Hanamkonda
-
బీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ : బీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్.. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని ఆదేశించారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో బీసీ కమిషన్ విచారణ చేపట్టింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్పీడీసీఎల్లో చేపట్టిన నియామకాలు, రిజర్వేషన్ల అమలు, అభ్యర్థుల ఎంపికపై చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి విచారణ చేపట్టారు. ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా బీసీ సెల్ ఏర్పాటు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ముందుగా హెచ్ఆర్డీ డైరెక్టర్ సి.ప్రభాకర్.. ఎన్పీడీసీఎల్లో అమలు చేస్తున్న రోస్టర్ పాయింట్, రిక్రూట్మెంట్, బ్యాక్ లాగ్ వెకెన్సీపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పని చేసే ఆన్ మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ల గురించి సంస్థ ఆలోచించి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు వినూత్న సేవలు అందిస్తున్నామని, సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యుత్ భద్రతాప్రమాణాలు పాటిస్తున్నామన్నారు. చీఫ్ ఇంజనీర్లు టి.తిరుమల్ రావు, మాధవరావు, జాయింట్ సెక్రటరీ కె.రమేశ్, జీఎంలు శ్రీనివాసరావు, ఎం.హేమంత్ కుమార్, బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడెపాక కుమార స్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు జి.బ్రహ్మేంద్రరావు, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు ఎన్.సదానందం, కార్యదర్శి నీలారపు రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఐలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వెంకటేష్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రంగు సత్యనారాయణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రమాకాంత్, తదితరులు పాల్గొన్నారు. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ను కలిసిన కలెక్టర్.. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కలిశారు. హనుమకొండకు వచ్చిన ఆయనను గురువారం నక్కలగుట్టలోని విద్యుత్ అతిథి గృహంలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. టీజీ ఎన్పీడీసీఎల్లో బీసీ సెల్ ఏర్పాటు చేయాలి తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ -
ఆర్టీసీ వరంగల్ ఆర్ఎంగా భవానీప్రసాద్
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్గా ఎస్.భవానీప్రసాద్ బదిలీపై వస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న దర్శనం విజయభానును అదిలాబాద్ రీజినల్ మేనేజర్గా బదిలీ చేయగా, ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్గా పనిచేస్తున్న భవానీప్రసాద్ను వరంగల్ రీజినల్ మేనేజర్గా నియమిస్తూ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయభానుపై పలు ఆరోపణలు రావడంతో బదిలీ జరిగిందనే ప్రచారం ఆర్టీసీ వర్గాల్లో సాగుతోంది. -
దళిత యువతకు పథకాలు
న్యూశాయంపేట: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత యువతకు ఫేజ్–2 ప్రణాళికలో భాగంగా పలు నూతన పథకాలు అమలు చేయనున్నట్లు వరంగల్ జిల్లా కార్యనిర్వాహక సంచాలకుడు సురేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈవీలు, స్కూటర్లు, ఆటోరిక్షాలు, సోలార్పంపు యూనిట్లు, వ్యవసాయ సంబంధిత డ్రోన్స్, సెరిక ల్చర్, పట్టు పరిశ్రమ చౌకీ కేంద్రం, కిసాన్నర్సరీ, ఆయిల్పామ్, కూరగాయల పందిరి, పాడిగేదెల పథకాల కోసం ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్హులు సరైన ధ్రువపత్రాలతో టీజీఓబీఎంఎంఎస్న్యూ.సీజీజీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో వచ్చేనెల 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు హనుమకొండ సుబేదారిలోని తుషారా స్కూల్ ఎదురుగా ఉన్న కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. భూసేకరణ సమస్యలు పరిష్కరించాలి న్యూశాయంపేట: దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపుహాల్లో జె.చొక్కారావు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూసేకరణ పురోగతిపై గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. నర్సంపేట, దుగ్గొండి, రాయపర్తి, వర్ధన్నపేట, నల్లబెల్లి మండలాల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తిచేయడానికి కార్యాచరణ సిద్ధం చేసి ముందస్తు నివేదికలు సమర్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి.సంధ్యారాణి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, తహసీల్దార్లు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం ● వర్ధన్నపేటలో విషాదం మామునూరు : వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన గొల్లపల్లి భాగ్యలక్ష్మి, కిషన్ దంపతుల కుమారుడు అరుణ్(26) వరంగల్లోని ఓ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. రోజుమాదిరిగానే బైక్పై బుధవారం రాత్రి వర్ధన్నపేట నుంచి వరంగల్ బయలుదేరాడు. ఈక్రమంలో పున్నేల్ క్రాస్ దాటగానే పార్కింగ్ లైట్లు వేయకుండా రోడ్డుపై లారీని నిలిపి డ్రైవర్ వెళ్లిపోయాడు. చీకట్లో కనిపించక బైక్.. లారీని ఢీకొంది. దీంతో అరుణ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సమాచారం అందుకున్న మామునూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. అనంతరం మృతుడి బంధువు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కొనసాగుతున్న లెప్రసీ సర్వేవరంగల్ చౌరస్తా: హనుమకొండ జిల్లాలో ఈనెల 23 నుంచి ప్రారంభమైన ఇంటింటి లెప్రసీ సర్వే విజయవంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ మదన్మోహన్రావు తెలిపారు. జిల్లాలోని అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఆశావర్కర్లు ఇంటింటికీ వెళ్లి లెప్రసీ సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరికై నా శరీరంపై స్పర్శ లేని తెల్లని, ఎర్రని మచ్చలుంటే మీ ఇంటికి వచ్చే ఆశా కార్యకర్తకు చూపించాలని సూచించారు. ఆ మచ్చలు వ్యాధికి సంబంధించినవే అయితే ఉచితంగా చికిత్స ఇస్తామన్నారు. ఈసర్వేలో జిల్లా హెచ్ఈఓ సందెల శ్రీనివాస్, హెచ్ఓ శివ, ఏఎన్ఎం సంధ్య, ఆశాల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బేగం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
క్రమశిక్షణతో చదివితే లక్ష్యానికి చేరువ
హన్మకొండ కల్చరల్ : విద్యార్థులు ప్రణాళికాప్రకారం క్రమశిక్షణతో చదివితే లక్ష్యానికి చేరుకుంటారని, చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేలా విషయ సేకరణ చేసి భద్ర పరచాలని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ వెలుదండ నిత్యానందరావు అన్నారు. గురువారం వరంగల్ హంటర్ రోడ్డులోని జానపద గిరిజన విజ్ఞాన పీఠాన్ని సందర్శించారు. అనంతరం జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశానికి వీసీ నిత్యానందరావు, కేయూ విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ నిత్యానందరావు మాట్లాడుతూ గతంలో పీఠంలో జరిగిన పరిశోధనలు, పొందుపరిచిన పరిశోధనాంశాలను డిజిటలైజేషన్ చేయాలని, అందుకు సహకరిస్తానన్నారు. అనంతరం ఆచార్య అయిలయ్య.. విద్యార్థులకు భాషా ప్రావీణ్యం, సాహిత్యంపై అవగాహన కల్పించారు. పీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న మాట్లాడుతూ వీసీ నిత్యానందరావు విద్యార్థుల కోరిక మేరకు పీఠంలో తగిన సదుపాయాలు కల్పించారన్నారు. జూనియర్ అసిస్టెంట్ అమేర్ అలీఖాన్, పీఠం అసిస్టెంట్ ప్రాఫెసర్లు శ్రీమంతుల దామోదర్, బాసాని సురేశ్, చూరేపల్లి రవికుమార్, అబ్బు గోపాల్రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ గంపా సతీశ్, సిద్దోజు సునంద, గెస్ట్ లెక్చరర్ నోముల రాజు, సిబ్బంది ఆంజనేయులు, అశోక్ , సులోచన, కస్తూరి బాయి, పరిశోధకులు సోనబోయిన సతీశ్, శాంతి, తదితరులు పాల్గొన్నారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వీసీ నిత్యానందరావు వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం సందర్శన -
హజ్ యాత్రికులకు అన్ని సౌకర్యాలు
వరంగల్ చౌరస్తా: హజ్ యాత్రకు వెళ్లే వారికి తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా తెలిపారు. హనుమకొండ జి ల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఎంజీఎం హాస్పిటల్, జిల్లా హజ్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం వరంగల్లోని ఐఎంఏ హాల్ నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఖుస్రూపాషా మాట్లాడుతూ.. యాత్రకు వెళ్లేవారు డాక్టర్స్ ఇచ్చిన సలహాలు తప్పకుండా పాటించాలన్నారు. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. గురువారం 53 మందికి వ్యాక్సిన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా హజ్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ అనీస్ సిద్ధిఖీ, ఎండీ నజీముద్దీన్, జిలానీ, ఇన్చార్జ్ ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ నాగరాణి, డాక్టర్ రెహమాన్, డాక్టర్ రుబీనా అప్రోజ్, జిల్లా మాస్ మీడియా అధికారిఅశోక్ రెడ్డి, జునేది, రమేశ్, శిరీష ప్రవీణ్, రెహమాన్, జమాలుద్దీన్ పాల్గొన్నారు. రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా -
వివాదాల్లో ‘వరంగల్’ పోలీసులు
సాక్షి, వరంగల్: వరంగల్ డివిజన్ పోలీసులు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల తప్పుడు కేసుల్లో ఓ ఏసీపీ, సీఐ, ఎస్సై సస్పెన్షన్ వ్యవహారం మరువకముందే.. ఇప్పుడు మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ ఎస్సై సురేశ్పై వేటు పడింది. మహిళలపై అనుచితంగా ప్రవర్తించడం, కేసుల నమోదులో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు విచారణలో తేలడంతో పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఆయనను సస్పెండ్ చేయడం చర్చనీయాంశమైంది. ఇదే ఠాణాలో పనిచేస్తున్న మరో ఎస్సై కూడా సివిల్ తగాదాల్లో తలదూర్చుతున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. అలాగే, తప్పుడు కేసుల్లో మట్టెవాడ పీఎస్, ఇంతేజార్గంజ్ ఠాణా పరిధిలోనూ ఒకరిద్దరు అధికారులు కేసుల నమోదులో నిర్లక్ష్యంతోపాటు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. ఇలా ఈ మూడు పోలీస్స్టేషన్లలో అవినీతి అధికారుల వైఖరి వివాదాస్పదమవుతోంది. సామాన్యులకు న్యాయం చేయాల్సిన పోలీసులే కట్టు తప్పుతుండడంతో ఇంకా ఎక్కడ న్యాయం జరుగుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కావాలని నమోదుచేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులతోపాటు మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన గొర్రెల దహనం కేసులో నిందితులను పట్టుకోవాలంటూ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గతంలో డీజీపీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇదీ పోలీసువర్గాల్లో పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. వివాదాలు, సస్పెన్షన్లకు కేరాఫ్ మిల్స్కాలనీ పోలీసులు.. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ ఇటీవల వరుస వివాదాలు, అధికారుల సస్పెన్షన్లకు కేరాఫ్ అడ్రస్గా మారింది. సీఐ వెంకటరత్నం గతేడాది మే నెలలో సస్పెన్షన్కు గురయ్యాడు. ఒక భూవివాదంలో నిందితులకు సహకరిస్తూ, తొమ్మిదేళ్ల క్రితమే మరణించిన వ్యక్తిపై తప్పుడు కేసు నమోదు చేయడం అప్పట్లో పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. అలాగే, ఒక హత్య కేసులో నిందితురాలిగా ఉన్న మహిళను పోలీస్ స్టేషన్ ఆవరణలోనే లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఆయనపై వేటు పడింది. అలాగే, ఎస్సై శ్రీకాంత్పై గతేడాది ఆగస్టులో అట్రాసిటి కేసు నమోదైంది. అర్ధరాత్రి సమయంలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న ఒక దళిత మహిళపై దాడి చేసిన ఆరోపణలతో ఎస్సై, కానిస్టేబుల్ రాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదైంది. సీఐ వెంకటరత్నం కంటే ముందు పనిచేసిన రమేశ్ను విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల కారణంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఎస్సై సురేశ్పై వేటు, మరో ఎస్సై సివిల్ వివాదాల్లో తలదూర్చుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత సీఐ రమేశ్ ఠాణా విభాగాధికారిగా పనితీరుపై సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇక్కడ అధికారులపై స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, దానికి తలొగ్గిన అధికారులు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారనే చర్చ కూడా ఉంది. ఒకప్పుడు నేర నియంత్రణలో మంచి పేరున్న ఈస్టేషన్.. నెలల వ్యవధిలో అధికారులు సస్పెన్షన్ అవుతుండడంతో కమిషనరేట్కు కలంకంగా మారుతోందన్న చర్చ ఉంది. అలాగే, మట్టెవాడ, ఇంతేజార్గంజ్ ఠాణాల్లోనూ పోలీసులు వివాదాల్లో చిక్కుకోవడం తెలిసిందే. సస్పెన్షన్లకు కేరాఫ్గా మిల్స్కాలనీ ఠాణా కేసుల నమోదులో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలతో ఎస్సై సురేశ్పై వేటు తప్పుడు కేసుల్లో మట్టెవాడ పీఎస్కు మరక.. ఇంతేజార్గంజ్లోనూ చేతివాటం ఉన్నతాధికారుల చర్యలతో అవినీతి ఖాకీల్లో గుబులు -
జల్సాలకు అలవాటు పడి బైక్ల చోరీ
కాజీపేట: జల్సాలకు అలవాటు పడి బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కాజీపేట పీఎస్ ఆవరణలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 9 ద్విచక్ర వాహనాలతోపాటు నిందితుడిని అరెస్ట్ చూపించారు. ఏసీపీ కథనం ప్రకారం.. వేలేరు మండలం షోడశపల్లి గ్రామానికి చెందిన గొడుగు సంతోష్ (28) హైదరాబాద్లో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆటో నడపగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నాడు. అయితే డబ్బులు సరిపోకపోవడంతో బైక్ చోరీలకు పాల్పడుతున్నాడు. ఇలా కాజీపే ట రైల్వే పరిసర ప్రాంతాల్లో 9 బైక్లు ఎత్తుకెళ్లి విక్రయించాడు. ఈ డబ్బుతో జల్సాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం కాజీపేటకు చోరీ చేసిన బైక్పై వచ్చాడు. ఆ సమయంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన సంతోష్ను అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ల చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఓ రహస్య ప్రదేశంలో పార్క్ చేసిన 9 వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. సీఐ వై.సుధాకర్ రెడ్డి, ఎస్సైలు వి.నవీన్కుమార్, తాళ్లపల్లి యాదగిరి, లవన్కుమార్, శివ, తదితరులు పాల్గొన్నారు. నిందితుడి అరెస్ట్, 9 వాహనాలు స్వాధీనం -
సైన్స్ విభాగాల్లో పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో సైన్స్ విభాగాల్లో 2026–2027 జనవరి సెషన్లో పీహెచ్డీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు సైన్స్ విభాగాల డీన్ జి. హనుమంతు గురువారం తెలిపారు. ఫెల్లోషిప్ అభ్యర్థులు యూజీసీ జేఆర్ఎఫ్, /సీఎస్ఐఆర్/ సీడ్/డీఈటీ/ ఎన్ఎఫ్పీడబ్ల్యూడీ, డీఎస్టీ–ఇన్స్ఫైర్ లేదా ఫిప్, క్విప్ టీచర్ ఫెల్లోషిప్స్, అలాగే నెట్, గేట్, జిప్యాట్ కలిగిన అభ్యర్థులు ఈ పీ హెచ్డీలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 10వ తేదీ వరకు సైన్స్ విభాగాల డీన్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాల్సింటుంది. విభాగాల వారీగా వెకెన్సీలు ఇలా ఉన్నాయి. బయోకెమిస్ట్రీ 3, బయోటెక్నాలజీ 4, బాటనీ 4, కెమిస్ట్రీ 4, కంప్యూటర్ సైన్స్ 5, జియాలజీ 1, మ్యాథ్మెటిక్స్ 9, మైక్రోబయాలజీ 6, ఫిజిక్స్ 6, జువాలజీ 13 సీట్లు వెకెన్సీలుగా ఉన్నాయని డీన్ హనుమంతు తెలిపారు. భద్రకాళి అమ్మవారికి పుష్పార్చన హన్మకొండ కల్చ రల్ : భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి పసుపు రంగు చామంతి పూలతో పుష్పార్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అర్చకులు, భద్రకాళి సాంగ ఆగమవేదపాఠశాల విద్యార్థులు పువ్వులకు సంప్రోక్షణ జరిపి అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు పాజూరి శ్రీరాం, శ్రావణి, సబిత, సమత, పబ్బ శివకుమార్ ఉభయదాతలుగా వ్యవహరించారు. తెలుగు విశ్వవిద్యాలయం వీసీ నిత్యానందరావు, కేయూ విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య, జానపద గిరిజన విజ్ఞానపీఠం డీన్ గడ్డం వెంకన్న, సతీశ్, సినీనటులు దీపక్సరోజ్, రచ్చ రవి, ప్రొడ్యూసర్ హరిబాబు, డైరెక్టర్ హరీశ్ అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాలయ ధర్మకర్త వీరన్న, పరిశీలకులు క్రాంతికుమార్, సిబ్బంది పర్యవేక్షించారు. సద్దుమణిగిన విద్యార్థుల వివాదం కాశిబుగ్గ: వరంగల్లోని అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్య కళాశాల విద్యార్థుల దాడి ఘటన ఎట్టకేలకు సద్దుమణిగింది. వారం రోజుల క్రితం స్థానిక యువకులు ఆయుర్వేద వైద్య విద్యార్థులపై చేయి చేసుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ‘సాక్షి’లో గురువారం కథనం ప్రచురితమైంది. దీంతో స్థానిక నాయకులు కదలివచ్చారు. కొంతమంది నాయకుల తనయులు సైతం ఇందులో ఉండడంతో ఈ ఘటన పెద్దది కాకముందే జాగ్రత్త పడ్డారు. కళాశాల ప్రిన్సిపాల్, వైఎస్ ప్రిన్సిపాల్తో సమావేశమై ఈ ఘటన వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ దాడిపై తాము విచారిస్తున్నామని, అలాగే ఘటనకు బాధ్యులైన స్థానికుల యువకులతో క్షమాపణ చెప్పించి, కాంప్రమైజ్ చేశారు. అలా గే, ఈ దాడి గురించి తెలుసుకున్న మిల్స్కాలనీ ఎస్సైలు నరేశ్, శ్రవణ్ కళాశాలను సందర్శించారు. విద్యార్థులను ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇరువర్గాలు శాంతించడంతో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎలాంటి ఘటనలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ఫిర్యాదు చేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఇక నుంచి ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. -
కల్యాణ రాముడిగా అలంకరణ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న సీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గురువారం సీతారాములకు నాగవల్లి పత్రాలతో ఘనంగా అర్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, శ్రీసీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు విశ్వక్సేనారాధన, మన్యసూక్తవిధానంతో పూజలు జరిపి రాములవారి ఉత్సవ విగ్రహాన్ని కల్యాణరాముడిగా అలంకరించారు. శుక్రవారం శ్రీసీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని ఎదుర్కోళ్ల కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో రిటైర్డ్ డీజీ ఏఆర్టీవై రవిప్రసాద్, లలిత, రిటైర్డ్ జీఓసీ నందిరాజు శ్రీనివాసరావు, అనురాధరావు దంపతులు పాల్గొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య నిత్యానందరావు, కేయూ విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య, జానపద గిరిజన విజ్ఞానపీఠం డీన్ డాక్టర్ గడ్డం వెంకన్న పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. -
మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: జిల్లాలో రబీ సీజన్కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు రైస్ మిల్లర్లు కేటాయించిన ధాన్యాన్ని తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోలు, కేటాయింపు, దిగుమతి అంశాలపై జిల్లాలోని రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైస్ మిల్లులకు కేటాయింపులు చేపడతామన్నారు. అదనపు కలెక్టర్ ఎన్. రవి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఎండీ వాజీద్ అలీ, జిల్లా సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ మేనేజర్ మహేందర్, ఇతర అధికారులు, జిల్లాలోని రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. ఈ నెల 31లోగా ఉపాధి పనులు పూర్తి చేయాలి జిల్లాలో ఉపాధి హామీ పనులు ఈ నెల 31లోగా పూర్తి చేయాలని, పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి డీఆర్డీఓ మేన శ్రీను, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, పంచాయతీరాజ్ ఈఈ సైదుల్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ నాయక్ తదితర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులతో ఉపాధి పనులు, ఇంటి పన్నుల వసూలు, తాగునీరు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో డీఎల్పీఓలు రవిబాబు, గంగ భవాని తదితర అధికారులు పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026
శాసనసభలో పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితంగా సాధించిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ప్రాంతీయ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటులో సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కీలక పాత్ర పోషించారని ప్ర స్తావించారు. పోలీస్ శాఖలో మల్టీజోన్ పదోన్నతులు, ఏఆర్ నుంచి సివిల్ విభాగానికి కన్వర్షన్ వంటి అంశాలు చాలా ఏ ళ్లుగా పెండింగ్లో ఉండడాన్ని ఆయన.. సభ దృష్టికి తీసుకొ చ్చారు. 40శాతం రిజర్వేషన్ అమలు కాకపోవడం వల్ల పోలీ స్ సిబ్బందికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి దాదాపు 20 ఏళ్లు వెనుకబడిందన్నారు.సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు రంగం సిద్ధం మొత్తం 102 మంది జీవిత ఖైదీల జాబితా ఇతర జిల్లా జైళ్లలో ఉన్న వరంగల్ ఖైదీలకు అవకాశం సీఎం పరిశీలనలో ఖైదీల విడుదల ఫైల్ ఈ ఏడాది జాబితాపై ఆశలు -
శిక్ష నుంచి ‘క్షమాభిక్ష’కు..
సాక్షిప్రతినిధి, వరంగల్: ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీల విడుదలకు రంగం సిద్ధమైంది. నిబంధనల ప్రకారం.. సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలను పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా విడుదల చేస్తారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ముందస్తు విడుదలకు అర్హులైన 102 మందితో కూడిన జీవిత ఖైదీల జాబితాను ఖరారు చేసినట్లు తెలిసింది. ఆరుగురు మహిళలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 102 మంది అర్హత కలిగిన జీవిత ఖైదీల జాబితాకు సంబంధించిన ఫైలు సీఎం కార్యాలయ పరిశీలనలో ఉందని, త్వరలోనే జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. ఈ మేరకు వరంగల్ సెంట్రల్ జైలు ఎత్తివేత తర్వాత ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ జిల్లా జైళ్లల్లో శిక్ష అనుభవిస్తున్న ఉమ్మడి వరంగల్కు చెందిన 10 మంది పేర్లున్నట్లు తెలిసింది. ఈ మేరకు వారి వివరాలపై రాష్ట్ర హోంమంత్రిత్వశాఖ ఆరా తీసింది. కొందరు ఖైదీల కుటుంబ సభ్యుల నుంచి సమాచారం రాబట్టినట్లు సమాచారం. నిబంధనల మేరకు.. సత్ప్రవర్తన కలిగే ఖైదీల శిక్షాకాలానికి జైలు అధికారులు ఏటా కొన్ని రోజులు కలుపుతారు. ఈ కాలాన్నే ‘రెమిషన్’ అంటారు. ఈ రెమిషన్ ప్రకారం ఖైదీలకు శిక్షకాలంలో వారి ప్రవర్తన ఆధారంగా ‘రెమిషన్’ వస్తోంది. ఏడాదిలో 130 రోజులు కన్నా పెంచే అవకాశం, అధికారం ఎవరికీ ఉండదు. మొదటి సంవత్సరం 60 రోజులతో పాటు 2, 3, 4, 5 సంవత్సరాలకు వరుసగా 120 రోజుల చొప్పున రెమిషన్ ఇస్తే ఐదేళ్లకు కలిపి 540 రోజులు అవతుంది. జీఓ ప్రకారం ఈ పద్ధతి న అర్హత ఉన్నవారికి క్షమాభిక్ష వర్తింపజేశారు. 2025 అ క్టోబర్ 27న హోంశాఖ జీఓఎంఎస్ 126 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం ప్రతీ నాలుగు నెలలకోసారి అర్హులైన జీవిత ఖైదీల జాబితా సిద్ధం చేసి, ఇందుకు ఏర్పాటు చేసిన సమీక్ష కమిటీ ముందు ఉంచాలి. మరో జాబితా ఎప్పుడు? 2025 సంవత్సరం ఫిబ్రవరి 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు అర్హత కలిగిన జీవిత ఖైదీల విడుదలపై కసరత్తు జరిగింది. ఇలా కసరత్తు ద్వారా సిద్ధం చేసిన జాబితాను సమీక్ష కమిటీ పరిశీలించి 102 మంది పేర్లను ప్రభుత్వానికి పంపగా.. సీఎం పేషీలో పరిశీలనలో ఉంది. అయితే ఈ ఏడాది కూడా జనవరి 1 నుంచి మార్చి 31 వరకు కూడా అర్హులైన జీవితఖైదీల జాబితాను కూడా సిద్ధం చేయాల్సి ఉంది. ఇప్పటికే సిద్ధమైన జాబితాను పరిశీలించి అర్హులైన 102 మంది జీవిత ఖైదీలను విడుదల చేసి, ఈ ఏడాది మొదటి విడత జాబితాను కూడా సిద్ధం చేయాలని పౌరహక్కులు, మానవహక్కుల సంఘాల నాయకులు కోరుతున్నారు. తక్షణమే విడుదల చేయాలి.. ప్రభుత్వం న్యాయం, సంస్కరణ, మానవతా దృక్ఫథాన్ని ప్రదర్శించి జీవిత ఖైదీల విడుదల ప్రక్రియను కొనసాగించాలి. జనవరి 1 నుంచి 31 మార్చి వరకు సంబంధించిన అర్హుల జాబితా సిద్ధం చేసే ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి. ఇప్పటికే ఆమోదానికి పంపిన 102 మంది జీవిత ఖైదీల విడుదల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలి. ప్రస్తుతం సిద్ధమవుతున్న తదుపరి జాబితాలో ఉన్న ఖైదీలను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయడానికి పరిశీలించాలి. – ఎస్.జీవన్కుమార్, రాష్ట్ర నాయకుడు, మానవ హక్కుల వేదిక -
రామయ్యకు పసిడి పాదుకలు
నర్సంపేట: శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని నర్సంపేటకు చెందిన సూక్ష్మ కళాకారుడు, జాతీయ అవార్డు గ్రహీత శ్రీరామోజు జయకుమార్ పసిడి పాదుకలను తయారుచేశారు. రాముడిపై ఉన్న తన భక్తిని చాటుతూ 8 మిల్లీమీటర్ల వెడల్పు, 7 మిల్లీమీటర్ల ఎత్తులో 40 మిల్లీగ్రాముల బంగారంతో సూక్ష్మ పాదుకలను తయారు చేశారు. ఈ సందర్భంగా జయకుమార్ మాట్లాడుతూ పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావంతో ప్రపంచం అల్లకల్లోలంగా మారుతోందని, అందుకే ప్రపంచ శాంతి నెలకొనాలని సీతారాములను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దేశం ఎదుర్కొనే ఆటంకాలు తొలగిపోవాలని కోరుకుంటున్నట్లు జయకుమార్ పేర్కొన్నారు. -
వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద కాశిబుగ్గ : రోగుల వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం సీకేఎం ప్రసూతి ఆస్పత్రిని తనిఖీ చేశారు. వివిధ వార్డులను సందర్శించి రోగులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగులకు అందిస్తున్న ఆహారం విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, పౌష్టికాహారం సమయానికి అందేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ ఉమారాణి, జిల్లా వెనుకబడిన వర్గాల అభివృద్ధి అధికారి పుష్పలత, సీకేఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి, ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డి, వైద్యులు పాల్గొన్నారు. ‘ఉపాధి’ పనులను పూర్తి చేయాలి న్యూశాయంపేట : ఉపాధి హామీ పథకం పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ హాల్లో పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పనుల పూర్తి వివరాలను సమగ్రంగా సిద్ధం చేసి రాష్ట్ర కమిషనర్ కార్యాలయానికి పంపించాలని సూచించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, సహాయ ప్రా జెక్టు డైరెక్టర్ శ్రీవాణి, పీఆర్ ఇంజనీర్ ఇజ్జగిరి, డీపీ ఓ కల్పన, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు. రైతులతో ఆర్బిట్రేషన్ సంగెం మండలంలోని సంగెం, చింతలపల్లి గ్రామాలకు చెందిన 163 గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులతో కలెక్టర్ సత్యశారద ఆర్బిట్రేషన్ నిర్వహించారు. రైతుల సమస్యలు, అభ్యంతరాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
భద్రకాళి అమ్మవారికి పుష్పార్చన
హన్మకొండ కల్చరల్ : భద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్ర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. అర్చకులు, శ్రీభద్రకాళి సాంగ ఆగమ వేదపాఠశాల విద్యార్థులు తెలుపురంగు చా మంతి పూలకు సంప్రోక్షణ జరిపి అ మ్మవారికి లక్షపుష్పార్చన చేశారు. పూజా కార్యక్రమాలకు వేల్పుల భాస్కర్, సత్యవతి, రోహిత్ ఉభయదాతలుగా వ్యవహరించారు. దేవాలయ ధ ర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. అ లాగే, కాసం పుల్లయ్య వస్త్ర దుకాణం అధినేత కాసం నమశ్శివాయ ఆలయానికి 16 ఎల్ఈడీ లైట్లను అందజేశారు. దేవాలయ పరిశీలకుడు క్రాంతికుమార్, వాసవీకబ్ల్ ఇంటర్నేషనల్ సెక్రటరీ దాచేపల్లి సీతారాం పాల్గొన్నారు. -
‘పెన్షన్ వాలిడేషన్ యాక్ట్’తో అన్యాయం
హన్మకొండ అర్బన్ : గతేడాది పార్లమెంట్లో ఆమోదించిన పెన్షన్ వాలిడేషన్ చట్టంతో అన్యాయం జరుగుతోందని, వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జి.వీరస్వామి, ఉపాధ్యక్షుడు టి.పురుషోత్తం డిమాండ్ చేశారు. బుధవారం సంఘం ఆధ్వర్యంలో పెన్షన్ వాలిడేషన్ యాక్ట్కు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటివరకు ప్రభుత్వ పెన్షనర్లు పొందుతున్న ప్రయోజనాలన్ని కూడా 2026 జనవరి 1నుంచి ఈ చట్టం ప్రకారం వర్తించవన్నారు. అలాంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం సరికాదని విమర్శించారు. వెంటనే ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం అమలుతో 2025 డిసెంబర్ 31 వరకు పెన్షనర్లు పొందుతున్న సదుపాయాలు భవిష్యత్లో ఉండవన్నారు. అలాగే 2024 మార్చి నుంచి 2026 ఫిబ్రవరి వరకు రిటైర్డ్ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్, పీఆర్సీ–2020 బకాయిలన్నింటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం పెన్షన్ వాలిడేషన్ యాక్ట్ సంబంధించిన జీఓ కాపీని చించివేసి హనుమకొండ కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రికి అందజేయాలని వినతిపత్రం అందజేశారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఎస్టీఓ జనరల్ సెక్రటరీ కందుకూరి దేవదాసు, ప్రధాన కార్యదర్శి సమ్మారెడ్డి, కమిటీ సభ్యులు ప్రకాశ్, రత్నాకర్, సూర్య ప్రకాశ్, సింగారెడ్డి, సత్యనారాయణ, రమేశ్, జ్యోతిరమణి, రాధ, సుభాషిణి, రాజ కొమురమ్మ, ప్రభాకర్రెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, ఆగయ్య, భోగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రాంట్లపైనే ఆశలు!
రూ.1,040.58 కోట్ల బడ్జెట్కు జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ ఆమోదంవరంగల్ అర్బన్ : ఊరించే అంకెలు.. ఊహాజనిత పద్దులు.. వాస్తవాలకు పొంతన లేని లెక్కలు.. కొత్త సీసాలో పాత సారా అన్నట్లుగా గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే ఈసారి బడ్జెట్ అంచనాలను రూపకల్పన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లపై పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. పెరుగుతున్న ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకొని ఆస్తి పన్నుల రివైజ్డ్ పేరుతో కొంత మేరకు రాబడి పెంచుకునే విధంగా స్వల్ప మార్పులు చేర్పులు చేశారు. బీజేపీ కార్పొరేటర్ల నిరసన మినహా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా సాగింది. 2026–27 చివరి బడ్జెట్ను జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం బడ్జెట్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రూ.1,040.58 కోట్లతో కూడిన ప్రతిపాదనలను అధికారులు సమావేశంలో ప్రవేశపెట్టి ‘మమ’ అనిపించారు. తొలుత మేయర్ గుండు సుధారాణి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నగరాభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. పోడియం వద్ద బైఠాయించిన బీజేపీ కార్పొరేటర్లు.. నగరాభివృద్ధి కోసం యూజీడీ, స్మార్ట్సిటీ, అమృత్ స్కీంలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పీఎం మోదీకి కృతజ్ఞతలు తెలియజేయకపోవడంతో బీజేపీ కార్పొరేటర్లు పోడియం వద్దకు దూసుకెళ్లి నిరసన తెలిపారు. అకౌంటెంట్ శివలింగం బడ్జెట్ చదువుతుండగా పోడియం ఎదుట సుమారు గంటన్నర పాటు బైఠాయించారు. నిబంధనలు పాటించాలని హనుమకొండ కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ విన్నవించారు. చివరికి మేయర్ కేంద్ర ప్రభుత్వం, మోదీకి కృతజ్ఞతలు తెలపడంతో శాంతించారు. బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని, మెప్పు కోసం అంకెలగారడి చేశారని కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ అన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మిన్నకుండిపోవడం చర్చనీయాంశంగా మారింది. మౌలిక వసతులకు నిధుల కోత నగర ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనలో బడ్జెట్లో మొండిచెయ్యి చూపించారు. కీలకమైన రంగాలకు కేటాయింపులను విస్మరించారు. పార్కులు, క్రీడా మైదానాలు, శ్మశాన వాటికలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు తదితర సమస్యల పరిష్కారానికి గతేడాది రూ.10.40 కోట్లు కేటాయించారు. కానీ, ఈ ఏడాది రూ.2.70 కోట్లతో సరిపెట్టడంతో కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు, వింగ్ అధికారులు పాల్గొన్నారు. పన్నుల భారం లేని ప్రజారంజక బడ్జెట్ మహానగర ప్రజలపై నయాపైసా పన్ను భారం లేకుండా బడ్జెట్ రూపకల్పన చేశాం. వాస్తవాలతో కూడిన ప్రజారంజక బడ్జెట్ ఇది. యూజీడీ కోసం సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇటీవల బల్దియాకు 15వ ఆర్థిక సంఘం, ఇతర స్కీం ద్వారా రూ.43 కోట్ల నిధులు మంజూరయ్యాయి. – గుండు సుధారాణి, మేయర్ సొంత రెవెన్యూ : రూ.349.18 స్టాంపు డ్యూటీ రూ.40అద్దెలు, ఫీజులు, ఇతర ఆదాయం రూ.10.10శానిటేషన్ ద్వారా రూ.23.56 టౌన్ ప్లానింగ్ రూ.126.50 ఇంజినీరింగ్ సెక్షన్ నుంచి రూ.36.27ఖర్చులు ఇలా.. (రూ.కోట్లలో)జీతాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ, వ్యయాలు రూ.100 శానిటేషన్ వ్యయం రూ.40.75 విద్యుత్ చార్జీలు రూ.29,05 రుణాల చెల్లింపులు రూ.20 లక్షలు గ్రీన్బడ్జెట్ రూ.34.91 ఇంజినీరింగ్ రూ.36,15 పరిపాలన వ్యయం రూ.30.41 టౌన్ ప్లానింగ్ వ్యయం రూ.1.40 డీజేఆర్ఎఫ్కు రూ.1.50 విలీన గ్రామాలు, మురికివాడలకు రూ.25.43 మౌలిక వసతులకు రూ.2.70 66 డివిజన్లకు మిగులు నిధులు రూ.47.41 సొంత ఆదాయంలో మిగులు బడ్జెట్ రూ.75 లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ల బడ్జెట్ రూ.685.20 నాన్ప్లాన్ గ్రాంట్ : రూ.127 ప్రకృతి విపత్తులు రూ.2 యూఐడీఎఫ్ వసతుల కల్పన రూ.75 15, 16వ ఆర్థిక సంఘం నిధులు రూ.50 ప్లాన్ గ్రాంట్స్ రూ.43 రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.18 ఎస్సీ సబ్ప్లాన్ నిధులు రూ.7 స్వచ్ఛభారత్, స్వచ్ఛ తెలంగాణ నిధులు రూ.8 వెజ్, నాన్వెజ్ మార్కెట్, అమృత్ నిధులు రూ.10 ఇతర నిధులు రూ.515 కోట్లుఎంపీ నిధులు రూ.50 లక్షలు మెప్మా నిధులు రూ.1.20 అత్యవసర ప్రత్యేకాభివృద్ధి నిధులు రూ.503 రెవెన్యూ గ్రాంట్ రూ.2.50 ఎన్నికల నిధులు రూ.6.50 జనాభా లెక్కలు రూ.50 లక్షలు డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ రూ.2 డిపాజిట్లు, అడ్వాన్స్లు రూ.6.20 బడ్జెట్ స్వరూపం ఇలా.. (రూ.కోట్లలో) సొంత ఆదాయం రూ.349.18 కోట్లు ప్రభుత్వాల నుంచి అంచనా రూ.685.20 కోట్లు మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన చివరి బడ్జెట్ సమావేశం -
వేయిస్తంభాల ఆలయంలో లక్షతులసి అర్చన
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో నిర్వహిస్తున్న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి ఉత్సవాలు బుధవారం ఏడో రోజుకు చేరాయి. ఇందులో భాగంగా సీతారాములకు లక్ష తులసి అర్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులకు విశ్వక్సేనారాధన, పంచసూక్తములతో చతుర్వేద మూలమంత్రంగా అర్చనలు చేశారు. కమ్మ సంఘం రాష్ట్ర నాయకుడు చిన్న కోనయ్య–ధనలక్ష్మి దంపతుల సౌజన్యంతో తూర్పుగోదావరి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన తులసి దళాలతో సీతారాముల ఉత్సవ విగ్రహాలకు లక్ష తులసి అర్చన చేశారు. యాగశాలలో నవగ్రహ రుద్రహోమ సహిత మహాసుదర్శన హోమం నిర్వహించారు. ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. హన్మకొండ : ప్రయాణికుల సలహాలు, సూచనల మేరకు మెరుగైన సేవలు అందించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–2 డిపో మేనేజర్ ఎం.రవిచందర్ తెలిపారు. ఈ నెల 26న(గురువారం) మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు హనుమకొండలోని వరంగల్–2 డిపో నుంచి డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. ములుగు, ఏటూరునాగారం ప్రాంత ప్రయాణికులు 99595 58556 నంబర్కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు తెలపాలని కోరారు. కాజీపేట రూరల్ : ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్లో బుధవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీపీ సన్ప్రీత్సింగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలను నివారించాలని సూచించారు. డ్రైవింగ్లో మొబైల్ ఫోన్ వినియోగం, మద్యం తాగి వాహనం నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. అనంతరం ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రమాణం చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్రావు, ఏసీపీలు సత్యనారాయణ, పింగిళి ప్రశాంత్రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు పి.వెంకన్న, సీతారాం రెడ్డి, సుజాత, కాజీపేట ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యారణ్యపురి : రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులో హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ ధర్మేంద్ర పేర్కొన్నారు. బుధవారం హనుమకొండలోని పీఆర్టీయూ భవనంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ రాకపోవడంతో కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించగా తీర్పునిచ్చిందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ మాట్లాడుతూ హైకోర్టు తీర్పు ఆదేశం మాత్రమే కాదని, విశ్రాంత ఉద్యోగుల పాలిట ఆశల ఆయుధమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కందుకూరి దేవదాసు, అబ్దుల్గఫార్, దామోదర్, ఇంద్రసేనారెడ్డి, కుమారస్వామి, సారయ్య, విశ్వనాథం పాల్గొన్నారు. -
చట్టబద్ధమైన దత్తతను స్వీకరించాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కాజీపేట అర్బన్ : మాతృత్వం ఒక వరం..ఆ కలను సాకారం చేసుకునేందుకు పిల్లలు లేని తల్లిదండ్రులు చట్టబద్ధమైన దత్తతను మాత్రమే స్వీకరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్బాజ్పాయ్ సూచించారు. హనుమకొండ కంచరకుంటలోని శిశుగృహలో బుధవారం వడ్డేపల్లికి చెందిన దంపతులకు నాలుగు నెలల శిశువును దత్తతగా కలెక్టర్ అందజేశారు. కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న దంపతులకు సీనియారిటీ ఆధారంగా, దత్తతకు ఎంపికై న శిశువును అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ జిల్లా సంక్షేమ అధికారి, సీడీపీఓ విశ్వజ, ఇన్చార్జ్ శిశుగృహ మేనేజర్ మాధవి పాల్గొన్నారు. -
ఫిన్లాండ్ పర్యటనకు జనగామ ఉపాధ్యాయురాలి ఎంపిక
● ప్రపంచ ఉత్తమ విద్యా విధానంపై అధ్యయనం జనగామ: పాఠశాల విద్యాశాఖ ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల కోసం రూపొందించిన టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్ ప్రోగ్రాం (ఉపాధ్యాయుల క్షేత్ర పర్యటన, విద్యా మార్పిడి)కు రాష్ట్రవ్యాప్తంగా 28 మంది ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు ఎంపిక కాగా, ఇందులో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం ఉన్నత పాఠశాలకు చెందిన స్కూల్ అసిస్టెంట్ తౌటం నిహారిక ఉన్నారు. ఫిన్లాండ్లో నిర్వహించనున్న ఈ ప్రత్యేక పర్యటనకు సంబంధించిన వివరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు టీచర్లు ఫిన్లాండ్, సింగపూర్, వియత్నాం, జపాన్ దేశాలను సందర్శించనున్నారు. ఫిన్లాండ్ పర్యటన నేపథ్యంలో ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాల అభివృద్ధి, ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ పాఠశాల విద్యా విధానాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. వచ్చే నెల 20 నుంచి 24 వరకు ఈ పర్యటన ఉండనుంది. పట్టణ ప్రగతి పనులు వేగవంతం చేయాలి● మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజాపాలన – పట్టణ ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బల్దియా ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై మేయర్ గుండు సుధారాణి మంగళవారం తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణంలో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, డ్రెయినేజీ శుభ్రత, చెత్త తొలగింపు పనులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సరఫరాను నిరంతరం అందుబాటులో ఉంచాలని, నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి?హన్మకొండ చౌరస్తా: వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతిచెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన హనుమకొండ ములుగురోడ్ జంక్షన్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పరకాల మండలం రాజుపేట గ్రామానికి చెందిన తోట రవి అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఆ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంతో మృతిచెందినట్లు రోదిస్తూ ఆస్పత్రి ఆవరణలో మృతదేహంతో ఆందోళన చేశారు. -
కల్తీ కారం పట్టివేత
వరంగల్: ఏనుమాముల పీఎస్ పరిధిలోని లక్ష్మీసాయి ఇండస్ట్రీస్లో 60 కల్తీ కారం బస్తాలను పట్టుకున్నట్లు ఇన్స్పెక్టర్ జువ్వాజి సురేశ్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం లక్ష్మీసాయి ఇండస్ట్రీస్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లతో కలిసి తనిఖీలు నిర్వహించగా కల్తీకారం బస్తాలు లభ్యంకావడంతో సీజ్ చేశామన్నారు. సీనియర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, ఫుడ్ ఇన్స్పెక్టర్ మౌనిక.. పట్టుకున్న కల్తీకారాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారని, నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటారని తెలిపారు. కాగా, నిందితుడు గోనె సంపత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సురేశ్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై రాజు పాల్గొన్నారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన కానిస్టేబుళ్లు ఖిలా వరంగల్: రైలు పట్టాలపై మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నిస్తున్నాడని 100 నంబర్కు ఫోన్ రాగా.. సమీపంలోని మిల్స్కాలనీ బ్లూకోల్ట్స్ పోలీస్ కానిస్టేబుళ్లు వాజిత్, బాలరాజ్ హుటాహుటిన రైలు పట్టాలపైకి చేరుకున్నారు. ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్న ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడి అతడిలో మనోధైర్యం నింపారు. అనంతరం కుటుంబ సభ్యులను పిలిపించి అప్పగించారు. సరైన సమయానికి వచ్చి ఓ వ్యక్తి ప్రాణం కాపాడిన పోలీసులకు స్థానికులు అభినందనలు తెలిపారు. -
వరంగల్లో సెంట్రలైజ్డ్ కోచింగ్ డిపో ఏర్పాటు చేయాలి
విజయవాడలోని గాల రైల్వే డిపోను వరంగల్కు తరలించాలని కాజీపేట రైల్వే రన్నింగ్స్టాఫ్ జేఏసీ, రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ సి.హెచ్.శంకర్రావు, జోనల్ ప్రెసిడెంట్ కాల్వ శ్రీనివాస్, సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ పి.రవీందర్కు సికింద్రాబాద్లో వినతి పత్రం అందజేశారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి సౌత్ ఈస్ట్కోస్ట్ రైల్వే విభజన కానున్న నేపథ్యంలో అన్ని క్రూ లింక్లను వరంగల్కు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాజీపేట రైల్వే సీసీఎస్ డైరెక్టర్ డి.శ్రీనివాస్యాదవ్, జేఏసీ కన్వీనర్ ఎం.రమేశ్, నాయకులు సంగ రమేశ్, ఆర్.రమేశ్, ఎస్.మహేశ్, ఎం.నరేశ్, తదితరులు పాల్గొన్నారు. -
ఆందోళన.. అయోమయం
కాజీపేట రూరల్ : దక్షిణ మధ్య రైల్వే పరిధి విజయవాడలోని గాల (గుణదల) లోకోపైలెట్ డిపోపై రన్నింగ్స్టాఫ్లో ఆందోళన, అయోమయం నెలకొంది. ఇప్పటికే క్రూ లింక్ల తరలింపులు, అధిక పని భారంతో సతమతమవుతున్న రన్నింగ్స్టాఫ్కు గాల డిపో సమస్య కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 2007లో 3 క్రూ లింక్లతో విజయవాడ డివిజన్లో గాల డిపోను ఏర్పాటు చేశారు. ఈ డిపో రన్నింగ్స్టాఫ్ విజయవాడ– బల్లార్షాకు 450 కి.మీ. అప్ అండ్ డౌన్ విధులు నిర్వర్తిస్తున్నారు. అతిపెద్ద డిపోగా గాల.. ప్రస్తుతం గాల డిపో 45 క్రూ లింక్లతో అతి పెద్దగా మారింది. కాజీపేట మాత్రం 15 క్రూ లింక్లతో నడుస్తోంది. గాల డిపో ఏర్పాటు కాకముందు కాజీపేట స్టాఫ్ పని చేసేది. ఒకప్పుడు లోకోపైలెట్లు, ట్రైన్ మేనేజర్లతో కలిపి 1,500 మందితో కాజీపేట డిపో నడిచేది. గాల డిపో ఏర్పాటు తర్వాత కాజీపేట స్టాఫ్ 700కు తగ్గింది. గాల కేంద్రంగా విజయవాడ–బల్లార్షా రన్నింగ్స్టాఫ్ 900 కి.మీ. త్రూ ఆపరేట్ చేయడం వల్ల దాదాపు 30 గంటలు విధుల్లో ఉండాల్సి వస్తోంది. ఫలితంగా 130 కేఎంపీహెచ్ స్పీడ్తో 3వ లైన్లో ఆటోమెటిక్ సిగ్నల్స్ దాటుకుంటూ విధులు చేయడం రన్నింగ్ స్టాఫ్కు ఇబ్బంది అవుతోంది. దీంతో ఇప్పటికే గాల డిపోలో పని చేస్తున్న కొందరు అనారోగ్యాల బారిన పడ్డారు. కానీ రైల్వే శాఖ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా గాల డిపోను ఆపరేట్ చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2010 నుంచి వరంగల్లో డిపో ఏర్పాటు ఉద్యయం.. 2010 సంవత్సరం నుంచి గాల రైల్వే డిపోను ఎత్తివేసి వరంగల్లో డిపోఏర్పాటు చేయాలని రన్నింగ్స్టాఫ్ ఉద్యమిస్తోంది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే నుంచి విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్గా ఏప్రిల్ 1వ తేదీ నుంచి బైపర్కేట్ కానున్న నేపథ్యంలో గాల డిపోను ఎత్తివేసి దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని వరంగల్లో ఏర్పాటు చేయాలని రన్నింగ్స్టాఫ్ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గాల డిపోను వరంగల్ తరలించాలి.. విజయవాడలోని గాల డిపోను వరంగల్కు తరలిస్తే తమపై అధిక పని భారం తగ్గుతుందని, ప్రయాణికుల భద్రత పెరుగుతుందని లోకోపైలెట్లు, ట్రైన్ మేనేజర్లు పేర్కొంటున్నారు. విజయవాడ నుంచి వరంగల్, వరంగల్ నుంచి బల్లార్షాకు స్టాఫ్ విధులు ఉంటాయన్నారు. ఫలితంగా విశ్రాంతి ఉంటుందని, దీని వల్ల విధులకు ఎలాంటి ప్రమాదం ఉండదని వారు చెబుతున్నారు. కాగా, 500 మంది వరకు స్టాఫ్ వరంగల్కు వస్తారని, రైల్వే శాఖకు కూడా లాభాలు వస్తాయంటు పేర్కొంటున్నారు. కాగా, గాల డిపోపై రన్నింగ్స్టాఫ్ ఉద్యమ కార్యచరణలో భాగంగా సోమవారం జేఏసీ నాయకులు సికింద్రాబాద్లో ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ ఎం.రాఘవయ్యను, మంగళవారం మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరి సి.హెచ్.శంకర్రావును కలువగా సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. గాల(విజయవాడ) రైల్వే డిపోపై నెలకొన్న సందిగ్ధం 1వ తేదీ నుంచి బైపర్కేట్.. సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు మారనున్న డిపో వరంగల్కు తరలించాలని లోకోపైలెట్లు, గార్డుల విజ్ఞప్తి రైల్వే జాతీయ నేతలు రాఘవయ్య, శంకర్రావుకు వినతిపత్రాలు అందజేత -
అసెంబ్లీలో ప్రస్తావన
వెంకటాపూర్ భూ ఆక్రమణలపై న్యూశాయంపేట : హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 324లో కబ్జాదారులు ఆక్రమించిన సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమిపై మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రస్తావించారు. అసైన్డ్ భూమి మార్పిడి కావడానికి వీలు లేదని పీఓటీ చట్టంలో ఉందన్నా రు. అలాంటిది అధికారుల సహకారం లేకుండా పే దలకు అసైన్డ్ చేసిన భూమి కేవలం ఒకే కుటుంబా నికి ఎలా మార్పిడి చెందుతుందని ప్రశ్నించారు. ఈ భూమి విషయంలో 20 సంవత్సరాలుగా గ్రా మానికి చెందిన దళితులు, నిరుపేదలు ఆందోళనలు నిర్వహించి పలుమార్లు కలెక్టర్, రెవెన్యూ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారన్నారు. అయినా పట్టించుకోవడం లేదని గళమెత్తారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలనికోరారు. కాగా, సదరు అంశంపై అసెంబ్లీలో ప్రస్తావించాలని పార్టీ జిల్లా కమిటీ బా ధ్యులు మంగళవారం కూనంనేనికి వినతిపత్రం అందజేయగా ఆయన మాట్లాడారు. దీనిపై సాంబశివరావుకు పార్టీ జిల్లా పక్షాన కార్యదర్శి కర్రె భిక్షపతి ధన్యవాదాలు తెలిపారు. భూమి దక్కే వరకూ పోరాటాలు చేస్తుంటామన్నారు. నాయకులు టి. భి క్షపతి, ఎల్లేశ్, శ్రీనివాస్, కరుణాకర్, వెంకట్రాజం, రవి, రాజు, యాకూబ్, తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి
● వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ ఖిలా వరంగల్: పంటల సాగులో రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని వరంగల్ జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ విజయనిర్మల, శాస్త్రవేత్తలు శ్రావణ్, మధు, కేవీకే శాస్త్రవేత్త సౌమ్య సూచించారు. ఈమేరకు మంగళవారం వరంగల్ రైతుశిక్షణ కేంద్రంలో రైతులు–శాస్త్రవేత్తల చర్చా గోష్టి నిర్వహించారు. వరంగల్, ఖిలా వరంగల్, గీసుకొండ, సంగెం, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల రైతులు హాజరై పంటల సాగులో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు, సాంకేతిక సలహాలు పొందారు. ముఖ్యఅతిథిగా వారు హాజరై పంటలసాగు, విత్తనాల ఎంపిక, పురుగులు, తెగుళ్ల నియంత్రణ, సమగ్రపంటల సంరక్షణ విధానాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా జీవనియంత్రణ పద్ధతులు, సమగ్ర పురుగు మందుల నిర్వహణ, మట్టి పరీక్షల ప్రాముఖ్యత, అధిక దిగుబడులు సాధించే ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై ప్రదర్శనలు, చర్చ నిర్వహించారు. వర్ధన్నపేట ఏడీఏ నర్సింగం, బయోకంట్రోల్ ల్యాబ్ ఏడీఏ మాధవి, వరంగల్ మండల వ్యవసాయాధికారి రవీందర్రెడ్డి, ఏఈఓ ఆశాదీప్, రైతులు పాల్గొన్నారు. -
జూన్లో ‘సూపర్’ స్పెషాలిటీ!
