breaking news
Hanamkonda
-
ఎంజీఎంలో వైద్యసేవలపై డీఎంఈ ఆరా
అదనపు వైద్యులను నియమిస్తామని వెల్లడి కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగుల వైద్యసేవల్లో నిర్లక్ష్యం చేస్తున్న సిబ్బంది తీరు, ఆస్పత్రి సమస్యలపై డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) డాక్టర్ వాణి ఆరా తీశారు. అలాగే, కలెక్టర్ సత్యశారద కూడా అధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. ఆయా వార్డుల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిపై ఎంజీఎం అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘మహాత్మా’.. మారేదెప్పుడు? శీర్షికన సాక్షిలో గురువారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వైద్యసేవల్లో నిర్లక్ష్యం చేస్తున్న మందలించారు. అలాగే, ఓపీ విభాగాలు, వార్డుల్లో రౌండ్ నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంఈ వాణి మాట్లాడుతూ ఎంజీఎంలో సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, పేషెంట్లకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అదనపు వైద్యుల నియామకానికి చర్యలు తీసుకుంటామన్నా రు. ఆర్ఎంఓలు పూర్తిగా ఉండేలా, వైద్యసేవలను మెరుగుపరిచేందుకు అదనపు ఆర్ఎంఓల నియామకానికి ఆదేశాలు ఇస్తామని వివరించారు. స్టె చర్లు, వీల్చైర్లు అందుబాటులో ఉండేలా చూస్తామ ని, త్వరలో అధికారులతో సమీక్షిస్తామని తెలిపారు. -
దద్దరిల్లిన కలెక్టరేట్
ఉద్యోగుల ఆందోళన..హన్మకొండ అర్బన్ : ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన మహాధర్నాతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ధర్నాలో ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలు, నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. జేఏసీలోని వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పాటు ప్రజాసంఘాలు కూడా సంఘీభావం ప్రకటించాయి. అధికార పార్టీ నేతలు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వగా, ప్రతిపక్ష నేతలు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. భారీగా ఉద్యోగులు తరలిరావడంతో కలెక్టరేట్ పరిసరాలు జనసందోహంగా మారాయి. హనుమకొండ–హైదరాబాద్ ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడగా పోలీసులు క్రమబద్ధీకరించారు. ఈసందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ ఆరు డీఏలు విడుదల చేయడం, మెరుగైన పీఆర్సీ ప్రకటించడం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను కూడా ఆలస్యం చేయకుండా అందించాలని డిమాండ్ చేశారు. డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాధర్నాను విజయవంతం చేశారని తెలిపారు. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్కు వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం: ఎమ్మెల్యే నాయిని ధర్నాకు హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ఇప్పటికే చర్చించానన్నారు. రెండో పీఆర్సీ, పెండింగ్ డీఏలు, పాత పెన్షన్ విధానం, హెల్త్కార్డులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర అంశాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని తెలిపారు. ఆరు డీఏలు వెంటనే విడుదల చేయాలి: మాజీ మంత్రి హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు విమర్శించారు. ఆరు డీఏలు పెండింగ్లో ఉండడం సిగ్గుచేటన్నారు. ఈహెచ్ఎస్ పేరుతో ఉద్యోగుల జీతాల నుంచి డబ్బులు కట్ చేస్తున్నా ఆస్పత్రులతో ఒప్పందాలు లేక సేవలు అందడం లేదని ఆరోపించారు. పెండింగ్ డీఏలు విడుదల చేయడంతోపాటు మెరుగైన పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. హాజరైన అన్ని ఉద్యోగ సంఘాలు.. సంఘీభావం తెలిపిన ప్రజాసంఘాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మహాధర్నా.. అక్కడే భోజనాలు అధికార, ప్రతిపక్ష నేతల హామీలు.. విమర్శలతో వేడెక్కిన వేదిక మాజీ మంత్రి హరీశ్రావుతోపాటు బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్.. స్టేషన్కు తరలింపు -
పార్సిల్ వస్తువుల వేలం
హన్మకొండ : ఆర్టీసీ కార్గో పార్సిల్ ద్వారా వచ్చి.. ఎవరూ తీసుకెళ్లని వస్తువులను ఈనెల 29న మధ్యాహ్నం 2 గంటలకు వేలం వేయనున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ భూక్య ధరమ్సింగ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ హనుమకొండ డిపోలో నిర్వహించే ఈ వేలంలో ఆసక్తి కలిగిన వారు నేరుగా పాల్గొనవచ్చని సూచించారు. కేయూ క్యాంపస్: హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఈవిద్యాసంవత్సరం (2026–27)లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ నిర్మల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు స్పాట్ అడ్మిషన్లకు ఆయా తేదీల్లో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సంప్రదించి అడ్మిషన్లు పొందాలని కోరారు. కాశిబుగ్గ: కేఎంసీలోని క్షయ నివారణ కేంద్రాన్ని హనుమకొండ ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టి.రోహిత్ నేత గురువారం సందర్శించారు. ఈసందర్భంగా క్షయ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న స్క్రీనింగ్ పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స విధానం గురించి ఇన్చార్జ్ టీబీ నివారణ అధికారి డాక్టర్ ప్రదీప్రెడ్డి వివరించారు. అదేవిధంగా ఓపీ పేషెంట్ల సేవలు, ట్రునాట్ ల్యాబ్ గురించి తెలిపారు. కార్యక్రమంలో టీబీ, కల్చర్ ల్యాబ్ సిబ్బంది పాల్గొన్నారు. హన్మకొండ అర్బన్: ఎస్ఐఆర్ ప్రక్రియలో నో మ్యాపింగ్, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసుల జారీ కొనసాగుతోందని హనుమకొండ అదనపు కలెక్టర్ రవి తెలిపారు. ఇప్పటివరకు 15,574 మందికి నోటీసులు అందించినట్లు పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో ఎస్ఐఆర్ పురోగతిపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, హనుమకొండ ఈఆర్ఓ/ఆర్డీఓ వెంకటేశ్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్సింగ్, రాజకీయ పార్టీల ప్ర తినిధులు ఎండీ.నేహాల్, కె.సంపత్రెడ్డి, కె.శ్యాంసుందర్, సయ్యద్ ఫైజుల్లా, అబ్దుల్ సత్తార్ పాల్గొన్నారు. విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి సారించాలని తెలంగాణ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (టీజీఎస్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, ఎంప్లాయీస్ హెల్త్కేర్ ట్రస్టు సభ్యులు, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యులు దేవరకొండ సైదులు డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండలోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఆ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలన్నారు. అలాగే సీపీఎస్ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సదస్సులో వివిధ జిల్లాల అధ్యక్షులు దిల్షాద్, గుండ యాదగిరి, షేక్ మన్సూర్, మంగ నర్సింహులు, సునీల్కుమార్, రవి, వృత్తి విద్య కాంట్రాక్టు అధ్యాపకులు, టీజీఎస్టీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజినీర్ ఎం.చైతన్యకుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కాజీపేట, ఫాతిమానగర్, మచిలీబజార్, సుధానగర్, యాదవనగర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ సిద్ధార్థ నాయక్, డీఈలు రవీందర్, కిషన్ నాయక్, విష్ణువర్ధన్, ఏఈలు, సీఎల్టీ సీలు, మేనేజర్లు పాల్గొన్నారు. -
స్కానింగ్ సెంటర్లపై నిఘా పెంచాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, అనుమానాస్పద ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం కమిటీ సమావేశం నిర్వహించారు. గత మూడు నెలల్లో జిల్లాలోని స్కానింగ్ సెంటర్లలో నిర్వహించిన తనిఖీల వివరాలను డీఎంహెచ్ఓ అప్పయ్యను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల నివేదికలను పరిశీలించడంతో పాటు కొత్త అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ సమాచారం అందించిన వారికి రూ.50 వేల పారితోషికం అందిస్తామని తెలిపారు. సమావేశంలో ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, మాతా శిశు సంక్షేమ కార్యక్రమ అధికారి డాక్టర్ రజిత, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఒంటేరు రమేశ్, బన్ను స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నీతా, డెమో వి.అశోక్రెడ్డి, పద్మజ ఉన్నారు. -
తల్లీతండ్రి అన్నీ.. అన్నే!
ఎస్ఎస్తాడ్వాయి: తాడ్వాయి మండల కేంద్రంలోని ఇందిరానగర్కు చెందిన దుబ్బాక శ్రీనివాస్కు ఇద్దరు చెల్లెళ్లు స్వప్న, రవళి. శ్రీనివాస్ 17 ఏళ్ల వయస్సులో ఉన్న సమయంలో తల్లిదండ్రులను కోల్పోయారు. దీంతో చిన్న వయస్సులోనే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. ఇద్దరు చెల్లెళ్లను కంటికి రెప్పలా చూసుకుంటూ వారిపి ఉన్నత చదువులు చదివించాడు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసి తన వంతుగా బాధ్యత నెరవేర్చాడు. తమ కోసం అన్న పడిన కష్టాలను మరచిపోని స్వప్న, రవళి ప్రతీ ఏడాది ఎక్కడున్నా.. రాఖీ పండుగకు వచ్చి అన్నకు రాఖీ కడుతున్నారు. తల్లిదండ్రులు లేకపోయినా.. మేమున్నాం అని చెల్లెళ్లకు భరోసా ఇచ్చిన అన్నకు రాఖీ కట్టి కృతజ్ఞతలు చెబుతున్నారు. -
గిరాఖీ
చలో.. రాఖీగురువారం వరంగల్ రామన్నపేట, బట్టలబజార్, పిన్నావారి వీధి, హనుమకొండ చౌరస్తా, టైలర్ స్ట్రీట్, కాజీపేట చౌరస్తా తదితర ప్రాంతాలు రాఖీలు, స్వీట్స్ కొనుగోళ్లతో రద్దీ ఏర్పడింది. – హన్మకొండ కల్చరల్ రాఖీ పండుగ సందర్భంగా సోదరులకు రాఖీలు కట్టేందుకు మహిళలు గురువారం వివిధ ప్రాంతాలకు వెళ్లడంతో హనుమకొండ, వరంగల్ బస్టాండ్లు, కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్లు కిటకిటలాడాయి. హనుమకొండ బస్స్టేషన్లో బస్సులు ఎక్కేందుకు పోటీలు పడడంతో కొంత తోపులాట జరిగింది. కాజీపేట స్టేషన్ ఎంట్రెన్స్ వద్ద ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్, జనరల్ టికెట్ కౌంటర్ల వద్ద బారులుదీరారు. ప్లాట్ఫామ్ సందడిగా మారింది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ హనుమకొండ/కాజీపేట రూరల్ -
‘సూపర్ స్పెషాలిటీ’ పనులు పూర్తి చేయాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద కాశిబుగ్గ: వరంగల్లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు గడువులోగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను గురువారం ఆమె పరిశీలించారు. భవన నిర్మాణం, మౌలిక వసతులు, విద్యుత్ తదితర పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమీక్ష నిర్వహించారు. ఇందులో సూపరింటెండెంట్ రాంకుమార్రెడ్డి, ఆర్ఎంఓ అశ్విన్, ఆర్అండ్బీ ఈఈ రాజేందర్, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ ఆనందం, వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్, అధికారులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో భూసర్వే చేపట్టాలి.. ఖిలా వరంగల్: భూసర్వేను క్షేత్రస్థాయిలో సమగ్రంగా చేపట్టాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. గురువారం ఖిలావరంగల్ మండలం అల్లీపురంలో భూ రీసర్వే పనులు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ వెంట ఏడీ సర్వే అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ ఇక్బాల్ ఉన్నారు. ఆరుతడి సాగును ప్రోత్సహించాలి.. జిల్లాలో ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ సత్యశారద.. వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం వ్యవసాయ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ సమీక్షించారు. జిల్లా వ్యవసాయాధికారి విజయభాస్కర్, ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్రావు, వివిధ మండలాల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. -
ఏటా ఒకచోట వేడుకలు
డోర్నకల్: డోర్నకల్లోని బ్యాంక్ స్ట్రీట్కు చెందిన కాలా యశోధర్ జైన్కు తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు. వీరంతా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నారు. ఏటా రాఖీ పండుగను పురస్కరించుకుని అక్కాచెళ్లెళ్లలో ఒకరి ఇంటికి తమ సోదరుడిని పిలిపించుకుంటారు. అందరూ అతడికి రాఖీలు కట్టి ఆనందంగా గడుపుతారు. ఇటీవల మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరత్వాడాలోని సోదరి ఇంటికి అందరూ చేరుకుని సోదరుడు యశోధర్జైన్కు రాఖీలు కట్టి దీవెనలు అందుకున్నారు. -
‘మహాత్మా’.. మారేదెప్పుడు?
కాశిబుగ్గ: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కయిన వరంగల్ మహాత్మాగాంధీ ఆస్పత్రి (ఎంజీఎం)లో రోగులకు తిప్పలు తప్పట్లేదు. వ్యయప్రయాసలకోర్చి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సరైన వైద్యం అందట్లేదని వాపోతున్నారు. ఆస్పత్రిలోని పలు వార్డులను బుధవారం ‘సాక్షి’ పరిశీలించగా.. అనేక సమస్యలు వెలుగుచూశాయి. బుధవారం పిల్లల వార్డులో సైలెన్ బాటిల్ను గోడకు వేలాడదీసి చికిత్స అందించారు. మరోవైపు ఓ చిన్నారికి పెట్టిన సైలెన్ బాటిల్ను తల్లి చేత్తో పట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్లడం వంటి దృశ్యాలు కనిపించాయి. ఇన్ని కష్టాలకోర్చినా వార్డు సిబ్బందికి అంతో ఇంతో ముట్టజెప్పక తప్పట్లేదని వాపోతున్నారు. ఆర్థో, కార్డియాలజీ, డయాలసిస్ వార్డుతోపాటు సీఓటీలో ముడుపులు ఇవ్వాల్సి వస్తోందని రోగుల బంధువులు వాపోతున్నారు. ఆర్థ్ధోపెడిక్ విభాగంతోపాటు న్యూరో సర్జరీ విభాగంలో ప్రధాన శస్త్ర చికిత్సలను ఎప్పుడో నిలిపివేసినట్లు తెలుస్తోంది. రోగుల వెతలు ఇలా.. పర్వతగిరి మండలం కొంకపాకకు చెందిన ఓ రోగి రెండో అంతస్తులోని ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అతడికి ఎక్స్రే అవసరం ఉందని వైద్యులు చెప్పారు. నర్సింగ్ సిబ్బంది సూచన మేరకు సదరు బాధితుడిని కింద ఉన్న రేడియాలజీ విభాగంలో ఎక్స్రే విభాగానికి తీసుకెళ్లాలి. 92వ నంబర్ గదిలో ఎక్స్రే తీయించడానికి స్ట్రెచర్పై పేషెంట్ను కుటుంబ సభ్యులే తీసుకెళ్లి తిరిగి వార్డుకు తీసుకొచ్చారు. ఈ విషయమై రోగి అటెండెంట్తో మాట్లాడగా.. ‘ఏం చేయాలి సార్, ఎక్స్రే కోసం తీసుకెళ్లడానికి ఎవరూ రావట్లేదు. మేమే కష్టాలు పడుతూ తీసుకెళ్లి తిరిగి తీసుకొస్తున్నాం’ అంటూ వాపోయారు. పేషెంట్ను రోడ్డుపై వదిలేశారు.. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న రోగుల అవసరాన్ని బట్టి టుడీ ఇకో కోసం ఆస్పత్రి అంబులెన్స్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్ష చేయించి తిరిగి ఎంజీఎం ఆస్పత్రికి తీసుకురావాలి. బుధవారం శివనగర్కు చెందిన ఓ రోగికి సూపర్ ఆస్పత్రిలో టుడీ ఇకో చేయించి, ఎంజీఎం వద్ద రోడ్డుపై వదలేసి వెళ్లారు. దీంతో పేషెంట్ అటెండెంట్ గత్యంతరం లేక ఎండలో స్ట్రెచర్పై పడుకోబెట్టిన పేషెంట్ను తానే నెట్టుకుంటూ వార్డుకు తీసుకెళ్లాడు. దీనిపై అటెండెంట్ మాట్లాడుతూ.. ‘సర్కార్ దవాఖానలో ఇట్లా ఉంది. అంబులెన్స్లో తీసుకెళ్లిన తర్వాత అక్కడ రూ.50 తీసుకున్నారు. ఇక్కడ ఏమీ ఇవ్వలేదని రోడ్డుపై వదిలేశారు’ అని తెలిపారు. రోగిని ఆర్థో వార్డుకు తీసుకెళ్తున్న అటెండెంట్ఎంజీఎంలో అడుగడుగునా రోగులకు కష్టాలు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం ప్రజాప్రతినిధుల పట్టింపు కరువు ‘సాక్షి’ పరిశీలనలో పలు సమస్యలు వెలుగులోకి..ఆపదలో ఆదుకునే 108 అంబులెన్స్లో తరచూ పేషెంట్లను అత్యవసర చికిత్స కోసం క్యాజువాలిటికి తీసుకొస్తారు. వాహనం నుంచి ఆస్పత్రిలో చేర్పించేందుకు ఎంజీఎం ఆస్పత్రికి సంబంధించిన పేషెంట్ కేర్, వార్డుబాయ్లు సహాయం చేయడానికి రారనే ఆరోపణలున్నాయి. ఇలా చెప్పుకుంటే పోతే ఏ వార్డులో చూసినా సమస్యలు తాండవిస్తున్నట్లు రోగులే చెబుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు నిత్యం ఓపీ సమయాల్లో రౌండ్లు వేయాలని, ప్రతీ వార్డుపై పర్యవేక్షణ పెంచాలని పలువురు కోరుతున్నారు. నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.. ఎంజీంఎం ఆస్పత్రి పేషెంట్ల సేవల విషయంలో ఎవరు నిర్లక్ష్యం చేసినా చర్యలు తీసుకుంటాం. అయితే క్యాజువాలిటీతో పాటు వార్డుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తే వారి గురించి భయపడకుండా నేరుగా ఫిర్యాదు చేయాలి. 108 అంబులెన్స్లో చికిత్స కోసం తీసుకొచ్చే సిబ్బందితో పాటు ఎంజీఎం సిబ్బంది కూడా సహకరించి, సేవలందించాలి. పేషెంట్ల వద్ద నుంచి ఎవరు డబ్బులడిగినా సహించేది లేదు. పేషెంట్ల సేవలు మెరుగుపర్చడం, అసంపూర్తి పనులన్నింటినీ దశలవారీగా పూర్తి చేస్తాం. – డాక్టర్ రాంకుమార్రెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ -
జనవరిలో పనులకు శ్రీకారం
సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ ‘మామునూరు ఎయిర్పోర్ట్’కు ఏళ్లుగా పట్టిన గ్రహణం వీడనుంది. ఇప్పటికే కార్యాలయం, అభివృద్ధి పనుల కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) రూ.496.86 కోట్లతో అంచనాలు వేసింది. విమానాశ్రయ నిర్మాణం కోసం రూ.203.49 కోట్లతో పిలిచిన టెండర్ పనులు జనవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే జనవరిలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా భూమిపూజ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఏఏఐ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల వేళ మామునూరు విమానాశ్రయ నిర్మాణంలో కేంద్రం కీలకపాత్రపై చర్చ జరిగేలా చేసి, అనుకూలంగా మలుచుకునేందుకు ఉపయోగపడుతోందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదేవిధంగా పీఎం మిత్ర కింద ఎంపిక చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు దశల వారీగా విడుదల చేస్తున్న నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రధాని మోదీ స్పీచ్లో చర్చకు వచ్చేలా చూసి, వరంగల్ నగర ఓటరు నాడిని పట్టుకోవాలనుకుంటోంది. స్మార్ట్సిటీ నిధుల విషయమై కూడా చర్చ పెట్టడం ద్వారా వరంగల్ నగర అభివృద్ధిలో కేంద్రం మార్క్ ఉందనడం ద్వారా పార్టీకి రాజకీయంగా కలిసొచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పటికే వరంగల్ నగరం వేదికగా అధికార కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన అసంతృప్తి జ్వాలలు కూడా ఆ పార్టీకి నష్టం కలిగించే సమయంలోనే తమకు లాభించే అవకాశముందని బీజేపీ లెక్కలు వేసుకుంటోంది. ఏదిఏమైనా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాదిరిగానే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ను కై వసం చేసుకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తమ ప్రభావాన్ని చూపాలనుకుంటోంది. విమానాశ్రయ నిర్మాణం కోసం భూమి సేకరించి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వమైన కాంగ్రెస్ పార్టీ దీన్ని ఓన్ చేసుకోవడంలో విఫలమవుతుండడం కూడా బీజేపీకి ప్లస్గా మారిందనే చర్చ రాజకీయ పార్టీల్లో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్లో కుమ్ములాటలు లాభిస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఏఏఐ ఏం చేయనుందంటే.. ఈనెల 18న టెక్నికల్ బిడ్ ఓపెన్ చేయగా, సెప్టెంబర్ 7వ తేదీన ఫైనాన్షియల్ బిడ్ను తెరవనున్నట్లు ఇప్పటికే జూన్లో పిలిచిన టెండర్ నోట్లో పేర్కొన్నారు. ఇప్పటికే పర్యావరణ అనుమతుల ప్రక్రియ సాగుతోంది. జనవరిలో ఈ నిర్మాణ పనులు మొదలై 15 నెలల్లో పూర్తి చేసే అవకాశముంది. మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవరాల్, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ సహా మరికొన్ని నిర్మాణాలకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ భూమి పూజకు ఏఏఐ సన్నాహాలు గ్రేటర్ ఎన్నికల వేళ భూమిపూజతో వరంగల్లో చర్చ పీఎంమిత్ర టెక్స్టైల్ పార్కు, స్మార్ట్సిటీ అభివృద్ధిపై కూడా ప్రచారం -
మత సామరస్యం పెంపొందించాలి
ఖిలా వరంగల్: మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి శాంతి, ప్రేమ, కరుణ, సోదరభావం, మానవతా విలువలు బోధించారని, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, కుల, మత సామర్యాన్ని పెంపొందించాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం వరంగల్ పోచమ్మ మైదాన్ ప్రాంతం, ఉర్సు కరీమాబాద్లోని హజరత్ మాషూక్ ఏ రబ్బానీ దర్గాలో పీఠాధిపతులు ఉబేద్బాబా, నవీద్బాబా ఆధ్వర్యంలో వేర్వేరుగా వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి సురేఖ హాజరై మాషూక్ రబ్బానీ దర్గాను దర్శించుకునే భక్తులకు కోసం నిర్మించిన విశ్రాంతి గదులను ప్రారంభించారు. అనంతరం దర్గాను దర్శించుకుని ఖీర్ పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. మిలాద్ ఉన్ నబీ పర్వదినం ప్రజలందరిలో ప్రేమ, సోదరభావం, మానవతా దృక్పథాన్ని మరింతగా పెంపొందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాశ్, కాంగ్రెస్ నేత గోపాల నవీన్రాజు, ఎంఏ జబ్బార్, మహమ్మద్ ముక్దుమ్, నాగపూరి కల్పన, సంజయ్బాబు తదితరులు పాల్గొన్నారు. మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ -
ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగం
నిట్ వరంగల్లోని ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనలకు సప్తగాన్ ఏషియా వాహన పనితీరు తోడ్పడుతుంది. మెరుగైన రహదారులు, రవాణా సౌకర్యం నిర్మాణానికి ఆయా ప్రదేశాల డేటా అవసరం. అలాంటి డేటాను సప్తగాన్ అందజేస్తుంది. నేషనల్ హైవేలో నిర్మించే రహదారులపై అవసరమైన సూచనలు, పరిశీలన వివరాలను భారత ప్రభుత్వం.. నిట్ వరంగల్నుంచి కోరుతోంది. అలాంటి పరిశీలనలకు సప్తగాన్ ఏషియాతో ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుంది. – శంకర్, సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, సప్తగాన్ ఏషియా కో–ఆర్డినేటర్ ● -
బంజారాల సంస్కృతికి ప్రతీక తీజ్
హసన్పర్తి: బంజారాల సంస్కృతీ, సంప్రదాయానికి ప్రతీక తీజ్ అని ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి అన్నారు. గోపాలపురంలోని బంజారా సేవాసమితి ఆధ్వర్యంలో బాలాజీనగర్లో నిర్వహిస్తున్న తీజ్ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజనుల ఆచారాలు, పండుగలు ప్రత్యేకతను చాటుతాయన్నారు. సేవా లాల్ మహరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీని సత్కరించారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ వెంకన్న, పీఆర్టీయూ నాయకులు తిరుపతిరెడ్డి, ఈదునూరి రవీందర్రెడ్డి, పి.శ్రీహరి, మహేందర్, కామిడి సతీ శ్రెడ్డి, పరిపూర్ణచారి, బిల్లా రఘునాథ్, కృష్ణ, వెంకటేశ్వర్లు, సుధాకర్, సేవాలాల్ సంఘం అధ్యక్షుడు రామెల్ నాయక్, రాజారామ్ నాయక్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి -
గురువారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2026
కాజీపేట అర్బన్ : ‘నా దారి రహదారి.. బెటర్ డోంట్ కమిన్ టు మై వే’ అనే సినిమా డైలాగ్ను తలపిస్తూ ‘మెరుగైన రహదారుల నిర్మాణానికి అవసరమైన డేటా అందించడమే నా దారి’ అంటూ ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన సప్తగాన్ వాహనం ఇటీవల నిట్ వరంగల్కు చేరుకుంది. భారతదేశంలోనే తొలిసారిగా హరియాణా, గురుగ్రామ్లో అడ్వాన్స్ టెక్నాలజీ, రూ.30 కోట్ల వ్యయంతో దీన్ని రూపొందించారు. నిట్తో ఎంఓయూ..ఆధునిక టెక్నాలజీతో రూపకల్పన మెరుగైన రహదారుల నిర్మాణంలో కీలకం నిట్ వరంగల్తో ఎంఓయూ.. ఇటీవల పనితీరును పరిశీలించిన విద్యార్థులు ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనకు ఉపయుక్తంమెరుగైన రవాణా సౌకర్యం, రహదారుల నిర్మాణాల్లో లోపాన్ని పసిగట్టడం, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ పరిశోధనలకు దేశవ్యాప్తంగా ఈ సప్తగాన్ ప్రయాణం చేస్తోంది. ఇందులో మన ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు ఇటీవల సప్తగాన్ ఏషియా సంస్థ నిర్వాహకులు, నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. భారత ప్రభుత్వం వికసిత్ భారత్, మేక్ ఇన్ ఇండియా విజన్లో భాగంగా ఈ వాహనాన్ని ఇక్కడికి తీసుకురాగా, వాహన పనితీరును విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. వాహన పనితీరుపై పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పర్చుకున్నారు. -
చర్చల అంశాలను అమలు చేయాలి
హన్మకొండ : సమ్మె సందర్భంగా కార్మిక సంఘాల జేఏసీతో ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్చల్లో అంగీకరించిన అంశాలను అమలు చేయాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి.హెచ్.రాంచందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. ఈ దీక్షలను సి.హెచ్.రాంచందర్, సీఐటీయూ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు మెట్టు రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చర్చల సందర్భంగా అంగీకారం తెలిపిన అంశాలను అమలు చేయాలని ఎన్ని సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం, యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. దీక్షల్లో ఎస్డబ్ల్యూఎఫ్ వరంగల్ రీజియన్ అధ్యక్షుడు టి.ఎల్ల య్య, సెక్రటరీ ఉపేంద్రాచారి, నాయకులు శ్రీనివాస్, మహేందర్, కృష్ణమూర్తి, సమ్మయ్య, జగన్మోహన్, జమాలుద్దీన్, సంపత్, అంజయ్య, బాబు, ఓదెలు, అరుణకుమారి, రామారావు, మోహన్, వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు. ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంచందర్ -
రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ వరంగల్ లీగల్: రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించేందుకు లోక్ అదాలత్ చక్కని అవకాశమని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారి సంస్థ చైర్పర్సన్ వీబీ నిర్మలా గీతాంబ తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయసేవా సదనం బిల్డింగ్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సెప్టెంబర్ 12న (శనివారం) జిల్లా కోర్టు, నర్సంపేట కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ న్యాయవాదులతో కలిసి కేసులను సత్వరమే పరిష్కరించుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చకిలం ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి ఆచార్య గడ్డం వెంకన్న హన్మకొండ కల్చరల్: జానపద సాహిత్య అధ్యయనానికి ప్రత్యేక గౌరవం లభించిందని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠం ఆచార్య గడ్డం వెంకన్న అన్నారు. 2025 సంవత్సరానికి జానపద సాహిత్య పరిషత్ హైదరాబాద్ వారు ప్రదానం చేసే జానపద విజ్ఞాన సాఫల్య పురస్కారానికి జిల్లాలోని తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బాసని సురేశ్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం హంటర్రోడ్డులోని విజ్ఞానపీఠంలో జరిగిన కార్యక్రమంలో పీఠాధిపతి ఆచార్య గడ్డం వెంకన్న, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సిబ్బంది సురేశ్ను శాలువాతో సన్మానించి అభినందించారు. పీఠం అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ శ్రీమంతుల దామోదర్, డాక్టర్ చూరేపల్లి రవికుమార్, అబ్బు గోపాల్రెడ్డి, డాక్టర్ గంపా సతీశ్, పరిశోధకుడు సోనబోయిన సతీశ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఒకరి నేత్రదానం.. ఇద్దరికి కంటి చూపు
కాశిబుగ్గ: మనిషి మరణించాక నేత్రదానం చేస్తే మరో ఇద్దరికి కంటి చూపు వస్తుందని ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రవిశేఖర్ అన్నారు. వరంగల్లోని కంటి దవాఖానలో మంగళవారం 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనిషి మరణించిన తర్వాత కళ్లను దానం చేస్తే మరో ఇద్దరికి కంటి వెలుగు వస్తుందని తెలిపారు. రెండు వారాల పాటు నేత్రదానంపై అవగాహన కల్పించనున్టన్లు పేర్కొన్నారు. వైద్యశాల డాక్టర్లు, సిబ్బంది ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లు, పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యా కళాశాలలో నేత్రదానం ఆవశ్యకతపై పలు కార్యక్రమాలు చేపడుతామని ఆయన వివరించారు. వైద్యులు హరిదేవ్, చంద్రభాను, అర్చన, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. కాజీపేట/కాశిబుగ్గ/హన్మకొండ అర్బన్: ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లు, అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్లలో పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాజీపేట, ములుగురోడ్డులోని హనుమకొండ ఐటీఐల ప్రిన్సిపాళ్లు పొన్నాల వేణు, సురేందర్ మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. విద్యార్థులు iti. telangana.gov.inలో సెప్టెంబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని వారు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 5 వరకు సంబంధిత కళాశాలలకు హాజరై ధ్రువీకరణ పూర్తి చేసుకోవాలని ప్రిన్సిపాళ్లు కోరారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీగా బయోటెక్నాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ శాస్త్రిని నియమిస్తూ రిజిస్ట్రార్ రామచంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు స్పోర్ట్స్బోర్డు సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించిన వై.వెంకయ్య నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం శాస్త్రి బయోటెక్నాలజీ విభాగం అధిపతిగా, బీఓఎస్గా, ఫారిన్రిలేషన్స్ ఆఫీసర్గా, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెల్లోగా కొనసాగుతున్నారు. వీసీ ప్రతాప్రెడ్డి చేతుల మీదుగా ఆయన ఉత్తర్వుల కాపీ అందుకున్నారు. హన్మకొండ అర్బన్ : ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల పథకం అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన హనుమకొండ డీఆర్డీఓ రిసోర్స్పర్సన్ సంగ సంతోష్కు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలశాఖ అవార్డు లభించింది. ఢిల్లీలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. శ్రీప్రియకు సేవానంది పురస్కారంఖిలా వరంగల్: వరంగల్ ఎరువుల నియంత్రణ ప్రయోగశాలలో అగ్రికల్చర్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న కొత్త శ్రీప్రియకు నందిసేవా పురస్కారం లభించింది. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్కు చెందిన గ్లోబల్ కల్చరల్, యోగా, విద్యా ఫౌండేషన్ బాధ్యులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ త్యాగరాయ గానసభలో ఆమెకు పురస్కారాన్ని అందజేశారు. కాళోజీ సెంటర్: తెలంగాణ బయోలాజికల్ సైన్స్ ఫోరం (టీబీఎస్ఎఫ్) జిల్లా శాఖ రూపొందించిన ఆన్లైన్ బ్లాగ్ను మంగళవారం డీఈఓ రంగయ్యనాయుడు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి పి.సురేష్ బాబు, ఫోరం జిల్లా అధ్యక్షుడు చిప్ప పరమేశ్వర్, ప్రధాన కార్యదర్శి గోనెల రమేశ్, కోశాధికారి గుమ్మడి రాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచ వాణిజ్యానికి సౌకర్యకర్త
కస్టమ్స్ విభాగం.. ఖిలా వరంగల్: కస్టమ్స్ విభాగం కేవలం పన్నులు వసూలు చేసే సంస్థ స్థాయి నుంచి ప్రపంచ వాణిజ్యానికి సౌకర్యకర్తగా మారిందని కస్టమ్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ అదనపు కమిషనర్ పి. సతీశ్(ఐఆర్ఎస్) పేర్కొన్నారు. మంగళవారం వరంగల్ బస్టాండ్ రోడ్డులోని ఎం.కె. నాయుడు హోటల్ అండ్ కన్వెన్షన్ హాల్లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ), వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంయుక్త ఆధ్వర్యంలో ఎగుమతులపై అవగాహన సదస్సు నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం దాదాపు 90శాతం దిగుమతి సరుకులను ఎలాంటి జోక్యం లేకుండా సజావుగా క్లియర్ చేస్తున్నామని తెలిపారు. అనంతరం ఫిక్కీ సీనియర్ కన్సల్టెంట్ పి.ఎస్ పృథ్వీ మాట్లాడుతూ ఏటీఏ కార్నెట్ అంతర్జాతీయ ప్రదర్శనలు, వాణిజ్య కార్యక్రమాలకు తీసుకెళ్లే వస్తువులకు పాస్పోర్ట్గా పనిచేస్తుందని వివరించారు. ఫిక్కీ డైరెక్టర్ ఎస్. విజయలక్ష్మి మాట్లాడుతూ ఏటీఏ కార్నెట్, టీఐఆర్ వ్యవస్థలకు సంబంధించి పత్రాలు, హామీల జారీ విషయంలో ఫిక్కీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వరంగల్ చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ నుంచి వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులకు విస్తృత అవకాశాలున్నాయన్నారు. ప్రధానంగా మిర్చి, మామిడి వంటి ఉత్పత్తులకు ఆగ్నేయాసియా మార్కెట్లో డిమాండ్ ఉందన్నారు. చాంబర్ కార్యదర్శి ఎం.వేద ప్రకాశ్, వ్యాపారులు, ఎగుమతిదారులు పాల్గొన్నారు. ఆ డిపార్ట్మెంట్ హైదరాబాద్ అదనపు కమిషనర్ సతీశ్ -
వ్యవసాయ మార్కెట్ కమిటీ పలు తీర్మానాలు
ఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చైర్పర్సన్ ఎర్ర ప్రియాంక అధ్యక్షతన మంగళవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అనేక సమస్యలపై కమిటీ చర్చించి తీర్మానాలు చేసింది. అవి ఇలా ఉన్నాయి. ఏనుమాముల మార్కెట్ యార్డు అనుబంధం పర్వతగిరి, షోడశపల్లి సబ్ యార్డుల్లో గోదాముల నిర్మాణానికి, కలెక్టర్ ఆదేశాల ప్రకారం ముసలమ్మకుంట నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూమి అప్పగించడం , పండ్ల మార్కెట్ నిర్మాణానికి 30 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించడం, తదితర అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు చేశామని చైర్పర్సన్ తెలిపారు. వైస్ చైర్మన్ బండి జనార్దన్, సభ్యులు గజ్జెల శ్యామ్, రాజు, పూర్ణచందర్, వాసుదేవారెడ్డి, భిక్షపతి, నర్సింహ నాయక్, రుద్రప్రసాద్, ప్రదీప్ కుమార్, సంపత్, సబేర, నాగరాజు పాల్గొన్నారు. -
ఉండేదెవరు.. పోయేదెవరు?
సాక్షిప్రతినిధి, వరంగల్: ఓటర్ల జాబితాలో ఉండేదెవరు? పోయేదెవరు? అన్నది తేల్చేందుకు రంగం సిద్ధమైంది. ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా జాబితాలో గుర్తించిన వివిధ కేటగిరీల ఓటర్లపై రేపటి (27వ తేదీ) నుంచి విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే గుర్తించిన అస్పష్ట వివరాలున్న ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న వారి నుంచి వివరణ తీసుకుని, అవసరమైన ఆధారాలను పరిశీలించిన అనంతరం తుది ఓటర్ల జాబితాలో ఎవరిని కొనసాగించాలి? ఎవరిని తొలగించాలి? అనేది అధికారులు నిర్ణయించనున్నారు. జూన్ 10 నాటికి ఉమ్మడి వరంగల్లో 30,53,238 మంది ఓటర్లు ఉండగా.. ఆగస్టు 17 నాటి ముసాయిదా జాబితాలో ఆ సంఖ్య 26,77,498కు తగ్గింది. అంటే 3,75,740 ఓట్లు.. 12.30 శాతం తగ్గాయి. నోటీసులు.. విచారణ.. తేలేదెవరు.. ఓటర్లకు నోటీసులు జారీ చేసి.. వారు అదే చిరునామాలో నివసిస్తున్నారా? ఓటరుగా కొనసాగేందుకు అర్హత ఉందా? ఇప్పటికే మరోచోట ఓటరుగా నమోదయ్యారా? అని అధికారులు ఈనెల 27 నుంచి విచారణ చేయనున్నారు. శాశ్వతంగా తరలివెళ్లినట్లు గుర్తించిన వారి విషయంలో చిరునామా, ప్రస్తుత నివాసం తదితర వివరాలను పరిశీలించనున్నారు. చనిపోయినవారి వివరా లను సంబంధిత రికార్డులతో సరిపోల్చనున్నారు. ఆన్ ట్రెసబుల్/ఆబ్సెంట్ కేటగిరీలో ఉన్నవారి విషయంలో క్షేత్రస్థాయి విచారణ కీలకం కానుంది. మరోవైపు జాబితాలో కొనసాగుతున్నప్పటికీ అనామలీస్ ఉన్నట్లు గుర్తించిన ఓటర్లపైనా విచారణ జరగనుంది. ఉమ్మడి వరంగల్లో ఇలాంటి వారు 4,83,803 మంది ఉన్నారు. అలాగే 1,61,935 మంది ఓటర్లకు నో మ్యాపింగ్ ఉన్నట్లు గుర్తించారు. మరోచోట ఇప్పటికే ఓటరుగా నమోదైన 47,177 మంది కూడా కీలక కేటగిరీలో ఉన్నారు. సంబంధిత ఆధారాలు, చిరునామా, ఓటరు వివరాలు పరిశీలించిన తర్వాతే వీరిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అప్పీల్కు ప్రత్యేక సెల్.. సెప్టెంబర్ 20 నాటికి ప్రక్రియ పూర్తి.. తమ పేరు తొలగించే అవకాశం ఉందని భావించే వారు, అధికారుల నిర్ణయంపై అభ్యంతరం ఉన్నవారు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్లు వినియోగించుకోవచ్చు. కాగా, నోటీసులు, విచారణ, అభ్యంతరాలు, అప్పీళ్ల ప్రక్రియను సెప్టెంబర్ 20 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అనంతరం తుది జాబితా రూపకల్పన దిశగా ముందుకు వెళ్లనున్నారు. తుది జాబితాతోనే అసలు లెక్క ప్రస్తుతం ఉన్నవి ముసాయిదా జాబితా గణాంకాలు మాత్రమే. విచారణలో అర్హత నిర్ధారణ అయితే కొందరు ఓటర్లు తుది జాబితాలో తిరిగి చేరవచ్చు. సరైన ఆధారాలు లేకపోవడం, మర ణం, శాశ్వత వలస, డూప్లికేట్ నమోదు తదితరాలు నిర్ధారణ అయితే మరికొందరి పేర్లు తొలగిపోవచ్చు. అందుకే ప్రస్తుతం కనిపిస్తున్న 3.75 లక్షల తగ్గింపు తుది సంఖ్య కాదు. విచారణ, నోటీసులు, క్లెయిమ్లు–అభ్యంతరాలు, అప్పీళ్ల తర్వాతే ఉమ్మడి వరంగల్లో తుది ఓటర్ల సంఖ్యపై స్పష్టత రానుంది. ఈనెల 27 నుంచి జరిగే విచారణతో ఈ ప్రశ్నకు సమాధానం మొదలు కానుంది. సెప్టెంబర్ 20 నాటికి పూర్తయ్యే ప్రక్రియతో వివిధ కేటగిరీల్లోని ఓటర్లలో ఎవరు జాబితాలో ఉంటారు? ఎవరి పేర్లు తొలగుతాయి? అన్నదానిపై స్పష్టత రానుంది. చనిపోయింది 79,275తగ్గిన ఓటర్లు 3,75,740ఆన్ట్రెసబుల్ 14,362వలసవెళ్లింది 2,34,122ఇతర కేటగిరీ 804మరోచోట నమోదు 47,177 అనామలీస్, డూప్లికేట్, వలస ఓటర్లు, ఆన్ట్రెసబుల్కు నోటీసులు రేపటి నుంచి అధికారుల విచారణ -
ఆరు లేన్లతో... మరింత వేగం!
సాక్షి, వరంగల్: హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి... రెండు నగరాల మధ్య రాకపోకలకు కీలకమైన కారిడార్. పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు విస్తరిస్తుండడం.. నగరాల చుట్టూ జనాభా, వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో ఈ మార్గంపై రద్దీ కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు లేన్లుగా ఉన్న రహదారిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆరు లేన్లుగా విస్తరించాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్–యాదగిరిగుట్ట సెక్షన్లో 35.65 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారిని ఆరు లేన్లుగా మార్చేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి కన్సల్టెన్సీ టెండర్ పిలిచింది. ఇదీ వరంగల్కు పరోక్ష ప్రయోజనం.. నాలుగు లేన్ల రహదారిపై వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ ఓవర్ టేకింగ్, లేన్ మార్పులు, జంక్షన్ల వద్ద రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. ఆరు లేన్లుగా విస్తరిస్తే వాహనాలకు అదనపు లేన్ సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది. ఫలితంగా రద్దీని మెరుగ్గా నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలనుంచి యాదగిరిగుట్ట, జనగామ, వరంగల్ వైపు నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులకు ప్రయోజనం కలగవచ్చు. హైదరాబాద్– యాదగిరి భాగం ఆరు లేన్లుగా అభివృద్ధి చెందితే హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వచ్చే మొత్తం కారిడార్ సామర్థ్యం పెంచే దిశలో ఇది ఒక ముఖ్యమైన కీలక అడుగుగా మారనుంది. పారిశ్రామిక ప్రాంతాలకు సరకు రవాణా, వ్యాపార వాహనాల రాకపోకలు, అంతర్నగర ప్రయాణాలకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రావడానికి దోహదపడే అవకాశం ఉంది. భవిష్యత్లోనూ యాదగిరి నుంచి వరంగల్ రహదారి కూడా ఆరు లేన్ల విస్తరణకు అవకాశముంది. హైదరాబాద్–వరంగల్ కారిడార్కు పెరగనున్న సామర్థ్యం హైదరాబాద్–యాదగిరిగుట్ట వరకు 35.65 కి.మీ. విస్తరణకు డీపీఆర్ టెండర్ రాబోయే రోజుల్లో యాదగిరిగుట్టనుంచి వరంగల్ రహదారి విస్తరణకు చాన్స్ -
హాస్టల్ యజమానులకు టోకరా..
