Hanamkonda
-
పోలీసింగ్పై దృష్టి పెట్టాలి : సీపీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతీ అధికారి పోలీసింగ్పై దృష్టి సారించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. మంగళవారం కమిషనరేట్లో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న చోరీలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆస్తి నేరాలను తగ్గించాలని కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులకు కారణాల్ని అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి సూచనలిచ్చారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన కమ్యునిటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరాల ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. వాహనాల చోరీలకు సంబంధించి అవగాహన కల్పించాలన్నారు. బక్రీద్ను పురస్కరించుకుని మూగజీవాల రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పండుగ రోజు దర్గాల వద్ద బందోబస్తు పటిష్టం చేయాలని, వరంగల్కు ఉన్న కీర్తి ప్రతిష్టలు తగ్గకుండా పోలీసింగ్ ఉండాలని ఆయన పేర్కొన్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో బేసిక్ పోలీసింగ్ ఉండాలని సీపీ ఆదేశించారు. కార్యక్రమంలో డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్రనాయక్, అంకిత్ కుమార్, జనగామ ఏఎస్పీ చైతన్య, అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. నిజాయితీగా పనిచేయాలి..నిజాయితీగా పని చేస్తూ.. పోలీస్ శాఖకు కీర్తి ప్రతి ష్టలు తీసుకురావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఎస్సైలుగా పని చేస్తూ.. సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన జనార్దన్, నారాయణ, సీతారాములు సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో పరిపాలనా విభాగం అదనపు డీసీపీ రవి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
రవాణాశాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్, మార్కెటింగ్ శాఖ సంచాలకులు సురేంద్రమోహన్ అన్నారు. వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద, డీసీపీ ప్రభాకర్, సంబంధిత శాఖల అధికారులతో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఒకే ప్రాంతంలో ఐదు ప్రమాదాలు జరిగితే బ్లాక్ స్పాట్గా గుర్తించాలని.. భద్రతా ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. సమావేశంలో రవాణా శాఖ అధికారులు పురుషోత్తం, శోభన్బాబు, ఆర్అండ్బీ అధికారి రమేశ్, డీఈఓ జ్ఞానేశ్వర్, ఎన్హెచ్ఐఎ టీం లీడర్ సంపత్ తదితర అధికారులు పాల్గొన్నారు. సహకార సంఘాల బలోపేతానికి కృషి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ, మార్కెటింగ్శాఖ సంచాలకులు, సహకారశాఖ రిజిస్ట్రార్ సురేంద్రమోహన్ పేర్కొన్నారు. జిల్లాలో సహకార శాఖ, మార్కెటింగ్శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలపై కలెక్టరేట్లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రాథమిక సహకార సంఘాలు కృషి చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ సత్యశారద, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి నీరజ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ జగన్మోన్రావు, తదితరులున్నారు. -
కేయూకు సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ విభాగాలు
కేయూ క్యాంపస్: ఎట్టకేలకు కాకతీయ యూనివర్సిటీలోని ఓల్డ్ అడ్మిషన్స్ డైరెక్టరేట్ బిల్డింగ్లో సో షియాలజీ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశారు. గతంలో హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎంఏ సోషియాలజీ విభాగం (రెగ్యులర్ కోర్సు) ఏడాది క్రితం కాకతీయ యూనివర్సిటీకి తరలింది.. కానీ.. ఆ విభాగాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంలో జాప్యం జరిగింది. ఈనెల 2న యూనివర్సిటీ అధికారులు ఉత్తర్వులు ఇవ్వగా.. మంగళవారం సోషియాలజీ విభాగాన్ని ఓల్డ్ అడ్మిషన్ల డైరెక్టరేట్కు షిప్ట్ చేశారు. కాగా.. మంగళవారం అక్కడే సోషియాలజీ విభాగంలో ఫైనలియర్ విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ నిర్వహించుకున్నారు. కేయూకు ఎంఎస్డబ్ల్యూ.. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కొనసాగుతున్న మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్డబ్ల్యూ)ను కూడా కాకతీయ యూనివర్సిటీకి షిఫ్ట్ చేశారు. కాగా.. 2018లో నిర్మల్ పీజీ సెంటర్ నుంచి సోషియాలజీ కోర్సు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ ఒకే విభాగంగా కొనసాగుతూ వస్తోంది. సోషియాలజీ విభాగంలో 90 మంది, ఎంఎస్డబ్ల్యూలో 120 మంది విద్యార్థులున్నారు. సోషియాలజీ విభాగంతోపాటే ఎంఎస్డబ్ల్యూను కొనసాగించాలని విద్యార్థులు, అధ్యాపకులు అప్పటి వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి దృష్టికి తీసకెళ్లారు. చివరికి ఎంఎస్డబ్ల్యూను కూడా వర్సిటీ క్యాంపస్కు షిఫ్ట్ చేస్తూ కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ఈనెల 2న ఉత్తర్వులు జారీచేశారు. ఒకటి రెండురోజుల్లో ఎంఎస్డబ్ల్యూ విభాగం కూడా కేయూలోని ఓల్డ్ అడ్మిషన్ల డైరెక్టరేట్కే తరలించనున్నారు. కేయూకు తరలడం హర్హనీయం.. ఎప్పటి నుంచో సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ.. క్యాంపస్లో ఉండాలని అందరూ కోరుకున్నారు. ఎట్టకేలకు షిఫ్ట్ చేయడం హర్షనీయం. వీసీ, రిజిస్ట్రార్కు కృతజ్ఞతలు. – ప్రొఫెసర్ స్వర్ణలత, సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ విభాగాధిపతి -
నేడు వేదపాఠశాల భవనానికి శంకుస్థాపన
హన్మకొండ కల్చరల్: చారిత్రక భద్రకాళి దేవాలయంలో కొనసాగుతున్న మాడవీధుల నిర్మాణంలో భాగంగా బుధవారం రాజగోపురాల నిర్మాణానికి, భద్రకాళి సాంగ ఆగమ సంస్కృత వేద పాఠశాల భవనానికి శంకుస్థాపన నిర్వహిస్తున్నట్లు దేవాలయ ఈఓ శేషుభారతి తెలిపారు. ఈమేరకు దేవాలయం తూర్పు వైపు (మెయిన్ గేటు వద్ద) నుంచి రాజగోపురాల నిర్మాణం ప్రారంభం కానుంది. దేవాలయానికి వాయువ్య దిశలోని దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం భూమిలో వేద పాఠశాల నిర్మాణం చేపట్టనున్నారు. ఈసందర్భంగా దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి చేతుల మీదుగా శిలాన్యాసం జరుగుతుందని తెలిపారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధార్మిక సలహాదారు ఆర్.గోవింద హరి దేవాలయాన్ని సందర్శించారు. ఆయనను శేషుభారతి, అర్చకులు భద్రకాళి శేషు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ఆదిశంకరులను, వల్లభగణపతిని దర్శించి ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. పూజల అనంతరం భద్రకాళి శేషు, వేదపండితులు తీర్థప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలు అందజేసి మహదాశీర్వచనం అందించారు. గోవింద హరి వెంట రాష్ట్ర ప్రధాన స్థపతి వల్లీ నాయగం, రాష్ట్ర దేవాదాయశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.దుర్గాప్రసాద్, ఆలయ పర్యవేక్షకులు అద్దంకి విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర ప్రభుత్వ ధార్మిక సలహాదారు -
‘డబుల్’ ఇళ్లను ఆక్రమించుకున్న పేదలు
హన్మకొండ అర్బన్: హనుమకొండ బాలసముద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పలువురు పేదలు మంగళవారం రాత్రి ఆక్రమించుకోవడంతో పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. ఇక్కడ మొత్తం 592 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించారు. కానీ, కేటాయింపు జరగలేదు. దీంతో వెంటనే అర్హులైన నిలువనీడ లేని నిరుపేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎంతో కాలంగా డబుల్ బెడ్ రూంలు ఇవ్వాలని ఆందోళన చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో గదుల తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడినట్లు పలువురు మహిళలు తెలిపారు. ఖాళీగా ఉన్న గదుల్లో వంటావార్పు చేసుకుని భోజనాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి స్పందించి అర్హులకు డబుల్ బెడ్ రూంలు కేటాయించాలని కోరారు. -
ప్రజల సంక్షేమానికి పథకాల తోడ్పాటు
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి నయీంనగర్: ప్రజల సంక్షేమానికి ప్రభుత్వ పథకాలు తోడ్పడతాయని, ప్రజల భాగస్వామ్యంతో పథకాలు విజయవంతమవుతాయని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధి ప్రాంతాలను నివాస యోగ్యమైన, స్థిరమైన అనుకూలమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వంద రోజుల కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 53వ డివిజన్ ఆదర్శకాలనీలో మంగళవారం నాయిని ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమం విజయవంతం కావడానికి కాలనీవాసులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఎంహెచ్ఓ రాజిరెడ్డి, కార్పొరేటర్ సోదా కిరణ్, కాలనీ అధ్యక్షుడు తూడి విద్యాసాగర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల వేణు, నరసింహస్వామి, జగదీశ్వర్ పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోuఅప్రమత్తంగా ఉన్నాం.. ఆందోళన వద్దు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం జిల్లాలో కరోనా నియంత్రణ కోసం వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయని సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లుకొట్టాయి. అదంతా అవాస్తవం. ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నిర్ధారణ కాలేదు. ప్రజలు ఆందోళన చెందొద్దు. దగ్గు, జలుబు, జ్వరం వస్తే సీజనల్ వ్యాధులే. ఈ ప్రకారం వైద్యులు ట్రీట్మెంట్ అందించాలి. – డాక్టర్ సాంబశివరావు, డీఎంహెచ్ఓ, వరంగల్ సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులున్యూశాయంపేట: మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా ఆర్థిక సాయం కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ కలెక్టర్, చైర్పర్సన్ మైనార్టీ సంక్షేమశాఖ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో తమ దరఖాస్తులు ఈనెల 30వ తేదీ వరకు సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం హనుమకొండ సుబేదారి కలెక్టరేట్లోని మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయంలో సంప్రదించాలని కలెక్టర్ కోరారు. నేటి నుంచి పరిశోధన పద్ధతులపై తరగతులుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 4 నుంచి 10వ తేదీ వరకు పరిశోధనా పద్ధతులపై అవగాహన తరగతులు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను ఆ విభాగాధిపతి డాక్టర్ సంకినేని వెంకట్, బీఓఎస్ డాక్టర్ కిష్టయ్యతో కలిసి ఆవిష్కరించారు. యూనివర్సిటీకి చెందిన సీనియర్ ఆచార్యులతో ఈఅవగాహన తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సోషల్ సైన్సెస్ పరిశోధకులు కూడా ఈపరిశోధనా పద్ధతుల అవగాహన తరగతుల్ని వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 4న ఈతరగతులను కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, సోషల్ సైన్స్ ఆచార్య టి.మనోహర్ ప్రారంభిస్తారని సంకినేని వెంకటయ్య తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ వి.సత్యనారాయణ, డాక్టర్ వి.నాగరాజు పాల్గొన్నారు. నేడు రైల్వే అధికారుల తనిఖీలుకాజీపేట రూరల్: కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో చేపట్టిన పలు రైల్వే నాన్ ఇంటర్ లాకింగ్ ఇంజనీరింగ్ వర్క్స్ను తనిఖీ చేసేందుకు సికింద్రాబాద్ డివిజన్ నుంచి రైల్వే అధికారులు తనిఖీ నిమిత్తం వస్తున్నట్లు మంగళవారం స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కాజీపేట నుంచి బల్లార్షా, ఖమ్మం, సికింద్రాబాద్ సెక్షన్లలో చేపట్టిన నాన్ ఇంటర్ లాకింగ్ వర్క్స్ను వారు తనిఖీ చేయనున్నట్లు స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్ల బదిలీవరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పరిధిలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనరేట్లోని సీసీఆర్బీ విభాగంలో పనిచేస్తున్న ఎస్.రాజేందర్ను రాయపర్తి పోలీస్ స్టేషన్కు, అక్కడ పనిచేస్తున్న శ్రవణ్కుమార్ను వీఆర్కు బదిలీ చేశారు.సాక్షి, వరంగల్: మున్ముందు కరోనా మహమ్మారి వస్తే కట్టడి చేసేందుకు వరంగల్, హనుమకొండ జిల్లాల వైద్యారోగ్య విభాగాధికారులు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహాత్మాగాంధీ మెమోరియల్(ఎంజీఎం) ఆస్పత్రితోపాటు గతంలో సేవలందించిన వివిధ ఆస్పత్రుల్లో ఎన్ని పడకలున్నాయనే వివరాలను సేకరిస్తున్నారు. ఈ జాబితాను ఆయా జిల్లాల విభాగాధికారులు కలెక్టర్ల ద్వారా ఉన్నతాధికారులకు పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంనుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా కరోనా పరీక్షలు చేసేలా సరిపడా సిబ్బందిని అందుబాటులో ఉంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్న వైద్యులు, ఒకవేళ ప్రబళితే ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా గతంలో కరోనా ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్లలో పాజిటివ్ రోగులకు మెరుగైన వైద్యం అందించి వేలాది మంది ప్రాణాలు కాపాడిన ఎంజీఎం ఆస్పత్రిలో ఇప్పటికీ 500 నుంచి 800 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉండడంతో ఏ పరిస్థితి వచ్చినా సన్నద్ధంగా ఉండడం కలిసొచ్చే అంశమని వరంగల్ జిల్లా వైద్యారోగ్యవిభాగాధికారులు భావిస్తున్నారు. కరోనాను నిర్ధారించే ర్యాపిడ్ యాంటీ జెన్, ఆర్టీపీసీఆర్ కిట్లు రాష్ట్ర ప్రభుత్వంనుంచి జిల్లాలకు రాగానే ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా పరీక్షలు చేసే వీలుంటుందని అంటున్నారు. వాతావరణ మార్పులతో జ్వరాలు.. మే నెల మూడో వారం నుంచి వాతావరణం చల్ల బడి అప్పుడప్పుడు వర్షాలు కురుస్తుండడంతో వాతావరణంలో మార్పులు వచ్చాయి. దీంతో దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగింది. వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలోని ఫీవర్ వార్డులోనూ పదుల సంఖ్యలో చికిత్స తీసుకుంటున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వంటివి సీజన్ వ్యాధులుగానే పరిగణించి వైద్యాధికారులు వైద్యం అందిస్తున్నారు. కరోనా లక్షణాలు అనుకొని భయపడవద్దని, వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు వస్తుంటాయని అంటున్నారు. పల్లె దవాఖానా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులందరూ అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. వరంగల్లో కరోనా బెల్స్●●●● ఎంజీఎంలో ఓ పీజీ వైద్యురాలికి పాజిటివ్? ● మరో ఆరుగురికి కూడా.. ప్రైవేట్లో చికిత్సలు ● నిర్ధారించని వైద్యాధికారులుఎంజీఎం : వరంగల్ నగరంలో కరోనా డేంజర్ బెల్స్ మోగాయి. ఎంజీఎం ఆస్పత్రిలోని జనరల్ మెడిసిన్ విభాగంలో పీజీ వైద్యురాలికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. సదరు వైద్యురాలు దగ్గు, జ్వరంతో బాధపడుతుండగా కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ రావడంతో వెంటనే హైదరాబాద్లోని తన స్వృగృహానికి ఐసోలేషన్కు వెళ్లిపోయింది. ఈ విషయంపై ఎంజీఎం పరిపాలనాధికారులను వివరణ కోరగా ప్రభుత్వపరంగా తమ వద్ద ఎలాంటి నిర్ధారణ పరీక్షలు జరగలేదని తెలిపారు. ప్రైవేట్ ల్యాబ్ కేంద్రంగా చేసిన పరీక్షల్లో వస్తే తాము పాజిటివ్గా నిర్ధారించలేమని పేర్కొన్నారు. మరో ఆరుగురికి కూడా.. వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ ల్యాబ్లో చేసిన పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. వీరంతా వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై వైద్యారోగ్యశాఖ అధికారులను వివరణ కోరగా, తమ వద్ద ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదని పేర్కొంటున్నారు. లోపించిన పాలన.. గ్రేటర్ వరంగల్లో పరిధిలోని ప్రైవేట్ ల్యాబ్లు, క్లినిక్లపై వైద్యారోగ్యశాఖ అధికారుల తనిఖీలు, సిబ్బంది వివరాలు, వివిధ కేసుల నమోదుపై ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకోకపోవడంతో ఎవరి ఇష్టారాజ్యంగా వారు వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్ ల్యాబ్లు, క్లినిక్ల అనుమతులు, రెన్యువల్ విషయాల్లో పెద్ద ఎత్తున చేతులు తడుపుతున్న క్రమంలో ప్రైవేట్ నిర్వాహకులు కీలకమైన వ్యాధి నిర్ధారణ విషయాలు అధికారులకు అందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల వివరాలతో ఈ విషయం స్పష్టమవుతుందన్న వాదన వినిపిస్తోంది. 20 పడకలతో ప్రత్యేక వార్డు.. ఎంజీఎంలో కరోనా చికిత్స కోసం 20 పడకలతో ప్రత్యేక వార్డు అందుబాటులో ఉంచాం. గతంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో పనిచేసిన వైద్యులు, వారి బృందం అందుబాటులో ఉంది. దీనికితోడు 500 నుంచి 800 ఆక్సిజన్ బెడ్లు కూడా ఉన్నాయి. ఎంత పెద్ద ఆపద వచ్చినా ఆదుకునేందుకు ఈ పెద్దాస్పత్రి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు కరోనాతో ఎంజీఎంలో ఎవరూ చేరలేదు. – కిశోర్, ఎంజీఎం సూపరింటెండెంట్ ●● ఓల్డ్ అడ్మిషన్స్ బిల్డింగ్లో అన్ని ఏర్పాట్లు ● ఉత్తర్వులు జారీ చేసిన వర్సిటీ అధికారులు న్యూస్రీల్ రెండు జిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల బెడ్ల సంఖ్య వివరాల సేకరణపై దృష్టి గతంలోనే 1,100 పడకలతో సేవలందించిన ఎంజీఎం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరోనా కిట్లు రాగానే పరీక్షలు షురూ ఇప్పటివరకు కరోనా ప్రభావం లేదంటున్న వరంగల్, హనుమకొండ జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులు -
పద్మశ్రీ సమ్మయ్యకు గవర్నర్ సన్మానం
దేవరుప్పుల: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం రాజ్ భవన్లో నిర్వహించిన సాంస్కృతిక సమ్మేళనం కార్యక్రమంలో జనగామ జిల్లా దేవరుప్పుల మండలానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్యను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ప్రిన్సిపల్ సెక్రటరీ దానం కిశోర్ సన్మానించారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ చిందు యక్షగాన కళల వైభవం కోసం పాటుపడినందుకు సన్మానం లభించిందన్నారు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, గంటా చక్రపాణి, డైరెక్టర్ తరుణ్, ఐఐసీటీ డైరెక్టర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.చెస్లో దేవాన్ష్కు అంతర్జాతీయ రేటింగ్ వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్కు చెందిన బైరి దేవాన్ష్రెడ్డి చదరంగంలో అంతర్జాతీయ రేటింగ్ సాధించినట్లు జిల్లా చదరంగ సమాఖ్య ప్రతినిధి పి. కన్నా తెలిపారు. హనుమకొండ రాంనగర్లోని చిల్డ్రన్స్ మాంటిస్సోరి స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న దేవాన్ష్రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి 30వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో జరిగిన అంతర్జాతీయ క్లాసికల్ విభాగంలో 1508 రేటింగ్ సాధించడం హర్షణీయమన్నారు. దేవాన్ష్రెడ్డి ఆరుగురు అంతర్జాతీయ రేటెడ్ క్రీడాకారులతో తలపడి విజయం సాధించారన్నారు. ఈ రేటింగ్ సాధించడంపై తల్లిదండ్రులు రఘువీరారెడ్డి, దివ్య సంతోషం వ్యక్తం చేశారు. లోకో పైలెట్ల భర్తీకి గ్రీన్సిగ్నల్ ● కాజీపేట రైల్వే అభివృద్ధిలో ఫలించిన ఎంపీ కావ్య కృషికాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే అభివృద్ధిలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పలుమార్లు చేసిన విజ్ఞప్తులపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్జైన్ సానుకూలంగా స్పందించి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ కాజీపేట లోకో రన్నింగ్ డిపో క్రూ లింక్లు మార్చడం, ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయడంపై ఎంపీకి లేఖ రాశారు. సోమవారం ఎంపీ కావ్య విలేకరులకు తెలిపిన వివరాలు. విజయవాడ–బల్లార్షా మధ్య 24 వందేభారత్ రైళ్లు..130 కి.మీ.వేగంతో నడుస్తున్నాయని, ఇందుకు విజయవాడ, కాజీపేట, సికింద్రాబాద్ డిపోల్లో కొన్ని క్రూ లింక్లు మార్చారని, సికింద్రాబాద్ డివిజన్లో ఖాళీల భర్తీకి 272 మంది అసిస్టెంట్ లోకోపైలెట్లు శిక్షణ తీసుకుంటున్నారని చెప్పా రు. జూలై నాటికి శిక్షణ పూర్తి చేస్తారని, 56 మంది కొత్త వాళ్లకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారని తెలిపారు. అలాగే 1,498 మంది అసిస్టెంట్ లోకోపైలెట్ల ఉద్యోగాల కోసం ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతుందని జీఎం లేఖలో పేర్కొన్నారు. అసిస్టెంట్ లోకో పైలెట్లకు శిక్షణ పూర్తయిన తర్వాత కాజీపేట డ్రైవర్ల డిపోలో ఖాళీలు భర్తీ చేస్తామని జీఎం లేఖలో తెలియజేశారు. కాజీపేట జంక్షన్ ప్రాముఖ్యతను కాపాడేందకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జీఎం హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు. కాజీపేట రైల్వే బస్టాండ్ నిర్మాణానికి త్వరితగతిన స్థల కేటాయింపు నిర్ణయం తీసుకోవాలని రైల్వే జీఎంను కోరగా జీఎం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. రైల్వే విస్తరణ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సమాన విలువ గల భూమిని కేటాయించడానికి సిద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం చూపిన భూమి విషయంలో రైల్వే అధికారులు ఆమోదం తెలిపితే త్వరితగతిన రైల్వే బస్టాండ్ పనులు వేగంగా జరుగుతాయని అన్నారు. బస్టాండ్ ఏర్పాటుతో ప్రయాణికులకు మరిన్ని మెరుగైన రవాణా సేవలు అందుతాయని ఆమె పేర్కొన్నారు. -
ఐదుగురు ఏఆర్లకు అంతర్గత బదిలీలు
కేయూ క్యాంపస్: కేయూలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఐదుగురు అసిస్టెంట్ రిజిస్ట్రార్ల (ఏఆర్)ను అంతర్గంగా బదిలీలు చేశారు. అలాగే, వారికి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. మరో ఏఆర్కు మరో రెండుచోట్ల అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రిజిస్ట్రార్ వి. రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ● యూనివర్సిటీ కాలేజీలో ఏఆర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పి. శ్రీధర్ను పరిపాలనాభవనంలోని టీచింగ్,నాన్టీచింగ్ విభాగాలకు బదిలీ చేశారు. అదనంగా లీగల్ సెల్ బాధ్యతలు అప్పగించారు. ● టీచింగ్, నాన్టీచింగ్ విభాగంలో ఏఆర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీహెచ్ ప్రణయ్కుమార్ను సీడీసీ విభాగానికి బదిలీ చేశారు. యూనివర్సిటీ ఫార్మసీకాలేజీ, కేయూ గెస్ట్హౌజ్ అదనపు బాధ్యత అప్పగించారు. ● కేయూ పరీక్షల విభాగంలో ఏఆర్గా పనిచేస్తున్న ఆర్. శ్రీలతాదేవిని పరిపాలన భవనంలోని అకౌంట్స్ విభాగానికి బదిలీచేశారు.సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల డైరెక్టర్ కార్యాలయం అదనపు బాధ్యతలు అప్పగించారు. ● కేయూ అకౌంట్స్ విభాగంలో ఏఆర్గా పనిచేస్తున్న కె.శ్రీలతను హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్కాలేజీకి బదిలీ చేశారు. సుబేదారి యూనివర్సిటీ పీజీ కాలేజీ, యూనివర్సిటీ మహిళా పీజీ కాలేజీ అదనపు బాధ్యతలు అప్పగించారు. ● కేయూ ఇంజనీరింగ్కాలేజీ(కోఎడ్యుకేషన్) ఏఆర్గా పనిచేస్తున్న బి. నేతాజీని పరీక్షల విభాగానికి బదిలీ చేశారు. అలాగే, అదే ఇంజనీరింగ్కాలేజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ అదనపు బాధ్యతలు అప్పగించారు. ● కేయూ అకడమిక్ బ్రాంచ్లో ఏఆర్గా పనిచేస్తున్న కోలశంకర్ను క్యాంపస్లోని యూనివర్సిటీ కాలేజీ, అలాగే ఎడ్యుకేషన్ కాలేజీ అదనపు బాధ్యతలు అప్పగించారు. అదనపు బాధ్యతలు కూడా.. మరో ఏఆర్కు సైతం అదనపు బాధ్యతలు -
వైద్యసేవలు సమర్థవంతంగా అందించాలి
ఖిలా వరంగల్: పేదలకు వైద్య సేవలు మరింత సమర్థవంతంగా అందించాలని రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. ప్రధానమంత్రి స్వస్త్య యోజన సురక్ష యోజన (పీఎంఎస్ఎస్వై) సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషన్ (హెచ్వ్యాక్) సిస్టమ్నకు మరమ్మతులు చేసి వెంటనే రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఖిలా వరంగల్ ఖుష్మహాల్ ప్రాంగణంలో జరిగిన వేడుకల అనంతరం ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, శ్రీపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, కలెక్టర్ సత్యశారదతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఎంజీఎం, కాకతీయ మెడికల్ కళాశాలలోని పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్వహణ, వైద్య సేవలు తదితర అంశాలపై సమీక్షించి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా మెరుగైన సేవలందించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
పురోగతిలో ఆర్టీసీ వరంగల్ రీజియన్
● రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను హన్మకొండ: గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం అన్ని పారామీటర్లలో పురోగతిని సాధించామని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను అన్నారు. సోమవారం హనుమకొండలోని వరంగల్ రీజియన్ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు గత సంవత్సరంతో పోలిస్తే అదనంగా 29.51 లక్షల కిలోమీటర్లు బస్సులు నడిపి, రూ.134.66 కోట్ల అదనపు ఆదాయం పొందామన్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి వరంగల్ రీజియన్లో సుమారు రూ.617.18 కోట్ల ఆదాయం పొందామన్నారు. అదే విధంగా గత నెలలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించిన గ్రాండ్ పీక్ చాంలెంజ్లో కూడా వరంగల్ రీజియన్ టార్గెట్ మీద 109 శాతం అధిక ఆదాయం సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. అదే విధంగా మే 15 నుంచి 26 వరకు జరిగిన సరస్వతీనది పుష్కరాల సందర్భంగా వరంగల్ రీజియన్ మొత్తం 1,503 బస్సులు నడిపి దాదాపు 4.86 లక్షల ప్రయాణికులను సురక్షితంగా చేరవేసి అధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం కేశరాజు భాను కిరణ్, అకౌంట్స్ ఆఫీసర్ ఎ.రవీందర్, తదితరులు పాల్గొన్నారు. తనయుడి మృతి.. మరునాడే తండ్రి మరణంఎల్కతుర్తి: అనారోగ్యం బారిన పడిన కొడుకు ఎంజీఎంలో చికిత్స పొదుతూ ఆదివారం మృతి చెందాడు. కొడుకు మరణవార్త తెలిసిన తండ్రి మరునాడు సోమవారం మరణించిన ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ములుగూరి శ్రీని వాస్కు 15 ఏళ్ల క్రితం పెరాలసిస్ వచ్చింది. ఇటీవల వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి తండ్రి పోచయ్యకు ఇటీవల గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మూడు వాల్స్ బ్లాక్ అయ్యాయి.. స్టంట్ వేయలేం.. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయలేం.. తీసుకువెళ్లమని వైద్యులు సూచించడంతో కు టుంబసభ్యులు పోచయ్యను ఇంటికి తీసుకొచ్చారు. అతడి ఆరోగ్యం క్షీణించి మంచం పట్టిన విషయం తెలిసిన కుమారుడు శ్రీనివాస్కు ఆస్పత్రిలోనే ఫిడ్స్ వచ్చి ఆదివారం మృతి చెందాడు. కొడుకు మరణవార్త విన్న తండ్రి పోచయ్య(75) కలత చెంది సోమవారం సాయంత్రం మరణించాడు. -
టీజీ ఎన్పీడీసీఎల్లో కొత్త ఒరవడికి శ్రీకారం
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ కొత్త ఒరవడికి శ్రీకా రం చుట్టిందని ఆ కంపెనీ ఇన్చార్డ్ డైరెక్టర్ (హెచ్ఆర్డీ) బి.అశోక్ కుమార్ అన్నారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముందు జాతీయ పతాకాన్ని ఇన్చార్డ్ డైరెక్టర్ బి.అశోక్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగులకు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ సీఎండీ వరుణ్ రెడ్డి టీజీ ఎన్పీడీసీఎల్లో సాంకేతిక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ రూ. కోటీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించారన్నారు. విద్యుత్ ఉద్యోగులకు శిక్షణ నిర్వహణ, ఇ–స్టోర్స్, డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ – కంట్రోల్, కస్టమర్ కేర్ సెంటర్, విద్యుత్ ప్రజావాణి, సైది సైఫీ లాంటి ఎన్నో నూతన విధానాలకు సీఎండీ రూపకల్పన చేశారని వివరించారు. ప్రస్తుతం రూ.2780 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. మినిస్ట్రీ ఆఫ్ పవర్ 2023 సంవత్సరానికి కన్జ్యూమర్ సర్వీస్ రేటింగ్ లో ‘ఎ’ గ్రేడ్ సాధించామన్నారు. ఎన్పీడీసీఎల్కి ఇప్పా యి పవర్ అవార్డులు 4 దక్కాయని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి డైరెక్టర్లు టి.సదర్లాల్, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు కె.తిరుమల్ రావు, రాజుచౌహాన్, రవీంద్రనాథ్, కె.వెంకట రమణ, జాయింట్ సెక్రటరీ కె.రమేశ్, కంపెనీ కార్యదర్శి కె.వెంకటేశం, వరంగల్ ఏపీటీఎస్ సీఐ కిరణ్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఇన్చార్జ్ డైరెక్టర్ బి.అశోక్కుమార్ -
రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యమవుదాం
కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యమవుదామని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్ర తాప్రెడ్డి అన్నారు. సోమవారం యూనివర్సిటీలోని పరిపాలనభవ నం ప్రాంగణంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దశాబ్దాల కల తెలంగాణ సాకారం చేసుకున్నామన్నారు. రాష్ట్ర సాధనలో ఎంతోమంది అసువులు బాశారని, అమరులకు శ్రద్ధాంజలి ఘటించాలన్నారు. రాష్ట్రసాధనలో కాకతీయ యూ నివర్సిటీకీలక పాత్ర వహించిందన్నారు. కేయూ మాజీ వీసీ దివంగత జయశంకర్ భూమిక మన కు గర్వకారణమన్నారు. కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం మా ట్లాడుతూ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతున్న క్రమంలో ప్రజలందరి తోడ్పా టు అవసరమన్నారు. కేయూ పాలకమండలి సభ్యులు అనితారెడ్డి, సురేశ్లాల్, రమ, చిర్రరాజు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వల్లాలపృథ్వీరాజ్ పాల్గొన్నారు. కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి -
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ ప్రభంజనం
విద్యారణ్యపురి: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక జేఈఈ అడ్వాన్స్డ్ –2025 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోశ్ రెడ్డి సోమవారం తెలిపారు. ఈ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయిలో అన్ని కేటగిరీల్లో కలిపి ఎం. రవిచంద్రారెడ్డి 8వ ర్యాంకు, వి. నాగసిద్దార్థ 13వ ర్యాంకు, పి. సాక్షి 40వ ర్యాంకు, ఎ. అనుశ్రీ 47వ ర్యాంకు సాధించి ఎస్ఆర్ కీర్తి ప్రతిష్టను జాతీయ స్థాయిలో నిలబెట్టారని వారు తెలిపారు. బి. సాయి 68వ ర్యాంకు, బి. భరణి శంకర్ 90వ ర్యాంకు, జి. రాజేశ్ 106వ ర్యాంకు, బి. వినోద్ 115వ ర్యాంకు, ఎం. వెంకటకౌసిక్ 123వ ర్యాంకు, ఎస్. పవన్ 204వ ర్యాంకు, ఎ. సంతోశ్ 265వ ర్యాంకు, బి. వాగ్దేవి 269వ ర్యాంకు సాధించారని వారు పేర్కొన్నారు. ఇంకా పలువురు ఎన్నో ర్యాంకులు సాధించారని వారు వివరించారు. భవిష్యత్లో మరింత అత్యత్తమ ర్యాంకులు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని వారు పేర్కొన్నారు. 50 సంవత్సరాలుగా పటిష్ట ప్రణాళికతో హైస్కూల్, జూనియర్ కాలేజీ ఎంసెట్ , ఐఐటీల్లో విద్యనందిస్తూ ప్రతీ ఏడాది రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో తమ తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని వారు తెలిపారు. -
తెలంగాణకు నాడు.. నేడు కాంగ్రెస్సే శాపం
హన్మకొండ: తెలంగాణకు నాడు.. నేడు కాంగ్రెస్ పార్టీ శాపంగా మారిందని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతరావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేశాక.. కెప్టెన్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి, మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత చారి, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేద్కర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత వినయ్భాస్కర్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని, కాంగ్రెస్ పార్టీ నాడు.. నేడు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందగా.. 18 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మర్రి యాదవ రెడ్డి, ఎల్లావుల లలితా యాదవ్, తాళ్లపల్లి జనార్ధన్, పులి రజనీకాంత్, రామ్మూర్తి, జానకీ రాములు, బొంగు అశోక్, సోదా కిరణ్, ఇమ్మడి రాజు, కడేరావు నర్సింహారావు, ఇమ్మడి లోహిత, నయీముద్దీన్, కంజర్ల మనోజ్ తదితరులు పాల్గొన్నారు. 18 నెలల పాలనలో రాష్ట్రం ఆగమైంది రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు -
రెండో రాజధానిగా వరంగల్ అభివృద్ధి
2040 అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ● మామూనూరు విమానాశ్రయ భూసేకరణకు రూ.205 కోట్లు ● రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సాక్షి, వరంగల్ : కాకతీయులు పాలించిన గొప్ప చరిత్ర కలిగిన వరంగల్ నగరాన్ని తెలంగాణకు రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కార్యాచరణ రూపొందించిన ప్రభుత్వం.. గతంలో ఎన్నడూ లేని విధంగా నగర అభివృద్ధికి రూ. 4,962 కోట్లు కేటాయించిందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖిలావరంగల్ మైదానంలో సోమవారం నిర్వహించిన వేడుకల్లో మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. 2040 సంవత్సరం వరకు జనాభా పెరుగుదలకు అనుగుణంగా వరంగల్ నగర అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్ను తీసుకువచ్చామన్నారు. వరంగల్ ప్రజల చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్ పోర్టు త్వరలో సాకా రం కాబోతోందని, విమానాశ్రయ భూసేకరణకు ప్రభుత్వం రూ.205కోట్లు ఇప్పటికే విడుదల చేసిందని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేశామని, నర్సంపేటలోని మెడికల్ కాలేజీ, ఆస్పత్రి సేవలు ఇప్పటికే ప్రారంభించామన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కాళోజీ కళాక్షేత్రం పనులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేసి సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి నట్లు పేర్కొన్నారు. వరంగల్ పాత బస్స్టేషన్ స్థానంలో అధునాతన సౌకర్యాలతో కొత్త బస్స్టాండ్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. రూ.80 కోట్ల వ్యయంతో వరంగల్లో నిర్మిస్తున్న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం(కలెక్టరేట్) పనులు శరవేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనులను చిత్తశుద్ధితో త్వరలోనే పూర్తి చేస్తామని, కొన్ని రోజులుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఇప్పటికే ఇక్కడికి కొన్ని కంపెనీలు వచ్చాయని, ఇటీవల సీఎం విదేశీ పర్యటనలోనూ కొన్ని కంపెనీలు రావడానికి అంగీకరించాయని వివరించారు. వేడుకల్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, మేయర్ గుండు సుధారాణి, శాసనమండలి సభ్యుడు బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్.నాగరాజ్, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మరిన్ని చిత్రాలు 8,9లో -
డివిజన్ సరే.. సిబ్బంది నియామకమేది..?
హన్మకొండ: డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం సిబ్బంది నియామకంపై స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రారంభం.. సేవలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ వినియోగదారుల విజ్ఞప్తులు.. పరిపాలనా సౌలభ్యం కోసం ఏటూరునాగారం కేంద్రంగా ఎన్పీడీసీఎల్ సేవలు అందించేందుకు యాజమాన్యం ప్రత్యేక డివిజన్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు గత నెల 31న సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. ములుగు డివిజన్ పరిధిలోని ప్రస్తుత సెక్షన్లను విభజించి ఏటూరునాగారం డివిజన్ ఏర్పాటు చేశారు. సీఎండీ పేషీలోని ఒక డీఈ పోస్టును ఏటూరునాగారం డీఈ పోస్టుగా మళ్లించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ డివిజన్ ఏర్పాటుకు అవసరమైన ఇతర ఇంజనీర్లు, సిబ్బంది నియామకంపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడక పోవడంతో డివిజన్ ఎప్పుడు ఏర్పాటవుతుంది..? ఎప్పటి నుంచి సేవలు అందుబాటులోకి వస్తా యి..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీజీ ఎన్పీడీసీఎల్ ములుగు డివిజన్ పరిధిలో ములుగు టౌన్, మల్లంపల్లి, వెంకటాపూర్, పస్రా, తాడ్వాయి సెక్షన్లు, ఏటూరునాగారం సబ్ డివిజన్లోని ఏటూరునాగారం, కమలాపూర్, కన్నాయిగూడెం సెక్షన్లు, ఎన్.వి.పురం సబ్ డివిజన్లోని కె.వెంకటాపురం, వాజేడు సెక్షన్లు ఉన్నాయి. వీటి నుంచి ఏటూరునాగారం, కె.వెంకటాపురం సబ్ డివిజన్లలోని ఏటూరునాగారం, కమలాపూర్, కన్నాయిగూడెం. ఎన్.వెంకటాపురం, వాజేడు సెక్షన్లను కలిపి ఏటూరునాగారం డివిజన్గా ఏర్పాటు చేశారు. డీఈ పోస్టు ఒకటే మంజూరు.. డివిజన్ పాలనా వ్యవహారాలు సాగించేందుకు డివిజనల్ ఇంజనీర్, ఏఈ కమర్షియల్, ఏఈ టెక్నికల్, ఇద్దరు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు, నలుగురు సీనియర్ అసిస్టెంట్లు, ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక రికార్డు అసిస్టెంట్, ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్లు అవసరం. కాగా ఇందులో ఒక డీఈ పోస్టును మాత్రమే మంజూరు చేశారు. ఇతర పోస్టుల గురించి ఉత్తర్వుల్లో ఎలాంటి ప్రస్తావన లేదు. సీఎండీ పేషీలోని ఒక డీఈ పోస్టును ఏటూరునాగారం డీఈగా మళ్లించినప్పటికీ నియామకం చేపట్టలేదు. ఇతర పోస్టుల మంజూరు, అధికారులు, సిబ్బంది నియామకంపై స్పష్టత లేకపోవడంతో డివిజన్ పరిపాలన కార్యక్రమాల ప్రారంభంపై స్పష్టత లేకుండా పోయింది. పని భారం పెరుగుతుందని ఆందోళన.. అదనపు పోస్టులు మంజూరు చేయకుండా.. అదనపు సిబ్బందిని నియమించకుండా ప్రస్తుత డివిజన్లోని ఉద్యోగులను విభజిస్తే వారిపై పని భారం పెరుగుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పోస్టులు, సిబ్బందిని నియమించకుండా నూతన డివిజన్ ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి సిబ్బందిని నియమించిన తర్వాతే నూతన కార్యాలయాన్ని ప్రారంభించాలని ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లాలు, సర్కిళ్ల పునర్విభజన జరిగి పదేళ్లు దాటుతున్నా ఇప్పటికీ వాచ్మెన్. స్వీపర్ పోస్టుల బైఫరికేషన్ ప్రక్రియ పూర్తి చేయలేదు. బైఫరికేషన్ చేయాలని ఆదేశాలున్నా చర్యలు లేదు. ఇప్పటికై నా యాజమాన్యం వాచ్మెన్, స్వీపర్ పోస్టుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని విద్యుత్ ఉద్యోగ సంఘాల బాధ్యులు కోరుతున్నారు. ఏటూరునాగారం కేంద్రంగా విద్యుత్ డివిజన్ ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేసిన టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ అధికారులు, సిబ్బంది నియామకంపై స్పష్టత కరువు ములుగు డివిజన్లోని సెక్షన్ల బదలాయింపుతో సరి.. -
స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభం
రాష్ట్ర అవతరణ వేడుకల్లో మేయర్ సుధారాణి న్యూశాయంపేట : ప్రజలు పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభమైందని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా ఆమె మహానగర పాలక సంస్థ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో వరంగల్ నగరం అగ్రగామిగా నిలవడానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారు ల నిబద్ధత, సమన్వయమే కారణమని పేర్కొన్నా రు. సీఎం రేవంత్రెడ్డి వరంగల్ను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, నగరం రానున్న రోజుల్లో టూరిజం హబ్గా ఏర్పడనుందని చెప్పారు. నగర ప్రజల చిరకాల వాంఛ అయిన అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.4,170 కోట్లు మంజూరు చేసిందని, భారీ వర్షాలు కురిసినా ప్రజ లకు ఇబ్బందులు ఉండకుండా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మేయర్ తెలిపారు. స్మార్ట్ సిటీ పథకం ద్వారా రూ.944 కోట్ల 67లక్షలతో 108 అభివృద్ధి పనులు మంజూరు కాగా 70 పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. సోమవారం నుంచి సెప్టెంబర్ 9 వరకు బల్దియా ఆధ్వర్యాన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలను రూపొందించినట్టు తెలిపారు. -
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి : సీపీ సన్ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం : పదవీ విరమణ అనంతరం పోలీస్ అధికారులు తమ వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన పలువురు పోలీస్ అధికారులను సీపీ సోమవారం సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఉద్యో గ విరమణ పొందిన అధికారుల సేవలు నేటితరం పోలీసులకు ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందిన డీసీపీ జనార్దన్, ఎస్సైలు అలీ మహ్మద్, అఫ్జల్ పాషా, రాజిరెడ్డి, పురుషోత్తం, మహేందర్రావు, క్రిష్టాచారి, యాకూ బ్ అలీ, ఏఎస్సై భీంరాజు, హెడ్ కానిస్టేబుల్ రమేశ్ గుప్తా, కానిస్టేబుల్ కొండయ్య పాల్గొన్నారు. -
కేడీసీ డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల
విద్యారణ్యపురి : హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్)లో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సుల ఫస్టియ ర్ రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను సోమవా రం కేడీసీ కళాశాలలో కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్, ప్రిన్సి పాల్ డాక్టర్ జి.శ్రీనివాస్తో కలిసి విడుదల చేశారు. రెండో సెమిస్టర్ పరీక్షల్లో 39 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో కేయూ అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ తిరుమలాదేవి, కేడీసీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శివనాగశ్రీను, వైస్ ప్రిన్సిపాల్ రజనీలత, అధ్యాపకులు త్యాగ య్య, ఇందిరాదేవి, కొమురయ్య, సమ్మయ్య, వెంకన్న, సీతారాములు, ఎం.వెంకన్న, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంగణ నియామకాలుకేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధి కొత్తగూడెం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు హైదరాబాద్ హైటెక్ సిటీలోని డీఎస్కే సాఫ్ట్వేర్ కంపెనీలో ఫ్రంట్ అండ్ డెవలపర్లుగా ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యారు. కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు డి.సత్యారెడ్డి, ఎం.సాయిపవన్, ఎస్.అరవింద్, టి.పుష్కరాణి, ఎం.మనస్విని, ఎ.వర్షిత ఎంపికై పట్లు కొత్తగూడెం కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జగన్మోహన్రాజు కేయూలో జరిగిన కార్యక్రమంలో తెలిపారు. ఒక్కొక్కరికి వార్షిక వేతనం రూ.6లక్షలు ఉంటుందని, తొలుత మూడునెలలపాటు శిక్షణ కూడా ఇస్తారని, అనంతరం హైటెక్ సిటీలోని డీఎస్కే సాఫ్ట్వేర్ కంపెనీలో పూర్తిస్థాయిలో పనిచేయాల్సింటుందన్నారు. ఆయా విద్యార్థులకు నియమాక పత్రాలను సోమవారం యూనివర్సిటీలో కేయూ వీసీ ప్రొఫెసర్ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం, ఆ కాలేజీ ప్లేస్మెంట్ డైరెక్టర్ డాక్టర్ వి.రాము, కేయూ పాలకమండలి సభ్యులు డాక్టర్ చిర్ర రాజు అందజేశారు. గ్లోబల్ యూత్ సమ్మిట్కు ప్రియచందనకేయూ క్యాంపస్ : కర్ణాటకలోని మంగుళూరు యోనేసోయి డీమ్డ్ యూనివర్సిటీలో ఈనెల 5, 6వ తేదీల్లో జరగబోయే గ్లోబల్ యూత్ సమ్మిట్–2025కు కేయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థిని కృతిక ప్రియచందన ఎంపికయ్యారు. ఈమేరకు సోమవా రం కేయూలో వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భిక్షాలు ప్రియచందనను అభినందించారు. గతంలో ప్రియచందన జీ–20 దేశాల ప్రెసిడెన్సీ వక్తృత్వ పోటీల్లో పాల్గొని రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించి అప్పటి గవర్నర్ నుంచి అభినందనలు అందుకున్నారని నారాయణ తెలిపారు. నియామకం కేయూ క్యాంపస్ : హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్గా కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రొఫెసర్ ఎస్.నర్సింహాచారి నియమితులయ్యారు. వీసీ ప్రొఫెసర్ ఆదేశాల మేరకు కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ పి.వరలక్ష్మి నుంచి నర్సింహా చారి బాధ్యతలను స్వీకరించనున్నారు. రుద్రేశ్వరుడికి పూజలు హన్మకొండ కల్చరల్ : శ్రీరుద్రేశ్వర స్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో సోమవా రం తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రేశ్వరస్వామి వారికి పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఉదయం సుప్రభాతసేవ, సామూహిక రుద్రాభిషేకాలు, అర్చనలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, మానసిక ప్రశాంతతతో జీవించాలని ఆకాంక్షిస్తూ స్వామివారికి పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించామని గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. -
తెలంగాణ రైజింగ్–2047
సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కార్యాచరణ ● రైతుల సమస్యలు తీర్చేందుకు ‘భూభారతి’ ● ఇందిరమ్మ ఇళ్లతో పేదల కల సాకారం ● రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ హన్మకొండ అర్బన్ : తెలంగాణ సమగ్రాభివృద్ధి–2047 విజన్తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది.. అందులో పేదల సంక్షేమం, సమగ్ర పాలసీ రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శకత, సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తూ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యావరణ అటవీ, దేవాదా యశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రంలో, జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా మహిళల అభ్యున్నతి, పర్యాటక అభివృద్ధి, నూతన ఉద్యోగాల కల్పన, మహిళా సాధికారికత వంటి అంశాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు తెలిపారు. అనంతరం 25 మంది తెలంగాణ అమరవీరుల కుటుంబాల బంధువులను సత్కరించారు. పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ శకటాలను ప్రదర్శించారు. వైద్య ఆరోగ్య శకటానికి మొదటి బహుమతి లభించిందని డీఎంహెచ్ ఓ డాక్టర్ అప్పయ్య తెలిపారు. ఆడబిడ్డలకు అండగా.. ప్రభుత్వం ఆడబిడ్డల అభ్యున్నతికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నదని, ఇందులో భాగంగానే ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో జిల్లాలో ఇప్పటి వరకు 5.50 కోట్ల మంది ప్రయాణించి రూ.222.50 కోట్లు ఆదా చేశారని మంత్రి సురేఖ చెప్పారు. రూ.500లకే వంట గ్యాస్ ఇస్తున్నామని, అలాగే పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో మొదటి దశలో 705, రెండో దశలో 5వేల ఇళ్లు మంజూరు చేశామన్నారు. రైతు రుణ విముక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 54,734 మందికి రూ.450 కోట్లు మాఫీ చేసినట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం, సన్న వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నామన్నారు. భూమి లేని పేదలకు రూ.12 వేలు ఆత్మీయ భరోసా అందజేస్తున్నామని, మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేసేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5,052 స్వయం సహాయక సంఘాలకు రూ.511 కోట్లు అందజేశామన్నారు. 8,446 సంఘాలకు రూ.18.33 కోట్లు వీఎల్ఆర్ ఇచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగ ల్ సీపీ సన్ప్రీత్ సింగ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అమరవీరులకు మంత్రి నివాళి రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన అమరులకు మంత్రి సురేఖ నివాళులర్పించారు. హనుమకొండలోని తెలంగాణ అమరవీరు ల స్తూపం వద్ద మంత్రి సురేఖ, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ఆశ్విని తానాజి వాఖడే నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి కొండా సురేఖ, పక్కన కలెక్టర్ ప్రావీణ్య -
సైక్లింగ్తో ఒత్తిడి దూరం
● ఇన్చార్జ్ డీవైఎస్ఓ దేవిక వరంగల్ స్పోర్ట్స్: నిత్యం ఉదయం గంట పాటు సైక్లింగ్ చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడిని జయించవచ్చని హనుమకొండ ఇన్చార్జ్ డీవైఎస్ఓ దేవిక అన్నారు. అంతర్జాతీయ సైక్లింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హనుమకొండలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యాన చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఉరుకుల పరుగులు జీవితంలో ప్రతీ ఒక్కరు శారీక వ్యాయామాన్ని తప్పనిసరిగా అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సైక్లింగ్ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజయ్య, వాకర్స్ సైక్లింగ్ సంఘం అధ్యక్షుడు గోపాల్రెడ్డి, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు పవన్కుమార్, శ్యాంప్రసాద్, డీఎస్ఏ కోచ్లు నరేందర్, రమేష్, విష్ణువర్ధన్, అఫ్జల్, శంకర్, వెంకట్, ప్రభుదాస్ పాల్గొన్నారు. -
ఆఫీసర్స్ క్లబ్ నిధుల్లో అక్రమాలు
వరంగల్ క్రైం: సుబేదారి పోలీస్స్టేషన్ పరిధి ఆఫీసర్స్ క్లబ్లో మేనేజర్ ముసుగులో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు సుబేదారి ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. 2015 సంవత్సరంలో గోలి గోపాల్రెడ్డి ఆఫీసర్స్ క్లబ్లో చేరి సభ్యత్వం కోసం వచ్చే వారి నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.1,40 లక్షలు వసూలు చేసి ఆ మొత్తాన్ని క్లబ్ అకౌంట్లో జమ చేయకుండా ఇలా రూ.130 కోట్లు సొంతానికి వాడుకున్నట్లు పేర్కొన్నారు. గోలి గోపాల్రెడ్డి క్లబ్లో షటిల్ బాయ్గా పనిచేస్తున్న పొడిశెట్టి రవీందర్కు డబ్బు ఆశచూపి ఏడుగురు సభ్యులను తీసుకురాగా వారి నుంచి రూ.1.50 లక్షల చొప్పున వసూలు చేసి అకౌంట్లో జమచేయలేదని తెలిపారు. అలాగే.. 2019లో జాయింట్ సెక్రటరీగా ఉన్న చెరుకు వెంకటరాజిరెడ్డి ముగ్గురు సభ్యుల డబ్బులు రూ.4.20 లక్షలు, ఇతర డబ్బులు రూ.60 లక్షలు కూడా సొంతానికి వాడినట్లు వివరించారు. అంతేకాకుండా క్లబ్లో పనిచేస్తున్న శ్రీనివాస్కు రూ.10 లక్షలు ఇస్తానని ఆశ చూపి ఇవ్వకపోవడంతో అతను 2024 ఏప్రిల్ 18న క్లబ్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. తన ఆత్మహత్యకు గోలి గోపాల్రెడ్డి, రాజిరెడ్డి, రవీందర్ కారణామని శ్రీనివాస్ తన కుమారుడికి ఫోన్లో వీడియో పంపడంతో కేసు నమోదు చేసినట్లు వివరించారు. క్లబ్ డబ్బులు రూ.2 కోట్లు సొంతానికి వాడుకోవడమే కాకుండా.. శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన ఆ ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై రామారావు, ఏఎస్సై వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసస్వామి, రోషన్ అలీ, కానిస్టేబుళ్లు ఉమేష్, దేవేందర్లను ఇన్స్పెక్టర్ అభినందించారు. రూ.2కోట్లు స్వాహా.. ముగ్గురి అరెస్టు -
హనుమకొండ పరేడ్ గ్రౌండ్స్లో..