సాక్షి, వరంగల్: ఉత్తర తెలంగాణ ప్రాంతవాసులకు నాణ్యమైన వైద్యసేవలందించేందుకు చేపట్టిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు జెట్స్పీడ్లో కొనసాగుతున్నాయి. వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలోని 56 ఎకరాల్లో రూ.1,371 కోట్ల వ్యయంతో చేపట్టిన నిర్మాణంలో 400 మంది కార్మికులు మూడు షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు. 16.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని 24 అంతస్తుల భవనంలో 34 విభాగాల స్పెషాలిటీ మెడికల్ సర్వీసులు ఈ ఏడాది జూన్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో పనులు పూర్తికావొస్తున్నాయి. ఈ పనులు ప్రారంభమైన సరిగ్గా ఐదేళ్లకు అందుబాటులోకి రానున్న ఈ ఆస్పత్రిలో పనిచేసేందుకు డాక్టర్లు, ఇతర సిబ్బంది నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే చాన్స్ ఉందని జిల్లా వైద్యవర్గాల్లో చర్చ జరుగుతోంది. 1500 పడకల ప్రస్తుత ఎంజీఎం ఆస్పత్రి ఇక్కడికి తరలుతుంది. మరో 500 పడకలు (కార్డియాలాజీ, న్యూరాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, గ్యాస్టో ఎంట్రాలాజీ, కార్డియోథెరపీ, నెఫ్రాలజీ, యూరాలజీ) ఏర్పాటుతో రెండువేల పడకల సామర్థ్యంతో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. దీనిద్వారా హైదరాబాద్కు రెఫరల్ వైద్యం తగ్గి, ఇక్కడే అన్ని వైద్య సేవలు అందనున్నాయి. హైదరాబాద్కు వెళ్లనవసరం లేకుండా అవయవమార్పిడి శస్త్రచికిత్సలు కూడా ఇక్కడే జరగనున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ ఈ ఆస్పత్రి ప్రారంభం కానుండడం కూడా అధికార పార్టీ కాంగ్రెస్కు కలిసొచ్చే అవకాశముందన్న చర్చ ఉంది. వేలాది మందికి వైద్యసేవలు.. ఉపాధి అవకాశాలు.. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు 2021 జూన్లో ప్రారంభమయ్యాయి. 2022లో ఆకృతి (డిజైన్) మార్చి అంచనా వ్యయం పెంచారు. 2024 మార్చికి అందుబాటులోకి వస్తుందనుకుంటే ప్రభుత్వం మారడం, డిజైన్ల మార్పు, అంచనాల పెంపు, దానిపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ తదితర కారణాలతో కాస్త ఆలస్యమయ్యాయి. ఈ నిర్మాణ పనులు మొదలైనా ప్రారంభానికి మాత్రం ముహూర్తం కుదరలేదు. అయితే ఇక్కడి ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం, ప్రతిపక్ష బీఆర్ఎస్ ముఖ్యనేతలు తరచూ ఈ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండడం...వెరసి ఈ ఆస్పత్రి తుది దశ నిర్మాణ పనులు వేగిరంగా సాగుతున్నాయి. జూన్ నాటికి పూర్తి పనులు చేసి ఆస్పత్రి పనులు ప్రారంభించేలా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడంతోపాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు దక్కే అవకాశముంది. జెట్స్పీడ్తో ఆస్పత్రి నిర్మాణ పనులు అందుబాటులోకి రానున్న 24 అంతస్తుల భవనం త్వరలోనే డాక్టర్లు, ఇతర సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ ఉత్తర తెలంగాణవాసులకు అందనున్న మెరుగైన వైద్యసేవలు -
కష్టపడితే అన్నీ సాధ్యమే
హసన్పర్తి: నిరంతం కష్టపడడంతోపాటు గెలవాలనే కోరిక బలంగా ఉంటే ఏదైనా సాధ్యమేనని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మనోజ్కుమార్ అన్నారు. మంగళవారం కిట్స్ 37వ క్రీడా వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి మనోజ్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలతో నైపుణ్యం పెంపొందుతుందన్నారు. ఐటీ కన్సల్టెంట్(అమెరికా సాఫ్ట్వేర్ డైవలపర్) సీవీఆర్ మోహన్ మాట్లాడుతూ శారీరక ధృఽఢత్వం, మానసిక వికాసానికి క్రీడలు దోహదపడుతాయన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా అతిథులను సన్మానించారు. కిట్స్ కళాశాల అదనపు సెక్రటరీ సతీశ్కుమార్ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ అశోక్రెడ్డి, కళాశాల ఏఓ రమేశ్రెడ్డి, పీడీ శ్రీనివాస్రెడ్డి,రిజిస్ట్రార్ కోమల్రెడ్డి, ప్రభా కరాచారి, స్పోర్ట్క్లబ్ విద్యార్థి అధ్యక్షులు విశాల్ ఆదిత్య, టి.కార్తీక్, క్లబ్ కో–ఆర్డినేటర్లు పి.లక్ష్మీరెడ్డి, వర్షిత, యశ్వంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ బ్మాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు మనోజ్కుమార్ కిట్స్లో ఘనంగా క్రీడా వార్షికోత్సవం -
ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
న్యూశాయంపేట: మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి పెట్రోల్బంకు కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)అధ్వర్యంలో ఆర్థిక సాధికారతకు ఇందిరా మహిళాశక్తి వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమన్నారు. పెట్రోల్ బంకుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని కోరారు. అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, ఎల్డీఎం రాజు, మెప్మా పీడీలు పాల్గొన్నారు. -
కేయూలో త్వరలోనే జీవ విజ్ఞాన కేంద్రం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో త్వరలోనే జీవవిజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయబోతున్నామని, విద్యార్థులు సృజనాత్మక ఆలోచలను పెంపొందించుకోవాలని కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి వెల్లడించారు. కాకతీయ యూనివర్సిటీ జూవాలజీ విభాగం ఆధ్వర్యంలో సెమినార్హాల్లో ‘అడ్వాన్స్సెస్ ఇన్లైఫ్ సైన్స్సెస్ ప్రజెంట్ ఫ్యూచర్’ అనేఅంశంపై మంగళవారం నిర్వహించిన జాతీయ సదస్సు ప్రారంభ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జీవ విజ్ఞాన కేంద్రం, ఔషధ శాస్త్ర కేంద్రం అనుబంధశాస్త్రాల కేంద్రం స్థాపనకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అనుమతులు రాగానే ఉన్నతస్థాయి పరిశోధనలకు వేదికగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కేంద్రం ద్వారా విద్యార్థులు, పరిశోధకులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రయోగశాలల్లో పనిచేసే అవకాశాలు పొందుతారన్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కర్నాటి రాయ్.. మెదడు కణజాలంలో ఏర్పడే గ్లియోమావ్యాధిలో కనిపించే ముఖ్యమైన జీవరసాయన మార్పు గురించి వివరించారు. ఈ సదస్సు నిర్వాహక కార్యదర్శి, జువాలజీ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, ఆ విభాగం అధిపతి వై. వెంకయ్య, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్, ఆ విభాగం ప్రొఫెసర్ షిమిత, ప్రొఫెసర్ ఈసం నారాయణ, మైక్రోబయాలజీ విభాగం అఽధిపతి సుజాత, బి. వెంకటగోపినాఽథ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు వివిధ యూనివర్సిటీల నుంచి 150 పరిశోధన పత్రాలు వచ్చాయి. కాగా, పరిశోధన పత్రాల అబ్స్ట్రాక్ట్ సావనీర్ను వీసీ ప్రతాప్రెడ్డి అతిథులు ఆవిష్కరించారు. ‘ప్రజాపాలన ప్రగతి’ని విజయవంతం చేద్దాం.. తెలంగాణ రాష్ట్ర 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను విజయవంతం చేద్దామని కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం యూనివర్సిటీలోని పరిపాలన భవనంలోని అకడమిక్ కమిటీ హాల్లో అన్ని విభాగాల అఽధిపతులు, ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో విశ్వవిద్యాలయాల అధ్యాపకులుగా కేరీర్పై వ్యక్తిత్వ వికాసం, ఉన్నత విద్య అవకాశాలపై విద్యార్థులకు తెలపాలన్నారు. కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం విభాగాల అధిపతులు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. వీసీ కె. ప్రతాప్రెడ్డి -
ఆశవర్కర్లకు అండగా ఉంటాం..
న్యూశాయంపేట: ఆశవర్కర్లకు అండగా ఉంటామని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జి.యువరాజు, ఆశ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు కె.లలిత ఆధ్వర్యంలో ఏకశిల పార్కు నుంచి భారీ ప్రదర్శనగా వచ్చి మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాకు సుదర్శన్రెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆశ వర్కర్లకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం ప్రభుత్వ పట్టింపులేనితనానికి నిదర్శనమన్నారు. ధర్నాలో యూనియన్ నాయకులు బి.మంజుల, ఎన్.రవి, పి.రమేశ్, మహేశ్వరి, సంధ్య, లత, అనిత, సాలమ్మ, వసుమతి, మంజుల, సునీత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
బాలికను లోబర్చుకున్న యువకుడి అరెస్ట్
మహబూబాబాద్ రూరల్ : పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బాలికను లోబరుచుకుని, గర్భవతిని చేసిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం పీఎస్లో వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్లోని కంకరబోర్డు ప్రాంతానికి చెందిన ఎండీ మౌలానా అనే యువకుడు స్థానిక ఓ ఫొటో స్టూడియోలో పనిచేస్తున్నాడు. ఓ బాలిక ఫొటో దిగేందుకు స్టూడియోకు రాగా ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో ఆ బాలికలో మార్పును గమనించిన తల్లిదండ్రులు నిలదీయడంతో విషయం చెప్పింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా గర్భవతిగా తేలింది. దీంతో తల్లిదండ్రులు తమ బిడ్డకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మౌలానాపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని టౌన్ సీఐ తెలిపారు. టౌన్ ఎస్సై మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు. -
పన్ను వసూళ్లలో వేగం పెంచండి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: క్షేత్రస్థాయిలో పన్ను వసూళ్లలో వేగం పెంచాలని హనుమకొండ కలెక్టర్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అభిప్రాయపడ్డారు. మంగళవారం నగర పరిధి 54వ డివిజన్ పరిధి కేయూసీ రోడ్డు సమీపంలో కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పన్ను వసూళ్ల తీరును పరిశీలించారు. అనంతరం గృహ వినియోగదారుడు చెల్లించిన పన్ను సంబంధ రసీదును కలెక్టర్ చెల్లింపుదారుడికి అందించారు. కార్యక్రమంలో ఆర్ఐ నరేశ్, వార్డు ఆఫీసర్ జెస్సీ ప్రియదర్శిని, బిల్ కలెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
విద్యారంగానికి బడ్జెట్ 20 శాతానికి పెంచాలి
టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి హన్మకొండ అర్బన్/కాళోజీ సెంటర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి 20 శాతానికి పెంచాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆ యూనియన్ హనుమకొండ, వరంగల్ జిల్లా శాఖల ఆద్వర్యంలో ఆయా జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలంటే పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణం, మౌలిక వసతులు, కంప్యూటర్లు, గ్రంథాలయాలు, ఉపాధ్యాయుల నియామకం, ప్రీ–ప్రైమరీ తరగతుల ప్రారంభం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందన్నారు. రెండు జిల్లాల అధ్యక్షులు బత్తిని శ్రీమాంజనేయులు, జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి అశోక్ మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించి మినిమం టైమ్ స్కేలు వర్తింపజేయాలని, సమ్మె కాలపు జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో యూ నియన్ రెండు జిల్లాల బాధ్యులు గొడిశాల సత్యనారాయణ, ముత్యాల రఘుపతి, మనోజ్. సురేష్ బాబు, బెల్లంకొండ పూర్ణచందర్, మనుపాటి వెంటకటేశ్వర్లు, కడారి బోగేశ్వర్, బెల్లంకొండ రమేష్, కుమారస్వామి, సోమేశ్వర్ పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్లో గ్యాస్ కొరత, ధరల పెరుగుదల కారణంగా చిన్న, మధ్యతరహా హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఎల్పీజీ సరఫరాలో అంతరాయాలు ఏర్పడి, చిరు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గ్యాస్ కొరత ప్రభావం, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా పెరగడం సరఫరాలో ఆలస్యం, బ్లాక్ మార్కెట్ పెరుగుదల కారణంగా చిన్న హోటళ్లు కుదేలవుతున్నాయి. ఇప్పటికే వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని 30 శాతం హోటళ్లు, పాస్ట్ఫుడ్ సెంటర్లు మూసివేశారు. చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం గ్రేటర్ వరంగల్ ట్రైసిటీలో చిరు హోటళ్లు, పాస్ట్ఫుడ్ సెంటర్లు 6,500 నుంచి 9,000 వరకు ఉన్నట్లు అధికారుల అంచనా. వీటిని ఆధారం చేసుకుని సుమారు 25 వేల నుంచి 30 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఒక్కో హోటల్, ఫా స్ట్ఫుడ్ సెంటర్లపై సగటున ముగ్గురి నుంచి ఐదుగురి వరకు ఉపాధి పొందుతున్నారు. గ్యాస్ కొరతతో 650 నుంచి 900 వరకు హోటళ్లు, సెంటర్లు మూతపడగా.. 2 వేల నుంచి 2,500 కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. కమర్షియల్ ఎల్పీజీ రూ.2 వేలు దాటడం.. అదీ సరిపడా సరఫరా లేని కారణంగా ఒక రోజు నడిస్తే మరో రోజు మూసేయాల్సిన పరిస్థితి. గ్యాస్ కొరత అరికడితేనే.. ట్రైసిటీలో చిన్న హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్ఫుడ్, ఇతరత్రా సెంటర్లు నడపాలంటే రోజుకు ఒకటిన్నర నుంచి రెండు సిలిండర్లు అవసరం. ఉదయం టిఫిన్కు ఒక సిలిండర్, మధ్యాహ్నం భోజనం వండేందుకు 1 సిలిండర్, సాయంత్రం స్నాక్స్కు సగం సిలిండర్ వినియోగించాల్సి వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ లెక్కన త్రినగరిలో రోజుకు సగటున 10 వేల గ్యాస్ సిలిండర్ల వరకు వినియోగిస్తున్నట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ‘రోజువారీ వ్యాపారం పూర్తిగా గ్యాస్ ఆధారితం కావడంతో చిరు వ్యాపారులైన తాము ఎక్కువగా నష్టపోతున్నామని వాపోతున్నారు. అంచనా గణాంకాలు (గ్రేటర్ వరంగల్)చిరు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు4,500 – 6,000 ఫాస్ట్ఫుడ్ సెంటర్లు 2,000 – 3,000 మొత్తం ఫుడ్ ఔట్లెట్లు 6,500 – 9,000 ఆధారపడిన కుటుంబాలు 25,000 – 35,000 ఒక్కో హోటల్పై జీవనాధారం సగటున 4–5 మంది తాత్కాలికంగా మూతపడినవి 650 నుంచి 900 వరకు సంక్షోభం ప్రభావం చూపే కుటుంబాలు సుమారు 2,000–2,500ఉపాధి కోల్పోతున్నాం.. ఫోర్ట్రోడ్డు పెట్రోల్ బంక్ జంక్షన్లో 30 ఏళ్లుగా హోటల్, టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాం. వాణిజ్య సిలిండర్ల కొరతతో పది రోజులుగా హోటల్ మూసివేశాం. మా దగ్గర ఐదుగురు కార్మికులు పని చేస్తారు. వారూ ఉపాధి కోల్పోవాల్సి వస్తోంది. మాలాంటి వారి కోసం ప్రభుత్వం ఆలోచించి సిలిండర్లు వచ్చేలా చూడాలి. – సతీశ్ హోటల్ నిర్వాహకుడు, ఖిలావరంగల్ఆర్థికంగా చితికిపోతున్నాం.. రోజూ ఇడ్లీ, పూరి, దోశ, వడ తయారు చేసేవాళ్లం. మంచి గిరాకీ ఉండేది. ప్రతీ రోజు రూ.3 వేల నుంచి రూ. 5వేల వ్యాపారం సాగేది. యుద్ధం ప్రభావంతో గ్యాస్ దొరకట్లేదు. పది రోజులుగా టిఫిన్ సెంటర్ బంద్ చేసుకున్నాం. అడ్డాకు నెలకు రూ.5 వేలు అద్దె భారమవుతోంది. – శ్రీనివాస్ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు, ఫోర్ట్ రోడ్డు ●‘గ్రేటర్’లో మూతపడుతున్న చిన్న, మధ్య తరహా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు కమర్షియల్ బదులు డొమెస్టిక్ వాడితే కేసులు సంక్షోభంలో చిరు వ్యాపారుల కుటుంబాలు ప్రత్యామ్నాయ ఉపాధి లేక ఇబ్బందులుఈ ఫొటోలోని వ్యక్తి పేరు అహ్మద్. హనుమకొండలోని కిషన్పురలో టిఫిన్ సెంటర్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కమర్షియల్ ఎల్పీజీ దొరకక టిఫిన్ సెంటర్ను తాత్కాలికంగా మూసేశారు. టిఫిన్ సెంటర్ నడిస్తేనే ఆ కుటుంబం గడిచేది. ఇంట్లో కూడా కట్టెల పొయ్యితో వంట చేసుకుంటున్నారు. ‘కమర్షియల్ సిలిండర్ ఎక్కువ రేట్ అయినా కొందాం అంటే దొరకట్లేదు. ఇంటిల్లిపాదికి ఇబ్బందిగా ఉంది. టిఫిన్ సెంటర్ నడిస్తేనే మాకు ఆదాయం. లేకపోతే కష్టమే’ అని అహ్మద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వరంగల్ ఫోర్ట్రోడ్డుపై కర్రీపాయింట్ నడుపుతున్న సంపత్రావు గ్యాస్ బుక్ చేసినా రాలేదు. ప్రస్తుతం కట్టెల పొయ్యిపై నడిపిస్తున్నాడు. కొరతతో మెనూ సగానికి తగ్గించాడు. గతంలో రోజుకు రూ.2వేల వరకు గిరాకీ అయ్యేది. మెనూలో అన్ని రకాలు లేకపోవడంతో కొనే వారు సైతం తగ్గిపోయారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. వరంగల్ స్టేషన్ రోడ్డులో కర్రీపాయింట్ నిర్వహిస్తున్న రమ వంట గ్యాస్ దొరకడం లేదని వారం నుంచి కర్రీపాయింట్ బంద్ పెట్టింది. ఆ తర్వాత కట్టెలతో వ్యాపారం కొనసాగిద్దామని ప్రయత్నించింది. కట్టెల ధరలు సైతం ఎక్కువగా ఉన్నయాని కర్రీ పాయింట్ మూసేసింది. దీంతో చిన్నాచితకా పనులకు వెళ్లాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
పునర్విభజనలో మరో తొమ్మిది!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మళ్లీ చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభనకు సోమవారం కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన బిల్లు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. మహిళలకు రిజర్వేషన్లు, డీలిమిటేషన్ చట్టాలకు సవరణ చేయనుందని ప్రకటించారు. ఆ వెనువెంటనే డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేసి సీట్ల పెంపు కార్యక్రమాన్ని పూర్తి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్లో పెరిగే కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలపై చర్చ జరుగుతోంది. పునర్విభజన జరిగితే ఉమ్మడి వరంగల్లో కొత్తగా దాదాపుగా 9 నియోజకవర్గాలు ఏర్పడనునున్నాయి. దీంతో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 21కి చేరనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నిబంధనల ప్రకారం 2021లో జరగాల్సి ఉండగా.. జనగణన ఆలస్యం కారణంగా నిలిచిపోయింది. కేంద్రం మళ్లీ జనగణనకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అది పూర్తికాగానే నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. కొత్తగా తొమ్మిది పెరిగే అవకాశం.. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం 2008 చివరలో నియోజక వర్గాలను పునర్ వ్యవస్థీకరించారు. అంతకు ముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 నియోజకవర్గాలు ఉండేవి. 2008 పునర్విభజన తర్వాత ఒక్కటి పెరిగి ఆ సంఖ్య 12 నియోజకవర్గాలకు చేరింది. ప్రస్తుతం హనుమకొండ జిల్లాలో రెండు (వరంగల్ పశ్చిమ, పరకాల), వరంగల్లో మూడు (వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట), జనగామలో మూడు (జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి), మ హబూబాబాద్లో రెండు (మహబూబాబాద్, డోర్నకల్), జేఎస్ భూపాపల్లిలో ఒకటి (భూపాలపల్లి), ములుగులో ఒకటి (ములుగు) ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో దాదాపు 35.12 లక్షలున్న జనాభా.. ప్రస్తుతం అది 41.50 లక్షలు దాటి ఉంటుందని అంచనా. జనగణన పూర్తయితే 2027 జనాభా ప్రకారం పునర్విభజనలో ఉమ్మడి జిల్లాలో దాదాపు తొమ్మిది కొత్త నియోజకవర్గాలు రానున్నాయి. దాంతో మొత్తం నియోజకవర్గాల సంఖ్య 21కి పెరిగే అవకాశం ఉంది. ‘ఓరుగల్లు’లో 21కి పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు హనుమకొండలో ఆరు, వరంగల్లో ఐదు... మానుకోటలో నాలుగు జేఎస్ భూపాలపల్లిలో రెండు.. జనగామ, ములుగులో యఽథాతథం ఆరు జిల్లాల పరిధిలోనే మొత్తం 21 నియోజకవర్గాలు 2027 జనాభా లెక్కల ఆధారంగా చేసే అవకాశం... ఆ ప్రకారమే 2029 ఎన్నికలు... కేంద్రం కసరత్తు నేపథ్యంలో డీలిమిటేషన్ చర్చనీయాంశంజిల్లా నియోజకవర్గాలు మొత్తం ప్రస్తుతం పెరగనున్నవి జనాభా నియోజక వర్గాలు హనుమకొండ 02 04 10,80,858 06 వరంగల్ 03 02 8,90,651 05 జేఎస్ భూపాలపల్లి 01 01 4,16,763 02 జనగామ 03 00 5,66,376 03 మహబూబాబాద్ 02 02 77,45,49 04 ములుగు 01 00 25,77,44 01 12 09 39,87,241 21 -
108, 102 అంబులెన్స్ సిబ్బందికి 7 నెలల జీతాలు బకాయి
సోమవారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2026108 వాహనం● బడ్జెట్ విడుదల చేయాలని వినతి ● అసలే పనిభారం ఆపై వేతనాలు లేవు ● డీజిల్... మరమ్మతులకు నిధులు కరువుహన్మకొండ అర్బన్: ఆపదలో ఆదుకునే అత్యవసర సేవకులకు కష్టమొచ్చింది. ఏడు నెలలుగా సిబ్బందికి వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. కుయ్.. కుయ్..మంటూ ఆపదలో ఉన్న వారిని ఆస్పత్రికి తరలిస్తూ ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తున్న అత్యవసర సేవల ఉద్యోగులకు వేతనాలకు ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయట్లేదు. సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108, 102 అంబులెన్స్ సిబ్బంది గతేడాది ఆగస్టు నుంచి 2026 , ఫిబ్రవరి వరకు సుమారు ఏడు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయకపోవడంతో వేతనాలు నిలిచిపోయాయని, వెంటనే బడ్జెట్ విడుదల చేసి పెండింగ్ జీతాలను చెల్లించాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది సేవలు తెలంగాణలో సుమారు 625 వరకు 108 అంబులెన్స్ వాహనాలు పనిచేస్తుండగా, వాటిలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు (ఈఎంటీ), పైలట్లు, సపోర్ట్ సిబ్బంది కలిపి దాదాపు 3,000 మంది సేవలందిస్తున్నారు. అదేవిధంగా గర్భిణులకు సేవలందించే 102 అంబులెన్స్ వాహనాలు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 185 ఉన్నాయి. వీటిలో సుమారు 250 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. పార్థివ వాహన సేవలకు ఇబ్బందులు పేద కుటుంబాల్లో ఎవరైనా ఆస్పత్రుల్లో మరణించిన వ్యక్తుల పార్థివ దేహాలను వారి స్వగ్రామాలకు తరలించేందుకు ఉపయోగించే పార్థివ వాహనాలు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 ఉన్నాయి. వీటిలో దాదాపు 180 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. జీతాలు అందక ఈ విభాగంలో పని చేస్తున్న సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 70 వరకు 108 అంబులెన్స్ వాహనాలు, 10 వరకు 102 అంబులెన్్స్ వాహనాలు, అదేవిధంగా 4 పార్థివ వాహనాలు పని చేస్తున్నాయి. వీటిలో సుమారు 320 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వెంటనే వైద్య సేవలు అందించేందుకు వీరు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. నిర్వహణ భారం.. బడ్జెట్ విడుదల అవ్వకపోవడంతో అంబులెన్స్ వాహనాల నిర్వహణ కష్టంగా మారింది. ప్రతీ రోజు డీజిల్ ఖర్చులు, వాహనాల మరమ్మతులు, అంబులెన్్స్ల్లో అవసరమైన మందులు సమకూర్చడం వంటి అంశాల్లో వ్యయభారం పెరిగిందని సిబ్బంది చెబుతున్నారు. దీంతో అత్యవసర సేవలను నిరంతరాయంగా కొనసాగించడం కూడా సవాల్గా మారిందని వారు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో అత్యవసర సేవలందిస్తున్న 108, 102, పార్థివ వాహనాల ఉద్యోగులకు ఉన్నవే కొద్ది పాటి వేతనాలు. ఏడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో వారికి కుటుంబ పోషణ భారంగా మారింది. నిధుల విడుదల చేసి, సిబ్బంది నియామకాల విషయంలో ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటే మరింత మెరుగైన సేవలందించడానికి వీలుంటుంది. – లకావత్ బాలాజీ, 108 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 102 వాహనం సకాలంలో వేతనాలు అందకపోవడంతో పాటు పని ఒత్తిడి అధికమవుతుండడంతో ఈ రంగంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు క్రమంగా విధులు వదులుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ భారం, నిరంతర పని ఒత్తిడి వంటి కారణాలతో ఉద్యోగులు ఈ రంగంలో కొనసాగేందుకు నిరాసక్తత చూపుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల అంబులెన్స్ సేవల్లో ఉద్యోగుల కొరత కూడా పెరుగుతోందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బడ్జెట్ విడుదల చేయాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని 108, 102, పార్థివ వాహనాల సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. పని ఒత్తిడి తగ్గించే చర్యలు తీసుకుని సకాలంలో జీతాలు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
ఆదర్శ జీవితానికి శ్రీరాముడు స్ఫూర్తి
హన్మకొండ కల్చరల్: ఆదర్శ జీవితానికి శ్రీరాముడు స్ఫూర్తి అయితే, సత్పరిపాలనకు రామరాజ్యం దిక్సూచి అని వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్ర శర్మ పేర్కొన్నారు. వేయిస్తంభాల గుడిలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ప్రభాతసేవ, గణపతి పూజ, రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు పంచరాత్ర శాస్త్ర ఆగమంతో అర్చకులు సూక్తవిధానంతో విశ్వక్సేనారాధన, విష్ణుసూక్తంతో నిత్యాహ్నికం నిర్వహిించారు. అనంతరం రాములవారి ఉత్సవ విగ్రహాన్ని బాలరాముడిగా అలంకరించి గరుడ వాహనంపై ప్రతిష్ఠించి మంగళవాయిద్యాలతో ఊరేగించారు. పూజా కార్యక్రమాలకు వైద్యులు రాహుల్–అక్షిత దాతలుగా వ్యవహరించారు. నిజామాబాద్కు చెందిన హనుమాన్ మాలధారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్, నరసింహచార్యులు, శ్రీవాత్సవ్, సిబ్బంది మధుకర్, రజిత పాల్గొని సేవలందించారు. ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. -
యుద్ధం కాదు.. ప్రపంచశాంతి అవసరం
విద్యారణ్యపురి : ప్రస్తుతం యుద్ధం కాదు.. ప్రపంచ శాంతి అవసరమని దేశాధినేతలు సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ప్రపంచంలో తలెత్తిన యుద్ధ వాతావరణం దాని ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ జనవిజ్ఞాన వేదిక హనుమకొండలో ఆదివారం నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ‘యుద్ధం కాదు.. ప్రపంచ శాంతి అవసరం’ అనే అంశంపై ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర పర్యావరణ ఉపసమితి కన్వీనర్ కేబీ ధర్మప్రకాశ్ మాట్లాడుతూ.. యుద్ధాలు దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బ తీస్తున్నాయని వివరించారు. సమావేశంలో జేవీవీ అధ్యక్షుడు పురుషో త్తం, ప్రధాన కార్యదర్శి భిక్షపతి, సుమలత, వంద న, రేవతి, రాజ్కుమార్, శ్రావణ్కుమార్, శ్రీని వాస్, వెంకటస్వామి, అజయ్, నరేశ్ పాల్గొన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వల్లంపట్ల నాగేశ్వర్రావు -
మక్కలకు లేదు మద్దతు
పరిశీలనలోనే కేంద్రాల ఏర్పాటు.. ప్రారంభంకాని కొనుగోళ్లుసాక్షిప్రతినిధి, వరంగల్: కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జరుగుతున్న జాప్యం కారణంగా మొక్కజొన్న రైతులకు మార్కెట్లో ‘మద్దతు’ దొరకడం లేదు. యాసంగి మక్కల కొనుగోళ్ల కోసం ప్రతీసారి మార్చి మొదటి వారంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే మార్క్ఫెడ్, ‘ప్యాక్స్’, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు ఈసారి వేచిచూసే ధోరణిలో ఉన్నాయి. ఎక్కడా కూడా మార్క్ఫెడ్ ఇంకా కొనుగోళ్లను ప్రారంభించకపోవడంతో సిండికేట్గా మారిన కొందరు ప్రైవేట్ వ్యాపారులు మార్కెట్లో తమకు తోచిన ధరకు కొనుగోలు చేస్తున్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాకు రూ.2,400 కాగా.. కనిష్టంగా రూ.1,700, గరిష్టంగా రూ.1,950 చెల్లిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఎంఎస్పీతో పోలిస్తే క్వింటాకు రూ.500 నుంచి రూ.650 వరకు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పెరిగిన సాగు.. ఈ యాసంగిలో మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. వ్యవసాయశాఖ అంచనాలను మించి రైతులు 88 శాతం అధికంగా సాగు చేశారు. వాస్తవానికి 2025–26 యాసంగిలో మొత్తం సాగు అంచనా 68,67,407 ఎకరాలు కాగా, 81,20,332 (118 శాతం) ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేశారు. ఇందులో మొక్కజొన్న సాగు అంచనా 6,45,574 ఎకరాలకు 12,13,914 (188 శాతం) ఎకరాల్లో వేశారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్లో 3,43,732 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న వేశారు. సాగైన మొత్తం విస్తీర్ణంలో సగటున ఎకరానికి 18 క్వింటాళ్లు వస్తే 6,18,717 టన్నులు.. 25 క్వింటాళ్లు వస్తే 8,59,330 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. గతేడాది 26 కేంద్రాలను ప్రతిపాదించిన మార్క్ఫెడ్, వ్యవసాయశాఖలు ఈసారి ఇంకా కొనుగోలు కేంద్రాల పరిశీలనలోనే ఉన్నాయి. దీంతో రైతులు అవసరాల కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి తక్కువ ధరకు అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నెల 18న మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీలో చర్చకు తేగా.. ఆ తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఐదు రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో పురోగతి లేదు. నేను 2 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశా. గతంలో కంటే ఈసారి దిగుబడి కూడా సరిగ్గా రాలేదు. ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులకు రూ.1,700కే అమ్ముకున్న. వాళ్లు కూడా 20 రోజుల తర్వాత డబ్బులు ఇస్తామన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే క్వింటాకు రూ.600 నుంచి రూ.700 ఎక్కువగా వచ్చేవి. కొనుగోలు కేంద్రాలు లేక నష్టపోవాల్సి వచ్చింది. – నకీర్త సంపత్, రైతు, పీచర, వేలేరు మండలం మొక్కజొన్న పంట చేతికందే సమయంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించాం. మక్కలను అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్నాం. కొనుగోలు కేంద్రాలు లేక దళారుల దగ్గరకు వెళ్లక తప్పడం లేదు. మద్దతు ధర కంటే ఐదారు వందల రూపాయలకు తక్కువ కొంటున్నరు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటికై నా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. – తాళ్లపల్లి సారయ్య, వైస్ ప్రెసిడెంట్, ‘మ్యాక్స్’, భీమదేవరపల్లి కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2,400.. వ్యాపారుల ధర రూ.1,950 ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా 3.43 లక్షల ఎకరాల్లో సాగు అసెంబ్లీలో ఈనెల 18న చర్చ.. మంత్రి ఆదేశించినా పురోగతి లేదు మొక్కజొన్న రైతుకు తప్పని దళారుల బెడదఈ ఫొటోలో ఉన్నది హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచరకు చెందిన రైతు నకీర్త మధు. మూడెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవల కురిసిన వడగళ్లకు కొంత మేరకు దెబ్బతింది. మిగిలిన పెరడు కోసి కంకి కొట్టాడు. అమ్మేందుకు మక్కలను కల్లం వద్ద ఆరబోశాడు. బయట అమ్ముకుందామంటే ధర తక్కువ. కొనుగోలు కేంద్రాలు అగొచ్చే ఇగొచ్చే అని అధికారులు అంటుంటే ఐదారు రోజుల నుంచి ఆశగా ఎదురుచూస్తున్నాడు. కానీ, ఇంతవరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఈ పరిస్థితి ఒక్క నకీర్త మధుదే కాదు.. అనేక మంది మక్క రైతులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. -
నగరంలో పార్కర్ పర్యటన
హన్మకొండ కల్చరల్/ఖిలా వరంగల్ : వేయిస్తంభాల ఆలయాన్ని యూకే నుంచి వచ్చిన ఇంటర్నేషనల్ ట్రావెల్ రైటర్ రాబర్ట్ పార్కర్ ఆదివారం సందర్శించారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలను యూకే, ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం రాబర్ట్ పార్కర్ను రాష్ట్ర పర్యాటక శాఖ ఆహ్వానించింది. అసిస్టెంట్ టూరిజం ఆఫీసర్ డాక్టర్ కుసుమ సూర్యకిరణ్ ఆలయ చరిత్రను వివరించారు. అలాగే రాబర్ట్ పార్కర్ వరంగల్ కోటలోని తూర్పుకోట, పడమర కోట, శృంగారబావి, కళాతోరణం, ఖుష్మహాల్ తదితర ప్రాంతాలను సందర్శించి కాకతీయుల కళాసంపద విశిష్టతను, పర్యాటక ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. సౌండ్ అండ్ లైట్లు ఇన్చార్జ్ విజయ్, కల్యాణ్, కేంద్ర పురావస్తు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.వరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నేడు (సోమవారం) గ్రీవెన్స్ సెల్ను నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. కేయూ క్యాంపస్: కేయూ మాజీ వీసీ ప్రొఫెసర్ ఎన్.లింగమూర్తి యాది సభను సోమవారం జర్నలిజం సెమినార్హాల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ పూలే ఆశయ సాధనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సంగాని మల్లేశ్వర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే యాదిసభకు హాజరుకావాలని ఆయన కోరారు. -
బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
ఖిలా వరంగల్: జనగణన శిక్షణ ఎంతో కీలకమని, జనగణన విజయవంతానికి ప్రతిఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో కలెక్టర్ ఆధ్వర్యంలో జనగణన 2027 సిబ్బందికి మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ శిక్షణను ప్రారంభించి మాట్లాడారు. చార్జ్ సెన్సెస్ క్లర్క్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు జనగణన ప్రక్రియపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని సూచించారు. జనగణన ద్వారా ప్రభుత్వానికి అవసరమైన కచ్చితమైన గణాంకాలు అందుతాయని, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో ఇవి కీలకమన్నారు. ప్రతీ ఇంటిని సందర్శించి సరైన వివరాలను సేకరించడం సిబ్బందిపై ఉందన్నారు. అనంతరం సిబ్బందికి విధివిధానాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా సెన్సెస్ అధికారి (డీఆర్ఓ) విజయలక్ష్మి, ముఖ్య ప్రణాళిక అధికారి చంద్రకళ, ఆర్డీఓ సుమ, తహసీల్దార్ ఇక్బాల్, అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద వాగ్దేవిలో జనగణన శిక్షణ ప్రారంభం -
కాంగ్రెస్కు పూర్తి కమిటీలు ఎప్పుడు?
సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికార కాంగ్రెస్ పార్టీ ఇటీవల మళ్లీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో వేగం పెంచింది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులను నియమించిన పార్టీ, తాజాగా కొన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మాత్రం ఇంకా పూర్తిస్థాయి కార్యవర్గం, కమిటీలు పెండింగ్లోనే ఉన్నాయి. ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని 14 జిల్లాల్లో పూర్తిస్థాయి డీసీసీ కమిటీలు ప్రకటించారు. వీటిలో వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, కోశాఽధికారి, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, కార్యవర్గసభ్యులతో పాటు విస్తృతస్థాయి నిర్మాణం పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో 2025, నవంబర్ 22న ప్రకటించిన డీసీసీ అధ్యక్షుల జాబితాతో ఆగిపోయింది. పూర్తిస్థాయి కమిటీలకు మోక్షం కలగకపోగా, పార్టీ పదవులను ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ కొనసాగుతోంది. నాలుగు నెలల క్రితమే డీసీసీ అధ్యక్షులు.. డీసీసీ అధ్యక్షుల్లో ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో ఇద్దరు షెడ్యూల్ కులాలు, ఒక మైనారిటీ, ఒక బీసీ, ఒక జనరల్, ఒక షెడ్యూల్ తెగలకు చెందిన వారికి పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించింది. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ‘కుడా’చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డిని నియమించగా, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ అయూబ్కు అవకాశం ఇచ్చారు. ఈ విషయంలో కీలక ప్రజాప్రతినిధులు అసంతృప్తికి గురైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా లకావత్ ధన్వంతి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా బట్టు కరుణాకర్, మహబూబాబాద్కు ఎమ్మెల్యే మురళి నాయక్ భార్య ఉమలను ఖరారు చేయగా, ములుగు జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి రెండోసారి పైడాకుల అశోక్కు దక్కింది. డీసీసీ అధ్యక్షుల సంధర్భంగా హనుమకొండ, ములుగు జిల్లాలు మినహా.. మిగతా నాలుగు జిల్లాల్లో సీనియర్లు అలకకు గురికాగా, కేడర్లో తర్జన భర్జన జరిగింది. ఈ నేపథ్యంలో అందరినీ అధిష్టానం బుజ్జగించింది. తాజాగా పూర్తిస్థాయి కమిటీల కూర్పు విషయం వచ్చే సరికి మళ్లీ రాజకీయ సిఫారసులు పెరగడం తలనొప్పిగా మారుతుందన్న చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది. జంబోజెట్ జాబితా... అందుకే పెండింగ్? నాలుగు నెలల కిందటే డీసీసీ అధ్యక్షులను నియమించిన కాంగ్రెస్ అధిష్టానం ఆరు జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలను ఇంకా పెండింగ్లోనే పెట్టింది. దీంతో స్థానిక కేడర్లో గందరగోళం నెలకొంది. వాస్తవానికి ఫిబ్రవరి చివరి వారంలోనే జిల్లాల వారీగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు తదితర పోస్టులకు టీపీసీసీకి జాబితా పంపించనట్లు తెలిసింది. ఉగాది సందర్భంగా 14 జిల్లాల కమిటీలను ప్రకటించిన అధిష్టానం ఆరు జిల్లాల కమిటీలను మాత్రం ప్రకటించలేదు. జిల్లా కమిటీల్లో అన్ని పోస్టులు కలిపి 30 నుంచి 50 మంది దాటకుండా ఉండేలా జాబితా రూపొందించాల్సి ఉండగా.. అంతకుమించి పంపడం వల్ల వడపోత చేస్తున్నారని చెబుతున్నారు. వరంగల్, జనగామ జిల్లాల్లో కీలక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల మధ్య పొసగకపోవడం వల్ల అక్కడినుంచి కూడా జంబోజెట్ జాబితా వెళ్లినట్లు తెలిసింది. ఆ జాబితాలు అధిష్టానం పరిశీలనలోనే ఉండగా.. హనుమకొండ, ములుగు జిల్లాల జాబితాపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన వెలువడవచ్చంటున్నారు. కమిటీలు ఆలస్యం కావడం పట్ల పార్టీ వర్గాల సమాచారం ప్రకారం చాలాచోట్ల గ్రూప్ రాజకీయాలు, కీలక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే స్థాయి నాయకులు, స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోటీ కారణంగా కమిటీలు ఆలస్యం అవుతున్నాయన్న చర్చ జరుగుతోంది. డీసీసీ అధ్యక్షులను నియమించి నాలుగు నెలలు పూర్తిస్థాయి కార్యవర్గంపై ఇంకా అస్పష్టత పొరుగు జిల్లాల్లో కార్యవర్గం, కమిటీల ఖరారు ఉమ్మడి జిల్లాలో ముందుకు కదలని పరిస్థితి ఆశావహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ -
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యం
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కాశిబుగ్గ: ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం వరంగల్లోని 19వ డివిజన్ శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో బల్దియా నిధులు రూ.29.70 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ ఫ్లోరింగ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆలయంలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆలయాల ప్రాశస్త్యాన్ని కాపాడుతూ ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించాలని ఆమె సూచించారు. కల్యాణ మండపం ఏర్పాటు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్ ఓని స్వర్ణలత భాస్కర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం... శ్రీ సీతారామాంజనేయ, హరిహర పుత్ర దేవాలయానికి తాత్కాలికంగా నియమించిన ఐదుగురు ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేశారు. మోతీలాల్ నాయక్, లకుం భాస్కర్, కుడికాల కోటేశ్వర్, పోతన లక్ష్మీనర్సయ్య, వెలిశాల మధుమతి ప్రమాణ స్వీకారం చేసినవారిలో ఉన్నారు. వీరు ఆలయంలో జరిగే శ్రీరామ నవమి ఉత్సవాల వరకు ధర్మకర్తలుగా వ్యవహరించనున్నారు. -
భద్రకాళి అమ్మవారికి మల్లెలతో పుష్పార్చన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం అమ్మవారికి మల్లెపూలతో పు ష్పార్చన నిర్వహించారు. ఉదయం అమ్మవారికి నిర్మాల్యసేవలు, నిత్యాహ్నికం నిర్వహించి పూలమాలలతో అలంకరించారు. అనంతరం ముఖ్య అర్చకులు చెప్పెల నాగరాజుశర్మ, వేద పాఠశాల విద్యార్థులు మల్ల్లెకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి ఘనంగా లక్షపుష్పార్చన నిర్వహించారు. వరంగల్కు చెందిన న్యాయవాది భాస్కరవజ్జుల పురుషోత్తం, భవానీ దంపతులు పుష్పార్చనకు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ ఈఓ రామల సునీత, ధర్మకర్తలు, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు. నయీంనగర్: భద్రకాళి ఆలయ అభివృద్ధి కోసం మాడవీధుల నిర్మాణానికి తమ స్థలాలను స్వచ్ఛందంగా అప్పగించిన వారికి శనివారం ఇళ్ల పట్టాలు అందించారు. 17 నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ‘కుడా’ కార్యాలయంలో లక్కీ డ్రా ద్వారా ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ కలెక్టర్, ‘కుడా’ వీసీ చాహత్ బాజ్పాయ్ న్యూశాయంపేటలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ‘కుడా’ ఆధ్వర్యంలో మాడవీధుల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ‘కుడా’ అధికారులు అజిత్రెడ్డి, భీమ్రావు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం మహా సుదర్శన హోమం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం ప్రభాతసేవ, గణపతి పూజ. రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, శ్రీసీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు విశ్వక్సేనారాధన, విష్ణుసూక్త మూలమంత్రయుక్తంగా నిత్యాహ్నికం నిర్వహించి రాముల వారి ఉత్సవిగ్రహాన్ని జానకీ వల్లభుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. యాగశాలలో మహా సుదర్శనహోమం నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో వెలమ సంఘం జిల్లా నా యకులు గుజ్జా సంపత్రావు, హైకోర్టు రిజి స్ట్రార్ ఓం శ్రీవిద్యాభారతి, వేదపండితులు గంగు మణికంఠ, సిబ్బంది మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. -
‘ట్రామా’.. ధీమా
సాక్షి, వరంగల్: ఉత్తర తెలంగాణకే తలమానికమైన వరంగల్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో ట్రామాకేర్ సేవలను మరింత పకడ్బందీగా అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాలతో తీవ్రంగా గాయపడిన వారికి సత్వరమే మెరుగైన చికిత్స అందించేందుకు మూడుస్థాయిల్లో ట్రామా ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి చోటు కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా లెవల్–1, లెవల్ –2, లెవల్–3గా విభజించి వైద్యారోగ్య శాఖ సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు కసరత్తు ప్రారంభించింది. ఎంజీఎం ఆస్పత్రిలో కూడా నిపుణులైన వైద్యులతో ట్రామా చికిత్సలో నాణ్యతను పెంచేందుకు కృషి చేస్తోంది. మూడేళ్ల క్రితం ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ (ఈఎండీ)ను అందుబాటులోకి తీసుకురావడంతో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోంది. అయితే నిమ్స్, ఉస్మానియా, గాంధీ, బీబీనగర్ ఎయిమ్స్, హైదరాబాద్ ఈఎస్ఐసీతోపాటు లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో ఎంజీఎంకు చోటు కల్పించడంతో మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. గోల్డెన్ అవర్లో ఆస్పత్రికి వచ్చిన క్షతగాత్రులకు అన్ని విభాగాల వారు ఒకే సమయంలో 24 గంటలు అందుబాటులో ఉండడం ద్వారా సత్వర వైద్యం అంది ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటుంది. అలాగే, వరంగల్లో నిర్మితమవుతున్న మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 10 నుంచి 12 పడకలతో ట్రామా ఐసీయూ అందుబాటులోకి రానుండడం కూడా క్షతగాత్రులకు ఎంతో ఉపయుక్తం కానుంది. న్యూరో, ఆర్థో, జనరల్ సర్జరీ, కార్డియాక్ స్పెషలిస్టులు, అనస్థీషాయా నిపుణులు, జనరల్ మెడిసిన్ వైద్యులతో పాటు డెంటల్, ఈఎన్టీ నిపుణులు కూడా అందుబాటులో ఉండడం వల్ల రోడ్డు ప్రమాద బాధితులకు అవసరమైన వైద్యం అందించే వీలుంటుంది. ఈ లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించి క్షతగాత్రులకు భరోసా కల్పించేలా చేస్తున్నారు. ఇప్పటికే ఎమర్జెన్సీ అపరేషన్ థియేటర్తో పాటు రేడియాలాజీ, అల్ట్రాసౌండ్ స్కాన్, సీటిస్కాన్ సేవలు ఎంజీఎంలో అందుబాటులో ఉన్నాయి. ఇంకా అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నారు. రోజుకు 200 వరకు ట్రామా కేసులు.. ఎంజీఎం ఆస్పత్రి క్యాజువాలిటీకి రోజుకు 500 నుంచి 700 వరకు కేసులు వస్తుంటాయి. వీటిలో 150 నుంచి 200 వరకు ట్రామా కేసులు ఉంటాయి. 30 నుంచి 50 వరకు మేజర్ కేసులుంటే, మిగిలినవి మైనర్. శని, ఆదివారాల్లో ఈ కేసులు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన క్షతగాత్రులకు వెంటనే వైద్యం అందేలా చేస్తున్నారు. లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రిగా అభివృద్ధి చేయడం ద్వారా ఎంజీఎంలో మరిన్ని సౌకర్యాలు పెరిగి 24 గంటలపాటు అన్ని విభాగాల వైద్యులు ఉంటారు. వీరికి ప్రత్యేక శిక్షణ తరగతులు ఇవ్వడం ద్వారా సమయానుకూలంగా స్పందించే అవకాశముంటుంది. ఇలా గోల్డెన్ అవర్లో క్షతగాత్రులకు మెరుగైన సత్వర చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు నిలుస్తాయి. క్షతగాత్రులకు సత్వర సేవలు.. ఇప్పటికే రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు సత్వర సేవలు అందుతున్నాయి. లెవల్–1 ట్రామాకేర్ ఆస్పత్రుల్లో ఎంజీఎం ఆస్పత్రికి చోటుకల్పించడం ద్వారా ఇంకొన్ని సౌకర్యాలు పెరుగుతాయి. క్షతగాత్రులకు గోల్డెన్ అవర్లో మెరుగైన వైద్య సేవలు అందుతాయి. – డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ లెవల్–1లో ఎంజీఎం ఆస్పత్రికి చోటు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం గోల్డెన్ అవర్ చికిత్సలో నాణ్యత పెంచే దిశగా అడుగులు ఇప్పటికే ఈఎండీతో క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు కొత్త మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోనూ ట్రామా ఐసీయూ -
కడియం శ్రీహరి వల్లే పార్టీ మారా..
● మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ● నగరంలో ముఖ్య కార్యకర్తల సమావేశం హసన్పర్తి: ‘స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వల్లే నేను పార్టీ మారాను. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానం మేరకు తిరిగి సొంత గూటికి చేరాను. అని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వర్ధన్నపేట డివిజన్ పరిధి 13 డివిజన్లలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలోని 1, 2వ డివిజన్ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నగరంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ.. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. సర్వేల ఆధారంగా గెలుపు అవకాశాలు ఉన్నవారికే కార్పొరేటర్ టికెట్ ఇస్తామని చెప్పారు. కష్టపడి పనిచేసిన వారికే పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ లావుడ్య రవి, డివిజన్ అధ్యక్షుడు నరేడ్ల శ్రీధర్, గండు అశోక్ యాదవ్, చల్లా వెంకటేశ్వర్రెడ్డి, గనిపాక విజయ్కుమార్, పీఏసీఎస్ మాజీ వైస్ ప్రసిడెంట్ నన్నబోయిన కుమార్ యాదవ్, ప్రమోద్, దేవేందర్, లోకేశ్, నంది శ్రీనివాస్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. డీటీఎఫ్ రెండు జిల్లాల బాధ్యులు విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 8.2 శాతం నిధులు కేటాయించడం అన్యాయమేనని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస్, కె.యాకయ్య, జి.ఉప్పలయ్య, గోవిందరావు ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనెఫెస్టోలో విద్యారంగానికి కనీసం 15 శాతం నిధులు కేటాయిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం శోఛనీయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరుమీద కొన్ని పాఠశాలలపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రధాన స్రవంతి పాఠశాలలను నిర్లక్ష్యం చేయడం సరికాదని తెలిపారు. విద్యారంగానికి కేటాయించిన నిధుల విషయంపై పునఃసమీక్షించి కనీసం 20 శాతం నిధులు కేటాయించి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ గడువు ముగిసి 32 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు రిపోర్ట్ తెప్పించుకోకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. -
పిచ్చుకలు.. ప్రకృతి సమతుల్యతకు సూచికలు
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: పిచ్చుకలు ప్రకృతి సమతుల్య తకు సూచికలని, అవి జీవించాలంటే సహజ వాతావరణాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఉందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాల్గొని పిచ్చుకల సంరక్షణపై రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పట్టణీకరణ, కాలుష్యంతో పిచ్చుకలు తగ్గిపోతుండడంతో ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. అనంతరం పిచ్చుకల గూళ్లను పరిశీలించి కొన్ని పిచ్చుకలను ప్రకృతిలోకి వదిలారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జిల్లా అటవీశాఖ అధికారి అనూజ్అగర్వాల్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ పాల్గొన్నారు. రెండు రోజుల్లో యాక్షన్ ప్లాన్ సమర్పించాలి ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం యాక్షన్ప్లాన్ను రెండు రోజుల్లో సిద్ధంచేసి సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపుహాల్లో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు సమన్వయంతో కృషిచేయాలన్నారు. ప్రజాప్రతినిధులు భాగస్వాములను చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, రోడ్లు పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. సమావేశంలో డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం స్వయం ఉపాధి పథకాల కోసం అర్హులైన ఎస్సీ నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. టూవీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు, గూడ్స్, ప్యాసింజర్ (ఎలక్ట్రిక్) వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్ విభాగాలు అందించి ఊబర్, జొమాటో, స్విగ్గీ, రాపిడో సంస్థలు, వ్యవసాయరంగంతో అనుసంధానం చేసి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. టీజీఓబీఎంఎంఎస్న్యూ.సీజీజీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో ఈనెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న కాపీతోపాటు సరైన ధ్రువపత్రాలు ఈనెల 25లోపు వరంగల్ ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. 23న పర్యావరణ పరిరక్షణపై కార్యక్రమం పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు వరంగల్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. 7, 8, 9 తరగతుల విద్యార్థులు రూపొందించిన ఆర్ట్, క్రాఫ్ట్ ప్రదర్శనలు ఈనెల 23న మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో ఏర్పాటు చేయనున్నారు. ఉత్తమ ప్రదర్శనలను ఎంపికచేసి విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. -
రంజాన్ పండుగ శుభాకాంక్షలు
హన్మకొండ అర్బన్: రంజాన్ పండుగ సందర్భంగా హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద ఆయా జిల్లాల ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దీవెనలతో ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను అందరూ సోదరభావంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. న్యూశాయంపేట : అంతరించిపోతున్న పక్షి సంపదను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హనుమకొండ జిల్లా అటవీశాఖాధికారి, జూపార్క్ క్యూరేటర్ బి.లావణ్య అన్నారు. శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్బంగా పాఠశాల విద్యార్థులకు కాకతీయ జూవాలజికల్ పార్క్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటి పరిసరాలకు వచ్చే పిచ్చుకలు, పక్షులకు ఆహారం, నీరును అందించి వాటి సంరక్షణకు సహాయపడాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి, కేయూ ప్రొఫెసర్ తిప్పని రాధిక, ఓరుగల్లు వైల్డ్లైఫ్ ఎన్జీఓ ప్రతినిధులు నాగేశ్వర్రావు, శ్యాంసుందర్, రవిబాబు, అటవీశాఖ సిబ్బంది సూరిదాస్, శివకుమార్, శారద, శ్వేత, సురేశ్ పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం లిల్లీపూలతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి నిర్మాల్యసేవలు, నిత్యాహ్నికం నిర్వహించి విశేషాలంకరణ జరిపారు. అనంతరం ముఖ్యార్చకులు చెప్పెల నాగరాజుశర్మ, వేద పాఠశాల విద్యార్థులు లిల్లీపూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వరంగల్కు చెందిన సూరినేని నవీన్రావు, నీరజ దంపతులు పుష్పార్చన ఉభయదాతలుగా వ్యవహరించారు. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ ఈఓ రామల సునీత, ధర్మకర్తలు, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు. హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం భద్రాద్రి రాముడిగా పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. పాంచరాత్ర ఆగమానుసారం చెరకుమల్లి శ్రీవాత్సవచార్యులు ఆధ్వర్యంలో రాముల వారి ఉత్సవ విగ్రహాన్ని భద్రాద్రి రాముడిగా అలంకరించి పూజలు, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. యాగశాలలో వివిధ ధాన్యాలు, పండ్లు, పూలు సమర్పిస్తూ మహా సుదర్శన హోమం ని ర్వహించారు. పూజా కార్యక్రమాల్లో తమిళనా డు ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ముఖేశ్, తిరుమూర్తి, బ్రాహ్మణ సేవాసంఘం సమాఖ్య రాష్ట్ర అ ధ్యక్షుడు మోతుకూరి రామేశ్వరరావు, శ్రీరామసేవాసమితి సభ్యుడు కట్ల రాజు ఉన్నారు. విద్యారణ్యపురి: వేసవి తీవ్రత దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర డైరెక్టర్ ఆదేశాల ప్రకారం అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఒంటి పూట మాత్రమే బడులు నడపాలని, రెండుపూటలా నడిపితే చర్యలు తీసుకుంటామని హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో వార్షిక పరీక్షల పేరిట హాల్ టికెట్లు జారీ సమయంలో ఫీజులు చెల్లించని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులొచ్చాయని, విద్యాశాఖ సూచనలు పాటించాలని ఆయన కోరారు. -
సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: జిల్లాలో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన పథకాలు పటిష్టంగా అమలు కావాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పోషణ, పోషణ్ అభియాన్, అక్షయపాత్ర భోజనం, ‘బేటీ బచావో.. బేటీ పడావో’ వంటి కార్యక్రమాల అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో సీడీపీఓలు స్వరూప, ఉమా, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సింధురాణి, ఇన్చార్జ్ డీసీపీఓ ప్రవీణ్ కుమార్, ఎఫ్ఆర్ఓ రవికృష్ణ, సఖి కేంద్రం అడ్మిన్ హైమావతి, శిశు గృహ మేనేజర్ మాధవి, చైల్డ్ లైన్ కో–ఆర్డినేటర్ భాస్కర్, డీహెచ్డబ్ల్యూ కో–ఆర్డినేటర్ కళ్యాణి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
మంత్రి ఇంటి ముట్టడి ఉద్రిక్తం
● ఆశ వర్కర్లకు, పోలీసులకు మధ్య తోపులాట ● రోడ్డుపై బైఠాయించి ఆశల ధర్నా హన్మకొండ: ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు నెలకు రూ.18,000 వేతనం చెల్లింపుపై నిర్ణయం తీసుకోవాలని సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి డిమాండ్ చేశారు. ఈమేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశాలు శుక్రవారం హనుమకొండ రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడికి యత్నించారు. రాంనగర్లోని సీఐటీయూ కార్యాలయం నుంచి మంత్రి ఇంటికి ఆశాలు ర్యాలీగా బయల్దేరారు. మంత్రి ఇంటి సమీపంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు సీఐటీయూ నాయకులు, ఆశాలు తీశ్రంగా శ్రమించారు. పోలీసులు ప్రతిఘటించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం మంత్రి ఇంటి సమీపంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. మంత్రి పీఏతో ఫోన్లో మాట్లాడించి.. శనివారం మంత్రి సురేఖను కలిసేలా ఏర్పాటు చేస్తామని, వినతి పత్రం ఇచ్చి సమస్యలు వివరించుకోవచ్చని సీఐ రంజిత్ కుమార్ చెప్పడంతో శాంతించి ధర్నా విరమించారు. ఆశాలను నాలుగవ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఈ నెల 28న చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆశాలు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. సీఐటీయూ వరంగల్ జిల్లా కార్యదర్శి ఆరూరి కుమార్ కార్యక్రమంలో ఆశా యూనియన్, సీఐటీయూ నాయకులు సుంచు రాజేశ్వరి, బైరి శోభ, జనగాం శ్వేత, సీహెచ్ శ్రీవాణి, పద్మ, సీహెచ్ రాణి, రమ, కవిత, రజిత, ఈసంపల్లి శోభ, కరుణలత, లీల, పుష్ప, ప్రేమలతతోపాటు వందలాది మంది ఆశాలు పాల్గొన్నారు. -
అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యం
● కొత్త ప్రాజెక్టులు జీరో.. పాత పనుల కొనసాగింపు ● ఉమ్మడి జిల్లాకు ‘ప్రత్యేకం’ లేదు ● యూజీడీ, మామునూరు సహా కీలక ప్రాజెక్టులకు పద్దులు లేవు ● అభివృద్ధి, సంక్షేమ పథకాలు యథాతథం.. ఆరు గ్యారంటీలకు ఆదరణ ● సాగునీరు, వ్యవసాయరంగాలు, మహిళల సంక్షేమానికి పెద్దపీట ఉమ్మడి జిల్లాకు కేటాయింపులు ఇలా.. గోదావరి ఎత్తిపోతల పథకం (జీఎల్ఐఎస్) ప్రాజెక్టు ఎస్టాబ్లిష్మెంట్కు రూ.5 కోట్లు జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల పథకం (సీఈ) పేరిట రూ.445 కోట్లు రామప్ప, పాకాల, లక్నవరం, మల్లూరుకు రూ.కోటి చొప్పన రూ.4 కోట్లు మామునూరు వెటర్నరీ సైన్స్ కళాశాలకు రూ.25 కోట్లు వరంగల్లోని రీజినల్ సైన్స్ సెంటర్కు రూ. 30 లక్షలు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో కొత్త భవనాల నిర్మాణానికి రూ.10 కోట్లు మేడారం జాతర పనుల కోసం రూ.10 కోట్లు ములుగులోని ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) రూ. 93.22 కోట్లు కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ.40 కోట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి రూ. 60 లక్షలు వరంగల్, కరీంనగర్ క్రీడా పాఠశాలల సాయం కోసం రూ.42.80 కోట్లు జనగామలో ప్రభుత్వ కోకోన్ మార్కెట్ నిర్మాణానికి రూ.2.53 కోట్లు అవీ, ఇవీ, అన్నీ.. వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయించడం ద్వారా ఉమ్మడి జిల్లాలో 15,01,109 ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్న 6,33,229 మంది రైతులకు అర్హతను బట్టి రైతుభరోసా, రైతుబీమా సౌకర్యం కలగనుంది. రైతుభరోసా ద్వారా సుమారు 6.50 లక్షల మంది రైతులకు రూ.900 కోట్ల నుంచి రూ.1,100 కోట్ల వరకు సంవత్సరానికి లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ఈబడ్జెట్లో రూ.26,674 కోట్లు కేటాయించింది. మొత్తం 3,331 ప్రభుత్వ పాఠశాలల్లో 4,67,011 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈసారి నిధులు వెచ్చించడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఉచిత ప్రయాణ పథకం కొనసాగింపు వల్ల ఆర్టీసీ బస్సుల్లో వరంగల్ రీజియన్లో రోజుకు సగటున సుమారు 55 వేల మంది మహిళలు రాకపోకలు సాగించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన సుమారు 8 వేల మంది లబ్ధిదారులకు బిల్లులు అందనున్నాయి. గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుతున్న 6,12,901 మందికి ఉచిత విద్యుత్ సౌకర్యం నిరంతరం కొనసాగనుంది. -
అభివృద్ధి.. సవాళ్లు!
సాక్షి, వరంగల్: పరాభవనామ సంవత్సరంలో వరంగల్ జిల్లా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూనే కొన్ని కీలక సవాళ్లను ఎదుర్కోనుంది. మౌలిక వసతులు, పరిశ్రమలు, పెట్టుబడులు జిల్లాను ముందుకు నడిపితే.. వ్యవసాయం, వాతావరణం, పరిపాలన సమస్యలు కొంతమేర ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మౌలిక వసతుల కల్పన కోసం.. హైదరాబాద్కు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి కేంద్రంగా గ్రేటర్ వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుండడం కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏళ్లుగా పెండింగ్లో ఉంటున్న గ్రేటర్ వరంగల్లో వరద, మురుగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఉద్దేశించిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూడీజీ) ప్రాజెక్టుకు రూ.5,257 కోట్లతో ఫేజ్–1 పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఇటీవల పరిపాలన అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే, ఏళ్లుగా ఎదురుచూస్తున్న మామునూరు విమానాశ్రయానికి కావాల్సిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించడంతో ఆ నిర్మాణ పనులు కూడా ఈ ఏడాదిలో ప్రారంభించే అవకాశముంది. రంగశాయిపేట నాయుడు పెట్రోల్బంకు నుంచి ఆరెపల్లి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 13 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెరగనుంది. కేంద్రం తీసుకొచ్చిన ‘సాస్కీ’ ప్రాజెక్టు కింద రూ.300 కోట్లతో కీలక ప్రాజెక్టులు, వివిధ పనులు పట్టాలెక్కే అవకాశం ఉంది. – శ్రీరామోజు వీరబ్రహ్మచార్యులు, జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి, ఓసిటీ, వరంగల్ హనుమకొండ ప్రాంత శుభాశుభ ఫలితాలు హన్మకొండ కల్చరల్: శ్రీపరాభవ నామసంవత్సరంలో హనుమకొండ జిల్లా పునర్వసు నక్షత్రం, మిధునరాశి అవుతుంది. ఈ సంవత్సరం గురువు జూన్ 1వరకు ఒకటో స్థానంలో ఉండి స్థానిక సమస్యల అవగాహన, ఆర్థిక, అభివృద్ధి పనుల్లో చురుకుగా ఉండగలదు. గురుగ్రహం వల్ల శుభం కలుగుతుంది. డిసెంబర్ నుంచి రాహు, కేతుల వల్ల స్థానమార్పులు ఉంటాయి. కొంత ప్రతికూల పరిస్థితులు, స్థానిక సమస్యలు ఏర్పడుతాయి. వీటిని అధిగమించే అవకాశం ఉంది. పరాభవ నామ సంవత్సరంలో వరంగల్, హనుమకొండ జిల్లాల జాతకం కీలక ప్రాజెక్టులకు కోట్లాది రూపాయల ఖర్చు త్వరలో నగరంలో యూజీడీ పనులు ప్రారంభంజిల్లాల వారీగా.. జిల్లా : వరంగల్ హనుమకొండ రాశి : వృషభం మిథునరాశి నక్షత్రం : రోహిణి పునర్వసు ఆదాయం : 5 08 వ్యయం : 14 11 -
మినరల్ మిథ్య!
వరంగల్ అర్బన్: మినరల్ వాటర్ తాగుతున్నాం.. మా ఆరోగ్యానికి ఢోకా లేదని ధైర్యంగా ఉన్నారా.. మీరు తాగేది స్వచ్ఛమైన మినరల్ వాటరే అని అనుకుంటున్నారా.. ఆ నీటిని కాచి చల్లార్చకుండానే మీ పిల్లలకు తాగిస్తున్నారా.. అయితే ఆరోగ్యం చేజా రిపోతున్నట్లే.. నగరంలో అనేకమంది మినరల్ వాటర్ప్లాంట్ల నిర్వాహకులు సరఫరా చేస్తున్న నీరు స్వచ్ఛమైనది కాదని, ఆ నీటిలో కనీస నాణ్యత లేద ని మీకు తెలుసా? ఔను.. చాలా ప్లాంట్లలో నిబంధనలకు విరుద్ధంగా అండర్గ్రౌండ్ నుంచి తీసిన నీటికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే నేరుగా క్యాన్లు, ప్యాకెట్లలోకి నింపుతున్నారు. దీనిపై కా ర్పొరేషన్ ప్రజారోగ్య విభాగం దృష్టి సారించకుంటే ప్రజారోగ్యం మరింత దెబ్బతినే ప్రమాదముంది. 12 ప్లాంట్లకు మాత్రమే బీఐఎస్ గుర్తింపు.. వరంగల్ నగరవాసులకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. కార్పొరేషన్ సరఫరా చేసే నీరు స్వచ్ఛంగా లేకపోవడంతో చాలా మంది మినరల్ వాటర్పై ఆధారపడుతున్నారు. దీంతో నగరంలో ఇబ్బడి ముబ్బడిగా గ్రౌండ్ వాటర్ప్లాంట్లు పుట్టుకొస్తున్నాయి. తక్కువ ధరకే నీటిని సరఫరా చేస్తామంటూ అనేక మంది అనుమతి లేకుండా, కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం నగరంలో 450కి పైగా గ్రౌండ్ వాటర్ప్లాంట్లు, 3,500 వరకు ప్యూరిఫైడ్ వాటర్ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో 12 మాత్రమే బీఐఎస్ గుర్తింపు కలిగి ఉన్నాయి. రోజుకు రూ.లక్షల్లో వ్యాపారం నగరంలో ఉన్న 450 ప్లాంట్ల నుంచి రోజుకు లక్షల లీటర్ల నీళ్లు ఉత్పత్తి అవుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. ప్రతీ వాటర్ ప్లాంట్ నుంచి 18 లక్షల లీటర్ల వరకు నీరు ఉత్పత్తి అవుతోంది. మినరల్ పేరుతో విచ్చలవిడిగా రసాయనాలు కలిపిన ఈ నీరు క్యాన్లు, ప్యాకెట్ల రూపంలో నివాస గృహాలు, హోటళ్లు, దుకాణాలకు సరఫరా అవుతోంది. 20 లీటర్ల వాటర్ క్యాన్కు రూ.10 నుంచి రూ.30 వరకు, వాటర్ ప్యాకెట్ రూ.2 చొప్పన విక్రయిస్తున్నారు. ఇలా రోజుకు రూ.20 లక్షలకు పైగా వ్యాపారం జరుగుతోంది. పట్టించుకోని అధికార యంత్రాంగం నిబంధనలు పాటించకుండా ప్రజారోగ్యాన్ని దెబ్బ తీస్తున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. ప్రజారోగ్య విభాగం ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. వాటర్, ఇండస్ట్రియల్ డిపార్టుమెంట్లు ఈ ప్లాంట్లను పర్యవేక్షించడం లేదు. డబ్బులిచ్చి మరీ రోగాలు కొని తెచ్చుకునే ప్రమాదం ఉంది. వేసవిని తమ ‘మార్కెట్‘కు అనుకూలంగా ఎంచుకొని అక్రమార్కులు నగరప్రజలే టార్గెట్గా విజృంభిస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. నామమాత్రంగా దాడులు నిర్వహించినా అధికారులపై రకరకాల ఒత్తిళ్లు వస్తున్నాయి. అయితే, ఇదే పరిస్థితి ఉంటే ‘మంచి’ నీటి రూపంలో మనకు అనారోగ్యంతో పాటు ఆర్థిక నష్టం కూడా జరుగుతోంది. గతంలో జాయింట్ కలెక్టర్గా పనిచేసిన వాకటి కరుణ పర్యవేక్షణలో అనుమతి లేని ప్లాంట్లను మూసివేసేందుకు జిల్లా అధికారులతో కమిటీని నియమించి, తనిఖీలు చేసి సీజ్ చేశారు. కొన్నేళ్లుగా ఆహార కల్తీ నిరోధక శాఖ, రెవెన్యూ, గ్రేటర్ వరంగల్ అధికారులు వాటర్ప్లాంట్ల వైపు చూడడం మరిచిపోయారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి నిబంధనలు పాటించని వాటర్ప్లాంట్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలు పాటించని వాటర్ప్లాంట్ల నిర్వాహకులు నీటిలో విచ్చలవిడిగా రసాయనాల వాడకం వ్యాధులబారిన పడుతున్న నగర ప్రజలు పట్టించుకోని జీడబ్ల్యూఎంసీ అధికారులువాటర్ ప్లాంట్కు బీఐఎస్ అనుమతి తీసుకోవాలి. ఏడాదికోమారు రెన్యువల్ చేసుకోవాలి. రూ.90 వేల ఫీజు చెల్లించాలి. విశాలమైన ప్రాంతంలో హెచ్డీపీ, స్టీల్ పైపులు ఏర్పాటు చేయాలి. ఐఎస్ఐ మార్కు కలిగిన ఫిల్టర్ మిషన్లు ఉండాలి. నీటి ట్యాంకులు ఇతర సామగ్రి నాణ్యమైనవి వినియోగించాలి. జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖ నుంచి అనుమతి పొందాలి. వాల్టా చట్టం ప్రకారం రెవెన్యూ శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకోవాలి. బల్దియా నుంచి ట్రేడ్ లైసెన్స్ పొందాలి. ఇద్దరు టెక్నీషియన్లు ఉండాలి. ఎప్పటికప్పుడు వాటర్ శాంపిల్ పరీక్షలు చేయాలి. కానీ, వీటిలో ఒక్క నిబంధన కూడా ప్లాంట్ల నిర్వాహకులు పాటించడం లేదు. గల్లీకో చోట విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తూ నీటి వ్యాపారం సాగిస్తున్నారు. -
ఘనంగా వసంత నవరాత్రోత్సవాలు షురూ
ఘనంగా అమ్మవారికి పసుపు రంగు చామంతులతో లక్ష పుష్పార్చన హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శ్రీపరాభవ నామ సంవత్సరం చైత్రమాసం పాడ్యమి తిథిని పురస్కరించుకుని గురువారం వసంత నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి నిర్మాల్య సేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి వసంత నవరాత్ర ఉత్సవాలు జరపడానికి అనుజ్ఞాప్రార్థన జరిపి పూర్ణాభిషేకం నిర్వహించి అమ్మవారిని పూలమాలలతో శోభా యమానంగా అలంకరించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, నీలిమా దంపతులు దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు జరుపుకున్న అనంతరం అమ్మవారి సన్నిధిలో జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రారంభించారు. ఉగాది పర్వదినం కావడంతో భక్తులతో దేవాలయం కిక్కిరిసిపోయింది. లక్ష పుష్పార్చనలో భాగంగా ఉత్సవాల మొదటిరోజు పసుపు రంగు చామంతులకు సంప్రోక్షణ నిర్వహించి అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు జ్యోతిష్య పండితులు అయినవోలు రాధాకృష్ణశర్మ సిద్ధాంతిచే పంచాంగ పఠనం నిర్వహించారు. -
లక్ష్య సాధనకు ఇష్టపడి చదవాలి
సివిల్స్ 123వ ర్యాంకర్ అట్ల తరుణ్తేజ కాజీపేట అర్బన్: లక్ష్యాన్ని ఎంచుకుని సాధించేందుకు ఇష్టపడి చదవాలని సివిల్స్ 123వ ర్యాంకు సాధించిన అట్ల తరుణ్ తేజ అన్నారు. హంటర్ రోడ్డులోని శ్రీవ్యాస ఆవాసంలో గురువారం సులక్ష్య సేవాసమితి 13వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. సివిల్స్ సాధించాలనే సంకల్పంతో నాలుగుసార్లు విఫలమైనా ఐదోసారి 123వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఓటమితో కుంగిపోకుండా విజయం సాధించే వరకు శ్రమించాలన్నారు. సమాజ సేవలో సులక్ష్య సేవా సమితి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఆవాసంలోని చిన్నారులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో భారతీయ వాయుసేన ఆఫీసర్ అనిల్కుమార్ త్రిపాఠి, సేవా సమితి వ్యవస్థాపక, అధ్యక్షుడు మండువ సంతోశ్, సాయికిరణ్, వినయ్, ప్రణీత్, వసుంధర, రామాచారి పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: పోతన విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో గురువారం పీఠం కార్యవర్గసభ్యులు గంధ శ్రీనివాస్, బన్న అయిలయ్య, ఎన్వీఎన్ చారి, అడ్టూరి చంద్రశేఖర్, జూలూరు నాగరాజు పాల్గొని పసుమర్తి సాంబశివ సోమయాజులు రాసిన ‘భూకంపాలు జ్యోతిష్య శాస్త్ర పరిశీలన’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉగాదిని పురస్కరించుకుని కవులు వల్స పైడి, జూలూరు నాగరాజు, కుడికాల జనార్దన్ తదితరులు కవితాగానం చేశారు. ఈసందర్భంగా సాంబశివ సోమయాజులుకు జ్యోతిష్య జ్ఞానరత్న పురస్కారం ప్రదానం చేశారు. అదేవిధంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన నగరానికి చెందిన వీఆర్ విద్యార్థి, రాజశేఖర్, రమేశ్బాబు, సుబేదార్ ప్రభాకర్, చెనుమల్ల శ్రీధర్ను సన్మానించి పోతన పురస్కారాలు ప్రదానం చేశారు. ఎంపీ కడియం కావ్య హన్మకొండ అర్బన్: మానసిక దివ్యాంగుల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. మానసిక దివ్యాంగులపై ఉన్న అపోహలు, వివక్ష తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఆధార్ లింకేజీ సమస్యల వల్ల పలువురు దివ్యాంగులు పెన్షన్లు, వైద్య సదుపాయాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బాలసముద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో గురువారం మానసిక దివ్యాంగ చిన్నారులతో కలిసి ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుటుంబ సమేతంగా వేడుకలు జరుపుకున్నారు. కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు కొత్త బట్టలు అందజేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు రామలీల, కళ్యాణ్ పాల్గొన్నారు. -
రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
● రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు ● రైతుల మహాగర్జన సభ విజయవంతం కావాలని పూజలు హన్మకొండ కల్చరల్: పాలకులు రైతన్నలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 28న కరీంనగర్లో ఓసీ జేఏసీ, రైతు ప్రజాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో లక్ష మందితో రైతుల మహా గర్జన సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గురువారం హనుమకొండ వేయిస్తంభాల ఆలయంలో సమాఖ్య రాష్ట్ర, ఉమ్మడి జిల్లాల నాయకులు పాల్గొని రైతుల మహాగర్జన సభ విజయవంతం కావాలని ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, ప్రత్యేకపూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. అనంతరం పోలాడి రామారావు విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా అందరినీ మహా గర్జన సభకు ఆహ్వానిస్తున్నట్లు, రైతులు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను మహాగర్జన ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. పూజా కార్యక్రమంలో రాష్ట్ర వైశ్య సంఘాల జేఏసీ చైర్మన్ అయిత నాగరాజు, రైతు సంఘాల రాష్ట్ర జేఏసీ తోట సురేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి చందుపట్ల నరసింహారెడ్డి, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. -
పిచ్చుకలు.. ప్రకృతి నేస్తాలు!