వరంగల్ క్రైం: అతను చేసేది హైదరాబాద్లో సె క్యూరిటీ గార్డు ఉద్యోగం. కానీ, చేసేది సైబర్ నేరాలు. ఫోన్లో ప్రముఖ ఐటీ కంపెనీ ప్రతినిధిగా తనను తాను పరిచయం చేసుకుని, ఉద్యోగులకు ఆ హారం సరఫరా చేసే క్యాటరింగ్ కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మించి హాస్టల్ యజమానులను మోసం చేస్తున్న అంతర్ జిల్లా సైబర్ మోసగాడిని హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. మంగళవారం సాయంత్రం కమిషనరేట్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మలక్పల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ షబ్బీర్ అలి యాస్ కిరణ్కుమార్, అలియాస్ శ్రీకాంత్రెడ్డి, అలి యాస్ నర్సింహారెడ్డి, అలియాస్ నరేందర్రెడ్డి పేర్లతో చలామణి అవుతున్నాడని తెలిపారు. అతను హైదరాబాద్లో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేస్తూ.. సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో సైబర్ నేరాలని ప్రవృత్తిగా ఎంచుకున్నట్లు చెప్పా రు. సెల్నంబర్లు మార్చుతూ హాస్టల్ యజమానులను లక్ష్యంగా చేసుకుని హాస్టల్ బోర్డులపై ఉన్న మొబైల్ నంబర్లను సేకరించి, వివిధ నంబర్ల ద్వారా వాటి యజమానులను సంప్రదించేవాడని చెప్పారు. తాను ప్రముఖ కంపెనీ ఉద్యోగి, ప్రతినిధినని పరిచయం చేసుకుని, ఆ కంపెనీ ఉద్యోగులకు ఆహారం క్యాటరింగ్ కాంట్రాక్టులు ఇప్పిస్తానని, ఇందుకు ప్రాసెస్ ఉంటుందని నమ్మించి డబ్బులు నేరుగా అకౌంట్లో వేయించుకునేడవా డని వివరించారు. హనుమకొండ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుతో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా రాష్ట్రవ్యాప్తంగా 23 కేసుల్లో ఇతని ప్రమేయం ఉన్నట్లు తేలిందన్నారు. కేసులు ఇలా... వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హనుమకొండలో 3, కేయూసీ – 2, సుబేదారి–1, మిల్స్కాలనీ – 1, మట్టెవాడ –1, సీసీపీఎస్–1, జనగా మ– 1 మొత్తం 10 కేసులు నమోదైనట్లు ఆమె తెలి పారు. ఈ కేసుల్లో రూ.22.44లక్షలు కొల్ల గొట్టగా పోలీసులు రూ.11,33,511లను బ్యాంకుల్లో పుట్ ఆన్హోల్డ్ చేసినట్లు సీపీ తెలిపారు. దీంతోపాటు ఖమ్మం జిల్లాలో 3, నిర్మల్లో 1, నిజామాబాద్లో 1, కరీంనగర్లో 1, హైదరాబాద్లో 1 కేసులో రూ. 10,89,950 కొల్లగొట్టగా, బ్యాంకుల్లో రూ.1,07, 146లను పుట్ ఆన్హోల్డ్ చేసినట్లు ఆమె తెలిపారు. నిందితుడికి మరో 6 కేసుల్లో ప్రమేయం ఉందని, అందులో రూ.3,65,050 కొల్లగొట్టగా రూ.68,430 లను పుట్ఆన్హోల్డ్ చేసినట్లు సీపీ వివరించారు. నిందితుడినుంచి 3 మొబైల్ఫోన్లు, 3 సిమ్ కార్డులు, 2 బ్యాంకు పాస్బుక్లు, ఒక చెక్బుక్, 2 ఏటీఎం కార్డులు, డైరీని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన హనుమకొండ ఏసీపీ నరసింహారావు, ఇన్స్పెక్టర్ శివకుమార్, సిబ్బందిని సీపీ అభినందించారు. సీపీ వెంట డీసీపీ దార కవిత ఉన్నారు. క్యాటరింగ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని మోసం పలు పేర్లతో చలామణి.. రాష్ట్ర వ్యాప్తంగా 23 కేసులు నిందితుడి అరెస్ట్.. వివరాలు వెల్లడించిన వరంగల్ సీపీ -
బెటాలియన్ కానిస్టేబుళ్లపై దాడి పట్టదా?
వరంగల్ క్రైం/ఖిలావరంగల్: వరంగల్ మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉర్సుగుట్ట వద్ద ఓ బార్అండ్ రెస్టారెంట్ ఎదుట ఇద్దరు 4వ బెటాలియన్ కానిస్టేబుళ్లపై జరిగిన దాడిలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం సోషల్ మీడియాలో మరో వీడియో వైరలైంది. ఇద్దరు బార్ ఉద్యోగులు బెటాలియన్ కానిస్టేబుళ్లపై కర్రలతో చేసిన దాడి ఒళ్లు జలదిరించేలా ఉంది. అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్న కానిస్టేబుల్ను మరోసారి ఒకరు పట్టుకుంటే మరొకరు కర్రతో దాడి చేయడం వీడియోలో స్పష్టంగా ఉంది. ఈ ఘటన ఈనెల 19న రాత్రి 9.45 గంటలకు జరిగినా మంగళవారం వరకు బార్ ఉద్యోగులపై కేసు నమోదు చేయలేదు. కానీ, మిల్స్కాలనీ బీట్ కానిస్టేబుల్ సంతోష్రెడ్డి ఫిర్యాదు మేరకు బార్ అండ్ రెస్టారెంట్ ఉద్యోగుల చేతిలో, ఆ కానిస్టేబుల్ దాడిలో తీవ్రస్థాయిలో దెబ్బలు తిన్న బెటాలియన్ కానిస్టేబుళ్లపై మాత్రం రాత్రికి రాత్రే కేసు నమోదు చేయడం గమనార్హం. దాడిలో గాయపడిన వారిలో ఒకరు మద్యం మత్తులో ఉండగా మరో కానిస్టేబుల్ సాధారణంగా ఉన్నట్లు తెలిసింది. మిల్స్కాలనీ బీట్ కానిస్టేబుల్ సంతోష్రెడ్డిని చెంపపై ఒక దెబ్బ కొడితేనే పోలీస్ అధికారులు కేసు నమోదు చేసినప్పడు ఆ కానిస్టే బుల్తోపాటు మరో ఇద్దరు విచక్షణారహితంగా కర్రలతో దాడి చేసినా ఎందుకు కేసు నమోదు చేయలేదు..? అన్న ప్రశ్నకు సమాధానం కరువైంది. సదరు బార్అండ్రెస్టారెంట్ యజమానితోపాటు మద్యం మాఫియాలు రంగంలోకి దిగి పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం సాగుతోంది. కాగా, టీజీ కానిస్టేబుల్పై బీట్ కానిస్టేబుల్ జరిపిన దాడి మిషయంపై శాఖాపరమైన విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఈనెల 19న రాత్రి మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దాడిలో బెటాలియన్ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయని డీసీపీ దార కవిత మంగళవారం తెలిపారు. బాధితులను పిలిచి ఫిర్యాదు చేయాలని కోరగా స్పందించలేదని చెప్పారు. అందుకే కేసు నమోదు చేయలేదని, మంగళవారం సుమోటో కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.కేసు నమోదులో జాప్యం సుమెటోగా కేసు పెట్టామన్న డీసీపీ తాజాగా మరో వీడియో వైరల్ -
పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి లోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈనెల 29న నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదావేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ తెలిపారు. మిగతావి షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరుగుతాయని తెలిపారు. 29న వాయిదా వేసిన ఆ పరీక్షలు మళ్లీ సెప్టెంబర్2న నిర్వహించనున్నామని పేర్కొన్నారు. హైకోర్టు ప్రాసెస్ సర్వర్ పరీక్షల నేపథ్యంలో 29న జరగాల్సి న పరీక్షలను వాయిదావేశామని తెలిపారు. పూర్తి వివరాలకు కేయూ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. కాకతీయ.ఏసి.ఇన్లోచూడాలన్నారు. ఉత్తమ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంగా అనితకాశిబుగ్గ : వరంగల్ లేబర్కాలనీలోని ప్రభుత్వ గ్రేయిన్ మార్కెట్ పాఠశాల హెచ్ఎం కుమ్మరి అని త రాష్ట్రస్థాయి ఉత్తమ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంగా ఎంపికై ంది. పాఠశాల సముదాయంలోని అన్ని పా ఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందిండంతో పాటు సమర్థవంతమైన అడ్మినిస్ట్రేషన్ అందించడం, అంకితభావంతో అందించిన సేవలను గుర్తించి ఉత్తమంగా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణి, కమిషనర్ అండ్ డైరెక్టర్ నవీన్ నికోలస్లు ఆమెకు ప్రశంసపత్రం అందజేసి ఘనంగా సన్మానం చేశారు. మంగళవారం పాఠశాలలో రిటైర్డు ఎంఈఓ గంప అశోక్కుమార్తోపాటు ఉపాధ్యాయులు సత్కరించారు. ● జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న వరంగల్ అర్బన్: నగరానికి అందం.. పర్యావరణానికి ప్రాణం మొక్కలే అని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న అన్నారు. వనమహోత్సవంలో భాగంగా మంగళవారం వరంగల్ తోట మైదానంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మొక్కలు నాటుదాం.. వరంగల్ను పచ్చని నగరంగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. మాజీ కార్పొరేటర్ బస్వరాజ్ కుమారస్వామి, సీహెచ్ఓ లక్ష్మారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణను పటిష్టం చేయాలి.. పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్టం చేయాలని కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. నగరంలోని పలు డివిజన్లలో ఆయన పర్యటించి చెత్త సేకరణ, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మోడల్ డివిజన్గా ఎంపిక చేసిన 13వ డివిజన్న్లోని శ్రీనివాసకాలనీ, నవయుగ కాలనీలో పర్యటించిన కమిషనర్ ఇంటింటా తడిపొడి చెత్త సేకరణ తీరును పరిశీలించారు. శానిటరీ సూపర్వైజర్ గోపాల్, శానిటరీ ఇనన్స్పెక్టర్ ప్రశాంతి, ఎంహెచ్ఓ రాజేశ్ ఉన్నారు. -
ఎఫ్ఆర్ఎస్పై పర్యవేక్షణేది?
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని బోధన, బోధనేతర ఉద్యోగులకు ముఖగుర్తింపు హాజరు విధానం (ఎఫ్ఆర్ఎస్–ఫేస్ రికగ్నిషన్ సిస్టం) అమలు చేస్తున్నారు. అయితే గతేడాది నవంబర్ నుంచి అమలు చేస్తున్న ఈ విధానంపై పర్యవేక్షణ లేదనే ఆరోపణలున్నాయి. పలు విభాగాలు, యూనివర్సిటీ వివిధ కాలేజీల్లోనూ ఇది మొక్కుబడిగానే కొనసాగిస్తున్నారని ఉద్యోగ వర్గాల నుంచే విమర్శలు వస్తున్నాయి. ముఖ గుర్తింపు హాజరు విధానం వచ్చి 9 నెలలు గడుస్తున్నా కొందరు బోధన, బోధనేతర ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. కొందరు ఆలస్యంగా వచ్చి ముందుగానే వెళ్లిపోతున్న వారు. మరికొందరు ఇలా ఎఫ్ఆర్ఎస్ హాజరుకు ముఖం చూపించి వెళ్లిపోయి మళ్లీ సాయంత్రం వచ్చి నమోదు చేసుకుంటున్న వారు కూడా ఉన్నారు. అంతేగాకుండా సాంకేతిక కారణాలు చూపిస్తూ సరిగా హాజరు నమోదు చేసుకోని వారు కూడా అక్కడక్కడ ఉంటున్నారని ఆరోపణలున్నాయి. అయినా సంబంధిత అధికారులకు అంతగా పట్టింపులేదనేది విశ్వవిద్యాలయంలో చర్చనీయాంశంగా మారింది. ఎఫ్ఆర్ఎస్కు వేతనాల చెల్లింపునకు అనుసంధానేమేది? యూనివర్సిటీలో బోధన, బోధనేతర ఉద్యోగులకు ఎఫ్ఆర్ఎస్ అమల్లోకి తీసుకొచ్చాక కొన్ని నెలల అనంతరం తప్పనిసరిగా వేతనాల చెల్లింపునకు ముఖ హాజరు గుర్తింపు విధానానికి అనుసంధానించి ఆ హాజరు నమోదు ప్రకారమే వేతనాలు చెల్లిస్తామని గతంలోనే వీసీ ప్రతాప్రెడ్డి ప్రకటించారు. కానీ ఇప్పటికీ అమల్లోకి తీసుకురాలేదనే ఆరోపణలున్నాయి. సంబంధిత అధికారులు ఎఫ్ఆర్ఎస్ నమోదు ప్రకారం కాకుండా ఆయా విభాగాలు, కార్యాలయాలు పంపిన హాజరు ఆధారంగా పూర్తి వేతనాలు చెల్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎలాంటి అనుమతి లేకుండా.. ఎఫ్ఆర్ఎస్ నమోదు చేయించుకోని బోధన, బోధ నేతర ఉద్యోగులు, సాంకేతిక సమస్యల కారణంగా హాజరు నమోదు కాని సందర్భాలు, ఆరోగ్యకారణాలతో ఏర్పడే ఇబ్బందులపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం లాంటి కారణాలు కూడా ఉన్నా యి. మరోవైపు ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన వారిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీ సుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ విధానం సమర్థవంతంగా అమలుచేస్తున్నారు. జిల్లాల్లో హాజరు నమోదుచేయని ఉద్యోగులకు సంబంధిత అధికారులు షోకాజ్ నోటీసులు కూడా జారీచేస్తున్నారు. అయితే యూనివర్సిటీలో మాత్రం ఎఫ్ఆర్ఎస్ మొక్కుబడిగానే మారిందనే విమర్శలు వస్తున్నాయి. బోధన, బోధనేతర ఉద్యోగులు, పెన్షనర్లు వివరాలు.. కాకతీయ యూనివర్సిటీలో అధ్యాపకులు (అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్లు) 77మంది, కాంట్రాక్టు లెక్చరర్లు 172 మంది, నాన్టీచింగ్ ఉద్యోగులు 311మంది, నాన్టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు 155 మంది, సర్వీస్ పెన్షనర్లు, టీచింగ్, నాన్టీచింగ్ కలిపి 498మంది, ఫ్యామిలీ పెన్షనర్లు 294మంది ఉన్నారు.కేయూలో మొక్కుబడిగా కొనసాగుతున్న ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్ హాజరు సమయపాలన పాటించని కొందరు బోధన, బోధనేతర ఉద్యోగులు ఆలస్యంగా వచ్చి ముందుగానే వెళ్లిపోతున్నారని వెల్లువెత్తుతున్న ఆరోపణలు అయినా పట్టించుకోని సంబంధిత అధికారులుకేయూలోని బోధన, బోధనేతర ఉద్యోగులకు ఆగస్టు నెల వేతనాలు సెప్టెంబర్లో ట్రెజరీ ద్వారా (ఈకుబేర్) నేరుగానే జరగనున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటి వరకు వేతన బిల్లులను యూనివర్సిటీలోని సంబంధిత అధికారులు ట్రెజరీకి సమర్పిస్తే ఆ వేతనాల మొత్తం యూనివర్సిటీ అకౌంట్కు జమజేశాక మళ్లీ కేయూ అకౌంట్స్ విభాగం అధికారులు బోధన, బోధనేతర ఉద్యోగులు, సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు వేతనాలు విడుదల చేస్తున్నారు. ఈ విధానానికి తెరపడబోతుందని తెలుస్తోంది. -
ట్రైనీ విద్యార్థులతో ఎక్స్రే పనులు!
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని రేడియాలజీ విభాగంలో ఎక్స్రే టెక్నీషియన్లు, సీటీ టెక్నీషియన్లు సరిగా విధులు నిర్వర్తించకుండా ట్రైనీ విద్యార్థులకు పనులు అప్పజెప్పుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఓపీతోపాటు క్యాజువాలిటీలో అత్యవసర సేవల కోసం వచ్చే పేషంట్లకు అగచాట్లు తప్పడం లేదు. మంగళవారం ఉదయం రేడియాలజీ విభాగంలో అసలైన ఎక్స్రే టెక్నీషియన్లకు బదులు విద్యార్థులు పనులు చేయడంతో గందరగోళం నెలకొంది. క్యాజువాలిటీ 7వ నంబర్, ఎక్స్రేల కోసం 92 నంబర్కు వస్తే పరిిస్థితి మరింత దారుణంగా ఉందని వాపోతున్నారు. మినీ డీఆర్ కూడా పనిచేయకపోవడంతో మ్యానువల్గా విద్యార్థులే ఎక్స్రేలు తీయడం వల్ల మరింత జాప్యం అవుతోందని చెబుతున్నారు. ఎక్స్రేలు ఆలస్యం కావడంతో రోగులు, సిబ్బంది మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. చివరకు సెక్యూరిటీ జోక్యం చేసుకుని సర్దిచెప్పినట్లు సమాచారం. విద్యార్థులకు మిషన్లపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం.. ఎక్స్రేలు ఎక్కువగా తీయడం వల్ల మిషన్లు రిపేర్కు వస్తున్నట్లు తెలుస్తోంది. ‘పనిచేయని ఎక్స్రే మిషన్లు’ శీర్షికన 15 రోజుల క్రితం సాక్షిలో కథనం ప్రచురితం కాగా.. అధికారులు స్పందించి బాగు చేయించారు. మళ్లీ రిపేర్కు రావడం అధికారులకు తలనొప్పిగా మారింది. రేడియాలజీ విభాగంలో సంబంధిత అధికారుల నియంత్రణ లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. -
టీపీసీసీ చీఫ్కు చేరిన క్రమశిక్షణ సంఘం నివేదిక మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ చుట్టూ ఉచ్చు
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుటుంబాన్ని చుట్టుముట్టిన పరిణా మాలు ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలపై మంత్రి కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో క్రమశిక్షణ సంఘం నివేదిక పీసీసీ చీఫ్కు చేరడం.. మరోవైపు మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్పై నమోదైన హత్యాయత్నం కేసులో వరుస అరెస్టులు, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ సస్పెన్షన్.. ఇలా ఒకదాని వెంట ఒకటి పరిణామాలు చోటుచేసుకోవడంతో ‘ఇక కొండాపై ఏం తేల్చనున్నారు?’ అన్న చర్చ పొలిటికల్ సర్కిళ్లలో సాగుతోంది. టీపీసీసీకి ‘క్రమశిక్షణ’ నివేదిక.. ‘కొండా’ శిబిరంలో కలకలం.. కొండా సుస్మిత వ్యాఖ్యలు, తదుపరి పరిణామాలపై విచారణ పూర్తి చేసి నివేదికను పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్కు అందించినట్లు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో వెల్ల డించారు. మంత్రి సురేఖకు నోటీసులు జారీ చేయ డం, ఆమె వివరణ ఇవ్వడం, అనంతరం కమిటీ తన అభిప్రాయాలను నివేదిక రూపంలో సిద్ధం చేసి సమర్పించడం వరకూ వ్యవహారం చేరింది. క్రమశిక్షణ చర్యలు కఠినంగా ఉండాలని కోరినట్లు మల్లు రవి ప్రకటించడంతో కొండా సురేఖ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? అనేది మరింత ఆసక్తికరంగా మారింది. రెండు పరిణామాలు ఒకే సమయంలో.. రాజకీయంగా సుస్మిత వ్యాఖ్యల వ్యవహారం.. పరిపాలనా, పోలీసు కోణంలో నార్ల సుమంత్ కేసు.. రెండూ ఒకే సమయంలో తెరపైకి రావడంతో కొండా కుటుంబంపై రాజకీయ ఒత్తిడి పెరిగిందన్న చర్చ సాగుతోంది. ఆయన గతంలో మంత్రి సురేఖకు ఓఎస్డీగా పనిచేసినందునే ఈ కేసు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడి, ‘హత్యాయత్నం’ ఆరోపణలతో నమోదైన కేసులో సుమంత్ డ్రైవర్ నవీన్తోపాటు మరో ముగ్గురు అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. సుమంత్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కేసు నమోదులో జాప్యం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ను సస్పెండ్ చేయడం ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యం తెచ్చింది.అసలు టార్గెట్ ఎవరు? ఓరుగల్లులో ఉత్కంఠ ఇప్పటి వరకు కుమార్తె వ్యాఖ్యల వ్యవహారంలో మంత్రి సురేఖను బాధ్యురాలిని చేయాలా? లేదా అది సుస్మిత వ్యక్తిగత వ్యాఖ్య లుగానే పరిగణించాలా? అన్నది కాంగ్రెస్లో చర్చ జరిగినా..చివరకు క్రమశిక్షణ సంఘం నివేదికలో సురేఖ వ్యవహారంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే మూడు పర్యాయాలు ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని కమిటీ ప్రస్తావించడం.. ఈసారి కఠిన చర్యలకు సిఫారసు చేశామనడం.. కొండా శిబిరంలో కలకలం రేపుతోంది. ఇదే సమయంలో సుమంత్ కేసులో పోలీసులపై చర్యలు తీసుకోవడం కూడా చర్చకు దారితీసింది. ఈ రెండు పరిణామాల మధ్య పార్టీ అధిష్టానం ఎలాంటి రాజకీయ సమీకరణాన్ని ఎంచుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో ఉమ్మడి వరంగల్ ప్రజాప్రతినిధులను హైదరాబాద్కు పిలిపించడం.. క్రమశిక్షణ సంఘం నివేదిక తీవ్రత.. పీసీసీ స్థాయిలో తదుపరి కసరత్తుపై జరుగుతున్న ప్రచారం.. ఇవన్నీ కలిపి చూస్తే త్వరలోనే కీలక నిర్ణయం వెలువడే అవకాశముందన్న చర్చ సాగుతోంది. మంత్రి పదవిపై ప్రభావమా? పార్టీ పరంగా చర్యా? వివా దానికి ఫుల్స్టాపా? లేక సర్దుబాటా? కాంగ్రెస్ అధిష్టానం ఏం తేల్చబోతోందన్నదే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది.సాక్షి, వరంగల్ : వన మహోత్సవంలో పాల్గొనేందుకు మంగళవారం వరంగల్కు వచ్చిన మంత్రి కొండా సురేఖను సుస్మిత వ్యాఖ్యలు, సీఎంతో వివాదంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా ఆమె స్పందించకుండా మౌనం పాటించడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా రాజకీయ అంశాలపై ఘాటుగా స్పందించే మంత్రి ఈసారి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో పార్టీ వర్గాల్లో మరిన్ని ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా, అధిష్టానం కదలికలను బట్టే కొండా ఆలోచనలుంటాయని అనుచరులు అంటున్నారు. డ్రైవర్ సహా నలుగురి అరెస్టు.. నిర్లక్ష్యం చేసిన సీఐపై వేటు ఒకేసారి రాజకీయ రచ్చ.. పోలీసు కేసు.. హైదరాబాద్కు ఉమ్మడి వరంగల్ ప్రజాప్రతినిధులు -
రోడ్డు ప్రమాదాలను నివారించాలి
సీపీ శ్వేత, హనుమకొండ కలెక్టర్ చాహత్ హన్మకొండ అర్బన్: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్న్.శ్వేత, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో మంగళవారం జిల్లాస్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించేలా చూడాలని సూచించారు. ప్రైవేట్ బస్సులు, టాక్సీలను రంగలీల మైదానం, హయగ్రీవాచారి మైదానాల్లో పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. కలెక్టర్ చాహత్బాజ్పాయ్ మాట్లాడుతూ హసన్పర్తి చెరువు కట్ట వద్ద రోడ్డు విస్తరణ పూర్తయినందున డివైడర్లు ఏర్పాటు చేయాలని, పోతననగర్లో డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని సూచించారు. మట్టి గణపతి విగ్రహాలపై అవగాహన కల్పించాలని కోరారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, అదనపు కలెక్టర్లు ఎన్..రవి, శేషాద్రి, గ్రేటర్ కమిషనర్ వెంకన్న, ఎన్హెచ్ ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, కుడా సీపీఓ అజిత్రెడ్డి ఉన్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం పలు శాఖల అధికారుల సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ఇంకా మొదలుకాని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీఓ భవనాల నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలన్నారు. మళ్లీ వారం రోజుల్లో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (ఇన్చార్జ్) శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాస్రావు, డీఈలు శ్రీనివాసరావు, రాజ గోపాల్, శిరీష, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
భాషాసాహిత్యాభివృద్ధికి పురస్కారాలు దోహదం
● తెలుగు అకాడమీ చైర్మన్ వెంకటనారాయణ హన్మకొండ కల్చరల్: విశేషంగా సాహిత్య సేవ చేసిన ప్రముఖులకు అందించే పురస్కారాలు భాషాసాహిత్యాభివృద్ధికి దోహదపడతాయని తెలుగు అకాడమీ చైర్మన్ వెంకటనారాయణ అన్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి హనుమకొండ వడ్డేపల్లిరోడ్లోని పీఆర్భవన్లో పేర్వారం జగన్నాథం స్మారక పురస్కారం ప్రదానోత్సవ సభ నిర్వహించారు. ఇందులో భాగంగా కేయూ విశ్రాంతాచార్యుడు, కవి, విమర్శకులు బన్న అయిలయ్య, కవి బాసిరి సాంబశివరావుకు పురస్కారం అందజేశారు. కవి పొట్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వెంకటనారాయణ, విశిష్ట అతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, కవి వీఆర్ విద్యార్థి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ పేర్వారం లాంటి గొప్ప కవిపేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి స్మారక పురస్కారాలు అందిస్తున్న పేర్వారం కుమారులు శంకర్రావు, శ్రీనాథ్ అభినందనీయులన్నారు. పేర్వార విజయలక్ష్మి, హైమావతి, తదితరులు పాల్గొన్నారు. సామాజికాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలి ● కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి కేయూ క్యాంపస్ : వికసిత్భారత్ –రైజింగ్ తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా జాతీయ సేవాపథకం కార్యక్రమాలను రూపొందించాలని, యువత సామాజికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించేలా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు కృషిచేయాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి కోరారు. సోమవారం కేయూ సెనెట్హాల్లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతీయ విద్యావిధానం–2020 అకడమిక్ అంశాలతోపాటు విలువలు, నైపుణ్యాలు, సామాజిక బాధ్యతకు ప్రాధాన్యతనిస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయుల పాత్ర తరగతి గదికే పరిమితం కావొద్దన్నారు. బోధనతోపాటు అడాప్టబిలిటీ, ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్వంటి నైపుణ్యాలపై దృష్టిసారించాలన్నారు. ఈ దిశగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. గౌరవ అతిథి కేయూ స్టూడెంట్స్ ఆఫైర్స్ డీన్ ఇస్తారి మాట్లాడుతూ కేయూ ఇతర విద్యాసంస్థలకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. అనంతరం కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసంనారాయణ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల ఎన్ఎస్ఎస్ కన్వీనర్లు రాంబాబు, శ్రీనివాస్, అనిల్కుమార్, ప్రసన్నకుమార్, యుగేందర్, క్యాంపస్, న్యాయ కళాశాలల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు రాధిక, ప్రభాకర్ మాట్లాడారు. ఉమ్మడివరంగల్జిల్లాలోని జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు. రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు పరిశోధన కేంద్రాలుగా గుర్తింపు కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల (అటానమస్), వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలను (అటానమస్) పరిశోధన కేంద్రాలుగా గుర్తిస్తూ వీసీ కె. ప్రతాప్రెడ్డి అప్రూవల్ మేరకు రిజిస్ట్రార్ వి. రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఆయా ఉత్తర్వుల కాపీలను కేడీసీ ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్, పింగిళి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ బత్తిని చంద్రమౌళికి వీసీ ప్రతాప్రెడ్డి మంగళవారం అందజేశారు. అలాగే, ఆ రెండు కళాశాలల్లోని మైక్రోబయాలజీ విభాగాలకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్లు పి. పల్లవి, జి. రేణుకను రీసెర్చ్ సూపర్వైజర్లుగా నియమించారు. వారిద్దరికి వీసీ ప్రతాప్రెడ్డి,రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వుల కాపీలు అందజేశారు. -
పెరుగుతున్న గోదావరి..
● సమ్మక్క సాగర్ బ్యారేజీలో పెరుగుతున్న వరద కన్నాయిగూడెం: రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మండలంలోని గోదావరిలోకి వరదనీరు భారీగా చేరుతోంది. దీంతో తుపాకులగూడెంలోని గోదావరిపై ఉన్న సమ్మక్కసాగర్ బ్యారేజీలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీలోకి 1,20,300 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఆదివారం వరకు 78,500 క్యూసెక్కులు చేరిన వరద నీరు.. సోమవారం ఒక్కరోజు సుమారు 40 వేల క్యూసెక్కులు అధికంగా చేరి ప్రవహిస్తున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద ఉన్న 59 గేట్లు ఎత్తి 1,12,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తెలిపారు. కొనసాగుతున్న పంపింగ్.. దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల వద్ద పంపింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. పంపింగ్ వద్ద మూడు ఫేజ్లలో 10 మోటార్లు ఉండగా కొన్ని రోజుల నుంచి 9 మోటార్లతో పంపింగ్ నిరంతరంగా కొనసాగిస్తున్నారు. దేవాదుల నుంచి దిగువన ఉన్న భీమ్ ఘన్పుర్ రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోస్తున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేవాదుల వద్ద 77.80 మీటర్ల నీటిమట్టం కొనసాగుతోంది. -
యాక్షన్ థ్రిల్లర్
● అక్షయ్ కుమార్బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న కొత్త సినిమాకు ‘సముక్’ అనే టైటిల్ని ఖరారు చేశారు మేకర్స్. సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ చిత్రానికి కనిష్క్ వర్మ దర్శకుడు. విపుల్ అమృత్లాల్ షా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ సోమవారం లండన్లో ప్రారంభమైంది. ‘‘సముక్’ సినిమా చిత్రీకరణ మొదలైంది. కొత్త జానర్లో కొత్త సవాల్ను స్వీకరించాను. వివాన్ అహుజాగా డ్యూటీ మొదలుపెట్టాను’’ అని ‘ఎక్స్’లో పేర్కొంటూ వీడియోను షేర్ చేశారు అక్షయ్ కుమార్. కాగా, ఈ సినిమా మేజర్ షూటింగ్ లండన్ లో జరుగుతుందని, కొద్దిపాటి షూటింగ్ ముంబైలో జరుగుతుందని బాలీవుడ్ సమాచారం. అంతర్జాతీయ సంబంధాలు, సర్వైవల్ హారర్, గ్రహాంతరవాసులు వంటి అంశాల నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ సమాచారం. హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు అలెక్ గిల్లిస్, స్టంట్ డైరెక్టర్ ల్యూక్ టంబర్ వంటి సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. -
ఇది ధర్మమా? అధర్మమా?
● అక్షయ్ ఖన్నా‘హనుమాన్’ మూవీ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్(పీవీపీయు)లో భాగంగా రూపొందుతున్న తాజా సినిమా ‘మహాకాళి’. భూమి శెట్టి, అక్షయ్ ఖన్నా, శ్రియా రెడ్డి, రోహిత్ సరాఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రశాంత్ వర్మ క్రియేటర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కే దుగ్గల్ సమర్పణలో ఆర్కేడీ స్టూడియోస్పై రివాజ్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 8న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా నటిస్తున్నారు. కాగా, ‘శుక్రాచార్య వార్– క్రై’ పేరుతో ‘మహాకాళి’నుంచి సోమవారం ఓ వీడియోను రిలీజ్ చేశారు. ‘అమృత మథన సమయమున దేవతలతో సమానంగా దానవులు శ్రమించినా ఆ విష్ణువు అమృతాన్ని దేవ గణానికే ప్రసాదించాడు. ఇది ధర్మమా? అధర్మమా?’, ‘యుద్ధ భీజ.. మానవజాతిని సర్వనాశనం చెయ్...’ వంటి డైలాగ్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ సినిమాకు స్మరణ్ సాయి స్వరకర్త. -
రైతు పోరాట యోధుడు ‘సారంపల్లి’
దుగ్గొండి: రైతాంగ పోరాట యోధుడు, సీపీఎం సీనియర్ నాయకుడు, అఖిలభారత కిసాన్సభ (ఏఐకేఎంఎస్) ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి (87) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన హైదరాబాద్లోని నిమ్స్లో సోమవారం కన్నుమూశారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన సారంపల్లి కృష్ణారెడ్డి, రాధమ్మ దంపతులకు ఆరుగురు సంతానం కాగా మల్లారెడ్డి మూడో సంతానం. 1939 ఆగస్టు 25న జన్మించిన మల్లారెడ్డి హెచ్ఎస్సీ వరకు చదువుకుని గ్రామంలో పోలీస్ పటేల్గా 1964 నుంచి 1971 వరకు పనిచేశారు. ఇదే సమయంలో గ్రామంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మధ్య నిత్యం గొడవలు జరిగేవి. కమ్యూనిస్టులకు పరోక్షంగా సహకరిస్తున్నాడనే నెపంతో పోలీసులు మల్లారెడ్డిపై అనుమానం వ్యక్తం చేయడంతో 1971లో రాజీనామా చేశారు. తన తమ్ముడు సారంపల్లి రాజిరెడ్డి ద్వారా దివంగత మాజీ ఎమ్మెల్యే ఓంకార్కు పరిచయమై పూర్తికాల కార్యకర్తగా సీపీఎం పార్టీలో పనిచేయడం ప్రారంభించారు. తాలుకా కమిటీ సభ్యుడిగా, జిల్లా కమిటీ సభ్యుడిగా రైతు సంఘం డివిజన్, మండల, జిల్లా అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడిగా, కార్యదర్శిగా చాలా కాలం పనిచేసి అఖిలభారత కిసాన్సభ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేసి రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. చదివింది హెచ్ఎస్సీ. అయినా అనేక యునివర్సిటీల్లో రైతాంగం సమస్యలపై ఆంగ్లంతో అనర్గళంగా ప్రసంగించారు. మల్లారెడ్డికి భార్య భాగ్యలక్ష్మి, కుమారులు వాసుదేవరెడ్డి, మధుసూదన్రెడ్డి, కుమార్తెలు అనిత, అజిత ఉన్నారు. ప్రజాప్రతినిధిగా సేవలు.. సారంపల్లి మల్లారెడ్డి మొదటిసారి 1981 నుంచి 87 వరకు సర్పంచ్గా పనిచేసి గ్రామాభివృద్ధికి కృషి చేశారు. 1987లో సింగిల్ విండో చైర్మన్గా గెలిచి జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్గా పనిచేశాడు. నిరంతర అధ్యయన శీలి.. మాల్లారెడ్డి నిరంతర అధ్యయనశీలి. ప్రతీ అంశంపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి రైతాంగం, ప్రజల బాధను గణాంకాలతో సహా వివరిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవారు. శ్రీరాంసాగర్ వరద కాల్వ నిర్మాణ పనులు పూర్తికావడానికి 200 గ్రామాల ప్రజలను కూడగట్టి ఉద్యమాలు చేశారు. నల్లబెల్లి మండలంలో ఫారెస్టు భూమిని పేదలకు పంచి ఇళ్లు నిర్మింపజేశారు. రైతులు, వ్యవసాయ సంక్షోభం, ప్రభుత్వాలు చేపట్టాల్సిన విధులు–నిధులు, తదితర సమస్యలపై 2008 నుంచి 2026 వరకు 20 పుస్తకాలు రచించారు. గాంధీ మెడికల్ కళాశాలకు పార్థివదేహం అందజేత.. మల్లారెడ్డి పార్థివదేహాన్ని సోమవారం ఉదయం నుంచి ప్రజలు, కార్యకర్తల సందర్శనార్థం హైదరాబాద్లో పార్టీ కార్యాలయంలో ఉంచారు. మంగళవారం పార్థివదేహాన్ని గాంధీ మెడికల్ కళాశాలకు వైద్య పరిశోధన నిమిత్తం అప్పగించనున్నట్లు ఆయన కుమారులు వాసుదేవరెడ్డి, మధుసూదన్రెడ్డి తెలిపారు. 20 రోజుల వ్యవధిలో దుగ్గొండి మండలానికి చెందిన ఇద్దరు కమ్యూనిస్టు దిగ్గజాలు అనారోగ్యంతో మృతి చెందారు. నాచినపల్లికి చెందిన పుచ్చకాయల చంద్రారెడ్డి(90) ఆగస్టు 3న మృతి చెందాడు. ఆయన మృతి చెందిన రోజున సారంపల్లి మల్లారెడ్డి నాచినపల్లికి వచ్చి చంద్రారెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం చంద్రారెడ్డి భార్య మల్లక్కను ఓదార్చారు. సరిగ్గా 20 రోజులకు సోమవారం సారంపల్లి మల్లారెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్లో మృతి చెందారు.జనగామ : కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయమని, ఆయన మృతి కమ్యూనిస్టు, రైతాంగ ఉద్యమాలకు తీరని లోటని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హన్మకొండ: రైతాంగ సమస్యలపై, వ్యవసాయ రంగం అభివృద్ధికి తన జీవితకాలం పోరాటం చేసిన రైతు ఉద్యమ నాయకుడు మల్లారెడ్డి అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. పాలకుర్తి టౌన్: వామపక్ష , శ్రామిక,రైతు ఉద్యమాలకు జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి మల్లారెడ్డి అని మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ పేర్కొన్నారు. ఖిలా వరంగల్ : మల్లారెడ్డి మృతి రైతాంగానికి తీరని లోటని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యాలయంలో సారంపల్లి మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పోలీస్ పటేల్ నుంచి అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడి వరకు పలు పదవులు.. అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూత విషాదంలో కమ్యూనిస్టు నాయకులు, శ్రేణులు సారంపల్లి మల్లారెడ్డి స్వ గ్రామం తిమ్మంపేటలో సోమవారం ఆయనకు సర్పంచ్ మోడెం శ్రీలత– మల్లేశం, సీపీఎం నాయకులు అక్కపెల్లి సుధాకర్, నల్లగొండ మొగిలి, సంజీవరెడ్డి, ఎంసీపీఐ నాయకులు నాగెల్లి కొంరయ్య, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. అలాగే, నర్సంపేటలోని అమరవీరుల స్తూపం ప్రాంగణంలో మల్లారెడ్డి చిత్రపటం వద్ద సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈసంపల్లి బాబు, కోరబోయిన కుమారస్వామి, కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ నివాళులర్పించారు. -
న్యాయం చేయరా దేవుడా...
సుమన్, సాయికుమార్, వరుణ్ సందేశ్, వితికా షేరు, నటరాజ్, రాయంచ కొక్కుర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించారు. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మించిన ఈ మూవీ ‘పివీఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ’ ద్వారా సెప్టెంబరు 4న విడుదలకానుంది. మహావీర్ యేలేందర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘న్యాయం చేయరా దేవుడా...’ అంటూ సాగే పాటను ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ విడుదల చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యం అందించగా, సునీత ఉపద్రస్త ఆలపించారు. ఈ పాటలో శ్రష్టి వర్మ నర్తించడంతో పాటు కొరియోగ్రఫీ చేయడం విశేషం. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రాన్ని రూపొందించాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబోస్ తనయుడు నంద వనమాలి, చిత్ర యూనిట్ పాల్గొన్నారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
బల్దియా కమిషనర్ టి.వెంకన్న వరంగల్ అర్బన్: నగరంలో గణేశ్ విగ్రహాల తయారీ, విక్రయంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగించకూడదని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో గణేశ్ విగ్రహాల తయారీదారులు, విక్రయంపై బల్దియా టౌన్ప్లానింగ్, ట్రాఫిక్, అధికారులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రధాన రహదారులు, డ్రెయినేజీలపై విగ్రహాలు అమ్మకూడదని, విక్రయాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలన్నారు. వరంగల్ ఓ సిటీ, పదాక్ష్మి మైదానం, హయగ్రీవాచారి గ్రౌండ్, ఉర్సు గ్రౌండ్, ఖిలా వరంగల్ మైదానం, పోచమ్మమైదాన్ తోట మైదానంలో విగ్రహాలను విక్రయించాలని సూచించారు. సమావేశంలో ఏసీపీ సత్యనారాయణ, ఎస్ఈ రాజ్కుమార్, సీపీ రవీందర్ రాడేకర్, ఏసీపీలు ఖలీల్, సీఐలు పాల్గొన్నారు. -
‘మీ ప్రమాణం’ యాప్ షురూ!
కాశిబుగ్గ: ఇకపై వేళాపాళా లేకుండా విధులకు హాజరయ్యే సిబ్బంది అలసత్వానికి చెక్ పడనుంది. కొందరు అధికారులతో పాటు సిబ్బంది సైతం ఇష్టారీతిన విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు ఇక రావు. ఆన్లైన్ పర్యవేక్షణ ద్వారా సిబ్బంది వివరాలు తక్షణమే తెలిసిపోనుంది. సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ కచ్చితంగా తెలుసుకోవడానికి మీ ప్రమాణం యాప్ ఉపయోగపడనుంది. ఎంజీఎంలో సోమవారం నుంచి ‘మీ ప్రమాణం యాప్’ అమల్లోకి వచ్చింది. ఆస్పత్రిలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వైద్య సిబ్బంది దాదాపు 1200 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి వీరంతా తమకు కేటాయించిన సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫోన్లో ఫేస్ రికగ్నేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లీవ్స్ కావాలన్నా ఈ యాప్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. ఆలస్యంగా వచ్చినా, పరిమితికి మించి సెలవులు పెట్టినా నిబంధనల ప్రకారం సాలరీ కట్ చేయనున్నట్లు సమాచారం. ఎంజీఎం సిబ్బంది ఆలస్యానికి చెక్ పారదర్శకంగా విధులు -
విద్యావకాశాల కల్పనకు చర్యలు
‘టాస్’ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సదానందం కాళోజీ సెంటర్: ‘టాస్’ అడ్మిషన్ల లక్ష్యాలను నిర్దేశిత గడువులోపు పూర్తిచేసి అర్హత గల ప్రతీ అభ్యర్థికి విద్యావకాశాలు కల్పించేందుకు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం సూచించారు. టాస్ అడ్మిషన్ల ప్రక్రియపై మండల సమాఖ్య డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్మిషన్, ఆన్లైన్ నమోదు విధానం, అవసరమైన పత్రాల అప్లోడ్, అడ్మిషన్లు సమర్థవంతంగా పూర్తిచేసే విధానంపై సమగ్ర శిక్షణ అందించారు. కార్యక్రమంలో ఏపీఎం రాజు, వరంగల్, హనుమకొండ జిల్లాల టాస్ / ఉల్లాస్ కోఆర్డినేటర్లు నాగేశ్వర్రావు, చల్లా రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఊహించని జానర్
కుష్లు, నమ్రిత.ఎంవీ, రెహమాన్, తనూజ పుట్టుస్వామి ప్రధాన పాత్రధారులుగా అనూష్ గోరక్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రకటన వచ్చింది. కేఏ ప్రొడక్షన్ ్స, పౌర్ణమి ఎంటర్టైన్ మెంట్స్పై కిరణ్ అబ్బవరం, శివశంకర నాయుడు. వై నిర్మాతలు. సోమవారం ఈ సినిమా అనౌన్ ్సమెంట్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఇలాంటి కథను మీరు ఇప్పటి దాకా తెరపై చూసి ఉండరు. ఇలాంటి జానర్ను మీరు (ప్రేక్షకులను ఉద్దేశించి కావొచ్చు) ఊహించలేరు’ అనే క్యాప్షన్ ్స ఈ సినిమా అనౌన్ ్సమెంట్ పోస్టర్పై ఉన్నాయి. జేసిన్ జార్జ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు వినీల సాహిత్య, కుష్లు సహ–నిర్మాతలు. -
నామి‘లేట్’ పదవులు!
