breaking news
Hanamkonda
-
పిలవని పేరంటానికి వస్తే జైలు, జరిమానా
మహబూబాబాద్ జిల్లా: పెళ్లి, ఇతర శుభకార్యాలను తమ హోదాతోపాటు బంధుమిత్రులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు ఫంక్షన్హాల్ను ఎంచుకుంటారు. ముక్కూమొహం తెలియని వారు ఫంక్షన్కు రావడం వల్ల అతిథులు ఇబ్బంది పడడం, చివరగా భోజనం పెట్టలేని పరిస్థితి వస్తుండడంతో ఆ ఫంక్షన్హాల్కు పెద్దగా గిరాకీ ఉండకపోవడంతో ఆ యజమాని వినూత్నంగా ఆలోచించాడు. ‘ఫంక్షన్కు సంబంధం లేని వ్యక్తులు లోనికి వచ్చి పట్టుబడితే సెక్షన్ 441 ప్రకారం 3 నెలల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా’అంటూ ఫంక్షన్హాల్ ముందు ఫ్లెక్సీ పెట్టాడు. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్ వద్ద ఏర్పాటు చేసిన ఆ ఫ్లెక్సీ సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ‘ఎవరైనా పిలవని పేరంటానికి వెళ్లకండి.. భోజనం లాగిద్దామని వెళ్తే..లాగి లోపలేస్తారు.. తస్మాత్ జాగ్రత్త’అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వృథాగాగోదావరి జలాలు ఎయిర్ వాల్వ్ ఓపెన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు చేర్యాల (సిద్దిపేట): గోదావరి జలాలు వృథాగా పోతున్నాయి. తపాసుపల్లి రిజర్వాయర్లోకి నీటిని పంపింగ్ చేసే పైప్లైన్ ఎయిర్ వాల్్వను గుర్తుతెలియని వ్యక్తులు ఓపెన్ చేశారు. దీంతో గోదావరి జలాలు పెద్దఎత్తున వృథాగా పొలాల్లోకి వెళ్తున్నాయి. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామ శివారులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. రాత్రి సమయం కావడం వల్ల దేవాదులకు సంబంధించిన అధికారులు అందుబాటులో లేకపోవడంతో నీటి వృథా కొనసాగుతూనే ఉంది. -
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
వరంగల్: అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం వరంగల్ కాశిబుగ్గ 20 డివిజన్ పరిధిలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు డివిజన్కు చెందిన క్యాతం రవీందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరగా మంత్రి సురేఖ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాశిబుగ్గ జంక్షన్ నుంచి తిలక్ రోడ్డు కేవీఎస్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీపీసీసీ కార్యదర్శి మీ సాల ప్రకాశ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడుతూ లబ్ధిదారులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలను గుర్తించి తన దృష్టికి తీసుకురావాలన్నారు. నాయకులు నవీన్రాజ్, ఓని భాస్కర్, డి.రాజేశ్, సతీశ్, లావణ్య, రాజమణి, సంతోష్ పాల్గొన్నారు. కనిపించని పార్టీ జిల్లా అధ్యక్షుడు.. తూర్పు నియోజవర్గంలోని 20వ డివిజన్లో నిర్వహించిన చేరికల సభలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయూబ్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో చేరిన రవీందర్ కాశిబుగ్గలోని పలు కూడళ్లలో ఏర్పాటు చసిన ఫ్లెక్సీల్లో సైతం డీసీసీ అధ్యక్షుడి ఫొటో లేక పోవడంపై సీనియర్ నాయకులు, కార్యకర్తలు తప్పుపట్టారు. డీసీసీ అధ్యక్షుడు స్థానికంగా ఉన్నా చేరికల సభకు ఆహ్వానించలేదని తెలిసింది. ఈవిషయంపై ఆయన పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ -
విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యం
హన్మకొండ అర్బన్ : హనుమకొండ జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమన్వయంతో అమలుచేస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంతోపాటు విద్య, వైద్య రంగాల ప్రాధాన్యతను ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ఎంపీ కడియం కావ్య అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. సమావేశంలో మహిళా శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య, విద్య, వ్యవసాయం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారులు తదితర శాఖల పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ పాఠశాలల్లో డ్రాపౌట్లను తగ్గించి విద్యార్థుల ప్రవేశాలను పెంచాలని సూచించారు. బాల్యవివాహాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని, వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లా అగ్రస్థానంలో నిలవాలని సూచించారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుకు అధికారులు సమష్టిగా పనిచేయాలని సూచించారు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా కార్యాచరణతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చై ర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, మేయర్ సుధారాణి, అదనపు కలెక్టర్ రవి, తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ స్కూల్స్ అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణహన్మకొండ అర్బన్ : రాష్ట్రంలోని క్రీడా పాఠశాలలలో 2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశాల సంబంధించిన పోస్టర్ను శనివారం జిల్లా కలెక్టరేట్లో హనుమకొండ కలెక్టర్ చాహత్ జాబ్పాయ్, ప్రజా ప్రతినిధులు ఆవిష్కరించారు. రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండ, తదితర క్రీడా పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. క్రీడల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి వారికి నాణ్యమైన విద్యతోపాటు ప్రత్యేక క్రీడా శిక్షణ అందించడమే స్పోర్ట్స్ స్కూల్స్ లక్ష్యమని తెలిపారు. ‘దిశ’ సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య -
షార్ట్ సర్క్యూట్ హోమ్నీడ్స్ షాపు దగ్ధం
● రూ. 50 లక్షల విలువైన ఆస్తి నష్టం వరంగల్ చౌరస్తా : షార్ట్ సర్క్యూట్తో ఓ హోమ్నీడ్స్ షాపు దగ్ధమైంది.ఈ ఘటన వరంగల్ జేపీఎన్ రోడ్డులో చోటు చేసుకుంది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. దత్తాత్రేయ హోమ్ నీడ్స్ షాపు యజమాని సతీశ్ శనివారం ఉదయం పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్తో మొయిన్ రోడ్డు వద్ద చేలరేగిన మంటలతో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. మొదటి ఫ్లోర్లోని హోమ్ నీడ్స్ మొత్తం మంటల్లో కాలిపోయింది. అనంతరం మంటలు మొదటి అంతస్తులో ఉన్న డెంటల్ షాపునకు ఎగబాకే క్రమంలో నాలుగు ఫైర్ ఇంజినీర్లు చేరుకుని ఆర్పాయి. ఈ ఘటనలో సుమారు రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని యాజమాని సతీశ్ లబోదిబోమన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నవీన్ , హనుమకొండ ఫైర్ ఆఫీసర్ దిలీప్, సిబ్బంది పాల్గొన్నారు. -
బిజినెస్ ఉమెన్.. కల్పన
● మరో ఆరుగురికి కూడా..● ఓవెన్ బ్యాగ్ తయారీ వ్యాపారంలో రాణింపు ● ప్రస్తుతం ఏడాదికి రూ. కోటిన్నర టర్నోవర్ ● మహిళా సంఘాల లోన్లతో స్వయం ఉపాధి శాయంపేట : ఆమె ఓ డ్వాక్రా సంఘంలో సాధారణ సభ్యురాలు. మండల సమాఖ్య తరఫున లోన్ తీసుకుని నానో ఓవెన్ బ్యాగ్ తయారీ పరిశ్రమ ఏర్పా టు చేశారు. తాను స్వయం ఉపాధి పొందడంతో పాటు మరో ఆరుగురికి ఉపాధి చూపించారు. కొద్ది కాలంలోనే రూ. కోటిన్నర టర్నోవర్ సాధించారు. ఫలితంగా మహిళా పారిశ్రామిక వేత్తగా ఎదిగి ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె హనుమకొండ జిల్లా శాయంపేటకు చెందిన దాసరి కల్పన. నేడు అంతర్జాతీయ మహిళాదినోత్సవం. ఈ సందర్భంగా కల్పన విజయ గాథపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 2001లో డ్వాక్రా గ్రూపులో సభ్యురాలిగా చేరిక ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న కల్పనకు భర్త, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ క్రమంలో కల్పన.. సరస్వతి డ్వాక్రా సంఘంలో 2001లో సభ్యురాలిగా చేరారు. కుట్టు మిషన్ ద్వారా జాకెట్లు కుడుతూ ఉపాధి పొందేవారు. ఈ నేపథ్యలో ఉమ్మడి జిల్లా తరఫున సీఆర్పీ ట్రైనింగ్కు ఎంపికయ్యారు. సీఆర్పీగా ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు వెళ్లి పని చేశారు. 2020లో నానో ఓవెన్ బ్యాగ్ తయారీ పరిశ్రమ ఏర్పాటు కల్పన.. శాయంపేట మండల సమాఖ్య తరఫున రూ. 15 లక్షల లోన్ తీసుకుని శాయంపేటలోనే 2020లో నాన్ ఓవెన్ బ్యాగ్ తయారీ పరిశ్రమ ప్రారంభించారు. సొంతంగా మరో రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం ఏడాదికి రూ.కోటిన్నర టర్నోవర్ సాధించారు. కుట్టు మిషన్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నా. నా ఇద్దరు కూతుళ్లను ఒంటరిగా వదిలేసి సీఆర్పీగా పని చేయడానికి పొరుగు రాష్ట్రాలకు వెళ్లా. ఈక్రమంలో ‘లక్పతి దిది’ కార్యక్రమం ద్వారా నాకు గొప్ప అవకాశం దక్కింది. నానో ఓవెన్ బ్యాగ్ పరిశ్రమ స్థాపించా. ఈ పరిశ్రమ నడపడంలో నా భర్త సహకారం మరువలేనిది. – దాసరి కల్పన, మహిళాపారిశ్రామికవేత్త, శాయంపేట -
రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనుల తనిఖీ
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ–కోచ్ ఫ్యాక్టరీ) నిర్మాణ పనులను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) అధికారులు శనివారం తనిఖీ చేశారు. ఆర్వీఎన్ఎల్ సికింద్రాబాద్ డీజీఎం శర్మ, ఆర్వీఎన్ఎల్ ఆర్ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వికాస్రెడ్డి.. ఆర్ఎంయూ నిర్మాణం, ఎలక్ట్రిఫికేషన్ పనులు తనిఖీ చేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పవర్మెక్ప్రాజెక్ట్ కాంట్రాక్టర్కు సూచించినట్లు అధికారులు తెలిపారు. కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వరంగల్ మీదుగా పొదనూర్–బరోని మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ శనివారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. మార్చి 16, 23వ తేదీల్లో పొదనూర్–బరోని (06021) ప్రత్యేక రైలు మరుసటి రోజు వరంగల్కు చేరుకుని వెళ్తుంది. అదేవిధంగా మార్చి 16,19వ తేదీల్లో బరోని–పొదనూర్ (06022) ప్రత్యేక రైలు మరుసటి రోజు వరంగల్కు చేరుకుని వెళ్తుంది. ఈ రైళ్ల సర్వీస్లకు తినుప్పుర్, ఈరోడ్, సేలం, జోలర్పెట్టాయ్, కట్పడి, పె రంబూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగ ల్, రామగుండం, సిర్పూర్కాగజ్నగర్, బల్లా ర్షా, చంద్రపూర్, నాగ్పూర్, బెతూల్, ఇటార్సీ, జబల్పూర్, సంత, మానిక్పూర్, ప్రయాగ్రా జ్, చౌకీ, చూనర్, పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ, బాక్సర్, ఆరా, దానాపూర్, పాటలీ పుత్ర, హాజిపూర్, షాపూర్ పాటూరి స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు సీపీఆర్వో తెలిపారు. -
ముగిసిన రూబిజెస్ట్–26
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో రెండురోజులుగా నిర్వహిస్తున్న రూబిజెస్ట్– 26 శనివారం రాత్రి ముగిసింది. ఫెస్ట్లో భాగంగా వివిధ ఈవెంట్లలో ప్రాజెక్టు ఎక్స్పో, టెక్నికల్ క్విజ్, కోడింగ్, పోస్టర్ల ప్రజెంటేషన్స్, లాజికల్ ఫజిల్స్ వంటిపలు పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటుకున్నారు. అలాగే, కల్చరల్ ఫెస్ట్ కూడా నిర్వహించారు. ఫ్యాషన్ షోలు, మోడలింగ్ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ముగింపు సందర్భంగా సింగర్లు పవన్కల్యాణ్, అనన్యభాస్కర్ పాటలు పాడారు. ఈవెంట్ల విజేతలకు బహుమతులు అందజేశారు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ భిక్షాలు, స్టూడెంట్స్ అకడమిక్ కోఆర్డినేటర్ అర్చనను సన్మానించారు. కన్వీనర్ సురేందర్ అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
భోజనం పెట్టమని అడిగినందుకు..
కాజీపేట అర్బన్ : ‘ఆకలవుతోంది భోజనం పెట్టు బిడ్డా’ అని అడిగినందుకు ఓ ప్రబుద్ధుడు తన తల్లి పట్ల కర్కషంగా వ్యవహరించాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ఈ ఘటన మడికొండలో చోటు చేసుకుంది. మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ కథనం ప్రకారం.. మడికొండకు చెందిన వస్కుల శాంత రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆమె కు ఐదుగురు కుమారులు ఉండగా వారి వద్ద ఉంటోది. ఈ క్రమంలో శుక్రవారం ఆకలవుతోంది భో జనం పెట్టు బిడ్డా అని మూడో కుమారుడు రా మును కోరింది. అంతే దీనికి ఒక్కసారిగా కోపోద్రెకుడైన రాము.. తల్లిని ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. అ నంతరం రాము భార్య సుమలత, నాలుగో కుమారుడు భార్య కల్పన కూడా ఇష్టం వచ్చినట్లు కొట్టా డు. కుమారుడు బండతో కొట్టగా కింద పడింది. ఈ ఘటనలో తల పగిలిపోడంతోపాటు చేయి విరిగింది. దీనిపై సమాచారం అందుకున్న మరో కుమారుడు శంకర్ వెంటనే ఘటనా స్థలికి చేరకుని శాంతను చికిత్స నిమిత్తం ఎంజీఎం తరలించారు. నడవలేని స్ధితిలో ఉన్న బాధితురాలు శాంత డయల్ 100కు కాల్ చేసి విషయం తెలిపింది. దీంతో స్వయంగా వృద్ధురాలి ఇంటికే వెళ్లి విచారణ చేపట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ కాపీని కాపీని శాంతకు అప్పగించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. వృద్ధులను దూషించిన, ఎలాంటి ఇబ్బందులు కలగజేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిపై కుమారుడి దాడి బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇంటి వద్దే ఎఫ్ఐర్ నమోదు -
అప్రమత్తతే ఆయుధం..
వరంగల్ క్రైం: మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, సమాన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగుతున్నారని వరంగల్ పోలీస్ కమి షనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత పేర్కొన్నారు. అప్రమత్తతే ఆయుధమని, పరిచయం లే ని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల ని సూచించారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల భద్రత, సవాళ్లు, సమస్యలను అధిగమించడం ఎలా తదితర అంశాలపై డీసీపీ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ప్రతి పోలీస్స్టేషన్లో ‘సన్నిహిత’ కేంద్రం ఏర్పాటు.. గతంతో పోలిస్తే ఇప్పుడు పోలీస్ స్టేషన్ పరిసరాలు, పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం బాధిత మహిళలు వారి కష్టాలు, ఇబ్బందులను ధైర్యంగా చెప్పుకునేందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో ‘సన్నిహిత’ కేందంర ఏర్పాటు చేశాం. సన్నిహిత విధులను మహిళా పోలీస్ అధికారి నిర్వహిస్తారు. దీంతో పోలీస్ స్టేషన్కు వచ్చే మహిళలు ఎవరికి సమస్యలను సన్నిహితతో చెప్పుకుంటారు. మహిళల కేసుల ఛేదనలో పురోగతి.. మహిళలు, యువతులు, బాలికలకు సంబంధించిన కేసుల ఛేదనలో పురోగతి ఉంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో మహిళల కేసుల్లో కన్వెక్షన్ గతంలో 11 శాతం ఉండేది. గతేడాది కన్వెక్షన్ శాతం 16కు పెరిగింది. పోక్సో కేసుల్లో 35 శాతం ఉంది. అన్యాయం జరిగితే ఫిర్యాదు చేయాలి.. సుబేదారి పీఎస్ పరిధిలో తల్లిదండ్రులు లేని ఓబాలిక తన పెద్దమ్మ దగ్గర ఉంటోంది. 43 ఏళ్ల వ్యక్తి ఓరాత్రి బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక పరిస్థితిని చూసి అడగడంతో విషయం వెలుగు చూసింది. దీంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించాం. ఎల్కతుర్తి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని ఓ యువతిపై యువకుడు అత్యాచారం చేశాడు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశాం. అన్యాయం జరిగితే ఫిర్యాదు చేయాలి. సమాచారం ఇస్తే ఇంటి వద్దకే వచ్చి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. చాలామంది యువతులు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చదువు, ఉద్యోగాల కోసం వస్తున్నారు. అందులో కొంతమంది పరిచయం లేని వ్యక్తులతో దగ్గరవుతున్నారు. ఇలాంటివి చివరకు బాధను మిగిలుస్తున్నాయి. సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. యువకులతో ఇష్టారాజ్యంగా తిరిగితే ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తారు. కొంతమంది బాలికలతో డ్రగ్స్ తెప్పించుకుని వాడుతున్నారు. హాస్టళ్లలో ఉంటున్న వారు ఒకటికి రెండుసార్లు ఎక్కడైనా సీక్రెట్ కెమెరాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత -
పల్లెల్లో పారిశ్రామికవేత్తలు
● సబ్బుల వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతున్న ఆదివాసీ మహిళలు ● రూ. కోట్ల టర్నోవర్ సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న అతివలుఏటూరునాగారం : పట్టుదల, ఆసక్తి ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఎంతటి కష్టతర లక్ష్యమైనా సులువుగా అధిరోహించొచ్చు. దీనికి నిదర్శమే ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శివాపురం గ్రామానికి చెందిన ఆదివాసీ నిరక్షరాస్య మహిళలు. నిత్యం కూలీ, వ్యవసాయ పనుల్లో లీనమయ్యేవాళ్లంతా సాధికారత దిశగా అడుగులు వేశారు. స్వయం ప్రతిపత్తి సాధించాలనే ఉద్దేశంతో సబ్బుల (డిటర్జెంట్) తయారీకి శ్రీకారం చుట్టారు. ‘సమ్మక్క సారలమ్మ’ జాయింట్ లయబిలిటీ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఆరంభంలో ఒడుదొడుకులు ఎదురైనా తట్టుకొని నిలబడ్డారు. ప్రస్తుతం ఆర్థికంగా బలపడి పల్లెల్లో పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా వారిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. చేయి చేయి కలిపి గ్రామానికి చెందిన ధనసరి సౌజన్య, పూనెం రమ, పూనెం సీతమ్మ, కోసం సమ్మక్క, చింత జ్యోతి, సిద్ధబోయిన శరత్, ధనసరి నర్సయ్యకు ఐటీడీఏ ద్వారా 2019లో రూ.23 లక్షలతో ఎంఎస్ఎంఈ పథకంలో భాగంగా సబ్బుల తయారీ యూనిట్ మంజూరైంది. గ్రామంలోనే ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. వాళ్లు తయారు చేసిన సబ్బులను గిరిజన సహకార సంస్థ కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. ఈ సబ్బులను ఉట్నూరు, భద్రాచలం, మన్ననూరు, ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమశాఖ పాఠశాలలు, హాస్టళ్లకు సరఫరా చేసేవాళ్లు. అలా ఆదాయం సమకూరడంతో ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేశారు. పొదుపు మంత్రం పఠిస్తూ జీవితంలో పైకి ఎదుగుతున్నారు. సమష్టిగా పని చేస్తూ సబ్బులను తయారు చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నాం. రోజూ పది వేల వరకు సబ్బులు తయారు చేస్తున్నాం. ఇప్పుడు కూలీకి స్వస్తి పలికాం. ప్రభుత్వం సహకరిస్తే పెద్ద యూనిట్ నెలకొల్పుతాం. – పూనెం రమ, గ్రూపు ప్రధాన కార్యదర్శి -
24 గంటల విద్యుత్ ఉత్తమాట
హన్మకొండ: వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్న మాట ఉత్తదేనని విద్యుత్ వినియోగదారులు చెప్పారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటైల్ విద్యుత్ సరఫరా వ్యాపారం కోసం సవరణ చేసిన సమగ్ర ఆదాయ అవసరాలు, విద్యుత్ ధరల ప్రతిపాదనలు, ఓపెన్ యాక్సెస్, వినియోగదారులపై క్రాస్ సబ్సిడీ, సర్చార్జీల ప్రతి పాదనలపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్, ఫైనాన్స్ మెంబర్ చెరుకూరి శ్రీనివాస రావు, టెక్నికల్ మెంబర్ రఘు కంచెర్ల బహిరంగ విచారణ చేపట్టారు. ఆదిలాబాద్కు చెందిన బీకేఎస్ నాయకుడు భూమారెడ్డి, జగిత్యాల జిల్లాకు చెందిన విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా ఇవ్వడం లేదని రోజుకు 7 నుంచి 12 గంటలు మాత్రమే ఇస్తున్నారన్నారు. మాజీ మంత్రి జలగం ప్రసాద రావు మాట్లాడుతూ ఎన్పీడీసీఎల్లో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందన్నారు. ఆపరేటర్లు లేక కొత్త సబ్స్టేషన్లు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ఆయా జిల్లాల రైతు సంఘాల నాయకులు, వినియోగదారులు మాట్లాడుతూ ఆదిలాబాద్, కరీంనగర్లో సీజీఆర్ఎఫ్ ఏర్పాటు చేయాలని, సీజీఆర్ఎఫ్ నిర్వహిస్తున్న లోకల్ కోర్టుల సంఖ్యలో నెలకు కనీసం 10కి పెంచాలని కోరారు. విద్యుత్ షాక్ మృతి ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలన్నారు. అనంతరం రైతు సంఘం నాయకుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. పలువురు వినియోగదారులు సమస్యలు వివరించగా వాటిని పరిశీలించాలని ఈఆర్సి చైర్మన్ జస్టిస్ నాగార్జున్ ఆదేశించారు. వినియోగదారులకు అత్యుత్తమ సేవలు విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ అందిస్తున్నామని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి చెప్పారు. బహిరంగ విచారణలో 38 మంది వినియోగదారులు అభ్యంతరాలు లేవనెత్తగా వరుణ్ రెడ్డి సమాధానం ఇస్తూ సబ్ స్టేషన్లను రిమోట్ మానిటర్ ద్వారా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఆసుపాక, కమలాపూర్ 33 కేవీ కొత్త లైన్, గుండాల 132 కేవీ సబ్ స్టేషన్లకు టెండర్ పిలిచామన్నారు. వాట్సాప్ చాట్ బాట్, టోల్ ఫ్రీ నంబర్ 1912, టీజీ ఎన్పీడీసీఎల్ పోర్టల్ ద్వారా సమస్యలు నమోదు చేసుకోవచ్చన్నారు. విద్యుత్ ప్రమాదాలు 22 శాతానికి తగ్గించా మని అన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, జీపీల్లో 1912 రాయించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. సోలార్ రూఫ్ టాప్ ద్వారా 135 మెగావాట్లు గ్రిడ్కు కనెక్ట్ చేస్తున్నామని చెప్పారు. ఖమ్మంలోని బోనకల్ మండలాన్ని మోడల్ సోలార్ గ్రామంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. పరిశ్రమలపై విద్యుత్ భారాన్ని తగ్గించాలి వరంగల్: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు, ప్రస్తుత ఉన్న పరిశ్రమల పురోగతికి పరిశ్రమలపై విద్యుత్ భారాన్ని తగ్గించాలని తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు బొమ్మినేని రవీందర్రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా కాటన్ అసోసియేషన్ అధ్యక్షులు చింతలపల్లి వీరారావులు అన్నారు. బహిరంగ విచారణలో పలు పారిశ్రామిక సమస్యలపై చర్చించారు. 70.29 లక్షల మంది వినియోగదారులు టీజీఎన్పీడీసీఎల్లో 70.29 లక్షల మంది విని యోగదారులు ఉన్నారని, తలసరి విద్యుత్ విని యోగం 1,680 యూనిట్లుగా ఉందన్నారు. ఈ నెలలో అత్యధిక పీక్ డిమాండ్ 6441 మెగావాట్ల చేరుకుందని తెలిపారు. 150 కొత్త 33/11 కేవీ అవుట్డోర్ సబ్ స్టేషన్లు, ఇండోర్ సబ్ స్టేషన్లు 5 నిర్మిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ నష్టాల తగ్గింపును లక్ష్యంగా పెట్టుకుని పీఎం కుసుమ్ పథకం కింద డిస్ట్రిబ్యూటెడ్ సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, మధుసూదన్, ప్రభాకర్, మోహన్ రావు పాల్గొన్నారు.రోజుకు 7 నుంచి 12 గంటలే సరఫరా సిబ్బంది కొరతతో ఇబ్బందులు సీజీఆర్ఎఫ్లు ఏర్పాటు చేయాలి బహిరంగ విచారణలో వినియోగదారులు -
జువైనల్ హోంకు ఇద్దరు బాలురు
కాజీపేట: కాజీపేట పోలీస్స్టేషన్ పరిధిలో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన ఇద్దరు మైనర్లను శుక్రవారం న్యాయమూర్తి ఆదేశం మేరకు జువైనల్ హోమ్కు తరలించినట్లు ట్రాఫిక్ సీఐ వెంకన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల నిర్వహించిన ప్రత్యేక తనిఖీ ల్లో ఇద్దరు బాలురు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ద్విచక్ర వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లు చెప్పారు. వీరిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి పిల్లలను జువైనల్ హోమ్కు పంపించినట్లు సీఐ వెల్లడించారు. హసన్పర్తి: మండల కేంద్రంలోని తెలంగాణ బాలిక గురుకుల విద్యాలయంలో ఎలుకల దాడి ఘటన మరువక ముందే మరో సంఘటన చోటుచేసుకుంది. పాఠశాల భవన స్లాబ్పై నాగుపాము బుసలు కొడుతున్నట్లు శబ్దాలు రావడంతో విద్యార్థినులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్క్యాచర్ను పిలిచారు. గంట పాటు యత్నించిన తర్వాత పాము చిక్కింది. సుమారు ఆరడుగుల పొడవు గల పామును నల్లగట్టులో వదిలారు. ఇదిలా ఉండగా నల్లగట్టుగుట్ట వద్ద పాము వదిలిపెట్టడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 8, 9 తేదీల్లో మహిళా రైతు మేళాహన్మకొండ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్లో మెగా మహిళా రైతు మేళా నిర్వహించనున్నట్లు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ రైతు మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్న కీలక సవాళ్లు – వాటి పరిష్కారాలపై శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులతో ముఖాముఖి’ నిర్వహించనున్నట్లు తెలిపారు. అధిక రసాయన ఎరువుల వాడకం వల్ల వచ్చే దుష్ప్రభావాలు, నేల–పర్యావరణ పరిరక్షణపై మహిళా రైతులకు అవగాహన కల్పించడం ఈకార్యక్రమ లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన రైతు మేళాలో పాల్గొనే మహిళా రైతులు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలను సంప్రదించాలని సూచించారు. దీంతో పాటు ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో దామెర మండలంలోని పులకుర్తిలో పెరటి తోటలు, నాటు కోళ్ల పెంపకం, నిత్య జీవితంలో బలవర్ధక ఆహారం ప్రాధాన్యంపై మహిళా రైతులు – శాస్త్రవేత్తల ‘ముఖాముఖి’ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ద్వారా సీతారాముల తలంబ్రాలుహన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్ పార్శిల్ ద్వారా సీతారాముల కల్యాణం త లంబ్రాలు భక్తులకు అందించాలని నిర్ణ యం తీసుకున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజిన ల్ మేనేజర్ విజయభాను తెలిపారు. శుక్రవారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో ఆర్ఎం డి.విజయభాను, డిప్యూటీ ఆర్ఎం భాను కిరణ్ తలంబ్రాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ.. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలు ప్రతీ ఇంటికి డోర్ డెలివరీ చేయనున్నట్లు తెలిపారు. తలంబ్రాలు కావాలని కోరుకునే భక్తులు రూ.151 చెల్లించి బుక్ చేసుకోవాలని సూచించారు. ఎగ్జిక్యూటివ్లు, మోబైల్ ఫోన్, గూగుల్ బ్రౌజర్లో, అడ్రస్ బార్లో టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ అని టైప్ చేసి తలంబ్రాలు బుక్ చేసుకోవాలన్నారు. ఎగ్జిక్యూటివ్స్ ఎస్.రామయ్య 91542 98759, సతీశ్కుమార్ 91542 98761, చైతన్య కుమార్ 91542 98766, ఎం.నవత 91542 98758ను సంప్రదించాలని కోరారు. -
విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
కేయూ క్యాంపస్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో సవాళ్లకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకుంటూ నూతన ఆవిష్కరణలపై దృష్టిసారించాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రం అన్నారు. కేయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం క్యాంపస్లోని ఆడిటోరియంలో నిర్వహించిన రూబిజెస్ట్–26 టెక్నికల్ ఫెస్టివల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భిక్షాలు అధ్యక్షత వహించగా రామచంద్రం మాట్లాడారు. సమస్య పరిష్కార నైపుణ్యం, విమర్శనాత్మక ఆలోచనలే ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలకు మూలమన్నారు. యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో విద్యార్థినులు అవకాశాలు అందిపుచ్చుకోవడం అభినందనీయమన్నారు. నిట్ ప్రొఫెసర్ కిరణ్కుమార్ మాట్లాడుతూ.. ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదువుతూ ఆశాభావంతో ముందుకెళ్తే భవిష్యత్లో ఉన్నతస్థితికి చేరుకోవచ్చన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ భిక్షాలు, స్టూడెంట్స్ అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ అర్చన, కన్వీనర్ డాక్టర్ సురేందర్, మహిళా ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు, స్టూడెంట్ కోఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు, ఇతర కాలేజీల విద్యార్థులు టెక్నికల్ ఈవెంట్స్ను ప్రదర్శించారు. వివిధ బ్రాంచీలకు సంబంధించి కోడ్ రైటింగ్, లాజికల్ ఫజిల్స్, క్లూస్కోడ్, ప్రాజెక్ట్ ఎక్స్పో, వివిధ పోస్టర్ల ప్రజెంటేషన్స్ చేశారు. విద్యార్థినుల సాంస్కృత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నేడు కల్చరల్ఫెస్ట్తో కార్యక్రమం ముగియనుంది. కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం ఆడిటోరియంలో రూబిజెస్ట్–26 టెక్నికల్ ఫెస్టివల్ -
ఉన్నత విద్య స్వయంప్రతిపత్తి కలిగి ఉండాలి
విద్యారణ్యపురి: ఉన్నతవిద్య స్వయంప్రతిపత్తి కలిగి ఉండాలని సామాజికవేత్త, సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘అకడమిక్ ప్రీడమ్ ఇన్స్టిట్యూషనల్ అటానమీ అండ్ డెమొక్రాటిక్ రెసిలియన్స్’ అంశంపై శుక్రవారం జాతీయ సదస్సు నిర్వహించారు. ఫ్యాకల్టీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యారంగంలో శాసీ్త్రయ విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలని కోరారు. పాలకవర్గాలు అనుసరిస్తున్న విధానాలతో అకడమిక్ పరంగా బోధన చేసే పరిస్థితులు అధ్యాపకుల చేతుల్లో లేకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఉన్నత విద్యారంగానికి రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెసర్ హరిజందర్సింగ్ మాట్లాడుతూ డిజిటల్ మాధ్యమాలను సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కె. శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ విద్య, వైద్యం నాణ్యతగా లభిస్తే ప్రైవేట్రంగాలు అభివృద్ధి చెందవని పేర్కొన్నారు. జాతీయ సదస్సు ఈనెల 7న ముగియనుంది. సదస్సుకు కేడీసీ ప్రిన్సిపాల్ ఆచార్య గుర్రం శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. కన్వీనర్ శ్రీనివాస్రెడ్డి, ఫాక్యల్టీ ఫోరం బాధ్యులు మధుసూదన్రెడ్డి, అరుణకుమార్ మాట్లాడారు. సామాజికవేత్త, రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాల్ కేడీసీలో జాతీయ సదస్సు -
మెరిసిన జనగామ డీపీఓ
జనగామ: జనగామ జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న అంగరాజు నవీన్ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 715వ ర్యాంక్ సాధించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లకు చెందిన సైదులు– లింగమ్మ కుమారుడు నవీన్ వరంగల్లోని కేఎంసీలో తన వైద్య విద్యను 2021లో పూర్తి చేశారు. అనంతరం నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్గా పనిచేశారు. సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా కృషి చేసిన ఆయన నాల్గో ప్రయత్నంలో 715వ ర్యాంకు సాధించారు. గతంలో గ్రూప్–1లో ఉత్తమ ర్యాంకు సాధించి ప్రస్తుతం డీపీఓగా విధులు నిర్వర్తిస్తూనే సివిల్స్కు ప్రయత్నించి విజయం సాధించారు. ఇదే పట్టుదలతో ఐఏఎస్ దిశగా ప్రిపరేషన్ కొనసాగిస్తానంటున్నారు.. నవీన్. -
గోల్ సాధించారు..