తగ్గిపోవడానికి కారణాలెన్నో.. పిచ్చుకల సంతతి తగ్గిపోవడానికి అనేక కారణాలున్నాయి. విద్యుత్తు ,పెట్రోల్ వంటివి వినియోగం, సెల్టవర్ల కారణంగా పెరుగుతున్న రేడియేషన్, పట్టణీకరణ పేరుతో ఎక్కడికక్కడ సిమెంట్ ఇళ్ల నిర్మాణాలు, కనీసం ఇవి గూడు పెట్టుకునే ఆవాసాలు లేకపోవడం, వ్యవసాయంలో పురుగు మందులు, క్రిమి సంహారక మందుల వినియోగం బాగా పెరగడం వంటివి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఖిలా వరంగల్: జీవ పరిణామ క్రమంలో ఉద్భవించిన అద్భుత జంతుజాలమే పక్షులు.. ఈ సంపద ప్రకృతి వరప్రసాదం. అందులో పిచ్చుకలు.. ప్రకృతికి అందం, మానవాళికి జీవవైవిధ్యంతోపాటు ఆనందాన్ని అందిస్తాయి. ఒకప్పుడు ఉదయం లేవగానే నగర, పట్టణ,గ్రామాల్లో ఎక్కడ చూసినా పిచ్చుకలు కనిపించేవి. ఇళ్లల్లోకి వచ్చి కిచకిచమంటూ పలకరించేవి. చప్పుడు చేయగానే తుర్రుమంటూ ఎగిరిపోతుండేవి. కాలక్రమంలో ఈబుజ్జి పక్షులు మన జీవితాల నుంచి క్రమంగా కనుమరుగవుతున్నాయి. అంతరించిపోతున్న పిచ్చుకలను సంరక్షించడంతో పాటు వాటి ప్రాఽధాన్యం మానవాళికి తెలియజేయడం కోసం ఏటా మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పిచ్చుకలతో మానవాళికి మనుగడ.. చూసేందుకు చిన్నవిగా ఉండే పిచ్చుకలు మానవాళి మనుగడకు ఎంతో మేలు చేస్తాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. పంటలను ఆశించే వివిధ కీటకాలను తినడం ద్వారా తెగుళ్లు రాకుండా పరోక్షంగా రైతులకు మేలు చేస్తాయి. వివిధ పంటల్లో పరాగ సంపర్కం జరిగేలా చేసి దిగుబడులు పెంచుతాయి. నేలను సారవంతం చేస్తూ భూమిలో మొక్కలు మొలకెత్తేందుకు దోహదం చేస్తాయి. మనమేం చేయాలంటే.. అవగాహన ఉన్న కొందరు గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు తమ పంట పొలాల్లో పక్షుల కోసం ప్రత్యేకంగా టీ ఆకారంలో కర్రలను ఉంచడం ద్వారా వాటిపై పక్షులు వాలుతుంటాయి. ● పొలం గట్లపై మోదుగు, సీమ చింత, మల్బ రీ, నేరేడు వంటి పండ్ల చెట్లను పెంచడం ద్వారా పక్షులు పంట పొలాలకు దగ్గరలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ● నగరాల్లో ప్రత్యేక గూళ్లు లభ్యమవుతున్నాయి. ఇంటి ఫోర్టికో వద్ద, పరిసరాల్లో ఆ గూళ్లను ఏర్పాటు చేసి అక్కడక్కడా డబ్బాల్లో ధాన్యం గింజలు, తాగునీరు అందుబాటులో ఉంచాలి. మందుల వినియోగం తగ్గాలి.. తెగుళ్లు నివారణ కోసం విచ్చలవిడిగా క్రిమిసంహారక మందులు వినియోగం వల్ల పంటలకు మేలు చేసే సూక్ష్మ జీవులతోపాటు పిచ్చుకల మనుగడకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతోంది. రైతు నేస్తాలుగా వీటిని పరిగణించి వాటికి ప్రత్యేకంగా ఆవాసాలు కల్పించాలి. పిచ్చుకల దినోత్సవాలను నిర్వహించడం ద్వారా ఈచిన్న పక్షులను మన జీవితాల్లోకి తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు జరగాలి. – డాక్టర్ అరుణ్జ్యోతి, కేవీకే శాస్త్రవేత్త సంరక్షణ బాధ్యతగా భావించాలి.. మానవ జాతి మనుగడతో ముడిపడి ఉన్న పిచ్చుకల సంరక్షణను బాధ్యతగా భావించాలి. అందరూ తమ ఇళ్ల ముందు మొక్కలు నాటి, ఇంటి సరిసరాల్లో పిచ్చుకలు నివసించడానికి వీలుగా చెక్కతో తయారు చేసిన డబ్బాలను అమర్చాలి. వాటిలో ధాన్యం, నీళ్లు అందించాలి. పిచ్చుకలు ఇళ్లల్లో నివసిస్తే ఆ ఇంటికి శుభ సూచకంగా భావిస్తారు. – గాదె స్వరూప్రెడ్డి పక్షి ప్రేమికుడు హనుమకొండ ● ఆహ్లాదాన్ని పంచే అతి చిన్న పక్షులు రక్షిస్తేనే పర్యావరణ సమతుల్యత నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం -
సుత్తెతో మోది.. డీజిల్ పోసి దహనం
కాజీపేట అర్బన్: కన్న బిడ్డనిచ్చిన పాపానికి మామను, కట్టుకున్న భార్యను అతికిరాతకంగా సుత్తెతో తలపై మోది, ఇద్దరిపై డీజిల్ పోసి నిప్పంటించి దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హను మకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలోని రాజీవ్గృహకల్ప సముదాయంలో బుధవారం చోటు చేసుకుంది. మృతు రాలి సోదరి తేజస్వి కథనం ప్రకారం.. కడిపికొండ రాజీవ్గృహకల్ప సముదాయంలోని 5వ బ్లాక్ 24వ ప్లాట్లో బాషబోయిన రాజశేఖర్ (51) ఉంటున్నాడు. భార్య శ్రీలత సుమారు పదిహేనేళ్ల క్రితం గుండె నొప్పితో మృతి చెందింది. వీరికి ముగ్గురు కుమార్తెలు రాజశ్రీ, తేజస్వి, మనోజ్ఞ ఉన్నారు. రాజశేఖర్ ఆటో డ్రైవర్గా, వంట మనిషిగా పనులు చేస్తూ పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. పెద్ద కుమార్తె రాజశ్రీని 2023లో వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలికి చెందిన పొక్కుల ప్రవీణ్కు ఇచ్చి పెళ్లి చేశాడు. రెండవ కుమార్తె తేజస్విని హనుమకొండలో ఉంటుండగా, మరో కుమార్తె డిగ్రీ చదువుతోంది. రాజశ్రీకి పెళ్లి సమయంలో రూ.3 లక్షల కట్నంతోపాటు ఇంటిసామగ్రి పెట్టి ఘనంగా పెళ్లి చేశాడు. వీరికి 2024లో బాబు జయాంశ్ జని్మంచగా, ఆరు నెలల క్రితం పాప పుట్టింది. ప్రవీణ్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్లోని మౌలాలిలో కోకాకోలా కంపెనీలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. పాప పుట్టిన నాటినుంచి వరకట్న వేధింపులతోపాటు అమ్మాయి పుట్టిందని, మరింత కట్నం తీసుకురమ్మని నిత్యం వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో రాజశ్రీ ఇటీవల ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో కుడి చెయ్యి విరిగింది. దీంతో పనులు కూడా సరిగా చేయడం లేదని విసిగిస్తున్నాడు. నెలరోజుల క్రితం పాపకు అన్నప్రాసన చేయాలని తండ్రి వద్దకు రాగా, వారం రోజుల క్రితం వచ్చిన ప్రవీణ్ కూడా ఇక్కడే ఉంటున్నాడు. మంగళవారం రాత్రి ఏమి జరిగిందో తెలియదు. బుధవారం తెల్లవారుజామున ప్రవీణ్ మామ రాజశేఖర్, భార్య రాజశ్రీలపై వెంట తెచ్చుకున్న సుత్తెతో నుదుటిపై దాడిచేశాడు. ఇద్దరికి తలలు పగిలి తీవ్రరక్తస్రావమైంది. ఇంకా బతికి ఉంటారని భావించిన ప్రవీణ్.. ఇద్దరిపై డీజిల్ పోసి నిప్పంటించాడు. ఆ తరువాత నిందితుడు తనకు వరుసకు అత్త (రాజశ్రీ పిన్ని) అయ్యే ఆమెకు ఫోన్ చేసి తన భార్య, మామ కాల్చుకుని చనిపోయారని సమాచారం ఇచ్చాడు. ఆమె వెంటనే రాజశేఖర్ రెండవ కూతురు తేజస్వికి ఫోన్ చేసి సమాచారం తెలిపింది. హుటాహుటిన ఆమె రాజీవ్గృహకల్ప క్వార్టర్స్కు వచ్చారు. అప్పటికే రాజశేఖర్, రాజశ్రీ పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్ధితిలో ఉన్నారు. నుదిటిపై బలమైన గాయాలు ఉన్నాయి. తేజస్వి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. కాగా, ప్రవీణ్ ఫిబ్రవరిలోనే వీరిని చంపాలని ప్లాన్ చేసుకున్నట్లు , అప్పుడే డీజిల్ కొనుగోలు చేసి క్యాన్ను క్వార్టర్లో ఓ మూలన పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
భార్య, మామను హత్య చేసి పెట్రోల్తో తగలబెట్టిన అల్లుడు
హనుమకొండ జిల్లా: హనుమకొండ జిల్లాలోని కడిపికొండ రాజీవ్ గృహాకల్పలో ఒక వ్యక్తి తన భార్యను, మామను అత్యంత కిరాతకంగా చంపి, పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. నిందితుడు ప్రవీణ్కు, అతని భార్య రాజశ్రీకి గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. చిన్నపాటి మనస్పర్థలు కాస్తా ముదిరి పెద్ద గొడవలకు దారితీశాయి. ఈ క్రమంలోనే బుధవారం వేకువజామున నాలుగు గంటల సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రవీణ్, తన భార్య రాజశ్రీతో పాటు మామ రాజశేఖర్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. వారు స్పృహ కోల్పోయిన తర్వాత, పక్కా పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న పెట్రోల్ను వారిపై పోసి నిప్పంటించాడు.ఈ ఘటనలో ఇద్దరూ పూర్తిగా కాలిపోయి బూడిదగా మారినట్లు సమాచారం.అనంతరం నిందితుడు తన కుమారుడు, కుమార్తెను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. -
ఆహార అవశేషాలతో బయోగ్యాస్
కేయూ క్యాంపస్ : గృహల్లో ఉత్పత్తయ్యే ఆహారఅవశేషాల(తడి వ్యర్థాలు, కూరగాయల తొక్కలు) నుంచి బయోగ్యాస్ను తయారు చేయొచ్చునని హైదరాబాద్ ఐఐసీటీచీఫ్ సైంటిస్టు ఎ. గంగాగ్నిరావు అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభా గం ఆధ్వర్యంలో క్యాంపస్లోని పరిపాలన భ వనం సెనేట్హాల్లో సోమవారం ‘కరెంట్ రీసెర్చ్ ఇన్ కెమికల్ సైన్సెస్ 2026’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. అలాగే ‘గృహా సంబంధ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి’ అనే అంశంపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అనంతరం కేయూ రిజి స్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ నూతన ఆవి ష్కరణలు మానవాళికి ఉపయోగపడాలన్నారు. హైదరాబాద్లోని హెట్రో డ్రగ్స్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.మురళి మాట్లాడుతూ యూనివర్సిటీలు, పరిశ్రమలు పరస్పరం అనుసంధానమై పనిచేసినప్పుడే నూతన ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయన్నారు. కెమిస్ట్రీ విభాగం అధిపతి ఎన్.వాసుదేవరెడ్డి, సైన్స్విభాగాల డీన్ జి. హనుమంతు, బిట్స్ ఫిలానీ ఆచార్యుడు ఎ. అమిత్నాగ్, ఐఐసీటీ శాస్త్రవేత్తలు రవిశంకర్, ఆర్. నాగరాజు మాట్లాడారు. ఆచార్య ఎస్. జ్యోతి, అధ్యాపకులు మమత, టి. రాజమణి, రంగారెడ్డి, ఎన్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అబ్స్ట్రాక్ పరిశోధనపత్రాల బుక్లెట్ను అతిథులు ఆవిష్కరించారు. ఈసదస్సునేటి(మంగళవారం)తో ముగియనుంది. హైదరాబాద్ ఐఐసీటీ చీఫ్ సైంటిస్టు గంగాగ్నిరావు -
వరంగల్ మార్కెట్కు నాలుగు రోజులు సెలవు
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్కు నాలుగు రోజులు సెలువు ఉందని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్. మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. 19వ తేదీ (గురువారం)ఉగాది పండుగ సందర్భంగా సెలవు ఉందని, ఈ సమయంలో మా ర్కెట్లో క్రయ, విక్రయాలు జరగవన్నారు. 20న(శుక్రవారం)మార్కెట్లో యథావిధిగా క్రయ, విక్రయాలు జరుగుతాయని, 21న(శనివారం) రంజాన్ పండుగ (ప్రభుత్వ సెలువు), 22న(ఆదివారం) వారాంతపు సెలవు కావడంతో మార్కెట్ బంద్ ఉంటున్నారు. ఈ సమయంలో మార్కెట్లో ఎలాంటి క్రయ, విక్రయాలు జరగవన్నారు. ఈవిషయాన్ని పరి గణనలోకి తీసుకుని రైతులు, వ్యాపారులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తీసుకురావొద్దని తెలిపారు. 23వ తేదీన (సోమవారం) మార్కెట్ పునఃప్రారంభమవుతుందన్నారు. -
చేనేత ఉత్పత్తులకు ‘టెండర్’ చిచ్చు
కాశిబుగ్గ: తెలంగాణలో చేనేత పరిశ్రమ వేలాది కుటుంబాలకు జీవనాధారం. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నేత కార్మికులకు ఈ వృత్తి సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతోంది. తరాల నుంచి ఈ వృత్తిని నమ్ముకుని చాలీచాలని సంపాదనతో నెట్టుకొస్తున్న చేనేత కార్మికులపై పిడుగు పడినట్లు తెలంగాణ సర్కారు జీఓ జారీ చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తాము రేయింబవళ్లు కష్టపడి పోగుపోగు కలుపుతూ తయారు చేసిన కార్పెట్లు, బెడ్షీట్ల కొనుగోళ్లకు టెండర్ విధానం గొడ్డలిపెట్టుగా మారిందని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల చర్యలతో తాము ఉపాధి కోల్పోయే దుస్థితి ఏర్పడుతుందని కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. చేనేత వృత్తితో వేల కుటుంబాలు ఉపాధి.. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సుమారు పదివేల చేనేత కుటుంబాలు ఆధారపడగా, అనుబంధంగా మరో 15వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఈ ప్రాంతాల్లో 60కు పైగా ప్రాథమిక చేనేత సహకార సంఘాలు, 35 వరకు మ్యాక్స్ సంఘాలు పనిచేస్తున్నాయి. ఈ సంఘాల ద్వారా తయారు చేసిన కార్పెట్లు, బెడ్షీట్లు తెలంగాణలో ఉన్న టెస్కో ద్వారా కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆప్కో ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వ రంగ సంస్థలు, హాస్టళ్లు, గురుకుల పాఠశాలలకు సరఫరా చేసేవారు. టెస్కో ద్వారానే ఆయా సంఘాలకు డబ్బులు చెల్లించిన తర్వాత కార్మికులకు వేతనాలు ఇచ్చేవారు. టెండర్ విధానంతో ఆందోళన.. ఏడున్నర దశాబ్దాల నుంచి ప్రభుత్వ సంస్థ కొనుగోలు చేస్తున్న విధానానికి స్వస్తి చెబుతూ టెండర్ విధానం ప్రవేశపెట్టడానికి ప్రయత్నించడంపై చేనేత కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నూతన విధానంతో ప్రైవేట్ వ్యక్తులు రంగ ప్రవేశం చేయడం వల్ల వేలాది మంది రోడ్డున పడే పరిస్థితి దాపురిస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే చేతి నిండా పనిదొరకక పస్తులు ఉంటుంటే ‘పుండు మీద కారం చల్లినట్లు’ టెండర్ విధానం ఏమిటంటూ వాపోతున్నారు. 22 రకాల వస్తువుల జాబితాలో కార్పెట్లు, బెడ్షీట్లు.. ప్రస్తుతం ప్రభుత్వం అమలులోకి తీసుకురానున్న ప్రత్యేక ఎడ్యుకేషన్ కిట్లో 22రకాల కేంద్రీకృత టెండర్ల విధానానికి అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఇందులో నేత కార్మికులకు సంబంధించిన కార్పెట్లు, బెడ్షీట్లకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు అందజేస్తున్నారు. తమ గోడు వినిపిస్తున్నా సంబంధిత అధికారి చలించడం లేదంటూ చెబుతున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆందోళనలో వేలాది మంది కార్మికులు ఉన్నతాధికారుల తీరుపై మండిపాటు డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు -
గ్రేటర్ గ్రీవెన్స్కు 76 ఫిర్యాదులు
వరంగల్ అర్బన్: బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కమిషనర్ చంద్రశేఖర్, బల్దియాకు చెందిన విభాగాల అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. టౌన్ ప్లానింగ్కు 35, ఇంజనీరింగ్కు 17, రెవెన్యూ 14, హెల్త్ – శానిటేషన్ 5, నీటి సరఫరా 5 దరఖాస్తుల అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్లానర్ రవీందర్ రాడేకర్ అకౌంట్స్ అధికారి శివలింగం వెటర్నరీ వైద్యుడు గోపాల్రావు, డీఈ సంతోశ్కుమార్ శానిటరీ సూపర్వైజర్ భాస్కర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఉచితం ఉత్త మాటే..!
కాశిబుగ్గ: వరంగల్లోని సీకేఎం (చందా కాంతయ్య మెమోరియల్ హాస్పిటల్)ను అక్కడి సిబ్బంది కమర్షియల్గా మార్చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పేద రోగులకు ఉచి తంగా అందించాల్సిన సర్కార్ వైద్య సేవలకు బేరమాడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పర్యవేక్షణాధికారి, ఆరుగురు ఆర్ఎంఓలు ఉన్నప్పటికీ.. వైద్యం కోసం వచ్చే వారి నుంచి వసూళ్లు మాత్రం ఆగట్లేదు. ఇవన్నీ అధికారుల దృష్టికి వెళ్లినా.. చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మారుమూల ప్రాంతాల నుంచి ప్రసవం కోసం వచ్చిన గర్భిణులు గంటల తరబడి వైద్యం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పైరవీలతో, నగ దు ముట్టజెప్పిన వారు నేరుగా వైద్య సేవలు పొందుతున్నట్లు ఆరోపణలున్నాయి. పాలనా విభాగంలో సైతం కొందరు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు.. సీకేఎం ఆస్పత్రిలో ఓపీ కోసం గర్భిణులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. వీరిని క్రమపద్ధతిలో పంపించే ఏర్పాట్లు లేవు. ఎవరైనా చికిత్స కోసం త్వరగా ఓపీ వైద్యుడిని కలవాలనుకుంటే అక్కడి సిబ్బందికి డబ్బులు ముట్టజెబితే లోపలికి పంపిస్తారని ఇతర పేషెంట్లు చెబుతున్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం కూడా... చికిత్సలు, డెలివరీతో పాటు ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చినప్పుడు ఎంతో కొంతో ముట్టజెప్పాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ నుంచి లేబర్ కార్డు బెనిఫిట్ పొందాలన్నా, బర్త్ సర్టిఫికెట్లు కావాలన్నా రూ.500 నుంచి రూ.1,000 ఇవ్వక తప్పట్లేదు. ఇక మెయిన్ గేట్ వద్ద ఉన్న కుటుంబ సభ్యులు తమ పేషెంట్కు అవసరమైన పనులు చేసి పెడితే సెక్యూరిటీ గార్డులకు రూ.100 నుంచి రూ.200, అలాగే పాలన విభాగంలో ఓ ఉద్యోగి డెలివరీ సర్టిఫికెట్ కోసం రూ.1,000 నుంచి రూ.2,000లు ముట్టజెప్పాల్సి వస్తోందని వాపోతున్నారు. వసూళ్ల దందాను అరికట్టాలి.. ఉచితంగా వైద్యం అందుతుందని సర్కార్ దవాఖానకు వస్తే ప్రైవేట్ మాదిరిగానే ఇక్కడ వసూలు చేస్తున్నారని పేషెంట్ల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీదానికి డబ్బులివ్వనిదే పని కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షణ చేసి డబ్బుల వసూళ్ల దందాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. మా దృష్టికి రాలేదు.. పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ఎవరైనా డబ్బులు తీసుకుంటున్నట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ మురళి, ఆస్పత్రి ఆర్ఎంఓ అడ్మిషన్ తర్వాత వార్డుల్లో క్లీనింగ్ కోసం రూ.50 నుంచి రూ.100, కుట్లు విప్పడానికి రూ.50 నుంచి రూ.100, వార్డు నుంచి వార్డుకు, స్కానింగ్ కోసం వీల్ చైర్లో వెళ్లినప్పుడు రూ.100 నుంచి రూ.200 స్కాన్ అండ్ ఎక్స్రేకు రూ.200 వసూలు చేస్తున్నారు. ఇక డిశ్చార్జ్ టైంలో డిశ్చార్జ్ సమ్మరీతో పాటు మెడిసిన్ కోసం రూ.100 నుంచి రూ.200లు, లేబర్ రూంలో రూ.200, ఆపరేషన్ రూంలో పుట్టిన బిడ్డలకు రూ.500 నుంచి రూ.1,000 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. డిశ్చార్జ్ చేసినప్పుడు సిబ్బంది రూ.200 నుంచి 500 తీసుకుంటున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. సీకేఎం ఆస్పత్రిలో వసూళ్ల దందా.. అడుగడుగునా దండుకుంటున్న ఆస్పత్రి సిబ్బంది ఆరుగురు ఆర్ఎంఓలు ఉన్నా నియంత్రణ కరువు ఇబ్బందులు పడుతున్న గర్భిణులు -
సేంద్రియ వ్యవసాయంతోనే లాభదాయకం
ఖిలా వరంగల్: సేంద్రియ వ్యవసాయంతోనే ఖ ర్చులు తగ్గి అధిక లాభాలు వస్తాయని ప్రధాన శాస్త్రవేత్త వెంకన్న, ఉద్యాన శాఖ అధికారి తిరుపతి, ఏరువాక శాస్త్రవేత్త రాజ్కుమార్, మట్టి పరీక్షల ప్రయోగశాల వ్యవసాయ అధికారి గోవర్ధన్రెడ్డి, బయో కంట్రోల్ ల్యాబ్ శాస్త్రవేత్త బి. మాధవి అన్నారు. వరంగల్ వ్యవసాయ శాఖ భవనంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) సహకారంతో వరి పంటల ప్రాధాన్యమైన రకాల ప్రోత్సాహం, హెచ్టీ పత్తి సాగు ప్రతికూల ప్రభావాలు, భూసార పరీక్షల ఆధారంగా రసాయ ఎరువుల వాడకం, నూ తన వ్యవసాయ పద్ధతులపై రైతులకు 2రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. వారు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్న సన్న రకాల ఎంపిక, నాణ్యమైన విత్తనాల వినియోగం, పురుగులు, వ్యాధులు నియంత్రణ, నేల పరీక్షల ప్రాముఖ్యత, స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఓ నెలకుర్తి రవీందర్రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి, ఆశాదీప్, తదితరులు పాల్గొన్నారు. ప్రధాన శాస్త్రవేత్త వెంకన్న -
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి పరిశుభ్ర వాతావరణం కల్పించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాల్లో భాగంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి అంశాలపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గ్రామపంచాయతీల్లో పన్నుల వసూళ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో చేపడుతున్న కార్యక్రమాల అమలుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్రతీ రోజూ ఉదయం 9.30 గంటల్లోపు కార్యాలయాలకు హాజరై ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పంచాయతీల్లో వంద శాతం పన్నుల వసూలు సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల అమలుపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్, డిప్యూటీ డివిజనల్ పంచాయతీ అధికారులు రవిబాబు, గంగభవాని, తదితరులు పాల్గొన్నారు. పన్నులు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేయండిహసన్పర్తి: పన్నులు చెల్లించకుండా మొండికేస్తున్నవారి ఆస్తులు జప్తు చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం కలెక్టర్ 1వ, 66వ డివిజన్లలో పర్యటించారు. ఈసందర్భంగా వార్డు కార్యాలయం, పబ్లిక్ టాయిలెట్స్తో పాటు బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లో యథావిధిగా విక్రయాలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎర్రగట్టుపల్లి, రాజలింగం కాలనీ, వెంకటేశ్వర కాలనీల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని స్థానిక కార్పొరేటర్ శివకుమార్ తెలిపారు. టైలర్స్ స్ట్రీట్లో రోడ్డు నిర్మాణానికి మరో రూ.30 లక్షలు మంజూరు చేయాలని కార్పొరేటర్ కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గురుమూర్తి శివకుమార్, అరుణకుమారి, మాజీ సర్పంచ్ దేవరకొండ అనిల్, బీజేపీ మండల అధ్యక్షుడు మారం తిరపతి, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల రమేశ్, సీహెచ్ఓ రాజారెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ బాషానాయక్, వర్క్ ఇన్స్పెక్టర్ సురేందర్ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
కాళోజీ సెంటర్: కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్, సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని టీఎస్యూ టీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి రెండో దశ నిరసనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని కాళోజీ విగ్రహం వద్ద సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్, ప్రధాన కార్యదర్శి సి.సుజన్ ప్రసాద రావు, కోశాధికారి ఎస్ఎ రవుఫ్, కార్యదర్శిలు పాక శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.‘వేం’ను కలిసిన పవర్ ఎంప్లాయిస్ జేఏసీ నేతలు హన్మకొండ : ఎంపీ వేం నరేందర్రెడ్డిని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర నాయకులు కలిశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై న సందర్భంగా వేం నరేందర్రెడ్డిని సోమవారం హైదరాబాద్లో జేఏసీ చైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్, సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్, కో కన్వీనర్ తాజుద్దీన్, తెలంగాణ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సదానందం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతిరామన్నపేట : వరంగల్ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్ 2007 సంవత్సరంలో ఎంఎస్ చదివేందుకు యూఎస్ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. పరామర్శించిన ప్రముఖులు బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, రాజేశ్వర్రావు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వ దేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తె లిపారు. రాకేశ్ మృతదేహం భారత్కు రావడా నికి ఐదు రోజులు పడుతుందని తెలిపారు. కుక్కల దాడిలో బాలికకు గాయాలు కేసముద్రం: కుక్కల దాడిలో ఓ బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన మున్సిపాలిటీ పరిధి అమీనాపురం శివారు హనుమంతరావు కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కాలనీకి చెందిన జాటోత్ రజిత మనుమరాలు చిన్ను (ఐదేళ్ల వయసు) ఇంటి బయట ఆడుకుంటుండగా కుక్కలు దా డి చేసి మెడ, వీపు భాగాల్లో కరిచాయి. స్థానికులు కుక్కలను తరిమేశారు. అనంతరం చికిత్స నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు. -
ఈద్ కా తోఫా.. ఇఫ్తార్కి దావత్
న్యూశాయంపేట : పవిత్ర రంజాన్ మాసం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ముస్లింలు ఈద్–ఉల్–ఫితర్ను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈద్ కా తోఫా పేరుతో రంజాన్ కానుకల పంపిణీ ప్రక్రియను ముమ్మరం చేసింది. దీంతోపాటు అధికారిక ఇఫ్తార్ విందులను నిర్వహిస్తోంది. ఈ పండుగ సంతోషం కేవలం ఉన్నత వర్గాలకు పరిమితం కాకూడదని, నిరుపేద ముస్లిం కుటుంబాల్లో కూడా వెలుగులు నింపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈద్ కా తోఫాలు అందజేసి రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు చేపట్టిన వారికి ఇఫ్తార్ దావత్లు ఏర్పాటు చేస్తోంది. ఇది కేవలం ఫలం, భోజనం మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల మధ్య ఐక్యతను చాటే అద్భుత సందర్భం. మరో వైపు నూతన వస్త్రాలు అందజేసి నిరుపేద కుటుంబాల్లో పండుగ పూట వెలుగులు నింపుతోంది. మసీదులు, ఈద్గాలో కమ్యూనిటీ హాళ్లలో వేలాది మంది కలిసి ఇఫ్తార్ విందుల్లో పాల్గొనడం వరంగల్ లాంటి చారిత్రక జిల్లాలో సోదర భావా నికి నిలువుటద్దంగా నిలుస్తోంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో తోఫాల పంపిణీ, ఇఫ్తార్ విందుల ఏర్పాటు పకడ్బందీగా జరుగుతున్నాయి. మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా అర్హుడైన ప్రతీ నిరుపేద ప్రయోజనం పొందేలా అధికారులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఇఫ్తార్ విందు (దావత్)లు కేవలం ముస్లింలకే కాకుండా అన్ని వర్గాల ప్రజల మధ్య సోదర భావం పెంపొందిస్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ప్రతీ కాన్స్టెన్సీలో వెయ్యిమందికి పైగా ఉపవాస దీక్షా పరులు(రోజేదార్) విందులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన మసీదుల్లో ఏర్పాట్లు చేసి పేదలకు ఇఫ్తార్ సమయానికి అవసరమైన ఖర్జూరాలు, పండ్లు, మంచినీరు, పంపిణీ చేసేందుకు నిధులు విడుదల చేశారు. ప్రతీ పేద ముస్లిం కుటుంబం పండుగను ఆత్మగౌరవంతో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈద్కా తోఫా పేరుతో రంజాన్ కానుకలు అందజేస్తున్నారు. ఈ కిట్లో జత పురుషుల వస్త్రాలు (కుర్తా, పైజమా), మహిళలకు నాణ్యమైన చీర లేదా సల్వార్ కమీజ్లు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికన మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా లబ్ధిదారుల జాబితా రూపొందించారు. స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా లక్షలాది రూపాయల వ్యయంతో అటు ఈద్ కా తోఫాల పంపిణీ, ఇటు అధికారిక ఇఫ్తార్ దావత్లు నిర్వహిస్తూ అందజేస్తున్నారు. ప్రభుత్వం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా తోఫాలను అందజేసేందుకు ఏర్పాట్లు చేసింది. నియోజక వర్గ స్థాయిలో అన్ని మండలాల్లో ఆర్డీఓ, తహసీల్దార్ల ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక మసీదు కమిటీల సమన్వయం, సహకారంతో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. పండుగకు ముందే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేల సంఖ్యలో ఉన్న పేద ముస్లిం కుటుంబాలు ఈద్కా తోఫాలు అందుకుంటున్నారు. ఇప్పటికే నిల్వలను మండల కేంద్రాలకు చేరవేసిన అధికారులు.. రంజాన్ పండుగ నాటికి ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.జిల్లా ఈద్కా ఇఫ్తార్ తోఫాలు దావత్కు నిధులు వరంగల్ 3,000 రూ. 12 లక్షలు హనుమకొండ 2,500 రూ.10 లక్షలు మహబూబూబాద్ 1,250 రూ.05 లక్షలు జనగామ 2,000 రూ.08 లక్షలు జేఎస్ భూపాలపల్లి 750 రూ.03 లక్షలు ములుగు 750 రూ. 03 లక్షలు మొత్తం 10,250 రూ.41 లక్షలు నిరుపేద కుటుంబాల్లో సంతోషం రెట్టింపు ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాలకు 10,250 కిట్లుపేద ముస్లింలకు పండుగకు ముందే తోఫాలు పంపిణీ చేయడం సంతోషంగా ఉంది. వచ్చే ఏడాది రంజాన్ పండుగకు మరిన్ని పంపిణీ చేయాలి. చాలా మంది నిరుపేదలకు అందడం లేదు. పండుగ రోజు ఓ నిరుపేద కుటుంబం కొత్త బట్టలు ధరించి సంతోషంగా ఉంటే అది సమాజానికే గర్వకారణంగా ఉంటుంది. రంజాన్కు ఐదు రోజుల ముందు ప్రత్యేక సెలవులు అధికారికంగా ప్రకటించాలి. – మహ్మద్ తాజుద్దీన్, తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి స్టేట్ సెక్రటరీ -
ఉద్యోగం.. ఔట్!
మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026తనిఖీల్లో చిక్కుకుంటున్న ఔట్సోర్సింగ్ కండక్టర్లుహన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్లో ఖాళీగా ఉన్న కండక్టర్ పోస్టులను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. వీరికి నామమాత్రపు శిక్షణ ఇచ్చి విధులు అప్పగిస్తున్నారు. కండక్టర్ ఉద్యోగం అంటే ఆషామాషీ కాదు. ప్రయాణీకుల రద్దీని తట్టుకుని టికెట్లు జారీ చేయాలి. ఈ క్రమంలో అనుభవలేమితో టికెట్ చెకింగ్లో చిక్కుతున్నారు. ఫలితంగా ఉద్యోగం ఊడిపోతుంది. కండక్టర్ ఉద్యోగం పర్మనెంట్ అవుతుందని ఏజెన్సీల మాయలో పడి డబ్బులు చెల్లించిన వారు ఆగమవుతున్నారు. ఏజెన్సీలు రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఉద్యోగంలో చేరి స్వల్ప వ్యవధిలోనే నెల రోజులు కూడా విధులు నిర్వహించకుండా, ఒక్క నెల జీతం కూడా తీసుకోకుండా ఉద్యోగాలు కోల్పోయిన వారు వరంగల్ రీజియన్లో పదుల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. వీరు ఉద్యోగం పోయి.. ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఇచ్చిన సొమ్ము (డబ్బులు)పోయి లబోదిబో మొత్తుకుంటున్నారు. కండక్టర్ల కొరత తీర్చేందుకు.. ఆర్టీసీ వరంగల్ రీజియన్లో 9 డిపోలున్నాయి. ఏళ్లుగా రిక్రూట్మెంట్ లేకపోవడం, ప్రస్తుతం పని చేస్తున్న వారు ప్రతీ నెల రిటైర్డ్ అవుతుండడంతో ప్రతీ నెల ఖాళీలు పెరుగుతున్నాయి. ఉన్న ఉద్యోగులపై పని భారం పెరుగుతోంది. సాదారణ, అత్యవసర సెలవులు ఇవ్వకుండా డ్యూటీల మీద డ్యూటీలు వేస్తూ డ్రైవర్లపై తీవ్ర పని భారం మోపుతున్నారు. కనీస విశ్రాంతి ఇవ్వకుండా డ్యూటీలు నిర్వహిస్తుండడంతో అలసటలో డ్రైవింగ్తో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు రావడంతో కండక్టర్ల కొరత ఏర్పడింది. సంస్థ బస్సుల్లో కండక్టర్ల కొరత తీర్చేందుకు వన్మ్యాన్ సర్వీస్ ద్వారా డ్రైవర్కు టిమ్ అప్పగించి డ్రైవర్తో పాటు కండక్టర్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లు సంస్థ ఉద్యోగులు కాకపోవడంతో కండక్టర్ల కొరత తీర్చేందుకు ఔట్సోర్సింగ్ విధానంలో నియామకాలు చేపట్టింది. అక్రమాలకు తెరలేపిన ఏజెన్సీలు సంస్థ నిబంధనలను ఆసరాగా చేసుకుని ఔట్సోర్సి ంగ్ ఏజెన్సీలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఔట్సోర్సింగ్ ఉద్యోగం అంటేనే ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి.. అయినప్పటికీ పర్మినెంట్ అవుతారని ఆశ చూపుతూ ఏజెన్సీలు కండక్టర్లు, డ్రైవర్ల నియామకాల్లో వసూళ్లకు తెగబడ్డారని ఆర్టీసీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. వరంగల్ రీజియన్లోని 9 డిపోల పరిధిలో దాదాపు 15కు పైగా ఔట్సోర్సింగ్ ఏజెన్సీలున్నాయి. వీటి ద్వారా ఇప్పటి వరకు 317 మంది కండక్టర్లను నియమించారు. ముందుగా నియమితులైన 179 మంది డ్రైవర్లు విధులు నిర్వహిస్తుండగా, మరో 120 మంది డ్రైవర్లు శిక్షణలో ఉన్నారు. వివరాలు ఎలా వెళ్లాయి? మరో వైపు అద్దె బస్సు డ్రైవర్ల వివరాలు ఔట్సోర్సి ంగ్ ఏజెన్సీల చేతుల్లోకి ఎలా వెళ్లాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల ప్రమేయం లేకుండా బయటి వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్తాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏయే డిపోలో ఏ బస్సుపై ఏ డ్రైవర్ పని చేస్తున్నాడనే వివరాలు ఔట్సోర్సింగ్ ప్రతినిధుల చేతుల్లోకి వెళ్లాయని, వీటి ఆధారంగా దళారులను నియమించుకుని పర్మినెంట్ అవుతారని ఆశ చూపుతూ అద్దె బస్సు డ్రైవర్లను తమ వైపు లాక్కుంటున్నారు. పైగా, ఒక్కొక్కరి నుంచి ముందుగా రూ.20 వేలు, దశల వారీగా మొత్తం 50 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆర్టీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పని చేస్తున్న డ్రైవర్లు ఎలాంటి సమాచారం లేకుండా వెళ్లిపోవడంతో అద్దె బస్సులు నిలిచిపోతున్నాయి. దీంతో అద్దె బస్సుల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అద్దె బస్సుల డ్రైవర్లను ఔట్సోర్సింగ్ డ్రైవర్లుగా తీసుకోవద్దని అద్దె బస్సుల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. నవ్య (పేరు మార్చాం) అవుట్ సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగం కోసం ఏజెన్సీ ప్రతినిధికి రూ.50 వేలు చెల్లించింది. ఉద్యోగంలో చేరిన నాలుగు రోజులకే టికెట్ ఇన్స్పెక్టర్లు బస్సును తనిఖీ చేశారు. తనిఖీలో ప్రయాణికులకు టికెట్ ఇవ్వకుండా చిక్కారు. ప్రయాణికులేమో డబ్బులు ఇచ్చినప్పటికీ తమకు టికెట్ ఇవ్వలేదని చెబుతుండగా.. తనకు డబ్బులివ్వలేదని కండక్టర్ మొత్తుకుంది. వాస్తవాలు ఎలా ఉన్నా... ఔట్సోర్సింగ్ కండక్టర్ను ఉద్యోగం నుంచి యాజమాన్యం తొలగించింది. నవ్య ఏజెన్సీని సంప్రదిస్తే తిరిగి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. ఏజెన్సీకి చెల్లించిన డబ్బులు రాక, ఉద్యోగం పోయి మొత్తుకుంటోంది. ఇది ఒక్క నవ్య పరిస్థితే కాదు. కొలువు కుదిరిన కొద్ది రోజులకే పదుల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. స్వల్ప కాలంలోనే ఊడిపోతున్న కొలువులు 317 మంది కండక్టర్లు, 299 మంది డ్రైవర్ల నియామకం 15కు పైగా ఏజెన్సీలు.. డబ్బులిచ్చి మోసపోతున్న ఉద్యోగులు -
కేంద్రం వైఫల్యంతోనే చమురు సంక్షోభం
హన్మకొండ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే దేశంలో చమురు సంక్షభం సంభవించిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో మహిళలు కట్ట్టెలతో వంటలు చేసి, ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలని, చమురు సంక్షోభాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. గృహ వినియోగ సిలిండర్లపై రూ.60, వాణిజ్య సిలిండర్లపై రూ.115 పెరుగుదలతోపాటు అనేక ప్రాంతాల్లో లభ్యత లేకపోవడంతో, వంట గ్యాస్ పొందడానికి ప్రజలు మండే ఎండలో క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జ్యోతి, నాయకులు కరుణాకర్, సదాలక్ష్మి, ఎల్లేష్, లింగారెడ్డి, రాములు, లక్ష్మణ్, ఎన్ఏ.స్టాలిన్, వెంకట్రాజం, భిక్షపతి, సదానందం, రవి, శంకర్ నాయక్, వెంకటేష్, రమేష్, సారంగపాణి, నర్సయ్య, రాజేందర్, వెంకటరమణ, స్వరూప, రాజయ్య పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు -
వినతులు త్వరగా పరిష్కరించండి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రజల నుంచి స్వీకరించిన వినతులను త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో కలెక్టర్ చాహత్ అధికారులతో కలిసి ప్రజల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను ఓపికగా విని, పరిష్కారానికి సంబంధిత అధికారులకు వెంటనే సూచనలిచ్చారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణికి సంబంధిత జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. ప్రతీ అర్జీని పరిశీలించి తగిన పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులే స్వీకరించాలి.. కొంతమంది శాఖల నుంచి ఉన్నతాధికారుల బదులు కింది స్థాయి ఉద్యోగులు హాజరవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యాశాఖ, ఫిషరీస్ శాఖల నుంచి జూనియర్ సిబ్బంది రావడం సరికాదని పేర్కొన్నారు. ఇకపై ఇలా జరగకుండా సంబంధిత శాఖల ఉన్నతాధికారులే హాజరై ప్రజల అర్జీలను పరిశీలించాలని ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇతర అధికారులను పంపాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 170 వినతులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సత్యపాల్రెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కన్నం నారాయణ, డీఆర్డీఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ శేషాద్రి అధికారులు పాల్గొన్నారు. సత్వరమే పరిష్కారం చూపండి: వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: అక్రమ పట్టా రద్దు చేయాలని ఒకరు, ఇంటి నిర్మాణానికి సహకరించాలని ఇంకొకరు, లేబర్ కోడ్లు రద్దు చేయాలని మరొకరు.. ఇలా పలు సమస్యల పరిష్కారానికి బాధితులు వినతిపత్రాలు సమర్పించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో వరంగల్ కలెక్టర్ సత్యశారద వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రీవెన్స్లో మొత్తం 136 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ గణేష్, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమా, ఉమారాణి, హౌసింగ్ పీడీ, శ్రీవాణి, డీడబ్ల్యూఓ రాజ మణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు పాల్గొన్నారు. ● కేంద్రప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ నాయకులు విన్నవించారు. ● గృహ నిర్మాణ పథకం కింద డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలని వరంగల్కు చెందిన పి.రాధిక విజ్ఞప్తి చేశారు. అక్రమ పట్టా రద్దు చేయాలి.. ఖిలావరంగల్ మండల పరిధి సర్వే నంబర్ 243బై1 భూమికి సంబంధించిన నిజమైన పట్టాదారు ఇ.నర్సయ్య. ఇటీవల ఈ భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులు తగిన విధివిధానాలు పాటించకుండా అక్రమంగా వేరొకరి పేరుతో పట్టా జారీ చేసినట్లు అనుమానం ఉంది. తగిన విచారణ చేసి అక్రమ పట్టాను రద్దు చేయాలి. – ఇనుముల సాంబయ్య, ఖిలావరంగల్ -
ఖనిజాల వెలికితీతలో
జియాలజిస్టుల పాత్ర కీలకంకేయూ క్యాంపస్ : ఖనిజాల వెలికితీతలో జియాలజిస్టుల పాత్ర కీలకమని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని జియాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘రీసెంట్ అడ్వాన్స్సెస్ అండ్ చాలెంజెస్ ఇన్ జియాలజీ’ అనే అంశంపై క్యాంపస్లోని ఫిజిక్స్ సెమినార్హాల్లో సోమవారం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో వివిధ చోట్ల ఎన్నో రకాల ఖనిజాలు ఉన్నాయన్నారు. ఆ ఖనిజ సంపదను అన్వేషించి వెలికి తీయడం జియాలజిస్టులపైనే ఆధారపడి ఉంటుందన్నారు. యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్ మాట్లాడుతూ జియాలజీ కోర్సు విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్ మెంట్స్ కూడా లభిస్తున్నాయన్నారు. నూతన అన్వేషణ పద్ధతులతో బొగ్గు, లైమ్స్టోన్, క్వార్ట్గ్రానైట్ వంటి ఖనిజాల నిల్వలను మరింత కచ్చితత్వంతో గుర్తించొచ్చనన్నారు. హైదరాబాద్ సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ విశేసాయి మాట్లాడుతూ థార్వర్ క్లాటన్లో భూశిల వనరులు ప్రత్యేకంగా మినరల్స్ మట్టి పరిమాణాలు వాటి అన్వేషణ పద్ధతులు వివరించారు. అనంతరం కేయూలో జియాలజీ విభాగం అధిపతి ఆర్. మల్లికార్జున్రెడ్డి, ప్రొఫెసర్ ఎంఎం ఆస్లాం మహ్మద్, విశ్రాంత ఆచార్యులు వి. మాధవన్, ఎం. పాండురంగారావు మాట్లాడారు. ఈ సదస్సులో అతిథులు సదస్సు అబ్స్ట్రాక్ట్ (సావనీర్) ఆవిష్కరించారు. పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈసదస్సునేటి(మంగళవారం) తో ముగియనుంది. కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం -
కలెక్టరేట్ భవనం ఎక్కి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
● హనుమకొండ కలెక్టరేట్లో ఘటన..హన్మకొండ అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్లో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. తమ భూమిని తహసీల్దార్ అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి కలెక్టరేట్ భవనం ఎక్కి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో కాసేపు కలకలం రేగింది. కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ప్రజలనుంచి వినతులు స్వీకరిస్తుండగా ఈ ఘటన జరిగింది. ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన పయ్యావుల మల్లయ్య కుటుంబ సభ్యులతో కలిసి పెట్రోల్ బాటిల్, పంట మందు డబ్బాతో కలెక్టరేట్కు వచ్చారు. ఈ క్రమంలో మల్లయ్య కుమారుడు పయ్యావుల సాంబరాజు మందు డబ్బా పట్టుకుని కలెక్టరేట్ భవనం ఎక్కి తమ భూమిని తిరిగి తమ పేరుపై పట్టా చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందగా, విషయం క్షణాల్లో కలెక్టరేట్ అంతా వ్యాపించింది. గ్రీవెనన్స్కు వచ్చిన ప్రజలు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కిందికి దిగితే కలెక్టర్తో మాట్లాడించి సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు పలుమార్లు చెప్పినా సాంబరాజు వినకుండా పైనే ఉండిపోయాడు. అనంతరం ఓ పోలీస్ అధికారి భవనంపైకి వెళ్లి సముదాయించి కిందికి దింపాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సాంబరాజును జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ వద్దకు తీసుకెళ్లగా, వివరాలు తెలుసుకున్న కలెక్టర్ వెంటనే ధర్మసాగర్ తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులను పిలిపించి సమస్యపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బాధితుడు సాంబరాజు తెలిపిన వివరాల ప్రకారం ధర్మసాగర్ రెవెన్యూ పరిధిలో తన తండ్రి పయ్యావుల మల్లయ్యకు 4.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, అందులో నుంచి 10 గుంటల భూమిని అప్పాల మహేందర్ కుటుంబానికి తహసీల్దార్ అక్రమంగా పట్టా చేశారని ఆరోపించారు. దీంతో వారు తమ భూమిపై హక్కు చూపుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఈ విషయమై తహసీల్దార్ కార్యాలయంలో, గ్రీవెన్స్లో పలుమార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, నిరాశతో కుటుంబంతో కలిసి కలెక్టరేట్కు వచ్చానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ధర్మసాగర్ తహసీల్దార్ సదానందం మాట్లాడుతూ ఇరు కుటుంబాల మధ్య తగాాదాలు ఉన్నాయని, రికార్డుల ప్రకారం ఇద్దరికీ పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. అక్రమంగా పట్టా చేశారనే ఆరోపణలు సరికాదని, వివాదం ఉంటే సివిల్ కోర్టులో పరిష్కారం పొందాలని సూచించారు. -
డిమాండ్ మేరకు చర్యలు తీసుకోవాలి
హన్మకొండ: వేసవిలో విద్యుత్ డిమాండ్ అంచనాల మేరకు సత్వర చర్యలు తీసుకోవాలని ఎస్ఈ, డీఈలను టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. వేసవిలో చేపట్టాల్సిన విద్యుత్ పనుల పురోగతిపై సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని కార్పొరేట్ కార్యాలయం నుంచి ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 సర్కిళ్ల ఎస్ఈ, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ 33 కేవీ, 11 కేవీ ఫీడర్ల వారీగా సమీక్షిస్తూ ఓవర్ లోడ్ లేకుండా లోడ్ బదలాయింపు చేపట్టాలన్నారు. అవసరమున్న చోట ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచాలని, ఈ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. భారీ వర్షాలు, ఈదురుగాలులకు సంభవించే ప్రకృతి విపత్తుకు సమాయత్తం కావాలన్నారు. 17 సర్కిళ్ల పరిధిలోని మీటర్లు లేని అంగన్వాడీ కేంద్రాలకు యుద్ధప్రాతిపదికన అమర్చాలన్నారు. మోడల్ సోలార్ గ్రామాల పను ల పురోగతిపై సమీక్షిస్తూ.. పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. సి.ఈలు టి.తిరుమల్ రావు, రాజు చౌహాన్, అశోక్, సురేందర్, అన్నపూర్ణ, జీఎంలు శ్రీ నివాస్, నాగప్రసాద్, మల్లికార్జున్, వాసుదేవ్, వేణుమాధవ్, ఈఈ సివిల్ వెంకటేశ్వర్లు, డి.ఈలు అనిల్ కుమార్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్ష ఫీజులకు నోటిఫికేషన్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్, అలాగే మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల బ్యాక్ లాగ్ విద్యార్థులకు బీఏ, బీకాం, బీఎస్సీ, ఒకేషనల్ బీఏ(ఎల్) బీసీఏ, బీహెచ్ఎం సిటీ, పీడీసీ (ప్రిడిగ్రీకోర్సు) ఫస్టియర్, సెకండియర్ కోర్సుల పరీక్షలకు ఫీజు నోటిఫికేషన్ జారీచేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి తిరుమలాదేవి, పి. వెంకటయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుములేకుండా ఏప్రిల్ 4వతేదీ వరకు ఫీజు చెల్లించాలన్నారు. రూ. 50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 9వతేదీ వరకు చెల్లించుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలు సంబంధిత కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు. -