సాక్షిప్రతినిధి, వరంగల్: నామినేటెడ్ పదవులపై మరోసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పలువురు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం జూలై 8న ముగిసింది. వారి స్థానంలో కొత్తవారిని నియమించడమా? లేక పాతవారినే మరోసారి కొనసాగిస్తారా? అనే దానిపై వెంటనే నిర్ణయం వస్తుందని భావించారు. ఆపదవుల కాలం ముగిసి 47 రోజులు గడిచినా ఆ ప్రస్తావనే లేదు. దీంతో ఇటు తాజా మాజీలు.. అటు ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీకి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే పదవులు ముగిసిన వారిలో కొందరు మరోసారి కొనసాగేందుకు అధిష్టానం పెద్దలను కలుస్తుండగా.. గత ఎన్నికల్లో టికెట్లు ఆశించి అవకాశం దక్కని వారు, ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నాయకులు, దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లు పదవుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశావహుల్లో ఉత్కంఠ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే దశల వారీగా నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. 2024 జూలై 8న ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా 37 మంది చైర్మన్లను ప్రభుత్వం నియమించగా.. ఉమ్మడి వరంగల్ నుంచి ఆరుగురికి అవకాశం లభించింది. పాలకుర్తి, వరంగల్ పశ్చిమ టికెట్లను ఆశించి తప్పుకున్న జంగా రాఘవరెడ్డికి ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి, పరకాల నుంచి పోటీకి వైదొలిగిన ఇనగాల వెంకట్రాంరెడ్డికి ‘కుడా’ చైర్మన్ పదవి లభించాయి. మహబూబాబాద్ నుంచి బెల్లయ్య నాయక్కు ట్రైబల్ కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, భూపాలపల్లి నుంచి అయిత ప్రకాశ్రెడ్డికి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎండీ రియాజ్కు గ్రంథాలయ పరిషత్ వంటి కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు అప్పగించారు. జూలై 8న వారి పదవీకాలం పూర్తయ్యింది. కాగా, జిల్లాలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు తొలుత నామినేటెడ్ పోస్టు (రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్) పదవి కట్టబెట్టిన అధిష్టానం.. ఆయన పదవీకాలం ముగిసిన వెంటనే మరో రెండేళ్లు పొడిగించింది. మిగతా ఆరు పోస్టులపై మాత్రం కొనసాగుతున్న సస్పెన్స్ తాజా మాజీలు, ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులదే తుది నిర్ణయం ఈసారి నామినేటెడ్ పదవుల భర్తీలో అధిష్టానం ఎలాంటి ఫార్ములాను అనుసరిస్తుందన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారా? ఇప్పటికే పదవులు అనుభవించిన వారికి మరో అవకాశం కల్పిస్తారా? సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యతకు పెద్దపీట వేస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరు జిల్లాల మధ్య సమతుల్యతతో పాటు ఆయా సామాజికవర్గాలకు ప్రాతినిథ్యం కల్పించడం కీలకంగా మారనుంది. ఒకరికి పదవి ఇస్తే మరో సామాజికవర్గం నుంచి వచ్చే డిమాండ్ను ఎలా సమన్వయం చేయాలన్నది అధిష్టానానికి సవాలుగా మారే అవకాశముంది. ఇదిలా ఉండగా.. నామినేటెడ్ పోస్టుల భర్తీకి మరి కొంత సమయం పట్టవచ్చని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్), ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరింత ఆలస్యం కావొ చ్చన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా, ఈసారి కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీలో సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్తో పాటు ఆయా జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సులే కీలకంగా మారనున్నాయన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో నడుస్తోంది. మా పేర్లు పరిశీలించండి..ఓవైపు తాజా మాజీలు కొనసాగింపు కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు కొత్తగా పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్, ఎమ్మెల్సీ తదితర నామినేటెడ్ పదవుల కోసం పోటీలో ఉన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ, జిల్లా స్థాయిల్లో పార్టీకి సేవలందించిన దొమ్మాటి సాంబయ్య, శనిగరపు ఇందిర, హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, కె.రవళి, నమిండ్ల శ్రీనివాస్, ఈవీ శ్రీనివాసరావు, పింగిళి వెంకట రాంనర్సింహరెడ్డి, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, బొమ్మనపల్లి అశోక్రెడ్డి, గాజర్ల అశోక్తో పాటు పలువురు నేతలు పదవుల రేసులో ఉన్నారు. వెన్నం శ్రీకాంత్రెడ్డి, భరత్ చంద్రారెడ్డి, గొల్లపల్లి రాజేందర్, మార్క విజయ్కుమార్, అబూబక్కర్, పోలెపల్లి రంజిత్రావు, మరికొందరు సీనియర్లు కూడా తమ పేర్లను పరిశీలించాలని అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నట్లు కూడా పార్టీ వర్గాల సమాచారం. 47 రోజులు గడిచినా నామినేటెడ్ పోస్టులపై నాన్చివేత ధోరణి మరింత సమయం పట్టే అవకాశం రెన్యూవల్ చేస్తారా.. కొత్తవారికి ఇస్తారా? అని సందిగ్ధం ఎటూ తేల్చని అధిష్టానం.. తాజా మాజీల్లో టెన్షన్ రోజురోజుకూ పెరుగుతున్న ఆశావహులు -
ప్రేక్షకుల స్పందనతో కళ్లు చెమర్చాయి
– రవితేజ‘‘ఇరుముడి’ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘ఇరుముడి’ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే నా కళ్లు చెమర్చాయి. 20 ఏళ్ల క్రితం థియేటర్కి వచ్చిన వాళ్లు ఇప్పుడు మళ్లీ ‘ఇరుముడి’కి థియేటర్కి రావడం భావోద్వేగంగా అనిపించింది’’ అని హీరో రవితేజ చెప్పారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్ జోడీగా, బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషించిన చిత్రం ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం(ఆగస్టు 21) విడుదలయింది. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన బ్లాక్బస్టర్ ప్రెస్మీట్లో రవితేజ మాట్లాడుతూ–‘‘ఇరుముడి’ చూస్తున్నప్పుడు జీవీ ప్రకాష్ మ్యూజిక్తో ఆటోమేటిక్గా ప్రేక్షకులకు కళ్లలో నీళ్లు వచ్చేస్తున్నాయి. మా అమ్మాయి మోక్ష కూడా కన్నీళ్లు పెట్టుకుంది. నిర్మాతలు రవి, నవీన్లతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. నాతో ఇంత మంచి సినిమా చేసినందుకు శివ నిర్వాణకి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ఒక దర్శకుడికి, నిర్మాతకి, హీరోకి, డిస్ట్రిబ్యూటర్కి, ప్రేక్షకుడికి ఒక సినిమా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చింది’’ అని శివ నిర్వాణ పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలో కావేరిలాంటి పాత్ర ఇచ్చినందుకు శివ నిర్వాణగారికి ధన్యవాదాలు’’ అన్నారు ప్రియా భవాని శంకర్. ‘‘ఈ సినిమాకి ఎదురు లేదు. మరో నాలుగు వారాలు వెళ్తూనే ఉంటుంది’’ అని వై. రవిశంకర్ పేర్కొన్నారు. ‘‘ఒక సినిమా విడుదలైన రోజున్నరలోనే లాభాల్లోకి రావడం యాభై ఏళ్లలో ఎప్పుడూ జరగలేదని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతుంటే చాలా సంతోషంగా అనిపించింది’’ అని నవీన్ యెర్నేని తెలిపారు. నటుడు సాయికుమార్, నటి స్వసిక, బేబీ నక్షత్ర, కెమెరామేన్ విష్ణు శర్మ, పాటల రచయిత అనంత శ్రీరామ్ తదితరులు మాట్లాడారు. -
లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి
వరంగల్ లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని న్యాయవాదులు, కక్షిదారులకు హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత పిలుపునిచ్చారు. రాజీపడదగు క్రిమి నల్, సివిల్ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్ వెహికిల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ, కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు, ఇన్సూరెన్స్ కేసులు, ఎకై ్సజ్ కేసులు, ప్రీ–లిటిగేషన్ కేసులు, ఇతర కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. లోక్ అదాలత్పై ఎలాంటి సలహాలు, సందేహాలు, సూచనలకు హనుమకొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించి, ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందాలని కోరారు. లోక్ అదాలత్లో భాగంగా హనుమకొండ కోర్టులో 9, పరకాల కోర్టులో 1 బెంచ్ ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. వరంగల్ స్పోర్ట్స్: మరమ్మతుల కారణంగా సుమారు ఏడాది పాటు మూతపడిన హనుమకొండలోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియాన్ని ఈనెల 29న పునఃప్రారంభిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కలెక్టర్ చాహత్బాజ్పాయ్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. పోక్సో కేసు నమోదు హసన్పర్తి: హాస్టల్లో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్పై పోక్సో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హసన్పర్తి పోలీస్స్టేషన్ పరిధి ఓ రెసిడెన్షియల్ స్కూల్లో విధులు నిర్విహిస్తున్న వార్డెన్ కొంతకాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడు. అతడి తీరుతో విసిగిపోయిన ఓ విద్యార్థిని తన తల్లిదండ్రులకు విషయం తెలిపింది. దీంతో వారు పాఠశాలకు వచ్చిన నిలదీశారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వార్డెన్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఖిలా వరంగల్: మద్యం మత్తులో ఉన్న టీజీఎస్సీ కానిస్టేబుల్ను చితకబాదిన మిల్స్కాలనీ బీట్ కానిస్టేబుల్పై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్ కావడంతో దీనిపై ఉన్నతాధికారులు మరింత సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ఈనెల 30న నిర్వహించనున్న నీట్ పీజీ–26 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇందులో డీసీపీ దారా కవిత, డీఎంహెచ్ఓ అప్పయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతానికి చర్యలు జిల్లాలో ప్రత్యేక ఓటర్ల సమగ్ర సర్వే (సర్) మ్యాపింగ్ కాని, అనామలీస్ ఓటర్ల జాబితా ప్రక్రియ వేగవంతానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చాహత్ బాజ్పాయ్ తెలిపారు. సోమవారం ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కలెక్టరేట్ నుంచి పాల్గొన్న కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ... జిల్లాలో ఎస్ఐఆర్లో మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలో ఉన్న 1.32 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
తథాస్తు అంటూ ఉండండి!
‘అసలు ఈ నీచ మానవులు మిమ్మల్ని ఎలా చూస్తారో తెలుసా? చీర్ గాళ్స్గా చూస్తారే !’ అంటూ నటుడు ‘వెన్నెల’ కిశోర్ చెప్పే డైలాగ్తో ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్ ఆరంభం అయింది. ‘అల్లరి’ నరేష్ హీరోగా నటించిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సురభి హీరోయిన్గా నటించారు. నరేష్ వీకే, ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్, రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్, రచ్చ రవి ఇతర పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్–హాస్య మూవీస్ బ్యానర్స్పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన ‘రంభ ఊర్వశి మేనక’ మూవీ సెప్టెంబరు 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ని హీరో అక్కినేని నాగార్జున లాంచ్ చేసి, చిత్రయూనిట్కి అభినందనలు తెలిపారు. ‘ముందు నేను ఈ లిస్ట్ చదువుతుంటాను మీరు తథాస్తు తథాస్తు అంటూ ఉండండి’, ‘అంటే మీకు ఇప్పుడు పవర్స్ లేవా?’, ‘నాకు నెలరోజులు కాదు.. జస్ట్ ఫైవ్ డేస్ ఇవ్వు చాలు’ అంటూ ‘అల్లరి’ నరేష్ చెప్పే డైలాగులు ట్రైలర్లో నవ్వులు పంచుతున్నాయి. అదేవిధంగా ‘యమధర్మ రాజులవారికి ప్రణామములు’, ‘మానవా.. ఇది మా తప్పిదం కాదు’(రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్), ‘ఈ అమ్మాయిలు ఏంటి? అసలు ఏం చేస్తున్నావురా నీవు’(సురభి), ‘మీరు మా ఇంద్రలోకం ప్రాపర్టీ.. ఇంత బోల్డ్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్న మిమ్మల్ని భూలోకంలో బాయ్స్ వదులుతారా? అసలే వారు కరువుప్రాంత జీవులే’(‘వెన్నెల’ కిశోర్) అంటూ పలికే పలు డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, కెమెరా: రాంరెడ్డి. -
‘టౌన్ప్లానింగ్’ కే అధికం
వరంగల్ అర్బన్: బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో టౌన్ప్లానింగ్ విభాగానికి అధిక వినతులు వచ్చాయి. నగరవాసులు పలు భూ సంబంధ, అనుమతులు, ఇతరత్రా సమస్యలపై ఎక్కువగా విజ్ఞప్తులు చేశారు. నగరవాసులనుంచి కమిషనర్ దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 72 దరఖాస్తులు రాగా, టౌన్ ప్లానింగ్కు 30, ఇంజనీరింగ్ విభాగానికి 15, హెల్త్ అండ్ శానిటేషన్కు 5, రెవెన్యూకు 14, తాగునీటి సరఫరా 7, హార్టికల్చర్ 1 చొప్పున దరఖాస్తులు అందాయి. గ్రీవెన్స్ సెల్కు అందిన ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, ప్రతీ ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిష్కరించాలని బల్దియా కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. అధికారులతో సమీక్ష.. పన్నుల వసూళ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, తదితర అంశాలపై అధికారులతో కమిషనర్ వెంకన్న సమీక్ష నిర్వహించారు. నగరంలోని అమ్మవారిపేటలో ఇటీవల 150 కేఎల్డీ సామర్థ్యంతో సెప్టిక్ ట్యాంక్ మల వ్యర్థాల శుద్ధి ప్లాంట్ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ప్రతీ మూడేళ్లకు ఒకసారి సెప్టిక్ ట్యాంకుల శుభ్రత నగర పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా సెప్టిక్ ట్యాంకుల శుభ్రతపై అధికారులు, ప్రజల్లో అవగాహన కల్పించాలని కమిషనర్ సూచించారు. సమీక్షలో అడిషనల్ కమిషనర్ జోనా, సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్కుమార్, సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్బాబు, పన్నుల అధికారి రామకృష్ణ అన్ని విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. హనుమకొండలో.. హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పెండింగ్లో ఉంచకుండా గడువులోగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్, అదనపు కలెక్టర్ ఎన్.రవి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. ప్రజావాణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజావాణికి అధికారులు సమయానికి హాజరు కావాలని, కారుణ్య నియామకాల భర్తీకి శాఖల వారీగా వివరాలు అందించాలని ఆదేశించారు. మంగళవారం నిర్వహించే వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కలెక్టరేట్తో పాటు హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాలు, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయాల్లోనూ ప్రజావాణి నిర్వహించారు. జిల్లా అటవీ శాఖ అధికారి ముకుందరెడ్డి వన మహోత్సవం ఏర్పాట్లపై అధికారులకు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శేషాద్రి, డీఆర్ఓ శ్రీనివాస్, డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. వరంగల్లో.. న్యూశాయంపేట: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇచ్చి ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్కు 145 దరఖాస్తులు రాగా, వాటిలో రెవెన్యూశాఖకు సంబంధించినవి 42, జీడబ్ల్యూఎంసీ 26, హౌసింగ్ 14, డీఆర్డీఓ 14, ఇతర శాఖలకు సంబంధించి 49 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్లో ప్రతీ సోమవారం అరగంట ముందు (ఉదయం 10గంటలు) ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. జిల్లాతోపాటు మండలాల పరిధిలో కూడా గ్రీవెన్స్ నిర్వహిస్తుండడంతో కలెక్టరేట్లోని గ్రీవెన్స్కు వచ్చే ఫిర్యాదుదారుల సంఖ్య తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ రాజారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. బల్దియా గ్రీవెన్స్లో ఈ విభాగానికి 30 వినతులు అందిన దరఖాస్తులు మొత్తం 72 అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు : బల్దియా కమిషనర్ టి.వెంకన్న -
హైదరాబాద్లో ధర్మన్
● రజనీకాంత్హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు ధర్మన్ . రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ధర్మన్ ’. ‘ది డెడ్లీ డాక్టర్’ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో సిమ్రాన్ , రాశీఖన్నా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్హాసన్ , ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న ఈ మూవీలో ధర్మన్ అనే డాక్టర్ గారజనీకాంత్ నటిస్తున్నారు. కాగా, ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైందని తెలిసింది. ఈ షెడ్యూల్లో రజనీకాంత్పై కొన్ని కీలక సన్నివేశాలను, ఓ యాక్షన్ సీక్వెన్ ్సను చిత్రీకరించేలా అశ్వత్ ప్లాన్ చేశారట. అలాగే ఈ చిత్రంలో హీరో రామ్ పోతినేని ఓ కీలక పాత్రలో నటించనున్నారని, ఆయన క్యారెక్టరైజేషన్ ్సలో నెగటివ్ షేడ్స్ ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్లో ప్రారంభమైన ‘ధర్మన్ ’ కొత్త షూటింగ్ షెడ్యూల్లో అతి త్వరలో రామ్ కూడా పాల్గొంటారని ఫిల్మ్నగర్ భోగట్టా. అంతేకాదు.. కథ రీత్యా ఈ చిత్రంలో రజనీకాంత్–రామ్ మామ అల్లుళ్ళుగా కనిపిస్తారట. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘ధర్మన్ ’ సినిమాని 2027 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. -
తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్..
● చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ హసన్పర్తి : తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్గా చోరీలకు పాల్ప డిన అంతర్రాష్ట్ర దొంగ పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు సోమవారం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ దార కవిత వివరాలు వెల్లడించారు. ఇటీవల వరంగల్ మిల్స్కాలనీ పీఎస్ పరిధిలో వరుస చోరీల పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆశిష్ శ్రీనివాస్రెడ్డి మల్ల.. ప్రస్తుతం మహారాష్ట్రలోని చంద్రాపూర్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈఏడాది మిల్స్కాలనీ పీఎస్ పరిధిలోని శివనగర్, ఎస్.ఆర్.ఆర్.నగర్ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో వరుస చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు. దీంతో నిందితుడి నుంచి సుమారు రూ. 12 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతోపాటు రూ.29,875 నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చెప్పారు. కాగా, గతంలో మహారాష్ట్రలో జరిగిన పలు చోరీ కేసుల్లో నిందితుడు జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలైనట్లు డీసీపీ తెలిపారు. -
చక్కెర చేదు!
● కిలో రూ.40 నుంచి ఏకంగా రూ.75కు పెరిగిన ధర ● ఆందోళనలో వినియోగదారులు సాక్షి, వరంగల్: తీపిని పంచే చక్కెర ధర ఇప్పుడు చేదు పుట్టిస్తోంది. కొద్ది రోజుల క్రితం కిలో రూ.40కి లభించిన పంచదార.. ప్రస్తుతం కొన్ని స్థానిక కిరాణా దుకాణాల్లో ఏకంగా రూ.75 వరకు ధర పలుకుతోంది. ఒక్కసారిగా అమాంతం పెరిగిన ధరతో సామాన్య వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. టీ, కాఫీ నుంచి స్వీట్లు, పిండి వంటల్లో నిత్యావసరంగా మారిన చక్కెర ధర పెరగడంతో నెలవారీ ఇంటి బడ్జెట్పై అదనపు భారం పడుతోంది. వరంగల్ జిల్లాలో నెలకు దాదాపు 1,500 టన్నుల విక్రయాలు జరుగుతుండడంతో ఇప్పటివరకు రూ.6 కోట్లు హోల్సేల్ వ్యాపారం జరిగితే ఇప్పుడు పెరిగిన ధరలతో ఏకంగా రూ.11.25 కోట్లు అవుతోంది. సంవత్సరానికి ఏకంగా రూ.135 కోట్లవుతోందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రిటైల్ ధర రూ.60 దాటగా.. మహారాష్ట్రలోని కొన్ని మార్కెట్లలో రూ.75 నుంచి 80 వరకు చేరాయి. వరంగల్ నగరంలో డెలివరీకి అందుబాటులో ఉన్న కొన్ని ఆన్లైన్ లిస్టింగ్లో కిలో చక్కెర రూ.60 నుంచి 72 మధ్య ఉంటోంది. స్థానిక దుకాణాల్లో రూ.70 నుంచి 75కు విక్రయిస్తుండగా.. ఆన్లైన్లో ఆఫర్లు, డిస్కౌంట్లతో రూ.60 నుంచి రూ.66లోనే లభిస్తుండడంపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఇంటి బడ్జెట్పై ప్రభావం.. చక్కెర వినియోగం ప్రతీ ఇంట్లో తప్పనిసరి కావడంతో ధర పెరుగుదల నేరుగా కుటుంబ ఖర్చులపై పడుతోంది. ముఖ్యంగా టీ, కాఫీ ఎక్కువగా తీసుకునే కుటుంబాలతో పాటు స్వీట్లు, బేకరీ పదార్థాల తయారీదారులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ధరలు మరింత పెరిగితే స్వీట్లు, ఇతర ఆహార పదార్థాల ధరలపైనా పరోక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ధరలు తగ్గించాలి – రమ, గృహిణి, వరంగల్ -
అభివృద్ధికి సహకరించండి
● సీఎంను కలిసిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరిధర్మసాగర్: ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డిని వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సోమవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్కు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం, స్టేషన్ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సీఎంతో చర్చించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిఽఽధిలో చేపట్టాల్సిన కీలక అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం, ప్రజలకు అవసరమైన వివిధ అభివృద్ధి పనులకు నిధుల మంజూరు తదితర అంశాలను ఎంపీ కావ్య.. సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఘన్పూర్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజల అవసరాలు, పెండింగ్ సమస్యలు, వివిధ ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై ఎమ్మెల్యే కడియం ముఖ్యమంత్రితో చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని కోరారు. -
సాధారణ వర్షపాతమే..
న్యూశాయంపేట: బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాధారణ వర్షపాతం నమోదైంది. సగటున 9.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఉన్న ఉక్కపోత, ఎండల తీవ్రత నుంచి ఈ వర్షం ప్రజలకు ఉపశమనాన్ని కలిగించింది. జిల్లాలోని వరంగల్ నగరంలో 38.0 మిల్లీ మీటర్ల (మి.మీ) వర్షపాతం నమోదు కాగా, ఖిలా వరంగల్ మండలంలో 19.6 మి.మీ, నర్సంపేట (3.4), ఖానాపురం (7.2), చెన్నారావుపేట (11.4), సంగెం (6.8), వర్ధన్నపేట (3.8), రాయపర్తి (4.6), పర్వతగిరి (3.8), నెక్కొండ (8.2), గీసుకొండ (14.2), దుగ్గొండి (2.4), నల్లబెల్లిలో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎండల ధాటికి ఎండిపోతున్న పత్తి, తదితర ఆరుతడి పంటలకు ఈ వర్షం ప్రాణవాయువులా పనిచేస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు వివరించారు. -
కొనసాగుతున్న సమ్మె
కాశిబుగ్గ: అల్లోపతిక్ మాదిరిగా తమకూ స్టైఫండ్ చెల్లించాలని కోరుతూ నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించట్లేదని ఆయుష్ జేఏసీ నాయకులు తెలిపారు. తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె ఆదివారం 20వ రోజుకు, రిలే నిరాహరదీక్ష 7వ రోజుకు చేరుకుంది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. స్టైఫండ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, అల్లోపతిక్తో సమానమైన స్టైఫండ్ను మంజూరు చేస్తూ వెంటనే జీఓ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాము శాంతియుతంగా నిరసన కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని జేఏసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రోహిత్ బాస్రే ఆవేదన వ్యక్తం చేశారు. కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం చీఫ్ క్రూ కంట్రోలర్ (సీసీసీ)గా ఎండీ మౌలాషరీఫ్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. కాజీపేట సీసీసీగా పనిచేస్తున్న సాంబశివుడిని సికింద్రాబాద్ రైల్వే అధికారులు ఆన్లైన్ విధులకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో కాజీపేట రైల్వే డీజిల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మౌలాషరీఫ్ను అధికారులు కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయానికి సీసీసీగా బదిలీ చేశారు. కాగా, మౌలాషరీఫ్ గతంలో కాజీపేట, డోర్నకల్ సీసీసీగా పనిచేశారు. వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూజీఎం) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ టి.వెంకన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ను పౌరులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వరంగల్ కలెక్టరేట్లో న్యూశాయంపేట: జిల్లా స్థాయిలో కలెక్టరేట్, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయం, మండల స్థాయిలో ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. గ్రీవెన్స్లో అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించి త్వరితగతిన పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. హనుమకొండ కలెక్టరేట్లో..హన్మకొండ అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. కలెక్టరేట్, హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాలు, మండల కార్యాలయాల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు గ్రీవెన్స్ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కాజీపేట అర్బన్: కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన మాతంగి ప్రవీణ్ ప్రపంచ ఓపెన్ తైక్వాండో చాంపియన్షిప్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించాడు. హైదరాబాద్లోని జీఎంసీ బాలయోగి ఇండోర్స్టేడియంలో కేఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. సీనియర్ బ్లాక్బెల్ట్ అండర్ 54 వెయిట్ కేటగిరీలో ప్రవీణ్ ప్రతిభ కనబర్చి బంగారు పతకాన్ని సాధించాడు. హసన్పర్తి : మండలంలోని మధుతండాలోని ఓ గోదాంలో 77.70 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. తండాలోని ఓ గోదాంలో రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయనే పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా పెద్ద ఎత్తున బియ్యం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం విలువ సుమారు రూ.2,71,950 ఉంటుందని టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. ఈ బియ్యం వ్యాపారం చేస్తున్న నిరూప్ భూక్య తరుణ్ కుమార్గా గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. దాడుల్లో ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్సై వీరస్వామి సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం
హన్మకొండ: విద్యావ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ విమర్శించారు. హనుమకొండ నయీంనగర్లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ధర్మ టీచర్స్ యూనిట్ రాష్ట్ర విద్యాసదస్సు బ్రోచర్ను వడ్లకొండ వేణుగోపాల్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మ టీచర్స్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర విద్యాసదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధర్మ టీచర్ యూనిట్ రాష్ట్ర కోకన్వీనర్ దామెర ఉపేందర్ మాట్లాడుతూ ఈసదస్సులో పలు అంశాలపై చర్చించనున్నట్లు వివరించారు. అభివృద్ధి చెందిన దేశాలు విద్యారంగానికి తమ బడ్జెట్లో అధిక కేటాయింపులు జరుపుతుంటే, మన ప్రభుత్వాలు విద్యారంగానికి సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆశించిన స్థాయిలో సమాజం అభివృద్ధి చెందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల మేధావులు, విద్యాభిమానులు అధిక సంఖ్యలో హాజరై విద్యా సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు. బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ -
నక్షత్రశాలకు మహర్దశ
రూ.6 కోట్లతో పునరుద్ధరణ పనులువరంగల్ అర్బన్: ఉత్తర తెలంగాణలోని ఏకై క నక్షత్రశాల అయిన హిందూజ ప్రతాపరుద్ర ప్లానిటోరియం 15 ఏళ్లుగా ప్రదర్శనలు లేక మూలనపడింది. కాలం చెల్లిన ప్రొజెక్టర్ మరమ్మతులకు రావడంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేతులెత్తేశారు. చాలామంది మేధావులు.. కలెక్టర్లకు, రాష్ట్ర మంత్రులకు, ఎమ్మెల్యేలకు నక్షత్రశాలను తిరిగి ప్రారంభించాలని వినతిపత్రాలిచ్చారు. ఎట్టకేలకు ప్లానిటోరియం పునఃప్రారంభోత్సవానికి సన్నద్ధమవుతోంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు నుంచి ప్రదర్శనల ద్వారా అంతరిక్ష విజ్ఞానం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. పీవీ చొరవతో ప్లానిటోరియం మాజీ దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేసిన సమయంలో ప్లానిటోరియం ఏర్పాటైంది. 1982లో నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో నక్షత్రశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హిందూజ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో జర్మనీ దేశం నుంచి ప్రొజెక్టర్ తెప్పించారు. భవన నిర్మాణం మాత్రమే కార్పొరేషన్ చేపట్టింది. 1984లో పీవీ నర్సింహారావు ప్రతాపరుద్ర హిందూజ ప్లానిటోరియాన్ని ప్రారంభించారు. దీని పర్యవేక్షణ బాధ్యత మున్సిపాలిటీకి అప్పగించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన భరత్కుమార్రెడ్డిని ప్లానిటోరియం డైరెక్టర్గా నియమించారు. 1994 నుంచి 2004లోనే నక్షత్రశాలలో అంతరిక్ష ప్రదర్శనలు నడిచాయి. భారీ టెలిస్కోప్ సహాయంతో అంతరిక్ష ప్రదర్శనలు కొనసాగాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి వేలాది మంది విద్యార్థులు ప్లానిటోరియాన్ని సందర్శించారు. 2004లో ప్రొజెక్టర్ పాడైంది. కొన్నాళ్లు మరమ్మతులు చేసి అడపాదడపా షోలు ప్రదర్శించారు. ఆ తర్వాత ప్రొజెక్టర్ మొరాయించడంతో పూర్తిగా షోలను నిలిపేశారు. గ్రేటర్ వరంగల్ పర్యవేక్షణలో ఉన్న ప్లానిటోరియాన్ని తిరిగి ప్రారంభించేందుకు గడువు ఖరారైంది. భవనానికి సివిల్ పనులు పూర్తయ్యాయి. త్వరలో అధునాతన యంత్రాలు విదేశాల నుంచి దిగుమతి కానున్నాయి. కమిషనర్ ఆదేశాలతో అక్టోబర్ 2 నుంచి సిద్ధం చేసేందుకు సదరు ఏజెన్సీ నిర్వాహకులు అంగీకరించారు. గడువులోగా పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటాం.– రాజ్కుమార్, బల్దియా ఎస్ఈ అక్టోబర్ 2 నుంచి ప్లానిటోరియంలో షోలు విదేశాల నుంచి అధునాతన యంత్రాల దిగుమతి ఏజెన్సీ నిర్వాహకులు, అధికారులతో గ్రేటర్ కమిషనర్ వెంకన్న సమావేశంస్మార్ట్సిటీకి చెందిన రూ.2కోట్ల నిధులతో ప్లానిటోరియం భవనానికి పనరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. రూ.4 కోట్లతో డోమో, ప్రొజెక్టర్లు, ఆడియో సిస్టమ్ తదితర ఆధునిక పరికరాలు, ఫర్నిచర్, సైన్స్ బొమ్మల ఏర్పాట్లకు టెండర్లు ఖరారయ్యాయి. సదరు ఏజెన్సీ సంస్థ తైవాన్, ఇజ్రాయిల్ నుంచి అధునాత పరికరాలు దిగుమతి చేసుకునేలా కసరత్తు పూర్తయినట్లు బల్దియా ఇంజనీర్లు వెల్లడించారు. 8 ఏళ్ల పాటు సదరు ఏజెన్సీ నిర్వాహకులదే ప్రదర్శనల నిర్వహణ బాధ్యత. అక్టోబర్ 2 నుంచి తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఇటీవల బల్దియా కమిషనర్ టి.వెంకన్న ఇంజనీర్లు, సదరు ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశమై గడువులోగా షోలు నడిపించాలని సీరియస్గా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజలు, విద్యార్థులు అంతరిక్ష విజ్ఞానాన్ని కళ్లకుకట్టినట్లుగా వీక్షించనున్నారు. -
ముగిసిన ‘టోసా–ఓయాసిస్కా’
హన్మకొండ అర్బన్: హనుమకొండలో మూడు రోజులపాటు నిర్వహించిన టోసా–ఓయాసిస్కాన్(తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్–ఆర్థోపెడిక్ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్)–2026 ఆది వారం ముగిసింది. దేశవ్యాప్తంగా ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు పాల్గొని ఆధునిక చికిత్సా విధానాలు, శస్త్రచికిత్సలపై తమ అనుభవాలు పంచుకున్నారు. రోబోటిక్ సర్జరీ, కృత్రిమ మేధ, కీళ్ల మార్పిడి, వెన్నెముక శస్త్రచికిత్సలపై సదస్సులో చర్చించారు. ప్రత్యక్ష ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాల ద్వారా వైద్యులకు ఆచరణాత్మక అవగాహన కల్పించారు. సీనియర్ వైద్యుడు వేదుల సత్యనారాయణమూర్తి స్మారక ఉపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓయాసిస్ అధ్యక్షుడు డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి, కార్యదర్శి డాక్టర్ కె.రాంకుమార్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హైదరాబాద్కు చెందిన డాక్టర్ అల్వాల్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు పాల్గొన్నారు. -
పూర్తిస్థాయిలో అందని యూనిఫామ్
విద్యారణ్యపురి: విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు దాటినా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పూర్తిస్థాయిలో యూనిఫామ్ అందలేదు. దీంతో హనుమకొండ జిల్లాలోని చాలా మంది విద్యార్థులు గత సంవత్సరం యూనిఫామ్తో, లేనివారు సాధారణ దుస్తులతో పాఠశాలలకు హాజరవుతున్నారు. ఈసారి యూనిఫామ్ మార్చడంతో ఆలస్యంగా జిల్లాకు క్లాత్ వచ్చింది. సెర్ప్–డీఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు కుట్టు బాధ్యతలను అప్పగించారు. 332 పాఠశాలల్లో 14,350 మంది విద్యార్థులు చదువుతున్నారు. మెప్మా ద్వారా 136 పాఠశాలల్లోని 13,487 మంది విద్యార్థుల కోసం సెల్ఫ్హెల్ప్ గ్రూపులకు క్లాత్ అందించారు. ఈనెల 13 వరకు 5,787 మంది విద్యార్థులకు మొదటి జత స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 21 వరకు మరికొన్ని పాఠశాలలకు పంపిణీ చేసినట్లు సమాచారం. కాజీపేట మండలంలో 35 పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలలకు కూడా మొదటి జత స్కూల్ యూనిఫామ్ రాలేదని ఎంఈఓ మనోజ్ తెలిపారు. ఎప్పుడు పంపిణీ చేస్తారో కూడా చెప్పలేకపోతున్నారు. హనుమకొండ డీఈఓ కార్యాలయం పక్కనే ఉండే సుబేదారి ప్రభుత్వ హైస్కూల్, ప్రైమరీ స్కూల్, అలాగే లష్కర్బజార్ ప్రభుత్వ బాలికల హైస్కూల్కు కూడా ఒక స్కూల్ యూనిఫామ్ అందించలేదు. హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్ విద్యార్థులకు కూడా సరిపడా ఒక జత యూనిఫామ్ రాలేదు. ఆ స్కూల్లో 656 మంది విద్యార్థులు ఉన్నారు. 185 మంది బాలికల్లో 162 మందికి బాటమ్స్ వచ్చాయి. టాప్స్ రాలేదు. బాలురు 471 మంది ఉండగా, కొందరికి ఒక జత స్కూల్ యూనిఫామ్ రాలేదు. యూనిఫామ్ వచ్చిన తర్వాతే యూడైస్ ప్రకారం మిగిలిన విద్యార్థులకు అందజేస్తామని హెచ్ఎం పేర్కొంటున్నారు. నాణ్యత లేని క్లాత్ విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ క్లాత్ నాణ్యత లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎంతకాలం మన్నికగా ఉంటుందనేది చెప్పలేని పరిస్థితి. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల కొలతల ప్రకారం స్టిచ్చింగ్ చేయగా.. అక్కడక్కడా ర్యాండమ్గా విద్యార్థుల సైజ్ను బట్టి స్టిచ్చింగ్ చేశారని సమాచారం. జిల్లాకు వచ్చిన షర్ట్స్ క్లాత్, బాలికల టాప్ క్లాత్ నాణ్యత విషయంపై తొలుత సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. క్లాత్ సరఫరా చేసిన సంస్థ నుంచి ఒకరు వచ్చి పరిశీలించి ఒకటి అర మార్చారని తెలుస్తోంది. గతేడాది యూడైస్ ప్రకారమే క్లాత్ పంపిణీ.. గత విద్యాసంవత్సరం యూడైస్ ప్రకారమే పాఠశాలలకు యూనిఫామ్ క్లాత్ పంపిణీ చేశారు. దీంతో ఈవిద్యాసంవత్సరం పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యపెరిగింది. కొత్తగా వచ్చిన ఆయా విద్యార్థులకు ఇప్పట్లో స్కూల్ యూనిఫామ్ అందే పరిస్థితి లేదు. దీనిపైన రాష్ట్ర ఉన్నతాధికారులే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జిల్లా విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. జిల్లాలో రెండో జత యూనిఫామ్ క్లాత్ ఇటీవల రాగా, ఆయా సెల్ఫ్ హెల్ప్గ్రూపులకు అందించారు. అది స్టిచ్చింగ్ దశలోనే ఉంది. సాధారణ, గత సంవత్సరం దుస్తులతో పాఠశాలలకు హాజరవుతున్న విద్యార్థులు -
లలితాదేవికి ప్రత్యేక అలంకరణ
శ్రావణ మాసం, మూల నక్షత్రం, పుత్రదా ఏకాదశి సందర్భంగా ఆదివారం వరంగల్ శివనగర్లోని శ్రీసీరామచంద్రస్వామి దేవాలయంలో శ్రీలలితాదేవికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి వెంకటేశ్వర్లచార్యులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 160 చీరలతో శ్రీలలితాదేవిని అలంకరించి పూజలు నిర్వహించారు. చీరలతో అలంకరణలో ఉన్న శ్రీలలితాదేవిని భక్తులు దర్శించుకున్నారు. భక్తులు మంచాల కృష్ణమూర్తి, శ్రీరాం రాజేశ్, అడెపు శ్యామ్, కుడికాల సుధాకర్, వీరస్వామి, సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు. – ఖిలా వరంగల్ -
‘సూపర్’లో నెలకొకరు!
కాశిబుగ్గ: హనుమకొండ కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నెలకొకరు చొప్పున ఇన్చార్జ్ అధికారి (హెచ్ఓడీ) పాలనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో డిప్యూటీ సూపరింటెండెంట్తో పాటు ఆర్ఎంఓ కలిసి హాస్పిటల్ వైద్యసేవలు, పాలనను పర్యవేక్షించేవారు. ఇంతవరకు పనిచేసిన డిప్యూటీ సూపరింటెండెంట్ అనిల్ బాలరాజు బదిలీపై వెళ్లిపోవడంతో రెండు నెలల నుంచి ఈ బాధ్యత తీసుకోవడానికి సీనియర్ వైద్యులు ముందుకు రావట్లేదని తెలుస్తోంది. వాస్తవానికి సూపర్ హాస్పిటల్లో సీనియర్గా ఉన్న ప్రొఫెసర్ను డిప్యూటీ సూపరింటెండెంట్గా నియమించే అధికారం ఎంజీఎం సూపరింటెండెంట్కు ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఎంజీఎం సూపరింటెండెంట్గా ఉన్న రాంకుమార్రెడ్డి సూపర్ స్పెషాలిటీలో సీనియర్ వైద్యులు డిప్యూటీగా ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో సీనియర్ వైద్యులెవరూ.. ముందుకు రాకపోవడంతో రొటేషన్ పద్ధతిపై పరిపాలనా బాధ్యతలు తీసుకునేందుకు వారి సీనియార్టీ ప్రకారం నెలకు ఒకరు చొప్పున ఇన్చార్జ్ బాధ్యతలు అప్పజెబుతూ ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో సూపర్ స్పెషాలిటీ విభాగాల హెచ్ఓడీలు తమ రెగ్యులర్ డ్యూటీలతో పాటు సూపర్ హాస్పిటల్ పరిపాలన వ్యవహారాలను చూసుకోవాలని ఆదేశించారు. పాలన గాడిన పడేనా? ఇప్పటికే సూపర్ స్పెషాలిటి హాస్పిటల్లో వైద్యసేవలు, అడ్మినిస్ట్రేషన్ పరంగా పలు ఆరోపణలు వస్తున్నాయి. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలందించే హాస్పిటల్లో పరిపాలనా బాధ్యత చూడడం కత్తిమీద సాములా ఉంటుందనే విమర్శలున్నాయి. ఇందులో రోగుల సేవలతో పాటు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడం భారమైనప్పటికీ గతంలో రెగ్యులర్ డిప్యూటీ సూపరింటెండెంట్తో పాటు ఆర్ఎంఓ ఉంటూ నెట్టుకొచ్చారు. ప్రస్తుతం డిప్యూటీ సూపరింటెండెంట్ లేకపోవడంతో భారమంతా ఆర్ఎంఓపై పడుతోంది. ఇక నూతన ఉత్వర్వుల ప్రకారం నెలకు ఒకరు చొప్పున సీనియర్ వైద్యులు ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకుంటే పరిపాలన గట్టెక్కడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెల తిరిగే సరికి బాధ్యత తీసుకున్న హెచ్ఓడీ గడువు కాలం ముగస్తుంది. మళ్లీ కొత్త డాక్టర్ వచ్చి బాధ్యత తీసుకుంటే వారికి ఇదే పరిస్థితి ఏర్పడుతుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఈవిధానం వల్ల సత్ఫలితాలు సాధించడం అంతా ఈజీగా ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాశ్వతంగా ఉండేలా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తేనే రోగుల సేవలు, అడ్మినిస్ట్రేషన్ సజావుగా సాగే అవకాశం ఉంది. న్యూరాలజీ ప్రొఫెసర్, హెచ్ఓడీ డాక్టర్ ఎన్.మాధవరావు ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు. కార్డియాలజీ ప్రొఫెసర్, హెచ్ఓడీ డాక్టర్ సి.మమతారెడ్డి అక్టోబర్ 1 నుంచి 31 వరకు. సీటీవీఎస్ హెచ్ఓడీ, ప్రొఫెసర్ డాక్టర్ బి.సర్తాజ్ హుస్సేన్ నవంబర్ 1 నుంచి 30 వరకు. యూరాలజీ హెచ్ఓడీ, ప్రొఫెసర్ డాక్టర్ సంతోశ్ డిసెంబర్ 1 నుంచి 31 వరకు. నెఫ్రాలజీ హెచ్ఓడీ, ప్రొఫెసర్ డాక్టర్ చాడ రమేశ్ జనవరి 1, 2027 నుంచి 31 వరకు. పిడియాట్రిక్ సర్జరీ హెచ్ఓడీ, ప్రొఫెసర్ డాక్టర్ నారాయణ ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు ఇన్చార్జ్ అధికారిగా విధులు రోగులకు మెరుగైన వైద్యం, అడ్మినిస్ట్రేషన్ బాగు పడేదెలా? -
పత్తిదే పైచేయి
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు పంట మార్పిడికి మొగ్గు చూపుతున్నారు. లోటు వర్షపాతం, వరి కంటే తక్కువ నీటితో పండే పత్తి, పప్పుధాన్యాల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో సాధారణ సాగు అంచనాతో పోలిస్తే పత్తి, పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరగగా.. వరి 66.88 శాతానికే పరిమితమైంది. వ్యవసాయశాఖ విడుదల చేసిన వానాకాలం–2026 నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్లో సాధారణ సాగు విస్తీర్ణం 15.93 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 13.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. మొత్తం 85.78 శాతం సాగు పూర్తయ్యింది. అంచనాలు మించిన పత్తి సాగు.. ఉమ్మడి వరంగల్లో సాధారణంగా 5,54,387 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా.. ఈసారి ఇప్పటికే 5,61,578 ఎకరాల్లో సాగైంది. అంటే సాధారణ అంచనాలో 101.30 శాతం మేర సాగు నమోదైంది. ముఖ్యంగా భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో పత్తి సాగు సాధారణ అంచనాలను మించింది. భూపాలపల్లిలో 98,764 ఎకరాల సాధారణ సాగుకు 1,09,442 ఎకరాల్లో పత్తి వేశారు. జనగామలో 1,37,145 ఎకరాల అంచనాకు 1,38,325 ఎకరాల్లో సాగు చేశారు. కాగా, సాధారణంగా 15,715 ఎకరాల్లో పప్పుధాన్యాలు సాగవుతాయని అంచనా ఉండగా.. ఇప్పటికే 60,863 ఎకరాల్లో సాగయ్యాయి. వరి సాధారణంగా 9,21,445 ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా కాగా 6,16,267 ఎకరాల్లో మాత్రమే సాగైంది. విస్తీర్ణంలో 66.88 శాతం మాత్రమే నమోదైంది. మానుకోట ముందంజ మొత్తం సాగు విస్తీర్ణం పరంగా మహబూబాబాద్ ముందు నిలిచింది. జిల్లాలో 3,71,318 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణానికి 3,30,176 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సాధారణ అంచనాతో పోలిస్తే సాగు ప్రగతిలో భూపాలపల్లి 94 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత జనగామ 91 శాతం, మహబూబాబాద్ 89 శాతం, హనుమకొండ 85 శాతం, ములుగు 80 శాతం, వరంగల్లో 72 శాతం చొప్పున సాగు నమోదైంది. వర్షపాతం లోటు, తక్కువ నీటి లభ్యత, ఎల్నినో ప్రభావంపై వ్యవసాయశాఖ చేపట్టిన అవగాహన సదస్సులు ఫలించాయి. అధిక నీటి అవసరం ఉన్న వరి సాగు కంటే తక్కువ నీటితో సాగయ్యే పత్తి, పప్పుధాన్యాల వైపు రైతుల మొగ్గు చూపారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్సీడ్స్, పప్పుధాన్యాల పంటలు సాగు చేయాలని రైతులకు సూచించాం. – దోమ ఆదిరెడ్డి, ఏడీఏ, హనుమకొండ ఉమ్మడి జిల్లాలో 5,61,578 ఎకరాల్లో కాటన్ క్రాప్ వరి 6,16,267, పప్పుధాన్యాలు 60,863 ఎకరాల్లో సాగు ఈసారి 15.93 లక్షలకు 13.66 లక్షల ఎకరాల్లో పంటలు వర్షాభావ పరిస్థితులతో పంటమార్పిడికి రైతుల మొగ్గు -
‘ఉత్తమ’ అవార్డులకు దరఖాస్తులు
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా స్థాయిలో విద్యాబోధనలో విశేష కృషి చేస్తున్న ఉపాధ్యాయులు ‘ఉత్తమ ఉపాధ్యాయ’ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో ఉత్తమ బోధనా పద్ధతులు అవలంబిస్తూ, విద్యార్థుల ప్రతిభావృద్ధికి, పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నవారు, సమాజంలో విద్యా చైతన్యానికి సేవలందిస్తున్న ఉపాధ్యాయుల నుంచి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. 25 ఏళ్ల సర్వీస్ను పూర్తి చేసి ఉండి తమ సేవలకు సంబంధించి ఆధారాలతో కూడిన ప్రతిపాదనలను సంబంధిత మండల విద్యాధికారుల ద్వారా హెచ్ఎంల ద్వారా పంపాలని సూచించారు. ఎంఈఓలు, హెచ్ఎంలు పరిశీలించి ప్రతిపాదనలు సమర్పించాల్సిన గడువు ఈనెల 29 వరకు ఉందని పేర్కొన్నారు. ఎంపిక చేసిన ఉపాధ్యాయులను సెప్టెంబర్ 5న అవార్డులు అందజేస్తామని తెలిపారు. కేయూ క్యాంపస్: నిరంతర జ్ఞాన సముపార్జనే లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం విద్యార్థులను, పరిశోధకులను కోరారు. కేయూలోని కంప్యూటర్ సెంటర్లో యూనివర్సిటీ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ అండ్ అలైడ్ డిసిప్లిన్ ఆధ్వర్యంలో వారంరోజులుగా నిర్వహిస్తున్న వర్క్షాప్ శనివారం ముగిసింది. శిక్షణలో పాల్గొన్న వారికి రిజిస్ట్రార్ రాంచంద్రం సర్టిఫికెట్లు అందించారు. వర్క్షాప్ డైరెక్టర్, ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ ఎన్.ప్రసాద్, అదనపు సంచాలకులు డాక్టర్ శాస్త్రి, పూణేకు చెందిన అడ్వెంట్ ఇన్ఫర్మేటిక్స్ లిమిటెడ్ బాధ్యులు డాక్టర్ దీపక్ శర్మ, డాక్టర్ సచికేత్ జోషి, డాక్టర్ షంషేర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు వికసిత్ భారత్లో భాగస్వామ్యమే లక్ష్యంగా విద్యనభ్యసించాలని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. క్యాంపస్లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో శనివారం 68వ బ్యాచ్ యూజీ విద్యార్థులకు ఓరియెంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హాజరై నూతన విద్యార్థులకు స్వాగతం పలికి మాట్లాడారు. క్యాంపస్లో అందుతున్న విద్య, వసతులు, ఉపాధి అవకాశాల గురించి వివరించారు. కార్యక్రమంలో డీన్లు వెంకయ్యచౌదరి, కిరణ్కుమార్, ప్రొఫెసర్లు వాసు, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ ఎన్ఐటీలో ఈనెల 17 నుంచి 22వ తేదీ వరకు ‘శారీరక విద్య, క్రీడా విజ్ఞాన శాస్త్రంలో అభివృద్ధి చెందుతున్న ధోరణులు, బహుళ విభాగాల విధానాలు’ అంశంపై స్వల్పకాలిక శిక్షణ నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో ఎన్ఐటీ వరంగల్ వ్యాయామ విద్యా విభాగ ప్రొఫెసర్ రవికుమార్ చేతుల మీదుగా స్పొర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ గుగులోతు అశోక్ కుమార్ ప్రశంసపత్రం అందుకున్నారు. అశోక్కుమార్ను సాట్ ఎండీ సోనీ బాలాదేవి, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు అభినందించారు. వరంగల్ లీగల్: వరంగల్ జిల్లా కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న కె.పూజ పదోన్నతిపై శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ వరంగల్కు బదిలీ అయ్యారు. ఈసందర్భంగా కార్యదర్శి పూజకు న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జ్ కార్యదర్శి ఎ.ప్రదీప్, సూపరింటెండెంట్ మోహన్రావు, సిబ్బంది ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా హైమ పూజిత సూపర్బజార్(కొత్తగూడెం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న హైమ పూజితను పదోన్నతిపై హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఈ మేరకు హైకోర్టునుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
గిరిజన తండాల్లో యువతుల సందడే సందడి
●సాక్షి, మహబూబాబాద్: బంజారా యువతులు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్. తీజ్ అంటే గోధుమ నారు. ప్రకృతి శ్రావణంలో వర్షాలు కురిసి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఈ సీజన్లో కనిపించే ఎర్రని వర్ణం గల ఆరుద్ర పురుగులను కూడా తీజ్ అని పిలుస్తారు. అంతటి అందమైన పురుగులను దేవుడు మనకోసమే కిందికి పంపిస్తాడని, ఈ పురుగులు కనిపించినప్పుడు యువతులు మనస్సులో కోరుకున్న కోరిక ఫలిస్తుందనేది గిరిజనుల నమ్మకం. ఈనేపథ్యంలో గోధుమలు బుట్టల్లో అలికి రోజూ నీళ్లు పోస్తే ఆరుద్ర పురుగులాంటి అందం, మంచి నడవడిక, బుద్ధి, సంపదలతో కూడిన వరుడు దొరుకుతాడని గిరిజనులు నమ్ముతారు. ఈనమ్మకం వందల ఏళ్ల కిందట మొదలై రోజురోజుకూ ఆధునిక హంగులు అద్దుకుంటోంది. తొమ్మిది రోజుల తంతు పెళ్లీడుకు వచ్చిన యువతి తనకు కావాల్సిన పెళ్లికొడుకు కోసం చేసే ఈ పండుగలో ముందుగా తల్లిదండ్రులు, తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. ముఖ్యంగా తండా పెద్ద నాయక్ అనుమతి పొందిన తర్వాత పండుగ తంతు మొదలు పెడతారు. తీజ్ (గోధుమ మొలకలు) ఏపుగా పెరిగేందుకు ఆడపిల్లలు అడవికి వెళ్లి దుస్సేరు (ఫిలోణీర్ వేళ్లీ) తెస్తారు. ఈ తీగలతో అందమైన బుట్టలను అల్లుతారు. లంబాడీల ఆరాధ్య దైవం తుల్జా భవానీ, సేవాలాల్ మహరాజ్, సీత్లాభవానీలకు పూజలు చేసి స్నానాలు ఆచరించి పవిత్రతతో పుట్టమట్టిని తెస్తారు. లంబాడీ భాషలో బోరడీ ఝుష్కేరో అంటే రేగుముళ్లు గుచ్చడం. గోధుమబుట్టల్లోని నారుకు నీరు పోస్తున్న యువతి గోధుమ నారు పెంచి.. కోరుకున్న వరుడి కోసం పూజలు ఉమ్మడి జిల్లాలో బంజారాల సంబురం నూతన అలంకరణలతో ఉత్సవం -
భూసేకరణను వేగవంతం చేయాలి
హన్మకొండ అర్బన్: గౌరవెల్లి కాలువ, గ్రీన్న్ ఫీల్డ్ జాతీయ రహదారి, దేవాదుల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో రెవెన్యూ, సాగు నీటిపారుదల, జాతీయ రహదారుల శాఖ అధికారులతో భూసేకరణ, పరిహారం చెల్లింపులపై సమీక్ష నిర్వహించారు. వేలేరు, భీమదేవరపల్లి, ధర్మసాగర్ మండలాల్లో గౌరవెల్లి కాలువకు సేకరిస్తున్న భూముల్లో పెగ్ మార్కింగ్ పనులు సర్వేయర్లతో త్వరగా పూర్తి చేయాలన్నారు. భూభారతి దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. భూముల రీసర్వేను కూడా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, ఆర్డీఓలు వెంకటేశ్, డీఎస్.వెంకన్న, హైవే పీడీ భరద్వాజ్, సాగునీటిపారుదల శాఖ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఏజీ మిల్లు మాజీ కార్మికులతో సమావేశం న్యూశాయంపేట: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆజంజాహి మిల్లు మాజీ కార్మికుల సమస్య పరిష్కారానికి వరంగల్ కలెక్టరేట్లో శనివారం సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖ అధికారులు, పిటిషనర్లు, మాజీ కార్మికులతో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, కుడా వైస్ చైర్పర్సన్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సమావేశమయ్యారు. సమస్య పరిష్కారానికి, ప్రత్యామ్నాయాలపై తమ అభిప్రాయాలను తెలిపేందుకు కార్మికులు సమయం కోరినట్లు కలెక్టర్ తెలిపారు. దీంతో మరోసారి సమావేశం నిర్వహించి తదుపరి చర్యలు చేపడతామని ఆమె పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కుడా సీపీఓ అజిత్రెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆజంజాహి మిల్లు మాజీ కార్మికులు పాల్గొన్నారు. -
90మంది కండక్టర్లు ‘ఔట్’!
