీ నేతలు, సానుభూతిపరులే విజయం సాధించారు. 2021 సెప్టెంబర్లో బాధ్యతలు చేపట్టిన వీరి పదవీ కాలం త్వరలో ముగియనుంది. అయినప్పటికీ వీరికి ఇప్పటి వరకూ బకాయి వేతనాలు విడుదల చేయకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. రెండేళ్లుగా.. గత సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి సాంకేతిక కారణాలతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాల చెల్లింపును అధికారులు నిలిపివేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయ్యాయి. ఈ కాలంలో 6 నెలల వేతనాలు మాత్రమే విడుదల చేసింది. మిగిలిన 12 నెలల గౌరవ వేతనం ఇప్పటి వరకూ విడుదల చేయలేదు. దీనిపై జెడ్పీ సర్వసభ్య సమావేశాలు జరిగిన ప్రతిసారీ జెడ్పీటీసీ సభ్యులు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఎంపీపీలకు కారు అలవెన్స్ మాత్రం చెల్లిస్తూండగా గౌరవ వేతనం మాత్రం చెల్లించడం లేదు. ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు ఒక్కొక్కరికి రూ.1.44 లక్షలు, ఎంపీటీసీ సభ్యులకు రూ.72 వేల చొప్పున ప్రభుత్వం గౌరవ వేతన బకాయిలు పెట్టింది. ఈవిధంగా జిల్లాలో రూ.కోట్లలోనే బకాయిలు పేరుకుపోయాయి. బిల్లులు పెడుతున్నా.. గౌరవ వేతనాలకు సంబంధించిన నిధుల విడుదల కోసం మండల, జెడ్పీ అధికారులు బిల్లులు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. గత్యంతరం లేక స్థానిక ప్రజాప్రతినిధులు సొంత సొమ్ము వెచ్చించి సమావేశాలకు హాజరవుతున్నారు. మెజార్టీ సభ్యులు వైఎస్సార్ సీపీకి చెందిన వారు అయినందువల్లనే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా గౌరవ వేతనం బకాయిలు విడుదల చేయడం లేదని స్థానిక ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. వేతన బకాయిలపై ఇటీవల కాకినాడలో జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని సభ్యులందరూ మూకుమ్మడిగా బాయ్కాట్ చేశారు. వారిని జిల్లా అధికారులు బుజ్జగించి వెనక్కు తీసుకువచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా విడుదల చేయకపోవడం విచిత్రం. దీనిపై పలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో ఎంపీటీసీ సభ్యులు సైతం నిలదీస్తున్నా, నిరసనలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. జెడ్పీలో అడుగుతున్నా దిక్కు లేదు గౌరవ వేతనాల కోసం జెడ్పీ సర్వసభ్య సమావేశాల్లో సభ్యులందరం పదేపదే అడుగుతున్నాం. ఇప్పటికే నాలుగైదుసార్లు మూకుమ్మడిగా వాకౌట్ చేశాం. కొంత మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు మద్దతుగా నిలిచారు. అప్పటికప్పుడు జిల్లా అధికారులు ఏదో ఒక హామీ ఇచ్చి ఆ తరువాత గాలికొదిలేస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంటే ఎందుకంత పక్షపాతమో అర్థం కావడం లేదు. గౌరవ వేతన బకాయిలు పేరుకుపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా అన్యాయం. ప్రజల ద్వారా ఎన్నికై న స్థానిక సంస్థల సభ్యులకే ప్రభుత్వం గౌరవం ఇవ్వకుంటే ఇక మిగిలిన వారికి ఏముంటుంది? – ఉలవకాయల లోవరాజు, జెడ్పీటీసీ సభ్యుడు, గొల్లప్రోలు తీర్మానాలు చేశాం.. వేచి చూస్తున్నాం గౌరవ వేతనాల కోసం జెడ్పీ సర్వసభ్య సమావేశాల్లో సభ్యులు తరచూ అడుగుతున్నారు. వారికి బకాయిలున్న మాట వాస్తవమే. జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు గౌరవ వేతనాల విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై సభలో కూడా పలు సందర్భాల్లో సభ్యుల సమక్షంలోనే చర్చించాం. దాదాపు ఏడాదిన్నర పైనే పేరుకుపోయిన బకాయిల కోసం జెడ్పీలో తీర్మానాన్ని ఆమోదించి ప్రభుత్వానికి పంపించాం. బకాయిల విడుదల కోసం ఎదురు చూస్తున్నాం. – విప్పర్తి వేణుగోపాలరావు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ -
జీతాలు పెంచే వరకూ పోరాటం ఆగదు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జీతాలు పెంచేంత వరకూ అంగన్వాడీల పోరాటం ఆగదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి అన్నారు. యూనియన్ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలను రెండో రోజైన శుక్రవారం ఆమె ప్రారంభించారు. వేతనాలు పెంచకుండా ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంగన్వాడీలను బుజ్జగించడం, బెదిరించడం మానుకుని, సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. మార్చి 2న నిర్వహించే చలో విజయవాడ మహాధర్నాకు ప్రభుత్వం స్పందించకపోతే తీవ్ర స్థాయి పోరాటాలకు అంగన్వాడీలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏడేళ్లుగా వేతనాలు పెంచకపోతే ఎలా బతకాలని బేబీరాణి ప్రశ్నించారు. దీక్షా శిబిరం నుంచే ముఖ్యమంత్రికి పోస్టు కార్డులు రాసి పంపిస్తున్నట్లు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రావతి తెలిపారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషుబాబ్జీ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ నిమ్మరసం ఇచ్చి రెండో రోజు దీక్షలను విరమింపజేశారు. -
రైతు ఆత్మహత్యలపై ఎందుకు మాట్లాడలేదు?
● అసెంబ్లీలో పబ్లిసిటీ కోసమే లడ్డూ కల్తీ డ్రామాలు ● మాజీ మంత్రి కురసాల కన్నబాబు కాకినాడ రూరల్: దాదాపు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి.. నాలుగోసారి సీఎం పదవిలో ఉన్న చంద్రబాబు కౌలు రైతుల గురించి ఎంత అవగాహనతో మాట్లాడారనేది అసెంబ్లీలో ఆయన మాటలను బట్టే అర్థమవుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్తో కలసి కాకినాడలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌలు రైతులు 30, 40 ఎకరాలు కౌలు చేస్తే మార్కెటింగ్ ఎలాగని అనడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు. కూలీ అని కాకుండా రైతు అనిపించుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని కష్టజీవులు.. భార్యాభర్తలిద్దరూ పని చేసుకునే వారు కౌలు చేస్తారని అన్నారు. కానీ, కౌలు రైతులే సమస్య అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడారని ఆక్షేపించారు. వ్యవసాయం మీద చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతున్నారంటే చాలా ఆసక్తిగా చూశానని, కానీ ఏమీ మాట్లాడలేదని, దీనినిబట్టి రాష్ట్రంలోని రైతులకు ఏమీ చేయలేదని ఆయన ఒప్పుకున్నట్టేనని అన్నారు. మార్కెటింగ్, రైతు సంక్షేమం, ఫెసిలిటీ గురించి మాట్లాడకపోవడం వైఫల్యం కిందే లెక్కన్నారు. కన్నబాబు ఇంకా ఏమన్నారంటే.. 392 మంది రైతుల ఆత్మహత్య చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం 2025లో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిని బట్టి వ్యవసాయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ రంగాన్ని దుర్మార్గంగా గాలికొదిలేసి, ఈవేళ కోకో సిటీ తెస్తాను, కాఫీ టౌన్ కడతాను, మీరు వాణిజ్య పంటలే పండించండని చెబుతున్నారు. రాష్ట్రంలోని 80 లక్షల ఎకరాల్లో రెండు పంటలు వరి పండిస్తారు. ఆ వరి రైతుల గురించి గానీ, 393 మంది రైతుల ఆత్మహత్యల గురించి గానీ చంద్రబాబు ఒక్క ముక్క మాట్లాడలేదు. కల్తీ అని కట్టుకథలు రైతుల పరిస్థితి బాగోలేదన్నా.. ఏం అడిగినా తిరుపతి లడ్డూలో పంది కొవ్వు కలిసిందని, ఆరోగ్యశ్రీని గాలికొదిలేశారంటే తిరుపతి లడ్డూలో చేప నూనె కలిసిందని, కల్తీ అని కట్టు కథలు, పిట్ట కథలతో చంద్రబాబు గడిపేస్తున్నారు. రాజమహేంద్రవరంలో పాల కల్తీతో ఆరుగురు, శ్రీకాకుళంలో నీళ్ల కల్తీతో నలుగురు చనిపోయారు. దీనినిబట్టి ఎంత కల్తీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారో అర్థం చేసుకోవాలి. క్షేత్ర స్థాయిలో వ్యవస్థలపై చంద్రబాబుకు పట్టు పోయింది. ఒక్క శాఖ కూడా సక్రమంగా నడవడం లేదు. జగన్ను దుమ్మెత్తి పోయడమే ఫెర్మార్మెన్స్గా చూడటంతో పరిపాలనను గాలికి వదిలేశారు. పురందేశ్వరి మాటలు సిగ్గుచేటు రాజమండ్రి ఎంపీ, చంద్రబాబు కుటుంబ సభ్యురాలు పురందేశ్వరి సీనియర్ నాయకురాలు. పాల కల్తీపై ప్రభుత్వం సకాలంలో స్పందించిందని ఆమె అభినందించడం సిగ్గుచేటు. చనిపోయిన వారికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వడమే ప్రభుత్వం స్పందించడమా? చావుల దగ్గర కూడా పొగుడుకుంటూ మాట్లాడుతున్నారంటే ప్రజలు ఏమనుకుంటారోననే పట్టింపు కూడా లేదన్నమాట. పాల కల్తీ జరిగి జనం చనిపోవడం మీరు విన్నారా? నీళ్ల కల్తీ, పాల కల్తీ జరుగుతూంటే మీరు వచ్చి సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. పాల కల్తీ జరిగి, జనం చనిపోయే సమయానికి శాసన సభ్యులు కబడ్డీ ఆడుతున్నారు. శ్రీకాకుళంలో నీళ్ల కల్తీ జరిగి జనం చనిపోయే టైమ్కు శాసన సభ్యులు క్రికెట్ ఆడుతున్నారు. మీరు సంతోషంగా ఆటపాటలతో గడుపుతున్నారు. ప్రభుత్వమైనా వేగంగా స్పందించడం లేదు. ఈ సంవత్సరం ఆటలు, పాటలు, గత సంవత్సరం నాటకాలు. భారతి సిమెంట్పై చర్చ చాలా చిత్రంగా ఉంది హౌసింగ్పై చర్చ సందర్భంగా భారతి సిమెంట్ ఎక్కువ కొనేశారని చెబుతున్నారు. జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉండగా పేదల ఇళ్లు, ప్రాజెక్ట్ల కోసం సిమెంట్ ప్రొక్యూర్ చేయాలని నిర్ణయించి, అన్ని సిమెంట్ కంపెనీలతో చర్చలు జరిపారు. ఆ రోజు బస్తా సిమెంట్ రూ.380 అమ్ముతుండగా రూ.235కు ఇవ్వాలని ఒప్పించారు. 1,19,43,237 మెట్రిక్ టన్నుల సిమెంట్ నాడు డిమాండ్ ఉండగా కొన్ని కంపెనీలు గిట్టుబాటు కాదన్నాయి. పీపీసీ రూ.225, రూ.235కు ఇచ్చేందుకు ఫిక్స్ చేశారు. 2015–16 నుంచి 2019–20లో చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే సమయానికి కంటే ఇది తక్కువ ధర. దీనివలన ప్రభుత్వానికి మంచే జరిగింది. దానిని వదిలేసి, భారతి సిమెంట్కు సప్లయ్ ఇచ్చేశారంటూ చర్చ పెట్టడమేమిటి? చంద్రబాబు రాజకీయ ప్రస్థానం అందరికీ తెలుసు ‘తమ్ముళ్లూ నేను ఎప్పుడైనా మోసం చేశానా?’ అని చంద్రబాబు అడిగినట్టు సోషల్ మీడియాలో చూశాను. ఆ సభలో ఒక్కరైనా కాదంటూ చెయ్యి ఊపారా? చంద్రబాబు రాజకీయ ప్రస్థానం ప్రజలకు తెలుసు. మోసం చేశారో లేదో ఎన్టీఆర్ నుంచి మాట్లాడుకోవాల్సి వస్తుంది. మీరు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు అమలు చేశారో లేదో మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఆడబిడ్డలకు సీ్త్రశక్తితో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చానని, అయినా సభకు రాలేదని చంద్రబాబు అంటున్నారు. కౌన్సిల్లో లడ్డూపై చర్చ పెట్టకుండా పారిపోతున్నారు.జగన్ను తగ్గించి చూపాలని కుట్రరాష్ట్రంలో మతం అనే అస్త్రాన్ని వాడి జగన్మోహన్రెడ్డిని తగ్గించి చూపేందుకు రాజకీయ కుట్ర చేస్తున్నారు. తిరుపతి వేంకటేశ్వరస్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ ప్రచారం మొదలు పెట్టారు. అది ఇవాళ చంద్రబాబు మెడకే చుట్టుకుంది. వేంకటేశ్వరస్వామితో రాజకీయం చేశారు. ఈ పాపం ఊరికే పోదు. చార్జిషీట్లోని అంశాలను వక్రీకరించి చెబుతున్నారు. చంద్రబాబు హయాంలో తీసిన శాంపిల్స్, రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు తిరిగి మళ్లీ లోపలకు వెళ్తే జగన్ హయాంలో తప్పు జరిగినట్టు చూపడం ఎంతవరకూ న్యాయం? పాలు, నెయ్యి, పెరుగు వ్యాపారం మీ చేతుల్లోనే కదా ఉన్నాయి. సంగం డెయిరీ, వైష్ణవి డెయిరీ గురించి మా నాయకుడు పేర్ని నాని చెబితే తెల్లారేసరికి రంగులు వేశారు. సున్నం కొడితే నిజాలు మారిపోతాయా? సీబీఐ కన్నా సీబీఎన్ గొప్ప అని మీ మైండ్లో పడిపోయింది. లెంపలేసుకుని క్షమాపణలు చెబితే స్వామి వారు క్షమిస్తారు. సీబీఐ రిపోర్టును వక్రీకరించి అసెంబ్లీలో చెబుతున్నారు. జంతువుల కొవ్వు లేదని రిపోర్టుల్లో స్పష్టంగా ఉన్నా ఇంకా బుకాయిస్తున్నారు. ఇందాపూర్పై చర్చకు రమ్మన్నా కౌన్సిల్లో రాలేకపోతున్నారు. లడ్డూ మీద మాట్లాడదామన్నా కౌన్సిల్కు రారు. హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్గా ఇందాపూర్ డెయిరీ 2026 ఫిబ్రవరి 15న కో మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్గా ఎలా మారిందో, ఎందుకు మారిందో చంద్రబాబు సమాధానం చెబుతారా? 2026 ఫిబ్రవరి 14న హెరిటేజ్ ఫుడ్స్ నేషనల్ సేల్స్ హెడ్గా ఉన్న మకరంద్ శాస్త్రి ఎందుకు రాజీనామా చేశారు? చంద్రబాబు 2015లో అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ ఇందాపూర్ డెయిరీ నుంచి కిలో నెయ్యి రూ.278కి కొన్నది నిజమా? అబద్ధమా? 2016 మార్చి 18న ఇది ల్యాబ్ రిపోర్టులో రిజెక్ట్ అయ్యిందా? లేదా? రిజెక్ట్ అయినప్పుడు మళ్లీ మూడు నెలలకే అనుమతించడంలో ఆంతర్యమేమిటి? హెరిటేజ్కు కో మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్గా ఉన్న ఇందాపూర్కు టెండర్ ఎలా ఖరారు చేశారో చెప్పాలి. మీ దగ్గర బ్రాండ్ తప్ప మాన్యుఫ్యాక్చరింగ్ లేదు. చట్టసభల సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. -
రేపు అపెక్స్–కేఎస్పీఎల్ మారథాన్
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ‘ఆమె భద్రత–మన బాధ్యత’ అనే నినాదంతో అపెక్స్–కాకినాడ సీపోర్ట్స్ (కేఎస్పీఎల్) మారథాన్–2026 నిర్వహిస్తున్నట్లు కాకినాడ రన్నర్స్ ట్రస్టు ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ సుధా కేశవరాజు తెలిపారు. ఎన్టీఆర్ బీచ్ నుంచి ఉప్పాడ వరకూ 4 కేటగిరీల్లో ఈ మారథాన్ రన్ జరుగుతుందన్నారు. ఈ రన్కు సంబంధించిన మెడల్స్, టీ–షర్ట్స్ ఆవిష్కరణ, కార్యక్రమ నిర్వహణ సన్నాహక సమావేశం స్థానిక జీఆర్టీ గ్రాండ్ హెూటల్లో గురువారం జరిగింది. ఈ సందర్భంగా సుధా కేశవరాజు మాట్లాడుతూ, ఆదివారం ఉదయం 5.30 గంటలకు మారథాన్ రన్ ప్రారంభమవుతుందని తెలిపారు. తొలుత 21.1 కిలోమీటర్ల పరిధికి, 6 గంటలకు 10 కిలోమీటర్లకు ఆఫ్ మారథాన్, 6.30 గంటలకు 5 కిలోమీటర్లకు మారథాన్, అదే సమయానికి 3 కిలోమీటర్ల ఫన్ రన్ నిర్వహిస్తున్నామని వివరించారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి దాదాపు 1,500 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. మారథాన్ రన్లో పాల్గొనే వారి కోసం, హైడ్రేషన్, వైద్య సహాయం, రెడ్క్రాస్ వలంటీర్ల సహకారంతో పాటు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని ఆమె వెల్లడించారు. మారథాన్ రేస్ డైరెక్టర్, కాకినాడ రన్నర్స్ ట్రస్టీ కమాండెంట్ ఎన్ఎల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, మారథాన్ రన్ను 50 ఏళ్లలోపు ఓపెన్ కేటగిరీలోను, 50 ఏళ్లు పైబడిన వారికి వెటరన్ కేటగిరీలోను నిర్వహిస్తామన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు కూడా అందజేస్తామని చెప్పారు. ఈ మారధాన్ ఎనిమిదోసారి ఇక్కడ జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో కేఎస్పీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మెర్ల మురళీధర్, అపెక్స్ సంస్థ ప్రతినిధి మాధవి, సంకురాత్రి ఫౌండేషన్ రమణమూర్తి, జీఆర్టీ గ్రాండ్ జీఎం రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
బాలల రక్షణే ధ్యేయం
కాకినాడ క్రైం: బాలల రక్షణ, భద్రతే ధ్యేయమని పలువురు అధికారులు అన్నారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ సహా మరో ఆరు శాఖల సమన్వయంతో కాకినాడ పోలీస్ కన్వెన్షన్ హాలులో శుక్రవారం నిర్వహించిన సదస్సులో ఎస్పీ బిందుమాధవ్, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బాల్యాన్ని రక్షించుకోవలసిన ఆవశ్యకతతో పాటు బాలలను రక్షించే వివిధ విధానాలపై ఈ సందర్భంగా చర్చించారు. వివిధ శాఖలకు చెందిన సిబ్బంది సుమారు 350 మంది పాల్గొనగా, వంద మందికి పైగా కూర్చునే ఏర్పాట్లు లేక మెట్లపై, ఆరుబయట కూర్చున్నారు. భోజనం ఏర్పాట్లు తగినంతగా చేయకపోవడంతో సిబ్బందిలో అధికులు బయటకు వచ్చి ఆహారం కొనుక్కున్నారు. తగిన ఏర్పాట్లు లేక ఇబ్బందులు పడ్డామని పలువురు మహిళలు వాపోయారు. మరింత విషమంగా కల్తీ పాల బాధితుల ఆరోగ్యం 8 నుంచి 11కు చేరిన వెంటిలేటర్, డయాలసిస్ కేసులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కల్తీ పాల ఘటనలో తీవ్ర అనారోగ్యం పాలై, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం రోజురోజుకూ మరింత విషమంగా మారుతోంది. ఈ ఘటనలో మొత్తం 15 మంది చికిత్స పొందుతూండగా.. వీరిలో వెంటిలేటర్పై ఒకరు, డయాలసిస్ ఆరుగురు, వెంటిలేటర్, డయాలసిస్పై ఎనిమిది మందికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అధికారులు శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం డయాలసిస్ 4, వెంటిలేటర్, డయాలసిస్పై 11 మందికి అత్యవసర చికిత్సలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా రోజూ మాదిరిగానే 110 మంది కల్తీ పాల వినియోగదారుల ఇళ్లలో వైద్య బృందాలు సర్వే చేసి, వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాయి. వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలూ నమోదు కాలేదు. వచ్చే నెల 4వ తేదీ వరకూ ఈ సర్వే నిర్వహించనున్నారు. కల్తీ పాలను గుర్తించడంపై అవగాహనఅమలాపురం టౌన్: పాలు కల్తీ అయ్యాయో లేదో ఇంట్లోనే తెలుసుకోవడానికి సులభమైన కొన్ని పరీక్షలను అమలాపురం పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు (ఏడీఏ) డాక్టర్ ఎల్.విజయరెడ్డి వివరించారు. స్థానిక పద్మినీ పేట ప్రాంతంలోని వీరన్న డెయిరీ వద్ద పాడి రైతులకు శుక్రవారం అవగాహన కల్పించారు. నీటి శాతం, స్టార్చ్, యూరియా, డిటర్జెంట్ వంటి కల్తీలను సులభంగా పరీక్షించవచ్చని సూచించారు. తాజా పాలు తెల్లగా, చిక్కగా ఉండి ఎక్కువ సేపు నిల్వ ఉంటే ఆ పాలు మంచివని నిర్ధారించవచ్చన్నారు. ఇంట్లోనే పాలు నాణ్యతను పరీక్షించే విధానాలను ఆయన ఆయా పరికరాలతో ప్రయోగాల ద్వారా ప్రత్యక్షంగా చూపించారు. వాటర్, షేక్ టెస్ట్లు తదితర విధానాలను వివరించారు. తాజా పాలు మంచి సువాసన కలిగి ఉంటాయని, రసాయనాల వాసన రావని తెలిపారు. పాలు మరిగించినప్పుడు ఆ పాలు కల్తీ స్వభావం బయట పడుతుందన్నారు. సింథటిక్ పాలను మరిగించినప్పుడు నురగ వచ్చి మీగడ ఏర్పదని విజయరెడ్డి వివరించారు. అన్నదాన పథకానికి విరాళాలుఆత్రేయపురం: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి గాంచిన వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో అన్నదాన పథకానికి పలువురు వివరాలు సమర్పించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్కు చెందిన నడింపల్లి కృష్ణ సూర్యవర్మ, కుటుంబ సభ్యులు రూ.లక్ష, ఈతకోటకు చెందిన కలిదిండి సాయిమణికంఠ, వెంకట కాశి హర్షిత్వర్మ రూ.50 వేలు, విశాఖపట్నం పెందుర్తి వాస్తవ్యులు మహాదేవ్ కార్తికేయ కుటుంబ సభ్యులు రూ.30 వేలు విరాళాలు అందించారు. దాతలకు స్వామివారి పటాలను అధికారులు, పాలకవర్గ సభ్యులు అందించారు. గిరిజనులు ఆర్థికంగా అభివృద్ది చెందాలి రంపచోడవరం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు బాగా చదువుకోవాలని జాతీయ మానవ హక్కుల మానిటరింగ్ అధికారి హేమంత్ కుమార్ అన్నారు. మారేడుమిల్లిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను, కొత్త కాలనీలో అంగన్వాడీ కేంద్రాన్ని, కుట్రవాడలో జాఫ్రా ప్రాసెసింగ్ యూనిట్ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులకు నిబంధనల ప్రకారం ఆహారం అందించాలన్నారు. విద్యార్థులు తెలుగు, ఇంగ్లిషుతో పాటు హిందీ చదవడం, రాయడం నేర్చుకోవాలని సూచించారు. -
త్వరలో ఎస్ఐఆర్
