breaking news
Hanamkonda
-
అంబేడ్కర్ స్టడీ సెంటర్ ఇన్చార్జ్ జాయింట్ డైరెక్టర్గా శ్రీనివాస్
కేయూ క్యాంపస్: కేయూలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టడీ సెంటర్ ఇన్చార్జ్ జాయింట్ డైరెక్టర్గా బయోటెక్నాలజీ విభాగం ల్యాబ్ అసిస్టెంట్ డాక్టర్ పుల్లా శ్రీనివాస్ను నియమిస్తూ సోమవారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచందం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన కేయూ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా, కేయూ టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, అఖిల భారత విశ్వవిద్యాలయాల ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఈ ఉత్తర్వుల కాపీని డాక్టర్ పుల్లా శ్రీనివాస్కు వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి అందజేశారు. ఓఎస్డీ ఆచార్య బి.వెంకట్రామ్రెడ్డి, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, కేయూ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ ఆచార్య ఈసం నారాయణ పాల్గొన్నారు. -
కొనసాగుతున్న టీజీసీపీగెట్ పరీక్షలు
కేయూ క్యాంపస్: తెలంగాణలోని తొమ్మిది యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ఈవిద్యాసంవత్సరం 2026–27లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న టీజీసీపీగెట్–26 ఆరో రోజు సోమవారం నిర్వహించినట్లు సీపీ గెట్ కన్వీనర్, కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రొఫెసర్ కె.రాజేందర్ తెలిపారు. ఉదయం సెషన్లో నిర్వహించిన ఎంఏ ఇంగ్లిష్ కోర్సుకు 2,942, మధ్యాహ్నం సెషన్లో ఎమ్మెస్సీ ఫిజిక్స్ కోర్సుకు 902, సాయంత్రం సెషన్లో ఎంఈడీ, ఎంఏ లింగ్విస్టిక్స్ కోర్సుకు 1,241 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు. కాజీపేట అర్బన్: హనుమకొండ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ పి.శ్రీనివాస్, హనుమకొండ ఎకై ్స జ్ ఇన్స్పెక్టర్ దుర్గాభవానీ సోమవారం వేర్వేరుగా సీపీ శ్వేతను కలిసి మొక్క అందించారు. హన్మకొండ అర్బన్: జనగణన ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పని చేయాలని హనుమకొండ జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణరెడ్డి ఆదేశించారు. జనగణన–27 సన్నద్ధతలో భాగంగా డిస్ట్రిక్ట్ సెన్సస్ హ్యాండ్బుక్ (డీసీహెచ్బీ) తయారీపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో ప్రారంభమైంది. ఈసందర్భంగా జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల సామాజిక, ఆర్థిక, మౌలిక సదుపాయాల సమాచారాన్ని సమగ్రంగా సేకరించి హ్యాండ్బుక్ రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 13 నుంచి 15 వరకు జరిగే శిక్షణలో గ్రామ, పట్టణ డైరెక్టరీల తయారీకి సంబంధించిన తొమ్మిది అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సెన్సస్ డైరెక్టరేట్ గణాంకాధికారి సతీశ్ సమాచార సేకరణ, నమోదు విధానం, డేటా కచ్చితత్వంపై వివరించారు. కార్యక్రమ ంలో గణాంకాధికారి రామ్ దయాకర్ రెడ్డి, ఎంపీఎస్ఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు. విద్యారణ్యపురి: కాకతీయ పద్య కవితా వేదిక ఆధ్వర్యంలో హనుమకొండలో విశ్రాంత తెలుగు భాషోపాధ్యాయులు కవి చంద్ర నర్సింగోజు లక్ష్మయ్య రచించిన శ్రీ లక్ష్మీనర్సింహ శతకం పుస్తకావిష్కరణను సోమవారం నిర్వహించారు. కాకతీయ పద్యకవిత వేదిక అధ్యక్షుడు సమస్యా పృచ్ఛక చక్రవర్తి కందిశంకరయ్య ఈ శతకాన్ని ఆవిష్కరించారు. పద్య కవితా వేదిక బాధ్యులు అన్నావజ్జుల సోంబాబు అధ్యక్షతన జరిగిన ఈ పుస్తకావిష్కరణలో సహృదయ సాంస్కృతిక కార్యదర్శి వనం లక్ష్మీకాంతారావు, విశ్రాంత విద్యాశాఖ అధికారి నన్నపనేని రామేశ్వర్రావు, వజ్జల రంగాచార్యులు, శతావధాని చేపూరి శ్రీరామ్, డాక్టర్ ఎన్వీఎన్ చారి, కె.రమేశ్, జీడికంటి శ్రీనివాసమూర్తి, పల్లేరు వీరస్వామి, అక్కర కరుణాసాగర్, గుంటి విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
కామధేనువులా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు
ఎల్ఆర్ఎస్ స్కీం ప్రారంభం: 31, అక్టోబర్, 2020దరఖాస్తుల పరిష్కారం: 2024జీడబ్ల్యూఎంసీ పరిధిలో నమోదైన దరఖాస్తులు 1,07 లక్షలుక్లియరెన్స్ దరఖాస్తులు 17,000ఎల్–1 వద్ద పెండింగ్ దరఖాస్తులు: 15వేలు ఎల్–2 అధికారుల వద్ద 22 వేలు వసూలైన మొత్తం: రూ.149 కోట్లు ● వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. నగరంలోని గవిచర్ల క్రాస్ రోడ్డులో పైసాపైసా కూడబెట్టి 200 గజాల ప్లాటు కొన్నాడు. 2020 ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 2023లో రూ. 25వేలు చెల్లించాడు. మూడేళ్లు గడుస్తున్నా ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ చేయడం లేదు. స్థలానికి ఇరిగేషన్, రెవెన్యూ నుంచి ఎన్ఓసీ అడుగుతున్నారు. ఎన్ఓసీ అందించని పక్షంలో రూ.30 వేల లంచం డిమాండ్ చేస్తున్నారు.● సోమిడి ప్రాంతానికి చెందిన రవికిరణ్ ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాడు. బల్దియా నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందించాలి. ప్రొసీడింగ్ కాపీ జారీ చేయాలి. కానీ, రెండేళ్ల నుంచి రవికిరణ్ ఎదురు చూస్తూ కార్యాలయాల చూట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అన్ని ధ్రువపత్రాలు ఉన్నా మామూళ్లు ముట్టజెబితేనే పరిష్కరిస్తామనే ధోరణితో ఆయా శాఖల సిబ్బంది కా చుకుని కూర్చున్నారు. ఇలా అనేక కారణాలు చె బుతూ బల్దియా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ సిబ్బంది దరఖాస్తుదారులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు అమ్యామ్యాలు ముట్టజెడితేనే ఫైళ్లు క్లియరెన్స్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ అర్బన్: ఇలా.. రవికిరణ్, శ్రీనివాస్ మాత్రమే కాదు. మరెందరో క్రమబద్ధీకరణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్ఆర్ఎస్ పరిశీలనలో మూడు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మొదట వరంగల్ మహా నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి డాక్యుమెంట్లు పరిశీలిస్తుండాలి. రెవెన్యూ ఉద్యోగులు ఆ స్థలం వివాదాస్పదంగా ఉందా? కేసులు ఉన్నాయా? ప్రభుత్వానిదా? ప్రైవేట్దా అని నిర్ధారించాలి. ఇరిగేషన్ ఉద్యోగులు క్రమబద్ధీకరించే స్థలం చెరువులు, కుంటలు, డ్యామ్లు, నీటి పారుదలకు సంబంధించిందా? కాదా చూడాలి. ఇలా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు పరిశీలిస్తుండంతో దరఖాస్తులు క్లియరెన్స్కు నోచుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దరఖాస్తుదారుల అవస్థలు క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసిన యాజమానులకు అవస్థలు తప్పట్లేదు. ఈ దరఖాస్తులను కేటాయించిన ఉద్యోగులు వచ్చి పరిశీలించి వెళ్లిపోతుండగా, ఆ తర్వాత సమాచారం ఉండట్లేదనే ఆరోపణలున్నాయి. ఫీజు ఎంత మేరకు వేస్తున్నారు? మళ్లీ చేపట్టే ప్రక్రియ ఏమిటనే వివరాలు మాత్రం లభించడం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. పైగా కొంత మంది దరఖాస్తుదారులకు సెల్ఫోన్ ద్వారా సమాచారం కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. అత్యధిక శాతం ఽఅర్జీలు నిషేధిత జాబితాలో వెళ్లడంపై ఆందోళన నెలకొంది. ఇళ్ల మధ్య ఉన్న ప్లాట్లను కూడా నిషేధిత జాబితాలో పేర్కొనడం ఏంటని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. దరఖాస్తులు ముట్టుకోని బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో 1.07లక్షల ఎల్ఆర్ దరఖాస్తులు నమోదయ్యాయి. 2020లో ఖాళీస్థలాల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) జీఓ 131 విడుదలైంది. దీని ప్రకారం ఆ ఏడాది ఆగస్టు 26 ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారంతా అర్హులే అని ప్రకటించారు. న్యాయస్థానాల్లో వివాదంలో ఉండడంతో 2024లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన, ప్రొసీడింగ్ జారీ ప్రక్రియ మొదలైంది. కానీ, బల్దియా టౌన్ ప్లానింగ్ భౌగోళిక ఆధారితం (గూగుల్ మ్యాప్)తో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల శాశ్వత స్థలాలను నిర్ధారించుకున్నారు. చెరువులు, కుంటలు తదితర సమస్యలు లేకున్నా నగరంలోని పలు ప్రాంతాల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ఇతర జోన్లకు మారిపోయాయి. ఇదే బల్దియా బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు కాసుల పంట పడిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. లైసెన్స్డ్ సర్వేయర్లను దళారులుగా ఏర్పాటు చేసుకుని వారి ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు న్నాయి. ఈ విషయమై బల్దియా ఇన్చార్జ్ రవీందర్ రాడేకర్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. దరఖాస్తుదారులు ముందుకు రావట్లేదని, పరిష్కరిస్తామని పొంతన లేని సమాధానం చెబుతున్నారు. సమగ్ర సమాచారం రూ.30 వేల నుంచి రూ.లక్ష చెల్లిస్తేనే ఫైళ్లు క్లియర్ దళారులుగా లైసెన్స్డ్ సర్వేయర్లు లబోదిబోమంటున్న దరఖాస్తుదారులు వివాదాస్పద స్థలాల నిరాకరణ దరఖాస్తులు: 30 వేలు -
సందర్శన.. సమీక్ష
ములుగు/కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామ పంచాయతీ పరిధి గుట్టగంగారంలో ఉన్న దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల పథకాన్ని సోమవారం రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. మంత్రులు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద ఉన్న హెలిపాడ్ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. వారికి కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ రామ్నాథ్ కేకన్, పీఓ లెనిన్ వత్సల్ టొప్పో పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అక్కడినుంచి ప్రత్యేక కాన్వాయి ద్వారా మంత్రులు సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. బ్యారేజీని పరిశీలించారు. నీటి స్టోరేజీ, సామర్థ్యం, గేట్ల పనితీరు, ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడినుంచి గట్టలగంగారం పరిధి దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల వద్దకు చేరుకొని పంపింగ్ స్టార్టింగ్ పాయింట్ను పరిశీలించారు. మోటార్ల పనితీరు, మూడు ఫేజ్లలో ఎన్ని మోటార్లు ఉన్నాయి.. ప్రస్తుతం ఎన్నింటి ద్వారా నీటిని దిగువకు ఎత్తిపోస్తున్నారని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవాదుల వద్ద ఏర్పాటు చేసిన సమావేశం వద్దకు చేరుకొని ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అధికారులు వారికి ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి మాట్లాడారు. దేవాదుల వద్ద ఉన్న పది మోటార్లు నిరంతరం పంపింగ్ చేయాలని ఆదేశించారు. దీని పరిధిలోని 22 రిజర్వాయర్లను నింపుతామన్నారు. ఈ నీటితో రైతులకు సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రాజెక్టును సందర్శించి, ఏడాది వ్యవధిలోనే పూర్తిచేయాలని స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారని తెలిపారు. లక్ష్య సాధన కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. మధ్యాహ్నం 1.31గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరిగివెళ్లిపోయారు. ఎస్పీ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీస్ భద్రత వలయంలో మంత్రుల పర్యటన సాగింది. కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్, వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, అదనపు కలెక్టర్లు మహేందర్ జి.సంపత్రావు, ములుగు డీఎస్పీ రవీందర్, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ బట్టు, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఈఎన్సీ జనరల్ రమేశ్ బాబు, ఇంజనీరింగ్ అధికారులు ధర్మ, మోహన్రావు, శరత్బాబు, ప్రవీణ్ కుమార్, స్థానిక తహసీల్దార్ సయ్యద్ సర్వర్ తదితరులు పాల్గొన్నారు. దేవాదుల నీటితో 22 రిజర్వాయర్లను పూర్తిగా నింపుతాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి సమ్మక్క సాగర్ బ్యారేజీ, దేవాదుల ప్రాజెక్టు పరిశీలన సమీక్ష, నీటి సామర్థ్యం, మోటార్ల పనితీరుపై ఆరా సాగునీరందిస్తామని రైతులకు హామీ -
ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పెంపు
మంగళవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 2026విద్యారణ్యపురి: హైదరాబాద్లోని షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ–27) ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్కు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 19వరకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ కె.జగన్మోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఆన్లైన్లో ఈనెల 19 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 26న హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు హెచ్టీటీపీ//టీఎస్స్టడీసర్కిల్.కో.ఇన్లో చూడాలని ఆయన కోరారు. -
నులి పురుగుల నిర్మూలనకు కృషి
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ కాశిబుగ్గ: నులి పురుగుల నిర్మూలనకు కృషి చేయాలని, పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి ఆల్బెండజోల్ మాత్రలు ఉపయోగపడతాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం సీకేఎం కళాశాల ఆవరణలోని దేశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మాత్రల పంపిణీని కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న మాత్రలతో పిల్లల్లో ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఐ.ప్రకాశ్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సాజితాబేగం, డీఈఓ రంగయ్యనాయుడు, ఎంఈఓ వెంకటేశ్వర్రావు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భరత్కుమార్, స్టాటిస్టికల్ అధికారి ప్రసన్న, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, హెచ్ఎంలు రాజేశ్, ఉష పాల్గొన్నారు. కాగా, సోమవారం జిల్లా వ్యాప్తంగా 1,83,038 మంది పిల్లలకు (93.26 శాతం) ఆల్బెండజోల్ మాత్రలను వేసినట్లు ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాశ్ తెలిపారు. -
పోలీస్ క్రీడాకారులు స్ఫూర్తిగా నిలవాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత వరంగల్ క్రైం: ఆరోగ్య పరిరక్షణలో పోలీస్ క్రీడాకారులు తోటి సిబ్బందికి స్ఫూర్తిగా నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు. ఇటీవల మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లో జరిగిన ఐదో రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ మొదటి క్లస్టర్లో మొత్తం 61 పతాకాలు సాధించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రీడాకారులకు సోమవారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఈసభకు సీపీ ముఖ్య అతిథిగా హాజరై పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు. అదనపు డీసీపీలు సురేశ్కుమార్, శ్రీనివాస్, బాలస్వామి, ప్రభాకర్రావు, ఏసీపీ నాగయ్య, ఆర్ఐ స్పర్జన్రాజ్, తదితరులున్నారు. బాధితులకు సత్వర న్యాయం చేయాలి భరోసా కేంద్రానికి వచ్చే వారికి సత్వర న్యాయం చేయాలని సీపీ శ్వేత అధికారులకు సూచించారు. సోమవారం వరంగల్ భరోసా కేంద్రాన్ని ఆమె సందర్శించారు. క్రైమ్ అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీ సదయ్య, భరోసా కేంద్రం ఇన్స్పెక్టర్ సువర్ణ, మహిళా పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ సూర్యప్రసాద్, భరోసా ఎస్సై కిరణ్మయి, కౌన్సెలర్లు పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో అందిన ప్రతీ అర్జీని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, పెండింగ్ దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఎన్.రవితో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజావాణిలో అందిన అర్జీలపై పలువురు తహసీల్దార్లతో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సూచించారు. ప్రజావాణిలో మొత్తం 282 అర్జీలు అందినట్లు తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, అధికారులు పాల్గొన్నారు. సత్వరమే పరిష్కరించాలి: వరంగల్ కలెక్టర్ న్యూశాయంపేట: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 191 దరఖాస్తులు వచ్చాయి. కాగా, గత ప్రభుత్వ హయాంలో ముస్లింలకు వరంగల్ గిర్మాజీపేట సర్వే నంబర్ 10లో హజ్హౌస్ నిర్మాణానికి 1800 గజాల ప్రభుత్వ భూమిని కేటాయించిందని, ఆ భూమిని ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించిందని, తిరిగి ఆ స్థలంలోనే హజ్ హౌస్ నిర్మాణం చేపట్టాలని బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు విన్నవించారు. ‘ఎస్ఐఆర్’ నమోదు ప్రక్రియ గడువును మరికొంత కాలం పొడిగించాలని కరీమాబాద్కు చెందిన ఎల్లాగౌడ్ సేవాసంస్థ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, అధికారులున్నారు. -
నాణ్యమైన బోధనకు డిజిటల్ టెక్నాలజీ కీలకం
ఏఎంఓ ఉండ్రాతి సుజన్ తేజ కాళోజీ సెంటర్: ప్రస్తుత విద్యావ్యవస్థలో ఉపాధ్యాయులు పాఠ్యాంశ బోధనకు పరిమితం కాకుండా డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ నాణ్యమైన బోధన అందించాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఉండ్రాతి సుజన్ తేజ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం శంభునిపేట ఉన్నత పాఠశాల, కరీమాబాద్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాంకు ఆయన హాజరై వినూత్న బోధనా పద్ధతులపై చర్చించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కోఆర్డినేటర్ నాగేశ్వర్రావు, సెంటర్ ఇన్చార్జ్లు తదితరులున్నారు. -
గ్రీవెన్స్కు వినతుల వెల్లువ
వరంగల్ అర్బన్: బల్దియా పరిధి పలు కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలని పౌరులు గళమెత్తారు. రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి పైప్లైన్లు, అక్రమ నిర్మాణాలు, అనధికారిక కట్టడాలు, కబ్జాలపై అడిషనల్ కమిషనర్ ఇసంపెల్లి జోనాను ప్రశ్నించారు. ఎన్నిసార్లు వినతులిచ్చినా ఇంత వరకు సమస్యలు పరిష్కారం కావట్లేదని వాపోయారు. గ్రీవెన్స్ సెల్కు మొత్తం 111 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి అత్యధికంగా 58, ఇంజనీరింగ్ 36, రెవెన్యూ 6, హెల్త్, శానిటేషన్ 7, నీటి సరఫరా 2, హార్టికల్చర్ ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్ఈ రాజ్కుమార్, ఇన్చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, అకౌంట్స్ అధికారి శివలింగం, పన్నుల అధికారి రామకృష్ణ, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, సెక్రటరీ అనిల్బాబు తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● 56వ డివిజన్ వడ్డేపల్లిలో 20 ఏళ్లుగా ఇళ్లు కట్టుకట్టుకుని పన్ను చెల్లిస్తున్నామని, డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు విన్నవించారు. ● వరంగల్ ఎల్బీ నగర్ 21వ డివిజన్లో దోబీ ఘాట్పై ఆక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని చర్యలు తీసుకోవాలని రజక సంఘం ప్రతినిధులు ఫిర్యాదు అందించారు. ● బల్దియాలోని విభాగాల్లో సుమారు 100 మంది ఔట్సోర్సింగ్ కార్మికులుగా ఏళ్ల తరబడి పని చేస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సంఘం నాయకులు కోరారు. ● వరంగల్ 14వ డివిజన్ సాయినగర్లో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు దరఖాస్తు అందించారు. ● హనుమకొండ న్యూ రాయపుర పార్కులో ఓపెన్ జిమ్ పరికరాలు ఏర్పాటు చేయాలని వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ● వరంగల్ 21వ డివిజన్ ఎస్ఎస్ఎస్ అపార్ట్మెంట్లో నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ స్థలంలో అదనపు కట్టడాలు చేపడుతున్నారని చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ● వరంగల్ ఎల్బీనగర్లోని హిందూ శ్మశాన వాటికలో బర్నింగ్ ప్లాట్ ఫాం, ఇతర సమస్యలు పరిష్కారించాలని అభివృద్ధి కమిటీ కోరింది. సమస్యలు పరిష్కరించాలని బాధితుల వేడుకోలు దరఖాస్తులు స్వీకరించిన అడిషనల్ కమిషనర్ జోనా -
ఆప్షన్ ఉద్యోగుల్లో ఆశలు
హన్మకొండ: రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న మూడో డిస్కం తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్పీడీసీఎల్)కు వెళ్లేందుకు ముందుకు వచ్చిన విద్యుత్ ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. మేలో పూర్తి కావాల్సిన బదిలీ నియామక ప్రక్రియ వివిధ కారణాలతో నిలిచిపోయింది. పలు అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో.. టీజీ ఆర్పీడీసీఎల్కు లైసెన్స్ మంజూరు తర్వాతనే బదిలీ నియామక ప్రక్రియ చేపట్టాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అయితే, బహిరంగ విచారణ నిర్వహించిన తెలంగాణ ఈఆర్సీ వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, ప్రభుత్వానికి పలు కండీషన్లు పెట్టి ఎట్టకేలకు ఈనెల 10వ తేదీతో లైసెన్స్ జారీ చేసింది. మూడో డిస్కంలోకి ప్రస్తుతమున్న టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కో, టీజీ ఎస్పీపీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి ఆసక్తి కనబర్చే అధికారులు, ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు నాలుగు విద్యుత్ సంస్థల నుంచి ఆసక్తి కనబర్చే ఉద్యోగులు, అధికారుల నుంచి ఆప్షన్లు అడిగారు. పదోన్నతి కల్పిస్తామనడంతో వెళ్లేందుకు పోటీ.. ముందుగా కొత్త డిస్కం ఎలా ఉంటుంది.. వెళ్లాలా వద్దా? అని మల్లగుల్లాలు పడిన ఇంజనీర్లు, ఇతర అధికారులు, ఉద్యోగులు చివరకు పెద్ద ఎత్తున స్పందించారు. పదోన్నతి కల్పిస్తామని జీఓలో పేర్కొనడంతో.. ప్రస్తుతం పనిచేస్తున్న డిస్కంలో ఇప్పట్లో పదోన్నతి రాదని భావించిన అధికారులు, ఉద్యోగులు, ఆర్టిజన్లు ఆర్పీడీసీఎల్కు వెళ్లేందుకు పోటీపడ్డారు. ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు ఆసక్తి కలిగిన అధికారులు, ఉద్యోగుల నుంచి సమ్మతి కోరింది. టీజీఆర్పీడీసీఎల్కు మొత్తం 2,000 మంది అధి కారులు, ఉద్యోగులు అవసరమని జీఓలో పేర్కొంది. రాష్ట్రంలోని టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కో, టీ జీ ఎ న్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్కు చెందిన ఉద్యోగు ల నుంచి ఆప్షన్లు కోరడంతో ఒక్క టీజీఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది ఆప్షన్లు ఇచ్చారు. ఇతర డిస్కంలలోనూ ఇదే పోటీ నెలకొందని విద్యుత్ ఉద్యోగులు తెలిపారు. ఆప్షన్లో పొందుపర్చిన వివరాలు... వాస్తవ వివరాలు సరి చూసి జాబితాను మూడో డిస్కంకు పంపారు. మేలోనే బదిలీ నియామక ప్రక్రియ పూర్తిచేసేలా ప్రకటించిన టీజీ ఆర్పీడీసీఎ ల్ తర్వాత వెనక్కి తగ్గింది. మే 13 నుంచి 19 వరకు బదిలీ ఉత్తర్వులు, జాయినింగ్, పోస్టింగ్ పూర్తయ్యేలా ఖరారు చేసినా ప్రక్రియ నిలిచింది. అనంతరం ఈఆర్సీ లైసెన్స్ మంజూరు చేసి తర్వాతే బదిలీ ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రచారం జరిగింది. ఆప్షన్లు ఇచ్చిన 1,252 మంది.. టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి మొత్తం 1,252 మంది ఆర్పీడీఎల్కు వెళ్లేందుకు ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో జూనియర్ లైన్మెన్లు 16 మంది, అసిస్టెంట్ లైన్మెన్లు 271 మంది, లైన్మెన్లు 116, లైన్ ఇన్స్పెక్టర్లు 31, సీనియర్ ఇన్స్పెక్టర్లు 4, ఫోర్మెన్లు 2, అసిస్టెంట్ ఇంజనీర్స్ 115, అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్లు 61, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు 59, డివిజనల్ ఇంజనీర్లు 28, సూపరింటెండెంట్ ఇంజనీర్లు 4, ఒక చీఫ్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్స్ 265, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ 66, ఆసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్స్ 10, అకౌంట్స్ ఆఫీసర్స్ 5, సీనియర్ అసిస్టెంట్లు 50, జూనియర్ అసిస్టెంట్లు 20, జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్ 15, పర్సనల్ ఆఫీసర్స్ 2, ఆర్టిజన్ గ్రేడ్కు చెందిన వారు 5, ఆర్టిజన్ గ్రేడ్–3కి చెందిన వారు ఆరుగురు, ఒక్కరు ఆర్టిజన్ గ్రేడ్– 4, ఒక్క రికార్డు అసిస్టెంట్, ఒక్క సివిల్ ఈఈ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. టీజీ ఆర్పీడీసీఎల్కు లైసెన్స్ రావడంతో మరోసారి ఆప్షన్లు ఇచ్చిన వారు పదోన్నతి లభిస్తుందనే సంతోషంలో ఉన్నారు. బదిలీ నియామక ప్రక్రియ ఎప్పుడు చేపడతారోనని అధికారులు, ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. టీజీఆర్పీడీసీఎల్కు కావాల్సిన ఉద్యోగులు 2 వేల మంది ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది దరఖాస్తు మేలో బదిలీ ఉత్తర్వులు వెలువడాల్సి ఉండగా నిలిచిన ప్రక్రియ ఎట్టకేలకు డిస్కంకు లైసెన్స్ జారీ.. బదిలీలకు ఎదురుచూపులు -
ఉప ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి
నేడు దేవాదులకు కన్నాయిగూడెం/ములుగు రూరల్: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామ పంచాయతీలోని గుట్టలగంగారం పరిధిలో ఉన్నా దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల ప్రాజెక్టుకు రాష్ట్ర ఉపముఖ్య మంతి భట్టి విక్రమార్క, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సోమవారం రానున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి దేవాదులకు చేరుకోనున్నారు. అక్కడ పంపింగ్ చేస్తున్న విధానం, పంపుల పని విధానం, సమ్మక్క–సాగర్ బ్యారేజీ స్టోరేజీ తదితర వివరాలను తెలుసుకోనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా, ఫిబ్రవరిలో రాష్ట్ర ముఖ్యమంతి రేవంత్రెడ్డి దేవాదులను సందర్శించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పూర్తి పంపింగ్, మిగిలిన పనులను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగానే సోమవారం డిప్యూటీ సీఎం, ఇరిగేషన్ మంత్రి దేవాదులకు వస్తున్నట్లు తెలుస్తోంది. కన్నాయిగూడెం నీటికష్టాలు తీరేనా? తలాపున గోదావరి ఉన్నా ఈ కన్నాయిగూడెం మండల ప్రాంత ప్రజలకు నీటి కష్టాలు తీరడంలేదు. మండలంలో అతి పెద్ద ప్రాజెక్టు దేవాదుల ప్రాజెక్టు ఉన్నా చుక్కనీరు ఈ ప్రాంత ప్రజలకు రావడం లేదు. దేవాదుల నుంచి ప్రత్యేక కాల్వ ఏర్పాటు చేసి మండలంలో ఉన్న చెరువులు, కుంటలను నింపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నుంచి నీటిని తోడి వంద కిలోమీటర్లు దూరానికి తరలించి సాగు నీరు, తాగు నీరు అందిస్తున్నారు. ఇక్కడి ప్రాంత ప్రజలకు మాత్రం చుక్కనీరు ఇవ్వడం లేదు. దీంతో మండలంలోని ఏజెన్సీ ప్రాంతాలకు వర్షాలు పడితే తప్ప పంటలు పండే పరిస్థితి లేదు. రాష్ట్ర మంత్రులు దృష్టి పెట్టి కన్నాయిగూడెం మండలానికి దేవాదుల నుంచి సాగు, తాగునీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు.రాష్ట్ర ఉపముఖ్యమంతి, ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సోమవారం దేవాదుల పర్యటనను పురస్కరించుకొని ఇరిగేషన్, అధికారులు, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కావాల్సిన వసతులు, టెంట్లు, భద్రతను సిద్ధం చేస్తున్నారు. దేవాదుల ప్రాంతాన్ని పూర్తిగా అధికారుల ఆధీనంలోకి తీసుకున్నారు. నీటి పంపింగ్, మిగిలిన పనులపై అధికారులతో సమీక్ష ఏర్పాట్లు చేస్తున్న పోలీసు, రెవెన్యూ, నీటిపారుదల శాఖ -
ఒత్తిడితో సబ్స్టేషన్ ఆపరేటర్ బలవన్మరణం
నల్లబెల్లి: ఉద్యోగంలో ఒత్తిడితో మనస్తాపానికి గురైన కుటుంబ పెద్ద బలవన్మరణానికి పాల్ప డిన ఘటన రంగాపురంలో జరిగింది. స్థానికులు, ఎస్సై సాయిప్రసన్న కుమార్ తెలిపిన వివరా ల ప్రకారం.. రంగాపురం గ్రామానికి చెందిన చీకటి విక్రమ్ (38) నెక్కొండ మండలం పత్తిపా క విద్యుత్ సబ్ స్టేషన్లో నాలుగేళ్లుగా సబ్స్టేషన్ ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. విధుల్లో పని ఒత్తిడి, ఉద్యోగం శాశ్వతం కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఆది వారం ఉదయం తన ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విక్రమ్–సునంద దంపతులకు వివాహమై 13ఏళ్లు గడిచినా సంతానం కలగలేదు. దీంతో మూడేళ్ల క్రితం 45 రోజుల వయస్సున్న ఓ (శ్రీనిక) పాపను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. చిన్నారి భ విష్యత్ కోసం ఎన్నో కలలుగన్న ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. మృతుడి భార్య సునంద ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. వాహన తనిఖీల్లో గంజాయి పట్టివేత?శాయంపేట: వాహన తనిఖీల్లో సుమారు నాలుగు కిలో గంజాయి దొరికినట్లు సమాచారం. మాందారిపేట స్టేజీ వద్ద పోలీసులు ఆదివారం వాహనాలు తనిఖీ చేస్తున్నారు. పక్కనే బస్టాప్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడి వద్దకు వెళ్లి వివరాలు అడుగగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో సదరు వ్యక్తి వద్ద ఉన్న సంచిని తనిఖీ చేయగా సుమారు నాలుగు కిలోలు గంజాయి లభించినట్లు తెలిసింది. గంజాయితోపాటు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ● నల్లబెల్లి మండలం రంగాపురంలో విషాదం -
అన్మ్యాన్డ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ల (అన్మ్యాన్డ్) సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ టీజీ ఎన్పీడీసీఎల్ గౌరవాధ్యక్షుడు జి.ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. హనుమకొండ రాంనగర్లోని సుందరయ్య భవన్లో టీజీ ఎన్పీడీసీఎల్ స్థాయి అన్మ్యాన్డ్ వర్కర్ల సమావేశం ఆదివారం జరిగింది. ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 జిల్లాల నుంచి అన్మ్యాన్డ్ వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్లో జరిగిన సమ్మె సందర్భంగా అన్మ్యాన్డ్ వర్కర్ల జీతంలో కోత విధించి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరరావు మాట్లాడుతూ అన్మ్యాన్డ్ వర్కర్ల సమస్యలను సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర జనరల్ సెక్రెటరీ అలువాల స్వామి మాట్లాడుతూ అన్మ్యాన్డ్ వర్కర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. యూనియన్ ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు ఆంజనేయులు, వరంగల్ జిల్లా కార్యదర్శి లడే శ్రీనివాస్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బూర వరుణ్ గౌడ్, నాయకులు పాండు, ఆనంద్, లక్ష్మణ్, బాపుగౌడ్, రమేష్, వెంకటేష్, శివ, నరేష్, సాయి పాల్గొన్నారు. -
ఆటపాటలకు ప్రాధాన్యం
కాళోజీ సెంటర్: ప్రభుత్వ విద్యావ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష అభియాన్ డైరెక్టర్ డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ స్థానిక సంస్థల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటో తరగతిలోకి ప్రవేశించే నాటికి పిల్లల్లో ఆశించిన పాఠశాల సంసిద్ధత (స్కూల్ రీడీనెస్) నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా నూతన మార్గదర్శకాలను విడుదల చేశారు. వరంగల్ జిల్లాలో గతేడాది 34 పాఠశాలల్లో విజయవంతంగా నడిచిన ప్రీప్రైమరీ సెక్షన్లకు అదనంగా ఈ విద్యా సంవత్సరం (2026–27) మరో 48 పాఠశాలల్లో వీటిని విస్తరించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం పూర్వ ప్రాథమిక కేంద్రాల సంఖ్య 82కు చేరింది. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో 1,003 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎన్సీఎఫ్ మార్గదర్శకాలకు అనుగుణంగా.. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం (ఎన్సీఎఫ్ఎస్ 2022) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ తరగతులు పూర్తిగా ఆనందదాయకమైన, ఆటపాటలతో కూడిన వాతావరణంలో సాగాలి. ఎస్సీఈఆర్టీ రూపొందించిన ప్రత్యేక టీచర్స్ హ్యాండ్బుక్ (టీహెచ్బీ), స్టూడెంట్ వర్క్బుక్స్ (ఎస్డబ్ల్యూబీ) ఆధారంగా బోధన జరగాలి. ప్రతీ విద్యార్థికి భాషా నైపుణ్యాలు (లిటరసీ), గణిత నైపుణ్యాల (న్యూమరసీ) కోసం రెండు ప్రత్యేక వర్క్బుక్లు ఉచితంగా అందజేయనున్నారు. వీటిని ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా దిద్ది, పెన్నుతో సంతకం చేయాల్సి ఉంటుంది. అలాగే క్యూఆర్ కోడ్ ఆధారిత ఆడియో, వీడియో విజువల్స్ ఉపయోగించి బోధనను మరింత ఆకర్షణీయంగా మార్చనున్నారు. హెచ్ఎంల పర్యవేక్షణ, ఫీడ్ బ్యాక్ డైరీ తప్పనిసరి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్య ఈ విద్యా సంవత్సరంలో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు ఆటపాటల ఆధారిత అభ్యాసన ప్రధాన ఉద్దేశం. హెచ్ఎంలు లేదా సీనియర్ ఉ పాధ్యాయులు ప్రతీ వారం (ముఖ్యంగా శుక్రవారం) ఒక తరగతిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇందుకు ప్రత్యేకంగా ఒక ‘ఫీడ్బ్యాక్ డైరీ’ నిర్వహించి, ఉపాధ్యాయుల ప్లస్ పాయింట్లు, మార్చుకో వాల్సిన అంశాలు లిఖితపూర్వకంగా నమోదు చేయాలి. – బి.రంగయ్యనాయుడు, డీఈఓ, వరంగల్ ప్రభుత్వ బడుల్లో పూర్వ ప్రాథమిక విద్యా విప్లవం బట్టీల పద్ధతికి స్వస్తి.. పరీక్షలు నిర్వహించడం పూర్తిగా నిషేధం ఎస్సీఈఆర్టీ సమగ్ర విధివిధానాలు విడుదల -
వేయిస్తంభాల ఆలయంలో మాసశివరాత్రి పూజలు
హన్మకొండ కల్చరల్: మాసశివరాత్రిని పురస్కరించుకొని రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజ లు, శివకల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం ఐదు గంటల నుంచి ప్రభాతసేవ, ఉత్తిష్టగణపతికి ఆరాధన గరికపూజ, శ్రీరుద్రేశ్వరుడికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు చేశారు. అనంతరం నాట్య మండపంలో వేదపండితుడు వెంకటేశ్వరశర్మ, అర్చకులు రుద్రేశ్వరిదేవి, రుద్రేశ్వరస్వామి వారిని ప్రతిష్ఠించారు. కలశస్థాపన, బాసికధారణ, యజ్ఞోపవీతధారణ, పాదప్రక్షాళన, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, అక్షతారోహణ, మహాహారతి జరిపి రుద్రేశ్వరిదేవి, రుద్రేశ్వరస్వామి వార్లకు కల్యాణోత్సవం నిర్వహించా రు. కల్యాణోత్సవంలో బీజేపీ సీనియర్ నాయకులు రావు అమరేందర్రెడ్డి పాల్గొన్నారు. వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ టి.వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధికారులకు దరఖాస్తులను అందజేయాలని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు ఇస్తామని, గ్రీవెన్స్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు. వరంగల్ కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్ఐఆర్ నిర్వహణలో భాగంగా డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణిని రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాశిబుగ్గ: వరంగల్ మహాత్మాగాంధీ స్మారక వైద్యశాల (ఎంజీఎం)తో పాటు సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో డైటీషియన్ పోస్టులు భర్తీ కావడం లేదు. ఇక్కడ పనిచేసిన డైటీషియన్లు బదిలీ అయి నెలరోజులు కావొస్తున్నా కొత్తవారు రావడం లేదు. ఎంజీఎంలో డైటీషియన్గా పనిచేసిన రవీందర్రెడ్డి హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రి, సీకేఎంలో డైటీషియన్గా పనిచేసిన ఏఈ గ్రేస్ నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి బదిలీ అయ్యారు. అయితే, వీరి స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు. ఉన్నతాధికారులు నూతన డైటీషియన్లను నియమించాలని పలువురు కోరుతున్నారు. విద్యారణ్యపురి: బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆర్డీఎస్డీఈ సంయుక్త ఆధ్వర్యంలో హనుమకొండ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఈనెల 13 (సోమవారం)న అప్రెంటిస్షిప్ జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఇంటర్ విద్య ఆర్జేడీ ఎ.గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 2023–2026 విద్యాసంవత్సరాల మధ్య ఇంటర్ ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ జాబ్మేళాకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు పారామెడికల్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాన్ పారామెడికల్ కోర్సులు పూర్తిచేసిన వారికి జాబ్మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎంపికై న వారికి నెలకు రూ 9,600 స్టైఫండ్ రూపంలో చెల్లిస్తారని, పలు ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ రంగసంస్థలు అభ్యర్థుకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్కార్డు, పాస్పోర్ట్సైజ్ ఫొటోలతో హాజరుకావాలని ఆయన సూచించారు. కాశిబుగ్గ/ఖిలావరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం పరిశీలించారు. ఈ మేరకు శంభునిపేట, పడమరకోట, కొత్తవాడ, బ్యాంకు కాలనీలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి బూత్ లెవల్ అధికారుల పనితీరును పరిశీలించారు. ఓటర్ల నుంచి దరఖాస్తులను నిబంధనల ప్రకారం స్వీకరించాలని, ఓటు హక్కు కలిగిన ప్రతీఒక్కరి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లోకల్ బాడీ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, డీబీసీడీఓ పుష్పలత, తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్, అధికారులు పాల్గొన్నారు. -
సమయం లేదు సర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రత్యేక ఓటరు జాబితా (ఎస్ఐఆర్) సవరణ ప్రక్రియ ముగియడానికి ఇంకా 11 రోజులే గడువు ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో డిజిటలైజేషన్ పనులు ఆశించిన వేగంతో సాగడం లేదు. ఇంటింటికీ వెళ్లి ఫారాల పంపిణీ దాదాపు పూర్తయ్యింది. వాటిని ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ మాత్రం ఇంకా సగానికి కూడా చేరుకోలేదు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం నిత్యం కాన్ఫరెన్స్ల ద్వారా అలర్ట్ చేస్తోంది. జిల్లాల్లో కలెక్టర్లు, అధికారులు నిత్యం ఫాలోఅప్ చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం రాత్రి 8.01 గంటలకు విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఉమ్మడి ఆరు జిల్లాల్లో కలిపి 45.57 శాతం ఫారాలే డిజిటలైజ్ అయ్యాయి. ఫారాల పంపిణీలో భేష్.. జూన్ 25న మొదలైన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, బీఎల్ఓల ఇంటింటి సందర్శన, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ఈ నెల 24న ముగియనుంది. వీటికి ఇంకా 11 రోజులే సమయం ఉండగా, 31న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ చేయాల్సి ఉంది. మొత్తం 30,53,238 మంది ఓటర్లకు సంబంధించి 30,53,231 ఫారాలు (100 శాతం) పంపిణీ చేశారు. అయితే, వాటిలో 13,91,440 (45.57 శాతం) ఫారాలు మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన లక్షలాది ఫారాలను గడువులోగా నమోదు చేయడం అధికారులకు సవాల్గా మారింది. విద్యావంతులు, పట్టణ ఓటర్లు అధికంగా ఉన్న హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోనే నింపిన ఫారాల అందజేత, డిజిటలైజేషన్ వేగం మందగించింది. హనుమకొండలో 42.97 శాతం, వరంగల్లో 40.39 శాతం , మహబూబాబాద్లోనూ 42.62 శాతం మాత్రమే పూర్తయ్యింది. 53.66 శాతంతో ముందంజలో ములుగు.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా డిజిటలైజేషన్ ప్రక్రియ మొత్తంగా చూస్తే 50 శాతం దాటలేదు. ఇక గిరిజన, అటవీ ప్రాంతాలు అధికంగా ఉన్న ములుగు జిల్లా మాత్రం 53.66 శాతంతో ఉమ్మడి జిల్లాలో ముందంజలో నిలిచింది. జయశంకర్ భూపాలపల్లి (50.36 శాతం), జనగామ (50.18 శాతం) జిల్లాలు కూడా కొంత మెరుగైన పురోగతి నమోదు చేశాయి. ఫారాల పంపిణీ దాదాపు పూర్తి కావడంతో ఇప్పుడు అధికారుల దృష్టి డిజిటలైజేషన్పైనే ఉంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో ఫారాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లు, ఉన్నతాధికారులు ‘సర్’ డిజిటలైజేషన్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు ముమ్మరం చేసిన అధికారులు సోమవారం నుంచి వేగం పెరుగుతుందని, ఇన్టైంలో డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెబుతున్నారు. మొత్తం ఓటర్లు ఫారాల పంపిణీ పంపిణీ శాతం డిజిటలైజేషన్ డిజిటలైజేషన్ శాతం100%50.18%40.39%42.97%4,84,93242.62%5,09,0147,67,4833,85,1522,77,8827,67,4844,84,93550.36%7,76,95353.66%2,36,9703,13,806 2,18,6992,77,8792,06,661 1,39,955 1,27,167 జేఎస్భూపాలపల్లిజనగామహనుమకొండములుగువరంగల్ఎన్యూమరేషన్ ప్రక్రియకు ఇంకా 11 రోజులే గడువు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంకా 45.57 శాతమే డిజిటలైజేషన్ ముందున్న ములుగు.. అదే వరుసలో జనగామ, జేఎస్ భూపాలపల్లి 40–43 శాతంలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలు ఆగుతూ సాగుతున్న డిజిటలైజేషన్... సీరియస్గా కలెక్టర్లు, అధికారుల ఫాలోఅప్ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (ఎస్ఐఆర్)లో నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారుల పర్యవేక్షణలో పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. బీఎల్ఓలు, అన్ని శాఖల సిబ్బంది ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, ధ్రువీకరణ, డిజిటలైజేషన్ ఇన్టైంలో పూర్తికి ఎప్పటికప్పుడు సూచిస్తున్నాం. – చాహత్ బాజ్పాయ్, హనుమకొండ కలెక్టర్ -
ఉజ్వల భవితకు నవోదయం..