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో జీవితానికి భద్రత ఉంటుందని కోటి ఆశలతో వచ్చిన నిరుద్యోగులను ఏడాదిలోపే సంస్థ రోడ్డున పడేసింది. వరంగల్ రీజియన్లో ఒక్కసారిగా 90మంది ఔట్ సోర్సింగ్ కండక్టర్లను తొలగిస్తూ రీజినల్ మేనేజర్ ఆదేశాల మేరకు పర్సనల్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ రీజియన్లో మొత్తం 274మంది ఔట్సోర్సింగ్ కండక్టర్లు పనిచేస్తుండగా శుక్రవారం రాత్రి 90మందిని తొలగించారు. తమకు ఎలాంటి ముందస్తు నోటీసు, సమాచారం ఇవ్వకుండానే అన్యాయంగా తొలగించారని నిరసన వ్యక్తం చేస్తూ, తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయం వద్ద తొలగించిన ఔట్ సోర్సింగ్ కండక్టర్లు ధర్నా చేశారు. ఏడాది కాలంగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమను అకారణంగా తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. మర్నాడు విధులకు రమ్మని డ్యూటీ చార్టు వేసి రాత్రికి రాత్రే తొలగించడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. తాము ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్కు రూ.లక్షనుంచి రూ.2 లక్షల వరకు ఇచ్చి విధుల్లో చేరామని ఆరోపించారు. నెలకు ఇచ్చే రూ.18వేలలో ఒక్కరోజు గైర్హాజరుకు రూ.600లకు బదులుగా రూ.1200 కోత విధించినా.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీలో ఉద్యోగ భద్రత ఉంటుందని సహిస్తూ వచ్చామన్నారు. తమ కుటుంబాల పరిస్థితులు అర్థం చేసుకుని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈవిషయమై ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ షెడ్యూల్స్ తగ్గించడంతో కండక్టర్లు మిగులుబాటులో ఉన్నారని, అందుకే తాత్కాలికంగా తొలగించామని తెలిపారు. రాత్రి 11 గంటల వరకు డ్యూటీ చేశాను.. నేను శుక్రవారం రాత్రి 11 గంటల వరకు డ్యూటీ చేశా. మర్నాడు డ్యూటీకి రమ్మని అధికారులు చెప్పారు. తెల్లారేసరికి నన్ను తొలగించారని తెలిసింది. నా భర్తకు ప్రమాదం జరిగి ఇంటి వద్దనే ఉంటున్నాడు. నా ఉద్యోగం పోయింది. ఇప్పుడు కుటుంబ పరిస్థితి ఆగమయ్యే పరిస్థితులున్నాయి. – అనూష, ఔట్సోర్సింగ్ కండక్టర్, హనుమకొండ డిపో ఏడాది కాలంగా చేస్తున్నా.. హైదరాబాద్లో హోమ్ లోన్స్లో పనిచేసే నేను.. ఆర్టీసీ ప్రభుత్వానిది కావడంతో రెగ్యులర్ అవుతుందని కండక్టర్ ఉద్యోగంలో చేరా. కాంట్రాక్టర్కు కొంత సొమ్ము కూడా ముట్టజెప్పా. ఇప్పుడు కాంట్రాక్టర్ ఫోన్ ఎత్తడం లేదు. మధ్యలోనే తొలగించడంతో మేం వీధిన పడే పరిస్థితి నెలకొంది. – ఐలయ్య, ఔట్సోర్సింగ్ కండక్టర్, నర్సంపేట డిపో వెట్టి చాకిరి చేయించుకున్నారు.. ఔట్ సోర్సింగ్ కండక్టర్ ఉద్యో గం కోసం ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు కాంట్రాక్టర్కు చెల్లించారు. వీరికి నెలకు రూ.18వేల వేతనం ఇచ్చారు. ఏడాది పని చేస్తే వీరికి రూ.2,16,000 వస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు పడినా భవిష్యత్లో రెగ్యులర్ అవుతుందన్న ఆశతో ఉద్యోగంలో చేరితే మధ్యలోనే తొలగించి అన్యాయం చేశారు. – గాదె మహేందర్, బీఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించిన ఆర్టీసీ వరంగల్ రీజియన్లో మొత్తం 274 మంది ఔట్ సోర్సింగ్ కండక్టర్లు ఆర్ఎం కార్యాలయం ఎదుట బాధితుల ధర్నా.. తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ -
కమ్ముకొచ్చిన శ్రావణ మేఘాలు.. ఆకాశం అక్షింతలు వేసినట్లుగా రాలే చినుకులు.. పచ్చని పైర్లు.. చల్లని గాలులు.. నేలమ్మ కొప్పులో ఎర్రని మందారాలు పెట్టినట్లుగా అగుపించే ఆరుద్ర పురుగులు.. ఇవన్నీ బంజారా యువతుల మనస్సులోని కోర్కెలు నెరవేర్చే ప్రకృతి సూచకాలు. వీటన్నింట
తీజ్ వేడుకల్లో నిర్వహించే ప్రతీ ఘట్టం ఆకట్టుకుంటుంది. వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనిగలకు యువతలు రేగుముళ్లు గుచ్చుతారు. ఎంతో నిష్టతో చేసే ఈ ప్రక్రియను బావ వరుస ఉన్న వారు కన్నెపిల్ల మనస్సు చెదిరేలా కదిలి స్తూ ఉంటారు. అప్పుడు రేగుముళ్లు శనిగలకు కాకుండా వారి చేతికి కూడా గుచ్చుకుంటాయి. దీన్ని భరిస్తూ రేగుముళ్లు శనిగలకు గుచ్చడం ఈ తంతు ప్రత్యేకత. ఏడోరోజు ఢమోళీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఢమోళీ చుర్మో (రొట్టెలు, బెల్లం కలిపిన ముద్ద)ను మేరామా భవానీకి నైవేద్యం పెడతారు. ఎనిమిదో రోజు మట్టితో బంజారా ఆరాధ్య దైవాల ప్రతిరూపాలు తయారు చేస్తారు. అబ్బాయి (డోక్రా), అమ్మాయి (డోక్రీ)లుగా పేర్లు పెడతారు. వీటికి గిరిజన సంప్రదాయాల ప్రకారం పూజ చేస్తారు. తొమ్మిదో రోజు డప్పుచప్పుళ్లు, గిరిజన నృత్యాలతో అంద రూ బుట్టలవద్దకు వెళ్తారు. అక్కడికి తండా నాయక్ వచ్చి యువతులకు బుట్టలిస్తారు. ఈసందర్భంగా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకుంటారు.భోగ్ వద్ద తీజ్ బుట్టలతో యువతులు -
‘వికసిత్ భారత్’కు అకౌంటింగ్ విధానాలు కీలకం
కేయూ క్యాంపస్ : వికసిత్ భారత్ లక్ష్యసాధనలో పారదర్శకత, విశ్వసనీయత అకౌంటింగ్ విధానాలు అత్యంత కీలకమని హైదరాబాద్లోని ఎన్ఎల్పీ కన్సల్టింగ్ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ కోమరగిరి రాధాకృష్ణ అన్నారు.శనివారం కాకతీయ యూనివర్సిటీలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం, ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ వరంగల్ చాప్టర్ సంయుక్త ఆధ్వర్యంలో ‘అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ క్యాపిటలిస్ట్స్ ఫర్ వికసిత్ భారత్ –2047’ అంశంపై నిర్వహించిన ఒకరోజు సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. భారత్ను అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో ఫైనాన్స్ అకౌంటింగ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 2047నాటికి వికసిత్భారత్ నిర్మించాలంటే ఆర్థికాభివృద్ధితోపాటు పారదర్శక పాలన అవసరమని కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. సదస్సుకు కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. నర్సింహారావు అధ్యక్షత వహించారు. అనంతరం ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు కె.వి చలపతి, ఐఏఏ చాప్టర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ సి.హెచ్ రాజేశం, కార్యదర్శి కె. రాజేందర్, కేయూ ఓఎస్డీ వెంకట్రాంరెడ్డి, సదస్సు కన్వీనర్ పి. అమరవేణి, ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు గాబ్రియెల్ సైమన్తాటైల్, కార్యదర్శి సంజయ్భాయని, ఇండియన్ అకౌంటింగ్ మా జీ అధ్యక్షుడు వి. అప్పారావు మాట్లాడారు. విశ్రాంత ఆచార్యులు రాజిరెడ్డి, కృష్ణమాచార్య ఉన్నారు. హైదరాబాద్ ఎన్ఎల్పీ కన్సల్టింగ్ గ్లోబల్ చీఫ్ ఎండీ రాధాకృష్ణ -
రౌడీషీటర్లపై నిరంతర నిఘా
పోలీస్ కమిషనర్ శ్వేత వరంగల్ క్రైం: పోలీస్ స్టేషన్ పరిధి రౌడీషీటర్ల వ్యవహార శైలిపై అధికారులు నిరంతరం నిఘా పెట్టాలని పోలీస్ కమిషనర్ శ్వేత ఆదేశించారు. నెలవారీ నేర సమీక్ష కమిషనరేట్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ శ్వేత మాట్లాడారు. నేర నియంత్రణలో భాగంగా ప్రతీ పోలీస్ అధికారి నిరంతరం శ్రమించాల్సి ఉంటోందని సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడంతో పాటు వారి సమస్యలపై తక్షణమే స్పందించాలని చెప్పారు. ప్రజలతో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కొనసాగించాలని సూచించారు. అనంతరం పెండింగ్ కేసులకు సంబంధించి నిందితుల అరెస్ట్లు, కేసుల దర్యాప్తు, ప్రస్తుతం కోర్టులో ఉన్న కేసుల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీసీపీలు అంకిత్కుమార్, దారా కవిత, రాజమహేందర్ నాయక్, కిషన్సింగ్, అదనపు డీసీపీలు సురేశ్ కుమార్, బాలస్వామితో పాటు ఏసీపీలు, పోలీస్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
బెటాలియన్ కానిస్టేబుల్ వర్సెస్ బీట్ కానిస్టేబుల్
బార్ దగ్గర న్యూసెన్స్ చేస్తున్నాడని టీజీఎస్ పీసీని చితకబాదిన బీట్ కానిస్టేబుల్ఖిలా వరంగల్: వరంగల్ ఉర్సు గుట్ట వద్ద ఓ బార్షాపులో మద్యంతాగి న్యూసెన్స్ చేస్తున్నాడని టీజీ ఎస్పీ కానిస్టేబుల్ను మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్కు చెందిన ఓ బీట్ కానిస్టేబుల్తోపాటు మరో ఇద్దరు కర్రలతో చితకబాదారు. ఈనెల 19న సాయంత్రం ఉర్సుగుట్ట వద్ద ఓ బార్షాపులో టీజీ ఎస్పీ కానిస్టేబుల్ మద్యం మత్తులో న్యూసెన్స్ చేస్తున్నాడని నిర్వాహకులు 112కు ఫిర్యాదు చేయడంతో బీట్ కానిస్టేబుల్ సంతోశ్రెడ్డి అక్కడికి చేరుకున్నాడు. బెటాలియన్ కానిస్టేబుల్కు షర్టు వేసుకొని అక్కడినుంచి వెళ్లిపోవాలని సూచించాడు. ఈ క్రమంలో అతడిని చెంపపై కొట్టడంతో అతను తిరిగి బీట్ కానిస్టేబుల్ చెంపపై కొట్టినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన బీట్ కానిస్టేబుల్, మరో ఇద్దరు కర్రలతో టీజీఎస్పీ కానిస్టేబుల్ను చితకబాదినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై బీట్ కానిస్టేబుల్ గురువారం మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, టీజీ కానిస్టేబుల్పై 132, 221 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. కాగా, టీజీఎస్పీ కానిస్టేబుల్కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో లేవలేని స్థితిలో ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన వీడియో శనివారం సామాజిక మధ్యమాల్లో వైరలైంది. ఇరువురు కానిస్టేబుళ్ల మధ్య జరిగిన ఘటనపై పోలీస్ అధికారులు పూర్తిస్థాయి విచారణ చేయనున్నట్లు తెలిసింది. -
వరంగల్లో ప్రతిష్టాత్మక
వైద్య సదస్సు గర్వకారణంహన్మకొండ అర్బన్ : నగరంలోని కాళోజీ కళాక్షేత్రంలో టోసా–ఒయాసిస్కాన్ 2026 ఆర్థోపెడిక్ సదస్సు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి ప్రతిష్టాత్మక వైద్య సదస్సులకు వరంగల్ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమన్నారు. సీనియర్ వైద్యుల అనుభవాన్ని యువ వైద్యులు అందిపుచ్చుకునేందుకు నిరంతరం అభ్యాసన, శిక్షణ అవసరమని తెలిపారు. ఒయాసిస్ అధ్యక్షుడిగా విజయ్చందర్ రెడ్డి.. సదస్సులో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ పెసరు విజయ్చందర్ రెడ్డి ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ (ఒయాసిస్) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దక్షిణ భారత ఆర్థోపెడిక్ వైద్యులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఆధునిక చికిత్స విధానాలు, పరిశోధనలు, సాంకేతికతపై జ్ఞానాన్ని పంచుకునేలా కృషి చేస్తానన్నారు. యువ వైద్యులకు శిక్షణ, ప్రయోగిక అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ వైద్యులు పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ శ్వేత టోసా– ఒయాసిస్కాన్ 2026 ఆర్థోపెడిక్ సదస్సు ప్రారంభం -
కళ తప్పుతున్న పార్క్
ఖాళీ ఎన్క్లోజర్స్.. న్యూశాయంపేట : చారిత్రక వరంగల్ నగరానికి తలమానికమైన కాకతీయ జులాజికల్ పార్క్ (వనవిజ్ఞాన కేంద్రం) రోజురోజుకూ తన వైభవాన్ని కోల్పోతోంది. ఒకప్పుడు పక్షుల కిలకిల రావాలు.. వన్యప్రాణుల గర్జనలు.. పర్యాటకుల సందడితో కళకళలాడిన జూపార్క్ రానురాను సరైన నిర్వహణ లేక కనువిందు చేసే జంతువుల కొరతతో వెలవెలబోతోంది. అడవికి రాజులైన పులులు, సింహాలు లేకపోవడంతో వివిధ జిల్లాల నుంచి వ్యయప్రయాసలు కోర్చి ఎంతో ఆశగా వచ్చే పర్యాటకులు తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. జూపార్క్ అనగానే గుర్తు కొచ్చే గత సంవత్సరంలో తీసుకొచ్చిన తెల్ల పులి శరణ్, శంకర్, అడవి దున్నల గర్జన వినడానికి, వాటి సంచారాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి వేలాది మంది పర్యాటకులు కుటుంబ సమేతంగా వచ్చేవారు. కానీ వయోభారంతో తెల్లపులి, మరిన్ని జంతువులు మరణించడం, మరికొన్నింటిని ఆరోగ్యరీత్యా హైదరాబాద్ జూపార్క్కు తరలించారు. తర్వాత వాటి స్థానంలో కొత్త వన్యప్రాణులను తీసుకురావడంలో అటవీశాఖ అధికారులు పూర్తిగా విఫలం చెందారని జంతు ప్రేమికులు విమర్శిస్తున్నారు. ఉత్సాహంతో జూపార్క్కు వస్తే ఖాళీగా ఉన్న బోన్లు, కొన్ని జింకలు, కోతులు, పక్షులు తప్ప ఏమి కనిపించడం లేదని పర్యాటకులు పెదవి విరుస్తున్నారు. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) నిర్మాణమేది? జూపార్క్లో మురుగు నీటి వ్యవస్థ తీవ్రంగా వేధి స్తోంది. హంటర్రోడ్ పరిసర ప్రాంతాల్లోని పలు కాలనీల నుంచి మురుగు నీరు కాల్వ ద్వారా నేరుగా జూపార్క్లోకి చేరుతుంది. మురుగునీటి మళ్లింపు కోసం రూ. కోటి వ్యయంతో డ్రెయినేజీ పనులు చేపట్టారు. అయితే నిధుల కొరతతో కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే వదిలేయడంతో సమస్య మరింత జఠిలమైంది. నిలిచిన మురుగునీరు దుర్వాసన, కాలుష్యం కారణంగా జంతువులు మృత్యువాత పడ్డాయి. మరికొన్ని అనారోగ్యం పాలవ్వడంతో అధికారులు సేఫ్ ప్రదేశమైన నెహ్రూ జువలాజికల్ పార్క్కు తరలించాల్సి వచ్చింది. గతంలో స్మార్ట్ సిటీ ఫండ్స్ ద్వారా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను నిర్మాణం చేపట్టాలని అధికారులు ప్రతిపాదించారు. త్వరితగతిన పూర్తి చేయాలని ఉరుకులు పరుగులు పెట్టారు. అయితే ఎస్టీపీ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్న చందంగా మారింది. మురుగు నీటి వ్యవస్థ తక్షణ, శాశ్వత పరిష్కారం కోసం మున్సిపల్ కమిషనర్.. అటవీశాఖ అధికారులతో కలిసి ఇటీవల పార్క్ను క్షేత్రస్థాయిలో సందర్శించారు. మురుగు నీటి ప్రాంతాలను పరిశీలించి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నెలవారీగా పర్యాటకుల వివరాలు (ఏప్రిల్–2025 నుంచి మార్చి–2026 వరకు ఆదాయం)మాసం పర్యాటకులు మొత్తంఆదాయం (రూ.ల్లో) 1)ఏప్రిల్–25 15,931 9,44,080 2)మే –25 27279 14,92,330 3)జూన్– 25 22292 12,78,910 4)జూలై –25 16922 10,45,750 5)ఆగస్టు–25 19011 11,53,150 6)సెప్టెంబర్–25 12867 7,98,830 7)అక్టోబర్–25 17850 11,27,000 8)నవంబర్–25 30159 15,76,010 9)డిసెంబర్–25 39077 19,97,580 10)జనవరి–26 27874 15,93,570 11)ఫిబ్రవరి–26 15759 10,63,580 12)మార్చి–26 16210 9,66,380 మొత్తం 2,61,431 1,50,37,170ఇక్కడ కనువిందు చేసే వన్యప్రాణులు కానరాకపోయే! వైభవం కోల్పోతున్న కాకతీయ జులాజికల్ పార్క్ జంతు సంరక్షణలో అధికారుల తీవ్ర నిర్లక్ష్యం పులులు లేవు.. పర్యాటకుల పెదవి విరుపుజూపార్క్లో ప్రధాన ఆకర్షణ(జంతువులు)లు కనుమరుగవ్వడంతో సందర్శకుల తాకిడి గణ నీయంగా పడిపోయింది. దీనికి తోడు కొన్ని వి భాగాలు నిర్వహణ సరిగా లేక అధ్వానంగా త యారయ్యాయి. ఇటీవలే అనారోగ్యంతో అడవి దున్న, కరెంట్ షాక్తో హైనా చనిపోయింది. రాయల్ బెంగాల్ టైగర్స్ ఎన్క్లోజర్స్లో జంతువులు లేక వెలవెలబోతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఎనిమల్ ఎక్సేంజీలో భాగంగా క్రూరమృగాలను ఇక్కడికి తీసుకొస్తామని గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటనలు గు ప్పించారు. కానీ ఆ ప్రకటనలు కాగితాలకే పరి మితమయ్యాయి. పార్క్లో అభివృద్ధి పేరుతో లక్షలాది రూపాయలు ఖర్చుచేస్తున్నారే తప్ప జంతు సంరక్షణపై తగినంత పర్యవేక్షణ, శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. సంరక్షణకు నిధుల కొరతనా లేక అధికారుల నిరక్ష్యమా.. అనే విషయం తెలియడం లేదని సామాజిక కార్యకర్తలు, పర్యాటకులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి పార్క్లోకి ఆకర్షణీయ జంతువులను తీసుకొచ్చి మౌలిక వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు. -
ఎంజీఎం ఐడీ వార్డు తీరుపై డీఎంఈ ఆరా
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని ఐడీ వార్డు నిర్వహణపై డీఎంఈ డాక్టర్ వాణి ఆరా తీసినట్లు తెలుస్తోంది. కలెక్టర్ డాక్టర్ సత్యశారద కూడా వివరణ కోరినట్లు సమాచారం. ‘ఐడీ వార్డు.. ఆగమాగం’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. నివారణ చర్యలు తక్షణమే చేపట్టాలని సంబంధిత శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. ఈసందర్భంగా పొద్దున్నే నలుగురు సానిటేషన్ సిబ్బంది ఐడీ వార్డుకు వెళ్లి పరిశుభ్రత చర్యలు చేపట్టారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా నివారణ చర్యలు తీసుకున్నారు. ఐడీ వార్డు ఎదుట అడ్డదిడ్డంగా ఉన్న రాళ్లను సరిచేసి, సిమెంట్, కంకరతో సరి చేయించారు. ఈ క్రమంలో తాత్కాలికంగా సిబ్బంది నీటి సదుపాయం కోసం ఒక నల్లాను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈసందర్భంగా ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ అశ్విని మాట్లాడుతూ.. ఐడీ వార్డులో ఉన్న పేషెంట్లను తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ రావడం లేదని, వారిని ఎక్కడికి పంపించలేక వార్డులోనే ఉంచాల్సి వస్తోందన్నారు. వీరిలో కేవలం ముగ్గురు పేషెంట్ల కోసం అవసరాన్ని బట్టి వైద్యులు వార్డుకు వచ్చి వెళ్తుంటారని తెలిపారు. ముఖ్యంగా ఇందులో ఓ మహిళకు మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల ఎవరు చెప్పినా వినకుండా క్లీన్ చేయడం, పక్క పేషెంట్లను ఇబ్బందులు పెట్టడం చేస్తోందని వివరించారు. ఆమెను అనాథాశ్రమానికి పంపాలనుకున్నా అక్కడ కూడా తోటి వారిని ఇబ్బందులు పెడుతుందన్న ఉద్దేశంతో ఐడీ వార్డులోనే ఉంచాల్సి వస్తోందని పేర్కొన్నారు. నివేదిక తెప్పించుకున్న వరంగల్ కలెక్టర్ సత్యశారద -
కళ్లలో కారం చల్లి.. కత్తితో గొంతు కోసి
ధర్మసాగర్ : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ పరిధి కాజీపేట మండలం రాంపూర్లో ఇటీవల జరిగిన పోలు వెంకటేశ్వర్లు (వెంకన్న)(45) హత్య కేసును పోలీసులు ఛేదించారు. కక్షల నేపథ్యంలో పథకం ప్రకారం హత్య చే సిన ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కాజీపేట ఏసీపీ పి.ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో వివరాలు వెల్లడించారు. జనగామ జిల్లా చిల్పూరుకు చెందిన మృతుడు పోలు వెంకటేశ్వర్లు కుమార్తెను ప్రధాన నిందితుడు ఇదే గ్రామానికి చెందిన అంబటి పరమేశ్ కుమారుడు వినయ్ 2022లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజులకే మనస్పర్థలతో దంపతులు విడిపోవడంతో ఇరువర్గాల మధ్య పంచాయితీలు జరిగాయి. 20 23లో జరిగిన ఓ పంచాయితీలో వెంకటేశ్వర్లు తనను తీవ్రంగా దూషించాడనే కక్షతో అతడిని అంతమొందించాలని పరమేశ్ నిశ్చయించుకున్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 17న పథకం ప్రకారం పరమేశ్.. తనకు తెలిసిన చిల్పూరు పల్లెకు చెందిన దామెర సంపత్ను నమ్మబలికి వెంకటేశ్వర్లును బయటకు తీసుకెళ్లి మద్యం తాగించాలని కోరాడు. మరో నిందితుడు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం రాంపూర్కు చెందిన చిలుముల వెంకటస్వామి కూడా హత్యకు సహకరిస్తే చట్టపరమైన సమస్యలను తాను చూసుకుంటానని పరమేశ్ భరోసానిచ్చాడు. ఈ క్రమంలో సంపత్.. వెంకటేశ్వర్లుకు మద్యం తాగించాక పరమేశ్ కూడా వారితో కలిసి తాగాడు. అనంతరం వెంకటేశ్వర్లును బైక్పై రాంపూర్ సమీపంలోని మడేలయ గుడి సమీపంలోని నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ మత్తులో ఉన్న వెంకటేశ్వర్లు కళ్లలో కారం చల్లి, కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం హత్యకు ఉపయోగించిన కత్తిని సమీపంలోని సిమెంట్ పైపుల్లో దాచిపెట్టాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులు పరమేశ్, సంపత్, వెంకటస్వామిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. కాగా, ముగ్గురు నిందితులకు గతంలోనే నేర చరిత్ర ఉన్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. వ్యక్తి దారుణ హత్య.. ఈ ఘటనలో ముగ్గురి అరెస్ట్ వివరాలు వెల్లడించిన పోలీసులు -
ట్రాక్షన్ మోటార్ ట్రయల్ రన్ టెస్ట్ ప్రారంభం
కాజీపేట రూరల్ : కాజీపేట డీజిల్ లోకోషెడ్లో శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపాల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ (పీసీఈఈ/ఎస్సీఆర్) జి.వి.మల్లికార్జునరావు ట్రాక్షన్ మోటార్ ట్రయల్ రన్ టెస్టింగ్ ప్యానెల్, అండర్ ట్రాక్ 65–టన్ను క్రేన్, తనిఖీ చక్రాన్ని ప్రారంభించినట్లు స్థానిక అధికారులు తెలి పారు. కాజీపేట రైల్వే డీజిల్ లోషెడ్లోని పలు విభాగాలను శుక్రవారం పీసీఈఈ మల్లికార్జున రావు తనిఖీ చేసి సీనియర్ డీఎంఈ ఎన్.వి.వెంకటకుమార్, సీనియర్ డీఈఈ హరికృష్ణ, సీనియర్ డీఈఈ సూర్యనారాయణతో మాట్లాడి లోకోల పనితీరు, షెడ్ అభివృద్ధి, ఇతరత్రా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైల్వే పీసీఈఈకి వినతులు.. రైల్వే పీసీఈఈ మల్లికార్జునరావుకు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ డీజిల్లోకో షెడ్ బ్రాంచ్ సెక్రటరీ పాక వేదప్రకాశ్, ట్రెజరర్ గిరిమిట్ల రాజేశ్వర్రావు, వైస్ చైర్మన్లు తిరుపతి, యాదగిరి, సహాయ కార్యదర్శులు మహేశ్బాబు, నరేశ్యాదవ్, కమిటీ సభ్యులు పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా రైల్వే ఓబీసీ సంఘం డివిజన్ సెక్రటరీ ఎ.సంతోష్కుమార్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లం రమేశ్, డీజిల్ బ్రాంచ్ సెక్రటరీ కూరపాటి శ్యాం, చైర్మన్ ఆంజనేయులు.. మల్లికార్జునరావుకు కార్మికుల సమస్యపై వినతి పత్రం అందజేశారు. కాగా, కార్మికుల సమస్యలు చెప్పుకోవడానికి మల్లికార్జునరావు సమయం ఇవ్వకపోవడంతో రైల్వే నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రాస్ క్లస్టర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభంఖిలా వరంగల్: మహిళా సూక్ష్మ పారిశ్రామిక వేత్తలు, చేతి వృత్తి కళాకారులకు మరింత ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో నాబార్డు అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్ శంభునిపేటలో బ్రాస్ క్లస్టర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా తెలంగాణ నాబార్డు ప్రాంతీయ కార్యాలయ డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రియాంక సైనీ హాజరై కామన్ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించారు. కార్యక్రమంలో నాబార్డు వరంగల్ డీడీఎం తంగివ చైతన్య రవి, హనుమకొండ నాబార్డు డీడీఎం చంద్రశేఖర్, మహబూబాబాద్ డీడీఎం సాయిరాం, జనగామ నాబార్డు డీడీఎంటీ, విజయ్కుమార్, నాబార్డు ఎం.సువీధి ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ మండల పరశురాములు, మాస్టర్ రాగి భిక్షపతి తదిరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ శవ రాజకీయాలు చేస్తోంది..
కాజీపేట అర్బన్: కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే బీఆర్ఎస్ శవ రాజకీయాలు చేస్తోందని, తెలంగాణ రాష్ట్ర అయిల్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. కాజీపేట మండలం టేకులగూడెంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్, హరీశ్రావు చేస్తున్న రాజకీయ లబ్ధి ప్రచారం వల్ల పెద్ది సుదర్శన్రెడ్డికి రావాల్సిన సానుభూతి దెబ్బతింటోందని, దొంతి మాధవరెడ్డి కాదు.. తన కుమారుడు నిల్చున్నా నర్సంపేటలో విజయం సాధిస్తాడన్నారు. వైఎస్సార్ నగర్ కాలనీ స్థలం ప్రభుత్వ భూమి అని, దాన్ని బస్టాండ్, ఆస్పత్రి, కళాశాలలకు, ఏసీపీ కార్యాలయానికి కేటాయిస్తామన్నారు. కొండా సుస్మిత.. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు, రాబోయే ఎన్నికల్లో సీట్లను సీఎం రేవంత్రెడ్డి ఒక్కరే నిర్ణయించలేరని, పార్టీ అధిష్టానం నిర్దేశిస్తుందని తెలిపారు. జెన్ జీ యువత రాజకీయాల్లోకి రావాలని రాహుల్ గాంధీ ఆహ్వానం పలుకుతున్నారని, రాబోయే ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కట్ల శ్రీనివాస్, తొట్లరాజు యాదవ్, సందెల విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు ఖండిస్తున్నా రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి -
కేయూలో అభివృద్ధి పనుల ప్రతిపాదనల పరిశీలన
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని పలు అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై యూనివర్సిటీ అధికారులు ఇటీవల నిర్వహించిన పాలకమండలి సమావేశంలో ఏజెండాగా పెట్టారు. ఆయా అభివృద్ధి ప్రతిపాదనల్లో ఏ మేరకు అవసరాలు ఉన్నాయనే అంశాలను కేయూ పాలకమండలి సభ్యులు శుక్రవారం పరిశీలించారు. తొలుత హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి ఆయా ప్రతిపాదనలను వివరించారు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో 40 కంప్యూటర్ల కోసం రూ. 30లక్షల వ్యయంతో, సెమినార్హాల్లో రూ. 10.80లక్షల వ్యయంతో ఫర్నిచర్ సదుపాయం, ఎంబీఏ విభాగంలో ఆరు తరగతి గదుల్లో రూ.14 లక్షల 78వేల 857తో ఫర్నిచర్ సదుపాయం అవసరమని పాలకమండలి సభ్యులకు వివరించారు. అనంతరం సుబేదారిలోని యూనివర్సిటీ శ్రీలాశ్రీ హాస్టల్ను సందర్శించి హాస్టల్లో మరమ్మతులు, ఎలక్ట్రిక్ వైరింగ్ తదితర పనులు అవసరమని గుర్తించారు. యూనివర్సిటీ పీజీ కళాశాలలో టాయ్లెట్స్ సక్రమంగా లేవని, వీటి మరమ్మతులు చేపట్టడంతోపాటు పాడైన చోట కొత్తగా నిర్మించాలని ప్రతిపాదించారు. కేయూ ఇంజనీరింగ్ కళాశాలలో పరిశీలన.. క్యాంపస్లోని కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. 36 లక్షల వ్యయంతో కంప్యూటర్ ల్యాబ్ కోసం, స్పోర్ట్స్ బోర్డు సందర్శించారు. అక్కడ బాస్కెట్బాల్, కబడ్డీ, తదితర క్రీడల కోర్టులకు సంబంధించి ప్రతిపాదనలు పరిశీలించారు. జూవాలజీ విభాగం పై అంతస్తులో అసంపూర్తిగాఉన్న భవనం నిర్మాణాన్ని కూడా పరిశీలించారు. కేయూ ఓఎస్డీ బి. వెంకట్రాంరెడ్డి, కేయూ పాలకమండలి సభ్యులు బి. సురేశ్లాల్, కె. అనితారెడ్డి, పుల్లూరి సుధాకర్, బి. రమ, ప్రొఫెసర్ మల్లం నవీన్, చిర్ర రాజు తదితరులు పాల్గొన్నారు. ఈనెల 24న ఇంకా పలు విభాగాల్లోని ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం వాటిలో మార్పులు, చేర్పులు కూడా చేయబోతున్నారు. అనంతరం రిపోర్టును యూనివర్సిటీ అధికారులకు అందజేస్తారు. -
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో గణనీయ అభివృద్ధి
హన్మకొండ: వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో గణనీయ పురోగతి సాఽధిస్తున్నామని ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ, డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్(వీసీ) నిర్వహించారు. ఇందులో ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ అంశాలను వివరించారు. టీజీ ఎన్పీడీసీఎల్లో వినియోగదారులకు విద్యుత్ సేవలను మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు వాట్సాప్ చాట్బాట్కు స్పందన లభిస్తోందని తెలిపారు. డి జిటల్ సేవల్లో భాగంగా ఫిర్యాదుల పరిష్కారంలో నూ పనితీరు మెరుగైందన్నారు. ఉద్యోగుల సేవల కు ఎంప్లాయ్ సపోర్ట్ బాట్ను అందుబాటులోకి తీ సుకొచ్చామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు కె.తిరుమల్ రావు, అశోక్, కె. వెంకటరమణ, సురేందర్, గౌతమ్ రెడ్డి, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, వేణుబాబు, జీఎంలు ప్రభావతి, శ్రీనివాస్, కళాధర్ రెడ్డి, జయరాజ్, వెంకట కృష్ణ, డి.ఈ. కె.అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ -
పోలీస్శాఖలో క్రమశిక్షణ, నిబద్ధత కీలకం
మామునూరు: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో 4వ బెటాలియన్ ఎల్లప్పుడూ అగ్రభాగాన నిలుస్తోందని, పోలీస్ శాఖలో క్రమశిక్షణ, నిబద్ధత అత్యంత కీలకమని 4వ బెటాలియన్ నూతన కమాండెంట్ ఎన్వీఎస్ శ్రీనివాసరావు అన్నారు. వరంగల్ మామునూరు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) 4వ బెటాలియన్ నూతన కమాండెంట్గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో అలసత్వాన్ని సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. బెటాలియన్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్ల ప్పుడు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు కె. బాలయ్య, వీరన్న, రాజేందర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ విజయ్, కార్తీక్, రాజిరెడ్డి, పురుషోత్తంరెడ్డి, వెంకటేశ్వర్లు, రాజ్కుమార్, రాంప్రసాద్ పాల్గొన్నారు. 4వ బెటాలియన్ నూతన కమాండెంట్ శ్రీనివాసరావు -
బాలలకు ఆపదొస్తే ఎలా?