హన్మకొండ అర్బన్: తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా హనుమకొండలోని పోలీస్ పరేడ్గ్రౌండ్ను ముస్తాబు చేశారు. జిల్లా యంత్రాంగం వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. హనుమకొండలో జరిగే వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఉదయం 9.40 గంటలకు హనుమకొండ అదాలత్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అమరుల కుటుంబాలకు సత్కారం తదితర కార్యక్రమాలు ఉంటాయి. అవతరణ వేడుకల సందర్భంగా కలెక్టరేట్, టౌన్హాల్ తదితర భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రముఖులను కలెక్టర్ ప్రావీణ్య ఆహ్వానించారు. -
పోలీస్ అధికారులకు సేవా పతకాలు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న 12 మంది పోలీస్ అధికారులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఒకరు ఉత్తమ సేవా పతకాని కి, 11 మంది పోలీస్ అధికారులు సేవా పతకా లకు ఎంపికయ్యారు. వీరిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఆదివారం అభినందించారు. ఉత్తమ సేవా పతకానికి హనుమకొండ పోలీస్స్టేషన్ ఏఎస్సై ఎ.రఘునారెడ్డి, సేవా పతకానికి ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, సీసీఆర్బీ ఎస్సై జె.విల్సన్, సుబేదారి ఎస్సై పి.ప్రకాశ్రెడ్డి, ఏఆర్ఎస్సై ఎండీ.మక్బుల్పాషా, ఏఆర్ఎస్సై ఎం.రాంధన్, కాజీపేట ఏఎస్సై వి.చంద్రమౌళి, ఏఆర్ ఎస్సై షేక్ పాషా, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎండీ.ఖాజానజీముద్దీన్, ఏఆర్ హెడ్కానిస్టేబుల్ బస్సు భీమయ్య, మామునూర్ పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బి.రమేష్, వంగర పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కె.తిరుపతిగౌడ్ ఎంపికయ్యారు. డొనేషన్ల వసూలుపై చర్య తీసుకోవాలికేయూ క్యాంపస్: హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తు అడ్మిషన్లు కల్పిస్తూ డొనేషన్లు వసూలు చేస్తున్నారని, సదరు కాలేజీపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకటరెడ్డి కోరారు. ఈమేరకు ఆదివా రం కాకతీయ యూనివర్సిటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఇ.పురుషోత్తంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు ఇవ్వడం సరికాదని సంబంధిత కళాశాలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్, బాధ్యులు శంకర్ పాల్గొన్నారు. ‘ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేయొద్దు’విద్యారణ్యపురి: ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేయొద్దు.. ఇటీవల పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులు ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసేలా ఉన్నాయి.. వాటిని వెనక్కి తీసుకోవాలని పీఆర్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంద తిరుపతిరెడ్డి, జనరల్ సెక్రటరీ ఫలిత శ్రీహరి డిమాండ్ చేశా రు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే విధంగా సర్దుబాటు ఉత్తర్వులు ఉండాలని, అనవసరమైన రేషనలైజేషన్ నిబంధనలను పాటించడం వల్ల ప్రాథమిక విద్యపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ‘బడిబాట’ కార్యక్రమం పూర్తయ్యాకే టీచర్ల సర్దుబాటు చేపట్టాలని ఒక ప్రకటనలో కోరారు. ‘బెస్ట్ అవైలబుల్ స్కీం’ దరఖాస్తుల ఆహ్వానం న్యూశాయంపేట : బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం పథకం ద్వారా షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు 2025–26 విద్యాసంవత్సరం అడ్మిషన్ల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి పి.భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ జిల్లాకు 1వ తరగతి 60 సీట్లు, 5వ తరగతి 62 సీట్లు కేటాయించారని, ఈనెల 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు సహాయ సాంఘిక సంక్షేమ అధికారి కార్యాలయం, వరంగల్, సహాయ సాంఘిక కార్యాలయం సంక్షేమాధికారి, నర్సంపేటలో సంప్రదించాలని సూచించారు. రామ్కిషన్కు సన్మానంహన్మకొండ: ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా ప్యానెల్ సభ్యుడిగా నియమితుడైన హనుమకొండకు చెందిన డాక్టర్ అజ్మీరా రామ్కిషన్ను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆదివారం సన్మానించారు. హనుమకొండ కనకదుర్గ కాలనీలోని స్వగృహంలో ఎంపీ డాక్టర్ కావ్యను అజ్మీరా రామ్కిషన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య ఆయనను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పరకాల నియోజకవర్గంలోని బావుసింగ్పల్లికి చెందిన రామ్కిషన్ ప్రస్తుతం ఢిల్లీలో జాయింట్ డ్రగ్ కంట్రోలర్గా పనిచేస్తున్నారు. వైద్యరంగంలో అపారమైన సేవలందిస్తూ ప్రపంచంలోని ప్రముఖ సంస్థకు సలహాదారుడిగా వ్యవహరించడం గొప్ప విషయమని ఎంపీ కావ్య కొనియాడారు. -
లంచం అడిగేవారిని పట్టిస్తే రూ.25వేల గిఫ్ట్
కాజీపేట అర్బన్ : ‘ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని లంచం అడిగేవారిని నాకు పట్టిస్తే రూ.25వేలు గిఫ్ట్గా ఇస్తాను.. అలాగే సదరు వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరిస్తానని’ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. హంటర్రోడ్డులోని అభిరామ్ గార్డెన్స్లో ఆదివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను పూర్తి పారదర్శకంగా అర్హులకే అందజేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్కరికై నా ఇల్లు మంజూరు చేసిందా అని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఓర్వడం లేదన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తున్నామని, అందులో 660 పత్రాలు ఇచ్చామని, త్వరలో మిగతావి అందజేస్తానని చెప్పారు. మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు 3వ తేదీన ముగ్గుపోసుకుని నిర్మాణాలు ప్రారంభించి దావతు చేసుకుని తనను ఆహ్వానిస్తే ఆనందంగా వస్తానని తెలిపారు. గత ప్రభుత్వం నిర్మించి పంపిణీ చేయకుండా వదిలేసిన డబుల్ బెడ్రూం ఇళ్ల పని పడతానని, 15 రోజుల్లో అర్హులకు వాటిని అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ, డిప్యూటీ కమిషనర్ రవీందర్, తహసీల్దార్ బావుసింగ్, కార్పొరేటర్లు మామిండ్ల రాజు, జక్కుల రవీందర్యాదవ్, విజయశ్రీ రజాలీ, తోట వెంకన్న, పోతుల శ్రీమాన్, దేవ్రాజ్, సురేష్ పాల్గొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
భారీ వాహనాలతో బెంబేలు
సోమవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2025ఔషధ నిల్వల్లో అధికారుల ఇష్టారాజ్యం ● ఇరుకు గదుల్లో వందలాది రకాల ఔషధాలు ● కానరాని రిఫ్రిజిరేటర్లు.. ఏసీలు ● మౌలిక వసతుల కొరత.. ఎంజీఎం: రోగులకు మెరుగైన మందులు అందించేందుకు ప్రతీ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ (సీఎంఎస్) నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతోంది. తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా పేర్కొంటున్న వరంగల్ మెడికల్ హబ్గా మారుతున్న క్రమంలో రెండు ఇరుకై న గదుల్లో సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ను మౌలిక వసతుల లేని ప్రదేశంలో ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వరంగల్ జిల్లా కేంద్రంలో 1,500 పడకల ఎంజీఎం ఆస్పత్రి తో పాటు 100 పడకల సీకేఎం ఆస్పత్రి, 100 పడకల నేత్ర వైద్యశాలకు వరంగల్ సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నుంచే మందులు సరఫరా అవుతాయి. అంతేకాకుండా వరంగల్ జిల్లా కేంద్రంలో ఉన్న పీహెచ్సీ, యూపీహెచ్సీలకు సైతం ఈ సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచే ప్రభుత్వం అందించే మందులు సరఫరా చేయాల్సి ఉంది. నిత్యం వేలాది మంది రోగులకు పంపిణీ చేసే సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నిర్వహణ చూస్తే పేదలపై అధికారుల ప్రేమ ఏపాటిదో ఇట్టే అర్థమవుతుంది. ఉర్సులో ఇరుకు గదుల్లో.. వరంగల్ జిల్లా కేంద్రంలోని సీకేఎం, ఉర్సు ప్రసూ తి ఆస్పత్రిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సీఎంఎస్(సెంట్రల్ డ్రగ్ స్టోర్)ను ఇరుకై న రెండు గదుల్లో ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా పరిధిలో ఎంజీ ఎం, ప్రాంతీయ కంటి దవాఖాన, సీకేఎం ప్రసూతి తో పాటు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నర్సంపేట, వర్ధన్నపేట కమ్యూనిటీ ఆస్పత్రి, అర్బన్ హెల్త్ సెంటర్లు, 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మందులు, సర్జికల్స్ ఈ సీఎంఎస్ నుంచే పంపిణీ చేయాల్సి ఉంది. ఇంత ప్రాముఖ్యం ఉన్న మందుల గిడ్డంగికి ముందస్తుగా క్షేత్రస్థాయిలోప్రణాళిక లేకుండా అప్పటికప్పుడు రెండు చిన్న గదుల్లో ఏర్పాటు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. అవసరమైన విశాలమైన భవనాలను సమకూర్చాల్సింది. ఔషధాలు పాడవకుండా అవసరమైన రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషన్ రూములు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మౌలిక సౌకర్యాలు లేకుండా బూత్ బంగ్లాను తలపించే విధంగా స్టోర్ భవనం ఉండడం అధికారుల పనితీరుకు నిదర్శనం. సీఎంఎస్ను ఎంజీఎంలోకి మార్చాలి తాత్కాలికంగా సీఎంఎస్ను ఎంజీఎంలో ఖాళీగా ఉన్న ఏదైనా బ్లాక్లోకి మార్చితే సమస్యకు పరి ష్కారం లభిస్తుంది. సీఎంఎస్ మందులలో 75 శాతం మందులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రే వినియోగించుకుంటోందని బడ్జెట్ గణాంకాల ద్వారా తెలుస్తోంది. అలాంటప్పుడు ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్దదిక్కుగా, రోగులకు బాసటగా నిలుస్తున్న ఎంజీఎంలో తాత్కాలిక సీఎంఎస్ ఏర్పాటు చేస్తే అత్యవసర సమయాల్లో మందుల సరఫరా కూడా సౌకర్యంగా ఉంటుందని కొందరు వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. కొత్తగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోకి మరికొద్ది నెలల్లో ఎంజీఎం వెళ్లనున్న నేపథ్యంలో ఎంజీఎం లేదా, కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో తాత్కాలికంగా సీఎంఎస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అంటున్నారు.న్యూస్రీల్వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఉర్సు ప్రాంతంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్కు ఇరుకై న రోడ్లపై భారీ వాహనాలు మందులతో వస్తుంటాయి. దాంతో రాకపోకలు కష్టతరంగా మారాయని పలువురు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎంఎస్ ప్రహరీ ప్రధాన గేటులోకి వచ్చిన వాహనాలు కిటెల్ గార్డ్(ఐరన్ ర్యాంప్)లో ఇరుక్కుపోతున్నాయి. -
వేడుకలు వైభవంగా నిర్వహించాలి
న్యూశాయంపేట: రాష్ట్ర అవతరణ వేడుకలను వైభవంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణితో కలిసి రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై శనివారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయం అవసరమన్నారు. ఖుష్మహల్లో ఏర్పాటు చేయనున్న అవతరణ వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వస్తున్న సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వేదిక ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖల సంక్షేమ అభివృద్ధి స్టాల్స్, శకటాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ ఏర్పాట్లు ఆదివారం లోపు పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్ ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, జెడ్పీ సీఈఓ రామ్రెడ్డి, హౌజింగ్ పీడీ గణపతి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, వరంగల్, ఖిలా వరంగల్ తహసీల్దార్లు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 3 నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు భూభారతి చట్టం–25 అమల్లో భాగంగా వరంగల్ జిల్లాలోని (వర్ధన్నపేట మండలం మినహాయించి) అన్ని మండలాల్లోని రెవెన్యూ గ్రామాల్లో భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యశారద శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అన్ని మండలాల రెవెన్యూ గ్రామాల పంచాయతీ కార్యాలయాల ఆవరణలో సదస్సులు ఉంటాయని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ భూములతో పాటు గ్రామస్థాయిలో ఉండే భూసమస్యల పరిష్కారం కోసం సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అధికారులు రెండు బృందాలుగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు. సమస్యల పరిష్కారానికి రైతులు సదస్సులు వినియోగించుకోవాలని కోరారు. 3నుంచి రెవెన్యూ సదస్సులు వరంగల్ కలెక్టర్ సత్యశారద -
ప్రభుత్వ పాఠశాలల పటిష్టతే టీచర్ల లక్ష్యం
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల పటిష్టతే ఉపాధ్యాయుల లక్ష్యం కావాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి కోరారు. హనుమకొండ జిల్లాలో స్కిల్స్టార్క్ స్కూల్లో ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉపాధ్యాయుల మూడో విడత శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను తరగతి గదుల్లో అమలు చేయాలని సూచించారు. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఎస్సై ఎం.రాజు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎస్సై పిలిప్స్రాజు, షీటీమ్స్ ఎస్సై విద్యాసాగర్, సైబర్ క్రైమ్స్ ఎస్సై శివకుమార్ మాట్లాడారు. శిక్షణ కేంద్రం ఇన్చార్జ్లు విజయ్ మోహన్, మధుసూదన్ రెడ్డి, డీఆర్పీలు శానుగుల భద్రయ్య, జీవీ.ప్రసాద్, అజయ్, అలీ, శశికళాధర్, శివకుమార్, సంపత్, శ్రీను, విద్యానంద్, అట్ల రవి, సీఆర్పీ రఘు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముగిసిన టీచర్ల శిక్షణ హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, టీజీఆర్ఈఐఎస్ ఉపాధ్యాయులు, ఉమ్మడి జిల్లాలోని ఉర్దూమీడియం పాఠశాలల ఉపాధ్యాయులకు మే 13నుంచి 31వ తేదీ వరకు మూడు దశల్లో సుమారు 2,700 మందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు నైపుణ్యాలు, అభ్యసనాల అభివృద్ధి వంటి అనేక అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి ముగిసిన ఉపాధ్యాయుల శిక్షణ -
విదేశాల్లో విద్యకు దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: పేద మైనారిటీ వర్గాల వారు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంప్రవేశపెట్టిన సీఎం ఓవర్సిస్ స్కాలర్షిప్ పథకం కింద అర్హులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్, ప్రాన్స్, జపాన్, సౌత్కొరియా, న్యూజిలాండ్, సింగపూర్ దేశాల్లో పీజీ, పోస్ట్ డాక్టరోల్ విద్యనభ్యసించే వీలుందని పేర్కొన్నారు. ఈనెల చివరి వరకు గడువు ఉందని, పూర్తి వివరాలకు హనుమకొండ సుబేదారిలోని కార్యాలయంలో లేదా 93988 60995 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. లైంగిక వేధింపుల ఫిర్యాదులకు ప్రత్యేక కమిటీలు● జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ.నిర్మలా గీతాంబ వరంగల్ లీగల్: లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీలు ఉన్నాయని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ.నిర్మలా గీతాంబ అన్నారు. ‘పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణ ప్రోష్ యాక్ట్ –2013’ చట్టంపై జిల్లాల ప్యానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లకు వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార సంస్థలు సంయుక్తంగా శని వారం అవగాహన సదస్సు నిర్వహించాయి. ఈ సందర్భంగా హనుమకొండ ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి బి.అపర్ణాదేవితో కలిసి ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ మాట్లాడారు. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, పరిష్కారానికి చట్టా లు ఉన్నాయని పేర్కొన్నారు. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు న్యాయ సహాయం ఎలా పొందాలి, ఎవరిని ఎలా సంప్రదించాలో న్యాయమూర్తులు రితిక, ఫరీనా అహ్మ, డాక్టర్ అనితారెడ్డి వివరించారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థల కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్ పాండే, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.సుధఋర్, తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి● హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, పొజిషన్ సర్టిఫికెట్లు, రెవెన్యూ సదస్సులు, రాజీవ్ యువ వికాసం, తదితర అంశాలపై అధికారులతో శనివారం సమీక్షించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్న తీరును గృహ నిర్మాణ శాఖ డీఈ సిద్ధార్థ నాయక్ వివరించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, నగర కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వైవీ.గణేష్, ఆర్డీఓ కె.నారాయణ, డీపీఓ లక్ష్మి రమాకాంత్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ జి.రవీందర్తో పాటు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై ముందస్తు ప్రణాళికలు● డీఎంహెచ్ఓ అప్పయ్య ఎంజీఎం: వర్షాకాలంలో వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని వైద్య సిబ్బందిని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సమావేశ మందిరంలో ల్యాబ్ టెక్నీషియన్లు, హెల్త్ సూపర్వైజర్లు, మలేరియా నోడల్ పర్సన్స్, హెల్త్ అసిస్టెంట్లతో శనివారం సమీక్షా సమావేశఽం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమలు వృద్ధి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. వర్షాకాలంలో వ్యాప్తి చెందే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వివిధ విభాగాలతో కలిసి మంగళవారం, శుక్రవారం డ్రై డే పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్, వైద్యుడు నరేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోuచిన్న పెండ్యాల గ్రామంలో సుమారు 250 కుటుంబాలు ఉంటాయి. వీరి ప్రధాన జీవనాధారం వ్యవసాయం, కులవృత్తులు. మబ్బుల్నే నిద్రనుంచి లేవడం, పొలంబాట పట్టడం, వ్యవసాయ పనులు చేసుకుని సాయంత్రానికి ఇంటికి చేరడం వీరి రోజువారీ విధి. వరంగల్, జనగామ, మహా అంటే హైదరాబాద్ తప్ప ఇతర పెద్ద నగరానికి వెళ్లింది లేదు. బస్సు, కారు తప్ప ఇతర వాహనం ఎక్కింది లేదు. కానీ వారిలోని ఐక్యమత్యం.. వారిని రాష్ట్రం దాటించింది. ఎప్పుడూ ఆకాశంలో వెళ్తుంటే చూసిన విమానాన్ని సైతం తమ దరికి చేర్చింది. పరపతి సంఘాల ఏర్పాటుతో రూపాయి, రూపాయి పొదుపు చేసుకుని అందులోనుంచే ఖర్చు చేసి విమానాన్ని ఎక్కారు. ఎప్పుడూ చూడలేమనుకున్న అనేక ప్రాంతాలను చుట్టివచ్చారు. ఈ గ్రామంలో మొత్తం కలిపి 22 పరపతి సంఘాల దాకా ఉంటాయి. అందులో పెద్దవి ఐదు (చైతన్య, ప్రగతి, శ్రీలక్ష్మీ, సిరి, శ్రీగణేశ్) ఉన్నాయి. ఇందులో అన్ని కులాలు, వృత్తుల వారు సభ్యులుగా ఉన్నారు. ప్రతీ సభ్యుడు నెలకు రూ.100 వేసుకుంటున్నారు. ప్రతీనెలా ఒకరు ఎత్తుకుని 1 శాతం చొప్పున వడ్డీ కడతారు. ఇలా కొన్నేళ్లుగా జమచేసిన డబ్బులే వారి ఆర్థిక ప్రగతికి సహకారం అందిస్తున్నాయి. ● పరపతి సంఘం ద్వారా సామాన్యుల విమానయానం ● కల నెరవేర్చుకున్న రైతులు, కూలీలు, వృత్తిదారులు ● కుటుంబ సమేతంగా ఛార్ధామ్, ఆగ్రా, కాశీ విహారయాత్రలు ● దేశాన్ని చుట్టివస్తున్న చిన్నపెండ్యాల గ్రామస్తులు విమానం పోతుంటే చూసేటోడిని.. నా కులవృత్తి తాళ్లు ఎక్కడం. రోజూ ఉదయం, సాయంత్రం తాటిచెట్లు ఎక్కి కల్లు అమ్ముకుంటాం. బయటి ఊర్లకు ఎక్కువగా వెళ్లింది లేదు. ఎప్పుడైనా ఆకాశంలో విమానం వెళ్తుంటే తాటిచెట్టుపైనుంచి చూసేటోడిని. కానీ ఆ విమానం నేను ఎక్కగలనా.. అనుకున్నా. ఆ కల నెరవేరింది. పరపతి సంఘం ద్వారా సభ్యులంతా కుటుంబంతో కలిసి ఛార్ధామ్యాత్రకు విమానంలో వెళ్లాం. మొదటిసారి విమానం ఎక్కినప్పుడు ఎంతో సంతోషం వేసింది. – గీసగోని రాజయ్య, గీతకార్మికుడు ప్రముఖులెవరైనా సభకో, సమావేశానికో వస్తే వాళ్లంతా వరుసకట్టేవారు. వారి మాటలు వినడానికో, సమావేశంలో పాల్గొనడానికో కాదు.. వారిని తీసుకొచ్చిన హెలికాప్టర్ను చూడ్డానికి.. అది కూడా అరకిలోమీటరు దూరం నుంచి.. జీవితంలో ఒక్కసారైనా కనీసం వాటిని తాకుతామా? అని ఆలోచించేవారు. కానీ చిన్నమొత్తాల పొదుపే వారిని ఆకాశంలో విహరించేలా చేసింది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామస్తుల కలలకు రెక్కలు తొడిగింది.గాల్లో వెళ్తుంటే బాగుంది..గ్రామంలో రోజూ కూలి పనికి వెళ్తా. వరినాట్లు, ఇతర వ్యవసాయ పనులకు వెళ్తుంటా. మేం పరపతి సంఘంలో సభ్యులుగా చేరాం. అందరితో కలిసి విమానం ఎక్కిన తర్వాత మొదట కొంచెం భయం వేసింది. ఆ తర్వాత గాల్లో వెళ్తుంటే బాగుంది. యాత్రలో అందరితో కలిసి పడవ ఎక్కినం, స్టీమర్ ఎక్కినం. ఛార్ధామ్ యాత్రలో గుర్రాలు ఎక్కినం. పరపతి సంఘం ద్వారా ఇదంతా సాధ్యమైంది. – రామగిరి సరోజ, వ్యవసాయ కూలీ, చిన్నపెండ్యాల అందరి కృషి.. పల్లెటూరి వాళ్లను కంపల్స రీ ఫ్లైట్ ఎక్కించాలని అనుకున్నాం. అందుకు ఏం చేయాలని మీటింగ్ పెట్టి నిర్ణయించుకున్నాం. డబ్బులు సమకూర్చుకున్నాం. అనుకున్నట్లుగానే టూర్కు వెళ్లాం. ఛార్ధామ్ యాత్రకు వెళ్లాం. ఇది మా అందరి కృషి. రోజూ కూలీ పని చేసే వాళ్లం. విమానాశ్రయానికి వెళ్లాక అందరి కళ్లు ఆనందభాష్పాలను రాల్చాయి. – చావ కుమారస్వామి, మల్లారెడ్డి, సంఘం సభ్యులు చిన్నపెండ్యాల సెల్ఫీ తీసుకుని మురిసిపోయా.. గ్రామంలో అందరం కుటుంబ సభ్యుల్లా ఉంటాం. గ్రామం దాటి బయటికి వెళ్లింది లేదు. కానీ, పరపతి సంఘం ద్వారా ఫ్లైట్ ఎక్కినం. మొదటిసారి విమానం ఎక్కిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. నేను, నా భార్య విమానంలో సెల్ఫీ తీసుకుని మా బంధువులకు పంపి ఆనందపడ్డాం. ఈసారి పూరి జగన్నాథ్యాత్రకు వెళ్దామనుకుంటున్నాం. – కీర్తిసత్యం, గ్రామస్తుడు, చిన్నపెండ్యాల పరపతి సంఘాల సభ్యులంతా 2023లో కాశీకి వెళ్లాలనుకున్నారు. ‘రెక్కల కష్టం నమ్ముకున్నాం.. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కుదాం’.. అని సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. 50 కుటుంబాలు (భార్యాభర్త) విమాన ప్రయాణానికి ఎంత ఖర్చు అవుతుందని సంబంధిత టూర్స్, ట్రావెల్స్ వాళ్లను అడగగా రూ.20 నుంచి రూ.24 లక్షలు అవుతుందని చెప్పారు. ఇందుకు అవసరమైన డబ్బుల కోసం కమిట్మెంట్ చిట్టీలు వేసుకుని రూ.20 లక్షలు పోగేసుకున్నారు. చేతి ఖర్చుకు ఒక్కో కుటుంబం రూ.10 వేల వరకు దగ్గర ఉంచుకుంది. ఇంకేముంది వారనుకున్న విమానయాన కల నెరవేరింది. ఇలా ఒక్కసారి కాదు.. ఇప్పటికే ఐదుసార్లు తమ కలను నెరవేర్చుకున్నారు.ఆలోచన వచ్చిందిలా.. గ్రామ పరపతి సంఘాల సభ్యులు ఇప్పటివరకు ఛార్ధామ్, కాశీ టూర్, రామేశ్వరం, ఢిల్లీ, ఆగ్రా యాత్రలకు వెళ్లారు. నగరంలోని హనుమకొండలోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్కు డబ్బులిస్తే వాళ్లు మొత్తం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లి.. అక్కడ ప్రత్యేకంగా బస్సు మాట్లాడుకుని ప్రదేశాలకు తిరిగారు. ఆవిమానం మొత్తం ఒకే ఊరు వాళ్లు ఉండడం.. మొదటిసారి విమానం ఎక్కిన వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.న్యూస్రీల్పరపతి సంఘాలు.. ఐకమత్యానికి నాంది ఎక్కడికెళ్లినా ఫ్యామిలీతోనే.. -
ప్రభుత్వాల మెడలు వంచుదాం
హన్మకొండ: ఉద్యమాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి, కార్మికుల హక్కులు సాధించుకుందామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కార్మిక మాసోత్సవం ముగింపు సందర్భంగా హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం బలమైన ఉద్యమాలు నిర్మించాల్సిన సమ యం ఆసన్నమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని సూచించారు. కేసీఆర్ పాలనలో వీధి వ్యాపారులకు రుణాలు అందించడంతో పాటు వెండింగ్ జోన్లను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. నాడు తెచ్చిన 2014 చిరు వ్యాపారుల రక్షణ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, చెన్నం మధు, సంకు నర్సింగ్, సోదా కిరణ్, కార్యక్రమ కన్వీనర్ నాయిని రవి, కార్మిక నాయకులు, తెలంగాణ ఆటో యూనియన్, ప్రతాపరుద్ర ఆటో యూనియన్, భవన నిర్మాణ రంగంలోని 14 రంగాల కార్మికులు, చిరు వ్యాపారులు, తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ -
డ్రెయినేజీల పరిశీలన
న్యూశాయంపేట: నగరంలోని 28, 29వ డివిజన్ల పరిధిలోని 12 మోరీల నుంచి మేదరి బస్తీ వరకు ఉన్న డ్రెయినేజీలను కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి నగర మేయర్ గుండు సుధారాణి క్షేత్రస్థాయిలో శనివారం పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో రెండు డివిజన్ల పరిధిలోని ప్రధాన నాలాతో పాటు రైల్వేట్రాక్ వైపు, మేదరి బస్తీ వద్ద ఉన్న డ్రెయినేజీల పరిస్థితిని పరిశీలించారు. సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ సీపీలు రవీందర్, వాడేకర్, శ్రీనివాస్ ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, ఏసీపీ శ్రీనివాస్, ఈఈ రవికుమార్, టీపీఎస్ శ్రీకాంత్, ఏఈ ముజామిల్ పాల్గొన్నారు. -
అడిషనల్ డీసీపీగా ప్రభాకర్రావు
హసన్పర్తి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగం అడిషనల్ డీసీపీగా రాయల ప్రభాకర్రావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆసిఫాబాద్ అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్రావును వరంగల్ పోలీస్ కమిషనరరేట్ అడిషనల్ ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ప్రభాకర్రావు వరంగల్ జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో పనిచేశారు. ఈమేరకు కమిషనర్ సన్ప్రీత్సింగ్ను ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు : కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: జిల్లాలో 2024–25 యాసంగి సీజన్లో 157 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు 1,16,290.240 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఇది గతేడాది రబీ సీజన్తో పోలిస్తే 40,330.240 మెట్రిక్ టన్నులు అధికమని పేర్కొన్నారు. ఽ24,814 మంది రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్లు చేసి వారి బ్యాంకు ఖాతాల్లో రూ. 252.37 కోట్లు జమ చేసినట్లు వివరించారు. సేకరించిన ధాన్యాన్ని జిల్లాలో కేటాయించిన 53 రైస్ మిల్లులకు ఎప్పటికప్పుడు తరలిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మిగిలి ఉన్న ధాన్యాన్ని కూడా త్వరిగతిన కొనుగోలు పూర్తి చేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా కల్పించారు. యువత మత్తు వలలో పడొద్దుహన్మకొండ అర్బన్: యువత వారి భవిష్యత్, దేశ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని మత్తు మహమ్మారి వలలో పడొద్దని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న మాదకద్రవ్యాలు, గుట్కా వ్యతిరేక కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సైకాలజిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా డీఆర్ఓ వైవీ గణేశ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ , గుట్కా రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాలపై ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ చేపట్టనున్న కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భారతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఆడెపు రాజేంద్రప్రసాద్, ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సహజ తదితరులు పాల్గొన్నారు. ఆదాయం పెంచాలి..ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్ హన్మకొండ: డిపో ఆదాయాన్ని పెంచాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్ అన్నారు. శుక్రవారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్–1, హనుమకొండ డిపోను ఆయన సందర్శించారు. డిపో పరిసరాల్ని పరిశీలించారు. వరంగల్–1 డిపోలో మొక్క నాటారు. ఈసందర్భంగా కార్మికులను ఉద్దేశించి సోలమన్ మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. వివిధ హోదాలో ఉన్న 20 మందితో ఒక టీమ్ ఏర్పాటు చేసి డిపో ఆదాయం పెంచేందుకు కృషి చేయాలన్నారు. ఈసందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన డ్రైవర్లను సన్మానించారు. కార్యక్రమంలో వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను, డిప్యూటీ ఆర్ఎం కేశరాజు భానుకిరణ్, వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత, హనుమకొండ డిపో మేనేజర్ ధరంసింగ్, అసిస్టెంట్ మేనేజర్ భవాని, సూపర్వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
వైద్యసేవలు మరింత సులభం
కాజీపేట రూరల్: భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖలోని రైల్ టెల్ కార్పొరేషన్ రైల్వే రిటైర్డ్ పెన్షనర్స్, సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్ కోసం మొబైల్ యాప్స్ అప్లికేషన్ డిజిటల్ సేవలు ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 18 లక్షల మంది రిటైర్డ్ రైల్వే పెన్షనర్స్, 12 లక్షల మంది రైల్వే సర్వీస్లోని ఎంప్లాయీస్ కోసం హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (హెచ్ఎంఐఎస్), హాస్పిటల్ రిసోర్స్మేనేజ్మెంట్ సిస్టం (హెచ్ఆర్ఎంఎస్)ను దేశవ్యాప్తంగా 714 ఆస్పత్రులు/హెల్త్ యూనిట్ల అనుసంధానంతో పాటు, మొబైల్ యాప్స్తో డిజిటల్ సేవలు అమలు చేయనున్నారు. హెచ్ఎంఐఎస్ను 2019లో, హెచ్ఆర్ఎంఎస్ను 2020లో ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఉమిత్కార్డు (యూనిక్ మెడికల్ ఐడీకార్డు)తో ఇండియన్ రైల్వేలో రూ.60 లక్షలు, సికింద్రాబాద్ డివిజన్లో 26 వేల మంది పెన్షనర్స్ మెడికల్ సేవలు పొందుతున్నారు. హెచ్ఎంఐఎస్ యాప్లో రైల్వే పెన్షనర్స్, సర్వీస్ ఎంప్లాయీస్కు కావాల్సిన వైద్య సదుపాయాల కోసం, రెఫరల్ ఆస్పత్రి ఆస్పత్రుల వివరాలు, మందులు అందుబాటులో ఉంటాయి. హెచ్ఆర్ఎంఎస్ యాప్లో రైల్వే ఎంప్లాయిస్ లీవ్స్, పీఎఫ్, సాలరీ, ఎస్ఆర్, ఈ–పాస్లు (పెన్షనర్స్ కోసం–సంవత్సరానికి రెండు ఉచిత ట్రైన్ పాస్ ఉంటుంది) హెచ్ఎంఐఎస్, హెచ్ఆర్ఎంఎస్ యాప్లను డౌన్లోడ్ చేసుకొని వాటిలోకి వెళ్లి డిజిటల్ సేవలు పొందాలి. డిజిటల్ సేవలు ఉపయోగకరం.. రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే పెన్షనర్స్, రైల్వే ఎంప్లాయీస్ కోసం ప్రవేశపెట్టిన డిజిటల్ సేవలను వినియోగించుకోవాలి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పెన్షనర్స్, సర్వీస్ ఎంప్లాయీస్కు డిజిటల్ సేవలు ఎంతో ఉపయోగం. రైల్వే పెన్షనర్స్ యాప్ తెలియకుంటే ఇంట్లో పిల్లలతో, లేదంటే తెలిసిన వారితో సేవలు పొందాలి. దేశవ్యాప్తంగా 16 రైల్వే జోన్లు, 70 రైల్వే డివిజన్లలో ఈ డిజిటల్ సేవలపై రైల్వే శాఖ అధికారుల సహకారంతో ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ (ఎఐఆర్ఆర్ఎఫ్)తో వర్క్షాపులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. – ఎస్.శ్రీధర్, ఏఐఆర్ఆర్ఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ పెన్షనర్లు, ఎంప్లాయీస్ కోసం ప్రత్యేక యాప్లు ప్రారంభించిన రైల్వే మంత్రిత్వ శాఖ -
అవతరణ వేడుకలకు అతిథులు వీరే!
హనుమకొండకు మంత్రి కొండా సురేఖ, వరంగల్కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సాక్షిప్రతినిధి, వరంగల్: జూన్ 2 ఉదయం 10 గంటలకు తెలంగాణ అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథుల జాబితాను శుక్రవారం ప్రకటించింది. హనుమకొండ జిల్లా పోలీస్ పరేడ్గ్రౌండ్స్లో రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. వరంగల్లో రాష్ట్ర రెవెన్యూశాఖ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ములుగులో పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. అదే విధంగా జయశంకర్ భూపాలపల్లిలో టీడీఎఫ్డీసీ చైర్మన్ పోదెం వీరయ్య, మహబూబాబాద్లో ప్రభుత్వ విప్ జె.రాంచంద్రునాయక్, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రముఖులు తెలంగాణ అమరవీరుల స్మారకచిహ్నాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించాలని, ఆ తర్వాత అతిథులు జాతీయ జెండాను ఆవిష్కరించాలని పేర్కొన్నారు. -
వైట్ హౌస్ సదస్సులో వరంగల్ వాసి
ఖిలా వరంగల్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారిక నివాసం వైట్ హౌస్లో గురువారం జరిగిన ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐస్లాండ్ హెరిటేజ్ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన 50 మంది ప్రతినిధులను ఆహ్వానించారు. ఇందులో వరంగల్ నగరానికి చెందిన ఒయాసిస్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జేఎస్ పరంజ్యోతి కుమారుడైన యూనివర్సిటీ సౌత్ ఫ్లోరిడా అసిస్టెంట్ ఫ్రొఫెసర్ జన్ను చిరంజీవి భరత్కు ఆహ్వానం అందింది. ఈమేరకు గురువారం హాజరై భారతీయ వారసత్వ సంపదపై పలు అంశాలను ప్రతినిధులకు వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. -
జూన్ 3 నుంచి భూభారతి దరఖాస్తుల స్వీకరణ
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట : జిల్లాలో జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి భూ భారతి పథకంపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, రేషన్ కార్డుల మంజూరుపై సంబంధిత శాఖ అధికారులతో కలెక్టరేట్లో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘భూభారతి’లో రైతులనుంచి స్వీకరించిన దరఖాస్తులు పరిశీలించి నిబంధనల ప్రకారం రైతులకు న్యాయం చేయాలని సూచించారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు నెల రోజుల్లో పూర్తి కావాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. రెండో విడత అర్హులైన పేదలను ఎంపిక చేయాలన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో ఆమోదం పొందిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యేల ఆమోదంతో పంపిణీ చేయాలన్నారు. రాజీవ్ యువ వికాసానికి ఎంపికై న వారికి జూన్ 2న మంజూరు పత్రాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఈడీ ఎస్సీ కార్పొరేషన్ అధికారి సురేశ్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, హౌసింగ్ పీడీ గణపతి, డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఉన్నారు. -
వంద రోజుల ప్రణాళిక పక్కాగా అమలు
మేయర్ సుధారాణి న్యూశాయంపేట: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ద్వారా రూపొందించిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో వంద రోజుల ప్రణాళిక అమలు తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. జూన్ 2 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు బల్దియా ద్వారా వంద రోజుల పాటు చేపట్టే కార్యాక్రమాల గురించి వివరించారు. ఈవంద రోజుల ప్రణాళికలో భాగంగా మొక్కలు నాటడం, ముంపు నివారణకు 36 ప్రధాన నాలాల్లో రూ.1.21 కోట్లతో పూడికతీత పనులు పూర్తి చేయడం, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నగరంలోని గోడలపై మృనాల్ పెయింటింగ్లు వేయడం, వరద నీరు సాఫీగా వెళ్లేలా నాలాల్లో ఉన్న బ్లాకేజ్ ప్రాంతాలను గుర్తించి మెష్లు ఏర్పాట్లు చేయాలని, జంక్షన్లలో సుందరీకరణ పనులు, రెండు పార్కుల అభివృద్ధి, రహదారుల మరమ్మతులు, శిథిలావస్థ నిర్మాణాల తొలగింపు, అంతర్గత మురుగు కాల్వల పరిశుభ్రత, తదితర పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి వంద రోజుల ప్రణాళిక విజయవంతానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ అదనపు కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ రాజిరెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఇన్చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నారాణి, డీఎఫ్ఓ శంకర్ లింగం, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
నగరాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ఖిలా వరంగల్: నగరాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వరంగల్ 19వ డివి జన్ వివేకానంద కాలనీలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న తాగునీటి పైప్ లైన్లు, డ్రెయినేజీ పనులు, 41వ డివిజన్ ప్రతాప్నగర్ ఉర్సు కరీమాబాద్లో రూ.34 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు మేయర్ సుధారాణి, కలెక్టర్ సత్యశారద, స్థానిక కార్పొరేటర్లతో కలిసి మంత్రి సురేఖ వేర్వేరుగా శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి పైపులైన్ల నిర్మాణాలకు అఽధిక ప్రాధాన్యమిస్తున్నామని, పేదల కాలనీల్లో ప్రధాన సమస్యలను గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్, నాయకులు నవీన్రాజ్, కేడల పద్మ, ట్రాన్స్జెండర్ రంజిత పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ -
ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదనే మనస్తాపంతో..