సివిల్ సర్వీస్.. ఇది పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే ప్రతీ అభ్యర్థి కల. జాతీయ స్థాయిలో సేవ చేసేందుకు దోహదపడే ఐఏఎస్.. ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ వంటి ఉన్నతస్థానాల్లో కొలువుదీరేందుకు దోహదపడేదే సివిల్స్. ఈ కలను నిజం చేసుకునే ప్రయాణంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పలువురు అభ్యర్థులు విజయం సాధించారు. శుక్రవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులతో ‘గోల్’ సాధించారు. సివిల్స్ ర్యాంకులు సాధించి ఉమ్మడి వరంగల్ జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలిపిన అభ్యర్థుల వివరాలతో ప్రత్యేక కథనం. సివిల్స్ ఫలితాల్లో మెరిసిన ఉమ్మడి జిల్లా అభ్యర్థులుఉత్తమ ర్యాంకులతో కల సాకారం చేసుకున్న యువకులు మొన్న గ్రూప్–1, ఇప్పుడు సివిల్స్ ఐనవోలు: ఐఏఎస్ లక్ష్యంగా కష్టపడి చదివిన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన బేతి మల్లేశం– అరుణ దంపతుల కుమారుడు బేతి విక్రమ్ సివిల్స్లో 472వ ర్యాంకు సాధించారు. తెలంగాణ గ్రూప్–1 ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సా ధించి సిద్దిపేట జిల్లా మార్కూర్ మండల ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తూనే సివిల్స్కు ప్రి పేరై 472వ ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలి చారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఐటీ ఉద్యోగాని కి ఎంపికై సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన విక్రమ్ ఐఏ ఎస్ తండ్రి సహకారంతో యూపీపీఎస్సీ పరీ క్షకు హాజరయ్యారు. ఈసందర్భంగా విక్రమ్ తండ్రి మల్లేశం మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతం నుంచి తన కుమారుడు సివిల్స్ ర్యాంకు సాధించడం గర్వంగా ఉందన్నారు.ఐఏఎస్కు తరుణ్ తేజ ఎంపికకాజీపేట/విద్యారణ్యపురి: కాజీపేట 61వ డివిజన్ ప్రశాంత్నగర్ కాలనీ–3కి చెందిన అట్ల తరుణ్ తేజ శుక్రవారం సివిల్స్ ఫలితాల్లో 123వ ర్యాంకు సాధించి ఐఏఎస్కు ఎంపికయ్యారు. తరుణ్ తేజ తల్లి అమరావతి వర్ధన్నపేట మండలం రామ్ధన్తండాలో స్కూల్ అసిస్టెంట్గా, తండ్రి రవీందర్ పంథినిలో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. కాజీపేట సెయింట్ గాబ్రియల్ హైస్కూల్లో టెన్త్ వరకు చదివిన తరుణ్.. ఇంటర్ హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కాలేజీలో చదివారు. జేఈఈ మెయిన్స్లో అఖిల భారతీయ స్థాయిలో 8వ ర్యాంకు సాధించి ఐఐటీ ముంబైలో సీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగంలో చేరారు. అనంతరం ఐఏఎస్ లక్ష్యంగా సివిల్స్ రాశారు. తొలిసారి 770వ ర్యాంకు సాధించి ఐఆర్ఎంఎస్లో ఉద్యోగం సాధించారు. గతేడాది మరోసారి సివిల్స్ పరీక్ష రాసి ప్రస్తుతం 123వ ర్యాంకు సాధించి ఐఏఎస్కు ఎంపికయ్యారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కామారం వీరి స్వగ్రామం. -
ముందస్తు ఫ్లాట్ల బుకింగ్ పేరుతో మోసం
● రూ.81 లక్షలు వసూలు చేసిన నిందితుడి రిమాండ్ వరంగల్ క్రైం: ఫ్లాట్ల ముందస్తు బుకింగ్ పేరుతో డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని రిమాండ్కు తరలించినట్లు హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. హైదరాబాద్ గుండ్లపోచంపల్లిలో 2018లో ఎస్వీబీ వైభవ్ పేరుతో ఏడు అంతస్తుల్లో 164 ఫ్లాట్లు నిర్మిస్తున్నామని సోలిపేట ప్రభాకర్రెడ్డి, కోడూరు లక్ష్మి ఆశ చూపారు. హనుమకొండ ఏనుగులగడ్డకు చెందిన బందెల్లి స్వర్ణ దగ్గర రూ.81 లక్షలు తీసుకొని మోసం చేశారు. సంవత్సరాలు గడుస్తున్నా పనులు మొదలుపెట్టకపోవడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు సోలిపేట ప్రభాకర్రెడ్డిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ముగ్గురికి జైలు
కాజీపేట: కాజీపేట పట్టణంలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 18 మందిని శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్ష, 15 మందికి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఫాతిమా చిన్నప్ప తీర్పునిచ్చారు. ట్రాఫిక్ సీఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో ఇటీవల పోలీస్ సిబ్బంది నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 18 మంది పట్టుపడ్డట్లు తెలిపారు. వీరిలో బత్తుల దిలీప్, శివరాత్రి రాజు, అంబాల రాజులకు జైలు శిక్ష విధించగా హుజూరాబాద్ సబ్ జైలుకు పంపించినట్లు తెలిపారు. -
డీఎస్పీ శిక్షణలోనే సివిల్స్ ర్యాంకు..
ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రానికి చెందిన దైనంపల్లి ప్రవీణ్ గ్రూప్–1 పరీక్షల్లో 105వ ర్యాంక్ సాధించి డీఎస్పీగా హైదరాబాద్లో శిక్షణ పొందుతున్నారు. శుక్రవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 793వ ర్యాంక్ సాధించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ప్రవీణ్ను పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న ఎల్లమ్మ(నానమ్మ) కష్టపడి పెంచారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ చదువులో ముందుకు సాగిన ప్రవీణ్ ఈ విజయాన్ని అందుకోవడంపై స్థానిక ప్రజలు, స్నేహితులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. -
గుండు అఖిలేశ్కు 462 ర్యాంకు
కాజీపేట అర్బన్: కాజీపే ట మండలం న్యూశాయంపేటకు చెందిన గుండు సరస్వతి శివకుమార్ కుమారుడు గుండు అఖిలేశ్ సివిల్స్లో 462వ ర్యాంకు సాధించారు. శివకుమార్ భూపాలపల్లిలో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. టెన్త్ వరకు వరకు హనుమకొండలోని వరంగల్ పబ్లిక్ స్కూల్లో, ఇంటర్ ఓ ప్రైవేట్ కళాశాలలో, ఐఐటీ ఖరగ్పూర్లో ఐదేళ్ల బీటెక్, ఎంటెక్ పూర్తిచేశారు. 2021లో ఐఈఎస్ ఇంజనీరింగ్ సర్వీస్లో ఇండియాలో 6వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఢిల్లీలో సీపీడబ్ల్యూ విభాగంలో సివిల్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అఖిలేశ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సమాజ సేవే లక్ష్యంగా సివిల్స్కు ప్రిపేరై.. 462వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఐపీఎస్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. -
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
హసన్పర్తి: నూతన సాంకేతికతను ఆస్వాదించాలని దర్శకుడు, కిట్స్ కళాశాల పూర్వ విద్యార్థి ప్రశాంత్ ఆర్.విహారి అన్నారు. కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న స్టూడెంట్ కల్చరల్ కార్నివాల్ ‘సంస్కృతి– 26’ వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రశాంత్ విహారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి వేడుకలు దోహదపడుతాయన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న అసంబద్ధమైన అంశాలకు అలవాటు పడొద్దని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కిట్స్ కళాశాల అదనపు కార్యదర్శి సతీష్కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నాయకత్వపు లక్షణాలు పెంపొందించడానికి వేడుకలు ఉపకరిస్తాయని తెలిపారు. విద్యార్థులు సానుకూల దృక్ఫథాన్ని అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్రెడ్డి, కళాశాల యాజమాన్య వర్గ సభ్యుడు వెంకట్రామ్రెడ్డి, ప్రోగ్రాం చైర్పర్సన్ ప్రొఫెసర్ శ్రీధర్, కన్వీనర్ డాక్టర్ పీఎస్ఎస్ మూర్తి, డాక్టర్ శిరీష, డాక్టర్ ప్రభాకరాచారి, విద్యార్థి ఐటీ విభాగం అధ్యక్షురాలు సంహిత, ఉపాధ్యక్షురాలు శ్రీలాస్య విద్యార్థి విభాగం ప్రతినిధులు సాయి సుమంత్, సాయి ధనుష్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా..కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రదీప్ డీజీ బ్యాండ్ ఆకట్టుకుంది. దర్శకుడు ప్రశాంత్ ఆర్.విహారి కిట్స్లో ప్రారంభమైన సంస్కృతి –26 వేడుకలు -
భరత్కు 900 ర్యాంకు
జనగామ: నర్మెట మండలం మచ్చుపహాడ్ గ్రామానికి చెందిన దస్రు నాయక్, అనసూయ దంపతుల పెద్ద కుమారుడు భరత్ సివిల్స్లో 900వ ర్యాంకు సాధించారు. సివిల్స్ –2023లో 135వ ర్యాంకుతో ఐఎఫ్ఎస్ సాధించి ప్రస్తుతం డెహ్రాడూన్లో శిక్షణ పొందుతున్నారు. జిల్లా కేంద్రంలోనే టెన్త్ పూర్తి చేసిన భరత్ ఐఐటీ మద్రాస్లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో బీటెక్ చదివారు. అనంతరం బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తూనే యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యారు. తెలంగాణ గ్రూప్–1 పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించి మున్సిపల్ కమిషనర్గా ఎంపికయ్యే అవకాశం ఉన్నా.. సివిల్స్ లక్ష్యంగా తన ప్రిపరేషన్ కొసాగించారు. భరత్ తండ్రి దస్రూ లింగాలఘనపురం మండలం గుమ్మడవెల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తుండగా, భరత్ తమ్ముడు కాన్పూర్లోని ఆర్టిఫిషియల్ లిమ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్లో ఆఫీసర్ కేడర్లో పనిచేస్తున్నారు. కాగా, ఐఏఎస్ లక్ష్యంగా మరోసారి యూపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతానంటున్నారు.. భరత్. -
సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలి
సాక్షి, మహబూబాబాద్: సంక్షేమ పథకాలు అర్హులకు చేరినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, ఆ దిశగా అధికారులు ముందుకు పోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికపై ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం శుక్రవారం మహబూబాబాద్ కలెక్టరేట్లో జరిగింది. పలు అంశాలపై కలెక్టర్లు ప్రణాళికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనుల్లో నూతన ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని, ఇందుకోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. వేసవి సెలవుల్లో పాఠశాల్లో మరమ్మతులు చేయించాలన్నారు. మండలంలోని అధికారి హాస్టళ్లను దత్తత తీసుకొని వారంలో రెండు రోజులు అక్కడే భోజనం చేసేలా చూడాలని పేర్కొన్నారు. ప్రమాదాలు నివారించేందుకు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే పాఠశాల గుర్తింపు ఇవ్వాలని ఆదేశించారు. బిల్లులు అందించి ఈనెల చివరి వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి పేదలకు అందించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండ్ చేయని లబ్ధిదారుల నుంచి అంగీకారాన్ని తీసుకుని రద్దు చేయాలని తెలిపారు. పాత భవనాలకు అవసరమైన చోట రంగులు వేయించాలని సూచించారు. ఇవేకాకుండా ప్రజల నుంచి వచ్చే వినతులు పరిశీలించాలని, ప్రజలకు ఏం అవసరమో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. డాక్టర్లు అంకితభావంతో పనిచేయాలి.. రైతుల సమస్యల పరిష్కార మార్గాలను తెలిపేందుకు సీనియర్ రైతులను భాగస్వామ్యులను చేసి చెప్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు అంకిత భావంతో పనిచేస్తే రోగుల సంఖ్య పెరుగుతుందని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే బాధ తప్పుతుందని మంత్రి అన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల మధ్య భూసమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో సాదాబైనామాకు అవకాశం వస్తుందని, అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి.. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల స్థితిని తెలుసుకుంనేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించాలని, సమాచారాన్ని ప్రజల ఫోన్లకు చేరవేయాలని సూచించారు. బాలికల వసతి గృహాల్లో ఇన్సినిరేటర్లు ఏర్పాటు చేయాలని, మండల స్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య పరీక్షలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. ఎంపీ బలరాంనా యక్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టే పనులు జాప్యం చేస్తున్నారన్నారు. ములుగు జిల్లా ఉపాధి హామీ పథకంలో వెనుకబడి ఉందని తెలిపారు. ప్రభుత్వ విప్ రాచంద్రునాయక్ మాట్లాడుతూ.. గత కలెక్టర్ హయాంలో ఫైల్స్ పెండింగ్లో ఉండడంతో మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలు నిలిచి పోయాయని వివరించారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యేలు, మురళీనాయక్, నాగరాజు, ప్రకాశ్రెడ్డి, రాజేందర్రెడ్డి, దొంతి మాధవరెడ్డి తమ నియోజకవర్గాల్లో సమస్యలు, 99 రోజుల ప్రణాళికలో చేపట్టే కార్యక్రమాలు వివరించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. కార్యక్రమాలు మొక్కుబడిగా కాకుండా ప్రజల సమస్యలు పరిష్కరించేలా, పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడాలన్నారు. సమావేశానికి హాజరు కాని మహబూబాబాద్ ఆస్పత్రి సూపరింటెండెంట్, ములుగు డీఎఫ్ఓకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో ‘కుడా’ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఐదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు, మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు. వార్డు సభ్యుల నుంచి చైర్మన్లు, సర్పంచ్ల వరకు శిక్షణ ఇవ్వండి బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే పాఠశాలకు గుర్తింపు ప్రారంభించిన ప్రతీ ఇందిరమ్మ ఇల్లుకు బిల్లు అందాలి ఫారెస్ట్, రెవెన్యూ మధ్య ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలి ప్రజాపాలన–పల్లెప్రగతి ఉమ్మడి జిల్లా సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
ఏఐతో ఆర్థిక వ్యవస్థలో మార్పు
హసన్పర్తి: కృత్రిమ మేధస్సు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వేగంగా మార్చేస్తోందని ఎస్ఆర్ వర్సిటీ వీసీ దీపక్ గార్గ్ అన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ అస్ట్రా స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో ‘స్ట్రాటజీ అనలిటిక్స్ టెక్నాలజీ అండ్ కల్చర్’ (ఎస్ఏటీటీ) అంశంపై రెండు రోజుల సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ కోడింగ్ చేయడంతో అనేక పనులను ఏఐ వ్యవస్థలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. మానవ సృజనాత్మకత, నిర్ణయ సామర్థ్యం, భావోద్వేగ అవగాహన వంటి అంశాలు సంస్థల అభివృద్ధికి కీలకమన్నారు. ఆరిఫ్టి టెక్నాలజీ సీహెచ్ఆర్ఓ రాంచందర్ మాట్లాడుతూ సంస్థలు పోటీల్లో నిలవాలంటే వ్యూహం, అనలిటిక్స్, టెక్నాలజీ, సంస్థ సంస్కృతి, సమన్వయం కావాలన్నారు. ప్రస్తుతం హెచ్ఆర్ విభాగం పరిపాలనా పనులకు మాత్రమే పరిమితం కాకుండా సంస్థ మార్పులకు దారితీసే వ్యూహాత్మక విభాగంగా మారుతోందన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్కూల్ ఆఫ్ బిజినెస్ విభాగం డీన్ డాక్టర్ గురునాథం, డాక్టర్ ఎం.రాజ్యలక్ష్మి, డాక్టర్ అర్చనారెడ్డి, రమేశ్బాబు పాల్గొన్నారు. -
కోర్టులో మహిళా దినోత్సవం
వరంగల్ లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ల అధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబ, హనుమకొండ ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి బి.అపర్ణాదేవి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. మహిళలు తాము ఎంచుకున్న రంగంలో ఎదగాలని, హక్కుల సాధించుకోవాలి తప్ప అడుక్కోవద్దని సూచించారు. ఈ సందర్భంగా 20 సంవత్సరాలకుపైగా వృత్తిలో కొనసాగుతున్న పలువురు మహిళా న్యాయవాదులను శాలువాలతో సత్కరించారు. ఏసీబీ కోర్టు జడ్జి క్షమాదేశ్ పాండే, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి.రామలింగం, ఉభయ బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ, మహిళా కార్యదర్శులు నాగేంద్ర, శశిరేఖ తదితరులు పాల్గొన్నారు. -
స్విమ్మింగ్ పూల్ను పునఃప్రారంభించండి
వరంగల్ స్పోర్ట్స్: ఈత సాధన చేసే విద్యార్థులు, యువతకు, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో తీసుకొచ్చి, వచ్చే నెల (ఏప్రిల్) 1వ తేదీన పునఃప్రారంబించాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. హనుమకొండ బాలసముద్రంలోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్లో చేపట్టిన అభివృద్ధి పనులను శుక్రవారం కలెక్టర్ చాహత్బాజ్పాయ్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పనులు వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూల్ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కలెక్టర్ చాహత్ వెంట డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్, ఆర్అండ్బీ ఈఈ సురేశ్బాబు, డీఎస్ఏ కోచ్లు రాయబారపు నవీన్, శ్రీమన్నారాయణ, రాజారపు రమేశ్, టీజీఐఐసీ అధికారులు ఉన్నారు. కలెక్టర్ చాహత్బాజ్పాయ్ స్విమ్మింగ్పూల్ అభివృద్ధి పనుల పరిశీలన -
రాష్ట్రాన్ని దోచుకుంటున్న సీఎం: ఆర్ఎస్పీ
హన్మకొండ: సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ పోరాడుతుంటే 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని తూర్పారబట్టారు. వెలుగుమట్లలో రెండు వేల పేద కుటుంబాల ఇళ్లను కూల్చి రోడ్డుపై పడేశారని మండిపడ్డారు. నాలుగు వేల మంది పోలీసులతో వెలుగుమట్లను గాజాగా మార్చారని ధ్వజమెత్తారు. హైదరాబాద్లో రూ.300 కోట్ల విలువైన భూమిని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుమారుడు కబ్జా చేస్తే గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేస్తే సీఐని బదిలీ చేయించారన్నారు. మేడారంలో నాసిరకం పనులు చేస్తూ దోచుకుంటున్నారని, భూభారతి పేరుతో రూ.వందల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. దీనికి బాధ్యుడిగా మంత్రి పదవికి శ్రీనివాస్రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నాయకులు ఇమ్మడి రాజు, జన్ను జకర్య, గబ్బెట శ్రీను, మంద శ్యాం, జంపన్న, చక్రి, సదాంత్, పూర్ణచందర్, ప్రశాంత్, మనోజ్ కుమార్ పాల్గొన్నారు. -
టీపీసీసీ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఎర్రబెల్లి స్వర్ణ తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈమేరకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ మేయర్గా, కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన స్వర్ణ రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన స్వర్ణకు ఉమ్మడి జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పారు. -
ఆదర్శం.. ఈ ఆచార్యుడు
ఎంజీఎం: కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ వీఎన్ మాధవరావు ఫిబ్రవరిలో 100 శాతం విధులకు హాజరు హాజరై పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సాధారణంగా ప్రొఫెసర్లు సెలవులను ఎక్కువగా వినియోగించుకుంటారు. కానీ, దీనికి భిన్నంగా డాక్టర్ వీఎన్ మాధవరావు ఫిబ్రవరిలో వంద శాతం హాజరు నమోదు చేసుకుని పలువురు వైద్యశాఖ ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకున్నారు. ఎంజీఎం: మహిళలు సవాళ్లను అధిగమించి సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలని సీనియర్ డాక్టర్లు కూరపాటి రాధిక, రమేశ్ పిలుపునిచ్చారు. వరంగల్లోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో శుక్రవారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడుతూ.. మహిళలు సమాజంలో ఎదురయ్యే అడ్డంకులు, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, ప్రతిభతో అన్ని రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహిళలు సంకల్పం, పట్టుదలతో ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించగలరని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ తాటి సునీత, ఫ్యాకల్టీ, బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎంజీఎం: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు నాలుగు దశల్లో వైద్య శిబిరాలు, వైద్య నిర్ధారణ పరీక్షలు, అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తెలిపారు. మొదటి దశలో ఈనెల 6వ తేదీ నుంచి 31 వరకు స్పెషలిస్ట్ వైద్యులచే నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించే శిబిరాల్లో ఎంజీఎం ఆస్పత్రి, ప్రసూతి ఆస్పత్రి నుంచి సీ్త్ర వైద్యులు, పిల్లల వైద్యులు, జనరల్ ఫిజీషియన్, కంటి, ఎముకల వైద్య నిపుణులతోపాటు జనరల్ ఫిజీషియన్లు సేవలందిస్తారని పేర్కొన్నారు. మరింత ఉన్నతమైన సేవల కోసం రెఫర్ చేసిన వారిని ప్రత్యేకంగా నమోదు చేసుకొని ఫాలోఅప్ సేవలు అందిస్తారని చెప్పారు. 14 ఏళ్ల బాలికలకు ఈనెల 8 నుంచి హెచ్పీవీ వ్యాక్సిన్ ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు. హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శుక్రవారం సాయంత్రం సంకటహరచతుర్థి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు గంగు మణికంఠశర్మ, సందీప్శర్మ, ప్రణవ్ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సంకటచతుర్థిని పురస్కరించుకుని సాయంత్రం దేవాలయంలోని కాకతీయుల కాలంనాటి ఉత్తిష్ట గణపతికి అభిషేకాలు నిర్వహించారు. గణపతికి ఇష్టమైన గరికతో అష్టోత్తరశతనామాలు పఠిస్తూ షోఢశోపచార పూజలు చేశారు. మహాహారతి మంత్రపుష్పం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. -
‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ షురూ
వరంగల్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. నగర మేయర్ గుండు సుధారాణి, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, హనుమకొండ కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, ప్రజాప్రతినిధులు, అధికారులు బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో చీపుర్లు చేతబూని చెత్తను తొలగించి పరిసరాలు శుభ్రం చేశారు. శానిటేషన్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. 99 రోజులపాటు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేయర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి–ప్రణాళికను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. వారం రోజుల పాటు పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. అంతేకాకుండా నీటి సరఫరాతోపాటు మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. హనుమకొండ కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. పీహెచ్సీల స్థాయిలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రేటర్ పరిధిలో 90 శాతం ప్రాజెక్టులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని, ఉర్సు, భద్రకాళి, వడ్డేపల్లి బండ్ను ప్రారంభించేలా చూస్తామన్నారు. స్థానిక కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, సీహెచ్ఓ రమేశ్, అకౌంట్స్ ఆఫీసర్ శివ లింగం, ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, బిర్రు శ్రీనివాస్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, హెచ్ఓ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. చీపుర్లతో చెత్తను తొలగించిన మేయర్, కలెక్టర్, ఎమ్మెల్యే భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, అధికారగణం -
కేయూలో అధ్యాపకులేరి?