సాక్షి, వరంగల్: చైల్డ్ హెల్ప్లైన్–1098కు వచ్చే ప్రతి కాల్ సాధారణ ఫోన్కాల్ కాదు.. అవతలి వైపు ఏడుస్తున్న బాలుడు, వేధింపులకు గురవుతున్న చిన్నారి, ఇంటి నుంచి తప్పిపోయిన పిల్లవాడు, బాలకార్మికుడు అయి ఉండొచ్చు. తక్షణ వైద్యం లేదా రక్షణ అవసరమైన వారు కావొచ్చు. అలాంటి సమయంలో కాల్ చేసిన వెంటనే స్పందన రాకపోతే ఆ నిమిషాల ఆలస్యం కూడా ప్రమాదకరమే. నిరంతరం సేవలు అందించాల్సిన 1098 ఆఫీస్కు తాళం పడితే బాలల రక్షణ వ్యవస్థకు అర్థమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తరచూ ఫార్వర్డ్ కాల్ ఆప్షన్తో తమ వ్యక్తిగత మొబైల్ నంబర్లకు కాల్స్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటూ రాత్రివేళ ఇంట్లో ఉంటున్నారని సమాచారం. దీనికి ఇక్కడ అధికారి ఒకరు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈహెల్ప్లైన్కు సంబంధించిన వివరాలు అడిగితే గోప్యంగా ఉంచడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. కలెక్టర్ ఆదేశాలు ఏమైనట్టు? బాలల సంరక్షణ కోసం 2015 జేజే యాక్ట్ నిబంధనలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం చైల్డ్ హెల్ప్లైన్ నిరంతరం అందుబాటులో ఉండాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న విమర్శలొస్తున్నాయి. 6 నెలల క్రితం బాలసముద్రంలోని బాలరక్షాభవన్ను వరంగల్ కలెక్టర్ సత్యశారద సందర్శించారు. ఎస్ఓపీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చైల్డ్లైన్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా అవి పాటించడంలో సిబ్బంది వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కలెక్టర్ ఆదేశాలనే అమలు చేయలేని పరిస్థితి ఉంటే.. బాలల రక్షణ వ్యవస్థను పర్యవేక్షిస్తున్న యంత్రాంగం ఏం చేస్తోంది? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. భద్రతాపరంగా సీసీ కెమెరాలు, వాచ్మన్ ఉన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలోని మూడో అంతస్తుకు తరలించినా సాయంత్రం, రాత్రి వేళ హెల్ప్లైన్ సిబ్బంది విధులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలున్నాయి. కాగా, చైల్డ్ హెల్ప్లైన్ సేవలు, 1098 కార్యాలయానికి తాళంపై జిల్లా సంక్షేమ విభాగాధికారి రాజమణిని ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. రాత్రివేళ వరంగల్ చైల్డ్ హెల్ప్లైన్–1098 కార్యాలయానికి తాళం ఆపదలో అండగా ఉండాల్సిన సిబ్బంది విధులకు డుమ్మా భద్రత పేరుతో ‘ఫార్వర్డ్ కాలింగ్’ వైపు మొగ్గు కలెక్టర్ ఆదేశాలున్నా నిరంతర సేవలకు బ్రేక్ -
వృద్ధాప్యంలో ప్రశాంత జీవనం గడపాలి
డీఎల్ఎస్ఏ కార్యదర్శి ప్రదీప్ వరంగల్ లీగల్: వృద్ధులు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రశాంత జీవితాన్ని గడపాలని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎ.ప్రదీప్ సూచించారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదనం బిల్డింగ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన సదస్సులో న్యాయమూర్తి ప్రదీప్ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర కారణాలతో బాధపడుతున్న వయోవృద్ధులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సలహాలు, ఉచిత న్యాయవాది సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా వృద్ధులకు ప్రత్యేక సేవలు అందిస్తున్న వారిని అభినందించి, సత్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారి పీఎస్.ఫణికుమార్, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ అధ్యక్షులు కోన్ మల్లారెడ్డి, లా కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ బి.విజయలక్ష్మి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి.శ్రీనివాసరావు, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, వృద్ధులు పాల్గొన్నారు. -
సర్వే పారదర్శకంగా నిర్వహించాలి
భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్కుమార్ న్యూశాయంపేట: సమగ్ర ఓటరు సర్వే ప్రక్రియ (ఎస్ఐఆర్)ను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్కుమార్ సూచించారు. వరంగల్ కలెక్టరేట్ లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, నర్సంపేట నియోజకవర్గాలకు చెందిన ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో ఎస్ఐఆర్ నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద జిల్లాలో ఎస్ఐఆర్పై పీపీటీ ద్వారా వివరించారు. అంతకుముందు పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఓటరు సర్వే ప్రక్రియ, బూత్ లెవల్ అధికారులు నిర్వర్తిస్తున్న విధులను కార్యదర్శి అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం రుద్రేశ్వరస్వామిని మధుర మీనాక్షి అమ్మవారిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠ అవధాని, అర్చకుడు ప్రణవ్ ఉదయం నుంచి సుప్రభాత సేవ, గణపతిపూజ, రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. వరంగల్ స్పోర్ట్స్: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్స్ 2026–27 కోసం హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో సెప్టెంబర్ 3న జిల్లా స్థాయి సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ శుక్రవారం తెలిపారు. హనుమకొండ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులంతా పాల్గొనాలని ఆయన కోరారు. సెప్టెంబర్ 3న జేఎన్ఎస్లో ఉదయం 8 గంటలకు ఐడీ కార్డు, ప్రస్తుత సర్వీస్ సర్టిఫికెట్తో హాజరుకావాని సూచించారు. మహిళలు, పురుషులకు అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, షటిల్ బాడ్మింటన్, క్రికెట్, చెస్, క్యారమ్స్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, లాన్ టెన్నిస్, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బెస్ట్ ఫిజిక్, యోగా, ఖో–ఖో మొదలైన క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు శ్రీమన్నారాయణ అథ్లెటిక్స్ కోచ్ 94410 86556ను సంప్రదించవచ్చని సూచించారు. కాజీపేట అర్బన్: బీసీ కులాలకు చెందిన నిరుద్యోగ బీసీ మహిళలకు వందశాతం సబ్సిడీతో ఆటోమెటిక్ కుట్టు మిషన్లను పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న హనుమకొండ కలెక్టర్ చాహత్బాజ్పాయ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ పథకంలో లబ్ధిపొందేందుకు ఆన్లైన్లో tgobmms. cgg. gov. in వెబ్సైట్లో సెప్టెంబర్ 13వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ కోటను శుక్రవారం సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ సెక్రటరీ నవీన్కుమార్ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన శిల్ప కళా సంపదను ఆసక్తిగా తిలకించారు. ఆతర్వాత ఖుష్మాహల్, రాతి, మట్టికోట, ఏకశిలగుట్ట అందాలు వీక్షించారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను గైడ్ రవియాదవ్, సెంట్రల్ ఎలక్షన్ సెక్రటరీ నవీన్కుమార్కు వివరించారు. కార్యక్రమంలో ఏఎస్ఓ ఉదిత్కుమార్, తహసీల్దార్ ఇక్బాల్, ఆర్ఐ వరుణ్, రెవెన్యూ సిబ్బంది, కో–ఆర్డినేటర్ శ్రీకాంత్, టీజీ టీడీసీ ఇన్చార్జ్ అజయ్ పాల్గొన్నారు. -
పండుగలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
సమీక్షలో కమిషనర్ టి.వెంకన్న వరంగల్ అర్బన్: నగరంలో వివిధ పండుగలను ప్రశాంత వాతావరణంలో, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్ప్లానింగ్, హార్టికల్చర్ తదితర విభాగాల అధికారులతో కమిషనర్ సమావేశమయ్యారు. ఈనెల 26న మిలాద్ నబీ, వచ్చే నెల 14నగణేశ్ విగ్రహాల ప్రతిష్ఠాపన, నిమజ్జనాల సందర్భంగా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా నగరంలోని పలు డివిజన్లలో ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. కొబ్బరి వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ను పరిశీలించారు. సమావేశంలో అదనపు కమిషనర్ జోనా, ఎస్ఈ రాజ్కుమార్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్ఓ లక్ష్మారెడ్డి, డీఎఫ్ఓ శంకర్ లింగం, ఇంజనీరింగ్, టౌన్ప్లానింగ్, శానిటేషన్ అధికారులు పాల్గొన్నారు. వాకీటాకీల అందజేత.. బల్దియా కాన్ఫరెన్స్ హాల్లో అధికారులకు కమిషనర్ వెంకన్న శుక్రవారం వాకీటాకీలు అందించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదలు, అత్యవసర పరిస్థితుల్లో అధికారుల మధ్య వేగవంతమైన సమాచార మార్పిడి, సమన్వయానికి వాకీటాకీలు ఎంతో ఉపయోగకరం అన్నారు. -
ప్రతీ వ్యాపారి సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి
వరంగల్ పొలీస్ కమిషనర్ ఎన్.శ్వేత హన్మకొండ: నేరాల నియంత్రణలో వ్యాపారస్తులు భాగస్వాములు కావాలని వరంగల్ పొలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యంపై సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వర్వంలో వరంగల్ మహానగరానికి చెందిన వ్యాపారస్తులకు హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. వరంగల్ సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రతీ వ్యాపారస్తుడు తప్పనిసరిగా రోడ్డుపై దృశ్యాలు కనిపించేలా నాణ్యమైన ఒకటి, రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను త్వరగా హాస్పిటల్కు తరలించి వారి ప్రాణాలు నిలబెట్టేందుకు కృషి చేస్తే వారికి కేంద్ర ప్రభుత్వం రాహవీర్ పథకం కింద రూ.25 వేలు నగదు పురస్కారం అందించనున్నట్లు తెలిపారు. సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, ఏసీపీలు నర్సింగరావు, సత్యనారాయణ, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, వ్యాపారులు పాల్గొన్నారు. పోలీస్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ కాజీపేట అర్బన్: కాజీపేట మండలం మడికొండలోని పోలీస్ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత పరిశీలించారు. శిక్షణ కేంద్రంలో శిక్షణార్థులకు అందిస్తున్న మౌలిక వసతులు, తరగతి గదులు, విధులు నిర్వహిస్తున్న అధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ రమణబాబు, ఇన్స్పెక్టర్ రవికుమార్, ఆర్ఐ సింహాచలం, శ్రీనివాస్, రవితేజ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మడికొండ పోలీస్ స్టేషన్ను శుక్రవారం సీపీ శ్వేత పరిశీలించారు. పీఎస్లోని పలు రికార్డులు, అధికారుల పనితీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని, ప్రతీ ఫిర్యాదుకు రశీదు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు. -
ఏఐసీసీకి చేరిన ఓరుగల్లు కాంగ్రెస్ పంచాయితీ
త్వరలో మీడియా ముందుకు సురేఖ?తాజా పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్లో శుక్రవారం తనను కలిసిన మీడియాతో కొండా సురేఖ చిట్చాట్ చేశారు. ‘తన ఇంట్లో ప్రత్యేక పూజ జరుగుతున్నందున బిజీగా ఉన్నాను. చెప్పాల్సినవి గురువారమే చెప్పాను. త్వరలోనే మీడియాతో మాట్లాడుతాను’ అని పేర్కొన్నారు. దీంతో ఒకటి, రెండు రోజుల్లో సురేఖ మీడియా ముందుకు వచ్చి తాజా వివాదంపై పూర్తిస్థాయిలో స్పందించే అవకాశం ఉందని తన అనుచరవర్గాలు తెలుపుతున్నాయి.సాక్షి ప్రతినిధి, వరంగల్ : పరకాల రాజకీయంతో ఓరుగల్లు కాంగ్రెస్లో మొదలైన విభేదాలు.. మంత్రి కొండా సురేఖ కుటుంబం, సీఎం రేవంత్రెడ్డి మధ్య బహిరంగ విమర్శలకు దారితీసి.. ఇప్పుడు ఏఐసీసీ పరిశీలనకు చేరాయి. సురేఖ కుమార్తె సుస్మిత.. సీఎం రేవంత్రెడ్డి, ఆయన కుటుంబం, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిపై చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి ఆమె ఇచ్చిన వివరణపై కమిటీ సంతృప్తి చెందకపోవడంతో పరిస్థితిని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో సీఎల్పీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సమావేశమై సురేఖపై చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. మంత్రి వివరణపై సంతృప్తి చెందని కమిటీ.. చల్లారని పంచాయితీ సుస్మిత వ్యాఖ్యలకు మంత్రి సురేఖను బాధ్యురాలిగా పరిగణించిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ.. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంత్రి ఇచ్చిన సమాధానంతో సమస్యకు తెరపడలేదు. కూతురు వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సముచితం కాదని పేర్కొంటూ.. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని కోరడం మరింత వివాదానికి దారి తీసింది. ఈ తంతు కొనసాగుతుండగానే హైదరాబాద్లోని సీఎల్పీ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు సురేఖ కుటుంబ రాజకీయ వ్యవహారశైలిని తప్పుబట్టారు. సదరు నేతలు వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణకే పరిమితం చేయకుండా.. మంత్రి పదవి అంశాన్ని కూడా ముందుకుతెచ్చి సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించడంతోపాటు పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీకి నష్టం కలిగించే వ్యవహారాలపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్లో ఇలాంటి ఘటనలు మళ్లీ తలెత్తే అవకాశం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ అంశంపై ఆరా తీసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే షోకాజ్ నోటీస్, మంత్రి వివరణ, సీఎల్పీలో నేతల సమావేశం, చర్యలకు డిమాండ్.. ఇలా వరుస పరిణామాలు చోటుచేసుకోవడంతో బంతి ఇప్పుడు అధిష్టానం కోర్టులోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో మంత్రి సురేఖపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటారా? మంత్రి పదవినుంచి తొలగించాలన్న డిమాండ్పై హైకమాండ్ ఎలా స్పందిస్తుంది? పరకాల టికెట్ విషయంలో రేవూరి ప్రకాశ్రెడ్డి అభ్యర్థిత్వంపై సీఎం చేసిన ప్రకటనకు అధిష్టానం మద్దతిస్తుందా? కొండా కుటుంబంతో రాష్ట్ర నాయకత్వం భవిష్యత్తులో ఏ విధంగా వ్యవహరిస్తుంది? అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. మొత్తానికి ఓరుగల్లు నుంచి కాంగ్రెస్లో మొదలైన పంచాయితీ.. సీఎల్పీకి చేరి.. అక్కడినుంచి టీపీసీసీ దాటి ఏఐసీసీ గడప తొక్కింది. ఇక ఈ వివాదానికి ముగింపు ఎలా పలుకుతారన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠగా మారింది. కూతురు వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. ఈ నెల 19న గీసుకొండలో జరిగిన మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్లో చర్చనీయాంశమయ్యాయి. అభ్యర్థిత్వాలను నిర్ణయించేది పార్టీ అధిష్టానమే అయినప్పుడు పరకాల సభలో సీఎం.. రేవూరి ప్రకాశ్రెడ్డిని ఎలా ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు. గతంలో రేవంత్రెడ్డి తమ కుటుంబానికి ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారి తీశాయి. ముఖ్యమంత్రి, సొంత పార్టీ ఎమ్మెల్యేపై బహిరంగ వేదికనుంచి ఈ స్థాయిలో విమర్శలు రావడాన్ని పీసీసీ నాయకత్వం తీవ్రంగా పరిగణించి నోటీసు జారీ చేసింది. సురేఖ వివరణపై సంతృప్తి చెందని పీసీసీ.. ఏఐసీసీకి ‘క్రమశిక్షణ’ నివేదిక సీఎల్పీలో అత్యవసరంగా భేటీ అయిన ఉమ్మడి వరంగల్ నేతలు మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల డిమాండ్ అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ -
సాక్షిప్రతినిధి, వరంగల్ :
ఓరుగల్లు కాంగ్రెస్లో మళ్లీ ముసలం మొదలైంది. ఈసారి పరకాల కేంద్రంగా రాజుకున్న చిచ్చు.. ఏకంగా సీఎం రేవంత్రెడ్డి వరకు తాకింది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి వర్సెస్ మంత్రి కొండా సురేఖ కుటుంబంగా సాగుతున్న రాజకీయ పోరు సీఎం పర్యటన తర్వాత మరింత ముదిరింది. సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత పార్టీ క్రమశిక్షణ సంఘం మంత్రి సురేఖకు నోటీసులు ఇవ్వడం.. దానికి ఆమె ఇచ్చిన వివరణ.. తాజాగా కొండా వ్యతిరేకవర్గం నేతలు మీడియా ముందుకొచ్చి ఆమైపె చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ నేతలను డిమాండ్ చేయడంతో వ్యవహారం మరింత ముదిరింది. చివరికి ఢిల్లీ పెద్దల వరకు ఫిర్యాదులు చేరాయి. సీఎం పర్యటన తర్వాత వివాదం.. సుస్మిత వ్యాఖ్యలతో దుమారం.. ఈ నెల 17న పరకాలలో సీఎం రేవంత్రెడ్డి పర్యటించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిని ప్రశంసిస్తూ, రాబోయే ఎన్నికల్లో ఆయనను గెలిపించాలని పార్టీ శ్రేణులకు సీఎం పిలుపునిచ్చారు. ఈపర్యటనకు మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. తాను పిలిచినా సీఎం సభకు మంత్రి రాలేదని ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. ఈసందర్భంగా బుధవారం గీసుకొండలో కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో వివాదానికి దారితీశాయి. సీఎం రేవంత్రెడ్డి, ఆయన సోదరులు, మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే రేవూరిపై ఆమె వ్యాఖ్యలు చేయడంతో పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం వచ్చినా, రేవూరి వచ్చినా పరకాలనుంచి తానే అభ్యర్థినని ఆమె ప్రకటించింది. దీంతో దుమారం రేపిన సుస్మిత వ్యాఖ్యలపై దృష్టి సారించింది. ఈ వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ బాధ్యత వహించాల్సి ఉంటుందన్న అభిప్రాయంతో టీపీసీసీ క్రమశిక్షణ సంఘం నోటీసు జారీ చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి సురేఖ వివరణ తీరుపై భగ్గు.. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవికి గురువారం వివరణతో కూడిన లేఖను అందజేసిన మంత్రి కొండా సురేఖ.. సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని.. వాటిని తనకు ఆపాదించడం తగదని స్పష్టం చేశారు. బంధుత్వం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొక రు రాజకీయంగా బాధ్యత వహించాలనడం సముచితం కాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హనుమకొండ డీసీసీ కార్యాలయంలో ప్రెస్మీట్ ఏర్పా టు చేసిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రెండు జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రాంరెడ్డి, అయూబ్ తదితరులు కొండా సురేఖ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేయడం కలకలంగా మారింది. అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ.. ఇటీవలి పరిణామాలు చూస్తే.. కొండా సురేఖ కుటుంబం వర్సెస్ ఒక్క రేవూరి వ్యవహారం కాదని స్పష్టమవుతోంది. సురేఖ వివరణ, పార్టీ కీలక నేతల తాజా డిమాండ్ల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. సుస్మిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటా రా? సురేఖకు ఇచ్చిన నోటీసుపై పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది? కొండా వ్యతిరేకవర్గం రీ–యూనియన్ నేతలు డిమాండ్లు ఏ మేరకు పరిష్కరించుకుంటారు? రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసిన జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ఏవిధమైన మలుపులు తిరగనున్నాయి? అన్న చర్చ ఇటు రాజకీయ విశ్లేషకులు, అటు పార్టీ కేడర్లో సాగుతోంది. ●పీక్స్కు చేరిన ఓరుగల్లు కాంగ్రెస్ పంచాయితీరేవూరి వర్సెస్ కొండా.. పరకాల టికెట్పై మొదలైన రగడ సుస్మిత వ్యాఖ్యలతో రగిలిన చిచ్చు.. మంత్రి సురేఖకు క్రమశిక్షణ నోటీసు ‘ఆమె వ్యక్తిగతం.. నన్నెలా బాధ్యురాలిని చేస్తారు?’ అంటూ సురేఖ వివరణ ‘కొండా’ వ్యతిరేక శిబిరం రీ–యూనియన్.. మంత్రిపై చర్యలకు డిమాండ్ సయోధ్య కుదిరిన కొద్ది నెలల్లోనే విభేదాలు బహిరంగం పదవులు అనుభవిస్తూ పార్టీని నిర్వీర్యం చేస్తారా? కొండా సురేఖ కూతురు సుస్మితపై కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆగ్రహంపాత విభేదాలకు కొత్త మలుపు..కొండా సురేఖ కుటుంబానికి, ఉమ్మడి వరంగల్కు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలకు మధ్య గతంలోనూ విభేదాలు బహిరంగమయ్యాయి. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు తదితర నేతలు గతంలో కొండా మురళీధర్రావు, కొండా సురేఖ, కుటుంబం వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్రెడ్డిలకు ఫిర్యాదు కూడా చేశారు. ఆ సందర్భంలోనూ కొండా సురేఖ పార్టీ అధిష్టానానికి లేఖ ద్వారా తన వివరణ ఇచ్చింది. ఏఐసీసీ, టీపీసీసీ నేతలు జోక్యం చేసుకుని ఎమ్మెల్యేలు, మంత్రి మధ్య సయోధ్య కుదిర్చారు. ఆ తర్వాత జరిగిన ఓ ఆత్మీయ సమావేశంలో కొండా సురేఖతోపాటు రేవూరి, కడియం, నాగరాజు, బస్వరాజు సారయ్య, ఎర్రబెల్లి స్వర్ణ, ఇనగాల వెంకట్రాంరెడ్డి తదితరులు ఒకే వేదికపై కనిపించారు. అందరూ కలిసి నాయిని రాజేందర్రెడ్డి నివాసంలో విందు భోజనంలో పాల్గొనడం కూడా అప్పట్లో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా పరకాల కేంద్రంగా భగ్గుమన్న విబేధాల సెగ హైదరాబాద్, ఢిల్లీ వరకు తాకడం కాంగ్రెస్లో ‘కలిసి నడుద్దాం’ అనుకున్న కొద్ది నెలలకే.. ‘ఎవరికి వారే’ అన్న పరిస్థితి నెలకొంది. -
పార్టీలు మారే సంస్కృతి మీది
హన్మకొండ చౌరస్తా: పదవుల కోసం పార్టీలు మారే సంస్కృతి మీది అంటూ కొండా సురేఖ కూతురు సుస్మితపై కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి గురువారం హనుమకొండలోని డీసీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజకీయాల్లో మొదట టీడీపీ నుంచి గెలిచి తర్వాత కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, బీఆర్ఎస్ ఇలా అన్ని పార్టీల్లో తిరిగి చివరికి కాంగ్రెస్లో చేరిన సంస్కృతి కొండా సురేఖది అన్నారు. పదవులు అనుభవిస్తూనే నాయకులను విమర్శిస్తూ పార్టీని నిర్వీర్యం చేసే అలవాటు మీదేనంటూ మండిపడ్డారు. అనేక పార్టీలు మారి కాంగ్రెస్లో చేరితే కార్యకర్తలు అక్కున చేర్చుకుని గెలిపించుకుంటే, ఇప్పుడు గెలిపించిన ప్రజలనే భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఇప్పటికి రెండు సార్లు పొరపాటు చేశారని, ఇక మీదట వీరిని క్షమించకుండా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ, సీఎంను కోరారు. ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు మాట్లాడుతూ వరంగల్లో ఉన్న కొండా వర్గం కాంగ్రెస్ నాయకులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. సుస్మిత వ్యాఖ్యల ను ముక్తకంఠంతో ఖండిస్తున్నామని, ఈ విషయంపై ఏకగ్రీవంగా తీర్మానం చేసి అధిష్టానానికి పంపించాలని డీసీసీని కోరారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ గతంలో వేం నరేందర్రెడ్డి కాళ్లు పట్టుకున్నది మరిచిపోయారా అంటూ కొండా దంపతులను ఉద్దేశించి అన్నారు. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ పార్టీలో నెలకొన్న సమస్యలను చెప్పుకునేందుకు జిల్లా రాజకీయ క్రమశిక్షణ కమిటీ ఉందని, ఏదైనా ఇక్కడే చర్చించాలన్నారు. వరంగల్ డీసీసీ అధ్యక్షుడు అయూబ్ మాట్లాడుతూ బీసీ జపం చేస్తూ బీసీలపైనే కేసులు పెట్టించిన చరిత్ర కొండా దంపతులదన్నారు. మాజీ మేయర్ గుండు సుధారాణి, నాయకులు వీసం సురేందర్రెడ్డి, మార్క విజయ్, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, కూచన రవళి, వెంకట్రాజం తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కొండా సుస్మితపై ఘాటు వ్యాఖ్యలు -
కీటక జనిత వ్యాధులను నివారించాలి
కాశిబుగ్గ: కీటక జనిత వ్యాధులను నివారించాలని వరంగల్ డీఎంహెచ్ఓ రాజారెడ్డి సూచించారు. వరంగల్ దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి ఎంహెచ్నగర్లో ఇటీవల డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు కీటక జనిత వ్యాధులపై గురువారం స్థానికులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి డెంగీ, మలేరియాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి భరత్కుమార్, మాజీ కార్పొరేటర్ సురేశ్కుమార్ జోషి, సబ్ యూనిట్ ఆఫీసర్ కుమార స్వామి, హెచ్ఈఓ సదానందం, సూపర్వైజర్ మధుకర్ పాల్గొన్నారు. -
ప్రత్యేక శ్రద్ధతో మాతృ మరణాల తగ్గింపు
హన్మకొండ అర్బన్: క్రమం తప్పకుండా గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించడం, అధిక ప్రమాద లక్షణాలున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ద్వారా మాతృ మరణాలను నివారించవచ్చని డీఎంహెచ్ఓ అప్పయ్య వైద్యాధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లాలో ఈ ఏడాది జరిగిన మూడు మాతృ మరణాలపై సమీక్ష నిర్వహించారు. ఒక్కో కేసును విశ్లేషించి మరణాలకు గల కారణాలు, లోపాలను గుర్తించి భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మాతా శిశు సంక్షేమ కార్యక్రమ అధికారి డాక్టర్ రజిత, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్ లక్ష్మీరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రదీప్రెడ్డి, పరకాల ఏరియా ఆస్పత్రి అనెస్థటిస్ట్ డాక్టర్ నారాయణరెడ్డి, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో పీజీ కోర్సుల (నాన్ ప్రొఫెషనల్) రెండో సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని పలు పరీక్ష కేంద్రాలను పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డాక్టర్ పి.శ్రీనివాస్, డాక్టర్ తిరుమలాదేవి పరిశీలించారు. 90 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. కేయూ క్యాంపస్: తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్ సెంటర్ (టాస్క్)తో హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గురువారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈమేరకు ఆకళాశాలలో ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతికి, టాస్క్ జిల్లా అభివృద్ధి అధికారి మామిడాల రామకృష్ణ అవగాహన ఒప్పంద పత్రం అందించారు. విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి అవకాశాలను పెంపొందించడంతో పాటు ఆ పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్ను అందించేందుకు ఈ ఎంఓయూ తోడ్పడనుంది. ఆకళాశాల టాస్క్ సంచాలకులు డాక్టర్ గిరిప్రసాద్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీలత పాల్గొన్నారు. హన్మకొండ చౌరస్తా: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గురువారం హైదరాబాద్లో మంత్రి వివేక్ను కలిసి వినతిపత్రం అందించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యకు సంబంధించిన జీఓ 97పై నెలకొన్న అపోహలను నివృత్తి చేసి, స్పష్టత ఇవ్వాలని మంత్రిని కోరారు. -
ఇంటికి చేరిన భరత్చందర్రెడ్డి పార్థివదేహం
హసన్పర్తి : బతుకుదెరువు నిమిత్తం అమెరికా వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై మరణించిన హసన్పర్తి మండలం గంటూరుపల్లికి చెందిన వర్ణ భరత్ చందర్రెడ్డి మృతదేహం పదిరోజుల తర్వాత గురువారం గ్రామానికి చేరుకుంది. ఈ సమయంలో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. దీనిని చూసిన స్థానికులు కూడా కంట తడిపెట్టారు. కాగా, భరత్ చందర్రెడ్డి పార్థివదేహానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి తండ్రి సమ్మిరెడ్డి, చిన్నాన్న సుధాకర్రెడ్డిని ఓదార్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ● ఎమ్మెల్యే నాగరాజు నివాళి -
ఆర్థోపెడిక్ వైద్యుల సదస్సు
నేటినుంచి దక్షిణ భారత స్థాయి హన్మకొండ: వరంగల్ వేదికగా ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు దక్షిణ భారతదేశ స్థాయి ఆర్థోపెడిక్ సర్జన్ల సదస్సు జరగనుందని ఆ సదస్సు ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు పెసరు విజయ్ చందర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంకుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం హనుమకొండ సుబేదారిలోని రోహిణి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర రాజధానుల్లో జరిగే ఈ సదస్సును తొలిసారిగా వరంగల్కు తీసుకొచ్చామన్నారు. వరంగల్ ర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్, కాకతీయ మెడికల్ కాలేజీ, ఎంజీఎం ఆర్థోపెడిక్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో మూడు రోజు పాటు ఈ సదస్సు కొనసాగుతుందన్నారు. ఇందులో వర్క్షాప్, సెమినార్లు, శిక్షణ నిర్వహించనున్నట్లు వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి 1,000 మంది ఆర్థోపెడిక్ సర్జన్లు ఈ సదస్సులో పాల్గొంటారని తెలిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయి, ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ అధ్యక్షుడు కృష్ణ గోపాల్ రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి రోషన్, తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జగన్ మోహన్, కెఎంసీ ప్రిన్సిపాల్ మోహన్దాస్ ముఖ్యఅతిథులుగా పాల్గొంటారని వివరించారు. విదేశాల్లో ఆధునిక శాస్త్ర, సాంకేతిక రంగంలో శిక్షణ పొందిన నిపుణులు ఈ సదస్సులో ప్రసంగిస్తారన్నారు. తద్వారా యువ సర్జన్లు, పీజీ విద్యార్థులు నూతన విషయాలు తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. సమావేశంలో ఆర్గనైజింగ్ కమిటీ బాధ్యులు రాకేశ్, శ్రీనివాస్ రెడ్డి, శిరీశ్, ఉత్తం వైద్య పాల్గొన్నారు. ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు పెసరు విజయ్ చందర్ రెడ్డి -
ఐడీ వార్డు.. ఆగమాగం
కాశిబుగ్గ : వరంగల్ మహాత్మాగాంధీ ఆస్పత్రిలో (ఎంజీఎం) ఐడీ (ఇన్ఫెక్షన్ డిసీజ్) వార్డు అధ్వానంగా మారింది. వార్డు ఆవరణంతా అపరిశుభ్రం, అస్తవ్యస్తంగా తయారైంది. సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేదు. కనీసం కాల కృత్యాలు తీర్చుకోవడానికి కూడా చుక్క నీరు లేదు. అయినా పట్టించుకునే వారే కరవయ్యారు. ఇదిలా ఉండగా పేషెంట్లను పరీక్షించేందుకు వైద్యులు రావడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా నామమాత్రంగా వైద్యసేవలు అందుతున్నట్లు తెలుస్తోంది. పెషెంట్లను పట్టించుకోని సిబ్బంది.. ఎంజీఎం ఆస్పత్రిలోని ఏఎంసీ వార్డు, డైట్ సమీ పంలో ఐడీ వార్డును ఏర్పాటు చేశారు. అయితే దీని కి బయట మాత్రం మానసిక వార్డు అని బోర్డు పె ట్టి, లోపల ఐడీ వార్డు నడిపిస్తున్నారు. ఇందులో పలు రకాల వ్యాధులకు గురైన వారు చికిత్స పొందుతుంటారు. ఎక్కువగా ఆర్థో, న్యూరోకు సంబంధించిన పెషెంట్లు ఉంటారు. అలాగే, అనాథలుగా ఉ న్నవారిని కూడా ఈ వార్డులోనే ఉంచుతున్నారు. ఇ ంతవరకు బాగానే ఉన్నా.. వీరికి అంతంత మాత్ర మే వైద్యం అందుతోంది. అసలే ఏమి చేసుకోలేని దుస్థితిలో ఉన్న పేషెంట్లను నర్సింగ్ సిబ్బంది, స్వీ పర్లు చూడాల్సి ఉంది. అయితే వారిని పట్టించుకు న్న పాపాన పోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు నెలల నుంచి పేషెంట్లను పరీక్షించని వైద్యులు? ఈ వార్డులో చికిత్స పొందుతున్న పది మంది పేషెంట్లను పరీక్షించడానికి రెండు నెలల నుంచి డాక్టర్లు వచ్చిన దాఖలాలు లేవని పలువురు రోగులు పేర్కొంటున్నారు. పేషెంట్లకు చికిత్స అందించ డం గాని, మందులు ఇవ్వడం గాని గాలికి వదిలా రని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఈ వార్డు కు డాక్టర్లు సరిగా రారని తెలుస్తోంది. ఇక మందులు కూడా అడ్మిట్ అయిన మూడునాలుగు నెలల క్రి తం రాసినప్పటివే నర్సింగ్ సిబ్బంది ఇస్తుంటారని తెలిసింది. పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని బట్టి మందులను మార్చడానికి డాక్టర్లు రారని సమాచారం. పేషెంట్లతో వార్డు శుభ్రం.. పేషెంట్లు పలుమార్లు వార్డును శుభ్రం చేసుకోవా ల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా గురువారం ఓ పేషెంట్ వార్డును క్లీన్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇందులో రోజు విధులు నిర్వహించే స్వీపర్లు ఎక్కడికి వెళ్లారో? ఎందుకు ఈ పని చేయిస్తున్నారో వారికే తెలియాలి. పేషెంట్ల భద్రత పేరుతో వార్డుకు ఎప్పుడు గొళ్లెం పెట్టి ఉండడం విమర్శలకు దారితీస్తుంది. అధ్వానంగా మారిన ఎంజీఎంలోని ఇన్ఫెక్షన్ డిసీజ్ వార్డు రెండు నెలల నుంచి పేషెంట్లను పరీక్షించని వైద్యులు మందులు మార్చకుండా అవే పంపిణీ చేస్తున్న వైనం పేషెంట్లతోనే వార్డు శుభ్రం చేయిస్తున్న సిబ్బంది కాలకృత్యాలకూ నీళ్లు కరువేవార్డులో చికిత్స పొందుతున్న రోగులకు నీళ్లు లేవు. కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా చుక్కనీరు లేకపోవడంతో వారు బాధలు వర్ణానాతీతం. సిబ్బందికి సైతం నీళ్లు లభించని పరిస్థితి నెలకొంది. వార్డు పైన ఉన్న పైపులను కోతులు విరగొట్టడంతో మరమ్మతు చేయక నీళ్లు రాని పరిస్థితి ఏర్పడింది. ఎంజీఎంలోని పలు వార్డులపై నియంత్రణ కరవైంది. పాలన బాధ్యతలు మోస్తున్న అధికారులు అన్ని వార్డులను రౌండ్స్ చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. సూపరింటెండెంట్తో పాటు ముగ్గురు ఆర్ఎంఓలు ఉన్నా.. మొదటి ఆర్ఎంఓ గత నెలలో ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరూ రాలేదు. ఇద్దరు ఆర్ఎంఓల్లో దాదాపు ఒకరు సెలవుల్లో ఉంటే మిగిలింది ఒకరే. అతడే బాధ్యత తీసుకోవాల్సి వస్తోంది. అయితే ఆస్పత్రి పనుల బట్టి గతంలో మాదిరిగా డిప్యూటీ సూపరింటెండెంట్తోపాటు అదనపు ఆర్ఎంఓలను నియమిస్తే రోగుల సమస్యలు కొంతవరకై నా తీరే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
22న డాక్ అదాలత్
ఖిలా వరంగల్ : పోస్టల్ సర్వీస్లపై ఫిర్యాదులకు ఈనెల 22న 55వ ప్రాంతీయ స్థాయి డాక్ అదాలత్ను గూగుల్ మీట్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు వరంగల్ సూపరింటెండెంట్ రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, వరంగల్ జిల్లా పరిధిలోని వరంగల్ డివిజన్కు సంబంధించి తపాలా సేవల వినియోగదారులకు ఏమైనా ఫిర్యాదులుంటే పోస్టల్ ఎన్వలప్ / కవర్పై 55వ డాక్ అదాలత్ రాయాలని, కె.శ్రీకాంత్, అసిస్టెంట్ డైరెక్టర్ (స్టాప్ అండ్ విజిలెన్స్, పోస్టుమాస్టర్ జనరల్, హైదరాబాద్ రీజియన్కు ఈనెల 31వ తేదీ లోగా పంపించాలని ఆయన కోరారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత హన్మకొండ కల్చరల్: పర్యావణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత అని కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ అన్నారు. గురువారం వరంగల్ హంటర్ రోడ్డులోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో వనమహోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా పీఠాధిపతి ఆచార్య గడ్డం వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గడ్డం భాస్కర్, ప్రముఖ పర్యావరణవేల్ల తాళ్లపల్లి రామస్వామి గౌడ్ పాల్గొని పీఠానికి పలురకాల పండ్లు, పూల మొక్కలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్ధులకు విద్యతోపాటు పర్యావరణంపై అవగాహన కల్పించాలని, మొక్కలు నాటడం వల్ల భవిష్యత్ తరాలకు ప్రాణవాయువును అందించినట్లేనని పేర్కొన్నారు. అనంతరం పీఠం ప్రాంగణంలో విద్యార్థులు, సిబ్బంది మొక్కలు నాటారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ ఆమేర్ అలీఖాన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ శ్రీమంతుల దామోదర్, డాక్టర్ చూరేపల్లి రవికుమార్, డాక్టర్ బాసాని సురేశ్, టెక్నికల్ అసిస్టెంట్ డాక్టర్ గంపా సతీశ్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చోరీ కేసులో ముగ్గురు దొంగల అరెస్ట్ గీసుకొండ : పెట్రోల్ బంకులో చోరీకి పాల్ప డిన ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్లు ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. కాజీపేట అంబేడ్కర్నగర్కు చెందిన కంది చరణ్, గండికోట శివ, జక్కుల ప్రతాప్ ఈనెల 18న అర్ధరాత్రి ఊకల్ హవేలి శివారులోని వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై ఉన్న భారత్ పెట్రోల్ బంకు వద్దకు వెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న మేనేజర్ కౌడగాని రాజగోపాల్ను సీఎన్జీ పంపు ఎక్కడ ఉందని అడిగినట్లు నటించారు. రెక్కీ నిర్వహించి దొంగతనం చేయడానికి పథకం రచించినట్లు సీఐ తెలిపారు. అనంతరం రాజగోపాల్ రెండో పంపు అవరణలో నిద్రిస్తుండగా అతడి బ్యాగులోని రూ.15800 నగదును దొంగిలించి ఆటోలో పారిపోయినట్లు తెలిపారు. పెట్రోల్ పంపు యజమాని ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు. గురువారం మరియపురం శివారు కెనాల్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుల నుంచి రూ.11 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నాని చెప్పారు. నిందితులపై సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసినట్లు తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన ఎస్సై అనిల్ కుమార్, కానిస్టేబుళ్లు అరవింద్, విజయ్, ప్రవీణ్, సాయిలను ఇన్స్పెక్టర్ అభినందించారు. -
బాలల నాటక పోటీలకు ఆహ్వానం
నయీంనగర్: ఇన్నర్ వీల్ క్లబ్ వరంగల్ ఆధ్వర్యంలో డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ స్మారక పాఠశాల స్థాయి బాలల నాటక పోటీలకు ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్టు అధ్యక్షుడు సుమతినాయుడు తెలిపారు. హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని సృజనాత్మకత, నటన కళను వెలికితీసి ప్రోత్సహించడంతో పాటు వారిని బాధ్యతాయుతమైన సమాజహితులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల పాఠశాలల విద్యార్థులు, నాటిక వ్యవధి 30–45 నిమిషాల మధ్య ఉండి నాటకలో పాల్గొనేవారు ఒకే పాఠశాల విద్యార్థులై ఉండాలని తెలిపారు. నాటిక ఇతివృత్తాలు సమాజంలో చైతన్యం రగిలించేవి, కుల వివక్ష నిర్మూలన, మూఢనమ్మకాలు, నరబలుల వ్యతిరేక ప్రచారం, ఈవ్ టీజింగ్, కలుషిత ఆహారం – ఆరోగ్య భద్రత, సామాజిక సంక్షేమం వంటి అంశాలపై ఎంట్రీలు ఈనెల 30లోపు పంపాలని కోరారు. నాటకల ప్రాథమిక పరిశీలన అక్టోబర్ 15 నుంచి 30వ తేదీ వరకు, నాటక పోటీలు, బహుమతుల ప్రదానం నవంబర్ 12, 13, 14వ తేదీల్లో ఉంటుందని వివరించారు. ప్రథమ బహుమతి రూ.10 వేలు, ద్వితీయ బహుమతి 8 వేలు, ప్రతీ నాటిక ప్రదర్శన పారితోషికం రూ.5 వేలు రివార్డు ఉంటుందని తెలిపారు. ఎంట్రీలను 88975 52958 నంబర్కు వాట్సాప్ చేయాలని సూచించారు. సమావేశంలో శోభావతి, ఎం.రేణుక, శ్యాంసుందర్, లలిత, నాగేశ్వర్ రావు, లక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో మానసికోల్లాసం
వరంగల్ అర్బన్ : క్రీడలు శరీర దారుఢ్యాన్ని పెంపొందించడంతోపాటు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని బల్దియా కమిషనర్ టి.వెంకన్న అన్నారు. ఈనెల 18 నుంచి వరంగల్ బల్దియా ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ కౌన్సిల్, ఓఎంసీ సర్కిల్, తెలంగాణ ట్రాన్స్కో డిస్కం ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించారు. ఇంటర్ సర్కిల్ బ్యాడ్మింటన్ (పురుషులు, మహిళలు), ఫుట్బాల్ (పురుషులు) టోర్నమెంట్ 2026–27 ముగింపు కార్యక్రమానికి కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయన్నారు. చీఫ్ ఇంజనీర్ మురళీ సాగర్, ఎన్పీడీసీఎల్ జీఎం హేమంత్ కుమార్, ఎస్ఈలు రవీంద్ర, శ్రీనివాసులు, టీవీ రావు, ఎస్ఏఓ దేవేందర్ రెడ్డి, విద్యుత్ సౌధ స్పోర్ట్స్ అధికారి జగన్నాథ్, స్పోర్ట్స్ జనరల్ సెక్రటరీ రాజారెడ్డి, ఎస్ఎఫ్ఓ రాజేశ్వర్ రావు, ప్రతినిధులు శ్యామ్, నరేశ్, వెంకటేష్, సృజన, తదితరులు పాల్గొన్నారు. బల్దియా కమిషనర్ టి.వెంకన్న -
విలీన దడ!