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రారంభం కానున్నదని డీఆర్ఓ పి.తిప్పేనాయక్ తెలిపారు. జిల్లాలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ఐఆర్ ప్రక్రియ జిల్లాలో సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని కోరారు. వివిధ పార్టీలు బూత్ ఏజెంట్లను తప్పనిసరిగా నియమించుకోవాలన్నారు. దీనికోసం బీఎల్ఏ–2 ఫామ్లో వివరాలు తెలియజేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1,640 పోలింగ్ కేంద్రాల్లో 16,48,436 మంది ఓటర్లుగా నమోదయ్యారన్నారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపు, కొత్త ఓటు నమోదు వంటి అంశాలపై ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ నెల 26వ తేదీ వరకూ ఫామ్ 6, 7, 8కు సంబంధించి 1,818 అభ్యంతరాలు వచ్చాయన్నారు. వీటన్నింటినీ నిర్దిష్ట సమయంలోగా పరిష్కరిస్తామన్నారు. ఓటర్ల సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుని పునర్వ్యవస్థీకరణ, కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. పోలింగ్ నిర్వహణకు అనువుగా లేని కేంద్రాలను అనువైన మరో భవనంలోకి మార్చేందుకు ప్రతిపాదిస్తామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,640 పోలింగ్ కేంద్రాలున్నాయని, హేతుబద్ధీకరణ ప్రకారం అదనంగా 183 కొత్త కేంద్రాలు రానున్నాయని డీఆర్ఓ వివరించారు. భార్య మృతికి కారకుడైన భర్తకు జీవిత ఖైదు కాకినాడ లీగల్: కట్నం కోసం వేధించి, భార్య మృతికి కారకుడైన భర్తకు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జి జి.ఆనంది శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం కోట గ్రామానికి చెందిన అనసూరి వెంకట రమణతో కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల గుబ్బలవారిపాలేనికి చెందిన కట్టా పద్మలక్ష్మికి గతంలో వివాహం జరిగింది. అనంతరం వారు కాకినాడ రూరల్ సర్పవరంలో కాపురం ఉండేవారు. వివాహ సమయంలో ఐదు కుంచాల పొలం, రూ.1.50 లక్షల నగదు, 2 కాసుల బంగారం, మోటార్ సైకిల్ కట్నంగా ఇచ్చారు. వివాహమైన అనంతరం కట్నం తక్కువ ఇచ్చారంటూ రమణ తన భార్యను వేధించేవాడు. మరో మహిళతో తరచూ ఫోన్లో మాట్లాడేవాడు. 2011 అక్టోబర్ 31న పద్మలక్ష్మిని హతమార్చాడు. దీనిపై పద్మలక్ష్మి తండ్రి కట్టా సత్యనారాయణ ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో రమణపై నేరం రుజువైంది. అదనంగా డబ్బులు డిమాండ్ చేసినందుకు మూడేళ్ల జైలు, రూ.5 వేలు జరిమానా, హత్య చేసినందుకు జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. రెండు శిక్షలూ ఏకకాలంలో అమలు చేయాలని ఆదేశించారు. -
‘చంద్రబాబు కల్తీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు’
కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్తీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు.. కల్తీ ప్రభుత్వాన్ని మాత్రం నడుపుతున్నారని విమర్శించారు. వ్యవసాయంపై ప్రభుత్వ పెద్దలు అసెంబ్లీలో మాట్లాడలేదంటేనే సర్కార్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాజమండ్రిలో కల్తీ పాలు, శ్రీకాకుళంలో కల్తీ నీళ్లు అన్నట్లుగా చంద్రబాబు సర్కార్ పనితీరు ఉందని విమర్శించారు. కల్తీ పాలతో ప్రాణాలు పోతుంటే టీడీపీ ఎమ్మెల్యేలు క్రికెట్ ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పాము కాటుకు చిన్నారి మృతి
నల్లజర్ల: పాము కాటుకు గురై ఓ చిన్నారి మృతి చెందింది. ఆ వివరాల ప్రకారం.. అనంతపల్లిలో చోడవరం రహదారి పక్కన నివాసం ఉంటున్న తీగల ప్రకాష్, ధనలక్ష్మి దంపతుల కుమార్తె వన్సిక (3) బుధవారం సాయంత్రం ఆరుబయట మూత్ర విసర్జనకు వచ్చింది. పక్కనే చెత్తలో ఉన్న తాచుపాము ఆమెను కాటేసింది. జరిగిన సంఘటన తల్లికి చెప్పి ఆ బాలిక కుప్పకూలిపోయింది. వెంటనే ఆ బాలికను చికిత్స నిమిత్తం నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్టు సమీప బంధువులు తెలిపారు. ఆ బాలిక తండ్రి ప్రకాష్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. కుమార్తె మరణ వార్త విని స్వస్థలానికి తిరిగి వస్తున్నారు.గీత కార్మికుడు..చాగల్లు: పాము కాటుకు గురై ఓ కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. చాగల్లుకు చెందిన దొంగ వెంకటేశ్వరరావు (51) గీత కార్మికుడు. నెలటూరు గ్రామ పరిధిలోని రుద్రబోయిన బుల్లిరాజుకు చెందిన పొలంలో తాటిచెట్ల వద్దకు వెళ్లి కల్లు తీయడానికి వెళ్తుండగా విష సర్పం కాటేసింది. అతన్ని వెంటనే బంధువులు చికిత్స నిమిత్తం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా, మార్గం మధ్యలోనే మృతి చెందారు.భార్యపై కత్తితో దాడిఅన్నవరం: మద్యం మత్తులో భార్యపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. అన్నవరం గ్రామ శివారు కొత్తపేటలో భార్యాభర్తలు ఆవాల శ్రీను, రత్నం నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీనుకు అతని భార్యతో తరచూ గొడవలు జరుగుతుండేవి. గురువారం మధ్యాహ్నం శ్రీను మద్యం తాగి కత్తితో రత్నంపై దాడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆమెను హుటాహుటిన తుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. శ్రీనుపై కేసు నమోదు చేశామని అన్నారు.కంటైనర్, కారు ఢీశంఖవరం: కత్తిపూడి జాతీయ రహదారిపై కంటైనర్, కారు ఢీకొన్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. సీతంపేట సమీపంలో కంటైనర్, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు క్రమబద్ధీకరించారు. అనంతరం ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు, అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు ఆ వాహనాలను తనిఖీ చేశారు.చైన్ స్నాచర్లను పట్టుకున్న ప్రజలుఐ.పోలవరం: ఓ మహిళ మెడలో బంగారు ఆభరణాలను చోరీ చేసిన చైన్ స్నాచర్లను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎస్సై రవీంద్రబాబు కథనం ప్రకారం.. మురమళ్ల నుంచి పశువుల్లంకకు బైక్పై వెళుతున్న దంపతులను వెంబడించి మహిళ మెడలోని బంగారు గొలుసును ఇద్దరు అంగతకులు లాక్కుని మోటారు సైకిల్పై పరారయ్యారు. దీనిని గుర్తించిన స్థానికులు వారిని వెంబడించారు. సలాదివారిపాలెం లంకలో వారిని పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. బాధితురాలు రాజ్యలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై వివరించారు. -
అర్తమూరు మాజీ సర్పంచ్ భూలక్ష్మి మృతి
కపిలేశ్వరపురం (మండపేట): మండపేట మండలం అర్తమూరు గ్రామ మాజీ సర్పంచ్ పడాల భూలక్ష్మి (61) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. 2001–06 మధ్య ఆమె సర్పంచ్గా పనిచేసి గ్రామానికి విశేష సేవలందించారు. ఆమెకు భర్త పడాల సుబ్బారెడ్డి, కుమారుడు భాస్కరరెడ్డి, కుమార్తె సత్యశ్రీ ఉన్నారు. భర్త పడాల సుబ్బారెడ్డి ప్రాంతీయ కోళ్ల రైతుల సంఘం అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడుకు భూలక్ష్మి సోదరి. అర్తమూరులో భూలక్ష్మి పార్థివదేహాన్ని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, పలువురు రాజకీయ, వ్యాపార, నియోజకవర్గ ప్రముఖులు సందర్శించారు. పడాల సుబ్బారెడ్డిని పరామర్శించారు. -
నిమ్మండి.. దిగులేనండి
దేవరపల్లి: నిమ్మ పంట దిగుబడి పులుపెక్కింది.. ఈ ఏడాది దారుణంగా పడిపోయింది.. కాయలు లేక తోటలు కళావిహీనంగా మారి, రైతన్నలకు కష్టం తెచ్చింది.. ధర బాగున్నా, దిగుబడి లేకుండా పోయింది.. ఎకరాకు 2.5 టన్నులు రావాల్సి ఉండగా, టన్ను కాయలూ కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో పెట్టిన పెట్టుబడి, కౌలు సొమ్ము వచ్చేట్టు కనిపించడం లేదు. ధర బాగున్నా దిగుబడులు తగ్గడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలోని ఎర్రనేలల్లో నిమ్మకాయల తోటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు.కొవ్వూరు డివిజన్ దేవరపల్లి, గోపాలపురం, చాగల్లు, తాళ్లపూడి, పెరవలి, నిడదవోలు మండలాల్లో సుమారు 2,200 ఎకరాల్లో నిమ్మ తోటలు సాగవుతున్నాయి. దేవరపల్లి మండలం యాదవోలు, చిన్నాయగూడెం, కొత్తగూడెం గ్రామాల్లో ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ మండలంలో సుమారు 800 ఎకరాలు ఉంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో పూత రాగా, ఫిబ్రవరి నెల నుంచి దిగుబడి వస్తుంది. జనవరి, ఫిబ్రవరిలో వచ్చిన పూతతో ఏప్రిల్ నుంచి జూన్ వరకూ దిగుబడి ఉంటుంది. ఈ ఐదు నెలలు నిమ్మకాయలకు మార్కెట్లో డిమాండ్ ఉంటోంది. వేసవిలో పండిన కాయలకు గిరాకీ ఉండి గిట్టుబాటు ధర లభిస్తోంది. వర్షాకాలంలో పండిన కాయలకు డిమాండ్ ఉండదు. వర్షాకాలంలో పూత శీతాకాలంలో కాపుఉంటోంది. అయితే నిమ్మకాయల వినియోగం తక్కువగా ఉండడంతో కొనుగోళ్లు అంతంత మాత్రంగా ఉంటాయి. కిలో రూ. 8 నుంచి రూ.10 పలుకుతాయి. అయినా కొనుగోలు చేసే నాధుడు కనిపించక రైతులు చెట్ల కిందే వదిలేస్తారు. ప్రస్తుతం కిలో రూ.80మార్కెట్లో నిమ్మకాయల ధర ఆశాజనకంగా ఉంది. మొన్నటి వరకూ కిలో కాయలు రూ. 8 నుంచి రూ.10 పలికగా, ప్రస్తుతం రూ.80 నుంచి రూ.90కు చేరింది. ఎండల తీవ్రత పెరగడంతో పాటు తోటలు కాపులు లేక దిగుబడులు తగ్గడంతో మార్కెట్లో ధర పెరిగింది. గత ఏడాది ఫిబ్రవరిలో కిలో రూ. 40 ఉంది. అయినప్పటికీ వేసవి పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో గిట్టుబాటు అయ్యింది. కిలో కాయలు రూ. 35 నుంచి రూ.50 నిలకడగా కొనసాగడంతో పెట్టుబడి పోను రైతులు నాలుగు డబ్బులు మిగిలాయి. ఈ ఏడాది వేసవి సీజన్లో మార్కెట్లో ధర రూ.120 దాటవచ్చని రైతులు అభిప్రాయపడుతున్నారు. కౌలు రైతులకు తప్పని నష్టంనిమ్మ సాగు చేస్తున్న రైతుల్లో ఎక్కువ మంది కౌలు దారులున్నారు. వీరి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్కొక్కరు 5 నుంచి 10 ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఎకరం కౌలు రూ. 90 వేల నుంచి రూ. లక్ష వరకు ఉండగా, పెట్టుబడి మరో రూ. 25 వేలు అవుతుంది. నిమ్మతోటకు ఏడాది పొడవునా పెట్టుబడి పెట్టాల్సి ఉంది. ఎక్కువగా సేంద్రియ ఎరువులను వేయాలి. ప్రస్తుత పరిస్థితిలో దిగుబడులు లేక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.యాదవోలు మార్కెట్లో విక్రయాలుయాదవోలు మార్కెట్లో రైతులు పంటను అమ్ముకుని సొమ్ము చేసుకుంటారు. ప్రస్తుతం మార్కెట్కు రోజుకు 20 నుంచి 25 టన్నుల కాయలు వస్తున్నాయి. కాపులు బాగుంటే రోజుకు 60 నుంచి 70 టన్నుల విక్రయాలు జరుగుతాయి. దేవరపల్లి మండల పరిసర గ్రామాల నుంచి పంటను రైతులు యాదవోలు మార్కెట్కు తీసుకువస్తారు. ఏలూరు తర్వాత పెద్ద మార్కట్ యాదవోలు. ఇక్కడ మార్కెట్లో కొనుగోలు చేసిన కాయలను ఒడిశా, కోల్కతా, విశాఖ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. కలుపు మందుల ఎఫెక్ట్ నిమ్మ తోటలకు విచ్చలవిడిగా కలుపు మందు పిచికారీ చేస్తున్నారు. దీని ప్రభావం మొక్కలపై పడి దెబ్బతింటున్నాయి. తోటలు నిగనిగలాడడంలేదని, ఎర్రబడి కొమ్మలు ఎండిపోతున్నట్టు రైతులు తెలిపారు. కలుపు మందులతో పాటు క్రిమిసంహారక మందుల వాడకం ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. గతంలో కాయలు గుత్తులుగా ఉండేదని, చెట్టుకు 100 కిలోల కాయల దిగుబడి వచ్చేవని రైతులు తెలిపారు. ఎకరాకు ఏడాదికి 40 క్వింటాళ్లు దిగుబడి వచ్చేవని అన్నారు. పెట్టుబడి కూడా రాదునిమ్మ ధర బాగుంది. అయితే దిగుబడి లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక తోటలు కాపులు కాయలేదు. ఎకరాకు 3 టన్నుల కాయలు దిగుబడి రావాల్సి ఉండగా, టన్ను కూడా లేవు. పెట్టుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 100 కిలోల కాయలు కోయడానికి రూ. 2,200 ఖర్చు అవుతుంది. వేసవి పంటలపై ఆశలు పెట్టుకుంటాం. ఈ సారి ఆశాజనకంగా లేదు. – గడా రాంబాబు, నిమ్మ రైతు, చిన్నాయగూడెం, దేవరపల్లి మండలంవేసవి పంటపైనే ఆశలువేసవి పంటపై ఆశలు పెట్టుకున్నాం. ప్రస్తుతం దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం యాదవోలు మార్కెట్లో కిలో కాయలు రూ. 80 పలుకుతున్నాయి. డిసెంబర్, జనవరిలో కిలో ధర రూ. 8 ఉంది. ఈ నెలలో ధర పెరిగింది. ధర ఉన్నప్పటికీ దిగుబడులు లేవు. నిమ్మ రైతుల్లో ఎక్కువ మంది కౌలు దారులు ఉన్నారు. వారంతా ఇబ్బంది పడుతున్నారు.– లకంసాని శ్రీనివాసరావు, నిమ్మరైతు, చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం -
క్షణికావేశానికి పసికందు బలి
జగ్గంపేట: ఆ చిన్నారి ఏం చేసిందో.. అమ్మా నాన్న అనడం కూడా రాని ఆ పసి ప్రాయాన్ని కన్న తండ్రే కడతేర్చాడు.. క్షణికావేశంలో కన్న బంధాన్నే మరిచాడు.. మద్యం మత్తులో తీసుకున్న నిర్ణయంతో ఓ చిన్నారి ప్రాణాలను హరించాడు. ఈ సంఘటన అందరి హృదయాలను కలిచివేసింది. జగ్గంపేటలో గురువారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. స్థానికులు, జగ్గంపేట ఎస్సై రఘునాథరావు కథనం ప్రకారం.. జగ్గంపేట టీచర్స్ కాలనీలో ఓడిబోయిన మణికంఠ (23), అతని భార్య ఓడిబోయిన సాయి (25) నివాసం ఉంటున్నారు. వీరిది కులాంతర వివాహం. అయితే సాయికి గతంలోనే వివాహం జరగడం ఆరేళ్ల కూతురు ఉండగా, భర్తతో విడిపోయింది. అనంతరం మణికంఠతో పరిచయం ఏర్పడి వివాహం చేసుకుంది. వీరికి ఆడపిల్ల ఉంది. ఆ పాపకు 11 నెలలు. అయితే భర్త తరచూ మద్యం తాగడం, సంపాదన గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా తిరగడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సాయి రెండు రోజుల క్రితం స్థానిక గోకవరం రోడ్డులోని పుట్టింటికి వెళ్లిపోయింది. గురువారం సాయంత్రం మద్యం తాగి అత్తవారింటికి వెళ్లిన మణికంఠ భార్యతో ఘర్షణకు దిగాడు. దీంతో అత్తింటివారు చివాట్లు పెట్టి, నీ కూతురిని తీసుకుని వెళ్లి పోషించుకో అని అనడంతో మద్యం మత్తులో ఉన్న మణికంఠ 11 నెలల చిన్నారితో సహా అక్కడి నుంచి మోటారు సైకిల్పై వచ్చేశాడు. మత్తు దిగిన తరువాత తిరిగి వస్తాడని భావిస్తున్న భార్య, అత్తకు పిడుగులాంటి వార్త తెలిసింది.మోటారు సైకిల్తో సహా కాలువలోకి..11 నెలల తన కూతురుతో సహా ఆవేశంగా బయలు దేరిన మణికంఠ, నేరుగా జగ్గంపేట నుంచి గుర్రంపాలెం వెళ్లే రహదారిలో ఉన్న పోలవరం కాలువలోకి మోటారు సైకిల్తో సహా దూసుకుపోయాడు. అయితే పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి తక్షణం కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉంది. మణికంఠను కాపాడి గట్టుపైకి తీసుకువచ్చారు. పోలవరం కాలువకు సమీపంలో ఉన్న వివేకానంద విద్యా సంస్థల అధినేత, రాష్ట్ర వైఎస్సార్ సీపీ నేత ఒమ్మి రఘురామ్కు సమాచారం తెలియడంతో తక్షణం ఆయన సంఘటన స్థలానికి చేరుకుని తన కారులో చిన్నారిని, మణికంఠను జగ్గంపేట సీహెచ్సీకి తీసుకువెళ్లారు. అయితే డాక్టర్లు పరీక్షించి చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.బోరున విలపించిన కుటుంబ సభ్యులుఆవేశంగా వెళుతుంటే కొద్ది సేపటికి తిరిగి వస్తాడని భావించానని, కానీ కూతురి ప్రాణాలు తీస్తాడని అనుకోలేదని తల్లి సాయి, ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపించారు. స్థానికులు ఆగ్రహంతో మణికంఠకు దేహశుద్ధి చేశారు. -
ఏమన్నుకుండా వదిలేసి..
అయినవిల్లి: అక్రమార్కులు లంకలపై పడ్డారు.. యథేచ్ఛగా మట్టి తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు.. పచ్చని పంటలను పండించే సారవంతమైన సొసైటీ భూములను కొంతమంది కాసులకు కక్కుర్తి పడి అమ్ముకుంటున్నారు. అయినవిల్లి మండలం మడుపల్లిలంక నదీ పరివాహక ప్రాంతంలో సొసైటీ భూముల్లో యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు సాగిపోతున్నాయి. అధికార అండతో కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. రైతుల ఆధీనంలో ఉన్న సొసైటీ భూములను కొందరు డబ్బు ఎరచూపి ఎక్కడికక్కడే తవ్వేస్తున్నారు. గతంలో అయినవిల్లిలంకలో ఈ తవ్వకాలు జరిగాయి. ఇప్పుడు మడుపల్లిలంకకు ఈ అక్రమ దందా పాకింది. గోదావరి పాయ వెంబడి, ఏటిగట్టును ఆనుకుని ఉన్న భూములను మట్టి కోసం కొనుగోలు చేసి రాత్రిళ్లు యథేచ్ఛగా తవ్వుకుని పోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం మిన్నకుండి పోతుండడం గమనార్హం. ఈ పంట భూముల్లో కొబ్బరి, కూరగాయ, మొక్కజొన్న, మునగ, పుచ్చకాయలు, దోసకాయ, బొప్పాయి పంటలు పండించి ఎంతోమంది రైతులు జీవనోపాధి పొందుతున్నారు. ఈ మట్టిని అక్రమంగా తరలించడం వల్ల మొత్తం పంట భూములు నదీ గర్భంలో అవకాశం లేకపోలేదు. భవిష్యత్తులో ఇక్కడ పండించడానికి భూములు లేక రైతులు తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఎటువంటి అనుమతులు లేకుండా లంకలను కొల్లగొడుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రొక్లెయినర్ల సాయంతో భారీ లారీల ద్వారా కొత్తపేట, రావులపాలెంలలోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఇలా రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.ఫ లంకలను కొల్లగొడుతున్న మాఫియా ఫ యథేచ్ఛగా మట్టి తరలింపు -
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వండి
● సంక్షేమ పథకాలు అమలు చేయండి ● అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్ ● కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు ప్రారంభం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, తమకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు మూడు రోజుల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఈ దీక్షలను కలెక్టరేట్ వద్ద సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, కోశాధికారి మలకా రమణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుబండి చంద్రావతి, కోశాధికారి రామలక్ష్మి మాట్లాడుతూ, అంగన్వాడీ కార్యకర్తలకు ఏడేళ్లుగా వేతనాలు పెంచలేదని అన్నారు. ఇదే సమయంలో ధరలు వందల రెట్లు పెరిగాయని, ఈ నేపథ్యంలో అంగన్వాడీలకు రూ.26 వేల కనీస వేతనం తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయాకు రూ.7 వేలు, టీచర్కు రూ.11,500 మాత్రమే చెల్లిస్తూ, ప్రభుత్వ వెబ్సైట్లో మాత్రం ప్రభుత్వోద్యోగులుగా నమోదు చేశారని, ఆ సాకుతో తమకు అన్ని సంక్షేమ పథకాలనూ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ, పాండిచ్చేరి రాష్ట్రాల మాదిరిగా అంగన్వాడీలకు కూడా పీఆర్సీ వర్తింపజేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు ఆటపాటలతో విద్యనందించే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్ఎస్ తీసుకువచ్చి పని ఒత్తిడి పెంచిందని అన్నారు. ఐసీడీఎస్ నిధులు తగ్గిస్తూంటే, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి, లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నించడం మానుకోవాలని, 2019లో నిర్ణయించిన మెనూ చార్జీలను నేటి ధరలకు అనుగుణంగా పెంచాలని, పెండింగులో పెట్టిన 168 సూపర్వైజర్ పోస్టులను తక్షణం భర్తీ చేయాలని, బాలింతలకు ఇచ్చే బియ్యం, పప్పు, ఆయిల్ నాణ్యతను పెంచాలని డిమాండ్ చేశారు. -
కోరుకొండ తీర్థం ప్రారంభం
● దేవుని కోనేరు నుంచి పుట్టమన్ను సేకరణ ● ఏర్పాట్లను పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు కోరుకొండ: కోరుకొండలో కొలువుదీరిన శ్రీలక్ష్మీనరసింహస్వామి తీర్థం గురువారం ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం నుంచి వైఖానస ఆగమ పండితుల ఆధ్వర్యంలో స్థానిక అర్చకస్వాములు స్వామివారి కోనేరు వద్ద నుంచి పుట్టమన్నును ఆలయానికి తీసుకొచ్చారు. అంకురార్పణ, ధ్వజారోహణం, నిత్య గ్రామ బలిహరణ, సేవాకాలం నిర్వహించారు. కొండపైన, కింద ఆలయాల్లో ఆరగింపు, జయగంట కార్యక్రమాలు జరిగాయి. తీర్థం సందర్భంగా కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రథోత్సవం సాగే ప్రాంతాలను అదనపు ఎస్పీ చెంచురెడ్డి, డీఎస్పీ రామకృష్ణ పరిశీలించారు. స్వామి మాలధారణ నారసింహుని ఉత్సవాల సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు మాలధారణ చేశా రు. వీరంతా స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణ మండపంలో తొమ్మిది రోజులుగా దీక్షలు నిర్వహించా రు. శుక్రవారం స్వామివారి రథోత్సవం, రాత్రి కల్యా ణం అనంతరం, శనివారం దీక్ష విరమించనున్నారు. నేటి నుంచి విశిష్టాద్వైత సభలు స్వామివారి ఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక రంగనాథస్వామి దేవాలయంలో ఎస్పీ నరసింహరాజభట్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి విశిష్టాద్వైత సభలు నిర్వహించనున్నారు. దీనికి భద్రాచలం, సింహాచలం నుంచి పండితులు హాజరవుతారు. వీరంతా స్వామి ఔన్నత్యాన్ని తెలియజేస్తారు. పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఎస్పీ రంగరాజ భట్టర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో అన్నవరం దేవస్థానం అధికారులు, అర్చక స్వాములు, కోరుకొండ ఎస్సై ఎస్.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
గాండ్రింపులివి..!