సాక్షిప్రతినిధి, వరంగల్: కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ)లో ఏళ్ల తరబడి అధ్యాపకుల కొరత తీరట్లేదు. రోజురోజుకూ అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల సమస్య తీవ్రమవుతోంది. యూనివర్సిటీలో 13 ఏళ్లుగా రెగ్యులర్, టీచింగ్ పోస్టుల నియామకాలు జరగలేదు. ఫలితంగా రెగ్యులర్ అధ్యాపకుల కొరత తీవ్రస్థాయికి చేరింది. ఒక్కసారి అధ్యాపకుల గణాంకాలను పరిశీలిస్తే మంజూరైన పోస్టుల్లో కేవలం 18.82 శాతం మందితోనే కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నియామకాల జాప్యం.. విఫలమవుతున్న ప్రయత్నాలు కాకతీయ యూనివర్సిటీలో మంజూరైన మొత్తం రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టులు 409 కాగా అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు కలిపి 77 మందే పనిచేస్తున్నారు. 2013 నుంచి నేటివరకు ఒక్క రెగ్యులర్ నియామకం జరగలేదు. పదేళ్లుగా ఉద్యోగ విరమణలు పెరుగుతున్నా, కొత్త రిక్రూట్మెంట్లు చేపట్టకపోవడంతో ఖాళీలు పేరుకుపోతున్నాయి. 2017లో ఒకసారి అప్పటి పాలకవర్గం హయాంలో 136 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతి పొందే ప్రయత్నం జరిగినప్పటికీ, ఆ ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు. 47 రకాల కోర్సులు, రెండు ఇంజనీరింగ్ కళాశాలలు, కామర్స్, ఫార్మసీ, లా వంటి కీలక విభాగాలు ఈ యూనివర్సిటీలో ఉన్నాయి. ప్రభుత్వ ఉదాసీ నతతో నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం జరగడమే కాకుండా, వర్సిటీ పరిశోధనా రంగం కుంటుపడుతోంది. రెగ్యులర్ సిబ్బంది తగినంత లేకఅధి కంగా అకడమిక్ కన్సల్టెంట్లు (కాంట్రాక్టు అధ్యాపకులు), పార్ట్టైం టీచర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఈసారైనా భర్తీ చేస్తారా? యూనివర్సిటీలు ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాల్లో మొత్తం 2,994 మంజూరైన పోస్టులు ఉండగా, ప్రస్తుతం 763 మంది రెగ్యులర్ అధ్యాపకులు మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన వారిలో 1,174 మంది కాంట్రాక్టు పద్ధతిలో, 544 మంది పార్ట్టైం పద్ధతిలో పనిచేస్తున్నారు. కాగా, సుమారు 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యామండలి ద్వారా నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం. త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ నియామకాల కోసం ప్రతిపాదనలు స్వీకరించినట్లు చెబుతుండగా.. ఇందుకు సంబంధించిన ప్రకటన ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీలో 250 పోస్టులు, కాకతీయ యూనివర్సిటీలో 145 పోస్టులను భర్తీ చేయనున్నారన్న చర్చ జరుగుతోంది. వీటితోపాటు పాలమూరు, శాతవాహన వంటి ఇతర విశ్వవిద్యాలయాల్లో కూడా కొన్ని పోస్టులను భర్తీ చేస్తారంటున్నారు. దీంతో ఈసారైనా కేయూలో ఉన్న ఖాళీలు భర్తీ అవుతాయా? అనే చర్చ మొదలైంది. కీలక విభాగాల్లో పోస్టులు ఖాళీ.. 2017 నుంచి ఇదే పరిస్థితిప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత తీరేదెప్పుడు పది విభాగాల్లో ఒక్క ప్రొఫెసర్ కూడా లేని పరిస్థితి అకడమిక్ కన్సల్టెంట్లపైనే ఆధారం.. పరిశోధనలపై తీవ్ర ప్రభావం తాజాగా 13 వర్సిటీలకు 500 పోస్టుల ప్రకటన ఈసారైనా ఖాళీలు భర్తీ అయ్యేనా? -
సికింద్రాబాద్-హిస్సార్ ఎక్స్ప్రెస్ రైలుకు తప్పిన పెను ప్రమాదం
సాక్షి,హన్మకొండ: సికింద్రాబాద్,హిస్సార్ ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు ఇంజన్ వీల్ విరిగిపోవడంతో ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలోని మడిపల్లి గేట్ వద్ద సుమారు నాలుగు గంటల పాటు నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు మరమత్తులు చేపట్టిన అనంతరం వేరే ఇంజన్తో సహా రైలును ఉప్పల్ రైల్వే స్టేషన్కు తరలించారు.ఈ ఘటనలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న సమస్యను పరిష్కరించడానికి ఇంత జాప్యం చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నీళ్లు ఇలా.. తాగేదెలా?
కాశిబుగ్గ: గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ పరిధిలోని కాశిబుగ్గలో మూడు రోజుల నుంచి నల్లా నీళ్లు పసుపురంగులో సరఫరా అవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసన కూడా వస్తున్నాయని, వీటిని ఎలా తాగాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైపులైన్ అస్తవ్యస్తంగా మారి తాగునీరు శుభ్రంగా లేకపోవడంతో తాగాలంటే భయమవుతోందని చెబుతున్నారు. అసలే వేసవికాలం.. ఇలాంటి నీళ్లు తాగి అనారోగ్యాల బారిన పడితే ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి రంగునీళ్లు సరఫరా జరిగిన సమయంలో మేయర్, అధికారులు సంబంధిత ఫిల్టర్ బెడ్ను సందర్శించి పరిశీలించారు. తర్వాత శుభ్రమైన నీటిని అందించారు. ప్రస్తుతం వారు స్పందించి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు నిర్వహించనున్న 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల అభివృద్ధి అధికారులతో నిర్వహించిన సమీక్షలో కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. శాఖల వారీగా అమలు చేయాల్సిన అంశాలను సమీక్షించి స్పష్టమైన సూచనలిచ్చారు. అదనపు కలెక్టర్ రవి, డీఆర్ఓ సత్యపాల్రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. పన్ను చెల్లింపులకు రాయితీ ఉండదు.. ఆస్తి పన్ను, నీటి పన్ను చెల్లింపులపై ఎలాంటి రాయితీ లేదా వడ్డీ మాఫీ అవకాశం లేదని హనుమకొండ కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ స్పష్టం చేశారు. ప్రజలు తక్షణమే పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు. నగర పాలక సంస్థ అధికారులతో పన్నుల వసూళ్లపై సమీక్షించారు. ఈసందర్భంగా పనుల చెల్లింపులో రాయితీలు ఉంటాయనే అపోహలు ప్రచారంలో ఉన్నాయని అలాంటి అవకాశం లేదని వివరించారు. రూ.34 కోట్ల పన్ను బకాయిల వసూళ్లకు ప్రయత్నించాలని ఆదేశించారు. సోలార్ విద్యుత్ వినియోగంపై.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని గృహ విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకో వాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. కలెక్టరేట్లో పథకం అమలుపై పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. వరంగల్ జిల్లాలో.. న్యూశాయంపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలుకు పటిష్ట కార్యాచరణ రూపొందించి జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపు హాల్లో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు ఐదు దశల్లో 99 రోజులపాటు వివిధ శాఖలకు సంబంధించిన 10 ముఖ్య అంశాలపై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 6న ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయిలో కార్యాచరణపై మంత్రుల సమీక్ష సమావేశం ఉంటుందని వెల్లడించారు. సంబంధిత అధికారులు పూర్తి వివరాలతో హాజరు కావాలని ఆదేశించారు. ప్రతీరోజు నిర్వహించిన కార్యక్రమాల వివరాలను రోజువారీ ప్రగతి నివేదిక రూపంలో సమర్పించాలన్నారు. ప్రతిస్థాయిలో నోడల్ అధికారులను నియమించి రోజువారీ పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్లు బి.సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఉప కమిషనర్ ప్రసన్నరాణి, నర్సంపేట, వరంగల్ ఆర్డీఓలు ఉమారాణి, సుమ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026
7 కేంద్రాల్లో నిర్వహణ.. ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సూళ్లూరుపేట (ఏపీ), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), షిల్లాంగ్(మేఘాలయ). ఎవరు అర్హులంటే.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. స్పేస్, సైన్స్ క్లబ్లో ఉంటే 5 శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో ఉంటే 5 శాతం, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి 20 శాతం ప్రాధాన్యం ఇస్తారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక అవకాశంఈ నెల 31 వరకు గడువు.. విద్యార్థులు మార్చి 31వ తేదీలోగా www.isro.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల వడపోత అనంతరం ఏప్రిల్ 13న ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు. మే 11 నుంచి 22 వరకు యువికా–26 కార్యక్రమం నిర్వహిస్తారు. మే 22న ముగింపు కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) నిర్వహిస్తోంది. ఈ ఏడాది చేపట్టనున్న కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను ఆహ్వానిస్తోంది. ఆ సంగతులేంటో తెలుసుకుందాం రండి. – మహబూబాబాద్ అర్బన్అంతరిక్ష పరిశోధనల్లో ఇటీవల ఇస్రో వంద ప్రయోగాలు పూర్తి చేసుకుంది. అగ్రదేశాలకు దీటుగా భారత్ పరిశోధనలు చేపడుతోంది. ఈవిజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇస్రో ఈ కార్యక్రమం చేపడుతోంది. అన్నీ ఉచితంగానే..ఇస్రో నిర్వహించే యువికా కార్యక్రమానికి ఎంపికై న విద్యార్థులకు ప్రయాణం, భోజన, వసతి సౌకర్యాలను ఇస్రో ఉచితంగా అందజేయనుంది. ఎంపికై న విద్యార్థులను మే నెలలో 12 రోజులపాటు ఇస్రోకు చెందిన స్పేస్ సెంటర్లకు తీసుకెళ్తారు. అక్కడ సైన్స్కు సంబంధించిన వింతలు, విశేషాలు, సప్త గ్రహ కూటమి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న మొత్తం విద్యార్థులు 48,941 ఉన్నారు.విద్యార్థులు వినియోగించుకోవాలి.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు భావిశాస్త్రవేత్తలుగా ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏడు రోజులు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి. – వి.రాజేశ్వర్. డీఈఓ, మహబూబాబాద్●జిల్లాల వారీగా 9వ తరగతి విద్యార్థులు శాస్త్రవేత్తలతో మాట్లాడే చాన్స్ ఈ నెలాఖరు వరకు దరఖాస్తు గడువు ఎంపికైతే ప్రత్యేక శిక్షణ -
విద్యుత్ శాఖలో లైన్మెన్లే వెన్నెముక
టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ ఎస్ఈ మధుసూదన్ రావు హన్మకొండ: విద్యుత్ శాఖకు జూనియర్ లైన్మెన్లు, లైన్మెన్లే వెన్నెముక అని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) పి.మధుసూదన్రావు అన్నారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్లో లైన్మెన్ దివస్ను నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో విద్యుత్ ఉద్యోగ అమరుల స్తూపం వద్ద ఎస్ఈ పి.మధుసూదన్రావు, డీఈలు ఎ.విజేందర్రెడ్డి, జి.సాంబరెడ్డి, మల్లికార్జున్, అధికారులు, ఉద్యోగులు పుష్పాంజలి ఘటించారు. మౌనం పాటించి నివాళి అర్పించారు. కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్లు ఎ.విజేందర్ రెడ్డి, జి.సాంబారెడ్డి, పి.మల్లికార్జున్, కె.నవీన్ కుమార్, సహాయ డివిజనల్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్లు, అకౌంట్స్ ఆఫీసర్లు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
నరహరి.. లొంగిపోయి ఇంటికిరా..
కాజీపేట: కాజీపేట మండలం సోమిడి గ్రామ వాస్తవ్యుడు, మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ లొంగిపోవాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షిస్తున్నారు. రెండు పదుల వయస్సులో పోరుబాట పట్టి దాదాపు 45 ఏళ్లుగా అజ్ఞాతంలో కొనసాగుతున్న ఆయన రాక కోసం నలుగురు అన్నదమ్ములతోపాటు కుటుంబ సభ్యులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని ఈస్ట్ రీజినల్ బ్యూరో వింగ్లో (టెక్నికల్) బాధ్యుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం దేశంలో కగార్ పేరుతో మావోయిస్టులను ఏరివేస్తుండడంతో అనేక మంది కీలక నాయకులు లొంగిపోతున్నారు. మరికొంత మందిని పారా మిలటరీ బలగాలు ఎన్కౌంటర్ చేస్తూ ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణంలోని సోమిడి గ్రామానికి చెందిన నరహరిపై నేడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. నరహరి ప్రభుత్వానికి లొంగిపోయి క్షేమంగా ఇంటికి రావాలని నలుగురు తోబుట్టువులు, స్నేహితులు వేడుకుంటున్నారు. డిగ్రీ చదువుతూ.. ఉద్యమం వైపు అడుగులు సోమిడి గ్రామానికి చెందిన పసునూరి నర్సమ్మ–సోమనారాయణకు ఐదుగురు కొడుకులు. వీరిలో రెండో కుమారుడు నరహరి 1980 సంవత్సరంలో ఎల్బీ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా నక్సల్స్ విధానాలకు ఆకర్షితుడయ్యాడు. అప్పటి రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, క్రాంతిరణదేవ్ అలియాస్ బక్కన్నతో ఏర్పడిన స్నేహం ఆయనను ఉద్యమం వైపు అడుగులు వేయించింది. గ్రామంలో ఉంటూ కూలీల రేట్లు పెంచడంతోపాటు భూస్వాములు, రౌడీలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అప్పటి ఆర్ఈసీలో ఉన్న ఉద్యమ నాయకుల మాటలతో ప్రభావితమైన నరహరి పోలీసుల నిర్బంధం పెరగడంతో అడవి బాట పట్టాడు. 1981లో అడవిలోకి వెళ్లిన నరహరి.. తల్లిదండ్రులతో పాటు ఎవరూ చనిపోయిన ఇంటి ముఖం చూడలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నరహరి ప్రభుత్వానికి లొంగిపోయి సోమిడికి చేరుకోవాలని నలుగురు సోదరులు కోరుతున్నారు. వేడుకుంటున్న సోదరులు, కుటుంబ సభ్యులు 45 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన సోమిడి వాసి జార్ఖండ్ టెక్నికల్ వింగ్లో బాధ్యతలు -
దశాబ్దకాలం లేట్!
3వలైన్..సాక్షిప్రతినిధి, వరంగల్: ‘మీరు ఎక్కాల్సిన రైలు.. జీవితకాలం లేట్ అన్నట్లు.. కాజీపేట–విజయవాడ రైల్వే మూడోలైన్ పనులు దశాబ్దకాలమైనా పూర్తికావడం లేదు. దక్షిణమధ్య రైల్వే డివిజన్ పరిధిలోని ఈ పనులు ప్రారంభమై సంవత్సరాలు గడిచినా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. సుమారు 219.64 కిలోమీటర్లు నిర్మాణ పనులకు 2012–13లో ప్రతిపాదనలు చేశారు. 2016–17లో అధికారికంగా ఆమోదించి ప్రారంభించారు. హైదరాబాద్–చైన్నె, ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో అత్యంత కీలకమైనదిగా ఈ ప్రాజెక్టును తీసుకున్నారు. అయితే, కాజీపేట–విజయవాడ మూడోలైన్ నిర్మాణ పనులు అప్పటి నుంచి నెమ్మదిగా సాగుతున్నాయి. ఖమ్మం–డోర్నకల్ మధ్య 44.624 కిలోమీటర్ల నిర్మాణం కోసం భూసేకరణ సమస్యగా మారింది. ఇటీవల రైల్వే బడ్జెట్ సందర్భంగా కూడా ఈ మూడోలైన్పై చర్చ జరిగింది. సుమారు రూ.2,063 కోట్లతో జరుగుతున్న ఈ పనులను వీలైనంత తొందరగా పూర్తి చేస్తే గూడ్స్, ప్యాసింజర్ రైళ్ల ట్రాఫిక్ సమస్య తగ్గి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు మోక్షం కలగనుంది. ముందుకుసాగని 28 హెక్టార్ల భూసేకరణ.. కాజీపేట–విజయవాడ రైల్వే మూడో లైన్కు 2017 లో శంకుస్థాపన జరిగింది. ఇందుకోసం తెలంగాణలో 145, ఆంధ్రప్రదేశ్లో 173 కలిపి మొత్తం 318 హెక్టార్లకు పనులు జరిగిన కొద్దీ 290 హెక్టార్లు సేకరించారు. సుమారు 28 హెక్టార్ల భూసేకరణ ముందుకు సాగని కారణంగా పనులు మందగించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, పనుల ప్రారంభసమయంలో రూ.1,952 కోట్లుండగా.. రోజులు గడిచిన కొద్ది రూ.2,063 కోట్లకు చేరింది. 2023–24 నుంచే వేగం ఈ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగింది. ఈ మూడేళ్లలోనే రూ.1,070 కోట్ల వరకు ఇచ్చారు. 2023–24లో రూ.350 కోట్లు, 2024–25లో రూ.420 కోట్లు, 2025–26లో (చివరి పనుల కోసం) రూ.300 కోట్లు విడుదల చేశారు. రైల్వే అధికారులు ఈ ప్రాజెక్టు 95 శాతం వరకు పూర్తయ్యిందని చెబుతున్నా.. పెండింగ్లో ఉన్న 5 శాతం పనులతో కాజీపేట–విజయవాడ మూడో లైన్కు మోక్షం కలగడం లేదు. 44.624 కిలోమీటర్ల నిర్మాణమే కీలకం.. వాస్తవానికి హైదరాబాద్–చైన్నె, ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో ట్రాఫిక్ను తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక ప్రాజెక్టును తీసుకుంది. ఇందులో బల్లార్షా–కాజీపేట, కాజీపేట–విజయవాడ మధ్యన మూడో లైన్కు శ్రీకారం చుట్టింది. బల్లార్షా–కాజీపేట మధ్యన 202 కిలోమీటర్లకు 183.285 కిమీ పూర్తయి 18.715 కిమీ నిర్మాణం ప్రోగ్రెస్లో ఉన్నట్లు రైల్వే నివేదికలు పేర్కొంటున్నాయి. అదేవిధంగా కాజీపేట–విజయవాడ మధ్యన 219.64 కిమీకు 175.016 కిమీ పూర్తికాగా 44.624 కిమీ మేర బ్యాలెన్స్ ఉంది. ఖమ్మం–డోర్నకల్ మధ్య 19.59 కిమీ, డోర్నకల్–మహబూబాబాద్ మధ్య 25.034 కిమీ మేర రైల్వేలైన్ నిర్మాణం పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే 28 హెక్టార్ల భూసేకరణ పెండింగ్లో ఉండడంతో పనులు నెమ్మదించాయని, ఇటీవలే భూసేకరణ పూర్తయి పనులు ప్రారంభించామని, త్వరలోనే పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు. పదేళ్లయినా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఢిల్లీ, చైన్నె మార్గాల్లో వెళ్లడానికి.. ఆ ప్రాంతాలకు వస్తు రవాణా చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో రైళ్ల రద్దీ తగ్గి వేగం పెరగనుంది. ప్రస్తుతం కాజీపేట–విజయవాడ మార్గం రైల్వేకు అధిక ఆదాయాన్ని సమకూర్చే మార్గాల్లో ఒకటి. రెండు ప్రధాన రాష్ట్రా(తెలంగాణ, ఏపీ)లను కలిపే ఈ మార్గంలో గూడ్స్ రైళ్ల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఉన్న రెండు లైన్లు ఈ రద్దీని తట్టుకోలేక తరచూ నిండిపోతున్నాయి. దీని ఫలితంగా ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను నిలిపివేసి ఆదాయం సమకూర్చే గూడ్స్ రైళ్లకు గ్రీన్సిగ్నల్ ఇవ్వాల్సి వస్తోంది. ఈ కారణంతో ప్రయాణికుల రైళ్లు ఆలస్యమవుతున్నాయి. మూడో లైన్ అందుబాటులోకి వస్తే రద్దీ నియంత్రించడంలో సాయపడుతుంది. గూడ్స్, ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు వేర్వేరు మార్గాల్లో ప్రయాణించే వీలు కలుగుతుంది. ఈ మార్గంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య 219.64 కిలోమీటర్లు.. రూ.1,952.68 కోట్ల నిధులు 2016–17లో రూ.3,103.99 కోట్లకు అంచనాలు 44.624 కిలోమీటర్లు అసంపూర్తిగా పనులు భూసేకరణ, నిధుల కొరతే అసలు సమస్య -
ఆకాశంలో అద్భుతం
కనువిందు చేసిన రెడ్ మూన్ ● 3.27 గంటల పాటు చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమైన గ్రహణం సాయంత్రం 6.47 గంటలకు వీడింది. మొత్తం 3.27 గంటల సేపు ఎరుపు వర్ణంలో (రెడ్ మూన్) చందమామ పలు విధాలుగా కనువిందు చేశాడు. వంద సంవత్సరాల తర్వాత రంగుల పండుగ హోలీ రోజున వచ్చిన చంద్రగ్రహణాన్ని ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. – సాక్షి స్టాఫ్ఫొటోగ్రాఫర్, హన్మకొండ 6:56 -
మది నిండుగా..
బుధవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2026రంగుల పండుగ..డిష్యూం డిష్యూం నిట్ వరంగల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత జూనియర్స్, సీనియర్స్ విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. మంగళవారం గ్రేటర్ వరంగల్ పరిధిలో జరిగిన వేడుకల్లో చిన్నారులు, యువతీయువకులు పెద్దలు, వృద్ధులు ఉత్సాహంగా రంగుల వేడుకల్లో మునిగితేలారు. రంగులు పూసుకుని నృత్యాలు చేశారు. నగరంలో పలుచోట్ల హోలీ ఈవెంట్లు నిర్వహించారు. డీజే పాటలతో హోరెత్తించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బ్యాండ్ వాయిద్యాల మధ్య పోలీస్ అధికారులు, సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్సింగ్ను అధికారులు, సిబ్బంది, మహిళలు, చిన్నారులు, రంగులతో ముంచెత్తారు. – సాక్షి నెట్వర్క్ -
నిట్తో ఎన్ఐజీస్టీ ఎంఓయూ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్తో ఎన్ఐజీఐఎస్టీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ) సర్వే ఆఫ్ ఇండియా మంగళవారం పరస్పర ఒప్పందం కుదుర్చుకుంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, ఎన్ఐజీఎస్టీ డైరెక్టర్, సీనియర్ అధికారి బీసీ ఫరీదా పరస్పరం ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు. కార్యక్రమంలో ఎన్ఐజీఎస్టీ ప్రతినిధులు నిత్యానందం, వెంకయ్యచౌదరి, నిట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. హసన్పర్తి: చంద్రగ్రహణంతో ఎర్రగట్టు వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని రద్దు చేశారు. జాతరను పురస్కరించుకుని మంగళవారం ఉదయం హసన్పర్తి–భీమారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆతర్వాత స్వామి వారిని రథంపై ఎర్రగట్టుగుట్టకు చేర్చారు. మధ్యాహ్నం 12 గంటలలోపే స్వామి వారిని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆతర్వాత ఆయాన్ని ద్వారబంధనం చేశారు. చంద్రగ్రహణంతో ఈసారి స్వామివారి శోభాయాత్ర నిరాడంబరంగా సాగింది. బుధవారం మహాసంప్రోక్షణ అనంతరం దర్శనాలు ప్రా రంభమవుతాయని ఉత్సవ కమిటీ తెలిపింది. -
కాక్లియర్ ఇంప్లాంట్తో అంగవైకల్యం దూరం
డాక్టర్ శ్రమలత ఎంజీఎం : కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స ద్వారా పిల్లల్లో పుట్టుకతో వచ్చిన చెవుడు, మూగ అంగవైకల్యాన్ని పూర్తిగా నయం చేయొచ్చని ఎంజీఎం ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ శ్రమలత తెలిపారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా ఎంజీఎం హాస్పిటల్లోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంపత్రావు, ఆడియాలజిస్ట్ డాక్టర్ రతన్సింగ్, డాక్టర్ జెన్నీఫర్, డాక్టర్ ప్రత్యూష, సీనియర్ రెసిడెంట్స్, పీజీ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యారంగానికి నిధులు కేటాయించాలి
డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డివిద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని డెమోట్రిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి డిమాండ్ చేశారు. హనుమకొండలో ఆ సంఘం జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యారంగంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణను నియంత్రిస్తూనే ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర విద్యావిధానం –2026 పేరుతో ఇటీవల విడుదల చేసిన నివేదికపై ఉపాధ్యాయ సంఘాలు, నిపుణులతో చర్చించి విద్యారంగం బలోపేతానికి చర్యలు చేపట్టాలన్నారు. అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకుడు గంగాధర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులను తరగతిగదికి దూరం చేసే కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ విద్యారంగం బలహీన పడుతుందన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదలచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉప్పలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా కమిటీ బాధ్యులు అంజనీదేవి, సారంగపాణి, అల్లం మల్లయ్య, కిషన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సంజీవరెడ్డి, సుభాషిణి, హర్షవర్ధన్రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
వన్యప్రాణులను కాపాడుకోవాలి
హనుమకొండ డీఎఫ్ఓ లావణ్య న్యూశాయంపేట: వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని హనుమకొండ డీఎఫ్ఓ లావణ్య అన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సుబేదారి ఫారెస్ట్ కాంప్లెక్స్ నుంచి హంటర్రోడ్డులోని కాకతీయ జూ పార్కు వరకు నిర్వహించిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. వన్యప్రాణులతోపాటు ఔషధ, సుగంధ మొక్కల ప్రాముఖ్యతను వివరిస్తూ ప్లే కార్డులు ప్రదర్శించారు. అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి, వెటర్నరీ డాక్టర్ కార్తికేయ, సెక్షన్ ఆఫీసర్లు సూరిదాస్ సింగ్, శివకుమార్, బీట్ ఆఫీసర్లు శారద, సురేశ్, శ్వేత, జూపార్కు సిబ్బంది పాల్గొన్నారు. -
రైల్వేశాఖలో సీబీఐ కేసు కలకలం!