ఖిలా వరంగల్ : గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన, అల్పాదాయ వర్గాలకు చెందిన విద్యార్థులకు చక్కని అవకాశం కల్పిస్తోంది ఉమ్మడి జిల్లాకు చెందిన వరంగల్ మామునూరు జవహర్ నవోదయ విద్యాలయం. ఇందులో భాగంగా 2027–28 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఈనెల 7న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఎలా చేసుకోవాలి? విద్యాలయంలో లభిస్తున్న సౌకర్యాలు, రిజర్వేషన్లు, తదితర వివరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఆరో తరగతిలోకి ప్రవేశం.. మామునూరు నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశం లభిస్తే ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా చదువుకోవచ్చు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నవోదయ విద్యాలయ సమితి పాఠశాలలను నిర్వహిస్తోంది. త్రిభాషా సూత్రం అమలు ద్వారా తెలుగు, ఆంగ్లం, హిందీ భాషలపై విద్యార్థులకు పట్టు లభిస్తుంది. బాలబాలికలకు వేర్వేరు వసతులు.. జవహర్ నవోదయ విద్యాలయంలో బాలబాలికలకు వేర్వేరుగా వసతి గృహాలు ఉంటాయి. ఉచిత విద్య, సీబీఎస్ఈ సిలబస్, స్కౌట్స్ గైడ్స్, ఏకరూపదుస్తులు, పాఠ్య పుస్తకాలు, ఇతర సదుపాయాలన్నీ కల్పిస్తారు. ఉన్నత విద్యార్హత, కంప్యూటర్ విద్య, క్రీడలు, యోగా, చిత్రలేఖనం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు నూతన సాంకేతిక అంశాలను జోడించి విద్యా బోధన, ప్రత్యేక శిక్షణ ఉంటుంది. రిజర్వేషన్లు ఇలా.. మొత్తం 80 సీట్లకు గాను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం, పట్టణ, నగర ప్రాంత విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయిస్తారు. దివ్యాంగులకు 3 శాతం, షెడ్యూల్డ్ కులాలకు 15శాతం రిజర్వేషన్ ఉంటుంది. బాలికలకు 33 శాతం సీట్లు రిజర్వేషన్ అమలు చేస్తారు. ఉమ్మడి జిల్లాలోని ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో నవంబర్ 28న ప్రవేశ పరీక్ష ఉంటుంది. సీటు సాధించిన విద్యార్థులు 6 నుంచి 12 వ తరగతి వరకు ఉచిత విద్యనభ్యసిస్తారు. కో–ఎడ్యుకేషన్ ఉండగా బాలబాలికలకు ప్రత్యేక వసతి సౌకర్యం ఉంది. ఆఫ్లైన్లో పరీక్ష.. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో నవంబర్లో ఆఫ్లైన్ విధానంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. వంద మార్కులకు 80 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. ప్రతీ ప్రశ్నకు 1.25 మార్కులు. మెంటల్ఎబిలిటీ, అంక గణితం(అర్ధమెటిక్), ఎన్విరాన్మెంట్ సైన్స్, అంగ్ల భాషకు సంబంధించి 20 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. జిల్లాలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.ఆరో తరగతిలో ప్రవేశానికి నవోదయ విద్యాలయ సమితి నిర్వహించే ప్రవేశ పరీక్షకు విద్యార్థులు ఈ అర్హతలు కలిగి ఉండాలి. 2027–28 విద్యా సంవత్సరంలో ఆరోతరగతిలో ప్రవేశాలకు ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 01–05– 2015 నుంచి 31–07 –2017 మధ్య జన్మించిన వారు అర్హులు. నవోదయ విద్యాలయాల ఽఅధికారికి వెబ్సైట్ ( https:// navodaya. gov.inనుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని వివరాలు పూర్తి చేయాలి. దరఖాస్తు చేసేందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు . విద్యార్థి ఫొటో, సంతకం, తండ్రి సంతకం తప్పని సరి. పూర్తి చేసిన దరఖాస్తును వెబ్సైట్లో జూలై 31లోగా ఆప్లోడ్ చేయాలి.ఉజ్వల భవిష్యత్కు అవకాశం నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నాం. 2027–2028 విద్యా సంవత్సరానికి గాను నవోదయలో 80 సీట్లలో ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి గడవు లోగా దరఖాస్తు చేసుకుని ప్రవేశ పరీక్షకు సన్నద్ధం చేయాలి – ప్రవీణ్కుమార్, వైస్ ప్రిన్సిపాల్, నవోదయ విద్యాలయం, మామునూరు ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఈనెలాఖరు వరకే దరఖాస్తు గడువు నవంబర్ 28న ప్రవేశ పరీక్ష -
ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం (జూలై 13) జిల్లాలోని 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల వారికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య, విద్య, మహిళాశిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా మొత్తం 2,08,441 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 1–2 సంవత్సరాల పిల్లలకు అర మాత్ర, 2 నుంచి 19 సంవత్సరాల వారికి పూర్తి మాత్ర అందజేస్తారని పేర్కొన్నారు. ఆల్బెండజోల్ పూర్తిగా సురక్షితమైన ఔషధమని, ప్రతి చిన్నారి తప్పనిసరిగా తీసుకునేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. నులి పురుగులతో రక్తహీనత, పోషకాహార లోపం, కడుపు నొప్పి, ఆకలి మందగించడం, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, చెప్పులు ధరించడం, పరిశుభ్రమైన ఆహారం, తాగునీరు వినియోగించడం వంటి అలవాట్లు పాటించడం ద్వారా నులిపురుగుల సంక్రమణను నివారించవచ్చని కలెక్టర్ సూచించారు. వరంగల్ జిల్లాలో 1,96,168 మందికి.. వరంగల్ జిల్లాలో 1–19 ఏళ్ల లోపు వారు 1,96,168 మంది ఉన్నారని ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాశ్ తెలిపారు. జిల్లాలోని 910 ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు 908 అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు మాత్రలు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మాత్రలను బాలబాలికలకు అందేలా చూడాలని వైద్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలను కోరారు. సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు స్వచ్ఛంద సంస్థలు కార్యక్రమ విజయవంతానికి కృషి చేయాలని సూచించారు. -
రైతు ఆత్మహత్యాయత్నం
జనగామ: జనగామ జిల్లా తరిగొప్పుల పోలీస్ స్టేషన్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్ప డిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనగామ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బాధితుడు రాజు విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొంతకాలంగా గ్రామంలోని పలువురితో భూ వివాదం కొనసాగుతోందని, ఈ విషయమై పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదన్నాడు. ఇటీవల జరిగిన ఘర్షణలో తాను గాయపడి వరంగల్లో చికిత్స పొందానని తెలిపాడు. తాను ఆస్పత్రిలో ఉన్న సమయంలో పోలీసులు ప్రత్యర్థి వర్గంతో మా త్రమే విచారణ నిర్వహించారని, తన పిటిష న్ను ఎస్సై శ్రీదేవి పట్టించుకోలేదనే ఆవేదనతో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పాడు. ఈ ఆరోపణలను తరిగొప్పుల ఎస్సై శ్రీదేవి ఖండించారు. భూ వివాదానికి సంబంధించిన ఘటనలో రాజు ఓ వృద్ధుడిపై దాడి చేసి గాయపరిచాడని, అతడిపై గతంలో కూడా పలు కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదైందని తెలుసుకుని అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాజు పిటిషన్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని, పోలీస్స్టేషన్కు వచ్చిన సమయంలో జరిగిన వ్యవహారానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. రాజు పురుగుల మందు తాగలేదని, బయటనే ఒంటిపై పోసుకున్న సమయంలో పోలీసులు అడ్డుకొని ఆస్పత్రికి తరలించారని వివరించారు. చికిత్స అందిస్తున్న వైద్యుడు మహేశ్ మాట్లాడుతూ బాధితుడు పురుగుల మందు తాగినట్లు చెబుతున్నప్పటికీ ఏ మందు తాగాడనే ఆధారాలు లేవని, సంబంధిత డబ్బా కూడా తీసుకురాలేదన్నారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని, రాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ఆరా తీస్తున్నాయి. ఎస్సై పట్టించుకోకపోవడం వల్లే ఆత్మహత్య ఒక్కటే శరణ్యంగా భావించానని రైతు చెబుతుండగా, అలాంటిది ఏం లేదని ఎస్సై చెబుతున్న వాదన.. రెండింట్లో ఎవరిది నిజమో పూర్తి విచారణ తర్వాత వెల్లడి కానుంది. జనగామ జిల్లా తరిగొప్పుల పీఎస్ ఎదుట ఘటన భూ వివాదమే కారణమని రైతు ఆరోపణ ఖండించిన ఎస్సై -
డైట్లో లెక్చరర్ విధులకు దరఖాస్తుల ఆహ్వానం
విద్యారణ్యపురి : హనుమకొండలోని ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణ సంస్థ (డైట్)లో లెక్చరర్ విధులు నిర్వర్తించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఇన్సర్వీస్ స్కూల్ అసిస్టెంట్లు, గెజిటెడ్ హెచ్ఎంల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ బి. రంగయ్యనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియం లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ–1, ఉర్దూ మీడియంలో బోధనకు ఉర్దూ–1, మ్యాథ్స్–1, సైన్స్ –1, సోషల్ స్టడీస్ –1, సైకాలజీ/ఫిలాసఫీ/, సోషియాలజీ –1 పోస్టుల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. వెబ్సైట్ స్కూల్ ఎడ్యు.తెలంగాణ.గౌట్.ఇన్లో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈనెల 14వరకు దరఖాస్తులు చేసుకునేందుకు చివరి గడువు ఉందని తెలిపారు. అంతర్జాతీయ సదస్సుకు ఆదిరెడ్డి కేయూ క్యాంపస్: పాండిచ్చేరిలో ఈనెల 25, 26వ తేదీల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా అవార్డుల ప్రదానోత్సవం ఈసందర్భంగా జరగబోయే సదస్సులో హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జర్నలిజం విభాగం అధ్యాపకుడు ఆర్. ఆదిరెడ్డి పాల్గొనబోతున్నారు. ఈ మేరకు నిర్వాహకుల నుంచి తనకు ఆహ్వానం అందినట్లు ఆదిరెడ్డి ఆదివారం తెలిపారు. ‘సమాజంలో మహిళలు– సాధికారత అభ్యుదయం’ అనే అంశంపై ఈ సదస్సు నిర్వహించబోతున్నారని తెలిపారు. కొనసాగుతున్న సీపీగెట్ –2026 కేయూ క్యాంపస్ : తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల్లో ఈ విద్యాసంవత్సరం 2026–2027లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష టీజీసీపీగెట్ –2026 ఆదివారం కూడా కొనసాగింది. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్లో నిర్వహిస్తున్న ఈసీపీగెట్కు ఉదయం సెషన్లో ఎమ్మెస్సీ జువాలజీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులకు కలిపి 4,088మందికి గాను 3,601 మంది అభ్యర్థులు హాజరయ్యారని సీపీగెట్ కన్వీనర్, కేయూ కామర్స్ అండ్బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రొఫెసర్ కె. రాజేందర్ తెలిపారు. మధ్యాహ్నం సెషన్లో ఎంఏ సంస్కృతం, ఉర్దూ, హిందీ కోర్సులకు కలిపి 366 మందికిగాను 315 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. సాయంత్రం సెషన్లో ఎమ్మెస్సీ జియాలజీ, ఎంఏ ఫిలాసఫీ ప్రవేశ పరీక్షలకు 399 మందిగాను 312 మంది అభ్యర్థులు హాజరయ్యారని రాజేందర్ తెలిపారు. వంట తెచ్చిన విషాదం.. ● ఆహారం వండలేదని దంపతుల మధ్య గొడవ ● మనస్తాపంతో మహిళ ఆత్మహత్య ● కొత్తపల్లిలో ఘటన స్టేషన్ఘన్పూర్ : ఆహారం వండలేదనే కారణంతో దంపతుల మధ్య జరిగిన గొడవతో మనస్తాపం చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం కొత్తపల్లిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సంపంగి చంద్రకళ(30), కనకయ్య దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం కనకయ్య పనికి వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చిన సమయంలో చంద్రకళ వంట చేయకపోవడంతో గొడవ జరిగింది. ఆదివారం కూడా మరోసారి గొడవ కాగా కనకయ్య వ్యవసాయ పనులకు వెళ్లాడు. దీంతో క్షణికావేశానికి గురైన చంద్రకళ ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి కిందపడిపోయింది. పిల్లలు గమనించిన వెంటనే తండ్రికి సమాచారం అందించారు. ఇంటికి చేరుకున్న కనకయ్య స్థానికుల సహకారంతో భార్యను 108లో వరంగల్ ఎంజీఎం తరలించారు. పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, కు మార్తె ఉన్నారు. కాగా, ఈ ఘటనపై రాత్రి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలి
● ఏఐసీసీ జనరల్ సెక్రటరీ బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డివరంగల్ స్పోర్ట్స్: యువత క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, నెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ అధ్యక్షతన జవహర్లాల్ నెహ్రూ (జేఎన్ఎస్) స్టేడియంలో ఆదివారం క్రీడల ప్రాధాన్యం, శాసీ్త్రయ శిక్షణ, గాయాల నివారణ, ఫిట్నెస్, వార్మ్అప్, కూల్డౌన్ అంశాలపై ఆదివారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడుతూ క్రీడాకారులకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ మాట్లాడుతూ క్రీడాకారులు శాసీ్త్రయ శిక్షణను అలవర్చుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఇలాంటి అవగాహన సదస్సులు క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడతాయని, భవిష్యత్లో కూడా మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిపుణులు క్రీడాకారులకు సరైన వార్మ్అప్, డైనమిక్ వ్యాయామాలు, అజిలిటీ శిక్షణ, శ్వాస నియంత్రణ, గాయాల నివారణ, ఫస్ట్ ఎయిడ్, సీపీఆర్, రికవరీ పద్ధతులు, పోటీలకు ముందు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రత్యక్ష ప్రదర్శనలతో వివరించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ తరఫున అథ్లెటిక్స్ కోచ్ శ్రీనివాస్, బాస్కెట్ బాల్కోచ్ సైదులు, క్రికెట్ కోచ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి పారా తైక్వాండోలో సత్తా
వరంగల్ స్పోర్ట్స్ : పుణెలోని శివ చత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ నెల 10, 11వ తేదీల్లో జరిగిన 5వ పారా తైక్వాండో ఓపెన్ జాతీయ చాంపియన్షిప్ (క్యోరుగి – పూమ్సే) లో తెలంగాణ పారా తైక్వాండో జట్టు ప్రతిభ కనబరిచి ఓవరాల్ చాంపియన్షిప్ కై వసం చేసుకుంది. మొత్తం 9 పతకాలు సాధించగా, అందులో 4 స్వర్ణం, 2 రజత, 3 కాంస్య పతకా ల ఉన్నాయి. గౌతమ్యాదవ్, కె.లోకేశ్వరి, కె.శివ, జి.రాజేశ్ స్వర్ణం, నర్సింహ, డి.సాయిబాబా రజ తం, అబ్దుల్, రమేశ్, సక్కుబాయి కాంస్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ఇండియా తైక్వాండో పారా చైర్పర్సన్ వీణ, తెలంగాణ పారా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.ఎస్. దిలీప్, ప్రధాన కార్యదర్శి గణేశ్ యాదవ్ విజేతలను అభినందించారు. క్రీడాకారులు చూపిన కృషి, క్రమశిక్షణ, అంకితభావాన్ని ప్రశంసిస్తూ, కోచ్లు, అధికారులు, సహాయక సిబ్బంది సేవలను కొనియాడారు. తెలంగాణ పారా తైక్వాండో అసోసియేషన్.. ఈ విజయానికి సహకరించిన కోచ్లు, అధికారులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపింది. ఓవరాల్ చాంపియక్ షిప్ సాధించిన తెలంగాణ జట్టు -
సోమవారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2026
ఎస్.జానకి మృతికి జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు జడల శివ ఆధ్వర్యంలో వరంగల్ కళాకారులు నివాళులు అర్పించారు. ఈమేరకు వరంగల్ గోపాలస్వామి గుడి కొత్తవాడ జంక్షన్లో జానకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జానకి పాడిన పాటను ఆలపించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జనగాం రాము, రమేశ్, శ్రీధరస్వామి, రాంనర్సింహస్వామి, భుజంగరావు, ఇమ్యానియల్ రంగనాఽథ్, చంద్రశేఖర్, సృజన్రావు, నజీర్, యాకూబ్, అనిల్, చందన, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. నందీశ్వరుడితో ఎస్.జానకి (ఫైల్)●ప్రజాకవి కాళోజీ నారాయణరావు, గాయని ఎస్.జానకి వాళ్ల మామ మంచి మిత్రులు. 1995లో కాళోజీ వారిని కలవడానికి చైన్నెలోని జానకి నివాసానికి వెళ్లారు. వారితో పాటు నేను వెళ్లాను. ఈ సందర్భంగా ఆమెతో ఫొటో తీసుకున్నాను. జానకమ్మ తనకు లభించిన అవార్డులను, బహుమతులను, షీల్డులను చూపించారు. అలాగే ఆమె భర్త రామప్రసాద్, మామ రామన్, కాళోజీ, కాళోజీ కుమారుడు రవికుమార్ కలిసి గ్రూప్ ఫొటో తీసుకున్నాం. అందరితో ఆప్యాయంగా మాట్లాడే జానకమ్మ మృతి బాధను కలిగిస్తోంది. – మట్టెవాడ అజయ్, మైక్రోఆర్టిస్ట్, గిర్మాజీపేట వరంగల్గాయని జానకమ్మ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు.. ఆమె 2014లో రుద్రేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వరంగల్కు వచ్చారు. దాదాపు గంట పాటు ఆమె రుద్రేశ్వరుడి సన్నిధిలో గడిపారు, ఆలయ పరిక్రమ చుట్టూ తిరుగుతూ శిల్పకళను, నందీశ్వరుడిపై చెక్కిన అలంకరణను పరిశీలించారు. – గంగు ఉపేంద్రశర్మ, వేయిస్తంభాల ఆలయ ప్రధానార్చకుడు, హనుమకొండహన్మకొండ కల్చరల్: ప్రముఖ సినీ నేపథ్యగాయని, గాన కోకిల ఎస్.జానకి మరణంతో ఓరుగల్లు సంగీతకారులు, ఆమె అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు ఓరుగల్లుతో విడదీయలేని అనుబంధం ఉంది. శివభక్తురాలైన జానకి 2014 మార్చి 20న వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించారు. రుద్రేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రత్యేకంగా ఆమె వరంగల్కు రావడం విశేషం. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. 2014లో రుద్రేశ్వరుడిని దర్శించుకునేందుకు వరంగల్కు వచ్చిన గాయని జానకి ఆమె మృతితో ఉమ్మడి జిల్లావాసుల దిగ్భ్రాంతి నివాళులర్పించిన అభిమానులు -
19న శాంతియుత పాదయాత్ర
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులు, రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి, కాజీపేట పరిసర గ్రామాల వారికి, ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరుతూ ఈ నెల 19వ తేదీన మడికొండ అంబేడ్కర్ విగ్రహం నుంచి కాజీపేట రైల్వే స్టేషన్ వరకు శాంతి యుత పాదయాత్ర చేపడుతున్నట్లు రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్, ప్రజాసంఘాల ఐక్యవేదిక కార్యదర్శి ఎం. చుక్కయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం కాజీపే ట రైల్వే కోచ్ఫ్యాక్టరీ ఎంట్రెన్స్ ఎదుట శాంతియుత పాదయాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైల్వే జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు మాట్లాడుతూ 40 ఏళ్ల ఆకాంక్ష కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు కోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. నాయకులు మద్దెల మల్లేశ్, జనగామ కుమారస్వామి, కె.రంజి త్, జెరిపోతుల విల్సన్, ఎన్.రాజమౌళి, కారు ఉ పేందర్, కందుల సంగమయ్య, అనుమాల శ్రీనివా స్, పి.రమేశ్, ఎం.మహేశ్, వి.తిరుపతి, ఎస్.రమేశ్, అయోధ్యపురం గ్రామస్తులు మేరుగు రాజయ్య, ఇలాసాగరం ప్రదీప్, జి. నరేందర్, డి. తేజ, ఎం. అనిల్కుమార్, ఇ.సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. రైల్వే జేఏసీ, ప్రజాసంఘాల ఐక్యవేదిక పిలుపు -
గూడూరులో చిరుతపులి కలకలం
● భయాందోళనలో ప్రజలు గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల అటవీ ప్రాంతంలో కొద్ది రోజులుగా చిరుతపులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జూన్ చివరి వారంలో పక్కన ఉన్న ఖానాపురం మండలం రాగంపేటలో సీసీ కెమెరాలో కనిపించింది. ఆ తర్వాత 30 తేదీ సాయంత్రం గూడూరు మండలం మర్రిమిట్ట శివారు తోటదస్రుతండా సమీప మామిడితోటలో సంచరించింది. సాయంత్రం జాతీయ రహదారి దాటుతుండగా వాహనదారులు చూసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన విషయం తెలిసిందే. జూలై 5న మండలంలోని దామరవంచ అటవీ ప్రాంత పోడు భూముల్లో కూడా సంచరించినట్లు తెలిసింది. తాజాగా శనివారం సాయంత్రం గూడూరు సమీప పాకాలవాగు పక్కన బూడిదినడుమ మార్గంలోని జీలుగు పంట చేలు వైపు ఓ రైతు వెళ్లాడు. ఆ సమయంలో పెద్ద శబ్దం చేస్తూ కొ ద్ది దూరంలో ఏదో జంతువు కదిలి నట్లు గమనించిన రైతు భయంతో ఇంటికి చేరుకున్నాడు. ఆదివారం ఉదయం రైతులు వెళ్లి చూశారు. అక్కడక్కడ గుర్తు తెలియని అటవీ జంతువు పాదముద్రలుగా గుర్తించారు. ఇవి ఇటీవల సంచరిస్తున్న చిరుతపులి అడుగులు కావొచ్చనే అనుమానంతో వెంటనే రైతులు.. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. జీలుగ పంటలో పాదముద్రలు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు అవి చిరుతపులి అడుగులేనని తేల్చారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్వో జి. ప్రసాదరావు విలేకరులతో మాట్లాడుతూ పాకాలవాగు సమీపంలోని పాదముద్రలు చిరుతపులివేనని, మండల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ చిరుతపై దాడి చేయొద్దని, ఎలాంటి హానీ తలపెట్టొద్దన్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంత సమీప గ్రామస్తులు ఒంటరిగా తిరగొద్దనిని, చిరుత కనిపించిన వెంటనే సమాచారం తమకు అందించాలని కోరారు. -
ఈ–గ్రంథాలయం ఏర్పాటుకు కృషి
కాశిబుగ్గ: వరంగల్లోని గ్రంథాలయాన్ని ఈ–గ్రంథాలయంగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆదివారం కాశిబుగ్గ ఓ సిటీలో వరంగల్ జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా మీసాల ప్రకాశ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొని మాట్లాడారు. పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకుడైన మీసాల ప్రకాశ్కు గౌరవం కల్పిస్తూ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా అవకాశం కల్పించిన సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని, ముందుగా ఈ–లైబ్రేరీగా తయారు చేయాలని ఇందుకు కావాల్సిన కంప్యూటర్లను సీఎస్ఆర్ ద్వారా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఇప్పటి నుంచే ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేయాలని, మేయర్ పీఠం కై వసం చేసుకోవడానికి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాలన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు ద్వారా తెలుసుకుంటున్నానని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గోపాల నవీన్రాజు, గ్రంథాలయ సెక్రటరీ బుగ్గారెడ్డి, చినబాబు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మీసాల ప్రకాశ్ ప్రమాణ స్వీకారం -
విపత్తు సమయంలో స్వీయరక్షణపై అవగాహన
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: విపత్తు సమయంలో స్వీయరక్షణ, ప్రాథమిక చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన కార్యక్రమాల నిర్వహణపై ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో శనివారం వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందస్తు సంసిద్ధత చర్యలు, ప్రజలకు అవగాహన వంటి అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్డీఆర్ఎఫ్ బృందానికి అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు. జిల్లాలో 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ ఆధ్వర్యంలో ఈనెల 11నుంచి 20వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ఇన్స్పెక్టర్ దీపక్కుమార్ నేతృత్వంలోని కే.వెంకటేశ్వర్లు, హరికృష్ణ, సతీశ్కుమార్ బృందం సభ్యులు అత్యవసర పరిస్థితులపై స్పందించే విధానంపై ప్రత్యక్షంగా ప్రదర్శించారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి అధికారులు పాల్గొన్నారు. భూ రీసర్వేను పక్కాగా చేపట్టాలి.. భూ రీసర్వేను పక్కాగా చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో భూ రీసర్వే, ఇందిరమ్మ, ఇళ్లు, సాదా బైనామా ద రఖాస్తులు, తదితర అంశాలపై శనివారం స మీక్షించారు. వీసీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక కా ర్యదర్శి లోకేశ్కుమార్, అధికారులు పాల్గొనగా జిల్లా నుంచి కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, అధికారులున్నారు. వీడియో కాన్ఫరెన్స్లో హనుమకొండ నుంచి కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ఏడీఎస్ఎల్ఆర్ నూర్సింగ్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సారంగపాణి, రాజనర్సయ్య, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు. -
బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలి
● బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్ హన్మకొండ: పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి కమిటీలు పునాది అని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. శనివారం ఆరెపల్లిలోని వజ్ర గార్డెన్లో బీజేపీ హనుమకొండ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బూర నర్సయ్య గౌడ్ పాల్గొని మాట్లాడుతూ.. కొత్త సభ్యత్వాలు, చేరికలను విస్తృతంగా చేపట్టాలని, రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి, నాయకులు మార్తినేని ధర్మారావు, డాక్టర్ రాజేశ్వర్, ప్రేమేందర్రెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్, రావు పద్మ, చాడ స్వాతి, సరోత్తంరెడ్డి, చాడ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి, గొట్టికొప్పుల రాంబాబు, జయంత్ లాల్, సండ్ర మధు, మేఘనాథ్ తదితరులున్నారు. -
వదలం.. కదలం!
ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026అల్లం–వెల్లుల్లి ధరలకు రెక్కలుఉమ్మడి జిల్లాలో ఇలా..● అన్నాఅక్క మెంటార్షిప్ కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ఈనెల 1న ప్రారంభం కాగా, సెప్టెంబర్ వరకు కొనసాగనుంది. ● ఈ మెంటార్షిప్ వారానికి రెండు మూడు రోజుల పాటు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకా రం 30 గంటల మేర బోధించనున్నారు. ● ఉమ్మడి జిల్లాలో 14 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నా యి. అందులో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఐదో సెమి స్టర్ చదువుతున్న విద్యార్థులకు అన్నాఅక్క మెంటార్షిప్ టీచింగ్ లెర్నింగ్ ఇంటర్నెషిప్నకు అవకాశం కల్పించారు.సాంకేతిక విద్యనందించాలని.. ప్రభుత్వ యూపీఎస్, హైస్కూల్ విద్యార్థులకు సాంకేతక విద్యను అందించాలని ‘అన్నాఅక్క మెంటార్షిప్, టీచింగ్ ఇంటర్న్షిప్’ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఐదో సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలల్లోని 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్, కంప్యూటింగ్, కోడింగ్, ఫైథాన్, జావా, గేమ్ డిజైన్ వంటి అనేక అంశాలపై బోధిస్తున్నారు.● మెంటార్లుగా డిగ్రీ విద్యార్థులు.. వీరికి ప్రత్యేక శిక్షణ ● అభ్యాసకులు ప్రభుత్వ యూపీఎస్, హైస్కూళ్ల పిల్లలు ● కృత్రిమ మేథ, డిజిటల్ లెర్నింగ్, కోడింగ్ అంశాలపై అవగాహన ● పిల్లల్లో స్నేహపూర్వక వాతావరణం పెంపొందించేలా చర్యలు స్నేహపూర్వక వాతావరణం.. చాలామంది విద్యార్థులు భయం, బెరుకు, స్పీకింగ్ ఫియర్ వల్ల క్లాస్రూమ్లో టీచర్ను సందేహాలు అడగకుండానే ఉండిపోతారు. అన్నాఅక్క మెంటార్షిప్లో భాగంగా విద్యార్థులకు, మెంటార్లకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. భయంలేకుండా సందేహాలు అడగడానికి అవకాశం ఏర్పడుతుంది. త్వరగా అర్థమయ్యే అవకాశం ఉంది. భవిష్యత్ మొత్తం ఏఐదే కాబట్టి బేసిక్ లెవెల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుందని అంచనా. డిగ్రీ విద్యార్థులకు క్రెడిట్ డిగ్రీ విద్యార్థులు మెంటార్లుగా తెలంగాణ కోడ్మిత్ర పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సర్టిఫికెట్ పొందారు. వీరికి శిక్షణ ఇచ్చారు. బోధన వల్ల వీరికి కమ్యూనికేషన్, టీచింగ్ స్కిల్స్ ఇంప్రూవ్తోపాటు మెంటార్షిప్ 30 గంటల పూర్తి చేసిన విద్యార్థులకు ఐదో సెమిస్టర్ ఫలితాల్లో ఒకటి లేదా రెండు క్రెడిట్ పాయింట్స్ కేటాయిస్తారు. ఇది వారికి ఒక ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ఇదొక అద్భుత అవకాశం నేను హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్నాను. నేను డిగ్రీ చదువుతూ ఇలా హైస్కూల్ విద్యార్థులకు బోధించే అవకాశం రావడం అద్భుత అవకాశంగా భావిస్తున్నా. నాలో బోధన నైపుణ్యాలు పెంచుకునే అవకాశం కలిగింది. – బి.భార్గవి, బీసీఏ, ఫైనల్ ఇయర్, కేడీసీ హనుమకొండడిజిటల్ లెర్నింగ్ పుస్తకం చదువుతున్న విద్యార్థులుసాంకేతిక అంశాలు నేర్చుకుంటున్నాం.. అన్నాఅక్క మెంటార్షిప్లో భాగంగా ఏఐ, డిజిటల్ లెర్నింగ్, కోడింగ్ ఫైథాన్, జావా వంటి పలు అంశాలు చెబుతున్నారు. డిజిటల్ లెర్నింగ్కు సంబంధించిన పుస్తకాలు కూడా ఇచ్చారు. వీడియోలను ప్రదర్శిస్తూ బోధిస్తుండడంతో మాకు ఈజీగా అర్థమవుతోంది. – ఎస్ ధనలక్ష్మి, తొమ్మిదో తరగతి, మర్కజీ హైస్కూల్, హనుమకొండ నేర్చుకుంటూ బోధిస్తున్నా.. ఏఐ, డిజిటల్ లెర్నింగ్ తదితర అంశాలను నేను నేర్చుకుంటూ పైడిపెల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్నా. ఐపీఎఫ్ బోర్డు ద్వారా ఆయా సాంకేతిక అంశాలను వీడియోలో రూపంలో బోధిస్తుంటే విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు. – ఎస్.రాజ్కుమార్, బీఏ, కాకతీయ డిగ్రీ కళాశాల, హనుమకొండడిగ్రీ కళాశాల వారీగా ఎంపికైన మెంటార్లు, స్కూళ్లు ఇలా.. మెంటార్లు స్కూళ్లుభవిష్యత్లో ఎంతో ఉపయోగం.. హనుమకొండపింగిళి మహిళానర్సంపేట ప్రభుత్వపరకాల ప్రభుత్వజనగామ ఏబీవీమహబూబాబాద్ ప్రభుత్వకాకతీయ బల్దియాలో తాజా మాజీ కార్పొరేటర్ల జబర్దస్తీ.. మళ్లీ తామే అంటూ అధికారులు, సిబ్బందిపై కర్రపెత్తనం నలిగిపోతున్న జీడబ్ల్యూఎంసీ అధికారులు, సిబ్బంది -
15 నుంచి శాకంబరీ ఉత్సవాలు
హన్మకొండ కల్చరల్: శాకంబరీ నవరాత్రోత్సవాలను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ అమ్మవారి అనుగ్రహం పొందాలని భద్రకాళి దేవాలయ ఈఓ, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత అన్నారు. ఆలయ ప్రాంగణంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామల సునీత, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, సిబ్బంది పాల్గొని శాకంబరీ ఉత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం రామల సునీత మాట్లాడుతూ.. ఈ నెల 15 బుధవారం నుంచి జూలై 29 బుధవారం వరకు 15రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ.. రోజూ అమ్మవారికి వివిధ క్రమాలలో పూజలు నిర్వహించనున్నట్లు, జూలై 29న మహా శాకంబరీగా అమ్మవారు దర్శనమిస్తారని తెలిపారు. ముఖ్యార్చకులు చెప్పెల నాగరాజుశర్మ, సిబ్బంది కూచన హరినాఽథ్, అలుగు కృష్ణ, చింత శ్యామ్సుందర్ పాల్గొన్నారు. వరంగల్ అర్బన్: ఇటీవల సాక్షిలో ప్రచురితమైన ‘జీతం మహాప్రభో’ కథనానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ టి.వెంకన్న స్పందించారు. ఆగమేఘాల మీద ఆయా విభాగాల అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేసి, అకౌంట్ ద్వారా వరంగల్ ఔట్సోర్సి ంగ్ కార్మికులకు వేతనాలు ఇప్పించారు. దీంతో కార్మికులకు ఉపశమనం కలిగింది. కేయూ క్యాంపస్: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకుగాను తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ప్రవేశ పరీక్షలు శనివారం నాలుగో రోజు కొనసాగినట్లు కన్వీనర్ ప్రొపెసర్ కె.రాజేందర్ తెలిపారు. ఉదయం సెషన్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సుకు 2,681 మంది అభ్యర్థులకుగాను 2,323 మంది పరీక్ష రాశారు. మధ్యాహ్నం సెషన్లో ఎంఎల్ఐఎస్సీ/బీఎల్ఐఎస్సీ కోర్సుకుగాను 736 మందికి 600 మంది హాజరయ్యారు. సాయంత్రం సెషన్లో నిర్వహించిన జియోగ్రఫీ ప్రవేశపరీక్షకు 165 మందికి 145 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ క్యాంపస్ను శనివారం నేషనల్ తైవాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెంగ్ చూన్ హీ తన బృందంతో సందర్శించారు. నిట్ వరంగల్ అధ్యాపకులతో కార్బన్ డై ఆకై ్సడ్ వ్యర్థాల నుంచి ఉపయోగకరమైన స్వచ్ఛ ఇందనంగా మార్చే నూతన సాంకేతికతలపై, పరిశ్రమల నుంచి వెలువడే కార్డన్ను తగ్గించడంపై పరిశోధనల గురించి చర్చించారు. ఈసందర్భంగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తైవాన్ ప్రొఫెసర్ల బృందానికి కాకతీయ తోరణ జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ లీలా మనోహర్ ఏశాల, రాజేశ్ఖన్నా గడ్డం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రిక్విజిషన్ల లెటర్లు కరవయ్యాయి. దవాఖానకు వచ్చే రోగులకు వివిధ పరీక్షల సూచిస్తూ వైద్యులు రిక్విజిషన్ లెటర్లు రాస్తుంటారు. అయితే గత రెండు రోజుల నుంచి ఈ లెటర్లు లేకపోవడంతో తెల్ల కాగితాల మీదనే వైద్యులు రాయాల్సి వస్తోంది. దీంతో ఈ కాగితాలు కూడా ధర్మ చిట్టీల మాదిరిగా ఉండడంతో ల్యాబ్ సిబ్బంది సరిగ్గా గుర్తించలేకపోతున్నారు. అలాగే పరీక్షల రిపోర్ట్తో పాటు స్టాంపింగ్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్లు ఇస్తున్న తెల్ల కాగితాలు ఏమాత్రం సరిపోకపోవడంతో ల్యాబ్ సిబ్బంది కూడా మరో తెల్ల పేపర్పై వివిధ పరీక్షల వివరాలతో పాటు రిపోర్ట్, స్టాంపింగ్ వేసి ఇస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ల్యాబ్లో వివిధ పరీక్షలకు అవసరమైన కెమికల్స్, కిట్స్ వచ్చాయని చెబుతున్నారు. -
మూడు నెలల్లోనే రెట్టింపు ఉమ్మడి వరంగల్లో రోజుకు రూ.35 లక్షల వ్యాపారం
సాక్షి వరంగల్: అల్లం, వెల్లుల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత మూడు నెలల్లో వీటి ధరలు సుమారు రెట్టింపవడంతో సామాన్య కుటుంబాల వంటింటి బడ్జెట్పై అదనపు భారం పడుతోంది. సరఫరా తగ్గడం, డిమాండ్ కొనసాగడం, ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గడం వంటి కారణాలతో ధరలు ఒక్కసారిగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం పాత అల్లం కిలో రూ.240, పాత వెల్లుల్లి రూ.245కు విక్రయిస్తుండగా, మూడు నెలల క్రితం ఇవి రూ.120, రూ.160 మాత్రమే ఉన్నాయి. కొత్త అల్లం ధర రూ.70 నుంచి రూ.220కు, కొత్త వెల్లుల్లి రూ.80 నుంచి రూ.200కు చేరింది. దీంతో హోటళ్లు, క్యాటరింగ్ నిర్వాహకులు, గృహిణులు వాటిని కూరల్లో వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది. వివిధ రాష్ట్రాలనుంచే దిగుమతులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అవసరమైన అల్లం, వెల్లుల్లి పూర్తిగా ఇతర రాష్ట్రాలనుంచే దిగుమతి అవుతోంది. అల్లం ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ, అస్సాం రా ష్ట్రాల నుంచి వస్తుండగా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వెల్లుల్లి దిగుమతి అవుతోంది. ఈ నిత్యావసర సరుకు ముందుగా వరంగల్ బీట్ బజార్ మార్కెట్కు చేరుకుని, అక్కడినుంచి హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రవాణా అవుతోంది. రోజుకు 130 క్వింటాళ్ల విక్రయాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతిరోజూ సుమారు 130 క్వింటాళ్ల అల్లం, వెల్లుల్లి విక్రయాలు జరుగుతున్నాయి. ఒక్కో జిల్లాలో రోజుకు సుమారు 10 క్వింటాళ్లకు పైగా అమ్మకాలు నమోదవుతున్నాయి. ప్రస్తుత ధరల ప్రకారం రోజుకు దాదాపు రూ.35 లక్షల వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. ధరలు ఇలానే కొనసాగితే దసరా నాటికి వెల్లుల్లి ధర కిలో రూ.400 వరకు చేరే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. -
15 రోజుల్లో అఫిలియేషన్స్ అందించాలి
ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అజీజ్ఖాన్ వరంగల్ స్పోర్ట్స్: నేటి నుంచి 15 రోజుల్లోపల జిల్లాలోని అన్ని క్రీడా సంఘాలు అఫిలియేషన్స్ అందించాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అజీజ్ఖాన్ తెలిపారు. శనివారం హనుమకొండలోని జిల్లా గ్రంథాలయంలో ఒలింపిక్స్ సంఘం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కైలాస్ యాదవ్ క్రీడా వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా సైక్లింగ్, కిక్బాక్సింగ్, నెట్బాల్, బాస్కెట్బాల్ అసోసియేషన్లో ఏకగ్రీవ ఎన్నికలు చెల్లవని, హైదరాబాద్ స్టేట్ సెక్రటరీ ఇచ్చిన ఆదేశాల మేరకు అతడిని తొలగిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్లో జిల్లా, మండల ఎన్నికలు ఎన్నికలు ఎవరు నిర్వహించినా బైలా ప్రకారం నిర్వహించుకోవాల్సి ఉంటుందన్నారు. అనంతరం జాయింట్ సెక్రటరీ కృష్ణారెడ్డిని ఇన్చార్జ్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కోశాధికారి టి.శ్యాం ప్రసాద్, ఉపాధ్యక్షుడు డాక్టర్ రమేశ్రెడ్డి, సారంగపాణి, సారయ్య, అశోక్, అసోసియేట్ వైఎస్ ప్రెసిడెంట్లు నలబోల సతీశ్, శ్యామల, పవన్కుమార్ పాల్గొన్నారు. -
ఓటరు జాబితా నమోదును వేగవంతం చేయాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణలో భాగంగా దరఖాస్తుల వివరాల నమోదును వేగవంతం చేసి, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ ఎన్.రవితో కలిసి నిర్వహించిన సమీక్షలో వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల వారీగా దరఖాస్తుల పంపిణీ, స్వీకరణ, నమోదు పురోగతిని పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. వెనుకబడిన పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శని, ఆదివారాల్లో సీనియర్, జూనియర్ సహాయకులను తక్కువ పురోగతి ఉన్న పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలిపారు. వారు క్షేత్రస్థాయి అధికారులకు పూర్తి సహకారం అందించి, దరఖాస్తుల నమోదును వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతీ పోలింగ్ కేంద్రం పురోగతిని రోజువారీగా పర్యవేక్షిస్తూ గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, ఆర్డీఓ వెంకటేశ్, తహసీల్దార్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష, పీఎం పోషణ్ అమలు వేగిరం చేయండి జిల్లాలో సమగ్ర శిక్ష, పీఎం పోషణ్ కార్యక్రమాల అమలుతో పాటు ప్రగతి సమాచార వ్యవస్థలో ఆర్థిక, భౌతిక పురోగతి వివరాలను గడువులోగా నమోదు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్వీ.గిరిరాజ్ గౌడ్, సమగ్ర శిక్ష సమన్వయకర్తలు మహేశ్, డాక్టర్ మన్మోహన్, సునీత, సుమ, రఘుచంద్రరావు, క్రాంతికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
డీఎంహెచ్ఓగా అప్పయ్య బాధ్యతల స్వీకరణ
రామన్నపేట/హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిగా డాక్టర్ ఏ.అప్పయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా.. ములుగు ప్రభుత్వ ఆస్పత్రి ఆర్ఎంఓగా బదిలీ అయిన ఆయనను హనుమకొండ డీఎంహెచ్ఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా వారు ఆయనకు సూచించారు. హన్మకొండ అర్బన్: భద్రకాళి మాడవీధుల అభివృద్ధి పనుల కారణంగా ప్రభావితమైన కుటుంబాల జీవనోపాధికి భరోసా కల్పించేందుకు అర్హులైన 30 మందికి ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామక పత్రాలను శుక్రవారం పంపిణీ చేశారు. కలెక్టరేట్లో జరిగిన ఈకార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ లబ్ధిదారులకు నియామక పత్రాలు అందించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల వల్ల ప్రభావితమైన కుటుంబాలకు సంక్షేమ, గృహ, ఉపాధి పథకాల ప్రయోజనాలు కూడా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఓ అజిత్ రెడ్డి, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లోని మేథమెటిక్స్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ‘సైంటిఫిక్ కంప్యూటింగ్ అండ్ విజువలైజేషన్’ అంశంపై మూడు రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను నిట్లోని రామన్హాల్లో అట్టహాసంగా ప్రారంభించారు. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఇండీస్, సెయింట్ ఆగస్టీన్ ప్రొఫెసర్, హెడ్ శ్రీధరరావు గునకాల ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ను ప్రారంభించి, కాన్ఫరెన్స్ సావనీర్ను విడుదల చేశారు. కాన్ఫరెన్స్లో భాగంగా శుక్రవారం ఉద్యోగ విరమణ పొందిన నిట్ ప్రొఫెసర్లు కేఎన్ఎస్, కాశీవిశ్వనాథన్, జేవీ.రమణమూర్తిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఐఐటీ ఖరగ్పూర్ ప్రొఫెసర్ పీవీఎస్ఎన్ మూర్తి, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ వైవీఎస్ఎస్.సన్యాసిరాజు, నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్, ప్రొఫెసర్ ఎన్వీ.ఉమామహేశ్, సీహెచ్.రామ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో 9, పదోతరగతి చదువుతున్న బీసీ, ఈబీసీ డే స్కాలర్ విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి లక్ష్మణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన డే స్కాలర్ విద్యార్థులకు ఏడాదికి రూ.4 వేలు ఉపకార వేతనం అందుతుందని, ఆన్లైన్లో ఈ–పాస్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధికి..విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే నిరుపేద ఎస్సీ విద్యార్థులు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ డీడీ బి.నిర్మల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియా దేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు రూ.20 లక్షల స్కాలర్షిప్, వీసా ఫీ, విమాన ప్రయాణ చార్జీలు అందించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఆగష్టు 31లోపు telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
ఆధార్ బయోమెట్రిక్ నవీకరణ పూర్తి చేయాలి
కాళోజీ సెంటర్: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆధార్ బయోమెట్రిక్ నవీకరణ త్వరగా పూర్తి చేయాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. శుక్రవారం నగరంలోని కృష్ణా కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆధార్ నవీకరణ కేంద్రం నిర్వహిస్తున్న తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధారించిన తేదీల్లోగా విద్యార్థుల బయోమెట్రిక్ (వేలి ముద్రలు), ఐరిష్, అడ్రస్ తదితర వివరాలను నవీకరించుకోవాలన్నారు. అనంతరం కళాశాలలో జరుగుతున్న తరగతులను పరిశీలించారు. పలువురు నూతన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శరదృతి, లైబ్రేరియన్ వనమాల, అధ్యాపకులు శర్మ, హరికృష్ణ, సిబ్బంది ఉన్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
కాళోజీ సెంటర్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీఎస్సీపీఎస్ఈయూ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొంపెల్లి రవీందర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని శంభునిపేట ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని నిరసిస్తూ ఈనెల 11న భద్రాద్రి జిల్లాలో మొదలు కానున్న జన జాగరణ యాత్ర వాల్ పోస్టర్ ఆవిషరించారు. ఈ సందర్భంగా రవీందర్రెడ్డి మాట్లాడుతూ ఈనెల 11 నుంచి 30వ తేదీ వరకు జరిగే ర్యాలీ ఈ నెల 29న వరంగల్ జిల్లాకు చేరుకుంటుందని, ర్యాలీలో జిల్లాలోని ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ రఘు, జిల్లా కార్యవర్గ సభ్యులు వివేకానంద, శ్రీనివాస్, రాజ్కుమార్, రఘు, నవీన్ దేవరాజ్, అశోక్ పాల్గొన్నారు. -
పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం
హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి హన్మకొండ చౌరస్తా: కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయడమే మనందరి మొదటి లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ కమిటీ సంస్థాగత సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ మండలం, ప్రతీ డివిజన్ పరిధిలో పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజలతో మమేకమవుతూ, సమన్వయంతో క్షేత్రస్థాయి కార్యాచరణను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ, టీపీసీసీలకు సమర్పించాల్సిన నివేదికల విషయంలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసి, నివేదికలను సకాలంలో అందించాలని నాయకులకు సూచించారు. నాయకులు, కార్యకర్తలు అందరూ ఒకే తాటిపైకి వచ్చి ముందుకు సాగాలని, పార్టీని మరింత ప్రజాదరణ పొందేలా ముందుకు కృషి చేద్దామన్నారు. ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తప్పవని సున్నితంగా హెచ్చరించారు. అనంతరం ‘చరక’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సమావేశంలో టీపీసీసీ జిల్లా కో–ఆర్డినేటర్ శ్రీనివాస్గౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి కూచన రవళి, టీపీసీసీ ట్రైనర్ పులి అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మండల అధ్యక్షులు, వర్ధన్నపేట నియోజకవర్గ పరిధి డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిపాదనలు సిద్ధం చేయండి
బల్దియా కమిషనర్ టి.వెంకన్న వరంగల్ అర్బన్: జంతు వధశాలల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని బల్దియా కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాజీపేట, హనుమకొండలోని జంతు వధశాలలను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆదేశాలిచ్చారు. హనుమకొండ ప్రెస్ క్లబ్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టు పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. అనంతరం నక్కలగుట్ట వార్డు కార్యాయాలన్ని తనిఖీ చేశారు. అనంతరం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, అర్బన్ మలేరియా విభాగ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎస్ఈ రాజ్కుమార్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, శానిటరీ సూపర్వైజర్లు భాస్కర్, నరేందర్, గోల్కొండ శ్రీను, హెల్త్ ఇన్స్పెక్టర్ మధుకర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. పోస్టర్ల ఆవిష్కరణ అభ్యుదయ సేవా సమితి, స్వచ్ఛ వరంగల్ పౌర సంఘాల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్లో సెప్టిక్ ట్యాంకుల క్రమబద్ధమైన డిస్లడ్జింగ్పై అవగాహన పోస్టర్లను కమిషనర్ టి.వెంకన్న ఆవిష్కరించారు. కార్యక్రమంలో అభ్యుదయ సేవా సమితి అధ్యక్షులు మండల పరశురాములు, సెప్టిక్ ట్యాంక్ వాహన యజమానులు పాల్గొన్నారు. -
విద్యాసంస్థల బంద్ విజయవంతం
విద్యారణ్యపురి: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా వామపక్ష విదత్యార్థి సంఘాలు ప్రభుత్వ పాఠశాలల తరగతులు బహిష్కరింపచేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు ముందస్తుగానే బంద్ పాటించాయి. ఈసందర్భంగా వామపక్షాల విద్యార్థి సంఘాల బాధ్యులు, విద్యార్థులు కేయూ జంక్షన్ నుంచి ఎస్డీఎల్సీఈ మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్ రోడ్డులో గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వివిధ విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి హనుమకొండ పోలీస్టేషన్కు తరలించారు. వామపక్ష విద్యార్థి సంఘాల బాధ్యులు బాషబోయిన సంతోశ్ (ఏఐఎస్ఎఫ్), మంద శ్రీకాంత్ (ఎస్ఎఫ్ఐ), బి.నర్సింహారావు (పీడీఎస్యూ), మాస్ సావిత్రి (ఏఐఎఫ్డీఎస్), మర్రి మహేశ్ (పీడీఎస్యూ), రోహిత్ (ఏఐఎస్బీ), వెంకటేశ్ (ఏఐడీఎస్ఓ), ఆయా విద్యార్థి సంఘాల బాధ్యులు స్టాలిన్, ఉట్కూరి ప్రణీత్, మోహన్, మిస్సా, తాజుద్దీన్, సమీర్, వంశీ, కార్తీక్, మధు, సురేశ్ పాల్గొన్నారు. బైక్ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించిన వామపక్ష విద్యార్థి సంఘాలు -
రుణాలు సకాలంలో అందించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: శ్రీనిధి ద్వారా మహిళలకు అందించే రుణాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ హాల్లో శ్రీనిధి కార్యక్రమం అమలు, రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వైవీ.గణేశ్, శ్రీనిధి జోనల్ ఆఫీసర్ ఎస్ఎన్.ఆర్ఎం.సైదిరెడ్డి, రజిత, ఏపీఎంలు, డీపీఎంలు, తదితరులు పాల్గొన్నారు. ‘ఎస్ఐఆర్’ను వేగవంతం చేయాలి ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ డాక్టర్ పవన్కుమార్ శర్మ ఆదేశించారు. శుక్రవారం న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ. గణేశ్, ఆర్డీఓలు సుమా, ఉమారాణి, ఎన్నికల సూపరింటెండెంట్ రజనీ, అధికారులు పాల్గొన్నారు. -
‘ఉచితం’ ఇక చాలు..!
హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి టీజీఎస్ ఆర్టీసీ తూట్లు పొడుస్తోంది. ఉచిత ప్రయాణ సేవలనుంచి తప్పుకోవాలని చూస్తున్నట్లు కనినిపిస్తోంది. ప్రధాన రూట్లలో ఎక్స్ప్రెస్ బస్సులు తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వరంగల్ రీజియన్లో హైదరాబాద్ రూట్లో ఎక్స్ప్రెస్ బస్సులను చాలా వరకు తగ్గించింది. హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి హైదరాబాద్కు ప్రతీ 5 నుంచి 10 నిమిషాలకు ఒక బస్సు నడిచేది. కానీ, ఇప్పుడు గంట నుంచి గంటన్నర వరకు ఎక్స్ప్రెస్ బస్సులు కనిపించడం లేదు. దీంతో ఉచితంగా ఎక్స్ప్రెస్ బస్సులో ప్రయాణించాల్సిన మహిళలు గంటల కొద్ది పడిగాపులు కాస్తున్నారు. ఆదాయం పెంచుకోవాలనే ఆలోచనతోనే.. ఉద్యోగుల జీతాల పెంపు, పశ్చిమ ఆసియాలో యుద్ధంతో ఇంధన ధరలు పెరగడంతో ఈ మేరకు ఆదాయం పెంచుకోవాలనే ఆలోచనకు ఆర్టీసీ యాజమాన్యం వచ్చింది. హైదరాబాద్ రూట్లో ఎక్స్ప్రెస్ బస్సులు తగ్గించాలని గత ఏప్రిల్లో ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. తద్వారా ప్రయాణికులను డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల వైపు మళ్లించి రోజువారీ ఆదాయం పెంచుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం సత్ఫలితాలు ఇచ్చింది. దీంతో ఎక్స్ప్రెస్ బస్సులను చాలావరకు తగ్గించింది. దీంతో బస్సుల ఫ్రీక్వెన్సీలో చాలా తేడా వచ్చింది. ప్రయాణికులు డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్నారు. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులను హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్స్టేషన్ వరకు నడిపించడంతో ఆర్టీసీ అధికారులు ఆశించిన మేరకు సంస్థకు ఆదాయం పెరిగింది. హైదరాబాద్ రూట్లో వరంగల్ రీజియన్లో రోజుకు రూ.1,00,000 నుంచి రూ.3,00,000 వరకు ఆదాయం పెరిగిందని ఆర్టీసీ అధికార వర్గాలు తెలిపాయి. బస్సులు తగ్గించడం దారుణం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ఎక్స్ప్రెస్ బస్సులను తగ్గించడం దారుణం. నేను పస్రా నుంచి ఉదయం 10 గంటలకు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ చేరుకున్నా. 11.30 అవుతున్నా.. ఇప్పటి వరకు ఒక్క బస్సు రాలేదు. బస్సులు తగ్గించారని తెలిసింది. పేద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే బస్సులను పెంచాలి. – భాగ్యమ్మ, పస్రా గంటలకొద్ది నిరీక్షణ నేను హైదరాబాద్ వెళ్లేందుకు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్కు వచ్చా. గంటన్నర నుంచి ఎక్స్ప్రెస్ బస్సు కోసం ఎదురుచూస్తున్నా. పేద, మధ్య తరగతి వారి ప్రయాణానికి అనువుగా ఉండే ఎక్స్ప్రెస్ బస్సులను తగ్గించడం సమంజసం కాదు. హైదరాబాద్ రూట్లో ఎక్స్ప్రెస్ బస్సులు పెంచాలి. – రాజు, వరంగల్ నగదు ఆదాయం పెంపుపై ఆర్టీసీ దృష్టి హైదరాబాద్ రూట్లో ఎక్స్ప్రెస్ బస్సుల తగ్గింపు 5 –10 నిమిషాల వ్యవధిని గంట నుంచి గంటన్నరకు పెంపు ఉచిత బస్సు కోసం మహిళా ప్రయాణికుల ఎదురుచూపు సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో ప్రయాణించేలా ప్రణాళిక -
నల్లా కనెక్షన్లు: 1,80,617
● పన్ను వసూళ్లనుంచి స్మార్ట్ సిటీ వరకు.. ఒకే డిజిటల్ మ్యాప్లోకి.. ● కార్పొరేషన్కు పెరగనున్న ఆదాయం ● హైదరాబాద్ మోడల్ ఇప్పుడు వరంగల్లో.. ● డ్రోన్, ఏఐ, 3డీ డేటాబేస్తో కొత్త అధ్యాయం ● మొదటగా రూ.10 కోట్లు విడుదల సాక్షిప్రతినిధి, వరంగల్ : గ్రేటర్ వరంగల్ నగరాన్ని అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీతో అనుసంధానించే భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నగరంలోని ప్ర తీ ఇల్లు, భవనం, స్థలం రోడ్డు, డ్రెయినేజీ, తాగునీటి పైప్లైన్ను డిజిటల్గా నమోదు చేసి ఒకే మ్యా ప్లోకి తీసుకురానున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అమృత్–2.0 పథకం కింద రూ.10 కోట్ల పరి పాలనా అనుమతి మంజూరు చేసింది. డ్రోన్ ఆధారిత ప్రాపర్టీ ట్యాక్స్ మ్యాపింగ్, సమగ్ర జీఐఎస్ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం), 3డీ డిజిటల్ అర్బన్ డేటాబేస్ రూపొందించే ఈ ప్రాజెక్టుకు సంబంధించి శుక్రవారం జీఓను జారీ చేసింది. కేవలం ఆస్తిపన్ను సర్వే కాదు.. భవిష్యత్ డిజిటల్ బ్లూ ప్రింట్.. ఇది కేవలం ఆస్తిపన్ను సర్వే కాదు. నగరానికి ఒక ‘డిజిటల్ ట్విన్’ రూపొందించి, కృత్రిమ మేధ (ఏఐ) డ్రోన్ సాంకేతికత, జీఐఎస్ డేటాతో భవిష్యత్ వరంగల్కు శాసీ్త్రయ అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేసే ప్రాజెక్టు. హైదరాబాద్లో అమలవుతున్న నమూనాను ఇప్పుడు వరంగల్లో అమలు చేయనున్నారు. ఇప్పటివరకు మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఆస్తుల వివరాలు నమోదు చేసేవారు. ఈ విధానంలో కొత్త నిర్మాణాలు, అదనపు అంతస్తులు, వాణిజ్య వినియోగానికి మారిన భవనాలు, రికార్డుల్లో లేని ఆస్తులు పూర్తిగా గుర్తించడం కష్టమయ్యేది. ఇకపై ప్రత్యేక డ్రోన్లు నగరంపై ఎగురుతూ అత్యంత స్పష్టతతో చిత్రాలను సేకరిస్తాయి. ఆ చిత్రాలను ఏఐ ఆధారిత విశ్లేషణతో పరిశీలించి ప్రతి భవనం విస్తీర్ణం, ఎత్తు, వినియోగం, నిర్మాణ స్థితి వంటి వివరాలను డిజిటల్గా నమోదు చేస్తారు. అనంతరం వాటిని ప్రస్తుతం ఉన్న ఆస్తి పన్ను రికార్డులతో సరిపోల్చి వ్యత్యాసాలను గుర్తిస్తారు. హైదరాబాద్లో సక్సెస్.. ఇప్పుడు వరంగల్లో హైదరాబాద్లో ఇప్పటికే డ్రోన్, జీఐఎస్ ఆధారిత సమగ్ర ఆస్తుల మ్యాపింగ్ చేపట్టారు. ఆ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో పన్ను రికార్డులకు బయట ఉన్న లేదా వివరాల్లో వ్యత్యాసాలున్న ఆస్తులను గుర్తించి, ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు ప్రారంభించారు. దీనివల్ల రూ.కోట్లల్లో ఆదాయం పెరిగినట్లు జీహెచ్ఎంసీ అప్పట్లో ప్రకటించింది. అదే నమూనాను ఇప్పుడు వరంగల్లో అమలు చేయడం ద్వారా రికార్డుల్లో లేని ఆస్తులు, అదనపు అంతస్తులు, విస్తరణలు, వాణిజ్య వినియోగాలు గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో ఆస్తి పన్ను పరిధి విస్తరిస్తుంది. పన్ను ఎగవేత తగ్గుతుంది. కార్పొరేషన్కు అదనపు ఆదాయం సమకూరుతుంది. అలాగే నగర పరిపాలనను డిజిటల్గా మార్చడంతోపాటు, స్మార్ట్ సిటీ లక్ష్యాలకు బలమైన పునాది పడుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. 3డీ డేటాబేస్.. వరంగల్కు డిజిటల్ ట్విన్ఈ ప్రాజెక్టులో నగరానికి కేవలం మ్యాప్ మాత్రమే కాదు, 3డీ డిజిటల్ నమూనా (డిజిటల్ ట్విన్) కూడా సిద్ధమవుతుంది. భవనం ఎత్తు, అంతస్తుల సంఖ్య, ఆకృతి, రహదారులతో అనుసంధానం, పరిసర నిర్మాణాలు, మౌలిక సదుపాయాల వివరాలు అన్నీ డిజిటల్గా నమోదవుతాయి. దీంతో కొత్త రోడ్లు ఎక్కడ వేయాలి? భవిష్యత్లో ఫ్లైఓవర్లు ఎక్కడ అవసరం? డ్రెయినేజీ వ్యవస్థను ఎలా విస్తరించాలి? వరద ముంపు ప్రాంతాలు ఏవి? ట్రాఫిక్ను ఎలా నియంత్రించాలి? అనే అంశాలపై శాసీ్త్రయంగా నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది. రోడ్ల విస్తీర్ణం: 5,623 చ.కి పైప్లైన్లు: 1,593 చ.కి ప్రతీ ఆస్తి కంప్యూటర్లోకి...జీఐఎస్ ద్వారా నగరానికి సంబంధించిన భౌగోళిక సమాచారమంతా ఒకే డిజిటల్ మ్యాప్లో ఉంటుంది. అధికారులు ఒకే స్క్రీన్పై...ఏ ప్రాంతంలో ఎన్ని భవనాలున్నాయి? ఎక్కడ రోడ్లు, డ్రెయినేజీలు, నీటి పైపులు ఉన్నాయి? ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి? ఎక్కడ అభివృద్ధి అవసరం? ఎక్కడ పన్ను బకాయిలు ఎక్కువగా ఉన్నాయి? అనే వివరాలను తక్షణమే తెలుసుకోగలుగుతారు. -
బయ్యారంలో ఉక్కుపరిశ్రమ కోసం ఉద్యమం
బయ్యారం: బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఉద్యమిస్తామని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం బయ్యారం సమీపంలోని ఇనుపరాతిగుట్టను సందర్శించారు. అనంతరం మండలంలోని చర్లపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బయ్యారం గనులను ప్రభుత్వరంగ సంస్థ సింగరేణికి అప్పగించాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని నినదించి ఆంధ్రపాలకుల నుంచి తెలంగాణ సంపదను కాపాడామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్లో ఇనుపరాయి గనులున్నాయని, వీటి ఆధారంగా బయ్యారంలో సింగరేణి సంస్థతో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఒకటి రెండుసార్లు విభజన చట్టంలో పొందుపర్చిన బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేయలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడిచినా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మిస్తే ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. సింగరేణిలో 35 వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఈ నెల 20 నుంచి అన్నం, నీరు ముట్టకుండా దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ. లక్షతోపాటు తులం బంగారం, పింఛన్ల పెంపు తదితర మాయమాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో పేదపిల్లలతోపాటు ఆడపిల్లలు చదువుకు దూరం కావాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా తాను తెలంగాణ సేనను ఏర్పాటు చేశానన్నారు. ఆడబిడ్డలకు రాజకీయంగా హక్కు ఉండాలని, ఆదివాసీల అభివృద్ధికి తమ పార్టీ ప్రత్యేకంగా రెండు గిరిజన విభాగాలను ఏర్పాటు చేసిందన్నారు. పార్టీ నాయకులు బోడ జనార్దన్, రామకృష్ణదొర, రియాజ్ అహ్మద్, నవీన్ ఆచారి, వీరన్న ఉన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఉక్కు పరిశ్రమపై చిన్నచూపు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత -
పథకాలు అర్హులకు చేరాలి
హన్మకొండ అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రయోజనాలు చివరి లబ్ధిదారుడి వరకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూచించారు. హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. టీబీ నిర్మూలన, పల్స్పోలియో, ఇందిరమ్మ ఇళ్లు, వైద్య సేవలు, వ్యవసాయం, మౌలిక వసతుల కల్పనపై అధి కారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాలనలో నాణ్యత, పారదర్శకత, సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలని, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలను బలోపేతం చేయాలన్నారు. రైతులను విలువ ఆధారిత పంటల సాగు వైపు ప్రోత్సహించాలని సూచించారు. హాస్టళ్ల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ: మంత్రి అడ్లూరి వర్షాకాలంలో సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అధికారులను ఆదేశించారు. అత్యవసర మరమ్మతుల కోసం ప్రతీ జిల్లాకు రూ.కోటి వరకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామన్నారు. ఆరోగ్య పరీక్షలు, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద, పోలీస్ కమిషనర్ శ్వేత, అదనపు కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. భద్రకాళి అమ్మవారికి పూజలుహన్మకొండ కల్చరల్: భద్రకాళి అమ్మవారిని గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆయన సతీమణి జానకి శుక్లా దర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించుకున్నారు. ముందుగా వారు గోవులకు గ్రాసం అందించి ఆదిశంకరులను, వల్లభగణపతిని దర్శించుకున్నారు. దీపారాధన చేశారు. అమ్మవారిని దర్శించి కుంకుమార్చన, పూజలు నిర్వహించుకున్నారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అధికారులతో సమీక్ష మహిళల కృషికి ప్రశంస హన్మకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గురువారం సందర్శించి మహిళల కృషిని అభినందించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, వ్యవసాయ, ఉద్యాన శాఖల స్టాళ్లలో ప్రదర్శించిన ఉత్పత్తులను పరిశీలించి తయారీ విధానం, నాణ్యత, మార్కెటింగ్ అవకాశాలపై మహిళలతో మాట్లాడారు. వరంగల్ దరీ స్టాల్ను సందర్శించి దరీల ప్రత్యేకత, మార్కెట్ అవకాశాలపై వివరాలు తెలుసుకుని వాటిని కొన్నారు. అనంతరం మహిళలను ప్రోత్సహిస్తూ పలు స్టాళ్లలోని ఉత్పత్తులను కొన్నారు. -
కులాల పేర్లలో మార్పులు గమనించాలి
న్యూశాయంపేట: ప్రభుత్వం సవరించిన బీసీల్లోని కొన్ని కులాల పేర్లను గమనించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రూప్–ఏ కేటగిరి సీరియల్ నంబర్–7లో ఉన్న డొమ్మర పేరును తొలగించి గడవంశీయ, సీరియల్ నంబర్ 18లో ఉన్న పిచ్చిగుంట్లను తొలగించి వంశరాజ్గా సవరించినట్లు ఆమె తెలిపారు. సీరియల్ నంబర్–4లో ఉన్న బుడబుక్కలకు శివక్షత్రియ, 23లో ఉన్న వీరభద్రీయ (వీరముష్టి లేదా నెట్టికోటల)గా సవరించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత అభ్యర్థుల అభ్యర్థన మేరకు వీరభద్రీయ, వీరముష్టి లేదా నెట్టికోటల పేర్లతో కుల ధ్రువీకరణ పత్రాలు జారీచేయనున్నట్లు వవరించారు. ఈ మార్పు కులం పేరుకు మాత్రమేనని, సంబంధిత కులాల రిజర్వేషన్ వర్గీకరణ హక్కులు, ప్రయోజనాల్లో ఎలాంటి మార్పు లేదని ఆమె స్పష్టం చేశారు. కాజీపేట అర్బన్ : కాజీపేట మండలం మడికొండలోని సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల, కళాశాల విద్యార్థినులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గురువారం నాణ్యమైన బియ్యాన్ని సంబంధిత అధికారులకు తెలిపి పంపించారు. ఇటీవల ఆయన సదరు సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో అన్నంలో పురుగులు వస్తున్నాయని పలువురు విద్యార్థినులు వాపోయారు. దీంతో స్పందించిన ఆయన పాత బియ్యాన్ని మార్చి నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని ఆదేశించారు. అధికారులు గురువారం బియ్యం అందజేయడంతో విద్యార్థినులు హర్షం వ్యక్తం చేశారు. -
వృత్తి నైపుణ్యాల్లో ప్రతిభ కనబర్చాలి
మామునూరు: డ్యూటీ మీట్ల ద్వారా వృత్తి నైపుణ్యాల్లో ప్రతిభ కనబర్చాలని, కఠోర సాధన చేస్తే అన్ని రంగాల్లో రాణించడంతోపాటు విధి నిర్వహణలో ఎదురయ్యే పని ఒత్తిళ్లు అధిగమించొచ్చని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. మామునూరు పోలీస్ శిక్షణ కళాశాల పరేడ్ గ్రౌండ్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్–2026 గురువారం సాయంత్రం ముగిసింది. ఈ డ్యూటీ మీట్లో జోనల్ పరిధి వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లతోపాటు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పోలీసులు అధికారులు కంప్యూటర్ పరిజ్ఞానం, ఫొరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, లిిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషన్, ఫొటో, వీడియో గ్రాఫిక్ విభాగాల్లో పోటీ పడ్డారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారికి సీపీ ఎన్.శ్వేత చేతుల మీదుగా పతాకాలు అందజేశారు. కమిషనరేట్ విభాగానికి 13 గోల్డ్ మెడల్స్ సహా మొత్తం 28 పతకాలు వచ్చాయి. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 12, మహబూబాబాద్ జిల్లా 13, ఖమ్మం కమిషనరేట్ టీమ్లు 9 పతకాలు సాధించాయి. ఇందులో రాణించిన పోలీస్ అధికారులు త్వరలో మల్కాజ్గిరి కమిషనరేట్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొంటారు. సీపీ శ్వేత మాట్లాడుతూ జోనల్ స్థాయిలో కనబర్చిన మాదిరిగా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చాలన్నారు. అదనపు డీసీపీలు శ్రీనివాస్, బాలస్వామి, ఏసీపీలు, సురేంద్ర, డీఎస్పీలు శ్రీనివాస్, సాంబరాజు, ఆర్ఐ సతీశ్, ఇన్స్పెక్టర్లు క్రాంతికుమార్, విశ్వేశ్వర్, విజయ్కుమార్, ఆర్ఎస్సై శ్రవణ్కుమార్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జోనల్ స్థాయి మాదిరిగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపాలి వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ముగిసిన భద్రాద్రి జోన్ పోలీస్ డ్యూటీ మీట్ –2026 -
రెడ్క్రాస్ సొసైటీకి విరాళం
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా రెడ్క్రాస్ సొసైటీకి తన ట్రస్ట్ తరఫున ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి రూ.1,00,116 విరాళం అందించారు. ఈమేరకు విరాళం చెక్కును గురువారం రెడ్ క్రాస్ పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు అందజేశారు. సమాజ సేవలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. అత్యవసర సమయాల్లో రక్తదానం చేస్తూ ప్రాణాలు కాపాడుతున్న రెడ్క్రాస్ సొసైటీకి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని గవర్నర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జిల్లా ఉన్నతాధికారులు, ట్రస్ట్ ప్రతినిధులు, రెడ్ క్రాస్ బాధ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో ఈనెల 10న జరగాల్సిన బీటెక్, ఫార్మసీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ గురువారం తెలిపారు. బీటెక్ ఆరో సెమిస్టర్, ఫార్మ్డీ మూడో సెమిస్టర్ బీఫార్మసీ రెండో సెమిస్టర్, ఆరో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 10న జరగాల్సి ఉండగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఆయా పరీక్షలను రీషెడ్యూల్ కూడా చేసినట్లు తెలిపారు. ఈనెల 10న జరగాల్సిన బీటెక్ ఆరో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 25న, ఫార్మ్డీ మూడో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 23న, బీఫార్మసీ రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 18న, బీఫార్మసీ ఆరో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 23న నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కాశిబుగ్గ: వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో చాలా కాలం నుంచి పేరుకుపోయిన స్క్రాప్ను ఎట్టకేలకు తొలగించారు. గత నెలలో ‘పేరుకుపోయిన స్క్రాప్’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఇనుప స్క్రాప్ను విక్రయించడానికి నిర్ణయించారు. ఈనేపథ్యంలో దీని కోసం టెండర్ పిలిచి, అధికంగా కోట్ చేసిన వారికి విక్రయించారు. దీనికి రూ.2,95,000 టెండర్ పాడినట్లు తెలుస్తోంది. కొనసాగిన టీజీసీపీజీఈటీ కేయూ క్యాంపస్ : రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో 2026–2027 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకుగాను నిర్వహిస్తున్న టీజీసీపీజీఈటీ రెండో రోజు గురువారం 22 కేంద్రాల్లో ఆన్లైన్ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని సీపీజీఈటీ కన్వీనర్, కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ రాజేందర్ తెలిపారు. రెండోరోజు మొదటి సెషన్లో ఎంఏ ఎకనామిక్స్ కోర్సుకు 1,143 మంది, ఎంఏ తెలుగుకోర్సుకు 2,486మంది అభ్యర్థులు హాజరయ్యారు. సాయంత్రం సెషన్లో ఎమ్మెస్సీ సైకాలజీ, ఎమ్మెసీ డేటాసైన్స్ ప్రవేశ పరీక్షలకు 1,233 మందికి 1048 మంది అభ్యర్థులు హాజరయ్యారని కన్వీనర్ రాజేందర్ తెలిపారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 86 కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న సుమారు రూ.4.31 కోట్ల విలువైన 862 కిలోల గంజాయిని హనుమకొండ జిల్లా అమ్మవారిపేటలోని కాకతీయ మెడిక్లీన్ సర్వీసెస్ వద్ద (ఇన్సినరేషన్ పద్ధతిలో) దహనం చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ డైరెక్టర్ ఆదేశాల మేరకు, డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయిని దహనం చేసినట్లు ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ తెలిపారు. ఇందులో అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, సీసీఆర్బీ ఏసీపీ పి.డేవిడ్ రాజు, ఇన్స్పెక్టర్ సంజీవరావు, ఎస్సై నరేశ్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఖిలా వరంగల్: వరంగల్ రైల్వేగేట్ పెరకవాడలో గురువారం చైన్స్నాచింగ్ జరిగింది. మినుముల వరలక్ష్మి గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కిరాణా దుకాణానికి నడుస్తూ వెళ్తుండగా.. గుర్తుతెలియని ఓ వ్యక్తి బైక్పై వచ్చి ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పరారయ్యాడు. మిల్స్కాలనీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలు వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ కర్రె స్వామి తెలిపారు. -
అద్దెకిస్తామని చెప్పి.. కార్లు తాకట్టు పెట్టి
ఖిలా వరంగల్: ఐటీ కంపెనీల్లో కార్లు అద్దెకు పెట్టిస్తానని వాటిని తాకట్టు పెట్టి లక్షలు కాజేసిన ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ కర్రె స్వామి తెలిపారు. గురువారం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. తన కారును ఐటీ కంపెనీలో అద్దెకు పెట్టానని, నెలకు రూ.35 వేలు అద్దె వస్తోందని, వరంగల్ కరీమాబాద్కు చెందిన సింగారపు శ్యామ్ కుమార్.. ఖిలా వరంగల్ మధ్యకోటకు చెందిన మొహమ్మద్ సోహైల్ను నమ్మించాడు. సోహైల్ తన కారును శ్యామ్కు అప్పగించగా.. శ్యామ్ అడ్వాన్స్ కింద రూ.35 వేలు చెల్లించాడు. అనంతరం కారును శ్యామ్కుమార్ వేరే వారి దగ్గర తాకట్టు పెట్టి లక్షలు కాజేశాడు. ఈవిషయమై బాధితుడు మొహమ్మద్ సొహైల్ పోలీసులను ఆశ్రయించాడు. వరంగల్ తెలంగాణ జంక్షన్ వద్ద గురువారం ఉదయం వాహన తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న సింగారపు శ్యామ్కుమార్, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన ఎండీ సోహైల్(మరో నిందితుడు)ను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఘరానా మోసం బయటపడింది. వారు ప్రయాణిస్తున్న మారుతి డిజైర్ కారుతోపాటు చింతల్ ప్లైఓవర్ బ్రిడ్జి కింద దాచిన మరో రెండు కార్లు (మారుతి ఎర్టిగా, మారుతి బెలెనో), మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఇన్స్పెక్టర్ స్వామి తెలిపారు. బురిడీ కొట్టిస్తున్న ఇద్దరి అరెస్ట్ కార్లు, ఫోన్ స్వాధీనం -
జీతాలు మహా ప్రభో!
వరంగల్ అర్బన్: చాలీచాలని జీతాలు. ఆ డబ్బులు కూడా సకాలంలో అందక కార్మికులు ఆర్థిక అవస్థలు పడుతున్నారు. వరంగల్ మహా నగర పాలక సంస్థలోని ఔట్ సోర్సింగ్ పద్ధతిపై పనిచేస్తున్న పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, వాహనాల డ్రైవర్లు, అర్బన్ మలేరియా విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల అవస్థలు వర్ణనాతీతం. వరంగల్ నగర పాలక సంస్థలోని ప్రజారోగ్య విభాగం, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, టౌన్ ప్లానింగ్, అర్బన్ మలేరియా, ట్యాక్స్, జనరల్ విభాగంలో 3,200 మంది కార్మికులు ఔట్సోర్సింగ్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ప్రతీ నెల రూ.6.40 కోట్ల సొమ్మును వేతన రూపంలో అందజేస్తుంటారు. ప్రతీ నెల 25వ తేదీలోగా అటెండెన్స్ పరిగణనలో తీసుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నెల 1వ తేదీన వేతనాలు అందించాలి. కానీ, 10 రోజులు గడిచినా వేతనాలు అందలేదు. సొమ్ముకు సంబంధించిన చెక్కును సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రాలేదని బల్దియా అకౌంటింగ్ విభాగం అధికారులు చెబుతున్నారు. కమిషనర్ ఆదేశాలతో ఒకటి, రెండు రోజుల్లో వేతనాలు కార్మికుల ఖాతాల్లో జమవువుతాయని, కమిషనర్ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నట్లు చెబుతున్నారు. కానీ, కార్మికులు మాత్రం ఆరు నెలల నుంచి సకాలంలో జీతాలు రావట్లేదని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 రోజులు కావొస్తున్నా అందని వేతనాలు ఔట్సోర్సింగ్ కార్మికుల వెతలు -
నర్సింగ్ విద్యార్థుల వెతలు
● 18 మంది అవసరం ఉండగా.. నలుగురే ట్యూటర్లు ● వార్డెన్లు లేకుండా కొనసాగుతున్న హాస్టల్ నిర్వహణ కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆవరణలోని ప్రభుత్వ జనరల్ నర్సింగ్ స్కూల్ నలుగురు ట్యూటర్లతో నడుస్తోంది. వాస్తవానికి 18 మంది ట్యూటర్లు అవసరం ఉండగా.. కేవలం నలుగురు మాత్రమే జాయిన్ కావడంతో విద్యార్థినుల బోధనకు ఇబ్బందులు తప్పట్లేదు. ఈ స్కూల్లో మూడేళ్ల కోర్సులో 200 మంది చదువుతున్నారు. వీరందరికి చదువుతోపాటు ఎంజీఎంలో నర్సింగ్ సేవలు, హాస్టల్ సదుపాయం ప్రిన్సిపాల్తో పాటు ట్యూటర్లు చూసుకోవాల్సి ఉంటుంది. దీంతో నిత్యం విద్యార్థినులు ఇక్కట్లకు గురవుతున్నారు. అలాగే విద్యార్థినుల హాస్టల్ చూసుకోవడానికి ఇద్దరు వార్డెన్లు అవసరం ఉండగా.. ఒకరు కూడా లేరు. తక్షణమే ట్యూటర్లను నియమించి, విద్యాబోధనకు ఇక్కట్లు తొలగించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
అసంపూర్తి పనులతో
శుక్రవారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2026వరంగల్ అర్బన్: వరంగల్లోని నర్సంపేట ప్రధాన రహదారిలో జరుగుతున్న గ్యాస్ పైప్లైన్ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వరంగల్ నగర శివారు నుంచి గొర్రెకుంట క్రాస్ రోడ్డు, లేబర్ కాలనీ, మిల్స్ కాలనీ, వెంకట్రామా జంక్షన్, కాశిబుగ్గ, పోచమ్మ మైదాన్, ఎంజీఎం సెంటర్ నుంచి ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వరకు గ్యాస్ పైప్లైన్ను ఓ ప్రైవేట్ ఏజెన్సీ సంస్థ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రధాన రహదారిని ఆర్అండ్బీ పర్యవేక్షిస్తోంది. సుమారు ఆరు నెలల పాటు ఎండలు మండిపోయాయి. ఇంతకాలం నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు ఏజెన్సీ నిర్వాహకులు నర్సంపేట రోడ్డు నుంచి పోచమ్మమైదాన్ జంక్షన్ వరకు రెండు నెలలుగా గ్యాస్ పైప్లైన్ల కోసం భారీ గుంతలు తవ్వుతున్నారు. 30 మీటర్లకో గుంత.. రోడ్డంతా కాకపోయిన సుమారు 30 మీటర్లకో చోట భారీ గుంతలు తవ్వి అండర్ గ్రౌండ్ ద్వారా పైప్లైన్లు వేస్తున్నారు. గ్యాస్ పైపులైన్లు వేయాల్సిందే... కానీ, అసలే వర్షాకాలం 30 మీటర్లకో చోట భారీ గుంత తవ్వడం, అసంపూర్తిగా పూడ్చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. తవ్వకాలు జరిగే చోట పైప్లైన్లు, ఇతర కేబుల్స్ అడ్డు రావడంతో తాత్కలిక ప్రమాద హెచ్చరికల రిబ్బన్లు ఏర్పాటు చేస్తున్నారు. రిబ్బన్లు గాలికి కొట్టుకుపోతున్నాయి. రోడ్డుకు ఒకవైపు సగానికి పైగా తవ్వకాలు జరుపుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతోంది. అక్కడక్కడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎవరిది ఈ నిర్లక్ష్యం? ఈ పనులపై సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భారీగా తవ్విన గుంతల్లో మట్టి ౖపైపెన పూడ్చేసి చేతులు దూలుపుకుంటున్నారు. మట్టి కుంగిపోయి రోడ్డుపై గుంతలు ఏర్పడుతున్నాయి. అసలే వర్షాకాలం కావడం వల్ల భారీ వర్షం కురిస్తే లోతైన గుంతలు వరద నీటితో నిండిరోడ్డు, గుంత తెలియక ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. ఈ రోడ్డు మార్గం నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది. బాటసారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాకపోకలు సాగిస్తున్నారు. ఈ విషయమై ఆర్అండ్బీ ఇంజనీర్లను సంప్రదిస్తే స్పదించడం లేదు. బల్దియా ఇంజనీర్లు మాత్రం చూస్తాం.. చేస్తామని కాలయాపన చేస్తుండడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పూర్తి చేయిస్తాం.. వరంగల్లోని నర్సంపేట రోడ్డులో అండర్ గ్రౌండ్ ద్వారా గ్యాస్ పైపులైన్లు వేసేందుకు అనుమతి ఉంది. పనుల్లో నిర్లక్ష్యం లేకుండా ఆదేశాలు ఇస్తాం. గుంతలు తవ్విన చోట పక్కాగా ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. – సంతోశ్, బల్దియా ఈఈ వరంగల్లోని నర్సంపేట నడి రోడ్డుపై తవ్విన భారీ గుంత ప్రధాన రహదారిపై తవ్విన భారీ గుంతలు వర్షాకాలం నీరునిలిచి ప్రమాదం జరిగే అవకాశం పట్టించుకోని అధికారులు -
పార్కింగ్ అడ్డదిడ్డం
వరంగల్ క్రైం: సుబేదారి పోలీస్స్టేషన్ నుంచి తిరుమల బార్ జంక్షన్ వైపు సాయంత్రం పూట వాహనాలు నడపాలంటే వాహనదారులు జంకుతున్నారు. ఈ రోడ్డులోని హోటళ్లకు వచ్చే కస్టమర్లు ఇష్టారాజ్యంగా వాహనాలను రోడ్డుపై పార్కింగ్ చేస్తున్నారు. గంటల తరబడి వాహనాలు తీయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హోటళ్ల నిర్వాహకులు కనీసం సెక్యూరిటీ గార్డులను కూడా ఏర్పాటు చేసుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. నిత్యం ఈ దారిగుండా వెళ్లే స్థానిక పోలీసులకు, ట్రాఫిక్ వారికి రోడ్డుపై నిలిపే వాహనాలు కంట పడకపోవడం గమనార్హం. ఇప్పటికై నా పోలీసులు కలగజేసుకుని ఈ దారిలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. -
గ్రేటర్ వరంగల్ ఆదర్శం
వరంగల్ అర్బన్/కాజీపేట అర్బన్: మలమూత్ర వ్యర్థాల శాసీ్త్రయ శుద్ధీకరణలో గ్రేటర్ వరంగల్ పనితీరు ప్రశంసనీయమని ఆసియా అభివృద్ధి బ్యాంకు సంస్థ(ఏడీబీఐ) జపాన్ కన్సల్టెంట్ డాక్టర్ కజుషి హషిమోటో అన్నారు. మంగళవారం విలీన గ్రామమైన అమ్మవారిపేటలో ఏర్పాటు చేసిన మలశుద్ధీకరణ కేంద్రాలను సందర్శించారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో మలవిసర్జన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థపై ఏర్పాటు చేసిన సమావేశంలో జపాన్ బృందం.. కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్, బల్దియా కమిషనర్ టి.వెంకన్నతో భేటీ అయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మలశుద్ధీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, పైరోలసిస్ విధానం ద్వారా మలాన్ని సేంద్రియ ఎరువుగా మార్చి వ్యవసాయ భూముల్లో వినియోగిస్తున్నట్లు తెలిపారు. నగర అవసరాలకు అనుగుణంగా ఇటీవల రోజుకు 150 కిలోలీటర్ల సామర్థ్యం గల ఆధునిక మలశుద్ధీకరణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్లో అమలవుతున్న పారిశుద్ధ్య నిర్వహణ విధానాలు, మలశుద్ధీకరణ సాంకేతికత, వనరుల పునర్వినియోగ విధానం ఆదర్శప్రాయంగా ఉన్నట్లు డాక్టర్ కజుషి హషిమోటో అభినందించారు. ఈతరహా సుస్థిర పారిశుద్ధ్య నమూనాలు ఇతర పట్టణాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈలు మహేందర్, స్పందన, ఆస్కీ ప్రతినిధులు డాక్టర్ స్నేహలత, రాజ్మోహన్రెడ్డి, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. మలమూత్ర శుద్ధీకరణ పనితీరు ప్రశంసనీయం ఏడీబీఐ జపాన్ కన్సల్టెంట్ డాక్టర్ కజుషి హషిమోటో క్షేత్రస్థాయిలో పరిశీలన, ప్రత్యేకాధికారి, కమిషనర్తో భేటీ -
కాజీపేట–హైదరాబాద్ రైళ్లకు వేగం!