ములుగు జంక్షన్లో ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులుబీఆర్ఎస్ మద్దతు.. ‘శక్తి’ నుంచి పాలిటెక్నిక్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం పాలిటిక్నిక్ విద్యార్థులు, వివిధ సంఘాల నాయకుల చేపట్టిన నిరసన ర్యాలీకి బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో మాజీ ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ్భాస్కర్, నాయకులు మద్దతు ప్రకటించి, ములుగు రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. వరంగల్ అర్బన్: పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇన్షియేటివ్స్(శక్తి)లో విలీనం చేయాలనే ప్రభుత్వ జీఓ జారీపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. భవిష్యత్పై భయందోళన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి వారం రో జులుగా నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల నిరసనకు అధ్యాపకులు, సిబ్బంది సైతం కదం తొక్కారు. ఇదిలా ఉండగా.. గురువా రం సాయంత్రం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రెస్మీట్లో వెల్లడించారు. అయినప్పటికీ అధ్యాపకులు, విద్యార్థుల్లో నమ్మకం కలగడం లేదనే వాదనలున్నాయి. ఉమ్మడి జిల్లాలో 10 వేల మంది.. తెలంగాణ వ్యాప్తంగా లక్ష మంది విద్యార్థులు పా లిటెక్నిక్ విద్యను అభ్యసిస్తుండగా, వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 10 వేల మంది జాయిన్ అవుతున్నారు. పదోతరగతి పూర్తయిన వారు పాలిటెక్నిక్లోని 28 కోర్సుల్లో జాయిన్ అవుతున్నారు. జిల్లాలోని వరంగల్లో బాలుర, బాలిక కళాశాలల్లో సుమారు 2,500 మంది, స్టేషన్ఘన్పూర్, పరకాల, కాటారం, మహబూబాబాద్లో మిగిలిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. స్కిల్డ్, అన్స్కిల్డ్కు పరిమితం చేయడమేనా? ప్రభుత్వం ఇటీవల శక్తి స్కీమ్ను తీసుకొస్తూ పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి విలీనం చేస్తూ జారీ చేసిన జీఓ 97 దుమారం రేపుతోంది. పాలిటెక్నిక్ విద్యార్థుల మూడేళ్ల పాటు పడ్డ శ్రమ అంతా వృథా అవుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉచితంగా అందించాల్సిన విద్యను పీపీపీ మోడల్లో నడిచే వర్సిటీకి అప్పగిస్తే భవిష్యత్లో ఫీజుల భారం పెరుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేకనే ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులను ప్రైవేట్ వర్సిటీల వైపు నెట్టేస్తున్నారని మదన పడుతున్నారు. గతంలో మూడేళ్ల పాలిటెక్నిక్ విద్య పూర్తి కాగానే ఇంజనీరింగ్ సెకండియర్ (లేటర్ విద్య)లోకి ప్రవేశించే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ విలీనం వల్ల డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులను స్కిల్డ్, అన్స్కిల్డ్కు పరిమితం చేసే అవకాశం ఉందని విద్యార్థులు భావిస్తున్నారు. స్కిల్ వర్సిటీలో ‘పాలిటెక్నిక్’ విలీనంపై భయాందోళన మూడేళ్ల విద్య వృథా అవుతుందని రోడ్డెక్కిన విద్యార్థులు -
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఆగస్టు శ్రీ 2026
●సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రజాప్రతినిధుల ఎన్నికల అఫిడవిట్లలో నమోదైన క్రిమినల్ కేసుల వివరాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 119 మంది ఎమ్మెల్యేల్లో 81మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలో వెల్లడించగా.. వారిలో 58 మంది తీవ్రమైన కేసుల వివరాలను కూడా పేర్కొన్నారు. చట్టసభ సభ్యులపై నమోదైన కేసుల విచారణలో జాప్యానికి సంబంధించి సుప్రీంకోర్టులో కొనసాగుతున్న వ్యవహారంలో సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా అమికస్ క్యూరీగా సమర్పించిన తాజా 22వ నివేదికతో ఈ అంశం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) విశ్లేషించిన ఎన్నికల అఫిడవిట్ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పరిశీలిస్తే.. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు తమపై నమోదైనట్లు పేర్కొన్న 28 కేసుల వివరాలను వెల్లడించారు. మళ్లీ తెరపైకి ఎమ్మెల్యేలపై కేసుల ‘చిట్టా’ ● ఎన్నికల ఉల్లంఘనలనుంచి అల్లర్ల వరకు నమోదైనవే.. ఉమ్మడి వరంగల్లో ఆరుగురిపై 28 క్రిమినల్ కేసులు ● కొండా సురేఖ అఫిడవిట్లో హత్యాయత్నం.. అభ్యర్థుల స్వీయ అఫిడవిట్ల ఆధారంగానే వివరాలు ● ‘సుప్రీం’కు విజయ్ హన్సారియా తాజా నివేదికలో వెల్లడి తుది తీర్పు వచ్చేవరకు ఆరోపణలే..● ఉమ్మడి వరంగల్లో మొత్తం 12మంది శాసనసభ్యులు ఉండగా ఆరుగురిపై కేసులు ఉన్నట్లు అమికస్ క్యూరీ రిపోర్టులో పేర్కొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తన అఫిడవిట్లో 8 క్రిమినల్ కేసులు ప్రకటించారు. వీటిలో ఐపీసీ 307 (హత్యాయత్నం), 332, 333, 353 వంటి ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం/దాడికి సంబంధించిన సెక్షన్లతో పాటు 143, 149, 188, 341, 504 తదితర సెక్షన్లు ఉన్నాయి. ● రాష్ట్ర మంత్రి, ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) తన అఫిడవిట్లో 6 కేసులు ప్రకటించారు. వీటిలో ప్రధానంగా ఐపీసీ 143, 149, 341 సెక్షన్లతో కూడిన కేసు ఉండగా.. మిగిలిన కేసుల్లో సీఆర్పీసీ 151 కింద నిర్బంధానికి సంబంధించినవి ఉన్నాయి. కేసులన్నీ నిరసనలు తెలిపిన సందర్భంగా నమోదయ్యాయని పేర్కొన్నారు. ● కొండా సురేఖపై 5 కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో ప్రకటించారు. వీటిలో ఐపీసీ 307 (హత్యాయత్నం) కేసు ఒకటి ఉంది. ఒక కేసులో ఆరమ్స్ ఆక్ట్ సెక్షన్ 27 కూడా నమోదైనట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. ● డిప్యూటీ స్పీకర్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్పై 4 కేసులు ప్రకటించారు. వాటిలో ఐపీసీ 294, 506, 149; 109, 147, 324, 341, 427, 506, 149; 452, 448, 143, 188, 353, 149 వంటి సెక్షన్లు ఉన్నాయి. ● మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్పై 3 కేసులు ఉన్నట్లు ప్రకటించారు. మూడు కేసుల్లోనూ ప్రధానంగా అక్రమ సమూహం, విధులకు ఆటంకం, ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘన తదితర ఆరోపణల సెక్షన్లు కనిపిస్తున్నాయి. ● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపై రెండు కేసులు ప్రకటించారు. ఒకటి ఐపీసీ 188 కింద, మరోటి ఐపీసీ 171–ఇ, కింద నమోదైనట్లు రికార్డులో ఉంది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల వేగవంతమైన విచారణ అవసరంపై సుప్రీంకోర్టు పలు మార్లు దృష్టి సారించింది. ఎన్నికల అఫిడవిట్లలో కేసుల వివరాలు వెల్లడించడం ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు ఉపయోగపడుతున్నప్పటికీ.. కేసుల తుది పరిష్కారంలో జాప్యం కొనసాగుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. కాగా, కేసు నమోదైనంత మాత్రాన నేరం రుజువైనట్లు కాదని, న్యాయస్థానాలు తుది తీర్పు ఇచ్చే వరకు ఆరోపణలను నిర్ధారిత అంశాలుగా పరిగణించరాదని న్యాయనిపుణులు సూచిస్తున్నారు. -
జాతీయ విద్యావిధానం
లక్ష్యాల సాధనలో ‘అపార్’ కీలకంకేయూ క్యాంపస్ : జాతీయ విద్యావిధానం–2020 లక్ష్యాల సాధనలో అకడమిక్ బ్యాంకు ఆఫ్ క్రెడిట్స్ ( ఏబీసీ) –అపార్ కీలకమని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. ప్రతీ విద్యార్థికి ఏబీసీ –అపార్పై అవగాహన కల్పించి సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. గురువారం క్యాంపస్లోని సెనెట్హాల్లో న్యూఢిల్లీకి చెందిన నేషనల్ అకడమిక్ డిపాజిటరీ సౌజన్యంతో విశ్వవిద్యాలయం విభాగాల అధిపతులు, ప్రిన్సిపాళ్లు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లకు అకడమిక్ బ్యాంకు ఆఫ్ క్రెడిట్స్( ఏబీసీ)–అపార్పై ఒకరోజు రాష్ట్ర స్థాయి వర్క్ షాప్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అపార్ ఐడీ విద్యార్థుల విద్యా రికార్డులు, విజయాలకు జీవితకాల డిజిటల్ గుర్తింపు అందిస్తుందన్నారు. కేయూ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ డైరెక్టర్ నర్సింహారావు మాట్లాడుతూ కళాశాలలు తమ పోటీతత్వాన్ని పెంచుకునేందుకు న్యాక్ గుర్తింపు కీలక పాత్రపోషిస్తుందన్నారు. డిజిటల్ ఇండియా కార్పొరేషన్ రీజనల్ కోఆర్డినేటర్ రవిపాండె పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏబీసీ–అపార్ ఆవశ్యకత, ఉపయోగాలు వివరించారు. పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆసిం ఇక్బాల్, సూపరింటెండెంట్ సురేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేయూ వీసీ ప్రతాప్రెడ్డి -
భూ రీసర్వే పనులు వేగంగా పూర్తి చేయాలి
● అదనపు కలెక్టర్ ఎన్.రవి హన్మకొండ అర్బన్: గడువులోగా భూ రీసర్వే కార్యక్రమాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తి చేసేందుకు రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్లు సమన్వయంతో పని చేయాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి సూచించారు. గురువారం అదనపు కలెక్టర్ చాంబర్లో సర్వేయర్లతో భూ రీసర్వేపై సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపిక చేసిన గ్రామాల్లో రీసర్వే పనులను ప్రణాళికాబద్ధంగా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. మొదటి దశలో ధర్మసాగర్ మండలం జానకీపురం, హసన్పర్తి మండలం ముచ్చర్ల, భీమదేవరపల్లి మండలం భీమదేవరపల్లి, నడికూడ మండలం సర్వాపూర్ గ్రామాల్లో రీసర్వే పూర్తయినట్లు తెలిపారు. రాజుపేట, మాదన్నపేట గ్రామాల్లో పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాలను మండలాల వారీగా క్లస్టర్లుగా ఏర్పాటు చేసి పనులు వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ జె.నూర్సింగ్ పాల్గొన్నారు. -
బాధితులకు న్యాయం చేయాలి
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య న్యూశాయంపేట: ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ బద్ధంగా అందాల్సిన ఫలాలను అందించడానికి కమిషన్ కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు. గురువారం వరంగల్ కలెక్టరేట్లో కమిషన్ సభ్యులు, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. భూ వివాదాలు, అట్రాసిటి కేసుల నమోదు విచారణ, పురోగతి, ప్రభుత్వశాఖల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రోస్టర్ పాయింట్ల పకడ్బందీ అమలుపై చర్చించారు. కేసుల పురోగతిపై పోలీసు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కేసుల పురోగతిని పరిశీలించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సమావేశం చివరలో పాల్గొన్న సీపీ శ్వేతకు చైర్మన్ సూచించారు. బాధితులకు పునరావాసం కల్పించాలి.. బాధిత కుటుంబాలను కేవలం పరిహారంతో వదిలేయకుండా పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అవసరాన్ని బట్టి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు, గృహవసతి కల్పించాలని సూచించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. సివిల్ రైట్స్ డే సందర్భంగా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తామని చెప్పారు. అనంతరం చైర్మన్ ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. కమిషన్ సభ్యులతోపాటు డీసీపీ అంకిత్కుమార్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్ జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కొత్త రైల్వే డివిజన్గా చేయాలని ఎంపీ వినతి
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్గా ఏర్పాటు చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో సమన్వయ్ సమావేశ మందిరంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవను కోరారు. దక్షిణ మధ్య రైల్వే ఎంపీల సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని రైల్వే రంగ అభివృద్ధికి సంబంధించిన 19 కీలక అంశాలను రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు వరంగల్ జిల్లా ప్రాంత ప్రజల చిరకాల డిమాండ్ అని దీనిపై రైల్వే శాఖ సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎంజీ జీఎంను కోరారు. -
సమన్వయంతో పనిచేయండి
● ట్రాఫిక్ సమస్యను పరిష్కరించండి ● పోలీస్ కమిషనర్ శ్వేత వరంగల్ క్రైం: వరంగల్ ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. వరంగల్ ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు అధిగమించడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం ప్రత్యేకంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఎన్హెచ్ఏఐ పీడీ భరద్వాజ్తో పాటు రోడ్లు, భవనాలు, మున్సిపల్, ట్రాఫిక్ విభాగాల అధికారులు, ట్రైసిటీ పరిధి పోలీస్స్టేషన్ల అధికారులు హాజరయ్యారు. ట్రాఫిక్ పోలీస్ అధికారులు నగరంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈసందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ట్రైసిటీ పరిధిలో రాత్రి సమయాల్లో వెలుతురు సరిగ్గా లేని 159 ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో వీధి దీపాల ఏర్పాటుకు అధికారులు చొరవ చూపాలని సూచించారు. బల్దియా కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ.. పోలీస్, మున్సిపల్ శాఖల అధికా రులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ట్రాఫి క్ నియంత్రణకు అవసరమైన చర్యలను మరింత స్పష్టంగా గుర్తించవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ట్రాఫిక్ విభాగం అధికారులు, ట్రైసిటీ పరిధి ఇన్స్పెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. -
మొత్తం కేసులు 134అరెస్టులు 369గంజాయి స్వాధీనం 2,571విలువ (రూపాయల్లో) 10,03,53,740
విద్యార్థులకు అవగాహన, విక్రేతలపై కఠినచర్యలు పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. విక్రయాలు, సరఫరాకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు అవసరమైన సందర్భాల్లో పీడీ యాక్టు కింద కఠిన చర్యలు తీసుకుంటున్నాం. గంజాయికి బానిసలైన యువతను గుర్తించి వారిపై చట్టపరమైన ప్రక్రియతోపాటు డీ–అడిక్షన్ సెంటర్లకు తరలించి, కౌన్సెలింగ్, చికిత్స మార్పు తెచ్చే చర్యలు చేపడుతున్నాం. – పి. రమేశ్కుమార్, డీఎస్పీ, నార్కొటిక్స్ ఈగల్ ఫోర్స్ -
నెట్వర్క్ లేక.. రిజిస్ట్రేషన్లు పూర్తవక
కాజీపేట అర్బన్: వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో బుధవారం నెట్వర్క్ లేకపోవడంతో భూక్రయవిక్రయదారులు రిజిస్ట్రేషన్ల కోసం సాయంత్రం వరకు వేచి ఉండాల్సి వచ్చింది. వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రేల్టెల్ నెట్ కనెక్షన్తో అనుసంధానమై రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. కాగా, బుధవారం రేల్టెల్ కేబుల్ కట్ అవడంతో నెట్ రాక ఒక్క దస్తావేజు కూడా రిజిస్ట్రేషన్కు నోచుకోలేదు. అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు మరమ్మతులు చేయించడంలో విఫలమవడంతో 108 స్లాట్ బుకింగ్స్ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడింది. 108 స్లాట్ బుకింగ్స్ చేసుకున్న భూక్రయవిక్రయదారులు తమకు కేటాయించిన స్లాట్ బుకింగ్ సమయానికి వరంగల్ ఆర్ఓకు చేరుకుని వేచి ఉండి రిజిస్ట్రేషన్ అవకపోవడంతో రీ స్లాట్ బుకింగ్ చేసుకోక తప్పదంటూ నిరాశతో వెనుదిరిగారు. హసన్పర్తి: ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా నాణ్యమైన వైద్యం అందుతోందని డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. హసన్పర్తి మండలం జయగిరి, అన్నాసాగరం గ్రామాల్లో నిర్వహిస్తున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, వ్యాధి నిరోధక టీకాల ప్రోగ్రాంను ఆయన పరిశీలించి రోగులతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్మాణ దశలో ఉన్న ఆయుష్ ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. ఆయన వెంట సర్పంచ్లు వెంకటేశ్వర్లు, వెన్నెల, డాక్టర్ శ్రీరాం భార్గవ్, డాక్టర్ మల్లేశం, హెల్త్ సూపర్వైజర్ లచ్చు, ఏఎన్ఎం, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నలుగురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కె.ఫణింధర్ వీఆర్ నుంచి నెక్కొండ సర్కిల్, ఎస్.శ్రీనివాస్ నెక్కొండ సర్కిల్ నుంచి వీఆర్ వరంగల్, జె.శంకర్రావు వీఆర్ వరంగల్ నుంచి దుగ్గొండి సర్కిల్, ఎం. సాయిరమణ దుగ్గొండి సర్కిల్ నుంచి వీఆర్ వరంగల్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాజీపేట: కాజీపేట రైల్వే క్వార్టర్స్లో నివాసం ఉండే ఓ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి పెట్రోల్ పోసి హత్య చేసేందుకు యత్నించారు. ఈ ఘటన కాజీపేటలో చర్చనీయాంశంగా మారింది. యువకుడు మాతంగి ప్రవీణ్ తన తల్లితో కలిసి రైల్వే క్వార్టర్స్లో నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్వార్టర్స్కు వచ్చి కిటికి నుంచి లోపలికి పెట్రోల్ పోశారు. ఆ సమయంలో ప్రవీణ్ సెల్ఫోన్ చూస్తూ మెలకువతో ఉండడం వల్ల పెట్రోల్ వాసనను పసిగట్టాడు. గట్టిగా కేకలు వేయడంతో నిందితులు పరారయ్యారు. వెంటనే బాధితుడు 100 డయల్కు ఫోన్ చేశాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుల కోసం గాలించారు. ప్రవీణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ గుగులోతు అశోక్కుమార్ బుధవారం సందర్శించారు. స్టేడియంలోని క్రీడావసతులు, క్రీడాకారులకు అందుతున్న సౌకర్యాలు, క్రీడా పాఠశాల నిర్వహణ, క్రీడా అకాడమీల కార్యకలాపాలను ఆయన పరిశీలించారు. అనంతరం డీఎస్ఏ ఆఫీస్లో హనుమకొండ డీవైఎస్ఓ ప్రశాంత్ అధ్యక్షతన కోచ్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా గుగులోత్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి, వారికి మెరుగైన శిక్షణ అందించడం ద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్ఏ కోచ్లు నరేందర్, రాయబారపు నవీన్కుమార్, కూరపాటి రమేశ్, శ్రీమాన్, దేవిక, జీవన్గౌడ్, ప్రభుదాస్, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, రాజారపు రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
స్కూల్ దశనుంచే గంజాయి కిక్కుకు బానిసలు.. కళాశాలలే లక్ష్యంగా సరఫరా..
గురువారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2026●● మత్తులో పెరుగుతున్న నేరాలు.. విద్యార్థులే ‘క్యారియర్లు’ ● నల్లగొండ ఘటనతో ఒక్కసారిగా ఉలికిపాటు ● మేల్కోకపోతే మరిన్ని ఘోరాలు.. నేరాలువరంగల్ నార్కొటిక్ పోలీస్స్టేషన్ పరిధిలో మూడేళ్లలో నమోదైన కేసులు, స్వాధీనం చేసుకున్న గంజాయి (కిలోలు)కేసులు38ఇటీవల జరిగిన ఘటనల్లో కొన్ని.. ● ఫిబ్రవరిలో వరంగల్లో బీటెక్ మూడో సంవత్సరం ఓ విద్యార్థి (20), ఇంటర్ సెకండియర్ మరో విద్యార్థి (19)తోపాటు మరో యువకుడిని ఈగల్ ఫోర్స్ అరెస్టు చేసింది. వారి వద్ద 36 కిలోల గంజాయి పట్టుబడింది. ● గత మార్చిలో హనుమకొండలో వెలుగుచూసిన మైనర్ బాలిక అపహరణ కేసులో నిందితులు ఆమెకు మద్యం, గంజాయి అలవాటు చేయించి, అనంతరం నేరానికి పాల్ప డినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ● హనుమకొండలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరితోపాటు గంజాయి సేవించిన బాలుడితో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు నివేదికలు వచ్చాయి. ఇది మైనర్ల వరకు వినియోగం చేరిందనడానికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు. ● గత నెల 18న వేలేరు మండలంలోని ఓ గ్రామంలో గంజాయి తాగుతున్న ముగ్గురు మైనర్ బాలురులను పోలీసులు పట్టుకున్నారు. ● గత నెల20న వేలేరు మండలం ఎర్రబెల్లి, ధర్మసాగర్ మండలం నారాయణగిరికి చెందిన ముగ్గురు యువకులు గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడగా వారిని సాధారణ జీవితంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో యువకుల కుటుంబ సభ్యుల సమ్మతితో డీ–అడిక్షన్ సెంటర్లో చేర్పించారు. ● గత నెల5న పరకాల మండలం పోచారం గ్రామ శివారులోని మాటుకట్ట వద్ద మరో ఇద్దరు యువకులు గంజాయితో పట్టుబడ్డారు. వారు మరో మైనర్ బాలుడికి విక్రయించినట్లు పోలీసులకు చెప్పారు. 5541సాక్షిప్రతినిధి, వరంగల్: ...చదువుకోవాల్సిన వయసులో కొందరు మత్తుకు బానిసలవుతున్నారు. తొలుత సరదాగా మొదలుపెట్టి.. ఆపై అలవాటుగా.. చివరకు వ్యసనంగా మార్చుకుంటున్నారు. గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి చిన్నచిన్న గొడవలనుంచి తీవ్రమైన నేరాల వరకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కొందరు మైనర్లు, స్కూల్, కాలేజీ విద్యార్థులే గంజాయి ముఠాల టార్గెట్గా మారుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో గంజాయి మత్తులో మైనర్లు ప్రిన్సిపాల్ను హత్య చేసిన ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా ఉలికిపాటు నెలకొంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్లో గంజాయి సరఫరా, వినియోగం, యువత ప్రమేయంపై మరోసారి చర్చ మొదలైంది. స్కూల్ వెనుక నుంచి, హాస్టళ్ల వరకు.. వరంగల్ నార్కొటిక్ పోలీస్స్టేషన్ పరిధిలో మూడేళ్లలో 134 గంజాయి కేసులు నమోదవగా, 369మందిని అరెస్ట్ చేశారు. 2,571 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు వరంగల్ నగర శివార్లకే పరిమితమైన గంజాయి వినియోగం క్రమంగా కొన్ని విద్యాసంస్థల పరిసరాలకూ చేరిందన్న ఆందోళన ఉంది. స్కూల్ వెనుక ఖాళీ ప్రదేశాలు, పాడుబడిన భవనాలు, చెరువు కట్టలు, రైల్వే పరిసరాలు, కాలేజీ హాస్టళ్లు, అద్దె గదులు.. ఇలా నిర్మానుష్య ప్రాంతాలను కొందరు మత్తు సేవించేందుకు ఉపయోగిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కాగా వరంగల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగుచూసిన గంజాయి కేసు మరింత ఆందోళన కలిగించింది. బీటెక్, ఇంటర్ విద్యార్థులతో కూడిన ముఠా 36 కిలోలకు పైగా గంజాయితో పట్టుబడింది. ఎనిమిది మంది విద్యార్థులు డబ్బులు పోగేసి గంజాయి కొనుగోలు చేసినట్లు ‘ఈగల్’దర్యాప్తులో వెల్లడైంది. ఈ విద్యార్థులు ఇదే తరహా కేసులో నాలుగోసారి పట్టుబడడం ఆందోళనకరం. వినియోగంతో మొదలు.. విక్రయంతో ముగింపు గంజాయి ముఠాలు ముందుగా కొందరు విద్యార్థులను వినియోగదారులుగా మార్చి.. ఆ తర్వాత వారినే చిన్నస్థాయి క్యారియర్లు, విక్రేతలుగా ఉపయోగించుకుంటున్నాయన్న ఆందోళన ఉంది. మొదట స్నేహితుడి ద్వారా పరిచయం.. ఆపై ఉచితంగా లేదా తక్కువ ధరకు సరఫరా.. అలవాటు పడిన తర్వాత డబ్బుల కోసం ఇతరులకు సరఫరా చేయించడం.. ఇలా మత్తు వల విస్తరిస్తున్నట్లు పోలీసులు గుర్తించిన కేసులు చెబుతున్నాయి. అరెస్టులు70152147మాదక ద్రవ్యాల అనుకూల పంటల సాగు వద్దు యువత దేశ భవిష్యత్కు వెన్నెముక. వారు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. మాదక ద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యం, విద్య, కుటుంబ వ్యవస్థ, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. అదేవిధంగా, మాదక ద్రవ్యాల తయారీకి అనుకూలమైన పంటలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగు చేయకుండా చూడాలి. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రభుత్వం, ఆచార్యులు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, ప్రజలు కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. – డాక్టర్ గాదె సమ్మయ్య, ప్రముఖ విద్యావేత్త ●2024 2025 2026 (ఇప్పటి వరకు)2024 2025 2026 (ఇప్పటి వరకు)2024 2025 2026 (ఇప్పటి వరకు) -
నేటినుంచి పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు
● వాయిదా వేయాలని విద్యార్థుల ఆందోళన కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిఽధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పీజీ కోర్సుల రెండోసెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే బుధవారం యూనివర్సిటీలోని కొందరు రెండో సెమిస్టర్ విద్యార్థులు పరీక్షలు వాయిదావేయాలని పరిపాలన భవనం వద్ద ఆందోళన చేపట్టారు. పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ వచ్చి విద్యార్థులతో మాట్లాడి అలుమనాక్ ప్రకారం ఈ రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, వాయిదావేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. పలువురు విద్యార్థులు తమకు ఇతర పోటీ పరీక్షలున్నాయని, అందుకే వాయిదావేయాలని డిమాండ్ చేశారు. ఒక్క క్యాంపస్ విద్యార్థులే కాదని ఇతర మూడు ఉమ్మడి జిల్లాల్లోనూ పీజీ రెండో సెమిస్టర్ రాసే విద్యార్థులున్నారని, వాయిదావేయబోమని తెలిపారు. తొలుత విద్యార్థులు రిజిస్ట్రార్ రామచంద్రంను కూడా కలిసి పరీక్షలు వాయిదా వేయాలని విన్నవించారు. కాగా, ఈ విషయంపై కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ను ‘సాక్షి’ వివరణ కోరగా పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలు యథావిధిగా ఈనెల 20నుంచి జరుగుతాయని చెప్పారు. యూనివర్సిటీ పరిధిలో 3,813 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని తెలిపారు. పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని రాజేందర్ తెలిపారు. -
సీఎం, రేవూరి ఎవరు వచ్చినా పరకాల నుంచే పోటీ..
● మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మితా పటేల్గీసుకొండ : సీఎం రేవంత్రెడ్డి అయినా, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అయినా.. ఆయన (ప్రకాశ్ రెడ్డి) తాత అయినా ఎవరు వచ్చినా పరకాల నుంచి తాను పోటీ చేసి గెలుస్తానని, రాబోయే 20 ఏళ్ల వరకు తానే ఎమ్మెల్యేగా ఉంటానని మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితాపటేల్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కొండావర్గం నాయకుడు రడం భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో ఆమె కూతురు సుస్మితా పటేల్ కేక్ కట్ చేసి సంబురాలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వయంగా సీఎం వచ్చి ప్రచారం చేసినా గెలుపు తనదే అన్నారు. తాను చెప్పిన విషయంలో కౌంటర్ ఇస్తే అన్నీ బయట పెడతానన్నారు. ఇటీవల పరకాలలో జరిగిన సభలో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిని వచ్చే ఎన్నికల్లో మరోమారు గెలిపించాలని సీఎం అన్నారని, రేవూరికి ఎన్నికల ముందు పరకాల అంటే ఏంటో తెలియదని ఎద్దేవా చేశారు. డైపర్లతో తిరుగుతున్న రేవూరికి మరోసారి టికెట్ ఇచ్చుడేందని, జెన్జీ వ్యక్తులకు టికెట్ ఇస్తానన్న సీఎం ఇప్పుడు ఇలా ప్రకటించుండేదని ప్రశ్నించారు. రెండేళ్ల దాకా ఎందుకు ఇప్పుడు రేవూరిని రాజీనామా చేయమని చెప్పాలని, సీఎం అతడి తరఫున ప్రచారం చేయాలని, అప్పుడు అతడు గెలుస్తడో లేదంటే కొండా కుటుంబం గెలుస్తుందో చూడాలని సవాల్ విసిరారు. నాయకులు గోపాల నవీన్రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు ఆదేశాలతో వ్యక్తి అరెస్ట్
వరంగల్ చౌరస్తా : భార్యను హత్య చేసిన కేసులో కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న ఓ నిందితుడిని బుధవారం ఇంతెజార్గంజ్ పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఇంతెజార్గంజ్ ఇన్స్పెక్టర్ షుకూరు కథనం ప్రకారం.. వరంగల్ నగరానికి చెందిన కుమ్మరి సుధాకర్ అలియాస్ నాని 2023లో తన భార్యను హత్య చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చారు. 2024 నవంబర్ నుంచి విచారణ జరుగుతున్న న్యాయస్థానం ఎదుట హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో నిందుతుడిపై ఎన్బీడబ్ల్యూ జారీ చేయగా, పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. -
కక్షతో ఇంటికి నిప్పు..
మహబూబాబాద్ రూరల్ : కక్షతో ఓ ఇంటికి నిప్పంటించడంతోపాటు ద్విచక్ర వాహనాన్ని దగ్ధం చేశా రు. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాషిపంగు రామకృష్ణ, అదే గ్రామానికి చెందిన కత్తుల రాజుకు ఇటీవల వాగ్వాదం జరిగి అదికాస్తా ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో కక్షను మనసులో పెట్టుకున్న కత్తుల రాజు మంగళవారం అర్ధరాత్రి రామకృష్ణ ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతోపాటు బైక్ను దగ్ధం చేశాడు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఇంట్లో ఉన్న కలప, రేకుల షెడ్డు, మంచం, నాలుగు కుర్చీలు, తలుపులు, దర్వాజ, కరెంట్ మీటర్ బోర్డు, దుస్తులు, విలువైన సామగ్రి దగ్ధమైంది. ఈ ఘటనలో రూ.2 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు బాధితుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్సై పిల్లల రాజు తెలిపారు. రూ.2 లక్షల విలువైన ఆస్తి నష్టం కంబాలపల్లిలో ఘటన -
పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు జరగుతున్నాయని వీసీ ప్రతాప్రెడ్డి తెలిపారు. కేయూ 50 వసంతాలతో గోల్డెన్జూబ్లీ, ఆవిర్భావ దినోత్సవాన్ని క్యాంపస్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. వీసీ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ.. సోషల్ సైన్సెస్, ఆర్డ్స్ విభాగాల్లో జరుగుతున్న పరిశోధనలు సమాజ అవసరాలు, సామాజిక సమస్యల పరిష్కారంపై దృష్టిసారించేలా ఉన్నాయన్నారు. పరిశోధనలను ప్రోత్సహించేందుకు కార్పస్ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రూ.140 కోట్ల వ్యయంతో మౌలిక వసతుల అభివృద్ధి పనులు, వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు, కేయూకు రూ.400 కోట్లు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. కేయూ ఆవిర్భావం తర్వాతి ప్రొఫెసర్లు, ఉద్యోగులు తమ అంకితభావంతో వర్సిటీకి బలమైన పునాదాలు వేశారన్నారు. వారి స్ఫూర్తిని నేటితరం అధ్యాపకులు, ఉద్యోగులు కొనసాగించాలని ఆయన సూచించారు. సమావేశంలో రిజిస్ట్రార్ రామచంద్రం, కేయూ పాలకమండలి సభ్యులు ఆచార్య బి.సురేశ్లాల్, డాక్టర్ రమ, డాక్టర్ కె.అనితారెడ్డి, డాక్టర్ సుకుమారి తదితరులున్నారు. కేయూ వీసీ ప్రతాప్రెడ్డి గోల్డెన్ జూబ్లీ, వర్సిటీ ఆవిర్భావ దినోత్సవం -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
● కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి కేయూ క్యాంపస్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి క్యాంపస్ను హరిత ప్రాంగణంగా తీర్చిదిద్దాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి కోరారు. కేయూ గోల్డెన్ జూబ్లీ, 50వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం అవెన్యూ ప్లాంటేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. క్యాంపస్లోని పరిపాలనభవనం సమీపంలోని స్థలంలో రిజిస్ట్రార్ వి. రామచంద్రం, హనుమకొండ జిల్లా అటవీశాఖ అధికారి ముకుందర్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. వీసీ మాట్లాడుతూ డీఎఫ్ఓ వివిధ రకాల మొక్కలు అందించారని, వాటిని క్యాంపస్లోని అన్ని విభాగాల్లో నాటుతున్నామన్నారు. డీఎఫ్ఓ ముకుందర్రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీలో ఖాళీ స్థలంలో గార్డెన్లు ఏర్పాటు చేసుకోవచ్చని, అందుకు సహకారం అందిస్తామన్నారు. కేయూ అవెన్యూ ప్లాంటేషన్ ఇన్చార్జ్ బి. వెంకట్గోపినాథ్, ఓఎస్డీ బి. వెంకట్రామ్రెడ్డి, పాలకమండలి సభ్యులు బి. సురేశ్లాల్, అనితారెడ్డి, పి. సుధాకర్, మల్లం నవీన్, రమ, చిర్రరాజు, ఆర్ట్స్ అండ్ సైన్స్కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, సీడీసీ డీన్ వరలక్ష్మి,కెహబ్ డైరెక్టర్ సవితాజ్యోత్న్స, కేయూ ఎన్జీఓ అధ్యక్షుడు బూర నవీన్, జనరల్ సెక్రటరీ వల్లాల తిరుపతి మొక్కలు నాటారు. కాగా, ఈమెగా ప్లాంటేషన్లో సుమారు 600 మొక్కలు నాటారు. -
నీట్ పీజీ–2026 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: నీట్ పీజీ–2026 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. నీట్ పరీక్ష ఏర్పాట్లపై కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని పేర్కొన్నారు. కేంద్రంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. పరీక్ష నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకునేలా అవసరమైన సమాచారాన్ని అభ్యర్థులకు అందించాలని, పరీక్ష సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: గ్రేటర్ వరంగల్ను పరిశుభ్రమైన, పచ్చదనం నిండిన నగరంగా మార్చేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించాలని హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్ సూచించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఘన వ్యర్థాల నిర్వహణపై మున్సిపల్ అధికారులు, పరిశోధనా సంస్థల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. ఇళ్ల నుంచి వచ్చే తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, స్వచ్ఛ ఆటో డ్రైవర్లు సమన్వయంతో పనిచేసి రాబోయే ఐదేళ్లలో నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దాలన్నారు. పరిశోధన, సాంకేతిక సహకారం అందించేందుకు ఎంఎస్ స్వామినాథ రీసెర్చ్ ఫౌండేషన్, ఐఐటీ మద్రాస్, శ్రీచర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ముందుకొచ్చినట్లు తెలిపారు. ప్రతీ ఓటరు హక్కును పరిరక్షిస్తాంజిల్లాలో అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని హనుమకొండ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చాహత్ బాజ్పాయ్ తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మ్యాపింగ్ కాని ఓటర్లు, అనామలీస్ గుర్తించిన వారికి నోటీసులు జారీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై వచ్చే ప్రతీ క్లెయిమ్, అభ్యంతరాన్ని నిర్ణీత గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అర్హులైన ప్రతి ఓటరు హక్కును పరిరక్షించేలా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని వివరించారు. సమావేశంలో ఆర్డీఓలు వెంకటేశ్, వెంకన్న, ఎలక్షన్ సూపరింటెండెంట్ జగత్సింగ్, సంబంధిత అధికారులున్నారు. -
జాతీయ లోక్అదాలత్ను విజయవంతం చేయాలి
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ వరంగల్ లీగల్: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 12 (శనివారం)న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబ పిలుపునిచ్చారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయవాధికార భవన్లో బుధవారం నిర్వహించిన పోలీస్ అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజీపడదగిన క్రిమినల్, సివిల్, వివాహ/కుటుంబ వివాదాలు, మోటారు వెహికల్ యాక్ట్, బ్యాంకు, చిట్ఫండ్, ఎక్సైజ్, విద్యుత్ సంబంధిత తదితర కేసులను జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత మాట్లాడుతూ పోలీస్ శాఖ పరిధిలోని రాజీకి అనుకూలమైన కేసులను గుర్తించి, సంబంధిత కక్షిదారులకు జాతీయ లోక్ అదాలత్ ప్రయోజనాలు వివరించాలని పోలీసు అధికారులకు సూచించారు. సమావేశంలో వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సీహెచ్.ఉపేందర్, బార్ కౌన్సిల్ సభ్యులు ఎం.సహోదర్రెడ్డి, వరంగల్ జిల్లా న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. -
జనగామలో మాజీ మంత్రి ఎర్రబెల్లి అరెస్ట్
జనగామ: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, దివంగత పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహం కూల్చివేతను నిరసిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళన నేపథ్యంలో జనగామ జిల్లా పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నర్సంపేట బంద్కు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునివ్వడంతో బుధవారం హైదరాబాద్ నుంచి నర్సంపేటకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న సీఐ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై చెన్నకేశవులు, పోలీసులు వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై పెంబర్తి వై జంక్షన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎర్రబెల్లి వాహనాన్ని అడ్డుకున్నారు. నర్సంపేట పర్యటనకు అనుమతి లేదని, స్టేషన్కు రావాలని కోరడంతో ఆయన వాహనంనుంచి దిగి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. పోలీసులు ఆయనను బలవంతంగా వాహనంలో ఎక్కించి జనగామ పట్టణ పోలీస్స్టేషన్కు తరలించారు. పాలకుర్తి, జనగామ నియోజకవర్గాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్స్టేషన్కు చేరుకుని ఆందోళన చేపట్టారు. రైల్వేస్టేషన్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడంతో పోలీసులు దయాకర్రావును స్టేషన్నుంచి బయటకు తీసుకువచ్చి ప్రత్యేక ఎస్కార్ట్ మధ్య హైదరాబాద్ వైపు తరలించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులను అడ్డుపెట్టుకుని భూకబ్జాలు రేవంత్రెడ్డి ప్రభుత్వం పోలీసులు, రెవెన్యూ అధికారులను ఉపయోగించుకుని రాష్ట్రవ్యాప్తంగా దౌర్జన్యాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. బుధవారం జనగామ పోలీస్స్టేషన్ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రెవెన్యూ శాఖలోని ఐఏఎస్ అధి కారులను ఉపయోగించుకుంటూ, పోలీసుల సహకారంతో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబాలు భూకబ్జాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. పేదల భూములను ఏదో ఒక కారణంతో లాక్కుంటూ, డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. పెద్ది సుదర్శన్రెడ్డి నిజాయితీ, నర్సంపేట ప్రజలకు చేసిన సేవలు అందరికీ తెలుసన్నారు. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కూల్చివేయడం దారుణమన్నారు. ఎర్రబెల్లి వెంట గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, పల్లా సుందర్రాంరెడ్డి, తాళ్ల సురేష్రెడ్డి, కౌన్సిలర్ ఉడుగుల కిష్టయ్య, ఉల్లెంగుల సందీప్, సలీం, మాశెట్టి వెంకన్న, మంగ రామకృష్ణ తదితరులు ఉన్నారు. హైవేపై బైఠాయింపు.. ఉద్రిక్తత -
హోమియో డాక్టర్ కోసం ఎదురుచూపులు
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలలో డాక్టర్ కోసం రోగులు పడిగాపులు పడాల్సి వచ్చింది. బుధవారం సదరు డాక్టర్ ఉదయం 9 గంటలకు రావాల్సి ఉంది. చాలామంది ఓపీ తీసుకుని డాక్టర్ కోసం గంటన్నరకు పైగా నిరీక్షించారు. అయితే డాక్టర్ 10.30 గంటల తర్వాత వచ్చి రోగులకు చికిత్స చేయడం ప్రారంభించారు. కాగా, సమాచారం తెలుసుకున్న ఆయుష్ ఆర్డీడీ డాక్టర్ బి.ప్రమీలాదేవి ఉదయం 11 గంటల సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్ ఆలస్యంగా రావడం గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. రైలు ఆలస్యం కావడంతో ఆలస్యంగా వచ్చానని డాక్టర్ చెప్పారని ఆర్డీడీ తెలిపారు. ఇకనుంచి అలా జరగకుండా చూసుకుంటానని చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా, గత బోనాల పండుగ రోజు పనిదినమైనా వైద్య సిబ్బంది రాలేదనే సమాచారం రావడంతో వారికి మెమోలు జారీ చేసినట్లు ఆమె వివరించారు. -
ఓల్టేజీ మెరుగు..
కెపాసిటర్ బ్యాంకులతో హన్మకొండ: విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఆధునిక, నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ఎన్పీడీసీఎల్ యాజమాన్యం నిరంతరం శ్రమిస్తోంది. ఇదే క్రమంలో లైన్లలో కెపాసిటర్ బ్యాంకులు అమర్చి విద్యుత్ సరఫరాను మెరుగు పరుస్తోంది. సంస్థ పరిధిలో 14 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉండడంతో గ్రామీణ విద్యుత్ ఫీడర్లపై ఇండక్షన్ లోడ్ అధికంగా ఉంటుంది. తద్వారా పవర్ ఫ్యాక్టర్ తగ్గి, విద్యుత్ ప్రవాహం పెరిగి ఓల్టేజీ డ్రాప్ ఏర్పడుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు సంస్థ పరిధిలో రెండున్నర సంవత్సరాల కాలంలో 33/11 కేవీ సబ్స్టేషన్లలో 2 ఎంవీఏఆర్ కెపాసిటర్ బ్యాంకులు 303, 1 ఎంవీఏఆర్ కెపాసిటర్ బ్యాంకులు 89 ఏర్పాటు చేశారు. ఫలితంగా రైతాంగానికి నాణ్యమైన, స్థిరమైన ఓల్టేజీతో విద్యుత్ సరఫరా అందించడంతోపాటు సాంకేతిక విద్యుత్ నష్టాలను గణనీయంగా తగ్గించుకున్నారు. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో మోటార్ల కారణంగా ఏర్పడే రియాక్టివ్ పవర్ డిమాండ్ను నియంత్రించేందుకు సబ్స్టేషన్లు, 11 కేవీ ఫీడర్ల వద్ద కెపాసిటర్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. రూ.21 కోట్ల మేర తగ్గిన ఆర్థిక భారం కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటుతో పవర్ ట్రాన్స్ఫార్మర్ (పీటీఆర్)ల సామర్థ్యంపై ఉపశమనం కలుగుతుంది. దీంతో అనేక ప్రాంతాల్లో వెంటనే అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని తగ్గించింది. 393 కెపాసిటర్ బ్యాంకులు ఏర్పాటుతో అదనంగా 66 కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాట్లు ఆవశ్యకత లేకుండా పోయింది. తద్వారా రూ.21 కోట్ల మేర ఆర్థిక భారం తగ్గింది. 11 కేవీ ఫీడర్లలో కెపాసిటర్ బ్యాంకులు అమర్చడం ద్వారా దాదాపు రూ.82 కోట్ల మేర సాంకేతిక నష్టాలు తగ్గాయని విద్యుత్ అధికారులు తెలిపారు. సబ్స్టేషన్ స్థాయిలో 2 ఎంవీఆర్ కెపాసిటర్ బ్యాంకులతోపాటు 11 కేవీ ఫీడర్ స్థాయిలో 600 కేవీఏఆర్ సామర్థ్యం కలిగిన కెపాసిటర్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతాల్లో 8 ఓల్టేజీ బూస్టర్లు ఏర్పాటు.. లైన్లలో ఓల్టేజీ డ్రాప్ తగ్గి, ముఖ్యంగా ఫీడర్ చివరి ప్రాంతాల్లో ఓల్టేజీ ప్రొఫైల్ మెరుగుపడుతుంది. ఫలితంగా వ్యవసాయ పంపుసెట్లతో పాటు ఇతర వినియోగదారులకు కూడా మరింత స్థిరమైన, నా ణ్యమైన ఓల్టేజ్ విద్యుత్ అందుతుంది. ఈ క్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల అటవీ, సుదూర ప్రాంతాల్లో మొత్తం 8 ఓల్టేజీ బూస్టర్లు అమర్చారు. కొత్త సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడం ఆచరణాత్మకంగా సాధ్యం కాని పరిస్థితులున్న అటవీ ప్రాంతాలు, పొడవైన లైన్లు ఉన్న ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి ఓల్టేజీ బూస్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా లో ఓల్టేజీ సమస్య పరిష్కరిస్తున్నారు. విద్యుత్ నష్టాల తగ్గింపు వ్యవసాయ ఫీడర్లలో లోఓల్టేజీ సమస్యకు పరిష్కారం అదనపు పీటీఆర్ల ఏర్పాటు అవసరం లేక తగ్గిన ఆర్థిక భారం -
బీఆర్ఎస్ నాయకుల గృహ నిర్బంధం
అక్రమ అరెస్టులపై మండిపాటు హన్మకొండ: బీఆర్ఎస్ నాయకుల గృహ నిర్బంధం వరుసగా రెండో రోజు కొనసాగింది. తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని తొలగించడంతో బీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర ప్రతిఘటన వ్యక్తమవుతుందని భావించిన పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. ప్రధాన నాయకులకు గృహనిర్బంధం విధించగా, ఇతర నాయకులను సమీపంలోని పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈక్రమంలో బుధవారం హనుమకొండ వడ్డేపల్లిలోని స్వగృహంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, నక్కలగుట్టలోని స్వగృహంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఇందిరానగర్లోని స్వగృహంలో రాష్ట్ర రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, టీచర్స్ కాలనీలోని స్వగృహంలో ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. సాయంత్రం వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మాజీ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, వినయ్భాస్కర్ మాట్లాడుతూ.. నర్సంపేట ప్రజలు స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చి నిరసన వ్యక్తం చేస్తుంటే ఉద్యమానికి మద్దతు తెలిపే నాయకులను పోలీసులు అడ్డుకోవడం రేవంత్రెడ్డి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. విగ్రహం తొలగించినంత మాత్రాన చరిత్ర చెరిగిపోదన్నారు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● వరంగల్ డీఎంహెచ్ఓ బి.రాజారెడ్డి ఖిలా వరంగల్: వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని వరంగల్ డీఎంహెచ్ఓ బి.రాజారెడ్డి ఆదేశించారు. ఖిలా వరంగల్, రంగశాయిపేట, ఎస్ఆర్ఆర్తోట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డీఎంహెచ్ఓ బుధవారం తనిఖీ చేశారు. హాజరు పట్టికలు, ఓపీ రిజిస్టర్, ఫార్మసీ, ల్యాబ్లు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల రిజిస్టర్లు, రికార్డులను పరి శీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రజలకు అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల సేవలను సమర్థవంతంగా అందించాలని, ఆ రోగ్య కేంద్రాల్లో ఓపీ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యా ధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకో వాలని, వారానికి రెండుసార్లు డ్రైడే నిర్వహించి దోమల వృద్ధి కేంద్రాలను నిర్మూలించాలని ఆదేశించారు. డాక్టర్ అనిత, డాక్టర్ వేద కిరణ్, ఎంపీహెచ్ఓలు సదానందం, నాగరాజు ఉన్నారు ఎన్సీడీ లక్ష్యాలను సాధించాలి గీసుకొండ: జాతీయ అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమం (ఎన్సీడీ) కింద నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం సాధించాలని వరంగల్ డీఎంహెచ్ఓ బి.రాజారెడ్డి అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఎన్సీడీ నర్సింగ్ ఆఫీసర్లు, నోడల్ పర్యవేక్షకులతో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికీ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ నిర్వహించాలని సూచించారు. ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి సయ్యద్ ఇక్తిదార్ అహ్మద్, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, ఎన్న్సీడీ జిల్లా కోఆర్డినేటర్లు ఆర్.ప్రకాశ్, ఎన్.శ్రీనివాస్ కర్ణ పాల్గొన్నారు. -
ఎఫ్సీఐ జీఎంను కలిసిన రైస్ మిల్లర్ల ప్రతినిధులు
ములుగు : ఎఫ్సీఐ గోదాముల్లో స్థలాల కొరత, ర్యాక్ మూమెంట్ లేకపోవడంతో బియ్యం డెలివరీలు చేయలేక రైస్ మిల్లర్లు ఆర్థికంగా నష్టపోతున్నారని ఉమ్మడి వరంగల్ జిల్లా రైస్ మిల్లర్ల ప్రతినిధులు ఎఫ్సీఐ జీఎం అనూజ్ త్యాగి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో జీఎం అనూజ్ త్యాగిని కలిసి సమస్యలు వివరించారు. గోదాముల్లో బియ్యం నిల్వ చేసేందుకు తగిన స్థలాలు ఏర్పాటు చేయడంతోపాటు ర్యాక్ మూమెంట్ చేపట్టాలని కోరారు. సమస్యలపై జీఎం అనూజ్ త్యాగి సానుకూలంగా స్పందిస్తూ సెప్టెంబర్లో ర్యాక్ మూమెంట్ జరిగేలా చర్యలు తీసుకుంటామని, గోదాముల్లో స్థలాల లభ్యత కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్, కార్యదర్శి సహోదర రెడ్డి, వరంగల్ జిల్లా కార్యదర్శి బూరెల సత్యనారాయణ, కోశాధికారి ఇరుకు కోటేశ్వరరావు, మహబూబాబాద్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, సీనియర్ రైస్ మిల్లర్ యుగంధర్, శ్రావణ్ పాల్గొన్నారు. చెరువుల పంపకాల విషయంలో గొడవ ● వ్యక్తి దారుణ హత్య ● మడిపల్లిలో ఘటన తొర్రూరు రూరల్: చెరువుల పంపకాల విషయంలో జరిగిన గొ డవలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్రెడ్డి కథనం ప్రకారం.. ఇటీవల గ్రామానికి చెందిన ఏదుల వెంకన్న(ముదిరాజ్ కులస్తుడు) అనారోగ్యంతో మృతి చెందాడు. బుధవారం మృతుడి 5వ రోజు కార్యక్రమం చేశారు. ఇందులో గ్రామానికి చెందిన గుంటుక రమేశ్(43), యాకన్న, వెంకన్న, జంపయ్య, మహేశ్తోపాటు మరికొంత మంది పాల్గొన్నారు. కాగా, కార్యక్రమం సందర్భంగా చెరువుల పంపకాల విషయంపై కొందరు గొడవ పడ్డారు. ఈ సమయంలో మాటామాటా పెరిగి కర్రలు, రాళ్లతో గుంటుక రమేశ్పై దాడికి పాల్పడ్డారు. దీంతో రమేశ్ భయపడి అక్కడి నుంచి గ్రామ శివారులోని చెరువు వైపునకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అయినా వెంబడించి కర్రలు, రాళ్లతో కొట్టి రమేశ్ను హత్య చేశారు. ఈ ఘటనపై మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రమేశ్ మృతితో కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
విద్యాశాఖ పనితీరు మెరుగుపడాలి
కాళోజీ సెంటర్: విద్యాశాఖ పనితీరు మెరుగుపరుచుకుంటూ ఉత్తమ ఫలితాలను సా ధించాలని అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ సూచించారు. డీఈఓ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. డీఈఓతో కలిసి సెక్టోరియల్ అధికారులు, ఆఫీస్ సూపరింటెండెంట్లతో సమీక్షించారు. పాఠశాల విద్యలో జిల్లా పనితీరును అంచనా వేసే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పర్ఫార్మెన్న్ గ్రేడింగ్ ఇండెక్స్(పీజీఐ) నివేదికలో జిల్లా ప్రచేస్త గ్రేడ్ 19వ స్థానంలో ఉందని, ప్రథమ స్థానం వచ్చేందుకు కృషిచేయాలని సూచించారు. ఏదైన సమస్య ఉంటే తన దృష్టికి తేవాలని ఆయన సూచించారు. -
పరకాలలో పవార్!