రంపచోడవరం: మన్యంలో పెద్ద పులి సంచారంతో పెదకొండ గిరిజనులు హడలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందో అనేది తెలియక ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపిన పులిని పాపికొండలు నేషనల్ పార్కులో విడిచిపెట్టగా, అది మారేడుమిల్లి మండలం రామన్నవలస, సున్నంపాడు మీదుగా రంప, పెదకొండ ప్రాంతానికి చేరుకుందని ఓ అధికారి చెబుతున్నారు. పెదకొండ గ్రామానికి ఆనుకుని ఉన్న కొండపోడు, చేను మకాంలో ఆవు, దూడలపై బుధవారం రాత్రి ఆ పులి దాడి చేసింది. ఆవు మెడపై గాయపరచడంతో పశు వైద్యులు 12 కుట్లు వేశారు. దూడను కూడా మెడపై కరిచింది. రంప కొండపై జలపాతం నుంచి పెదకొండ గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతానికి పులి చేరుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పాపికొండలు నేషనల్ పార్కు నుంచి సున్నంపాడు మీదుగా సీతపల్లి వాగు దాటి పులి రంప వచ్చిందని దానికి అమర్చిన జియో ట్యాగ్ ద్వారా తెలిసిందని మంగళవారం ఇక్కడి అధికారులు వివరించారు. అయితే అదేరోజు రాజమహేంద్రవరంలో సీసీఎఫ్ నీలకంఠరెడ్డి రంప ప్రాంతంలోకి వచ్చిన పులి, పాపికొండల్లో వదలిపెట్టిన పులి ఒకటి కాదని చెప్పారు. ఇద్దరు అటవీ ఉన్నతాధికారులు పులి కదలికలపై భిన్నమైన సమాచారాన్ని చెప్పారు. ఈ పరిస్థితుల్లో గిరిజనుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. జీడిపిక్కల సీజన్ కావడంతో... జిల్లాలో గిరిజనులకు ఆదాయ వనరుల్లో జీడిపిక్కల సేకరణ ప్రధానమైంది. ఈ సీజన్లో కొండపోడు, జీడిమామిడి తోటల్లో జీడిపిక్కలను సేకరించి అమ్ముకుంటారు. ప్రస్తుతం పూత దశలో ఉండడంతో జీడిమామిడి తోటలను శుభ్రం చేసుకోవడం, పూత రాలిపోకుండా మందులు పిచికారీ చేయించడం వంటివి చేయించుకుంటారు. పులి భయంతో వారు జీడిమామిడి తోటలకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. పెదకొండ నుంచి దిగువన చుట్టుపక్కల సుమారు 30 గ్రామాల వరకూ ఉన్నాయి. పులి ఎప్పుడు ఎలా వస్తుందోననే భయందోళనలో గిరిజన రైతులు ఉన్నారు. పులిని పట్టుకుని మరోచోట వదిలి పెట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆవు, దూడలపై దాడి చేసిన పులి గ్రామంలోకి వస్తే పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది. రక్షణ లేని పూరి పాకల్లో అనేక మంది నివాసం ఉంటున్నారు. వాటికి తలుపులూ ఉండవు. ప్రస్తుతం పులి గ్రామానికి కిలోమీటరు దూరంలోని కొండల్లో ఉంది. దీంతో భయాందోళన నెలకొంది. ఇదిలా ఉంటే పులి పంజాతో దూడ మెడపై గాట్లు పెట్టిందని, దాని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని రంపచోడవరం పశు సంవర్ధక శాఖ డీడీ షరీఫ్ అన్నారు. పశు వైద్య సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. ఆవుకు మెడపై కుట్లు వేశామని, ఆహారం తీసుకోకపోవడంతో నీరసంగా ఉందన్నారు. సైలెన్ ఎక్కిస్తున్నామని తెలిపారు. ఫ మన్యంలో పులి సంచారంపై భిన్న కథనాలు ఫ ఒకే శాఖ అధికారుల్లో సమన్వయ లోపం ఫ పెదకొండలో రెండు మూగజీవాలపై దాడి -
పాపాల వ్యాపారం
పిఠాపురం: తెల్లనివన్నీ పాలు కాదని అంటారు. ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే ఇది నిజమనిపించక మానదు. పసి పిల్లల నుంచి పెద్దల వరకూ నిత్యం ఉపయోగించే పాలల్లో కొందరు వ్యాపారులు ఎన్నో విధాలుగా కల్తీకి పాల్పడుతున్నారు. వివిధ రకాల పదార్థాలు, రసాయనాలు కలిపి కల్తీకి పాల్పడటం అందరికీ తెలిసిందే. కానీ, లాభార్జనే ధ్యేయంగా కొంత మంది స్వార్థపరులు పాడి పశువుకు నేరుగా ప్రమాదకర ఇంజెక్షన్ ఇస్తూ కూడా కొంత మంది పా‘పాల’ వ్యాపారం చేస్తున్నారు. ఎప్పుడు వాడతారంటే.. పశువులు ఈనే సమయంలో పరిస్థితి ప్రమాదకరంగా మారినప్పుడు, ఈనిన తరువాత మాయ వేయలేనప్పుడు, గర్భసంచిని సరిదిద్దడానికి పొదుగు వాపులో పాలు రానప్పుడు, ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వాడుతూంటారు. దీనివలన రెండు నుంచి ఆరు నిమిషాల్లో జీవక్రియ జరుగుతుంది. అలాగే, చేపునకు రావడంతో పాడి పశువు అధికంగా పాలు స్రవిస్తుంది. ఎన్నో దుష్పరిణామాలు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. వాస్తవానికి ఇది ఒక హార్మోన్ అని పశువైద్యులు చెబుతున్నారు. దీనిని ప్రతి రోజూ వాడటం వలన పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు తలెత్తుతాయి. పశువు ఎదకు వచ్చినా చూలు నిలబడదు. పైగా గర్భస్రావం వంటి దుష్పరిణామాలు తలెత్తుతాయి. మరోవైపు ఈ ఇంజెక్షన్ వాడిన పశువు నుంచి తీసుకున్న పాలు తాగిన వారిలోనూ అనేక దుష్పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా పిల్లల్లో వినికిడి, దృష్టి లోపాలు వస్తూంటాయి. శరీరంలో శక్తి నశించి తొందరగా అలసటకు గురవుతారు. చంటి పిల్లలపై ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది. బాలింతల్లో హైపర్ సెన్సిటివ్ రియాక్షన్ రావచ్చు. ఈ ఇంజెక్షన్ వాడిన పశువు పాలు తాగడం వల్ల ఆడ పిల్లలు చిన్న వయసులోనే ప్రౌఢ దశకు చేరుకుంటారు. ఈ ఇంజెక్షన్ను 1960లోనే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్టు ప్రకారం ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ కొందరు పాల వ్యాపారులు అధిక పాల దిగుబడి కోసం వీటిని అక్రమంగా రైతులకు సరఫరా చేస్తున్నారు. ఇలా చేస్తే ఇంజక్షన్తో పని లేదు పశువులకు మేపులో పౌష్టిక దాణాలు, ఖనిజ లవణాలు అందించడం ద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుంది. పశువులు ఆరోగ్యంగా ఉంటాయని పశు వైద్యులు చెబుతున్నారు. అజోల్లా వంటి ఆరోగ్యకరమైన మేతలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వాటిని రైతులే స్వయంగా తయారు చేసుకోవచ్చు. తద్వారా ఖర్చు తగ్గడంతో పాటు ఆదాయం పెరుగుతుంది. అనేక ప్రాంతాల్లో పోషణపై శ్రద్ధ చూపకపోవడం వల్ల 30 శాతం దూడలు చనిపోతున్నాయి. దూడ లేకపోతే తల్లి పశువు పాలు ఇవ్వదు. పాడి రైతులు పశువులకు అలవాటు చేసిన ప్రకారం పాల చేపు వస్తుంది. ముందుగా దూడతో తాగించి, తరువాత పాలు తీస్తే.. అదే అలవాటవుతుంది. అందువలన దూడ లేకపోతే పాలు చేపునకు రావు. అలా కాకుండా ముందుగా పాల గిన్నెల శబ్దాలు అలవాటు చేయడంతో పాటు ముందు పాలు పితికి.. ఆ తరువాత దూడలకు పాలు వదలాలి. అలా చేస్తే దూడ లేకపోయినా పశువులు చేపునకు వస్తాయని పశు వైద్యులు చెబుతున్నారు.వైద్యుల సలహాతోనే... కొన్ని అనివార్య పరిస్థితుల్లో మాత్రమే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వాడాలి. అది కూడా వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి. ఈ ఇంజెక్షన్ పశువులకే కాదు.. ఆ పాలు తాగే మనుషులకూ ప్రమాదకరం. అందుకే దీనిని నిషేధించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దీనిని అమ్మినా, కొన్నా నేరమే అవుతుంది. ఈనే సమయంలో పశువుకు ఇబ్బందులు ఏర్పడినా, పాలు ఇచ్చేందుకు అనుకూలత లేకపోయినా దీనిని డాక్టర్ల సూచనల మేరకు మాత్రమే ఉపయోగించాలి. ఎన్నో దుష్పరిణామాలున్న ఈ ఇంజెక్షన్ వాడకుండా రైతుల్లో అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. – పి.కృష్ణమూర్తి,జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి పాల చేపునకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల వాడకం దీనివలన ఆ పశువుకు, ఆ పాలు తాగే వారికి ప్రమాదం నిషేధిత ఇంజెక్షన్లు వాడరాదని పశు వైద్యుల హెచ్చరికలు -
పనులు వేగవంతం చేయాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జాతీయ ఉపాధి హామీ పథకం కింద పల్లెపండుగ –1, 2లో భాగంగా జిల్లాలో చేపట్టిన పనులన్నింటినీ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనుల పురోగతిపై డ్వామా, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలెక్టరేట్లో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపొనెంట్ కింద సమకూరిన నిధులతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనులు చేపట్టామని చెప్పారు. పల్లెపండుగ–1, పల్లెపండుగ–2 కింద చేపట్టిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో చేపట్టిన సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, సీసీ డ్రైన్ల పనులకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ పనులను మార్చి 15 నాటికి నూరు శాతం పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, పంచాయతీరాజ్ ఎస్ఈ ఏవీఎస్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. రేపు పింఛన్ల పంపిణీ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను శనివారం పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి ఒకటో తేదీ ఆదివారం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లాలో 2,68,958 మందికి రూ.117.02 కోట్ల మేర పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పోగొట్టుకున్న బంగారు ఆభరణాల అందజేత గోకవరం: ఆర్టీసీ బస్సులో పోగొట్టుకున్న సుమారు 6 కాసుల బంగారు ఆభరణాలను ప్రయాణికురాలికి గోకవరం ఆర్టీసీ డిపో అధికారులు అందజేశారు. డిపో మేనేజర్ సుచరిత మార్గరేట్ కథనం ప్రకారం.. గోకవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు సర్వీసు గురువారం ఉదయం గోకవరం నుంచి రంపచోడవరం బయలుదేరింది. బస్సు రంపచోడవరం వెళ్లిన తరువాత ఓ ప్రయాణికురాలికి సీటు వద్ద పర్సు లభించింది. ఆమె ఆ పర్సును బస్సు కండక్టర్ ఏపీ శర్మ, డ్రైవర్ శేషగిరికి అప్పగించింది. వారు పర్సు తెరచి చూడగా సుమారు 6 కాసుల బంగారు ఆభరణాలు, రూ.420 నగదు, ఆధార్ కార్డు, బస్సు టికెట్టును గుర్తించారు. వారు ఆ పర్సును గోకవరం ఆర్టీసీ డిపోలోని అధికారులకు అప్పగించారు. పర్సు పోగొట్టుకున్న ప్రయాణికురాలిని మడకం అమ్మాజీగా గుర్తించారు. వెంటనే ఆమెకు సమాచారం అందించి గోకవరం ఆర్టీసీ బస్టాండ్లో డీఎం చేతుల మీదుగా ఆమెకు పర్సును అప్పగించారు. నిజాయితీ చాటిన కండక్టర్ ఏసీ శర్మ, డ్రైవర్ శేషగిరిని డీఎం, ఇతర సిబ్బంది అభినందించారు. -
వైద్యుల మల్లగుల్లాలు
● విషమంగా కల్తీపాల బాఽధితుల పరిస్థితి ● విరుగుడు ఇంజెక్షన్లు ఇవ్వాలా.. వద్దా తేల్చుకోలేకపోతున్న వైనం ● ఆ ఎనిమిది మంది గురించి రెండురోజులు ఆగితేనే కానీ ఏమీ చెప్పలేమంటున్న డాక్టర్లు ● పాల వ్యాపారి గణేష్ విచారణకు సిద్ధమవుతున్న పోలీసులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురై రాజమహేంద్రవరం ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న 15 మందిలో 8 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూర్యకుమారి అనే బాధితురాలికి బుధవారం అర్ధరాత్రి గుండె సమస్య రావడంతో వైద్యులు ఆందోళన చెందారు. సకాలంలో స్పందించి ఆమెకు సీపీఆర్ చేసి అత్యవసర మందులు అందించడంతో తిరిగి కోలుకుంది. విషమంగా ఉన్న ఎనిమిది మంది పరిస్థితి మరో రెండు రోజులు దాటితేనే కానీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు. రెయిన్బో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న ముగ్గురు చిన్నారుల్లోనూ ఒకరి పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. కిడ్నీలు విఫలమైన ఇద్దరికి డెల్టా ఆసుపత్రిలో డయాలసిస్ జరుగుతోంది. బొల్లినేని ఆసుపత్రిలో ఎనిమిది మందిలో ఐదుగురు వెంటిలేటర్, డయాలసిస్ మీద ఉండగా, మరో ముగ్గురికి డయాలసిస్ జరుగుతోంది. ఫోమోఫైజోల్ ఇంజెక్షన్లపై మల్లగుల్లాలు బాధితులకు మెరుగైన వైద్యం అందించే దిశగా ముంబై నుంచి రప్పించిన ఫోమోఫైజోల్ ఇంజెక్షన్లు ఏ విధంగా, ఎంత డోసు ఇవ్వాలనే దానిపై వైద్య బృందం మల్లగుల్లాలు పడుతోంది. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజు కిమ్స్ ఆసుపత్రికి వచ్చి అక్కడ వైద్య బృందంతో ఇంజెక్షన్ల డోసులపై చర్చించారు. వీటిని బాఽధితులకు శుక్రవారం నుంచి అందించనున్నట్టు సమాచారం. ఈ ఇంజెక్షన్లు వ్యాధి ప్రాథమిక దశలో ఉన్న వారికి మెరుగ్గా, కిడ్నీ ఫెయిల్ అయి డయాలసిస్ జరుగుతున్న వారికి అంతంత మాత్రంగా ఫలితాలు ఇస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదీ రిఫిజ్ లీకేజీ వల్ల పాలలో ఇథనాల్ గ్లైకాన్ కలిస్తేనే ఈ ఇంజెక్షన్లు పనిచేస్తాయి. వేరే ఏ రసాయనాలు కలిసినా ఈ ఇంజెక్షన్లు పనిచేయవు. పాలలో ఏ విధంగా కల్తీ జరిగిందో తెలియడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు రావడానికి మరో మూడు రోజుల సమయం పట్టవచ్చు. దీంతో బాధితులకు రికవరీ డోసు ఇవ్వడంలో ఆలస్యం అవుతోంది. ఇంజక్షన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమీ రావని నిర్ధారణ అయ్యాక, రిపోర్టుతో పనిలేకుండా వాటిని బాఽఽధితులకు అందించేందుకు డాక్టర్లు సిద్ధమయ్యారు. విషమంగా ఉన్న 8 మందికి అత్యవసర వైద్యం అందిస్తున్నా, ఇంజెక్షన్లు ఇస్తే కానీ వారు ఎంతమేరకు కోలుకుంటారనేది అంచనా వేయలేమని చెబుతున్నారు. ఇప్పటికే ఘటన జరిగి 11 రోజులు కావడం, బాధితుల పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తుండడంతో వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని, మరింత మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జైలులో ఉన్న గణేష్ను విచారించనున్న పోలీసులు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న పాల వ్యాపారి గణేష్ను మరోసారి సమగ్రంగా విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. న్యాయస్ధానం నుంచి అనుమతి వచ్చిన వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని ఘటన వివరాలపై నివేదిక తయారు చేయనున్నారు. ఇథనాల్ గ్లైకాన్ లీకయి పాలు కలుషితం అవడంతో పాటు, పాలల్లో కలిపిన రసాయనాల కారణంగా మరింత విషతుల్యమయ్యాయా, లేక ఇథనాల్ లీకేజీ వల్లే జరిగిందా అన్నది గణేష్ నిర్ధారించాల్సి వుంది. అతని వాంగ్మూలంతో.. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్టులు సరిచూసుకుని ఎంతమేరకు నిజం చెప్పాడన్నది నిర్ధారణ చేసుకుంటారు. ఈ ఘటనపై గణేష్ తల్లి అనుమానం వ్యక్తం చేస్తోంది. తాము కూడా అదే పాలు తాగామని, తమకు ప్రమాదం జరగలేదని ఆమె అంటోంది. తన కుమారుడంటే గిట్టని వారు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చునని చెబుతోంది. కల్తీ పాల వినియోగదారుల ఆరోగ్యంపై ఆరా పాల వ్యాపారి గణేష్ సరఫరా చేసిన పాల వినియోగదారుల చిట్టా ఆధారంగా 110 కుటుంబాల ఆరోగ్య పరిస్థితిపై వైద్యాధికారులు ఆరా తీస్తున్నారు. మరో వారం రోజుల పాటు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది కల్తీ పాల వినియోగదారుల ఆరోగ్య స్థితిని రికార్డు చేస్తారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు మినహా గణేష్ వద్ద పాలు తీసుకున్న వారి శరీరంలో ఎటువంటి మార్పులూ కనిపించలేదు. -
మినీ.. ఏదీ మనీ!
పిఠాపురం మండలం రాపర్తిలో గోకులం షెడ్ ● మినీ గోకులాల పేరిట సర్కారు ఆర్భాటం ● షెడ్ల నిర్మాణానికి 90 శాతం రాయితీ ఇస్తామని హడావుడి ● పాడి రైతులు 10 శాతం ఖర్చు చేస్తే చాలని ప్రకటన ● ఆ మాటలు నమ్మి నిర్మించుకున్న రైతులు ● నెలలు గడుస్తున్నా విడుదల కాని బిల్లులు ● గగ్గోలు పెడుతున్న లబ్ధిదారులు పిఠాపురం: పాడి పరిశ్రమకు వైభవం తెస్తాం.. రైతుకు అండగా ఉంటాం.. భారీ రాయితీతో మినీ గోకులం షెడ్లు నిర్మిస్తున్నామంటూ ప్రభుత్వ పెద్దలు తెగ ఆర్భాటం చేశారు. నిజమేననుకుని ఆ బుట్టలో పడిన పాడి రైతులు చేతి చమురు వదిలించుకుని, అప్పులు చేసి మరీ షెడ్లు నిర్మించుకున్నారు. నెలలు గడుస్తున్నా వారికి రాయితీ ఇవ్వకుండా సర్కారు చుక్కలు చూపిస్తోంది. నిర్మాణం ఇలా.. రైతుకు పాడి, పంట రెండు కళ్ల లాంటివి. తమకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడే పాడి పశువులను అన్నదాతలు కన్నబిడ్డల్లా సాకుతారు. అటువంటి పశువుల పోషణ, రక్షణకని చెబుతూ చంద్రబాబు ప్రభుత్వం 2024లో మినీ గోకులం షెడ్లు మంజూరు చేసింది. ఈ పథకం ద్వారా పశువులకు రేకుల షెడ్లు నిర్మించేందుకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. ఈ పథకంలో పశు సంవర్ధక శాఖతో పాటు నిధుల మంజూరుకు ఉపాధి హామీ పథకం అధికారులను భాగస్వాముల్ని చేసింది. పశువుల సంఖ్యను బట్టి గోకులం షెడ్ల నిర్మాణానికి వెసులుబాటు కల్పించింది. ఆవులు, గేదెలు రెండు కానీ ఉంటే రూ.1.15 లక్షలు, నాలుగు ఆవులు, గేదెలు ఉంటే రూ.1.66 లక్షలు, 6 గేదెలు, ఆవులు ఉంటే రూ.2.30 లక్షల చొప్పున, 20 గొర్రెలుంటే రూ.1.30 లక్షలు, 50 గొర్రెలకు రూ.2.30 లక్షలు, వంద కోళ్ల పెంపకానికి రూ.87 వేలు, 200 కోళ్ల పెంపకానికి రూ.1.32 లక్షల చొప్పున షెడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఇందులో లబ్ధిదారు అయిన రైతు 10 శాతం చెల్లిస్తే చాలు.. మిగిలిన 90 శాతం ప్రభుత్వమే చెల్లించేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు హడావుడి చేసింది. ఈ మాటలు నమ్మిన పలువురు రైతులు సొంత డబ్బులు వెచ్చించి, కొంత మంది వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ ఈ షెడ్లు నిర్మించుకున్నారు. లబ్ధిదారుల ఎంపికలో కూటమి కార్యకర్తలకే ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలు కూడా వచ్చాయి. వదిలిపోయిన చేతిచమురు పశువుల సంఖ్యను బట్టి ఒక్కో లబ్ధిదారుకు సుమారు రూ.లక్ష నుంచి రూ.1.80 లక్షల వరకూ ఖర్చయ్యింది. ఈ షెడ్లను త్వరగా నిర్మించాలంటూ అప్పట్లో అధికారులు ఒత్తిడి తేవడంతో పలువురు అప్పులు చేసి మరీ వీటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేశారు. ఈ మినీ గోకులం షెడ్లను గత ఏడాది జనవరిలో కూటమి ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా ప్రారంభించారు. లబ్ధిదారులతో ఫొటోలకు పోజులిచ్చారు. గోకులం షెడ్లు నిర్మించుకున్న వారు తమ వాటాగా 10 శాతం సొమ్మును డీడీ రూపంలో ప్రభుత్వానికి ముందుగానే అందజేశారు. కానీ, ప్రభుత్వం మాత్రం తాను ఇస్తానన్న 90 శాతం రాయితీని ఇప్పటి వరకూ ఇవ్వలేదు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో షెడ్లు నిర్మించుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ఇటు అధికారులు, అటు కూటమి ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయి, తిరిగి కొత్త అప్పుల పాలవుతున్నామంటూ పాడి రైతులు గగ్గోలు పెడుతున్నారు.జిల్లాలో మినీ గోకులం షెడ్ల వివరాలు మంజూరు : 1,380 నిర్మాణ వ్యయం : రూ.30 కోట్లు ఇప్పటి వరకూ పూర్తయినవి : 1,055 బిల్లు బకాయిలు : రూ.11 కోట్లకు పైగా -
చిన్నారి ఉసురు తీసిన భార్యాభర్తల వివాదం
జగ్గంపేట: భార్యాభర్తల మధ్య నెలకొన్న కీచులాట 11 నెలల చిన్నారి ప్రాణాలు తీసింది. ఈ దారుణ సంఘటన కాకినాడ జిల్లా జగ్గంపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జగ్గంపేట టీచర్స్ కాలనీలో ఓడిబోయిన మణికంఠ, సాయి దంపతులు నివాసం ఉంటున్నారు. మణికంఠ మద్యానికి బానిసై జీవనోపాధికి కూడా ఇబ్బంది పడడంతో దంపతుల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నాయి. గురువారం కూడా భార్యాభర్తల మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో అత్తింటి వారు పరుషంగా మాట్లాడడంతో కోపంతో ఊగిపోయిన మణికంఠ 11 నెలల కుమార్తెను తీసుకుని స్థానికంగా ఉన్న పోలవరం కాలువలోకి మోటార్ సైకిల్తో సహా దూసుకుపోయాడు. గుర్తించిన స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అప్పటికే చిన్నారి మృతి చెందింది. దీంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు కేసు నమోదు చేశారు. -
వడలు, గార్లు కాదు.. వడగర్లు!