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ పరిధిలోని రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల్లో అక్రమాలకు పాల్పడిన రైల్వే అధికారులు, కాంట్రాక్ట్ సంస్థపై సీబీఐ కేసు కలకలం సృష్టించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముగ్గురు రైల్వే ఇంజనీర్లు, ఇద్దరు ట్రాక్ నిర్వాహకులు, ఒక కాంట్రాక్ట్ సంస్థపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సీబీఐ అధికారులు కాజీపేట జంక్షన్ సబ్ డివిజన్ పరిధిలోని రైల్వే కార్యాలయాలకు వెళ్లి విచారణ చేసినట్లు జోరుగా ప్రచారం జరిగింది. సీబీఐ అధికారులు విచారణకు వచ్చిన విషయాన్ని రైల్వే పోలీసులను అడుగగా అలాంటిది ఏమి లేదని చెప్పుకొచ్చారు. సీబీఐ కేసు నమోదు అవినీతి రైల్వే ఇంజనీరింగ్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కాజీపేట రైల్వే సబ్డివిజన్ పరిధిలో కొంతమంది రైల్వే అధికారుల పనితీరు, విధి నిర్వహణ, కార్మికులను వేధిస్తున్న వారు, రైల్వే ను మోసం చేస్తూ కంభకోణాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టినట్లు రైల్వే అధికారుల ద్వారా తెలిసింది. ఇప్పుడు కాజీపేట రైల్వేట్రాక్ నిర్వహణ విధుల్లో అక్రమాలకు పాల్పడిన ఇంజనీర్లు, సిబ్బందిపై సీబీఐ కేసు నమోదు కావడం, గతంలో కాజీపేట రైల్వేలో నమోదైన రెండు సీబీఐ కేసులు దక్షిణ మధ్య రైల్వేలో సంచలనం రేపుతున్నాయి. ఐదుగురు ఉద్యోగులు, కాంట్రాక్టు సంస్థపై నమోదు ట్రాక్ నిర్వహణలో అక్రమాలే కారణం సోషల్ మీడియాలో వైరల్ -
వయోవృద్ధుల చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలో తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంక్షేమ చట్టం–2007ను పకడ్బందీగా అమలు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ని జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం కోరింది. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ను సోమవారం వారు కలెక్టరేట్లో కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. గతేడాది ప్రారంభించిన వృద్ధుల డే–కేర్ సెంటర్ను సందర్శించాలని కలెక్టర్ను కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి తేరాల యుగంధర్, తదూరి లక్ష్మీనారాయణ, మార్క రవీందర్గౌడ్, ఎస్.రమేశ్, శీలం వెంకటేశ్వర్లు, గుంటి సీతారాములు, కొండబత్తిని రాజేందర్, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర్ పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్ : చంద్రగ్రహణం ఉన్నందున వేయిస్తంభాల ఆలయాన్ని మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేస్తున్నట్లు ఆలయ ఈఓ ధరణి కోట అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి బుధవారం ఉదయం సంప్రోక్షణలు పూజలు నిర్వహించి ఆలయాన్ని భక్తుల దర్శనార్థం అనుమతించనున్నట్లు తెలిపారు. కేయూ క్యాంపస్: హర్యానాలోని కురుక్షేత్ర యూనివర్సిటీలో ఈనెల 2 నుంచి 7వ తేదీ వరకు కొనసాగనున్న ఆలిండియా ఇంటర్ వర్సిటీ బాక్సింగ్ టోర్నమెంట్కు కేయూ పురుషుల జట్టు పాల్గొననున్నట్లు సోమవారం వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య తెలిపారు. ఈజట్టులో బి.నిఖిల్గౌడ్, కె.శ్రీశాంత్గౌడ్, ఎం.సంజయ్, పినవదీప్, వి.వంశీకృష్ణ, విన్పాల్, జి.అభిషేక్, జి.చంద్రశేఖర్ ఉన్నట్లు వెంకయ్య తెలిపారు. ఈజట్టుకు హనుమకొండ ప్రభుత్వ బీఈడీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎన్.రమేశ్ కోచ్కమ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నట్లు స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య తెలిపారు. హన్మకొండ అర్బన్: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల స్థాపించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మార్చి 29న ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నారు. ఈసందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఇ.వి. శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో నాయకులు సోమవారం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు. కాగా, దేశ విదేశాల్లోని పూర్వ విద్యార్థులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. -
ఈఎల్ఎస్ఆర్ పరిసరాలు శుభ్రంగా ఉండాలి
● మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: ఈఎల్ఎస్ఆర్ (ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్) ట్యాంక్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు నీటి సరఫరా సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని సమర్థవంతంగా నిర్వహించేందుకు మేయర్ సూచనలిచ్చారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగర పరిధి 11వ డివిజన్లోని ఐ హాస్పిటల్ వాటర్ ట్యాంక్, కేఎంసీ హాస్పిటల్లో ఈఎల్ఎస్ఆర్, 24వ డివిజన్ మట్టెవాడ ప్రాంతంలోని ఈ ఎల్ఎస్ఆర్తో పాటు 28వ డివిజన్లోని గాయత్రి ఆలయం సమీపంలోని ఈఎల్ఎస్ఆర్లకు చెందిన వర్క్ ఇన్స్పెక్టర్లు లైన్మెన్లు, ఏఈలు, డీఈలు, ఈఈలతో సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలిచ్చారు. సమావేశంలో ఈఈలు రవికుమార్, సంతోశ్బాబు, డీఈలు రాజ్కుమార్, సతీశ్, రాగి శ్రీకాంత్, మొజామిల్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ వ్యవస్థ రక్షణకు చర్యలు
హన్మకొండ: విద్యుత్ వ్యవస్థను రక్షించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ పకడ్బందీ చర్యలు చేపట్టింది. వర్షాకాలం, అకాల వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులు రావడం సహజం. వీటితో విద్యుత్ సబ్స్టేషన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు, విద్యుత్ లైన్లకు ముప్పు వాటిల్లుతోంది. తద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలో విద్యుత్ వ్యవస్థలను రక్షించడంతోపాటు వినియోగదారులకు అంతరాయాలు లేకుండా అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతీ సబ్స్టేషన్లో నిర్మాణ సమయంలోనే లైట్నింగ్ అరెస్టర్లు (పిడుగుల నిరోధకాలు) ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా పొడవాటి లైన్లను గుర్తించి ఈ లైన్లలో స్తంభాలకు లైట్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు, విద్యుత్ లైన్లకు రక్షణ ఉంటుంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో పొడవాటి విద్యుత్ లైన్లలో మొత్తం 2,337 లైట్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేశారు. హనుమకొండ సర్కిల్లో 95, వరంగల్ సర్కిల్లో 25, జనగామలో 107, భూపాలపల్లి సర్కిల్లో 52, మహబూబాబాద్ సర్కిల్లో 38 అరెస్టర్లు ఏర్పాటు చేశారు. ఎలా పనిచేస్తుందంటే.. లైట్నింగ్ అరెస్టర్ అనేది మెరుపు, పిడుగు వల్ల ఉత్పన్నమయ్యే అధిక ఓల్టేజీని భూమిలోకి సురక్షితంగా మళ్లించే రక్షణ పరికరం. దీని ద్వారా ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, స్విచ్గేర్, ఇతర విద్యుత్ పరికరాలతో పాటు యంత్రాంగం సురక్షితంగా ఉండడం ద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గుతాయి. దీంతోపాటు పరికరాలు సురక్షితంగా ఉండడంతో నష్టం తగ్గుతుంది. ఉరుములు, మెరుపులనుంచి రక్షణకు నిరోధకాల బిగింపు టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 2,337 లైట్నింగ్ అరెస్టర్ల ఏర్పాటునాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాం. విద్యుత్ వ్యవస్థ రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్రమంలో సుదూరంగా ఉండే విద్యుత్లైన్లలో లైట్నింగ్ అరెస్టర్లు చేశాం. వినియోగదారులు కూడా వర్షాకాలంలో ఇంటి విద్యుత్ పరికరాలకు సర్జ్ ప్రొటెక్టర్లు వినియోగించాలి. మెరుపు సమయంలో విద్యుత్ పరికరాలను తాకొద్దు. – వరుణ్ రెడ్డి, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ -
నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యం
● పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ అర్బన్/కాజీపేట రూరల్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని 48, 49వ డివిజన్ల పరిధిలో రూ.9.37 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు హనుమకొండ కలెక్టర్ చాహత్ జాబ్పాయ్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. రూ.7.50 కోట్ల వ్యయంతో నిట్ నుంచి లోటస్ కాలనీ వరకు ఆర్అండ్బీ రహదారి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈరహదారికి సెంటర్ లైటింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. రూ.50 లక్షలతో అంతర్గత రోడ్లు, రూ.1.37 కోట్లతో లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో కాజీపేట తహసీల్దార్ సీహెచ్.రాజు, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రుపాషా, కార్పొరేటర్లు మానస రాంప్రసాద్, సర్తాజ్బేగం, మాజీ కార్పొరేటర్ అబుబక్కర్, సీనియర్ నాయకులు అమర్, కట్ట రఘుపాల్రెడ్డి, మట్టాడ కుమార్, డివిజన్ అధ్యక్షుడు సింగారపు రవిప్రసాద్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 02హెచ్ఎంకెడి180: -
ఈఎస్ఐ.. ఇక్కట్లు
కాశిబుగ్గ: వరంగల్ ఈఎస్ఐ ఆస్పత్రిలో పేరుకు నోడల్ సెంటర్ ఉన్నప్పటికీ సిబ్బంది లేక అరకొర సేవలతో కాలం వెళ్లదీస్తున్నారు. రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన నోడల్ సెంటర్ నుంచి ఈఎస్ఐ పరిధిలో 16 డిస్పెన్సరీలకు మందులు సరఫరా చేస్తున్నారు. రీజియన్లోని ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిస్పెన్సరీలకు పంపిణీ చేయాలి. సాధారణంగా నోడల్ సెంటర్కు ఒక ఫార్మాసిస్ట్, ఒక క్లర్క్, ఐదుగురు నాల్గవ తరగతి సిబ్బంది, ప్రత్యేకంగా వ్యాన్ సదుపాయం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో ఏ ఒక్కటీ అమలు కావడం లేదు. దీంతో ఈఎస్ఐ ఆస్పత్రిలో సేవలు అందని ద్రాక్షలా మారాయి. రూ.4.8 కోట్లతో మందుల కొనుగోలు.. రెండేళ్ల క్రితం నోడల్ సెంటర్ మంజూరు కావడంతో రూ. 4.8 కోట్లతో టెండర్ ద్వారా ఎంపికై న కాంట్రాక్టర్ మందులను కొనుగోలు చేశారు. కానీ, ఆ బిల్లులు ఇంత వరకు రాకపోకవడం, సదరు కాంట్రాక్టర్ తనకు ఆర్థిక ఇబ్బందులున్నాయంటూ ఒత్తిడి తీసుకోస్తున్నారు. వివిధ రకాల మెడిసిన్కు ఫండ్ రాక తిరిగి ఈ ఏడాది మందులు కొనుగోలు చేయడం అధికారులకు సవాల్గా మారింది. ఆరునెలల నుంచి అందని భోజనం ఈఎస్ఐ ఆస్పత్రిలోని ఇన్పేషెంట్లకు ఆరునెలల నుంచి భోజనం అందడం లేదని తెలుస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు భోజనం కోసం ఇబ్బందులు పడుతున్నారు. గత సెప్టెంబర్ నుంచి డైట్కు సంబంధించిన బిల్లులు రాకపోవడం వల్ల భోజనం పెట్టలేదని సమాచారం. బిల్లులు పేరుతో సదరు కాంట్రాక్టర్ భోజనం సరఫరా చేయకపోవడంతో బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసి భోజనం తెచ్చుకోవాల్సి వస్తోంది. అసలే పేద కార్మికులు చికిత్స కోసం వచ్చి అడ్మిట్ అయితే భోజనం కోసం కడుపు మాడ్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. కాగా, కాంట్రాక్టర్ భోజనం సరఫరా చేయకపోతే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం శోఛనీయం. అరకొర సేవలు.. అలమటిస్తున్న రోగులు పేరుకే నోడల్ సెంటర్ పూర్తి స్థాయిలో డిస్పెన్సరీలకు అందని మందులు ఇన్పేషెంట్లకు చేరని భోజనం -
‘గ్రేటర్’ గ్రీవెన్స్కు 72 అర్జీలు
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు 72 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. టౌన్ ప్లానింగ్కు 35, ఇంజనీరింగ్ 18, రెవెన్యూ 8, హెల్త్–శానిటేషన్ 9, నీటి సరఫరా విభాగానికి 2 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, డీఎఫ్ఓ శంకర్ లింగం, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, టీఓ రామకృష్ణ, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, హెచ్ఓ లక్ష్మారెడ్డి, ఏసీపీలు, ఈఈలు తదితరులు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● భవానీ నగర్లో 2–6–1381 ఇంటికి ఆరు నెలల నుంచి నల్లా నీరు రావట్లేదని విన్నవించారు. ● ఎల్బీనగర్లో రోడ్డు విస్తరించి, అభివృద్ధి చేయాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ● వరంగల్ గాంధీనగర్ 11–8–38 తదితర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు లేక చీకట్లో మగ్గుతున్నామని ఏర్పాటు చేయాలని కాలనీవాసులు విన్నవించారు. ● హనుమకొండ స్నేహనగర్ 2–9–307 డ్రెయినేజీ అస్తవ్యస్థంగా మారిందని, నూతనంగా నిర్మించాలని కాలనీవాసులు కోరారు. ● హనుమకొండ సదాశివ కాలనీలో రోడ్డు నంబరు 1, 6, 8లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కాలనీ వేల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించారు. ● గోపాల్పూర్లోని రోడ్డు నంబరు 6, 7 నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కాలనీవాసులు కోరారు. -
అర్జీలు వెంటనే పరిష్కరించేలా చర్యలు
● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దని సూచించారు. అలాగే, జిల్లాలోని పలువురు తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి పెండింగ్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 222 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కన్నం నారాయణ, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, తదితర అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు :వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజలు ఇచ్చిన వినతులను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. గ్రీవెన్స్కు మొత్తం 163 దరఖాస్తులు రాగా, అందులో రెవెన్యూకు సంబంధించి 67, జీడబ్ల్యూఎంసీ 38, ఇతర శాఖలకు సంబంధించి 58 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రెవెన్యూశాఖకు సంబంధించిన దరఖాస్తులను కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంధ్యారాణి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వైవీ.గణేష్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, హౌసింగ్ పీడీ శ్రీవాణి, జిల్లా అధికారులున్నారు. -
స్ట్రీట్ వెండర్ల ఆర్థికాభివృద్ధికి చర్యలు
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: పట్టణ ప్రాంతాల్లో జీవనోపాధి సాగిస్తున్న వీధి విక్రయదారుల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించారు. మున్సిపాలిటీల వారీగా రుణాల పంపిణీ, తిరిగి చెల్లింపుల పురోగతి, కొత్త అర్హుల గుర్తింపు, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సాహించడం వంటి పలు అంశాలపై కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) వైవీ.గణే శ్, జిల్లా లీడ్ బ్యాంకు ప్రతినిధి తదితరులున్నారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావుకు నివాళి మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించారు. శ్రీపాదరావు చిత్రపటానికి కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైద్యసేవలపై నిర్లక్ష్యం వద్దు.. రోగులకు అందించాల్సిన వైద్యసేవలపై నిర్లక్ష్యం వహించరాదని వైద్యాధికారులను కలెక్టర్ సత్యశారద హెచ్చరించారు. కలెక్టరేట్లో జిల్లా వైద్యాశాఖాధికారి, సూపరింటెండెంట్లతో సోమవారం సమావేశం నిర్వహించి జిల్లాలో అందుతున్న వైద్యసేవలపై సమీక్షించారు. ఇందులో జిల్లా వైద్యాధికారి సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు. -
6న విద్యుత్ సర్ చార్జీల ప్రతిపాదనలపై బహిరంగ విచారణ
హన్మకొండ: 2026–2027 ఆర్థిక సంవత్సరానికి సవరించబడిన ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడీ, సర్ చార్జీల ప్రతిపాదనలపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఈ నెల 6న హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బహిరంగా విచారణ చేపట్టనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం సోమవారం ఒక ప్రకటనలో వివరించింది. ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ డాక్టర్ దేవరాజ్ నాగార్జున్, సభ్యులు రఘు కంజర్ల, సి.హెచ్.శ్రీనివాస్ రావు పాల్గొంటారని తెలిపింది. ఆసక్తి గల విద్యుత్ వినియోగదారులు ఈ బహిరంగ విచారణకు హాజరు కావాలని సంబంధిత అధికారులు కోరారు. ● సాదుతండాలో ఘటనలో డోర్నకల్ : మానసిక వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరో లు మండలం అందనాలపాడు జీపీ పరిధిలోని సాదుతండాలో చోటు చేసుకుంది. డోర్నకల్ సీఐ చంద్రమౌళి కథనం ప్రకారం.. తండాకు చెందిన ధరంసోత్ సురేశ్(23) డోర్నకల్ మండలం తొడేళ్లగూడెంలోని ఎస్కే ఆగ్రోస్లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సురేశ్కు 9 నెలల క్రితం వివాహం జరిగింది. అయితే ఇదే తండాకు చెందిన సురేశ్ స్నేహితుడు ఆంగోత్ సాయి తన భార్యతో ఫోన్లో మాట్లాడుతున్నాడని ఆరోపిస్తూ గతంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఈ క్రమంలో ఇటీవల సాయితోపాటు కొంతమంది సురేశ్ను మానసికంగా వేధించడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో సోమవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయితో పాటు వారి కుటుంబ సభ్యుల వేధిపులతోనే సురేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. దీంతో డోర్నకల్ సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మృతుడి తండ్రి శ్రీనుకు హామీ ఇచారు. అనంతరం మృతుడి కుటంబీకుల ఫిర్యాదు మేరకు ఆంగోత్ సాయి, నాగేశ్వర్రావు, ఆశా, అఖిల్పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. హాస్టల్లో మళ్లీ మంటలు ● విద్యార్థినుల పరుగులు.. ● కిందపడి పలువురికి గాయాలు ● మరో హాస్టల్కు తరలింపు హసన్పర్తి : 24 గంటలు గడవక ముందే ఆ హాస్టల్లో మళ్లీ మంటలు చెలరేగాయి. ఈ ఘటన సోమవారం రాత్రి భీమారం సమీపంలోని ఓ కళాశాల హాస్టల్లో చోటు చేసుకుంది. నగరంలోని భీమారం–పలువేల్పుల ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు ఓ కళాశాల నిర్వహిస్తున్నారు. అయితే భీమారంలోని గణేశ్ నగర్లో నిర్వహిస్తున్న హాస్టల్లో విద్యార్థినులకు వసతి కల్పించారు. ఆదివారం ఆ హాస్టల్లోని పై అంతస్తులో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. ఆ సమయంలో విద్యార్థినులు కింది అంతస్తులో పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే ఘటనలో విద్యార్థినుల సామగ్రితో పాటు సర్టిఫికెట్లు కూడా దగ్ధమయ్యాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి మళ్లీ అదే హాస్టల్లో మంటలు చెలరేగాయి. గ్లిజర్ పేలడంతో ఒకే సారి పెద్ద శబ్దం వచ్చింది. దీంతో విద్యార్థినులు భయాందోళనకు గురై పరుగులుదీశారు. ఈ సమయంలో కొంతమంది విద్యార్థినులు కింద పడి స్వ ల్ప గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న కేయూ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇదిలా ఉండగా, అదే కళాశాల పేరుతో నిర్వహిస్తున్న మరో హాస్టల్లోకి విద్యార్థినులను తరలించారు. -
నేడు, రేపు హోలీ సంబురాలు
హన్మకొండ కల్చరల్: ఫాల్గుణమాసం కామునిపున్నమిని పురస్కరించుకుని మంగళ, బుధవారం హోలీ సంబురాలు జరుపుకోనున్నారు. సోమవారం సా యంత్రం 5.55గంటలకు పౌర్ణమి ప్రా రంభమై మంగళవారం సాయంత్రం 5.07గంటలకు ముగుస్తుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం ప్రజ లు ప్రధాన వీధుల ముఖ్య కూడలిలో కామదహనం ఘనంగా జరుపుకున్నారు. అంతకు ముందు పాత కర్ర పెట్టి నీళ్లు ఆరబోసి కామదాహన వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వారంరోజులుగా జాజిరి ఆడిన పిల్లలు తమ కోలలను కామదహనంలో పడేశారు. మహిళలు కామదహనం చుట్టూ నీళ్లు పోస్తూ గుడాలు చల్లుతూ ఆరగింపు చేశారు. కొన్ని చోట్ల మంటచుట్టూ పాటలు పాడారు. హోలీ పండుగ.. సందిగ్ధం మంగళవారం చంద్రగ్రహణం సంభవిస్తున్న నేపథ్యంలో హోలీ పండుగను ఎప్పుడు జరుపుకోవాలని ప్రజల్లో సందిగ్ధం ఏర్పడింది. మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటల నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణానికి ఆరుగంటల ముందు గ్రహవేద, గ్రహణం అనంతరం ఆరుగంటల వరకు గ్రహణశూల ఉంటుంది. అందుకే హోలీ పండుగ, పూజా కార్యక్రమాలను బుధవారం జరుపుకోవడం ఉత్తమమని తెలంగాణ అర్చక సమాఖ్య జాక్ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, కొందరు వేదపండితులు మంగళవారం మధ్యాహ్నం 12గంటల లోపు నిర్వహించుకోవచ్చని చెప్పడంతోపాటు ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో కొందరు నేడు హోలీ పండుగను జరుపుకోనున్నారు. ఈ మేరకు సోమవారం నగరంలోని పలు కూడళ్లలో వివిధ రంగులు, వాటర్ కలర్ గన్స్, బిస్కెట్లు, చిలకలు, చాక్లెట్ల దండలు, షుగర్ క్యాండీలు విక్రయించే దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా కన్పించాయి. రజకవీధిలో కామదహనం.. హనుమకొండ రాగన్నదర్వాజ రజకవీధిలో కామదహనం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చీకటి ఆనంద్, వీరస్వామి, నాగ సోమేశ్వర్, చందుపట్ల ధనరాజ్, చీకటి అశోక్, చీకటి రాజు, క్షను, సురేశ్, ఉపేంద్రాచారి తదితరులు పాల్గొన్నారు. -
రాహుల్ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు ఆయూబ్
వరంగల్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల అధ్యక్షుల శిక్షణ శిబిరాన్ని ఫిబ్రవరి 21 నుంచి మార్చి 2 వరకు వికారాబాద్లోని హరిత వ్యాలీలో నిర్వహించారు. ఈశిక్షణ ముగింపు కార్యక్రమానికి వచ్చిన పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నాయకులు రాహుల్గాంధీని వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ ఆయూబ్ కుటుంబ సమేతంగా కలిశారు. పార్ట్టైం లెక్చరర్ల నియామక దరఖాస్తు గడువు పొడిగింపుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో 2025–2026 విద్యాసంవత్సరంలో మిగిలిన కాలానికి వివిధ విభాగాల్లో పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 4వ తేదీ సాయంత్రం 5గంటల వరకు గడువు పొడిగిస్తూ సోమవారం రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఆస క్తిగల అభ్యర్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు వవిధ విభాగాల్లో కలిపి సుమారు 500వరకు దరఖాస్తులు వచ్చాయి. గడువు పెంపుదలతో కొంతమేర పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా 99 మంది పార్ట్టైం లెక్చరర్లను నియమించనున్నారు. -
ఆనందాల కేళి
సహజ హోలీ.. రసాయన రంగుల వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తలు ● చర్మానికి రంగులు పట్టుకోకుండా ముందస్తు జాగ్రత్తగా ఆవాల నూనె, జెల్లి రాసుకోవాలి. ● అద్దాలు పెట్టుకుంటే రంగునీళ్లు కళ్లలో పడకుండా ఉంటాయి. ● హోలీ ఆడిన వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలి. లేనిపక్షంలో చేతి గోర్ల నుంచి రంగులు శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.మోదుగు పూల రంగులతోనే పండుగ జరుపుకోవాలి ● రసాయనాలతో ముప్పు.. ప్రజలకు వైద్య నిపుణుల సూచనలు నేడు హోలీ పర్వదినంసహజ రంగులైతే మేలు.. సహజ సిద్ధ రంగులు వినియోగిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు. దానిమ్మ, టమాటాలతో ఎరుపు రంగు, మోదుగుపూలు, క్యారెట్తో ఆరెంజ్ రంగు, బీట్రూట్తో ఊదారంగు, ఆకు కూరలతో ఆకుపచ్చ రంగు, పసుపు కొమ్ములతో పసుపు రంగు ఇలా సహజ సిద్ధమైన రంగులను తయారు చేసుకోవచ్చు. వీటితో ఎలాంటి హాని జరగదు. మోదుగుపూలతో రంగుల తయారీ ఇలా.. హోలీకి ఒక రోజు ముందు మోదుగు పూలు తీసుకొచ్చి వే డి నీటిలో ఉడకబెడతారు. ఉడకబెట్టిన తర్వాత మరుసటి రోజు వరకు నీటిలోనే నానబెడతారు. తెల్లవారుజామున నానబెట్టిన మోదుగుపూలను దంచి సీసాలో వడబోస్తారు. అనంతరం ఆ రంగు నీటితో హోలీ ఆడుతారు.రసాయన రంగులతో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రకృతి ప్రసాదించే మో దుగు పూలు ఆరోగ్యరీత్యా పలు సుగుణాలు కలిగి ఉన్నాయి. మా చిన్నతనంలోస్నేహితులతో కలిసి ఒక రోజు ముందే మోదుగు పూలు తెచ్చి నానబెట్టి ఉడికించిన తర్వాత చేసిన కాషాయవర్ణపు రంగులతో హోలీ ఆడేవాళ్లం. సహజ సిద్ధ రంగులు వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు . – అనంతగిరి సురేశ్, చిన్నగూడూరు -
విరమణ అనంతరం కుటుంబీకులతో గడపాలి
వరంగల్ క్రైం : ఉద్యోగ విరమణ అనంతరం పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ విభాగంలో విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన పో లీస్ అధికారులను శని వారం ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. విరమణ పొందిన వారిలో సబ్ ఇన్స్పెక్టర్లు సిద్ధయ్య, సాంబారెడ్డి కనకచంద్రం, సయ్యద్ చాంద్ పాషా, లింగారెడ్డి, రాజు, ఆర్ఎస్సై మహమూద్, ఏఆర్ఏఎస్సై వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుళ్లు రమేశ్, రాములు ఉన్నారు. ఈ సందర్భగా సీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖకు సుదీర్ఘ కాలం సేవలందించి ఉద్యోగ విరమణ చేస్తున్న అధికారులు నేటితరం పోలీసులకు ఆదర్శంగా నిలుస్తారన్నారు. విరమణ అనంతరం ఆరో గ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి, సురేశ్ కుమార్, ఆర్ఐలు స్పర్జన్ రాజ్, సతీశ్, ఆర్ఎస్సై శ్రవణ్ కుమార్, విరమణ సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ -
నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు
● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ● అధికారులతో సమీక్షహన్మకొండ అర్బన్: వేసవిని దృష్టిలో ఉంచుకుని హనుమకొండ జిల్లాలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో తాగునీటి సరఫరాపై మిషన్ భగీరథ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా గత వేసవిలో జరిగిన నీటి వినియోగం, ఎల్ఎండీ నుంచి నీటి అందుబాటు, చలివాగు నుంచి ధర్మసాగర్ పంప్ హౌస్కు నీటి పంపింగ్, అక్కడి నుంచి జిల్లాకు నీటి సరఫరా వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. మిషన్ భగీరథ ఎస్ఈ చలమారెడ్డి, ఈఈలు రామాంజనేయులు, రామ్ కుమార్, గాయత్రి, డీఈలు ఇతర అధికారులు పాల్గొన్నారు ఐడీఓసీలో కలెక్టర్ తనిఖీలు కలెక్టరేట్ కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్లోని వివిధ విభాగాలు, మొదటి అంతస్తులోని ముఖ్య ప్రణాళిక శాఖ, భూసర్వే, కొలతల శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ, ఖజానా శాఖ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, జిల్లా పరిశ్రమల కేంద్రం, పౌర సరఫరాల శాఖ, ఈ–డిస్ట్రిక్ట్ విభాగం, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ, పరిపాలన విభాగ తదితర కార్యాలయాలను కలెక్టర్ చాహత్ సందర్శించారు. అక్కడి అధికారులు, సిబ్బంది హాజరు, విధుల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, పరిపాలన అధికారి గౌరీశంకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పోలీసుల వైఖరి నిరసిస్తూ అడ్తి వ్యాపారుల నిరసన
వరంగల్: రైతుల వద్ద మిర్చి కొనుగోలు చేస్తే చోరీ చేసి తీసుకొచ్చిన బస్తాలు కొనుగోలు చేశారంటూ పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని అడ్తి వ్యా పారులు సోమవారం వరంగల్ ఏనుమాముల మా ర్కెట్లో కొనుగోళ్లు నిలిపివేసి నిరసన వ్యక్తం చేశా రు. సుమారు మూడు గంటల పాటు క్రయ, విక్రయాలు నిలిచిపోవడంతో గందరగోళం నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ రైతు ఏటా వరంగల్కు చెందిన సూర్యతేజ ఎంటర్ప్రైజెస్లో పంటలు విక్రయిస్తుంటాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మూడు నాలుగు సార్లు మిర్చి తీసుకొచ్చి అడ్తిదారుడికి అదే గ్రామానికి చెందిన నలుగురు రైతులతో కలిసి విక్రయించాడు. మూడు రోజుల క్రితం భూపాలపల్లి ప్రాంతంలో మిర్చి బస్తాలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటనపై సూర్యతేజ ఎంటర్ప్రైజెస్కు విక్రయించే రైతు ఉన్న ట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని విచా రించగా తాను చోరీ చేసిన మిర్చిని వరంగల్ అడ్తిదా రుడికి విక్రయించినట్లు చెప్పారు. వెంటనే పోలీసులు అడ్తిదారుడికి ఫోన్ చేసి దొంగ మిర్చిని తీసుకొ స్తే మీరు కొనుగోలు చేసినట్లు తెలిసింది.. పోలీసుస్టేషన్కు రావాలని చెప్పగా తాను వేరో చోట ఉన్నాయని, తర్వాత వస్తానని పేర్కొన్నాడు. వెంటనే పోలీసులు అడ్తిదారుడి వద్దకే వెళ్లి నిందితుడి తీసుకెళ్లి చూపించగా ఇతనే అమ్మాడని చెప్పాడు. దీంతో వివరాలు తీసుకుని పోలీసుస్టేషన్కు రావాలని చె ప్పగా అడ్తిదారుడు వెళ్లాడు. రోజంతా కూర్చుబెట్టి రాత్రికి ఇంటికి పంపించి ఉదయం రావాలని హు కుం జారీ చేశారు. ఈవిషయంపై ఆదివారం చాంబర్లో వ్యాపారులు సమావేశమై పోలీసుల వైఖరికి నిరసనగా కొనుగోళ్లు బంద్ చేయాలని నిర్ణయించి సోమవారం మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు నిలిపివేశారు. ఈవిషయం తెలిసిన వెంటనే మార్కెటింగ్శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, కలెక్టర్ సత్యశారద, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు.. చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డితో మాట్లాడి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో కొ నుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ నిరసనలో చాంబర్ ప్రతినిధులు కటకం పెంటయ్య, వేద ప్రకాశ్, మొగిళి చంద్రమౌళి, అల్లె సంపత్, ఎన్రెడ్డి లింగా రెడ్డి, చాగర్ల శ్రీనివాస్,రాజేశ్, డి.కరాణి, కాటన్ సెక్ష న్ ప్రెసిడెంట్ చింతలపల్లి వీరారావు పాల్గొన్నారు. పోలీసుల వైఖరి బాధ కలిగించింది.. ‘అడ్తి వ్యాపారిని రోజంతా పోలీసుస్టేషన్లో ఉంచడంపై నేను భూపాలపల్లి క్రైం ఎస్సై రమేశ్కు కాల్ చేసి తాను చాంబర్ అధ్యక్షుడిని మాట్లాడుతున్నాన ని చెప్పగా చాంబర్ అని చెప్పొద్దు.. పేరు మాత్రమే చెప్పాలి’ అని అనడం బాధించిందని చాంబర్ అఽ ద్యక్షుడు రవీందర్రెడ్డి అన్నారు. ఆరోపణలు వస్తే ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా అడిగే హక్కు తమకు ఉంటుందని ఎస్సై అనడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఇలా వేధింపులకు గురిచేస్తే పంటలకు సంబంధించిన గుర్తింపు పత్రాలు, ఆధార్కార్డు తీ సుకురావాలని అంటే రైతులు ఇబ్బందులు పడతారన్నారు. అధికారుల హామీ మేరకు కొనుగోళ్లు ప్రారంభించామన్నారు. మూడు గంటలపాటు నిలిచిన క్రయ, విక్రయాలు మార్కెట్ అధికారుల హామీతో నిరసన విరమణ -
శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయం
హన్మకొండ : గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయమని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి కొనియాడారు. సోమవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు దుద్దిళ్ల శ్రీపాదరావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా కొనసాగిన శ్రీపాదరావు ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేశారన్నారు. ప్రజల మధ్యే ఉంటూ వారి అవసరాలు తెలుసుకుని, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం ఆయన ప్రత్యేకత అన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సి.ఈలు కె.రాజు చౌహాన్, అశోక్, అన్నపూర్ణ, సురేందర్, మాధవ రావు, సీజీఎంలు రవీంద్రనాఽథ్, జాయింట్ సెక్రటరీలు కె.రమేశ్, శ్రీకృష్ణ, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జీఎంలు హేమంత్ కుమార్, వేణు బాబు, గిరిధర్, నాగ ప్రసాద్, కళాధర్ రెడ్డి, జయరాజ్, శ్రీనివాస రావు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
మిర్చి రైతు కన్నెర్ర
వరంగల్ : మిర్చి రైతులు కన్నెర్ర చేశారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు కుమ్మకై ్క ధర తగ్గించారని ఆరోపిస్తూ సోమవారం ధర్నా నిర్వహించారు. కాగా, మిర్చి కొనుగోళ్ల విషయంలో పోలీసుల వైఖరిని నిరసిస్తూ అడ్తి వ్యాపారులు జెండా పాటలో పాల్గొనలేదు. దాదాపు మూడు గంటల అనంతరం జరిగిన వేలంలో 341రకం మిర్చి ధర క్వింటాల్కు రూ.21వేలు ఖరారైంది. దీంతో ఈరకం మిర్చి విక్రయానికి తీసుకొచ్చిన పలువురు రైతులు శనివారం క్వింటాల్కు రూ.22,300 ధర పలికితే సోమవారం రూ.1,300 తగ్గించారంటూ మార్కెట్ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం మార్కెట్ ఆఫీస్లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా ఏనుమాముల పోలీస్ ఇన్స్పెక్టర్ సురేశ్, సిబ్బంది గేట్ మూసి వేసి అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం ఘటనాస్థలికి చేరుకుని ధర తగ్గించలేదని చెప్పారు. ఖమ్మం మార్కెట్లో 341 రకం మిర్చి ధర క్వింటాల్కు రూ.20,500 పలికిందని రైతులకు తెలిపారు. బహిరంగ మార్కెట్లో డిమాండ్ ప్రకారం ధరలు నిర్ణయమవుతాయన్నారు. ధర తగ్గించారంటూ మార్కెట్లో ధర్నా ఆఫీస్లోకి దూసుకెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు -
డ్రెయినేజీలో నల్లా కనెక్షన్లు
వరంగల్: వరంగల్ 19వ డివిజన్ వివేకానందకాలనీ రోడ్డు–2లో డ్రెయినేజీలోనే తాగు నీటి నల్లా కనెక్షన్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కాలనీలో డ్రెయినేజీల నిర్మాణంలో భాగంగా పాత పైపులైన్ తీసివేశారు. కాల్వ మధ్యలో పైపులైన్ వేసి కనెక్షన్లు ఇవ్వడంపై కాలనీవాసులు అభ్యంతరం చెబుతున్నారు. కాల్వ మధ్యలో ఉన్న పైపుపై సిమెంట్, కాంక్రీట్ వేస్తామని ప్లంబర్ చెప్పగా.. భవిష్యత్లో లీకయితే ఎలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. తాగునీటి పైపులైన్ను మధ్య నుంచి పక్కకు జరిపి, సైడ్ డ్రెయిన్ గోడ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. -
వాహన కాంతితోనే ప్రమాదాలు
ఖిలా వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని జాతీయ రహదారులపై రాత్రివేళ హెడ్లైట్లతోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటితో వచ్చే కాంతితో ఎదురుగా వచ్చే వాహనదారులకు రోడ్డు కనిపించక ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని ఆర్టీఏ, పోలీసు అధి కారులు గుర్తించారు. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని రకాల వాహనాలు కలిపి సుమారు 9లక్షల 50 వేల వరకు ఉన్నాయి. ఆర్టీఏ కార్యాలయాలు ఆరు ఉన్నాయి. కనిపించని నిషేధం.. రహదారులపై వాహనదారులు హైబీమ్ లైట్లను నిరంతరం వాడితే ఎదురుగా వచ్చే వాహనదారుల కంటి చూపు తాత్కాలికంగా దెబ్బతిని, రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది. నగరాలు, పట్టణాలు, వెలుతురు ఎక్కువగా ఉన్న రోడ్లపై లోబీమ్ వాడాలి. కానీ, అవగాహన లోపంతోనే హైబీమ్ వాడుతున్నారు. వీటి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చాలామంది వాహనదారులు వాపోతున్నారు. ఇది చట్టరీత్యా నేరమని తెలిసినా లారీలు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు సైతం ఎల్ఈడీ, హైబీమ్ లైట్లు వాడడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈసమస్య ఏ ఒక్కరిదే కాదు.. రాత్రి రోడ్డుపై వాహనం నడిపే ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నారు. కనిపించని బ్లాక్ స్టిక్కర్.. వాహనం ఏదైనా హెడ్లైట్లపై సగం వరకు బ్లాక్స్టిక్కర్ ఉండాలన్నా నిబంధన ఉండేది. ఆ రూల్ ఉందా.. తీసేశారో తెలియదు. వాహనాల హెడ్లైట్లకు వస్తున్న లీడ్ లైట్ల గురించి చర్యలు తీసుకోవడంతోపాటు హెడ్లైట్లకు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ లేదా బ్లాక్ పెయింట్ వేయాలనే నిబంధన పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. గరిష్టంగా 70 వాట్లు మించిన ఫోకస్ లైట్లు వాడకూడదని నిబంధనలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ వాహనాలు, ప్రభుత్వ వాహనాలు అత్యధికంగా వెలుగులు ఇచ్చే హైబీమ్ లైట్లను వాడుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి ఎదురుగా వచ్చే వాహనదారులు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. హైబీమ్, ఎల్ఈడీ లైట్లు వాడితే ఆర్టీఏ చట్ట ప్రకారం రూ.500 నుంచి రూ.1,500 వరకు జరిమానా విఽధించాలని సుప్రీంకోర్టు సూచనలు ఉన్నా.. ఆర్టీఏ అధికారులు, పోలీసులకు పట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా హెడ్లైట్ల నిషేధం వాహన చట్టం ప్రకారం సాధారణ లైట్లు వాడాలి హైబీమ్ ఎల్ఈడీ లైట్లు వాడితే జరిమానారాత్రివేళ నరకమే.. నగరాలు, పట్టణాలు, జాతీయ రహదారులపై రాత్రి 7 గంటల దాటితే వాహనాలు నడపాలంటే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఎదురుగా వాహనాల ఎల్ఈడీ లైట్లతో కళ్లు కనిపించకుండా మసకబారిపోతున్నాయని చెబుతున్నారు. కొత్తగా వచ్చే వాహనాలు ఎల్ఈడీ లైట్లతో రోడ్డు ఎక్కుతున్నాయి. వీటిపై ఆర్టీఏ, పోలీస్ అధికారుల పర్యవేక్షణ కరువడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. -
నిట్లో 15 మంది విద్యార్థులకు అస్వస్థత
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లోని 15 మంది విద్యార్థులు శనివారం అర్ధరాత్రి వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని చి కిత్స నిమిత్తం వరంగల్లోని ఓ ప్రైవే ట్ ఆస్పత్రికి తరలించినట్లు నిట్ యాజమాన్యం తెలిపింది. శని వారం అర్ధరాత్రి వరకు విద్యార్థులు స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకల్లో పాల్గొన్నారు. నిట్లో తిన్న ఆహారంతో నా, బయట ఏదైనా తిన్న ఆహారంతో అస్వస్థతకు గురయ్యారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముగిసిన ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష కేయూ క్యాంపస్ : ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత కోచింగ్ ఇవ్వడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు ఆదివారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్కాలేజీలో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. గ్రూప్–1, 2, 3,4, బ్యాంకింగ్, తదితర ఉద్యోగాల పరీక్షలకు కోచింగ్ ఇవ్వనున్నామని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ హనుమకొండ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ బి. నిర్మల, ఉమ్మడి వరంగల్ జిల్లా సంచాలకుడు జగన్మోహన్ తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణ చీఫ్ సూపరింటెండెంట్గా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి విధులు నిర్వర్తించారు. ఇందులో వంద మంది అభ్యర్థులను శిక్షణకు ఎంపిక చేస్తారు. పసుపు బదులు రంగు వినియోగిస్తే చర్యలు ● ఫుడ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మాజీ వరంగల్ అర్బన్ : చికెన్ సెంటర్ నిర్వాహకులు కోడిని శుభ్రం చేసే క్రమంలో పసుపు బదులు రంగు వినియోగిస్తే చర్యలు తప్పవని ఫుడ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మాజీ హెచ్చరించారు. ఈమేరకు ఆదివారం హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో ఆహార కల్తీ నియంత్రణ, వినియోగదా రుల మండలి ఆధ్వర్యంలో సంయుక్తంగా చికెన్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడిని శుభ్రం చేసేందుకు పసుపు బదులు రంగు ఉపయోగిస్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇలా ఉపయోగించి విక్రయించిన మాంసం తినడం వల్ల ఉదరం, పేగు కేన్సర్ బారిన పడుతారన్నారు. అందుకే ఇక నుంచి చికెన్ సెంటర్ నిర్వాహకులు కోడిని శుభ్రం చేసేందుకు పసుపు వాడాలన్నారు. ప్రైవేట్ కళాశాలలో షార్ట్ సర్క్యూట్హసన్పర్తి: నగర శివారులోని ఓ ప్రైవేట్ కళాశాల హాస్టల్లో ఆదివారం షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ సంఘటనలో కళాశాల హాస్టల్లోని సామగ్రి పాక్షికంగా దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి. పలివేల్పుల శివారులో కొంతమంది వ్యక్తులు కళాశాల హాస్టల్ నిర్వహిస్తున్నారు. అయితే సోమవారం జూనియర్ ఇంటర్ పరీక్ష ఉంది. కింది అంతస్తులో విద్యార్థినులు పరీక్షకు సిద్ధమవుతున్నారు. అయితే ఒకేసారి పై అంతస్తులో నుంచి మంటలు చేలరేగాయి. దీంతో విద్యార్థినులు ఆందోళనతో బయటకు పరుగులు దీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేశారు. కట్టడాలను పరిరక్షించాలి ఖిలా వరంగల్: వారసత్వ సంపద, చారిత్రక కట్టడా ల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చ ట్టం తీసుకురావాలని వినియోగదారుల దక్షిణాది రాష్ట్రాల సమన్వయ సమితి జనరల్ సెక్రటరీ మొ గిలిచెర్ల సుదర్శన్ కోరారు. వినియోగదారుల రక్షణ చట్టాలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వరంగల్ శివనగర్లోని వినియోగదారుల సమాఖ్య జిల్లా కార్యాలయంలో చిలువేర ప్రవీణ్ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో సుదర్శన్ మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టం –2019 అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల్లో చట్టాలు లోపభూయిష్టంగా అమలవుతున్నాయని అన్నారు. కల్తీ బారినపడి వినియోగదారులు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర నష్టానికి గురవుతున్నారన్నారు. కాకతీయుల కోట, కట్టడాలను ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర విధ్వంసానికి గురి చేస్తున్నారని వినియోగదారులు ఫిర్యాదులు చేసినా విధ్వంసాలు మాత్రం ఆగడం లేదని వా పోయారు. దిడ్డి లక్ష్మీనారాయణ, కార్తీక్, శ్రవణ్, వాసుకి, నరసింహం, సూర్యం పాల్గొన్నారు. -
మామిడి సంరక్షణకు సస్యరక్షణే మేలు
జనగామ: మామిడి పంట సంరక్షణకు సస్యరక్షణే మేలు. కాయ రాలిపోకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే దిగుబడి వస్తుంది. జనగామ జిల్లాలో 85వందల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. ఈ నేపథ్యంలో పూత అనంత రం చిన్న కాయలు ఏర్పడే ప్రస్తుత దశలో ఫ్రూట్లె ట్ డ్రాప్ సమస్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మామిడి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ఈ సమస్యను నియంత్రించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవికాంత్ తెలిపారు. ఈమేరకు మామిడి రైతులకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. కాయ రాలిపోవడానికి ప్రధాన కారణాలు.. పరాగసంపర్కం సరిగా జరగకపోవడం, అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ మట్టితేమ, బోరాన్, పొటాష్ లోపాలు, త్రిప్స్, హాపర్ దాడులు, అలాగే పొడరీ మిల్యూ, అంట్రాక్నోస్ వంటి వ్యాధులు ప్రధాన కారణాలు. నివారణ చర్యలు పాటించాలి.. నీటిపారుదల నిర్వహణలో బిందు సేద్యంతో రో జుకు 3 గంటల పాటు నీరు అందించడం, మల్చింగ్ చేయడం, నీటి కొరత, అధిక నీరు రెండింటినీ ని వారించాలి. పోషక నిర్వహణలో ఒకశాతం 19 :19:19 లేదా 13:0:45 నీటిలో కరిగే ఎరువులను స్ప్రే చేయాలి. బోరాన్ 0 .1శాతం( గ్రాముకు లీటర్) స్ప్రే చేయడం ద్వారా కాయరాలిపోవడం తగ్గిపోతుంది. అవసరమైతే మైక్రోన్యూట్రియొంట్స్ వినియోగం తప్పనిసరి. గ్రోత్ రెగ్యులేటర్ వినియోగం.. ప్లానోఫిక్స్ 4.5 ఎంఎల్ను 25 లీటర్ల నీటిలో కలిపి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో స్ప్రే చేయాలి. కీటక–వ్యాధి నియంత్రణ.. త్రిప్స్, హాపర్ నివారణకు ఫైప్రోనిల్ లేదా ఇమిడాక్లోప్రిడ్ పురుగు మందులు ఉపయోగించాలి. కాయ పరిమాణం పెంపునకు ప్రత్యేక సూచనలు.. పొటాష్ అధికంగా ఉండే 13:0:45 ఎరువును రెండు దఫాలుగా 10–15 రోజుల వ్యత్యాసంలో స్ప్రే చేయాలి. తగినంత సేంద్రియ ఎరువు, తేమ అందేలా సరైన నీటిపారుదల నిర్వహణ అవసరం. అధిక ఉష్ణోగ్రతల కారణంగా స్ప్రే తప్పనిసరిగా ఉదయం 8 ముందు లేదా సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే చేయాలి. కాగా, ఏమైనా సందేహాలుంటే రైతులు వెంటనే హార్టికల్చర్ అధికారులను సంప్రదించాలని జిల్లా ఉద్యాన శాఖ సూచించింది. కాయ రాలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పంట దిగుబడి కాపాడుకోవాలి ఉద్యాన శాఖ అధికారి రవికాంత్ -
హేమాచల క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం
● మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంగపేట: మండలంలోని రెండో యాదగిరిగుట్టగా ప్రస్ధిగాంచిన మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి శ్రీనివాస్రెడ్డి దంపతులు, కుటుంబీకులు.. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎంపీ పోరిక బలరాంనాయక్, పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో కలిసి మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ హేమాచల క్షేత్రంలో స్వయంభుగా వెలసిన లక్ష్మీనర్సింహాస్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆలోచనకు అనుగుణంగా గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని దేవాలయాలను టెంపుల్ టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. వాటికి సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. మంత్రి సీతక్క కోరిక మేరకు ప్రభుత్వం హేమాచల క్షేత్రంతోపాటు ములుగు ప్రాంతంలోని ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తుందన్నారు. కాగా, ఆలయ కార్యనిర్వాహణ అధికారి రేవెల్లి మహేశ్ ఆధ్వర్యంలో అర్చకులు ముక్కామల శేఖర్శర్మ, రాజీవ్ నాగశర్మ, కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు, వెంకటనారాయణ శర్మ.. మంత్రులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఉమాచంద్రశేఖరస్వామి ఆలయంలో పూజలు.. మండల కేంద్రంలోని ఉమాచంద్రశేఖరస్వామి ఆలయాన్ని మంత్రులు శ్రీనివాస్రెడ్డి, సీతక్క, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్లు, వెంకట్రావు దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ నరేశ్రెడ్డి, పూజారి నరేశ్శర్మ ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కలెక్టర్ టీఎస్ దివాకర, అదనపు కలెక్టర్ మహేందర్జీ, రాష్ట్ర ఉపాధి హామీ మండలి డైరెక్టర్ సోమయ్య, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగకల్యాణి, తహసీల్దార్ రవీందర్, హేమాచల క్షేత్రం మాజీ చైర్మన్ సురేశ్, పురుషోత్తం, సత్యనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, మహిళా అధ్యక్షురాలు శానం నిర్మల, మంగపేట ఎఫ్ఎస్సీఎస్ మాజీ చైర్మన్ తోట రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘అరైవ్.. అలైవ్’ను ఉద్యమంగా సాగించాలి
జనగామ/ వరంగల్ క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరెవ్.. అలైవ్ కార్యక్రమాన్ని ఉద్యమంగా కొనసాగించాలని డీజీపీ శివధర్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రం వెస్ట్ జోన్ పరిధి లోని ఏసీపీ కార్యాలయంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయన్నారు. నేరస్తులు ఎక్కడో ఉండి టెక్నాలజీ వినియోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ క్రమంలో ప్రతీ అధికారి సైబర్ నేరాలపై అవగా హన కల్పించాలన్నారు. ప్రధానంగా స్టేషన్ అధికా రులు రికార్డుల నమోదుపై దృష్టి సారించాలని, రౌడీ షీటర్లు, అనుమానితులను ప్రత్యక్షంగా వెళ్లి తనిఖీ చేయాలన్నారు. ప్రతీ అధికారి తన స్టేషన్ పరిధిలోని హిస్టరీ పై అవగాహన కలిగి ఉండాలని, ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు సామాజిక సమస్యగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలపై మరింత అవగాహన కల్పించాలని, ఇందుకోసం ప్రతీనెల చివరివారం అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. అలాగే ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలన్నారు. సమావేశంలో డీసీపీలు రాజమహేంద్ర నాయక్, అంకిత్ కుమార్, దార కవిత, ఏఎస్పీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు డీజీపీ శివధర్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష -
వేతనాలు ఎక్కువగా ఉన్నాయనడం సరికాదు
హన్మకొండ: ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని ఆకునూరి మురళి విద్యా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తూ చెప్పడం సరికాదని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తూపురాణి సీతారం అన్నారు. ఈ వ్యాఖ్యల్ని తమ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. హనుమకొండలోని సెయింట్ పీటర్స్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాంనగర్ యూనిట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తూపురాణి సీతారాం మాట్లాడుతూ పెరిగిన ధరల గురించి ఆకునూరు మురళికి తెలియదా అని ప్రశ్నించారు. 1966లో 10 గ్రాముల బంగారం ధర సెకండరీ గ్రేడ్ టీచర్ స్కేల్ మూలవేతనంతో సమానంగా ఉండేదని, ఇప్పుడు ఆ ధరల ప్రకారం ఉపాధ్యాయుల వేతనాలు ఉన్నాయా అని ఆలోచించాలని సూచించారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో గరిష్టంగా రూ.500తో వైద్యం అందిస్తుంటే మనకు ఎందుకు సరిపోదని నిలదీశారు. ఒక శాతానికి మించి కాంట్రిబ్యూషన్ విధిస్తే పోరాటాలు తప్పవని ఆయన హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఆకునూరు విద్యాదేవి, జిల్లా బాధ్యులు జన్నపురెడ్డి ప్రభాకర్ రెడ్డి, నారాయణగిరి వీరన్న, కాంతాల లక్ష్మారెడ్డి, రహమాన్, సమ్మోహి ధర్మయ్య, సిరంగి రాజయ్య, మందల వెంకట్ రెడ్డి, నాగపురి రాజయ్య, కొంపెల్లి రామచంద్రం, రామానుజం, తుమ్మ రమేశ్బాబు, తదితరులు పాల్గొన్నారు. -
నేడు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్
● జిల్లా స్థాయి పోటీలకు 200 మంది డిగ్రీ విద్యార్థులు కేయూ క్యాంపస్: వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–హనుమకొండ జిల్లా స్థాయి పోటీలను కేయూలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ఈనెల 2న నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రమణ, కన్వీనర్లు డి. శైలజ, డాక్టర్ ఎన్.సౌజన్య ఆదివారం తెలిపారు. కేయూ కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో మై భారత్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ‘ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు, భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు’ అంశంపై ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మై భారత్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్న విద్యార్థుల్లో 200 మందికి ఈ పోటీల్లో అవకాశం కల్పించనున్నట్లు కేయూ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ ఆచార్య ఈసం నారాయణ తెలిపారు. ఐదుగురిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. -
సమ్మర్ యాక్షన్ప్లాన్ను అమలు చేయండి
● మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ను పక్కాగా అమలు చేయాలని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. మట్టెవాడ వాటర్ ట్యాంకులో ఆదివారం మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి సరఫరాలో ఆ టంకాలు లేకుండా చూడాలని సూచించారు. ఎస్సీ కాలనీలో పర్యటించి వాల్వ్లు, బోర్లకు మరమ్మతులు చేయాలని కోరారు. డీఈలు సతీశ్, మొజామిల్, రవీందర్, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్ పాల్గొన్నారు. -
విద్యుత్ వినియోగం ౖపైపెకి..