సకలజనులను ఏకం చేస్తాం
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీకి భూ ములు ఇచ్చిన అయోధ్యపురం భూనిర్వాసితులు, నిరుద్యోగులు, రైల్వే ఉద్యోగుల పిల్లలు, అంప్రెటీస్ చేసిన వారికి కోచ్ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇవ్వాలని టీజేఎస్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజ్, రిటైర్ట్ ప్రొఫెసర్ వెంకటనారాయణ డిమాండ్ చేశారు. ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని, కాజీపేట నుంచి ఢిల్లీ వరకు సకలజనులను ఏకం చేస్తామని వారు స్పష్టం చేశారు. కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీ గేట్ ఎదుట ఆదివారం మహా నిరసన దీక్ష చేపట్టారు. ముందుగా భగవాన్దాస్, కాళిదాస్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.చుక్కయ్య, న్యాయవాదులు గుడిమల్ల రవికుమార్, సాయి నరేందర్ మాట్లాడుతూ రైల్వే కోచ్ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇచ్చే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని కోరారు. రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్, చైర్మన్ కొండ్ర నర్సింగరావు మాట్లాడుతూ కోచ్ఫ్యాక్టరీ నినాదం అందించిన భగవాన్దాస్, కాళిదాస్ స్ఫూర్తితో ఉద్యోగాలు, కాజీపేట డివిజన్ కోసం చేస్తున్న ఉద్యమాలకు అందరూ సహకరిస్తున్నారని పేర్కొన్నారు. రాయబరేలి, లాతూరు, కపుర్తాల మాదిరిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 80 శాతం ఉద్యోగాలిచ్చి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ కాల్వ శ్రీనివాస్, సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరి పి.రవీందర్ మాట్లాడూతూ కేంద్రం ఉద్యోగాల విషయంలో కూడా న్యాయం చేయాలని కోరారు. కార్పొరేటర్లు రాధికరెడ్డి, జక్కుల రవీందర్, విజయశ్రీ రజాలీ మాట్లాడుతూ ప్రధాని మోదీ రామభక్తుడని, మెట్టురామన్న ఆలయ భూమిలో నిర్మిస్తున్న కోచ్ఫ్యాక్టరీలో నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇటీవల రైల్వే కోచ్ఫ్యాక్టరీ తనిఖీ నిమిత్తం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వచ్చినప్పుడు భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాజీపేట డివిజన్ ఏర్పాటు కల 35 ఏళ్ల నాటిదని, ఆంధ్ర పాలకులు రైల్వే జోన్, రైల్వే డివిజన్ తెచ్చుకున్నారని, తెలంగాణ పాలకులు కాజీపేట డివిజన్ ఏర్పాటు విషయంలో విఫలమైతున్నారని ఆరోపించారు. రైల్వే జేఏసీ నాయకులు, 70 మంది అయోధ్యపురం వాసులు దీక్షకు మద్దతు తెలిపారు. నాయకులు తొట్ల రాజు, బండారి సుకేందర్, పసునూరి మనోహర్, మర్యాల కృష్ణ, రైల్వే నాయకులు ఎ.సంతోష్కుమార్, పాక వేదప్రకాశ్, జానీ, రైల్వే సంఘ్ నుంచి యాకూబ్పాషా, మన్నె బాబురావు, మంద కుమార్ మాదిగ, నూనె అప్పారావు, పాపిరెడ్డి, హైదరాబాద్ నుంచి రైల్వే రిటైర్డ్ నాయకులు యుగేంధర్, జీఎస్.బాబురావు, వెంకటయ్య, కాజీపేట రైల్వే రిటైర్డ్ నాయకులు జి.సుధాకర్, పి.కృష్ణమూర్తి, ఎస్ఆర్వీ రావు, కె.సంగమయ్య, టి.సీతారాం తదితరులు పాల్గొన్నారు. భూనిర్వాసితులు, స్థానికులకు రైల్వే కోచ్ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇవ్వాలి రైల్వే జేఏసీ మహా నిరసన దీక్షలో వక్తల డిమాండ్ -
కేయూ మాజీ వీసీ లింగమూర్తికి నివాళులు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ఎన్.లింగమూర్తి అంత్యక్రియలు ఆదివారం హనుమకొండలోని పోచమ్మకుంటలో నిర్వహించారు. కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి, మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.యాదగిరి, యూనివర్సిటీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.సదానందం, జనరల్ సెక్రటరీ వడ్డె రవీందర్, పలు విభాగాల పలువురు అధ్యాపకులు తదితరులు లింగమూర్తికి నివాళుల ర్పించారు. కాగా, లింగమూర్తి మృతి విద్యారంగం, విద్యార్థి ఉద్యమానికి తీరని లోటని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వలీఉల్లాఖాద్రీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఇంటర్ వర్సిటీ హ్యాండ్బాల్ టోర్నమెంట్కు కేయూ జట్టు
కేయూ క్యాంపస్ : వెల్లూరులోని విట్ యూనివర్సి టీలో ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు జరగను న్న ఆలిండియా హ్యాండ్ బాల్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో కాకతీయ యూనివర్సిటీ హ్యాండ్బాల్ పురుషుల జట్టు పాల్గొనబోతుందని స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య ఆదివారం తెలి పారు. ఈ జట్టులో బి. సాయికుమార్, బి. వంశీ, ఎం. శ్రీరామ్ (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నర్సంపే ట), డి. శ్రీనివాస్, బి. శివాజీ, బి. రాజేందర్, ఎం. సాయికుమార్, కె. గణేశ్ (యూసీపీఈ ,కేయూ), పి. సాయి (వాగ్దేవి డిగ్రీ కళాశాల, హనుమకొండ), వి.సాయికృష్ణ (ఎల్బీ కాలేజీ, వరంగల్), ఎం. రో హిత్ (కిట్స్, వరంగల్), పి. రామారావు, ఎం. శ్రీరా మ్, వై. భద్రు (ఎస్ఆర్అండ్బిజిఎన్ఆర్ డిగ్రీక ళా శాల, ఖమ్మం), కె. ధర్మభిక్షం (వికాస్ డిగ్రీ కళాశాల ,ఖమ్మం) ఉన్నారని వెంకయ్య తెలిపారు. ఈ జట్టుకు నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ రమేశ్కోచ్గా కొత్తగూడెం ఎంజేపీ టీబీ సీడబ్ల్యూ ఆర్డీసీ ఫిజికల్ డైరెక్టర్ రఘువరణ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య ఇనుగుర్తి : కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని కోమటిపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై గంగారపు కరుణాకర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన విలాసాగర్ మురళి (46) తనకున్న 20 గుంటల వ్యవసాయ భూమిని అమ్మి ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇదిలా ఉండగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన మురళి ఆదివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే 108లో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తైలిపారు. -
హమాలీల సమస్యల పరిష్కారానికి కృషి
హన్మకొండ అర్బన్ : హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో ఆదివారం తెలంగాణ హమాలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన హమాలీ మహా గర్జన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హనుమకొండ కేంద్రంలో హమాలీల కోసం భూమి కేటాయించడంలో కృషి చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. హమాలీలు రక్తాన్ని చెమటగా మార్చి జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. హమాలీలకు ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ బోర్డు ఏర్పాటు, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ వంటి అంశాలపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొద్దిపాటి ఆలస్యం జరిగినా హామీలను తప్పకుండా నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్మికుడు తన కష్టంతో సంపాదించే వ్యక్తి అని, సమాజాభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమన్నారు. హమాలీల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హమాలీల సంక్షేమం కోసం తన వంతు సాయంగా సీడీఎఫ్ నుంచి రూ.20 లక్షలు విడుదల చేస్తానని ప్రకటించారు. అంతకు ముందు అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హమాలీలు అంబేడ్కర్ జంక్షన్ నుంచి నిర్వహించిన భారీ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో టీజేఎస్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, రచయిత మిట్టపల్లి సురేందర్, గాయకులు చుక్క రాంనర్సయ్య, హమాలీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం, ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క -
అనుమానాస్పద స్థితిలో డాక్టర్ మృతి
నర్సంపేట/నర్సంపేట రూరల్: అనుమానాస్పద స్థితిలో డాక్టర్ మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జరిగింది. నర్సంపేట టౌన్ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. పట్టణంలోని శశి మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రిని అనస్థీషియా డాక్టర్ శశిధర్రెడ్డి (38), ఆయన భార్య గైనకాలజిస్ట్ సిందూరరెడ్డి కొంతకాలంగా నిర్వహిస్తున్నారు. అయితే, ఏడాదిన్నర కాలం నుంచి భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో వైద్యుడు శశిధర్రెడ్డి ఆదివారం తెల్లవారుజామున ఇంటిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించాడు. ఆయన తండ్రి శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లే నాన్న.. ఎంత సేపు పడుకుంటావ్.. లే నాన్న.. ఎంత సేపు పడుకుంటావ్. అంటూ తండ్రి గదువ పట్టుకుని అటూ ఇటూ కదుపుతున్న ఆ చిన్నారులను చూసి అక్కడున్న వారంతా కంట తడి పెట్టారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన అనస్తీషియా డాక్టర్ శశిధర్రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించగా.. అతడి కుమారులు కృతిక్, అయాన్ మార్చురీ వద్దకు వచ్చారు. డాడీ ఎందుకు పడుకున్నావు లే. అంటూ ఏడవడంతో అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు. -
నేటి నుంచి జాతీయ సదస్సు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 16,17 తేదీల్లో రెండురోజులపాటు జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఆ విభాగం అధిపతి ఎన్. వాసుదేవరెడ్డి, పాఠ్యప్రణాళిక అధ్యక్షురాలు సవితాజ్యోత్స్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘కరెంట్ రీసెర్చ్ ఇన్ కెమికల్ సైన్సెస్’ (సీఆర్సీఎస్–2026) అనే అంశంపై యూనివర్సిటీలోని పరిపాలన భవనం సెనేట్హాల్లో ఉదయం 10గంటలకు ఈ సదస్సు నిర్వహించబోతున్నామని వారు తెలిపారు. ముఖ్యఅతిథిగా కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి, హైదరాబాద్ ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ గంగాగ్నిరావు కీలకోపన్యాసం చేస్తారన్నారు. గౌరవ అతిథిగా సైన్స్ విభాగాల డీన్ జి. హనుమంతు తదితరులు పాల్గొంటారని వారు తెలిపారు. నేటి నుంచి బధిరుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు హన్మకొండ అర్బన్ : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నగరంలో కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర బధిరుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రా రంభమైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీనర్సమ్మ తెలిపారు. హనుమకొండలోని మయూరి గార్డెన్ లైన్, ప్రగతి నగర్ కాలనీ ఫేజ్–2లో ఉన్న ఈ పాఠశాలలో నేటి (సోమవారం) నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు వికలాంగుల సంక్షేమ శాఖ సర్టిఫికెట్, యూడీఐడీ కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ, కులం, ఆదాయం ధ్రువపత్రాలు, ఆధార్డ్, రేషన్ కార్డు, నాలుగు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు 94407 39423, 98666 73486 నంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు. బాలికపై అత్యాచారయత్నం? ● వ్యక్తికి దేహశుద్ధి.. ఓ గ్రామంలో ఘటన ఖానాపురం: బాలికపై వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని ఓ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన ఐదు సంవత్సరాల బాలికను ఇదే గ్రామానికి చెందిన బోళ్ల ప్రసాద్ తన బైక్పై ఈనెల 13(శుక్రవారం) గ్రామంలోని ఓ కిరాణా షాపునకు తీసుకెళ్లాడు. షాపులో చాక్లెట్ కొనుగోలు చేసి బాలికకు అందజేసి సమీపంలో ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం సదరు బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడగా బాలిక రోదించింది. సమీపంలో పంట పొలాల వద్ద ఉన్న రైతులు కేకలు వేశారు. దీంతో బాలి కను గ్రామంలోకి ఇంటికి తీసుకెళ్లి వదిలేశాడు. ఈ విషయాన్ని కుటుంబీకులకు చెప్పొద్దని భయభ్రాంతులకు గురి చేసి వెళ్లిపోయాడు. బాలికకు స్నానం చేయించడానికి తల్లి తీసుకెళ్లగా జరిగిన విషయాన్ని తెలుపడంతో ప్రసాద్ ఇంటికి వెళ్లి దేహశుద్ధి చేశారు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇదే విషయంపై ఆదివారం పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ సైతం చేపట్టినట్లు సమాచారం. కేఎంసీ అల్యుమ్ని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా జార్జిరెడ్డిఎంజీఎం: కాకతీయ మెడికల్ కళాశాల అల్యుమ్ని వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా డాక్రట్ వి.జార్జిరెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్ఆర్ఐ భవనంలో నిర్వహించిన పోలింగ్లో 137 మంది వైద్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జార్జిరెడ్డి 131 ఓట్లు సాధించగా డాక్టర్ ఎం.రవికుమార్కు ఆరు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల అధికారులుగా బందెల మోహన్రావు, సహాయ ఎన్నికల అధికారులుగా మల్లేశం, నాగార్జునరెడ్డి వ్యవహరించారు. -
డ్రైవర్ నిర్లక్ష్యం.. ఇద్దరి మృత్యువాత
మరిపెడ రూరల్: ‘మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకై నా లేడు చూడు మానవత్వం ఉన్న వాడు’ అని అందెశ్రీ రాసిన ఈ పాట ఇటీవల జరిగిన మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఓ ఘటన గుర్తుచేస్తోంది. ఈ నెల 11న మహబాబాబాద్ జిల్లా మరిపెడ మండలం గాలివారిగూడెం గ్రామానికి చెందిన బావబామ్మర్దులు బల్లెం ఉదయ్కిరణ్, బండి భిక్షం ద్విచక్రవాహనంపై బంధువుల ఇంటికి వెళ్లారు. అదేరోజు అర్ధరాత్రి తిరిగి స్వగ్రామం గాలివారిగూడేనికి 365వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టి వారు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కాగా, ఇసుక కోసం రాత్రి వేళ ఓ ట్రాక్టర్ ట్రక్కు డోర్ వేయకుండా వేలాడుతూ వెళ్తోంది. ట్రాక్టర్ లైట్లు కూడా డిమ్ముగా ఉండడంతో ద్విచక్రవాహనదారుడికి ట్రాక్టర్కు సంబంధించిన ఎలాంటి సిగ్నల్స్, లైటింగ్ కనిపించలేదు. దీంతో యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ట్రాక్టర్ ట్రక్కుకు వేలాడుతున్న డోర్కు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో రోడ్డుపై పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడారు. ఆ సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ పక్కకు ఆపి 108 వాహనానికి ఫోన్చేసి వారి ప్రాణాలను రక్షించే ప్రయత్నం చేయాల్సి ఉంది. కానీ, ఆ ట్రాక్టర్ డ్రైవర్ అలా చేయకుండా వారిని అక్కడే వదిలేసి, తనను ఎవరు చూడలేదని మానవత్వం మంటగలిసేలా సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని మరిపెడ సీఐ రాజ్కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఈ యువకుల మృతికి కారణమైన ట్రాక్టర్ మండలంలోని బాల్నిధర్మారం గ్రామానికి బాసిక లింగయ్యదిగా గుర్తించారు. ట్రాక్టర్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టినట్లు సీఐ తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పత్రాలు, అనుమతులు లేకుండా రాత్రి వేళ ఇసుక, మట్టి, కలప అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, మృతుల కుటుంబాలు కోరుతున్నాయి.డోర్ వేయకుండా వేలాడుతూ వెళ్లిన ట్రాక్టర్ వెనుక నుంచి బైక్తో ఢీకొట్టిన యువకులు పట్టించుకోకుండా వెళ్లిపోయిన ట్రాక్టర్ డ్రైవర్ ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి బాల్నిధర్మారం గ్రామానికి చెందిన ట్రాక్టర్గా గుర్తించిన పోలీసులు -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన 3వ తెలంగాణ రాష్ట్ర స్థాయి రిలే కార్నివాల్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలను వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ గట్టు మహేశ్బాబు ము ఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, నిత్యం సాధన చేసే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. జాతీయ స్థాయిలోనూ రాణించి జి ల్లా, రాష్ట్ర ఖ్యాతిని చాటాలని క్రీడాకారులకు సూచించారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ ఉమ్మ డి పది జిల్లాల నుంచి 363 మంది అథ్లెట్లు పాల్గొనగా, అండర్–14, 20 విభాగాలతోపాటు మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో ఎంపికలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 28వ తేదీన చంఢీఘడ్లో జరగనున్న జాతీయ స్థాయి రిలే కార్నివాల్ చాంపియన్షిప్లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం పలు విభా గాల్లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లకు సర్టిఫికెట్లు, పతలును అందజేశారు. అథ్లెటిక్స్ సంఘం బాధ్యులు పగడాల వెంకటేశ్వర్రెడ్డి, కిషన్ పాల్గొన్నారు. -
ఇంకా నిర్మాణంలోనే..
న్యూశాయంపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల పునఃర్విభజన ప్రక్రియ 2016లో అక్టోబర్ 11న (దసరా పండుగ రోజున) జరిగింది. అప్పటి వరకు ఉన్న పది జిల్లాలను 31 జిల్లాలుగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనంత రం మరో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో 33 జిల్లాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాను విభజిస్తూ వరంగల్ అర్బన్, వ రంగల్ రూరల్ జిల్లా, జనగామ, మహబూబా బా ద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు గా విభజించారు. అనంతరం 2021లో వరంగల్ అర్బ న్ జిల్లాను హనుమకొండ, వరంగల్ రూరల్ జిల్లా ను వరంగల్ జిల్లాగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విభజన జరిగి ప దేళ్లు కావస్తున్నా.. కార్యాలయాలు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జి ల్లా కార్యాలయాలు నగరంలోని విసిరి పారేసినట్టు ఉండటంతో ఏ పనికి ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రజ ల్లో గందరగోళం నెలకొంది. వరంగల్ ఆజంజాహి మిల్లు మైదానంలో నూతనంగా కలెక్టరేట్ (ఇంటిగ్రేటెట్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్) నిర్మాణం పూర్తి కావస్తున్నా ప్రారంభానికి ముహూర్తం ఏప్పుడొస్తుందా.. అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. రూ.80 కోట్ల అంచనాతో.. జిల్లా పరిధిలోని నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, పరకాల నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా ఆజంజాహి మిల్లుకు చెంది న సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ కాంప్లెక్స్ జీ ప్లస్ 2 నిర్మాణం చేపట్టారు. 2023 జూన్లో సుమారు రూ.80 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేశారు. సుమారు 40కి పైగా ప్రభుత్వశాఖల కార్యాలయాలు ఒకే భవనంలో కొలువుదీరనున్నాయి. ఇప్పటివరకు నగర వ్యాప్తంగా విస్తరించి ఉన్న రెవెన్యూ, వ్యవసాయ, విద్యా, వైద్య, సంక్షే మ, తదితర శాఖలన్నీ ఇకపై ఒకే భవనంలో ఉండనున్నాయి. విశాలమైన చాంబర్లు, వీడియో కాన్ఫరెన్స్ హాల్స్, మీటింగ్ రూమ్లు, పబ్లిక్ గ్రీవెన్స్ హాల్స్తో ఈ భవనం హైటెక్ లుక్ సంతరించుకోనుంది. ఒకే కాంప్లెక్స్లో అన్ని పనులు పూర్తవుతాయి. పైగా ప్రజల ప్రయాణ ఖర్చులు, సమయం కూడా ఆదా కానున్నాయి. పురోగతిలో నిర్మాణ పనులు ప్రస్తుత భవనానికి సంబంధించిన చివరి విడత పెయింటింగ్, విద్యుత్ పనులు పూర్తయ్యాయి. కా ర్యాలయాల్లో ఫర్నిచర్ బిగింపు, ఇంటర్నల్ సీసీ రో డ్లు, గ్రీనరీ పనులు, పార్కింగ్ షెడ్స్ నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. ఇక పనుల కోసం కిలోమీటర్ల దూరం తిరగాల్సిన అవసరం లేకుండా మెట్టు దిగి తే ఆఫీస్, మెట్టు ఎక్కితే మరో ఆఫీస్ అన్నట్టుగా పా లన సాగనుంది. సకల సౌకర్యాలతో కలెక్టరేట్ నిర్మాణంతో పరిపాలన సవ్యంగా సాగనుంది. మూడేళ్లయినా పూర్తికాని వరంగల్ కలెక్టరేట్ పనులు 10 సంవత్సరాల నుంచి తాత్కాలిక అద్దె భవనాల్లోనే జిల్లా కార్యాలయాలు ఇబ్బందులు పడుతున్న జిల్లా వాసులు -
అగ్ని ప్రమాదంలో హోటల్ దగ్ధం
● సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం కురవి: సీరోలు మండలం కాంపల్లి శివారులో అచ్చమ్మ దాబా హోటల్ శనివారం అర్ధరాత్రి నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కాంపల్లి నుంచి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి 365/ఏ పక్కన సక్రంనాయక్ తండాకు చెందిన బానోత్ అచ్చమ్మ కొన్ని సంవత్సరాల నుంచి హోటల్ నడుపుకుంటూ జీవిస్తోంది. నాలుగు రోజులుగా హోటల్ బంద్ చేసి తన బిడ్డ డెలివరీ కోసం మహబూబాబాద్ ఆస్పత్రికి వెళ్లింది. హోటల్ దగ్గర తన అమ్మానాన్నను కాపలా ఉంచింది. ఈ క్రమంలో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఖమ్మం నుంచి మహబూబాబాద్ వెళ్తున్న వాహనదారుడు చూసి అగ్నిమాపక శాఖ అధికారులకు అందించడంతో వారు సకాలంలో ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. హోటల్ పక్కనే పార్కింగ్ చేసి ఉన్న నాలుగు హార్వెస్టర్ (వరి కోత మిషన్స్) లకు ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఫర్నిచర్, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధం కావడంతో సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని యజమాని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో వృద్ధులు ఆరుబయట నిద్రిస్తుండడంతో ప్రమాదం తప్పింది. -
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
మరిపెడ రూరల్: ఇద్దరు యువకులు గంజాయి విక్రయించడానికి వచ్చి మరిపెడ పోలీసులు పట్టుబడ్డారు. ఈ ఘటన ఆదివారం మరిపెడ మండలం అబ్బాయిపాలెం శివారులో చోటు చేసకుంది. ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా మోతే మండలానికి చెందిన బానోత్ సింహాద్రి, జర్పుల సింహాద్రి బైక్పై గంజాయి విక్రయించడానికి మండలానికి వచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై వీరభద్రరావు ఆధ్వర్యంలో ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న కిలో గంజాయితో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.50 వేలు ఉంటుంది. అనంతరం ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. పోలీస్ సిబ్బంది సాయికిరణ్, శ్రీనివాస్, గణేశ్, రవీందర్, రమేశ్ను ఎస్సై అభినందించారు. -
హెచ్పీవీ టీకాలు ఇప్పించాలి
● హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య ఎంజీఎం: బాలికలకు తప్పనిసరిగా హెచ్పీవీ టీకాలు ఇప్పించాలని హనుమకొండ వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా జరిపిన అధ్యయనాల్లో గర్భాశయ క్యాన్సర్ను నివారించడంలో 93 నుంచి 100 శాతం సామర్థ్యంతో హెచ్పీవీ టీకాలు అత్యంత ప్రభావంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్లో దాదాపు రూ.4వేల ఖరీదైన ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం ఉచితంగా ఇస్తున్నారని తెలిపారు. 14వ పుట్టినరోజు జరుపుకొని 15వ పుట్టినరోజు ఇంకా చేసుకో ని వారు ఈ టీకాలు వేసుకునేందుకు అర్హులని వివరించారు. ఈ టీకాలతో ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు ఉండవని, ఇతర టీకాల మాదిరిగా కొందరిలో ఇంజక్షన్ చేసిన ప్రదేశంలో నొప్పి, వాపు, జ్వరం ఉండవచ్చని, ఇవన్నీ రెండు మూడు రోజుల్లో తగ్గిపోతాయన్నారు. హెచ్పీవీ టీకా సంతానోత్పత్తిని ఏ విధంగా ప్రభావితం చేయదని, వాస్తవానికి గర్భాశయ క్యాన్సర్కు కారణమయ్యే, హెచ్పీవీ వ్యాధులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ను నివారించడం ద్వారా సంతానోత్పత్తికి సహాయపడుతుందని వివరించారు. హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని, అలాగే వారి సమక్షంలో వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. హనుమకొండ జిల్లాలో ప్రస్తుతం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, పరకాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టీకాలు ఇస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ తర్వాత సర్టిఫికెట్ కూడా ఇవ్వనున్నట్లు వివరించారు. -
నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతా
హన్మకొండ: అభివృద్ధిలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని వడ్డేపల్లి ఎస్సీ కాలనీలో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీరోడ్డు, డ్రెయినేజీ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతీ కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, అదేదిశగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కూడా సమగ్ర అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పదేళ్లలో జరగని అభివృద్ధి రెండు సంవత్సరాల్లో జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నానని తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నివర్గాల ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రెండూ సమానంగా అందుతున్నాయని వివరించారు. అభివృద్ధి పనులు వేగంగా జరగాలంటే స్థానిక ప్రజల సహకారం అవసరమని అన్నారు. కార్యక్రమంలో వరంగల్ మహానగరపాలక సంస్థ డీఈ సారంగం, వర్క్ ఇన్స్పెక్టర్ రవికుమార్, కాంగ్రెస్ నాయకులు కరాబు రాజేశ్వర్రావు, ఎనుకంటి నాగరాజు, తాళ్లపల్లి సుదాకర్, తాళ్లపల్లి విజయ, మండల సమ్మయ్య, జేకే పాల్గొన్నారు. అభివృద్ధిలో వెనుకడుగు వేసేది లేదు..హన్మకొండ చౌరస్తా: అభివృద్ధిలో ఎలాంటి వెనుకడుగు వేసేది లేదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండ 9వ డివిజన్లోని కాకతీయ లైన్ ప్రాంతంలో రూ.1.30 కోట్లు, 10వ డివిజన్ పరిధిలోని అలంకార్ జంక్షన్లో రూ.29.50 లక్షలతో సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్లు చీకటి శారద, తోట వెంకటేశ్వర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి వడ్డేపల్లిలో రూ.50 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభం -
గ్యాస్ బుక్ చేస్తారు!
సిలిండర్ల డిమాండ్ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల ఎత్తుగడలు ● గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్, అత్యవసర గ్యాస్ బుకింగ్తో ఎర ● వాట్సాప్, ఎస్ఎంఎస్ లింక్లతో ప్రమాదమే ● సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్న లింక్లు ● ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ క్రైమ్ పోలీసులుసాక్షి, వరంగల్: ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. యుద్ధం ప్రభావంతో జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతుందన్న వార్తలను నేరానికి పెట్టుబడిగా పెడుతున్నారు. గ్యాస్ సిలిండర్ల డిమాండ్ పెరుగుతున్న పరిస్థితిని ఆసరాగా చేసుకొని గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్, అత్యవసర గ్యాస్ బుకింగ్ పేరుతో సామాజిక మాద్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ తరహా వాట్సాప్ పోస్టులు, ఎస్ఎంఎస్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సెల్ఫోన్ వినియోగదారులకు వెళ్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని వరంగల్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. లింక్లు పంపి...పైసలు కొల్లగొట్టేలా... గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ చేయాలంటూ వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా వచ్చే గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయడం, వారు పంపే ఏపీకే ఫైల్స్ను మొబైల్లో డౌన్లోడ్ చేయడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. నేరగాళ్లు పంపే యాప్ డౌన్లోడ్ చేస్తే మొబైల్ నియంత్రణ అంతా వారి ఆధీనంలోకి వెళ్లడం ద్వారా ఫోన్కు వచ్చే బ్యాంక్ ఓటీపీలు, రహస్య సందేశాలు నేరుగా వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఖాతాలో డబ్బు ఖాళీ అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియా వేదికలో ‘అత్యవసర గ్యాస్ బుకింగ్’, ‘తక్షణ డెలివరీ’ పేరుతో నకిలీ ప్రకటనలు విస్త్తృ తంగా కనిపిస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్ అందిస్తామని, వెంటనే బుకింగ్ చేసుకునే ప్రత్యేక లింక్ ఇచ్చినట్లు చూపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. లింక్పై క్లిక్ చేసిన తర్వాత మొబైల్లో ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తారు. అలాంటి ఫైల్స్ను ఇన్స్టాల్ చేస్తే మొబైల్లోని బ్యాంకింగ్, వ్యక్తిగత వివరాలు హ్యాకర్లకు వెళ్లే ప్రమాదం ఉంది. ముందుగా డబ్బు చెల్లిస్తే గ్యాస్ వస్తుందంటూ సందేశాలు వస్తే అది సైబర్ మోసమని గ్రహించాలి. 1930కి ఫిర్యాదు చేయండిసాధారణంగా గ్యాస్ బుకింగ్, కేవైసీ అప్డేట్ వంటి ప్రక్రియలను ఆయా గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్సైట్లు లేదా అధికారిక మొబైల్ యాప్ల ద్వారానే చేయాలి. గుర్తు తెలియని లింకులు, సందేశాలను నమ్మి వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు ఇవ్వకూడదు. గ్యాస్ బుకింగ్, కేవైసీ అప్డేట్ వంటి వాట్సాప్ సందేశాలు, ఎస్ఎంఎస్లు వస్తే నేరుగా సంబంధింత గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి సంప్రదించండి. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి. పోలీసులకు సమాచారం ఇవ్వాలి. తక్షణ ఫిర్యాదు ద్వారా ఆ నగదు రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. – గిరి కుమార్, ఏసీపీ, సైబర్ క్రైమ్, వరంగల్ -
ప్రమాణ స్వీకారానికి తరలిన కాంగ్రెస్ శ్రేణులు
వరంగల్: హైదరాబాద్లో రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా ఎరబ్రెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆదివారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. తూర్పు నుంచి పార్టీ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు సుమారు 20 బస్సులు, 50 కార్లలో సుమారు 1,500 మంది కార్యకర్తలు తరలివెళ్తున్న వాహన శ్రేణికి డీసీసీ అధ్యక్షుడు ఎండీ.అయూబ్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, బస్వరాజు శిరీష శ్రీమాన్, బస్వరాజు కుమారస్వామి, పీసీసీ సభ్యుడు నల్లగొండ రమేశ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొరివి పరమేశ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నారగోని స్వప్న మురళీధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోరంట్ల రాజు, తత్తరి లక్ష్మణ్, జన్ను రవి, దూపం సంపత్, కరాటే ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. -
యూజీడీ వైపు అడుగులు
రూ.5,257 కోట్లకు ఇటీవల పరిపాలన అనుమతిసాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ నగరంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) ప్రాజెక్టు వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. సుమారు 40 ఏళ్లుగా ఈ ప్రాజెక్టుకు మోక్షం కలగలేదు. పలుమార్లు ప్రతిపాదనలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వాలకు పంపించినా ఏదో ఒక కారణంతో ఆచరణకు నోచుకోలేదు. ఫలితంగా వర్షాకాలం వస్తే చాలు డ్రెయినేజీ లైన్లు తరచూ బ్లాక్ అవ్వడం, రోడ్లపై మురుగు నీరు రావడం, మ్యాన్హోల్స్ నుంచి మురుగు పొంగిపోవడం దోమలు, దుర్వాసన సమస్య సర్వసాధారణమైంది. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీలో పలు కాలనీలకు మురుగు, ముంపు బాధలు తప్పలేదు. ఎట్టకేలకు యూజీడీ కోసం ప్రభుత్వం ఇటీవల రూ.5,257 కోట్లతో పరిపాలన అనుమతి ఇవ్వగా.. పనుల ప్రారంభం కోసం కసరత్తు జరుగుతోంది. యూజీడీ లేక రోడ్లపైకి మురుగు నీరు.. చెరువుల నీరు కలుషితం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) అంచనాల ప్రకారం సాధారణ సమయంలో నగరంలో రోజుకు సుమారు 180–200 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. ఈ మురుగును శుద్ధి చేసేందుకు రెడ్డిపురం, ప్రగతినగర్, ఉర్సుగుట్ట సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ) ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 120 ఎంఎల్డీలు మాత్రమే శుద్ధి అవుతున్నాయి. మిగిలిన మురుగు నీరంతా నగరంలో బంధం చెరువు, ధర్మసాగర్, మడికొండ, గోపాలపూర్, భద్రకాళి, వడ్డేపల్లి తదితర చెరువులతో పాటు ఎస్సారెస్పీ కాల్వలోకి చేరి కలుషితం అవుతున్నాయి. ఇక వర్షాకాలం వస్తే చాలు పలుమార్లు రోడ్లపైకి పారే వరద, మురుగునీరు కారణంగా ప్రధాన కాలనీలు మునిగిపోయిన పరిస్థితి. సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో నగరవాసులు తరచూ అవస్థలు పడిన సందర్భాలు ఉన్నాయి. ఎట్టకేలకు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీకి ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇవ్వడంతో పాటు టెండర్ల ప్రక్రియను సైతం మొదలెట్టడం చర్చనీయాంశం అవుతోంది. ఏప్రిల్లో సీఎంతో పనులు ప్రారంభం.. నేడు తేదీలు ఖరారయ్యే అవకాశం యూజీడీ పనులకు ఈ నెలాఖరులోగా టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 10న వరంగల్ అభివృద్ధి పనులపై మంత్రి కొండా సురేఖతో కలిసి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఈ నెలాఖరులో యూజీడీ పనుల టెండర్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు టెండర్ నోటిఫికేషన్ జారీ, టెండర్ ప్రక్రియ ఖరారు, కాంట్రాక్టర్ ఎంపిక, పనుల ప్రారంభంపై కార్యాచరణ రూపొందించడంపై మల్లగుల్లాలు పడుతున్నారు. టెండర్ల ప్రక్రియ ఈ నెలలో పూర్తి చేసి వచ్చే నెలలో సీఎం రేవంత్రెడ్డితో శంకుస్థాపన చేయించే యోచనలో నేతలు ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. బడ్జెట్ సమావేశాల సందర్భంగా హైదరాబాద్కు వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యూజీడీ విషయమై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నట్లు తెలుస్తోంది. టెండర్లు పూర్తి, పనుల ప్రారంభం తేదీల ఖరారుపై చర్చించే అవకాశం ఉందని తెలిసింది. త్వరితగతిన నిర్మాణం చేపట్టేలా కార్యాచరణ ఈ నెలాఖరులో టెండర్ల ప్రక్రియ.. అధికారుల కసరత్తు పూర్తి సకాలంలో పనులు పూర్తయితే ‘గ్రేటర్’కు తప్పనున్న మురుగు, ముంపు నేడు మరోసారి సీఎంను కలవనున్న ప్రజాప్రతినిధులు పనుల ప్రారంభం ముహూర్తంపై చర్చించే అవకాశంయూజీడీ ప్రాజెక్టు వివరాలు..ప్రాజెక్టు పేరు: అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) మొత్తం వ్యయం: రూ. 5,257 కోట్లు అమలు సంస్థ: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాజెక్టు లక్ష్యం: ట్రైసిటీలో సమగ్ర యూజీడీ వ్యవస్థ ఏర్పాటు పైపులైన్ నెట్వర్క్: 740 కిలోమీటర్లు యూజీడీ జోన్లు: 9 సీవరేజ్ ట్రీట్మెంట్ జోన్లు: 21 డ్రెయినేజీ కనెక్షన్లు: దాదాపు 3.15 లక్షల ఇళ్లువరంగల్ : గిర్మాజీపేట, శివనగర్, మండిబజార్, మట్టెవాడ, దేశాయిపేట, మిల్స్కాలనీ, రాంనగర్, ఆటోనగర్, ఎంజీఎం హాస్పిటల్ పరిసరాలు, హంటర్ రోడ్డు, కరీమాబాద్ హనుమకొండ : సుబేదారి, బాలసముద్రం, అదాలత్ సెంటర్, ఎల్బీనగర్, నయీంనగర్, కిషన్పుర క్రాస్, ఎన్జీఓస్ కాలనీ, తిరుమల బార్ చౌరస్తా, అంబేడ్కర్ భవన్ ఏరియా కాజీపేట : రైల్వే కాలనీ, ఫాతిమానగర్, శివనగర్, గాంధీనగర్, ఎల్ఐసీ కాలనీ, డీజిల్ కాలనీ, మడికొండ రోడ్డు పరిసరాలు -
ప్రమాదంలో ‘కుడా’ అపార్ట్మెంట్స్
హన్మకొండ: హనుమకొండ గోకుల్నగర్లో అంబేడ్కర్ భవన్ పక్కన నిర్మించిన ‘కుడా’ అపార్ట్మెంట్స్ ప్రమాదకరంగా మారాయని అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రెంటాల కేశవరెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరువరంగం ప్రభాకర్ తెలిపారు. ‘కుడా’ అపార్ట్మెంట్ నివాసితులు సమస్యలను జిల్లా కమిటీ దృష్టికి తీసుకెళ్లగా ఆదివారం అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు రెంటాల కేశవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరువరంగం ప్రభాకర్, జాయింట్ సెక్రటరీ రాగంశెట్టి సత్యనారాయణ అపార్ట్మెంట్ను పరిశీలించారు. అనంతరం అపార్ట్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్స్ అసోసియేషన్ కమిటీతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ‘కుడా’ అపార్ట్మెంట్లో అనేక సమస్యలున్నాయని వివరించారు. లిఫ్ట్ల అడుగు భాగంలో సీపేజ్ కారణంగా నీరు రావడం చాలా ప్రమాదకరమన్నారు. ఇది భవిష్యత్తులో పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అపార్ట్మెంట్లో 75 కుటుంబాలు నివసిస్తున్నాయని, వీరంతా భయాందోళనల మధ్య గడుపుతున్నారన్నారు. ఈ అపార్ట్మెంట్లో ‘కుడా’ గెస్ట్ హౌజ్ కోసం మూడు ఫ్లాట్లు వాడుతున్నప్పటికీ... నెలవారీ మెయింటెనెన్స్ చెల్లించడం లేదని, ఇది అన్యాయమన్నారు. ‘కుడా’ అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. -
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించాలి
హన్మకొండ: రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్ల రవి అన్నారు. ఆదివారం హనుమకొండ అంబేడ్కర్ కూడలిలోని రెవెన్యూ గెస్ట్ హౌస్లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఇందులో కొండమల్ల రవి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య పథకం కింద అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత, పరిమితి లేని వైద్యం అందించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్లకు కూడా ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఇవ్వకుండానే ఆరోగ్య పథకం అమలు చేయాలని డి మాండ్ చేశారు. పీఆర్సీ అమలు చేయకపోవడంతో ఉద్యోగులు చాలా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే 40 శాతానికి తగ్గకుండా అమలు చేయాలని, ఎరియర్స్ వేతనంలో కలిపి ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూక్యా నరసింహ నాయక్, జనగామ, హనుమ కొండ అధ్యక్షులు మట్టపెల్లి వెంకటేశ్వర్లు, మరుపట్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మేకల రమేశ్, కల్చర ల్ సెక్రటరీ బోగం రాంచందర్, ఉద్యోగులున్నారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ -
భద్రకాళికి ఎస్బీఐ చైర్మన్ పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని ఆదివారం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ఆదివారం కుటుంబ సమేతంగా సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తలు పూర్ణచందర్, ఆంజనేయులు ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ఎస్బీఐ చైర్మన్ అమ్మవారికి పూజలు చేసిన అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. అలాగే, రూ.1.20 లక్షలతో ఆలయ ఆర్చ్ గేట్కు రంగులు వేయించేందుకు దేవాలయ ధర్మకర్త మూగా శ్రీనివాసరావు కుమారుడు మూగా శ్రీధర్ ఆదివారం పెయింటర్కు అడ్వాన్స్ అందజేశారు. కార్యక్రమంలో ధర్మకర్త తొనుపునూరి వీరన్న తదితరులు ఉన్నారు. -
నేటినుంచి ఒంటిపూట బడులు
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలను సోమవారం నుంచి ఒక్కపూట నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం 7–45 నుంచి మధ్యాహ్నం 12–30 గంటలవరకు తరగతులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం 12–30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టి ఇళ్లకు పంపించాలని తెలిపారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో పరీక్షలున్న రోజు మాత్రం విద్యార్థులకు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు నిర్వహిస్తారని అధికారులు వివరించారు. -
ఎంపీ వేం నరేందర్ను కలిసిన డీవైఎస్ఓ అశోక్
వరంగల్ స్పోర్ట్స్: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై న వేం నరేందర్రెడ్డిని హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి గుగులోత్ అశోక్కుమార్ ఆదివారం హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్రీడా పథకాలను ఉమ్మడి వరంగల్ జిల్లాలో అమలయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలకసంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఖిలా వరంగల్: వరంగల్ ఎరువుల నియంత్రణ ప్రయోగశాలలో అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్న కొత్త శ్రీప్రియకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. విద్య, సామాజిక, మహిళా సాధికారత, నాయకత్వ ప్రతిభ, వ్యవసాయ రంగాల్లో విశేషంగా కృషిచేసిన శ్రీప్రియ.. వీహబ్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా అవార్డుకు ఎంపికై ంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన అవార్డుల కార్యక్రమంలో వీహబ్ అసోసియేట్ డైరెక్టర్ ఊహ సజ్జ, సినీ యాక్టర్ తన్వి చేతుల మీదుగా శ్రీప్రియ అవార్డు అందుకున్నారు. ఉమ్మడి సుస్థిర వ్యవసాయం–అధిక పంటల దిగుబడి కోసం కృషి చేస్తున్నందుకు అవార్డు దక్కడం గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. హన్మకొండ కల్చరల్: వరంగల్ మిత్రమండలి సౌజన్యంతో సామాజికవేత్త రంగరాజు శ్యాంసుందర్ రావు రాసిన ‘అద్భుత ప్రపంచంలోకి మా ప్రయాణం’ పుస్తకావిష్కరణ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ మేరకు హనుమకొండ పోస్టల్కాలనీలో అభయాంజనేయస్వామి దేవాలయ ఆవరణలో కవి వీఆర్ విద్యార్థి అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సాహితీవేత్తలు గన్నమరాజు గిరిజమనోహరబాబు, నాగిళ్ల రామశాస్త్రి, మల్యాల మనోహర్రావు, పొట్లపల్లి శ్రీనివాసరావు, వేముగంటి శుక్తిమతి, కాలనీ అధ్యక్షుడు చాడ జైహింద్రెడ్డి, స్థానికులు వాసిరెడ్డి కృష్ణారావు, మండవ రవీందర్రావు, దిలీప్కుమార్, ఏవీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. వరంగల్: పరిపాలనా సౌలభ్యంలో భాగంగా జిల్లాలోని 112 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులకు డిప్యుటేషన్పై బదిలీ చేస్తూ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత రెండేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తించిన పంచాయతీ కార్యదర్శులు కొత్తగా వచ్చిన సర్పంచ్ల వల్ల కొంత ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో 317 పంచాయతీ కార్యదర్శులకు గాను 112 మందిని పరిపాలన సౌలభ్యం మేరకు బదిలీ చేసినట్లు సమాచారం. -
మహర్షి గోశాలకు సహకారం అందిస్తాం..
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హసన్పర్తి: మహర్షి గోశాలలో గోఆధారిత ఉత్పత్తులు తయారుచేయడం అభినందనీయమని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. చింతగట్టులోని మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్, ఎస్ఆర్ఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంచగవ్య ఉత్పత్తుల తయారీ శిక్షణ శిబిరాన్ని శనివారం కలెక్టర్ పరిశీలించారు. గోవులకు మేత వేసి మాట్లాడారు. మహర్షి గోశాలకు సహకారం అందిస్తామన్నారు. పొద్దుటూరులోని సురభి గోశాల ప్రతినిధి దిలీప్కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా పంచగవ్య ఉత్పత్తుల తయారీ కోసం 200 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు సర్జన రమేశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, తహసీల్దార్ కిరణ్కుమార్, తెలంగాణ రాష్ట్ర గోశాల సేవా సమితి సభ్యుడు ఆకుతోట రామారావు, చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు యుగేంధర్, యాదగిరి, స్వామి నారాయణ, ప్రొఫెసర్ కేశవరావు, డి.కిషన్రావు, జయ, మలహర్రావు, నాగ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఎవరికీ పట్టని ‘సీఎంఆర్’!