సఖినేటిపల్లి: పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా సముద్రంపై వేటకు వెళ్లిన మత్య్సకారులకు బుధవారం భారీగా మత్య్స సంపద లభించింది. వడగర్లు రకం చేపలు సుమారు రెండు టన్నులు వలకు చిక్కడంతో గంగపుత్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కేజీ రూ.50 చొప్పున ఉంటుందని వారు తెలిపారు. మాంసాహార ప్రియులు ఈ రకం చేపల కోసం ఎదురు చూస్తుంటారని తెలిపారు. ఈ మేరకు వీటి ఎగుమతికి ఐస్ బాక్సుల్లో భద్రపరిచే పనులను కొనుగోలుదారులు చేపట్టారు. అలాగే వలకు చిక్కిన భారీ సొర చేప 10 కేజీలు రూ.10 వేలకు పాటదారుడు చేజిక్కించుకున్నాడు. -
మిరపలో కొత్తరకం చీడ
● ఐసీఏఆర్–నిర్కా డైరెక్టర్ డాక్టర్ మాగంటి ● నియంత్రణపై అవగాహన సదస్సు ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): త్రిప్స్ పార్విస్పినస్గా పిలిచే చీడ పురుగు ఆగ్నేయాసియా మిరపకాయలలో కొత్తగా పుట్టుకొస్తోందని ఐసీఏఆర్–జాతీయ వాణిజ్య పరిశోధన సంస్థ (నిర్కా) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. రాజమండ్రిలోని ఐసీఏఆర్–నిర్కా సమావేశ మందిరంలో బుధవారం మిరప పంటలో సస్యరక్షణపై కార్యక్రమం నిర్వహించారు. శేషుమాధవ్ మాట్లాడుతూ మిరప ఉత్పత్తిలో 30–50% నష్టపరిచే సామర్థ్యాన్ని ఈ చీడపురుగు కలిగి ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఐసీఏఆర్–నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎన్ సుశీల్, పంట రక్షణ విభాగం అధిపతి డాక్టర్ కె.రాజశేఖరరావు బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ నిర్వహించారు. శాస్త్రవేత్తలు డాక్టర్ ఎ.కందన్, డాక్టర్ ఆర్ఆర్ రచన ఈ చీడను నియంత్రించే పద్ధతులపై చర్చించారు. డాక్టర్ టీవీకే సింగ్, డాక్టర్ వి.శ్రీధర్, డాక్టర్ యు.శ్రీధర్ వంటి శాస్త్రవేత్తలు ఈ తెగులు నివారణకు విలువైన సూచనలిచ్చారని నిర్వహణ కార్యదర్శి డాక్టర్ శైలజ జయశేఖరన్ తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరిపై నల్లి తెగులు, తెల్లదోమ పోటు చర్యలకు ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ డిమాండ్ అల్లవరం: ఉభయ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వేలాది ఎకరాల్లో కొబ్బరిని నల్లి తెగులు, తెల్లదోమ పోటు తీవ్రంగా నష్టపరుస్తోందని శాసనమండలిలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ప్రస్తావించారు. నల్లి తెగులు, తెల్లదోమ విస్తారంగా వ్యాప్తి చెందిందని, దీంతో రైతులకు దిగుబడి తగ్గి ఆర్థికంగా నష్టపోతున్నారని వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెల్లదోమ వల్ల ఆకుపై నల్లటి మచ్చలు ఏర్పడి కిరణజన్య సంయోగ క్రియ అడ్డంకిగా మారి దిగుబడి తగ్గడం, పిందెలు రాలిపోవడం జరుగుతున్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటోందో తెలపాలని ప్రశ్నించారు. కొబ్బరితో పాటుగా అరటి, కోకో వంటి వాణిజ్య పంటలపై తీవ్ర ప్రభావం ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నల్లి తెగులు, తెల్లదోమ నివారణకు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 3న దర్శనాలు నిలిపివేత మామిడికుదురు: చంద్ర గ్రహణం సందర్భంగా మార్చి 3వ తేదీ మంగళవారం అప్పనపల్లి బాల బాలాజీ స్వామి వారి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తామని ఈఓ ఎం.రాంబాబు రెడ్డి బుధవారం తెలిపారు. 3వ తేదీ ఉదయం 9 గంటలకు ఆలయాన్ని మూసివేస్తామన్నారు. 4వ తేదీ బుధవారం ఉదయం సంప్రోక్షణ, నిత్య కై ంకర్యాలు అనంతరం ఉదయం 10 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తామన్నారు. -
ప్రకృతి సాగుకు ఉత్సాహాన్నిచ్చారు
● జిల్లా కలెక్టర్ కీర్తి ● మాజీ స్పెషల్ సీఎస్ విజయ కుమార్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రకృతి వ్యవసాయానికి కొనుగోలుదారులు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారని కలెక్టర్ కీర్తి అన్నారు. బుధవారం ప్రకృతి వ్యవసాయంపై స్థానిక జేఎన్రోడ్డు లోని సూర్య గార్డెన్స్లో కొనుగోలుదారులు – విక్రేతల అనుసంధాన సమావేశం నిర్వహించారు. తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కోనసీమ, కృష్ణా, కాకినాడ (డెల్టా ప్రాంతం) జిల్లాలకు చెందిన బీఆర్సీ (బయో రిసోర్స్ సెంటర్) ఉత్పత్తులు, స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ డెల్టా ప్రాంత రైతులు, అగ్రిగేటర్లు, ప్రాసెసర్లు, రిటైలర్లు, సర్వీస్ ప్రొవైడర్లు పరస్పర అనుసంధానం కావడానికి ఈ సమావేశం వేదికగా నిలిచిందన్నారు. రైతు ఉత్పత్తులకు ప్రత్యక్ష మార్కెటింగ్ కల్పించడమే లక్ష్యంగా ఈ నెట్ వర్కింగ్ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రకృతి సాగు ద్వారా రసాయన రహిత, నాణ్యమైన ఆహార ఉత్పత్తులను వినియోగదారులకు అందించవచ్చన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి మాత్రమే కాకుండా మార్కెటింగ్ వైపు కూడా దృష్టి సారించాలని సూచించారు. వినియోగదారుడికి నేరుగా అనుసంధానం ఏర్పడితే రైతు ఆదాయం గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. మాజీ స్పెషల్ ప్రధాన కార్యదర్శి, రైతు సాధికార సమితి కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, టి.విజయ్కుమార్ జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొని రైతులు, వ్యాపారవేత్తలు, కొనుగోలు దారులతో ప్రత్యక్షంగా మాట్లాడి విత్తనం నుంచి పంట కోత వరకు ప్రకృతి సాగు విధానాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్ ప్రతి రైతు ఉత్పత్తి దశతో పాటు మార్కెటింగ్ దశలోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు. రైతు ఒక ఉత్పత్తిదారుడిగానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా ఆలోచించే దిశగా ముందుకు రావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
కిక్ బాక్సింగ్లో నిహారిక ప్రతిభ
ఖేలో ఇండియా సౌత్ జోన్ పోటీలకు ఎంపిక అమలాపురం రూరల్: న్యూఢిల్లీలోని కేడీ జావేద్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ కప్–20 పోటీలలో రామచంద్రపురానికి చెందిన కారుమూరి లేఖా నిహారిక అద్భుత ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణ, ఒక రజత పతకాలను సాధించింది. ఈ సందర్భంగా ఆమె బుధవారం కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసింది. అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని, కోనసీమ ఖ్యాతిని చాటాలని పేర్కొన్నారు. లైట్ కాంటాక్ట్ విభాగంలో రెండు స్వర్ణ పతకాలను గెలుచుకోగా, క్రియేటివ్ ఫామ్ వెపన్ విభాగంలో రజత పతకాన్ని కై వసం చేసుకుందన్నారు. ఆమె ప్రతిభతో బెంగళూరులో నిర్వహించనున్న ఖేలో ఇండియా సౌత్ జోన్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్లు బీకే రత్నం, అంజనీకుమార్లను, ఆమె తల్లిదండ్రులను కలెక్టర్ అభినందించారు. -
పంపాలో కొండచిలువ హల్చల్
అన్నవరం: స్థానిక పంపా ప్రాజెక్టు గేట్లు, పరిసరాలలో బుధవారం భారీ కొండచిలువ హల్చల్ చేసింది. పంపా ప్రాజెక్టు గేట్లు, బ్యారేజీ వద్ద బుధవారం సుమారు పది అడుగుల కొండచిలువను స్థానిక యువకులు గుర్తించారు. అక్కడికి దగ్గరలోనే పలు కుటుంబాలు గుడిసెలు నిర్మించుకుని నివసిస్తున్నారు. ఈ సమాచారంతో వారు ఆందోళన చెందారు. కొండచిలువ సంచారం విషయాన్ని యువకులు ప్రాజెక్టు సిబ్బందికి తెలియజేయగా వారు అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. శంఖవరం ఫారెస్ట్ రేంజి ఆఫీసర్ నాగేశ్వరరావు తన బృందంతో వచ్చి దానిని చాకచక్యంగా గోనెసంచెలో బంధించారు. దాని బరువు 12 కిలోలు ఉండగా పొడవు 8.2 అడుగులు ఉందని తెలిపారు. దానిని పాండవుల కొండ రిజర్వ్ఫారెస్ట్లో వదిలిపెట్టినకుట్టు అటవీ సిబ్బంది తెలిపారు. రాయి పడి కార్మికుడి మృతి దేవరపల్లి: మండలంలోని గౌరీపట్నంలో నల్లరాతి క్వారీలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం గౌరీపట్నం పంచాయతీ శివారు కొండగూడెంలోని ఓ క్వారీలో బుధవారం కార్మికుడు అవిటి యేసు (42) డ్రిల్లింగ్ చేస్తుండగా, పై నుంచి రాయి తలపై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. యేసుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ స్తంభం పడి సైక్లిస్టు మృతి
మామిడికుదురు: మండలం పెదపట్నంలంకలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. సైకిల్పై వెళ్తున్న వ్యక్తిపై విద్యుత్ స్తంభం విరిగి పడి అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తి తృటిలో తప్పించుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో కుల వృత్తి చేసుకునే మానేపల్లి శ్రీమన్నారాయణ (65) రెండు వివాహాల నిమిత్తం అవిరేడు కుండలు ఇచ్చి సైకిల్పై ఇంటికి వెళ్తుండగా గిడుగువారిపాలెంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న కొబ్బరి చెట్టు విద్యుత్ తీగలపై పడింది. దీంతో విద్యుత్ తీగలు తెగిపడి ట్రాన్స్ఫార్మర్తో సహా స్తంభం విరిగి శ్రీమన్నారాయణపై పడింది. దీంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడే ఉన్న మరొక వ్యక్తి గొల్లమందల నాగరాజు పరుగులు పెట్టడంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని శ్రీమన్నారాయణ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని కుమారుడు మానేపల్లి దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు నగరం పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. అందరితో అప్యాయంగా ఉండే శ్రీమన్నారాయణ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్తో..అంబాజీపేట: కొబ్బరికాయల దింపునకు కొబ్బరి చెట్టు ఎక్కుతుండగా విద్యుదాఘాతానికి గురై కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నందంపూడి గ్రామానికి చెందిన నేదునూరి జనార్దనరావు (55) బుధవారం కొబ్బరికాయలు దింపు తీసేందుకు చెట్టు ఎక్కుతున్నాడు. కొబ్బరిచెట్టుకు సమీపంలో విద్యుత్ వైర్లపై ఉన్న ఎండు కొబ్బరి ఆకు జనార్దనారావుకు తగలడంతో విద్యుత్ షాక్కు గురై చెట్టుపైనే విగతజీవిగా వేలాడిపోయాడు. జనార్దనరావుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రిజర్వాయర్లో మునిగి.. గంగవరం: మతి స్థితిమితం లేని ఓ వృద్ధురాలు సూరంపాలెం రిజర్వాయర్లో మునిగి ప్రాణాలు కోల్పోయింది. ఎస్సై వెంకయ్య బుధవారం రాత్రి తెలిపిన వివరాల మేరకు మండలం మొల్లేరు గ్రామానికి చెందిన చొప్పా కృష్ణవేణి (70) చిన్నతనం నుంచి మతి స్థిమితం లేక పలు చోట్లకు నడిచి వెళ్లిపోతూ ఉండేది. ఈ నేపథ్యంలో ఆమె సూరంపాలెం రిజర్వాయర్ నీటిలో మునిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. బుధవారం సాయంత్రం ఆమె మృతదేహం తేలినట్లు గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నట్టు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని బయటకు తీయించి ఆమెను గుర్తించి మొల్లేరు గ్రామస్తురాలిగా నిర్ధారించామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వాహనం ఢీకొని..రంగంపేట: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో మహిళ మృతి చెందినట్టు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. బుధవారం రాత్రి ఆయన తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని కోటపాడు శివారు రామేశంపేట వద్ద బిక్కవోలు వెళ్లే దారిలో బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో సుమారు 45 నుంచి 50 ఏళ్ల వయస్సు గల మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలైన ఆమెను స్థానికులు 108 వాహనంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే ఆమె మృతి చెందినట్టు చెప్పారని తెలిపారు. కోటపాడు ఇంచార్జి వీఆర్ఓ పుప్పాల రుద్రమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు 94409 04854, 94407 96538 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. -
లండన్లో పెద్దాపురం యువకుడి సజీవ దహనం
కాకినాడ క్రైం/సామర్లకోట: ఇంగ్లండ్ దేశ రాజధాని లండన్లో కాకినాడ జిల్లాకు చెందిన ఓ యువకుడు సజీవ దహనమై ప్రాణాలు కోల్పోయాడు. లండన్ ఫైర్ బ్రిగేడ్, మెట్రోపాలిటన్ పోలీసుల కథనం మేరకు, పెద్దాపురానికి చెందిన గొంతి అభిషేక్(26) ఏ232 క్రోయిడాన్ ఫ్లైఓవర్ పక్కనే ఉన్న ఓ రెండు అంతస్తుల భవనంలో వాటిల్లిన అగ్ని ప్రమాదంలో మరణించాడు. ఈ ప్రమాదం ఈ నెల 23 తెల్లవారుజామున 1.30 సమయంలో, భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు చోటు చేసుకుంది. ఘటనలో అభిషేక్ అక్కడికక్కడే చనిపోగా మరో భారతీయ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అదే భవంతిలో కింది అంతస్తులో ఉన్న మరో విదేశీ యువకుడు అగ్నికీలల్ని గుర్తించి ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. సుమారు రెండు గంటల పాటు శ్రమించిన సౌత్ లండన్ అగ్నిమాపక సిబ్బంది తెల్లవారుజామున 2.47 గంటల సమయానికి మంటలను అదుపులోకి తెచ్చారు. యువకుల నివాసం అధిక భాగం చెక్కతో నిర్మితం కావడం ప్రమాద తీవ్రతను పెంచిందని తెలిపారు. అభిషేక్ మూడేళ్ల క్రితం హోం సైన్స్ పూర్తి చేసి ఎంఎస్ చేసేందుకు లండన్ వెళ్లాడు. అక్కడ ఎంఎస్ పూర్తి చేసి స్థానికంగా ఉద్యోగం చేస్తున్నాడు. అభిషేక్ తండ్రి ఆస్కార్రావు ఏలూరు జిల్లా అగిరిపల్లి ఆరోగ్య కేంద్రం పరిధిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఈయన ఉద్యోగ వేదిక చైర్మన్గా, ఏపిజీఈఏ జనరల్ సెక్రటరీగా, ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కీలక హోదాల్లో పనిచేశారు. ఆస్కార్రావు, రాధిక దంపతుల ఏకై క కుమారుడు అభిషేక్, ఇతడికి ఇద్దరు అక్కలు ఉన్నారు. వీరిలో షమీమా కెనడాలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. షకీనా వైద్యురాలిగా విజయవాడలో పనిచేస్తున్నారు. కుమారుడి మృతి నేపథ్యంలో ఆస్కార్రావుకి పలువురు ఉద్యోగులు, అధికారులు సానుభూతి తెలిపారు. అభిషేక్ మృతదేహం దేశానికి చేరేందుకు కనీసం వారం రోజులు పట్టవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. -
కలెక్టరేట్ సిబ్బందికి ఏఐ ఫైలింగ్పై వర్క్ షాప్
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించుకుని ఫైలింగ్ నిర్వహణ పద్ధతులను మెరుగు పరచడం వంటి అంశాలపై బుధవారం కలెక్టరేట్లోని వివిధ విభాగాల అధిపతులు, సిబ్బందికి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్లో కలెక్టర్ షణ్మోహన్.. జేసీ అపూర్వ భరత్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాల్లో ఏఐ టెక్నాలజీని భాగం చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు చర్చించారు. వర్క్ షాప్లో భాగంగా ఏఐ టూల్స్ని ఎలా ఉపయోగించి మానవ తప్పులను తగ్గించుకోవాలి, కార్యాలయ పనితీరును మెరుగుపరచుకోవడానికి అనుసరించాల్సిన విధానాలపై కలెక్టర్ వివరించారు. కలెక్టరేట్లో పత్రాల నిర్వహణకు భవిష్యత్తులో సరైన మార్గదర్శకాలు, సూచనలు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. వర్క్ షాప్లో సీపీవో పీ.త్రినాథ్, కలెక్టరేట్ ఏవో ఎస్.రామ్మోహన్రావు, వివిధ విభాగాల అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘చోద్య’ ఆరోగ్యశాఖ!
కాకినాడ క్రైం: ఈ చిత్రం చూశారా..! ఇదేదో ఊరి శివారునున్న డంపింగ్యార్డ్ అనుకుంటున్నారా, కాదండోయ్. కాకినాడ నడిబొడ్డులో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ఆవరణ! పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి–అనారోగ్యాలకు దూరంగా ఉండండి ఇదీ ఇక్కడి అధికారులు ప్రజలకిచ్చే పిలుపు. ఈ నినాదానికి ఏ మాత్రం సరిపోలదు అక్కడి ఆవరణ. అసలు మీరు చెప్పేదేంటి, మీ కార్యాలయ ఆవరణలో జరిగేదేంటి అంటూ ప్రశ్నిస్తాయి అక్కడి దుర్భర పరిస్థితులు. డీఎంహెచ్వో కార్యాలయం ఎదురుగా ఉన్న మూడు చెత్త కంటైనర్లు చెత్తతో నిండిపోతున్నా మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అక్కడి ఆవరణంతా దుర్వాసన వెదజల్లుతూ దోమలు, ఈగలతో అత్యంత దుర్గంధ భరితంగా మారింది. అసలు జబ్బులన్నీ అక్కడే పుడుతున్నాయా అన్నట్టుంది పరిస్థితి. ఈ దుర్భర స్థితి నిత్యం కంటికి కనిపిస్తున్నా కార్యాలయ సిబ్బంది లేదా అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. ఈ నిర్లక్ష్య ధోరణి ప్రజారోగ్యానికి పొగబెడుతోంది. -
మత్స్య సొసైటీ సభ్యులకు శిక్షణ
కాకినాడ రూరల్: కరీంనగర్ జిల్లాలోని మత్స్య సొసైటీ మహిళా సభ్యులు, సుందరిగిరి గ్రామంలోని పెద్దమ్మతల్లి షిషరీస్ ఎఫ్ఎఫ్పీఓ సభ్యులు క్యాట్ ప్రోగ్రాం కింద కాకినాడలోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ షిషరీస్ టెక్నాలజీ(ఎస్ఐఎఫ్టీ)లో మూడు రోజుల శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐఎఫ్టీ ప్రిన్సిపాల్, మత్స్యశాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.అంజలి మాట్లాడుతూ విలువ ఆధారిత ఉత్పత్తులుగా చేపలను తయారు చేస్తే ఫిష్ ఫుడ్ అవుట్ లెట్స్ ద్వారా మహిళలకు అధిక ఆదాయం లభిస్తుందన్నారు. వీరితో పాటు సొసైటీ సభ్యులకు అవుట్ లెట్స్ ద్వారా ఆన్లైన్ మార్కెటింగ్, బ్రాండింగ్పైనా ఎస్ఐఎఫ్టీలో అవగాహన కల్పించామన్నారు. శిక్షణలో పాల్గొన్న 24 మందికి చివరి రోజు బుధవారం మెటీరియల్ను అందజేశామన్నారు. H½-ïÜyîl çœ#yŠæ MøÆý‡$tMýS$ ˘ రూ.11 వేల జరిమానా అమలాపురం టౌన్: అమలాపురంలోని ఏబీసీడీ ఫుడ్ కోర్టు (హోటల్)లో నిల్వ మాంసంతో ఆహారం పెట్టారంటూ వచ్చిన ఆరోపణలపై మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్ బుధవారం ఆ హోటల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీనిపై ఒక వినియోగదారుడు మంగళవారం రాత్రి మున్సిపాలిటీ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఆ హోటల్ను తొలుత మున్సిపల్ ఇన్విరాల్మెంట్ ఏఈ వెంకటేష్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, సిబ్బంది తనిఖీ చేశారు. లోపల పలు విభాగాల్లో అపరిశుభ్రత ఉందని పేర్కొంటూ హోటల్ యాజమాన్యానికి రూ.వెయ్యి జరిమానా విధించారు. అనంతరం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రామయ్యతో మున్సిపల్ కమిషనర్ నిర్మల్కుమార్ ఫోన్లో మాట్లాడారు. రాజమహేంద్రవరంలో జరిగిన పాలు కల్తీ ఘటన నేపథ్యంలో కోనసీమ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రామయ్య అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ రంగంలోకి దిగి ఏబీసీడీ ఫుడ్ కోర్టును స్వయంగా తనిఖీ చేశారు. ఫుడ్ కోర్టులో అపరిశుభ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రస్తుతం అందుబాటులో లేరని చెప్పారు. ఫుడ్ కోర్టులో నూనెను రీయూజ్డ్ చేస్తున్నారని, మాంసాన్ని ఫ్రిజ్ల్లో ఉంచి వాడుతున్నారని, మసాలా దినుసుల ప్యాకెట్లపై ఎఫ్ఎస్ఎస్ఐ ముద్ర లేదని గుర్తించారు. కొన్ని మాంసాహార పదార్థాలను, మసాలా ప్యాకెట్లను సీజ్ చేశారు. ఈ తప్పిదాలపై అధ్యయనం చేసిన కమిషనర్.. హోటల్ యాజమాన్యానికి రూ.10 వేలు జరిమానా విధించారు. సీజ్ చేసిన ఆహార వస్తువులతో పాటు సేకరించిన ఆహార శాంపిళ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులకు అందజేస్తామని కమిషనర్ నిర్మల్కుమార్ తెలిపారు. హోటల్ యాజమాన్యానికి తొలుత తమ ఇన్విరాల్మెంట్, శానిటేషన్ సిబ్బంది తనిఖీలో రూ. వెయ్యి. తన తనిఖీలో రూ.10 వేలు.. మొత్తం రూ.11 వేల జరిమానా విధించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ తనిఖీల్లో వార్డు సచివాలయ ఇన్విరాల్మెంట్, శానిటేషన్ సెక్రటరీ బండి వీరన్న పాల్గొన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారి రామయ్య తనిఖీ అమలాపురంలోని ఏబీసీడీ ఫుడ్ కోర్టు హోటల్ను జిల్లా ఫుడ్ సేఫ్టీ అదికారి వై.రామయ్య బుధవారం రాత్రి తనిఖీ చేశారు. అక్కడి మాంసాహార పదార్థాల శాంపిల్స్ సేకరించారు. వాటిని హైదరాబాద్లోని స్టేట్ ఫుడ్ ల్యాబ్కు పంపిస్తున్నట్లు తెలిపారు. కల్తీ పాల ఘటనకు చంద్రబాబే బాధ్యత తీసుకోవాలి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కల్తీ పాల వల్ల రాజమహేంద్రవరంలో జనం మృతి చెందిన ఘటనకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబే తీసుకోవాలని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఆయన బుధవారం రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం, అధికారుల అసమర్థత, నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందన్నారు. పాల కేంద్రాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయాలన్నారు. కానీ సంవత్సరాల తరబడి తనిఖీలు చేపట్టకపోవడం వల్ల ఈ మరణాలు సంభవించాయన్నారు. ఈ ఘటనకు సంబంధించిన అధికారులను ఈ పాటికే సస్పెండ్ చేయాలన్నారు. పుష్కరాల సమయంలో చంద్రబాబు అతి ప్రచారం వల్ల 29 మంది చనిపోయారన్నారు. -
అపర్ణాదేవీ నమామ్యహం
● కనుల పండువగా సామూహిక కుంకుమ పూజలు ● పోటెత్తిన మహిళా భక్తులు గొల్లప్రోలు (పిఠాపురం): గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో వేంచేసియున్న అపర్ణా సమేత నాగేశ్వరస్వామివారి కల్యాణోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం కనుల పండువగా కుంకుమ పూజలు నిర్వహించగా వేలాదిగా మహిళలు పాల్గొన్నారు. కుంకుమ పూజలకు సుమారు మూడువేల మంది మహిళలు పోటెత్తారు. ఆలయ అర్చకులు ఆకొండి వెంకటేశ్వరశర్మ, ఆకొండి ప్రభాకరశాస్త్రిల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహిళలతో ప్రత్యేక లక్ష కుంకుమార్చనలు, సహస్ర తులసిపూజ, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలకు, భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీగా హాజరైన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ కుంపట్ల సత్యనారాయణ, సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
కోనసీమ బాలిక.. కేరళ దంపతులకు దత్తత
సాక్షి, అమలాపురం: కోనసీమ చిన్నారి కేరళకు దత్తత వెళుతోంది. జిల్లాలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శిశుగృహం ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారిగా ఒక ఆడపిల్లను దత్తత ఇచ్చారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి కోనసీమ కలెక్టరేట్ వేదికై ంది. కోనసీమ శిశుగృహ కేంద్రంలో సంజన అనే 15 నెలల పాప ఆశ్రయం పొందుతోంది. ఈ చిన్నారిని పిల్లలు లేని పలువురు దంపతులు దత్తత చేసుకునేందుకు ముందుకు వచ్చారు. దేశ వ్యాప్తంగా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పిల్లలు లేని దంపతుల జాబితాలో కేరళకు చెందిన ఒక జంటకు ప్రాధాన్యతను బట్టి అవకాశం కల్పించారు. కేరళకు చెందిన బాదుషా, సమీనా దంపతులు ఎంపిక కావడంతో వారికి దత్తత ఇచ్చినట్టు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. వారికి కలెక్టరేట్లో బుధవారం పాపను అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా శిశుగృహం ద్వారా అసహాయ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందించడం జరుగుతోందన్నారు. పిల్లలు లేని దంపతులు పోర్టల్లో దరఖాస్తు చేసుకుని, చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలన్నారు. దత్తత తీసుకున్న పిల్లలను కన్నబిడ్డలుగా ప్రేమతో చూసుకుని, వారికి మంచి విద్య, భవిష్యత్తు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఐసీడీఎస్ పీడీ కె.నాగమణి, జిల్లా చైల్డ్ ప్రొడక్షన్ అధికారి బి.ఉమా లక్ష్మి, ప్రొటెక్షన్ ఆఫీస్ నాన్ ఇన్సి్ూట్యషన్ కేర్ శిరీష, శిశు గృహ మేనేజర్ ఎం.వనజాక్షి తదితరులు పాల్గొన్నారు. -