హన్మకొండ : శీతాకాలం ముగియడంతోనే విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. టీజీ ఎన్పీడీసీఎల్ చరిత్రలో అధిక స్థాయిలో నమోదవుతూ రికార్డులు బ్రేక్ చేస్తోంది. మార్చితో వేసవి మొదలైంది. కాలం ఆరంభానికి ముందు నుంచి గరిష్ట స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదు కావడం చూస్తే మండుటెండల వరకు మరిన్ని రికార్డులు నమోదవుతాయ ని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శీతాకా లం ముగియడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో వినియోగదారులు ఫ్యాన్లు, ఏసీలు వినియోగిస్తున్నారు. ఫలితంగా కరెంట్ వినియోగం పెరిగింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం.. గతేడాది మార్చి 11న 5,816 మెగావాట్ల డిమాండ్ నమోదు కాగా ఇప్పటి వరకు ఇదే అత్యధిక డిమాండ్గా ఉంది. ఈసారి 12 రోజుల ముందుగానే ఫిబ్రవరి 28న అత్యధికంగా 6,057 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇదిలా ఉండగా మరునాడే ఈ నెల 1వ తేదీ (ఆదివారం)న టీజీ ఎన్పీడీసీఎల్ చరిత్రలోని గరిష్టంగా 6,267 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముంది. ఈ క్రమంలో టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి గత రెండు నెలల నుంచి వేసవికి అధికారులను సన్నద్ధం చేస్తున్నారు. రెండు నెలల క్రితమే వేసవిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళిక, కార్యాచరణ రూపొందించుకోవాని ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లు, డివిజనల్ ఇంజనీర్లు, ఏడీఈలు, ఏఈలు వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టారు. అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు.. అధిక భారం ఉన్న డిస్ట్రిబ్యూషన్ల స్థానంలో అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు, వీలుకాని చోట ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు, అదే విధంగా సబ్ స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇప్పటికే 35 నూతన 33/11 కేవీ సబ్ స్టేషన్లు నిర్మించారు. అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లు 366 బిగించారు. 7,600 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచారు. 33 కేవీ ఫీడర్లలో ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్లు వేశారు. లోఓల్టేజీ సమస్య తీర్చేందుకు 392 కెపాసిటర్ బ్యాంక్లు అమర్చారు. వేసవి దృష్టిలో ఉంచుకుని ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, విద్యుత్ లైన్ల పర్యవేక్షణ, వదులుగా ఉన్న లైన్లు సరి చేయడానికి అత్యవసర స్పందన బృందాలను ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. చలి తగ్గగానే ఒక్కసారిగా పెరిగిన డిమాండ్ ఆగకుండా తిరుగుతున్న ఫ్యాన్లు, ఏసీలు ఎన్పీడీసీఎల్ చరిత్రలో రికార్డులు బ్రేక్ శనివారం 6,057, ఆదివారం 6,267 మెగావాట్ల గరిష్ట డిమాండ్విద్యుత్ డిమాండ్ వివరాలు(మెగావాట్లు).. తేదీ 2026లో 2025లో 2024లో ఫిబ్రవరి డిమాండ్ డిమాండ్ డిమాండ్ 20 5,845 5,502 5,178 21 5,904 5,573 5,283 22 5,837 5,635 5,189 23 5,709 5,494 5,243 24 4,798 5,670 5,200 25 5,158 5,708 4,903 26 5,279 5,778 5,061 27 5,948 5,451 5,061 28 6,057 5,646 5,228 మార్చి1 6,267 5,709 5,174 -
నగరంలో కల్తీ పాల విక్రయాలే అధికం
హన్మకొండ చౌరస్తా: పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు హైడ్రోజన్ ఫెరాకై ్సడ్ లాంటి రసాయనాలు కలపడం, వెన్న శాతం 6.0గా ప్యాకెట్లపై చూపగా అందులో 5.5శాతం ఉన్నట్లుగా గుర్తించినట్లు వినియోగదారుల మండలి ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి తెలిపారు. వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో హనుమకొండలోని కుమార్పల్లి మార్కెట్ ఏరియాలో పాల కల్తీ – నాణ్యతపై ప్రజలకు ఆదివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మొబైల్ వాహనంలో ఉన్న ఆహార కల్తీ ప్రయోగశాలలో పలు కంపెనీలకు చెందిన పాల నాణ్యతను తనిఖీ చేశారు. నగరంలో అత్యధిక కంపెనీల పాలలో కల్తీ ఉన్నట్లు పరిశీలనతో తేలిందని చక్రపాణి అన్నారు. ఆహార భద్రత చట్టం, నిబంధనలకు సత్వరమే సవరణలు అవసరమని, వినియోగదారుల సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ జరిగిన రెండేళ్లు గడిచినా సవరణలు అమలు కావడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ఆహార కల్తీ లాబొరేటరీలను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లెపాడు దామోదర్, హనుమకొండ ఫుడ్ సేఫ్టీ అధికారి బ్రహ్మాజీ, సీసీఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆర్.రంజిత్కుమార్, మండలి రాష్ట్ర కార్యదర్శి ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఈద్గా అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
రామన్నపేట/ఖిలా వరంగల్: గ్రేటర్ వరంగల్ 11వ డివిజన్ పరిధి జెమిని థియేటర్ సమీపంలోని ఈద్గాలో చేపట్టిన అభివృద్ధి పనులను రంజాన్ పర్వదినానికి ముందే పూర్తిచేయాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వరంగల్ ఎంజీఎం సర్కిల్లో శిశు సంరక్షణ ప్రతిబింబించేలా రూ.35 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్రతిమను లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా మట్టెవాడ ఈద్గాలో కోటి రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారదలో కలిసి మంత్రి సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈద్గా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. గడువులోగా పనులు పూర్తిచేయాలన్నారు. అదేవిధంగా 40వ డివిజన్ కరీమాబాద్లో రూ.1.40 కోట్ల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, ఉర్సు శ్మశానవాటిక, గౌడ సంఘం, మైనార్టీ కమ్యూనిటీ హాళ్ల పనులను కలెక్టర్ సత్యశారద, మేయర్ గుండు సుధారాణితో కలిసి మంత్రి సురేఖ శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్లు మరుపల్లి రవి, పల్లం పద్మ, మీసాల ప్రకాశ్, గోపాల నవీన్రాజు పాల్గొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ -
హాట్ హాట్గా మిర్చి
రకం ధర దేశీ మిర్చి 50,000ఎల్లో మిర్చి 42,000వండర్హాట్ 39,000సింగిల్ పట్టి 35,000 దీపిక 31,000యూఎస్–341 29,0001048 21,000తేజ 20,600సాక్షి, వరంగల్: వరంగల్లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు హాట్ హాట్గా ఉంటున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం అన్ని రకాల మిర్చికి ధర రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు తాజాగా దేశీ మిర్చి క్వింటాలు రూ.50,000 పలకడంతో మిర్చి ధరలపై మరోసారి చర్చ జరుగుతోంది. మూడు రోజుల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పుల్లూరుపల్లికి చెందిన రవీందర్రావు 9 బస్తాల దేశీ మిర్చిని తీసుకురాగా.. అడ్తి శాంతి ఇండస్ట్రీస్ అమ్మించగా రూ.50,000 ధర పలికిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి సాగు విస్తీర్ణం తగ్గి, అకాల వర్షాలతో పంట దెబ్బతినడంతో ఉన్న మిర్చికే రేటు అధికంగా పలుకుతోందని, అదే సమయంలో ఆయా మిర్చి కారం, నాణ్యతను బట్టి పరిశ్రమలు ఎక్కువ ధరకు కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తుండడం కూడా రేటు పెరగడానికి మరో కారణంగా ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. మిర్చి నాటే సమయానికి కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతింది. దిగుబడి రాకపోవడంతో మార్కెట్కు మిర్చి రావడం తగ్గింది. అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గింది. గృహ అవసరాలకు వినియోగం పెరగడం, మార్కెట్కు మేలు రకమైన మిర్చి వస్తుండడంతో వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. డిమాండ్ ఎందుకు ఎక్కువంటే.. ● అకాల వర్షాలు, తామర తెగులుతో దేశీ రకం దిగుబడి పడిపోయింది. అదే సమయంలో ఈ మిర్చిని ఎక్కువగా పచ్చళ్లలో వాడుతుండడంతో ధర పలుకుతోంది. ● సింగిల్ పట్టి మిర్చిని ఎక్కువగా పచ్చళ్లకు వినియోగిస్తున్నారు. ఘాటు ఉండకుండా టేస్టీగా ఉండడంతో దీనికి డిమాండ్ ఉంది. ● వండర్హాట్ మిర్చిలో కారం ఎక్కువ శాతం ఉంటుంది. పచ్చడి, పొడి మసాలా తయారీలో డిమాండ్ ఉంటుంది. తేజ మిర్చికి కూడా స్థానిక పరిశ్రమలు, ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉంది. ఏనుమాముల మార్కెట్లో మిర్చి ధరలు ౖపైపెకి రోజురోజుకూ పెరుగుతున్న దేశీ, వండర్హాట్ ధరలు ఇతర రకాల మిర్చికి సైతం మార్కెట్లో డిమాండ్ దేశీ మిర్చికి అత్యధికంగా క్వింటాకు రూ.50,000 జనవరి నుంచి ఇప్పటివరకు 1,27,200ల క్వింటాళ్ల విక్రయాలు -
ముగిసిన ముప్పిడి ఉద్యమ ప్రస్థానం
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీపీఐ (మావోయిస్టు) పార్టీలో ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ అలియాస్ జంగ్ దాదా ఉద్యమ ప్రస్థానం ముగిసింది. ఆయిడిసి, బాయిడిసి.. నాన్ననిడిసి సాయుధ బాట పట్టిన మావోయిస్టు నేత మళ్లీ జనం మధ్యకు రానున్నారు. పేద, బడుగు బలహీన వర్గాల కోసం తుపాకీ ఎత్తి రాజీలేని ఉద్యమాన్ని సాగించిన ముప్పిడి సాంబయ్య ఆదివారం జనజీవన స్రవంతిలో కలిశారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా, దండకారణ్య డివిజన్ కమిటీ నేతగా ఉన్న ఆయన తన 14 మంది అనుచరులతో కలిసి ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారన్న వార్త చర్చనీయంశంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన సాంబయ్య సుమారు నాలుగు దశాబ్దాల క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరారు. పదో తరగతి చదువుతున్నప్పుడే ఉద్యమం వైపు.. ముప్పిడి సాంబయ్య 1984లో పదో తరగతి చదువుతున్నప్పుడు ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. వరంగల్ ఉద్యమ పితామహుడు, వరంగల్ జిల్లా కార్యదర్శి పులి అంజన్నను స్ఫూర్తిగా తీసుకొని 1984లో పూర్తిస్థాయి కార్యకర్తగా పార్టీలో చేరారు. మొదట పరకాల ఏరియా దళసభ్యుడిగా, కొద్ది రోజులకే బాబన్న పేరుతో పరకాల – చిట్యాల ఏరియా కమాండర్గా వ్యవహరించారు. పరకాల కమాండర్ నుంచి ఖమ్మం జిల్లాకు జిల్లా కమిటీ సభ్యుడిగా బదిలీ అయ్యి 2002 వరకు అక్కడే ఉన్నారు. 2002 తర్వాత 2018 వరకు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, తూర్పు ఇన్చార్జ్గా భాస్కర్ పేరుతో వ్యవహరించారు. 2018లో ఒడిశా స్టేట్ కమిటీ మెంబర్గా వ్యవహరించారు. 2025లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి స్థానంలో ఒడిశా నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికై కొనసాగుతున్నారు. కాగా, 2013లో కమాండర్ స్థాయి అయిన నిమ్మల సారమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు ఉంది. వివాహం జరగగా ప్రస్తుతం ఆమె జనగామలో ఉంటున్నట్లు పోలీసుల సమాచారం. వికాస్, జంగ్ దాదా ఆయనే.. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పనిచేసిన సాంబయ్య.. వికాస్, జంగ్ దాదా పేర్లతో కూడా పనిచేసి పాపులర్ అయ్యారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జిల్లా కమిటీ సభ్యుడు, కార్యదర్శిగా పనిచేసినప్పుడు సుదర్శన్, వికాస్ పేర్లతో వ్యవహరించారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జంగ్ దాదాగా ఆదివాసీ గిరిజనులతో మమేకమయ్యారు. సాహిత్యంలో అనేక రచనలు చేశారు. సాంబయ్య తల్లిదండ్రులు రామస్వామి–భద్రమ్మ కాగా.. ప్రస్తుతం భద్రమ్మ ఉంది. సాంబయ్య కు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉండగా.. ఒక సోదరుడు సదానందం ప్రభుత్వ టీచర్. ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత, అనుచరులు కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన ముప్పిడి సాంబయ్య పులి అంజన్న స్ఫూర్తితో 42 ఏళ్ల క్రితం ఉద్యమ బాట ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశాలో పనిచేసిన సాంబయ్య ఉమ్మడి వరంగల్ నుంచి మిగిలింది నరహరి, పాండునే.. -
సిబ్బంది సంక్షేమానికే ఫిల్లింగ్ స్టేషన్: డీజీపీ
వరంగల్ క్రైం: పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం మడికొండలోని పోలీస్ శిక్షణ కేంద్రం ప్రాంగణంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు డీజీపీ శివధర్రెడ్డి పేర్కొన్నారు. ఫిల్లింగ్ స్టేషన్ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాల అధికారిక వాహనాల ఇంధన అవసరాల ను ఈ ఫిల్లింగ్ స్టేషన్ తీర్చనున్నట్లు ఆయన తెలి పారు. ఇంధన సరఫరాలో నాణ్యత నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, డీసీపీలు కవిత, అంకిత్ కుమార్, ఏఎస్పీ శుభం, అదనపు ఏసీపీలు సురేశ్కుమార్, శ్రీనివాస్, కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, ఎంటీ ఏసీపీ అంతయ్య, సురేంద్ర ఉన్నారు. పోలీస్ అతిథి గృహం ప్రారంభం కమిషనరేట్ పరిధిలో మరమ్మతులు చేసిన పోలీస్ అతిథి గృహాన్ని డీజీపీ బి.శివధర్రెడ్డి ఆదివారం ప్రారంభించారు. హనుమకొండ పోలీస్ గెస్ట్హౌస్కు చేరుకున్న డీజీపీకి సీపీ సన్ప్రీత్సింగ్, పోలీస్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం డీజీపీ మాట్లాడారు. పోలీస్ శాఖ అధికారుల, అతిథుల సౌకర్యాలను మెరుగుపర్చేలా ఈ అతిథి గృహాన్ని పునర్నిర్మించినట్లు తెలిపారు. డీసీపీలు అంకిత్ కుమార్, కవిత, శుభం నాగ్, అదనపు డీసీపీలు రవి, శ్రీనివాస్, సురేశ్కుమార్ ఉన్నారు. -
సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026
నగరంలో కర్రీ పాయింట్లు, రైతుబజార్లు సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మాంసం, చేపలు, కూరగాయల కర్రీలను అమ్ముతున్నారు. చాలా కేంద్రాల్లో మిగిలిన చికెన్, మాంసాన్ని ఫ్రిజ్లలో నిల్వ చేసి మరుసటిరోజు వేడి చేసి విక్రయిస్తున్నారు. గతంలో బల్దియా ప్రజారోగ్య విభాగం అధికారులు తనిఖీ చేయగా.. కుళ్లిపోయిన మాంసం, బూజుపట్టిన చేప ముక్కలు లభ్యమయ్యాయి.ప్రజల ఆహార భద్రత కోసం నియమించిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 2011 వరకు బల్దియా ప్రజారోగ్యం అధికారులు, సిబ్బంది ఆహార కల్తీ నివారించేందుకు తనిఖీలు చేస్తుండే వారు. ఆ తదుపరి నిబంధనలతో ఆహార కల్తీ నియంత్రణ శాఖ అధికారులు పర్యవేక్షించాలి. కానీ, ఫుడ్సేఫ్టీ అధికారుల కొరతతో ఫిర్యాదులు వస్తేనే స్పందిస్తున్నారు. నమూనాలు సేకరించి చేతులు దులుపుకుంటున్నారు. ఇక పరిశుభ్రతను తనిఖీ చేయాల్సిన బల్దియా ప్రజారోగ్యం అధికారులు, సిబ్బంది పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆహార కల్తీపై హనుమకొండ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ను సంప్రదిస్తే అందుబాటులో లేరు. వరంగల్ అర్బన్: కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా పరిస్థితి మారింది. ఆహారపదార్థాల నుంచి అలంకరణ వస్తువుల వరకు అన్నీ కల్తీమయమే. ధనార్జనే ధ్యేయంగా కొంతమంది ప్యాపారులు చేస్తున్న ఈ దందా ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. ఆహారపదార్థాల్లో కల్తీ నేరుగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొన్ని వెంటనే దుష్ప్రభావం చూపిస్తుండగా.. మరికొన్ని దీర్ఘకాలికంగా చేటుచేస్తున్నాయి. ఉరుకులు, పరుగుల జీవనంలో డబ్బులు ముట్టజెప్పి కడుపు నింపుకుంటూ అనేకమంది రోగాలను కొనుక్కుంటున్నారు. వరంగల్ మహానగరంలోని పలు హోటళ్లు, బిర్యానీ సెంటర్లు, దాబాలు, ఫాస్ట్పుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్ల నిర్వాహకులు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. నిషేధిత రసాయన పౌడర్లు, కల్తీ నూనెలు విచ్చలవిడిగా వాడుతున్నారు. అపరిశుభ్ర వాతావారణంలో వంటలు తయారు చేస్తున్నారు. నిర్వాహకులకు డబ్బు సంపాదన యావ తప్ప కనీస నాణ్యతా ప్రమాణాలు, పరిశుభ్రతపై పట్టింపులేదు. బల్దియా ప్రజారోగ్య విభాగం అధికారులు, సిబ్బంది, ఆహార కల్తీ నియంత్రణ అధికారులు నెలవారీగా మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫిర్యాదు వస్తే మొక్కుబడి తనిఖీలతో చేతులు దులుపుకుంటున్నారు. బిర్యానీ ఘుమఘుమలు.. ఆహా ఏమి రుచి తినరా మైమరిచి అన్నట్లు భోజన ప్రియలు లోట్టలేసుకుంటూ చికెన్, మటన్ బిర్యానీ ఆరాగిస్తున్నారు. బిర్యానీ పాయింట్ల నిర్వాహకులు కస్టర్లమర్లను ఆకట్టుకునేందుకు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. రంగు, రుచి, వాసన కోసం నిషేధిత పౌడర్లను ఉపయోగిస్తున్నారు. బిర్యానీలో వాడే చికెన్, మటన్ కూడా శుభ్రంగా ఉండడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా వాడే నూనెలు అత్యంత ప్రమాదకరంగా ఉంటున్నాయని చెబుతున్నారు. ఎముకలు, కళేబారాల నుంచి తీసిన నూనెలు వాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవి ప్రముఖ బ్రాండ్ల పేరుతో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా అవుతున్నట్లు సమాచారం. ఆహార పదార్థాలను యథేచ్ఛగా కల్తీ చేస్తున్నారు. వంట గదుల్లోకి వినియోగదారులు వెళ్లే అవకాశం లేదు. ఆ గదుల్లోకి నోఅడ్మిషన్ అని బోర్డులు పెడుతుండడంతో అవి రహస్య స్థావరాలుగా మారాయి. చాలా హోటళ్లలో గాలి, వెలుతురు కరువైంది. వడ్డించే వాళ్లు కనీసం చేతులకు గ్లౌజులు, నెత్తికి టోపీలు ధరించడం లేదు. ప్రజారోగ్య విభాగం, ఆహార కల్తీ నియంత్రణ అధికారులు హోటళ్లపై దాడులు చేసినప్పుడల్లా ఆశ్చర్యకర విషయాలు ఎన్నో వెల్లడవుతున్నాయి. వీటి వల్ల ప్రజలు ప్రమాదకర వ్యాధులబారిన పడే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. పాడైపోయిన పదార్థాలతో తయారు చేస్తున్న నిర్వాహకులు వంటల్లో నిషేధిత రసాయన పౌడర్లు, కల్తీ నూనెల వాడకం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం పట్టించుకోని జీడబ్ల్యూఎంసీ, ఆహార కల్తీ నియంత్రణ శాఖ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, కర్రీ పాయింట్లలో పారిశుద్ధ్య తనిఖీలు చేస్తున్నాం. అపరిశుభ్రంగా ఉన్న వాటికి నోటీసులు జారీ చేసి, తదుపరి జరిమానా విధించి వసూలు చేస్తున్నాం. ఆహార కల్తీ తనిఖీ మాది కాదు. – రాజారెడ్డి, సీఎంహెచ్ఓ -
భవిష్యత్ తరాల కోసమే..
మేడారంలో రాతి కట్టడాలుములుగు/తాడ్వాయి: ఆదివాసీల ఆరాధ్యదైవాలు సమక్క, సారలమ్మ వైభవాన్ని భవిష్యత్ తరాలకు తెలపడానికి మేడారంలో 200 ఏళ్లు నిలిచేలా రాతి కట్టడాలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క, ఎంపీ బలరాం నాయక్ కలిసి వన దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దెల చుట్టూ నిర్మించిన రాతి కట్టడాలు, ఆలయ ప్రహరీ, ప్రధాన ఆర్చ్లు, సాండ్ స్టోన్ శిల్పాలు, డ్రెయినేజీ వ్యవస్థ, మీడియా టవర్, గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన గ్రిల్స్, ఆలయ ఫ్లోరింగ్ తదితర పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మేడారం హరిత హోటల్లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో జాతర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇటీవల మేడారం మహాజాతరను అద్భుతంగా నిర్వహించామని, జాతర విజయవంతానికి కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. సుమారు కోటి 50 లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారని తెలిపారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, లక్ష్మణ్ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతంగా నిర్వహించామన్నారు. జంపన్న వాగులో సంవత్సరమంతా నీరు ఉండేలా గోదావరి జలాలను తీసుకురావా లని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకోసం ఐదు చెక్ డ్యామ్లు నిర్మించి నీటి నిల్వను పెంచే ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ గతంలో మేడారం జా తర పూర్తయిన తర్వాత సమీక్షలు జరగలేదన్నారు. కానీ ఈసారి జాతర అనంతరం కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి మిగతా పనులు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించిందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం వాహనంలో జంపన్న వాగు, ఊరట్టం, చిలకలగుట్ట, ఆర్టీసీ జంక్షన్ పరిసరాలను పరిశీలించారు. గోదావరి పరీవాహక ప్రాంతమైన బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న దేవాలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్ మహేందర్జీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ములుగు మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఈఓ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి , పక్కన మంత్రి సీతక్కఅమ్మవార్లను దర్శించుకుంటున్న మంత్రులు పొంగులేటి, సీతక్క జంపన్న వాగులో నిరంతరం గోదావరి నీరు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలన -
విభిన్న సెట్టింగులు.. చిన్నారుల ఫొటోలు
ఇదివరకు ఎవరైనా ఇంటికొస్తే కాసేపు మాట్లాడాక ఫొటో ఆల్బమ్ ముందు పెట్టేవాళ్లు. ఫొటోలు చూపిస్తూ సరదాగా గడిపేవాళ్లు. ఇప్పుడు టీవీలు ఆన్ చేస్తున్నారు. ఫొటో షూట్లు, వీడియో ఆల్బమ్లు చూపిస్తున్నారు. డిఫరెంట్ లొకేషన్లలో భారీ సెట్టింగుల్లో దిగిన ఫొటోలు, మంచి మంచి లొకేషన్లలో, ఆకట్టుకునే పాటలతో తయారు చేసిన వీడియోలు ప్లే చేస్తున్నారు. చిన్నారుల జ్ఞాపకాలు చిరకాలం పదిలంగా ఉండేలా ఆల్బమ్లు రూపొందిస్తున్న స్టూడియోలపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.. – ఖిలా వరంగల్ఫొటోలు తీసుకునేందుకు ఒకప్పుడు పార్కులు, నది, సముద్రతీరాలు, చారిత్రక కట్టడాల వంటి ప్రదేశాలకు వెళ్లేవాళ్లు. ఇప్పుడు వాటినే మన ముందుకు తీసుకొచ్చారు ఫొటో స్టూడియోల నిర్వాహకులు. డిఫరెంట్ సెట్లతో బేబీ ఫొటో స్టూడియోలు ఎక్కడికక్కడ ఏర్పాటయ్యాయి. బేబీ ఫొటో షూట్ ట్రెండ్ ఏళ్ల కిందటి నుంచే ఉన్నప్పటికీ ఈ మధ్య ఈ విధానంపై గ్రేటర్ వరంగల్ వాసుల ఆసక్తి మరింత పెరిగింది. అంతేకాకుండా ఇటీవల వచ్చిన ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా సృజనాత్మకతంగా చూపించడంతో అందరి దృష్టి ఫొటో షూట్వైపు పడుతోంది. ప్రస్తుతం ఇదొక ఆనవాయితీగా మారిందని ఫొటో స్టూడియోల నిర్వాహకులు చెబుతున్నారు. అభిరుచికి అనుగుణంగా.. పిల్లల తల్లిదండ్రుల అభిరుచి మేరకు ఏదైనా విభిన్న సెట్ కావాలంటే.. అదనపు ఖర్చుతో నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. చారిత్రక కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ మధ్యకోటలో మనసుదోచేలా ఆహ్లాదం కల్పించేలా భారీ సెట్లతో స్టూడియో ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాలోని చిన్న పిల్లల మనసు దోచేస్తున్నారు. ఇటీవల కాలంలో మధ్యతరగతి వర్గాలు సైతం ఈషూట్లపై ఆసక్తి కనబరుస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అందరికీ అందుబాటులో ధరలు బేబీ స్టూడియోలు మధ్యకోట, వరంగల్, మహబూబాబాద్, ములుగు, రామప్ప, భూపాలపల్లి, కాళేశ్వరం, జనగామ జిల్లా, మండల కేంద్రాల్లోనూ ఉన్నాయి. ఇవి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో తెరిచి ఉంటాయి. బర్త్ డే అల్బమ్ కోసం రూ.10 వేల నుంచి రూ. 25వేల వరకు చార్జ్ చేస్తున్నారు. స్టూడియోలో ఏదైనా ఆట వస్తువులు ఉపయోగించుకుంటే రూ.1500 నుంచి రూ.2500 వసూలు చేస్తున్నారు. వారాంతాల్లో అయితే వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఫొటోగ్రాఫర్ను ఔత్సాహికులు తెచ్చుకుంటే.. గంటకు రూ.1,500 చార్జ్, అదే నిర్వాహకుల ఫొటోగ్రాఫర్ అయితే గంటకు రూ.2,500 వరకు తీసుకుంటామని చెబుతున్నారు. వీటి ఏర్పాటుకు దాదాపు రూ.8 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఓ స్టూడియో నిర్వాహకుడు పేర్కొన్నారు. బర్త్డేకు ఫొటో షూట్ చేయించాం.. మా బాబు ఫస్ట్ బర్త్డేను ప్రత్యేకమైన రోజుగా చూస్తున్నాం. తీపి గుర్తు కోసం బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి జన్మదిన వేడుకులు జరుపుకున్నాం. బర్త్డే అంటే స్పెషల్ డేగా గుర్తించి ఆధునిక హంగులతో కూడిన బేబీ స్టూడియోలో ఫొటో షూట్ చేయించాం. తరచూ ఫొటోలు, వీడియోలు చూసి జ్ఞాపకాలు గుర్తు చేస్తూ సంతోషిస్తున్నాం. – అయాన్తో తల్లిదండ్రులు అఖిల, జూహకర్ పిల్లలు మెచ్చేలా.. చిన్నారులు ఇష్టపడే బాహుబలి, పోలీస్ స్టేషన్, విమానం, బేబీ షవర్, జీప్ డ్రైవింగ్, ఉయ్యాల, నది వంతెన, ట్రైన్, బైక్, గార్డెనింగ్, చారిత్రక అందాల సీన్స్ వంటి సెట్లను స్టూడియోల నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. తాజ్మహల్, కొలనులు, స్విమ్మింగ్ పూల్, దేవాలయం, గ్రామీణ నేపథ్యం ఉండే సెట్లు సైతం వీరి వద్ద అందుబాటులో ఉంటున్నాయి. సెట్కు తగిన మేకప్ కిట్లు, దుస్తులు స్టూడియోలోనే అందుబాటులో ఉంచుతున్నారు. కొన్నింటిలో పుట్టిన రోజు వేడుకలు సైతం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఏడాది వయస్సు చిన్నారుల నుంచి ఐదేళ్ల పిల్లల కోసం ప్రత్యేక సెట్లు స్టూడియోల్లో అందుబాటులో ఉన్నాయి. ఆకట్టుకుంటున్న స్టూడియోలు సమయానుగుణంగా ధరలు ఏఐ సాంకేతికతతో మరింత క్రేజ్ -
అధికారంలో ఉన్నప్పుడు రైల్వే కోచ్ గుర్తుకురాలేదా?