హనుమకొండ: ఇందిరమ్మ ఇండ్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 2 లక్షల 10 వేల ఇండ్లను ఫైనల్ చేశారు. ఫైలేట్ ప్రాజెక్టులో 47 వేల ఇండ్లకు గాను 24 వేల ఇండ్లను ప్రారంభించారు. అయితే తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని చెప్పి ఓ యువకుడు హోర్డింగ్ ఎక్కి హల్ చల్ చేశాడు. తనకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ తన పేరు జాబితాలో లేదంటూ ఆవేదన చెందిన హనుమకొండ రామ్ నగర్ కు చెందిన పాషా అనే యువకుడు హనుమకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు హోర్డింగ్ ఎక్కాడు. తనను ప్రభుత్వం మోసం చేసిందంటూ హోర్డింగ్ చివర వరకూ ఎక్కి తనకు న్యాయం చేయాల్సిందేనని నిరసన స్వరం వినిపించాడు. ఇలాగైనా ప్రభుత్వ పెద్దలు తన మాట ఆలకించాలని డిమాండ్ చేస్తున్నాడు. అయితే ఇలా హోర్డింగ్ ఎక్కింది హోంగార్డు లతీఫ్ కుమారుడిగా పోలీసులు తేల్చారు. -
టెంట్ సిటీలో దొంగలు పడ్డారు..
కాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26 వరకు జరిగిన సరస్వతీనది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం 40 టెంట్సిటీ నిర్మాణాలు చేపట్టింది. సోమవారం పుష్కరాలు పూర్తి కావడంతో బుధవారం నుంచి టెంట్సిటీలోని ఏసీలు, ఫర్నిచర్, బెడ్స్ తదితర వ స్తువులు తీసుకెళ్లడానికి సిద్ధం చేశారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి టెంట్సిటీకి చెందిన 8 ఏసీ కంప్రెషర్స్, 3 కూలర్లు, డార్మెటరీకి చెందిన 9 బెడ్స్, దిండు, బెడ్షీట్స్, డ్రెస్సింగ్ మిర్రర్లు, గ్రీన్ నెట్ బాండిల్, కుర్చీలు దుండగులు ఎత్తుకెళ్లారు. రెండు రోజులుగా ఆ ప్రాంతంలో ఎలాంటి బందోబస్తు లేకపోవడం, విద్యుత్ దీపాలు వెలుగకపోవడంతో దుండగులు రెక్కీ నిర్వహించి ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై సంబంధిత ఆలీఎలిమెంట్ ప్రైవేట్ సంస్థకు చెందిన నిర్వాహుకులు కాళేశ్వరం పోలీసుస్టేషన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తమాషారెడ్డి తెలిపారు. 8 ఏసీ కంప్రెషర్స్, 3 కూలర్లు, ఇతర విలువైన వస్తువుల అపహరణ -
టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం
విద్యారణ్యపురి: తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) ఆవిర్భావ దినోత్సవం గురువారం హనుమకొండలోని ఆ ఉపాధ్యాయ సంఘం కార్యాలయంలో నిర్వహించారు. టీపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు నటరాజ్ సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలకు మేరకు సంఘం పనిచేయాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలతోపాటు సామాజిక సమస్యలపై టీపీటీఎఫ్ అనేక పోరాటాలుచేసిందన్నారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బత్తిని రామాంజనేయులు, జనరల్ జనరల్ సెక్రటరీ గొడిశాల సత్యనారాయణ, బాధ్యులు ఎం. రఘుపతి, సీహెచ్ లక్ష్మయ్య, కుమారస్వామి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రెవెన్యూ వసూళ్లు వందశాతం సాధించాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డిహన్మకొండ: రెవెన్యూ వసూళ్లు వందశాతం సాధించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. గురువారం రాత్రి హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈ, డీఈ, ఎస్ఏఓలకు వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) నిర్వహించారు. డివిజన్, జిల్లా వారీగా ప్రగతి సమీక్షించారు. ప్రధానంగా రెవెన్యూ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. సర్కిళ్లు, డివిజన్ల, సెక్షన్ వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి రెవెన్యూ వసూళ్లు వంద శాతం సాధించేలా ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్లాలని సూచించారు. విద్యుత్ చౌర్యం అరికట్టాలని చెప్పారు. రైతులు తమ మోటార్లకు కెపాసిటర్లు అమర్చుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కేబుల్ ఆపరేటర్లు ఉపయోగించే విద్యుత్ స్తంభాలకు అద్దె వసూలు చేయాలని ఆదేశించారు. అలాగే, కేబుల్ ఆపరేటర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి, స్తంభాల వెంట గుత్తులుగా ఉన్న కేబుళ్లతో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, క్రమపద్ధతిలో తీగలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్ వి. తిరుపతి రెడ్డి, 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఎస్ఏఓలు పాల్గొన్నారు. -
విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తే మెరుపు సమ్మె
హన్మకొండ: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాలని చూస్తోందని, ఇదే జరిగితే దేశ వ్యాప్తంగా మెరుపు సమ్మెకు దిగుతామని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ హెచ్చరించారు. ఉత్తర్ ప్రదేశ్లో కార్మికుల హక్కుల కాలరాసేలా పోరాటాలు, సమ్మె చేయకుండా రెగ్యులరైజేషన్ అమైండ్మెంట్ తీసుకురావడాన్ని నిరసిస్తూ అక్కడి విద్యుత్ ఉద్యోగులకు మద్దతుగా గురువారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మధ్యా హ్న భోజన సమయంలో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తే ప్రజలకు ఎక్కువ ఇబ్బందులుంటాయన్నారు. ఉద్యోగావకాశాలు పోతాయన్నారు. ప్రైవేట్ నిర్వాహకులను భరించలేమన్నారు. ఈ క్రమంలో ప్రజలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఎన్పీడీసీఎల్ బాధ్యుడు సామ్యా నాయక్ మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్ ఉద్యోగుల పట్ల అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఇక్కడ ధర్నా చేశామన్నారు. ఈ ధర్నాలో శ్రీకాంత్, వెంకటేశం, కుమారస్వామి, జానకీరాంరెడ్డి, మధుకర్, పి.మహేందర్ రెడ్డి, మచ్చిక బుచ్చయ్య గౌడ్, చిట్ల ఓదెలు, తదితరులు పాల్గొన్నారు. టీఎస్ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ -
ఇక నో టెన్షన్
సైబర్ ఎటాక్..కాజీపేట మండలం మడికొండకు ఓ యువకుడు లోన్ యాప్ ద్వారా రుణం తీసుకుని రికవరీ ఏజెంట్ల బారినపడ్డాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో రూ.1.60 లక్షల మొత్తం చెల్లించారు. అయినా మరికొంత చెల్లించాలని డిమాండ్ చేసి.. ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరించడంతో తెలివిగా ఫేస్బుక్, వాట్సాప్, సోషల్ మీడియా ఖాతాల నుంచి తప్పుకుని తన ఫోన్ హ్యాక్ అయ్యినట్లు ప్రకటించాడుకాజీపేట: లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక జనగామ జిల్లా చిల్పూరు మండలం లింగపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు పెళ్లైన నలబై రోజులకే ఆత్మహత్యకు ఒడిగట్టాడు. కేవలం రూ.2వేల కోసం భార్యభర్తల ఫొటోలను మార్ఫింగ్ చేసి బంధువులకు పంపడంతో మనస్తాపానికి గురై తనువు చాలించాడు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతి రూ. 15వేల రుణం తీర్చే క్రమంలో వేధింపులకు గురైంది. అవమానంగా భావించిన సదరు యువతి.. పురుగు ల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఇలా.. ఇటీవల రుణయాప్ నిర్వాహకుల వేధింపులకు బలవుతున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఈ విషయమై రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ కేసులు నమోదవుతున్నాయి. బాధితుల్లో యువత, విద్యార్థులు, మహిళలే ఎక్కువ ఉంటున్నారు. పూర్తిగా చెల్లించినా బాకీ ఇంకా ఉందంటూ.. ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతుండడం సైబర్ కేటుగాళ్ల తెగింపునకు పరాకాష్టగా నిలుస్తోంది. దీంతో బాధితులు మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు.. ఆ సైబర్ దాడి నుంచి రక్షించుకునేందుకు ఓ వెబ్సైట్ అందుబాటులో ఉంది. దీనిపై అవగాహన పెంచుకుంటే ఏ సందర్భంలోనైనా ఉపయోగపడుతుందని పోలీసులు చెబుతున్నారు. ఆ వివరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సైట్కు ఫిర్యాదు చేయొచ్చు.. మీ ఫొటోలతో అశ్లీల చిత్రాలు రూపొందించి ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తుంటే నేరుగా ఫిర్యాదు చేయొ చ్చు. ఇందు కోసం మీ సెల్ఫోన్కి వచ్చిన ఫొటోల ను ఈ సైట్కు పంపాలి. ఇందులో తొమ్మిది రకాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మే రకు వివరాలు నమోదవుతాయి. తర్వాత ఫొటోలు అప్లోడ్ చేస్తే వాటిపై సదరు సైట్ నిఘా పెడుతుంది. ఎవరైనా ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పో స్ట్ చేస్తే వెంటనే గుర్తించి తొలగిస్తుంది. ఆ వివరాల ను నోటిఫికేషన్ రూపంలో మీకు తెలియజేస్తుంది. – పింగిళి ప్రశాంత్ రెడ్డి, ఏసీపీ, కాజీపేటఫొటో మార్ఫింగ్ బెదిరింపు నుంచి రక్షణ పొందండిలా! రుణయాప్ వేధింపుల అడ్డుకట్టకో సైట్ అవగాహన పెంచుకోవాలంటున్న పోలీసులు 2015 నుంచే అందుబాటులోకి..ఈ జాగ్రత్తలు మేలు.. సామాజిక మాధ్యమాల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఫొటోలను అప్లోడ్ చేయకపోవడమే మంచిదని..ఒక వేళ చేసినా ఇతరులకు వాటి యాక్సెస్ లేకుండా జాగ్రత్త వహించాలని చెబుతున్నారు. ప్రొఫైల్ చిత్రాలను ఇతరులకు డౌన్లోడ్ కాకుండా లాక్ వేయాలి. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే రిక్వెస్ట్లు, లింక్లను ఎట్టి పరిస్థితులలోనూ ఆమోదించొద్దు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వారిని బ్లాక్లిస్ట్లో పెట్టడం సురక్షితమని వివరిస్తున్నారు.ఆ సైట్ పేరు.. www.sotpncii.org అంతర్జాతీయంగా నిర్వహించే ఈ వెబ్సైట్ పూర్తిగా భద్రమని పోలీసులు చెబుతున్నారు. మనం అప్లోడ్ చేసిన ఫొటోలను డౌన్లోడ్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం ఉండదు. డిజిటల్ ఫింగర్ ప్రింట్ తరహాలో.. మన చిత్రంతో ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది. దీని ఆధారంగా సామాజిక మాధ్యమాల్లో మన చిత్రాలు అప్లోడ్ అయితే .. అధునాతన సాంకేతికత ఆధారంగా గుర్తించి వెంటనే తొలగిస్తుంది. 2015 లోనే అందుబాటులోకి వచ్చింది. ఈ సైట్ ఇప్పటి వరకు అంతర్జాతీయంగా రెండు లక్షల మందికి పైగా బాధితుల మార్ఫింగ్ చిత్రాలను తొలగించి వారికి వ్యక్తిగత రక్షణ కల్పించింది.పూర్తిగా సురక్షితం..అప్రమత్తంగా ఉండాలి ఫొటోలు మార్ఫింగ్, రుణ యాప్ వేధింపులు ఎదురైతే భయపడకుండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. తద్వారా వారికి అండగా నిలిచి .. అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నాం. -
ఉమ్మడి జిల్లా సమీక్షలో ఎమ్మెల్యేలు, అధికారులు..
సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి సమావేశంలో పాల్గొన్న డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్రనాయక్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల ఎస్పీలు కిరణ్ఖరే, సుధీర్రాంనాథ్ కేకన్, శబరీశ్హనుమకొండ కలెక్టరేట్లో గురువారం ఉమ్మడి జిల్లాలో ధాన్యం సేకరణ, వ్యవసాయం, వర్షాకాల ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.. మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. – హన్మకొండ అర్బన్ -
ఫిర్యాదులు.. ఇష్టానుసారంగా
హన్మకొండ : టీజీఎన్పీడీసీఎల్లో ఫిర్యాదుదారుడి పేరు, చిరునామా లేని ఆకాశరామన్న ఉత్తరాలు (ఫిర్యాదులు) ఉద్యోగులు, అధికారులను బెంబేలెత్తిస్తున్నాయి. వివిధ ఫిర్యాదులపై అధికారుల తక్షణ స్పందనతో ఫిర్యాదుదారులు పెట్రేగిపోతున్నారు. ఇష్టానుసారంగా ఫిర్యాదులు చేస్తూ క్షణికానందం పొందుతున్నారు. దీంతో ఉద్యోగులు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే అనామక (ఆకాశరామన్న), చిరునామా లేని ఫిర్యాదులను పరిశీలన, విచారణకు స్వీకరించాల్సిన అవసరం లేదని సెంట్రల్ విజిలెన్స్, స్టేట్ విజిలెన్స్ ఆదేశాలు స్పష్టంగా ఉన్నా.. కొందరు అధికారులు అత్యుత్సాహం చూపుతూ విచారణ చేపడుతున్నారు. ఇదే అదునుగా ఆకాశరామన్న ఉత్తరాలు రాసే వారు పెట్రేగిపోతున్నారని విద్యుత్ ఉద్యోగులు మండిపడుతున్నారు. వ్యక్తిగత కక్షలు నేరుగా ఎదుర్కోలేక.. వ్యక్తిగత కక్షలు నేరుగా ఎదుర్కోలేక ఆకాశరామన్న ఉత్తరాలు, ఫిర్యాదులతో తమ కోపాన్ని తీర్చుకుంటున్నారనే ప్రచారం విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్లలో ఈ వింత పోకడలు ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. ప్రత్యర్థుల క్షణికానందం.. ప్రధానంగా యాజమాన్యం ప్రతీ అనామక ఫిర్యాదుపై స్పందించి విచారణ చేస్తుండడంతో పేరు, చిరునామా లేని ఫిర్యాదులు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అంతే కాకుండా ఫిర్యాదుకు గురైన ఉద్యోగి, అధికారి పడుతున్న ఇబ్బందులను చూసి ప్రత్యర్థులు క్షణికానందం పొందుతున్నారు. విద్యుత్ ఉద్యోగులు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు ఆకాశరామన్న ఉత్తరాల పేరుతో ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటిగా మారిందని విద్యుత్ ఉద్యోగులు వాపోయారు. ఇంత జరుగుతున్న ఉద్యోగ, కార్మిక సంఘాలు చోద్యం చూస్తున్నాయే కాని, వీటిని అరికట్టేందుకు సంఘాల నాయకులు పూనుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ విజిలెన్స్ ఆదేశాలు బేఖాతర్.. పేరు, చిరునామా లేకుండా వచ్చిన అనామక ఫిర్యాదులను పట్టించుకోవద్దని సెంట్రల్ విజి లెన్స్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పా టు కోర్టులు ఇచ్చిన తీర్పులను సైతం ఉదాహరించింది. చిత్తశుద్ధి, బాధ్యత, పారదర్శకంగా పని చేసే అధికారులపై కొందరు ఇలాంటి ఫిర్యాదులు చేసే అవకాశముందని, ఇలాంటి ఫిర్యాదులు విచారణకు స్వీకరించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయినా అత్యుత్సాహం చూపుతున్న కొందరు అధికారులు దురుద్దేశంతో విచారణ చేపడుతున్నారని, తమను మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టాల్సిన యాజమాన్యం విచారణలకు ఆదేశిస్తుండడంతో ఫిర్యాదుదారులు పెట్రేగిపోతున్నారని ఉద్యోగులు తెలిపారు. ఇప్పటికై నా యాజమాన్యం అనా మక, ఆకాశరామన్న ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు లేకుండా, సెంట్రల్, స్టేట్ విజిలెన్స్ ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ ఉద్యోగులు కోరారు. తప్పులు జరిగితే అప్పుడే ఎందుకు స్పందించరు?అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వర్తించే సమయంలో కాకుండా రిటైర్మెంట్ ముందు ఆకాశరామన్న లేఖల ద్వారా ఫిర్యాదులు పంపుతుండడం సరికాదని పలు సంఘాలు, అసోసియేషన్ల నాయకులు, ఉద్యోగులు పేర్కొంటున్నారు. తప్పులు జరిగితే అప్పుడే ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. ఒకరిపై మరొకరు ఉద్యోగ విరమణ సమయంలో ఫిర్యాదులు చేస్తే పరిస్థితులు ఎటువైపు వెళ్తాయో ఆలోచించాలని అకాశరామన్న ఉత్తరాలు రాసే వారికి సూచిస్తున్నారు. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే ఏ ఉద్యోగి కూడా సంతోషంగా విరమణయ్యే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం కాదని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ ఉద్యోగులను బెంబేలెత్తిస్తున్న పేరులేని ఫిర్యాదులు ఫిర్యాదులపై అధికారుల స్పందనతో పెట్రేగిపోతున్న ఫిర్యాదుదారులు అనామక ఫిర్యాదులపై విచారణ చేపట్టొద్దని విజిలెన్స్ ఆదేశాలు.. అయినా పట్టించుకోని కొందరు అధికారులు.. విచారణకు ఆదేశం ఇదే అదునుగా భావిస్తున్న ప్రత్యర్థులు విద్యుత్ ఉద్యోగుల నుంచి వెల్లువెత్తుతున్న నిరసన -
యువతకు హెచ్ఐవీపై అవగాహన ఉండాలి
ఎంజీఎం : యువతకు హెచ్ఐవీపై అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య అన్నారు. గురువారం నగరంలోని డబ్బాల జంక్షన్ వద్ద మొబైల్ వ్యాన్ హెచ్ఐవీ/ఎస్టీఐ సంపూర్ణ సురక్ష కేంద్రం సేవలపై ప్రదర్శన నిర్వహించారు. డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ హైరిస్క్లో ఉన్నవారికి అవగాహన కలిగించడంతోపాటు టెస్టింగ్ చేయాలని వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. జనసాంద్రత ఎక్కువగా ఉండే కూడళ్లలో ఈ మొబైల్ వాహనం ద్వారా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అనంతరం బ్రోచర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ మదన్మోహన్రావు, పోచమ్మకుంట పీహెచ్సీ వైద్యాధికారి దీప్తి, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ స్వప్న మాధురి, జిల్లా మాస్మీడియా అధికారి అశోక్రెడ్డి, హెచ్ఈఓ శ్రీనివాస్, సంపూర్ణ సురక్ష కేంద్రం మేనేజర్ పాషా, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. గుర్తింపు లేని పాఠశాలలను మూసివేయాలి : డీఈఓ విద్యారణ్యపురి : జిల్లా వ్యాప్తంగా గుర్తింపులేని పాఠశాలలను మూసివేసి సీజ్ చేయాలని హనుమకొండ డీఈఓ వాసంతి ఎంఈఓలను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అనుమతి ఉన్న పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్, నోట్బుక్స్, పెన్నులు తదితర వస్తువులను తమవద్దనే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు.ఇలాంటి చర్యలు కొనసాగిస్తే శాఖాపర ంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొల్యూషన్ కంట్రోల్ అప్పిలేట్ అథారిటీ సభ్యుడిగా దయాకర్కేయూ క్యాంపస్: రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ అప్పీలేట్ అథారిటీ సభ్యుడిగా కాకతీయ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ గాదె దయాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దయాకర్ రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఎన్విరాన్మెంటల్ ఎక్సఫర్ట్ అప్రైజర్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతంలో 15 ఏళ్లపాటు కాలుష్య నియంత్రణ మండలి హైదరాబాద్ జోనల్ మెంబర్గా ఉన్నారు. టాస్క్ఫోర్స్ సభ్యుడిగా పనిచేశారు. వరంగల్ ధర్మారానికి చెందిన దయాకర్ హనుమకొండలో స్థిరపడ్డారు. కేయూలో పలు పలు పదవులు నిర్వర్తించారు. దరఖాస్తుల ఆహ్వానం హసన్పర్తి : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బండారుపల్లి, వేలేరు, హసన్పర్తి, వంగర, నెక్కొండ, కొడకండ్ల పాఠశాల, కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ బాలికల గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ఇందుమతి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశోక్రెడ్డిలు సంయుక్త ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్, సంస్కృతం, గణితం, ఫిజిక ల్ సైన్స్, బయోసైన్స్, సోషల్ సబ్జెక్ట్లు, కళాశాలలో గణితం, బోటని, జువాలజీ, ఫిజిక్స్, కెమి స్ట్రి బోధించేందుకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆయా పాఠశాలలు, కళాశాలల్లో జూన్ 2వ తేదీ లోపు సమర్పించాలని సూచించారు. జూన్ 3వ తేదీన బాలికల గురుకుల జూనియర్ కళాశాల, పాఠశాలల్లో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని చెప్పారు. -
లీకేజీలకు మరమ్మతు చేయాలి
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్ : వాల్వుల లీకేజీల స్థానంలో కొత్తగా మరమ్మతులు చేయాలని మేయర్ గుండు సుంధారాణి సూచించారు. గురువారం బల్దియా పరిధిలోని 24వ డివిజన్ మట్టెవాడ వాటర్ ట్యాంక్ వద్ద కొనసాగుతున్న వాల్వ్ మరమ్మతు పనులను మేయర్ క్షేత్రస్థాయిలో సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమీపంలోని 11, 28, 29 డివిజన్ల ఆవాసాలకు తాగునీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఇందుకు ప్రత్యామ్నాయ వాల్వులు ఏర్పాటు చేయడంతో పాటు పిల్లలకు ఎలాంటి ప్రమాదం కలుగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఏఈ హబీబ్ మొజామిల్, ప్రధానోపాధ్యాయురాలు అరుణ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో టెక్స్టైల్ పార్క్ కీలకం
న్యూశాయంపేట: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్తో రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్ధి, ఉద్యోగావకాశాల సృష్టికి, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం అవుతుందని కలెక్టర్ సత్యశారద అన్నారు. గురువారం కలెక్టరేట్లో డైరెక్టర్ ఆఫ్ టెక్స్ౖటైల్ ధరణికాంత్తో కలిసి టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులు, పరిశ్రమల యాజమాన్యాలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్తో టెక్స్టైల్ రంగంలో సమగ్ర మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు, మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ముందుంటుందని తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమలు, స్థానిక ఉత్పత్తిదారుల సహకారంతో ఈ పార్క్ దేశంలో మోడల్ టెక్స్టైల్ పార్క్గా గుర్తింపు పొందేందుకు కృషి చేయాలన్నారు. కాకతీయ టెక్స్టైల్ పార్క్ నిర్మాణంలో భూమి కోల్పోయిన వారికి ఇళ్ల స్థలాల ‘కుడా’ లేఅవుట్ అనుమతులు అనంతరం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించి మౌలిక సౌకర్యాలు కల్పించాలని తహసీల్దార్, జోనల్ మేనేజర్లను ఆదేశించారు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ టెక్స్టైల్ ధరణి కాంత్ మాట్లాడుతూ.. కాకతీయ మెగా టెక్స్టైల్ ఇండస్ట్రీయల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఎలాంటి ఉపాధి కల్పించవచ్చో అలాంటి స్థానాలలో యువతకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో కేఎంపీటీ జోనల్ మేనేజర్ స్వామి, తహసీల్దార్లు రియాజుద్దీన్, రాజ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద అధికారులతో సమీక్ష -
పిల్లలను ప్రభుత్వ బడికి పంపండి
విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలలు జూన్ 12వ తేదీనుంచి పునఃప్రారంభం కానున్నాయి. 2025–26విద్యాసంవత్సరంలో పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పడరాని పాట్లు పడుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో కొద్దిరోజులుగా అనేక చోట్ల ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులైతే తమ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలు, నాణ్యమైన విద్య అందిస్తామని కరపత్రాలు, బ్రోచర్లు రూపొందించి పంపిణీ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్తున్న తల్లిదండ్రులను, ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకే వెళ్లి ప్రభుత్వ బడిలో అందించే సౌకర్యాలపై టీచర్లు అవగాహన కల్పించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరుతున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా వివిధ తరగతుల్లో చేర్పించేందుకు 1,908 మంది విద్యార్థులను గుర్తించారు. మౌలిక సదుపాయాలపై అవగాహన విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు,నోట్బుక్స్, స్కూల్ యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం ఉంటుందని చెబుతున్నారు. డిజిటల్, ఏఐ కంప్యూటర్ ఆధారిత విద్యాబోధన కూడా అందిస్తున్నామని ఉపాధ్యాయులు ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా వివిధ హైస్కూల్స్ పీఎంశ్రీ పాఠశాలలు ఉండగా, అందులో ప్రత్యేక నిధులతో గ్రంథాలయాలు, ఆట వస్తువులు, ఇతర సదుపాయాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అలాగే బడిఈడు పిల్లలను సైతం గుర్తిస్తున్నారు. బడిమానేసిన పిల్లలు ఉంటే వారి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తయింది. జూన్ 6వ తేదీనుంచి అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నారు. తల్లిదండ్రులతోనూ సమావేశాలు ఈనెల 2వ తేదీన, 16న పలుచోట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్థాయిలో ఆయా పరిధిలోని తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్లు, తల్లుల కమిటీలతో సమావేశాలు కూడా నిర్వహించారు. ఈనెల 30న స్థానిక ప్రజాప్రతినిధులతో, యువకుతల చేత సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల అవశ్యకతను వివరించి విద్యార్థుల నమోదుపై దృష్టిసారించాలని డీఈఓ వాసంతి హెచ్ఎంలను, ఉపాధ్యాయులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు వివిధచోట్ల ఒకటో తరగతికి 728 మంది విద్యార్థులను గుర్తించారు. ఆరో తరగతికి 893 మందిని, ఎనిమిదో తరగతికి 287 మందిని గుర్తించారని జిల్లా విద్యాశాఖ కమ్యూనిటీ మొబలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి తెలియజేశారు.హనుమకొండ జిల్లాలో ముందస్తు ‘బడిబాట’ ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ ఉపాధి పనుల వద్దకూ వెళ్లి ప్రచారం చేస్తున్న టీచర్లు ఇప్పటివరకు 1,908 మంది విద్యార్థుల గుర్తింపు -
మహిళల ఆర్థికాభివృద్ధికి డెయిరీ ఏర్పాటు
హన్మకొండ అర్బన్ : పరకాల నియోజకవర్గంలోని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకే పాడి డెయిరీని ఏర్పాటు చేస్తున్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పరకాల మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘాల సమితి ‘మహాజన సభ ’నిర్వహించారు. సభలో ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ మహిళా డెయిరీ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినప్పప్పుడు ఈ విషయాన్ని వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లగా, వారు ప్రారంభంనుంచి కోఆర్డినేట్ చేస్తున్నారన్నారు. ముల్కనూరు డెయిరీ మాదిరిగానే పరకాల మహిళా డెయిరీ కూడా రానున్న రోజుల్లో విజయవంతంగా నిర్వహిస్తూ జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. అనంతరం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారదలతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి.. పరకాల మహిళా డెయిరీకి సంబంధించిన మౌలిక వసతుల కల్పన, మహిళ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం, నేచురల్ ఫార్మింగ్పై నేషనల్ డెయిరీ డెవలప్మెంట్, జిల్లా గ్రామీణాభివృద్ధి, మెప్మా, వి–హబ్, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయా సమావేశాల్లో రెండు జిల్లాల డీఆర్డీఓలు మేన శ్రీను, కౌసల్య దేవి, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు రవీందర్ సింగ్, అనురాధ, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ అధికారులు లత, సుందర్ రావు తదితరులు పాల్గొన్నారు.పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి -
ఫిట్నెస్ లేని బస్సులు నడిపితే చర్యలు
ఇన్చార్జ్ ఆర్టీఓ శోభన్బాబు ఖిలా వరంగల్ : ప్రైవేట్ విద్యాసంస్థలు ఫిట్నెస్ లేని బస్సులు నడిపితే చర్యలు తప్పవని, సకాలంలో వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని వరంగల్ ఇన్చార్జ్ ఆర్టీఓ శోభన్బాబు సూచించారు. వరంగల్ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ప్రైవేట్ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ (సామర్థ్యపు) పరీక్షలు శరవేగంగా జరుగుతున్నాయి. గురువారం ఫిట్నెస్ కోసం వచ్చిన బస్సులను అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించగా ఇన్చార్జ్ ఆర్టీఓ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఈనెల 15వ తేదీతో స్కూల్ బస్సుల ఫిట్నెస్ కాలపరిమితి ముగిసిందన్నారు. 16వ తేదీ నుంచి మీసేవ, ఈసేవలో ఫిట్నెస్ పరీక్షలకు ఆన్లైన్ నమోదు చేసి ఆర్టీఏకు చేరుకున్న బస్సుకు నిబంధనల మేరకు సర్టిఫికెట్స్ జారీచేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఆరు బస్సులకు వివిధ కారణాలతో ఫిట్నెస్లు రిజెక్ట్ చేయగా, 40 బస్సులకు పరీక్షలు పూర్తి చేసి సర్టిఫికెట్స్ జారీ చేశామని వివరించారు. జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలల పునఃప్రారంభకానున్నాయని, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డుపైకి బస్సు వస్తే డ్రైవర్ లైసెన్సును రద్దు చేస్తామని ఆర్టీఓ హెచ్చరించారు. -
మేల్కోని ‘గ్రేటర్’ యంత్రాంగం
చిత్రంలో కనిపిస్తుంది శాకరాశికుంట నాలా. వర్షాకాలం ముందస్తు చర్యలంటూ ఇటీవల నాలాల్లోని సిల్ట్ను జేసీబీల సాయంతో లక్షలు ఖర్చు చేసి తీశారు. ఇంతవరకు బాగానే ఉంది. తీసిన సిల్ట్ను వెనువెంటనే యార్డుకు తరలించకుండా నాలా పక్కనే పోశారు. వరుస వర్షాలకు ఆ సిల్ట్ తిరిగి నాలాల్లో కలిసిపోతోంది. ఇదంతా అధికారుల నిర్లక్ష్యమేనని నగరవాసులు అంటున్నారు.కనిపిస్తున్నది హనుమకొండ అంబేడ్కర్ భవన్ ముందున్న నాలాలో తీసిన చెత్త. తీసిన వారు కొంచెం దూరమైన వేయాలి. కానీ నాలాలోకి సగం, రోడ్డుమీదికి సగం అన్నట్లు ఉంది. మంగళవారం కురిసిన వర్షానికి తీసిన చెత్తలో సగం తిరిగి నాలాల్లోకి చేరిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపాటి వర్షానికి వరద సాఫీగా వెళ్లలేక రోడ్లను ముంచెత్తుతోంది. ఈ రోడ్డునిండా వరద నీరు నిలిచి చిన్నపాటి కుంటను తలపించింది.వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లోని నాలాలకు ఇరువైపులా అడ్డుగోడల నిర్మాణానికి రెండున్నరేళ్లుగా కొనసాగుతున్న కార్యాచరణ అసంపూర్తిగా మిగిలిపోయింది. హనుమకొండలోని వడ్డేపల్లి, భీమారం, గోపాల్పూర్ చెరువు, వరంగల్ భద్రకాళి చెరువుల పరీవాహక నాలాల విస్తీర్ణం 12.25 కిలో మీటర్లు ఉంటుందని, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వంనుంచి నిధులు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన నాలాల మూలాల్లోకి స్ట్రైకింగ్ ఫోర్స్ కూల్చివేతలు చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయా విభాగాల అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా వడ్డేపల్లి నుంచినుంచి జవహర్నగర్ కాలనీ బ్రిడ్జి, అక్కడినుంచి గోపాల్పూర్, భీమారం చెరువులో వరద నీరు ఈ నాలాలో కలుస్తుంటాయి. పరిమళ కాలనీ, సమ్మయ్య నగర్, ప్రెసిడెన్సీ సిడెంట్ స్కూల్నుంచి రాజాజీ నగర్, నయీంనగర్, బొక్కలగడ్డ ఈద్గా, మంగళివాగు, కెనాల్ వరకు రూ.155కోట్ల మేర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు విడుదలయ్యాయి. కానీ, ఆ నిధులతో 70శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. కానీ.. అక్కడక్కడ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.గ్రేటర్ వరంగల్ అధికార యంత్రాంగం నిద్రమత్తునుంచి మేల్కొనడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా చెదురుమదురుగా ప్రారంభమైన వర్షాలు మోస్తరుకు చేరుకున్నాయి. వారం కిందటి ఎండలతో విలవిల్లాడిన వరంగల్ నగర ప్రజలు కాస్త సేదదీరారు. ఈ సంతోషం ప్రజల్లో ఎంతో సేపు నిలవలేదు. మోస్తరు వర్షానికే నగరంలోని రోడ్లు, డ్రెయినేజీలు అధ్వానంగా మారాయి. ఇళ్లల్లో నుంచి రోడ్డెక్కాలంటేనే భయపడుతున్నారు.కార్యాచరణ ఇలా చేస్తే మేలు..● వర్షాభావ సమస్యలను విన్నవించేందుకు బల్దియా కార్యాలయంలో 24గంటలపాటు కాల్ సెంటర్ను ఏర్పాటు చేయాలి. ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలి.● సర్కిళ్ల వారీగా డీఆర్ఎఫ్ బృందాలను నియమించాలి. జేసీబీలు, వరద నీటిని తోడే యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలి. ● కప్పులు లేని మ్యాన్హోల్స్పై మూతలు పెట్టించాలి. ● గుంతలుగా మారిన రోడ్లను మరమ్మతు చేయించాలి. ● నాలాల్లో, డ్రెయినేజీల్లో పూడికతీత పనులు త్వరితగతిన పూర్తిచేయాలి. తొలగించిన సిల్ట్(వ్యర్థాలు)ను వెనువెంటనే డంపింగ్ యార్డుకు తరలించాలి. ● అస్తవ్యస్తంగా మారిన డ్రెయినేజీలను మరమ్మతులు చేయాలి. ● రోడ్లు, ఇతర ప్రాంతాల్లో నిలిచిన నీటిని డీజిల్ ఇంజన్ మోటార్లు పెట్టి ఎప్పటికప్పుడు తొలగించాలి. ● పాడుబడిన భవనాల మరమ్మతులకు నోటీసులు జారీ చేయాలి. అవసరమైతే కూల్చివేతలు చేపట్టాలి. ● సీజనల్ వ్యాధులపై, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, మురికివాడల్లో హెల్త్ క్యాంపులు పెట్టాలి. ● సెల్లార్ల ఆక్రమణలను ఖాళీ చేయించాలి.బొందివాగునుంచి పోతన నగర్ మీదుగా భద్రకాళి బండ్, అలంకార్ జంక్షన్, భద్రకాళి మత్తడినుంచి ములుగు రోడ్డు బ్రిడ్జి వరకు గోడల నిర్మాణ పనులకు రూ. 158కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ పనులను ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు నిర్వహిస్తున్నారు. ఈ టెండర్లు ఇంకా ఖరారు కాలేదు. వర్షాకాలం నెత్తిమీదికొచ్చిన తర్వాత భద్రకాళి అవుట్ లెట్లకు షెట్టర్లు ఏర్పాటు చేస్తామని పనులు తాత్కాలికంగా మొదలు పెట్టారు. భద్రకాళి మత్తడినుంచి కాల్వలు చదును చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. సోమవారం తమ నాలా ఆధునికీకరణ పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవని, కచ్చా నాలా తీయాలని, లేనిపక్షంలో తమ కాలనీలు నీట మునుగుతాయని ప్రజలు బల్దియా ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఖిలా వరంగల్ అగర్తలా చెరువునుంచి శివనగర్, సాకారాశికుంట మీదుగా వెళ్లే ప్రధాన నాలాల అభివృద్ధి పనులు అక్కడక్కడ మొదలు పెట్టి వదిలేశారు. మధ్యమధ్యలో నాలాల్లో వరద నీరుపోక సమీప కాలనీలు ముంపు ముప్పునకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. గొర్రెకుంటనుంచి గరీబ్ నగర్, ఎస్ఆర్ నగర్, మధురా నగర్ మీదుగా, చిన్నవడ్డేపల్లి చెరువు, అక్కడినుంచి కోట చెరువు వరకు నాలాల మార్కింగ్, ప్రత్యామ్నాయ చర్యలు కరువయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఈ ఏడాది ఎలాంటి వరద ముంపు ముంచుకొస్తుందోనని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పసికందు కిడ్నాప్..
● కాజీపేట జంక్షన్లో ఘటన ● సికింద్రాబాద్లో పట్టుకుని తల్లికి అప్పగించిన పోలీసులు ● మహిళ అరెస్ట్ కాజీపేట రూరల్ : ఆకలికి ఏడుస్తున్న తనబిడ్డకు పాలు తీసుకురావడానికి తల్లి.. వేరే మహిళకు తన చిన్నారిని అప్పగించి వెళ్లింది. పాలతో తిరిగి వచ్చిన అనంతరం తన బిడ్డ, సదరు మహిళ కనిపించకపోవడంతో రైల్వే స్టేషన్ మొత్తం వెతికింది. ఆయినా ఆచూకీ లభించపోకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాజీపేట జీఆర్పీ సీఐ వి.నరేశ్కుమార్ కథనం ప్రకారం.. గౌరీ అనే ఓ మహిళ మంగళవారం 2,3 ప్లాట్ఫామ్లపై ఉన్న మరుగుదొడ్ల వద్ద తన బిడ్డను పడుకొబెట్టి అందులో పనిచేస్తున్న ఓ గుర్తు తెలియని మహిళకు అప్పగించి పాలు తీసుకురావడానికి వెళ్లింది. పాలతో వచ్చిన తల్లికి మరుగుదొడ్డి వద్ద పని చేసే మహిళ, తన బిడ్డ కనిపించలేదు. దీంతో రైల్వే స్టేషన్ మొత్తం గాలించినా ఆచూకీ లభించకపోవడంతో కాజీపేట జీఆర్పీ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్టేషన్లోని సీసీ ఫుటేజీ పరిశీలించారు. సదరు మహిళ.. పాపను కిడ్నాప్ చేసి రైలులో సికింద్రాబాద్కు వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ విషయం స్టేషన్లోని మరుగుదొడ్ల యజమానికి తెలుపగా సదరు మహిళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 10వ నంబర్ ప్లాట్ఫామ్పై ఉన్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు కాజీపేట రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు.ఈ క్రమంలో సదరు మహిళ బయట ఆటో కోసం వేచి ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకుని కాజీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కాజీపేట జీఆర్పీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఉపేందర్, కానిస్టేబుల్ రజిత సికింద్రాబాద్ వెళ్లి పాపను ఎత్తుకెళ్లిన మహిళ చింతల స్వప్నగా గుర్తించి అరెస్ట్ చేశారు. పాపను కాజీపేటకు తీసుకొచ్చి తల్లి గౌరికి అప్పగించారు. అనంతరం నిందితురాలు స్పప్నను కోర్టులో హాజరుపర్చినట్లు కాజీపేట జీఆర్పీ సీఐ వి.నరేశ్కుమార్ బుధవారం తెలిపారు. -
‘పహల్గాం’పై పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలి
న్యూశాయంపేట : పహల్గాం ఉగ్రఘటనపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని, కాల్పుల విరమణలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాత్రపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంటామని చెప్పి కాల్పుల విరమణకు ఒప్పించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనపై మోదీ జవాబు చెప్పాలన్నారు. ఆపరేషన్ కగార్ ఆపాలని వామపక్షాలు, మేధావులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేసినా పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. కేంద్ర బలగాలు.. మావోయిస్టుల మృతదేహాల ఎదుట నృత్యం చేయడం.. వారిని మోదీ, అమిత్ షా అభినందించడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేయాలని, లేదంటే ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదన్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు డబ్బులు లేవనడం సరికాదన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.సుదర్శన్రావు, జిల్లా కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు చుక్కయ్య, చక్రపాణి, వీరన్న, రమేశ్, వెంకట్, భానునాయక్, లింగయ్య, తిరుపతి, రాములు, తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ -
పుష్కరాల ఆదాయం రూ. 2.83 కోట్లు
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరిగిన సరస్వతీనది పుష్కరాల సందర్భంగా భక్తులు హుండీల్లో వేసిన నగదు కానుకలు, లడ్డు ప్రసాదం, రూమ్ల అద్దెలు, హోమాలు, దర్శనాల ద్వారా కాళేశ్వరాలయానికి రూ. 2.83కోట్ల ఆదాయం సమకూరినట్లు ఈఓ శనిగెల మహేశ్ తెలిపారు. బుధవారం శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయ హుండీలను లెక్కించారు. పుష్కరాలు 12 రోజులతో సహా మొత్తం 64 రోజులకు గాను హుండీల ద్వారా రూ.1,36,28,099 కోట్లు, దేవస్థానం అద్దె గదుల ద్వారా రూ.1.71లక్షలు, హోమాల ద్వారా రూ.1.23లక్షలు, శీఘ్రదర్శనం ద్వారా రూ.5.60.లక్షలు, ప్రసాదం ద్వారా రూ.1,38,36,552 కోట్లు, మొత్తం రూ. 2,83,18,651 ఆదాయం వచ్చినట్లు ఈఓ పేర్కొన్నారు. మిశ్రమ బంగారం 15 గ్రాములు, మిశ్రమ వెండి 1.750 గ్రాములు సమకూరిందని తెలిపారు. వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ సునీత, పర్యవేక్షణాధికారి నందనం కవిత ఆధ్వర్యంలో హుండీ నగదు లెక్కించారు. కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, పుష్కరాల ఉత్సవ కమిటీ సభ్యులు మోహన్శర్మ, సత్యనారాయణ, సత్యం, శ్యాందేవుడా, సత్యనారాయణ, సీతయ్య, ప్రశాంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం ఎస్సై తమాషా రెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
అక్రమార్కులపై చర్యలేవి..?
టీజీఎన్పీడీసీఎల్లో సబ్ ఇంజనీర్ల నియామకాల్లో అక్రమాలుహన్మకొండ : తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీ ఎన్పీడీసీఎల్) లో చేపట్టిన సబ్ ఇంజనీర్ల రిక్రూట్మెంట్లో అక్రమాలు జరిగినట్లు వాస్తవాలు వెలుగుచూశాయి. అయితే దీనిపై యాజమాన్యం బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తోంది. ఫలితంగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంపెనీ తీరుపై అనేక సందేహాలు నెలకొంటున్నాయి. అక్రమాలు జరిగినట్లు మూడు నెలల క్రితమే నిజాలు నిగ్గు తేలగా ఇప్పటి వరకూ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిని కాపాడడంలో ఉన్న ఆంతర్యమేమిటని విద్యుత్ ఉద్యోగ వర్గాలతో పాటు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు.. ఎన్నిక కోడ్ ఎత్తివేశాక 2018 డిసెంబర్లో పూర్వ సర్కిళ్ల వారీగా మరోసారి సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలని కాల్ లెటర్ పంపారు. అయితే ఈ సమయంలో మరో 24 పోస్టులు తగ్గించారు. గతంలో కాల్ లెటర్ అందుకుని రెండోసారి కాల్లెటర్ అందని అభ్యర్థులు వెంటనే హైకోర్టును ఆశ్రయించగా అంతకు ముందు కాల్లెటర్ జారీ చేసిన వారందరికీ తిరిగి జారీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు అనర్హులతో కలిపి 427 మందికి కాల్లెటర్ పంపి పోస్టులు భర్తీ చేశారు.. అయితే ఇక్కడ కోర్టు ఆదేశాలతో కాల్ లెటర్ పొందిన 24 మంది అభ్యర్థులను పక్కన పెట్టారు. ఇక్కడే అక్రమాలకు బీజం పడింది. కాల్ లెటర్ అందుకుని ఉద్యోగాలు రాని అభ్యర్థులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్లో నిర్వహించిన ప్రజాపాలనలో ఫిర్యాదు చేశారు. దీంతో టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం విచారణ చేపట్టింది. టీజీ పీఎస్సీ నుంచి ఒక అధికారి, టీఎస్ ఎస్పీడీసీఎల్ నుంచి ఇద్దరు, టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి ఇద్దరు అధికారులతో కూడిన కమిటీ పూర్తి స్థాయిలో విచారణ జరిపి 24 పోస్టుల భర్తీలో అక్రమాలకు జరిగినట్లు గుర్తించారు. అర్హులు కాని వారు ఉద్యోగాలు పొందినట్లు గుర్తించి విచారణ కమిటీ యాజమాన్యానికి నివేదిక అందించింది. ఈ నివేదిక మేరకు అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారికి నోటీసు జారీ చేయగా వారు కోర్టుకు వెళ్లారు. కోర్టు వీరికి అనుకూలంగా నిర్ణయం వెల్లడించడంతో వారు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. అన్యాయం జరిగిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సి ఉన్నా ఇప్పటి వరకు యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కీలక పోస్టులో ఏళ్ల తరబడి ఒకే అధికారి తిష్ట టీజీ ఎన్పీడీసీఎల్లో ఉద్యోగ నియామక ప్రక్రియను ఇండస్ట్రీయల్ విభాగం నిర్వహిస్తుంది. ఈ విభాగంలో కంపెనీ ఏర్పాటు నుంచి కీలక పోస్టులో ఒకే అధికారి ఏళ్ల తరబడి పని చేస్తున్నారు. ఈ అధికారిపై అనేక ఆరోపణలున్నాయి. అక్రమాలకు పాల్పడడంలో ఆయనది అందెవేసిన చేయి అని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఏళ్లుగా ఒకే పోస్టులో పని చేస్తుండడంతో ఏ సమయంలో ఎలా అక్రమాలకు పాల్పడొచ్చో ఆయనకు సంపూర్ణ అవగాహన ఉందని సమాచారం. దీంతో సబ్ ఇంజనీర్ల నియామకాల్లో అక్రమాలకు తెరలేపారని ఉద్యోగవర్గాలు పేర్కొన్నాయి. విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు497 సబ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి 2018లో నోటిఫికేషన్.. టీజీ ఎన్పీడీసీఎల్లో 497 సబ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి 2018, మే 24న నోటిఫికేషన్ జారీ చేశారు. అదే ఏడాది జూలై 8న రాత పరీక్ష నిర్వహించారు. ఆగష్టు 31న ఫలితాలు ప్రకటించారు. పోస్టుకు ఒక్కరు చొప్పున మెరిట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు ఒరిజనల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సెప్టెంబర్లో పూర్వ సర్కిల్ వారీగా వేర్వేరు తేదీల్లో కాల్ లెటర్ పంపించారు. నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు 497 మందికి కాకుండా 427 మందికి మాత్రమే కాల్ లెటర్ పంపారు. అంటే ఇక్కడ 70 పోస్టులు తగ్గించారు. అదే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో తాత్కాలికంగా నియామక ప్రక్రియ నిలిపేశారు. అక్రమార్కులపై చర్య తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటి?ఇంజనీర్ల నియామకాల్లో అక్రమాలు వెలుగు చూసినా ఎలాంటి చర్య తీసుకోకపోవడంలో ఉన్న ఆంతర్యమేమిటని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కింది స్థాయి ఉద్యోగులు చిన్న తప్పులు చేస్తే చర్యలు తీసుకునే యాజమాన్యం.. ఇంత పెద్ద అక్రమం జరిగినా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇలాగైతే భవిష్యత్లో చేపట్టనున్న నియామకాలు పారదర్శకంగా జరుగుతాయా అనే సందేహాలు నిరుద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. అక్రమాలకు పాల్పడింది ఇండస్ట్రీయల్ విభాగం అధికారులేనని స్పష్టంగా కనిపిస్తున్నా చర్యలకు వెనుకంజ వేయడంపై యాజమాన్యం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యుత్ ఉద్యోగులతోపాటు నిరుద్యోగులు కోరుతున్నారు. విచారణ ముగిసి మూడు నెలలైనా బాధ్యులపై చర్యలు శూన్యం యాజమాన్యం వెనుకడుగు వెనుక ఉన్న ఒత్తిళ్లేమిటి..? -
ట్రంప్ విధానాలతో విద్యార్థులకు తీవ్ర నష్టం
వరంగల్ చౌరస్తా : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలతో వర్తమాన దేశాలకు, విదేశీ ఉన్నత విద్యనభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ విమర్శించారు. బుధవారం మార్కిస్టు కమ్యూనిస్టు పార్టీ ఇండియా(ఐక్య) పొలిట్ బ్యూరో సమావేశాల అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రంప్ కొన్ని దేశాలపై కక్ష కట్టి భారీ పన్నులను విధిస్తూ అమెరికాలో చదువుకునే భారతీయ, ఇతర దేశాల విద్యార్థులపై అనేక ఆంక్షలు విధిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఈ విధానాలను వ్యతిరేకించాల్సిన భారత ప్రభుత్వం అందుకు విరుద్ధంగా మోకరిల్లి దేశానికి తీరని నష్టం చేకూరుస్తోందని మండిపడ్డారు. సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిరణ్ జిత్ సింగ్ శేఖన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, పొలిట్ బ్యూరో సభ్యుడు మహేంద్ర నేహ, అనుభవ్ దాస్ శాస్త్రి, కాటం నాగభూషణం, వల్లెపు ఉపేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోనె కుమారస్వామి, ఎన్రెడ్డి హంసారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలపాలి ఖిలా వరంగల్: కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై రాజ్యహింస, మావోయిస్టుల ఏరివేత పేరుతో పౌరులపై కొనసాగిస్తున్న కాల్చివేతను వెంటనే నిలపాలని ఎంసీపీఐ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు మర్రెడ్డి వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ శివనగర్లోని సాయి ఫంక్షన్ హాల్లో ఎంసీపీఐ కేంద్ర నాయకుడు మోర్తాల చందర్ రావు ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన పార్టీ రాష్ట్ర ప్రథమ మహాసభలు బుధవారం ముగిశాయి. ఈ ముగింపు సమావేశానికి వెంకట్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టి మావోయిస్టుల ఏరివేత పేరుతో కాల్చి చంపి వారి మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండపడ్డారు. ఇప్పటికై నా ఆపరేషన్ కగార్ నిలిపి మావోయిస్టులను శాంతి చర్చలకు ఆహ్వానించి పౌర హక్కులను కాపాడాలన్నారు. సమావేశంలో నాయకులు నర్ల చంద్రశేఖర్ , పానుగంటి నరసయ్య, మాదం తిరుపతి, మాడిశెట్టి అరుణ్ కుమార్, తాటికొండ రవి, మాలోత్ రాజేశ్ నాయక్, సంద గణేశ్, బాషిపాక రమేశ్, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ -
మట్టికి ఆరోగ్య పరీక్షలు..