పాల తయారీకి కెమికల్స్ వినియోగిస్తే చర్యలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పాల తయారీకి కెమికల్స్, పాల పౌడర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని అసిస్టెంట్ పుడ్ కంట్రోలర్ జీఏబీ నందాజీ హెచ్చరించారు. రాజమహేంద్రవరం కల్తీ పాల వ్యవహారం ఘటన నేపథ్యంలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా పాల కేంద్రాల వ్యాపారాలపై బుధవారం తనిఖీలు నిర్వహించారు. స్థానిక గాంధీనగర్, సినిమా రోడ్డులో గల రైతుపాలు, కేశవ మిల్క్ల కేంద్రాల్లో అపరిశుభ్ర వాతావరణం గమనించారు. శాంపిల్స్ సేకరించారు. ఈ సందర్భంగా నందాజీ మాట్లాడుతూ గ్రామాల నుంచి సేకరించిన పాలను ప్యాకెట్లతో విక్రయిస్తున్న కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. తమ తనిఖీఓ్ల ఐస్ వినియోగించి పాలను నిల్వ చేయటం గమనించామన్నారు. పాల కేంద్రాల్లో పాలు నిల్వలకు ఫ్రీజర్లు వినియోగించాలని, కాలం చెల్లిన ధర్మాకోల్ బాక్స్లు వినియోగిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. పాల కేంద్రాలలో శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ కు పంపిస్తున్నామన్నారు. కెమికల్స్ వినియోగించినట్టు నిర్ధారణ అయితే వారిపై ఆహార భద్రత చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పాల తయారీకి పాల పౌడర్ వాడుతున్నట్లు గమనించి వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో పుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ర్యాంకుల ప్రహసనం
అన్నవరం: ఒక వారం ఒక రాశికి వచ్చిన ఫలితం తరువాతి వారం మరో రాశికి కనిపిస్తుంది. ఇలా 12 రాశుల వారఫలాలు అటూ ఇటూ మారతాయి తప్ప పెద్దగా మార్పు ఉండదని కొంతమంది చమత్కరిస్తూంటారు. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో అందిస్తున్న సేవలపై ఐవీఆర్ఎస్ సర్వే పేరిట ప్రభుత్వం ఇస్తున్న ర్యాంకులు కూడా ఇలాగే ఉంటున్నాయి తప్ప పెద్దగా మార్పు కనిపించడం లేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సర్వే పేరిట ప్రతి నెలా ప్రభుత్వం ర్యాంకులు విడుదల చేసి చేతులు దులిపేసుకుంటోంది తప్ప.. దిద్దుబాటు చర్యలపై దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా ఈ సర్వేలు ఓ ప్రహసనంగా మిగిలిపోతున్నాయి. అన్నవరం.. ఈసారి నాలుగో స్థానం జనవరి 25 నుంచి ఈ 21వ తేదీ వరకూ రాష్ట్రంలోని ఏడు దేవస్థానాలపై ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో అన్నవరం దేవస్థానం 75 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది. గత జనవరిలో మూడో స్థానంలో నిలవగా ఈసారి ఒక ర్యాంకు తగ్గింది. అయితే, అన్ని విభాగాల్లోనూ సంతృప్తి శాతం పెరగడం విశేషం. జనవరిలో 25.9 శాతం మంది భక్తులు అన్నవరం దేవస్థానంపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఈసారి అది 25 శాతానికి తగ్గింది. ద్వారకా తిరుమల దేవస్థానం కేవలం ఒక్క శాతం అంటే 76 శాతం మంది భక్తుల సంతృప్తితో ఈసారి ప్రథమ స్థానంలో నిలిచింది. 67.2 శాతంతో శ్రీశైలం దేవస్థానం ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. విశేషమేమిటంటే మిగిలిన ఐదు దేవస్థానాల్లో కూడా భక్తుల సంతృప్తి శాతంలో ఒకటి రెండు పాయింట్లు తప్ప పెద్దగా తేడా ఏమీ లేదు. దీనినిబట్టి ఈ ఏడు దేవస్థానాల్లోనూ అందిస్తున్న సేవలపై 25 శాత మందికి పైగా భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టే. కానరాని దిద్దుబాటు ఫ వాస్తవానికి ఐవీఆర్ఎస్ సర్వేల పేరుతో ప్రభుత్వం హడావుడి చేసి, ర్యాంకులు ప్రకటిస్తోందే తప్ప తక్కువ ర్యాంకులు వచ్చిన దేవస్థానాల్లో దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా ఈ సర్వేల వలన ఎటువంటి ఉపయోగమూ ఉండటం లేదు. ఫలితంగా దీనికోసం చేస్తున్న ఖర్చు బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది. ఫ ఈ ఏడు దేవస్థానాల్లోనూ పారిశుధ్య నిర్వహణ కాంట్రాక్టును సీఎం బంధువు అయిన భాస్కర నాయుడుకు చెందిన పద్మావతి హాస్పిటాలిటీ సంస్థ దక్కించుకుంది. దీంతో, ఆ సంస్థ ఏం చేస్తే అదే పారిశుధ్యం అనే పరిస్థితి నెలకొంది. ఏ దేవస్థానంలోనైనా ఆ సంస్థపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తే వెంటనే సీఎంఓ నుంచి ఫోన్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా దేవస్థానాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేనప్పటికీ ఏ ఒక్క అధికారి ప్రశ్నించలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్నవరం దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణకు నాసిరకం శానిటరీ మెటీరియల్ వాడుతున్నారనే అభిప్రాయం ఉంది. అయినప్పటికీ ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఫ తక్కువ ర్యాంకులు వస్తున్న దేవస్థానాలపై కనీసం నెలకొకసారైనా దేవదాయ శాఖ ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి సమీక్షలు నిర్వహిస్తే ప్రయోజనం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వీడియో కాన్ఫరెన్స్లు, ప్రధాన కార్యాలయంలో సమావేశాలతో పెద్డగా ప్రయోజనం ఉండటం లేదు.అన్నవరం దేవస్థానంఅన్నవరం దేవస్థానంలో ఈ నెలలో భక్తుల సంతృప్తి శాతం ఇలా.. సేవలు జనవరి ఫిబ్రవరి సత్యదేవుని దర్శనం 69.9 77.8 మౌలిక వసతులు 71.4 71.4 గోధుమ నూక ప్రసాదం నాణ్యత 82.3 81.6 పారిశుధ్యం 66.9 69.6 ఫ దేవాలయాల్లో ఐవీఆర్ఎస్ సర్వే పేరిట హడావుడి ఫ ర్యాంకుల విడుదల ఫ సేవలపై ప్రతిసారీ భక్తుల అసంతృప్తి ఫ దిద్దుబాటు చర్యలు చేపట్టని ప్రభుత్వం అన్ని విభాగాల్లోనూ తనిఖీలు అన్నవరం దేవస్థానంలో ప్రతి విభాగాన్నీ తనిఖీ చేసి, భక్తులకు మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి వారం అన్నదానం, ప్రసాద విభాగాలను తనిఖీ చేసి, నాణ్యతపై పరిశీలన చేసి, తగు ఆదేశాలిస్తున్నాం. పారిశుధ్య విభాగంలో కూడా భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా సేవలందించాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించాం. రానున్న రోజుల్లో దేవస్థానం ర్యాంకు మరింత మెరుగు పడేలా చర్యలు తీసుకుంటాం. – వి.త్రినాథరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తెలుగు, హిందీ, సంస్కృతం పరీక్షలకు 18,380 హాజరు కాగా 382 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,343 మంది పరీక్షలు రాయగా 42 మంది హాజరు కాలేదని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి కేశవరావు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు. రేపటి నుంచి సీ పోర్టు రోడ్డు మూసివేతకాకినాడ రూరల్: కాకినాడ డీప్ వాటర్ పోర్టు (సీ పోర్టు) నాలుగో గేటు – కుంభాభిషేకం ఆలయం మధ్య ఏడీబీ రోడ్డుపై (ఎన్హెచ్–216ఎఫ్) లెవెల్ క్రాసింగ్ గేట్ మేజర్ మరమ్మతులు, ట్రాక్ రిపేర్లు చేపడుతున్నారు. ఈ దృష్ట్యా గురువారం నుంచి మూడు రోజుల పాటు ఈ రోడ్డును మూసివేస్తున్నట్లు సీ పోర్టు మేనేజర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 7 నుంచి శనివారం సాయంత్రం 7 గంటల వరకూ మరమ్మతులు చేపడుతున్నందున ట్రాఫిక్ను ప్రత్యామ్నాయ మార్గంలోకి మళ్లిస్తామన్నారు. వాహనదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.పారిశుధ్య కార్యక్రమాలు పక్కాగా చేపట్టాలిబోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలు పక్కాగా చేపట్టాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం, వీధిలైట్లు, అన్నా క్యాంటీన్లు, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ అధికారులతో కలెక్టరేట్ నుంచి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోడ్ల పక్కన ఎప్పటి నుంచో ఉండిపోయిన చెత్తను వెంటనే తొలగించాలని సూచించారు. రోజువారీ పారిశుధ్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పర్యవేక్షించాలన్నారు. వెలగని వీధి లైట్ల స్థానంలో వెంటనే కొత్తవి వేయాలని ఆదేశించారు. అన్న క్యాంటీన్, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణపై కూడా అధికారులు సక్రమంగా పర్యవేక్షించాలని సూచించారు. కల్తీ పాల బాధితులకు వైఎస్సార్ సీపీ నేతల పరామర్శసాక్షి, రాజమహేంద్రవరం: కల్తీ పాలు తాగి ఆస్పత్రి పాలైన బాధితులను వైఎస్సార్ సీపీ నేతల బృందం మంగళవారం పరామర్శించింది. చికిత్స పొందుతున్న కిమ్స్, రెయిన్బో తదితర ఆస్పత్రులకు వెళ్లి బాధితుల ఆరోగ్య పరిస్థితిని నేతలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుంటారు.. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. వైద్యం అందుతున్న తీరును పరిశీలించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాధితుల కుటుంబాలను పలకరించారు. ఎలాంటి సమయంలోనైనా వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా పోరాటం చేస్తామన్నారు. పరామర్శించిన వారిలో మాజీ మంత్రులు విడదల రజని, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందజేత సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పాల కల్తీ కారణంగా మృతి చెందిన ముగ్గురి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించామని కలెక్టర్ కీర్తి తెలిపారు. మంగళవారం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు చెక్కులు అందించారు. స్థానిక ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆనాల ఎన్క్లేవ్ వద్ద తాడి కృష్ణవేణి, తాడి రమణిలకు సంబంధించిన రూ.20 లక్షల చెక్కులను వారి కుటుంబ సభ్యులకు, లాలాచెరువు గ్లో గార్డెన్ సమీపంలో మృతుడు నీలా శేషగిరిరావు కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చెక్కును అందించారు. -
‘సూర్యఘర్’ పనులు
వేగవంతం చేయాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకంలో ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై సోలార్ ప్యానళ్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఏపీఈపీడీసీఎల్ అధికారులు, సోలార్ ప్యానళ్ల సరఫరాదారులతో కలెక్టరేట్లో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. సోలార్ ప్యానళ్లు, పీఎం కుసుమ్ పథకంలో రైతులకు సోలార్ పంపుసెట్ల ఏర్పాటు వంటి అంశాల పురోగతిని సమీక్షించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద జిల్లాలో 19,593 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించామని చెప్పారు. ఇందుకు అవసరమైన సర్వే పూర్తి చేసి, పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అగ్రికల్చర్ ఫీడర్లు ఉన్న సబ్ స్టేషన్ దగ్గరలో ప్రభుత్వ భూములు, ఖాళీగా ఉన్న ప్రైవేట్ భూములను గుర్తించడం ద్వారా అక్కడే సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే పగటి పూట నిరంతర వ్యవసాయ విద్యుత్ సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ జి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఇది ఆ పులి కాదు
సీటిఆర్ఐ (రాజమహేంద్రవరం): పాపికొండలు అభయారణ్యంలో ఇటీవల విడిచిపెట్టిన పులి మళ్లీ రంప ప్రాంతంలోకి వచ్చిందంటూ అక్కడి అధికారులు చెబుతుండగా.. ఆ పులి ఇది కాదని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీకంఠనాథరెడ్డి వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని ప్రాంతీయ అటవీ శాఖ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లాలో హడలెత్తించిన పెద్ద పులి.. మళ్లీ జనావాసాల్లోకి వచ్చిందన్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని చెప్పారు. కూర్మాపురం వద్ద పట్టుకున్న పులిని ఈ నెల 14న పాపికొండలు నేషనల్ పార్కులో విడిచిపెట్టామన్నారు. ముందుగా దానికి జీపీఎస్ రేడియో ట్రాకర్ సిస్టం అమర్చామన్నారు. లక్ష ఎకరాలకు పైగా విస్తీర్ణం గల పాపికొండల నేషనల్ పార్కులో అది ఎక్కడ ఉందో తమకు తప్ప ఎవరికీ తెలియదన్నారు. దాన్ని విడిచిపెట్టిన ప్రాంతంలో ఆహారంగా ఉపయోగపడేలా కొన్ని జింకలను కూడా వదిలామన్నారు. అది మగ పులి కాబట్టి, రెండు ఆడ పులులను తీసుకువచ్చి ఆ ప్రాంతంలో విడిచిపెట్టనున్నట్లు తెలిపారు. దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. తాజాగా పులి తిన్న ఒక జంతు కళేబరాన్ని ఆయన మీడియాకు చూపించారు. రంపచోడవరం వద్ద పులి సంచరిస్తోందంటూ వచ్చిన వీడియో నిజం కాదన్నారు. రాజమహేంద్రవరం పెద్దపులికి ఎక్స్ప్లోరర్ అని పేరు పెట్టామని, అది మంచి ప్రవర్తన కలిగిన పులి అని చెప్పారు. -
బాబు సర్కార్ ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసింది: వైఎస్సార్సీపీ
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో కల్తీ పాల బాధితులను వైఎస్సార్సీపీ నేతలు విడదల రజని, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, మార్గాని భరత్, జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పరామర్శించారు. అనంతరం మీడియాతో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడారు.మెరుగైన వైద్యం అందించాలి: వేణుగోపాలకృష్ణపాలలో కల్తీ జరిగి ఐదు ప్రాణాలు పోయాయి. ప్రతిపక్షం స్పందించిన తరువాతే ప్రభుత్వ స్పందించింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమైపోయింది. సంబంధిత మంత్రులు ఎవరూ ఇప్పటివరకు స్పందించలేదు. విషయం తెలిసిన వెంటనే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి... వైఎస్సార్ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లందరికీ పూర్తిస్థాయిలో వైద్యం అందించాలి. చనిపోయిన వారికి రూ.25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలి. తిరుపతి లడ్డూ కల్తీ అనే మాట ద్వారా రాష్ట్రంలో చంద్రబాబు కల్తీకి తెర తీశారు. ఇంకా చాలామంది పేషెంట్లు ఉన్నారు. వారిని కూడా ఆస్పత్రిలో చేర్చి మెరుగైన వైద్యం అందించాలి.ముందే ఎందుకు స్పందించలేదు?: విడదల రజనికల్తీ మాటలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ఘటన 19 మంది బాధితులయ్యారు. ఐదుగురు చనిపోయారు. ఈ వ్యవహారంపై వైఎస్సార్సీపీ నిలదీస్తే ప్రభుత్వ స్పందించింది. ప్రభుత్వానికి బాధ్యత ఉంటే ఎందుకు ముందే స్పందించలేదు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ నిద్రపోతుంది. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ పని చేస్తుందా?. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 900 మంది డయేరియాతో ఆసుపత్రుల్లో చేరారు. అనేక మంది చనిపోయారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ పూర్తిగా విఫలమైంది. కల్తీ పాలతో అనారోగ్యంతోనే రాజమండ్రి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే వైద్యం దొరికే పరిస్థితి కనిపించలేదు.రెయిన్బో ఆస్పత్రిలో రితిక్ అనే బాలుడికి సంబంధించి ప్రైవేట్ ఆస్పత్రిలో ఇప్పటివరకు వైద్యం కోసం ఎనిమిదిన్నర లక్షలు బిల్లు కట్టాల్సి వచ్చింది. మిగిలిన వారి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. కల్తీ పాల వల్ల రీనల్ ఫెయిల్యూర్ జరిగింది. ఈ పరిస్థితికి ఎవరు బాధ్యత వహిస్తారు. చనిపోయిన వారికి పది లక్షలు ఇస్తారట.. ఏమూలకు సరిపోతుంది.ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఉపయోగకరంగా ఉంటాయని గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ 17 మెడికల్ కళాశాల ప్రారంభించారు. చంద్రబాబు తన వ్యాపారం స్కాముల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు.. ప్రజారోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. తప్పు జరిగిందన్న విషయం వాళ్ళ మాటల్లోనే బయటపడింది. రాష్ట్రంలో అనేక హాస్టల్లో విద్యార్థులు కూడా బాధితులు అవుతున్నారు. హెరిటేజ్ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకొచ్చాము ప్రజలన్నీ గమనిస్తున్నారుబాధితులకు అండగా ఉంటాం: తానేటి వనితఒకే ఫ్యామిలీకి చెందిన అనేకమంది బాధితులు ఆసుపత్రిలో చేరడంతో వైద్యులకు అనుమానం రావడంతోనే పాల కల్తీ వ్యవహారం బయటపడింది. బాధితులకు అండగా ఉంటాం. గత ప్రభుత్వ హయాంలో సమస్యలు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ అండగా ఉండేది. చికిత్స పొందుతున్న బాధితులకు భవిష్యత్తులో ఎంత బిల్లు అవుతుందో తెలియని పరిస్థితి. బాధితుల వైద్యానికి అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరించాలి. బాధిత కుటుంబాలకు పరిహారం 25 లక్షల రూపాయలు చెల్లించాలి. -
కౌలు రైతులకిచ్చిన హామీలు నెరవేర్చాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కౌలు రైతులకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.రాజశేఖర్, వల్లు రాజబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ వద్ద సంఘం ఆధ్వర్యాన సోమవారం నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ శిబిరాన్ని సీనియర్ ఉద్యమ నాయకుడు అయితాబత్తుల రామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కౌలు రైతుల సంక్షేమం కోసం సీసీఆర్సీ చట్టాన్ని రద్దు చేసి ఎల్ఈసీ చట్టాన్ని తీసుకొస్తామని ఎన్నికల ముందు కూటమి నేతలు హామీ ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024, 2025 సంవత్సరాల్లో అన్నదాత సుఖీభవ సాయం అందించలేదని, తొలకరిలో పంట నష్టం నమోదు చేసినప్పటికీ పరిహారం మాత్రం ఇప్పటి వరకూ ఇవ్వలేదన్నారు. రాజబాబు మాట్లాడుతూ, పెరిగిన ఎరువులు, పురుగు మందులు ధరలు తగ్గించాలని, గిట్టుబాటు ధరలు కల్పించాలని, క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటి కోసం ప్రభుత్వానికి అనేకసార్లు అర్జీలు ఇచ్చినప్పటికీ స్పందిచనందున ఈ దీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. సంఘం జిల్లా కార్యదర్శి అప్పారెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా రూ.6 వేలు మాత్రమే రైతుల ఖాతాల్లో వేస్తోందని అన్నారు. పంట పెట్టుబడి పెరగడం ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కౌలు రైతుల నిరాహార దీక్షకు ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి సీహెచ్ రమణి, పెన్షనర్ల సంఘం జిల్లా నాయకుడు యు.సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కె.సత్తిరాజు, ఎస్ఎఫ్ఐ నాయకుడు సంజయ్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు టేకుమూడి ఈశ్వరరావు మద్దతు పలికారు. -
అంగన్వాడీ కేంద్రాల్లో పనులు వేగవంతం చేయాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, మార్చి 5 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. ఈ అంశంపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 125 అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, 101 కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేపట్టామని చెప్పారు. గతంలో ప్రారంభించి, ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న 155 అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించేందుకయ్యే వ్యయం, చేపట్టాల్సిన పనుల వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇంటర్ పరీక్షలు ప్రారంభం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లావ్యాప్తంగా 58 కేంద్రాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఫస్టియర్ జనరల్ విభాగంలో తెలుగు, సంస్కృతం, హిందీ, ఒకేషనల్ జీఎఫ్సీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 20,104 మంది హాజరవగా 670 మంది గైర్హాజరయ్యారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోలేదు. తొలి రోజు 24 పరీక్ష కేంద్రాలను స్క్వాడ్స్ తనిఖీ చేశాయి. ఆరు కేంద్రాలను సిట్టింగ్ స్క్వాడ్స్ పర్యవేక్షించాయి. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఆయా కేంద్రాల గేట్లను ఉదయం 9 గంటలకే మూసివేశారు. కాకినాడ ఆర్ఐఓ వి.కేశవరావు నగరంలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు జ్యోతుల రాంబాబు, డీవీకే వర్మ, వి.శ్రీనివాస్లు కాకినాడ రూరల్తో పాటు పలు కేంద్రాలను పర్యవేక్షించారు. తలుపులమ్మ తల్లికి రూ.46.21 లక్షల ఆదాయం తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారికి హుండీల ద్వారా రూ.46,21,025 ఆదాయం లభించిందని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, లోవ దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. కాకినాడ ఎంఎస్ఎన్ చారిటీస్ సహాయ కమిషనర్ సీహెచ్ సురేష్ నాయుడు పర్యవేక్షణలో దేవస్థానంలోని హుండీలను సోమవారం తెరచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. మొత్తం 66 రోజులకు గాను నాణేలు రూ.3,07,475, నోట్లు రూ.43,13,550 వచ్చాయని ఈఓ వివరించారు. హుండీల ఆదాయం లెక్కింపులో శ్రీవారి సేవకులు, బ్యాంకు సిబ్బంది, నాయీ బ్రాహ్మణులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. భాషల్లో ప్రావీణ్యం అవసరం కాకినాడ రూరల్: ప్రతి విద్యార్థికి తెలుగు, ఇంగ్లిషు, హిందీతో పాటు ఇతర భాషల్లో ప్రావీణ్యం అవసరమని జిల్లా ఉప విద్యాశాఖాధికారి కేవీవీ సత్యనారాయణ అన్నారు. రమణయ్యపేటలోని ఏపీఎస్పీ బెటాలియన్ జెడ్పీ హైస్కూలులో జిల్లా స్థాయి లాంగ్వేజ్ ఫెస్టివల్ను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకూ మండల స్థాయిలో నిర్వహించిన లాంగ్వేజ్ ఫెస్టివల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు జిల్లా స్థాయి ఫెస్టివల్లో అవకాశం కల్పించారు. కథా వచనం, వ్యాస రచన, పద్య పఠనం, వక్తృత్వం తదితర పోటీల్లో 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏఎస్ఓ కె.జోగిరెడ్డి, ఎంఈఓ శ్రీనివాస కుమార్, హెచ్ఎం సత్యవోలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫెస్టివల్కు 80 మంది గైడ్ టీచర్లు కూడా హాజరయ్యారు. -
గోల్డ్ బాండ్ స్కీమ్కు సత్యదేవుని బంగారం