సాక్షిప్రతినిధి, వరంగల్ : కాజీపేట నుంచి కాచిగూడ వైపు వెళ్లే పలు సుదూర ఎక్స్ప్రెస్ రైళ్లకు రైల్వే శాఖ శాశ్వతంగా కొత్త మార్గాన్ని అమలు చేసింది. ఇప్పటి వరకు ఈ రైళ్లు మౌలాలి గేట్ క్యాబిన్ – మల్కాజిగిరి – కాచిగూడ మార్గంలో చుట్టూ తిరుగుతూ ప్రయాణించేవి. తాజాగా నిర్మించిన లాలాగూడ – సీతాఫల్ మండి 4 కిలోమీటర్ల కార్డ్ (బైపాస్) రైల్వే లైన్ అందుబాటులోకి రావడంతో ఈ రైళ్లను ఇకపై ఈ కొత్త మార్గంలో నడపాలని నిర్ణయించారు. ఈ కొత్త బైపాస్ నిర్మాణ పనులు రెండేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. ఇటీవల అన్ని సాంకేతిక పరీక్షలు, భద్రతా పరిశీలనలు పూర్తవడంతో రైల్వే శాఖ ఈ లైన్ను వినియోగంలోకి తీసుకొ చ్చింది. దీంతో రైళ్లు మల్కాజిగిరి వైపు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా సీతాఫల్మండి మీదుగా కాచిగూడ చేరుకునే అవకాశం ఏర్పడింది. సమయం ఆదా.. భవిష్యత్లో టైం టేబుల్లో మార్పులు ప్రస్తుతం కొత్త మార్గంలో నడిపిస్తున్న రైళ్ల షెడ్యూల్లో ఎలాంటి సమయ మార్పులు చేయలేదు. అయితే ప్రయాణ దూరం, సమయం తగ్గనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ రైళ్ల టైం టేబుల్ను పునఃసమీక్షించి ప్రయాణ సమయాన్ని తగ్గించే అవకాశం ఉందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. కాచిగూడ రూట్కు కొత్త బైపాస్ లాలాగూడ–సీతాఫల్మండి 4 కి.మీ. కార్డ్ లైన్పై శాశ్వతంగా రైళ్ల దారి మళ్లింపు ప్రయాణ సమయం ఆదాకు మార్గం భవిష్యత్లో టైం టేబుల్లోనూ మార్పులకు అవకాశందారి మళ్లించిన రైళ్లు 12707/12708 తిరుపతి–హజ్రత్ నిజాముద్దీన్ ఏపీ సంపర్క్ క్రాంతి ట్రై వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12649/12650 యశ్వంత్పూర్–హజ్రత్ నిజాముద్దీన్ కర్ణాటక సంపర్క్ క్రాంతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12647/12648 కోయంబత్తూరు–హజ్రత్ నిజాముద్దీన్ కొంగు వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12975/12976 జైపూర్–మైసూరు బై వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12193/12194 జబల్పూర్–యశ్వంత్పూర్ వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 15023/15024 గోరఖ్పూర్–యశ్వంత్పూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ (అయోధ్య మార్గం) 12251/12252 కోర్బా–యశ్వంత్పూర్ వెన్గంగా బై వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 11085/11086 గ్వాలియర్–ఎస్ఎంవీటీ బెంగళూరు వీక్లీ ఎక్స్ప్రెస్ -
నూతన హంగులతో లహరి బస్సులు
హన్మకొండ: ప్రయాణికుల సౌకర్యార్థం నాన్ ఏసీ లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులను నూతన హంగులతో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ ఎస్.భవాని ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సుదూర ప్రయాణాలు చేసే వారికి ఇంటి వాతావరణాన్ని తలపించేలా ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. సాధారణ ప్రయాణికులకు అందుబాటు చార్జీలతో మెరుగైన సేవలు అందించేందుకు లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు నడుపుతున్నట్లు వివరించారు. ఇతర ప్రైవేట్ బస్సులకు ఏ మాత్రం తీసిపోకుండా అత్యున్నత సౌకర్యాలతో ఈ బస్సులు నడుపుతున్నామన్నారు. ప్రయాణికులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని, లహరి బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయంలో స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాల ఎంపిక ప్రక్రియ మంగళవారం ముగిసింది. స్పోర్ట్స్ స్కూల్కు ఎంపికైన బాలుర ధ్రువపత్రాలను డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ ఆధ్వర్యంలో పరిశీలించారు. క్రీడాకారులు, వారి తల్లిదండ్రులకు డీవైఎస్ఓ స్వాగతం పలికారు. అడ్మిషన్ ప్రక్రియ, హాస్టల్ వసతి, నాణ్యమైన క్రీడా శిక్షణ, సౌకర్యాల గురించి వివరించారు. ఎంపికై న వారికి క్రీడా శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారులు, కోచ్లు పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: వరంగల్ ఆర్ఓ కార్యాలయంలో వారం రోజులుగా భూక్రయవిక్రయదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ సర్వర్, వెబ్సైట్ మంగళవారం స్పీడ్ అందుకుంది. వరంగల్ ఆర్ఓ లో ప్రతీ రోజు రిజిస్ట్రేషన్ నిమిత్తం 108 స్లాట్ బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి. మంగళవారం 67 స్లాట్ బుకింగ్స్ కాగా.. ప్రతీ రిజిస్ట్రేషన్ను నిర్దేశించిన 15 నిమిషాల్లో పూర్తిచేసినట్లు ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ కరుణారెడ్డి తెలిపారు. దీంతో భూక్రయవిక్రయదారులు ఉపశమనం పొందారు. హన్మకొండ అర్బన్: యాక్షన్ ధాన్యానికి సంబంధించిన బకాయిలు, సీఎంఆర్ ధాన్యం బకాయిలను డిఫాల్ట్ రైస్మిల్లర్లు నిర్దేశించిన గడువు (ఆగస్టు 5వ తేదీ)లోగా ప్రభుత్వానికి చెల్లించాలని సివిల్ సప్లయీస్ హెడ్ ఆఫీస్ టాస్క్ఫోర్స్ అదనపు ఎస్పీ ప్రభాకర్రావు సూచించారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ ఎన్.రవి చాంబర్లో రైస్ మిల్లర్లు, డిఫాల్ట్ రైస్మిల్లర్లతో అదనపు ఎస్పీ ప్రభాకర్రావు సమీక్ష నిర్వహించారు. సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ మహేందర్, టాస్క్ఫోర్స్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి టీచర్లకు శిక్షణ విద్యారణ్యపురి: హనుమకొండ, వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, యూఆర్ఎస్, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న హిందీ, ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్లకు ఈనెల 8 నుంచి10 వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. హిందీ సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్లకు హనుమకొండలోని ప్రభుత్వ డైట్, ఇంగ్లిష్ టీచర్లకు హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్, ఫిజికల్ సైన్స్ టీచర్లకు హనుమకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిక్షణ తరగతులు నిర్వహించనన్నారు. హనుమకొండ జిల్లాలో సుమారు 270 మంది తరగతులకు హాజరవ్వనున్నారు. వరంగల్ జిల్లాలో.. కాళోజీ సెంటర్: ‘ట్రాన్స్ఫార్మేటివ్ క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ ఫర్ క్వాలిటీ లెర్నింగ్‘ అంశంపై నేటి (బుధవారం) నుంచి మూడు రోజుల సమీకృత ఉపాధ్యాయ శిక్షణ నిర్వహించనున్నట్లు డీఈఓ బి.రంగయ్యనాయుడు తెలిపారు. శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. మొత్తం 2,922 మంది ఉపాధ్యాయులు హాజరవ్వనున్నట్లు పేర్కొన్నారు. మొదటి దశలో ఇంగ్లిష్, హిందీ, ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్స్కు జీహెచ్ఎస్ శంభునిపేటలో నిర్వహించనున్నారు. -
సమగ్రాభివృద్ధికి కృషి చేద్దాం
గ్రేటర్ కమిషనర్ వెంకన్న వరంగల్ అర్బన్: క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వింగ్ అధికారి వరకు సమన్వయంతో నిబద్ధతతో, పారదర్శకంగా పనిచేస్తూ మహా నగరాభివృద్ధికి కృషి చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషన్ టి.వెంకన్న ఆదేశించారు. మంగళవారం నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. అనంతరం బల్దియా ప్రధాన కార్యాలయంలో వింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరాభివృద్ధిలో భాగంగా ప్రజారోగ్యానికి మేలు కలిగేలా పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సేవల మెరుగుదలపై సూచనలిచ్చారు. జంతు సంరక్షణ, డంపింగ్ యార్డు పరిశీలన బాలసముద్రంలోని బయో కంపోస్ట్, వర్మీ కంపోస్ట్, కోకోపిట్, జీవ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రం, పొడి వ్యర్థాల వేరు చేసే కేంద్రాలను కమిషనర్ పరిశీలించారు. అనంతరం హసన్పర్తిలోని జంతు జనాభా నియంత్రణ (ఏబీసీ) కేంద్రంలో నిర్వహణ తెలుసుకున్నారు. మడికొండలోని డంపింగ్ యార్డును పరిశీలించి బయోమైనింగ్ పనుల పురోగతిని సమీక్షించారు. సమావేశంలో అదనపు కమిషనర్ జోనా, సూపరింటెండింగ్ ఇంజినీర్ రాజ్కుమార్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జ్ పట్టణ ప్రణాళిక అధికారి రవీందర్ రాడేకర్, డీఎఫ్ఓ శంకర్ లింగం, అకౌంట్స్ అధికారి శివలింగం, ఉప కమిషనర్ ప్రసన్నరాణి, మున్సిపల్ ఆరోగ్య అధికారి రాజేశ్, ఉద్యానఅధికారి లక్ష్మారెడ్డి, కార్యనిర్వాహక ఇంజనీర్లు, అధికారులున్నారు. -
అవినీతి నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండ చౌరస్తా: ‘కుడా’ భూముల వేలంలో అవినీతి జరిగిందంటూ మాజీ ఎమ్మెల్యే, ‘కుడా’ మాజీ చైర్మన్లు హైదరాబాద్లో మీడియా ముందు చేసిన వ్యాఖ్యలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్లో మీడియా ముందుకు వచ్చే ధైర్యం లేక హైదరాబాద్లో దాక్కుని ప్రెస్మీట్ పెట్టడం మాజీ ఎమ్మెల్యే దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. కుడా భూముల వేలం పూర్తి పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్వహించామని, వేలంలో పాల్గొనే అవకాశం అందరికీ కల్పించామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. హనుమాన్ టెంపుల్ సమీపంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మిస్తున్నామని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, అక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలో శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వరంగల్ అభివృద్ధి కోసం సాఫ్ట్వేర్ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలు, స్టార్ హోటళ్లను ఆహ్వానించినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ ప్రాజెక్టును తీసుకొస్తున్నట్లు వివరించారు. పదేళ్ల పాలనలో జరిగిన వందల అక్రమాలను ప్రజల ముందు పెట్టే ధైర్యం తమకు ఉందని, తనపై అవినీతిని ఆధారాలతో ని రూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. -
పోలీసులకు వృత్తి నైపుణ్యం అవసరం
వరంగల్ క్రైం: పోలీసులు విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం ఎంతో కీలకమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అన్నారు. మూడు రోజుల పాటు జరిగే భద్రాద్రి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలను మంగళవారం మామునూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ప్రారంభించారు. భద్రాద్రి జో నల్ పరిధిలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం పోలీసు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది డ్యూటీ మీట్లో పాల్గొన్నా రు. డ్యూటీ మీట్లో భాగంగా కంప్యూటర్ పరి జ్ఞానం, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్ లిఫ్టింగ్, ప్యాకింగ్, హ్యాండ్లింగ్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్, ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీ వంటి విభాగా ల్లో సిబ్బంది తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. ప్రతిభ కనబర్చిన వారిని త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్ కోసం ఎంపిక చేస్తామని ఆమె తెలిపారు. ఈ సంవత్సరం రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్, అదనపు డీసీపీలు బాలస్వామి, శ్రీనివాస్, జోనల్కు చెందిన ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు పాల్గొన్నారు. విపత్తుల నుంచి ప్రజలను కాపాడాలి మామునూరు: విపత్తుల నుంచి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రజలను కాపాడాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఆదేశించారు. ఈమేరకు మంగళవారం మామునూరు టీజీ ఎస్పీ బెటాలియన్ను ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్తో కలిసి సీపీ సందర్శించారు. ప్రధాన గేట్ వద్ద సీపీ శ్వేతకు కమాండెంట్ శివప్రసాద్రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతించారు. అనంతరం పరిపాలన భవనం వద్ద స్పెషల్ పోలీసులు గౌరవందన సమర్పించారు. అత్యవసర సమయంలో ప్రజలను ఎలా కా పాడుతున్నారని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అడిగి తె లుసుకున్నారు. 2025 మోంథా తుపాను సమయంలో నాలుగో బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చే సిన సేవలను అభినందించారు. అనంతరం సిబ్బంది పరికరాలను పరిశీలించారు. ఏసీ ఈ.వీరన్న, రాజేందర్, ఎస్డీఆర్ఎఫ్ ఆర్ఐలు కార్తీక్, రవి, రాజ్కుమార్, అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత -
‘సోషల్ వెల్ఫేర్’కు రూ.28 లక్షలు
కాజీపేట అర్బన్: మడికొండలోని గర్ల్స్ సోషల్ వెల్ఫేర్ పాఠశాల, కళాశాల అభివృద్ధికి రూ.28 లక్షల నిధులతో పాటు తన వేతనం నుంచి రూ.2.50 లక్షలు విరాళంగా అందజేస్తున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు తెలిపారు. కాజీపేట మండలం మడికొండలోని గర్ల్స్ సోషల్ వెల్ఫేర్ పాఠశాల, కళాశాలను మంగళవారం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్తో కలిసి పరిశీలించారు. ఇటీవల విద్యార్థిని కుక్క కాటుకు గురైన ఘటనను గోప్యంగా ఉంచిన ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ జ్యోతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో లైటింగ్, 20 సీలింగ్ ఫ్యాన్ల ఏర్పాటుకు తన ఒక నెల వేతనం రూ.2.50 లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు. పాఠశాల ప్రహరీపై ఫెన్సింగ్ మున్సిపల్ శాఖ ద్వారా ఏర్పాటు చే యనున్నట్లు కలెక్టర్ చాహత్ తెలిపారు. గురుకుల విద్యా సంస్థ రీజినల్ కోఆర్డినేటర్ అరుణకుమారి, ఈడబ్ల్యూఐడీసీ కార్యనిర్వాహక ఇంజనీర్ నరేందర్రెడ్డి, ఏసీపీ ప్రశాంత్రెడ్డి, తహసీల్దార్ రాజు ఉన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ.. మడికొండలోని శ్రీ రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్లో మంగళవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు 44, 45, 46, 64 డివిజన్ల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు. సీఎస్ను కలిసిన హనుమకొండ కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజూను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూలమొక్క ఇచ్చారు. ‘సర్’ను పారదర్శకంగా పూర్తిచేయాలి కాజీపేట రూరల్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ బూత్స్థాయి అఽధికారులను ఆదేశించారు. కాజీపేట పట్టణంలోని డీజిల్కాలనీ, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సర్ ప్రక్రియను పరిశీలించారు. వేతనం నుంచి రూ. 2.50 లక్షలు ఇస్తా: వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ప్రహరీకి రింగ్ చైన్ ఫెన్సింగ్ : హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
అర్ధంతరంగా సెంట్రల్ ల్యాబ్ బంద్
కాశిబుగ్గ: వరంగల్ మహాత్మాగాంధీ స్మాకర వైద్యశాలలో (ఎంజీఎం) క్రితం ఏర్పాటు చేసిన సెంట్రల్ ల్యాబ్ను అర్ధంతరంగా మూసివేయడంతో పేషెంట్లు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రిలోని 91/ఏ వ నంబర్లో ఆనాటి నుంచి పేషెంట్లకు సంబంధించిన రక్త పరీక్షలు చేస్తున్న ల్యాబ్ పూర్తిగా పనిచేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో నలుగురు ల్యాబ్ అటెండెంట్లు, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు విధులు సేవలు అందించారు. ప్రస్తుతం ల్యాబ్ మూసివేయడంతో వీరిని ఇతర ల్యాబ్లకు పంపించారు. ఆర్థోపెడిక్, సర్జరీ వార్డుల పేషెంట్ల ఇబ్బందులు సాధారణంగా ఈ ల్యాబ్లో పనిచేసుస్తున్న సిబ్బంది దవాఖానాలోని సర్జికల్, మెడికల్, పిడీయాట్రిక్, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, న్యూరో, కార్డియాలజీ, ఆర్ఐసీయూ, సీటీ తదితర వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులకు సంబంధించిన పరీక్షల కోసం వచ్చి బ్లడ్, యూరిన్ శాంపిల్ను తీసుకువెళ్తారు. వీరు సెంట్రల్ ల్యాబ్లో పరీక్షలు చేయించి, అదే రోజు రిపోర్టు అందిస్తారు. దీంతో వార్డుల్లో ఉన్న పేషంట్లు హెచ్బీ, హిమోగ్లోబిన్, బీటీ సీటీ పరీక్షల కోసం వార్డుల్లో పేషెంట్లకు వెసులుబాటు ఉండేది. నేరుగా బ్లడ్ శాంపిల్స్ టేకర్స్ వెళ్లి శాంపిల్స్ను తీసుకొచ్చే విధానం ఉండడంతో ఇన్ పేషెంట్లు ఊపిరిపీల్చుకునేవారు. ప్రస్తుతం వారు లేకపోవడంతో పేషెంట్లు నేరుగా ల్యాబ్కు పరీక్షల కోసం నడిచి రావాల్సి వస్తోంది. ముఖ్యంగా ఆర్థోపెడిక్, సర్జరీ వార్డుల్లో ఉన్న పేషెంట్ల బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఎంజీఎంలో ఉన్న మూడు ల్యాబ్ల్లో ఎక్కడికి వెళ్లాలో వీరికి తెలియడం లేదు. ఇన్ పేషెంట్గా ఉన్నవాళ్లు పరీక్షల కోసం ఎలా వెళ్తారని అటెండెంట్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో మాదిరిగానే సెంట్రల్ ల్యాబ్ను నడిపిస్తూ ఇన్ పేషెంట్ల వెతలను తీర్చాలని వారు కోరుతున్నారు. ఎంజీఎంలో ఇన్పేషెంట్లకు తప్పని అవస్థలు వార్డుల్లో అడ్రస్ లేని బ్లడ్ శాంపిల్ టేకర్స్ -
ముంపు నివారణకు చర్యలు
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఖిలావరంగల్: శివనగర్లోని మైసయ్యనగర్ వరద నీటి నిల్వ సమస్య నివారణకు చేపడుతున్న చర్యలను వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్, వర్షపు నీరు వేగంగా వెళ్లేలా డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చడం, నీరు నిల్వ కాకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ముందస్తు చర్యలను చేట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వరంగల్ ఆర్డీఓ సుమ, జీడబ్ల్యూఎంసీ ఈఈ సంజయ్, తహసీల్దార్ ఇక్బాల్ పాల్గొన్నారు. -
అప్పులు.. వడ్డీల భారమే కారణం
జనగామ: జనగామలోని పూర్ణిమ కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. బంధువులకు ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం, ప్రైవేట్గా తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించలేక తీవ్ర మానసిక వేదనకు గురై రిటైర్డ్ టీచర్ పగిడిపల్లి మల్లయ్య (63) సోమవారం అర్ధరాత్రి తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. కూతురు, కుటుంబ సభ్యులు, 33 పేజీల సూసైడ్ నోట్లోని వివరాలు ఇలా ఉన్నాయి. బంధువులు ద్రోహం చేశారు.. మృతుడు మల్లయ్య తన సూసైడ్ నోట్లో 1995 నుంచి 2021 వరకు బంధువులకు ఇచ్చిన అప్పులు, తాను ఇతరుల నుంచి తీసుకున్న అప్పులు, వాటిపై చెల్లించిన వడ్డీలు, రావాల్సిన, చెల్లించాల్సి న మొత్తం వంటి అన్ని ఆర్థిక లెక్కలను తేదీల వారీగా, వడ్డీలతో సహా సవివరంగా సూసైడ్ నోట్లో నమోదు చేశారు. ముఖ్యంగా బావమరుదులు, బంధువులు తనకు ద్రోహం చేశారని, అప్పు తీసుకునే సమయంలో మంచి మాటలు చెప్పి, తిరిగి ఇవ్వాల్సిన సమయంలో మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డికి లేఖ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఉద్దేశించి కూడా లేఖ రాశారు. 2024 ఆగస్టు 31న ఉద్యోగ విరమణ చేసిన తనకు రావాల్సిన మొత్తం రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.56, 33,435 కాగా, ఇప్పటి వరకు రూ.45,55,897 మాత్రమే అందాయని తెలిపారు. ఇంకా రూ.10,77,538 జెడ్పీ జీపీఎఫ్ బకాయి ఉందని చెప్పారు. భార్య, పిల్లలకు.. భార్య అనిత, కుమారుడు భార్గవ్, కుమార్తె మౌక్తిక, అల్లుడు విక్రమ్కు ప్రత్యేకంగా లేఖ రాశారు. ‘నన్ను క్షమించండి.. పిల్లలను బాగా చూసుకోండి. చంటి పిల్లలను జాగ్రత్తగా పెంచండి. నాకు రూ.50 వేల పెన్షన్ వస్తుంది. అమ్మను జాగ్రత్తగా చూసుకో.. చెల్లి, కోడళ్లు, బావ అందరూ మిత్రుల్లా ఉండాలి.. కుటుంబ బాధ్యత మొత్తం నీదే’ అంటూ కుమారుడికి సూచించారు. పలువురిపై ఆరోపణలు తన చావుకు ప్రధాన కారణం గుంటి రత్నాకర్ అని, తనకు రూ.1.44 కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. గుంటి మనోహర్ తనకు రూ.27.23 లక్షలు ఇవ్వాల్సి ఉందని, ఆయన భార్య, కుమార్తె కూడా ఈ పరిస్థితికి కారణమని ఆరోపించారు. గుంటి రాధమ్మ సుమారు రూ.10 లక్షలు ఇవ్వలేదని, గుంటి జయశ్రీ అసత్య ప్రచారం చేసిందని రాశారు. రత్నాకర్ గారు మీ నుంచి భూమి విలువతో కలిపి రూ.3.44 కోట్లు రావాలి. మీకిచ్చిన డబ్బు అడిగితే నేను రాక్ష సుడినయ్యాను అని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. నా బావమరుదులకు అప్పు ఇవ్వడం నేను చేసిన మొదటి తప్పు. వారిని నా వారిగా నమ్మి నా సర్వస్వాన్ని ధారపోశాను. 1995 నుంచి 2021 వరకు వారు ఆపదలో ఉన్నారని డబ్బులు ఇచ్చాను. ఏ రోజు కాగితం రాయించుకోలేదని పేర్కొన్నారు. రావాల్సిన డబ్బులు సమయానికి రాకపోవడంతో తాను ఇతరులకు వడ్డీ రూపంలో సుమారు రూ.26 లక్షల వరకు చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు. నా శవాన్ని పంచనామాకు తీసుకెళ్లే ముందు కలెక్టర్ లేదా పోలీసు ఉన్నతాధికారి.. మీడియా సమక్షంలో నేను రాసిన లేఖ మొత్తం చదివిన తర్వాతే నన్ను దించండి. నా చావుకు కారణమైన వారు అంత్యక్రియలకు రావొద్దని స్పష్టంగా రాశారు.కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కూతురు, అల్లుడు ప్రజలకు చివరి విజ్ఞప్తినా కుటుంబాన్ని పక్కనపెట్టి బంధువులకు సాయం చేశాను. ఎన్నడూ వడ్డీ అడగలేదు. అసలు కూడా బలవంతంగా అడగ లేదు. వారు ఎంత ఇస్తే అంతే తీసుకున్నాను. కానీ, అనేక సందర్భాల్లో అవమానించారు. నాకు జరిగిన అన్యాయంపై ప్రతి పౌరుడు ఆలోచించాలని రాశారు. స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు.వాట్సాప్ సందేశం ప్రస్తావన2021ఏప్రిల్16న మనోహర్ పంపిన వాట్సాప్ సందేశాన్ని కూడా సూసైడ్ నోట్లో జత చేశారు. బావా నమస్తే.. నేను రూ.10 లక్షల వరకు ఇవ్వాలి అని నాకు అర్థమైంది. ఒకేసారి ఇవ్వలేను. అయినా తప్పకుండా ఇస్తాను అని ఆ సందేశంలో మనోహర్ పంపించిన సందేశాన్ని ప్రస్తావించారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడి బలవన్మరణంతో జనగామ పూర్ణిమ కాలనీలో విషాదఛాయలు -
‘కుడా’కు 30 ఎకరాల భూమి అప్పగింత
నయీంనగర్: కుడా ల్యాండ్ పూలింగ్ స్కీం ప్రక్రియలో భాగంగా హనుమకొండ వడ్డేపల్లి ఫిల్టర్బెడ్ పరిసర ప్రాంతాల్లోని భూములను అభివృద్ధి చేసేందుకు యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. మంగళవారం భూయజమానుల కమిటీ సభ్యులు బూర విద్యాసాగర్, ఎం.విజయ్కుమార్, డి.స్వరాజ్యలక్ష్మి బి.అశోక్కుమార్, బి.వెంకటయ్య, తిరుపతిరెడ్డి కుడా కార్యాలయంలో చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, సీపీఓ అజిత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. 30 ఎకరాల భూమిని ఎల్పీఎస్ నిబంధనల ప్రకారం కుడా ఆధ్వర్యంలో లేఔట్ చేయడానికి అంగీకారం తెలిపారు. ఇందుకు సంబంధించిన అధికారిక దరఖాస్తులు, భూమి హక్కు పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా కుడా చైర్మన్ మాట్లాడుతూ నగర సుందరీకరణ, క్రమబద్ధమైన పట్టణాభివృద్ధికి ల్యాండ్ పూలింగ్ ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ ప్రాజెక్టును వేగంగా చేయడానికి రానున్న నాలుగు రోజుల్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
ఊ అంటారా.. ఉఉ అంటారా!
సాక్షి ప్రతినిధి, వరంగల్: నామినేటెడ్ పదవులపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరోసారి రాజకీయ వేడి మొదలైంది. గతేడాది జూలై 8న రాష్ట్ర ప్రభుత్వం నియమించిన చాలా మంది రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం మంగళవారం ముగిసింది. ఆయా కార్పొరేషన్లకు ప్రస్తుతం ఉన్నవారినే తిరిగి చైర్మన్లుగా మరోమారు కొనసాగిస్తారా? లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా? అన్న చర్చ ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్రంగా సాగుతోంది. ఈసమయంలో త్వరలోనే ఖాళీ అయిన నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోందన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్లు, టికెట్ ఆశించి నిరాశ చెందిన నేతలు, ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నాయకులు, సీనియర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి, మంత్రులు, ముఖ్య నేతలతో లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రచారం. ‘నామినేటెడ్’ పోస్టుల్లో ఎవరెవరు? కాంగ్రెస్ ప్రభుత్వం దశల వారీగా నామినేటెడ్ పదవుల్లో పలువురు సీనియర్లకు అవకాశం కల్పించింది. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఆశించిన అధిష్టానం నిర్ణయం మేరకు వాటిని త్యాగం చేసిన వారికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. ఈక్రమంలో మొట్టమొదటగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పదవి దక్కింది. ఆ తర్వాత 2024 జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా 37 మందిని నియమించిన ప్రభుత్వం.. ఉమ్మడి జిల్లాలో ఆరుగురికి చాన్స్ ఇచ్చింది. పాలకుర్తి, వరంగల్ పశ్చిమ టికెట్లు ఆశించి తప్పుకున్న జంగా రాఘవరెడ్డికి ఆయిల్ సీడ్స్, గ్రోవర్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చింది. పరకాల పోటీ నుంచి వైదొలగిన ఇనగాల వెంకట్రాంరెడ్డికి ‘కుడా’ చైర్మన్, మహబూబాబాద్ నుంచి బెల్లయ్యనాయక్కు ట్రైబల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, భూపాలపల్లి నుంచి అయిత ప్రకాశ్రెడ్డికి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చింది. అలాగే, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎండీ రియాజ్కు గ్రంథాలయ పరిషత్ వంటి కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు అందరి పదవీ కాలం ముగియడంతో వారికి మరో చాన్స్ ఇచ్చి కొనసాగిస్తారా? మరికొందరు సీనియర్లకు సామాజిక ప్రాతిపదికన కొత్తగా అవకాశం కల్పిస్తారా? అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. తిరిగి మరోసారి కొనసాగేందుకు ప్రస్తుతం ఉన్న చైర్మన్లు కొందరు సీఎం, మంత్రుల స్థాయిలో మాట్లాడుతున్నట్లు సమాచారం. ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వివిధ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్, ఎమ్మెల్సీ తదితర నామినేటెడ్ పదవుల కోసం పోటీలో ఉన్నారు. అయితే ఈసారి కూడా ఎవరికీ ప్లస్.. ఎవరికీ మైనస్ అవుతోందన్న ఆందోళన ఆశావహుల్లో ఉంది. ఇప్పటి వరకున్న చైర్మన్లతో పాటు చాలా మంది సీనియర్లు ఉమ్మడి వరంగల్ నుంచి సామాజికవర్గాల వారీగా పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఐసీసీ, టీపీసీసీ, జిల్లా స్థాయిలో ఉన్న సీనియర్లు దొమ్మాటి సాంబయ్య, శనిగరపు ఇందిర, హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, కె.రవళి, నమిండ్ల శ్రీనివాస్, ఈవీ శ్రీనివాసరావు, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, బొమ్మనపల్లి అశోక్రెడ్డి, గాజర్ల అశోక్, పింగిళి వెంకట రాంనర్సింహారెడ్డి పదవులు ఆశిస్తున్నారు. బండి సుధాకర్గౌడ్, వెన్నం శ్రీకాంత్రెడ్డి, భరత్ చంద్రారెడ్డి, గొల్లపల్లి రాజేందర్, మార్క విజయ్కుమార్, అబూబక్కర్, పోలెపల్లి రంజిత్రావుతో పాటు పలువురు కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ఇతర నామినేటెడ్ పోస్టుల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈసారి అధిష్టానం ఎలాంటి ఫార్ములా అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వా రికి, సామాజిక సమీకరణాలకు అనుగుణంగా ప్రా ంతీయ సమతుల్యతను పాటిస్తూ పదవులు ఇస్తారా లేక ఇప్పటికే పదవుల్లో ఉన్న వారినే కొనసాగిస్తారా అన్నది సీఎం రేవంత్రెడ్డి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. నామినేటెడ్ పదవులపై ఉత్కంఠ.. పదవీకాలం ముగిసిన నేతల్లో టెన్షన్ కొనసాగింపా, కొత్తవారికా.. సీఎం రేవంత్ నిర్ణయమే కీలకం రాజధానికి మారిన ‘నామినేటెడ్’ సీన్.. ఆశావహుల లాబీయింగ్ -
తప్పుడు వారసత్వ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్
● పలువురిపై కేసు నమోదు రామన్నపేట : తప్పుడు వివరాలతో ఇంటి ఆస్తిని గిఫ్ట్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటనపై మట్టెవాడ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ కరుణాకర్ కథనం ప్రకారం.. పోచమ్మమైదాన్కు చెందిన షేక్ మహబూబ్పాషా తండ్రి షేక్ అహ్మద్ పేరుపై ఉన్న ఇంటి ఆస్తికి సంబంధించి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే పెద్దన్న షేక్ మహమ్మద్ పాషా తానే ఏకై క చట్ట వారసుడినని తప్పుడు ప్రకటన చేశాడు. అలాగే జీవించి ఉన్న తమ తల్లిని మరణించినట్లు తప్పుడు సమాచారం ఇచ్చి సంబంధిత సబ్రిజిస్ట్రార్ డ్యాకుమెంట్ రైటర్తో కుమ్మకై ్క ఇంటిని తన భార్యపేరు మీద గిఫ్ట్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఫిర్యాదు దారు మహబూబ్పాషా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో గిఫ్ట్ డీడ్ సాక్షులుగా సంతకాలు చేసిన మరో ఇద్దరు వ్యక్తులు కూడా కుట్రలో భాగమైనట్లు ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. కౌన్సిలర్ సంపత్రాజ్పై కేసుస్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లుకు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ సౌదరపెల్లి సంపత్రాజ్పై బీఎన్ఎస్ 74, బీఎన్ఎస్ 333 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు స్టేషన్ఘన్పూర్ సీఐ జి.వేణు తెలిపారు. ఈ విషయమై మంగళవారం సాయంత్రం సీఐ వివరాలు వెల్లడించారు. ఛాగల్లుకు చెందిన 9వ వార్డు కౌన్సిలర్ సంపత్రాజ్ ఆదివారం రాత్రి ఓ ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించాడు. ఇంటిపై అంతస్తులో మంచంపై నిద్రిస్తున్న వృద్ధురాలితో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపారు. అయితే సదరు వృద్ధురాలు అతడిని నెట్టివేసి గట్టిగా అరిచింది. దీంతో ఆమె కోడలు ఇంటి ముందు, వెనుక తలుపులు మూసి భర్త, ఇరుగుపొరుగు వారికి చెప్పింది. వారు వచ్చేసరికి ఇంటి గోడ దూకి పక్క ఇంటిలో బాత్రూంలో దాక్కున్నాడు. కాగా, బాధితులు 100 డయల్ ద్వారా పోలీసులకు సమాచారం అందిచారు. పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడం, వృద్ధురాలిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో సంపత్రాజ్పై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టామని సీఐ తెలిపారు. 21.69 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేతఖిలా వరంగల్: అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యం, నూకలపై వరంగల్ టాస్క్ఫోర్స్ అధికారులు మంగళవారం దాడులు చేసినట్లు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. వరంగల్ ఎస్ఆర్ఆర్తోటలో పసునూరి రాజ్కుమార్, పెరుమండ్ల రవీందర్ ప్రజల నుంచి సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని నిల్వచేసినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్కు పక్కా సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు వరంగల్ ఎస్ఆర్ఆర్తోటలో కనకదుర్గ ట్రేడర్స్ పేరుతో వారు నిర్వహిస్తున్న గోదాంపై టాస్క్ఫోర్స్ దాడులు చేశారు. ఇందులో రూ.58,090 విలువైన 21.69 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, నూకలు, మిశ్రమ బియ్యం, తూకం యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. తదుపరి చర్యల నిమిత్తం మిల్స్కాలనీ పోలీసులకు కేసును అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై వీరస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. -
అజయ్కుమార్కు అరుదైన గౌరవం
వరంగల్ అర్బన్: నగరంలోని గిర్మాజీపేటకు చెందిన సూక్ష్మ కళాకారుడు మట్టెవాడ అజయ్కుమార్ అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఆయన రూపొందించిన సూక్ష్మ కళాకృతులు అంతరిక్షంలో విహరించనున్నాయి. భారతదేశపు తొలి ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థ స్కైరూట్ ఎయిర్స్పేస్ ‘మిషన్ ఆగమన్’ ప్రయోగించనున్న విక్రమ్–1 రాకెట్ ద్వారా ఆయన కళాఖండాలు ప్రదర్శించనున్నారు. ఈనెల 12 నుంచి ఆగస్టు 4 మధ్యలో అంతరిక్షయానంలో ప్రయాణించనున్నాయి. ఈ విషయాన్ని స్కైరూట్ ఎయిర్స్పేస్ సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. సూది రంధ్రంలో శాస్త్రవేత్తల కళారూపాలకు.. డాక్టర్ సీవీ రామన్, విక్రమ్ సారాబాయి, ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిరూపాలను అజయ్కుమార్ సూది రంధ్రంలో రూపొందించారు. ఈ శిల్పాలు సూది రంధ్రంలో 800 మైక్రాన్ల (0.8 మిల్లీమీటర్లు) ఎత్తుతో అత్యంత సూక్ష్మంగా రూపొందించారు. మానవ కంటితో వీటిని స్పష్టంగా చూడడం సాధ్యం కాదు. ప్రత్యేక మైక్రోస్కోప్ సాయంతో మాత్రమే వీటిని వీక్షించవచ్చు. ఈ ప్రాజెక్టును ఆయన 2023లో ప్రారంభించి 2026 ఫిబ్రవరి నెలలో పూర్తి చేశారు. ఈ సూక్ష్మ కళాఖండాలను రూపొందించడానికి సుమారు 140 గంటల సమయం పట్టిందని వెల్లడించారు. అంతరిక్ష ప్రయాణానికి అనువుగా ఉండే స్టెయిన్లెస్స్టీల్, 24 క్యారెట్ల బంగారం, స్వచ్ఛమైన వెండి, సిరామిక్ పొడి, కార్బన్ ఫైబర్ చూర వంటి ప్రత్యేక పదార్థాలను ఉపయోగించి చెక్కినట్లు ఉద్ఘాటించారు. 24 క్యారెట్ల బంగారంతో.. అజయ్కుమార్ 18 క్యారెట్ల బంగారంతో రూపొందించిన సూక్ష్మ రాకెట్ నమూనాలో ప్రతిష్ఠించి అంతరిక్ష ప్రయాణానికి సిద్ధం చేశారు. కానీ, స్కైరూట్ ఎయిర్ స్పేస్ ఇంజనీర్లు సూచించిన సాంకేతిక ప్రమాణాలను అనుసరించి 24 క్యారెట్ల బంగారంతో రూపకల్పన చేశారు. ఈ కళాఖండాలపై కఠినమైన వైబ్రేషన్, హీటింగ్, ఇంజనీరింగ్ అర్హత పరీక్షలు విజయవంతమయ్యాయి. అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన రక్షిత పేలోడ్ హౌసింగ్లో అమర్చి విక్రమ్–1 రాకెట్ పేలోడ్లో భాగంగా అంతరిక్ష యాత్రకు సిద్ధం చేశారు. ఇప్పటివరకు అంతరిక్షంలోకి పంపించిన కళాఖండాల్లో మూన్ మూజ్యిమ్(1969), ఫల్లెన్ అస్టోనాల్టు (1971 గుర్తింపు పొందాయి. తాజాగా భారతదేశం నుంచి సూది రంధ్రంలో రూపొందించిన ఈ సూక్ష్మ శిల్పాలు చెక్కి అజయ్ కుమార్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 40 ఏళ్ల సూక్ష్మ శిల్పకళకు ఇది దక్కిన అత్యున్నత గౌరవంగా భావిస్తున్నానని అజయ్కుమార్ తెలిపారు. ఈ అరుదైన అవకాశాన్ని కల్పించిన స్కైరూట్ ఎయిర్స్పేస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్కుమార్ చందన, నాగభారత్ దాకా, నిఖిల్ మద్దూరి, సీవీఎస్ కిరణ్కు కృతజ్ఞతలు తెలిపారు. అంతరిక్షంలో విహరించనున్న ఆయన కళాకృతులు అధికారికంగా ధ్రువీకరించిన స్కైరూట్ ఎయిర్స్పేస్ సంస్థ -
జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యంపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరం
● ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఫిర్యాదు ● ఇరువర్గాల మధ్య కుదురుతోందనుకున్న సయోధ్యకు బ్రేక్ ● ఉమ్మడి వరంగల్ జిల్లా హస్తం పార్టీలో తెరపైకి మరోసారి వర్గపోరు సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ మంత్రి కొండా సురేఖ నేరుగా ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాసినట్లు మంగళవారం వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతోందనే సంకేతాలు కనిపించినప్పటికీ, తాజా పరిణామాలతో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సయోధ్య సంకేతాలు.. తాత్కాలికమే! ఇటీవల ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం, పరస్పరం విమర్శలు తగ్గించడం, పార్టీ కార్యక్రమాల్లో కలిసి పాల్గొనడం వంటి పరిణామాలతో విభేదాలు ముగిశాయనే ప్రచారం జరిగింది. కడియం శ్రీహరి ఇటీవల నిర్వహించిన ఓ ఫంక్షన్కు కొండా దంపతులు హాజరు కూడా అయ్యారు. దీంతో జిల్లా కాంగ్రెస్లో కూడా ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, తాజా లేఖ వ్యవహారంతో ఆ సయోధ్య తాత్కాలికమేనని తేలిపోయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నేతలుగా ఉన్న కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య మరోసారి విభేదాలు బయటపడడం పార్టీపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? ఇరువర్గాల మధ్య మరోసారి రాజీ ప్రయత్నాలు జరుగుతాయా? లేదా? అన్నది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తాజా వివాదానికి కారణాలివే.. కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంపై ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసమావేశంలో ఉమ్మడి వరంగల్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సమగ్ర మాస్టర్ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. జిల్లా వ్యవహారాల్లో ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రిని పక్కనబెట్టి కడియం శ్రీహరి అధికారులతో సమీక్షలు నిర్వహించడం, ఆదేశాలివ్వడం సరైన పద్ధతి కాదని ఆమె అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే కడియం శ్రీహరి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాసినట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించడం, ప్రభుత్వ పరి పాలనలో అనవసర జోక్యం చేసుకోవడం వంటి అంశాలను ఆమె లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. కాంగ్రెస్లో చేరిన తర్వాత నుంచే కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నియోజకవర్గాల పరిధి, పార్టీ వ్యవహారాలు, అధికారుల సమావేశాలు, రాజకీయ కార్యక్రమాల విషయంలో ఇద్దరూ పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఈ విభేదాలు రాష్ట్ర నాయకత్వం దృష్టికి వెళ్లడంతో పలుమార్లు సర్దుబాటు ప్రయత్నాలు జరిగాయి. -
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
ఎన్నికలకు ముందే ● ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న హన్మకొండ: ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు ముందే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ వరంగల్ రీజియన్ స్థాయి నిర్మాణ మహా సభ నిర్వహించారు. ఈ మహాసభలో వెంకన్న పాల్గొని మాట్లాడుతూ యూనియన్ నాయకత్వంలోని జేఏసీ ద్వా రా పోరాడి హామీలు సాధించుకున్నామన్నారు. వి లీన ప్రక్రియ కూడా పూర్తి చేయించే బాధ్యత తమదేనని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ను మరింత బలోపేతం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల ప్రతీ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. ఆర్టీసీని త్వరలో ప్రభుత్వంలో విలీన ప్రక్రియను పూర్తి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ వరంగల్ రీజియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. రీజియ న్ చైర్మన్గా ఎస్.ఆర్.కుమార్, అధ్యక్షుడిగా ఎ.మురళి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎ.రమేశ్, కార్యదర్శిగా ఎం.శ్రీనివాస్ ఎన్నికయ్యారు. నాయకులు వి.కె. స్వామి, బాలరాజు, ఎల్లయ్య, మురళి, వి.సి .కుమార్, పి.రవీందర్, టి.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అంత్యక్రియలకు వెళ్లొస్తూ ఒకరు.. బారసాలకొచ్చి మరొకరు
● కారు ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం ● మద్యం మత్తులో వాహనం నడిపి ఇద్దరిని బలితీసుకున్న డ్రైవర్ ● పాలకుర్తిలో ఒకరు, గూడూరులో మరొకరు మృతి పాలకుర్తి టౌన్ : మద్యం మత్తు డ్రైవింగ్ ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. మద్యం సేవించిన ఓ డ్రైవర్ కారు నడుపుతూ అంత్యక్రియలకు వెళ్లొస్తున్న ఓ మహిళను, బంధువుల ఇంట్లో బారసాలకొచ్చి వెళ్తున్న మరో వ్యక్తిని ఢీకొన్నాడు. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదాలు ఇరువురి కుటుంబాల్లో తీరని విషాదం నింపాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రఘనాథపల్లి మండలం వెల్ది గ్రామానికి చెందిన పెంతల వెంకటలక్ష్మి (42) తన భర్త శ్రీనివాస్తో కలిసి మంగళవారం పాలకుర్తి మండలం దర్దేపల్లి శివారు గూడోళ్లగూడెంలో బంధువు మృతి చెందగా అంత్యక్రియలకు హాజరైంది. కార్యక్రమం ముగిసిన అనంతరం రాత్రి తిరిగి బైక్పై స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో పాలకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన చేపూరి రాహుల్ మద్యం మత్తులో కారు నడుపుతూ పాలకుర్తిలో బైక్ను ఢీకొనడంతో వెంకటలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం రాహుల్ కారు ఆపకుండా అతివేగంతో వెళ్లి గూడూరులో చిల్పూరు మండలం క్రిష్టాజీగూడెం గ్రామానికి చెందిన వడ్లకొండ రంజిత్(30)ను వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే దుర్మణం చెందాడు. రంజిత్ తన అత్తగారి గ్రామం గూడూరులో జరిగిన శుభకార్యానికి హాజరై తిరిగి బైక్పై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రంజిత్కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఘటనా స్థలిని సీఐ జానకీరాంరెడ్డి సందర్శించారు. కారు డ్రైవర్ రాహుల్ను అదుపులోకి తీసుకున్నారు. -
నిట్ దిక్సూచిగా నిలవాలి
కాజీపేట అర్బన్: విద్యార్థుల సంక్షేమానికి, సమగ్రాభివృద్ధికి, మానసిక ఆరోగ్య పెంపుదలకు, సానుకూల క్యాంపస్కు నిట్ వరంగల్ క్యాంపస్ దిక్సూచిగా నిలవాలని దక్షిణ మధ్య రైల్వే మంత్రిత్వశాఖ మాజీ అడిషనల్ సెక్రటరీ, సర్టిఫైడ్ మైండ్ ట్రైనర్, లైఫ్ కోచ్ గిరిజా శంకర్దాస్ అన్నారు. నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో సోమవారం నిట్ సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ వెల్నెస్ చైర్మన్, ప్రొఫెసర్ జి.అంబాప్రసాద్రావు ఆధ్వర్యంలో ‘విద్యార్థుల మానసిక శ్రేయస్సు, మెంటరింగ్, సానుకూల క్యాంపస్, సంస్కృతి’ అంశంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల ఫ్యాకల్టీ అప్గ్రేడేషన్ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా రైల్వే మంత్రిత్వశాఖ మాజీ అడిషనల్ సెక్రటరీ గిరిజా శంకర్దాస్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఎఫ్డీపీ ప్రోగ్రాంను ప్రారంభించారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కిరణ్కుమార్, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కేయూలోని వివిధ విభాగాల్లో పార్ట్టైం అధ్యాపకుల నియామకాలకు ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి. సోమవారం ఇంగ్లిష్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ విభాగాల్లో డిపార్టుమెంటల్ కమిటీలు హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలతోపాటు, డెమోలు కూడా నిర్వహించారు. ఇంగ్లిష్లో రెండు పోస్టులు ఉండగా.. 18 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 13 మంది ఇంటర్వూకు హాజరయ్యారు. కెమిస్ట్రీ విభాగంలో 15 పోస్టులకు 35 మంది దరఖాస్తులు చేసుకుని 25 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. బయోటెక్నాలజీ విభాగంలో రెండు పోస్టులకు ఐదుగురు దరఖాస్తులు చేసుకుని నలుగురు ఇంటర్వ్యూలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు.విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వరుసగా 18 పనిదినాలు హాజరు నమోదు చేయకపోవడంతో మొత్తం 46 మందికి హనుమకొండ డీఈఓ ఎల్వీ.గిరిరాజ్ గౌడ్ సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తగిన వివరణ ఇవ్వకపోతే తదుపరి ఎలాంటి నోటీస్ లేకుండానే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని షోకాజ్ నోటీసులో హెచ్చరించారు. కాజీపేట రూరల్: హైదరాబాద్ మాసబ్టాంక్లోని పోలీస్మెస్లో సోమవారం నిర్వహించిన రాష్ట్ర కరాటే బుడోకాన్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు కరాటే మాస్టర్లను ఎన్నుకున్నట్లు కాజీపేటకు చెందిన కరాటే మాస్టర్ నాయిని సదానందం తెలిపారు. హనుమకొండ నుంచి రాష్ట్ర కరాటే వైస్ ప్రెసిడెంట్లుగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, నమిండ్ల శ్రీనివాస్, వరంగల్ నుంచి సీనియర్ కరాటే మాస్టర్ పండా దినేశ్, కాజీపేట నుంచి సదానందం, జాయింట్ సెక్రటరీగా హనుమకొండకు చెందిన రేణిగుంట్ల దుర్గాప్రసాద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా హనుమకొండకు మాస్టర్ డి.శంకర్, కాజీపేటకు చెందిన పాశం దేవయ్యను ఎన్నుకున్నారు. విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అన్నా, అక్కా మెంటర్షిప్ను హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అమలుకు ఉపక్రమించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కృత్రిమ మేధ, డిజిటల్ నైపుణ్యాలను, కోడింగ్పై అవగాహనను పెంపొందించేందుకు కేడీసీ విద్యార్థులు ఉపక్రమించినట్లు ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్ తెలిపారు. ఎంపిక చేసిన పాఠశాలలకు వెళ్లి అక్కడ ఆయా అంశాలపై డిగ్రీ విద్యార్థులు పాఠశాలల విద్యార్థులకు బోధన చేయనున్నారు. సోమవారం పలవురు విద్యార్థులు ఆకళాశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లారు. అక్కడ ఆయా అంశాలపై బోధన చేసినట్లు ఆయన తెలిపారు. -
ఇలాగైతే ఎలా సర్?