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్కు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుర్తుకురాలేదా? అని మాజీ మంత్రి హరీశ్రావును వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీశ్రావు శనివారం కాజీపేట పర్యటనపై ఎమ్మెల్యే నాయిని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య మంత్రిగా రూ.20 కోట్లు మంజూరు చేసి 54 ఎకరాల స్థలాన్ని కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేటాయించారన్నారు. వరంగల్ ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని, పర్యటనల పేరుతో పదేళ్లు పబ్బం గడిపింది మీరు కాదా? అని ప్రశ్నించారు. 15 ఏళ్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మాజీలంతా కాజీపేటకు చేసిందేంటో చెప్పాలన్నారు. కాజీపేట రైల్వే ఉద్యోగులకు స్థానికత క్రమంలో ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. మాజీ మంత్రి హరీశ్రావు కాజీపేట పర్యటన.. స్వామి కార్యం, స్వకార్యంగా ఉందని హేళన చేశారు. సీఎం రేవంత్ను కలిసిన నాయిని సీఎం రేవంత్రెడ్డిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిశారు. వరంగల్ వైద్య రంగ అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై చర్చించారు. ఇటీవల కేఎంసీ, ఎంజీఎం ఆస్పత్రుల అభివృద్ధి కోసం ఆర్థిక సాయం ప్రకటించిన ఎన్ఆర్ఐ డాక్టర్ సుజిత్రెడ్డిని సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. సొంతగడ్డపై మమకారంతో వైద్య రంగానికి చేయూతను అందించడం అభినందనీయమన్నారు. ఈసందర్భంగా సుజిత్రెడ్డి సీఎం రేవంత్రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి, విష్ణురెడ్డి ఉన్నారు. -
మూడేళ్లుగా మంచానికే పరిమితం
హన్మకొండ చౌరస్తా: రెక్కల కష్టమే పెట్టుబడిగా పెట్టి కుటుంబాన్ని కంటికి రెప్పలా సాకుతున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయప డ్డాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అత డి భవిష్యత్ అంధకారంగా మారింది. కొడుకుకు జరిగిన ప్రమాదం చూసి తట్టుకోలేక తల్లి ప్రేమలీల మనోవేదనతో అనారోగ్యానికి గురై ఏడాదికే చని పోయింది. యువకుడి తండ్రి బాబు మేసీ్త్ర పని చేసి కొడుకు, కోడలు, మనువళ్లను కొంతకాలం సాకా డు. ఇప్పుడు అతడు కూడా వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో ఏమి చేయలేని దుస్థితిలో కన్నీళ్లును దిగమింగుతూ జీవితం గడుపుతున్నాడు. వివరాల్లో కి వెళ్తే.. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎల్కుర్తి హవేలీకి చెందిన మైదం ప్రవీణ్ పేదరికంతో చదువు మధ్యలో (డిగ్రీ)నే ఆపేశాడు. ప్రవీణ్కు భా ర్య మౌనిక, పిల్లలు రేచల్శ్రేష్ట, సాహస్ప్రిన్స్, ప్రశస్థ ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ నిమి త్తం ప్రతీ రోజు వరంగల్కు వచ్చి హమాలీ పనిచేసి తిరిగి ఇంటికెళ్లేవాడు. 2022లో పని ముగించుకుని వరంగల్ నుంచి స్వగ్రామం వెళ్తున్నాడు. మొగి లి చర్ల క్రాస్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని వెళ్లింది. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ను అక్కడే ఉ న్న వారి సాయంతో అంబులెన్స్లో ఎంజీఎం తరలించారు. ఇక్కడ ఏడాది పాటు చికిత్స పొందిన ప్ర వీణ్ను మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. అక్కడ పది రో జులు అబ్జర్వేషన్లో ఉంచిన వై ద్యులు హైదరాబా ద్ నిమ్స్ తీసుకెళ్లాని సూచించారు. పరీక్షలు చేసిన నిమ్స్ వైద్యులు స్పైనల్కార్డ్ సర్జరీ చే యాలన్నారు. అయితే అప్పటికే ప్రవీణ్ చాతీలో రక్తం గడ్డకట్టిందని, కొంత సమయం పడుతుందని చెప్పారు. ఆర్థికభారం భరించలేక ఇంటికి చేరుకున్నారు. సర్జరీకి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు .. సర్జరీకి రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపినట్లు ప్రవీణ్ కన్నీరుమున్నీరవుతూ తెలిపాడు. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ప్రవీణ్కు ఆర్థిక స్థోమత లేకపోవడంతో సర్జరీ నిలిచిపోయింది. పిల్లలతోపాటు భర్తకూ నిరంతరం సేవలు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ మూడేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. భార్య మౌనిక తన ముగ్గురు చిన్న పిల్లలతో సహా ప్రవీణ్ ను సైతం పాపలా చూసుకుంటుంది. జీఎన్ఎం నర్సింగ్ చేసిన మౌనిక ప్రైవేట్ ఉద్యోగం చేద్దామంటే పిల్లలు, భర్తను చూసుకునేవారు లేక ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి అంటూ బాధితుడు కన్నీటి పర్యంతమవుతున్నాడు. కనికరించని కార్మికశాఖ .. ప్రవీణ్ కార్మికశాఖ గుర్తింపు కార్డు కలిగి ఉన్నాడు. ఆ శాఖ నిబంధన ప్రకారం గుర్తింపు కార్డు కలిగిన వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం పొందితే రూ. 3 లక్షల నుంచి రూ.4 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. ప్రవీణ్ అంగవైకల్యం పొంది నట్లు ఎంజీఎం వైద్యులు ధ్రువీకరించిన తాత్కాలిక సర్టిఫికెట్ కార్మికశాఖలో అప్పగించారు. అయినా అధికారులు నిబందనల పేరుతో ఏడాదిగా తిప్పించుకుంటున్నారని ప్రవీణ్ భార్య మౌనిక కన్నీటి ప ర్యంతమవుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు , ప్రజాప్రతినిధులు స్పందించి కార్మికశాఖ ద్వారా నష్టపరిహారం ఇప్పించాలని వేడుకుంటుంది. యువకుడి భవిష్యత్ అంధకారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు ఏడాదిగా కార్మికశాఖ చుట్టూ ప్రదక్షిణ నిబంధనల పేర దరఖాస్తు తిరస్కరణ ఆదుకోవాలని కుటుంబం వేడుకోలుదాతలు ఆదుకోండి.. ‘మూడు సంవత్సరాలుగా తీవ్ర అవస్థలు పడుతున్నాం, దయచేసి తమను ఆదుకోవాలి’ అని ప్రవీణ్, అతడి భార్య మౌనిక చేతులెత్తి వేడుకుంటున్నారు. ఆర్థిక సాయం చేయాలనుకునే దాతలు గూగుల్పే, ఫోన్పే నంబర్ 90006 85709 తోపాటు ప్రవీణ్ బ్యాంకు అకౌంట్ నంబర్ 520191056074030 యూనియన్ బ్యాంకు, ఊకల్ హవేలీ బ్రాంచ్, IFSC CODE NO : UBIN 0903027 నంబర్కు పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
పాట ఓ చైతన్య కెరటం
భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలి● సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ ● తెలుగు సినిమా గేయ రచనపై సదస్సు ● ‘గేయ పరిమళాలు’ పుస్తకావిష్కరణ హన్మకొండ కల్చరల్: నిబద్ధత క్రమశిక్షణ సంస్కారవంతమైన భాషతో చేసే రచనే గేయమని, సాహిత్య ప్రక్రియల్లో పాట చాలా గొప్పదని సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ అన్నారు. శనివారం వరంగల్ హంటర్రోడ్డులోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో తెలుగు సినిమా గేయ రచన సదస్సు, పీఠం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నోముల రాజు సంపాదకత్వంలో ప్రచురించిన సినీ గేయ వ్యాస సంకలనం ‘గేయ పరిమళాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా మౌనశ్రీ మల్లిక్, విశిష్ట అతిథులుగా కేయూ విశ్రాంత ఆచార్యులు పంతంగి వెంకటేశ్వర్లు, జానపద గాయకులు పత్తిపాక సురేందర్, కవి, రచయిత, విశ్రాంత ఉపాధ్యాయులు గోవిందం లక్ష్మీనర్సయ్య గేయ రచనలపై ప్రసంగించారు. అనంతరం అతిథులు ‘గేయ పరిమళాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించి సంపాదకుడు నోముల రాజును అభినందించారు. పీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పీఠం సిబ్బంది ఆమేర్ అలీఖాన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు దామోదర్, సురేశ్, రవికుమార్, గోపాల్రెడ్డి, సతీశ్, సునీత, విద్యార్థులు పాల్గొన్నారు. కాళోజీ సెంటర్: విద్యార్థులు చక్కగా చదువుకొని భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలని వరంగల్ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నరసింహమూర్తి సూచించారు. వరంగల్ మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇన్చార్జ్ హెచ్ఎం శ్రీనివాసరావు అధ్యక్షతన టెన్త్ విద్యార్థులకు శనివారం స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయుడు భిక్షపతి, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి
వరంగల్ లీగల్: ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు నిర్మల గీతాంబ, బి.అపర్ణ సూచించారు. శనివారం జిల్లా కోర్టు భవన ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవా సంస్థ (డీఎల్ఎస్ఏ)ఆధ్వర్యంలో సుబేదారిలోని అమృత వెల్నెస్ సెంటర్ సహకారంతో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. క్యాంపును న్యాయమూర్తులు ప్రారంభించారు. ఈశిబిరంలో రక్తపోటు, బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి నిపుణులు ఆరోగ్య పరిరక్షణపై సూచనలందించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయికుమార్, జి.రామలింగం, హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పులి సత్యనారాయణ, వివిధ కోర్టుల న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టుల సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. -
బాలవికాస సేవలు ఆదర్శనీయం
కాజీపేట రూరల్ : బాలవికాస సేవలు ఆదర్శనీయమని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. శనివారం కాజీపేట ఫాతిమానగర్లోని బాలవికాసలో తాగునీటి శుద్ధీకరణ పథకాల కమిటీల మహాసభ నిర్వహించారు. ఎమ్మెల్యేలు నాయిని రా జేందర్రెడ్డి, కె.ఆర్.నాగరాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీ కావ్య ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నీరు జీవనానికి అత్యవసరమన్నారు. బాలవికాస వెంట ఉంటే గ్రామం ఆదర్శంగా మారుతుందన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ సమాజంలో బాలవికాస వివిధ రకాల సేవలు, అభివృద్ధి ఆదర్శనీయమన్నారు. వర్ధన్నపేట ఎ మ్మెల్యే కె.ఆర్.నాగరాజు మాట్లాడుతూ నేటికి పరి శుభ్ర తాగునీరు అందుబాటులో లేని ప్రజలు ఇంకా ఉన్నారని, అలాంటి వారికి సేవ చేయడం గొప్ప అన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ ద్వారా మాట్లాడుతూ బాలవికాస సమాజ హిత కార్యక్రమాలు అభినందనీయమన్నారు. గ్రామాల్లో నీటి శుద్ధికరణ కేంద్రాలకు ఉచిత విద్యుత్ కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు మాట్లాడుతూ బాలవికాస వ్యవస్థాపకురాలు బాలథెరిసా సేవలు అద్భుతమని, బాలవికాస ప్రాజెక్ట్లు ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. బాలవికాస వ్యవస్థాపకురాలు బాలథెరిసా జింగ్రాస్ కెనడా నుంచి ఆన్లైన్లో మాట్లాడుతూ బాలవికాస ఈ రోజు 1,600 మంది సభ్యులు, అన్ని గ్రామాలు కలిసి ఒకే కుటుంబంగా మారడం గొప్ప విషయమన్నారు. ఈ కుటుంబాన్ని ఐక్యంగా నిర్మించారన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు డాక్టర్ టి.రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి, బాలవికాస సిబ్బంది, పలు రాష్ట్రాలకు చెందిన 3వేల మంది కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య తాగునీటి శుద్ధ్ధీకరణ పథకాల కమిటీల మహాసభ -
మోడల్ రాకెట్ విఫలం
ప్రయోగం తుస్.. వీక్షకుల నిరాశ నయీంనగర్: సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం భద్రకాళి చెరువులోని ఐలాండ్పై ఏర్పాటుచేసిన రుద్రమ–1 మోడల్ రాకెట్ లాంచ్ తుస్మంది. పట్టుమని వంద అడుగులు కూడా ఎగరలేదు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మోడల్ రాకెట్ లాంచింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ‘కుడా’ ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించింది. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మోడల్ రాకెట్ రూపకర్త శశాంక్ భూపతి తొలుత చిన్న రాకెట్ను లాంచ్ చేయగా.. కొన్ని అడుగుల ఎత్తులోకి వెళ్లి కొంత దూరంలో నేల కూలింది. కొంత సమయం తర్వాత మరో రాకెట్ను ప్రయోగించగా అది కూడా తుస్మంటూ చెరువులో పడింది. మోడల్ రాకెట్ విఫలం కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వేల సంఖ్యలో తరలివచ్చిన స్కూల్ విద్యార్థులు, యువత, సైన్స్, ఖగోళప్రియులు, నగర ప్రజలు నిరాశ చెందారు. మోడల్ రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు వచ్చిన వారిలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త శేషగిరిరావు, వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్ అంజన్ కుమార్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్ సెక్రెటరీ, డైరెక్టర్ ఎన్.రఘునందన్ కుమార్, ‘కుడా’, పోలీస్, ఇతరశాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
బాల్య వివాహాలను ప్రోత్సహించడం నేరం
కాళోజీ సెంటర్: బాల్య వివాహాలను ప్రోత్సహించడం నేరమని వరంగల్ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రాజ్నిధి అన్నారు. మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలపై శనివారం నిర్వహించిన చైతనకార్యక్రమంలో జడ్జి మాట్లాడారు. బాల్య వివాహాలు ఉన్నత చదువులకు ఆటంకమని పేర్కొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు భవిష్యత్ అంధకారం అవుతుందని పేర్కొన్నారు. హెచ్ఎం కె.అరుణ, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, భిక్షపతి, షౌకత్ అలీ, రమేష్, అజయ్బాబు, వంశీ మోహన్, ప్రభాకర్, పూర్ణిమ, సుభాషిణి, అరుణ, చంద్రకళ విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా పాఠశాలలో జరిగిన సైన్స్ దినోత్సవంలో జడ్జి పాల్గొని మాట్లాడారు. -
గంజాయి నుంచి యువతను కాపాడుకుందాం
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం : గంజాయి మత్తు నుంచి యువతను కాపాడుకుందామని వరంగ ల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. ఈ మేరకు శనివారం కాకతీయ మెడికల్ కళా శాలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి వినియోగదారుడిని పట్టుకోవడంతో బాధ్యత అయిపోతుందని అనుకోవద్దని, గంజాయిని విక్రయించే వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని పేర్కొన్నారు. అలాగే, పేకాటరాయుళ్లపై కఠినంగా వ్యవహరించాలన్నారు. చోరీలకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్లను తెరవాలని, అధికంగా చోరీలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అదే విధంగా ఎంజీఎం, రైల్వే స్టేషన్ల ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలన్నారు. ఇసుక, రేషన్ అక్రమ రవాణాపై స్టేషన్ అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించా రు. డీసీపీలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, కవిత, శుభంనాగ్తోపాటు అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. మాల సంఘాల జేఏసీ కన్వీనర్గా లక్ష్మీనారాయణకాళోజీ సెంటర్: మాల సంఘాల జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్గా పొనగంటి లక్ష్మీనారాయణను నియమిస్తూ రాష్ట్ర చైర్మన్ మందాల భాస్కర్, గౌరవ అధ్యక్షుడు చెరుకు రామచందర్, విద్యార్థి జేఏసీ చైర్మన్ మాదాసి రాహుల్రావు ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్లో శనివారం నిర్వహించిన మాల సంఘాల సమావేశంలో అడ్హక్ కమిటీని ఎన్నుకున్నారు. కోకన్వీనర్లుగా శేషాద్రి నాగులు, దండ్రి శ్రీనివాస్, పోతుల కొమ్మాలు, వంగేటి రాజమౌళి, గురిమిల్ల రాజు, బుజుగుండ్ల శ్రీనివాస్, వంగేటి ప్రభాకర్ నియమితులయ్యారు. -
కొమ్మాల జాతరను ప్రశాంతంగా నిర్వహించాలి
● భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి ● సమీక్షలో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ గీసుకొండ: కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలని, జాతర విజయవంతానికి రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని ఈస్ట్జోన్ డీసీసీ అంకిత్కుమార్ అన్నారు. హనుమకొండ పోలీస్ హెడ్క్వార్టర్లోని తన కార్యాలయంలో వరంగల్ జిల్లా గీసుకొండ, దుగ్గొండి, నర్సంపేట మండలాలకు చెందిన ప్రధాన పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులతో శనివారం జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్–నర్సంపేట రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలని, ప్రభబండ్లతో వచ్చే వారు సంయమనం పాటించి గొడవలు జరగకుండా చూసుకోవాలన్నారు. గొడవలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గొడవలకు పాల్పడవద్దని నోటీసులు జారీ చేయగా.. తాము జాతర ప్రశాంతంగా జురగడానికి సహకరిస్తామని ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు డీసీపీకి మాట ఇచ్చారు. మామునూరు, నర్సంపేట ఏసీపీలు వెంకటేశ్, రవీందర్రెడ్డి, గీసుకొండ, దుగ్గొండి, నర్సంపేట ఇన్స్పెక్టర్లు విశ్వేశ్వర్, సాయిరమణ, శ్రీనివాస్, గీసుకొండ తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, రాజకీయ నాయకులు అల్లం బాలకిశోర్రెడ్డి వీరగోని రాజ్కుమార్, తుమ్మనపల్లి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ పోలీసు ధర్మారావు, సర్పంచ్ బోడకుంట్ల ప్రకాశ్, కన్నెబోయిన ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
న్యూశాయంపేట: గురుకుల పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెల్లో విద్యార్థులు చిట్టీల రూ పంలో తెలియజేసిన సమస్యలను పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులు బోధన సరిగా చేయడం లేదని, ప్రిన్సిపాళ్లతో ఇబ్బందులు పడుతున్నామని తదితరల సమస్యలపై విద్యార్థులు ఫిర్యాదు పెట్టెల్లో చిట్టీలు వేశారు. ఈమేరకు కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన ఆర్సీఓల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును క్షుణంగా చదివి పరిశీలించాలని, విద్యార్థుల పేర్లను గోప్యంగా ఉంచి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఆర్సీఓలను ఆదేశించారు.సమావేశంలో డీబీసీడీఓ పుష్పలత, డీఎస్డీఓ భాగ్యలక్ష్మి, డీఎండబ్ల్యూఓ టి.రమేశ్, డీఈఓ రంగయ్యనాయుడు, డీడబ్ల్యూఓ రాజమణి, జీసీడీఓ ఫ్లోరెన్స్, టెమ్రిస్ ఆర్ఎల్సీ డాక్టర్ జంగా సతీశ్, ఆర్సీఓలు పాల్గొన్నారు. -
బైక్ స్టంట్స్.. ప్రో షో అదుర్స్
● రణీనా రెడ్డి జోష్.. విద్యార్థుల కేరింతలు ● ముగిసిన నిట్ స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకలుకాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో నిర్వహిస్తున్న రెండు రోజుల సంస్కృతీసంప్రదాయాల వసంతోత్సవం స్ప్రింగ్స్ప్రీ–26 శనివారం ముగిసింది. వేడుకలకు దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు హాజరై రెండు రోజులపాటు ఉత్సాహంగా గడిపారు. రెండో రోజు స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకల ముగింపులో భాగంగా నిట్ మీడియా క్లబ్ ఆధ్వర్యంలో ‘డిటెక్టివ్ కనుక్కో నీ మేధస్సు’ అంటూ పోటీ పడ్డారు, అచ్చం సినిమాలను తలపించేలా క్రైమ్ సీన్ రీక్రియేషన్, బెస్ట్ ఆఫ్ వేస్ట్ పర్యావరణ పరిరక్షణకు, ఐడల్ సింగింగ్ పోటీ, మాక్ పార్లమెంట్ తదితర ఉత్సాహ భరిత పోటీలతో కల్చరల్ఫెస్ట్ ముగిసింది. అలరించిన బైక్ స్టంట్స్.. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్టంట్స్ టీం ప్రదర్శనలు అదరగొట్టాయి. ‘వీ ఆర్ రాయల్ వీ డు బైక్ స్టంట్స్ రాయల్లీ’ అంటూ విద్యార్థుల నడుమ స్టంట్స్తో దూసుకుపోయారు. బైక్ ముందు టైర్ గాల్లోకి లేపి చేసిన స్టంట్స్తోపాటు బ్యాక్ డ్రైవింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బైక్స్టంట్స్ వీక్షిస్తున్న విద్యార్థులు కేకలతో హోరెత్తించారు. రాత్రి ప్రోషోలో సింగర్ రణీనా రెడ్డి తన గీతాలాపనతో విద్యార్థుల్లో జోష్ నింపింది. నిట్లో స్ప్రింగ్ స్ప్రీ వేడుకల్లో భాగంగా విద్యార్థుల బైక్ విన్యాసాలు -
గాదె ఇన్నయ్య ఇంట్లో మరో విషాదం..