సాక్షిప్రతినిధి, వరంగల్: ● హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఓ రైస్మిల్లును ఏడాది క్రితం డిఫాల్టర్ల జాబితాలో చేర్చారు. 2021–22, 2022–23 సంవత్సరాలకు సీఎంఆర్ కింద కేటాయించిన సుమారు రూ.7.50 కోట్ల విలువైన ధాన్యం ఎగవేయడమే ఇందుకు కారణం. డిఫాల్టర్ల జాబితాలో చేర్చి నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేసినా ఇప్పటికీ నూరు శాతం సీఎంఆర్ రికవరీ కాలేదు.● హసన్పర్తి మండలంలోని ఓ రైస్మిల్లు నిర్వాహకులు 2,200 మెట్రిక్ టన్నుల బియ్యం చెల్లించాల్సి ఉంది. దాడులు, తనిఖీలు చేసి నోటీసులు జారీ చేయడంతో 1,300 మెట్రిక్ టన్నులు చెల్లించారు. ఇంకా 900 మెట్రిక్ టన్నులు ఇవ్వాలని కమిషనర్ కార్యాలయానికి అందిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ..ఇలా ప్రతీసారి కస్టం మిల్లింగ్ ధాన్యం (సీఎంఆర్) దారి మళ్లుతోంది. వ్యాపారం, వృత్తి మీద ని బద్ధత ఉన్న సుమారు 75 శాతం మంది రైస్మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ చెల్లిస్తున్నారు. కొందరు రాజకీ య పలుకుబడి, మరికొందరు అక్రమార్జన కోసం సీఎంఆర్ బకాయి పెడుతున్నారు. ఓ సీజన్కు చెల్లించాల్సింది మరో సీజన్కు ఇస్తూ.. కొందరు అధికారులను మేనేజ్ చేస్తూ సర్కారు ధాన్యంతో వ్యాపారం చేస్తున్నారు. కొందరైతే మొత్తానికే ఎగవేస్తున్నారు. సర్కారు ధాన్యం మరాడించి పక్క రాష్ట్రాలకు తరలించి బియ్యం అమ్ముకుని.. ఆ డబ్బుతో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేసి ‘రియల్’ వ్యాపా రం చేస్తున్నారు. ఏటా రూ.కోట్ల విలువ చేసే ధా న్యం దారి మళ్లుతుండగా అవినీతి, అక్రమాలకు అలవాటుపడిన కొంతమంది అధికారులు, రైస్మిల్లర్లకు సీఎంఆర్ వరంగా మారిందన్న చర్చ జరుగుతోంది. స్కాం ఇలా వెలుగులోకి.. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తోంది. ఈ ధాన్యాన్ని సివిల్ సప్లయీస్/మార్కెటింగ్ శాఖ ద్వారా రైస్ మిల్లులకు పంపుతుంది. మిల్లర్లు ధాన్యం తీసుకున్న తర్వాత మిల్లింగ్ చేసి బియ్యం ఇవ్వాలి. ఒప్పందం ధాన్యం మిల్లింగ్ చేసి సుమారు 67 శాతం బియ్యం ఎఫ్సీఐ/సివిల్ సప్లయీస్ గోదాములకు ఇవ్వాలి. ఇక్కడే అసలు స్కాం మొదలవుతుంది. కొంతమంది మిల్లర్లు ప్రభుత్వ ధాన్యం మిల్లింగ్ చేయరు.. లేదా కొంత మాత్రమే మిల్లింగ్ చేస్తారు. మిగిలిన ధాన్యాన్ని మార్కెట్ ధర ఎక్కువ ఉంటే ప్రైవేట్కు అమ్మేయడం, లేదంటే మరాడించి బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి అమ్ముకుంటున్నారు. ఈ వ్యవహారంలో ఫేక్ మిల్లింగ్ రికార్డులు, స్టాక్ రిజిస్టర్ మార్పులు చేసి తక్కువ బియ్యం చూపించడం.. బియ్యం ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగితే ధాన్యం తడిగా ఉండడం, మిల్లింగ్, ట్రాన్స్పోర్ట్ సమస్యలను చెప్పి దాటవేయడం పరిపాటి. తీరా పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు మిల్లుల్లో ఉన్న ధాన్యం, సరఫరా చేసిన బియ్యం లెక్కల్లో భారీ తేడా కనిపిస్తుంది. దీంతో సీఎంఆర్ బకాయిలు, పక్కదారి పట్టించిన స్కాంలు బయట పడుతున్నాయి. డిఫాల్టర్ రైస్మిలర్లపై చర్యలు లేవు.. వారి వద్దే కస్టమ్ మిల్లింగ్ రైస్ నోటీసులకే పరిమితమైన రికవరీ.. ‘తిలా పాపం తలా పిడికెడు’లా పరిస్థితి మూడేళ్లు గడిచినా ఇంకా మౌనమే.. మిల్లర్ల వ్యాపారానికి సర్కారు ధాన్యం అధికారుల ఉదాసీనతపై కమిషనర్ సీరియస్.. మళ్లీ తెరపైకి బకాయిల వ్యవహారం 2021–22లో రైతుల నుంచి వానాకాలం, యాసంగి సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద రైస్మిల్లర్లకు సరఫరా చేశారు. ఆ ధాన్యానికి సంబంధించిన బియ్యం సరఫరా చేయడంలో ఉమ్మడి వరంగల్లోని 33 మంది మిల్లర్లు నిర్లక్ష్యం వహించారు. బియ్యం చెల్లించని వారికి పౌరసరఫరాలశాఖ నోటీసులు ఇచ్చింది. స్పందించకపోవడంతో ఆయా మిల్లులకు సరఫరా చేసిన లెక్కల ప్రకారం ఉండాల్సిన ధాన్యానికి 2023లో టెండర్లు నిర్వహించారు. అలా ఉమ్మడి వరంగల్లోని మిల్లుల్లో 2,92,585 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు.. తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు ఎట్టకేలకు 1,83,985 మెట్రిక్ టన్నులు రాబట్టినట్లు అప్పట్లోనే ప్రకటించారు. ఇంకా సుమారు రూ.107 కోట్ల విలువ చేసే ఆ ధాన్యం రైస్మిల్లర్ల వద్ద ఉందని పౌర సరఫరాలశాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చారు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉంది. కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై తాజాగా పౌర సరఫరాల శాఖ కమిషనర్కు కొందరు రైస్మిల్లర్లే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీఎంఆర్ బకాయిలు రాబట్టడంపై కొందరిపై కఠినంగా, మరికొందరిపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించినట్లు తెలిసింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్లో సీఎంఆర్ బకాయిలపై కమిషనర్ కార్యాలయం తాజాగా ఆరా తీయడం రైస్మిల్లర్లలో చర్చనీయాంశంగా మారింది. -
పదో తరగతి పరీక్షలు షురూ
విద్యారణ్యపురి: పదో తరగతి వార్షిక పరీక్షలు శని వారం ప్రారంభమయ్యాయి. హనుమకొండ జిల్లాలో 64 కేంద్రాల్లో తొలిరోజు తెలుగు పరీక్షను నిర్వహించారు. 12,049 మంది విద్యార్థులు పరీక్షలకు అందులో 12,033 మంది (99.87 శాతం) హాజరయ్యారు. 16 మంది గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. కాగా, హనుమకొండ లష్కర్బజార్లో ని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్, ప్రభుత్వ బాలి కల ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాలను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఉన్నారు. అదేవిధంగా జిల్లాలోని మరో ఐదు పరీక్ష కేంద్రాలను రాష్ట్రస్థాయి అబ్జర్వర్, రాష్ట్ర మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ ఎస్.శ్రీనివాసాచారి, 21 పరీక్ష కేంద్రాలను నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశాయి. వరంగల్ జిల్లాలో 9,479 మంది హాజరు.. కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలో 9,492 మంది విద్యార్థులకు 9,479 మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ బి.రంగయ్యనాయుడు తెలిపారు. పదో తరగతి పరీక్షల కోసం 47 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ సత్యశారద నర్సంపేటలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆమె ఆదేశించారు. అదేవిధంగా కరీమాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సెంటర్ను అర్డీఓ సుమ, ఖిలా వరంగల్ తహసీల్దార్ ఎండీ ఇక్బాల్, శంభునిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సెంటర్ను జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, పోచమ్మ మైదాన్ని ఎస్ఆర్ హైస్కూల్ సెంటర్, దేశాయిపేటలోని నాగార్జున హైస్కూల్ సెంటర్, కొత్తవాడలోని గిర్మాజీపేట ప్రభుత్వ పాఠశాల సెంటర్, పైడిపల్లి హైస్కూల్ సెంటర్ను అదనపు కలెక్టర్ సంధ్యారాణి తనిఖీ చేసినట్లు డీఈఓ తెలిపారు. హనుమకొండ జిల్లాలో 99.87 శాతం మంది హాజరు -
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026
కాంతులీనే విద్యుద్దీపాలు.. నోరూరించే హలీం, హరీస్, బిర్యానీ సువాసనలు. మంత్రముగ్ధుల్ని చేస్తూ విక్రయానికి సిద్ధంగా ఉన్న వస్త్రాభరణాలు. సుగంధాలు వెదజల్లే అత్తరు సీసాలు. ఇలా ఒక్కటేమిటి త్రినగరిలో మండి బజార్ వెళ్తే అది ఓ మధుర జ్ఞాపకం. రంజాన్ సందర్భంగా ఈ ప్రాంతం సరికొత్త శోభను సంతరించుకుంది. వరంగల్ పాత లక్ష్మీటాకీస్ మొదలు, పోచమ్మమైదాన్ వరకు, అక్కడి నుంచి ఎల్బీనగర్, చార్బౌళి ప్రాంతంలో రంగుల విద్యుత్ దీపాలు ఆకర్షిస్తుంటాయి. సిటీ ఆఫ్ ది అట్రాక్షన్గా మారిన మండిబజార్పై రంజాన్ నేపథ్యంలో ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.. – న్యూశాయంపేటచిరు వ్యాపారులకు జీవనోపాధి..రంజాన్ మాసంలో చిరువ్యాపారులకు పుష్కలంగా జీవనోపాధి దొరుకుతుంది. ఒక్క నెలలోనే జరిగే వ్యాపారంపై వందలాది కుటుంబాలు ఏడాదిపొడవునా ఆధారపడతాయి. తోపుడు బండ్ల మీద అమ్మే వస్తువుల నుంచి షోరూంల వరకు ప్రతీ ఒక్కరికి ఇది మెయిన్ సీజన్. అదనపు రద్దీని తట్టుకోవడానికి హోటళ్లు, బట్టల షాపుల్లో తాత్కాలికంగా వందలాది మంది యువతకు ఉపాధి లభిస్తుంది. కులమతాలతో సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి జరుపుకునే ఈ ఉత్సవం గంగా జమునా తహజీబ్కు ప్రతీకగా నిలుస్తోంది. మండిబజార్లో రాత్రి 10 గంటలకు మొదలయ్యే కోలాహలం మళ్లీ తెల్లవారుజామున సహర్ ముగిసే వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. పోలీస్ ఉన్నతాధికారులు మహిళల రక్షణ కోసం ఈవ్టీజర్స్ నుంచి కాపాడేందుకు షీ–టీమ్స్ను ఏర్పాటు చేయాలి. – మహ్మద్ అల్తాఫ్, మండిబజార్, వరంగల్ మండి బజార్ నైట్ వ్యూవరంగల్ నగరంలోని మండిబాజార్ నిత్యం రద్దీగానే ఉంటుంది. రంజాన్ మాసం వేళ ఇక్కడి దుకాణాలు విద్యుత్ దీపాలతో తళతళలాడుతుంటాయి. ముత్యాలు, రాళ్లతో పొదిగిన గాజులు, మేకప్ సామగ్రి కొనుగోలు చేయడానికి మహిళలు అధిక సంఖ్యలో వస్తున్నారు. సంప్రదాయ ఖారా దుపట్టా, జరీవర్క్ ఉన్న దుస్తులు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. పిల్లల కోసం బొమ్మలు, ఈద్కు సంబంధించిన పఠానీ, షల్వార్ ఖమీస్, షెల్వార్ షూట్ కొత్త దుస్తుల కొనుగోళ్లు భారీగా జరుగుతాయి. అత్తరు వాసన(రోజ్, మొగ్రా) ఘుమఘుమలు, చేనేత కళాఖండాలు, కొత్తరకం బెడ్ షీట్లు, పరదాలు, క్రాకరీ ఐటమ్స్ పాదరక్షలు తదితరాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కేవలం ముస్లింలే కాకుండా ఇతర మతాల ప్రజలు సైతం ఇక్కడ కొనుగోళ్లు చేస్తూ ఉంటారు. నోరూరించే ఘుమఘుమలు.. మండిబజార్ అంటే కేవలం షాపింగ్ మాత్రమే కాదు.. హలీం, హరీస్, పత్తర్కా ఘోష్ట్, కబాబ్, సమోసా, జిలేబీ, షీర్ ఖుర్మా, కద్దూకా ఖీర్, డబుల్కా మీఠా, ఖుర్బానీకా మీఠా, షాయిదూద్ వంటి పదార్థాలు నోరూరిస్తాయి. సహరీ సమయం వరకు ఇరానీ చాయ్–ఉస్మానియా బిస్కెట్లను ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకుంటూ గడుపుతారు. సాధారణంగా నగరమంతా నిద్రపోయే సమయంలో ఈ ప్రాంతం మేల్కొని ఉంటుంది. రంజాన్లో ఉపవాసాలు ఉండే వారికి నైట్బజార్లో షాపింగ్ అయ్యాక తెల్ల వారుజామున 3 గంటల నుంచి 4.30 మధ్య సహరీ (సూర్యోదయానికి ముందు సమయం) సందడి మొదలవుతుంది. కేవలం ఇఫ్తార్కే కాకుండా సహరీ కోసం ప్రత్యేకంగా ఖిచిడీ–ఖట్టా–ఖీమా, నహారీ–కుల్చా తదితర వంటకాలు ఇక్కడ హాట్ కేక్ల్లా అమ్ముడవుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పర్యాటకులే కాకుండా, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి యువకులు ఇక్కడి వచ్చి తెల్ల వారుజామున ఈ విందును ఆస్వాదిస్తారు. భద్రత కట్టుదిట్టం.. వేలాది మంది తరలి వచ్చే ఈ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నగర పోలీసు అధికారులు ప్రత్యేకంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వేలాది వాహనాలను నియంత్రించడానికి ట్రాఫిక్ను డైవర్ట్ చేసి నియంత్రిస్తున్నారు. కంట్రోల్ రూం ద్వారా నిరంతర నిఘా పెడుతున్నారు. ప్రత్యేకంగా సీసీ కెమెరాలు, పోలీస్ బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు. వరంగల్ శంభునిపేట ప్రభుత్వ పాఠశాలలో పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులు -
కోచ్ ఫ్యాక్టరీలో కొలువులివ్వాలి
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీలో అయోధ్యపురం భూ నిర్వాసితులు, గ్రామస్తులకు, కాజీపేట పరిసర ప్రాంతాల వారికి, రైల్వే ఆక్ట్ అంప్రెంటీస్ చేసిన వారికి, ఉమ్మడి జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ అన్నారు. కాజీపేట రైల్వే ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవేందర్ మాట్లాడుతూ.. ఆదివారం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎంట్రెన్స్ ఎదుట రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో మహా నిరసన దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. రైల్వే జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు మాట్లాడుతూ.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించాలని రైల్వే జేఏసీ చేపడుతున్న డిమాండ్లు నెరవేరే వరకు అందరి సహకారం ఉండాలన్నారు. కాజీపేట డివిజన్ కోసం రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని, రైల్వే జేఏసీ దీక్షను అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైల్వే జేఏసీ బృందం పాక వేద ప్రకాశ్, గుర్రపు సుధాకర్రావు, వస్కుల రవీందర్, వల్లపు తిరుపతి, జి.భాస్కర్, జి.నాగరాజు, శిరుమల్ల రమేశ్ పాల్గొన్నారు. రైల్వే జేఏసీ కన్వీనర్ రాఘవేందర్ నేడు రైల్వే జేఏసీ మహా నిరసన దీక్ష -
గ్యాస్ కోసం చింతించొద్దు
● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: జిల్లాలో గృహ వినియోగదారులకు ఎక్కడా ఇబ్బందులు కల్గకుండా గ్యాస్ సిలిండర్ల సరఫరా జరుగుతుందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో పౌర సరఫరాలు, రెవెన్యూ, విద్య, వైద్య ఆరోగ్య, పోలీస్ శాఖల అధికారులు, ఎల్పీజీ సేల్స్ అధికారులు, జిల్లాలోని గ్యాస్ డిస్టిబ్య్రూషన్ ఏజెన్సీల యజమానులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గ్యాస్ సరఫరా పరిస్థితి, వినియోగదారులకు అందుతున్న సిలిండర్లపై కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ ఎన్.రవి చర్చించారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, ఆర్డీఓలు నారాయణ, రాథోడ్ రమేశ్, కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, డీఈఓ గిరిరాజ్ గౌడ్, డీఎంహెచ్ఓ అప్పయ్య, డీసీఎస్ఓ ఎండీ.వాజీద్ అలీ, బీపీసీఎల్ వరంగల్ మేనేజర్ సాహిల్ ధోబ్లె తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీగా ఎస్ఐఆర్ మ్యాపింగ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా మ్యాపింగ్ ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. జిల్లాలో 68.56 శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్షించారు. సమావేశంలో పరకాల, హనుమకొండ ఆర్డీఓలు డాక్టర్ కన్నం నారాయణ, రాథోడ్ రమేశ్, హనుమకొండ, పరకాల తహసీల్దార్లు రవీందర్రెడ్డి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చెరువులు, కుంటలను సంరక్షించుకోవాలి.. ¯]lƇʅ¯]lVýSÆŠḥæ: నగర పరిధి చెరువులు, కుంటలను సంరక్షించుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. శుక్రవారం ‘కుడా’ కార్యాలయంలో ఇరిగేషన్, రెవెన్యూ, జీడబ్ల్యూఎంసీ, ‘కుడా’, ఇండస్ట్రీస్ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ఇందులో ‘కుడా’ సీపీఓ అజిత్ రెడ్డి, అదనపు కలెక్టర్ రవి, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, బల్దియా సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఇరిగేషన్, ‘కుడా’, బల్దియా అధికారులు కిరణ్ కుమార్, భీమ్ రావు, మహేందర్, సంతోశ్బాబు, ఇరిగేషన్ డీఈ హర్షవర్ధన్, ఎన్ఐటీ మాజీ ప్రొఫెసర్ పాండురంగారావు పాల్గొన్నారు. గ్యాస్ కొరత లేదు: మంత్రి ఉత్తమ్ హన్మకొండ అర్బన్: రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని రాష్ట్ర పౌర సరఫరాలు, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. గ్యాస్ సరఫరాపై అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు. శుక్రవారం సచివాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి కలెక్టర్లు, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హనుమకొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, అదనపు కలెక్టర్ ఎన్.రవి పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నుంచి కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ అంకిత్కుమార్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ కలెక్టరేట్లో జిల్లా ఎనర్జీ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. -
పొగ.. సెగ
మత్స్యకారుల విలవిల మడికొండ సమీప గ్రామాల చెరువుల్లో చేపలు పెంచే మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారు. నీరు కలుషితం కారణంగా చేపలు ఎదగడం లేదని, చాలా వరకు చనిపోతున్నాయని, పెట్టుబడి సైతం రావట్లేదని వారంతా వాపోతున్నారు. సొంతంగా సీడ్స్ తెచ్చుకుని వేసుకుంటే కనీసం బతకడానికి కూడా కష్టమవుతోందని, డంపింగ్ యార్డు కారణంగా వృత్తిని వదిలి కూలీ పనులకు వెళ్లాల్సి వస్తోందని మత్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్లుతాళ్లు.. మడికొండ ప్రాంతంలో సుమారు 2,000కు పైన తాటిచెట్లు ఉంటాయి. వీటిని ఆధారంగా చేసుకుని సుమారు 200 కల్లుగీత కార్మిక కుటుంబాలు జీవిస్తున్నాయి. డంపింగ్ యార్డు పొగ, కలుషిత జలాల కారణంగా కల్లు రుచిపోతోందని, తమ గిరాకీ తగ్గుతోందని గీతకార్మికులు వాపోతున్నారు. ఇదివరకు మాదిరిగా కల్లు పారడం లేదని ఈ వృత్తిని నమ్ముకున్న తమకు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని వారంతా ఆందోళన చెందుతున్నారు.కాజీపేట అర్బన్: ‘పొగ తాగరాదు’ అని సినిమా థియేటర్లలో పలు బహిరంగ ప్రదేశాల్లో బోర్డులు చూస్తుంటాం. పొగ తాగే వారితో పాటు పీల్చినా ఆరోగ్యానికి ప్రమాదమే అని హెచ్చరిస్తుంటారు వైద్యులు. అలాంటిది నిత్యం చిన్నాపెద్దా తేడా లే కుండా పొగ పీలుస్తూనే ఉన్నారు మడికొండ, రాంపూర్, కాజీపేట, డీజిల్ కాలనీ, అయోధ్యపురం, కడిపికొండ, ధర్మసాగర్, కుమ్మరిగూడెం, తదితర గ్రామాల ప్రజలు. ఆయా ఊళ్ల ప్రజల జీవన విధానంలో పొగ అంతర్భాగమైంది. అనారోగ్యం రోజుకింత చొప్పున శరీరం లోపలికి వ్యాపిస్తోంది. పొసగకుండా చేస్తున్న ఈ పొగ జీవనోపాధిపై ఎనలేని ప్రభావం చూపుతోంది. చెమ్మగిల్లుతోన్న చెరువు.. చెరువు.. ఊరికి ఆదెరువు. మడికొండ చుట్టుపక్కల పంట పొలాలకు చెరువునీరు ఆధారంగా ఉండేది. ఈ నీటితో సమృద్ధిగా పంటలు పండించేవారు. 2011లో డంపింగ్ యార్డు ఏర్పాటైన తర్వాత చెరువు నీరు కలుషితమవుతోంది. దీంతో చుట్టుపక్కల వ్యవసాయ క్షేత్రాల్లో పంటల దిగుబడి సైతం తగ్గిందని స్థానికులు వాపోతున్నారు. కాగా, మడికొండ పెద్ద చెరువులో కలుషితమైన నీరు సోమిడి చెరువుకు చేరుతుంది. అక్కడి నుంచి వడ్డేపల్లి పెద్ద చెరువులోకి చేరుతుంది. ఇలా ఆయా చెరువులు కలుషితమవుతున్నాయి. పంటలు దెబ్బతింటున్నాయి. మడికొండలోని డంపింగ్ యార్డుతో ప్రశ్నార్థకంగా కులవృత్తులు ముదిరాజ్, గీత కార్మికుల జీవనోపాధిపై ప్రభావం యార్డును తొలగించాలని డిమాండ్ -
టెన్త్.. ఆల్ ది బెస్ట్!
శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026నేటినుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు హనుమకొండ వరంగల్ విద్యార్థులు 12,079 9,492 పరీక్ష కేంద్రాలు 64 47 ఫ్లయింగ్ స్క్వాడ్లు 04 03 సిట్టింగ్ స్క్వాడ్లు 64 47 ఇన్విజిలేటర్లు 698 496● ఉదయం 9.35 గంటలు దాటితే నో ఎంట్రీ ● అన్ని ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు ● తొలిసారిగా సెంటర్ల వద్ద క్లాక్ రూమ్ విద్యారణ్యపురి/కాళోజీ సెంటర్ : పదో తరగతి పరీక్షలకు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో సంబంధిత విద్యాశాఖాధికారులు సర్వం సిద్ధం చేశారు. శనివారం నుంచి ఏప్రిల్ 15వరకు జరగనున్న పరీక్షలకు హనుమకొండ జిల్లాలో 64 సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రైవే ట్, ఎయిడెడ్, గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూల్స్ కలిపి 12,079 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఒక్కో సెంటర్కు ఒకరు చొప్పున 64మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 64మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు. వరంగల్ జిల్లాలోని 288 పాఠశాలల నుంచి బాలురు 4,932 మంది, బాలికలు 4,560 మంది మొత్తం 9,492 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరి కోసం 47 సెంటర్లు ఏర్పాటు చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లతోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు, ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద తొలిసారిగా క్లాక్రూమ్లను ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రం వద్ద ఒక క్లాక్ రూమ్ ఉంటుంది. విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులు తీసుకురాకూడదు. ఒకవేళ ఏమైనా బ్యాగ్లు తీసుకొస్తే ఆ క్లాక్ రూమ్లో భద్రపర్చుకునే వెసులుబాటు కల్పించారు. హాల్టికెట్పై క్యూఆర్ కోడ్ విద్యార్థులకు హాల్టికెట్లపై క్యూఆర్కోడ్ ముద్రించారు. ఆ కోడ్ను స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం అడ్రస్ గూగుల్ మ్యాప్లో ఓపెన్ అవుతుంది. ఇప్పటికే హాల్టికెట్లు అందుబాటులో ఉంచారు. ఒకవేళ ప్రైవేట్ యాజమాన్యాలు ఎవరైనా ఫీజుల పేరిట హాల్టికెట్ ఇవ్వకుంటే నేరుగా బీఎస్ఈ.తెలంగాణజీఓవి.ఇన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ హాల్టికెట్తో పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతి ఉంటుంది. కేంద్రాల్లోని సీఎస్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లకు ఫోన్ అనుమతి లేదు. సీసీ కెమెరాల నిఘాలోనే చీఫ్ సూపరింటెండెంట్ ప్రశ్నపత్రాల బండిళ్లను విప్పాలి. పరీక్ష ముగిశాక బండిల్స్గా కట్టాల్సి ఉంటుంది. ప్రతీ పరీక్షకు వ్యవధి.. శనివారంనుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈసారి పరీక్షల్లో ఒక సబ్జెక్టుకు మరో సబ్జెక్టుకు మధ్య మూడు, నాలుగు రోజుల వ్యవధి ఇచ్చారు. దీనివల్ల విద్యార్థులు బాగా ప్రిపేరయ్యే అవకాశం ఉంది. మధ్య లభించే గడువులో సబ్జెక్టులకు సంబంధించి ఉపాధ్యాయులు నివృత్తి చేస్తారు. పకడ్బందీ ఏర్పాట్లు చేశాం.. టెన్త్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు గంటముందుగానే పరీక్షకేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 9:35గంటల తర్వాత అనుమతి ఉండబోదు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాం. ఎలాంటి ఆందోళన, ఒత్తిడికి గురవకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. – ఎల్వీ.గిరిరాజ్ గౌడ్, డీఈఓ హనుమకొండ, కె.అరుణ, ఏసీజీఈ వరంగల్ ●పరీక్షసమయం : ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12–30గంటల వరకు ఫిజికల్ సైన్స్, బయాలాజికల్ సైన్స్ : ఉదయం 9–30 నుంచి 11గంటల వరకుజిరాక్స్ సెంటర్లు మూసివేయాలి.. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధించారు. కేంద్రాల సమీపంలోని జిరాక్స్సెంటర్లను మూసివేయాల్సి ఉంటుంది. కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. విద్యార్థులకు సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు ప్రత్యేకంగా నడుపుతారు. విద్యుత్కు అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల విషయంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు హనుమకొండ డీఈఓ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ (సెల్నంబర్ 79817 67208)లో, వరంగల్ జిల్లా విద్యార్థులు అయితే 94402 34571 నంబర్లో సంప్రదించవచ్చు. విద్యార్థులు గంటముందే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 9–35గంటల తర్వాత లోనికి అనుమతి ఉండదు. సమాచారం కోసం ప్రతీ సెంటర్ వద్ద బ్యానర్ కట్టారు. అందులో సెంటర్ పేరు, కంట్రోల్ రూమ్ సెల్నంబర్ను పొందుపర్చారు. -
క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం
● హనుమకొండ జిల్లా క్షయ నియంత్రణాధికారి హిమబిందుఎంజీఎం: క్షయ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, జిల్లాను క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని హనుమకొండ జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు అన్నారు. మార్చి 24న ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కాకతీయ మెడికల్ కాలేజీ నర్సింగ్ కళాశాలలో క్షయ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ.. టీబీని నివారించడం కంటే ముందుగా దాన్ని గుర్తించడం ముఖ్యమని, ప్రాథమిక దశలో గుర్తించి తగు చికిత్స తీసుకుంటే పూర్తిగా నియంత్రివచ్చన్నారు. కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ టి.సునీత, నర్సింగ్ ట్యూటర్స్ అనురాధ, సుకన్య, జిల్లా క్షయ వ్యాధి టీబీ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్లు సుష్మా, కిరణ్ కుమార్, నగేశ్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ విజయ్, సతీశ్, హెల్త్ విజిటర్స్ అంజమ్మ, సునీత, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. పీహెచ్సీ సందర్శన హసన్పర్తి: హసన్పర్తి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని శుక్రవారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజర్ ప్రతినిధి డాక్టర్ శిరీష సందర్శించారు. ఈసందర్భంగా కుష్ఠువ్యాధి డిటెక్షన్ సర్వే నిర్వహించారు. పైలేరియా, కుష్ఠు కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ రామ్ భార్గవ్, డాక్టార్ భరత్, హెచ్ఈఈఓ సందెల శ్రీనివాస్, డీపీఎంఓలు రవీందర్, సతీష్రెడ్డి, సబ్ యూనిట్ ఆఫీసర్ ఖాదర్ అబ్బాస్, విప్లవ్కుమార్ పాల్గొన్నారు. -
అక్కడ యుద్ధం..
ఇక్కడ ఆందోళన!సాక్షి ప్రతినిధి, వరంగల్: అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధ ప్రభావం పరోక్షంగా ఉమ్మడి వరంగల్ ప్రాంతంలోని రైతులు, వ్యాపారులు, సాధారణ ప్రజలపై పడుతోంది. ఇప్పటికే వంటింటిపై ఎల్పీజీ గ్యాస్ బండ భారమవుతోంది. గ్రేటర్ వరంగల్ నగరంలో చిన్న చిన్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ పా యింట్లు మూతపడుతున్నాయి. పబ్లిక్ గార్డెన్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కేయూసీ ప్రాంతాల్లో ఉదయం వాకింగ్ చేసేవారికి రాగి జావా, జొన్న గట్క ఇవ్వలేకపోతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. వ్యవసాయ రంగంపైనా.. ఉమ్మడి వరంగల్ ప్రాంతంలో సుమారు 4.27 లక్షల మంది రైతులు, 5 లక్షలకుపైగా వ్యవసాయ కూలీలు ఉన్నారు. ధరల పెరుగుదలతో సాగు వ్యయం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. ఇంధన వినియోగం ఎక్కువ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకు సుమారు 40–50 లక్షల లీటర్ల పెట్రోల్, 70–80 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి మార్కెట్లో వస్తువుల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. మొత్తంగా ఈ ప్రభావం సుమారు 13 లక్షల మందిపై పడుతుందని అంచనా. ఉమ్మడి వరంగల్లో ఏటా యూరియా 1.3 – 1.5 లక్షల టన్నులు, డీఏపీ 60 – 70 వేల టన్నులు, పొటాష్ 25 – 30 వేల టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 80 – 90 వేల టన్నుల వినియోగం ఉంటుంది. ప్రపంచ మార్కెట్లో ఎరువులు ముడి పదార్థాల సరఫరాపై ప్రభావం పడితే ధరలు పెరిగే అవకాశం ఉంటుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. కాగా, డీజిల్, ఎరువుల ధరలు పెరిగితే సాగు ఖర్చులు పెరుగుతాయని ఎల్క తుర్తి మండలానికి చెందిన రైతు నిరంజన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్, ఇంధన ధరలు పెరిగితే కుటుంబ ఖర్చులు పెరుగుతాయి, చిరువ్యాపారస్తులపై భారం పడుతోంది’ అని టీ పాయింట్ నిర్వాహకుడు, గ్యాస్ వినియోగదారుడు సాయి సిద్ధార్థ్ చెప్పారు. వ్యాపార వాణిజ్య రంగంలో ఆందోళన.. వ్యాపారులు, ట్రాన్స్పోర్ట్ రంగం ఇతర వృత్తుల్లో పనిచేసేవారి సంఖ్య 4,46,399 మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు, సరుకుల ధరలపై ప్రభావం పడుతోంది. గృహ పరిశ్రమలు/చిన్న పరిశ్రమల్లో పనిచేసేవారు 34,820 మంది ఉండగా.. ముడి పదార్థాల ధరలు పెరిగితే ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి. మొత్తంగా ఉమ్మడి వరంగల్లో అన్ని రంగాల్లో పనిచేసే జనాభా 17,05,655 మంది ఉండగా.. యుద్ధాల వల్ల వస్తువుల ధరలు పెరగడం వల్ల ఈ వర్గాలందరికీ పరోక్ష ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వంటింటిపై తీవ్ర ప్రభావం.. మొదలైన గ్యాస్ సిలిండర్ల కొరత టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలకు దెబ్బ వ్యవసాయం సహా పలు రంగాలపై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉమ్మడి వరంగల్పై పరోక్ష ప్రభావంఈ ఫొటోలో దిగాలుగా కూర్చున్నది మునగాల కల్యాణ్కుమార్. హనుమకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద రోజూ ఉదయం రాగి జావా, జొన్నగట్క, మొలకల స్టాల్ ఏర్పాటు చేసి వాకర్లకు విక్రయిస్తుంటాడు. రెండు రోజులనుంచి మొలకలు మాత్రమే విక్రయిస్తున్నాడు. రాగి జావా, జొన్న గట్క ఎందుకు పెట్టడం లేదని అడిగితే ‘గ్యాస్ అయిపోయింది. ఇంతకుముందు బుక్ చేసిన వెంటనే సిలిండర్ ఇచ్చేవారు. ఇప్పుడు ఇవ్వడం లేదు. రెండు రోజులుగా రాగి జావా, జొన్న గట్క తయారు చేయడం లేదు’ అని సమాధానమిచ్చాడు. -
ఆర్టీసీలో నియామకాలపై విచారణ షురూ
● ఆదేశాలు జారీ చేసిన ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ హన్మకొండ: ‘అమ్మకానికి ఉద్యోగం’ శీర్షికన ఈ నెల 10న సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించారు. ఔట్ సోర్సింగ్ నియామకాలపై విచారణ చేపట్టాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి.. కరీంనగర్ జోన్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ రవీందర్ను ఆదేశించారు. ఎండీ ఆదేశాలు అందుకున్న ఆయన విచారణ షురూ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు : డీసీపీ కవిత వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలో పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సెంటర్ల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని సెంట్రల్ డీసీపీ దార కవిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిభద్రతల రక్షణలో భాగంగా సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడరాదని, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిషేధమని వివరించారు. ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. మార్కెట్ క్యాంటీన్లో పాము కలకలం వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్లోని పల్లికాయ యార్డు పక్కనే ఉన్న క్యాంటీన్ నిర్వాహకుడిని పాము కాటేసింది. శుక్రవారం క్యాంటీన్ నిర్వాహకుడు శ్రీనివాస్ కట్టెలు తీసే క్రమంలో పామును పట్టుకోవడంతో కాటు వేసినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. అతడిని హోటల్ సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వంటకు ఉపయోగించే కట్టెలను పెద్ద మొత్తంలో పల్లికాయ యార్డు పక్కనే స్టాక్ పెట్టడంతో పాములు, విష పురుగులకు ఆవాసంగా మారిందని, వెంటనే కట్టెలను తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీలంక క్రికెట్ టూర్కు పవన్, వైష్ణవ్ వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు కొలంబోలో జరగనున్న టీ–20, వన్డే మ్యాచ్లలో పాల్గొనేందుకు హెచ్సీఏ సంయుక్త జిల్లాల జట్టులో వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఎంపికై న క్రీడాకారుల్లో జి.పవన్, వి.వైష్ణవ్తో పాటు టూర్ పరిశీలకుడిగా చాగంటి శ్రీనివాస్, కోచ్లుగా జీఎస్ రాజు, సీహెచ్ వెంకటేశ్వర్లును హెచ్సీఏ అపెక్స్ కమిటీ ఎంపిక చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. -
జనగణన సర్వే సమర్థవంతంగా నిర్వహించాలి
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ● కలెక్టరేట్లో అధికారులకు శిక్షణ న్యూశాయంపేట: జనగణన సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని, 2027 జనాభా లెక్కలు ప్రభుత్వ పథకాల అమలు, దేశాభివృద్ధికి కీలకమని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. జనాభా గణన–2027 నిర్వహణపై జిల్లా, మండల, మున్సిపల్స్థాయి అధికారులకు కలెక్టరేట్లో మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. జిల్లాస్థాయిలో జనగణన సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు, మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. మొదటి దశ మే 2026 మే నుంచి జూన్ 9 వరకు, రెండో దశ ఫిబ్రవరి 2027లో నిర్వహిస్తారని ఆమె తెలిపారు. 1 మార్చి 2027ను రెఫరెన్స్ తేదీగా ప్రకటిస్తారని చెప్పారు. జనాభా గణన విభాగం సంయుక్త సంచాలకులు డి.సుబ్బరాజు, గణాంక అధికారి ఎస్.సతీశ్ ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుందని తెలిపారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, సీపీఓ చంద్రకళ, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలి.. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని ప్రతీ పోలింగ్ స్టేషన్కు బూత్ లెవల్ ఆఫీసర్ను నియమించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అధికారులు పాల్గొన్నారు. -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎదుట విజయ సంకేతం చూపుతున్న విద్యార్థినులులగేజీతో బస్టాండ్కు వెళ్తున్న విద్యార్థివిద్యారణ్యపురి: ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు (జనరల్ విభాగం) శుక్రవారంతో ముగిశాయి. శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి 18,350 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. అందులో 17,931 మంది (98 శాతం) హాజరైనట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. ఇంటర్మీడియట్ జనరల్ పరీక్షలు ముగియడంతో నగరంలో వివిధ హాస్టళ్లలో, గురుకులాల్లో ఉండే విద్యార్థులు ఇంటిబాట పట్టారు. వరంగల్ జిల్లాలో 163 మంది గైర్హాజరు కాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. చివరి రోజు పరీక్షకు 163 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. జనరల్ కోర్సు మొత్తం విద్యార్థులు 4,736 మందికిగాను 4,605 మంది హాజరు కాగా.. 131 మంది గైర్హాజరయ్యారని, ఒకేషనల్ కోర్సులో మొత్తం విద్యార్థులు 671 మంది కాగా, 639 మంది హాజరు కాగా 32 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. -
దీన్దయాళ్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలి
● వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఖిలా వరంగల్: పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలు, అంత్యోదయ భారత్కి ఎంతో అవసరమని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. పండిట్ దీన్దయాళ్ ప్రశిక్షణ మహాభియాన్–2026 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కరీమాబాద్లో మండల అధ్యక్షులు బోరిగం నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ సంస్కృతిలో అనేక విలువలున్నాయనే విషయాన్ని మరిచిపోయి సమాజంలో మానవత్వం మంటగలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ దేశ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుసుమ సతీష్, కోకన్వీనర్ కందిమల్ల మహేష్, భైరి నాగరాజు, రాజకుమార్, దీన్దయాళ్ పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్ : కొత్తగూడ మండలంలోని మోడల్ క్రీడా పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గుగులోత్ దేశీరాం నాయక్ శుక్రవారం పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోని మండల స్థాయి పోటీల్లో పాల్గొనాలని, దరఖాస్తుతో పాటు, ధ్రువపత్రాలను కొత్తగూడ క్రీడా పాఠశాలలో అందజేయాలని వివరించారు. ఈ నెల 28నుంచి 31 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపిక పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు 94924 40711, 94924 40710, 94406 97433 నంబర్లలో సంప్రదించాలన్నారు. జాతీయ వాలీబాల్ సెలక్షన్ కమిటీలో చోటు గోవిందరావుపేట : యూత్ నేషనల్ వాలీబాల్ చాంపియన్ షిప్నకు సంబంధించిన భారత జట్టు సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా ములుగు జిల్లా వాసి కోసరి కృష్ణప్రసాద్ను నామినేట్ చేయగా గురువారం సాయంత్రం ఫెడరేషన్ కార్యదర్శి రామానంద్ చౌదరి అధికారిక లేఖను విడుదల చేశారు. గోవిందరావుపేట మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన కృష్ణప్రసాద్ ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఈ నెల 15 నుంచి 20 వరకు భువనేశ్వర్లోని కేఐఐటీ యూనివర్సీటీ ప్రాంగణంలో నిర్వహించనున్న పురుషుల విభాగానికి కృష్ణప్రసాద్ సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా తనను కమిటీ సభ్యుడిగా ఎంపిక చేసినందుకు వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వీరేందర్ కన్వీనర్తో పాటు ప్రతినిధులకు కృష్ణప్రసాద్ కృతజ్ఞతలు తెలి పారు. కృష్ణప్రసాద్కు జాతీయ స్థాయి బాధ్యత పొందటంతో క్రీడాభిమానులు, యువ క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రూ.3 లక్షల విలువైన గంజాయి స్వాధీనం రామన్నపేట : వరంగల్ నగరంలోని బ్యాంకు కాలనీ–2 కాల్వ బ్రిడ్జి సమీపంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు.ఎస్సై శివకృష్ణ తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి స్కూటర్పై అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించడంతో అతడిని ఆపి తనిఖీ చేయగా స్కూటర్ ముందు భాగంలో ఆరు కిలోల గంజాయి దొరికినట్లు సీఐ తెలిపారు. విచారణలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి వేణురావు కాలనీకి చెందిన గోలి సుమన్ అని, అతడు ఆంధ్రప్రదేశ్లోని సీలేరు ప్రాంతం నుంచి వరంగల్కు గంజాయి విక్రయించేందుకు తీసుకు వచ్చినట్లు పేర్కొన్నారు. గంజాయిని తూకం వేయగా 6 కిలోల ఉండగా దాని విలువ రూ.3 లక్షలుగా గుర్తించారు. ఈ ఘటనలో గంజాయితో పాటు సెల్ఫోన్, బైక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. కేసు నమోదు రామన్నపేట : వరంగల్ నగరంలోని రంగంపేట ప్రాంతంలో ఆన్లైన్ లావాదేవీల్లో మోసం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్, పోలీసుల కథనం ప్రకారం.. రంగంపేటకు చెందిన భరతపురం సంధ్య నర్సుగా పనిచేస్తోంది. తన వ్యక్తిగత అవసరాల కోసం పరిచయమైన వ్యక్తికి ఫోన్పే ద్వారా రూ.50 వేలు పంపాలని ప్రయత్నించగా ఆ మొత్తం తెలియని వ్యక్తి యూపీఐ ఖాతాకు ట్రాన్స్ఫర్ అయ్యింది. తప్పు జరిగినట్లు గుర్తించిన వెంటనే ఆమె సంబంధిత వ్యక్తికి ఫోన్ చేసి డబ్బు తిరిగి ఇవ్వమని కోరగా అతడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి స్పందించకపోవడంతో బాధితురాలు సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వివరాల ఆధారంగా కేసు నమోదు చేసి డబ్బు రికవరీకి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
అభినవ్ మృతదేహం
విద్యుదాఘాతంతో బాలుడి మృతి నర్సంపేట రూరల్ : విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన నర్సంపేట మండలంలోని మాధన్నపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..మాధన్నపేటకు చెందిన దూడెల సతీష్–జ్యోతి దంపతుల ఏకై క కుమారుడు అభినవ్ (10) నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఉదయం సైకిల్పై వెళ్తుండగా స్తంభం పక్కనే ఉన్న ఎర్త్ వైర్ను ముట్టుకోవడంతో విద్యుత్ షాక్తో కింద పడిపోయాడు. వెంటనే నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు సీపీఆర్ చేసి పరీక్షించి మృతిచెందినట్లు తెలిపారు. దీంతో మాధన్నపేట గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ తెలిపారు. -
విద్యార్థి సంఘాల నాయకుల అరెస్ట్
కేయూ క్యాంపస్ : ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా జాబ్ క్యాలెండర్ను సక్రమంగా అమలు చేయాలని తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో శుక్రవారం తెల్లవారు జామునుంచే కేయూలోని వివిధ విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి, విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగ జేఏసీ పిలుపునిస్తే ఇక్కడ అక్రమంగా అరెస్టులు చేశారని ఆరోపించారు. అరెస్టయిన వారిలో కామగోని శ్రావణ్, మంద శ్రీకాంత్, మర్రి మహేష్, ఎల్తూరి సాయికుమార్, రాచకొండ రంజిత్, అశోక్, సేవాలాల్, బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్ తదితరులు ఉన్నారు. -
ఆఫీస్ సబార్డినేట్ ఆత్మహత్య
డోర్నకల్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో సబార్డినేట్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. డోర్నకల్ ఎస్సై గడ్డం ఉమ కథనం ప్రకారం.. అమ్మపాలెం గ్రామానికి చెందిన ఎస్కే జమాల్ (45) పీహెచ్సీలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఆఫీస్ సబార్డినేట్గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం సాయంత్రం పీహెచ్సీ వద్ద పురుగు మందు తాగి ఇంటికి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న జమాల్ పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం డోర్నకల్ పీహెచ్సీకి తీసుకు వచ్చారు. పీహెచ్సీలో పూర్తిస్థాయి వైద్యం చేసే అవకాశాలు లేకపోవడంతో 108వాహనంలో మహబూబాబాద్ తరలించే ప్రయత్నాలు చేస్తుండగా జమాల్ మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే అప్పుల బాధతో జమాల్ మృతి చెందాడని భార్య సుల్తానాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు
కాజీపేట : ఒకప్పుడు పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ కుమారుడు సురేందర్ రావుకు నేడు బుక్కెడు తిండి లేక తల్లడిల్లుతున్నాడు. చిన్ననాటి స్నేహితుడు విజయ్కుమార్ మిత్రుత్వాన్ని మరచిపోలేక నిత్యం పంపిస్తున్న ఆహారమే ఆయన ప్రాణాలను కాపాడుతోంది. కాజీపేట మండలంలోని కడిపికొండకు చెందిన కొండపర్తి మనోహర్రావు 1958లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. మనోహర్రావుకు ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు సురేందర్రావు ఉన్నారు. కాగా ఇద్దరు కూతుర్లు, కోడలు అనారోగ్యంతో మృతిచెందగా కుమారుడు ఒంటరివాడయ్యాడు. 1996లో సురేందర్రావు ఒంటరిగా ఉండడాన్ని గమనించిన పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చేరదీసి నాలుగేళ్లు ఆశ్రయం కల్పించారు. ఆ తర్వాత పట్టించుకునే వారు లేక చివరికి కడిపికొండలోని రాజీవ్ గృహకల్ప ఇళ్లకు చేరి జీవనం సాగిస్తున్నాడు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్పందించి సురేందర్రావుకు చేయూతనందిస్తారనే ఆశాభావాన్ని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల పింఛన్కు దరఖాస్తు.. ఒకనాడు వందల ఎకరాల భూములున్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి నేడు దివ్యాంగుల పింఛన్తో పాటు మనసున్న దాతల చేయూత కోసం ఎదు రు చూస్తున్నాడు. ఎంజీఎం ఆస్పత్రి ఆర్ధోపెడిక్ వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్తో దివ్యాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండాపోయింది. మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు పెండింగ్లో ఉండటంతో రెండేళ్లుగా పింఛన్ అందుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు.కె.సురేందర్ రావు,ఎస్బీఐ అకౌంట్ నంబర్ 62304832105, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్ 0021300, బ్రాంచి మడికొండకు దాతలు సాయం అందించాలని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ కుమారుడు సురేందర్రావుకు చేయూత కరువు రాజీవ్ గృహకల్పలో ఆశ్రయం సీఎం పట్టించుకోవాలని వేడుకోలు -
‘ఆవాస్ యోజన’ ఇళ్ల ఎంపికలో లోపాలు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంతోశ్రెడ్డిహన్మకొండ : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో చాలా లోపాలున్నాయని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ దీన్దయాళ్ నగర్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియా బలోపేతం, ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం అమలు, ప్రశిక్షణ అభియాన్ పై చర్చించారు. జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఇష్టానుసారంగా జరుగుతోందని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ కార్పొరేటర్లను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పక్కదారి పడుతోందని తెలిపారు. ఈవారంలో నిర్వహించనున్న మండల స్థాయి ప్రశిక్షణ అభియాన్ను విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలోని అన్ని మండలాల్లో జరిగే ప్రశిక్షణకు పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలన్నారు. జిల్లాలో పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడానికి సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించాలన్నారు. ఇంటి పన్నులు బలవంతంగా వసూలు చేయవద్దని, ప్రజా సమస్యలపై పార్టీ పోరాడుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్పీ.జయంత్, సండ్ర మధు, ఇతర పదాధికారులు పాల్గొన్నారు. -
కేయూ సమస్యలను ప్రస్తావిస్తా..