ఫ 9.646 కిలోల ముడి బంగారం అప్పగించిన దేవస్థానం ఫ దీనిని కరిగించగా వచ్చిన మేలిమి బంగారం స్కీమ్లో జమ ఫ దీనిపై దేవస్థానానికి బంగారం రూపంలో 0.3 శాతం వడ్డీ అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి చెందిన 9.646 కేజీల ముడి బంగారాన్ని అధికారులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గోల్డ్ బాండ్ స్కీమ్లో డిపాజిట్ చేశారు. ఈ మేరకు ఈ బంగారాన్ని విశాఖపట్నంలోని ఎస్బీఐ అధికారులకు సోమవారం అప్పగించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి భక్తులు వివిధ కానుకల రూపంలో బంగారాన్ని హుండీల్లో సమర్పిస్తూంటారు. అలాగే, కొంతమంది చిన్నచిన్న కానుకల రూపంలో స్వామి, అమ్మవారి అలంకరణ నిమిత్తం బంగారాన్ని అధికారులకు అందజేస్తారు. వీటిలో స్వామి, అమ్మవారి అలంకరణకు అవసరమైన వాటిని ఉంచి, మిగిలిన వాటిని బ్యాంక్ లాకర్లలో దేవస్థానం భద్రపరుస్తుంది. ఆవిధంగా భద్రపరచిన బంగారాన్ని గోల్డ్ బ్యాండ్ స్కీమ్కు అప్పగించారు. ఈ బంగారాన్ని ప్రభుత్వ మింట్లో దేవస్థానం అధికారుల సమక్షంలో కరిగించారు. ఆభరణాల్లోని వివిధ పొడులు, రాళ్లు తొలగించారు. మిగిలిన నికర బంగారాన్ని కడ్డీలో రూపంలో తయారు చేసి, దీనిపై ఏటా బంగారం రూపంలో 0.3 శాతం వడ్డీని ఎస్బీఐ అందజేస్తుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 32 కేజీల బంగారం ఇప్పటికే అన్నవరం దేవస్థానానికి చెందిన 32 కేజీల బంగారాన్ని గోల్డ్ బాండ్ స్కీమ్లో డిపాజిట్ చేశారు. చివరిగా 2018 జూలైలో ఎం.జితేంద్ర ఈఓగా ఉన్న సమయంలో 672.33 కిలోల వెండిని కరిగించారు. దీనిని విక్రయించగా వచ్చిన సొమ్ముతో ఏడు కిలోల బంగారాన్ని కొనుగోలు చేసి, ఇదే విధంగా గోల్డ్ బాండ్ స్కీమ్లో డిపాజిట్ చేశారు. దీనిపై దేవస్థానానికి ఏటా బంగారం రూపంలో వడ్డీ జమ అవుతోంది. ఈ స్కీమ్ వలన దేవస్థానానికి లాభమని అధికారులు చెప్పారు. ఈ బంగారాన్ని ఇప్పటి వరకూ లాకర్లలో ఉంచడం వలన బ్యాంకుకు అద్దె చెల్లించాల్సి వచ్చేదని, ఇకపై ఆ భారం తప్పుతుందని తెలిపారు. పైగా, దేవస్థానానికి వడ్డీ రూపంలో ఆదాయం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ కమిషనర్ బాబూరావు, అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి, ఏఈఓ ఎల్.శ్రీనివాస్, స్టేట్ బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. -
అరణ్యరోదన
అంతుచిక్కని కారణాలు? ఈ గ్రామ ప్రజల అవసరార్థం మూడు రక్షిత మంచి నీటి పథకాలు ఉన్నారు. అలాగే 20 చేతి పంపులు ఏర్పాటు చేశారు. తాగునీటి కుళాయిల ద్వారా వచ్చిన నీటిని వాడకానికి, చేతిపంపుల నీటిని తాగేందుకు వాడుతున్నారు. ట్యాంకు నీటిని క్లోరినేషన్ చేయకపోవడంతో తాగేందుకు వినియోగించడం లేదు. చేతిపంపు నుంచి వచ్చిన నీటిని రెండు రోజులు నిల్వ ఉంచుకుంటే అడుగు భాగాన సుద్దగా వస్తోందని ప్రజలు అంటున్నారు. ఇది వ్యాధులకు కారణమని ప్రజలు చెబుతున్నారు. నీటి పరీక్షలు చేస్తే అసలు కారణాలు తెలుస్తాయి.గిరిజనులకు ‘అరణ్య’రోదనే మిగిలింది.. చంద్రబాబు సర్కారు పట్టించుకోక ఉర్లాకులపాడు మరో ఉద్దానంలా మారుతోంది.. ఫలితంగా ఏడాదిన్నరగా మృత్యుఘంటిక మోగుతోంది.. కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఆ పల్లెలో జనం సతమతమవుతున్నా ఎవరికీ పట్టకుంది.. అసలు వ్యాధులకు కారణాలేంటో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. కనీసం మెరుగైన వైద్యం అందించడంలోనూ ప్రభుత్వం విఫలం అవుతోంది.. ఆ మరణ మృదంగం గురించి తెలుసుకుందాం రండి.. రాజవొమ్మంగి: ఉర్లాకులపాడు.. పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలంలో ఓ కుగ్రామం. మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది రాజవొమ్మంగి – ఏలేశ్వరం ప్రధాన రహదారిని ఆనుకుని ఉంది. గ్రామంలో 185 కుటుంబాలున్నాయి. జనాభా 701. ఇక్కడంతా ఆదివాసీలు (కొండరెడ్డి) నివసిస్తున్నారు. ఏం జరుగుతుందో గాని ఇక్కడి గిరిజనులు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇలా ఏడాదిన్నగా పది మందికి పైగా మృత్యువాత పడ్డారని గిరిజనులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ ఆరోగ్యం గురించి కనీసం పట్టించుకునే వారే లేకపోయారని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం దృష్టికి వెళ్లకపోవడం విచారకరమని సర్పంచ్ తొంటా ఆదిరాజు అన్నారు. ప్రజాప్రతినిధిని అయినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా మంచాన పడి.. గత ఏడాది డిసెంబర్లో కోసూరి తమ్మారావు (47) ఒక్కసారిగా మంచాన పడ్డాడు. వ్యవసాయం కూలీగా ఉంటూ కుటుంబానికి ఆధారమైన అతను కిడ్నీ సమస్య బారిన పడ్డాడు. అతనికి భార్య భద్ర, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లలను చదివించుకుంటూనే తన భర్తను డయాలసిస్ కోసం, వారానికి మూడు సార్లు వంద కిలోమీటర్ల దూరంలోని కాకినాడకు తీసుకు వెళ్తున్నట్లు భద్ర చెబుతోంది. ఇందుకు గాను నెలకు రూ.7,200 ఖర్చు అవుతోందని తెలిపింది. ఇలా గత 13 నెలలుగా నరకయాతన అనుభవిస్తున్నామని కన్నీటి పర్యంతమైంది. యజమాని మంచాన పడడంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని వివరించింది. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంది. అనేక మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో మందులు వేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ కనీసం పట్టించుకోకపోవడం లేదు. అసలు సమస్య ఎందువల్ల వచ్చిందనే దానిపై ఇంకా ఓ అంచనాకు రాకపోవడం దారుణం. వెలుగులోకి రావడంతో.. ఉర్లాకులపాడులో కిడ్నీ సమస్యతో పలువురు మృత్యువాత పడ్డారన్న విషయం వెలుగు చూడడంతో అధికారులు శుక్ర, శనివారాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం 43 మందికి రక్త పరీక్షలు చేసి కాకినాడ ల్యాబ్కు పంపగా, ఆరుగురికి అసాధారణ ఫలితాలు వచ్చాయని రంపచోడవరం నుంచి వచ్చిన డాక్టర్ డేవిడ్ అన్నారు. వీరిని తదుపరి పరీక్షల నిమిత్తం సోమవారం ప్రత్యేక వాహనంలో కాకినాడకు తరలిస్తామన్నారు. శనివారం మరో 66 మందికి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపామన్నారు. ఈ గ్రామంలో సంభవిస్తున్న మరణాలకు కారణం ఏంటో తప్పకుండా కనుగొని తక్షణ వైద్య సహాయం అందజేస్తామని రంపచోడవరం నుంచి వచ్చిన ఆర్బీఎస్కే – ఎన్సీడీసీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాగార్జున ‘సాక్షి’తో అన్నారు.ఫ ఉర్లాకులపాడులో మృత్యుఘోష ఫ కిడ్నీ సమస్యలతో గ్రామస్తులు ఫ ఏడాదిన్నరగా ఆగని ఆక్రందనలు ఫ పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్కరూ పట్టించుకోలేదు ఉర్లాకులపాడులో అనారోగ్య సమస్యలను ఇప్పటి వరకూ ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. మరణాలు వెలుగు చూస్తూండడంతో ఇప్పుడు వచ్చి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మా గ్రామంలో ఎంతో మంది మరణించారు. కుటుంబ యజమాని చనిపోవడంతో వీధిన పడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఎంతో బాధాకరం. – కోసూరి భద్ర, ఉర్లాకులపాడు కష్టం నుంచి ఆదుకోవాలి మా గ్రామంలో కిడ్నీ సమస్యల కారణంగా డయాలసిస్ చేయించుకుంటూ మరణించిన వారి సంఖ్య 20కి పైనే ఉంటుంది. ఇందులో పెళ్లి కాని యువకులూ ఉన్నారు. భార్య, పిల్లలు ఉన్న పురుషులు ఉన్నారు. నేటికి ఉర్లాకులపాడులో అనేక మంది అనారోగ్యంతో మంచాన పడ్డారు. మా గ్రామాన్ని ఈ కష్టం నుంచి ప్రభుత్వం ఆదుకోవాలి. – కోసూరి బూరమ్మ నమూనాలు సేకరిస్తున్నాం.. గ్రామంలో మూడు రక్షిత మంచి నీటి పథకాలు, మరో 20 చేతి పంపులున్నాయి. తాగేందుకు చేతి పంపు నీటినే వినియోగిస్తున్నారని తెలుసుకున్నాం. ఆ నీటి నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపాం. నీటి కారణంగా వ్యాధులు సంభవిస్తున్నాయా? ఇతర కారణాలు ఉన్నాయా అనే దానిపై అధ్యయనం చేస్తున్నాం. ఉర్లాకులపాడులో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కృషి జరుగుతోంది. – డేవిడ్, ప్రభుత్వ వైద్యాధికారి, రంపచోడవరం -
మహిళలపై పెరిగిన అత్యాచారాలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్రంలో పసి పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకూ మహిళలపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని ప్రగతిశీల మహిళా సంఘం (సీ్త్ర విముక్తి) జిల్లా నాయకురాలు రెడ్డి దుర్గాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాలు, పోర్న్ వెబ్సైట్ల నియంత్రణలో పాలకులు దారుణంగా విఫలమయ్యారని విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంఘం ఆధ్వర్యాన మార్చి 2 నుంచి 8వ తేదీ వరకూ నిర్వహించే సభలు, ర్యాలీల పోస్టర్ను ఆమె స్థానిక సూర్యనారాయణపురంలో ఆదివారం ఆవిష్కరించారు. మార్చి 2న రంగంపేట మండలం సింగంపల్లి, 3న రంపచోడవరం, 4న పెద్దాపురం, 6న జగ్గంపేట, 7న కాకినాడ, 8న రాజమహేంద్రవరం తదితర కేంద్రాల్లో నిర్వహిస్తున్న సభలు, ర్యాలీలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తోందని, ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన అని దుర్గాదేవి అన్నారు. రాష్ట్రంలో మద్యం వ్యాపారులు అధికార పార్టీ అండదండలతో బెల్టు షాపులు నిర్వహించి, విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారని చెప్పారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్షాల నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేస్తోందని, మనువాద భావజాలాన్ని ముందుకు తెస్తూ మహిళలను తిరోగమనం దిశగా నడిపిస్తోందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు. -
విద్యార్థీ.. విజయోస్తు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నా యి. వచ్చే నెల 24 తేదీ వరకూ ఈ పరీక్షలు నిర్వ హించనున్నారు. తొలి రోజు ఫస్టియర్, ఆ మర్నాడు అంటే మంగళవారం సెకండియర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. జిల్లావ్యాప్తంగా 58 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష పేపర్లను ఇప్పటికే ఆయా పోలీస్ స్టేషన్లలో భద్రపరిచి, సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. ఉదయం 8.30 గంటలకు పోలీస్ స్టేషన్ నుంచి పేపర్లు తీసుకుని వచ్చి, 8.45 గంటలకు తెరుస్తారు. పోలీస్ స్టేషన్ల నుంచి పరీక్ష పత్రాలను ఆయా కేంద్రాలకు ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం ‘నో యువర్ సెంటర్’ మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్గా ఆర్ఐఓ ఐ.శారద వ్యవహరిస్తారు. జిల్లా స్థాయి కమిటీ కన్వీనర్గా జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి (డీఐఈఓ) వి.కేశవరావు ఉంటారు. ఈయన జిల్లాలో పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారు. హాల్ టికెట్ల విషయంలో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసి, విజయం సాధించాలని ఆకాంక్షించారు. కొత్త విధానంలో.. ఈసారి ఇంటర్ పరీక్షల్లో ప్రభుత్వం అనేక మార్పులు చేసింది. ఫస్టియర్ విద్యార్థులకు కొత్త విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రథమ సంవత్సరం బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు 24 పేజీలు, మిగిలిన సబ్జెక్టులకు 32 పేజీలతో కూడిన బుక్లెట్లు ఇస్తారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మాత్రం అన్ని సబ్జెక్టులకూ పాత విధానంలోనే 24 పేజీల బుక్లెట్ ఇవ్వనున్నారు. బుక్లెట్లలో అన్ని పేజీలూ ఉన్నాయో లేదో విద్యార్థులు ముందుగానే చూసుకోవాలి. పేజీలను చించితే ఆ విద్యార్థిపై మాల్ప్రాక్టీస్ కేసు నమోదు చేస్తారు. ఇప్పటి వరకూ జువాలజీ, బోటనీ సబ్జెక్టులకు చెరొక 60 మార్కుల చొప్పన థియరీ పరీక్షలు నిర్వహించేవారు. ఈ ఏడాది రెండింటికీ కలిపి బయాలజీ పేరుతో 85 మార్కులకు నిర్వహిస్తున్నారు. ప్రశ్నపత్రం ఒక్కటే అయినప్పటికీ జవాబులు రాసేందుకు మాత్రం రెండు సబ్జెక్టులకు రెండు ఓఎంఆర్ షీట్లు ఇస్తారు. ఈ ఏడాది తొలిసారిగా ఒక్క మార్కు ప్రశ్నలు ప్రవేశపెట్టారు. గణితంలో 12, బోటనీలో 5, జువాలజీలో 4, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో చెరొక 9 చొప్పున ఒక్క మార్కు ప్రశ్నలు ఇవ్వనున్నారు. పాస్ మార్కులు ఇలా.. ఏ సబ్జెక్టుకైనా ఉత్తీర్ణత శాతం 35. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులకు ప్రథమ సంవత్సరంలో 85కు 29, ద్వితీయ సంవత్సరంలో 85కు 30 మార్కులు కచ్చితంగా రావాలి. ద్వితీయ సంవత్సరంలో 30 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తూండగా పాస్ మార్కులు 11 రావాలి. టైమ్ టేబుల్లో మార్పులు వచ్చే నెల 3న జరగాల్సిన సెకండియర్ మ్యాథ్స్, సివిక్స్ పరీక్షలు 4న, మార్చి 20న జరగాల్సిన ఫస్టియర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పరీక్ష 21న నిర్వహించనున్నారు. మార్చి 3న హోలీ, మార్చి 20న రంజాన్ రావడంతో ఈ మార్పులు చేశారు. నిఘా నీడలో.. పరీక్షలు నిఘా నీడలో నిర్వహించనున్నారు. పరీక్షలు జరుగుతున్నంతసేపూ ఆయా కేంద్రాల్లో ప్రతి కదలికనూ నిశితంగా పరిశీలించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ అధికారి(ఆర్ఐఓ)తో పాటు బోర్డు కేంద్ర కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. తద్వారా పరీక్షల నిర్వహణను లైవ్(ప్రత్యక్ష ప్రసారం)లో పరిశీలిస్తారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి జిల్లావ్యాప్తంగా 42,873 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం జిల్లా అంతటా కలిపి 58 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా కాకినాడ నగరంలో 19 వేల మంది వరకూ విద్యార్థులుండగా వీరి కోసం నగరం, రూరల్ ప్రాంతాలు కలిపి 24 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు ప్రైవేటు కేంద్రాలపై పర్యవేక్షణకు అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. రాష్ట్ర బృందంతో పాటు ఐదుగురు సభ్యులున్న జిల్లా కమిటీ పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తుంది. ప్రిన్సిపాల్, జూనియర్ లెక్చరర్, డిప్యూటీ తహసీల్దార్, పోలీసులతో కూడిన మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు, మూడు సిట్టింగ్ స్క్వాడ్లతో పాటు జిల్లా హైపవర్ కమిటీ ఈ పరీక్షలను పర్యవేక్షించనుంది. ఫోన్లపై నిషేధం పరీక్షా కేంద్రంలో సూపరింటెండెంట్ సహా కింది స్థాయి సిబ్బంది వరకూ ఏ ఒక్కరూ ఎటువంటి వ్యక్తిగత ఫోన్లూ వాడకూడదు. బోర్డు సమకూర్చిన ఫోన్, సిమ్ కార్డులు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద మట్టికుండలో తాగునీరు ఏర్పాటు చేయాలి. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.కాకినాడ పీఆర్ కళాశాలలో పరీక్ష నిర్వహణకు సిద్ధం చేసిన గది జిల్లాలో పరీక్షల నిర్వహణ ఇలా.. ప్రభుత్వ కళాశాలలు 15 హైస్కూల్ ప్లస్ 14 మోడల్ స్కూల్ 2 కేజీబీవీ 4 ఏపీఎస్డబ్ల్యూఆర్ 8 ప్రైవేట్ ఎయిడెడ్ 4 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ 99 మొత్తం 146 ఫస్టియర్ విద్యార్థులు 22,009 సెకండియర్ విద్యార్థులు 20,864 మొత్తం 42,873 పరీక్ష కేంద్రాలు 58 ఫ్లయింగ్ స్క్వాడ్లు 3 కంట్రోల్ రూమ్ హెల్ప్లైన్ నంబర్లు 90635 53377, 98493 92905 రాష్ట్ర స్థాయి టోల్ఫ్రీ నంబరు 1800–425–1531అరగంట ముందే రావాలి ఉదయం 9 గంటలకు పరీక్ష కచ్చితంగా ప్రారంభమవుతుంది. విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకోవాలి. మూడు గంటల పరీక్షా సమయంలో గతంలో మాదిరిగా అరగంట ముందుగా బయటకు వచ్చేసే వెసులుబాటును రద్దు చేశారు. కాబట్టి విద్యార్థి పూర్తిగా 12 గంటల వరకూ పరీక్ష గదిలోనే ఉండాలి. సందేహాలుంటే హెల్ప్లైన్ నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఎలాంటి పొరపాట్లు జరిగినా ఉపేక్షించేది లేదు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఆన్లైన్ కేంద్రాల వంటివి తెరవరాదని స్పష్టంగా సూచించాం. – వి.కేశవరావు, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి నేటి నుంచి ఇంటర్ పరీక్షలు వచ్చే నెల 24వ తేదీ వరకూ నిర్వహణ జిల్లావ్యాప్తంగా 58 కేంద్రాలు అరగంట ముందే బయటకు వచ్చే వీలు రద్దు ఫస్టియర్ విద్యార్థులకు 32 పేజీల బుక్లెట్ -
చలో విజయవాడను విజయవంతం చేయాలి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, పెన్షనర్లకు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 25న రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) సమర శంఖం పేరిట చలో విజయవాడకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి లంకలపల్లి సాయి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎస్టీయూ భవన్లో ఆదివారం జరిగిన ప్రథమ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, సంఘ నాయకులను చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యాయ వాణి ప్రధాన సంపాదకుడు కేవీ శేఖర్ మాట్లాడుతూ, 12వ పీఆర్సీ కమిటీని వెంటనే నియమించి, మధ్యంతర భృతి 30 శాతం ప్రకటించాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న నాలుగు విడతల డీఏ, 11వ పీఆర్సీ ఏపీజీఎల్ఐ, పీఎఫ్ సరెండర్ లీవ్స్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంఈఓల బదిలీలు నిర్వహించాలన్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శేశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతు రామకృష్ణ, ఆర్థిక కార్యదర్శి రామ్తేజ, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కుసుమంచి కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తుని రూరల్: హంసవరంలోని ఆదర్శ విద్యాలయం(ఏపీ మోడల్ స్కూల్)లో వచ్చే విద్యా సంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ టీవీ శివలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలివీ.. ఓసీ, బీసీ విద్యార్థులు 2014 సెప్టెంబర్ 1 నుంచి 2016 ఆగస్టు 31వ తేదీల మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 2012 సెప్టెంబర్ 1 నుంచి 2016 ఆగస్టు 31వ తేదీ మధ్య పుట్టిన వారు అర్హులు. సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2024–25, 2025–26 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. 2026లో ఐదో తరగతి చదువుతూ ప్రమోషన్కు అర్హత పొందాలి. దరఖాస్తు చేయడానికి ముందు సీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ లేదా ఏపీఎంఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్లలో సమాచార పత్రం పొందాలి. అర్హులైన అభ్యర్థులు సోమవారం నుంచి మార్చి 31వ తేదీలోగా నెట్ బ్యాంకింగ్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించిన తర్వాత కేటాయించిన జర్నల్ నంబరుతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీలు రూ.125 చొప్పున పరీక్ష ఫీజు చెల్లించాలి. ప్రవేశ పరీక్షలో ఎస్సీ, ఎస్టీలు 30, ఓసీ, బీసీ అభ్యర్థులు 35 చొప్పున మార్కులు సాధించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఐదో తరగతి స్థాయిలో తెలుగు, ఇంగ్లిషు మీడియాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఆరో తరగతిలో బోధన మాత్రం ఇంగ్లిషు మీడియంలో ఉంటుంది. మరిన్ని వివరాలకు పని వేళల్లో పాఠశాల కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రిన్సిపాల్ శివలక్ష్మి సూచించారు. రత్నగిరి కిటకిట అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి ఆదివారం కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. శనివారం రాత్రి, ఆదివారం వేకువజాము ముహూర్తాల్లో రత్నగిరి పైన, ఇతర ప్రాంతాల్లోను పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులు అధిక సంఖ్యలో సత్యదేవుని దర్శించుకున్నారు. ఆదివారం సెలవు కావడంతో వీరికి ఇతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తోడయ్యారు. దీంతో, ఆలయంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. ఉదయం 9 గంటల వరకూ రద్దీ ఓ మాదిరిగా ఉండగా.. ఆ తరువాత ఒక్కసారిగా వచ్చిన భక్తులతో కిక్కిరిసింది. సాయంత్రం వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. భక్తుల వాహనాలతో ఘాట్ రోడ్లు, పార్కింగ్ స్థలాలు నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి 2 గంటలు, రూ.200 టికెట్టుతో జరిగే అంతరాలయ దర్శనానికి గంట చొప్పున సమయం పట్టింది. స్వామివారి నిత్య కల్యాణంలో 25 మంది భక్తులు పాల్గొన్నారు. సుమారు 40 వేల మంది భక్తులు ఆలయానికి తరలి వచ్చారని, దేవస్థానానికి రూ.40 లక్షలకు పైగా ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సత్యదేవుని వ్రతాలు 2,500 జరిగాయి. ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున కూడా రత్నగిరిపై వివాహాలు జరగనున్నాయి. దీంతో, ఆలయంలో సోమవారం కూడా రద్దీ నెలకొనే అవకాశం ఉంది. -
లోవకు పోటెత్తిన భక్తులు
తుని రూరల్: లోవ దేవస్థానంలో తలుపులమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని క్యూలో 16 వేల మంది దర్శించుకున్నారని దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,86,020, పూజా టికెట్లకు రూ.2,57,000, తలనీలాలకు రూ.15,200, వాహన పూజలకు రూ.7,460, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.65,805, విరాళాలు రూ.31,301 కలిపి మొత్తం రూ.5,62,786 ఆదాయం సమకూరిందని వివరించారు. దేవస్థానంలో హుండీలను సోమవారం తెరచి ఆదాయాన్ని లెక్కించనున్నట్టు ఈఓ తెలిపారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్కాకినాడ క్రైం: వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. సత్ప్రవర్తనతో మెలగాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని, గొడవలు, దాడులు, భూ వివాదాలకు దూరంగా ఉండాలని, బెదిరింపులు, అక్రమ వసూళ్లకు దిగకూడదని, మద్యం తాగి అల్లర్లు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. చట్ట వ్యతిరేకంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. బాలాజీకి రూ.2.14 లక్షల ఆదాయం మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి దర్శనానికి ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి వారికి ముడుపులు, మొక్కులు చెల్లించారు. గోవిందా గోవిందా అంటూ బాలబాలాజీ దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని తన్మయులయ్యారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.2,14,453 ఆదాయం వచ్చింది. మొత్తం 6,300 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. అన్నప్రసాదం 2,100 మంది స్వీకరించారు. నిత్యాన్న ప్రసాదం ట్రస్టుకు రూ.88,463 విరాళాలు అందించారు. ఏకదంతుని దర్శనానికి తండోపతండాలు అయినవిల్లి: భక్తుల కోర్కెలు తీర్చే అయినవిల్లి గణపయ్యను దర్శించేందుకు ఆదివారం భక్తజ నం తండోపతండాలుగా తరలివచ్చారు. ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వ ర్యంలో స్వామికి తెల్లవారుజామున మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. స్వామి వారిని ఆర్చకులు పరిమళభరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహా నివేదన చేశారు. రాత్రి 8 గంటలకు స్వామికి విశేష సేవలు చేసిన అనంతరం ఆలయం తలుపులు మూసివేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 39 మంది పాల్గొన్నారు. 16 మంది భక్తులు లక్ష్మీగణపతి హోమం చేయించుకున్నారు. భక్తదంపతులు స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. స్వామికి నలుగురు భక్త దంపతులు ఉండ్రాళ్ల పూజ చేశారు. ఓ చిన్నారికి నామకరణ, ఎనిమిది మందికి అక్షరాభ్యాసాలు చేశారు. ఇద్దరు చిన్నారులకు తులాభారం, 52 మందికి అన్నప్రాశన నిర్వహించారు. వాహన పూజలు 58 మంది చేయించుకున్నారు. స్వామివారి అన్నప్రసాదం 5,218 మంది భక్తులు స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.4,24,197 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
సై.. సై.. శయ్యారే!