సాక్షి, వరంగల్: పరకాల నియోజకవర్గ కాంగ్రెస్లో అసంతృప్తి సెగలు ఇప్పుడే రాజుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ పార్టీలో మొదలైంది. ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని సీఎం రేవంత్రెడ్డి ఇటీవల పరకాల పర్యటనలో పిలుపునివ్వడం ఒకవైపు.. కొండా సుస్మితాపటేల్ చేసిన ఘాటు వ్యాఖ్యలు మరోవైపు రాజకీయ వేడిని పెంచాయి. ఇదే సమయంలో కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి సైతం తాను లేదా తన సతీమణి పరకాల నుంచి బరిలో ఉంటామని చెప్పడంతో కాంగ్రెస్లో మూడు వర్గాల మధ్య పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఎన్నికలకు ముందే మొదలైన ఈ టికెట్ పోరు.. రానున్న రోజుల్లో ఇంకా ముదిరే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. గీసు‘కొండా’ కేంద్రంగానే.. ● 2024 మే 8: గీసుకొండ కాంగ్రెస్ నాయకుడి వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మధ్య ఫోన్ సంభాషణ ఆడియో లీక్తో కలకలం. ● 2024 అక్టోబర్ 13: ధర్మారంలో దసరా ఫ్లెక్సీ వివాదం.. కొండా, రేవూరి వర్గాల మధ్య ఉద్రిక్తత, పోలీస్స్టేషన్లో హైటెన్షన్. ● 2025 డిసెంబర్: గీసుకొండ మండలంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన 16 స్థానాల్లో కొండా వర్గానికి 7, రేవూరి వర్గానికి 9 స్థానాలు వచ్చాయి. ● 2026 మార్చి 3: కొండా మురళి సైతం కుమార్తెకు మద్దతుగా కొండా కుటుంబాన్ని భవిష్యత్లోనూ గీసుకొండ ప్రజలు ఆశీర్వదించాలని పిలుపు. ● 2026 ఆగస్టు 19: గీసుకొండలో సుస్మితా పటేల్ సీఎం రేవంత్రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు.. రేవూరి ప్రకాశ్రెడ్డితో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటన.ఎమ్మెల్యే రేవూరి, సుస్మితాపటేల్, ఇనగాల ఎన్నిలకు సమయమున్నా కాంగ్రెస్లో మూడు ముక్కలాట షురూ ఇటీవల సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలతో పార్టీలో ఒక్కసారిగా మంటలు తాజాగా గీసుకొండ వేదికగా సుస్మితాపటేల్ ఘాటు వ్యాఖ్యలు తాను కూడా బరిలో ఉంటానని ఇనగాల వెంకట్రాంరెడ్డి ప్రకటన -
పిల్లల భద్రత, ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి
హనుమకొండ అదనపు కలెక్టర్ రవి హన్మకొండ అర్బన్ : బాలల సంరక్షణ కేంద్రాల్లో పిల్లల భద్రత, సంక్షేమం, ఆరోగ్యం, విద్య, వసతి, ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రవి సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా తనిఖీ కమిటీ సమావేశం జరిగింది. గత త్రైమాసిక తనిఖీల్లో గుర్తించిన లోపాలు, సూచనలపై సమీ క్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించి తీసుకున్న చర్యల నివేదికలను సమర్పించాలని కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, బాలల సంక్షేమ సమితి సభ్యుడు దామోదర్ పాల్గొన్నారు. -
నగర సుందరీకరణకు సహకరించాలి
● అనుమతి లేని వాణిజ్య ఫ్లెక్సీలు, కటౌట్లపై క్రిమినల్ కేసులు ● ఫ్లెక్సీ తయారీదారుల సమావేశంలో బల్దియా కమిషనర్ వెంకన్న వరంగల్ అర్బన్: నగరంలో అనుమతి లేకుండా కమర్షియల్ ఫ్లెక్సీలు, కటౌట్లను ముద్రించినా, అనధికారికంగా ఏర్పాటు చేసినా క్రిమినల్ కేసులు తప్పవని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న హెచ్చరించారు. బల్దియా కార్యాలయంలోని ఫ్లెక్సీ తయారీదారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందస్తుగా అనుమతి తీసుకున్న తర్వాతనే ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. నగరంలోని ఫ్లెక్సీ తయారీదారులతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి నిబంధనలు చేరవేస్తామని తెలిపారు. నగర సుందరీకరణకు సహకరించాలని కోరారు. జిల్లా అగ్నిమాపక అధికారి శంకర్లింగం, సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, స్టేషన్ ఫైర్ఆఫీసర్ రాజేశ్వర్రావు, శానిటరీ సూపర్వైజర్ గోల్కొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కమిషనర్ జన్మభూమి జంక్షన్లో పారిశుద్ధ్య పనులు తనిఖీ చేశారు. ఎస్ఈ రాజ్కుమార్, ఎంహెచ్ఓ రాజేశ్, ఈఈ రవికుమార్, శానిటరీ సూపర్వైజర్లు నరేందర్, గోల్కొండ శ్రీను, డీఈ రాజ్కుమార్, ఎస్ఐ భీమయ్య ఉన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై అధ్యయనం చేసేందుకు చైన్నెలోని స్వామినాథన్ పరిశోధనా సంస్థ బృందం కమిషనర్ టి.వెంకన్నతో సమావేశమైంది. -
బుధవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2026
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అటానమస్, గురుకుల డిగ్రీ కళాశాలలు 241పీజీ కళాశాలలు 62ఫార్మసీ 24ఇంజనీరింగ్ 06బీఈడీ 43ఫిజికల్ ఎడ్యుకేషన్ 03ఎంసీఏ 10ఎంబీఏ 22 హోటల్ మేనేజ్మెంట్ 03లా 04 కేయూ పరిధిలోని కొత్తగూడెం ఇంజనీరింగ్ కళాశాలను మన్మోహన్సింగ్ ఎర్త్ వర్సిటీగా మార్చారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవ శోభ సంతరించుకుంది. నిత్య చైతన్య దీప్తిగా ఉంటూ లక్షలాది మంది విద్యార్థులను అక్షర దివిటీలుగా తీర్చిదిద్దిన ఘనచరిత్ర ఈ యూనివర్సిటీది. సామాజిక ఉద్యమాలు, పోరాటాల గడ్డగా పేరొందింది. బుధవారంతో యూనివర్సిటీ 50 వసంతాలు (గోల్డెన్ జూబ్లీ) పూర్తి చేసుకొని 51వ వసంతంలోకి అడుగిడుతోంది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ప్రస్థానంతోపాటు స్థానికంగా నెలకొన్న సమస్యలపై ప్రత్యేక కథనం. కేయూ తొలుత పీజీ సెంటర్గా తొలుత ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెంటర్గా 1968లో మొదలైంది. నాడు పోరాటాల ఫలితంగానే 1976 ఆగస్టు 19న కాకతీయ యూనివర్సిటీగా ఆవిర్భవించింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ 50 వసంతాల్లో ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసించి వివిధ రంగాల్లో, దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. ఇక్కడే ఆచార్యులు అయినవారూ ఉన్నా రు. మొదట కేయూ నాలుగు విభాగాలతో మొదలై నాడు రేకుల షెడ్లలోనే విద్య కొనసాగింది. అంచ లంచెలుగా ఎదిగి 29 విభాగాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం యూనివర్సిటీలోని అన్ని కాలేజీల్లో 1.20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. కేయూలో వివిధ సెంటర్లు కాకతీయ యూనివర్సిటీలో అంబేడ్కర్ స్టడీస్ సెంటర్, స్టూడెంట్ వెల్ఫేర్, ఎస్సీ, ఎీస్టీ సెల్, బీసీసెల్, దివ్యాంగసెల్, మహిళా అధ్యయన కేంద్రం, యోగా సెంటర్ ఉన్నాయి. వీటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. విద్యతోపాటు జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డిగ్రీ, జూనియర్, పీజీ కళాశాలల్లో కలిపి 360 ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉండగా అందులో 36వేల మంది ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ఉన్నారు. రక్తదానంలో అనేక అవార్డులు పొందింది. స్పోర్ట్స్బోర్డు కూడా ఉంది. ప్రతీఏటా సౌత్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ, ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీల వివిధ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి పంపిస్తున్నారు. నిధుల మంజూరుపై ఆశలు యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటు న్న వేళ.. మౌలిక సదుపాయల కల్పనకు రూ.400 కోట్ల నిధుల కోసం వీసీ ప్రతాప్రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆనిధులు మంజూరు చేస్తే యూనివర్సిటీలో గోల్డెన్జూబ్లీ, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే యోచనలో ఉన్నారు. కేయూ పరిధిలోని కాలేజీలు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు తొలుత ఓయూ పీజీ సెంటర్గా ఆ తర్వాత కేయూ నాలుగు విభాగాలతో మొదలై నేడు 29 విభాగాలు యూనివర్సిటీ అభివృద్ధికి రూ.400 కోట్లతో ప్రతిపాదనలుకాకతీయ యూనివర్సిటీకి 50 వసంతాలు పూర్తి కేయూలో 332 అధ్యాపక పోస్టులు ఖాళీ బోధన, పరిశోధనలపై ప్రతికూల ప్రభావం విద్యార్థులకు సరిపడా హాస్టళ్లు ఏవీ?స్వర్ణోత్సవం భవిష్యత్కు బలమైన పునాది కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవం గతానికి గర్వకారణం భవిష్యత్కు బలమైన పునాది. విద్య, నాణ్యమైన పరిశోధనల దిశగా కృషి చేస్తున్నాం. రూసా ప్రాజెక్టు కింద రూ.60 కోట్ల నిధులు రాగా, రూ.35 కోట్లతో 42 పరిశోధన ప్రాజెక్టులు, రూ.15 కోట్లతో కెహబ్ అభివృద్ధి చేస్తున్నాం. బీఎస్ఎన్ఎల్కు సంబంధించి అండర్గ్రౌండ్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు పూర్తయ్యింది. అకడమిక్ బ్లాక్లు, వర్క్షాప్లు,సెమినార్ హాల్స్, స్వర్ణోత్సవ శతాబ్ది పైలాన్ తదితర పనులకు ఆమోదం లభించింది. రూ.400 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇవి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. 50 ఏళ్ల విద్యాప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తాం. – కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి -
బీఆర్ఎస్ కార్యాలయం వద్ద హైడ్రామా
శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ అరెస్ట్ హన్మకొండ: హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. నర్సంపేటలో పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహం తొలగింపు నేపథ్యంలో మంగళవారం ఆందోళనలు చేపడతారని భావించిన పోలీసులు ముందుజాగ్రత్తగా బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. కొందరిని పోలీస్స్టేషన్కు తరలించగా, మరికొందరిని గృహ నిర్బంధం చేశారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన అనంతరం శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి నర్సంపేటకు బయలుదేరుతుండగా కార్యాలయం గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ రాజకీయాన్ని ఇక్కడ రుద్ద దలచుకున్నారా అని మధుసూదనాచారి పోలీసులను ప్రశ్నించారు. తన బలగం ఏమైందని సుదర్శన్రెడ్డి ఆత్మ ఎదురు చూస్తుందని, వందల మంది పోలీసులు రండి వెళదామని చెప్పినా వదలకుండా మధుసూదనాచారిని అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించగా నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. చివరకు పోలీసులు పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని తొలగించడం అన్యాయమని అన్నారు. సహచర ఉద్యమకారులుగా వెళ్లేందుకు రేవంత్రెడ్డి సర్కారు అడ్డుకుంటోందని, దీనికి వెనుక ఆంధ్ర కుట్ర దాగి ఉందని ఆరోపించారు. చంద్రబాబు ద్వారా ఆంధ్రా నుంచి రిమోట్ ఆపరేషన్ జరుగుతోందని, తెలంగాణ నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. -
మెస్ల నిర్వహణలో అక్రమాలపై సబ్కమిటీ
కేయూ క్యాంపస్: హైదరాబాద్లోని సెక్రటేరియట్లో మంగళవారం కేయూ పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఇందులో పలు అంశాలపై చర్చించారు. కేయూలోని హాస్టళ్ల మెస్ల నిర్వహణ, అడ్వాన్స్ల పేరుతో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన రెండు కమిటీల నివేదికలను పరిశీలించారు. నివేదికలు, అవకతవకల ఆరోపణలపై విచారణ జరిపి మరో నివేదిక ఇచ్చేలా పాలకమండలి సమావేశం నిర్ణయించిందని సమాచారం. ఇందుకోసం కేయూ పాలకమండలి సభ్యులు పుల్లూరు సుధాకర్, డాక్టర్ అనితారెడ్డి, ప్రొఫెసర్ మల్లం నవీన్తో సబ్కమిటీని నియమించారు. యంగ్ ఇండియా ఇంట్రిగ్రేటెడ్ స్కూల్కు 15 ఎకరాలు.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి ప్రభుత్వం మంజూరు చేసిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి కేయూలోని కెనాల్ సమీపంలో ఉన్న 15 ఎకరాల భూమి కేటాయించాలని తీర్మానం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. సమావేశం అనంతరం పలువురు పాలకమండలి సభ్యులు సెక్రటేరియట్లో ఉన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిని కలిసి ఈవిషయాన్ని వివరించారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతి, సహకారం అందేలా కృషిచేయాలని ఎమ్మెల్యేను కోరారు. ఎజెండాలో 40 అంశాలు.. నవంబర్లో నిర్వహించే కేయూ 24వ స్నాతకోత్సవానికి పాలకమండలి ఆమోదించింది. యూనివర్సిటీలో వివిధ అభివృద్ధి పనులకు కూడా పాలకమండలి సమావేశంలో ఆమోదించినట్లు తెలిసింది. ఎజెండాలో మొత్తం 40 అంశాలను ప్రవేశపెట్టగా పలు అంశాలు డిపర్ అయ్యాయని సమాచారం. సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ సిక్తా పట్నాయక్, ఉన్నత విద్యాకమిషనర్ శ్రీదేవసేన, కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, పాలకమండలి సభ్యులు బి.సురేశ్లాల్, పి.సుధాకర్, సుదర్శన్, రమ, చిర్ర రాజు, అనితారెడ్డి, బాలుచౌహాన్, మల్లం నవీన్,సుకుమారి పాల్గొన్నారు. -
ఇంటర్ విద్యలో ఆధునిక బోధన
● వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ కాళోజీ సెంటర్: ప్రస్తుత సాంకేతిక విప్లవానికి అనుగుణంగా ఇంటర్మీడియట్ సిలబస్ను మార్చినట్లు వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మంగళవారం అధ్యాపకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ సుమన్ మాట్లాడుతూ జనరల్ విభాగంలో చదివే విద్యార్థుల కోసం తెలుగు ద్వితీయ భాషా పాఠ్యపుస్తకాన్ని పూర్తిగా నూతన శైలిలో రూపొందించారని, సమకాలీన అంశాలు, నైతిక విలువలు, సృజనాత్మకత పెంపొందించేలా నూతన పాఠ్యాంశాలను చేర్చారన్నారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా కృత్రిమ మేథ(ఏఐ) డిజిటల్ తరగతుల ద్వారా బోధించే ప్రణాళిక ఉందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు శ్రీనివాస్రావు, మాధవరావు, పరశురాం, శ్రీదేవి, అధ్యాపకులు, రిసోర్స్పర్సన్స్ పాల్గొన్నారు. -
మొక్కలు నాటడం బాధ్యతగా భావించాలి
ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ● కాకతీయ వైద్య కళాశాలలో వనమహోత్సవం కాశిబుగ్గ: మొక్కలు నాటడం బాధ్యతగా భావించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సూచించారు. కాకతీయ వైద్య కళాశాలలో వరంగల్ పూర్వ విద్యార్థుల సంఘం, కళాశాల యాజమాన్యం సహకారంతో మంగళవారం వనమహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని హాజరై మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా తీసుకోవాలన్నారు. అనంతరం అటవీ శాఖ అధికారులు అందించిన వెయ్యి మొక్కలను కేఎంసీ ప్రాంగణంలో నాటారు. అలాగే, పూర్వ విద్యార్థి, ఎన్ఆర్ఐ డాక్టర్ జంధ్యం దివాకర్ రూ.లక్ష విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. అలుమిని అధ్యక్షుడు డాక్టర్ కస్తూరి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాసు, జిల్లా అటవీశాఖ అధికారి ముకుందరెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్రెడ్డి, డాక్టర్ పి.విజయ్చందర్రెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి, పి.ఉపేందర్రెడ్డి, పి.విజయకుమారి, రాంచందర్, లక్ష్మారెడ్డి, కూరాకుల భారతి, మట్టెవాడ సీఐ కరుణాకర్ పాల్గొన్నారు. -
పాపన్నను స్ఫూర్తిగా తీసుకోవాలి
హన్మకొండ అర్బన్: సామాజిక సమానత్వం, బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చేసిన పోరాటాన్ని నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సూచించారు. హనుమకొండ కలెక్టరేట్లో మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి నిర్వహించారు. ఎమ్మెల్యే నాగరాజు, హను మకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ రవి, అధికారులు పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ‘కుడా’ మాజీ చైర్మన్్ సుందర్రాజ్యాదవ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. పాపన్నగౌడ్ జీవితం ఆదర్శం : ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితం అందరికీ ఆదర్శమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. మంగళవారం వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ. గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, బీసీ సంక్షేమశాఖ అధికారి పుష్పలత, గౌడ సంఘం నాయకులు రాజుగౌడ్, రమేశ్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, లక్ష్మణ్ పాల్గొన్నారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టర్ సత్యశారదతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు సమీక్ష నిర్వహించారు. -
వరంగల్ డీఎంఓగా నాగరాజు బాధ్యతల స్వీకరణ
ఖిలా వరంగల్: వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికా రిగా నాగరాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. డీఎంఓ కలకోట్ల సురేఖ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమెస్థానంలో మెదక్ జిల్లా డీఎంఓ నాగరాజును ఇక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం బాధ్యతలు చేపట్టి కలెక్టర్ సత్యశారదను మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్తో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. పాము కాటుతో మహిళా కూలీ మృతి మరిపెడ రూరల్: పాము కాటుతో ఓ మహిళా కూలీ మృతి చెందింది. ఈ ఘటన మహబూబాబాద్ జి ల్లా మరిపెడ మండలం బాల్నిధర్మారంలో చోటు చే సుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మక్కల రాములమ్మ (55) సోమవారం గ్రా మంలోని ఓ రైతుకు చెందిన పత్తి చేనులో కలుపు తీస్తుండగా పాము కాటు వేసింది. సహకూలీలు గ మనించి వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. -
బీఏఎంఎస్ అడ్మిషన్లకు లైన్ క్లియర్!
● వరంగల్ ఆయుర్వేద కళాశాలలో ఆయుష్ సీట్లు పదిలం ● కండీషన్ అఫిడవిట్తో అంగీకరించిన ఎన్సీఐఎస్ఎం ● 2026–2027 వైద్యవిద్య ప్రవేశాల అభ్యర్థులకు అవకాశం కాశిబుగ్గ: వరంగల్ లేబర్కాలనీలోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ఆయుష్ (బీఏఎంఎస్) అడ్మిషన్లకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. 2026–2027లో వైద్యవిద్య ప్రవేశాలకు సంబంధించిన సీట్ల భర్తీ కోసం డోకా లేనట్లు సమాచారం. ఢిల్లీలోని నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ (ఎన్సీఐఎస్ఎం) హెల్త్ సెక్రటరీ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కళాశాలలో ఉన్న 50 జనరల్ సీట్లతో పాటు 13 ఈడబ్ల్యూఎస్ సీట్లు కలిపి మొత్తం 63 బీఏఎంఎస్ సీట్లను భర్తీ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. నీట్ ద్వారా బీఏఎంఎస్ కోర్సులో చేరడానికి మార్గం సుగమం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 12 సీట్లకు కోత.. కళాశాలలోని అధ్యాపకులు, ఇతర సౌకర్యాలను లేమిగా చూపుతూ గత సంవత్సరం 12 సీట్లకు కోత పెట్టారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో సదుపాయాలు కల్పించకపోవడం వల్ల సీట్లను కోల్పోవాల్సి వచ్చిందని నిరసన తెలిపారు. దీంతో వచ్చే విద్యా సంవత్సరానికి ఫ్యాకల్టీతో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని అప్పుడు కండీషన్ అఫిడవిట్ ఇవ్వడంతో సీట్లను యథావిధిగా భర్తీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఈ విద్యా సంవత్సరం వరకు ఫ్యాకల్టీతోపాటు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. ఈ ఏడాది ఏప్రిల్లో తనిఖీ కోసం వచ్చిన ఉన్నతాధికారులు సౌకర్యాల లేమి చూపినట్లు తెలుస్తోంది. అవసరమైన సదుపాయాలు.. 2024 గెజిట్ ప్రకారం 30 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండాలి. ఈ ఏడాది మరో 50 మందిని పెంచారు. అలాగే, టీచింగ్ స్టాఫ్ 60 మంది ఉండాలి. మరో 30 మందిని అదనంగా పెంచినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం 80 మందిని నియమించడం సాధ్యంకాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కళాశాలలో 40 శాతం వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం. మళ్లీ కండీషన్ అఫిడవిట్..! ఆయుష్ విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం గతంలో మాదిరిగా ఈసారి కూడా కండీషన్ అఫిడవిట్ తీసుకున్నట్లు సమాచారం. 31 జనవరి 2027లోపు పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీతో పాటు సౌకర్యాలు కల్పిస్తామని అండర్ టేకింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా ఈడబ్ల్యూఎస్ కలుపుకుని 63 ఆయుష్ సీట్లు భర్తీ చేసే అవకాశం ఏర్పడింది. కండీషన్ అఫిడవిట్కు ఎన్సీఐఎస్ఎం అంగీకరించినట్లు సమాచారం. -
వేధిస్తున్న అధ్యాపకుల కొరత
కేయూ క్యాంపస్ : వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ బుధవారం నాటికి 50 వసంతాలు పూర్తి చేసుకుని (గోల్డెన్ జూబ్లీ) 51 వసంతంలోకి అడుగిడుతోంది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీని పలు సమస్యలు వేధిస్తున్నాయి. ప్రధానంగా రెగ్యులర్ అధ్యాపకుల కొరతతో విద్యాబోధనపై, పరిశోధనలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. రెగ్యులర్ అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్లు కలిపి ప్రస్తుతం 77మంది ఉన్నారు. వీరిలో కొందరు రెండు, మూడు అంతకంటే ఎక్కువగా పాలన పదవుల్లోనే కొనసాగుతున్నారు. దీంతో బోధనపై వీరు అంతగా ఆసక్తి చూపడం లేదని ఆరోపణలున్నాయి. పొలిటికల్ సైన్స్, విద్యా కళాశాల, ఫిజికల్ ఎడ్యుకేషన్, జర్నలిజం, సైకాలజీ, తెలుగు, బయోకెమిస్ట్రీ విభాగాల్లో ఒక్కరు కూడా రెగ్యులర్ అధ్యాపకులు లేరు. బాటనీ, హిస్టరీ, జియాలజీ, ఎకనామిక్స్ విభాగాల్లో ఒకరు చొప్పున రెగ్యులర్ అధ్యాపకులు ఉండగా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఇద్దరు ఉండగా, అందులో ఒకరు తెలంగాణ వర్సిటీ వీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 172 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉండగా 165 మంది వరకు పార్ట్టైం లెక్చరర్లు ఉన్నారు. మరో 99 మంది వరకు నూతనంగా పార్ట్టైం లెక్చరర్లకు త్వరలోనే నియామక పత్రాలు ఇవ్వనున్నారు. 332 అధ్యాపక పోస్టులు ఖాళీ.. కేయూలో రెగ్యులర్ అధ్యాపకుల పోస్టులు 409 మంజూరు ఉండగా ప్రస్తుతం 77మంది పనిచేస్తున్నారు. 332 పోస్టులు వెకెన్సీలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో 136 అధ్యాపకుల పోస్టులకు మంజూరు ఇచ్చి నియమించలేదు. క్యాంపస్లోని రెండు ఇంజనీరింగ్ కళాశాలల్లోనూ రెగ్యులర్ అధ్యాపకులను నియమించాల్సింది. నాన్టీచింగ్ పోస్టుల మంజూరు 626 ఉండగా ప్రస్తుతం రెగ్యులర్ 311మంది పనిచేస్తున్నారు. 315 వెకెన్సీలున్నాయి. నాన్టీచింగ్ కాంట్రాక్టులో 167 మంజూరు ఉండగా 155 మంది పనిచేస్తున్నారు. 12వెకెన్సీలు ఉన్నాయి. ఔట్సోర్సింగ్ పోస్టుల మంజూరు 330 ఉండగా 327 వెకెన్సీలు 3 ఉన్నాయి. సర్వీస్ పెన్షనర్లు టీచింగ్ నాన్టీచింగ్ కలిపి 498 మంది ఉన్నారు. ఫ్యామిలీ పెన్షనర్లు 294 మంది ఉన్నారు. పీజీసెంటర్ల బలోపేతంపై దృష్టి ఏది? కేయూ పరిధిలో జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, నిర్మల్ జిల్లాలో పీజీ సెంటర్లున్నాయి. కానీ వీటి అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. అక్కడ పీజీ సెంటర్లలో రెగ్యులర్ అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు లేరు. తూతూ మంత్రంగా నడిపిస్తుండడంతో అడ్మిషన్ల సంఖ్య తగ్గిపోతోంది. సరిపడా హాస్టళ్లులేవు.. విద్యార్థులకు సరిపడా హాస్టళ్లు లేవు. ముఖ్యంగా పీ జీ తదితర కోర్సుల్లో విద్యార్థినులు( మహిళలు) ఎ క్కువ మంది అడ్మిషన్లు పొందుతున్నారు. వీరికి స రిపడా హాస్టళ్ల సదుపాయం కల్పించలేకపోడంతో ఇ బ్బందులు పడుతున్నారు. ఇక మెస్లలో నాణ్య మైన భోజనం అందించాలని తదితర సమ్యలతో తరచూ ఆందోళనలు చేస్తున్న విషయం విధితమే.కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవ వేడుకలు, యూనివర్సిటీ ఆవిర్భావాన్ని బుధవారం ఉదయం 11గంటలకు క్యాంపస్లోని సెనెట్హాల్లో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ వి. రామచంద్రం మంగళవారం తెలిపారు. యూనివర్సిటీ ఐదు దశాబ్దాల ప్రస్థానంలో విద్య, పరిశోధన సంస్థాగత అభివృద్ధి, ఉన్నత విద్యారంగంలో అందించిన విశిష్ట సేవలను ఈ సందర్భంగా స్మరించుకోనున్నారని తెలిపారు. కేయూలో 332 పోస్టులు ఖాళీ బోధన, పరిశోధనలపై ప్రతికూల ప్రభావం విద్యార్థులకు సరిపడా హాస్టళ్లు ఏవీ? -
శిలాఫలకాలు, సర్క్యులర్లకే పరిమితం..!
న్యూశాయంపేట: హజ్యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం, వరంగల్, కరీంనగర్, ఖమ్మం మైనార్టీలకు ఉపయోగపడుతుందనే కోణంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాధారణ ఎన్నికలకు ముందు వరంగల్ నగరంలో రూ.5 కోట్ల వ్యయంతో హౌజ్హౌస్ నిర్మాణానికి ప్రతిపాదించారు. అంతేకాకుండా హనుమకొండలో రూ.5కోట్ల వ్యయంతో షాదీఖానా నిర్మాణానికి శిలాఫలకాల ఆవిష్కరణ, సర్క్యులర్ల జారీ చకచకా జరిపోయాయి. నాయకుల ప్రకటనలు, అధికారులు వేసిన అంచనాలు చివరికి కాగితాలకే పరిమితమయ్యాయి. వరంగల్లో హజ్హౌస్ కోసం వరంగల్ రైల్వేస్టేషన్ ఎదురుగా సర్వే నంబర్ 10లో 1,400 గజాల స్థలం కేటాయిస్తున్నామని సర్క్యులర్ జారీ చేశారు. మండిబజార్ జెండా వద్ద అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శిలాఫలకాన్ని సైతం ఆవిష్కరించారు. తర్వాత నిధుల విడుదలలో జాప్యం, పాలక వర్గాల నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగలేదు. కాగా, ఈ స్థలాన్ని ప్రస్తుతం వేరే ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించినట్లు సమాచారం. హనుమకొండలో పేద, మధ్య తరగతి మైనార్టీ కుటుంబాల శుభకార్యాలు, వివాహాలు జరుపుకునేందుకు 2023లో అప్పటి ప్రభుత్వం న్యూశాయంపేటలోని 579 సర్వే నంబర్లో సుమారు 25 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. నాటి మంత్రి కేటీఆర్ లష్కర్బజార్లో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అధి కారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణానికి భూమి అనువుగా లేదని కుడా నిధులతో భద్రకాళి చెరువు మట్టిని నింపి వేరే ప్రజోపయోగ కార్యక్రమానికి వినియోగించుకోవాలని భూ కేటాయింపుని రద్దు చేసింది. కాగా, ఇటీవల బీఆర్ఎస్ ఆందోళనలతో అదే భూమిని షాదీఖానాకు కేటాయించారు. ములుగురోడ్డులో గుసూల్ ఖానా.. నగరంలో అద్దె ఇళ్లలో నివసించే కుటుంబాలకు మృతదేహానికి గుసూల్ నిర్వహించడానికి సరైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇస్లాం ఆచారం ప్రకారం మరణించిన వారి అంతిమ సంస్కారాల్లో భాగంగా పవిత్రస్నానం చేయించి, ఖన నం చేయడానికి రూ.20 లక్షలతో ములుగురోడ్డులోని ఖబ్రస్థాన్లో గుసూల్ఖానా, స్నానపు గదులు, మరుగుదొడ్ల నిర్మాణానికి 2023లో అప్పటి మంత్రి మహమూద్ అలీ శంకుస్థాపన చేశారు. పిల్లర్ల వరకు నిర్మాణం పూర్తయ్యింది. అనంతరం పట్టించుకోకుండా వదిలేశారు. నగరంలో నిర్మాణానికి నోచుకోని హజ్హౌస్, షాదీఖానా మండిపడుతున్న మైనార్టీ సంఘాలు -
విద్యుత్ ఉద్యోగుల క్రీడలు ప్రారంభం
హన్మకొండ: ™ðlÌS…V>׿ {sꯌSÞ Mø, yìlçÜP… Æ>çÙ‰ Ýë¦Æ‡$$ C…rÆŠ‡ çÜÇPÌŒæ {MîSyé ´ùsîæ-Ë$ {´ëÆý‡…-¿ýæ-Ð]l$-Ķæ*ÅÆ‡$$. {sꯌSÞ-Mø Ð]lÆý‡…-VýSÌŒæ gZ¯ŒS B†£ýlÅ…ÌZ Ð]lÊyýl$ ÆøkÌS ´ër$ fÆý‡-VýS-¯]l$¯]l² »êÅyìlÃ…r¯Œl, çœ#sŒæ-»êÌŒæ {MîSyýl-ÌS¯]l$ Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… çßæ¯]l$-Ð]l$-Mö…yýl-ÌZ° iyýl-º*ÏÅ-G…ïÜ C…yøÆŠ‡ õÜtyìl-Ķæ$…-ÌZ {sꯌSÞ-Mø Ð]lÆý‡…-VýSÌŒæ gZ¯ŒS `‹œ C…f±ÆŠ‡ Ð]l¬Æý‡-äÝë-VýSÆŠ‡ {´ëÆý‡…-À…^éÆý‡$. °™èlÅ… ç³° J†¢yìl-ÌZ E…yól E§øÅ-VýS$-ÌSMýS$ CÌê…sìæ {MîSyýl-Ë$ Ð]l*¯]l-íÜ-MøÌêÏçÜ… MýSÍWÝë¢-Ķæ$-¯é² Æý‡$. ÝùµÆŠætÞ Mú°ÞÌŒæ Ð]lÆý‡…-VýSÌŒæ A«§ýlÅ-„ýS$yýl$, G‹ÜD Æý‡Ò…{§ýl, G‹ÜDË$ sìæ.Ñ.Æ>Ð]l#, }°ÐéçÜ$-Ë$, Æ>çÙ‰ ÝùµÆŠætÞ BïœçܯЇ fVýS-¯é²£Šl, Ð]lÆý‡…-VýSÌŒæ ÝùµÆŠætÞ Mú°ÞÌŒæ f¯]l-Æý‡ÌŒæ òÜ{MýS-rÈ ç³#ÌêÅÌS Æ>hÆð‡yìlz, sîæi G±µyîl-ïÜGÌŒæ ÝùµÆŠætÞ Mú°ÞÌŒæ f¯]l-Æý‡ÌŒæ òÜ{MýS-rÈ õßæÐ]l$…™Œæ MýS$Ð]l*-ÆŠæ, ™èl¨™èl-Æý‡$-Ë$ ´ëÌŸY-¯é²Æý‡$.˘వన్యప్రాణులను చంపితే జైలు ● ఎఫ్ఆర్వో జి. ప్రసాదరావు గూడూరు: అటవీ జంతువులను వేటాడినా, చంపినా జైలు శిక్ష తప్పదని ఎఫ్ఆర్వో జి. ప్రసాదరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో చుక్కల దుప్పిని చంపిన ఇద్దరు వేటగాళ్ల అరెస్ట్ చూపి వివరాలు వెల్లడించారు. మచ్చర్లకు చెందిన యువకులు కొట్టెం మనోజ్కుమార్, తొర్రెం సందీప్, నవీన్.. దామరవంచ ఫారెస్ట్ బీట్లో అటవీ జంతువులను చంపడానికి ఉచ్చులు అమర్చారు. ఆ ఉచ్చులో సోమవారం ఓ చుక్కల దుప్పి పడగా దానిని మచ్చర్ల సమీపంలోని ఓ చేనులో చంపి మాంసం విక్రయానికి సిద్ధపడ్డారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అధికారులు ఘటనాస్థలికి చేరుకుని గాలించారు. ఇందులో నవీన్ పరారు కాగా, ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. అనంతరం విచారించగా ఆ జంతువును తామే చంపామని అంగీకరించారు. దీంతో దుప్పి మాంసం స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని, పరారైన యువకుడి కోసం గాలిస్తున్నట్లు ఎఫ్ఆర్వో తెలిపారు. రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతి కాజీపేట అర్బన్ : ఆటో బోల్తాపడి పాస్టర్ మృతి చెందాడు. ఈ ఘటన మడికొండ శివారు ధర్మసాగర్ ఓఆర్ఆర్ వద్ద చోటు చేసుకుంది. మృతుడి కుమారుడు నలిమేల పీటర్ కథనం ప్రకారం.. కాజీపేట విష్ణుపురి కాలనీలో నివాసముంటున్న నలిమేల ప్రభాకర్(52) ధర్మసాగర్లోని పెంథెకోస్ట్ చర్చిలో పాస్టర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం విష్ణుపురి కాలనీ నుంచి ధర్మసాగర్ చర్చి వద్దకు తానే ఆటో డ్రైవింగ్ చేస్తూ అసోసియేట్ పాస్టర్ రాసమల్ల విజయ్కుమార్తో కలిసి బయలుదేరాడు. ఆటో ధర్మసాగర్ ఓఆర్ఆర్ వద్దకు చేరుకోగా అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ఘటనలో పాస్టర్ ప్రభాకర్, విజయ్కుమార్ ఆటో కింద పడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108లో ఎంజీఎం తరలించారు. ప్రభాకర్ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మడికొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పాస్టర్ ప్రభాకర్ మృతితో విశ్వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. -
పునరుత్పాదక ఇంధనంతో విప్లవాత్మక మార్పులు
హన్మకొండ: డిజిటలైజేషన్, పునరుత్పాదక ఇంధనం ద్వారా విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ నోవాటెల్లో మంగళవారం నిర్వహించిన ఇండియా ఎనర్జీ సమ్మిట్ – ఎక్స్పో 2026 కార్యక్రమంలో ‘మోడర్నయిజింగ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్మార్ట్ గ్రిడ్స్ ఫర్ ఎ రిలయబుల్ పవర్ ఫ్యూచర్’’ అనే అంశంపై కర్నాటి వరుణ్ రెడ్డి ప్రసంగించారు. ఐఏఎస్ సంస్థలో అమలు చేస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు, నెట్వర్క్ మ్యాపింగ్, స్మార్ట్ మీటరింగ్ కార్యక్రమాలను వివరించారు. సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ చేతుల మీదుగా జ్ఞాపిక, సావనీర్ అందుకున్నారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 21వ తేదీన వరంగల్ జిల్లాస్థాయి అండర్–14, 16, 18, 20 బాలబాలికల అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కిషన్, యుగేంధర్రెడ్డి మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 26, 27 తేదీల్లో జేఎన్ఎస్లో జరగనున్న 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రం లేదా పదో తరగతి మెమోతో హాజరుకావాలని వారు సూచించారు. పూర్తి వివరాలకు 9866564422, 9000354465 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. కాజీపేట రూరల్: కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో డోర్నకల్–గుండ్రాతిమడుగు మధ్య మూడో లైన్ నిర్మాణం కారణంగా కాజీపేట జంక్షన్ మీదుగా నడిచే చర్లపల్లి–షాలిమార్ (18046) వెళ్లే ఎక్స్ప్రెస్ను బుధవారం వయా పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా దారి మళ్లించి నడిపిస్తున్నట్లు మంగళవారం రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని కోరారు. హన్మకొండ అర్బన్: జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద ల్యాబ్ టెక్నీషియన్్ ఒకటి, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ రెండు పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు హనుమకొండ డీఎంహెచ్ఓ అప్ప య్య తెలిపారు. కలెక్టర్ అనుమతితో ఈ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసినట్లు పేర్కొన్నారు. వీటిలో ఒకటి జనరల్, మరొకటి ఎస్సీ కేటగిరీకి కేటాయించారని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 19వ తేదీ ఉదయం 10.30 నుంచి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు హనుమకొండ కలెక్టరేట్లోని వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వివరాల కోసం హనుమకొండ జిల్లా అధికారిక వెబ్సైట్ను పరిశీలించాలని పేర్కొన్నారు. నయీంనగర్: భద్రకాళి బండ్పై సందర్శకుల సౌకర్యార్థం బ్యాటరీ వాహనం సేవలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మంగళవారం ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. అనంతరం ఆ వాహనంలో నాయినితోపాటు, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, బల్దియా కమిషనర్ వెంకన్న, కుడా సీపీఓ అజిత్రెడ్డి ప్రయాణించారు. కెనరా బ్యాంకు ఫాతిమానగర్ బ్రాంచ్ తన సీఎస్ఆర్ నిధుల కింద ఈ బ్యాటరీ వాహనం కొనుగోలు చేసి కుడాకు అందించింది. కార్యక్రమంలో కుడా ఈఈ భీంరావు, కెనరా బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. -
మోసం చేయడంలో ఆరితేరిన రేవంత్
హన్మకొండ: సామాజిక న్యాయమని ఉచ్చరించే నైతిక హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి అన్నారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని 100 మీటర్ల లోతున పాతిపెట్టిందని ధ్వజమెత్తారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో బీసీలకు తగిన ప్రాధాన్యం దక్కలేదని, బీసీ సబ్ప్లాన్కు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటి వరకూ అమలు చేయలేదని దుయ్యబట్టారు. పరకాల సభలో సీఎం రేవంత్ దుర్మార్గంగా మాట్లాడారన్నారు. పాలనపై ఆలోచన, అవగాహన లేదని విమర్శించారు. ప్రజలను నమ్మించి మోసం చేసే విద్యలో సీఎం రేవంత్ ఆరితేరారని విమర్శించారు. దీనిని ప్రజలు గమనించారని, తగిన సమయంలో బుద్ధి చెప్పుతారన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు వింటేనే సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టకుంటుందన్నారు. పరకా ల పర్యటనకు ముందు తొలగిస్తే వరంగల్ జిల్లా భ గ్గుమంటుందనే ఉద్దేశంతోనే పర్యటన తర్వాతే విగ్రహం తొలగింపు దుశ్చర్యకు పూనుకున్నారని దు య్యబట్టారు. మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, నాయకులు తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, శోభన్, శ్రీధర్, సల్వాజీ రవీందర్ రావు పాల్గొన్నారు. శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి -
ఉత్సాహంగా నేషనల్ అథ్లెటిక్స్ సిరీస్
● హాజరైన 495 మంది అథ్లెట్లు వరంగల్ స్పోర్ట్స్: అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన నేషనల్ అథ్లెటిక్స్ సిరీస్–13 ఉత్సాహంగా సాగింది. ఒక్కరోజు పోటీల్లో భాగంగా క్రీడలు ఉదయం ప్రారంభమై సాయంత్రం 6గంటలకు ముగిశాయి. మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 495 మంది అథ్లెట్లు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. 12 ఈవెంట్లలో పోటీలు నిర్వహించగా విజేతల జాబితాను అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆన్లైన్లో అందించనున్నట్లు తెలిపారు. సర్టిఫికెట్లు సైతం ఆన్లైన్లోనే తీసుకోవాలని సూచించారు. -
కాళేశ్వరం పాత గర్భగుడి కూల్చివేత
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మంగళవారం ఆలయ పాత గర్భగుడిని కూల్చివేశారు. మంత్రి శ్రీధర్బాబు ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని ఆలయ చైర్మన్ మోహన్శర్మ అన్నారు. ఆర్అండ్బీ డీఈఈ దేవేందర్, నిపుణుల సూచనలతో పాత గర్భగుడిని తొలగించినట్లు ఈఓ మహేశ్ పేర్కొన్నారు. పెద్దరాళ్ల తొలగింపు.. గర్భగుడిని పెద్ద రాళ్లు, ఇనుము, మట్టి, సిమెంట్ ఇటుకలతో నిర్మాణం చేయగా తొలగించారు. 11వ శతాబ్దంలో కాకతీయులు, చాళుక్యుల కాలం నాటి ఆలయానికి అప్పటి రవాణాశాఖ మంత్రి జువ్వాడి చొక్కారావు 1978 నుంచి 1982లో జీర్ణోద్దరణ చేసి కుంభాభిషేకం నిర్వహించిన విషయం తెలిసిందే. శ్రీకాళేశ్వరముక్తీశ్వరుల లింగాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా పైనుంచి ఇనుప కప్పు ఏర్పాటు చేసి జాగ్రత్తగా పాత గర్భగుడిని తొలగించారు. ద్విలింగాలకు ఆనుకుని ఉన్న మిగిలిన నాలుగు స్తంభాలను యంత్రాలతో కాకుండా మనుషులతో తొలగించనున్నారు. దీంతో పూర్తిగా తొలగింపు ప్రక్రియ ముగియనుంది. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్..