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో క్షేత్రస్థాయి పని ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో దాదాపు పూర్తయినా.. కీలకమైన డిజిటైజేషన్ మాత్రం ముందుకు కదలడం లేదు. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ప్రకారం 30.53 లక్షల ఓటర్లలో 98.22 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసిన అధికారులు.. వాటిలో కేవలం 8.91 శాతాన్నే డిజిటల్ వ్యవస్థలో నమోదు చేయగలిగారు. అన్ని జిల్లాల్లోనూ 96 నుంచి 99.22 శాతం వరకు ఈఎఫ్ల పంపిణీ పూర్తయిందని రికార్డులు చెబుతుండగా, పంపిణీ చేసిన ఫారాలను డిజిటల్ రూపంలో నమోదు చేసే ప్రక్రియ మాత్రం ఏ జిల్లాలోనూ సంతృప్తికర స్థాయికి చేరుకోలేదు. ఈఎఫ్ల పంపిణీలో వేగం.. డిజిటైజేషనే నత్తనడకన ఎన్యూమరేషన్ ఫారం (ఈఎఫ్)ల పంపిణీ మొదట కొంత మందగించిన తర్వాత వేగం పెరిగింది. అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ బూత్ లెవెల్ ఆఫీసర్లు సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఫారాలను తిరిగి తెప్పించడం, డిజిటైజేషన్ చేయడంలో కాలయాపన చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2,75,468 (99.21 శాతం) ఈఎఫ్లు పంపిణీ చేసినట్లు అధికారులు నమోదు చేశారు. అయితే అదే జిల్లాలో డిజిటైజేషన్ కేవలం 47,543 (10.25 శాతమే) పూర్తైంది. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోనే అత్యధికం కావడం గమనార్హం. పంపిణీ చేసిన ఫారాల్లో అత్యధిక భాగం ఇంకా డిజిటల్ వ్యవస్థలో నమోదు కావాల్సి ఉంది. మహబూబాబాద్ జిల్లాలో 99.41 శాతం పంపిణీ చేసినా డిజిటైజేషన్ 7.80 శాతం మాత్రమే. ములుగులో 98.48 శాతం పంపిణీకి 13.88 శాతం, జనగామలో 99.65 శాతం పంపిణీకి 11.38 శాతం, వరంగల్లో 96.17 శాతం పంపిణీకి 5.40 శాతం, హనుమకొండలో 97.47 శాతం పంపిణీకి కేవలం 4.79 శాతం డిజిటైజేషన్ అయ్యింది. ఫీల్డ్లో పనిచేసిన శ్రమ వృథా అవుతోందా? బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఫారాలు పంపిణీ చేసి వివరాలు సేకరిస్తున్నారు. కొన్నిచోట్ల నిరక్షరాస్యత కారణంగా ఫారాలు తిరిగి సకాలంలో అందడం లేదు. వీటికి తోడు అందిన వివరాలను సకాలంలో డిజిటల్ వ్యవస్థలో నమోదు చేయకపోతే మొత్తం ప్రక్రియ ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని ఎన్నికల వ్యవహారాలపై అవగాహన ఉన్న అధికారులు చెబుతున్నారు. పూర్తయిన తర్వాతే వివరాల పరిశీలన, అభ్యంతరాలు, తుది ఓటర్ల జాబితా తయారీ వంటి తదుపరి ప్రక్రియలు వేగం అందుకునే అవకాశం ఉంది. ఈ నెల 31న ఓటర్ల తుది జాబితా ప్రకటించాల్సిన నేపథ్యంలో డిజిటైజేషన్ ప్రక్రియలో వేగం పెరగాల్సి ఉంది. ‘సర్’పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగంతో .. జిల్లాల కలెక్టర్లు కిందిస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ పురోగతిని సమీక్షిస్తున్నారు. అయితే ఈ నెల 31న తుది ఓటర్ల జాబితా ప్రకటించాల్సి ఉండగా..మరో 23 రోజులే మిగిలి ఉండటంతో డిజిటైజేషన్ వేగం పెంచాల్సిన అవసరం ఏర్పడింది. చదువు రాదు.. ఫారం ఎలా నింపాలి ఓటర్ల ఫారాన్ని నింపడం కోసం నాలాంటి చదువురాని వాళ్లు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. ఫారం ఇచ్చి నింపి మళ్లీ ఇవ్వమన్నారు. చదువురాని నాలాంటి వాళ్లు ఫారాన్ని ఎలా నింపుతాం. చదువుకున్న వాళ్లను బతిమలాడాల్సి వస్తున్నది. ఓటర్లు బతికున్నారా లేదా చనిపోయారా తెలుసుకుంటే సరిపోతుంది. కానీ మళ్లీ కొత్తగా ఓట్ల కోసం దరఖాస్తులు, ఫొటోలు ఇవ్వమంటున్నారు. – బొజ్జు ఐలయ్య, జఫర్గడ్ శివారు వడ్డెగూడెం మొత్తం ఓటర్లుఈఎఫ్లు పంపిణీడిజిటలైజ్ చేసిన ఈఎఫ్లుహనుమకొండ వరంగల్ జనగామ మహబూబాబాద్ ములుగు భూపాలపల్లి‘ఫారం’ ఇంటికొచ్చింది.. సిస్టంలోకి చేరలేదు 98.22 శాతం ఫారాల పంపిణీ.. డిజిటైజేషన్ మాత్రం 8.91 శాతం పంపిణీలో దూకుడు.. నమోదు మాత్రం నత్తనడక ఫైనల్ పబ్లికేషన్కు మరో 23 రోజులే గడువు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ‘సర్’ పురోగతి -
అర్జీలను సత్వరమే పరిష్కరించండి
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావివ్వకుండా వచ్చే సోమవారం నాటికి పెండింగ్ వినతులు పరిష్కరించాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురుకుల విద్యాసంస్థలను ప్రత్యేక అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేసి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణ, హాస్టళ్లలో దోమల నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అదేవిధంగా రెడ్క్రాస్ సభ్యత్వ నమోదును చేపట్టాలని సూచించారు. ఈప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 263 అర్జీలు అందగా, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అర్జీలు వెంటనే పరిష్కరించాలివరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణికి 211 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అందులో రెవెన్యూకు సంబంధించినవి 67, మున్సిపల్ శాఖ 55, హౌసింగ్ 29, ఇతర శాఖలకు సంబంధించినవి 60 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. ఈ మేరకు దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపిణీ చేస్తూ త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేష్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్వో విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ప్రజావాణిలో 263 అర్జీల స్వీకరణ -
మీరైనా పరిష్కారం చూపండి
వరంగల్ అర్బన్: ‘ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించట్లేదు. మీరైనా మా సమస్యలకు పరిష్కారం చూపండి’ అని పలు కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ సెల్లో కమిషనర్ టి.వెంకన్న వింగ్ అధికారుల సమక్షంలో పౌరుల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 85 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్ ప్లానింగ్కు అత్యధికంగా 42 వినతులు వచ్చాయి. ఇంజనీరింగ్ సెక్షన్కు 21, రెవెన్యూకు 15, హెల్త్, శానిటేషన్కు 4, తాగునీటి సరఫరాకు 2, ఉద్యాన విభాగానికి 1 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్ఈ రాజ్కుమార్, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, డీఎఫ్ఓ శంకర్ లింగం, ఇన్చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, పన్నుల అధికారి రామకృష్ణ, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్బాబు, హెచ్ఓ లక్ష్మారెడ్డి, రాజేశ్ పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● 42వ డివిజన్ రంగశాయిపేట మద్దెల కుంట హిందూ శ్మశాన వాటిక పనులు పూర్తి చేయాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కోరారు. ● 18 శాలినీ నగర్ నుంచి కట్టమల్లన్న వెళ్లే రహదారి గుంతలు పడిందని, నూతనంగా నిర్మించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ● 29వ డివిజన్లోని రఘునాథ కాలనీ, ఓస్ఎస్ఆర్ నగర్లో తాగునీటి సమస్యను పరిష్కారించాలని సీపీఎం నాయకులు సింగారపు బాబు, అరూరి కూమార్ విన్నవించారు. ● వరంగల్లోని 16–2–323 ప్రాంతంలో రోడ్డు, డ్రెయినేజీ బ్లాక్ అయ్యిందని క్లియర్ చేయాలని మహ్మద్ రఫత్ కోరారు. ● 19వ డివిజన్ వివేకానంద కాలనీలో రోడ్డు 6, 7 ప్రాంతంలో వినాయక చవితి, దసరా, శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తామని, ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం పేరుకుపోయిందని, క్లీన్ చేయాలని ఉత్సవ సమితి ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ● 42వ డివిజన్లో సీసీ రోడ్డు, నాలాను ఆక్రమించి ఇంటి నిర్మాణం చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని స్థానికులు 3 సార్లు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ● 14వ డివిజన్ సాయినగర్లో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు వినతిపత్రం అందించారు. ● 15వ డివిజన్ గొర్రెకుంటలో వీధిలైట్లు వెలగడం లేదని ఎస్.రవి ఫిర్యాదు అందించారు. ● 29వ డివిజన్ రామన్నపేట, పాపయ్యపేట ప్రాంతాల్లో నల్లా నీళ్లు రావట్లేదని స్థానికులు వినతి పత్రం అందించారు. ● 23వ డివిజన్ తోట మైదానంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ● 49వ డివిజన్ప్రగతి నగర్లో 50 ఫీట్ల రోడ్డు అసంపూర్తిగా నిర్మించారని, సైడ్ బర్మ్ వేయాలని అభివృద్ధి కమిటి ప్రతినిధులు కోరారు. ● హనుమకొండ గోపాలపురం శివసాయి నగర్లో రోడ్డును ఆక్రమించి అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ● హనుమకొండలోని గాంధీనగర్లో సీసీ రో డ్డు, డ్రెయినేజీలను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని కోరారు. ● హనుమకొండ కాజీపేటలోని అఫ్జల్ నగర్లో 24–1–138:3 ఇంటికి నల్లా కనెక్షన్ లేకున్నా రెండేళ్లుగా బిల్లు వస్తోందని రద్దు చేయాలని ఎం. రమాదేవి ఫిర్యాదు చేశారు. ● 3వ డివిజన్ ఆర్టీసీ కాలనీ రోడ్డు–8లో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు వినతి పత్రం అందించారు. ● వర్షాకాలం ప్రారంభమైనందున నాలాల్లోని వ్యర్థాలను, గుర్రెపు డెక్కను తొలగించాలని హనుమకొండ జిల్లా సీపీఎం కమిటీ కార్యవర్గ సభ్యుడు యం.చుక్కయ్య వినతి పత్రం సమర్పించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు.. గ్రేటర్ గ్రీవెన్స్లో కమిషనర్ ఎదుట అర్జీదారుల ఆవేదన -
డిజిటలీకరణ వేగవంతం చేయాలి
వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలీకరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సమీక్షించారు. హనుమకొండ కలెక్టరేట్నుంచి కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ పరకాల, పశ్చిమ నియోజకవర్గాల్లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ 97 శాతం పూర్తయ్యిందన్నారు. డిజిటలీకరణ ఈనెల 20లోపు పూర్తి చేసేలా కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలీకరణలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతీ గురువారం సమీక్ష నిర్వహిస్తున్నట్లు, ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. వరంగల్నుంచి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేష్, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, ఎన్నికల సూపరింటెండెంట్ రజనీ, తహసీల్దారులు, తదితరులున్నారు. -
పన్ను వసూలు లక్ష్యాన్ని చేరుకోవాలి
బల్దియా కమిషనర్ టి.వెంకన్న వరంగల్ అర్బన్: పన్ను వసూళ్ల లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా చేధించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న అన్నారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో పన్ను వసూళ్ల పురోగతిపై సోమవారం ఆయన సమీక్షించారు. ఆశించిన స్థాయిలో పన్నులు వసూలు చేయకపోవడంపై, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లు, ట్యాక్స్ ఆఫీసర్పై అసహనం వ్యక్తం చేశారు. పన్ను వసూళ్లు, దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్ ప్రసునారాణి, పన్నుల అధికారి రామకృష్ణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.. మడికొండలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గహం, కళాశాలకు ప్రహరీ లేక ఎదురవుతున్న ఇబ్బందులపై కమిషనర్ పర్యవేక్షించారు. వసతి గృహం, కళాశాల ఆవరణను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆయన వెంట సీఎంహెచ్ఓ రాజారెడ్డి, పశువైద్య అధికారి డాక్టర్ గోపాల్రావు, ప్రిన్సిపాల్ జ్యోతి, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కోర్టు ఆదేశాలు అమలు చేయండి.. హనుమకొండలో నిబంధనలకు విరుద్దంగా భవన నిర్మాణాల అనుమతులు, ఇంటి నంబర్లు జారీ చేశారని, వాటిని రద్దు చేయాలని కమిషనర్ టి.వెంకన్నను ఎన్.సమరసింహ ఫిర్యాదు చేశారు. బల్దియాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించానని, ఉత్తర్వులు అమలు చేయాలని విన్నవించారు. -
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత హన్మకొండ చౌరస్తా: పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదుపై తక్షణమే స్పందించి ప్రజలకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అధికారులను ఆదేశించారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమవారం ఆమె మొదటిసారిగా హనుమకొండ పోలీస్ స్టేషనన్ను సందర్శించారు. పోలీస్ స్టేషనన్కు చేరుకున్న కమిషనర్ ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను తనిఖీ చేసి, వాటి స్వాధీనానికి కారణాలు, కేసుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసుల నమోదులు, ఇతర పరిపాలన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషనన్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది వివరాలు తెలుసుకుని, వారి విధి నిర్వహణపై ఆరా తీశారు. ఈసందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. పోలీసులు ప్రజల సేవకులనే భావనతో విధులు నిర్వహించాల్సిన బాధ్యత ఉందన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అందిన ప్రతీ ఫిర్యాదును వెంటనే నమోదు చేసి రసీదు అందజేయాలని సూచించారు. సీపీ శ్వేత వెంట సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, ఏసీపీ లు నర్సింహరావు, సత్యనారాయణ, హనుమకొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు, అధికారులు, సిబ్బంది ఉన్నారు. రాష్ట్రస్థాయి క్రీడల్లో రాణించాలి..హసన్పర్తి: హైదరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో నిర్వహించే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు వెళ్తున్న వరంగల్ పోలీస్ క్రీడాకారులకు సోమవారం కమిషనర్ శ్వేత ఆల్ ది బెస్ట్ చెప్పారు. మూడు రోజుల పాటు వివిధ అంశాల్లో జరిగే క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబర్చాలన్నారు. గతంలో మాదిరిగా పతకాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీపీ అంకిత్కుమార్, అదనపు డీసీపీలు శ్రీనివాస్, ప్రభాకర్రావు, ఏసీపీలు నాగయ్య, సురేంద్ర, ఆర్ఐలు స్పర్జన్రాజ్, సతీశ్, ఆర్ఎస్సై శ్రవణ్తోపాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆరేళ్లనుంచి ఆపరేషన్లు నిల్
అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో ఆగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కాశిబుగ్గ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలోని వెనుకభాగంలో ఏర్పాటు చేసిన అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ ఒకటుందని ప్రజలకు తెలియడం లేదు. ఇక్కడ గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేసేవారు. ఆరేళ్లనుంచి ఆపరేషన్లు చేయడం లేదు. కోవిడ్కు ముందు ఎంజీఎం వెనుకభాగంలో ప్రత్యేకంగా కనిపించినప్పటికీ ఆ తర్వాత అడ్రస్ మార్చారు. ప్రస్తుతం ఓల్డ్ చిల్డ్రన్స్ వార్డు లోపల డ్యూటీ డాక్టర్ రూంను కేటాయించారు. ప్రస్తుతం ఈ వార్డుకు బయట వయోవృద్ధుల చికిత్స వార్డు, జిల్లా క్యాన్సర్ చికిత్స వార్డు అని పేరు రాశారు. ఫ్యామిలీ వెల్ఫేర్ కేంద్రానికి ప్రత్యేకంగా గుర్తింపు లేదు. బోర్డు అసలే లేదు. ముందు భాగాన ఉన్న ఓ గదిలో మాత్రం పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఆగిపోయిన ఆపరేషన్లు.. ఈ అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విరివిగా చేసేవారు. వేసెక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్ల చేస్తూ కుటుంబ నియంత్రణలో విధులు నిర్వహించేవారు. కోవిడ్ తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది. గతంలోలాగా ప్రత్యేకంగా శిబిరాలు నిర్వహించడం, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయడం బంద్ చేశారు. దాదాపు ఆరు సంవత్సరాల నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగడం లేదని తెలుస్తోంది. దీంతో ఇక్కడ ఈ సదుపాయం ఉన్నట్లు ప్రజలకు తెలియట్లేదు. కొనసాగుతున్న ఇమ్యునైజేషన్ ప్రక్రియ.. ఇందులో పనిచేస్తున్న సిబ్బంది ఇమ్యునైజేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. రామన్నపేట, పాపయ్యపేట, పోతననగర్, మట్టెవాడ ప్రాంతాల్లో హెల్త్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. నాన్ కమ్యూనకేబుల్ డిసీజ్కు వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. అలాగే 14 నుంచి 15 సంవత్సరాల ఆడపిల్లలకు సర్వేకల్ క్యాన్సర్ రాకుండా హెచ్పీవీ వ్యాక్సిన్ విధుల్లో ఉంటున్నారు. ఆదివారం తప్ప ప్రతిరోజు ఈ ప్రక్రియ కొనసాగుతున్నా ప్రచారం కొరవడడంతో అందరికీ తెలియడం లేదు. ఇకనైనా సంబంధిత అధికారులు అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో గతంలో మాదిరిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అదేవి ధంగా ఈ సెంటర్ ప్రజలకు సులభంగా తెలిసేలా బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంజీఎంలో ఇలాంటి ఒక సెంటర్ ఉన్నట్లు తెలియని వైనం ప్రస్తుతం ఇమ్యునైజేషన్ విధుల్లో సిబ్బంది -
ఎస్ఐఆర్ ప్రక్రియ పరిశీలన
హన్మకొండ అర్బన్/కాజీపేట అర్బన్/న్యూశాయంపేట/ఖిలావరంగల్: హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధి బాలసముద్రం పోలింగ్ కేంద్రాన్ని, కాజీపేట మండలం న్యూశాయంపేటలో శనివారం సర్ ప్రక్రియను, వరంగల్ తూర్పు నియోజవర్గంలోని ఖిలా వరంగల్ మండలంలో క్షేత్రస్థాయిలో ఆయన సర్ ప్రక్రియను పరిశీలించారు. బీఎల్ఓలతో సమావేశమై సూచనలిచ్చారు. ఓటర్లు సమర్పించిన ఎన్యూమరేషన్ ఫారాలను యాప్లో నమోదు చేసే విధానాన్ని స్థానిక బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. చనిపోయిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్ల జాబితాను వీడియో రూపంలో చిత్రీకరించడాన్ని అభినందించారు. కాగా, వరంగల్ జిల్లాకు వచ్చిన ఆయనకు కలెక్టర్ సత్యశారద మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్తో కలిసి సర్ అమలు తీరుపై కలెక్టరేట్లో సమీక్షించారు. -
ఉద్యోగాల పేరుతో దళారుల దందా!
●కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఇక వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారనుంది. మరో మూడునాలుగు నెలల్లో ఎంజీఎంను 24 అంతస్తుల భవనంలోకి మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు దళారులు కొత్త దవాఖానలో ఉద్యోగాలిప్పస్తామని దందా చేస్తున్నట్లు సమాచారం. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి 788 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు పత్రికల్లో వచ్చిందని వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న కొందరు బయటివారితో కలిసి ఈ దందాకు శ్రీకారం చుట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త భవనం ప్రారంభం కాగానే పోస్టులను సిద్ధం చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందని, అందులో ఉద్యోగాల భర్తీ చూసుకుంటామని నమ్మిస్తున్నట్లు చెబుతున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పోస్టులకు బేరం పెడుతూ, అడ్వాన్స్గా డబ్బులిస్తేనే జాబితాలో ఉంటారని చెబుతున్నారు. ఎంజీఎంలో ఇప్పుడున్న కాంట్రాక్టు ఈ నెలతోనే అయిపోతుందని, కొత్తవారు వచ్చేవరకు వారుంటారని, ఆ తర్వాత మీకే ఉద్యోగాలిప్పిస్తామని దళారులు బేరసారాలు సాగిస్తున్నట్లు చర్చి జరుగుతోంది. ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులు వారి మాట లు నమ్మకుండా ఎంజీఎంలో పనిచేస్తున్న ఉద్యోగులు, వైద్యులను అడిగి క్లారిఫై చేసుకోవడంతో వారి దందా బయటపడుతోంది. అలాగే, ఎంజీఎంలో పనిచేసిన వారిని కూడా ఉద్యోగాలు, దళారుల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇంతకు ఈ ఉద్యోగాలకు జీఓ రాలేదు, పోస్టుల వివరాలు రాలేదు, ఉన్నతాధికారుల అనుమతి తీసుకోలేదు. నోటిఫికేషన్ కూడా రాకున్నా దళారుల మాయలో నిరుద్యోగులు పడే అవకాశం లేకపోలేదు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వస్తున్న పుకార్లు నమ్మవద్దు. దళారుల జోలికి వెళ్లి మోసపోవద్దు. ఎలాంటి ఉద్యోగాలైనా నిబంధనల ప్రకారం, పారదర్శకంగా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఉద్యోగాల నియామకంపై ఎలాంటి సమాచారం లేదు. అనవసరంగా ఉద్యోగాల కోసం నిరుద్యోగులు దళారుల వలలో పడొద్దు. దళారుల సమాచారం తెలిస్తే కలెక్టర్, ఏసీబీ, ఇన్చార్జ్కు తెలియజేయండి. – డాక్టర్ రాంకుమార్రెడ్డి, ఎంజీఎం ఇన్చార్జ్ సూపరింటెండెంట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కొలువులు ఇప్పిస్తామని బేరసారాలు అడ్వాన్స్ డబ్బులు ఇస్తే జాబితాలో ఉంటారని నిరుద్యోగులకు గాలం ఎలాంటి పుకార్లు నమ్మొద్దని అధికారుల సూచన -
వర్షాకాలంలో ఇబ్బందులు కలగొద్దు
గ్రేటర్ కమిషనర్ వెంకన్న కాశిబుగ్గ: వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా నాలాలు, చెరువులు, పారిశుద్ధ్య నిర్వహణ పనులు వేగవంతం చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండలోని ఎస్బీహెచ్ కాలనీ, వడ్డేపల్లి చెరువు, సమ్మయ్యనగర్, బృందావన్ కాలనీ, పద్మాక్షమ్మ ఆలయ పరిసరాలతో పాటు వరంగల్లోని బొందివాగు, అంబేడ్కర్నగర్, కరీమాబాద్, చిన్న వడ్డేపల్లి చెరువు, ఆటోనగర్ ప్రాంతాల్లో పర్యటించి పనులు పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా నాలాలను ఎప్పటికప్పుడు శుభ్రపర్చాలని, పూడిక, చెత్త తొలగింపు పనులు వేగవంతం చేయాలని, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. తనిఖీల్లో ఎస్ఈ రాజ్కుమార్, డాక్టర్ రాజారెడ్డి, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఏఈ రవికుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులను నియంత్రించాలి
హన్మకొండ అర్బన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, గురుకుల విద్యాలయాల్లో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం ఆర్బీఎస్కే, ఐడీఎస్పీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రిస్క్ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి, పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యత, దోమల నివారణకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో యూరియా, నీటి కొరత లేదు ‘వరంగల్, హనుమకొండ జిల్లాల్లో యూరియా కొరత లేదు. రానున్న 90 రోజుల పాటు తాగునీటి ఇబ్బందులు ఉండవు’ అని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పరిస్థితులను ఆయనకు వివరించారు. దొడ్డి కొమురయ్య ఆశయాలు ఆదర్శం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మానస రాంప్రసాద్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కులసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు భీమారంలో టీబీ ఎన్సీడీ స్క్రీనింగ్ క్యాంప్ హసన్పర్తి: క్షయవ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. హసన్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో భీమారం పాత గ్రామపంచాయతీ ఆవరణలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన క్షయ–ఎన్సీడీ స్క్రీనింగ్ క్యాంప్ను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ శనివారం సందర్శించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మదన్మోహన్రావు, ట్రెయినీ స్పెషల్ ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్ రోహిత్, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రదీప్రెడ్డి, తహసీల్దార్ కిరణ్కుమార్, వైద్యాధికారులు డాక్టర్ భరత్, డాక్టర్ మానస, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి, టీబీ యూనిట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దొడ్డి కొమురయ్య వర్ధంతి న్యూశాయంపేట: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని శనివారం వరంగల్ కలెక్టరేట్లో నిర్వహించారు. ఈసందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ సత్యశారద పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీబీసీడీఓ పుష్పలత, జిల్లా అధికారులు, మాజీ కార్పొరేటర్ మరుపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలి హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
ఇన్చార్జ్ డీఎంహెచ్ఓగా డాక్టర్ మదన్మోహన్
రామన్నపేట: హనుమకొండ డీఎంహెచ్ఓ రామ్కుమార్ వైద్యులు, సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలతో పెద్దఎత్తున ఉద్యోగులు ఆందోళన చేయడంతో సెలవులో వెళ్లిపోయారు. ఈక్రమంలో శనివారం ఇన్చార్జ్ డీఎంహెచ్ఓగా డాక్టర్ మదన్మోహన్ బాధ్యతలు తీసుకున్నారు. హసన్పర్తి డిప్యూటీ సివిల్ సర్జన్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కృష్ణారావును డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రదీప్రెడ్డిలతో పాటు ప్రోగ్రాం అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు. వరంగల్ క్రైం: ఆరోగ్యం బాగుండాలంటే దినచర్యలో మార్పు అవసరమని వరంగల్ సీపీ ఎస్.శ్వేత అన్నారు. శనివారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్లో నిర్వహించిన వారాంతపు పరేడ్ను ఆమె పర్యవేక్షించారు. సిబ్బంది క్రమశిక్షణ, నిబద్ధత, శారీరక దృఢత్వంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్య పరిరక్షణకు రోజూ కొంత సమయం కేటాయించి వ్యాయామం, యోగాను అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు సురేశ్కుమార్, శ్రీనివాస్, ఏసీపీలు అంతయ్య, సత్యనారాయణ, ఆర్ఐలు స్పర్జన్రాజ్, సతీశ్, శ్రీధర్, చంద్రశేఖర్, ఉదయ్భాస్కర్, ఇన్స్పెక్టర్లు వెంకన్న, సువర్ణ, సుజాత, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కేయూలో శనివారం మూడు విభాగాల్లో కంప్యూటర్సైన్స్, ఫిజిక్స్, కామర్స్ విభాగాల్లో డిపార్ట్మెంటల్ కమిటీలు, సబ్జెక్టుల ఎక్స్పర్ట్స్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. హాజరైన అభ్యర్థులకు డెమోలు నిర్వహించారు. కామర్స్ విభాగంలో ఇంటర్వ్యూలకు 69 మంది అభ్యర్థులను పిలవగా 58 మంది, ఫిజిక్స్లో 16 మంది అభ్యర్థులకుగాను 9 మంది, కంప్యూటర్ సైన్స్లో 19 మందికి 14మంది ఇంటర్వ్యూలకు హాజరైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఖిలా వరంగల్: ఈనెల 6న వరంగల్ ఎంజీఎం జంక్షన్లోని వెంటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ (వీసీసీ)లో పెంపుడు జంతువులకు ఉచిత రేబిస్ నిరోధక టీకాలు వేయనున్నట్లు ఎంజీఎం సమీపంలోని పశువైద్య శాల డాక్టర్ అంబిక శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం పరిధి పశువైద్య కళాశాల మామునూరు, వరంగల్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు జంతువులకు ఉచితంగా టీకాలు వేయించాలని కోరారు. వరంగల్ లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈనెల 18న ప్రత్యేకలోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా కోర్టులో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఎన్ఐ యాక్ట్ చెక్ బౌన్స్ కేసులను త్వరితగతిన, సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఎల్ఎస్ఏను సంప్రదించి, కేసులను ప్రత్యేక లోక్ అదాలత్ జాబితాలో చేర్చుకోవాలని జడ్జి కోరారు. న్యూశాయంపేట: క్రిసిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అర్హులైన నిరుద్యోగులకు కుట్టుమిషన్లు, ఈ–బైక్లు అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేశ్, హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ మైనార్టీ సంక్షేమాధికారి మేన శ్రీను వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఈపథకం కోసం ఈనెల 18లోగాలోగా tgobmms. cgg. gov.inలో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. -
నేడు కన్నెపల్లికి కేటీఆర్
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన లక్ష్మీపంప్హౌస్(కన్నెపల్లి)ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు (ఆదివారం) సందర్శించనున్నారు. ఉదయం 8గంటలకు హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరుతారు. వరంగల్, పరకాల, భూపాలపల్లి, కాటారం మీదుగా మహదేవపూర్ మండలం కాళేశ్వరం సమీపంలోని కన్నెపల్లికి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేరుకుంటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతారని పార్టీ వర్గాలు తెలిపారు. ఆయనవెంట పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు రానున్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, మేడిగడ్డ బరాజ్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కన్నెపల్లి వద్ద గోదావరికి అడ్డంగా కట్ట నిర్మాణం చేసి నీటిని నిలిపి పంపులు ద్వారా ఎత్తిపోయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ బృందంతో కలిసి కేటీఆర్ టూర్ ప్లాన్ చేసినట్లు చేశారని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. కాగా, శనివారం కన్నెపల్లి పంపుహౌస్, పరిసరాలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సందర్శించి కేటీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఆయనతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మీపంప్హౌస్ పంపులు లిఫ్ట్ చేయాలనే లక్ష్యంతో పర్యటన -
● ఒప్పించారు.. మెప్పించారు
బడి బాగుంటే భవిష్యత్ బాగుంటుందని నమ్మారు. ఎంఈఓ, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ముక్తకంఠంతో బడిని బతికించాలని నినదించారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే లాభాలేంటో వివరించారు. మొత్తానికి ఏళ్లుగా మూతబడి ఉంటున్న పాఠశాలలకు పునర్జీవం పోశారు. మూతబడిన వాటిని ముందుండి నిలబెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది పునఃప్రారంభమైన పాఠశాలలపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. ఉమ్మడి జిల్లాలో మూతబడిన పలు సర్కారు పాఠశాలలు పునఃప్రారంభం తెరిపించడంలో సర్పంచ్, గ్రామస్తులు, ఉపాధ్యాయులది కీలకపాత్ర సత్ఫలితాలిచ్చిన జయశంకర్ బడిబాట ఒనగూరే ప్రయోజనాలు వివరించడంతో సక్సెస్ -
రాజకీయాలకు వాడుకోవడం సరికాదు
● ఏఐటీయూసీ నేత రాజ్కుమార్ భూపాలపల్లి అర్బన్ : సింగరేణి సంస్థను రాజకీయ వేదికగా మార్చడం మానుకోవాలని, కార్మికుల చెమటను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం సరికాదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తి, గణాంకాల అంశంపై మాజీ మంత్రి హరీష్రావు మాట్లాడాలనుకుంటే శాసనసభ సరైన వేదిక అని, అక్కడ ప్రభుత్వం, అవసరమైతే సింగరేణి యాజమాన్యం అధికారికంగా సమాధానం ఇస్తుందని తెలిపారు. గనుల వద్ద మీడియా సమావేశాలు నిర్వహిస్తూ సంస్థను రాజకీయ వివాదాల్లోకి లాగడం వల్ల సింగరేణి ప్రతిష్ట దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై హరీష్రావు చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా బొగ్గు ఉత్పత్తి గణాంకాలపై ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను దృష్ట్యా సంస్థ పేరును రాజకీయ ప్రచారానికి వాడుకోవద్దని కోరారు. ఉద్యోగుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం ● టీఆర్ఈ నాన్గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్ల రవి హన్మకొండ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్ల రవి పేర్కొన్నారు. తాము పెండింగ్ బిల్లులు అడుగుతుంటే ప్రభుత్వం ప్రమాద బీమా అమలు చేస్తామంటూ మభ్యపెడుతోందని వాపోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం, యజమాన్యం 42 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఆరు డీఏలు వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగుల ఆరోగ్య నిధికి ఉద్యోగుల జీతాల నుంచి కోత విధించకుండా ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 60 ఏళ్లు దాటిన వీఆర్ఏల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు పదవి విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన ప్రయోజనాల బకాయిలు ఇప్పించాలని, వీటిని సాధించడానికి ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పాముకాటుతో మహిళ మృతి జఫర్గఢ్ : ఇంట్లో నేలపై నిద్రిస్తున్న మహిళ పాము కాటుకు గురై మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని తిడుగు గ్రామంలో శుక్రవారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. తిడుగు గ్రామానికి చెందిన మారపల్లి సౌందర్య (44), భర్త అంజయ్య, ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం రాత్రి ఇంట్లో నేలపై పడుకున్నారు. అర్ధరాత్రి సౌందర్య నిద్ర నుంచి లేచి ఏదో కుట్టినట్లుగా అనిపించిందని తన భర్తకు చెప్పడంతో అతను లేచి వెతకగా దుస్తుల్లో కట్లపాము కనిపించింది. దీంతో సౌందర్య పాముకాటుకు గురైందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే 108లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్ల వారుజామున మృతి చెందింది. కుటుంబ స భ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామారావు తెలిపారు. కాగా బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. పాముకాటుకు గురైన మహిళ చిల్పూరు : మండలంలోని ఫత్తేపూర్ గ్రామానికి చెందిన వడ్లూరి కోమలత శుక్రవారం పాము కాటుకు గురైంది. 108 సిబ్బంది ఈఎంటీ రాజేంద్రప్రసాద్, పైలట్ అమర్నాథ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కోమలత శుక్రవారం పాఠశాల ఆవరణలో గడ్డి, చెత్తను తొలగిస్తుండగా కాలుపై పాము కాటు వేసింది. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం స్టేషన్ఘన్పూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
మాకు దిక్కెవరు?
‘అమ్మానాన్న.. మమ్మల్ని స్కూల్కు ఎవరు పంపిస్తారు? కొసరి.. కొసరి గోరుముద్దలెవరు తినిపిస్తారు? తమ్ముడిని, నన్ను అనాథల్ని చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు మాకు దిక్కెవరు’ అంటూ రవి, శిరీష దంపతుల కుమారులు సుశాంత్, విద్వాన్ష్ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కాగా, వ్యాపారం కోసం ఇచ్చిన డబ్బులు వసూల్ చేయడానికి పడుతున్న ఇబ్బందుల వల్ల ఇద్దరు భార్యాభర్తలు 20 రోజులుగా ఇంట్లో గొడవ పడుతున్నారని, కనీసం తిండి కూడా సక్రమంగా తినట్లేదని ఇరుగుపొరుగు వారు తెలిపినట్లు మృతుడి బంధువులు చర్చించుకుంటున్నారు. -
జేఎన్ఎస్ను సందర్శించిన సీపీ
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత శుక్రవారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని సందర్శించారు. ఈసందర్భంగా హనుమకొండ జిల్లా యువజన క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ సీపీకి స్వాగతం పలికి స్టేడియంలోని క్రీడా వసతులు వివరించారు. అనంతరం కమిషనర్ స్టేడియం ఆవరణతో పాటు స్విమ్మింగ్ పూల్ను పరిశీలించి అక్కడ నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాల గురించి డీవైఎస్ఓను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులతో కమిషనర్ ముచ్చటించారు. కార్యక్రమంలో వరంగల్ డీఎఫ్ఓ, ములుగు డీఎఫ్ఓ, స్టేడియం సిబ్బంది, కోచ్లు, క్రీడాకారులు, స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్లోని హకీంపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్లో ప్రతిభ కనబర్చి హనుమకొండ స్పోర్ట్స్ స్కూల్కు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 4, 7న రిపోర్ట్ చేయాలని హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న 40 మంది బాలికలకు జూలై 4న, 40 మంది బాలురకు జూలై 7న జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయం, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, హనుమకొండలో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులు ధ్రువపత్రాలు, 10 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. అడ్మిషన్ పూర్తయిన వెంటనే హాస్టల్లో చేరాల్సి ఉటుందని, లగేజీతో హాజరుకావాలని పేర్కొన్నారు. రామన్నపేట : వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ నేడు (శనివారం) ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ నిర్ణీత సమయానికి కళాశాలలో తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొన్నారు. హసన్పర్తి: ఇందిరమ్మ రాజ్యం అంటే కూల్చివేతలా.. ఓటు వేసి గెలిపిస్తే రోడ్డున పడేస్తారా అని సీపీఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి ప్రశ్నించారు. నగరంలోని 2వ డివిజన్ గుండ్లసింగారంలో అధికారులు ఇటీవల కూల్చిన ఇళ్లను శుక్రవారం ఆయన పార్టీ రాష్ట్ర పహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస్రావుతో కలిసి సందర్శించారు. వంటవార్పు కార్యక్రమం చేస్తున్న గుడిసెవాసులకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహ, హనుమకొండ మండల కార్యదర్శి ఎన్.స్టాలిన్, జిల్లా కార్యవర్గసభ్యులు రాములు, లక్ష్మణ్, సదానందం, భి క్షపతి, రాజేందర్, మొగిలి, గోపాల్ ఉన్నారు. వెలుగుల తల్లి సన్నిధిలో చీకట్లుహన్మకొండ కల్చరల్: కోట్ల రూపాయల ఆదాయం లభించే ఈ దేవాలయంలో చాలా రోజుల నుంచి జనరేటర్ పనిచేయట్లేదు. బ్యాటరీ, ఇన్వర్టర్ కూడా పనిచేయట్లేదు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు రాత్రి 8 గంటల వరకు దేవాలయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అర్చకులు చమురుతో దీపాలు వెలిగించి అమ్మవారికి పూజలు జరిపారు. ఈవిషయంపై సిబ్బందిని ప్రశ్నించగా.. మాడవీధుల నిర్మాణంలో భాగంగా కొత్త జనరేటర్ను తగిన చోట అమర్చాల్సి ఉందని తెలిపారు. భక్తులు చీకట్లోనే అమ్మవారిని దర్శించుకోవాల్సి వచ్చింది. -
‘భద్రకాళి’ సాక్షిగా ప్రమాణాల రభస
సాక్షి ప్రతినిధి, వరంగల్ : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) భూముల వేలం, టెండర్ల వ్యవహారం శుక్రవారం వరంగల్ నగరంలో రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ‘కుడా’భూముల వేలంలో అ క్రమాలు జరిగాయని ఆరోపిస్తూ భద్రకాళి అమ్మవారి సాక్షిగా తడి బట్టలతో ప్రమాణం చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించగా, దీనికి ప్రతిగా కుడా చైర్మ న్ వెంకట్రాంరెడ్డి అదే ఆలయంలో ప్రమాణం చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇరు వర్గాల కార్యక్రమాల నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయగా, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డిని ఆలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో భద్రకాళి ఆలయం వద్ద హైడ్రామా నెలకొంది. చన్నీటి స్నానం.. అరెస్టుతో హైడ్రామా శుక్రవారం ఉదయం భద్రకాళి ఆలయానికి చేరుకున్న కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆలయ సమీపంలో చన్నీటితో స్నానం చేసి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మర్రి యాదవరెడ్డిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. యాదవరెడ్డిని తీసుకెళ్తున్న పోలీసు వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసు వాహనంలోనుంచే మర్రి యాదవరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం సత్యానికి భయపడి అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆలయంలో ప్రమాణం చేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. విమర్శలు, ప్రతివిమర్శలు.. ● కుడా లేఅవుట్, టెండర్ల వ్యవహారంలో నూటికి నూరు శాతం అక్రమాలు జరిగాయని, ఫార్మసిస్టులు, వైద్యులు, ఎన్నారైలను బెదిరించి వేలంలో పాల్గొనకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ ఆరోపించారు. గజం రూ.1.50 లక్షలు పలికే భూమిని సిండికేట్ ద్వారా రూ.60 నుంచి రూ.65 వేలకే కట్టబెట్టారని పేర్కొన్నారు. ప్రమాణం చేసేందుకు వచ్చిన కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని, ఎలాంటి పిలుపు ఇవ్వని తననూ పోలీసులు నిర్బంధించారని విమర్శించారు. ● బీఆర్ఎస్ నేతల విమర్శలపై స్పందించిన ఇనగాల వెంకట్రాంరెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు రాజకీయ ఉనికి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కుడాలో జరిగిన ప్రతి అక్రమంపై విచారణ జరుగుతోందని తెలిపారు. బాలసముద్రంలో రూ.150 కోట్ల విలువైన కుడా భూమిని ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మించారని ఆరోపించారు. కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్పై కుడా నిధుల వినియోగం, వెంచర్ల పేరిట జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించామని వెల్లడించారు.‘కుడా’ భూముల వేలం, టెండర్లపై దుమారం అవినీతి జరిగిందని బీఆర్ఎస్.. జరగలేదని కాంగ్రెస్ పరస్పర సవాళ్లు చన్నీటి స్నానాలు, పసుపు నీళ్లతో శుద్ధి.. అరెస్టులు, ఆందోళనలు వరుస పరిణామాలతో భద్రకాళి దేవస్థానం వద్ద హైడ్రామా చన్నీటి స్నానం చేస్తున్న కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి -
‘దూరవిద్య’లో ఉద్యోగుల చేతివాటం!
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని దూరవిద్య సీడీఓఈ/ఎస్డీఎల్సీఈలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లకు, కోర్సు పూర్తయ్యాక వివిధ సర్టిఫికెట్లు తీసుకునేందుకు ఆన్లైన్ పద్ధతిలోనే ఫీజులు చెల్లించేందుకు క్యూఆర్ కోడ్ను అందుబాటులో తీసుకువచ్చారు. దూరవిద్య కేంద్రానికి వచ్చేవారు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఫీజులు చెల్లించి అడ్మిషన్లతో పాటు సర్టిఫికెట్లు తీసుకోవచ్చు. దూరవిద్యలో అడ్మిషన్లు పొందే వారి నుంచి, వివిధ సర్టిఫికెట్లు పొందేవారి నుంచి కొంతమంది ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు నిదర్శనం ఇటీవల దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ బి.సురేష్లాల్ దూరవిద్య కేంద్రానికి సంబంధించిన బ్యాంకుల్లో జమ అవుతున్న ఫీజుల వివరాలను పరిశీలించగా అందులో క్యూఆర్ కోడ్ ద్వారా దూరవిద్య కేంద్రంలోని తొమ్మిది మంది ఔట్సోర్సింగ్ , కాంట్రాక్టు ఉద్యోగుల ఫోన్ల ద్వారానే దూరవిద్య కేంద్రంలోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేసినట్లు వెల్లడైంది. లక్షల్లో పేమెంట్లు.. దూరవిద్య కేంద్రంలోని ఓ ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగి తన ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్కు కొంతమంది అభ్యర్థుల ఫీజులు రూ.6లక్షల 47వేలు, ఓ మహిళా ఉద్యోగి రూ.6లక్షల 6వేలు చెల్లించినట్లు, మరో ఉద్యోగి రూ.4లక్షల 27వేలు, ఇంకో ఉద్యోగి రూ.2లక్షల 30వేలు చెల్లించినట్లు గుర్తించారు. ఇలా మొత్తం 9 మంది ఉద్యోగులు అభ్యర్థుల నుంచి ఫీజుల డబ్బులు తీసుకొని దూరవిద్య కేంద్రానికి క్యూర్ కోడ్ ద్వారా చెల్లించినట్లు గుర్తించారు. ఈ తొమ్మిది మందిలో ఇటీవల ఒకరు ఉద్యోగ విరమణ పొందారు. 9 మంది ఉద్యోగులకు మెమోలు జారీ కేయూ దూరవిద్య కేంద్రంలోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు 8 మందికి దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ బి.సురేష్లాల్ మూడ్రోజుల క్రితం మెమోలు జారీచేశారు. అందులో రిటైర్డ్ ఉద్యోగికి కూడా వాట్సాప్లో మెమో పంపారు. మీరు అభ్యర్థుల నుంచి ఫీజుల డబ్బులు తీసుకొని చెల్లించడం అనేది ఆర్థిక పరమైన అవకతవలకు కిందికే వస్తుందని మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని 7రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆయా ఉద్యోగులకు జారీచేసిన మెమోలో పేర్కొన్నారు. ఇదే విషయం ఇప్పటికే కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని సీరియస్గా పరగిణిస్తున్నారని తెలిపారు. మెమోలకు వివరణ ఇచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఫీజు డబ్బుల కంటే ఎక్కువ వసూలు? దూరవిద్య కేంద్రంలో క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు 9 మంది ఉద్యోగులకు మెమోలు జారీ -
స్నేహం పేరిట నమ్మక ద్రోహం
రవి–శిరీష దంపతులు (ఫైల్)చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన బుడిగె రవి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా పదో తరగతితోనే చదువు ఆపేశాడు. ఉన్నత చదువులకు స్వస్తి చెప్పి హైదరాబాద్కు వెళ్లి రైస్ మిల్లులో గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించాడు. ఆ రంగంలో అనుభవం వచ్చాక హైదరాబాద్లోని హయత్నగర్లో ఒక బియ్యం దుకాణం పెట్టుకున్నాడు. తర్వాత కేసముద్రం మండలం నాయక్పల్లి గ్రామానికి చెందిన శిరీషను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు. హయత్నగర్లో సొంత ఇళ్లు కొనుక్కొని పిల్ల లను చదివిస్తున్నాడు. ఆర్థిక స్వేచ్ఛ సాధించానని సంబరపడుతున్న సమయంలో రవి–శిరీష దంపతులకు కొంత మందితో స్నేహం ఏర్పడింది. అది కాస్త ఫ్యామిలీ ఫ్రెండ్షిప్లా మారింది. ఓ వ్యక్తి, అతడి భార్య.. రవి, శీరిష దంపతులను తమ వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకుంటామని మాటిచ్చారు. లాభాల ఆశజూపి రూ.15 లక్షలు తీసుకున్నారు. ఎన్ని నెలలు గడిచినా భాగస్వామ్యం ఇవ్వకపోగా.. ప్రశ్నించిన రవి దంపతులను బెదిరించారు. దీంతో తాము మోసపోయామని గ్రహించి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఘట్కేసర్ బీబీనగర్ మధ్యలో ద్విచక్ర వాహనాన్ని చెట్ల పొదల్లో పెట్టి, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు వారి బంధువులు చెబుతున్నారు.అమ్మా, నాన్న లేండి.. రవి, శిరీష దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో వారి పిల్లలు తొమ్మిదేళ్ల సుశాంత్, ఆరేళ్ల విద్వాంస్ అనాథలయ్యారు. ‘అమ్మా, నాన్న లేండి’ అంటూ చిన్నారులు రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. తల్లిదండ్రుల మృతితో అనాథలయ్యారు. -
ఓరుగల్లు పీఠాధిపతిగా విజయపాల్ పట్టాభిషేకం
కాజీపేట రూరల్ : కాజీపేట ఫాతిమా కేథడ్రల్ ప్రాంగణంలో శుక్రవారం ఓరుగల్లు కథోలిక పీఠం (డయాసిస్) 4వ నూతన పీఠాధిపతిగా దుగ్గింపూడి విజయపాల్రెడ్డి పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. రోమ్ నుంచి లియోపోప్ పంపిన అధికార ఉత్తర్వులను పోప్దూత సెక్రటరీ లాటిన్ భాషలో చదివి వినిపించారు. హైదరాబాద్ ఆర్చ్ బిషప్ కార్డినల్ పూల ఆంథోని, విశాఖ ఆర్చ్ బిషప్ ఉడుమల బాల, శ్రీకాకుళం బిషప్ రాయరాల విజయ్కుమార్ సహాకారంతో బిషప్గా ఎన్నికై న ఫాదర్ విజయపాల్రెడ్డిని కతోలిక ఆధ్యాత్మిక సంప్రదాయనుసారం తైలాభిషేకం చేసి తలపై శిరస్త్రాణాన్ని ధరింపజేసి బిషప్గా పట్టాభిషేకం చేశారు. నూతన బిషప్ విజయపాల్రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. పోప్లియో తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానన్నారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల ఫాదర్లు, కథోలికులు, 20 మంది బిషప్లు, 500 మంది ఫాదర్లు, 500 మంది సిస్టర్లు, బ్రదర్లు, ప్రజలు పాల్గొన్నారు. విజయపాల్ను సన్మానించిన ఎమ్మెల్యేలు నూతన బిషప్ విజయపాల్ను వరంగల్ పశ్చిమ ఎ మ్మెల్యే రాజేందర్రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొ ండ రాజయ్య, కొండేటి శ్రీధర్, ‘కుడా’ చైర్మన్ ఇనగా ల వెంకట్రాంరెడ్డి, ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ప్రియాంక అనిల్కుమార్ తదితరులు ఘనంగా సన్మానించారు. బిషప్ పట్టాభిషేకం ముందు నూతన బిషప్స్ హౌజ్ను కార్డినల్, సీబీసీఐ అధ్యక్షుడు పూల ఆంథోని ప్రారంభించారు. ఊరేగింపుగా వేదిక వద్దకు.. కార్డినల్ పూల ఆంథోని, నున్షియో సెక్రటరీ ఒక వాహనంలో, నూతన బిషప్గా పట్టాభిషేకం పొందనున్న విజయపాల్ ప్రత్యేక వాహనంలో బ్యాండ్ వాయిద్యాల నడుమ ప్రదర్శనగా హౌజ్ నుంచి పట్టాభిషేక వేదిక వద్దకు తొడ్కోని వచ్చారు. పాల్గొన్న రోమ్ పోప్ దూత సెక్రటరీ, అగ్ర పీఠాధిపతులు, ఫాదర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, దైవ సేవకులు తరలివచ్చిన వరంగల్, కరీంనగర్ జిల్లాల కథోలిక విశ్వాసులు -
నిఘా సరే.. బ్యాకప్ ఏది?
కాజీపేట అర్బన్: వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఉన్నా.. బ్యాకప్ లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. చూసి తరించేందుకు తప్ప ఏదైనా ఘటన జరిగితే రికార్డు చేసి తెలిపేలా కెమెరాలకు బ్యాకప్ లేదు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రతీ రోజు జరిగే రిజిస్ట్రేషన్ ప్రక్రియతోపాటు భూక్రయవిక్రయదారులు, కార్యాలయ సిబ్బంది కార్యకలాపాలు రికార్డు చేయడంతోపాటు అక్రమాలను నిఘా నేత్రం గమనిస్తుందనే భయం ఉంటే ఎలాంటి పొరపాట్లకు తావుండదు. అన్ని కెమెరాలూ అంతే.. వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ల ఎదురుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కెమెరా కనిపెడుతూ మానిటర్లో డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. కానీ, సబ్ రిజిస్ట్రార్ల ఎదురుగా ఉన్న రెండు సీసీ కెమెరాలు ఎప్పుడు పని చేస్తాయో తెలియని పరిస్థితి. ఒకవేళ అవి పని చేసినా రికార్డు కాదు.. దీంతో ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు మళ్లీ ఫుటేజీ చూసుకునే అవకాశం లేదు. రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ, రికార్డు సెక్షన్లోనూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం సరిగ్గా పనిచేయకపోవడంతో భూక్రయవిక్రయదారులు తమను వేధిస్తున్న వారిని పట్టించేందుకు తోడ్పడని సీసీ కెమెరాలు ఉన్నా.. లేకున్నా ఒకటే కదా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. రికార్డు సెక్షన్లో దస్త్రాలకు భద్రత కరువు ఒక్క సీసీ కెమెరా వంద మందితో సమానమని నానుడి. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విలువైన, ఏళ్లనాటి దస్త్రాలను భద్రపర్చే రికార్డు సెక్షన్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కానీ, వీటికి బ్యాకప్ లేక దస్త్రాలకు భద్రత లేకుండాపోయింది. ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో నిఘా వ్యవస్థ సరిగ్గా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సీసీ కెమెరాలకు బ్యాకప్ ఏర్పాటు చేయాలని భూక్రయవిక్రయదారులు కోరుతున్నారు. వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సీసీ కెమెరాలకు లేని బ్యాకప్ రికార్డు సెక్షన్లోని దస్త్రాలకు భద్రత కరువు -
శనివారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2026
స్నేహితులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తే.. అతను మాత్రం పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ వెళ్లాడు. చిన్నప్పటి నుంచి తాను ప్రత్యక్షంగా అనుభవించిన పేదరికాన్ని జయించాలనుకున్నాడు. హైదరాబాద్ వెళ్లి రైస్ మిల్లులో గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించాడు. అనుభవాన్ని మూటగట్టుకుని సొంతగా రైస్ షాపు ప్రారంభించాడు. పెళ్లి చేసుకున్నాడు. ఇల్లు కొనుక్కున్నాడు. పేదరికాన్ని తరిమేశాననుకుంటున్న తరుణంలో స్నేహం రూపంలో మోసం ఎదురైంది. చివరికి ఆ స్నేహ బంధం ప్రాణాలనే హరించింది. దిక్కుతోచని స్థితిలో ఇద్దరు చిన్నారులు దిక్కులు పెక్కటిల్లేలా రోదిస్తున్నారు. – చెన్నారావుపేటభరించలేక మనస్తాపంతో దంపతుల బలవన్మరణం వ్యాపారం కోసం రూ.15 లక్షలు తీసుకుని మోసం.. అనాథలైన ఇద్దరు చిన్నారులు వరంగల్ జిల్లా పాపయ్యపేటలో విషాదం -
భద్రతకు హామీ లభించినట్లేనా..?