చిన్ననాడు అమ్మ పాడిన జోల పాటలు.. మనవడినో, మనవరాలినో నిద్రపుచ్చుతూ పక్కనే పడుకోబెట్టుకుని అమ్మమ్మ, నాన్నమ్మలు చెప్పిన కథలు.. మరెన్నో మరువలేని అనుభూతులు.. మధుర జ్ఞాపకాలకు ప్రత్యక్ష సాక్ష్యం.. పందిరి మంచం. పందిరి మంచం అంటే కేవలం నిద్రపోయేది కాదు.. అది ఒక తరం నుంచి మరో తరానికి జ్ఞాపకాలను అందించే అద్భుతమైన సాధనం! టేకు కర్రతో చేసిన దృఢమైన కోళ్లు.. వాటిని నాలుగు వైపులా కలుపుతూ అమర్చిన బలమైన బద్దీలు.. వాటికి నలుమూలలా నగిషీలు చెక్కి, బిగించిన నాలుగు టేకు స్తంభాలు.. వాటిని కలుపుతూ మళ్లీ నాలుగు బద్దీలు.. వాటికి అందంగా వేలాడదీసిన తెరలు.. వెరసి రాజసం ఉట్టి పడే పాన్పు! అందుకే దీనికున్న ఆదరణ ‘చెక్క’ చెదరనిది!పిఠాపురం: ఇల్లయినా కార్యాలయమైనా ఫర్నీచర్ ఉండాల్సిందే. అలసి సొలసిన దేహానికి కాసింత విశ్రాంతిని అందించేందుకు మంచాలు, కుర్చీలు ఎంతో అవసరం. వీటన్నింటిలోనూ మంచాలకు ఉన్న విలువ ఫర్నిచర్లో ఇక దేనికీ ఉండదు. మనిషి జీవితంలో సగ భాగం గడిపేది మంచం మీదే అంటే అతిశయోక్తి కాదు. అలాంటి మంచాలకు పూర్వకాలం నుంచీ మంచి గుర్తింపు ఉంది. ట్రెండ్ మారుతున్న కొద్దీ మంచాల్లో అనేక రకాల డిజైన్లు మార్పులు వచ్చినప్పటికీ పందిరి మంచానికి ఉన్న ఆదరణ చెక్కుచెదరనిది. గతంలో పందిరి మంచం లేని ఇల్లు ఉండేది కాదు. రానురానూ మారిన కాలంతో పాటు మంచాలు మారిపోయాయి. పందిరి మంచం పాత కాలపు వస్తువుగా మిగిలిపోయింది. కానీ, ప్రస్తుతం మారిన ట్రెండ్తో మళ్లీ పందిరి మంచాలకు పూర్వ వైభవం వస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా పందిరి మంచాలకు మంచి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో, వీటి తయారీ అమ్మకాలు ఊపందుకున్నాయి. కొన్నాళ్లు కనుమరుగు మంచానికి పైభాగంలో పందిరి లాగా కరత్రో చేసిన ఫ్రేమ్ నిర్మిస్తే దానిని పందిరి మంచం అంటారు. వీటిని దోమ తెరలు బిగించడానికి లేదా శుభకార్యాల్లో అలంకరించడానికి ఉపయోగిస్తారు. పూర్వం దోమల నుంచి రక్షణకు దోమ తెరలు కట్టుకునే విధంగా దీనిని రూపొందించారు. కేవలం నిద్రించడానికే కాకుండా ఇంటి అలంకరణలో స్టేటస్ సింబల్గా ఇది ఉండేది. ఇంటి ముందర వాతావరణం నుంచి రక్షణగా పందిరి ఎలా ఉంటుందో ఇంట్లో సౌకర్యవంతంమైన నిద్రకు రక్షణగా ఈ మంచంను డిజైన్ చేయడంతో దీనికి పందిరి మంచం అనే పేరు వచ్చింది. మడత మంచం, నవారు మంచం ఇలా అనేక రకాల మంచాలు ఉన్నప్పటికీ దీనికి ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అలాంటిది రాను రానూ ఇవి వాడుకలో లేకుండా పోయాయి. కొందరు పాత సామాన్ల వారికి అమ్మేసిన సందర్భాలూ ఉన్నాయి. ఎక్కువ జాగా అవసరం కావడంతో ప్రస్తుత కాలంలో అతి తక్కువ జాగాలో ఎక్కువ మంది నివసించే పరిస్థితుల్లో వీటిని ఉపయోగించడం భారంగా భావించి వాడడం మానేశారు. తయారీకి సెప‘రేటు’ డబుల్ కాట్ సింగిల్ కాట్ మంచాలు డిజైన్ బట్టి తయారు చేసే కర్రను బట్టి రేట్లు ఉండగా ప్రస్తుతం పందిరి మంచాలకు మాత్రం అధిక ధరలు పలుకుతున్నాయి. టేకు కర్రతో తయారు చేసే పందిరి మంచాలకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ధర పలుకుతోంది. మామూలు మంచాల కంటే ఎక్కువ కర్ర అవసరం అవుతుంది. పని కూడా పదితంలు ఎక్కువగా ఉండడంతో వీటి తయారీకి సొమ్ము గట్టిగానే ఖర్చవుతోంది. గతంలో నాణ్యమైన కర్రతో చేసిన పందిరి మంచాలు ఎలా ఉన్నాయో అదే రీతిలో ఇప్పుడు తయారు చేయిస్తున్నారు. వీటికితోడు కొత్త సొబగులు అద్దుకొని ఆకర్షణీయంగా తయారవుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో పందిరి మంచాల అమ్మకాలు ఊపందుకోగా తయారీదారులు బిజీగా మారిపోయారు. పట్టు పరుపునకే ప్రాధాన్యం పందిరి మంచం పట్టు పరుపు ఒక కాంబినేషన్గా ఉంటుంది. ఇది పూర్వం నుంచి కొనసాగుతున్న ఒరవడి. అయితే కొంతకాలం నుంచి పరుపుల్లో అనేక రకాలు అందుబాటులోకి రావడంతో పట్టు పరుపులు కనుమరుగయ్యాయి. కేవలం బూరుగు దూదితో తయారు చేసే పట్టు పరుపులు కనిపించకుండా పోయాయి. కాని పందిరి మంచాల రాకతో మళ్లీ వీటికి జీవం వస్తోంది. పందిరి మంచం తయారు చేయించుకునే వారు దూది పరుపుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మళ్లీ దూది పరుపుల తయారీ ప్రారంభమయ్యింది.ట్రెండ్ మారింది ఇప్పటి వరకు మామూలు మంచాలు మాత్రమే తయారు చేసేవాళ్లం. ఈ మధ్య చాలామంది పందిరి మంచాలు తయారు చేయమని ఆర్డర్లు ఇస్తున్నారు. పూర్వం ఉండే పందిరి మంచాలను పోలి ఉండి కొత్త డిజైన్లలో మంచాలు తయారు చేయమంటున్నారు. వీటి తయారీకి ఎంత ఖర్చు అయినా వెనుకాడడం లేదు. ఒక్కో మంచం తయారు చేయడానికి రూ.1.50 లక్షలు ఖర్చవుతోంది. డిజైన్ను బట్టి రేటు పెరుగుతుంది.ఒక్కో మంచం తయారీకి నెల రోజులు పైగా సమయం పడుతోంది. ప్రతీ రోజు ఇద్దరు నుంచి నలుగురు పని చేయాల్సి ఉంటుంది. గతంలో అంతా చేతి పని కాగా ప్రస్తుతం మెషీన్లు అందుబాటులోకి రావడంతో కాస్త పని సులువుగా మారినా మంచం అంతా డిజైన్లతో ఉండడం వల్ల బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. పాలిష్కు ప్రాధాన్యం ఉండడంతో దానికే రూ.30 వేల వరకు ఖర్చు అవుతుంది. – పట్నాల సీతాంబరం, వడ్రంగి మేస్త్రి, కొత్తపల్లిక్రమంగా డిమాండ్ ట్రెండ్ మారింది. పాత కాలపు అలవాట్లకు వస్తువులకు ప్రా«ధాన్యం పెరిగింది. దానిలో భాగంగా కొన్నాళ్లు కనిపించని పందిరి మంచాలకు మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. జనం వీటిపై మక్కువ చూపడంతో క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. దీంతో పందిరి మంచాల తయారీ ఊపందుకుంది. ఎక్కువ మంది కొత్తగా పందిరి మంచాలను తయారు చేయిస్తున్నారు. -
సై.. సై.. శయ్యారే!
● పందిరి మంచాలకు పెరుగుతున్న క్రేజ్ ● మారిన ట్రెండ్తో పూర్వ వైభవం ● తయారీకి పెరిగిన ప్రాధాన్యంపిఠాపురం: ఇల్లయినా కార్యాలయమైనా ఫర్నిచర్ ఉండాల్సిందే. అలసి సొలసిన దేహానికి కాసింత విశ్రాంతిని అందించేందుకు మంచాలు, కుర్చీలు ఎంతో అవసరం. వీటన్నింటిలోనూ మంచాలకు ఉన్న విలువ ఫర్నిచర్లో ఇక దేనికీ ఉండదు. మనిషి జీవితంలో సగ భాగం గడిపేది మంచం మీదే అంటే అతిశయోక్తి కాదు. అలాంటి మంచాలకు పూర్వకాలం నుంచీ మంచి గుర్తింపు ఉంది. ట్రెండ్ మారుతున్న కొద్దీ మంచాల్లో అనేక రకాల డిజైన్లు మార్పులు వచ్చినప్పటికీ పందిరి మంచానికి ఉన్న ఆదరణ చెక్కుచెదరనిది. గతంలో పందిరి మంచం లేని ఇల్లు ఉండేది కాదు. రానురానూ మారిన కాలంతో పాటు మంచాలు మారిపోయాయి. పందిరి మంచం పాత కాలపు వస్తువుగా మిగిలిపోయింది. కానీ, ప్రస్తుతం మారిన ట్రెండ్తో మళ్లీ పందిరి మంచాలకు పూర్వ వైభవం వస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా పందిరి మంచాలకు మంచి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో, వీటి తయారీ అమ్మకాలు ఊపందుకున్నాయి. కొన్నాళ్లు కనుమరుగు మంచానికి పైభాగంలో పందిరి లాగా కరత్రో చేసిన ఫ్రేమ్ నిర్మిస్తే దానిని పందిరి మంచం అంటారు. వీటిని దోమ తెరలు బిగించడానికి లేదా శుభకార్యాల్లో అలంకరించడానికి ఉపయోగిస్తారు. పూర్వం దోమల నుంచి రక్షణకు దోమ తెరలు కట్టుకునే విధంగా దీనిని రూపొందించారు. కేవలం నిద్రించడానికే కాకుండా ఇంటి అలంకరణలో స్టేటస్ సింబల్గా ఇది ఉండేది. ఇంటి ముందర వాతావరణం నుంచి రక్షణగా పందిరి ఎలా ఉంటుందో ఇంట్లో సౌకర్యవంతంమైన నిద్రకు రక్షణగా ఈ మంచంను డిజైన్ చేయడంతో దీనికి పందిరి మంచం అనే పేరు వచ్చింది. మడత మంచం, నవారు మంచం ఇలా అనేక రకాల మంచాలు ఉన్నప్పటికీ దీనికి ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అలాంటిది రాను రానూ ఇవి వాడుకలో లేకుండా పోయాయి. కొందరు పాత సామాన్ల వారికి అమ్మేసిన సందర్భాలూ ఉన్నాయి. ఎక్కువ జాగా అవసరం కావడంతో ప్రస్తుత కాలంలో అతి తక్కువ జాగాలో ఎక్కువ మంది నివసించే పరిస్థితుల్లో వీటిని ఉపయోగించడం భారంగా భావించి వాడడం మానేశారు. తయారీకి సెప‘రేటు’ డబుల్ కాట్ సింగిల్ కాట్ మంచాలు డిజైన్ బట్టి తయారు చేసే కర్రను బట్టి రేట్లు ఉండగా ప్రస్తుతం పందిరి మంచాలకు మాత్రం అధిక ధరలు పలుకుతున్నాయి. టేకు కర్రతో తయారు చేసే పందిరి మంచాలకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ధర పలుకుతోంది. మామూలు మంచాల కంటే ఎక్కువ కర్ర అవసరం అవుతుంది. పని కూడా పదితంలు ఎక్కువగా ఉండడంతో వీటి తయారీకి సొమ్ము గట్టిగానే ఖర్చవుతోంది. గతంలో నాణ్యమైన కర్రతో చేసిన పందిరి మంచాలు ఎలా ఉన్నాయో అదే రీతిలో ఇప్పుడు తయారు చేయిస్తున్నారు. వీటికితోడు కొత్త సొబగులు అద్దుకొని ఆకర్షణీయంగా తయారవుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో పందిరి మంచాల అమ్మకాలు ఊపందుకోగా తయారీదారులు బిజీగా మారిపోయారు. పట్టు పరుపునకే ప్రాధాన్యం పందిరి మంచం పట్టు పరుపు ఒక కాంబినేషన్గా ఉంటుంది. ఇది పూర్వం నుంచి కొనసాగుతున్న ఒరవడి. అయితే కొంతకాలం నుంచి పరుపుల్లో అనేక రకాలు అందుబాటులోకి రావడంతో పట్టు పరుపులు కనుమరుగయ్యాయి. కేవలం బూరుగు దూదితో తయారు చేసే పట్టు పరుపులు కనిపించకుండా పోయాయి. కాని పందిరి మంచాల రాకతో మళ్లీ వీటికి జీవం వస్తోంది. పందిరి మంచం తయారు చేయించుకునే వారు దూది పరుపుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మళ్లీ దూది పరుపుల తయారీ ప్రారంభమయ్యింది. చిన్ననాడు అమ్మ పాడిన జోల పాటలు.. మనవడినో, మనవరాలినో నిద్రపుచ్చుతూ పక్కనే పడుకోబెట్టుకుని అమ్మమ్మ, నాన్నమ్మలు చెప్పిన కథలు.. మరెన్నో మరువలేని అనుభూతులు.. మధుర జ్ఞాపకాలకు ప్రత్యక్ష సాక్ష్యం.. పందిరి మంచం. పందిరి మంచం అంటే కేవలం నిద్రపోయేది కాదు.. అది ఒక తరం నుంచి మరో తరానికి జ్ఞాపకాలను అందించే అద్భుతమైన సాధనం! టేకు కర్రతో చేసిన దృఢమైన కోళ్లు.. వాటిని నాలుగు వైపులా కలుపుతూ అమర్చిన బలమైన బద్దీలు.. వాటికి నలుమూలలా నగిషీలు చెక్కి, బిగించిన నాలుగు టేకు స్తంభాలు.. వాటిని కలుపుతూ మళ్లీ నాలుగు బద్దీలు.. వాటికి అందంగా వేలాడదీసిన తెరలు.. వెరసి రాజసం ఉట్టి పడే పాన్పు! అందుకే దీనికున్న ఆదరణ ‘చెక్క’ చెదరనిది! క్రమంగా డిమాండ్ ట్రెండ్ మారింది. పాత కాలపు అలవాట్లకు వస్తువులకు ప్రాధాన్యం పెరిగింది. దానిలో భాగంగా కొన్నాళ్లు కనిపించని పందిరి మంచాలకు మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. జనం వీటిపై మక్కువ చూపడంతో క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. దీంతో పందిరి మంచాల తయారీ ఊపందుకుంది. ఎక్కువ మంది కొత్తగా పందిరి మంచాలను తయారు చేయిస్తున్నారు. ట్రెండ్ మారింది ఇప్పటి వరకు మామూలు మంచాలు మాత్రమే తయారు చేసేవాళ్లం. ఈ మధ్య చాలామంది పందిరి మంచాలు తయారు చేయమని ఆర్డర్లు ఇస్తున్నారు. పూర్వం ఉండే పందిరి మంచాలను పోలి ఉండి కొత్త డిజైన్లలో మంచాలు తయారు చేయమంటున్నారు. వీటి తయారీకి ఎంత ఖర్చు అయినా వెనుకాడడం లేదు. ఒక్కో మంచం తయారు చేయడానికి రూ.1.50 లక్షలు ఖర్చవుతోంది. డిజైన్ను బట్టి రేటు పెరుగుతుంది. ఒక్కో మంచం తయారీకి నెల రోజులు పైగా సమయం పడుతోంది. ప్రతీ రోజు ఇద్దరు నుంచి నలుగురు పని చేయాల్సి ఉంటుంది. గతంలో అంతా చేతి పని కాగా ప్రస్తుతం మెషీన్లు అందుబాటులోకి రావడంతో కాస్త పని సులువుగా మారినా మంచం అంతా డిజైన్లతో ఉండడం వల్ల బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. పాలిష్కు ప్రాధాన్యం ఉండడంతో దానికే రూ.30 వేల వరకు ఖర్చు అవుతుంది. – పట్నాల సీతాంబరం, వడ్రంగి మేస్త్రి, కొత్తపల్లి -
రత్నగిరి కిటకిట
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం శనివారం వేలాదిగా విచ్చేసిన భక్తులతో కిటకిట లాడింది. రత్నగిరిపై శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వివాహాలు చేసుకున్న నవ దంపతులు కూడా వారి బంధుమిత్రులతో కలసి సత్యదేవుని ఆలయానికి వచ్చారు. దీంతో ఆలయం నవ దంపతులు, వారి బంధుమిత్రులతో బాటు పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులతో స్వామివారి ఆలయం, ఆలయ ప్రాంగణం, విశ్రాంతి మండపాలు, క్యూ లు నిండిపోయాయి. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఉదయం పది గంటలకు స్వామి, అమ్మవార్లను తిరుచ్చి వాహనంపై ఊరేగింపుగా తూర్పురాజగోపురం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ పండితుల పూజల అనంతరం దేవస్థానం ఏఈఓ కృష్ణారావు కొబ్బరికాయ కొట్టి సేవ ప్రారంభించారు. స్వామి, అమ్మవార్లను తిరుచ్చి వాహనం మీద మూడు సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. అనంతరం మళ్లీ పూజలు చేసి స్వామి, అమ్మవార్లను తిరిగి ప్రధానాలయానికి చేర్చారు. -
అదే రూపం.. అచ్చెరువొందేలా!