జనగామ : తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ భీం శర్మ తెలిపారు. మంగళవారం జనగామ పట్టణ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ పి.సత్యనారాయణరెడ్డి, ఎస్సై ఎం.భరత్తో కలిసి వివరాలు వెల్లడించారు. వరంగల్కు చెందిన సయ్యద్ హమీద్ ప్రస్తుతం హైదరాబాద్లోని చాంద్రాయణగుట్టలో నివాసముంటూ ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 28, 29 తేదీల్లో బైక్పై హైదరాబాద్ నుంచి జనగామకు వచ్చిన నిందితుడు.. పట్టణంలోని హౌసింగ్ బోర్డు, రైల్వే ట్రాక్ సమీపంలోని కాలనీలతోపాటు బచ్చన్నపేట మండలం వీఎస్ఆర్ నగర్, సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. చోరీ సొత్తులో కొంత భాగం విక్రయించి వచ్చిన డబ్బును వ్యక్తిగత అవసరాలతోపాటు జూదం, మద్యం తదితరాలకు ఖర్చు చేశాడు. కేసుల దర్యాప్తులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం జనగామ–పెంబర్తి బైపాస్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన హమీద్ను ఆపి విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడి నుంచి సుమారు 47 గ్రాముల బంగారం, 210 గ్రాముల వెండి, రూ.5.60 లక్షల నగదు, బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీసీ పేర్కొన్నారు. కాగా, హమీద్పై గతంలో తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో 100కు పైగా చోరీ కేసులు నమోదయ్యాయి. నాచారం, సంగారెడ్డి పోలీస్స్టేషన్ల పరిధిలో సదరు దొంగపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. ఇటీవల కర్నాటకలోని గుల్బర్గా, అశోక్నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి విడుదలైన అనంతరం మళ్లీ నేరాలకు పాల్పడుతున్నాడు. నిందితుడిని పట్టుకోవడంలో జనగామ సీఐ పి.సత్యనారాయణరెడ్డి, ఎస్సై ఎం.భరత్, హెడ్ కానిస్టే బుల్ బి.కరుణాకర్, ఎన్.సాగర్, బి.కృష్ణ, ఎన్.బి.భాస్కర్, ఐడీ అసిస్టెంట్ సాల్మన్తదితరులు ప్రతిభ కనబరిచారని, వారిని వరంగల్ సీపీ అభినందించినట్లు అధికారులు తెలిపారు. వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ బంగారం, వెండి, నగదు స్వాధీనం నిందితుడిపై 100కు పైగా కేసులు -
ఎస్సారెస్పీ కాల్వకు నీటిని విడుదల చేయాలి
రాయపర్తి: కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతు చేయించి ఎస్సారెస్పీ కాల్వ నీటిని విడుదల చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. సోమవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని మైలారం నుంచి తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామం వరకు 7 కిలోమీటర్లు ఉన్న ఎస్సారెస్పీ కాల్వ గుండా రైతులు, గ్రామాల ప్రజలతో కలిసి పాదయాత్ర, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాంచారి మడూరులోని ఎస్సారెస్పీ కాల్వ బ్రిడ్జిపై రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దయాకర్రావు మాట్లాడుతూ సాగు నీరందక పంటపొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకో సభ పెట్టుడు తప్ప రైతులకు ఏమి చేయాలో తెలియని వ్యక్తి సీఎంగా ఉండడం సిగ్గు చేటని రేవంత్రెడ్డిపై మండిపడ్డారు. రైతులకు ఎకరాకు రూ.25వేలు నష్టం వాటిళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుభరోసా, రైతుబీమా రాక, పంట రుణమాఫీ కాక, యూరియా, కరెంట్ కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. తులం బంగారంతోపాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఇవ్వకపోతే మహిళలే తన్ని తరిమే పరిస్థితి వస్తుందన్నారు. సాగునీరు ఇవ్వకుంటే రైతుల పక్షాన ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. అనంతరం తొర్రూరు పోలీసులు మాజీ మంత్రి దయాకర్రావు చేస్తున్న ధర్నాను విరమింపజేసి పోలీస్స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్రెడ్డి, నాయకులు మూనావత్ నర్సింహానాయక్, జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్గౌడ్, సురేందర్రాథోడ్, పూస మధు, పాలకుర్తి, తొర్రూరు మండలాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేతకాకపోతే ప్రభుత్వం గద్దె దిగిపోవాలి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నాంచారి మడూరులో రైతులతో కలిసి ధర్నా.. అరెస్ట్ చేసిన పోలీసులు -
అంకిత భావంతో ఉన్నత స్థానాలకు..
● కేయూ ఓఎస్డీ వెంకట్రాంరెడ్డి ● ఇంజనీరింగ్ విద్యార్థులకు ఓరియంటేషన్ కేయూ క్యాంపస్: అంకితభావం, క్రమశిఽక్షణ, దృఢసంకల్పం విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరవచ్చని కేయూ ఓఎస్డీ బి.వెంకట్రాంరెడ్డి అన్నారు. సోమవారం కేయూలో ఆడిటోరియంలో కో–ఎడ్యుకేషనల్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్లో ప్రవేశాలు పొందిన నూతన విద్యార్థులకు సోమవారం ఓరియంటేషన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యం ఏర్పర్చుకుని సాధించేందుకు కష్టపడి చదవాలని సూచించారు. వరంగల్ నిట్ ప్రొఫెసర్ కోల ఆనందకిషోర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యం, నైతిక విలువలు, మానవీయ దృక్పథం సమన్వయమే సమగ్ర విద్యకు పునాది అన్నారు. కార్యక్రమంలో ఆ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రమణ, వివిధ విభాగాల అధ్యాపకులు రాధిక, సుమలత, వి.మహేందర్, ఆసీం ఇక్బాల్, విజయ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం
హన్మకొండ: విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం సాగుతుందని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. యాదాద్రి పవర్ థర్మర్ పవర్ స్టేషన్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఆవరణలో మధ్యాహ్న భోజన సమయంలో విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు. అనంతరం ఈ నెల 19న నిర్వహించనున్న విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా పోస్టర్ను తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేఏసీ టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ రమణారావు, నాయకులు సామ్యానాయక్, నార్ల సుబ్రహ్మణ్యేశ్వరరావు, మల్లికార్జున్, పి.మహేందర్ రెడ్డి, కుమారస్వామి, మచ్చిక బుచ్చయ్యగౌడ్. చిట్ల ఓదెలు, జశ్వంత్కుమార్, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.ప్రతీ గర్భిణి వివరాలు నమోదు చేయాలి● మాతా శిశు సంక్షేమం కార్యక్రమ అధికారి డాక్టర్ రజిత హన్మకొండ అర్బన్: లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం ప్రకారం స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు అన్ని రికార్డులను తప్పనిసరిగా నిర్వహించాలని మాతా శిశు సంక్షేమం కార్యక్రమ అధికారి డాక్టర్ రజిత సూచించారు. సోమవారం హనుమకొండ, పరకాలలోని స్కానింగ్ కేంద్రాలను ఆమె తనిఖీ చేసి రిజిస్ట్రేషన్, ఫీజుల చెల్లింపులు, స్కానింగ్ నివేదికలు, వైద్యుల వివరాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. స్కానింగ్కు వచ్చిన ప్రతీ గర్భిణి పూర్తి వివరాలను ఫారం–ఎఫ్లో నమోదు చేసి, రోజువారీ వివరాలను ఆన్న్లైన్లో నమోదు చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి ఈనంబర్లో 63000 30940 ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదు చేసిన వారికి రూ.50 వేల పారితోషికం అందిస్తామన్నారు. అనంతరం శాయంపేట, కమలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి మాతా శిశు సంక్షేమ రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారి సాయికృష్ణ, ఆరోగ్య పర్యవేక్షకులు పద్మజ, సందీప్ పాల్గొన్నారు. కరాటే మాస్టర్ల గిన్నిస్ రికార్డు కాజీపేట రూరల్: కాజీపేటకు చెందిన రైల్వే ఉద్యోగి పాశం దేవయ్య బ్లాక్ బెల్ట్, నయీంనగర్కు చెందిన దామెర శంకర్ బ్లాక్ బెల్ట్ గిన్నిస్బుక్ వరల్డ్ రికార్డు సాధించారు. పాశం దేవయ్య తెలిపిన వివరాల మేరకు.. వరల్డ్ కరాటే మాస్టర్స్ అసిసియేషన్ (డబ్ల్యూకేఎంఏ) ప్రెసిడెంట్ ఎస్.బాలమురుగన్ ఆధ్వర్యంలో ఈనెల 16న సెయింట్ థామస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో నిర్వహించిన ఆల్ టైం రికార్డ్స్ కరాటే బుడోకాన్ ఇంటర్నేషనల్ వరల్డ్ సభ్యులు అయిన దేవయ్య, శంకర్ పాల్గొని రికార్డు సాధించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బుడోకాన్ కరాటే ఇంటర్నేషనల్ వరల్డ్ అధ్యక్షుడు బి.చంద్రశేఖర్రెడ్డి, ఉపాధ్యక్షుడు నమిండ్ల శ్రీనివాస్, పాండ దినేశ్, ఎం.రవిదుర్గాప్రసాద్ అభినందించారు. డీఎంఓకు ఘననివాళి ఖిలా వరంగల్: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖకు సోమవారం కలెక్టర్ డాక్టర్ సత్యశారద నివాళులర్పించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సురేఖ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె సేవలను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వై.వీ.గణేశ్, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, జిల్లా వ్యవసాయశాధికారి విజయ భాస్కర్, డీఎం సంధ్యారాణి, డీఎస్ఓ కిష్టయ్య, అధికారులు పాల్గొన్నారు. ఉరేసుకుని ట్రైనీ డీటీ బలవన్మరణంమహబూబాబాద్ రూరల్: రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్గా శిక్షణ పొందుతున్న ఓ యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్ప డిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. టౌన్ సీఐ ఎల్.రఘుపతిరెడ్డి కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కేఎస్ఎన్ రెడ్డి ఇంటి సమీపంలో అద్దెకు ఉండే డోలి వెంకటేశ్వర్లు, పద్మ దంపతుల చిన్నకుమార్తె డోలి సంధ్య (28) స్థానిక మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్గా విధులు నిర్వర్తించింది. అనంతరం గ్రూప్–2 రాయగా డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగం పొందింది. ఖమ్మం జిల్లాలో శిక్షణ పొందుతూ ఉద్యోగం చేస్తోంది. సోమవారం సాయంత్రం తల్లిదండ్రులు ఇంటి నుంచి బయటకు వెళ్లిన కొంతసేపటికి సంధ్య ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంత సమయం తర్వాత ఇంటికి వచ్చిన తల్లి పద్మ చుట్టుపక్కల వారికి, తండ్రి వెంకటేశ్వర్లుకు సమాచారం ఇచ్చింది. అనంతరం వెంకటేశ్వర్లు పోలీసులకు విషయాన్ని తెలిపారు. సంఘటనా స్థలాన్ని టౌన్ సీఐ రఘుపతిరెడ్డి, క్రైం, టౌన్ ఎస్సైలు వెంకటేశ్వర్లు, సూరయ్య సందర్శించి సంధ్య మృతికిగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంధ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు అనంతరం ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు. మృతురాలు సంధ్య ఇటీవల ఒకే సమయంలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి మన్ననలు పొందింది. -
పట్టాలపై ప్రాణాలు ఫణంగా..
ఖిలా వరంగల్: రైలు ప్రయాణం సురక్షితంగా సాగాలంటే పట్టాలు పటిష్టంగా ఉండాలి. పట్టాలపై చిన్న లోపం తలెత్తినా దాని ప్రభావం భారీగా ఉంటుంది. అలాంటి లోపాలను ముందుగానే పసిగట్టి సరిచేసే బాధ్యత ట్రాక్మెన్ (ట్రాక్ మెయింటెనర్లు)లదే. రైల్వే వ్యవస్థలో వీరు అత్యంత కీలక విధులు నిర్వర్తిస్తున్నారు. కంటికి కనిపించని కష్టం.. రైల్వే ట్రాక్ పటిష్టతను ఎప్పటికప్పుడు పరిశీలించడం, పట్టాలపై లోపాలను గుర్తించడం, అవసరమైన మరమ్మతులు చేయడం, ట్రాక్ పెట్రోలింగ్ నిర్వహించడం వంటి బాధ్యతలను ట్రాక్మెన్ నిర్వర్తిస్తారు. పట్టాలపై చిన్న పగుళ్లు, అమరికలో తేడాలు, ఇతర సాంకేతిక లోపాలు గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో భద్రతా చర్యలు చేపట్టాలి. ప్రయాణికులకు రైలు కొన్ని నిమిషాల ఆలస్యం పెద్ద విషయంగా కనిపించొచ్చు. కానీ, ఆ రైలు పట్టాలపై సురక్షితంగా పరుగెత్తేందుకు గంటల తరబడి ఎండలోనూ, వానలోనూ ట్రాక్మెన్లు పనిచేయాలి. వారి కష్టం మాత్రం సాధారణ ప్రయాణికుడి కంటికి కనిపించదు. వాతావరణ పరిస్థితులు పెద్ద సవాల్.. ట్రాక్మెన్ విధుల్లో వాతావరణ పరిస్థితులు పెద్ద సవాల్గా ఉంటాయి. మండే ఎండలో కిలోమీటర్ల మేర పట్టాల వెంట నడుస్తూ తనిఖీలు చేయాల్సి ఉంటుంది. వర్షాకాలంలో జలమయమైన ప్రాంతాల్లోనూ ట్రాక్ పరిస్థితులను పరిశీలించా లి. రాత్రివేళ పెట్రోలింగ్ చేయాల్సిన సందర్భాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఒక వైపు రైళ్ల రాకపోకలు.. మరోవైపు పట్టాలపై విధులు, ప్రతి క్షణం అప్రమత్తత అవసరమే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వీరి ప్రాణాలకు ముప్పు తప్పదు. ప్రాణాలతో చెలగాటం.. ట్రాక్మెన్ పని కేవలం పట్టాలపై నడవడం కాదు.. భారీ పరికరాలతో పనిచేయాలి. ట్రాక్ నిర్వహణలో భాగంగా శారీరక శ్రమ చేయడం, రైళ్ల రాకపోకల మధ్య విధులు నిర్వర్తించడం వంటి ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రైళ్ల రాకపోకలు అధికంగా ఉండే మార్గాల్లో ట్రాక్ తనిఖీలు, మరమ్మతులు చేపట్టేటప్పుడు భద్రతా నిబంధలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. తమకు అందుబాటులో ఉండే భద్రతా పరికరాలు, రక్షణ వ్యవస్థలు, సరైన శిక్షణ ఎంతో కీలకమని సిబ్బంది చెబుతున్నారు. పట్టాల భద్రతకు వీరే కాపలా.. సౌత్ సెంట్రల్ రైల్వే రైల్వే పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాక్మెన్లు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ప్రా ణాలు సైతం కోల్పోతున్నారని వరంగల్ బ్రాంచ్ సంఘ్ నా యకులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. రైలు కూత వినిపించగానే ప్రయాణికులు అప్రమత్తమవుతారు. కానీ, అదే రైలు సురక్షితంగా వెళ్లేందుకు పట్టాలపై కాపలా కాసే ట్రాక్మెన్ మాత్రం ప్రతి క్షణం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు. ట్రాక్మెన్ల డిమాండ్లు.. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. బ్రిటిష్ కాలం నాటి అధిక పనిభారాన్ని తగ్గించాలి. మహిళలను మరో డిపార్ట్మెంట్కు కేటాయించాలి. రిస్క్ అలవెన్స్ను గణనీయంగా పెంచాలి. పెట్రోలింగ్ బిట్ లెంత్ తగ్గించి, హంట్లను ఏర్పాటు చేయాలి. పెట్రోలింగ్ సమయంలో నాణ్యతగల టార్చ్లైట్, సేఫ్టీ పనిముట్లు ఇవ్వాలి. తాగునీరు, విశ్రాంతి గదులతోపాటు మెరుగైన రెయిన్కోట్, షూ, వింటర్ జాకెట్ అందించాలి. పదోన్నతులు ఇవ్వాలి. ప్రయాణికుల భద్రత కోసం పనిచేస్తే తమ భద్రత, సంక్షేమాన్ని విస్మరించడం, నిర్లక్ష్యం చేయడం సరికాదని ట్రాక్మెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్, మహబూబాబాద్, మధిర సెక్షన్ల పరిధిలో సుమారు 8 మంది ట్రాక్మెన్లు విధుల్లో రైళ్లు ఢీకొని ప్రాణాలు పోగొట్టుకున్నారని సిబ్బంది చెబుతున్నారు. రైళ్ల రాకపోకలకు భద్రతా కవచం.. ట్రాక్మెన్ పట్టాల నిర్వహణ, పెట్రోలింగ్లో అత్యంత కీలకం ఎండ, వాన, చీకటి, ఎప్పుడైనా విధుల్లోనే.. సమస్యలు పరిష్కరించాలంటున్న సిబ్బంది రైల్వే ట్రాక్లను నిరంతరం తనిఖీ చేస్తున్నాం. లోపాలను గుర్తించి మరమ్మతులు చేస్తూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. రాత్రి వేళ సరైన టార్చ్లైట్ల లేక చీకట్లో పట్టాలపై నడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. నాణ్యమైన రెయిన్కోట్లు, అధునాతన టార్చ్లైట్లు ట్రాక్మెన్లకు అందజేసి భద్రతకు చర్యలు తీసుకోవాలి. రానున్న పీఆర్సీలో ట్రాక్మెన్కు శ్రమ తగ్గ ఫలితం చూపాలి. – ఎండీ రఫీక్, సంఘ్ కోశాధికారి వరంగల్ట్రాక్పై ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్న ట్రాక్మెన్ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి. రిస్క్ అలవెన్స్ను గణనీయంగా పెంచాలి. పెట్రోలింగ్ బిట్ లెంత్ తగ్గించి హంట్ ఏర్పాటు చేయాలి. – సీహెచ్.వెంకటేశ్, సంఘ్ ఉపాధ్యక్షుడు వరంగల్ -
ఉమ్మడి జిల్లాలో భారీగా ఓట్ల కుదింపు విడుదలైన ఎస్ఐఆర్ ముసాయిదా జాబితా
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం ప్రత్యేక సవరణ ముసాయిదా ఇలా..10.06.2026 మొత్తం ఓటర్లు 30,53,238సాక్షిప్రతినిధి, వరంగల్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)తో ఉమ్మడి వరంగల్లో రాజకీయ సమీకరణాల కంటే ముందే ఓటర్ల లెక్కల్లో భారీ మార్పు చోటుచేసుకుంది. జూన్ 10న ఉన్న ఓటర్లతో పోలిస్తే సోమవారం నాటి ముసాయిదా ప్రకారం 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీగా ఓటర్ల వివరాలు మారాయి. 30,53,238 మంది ఓటర్లు ఉండగా.. తాజా జాబితాలో 26,77,498 మంది నమోదయ్యారు. అంటే దాదాపు 12.31 శాతం తగ్గుదల కనిపించింది. 3,75,740 మంది ఓటర్లు తగ్గారు. 4,83,803 మంది ఏఎస్డీడీ (మరణించినవారు, గుర్తించలేని/గైర్హాజరైన వారు, శాశ్వతంగా తరలిపోయినవారు, ఇప్పటికే మరోచోట నమోదైనవారు, ఇతర కేటగిరీ)లలో ఉన్నారు. మరోవైపు పెద్ద సంఖ్యలో ఓటర్లకు మ్యాపింగ్ జరగకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తూర్పులో భారీ మార్పు.. పశ్చిమలో పెద్ద కోత ఉమ్మడి వరంగల్లో అత్యంత ఆసక్తికరమైన గణాంకం వరంగల్ పశ్చిమది. జూన్ 10న 2,86,335 మంది ఓటర్లు ఉండగా.. సోమవారం నాటికి 2,03,719కు తగ్గారు. అంటే 82,616 మంది తగ్గారు. వరంగల్ తూర్పులోనూ దాదాపు ఇదే తరహా పరిస్థితి. 2,60,437 మంది నుంచి ఓటర్ల సంఖ్య 2,09,646కు తగ్గింది. అంటే 50,791 మంది తగ్గారు. ఏఎస్డీడీలో పాలకుర్తి రెండో స్థానం.. ఏఎస్డీడీని పరిశీలిస్తే పాలకుర్తి 23.68 శాతంతో ఉమ్మడి వరంగల్లో రెండో స్థానం, వరంగల్ తూర్పు 23.88 శాతంతో మొదటి స్థానంలో ఉంది. భూపాలపల్లిలో ఏఎస్డీడీ ఓటర్ల శాతం కేవలం 8.63 శాతం ఉంది. అంటే ఒకే ఉమ్మడి ప్రాంతంలో నియోజకవర్గాల మధ్య సవరణ ప్రభావంలో గణనీయమైన తేడా కనిపిస్తోంది. అక్టోబర్ 1న తుది జాబితా.. ఇక నుంచి క్లెయిమ్స్, అభ్యంతరాలు, విచారణ, కొత్తగా చేరే ఓటర్లు, తిరిగి చేర్చే పేర్లతో జాబితా మారనుంది. ఆ ప్రక్రియ పూర్తయ్యాక అక్టోబర్ 1న వెలువడే తుది జాబితానే ఉమ్మడి వరంగల్లో అసలు ఓటర్ల బలాన్ని స్పష్టంగా చూపించనుంది. ఇప్పటివరకు కనిపిస్తున్న గణాంకాలు తుది జాబితా కాదన్నదే కీలకం. ప్రత్యేక సవరణలో ముసాయిదా జాబితా అనంతరం ఓటర్లకు తమ పేరు ఉందో లేదో చూసుకునే అవకాశం, అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ముసాయిదా జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాలకు ఈ నెల 30 వరకు అవకాశం ఉండగా, వాటి పరిష్కార ప్రక్రియ సెప్టెంబర్ 28 వరకు కొనసాగి, తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 1న ప్రచురించాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం కనిపిస్తున్న తగ్గుదలలో ఎన్ని పేర్లు శాశ్వతంగా తొలగిపోతాయి? ఎన్ని తిరిగి చేరుతాయి? కొత్తగా ఎన్ని పేర్లు చేరతాయి? అనేది త్వరలో తేలనుంది. రంగంలోకి రాజకీయ పార్టీలు మరణించిన వారు, గుర్తించలేని/గైర్హాజరైన వారు, శాశ్వతంగా తరలిపోయిన వారు, ఇప్పటికే మరోచోట నమోదైన వారు, ఇతర కేటగిరీలు ఏఎస్డీడీలో ఉన్నాయి. కాబట్టి రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. తమ బూత్లో తొలగించిన ఓటర్ల జాబితాను తీసుకోవడం, నిజంగా అక్కడే నివసిస్తున్న ఓటర్ల పేర్లు తొలగిపోయాయా? అనేది ఇంటింటికీ పరిశీలించడం. అర్హులైన కొత్త ఓటర్లు, మిస్సైన పేర్లు, చిరునామా/పేరు తప్పులపై క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేయడం. ఇది పార్టీలకు కేవలం రాజకీయ కార్యక్రమం కాదు.. ఎన్నికల బూత్ మేనేజ్మెంట్కు కీలకమైన ప్రక్రియగా మారనుంది. 12 నియోజకవర్గాల్లో 4.84 లక్షల మంది ఏఎస్డీడీలో.. 1.62 లక్షల మందికి నో మ్యాపింగ్ నియోజకవర్గం 10.06.26 17.08.26 ఏఎస్డీడీ ఏఎస్డీడీ నో తగ్గిన ఓటర్లు ఓటర్లు(డిజిటైజ్) శాతం మ్యాపింగ్ ఓటర్లువరంగల్ పశ్చిమ 2,86,335 2,03,719 43,892 21.55 46,238 82,616 పరకాల 2,22,679 2,03,598 37,376 18.36 4,568 19,081 వరంగల్ తూర్పు 2,60,437 2,09,646 50,058 23.88 25,685 50,791 నర్సంపేట 2,40,244 2,21,913 46,321 20.87 5,559 18,331 వర్ధన్నపేట 2,76,272 2,46,981 53,804 21.78 12,966 29,291 జనగామ 2,49,437 2,22,381 46,000 20.69 9,943 27,056 స్టేషన్ఘన్పూర్ 2,56,806 2,39,750 31,215 13.02 6,746 17,056 పాలకుర్తి 2,61,241 2,41,462 57,177 23.68 12,776 19,779 డోర్నకల్ 2,24,165 2,05,085 27,254 13.29 4,715 19,080 మహబూబాబాద్ 2,60,770 2,31,871 39,243 16.92 9,687 28,899 భూపాలపల్లి 2,77,882 2,41,964 20,877 8.63 11,739 35,918 ములుగు 2,36,970 2,09,128 30,586 14.63 11,313 27,84217.08.26 నాటికి ఓటర్లు26,77,498ఉమ్మడి వరంగల్ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సవరణ ముసాయిదా ఇలా..నో మ్యాపింగ్1,61,935ఏఎస్డీడీ4,83,803తగ్గిన ఓటర్లు3,75,740 -
బీఆర్ఎస్ నిరసన ఉద్రిక్తం
హన్మకొండ: వరంగల్ కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఎగవేతకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నందుకు నిరసిస్తూ సోమవారం హనుమకొండ కాళోజీ కూడలిలోని వరంగల్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వరంగల్ కలెక్టరేట్కు వద్దకు చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు గేట్ మూసివేశారు. దీంతో గేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో పాటు ఇతర నాయకులను పోలీసులు పోలీస్స్టేషన్కు తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వినయ్భాస్కర్తో పాటు, పార్టీ నాయకులను సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించి అనంతరం వదిలిపెట్టారు. ఈసందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాన్ని రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నాయకులు కమరున్నీసా బేగం, మిడిదొడ్డి స్వప్న, మర్రి యాదవరెడ్డి, నయీముద్దీన్, జోరిక రమేశ్, రామ్మూర్తి, బైరపాక ప్రశాంత్ తదితరులున్నారు. కల్యాణలక్ష్మి ఎగవేతపై ధర్నా వరంగల్ కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం -
వ్యవసాయ అధికారులకు మంత్రి ‘తుమ్మల’ అభినందన
మహబూబాబాద్ రూరల్ : ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం.. రసాయన రహిత సాగుతో నేలకు ఆరోగ్యం, పర్యావరణ పరి రక్షణ, రైతులకు ప్రయోజనాలు, నాణ్య మైన పంట, ఆరోగ్యకరమైన సమాజమే లక్ష్యం శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్లోని తన నివాసం నుంచి కలెక్టర్ స్నేహశబరీష్, డీఏఓ విజయచంద్రను అభినందించి వ్యవసాయ విస్తరణ అధికారి పున్నమికి ఫోన్ చేసి మాట్లాడారు. ‘సాక్షి’ లో ప్రచురితమైన సేంద్రియ వ్యవసాయ కథనం చూశానని, యూరియా, డీఏపీలు వేయకుండా రై తులు ఎలా దిగుబడి తీస్తున్నారని అడిగారు. జాతీ య ప్రకృతి వ్యవసాయ మిషన్లో భాగంగా ఈదులపూసపల్లి క్లస్టర్ ఎంచుకుని 125 మంది రైతులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి, ఒక్కో రైతు కనీసం ఎకరం చొప్పున సేంద్రియ వ్యవసాయం చేసేలా మళ్లిస్తున్నామని ఏఈఓ పున్నమి మంత్రితో చెప్పారు. వరి సాగు సమయంలో రైతులు దమ్ములో పశు ఎరువు, వర్మి కంపోస్ట్ నేలలో కలియ దున్నుతారని, పైరు పెరిగిన తర్వాత పురుగుల, తెగుళ్ల నివారణకు జీవామృతం పిచికారీ చేస్తారని వివరించారు. తా ము జీవామృతం, పంచగవ్య, ఘనజీవామృతం, అగ్నిహస్త్రం, నీమాస్త్రం లాంటి సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులకు అందిస్తామని ఏఈఓ చెప్పారు. పచ్చిరొట్ట విత్తనాలు జనుము, జీలుగ రైతులకు ఏమైనా ఇచ్చారా అని మంత్రి అడుగగా సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందించామని, జీలుగ పొలాలలో సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవడానికి, జనము మిరప వేసే ముందు సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవడానికి సబ్సిడీలో అందజేశామని మంత్రికి చెప్పారు. రైల్వేగేట్ ప్రాంతంలో చోరీల కలకలం ఖిలా వరంగల్: వరంగల్ రైల్వేగేట్ ప్రాంతంలో వ రుస చోరీలు కలకలం రేపుతున్నాయి. ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ పరిధిలోని వేర్వేరు కాలనీల్లో వరుస చోరీలు జరిగా యి. నాలుగు ఇళ్లలో సుమారు రూ.2.17 లక్షల నగదు, 76.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 97 గ్రాముల వెండి వస్తువులు అపహరించిన ఘటనలు సోమవారం ఆలస్యంగా వెలుగుచూశాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాలను క్లూస్ టీంతో ఇన్స్పెక్టర్ కర్రె స్వామి పరిశీలించారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని సైతం పరిశీలించారు. నాలుగు చోట్ల ఒకే వ్యక్తి చోరీలకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాళేశ్వరానికి కృష్ణశిల రాయికాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం నిర్మాణం రాతితో చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత కాంట్రాక్టర్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా గురజపల్లి నుంచి కృష్ణశిల రాయిని తీసుకువస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రాతి నిర్మాణం కోసం ఆర్డర్స్ ఇచ్చినట్లు సమాచారం. కానీ, శిల్పాలకు సంబంధించిన కొలతలు రాలేదని తెలిసింది. -
హనుమకొండ డీపీఆర్ఓగా బండి పల్లవి
హన్మకొండ అర్బన్: జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి గా బండి పల్లవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. నూతనంగా డీపీఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన పల్లవికి పలువురు అధికారులు, కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. హన్మకొండ అర్బన్: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు టీఎన్జీఓస్ కేంద్ర సంఘం సెప్టెంబర్ 19న హనుమకొండలోని పాత పెన్షన్, పీఆర్సీ సాధన సభ నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ తెలిపారు. నాంపల్లిలోని టీఎన్జీఓస్ కేంద్ర సంఘం భవన్లో సోమవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా పాత పెన్షన్, పీఆర్సీ సాధన సభ హనుమకొండలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో టీఎన్జీఓస్ జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, కేంద్ర సంఘం ఉపాధ్యక్షుడు రామునాయక్ పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీ టి.యాదగిరిరావు సూచించారు. కేయూలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మానవ వనరుల విభాగాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో వీసీ మాట్లాడారు. సమావేశంలో విభాగాధిపతి పి.శ్రీనివాస్రావు, అధ్యాపకులు ఎ.శ్రీనివాసులు, చీకటి శ్రీను, ఉమాశంకర్, దేవేంద్రచారి విద్యార్థులున్నారు. న్యూశాయంపేట: టైలరింగ్లో ప్రావీణ్యం ఉన్న నిరుద్యోగులకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉపాధి అవకాశాలు ఉన్నాయని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. డీఆర్డీఓ కార్యాలయంలో నిరుద్యోగులు సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతీ సోమవారం, గురువారాల్లో ఉదయం 11 గంటలకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును సంప్రదించి కూడా ఉపాధి పొందవచ్చని ఆమె పేర్కొన్నారు. కేయూ క్యాంపస్: అధునాతన సాంకేతిక సాధనాల వినియోగం అత్యంత కీలకమని కేయూ ఓఎస్డీ బి.వెంకట్రాంరెడ్డి అన్నారు. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ అండ్ అలైడ్ డిసిప్లిన్స్ ఆధ్వర్యంలో కేయూ కంప్యూటర్ సెంటర్లో వారం రోజుల వర్క్షాపును సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆధునిక పరిశోధనలో డేటాను శాసీ్త్రయంగా విశ్లేషించి ప్రయోగాత్మక ఫలితాలను మరింత కచ్చితంగా వినియోగించాలని కోరారు. పుణేలోని అడ్వకేంట్ ఇన్ఫర్మేటిక్స్ సీఈఓ సురోజిత్సాధు, ఇతర బాధ్యులు షమ్షీర్సింగ్, దీపక్శర్మ, రూసా నోడల్ అధికారి ఆర్.మల్లికార్జున్రెడ్డి, వర్క్షాప్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్.ప్రసాద్, కో కోఆర్డినేటర్ డాక్టర్ శాస్త్రి, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ టి.మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులో నీటి నాణ్యత యూనిట్లు
వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర ప్రజలకు మరింత నాణ్యమైన, సురక్షితమైన తాగునీటిని అందించేందుకు అధునాతన నీటి నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థను (వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టం) అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి. వెంకన్న తెలిపారు. సోమవారం బల్దియా కౌన్సిల్హాల్ నుంచి నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్లో కమిషనర్ పాల్గొని నీటి నాణ్యత పర్యవేక్షణ విధానాన్ని పరిశీలించారు. నగరంలోని ప్రతా పరుద్ర, కేయూసీ, వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్లలో వా టర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టం యూనిట్లను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్పుట్, ఔట్పుట్ దశల్లో నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ అధునాతన వ్యవస్థలు ఉపయోగపడతా యని తెలిపారు. అమృత్ 2.0 ఫేజ్–2లో భాగంగా ఐనెట్ ఆక్వా సొల్యూషన్ రూపొందించిన ‘ఆన్లైన్ఫ్లోరైడ్ క్వాలిటీ మానిటరింగ్’ సాంకేతికతకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు లభించాయని కమిషనర్ తెలిపారు. అదేవిధంగా జీడబ్ల్యూఎంసీ ఎస్బీఐ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్వహించిన శాలరీ ప్యాకేజీ అవగాహన సదస్సులో కమిషనర్ మాట్లాడారు. ఎస్ఈ రాజ్కుమార్, ఈఈలు రవికుమార్, మహేందర్, మాధవీలత, డీఈలు, ఏఈలు, పాల్గొన్నారు. మండలస్థాయి ప్రజావాణికి స్పందనన్యూశాయంపేట: ఎంపీడీఓ నోడల్ అధికారిగా మండల స్థాయిలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా 11 మండలాల పరిధిలోని ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ఎంపీడీఓలకు వినతి పత్రాలు అందించారు. నెక్కొండలో 13, గీసుకొండ 8, నర్సంపేట 15, నల్లబెల్లి 8, ఖానాపురం 20, పర్వతగిరి 38, సంగెం 20, వర్ధన్నపేట 18, రాయపర్తి 17, చెన్నారావుపేట 7, దుగ్గొండిలో 6 వినతులు (మొత్తం 170) స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. -
వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న వరంగల్ అర్బన్: ‘గ్రేటర్’ గ్రీవెన్స్ సెల్కు అందిన ఫిర్యాదులపై ఏ మాత్రం నిర్లక్ష్యం వహించొద్దని కమిషనర్ టి.వెంకన్న అధికారులను, ఉద్యోగులను హెచ్చరించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్లో జరిగిన గ్రీవెన్స్ సెల్లో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 95 ఫిర్యాదులు అందాయి. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. సమస్యాత్మక దరఖాస్తులైతే నివేదికలు అందించాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్ఈ రాజ్కుమార్, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్ బాబు, హార్టికల్చర్ అధికారి లక్ష్మారెడ్డి, పన్నుల అధికారి రామకృష్ణ, అధికారులు పాల్గొన్నారు. -
హౌస్సర్జన్ల రిలే నిరాహార దీక్ష ప్రారంభం
కాశిబుగ్గ: స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఆయుష్ విద్యార్థులు, హౌస్సర్జన్లు వరంగల్ ప్రభుత్వ అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్యశాల వద్ద సోమవారం రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. తెలంగాణ ఆయుష్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు 14వ రోజుకు చేరాయి. దీక్షలో జేఏసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రోహిత్ బాస్రే, డాక్టర్ గణేశ్, డాక్టర్ సంఘమేశ్వర్రెడ్డి, డాక్టర్ కీర్తన, డాక్టర్ అంకిత పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయమైన డిమాండ్ల కోసం తాము శాంతియుతంగా పోరాటం చేస్తూ, అధికారులకు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. పోస్టర్ కార్డు క్యాంపెయిన్, హైదరాబాద్లో ధర్నా చేసినా ఫలితం లేదని వాపోయారు. ములుగు జిల్లాకు విచ్చేసిన సీఎం రేవంత్రెడ్డికి తమ గోడును విన్నవించుకోవడానికి అవకాశం కల్పించకపోవడం మరింత బాధకు గురిచేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చేవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. -
అర్జీల సత్వర పరిష్కారానికి కృషి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రజల నుంచి స్వీకరించిన వినతుల పరిష్కారానికి సత్వర పరిష్కారం చూపెట్టాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. వినతుల పరిష్కార చర్యలపై కలెక్టర్.. తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మండల స్థాయి ప్రజావాణిని సజావుగా నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా, ప్రజావాణిలో జిల్లా స్థాయిలో 127, రెవెన్యూ డివిజన్ స్థాయిలో 47, మండల స్థాయిలో 187 కలిపి మొత్తం 361 వినతులు అందాయి. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శేషాద్రి, డీఆర్ఓ శ్రీనివాస్, ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, డీఆర్డీఓ మేన శ్రీను, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. వినతులను తక్షణమే పరిష్కరించాలి: వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన వినతులను తక్షణమే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులతో కలిసి ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. మొత్తం 166 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఆర్డీఓ నాగపద్మజ, డీఎంహెచ్ఓ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలి
హన్మకొండ అర్బన్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరి ష్కార చర్యలను వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్, గ్రేటర్ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన, ప రిష్కార చర్యలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కా ర్పొరేషన్ టౌన్ప్లానింగ్, రెవెన్యూ, సాగునీటిపారుదల శాఖల అధికారులతో కలెక్టర్ సోమవారం స మీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోర్టల్లో నమోదైన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను అధికారులు సమన్వయంతో పరిశీలించాలన్నారు. సిటీ ప్లానర్ రవీంద్ర రాడేకర్, టౌన్ప్లానింగ్ అధికా రి జ్యోతి, అసిస్టెంట్ సిటీప్లానర్లు నస్రీన్భాను, ప్రశాంత్, ఇరిగేషన్ అధికారి వెన్నెల పాల్గొన్నారు. కేటాయించిన డబుల్బెడ్రూం ఇళ్లలో నివసించాలి కాజీపేట అర్బన్: కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లలో వెంటనే నివసించాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. గ్రేటర్ 31వ డివిజన్ న్యూశాయంపేటలోని డబుల్ బెడ్రూం ఇళ్లను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించి మాట్లాడారు. న్యూశాయంపేటలోని 19 బ్లాకుల్లో నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఆరు బ్లాక్లకు మాత్రమే విద్యుత్ సౌకర్యం ఉందని మిగతా బ్లాక్లకు కూడా వారం రోజుల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. హౌసింగ్ పీడీ సిద్ధార్థ్నాయక్, ఆర్అండ్బీ ఈఈ, హౌసింగ్ ఏఈ పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
సిబ్బందికి అండగా నిలవాలి
వరంగల్ సీపీ శ్వేత వరంగల్ క్రైం: పోలీస్ అధికారుల సంఘం సి బ్బందికి అండగా నిలవాలని వరంగల్ పోలీ స్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. ఇటీవల ఎన్నికై న నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు సోమవారం సీపీ ఎన్.శ్వేతను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీకి మొక్కలు అందజేశారు. ఎన్నికల నోడల్ అధికారి, అదనపు డీసీపీ ప్రభాకర్రావు నూతన కార్యవర్గ సభ్యులను సీపీకి పరిచయం చేశారు. అనంతరం ఆమె నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది సమస్యలపై తక్షణమే స్పందించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పోలీస్ అధికారుల సంఘం స్ఫూర్తిదాయకంగా పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు నాగయ్య, సదయ్యతో పాటు నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
తండ్రి కల నెరవేరకుండానే..
● రోడ్డు ప్రమాదంలో యువ క్రికెటర్ దుర్మరణం ● టీజీ –20లో చోటు.. ● విషాదంలో వరంగల్ క్రీడాభిమానులువరంగల్ స్పోర్ట్స్/ఖిలా వరంగల్: మైదానంలో పరుగులు తీస్తూ.. బంతిని బౌండరీ దాటిస్తూ.. ఒక రోజు జాతీయ జట్టు తరఫున తన కుమారుడు ఆడాలన్నది ఆ యువ క్రికెటర్ తండ్రి కల. తన తండ్రి కలను నెరవేర్చాలని ఆ కుమారుడి తపన మధ్యలో ఆగిపోయింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. అటు తండ్రి కన్న కల, ఆ యువ క్రికెటర్ ఆశయం నెరవేరకుండానే ఇటీవల హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్ను మూశాడు. ఈఘటనతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రిడాకారులను విషాదంలో ముంచెత్తాడు. వరంగల్ ఎస్ఆర్ఆర్తోటకు చెందిన విశ్వనాధ ఓం ప్రకాశ్, కవిత దంపతులు కుమారుడు వైష్ణవ్(21)కు చిన్ననాటి ఉంచే క్రికెట్పై ఆసక్తి ఉండేది. తన కుమారుడిని జాతీయ స్థాయి క్రికెటర్గా చూడాలన్న ఆశతో హైదరా బాద్లోని ఓ క్రికెట్ కోచింగ్ సెంటర్లో శిక్షణ ఇప్పించారు. మూడు నెలల క్రితం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తెలంగాణ–20 పోటీల్లో వరంగల్ వారియర్స్ జట్టులో ప్రాతి నిధ్యం వహించాడు. ఈ క్రమంలో జూలై 26వ తేదీన రాత్రి 9 గంటలకు హైదరాబాద్లోని ఉప్ప ల్ స్టేడియానికి నడుచుకుంటూ వెళ్తున్న వైష్ణవ్ను వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన వైష్ణవ్ను సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. సుమారు 20 రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ శనివారం తుదిశ్వాస విడిచాడు. కాగా, విశ్వనాథ్ వైష్ణవ్ వరంగల్ జట్టు నుంచి అండర్–14, 16, 19 విభాగాలతోపాటు వరంగల్–2, 3డే టీములకు ప్రాతినిధ్యం వహించాడు. వేసవిలో జరిగిన శ్రీలంక టూర్లో వరంగల్ జిల్లా నుంచి పాల్గొన్నాడు. కన్నీటి వీడ్కోలు.. నిన్నటి వరకు క్రికెట్ మైదానంలో పరుగులు తీసిన యువకుడు, నేడు విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. క్రికెట్ అభిమానులు కన్నీంటి పర్యంతమయ్యారు. ఎస్ఆర్ఆర్తోటలో యువ క్రికెటర్ వైష్ణవ్ మృతదేహాన్ని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మేనల్లుడు యువ నేత విష్ణువర్ధన్రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. సాయంత్రం స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి.