ఖిలా వరంగల్: ఖరీఫ్లో రైతులు తమ పొలాల్లో భూసార పరీక్షలు చేయించుకోవడానికి ఇది అనువైన సమయం. ప్రతీ ఏడాది భూసార పరీక్షలు చేయించుకోవడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రైతులకు ఈ అంశంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ రాజన్న తెలిపారు. భూమిలో ప్రధానంగా 17 నుంచి 18 పోషకాలు.. మట్టి (భూసార) పరీక్షలతో నేల ఆరోగ్యం కాపాడినట్లు అవుతుందని, భూమిలో ప్రధానంగా 17 నుంచి 18 పోషకాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మట్టిలో నైట్రోజన్, పాస్పరస్ ముఖ్యమైన పోషకాలు. తర్వాత కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్( సీహెచ్ఓ) మైక్రోన్యూట్రెన్స్ (లఘు పోషకాలు) ప్రధానమని, ఇవన్నీ ఉంటే పంటల దిగుబడి అఽధికంగా వస్తుందని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూమిలో సహజ పోషకాలున్నా రైతులు అధిక దిగుబడులు కోసం ఇష్టారాజ్యంగా రసాయన ఎరువులు వాడడం వల్ల కొన్ని రోజులకు భూమి చౌడుగా మారి వినియోగంలోకి రాకుండా పోతుందని తెలిపారు. మట్టిని ఎలా సేకరించాలి.. ఏటవాలు పొలంలో వర్షపు నీరు ప్రవహించి పోషకాలు ఒకే దగ్గరికి చేరుతాయి. ఈనేపథ్యంలో రైతులు ఎకరం పొలంలో 8 నుంచి 10 ప్రదేశాల్లో మట్టిని సేకరించాలి. వీ ఆకారంలో 15సెం. వరకు పారతో గుంతతీసి, అందులో పైపొర ఇంచు లోతుకు తవ్వి మట్టి తీయాలి. తడిలేకుండా ఆరబెట్టాలి. చతురాస్త్రా ఆకారంలో నాలుగు విభాగాలు చేయాలి. ఎదురెదురుగా ఉన్న మన్ను మాత్రమే తీసుకోవాలి. మిగతా రెండు భాగాలను తొలగించాలి. ఇలా కిలో మట్టి వచ్చే వరకు చేయాలి. ఇలా సేకరించిన మట్టిలో రాళ్లు, పంట వేర్ల మొదళ్లు లేకుండా చూసుకుని నీడలో ఆరనివ్వాలి. నమూనా కోసం పొలంలో మట్టిని తవ్వి సేకరించే సమయంలో గట్ల దగ్గర, పంట కా ల్వలోని మట్టి తీసుకోవద్దు. చెట్ల కింద ఉన్న పొలం భాగం నుంచి మట్టిని సేకరించొద్దు. ఆ తర్వాత ఆ మట్టిని మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం, ములుగు రోడ్డులోని వ్యవసాయ పరిశోధన భూసార పరీక్ష కేంద్రానికి తరలించాలి. నిపుణులు సర్వే నంబర్తో నమోదు చేసుకుని ప్రయోగశాలలో పరీక్షలు చేసి నివేదిక అందజేస్తారు. ఉమ్మడి వరంగల్లోని పొలాల్లో జింక్ లోపం.. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు వరంగల్ జిల్లాలోని పొలాల్లో ఎక్కువ జింక్ లోపమున్నట్లు తేలిందని నిపుణులు చెబుతున్నారు. గతంలో పశువులు, గొర్రె ఎరువు పొలంలోని భూమిలో కలిసిపోయి ఎరువుగా మారడం వల్ల జింక్ ఉండేది. ఇప్పడు ఆ పరిస్థితి లేకపోవడంతో రైతులు రసాయన ఎరువులు వాడడంతో భూసారం తగిందని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు వెల్లడించారు. ప్రయోజనాలు.. భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల భూమిలో మొక్కకు కావాల్సిన పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. సమస్యాత్మక భూములున్నా వాటి గురించి తెలుసుకుని వాటిని సవరించుకునే విధానాలు కూడా ఉపయోగించొచ్చు.భూసారంతో అధిక దిగుబడులు ఎరువుల వాడకంలో ఖర్చులు తగ్గుదల సూక్ష్మ పోషకాల పరిమాణాన్ని తెలుసుకోవచ్చు మట్టి నమూనాను సేకరించే పద్ధతి ప్రదర్శన రైతులకు అవగాహన సదస్సులుభూసార పరీక్షలు తప్పనిసరిఖరీఫ్లో అన్నదాత కచ్చితంగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. చెప్పిన విధంగా మట్టిని సేకరించి ల్యాబ్లో అందజేస్తే వారంలోపు నివేదిక ఇస్తారు. నివేదిక ప్రకారం పంటలకు ఎరువులు వేస్తే పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుంది. –రవీందర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి మట్టి పరీక్షలపై అవగాహన పెంచుకోవాలి సాగుకు ముందే మట్టి నామూనా సేకరించి భూసార పరీక్షలు చేయించుకోవాలి. పరీక్షలు చేయించుకోవడం వల్ల అధిక దిగుబడులతోపాటు రసాయనిక ఎరువులు వాడకంలో ఖర్చులు తగ్గుతాయి. మట్టిపరీక్షలపై అవగాహన పెంచుకోవాలి. –డాక్టర్ రాజన్న, కేవీకే కోఆర్డినేటర్, మామునూరు -
రైతులకు మేలు చేసేందుకు విత్తన చట్టం
● రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్రెడ్డి కాజీపేట అర్బన్ : రైతులకు మేలు చేసేందుకు విత్తన చట్టం ముసాయిదా తోడ్పడుతుందని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్రెడ్డి తెలిపారు. బుధవారం హనుమకొండ జెడ్పీ హాల్లో ఏర్పాటు చేసిన నూతన విత్తన చట్ట ముసాయిదా తయారీకి కమిటీల అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో విత్తనోత్పత్తి చేస్తున్న రైతులు, పంటలు సాగు చేస్తున్న రైతులు నష్టపోకుండా ముసాయిదా ఏర్పాటు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఎక్కువ అమ్ముడవుతున్న ట్రూత్ఫుల్ విత్తనాలకు బదులు సర్టిఫైడ్ సీడ్లను డీలర్లు రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. భూభారతి చట్టం మాదిరి విత్తన చట్టం, మార్కెటింగ్ చట్టాల ముసాయిదా తయారు అవుతుందన్నారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్ధ ఆధ్వర్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదలైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటాయని, వరంగల్ టీ–సీడ్స్ కూడా అందుబాటులో ఉంటాయన్నారు. డీలర్లు రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సునీల్కుమార్, నర్సింహారెడ్డి, శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, డీఏఓ రవీందర్సింగ్, తదితరులు పాల్గొన్నారు. -
బ్రాండెడ్ పేరుతో నకిలీ ఎలక్ట్రికల్ పరికరాలు విక్రయం
● పట్టుకున్న కంపెనీ బృందం నెహ్రూసెంటర్ : బ్రాండెడ్ పేరుతో నకిలీ ఎలక్ట్రికల్ పరికరాలు (ఇంట్లో వినియోగించే విద్యుత్ పరికరాలు) విక్రయిస్తున్న షాపులో కంపెనీ బృందం తనిఖీ చేసింది. ఈ తనిఖీలో నకిలీ పరికరాలను గుర్తించి సీజ్ చేసింది. ఈ ఘటన బుధవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గోల్డ్మెడల్ కంపెనీ రీజినల్ హెడ్ నాగేశ్వర్రావు కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని నీలం ఎలక్ట్రికల్ అండ్ శానిటరీ షాపులో బ్రాండెడ్ ఎలక్ట్రికల్ పేరుతో నకిలీ పరికరాలు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీలు చేపట్టామన్నారు. ఇందులో నకిలీ ఎలక్ట్రికల్ పరికరాలు విక్రయిస్తున్నట్లు గుర్తించి ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. రాజస్తాన్ ప్రాంతం నుంచి వచ్చి షాపులను నిర్వహిస్తూ ఇలాంటి నకిలీ పరికరాలు విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. నకిలీ ఎలక్ట్రికల్ పరికరాల వినియోగంతో వి ద్యుత్ ప్రమాదాలు సంభవిస్తాయని, ప్రజలు నకిలీ పరికరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. టౌన్ ఎస్సై విజయ్కుమార్ సమక్షంలో తనిఖీలు చేపట్టి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
రంగస్థల నటుడు శ్యామలరావు కన్నుమూత
హన్మకొండ కల్చరల్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు నాటక రంగంలో దర్శకుడిగా, నటుడిగా ఖ్యాతి గడించిన శతపతి శ్యామలరావు (66) కన్నుమూశారు. వరంగల్ రైల్వేగేట్ ఉర్సు కరీమాబాద్కు చెందిన శతపతి శ్యామలరావుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయనకు భార్య కిడ్నీ దానం చేశారు. కిడ్నీ శరీరానికి సరికాకపోవడంతో అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఏటా రంగలీలా మైదానంలో నిర్వహించే రావణవధ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు. నరకాసురవధ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గత ఆదివారం ప్రముఖ రంగస్థల కళాకారుడు జీవీ బాబు మరణించడం.. బుధవారం మరో రంగస్థల సీనియర్ కళాకారుడు శతపతి శ్యామలరావు మృతి చెందడంతో ఓరుగల్లు రంగస్థల కళాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి, తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల అధ్యక్షుడు ఆకుల సదానందం, ఐక్యవేదిక బాధ్యులు కాజీపేట తిరుమలయ్య, ఎన్ఎస్ఆర్ మూర్తి, సీనియర్ కళాకారుడు జేఎన్ శర్మ, జూలూరు నాగరాజు, సహృదయ సాహిత్య సాంస్కృతిక బాధ్యులు, తదితరులు సంతాపం తెలిపారు. -
వ్యర్థాల తరలింపులో నిర్లక్ష్యంపై మేయర్ ఆగ్రహం
వరంగల్ అర్బన్ : నాలాలు, డ్రెయినేజీల్లో తొలగించిన వ్యర్థాలను తరలించకుండా వదిలేయడంపై నగర మేయర్ గుండు సుధారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ పోతనగర్ రోడ్డులోని స్మార్ట్సిటీ పనులతో చేపడుతున్న అభివృద్ధి పనులను, 28, 29 డివిజన్లలో సుశీల్ గార్డెన్ జంక్షన్నుంచి రామన్నపేట, బీట్ బజార్నుంచి 12 మోరీలు, రఘునాథ కాలనీ డ్రెయిన్ల మీదుగా బట్టల బజార్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి, వేంకటేశ్వర స్వామి ఆలయం వెనుక వైపున గల డ్రెయిన్లు, ఇతర ప్రాంతాలను ఇంజనీరింగ్, శానిటేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి బుధవారం ఆమె క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. పోతననగర్ ప్రాంతంలో నిర్మాణ పనులు చేపట్టి మట్టికుప్పలను అలాగే వదిలి వేయడం వల్ల భారీ వర్షాలు కురిసే క్రమంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అసహనం వ్యక్తం చేశారు. ఆ కుప్పలను వెంటనే తొలగించేలా చూడాలన్నారు. దుకాణదారులు డ్రెయిన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలను వేయకుండా నియంత్రించాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రేతలకు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కలిగించి ఉల్లంఘిస్తే పెనాల్టీలు విధించాలని ఆదేశించారు. ప్రధాన నాలాల్లో మూడు రోజుల్లోగా పూడికతీత పూర్తి చేయాలని సూచించారు. తనిఖీల్లో ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈ రవి కుమార్, టీపీఎస్లు పాల్గొన్నారు. ఇంజినీరింగ్, టౌన్ అధికారుల సమన్వయంతో పనిచేయాలి క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన మేయర్ గుండు సుధారాణి -
కోటను సందర్శించిన మాల్దీవ్స్ దేశస్తులు
ఖిలా వరంగల్: కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోటను బుధవారం మాల్దీవ్స్ దేశస్తులు సందర్శించారు. నాలుగు కీర్తితోరణాల నడుమ నళ్ల రాతిలో నాటి శిల్పులు చెక్కిన శిల్పకళ సంపదను తిలకించారు. అనంతరం రాతి, మట్టికోట అందాలు, ఖుష్మహల్ను సందర్శించి కాకతీయుల కళాఖండాలను తమ వెంట తెచ్చుకున్న కెమెరాల్లో బంధించుకున్నారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను కోట గైడ్ రవి వివరించారు. వారివెంట కేంద్రపురావస్తుశాఖ కో–ఆర్డినేటర్ శ్రీకాంత్, టీఎస్టీడీసీ కోట ఇన్చార్జ్ అజయ్ పాల్గొన్నారు. వరంగల్లో సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ : ఎంపీ కావ్యహన్మకొండ చౌరస్తా: త్వరలో వరంగల్లో సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ప్రారంభమవుతున్నట్లు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెల్నెస్ సెంటర్కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు ఆ శాఖ అదనపు కార్యదర్శి రోలీసింగ్ లేఖ రాశారని పేర్కొన్నారు. అవసరమైన పోస్టుల భర్తీకి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్నుంచి ఆమోదం కూడా లభించినట్లు పేర్కొన్నారు. ఈ వెల్నెస్ సెంటర్ ద్వారా వైద్య చికిత్సలు, వ్యాధి నిర్ధారణ తదితర సదుపాయాలు కలుగుతాయని తెలిపారు. సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేసిన ఎంపీ కావ్యకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. క్రైం ఏసీపీగా సదయ్యహసన్పర్తి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైం ఏసీపీగా సదయ్య నియమితులయ్యారు. సీఐడీ విభాగంలో పనిచేసిన సదయ్య బదిలీపై ఇక్కడికిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. గతంలోని ఆత్మకూర్లో ఎస్సైగా, కేయూసీ, సుబేదారి పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించారు. నిట్లో టెమ్ ఎక్స్పో కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లోని సీఆర్ఐఎఫ్ (సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్ట్రూమెంటేషన్ ఫెసిలిటీ) భవనంలో బుధవారం ఏర్పాటుచేసిన టెమ్ (ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్పోపీ) స్పెసిమెన్ ప్రిపరేషన్ పరికరాల ఎక్స్పోను నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ప్రారంభించి మాట్లాడారు. నానో టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలకు వేదికగా ఎక్స్పో నిలవాలని ఆకాంక్షించారు. నిట్తోపాటు వివిధ విద్యాసంస్థల విద్యార్థులకు, పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు తోడ్పడుతుందన్నారు. కార్యక్రమంలో డీన్ అకాడమీ శరత్బాబు, ప్రొఫెసర్ శ్రీలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. కాజీపేట రైల్వే అమృత్ భారత్ పనుల తనిఖీకాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లో జరుగుతున్న అమృత్ భారత్ రైల్వే పునరాభివృద్ధి పనులను బుధవారం సికింద్రాబాద్ డివిజన్ అడిషనల్ రైల్వే మేనేజర్ (ఏడీఆర్ఎం) గోపాల్ తనిఖీ చేశారు. స్థానిక రైల్వే అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న కాజీపేట రైల్వే రన్నింగ్ రూం కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అక్కడి నుంచి రైల్వే డిజిల్ లోకోషెడ్కు వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను తనిఖీ చేసి షెడ్ అధికారులతో మాట్లాడారు. ఆయనవెంట సికింద్రాబాద్ డివిజన్ ఏడీఈన్ ప్రంజల్ కేసరి, కాజీపేట ఏడీఈఎన్ కేఆర్కె.రాజు, ఐఓడబ్ల్యూ విజయ్కుమార్, వివిధ విభాగాల స్థానిక అధికారులు పాల్గొన్నారు. -
ఆస్పత్రి నిర్మాణ నిధుల పెంపుపై విచారణ
హన్మకొండ చౌరస్తా: వరంగల్ నగరంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం ఎలాంటి అప్రూవల్ లేకుండా రూ.600 కోట్లు వెచ్చించినట్లు గత బీఆర్ఎస్ సర్కార్ చెబుతుందని, ఈ అక్రమాలపై ప్రభుత్వం విచారణ కమిటీ వేయనున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. హనుమకొండ బాలసముద్రంలోని ప్రజాభవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎంజీఎం ఆస్పత్రికి ఇకనుంచి వారానికోసారి వెళ్లి వైద్య సదుపాయాలు పరిశీలిస్తూనే అధికారులతో సమీక్షిస్తానని తెలిపారు. హనుమకొండలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన సముదాయం నిర్మాణానికి ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయిస్తూ జీఓ విడుదల చేసిందన్నారు. కాకతీయ యూనివర్సిటీ స్థలంలో పెగడపల్లికి వెళ్లే దారిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనం నిర్మించేందుకు అనుకూలంగా ఉందని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. హనుమకొండ చౌరస్తాలో కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. గత సర్కారు హయాంలో నిర్మించిన వెండింగ్ జోన్లను బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముకున్నారని, అందుకు సంబంధించిన చిట్టాను త్వరలోనే బయటపెడతానని తెలిపారు. కార్మిక నాయకుడినని చెప్పుకుంటున్న నాయకుడు పదేళ్లలో కార్మిక భవనం ఎందుకు నిర్మించలేదో చెప్పాలని ప్రశ్నించారు. చేసిన అభివృద్ధిపై మాట్లాడాలని అనేక సార్లు సవాల్ విసిరితే, చేతకాక కోడిగుడ్డుపై ఈకలు పీకే రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు, భవన నిర్మాణానికి నిధులు కేటాయించడంపై సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. సమావేశంలో పీసీసీ సభ్యుడు ఈవీ శ్రీనివాసరావు, గ్రంథా లయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్ఖాన్, మున్సిపల్ కా ర్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు బంక సరళ, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ పెరుమాండ్ల రామకృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఇకనుంచి వారానికోసారి ఎంజీఎం వెళ్తా.. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరుపై సీఎం రేవంత్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం -
సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శిగా కర్రె భిక్షపతి
హసన్పర్తి: సీపీఐ హనుమకొండ జిల్లా కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా కర్రె భిక్షపతి, సహాయ కార్యదర్శులుగా తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, కార్యవర్గ సభ్యులుగా సిరబోయిన కర్ణాకర్, శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, నద్దునూరి అశోక్ స్టాలిన్, ఏదునూరి వెంకట్రాజం, బత్తిని సదానందం, కొట్టెపాక రవి, మునిగాల భిక్షపతి, నేదునూరి రాజమౌళి, ఉట్కూరి రాములు (రైతు సంఘం), కర్రె లక్ష్మణ్ (వ్యవసాయ కార్మిక సంఘం), ఓదెలు, బాషబోయిన సంతోష్ (విద్యార్థి సంఘం), మంచాల రమాదేవి(మహిళా సమాఖ్య), జక్కుల రాజుగౌడ్ (ఏఐటీయూసీ)తోపాటు మరో 45 మంది జిల్లా కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు. జిల్లాలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి హనుమకొండ జిల్లాలో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి డిమాండ్ చేశారు. హసన్పర్తి మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు ఏర్పాటు వల్ల నిరుద్యోగాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. ఎన్నికల హామీల అమలులో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన పార్టీ మహాసభలను విజయవంతం చేసిన కార్యకర్తలు, నాయకులకు భిక్షపతి కృతజ్ఞలు తెలిపారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, నాయకులు పాల్గొన్నారు. -
‘ఆర్యువీ’పై వీసీలో సమీక్ష
వీసీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి బుధవారం జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వం పెట్టే ప్రతి పైసా పెట్టుబడిగా ఎలా పనిచేస్తుందో రెగ్యులర్గా అధికారులు మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాలనుంచి కలెక్టర్లుప్రావీణ్య, సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఇన్చార్జి అదనపు కలెక్టర్లు వైవీ గణేశ్, మేన శ్రీను, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
తొలగింపా.. విలీనమా?
కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపా.. లేక ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి విలీనం చేస్తారా? అనే మీమాంసలో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో ప్రైవేట్ ఉద్యోగులు భాగస్వాములు కావొద్దని అదే విధంగా.. ఔట్ సోర్సింగ్ విధానాన్ని సైతం తీసేసే ప్రక్రియలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీంతో ముందస్తుగా అప్రమత్తమైన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ అనుబంధ సంఘమైన టీఎన్జీఓస్ నాయకులతో ఇటీవల హైదరాబాద్లో సమావేశమై ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రీమెన్ కమిటీ చైర్మన్ నవీన్ మిట్టల్తో చర్చలు జరిపి ఉద్యోగులను తొలగించకుండా కృషి చేసేలా చర్యలు చేపట్టాలని వేడుకున్నారు. కాగా.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కార్పొరేషన్లోకి విలీనం చేసేలా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల వివరాలు సేకరించింది. దీంతో జూన్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. నేరుగా ప్రభుత్వమే వేతనాలిచ్చేలా.. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏజెన్సీల ద్వారా రిక్రూట్ అవడంతో పాటు వారికి కేటాయిస్తున్న వేతనాల్లో కమీషన్ పొందుతున్నారు. దీంతో ప్రభుత్వానికి సేవలందిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో ఏజెన్సీల కమీషన్లతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఏజెన్సీలను ఎత్తేసి కార్పొరేషన్లో విలీనం చేస్తే ఉద్యోగులకు నేరుగా ప్రభుత్వమే వేతనాలందించే ఆస్కారం ఉంటుంది. కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2023లో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించారు. అదే మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం ఔట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగభద్రత కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఉమ్మడి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 20 నుంచి 30 ఏళ్ల పైబడి 13 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అటెండర్లుగా, షెరఫ్లుగా, డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖతో ముడిపడిన ఉద్యోగం తప్ప వేరే పనులు చేసుకోలేని స్థితిలో 30 ఏళ్లుగా పని చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా వివిధ శాఖల్లో వారిని పర్మనెంట్ ఉద్యోగులుగా ఎంపిక చేశారు. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా లేదా.. కార్పొరేషన్లో విలీనం చేయాలని ఎదురుచూస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి.. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రభుత్వానికి ఆదాయం అందజేయడంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర కీలకమైంది. ఏళ్లుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలి. – మోతె శ్రీనివాస్రెడ్డి, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కార్పొరేషన్లో విలీనం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా బెనిఫిట్స్ అందజేయాలి. ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నాం. హైదరాబాద్లోని టీఎన్జీఓస్ భవన్లో, సెక్రటేరియట్లో వినతులు అందజేశాం. కార్పొరేషన్లోకి రిజిస్ట్రేషన్ శాఖ ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఎత్తివేతకు రంగం సిద్ధం – జగన్, ఔట్సోర్సింగ్ అసోసియేషన్ సభ్యుడు -
చిరువ్యాపారులపై అధికారుల జులుం
కూరగాయల దుకాణాల తొలగింపు హన్మకొండ చౌరస్తా: చిరువ్యాపారులపై బల్దియా అధికారులకు కోపం వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై కూరగాయలు అమ్ముతున్నారంటూ నేలపై పడేశారు. దండం పెడతాం వదిలేయండని వేడుకున్నా కనికరించలేదు. దీంతో పలువురు చిరువ్యాపారులు కన్నీరు మున్నీరయ్యారు. హనుమకొండ చౌరస్తాలోని ఖాళీ స్థలంలో గత నాలుగేళ్లుగా దాదాపు 40కి పైగా చిరువ్యాపారులు కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం చౌరస్తా కూరగాయల అడ్డా వద్దకు వచ్చిన మున్సిపల్ అధికారులు ‘మీకు ఖాళీ చేయాలని రెండు రోజుల ముందే చెప్పాం. అయినప్పటికీ మీరు చేయడం లేదు’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయలను చిందరవందర చేశారు. వద్దు సారూ గిరిగిరి తెచ్చి కూరగాయలు కొనుక్కొచ్చా అంటూ వేడుకున్నా వదిలి పెట్టలేదు. రేపటినుంచి ఇక్కడ ఎవరూ ఉండొద్దంటూ హుకుం జారీ చేసి వెళ్లారని మహిళ చిరువ్యాపారులు కన్నీరు పెడుతూ చెప్పారు. -
దేశపౌరులను చంపిన వారితో చర్చలా?
హసన్పర్తి : దేశపౌరులను చంపిన ఉగ్రవాదులతో చర్చలకు సిద్ధపడిన కేంద్ర ప్రభుత్వం..పేదల కోసం పోరాడుతున్న మావోయిస్టులతో చర్చలు జరపడానికి ఎందుకు ముందుకు రావడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. హసన్పర్తిలో జరుగుతున్న ఆ పార్టీ హనుమకొండ జిల్లా మహాసభల్లో భాగంగా మంగళవారం ఏర్పాటుచేసిన సీపీఐ ప్రతినిధుల సభలో సాంబశివరావు మాట్లాడారు. ఉగ్రవాదుల కంటే కమ్యూనిస్టులు అంటేనే మోదీకి భయమన్నారు. బూటకపు ఎన్కౌంటర్ వల్లే శవాలను ఇవ్వడానికి భయపడ్డారని పేర్కొన్నారు. కేంద్రం ప్రభుత్వం చేస్తున్న బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో బీజేపీతో జతకట్టడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని, కేసీఆర్కు కవిత రాసిన లేఖ ద్వారా అది స్పష్టమైందన్నారు. ఆపరేషన్ కగార్పై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్రావు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చేసి మనువాదాన్ని తీసుకువచ్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నివేదికను సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి ప్రవేశపెట్టగా, వాటిని ఆమోదించారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి, వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి, కార్యక్రమ ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు రాజమౌళి, ప్రధాన కార్యదర్శి జ్యోతి, సీనియర్ నాయకులు మోతె లింగారెడ్డి, సారంగపాణి, శంకర్, షేక్ బాబా, సిరబోయిన కర్ణాకర్, శ్యాం సుందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు -
సర్వే నివేదిక ఆధారంగా రిజిస్ట్రేషన్లు
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్యహసన్పర్తి : రాబోయే రోజుల్లో సర్వే నివేదిక ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేసే అవకాశం ఉందని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సంస్కృతీ విహార్లో 50రోజుల పాటు నిర్వహిస్తున్న సర్వేయర్ల శిక్షణ శిబిరాన్ని మంగళవారం కలెక్టర్ సందర్శించారు. సర్వేకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణార్థులకు అవసరమైన మెటీరియల్ను అందజేశారు. అనంతరం ప్రావీణ్య మాట్లాడుతూ.. శిక్షణలో సర్వేయర్లు అన్ని అంశాలపై పట్టు సాధించాలన్నారు. చివరగా పరీక్షలు నిర్వహించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికే భూభారతి సర్వేయర్లుగా అవకాశం లభిస్తుందన్నారు. భూవివాదాల పరిష్కారానికి సర్వే నివేదికలే కీలకమన్నారు. కాగా, కలెక్టర్ స్వయంగా శిక్షణార్థులతో కలిసి కూర్చొని పాఠాలు విన్నారు. కార్యక్రమంలో సర్వే ల్యాండ్ ఏడీ శ్రీనివాస్, తహసీల్దార్ చల్లా ప్రసాద్స, లైసెన్స్ సర్వేయర్ల జిల్లా అధ్యక్షుడు పెసరు బొందయ్య, చుంచు రవి, తదితరులు పాల్గొన్నారు. ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీ అదేవిధంగా మండలంలోని లక్ష్మీ ఫర్టిలైజర్, ఆగ్రోస్ రైతుసేవా కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నిల్వలు, విక్రయాలకు సంబంధించిన రికార్డులు, బిల్లులను పరిశీలించారు. గోదాంలోని నిల్వలను స్వయంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రవీందర్సింగ్, మండల వ్యవసాయాధికారి అనురాధ తదితరులు పాల్గొన్నారు. భూసేకరణను వేగంగా పూర్తి చేయాలి హన్మకొండ అర్బన్ : హనుమకొండ జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్ట్, గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో భూసేకరణ ప్రక్రియపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. భూసేకరణ మొదటి దశలో గుర్తించిన రైతులకు జూన్ 30 నాటికి పరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ డీఈ చైతన్య, ఆర్అండ్బీ ఈఈ సురేష్ బాబు, ఆర్డీఓలు రాథోడ్ రమేష్, కె.నారాయణ, నేషనల్ హైవే అధికారులు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఒక్క ఏఆర్కు ఐదు బాధ్యతలు!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ల (ఏఆర్) కొరత వేధిస్తోంది. ఒక్కరికే ఐదు కీలక విభాగాల బాధ్యతలు అప్పగించడం, మరో ముగ్గురిని ఒక విభాగంలోనే పనిచేయించడంలో అధికారుల ఆంతర్యమేమిటో అంతుపట్టడం లేదన్న చర్చ నడుస్తోంది. యూనివర్సిటీలో 15 అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఒక పోస్టు ఖాళీగా ఉండగా, మరో ఇద్దరు కొంతకాలం క్రితమే సస్పెన్షన్కు గురయ్యారు. మరొకరు ఈ ఏడాది జూలైలో ఉద్యోగ విరమణ పొందనున్నట్లు సమాచారం. యూనివర్సిటీలో ప్రస్తుతం 12మంది ఏఆర్లు పనిచేస్తున్నారు. అందులో ఎక్కువమంది ఒక్కొక్కరికి రెండు, మూడు చోట్ల బాధ్యతలు అప్పగించడంతో పనిభారం పడుతోందని అంటున్నారు. యూనివర్సిటీ కాలేజీలు, వివిధ విభాగాలు పెరిగినా ఏఆర్ల పోస్టులు మాత్రం పెరగడం లేదు. అర్హులైన సూపరింటెండెంట్లకు ఏఆర్గా పదోన్నతులు కల్పించడంలేదు. మరోవైపు యూనివర్సిటీలో నాలుగు డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. అర్హులైన ఏఆర్లకు డిప్యూటీ రిజిస్ట్రార్లుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంది. కానీ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. సెలవుపై ఏఆర్.. మరొకరికి ఐదుచోట్ల బాధ్యతలు కాకతీయ యూనివర్సిటీలో కీలక విభాగాల్లో పబ్లికేషన్ సెల్ డైరెక్టర్గా, పరీక్షల విభాగం, సర్టిఫికెట్ సెక్షన్లో అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా, ఎస్డీఎల్సీఈలో ఏఆర్గా కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్న డాక్టర్ నర్సింహారావు ఇటీవల నెలరోజులపాటు సెలవుపై అమెరికాకు వెళ్లారు. ఆయన నిర్వహిస్తున్న ఆ మూడు బాధ్యతలను ఏఆర్ హబీబుద్దీన్కు అదనంగా అప్పగించారు. ఇప్పటికే హబీబుద్దీన్ క్యాంపస్లో అకడమిక్ డీన్ ఆఫీస్లో, యూజీసీ విభాగంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నర్సింహారావు నిర్వర్తించిన మూడు కీలక బాధ్యతలను హబీబుద్దీన్కు అప్పగించడంతో ఐదుచోట్ల పనిచేయడం ఇబ్బందికరంగా మారింది. ఆ ఐదు విభాగాలు కూడా కీలకమైనవే కావడం, ఒకరోజు సెలవు పెడితే ఐదు చోట్ల ఇబ్బంది ఏర్పడే పరిస్థితులున్నాయి. ఒక్క చోటనే బాధ్యతలు నిర్వర్తిస్తున్న ముగ్గురు ఏఆర్లు కూడా ఉన్నారు. వారిలో ఒక్కొక్కరికి మరోచోట అదనంగా బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న చర్చ జరుగుతోంది. కీలక పదవులు ఉన్నవారికే అదనపు బాధ్యతలు అప్పగించడంలో యూనివర్సిటీ అధికారుల ఆంతర్యమేమిటి అనేది కూడా చర్చగా ఉంది. పరీక్షల విభాగంలో సర్టిఫికెట్ సెక్షన్ కూడా కీలకమైంది. అక్కడ ఎప్పటికి ఒక ఏఆర్ అయినా బాధ్యతలను నిర్వర్తించాల్సింటుంది. ఒకప్పుడు ఆ విభాగంలో డిప్యూటీ రిజిస్ట్రార్ విధులను నిర్వర్తించారు. ఆయన కొంతకాలం క్రితమే ఉద్యోగ విరమణ పొందారు. ఆయనస్థానంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ కూడా లేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ సెక్షన్పై పర్యవేక్షణ కొరవడే అవకాశాలున్నాయి. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి, హాస్టళ్ల ఆఫీస్కు ఏఆర్లు లేరు.. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న ఏఆర్ కొన్నినెలల క్రితమే సస్పెండ్ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ఎవరినైనా నియమించాల్సింటుంది. ఏఆర్ లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆ కాలేజీ ప్రిన్సిపాల్, నాన్టీచింగ్ అసోసియేషన్ బాధ్యులు ఇటీవల వీసీ, రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవటం లేదు. కేయూ హాస్టళ్ల డైరెక్టర్ కార్యాలయంలో ఏఆర్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే లక్షల్లో బిల్లులు పెడుతుంటారు, లావాదేవీలుంటాయి. పరిశీలన, పర్యవేక్షణ కూడా అవసరం ఉంటుంది. అక్కడ హాస్టళ్ల డైరెక్టర్ కార్యాలయంలో పనిచేసిన ఏఆర్ ఏసీబీకి పట్టుబడి సస్పెన్షన్ అయి 17 నెలలు కావొస్తుంది. అప్పటినుంచి ఆ బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు. కేయూ వీసీగా ప్రతాప్రెడ్డి బాధ్యతలు స్వీకరించి ఏడు నెలలు అవుతుంది. అయినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, కనీస మార్పు రాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ల కొరత పనిభారంతో ఏ విభాగాన్ని సరిగా చూసుకోలేని పరిస్థితి.. ముగ్గురికి ఒక్కచోటే బాధ్యతలు, మరికొందరికి రెండు, మూడు అమెరికాకు వెళ్లిన మరో ఏఆర్, ఇంకో ఇద్దరు సస్పెన్షన్లో.. -
ఇన్చార్జ్ల పాలన!