● తనువులు వేరైనా పోలిక ఒక్కటే ● చూపరులకు కనికట్టు చేసే చిత్రం! ● నేడు ప్రపంచ కవలల దినోత్సవం పిఠాపురం: కను ముక్కు తీరు ఒకేలా.. హావభావాలు ఒకేలా.. నవ్వు మాటతీరు ఒకేలా.. ఆంగికం ఒకేలా.. ఆ ఇద్దరూ ఒకేలా.. అవును ఒకేలా కనిపించే వారు ఇద్దరుగా వచ్చి ఆ కుటుంబాన్నీ.. చుట్టుపక్కల వారినీ.. స్నేహితులనూ తికమక పెట్టే కవలలు వారు. భగవంతుని సృష్టిలో ఇదో విచిత్రం. ఇటువంటి వారికి వారి తల్లిదండ్రులు పేర్లు సైతం శబ్ద సారూప్యం ఉండేలా జయ విజయ, రామ తులసీ లక్ష్మీ తులసి, రామయ్య లక్ష్మయ్య, రమేష్ నరేష్, వనజ జలజ ఇలా పెడుతుంటారు. ఆదివారం ప్రపంచ కవలల దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. దినోత్సవం మొదలైంది ఇలా.. కవలల దినోత్సవం ఏటా ఫిబ్రవరి 22న నిర్వహిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 125 మిలియన్ల ‘మల్టిపుల్స్’ (ఒకే కాన్పులో జన్మించిన ఒకరి కన్నా ఎక్కువ మంది) ఉన్నారు. ప్రపంచంలో మొదట సారి కవలల దినోత్సవాన్ని పోలెండ్లో 1976లో నిర్వహించారు. వేదాల్లో అశ్వినీ దేవతలు, రామయణంలో లవకుశలు, మహాభారతం లో నకుల సహదేవులు కవలలుగా మనకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పోలెండ్లో జన్మించిన మోజస్, ఆరోన్ విల్కాక్స్ అనే కవల సోదరులు మరణించిన రోజును ప్రపంచ కవలల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దీనికి చారిత్రక నేపథ్యం ఉంది. మోజస్, ఆరోన్ విల్కాక్స్లు పెద్ద మొత్తంలో భూమిని దానం చేశారు. వారి మరణానంతరం వారి సంస్మరణార్థం ఆ ఊరికి ట్విన్స్బర్గ్ అని పేరు పెట్టారు. వివాహాల అనంతరం కూడా తమ అనుబంధం విడిపోకూడదన్న ఆలోచనతో అక్క చెల్లెళ్లనే వారు వివాహం చేసుకున్నారు. విచిత్రంగా ఇద్దరూ ఒకే వ్యాధితో బాధపడుతూ ఫిబ్రవరి 22వ తేదీనే మరణించారు. ఆ రోజు నుంచే ట్విన్స్ డే నిర్వహిస్తున్నారు. మన దేశంలో మొదటిసారిగా కవలల పండుగ 2004లో హైదరాబాద్లో నిర్వహించారు. ట్విన్స్ ప్యారడైజ్ పేరుతో నిర్వహించిన ఈ పండుగలో వందలాది కవలలు పాల్గొన్నారు. బయటివాళ్లు పోల్చుకోలేరు కరప మండలం పాతర్లగడ్డకు చెందిన ఉపాద్యాయుడు పులపకూర వెంకటరమణమూర్తికి ఝాన్సీరాణి, ఇషితాప్రియ అనే కవలలు ఉన్నారు. వీరు బయటకు వెళ్తే ఎవరి పేరేంటో ఎవరూ గుర్తు పట్టలేరు. ఇద్దరూ మొండి ఘటాలే. డ్రెస్సులు, ఆభరణాలు, టిఫిన్లు సైతం ఒకటే కావాలంటారు. కుదరదంటే ఆ ఇంట రణరంగమే. విచిత్రమేంటంటే ఆనందం కానీ, అనారోగ్యం కానీ ఇద్దరికీ ఒకేసారి వస్తాయంటారు వారి తల్లిదండ్రులు. అదే మండలం వేళంగికి చెందిన గుణ దంపతులకు గౌషిక్, గౌతమ్ అనే కవలలు ఉన్నారు. వీరికి నాలుగేళ్లు. వారి రూపం చేష్టలు ఒకేలా ఉంటాయి. వారి అల్లరి చేష్టలతో ఆ తల్లిదండ్రులు ముచ్చటపడుతుంటారు. బండార్లంకలో ట్రిప్లెట్స్ అమలాపురం రూరల్: మండలంలోని బండార్లంకలో నిమిషం వ్యవధి జన్మించిన రాగిరెడ్డి లక్ష్మణ్, రాము, మోహినీ పుష్ప స్థానికులను నిత్యం తికమకపెడుతూనే ఉంటారు. ఇదే గ్రామంలో కోలిపాక రాజశేఖర్ రత్నకుమార్, చింతామోహన్ మానోభిశివరా మ్, వసా రోహితకుమార్ రోజా, చొల్లింగి సుశీల, హరిత, లంకాడి కార్తికేయ, జి.రాయ్వర్మ, తేజశ్రీసాయి తేజశ్రీ శైల, లోహిత రుచిత. పి లక్ష్మి, సాయి ఒకే పోలికలతో ఉండడం గమనార్హం. అలాగే కామనగరువు ఆదిత్య స్కూల్లో అలేఖ్య, అమూల్య, క్రిత్విక్, క్రితిక్, అనుదీప్ అనిరుథ్, విరాజ్ విరాట్, అల్లవరానికి చెందిన రామ్, లక్ష్మణ్, కామనగరువుకు చెందిన జాస్మిత శ్రీ, జస్విత శ్రీ, బండారులంక నక్క వారి పేట ఎంపీపీఎస్ చదువుతున్న మెండి నేహశ్రీ, మెండి నవ్యశ్రీ ఇలా ఎందరో కవలలు స్థానికులను అలరిస్తుంటారు. శంఖవరానికి చెందిన రొట్ట అనూష, సునీత సింగులూరి జయ, విజయకవలలు సకిరెడ్డి రామ తులసి, లక్ష్మీ తులసి సైన్స్ పరంగా.. సృష్టిలో ఉన్న వింతలలో కవలల జననం ఒకటి. తల్లి గర్భంలో జరిగే మార్పుల వల్ల వీరు పుడతారని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రత్యుత్పత్తి ప్రక్రియలో అండం ఏర్పడిన తరువాత శుక్రకణం రెండుగా విడిపోయి పుట్టిన కవలలను మోనోజైగోటిక్ లేదా యూనిఓవిలార్ ట్విన్స్ అంటారు. వీరిలో ఇద్దరు ఆడ లేక మగ అయ్యి ఉంటారు. వీరికి పోలికలు అన్ని ఒకేలా ఉంటాయి. రెండు శుక్రకణాలు ఏర్పడి జన్మించే కవలలను డైజైగోటిక లేదా జైనోవిలార్ ట్విన్స్ అంటారు వీరిలో ఒకరు ఆడ మరొకరు మగ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. -
పోక్సో కేసు నిందితుడిని అరెస్టు చేయాలి
● బాధితులతో కలసి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి ఆందోళన ● బిక్కవోలు పోలీసుస్టేషన్ ముట్టడి ● భారీగా తరలి వచ్చిన ప్రజలు అనపర్తి: పోక్సో కేసులో బిక్కవోలు పోలీసులు నిందితుడికి అండగా ఉండి తమకు అన్యాయం చేశారంటు రంగాపురం గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు శనివారం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో బిక్కవోలు పోలీస్టేషన్ను ముట్టడించారు. సాయంత్రం నాలుగు గంటలకు రంగాపురం గ్రామం నుంచి భారీగా తరలి వచ్చిన ప్రజలతో కలసి డాక్టర్ సూర్యనారాయణరెడ్డి స్టేషన్కు వెళ్లారు. సిబ్బంది ఎస్సై లేరని చెప్పడంతో వచ్చే వరకు వేచి ఉంటామంటూ స్టేషన్ ఎదురుగా బైఠాయించి బాలికకు న్యాయం చేయాలంటు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో కొంత సేపటికి అనపర్తి సీఐ వీఎల్వీకే సుమంత్ రావడంతో ప్రజలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. తమకు న్యాయం జరగడం లేదంటూ పెద్ద పెట్టున కేకలు వేస్తు బాలిక తల్లి వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాను తాగబోతుండగా పక్కన ఉన్న వారు దానిని లాక్కుని ఆమెను శాంతపరిచారు. అనంతరం బాధిత బాలిక తల్లిని సీఐ విచారించారు. ఆరో తరగతి చదువుతున్న తమ కుమార్తైపె టీడీపీ గ్రామశాఖ మాజీ అధ్యక్షుడు నంగన వెంకటరమణ కుమారుడు నరశింహ అత్యాచారయత్నం చేశాడని ఫిర్యాదు చేయడానికి వస్తే కేసు నమోదు చేయకుండా మూడు రోజుల పాటు స్టేషన్ చుట్టూ తిప్పుకొన్నారని, పరిహారం కావాలో, పెళ్లి కావాలో చెబితే చేయిస్తామని అన్నారని తెలిపింది. తమకు న్యాయం కావాలని, కేసు మాత్రమే కావాలంటే ఎస్సై నానా దుర్భాషలాడారని పేర్కొన్నారు. తనను, తన తోటి కోడల్ని స్టేషన్లో నిర్బంధించి తన భర్తను బావగారిని, వారి కుమారుడిని జోడినాదాల తూము వద్ద అరెస్టు చేసినట్టు చెప్పారన్నారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి వారిని రాజమహేంద్రవరం జైలుకు రిమాండ్కు పంపించారని తెలిపింది. మహిళలైన తమను ఇంటికి పంపించడానికి రూ.10 వేలు తీసుకున్నారని బాధితురాలి తల్లి ఆరోపించింది. సుమారు గంటపాటు ఆందోళనకారులు పోలీసులతో వాగ్వాదం చేశారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సూర్యనారాయణరెడ్డితో చర్చించిన సీఐ సుమంత్ బాధితురాలి వాంగ్మూలం ఇంకా స్టేషన్కు రాలేదని, వచ్చిన వెంటనే కోర్టు అనుమతితో మారుస్తామని, ఇందుకు సహకరించాలని కోరారు. దీనిపై డాక్టర్ మాట్లాడుతూ ఎస్సై పనితీరు చాలా అభ్యంతరకరంగా ఉంటోందని, ఆయనను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తానని బాలికకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. కార్యక్రమంలో బిక్కవోలు మండల వైఎస్సార్ సీపీ నాయకులు నల్లమిల్లి త్రినాథరెడ్డి, సత్తి హరిప్రసాదరెడ్డి, గుబ్బల లాజర్బాబు, పోతుల ప్రసాదరెడ్డి, గువ్వల సత్తిరెడ్డి, కొంకుదురు పీవీ, పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి తోట ప్రకాశరావు తదితర నాయకులు పాల్గొన్నారు. -
తొలి తిరుపతిలో భక్తుల రద్దీ
పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండల పరిధిలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి గ్రామంలో వేంచేసియున్న శృంగారవల్లభ స్వామి ఆలయానికి ఽశనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కాలి నడకతో ఆలయానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటామని మొక్కుకున్న భక్తులు వివిధ గ్రామాల నుంచి తరలివచ్చారు. స్వామి, అమ్మవార్లను పూలతో సుందరంగా అలంకరించారు. సుమారు 12వేల మంది స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.1,78,750, అన్నదాన విరాళాలుగా రూ.50,125, కేశ ఖండన ద్వారా రూ.4,520, తులాభారం ద్వారా రూ.600, లడ్డూ ప్రసాదం విక్రయంతో రూ.20,565 కలిపి మొత్తం రూ.2,54,560 ఆదాయం ఆలయానికి వచ్చినట్టు చెప్పారు. ఆలయంలో 3,200 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని ఈఓ తెలిపారు. ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజలు నిర్వహించారు. సర్పంచ్ మొయిలి కృష్ణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్మన్ మొయిలి సంధ్య, దేవస్థాన సిబ్బంది, భక్తులకు సేవలందించారు. -
అక్రమంగా తరలిస్తున్న 320 తాబేళ్ల స్వాధీనం
ఇద్దరి అరెస్టు ఏలేశ్వరం: అక్రమంగా రవాణా చేస్తున్న తాబేళ్లను శనివారం అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. అటవీశాఖ రేంజర్ దుర్గా రాంప్రసాద్ తెలిపిన వివరాల మేరకు కోనసీమ జిల్లా రామచంద్రపురం పరిసరాల గ్రామాల నుంచి 18 గోనె సంచుల్లో 320 తాబేళ్లను బోలెరో వాహనంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ప్లాజా వద్ద వాహనంతో పాటు తాబేళ్లు, ఇద్దరు నిందితులను స్వాధీనం చేసుకున్నారు. తాబేళ్లను ఏలేరు ప్రాజెక్టులో వదిలిపెట్టారు. నిందితులను ప్రత్తిపాడు కోర్డులో హాజరు పరిచినట్టు ఆయన తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంలో కార్మికుడి మృతి కాకినాడ రూరల్: ఎన్హెచ్ 216 బ్రిడ్జి నిర్మాణ పనుల్లో పొల్గొన్న పశ్చిమ బెంగాల్కు చెందిన కార్మికుడు నాబా ముండా (51) మృతి చెందడంతో సర్పవరం పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సర్పవరం ఆటోనగర్ వెనక భాగంలోని హైవే వంతెన నిర్మాణ పనులు జరుగుతుండడంతో నాబా ముండా ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే తోటి కార్మికులు జీజీహెచ్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పెద్దిరాజు తెలియజేశారు. -
కాల్మనీ బాధితులకు అండగా ఉంటాం
● ఆ మాఫియాను తరిమికొడదాం ● ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అమలాపురం టౌన్: కాల్ మనీ వ్యాపారులు ఓ మాఫియా తయారై, అధిక వడ్డీలతో పేదల జీవితాలను నాశనం చేస్తున్నారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థను రద్దు చేయాలని తాము శాసన మండలిలో పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో కొందరు కాల్ మనీ బాధితులతో కలిసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో సుమారు 30 వేల మందికి పైగా పేదలు.. కాల్ మనీ వ్యాపారుల బారిన పడి విలవిలలాడుతున్నారన్నారు. ఉప్పాడ సత్యనారాయణ అనే చిన్న వ్యాపారి రూ.2 లక్షల అప్పు తీసుకుంటే.. దానిపై అధిక వడ్డీలు వేసి నేటికి రూ.17 లక్షలు వసూలు చేసేందుకు ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. పుస్తకాలు కుట్టుకుంటూ జీవించే సత్యనారాయణ ఇంటిపై కాల్ మనీ వ్యాపారి కన్ను పడిందన్నారు. దీంతో బాధితుడితో కలిసి తాను ఇటీవల జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అమలాపురం పట్టణ సీఐ వీరబాబు ఆ కేసును దర్యాప్తు చేస్తున్నారని, సంబంధిత కాల్ మనీ వ్యాపారి కూడా దారికి వచ్చారని గుర్తు చేశారు. బాధితుల ఆస్తులపై కాల్ మనీ వ్యాపారులు సివిల్ దావాల ద్వారా పెడుతున్న కేసులను బాధితుల తరఫున ఎదుర్కొనేందుకు, పోరాడేందుకు మేమంతా మీకు అండగా ఉంటామని ఎమ్మెల్సీ తెలిపారు. -
నాక్ ఆధ్వర్యంలో సర్వేపై ఉచిత శిక్షణ
సామర్లకోట: స్థానిక సీబీఎం సెంటర్లో ఉన్న నేషనల్ అకాడమి ఆఫ్ కనస్ట్రక్షన్ (నాక్) ఆధ్వర్యంలో నిరుదోగ్య యువతీ, యువకులు మూడు నెలల పాటు సర్వేయింగ్ కోర్సుపై ఉచిత శిక్షణ ఇస్తామని సెంటర్ కోర్సు కోఆర్డినేటర్ ఆర్ఎన్ఎస్ఎస్ శివ, సెంటర్ ఇన్చార్జి ఎన్.తాతారావు తెలిపారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ 18 నుంచి 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లమా, ఐటీసీ, బీటెక్ అర్హత ఉన్నవారు శిక్షణకు హాజరు కావచ్చునని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్తో పాటు ఉదోగ్య అవకాశం కల్పిస్తారన్నారు. ఈ నెల 25వ తేదీలోపు అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేయించుకోవాలని 28 నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఆసక్తి కలిగిన వారు 94407 56250, 96667 71726 నంబర్లలో సంప్రదించాలన్నారు. తపోవనాన్ని సందర్శించిన శారదా పీఠాధిపతి తుని రూరల్: తుని మండలం కుమ్మరిలోవ తాండవ నదీతీరంలో ఉన్న సచ్చిదానంద తపోవనం ఆశ్రమాన్ని విశాఖపట్నానికి చెందిన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి శనివారం సందర్శించారు. ఇటీవల శివైక్యం చెందిన తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతీ మహాస్వామి సమాధి వద్ద నివాళులర్పించారు. వేద విద్యార్థులను, వేద పండితులను కలుసుకుని సరస్వతీ మహాస్వామి నిర్వహించిన ఆథ్యాత్మిక కార్యక్రమాలను తెలుసుకున్నారు. శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి, విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, భక్తులు పాల్గొన్నారు. అందుబాటులోకి హెలికాప్టర్ సేవలు కాకినాడ రూరల్: కాకినాడ నగర వాసులు, జిల్లా వాసులు, బీచ్ సందర్శకుల గగన విహారానికి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో స్మార్ట్ సిటీ నిధులు సుమారు రూ.3.5 కోట్లతో బీచ్ రోడ్డులో హెలిపోర్ట్ను అభివృద్ధి చేశారు. 2023 నవంబర్లో పనులకు మాజీ మంత్రి, అప్పటి ఎమ్మెల్యే కురసాల కురసాల కన్నబాబు ప్రారంభోత్సవం చేశారు. ఇప్పటికే గో కార్ట్ స్పోర్ట్స్ అందుబాటులో ఉండగా తాజా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్ నిర్వాహకుల ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ సేవలను రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ శనివారం ప్రారంభించారు. నిర్వాహకులు మాట్లాడుతూ 5 నుంచి 7 నిమిషాల పాటు గగన విహారం ఉంటుందని, ఇందుకు రూ.3,999 వసూలు చేస్తామన్నారు. ఏ స్క్వేర్ గో కార్ట్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చన్నారు. వారంలో మూడు రోజుల పాటు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. లిఫ్ట్లో చిక్కుకున్న రోగులు కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్లో రోగులు వారి బంధువులు లిఫ్ట్లో చిక్కుకోవడం ఆందోళన కలిగించింది. శనివారం సాయంత్రం 8 మంది మెడికల్ వార్డులో ఉన్న లిఫ్ట్లో చిక్కుకున్నారు. మొదటి, రెండవ అంతస్తుల మధ్య ఒక్కసారిగా ఆగిపోవడంతో ఎక్కిన వారిలో కంగారు మొదలైంది. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ సూపర్వైజర్ లిఫ్ట్ ఆపరేటర్కి సమాచారం ఇవ్వడంతో టెక్నీషియన్లు వచ్చి అందులో ఉన్న వారిని సురక్షితంగా బయటకి తీసుకొచ్చారు. జీజీహెచ్లో ఈ లిఫ్ట్ చుట్టూ వివాదాలు అలముకున్నాయి. తరచుగా మొరాయిస్తూ లిఫ్ట్ కొన్ని నెలల పాటు పనిచేసేది కాదు. అధికారులు చేపట్టిన చర్యలన్నీ అంతంత మాత్రంగానే ఉండేవి. తాత్కాలికంగా పనిచేసినా మళ్లీ మొరాయింపు మామూలే. ఇలా గతంలోనూ లిఫ్ట్లో రోగులు చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. శాశ్వత పరిష్కారం చూపకుండా జీజీహెచ్ అధికారులు, ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
హామీలు నెరవేర్చకుండా బడ్జెట్లో కాకి లెక్కలు ఎన్నికల హామీలు నెరవేర్చకుండా బడ్జెట్లో మాత్రం కాకి లెక్కలు చూపించారు. హామీలివ్వడం.. అధికారంలోకి వచ్చాక వాటిని ఎగ్గొట్టడం చంద్రబాబు నైజం. నిరుద్యోగ భృతి ఇస్తానని 2014, 2024 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక, బడ్జెట్లలో భృతి మాట ప్రస్తావించ లేదంటే నిరుద్యోగులను మోసం చేసినట్లే. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1,500 ఇస్తానన్న హామీ ప్రస్తావన కూడా బడ్జెట్లో లేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్లకు గట్టి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. – డాక్టర్ పినిపే శ్రీకాంత్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, అమలాపురం చేనేతకు మొండిచెయ్యి చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొండిచెయ్యి చూపించారు. 2024 ఎన్నికల్లో నేతన్న భరోసాగా రూ.25 వేలు మేం అడగకుండానే ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే, చేనేత మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. కానీ, దీనిపై ఇప్పటి వరకూ ఎటువంటి స్పందనా లేదు. దీనికి బడ్జెట్లో నిధుల కేటాయింపు సైతం జరగలేదు. గత ప్రభుత్వంలో నేతన్న నేస్తం పథకం కింద రూ.24 వేలు ఇచ్చేవారు. హామీలు అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. – ముప్పన వీర్రాజు, ఆప్కో మాజీ డైరెక్టర్, పెద్దాపురం -
వ్యాపారులపై వడ్డన
● కాకినాడలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు భారీగా పెంపు ● నగర పాలక సంస్థ నిర్ణయం ● అనుమతించిన ప్రభుత్వం ● అసలే మందగించిన వ్యాపారాలు ● ఈ తరుణంలో ఇవేం వడ్డింపులంటూ వ్యాపారుల మండిపాటుసాక్షి ప్రతినిధి, కాకినాడ: అసలే గతంలో మాదిరిగా చేతిలో తగినంత సొమ్ము లేక, కొనుగోలు శక్తి పడిపోయి ప్రజలు సతమతమవుతున్నారు. ఫలితంగా దాదాపు అన్ని రకాల వ్యాపారాలు మందగించాయి. సంక్రాంతి సీజన్లో రెండు మూడు వారాలు మినహా మిగిలిన రోజుల్లో వ్యాపారాలు సక్రమంగా జరగక వ్యాపారులు పుట్టెడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటువంటి తరుణంలో మూలిగే నక్కపై తాటి పండు పడిన చందాన.. కాకినాడ నగరంలో వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అనుమతించే ట్రేడ్ లైసెన్సు ఫీజును ప్రభుత్వం భారీగా పెంచేసింది. తద్వారా వ్యాపారులపై పెను భారం మోపింది. ముఖ్యంగా ఈ పెంపు చిరు వ్యాపారులకు గుదిబండగా మారుతోంది. పెంచిన ట్రేడ్ లైసెన్సు ఫీజును చెల్లించలేమని, అడ్డగోలుగా, అనాలోచితంగా చేసిన పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వ్యాపార ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై దశల వారీ ఆందోళనకు సైతం వెనుకాడేది లేదని వామపక్షాలు హెచ్చరిస్తున్నాయి. గతంలో తిరస్కరించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారుల లెక్కల ప్రకారం కాకినాడ నగరంలో ట్రేడ్ లైసెన్సు ఫీజు చెల్లింపుదారులు 6,700 మంది వరకూ ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ అంతకు రెట్టింపు సంఖ్యలో వ్యాపారాలు జరుగుతున్నాయన్నది అంచనా. ట్రేడ్ లైసెన్స్ ఫీజు ద్వారా నగర పాలక సంస్థకు రెండు మూడు లక్షల రూపాయలు అటూ ఇటుగా రూ.కోటి వరకూ ఆదాయం వస్తోంది. ట్రేడ్ లైసెన్స్ ఫీజును 2011 తరువాత ఇప్పటి వరకూ పెంచిన దాఖలాల్లేవు. వాస్తవానికి నగర పాలక సంస్థలు ఆదాయాన్ని పెంచుకునేందుకు మూడేళ్లకోసారి 25 శాతం వరకూ ట్రేడ్ లైసెన్సు ఫీజు పెంచుకునే వెసులుబాటు ఉంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఫీజు పెంపునకు అధికారులు ప్రతిపాదనలు చేశారు. అయితే, వ్యాపారులకు భారం అవుతుందనే ఉద్దేశంతో నాటి ప్రభుత్వం లైసెన్స్ ఫీజు పెంచకుండా నిలిపివేసింది. నేడు చంద్రబాబు సర్కారు అనుమతి తమను అధికారంలోకి తీసుకువస్తే ఏ వర్గం పైనా భారం పడకుండా చూస్తామని, సంపద సృష్టిస్తామని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు అండ్ కో గొప్పలకు పోయారు. అటువంటిది ఇప్పుడు నాలుక మడత పెట్టేసి ట్రేడ్ లైసెన్సు ఫీజు పెంచడం ఎంతవరకూ సమంజసమని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. నగరపాలక సంస్థకు ఏటా వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటోందనే కారణంతో ఇటీవల జరిగిన అధికారుల సమీక్షలో కుళాయి పన్ను, ట్రేడ్ లైసెన్సు ఫీజు పెంపునకు ప్రభుత్వం అనుమతించింది. గతంలో చదరపు అడుగులు ప్రామాణికంగా లైసెన్సు ఫీజు ఉండేది. ప్రస్తుతం చదరపు మీటర్ల ప్రకారం ఫీజు వసూలు చేయాలని నిర్ణయించారు. దీనివలన వ్యాపారులపై తలకు మించిన భారం పడుతోంది. సంపద సృష్టించడమంటే ప్రజలపై భారాలు మోపడమా అని వ్యాపార వర్గాలు మండిపడుతున్నాయి. భారీగా భారం ఇప్పటి వరకూ చిరు వ్యాపారులు రూ.400 నుంచి రూ.500 వరకూ ట్రేడ్ లైసెన్సు ఫీజు చెల్లిస్తున్నారు. తాజా పెంపుతో ఇది ఏకంగా రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెరుగుతోంది. ట్రేడ్ లైసెన్సు ఫీజు రెట్టింపవుతోందని శానిటరీ ఇన్స్పెక్టర్లు వచ్చి చెబుతూంటే సైకిల్, మోటార్ సైకిల్ మెకానిక్లు, కిళ్లీ షాపులు, రోడ్డు పక్కన చిన్నచిన్న బడ్డీల్లో టీ అమ్ముకునే చిరు వ్యాపారులు దిగులు చెందుతున్నారు. ఇదివరకు మాదిరిగా వ్యాపారాలు సాగడం లేదని, ఇటువంటి పరిస్థితుల్లో ట్రేడ్ లైసెన్స్ ఫీజు పెంచడంలో ఔచిత్యమేమిటని నిలదీస్తున్నారు. ఇదే సమయంలో వారి అవసరాన్ని అవకాశంగా చేసుకుని లైసెన్స్ ఫీజు తగ్గించేలా చూస్తామంటూ కొంతమంది అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపసంహరించుకోవాలి ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఒకేసారి అన్ని రెట్లు పెంచడం అన్యాయం. ఇది చిరు వ్యాపారుల నడ్డి విరిచే నిర్ణయం. లైసెన్స్ ఫీజు పదిహేనేళ్లుగా పెంచడం లేదు. అటువంటిది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా పెంచడం దుర్మార్గం. అసలే వ్యాపారాలు లేక అవస్థలు పడుతున్న వ్యాపారులకు ఇది పిడుగుపాటు. ప్రభుత్వం తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. – తాటిపాక మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, కాకినాడ ట్రేడ్ లైసెన్స్ ఫీజులు పెంచారిలా (రూ.లలో) గతంలో ఫీజు ఇకపై చెల్లించాల్సింది 400 – 500 1,000 1,000 2,000 – 3,000 1,500 3,000 2,000 4,000 – 5,000 3,000 5,000 5,000 10,000 బార్ అండ్ రెస్టారెంట్లకు గతంలో రూ.10 వేల నుంచి సుమారు రూ.15 వేల వరకూ ఉండేది. దీనిని ఏకంగా రూ.20 వేల నుంచి రూ.40 వేలకు పెంచారు.