హన్మకొండ : విద్యుత్ బస్సుల భద్రతపై జేబీఎం సంస్థ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లేనా అనే సందేహాలు ప్రయాణికుల్లో వ్యక్తమవుతున్నాయి. జేబీఎం బస్సులతో ప్రయాణికుల భద్రతకు ప్రమాదం పొంచిఉందని భావించిన టీజీఎస్ ఆర్టీసీ ఈ నెల 2న రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బస్సులు నిలిపివేసింది. జేబీఎం నుంచి ఏ హామీ లభించిందో ఏమో కానీ.. శుక్రవారం వరంగల్ రీజియన్లో జేబీఎం విద్యుత్ బస్సులు రోడ్డెక్కాయి. 50 బస్సులను సాంకేతికంగా సరిదిద్దామని, వాటిని నడించాలని జేబీఎం సంస్థ ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరిందని, ఈ మేరకు 45 బస్సులు నడిపామని అధికారులు తెలిపారు. జేబీఎం బస్సుల ప్రమాదాలకు కారణాలేమిటి, భవిష్యత్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకున్న చర్యలు, తీసుకునే చర్యలు ఏమిటో స్పష్టంగా తెలియాల్సిన అవసరముందని ప్రయాణికులు అంటున్నారు. విద్యుత్ బస్సులకు బ్యాటరీల నుంచి పొగలు రావడం క్రమంగా మంటలు వ్యాప్తి చెందుతున్నాయి. అయితే భవిష్యత్లో ప్రమాదం జరిగితే అబాసుపాలు కావాల్సి వస్తోందని భావించిన ఆర్టీసీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. అయితే ఒక్క రోజు బస్సుల నిలిపివేతతో సమస్య పరిష్కారమైనట్లేనేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గందరగోళంలో కార్మికులు సాంకేతిక నిపుణులు బ్యాటరీల వద్ద ఉత్పన్నమయ్యే సమస్యను గుర్తించి వాటిని సరిచేస్తున్నారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. వరంగల్–2లోని 115 విద్యుత్ బస్సులు నిలిచిపోవడంతో కార్మికులు గందరగోళానికి గురయ్యారు. బస్సులు ఎన్ని రోజులు నిలిపివేస్తారో తెలియక వరంగల్ రీజినల్ అధికారులు కండక్టర్లను సర్దుబాటు చేయగా అభ్యంతరం, నిరసన వ్యక్తం చేశారు. అవసరమైతే విద్యుత్ బస్సులు వచ్చిన తర్వాత గతంలో ఈ డిపోలో నడిచి సర్దుబాటు చేసిన బస్సులను తిరిగి డిపోనకు తెప్పించాలని, తమను ఇతర డిపోలకు పంపొద్దని అధికారులను డిమాండ్ చేశారు. ఏది ఏమైనా బస్సులు పునరుద్ధరించడంతో కండక్టర్ల సమస్య సమసిపోయింది. వరంగల్ రీజియన్లో రోడ్డెక్కిన 45 విద్యుత్ బస్సులు కండక్టర్ల సర్దుబాటు నిలిపివేత -
బొగతలో సందడి షురూ
వాజేడు : మండల పరిధిలోని చీకుపల్లి సమీపంలో గల బొగత జలపాతానికి శుక్రవారం పర్యాటకులు తరలివచ్చారు. బొగత నుంచి జాలువారుతున్న జలధారలను తిలకిస్తూ సెల్ఫీలు, ఫొటోలు తీసుకొని సందడి చేశారు. చాలా రోజుల తర్వాత బొగత జలపాతంలో జలధార కనిపించడంతో మంత్ర ముగ్ధులయ్యారు. గోదావరికి ప్రాణహిత వరదకాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నదికి ప్రాణహిత గుండా వరద నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరదనీరు చేరగా కాళేశ్వరం వద్ద 4.885 మీటర్ల ఎత్తులో నీటి మట్టం దిగువకు ప్రవహిస్తోంది. దిగువన ఉన్న అంబట్పల్లిలోని కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద 19వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో తరలిరాగా, మొత్తం 85గేట్లు ఎత్తి దిగువకు ఔట్ ఫ్లోను అదే స్థాయిలో తరలిస్తున్నారు. -
వినూత్న డిజైన్లతో వస్త్రాలు తయారు చేయాలి
కాజీపేట అర్బన్: మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలు తయారు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. కాజీపేట మండలం మడికొండలోని ఇండస్ట్రియల్ పార్క్లోని కాకతీయ టెక్స్టైల్ పార్క్, వివర్స్ వెల్ఫేర్స్ పొదుపు పరపతి పరస్పర సహాయక సంఘం, ఐటీ సెజ్, గ్రానైట్ పరిశ్రమలను శుక్రవారం కలెక్టర్ పరిశీలించి మాట్లాడుతూ.. 164 యూనిట్లతో ఉన్న టెక్స్టైల్ పార్క్లో ఉత్పత్తి ప్రారంభించని యూనిట్లను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఆధునిక టె క్నాలజీతో గ్రానైట్, మార్బుల్స్ తయారు చేయడం అభినందనీయమని అన్నారు. ఐటీ సెజ్లో పని చేస్తున్న యువత ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం నవీన్కుమార్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ స్వామి నాయక్, కాజీపేట తహసీల్దార్ సీహెచ్.రాజు పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించాలి.. మడికొండలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ చాహత్ తెలిపారు. మడికొండలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఇండస్ట్రియల్ పార్క్లో విస్తృత పర్యటన -
ఐదేళ్ల లా విద్యార్థుల ఆందోళన బాట
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఐదేళ్ల లా కోర్సు విద్యార్థులు (బాయ్స్) హాస్టల్ వసతి కల్పించాలన్న డిమాండ్తో ఆందోళనబాట పడుతున్నారు. ఈ మేరకు శనివారంనుంచి రిలే నిరాహార దీక్షలకు దిగనున్నారు. యూనివర్సిటీలో సెల్ఫ్ఫైనాన్స్ కోర్సు (ఎస్ఎఫ్సీ) ఐదేళ్ల లా కోర్సు ఏర్పాటుచేశాక తొలుత విద్యార్థినీ విద్యార్ధులకు హాస్టల్ వసతి కల్పించలేదు. పలుమార్లు ఆందోళనలు చేశాక గర్ల్స్కు యూనివర్సిటీ క్యాంపస్లో హాస్టల్ వసతి కల్పిస్తున్నారు. కానీ, బాయ్స్కు మాత్రం మెస్ సదుపాయం కల్పిస్తూ హాస్టల్ వసతి లేదు. వీరు గత ఏడాది సెప్టెంబర్లో యూనివర్సిటీ పరిపాలనాభవనం వద్ద బైఠాయించగా, యూనివర్సిటీ అధికారులు హాస్టల్ వసతిపై చర్చించారు. జులైవాడలోని లా హాస్టల్ భవనంలో మూడేళ్ల లా, ఎల్ఎల్ఎం విద్యార్దులకు హాస్టల్ వసతి ఉంది. కానీ, ఐదేళ్ల లా కోర్సు వారికి మెస్ సదుపాయం అదే హాస్టల్లో కల్పిస్తున్నప్పటికి వసతి లేదు. రిజిస్ట్రార్ రామచంద్రం జులైవాడలోని లా విద్యార్థుల హాస్టల్లో ఐదేళ్ల కోర్సు వారికి వసతికి ఇంకా అవకాశం ఉందా లేదా అనేది పరిశీలించాలని ఓ కమిటీని గత ఏడాది సెప్టెంబర్లో నియమించారు. కమిటీ గదులను మరమ్మతు చేయించి వసతి కల్పించవచ్చని రిజిస్ట్రార్కు నివేదిక సమర్పించింది. రిజిస్ట్రార్ రామచంద్రం కూడా రెండు గదులు కేటాయించాలని హాస్టళ్ల డైరెక్టర్ను ఆదేశిస్తూ ఆర్డర్ తీశారు. ఆర్డర్ ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నప్పటికి ఆ గదులకు మరమ్మతులు చేయించలేదు. దీంతో విద్యార్థులకు కేటాయించలేదు. దీంతో మరోసారి ఆందోళన బాట పట్టాలని విద్యార్ధులు నిర్ణయించారు. హనుమకొండ సుబేదారిలోని యూనివర్సి టీ లా కాలేజీ వద్ద నిరాహరదీక్షలకు దిగుతున్నట్లు లా కళాశాల విద్యార్థి స్టాలిన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం యూనివర్సిటీ లా కాలేజి ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు సందీప్, రాకేష్రెడ్డి, అరుణ్, అజయ్, ఈశ్వర్, సాత్విక్, శ్రీను, పవన్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ నేటినుంచి విద్యార్థుల నిరాహార దీక్ష -
సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ : రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్, కన్వీనర్ మన్నె శశికుమార్ కోరారు. గురువారం రాత్రి హైదరాబాద్లోని టీజీ ట్రాన్స్కో ప్రధాన కార్యాలయంలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (హెచ్ఆర్డీ, కమర్షియల్) శ్రీనివాసులును కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు వెంటనే పే రివిజన్ కమిటీ వేయాలని, 1999–2004 మధ్య నియామకమైన అర్హులైన ఉద్యోగులకు జీపీఎఫ్ సౌకర్యం కల్పించడంతో పాటు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, శశికుమార్ మాట్లాడుతూ.. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కోరారు. ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ విభాగంలో అదనపు పోస్టులు మంజూరు చేసి జూనియర్ లైన్మెన్, క్షేత్ర స్థాయి సిబ్బంది నియామకాలు చేపట్టాలన్నారు. 2019లో నియామకమైన జేఎల్ఎం, ఏఎల్ఎంలకు బదిలీ అవకాశం కల్పించాలని కోరారు. -
బీఎల్ఓలు ఇళ్లను సందర్శించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్న్స్ హాల్లో ఈఆర్ఓలు, సూపర్వైజర్లు, బీఎల్ఓలతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. బీఎల్ఓలు తమ పోలింగ్ కేంద్రం పరిధిలోని ఇళ్లను స్వయంగా సందర్శించి ఓటరు వివరాలు నమోదు చేయాలని సూచించారు. తూర్పు నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంత శాతం సర్ పూర్తయ్యింది, ఏ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయో ఈఆర్ఓలను అడిగి తెలుసుకున్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. ట్రాన్స్జెండర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి నియోజకవర్గంలో కొందరు ట్రానన్స్జెండర్లు సర్ నమోదుకు ముందుకు రావడంలో సంకోచిస్తున్నట్లు అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కలెక్టర్ ప్రతి పౌరుడికి ఓటు రాజ్యాంగబద్ధమైన హక్కు అని తెలిపారు. ట్రాన్న్స్జెండర్లు కూడా దేశ పౌరులేనని, వారికి సర్పై అవగాహన కల్పించి వంద శాతం నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు పి.సంధ్యారాణి, వైవీ గణేశ్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, వరంగల్ ఆర్డీఓ సుమ, అధికారులు, సూపర్వైజర్లు, బీఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు. -
మాజీ సర్పంచ్ ఓటుకే మ్యాపింగ్ కరువు
లింగాలఘణపురం : భారత ఎన్నికల సంఘం చేపట్టిన గణన పత్రంలో ఓ మాజీ సర్పంచ్ ఓటుకే మ్యాపింగ్ కరువైంది. దీంతో ఆమె ఓటు హక్కు ఉంటుందా..? లేక కోల్పోతుందా తెలియని అయోమయంలో పడ్డారు. ఆమెతో పాటు అదే గ్రామంలో మరో 80 మందికిపైగా ఇదే పరిస్థితి నెలకొంది. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలో 2018లో పిట్టలోనిగూడెం కలుపుకొని ఏనెబావి నూ తన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ఆ సమయంలో ఎస్టీ రిజర్వేషన్ కావడంతో 2019లో జరిగిన ఎన్నికల్లో పిట్టలోనిగూడానికి చెందిన గుజులోతు యాదమ్మ ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నికయ్యారు. 2002లో యాదమ్మకు సంబంధించిన కుటుంబ సభ్యుల ఓటరు జాబితాలో ఎవరి పేర్లు లేకపోవడంతో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణలో మ్యాపింగ్ అయ్యే పరిస్థితి లేదు. 2002లో ఆమెకు సంబంధించిన తల్లిదండ్రులు, నాయనమ్మ, తాతల ఓటరు వివరాలు ఎక్కడా లేకపోవడంతో వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. పరిశీలించాకే నిర్ణయం.. పిట్టలోనిగూడెంలో సుమారుగా 70 ఇళ్లు ఉండగా 120 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 80 మందికి పైగా మ్యాపింగ్ అయ్యే పరిస్థితి లేదు. ఈ విషయంపై తహసీల్దార్ ఏఈఆర్ఓ అండాలును వివరణ కోరగా ఇలాంటి పరిస్థితుల్లో వీరి ఓటు హక్కుపై నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ (ఈఆర్ఓ) వారికి వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారన్నారు. సంచార జాతులు కాబట్టి కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని వివరించారు. పిట్టలోనిగూడెంలో 80 మందికి పైగా ఇదే పరిస్థితి -
ప్రకృతి విపత్తుతోనే గుడ్డు ధర పెరిగింది
కాజీపేట అర్బన్ : వాతావరణంలో సమతుల్యత లోపించడం, తీవ్రమైన ఎండలు, ప్రకృతి విపత్తుతోనే కోడి గుడ్డు ధర పెరిగిందని వరంగల్ పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు అన్నారు. హంటర్ రోడ్డులోని నెక్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 40 ఏళ్లలో ఎన్నడులేని విధంగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో తీవ్రమైన ఎండలు, వడగాలులు, 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు కావడంతో గుడ్లు పెట్టే లక్షలాది కోళ్లు మృతి చెందాయని చెప్పారు. దీంతో పౌల్ట్రీ రైతులకు రూ.16 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. కోళ్ల దాణా సోయా కేక్ టన్నుకు ధర రూ.30 వేల నుంచి రూ.60 వేలకు పెరిగిపోయిందని వాపోయారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ టి.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
నేతాజీ గౌరవం కోసం 13వేల కిలోమీటర్ల మహా బైక్ యాత్ర
● వరంగల్ యువకుడి అసాధారణ దేశ భ క్తి నయీంనగర్: నేతాజీ గౌరవం కోసం, ఆయన స్ఫూర్తితో దేశ ప్రజల్లో చైతన్యం నింపేందుకు వరంగల్కు చెందిన దేశభక్తుడు ఆడెపు కిశోర్ కుమార్ వరంగల్ నుంచి మొదలైన బైక్ యాత్ర కన్యాకుమారి నుంచి హిమగిరుల కాశ్మీర్ వరకు సాగింది. 13వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించుకున్న ఆయన గురువారం స్వస్థలమైన వరంగల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని 20కి పైగా రాష్ట్రాల గుండా ఈ యాత్ర సాగిందని తెలిపారు. నేతాజీ లాంటి మహానుభావునికి దేశంలో సరైన గుర్తింపు రావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుని జపాన్లో ఉన్న ఆయన అస్థికలను వెంటనే భారత్కు తీసుకురావాలని, నేతాజీ స్ఫూర్తి, భావజాలం, దేశభక్తి భావితరాలకు చాటి చెప్పాలన్నారు. -
నేటి నుంచి ఆర్ట్ చాలెంజ్
హన్మకొండ చౌరస్తా: జాతీయ స్థాయి ఆర్ట్ చాలెంజ్ శుక్రవారం నుంచి 14 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు సాగంటి మంజుల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ చిత్రకారుడు శేష బ్రహ్మం కళా యజ్ఞ స్ఫూర్తితో ‘కళాయజ్ఞ మినీ’ అనే పేరుతో జాతీయ స్థాయిలో 7 అంశాలపై ఆర్ట్ చాలెంజ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే వారికి ప్రతీ రెండు రోజులకు ఓ సారి ఒక సరికొత్త అంశం ఇవ్వనున్నట్లు తెలిపారు. అందులో అద్భుత ప్రతిభ కనబరిచిన చిత్రకారుల చిత్రాలను హైదరాబాద్లో ఆగస్టులో జరిగే చిత్ర కళా ప్రదర్శనలో ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ఇందులో 50 మంది ప్రముఖ చిత్రకారులు పాల్గొంటున్నారని, వారు వేసిన పెయింటింగ్స్ సైతం పొందుపరచనున్నట్లు తెలిపారు. ఇతర పూర్తి వివరాలకు 81436 43337 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. ‘కుడా’ భూముల వేలంపై చర్చకు సిద్ధం నయీంనగర్ : ‘కుడా’ భూముల వేలంపై బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలకు కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ను వెంటబెట్టుకుని రావాలని ప్రతి సవాల్ విసురుతూ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వేలం ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. ఏ గుడికై నా వచ్చి ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమన్నారు. బీఆర్ఎస్ పాలనలో ‘కుడా’ నిధుల వినియోగంపై ఇప్పటికే విచారణ ప్రారంభమైదందని తెలిపారు. ఆధారాలు లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. అన్నా.. అక్క మెంటార్షిప్ టీచింగ్ ఇంటర్ ్న షిప్ ప్రారంభం విద్యారణ్యపురి : ఉన్నత విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు అన్నా, అక్క మెంటర్షిప్–కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ టీచింగ్ ఇంటర్న్షిప్ కార్యక్రమంలో భాగంగా హనుమకొండలోని పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తృతీయ సంవత్సరం విద్యార్థినులు గురువారం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్న్షిప్ ప్రారంభించారు. తొలిదశలో 120మంది విద్యార్థినులు హనుమకొండ జిల్లాలోని 19 ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి కృత్రిమ మేధస్సు, డిజిటల్ అక్షరాస్యత సాంకేతిక నైపుణ్యాలు, డిజిటల్ లెర్నింగ్ తదితర అంశాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ బి. చంద్రమౌళి తెలిపారు. ఈకార్యక్రమాన్ని నోడల్ అధికారులు బి. మాధవి, బి. స్వర్ణలత, డాక్టర్ పి. రాజిరెడ్డి సమన్వయం చేస్తున్నారు. -
పాస్పుస్తకమున్నా బెదిరింపులు..
హసన్పర్తి : హసన్పర్తి పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్ కబ్జాదారులకు సహకరిస్తూ పట్టాదారులైన తమను బెదిరింపులకు గురి చేస్తున్నాడని రైతులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం హసన్పర్తి మండలం అన్నాసాగరం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతులు వైద్యుల స్వరూప, సమ్మిరెడ్డి మాట్లాడారు. అన్నాసాగరం శివారులోని సర్వే నంబర్ 74/బీ, 73/ఏ/1,77/ఏ/1,78/బీలో సుమారు 4.03ఎకరాల భూమి ఉందన్నారు. ఈభూమికి సంబంధించిన పట్టాదారు పాస్పుస్తకం పొంది రైతుభరోసా డబ్బులు కూడా తీసుకుంటున్నట్లు వివరించారు. అయితే ఇందులో 1.06 ఎకరాల భూమిని ఇదే గ్రామానికి చెందిన ప్రతాప్ రెడ్డి కబ్జా చేశాడని ఆరోపించారు. ఈవిషయమై పోలీస్స్టేషన్ను ఆశ్రయిస్తే ఇన్స్పెక్టర్ మహేందర్ తమనే బెదిరింపులకు గురిచేస్తూ కోర్టుకు వెళ్లమని హుకుం జారీచేస్తున్నాడని తెలిపారు. తమ వద్ద రెవెన్యూ అధికారులు సర్వే చేసిన మ్యాప్తో పాటు పట్టాదారుపాస్ పుస్తకాలు ఉన్నాయని చూపిస్తే.. క్షేత్రస్థాయికి వెళ్లినట్లయితే కేసు నమోదు చేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. భూమి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్ నుంచి తమకు ప్రాణభయం ఉందని చెప్పారు. ఇలాగే పోలీస్ ఇన్స్పెక్టర్ వేధింపులకు గురి చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయమై కలెక్టర్, పోలీస్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని వైద్యుల స్వరూప, సమ్మిరెడ్డి తెలిపారు. పోలీస్ ఇన్స్పెక్టర్ నుంచి ప్రాణభయం విలేకరుల సమావేశంలో రైతుల ఆవేదన -
అదుపు తప్పిన బైక్..
● కాల్వలో పడి యువకుడి మృతి ● గుండేడు శివారులో ఘటన కమలాపూర్: బైక్ అదుపు తప్పి కాల్వలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుండేడుకు చెందిన దాసి వెంకటేష్ (27) తన తండ్రి సాంబయ్యతో కలిసి జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ దర్గాను దర్శించుకుని అక్కడి నుంచి బైక్పై గుండేడుకు వస్తున్నాడు. మార్గమధ్యలో తన తండ్రిని దింపి ఒంటరిగా వస్తున్నాడు. ఈ క్రమంలో గుండేడు శివారులో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కెనాల్లో పడింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ నవీన్ తెలిపారు. ప్రేమ వివాహం చేసుకుందని.. హసన్పర్తి : చెల్లి ప్రేమ వివాహం చేసుకుందనే ఆ గ్రహంతో అబ్బాయిని చంపుతామని బెదిరించడమే కాకుండా అతడి ఇంటికి నిప్పు అంటించారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి గురువారం నిందితులను అరెస్ట్ చేసి రి మాండ్కు తరలించినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపారు. పోలీస్ ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం.. హసన్పర్తి మండలం పెంబర్తికి చెందిన సౌరం విష్ణువర్ధన్, గుండ్లసింగారానికి చెందిన గాదె కరిష్మా గత నెల 24న ఓ ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహాన్ని పెద్దలు అంగీకరించలేదు. చెల్లి ప్రేమ వివాహం చేసుకుందని కక్ష పెంచుకున్న అమ్మాయి సోదరుడు గాదె పాల్.. తన స్నేహితుడు మహబూబాబాద్ జిల్లా పూరి తండాకు చెందిన గుగులోత్ మనోజ్తో కలిసి జూన్ 24న కత్తులతో దాడికి చేయడానికి విష్ణు వర్ధన్ ఇంటికి వచ్చారు. ఆ తర్వాత మర్నాడు తెల్ల వారుజామున బాధితుడి ఇంటికి నిప్పు అంటించారు. దీంతో ఇంట్లో ఉన్న వారు తృటిలో ప్రాణాలతో తిప్పించుకున్నారు. నిందితుల నుంచి తల్వార్, కత్తిపాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపారు.● అబ్బాయి ఇంటికి నిప్పు..ఆపై బెదిరింపు ● నిందితుల అరెస్ట్.. వివరాలు వెల్లడించిన పోలీసులు -
అప్రెంటిస్ జాబ్మేళాను వినియోగించుకోవాలి
● ఇంటర్ విద్య ఆర్జేడీ గోపాల్ విద్యారణ్యపురి : ఇంటర్ వృత్తి విద్య కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 13న నిర్వహించనున్న అప్రెంటిస్ జాబ్మేళాను వినియోగించుకోవాలని ఇంటర్ విద్య ఆర్జేడీ ఎ. గోపాల్ కోరారు. ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్, హైదరాబాద్ ఆర్డీఎస్డీఈ సంయుక్త ఆధ్వర్యంలో 2023 నుంచి 2026 విద్యాసంవత్సరాల్లో ఇంటర్ వృత్తి విద్య కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు హనుమకొండలోని ప్రభుత్వ వృత్తివిద్య జూనియర్ కళాశాలలో అప్రెంటిస్ జాబ్మేళా నిర్వహించబోతున్నామన్నారు. ఈ మేరకు గురువారం ఈ కళాశాలలో అప్రెంటిస్ జాబ్మేళా సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు విస్తృత ప్రచారం కల్పించి ఎక్కువ సంఖ్యలో ఆయా విద్యార్థులు అప్రెంటిస్ జాబ్మేళాకు హాజరయ్యేలా కృషి చేయాలని సూచించారు. ఈ జాబ్మేళాలో ఎంపికై న వారికి ఆర్డీఎస్డీఈ వారు నెలకు రూ. 9,600 స్టైఫండ్ కూడా చెల్లిస్తారన్నారు. పారామెడికల్, ఇంజనీరింగ్, కామర్స్, కంప్యూటర్, హోమ్సైన్స్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ బి. వెంకన్న, ప్రభుత్వ వృత్తివిద్య జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.శ్రీధర్, వివిధ జిల్లాల ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఆర్. శ్రీనివాస్రావు, కె. మాధవరావు, బి.కవిత, భగవద్గీత, ఎం. మంజుల, తదితరులు పాల్గొన్నారు. -
గుండెల్లో నిలుపుకుంటారు
వరంగల్ పోలీసులు అధికారులనువరంగల్ క్రైం : వరంగల్ పోలీసులు తమతో కలిసి పనిచేసిన అధికారులను గుండెల్లో నిలుపుకుంటారని పూర్వ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా విధులు నిర్వహించి ఇటీవల సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా బదిలీ అయిన సన్ ప్రీత్ సింగ్కు గురువారం ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో వీడ్కోలు నిర్వహించారు. ఈ సందర్భంగా అలంకరించిన వాహనంపై సన్ ప్రీత్ సింగ్ను నిలబెట్టి పోలీస్ అధికారులు తాళ్లతో ఆ వాహనాన్ని లాగుతూ తమ అభిమానం, గౌరవం చాటుతూ భావోద్వేగ వీడ్కోలు పలికారు. అనంతరం సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్లో 15 నెలలపాటు విధులు నిర్వర్తించిన కాలంలో ప్రతీ అధికారి, సిబ్బంది అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్తో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, ఇక్కడి అధికారులు, సిబ్బంది, ప్రజల ప్రేమ, ఆదరణ జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు. భవిష్యత్లో కూడా వరంగల్ పోలీస్ కమిషనరేట్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. డీసీపీలు ధార కవిత, రాజమహేంద్ర నాయక్, అదనపు డీసీపీలు సురేశ్ కుమార్, శ్రీనివాస్, ప్రభాకర్ రావు, బాలస్వామి, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పూర్వ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ -
నియామకానికి ఇంటర్వ్యూలు
నేటి నుంచి పార్ట్టైం అధ్యాపకుల కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో పార్ట్టైం అధ్యాపకుల నియామకానికి ఈనెల 3(శుక్రవారం) నుంచి 8వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి –మార్చిలో 20 విభాగాల్లో 99 మంది పార్ట్టైం అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు స్వీకరించారు. 601 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలుత 16 విభాగాల్లో 69 మంది అధ్యాపకుల నియామకానికి ఈనెల 3 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు రోస్టర్ ప్రకారం షార్ట్లిస్టు చేసి కొందరికే ఫోన్ద్వారా సమాచారం అందించారు. విభాగాల వారీగా ఇంటర్వ్యూల తేదీలు.. జూలై 3న ‘లా’, సోషియాలజీ, లైబ్రరీ సైన్స్, సైకాలజీ అభ్యర్థులకు, 4న కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కామర్స్, 6న బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, 7న బాటనీ, జువాలజీ, తెలుగు, 8న పొలిటికల్ సైన్స్, ఇంగ్లిష్, మ్యాథ్మెటిక్స్, ఫార్మసీ విభాగాల అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచినట్లు రిజిస్ట్రార్ వి. రామచంద్రం తెలిపారు. వంద మార్కులు.. ఆయా విభాగాల్లో పార్ట్టైం అధ్యాపకుల నియామకానికి వంద మార్కులు కేటాయించారు. అభ్యర్థులకు యూజీ, పీజీ, పీహెచ్డీ, నెట్,సెట్, పబ్లికేషన్స్, టీచింగ్ అనుభవానికి సంబంధించి 80 మార్కుల వరకు కేటాయించారు.10 మార్కులు డెమోన్స్ట్రేషన్,10 మార్కులు ఇంటర్వ్యూలకు కేటాయించారు. ఈ విభాగాలకు తర్వాతే.. కేయూలోని మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, జియాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాలకు దరఖాస్తులు స్వీకరించినా ప్రస్తుతం ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదు. తర్వాత నిర్వహిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. 269 మంది అభ్యర్థులకు పిలుపు 16 విభాగాల్లో 69 మందిని ఎంపిక చేయనున్న అధికారులు ఆయా విభాగాలన్నీ కలిపి దరఖాస్తులు చేసిన అభ్యర్థుల్లో షార్ట్ లిస్టుగా రూపొందించి 269 మంది అభ్యర్థులను డెమో, ఇంటర్వ్యూలకు పిలిచారు. ఇందులో 69 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. కాగా, 248 మంది అభ్యర్థుల దరఖాస్తులను రిజెక్ట్ చేశారు. -
ఫీవర్.. ఫియర్
● ఆరు నెలల్లో జ్వరాల విజృంభణ ● జిల్లాలో 4,205 కేసులు నమోదు ● వానాకాలంతో సీజనల్ వ్యాధుల ముప్పు ● అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులుఆస్పత్రుల్లో రద్దీ.. వాతావరణంలో మార్పులు, వర్షాకాలం ప్రారంభం కావడంతో జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, విరేచనాల వంటి సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లలోనూ రోగుల రద్దీ కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఎక్కువగా చికిత్స కోసం వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. జ్వరం రెండు, మూడు రోజులకు మించి కొనసాగినా, విరేచనాలు తీవ్రంగా ఉన్నా స్వయంగా మందులు వాడకుండా వైద్యులను సంప్రదించాలని, యాంటీబయాటిక్స్ను ఇష్టానుసారంగా వాడొద్దని సూచిస్తున్నారు. సాక్షి, వరంగల్: వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశముంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నెలవరకు సాధారణ జ్వరాలు, విరేచనాలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, టైఫాయిడ్ వంటి రోగాలు జనాలను బెంబెలెత్తించాయి. ఆరు నెలల్లో అత్యధికంగా 4,205 జ్వరాల కేసులు నమోదయ్యాయి. అనంతరం అక్యూట్ డయేరియల్ డిసీజ్ (విరేచనాలు) 3,087 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు 1,008, టైఫాయిడ్ 218 కేసులు నమోదయ్యాయి. డెంగీ కేసులు ఇప్పటివరకు 27, మలేరియా ఒక్క కేసు మాత్రమే నమోదైంది. వైరల్ హెపటైటిస్, హెచ్1ఎన్1, చికున్గున్యా వంటి వ్యాధులు నమోదుకాకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. జూలైలో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్య విభాగం అధికారులు సూచిస్తున్నారు. సీజన్లో కలుషిత నీరు, పరిసరాల అపరిశుభ్రత కారణంగా ఈ వ్యాధులు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నీరు నిల్వ లేకుండా చూడాలి..వైద్యులు సూచించిన ప్రకారం మరిగించిన నీటినే కాచి తాగాలి. బయట ఆహారం తినడం తగ్గించాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసి, దోమల నివారణ చర్యలు చేపట్టాలి. మూడు రోజులకుపైగా జ్వరం కొనసాగినా, విరేచనాలు తీవ్రమైతే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలి. – డాక్టర్ సాంబశివరావు, వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారినెల జ్వరాలు విరేచనాలు శ్వాసకోశ టైఫాయిడ్ డెంగీ ఇన్ఫెక్షన్లుజనవరి 745 394 257 31 4 ఫిబ్రవరి 637 242 221 26 8 మార్చి 772 426 254 44 8 ఏప్రిల్ 828 584 115 52 2 మే 672 964 92 38 4 జూన్ 551 477 69 27 1 మొత్తం 4,205 3,087 1,008 218 27 -
నేడు ఓరుగల్లు పీఠకాపరిగా విజయపాల్రెడ్డికి పట్టాభిషేకం
కాజీపేట రూరల్ : కాజీపేట ఫాతిమానగర్ కేథిడ్రల్ క్యాంపస్లో రోమ్ 14వ పోప్లియో నియమించిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన దుగ్గింపుడి విజయపాల్రెడ్డికి శుక్రవారం ఓరుగల్లు మేత్రాసనం 4వ పీఠకాపరిగా పట్టాభిషేకం జరగనుందని మీడియా ఇన్చార్జ్ ఫాదర్ ఎం.జయపాల్ గురువారం తెలిపారు. ఉదయం 9: 00 గంటలకు ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, కర్నాటక, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రోమ్ పోప్లియో దూత, అగ్రపీఠాధిపతులు, ఫాదర్లు, మఠాధిపతులు, మఠకన్యలు, ప్రజాప్రతినిధులు, అధికారులు.. విజయపాల్రెడ్డిని పీఠకాపరిగా అభిషేకిస్తారని చెప్పారు. పట్టాభిషేకానికి తరలొచ్చే వారి కోసం ఫాతిమానగర్ కేథిడ్రల్ చర్చి ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నూతన బిషప్స్ హౌస్ ప్రారంభం.. ఫాతిమానగర్ కేథిడ్రల్ క్యాంపస్ ప్రాంగణంలో ఓరుగల్లు మేత్రాసనం పరిపాలనా సౌలభ్యం కోసం అత్యాధునిక హంగులతో నిర్మించిన నూతన బిషప్స్ హౌస్ను ప్రారంభించనున్నట్లు మీడియా ఇన్చార్జ్ ఎం.జయపాల్ తెలిపారు. -
ఈవీ బస్సు.. భద్రత తుస్సు
శుక్రవారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2026హన్మకొండ: విద్యుత్ బస్సులపై భ్రమలు వీడుతున్నాయి. తరచూ జరుగుతున్న అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాలు విద్యుత్ బస్సులను మొదటినుంచీ వ్యతిరేకిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణ కోసమంటూ ఈవీ బస్సులను ప్రవేశపెట్టింది. బస్సుల్లో అగ్నిప్రమాదాలు జరుగుతుండడంతో ఆర్టీసీ యాజమాన్యం ఆలోచనలో పడింది. ప్రయాణికుల భద్రతకు భరోసా లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను నిలిపేసింది. ఇటీవల కరీంనగర్లో 15 రోజుల వ్యవధిలో రెండు బస్సుల్లో మంటలు లేచి దగ్ధమయ్యాయి. వరంగల్ రీజియన్లో వరంగల్–2 డిపోనకు 115 బస్సులు కేటాయించగా.. ఈ డిపో ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతోంది. వీటన్నింటి సేవలను నిలిపేసింది. స్పందించని జేబీఎం యాజమాన్యం వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్న జేబీఎం సంస్థకు ప్రయాణికుల భద్రతపై లేఖ రాసినట్లు సమాచారం. ప్రయాణికులకు ఎలాంటి రక్షణ కల్పిస్తారని, తరచూ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని అడిగినట్లు తెలిసింది. ఈ లేఖకు జేబీఎం యాజమాన్యంనుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా 500కు పైగా ఎలక్ట్రిక్ బస్సులు నిలిపేసింది. ఈక్రమంలో వరంగల్ రీజియన్లో 115 బస్సులు డిపోనకే పరిమితమయ్యాయి. -
ఘన వ్యర్థాలను సమర్థంగా నిర్వహించండి
గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్)ను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ట్రాన్స్ఫర్ స్టేషన్ల నిర్వహణను పటిష్టంగా కొనసాగించాలని కమిషనర్ టి.వెంకన్న సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం బల్దియా కార్యాలయంలో ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాల పురోగతిపై కమిషనర్ అధికారులతో సమీక్షించారు. సమావేశంలో ఎస్ఈ రాజ్కుమార్, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజేశ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహేందర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతోశ్కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. బండ్ పనులు త్వరగా పూర్తి చేయండి కాజీపేట రూరల్: గ్రేటర్ వరంగల్ నగరంలోని వడ్డేపల్లి బండ్పై కొనసాగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం వడ్డేపల్లి బండ్ వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, కాంట్రాక్టర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్ పరిశీలన ధర్మసాగర్: ప్రజలకు రోజూ నల్లాల ద్వారా నీటిని సరఫరా చేయాలని కమిషనర్ ఇంజనీర్లను ఆదేశించారు. ధర్మసాగర్ రిజార్వాయర్ను పరిశీలించిన ఆయన ఇంజినీర్లకు పలు సూచలిచ్చారు. నాణ్యతతో కూడిన తాగు నీరందించాలని కోరారు. -
సమన్వయంతో పనిచేయాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత వరంగల్ క్రైం: లైంగిక దాడులకు గురైన మహిళలు, చిన్నారులకు చట్టబద్ధమైన రక్షణతో పాటు వైద్య, న్యాయ, మానసిక పరామర్శ, పునరావాస సేవలు సకాలంలో అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. కమిషనరేట్ పరిధి వరంగల్, జనగామ జిల్లాలకు చెందిన భరోసా కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలు మరింత సమర్థవంతంగా కొనసాగేందుకు, సంబంధిత ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పోలీస్ కమిషనర్ సీపీ శ్వేత బాధితుల గౌరవం, గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రతీ కేసును సున్నితంగా విచారించాలని సూచించారు. కేసు నమోదు నుంచి దర్యాప్తు, వైద్య పరీక్షలు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, పునరావాసం వరకు ప్రతీ దశలో ఎలాంటి జాప్యం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసుల్లో నిర్దేశిత గడువులో దర్యాప్తు పూర్తి చేసి, కోర్టులో బలమైన సాక్ష్యాధారాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో పోలీస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
డీఎఫ్ఓ ముకుందరెడ్డి బాధ్యతల స్వీకరణ
న్యూశాయంపేట : హనుమకొండ, జనగామ జిల్లాల అటవీశాఖాధికారిగా జి.ముకుందరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను హనుమకొండ రేంజ్ అధికారులు టి.శ్రీనివాస్, జే.శిరీష, కాకతీయ జూపార్క్ అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి, పరిపాలన అధికారి పి.మంజుల, సిబ్బంది రాజు తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాజీపేట అర్బన్ : ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ రిజిస్ట్రార్గా వల్లి సుబ్బలక్ష్మి గురువారం బాధ్యతలు స్వీకరించారు. చిట్స్ సహాయ రిజిస్ట్రార్ తస్లీమా, సబ్ రిజిస్ట్రార్లు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ లీగల్: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు నెల 18న చెక్బౌన్స్ కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్లు వీబీ నిర్మలా గీతాంబ, ఎం.రామకృష్ణ సునీత తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రత్యేక లోక్ అదాలత్ కోసం ఇప్పటి వరకు వరంగల్లో 2,364 ఎన్ఐ యాక్ట్ కేసులు, హనుమకొండలో 4,362 ఎన్ఐ యాక్ట్ కేసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులను పరిష్కరించేందుకు వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో ప్రత్యేక బెంచ్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. లోక్ అదాలత్పై ఎలాంటి సలహాలు, సందేహాలు, న్యాయ సాయం కోసం న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించి, ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందవచ్చని సూచించారు. న్యాయమూర్తి జె.మైత్రేయి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ప్రదీప్, వరంగల్ బార్ అసోసియేషన్ అ ధ్యక్షుడు సీహెచ్.ఉపేందర్, చిట్ఫండ్ కంపెనీ, బ్యాంకు అధికారులు, న్యాయవాదులున్నారు. రామన్నపేట: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ఖాళీ ఉన్న సీట్ల భర్తీకి నేడు(శుక్రవారం) దరఖాస్తుల స్వీకరణ, జూలై 4న అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్ తెలిపారు. జూలై 2 నాటికి సివిల్ ఇంజనీరింగ్లో ఒకటి, సివిల్ ఇంజినీరింగ్ (రియల్ ఎస్టేట్ అండ్ వాల్యుయేషన్)లో 21, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో 2, మెకానికల్ ఇంజినీరింగ్లో 35 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.5,080 ఫీజుతో పాటు నిబంధనల ప్రకారం స్పాట్ అడ్మిషన్ ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు టీజీ పాలిసెట్ ర్యాంక్ కార్డు (అర్హులైతే), ఎస్సెస్సీ మార్కుల మెమో, పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం (అవసరమైతే), ఒక సెట్ జిరాక్స్ ప్రతులతో వ్యక్తిగతంగా ప్రభుత్వ పాలిటెక్నిక్, వరంగల్కు హాజరుకావాలని సూచించారు. -
రీ సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కాజీపేట అర్బన్: రీ సర్వే చేయడం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. కాజీపేట మండలం అమ్మవారిపేటలో గురువారం భూ కొలతల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భూముల రీ సర్వే అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హాజరై మాట్లాడారు. క్షేత్రస్థాయిలో భూముల హద్దు రాళ్లు దొరకడం లేదని, సర్వే నంబర్ గుర్తించడం, హద్దులు నిర్ణయించడం ద్వారా భూ సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఇందుకు రీ సర్వే చక్కటి మార్గం అని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోవర్స్, డీజీపీఎస్ సాయంతో ఇంచు భూమి కూడా తప్పిపోకుండా సర్వే జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కాజీపేట మండల తహసీల్దార్ సీహెచ్.రాజు, సర్వే విభాగం డిప్యూటీ ఇన్స్పెక్టర్ సారంగపాణి, భూములు కొలతల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నూర్ సింగ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రుణాల వసూళ్లపై దృష్టి పెట్టాలిసీ్త్ర నిధి రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి, రుణాలు దుర్వినియోగం చేసిన వారి నుంచి తప్పనిసరిగా రికవరీ చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. రుణ వసూళ్లు సీ్త్ర నిధి యాప్ ద్వారానే నిర్వహించాలని, అర్హులైన మహిళలకు రుణాల మంజూరులో పురోగతి సాధించాలని సూచించారు. గురువారం కలెక్టరేట్లో సీ్త్ర నిధి రుణాల మంజూరు, వసూళ్లు, బ్యాంక్ అనుసంధానంపై డీఆర్డీఓ మేన శ్రీను, అదనపు డీఆర్డీఓ వెంకటేశ్వర్లు, రీజినల్ మేనేజర్, డీపీఎంలు, ఏపీఎంలతో సమీక్ష నిర్వహించారు. ఇందులో డీపీఎంలు అనిత, రాజేంద్ర ప్రసాద్, రీజినల్ మేనేజర్ రమేశ్, ఏపీఎంలు, సీ్త్ర నిధి సిబ్బంది పాల్గొన్నారు. మెరుగైన పురోగతి సాధించాలివిద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు (ఎఫ్ఆర్ఎస్) నమోదు వందశాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో గురువారం ఎఫ్ఆర్ఎస్ అమలు, అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల మూసివేత, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపు, శిథిల భవనాల తొలగింపు తదితర అంశాలపై డీఈఓ, ఎంఈఓలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, డీఈఓ గిరిరాజ్ గౌడ్, ఎంఈఓలు ఉన్నారు.అంగన్వాడీ టీచర్గా మారిన కలెక్టర్కాజీపేట అర్బన్: కాజీపేట మండలం అమ్మవారిపేటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం కలెక్టర్ చాహత్బాజ్పాయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీచర్గా మారి ఆటపాటలతో కూడిన విద్యను బోధించారు. ఈ బొమ్మ ఏంటో మీకు తెలుసా? అని అడుగుతూ చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. చిన్నారులకు ప్రాథమిక విద్యను అందించడంతో పాటు ఆటపాటలతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. -
అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ చేయాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లాలోని ప్రతీ సీడీపీఓ తన పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్ప న, పిల్లలకు అందుతున్న పోషకాహారం, ప్రీస్కూల్ విద్యా కార్యక్రమాలపై సీడీపీఓలు, సంక్షేమాధికారితో గురువారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీడీపీఓలు నెలకు కనీసం 150 కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. పిల్లలతో మాట్లాడడం, వంటశాల పరిశుభ్రత, స్టాక్ పరిశీలన, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను పరిశీలించి ఫొటోలు నివేదికలను అదేరోజు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. రోజువారీ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. కొందరు సీడీపీఓలు విధుల్లో నిర్లక్ష్యం వహించడం, క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన లేకపోవడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబద్ధతతో పనిచేస్తున్న సీడీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లను అభినందించారు. జిల్లా సంక్షేమాధికారి రాజమణి, సీడీపీఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. సీపీని కలిసిన వరంగల్ కలెక్టర్ న్యూశాయంపేట: వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఎన్.శ్వేతను కమిషనరేట్ కార్యాలయంలో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజాసమస్యల సత్వర పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. పోలీస్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాల్సిన అవసరాన్ని ఇరువురు అధికారులు ప్రస్తావించారు. -
హరితహారం లక్ష్యం ఇలా..