రవాణా శాఖలో సాక్షిప్రతినిధి, వరంగల్ : రవాణా శాఖలో ఇన్చార్జ్ల పాలన కొనసాగుతోంది. కోర్టు స్టే కారణంగా కొద్ది రోజులుగా ఆ శాఖలో డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) జాబితాకు బ్రేక్ పడింది. దీంతో పదోన్నతులు, నియామకాలు నిలిచాయన్న సాకుతో చాలాచోట్ల మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్(ఎంవీఐ)లనే ఇన్చార్జ్ జిల్లా రవాణా శాఖాధికారులు(డీటీఓ)గా నియమించారు. మరికొందరు ఎంవీఐలకు.. ఎంవీఐతో పాటు ఇన్చార్జ్ డీటీఓలుగా ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించారు. కాగా.. కొందరు ఎంవీఐలు ఇన్చార్జ్ డీటీఓ పోస్టును పోటీపడి తెచ్చుకున్న సందర్భాలుంటే.. మరికొన్నిచోట్ల జూనియర్లను డీటీఓలుగా తెరమీద పెట్టి సీనియర్లు తెరవెనుక చక్రం తిప్పుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు కూడా ఇష్టారాజ్యం.. ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో డీటీసీ, డీటీఓ పోస్టుల్లో ఇన్చార్జ్లే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పదోన్నతులు నిలిపేసి ఒక్కో సీనియర్ ఎంవీఐకి రెండు నుంచి నాలుగు జిల్లాల్లో ‘ఆన్ డిప్యుటేషన్ పోస్టింగ్’లు ఇచ్చి పెద్ద ఎత్తున దండుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరిగింది. ఇందులో కీలక సూత్రధారిగా ఉన్న ఓ అధికారి ప్రభుత్వం మారాక స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పెట్టుకోవడం కొసమెరుపు కాగా.. అతడికి అండగా నిలిచిన కొందరు ఏసీబీ కేసుల్లో ఇరుక్కుని సస్పెండయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొందరు ఇన్చార్జ్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లోని కొందరు పెద్దల ఆశీస్సులతో పలువురు పదోన్నతులు, హోదాలతో పని లేకుండా ఎంవీఐలు ఇన్చార్జ్ డీటీఓలు, డీటీసీలుగా వ్యవహరిస్తున్నారు. అక్కడితో ఆగకుండా పొరుగు జిల్లాల బాధ్యతల కోసం పైరవీలు చేయడంపై చర్చ జరుగుతోంది. పాతుకుపోయారు.. ఏళ్లుగా పాతుకుపోయిన కొందరు రవాణాశాఖ అధి కారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేసుకుంటూ కో రుకున్న పోస్టుల్లో కొనసాగుతున్నారనే చర్చ జరుగుతోంది. భూపాలపల్లి కార్యాలయంలో కీలకంగా ఉన్న ఓ అధికారి నాలుగేళ్లుగా అక్కడే తిష్ట వేశారు. వివిధ పోస్టుల్లో అక్కడే పాతుకుపోవడంతో పాలన గాడి తప్పి అవినీతి పెరిగిందన్న ఆరోపణ లున్నాయి. హనుమకొండ డీటీఓ ఆఫీసులో తెరవెనుక చక్రం తిప్పుతున్న ఓ కీలక అధికారి సుమారు పదేళ్లుగా ఉమ్మడి వరంగల్లో వివిధ చోట్ల పనిచేసి పాతుకుపోయారన్న చర్చ ఉంది. ఏడాది క్రితం హనుమకొండకు బదిలీ కాగా.. కొద్ది రోజులకే ఏ సీబీ దాడులు జరిగాయి. ఈకేసులో డీటీసీ పుప్పాల శ్రీనివాస్ సస్పెండ్ కావడం కలకలం రేపింది. కీలక పోస్టుల్లో ఇన్చార్జ్లు.. ● హనుమకొండ డీటీఓ, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్(డీటీసీ)గా ఉన్న పుప్పాల శ్రీనివాస్పై అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేయగా సస్పెండయ్యారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో కరీంనగర్ డీటీసీ పురుషోత్తంకు ఇన్చార్జ్ డీటీసీ బాధ్యతలు అప్పగించారు. ● హనుమకొండ డీటీఓ పోస్టు ఖాళీ కావడంతో వాస్తవానికి అదే కార్యాలయంలో సీనియర్గా ఉన్న 1994 బ్యాచ్కు చెందిన రమేశ్రాథోడ్కు ఇన్చార్జ్ డీటీఓగా ఇవ్వాల్సి ఉంది. అయితే కీలక పోస్టులో ఉండడం ఇష్టం లేక అతను ఆసక్తి చూపకపోవడంతో 2012 బ్యాచ్కు చెందిన వేణుగోపాల్కు ఇన్చార్జ్ డీటీఓగా నియమించినట్లు ప్రచారంలో ఉంది. ● మహబూబాబాద్ గౌస్పాషా ఏసీబీకి చిక్కడంతో సస్పెన్షన్కు గురయ్యాడు. ఆయన స్థానంలో వరంగల్ ఎంవీఐ జైపాల్రెడ్డిని ఇన్చార్జ్ డీటీఓగా నియమించారు. ● ములుగు డీటీఓ సిరాజ్ రెహమాన్ ఉద్యోగ విరమణ చేశాడు. అక్కడ ఎంవీఐ, డీటీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిరాజ్ రిటైర్డ్మెంట్ తర్వాత ఆయన స్థానంలో పెద్దపల్లి ఎంవీఐ బి.శ్రీనివాస్ను ఇన్చార్జ్ డీటీఓగా నియమించారు. ప్రస్తుతం ములుగు ఎంవీఐ, ఇన్చార్జ్ డీటీఓగా కూడా శ్రీనివాసే వ్యవహరిస్తున్నారు. ● జేఎస్ భూపాలపల్లి ఇన్చార్జ్ డీటీఓ వేణు బదిలీ తర్వాత ఎవరినీ నియమించలేదు. అక్కడ ఎంవీఐగా ఉన్న సంధానికే ఇన్చార్జ్ డీటీఓ బాధ్యతలు ఇచ్చారు. ప్రస్తుతం భూపాలపల్లి ఎంవీఐ, ఇన్చార్జ్ డీటీఓగా సంధానీ పని చేస్తున్నారు. ● ఈ ఏడాది ఫిబ్రవరి 8న వరంగల్ డీటీఓ లక్ష్మిపై బదిలీ వేటు పడింది. డీటీసీ పుప్పాల శ్రీనివాస్పై ఏసీబీ దాడులు జరిగిన మరుసటి రోజే లక్ష్మిని బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. ఆమె స్థానంలో ఎంవీఐ శోభన్బాబు ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తున్నారు. ఎంవీఐలే డీటీఓలు.. పలుచోట్ల ఇదే పరిస్థితి హనుమకొండ డీటీఓగా జూనియర్కు బాధ్యతలు తెరవెనుక చక్రం తిప్పుతున్న సీనియర్లు విచారణలు, ఆరోపణలున్నా.. కుర్చీలు వదలని అధికారులు ఆదాయం ఉన్న పోస్టింగ్ల కోసం ఇంకా పైరవీలు -
‘సూపర్’ ఆస్పత్రి పనులు త్వరగా పూర్తిచేయాలి
ఎంజీఎం : ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు నిర్మిస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్ అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆయన ఆస్పత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో రామకృష్ణరావు మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణ ప్రజల వైద్య అవసరాల కోసం నిర్మిస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని త్వరగా అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో సీఎం రేవంత్రెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఐకానిక్ అని.. దేశంలోనే అత్యధిక నిధులతో మెరుగైన వైద్య సేవలు, ఆధునిక సదుపాయాలతో నిర్మిస్తున్నదని చెప్పారు. నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా పనుల్లో మరింత వేగం పెంచాలన్నారు. సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ నరేంద్రకుమార్, ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్రెడ్డి, ఎస్ఈ నాగేంద్ర, ఎల్అండ్టీ ఏరియా మేనేజర్ వెంకట్రెడ్డి, కేఎంసీ ప్రిన్సిపాల్ రాంకుమార్ రెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ కిషోర్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. సీఎస్ను కలిసిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు హైదరాబాద్ నుంచి వరంగల్ ఎన్ఐటీ అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే మర్యాదపూర్వకంగా క లిసి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. సీఎస్ కె.రామకృష్ణారావు పనుల పరిశీలన.. ఉన్నతాధికారులతో సమీక్ష -
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
ఇన్చార్జ్ అదనపు కలెక్టర్లు శ్రీను, గణేష్ హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్లు వై.వి.గణేష్, మేన శ్రీను అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 113 వినతులు వచ్చినట్లు తెలిపారు. వినతులను నిర్లక్ష్యం చేయొద్దు వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన వినతులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలి.. నిర్లక్ష్యం చేయొద్దని వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యలపై 101 అర్జీలు రాగా.. ఆమె స్వీకరించారు. వినతుల విషయంలో అప్రమత్తంగా ఉంటూ పెండింగ్ లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో విజయలక్ష్మి, వరంగల్ ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, జెడ్పీ సీఈఓ రామ్రెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, ఏడీఏ అనురాధ, డీసీఓ నీరజ, బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పలత, డీఈఓ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు. -
బీఆర్టీయూ నాయకుల అరెస్ట్
సుబేదారి పోలీస్స్టేషన్కు తరలింపు హన్మకొండ: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హనుమకొండ కలెక్టరేట్కు భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ) ఆధ్వర్యంలో వెళ్తున్న కార్మిక నాయకులు, కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్స్టేషన్కు తరలించారు. కార్మికుల సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియం ఆవరణలో సమాయత్తమైన నాయకులు, కార్మికులు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో సుబేదారి పోలీసులు చేరుకుని వారిని స్టేషన్కు తరలించారు. రెండు గంటల పాటు నిర్భందించి తర్వాత పోలీసుల సమక్షంలో కలెక్టరేట్కు తరలించగా ప్రజావాణి కార్యక్రమంలో డీఆర్ఓ వై.వి.గణేశ్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం పోలీసులు వారిని వదిలిపెట్టారు. ఈసందర్భంగా భవన నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారుడు ఎంజాల మల్లేశం, బీఆర్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రవి మాట్లాడుతూ శాంతియుతంగా కలెక్టరేట్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తమను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే అరెస్తు చేస్తారా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు, కార్మికులు సారంగపాణి, సిరికొండ భిక్షపతి, రాజారపు రాజు, రాజేందర్, నారాయణగిరి రాజు, చేరాలు, శ్యామ్, ఎండీ గౌస్ సాదిక్, ఎండీ.ఇస్మాయిల్, ఎండీ.షబ్బీర్, ఉమేందర్ పాల్గొన్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
హన్మకొండ అర్బన్: వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత శాఖల అధికారు లను హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో వరద ముంపు నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ముంపు ప్రాంతాలను అధికారులు ముందస్తుగా గుర్తించి, తీసుకోవాల్సిన చర్యలకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన పాత భవనాల్ని అధికారులు గుర్తించాలని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సరిపో ను మందులు నిల్వ ఉంచాలని పేర్కొన్నారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, డీసీపీ సలీమా, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్లు వైవీ.గణేశ్, మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి, డీఏఓ రవీందర్సింగ్, డీపీఓ లక్ష్మీరమాకాంత్, డీఎంహెచ్ఓ అప్పయ్య, ఆర్డీఓ నారాయణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. పీసీపీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలుపీసీపీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘించి జిల్లాలో ఎవరైనా లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించినా, పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అని తెలుసుకుని అబార్షన్లకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హెచ్చరించారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో లింగ నిర్ధారణ పరీక్షలపై ఫిర్యాదులు చేసేందుకు ఏర్పాటు చేసిన 63000 30940 వాట్సాప్ నంబర్ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ పరీక్షలపై వాట్సాప్ నంబర్, అలాగే 104, 181, 1098, డయల్ 100 టోల్ఫ్రీ నంబర్లతో పాటు pndtmtpcomplaintsd mhohnk@gm-ail. comకి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, డీడబ్ల్యూఓ జయంతి, మాతా శిశు సంక్షేమ ప్రోగ్రాం అధికారి మంజుల, మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి పాల్గొన్నారు. వరద ముంపు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.. హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య కలెక్టరేట్లో సమన్వయ సమావేశం -
ఓబీసీ డిక్లరేషన్కు మేయర్ సుధారాణి హాజరు
వరంగల్ అర్బన్: న్యూ ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ (ఐఐఈ)లో సోమవారం ఓబీసీలపై జరిగిన క్లోజ్ డోర్ సమావేశానికి మేయర్ సుధారాణి హాజరయ్యారు. దేశ వ్యాప్త కుల గణన కోసం ఎంపీ రాహుల్ గాంధీ విశేషంగా కృషి చేస్తున్నారని మేయర్ తెలిపారు. ఓబీసీల సమస్యల్ని సమావేశం దృష్టికి తీసుకెళ్లి నట్లు మేయర్ తెలిపారు. కులగణన, ఉపవర్గీకరణ, పదోన్నతుల్లో రిజర్వేషన్, సామాజిక న్యా యనమూనా ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. టీచర్ల శిక్షణ శిబిరం మార్పు విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో మంగళవారం(నేడు) నుంచి 31 వరకు నిర్వహించనున్న ఉన్నత పాఠశాలల టీచర్లకు శిక్షణకు సంబంధించి శిబిరాన్ని హసన్పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట వద్ద గ్రీన్వుడ్ పాఠశాలకు మార్చి నట్లు హనుమకొండ డీఈఓ డి.వాసంతి ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, హిందీ, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం ఉపాధ్యాయులకు, అలాగే ఉమ్మడి జిల్లాలోని భౌతికశాస్త్రం, జీవశాస్త్రం ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు తొలుత పెద్దపెండ్యాలలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శిక్షణ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అనివార్యకారణాలతో శిక్షణ వేదిక మార్చినట్లు పేర్కొన్న డీఈఓ.. ఈ విషయాన్ని సంబంధిత ఉపాధ్యాయులు గమనించాలని కోరారు. మందుల సరఫరాలో అప్రమత్తంగా ఉండాలిఎంజీఎం: మందుల సరఫరాలో జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సౌకర్యాల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జి.ఫణీంద్రరెడ్డి అన్నారు. సోమవారం ఆయన హనుమకొండ సెంటర్ మెడిసిన్ స్టోర్స్ (సీఎంఎస్)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఫణీంద్రరెడ్డి మాట్లాడుతూ.. సీఎంఎస్ అధికారులు ఆస్పత్రుల వైద్యాధికారులతో సమన్వయంగా ఉంటూ.. మందుల కొరత రాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎంఎస్లో మందుల నిల్వ గదులను పరిశీలించి వాక్సిన్ కూలర్లో వ్యాక్సిన్లు, మందుల నిల్వలు, ఉష్ణోగ్రతల వివరాలను సీఎంఎస్ ఇన్చార్జ్ ఫార్మసీ ఆఫీసర్ల్లు ఉప్పు భాస్కర్, నళినిని అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలకు ఆటంకం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ దేవేంద్రకుమార్, ఈడీ కౌటిల్య, ఈఈ కేఎస్కే ప్రసాద్ తదితరులున్నారు. వైద్యులపై చర్యలు షురూ..ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రిలో పేద ప్రజలకు అందుతున్న సేవలపై మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీ సారయ్య, ‘కుడా’ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టిన అనంతరం శాఖాపరమైన చర్యలు మొదలయ్యాయి. ఆస్పత్రిలో అత్యవసర సేవా విభాగం, మెడికల్ స్టోర్, రోగులకు అందించే ఆహారం, పిల్లల వార్డును సందర్శించిన నేతలు రోగులకు అందించే సేవల్లో లోపం ఉన్నట్లు గుర్తించి అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో పలు విభాగాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది లేని విషయాన్ని గుర్తించి ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి.. సూపరింటెండెంట్ కిషోర్ను అక్కడే ప్రశ్నించారు. అనంతరం ఫోన్లో కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్, బయోమెట్రిక్ అటెండెన్స్ను కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాలతో అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన 77 మంది వైద్యులు, సిబ్బందికి సోమవారం ఎంజీఎం పరిపాలనాధికారులు మెమోలు జారీ చేశారు. అధిక సంఖ్యలో ఒకేసారి మెమోలు జారీ చేయడం ఎంజీఎం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. నకిలీలపై దాడులు చేయాలి ● ‘చాంబర్’ అధ్యక్షుడు రవీందర్ రెడ్డివరంగల్ చౌరస్తా : రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా చేసి మోసగిస్తున్న సంస్థలు, షాపులపై దాడులు చేసి అన్నదాతలకు నాణ్యమైన పత్తి విత్తనాలు సరఫరా చేయాలని వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు సీఎస్కు, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులకు లేఖలు రాసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవల టాస్క్ఫోర్స్, వ్యవసాయ అధికారులు వివిధ విత్తన సంస్థలు, ఏజెన్సీలు, షాపులపై దాడులు నిర్వహించి నకిలీ విత్తనాల సరఫరాను నిరోధిస్తున్నారని వివరించారు. -
మూగబోయిన ఓరుగల్లు రంగస్థలం
హన్మకొండ కల్చరల్: ఓరుగల్లు ముద్దుబిడ్డ, ప్రముఖ రంగ స్థల కళాకారుడు జీవీబాబు (70) ఇకలేరు. బలగంతోపాటు 20 సినిమాలకు పైగా నటించిన మహా నటుడు జీవీ బాబు కన్నుమూశారు. రెండు కిడ్నీలు పాడై కొంత కాలంగా డయాలసిస్తో బాధపడుతున్నారు. వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో వరంగల్ రామన్నపేట( పాపయ్యపేట)లో విషాదఛాయలు అలుముకున్నాయి. నాటక ప్రదర్శనలతో చైతన్యం..సినిమాలకు అంతగా ప్రాధాన్యం లేని సమయంలో బాల్య వివాహాలు, వితంతు వివాహాలు, కన్యాశుల్కం వంటి సాంఘిక, సామాజిక సమస్యలను ఎత్తి చూపి వాటిని పారద్రోలేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం అనేక నాటకాలు రచించి నాటకాలు వేసి అగ్ర స్థానంలో నిలిపారు. పౌరాణిక నాటకాలు వేసి ప్రేక్షకులను మెప్పిస్తూ ఆటపాటతో ఉర్రూతలు ఊగించారు. జీవీబాబు భౌతికకాయానికి నివాళి..జీవిబాబు మృతిపై బలగం డైరెక్టర్ యొల్దండి వేణుతోపాటు హీరో ప్రియదర్శి విచార వ్యక్తం చేశారు. రామన్నపేటలోని తన నివాసంలో జీవీబాబు భౌతికకాయాన్ని ఉంచగా.. నాటక సమఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం, రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక బా«ధ్యులు కాజీపేట తిరుమలయ్య, ఎన్ఎస్ఆర్ మూర్తి, బలగం డైరెక్టర్ వేణు, హీరో ప్రియదర్శి, చిత్రం సభ్యులు బాలు కాయితి, ఆకునూరి దేవయ్య, బలగం కొమురమ్మ, భాస్కర్, నటుడు సుధాకర్, ఇతర నటీమణులు, రంగ స్థల కళాకారులు సందర్శించి నివాళులరి్పంచారు.నటనలో ఆయనకు సాటేరి.. వరంగల్ రామన్నపేట(పాపయ్యపేట)కు చెందిన జీవిబాబు బలగం సినిమాలో హీరో ప్రియదర్శి తాతగా.. కొమురయ్య తమ్ముడిగా అంజన్న పాత్రలో నటించాడు. జీవీ బాబు అసలు పేరు గుడిబోయిన బాబు. సుజాతతో వివాహమైంది. రంగస్థల వేదికపై 50పైగా నాటకాలు వేసి ప్రేక్షకులను మెపించారు. 20కి పైగా సినిమాలలో నటించారు. పౌరాణిక నాటక రంతోపాటు సినిమా రంగంలో వరంగల్కే మూల స్తంభంగా నిలిచారు. -
ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ నియామకాలు అమలులోకి వచ్చాయి. పూర్తి స్థాయి నియామకాలకు మంగళం పాడిన యాజమాన్యం సిబ్బంది లోటును పూడ్చడానికి తాత్కాలిక నియామకాల వైపు మొగ్గు చూపింది. ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాల నియామకం చేపట్టనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ పలు మార్లు ప్రకటనలు చేశారు. ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా.. డ్రైవర్, కండక్టర్ల ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేపట్టనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అందుకు భిన్నంగా యాజమాన్యం ఔట్ సోర్సింగ్ నియామకాల కోసం జారీ చేసిన సర్క్యులర్ రీజియన్ కార్యాలయాలకు చేరింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ల నియామక సర్క్యులర్ ముందుగా, కండక్టర్లకు సంబంధించి తర్వాత జారీ అయ్యాయి. వరంగల్ రీజియన్లో ఇప్పటికే 30 మంది డ్రైవర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టి శిక్షణ ఇస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం డి.విజయభాను తెలిపారు. మరో 70 మంది డ్రైవర్లను తీసుకునేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల రాకతో కండక్టర్ల కొరత.. అలాగే.. వరంగల్ రీజియన్కు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం 112 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ఈ క్రమంలో కండక్టర్ల లోటు భారీగా ఏర్పడింది. దీనికి తోడు రీజియన్లో ఆర్టీసీకి చెందిన సొంత బస్సులు 417 మాత్రమే ఉండగా.. అద్దె బస్సులు 310 ఉన్నాయి. ఎలక్ట్రిక్ బస్సులను ప్రయివేట్ సంస్థ జేబీఎం ఆపరేట్ చేస్తున్నది. జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు, అద్దె బస్సులు కలిపి 422 ఉన్నాయి. ఆర్టీసీ సొంత బస్సుల్లో కండక్టర్ల కొరతను అధిగమించేందుకు డ్రైవర్లకు టిమ్లు ఇచ్చి టికెట్ జారీ చేయిస్తూ బస్సులను నడుపుతోంది. ప్రయివేట్ బస్సుల డ్రైవర్లకు టికెట్ జారీ చేసేందుకు టిమ్లు ఇవ్వలేదు. అయితే.. కండక్టర్ల కొరత నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్లకు మాత్రం టిమ్లు ఇచ్చి టికెట్లు జారీ చేయిస్తున్నారు. ఆర్టీసీకి ప్రధాన ఆదాయం టికెట్ల ద్వారానే వస్తుంది కాబట్టి.. ప్రయివేట్ డ్రైవర్లకు అప్పగించేందుకు సిద్ధంగా లేని యాజమాన్యం తాత్కాలికంగా ఔట్ సోర్సింగ్ విధానంలో కండక్టర్ల నియామకానికి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వరంగల్ రీజియన్కు అత్యవసరంగా 100 మంది కండక్టర్లను నియమించనున్నారని, అవసరాన్ని బట్టి మరికొంత మందిని నియమించే ఆలోచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. రెగ్యులర్ నియామకాలకు ఆలస్యం అవుతుండడంతో తాత్కాలికంగా సమస్య నుంచి గట్టెందుకు ఔట్ సోర్సింగ్ వైపు ఆర్టీసీ మళ్లిందని, తర్వాత రెగ్యులర్ నియామకాలు చేపట్టే అవకాశముందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఔట్ సో ర్సింగ్లో విజయవంతమైతే పూర్తి స్థాయి నియామకాలను పట్టించుకుంటారా లేదా? అనే సందేహాలు ఆర్టీసీ ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మ్యాన్ పవర్ అందించే ఏజెన్సీల ద్వారా.. ఔట్ సోర్సింగ్ నియామకాలు మ్యాన్ పవర్ అందించే ఎజెన్సీల ద్వారా చేపట్టనున్నారు. ఆర్టీసీకి చెందిన డిప్యూటీ రీజినల్ మేనేజర్లతో కూడిన కమిటీ డ్రైవర్ల నియామకాన్ని చేపడుతోంది. డ్రైవర్ ఉద్యోగానికి చదవడం, రాయడం వస్తే సరిపోతుంది. హెవీ డ్రైవింగ్ లైసెన్స్తోపాటు 18 నెలల అనుభవం ఉండాలి. వయసు 60 ఏళ్లు లోపు వారు అర్హులు. ఎంపిక కమిటీ ముందుగా డ్రైవింగ్ లైసెన్స్, అనుభవాన్ని పరిశీలించిన తర్వాత డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో సంతృప్తి చెందిన అధికారులు వారిని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ నిర్వహించి ఫిట్నెస్ కలిగి ఉన్న వారిని ఎంపిక చేసి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటారు. అదే విధంగా కండక్టర్ల నియామకాన్ని ఎంపిక కమిటీ చేపడుతుంది. ఎస్సెస్సీ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై, వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు. వీరి నియామకానికి మ్యాన్ పవర్ అందించే ఎజెన్సీ రూ.2లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవర్లకు నెలకు రూ.22 వేలు జీతం ఇవ్వనుండగా, కండక్టర్లకు రూ.17,969 వేతనం చెల్లిస్తారు. ఎంపికై న వారు రవాణా శాఖ ద్వారా కండక్టర్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది.సిబ్బంది లోటు తీర్చేందుకు తాత్కాలిక చర్యలు వరంగల్ రీజియన్లో ఇప్పటికే 30 మంది డ్రైవర్ల నియామకం మరో 70 మంది డ్రైవర్లు, 100 మంది కండక్టర్ల అవసరం జీతం డ్రైవర్లకు నెలకు రూ.22వేలు, కండక్టర్లకు రూ.17,969 -
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతం
విద్యారణ్యపురి: యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష–2025 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం అభ్యర్థులు 4,141 మందికి హనుమకొండ జిల్లాలో 10 పరీక్ష కేంద్రాలు కేటాయించారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్లో 2,435 మంది(58.80శాతం), మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షకు 2,422 మంది(58.49శాతం)మంది హాజరైనట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు సంబంధించి అడ్మిట్కార్డుతోపాటు గుర్తింపు కార్డు పరిశీలించడంతోపాటు క్షుణ్ణంగా తనిఖీ చేశాకే ఉదయం 9 గంటల వరకు లోనికి అనుమతించారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్కాలేజీ, ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాల కేంద్రాలను హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఉదయం సెషన్లో 58.80శాతం.. మధ్యాహ్నం సెషన్లో 58.49శాతం హాజరు -
మల్లన్నను దర్శించుకున్న ఆర్టీఐ కమిషనర్
ఐనవోలు: ప్రఖ్యాత ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు (ఆర్టీఐ) కమిషనర్ బో రెడ్డి అయోధ్యరెడ్డి సందర్శించారు. ఆల య సంప్రదాయం ప్రకారం.. అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం గర్భాలయంలో స్వామి వారి అభిషేకంతో పాటు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేదపండితులు అయోధ్యరెడ్డి–జ్యోతిరెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం చేయగా.. అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలతో పాటు స్వామి వారి శేషవస్త్రాలు, మల్లికార్జునస్వామి చిత్రపటాన్ని అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీఐ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కుటుంబ సమేతంగా మల్లికార్జునస్వామిని దర్శించుకోవడం సంతోషాన్ని కలిగించిందన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా గ్రామ పాలన ఆఫీసర్ల పరీక్ష
హన్మకొండ అర్బన్: నగరంలోని సెయింట్ పీటర్స్ పబ్లిక్ స్కూలో ఆదివారం జరిగిన గ్రామపాలన ఆఫీ సర్ల పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈపరీక్షకు 133 మంది అభ్యర్థులకు 122 మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణ తీ రును పరిశీలించేందుకు హనుమకొండ కలెక్టర్ ప్రా వీణ్య పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ నారాయణ, కలెక్టరేట్ ఏఓ గౌరీ శంకర్, చీఫ్ సూపరిటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో..న్యూశాయంపేట: గ్రామపాలన అధికారి రాత పరీక్ష–25 ఆదివారం ప్రశాంతంగా ముగిసినట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. నగరంలోని ఇస్లామియా కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో 198మంది అభ్యర్థులకు 187 మంది హాజరై పరీక్ష రాసినట్లు పేర్కొన్నారు. 12 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఇస్లామియా కళాశాలను సందర్శించి కలెక్టర్ పరీక్ష జరుగుతున్న తీరు ను పరిశీలించారు. ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నా రు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీ ఆర్డీఓ విజయలక్ష్మి,ఏఓ సత్యప్రసాద్,తహసీల్దాదార్ ఇక్బాల్,చీఫ్ సూపరెండింట్ తదితరులు ఉన్నారు. -
సౌధామిని.. పుష్కర మణి!
ప్రాణహితలో మునకలు.. పుష్కరిణికి పూజలు.. పారే గోదావరికి దీపదానాలు.. ప్రవహించే తల్లికి చీరెసారెలు. పితృదేవతలకు పిండ ప్రదానాలు.. అండగా నిలవమని నదికి నవరత్న మాల హారతులు. చదువుల తల్లి నిలువెత్తు రూపానికి భక్తుల నీరాజనాలు. కాళేశ్వర ముక్తీశ్వరుడికి శత కోటి ప్రణామాలు. ఆదివారం కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. సెలవు కావడంతో నదీ పరిసరాలు కిక్కిరిశాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సినీ నటుడు తనికెళ్ల భరణి పుణ్యస్నానం ఆచరించి కాళేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
‘అంతిమ’ రాగం.. భావోద్వేగం!
‘తోడుగా మాతోడుండీ.. నీడగా మాతో నడిచి నువ్వెక్కాడెళ్లినావు కొమురయ్యా.. నీ జ్ఞాపకాలూ మరువామయ్యా కొమురయ్యా.. కొడుకునెట్లా మరిసినావే కొమురయ్యా.. నీ బిడ్డనెట్లా మరిసినావే కొమురయ్యా.. బలగాన్నీ మరిసినావే కొమురయ్యా’ అంటూ బలగం సినిమాలో పాడిన పాట అందరినీ కంటతడి పెట్టించిన విషయం తెలిసిందే. ఆఖరి మజిలీలో చనిపోయిన వ్యక్తితో కుటుంబానికి, బంధుగణానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే పాటలు పాడడం ఇప్పుడు ఓరుగల్లులో ఆనవాయితీగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా డప్పు కళాకారుల రాగం.. భావోద్వేగాన్ని పలికిస్తోంది. అదే ఈవారం ‘సాక్షి’ ప్రత్యేకం! – సాక్షి, వరంగల్ఇన్ని రోజులు కలిసి ఉండి.. ఒక్కసారిగా కుటుంబంలో ఒకరు దూరమైతే కుటుంబ సభ్యులు తట్టుకోలేరు. వారి జ్ఞాపకాలు వెంటాడతాయి. వారితో ఉన్న అనుబంధాలు మదిలో మెదులుతాయి. ఇన్నాళ్లూ అంతిమయాత్రలో డప్పుచప్పుళ్లు, అందుకు అనుగుణంగా స్టెప్పులు వేసేవారు. ఇప్పుడు డప్పుకళాకారుల నోటి నుంచి వస్తున్న బంధాలను పెనవేసే పాటలు భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. కుటుంబ పెద్ద మరణించినప్పుడు బలగం సినిమాలో పాడిన పాట, డప్పు కళాకారుల ప్రదర్శన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ఏళ్ల కిందటి సంప్రదాయం. ఇప్పుడు మరింత ట్రెండీగా మారింది. బలగం సినిమాకు ముందే...15 ఏళ్ల క్రితమే చెన్నారావుపేట మండలం పాపాయ్యపేట యాకన్న బృందం అంత్యక్రియల్లో పాటలు పాడడం ప్రారంభించింది. ఆతర్వాత నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన యాకాంబరం బృందం కూడా బంధుత్వ విలువలు తెలిసేలా పాటలు పాడడం మొదలు పెట్టింది. అయితే బలగం సినిమా విడుదలైన తర్వాత ఈ డప్పు కళా బృందాలకు ముఖ్యంగా పాటలు పాడే వారికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఎవరు మరణించినా.. అప్పటికప్పుడు వారి గుణగణాలు తెలుసుకుని పాటలు అల్లుతూ పాడుతూ కళాకారులు కన్నీళ్లు పెట్టిస్తున్నారు.డప్పుచప్పుళ్లు.. పాటలు‘నేనెళ్లి పోతున్నా దూరం.. మన ఇల్లు, నీ పిల్లలు పదిలం.. మన బంధు బలగం పదిలం.. అని పైనుంచి తన ఆత్మ ద్వారా సుశీలవ్వ మనకు చెబుతున్నది’ అంటూ నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన డప్పు కళా బృందం వరంగల్జిల్లా అనంతారంలో పాడిన పాట ఆఖరి మజిలీకి వచ్చినవారందరినీ కంటతడి పెట్టించింది. ఇలా డప్పు కళాకారులు, జానపదులు పాడుతున్న పాటలు బంధాలను బలోపేతం చేస్తున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని చాటిచెబుతున్నాయి.నా భర్త చనిపోయినప్పుడు ఇదే పాట పాడిన..దుగ్గొండి: నా భర్త పస్తం మొగి లి చనిపోయినప్పుడు సైతం పుట్టెడు దుఃఖంలో ఉన్న నేను పాటతో ఆయనకు కన్నీటి నివా ళి అర్పించాను. ఆయన నేర్పిన కళను ఆయన చివరి మజిలీకి చేరే వరకు వినిపించా.. నాతోటి కళాకారులు సైతం పాట పాడుతూ వచ్చారు. నేడు చావు సందర్భాల్లో పాటలు పాడే క్రమంలో చనిపోయిన వ్యక్తికి ఉన్న పేరు ప్రతిష్టలు, సేవా గుణం, బంధువులతో బంధుత్వం తెలుసుకుని కళాకారులు పాటతో కన్నీరు పెట్టిస్తున్నారు. – పస్తం కొంరమ్మ, బలగం ఫేమ్, దుగ్గొండిచాలా ఏళ్ల నుంచి పాడుతున్నాం..చాలా ఏళ్ల నుంచి మేం 12 మంది సభ్యులతో డప్పు కళాబృందం ఏర్పాటు చేసుకున్నాం. మ నిషి చనిపోయిన సమయంలో వారు తన కుటుంబసభ్యులకు బాధ్యతలు అప్పగిస్తూ ఏమనుకుంటున్నారనే మాటలతో అప్పటికప్పుడు పాటలు రాసుకుని పాడతాం. మా పాటలతో పెద్ద గొడవలు ఉన్న ఫ్యావిులీలు మారిన సందర్భాలూ ఉన్నాయి. చాలామంది మమ్మల్ని సంప్రదించి తమ కుటుంబీకుల ఆఖరి మజిలీలో పాటలు పాడాలని అడుగుతున్నారు. – సౌరపుయాకాంబరం, దీక్షకుంట, గ్రామ డప్పు కళాబృందం, నెక్కొండఆదరణ పెరిగింది..మాది చెన్నారావుపేట మండలం పాపయ్యపేట డప్పు కళా బృందం. 22మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని 14 ఏళ్ల క్రిత మే ఏర్పాటు చేసుకున్నాం. ఓవై పు డప్పుచప్పుళ్లతో పాటు ఇంకోవైపు పాటలు పా డుతున్నాం. అయినా అప్పుడు పెద్దగా ఆదరణ ఉండేది కాదు.ఇటీవల చాలామంది మా పాటలను సో షల్ మీడియాలో పోస్టు చేస్తుండడంతో మాకు గిరా కీ పెరిగింది.ఇందుకు అనుగుణంగానే సరికొత్త చరణాలతో అప్పటికప్పుడు పాటలురాస్తూ.. పాడు తూ బంధాలను మరింత బలోపేతం చేస్తున్నాం. – అబ్బదాసి యాకన్న,డప్పు కళాకారుడు -
ఈ–పాస్ మిషన్లతోనే ఎరువులు విక్రయించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద ఖిలా వరంగల్: ఈపాస్ మిషన్లతో ఎరువులను విక్రయించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. వరంగల్ శివనగర్లోని సాయి కన్వెన్షన్లో రిటైల్ ఎరువుల వ్యాపారులకు శుక్రవారం ఎల్–1 ఈపాస్ మిషన్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ సత్యశారద హాజరై డీలర్లకు ఈపాస్ మిషన్లు పంపిణీ చేసి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎరువుల శాఖ ఆదేశాల మేరకు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ వారు ప్రస్తుతం ఉన్న ఈపాస్ మిషన్ల స్థానంలో కొత్తగా ఎల్–1 ఈపాస్ మిషన్లను డీలర్లకు పంపిణీ చేసినట్లు వివరించారు. ఈపాస్ మిషన్లతో ఎరువుల పంపిణీ పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, సహాయ సంచాలకులు దామోదర్రెడ్డి, నర్సింగం, ఏఓ రవీందర్రెడ్డి, టెక్నికల్ ఏఓ కృష్ణారెడ్డి, కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రతినిధులు సుజనకుమార్, సుమన్రెడ్డి పాల్గొన్నారు. ఉద్యాన సాగును విస్తృతం చేయాలి న్యూశాయంపేట: రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ఉద్యాన సాగును విస్తృతం చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. పండ్ల తోటలు, కూరగాయల సాగు విస్తీర్ణంపై అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులతో కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. అనంతరం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. డీఆర్ఓ విజయలక్ష్మి, హార్టికల్చర్ అధికారి అనురాధ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, నాబార్డ్ ఏజీఎం రవి, కేవీకే మామునూరు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజన్న పాల్గొన్నారు. జీపీఓ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు వరంగల్లోని ఇస్లామియా జూనియర్ కళాశాలలో ఆదివారం నిర్వహించనున్న జీపీఓ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. జీపీఓ పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. పరీక్షకు 198 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ, బల్దియా హెల్త్ఆఫీసర్ రాజేశ్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అర్షియా తబస్సుమ్, ఏఓ విశ్వప్రసాద్, తహసీల్దార్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. -
నిట్లో క్యాంపస్ సెలక్షన్స్
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ క్యాంపస్ సెలక్షన్స్ 2025లో 1,201 యూజీ, పీజీ విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ శుక్రవారం క్యాంపస్ సెలక్షన్స్ వివరాలు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకతను సాధించుకున్న నిట్ వరంగల్ క్యాంపస్ విద్యార్థులను ఎంపిక చేసుకునేందుకు ఈఏడాది 290కి పైగా.. కంపెనీలు పోటీ పడినట్లు తెలిపారు. నిట్కు చెందిన 791 మంది అండర్ గ్రాడ్యుయేట్, 717 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పూర్తిగా 1,508 మంది విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్కు హాజరుకాగా.. 1,201 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలను సాధించారని తెలిపారు. బీటెక్లో ఈసీఈ విభాగానికి చెందిన సోమిల్ మాల్ధాని అత్యధిక ప్యాకేజీ రూ.64.3 లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపిక కాగా.. అత్యల్పంగా రూ.14.35 లక్షల ప్యాకేజీకి, అదే విధంగా పీజీలో రూ.12.20 లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపికైనట్లు తెలిపారు. గతేడాది క్యాంపస్ సెలక్షన్స్లో 76 శాతం ఎంపిక కాగా.. ఈఏడాది 79.7 శాతం విద్యార్థులు ఎంపికవడం అభినందనీయమన్నారు. ఈ ఏడాది పీహెచ్డీ విద్యార్థులు సైతం క్యాంపస్ సెలక్షన్లలో పోటీపడగా.. ఆరుగురు పీహెచ్డీ విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్స్లో రూ.9 లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపికైనట్లు పేర్కొన్నారు. నిట్లో విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్స్ ఎంపికకు సీపీపీడీ (సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్) ప్రత్యేకంగా పని చేస్తుందని తెలిపారు. సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేస్తా.. మాది జైపూర్. బన్వారీ లాల్ మాల్ధానీ, రేణు అగర్వాల్ మా నాన్నఅమ్మ. సాధారణ మధ్య తరగతి కుటుంబం మాది. నిట్ క్యాంపస్ సెలక్షన్స్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా బెంగళూరులోని సాఫ్ట్వేర్ కంపెనీలో రూ.64.3 లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపికయ్యా. సాఫ్ట్వేర్ కంపెనీనీ ఏర్పాటు చేసి నా తోటి మిత్రులకు ఉపాధి కల్పించాలన్నదే నా లక్ష్యం. – సోమిల్ మాల్ధానీ, ఈసీఈ విభాగం 1,201 మందికి ఉద్యోగాలు రూ.64.3 లక్షల వార్షిక ప్యాకేజీతో సోమిల్ మాల్దానీ -
జీవ నది.. ఉప్పొంగిన మది
నదిని చూసిన మది ఉప్పొంగింది.. స్నానమాచరించాక కష్టాల గుండె తేలికయ్యింది.. చల్లని తల్లికి నమస్కరించాక భయం పటాపంచలైంది.. సైకత లింగాన్ని పూజించాక అభయం అందినట్లయ్యింది. అని కాళేశ్వరాలయంలో పుణ్య స్నానం ఆచరించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయి కనిపించారు. ‘సల్లంగ సూడు సరస్వతమ్మా’ అంటూ నీటిలో దీపాలు వదిలారు. గోదావరి మాతకు చీరసారె సమర్పించారు. కాళేశ్వర ముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. శుక్రవారం కాళేశ్వరం భక్తజన సంద్రమైంది. సుమారు లక్షమందికి పైగా భక్తులు వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. – వివరాలు, ఫొటోలు 8లోu -
చట్టాలను కాలరాస్తున్న ప్రభుత్వాలు
హన్మకొండ: కార్మిక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని.. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కార్మిక సంక్షేమ మాసోత్సవంలో భాగంగా శుక్రవారం వివిధ కార్మిక సంఘాల నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమా ండ్ చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలు అమలు చేయాలని కోరుతూ.. 27వ తేదీన హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయనున్నట్లు తెలిపారు. 30న ఆటో కార్మికులచే ధర్నా నిర్వహించనున్నట్లు, 31న కార్మిక మాసోత్సవాల ముగింపు నిర్వహించనున్నట్లు వివరించారు. కార్మికులకు అండగా బీఆర్ఎస్ నిలుస్తుందన్నారు. సమావేశంలో కార్మిక నాయకులు నాయిని రవి, ఇంజాల మల్లేశం, ఈసంపల్లి సంజీవ, మహమూద్, ఇస్మాయిల్, తేలు సారంగపాణి, జి.నరహరి, రవీందర్రెడ్డి రఘుపతి రెడ్డి, రఘు, శివకుమార్, రాజారపు రాజు, శ్రీధర్రెడ్డి, వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ -
నేడు మార్కెట్లోకి విజయ డెయిరీ కొత్త ప్యాకింగ్
హన్మకొండ చౌరస్తా: తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ పాలు, పెరుగు ఉత్పత్తులను నేటి (శనివారం) నుంచి కొత్త ప్యాకింగ్లో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వరంగల్ యూనిట్ డీడీ శ్రవణ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలి పారు. నూతనంగా ప్యాకింగ్ ఉత్పత్తులను ములుగురోడ్ సమీపంలోని విజయ డెయిరీ ఆవరణలో ఉదయం 11గంటలకు డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, వరంగల్ ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి చేతుల మీదుగా మార్కెట్లో కి విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. 150 ఎంఎల్ టోన్డ్ మిల్క్, 120, 400 టీఎం పెరుగు ప్యాకెట్లతోపాటు 900 గ్రాములు, 1 కేజీ, 5కేజీ, 10 కేజీ డీటీఎం పెరుగు బకెట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు. ఎంబీఏ పరీక్షల పరిశీలనకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం క్యాంపస్లోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం పరీక్ష కేంద్రాన్ని రిజిస్ట్రార్ వి.రామచంద్రం సందర్శించారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ పి.అమరవేణి, డాక్టర్ ప్రగతి ఉన్నారు. బాలికను దత్తత తీసుకున్న అమెరికా దంపతులుహన్మకొండ అర్బన్: జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అనుబంధ శిశు గృహ, బాల సదనంలో ఆశ్రయం పొందుతున్న పదేళ్ల బాలికను అమెరికా దేశానికి చెందిన దంపతులకు ఇంటర్ కంట్రీ అడాప్షన్ ఇచ్చినట్లు జిల్లా సంక్షేమాధికారి జయంతి తెలిపారు. గతంలోనే ఈ దంపతులు అంతర్రాష్ట్ర దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నట్లు.. పరిశీలించిన కేంద్ర దత్తత వనరుల విభాగం వారికి సీనియార్టీ ప్రకారం నిబంధనల మేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో బాలికను దత్తత అందించినట్లు తెలిపారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మాతృత్వం ఒక వరమని అందుకు చట్టబద్ధమైన దత్తత ప్రధాన మార్గమన్నారు. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు సందసాని రాజేంద్రప్రసాద్, బాలరక్షా భవన్ కో–ఆర్డినేటర్ సీహెచ్.అవంతి, సూపరింటెండెంట్ కళ్యాణి, జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జ్ అధికారి ప్రవీణ్కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ మౌనిక, దత్తత కేంద్రం సోషల్ వర్కర్ సంగి చైతన్య, తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు..విద్యారణ్యపురి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. హనుమకొండ జిల్లాలో ఉదయం నిర్వహించిన ఇంటర్ ప్రథమ ఫస్టియర్ పరీక్షలకు 2,127 మంది విద్యార్థులకుగాను 1,851మంది (87శాతం)హాజరుకాగా.. 276 మంది గైర్హాజరయ్యారని డీఐఈఓ గోపాల్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన సెకండియర్ పరీక్షలకు 152 మందికిగాను 75 మంది హాజరుకాగా, 77 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో 91మంది గైర్హాజరు.. వరంగల్ జిల్లాలో ఇంటర్ ఫస్టియర్లో 559 మందికి 499 మంది హాజరుకాగా, 60 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. సెకండియర్ పరీక్షల్లో 131 మందికి గాను 110 మంది హాజరుకాగా, 31 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. -
బదిలీల కుదుపు...
కొద్దిరోజులుగా పోలీస్శాఖలో హాట్టాపిక్ సాక్షిప్రతినిధి, వరంగల్: పోలీస్శాఖలో బదిలీల కుదుపు మొదలైంది. చాలా రోజుల తర్వాత ఉమ్మడి వరంగల్లో పలువురు డీఎస్పీ/ఏసీపీలకు స్థానచలనం కలిగింది. నార్త్జోన్–1 పరిధిలో పలువురు ఎస్హెచ్ఓలు బదిలీ కాగా, అడిషనల్ ఎస్పీలు కూడా మారారు. పది రోజుల వ్యవధిలో రేంజ్ పరిధిలో ఐదారు ఉత్తర్వుల ద్వారా 29 మంది ఎస్హెచ్ఓల బదిలీలు అయ్యాయి. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు ఎస్హెచ్ఓలు మారారు. ఈనేపథ్యంలో త్వరలోనే మరో ఇద్దరు డీఎస్పీలు, భారీ సంఖ్యలో సీఐ/ఎస్హెచ్ఓల ట్రాన్స్ఫర్లు ఉంటాయన్న ప్రచా రం పోలీస్శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా బదిలీల కలకలం.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటీవల జరిగిన డీఎస్పీ/ఏసీపీల మూకుమ్మడి బదిలీలు కలకలంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా 77మంది ఏసీపీలను బదిలీ చేస్తూ డీజీపీ డాక్టర్ జితేందర్ ఉత్తర్వులు జారీ చేయగా.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురికి స్థానచలనం కలిగింది. నర్సంపేట ఏసీపీగా పనిచేసిన వి.కిరణ్కుమార్ డీజీపీ ఆఫీస్కు బదిలీ కాగా, ఆ స్థానంలో ఖమ్మం సీసీఆర్బీ ఏసీపీగా పనిచేసిన పున్నం రవీందర్ రెడ్డిని నియమించారు. కాజీపేట ఏసీపీ తిరుమల్ హైదరాబాద్ ‘హైడ్రా’ స్టేషన్ ఎస్హెచ్ఓగా నియమితులు కాగా, సైబర్ సెక్యూరిటీ విభాగం డీఎస్పీగా ఉన్న పింగిళి ప్రశాంత్రెడ్డిని తీసుకొచ్చారు. మామునూరు ఏసీపీ బి.తిరుపతి డీజీపీ కార్యాలయానికి బదిలీ చేసి ఆయన స్థానంలో ఖమ్మం ఎస్బీ ఏసీపీగా పనిచేస్తున్న ఎన్.వెంకటేశ్ను, రాచకొండ ‘షీ’టీమ్ ఏసీపీగా పని చేస్తున్న పి.నర్సింహారావు హనుమకొండ ఏసీపీగా, హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్రెడ్డి డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. అదేవిధంగా సీఐడీ డీఎస్పీగా పనిచేస్తున్న పి.సదయ్య వరంగల్ సీసీఎస్ ఏసీపీగా నియమించగా.. త్వరలో మరో ఇద్దరు నుంచి ముగ్గురు డీఎస్పీలకు స్థానచలనం ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అదే విధంగా ఖమ్మం అడిషనల్ డీసీపీగా ఉన్న ఎ.నరేశ్కుమార్ భూపాలపల్లి ఏఎస్పీగా నియమించిన డీజీపీ, భూపాలపల్లి ఏఎస్పీగా ఉన్న బోనాల కిషన్ వరంగల్ ఏఎస్పీగా, కొమురంభీం ఆసిఫాబాద్ ఏఎస్పీగా ఉన్న ఆర్.ప్రభాకర్రావును వరంగల్ కమిషనరేట్కు అదనపు డీసీపీగా నియమించారు. త్వరలోనే ఎస్హెచ్ఓల వంతు.. ఇప్పటికే ఠాణాల్లో ఖర్చీఫ్లు.. వరంగల్ కమిషనరేట్ పరిధిలో పలువురికి త్వరలోనే స్థానచలనం కలగనుంది. వాస్తవానికి ఇరవై రోజుల కిందటే జరుగుతాయన్న ప్రచారం జరిగింది. అయితే ఏసీపీ, డీఎస్పీల బదిలీ తర్వాత ఎస్హెచ్ఓలపై కసరత్తు జరుగుతోంది. ఈనేపథ్యంలో అప్రమత్తమైన పలువురు సీఐలు ఎస్హెచ్ఓలుగా ఠాణాల్లో ఖర్చీఫ్లు వేసుకుని పోస్టింగ్లు పదిలం చేసుకున్నట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్తోపాటు కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో పని చేస్తున్న వారు గ్రేటర్ వరంగల్ ఠాణాలపై గురి పెట్టారన్న ప్రచారం ఉంది. ఇదిలా ఉండగా మిల్స్కాలనీ పీఎస్లో సస్పెండైన ఎస్హెచ్ఓ వెంకటరత్నం స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది. దీంతో పలువురు ఎస్హెచ్ఓలను బదిలీ చేస్తారన్న చర్చ పోలీసువర్గాల్లో సాగుతోంది. హనుమకొండ, హసన్పర్తి, సుబేదారి, మట్టెవాడ, ఇంతేజార్గంజ్, ఏనుమాములలతో పాటు కమిషనరేట్ పరిధిలోని పన్నెండు ఠాణాల్లో ఎస్హెచ్ఓల మార్పు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ ఠాణాల్లో పోస్టింగ్ కోసం ప్రజాప్రతినిధులనుంచి హామీలు పొందిన ఇన్స్పెక్టర్ల పేర్లు కూడా ప్రచారం జరుగుతున్నాయి. సెలవులో వెళ్లిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తిరిగి విధుల్లో చేరాక ఈ ప్రక్రియ జరుగుతుందని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కమిషనరేట్పై పట్టు బిగిస్తున్న సీపీ.. వరంగల్ పోలీస్ కమిషనర్గా మార్చి 10న బాధ్యతలు చేపట్టిన సన్ప్రీత్సింగ్.. కమిషనరేట్పై పట్టు బిగించారు. సీపీగా పదవీ బాధ్యతలు చేపట్టిన నెలరోజుల్లోపే సుమారు 18 పోలీస్స్టేషన్లను విజిట్ చేసి పోలీసులు, అధికారులతో మాట్లాడి యోగక్షేమాలు, శాంతిభద్రతల గురించి ఆరా తీశారు. సబ్డివిజన్లు, పోలీసుస్టేషన్ల వారీగా నేరాల నమోదు, పరిశోధన, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ప్రత్యేక దృష్టి సారిస్తున్న ఆయన నేరుగా బాధితులతో మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు అధికారులపై పనితీరుపైనా గ్రేడింగ్ చేస్తున్నారు. ఓ కేసులో వివాదాస్పదంగా మారిన మిల్స్కాలనీ సీఐ వెంకటరత్నంపై సస్పెన్షన్ వేటు వేసిన సీపీ.. కట్టుదాటితే ఎవరిౖపైనెనా చర్యలు తప్పవన్న సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే 8 మంది డీఎస్పీ/ఏసీపీల బదిలీ ముగ్గురు అడిషనల్ ఎస్పీలకు పోస్టింగ్ త్వరలో మరికొందరు డీఎస్పీలు.. సీఐలకు కూడా స్థానచలనం? పోస్టింగ్లకు హామీలు పొందిన ఎస్హెచ్ఓలు సెలవులో పోలీస్ కమిషనర్.. వచ్చాక ప్రక్రియ మొదలు -
పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: ఈనెల 25న (ఆదివారం)న జరగనున్న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్, గ్రామ పాలన ఆఫీసర్ల పరీక్ష నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద నిబంధనల మేరకు ఏర్పాట్లు ఉండాలన్నారు. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఈపరీక్షకు ఏర్పాటు చేసిన 10 కేంద్రాల్లో 4,141 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. గ్రామపాలన ఆఫీసర్లు పరీక్ష హనుమకొండ సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంటుందని, ఈ పరీక్షకు 132 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పకడ్భందీగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.వి గణేశ్, యూపీఎస్సీ అధికారి కేశ్ రామ్ మీనా, ఏసీపీ నరిసింహారావు, ఏఓ గౌరీ శంకర్, పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల నమోదుశాతాన్ని పెంచాలిజిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదుశాతాన్ని పెంచే విధంగా బడిబాట కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య.. అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న బడిబాట కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడిబాటపై అవగాహన కార్యక్రమాలు తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓలు సమన్వయంతో జూన్ 6వ తేదీనుంచి నిర్వహించాలన్నారు. విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. పాఠశాలల విద్యా సంవత్సరం ప్రారంభంనాటికే యూనిఫామ్స్ సిద్ధంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాఠశాలలకు అవసరమైన వసతుల కల్పనపై ఎంపీడీఓల దృష్టికి తీసుకెళ్లి ఎంఎన్ఆర్, ఈజీఎస్ ద్వారా పనులు పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం బడిబాట కార్యక్రమాల నిర్వహణపై డీఈఓ వాసంతి సంబంధింత శాఖల అధికారులకు వివరించారు. జెడ్పీ సీఈఓ విద్యాలత, జిల్లా సంక్షేమాధికారి జయంతి, బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, ఎంఈఓలు పాల్గొన్నారు. -
భక్తికి రూపం హనుమంతుడు
వేయిస్తంభాల దేవాలయంలో ఘనంగా హనుమాన్ జయంతి హన్మకొండ కల్చరల్: భగవంతుడి భక్తికి రూపం హనుమంతుడని, చిన్నాపెద్దా భక్తితో అతడిని కొలుస్తారని వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు మణికంఠశర్మ, సందీప్ శర్మ, ప్రణవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో వేదపండితులు హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. సీఎంఆర్ షాపింగ్మాల్ అధినేత వెంకటరమణ, భరత్భూషణ్ దంపతుల అధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షుడు గట్టు మహేశ్బాబు తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. -
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో అధికారులు, రైస్మిల్లర్లతో గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాల్లో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 25,923 మంది రైతుల నుంచి 1,22 372 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. రైతులకు అందుబాటులో గన్నీ సంచులు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యాన్ని మిల్లర్లు దిగుమతి చేసుకోవాలని సూచించారు. 83 మిల్లులను ట్యాగింగ్ చేసి, కొనుగోలు సెంటర్ల కేంద్రాల ధాన్యాన్ని రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అదనంగా లారీలను కేటాయించి రవాణా చేయించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీసీఓ నీరజ, డీఏఓ అనురాధ, డీఎస్ఓ కిష్టయ్య, డీఎం సంధ్యారాణి, డీఎంఓ సురేఖ రైస్మిల్లర్లు పాల్గొన్నారు. కాల్సెంటర్ను వినియోగించుకోవాలి.. ధాన్యం కొనుగోళ్ల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన కాల్సెంటర్ను జిల్లాలోని రైతులు వినియోగించుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద గురువారం ఒక ప్రకటనలో కోరారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, సేకరణ, రవాణా, మద్దతు ధర, సమాచారం, ఇతర ఫిర్యాదుల పరిష్కారానికి టోల్ఫ్రీ నంబర్ 180042 53424కు కాల్ చేయాలని ఆమె సూచించారు. -
ముంపునకు గురికాకుండా చర్యలు చేపట్టండి
క్షేత్రస్థాయిలో మేయర్, ఎమ్మెల్యే, కమిషనర్ పర్యటన హసన్పర్తి: వర్షాకాలంలో కాలనీలు ముంపునకు గురవకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. 55, 56వ డివిజన్లలోని జవహర్ కాలనీ, పోచమ్మ గుడి, గోపాలపురం చెరువు, నక్షత్ర కాలనీ ప్రాంతాల్లో వారు పర్యటించారు. నాలాల్లో చేపట్టనున్న పూడిక పనుల ప్రక్రియను పరిశీలించారు. వడ్డేపల్లి మత్తడి నుంచి వచ్చే నాలా జవహర్నగర్ వద్ద ముంపునకు గురవకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. స్థానికుల కోరిక మేరకు గోపాలపురం చెరువును శుభ్రం చేసి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే వడ్రా.. హైడ్రా తరహాలో ఇక్కడ వడ్రా అమలు చేయనున్నట్లు ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు తెలిపారు. శిఖం, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టినా కూల్చివేస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సిరంగి సునీల్కుమార్, జక్కుల రజిత, మాజీ కార్పొరేటర్ వెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు, గడ్డం శివరాం, మణీంధర్నాథ్, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ రవికుమార్, సంతోశ్బాబు, డీఈలు రవికిరణ్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అత్యాధునిక సౌకర్యాలతో రైల్వేస్టేషన్లు
ఖిలా వరంగల్: ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి ఇతర దేశాలతో పోటీ పడే విధంగా రైల్వేస్టేషన్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమలశాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రూ.25.41 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేసిన వరంగల్ రైల్వేస్టేషన్ను గురువారం రాజస్థాన్లోని బికినీర్ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్చువల్గా పునఃప్రారంభించారు. ఈసందర్భంగా వరంగల్ రైల్వేస్టేషన్ ప్రాంగణంలో రైల్వేశాఖ దక్షిణమధ్య రైల్వే అడిషనల్ జనరల్ మేనేజర్ నీరజ్ అగర్వాల్ అధ్యక్షతన ప్రారంభోత్సవ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ హాజరై మాట్లాడారు. అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో అమృత్ భారత్ పథకంలో స్టేషన్లు అభివృద్ధి చెందాయన్నారు. రూ.25 కోట్లతో కాజీపేట రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులకు జరుగుతున్నాయని, కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యాధునిక హుంగులతో రానున్న 30 సంవత్సరాల్లో రైల్వేలను ఆధునికీకరించే విధానంలో వృద్దులు, దివ్యాంగులకు టాయిలెట్స్, వెయిటింగ్ రూమ్స్, ఎస్కలేటర్స్, ఫుట్ఓవర్ బ్రిడ్జి, లిఫ్ట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో బుల్లెట్ రైలు తీసుకురావడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మామునూరు ఎయిర్పోర్ట్ రన్వే విస్తరణ కోసం భూమిని కేటాయించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కళావైభవం ఉట్టిపడేలా స్టేషన్ : శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రూ.25.41 కోట్ల వ్యయంతో కాకతీయ కళావైభవం ఉట్టిపడేలా వరంగల్ రైల్వేస్టేషన్ను తీర్చిద్దిదడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లకు మాత్రమే కాకుండా అన్ని స్టేషన్లను అమృత్ భారత్ పథకంలో భాగంగా అభివృద్ధి చేయాలని కోరారు. రూ.425 కోట్లతో చర్లపల్లి నిర్మాణం : ఎంపీ ఈటల రాజేందర్ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో సమపాళ్లలో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రూ.425 కోట్ల వ్యయంతో చర్లపల్లి టర్మినల్ను అత్యాధునిక హంగులతో నిర్మించినట్లు తెలిపారు. కాజీపేటను రైల్వే డివిజన్గా ప్రకటించాలి: ఎంపీ కడియం కావ్య కాకతీయుల కళలు ప్రతిభింబించేలా వరంగల్ రైల్వేస్టేషన్ నిర్మించడం అభినందనీయమన్నారు. అమృత్ భారత్ పథకం కింద కాజీపేట రైల్వేస్టేషన్ పునరుద్దరణ పనులు కొనసాగుతున్నాయని, త్వరలో ప్రారంభించుకుంటామన్నారు. కాజీపేట రైల్వే డివిజన్గా ప్రకటించాలని, రైల్వేశాఖ ద్వారా బస్స్టేషన్ నిర్మించాలని కోరారు. 103 స్టేషన్లు దేశానికి అంకితం: ఎంపీ డీకే అరుణ అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా 103 స్టేషన్లను మౌలిక సదుపాయాలు, సకల సౌకర్యాలు కల్పించి ప్రధాని చేతుల మీదుగా వర్చువల్గా ప్రారంభించుకొని దేశానికి అంకితం చేసినట్లు తెలిపారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు వరంగల్ రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. భద్రకాళి అమ్మవారి గీతం, సిందూర్ ప్రత్యేక గీతానికి సైనిక దుస్తుల్లో కళాకారులు చేసిన నృత్యాలు అలరించాయి. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ వరంగల్ రైల్వేస్టేషన్ను గురువారం రాజస్థాన్లోని బికినీర్ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్చువల్గా పునఃప్రారంభించగా.. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రైల్వే అధికారులు ఇటీవల నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, యశస్విని రెడ్డి, కలెక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు, ప్రేమేందర్రెడ్డి, మాజీ మేయర్ రాజేశ్వర్రావు, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, స్థానిక కార్పొరేటర్ చింతకాల అనిల్, రైల్వే అధికారులు పాల్గొన్నారు. కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వరంగల్ రైల్వేస్టేషన్ను వర్చువల్గా పునఃప్రారంభించిన ప్రధాని మోదీ హాజరైన రాష్ట్ర మంత్రి పొంగులేటి, ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రాల ప్రదానం స్టేషన్ల ఆధునికీకరణ అభినందనీయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాష్ట్రంలోని బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వేస్టేషన్లను ఆధునికీకరించి ప్రారంభించినందుకు ప్రధాని మోదీకి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోనే హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో అదే విధంగానే వరంగల్ నగరం అభివృద్ధి సాధించాలని అన్నారు. ఉత్తర, దక్షిణ భారతాన్ని కలుపుతున్న కాజీపేట జంక్షన్ను డివిజన్గా ప్రకటించాల్సిన అవసరం ఉందని అన్నారు. -
అత్యాధునిక సౌకర్యాలతో రైల్వేస్టేషన్లు..