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని సమస్యలు తెలుసుకునేందుకు వచ్చా.. ఇక్కడి సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. శుక్రవారం కేయూ సెనేట్ హాల్లో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను విన్నాక స్పందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను, ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాబోయే శానసమండలి సమావేశాల్లో కాకతీయ యూనివర్సిటీలోని సమస్యలపై చర్చిస్తానన్నారు.పార్ట్ టైం లెక్చరర్లను కాంట్రాక్టు లెక్చరర్లుగా కన్వర్సన్ చేయించేందుకు, కాంట్రాక్టు లెక్చరర్లను మినిమం టైం స్కేల్ చేయించేందుకు కృషిచేస్తానని తెలిపారు. సుమారు 650 ఎకరాల భూమి ఉండాలని, తగ్గిపోయిందన్నారు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విషయంలో తాత్సారం చేస్తోందని ఈ విషయంలో తాను జాబ్ క్యాలెండర్ కంటే ముందే ఈడబ్లూఎస్ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నానని వివరించారు.10 శాతం ఈడబ్లూఎస్ ఇవ్వటం సమంజసం కాదని 42శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వమంటే ఇస్తలేరని పేర్కొన్నారు. ఏప్రిల్ 1నుంచి బస్సు సదుపాయం వచ్చే నెల 1వ తేదీనుంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు బస్సు సదుపాయం కల్పించేందుకు రిజిస్ట్రార్ రామచంద్రంతో మాట్లాడి అంగీకరింపచేశారు. అలాగే లైబ్రరీ ఉదయం 8గంటలనుంచి రాత్రి 10గంటలవరకు కూడా తెరిచే ఉంచేలా రిజిస్ట్రార్ అంగీకరించారు. ఈ సమావేశంలో బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ బొడిగ సతీష్ పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న -
పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తాం..
కాళేశ్వరం : కాళేశ్వరంలో మే 21నుంచి జూన్ 1వ తేదీ వరకు సరస్వతి నది అంత్య పుష్కరాలు.. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు గోదావరి నది పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్రెడ్డితో కలిసి ప్రణాళికలు చేశామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. శుక్రవారం మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కాళేశ్వరం నుంచి పలుగుల వరకు రూ.22 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, కాళేశ్వరంలో రూ.1.20 కోట్లతో చేపట్టనున్న మ్యూజియం పనులకు, ఆది ముక్తేశ్వర దేవస్థానం నుంచి సరస్వతి ఘాట్ వరకు రూ.2.38 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.రూ.1.55 కోట్లతో నిర్మించిన అన్నదాన సత్రాన్ని మంత్రి ప్రారంభించారు. కాళేశ్వరం, అన్నారం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. పూర్తి చేయాల్సిన పనులకు డెడ్ లైన్ పెట్టండి..అప్పటి వరకు పూర్తి చేయకపోతే అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. పుష్కరాలపై సమీక్ష.. ఈఓ కార్యాలయంలో సరస్వతి అంత్య పుష్కరాలు, గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్ఈ స్థాయి అధికారులు హాజరు కాకపోవడంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మాకేం పని లేదనుకుంటున్నారా’ పుష్కరాల కంటే ముఖ్యమైన పనులు ఏం ఉన్నాయి?’ అని అధికారులను ప్రశ్నించారు. బస్టాండ్కు చెరువు స్థలం కేటాయించాలని సీసీఎల్ఏతో ఫోన్లో మాట్లాడారు. బస్టాండ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని సూచించారు. కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ నిర్దేశించిన సమయంలో ఆయా శాఖల అధికారులు వారికి కేటాయించిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ధార్మిక సంస్థ సలహాదారుడు గోవింద హరి, ఎస్పీ సంకీర్త్, అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీసీ సునీత, ఈఓ మహేష్, సర్పంచ్ మోహన్రెడ్డి, ఉపసర్పంచ్ సుధీర్ పాల్గొన్నారు. పలుగుల, మద్దులపల్లి సర్పంచ్లు సరిత, విజయలక్ష్మి ఉన్నారు. మే వరకు పనులు పూర్తి చేయాలి రాష్ట్ర ఐటీ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కాళేశ్వరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు -
శాంతికోసం మరియతల్లిని వేడుకోవాలి
కాజీపేట రూరల్ : ప్రపంచ దేశాలు.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలకాలని, శాంతి స్థాపనకు ప్రజలందరు మరియతల్లిని వేడుకోవాలని హైదరాబాద్ అగ్రపీఠ కాపరి మహాశ్రేష్ఠ కార్డినల్ అంతోని పూల సందేశమిచ్చారు. కాజీపేట ఫాతిమానగర్లో జరుగుతున్న ఫాతిమామాత తిరునాళ్ల మహోత్సవ వేడుకలు శుక్రవారంతో భక్తిశ్రద్ధలతో ముగిశాయి. ముగింపులో ముఖ్యఅతిథిగా అంతోని పూల పాల్గొని దివ్యబలి పూజను సమర్పించి మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో జరుగుతున్న యుద్ధాలు నిలిచిపోయి ఆయా దేశాల మధ్య శాంతి నెలకొల్పాలని మరియతల్లిని ప్రార్థించి వేడుకోవాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పాల్గొని ప్రజలందరికి ఫాతిమామాత ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. వరంగల్ జిల్లా కులమతాలకు అతీతంగా నిలుస్తోందని అన్నారు. గురుశ్రీ సుధీర్, ఉమేష్ ప్రార్థన చేసి చివరి పూజబలిని నిర్వహించారు. ఓరుగల్లు పీఠ పాలనాధికారి ఫాదర్ దుగ్గింపుడి విజయపాల్రెడ్డి పతాక అవరోహణ చేసి ఫాతిమామాత ముగింపు ఉత్సవాలను ప్రకటించారు. అంతోని పూ ల, డి.విజయపాల్రెడ్డి, ఫాదర్లను, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డిని అంతోని పూల, విజయపాల్రెడ్డి సన్మానించారు. వివిధ సాంస్కృతిక పోటీల్లో గెలిచిన వా రికి బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్ర నలు మూలల నుంచి వచ్చిన భక్తులు, విశ్వాసులు క్యాండిల్స్, కొబ్బరి కాయలు, తలనీలాలతో మరియమాతకు మొక్కులు సమర్పించారు. కార్పొరేటర్ మానసరాంప్రసాద్, విశ్రాంత అగ్రపీఠ కాపరి మహాపూజ్య జోసెఫ్ హరిష్, ఫాదర్లు కాసుమర్రెడ్డి, కొమ్మారె డ్డి జోసెఫ్, టి.జోసెఫ్, జి.అనుకిరణ్, సింగారెడ్డి ఇ న్నారెడ్డి, ఇతర గురువులు, దైవాంకితులు, కెథడ్రల్ చర్చీ కమిటీ, క్వాయర్ టీం, మఠకన్యలు, భక్తులు, విశ్వాసులు, వివిధ జిల్లాల ప్రజలు పాల్గొన్నారు. హైదరాబాద్ అగ్రపీఠ కాపరి కార్డినల్ అంతోని పూల ముగింపు ఉత్సవాలను ప్రకటించిన ఓరుగల్లు పాలనాధికారి ఫాదర్ విజయపాల్రెడ్డి పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
ఆర్టీసీలో డివిజన్ల కుదింపు
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో సివిల్ విభాగం డివిజన్ కార్యాలయాలు పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు ఆర్టీసీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. పునర్వ్యవస్థీకరణ పేరుతో డివిజన్ కార్యాలయాలను కుదించేందుకు ఆర్టీసీ యాజమాన్యం పూనుకుంది. 20 ఏళ్లుగా సివిల్ విభాగంలో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ చేపట్టకపోవడంతో ఉన్నతస్థాయి పోస్టులు మినహా మిగతా అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ చేపట్టాల్సి ఉండగా సివిల్ విభాగాన్ని కుదించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా నిరసన, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సివిల్ విభాగం అభివృద్ధి పనులు పర్యవేక్షించే వారు లేకపోగా, డివిజన్లను కుదించడం ద్వారా పర్యవేక్షణ కొరవడుతుందని, అభివృద్ధి పనులు కుంటుపడుతాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈఈగా 6 డివిజన్ కార్యాలయాలు.. టీజీఎస్ ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా బస్భవన్లోని కార్యాలయం కాకుండా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నతాధికారిగా 6 డివిజన్ కార్యాలయాలున్నాయి. వీటి పరిధిలో రీజియన్ కార్యాలయాలు కేంద్రంగా డిప్యూటీ ఇంజనీర్లు అధికారిగా సబ్ డివిజన్ కార్యాలయాలున్నాయి. అదేవిధంగా క్షేత్రస్థాయిలో పనుల నిర్వహణ, పర్యవేక్షణకు అసిస్టెంట్ ఇంజనీర్లు ఉంటారు. రాష్ట్రస్థాయిలో చీఫ్ సివిల్ ఇంజనీర్ ఉంటారు. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ రూరల్, హైదరాబాద్ అర్బన్, సికిందాబాద్, హైదరాబాద్ హెడ్క్వార్టర్ డివిజన్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇందులో వరంగల్, హైదరాబాద్ అర్బన్ డివిజన్ కార్యాలయాలను ఎత్తివేయడానికి రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వరంగల్ సివిల్ డివిజన్లో రెండు రీజియన్లు.. వరంగల్ సివిల్ డివిజన్ పరిధిలో ప్రస్తుతం నల్ల గొండ, వరంగల్, ఖమ్మం రీజియన్లున్నాయి. హైదరాబాద్ అర్బన్ సివిల్ డివిజన్ పరిధిలో సిటీ డిపోలున్నాయి. వరంగల్ సివిల్ డివిజన్ను కరీంనగర్ డివిజన్లో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో వరంగల్ డివిజన్ పరిధిలోని వరంగల్, ఖమ్మం రీజియన్ను కరీంనగర్ సివిల్ డివిజన్ పరిధిలోకి విలీనం చేయనున్నారు. నల్లగొండ రీజియన్ను హైదరాబాద్ జోన్ డివిజన్ కార్యాలయంలో విలీనం చేయనున్నారు. విలీనం అనంతరం హైదరాబాద్ జోన్ సివిల్ డివిజన్ పరిధిలో నల్లగొండతో పాటు మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి రీజియన్లు ఉండనున్నాయి. కరీంనగర్ సివిల్ డివిజన్ పరిధిలో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం రీజియన్లు ఉండనున్నాయి. ఒక్క ఈఈకి నాలుగైదు రీజియన్ల బాధ్యతలు.. ఈక్రమంలో ఈఈలకు పర్యవేక్షణ కష్టతరం కానుంది. ఒక్క ఈఈ నాలుగైదు రీజియన్లను పర్యవేక్షించడం అంత సులువు కాదు. కరీంనగర్లో ఉంటూ ఖమ్మం, ఆదిలాబాద్ వంటి సుదూర ప్రాంతాల్లోని డిపోల పరిధిలో జరిగే అభివృద్ధ పనులు పర్యవేక్షించడం ఆషామాషీ కాదని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే అన్ని రీజియన్లలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో డీఈఈలు చేయాల్సిన పర్యవేక్షణ కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (ఈఈ)లు చేయాల్సి వస్తోంది. దీంతో పాటు కార్యాలయం పనులు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అభివృద్ది పనుల పర్యవేక్షణ కొరవడనుంది. మాయంకానున్న వరంగల్, హైదరాబాద్ అర్బన్ డివిజన్లు కొరవడనున్న పర్యవేక్షణ.. అభివృద్ధి పనులు మరింత ఆలస్యం 20 ఏళ్లుగా చేపట్టని సివిల్ ఇంజనీర్ల నియామకాలు ఏళ్లుగా డిప్యూటీ ఇంజనీర్లు, ఏఈల పోస్టులు ఖాళీవరంగల్ రీజియన్లో రూ.5.91 కోట్లతో ఏటూరునాగారంలో బస్ డిపో నిర్మాణం, రూ.4.8 కోట్లతో ములుగు బస్స్టేషన్, రూ.51 లక్షలతో మంగపేట బస్ స్టేషన్ నిర్మాణం, ఖమ్మం రీజియన్లో రూ.9.41 కోట్లతో మధిర బస్ స్టేషన్ నిర్మాణం, నల్ల గొండ రీజియన్లో రూ.17 కోట్లతో కోదాడలో బస్ స్టేషన్, రూ.3.53 కోట్లతో హుజుర్నగర్లో బస్ స్టేషన్ నిర్మాణ వంటి మేజర్ పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు ఇతర సివిల్ అభివృద్ధి పనులు సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆయా డివిజన్లలో రూ.కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు సాగుతున్నాయి. డివిజన్ల కుదింపు, డీఈల కొరతతో పర్యవేక్షణ లేక పనులు కుంటుపడే అవకాశముంది.టీజీఎస్ ఆర్టీసీలో 20 ఏళ్లుగా సివిల్ విభాగంలో ఇంజనీర్ల రిక్రూట్మెంట్ చేపట్టలేదు. దీంతో ఖాళీగా ఉన్నా ఏఈ పోస్టుల్లో కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగుల్లో సివిల్ ఇంజనీరింగ్, సివిల్ డిప్లొమా, సివిల్ ఐటీఐ చేసిన వారిని అదనపు డ్యూటీల్లో భాగంగా ఏఈ పనులు చూసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో ఏఈలుగా ఔట్సోర్సింగ్ ద్వారా దాదాపు 37 మంది, సంస్థకు చెందిన 20 మంది ఓడీగా ఏఈలుగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ అర్బన్–1, హైదరాబాద్ అర్బన్–2, మెదక్, మహబూబ్నగర్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం, సికింద్రాబాద్–1 డీఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పాటు డీఈ పీ అండ్ డీ ఈనెల రిటైర్డ్ కానున్నారు. -
పదవి బాధ్యత.. అలంకారం కాదు
ఇదిలా ఉండగా శిక్షణ కార్యక్రమానికి నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు దొంతి మాధవరె డ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, నాగరాజు హాజరు కాకపోవ డం చర్చనీయాంశంగా మారింది. మంత్రి వెళ్లిపోయిన తర్వాత సాయంత్రం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు.గీసుకొండ: ‘పదవి అనేది బాధ్యత.. అంతేకాని అ లంకారం కాదు.. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజ ల్లో ఉండి వారి సమస్యలు తీర్చడానికి కృషిచేసి ఎ న్నటికీ గుర్తుండిపోయేలా సేవలు అందించాలి’ అ ని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మండలంలోని మరి యపురం శివారులోని ఎస్ఎస్ గార్డెన్స్లో జిల్లాలోని సర్పంచ్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేట ర్లు, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ కౌన్సిలర్లకు ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై గురువారం ఒక ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ మహిళా సర్పంచ్లు భర్త చాటు భార్యలుగా ఉండవద్దని, వారి అభిప్రాయాలు గౌరవిస్తూనే ముందుకు సాగా లని హితవు పలికారు. అధికారం ఉంది కదా అని విర్రవీగితే ప్రజలు తమ ఓటు హక్కుతో బుద్ధి చెబు తారని అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలని సూచించారు. ఏదో దోచుకుందాం అని వచ్చే వారు చరిత్ర హీనులుగా మిగులుతారన్నారు. సమావేశంలో గ్రేటర్ వరంగల్ నగర మేయ ర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట, నర్సంపేట ము న్సిపల్ చైర్మన్లు సారంగపాణి, పెండ్యాల లక్ష్మి, డీసీ పీ అంకిత్కుమార్, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, గీసుకొండ తహసీల్దార్ రియాజుద్దీన్, ఎంపీడీఓ కృష్ణవేణి, ఎంపీఓ శ్రీనివా స్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కాగా, ఇటీవల మరణించిన గంగదేవిపల్లి మాజీ స ర్పంచ్ కూసం రాజమౌళికి ప్రతినిధులు, అధికారులు మౌ నం పాటించి నివాళులర్పించారు. అంతకు ముందు పలు శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్, ఫొటో ఎగ్జిబిషన్ను మంత్రి పరిశీలించి అభినందించారు. సర్పంచ్లకు గుర్తింపు కార్డులను అందించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ -
జోయలుక్కాస్ నమ్మకమైన బ్రాండ్
హన్మకొండ: జోయలుక్కాస్ అంటేనే నమ్మకమైన బ్రాండ్ అని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జోయాలుక్కాస్ హనుమకొండ నక్కలగుట్టలో ఏర్పాటు చేసిన రెండో షోరూంను ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్.నాగరాజుతో కలిసి ప్రారంభించారు. షోరూంలో విక్రయానికి ఉంచిన ఆభరణాలను పరిశీలించారు. సినీ నటి అంతారా స్వర్ణకార్ షోరూం ఓపెనింగ్లో సందడి చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ వినియోగదారులకు సరసమైన ధరలకు ఆభరణాలు అందించాలన్నారు. కేరళలోని కొట్టాయంలో ప్రారంభించిన జోయలుక్కాస్ 40 దేశాల్లో 190 షోరూంలు కలిగి ఉందన్నారు. నమ్మకం, విశ్వాసం, మన్నికకు పేరెన్నికగన్నదన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన డైమండ్లను అందిస్తోందన్నారు. జోయ లుక్కాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ మాథ్యు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరుసగా మూడు రోజుల్లో నాలుగు కొత్త షోరూంలు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. దేశంలో వ్యాపార విస్తరణలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అన్నారు. కస్టమర్ డిమాండ్ను అందుకోవడానికి బ్రాండ్ బలమైన నిబద్ధతను ఈ విస్తరణ నొక్కి చెబుతుందన్నారు. జోయలుక్కాస్లో ఒకే చోట బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లు, ప్లాటినం, వివాహ ఆభరణాల విస్తృతి శ్రేణిని చూడొచ్చని వివరించారు. వ్యక్తిగతీకరించిన సేవల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండ్ గుర్తింపు పొందిందన్నారు. ఈ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జోయలుక్కాస్ ఈ నెల 29 వరకు తయారీ చార్జీలపై ఫ్లాట్ 40 శాతం తగ్గింపుతో పరిమిత కాలపు ప్రారంభ ఆఫర్ అందిస్తోందన్నారు. తమ షోరూంల ద్వారా అందిస్తున్న ఆభరణాలు పై నమ్మకాన్ని బలోపేతం చేయడానికి వ్యాపార విస్తరణలో భాగంగా తమ చైర్మన్ జోయలుక్కాస్ కొత్తగా షోరూంలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జోయలుక్కాస్ సీఓఓ హెన్రీ జార్జ్, మార్కెటింగ్ హెడ్ అనిశ్ వర్గీస్, రిటైల్ హెడ్ రాజేశ్ కృష్ణన్ పాల్గొన్నారు. వినియోగదారులకు సరసమైన ధరలకు అందించాలి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ -
మహా రథ ఊరేగింపు
వైభవోపేతంగా ఫాతిమామాతకాజీపేట రూరల్ : కాజీపేట ఫాతిమామాత స్వరూపంతో మహా రథ ప్రదక్షిణ ఊరేగింపు(ర్యాలీ) గురువారం వైభవోపేతంగా కొనసాగింది. కెథిడ్రల్ చర్చి ప్రాంగణంలో ఓరుగల్లు పీఠం పాలనాధికారి ఫాదర్ రెవరెండ్ డి.విజయపాల్ రెడ్డి ప్రత్యేక ప్రార్థన చేసి ఊరేగింపును ప్రారంభించారు. అనంతరం ఫాదర్లు, మఠకన్యలు, విశ్వాసులు, భక్తజనం మధ్య ఊరేగింపు ఫాతిమానగర్ మెయిన్ రోడ్ మీదుగా శౌరి నగర్, దర్గా పురవీధుల గుండా తిరిగి ఫాతిమా కెథిడ్రల్ చర్చి ప్రాంగణానికి చేరుకుంది. అనంతరం భక్తులు, విశ్వాసులు కొవ్వొత్తులతో దివ్యప్రసాద ప్రదక్షిణ చేశారు. అంతకు ముందు ఫాదర్ డి.విజయపాల్రెడ్డి దివ్యబలిపూజ సమర్పించి మాట్లాడుతూ మానవాళికి మరియతల్లి ప్రార్థన సహాయం శక్తివంతమైందన్నారు. ఫాదర్లు మర్రెడ్డి, కొమ్మారెడ్డి జోసెఫ్, జోసెఫ్, జి.అనుకిరణ్, ఎం.నవీన్, విద్యాసాగర్, 49వ డివిజన్ కార్పొరేటర్ మానసరాంప్రసాద్, కాజీపేట సీఐ సుధాకర్రెడ్డి, ట్రాఫిక్ సీఐ పి.వెంకన్న, ఎన్పీడీసీఎల్ ఏడీఈ పి.శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ర్యాలీని ప్రారంభించిన ఓరుగల్లు పీఠం పాలనాధికారి విజయ్పాల్రెడ్డి -
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వెంకటరమణ
వరంగల్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా డాక్టర్ వన్నాల వెంకటరమణ నియామకమయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో డాక్టర్ వన్నాల వెంకటరమణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. కాగా, తన సేవలు గుర్తించి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు, రాష్ట్ర నాయకులకు, జాతీయ బీజేపీ నాయకత్వానికి వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, డాక్టర్ వన్నాల వెంకట రమణ తండ్రి మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు బీజేపీ మాజీ జాతీయ కౌన్సిల్ మెంబర్గా పని చేశారు. -
ఆన్లైన్లో ఆర్టీఏ సేవలు
ఖిలా వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆర్టీఏ సేవలన్నీ వందశాతం ఆన్లైన్లోకి తెచ్చింది. శుక్రవారం నుంచి పేపర్ రహిత సేవలను పక్కాగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు కార్యాలయాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. జనవరి 24 నుంచి వాహనాలు విక్రయించిన షోరూంలలోనే నాన్ ట్రాన్స్ఫోర్ట్ వాహన రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ విధానాన్ని రవాణాశాఖ డిప్యూటీ ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్ సురేశ్రెడ్డి పర్యవేక్షణలో ఆరు జిల్లాల షోరూం డీలర్ల వద్ద తాత్కాలిక, పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. దరఖాస్తుల సమర్పణ ఆన్లైన్లోనే .. వాహనాల శాశ్వత నమోదు కోసం షోరూం డీలర్ల వద్ద దరఖాస్తుల సమర్పణకు బదులుగా వందశాతం పేపర్ రహిత ఆన్లైన్ విధానం అమలు చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. డీలర్లు.. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఫామ్ –20 (ఫైనాన్షి యర్ సంతకం అవసరమైతే), ఇతర పేపర్ ఆధారిత ప్రతాలను స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా సంబంధిత ఆర్టీఏ కార్యాలయాలకు పంపిస్తున్నారు. ఈ విధానం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆలస్యం జరుగుతున్నట్లు రవాణాశాఖ గుర్తించింది. అన్ని పత్రాలు స్కాన్ చేసి ఆన్లైన్ పంపిస్తే అధికారులు పరిశీలించి ఆదే రోజు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయింపుతోపాటు కార్డు జారీకి ఆదేశాలు వెళ్లనున్నాయి. నేటినుంచి పేపర్రహిత సేవలు .. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో, షోరూం డీలర్లకు ఫామ్ 20, ఇతర పేపర్ పత్రాలను నేరుగా సమర్పించే విధానాన్ని పూర్తిగా రద్దు చేసి శుక్రవారం ఉదయం నుంచి వాహన షోరూంలో జరిగే తాత్కాలిక రిజిస్ట్రేషన్(టీఆర్) వాహనాలకు, డీలర్లు ఫామ్ –20, ఇతర పత్రాలు స్కాన్ కాపీలు ఆప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాహనం తీసుకోగానే పత్రాలన్నీ ఆన్లైన్లో నమోదు చేసే బాధ్యత డీలర్లదే. తప్పుడు లేదా నకిలీ పత్రాలు సమర్పిస్తేయ క్రిమినల్ చర్యలు ఉంటాయని డీటీసీ సురేశ్రెడ్డి స్పష్టం చేశారు. నేటినుంచి వందశాతం పేపర్ రహిత సేవలు ఫామ్20, ఇతర పత్రాలు నేరుగా సమర్పించే విధానం రద్దు పత్రాలన్నీ స్కాన్ చేసి అన్లైన్లో అప్లోడ్ చేయాల్సిందే.. ఆర్టీఏ కార్యాలయాల్లో పక్కాగా అమలుకు నిర్ణయం రెండు పనిదినాల్లో పరిష్కారం.. వాహన షోరూం డీలర్ నుంచి ఆర్టీఏ కార్యాలయానికి ఆన్లైన్లో పంపించిన దరఖాస్తులను రెండు పనిదినాల్లో అధికారులు పరిశీలించి ఆమోదం లేదా రివ్యూ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆలస్యం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం. డీలర్ల వద్ద 7రోజులకు మించి దరఖాస్తులు పెండింగ్లో ఉంచకూడదు. ఉల్లంఘన జరిగితే వారి లాగిన్ నిలిపివేస్తారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. డీలర్లు అందరూ ఆన్లైన్ సేవలను వినియోగించుకుని, వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఫామ్ 20, ఇతర పత్రాలను ఆన్లైన్ విధానంలోనే సమర్పించాలి. – సురేశ్రెడ్డి, డీటీసీ -
రామప్ప ఆలయం బాగుంది
● మాజీ మావోయిస్టు ఆశన్న వెంకటాపురం(ఎం): యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం అద్భుత కళా సంపదకు నిదర్శనమని మాజీ మావోయిస్టు తక్కళ్లపల్లి వాసుదేవారావు అలియాస్ ఆశన్న పేర్కొన్నారు. గురువారం మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆశన్నతో పాటు లొంగిపోయిన మావోయిస్టులు సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పాకళాసంపద బాగుందని వారు కొనియాడారు. భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన పోలీసులువరంగల్: వరంగల్ 14 డివిజన్ ఎస్ఆర్నగర్లో ఈనెల 9వ తేదీన భార్యను హత్య చేసిన ఘటనలో భర్తను అరెస్ట్ చేసినట్లు ఏనుమాముల ఇన్స్పెక్టర్ జువ్వాజీ సురేశ్ తెలిపారు. ఈ మేరకు గురువారం పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గాంధీనగర్–2కు చెందిన చిలుకలపల్లి అనిత (40)కు వడ్లకొండ గ్రామానికి చెందిన అబ్బరబోయిన రాజుతో 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా వీరు ప్రస్తుతం 14వ డివిజన్లోని ఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటున్నారు. రాజు కొంతకాలంగా మద్యం, జూదానికి బానిసై భార్యను నిత్యం వేధిస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 9వ తేదీన బంధువుల దశదిన కర్మకు వెళ్లి వచ్చిన భార్యతో రాజు గొడవపడ్డాడు. అనంతరం రోకలితో ఆమె తలపై కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అనితను వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందారు. ఈ ఘటనపై మృతురాలి సోదరి సునీత ఫిర్యాదు మేరకు రాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ సురేశ్ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై రాజు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి ● కేయూ రౌండ్టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్కేయూ క్యాంపస్ : విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. గురువారం కేయూ సెమినార్హాల్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి కేయూ తెలుగు విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు ముఖ్యవక్తలుగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహణపై నిషేధం విధించారన్నారు. నిషేధం విధించి 38 ఏళ్లు గడిచాయన్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక కూడా విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. శాంతిభద్రతల సమస్య అయితే సాధారణ ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నాని ప్రశ్నించారు. ఇప్పటికై నా విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలని, లేని పక్షంలో ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. వివిధ విద్యార్థి సంఘాల నేతలు మర్రి మహేశ్, గుర్రం అజయ్, బాలరాజు, రాజ్మహ్మద్, కుమారస్వామి, తిరుపతి, బొట్ల మనోహర్, వినయ్, అనూష, ఠాగూర్, రాకేశ్, శివ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసుకాజీపేట రూరల్ : నగరంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో బాలికపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సుబేదారి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న బాలికపై ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక విషయం తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సుబేదారి పోలీసులు తెలిపారు. -
ప్రజాప్రతినిధులు భాగస్వాములవ్వాలి
హన్మకొండ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్న్స్ హాలులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై గ్రామీణ, పట్టణ ప్రజాప్రతినిధులకు నిర్వహించిన అవగాహన సదస్సును మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామాలు, డివిజన్ల అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఇందులో పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలను గ్రామాభివృద్ధిలో భాగస్వాములను చేయాలని సూచించారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్, డీఆర్డీఓ మేన శ్రీను, తదితర అధికారులు 99 రోజుల కార్యాచరణపై ప్రజాప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు, పారిశుద్ధ్యం, ఇతర అంశాలపై జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రతిబింబించే విధంగా ఏర్పాటుచేసిన ఫొటోప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఎండీ అజీజ్ ఖాన్, పరకాల మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్, జడ్పీ సీఈఓ శేషాద్రి, అధికారులు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి -
దొంగల ముఠా అరెస్ట్..
హసన్పర్తి : వ్యవసాయ మోటార్ల చోరీలకు పాల్ప డుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాకు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాల తనిఖీ సందర్భంగా వంగపల్లి వద్ద సీసీఎస్, కమలాపూర్ పోలీసులు ఆ ముఠాను పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత వివరాలు వెల్లడించారు. పె ద్దపల్లి జిల్లా ఓదెల గ్రామ తారకరామ కాలనీకి చెందిన సిరిగిరి ప్రసాద్, మంచిర్యాల జిల్లా చున్నంబట్టి కాలనీకి చెందిన మోతె రాజు, గోదావరిఖని ప్రగతినగర్కు చెందిన టేకు నవీన్, మంచిర్యాల టౌన్కు చెందిన వారణాసి లక్ష్మణ్, మంచిర్యాల జిల్లా గాంఽధీనగర్కు చెందిన మోటం తిరుపతి, మోటం నరేశ్, మంచిర్యాల జిల్లా భగత్సింగ్ నగర్కు చెందిన వస్తం భీమేశ్ ముఠాగా ఏర్పడ్డారు. మద్యానికి బానిసైన వీరు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకు వ్యవసాయ బావులు, కాల్వల వద్ద అమర్చిన మోటార్లను అపహరిస్తూ జల్సాలు చేస్తున్నారు. ఈక్రమంలో వరంగల్ పోలీస్ కమి షనరేట్ పరిఽధిలోని కమలాపూర్, దామెర పోలీస్స్టేషన్లు, భూపాలపల్లి జిల్లా రేగొండ పీఎస్ పరిధిలోని కేశవపట్నంలో మోటార్లు అపహరించారు. ఫిర్యాదు మేరకు రంగంలోకి.. ఆయా గ్రామాల రైతుల ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కమలాపూర్ మండలం వంగపల్లి వద్ద వాహన తనిఖీలు చేశారు. ఈక్రమంలో ఆటో ట్రాలీ, కారును తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వీరిని అదుపులోకి తీసుకుని వి చారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు. దీంతో ఏడుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 71 వ్యవసాయ మోటార్లు స్వాధీనం చేసుకుని ఆటోట్రాలీ, కారు సీజ్చేసినట్లు డీసీపీ వెల్లడించారు. నిందితులకు నేర చరిత్ర ఉందని డీసీపీ చె ప్పారు. కరీంనగర్, రామగుండం కమిషనరేట్ పరిధిలో ట్రాన్స్ఫార్మర్ల వైర్ను అపహరించిన కేసుల్లో నిందితులు జైలుకెళ్లారని డీసీపీ తెలిపారు. పోలీసు అధికారులకు అభినందనలు.. కేసును ఛేదించిన సీపీఎస్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్, రామకృష్ణ, కమలాపూర్ ఇన్స్పెక్టర్ నవీన్, ఐటీ కోర్ టీం ఏఏఓ మహ్మద్ సల్మాన్ పాషా, ఎస్సై శ్రీనివాస్, రాజు, హెడ్ కానిస్టేబుల్ నసీమ్ మహ్మ ద్, మహేశ్వర్, జంపయ్య, విశ్వేశ్వర్, వంశీ, వినోద్, కమలాపూర్ ఎస్సై దిలీప్ను డీసీపీ అభినందించారు. సీపీఎస్, కాజీపేట ఏసీపీలు సదయ్య, ప్రశాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 71 వ్యవసాయ మోటార్లు స్వాధీనం ఆటో ట్రాలీ, కారు సీజ్ వివరాలు వెల్లడించిన సెంట్రల్ జోన్ డీసీపీ కవిత -
ఎఫ్ఎల్ఎన్ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి
వరంగల్ ఏఎంఓ ఉండ్రాతి సుజన్ తేజ కాళోజీ సెంటర్: ప్రాథమిక విద్యార్థుల్లో ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో విద్యావ్యస్థలో అత్యంత కీలకమైన అంశమని వరంగల్ అకడమిక్ మానిట రింగ్ అధికారి (ఏఎంఓ) ఉండ్రాతి సుజన్ తేజ అ న్నారు. హనుమకొండలోని డైట్ కళాశాలలో గురువారం రెండో రోజు జరిగిన ఎఫ్ఎల్ఎన్ శిక్షణలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు చదవడం, అర్థం చేసుకోవడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు సాధిస్తే వారి భవిష్యత్ విద్యాభ్యాసానికి బలమైన పునాది ఏర్పడుతుందని వివరించారు. నిపుణ్ భారత్ మిషన్ లక్ష్యాలను సాధించడానికి ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. మూడో తరగతి పూర్తయ్యే నాటికి ప్రతీ విద్యార్థి సులభంగా చదివేందుకు, అర్థం చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత పద్ధతులను ఉపయోగించి ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని అంచనా వేయనున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు తరగతి గదిలో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ప్లేవే మెథడ్, చైల్డ్ సెంటర్ టీచింగ్ పద్ధతులను ఉపయోగించాలని సూచించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ రిస్సోర్స్ పర్సన్స్ గంగాధర్, పద్మజ, సౌజన్య, నరేందర్ పాల్గొన్నారు. -
ఏ జిల్లా శిశుగృహ ఆ జిల్లాలోనే ఉండాలి
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒకటే శిశుగృహ ఉండడంతో దత్తతలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఏ జిల్లాకు చెందిన శిశుగృహ ఆ జిల్లాలోనే ఉంటే ఇలాంటి సమస్యలు రావని అందరు సమన్వయంతో ముందుకెళ్లవచ్చని హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి అభిప్రాయపడ్డారు. ‘సమన్వయ లోపం.. శిశువులకు పాపం’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనంపై ఆమె స్పందించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న అక్రమ దత్తత కేసులు తొందరగా పరిష్కారమైతే ఐదుగురు శిశువుల దత్తత ప్రక్రియ త్వరగా ముగుస్తుందన్నారు. శిశువుల దత్తతలో ఆలస్యమవడానికి గల కారణాలను లోతుగా పరిశీలించి జిల్లా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. హనుమకొండలోని శిశుగృహలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 13 మంది శిశువులు ఉంటే 10 మంది అక్రమ దత్తత, డీఎన్ఏ పెండింగ్, కిడ్నాప్ కేసుల వల్ల దత్తత వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు. దీంతో నాలుగు గోడల మధ్యే ఉండాల్సిన పరిస్థితి ఉందని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి -
ప్రమాదంలో ప్రజారోగ్యం!
సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నకిలీ వైద్యుల బెడద ఊపందుకుంటుంటే, ఇంకోవైపు ఎంబీబీఎస్ చదివిన కొంతమంది తమకు లేని స్పెషలైజేషన్ అర్హతను చేర్చుకొని వైద్యం చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అనుమతి లేకుండా క్లినిక్లు నిర్వహిస్తూ, వైద్యులమని చెప్పుకుంటూ రోగులకు చికిత్స అందిస్తూ ప్రాణాల మీదికి తెస్తుండడం కలవరానికి గురిచేస్తోంది. చిన్న క్లినిక్ల నుంచి ఆస్పత్రుల వరకు కొందరు తమకు లేని అర్హతను ఉన్నట్లుగా ప్రకటనలు, ప్రిస్కిప్షన్లు ఇస్తూ రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తూ వైద్య వృత్తిని ఓ వ్యాపారంగా మార్చేస్తున్నారు. దీంతో ప్రజలు నిజమైన వైద్యులు ఎవరో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. అయితే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) చేసిన దాడుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 126 కేసులు నమోదయ్యాయి. నకిలీ వైద్యుల సమాచారం 9154382727 వాట్సాప్ ద్వారా ఇస్తే చర్యలు తీసుకుంటోంది. స్పెషలిస్ట్.. సూపర్ స్పెషలిస్ట్ పదాలు వాడుతూ.. ప్రత్యేక వైద్య విద్య (ఎండీ, ఎంఎస్) లేకపోయినా కొందరు వైద్యులు తమ క్లినిక్ల వద్ద ‘స్పెషలిస్ట్’, ‘సూపర్ స్పెషలిస్ట్’ వంటి పదాలను ఉపయోగిస్తూ రోగులను ఆకర్షిస్తున్నారు. దీంతో రోగులు వారికి పూర్తి అర్హతలు ఉన్నాయనే భావనతో చికిత్స పొందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మధ్యస్థ విద్య మాత్రమే ఉన్నవారు కూడా క్లినిక్లు నడుపుతూ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వంటి మందులు ఇస్తున్న ఘటనలు బయటపడినట్లు ఆరోగ్య శాఖ పరిశీలనల్లో వెల్లడైంది. ఇలాంటి అక్రమ వైద్యంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. మచ్చుకు కొన్ని కేసులిలా.. ● వరంగల్లోని కాశిబుగ్గలో షేక్ నయీంపాషా ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా అనధికారికంగా వైద్యుడిగా చెలామణి అవుతూ చికిత్స, మందులు ఇస్తున్నారని కేసు నమోదైంది. ● వైద్యపరంగా విద్యార్హత లేకుండా వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్న ఏనుమాములలో బోయిని శంకర్ (కల్యాణి క్లినిక్), కర్రు రాజేందర్ (జయశ్రీ ఫర్ట్స్ ఎయిడ్ సెంటర్), పి.రమేశ్ (శ్రీవెంకటేశ్వర ఫస్ట్ఎయిడ్ సెంటర్)పై కూడా టీజీఎంసీ కేసులు నమోదు చేసింది. ● ఎంబీబీఎస్ విద్యార్హత లేకున్నా మడికొండలో టి.రాజయ్య, ఈ.జయరాం, భాగ్యలక్ష్మి వైద్యులుగా చెలామణి అవుతూ చికిత్స అందిస్తుండడంతో కేసు నమోదైంది. ప్రజల ప్రాణాలతో నకిలీ వైద్యుల చెలగాటం అర్హత, అనుభవం లేకున్నా యథేచ్ఛగా క్లినిక్ల నిర్వహణ ఎంబీబీఎస్ చదివినా స్పెషలిస్ట్ అని కొందరు ప్రలోభాలు ఫేక్ డాక్టర్ల సమాచారాన్ని 91543 82727 నంబర్కు వాట్సాప్ చేయండి ప్రజలకు తెలంగాణ వైద్య మండలి విజ్ఞప్తి వైద్య విద్య అర్హతలను తప్పుగా చూపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలపై వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ మర్రి దయాకర్కు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నోటీసు జారీ చేసింది. వాస్తవానికి ఆయన ఎండీ ఫార్మకాలజీ అర్హత కలిగి ఉన్నాడు. తన ప్రిస్క్రిప్షన్లు, ప్రచారంలో ఎండీ జనరల్ మెడిసిన్ – కార్డియాలజీగా పేర్కొంటున్నాడని ఫిర్యాదు వచ్చినట్లు కౌన్సిల్ తెలిపింది. అలాగే, డీసీ (ఈఈ) వంటి గుర్తింపు లేని అర్హతలను కూడా ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. -
కృత్రిమ మేధానైపుణ్యాలను పెంపొందించుకోవాలి
కేయూ క్యాంపస్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజలో నిలవాలంటే కృత్రిమ మేధా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్రెడ్డి కోరారు. యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులకు గురువారం రూసా 02 ప్రాజెక్టు కింద రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ ప్రతాప్రెడ్డి పాల్గొని మాట్లాడారు. హ్యాండ్స్ ఆన్ శిక్షణ ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు మంరింతగా మెరుగుపుడుతాయన్నారు. ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్ ఎన్.రమణ, కె.భిక్షాలు, డాక్టర్ ఆసిం ఇక్బాల్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్లోని మిర్చి యార్డులో కొంతమంది దడవాయిలు జీరో దందా సాగిస్తున్నట్లు వెలుగుచూసింది. మార్కెట్లో జీరో జరిగితే అందుకు సూపర్వైజర్లు, ఇతర అధికారులను బాధ్యులను చేస్తూ చర్యలు తప్పవని జేడీఎం లక్ష్మణుడు.. ఇటీవల హెచ్చరించడంతో ఈ దందా వెలుగు చూసినట్లు తెలుస్తోంది. మిర్చి సీజన్లో మార్కెట్ ఉద్యోగులు బిజీగా ఉండడం గుర్తించిన కొంతమంది దడవాయిలు రైతులతో మాట్లాడుకుని సరుకు ధరలను సగానికి తగ్గించి మార్కెట్ ఫీజును దోపిడీ చేస్తున్నట్లు బహిర్గతమైంది. బుధవారం వచ్చిన మిర్చికి పలికిన ధరలను మార్కెట్ అధికారులు ఆన్లైన్లో పరిశీలించగా కొంతమంది రైతుల సరుకులకు సగం ధరలు పలికినట్లు వెల్లడి కావడంతో ఈదందా వెలుగు చూసింది. ఇందుకు కారణమైన దడవాయిలు తూర్పాటి రమేష్, నిమ్మాని నాంపల్లి, ఆకుతోట సతీష్లకు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేషం నోటీసులు జారీ చేసి గురువారం వీరికి డ్యూటీలు వేయవద్దని ఆదేశాలు జారీ శారు. ఈ దందా కొన్నేళ్లుగా సాగుతున్నట్లు మార్కెట్లో చర్చించుకుంటున్నారు. హసన్పర్తి/హన్మకొండ అర్బన్ : వరంగల్ నగరంలో వివిధ ప్రాంతాల్లోని హోటళ్లలో సివిల్ సప్లయ్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. గృహవసరాలకు వినియోగించే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లు అఽధికారులు గుర్తించారు. 73 సిలిండర్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన సిలిండర్లను ఇందు శేఖర్, బోగేస్ గ్యాస్ ఏజెన్సీలకు అప్పగించినట్లు సివిల్ సప్లయీస్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో డీటీలు భద్రునాయక్, వేణుగోపాల్, ఎఫ్ఐ సదానందం పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: చండీఘర్లోని పంజాబ్ యూనివర్సిటీలో ఈనెల 14నుంచి 16వరకు జరగనున్న ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ మహిళా జట్టును ఎంపిక చేసినట్లు గురువారం స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య తెలిపారు. జట్టులో జి.అనూషా, బి.ప్రతూషా, కె.శ్రావణి బి.అంజలి, జె.శ్రావణి ఉన్నట్లు పేర్కొన్నారు. వాగ్దేవి ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ రవీందర్ కోచ్కమ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. -
ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి!