డివైడర్లలో 4,37,686చెరువు కట్టలు, బండ్లపై 90,720పీపీవీ, పార్కులు 1,74,593సంస్థాగత 70,946ఎంఎల్ఏపీ 1,000ఇతర మొక్కలు 55,032 15.20 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం ● వర్షాలు కురిస్తే 15 రోజులకు.. లేదంటే వచ్చే నెల ప్రారంభం ● వన మహోత్సవానికి గ్రేటర్ ఉద్యాన శాఖ సిద్ధం రహదారి పక్కన 20,023గృహాలకు 6,70,000నర్సరీలో సిద్ధంగా ఉన్న మొక్కలువరంగల్ అర్బన్: చారిత్రక, వారసత్వ ఓరుగల్లు మహా నగరాన్ని హరితమయంగా మార్చేందుకు జీడబ్ల్యూఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. సీఎం రేవంత్రెడ్డి, గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశాల మేరకు కసరత్తులు పూర్తి చేశారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు రంగం సిద్ధం చేశారు. పక్షం రోజుల వ్యవధిలో మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ వర్షాలు కురవకపోతే ఆగస్టు మొదటి వారంలో 15.20 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయగా, అందులో బల్దియా పరిధిలో 6 లక్షల మొక్కలు నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయి. మరో 9.20 లక్షల మొక్కలను పబ్లిక్, ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేసి దిగుమతి చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 16 నర్సరీల్లో మొక్కలు సిద్ధం.. క్రిస్ట్రియన్ కాలనీ, లక్ష్మీ మెగాటౌన్ షిప్లో, తిమ్మాపూర్లో, వెస్ట్సిటీ, సూర్యకుటీర్, బాలసముద్రం ఎల్లపూర్, నక్కలగుట్టలో ప్రభుత్వ బీఈడీ కళాశాలలో, హెచ్ఎండీఏతోపాటు ప్రైవేట్ సంస్థల తదితర ప్రాంతాల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పూలు, పండ్లు, అలంకరణ మొక్కలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. తట్టుకునేలా.. నగర వాతావరణంలో సులువుగా, బలమైన వేర్లతో వృద్ధి చెందే దేశీ జాతి మొక్కలకు వన మహోత్సవంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు వెల్ల డించారు. అవసరమైన చోట రావి, దారుల పొడవునా, పార్కులు, సంస్థల్లో నీడనిచ్చే వివిధ రకాల మొక్కలు పెంచుతామంటున్నారు. గాలి, వానల ను తట్టుకుని నిలిచే వాటిపై దృష్టిపెట్ట కున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ప్రతీ ఇంటికి 3 మొక్కల పంపిణీ నగరంలో ప్రతీ ఇంటికి 3 మొక్కలు పంపిణీ చేసేలా లక్ష్యం పెట్టుకున్నారు. ఆయా డివిజన్లలో అందుబాటులో ఉన్న వాటర్ ట్యాంక్లు, పార్కులు, నర్సరీల్లో వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పలురకాల పండ్లు, పూల జాతులు, నీడనిచ్చే మొక్కలను అందించనున్నారు. రోడ్లు, అంతర్గత రహదారులు, మోడల్ కా లనీల పొడవునా మాస్టార్ ప్లాన్కు సంబంధించిన 80,60 ఫీట్ల రహదారుల్లో మల్టీ రో అవెన్యూ మొక్కలతో అలంకరణ జాతుల మొక్కలను అవెన్యూ ప్లాంటేషన్ కింద విస్తృతంగా నాటనున్నారు. అందరీని భాగస్వాముల్ని చేస్తాం.. వనమహోత్సవ కార్యక్రమాన్ని నగరంలో అమలు చేసేందుకు ముందుస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, స్లమ్ సమాఖ్యల ప్రతినిధులను, కాలనీ అసోసియేషన్, వేల్పేర్ కమిటీ ప్రతినిధులను, స్వచ్ఛంద, యువజన సంఘాలందరినీ ఈబహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తాం. – లక్ష్మారెడ్డి, బల్దియా ఉద్యాన శాఖ అధికారి నగర వ్యాప్తంగా ఉన్న 149 కిలోమీటర్ల పరిధి రహదారుల వెంట 26,335 మొక్కలు నాటనున్నారు. మీడియం, జంక్షన్లు 65.95 చదరపు కిలోమీటర్లు ఉండగా, 3,23,465 మొక్కలు నాటాలని నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రులు, హాస్టళ్లు తదితర 16 ప్రాంతాల్లో ఇన్స్టలేషన్ ప్రాంతాల్లో 45,800 మొక్కలు నాటనున్నారు. మడికొండ ఓఆర్ఆర్లో 6 ప్రాంతాల్లో 1,000 మొక్కలు, విద్యుత్ నగర్ 1,000 మొక్కలు నాటాలని నిర్ధారించారు. చెరువులు, బండ్ తదితర 18 ప్రాంతాల్లో 32 వేల మొక్కలు నాటనున్నారు. ఖాళీ స్థలాలతోపాటు, శ్మశాన వాటికల్లో మొక్కలు నాటేందుకు ప్రతిపాదించారు. మొక్కలు నాటడంతో పాటు ప్రత్యేకంగా వాటి సంరక్షణకు చర్యలు తీసుకోనున్నారు. -
తెగిన ఓహెచ్ఈ వైరు.. ఆలస్యంగా నడిచిన రైళ్లు
డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే జంక్షన్ పరిధిలోని సిగ్నల్తండా సమీపంలో అప్ లైన్లో ఓహెచ్ఈ (ఓవర్ హెడ్ ఎక్యూప్మెంట్) లైన్ తెగిపడింది. బుధవారం తెల్ల వారుజామున ఓహెచ్ఈ వైరు తెగి డౌన్లైన్పై పడడంతో రెండు మార్గాల్లో విద్యుత్ సరఫరా నిలిచి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మహబూబాబాద్, డోర్నకల్, భద్రాచలం రోడ్ మార్గంలో పలు ఎక్స్ప్రెస్తో పాటు గూడ్సు రైళ్లు నిలిచాయి. ఓహెచ్ఈ సిబ్బంది స్పందించి మొదట డౌన్లైన్ మార్గంలో ఓహెచ్ఈ కేబుల్కు మరమ్మతులు చేసిన అనంతరం 50 నిమిషాల తర్వాత రైళ్లను పునరుద్ధరించారు. అనంతరం అప్లైన్లో సుమారు 3.30 గంటలపాటు శ్రమించి కేబుల్కు మరమ్మతులు చేసి ఉదయం 7.30 గంటలకు రైళ్లను పునరుద్ధరించారు. ఓహెచ్సీ కేబుల్ తెగి విద్యుత్ సరఫరా నిలిచి ఎక్కడి రైళ్లు అక్కడ నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి స్థానిక కోర్టులు● సీజీఆర్ఎఫ్ వరంగల్ చైర్మన్ నాగ ప్రసాద్ హన్మకొండ: విద్యుత్ సమస్యల పరిష్కారానికి స్థానిక కోర్టులు నిర్వహిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ సీజీఆర్ఎఫ్ వరంగల్ చైర్మన్ నాగప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్ణీత రోజున ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ నెల3న మహబూబాబాద్ జిల్లా మరిపెడ డివిజన్ 33/11 కేవీ కొత్తపేట సబ్స్టేషన్లో కొత్తపేట, కురవి, డోర్నకల్, గార్ల, సీరోల్ మండలాలు, 7న హనుమకొండ రూరల్ డివిజన్ పరకాల రూరల్ 33/11 కేవీ సబ్స్టేషన్లో పరకాల రూరల్, ఆత్మకూరు, దామెర, శాయంపేట, పరకాల టౌన్, 9న భూపాలపల్లి జిల్లా కాటారం డివిజన్ కొయ్యూరు 33/11 కేవీ సబ్ స్టేషన్లో కొయ్యూరు, కాటారం, మహాముత్తారం, మహదేవ్పూర్, పలిమెల, 14న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ డివిజన్ కాల్వ శ్రీరాంపూర్ సబ్డివిజన్లోని శ్రీరాంపూర్ 33/11 కేవీ సబ్ స్టేషన్లో శ్రీరాంపూర్, పోత్కపల్లి, ఓదెల, 17న ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ డివిజన్, కూసుమంచి సబ్ డివిజన్లోని రాజేశ్వరాపురం 33/11 కేవీ సబ్ స్టేషన్లో రాజేశ్వరాపురం, పాలేరు, నేలకొండపల్లి, కూసుమంచి, బచోడు సెక్షన్ పరిధిలోని వినియోగదారులు ఈ లోకల్ కోర్టులో ఫిర్యాదులు సమర్పించి సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. బాలుడిపై పోక్సో కేసు నమోదు ఖిలా వరంగల్ : బాలికపై లైంగిక దాడికి పా ల్పడిన ఓ బాలుడిపై పోక్సో నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ సురేశ్ తెలిపారు. వరంగల్ ఏనుమాముల పీ ఎస్ పరిధిలో గత నెల 26న మధ్యాహ్నం ఓ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ సమయంలో ఓ బాలుడు వెళ్లాడు. అనంతరం సదురు బాలిక చెల్లికి డబ్బు ఇచ్చి కిరాణం పంపించా డు. దుకాణం నుంచి వచ్చిన చెల్లి ఈ ఘటనను చూసి కేకలు వేయడంతో సదరు బాలుడు అ క్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై బా ధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పో క్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలో పరారీలో ఉన్న బాలుడు బుధవారం పోలీసులకు చిక్కాడు. దీంతో న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ఓరుగల్లు మేత్రాసనం అభివృద్ధే లక్ష్యం
కాజీపేట రూరల్ : ఓరుగల్లు మేత్రాసనం కేంద్రంగా విశ్వాస ఆధ్మాతిక, విద్య, వైద్య, సాంఘింక రంగాల అభివృద్ధే లక్ష్యంగా అందరి సహకారంతో తన వంతు కృషి చేయనున్నట్లు ఓరుగల్లు మేత్రాసనం నూతన పీఠాధిపతి బిషప్ దుగ్గింపుడి విజయపాల్రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం కాజీపేట ఫాతిమానగర్ పాస్ట్రల్ సెంటర్ గ్రీన్హౌజ్లో మీడియా ఇన్చార్జ్ ఫాదర్ ఎం.జయపాల్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో బిషప్ విజయపాల్రెడ్డి మాట్లాడారు. ఓరుగల్లు మేత్రాసనం పరిధిలోని 12 జిల్లాల్లో కులమతాలు, ప్రాంతాలు, వర్గాలకతీతంగా ఫాతిమామాత ఆశీర్వాదంతో సకల జనుల ప్రయోజనాలే ధ్యేయంగా పని చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తర్వాత ఓరుగల్లు మేత్రాసనం విశిష్టమైందని, రోమ్ 14వ లియోపోమ్ తనను 4వ పీఠాధిపతిగా నియమించారని చెప్పారు. 1952లో ఓరుగల్లు మేత్రాసనం ఏర్పడిందని, మొదటి బిషప్గా అల్పోన్స్ బిషప్ బెరెట్టా, 2వ బిషప్గా తుమ్మబాల, 3వ బిషప్గా ఉడుములబాల, 4వ బిషప్గా తాను ఈ నెల 3వ తేదీన పట్టాభిషేకంతోపాటు నూతన వరంగల్ బిషప్స్ హౌజ్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫాదర్లు తాటికొండ జోసెఫ్, కాసుమర్రెడ్డి, వై.కిరణ్, బాలరాజ్, బ్రదర్ జార్ట్, టామీ, మథ్యాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫాతిమామాత ఆశీర్వాదంతో సకల జనులకు సేవలు బిషప్ విజయపాల్రెడ్డి -
భార్య హత్య కేసులో భర్త అరెస్ట్
మల్హర్(కాటారం) : మండలంలోని ఇబ్రహీంపల్లి గ్రామంలో గత నెల 29 తేదీన జరిగిన భార్య హత్య కేసులో భర్తను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిచారు. ఇబ్రహీంపల్లి గ్రామానికి చెందిన మంతెన సత్యంకు రాజమణితో 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు కూతురు రవళి, కుమారుడు మాన్విత్ ఉన్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని తనను దూరం పెడుతుందని ఆగ్రహంతో సత్యం కత్తితో భార్య మెడపై కోసి హత్య చేసి పరారయ్యాడు. హత్యకు ఉపయోగించిన కత్తి, హత్య చేసిన రోజు ధరించిన దుస్తులను పడేసిందుకు బయ్యారం వైపు నుంచి భూపాలపల్లి–కాటారం ప్రధాన రహదారి వైపునకు వస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులను చూసి పరిగెడుతుండగా సీఐ నాగార్జునారావు, సిబ్బంది పట్టుకున్నారు. కత్తి, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకుని నిందితుడు సత్యంను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. కాగా, హత్య కేసును త్వరగా ఛేదించిన సీఐ నాగార్జునారావు, ఎస్సై శ్రీనివాస్, సిబ్బందిని ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ సూర్యనారాయణ -
ప్రజలకు మెరుగైన సేవలందిస్తా
గురువారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2026విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న కిడ్స్ ప్లేస్కూల్స్ను బుధవారం అధికారులు సీజ్ చేశారు. డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఆదేశాల మేరకు వండర్ కిడ్స్, బచ్పన్, కిడ్జి ప్లేస్కూ ల్స్ను మూసివేశారు. అదేవిధంగా రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఒకే పేరుతో నిర్వహిస్తున్న మై చోటా ప్లేస్కూల్స్ను కూడా సీజ్ చేసినట్లు హనుమకొండ ఎంఈఓ నెహ్రూ తెలిపారు. ఆయా స్కూళ్లలో నోటీసులు అంటించి, తల్లి దండ్రులకు కూడా సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. కాజీపేట దర్గా ప్రాంతంలో గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న హ్యాపీహ్యాపీ ప్లేస్కూ ల్ను సీజ్ చేశామని కాజీపేట ఎంఈఓ బి.మనోజ్కుమార్ తెలిపారు. ఈ ప్లేస్కూల్లో చదువుతున్న విద్యార్థులను సమీపంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. ఎంఈఓ వెంట సీఆర్పీలు ప్రవీణ్కుమార్, రాంప్రసాద్ తదితరులు ఉన్నారు. అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించొద్దని గిరిరాజ్గౌడ్ తల్లిదండ్రులను కోరారు. కేయూ క్యాంపస్: ఉన్నత విద్యాశాఖ అధికారులు, వివిధ యూనివర్సిటీల వీసీలు, ప్రొఫెసర్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలల లెక్చరర్లు ఎడ్యుకేషన్ స్టడీ టూర్కు జర్మనీ వెళ్లారు. జర్మనీ పర్యటనకు వెళ్లిన బృందంలో ఉన్న కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి అక్కడ మూడు యూనివర్సిటీలతో కేయూకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. ఈమేరకు బుధవారం వివరాలను వెల్లడించారు. ఆయా విశ్వవిద్యాలయాల అంతర్జాతీయ సంబంధాల విభాగాల అఽధిపతులతో వీసీ ప్రతాప్రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, రూసా ప్రాజెక్టు అధికారి సౌందర్యజోసెఫ్, రూసా కేయూ నోడల్ అధికారి ప్రొఫెసర్ ఆర్.మల్లికార్జున్రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎం.కుమార్ చర్చలు జరిపారు. అనంతరం ఎంఓయూ కుదుర్చుకున్నారు. జర్మనీ పర్యటనలో ఆయన ఈనెల 6 వరకు ఉండనున్నారు. నయీంనగర్: టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ‘కుడా’ రెండేళ్ల అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ను వారికి అందజేశారు. రెండేళ్ల కాలంలో వరంగల్ మహానగర పరిధిలో మౌలిక వసతుల కల్పన, మాస్టర్ ప్లాన్ విస్తరణ, ల్యాండ్ పూలింగ్, కాళోజీ కళాక్షేత్రం వంటి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి తదితర అంశాలను చైర్మన్ వివరించారు. సీఎం రేవంత్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ‘కుడా’ను ఆర్థిక స్వావలంబన వైపు నడిపిస్తున్నట్లు ఆ యన తెలిపారు. ఇనగాల వెంట ఎమ్మెల్యే నాగరాజు, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ పింగిలి వెంకట్రాంనరసింహారెడ్డి, నాయకులు ఉన్నారు. హన్మకొండ కల్చరల్: వరంగల్కు చెందిన పురుషోత్తమ ఘనాపాఠికి ఘన పాఠమణి బిరుదు, ప్రముఖ రుగ్వేద పండితుడు సూర్యనారాయణ ఘనాపాఠి, శివసుబ్రహ్మణ్య ఘనాపాఠి సోదరులు రుగ్వేద సుధాకర బిరుదు అందుకున్నారు. ఈ మేరకు శ్రుతి స్మృతి ట్రస్ట్ బాధ్యులు హైదరాబాద్లోని స్కందగిరి దేవాలయంలో 33 రోజులుగా రుగ్వేద ఘనపారాయణం నిర్వహించారు. ఆగమ సామ్రాట్ భద్రకాళి శేషు ఈ కార్యక్రమంలో పాల్గొని పురుషోత్తమ ఘనాపాఠికి ఘన పాఠమణి బిరుదు ప్రదానం చేశారు. కంచికామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతీస్వామి ఘనాపాఠి సోదరులకు రుగ్వేద సుధాకర బిరుదు అందజేశారు. ● శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం ● వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ● కమిషనరేట్లో బాధ్యతల స్వీకరణ వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, ఇందుకు ప్రజలం సహకారం ఎంతో అవసరమని వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా సన్ప్రీత్సింగ్ నుంచి బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ పోలీస్ కమి షనరేట్ కార్యాలయానికి చేరుకున్న నూతన సీపీకి సిబ్బంది సాయుధ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా నూతన సీపీని వరంగల్ పోలీస్ కమిషనరేట్కు చెందిన డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కలు, నోట్బుక్స్ అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత మాట్లాడుతూ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించే విధంగా పోలీసింగ్ను సమర్థవంతంగా నిర్వహిస్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు. అమ్మవారికి సీపీ శ్వేత పూజలు హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని బుధవారం వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ శ్వేత సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, అర్చకులు ఆమెను ఘనంగా స్వాగతించారు. సీపీ శ్వేత అమ్మవారిని దర్శించుకుని పూజలు జరుపుకున్నారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. కమిషనర్ వెంట ఏసీపీ సత్యనారాయణ, సీఐ సుజాత తదితరులు ఉన్నారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఆపద సమయంలో వీరోచిత సేవల్లో ముందువరుసలో ఉంటారు. చాలామంది అధికారులు ఐక్యతకు మారుపేరుగా నిలుస్తారు. ఇవన్నీ బొమ్మకు ఒక వైపు మాత్రమే.. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో చాలాకాలంగా సమస్యలు తిష్టవేశాయి. కొంతమంది అధికారుల అనైతిక చర్యలు, చేతివాటంతో పోలీస్ శాఖ పరువు మసకబారుతోంది. సీపీలుగా పనిచేసిన తరుణ్జోషి, ఏవీ రంగనాథ్, అంబర్కిషోర్ ఝా, సన్ప్రీత్సింగ్ తమదైన శైలిలో కొంతమేర కట్టడి చేసినప్పటికీ అవినీతి అధికారులపై పూర్తిస్థాయిలో చర్యలు లేకుండా పోయాయి. రాజకీయంగా పలుకుబడి ఉన్న కొంతమంది అధికారులు కమిషనరేట్ను అంటిపెట్టుకుంటున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ముందు పాలనాపరంగా అనేక సవాళ్లు ఉన్నాయి. పార్కింగ్ సమస్య.. నగరంలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. చాలా షాపింగ్ కాంప్లెక్స్లకు పార్కింగ్ లేకుండా పోయింది. హనుమకొండ, వరంగల్ చౌరస్తాలో 10 నిమిషాలు ద్విచక్రవాహనాలను సైతం పార్కింగ్ చేసి షాపింగ్ చేసే పరిస్థితులు లేవు. పార్కింగ్ స్థలాలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ పోలీస్ అధికారులు సంయుక్తంగా కలిసి పనిచేసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. దీనికి తోడు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ సమస్య ఉంది. నగరంలో ట్రాఫిక్ పెరగడం వల్ల మరో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ప్రతిపాదించి చాలా రోజులు అవుతోంది. కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏఆర్లో ఎక్కడి వారు అక్కడే.. పోలీస్ శాఖలో లా అండ్ అర్డర్తో పాటు ఏఆర్ విభాగం చాలా కీలకం. ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న కొంతమంది ఆర్ఎస్సై, ఆర్ఐ, ఏసీపీ, అడిషనల్ డీసీపీ స్థాయి అధికారులు కమిషనరేట్ను వదలడం లేదు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు బదిలీ అయినప్పటికీ వారికి ఉన్న పలుకుబడితో తిరిగి ఇక్కడికే వచ్చి చేరుతున్నారు. ఇక్కడ రియల్ వ్యాపారం, సెటిల్మెంట్లకు కొంత మందికి పెట్టింది పేరు అనే ఆరోపణలు ఉన్నాయి. నేతల అండ.. నిబంధనలు తూచ్ వరంగల్, హనుకొండ, కాజీపేట సబ్ డివిజన్లోని కొంతమంది అధికారులు నేతల అండ చూసుకొని పెద్ద ఎత్తున సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఈఅధికారులపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పలుకుబడితో చర్యల నుంచి తప్పించుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లను వారి ప్రైవేట్ దర్బారులుగా మార్చివేశారు. భూములు రేట్లు పెరగడంతో తగదాలు సృష్టించి సెటిల్మెంట్లు సైతం చేయడం గమనార్హం. గతంలో ఇలా చేసిన అధికారులపై సస్పెన్షన్ వేటుపడినా ఈ అధికారుల్లో మాత్రం మార్పు రావట్లేదు. దృష్టి సారిస్తే... మొదటి నుంచే పాలనాపరంగా కఠినంగా వ్యవహరిస్తూ, శాంతి భద్రతలపై దృష్టి సారిస్తే వరంగల్ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. చైతన్యానికి మారుపేరుగా ఉన్న వరంగల్ ప్రజలు నిస్వార్థంతో పనిచేసిన ఎంతో మంది అధికారులకు జీవిత కాలం సరిపోయే కీర్తి ప్రతిష్టతలను అందించారు. ఏది ఏమైనా నూతన సీపీ ఆల్ ది బెస్ట్. వరంగల్ సబ్ డివిజన్లో కరువైన లా అండ్ ఆర్డర్.. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రజారోగ్య రక్షణలో వైద్యులది కీలక పాత్ర అని హనుమకొండ కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ అధ్యక్షురాలు చాహత్ బాజ్పాయ్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ భవన్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. హనుమకొండ కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ అధ్యక్షురాలు చాహత్ బాజ్పాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెడ్క్రాస్ పాలకవర్గ సభ్యులు ప్రముఖ వైద్యుడు, భారతరత్న డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి–వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి.విజయచందర్రెడ్డి, హనుమకొండ డీఎంహెచ్ఓ ఎస్డీ.రాంకుమార్, జిల్లా పాలకవర్గ సభ్యులు, పలువురు వైద్యులను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణగౌడ్, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు ఈవీ.శ్రీనివాస్రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, డాక్టర్ మాగంటి శేషుమాధవ్, డాక్టర్ కె.సుధాకర్రెడ్డి, రెడ్ క్రాస్ సిబ్బంది, పలువురు వైద్యులు పాల్గొన్నారు. పెద్దమ్మగడ్డలో కలెక్టర్ పర్యటన హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని 4వ డివిజన్ పరిధి పెద్దమ్మగడ్డ ప్రాంతంలో బుధవారం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పర్యటించారు. స్థానిక సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇరుకై న రహదారి, అస్తవ్యస్తంగా మారిన డ్రెయినేజీ వ్యవస్థపై అసహనం వ్యక్తం చేశారు. మెరుగైన వసతుల కల్పన కోసం ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. పెద్దమ్మగడ్డలో అద్దె భవనంలో ఉంటున్న యుపీహెచ్సీకి సొంత భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని మాజీ కార్పొరేటర్ బోడ అనయ్ కలెక్టర్ను కోరారు.పేదల కోసం భూ పోరాటం ఉధృతంసీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు హన్మకొండ అర్బన్: పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు సాధించే వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గబోమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా హనుమకొండ కలెక్టరేట్ ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం భారీ పికెటింగ్ నిర్వహించారు. ఉదయం నుంచే కలెక్టరేట్కు చేరుకున్న వామపక్ష నాయకులు, కార్యకర్తలు అధికారులను, సిబ్బందిని లోపలకు వెళ్లకుండా అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పికెటింగ్ కొనసాగుతుండగా సుబేదారి పోలీసులు వామపక్ష నాయకులను అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, వామపక్ష శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం త క్కళ్లపల్లి శ్రీనివాసరావుతోపాటు పలువురు నాయకులను సుబేదారి పోలీస్స్టేషన్కు తరలించారు. కా ర్యక్రమంలో సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ జిల్లా నాయకులు కర్రె భిక్షపతి, జి.ప్రభాకర్రెడ్డి, ఎన్.హంసారెడ్డి, నేదునూరి జ్యోతి, ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, తదితరులు పాల్గొన్నారు.మంత్రి దామోదరను కోరిన ఎమ్మెల్యే నాయిని హన్మకొండ చౌరస్తా: హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్డీ రాంకుమార్పై పూర్తిస్థాయి విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. డీఎంహెచ్ఓ తీరు అభ్యంతరకంగా ఉందంటూ బుధవారం ఆ శాఖ ఉద్యోగులు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డిని బాలసముద్రంలోని క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే నాయిని.. మంత్రి దామోదరకు ఫోన్ చేసి డీఎంహెచ్ఓపై వచ్చిన ఫిర్యాదు గురించి వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి దామోదర విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు పరస్పర గౌరవం, సానుకూల వాతావరణంలో విధులు నిర్వర్తించే పరిస్థితులు ఉండాలన్నారు. ఎమ్మెల్యే నాయిని వెంట ఎమ్మెల్సీ సారయ్య ఉన్నారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్రావు, ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కృష్ణారావు, కార్యదర్శి డాక్టర్ రాజిరెడ్డి, ఏఓ కోలా రాజేశ్, నెహ్రూ చందు, యాదానాయక్, సుధాకర్, జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. చర్చనీయాంశంగా ఫిర్యాదు.. రామన్నపేట: డీఎంహెచ్ఓ రాంకుమార్పై ఎమ్మె ల్యే, కలెక్టర్కు ఉద్యోగులు లిఖితపూర్వకంగా ఫిర్యా దు చేసిన ఘటన చర్చనీయాంశంగా మారంది. మహిళా ఉద్యోగులపై అనుచితంగా వ్యవహరిస్తున్నారని, చిన్న విషయాలకే తీవ్రస్థాయిలో మందలిస్తూ మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని వారు ఫి ర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయమై డీఎంహెచ్ఓ రాంకుమార్ను వివరణ కోరగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పలు పథకాలలో జిల్లా 25 నుంచి 219వ స్థానంలో ఉండడంతో వైద్య సిబ్బంది, అధికారులు పనితీరు మెరుగుపర్చుకోవాలని ఆదేశించాను. కొంతమంది యూ నియన్ నేతలు కార్యాలయాలు వదలకుండా తిష్టవే సి అసత్య ఆరోపణ చేస్తున్నారు. ఏ ఉద్యోగిపై ఎ లాంటి వేధింపులకు పాల్పడలేదని పేర్కొన్నారు.సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో జూన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం.. భూగర్భజల మట్టం కూడా గణనీయంగా పడిపోవడం భవిష్యత్లో నీటి కొరతకు సంకేతాలిస్తోంది. విస్తారంగా వర్షాలు కురవకపోతే జిల్లాలో ఖరీఫ్ సాగుతోపాటు తాగునీటి సమస్య కూడా తలెత్తే ప్రమాదం లేకపోలేదు. జూలైలో కురవాల్సిన వర్షం కంటే అధికంగా వాన పడితే జనాల తిప్పలు తప్పనున్నాయి. జిల్లాలోని పర్వతగిరి, సంగెం మండలాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారే ప్రమాదముంది. నర్సంపేటలో అత్యధికంగా 80 శాతం వర్షపాతం లోటు నమోదైంది. భూగర్భ జలాలు మరింత పడిపోతే తాగునీటికి సైతం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. మరింత దిగువకు భూగర్భజలాలు హన్మకొండ: వాతావరణం వేసవిని తలపిస్తోంది. వర్షాలు కురవకపోవడం, పెరిగిన జల వినియోగంతో హనుమకొండ జిల్లాలో జలమట్టం తగ్గుతూ వస్తోంది. హనుమకొండ జిల్లాలో సగటున మే నెలాఖరులో 6.17 మీటర్ల లోతులో ఉన్నాయి. ఈ ఏడాది 69 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీని ప్రభావం భూగర్భజలాలపై పడుతోంది. ఫలితంగా ప్రతీ నెల భూగర్భజలాలు పడిపోతున్నాయి. సకాలంలో వర్షాలు కురవకపోతే సాగు, తాగు నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని విశ్లేషకుల అంచనా. భూగర్భ జల శాఖ జిల్లాలోని 25 ప్రాంతాల్లో బోర్లు తవ్వించి ఫీజో మీటర్లు అమర్చి వాటి ద్వారా భూగర్భ జల మట్టం కొలతలను సేకరిస్తోంది. ప్రతీ నెల చివరి వారంలో భూగర్భ జల మట్టాన్ని సేకరిస్తోంది. హనుమకొండ జిల్లాలోని వేలేరు మండలం పీచర్లలో అత్యధికంగా 16.3 మీటర్ల లోతున భగర్భజలాలు పడిపోయాయి. విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకురాలు విజయలక్ష్మిబాయి విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలని విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకురాలు, సైట్ డైరెక్టర్ విజయలక్ష్మిబాయి జిల్లా విద్యాశాఖాధికారి, ఎంఈఓలను ఆదేశించారు. హనుమకొండ డీఈఓ కార్యాలయంలో డీఈఓ, అర్బన్ మండలాల విద్యాశాధికారులు, సమగ్రశిక్ష కో–ఆర్డినేటర్లతో బుధవారం సమీక్ష నిర్వహించారు. జయశంకర్ బడిబాటలో ఎంతమంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు, ప్రీప్రైమరీలో విద్యార్థుల నమోదు ఎలా ఉంది, విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ, హనుమకొండ, కాజీపేట మండలాల పాఠశాలల్లో అల్పాహారం పంపిణీపై ఆరా తీశారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థుల నమోదు 33 వేలకుపైగా నమోదు లక్ష్యంగా ఉందని, ఇప్పటివరకు 28 వేల వరకు అడ్మిషన్లు అయ్యాయని తెలిపారు. విద్యార్థుల వివరాలను యూడైస్లో పేర్కొనే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 10 వరకు వి ద్యార్థుల నమోదు లక్ష్యాన్ని చేరుకునేలా కృషిచేయాలని విజయలక్ష్మిబాయి సూచించారు. ఎంఈఓలు నెహ్రూ, శ్రీనివాస్, సమగ్రశిక్ష కోఆర్డినేటర్లు మ హేశ్, మన్మోహన్, సునీత, సుమాదేవి ఉన్నారు.బల్దియా అడిషనల్ కమిషనర్ ఇసంపల్లి జోనా వరంగల్ అర్బన్: బల్దియా ప్రధాన కార్యాలయంలోని ఇన్వార్డులో ఇద్దరు మహిళా ఉద్యోగుల మధ్య మనస్పర్థలు తలెత్తడం, విధుల్లో బాధ్యతా రహితంగా వ్యవహరించడంతో వారికి విధులను గుర్తు చేసినట్లు అడిషనల్ కమిషనర్ అడిషనల్ కమిషనర్ ఇసంపల్లి జోనా ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్వార్డులో నమోదైన దరఖాస్తులు ఆయా విభాగాలకు పంపించడంలో జాప్యం అవుతోందని ఇన్వార్డు ఉద్యోగులు చందన, శ్రుతిని తన చాంబర్కు పిలిపించి దరఖాస్తులను త్వరితగతిన చేరవేయాలని ఆదేశించినట్లు తెలిపారు. వ్యక్తిగత, కుటుంబ ఇబ్బందులతోనే శ్రుతి తన స్వగృహంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. వాస్తవాలను పక్కన పెట్టిన బల్దియా ఉద్యోగులు, అధికారులపై నింద మోపడం సరికాదన్నారు. ఈ ఘటనలో సీ–1 సూపరింటెండెంట్, ఇతర ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) సెక్రటరీగా జిల్లా కేంద్రంలోని టీపీటీ ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు ఆదిరాజు శైలజ నియమితులయ్యారు. ఈమేరకు డీఈఓ, డీసీఈబీ చైర్మన్ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు డీసీఈబీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ బి.రాంధన్ ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో నియమించిన శైలజ బుధవారం సాయంత్రం డీఈఓ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఏఆర్లో పాతుకుపోయిన అధికారులు నగరంలో తీవ్రమవుతున్న ట్రాఫిక్ వరంగల్ సబ్ డివిజన్లో ఏసీపీ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు ల్యాండ్ సెటిల్మెంట్లో జోక్యం చేసుకొని సామాన్యులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారే ఆరోపణలున్నాయి. ఇదే అదునుగా భావించి సబ్ డివిజన్లోని ఒక్కరిద్దరు అధికారులు సెటిల్మెంట్లను జోరుగా చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. సీసీఎస్లో కదలరు.. వదలరు దొంగల భరతం పట్టాల్సిన సీసీఎస్ పోలీసుల వ్యవహారంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బంది ఏళ్ల తరబడి ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. కొంత మంది 15 ఏళ్లు దాటినా సీసీఎస్ను వదలట్లేదు. రాయపర్తిలో బ్యాంకు దోపిడీ జరిగి రెండేళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో రికవరీ చేయడంలో సీసీఎస్ సిబ్బంది విఫలమయ్యారు. వందల సంఖ్యలో జరిగిన దొంగతనాల్లో చోరీ సొత్తు రికవరీ చేయాల్సి ఉంది. వరుసగా చైన్స్నాచింగ్లు జరుగుతున్నా.. దొంగలు దొరకట్లేదు. అధికారులకు విడిదిగా, సిబ్బందికి కాసులు కురిపించే వనరుగా సీసీఎస్ తయారైనట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు రుజువై సస్పెండ్ అయిన చాలామంది అధికారులు కమిషనరేట్ను వదలకుండా ఇక్కడే ఉన్నారు. నేతల సిఫార్సులతో తిరిగి పోస్టింగ్ పొందేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తూ ఇక్కడ లూప్లైన్లలో పనిచేస్తున్నారు. కొంత మంది అధికారులు మహిళా సిబ్బంది, మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించారని విమర్శలున్నాయి. ఇలాంటి అధికారులపై కఠినంగా వ్యవహరించాలి. పడిపోతున్న భూగర్భజలాలు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో కానరాని వాన రైతుల ఎదురుచూపు -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఖిలా వరంగల్: మార్కెట్ అభివృద్ధి, రైతు సంక్షేమమే లక్ష్యమని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పులి ప్రియాంక అన్నారు. ఈమేరకు బుధవారం మార్కెట్లో జరిగిన పాలకవర్గ మొదటి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. తాగునీటి సౌకర్యం కోసం పైపులైన్, కొత్త వాటర్ కూలర్స్ ఏర్పాటుకు ప్రతిపాదనాలు, ఆర్ఓ ప్లాంట్ సామర్థ్యాన్ని అదనంగా 4000 లీటర్లకు పెంచడం, రెండు బోర్లు వేయడం, మిర్చియార్డు, పల్లికాయ యార్డు మధ్యన మహిళలకు మరుగుదొడ్ల నిర్మాణం మార్కెట్యార్డ్ చుట్టూ కూలిపోయిన గోడ మరమ్మతులు చేయించడం తదితర అభివృద్ధి పనులు చేపట్టడానికి పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు చైర్పర్సన్ పులి ప్రియాంక తెలిపారు. ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎన్.శ్రీనివాస్, వైస్ చైర్మన్ బండి జనార్దన్, సభ్యులు గాదరబోయిన రాజు, కందుకూరి పూర్ణచందర్, చల్లా వాసుదేవారెడ్డి, గొడుగు భిక్షపతి, బాదావత్ నర్సింహనాయక్, ఆకుల రుద్రప్రసాద్, బొడ్డు ప్రదీప్కుమార్, కత్తి సంపత్, మహమ్మద్ సబేర, అచ్చ నాగరాజు, దుగ్యాల గోపాల్రావు, జిల్లా మార్కెటింగ్ అధికారి కె.సురేఖ, సహాయ సంచాలకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పులి ప్రియాంక పాలకవర్గ మొదటి సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలు -
రిజిస్ట్రేషన్ శాఖలో బదిలీలు
● ఇన్చార్జ్ డీఐజీగా ప్రవీణ్కుమార్, నూతన డీఆర్గా సుబ్బలక్ష్మి కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో రెండేళ్లలోపే బదిలీలు షురూ అయ్యాయి. 2024 జూలై 25న అటెండర్ నుంచి డీఐజీ స్థాయి వరకు బదిలీ అయ్యారు. 2026 జూన్ 30న డీఐజీ, డీఆర్ బదిలీ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టుకుంది. కాగా, ఈసారి పూర్తిస్థాయి జిల్లా రిజిస్ట్రార్ వరంగల్కు వచ్చారు. బదిలీల్లో ఇలా.. వరంగల్ డీఐజీగా విధులు నిర్వర్తిన్న సుభాషిణి రెండేళ్లలోపే రంగారెడ్డి డీఐజీగా బదిలీ కాగా.. ఇటీవల డీఐజీగా పదోన్నతి పొంది ఎఫ్ఏసీ జిల్లా రిజిస్ట్రార్గా విధులు నిర్వర్తిస్తున్న ప్రవీణ్కుమార్ కరీంనగర్ జిల్లాకు డీఐజీగా, ఎఫ్ఏసీగా వరంగల్ జిల్లా డీఐజీగా నియమితులయ్యారు. జిల్లా రిజిస్ట్రార్గా 2024లో బదిలీపై వచ్చిన ఫణీందర్ ఏడాదిలోపే హైదరాబాద్కు డిప్యుటేషన్పై వెళ్లారు. ప్రవీణ్కుమార్ ఎఫ్ఏసీ డీఆర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మెదక్ జిల్లా రిజిస్ట్రార్ వల్లి సుబ్బలక్ష్మి ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్ట్రార్గా బదిలీపై వచ్చారు. జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ ఎ.శ్రీనివాస్ వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ మార్కెట్ వాల్యూ అండ్ ఆడిటింగ్ విభాగానికి పదోన్నతిపై వచ్చారు. తర్వాత సబ్ రిజిస్ట్రార్లే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చెందిన సబ్ రిజిస్ట్రార్లు 2024లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు. కాగా, ఖమ్మం జిల్లా సబ్ రిజిస్ట్రార్లు ఉమ్మడి వరంగల్కు వచ్చారు. ఏడాదిలోపే 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని 8 మంది తిరిగి డిప్యుటేషన్ పేరిట ఖమ్మం జిల్లాకు, కొందరు లాంగ్ లీవ్ పేరుతో వెళ్లారు. దీంతో 13 సబ్ రిజిస్ట్రార్కార్యాలయాల్లో ఐదు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పూర్తిస్థాయి సబ్ రిజిస్ట్రార్లు, మిగతా వాటిల్లో ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్లు విధులు నిర్వర్తిస్తున్నారు. డీఐజీ, డీఆర్ బదిలీల తర్వాత సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం బదిలీ చేయనున్నట్లు సమాచారం. ఈసారి బదిలీలతోనైనా పూర్తిస్థాయి సబ్ రిజిస్ట్రార్లు వచ్చేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. -
రూ. 4.70 లక్షల గంజాయి పట్టివేత
సంగెం : సంగెం మండలంలో భారీగా గంజాయి పట్టుబడింది. బుధవారం సంగెం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్ వివరాలు వెల్లడించారు. సంగెం మండలం చింతలపల్లి రైల్వే గేట్ సమీపంలో మంగళవారం ఎస్సై వంశీకృష్ణ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి రెండు బ్యాగులతో అనుమానాస్పదంగా సంచరిస్తున్నా డు. దీంతో అదుపులోకి తీసుకుని అతడి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా 10 ప్యాకెట్లలో 9.418 కిలోల సుమారు రూ. 4,70,900 విలువైన ఎండుగంజాయి లభించింది. ఉత్తర్ప్రదేశ్కు చెందిన షోయబ్ఖాన్ మరో వ్యక్తి నుంచి కొనుగోలు చేసి సంగెం–గీసుకొండ మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులకు అధిక ధరలకు విక్రయించేందుకు తీసుకున్నట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో అరెస్ట్ చేసి కోర్టులో హజరు పరిచినట్లు తెలిపారు. కాగా, ఎస్సై వంశీకృష్ణ, హెడ్కానిస్టేబుల్ బాబు, కానిస్టేబుళ్లు శ్రవణ్, నవీన్, పాష, వీరన్న, రాజును సీఐ అభినందించారు. వ్యక్తి అరెస్ట్, రిమాండ్ -
దూరవిద్య డిగ్రీ , పీజీ అడ్మిషన్లకు నోటిఫికేషన్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య (సీడీఓఈ/ఎస్డీఎల్సీఈ)లో 2026–2027 విద్యాసంవత్సరంలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు దూరవిద్య కేంద్రం డైరెక్టర్ బి. సురేశ్లాల్ బుధవారం తెలిపారు. ఈనెల 1 నుంచి సెప్టెంబర్ 15వ తేదీవరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కేయూ దూరవిద్య వెబ్సైట్లో కోర్సులు, వ్యవధి, విద్యార్హతలు, బోధనామాధ్యమం, అర్హతలు, ఫీజుల వివరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో నిర్ణీత ఫీజులు చెల్లించి అడ్మిషన్లు పొందాలని ఆయన కోరారు. పట్టాలిచ్చే వరకూ పోరాడతాం న్యూశాయంపేట : పేదల ఇళ్ల స్థలాలకు పట్టాలిచ్చే వరకు పోరాటాలు కొనసాగిస్తామని వామపక్ష పార్టీల నేతలు స్పష్టం చేశారు. బుధవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వామపక్షాల ఆందోళనతో కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణం దద్దరిల్లింది. అంతకుముందు సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ(యూ) సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, లిబరేషన్ పార్టీల ఆధ్వర్యంలో ఏకశిలపార్క్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నాయకులు, కార్యకర్తలు బైఠాయించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్బాషుమియా, సీపీఎం జిల్లా కార్యదర్శి రంగయ్య, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, న్యూడెమోక్రసీ నాయకులు గంగుల దయాకర్, యాదగిరి, రవీందర్, శరత్, కుమారస్వామి తదితర నాయకులు పాల్గొన్నారు. -
చెట్ల కొమ్మలు నరకడం ఇక సులువు
హన్మకొండ: చెట్ల కొమ్మలు నరకడం ఇక నుంచి సులువు కానుందని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. చెట్ల కొమ్మలు నరకడం కోసం సమకూర్చిన హైడ్రాలిక్ బకెట్ ల్యాడర్ వాహనాన్ని బుధవారం హనుమకొండ బాలసముద్రంలో ప్రారంభించారు. అనంతరం ల్యాడర్ ద్వారా కొమ్మల నరికివేతను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్రెడ్డి మాట్లాడుతూ లైన్ల పైకి చెట్ల కొమ్మలు విస్తరించి తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. సులువుగా, వేగంగా చెట్ల కొమ్మలు తొలగించేందుకు ఈ వాహనాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం హనుమకొండ సర్కిల్కు సమకూర్చామని, వరుసగా అన్ని సర్కిళ్లకు విస్తరిస్తామన్నారు. వర్షాకాలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినా వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేలా అన్ని బృందాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్రావు, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సీఈలు కె.తిరుమల్రావు, రాజుచౌహాన్, అశోక్, హనుమకొండ ఎస్ఈ బి.సామ్యనాయక్, డీఈలు జి.సాంబరెడ్డి, మల్లికార్జున్, అనిల్కుమార్, భాస్కర్, ఏడీఈ రాజు, ఏఈ ప్రవీణ్, లైన్మెన్ మల్లికార్జున్, సిబ్బంది శౌర్య, సదానందం, వంశీధర్, సిద్ధిరెడ్డి, రాంరెడ్డి, వినయ్, నరేశ్ పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హైడ్రాలిక్ బకెట్ ల్యాడర్ సేవలకు శ్రీకారం -
క్యాన్సర్ విభాగంలో కరువైన రేడియేషన్
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని క్యాన్సర్ విభాగంలో రేడియేషన్ సేవలు కరువయ్యాయి. గతేడాది నుంచి పేషంట్లు రేడియేషన్ చికిత్స చేయించుకోలేకపోతున్నారు. దీనికోసం హైదరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రి, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా పాతకాలం నాటి కోబాల్ట్ పరికరం సోర్స్ లేకపోవడంతో అదిమూలన పడి ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని రిపేర్ చేసేందుకు టెక్నీషియన్లు హైదరాబాద్ నుంచి రావాల్సి ఉండగా జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. దీంతో కోబాల్ట్ క్యాన్సర్ రేడియేషన్ పరికరం మరమ్మతుకు నోచుకోవడం లేదు. అయితే, అధునాతన పరికరంతో రేడియేషన్ సేవలు అందించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డిపార్ట్మెంట్లో ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లతోపాటు ఒకరు కాంట్రాక్టుపై విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల హెచ్ఓడీ స్థానంలో ఉన్న ప్రొఫెసర్ డిప్యుటేషన్పై హైదరాబాద్కు వెళ్లారు. వైద్య సిబ్బంది కొరత లేకున్నా రేడియేషన్ చికిత్స లేకపోవడం ఇబ్బందిగా మారుతోంది. పేషంట్లకు అందుతున్న కీమోథెరపీ సేవలు.. రేడియేషన్ చికిత్స సౌకర్యం లేకున్నా పేషంట్లకు మెడికల్, కీమోథెరపీ సేవలు రెగ్యులర్గా అందుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక దశలో ఉన్న క్యాన్సర్ పేషంట్ల కోసం ప్రత్యేక మెడికల్ సేవలతోపాటు కీమోథెరపీ చికిత్స అందిస్తున్నారు. దీనివల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేషంట్లకు ఉపశమనం కలుగుతోంది. రేడియేషన్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని పేషంట్లు కోరుతున్నారు. -
వాగు వద్ద భద్రత పెంచాలి
జంపన్న వాగు పవి త్రంగా భావించి వేలా ది మంది భక్తులు పు ణ్యస్నానాలు ఆచరి స్తారు. భక్తుల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉంది. వాగులో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో వాగులోకి దిగకుండా భక్తులను మైకుల ద్వారా అప్రమత్తం చే యాలి. భక్తులు కూడా నీటి లోతు తెలియని ప్రాంతాల్లో స్నానాలకు దిగకుండా జాగ్రత్తలు పాటించాలి. అధికారులు భద్రతా ఏర్పా ట్లు కల్పిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చు. – సిద్ధబోయిన స్వామి, సమ్మక్క పూజారి, మేడారం -
జంపన్న వాగులో భద్రతేది?