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రూ.25.41కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేసిన వరంగల్ రైల్వేస్టేషన్ను గురువారం రాజస్థాన్లోని బికనీర్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఈసందర్భంగా రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమలశాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మతోపాటు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. – ఖిలా వరంగల్ కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమలశాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వరంగల్ రైల్వేస్టేషన్ను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ – వివరాలు 8లోu -
కమిషనరేట్కు అధికారులు
వరంగల్ క్రైం: రాష్ట్రవ్యాప్తంగా పోలీస్శాఖలో జరిగిన బదిలీల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్కు ఇద్దరు, భూపాలపల్లికి ఒకరు వచ్చారు. రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఖమ్మం అడిషనల్ డీసీపీగా పనిచేస్తున్న ఏ.నరేశ్కుమార్ భూపాపల్లి అడిషనల్ ఎస్పీగా, భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్ను వరంగల్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీగా (ఆపరేషన్ అండ్ క్రైం), ఆసిఫాబాద్లో అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రాయల్ప్రభాకర్రావును వరంగల్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ ( లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్)కు బదిలీ చేశారు. -
ప్రాణహిత పరవళ్లు.. కాళేశ్వరం విరాజిల్లు!
మేఘం నీళ్లను కుమ్మరించినా.. ఈదురుగాలి చల్లగా పలకరించినా.. నేల చిత్తడిగా మారినా.. భక్తుల నిష్ట చెక్కుచెదరలేదు. రాష్ట్రాలు దాటి వచ్చిన వారు కొందరైతే.. గంటలకు గంటలు ప్రయాణించి వచ్చిన వారు ఇంకొందరు. భక్తజనులతో కాళేశ్వరాలయం, నదీ పరిసరాలు కిక్కిరిశాయి. పుణ్యస్నానమాచరించిన అనంతరం గోదావరికి ప్రత్యేక పూజలు చేశారు. కాళేశ్వరముక్తీశ్వరుణ్ని దర్శించుకునేందుకు పోటెత్తారు. గురువారం సుమారు లక్షమందికి పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. – మరిన్ని ఫొటోలు 8లోu -
ఝాన్సీరెడ్డికి హైకోర్టు నోటీసులు
పాలకుర్తి: ఫెమా నిబంధనలు ఉల్లంఘించి భూములు కొనుగోలు చేసిందనే కారణంతో పాలకుర్తి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసు జారీ చేసింది. 2017లో పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో ఝాన్సీరెడ్డి, డాక్టర్ రాజేందర్రెడ్డి దంపతులు 75 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. అమెరికా పౌరసత్వం కలిగిన ఝాన్సీరెడ్డి స్వదేశంలో భూమి ఎలా కొనుగోలు చేస్తుందంటూ వర్ధన్నపేట మండలం ఇల్లందకు చెందిన దామోదర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఈ నెల 1న హైకోర్టులో జడ్జి సీవీ భాస్కర్రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై జూన్ 19 లోపు వివరణ ఇవ్వాలని ఝాన్సీరెడ్డి, డాక్టర్ రాజేందర్రెడ్డి దంపతులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరితోపాటు రెవెన్యూ అధికారుల వివరణ కోరింది. గుర్తూరులో కొనుగోలు చేసిన 75 ఎకరాల భూమిలో ఝాన్సీరెడ్డి దంపతులు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సెంటర్ నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన పూర్తి చేసి పనులకు శ్రీకారం చుడుతున్న తరుణంలో హైకోర్టు నోటీసులు జారీ చేయడం చర్చానీయాంశంగా మారింది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి.. ఝాన్సీరెడ్డికి కోడలు కావడం గమనార్హం. -
శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025
ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రారంభించిన ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని నాలుగు మండలాలను ఎంపిక చేసింది. తర్వాత జిల్లాకు ఒక మండలం చొప్పున ఎంపిక చేసి సదస్సులు నిర్వహించి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలకు సంబంధించి.. నడికూడ (హనుమకొండ జిల్లా), వర్ధన్నపేట (వరంగల్), వెంకటాపురం (ములుగు), దంతాలపల్లి (మహబూబాబాద్), స్టేషన్ఘన్పూర్ (జనగామ), రేగొండ (జేఎస్ భూపాలపల్లి) మండలాలను ‘పైలట్’గా ఎంచుకున్నారు. ఆరు మండలాల నుంచి మొత్తం 19,655 దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ధరణి పోర్టల్లో నిక్షిప్తం చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. భూభారతి సదస్సులు, దరఖాస్తుల స్వీకరణ, క్షేత్రస్థాయి పరిశీలనలపై ‘గ్రౌండ్ రిపోర్ట్’.●సాక్షిప్రతినిధి, వరంగల్20 ఏళ్ల నుంచి ఇప్పటికీ పట్టాకాలేదు..సర్వేనంబర్ 161లో 1–01 ఎకరం భూమి ఉంది. మా తండ్రి వాటా కింద 20 ఏళ్ల కింద ఇచ్చిన భూమి ఇప్పటికీ నా పేరు మీద పట్టా కాలేదు. రెవెన్యూ అధికారులు మోకా మీదికి రాకుండానే గ్రామ పంచాయతీలో రికార్డులు చూసి గత పహాణీల్లో నీ పేరు లేదు కాబట్టి పట్టా చేయమని చెప్పారు. తాతలిచ్చిన ఆస్తులకే పట్టాలు చేయడం లేదు. గత ప్రభుత్వం ధరణిలో చేయకపోవడం వల్ల భూభారతి చట్టంలో దరఖాస్తు చేసుకున్నా. – శెట్టి సంపత్, వెంకటాపురం(ఎం)పాస్ బుక్ కోసం అర్జీ పెట్టుకున్నా..నాకు రామన్నగూడెం శివారులో 24 గుంటల అసైన్డ్ భూమి ఉంది. గత ప్రభుత్వంలో సర్వే నిర్వహించారు. కానీ, ఇప్పటివరకు పట్టా కాలేదు. భూభారతి సదస్సులో పట్టా పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేశా. – జంగేటి సంజీవ్, రామన్నగూడెం, రేగొండ మండలం వారసత్వ భూమి పట్టా కోసం అర్జీ పెట్టినం..జాలుబావుల్లో సర్వేనంబర్ 58, 67, 68లో రెండెకరాల 10 గుంటలు చెలుక నా పేరు, మా అన్న కొండ లింగయ్య పేర్లపై పట్టా కావాల్సి ఉంది. గత ప్రభుత్వంలో అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. అప్పుడు ధరణిలో చేయకపోవడం వల్ల భూభారతి చట్టంలో దరఖాస్తు చేసుకున్నం. మా తాత వారసత్వంతో పాటు కొన్న భూమి కూడా ఉంది. – కొండ భూపాల్, రైతు, దంతాలపల్లి భూభారతితో సత్వర పరిష్కారం..భూభారతి చట్టంతో భూసంబంధిత సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటికే నలభై శాతానికి పైగా పరిష్కరించాం. కలెక్టర్ ఆదేశాల మేరకు భూభారతి దరఖాస్తులపై ప్రత్యేక చొరవతో పనిచేస్తున్నాం. మొదట పైలట్ప్రాజెక్టుగా స్టేషన్ఘన్పూర్ మండలంలో పూర్తి చేస్తున్నాం. – వెంకటేశ్వర్లు, తహసీల్దార్, స్టేషన్ఘన్పూర్పైలట్ మండలాల వారీగా ఇదీ పరిస్థితి.. హనుమకొండ జిల్లా నడికూడలో రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 2,695 అర్జీలు రాగా, సదస్సులు ముగిశాక 203 అర్జీలు తహసీల్దారు కార్యాలయంలో రైతులు అర్జీలు పెట్టుకున్నారు. మొత్తం 2,898 అర్జీల్లో అత్యధికంగా 1,456 సాదాబైనామా, 481 అసైన్డ్ సవరణ, 331 డీఎస్ పెండింగ్, 223 వారసత్వ మార్పిడి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. భూవిస్తీర్ణంలో తేడా తదితర అంశాలపై అర్జీలు అందగా.. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రెవెన్యూ గ్రామాల వారీగా నాలుగు బృందాలు పనిచేస్తున్నాయి. వరంగల్ జిల్లాలో భూభారతి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న వర్ధన్నపేట మండలంలో 3,197 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ సదస్సుల్లో 2,917 దరఖాస్తులు రాగా.. తహసీల్దార్ కార్యాలయంలో 280 దరఖాస్తులు రైతులు ఇచ్చారు. వీటిలో అత్యధికంగా 1,415 సాదాబైనామాలు రాగా.. ఆతర్వాత అసైన్డ్ భూములకు సంబంధించి 746 దరఖాస్తులు వచ్చాయి. వారసత్వ భూమార్పిడి కోసం ఏకంగా 192 దరఖాస్తులు వచ్చాయి. ఉన్న భూమి కంటే తక్కువ నమోదైనవారు 155 మంది ఉన్నారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలో సదస్సులు ముగిసినప్పటికీ దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. మొత్తం 1,068 దరఖాస్తులు వచ్చినట్లు అఽధికారులు చెబుతున్నారు. సాదాబైనామా మినహా మిగిలిన దరఖాస్తుల్లో 40శాతానికి పైగా.. సమస్యలు పరిష్కారమయ్యాయి. మొత్తంగా భూభారతి చట్టంతో భూసమస్యల పరిష్కారంలో సత్ఫలితాలు వస్తున్నాయని అఽధికారులు, రైతులు చెబుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 4,555 దరఖాస్తులు వచ్చాయి. గడువు ముగిసినప్పటికీ తహసీల్దార్ కార్యాలయంలో పలువురు వివిధ భూ సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఎలాంటి వివాదాలు లేని పట్టా భూముల్లో ఉన్న సమస్యలను 40 శాతానికి పైగా పరిష్కారమయ్యాయి. మొత్తంగా భూభారతి చట్టంతో సత్ఫలితాలు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. జేఎస్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఈనెల 5 నుంచి 13వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 7,111 దరఖాస్తులు వచ్చాయి. సాదాబైనామా మినహా మిగిలిన దరఖాస్తుల్లో 30 శాతానికిపైగా సమస్యలు పరిష్కారమయ్యాయి. మొత్తంగా భూభారతి చట్టంతో సత్ఫలితాలు వస్తున్నాయని అధికారులు, రైతులు చెబుతున్నారు. న్యూస్రీల్అంశాలు, జిల్లాల వారీగా అర్జీల వివరాలు..అంశాలు హనుమకొండ వరంగల్ భూపాలపల్లి జనగామ ములుగు మానుకోట సాదాబైనామా 1,456 1,415 1,999 422 2,801 246 అసైన్డ్ 481 746 1,362 35 732 60 వారసత్వ మార్పిడి 223 192 290 140 430 56 భూ విస్తీర్ణంలో తేడాలు 134 155 338 84 101 101 డీఎస్ పెండింగ్ 331 45 247 29 100 20 మ్యుటేషన్పెండింగ్ 16 33 06 41 20 23 మిస్సింగ్ సర్వే నంబర్లు 08 30 23 05 100 37 ఇనామ్–ఓఆర్సీ జారీ 119 28 00 07 01 07 భూ వివరణ 00 22 01 11 203 02 భూ సేకరణ 14 05 08 23 03 29 పేరు సరిచేయుట 21 04 19 11 21 22 నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు 07 01 03 19 24 10 38 –ఈ ధ్రువపత్రం 00 01 00 00 19 00 ఇతర దరఖాస్తులు 88 520 2815 241 00 213 -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
ఖిలా వరంగల్: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వర్ధన్నపేట ఏడీఏ నరసింగం, ఖిలా వరంగల్ మండల వ్యవసాయధికారి రవీందర్రెడ్డి హెచ్చరించారు. వరంగల్ స్టేషన్ రోడ్డు, ఫోర్ట్ రోడ్డులోని ఎరువులు, విత్తన దుకాణాల్లో వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు గురువారం 25 షాపులను తనిఖీ చేసి రికార్డులు, విత్తనాల విక్రయాలు, అనుమతి, కంపెనీ గుర్తింపు వివరాలు తెలుసుకున్నారు. గాయత్రి, అరుంధతి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపులను తనిఖీ చేశా రు. స్టేషన్రోడ్డులోని ఓ షాపు నిర్వాహకులు కళాష్ సీడ్స్ కంపెనీ వారి విత్తన లైసెన్స్ రెన్యువల్ కాపీని అధికారులకు చూపించలేదు. దీంతో రూ.6,85,980 విలువై న 580 పత్తి, మిర్చి ప్యాకెట్ల విక్రయాలను నిలిపివేయించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నకిలీ, విడి విత్తనా లు కొనుగోలు చేసి మోసపోవద్దని, లైసెన్స్ ఉన్న షాపులోనే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. పంట ముగిసే వరకు విత్తన బిల్లులను భద్రపర్చుకోవాలన్నారు. పంట దిగుబడి రాకుంటే నష్టపరిహారం పొందే అవకాశం ఉందని వివరించారు. తనిఖీల్లో వ్యవసాయ శాఖ అధికారులు యాకయ్య, విజయ్, హెడ్కానిస్టేబుల్ కరుణాకర్, సిబ్బంది పాల్గొన్నారు. వర్ధన్నపేట ఏడీఏ నరసింగం, ఖిలా వరంగల్ ఏఓ రవీందర్రెడ్డి -
అంచెలంచెలుగా ఎదిగి.. నేలకొరిగి
హసన్పర్తి: విద్యార్థి దశ నుంచే విప్లవ భావాలు. పీజీ పూర్తిచేశాక నేరుగా మావో యిస్టు పార్టీకి ఆకర్షితుడై అందులో చేరారు. తొమ్మిదేళ్ల పాటు పార్టీలో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగిన బూర రాకేశ్ చివరికి ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో నేలకొరిగాడు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత సంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతోపాటు 26 మంది కాల్పుల్లో మృతి చెందారు. ఇందులో హసన్పర్తి మండలం చింతగట్టుకు చెందిన బూర రాకేశ్ అలియాస్ వివేక్ ఉన్నట్లు ఛత్తీస్గడ్ పోలీసులు ప్రకటించారు. హసన్పర్తి మండలం చింతగట్టుకు చెందిన రాకేశ్ది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు సరోజన–బాబు. తండ్రి ట్రాక్టర్ డ్రైవర్. తల్లి కూలీ. సోదరుడు రంజిత్కుమార్ ఆటోడ్రైవర్. రాకేశ్ బాల్యం చింతగట్టులోనే గడిచింది. 2009లో చింతగట్టు పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశాడు. ఈతర్వాత నగరంలోని స్నేహా కళాశాలలో (2009–11) ఇంటర్ పూర్తి చేశాడు. 2011–14 వరకు నగరంలోని ఓప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదివాడు. ఆతర్వాత నగరంలోని ఓ కళాశాలలో పీజీ పూర్తి చేశాడు. 2016లో అడవిలోకి.. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై 2016లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. మరుసటి ఏడాది అప్పటి కార్పొరేటర్లు కాయిత సమ్మిరెడ్డి, దాస్యం విజయ్భాస్కర్, ప్రస్తుత హసన్పర్తి పీఏసీఎస్ చైర్మన్ ఉదయ్కుమార్రెడ్డి, హసన్పర్తి మండల పరి షత్ మాజీ ఉపాధ్యక్షుడు బండా రత్నాకర్రెడ్డి, పెగడపల్లి మాజీ సర్పంచ్ నరేడ్ల శ్రీధర్ను హతమార్చేందుకు రెక్కీ నిర్వహించాడు. ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఉదయ్కుమార్రెడ్డి తప్పించుకున్నారు. అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఓసారి చింతగట్టుకు వచ్చినట్లు ప్రచారం జరిగింది. తొమ్మిదేళ్ల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లిన రాకేశ్ అంచెలంచెలుగా ఎదుగుతూ అగ్రనేతకు కంప్యూటర్ ఆపరేటర్గా వ్యవహరించాడు. విద్యార్థి దశ నుంచే.. విప్లవ భావాలు 2016లోనే అడవిబాట 2017లో ఐదుగురిపై రెక్కీ ముగిసిన రాకేశ్ ప్రస్థానం -
పది రోజులుగా టెంట్కిందనే..
పాలకుర్తి టౌన్: ఆయన యోగా గురువు. ఎంతోమందికి యోగా నేర్పాడు. ఏనాడూ డబ్బులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. అద్దె ఇల్లు. తనకంటూ ఏమీ సంపాదించుకోలేదు. చివరికి అనారోగ్యంతో చనిపోగా, ఇంటి యజమాని ఒప్పుకోకపోవడం, పది రోజుల కార్యక్రమాలయ్యే వరకు రావద్దని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఖాళీ ప్లాట్లో టెంట్వేసి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పది రోజులుగా అదే టెంట్లో కాలం గడుపుతున్నారు. ఈ విషాద ఘటన జనగామ జిల్లా పాలకుర్తిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పాలకుర్తి మండల కేంద్రం, చుట్ట పక్కల గ్రామాల్లో ఒకప్పుడు ఎల్ఎన్ టైలర్గా దార్ల లక్ష్మీనారాయణ ఓ వెలుగు వెలిగాడు. డబ్బులకు ప్రాధాన్యం ఇవ్వకుండా యోగా గురువుగా ఎంతోమంది కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాడు. పది రోజులక్రితం అనారోగ్యం బారిన పడి చనిపోయాడు. మృతదేహం ఉంచేందుకు ఇంటి యజమాని ఒప్పుకోలేదు. దీంతో వారికున్న ఖాళీ స్థలంలో(ప్లాట్)లో టెంట్ వేసి దహనసంస్కారాలు నిర్వహించారు. పది రోజుల వరకు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. దీంతో ఆ టెంట్కు చుట్టూ పరదాలు కట్టుకొని కాలం వెళ్లదీస్తూ మిగతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఈదురుగాలులు, వర్షం పడుతున్నా టెంట్కిందనే జీవనం సాగిస్తున్న దైన్యం. దశదిన కర్మ కార్యక్రమానికి కూడా చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. ఎవరైనా ఆపన్నహస్తం అందిస్తారని ఆశగా చూస్తున్నట్లు కుమారుడు దార్ల ఉపేందర్ తెలిపాడు. -
టెండర్లకు ముందుకు రాని కాంట్రాక్టర్లు
హన్మకొండ: తమకు పాత రేట్లు గిట్టుబాటు కావడం లేదని స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు పెంచితేనే పనులు చేయడం సాధ్యపడుతుందని విద్యుత్ కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు. ఈక్రమంలో టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ పరిధిలో సబ్ డివిజన్ల వారీగా విద్యుత్ సంబంధ పనులు పూర్తి చేయడానికి 2025–26 ఆర్థిక సంవత్సరానికి టెండర్లు పిలిచారు. ఈనెల 22న టెండర్లు వేయాల్సి ఉంది. దీనికిగాను షెడ్యూల్ తీసుకోవడానికి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించారు. గడువులోగా ఒక్క కాంట్రాక్టర్ కూడా షెడ్యూల్ తీసుకోలేదు. దీంతో గురువారం టెండర్లు వేసే అవకాశం లేదు. కాంట్రాక్టర్లు హనుమకొండ సర్కిల్ కార్యాలయానికి వచ్చినా షెడ్యూల్ మాత్రం తీసుకోలేదు. వచ్చిన వారు కూడా ఇతరులెవరైనా టెండర్ల షెడ్యూల్ తీసుకుంటారేమోనని జాగ్రత్తగా గమనిస్తూ కార్యాలయం ఆవరణలోనే కాపుకాశారు. కాంట్రాక్టర్లంతా సమష్టిగా టెండర్లు వేయడానికి ముందుకు రావట్లేదు. వారు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. ఆరేళ్ల క్రితం స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు పెంచారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు రేట్లు పెంచలేదని, ప్రతీ మెటీరియల్ రేట్ రెట్టింపు స్థాయిని మించి పెరిగాయని, ఈరేట్లతో పనులు చేస్తే గిట్టుబాటు ఏమో కానీ.. అప్పుల పాలు కావాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు. రెండేళ్ల క్రితం తాము సమ్మెకు వెళ్లగా.. నెలన్నర రోజుల్లో పెంచుతామని ఎన్పీడీసీఎల్ యాజమాన్యం హామీ ఇచ్చిందని, ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు పెంచితేనే టెండర్ల ప్రక్రియలో పాల్గొంటామని కాంట్రాక్టర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు తాము హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావుకు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. ముగిసిన కాల పరిమితి సబ్ డివిజన్ పరిధిలో రూ.20 లక్షల్లోపు విద్యుత్ అభివృద్ధి పనులు చేసేందుకు ఏడాది కాల పరిమితితో కాంట్రాక్టర్లను నియమిస్తారు. ఈకాంట్రాక్టర్ల నియామకానికి ప్రతీ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టెండర్లు పిలుస్తారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఖరారు చేసిన కాంట్రాక్టర్ల నియామక కాల పరిమితి ముగిసింది. దీంతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి కాంట్రాక్టర్లను ఖరారు చేసేందుకు టెండర్లు పిలువగా కాంట్రాక్టర్ల నిరాకరణ ఎదురైంది. స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లపై పూర్తి అసంతృప్తితో ఉన్న కాంట్రాక్టర్లు టెండర్లు వేయడానికి ఏ మాత్రం సహకరించేందుకు సిద్ధంగా లేరు. రేట్ల ఖరారుపై టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం తీసుకునే నిర్ణయంపై కాంట్రాక్టర్ల భవితవ్యం ఆధారపడి ఉంది. ఆరేళ్లుగా పెంచని స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు ధరలు పెంచితేనే టెండర్లకు వస్తామంటున్న కాంట్రాక్టర్లు గడువులోగా ఒక్కరూ తీసుకోని షెడ్యూల్ -
పూడికతీత పనుల తనిఖీ
వరంగల్ అర్బన్: హనుమకొండ పరిధి నయీంనగర్ నాలా బ్రిడ్జి, మంగలి వాగు బ్రిడ్జి నాలాల పూడికతీత పనుల్ని బుధవారం కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తనిఖీ చేశారు. నాలాల్లో ఏమాత్రం వ్యర్థాలు లేకుండా ఇంజనీర్లు క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయాలని సూచించారు. పూడికతీత పనుల్లో నిర్లక్ష్యం చేస్తే వరదల వల్ల కాలనీకు ముప్పు వాటిల్లుతుందని గుర్తించుకోవాలని సూచించారు. ఉనికిచెర్లకు పట్టణ రూపు తీసుకొస్తా..ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధర్మసాగర్: ఉనికిచర్ల గ్రామానికి పట్టణ రూపు తీసుకొస్తానని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ పరిధి ఉనికిచర్లలో రూ.1.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్లు, వరద కాలువల నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఉనికిచర్ల గ్రామాభివృద్ధికి ‘కుడా’ ద్వారా రూ.3 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఉనికిచర్ల– రా పాకపల్లి రోడ్డుకు రూ.41 లక్షలు మంజూరైన ట్లు, పనులు ప్రారంభమవుతాయన్నారు. -
తహసీల్దార్లా.. మజాకా ● ఎగ్జిక్యూటివ్ పోస్టు కోసం పట్టు
గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025– 8లోuహన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో ఇటీవల జరిగిన తహసీల్దార్ల బదిలీలు.. వాటివెనుకున్న రాజకీయ ప్రమేయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. సాధారణ ఎన్నికల సమయంలో ఇతర జిల్లాల నుంచి తహసీల్దార్లు వచ్చారు. ఇక్కడి వారు ఇతర జిల్లాలకు వెళ్లారు. తాజాగా ప్రభుత్వం తహసీల్దార్ల అభ్యర్థన మేరకు గతంలో పనిచేసిన జిల్లాలకు తిరిగి పంపింది. దీంతో జిల్లాకు వచ్చినవారికి పోస్టింగ్స్ ఇచ్చే క్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొందరు కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లో సూపరింటెండెంట్ పోస్టులు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. తమకు ప్రాధాన్యం ఉన్న మండలాల్లో పోస్టు కావాలని ఉన్నతాధికారులపై వివిధ మార్గాల్లో ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో జిల్లాలోని 14 మండలాల్లోని కొన్ని కీలక ప్రాంతాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లు తమ సీటుకు ఎక్కడ ముప్పు వస్తుందోనని ముందే స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని, కదిలించకుండా చూడాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. ముఖ్యంగా హసన్పర్తి, ధర్మసాగర్, ఐనవోలు, ఎల్కతుర్తి, కాజీపేట మండలాల విషయంలో అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం. అటు అధికారులను, ఇటు ప్రజాప్రతిధులను సమన్వయ పరుస్తూ జిల్లా ఉన్నతాధికారులు పోస్టింగ్స్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. కొన్ని మండలాల తహసీల్దార్లు తమ సీటుకు ఎసరు వస్తుందని ముందే పసిగట్టి స్థానిక ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుని ఎలాగైనా స్థానచలనం కలగకుండా చూడాలని చివరి దాకా ప్రయత్నం చేసి దాదాపు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఈక్రమంలో తమకేం కాదని, తమ మండలాలకు ఎవరూ రారులే అనుకుని ఉన్నవారికి మాత్రం ఊహించని రీతిలో బదిలీ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. జిల్లాలో ప్రస్తుత బదిలీల్లో భీమదేవరపల్లి, నడికూడ, పరకాల, వేలేరు తహసీల్దార్ పోస్టులతోపాటు పరకాల డీఏఓ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ పోస్టులకు కేటాయించారు. వారిలో కొందరికి మంచి పోస్టులే వచ్చినా.. తాము అనుకున్న స్థాయి పోస్టులు దక్కలేదని అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా బదిలీల్లో వేలేరు తహసీల్దార్ కోమిని కలెక్టరేట్కు, కలెక్ట్టరేట్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ప్రసాద్ను వేలేరుకు బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, వాటిని బుధవారం మళ్లీ మార్పు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అక్కడి నుంచి కలెక్టరేట్కు బదిలీ చేసిన తహసీల్దార్ కోమిని వేలేరులోనే ఉండేలా, ప్రసాద్ కలెక్టరేట్లో ఉండేలా ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తంగా చాలాకాలం తర్వాత జరిగిన తహసీల్దార్ల బదిలీలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. త్వరలో జిల్లాకు మరో ఇద్దరు తహసీల్దార్లు వస్తారని ప్రచారం సాగుతోంది. దీంతో వారి రాక ఎవరి సీటుకు ఎసరుతెస్తుందోనని గుసగుసలు మొదలయ్యాయి. న్యూస్రీల్అయినా అసంతృప్తి.. కలెక్టరేట్లో ఉండేందుకు ససేమిరా... వేలేరు తహసీల్దార్ రిటెన్షన్ కొందరికి ప్రజాప్రతినిధుల భరోసా హనుమకొండ జిల్లాలో తహసీల్దార్ల బదిలీలపై తీవ్ర చర్చ -
రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన నాయకులు
రామన్నపేట: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం ఎంజీఎం సర్కిల్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, నాయకులు గోపాల నవీన్రాజ్, మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మావతి భాస్కర్, టీపీసీసీ కార్యదర్శులు మీసాల ప్రకాశ్, కొత్తపల్లి శ్రీనివాస్, మబ్బు ప్రవీణ్, భాషపాక సదానందం, మడిపల్లి కృష్ణ, సకినాల రజనీకాంత్, కత్తెరశాల వేణుగోపాల్, జారతి రమేశ్, నారగోని స్వప్న మురళి, కార్పొరేటర్లు తేజస్వి శిరీష్, వస్కుల బాబు, కావేటి కవిత, బాల్నే సురేశ్, భోగి సువర్ణ సురేశ్, గుండు చందన, పూర్ణచందర్ పాల్గొన్నారు. -
ఆధునిక హంగులు.. అమృత్ వెలుగులు
సాక్షి, వరంగల్: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఆధునికీకరించిన వరంగల్ రైల్వే స్టేషన్ సకల సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. రూ.25.41 కోట్ల అమృత్ నిధులతో కాకతీయుల సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా అభివృద్ధి చేసిన ఈ రైల్వేస్టేషన్ను గురువారం ఉదయం 9.30 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధి ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో ఉన్న వరంగల్ రైల్వే స్టేషన్లో కొత్త ప్లాట్ఫాంలు, ట్రాక్లు, సౌకర్యాల కల్పనతోపాటు అనేక విస్తరణలు, ఆధునికీకరణ పనులు చేశారు. ఈస్టేషన్లో నాలుగు ప్లాట్ఫాంలు ఉన్నాయి. ఏమేం పనులు చేశారంటే.. కాకతీయ కళాతోరణం ఉండేలా స్టేషన్ ముఖద్వారాన్ని అభివృద్ధి చేశారు. ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారం, ప్రయాణికుల సౌకర్యార్థం 12 మీటర్ల వెడల్పు గల పాదచారుల వంతెన (ఫుట్ఓవర్ బ్రిడ్జి) నిర్మాణంతోపాటు మూడు లిఫ్ట్లు, నాలుగు ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. ప్లాట్ఫాం విస్తీర్ణం పెంపు, ప్లాట్ఫాంపై అదనపు కప్పు, దివ్యాంగులకు కొత్త టాయిలెట్ బ్లాకులు నిర్మించారు. వెయిటింగ్ హాల్ అభివృద్ధి, ఆహ్లాదం కోసం స్టేషన్ ఆవరణలో పచ్చదనాన్ని పెంచారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకుండా స్టేషన్ ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేశారు. కళలు, సంస్కృతికి సంబంధించిన చిత్రాలు వేశారు. రైలు సూచిక బోర్డులు, కోచ్ సూచిక బోర్డులు అమర్చారు. రోజుకు 31,887 మంది రాకపోకలు.. ● కాజీపేట, విజయవాడ సెక్షన్లో ఉన్న ఈ స్టేషన్ రూ.41.09 కోట్ల వార్షిక ఆదాయం వస్తుంది. సగటున రోజుకు 31,887 మంది ప్రయాణికుల రాకపోకలతో కాజీపేట, హనుమకొండ, వరంగల్తో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ● ఈ స్టేషన్లో దాదాపు 137 రైళ్లు ఆగుతాయి. న్యూఢిల్లీ, హౌరా, చైన్నె, విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే సూపర్ఫాస్ట్ రైళ్లకు ఇక్కడా హాల్టింగ్ ఉంది. వరంగల్ రైల్వే స్టేషన్కు నూతన సొబగులు వర్చువల్గా నేడు ప్రారంభించినున్న ప్రధాని మోదీ -
పరీక్షల బోర్డు నిబంధనలు పాటించాలి
విద్యారణ్యపురి: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం వరంగల్ జిల్లాకు సంబంధించి హనుమకొండలోని ఇంటర్ విద్యా కార్యాలయంలో స్క్వాడ్ బృందాలతో నిర్వహించిన సమావేశంలో డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ పాల్గొని మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా స్క్వాడ్ల బృందాలు తనిఖీలు చేపట్టాలన్నారు. వరంగల్ జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలు, 16 మంది చీఫ్ సూపరింటెండెంట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 5,200 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. రెండు సిట్టింగ్ స్క్వాడ్లు, ఒక ప్లయింగ్స్కాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈసమావేశంలో డీఈసీ సభ్యులు మాధవరావు, విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లాలో.. హనుమకొండ జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలకు 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 12,063 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,453 మంది పరీక్షలు రాయనున్నట్లు డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. ఈపరీక్షలు ఈనెల 22 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ -
మహిళా కానిస్టేబుల్కు సీపీ అభినందన
వరంగల్ క్రైం: ఆలిండియా పోలీస్ కబడ్డీ క్లస్టర్ 2024–25 క్రీడా పోటీల్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ స్పందనను సీపీ సన్ప్రీత్సింగ్ బుధవారం అభినందించారు. వరంగల్ కమిషనరేట్ ఆర్మ్డ్ రిజర్వ్ వి భాగంలో మహిళా కానిస్టేబుల్ స్పందన విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె గత నెల పంజాబ్ రాష్ట్రం జలందర్లో నిర్వహించిన మొదటి ఆలిండియా పోలీస్ కబడ్డీ క్లస్టర్ 2024–25 క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఫెన్సింగ్ క్రీడలో సీనియర్ ఉమెన్స్ టీం ఫాయిల్ విభాగంలో కాంస్య పతకం సాధించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. క్రీడల్లో రాణించే పోలీస్ సిబ్బందికి పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. జాతీయ స్థాయి క్రీడల్లో రాణించే పోలీస్ క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో పరిపాలనా విభాగం అదనపు డీసీపీ రవి, ఏఆర్ ఏసీపీ అంతయ్య పాల్గొన్నారు. ఎంసీఏ పరీక్షలు షురూ..కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిఽధిలో ఎంసీఏ సెకండియర్ రెండో సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. క్యాంపస్లోని ఎకనామిక్స్ విభాగంలో ఏర్పా టు చేసిన ఎంసీఏ పరీక్ష కేంద్రాన్ని కేయూ వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం పరిశీలించారు. కేయూ పరిధిలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సుల వివిధ సెమిస్టర్ల పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం ఏటూరు నాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని బుధవారం కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పి.వెంకటయ్యతో కలిసి పరిశీలించారు. బెస్ట్ ప్రాక్టీసెస్ నమోదు గడువు పెంపువిద్యారణ్యపురి: ప్రభుత్వ ఉపాధ్యాయులు, హెచ్ఎంలు తమ పాఠశాలల్లో ఆచరించే బెస్ట్ ప్రాక్టీస్ నమోదు గడువును ఎస్సీఈఆర్టీ పెంచినట్లు హనుమకొండ డీఈఓ వాసంతి బుధవారం తెలిపారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల, కేజీబీవీల, తెలంగాణ మోడల్ పాఠశాలలు, తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించి ఉపాధ్యాయులు, హెచ్ఎంలు ఈనెల 22వ తేదీ వరకు ఎస్సీఈ ఆర్టీవెబ్సైట్లో, హెచ్టీటీపీఎస్//ఎస్సీఈఆర్టీ.తెలంగాణ.గౌట్.ఇన్లో నమోదు చేసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించి సందేహాలుంటే డి.మధుసూదన్రెడ్డి 97058 06579 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానంకాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలోని బీసీ కులానికి చెందిన శిక్షణలో ఉన్న అడ్వకేట్ విద్యార్థులకు 2025–26 సంవత్సరానికి బీసీ అడ్వకేట్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 31వ తేదీలోపు కలెక్టరేట్లోని బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి..విద్యారణ్యపురి: పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు పాఠశాలలకు సంబంధించిన విషయాల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి కోరారు. బుధవారం జిల్లాలోని భీమారంలోని స్కిల్ స్టార్క్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని డీఈఓ వాసంతి సందర్శించి హెచ్ఎంలను ఉద్దేశించి మాట్లాడారు. వృత్తిపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలని అలాగే నాయకత్వ లక్షణాలు పునికిపుచ్చుకోవాలన్నారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే, పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనలో ఉత్తమ మార్గాలను అనుసరించాలని హెచ్ఎంలకు డీఈఓ సూచించారు. శిక్షణలో జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్, కమ్యూనిటీ మొబలైజింగ్ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, రిసోర్స్పర్సన్లు రామకృష్ణ, వేణు ఆనంద్, మనోహర్నాయక్, రమేశ్బాబు తదితరులు పాల్గొన్నారు. -
అర్హుల ఎంపిక త్వరగా పూర్తి చేయండి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: జిల్లాలో రాజీవ్ యువ వికాసంపథకం అర్హుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధి కారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఆర్వైవీ, ఉపాధి హామీ పథకాలపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. అర్హుల ఎంపికలో భాగంగా దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తి చేయాలని, జిల్లాలో మొత్తం 10,565 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. మే 24 వరకు మండల స్థాయి కమిటీలతో ఎంపిక పూర్తి చేసి తుది జాబితా అందించాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా 7,675 పని దినాలకు ఇప్పటి వరకు 3,645 పని దినాలు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. రుతుపవనాలు ముందే వచ్చే అవకాశం ఉన్నందున జూన్ 15 నాటికి లక్ష్యాన్ని అధిగమించి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, హౌసింగ్ డీడీ రవీందర్, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, ఎల్డీఎం శ్రీనివాస్, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి.. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అంగన్వాడీల్లో చేపట్టిన పనుల పురోగతి, ఇతర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఉపాధి హామీ పథకం ద్వారా 24 అంగన్వాడీల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీడబ్ల్యూఓ జయంతి, సీపీఓ సత్యనారాయణరెడ్డి, పీఆర్ ఈఈ ఆత్మరావు ఉన్నారు. -
ఇన్చార్జ్ సీఎండీలతో ఇబ్బందులు
● టీఎస్ఈఈయూ –327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ హన్మకొండ: టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కోలో ఇన్చార్జ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లతో అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. మంగళవారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్లోని టీఎస్ఈఈయూ–327 కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు గ్రహీతల సన్మానం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల నియామకంలో జాప్యంతో పాలనాపరమైన ఇబ్బందులు కలుగుతున్నాయని, వెంటనే నియామకాలు చేపట్టాలన్నారు. ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందన్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో అపాయింట్మెంట్ ఇప్పించాలని సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కోరారు. ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ తాను ఈ కార్యక్రమం నుంచి విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడానని, నాలుగైదు రోజుల్లో సమయం ఇస్తానని చెప్పారన్నారు. అనంతరం శ్రమశక్తి అవార్డు గ్రహీతలు పి.మహేందర్ రెడ్డి, నీలం ఐలేశ్, సురేశ్ కుమార్ను ఎమ్మె ల్యే నాయిని, ఇనుగాల శ్రీధర్, నాయకులు సన్మానించారు. పీసీసీ నాయకుడు ఈ.వి.శ్రీనివాస్ రావు, టీఎస్ఈఈయూ–327 టీజీ ఎన్పీడీసీఎల్ సెక్రటరీ కొండూరి శ్రీనివాస్, భూపాల్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నరేందర్ రెడ్డి, మాధవ రావు, చిట్ల ఓదేలు, బుచ్చయ్య గౌడ్, జశ్వంత్ కుమార్, సదయ్య, శ్రీనివాస్, రవికుమార్ పాల్గొన్నారు. కొత్త సబ్స్టేషన్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హన్మకొండ: కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్లు, నోడల్ అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎండీ వరుణ్రెడ్డి మాట్లాడుతూ 16 సర్కిళ్ల పరిధిలో పురోగతిలో ఉన్న ఇంటర్ లింకింగ్ లైన్ల పనులు యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని ఆదేశించారు. బ్రేక్ డౌన్స్, ట్రిప్పింగ్స్ లేకుండా ప్రతీ నెల ఫీడర్ల నిర్వహణ చేపట్టాలన్నారు. ప్రీ మాన్సూన్ తనిఖీలు అన్ని ఫీడర్లలో చేపట్టాలని, తద్వారా అంతరాయాలు తగ్గుతాయన్నారు. సబ్ స్టేషన్ల నిర్వహణ చేసే సమయంలో అంతరాయం లేకుండా వేరే సబ్ స్టేషన్ నుంచి ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సీఈలు కె.తిరుమల్ రావు, రాజుచౌహాన్, అశోక్, వెంకట రమణ, జీఎంలు వేణు బాబు, దేవేందర్, కృష్ణమోహన్, వెంకటకృష్ణ, శ్రీనివాస్, సత్యనారాయణ, సురేందర్, ఉత్తమ్, తదితరులు పాల్గొన్నారు. పీజీ పరీక్షలు షురూకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆ దిలాబాద్ జిల్లాలో పీజీ కోర్సుల (నాన్ ప్రొఫెషనల్) రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్ నాలుగో సెమిస్టర్ పరీక్షలు మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ కొందరు విద్యార్థులు మంగళవారం ఉదయం కేయూలోని పరిపాలనా భవనం వద్ద ధర్నా నిర్వహించారు. పోలీసుల చొరవతో వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ విద్యార్థులతో చర్చించారు. త్వరగా పరీక్షలు జరిగితే ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని నచ్చజెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. టైంటేబుల్ ప్రకారం మధ్యాహ్నం 2గంటల నుంచి యథావిధిగా పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు కేయూ పరిధిలో 95 శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. వీరి వెంట పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బీఎస్ఎల్ సౌజన్య, వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, ఆర్ట్స్ కాలేజీ పరీక్ష కేంద్రంలో ప్రిన్సిపాల్ జ్యోతి ఉన్నారు. రేపటి నుంచి జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపికలువరంగల్ స్పోర్ట్స్: ఈనెల 22వ తేదీన జూనియర్స్ బాలబాలికల ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పి.రాజేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు జనవరి 1, 2009 నుంచి డిసెంబర్ 31, 2010 మధ్య జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఆధార్, స్కూల్ బోనోఫైడ్, జనన ధ్రువీకరణ పత్రం జిరాక్స్లతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో పాటు రూ.300 ఎంట్రీ ఫీజుతో ఉదయం 7గంటలకు హనుమకొండలోని డీఎస్ఏ బాక్సింగ్హాల్ నందు హాజరు కావాలని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 24వ తేదీన మంచిర్యాలలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ● ఉదయం కేయూలో విద్యార్థుల ధర్నా ● మధ్యాహ్నం నుంచి యథావిధిగా ఎగ్జామ్స్ -
ఎస్సై సంతకం ఫోర్జరీ..
● ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్.. సీపీ ఉత్తర్వులు జారీ ● తరిగొప్పుల పోలీస్ స్టేషన్లో సంఘటన వరంగల్ క్రైం: జనగామ జిల్లా తరిగొప్పుల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఏకంగా ఎస్సై సంతకం ఫోర్జరీ చేసి అడ్డంగా దొరికిపోయారు. దీంతో వారిని సస్పెండ్ చేస్తూ సీపీ సన్ప్రీత్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం ఆలస్యంగా మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. తరిగొప్పుల పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న సురేష్, రాజు కానిస్టేబుళ్లు ఇటీవల స్టేషన్ బెయిల్ విషయంలో అక్కడ ఎస్సైగా పనిచేస్తున్న శ్రీదేవి సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఆ కాగితాలను కోర్టుకు సమర్పించారు. గుడుంబా అమ్ముతున్న ఓ వ్యక్తికి స్టేషన్ బెయిల్ ప్రాసెస్ చేయాల్సిందిగా ఎస్సై శ్రీదేవి అదే స్టేషన్ రైటర్ను ఆదేశించారు. దీనిని అవకాశం తీసుకున్న సదరు రైటర్తోపాటు మరో కానిస్టేబుల్ డబ్బులకు ఆశపడి, ఎస్సై ఆదేశాలను అవకాశంగా తీసుకుని ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి స్టేషన్ బెయిల్ మంజురు చేశారు. ఆ తరువాత ఆ కేసుకు సంబంఽధించిన కాగితాలను కోర్టుకు సమర్పించారు. ఆలస్యంగా తన సంతకం ఫోర్జరీ అయ్యిందని గ్రహించిన ఎస్సై శ్రీదేవి వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. విచారణ జరిపిన అధికారులు వరంగల్ పోలీస్ కమిషనర్కు నివేదిక సమర్పించడంతో కానిస్టేబుళ్లు సురేష్, రాజులపై సీపీ రెండు రోజులక్రితం సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మారని తీరు.. సంవత్సరాల తరబడి శిక్షణాలు పూర్తి చేసిన పోలీస్ అధికారులు కాసుల కక్కుర్తి కోసం అడ్డదారులు తొక్కుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీంతో పోలీస్శాఖ పరువు బజారున పడుతోంది. కమిషనరేట్ పరిధిలో జరిగిన రెండు హత్య కేసుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రధాన నిందితులుగా ఉండడం గమనార్హం. ఇటీవల సస్పెండ్కు గురైన ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా గతంలోనూ అవినీతి ఆరోపణలపై సస్పెండ్ కావడం కొసమెరుపు. గతంలో హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో, శాయంపేట పోలీస్ స్టేషన్, సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ వసూళ్లకు పాల్పడి సస్పెండ్ అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఉన్నతాధికారులు తీసుకుంటున్న క్రమశిక్షణ చర్యలు కూడా బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. అవినీతికి పాల్పడుతున్న పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే పోలీస్ శాఖ గాడిన పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంటెలిజెన్స్ డీజీని కలిసిన సీపీవరంగల్ క్రైం: తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీ శివధర్రెడ్డిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ మంగళవారం హనుమకొండలోని పోలీస్ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. కాళేశ్వరం పుష్కరాలకు వెళ్తున్న డీజీ శివధర్రెడ్డి మార్గమధ్యలో పోలీస్ అతిథి గృహానికి చేరుకున్న సందర్భంగా సీపీ కలిశారు. ఈసందర్భంగా ఇరువురు అధికారులు పలు అంశాలపై చర్చించారు. -
గోదావరి తీరం.. భక్తప్రవాహం
సరస్వతీనది పుష్కర స్నానాలకు భక్తుల రద్దీ● హైకోర్టు జడ్జి, ఎస్ఐబీ డైరెక్టర్, ఇంటెలిజెన్స్ డీజీ పుష్కర స్నానం, దర్శనం ● 50వేల మంది వరకు భక్తులు పుష్కర స్నానాలు● తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకూ కొనసాగింపు.. ● ఆరో రోజు స్వల్పంగా తగ్గిన భక్తులు ● ముక్తీశ్వరస్వామి ఆలయ క్యూలైన్లో బారులుదీరిన భక్తజనంభూపాలపల్లి/కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీనది పుష్కరాలకు భక్తులు తరలివచ్చారు. మంగళవారం ఆరో రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్నాటక రాష్ట్రాల నుంచి తరలొచ్చి గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీనదిలో పుష్కర పుణ్యస్నానాలు ఆచరించారు. నదీమాతకు పూజలు చేశారు. పిండ ప్రదాన పూజలు చేశారు. పితృదేవతలకు తర్పణాలు నిర్వహించారు. నదీమాతకు చీర, సారె సమర్పించారు. ముత్తయిదువలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. గోదావరితీరం వద్ద భక్తప్రవాహం కనిపించింది. నదిలో దీపాలు వదిలి మొక్కులు చెల్లించారు. ఇసుకలో సైకత లింగాలు చేసి పూజించారు. కలెక్టర్, ఎస్పీ పరిశీలన పుష్కరాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్లు, సింగరేణి, గజ ఈతగాళ్లును ఏర్పాటు చేశారు. కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే వాకీటాకీలతో మాట్లాడుతూ పరిశీలించారు. టెంట్సిటీ, ఆలయ పరిసరాలు, ప్రధాన రహదారుల్లో బ్లీచింగ్ చల్లించి పరిస్థితిని చూశారు. పుష్కర ఘాట్ గోదావరిలో బోటు ద్వారా భద్రతను పరిశీలించారు. బస్టాండ్ ప్రాంతంలో అదనంగా చలువ పందిళ్లు వేయాలని ఆదేశించారు. ఎస్పీ ట్రాఫిక్ నియంత్రణను పకడ్బందీగా చేట్టాలని ఆదేశించారు. అష్టమితో తగ్గిన రద్దీ.. మంగళవారం అష్టమి సందర్భంగా భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. ఉదయం 10గంటల వరకు భక్తుల రద్దీ లేదు. ఆ తర్వాత క్రమక్రమంగా పెరిగింది. హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి, మంథని, కాటారం మీదుగా వాహనాలు తరలొచ్చాయి. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు డివైడర్లతో నియంత్రించారు. పార్కింగ్ స్థలాల్లో వాహనాల రద్దీ కొనసాగింది. రోడ్లు శుభ్రం.. ఆదిముక్తీశ్వరస్వామి నుంచి వీఐపీ ఘాట్ వెళ్లే మార్గంలో వర్షం పడితే రోడ్లపై దిగబడకుండా గ్రావెల్ చిప్స్ వేశారు. రోడ్లపై దుమ్ము లేవకుండా ట్యాంకర్లతో నీటిని చల్లుతున్నారు. గోదావరితీరం, ఆలయ పరిసరాలు, పార్కింగ్ ప్రాంతాలు, ఆర్టీసీ బస్టాండ్లు, ప్రధాన రహదారుల్లో పారిశుద్ధ్య కార్మికులు పనులు చురుగ్గా చేపట్టారు. 50వేల మంది స్నానాలు.. వివిధ రాష్ట్రాల నుంచి ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో భక్తులు త్రివేణి సంగమం సరస్వతీనదికి వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. కాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో దర్శనానికి క్యూలైన్లో బారులుదీరారు. మంగళవారం 50వేల మంది వరకు పుష్కర స్నానాలు చేసి దర్శనాలు చేసుకున్నట్లు అధికారుల అంచనా. పలువురు భక్తులు అక్కడక్కడ వడదెబ్బకు గురయ్యారు. వారిని కాళేశ్వరం పీహెచ్సీకి తరలించి వైద్యసేవలందించారు. కొంత మందిని ఇతర పట్టణాలకు తరలించి వైద్యసేవలందించినట్లు వైద్యులు పేర్కొన్నారు. మజ్జిగ ప్యాకెట్లు అందజేత.. భక్తులకు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో తాగునీరు, మజ్జిక ప్యాకెట్లు అందించారు. ప్రధాన తూర్పు, దక్షిణ ద్వారాల ద్వారా క్యూలైన్లలో భక్తులను ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు. ప్రత్యేకాధికారిగా మనోహర్ను నియమించారు. ఆయన క్రౌడ్ మేనేజ్మెంట్ చేపట్టారు. సరస్వతీనది పుష్కరాలకు ప్రముఖులు హాజరయ్యారు. హైకోర్టు జడ్జి సృజన, ఎస్ఐబీ డైరెక్టర్ తరుణ్జోషి, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పుష్కర స్నానాలు ఆచరించి శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.నదీహారతి ప్రత్యక్ష ప్రసారం.. సరస్వతి ఘాట్లో కాశీపండితులతో ఏర్పాటు చేసిన నవరత్నమాలిక హారతికి భక్తుల నుంచి విశేష స్పందన రావడంతో సీఎం రేవంత్రెడ్డి ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. రాత్రి 7.30 గంటలకు 45 నిమిషాల పాటు జరిగే ఈకార్యక్రమాన్ని పుష్కరాలు పూర్తయ్యే వరకు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. కాశీ పండితులు ఏడుగురితో తొమ్మిది హారతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగుల్లో హారతి ఇస్తున్నారు. రోజురోజుకూ పరిసర ప్రాంతాల భక్తులు వీక్షించడానికి తరలి వస్తున్నారు. రాత్రి 9 వరకు కూడా వరకు భక్తులు ఆయా పరిసరాల్లో కాలక్షేపం చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. ప్రముఖుల పూజలు.. -
వివాదాలకు అడ్డాగా ‘మిల్స్ కాలనీ’
సాక్షి, వరంగల్: వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్స్టేషన్ వివాదాలకు అడ్డాగా మారుతోంది. ఇక్కడ పనిచేసేందుకు వచ్చే పోలీసు అధికారులు భూ వివాదాల్లో తలదూరుస్తూ సస్పెండ్ వరకు వెళ్తున్న ఉదంతాలు వరుసగా జరుగుతుండడం గమనార్హం. ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఠాణా పరిధిలో ఎక్కువగా భూసమస్యలే వస్తుండడంతో వాటిపై కన్నేసి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన కొందరు ఇన్స్పెక్టర్లు భూవివాదాల్లో పరిధి దాటి వ్యవహరించడంతో ఉన్నతాధికారులు వేటు వేశారు. తాజాగా సీఐ వెంకటరత్నంపై పలు వివాదాలు రావడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ సీసీ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. గతంలోనూ... ● దూపకుంటలోని 20 గుంటల భూమిలో ఏడుగురు ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేశారు. అమ్మిన వ్యక్తి సోదరుడు తనదంటూ రావడంతో బాధితులకు సహాయం చేయాల్సిన సీఐ రవి కిరణ్ వారిని పట్టించుకోకపోవడంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మరో సీఐపై భూవివాదంలో తలదూర్చారనే ఆరోపణలొచ్చాయి. అలాగే ఆయన పోలీసు స్టేషన్ ఆవరణలో ఓ నిందితుడు భవనంపైనుంచి కిందపడడం కూడా అప్పట్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో సదరు అధికారిని ఇక్కడినుంచి మరో చోటికి బదిలీ చేశారు. ● తర్వాత వచ్చిన సీఐ మల్లయ్యపై కూడా ఉన్నతాధికారులకు భూవివాదాల్లో తలదూర్చారనే ఫిర్యాదులు వెళ్లాయి. అదేసమయంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ స్టేషన్ ఘన్పూర్ లోని ఓ గుడికి వెళ్లిన సమయంలో పరిధి దాటి ఎస్కార్ట్గా వెళ్లడంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు ఐజీ కార్యాలయానికి అటాచ్డ్ చేశారు. తాజాగా సీఐ వెంకటరత్నంపై వేటుతో చర్చ గతంలోనూ భూవివాదాల్లో కొందరు అధికారులు సస్పెండ్, అటాచ్డ్లతో ఉన్నతాధికారుల చర్యలు -
లండన్లో చదువుకున్నా..మన సంస్కృతిని మరిచిపోలేదు
హన్మకొండ/హన్మకొండ కల్చరల్/ఖిలావరంగల్: లండన్లో చదువుకున్నా మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోలేదని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్దేవ్ అన్నారు. మంగళవారం ఆయన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, నన్నపునేని నరేందర్తో కలిసి నగరంలోని వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, ఖిలావరంగల్ కోటలోని స్వయంభు శంభు లింగేశ్వర ఆలయంలో, వడ్డేపల్లిలోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పోచమ్మ మైదాన్లోని రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం హనుమకొండలోని హోటల్ హరిత కాకతీయలో ప్రజలతో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు సాంస్కృతికపరంగా ఎంతో అభివృద్ధి చెందిందని, పారిశ్రామిక పరంగా అభివృద్ధి జరిగేందుకు సలహాలు ఇవ్వాలని కోరారు. కాకతీయుల కాలంలో సాంస్కృతిక జీవనం విలసిల్లిందని, ఇప్పుడు ఆ సంస్కృతి, కలలు కాపాడడానికి మీరు ఏమైనా చేయగలుగుతారా అని ప్రజలు అడిగారు. కమల్ చంద్ర భంజ్దేవ్ స్పందిస్తూ తనకు కళలు, కళాకారులన్నా చాలా ఇష్టమని, సాధ్యమైనంతవరకు సంస్కృతిని కాపాడుతానన్నారు. తాను లండన్లో విద్యనభ్యసించే సమయంలో తమ వద్ద జరిగే దసరా వేడుకలకు కాలేజీ మానేసి వచ్చేవాడినన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించడం తనకు ఇష్టమన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పర్యాటకశాఖాధికారి ఎం.శివాజీ, టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య, సేవా టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ వ్యవస్థాపకుడు కుసుమ సూర్యకిరణ్, పర్యాటక శాఖ ఉద్యోగులు జై నరేశ్, రాజు, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు దాస్యం విజయ్భాస్కర్, బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ పులి రజినీకాంత్, తదితరులు పాల్గొన్నారు. కాలేజీ వదిలేసి దసరాకు వచ్చేవాడిని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్దేవ్ కోట, వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయంలో పూజలు -
ఐఎఫ్ఎస్ ఫలితాలు.. కాజీపేట యువకుడికి 53వ ర్యాంక్
కాజీపేట: కాజీపేట 61వ డివిజన్ ప్రశాంత్నగర్ కాలనీకి చెందిన విద్యార్థి అట్ల తరుణ్తేజ ఇటీవల విడుదల చేసిన యూపీఎస్సీ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 53వ ర్యాంక్ సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు ఎంపికయ్యారు. అలాగే ఇటీవల ప్రకటించిన సివిల్స్ పరీక్షల్లో అఖిలభారత స్థాయిలో 770 ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలిచారు. ఫాతిమానగర్ సెయింట్ గ్యాబ్రియల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన తరుణ్తేజ ఐఐటీ ముంబాయి నుంచి బీటెక్ సీఎస్సీ పూర్తి చేశారు. గణితం ప్రధాన సబ్జెక్టుగా తీసుకుని సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఈసందర్భంగా మంగళవారం తరుణ్తేజ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఐఏఎస్ సాధించడమే తన అంతిమ లక్ష్యంగా నిర్ణయించుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.అభ్యసన సామర్థ్యాల పెంపునకు కృషివిద్యారణ్యపురి: విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాల పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని హనుమకొండ డీఈఓ వాసంతి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను కోరారు. మంగళవారం మండల స్థాయిలో ఐదు రోజులపాటు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణను హనుమకొండలోని ప్రశాంత్నగర్లోని డీపీఎస్ స్కూల్లో ప్రారంభించి ఆమె మాట్లాడారు. తెలుగు, ఆంగ్ల, గణితం సబ్జెక్టుల్లో కనీస సామర్థ్యాలు సాధించేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలని కోరారు. ఐదు రోజులపాటు రిసోర్స్పర్సన్లు ఇస్తున్న శిక్షణ వినియోగించుకుని ఇందులో నేర్చుకున్న అంశాలతో విద్యను బోధించాలన్నారు. శిక్షణలో హనుమకొండ ఎంఈఓ జి.నెహ్రూ, రిసోర్స్పర్సన్లు శ్రీపాల్రెడ్డి, ఎం.శ్రీధర్, పృధ్వీరాజ్, శివకోటి, అశోక్, ఎ.శ్రీధర్, మధు, జ్యోతి, రాజ్కుమార్, మండలంలోని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలువిద్యారణ్యపురి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 22 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. ఈమేరకు హనుమకొండ జిల్లాలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హనుమకొండ డీఐఈఓ ఎ.గోపాల్ మంగళవారం తెలిపారు. ప్రతీ రోజు రెండు పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాలో 33 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 12,063 మంది, సెకండియర్లో 5,453 మంది పరీక్షలు రాయనున్నట్లు, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లు, రెండు సిట్టింగ్ స్క్వాడ్ల బృందాలను నియమించినట్లు తెలిపారు. విద్యార్థులకు హాల్టికెట్లు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎస్బీఐఈ.సీజీజీ. గౌట్.ఇన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. -
సీఐ వెంకటరత్నంపై వేటు
వరంగల్ క్రైం: వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ జూపల్లి వెంకటరత్నంపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సస్పెన్షన్ వేటు వేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ వేడెక్కింది. తప్పుడు కేసులతో బాధితులను ఇబ్బంది పెట్టడంతోపాటు ఓ హత్య కేసులో ప్రధాన నిందితురాలిని లైంగిక వేధింపులకు గురిచేయడం సంచలనంగా మారింది. కాగా, భూ కేసుకు సంబంధింఏప్రిల్ 15న ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అదేవిధంగా మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న అనేక భూకబ్జాలకు స్థానిక అధికారులు వంత పాడుతున్నారనే విషయంపై పలు కథనాలు వెలువడ్డాయి. ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం పట్టించుకోకపోవడంతో ‘సాక్షి’లో ఆధారాలతో సహా వెలువడిన కథనంపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ క్షేత్రస్థాయిలో విచారణ జరిపించారు. ఎఫ్ఐఆర్ నంబర్ 47/2025లో ఏ–1గా పేర్కొన్న బత్తిని చంద్రశేఖర్ చనిపోయి 9 ఏళ్లు కాగా, ఆ వ్యక్తిని ఏ–1గా పేర్కొంటూ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం కేసు నమోదు చేయడం సంచలనం రేకెత్తించింది. నిందితులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి విచారణ చేయకుండానే బాధితులపై కేసు నమోదు చేసి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనలో ఉన్నతాధికారులు సైతం ఇన్స్పెక్టర్ను కట్టడి చేయపోవడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారుల్లో భయం.. భయం వరంగల్ పోలీస్ కమిషనర్గా సన్ప్రీత్సింగ్ మార్చి 10న బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో పోలీసింగ్కు మొదటి ప్రాధాన్యం అని, అధికారులు తప్పు చేస్తే పేపర్పై పెడతానని స్పష్టంగా చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన రెండు నెలల్లో ఒక ఇన్స్పెక్టర్, ఒక హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబు ల్పై వేటు వేయడం కమిషనరేట్లో సంచలనంగా మారింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా అధికారుల్లో భయం పట్టుకుంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో, ఎవరిపై ఎలాంటి చర్యలు ఉంటాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. కాగా, ఇన్స్పెక్టర్ వెంకటరత్నంపై చర్యలు ఉంటాయనే విషయం బయటకు రావడంతో సీపీపై రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ వాటిని లెక్కచేయకుండా ఉత్తర్వులు జారీ చేయడంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. భూ కేసుకు సంబంధించి ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం క్లిప్పింగ్ సస్పెండ్ చేస్తూ సీపీ సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ భూ వివాదం కేసులో ఎఫ్ఐఆర్లో మరణించిన వ్యక్తి పేరు నమోదు సమగ్ర వివరాలతో కథనం ప్రచురించిన ‘సాక్షి’ మర్డర్ కేసులోని నిందితురాలిపై మిల్స్కాలనీ సీఐ లైంగిక వేధింపులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ.. వాస్తవం తేలడంతో చర్యలు అవినీతి అధికారుల్లో భయం.. భయం లైంగిక వేధింపులు.. సీసీ కెమెరాల ఆధారంగా వేటు.. మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ కేసులో నిందితులను పట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు వారిని మిల్స్కాలనీ పోలీసులకు అప్పగించారు. అరెస్టు చూపిన అనంతరం జైలుకు పంపించారు. విచారణలో భాగంగా నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఈక్రమంలో హత్యకేసులో ఏ–1గా ఉన్న మహిళా నిందితురాలి పట్ల ఇన్స్పెక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో స్పందించిన సీపీ.. ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్తో విచారణ జరిపించారు. ఈ విచారణలో పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు కీలకంగా మారినట్లు సమాచారం. దీంతోపాటు వేధింపులు ఎదుర్కొన్న నిందితురాలిని, మిల్స్కాలనీ పోలీసులను వేర్వేరుగా విచారించి నివేదిక సమర్పించడంతో సీపీ సన్ప్రీత్సింగ్.. సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు. -
స్కానింగ్ సెంటర్లపై దృష్టి సారించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లపై దృష్టి సారించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. లింగనిర్ధారణ పరీక్షలు చేయకుండా కమిటీ సభ్యులు తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. వీటిపై కళాబృందాలతో కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. జిల్లా కోర్టు చీఫ్ ఏఓ కోట్ల రాధాదేవి, డీసీపీ అంకిత్కుమార్ సంకాల్వే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్, మామునూరు ఏసీపీ తిరుపతి, నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి, పీపీ సంతోషి, ప్రోగ్రాం ఆఫీసర్ ఆచార్య, డిప్యూటీ డెమో అనిల్కుమార్, సీఐ వెంకన్న, ఎన్జీఓ ప్రతినిధి పరశురాములు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులు సిద్ధం సమస్యల పరిష్కారానికి పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సిద్ధంగా ఉన్నారని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ అట్రా సిటి, అత్యాచార కేసుల పరిహారం చెల్లింపు, ఇతర సమస్యలపై కలెక్టర్ సమీక్షించారు. రక్తనిధి కేంద్రం నిర్మాణానికి హామీ గవర్నర్ ప్రధాన కార్యదర్శి దానకిశోర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఇండియన్ రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంకు (రక్తనిధి) నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టరేట్లో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సభ్యత్వం, సొసైటీ ఎన్నికల నిర్వహణ, రక్తనిధి కేంద్రం నిర్మాణ అంశాలపై సమగ్రంగా చర్చించారు. -
పార్టీని బలోపేతం చేయండి
హసన్పర్తి: ‘రాష్ట్ర ప్రభుత్వం పథకాల అమలులో ముందుకు వెళ్తోంది.. ప్రచారంలో మాత్రం మనమంతా వెనుకబడి ఉన్నాం’ అని కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య భేదాభిప్రాయాలే ఇందుకు కారణమన్నారు. గోపాలపురంలోని ఓ బాంక్వెట్ హాల్లో మంగళవారం హసన్పర్తి, ఐనవోలుతో పాటు 1, 2, 44, 45, 46, 55, 56, 64, 65, 66 డివిజన్ల పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలన్నారు. సీనియర్లు, జూనియర్లు అంటూ ఇగో(అహం)లు వీడి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టాలన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి పునాదులని.. కష్టపడిన వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఆయా పదవులకు పోటీ చేసే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పింగిలి వెంకట్రామ్ నర్సింహారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు, కనపర్తి కిరణ్, పొన్నాల రఘు, గడ్డం శివరాం, కార్పొరేటర్లు సునీల్కుమార్, జక్కుల రజిత, అరుణకుమారి, ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు వీసం సురేందర్రెడ్డి, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ శేఖర్రావు, మాజీ సర్పంచ్ మదన్, శ్రీరాం, అనిల్, విజయ్ ఉన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
బ్యాంకులు నిర్దేశిత లక్ష్యాల్ని చేరుకోవాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: జిల్లాలో వివిధ బ్యాంకులు 2024–25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య బ్యాంకర్లకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో ఈఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లక్ష్యం, అందించిన రుణాలు, చేరాల్సిన లక్ష్యాల ప్రణాళిక తదితర అంశాలపై జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా సంప్రదింపుల కమిటీ చైర్పర్సన్, కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. వార్షిక రుణ ప్రణాళిక ఆధారంగా బ్యాంకులు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాల పురోభివృద్ధి సాధించేందుకు బ్యాంకు లింకేజీ రుణాలు అందించాలన్నారు. అలాగే దామెర మండలానికి సంబంధించిన బ్యాంకు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్, నాబార్డ్ ఏజీఎం చైతన్య రవికుమార్, ఆర్బీఐ అధికారి తానియా, జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ కమిషనర్ రాజేశ్వర్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం నవీన్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, మైనార్టీ వెల్ఫేర్ అధికారి మురళీధర్రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, వివిధ బ్యాంకుల, శాఖల అధికారులు పాల్గొన్నారు. -
త్వరలో జిల్లాకు క్రికెట్ స్టేడియం
● ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ● అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు షురూ వరంగల్ స్పోర్ట్స్: జిల్లాలో క్రికెట్ స్టేడియం నిర్మాణ అంశాన్ని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి దృష్టికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు తీసుకెళ్లారని, త్వరలోనే స్టేడియం ఏర్పాటు ప్రకటన వెలువడనుందని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. వరంగల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ రెడ్డిపురంలో సోమవారం అంతర్జిల్లాల క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. హనుమకొండ, భూపాలపల్లి జిల్లాల మధ్య జరిగిన మ్యాచ్ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఉమ్మడి రా ష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి హయాంలో బీజంపడిన క్రికెట్ స్టేడియం నిర్మాణం.. ఇప్పుడు ఆచరణలోకి రానుందని, అందుకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో పాటు తానుకూడా ముందుండి నిర్మాణం జరిగేలా చొరవచూపుతానని భరోసా కల్పించారు. క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ రెడ్డిపురంతో పాటు మొగిలిచర్ల గ్రౌండ్లో జనగామ, ములుగు, వంగాలపల్లి మైదానంలో వరంగల్, మహబూబాబాద్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్లు కొనసాగాయని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్ది ప్రవీణ్గౌడ్, ఉపాధ్యక్షుడు సదాశివ్, తోట రాము, సంయుక్త కార్యదర్శి ఉపేందర్ పాల్గొన్నారు. -
కమిషనరేట్లో ఏసీపీల బదిలీ
వరంగల్ క్రైం: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఏసీపీ బదిలీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఏసీపీలు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 77 మంది ఏసీపీలను బదిలీ చేస్తూ డీజీపీ డాక్టర్ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. నర్సంపేట ఏసీపీగా పనిచేసిన వి.కిరణ్కుమార్.. డీజీపీ ఆఫీస్కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఖమ్మం సీసీఆర్బీ ఏసీపీగా పనిచేస్తున్న పున్నం రవీందర్రెడ్డి బదిలీపై వచ్చారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం డీఎస్పీగా పనిచేసిన పి.ప్రశాంత్రెడ్డిని కాజీపేట ఏసీపీగా, మామునూరు ఏసీపీగా పనిచేస్తున్న బి.తిరుపతి డీజీపీ కార్యాలయానికి బదిలీ కాగా, ఆయన స్థానంలో ఖమ్మం ఎస్బీ ఏసీపీగా పనిచేస్తున్న ఎన్.వెంకటేష్ బదిలీపై వచ్చారు. రాచకొండ ‘షీ’ టీమ్ ఏసీపీగా పనిచేస్తున్న పి.నర్సింహారావు హనుమకొండ ఏసీపీగా, హనుమకొండ ఏసీపీగా పనిచేస్తున్న కొత్త దేవేందర్రెడ్డి డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. సీఐడీ డీఎస్పీగా పనిచేస్తున్న పి.సదయ్య వరంగల్ సీసీఎస్ ఏసీపీగా బదిలీ అయ్యారు. ఇప్పటికే బదిలీ అయిన స్థానాల్లో పలువురు ఏసీపీలు రిపోర్టు చేశారు. నర్సంపేట ఏసీపీగా పనిచేసిన కిరణ్కుమార్ సీసీఎస్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించారు. పి.ప్రశాంత్రెడ్డి కాజీపేట ఏసీపీగా, నర్సంపేట ఏసీపీగా పున్నం రవీందర్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కొత్తగా వెలువడిన ఉత్తర్వుల్లో సీసీఎస్ ఏసీపీగా పి.సదయ్య బదిలీ అయినట్లు ఉండడం గందరగోళానికి తావిస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో బదిలీ ఉత్తర్వులపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శిగా వలీఉల్లాఖాద్రీ కేయూ క్యాంపస్: అఖిల భారత యువజన సమైక్య(ఏఐవైఎఫ్) జాతీయ కార్యదర్శిగా వరంగల్కు చెందిన డాక్టర్ వలీ ఉల్లాఖాద్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలోని తిరుపతిలో నాలుగురోజులుగా నిర్వహించిన ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల్లో వలీఉల్లాఖాద్రీని జాతీయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. వలీఉల్లాఖాద్రీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్రపోషించారు. కేయూ వేదికగా అనేక ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా కూడా దేశం వ్యాప్త విద్యార్థి ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. వలీఉల్లాఖాద్రీ కేయూలో కామర్స్ అండ్ బిజినెస్మేనేజ్మెంట్ విభాగం నుంచి డాక్టరేట్ పొందారు. -
ఓరుగల్లు కీర్తి ప్రతిష్టను పెంచేలా..
ఖిలా వరంగల్ : ఓరుగల్లు కీర్తి ప్రతిష్టతను మరింత పెంచేలా.. అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన వరంగల్ రైల్వేస్టేషన్ను ఈనెల 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నట్లు అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ (ఏసీఎం) ఎస్ఆర్.మూర్తి తెలిపారు. ఈమేరకు సోమవారం వరంగల్ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.25.41కోట్ల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ కింద తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా వరంగల్ రైల్వే స్టేషన్ సరికొత్తగా రూపుదిద్దుకుందన్నారు. విశాల ప్లాట్ ఫామ్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, విశ్రాంతి గదులు, ఆధునిక టాయిలెట్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. స్టేషన్ గోడలకు కాకతీయుల కళావైభం ఉట్టిపడేలా రంగుల చిత్రాలు వేశామని, ప్రయాణికులకు సరికొత్త అనుభూతి కలిగేలా ఆహ్లాదం, పచ్చని తోరణాలు, ఆకట్టుకునే విద్యుత్ కాంతులు, 12 ఫీట్ల వెడల్పుతో ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించామని వివరించారు. అనంతరం రైల్వేస్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇన్చార్జ్ స్టేషన్ మేనేజర్ కె.సారయ్య, సీసీఐ ఇన్స్పెక్టర్ రాజగోపాల్, ఐఓడబ్ల్యూ శ్రీనివాస్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు.. కాజీపేట రూరల్ : కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని పలు పాఠశాలల్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ‘మేరా అమృత్ స్టేషన్ అండ్ ఆపరేషన్ సిందూర్’ అనే అంశంపై విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. ఈ నెల 22న ప్రధాని మోదీ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 103 పునరాభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభిస్తారని, వీటిలో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్లో వరంగల్, కరీంనగర్, బేగంపేట స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం, సోమవారం వరంగల్, రామగుండం, కరీంనగర్లో వివిధ పాఠశాలల్లో వ్యాస రచన, డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలు నిర్వహించగా 170 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. వరంగల్ అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవం రోజున విజేతలకు ముఖ్య అతిథులతో సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నట్లు సీపీఆర్వో తెలిపారు. అత్యాధునిక హంగులతో వరంగల్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ 22న వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్(ఏసీఎం) ఎస్ఆర్.మూర్తి -
పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి
● కేయూలో ఆందోళనకు దిగిన విద్యార్థులు ● నేటినుంచి పరీక్షలు యథాతథం : కేయూ రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ఈనెల 20 నుంచి పీజీ కోర్సుల (నాన్ ప్రొఫెషనల్ రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) విద్యార్థులకు నాల్గో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు పరీక్షలు వాయిదా వేయాలని సోమవారం రాత్రి 9.30 నుంచి 11.30 గంటల వరకు క్యాంపస్లోని విద్యార్థులు కేయూ మొదటి గేట్ వద్ద ఆందోళన చేశారు. కేయూ పోలీస్టేషన్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సైలు రవీందర్, శ్రీకాంత్ అక్కడికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరారు. పరీక్షల వాయిదా విషయమై కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ రాజేందర్ను వివరణ కోరగా, ఈనెల 20నుంచి కేయూ పరిధిలో యధావిధిగా పీజీ కోర్సుల నాల్గో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఒకసారి వాయిదా వేశామని, ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని విద్యార్థులు ఎవరూ వాయిదా వేయాలని కోరుకోవడం లేదన్నారు. సెమిస్టర్ పరీక్షలు యధావిధిగా ఉంటాయని కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం కూడా స్పష్టంచేశారు. -
ప్రముఖుల పుష్కర స్నానం..