రాంపూర్ డంపింగ్యార్డు నుంచి పొగ, విషవాయువులు● శ్వాసకోశ, చర్మ వ్యాధులబారిన పడుతున్న ప్రజలు ● రూ.కోట్లు ఖర్చుచేసినా ప్రారంభంకాని చెత్త రీసైక్లింగ్ రాంపూర్ చెత్తడంపింగ్ యార్డునుంచి వెలువడుతున్న పొగఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు పంజాల స్వరూప. ఈమెది మడికొండ. రాంపూర్లోని డంపింగ్యార్డు నుంచి వస్తున్న పొగ, విషవాయువులు, దుర్వాసనతో శ్వాస తీసుకోవడానికి ఆమె తీవ్ర ఇబ్బందులు పడింది. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తే 15వేల రూపాయల ఖర్చు అయ్యింది. వైద్యులు ఆమెకు 15 రోజుల కోర్సు ఇచ్చారు. డంపింగ్యార్డుతో నీరు, గాలి కలుషితమైనా అధికారులు పట్టించుకోవడం లేదని, డంపింగ్యార్డు తరలించాలని ఆమె వేడుకుంటోంది. ఈ పరిస్థితి ఒక్క స్వరూపదే కాదు.. మడికొండ, రాంపూర్ గ్రామాల్లోని అనేక మంది ఎదుర్కొంటున్నారు. కాజీపేట అర్బన్: డంపింగ్యార్డు నుంచి వెలువడే పొగతో మడికొండ, రాంపూర్ గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పలువురు వ్యాధులతో బాధపడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. కాజీపేట మండలం రాంపూర్ గ్రామంలో 2011 సంవత్సరంలో 36 ఎకరాల్లో చెత్తను పోగుచేసేందుకు డంపింగ్యార్డును ఏర్పాటు చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు పూట గడవడమే కష్టంగా ఉండగా.. మూలిగే నక్క మీద తాటికాయపడిన చందంగా డంపింగ్యార్డు నుంచి వెలువడుతున్న పొగ, విషవాయువులతో చర్మ వ్యాధులు, శ్వాసకోస వ్యాధుల బారినపడుతున్నారు. చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరి అప్పుల పాలవుతున్నారు. రోజుకు 500 టన్నుల చెత్త.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లు ఉన్నాయి. ప్రతిరోజూ 300 స్వచ్ఛ ఆటోలు, టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా సుమారు 500 టన్నుల చెత్త డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. కాగా, ఎప్పటి చెత్తను అప్పుడు రీసైక్లింగ్ చేయాలి. చెత్త నుంచి కాగితాలు, పీచు, ఖాళీ బాటిళ్లు, మూతలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, సుమారు 24 రకాల వ్యర్థాలను వేరు చేసి సంబంధిత ఫ్యాక్టరీలకు పంపిచాలి. కాగా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.16 కోట్లతో రీసైక్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. 36 ఎకరాల్లోని 16 ఎకరాల్లో పేరుకుపోయిన లక్షల టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేయాలని సంకల్పించా రు. ఆదిలోనే హంసపాదు అన్న చందంగా ప్లాంట్ల నిర్వహణ సరిగాలేక రీసైక్లింగ్ ప్రక్రియ ఆగిపోయింది. తిరిగి ప్రస్తుత ప్రభుత్వ హయంలో రూ. నాలు గు కోట్లతో నాలుగు రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసినా ఫలితం మాత్రం శూన్యం. అవి కూడా పని చేయ డం లేదు. దీంతో గుట్టలుగా పేరుకుపోయిన లక్షల టన్నుల చెత్త మంటల్లో చిక్కుకుంటే ఫైరింజన్లతో ఆర్పివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికైనా అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించి డంపింగ్యార్డును తరలించాలని ప్రజలు కోరుతున్నారు. వాయుకాలుష్యం, పొగమంచు కోరల్లో చిక్కుకున్న దేశరాజధాని ఢిల్లీలో అక్కడి ప్రజలు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. అక్కడి పరిస్థితినే రాంపూర్లోని డంపింగ్యార్డు తలపిస్తోంది. ఉదయం చెత్త డంపింగ్, రాత్రి డంపింగ్ చేసిన చెత్తను కాల్చి వేయడం, చెత్తలో వివిధ రసాయన ప్రక్రియలు చోటుచేసుకుని మిథైన్ వాయువు ఉత్పత్తి అవుతోంది. దుర్వాసనతో కూడిన పొగ వెలువడి మడికొండ–రాంపూర్ రాత్రివేళ పొగమంచు కురిసినట్లు తలపిస్తోంది. డంపింగ్యార్డు పొగతో ఊపిరాడడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డంపింగ్యార్డు ఎత్తివేయాలని రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు చేసినా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. -
పకడ్బందీగా పదో తరగతి వార్షిక పరీక్షలు
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ తన చాంబర్నుంచి డీఈఓ గిరిరాజ్, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ భువనేశ్వరీలతో కలిసి పరీక్షకేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 12,079 మంది రెగ్యులర్ విద్యార్థులకోసం 64 పరీక్షకేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతీ కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, శాఖా అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించినట్లు చెప్పారు. పరీక్షకేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫ్యా న్లు, లైట్లు, వైద్యసేవలు వంటి సౌకర్యాలు కల్పించామన్నారు. పరీక్ష హాల్స్ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, బాలబాలికలకు వేర్వేరుగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. -
సీఎం హామీని అమలు చేయాలి
ఆజంజాహి మిల్లు కార్మికుల రాస్తారోకో కాశిబుగ్గ: గత ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆజంజాహి మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మిల్లు కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు వరంగల్ వెంకట్రామ జంక్షన్లో గంటపాటు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన విరమింపజేశారు. ఈ సందర్భంగా విశ్రాంత కార్మికుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఇనుముల శ్రీనివాస్, ఆరెల్లి కృష్ణ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 318 మంది కార్మికులకు ఒక్కొక్కరికి 200 గజాల ఇంటిస్థలం కేటాయిస్తానని సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చారన్నారు. ఇంతవరకు ఆ హామీ నెరవేర్చలేదని తెలిపారు. దశలవారీగా అనేక రూపాల్లో ఆందోళనలు చేపడుతున్నప్పటికీ ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా సీఎం రేవంత్రెడ్డి కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేసి, కార్మిక సంక్షేమ భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, సామాజిక కార్యకర్త జనగాం కుమారస్వామి, హరినారాయణ, యశోద, సందీప్, శ్యాం, ప్రవీణ్, సూర్య, భాను, భిక్షపతి, సంజీవ, ప్రభావతి, సనా, ఉమా, ప్రమీల, కుమారస్వామి, మల్లేశం, రాజేశం తదితరులు పాల్గొన్నారు. -
2025–26 ఆర్థిక సంవత్సరంలో పన్నుల వివరాలు (రూ.కోట్లలో)
మొత్తం ఆస్తి పన్ను : రూ.178.19 ఇప్పటి వరకు వసూలైంది : రూ.66.24 బకాయిలు మొత్తం : రూ.111.95 మొత్తం అసెస్మెంట్లు : 2,28,758ఆస్తి పన్ను : 81.58 వడ్డీ: 49.55 పాత బకాయిలు: 47.06 వసూలైంది: 53.88వసూలైంది: 8.35వసూలైంది: 4.01బ్యాలెన్స్: 27.70 బ్యాలెన్స్: 38.71 బ్యాలెన్స్: 45.54 -
అక్షరం బాగుంటే విజయం మీ వెంటే
ప్రతీ విద్యార్థి దస్తూరిపై దృష్టి సారించాలి. అక్షరం ఆకట్టుకునేలా ఉంటే విజయం విద్యార్థి వెంటే ఉంటుంది. సామాన్య శాస్త్రంలో బొమ్మలు గీస్తే ఆ చిత్రంలోని భాగాన్ని గుర్తించడంలో క్రమపద్ధతి పాటించాలి. స్కెచ్లు, పలు రంగుల పెన్నులను అడ్డదిడ్డంగా ఉపయోగిస్తుంటారు. ఇది సరికాదు. జవాబుల్లో ముఖ్యమైన పదాలు ఉండేలా చూడాలి. క్రమ పద్ధతి పాటించడం, అక్షరాలు, పదాలు, వాక్యాల మద్య తగినంత దూరం ఉండేలా పేజీకి 16 నుంచి 18 వరుసలు మించకుండా రాయాలి. సమాధానం ఆకట్టుకునేలా ఉంటే మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. – బొజ్జ సురేశ్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, (చేతిరాత నిపుణుడు) -
సకాలంలో లక్ష్యాలు పూర్తిచేయాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: జిల్లాలో ఇందిరా మహిళాశక్తి కార్యక్రమాల లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ఇందిరా మహిళాశక్తి కార్యక్రమాలపై సంబంధిత విభాగాల ప్రాజెక్టు నిర్వాహకులతో బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ ప్రతి విభాగానికి కేటాయించిన పనులను నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలని కోరారు. వ్యవసాయేతర విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన పెట్రోల్బంకు, సౌరవిద్యుత్ యూనిట్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల ఉత్పత్తులను ప్రోత్సహించే మహిళా మార్కెట్ పనులను ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా ప్రారంభించాలని తెలిపారు. డీఆర్డీఓ మేన శ్రీను, అదనపు డీఆర్డీఓ బొజ్జ వెంకటేశ్వర్లు, ప్రాజెక్టు నిర్వాహకులు దయాకర్, రాజేంద్ర ప్రసాద్, అనిత, సరిత, పద్మప్రియ, సీ్త్రనిధి ప్రాంతీయ నిర్వాహకుడు రమేశ్ పాల్గొన్నారు. సమర్థవంతమైన శిక్షణకు ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 12న మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులకు నిర్వహించే శిక్షణ సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను అదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్డీఓ మేన శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
స్నేహనగర్లో వింత చోరీ
హన్మకొండ: హనుమకొండ స్నేహనగర్లో వింత చోరీ జరుగుతోంది. దండెంపై ఆరేసిన, ఉతకడానికి ఇంటి ఆవరణలో ఉంచిన మహిళల లోదుస్తులు, డ్రెస్సులు ఎత్తుకెళ్లి తిరిగి వారం పది రోజుల తర్వాత అదే ఇంటి వద్ద వదిలేస్తుండడంతో కాలనీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. మహిళ దుస్తులు ధరించి మాస్క్తో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఈ వింత చోరీకి పాల్పడుతున్నాడని వారు చెబుతున్నారు. రాత్రి ఒంటి గంట నుంచి 3 గంటల ప్రాంతంలో ఈ చోరీకి పాల్పడుతున్నట్లు సీసీ కెమెరాల్లో నమోదైందని వివరించారు. దుస్తులు ఎత్తుకెళ్తుండడం, తిరిగి వదలి వెళ్తుండడంతో రాత్రి వేళలో మూత్రవిసర్జన, ఇతర కాలకృత్యాలకు రాత్రి బయటకు రావడానికి భయపడుతున్నారు. భారీ చోరీ కోసం కవ్విస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు వాహనాల బ్యాటరీలు ఎత్తుకెళ్తున్నారని వారు తెలిపారు. ఈ మేరకు బుధవారం సుబేదారి పీఎస్లో స్టేషన్ హౌజ్ ఆఫీసర్ రణధీర్కు స్నేహనగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కండేరావు నరసింహారావు, ప్రధాన కార్యదర్శి డి.తిరుపతి రెడ్డి, బాధ్యులు ఫిర్యాదు చేశారు. దుస్తులు ఎత్తుకెళ్లి వారం తర్వాత వదిలేసిన దొంగలు మాయమవుతున్న వాహనాల బ్యాటరీలు -
22న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన హనుమకొండలోని పబ్లిక్గార్డెన్ ఎదుట గల టీటీడీ కల్యాణ మండపంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి 4వ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి పి. కన్నా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులు జనవరి 01, 2011న, ఆ తర్వాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఇందులో గెలుపొందిన వారికి ప్రశంస పత్రాలు, ట్రోఫీలు అందజేయనున్నట్లు తెలిపారు. మరిన్ని ఇతర వివరాలకు 90595 22986 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. స్పోర్ట్స్ స్కూల్ దరఖాస్తులకు నేటితో గడువు పూర్తి వరంగల్ స్పోర్ట్స్: రాష్ట్రంలోని స్పోర్ట్స్ స్కూళ్లలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 12వ తేదీతో ముగుస్తుందని హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతిలో ప్రవేశాల కోసం ఫిబ్రవరి 26వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో ప్రతిభ ఉన్న బాలబాలికలకు ఉచిత విద్య, భోజన వసతులతో పాటు నైపుణ్యం గల శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఎంపిక ప్రక్రియ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించి ప్రతిభావంతులైన విద్యార్థుల ను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి, అ ర్హత గల విద్యార్థులు telangana.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆలిండియా ఇంటర్వర్సిటీ పోటీలకు కేడీసీ విద్యార్థులు విద్యారణ్యపురి: పంజాబ్లోని జలంధర్ యూనివర్సిటీలో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు జరగబోయే తైక్వాండో టోర్నమెంట్కు హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు టి.నవీన్, వి.శ్రీయాంశ్, ఎ.మణికంఠలు ఎంపికయ్యారు. బుధవారం వీరిని ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ శశికాంత్ అభినందించారు. బాలికపై సర్పంచ్ భర్త అత్యాచార యత్నంకన్నాయిగూడెం: భయం చెప్పమంటే బాలికపై ఓ సర్పంచ్ భర్త అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై వెంకటేశ్ కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటర్ చదువుతోంది. కూతురు తన మాట వినడం లేదని, భయం చెప్పాలని పెద్దమనిషి, సర్పంచ్ భర్త శ్రీకాంత్కు వారం రోజుల క్రితం చెప్పింది. ఇదే అదునుగా తీసుకున్న శ్రీకాంత్ మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో బాలిక ఇంటికి వెళ్లి ఆమైపె అత్యాచారయత్నం చేశాడు. బాలిక ప్రతిఘటించి బయటకు వచ్చి కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పంచాంగం ఆవిష్కరణహన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవస్థాన శ్రీపరాభవ నామసంవత్సర నూతన పంచాంగాన్ని బుధవారం భద్రకాళి దేవాలయ కార్యాలయంలో ఈఓ రామల సునీత ఆవిష్కరించారు. కా ర్యక్రమంలో జ్యోతిష్య పండితులు అయినవో లు రాధాకృష్ణశర్మ, సాయికృష్ణశర్మ, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, పూర్ణచందర్, మోత్కూరి మయూరి, పార్నంది నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, పరిశీలకుడు క్రాంతికుమార్, ముఖ్యార్చకుడు చెప్పల నాగరాజుశర్మ తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం
కాజీపేట రూరల్: అమృత్ భారత్ పథకం కింద రూ.25 కోట్లతో కాజీపేట రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్రెడ్డి అన్నారు. పార్టీ నాయకులతో కలిసి బుధవారం కాజీపేట రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా సంతోష్రెడ్డి మాట్లాడుతూ రూ.716 కోట్లతో కాజీపేటలోని చేపట్టిన కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు దాదాపు పూర్తయ్యాయని, త్వరలో ప్రారంభానికి సిద్ధం ఉందని పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి, నాయకులు డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి, దొంతి దేవేందర్రెడ్డి, పులి సరోత్తంరెడ్డి, కాచం గురుప్రసాద్, కందగట్ల సత్యనారాయణ, మేకల శ్రావణ్ యాదవ్, మధు, మేఘనాథ్, కార్పొరేటర్లు గుజ్జుల వసంత, బైరి శ్రావణ్, రావుల కిషన్ పాల్గొన్నారు. నానో టెక్నాలజీపై సర్టిఫికెట్ కోర్సు ప్రారంభం విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బుధవారం మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో నానో టెక్నాలజీపై సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించారు. నా నోకణాలు , గ్రీన్నానో టెక్నాలజీ –సంశ్లేషణ విశ్లేషణ వినియోగాలు అనే అంశంపై ఈ సర్టిఫికెట్ కో ర్సు ద్వారా విద్యార్థులకు గ్రీన్ టెక్నాలజీ ప్రాథమిక సూత్రాలు, బయోటెక్నాలజీలో వినియోగాల గురించి అవగాహన కల్పించటమే లక్ష్యంగా ఉందని ప్రిన్సిపాల్ చంద్రమౌళి తెలిపారు. సమావేశాని3కి వరంగల్ నిట్ బయోటెక్నాలజీ విబాగం అసోసియేట్ ప్రొఫెసర్ పెరుగు శ్యాం ముఖ్యఅతిథిగా పాల్గొని నానోటెక్నాలజీలో వస్తున్న మార్పులు, సూక్ష్మజీవ శాస్త్రంలో ప్రాముఖ్యతపై వివరించారు. వైస్ ప్రిన్సిపాల్ జిసుహాసిని, మైక్రోబయాలజీ విభాగం ఆర్డినైజింగ్ సెక్రటరీ డాక్టర్ రేణుక, డాక్టర్ ఆదిత్య పాల్గొని మాట్లాడారు. -
చిట్ ఫండ్ పేరుతో మోసం..
● వ్యక్తి అరెస్ట్, రిమాండ్ ● వివరాలు వెల్లడించిన ఏసీపీ సతీశ్ బాబు శాయంపేట : చిట్టీల పేరుతో మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పరకాల ఏసీపీ సతీశ్ బాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం శాయంపేట పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన పెరుమాండ్ల కిశోర్ రెడ్డి పెరుమాండ్ల చిట్ఫండ్ పేరుతో 117 మంది వద్ద రూ. 1.49 కోట్లు, మరో 59 మంది వద్ద రూ.3.55 కోట్లు అప్పు తీసుకొని మొత్తం 176 మందిని మోసం చేశాడు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యా దు మేరకు పోలీసులు కిశోర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అనంతరం అరెస్ట్ చేసి అతడి వద్ద వద్ద ఉన్న రూ. 25.39లక్షల నగదు, 12 ప్లాట్లు, వ్యవసాయ భూముల పత్రాలు, బంగారం, వెండి ఆభరణాలు, ఓ కారుతో సహా మొత్తం రూ. 8.12 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. కాగా, కేసు వేగంగా చేధించిన సీఐ రంజిత్ రావు, ఎస్సై జక్కుల పరమేశ్తోపాటు సిబ్బందిని ఈస్ట్ జోన్ డీసీసీ అంకిత్ కుమార్, ఏసీపీ సతీశ్ బాబు అభినందించారు. -
ఐసీఏఐ వరంగల్ బ్రాంచ్ కార్యవర్గం ప్రమాణ స్వీకారం
రామన్నపేట: హంటర్రోడ్డులోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్హాల్లో ఐసీఏఐ వరంగల్ బ్రాంచ్ అధ్యక్షుడు సీఏ మదరాపు సుజిత్, ఇతర కార్యవర్గ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యఅతిథిగా సదరన్ ఇండియన్ రీజనల్ కౌన్సిల్ (ఎన్ఐఆర్సీ) చైర్మన్, సీఏ ముప్పాల సుబ్బారావు హాజరై మాట్లాడుతూ వరంగల్ బ్రాంచ్కి సొంత భవనం వచ్చేవిధంగా కృషిచేస్తానని, అన్ని విధాలుగా బ్రాంచ్ అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని హామీ ఇచ్చారు. నూతన అధ్యక్షుడు సుజిత్ మాట్లాడుతూ సీఏ మెంబర్స్, సీఏ విద్యార్థులు, ప్రజలకు ఇన్స్టిట్యూట్ తరఫున ఉత్తమ సేవలందిస్తామని తెలిపారు. సీఏ మెంబర్స్ కోసం సెమినార్స్, విద్యార్థులకు తరగతులు, రీడింగ్ రూం సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్, సీఏ సుధాటి వినీల్రావు, కార్యదర్శి జి.నిఖిత, కోశాధికారి బల్నే భగవాన్, స్టూడెంట్స్ అసోసియేషన్ చైర్మన్ హెచ్.భరత్రాజ్, ఎంసీ మెంబర్ సత్యనారాయణ, రీజనల్ కౌన్సిల్ వైస్ చైర్మన్, సీఏ మండవ సునీల్, రీజినల్ కౌన్సిల్ స్టూడెంట్స్ అసోసియేషన్ చైర్మన్ దీపక్ లడ్డా, సభ్యుడు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. -
శిశువులకు శాపం
సమన్వయ లోపం.. ఉమ్మడి వరంగల్ శిశుగృహలో దత్తత పిల్లలకు బాలారిష్టాలు● 13 మందిలో ముగ్గురికి మార్గం సుగమం.. మిగిలిన వారికి అడ్డంకులు ● శిశువుల అక్రమ దత్తత కేసుల్లో ఐదుగురికి తప్పని నిరీక్షణ ● డీఎన్ఏ పెండింగ్, కిడ్నాప్ కేసుల్లో నలుగురికి ఆలస్యం ● అధికారులు, కోర్టుల కేసులతో దత్తతకు ఎదురుచూపులు ● పోక్సో కేసుల మాదిరిగానే ఈ కేసుల్లో వేగం పెంచాలిసాక్షి, వరంగల్: జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, జిల్లా సంక్షేమ అధికారులు, వైద్యారోగ్య విభాగాలు, పోలీసు శాఖల మధ్య సమన్వయం కొరవడడం.. దత్తతకు పోయే శిశువులకు శాపంగా మారుతోంది. అక్రమంగా దత్తత కేసులు, డీఎన్ఏ పెండింగ్ కేసులు, అపహరణ కేసులతో హనుమకొండలోని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యప్తంగా హనుమకొండలో ఉన్న ఒకేఒక శిశుగృహలోని 13 మంది పిల్లల్లో 10 మంది దత్తతకు అనర్హులుగా ఉండడంతో ఆ పిల్లలు.. కుటుంబ ఆలనపాలన దూరమవుతున్నారు. వారి భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని పోక్సో కేసుల మాదిరిగానే ప్రత్యేక దృష్టితో దత్తతకు సంబంధించిన కేసులను పరిష్కరిస్తే శిశువులు త్వరగా కుటుంబ వాతావరణంలోకి వెళ్లే అవకాశం ఉంటుందని బాలల హక్కుల కార్యకర్తలు అంటున్నారు. ఆయా విభాగాధికారులు సమన్వయంతో పనిచేస్తేనే శిశువులకు న్యాయం జరుగుతుందనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇటీవల ఓ కేసులో పిల్లల అక్రమ దత్తతలో వ్యవహారం చైల్డ్ ట్రాఫికింగ్ (అక్రమ రవాణా)కు దారితీసి, వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని, ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే అక్రమంగా దత్తత తీసుకున్న పిల్లలతో.. వారిని పెంచుకుంటున్న తల్లిదండ్రులకు ఎంత అనుబంధమున్నా ఆ దత్తతను అనుమతించలేమని, దత్తత విషయంలో కేంద్రం రూపొందించిన సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ (కారా) మార్గదర్శకాలను పాటించాలని హైకోర్టు ఇటీవల తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో శిశుగృహలో ఉంటున్న నెలల పాపల నిరీక్షణ అంశం తెరమీదకు వచ్చింది. సమన్వయంతోనే ముందుకు సాగాలి అక్రమంగా దత్తత తీసుకున్న శిశువులను తిరిగి పొందేందుకు కొందరు వ్యక్తులు కోర్టుల్లో కావాలనే కేసులు వేస్తుండడం వల్ల దత్తత వ్యవహారాలు ఆలస్యమవుతున్నాయి. చట్టబద్ధంగా కాకుండా పిల్లలను తీసుకున్న సందర్భాల్లో అధికారులు శిశువులను ప్రభుత్వ సంరక్షణలోకి తీసుకుంటారు. అయితే అలాంటి పరిస్థితుల్లో శిశువులను తిరిగి పొందేందుకు కొందరు కోర్టులను ఆశ్రయిస్తూ ప్రక్రియను దీర్ఘకాలం పాటు సాగదీస్తున్నారు. పత్రాల ధ్రువీకరణ, అసలు తల్లిదండ్రుల గుర్తింపు, డీఎన్ఏ పరీక్షలు వంటి అంశాలు కూడా కోర్టు విచారణల్లో కీలకమవుతున్నాయి. ఈ కారణాలతో కేసులు ఎక్కువకాలం పెండింగ్లో ఉండి చట్టబద్ధ దత్తత ప్రక్రియకు అడ్డంకిగా మారుతున్నాయి. ఈ కేసులను అన్ని విభాగాధికారులు సమన్వయంతో పనిచేస్తేనే త్వరగా కోర్టు ఆదేశాలు వచ్చి దత్తతకు మార్గం సుగమం అవుతుంది. ప్రాధాన్యతా క్రమంలో వేగం పెంచాలి దత్తత లేదా శిశువుల మార్పిడి, అపహరణ వంటి కేసుల్లో శిశువు నిజమైన తల్లిదండ్రులను గుర్తించడానికి డీఎన్ఏ పరీక్షలు కీలకం. కేసు నమోదు అనంతరం పోలీసులు శిశువు, అనుమానిత తల్లిదండ్రుల నుంచి నమూనాలు సేకరించి హైదరాబాద్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపాలి. సాధారణంగా ఈ పరీక్షల ఫలితాలు 15 నుంచి 30 రోజుల్లో వెలువడాలి. అత్యవసర పరిస్థితుల్లో కోర్టుల ఆదేశాల మేరకు ప్రాధాన్యతా క్రమంలో పరీక్షలు నిర్వహించి ఒకటి నుంచి రెండు వారాల్లోనే నివేదిక ఇవ్వాలి. అయినా ఈ కేసులను ఆయా అధికారులు ఇతర కేసుల ఒత్తిడితో ఫాలోఅప్ చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో జాప్యం అవుతున్నాయన్న విమర్శలొస్తున్నాయి. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) నిబంధనల ప్రకారం పిల్లల గుర్తింపు, తల్లిదండ్రుల నిర్ధారణ త్వరగా చేయాలి. జువెనల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్ 2015 ప్రకారం శిశువుల సంరక్షణ, దత్తత వ్యవహారాలు త్వరగా పరిష్కరించాలని సామాజికవేత్తలు అంటున్నారు. గుర్తుతెలియని శిశువుల దత్తతలోనూ అదే తీరు కిడ్నాప్ కేసుల్లో పోలీసులకు దొరికిన గుర్తు తెలియని శిశువులను దత్తత ఇవ్వడంలో అనేక చట్టపరమైన ప్రక్రియలు ఉండడంతో ఆ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ముందుగా శిశువు అసలు తల్లిదండ్రులు ఎవరన్నది పోలీసులు గుర్తించాలి. శిశువు అపహరణకు గురైందా లేదా అన్నది నిర్ధారించేందుకు వివిధ ప్రాంతాల్లో మిస్సింగ్ కేసుల వివరాలను పరిశీలించాలి. అలాగే శిశువును తాత్కాలికంగా శిశుగృహలో ఉంచి కోర్టు ఆదేశాలు పాటించాలి. ఇలా శిశువు కేసుల్లో పోలీసులు వేగం పెంచాల్సిన అవసరం ఉంది. ఈ దత్తత ప్రక్రియలో సీడబ్ల్యూసీ అనుమతి, ప్రతి కేసు నివేదిక, ప్రొసీడింగ్స్, ఆర్డర్స్, శిశువు ఆరోగ్య పరీక్షల నివేదికను క్షుణ్ణంగా పరిశీలించడం తప్పనిసరి కావడంతో ఆలస్యమవుతోంది. పెండింగ్లో ఉన్న కేసులు.. 2024 జూలై 25న జనగామ జిల్లాలో పోలీసులకు, జిల్లాల బాలల సంరక్షణ విభాగం, జిల్లా బాలల సంక్షేమ కమిటీకి దొరికిన 25 రోజుల పాప కేసు ఇల్లీగల్ అడాప్షన్ కింద కోర్టులో నడుస్తుండడంతో ఇంకా పాపను దత్తత ఇచ్చేందుకు గ్రీన్సిగ్నల్ రాలేదు. 2024 ఆగస్టు 27న మహబూబాబాద్ జిల్లాలో 39 రోజుల బాబు, 2024 నవంబర్ 19న ములుగు జిల్లాలో దొరికిన ఐదు నెలల 15 రోజుల పాప, 2025 జూన్ 5న ములుగు జిల్లాలో దొరికిన 20 రోజుల పసికందు, 2025 సెప్టెంబర్ 26న వరంగల్ జిల్లాలో దొరికిన రెండు నెలల నాలుగు రోజుల పాప కేసు ఇల్లీగల్ అడాప్షన్ కోర్టు కేసులు నడుస్తుండడంతో దత్తతకు అనర్హులుగా ఉన్నారు. 2025 నవంబర్ 26న లభ్యమైన 36 రోజుల పాప, 2025 డిసెంబర్ 24న లభ్యమైన ఒకరోజు మగబాబు, 2026 ఫిబ్రవరి 8న లభ్యమైన ఒకరోజు పాప డీఎన్ఏ పెండింగ్లో ఉంది. 2026 జనవరి 10న కిడ్నాప్ కేసులో దొరికిన 8నెలల పాప, 16 నెలల పాప తల్లిదండ్రుల ఆచూకీ కనుగొనాల్సి ఉండడంతో వారు కూడా పెండింగ్లో ఉన్నారు. -
గురువారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2026
ఇదీ జీడబ్ల్యూఎంసీ పన్ను వసూళ్ల లక్ష్యం● కార్యాచరణ సిద్ధం చేసిన రెవెన్యూ అధికారులు ● చెల్లింపుదారులకు ఎస్ఎంఎస్లు, ఫోన్లలో సమాచారం ● త్వరలో ముగియనున్న ఆర్థిక సంవత్సరం వరంగల్ అర్బన్: ఆర్థిక సంవత్సరం మరో 20 రోజుల్లో ముగియనుంది. దీంతో ఆస్తిపన్ను వసూళ్లను జీడబ్ల్యూఎంసీ వేగవంతం చేస్తోంది. ఇక నుంచి రోజూవారీగా రూ.1.50 కోట్ల చొప్పున నెలాఖరులోగా రూ.30 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో నగర వ్యాప్తంగా ఆస్తిపన్ను అసెస్మెంట్లు 2,28,753 కాగా.. ఈ ఏడాది ఆస్తిపన్ను రూ.81.58 కోట్లు, వడ్డీ రూ.47.06 కోట్లు, పాత బకాయిలు రూ.49.55 కోట్లు. మొత్తంగా రూ.178.19 కోట్లు వసూళ్ల లక్ష్యంగా పెట్టుకున్నారు. 15వ ఆర్థిక సంఘం ఆదేశాల మేరకు ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను, బకాయిల్లో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాల్సిందేనని మేయర్ గుండు సుధారాణి, ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ రెవెన్యూ సిబ్బందికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. వసూళ్లలో వెనుకబడితే శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో బల్దియా పన్నుల వసూళ్లలో దూకుడు పెంచారు. జీడబ్ల్యూఎంసీలో ప్రత్యేక వ్యవస్థ.. పన్నులు చెల్లించాల్సిన వ్యక్తులను అప్రమత్తం చేస్తూ మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్లతో సమాచారం ఇస్తున్నారు. ఇందుకోసం జీడబ్ల్యూఎంసీలో ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తోంది. రూ.లక్షకు పైగా పన్ను చెల్లించాల్సిన వ్యక్తులు, సంస్థలకు జీడబ్ల్యూఎంసీలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల నుంచి ఉద్యోగులు నేరుగా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. నెలాఖరులోగా పన్నులు చెల్లించి సహకరించాలని సూచిస్తున్నారు. లేదంటే వడ్డీతోపాటు చట్ట ప్రకారం తీసుకోనున్న చర్యలను వివరిస్తున్నారు. మొండిబకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. వింగ్ అధికారులు, గెజిటెడ్ అధికారులను సర్కిళ్ల వారీగా ఇన్చార్జులుగా నియమించారు. ఆస్తి, నీటి పన్ను వసూళ్లపై కఠినంగా వ్యవహరిస్తోంది. బకాయిదారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల నుంచి జబర్దస్తీగా వసూలు చేస్తున్నారు. పేదల ఇళ్ల తలుపులు, ఇతర వస్తువులు జప్తు చేస్తున్నారు. నల్లా కనెక్షన్లు, గ్యాస్ సిలిండర్లు సీజ్ చేస్తుండడంతో తీవ్ర నిరసన తెలుపుతున్నారు. బకాయిలు చెల్లించకుండా మొండికేస్తున్న వారికి రెడ్నోటీస్లు, వారెంట్లు జారీ చేస్తున్నారు. ఏళ్ల తరబడి పన్ను కట్టని వారికి లీగల్ నోటీసులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. వారం రోజులుగా గ్రేటర్ పన్నుల అధికారులు, సిబ్బంది ఆస్తి, నీటి పన్నుల వసూళ్లల్లో దూకుడు పెంచారు. బకాయిలు చెల్లించకుండా ఒత్తిడి తెచ్చేవారికి, రాజకీయ నేతలతో ఒత్తిడి తెచ్చే వారిని గుర్తించి ఆస్తుల జప్తుల కోసం రెడ్నోటీసులు జారీ చేస్తున్నారు. ఆగమాగం.. అయోమయం రాష్ట్ర పురపాలకశాఖ ఆదేశాల మేరకు మేరకు 2023 నుంచి ఆస్తి, నీటి, ట్రేడ్ లైసెన్స్ కార్యకలపాలను ‘ఆన్లైన్’ ద్వారా సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) పర్యవేక్షిస్తోంది. గతంలో బల్దియా సొంత వైబ్సైట్ నుంచి పన్నుల మదింపు, వసూళ్లు తదితర అంశాలకు ఇక్కడే పరిష్కారం లభిస్తుండేది. ప్రస్తుతం సీజీజీ పన్ను అసెస్మెంట్లు, డిమాండ్ ఎక్కువ చూపెడుతోంది. వసూళ్లు తక్కువ చూపెడుతోంది. దీంతో బల్దియా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 34వ డివిజన్కు చెందిన ఒక బిల్ కలెక్టర్ తన పరిధిలో డిమాండ్ రూ.1,23 కోట్లు పన్నుల వసూలు చేయగా.. సీజీజీ విడుదల చేసిన పత్రాల్లో రూ.52 లక్షలు మాత్రమే వసూలు చేసినట్లు ధ్రువీకరిస్తున్నారు. ఇలా ఆస్తి, నల్లా పన్నులు, డిమాండ్ లెక్కల్లో గందరగోళంగా మారాయి. అంతేకాకుండా బల్దియా అధికారులు 65 శాతం పైచిలుకు పన్నులు వసూలు చేసినట్లు చెబుతుండగా.. సీజీజీ సంస్థ నుంచి మాత్రం ఆస్తిపన్ను కేవలం 27 శాతం, నీటి పన్నులు 20 శాతం వసూలైనట్లుగా నివేదికలు అందిస్తున్నారు. దీంతో లెక్కలకు పొంతన లేకపోవడంతో హైరానా పడుతున్నారు. పన్నుల వసూళ్లలో హ్యాండ్ మిషన్లు సాంకేతిక లోపంతో మొరాయిస్తున్నాయని బిల్కలెక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈలోపాలు పన్నుల వసూళ్లపై ప్రభావం పడుతోందని అంటున్నారు. -
ఉపాధ్యాయుడు, హెచ్ఎంకు షోకాజ్ నోటీసులు
కాళోజీ సెంటర్: విద్యార్థులకు పాఠాలు బోధించని ఉపాధ్యాయుడితో పాటు అందుకు సహకరించిన ప్రధానోపాధ్యాయురాలిపై డీఈఓ చర్యలు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీమాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డీఈఓ రంగయ్య నాయుడు, ఏఎంఓ సుజన్ తేజ ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేయగా 9వ తరగతి విద్యార్థులకు ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు ఎం.నర్సయ్య నెల రోజులుగా పాఠాలు చెప్పడం లేదనే విషయాన్ని గ్రహించారు. అందుకు ప్రధానోపాధ్యాయురాలు ఆర్.మాధవి సహకరించినట్లు గుర్తించారు. ఈ మేరకు వారిద్దరికి డీఈఓ బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా నిర్లక్ష్యం వహించిన నేపథ్యంలో చర్యలు ఎందుకు తీసుకోకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీస్లో పేర్కొన్నారు. కల్తీ మిరప పొడి స్వాధీనం వరంగల్: వ్యర్థ పదార్థాలు, మిరపకాయల పొడిని కలిపి కారం కల్తీ చేస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ బృందం మంగళవారం వరంగల్ ఏనుమాముల పీఎస్ పరిధిలోని సాయి సిద్ధార్థ్ ఇండస్ట్రీ (మిరపకాయల పొడి– గ్రైండింగ్ వర్క్స్)పై దాడి చేసింది. ఇందులో నిందితుడి వద్ద నుంచి రూ. 4 లక్షల విలువైన మిరపకాయ పొడి స్టాక్ను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తుతో పాటు నిందితుడు బీర్తి సురేశ్ను ఏనుమాముల పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఈదాడుల్లో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ పవన్కుమార్, ఎస్సై ఉప్పలయ్య, ఏనుమాముల ఇన్స్పెక్టర్ సురేశ్, ఎస్సై రాజు పాల్గొన్నారు. పొగాకు ఉత్పత్తుల పట్టివేతఖిలా వరంగల్: నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. వరంగల్ తూర్పుకోట చెందిన పోశాల జగదీశ్వర్ నిషేధిత పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లను నిల్వ చేసి పాన్షాపులు, కిరాణాషాపుల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. బుధవారం ఖిలావరంగల్ తూర్పు హనుమాన్ జంక్షన్ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న మిల్స్కాలనీ పోలీసులకు జగదీశ్వర్ అనుమానాస్పదంగా కనిపించాడు. వెంటనే అతడి వద్ద బ్యాగును పరిశీలించగా రూ.44,307 విలువైన పొగాకు ఉత్పత్తులు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు. హసన్పర్తి: కుటుంబ కలహాలతో ఓ ప్రైవేట్ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని సీతంపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తోకల మమత(36) నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. అయితే కొంతకా లంగా కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో మానసిక వేదనకు గురైన మమత ఈనెల 9న పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు వెంటనే ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు బుధవారం తెలిపారు. -
సమయపాలన.. విజయ సాధన
కాళోజీ సెంటర్ : టెన్త్.. ప్రతీ విద్యార్థి దశలో అత్యంత కీలకం. వారి ఉజ్వల భవిష్యత్ను నిర్ణయించే తరగతి ఇదే. కలల సౌధానికి పునాది ఏర్పడేది కూడా ఇక్కడే. అయితే పరీక్షల సమయం దగ్గర పడుతున్న కొద్దీ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంటుంది. పరీక్ష హాల్లో ప్రశ్నపత్రం చూడగానే ఒక్కసారిగా భయాందోళనకు గురై జవాబు రాయలేక పోతుంటారు. ఇలా కాకుండా భయపెట్టే అంశాలను వీడి సానుకూల దృక్పథంతో ఆలోచించాలని, తద్వారా ఏదైనా సాధ్యమేనని సైకాలజిస్ట్లు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ప్రణాళిక, పట్టుదల ఉంటే పరీక్ష సమయంలో ఒత్తిడి అనే భయాన్ని అధిగమించడం చాలా సులభమని వారు పేర్కొంటున్నారు. పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన పలు అంశాలపై పదో తరగతి విద్యార్థులకు వారు పలు సూచనలు చేస్తున్నారు. ప్రతీ విద్యార్థి సానుకూల దృక్పథంతో ఉండాలి.. నేను చేయగలను.. నేను సాధించగలననే సానుకూల దృక్ఫథం పెంచుకున్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. పరీక్షలంటే భయం వీడాలి. అప్పుడే విజయం ధరిచేరుతుంది. నేను సాధించగలను అనే నమ్మకం సగం విజయాన్ని అందించడానికి దోహదపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ముందు పరీక్షలంటే భయం వీడాలి. అప్పుడే విజయం లభిస్తుందన్నారు. భయం జ్ఞాపకశక్తిని తగ్గిస్తుందని తెలుపుతున్నారు.పరీక్షల్లో విద్యార్థుల భవితవ్యం నిర్దేశించేది చేతి రాత. ముత్యాల్లాంటి అక్షరాలు పరీక్షల్లో మార్కులపై ప్రభావం చూపుతాయి. కొట్టి వేతలు లేని కుదురైన దస్తూ రి కనిపిస్తే కచ్చితంగా మూల్యాంకనం చేసే వ్యక్తి సదుభిప్రాయానికి వచ్చి కనీసం 20 మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పొరపాట్లు చేయడం వల్ల మార్కులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. జవాబులో ముఖ్యమైన పాయింట్లను ఇచ్చే సంజ్ఞలను మార్జిన్లో ఒక దాని కింద మరోటి వేయకుండా గీత చివరి వరకు రాస్తూ చివరికి వెళ్లగానే అక్కడ సగం పదం రాసి మరో సగం కింద వరుసలో రాస్తుంటారు. దీంతో పేపర్ మూల్యాంకనం చేసే వారికి ఆ పూర్తి పదం ఏంటో వెంటనే అర్థం కాదు. అందుకే జాగ్రత్తగా పదాల పొందుపరిచే విధానం బాగుండేలా రాయాలని కౌన్సెలింగ్ సైకాలజిస్ట్లు సూచిస్తున్నారు.సానుకూల దృక్పథంతో ఏదైనా సాధ్యమే భయపెట్టే అంశాలను విడనాడాలి దస్తూరిపై దృష్టిపెడితే మంచి మార్కులు టెన్త్ విద్యార్థులకు సైకాలజిస్ట్ల సూచనలు -
ఎఫ్ఎల్ఎన్ నైపుణ్యాలు ముఖ్యం
కాళోజీ సెంటర్: ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) నైపుణ్యాలు చాలా ముఖ్యమని, మూడో తరగతి నాటికి ప్రతీ విద్యార్థి చదవడం, రాయడం, గణితంలో పటిమ సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ రంగయ్య నాయుడు సూచించారు. డైట్ కళాశాలలో ఎఫ్ఎల్ఎన్ – ఏఎక్స్ఎల్ఏఐ టీచర్స్ ట్రైనింగ్ను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ జిల్లాలోని 11 పాఠశాలలకు చెందిన 50 శాతం మంది ఉపాధ్యాయులు, డీఆర్పీలు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారని, మిగతా 50 శాతం మంది ఉపాధ్యాయులకు 12న ట్రైనింగ్ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం విద్యారంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఏఎక్స్ఎల్ ఏఐ వంటి సాంకేతిక పద్ధతులను ఉపయోగించి విద్యార్థుల అభ్యాసన స్థాయిని అంచనా వేసి బోధనను మెరుగుపర్చాలని అన్నారు. ఏఎంఓ సుజన్తేజ మాట్లాడుతూ ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న విషయాలను పాఠశాల స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. డైట్ కళాశాల అధ్యాపకులు సోమయ్య, డీఆర్పీలు గంగాధర్, సౌజన్య, నరేందర్, పద్మజ పాల్గొన్నారు. -
మహిళా న్యాయవాదులకు 30 శాతం రిజర్వేషన్లు
వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం వరంగల్ లీగల్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలస సుధీర్ అధ్యక్షతన కోర్టు హాల్లో బుధవారం జరిగిన వరంగల్ బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో మహిళా న్యాయవాదులకు 30శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఐదు పదవులను వారికి కేటాయిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ కార్యవర్గ కమిటీ తీసుకున్న నిర్ణయాలను సర్వసభ్య సభలో ప్రవేశపెట్టారు. చర్చల అనంతరం పలు తీర్మానాలను సార్వత్రిక సభ ఆమోదించింది. మహిళా న్యాయవాదులకు ఉపాధ్యక్షురాలు, కోశాధికారి పదవులను ఈసారి కొత్తగా ఇవ్వడంతో పాటు గతంలో ఉన్న సంయుక్త కార్యదర్శి, సీనియర్ కార్యవర్గ సభ్యురాలు, జూనియర్ కార్యవర్గ సభ్యురాలు మొత్తం కలిపి ఐదు పదవులను కేటాయించినట్లు వలస సుధీర్ తెలిపారు. మహిళా పదవులతో కలిపి మొత్తం 16 పోస్టులకు వరంగల్ బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల చివరలో నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. సమావేశంలో వరంగల్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి.రమాకాంత్, ఉపాధ్యక్షుడు మైదం జయపాల్, సంయుక్త కార్యదర్శులు ఎం.శ్రీధర్ గౌడ్, శశిరేఖ, క్రీడా సంయుక్త కార్యదర్శి శివప్రసాద్, కార్యనిర్వాహక సభ్యులు సురేశ్, నిర్మలజ్యోతి, రాజు, మహేందర్, తోట అరుణ, కార్యవర్గ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఉద్యమాన్ని
మొదలుపెట్టింది ‘పీపుల్స్వార్’వెంకటాపురం(ఎం): తెలంగాణ సాయుధ పోరాటాన్ని మలిదశ ఉద్యమంగా మొదలుపెట్టింది పీపుల్స్వార్ పార్టీనేనని మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి మండలంలోని స్వగ్రామమైన నర్సింగాపూర్కు బుధవారం చేరుకున్న ఆశన్నకు గ్రామస్తులు, బాల్యమిత్రులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆశన్న అందరిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఆశన్న విలేకరులతో మాట్లాడారు. వరంగల్ డిక్లరేషన్తో మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమంలో పలువురు భాగస్వాములు అయ్యారని వెల్లడించారు. మళ్లీ ఈ నేల మీద(నర్సింగాపూర్లో) అడుగు పెడతానని ఊహించలేదని, తన తండ్రి భిక్షపతిరావు కుటుంబం కంటే గ్రామం కోసమే ఎక్కువ ఆలోచించేవారని గుర్తుచేశారు. గ్రామంలో సూర్యనేని సత్తన్నను నక్సలైట్లు అంతిరెడ్డి హయాంలో చంపితే వారికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు తెలిపారు. నక్సలైట్లకు వ్యతిరేకంగా మాట్లాడితే తనపై పోస్టర్లు వేసిన సందర్భాలు గుర్తు ఉన్నాయన్నారు. ఎంత శత్రువైనా నమ్మి వచ్చినవాళ్లకు ఎలాంటి హానితలపెట్టలేదన్నారు. ఒకప్పుడు నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడా ఆయుధాలు అవసరం లేదు.. ప్రజల్లో చైతన్యం నింపాలి మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు ఆశన్నమావోయిస్టుల్లో ఉండి ప్రజల కోసం పనిచేసినా, లొంగిపోయి ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల కోసం పనిచేసినా విమర్శించే వారే ఎక్కువని ఆశన్న పేర్కొన్నారు. మావోయిస్టులు ఉంటే లొంగి పోవాలన్నారు. లొంగిపోయి బయటకు వస్తే మళ్లీ వారే వ్యతిరేకిస్తున్నారని అన్నారు. సమాజంలో అడ్వాన్స్, తటస్థం, వెనక్కిలాగే మనుషులు ఉంటారని పేర్కొన్నారు. ప్రజల కోసం అడ్వాన్స్, తటస్థం ఉన్న మనుషులతోనే కలిసి ముందుకు వెళ్తామని, నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసే ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తామని ఆశన్న స్పష్టం చేశారు.