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలోని జంపన్న వాగులో భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రతీ వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండడంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినప్పటికీ పుణ్యస్నానాల కోసం వాగులోకి దిగుతున్న భక్తులు నీటిలోతు అంచనా వేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రతీ ఏడాది ఏదో ఒక చోట మునిగి పలువురు మరణిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శాశ్వత భద్రతా చర్యలు మాత్రం కనిపించడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం, సెలవు రోజులు, వారాంతంలో మేడారానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చాలామంది కుటుంబ సమేతంగా జంపన్న వాగులో స్నానాలు ఆచరిస్తుంటారు. వాగులో లోతైన గుంతలు, వేగవంతమైన వరద ప్ర వాహం గురించి అవగాహన లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. జనవరి నుంచి జూన్ నెల వరకు సు మారు ఆరుగురు భక్తులు జంపన్నవాగులో మునిగి ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.. వాగులో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి స్పష్టమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు ఏర్పాటు చేయాలని భక్తులు సూచిస్తున్నారు. వర్షాకాలం పూర్తయ్యే వరకు వాగు వద్ద గజ ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, లైఫ్ జాకెట్లు, లైఫ్ బోయ్లు, ప్రథమ చికిత్స సౌకర్యాలను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలని కోరుతున్నారు. వరద ప్రవాహం అధికంగా ఉన్న సమయంలో మైకుల ద్వారా భక్తులను అప్రమత్తం చేయడంతో పాటు పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జంపన్న వాగు పవిత్రతతో పాటు భక్తుల ప్రాణ భద్రత కూడా అంతే ముఖ్యమని, ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందస్తు చర్యలే శాశ్వత పరిష్కారమని వారు అభిప్రాయపడుతున్నారు. లోతు తెలియక మునిగి పలువురు భక్తుల మృతి హెచ్చరిక బోర్డులు, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి -
పెళ్లింట విషాదం
హసన్పర్తి: పెళ్లికి ఏర్పా టు చేసిన ఫ్లెక్సీని తొలగిస్తున్న తండ్రీ కొడుకులు విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమారంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భీమారానికి చెందిన ఉప్పు సాంబయ్య (62) రిటైర్డ్ ఉద్యోగి. ఆయనకు భార్య రమాదేవి, ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు శరత్ (32) వివాహం వారం రోజుల క్రితం జరిగింది. పెళ్లిని పురస్కరించుకుని ఇంటి ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మంగళవారం చినుకులు కురవడంతో సాంబయ్య ఆ ఫ్లెక్సీ తొలగించడానికి ఉపక్రమించాడు. దీంతో అతడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. తండ్రిని రక్షించడానికి వెళ్లిన శరత్ కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇద్దరినీ చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. -
రైలింజన్లో సాంకేతిక లోపం
● పలు స్టేషన్లలో నిలిచిపోయిన రైళ్లు డోర్నకల్: రైలింజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో మంగళవారం పలు రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచాయి. వివరాలిలా ఉన్నాయి. నాగవల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్(20809) రైలు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గుండ్రాతిమడుగు స్టేషన్ సమీపించగానే ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో రైలు స్టేషన్లో నిలిచింది. దీంతో మనర్గుడి–జోద్పూర్ ఎక్స్ప్రెస్, కేఎస్ఆర్ బెంగళూరు–దానాపూర్ ఎక్స్ప్రెస్ డోర్నకల్ రైల్వే స్టేషన్లలో సుమారు 40 నిమిషాల పాటు నిలిచాయి. భద్రాచలంరోడ్–సికింద్రాబాద్ కాకతీయ ఎక్స్ప్రెస్ డోర్నకల్ సమీపంలోని బ్రాంచ్లైన్లో గంట సేపు నిలవగా, తమిళనాడు, సహారా, ఏపీ ఎక్స్ప్రెస్ రైళ్లు పలు స్టేషన్లలో నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మామను బాత్రూంలో నిర్బంధించిన కోడలు● కుటుంబ, ఆస్తి తగాదాలే కారణం నర్సంపేట రూరల్: స్నానం కోసం బాత్రూంకు వెళ్లిన మామ బయటకు రాకుండా కోడలు గడియపెట్టిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో మంగళవారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేటలోని వరంగల్ రోడ్డులో రంగారెడ్డి నివసిస్తున్నాడు. అయితే, ఆయనకు తన కోడలు డాక్టర్ నవతతో ఆస్తి, కుటుంబ తగాదాలున్నాయి. స్నానానికి బాత్రూంకు ఆ యన వెళ్లగా కోడలు బయట గడియపెట్టి నిర్బంధించింది. దీంతో రెండు గంటలు బయటకు రాలేకపోయాడు. ఆయన అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వచ్చి రంగారెడ్డిని బాత్రూం నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ తెలిపారు. కాశిబుగ్గ: డాక్టర్స్ డే సందర్భంగా వరంగల్ ఐఎంఏ ఆధ్వర్యంలో నగరానికి చెందిన 10 మంది ఉత్తమ డాక్టర్లను ఎంపిక చేశారు. వరంగల్ ఐఎంఏ హాల్లో బుధవారం రాత్రి 8 గంటలకు వారిని సన్మానించి ఉత్త మ డాక్టర్ అవార్డులు అందజేయనున్నారు. ఎస్.గోపినాఽథ్, ఎ.అప్ప య్య, బి.రాధాకృష్ణ, ఎం.పుల్లారెడ్డి, జి.చంద్రశేఖర్, బేతి కవిత, పి.అశోక్కుమార్, జలగం మాధవి, అజిత్ మహ్మద్, జలగం కావ్యారావు ఉత్తమ డాక్టర్ అవార్డులు అందుకోనున్నారు. ముఖ్య అతిథిగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ పి.కాళీప్రసాద్, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి.విజయ్చందర్రెడ్డి, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్దాస్, ఎంజీఎం ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.రాంకుమార్రెడ్డి, డీఎంహెచ్ఓలు డాక్టర్ ఎస్డీ రాంకుమార్, డాక్టర్ బి.సాంబశివరావు, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.నాగార్జునరెడ్డి పాల్గొంటారు. మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం వరంగల్ అర్బన్: వేధింపులు తాళలేక ఓ మహిళా ఉద్యోగి సోమవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో కలకలం రేపింది. వివరాలిలా ఉన్నాయి.. ఏడాది క్రితం నర్సంపేట మున్సిపాలిటీ నుంచి శాశ్వత ఉద్యోగి శ్రుతి వరంగల్ బల్దియాకు బదిలీపై వచ్చి డిప్యుటేషన్పై ఇన్వార్డు సెక్షన్లో విధులు నిర్వర్తిస్తోంది. ఇన్వార్డులో నమోదవుతున్న ఫైళ్లను సకాలంలో ఆయా విభాగాలకు పంపించకపోవడంతో అదనపు కమిషన్ ఇసంపల్లి జోనా, సీ–1 సూపరింటెండెంట్ ఆనంద్.. ఇన్వార్డు సెక్షన్ సిబ్బందిని సోమవారం పిలిచి క్లాస్ తీసుకున్నారు. కొత్త కమిషనర్ ఫైళ్లపై సమీక్షిస్తే ఏం సమాధానం చెబుతారని మందలించినట్లు తెలిసింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన శ్రుతి నర్సంపేట మండలంలోని తన ఇంటికి వెళ్లి అల్లోపతి మాత్రలను మింగింది. కుటుంబ సభ్యులు ఆమెను నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఓ వీడియోలో తన ఆవేదన వెళ్లగక్కింది. తాను మాత్రమే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిసున్నానని, అక్కడి నుంచి అంతర్గత బదిలీ చేస్తామంటూ బెదరింపులకు పాల్పడడంతో ఇంట్లో ఉన్న అల్లోపతి మాత్రలను మింగినట్లు వెల్లడించింది. సీ–1 సూపరింటెండెంట్ ఆనంద్, అటెండర్ చందన తనపై కక్షపూరితంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం శ్రుతి ఆరోగ్య పరిస్థితి కుదుటపడినట్లు తెలిసింది. ఈ విషయంపై బల్దియా కమిషనర్ వెంకన్న మంగళవారం ఆరా తీశారు. సీ–1 సూపరింటెండెంట్ ఆనంద్ వివరణ సమర్పించినట్లు తెలిసింది. ఈ ఘటనపై అడిషనల్ జోనా, సూపరింటెండెంట్ ఆనంద్ను వివరణ కోరగా వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించడం తగదని, బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించినట్లు తెలిపారు. ఇదేకాకుండా సీ–1 సెక్షన్ సూపరింటెండెంట్ ఆనంద్ తన వద్ద డబ్బులు డిమాండ్ చేశారని ఇటీవల తొర్రూరు మున్సిలిటీ హెల్త్ అసిస్టెంట్ వాయిస్ రికార్డు చేసిన సంఘటన వైరల్గా మారింది. మామునూరులో చైన్స్నాచింగ్మామునూరు: మామునూరులో మంగళవారం చైన్స్నాచింగ్ జరిగింది. పోలీ సుల కథనం ప్రకారం.. మామునూరుకు చెందిన రిటైర్డ్ హెడ్కానిస్టేబుల్ గుండు నాగభూషణం మంగళవారం ఉదయం 5.30 గంటల సమయంలో వాకింగ్ చేస్తుండగా కారులో వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు నాగభూషణంపై అకస్మికంగా దాడి చేశారు. మెడలోని రెండు తులాల బంగారు చైన్ను లాక్కుని పరారయ్యారు. నాగభూషణం స్వల్పంగా గాయపడగా స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మామునూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కాగా, మరో రెండు రోజుల్లో కుమారుడి వివాహం ఉంది. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలందించాలి
కాశిబుగ్గ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలందించి, ప్రజల్లో మరింత విశ్వాసం పెంచే విధంగా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద తెలిపారు. మంగళవారం వరంగల్లోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది హాజరు, పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని, వారికి అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం వైద్యాధికారులు, వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రి తనిఖీ సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఓ వైద్యుడికి, ఏఎన్ఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. సూపరింటెండెంట్ డాక్టర్ జీఎస్కే ధర్మరాజు, అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.అనసూర్య, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, లేబర్కాలనీలోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలను కలెక్టర్ సందర్శించారు. కళాశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుతూ, విద్యార్థులకు అంకితభావంతో విద్యాబోధన చేయాలని సూచించారు. మిషన్ ఎయిడ్స్ సురక్షను విజయవంతం చేయాలి న్యూశాయంపేట: జాతీయ స్థాయిలో లక్ష్య సాధన దిశగా మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కళను భావితరాలకు అందించాలి హన్మకొండ కల్చరల్: కళను భావితరాలకు అందించాలని, పేరిణి నాట్యం భారతదేశ సాంస్కృతిక వారసత్వంలో ఒక అమూల్యమైన సంపదని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం వరంగల్కు చెందిన నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ నాట్యచార్యులు, పేరిణి ప్రవీణ గజ్జెల రంజిత్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పేరిణి నాట్య గురుశిష్య పరంపర నాట్యోత్సవం –2026 కార్యక్రమ వాల్పోస్టర్ను కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గజ్జెల రంజిత్కుమార్, ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల పేరిణి నాట్య అధ్యాపకురాలు చాతరాజు నవ్యజ, పేరిణి కళాకారులు గడ్డం విద్యాశ్రీ, తోడెన్గా సంతోష్, తొడసం గురుదేవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఈనెల 18న ఉదయం 10 గంటలకు హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నాట్యోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
రైలు భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం..
రైలు పట్టాల వెంట నిఘా పెట్టాం. రైలుపై రాళ్లు విసిరితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం. పట్టాల సమీప కాలనీల ప్రజలు నిరంతరం రైలు భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం. పశువులను వదిలేయడం, రైలు ట్రాక్ నుంచి మరో ట్రాక్పై వెళ్లినా, పట్టాలపై చిన్నపిల్లలు ఆటలు ఆడటం అత్యంత ప్రమాదకరం. వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నాం. రైలు భద్రత ప్రయాణికులు, ప్రజల భద్రత అని అవగాహన కల్పిస్తున్నాం. – శ్రీనివాస్గౌడ్ ఇన్స్పెక్టర్ ఆర్పీఎఫ్ వరంగల్ -
ఉపయోగపడే పరిశోధనలు చేయాలి
● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంకేయూ క్యాంపస్: సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం అన్నారు. ద్రవిడియన్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘అండర్ స్టాండింగ్ డ్రవిడియన్ సొసైటీ అండ్ పాలిటిక్స్’ అనే పుస్తకాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈఏడాది మే 9, 10 తేదీల్లో నిర్వహించిన సదస్సుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ను పుస్తకం రూపంలోనికి తీసుకురావడం ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. కార్యక్రమంలో పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతి డాక్టర్ కృష్ణయ్య, పీవీ నర్సింహారావు నాలెడ్జ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వడ్లకొండ సత్యనారాయణ, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాలాకుల కొమురయ్య, ద్రవిడ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నాగరాజు, ఉపాధ్యక్షుడు సోమలింగం, సహాయ కార్యదర్శి నరేష్కుమార్, కోశాదికారి డాక్టర్ ప్రశాంత్, కార్యవర్గసభ్యులు సురేష్, లీలావతి, పరిశోధక విద్యార్థిని రుబీనా పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ ఇల్లు ముట్టడి ● రాంనగర్లో అడ్డుకున్న పోలీసులు ● వినతిపత్రం స్వీకరించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావుహన్మకొండ: తమకు నెలకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించారు. మంగళవారం హనుమకొండలోని మున్సిపల్ గెస్ట్హౌస్ నుంచి సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ర్యాలీగా హనుమకొండ రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడికి బయలుదేరారు. సమాచారం అందుకున్న పోలీసులు కొండా సురేఖ ఇంటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించారు. సీఐటీయూ నాయకులు, మున్సిపల్ కార్మికులు ర్యాలీగా చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు అక్కడకు చేరుకుని ఆందోళనకారులనుంచి వినతి పత్రం స్వీకరించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేశ్, సీఐటీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు టి.ఉప్పలయ్య, నాయకులు బొట్ల చక్రపాణి, ఆర్.కోటీశ్వర్, బరుపట్ల మహేష్, వై.బాబు, మున్నంగి రఘు, ఎర్ర నరేష్, కొట్టే మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
మేడారం హుండీ ఆదాయం రూ.63,70,531
ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెలపై ఏర్పాటు చేసిన హుండీల ద్వారా 99 రోజుల్లో రూ.63,70,531 ఆదాయం సమకూరినట్లు మేడారం ఈఓ వీరస్వామి తెలిపారు. ఈ ఏడాది మార్చి 24 నుంచి జూన్ 30 వరకు గద్దెలపై ఉంచిన మొత్తం 40 హుండీల్లోని కానుకలను మంగళవారం మేడారంలోని ఎండోమెంట్ డార్మెటరీ భవనంలో పూజారుల సమక్షంలో లెక్కించారు. ఇందులో సమ్మక్క హుండీ ఆదాయం రూ.34,05,959, సారలమ్మ హుండీ ఆదాయం రూ.25,59,430, గోవిందరాజు హుండీ ఆదాయం రూ.2,26,266, పగిడిద్దరాజు హుండీ ఆదాయం రూ.1,78,876 వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, సూపరింటెండెంట్ క్రాంతి, ఇన్స్పెక్టర్ అనిల్, పూజారులు కాక వెంకటేశ్వర్లు, కిరణ్, సారయ్య, మునీందర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు. ‘భద్రకాళి’ ఆదాయం రూ.85,03,997 హన్మకొండ కల్చరల్ : భద్రకాళి దేవాలయంలోని హుండీల్లోని కానుకలను లెక్కించగా.. రూ.85,03,997 ఆదాయం సమకూరినట్లు అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ రామల సునీత తెలిపారు. మూడు నెలల ఆరు రోజుల్లోలకు సంబంధించి కానుకను మంగళవారం యూనియన్ బ్యాంక్లో జమ చేసినట్లు తెలిపారు. 200 యూఎస్ఏ డాలర్లు, 260 కెనడా డాలర్లు, 30 యూఏఈ దిరమ్స్, 30 ఇంగ్లండ్ పౌండ్స్, 300 ఓమన్, 2 సింగపూర్ డాలర్లు భక్తులు హుండీల్లో వేసినట్లు గుర్తించామని తెలిపారు. లెక్కింపు కార్యక్రమానికి పర్యవేక్షాణాధికారిగా దేవాదాయ ధర్మాదాయశాఖ వరంగల్ ఉప కమిషనర్ కార్యాలయ పర్యవేక్షకులు గౌరీశంకర్ వ్యవహరించారు. అర్చకులు భద్రకాళిశేషుతోపాటు ఆలయసిబ్బంది, శ్రీలక్ష్మి శ్రీనివాస సేవా ట్రస్ట్ అధ్యక్షుడు జి.కృష్ణారెడ్డి, శ్రీలక్ష్మి వెంకటేశ్వర సేవా సమితి జి.నవీన్, 200 మంది సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు. -
వీధి వ్యాపారుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
వరంగల్ అర్బన్ : వీధి వ్యాపారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని హనుమకొండ కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ పేర్కొన్నారు. మంగళవారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో జీడబ్ల్యూఎంసీ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సంయుక్త ఆధ్వర్యంలో స్వనిధి మహోత్సవ్–2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జీడబ్ల్యూఎంసీ పరిధిలో సుమారు 48 వేల మంది స్ట్రీట్ వెండర్లు నమోదయ్యారని, కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి ఎప్పటికప్పుడు నమోదు అవకాశం కల్పిస్తూ, జాబితాను నిరంతరం నవీకరించాలని అధికారులకు సూచించారు. అంబేడ్కర్ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీధి వ్యాపారులు, మహిళా సంఘాల వివిధ ప్రదర్శన స్టాల్స్ను కలెక్టర్ సందర్శించారు. అనంతరం రుణాలు అందించిన బ్యాంకర్లు, వీధి వ్యాపారులను సన్మానించారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఎల్డీఎం మహేందర్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నవీన్ కుమార్, డీఎంసీ రజిత రాణి, టీఎంసీలు రమేష్ తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలిహన్మకొండ అర్బన్: జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను గడువులోగా మంజూరు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెట్టుబడులను ఆకర్షించేలా అనుకూల వాతావరణం కల్పించాలని, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ప్రధాన నిర్వాహకుడు నవీన్ కుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ -
శిక్ష పడుతుందనే భయం కలగాలి
వరంగల్ క్రైం : నేరం చేస్తే కోర్టులో శిక్ష పడుతుందనే భయాన్ని నిందితులకు కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ కేసుల్లో నిందితులు పాల్పడిన నేరాలను కోర్టు నిరూపించి నేరస్తులకు శిక్ష పడటంలో కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పాటు దర్యాప్తు అధికారులు, కోర్టు విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందిని సీపీ అభినందిస్తూ మంగళవారం ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. గతేడాది నుంచి నేటివరకు కమిషనరేట్ పరిధిలో మొత్తం 41 కేసుల్లో నిందితులు పాల్పడిన నేరాలకు కోర్టులో శిక్షలు అమలయ్యాయని తెలిపారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ రాము, ఏసీపీలు డేవిడ్రాజు, సతీశ్బాబు, సదయ్య, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శ్రీనివాస్, సంతోషి, రవి కిరణ్, హరిచంద్ర ప్రసాద్, బృందా దేవి, దుర్గాబాయి, రాజమల్లారెడ్డి, శ్రీధర్ రెడ్డి, రవీందర్ రావు, కిరణ్ కుమార్, నీజర, ఇన్స్పెక్టర్లు సంజీవ్ రావు, మల్లయ్య పాల్గొన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ఉద్యోగ విరమణ అనంతరం పోలీస్ అధికారులు తమ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులను కమిషనర్ మంగళవారం ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అదనపు డీసీపీలు సురేష్కుమార్, శ్రీనివాస్, ఏసీపీలు అంతయ్య, సురేంద్ర, ఆర్ఐలు సతీష్, స్పర్జన్ రాజ్, హనుమకొండ ఇన్న్స్పెక్టర్ శివకుమార్, ఆర్ఎస్ఐ శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ -
పీహెచ్డీ రెన్యువల్ ఫీజు తగ్గించాలి
కేయూ క్యాంపస్: పీహెచ్డీ రెన్యువల్ ఫీజు తగ్గించాలని పరిశోధక విద్యార్థులు మంగళవారం రిజిస్ట్రార్ వి.రామచంద్రంను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెన్యువల్ ఫీజు పెంచడంతో విద్యార్థులపై భారం పడుతోందని పేర్కొన్నారు. పరిశోధక విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉపకార వేతనాలు అందడం లేదని, రెన్యువల్ ఫీజు తగ్గించి, ఫీజు చెల్లింపునకు గడువు పెంచాలని కోరారు. విద్యార్థులు కలకోట్ల సుమన్, డి.తిరుపతి, బొస్క నాగరాజు, మహబూబ్పాషా, మంద శ్యాం, చందు, గణపాక సురేశ్, గుగులోత్ శ్రీనివాస్ ఉన్నారు. న్యూశాయంపేట : హనుమకొండ, జనగామ జిల్లాల అటవీ శాఖ అధికారిగా జి.ముకుందారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు డీఎఫ్ఓగా విధులు నిర్వహించిన లావణ్యను మహబూబాబాద్ డీఎఫ్ఓగా బదిలీ చేశారు. హనుమకొండ జిల్లా డీఎఫ్ఓగా ముకుందారెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది. నయీంనగర్ : రోడ్లు, భవనాల శాఖ హనుమకొండ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్గా పి.సురేశ్బాబు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను సమన్వయం చేసుకొని రోడ్లు, భవనాల శాఖ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. హన్మకొండ : ప్రయాణికుల సలహాలు, సూచనలు పరిశీలించి పరిష్కరిస్తామని ఆర్టీసీ వరంగల్–2 డిపో మేనేజర్ రవిచందర్ తెలిపారు. మంగళవారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 13 ఫోన్ కాల్స్ స్వీకరించారు. ప్రయాణికుల సమస్యలు నమోదు చేసుకున్నారు. కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని జిల్లా అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ సందర్శించారు. మంగళవారం సూపరింటెండెంట్ చాంబర్లో సమావేశమయ్యారు. ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరం క్యాంపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై సమీక్షించారు. ఆయన వెంటన ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్రెడ్డి తదితరులు ఉన్నారు. ఖిలా వరంగల్: జిల్లాలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 1,671 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు (పీపీబీఎస్) పథకానికి అనుసంధానం చేయబడ్డాయన్నారు. రైతులు తమ క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ)ను సంప్రదించి ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా జిరాక్స్లను జూలై 5వ తేదీలోపు అందించాలన్నారు. న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో పైచదువుల కోసం అందించే సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తుల గడువు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి రమేశ్, హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ మైనార్టీ సంక్షేమాధికారి మేన శ్రీను మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయాల్లో సంప్రదించాలన్నారు. -
జవాబుదారీతనం పెరగాలి
● గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న వరంగల్ అర్బన్: పారిశుద్ధ్య నిర్వహణలో జవాబుదారీతనం పెరగాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న అధికారులను హెచ్చరించారు. మంగళవారం ఉదయం 34వ డివిజన్ పరిధిలోని శివనగర్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం స్థానిక వార్డు కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా చూడాలని ఆదేశించారు. సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జి సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, శానిటరీ సూపర్వైజర్లు భాస్కర్, గోల్కొండ శ్రీను పాల్గొన్నారు. -
రైళ్లతో ఆటలొద్దు.. జాగ్రత్త
ఖిలా వరంగల్: రైలు ప్రయాణాన్ని మరింత సురక్షి తం చేయడానికి, వ్యవస్థను అస్తవ్యస్తం చేసేవారి ఆగడాలను నియంత్రించడానికి వరంగల్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైల్వే సిగ్నల్ వ్యవస్థతో చెలగాటమాడినా, రైలు పట్టాలపై పశువులను నిర్లక్ష్యంగా వదిలేసినా, రైలు పట్టాల వెంట పిల్లలు, ప్రయాణికులపై రాళ్లు రువ్వినా, కాలనీల ప్రజలు అజాగ్రత్తగా దాటేందు కు ప్రయత్నించినా, అనవసరంగా అలారం గొలు సు లాగినా, చట్టపరంగా కఠిన చర్యలుంటాయని తాజాగా వరంగల్ ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరికలు జారీ చేశారు. సిగ్నల్ వ్యవస్థ సున్నితం.. రైళ్ల రాకపోకలను నియంత్రించే సిగ్నల్ వ్యవస్థ అత్యంత సున్నితమైంది. కొన్నిచోట్లా కొంతమంది ఆకతాయిలు, దుండగులు తెలిసీతెలియక తీగలను ధ్వంసం చేస్తారు. దీంతో లోకో పైలట్లకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఏర్పడుతుంది. దీని వల్ల రెండు రైళ్లు ఒకే ట్రాక్పైకి వచ్చే ప్రమాదం ఉంది. అలా చేయడం వందలాది మంది ప్రాణాలను ఫణంగా పెట్టడమేనని అంటున్నారు. అనవసరంగా చైన్ లాగితే నేరం.. ప్రయాణ సమయంలో రైలును అత్యవసరం వేళ ఆపడానికి ప్రతి బోగీలోనూ అలారం చైన్ ఉంటుంది. దీనిని అనవసరంగా లాగితే జరిమానాతోపాటు జైలు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. చర్యలు ఇలా.. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 141 ప్రకారం తొలిసారి నేరం చేస్తే రూ.వెయ్యి వరకు జరిమానా, ఏడాదిపాటు జైలు శిక్ష, పదే పదే అదే తప్పుచేస్తే జరిమానాతోపాటు శిక్ష తీవ్రత పెరుగుతుంది. రైలు ఆగి, కదలడానికి అవసరమైన వ్యయాన్ని వసూలు చేస్తారు. ఇతర రైళ్లు తీవ్ర ప్రభావానికి గురైతే బాధ్యుడిపై అదనపు జరిమానా విధిస్తారు. జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష విధిస్తారు. చైన్ ఎప్పుడు లాగొచ్చంటే.. ప్రయాణికుల్లో ఎవరికై నా గుండెపోటు, మూర్ఛ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు, ఎవరైనా ప్రయాణికుడికి సమీపంలోని ఏదైనా స్టేషన్లో తక్షణ చికిత్స, మందులు లేదా ఆస్పత్రిలో అడ్మిట్ చేయడం వంటి వైద్య సాయం అవసరమైనప్పుడు, ప్రయాణికులు ముప్పులో ఉన్నప్పుడు, మంటలు, పేలుళ్లు చెలరేగినప్పుడు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు రైలెక్కేటప్పుడు అది కదిలితే, దొంగతనాలు, దోపిడీదారులు దుశ్చర్యలకు పాల్పడినప్పుడు చైన్ లాగాలి. రైలు భద్రత అందరి బాధ్యత పట్టాలపై ఆటలు, పశువులను వదలొద్దు -
ప్రత్యేక సవరణతో ఓటర్ల తొలగింపు
వరంగల్ చౌరస్తా: ప్రత్యేక సవరణ పేరుతో అర్హుల ఓటర్లను తొలగిస్తూ పాలకులు రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక (టీఎస్డీఎఫ్) రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వినాయక రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల హక్కులను కాపాడుకుందాం అనే అంశంపై వరంగల్ అండర్ బ్రిడ్జి ఓంకార్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం ఎన్రెడ్డి హంసారెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ వినాయకరెడ్డి మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.. స్పెషల్ ఇంటెన్సీ రిమూవ్గా మారిందన్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కోట్లాది ఓట్లు గల్లంతయ్యాయని పేర్కొన్నారు. ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి గాద గోని రవి, న్యూ డెమోక్రసీ అధికార ప్రతినిధి జేవి చలపతిరావు, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జూపల్లి జానకి రాములు, ఆరెల్లి కృష్ణ, ఇనాం ఉమ్మడి జిల్లా బాధ్యులు మహమ్మద్ జుబేర్ హమ్, బోళ్ల రామకృష్ణ, ఎలకంటి రాజేందర్ , కన్నం వెంకన్న, రాచర్ల బాలరాజు, సుభాన్, మాస్ సావిత్రి, వల్లపు ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు. టీఎస్డీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వినాయకరెడ్డి -
పెళ్లయిన వారం రోజులకే..
హసన్పర్తి: పెళ్లయిన వారం రోజుల్లోనే నవవరుడిని విద్యుత్ రూపంలో మృత్యువు కబళించింది. తండ్రిని రక్షించడానికి వెళ్లి తండ్రితో పాటు అతడు మృతిచెందిన విషాద సంఘటన నగరంలోని 55వ డివిజన్ భీమారంలో మంగళవారం చోటు చేసుకుంది. భీమారానికి చెందిన ఉప్పు సాంబయ్య (62) ఎఫ్సీఐలో విధులు నిర్వర్తించి రిటైర్డ్ అయ్యాడు. సాంబయ్యకు భార్య రమ, ముగ్గురు కుమారులు శివ కుమార్, రంజిత్ కుమార్, శరత్ కుమార్ (32) ఉన్నారు. పెద్ద కుమారుడు శివకుమార్ కరోనా సమయంలో మృతి చెందగా.. రంజిత్కుమార్, శరత్కుమార్ మాత్రం తండ్రితోనే ఉంటున్నారు. చిన్న కుమారుడు శరత్కుమార్ సీఏ పూర్తిచేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. జూన్ 24న వివాహం.. శరత్కుమార్ పెళ్లి జూన్ 24న నగరానికి చెందిన ఓ యువతితో ఘనంగా జరిగింది. పెళ్లికి వారం ముందు సెలవు పెట్టి వచ్చినట్లు బంధువులు తెలిపారు. శుక్రవారం భీమారంలోని ఓ ఫంక్షన్హాల్లో విందు నిర్వహించారు. కాగా, సోమవారం రాత్రి నవ వధువుతో కలిసి శరత్కుమార్ తన బర్త్డే వేడుకలు నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు. ఫ్లెక్సీ తొలగించే క్రమంలో ప్రమాదం.. పెళ్లిని పురస్కరించుకుని ఇంటి ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మంగళవారం చినుకులు పడడంతో ఆ ఫ్లెక్సీ తొలగిస్తుండగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. తండ్రిని రక్షించే క్రమంలో శరత్కుమార్కు కూడా కరెంట్ షాక్ తగిలింది. ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు మృతిచెందారు. తండ్రి కొడుకుల మృతితో భీమారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యుదాఘాతంతో వరుడి దుర్మరణం తండ్రిని కాపాడే క్రమంలో ఇద్దరి మృతి భీమారంలో విషాదఛాయలు -
కమిషనరేట్ పరిధిలో మరికొన్ని ఘటనలు..
సంవత్సరంవరంగల్ క్రైం: కాపాడాల్సిన వారే కాటేస్తున్నారు. కంటికి రెప్పలా ఉండాల్సిన వారే కామాంధులవుతున్నారు. బుడిబుడి అడుగులేస్తున్న వారి నుంచి మొదలు.. స్కూలు, కాలేజీకి వెళ్లే వారి దాకా అడుగడుగునా లైంగిక వేధింపులు. అఘాయిత్యాలు. చట్టాలు ఎంత కఠినతరం చేసినా చిన్నారులపై పైశాచికత్వం ఆగట్లేదు. ఇలాంటి హృదయ విదారక ఘటనలు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిత్యం వెలుగుచూస్తున్నాయి. కామాంధుల వికృత చేష్టలను తల్లిదండ్రులు, పిల్లలు సైతం గుర్తించలేకపోతున్నారు. పెరుగుతున్న కేసులు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ప్రతియేటా పోక్సో, రేప్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీస్స్టేషన్ వరకు రాని ఘటనలు ఎన్నో ఉన్నాయి. విషయం బయటకు తెలిస్తే అమ్మాయి జీవితం నాశనం అవుతుందని కొందరు తల్లిదండ్రులు.. తండ్రి, తాత, బాబాయ్, ఇలా అయిన వారి నుంచే ప్రమాదం వస్తోందని కుమిలిపోయే చిన్నారులు మరికొందరు. గ్రేటర్ వరంగల్ నగరంలో అనేకం. పోక్సో కేసుల నమోదుపై అవగాహన పెరగడం వల్ల ఫిర్యాదు చేయడానికి తల్లిదండ్రులు ముందుకు రావడంతో కొంతలో కొంతైన బాధితులకు న్యాయం జరుగుతోంది. భరోసా కేంద్రం బాధితులను అక్కున చేర్చుకోని ఓదార్చుతోంది. ‘భరోసా’ఇస్తూ.. కమిషనరేట్లోని ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో పోక్సో కేసులు వేగంగా నమోదు కావడంతో బాధితులు భరోసా కేంద్రానికి వస్తున్నారు. బాధితులకు కావాల్సిన అన్ని రకాల సేవలను భరోసా కేంద్రం అందిస్తోంది. తక్షణమే వైద్య పరీక్షలు చేయించడంతో పాటు నిందితులకు శిక్ష పడే వరకు అన్ని రకాలా అండగా నిలుస్తోంది. కమిషనరేట్ పరిధిలో 2022 నుంచి ఇప్పటి వరకు 45 మందికి శిక్ష పడింది. ఇందులో ఇద్దరికి జీవిత ఖైదు పడగా.. మరికొంత మంది 20 ఏళ్లు జైలు శిక్ష పడింది. జిల్లా మహిళా సంక్షేమ అధికారి నుంచి 587 మంది బాధితులకు రూ.1.84 కోట్ల ఆర్థికసాయం అందింది. జిల్లా న్యాయ సేవా సంస్థ నుంచి 11 మంది బాధితులకు రూ.19.78 లక్షలు ఆర్థిక సాయం అందింది. విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ కింద 87 మంది బాధితులకు రూ. 5.64 లక్షలు అందాయి. భరోసా కేంద్రంలో సత్వర సాయం అందడం వల్ల బాధితులు కొంత ఉపశమనం పొందుతున్నారు. కమిషనరేట్ పరిధిలో తాగిన మైకంలో 12 ఏళ్ల బాలికపై కన్నతండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. పలుమార్లు కడుపున పుట్టిన బిడ్డపై అత్యాచారం చేయడం చూసిన తల్లి ఫిర్యాదు మేరకు కామాంధుడిపై పోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. కోర్టు సుమారు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. పక్కింట్లో జామకాయలు తెచ్చుకునేందుకు వెళ్లిన 12 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఎవరికై నా చెబితే చంపుతానంటూ బెదిరించాడు. తండ్రి లేని చిన్నారి భయంతో తనకు జరిగిన అన్యాయాన్ని ఎవ్వరికి చెప్పుకోలేదు. దీన్ని అదునుగా తీసుకుని పలుమార్లు బలవంతంగా ఆత్యాచారానికి పాల్పడడంతో చిన్నారి గర్భం దాల్చింది. అనారోగ్యానికి గురవడంతో వైద్యులు పరీక్షించి తల్లికి విషయం చెప్పారు. తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది. కోర్టు కామాంధునికి జీవిత ఖైదు విధించింది. మానసికంగా బలహీనురాలైన 16 ఏళ్ల బాలికను వరుసకు చిన్నాన్న ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో అఘాయిత్యం చేశాడు. ఆటోలో ఎక్కించుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడి వదిలేయడంతో ఎక్కడికెళ్లాలో తెలియక నరకం చూసింది. విషయం తల్లికి తెలియడంతో అతడిని జైల్లో పెట్టారు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో అక్క ఇంట్లో తలదాచుకున్న 15 ఏళ్ల అమ్మాయిపై బావ తమ్ముడు బెదిరింపులకు పాల్పడి అత్యాచారం చేశాడు. అక్క ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది. నిందితుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న పోక్సో కేసులు అభంశుభం తెలియని చిన్నారులపై పైశాచికత్వం శిక్షలు పడుతున్నా తగ్గని ఘోరాలు బాధితులకు అండగా భరోసా కేంద్రం -
సమాజ అభివృద్ధిలో ‘బాలవికాస’
కాజీపేట రూరల్ : సమాజ అభివృద్ధి, సామాజిక పరివర్తనలో బాలవికాస అందిస్తున్న సేవలు అభినందనీయమని ‘కుడా’ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి పేర్కొన్నారు. కాజీపేట ఫాతిమానగర్ బాలవికాస పీటీడీసీ సెంటర్లో బాలవికాస, విశ్వయువక్ కేంద్రం న్యూఢిల్లీ సంయ్తుకంగా నిర్వహిస్తున్న జాతీయ వర్క్షాప్ ముగింపులో మంగళవారం మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుపై అనే అంశంపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ వెంకట్రామ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో 8 రాష్ట్రాల్లో 8 వేలకు పైగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ 80 లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూరుస్తున్న బాలవికాస సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని ఆయన కొనియాడారు. హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్డీ రాంకుమార్ మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం, మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన, సామర్థ్యాభివృద్ధి ప్రాముఖ్యతను వివరించారు. ప్రభుత్వం మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వివిధ చర్యలు చేపడుతున్నా బాలవికాస వంటి సంస్థలు నిర్వహించే అవగాహన కార్యక్రమాలు గ్రామీణ స్థాయి పరివర్తనలో మార్పు తీసుకురావడానికి ఎంతో దోహదపడుతాయని అన్నారు. అనంతరం వర్క్షాప్లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో బాలవికాస పీటీడీసీ డైరెక్టర్ సునీతరెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ రవీణ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రమ, ఆఫీసర్ మంజునాథ్ పాల్గొన్నారు. కుడా చైర్మన్ వెంకట్రామ్రెడ్డి -
పాఠశాలల్లో అకడమిక్ తనిఖీలు!
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ ప్యానల్ తనిఖీ బృందాలతో ఈ విద్యాసంవత్సరం 2026–27లోనూ తనిఖీలు చేపట్టనున్నారు. ఈమేరకు ఇటీవల తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈవిద్యాసంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభమై కొనసాగుతుండగా.. తాజాగా అకడమిక్ ప్యానల్ తనిఖీ బృందాలను కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డీఈఓలను ఆదేశించారు. దీంతో డీఈఓలు మళ్లీ తనిఖీ బృందాల ఏర్పాటు కోసం ఉపక్రమించారు. గత విద్యాసంవత్సరంలో తనిఖీ బృందాల్లో బాధ్యతలను నిర్వర్తించిన ఉపాధ్యాయులకు ఆసక్తి ఉంటే ఈసారి అవకాశం కల్పించనున్నారు. లేకపోతే మళ్లీ కొత్తవారికి అవకాశం ఇస్తారు. తనిఖీ బృందంలో పనిచేసేవారు విధులకు దూరం అవుతారు. దరఖాస్తుల స్వీకరణ హనుమకొండ జిల్లాలో అకడమిక్ ప్యానల్ తనిఖీ బృందాలకు 39 మంది ఉపాధ్యాయులు అవసరం ఉండగా.. డీఈఓలు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గత విద్యాసంవత్సరంలో తనిఖీ బృందాల్లో పనిచేసినవారు ఆసక్తి ఉంటే.. సంబంధిత ఎంఈఓల నుంచి సిఫార్సుతోకూడిన సమ్మతి పత్రాన్ని డీఈఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. గత విద్యాసంవత్సరం దరఖాస్తు చేసుకోని ఉపాధ్యాయులు ఈసారి తమ హెచ్ఎంల, ఎంఈఓల ద్వారా తమ దరఖాస్తులను డీఈఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను డీఈఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. పాఠశాల విధులకు దూరం.. తనిఖీ బృందాల విధుల్లో పాల్గొననుండడంతో కొందరు స్కూల్ అసిస్టెంట్లు పాఠశాల విధులకు దూరం కానున్నారు. ఇప్పటికే ప్రభుత్వ, జిల్లా పరిషత్ హైస్కూళ్లల్లో సబ్జెక్టు టీచర్ల కొరత (ఎస్ఏ) ఉండడంతో హైస్కూళ్లలో సబ్జెక్టుల టీచర్ల కొరత ఏర్పడనుంది. ఫలితంగా విద్యాబోధనపై ప్రతికూల ప్రభావం పడనుంది. అడ్మిషన్ల ప్రక్రియ తర్వాతే ఆయా జిల్లాల్లోని పాఠశాలల్లో టీచర్లను సర్దుబాటు కూడా చేస్తారు. 457743795163946437330 ఆసక్తి ఉన్న టీచర్ల కొనసాగింపు మళ్లీ కొత్తగా దరఖాస్తుల స్వీకరణ విధులకు దూరమవుతున్న పలువురు ఉపాధ్యాయులు ఇప్పటికే హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత!బృందాల వివరాలు ఇలా.. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యాబోధన విద్యార్థులు అభ్యసన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులకు సూచనలివ్వడం. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టుల బోధన పరిశీలన. పాఠశాలల సందర్శన సమయాల్లో గమనించిన అంశాల ఆధారంగా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు ఎజెండాను సిద్ధం చేస్తారు. -
నిర్మాణ వ్యర్థాలు.. విలువైన వనరులు
● ఆస్కీ కేంద్ర డైరెక్టర్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి హన్మకొండ అర్బన్: నిర్మాణ వ్యర్థాలు విలువైన వనరులని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) కేంద్ర డైరెక్టర్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఆస్కీ ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణపై శిక్షణలో ఆయన మాట్లాడారు. నిర్మాణ వ్యర్థాలను చెరువులు, రహదారుల పక్కన, ఖాళీ స్థలాల్లో వేస్తే పర్యావరణ, ప్రజారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. వాటిని సేకరించి, వేరు చేసి, తిరిగి ఉపయోగిస్తే సహజ వనరుల పరిరక్షణతోపాటు నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందన్నారు. ఇటుకలు, కాంక్రీట్, రాళ్ల వంటి వ్యర్థాలతో రహదారులు, పేవర్ బ్లాకులు, ఇతర నిర్మాణ సామగ్రిని తయారు చేయవచ్చని వివరించారు. హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ నిర్మాణ వ్యర్థాల నిర్వహణపై ప్రభుత్వ మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న మాట్లాడుతూ నగరంలో నిర్మాణ వ్యర్థాల శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. -
నా భర్త అర్ధరాత్రి మేనమరదలు ఇంటికి వెళ్తాడు..!
హనుమకొండ జిల్లా: తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, అదనపు కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ ఇంటి నుంచి వెళ్లగొట్టాడని ఆరోపిస్తూ తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ఎదుట బైఠాయించి నిరాహార దీక్ష చేపట్టింది ఓ మహిళ. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడులో సోమవారం చోటుచేసుకుంది.బాధితురాలి కథనం మేరకు.. ఐనవోలు మండలం వెంకటాపూర్కు చెందిన శ్రీజకు గుండేడుకు చెందిన డెంగు రాజుతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో కట్నంగా రూ.12 లక్షల నగదు, 16 తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు. పెళ్లైన మూడు నెలల నుంచే భర్త, అత్త తీవ్ర వేధింపులకు గురి చేస్తూ శారీరకంగా, మానసికంగా హింసించారని తెలిపింది.పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు జరగగా, తనదే తప్పు అని ఒప్పుకుని హైదరాబాద్కు తీసుకెళ్లాడని తెలిపింది. అక్కడ మద్యం సేవించి వచ్చి తనను కొట్టేవాడని ఆరోపించింది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని అర్ధరాత్రి సమయంలో బయటకు వెళ్లి వచ్చేవాడని, ఆన్లైన్లో పేకాట ఆడి లక్షల్లో డబ్బులు పోగొట్టుకుని వచ్చి అదనపు కట్నం కోసం వేధిస్తూ పుస్తెల తాడుతో ఉరి బిగించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది.ప్రస్తుతం తన మేనమరదలుతో ఉంటున్నాడని, “నువ్వేం చేసుకుంటావో చేసుకో” అంటూ ఇంట్లోంచి తరిమేశాడని కంటతడి పెట్టుకుంది. సుమారు 20 నెలలుగా తాను పుట్టింట్లోనే ఉంటున్నానని, పోలీసుల వద్దకు పిలిపించినా తనకేమీ ఇవ్వనన్నాడని ఆరోపించింది.ఇచ్చిన కట్నం మొత్తం తమకు తిరిగి ఇచ్చి న్యాయం చేయాలని ఆమె వేడుకుంది. తనకు న్యాయం జరిగే వరకు భర్త ఇంటి ఎదుట నిరాహార దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేసింది. -
వరంగల్: పంట పొలంలో ‘బంగారం’ కలకలం
సాక్షి, వరంగల్: పంట పొలంలో బంగారం కలకలం రేపింది. పంపకాల పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరింది. చెన్నరావుపేట మండలం కోపాకులపాడులో ఈ ఘటన జరిగింది. ప్రతాప్ రెడ్డి అనే రైతుకు చెందిన ఆరు ఎకరాల పంట భూమిని బాలు అనే రైతు కౌలుకు సాగు చేసుకుంటున్నారు. పొలం దున్నుతున్న క్రమంలో బంగారం లభ్యమైంది. దీంతో కూలీలు - కౌలు రైతు మధ్య వాటాల పంచాయితీ మొదలైంది. గతంలో కూడా ఈ పొలంలో బంగారం దొరికిందని ప్రచారం జరుగుతోంది.బయటకు పొక్కడంతో పోలీసుల దృష్టికి బంగారం పంచాయతీ వచ్చింది. తనకు వాటా ఇవ్వాలని ఆరేళ్ల క్రితం భూమి అమ్మిన జైపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పొలంలో మరిన్ని బంగారు నిధులు ఉన్నాయంటూ కౌలు కోసం రైతులు పోటీ పడుతున్నారు. -
ఒత్తిడిని జయించాలి
● ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత ● బాలవికాసలో జాతీయ వర్క్షాప్ ప్రారంభం కాజీపేట రూరల్: నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడిని జయించాలని, ముఖ్యంగా యువత మానసిక ఆరోగ్యం కోసం జాతీయ వర్క్షాప్ వంటివి ఎంతో దోహదపడతాయని హనుమకొండ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత అన్నారు. కాజీపేట ఫాతిమానగర్ బాలవికాస పీపుల్ డెవలప్మెంట్ సెంటర్లో సోమవారం బాలవికాస, విశ్వక్ యువ కేంద్ర, న్యూఢిల్లీ వారి భాగస్వామ్యంతో రెండు రోజుల పాటు జరిగే జాతీయ స్థాయి వర్క్షాప్ను ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రారంభించారు. ‘మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు–ఒత్తిడి నివారణ, మాదక ద్రవ్యాల వ్యసన విముక్తి’ అంశంపై ముఖ్య అతిథిగా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్నేత మాట్లాడుతూ యువతకు శారీరక దృఢత్వం ఎంత ముఖ్యమో, మానసిక దృఢత్వం అంతే ముఖ్యమన్నారు. బాలవికాస పీడీటీసీ డైరెక్టర్ సునీతారెడ్డి మాట్లాడుతూ.. బాలవికాస పీడీటీసీ 24 ఏళ్లుగా ఎన్నో శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు, ఈ జాతీయ వర్క్షాప్లు యువతకు ఎంతో మేలు చేస్తాయన్నారు. బ్రహ్మకుమారి సంస్థకు చెందిన నిపుణులు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో విశ్వక్ యువ కేంద్ర, న్యూఢిల్లీ నుంచి హాజరైన ప్రోగ్రాం ఆఫీసర్ మంజునాథ్, 8 రాష్ట్రాల నుంచి 100 మంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