కాటారం/కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల్లో భాగంగా సోమవారం పలువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్, వైరా ఎమ్మె ల్యే రాందాస్నాయక్, హైకోర్టు జడ్జి నందికొండ నర్సింగరావు దంపతులు, త్ర యంబకేశ్వర్ నాసిక్కు చెందిన మహామండలేశ్వర్ ఆచార్య సంవిధానందాసరస్వతి మహారాజ్ స్వామి సరస్వతి ఘాట్ వద్ద త్రివేణి సంఘమంలో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం సరస్వతి మాతను దర్శించుకుని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. జడ్జి దంపతులకు కలెక్టర్ రాహుల్శర్మ, భూపాలపల్లి న్యాయమూర్తి అఖిల.. సరస్వతీమాత చిత్రపటం అందజేశారు. ఆలయ అధికారులు సంవిధానందాసరస్వతి మహారాజ్ స్వామికి సరస్వతీమాత విగ్రహం బహూకరించారు. -
త్రివేణి సంగమం.. భక్తజన సంద్రం
● సరస్వతీ నది పుష్కరాలకు పోటెత్తిన భక్తజనం ● ఐదో రోజు 80వేల మంది పుణ్యస్నానాలుభూపాలపల్లి/కాళేశ్వరం: సరస్వతీ నది పుష్కరాలకు సోమవారం ఐదోరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి నదీమాతకు పూజలు చేశారు. చీరె, సారె సమర్పించారు. ముత్తయిదువలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. పిండ ప్రదానాలు, పితృదేవతలకు తర్పణాలు నిర్వహించారు. భక్తులతో పుష్కరిణి నిండిపోయింది. పుష్కర స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. తగ్గిన రద్దీ పుష్కరాలకు భక్తుల రద్దీ తగ్గింది. హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి.. మంథని, కాటారం మీదుగా.. అలాగే మంచిర్యాల, గోదావరిఖని, చెన్నూర్, ఆసిఫాబాద్, నిర్మల్ నుంచి భక్తులు వాహనాల్లో తరలివచ్చారు. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు డివైడర్లు ఏర్పాటు చేసి నియంత్రించారు. పార్కింగ్ స్థలాల్లో వాహనాల రద్దీ కొనసాగింది. శని, ఆదివా రాల్లో రెండేసి లక్షల చొప్పున భక్తులు రాగా.. సోమవారం 80వేల మంది పుణ్యస్నానాలు ఆచరించిన ట్లు అధికారులు అంచనా వేశారు. నదీహారతికి రద్దీ సరస్వతీ ఘాట్లో కాశీపండితులచే ఏర్పాటు చేసిన నవరత్నమాలిక హారతికి భక్తుల తాకిడి పెరుగుతోంది. ఏడు గద్దెలపై తొమ్మిది హారతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగుల్లో హారతి ఇస్తున్నా రు. తిలకించేందుకు భక్తులు పోటీ పడ్డారు. సరస్వతీ అమ్మవారి విగ్రహం వద్ద భక్తులు దర్శించుకున్నాక జ్ఞానతీర్థం వద్ద ఫొటోలు, సెల్ఫీలు దిగారు. నాసిక్ పీఠాధిపతి పూజలు నాసిక్ త్రయంబకేశ్వర్ మహామండలేశ్వర్ ఆచార్య సంవిధానందా సరస్వతీ మహారాజ్ ముందుగా త్రివేణి సంగమంలోని అంతర్వాహిని సరస్వతీనది లో పుష్కర స్నానం.. విశేష పూజలు నిర్వహించా రు. అనంతరం రాజగోపురం వద్ద అర్చకులు, అధి కారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకుని పూజలు చేశారు. -
డీసీసీబీని మరింత ప్రగతిలోకి తీసుకెళ్లాలి
● టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు హన్మకొండ: వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)ని మరింత ప్రగతిలోకి తీసుకెళ్లాలని తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అన్నారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో మేనేజ్మెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్యాంకు ప్రగతి, బ్రాంచ్ల పనితీరును సమీక్షించారు. ఆడిట్ నివేదికను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. రుణాలు ఇవ్వడంతో పాటు డిపాజిట్లు సేకరించాలన్నారు. ఈ సందర్భంగా వరంగల్ డీసీసీబీకి ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చిన సందర్భంగా చైర్మన్ రవీందర్ రావును బ్యాంకు వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, డైరెక్టర్లు, డీసీఓలు, బ్యాంకు అధికారులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర రెడ్డి, డైరెక్టర్లు హరిప్రసాద్, ఎన్నమనేని జగన్ మోహన్ రావు, రాజేశ్వర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, మాడుగుల రమేశ్, దొంగల రమేశ్, గోపాల్ రావు, యాదగిరి రెడ్డి, నర్సింగ రావు, శ్రీనివాస్, రవిరాజు, నరేందర్, ప్రదీప్ చందర్, డీసీఓ సంజీవ రెడ్డి, నాబార్డ్ డీడీఎం చంద్ర శేఖర్, డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, జీఎం పద్మావతి, టీజీ క్యాబ్ జీఎం సుజాత, డీజీఎం అశోక్, ఏజీఏం రాజు, మేనేజర్ నిహారిక తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్లకు స్థానచలనం ● నాయబ్ తహసీల్దార్లు కూడా.. హన్మకొండ అర్బన్: ఇటీవలహహనుమకొండ జిల్లాకు బదిలీపై వచ్చిన తహసీల్దార్లకు కలెక్టర్ ప్రావీణ్య పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ క్రమంలో జిల్లాలో ఇప్పటికే పనిచేస్తున్న కొందరు తహసీల్దార్లకు స్థానచలనం కల్పించారు. వారితోపాటు పలువురు నాయబ్ తహసీల్దార్లకు కూడా స్థానచలనం కల్పించారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల వివరాలు.. భీమదేవరపల్లి తహసీల్దార్గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్.ప్రవీణ్కుమార్ను కలెక్టరేట్కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఇటీవల వరంగల్ జిల్లా నుంచి వచ్చిన బి.రాజేశ్కు పోస్టింగ్ ఇచ్చారు. వేలేరు తహసీల్దార్గా విధులు నిర్వర్తిస్తున్న హెచ్.కోమిని కలెక్టరేట్ బదిలీ చేశారు. వేలేరుకు కలెక్టరేట్లో సూపరిటెండెంట్గా ఉన్న ఏవీఎన్వీ ప్రసాద్కు పోస్టింగ్ ఇచ్చారు. పరకాల ఆర్డీఓ కార్యాలయం డీఏవోగా విధులు నిర్వర్తిస్తున్న టి.విజయలక్ష్మికి పరకాల తహసీల్దార్గా పోస్టింగ్ ఇచ్చారు. పరకాల ఆర్డీఓ కార్యాలయం డీఏఓగా కరీంనగర్ నుంచి ఇటీవల వచ్చిన సీహెచ్. రాజుకు పోస్టింగ్ ఇచ్చారు. నడికూడ తహసీల్దార్గా విధులు నిర్వర్తిస్తున్న జి.నాగరాజును కలెక్టరేట్కు బదిలీ చేసి అక్కడికి తహసీల్దార్గా ఇటీవల సిద్దపేట జిల్లా నుంచి వచ్చిన జి.రవీందర్రెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. అదేవిధంగా ఇటీవల బదిలీల్లో ములుగు జిల్లా నుంచి హనుమకొండ జిల్లాకు వచ్చిన తహసీల్దార్ డి.సమ్మయ్యకు కలెక్టరేట్లో పోస్టింగ్ ఇచ్చారు. కలెక్టరేట్ పోస్టింగ్స్ ఇచ్చిన తహసీల్దార్లకు సెక్షన్లు కేటాయించాల్సి ఉంది. నాయబ్ తహసీల్దార్లు.. జిల్లాలో నాయబ్ తహసీల్దార్లకు కూడా స్థానచలనం కల్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. పరకాలలో పనిచేస్తున్న కె.సూర్యనారాయణను జిల్లా కేంద్రంలోని భూసేకరణ విభాగానికి, పౌరసరఫరాల సంస్థలో పనిచేస్తున్న శివతేజను కలెక్టరేట్కు, కలెక్టరేట్లో పనిచేస్తున్న రాజ్కుమార్ను ఐనవోలుకు, పరకాల ఆర్డీఓ ఆఫీస్లో పనిచేస్తున్న సుమన్ను పరకాల తహసీల్ కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్లు కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద విద్యారణ్యపురి/న్యూశాయంపేట: ఈనెల 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, జూన్ 3 నుంచి జరగనున్న టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 16 ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో 5,200 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రెండు సిట్టింగ్ స్క్వాడ్లు, ఒక ప్లయింగ్ స్క్వాడ్, సీఎస్డీఓలను 16మంది చొప్పున నియమించారు. ఈ సమావేశంలో డీఐఈఓ శ్రీధర్సుమన్, డెక్ సభ్యులు మాధవరావు, విజయనిర్మల, జిల్లా విద్యాశాఖాధికారి మామిడి జ్ఞానేశ్వర్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. భూములు కోల్పోయిన రైతుల ఆర్బిట్రేషన్ పూర్తిన్యూశాయంపేట: గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే 163–జి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతుల ఆర్బిట్రేషన్ పూర్తయ్యిందని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. హైవేలో భూములు కోల్పోయిన నెక్కొండ మండలం నెక్కొండ, పత్తిపాక, వెంకటాపూర్, ఆలంఖాన్పేట, చంద్రుగొండ, తోపనపల్లి, అప్పలరావుపేట, గ్రామాల రైతులతో సోమవారం కలక్టరేట్లో కలెక్టర్ ఆర్బిట్రేషన్ నిర్వహించారు. ఆర్డీఓ ఉమారాణి, నెక్కొండ తహసీల్దార్ రాజ్కుమార్, ఎన్హెచ్ హైవే టీం లీడర్ సంపత్కుమార్, పర్యవేక్షకులు శ్రీకాంత్ పాల్గొన్నారు. -
త్రివేణి సంగమం.. భక్తజన సంద్రం
కాళేశ్వరంలో భక్తుల సందడి ● పుణ్యస్నానాలు ఆచరించిన వేలాది భక్తులు ● ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రముఖులు త్రివేణి సంగమం.. భక్త జన సంద్రమైంది. పుష్కరిణి స్నానం.. పులకించేలా చేసింది. వడివడిగా పరుగులు పెడుతున్న చల్లని తల్లికి వాయినాలిచ్చే ఆడపడుచులు.. పితృదేవతలను స్మరిస్తూ తర్పణాలు వదిలే పురుషులు, కేరింతలు కొడుతూ అల్లరి చేస్తున్న యువతులు, చిన్నారులతో నదీ ప్రాంతం సందడిగా మారింది. ఐదో రోజు సోమవారం వేలాదిగా భక్తులు కాళేశ్వరానికి తరలివచ్చారు. ముక్తీశ్వరున్ని దర్శించుకునేందుకు గంటల కొద్దీ క్యూలో వేచి చూశారు.– మరిన్ని ఫొటోలు 8లోu -
ఆక్రమణలు.. అతిక్రమణలు
వరంగల్ అర్బన్: రోడ్లు, డ్రెయినేజీల ఆక్రమణలు, నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేని కట్టడాలపై బల్దియా గ్రీవెన్స్కు ఫిర్యాదులు సోమవారం వెల్లువలా వచ్చాయి. ఎన్నిసార్లు దరఖాస్తులు అందించినా క్షేత్ర స్థాయిలో పరిష్కారం లభించడం లేదని పలు కాలనీవాసులు బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాడకే దృష్టికి తీసుకొచ్చారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులను కమిషనర్ స్వీకరించారు. గ్రీవెన్స్కు మొత్తం 99 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి 56 దరఖాస్తులు రావడం గమనార్హం. కనీస వసతుల కోసం ఇంజనీరింగ్ సెక్షన్కు 16, ప్రజారోగ్యానికి 14, పన్నుల విభాగానికి 7, తాగునీటి సరఫరాపై 6 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఎఫ్ఓ శంకర్లింగం, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, హెచ్ఓలు రమేష్, లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, రాజేశ్వర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్కు వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని.. ● మడికొండలోని 646, 647 సర్వే నంబర్లలోని స్థలాన్ని డెవలపర్స్ తప్పుడు సర్వే నంబర్లతో కుంట కట్టను తొలగించి, ఎఫ్టీలో పాట్లు చేసి, తమ సొంత భూములకు కూడా కబ్జా చేస్తున్నారని బాధితులు వాపోయారు. కబ్జాదారులపై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ● హంటర్ రోడ్డులో 196 ఇళ్లకు గత రెండేళ్లుగా పెంచిన ఆస్తి పన్నును తగ్గించాలని బాధిత ఇళ్ల యజమానులు కోరారు. ● 1వ డివిజన్ పెగడపల్లి ప్రభుత్వ స్కూల్కు వెళ్లే దారిలో డ్రెయినేజీ వ్యవస్థ లేక మురుగు నీరు రోడ్డుపైనే ప్రవహిస్తోందని స్థానికులు పేర్కొన్నారు. ● 57వ డివిజన్ అశోకా కాలనీలో మురుగు కాల్వ లు లేక చిన్నపాటి వర్షానికే వరద నీరు ఇళ్లల్లోకి వస్తోందని, ఈక్రమంలో డ్రెయినేజీతో పాటు కల్వర్ట్ నిర్మించాలని కాలనీవాసులు కోరారు. ● హనుమకొండ శ్రీనగర్ కాలనీలో ఇంటి నంబర్ 2 – 8 – 456 వద్ద డ్రెయినేజీ లేక రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని మణెమ్మ ఫిర్యాదు చేశారు. ● హనుమకొండ న్యూ బృందావన్ కాలనీలో కుక్కల బెడద విపరీతంగా ఉందని, ఈక్రమంలో అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విన్నవించారు. ● మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే సొసైటీకి 2016 నుంచి 2025 వరకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు. ● భద్రకాళి గుడి రోడ్డులో ఓ ప్లాట్ యాజమాని రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేస్తున్నాడని, ఈక్రమంలో అతడిపై చర్య తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. ● 2వ డివిజన్ పెగడపల్లిలో నాలుగేళ్ల క్రితం ఇళ్లను నిర్మించుకున్నామని, ఈక్రమంలో ఇంటి నంబర్లు కేటాయించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ● మడికొండ హిల్స్ కాలనీలో కొంతమంది రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, బాధ్యులపై చర్య తీసుకోవాలని కాలనీవాసులు కోరారు. ● హంటర్ రోడ్డులో ప్రతిపాదిత పార్కు స్థలాన్ని కబ్జా చేసేందుకు కొంతమంది యత్నిస్తున్నారని, ఈక్రమంలో ఆ స్థలాన్ని కాపాడాలని కాలనీవాసులు విన్నవించారు. ● ఒక్కో సెలూన్ షాపు ఏర్పాటుకు 250 మీటర్ల దూరం ఉండేలా అనుమతులు ఇవ్వాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలని నాయీ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. వాటిపైనే వెల్లువలా ఫిర్యాదులు కనీస వసతులు కల్పించాలని ప్రజల విన్నపాలు గ్రీవెన్ సెల్లో దరఖాస్తులు స్వీకరించిన కమిషనర్ -
నేడు కాకతీయ వారసుడి రాక
హన్మకొండ: కాకతీయ 22వ వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ మంగళవారం వరంగల్ పర్యటనకు వస్తున్నారని టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య తెలిపారు. పర్యటనలో భాగంగా భద్రకాళి, వేయి స్తంభాల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు హనుమకొండ నక్కలగట్టలోని టూరిజం హోటల్ హరిత కాకతీయలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సైన్స్ కోర్సు పీహెచ్డీ తరగతుల పరిశీలనకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని సైన్స్ విభాగాల పరిశోధకుల ప్రీ పీహెచ్డీ కోర్సు వర్క్లో భాగంగా క్యాంపస్లోని గణితశాస్త్ర విభాగం సెమినార్ హాల్లో నిర్వహిస్తున్న కామన్ టాపిక్స్ తరగతుల నిర్వహణను కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం సోమవారం పరిశీలించారు. రీసెర్చ్ మెట్రిక్స్, ప్లగరిజం, టెక్నికల్ రిపోర్ట్ రైటింగ్ వంటి పలు అంశాలపై ఈనెల 31వ తేదీ వరకు తరగతులు కొనసాగుతాయని ఆ విభాగం అధిపతి అసిస్టెంట్ ప్రొఫెసర్ భారవీశర్మ తెలిపారు. రిజిస్ట్రా ర్ వెంట ఓఎస్డీ ప్రొఫెసర్ మల్లారెడ్డి, ప్లగరిజం డైరెక్టర్ ఎల్పీ.రాజ్కుమార్ ఉన్నారు. జీఎంహెచ్లో ప్రత్యేక విభాగంహన్మకొండ చౌరస్తా/ఎంజీఎం: గర్బిణుల నమోదు, ప్రసవాల శాతం పెంచేందుకు హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, జీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సూపరింటెండెంట్ చాంబర్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. గర్భిణులకు ఇబ్బందులు కలుగకుండా ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, జీఎంహెచ్ సిబ్బంది వైద్యులకు అనుసంధానంగా ఉండేలా ప్రత్యేక సెల్ ఉంటుందని చెప్పారు. అందుకు ముగ్గురు మహిళా పబ్లిక్ హెల్త్ అధికారులను డిప్యుటేషన్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రతీ గర్భిణికి మొదటి రెండు చెకప్లు పీహెచ్సీ డాక్టర్ వద్ద, మూడు, నాలుగు చెకప్లకు హనుమకొండలోని జీఎంహెచ్ తప్పనిసరి వచ్చేలా కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాతా శిశు సంక్షేమం ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల, పీహెచ్ఎన్లు లీల, సుందరి, హెచ్ఈఓ రాజేశ్వర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 23న జాబ్ మేళా హన్మకొండ అర్బన్: నిరుద్యోగులకు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 23న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలో వరంగల్, హనుమకొండలో సేల్స్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి 20 మందిని ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 78933 94393 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. అట్రాసిటి కేసు విచారణ అధికారిగా ఏసీపీ తిరుపతిఖిలా వరంగల్ : వరంగల్ 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్పై ఆదివారం నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, అత్యాచారయత్నం కేసు విచారణ అధికారిగా మామునూరు ఏసీపీ తిరుపతిని నియమిస్తూ సీపీ సన్ప్రీత్సింగ్ సోమవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసును సమగ్రంగా, పాదర్శకంగా విచారించాలని ఆదేశించారు. ‘భద్రకాళి’ని దర్శించుకున్న హైకోర్టు జడ్జి హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాన తన కుటుంబ సమేతంగా అమ్మవారిని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా భద్రకాళి అమ్మవారిని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వేయిస్తంభాల ఆలయంలో.. వేయిస్తంభాల దేవాలయంలో రుద్రేశ్వర స్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందికొండ నర్సింగరావు కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. -
– సాక్షి, వరంగల్/వరంగల్ అర్బన్
కేవలం ఒక మనిషి వెళ్లేంత వెడల్పుతో ఉన్న మెట్ల మార్గం.. సరిపడేంత స్థలం లేని మెట్లు.. కనిపించని వెంటిలేషన్.. ఇది సోమవారం ఉదయం హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన గుల్జార్ హౌస్ పరిస్థితి. షార్ట్ సర్క్యూట్తో పొగలు వ్యాపించిన ఘటనలో 17 మంది మృత్యువాత పడ్డారు. గుల్జార్ హౌస్వంటి ఇరుకై న భవనాలు గ్రేటర్ వరంగల్లో వేలాది ఉన్నాయి. ఇక్కడా అగ్గి రాజుకుంటే అంతే సంగతి. యథేచ్ఛగా అనుమతులు.. బల్దియా టౌన్ ప్లానింగ్ అధికార యంత్రాంగం కూడా వినియోగ ధ్రువపత్రం (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) ఇవ్వాలి. కానీ ఎన్ఓసీ ఉందా? లేదా? అనేది పట్టించుకోకుండానే ఆ సర్టిఫికెట్లను యఽథేచ్ఛగా జారీ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. ఏటా తనీఖీ చేసి ఫైర్ సేఫ్టీ లేకపోతే నోటీసులు జారీ చేసి జరిమానాలు విఽ దించడం, ఒకవేళ ఉంటే లైసెన్స్ రెన్యూవల్ చేసుకునేలా అధికారులు చూడాలి. అధికారులు ఇప్పటికైనా మేల్కోకపోతే హైదరాబాద్ తరహాలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గతేడాది మార్చిలో వరంగల్ పోచమ్మమైదాన్లోని జకోటియా మాల్లో ఏసీ కంప్రెషర్లు పేలాయి. భారీ శబ్దాలతో స్థానికులు ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. అప్పుడూ ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గ్రే టర్ వరంగల్ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని చాలా కాలనీల్లో ఇరుకు గల్లీల్లో అగ్గిపెట్టెల్లాంటి చిన్న చిన్న బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. వీటిలో వెంటిలేషన్, కిటీకీలు ఎక్కువగా లేకపోవడంతో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే భారీగా ప్రాణనష్టం ఉండే అవకాశముంటుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. హైదరాబాద్లోని పాతబస్తీలోని గుల్జార్ హౌస్లో షార్ట్ సర్క్యూట్తో జరిగిన ఘోర అగ్నిప్రమాదంతో ఇక్కడి భద్రత చర్చలోకి వచ్చింది. ముఖ్యంగా వరంగల్ బట్టలబజార్, పిన్నావారి వీధి, గిర్మాజీపేట, చౌర్బౌళి, మండిబజార్, పోచమ్మ మైదాన్, పాపయ్యపేట చమన్, పాఠక్ మహేల్, గోపాల స్వామి గుడి, ఎల్బీనగర్, పోతన నగర్ తదితర ప్రాంతాల్లో ఇరుకు రహదారుల్లో కనీసం పార్కింగ్కు కూడా స్థలం కేటాయించకుండా భారీ భవనాలు నిర్మించారు. కొన్ని భవనాలకు ఇరుకు కాలనీల్లో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే కనీసం ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు కూడా చాలా సమయం పడుతుంది. ఫైర్ వాహనాలు కూడా కొన్ని కాలనీలకు వెళ్లలేని పరిస్థితులున్నాయి. ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం జరిగితే ఊహించని నష్టం జరగొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా మేల్కొనాల్సిందే.. భవనాల్లో నాసిరకమైన కేబుళ్లు, పాత వైరింగ్, సా మర్థ్యానికి మించి ఎలక్ట్రిక్ పరికరాలు ఉపయోగించడం కారణంగా షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. నగరంలోని చాలా కాలనీల్లో నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించడం, అగ్నిమాపక యంత్రాలు వెళ్లే దారి లేకపోవడం ఆందోళన కల్గిస్తోంది. ఏళ్ల కిందట నిర్మించిన ఈ నివాసాల్లో పాత వైరింగ్, అతుకుల తీగలను తీసేసి కొత్త వైరింగ్ చేసుకోవాలి. ఇప్పటికై నా అన్ని ఇళ్లలో వెంటిలేషన్ ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ప్రమాద తీవ్రత తగ్గించవచ్చు. పొగ బయటకు వెళ్లే వీలుంటే జనాలు అపస్మారక స్థితి చేరుకునేలోపు అక్కడి నుంచి బయటపడేందుకు వీలుంటుంది. నిబంధనలు పాటిస్తేనే.. నగరంలో ఆస్పత్రులు, విద్యా సంస్థలు, హస్టళ్లు, ఫంక్షన్ హాల్స్, అపార్ట్మెంట్లు, కమర్షియల్ భవనాలు, డింబర్ డిపోలు, ఫర్నిచర్ షాపులు, కోల్డ్ స్టోరేజీలు, పత్తి మిల్లులు, ఇతర పరిశ్రమలు వేల సంఖ్యల్లో వెలిశాయి. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే భవనాల్లో కనీసం ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో చిన్న అగ్నిప్రమాదం చోటు చేసుకున్నా.. ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. నగర పరిధిలో జీ ప్లస్ 9 నుంచి 15 మీటర్లలోపు వాణిజ్య భవనాలకు, 15 నుంచి 18 మీటర్లలోపు అపార్టుమెంట్లకు బల్దియా ఫైర్ వింగ్ నిరభ్యంతరం (ఎన్ఓసీ) ఇవ్వాల్సి ఉంటుంది. 15 మీటర్ల కంటే ఎత్తు ఉంటే వాటికి అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ కావాలి. కానీ.. నగరంలో జరుగుతున్న ఎత్తయిన వాణిజ్య, నివాస కట్టడాలకు ఎన్ఓసీ ఉండడం లేదు. 57 మల్టీ స్టోరేజీ భవనాల్లో కనీస జాగ్రత్తలు పాటించడం లేదని తేలింది. నగరంలో అగ్ని ప్రమాదాల వివరాలు (రూ. కోట్లలో)సంవత్సరం కేసులు ఆస్తి నష్టం రక్షించిన ఆస్తి2022 68 28,30,55,000 2,94,15,000 2023 67 2,04,21,000 8,07,70,000 2024 63 4,05,62,250 26,54,40,000 2025 50 51,43,000 1,87,63,000 వెంటిలేషన్ లేకుండా నిర్మించిన భవనాలు అనేకం అగ్ని ప్రమాదం జరిగితే పొగతో ఉక్కిరిబిక్కిరే.. నాణ్యమైన విద్యుత్ పరికరాలు వినియోగిస్తే మంచిది హైదరాబాద్ గుల్జార్ హౌస్ ఘటనతోనైనా మేల్కొనాలి -
ఘనంగా తిరంగా యాత్ర
హన్మకొండ: ఆపరేషన్ సిందూర్ విజయంతో సైన్యానికి సంఘీభావంగా తిరంగా యాత్రను సోమవారం ఘనంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ సైనికులు, విద్యార్థులు భారత జాతీయ పతాకాన్ని చేపట్టి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్కు భారత్ సరైన జవాబు చెప్పిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
టీచర్లు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
విద్యారణ్యపురి: ఉపాధ్యాయులు నైపుణ్యాలు పెంపొందించుకుని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాష్ట్ర సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ పి.రాజీవ్ సూచించారు. వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయులకు రెండోదఫా ఐదురోజుల పాటు కొనసాగే శిక్షణ కార్యక్రమం బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్తేజ, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, హెచ్ఎం వెంకటేశ్వర్రావు, కోర్సు కోఆర్డినేటర్ నాగేశ్వర్రావు, రిసోర్స్పర్సన్లు, తదితరులు పాల్గొన్నారు. -
బయో గ్యాస్ ప్లాంట్కు చొరవ తీసుకోవాలి
వీసీలో పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ శ్రీదేవి వరంగల్ అర్బన్: వరంగల్ నగరంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని రాష్ట్ర పురపాలక కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలో వెలువడే 20 టన్నుల ఆర్గానిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి కంప్రెస్ట్ బయో మిథైన్ గ్యాస్గా మార్చేందుకు వేస్ట్ – టు బయో మిథనైజేషన్ ప్లాంట్ను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్లాంట్ ఏర్పాటు ద్వారా నగర పరిశుభ్రత మెరుగు పడుతుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో రూపకల్పన, నిర్మాణం, వితరణ, నిర్వహణ, బదలాయింపు, మోడల్ ఆధారంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉత్పత్తి అయ్యే బయోమైథెన్ గ్యాస్ను మార్కెట్లో విక్రయించడం ద్వారా ఆదాయం సమకూరుతుందని శ్రీదేవి అన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, మాధవి, సీఎంహెచ్ఓ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఓరుగల్లు ఉద్యమాల గడ్డ
● ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ న్యూశాయంపేట/రామన్నపేట : ఓరుగల్లు ఉద్యమాల గడ్డ.. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వరంగల్ ప్రజలు ఐక్యంగా ఉండి ఇతర పార్టీలతో కలిసి ముందుకు సాగేలా అడుగులు వేయడం అబినందనీయమని ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆదివారం రాత్రి వరంగల్ ఎంజీఎం సమీప ఇస్లామియా గ్రౌండ్లో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈనెల 22న మహిళలతో హైదరాబాద్లో పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 25న రాష్ట్ర హ్యూమన్ చైన్(మానవహారం), జూన్ 1న ఇందిరా పార్కు వద్ద ఆందోళనలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సభలో బీఆర్ఎస్ నాయకులు సోహైల్, ముస్లిం మత పెద్దలు మీర్ ఇద్రిసాలీ, ఉమర్ అబేదిన్, మౌలానా ఫసీయోద్దీన్ ఖాస్మీ, జలీల్ఖాన్, సయ్యద్ అబ్దుల్ సుబాన్, అబ్దుల్ ఖుద్దుస్, సయ్యద్ మసూద్, జుబేర్, సీపీఐ, న్యూడెమోక్రసీ నాయకులు మేకల రవి, గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు. బహిరంగ సభలో అధిపత్య పోరు ఈ బహిరంగలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకుల మధ్య అధిపత్య పోరు కనిపించింది. తమను సభా వేదికలో ప్రసంగించకుండా అడ్డుకుంటున్నారని ఇరు పార్టీల మద్దతుదారులు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో లా బోర్డు పెద్దలు కలుగజేసుకుని వివాదాన్ని సద్దుమణిగించేలా చేశారు. సెల్ఫోన్ లైట్లతో మద్దతు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ సభకు హాజరైన ముస్లింలు సెల్ఫోన్ లైట్లు వెలిగించి మద్దతు తెలిపారు. సభ ప్రారంభంలో పహల్గాం ఉగ్రవాద దాడితో మృతిచెందిన భారతీయులకు, యుద్ధంలో మృతి చెందిన సైనికుల మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. -
అన్నదానం.. మహాప్రసాదం
భోజన సౌకర్యం బాగుంది..సరస్వతీనది పుష్కరాలకు రెండు రోజుల క్రితం కుటుంబ సమేతంగా వచ్చాం. అన్నదాన సత్రాల్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం. చాలా రుచిగా, శుభ్రంగా ఉంది. – అనురాధ, భక్తురాలు, మంచిర్యాలకాటారం /మల్హర్: అన్నం పరబ్రహ్మ సర్వూపం. ఆకలితో ఉన్న వారికి ఒక పూట భోజనం పెట్టినా చాలు ఎంతో పుణ్యం లభిస్తుంది. అందుకే సేవాభావంతో పలువురు ప్రముఖ దైవక్షేత్రాల్లో నిత్యాన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అదే మాదిరి ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది పుష్కరాల నేపథ్యంలో ముక్తీశ్వరాలయ సమీపంలో దాదాపు 8 చోట్ల అన్నదాన సత్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి అన్నదాతలు ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేసి భక్తుల కడుపునింపుతున్నారు. ఒక్క పూటకు నాలుగు నుంచి ఆరు వేల మంది భక్తులకు ఉచిత అన్నదానాలు చేస్తున్నారు. ప్రతీ రోజు టిఫిన్, అన్నదానం.. సరస్వతీనది పుష్కరాల సందర్భంగా ఆర్యవైశ్య, బ్రహ్మణ, ఈశ్వరకుమారి, వాసవీ క్లబ్, ఇతరాత్ర ట్రస్ట్ల ద్వారా ఏర్పాటు చేసిన అన్నప్రసాద సత్రాల ద్వారా భక్తులకు ప్రతీ రోజు టిఫిన్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఏదో ఉచిత భోజనం అందిస్తున్నామనే కాకుండా నిర్వాహకులు నాణ్యతతో కూడిన రుచికర భోజనం అందిస్తున్నారు. ఉదయం పలు రకాల అల్పాహారంతోపాటు భోజనంలో రెండు రకాల కూరలు, పప్పు, సాంబారు, పెరుగు, స్వీట్లు, పచ్చడి పెడుతున్నారు. రుచికరం, పరిశుభ్రంగా ఉండడంతో భక్తులు సత్రాల్లో భోజనం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.సేవలు అభినందనీయం.. పుష్కరాలకు పిల్లలతో కలిసి చాలా దూరం నుంచి వచ్చాం. మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇబ్బంది అవుతుందని ఆందోళన చెందాం. కానీ తీరా ఇక్కడికి వచ్చి చూస్తే అన్నదాన సత్రాల్లో భోజనం లభించింది. సమయానికి మా ఆకలి తీరింది. అన్నదానం నిర్వాహకుల సేవలు అభినందనీయం. – శ్రీనివాస్, భక్తుడు, కరీంనగర్ పుష్కరాల భక్తులకు పలు ట్రస్ట్ల నిత్యాన్నదానం పన్నెండు రోజుల పాటు ఉచితంగా టిఫిన్, భోజనం భక్తుల ఆకలి తీరుస్తున్న సత్రాలు -
హామీల అమలులో కేంద్రం విఫలం
● సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి ఎల్కతుర్తి: హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. ఆదివారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ మండల పదో మహాసభలకు ఆయన ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అందిస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ.. ఆ హామీల అమలులో పూర్తిగా విఫలం చెందారన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ మనుధర్మ శాస్త్ర అమలుకు కుట్ర పన్నుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక హామీలను నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఆదరి శ్రీనివాస్, మండల కార్యదర్శి ఉట్కూరి రాములు, మర్రి శ్రీనివాస్, కర్రె లక్ష్మణ్, సంతోశ్, రాజ్కుమార్, బొంత మల్లయ్య, నిమ్మల మనోహర్, ఉట్కూరి ప్రణీత్, విజయ్, రాజనర్సు, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముగిసిన నెట్బాల్ పోటీలు ● విజేతలకు బహుమతుల ప్రదానం జనగామ: జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి 8వ సబ్ జూనియర్ బాల బాలికల నెట్బాల్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్రంలోని 25 జిల్లాల నుంచి 620 మంది బాలురు, బాలికా క్రీడాకారులు హాజరయ్యారు. ట్రెడిషినల్, ఫాస్ట్–5, మిక్స్డ్ డబుల్స్ కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. ట్రెడిషినల్, ఫాస్ట్–5 పోటీలు ఈనెల 17న ముగియగా.. చివరగా మిక్స్డ్ డబుల్స్ పోటీలతో ముగింపు పలికారు. మిక్స్డ్ డబుల్స్లో మహబూబ్నగర్(విన్నర్), కామారెడ్డి(రన్నర్), థర్డ్ ప్లేస్లో వరంగల్/నాగర్ కర్నూల్ సంయుక్త విజేతలుగా నిలువగా, మూడు కేటగిరీల్లో విజయం సాధించిన టీంలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. -
ఉద్యమ జీవి నల్లెల రాజయ్య
విద్యారణ్యపురి: ఉద్యమ జీవి నల్లెల రాజయ్య చిరస్మరణీయుడని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్యనవీన్ అన్నారు. ఆదివారం హ నుమకొండ ప్రాక్టీసింగ్ ప్రైమరీ స్కూల్లో నిర్వహించిన ‘ప్రజల మనిషి నల్లెల రాజయ్య’ పుస్తకాన్ని ఆ యన ముఖ్యఅతిథిగా పాల్గొని ఆవిష్కరించి మాట్లాడారు. సి. చంద్ర ప్రధాన సంపాదకుడిగా, అనిశెట్టి రజిత, డాక్టర్ కెబి. చంద్రభాను, బిల్ల మహేందర్, పిట్ట సాంబయ్య, రౌతు అజయ్కుమార్ సంపాదకవర్గం సభ్యుల ఆధ్వర్యంలో వ్యాసాల సంపుటి(పుస్తకం)ని రూపొందించారు. కేయూ రిటైర్డ్ ఆచార్యుడు బన్నఅయిలయ్య,ప్రముఖ కవి వీఆర్ విద్యార్థి, టీపీఎఫ్ కన్వీనర్ రమాదేవి మాట్లాడారు. కవి కోడం కుమారస్వామి పుస్తకాన్ని సమీక్షించారు. వ రంగల్ రచయితల సంఘం కార్యదర్శి దండ్రె రాజ మౌళి, వివిధ ప్రజాసంఘాల బాధ్యులు భిక్షపతి, తిరుపతయ్య, సాంబయ్య, ఉదయ్సింగ్, మెట్టురవీ ందర్, జిడి. సారయ్య, మార్కశంకర్నారాయణ, కె. శంకర్రావు, వి. దిలీప్, బండారు సుజాత, బోనగిరి రాములు, ఎ. విద్యాదేవి, రాజేంద్రప్రసాద్, కుటుంబీకులు సుగుణ, వెన్నెల, సూర్య పాల్గొన్నారు.● కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్యనవీన్ -
నేడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రాక
ప్రముఖుల పుష్కర స్నానం.. కాటారం/కాళేశ్వరం: పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది పుష్కరాల్లో భాగంగా ఆదివారం పలువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. హైకోర్టు జడ్జి సుధా దంపతులు, ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్, జెన్కో డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ అనురాధ, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. సరస్వతి(వీఐపీ)ఘాట్లో పుష్కర స్నానం చేశారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం చేరుకుని స్వామి వారికి, సరస్వతీమాతా, శుభానందాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు హైకోర్టు జడ్జి సుధాకు కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే స్వాగతం పలికి మొక్కను బహూకరించారు.నిఘా నీడలో కాళేశ్వరం భూపాలపల్లి/కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల సందర్భంగా పోలీసులు ముందస్తు నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం, మహారాష్ట్ర– తెలంగాణ సరిహద్దులో కాళేశ్వరం ఉండడంతో అంతర్రాష్ట్ర వంతెన నుంచి మొదలు.. శ్రీకాళేశ్వర ముక్తీశ్వర దేవాలయం, పరిసర ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలు, పుష్కర ఘాట్, ప్రధాన రహదారుల్లో సుమారు 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసి నిత్యం పరిశీలిస్తున్నారు. ఫలితంగా ఇప్పటి వరకై తే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ఎండవేడితో భక్తుల అస్వస్థత భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరంలో ఎండ వేడితో భక్తులు అస్వస్థతకు గురవుతున్నారు. పుష్కరాలో భాగంగా నాలుగో రోజు ఆదివారం 8 మంది భక్తులు ఎండవేడికి అస్వస్థతకు గురికాగా 108లో కాళేశ్వరం పీహెచ్సీకి తరలించారు. పీహెచ్సీలో ఆదివారం 156 మందికి ఓపీ పరీక్షలు నిర్వహించగా 30 మంది భక్తులను అడ్మిట్ చేసుకున్నారు. కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన క్యాంపుల ద్వారా సుమారు 4వేల మంది భక్తులకు వైద్య సేవలు అందించామని డీఎంహెచ్ఓ మధుసూదన్ తెలిపారు.కలెక్టర్ జాయ్ రైడ్.. భూపాలపల్లి/కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ జాయ్ రైడ్ చేసి సరస్వతీనది పుష్కర సదుపాయాలను పరిశీలించారు. ఆదివారం ఉదయం కరీంనగర్ సీపీ గౌస్ అలం, కరీంనగర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్తో కలిసి హెలికాప్టర్లో పుష్కర పరిసరాలు పరిశీలించారు. పుష్కర ఘాట్లు, రహదారి సదుపాయాలు, శానిటేషన్, పారిశుద్ధ్య చర్యలు, టెంట్ సిటీ, స్టాళ్లు, భద్రతా ఏర్పాట్లును పరిశీలించారు. అనంతరం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు హెలికాప్టర్ ద్వారా త్రివేణి సంగమం, కాళేశ్వర దేవస్థానం, కాళేశ్వరం చుట్టు పక్కల అడవులు, తదితర అందాలను వీక్షించడానికి జాయ్ రైడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.భూపాలపల్లి: సరస్వతీనది పుష్కరాలకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సోమవారం రోడ్డు మార్గాన కాళేశ్వరం రానున్నారు. ఉదయం 10.30 గంటలకు కాళేశ్వరం చేరుకుని పుష్కర స్నానం ఆచరించిన అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. 12 గంటలకు తిరిగి కరీంనగర్కు వెళ్లనున్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ కూడా సోమవారం కాళేశ్వరం రానున్నట్లు సమాచారం. -
భక్తజన ప్రవాహం
సోమవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2025– 8లోuరేపటి నుంచి పీజీ కోర్సుల పరీక్షలు● 26 పరీక్ష కేంద్రాలు.. 4,300 మంది విద్యార్థులు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలా బాద్ జిల్లాలో పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్( నాన్ ప్రొఫెషనల్) రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలు ఈనెల 20 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సౌజన్య ఆదివారం తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ తదితర కోర్సుల పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల 20, 22, 24, 27, 29, 31 తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కేయూ పరిధిలో పీజీ కోర్సుల పరీక్షల నిర్వహణకు 26 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,300 మంది పరీక్షలు రాయనున్నట్లు వారు తెలిపారు. బాల్య వివాహం అడ్డగింత వరంగల్ క్రైం: సుబేదారి పోలీస్స్టేషన్ పరిధిలోని న్యూశాయంపేట ప్రాంతంలో ఆదివారం ఓ కల్యాణ మండపంలో బాలికకు వివాహం జరుగుతున్నట్లు పోలీసులకు అందిన సమాచారంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఆదేశాలతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం పోలీసులు, చైల్డ్లైన్ అధికారులు సంయుక్తంగా అక్కడికి చేరుకుని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బాలిక, యువకుడి తల్లిదండ్రులను సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపర్చి కౌన్సెలింగ్ నిర్వహించారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. చిన్నవయస్సులో పెళ్లి చేస్తే తీవ్ర అనర్థాలు కలుగుతాయన్నారు. అత్యాధునిక వసతులతో రైల్వే స్టేషన్ఖిలా వరంగల్: కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ తరహాలో అత్యాధునిక హంగులు, వసతులతో రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేయడం అభినందనీ యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. ఆదివారం వరంగల్ రైల్వేస్టేష న్ను మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, అరూ రి రమేశ్, బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్రావుతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. రూ.25.41 కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వేస్టేషన్ను ఈనెల 22న ప్రధాని నరేంద్ర మోదీ పర్చువల్గా ప్రారంభించనున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు రత్న సతీశ్, డాక్టర్ వన్నాల వెంకటరమణ, తాబేటి వెంకట్గౌడ్, బన్న ప్రభాకర్, ఎరుకుల రఘనారెడ్డి, కనుకుంట్ల రంజిత్ కుమార్, గోకే వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.● విధులకు హాజరు కాకుండానే హాజరైనట్లు సంతకాలు ● చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల డిమాండ్సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నాలాల పూడికతీత పనుల్లో చేతివాటం తంతుగా మారింది. ఇప్పటికే ప్రతీ పనికి ‘నీకింత.. నాకెంత’లా సాగుతున్న పర్సంటేజీల దందాపై కొందరు కార్పొరేటర్లు, జీడబ్ల్యూఎంసీ అధికారులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. నగరం వరద ముంపునకు గురికాకుండా ముందస్తుగా చేపట్టే నాలాల పూడికతీత పనుల్లోనూ కమీషన్ల దందా కలకలం రేపుతోంది. ప్రతీసారి ఆలస్యంగా మొదలుపెట్టే ఈ పూడికతీత పనులు సాగుతున్న తీరు చూస్తే నిజంగానే పూడికతీత కోసమా? లేక నిధుల మేత కోసమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్లుగా నాలాల క్లీనింగ్ అరకొరగానే సాగుతోంది. అంచనాలు పెంచి.. కాజీపేట, హనుమకొండ, వరంగల్ ట్రైసిటీస్లో ప్రధాన నాలాలతో పాటు అంతర్గత నాలాల పూడికతీత కోసం బల్దియా ఏటా రూ.కోట్లు వెచ్చిస్తున్నది. ఆరేళ్లలో సుమారు రూ.9.49 కోట్ల వరకు ఖర్చు చేసిన అధికారులు.. గతేడాది సైతం రూ.2.32 కోట్లు వరకు వెచ్చించారు. అంతకు ముందు సంవత్సరం రూ.1.24 కోట్లుంటే.. చాలాచోట్ల అంచనాలు పెంచి రూ.2.32 కోట్లకు చేర్చారన్న విమర్శలు వచ్చాయి. ప్రధాన నాలాలతో పాటు 42 అంతర్గత నాలాల్లో పూడిక తీతకు డబ్బులు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఆ డబ్బును గ్రేటర్ వరంగల్లోని కొందరు ఇంజినీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లు అందరినీ ‘సమన్వయం’ చేసి ‘లెక్కలు’ తేలిన పిదపే పనులు ప్రారంభించారన్న చర్చ కూడా ఉంది. ఈసారి కూడా సుమారు కోటిన్నరకు పైగా పూడికతీత పనులకు వెచ్చిస్తున్న బల్దియా చాలాచోట్ల నామినేషన్ పద్ధతిన పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అడుగడుగునా నిర్లక్ష్యం.. శంభునిపేట, ఏకశిలానగర్, శివనగర్, ఉర్సు డీకే నగర్, కరీమాబాద్ సాకరాశికుంట, 12 మోరీలు, రామన్నపేట, హంటర్రోడ్డు, ఉర్సు బొడ్రాయి, తిరుమల జంక్షన్, వడ్డ్డేపల్లి, ప్రశాంత్నగర్, నయీంనగర్, చైతన్యపురి కాలనీ ప్రాంతాలతో పాటు వరంగల్, హనుమకొండ, కాజీపేట పరిధి పలు డివిజన్లలో పూడికతీత పనులు చేపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరహాలో పనుల్లో పారదర్శకత కోసం కొత్తగా యాప్ను రూపొందించి జీపీఆర్ఎస్, జియో ట్యాగింగ్ పద్ధతిని కూడా కొన్నిచోట్ల ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే చాలాచోట్ల నాలాల పూడికతీత పనులు జేసీబీ, హిటాచీ యంత్రాలతో ౖపైపెన చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దగ్గరుండి పని చేయించాల్సి న ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో ఉండడం లేదు. దీంతో అడుగు భాగంలో పేరుకుపోయిన మట్టి(సిల్ట్)ని మాత్రమే తీసి ఇతర వ్యర్థాలను వదిలేస్తున్నారని నగరవాసులు చెబుతున్నారు. ఇటీవల వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో పర్యటించిన నగర మేయర్ గుండు సుధారాణి పూడికతీత పనులు పరిశీలించారు. వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు ● రెండో దశలో ఎస్ఏలకు.. ● మెరుగైన బోధనే లక్ష్యంగా ట్రైనింగ్పుణ్య స్నానాలు చేస్తున్న భక్తులు● సరస్వతి నది పుష్కరాలకు పోటెత్తిన భక్తులు ● తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు రద్దీ ● ఆలయాల్లో దర్శనాలు.. పుష్ప గిరి పీఠాధిపతి విద్యా భారతి స్వామి పూజలు ● సుమారు 1.80 లక్షల మంది పుష్కర స్నానాలు.. పర్యవేక్షించిన కలెక్టర్ రాహుల్ శర్మ న్యూస్రీల్పూడికతీత పనుల్లో కమీషన్ల వేట ‘గ్రేటర్’లో కొనసాగుతున్న తంతు ఏటా రూ.కోట్లు తగలేస్తున్న ‘బల్దియా’ మొక్కుబడిగా పనులు.. నామమాత్రంగా తనిఖీలు గత అక్రమాలపై ఫిర్యాదులు.. తేల్చని ‘విజిలెన్స్’ ‘విజిలెన్స్’ విచారణ బుట్టదాఖలు ఎప్పటిలాగే ఈసారి కూడా పనులను ఆలస్యంగా మొదలెట్టారు. జూన్ 2 నుంచే వర్షాలు పడతాయని వాతావరణశాఖ స్పష్టం చేసినా పూడికతీత పనులు వేగంగా సాగడం లేదు. సగం పనులు పూర్తయ్యేలోపే వర్షాలు పడితే గతంలో మాదిరిగానే ఈసారి విడుదలైన నిధుల్లో సగానికి పైగా స్వాహా అయ్యే అవకాశాలు ఉన్నాయని బల్దియా అధికారులు, కార్పొరేటర్లే అంటున్నారు. పూడికతీత పనుల్లో అక్రమాలు జరిగాయంటూ గతంలో కొందరు మాజీ కార్పొరేటర్లు, పౌరుల ఫిర్యాదు మేరకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేపట్టారు. చర్యలు మాత్రం లేకపోవడంతో నిధుల దుర్వి నియోగం సర్వసాధారణంగా మారింది.లక్ష్యం మేరకు పూడిక తీయట్లేదు.. భద్రకాళి చెరువు మరింత లోతు పూడిక తీయాల్సింది. 3లక్షల క్యూబిక్ ఫీట్లు పూడిక తీయాల్సి ఉండగా సగం కూడా పూర్తికాలేదు. అధికారులు మాత్రం 70శాతం అయ్యిందని మంత్రులను కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. ఇలా అయితే వర్షాకాలంలో చెరువునిండి నీరు బయటకు వస్తుంది. వర్షాలుపడే లోపే పూడికతీత పూర్తిచేయాలి. భద్రకాళి చెరువులోకి డ్రెయినేజీ నీరు రాకుండా గోడ నిర్మించాలి. – పుల్లూరు సుధాకర్, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు -
క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి
కేయూ క్యాంపస్: తెలంగాణలో క్రీడా రంగాభివృద్ధి కి రేవంత్రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి అన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కుమారు డు నాయిని విశాల్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలోని యూనివర్సి టీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో నాయిని టీ–10 లీగ్ సీజన్–2 క్రికెట్ పోటీలు ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వేం నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. 2015లో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో విశాల్రెడ్డి మరణించడంతో ఆయన జ్ఞాపకాలను రాజేందర్రెడ్డి విశాల్ ట్రస్ట్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాల్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్యాటింగ్ చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, మేయర్ సుధారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి విశాల్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ప్రారంభం -
విద్యార్థి దశ నుంచే అవగాహన ఉండాలి
విద్యారణ్యపురి: విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ ఎయిడ్స్, హెచ్ఐవీపై అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్ఓ) అప్పయ్య అన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే సందర్భంగా ఆదివారం సాయంత్రం హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి హనుమకొండ ప్రసూతి ఆస్పత్రి వరకు కొవ్వొత్తులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడ్స్తో మరణించిన వారిని స్మరించుకుంటూ ప్రజల్లో హెచ్ఐవీ, ఎయిడ్స్పై అవగాహన కల్పిస్తూ ఎవరైతే హెచ్ఐవీతో జీవిస్తున్నారో వారికి సంఘీభావంగా ఉండేందుకు ఈకార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అడిషనల్ డీఎంహెచ్ఓ టి.మదన్మోహన్రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, టీబీ ఆస్పత్రి, పరకాలలోని సీఎస్సీ ఐసీటీసీ సెంటర్లుగా పని చేస్తున్నాయన్నారు. 2024–25లో 55,000ల మందిని పరీక్షించగా.. 100 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ గీత, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్రెడ్డి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణఽ సంస్థ మేనేజర్ స్వప్నమాధురి, ఐసీటీసీ సూపర్వైజర్ రామకృష్ణ, ఐసీటీసీ కౌన్సిలర్లు రాపర్త సురేశ్, రాజేందర్, సంపూర్ణ, సురక్ష కేంద్ర బృందం ఇక్బాల్, భాషా ల్యాబ్ టెక్నిషియన్లు, కరుణ మైప్రాజిటివ్ నెట్వర్క్ రవీందర్, మారి, విజయ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఽఖ అధికారి అప్పయ్య -
మారిన యూనిఫామ్ డిజైన్లు
రూ.75తో గిట్టుబాటు కాని కూలి.. ప్రభుత్వం ఒక జత యూనిఫామ్ స్టిచ్చింగ్కు రూ.75 చొప్పున చెల్లిస్తోంది. గతంలో ఒక్కో తకు రూ.50 చొప్పున చెల్లించగా గత ఏడాది నుంచి రూ.25 పెంచారు. ఇందులో కుట్టు కూలికి రూ.50, కటింగ్, బటన్స్, కాజలు, ఎంఎస్ సర్వీస్ చార్జి రూ.25 కలిపి రూ.75 ఇస్తున్నారు. బయట టైలర్లు ఒక్కో జత కుట్టడానికి రూ.300 నుంచి రూ.400 తీసుకుంటుండగా ప్రభుత్వం రూ.75 నిర్ణయించడంతో గిట్టుబాటు కావడం లేదని మహిళా సమాఖ్య సభ్యులు పేర్కొంటున్నారు. యూనిఫాంకు కనీసం రూ.150 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.విద్యారణ్యపురి/వేలేరు: ప్రభుత్వ పాఠశాలల్లోని వి ద్యార్థులకు(2025–26 )విద్యాసంవత్సరం అందించే స్కూల్ యూనిఫామ్ డిజైన్లో స్వల్ప మార్పులు చేశారు. తరగతుల వారీగా బాలబాలికలకు వేర్వేరు డిజైన్లలో దుస్తులు కుట్టించేందుకు ఇప్పటికే హనుమకొండ జిల్లాలో గ్రామీణ ప్రాంత మహిళ సంఘా ల సమాఖ్యలకు క్లాత్ను మండలాల వారీగా పాఠశాలల స్థాయిలో అందజేశారు. పట్టణ ప్రాంతంలో మెప్మాకు సంబంధించి టీఎల్ఎఫ్లకు అప్పగించారు. క్లాత్ను టిస్కో పంపిణీ చేసింది. ఈసారి స్టి చింగ్ డిజైన్లో మార్పులను గమనిస్తే.. ముఖ్యంగా చొక్కాలు, లాంగ్ ఫ్రాక్లకు పట్టీలు, భుజాలపైన క ప్స్ వంటి ప్యాచ్లు లేకుండా కుటిస్తున్నారు. స్టిచ్చింగ్ సరళంగా ఉండేందుకు స్వల్పమార్పులు చేశారు. తరగతుల వారీగా యూనిఫామ్ ఇలా.. ఒకటి నుంచి 5వ తరగతి బాలురకు చొక్కా, నిక్కర్, ఆరు నుంచి 12వ తరగతి వరకు బాలురకు చొక్కా, పాయింట్, ఒకటి నుంచి మూడో తరగతి బాలికలకు చొక్కా, లాంగ్ఫ్రాక్, 4, 5 తరగతుల బాలికలకు షర్ట్, స్కర్ట్, ఆరు నుంచి 12వ తరగతి బాలికలకు పంజాబీడ్రెస్ మోడల్లో ఉండేలా టాప్ బాటమ్ చున్నీ లేకుండా కుట్టిస్తున్నారు. ఈసారి వేసవి సెలవులకు ముందే యూనిఫాం కుట్టించేందుకు కొలతలు కూడా తీసుకున్నారు. దుస్తులు హెచ్చు తగ్గులు ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొలుత ఒకే జతకు క్లాత్రాక.. యూనిఫాం స్టిచ్చింగ్ కోసం ముందుగా ఒకే జత కోసం క్లాత్ను మహిళా సమాఖ్యలకు అప్పగించారు. ఈనెల 31 వరకు స్టిచ్చింగ్ పూర్తి చేసి అందజేయాలని జిల్లా విద్యాశాఖ ఆదేశించింది. జిల్లాలో 314 పీఎస్లు, 72 యూపీఎస్లు, 147 హైస్కూళ్లు, 9 కేజీబీవీలు, మూడు మోడల్ స్కూళ్లు, ఒక యూఆర్ఎస్, 25 వరకు ఎయిడెడ్ స్కూళ్లు ఉన్నాయి. మొత్తం విద్యార్థులు 30,922 మంది ఉండగా ఇందులో బాలురు 14,852, బాలికలు 16,070 మంది ఉన్నారు. ఇదిలా ఉండగా.. ప్రతి ఏడాది ఒక్కో విద్యార్థికి రెండుజతల చొప్పున స్కూ ల్ యూనిఫామ్ అందజేస్తున్నారు. ఈసారి తొలుత ఒక జత పంపిణీ చేసేందుకు స్టిచ్చింగ్ చేయిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక పిల్ల లకు అందజేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే రెండో జతకు క్లాత్వచ్చే అవకాశం ఉంటుంది.స్వల్పమార్పులతో స్టిచ్చింగ్ ప్రస్తుతానికి ఒకే జతకు క్లాత్ రాక కుట్టుపనికి 31వ తేదీ వరకు డెడ్లైన్ జిల్లాలో 30,922 మంది విద్యార్థులు -
కానిస్టేబుల్కు అభినందనలు
రామన్నపేట: వృత్తి ధర్మంలో భాగంగా మానవత్వం చాటుకున్న ఓ కానిస్టేబు ల్ మంచి మనస్సును ప్రజలు అభినందించారు. వివరాల్లోకి వెళ్తే వరంగల్ గోపాలస్వామి గుడి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి దుస్తులు కూడా సరిగ్గా లేక ఎండవేడి తట్టుకోలేక పడిపోగా, స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మట్టెవాడ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ కల్యాణ్కుమార్ అక్కడికి చేరుకుని బాధిత వ్యక్తికి దుస్తులు తెప్పించి తొడిగి 108 వాహనాన్ని పిలిపించి ఎంజీఎం ఆస్పత్రికి వైద్యం కోసం తరలించాడు. ఇదంతా గమనించిన స్థానికులు సదరు కానిస్టేబుల్ స్పందించి సహాయం చేసిన తీరుకు అభినందనలు తెలిపారు. -
డైక్ కాంట్రాక్ట్ సిబ్బంది ఇష్టారాజ్యం
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డైక్)లో కాంట్రాక్ట్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొద్ది నెలల నుంచి సిబ్బంది అసలు విధుల్లో లేకుండానే విధులకు హాజరైనట్లు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏకంగా విధులకు హాజరవ్వకుండా డైక్ సెంటర్కే తాళం వేసిన ఘటనలున్నట్లు బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. సిబ్బంది విధులకు డుమ్మా కొడుతుండడంతో బాధిత పిల్లలకు సేవలు ఎలా అందిస్తారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డైక్ సెంటర్ కాంట్రాక్ట్ సిబ్బందిలో ఓ ఉద్యోగిని ఎవరైనా ప్రశ్నిస్తే.. ప్రముఖ దినపత్రిక చీఫ్ బ్యూరో నా చుట్టం.. మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ.. చిందులు తొక్కుతుండడం గమనార్హం. ఎంజీఎం డైక్ సెంటర్లో అర్హత లేని వ్యక్తులు ఉద్యోగాలు పొందారని, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగ నియామకాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డైక్ సెంటర్ కాంట్రాక్టు సిబ్బంది తీరు, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగ నియామకాలపై కలెక్టర్ విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించాలంటూ ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.