● అనారోగ్యంతో తండ్రి సాల్మన్రెడ్డి మృతి జఫర్గఢ్ : సామాజిక ఉద్యమకారుడు, మాఇల్లు అనాథ ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నయ్య ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి థెరిసమ్మ మృతి చెందిన నెలన్నర రోజులకే తండ్రి సాల్మోన్రెడ్డి శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. మండలంలోని సాగరంలో ఉంటున్న సాల్మోన్రెడ్డి కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అలాగే, ఇటీవల తన భార్య థెరిసమ్మను కోల్పోవడం.. కుమారుడు జైలులో ఉండడంతో మానసికంగా కృంగిపోయాడు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. కాగా, మావోయిస్టులను ప్రోత్సహిస్తున్నారనే కారణంతో ఎన్ఐఏ డిసెంబర్ 21న ఇన్నయ్యను అరెస్ట్ చేసిన విషయం విధితమే. అప్పటి నుంచి ఇన్నయ్య హైదరాబాద్లోని చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. ఇటీవల తల్లి థెరిసమ్మ చనిపోవడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఇన్నయ్య రెండు సార్లు కండీషన్ బెయిల్పై వచ్చాడు. ఈ ఘటన జరిగి 43 రోజులు గడవక ముందే తండ్రి సాల్మోన్రెడ్డి కన్నుమూశాడు. దీంతో మళ్లీ తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కుటుంబీకులు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు.. ఇన్నయ్యకు రెండు రోజులు కండీషన్ బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఇన్నయ్య ఆదివారం స్వగ్రామం చేరుకోనున్నారు. రేపు లేదా ఎల్లుండి తండ్రి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి
ఖిలా వరంగల్: రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ విధానం అమలు చేయాలని, లేనిపక్షంలో కంట్రాక్ట్, ఔట్స్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రత్యక్ష పోరాటాలు తప్పవని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి యూసుఫ్ హెచ్చరించారు. శనివారం వరంగల్ శివనగర్లోని సీతారామచంద్రస్వామి కల్యాణ మండపంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహా సభలు ప్రారంభమయ్యాయి. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న కార్మికుల కష్టాన్ని కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. కార్మికులకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో వారి జీవనం దినదిన గండంగా సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నర్సింహ మాట్లాడుతూ ప్రధాని మోదీ విధానాలతో దేశ కార్మిక వర్గం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోందన్నారు. పాత ఏజెన్సీలను రద్దు చేసి కార్మికులకు రూ. 26వేల కనీస వేతనం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ బాషుమియా, గన్నారపు రమేశ్, ఎం. లక్ష్మి బాయి, హసీనాబేగం, దేవేందర్రెడ్డి, ఓమయ్య, దండు లక్ష్మ ణ్, చెన్న కేశవులు, ఎండి యాకూబ్, పార్వతి, బోగి ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.● ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ ● రాష్ట్ర నాలుగో మహా సభలు ప్రారంభం -
కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టత ఇవ్వాలి
కాజీపేట రూరల్: రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలివ్వడంలో, కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రం చేయడంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్రావు అన్నారు. కాజీపేట చౌరస్తాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం ‘కోలువుల కోసం కోట్లాట’ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. హరీశ్రావు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పోరాటం, పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు 50 ఏళ్ల కృషి ఫలితంగానే కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీ వచ్చిందన్నారు. ‘కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధమవుతోందని, కానీ, కోచ్ఫ్యాక్టరీలో అసలు కోచ్లు తయారవుతాయా? వ్యాగన్లు తయారవుతాయా? అసలు ఎంత మందికి ఉద్యోగాలిస్తారు? భూమి ఇచ్చిన అయోధ్యపురం గ్రామస్తులకు ఎన్ని ఉద్యోగాలు, స్థానికులకు ఎన్ని ఇస్తున్నారో తేల్చి కేంద్రం గెజిట్ ఇవ్వాలి’ అని అన్నారు. స్థానికులకు 70 శాతం ఉద్యోగాలివ్వాలి.. కేంద్రం లాతూర్, అస్సాం కోచ్ ఫ్యాక్టరీలో మాదిరి ఇక్కడ కూడా స్థానికులకు 70 శాతం ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. స్థానికులకు ఉద్యోగాలివ్వకపోతే ప్రారంభోత్సవానికి వచ్చే బీజేపీ మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు, కాజీపేట డివిజన్ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ ఒప్పించాలన్నారు. ఏపీలో విశాఖ రైల్వే జోన్ చేసినట్లు, కాజీపేట డివిజన్గా చేయాలని అందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, ఎంపీలు ప్రధాని మోదీతో మాట్లాడాలన్నారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ మట్లాడుతూ.. రైల్వే కోచ్ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు, కాజీపేట డివిజన్ కోసం కాజీపేట నుంచి ఢిల్లీ వరకు దశల వారీగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ధర్నాలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు టి.రాజయ్య, అరూరి రమేశ్, శంకర్నాయక్, పెద్ది సుదర్శన్రెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, కె.యాదవరెడ్డి నాయకులు పాల్గొన్నారు. కాజీపేటను రైల్వే డివిజన్ చేసేవరకు పోరాడుతాం స్థానికులకు ఉద్యోగాలివ్వకపోతే ఉద్యమం ఉధృతం.. ‘కొలువుల కోసం కొట్లాట’లో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్రావు -
పురోగతి సాధనే వికసిత్ భారత్ లక్ష్యం
కేయూ క్యాంపస్: దేశంలో పేదరిక నిర్మూలన, ఆరోగ్యసేవల విస్తరణ, మహిళా సాధికారత, డిజిటల్ చేర్పువంటి కీలకరంగాల్లో పురోగతి సాధించటమే వికసిత్ భారత్ –2047 లక్ష్యంగా ఉండాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం అన్నారు. కేయూలో సోషల్ సైన్సెస్ విభాగాల ఆధ్వర్యంలో రెండురోజులుగా సెనెట్ హాల్లో నిర్వహిస్తున్న జాతీయ సదస్సు ముగింపు సభలో శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. డేటా ఆధారిత విధానాలు, రియల్టైమ్ మానిటరింగ్ వ్యవస్థలు, గ్రీన్ ఎకనామీ, పునరుత్పాదక శక్తి వాతావరణ చర్యలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య మనోహర్ మాట్లాడుతూ.. వికసిత్ భారత్ సాధన కేవలం ఆర్ధిక వృద్ధి మాత్రమే కాకుండా సమానత్వం, పర్యావరణ సమతుల్యత, సామాజిక న్యాయం, సాంకేతిక ప్రగతి సమన్వయంతో కూడిన సమగ్రాభివృద్ధి ఉండాలన్నారు. ఈ సభలో కేయూ యూజీసీ కోఆర్డినేటర్ ఆచార్య మల్లికార్జున్రెడ్డి, సోషల్ సైన్స్ డీన్ ఆచార్య సురేష్లాల్, వివిధ విభాగాల అధిపతులు సంగాని మల్లేశ్వర్, రాధికారాణి, చిలువేరు రాజ్కుమార్, మామిడి లింగయ్య, సంకినేని వెంకట్, శ్రీనివాసులు, మేఘనరావు తదితరులు పాల్గొన్నారు.11 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్ ● రూ.59,340 నగదు.. 11 సెల్ఫోన్లు స్వాధీనం వరంగల్ క్రైం: హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుగా పేకాట ఆడుతున్న శిబిరంపై దాడులు నిర్వహించి 11మందిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదవనగర్లో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.59,340 నగదు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేకాట ఆడుతూ పట్టుబడినవారిలో మల్లారెడ్డిపల్లికి చెందిన అల్ల వెంకటేష్, పద్మాక్షిగుట్ట ప్రాంతానికి చెందిన బొంత రామకృష్ణ, రెడ్డిపాలేనికి చెందిన గట్ల రామాలింగారెడ్డి, హనుమన్నగర్కు చెందిన బానోతు రాజు, మధ్యకోటకు చెందిన మేకల రాజు, రంగశాయిపేటకు చెందిన వేములపల్లి అశోక్, రాంనగర్కు చెందిన బానోతు వర్మ, వంగపాడుకు చెందిన ముసుకు రాజశేఖర్, కొత్తవాడకు చెందిన వంగ విజేందర్, గుడిబండల్కు చెందిన ముసుకు ప్రవీణ్, వంగపహాడ్కు చెందిన సాధు ధనుంజయ్ ఉన్నట్లు తెలిపారు. తదుపరి చర్యల కోసం హనుమకొండ పోలీసులకు నిందితులను అప్పగించినట్లు తెలిపారు. టాస్క్ఫోర్స్ దాడిలో ఇన్స్సెక్టర్ రాజు, ఆర్ఎస్సై భానుప్రకాశ్ పాల్గొన్నట్లు తెలిపారు. సౌందరరాజన్ మృతికి సంతాపంహన్మకొండ కల్చరల్: చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధానార్చకుడు, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ సౌందరరాజన్ శుక్రవారం వయోభారం, అనారోగ్యంతో మృతిచెందడంతో ఆయన మృతికి తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య పక్షాన గంగు ఉపేంద్రశర్మ, భాస్కరభట్ల రామశర్మ, తనుగుల రత్నకర్, వివిధ దేవాలయాల అర్చకులు సంతాపం తెలిపారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆధ్వర్యంలో సౌందర్యరాజన్ వరంగల్లో తెలంగాణ అర్చక సమాఖ్య ఏర్పాటు చేశారని, ధూపదీపనైవేద్య పథకం ఏర్పాటుకు నాంది పలికిన వ్యక్తి అని కొనియాడారు. ● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ● ముగిసిన జాతీయ సదస్సు -
ఆస్పత్రి పనులు త్వరగా పూర్తి చేయాలి
● వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య ● కలెక్టర్తో కలిసి మల్టీ సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణ పనుల పరిశీలనఎంజీఎం : వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వరంగల్ ఎంపీ కడి యం కావ్య నిర్మాణ సంస్థ, అధికారులను ఆదేశించారు. వరంగల్ కలెక్టర్ సత్యశారదతో కలిసి శుక్రవారం ఆమె ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించా రు. ఆస్పత్రిలో ప్రధానంగా ఎమర్జెన్సీ సేవలు, 16 అంతస్తుల్లో ఏర్పాటు చేస్తున్న బెడ్లకు ఆక్సిజన్ లైన్లు, ఫైర్ సేఫ్టీ వ్యవస్థ, సెంట్రల్ ఏసీ లైన్, విద్యు త్ సరఫరా, నీటి పైప్లైన్ కనెక్షన్లు, కేన్సర్ విభా గానికి రేడియేషన్ థెరపీ కోసం ప్రత్యేక బంకర్లు, ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ సేవలు, ఆడిటోరియం, ఆపరేషన్ థియేటర్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఆస్పత్రి పూర్తిస్థాయిలో ప్రారంభమైతే ఉత్తర తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ స్థాయి వైద్యసేవలు ఇక్కడే అందుబాటులోకి రానున్నాయని ఎంపీ కావ్య తెలిపారు. అనంతరం ఆస్పత్రి అభివృద్ధి ప నుల పురోగతిపై అధికారులతో నిర్వహించిన స మావేశంలో కావ్య మాట్లాడుతూ.. రోగులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తూ నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఆస్పత్రికి సరిప డా డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పారా మెడికల్ సిబ్బంది ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ రాఘవరెడ్డి, ఈఈ రాజేందర్, ఎల్అండ్టీ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రవణ్కుమార్, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్ చంద్రారెడ్డి, ఆర్ఎంఓ అశ్విన్కుమార్, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీధర్రెడ్డి, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గీతం రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ (ఎలక్ట్రికల్) నర్సయ్య , ఏఈ (జీడబ్ల్యూఎంసీ) రవికుమార్, తహసీల్దార్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. -
అమ్మవారి సేవలో కలెక్టర్ చాహత్
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం ఉదయం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ దర్శించుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ను ఆలయ ఈఓ రామల సునీత, ప్రధానార్చకులు భద్రకాళి శేషు, ధర్మకర్త బింగి సతీశ్ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతించారు. ఆమె ముందుగా గోశాలలో గోవులకు గ్రాసం తినిపించి అనంతరం ఆదిశంకరులను, వల్లభ గణపతిని దర్శించుకుని ఆలయ ప్రదక్షిణ చేశారు. ఆలయంలోని అమ్మవారి ని దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆల య అర్చకులు కలెక్టర్కు తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమేశ్ రాథోడ్, తహసీల్దార్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమా హీరోయిన్ నభా నటేష్ అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త తొనుపునూరి వీరన్న తదితరులు పాల్గొన్నారు. కాళోజీ సెంటర్: మట్టి పాత్రలు వాడి పర్యావరణహిత జీవనశైలిని ప్రతిఒక్కరూ అలవర్చుకోవాల ని వరంగల్ డీఈఓ రంగయ్య నాయుడు సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మట్టిపాత్రల తయారీపై కార్యశాల (పాట్ మే కింగ్ వర్క్షాప్) నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలమైన మట్టిపాత్రల వాడకాన్ని ప్రోత్సహించాలని కోరారు. ప్రాచీన కాలంలో మట్టితో తయారు చేసిన వస్తువులనే ఉపయోగించేవారని గుర్తుచేశారు. ముందుగా విద్యార్థులు మట్టి పాత్రల తయారీవిధానాన్ని చేసి చూపించారు. జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్, ఏఎంఓ ఉండ్రాతి సుజన్ తేజ, పాఠశాల హెచ్ఎం అరుణ, ఉపాధ్యాయులు ప్రభాకర్, కిరణ్, సుభాషిణి, తదితరులు పాల్గొన్నారు. -
కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలివ్వాలి
కాజీపేట రూరల్: ‘ఈ ప్రాంత అభివృద్ధి కోసం, కా జీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీలో స్థానికులకు 80 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలి, కాజీపేట డివిజన్ ఏర్పాటు చేయాలి. ఇందుకు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్రంతో మాట్లాడి ఒత్తిడి తీసుకురావాలి’ అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే స్టేషన్ ఎదుట శుక్రవారం సాయంత్రం వినయ్భాస్కర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ చేసిన ఎన్నో ఉద్యమాల ఫలితంగా 2023లో ప్రధాని నరేంద్రమోదీ కోచ్ప్యాక్టరీకి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో 80 శాతం ఉద్యోగాలు, కాజీపేట డివిజన్ ఏర్పాటు విషయంపై శని వారం కాజీపేట చౌరస్తాలో ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీశ్రావు పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్ నర్సింగరావు, నాయకులు యాదవరెడ్డి, రమే ష్, కృష్ణ, రజినీకాంత్, రాంమూర్తి, దశరథం, రాజు, కృష్ణ, శివకుమార్, కనకరాజు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ నేడు కాజీపేట చౌరస్తాలో ధర్నా -
వడ్డీల ఆశ చూపి రూ.కోటితో పరారీ
కాశిబుగ్గ: వరంగల్ 20వ డివిజన్ కాశిబుగ్గలో ఓ వ్యాపారి స్థానిక ప్రజల వద్ద నుంచి దాదాపు రూ.కోటి వసూలు చేసుకుని పరారైన ఉదంతం ఆలస్యంగా వెలుగులో కి వచ్చింది. ఈ వ్యాపారి తీరుపై శుక్రవారం సోషల్ మీడియాలో చక్కర్లు కొ ట్టడంతో విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వీరశెట్టి సురేష్ అనే వ్యాపారి కాశిబుగ్గలో కిరాణం షాపు నిర్వహిస్తూ ప్రజలతో కలిసి మెలిసి ఉంటూ నమ్మకం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో వారి వద్ద నుంచి అధిక వడ్డీ ఇస్తానని ఆశచూపి రూ.కోటి వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణాల డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే పదిహేను రోజుల క్రితం కిరాణం షాపునకు తాళం వేసి నాటి నుంచి కనిపించకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. క్రీడాపాఠశాలల్లో ప్రవేశాలకు ఎంపికలుకాశిబుగ్గ: హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లోని క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతిలో ప్రవేశాల కోసం రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. బాలబాలికలు ముందుగా మండల, జిల్లాస్థాయిలో ఎంపిక కావాల్సి ఉంటుందని, ఆన్లైన్లో ఈనెల 26 నుంచి మార్చి నాలుగో తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నా రు. విద్యార్థులు 1 సెప్టెంబర్, 2017 నుంచి 31 ఆగస్టు 2018 మధ్య జన్మించి ఉండాలని తెలి పా రు. ఐదు పాస్పోర్టుసైజ్ ఫొటోలు, బర్త్, స్టడీ, కమ్యూనిటీ సర్టిఫికెట్, మూడో తరగతి ప్రోగ్రెస్ రిపోర్టు, ఆధార్కార్డుతో రావాలని, ఇతర వివరా లకు ఎంఈఓలను సంప్రదించాలని తెలిపారు. -
బ్లాక్స్పాట్స్ను గుర్తించాలి
న్యూశాయంపేట: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్స్ను గుర్తించి తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపు హాల్లో శుక్రవారం నిర్వహించిన రోడ్సేఫ్టీ కమిటీ సమావేశంలో జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణపై విస్తృతంగా చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ప్రమాదాల విశ్లేషణ ఆధారంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మున్సిపల్, ఎన్హెచ్ పరిధిలో ఉన్న రోడ్ల మరమ్మతులను వెంటనే చేయాలని సూచించారు. రోడ్లలో లోపాలతో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరంగల్ నగర పరిధిలో అనేక ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా సరైన లైటింగ్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. మున్సిపల్ అధికారులకు తక్షణమే వీధి దీపాలు ఏర్పాటు చేపట్టాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, ఆర్అండ్బీ ఈఈ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించాలి మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో శుక్రవారం జరిగిన జిల్లా నార్కోటిక్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థులకు మత్తుపదార్థాలను విక్రయించే వారిని గుర్తించాలని సూచించారు. అదేవిధంగా స్ఫూర్తి కార్యక్రమంలో నార్కోటిక్ అధికారులను భాగస్వామ్యం చేసి విద్యార్థినీవిద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి అధికారులు పాల్గొన్నారు.రోడ్సేఫ్టీ కమిటీ సమావేశంలో కలెక్టర్ సత్యశారద -
మోడల్ రాకెట్ ట్రయల్ రన్ విజయవంతం
నయీంనగర్: భద్రకాళి బండ్ వద్ద మోడల్ రాకెట్ ట్రయల్ రన్ను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మోడల్ రాకెట్ లాంచింగ్ ట్రయల్ రన్ కోసం ఏర్పాట్లు చేయగా, భద్రకాళి చెరువులోని ఐలాండ్ వద్ద నమూనా రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. మోడల్ రాకెట్ రూపకర్త శశాంక్ భూపతి ట్రయల్ రన్ను విజయవంతంగా ప్రయోగించారు. ఈసందర్భంగా వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్ అంజన్ కుమార్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్ సెక్రటరీ, డైరెక్టర్ ఎన్.రఘునందన్కుమార్, ‘కుడా’ సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్రావు, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, హనుమకొండ ఏసీపీ నరసింహారావు సమక్షంలో రాకెట్ లాంచింగ్ ట్రయల్ రన్ చేపట్టారు. జాతీయ సైన్స్ దినోత్సవం (ఫిబ్రవరి 28) సందర్భంగా శనివారం సాయంత్రం భద్రకాళి బండ్ నుంచి రుద్రమ–1 మోడల్ రాకెట్ ప్రయోగించనున్నారు. ఈ ప్రమోగంతో చారిత్రక వరంగల్ నగరం సరికొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. శనివారం హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4:00 గంటల వరకు కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించే సెమినార్లో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన వివిధ అంశాలపై వక్తలు ప్రసంగిస్తారు. సెమినార్కు పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఉందని అధికారులు తెలిపారు. -
కంటిచూపు బాగుంటే ప్రమాదాల నియంత్రణ
రామన్నపేట : డ్రైవర్ల కంటి చూపు బాగుంటే రోడ్డు ప్రమాదాలను తగ్గించగలమని వరంగల్ పోలీసు కమీషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ రెండో విడతలో భాగంగా వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ములుగు రోడ్డులోని వెంకటేశ్వర కల్యాణ మండపంలో ఆటో డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక రీజినల్ ఐ ఆస్పత్రి, శరత్ ఐ ఆస్పత్రి, కీర్తి ఆస్పత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి పోలీసు కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరానికి సుమారు 400 మంది ఆటో డ్రైవర్లు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈసందర్భంఆ 300 మంది డ్రైవర్లకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ప్రతీ వాహనాదారుడు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలనే లక్ష్యంగా సీఎం అరైవ్ అలైవ్ ప్రారంభినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకమని అన్నారు. ప్రజలను తరలించే ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు కంటి చూపుపై మరింత శ్రద్ధ వహించాలని తెలిపారు. ముఖ్యంగా కంటి చూపుతో బాధపడే వారు వాహనం నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారం అధికమని తెలిపారు. కంటి చూపు బాగుంటే ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి సూచనలను గుర్తించడం ద్వారా సురక్షితమైన డ్రైవింగ్ చేయగలమని పోలీసు కమిషనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్రావు ఏసీపీలు సత్యనారాయణ, నర్సింహారావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సుజాత, సీతారెడ్డి, వెంకన్న, మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు 300 మందికి కంటి అద్దాల పంపిణీ -
సమస్యలు పరిష్కరించండి
కాళోజీ సెంటర్ : గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీపీటీఎఫ్ వరంగల్ జిల్లా శాఖ అధ్యక్షుడు ఊటుకూరి అశోక్ ప్రభ్వుత్వాన్ని కోరారు. ఈమేరకు అదనపు కలెక్టర్ సంధ్యారాణిని కలెక్టరేట్లో కలిసి వినతి పత్రం అంజేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు అదనపు కలెక్టర్కు వినతిపత్రం అంజేశామని తెలిపారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని, పండిట్ పోస్టులను అప్గ్రేడ్ చేసి సీఆర్టీ డైలీ వేజ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. పలుమార్లు సంబంధిత అధికారులు, గిరిజన శాఖ మంత్రికి విన్నవించినా.. ఫలితం లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్, మనోజ్, ౖబైరి స్వామి, ఉమేశ్, కొమురయ్య పాల్గొన్నారు. -
మేజిక్బస్ ఇండియాతో కేయూ ఎంఓయూ
కేయూ క్యాంపస్: ప్రముఖ స్వచ్ఛంద సంస్థ మేజిక్బస్ ఇండియా ఫౌండేషన్తో కేయూ గురువారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. సంవత్సరంపాటు ఉండే ఈ ఒప్పందంపై కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, మేజిక్బస్ ఇండియా ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శేఖరబాబు సంతకాలు చేశారు. ఎంఓయూతో వెనుకబడిన, ఆర్థికంగా బలహీనవర్గాల యువతకు నాణ్యమైన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ, కెరీర్ మార్గదర్శక, ఉపాధి ఆధారిత శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థుల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్, ప్లేస్మెంట్ కల్పించనున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు. కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్రెడ్డి, కేయూ స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆఫైర్ డీన్ మామిడాల ఇస్తారి, వివిధ విభాగాల ఫ్రొఫెసర్లు ఎస్. జ్యోతి, ఆర్.మల్లికార్జున్రెడ్డి, ప్రోగ్రాం మేనేజర్ టి.వెంకటరావు, ప్లేస్మెంట్ ఆఫీసర్ రాజేశ్ పాల్గొన్నారు. -
భద్రకాళికి నటుడు అడవి శే షు పూజలు
హన్మకొండ కల్చరల్: వరంగల్లోని శ్రీభద్రకాళి దేవాలయాన్ని గురువారం సినీనటుడు అడవి శేషు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పరిశీలకుడు క్రాంతికుమార్, అర్చకులు ఆయనను ఘనంగా స్వాగతించారు. శేషు అమ్మవారికి పూజలు జరుపుకున్నారు. అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. వరంగల్ స్పోర్ట్స్: రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండలో ఉన్న క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశాలకు మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎంపిక పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రవేశాల కోసం విద్యార్థులు ఈ నెల 26 నుంచి మార్చి 4వ తేదీ వరకు https:///tgss.telangana.gov. inలో రిజి స్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మూడో తరగతి పూర్తి చేసుకుని 1 సెప్టెంబర్ 2017 నుంచి 31 ఆగస్టు 2018 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులుగా పేర్కొన్నారు. విద్యార్థులకు ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లయింగ్స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల పరుగు, 610 మీటర్ల షటిల్రన్, మెడిసిన్ బాల్త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ తదితర పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే విద్యార్థులు ప్రస్తుత పాఠశాల నుంచి బోనోఫైడ్, 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, తహసీల్దార్, గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులు జారీ చేసిన జనన, కులధ్రువీకరణ పత్రాలు, 10 పాస్పోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్కార్డు జిరాక్స్, ఒరిజినల్ పత్రాలు వెంట తీసుకురావాలని కోరారు. మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు మండలస్థాయి, మార్చి 28 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జిల్లాస్థాయి, ఏప్రిల్ 27 నుంచి మే1 వరకు రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ● నాభర్త ప్రాణాలు కాపాడండి ● ముఖ్యమంత్రికి రిటైర్డ్ ఏఎస్సై భార్య వేడుకోలు వరంగల్ క్రైం: పోలీస్ శాఖలో సుమారు 40 ఏళ్లు పనిచేసి రిటైర్మెంట్ అయిన నా భర్త ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించాలని రిటైర్డ్ ఏఎస్సై వీవీఎల్ఎన్ మూర్తి భార్య విజయలక్ష్మి ముఖ్యమంత్రిని వేడుకుంటోంది. వాట్సాప్లో ఆమె అభ్యర్థన వైరల్గా మారింది. గతేడాది రిటైర్డ్ అయిన మూర్తికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అందలేదు. ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లకు తెచ్చిన అప్పులు భారంగా మారడంతోపాటు భర్త తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆమె పేర్కొంది. ఇంటి కిరాయి చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ విషయం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి చేరే విధంగా అధికారులు సహకరించాలని విజయలక్ష్మి కోరుతోంది. -
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొత్తం 52 కేంద్రాల్లో తొలిరోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహించారు. జనరల్, ఒకేషనల్ కలిపి 18,768మందికి, 18,375 మంది (98శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. వరంగల్ జిల్లాలో ముగ్గురు డీబార్.. కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలో ఇంటర్ సెకండియర్ తొలిరోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు జనరల్ కోర్సుల్లో మొత్తం 4,821 మంది విద్యార్థులకు 4,705 మంది హాజరుకాగా, 116 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఒకేషన్ కోర్సుల్లో మొత్తం 744 మందికి 713 మంది విద్యార్థులు హాజరయ్యారని 31 మంది గైర్హాజరైనట్లు వివరించారు. జిల్లా స్థాయిలో ఇద్దరు డీఈసీ సభ్యులు, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, 4 సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా పర్యవేక్షించి ఆయా పరీక్ష కేంద్రాల్లో తనిఖీ చేసినట్లు చెప్పారు. పర్వతగిరి సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ద్వితీయ భాష తెలుగు సబ్జెక్టులో ముగ్గురు విద్యార్థులు డీబార్ అయినట్లు డీఐఈఓ తెలిపారు. 98 శాతం మంది విద్యార్థుల హాజరు -
స్నేహ శబరీష్ వివరాలు..
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రట్రరీ కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.హనుమకొండ, మహబూబా బాద్, జనగామ కలెక్టర్లను బదిలీ చేసి.. వారి స్థానంలో కొత్త కలెక్టర్లను నియమించారు. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓను కరీంనగర్ కలెక్టర్గా నియమించారు. జనగామ అదనపు కలెక్టర్ను హైదరాబాద్కు బదిలీ చేశారు. ఇటీవలే ఐఏఎస్ అధికారి హోదా కల్పించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ను వరంగల్ అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్)గా ప్రభుత్వం నియమించింది. ఎవరు ఎక్కడికంటే.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాచ్పాయ్ హనుమకొండ కలెక్టర్గా నియమితులయ్యారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు కమిషనర్గా కూడా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ను మహబూబాబాద్కు బదిలీ చేశారు. మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ సమన్వయ శాఖకు బదిలీ చేశారు. జనగామ కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ జోగుళాంబ గద్వాలకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆరు నెలల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా పనిచేసి ప్రస్తుతం జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా ఉన్న సందీప్ కుమార్ ఝాను నియమించారు. మరో ఐఏఎస్ అధికారి, జనగామ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పర్మార్ పింకేష్కుమార్ లలిత్కుమార్ను బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా నియమించారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు. కాగా, ఇటీవల ఐఏఎస్ (ఎస్సీఎస్) అధికారిగా పదోన్నతి పొందిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వైవీ గణేశ్కు వరంగల్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పోస్టింగ్ ఇచ్చారు. ఐటీడీఏ పీఓ టు కరీంనగర్ కలెక్టర్.. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా కరీంనగర్ కలెక్టర్గా నియమితులయ్యారు. 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆమె 2024 ఫిబ్రవరి 12న ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా బాధ్యతలు చేపట్టారు. సుమారు రెండు సంవత్సరాలకు పైగా గిరిజన సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో ఆమె కీలక పాత్ర పోషించారన్న పేరుంది. దీంతో ఆమెను ప్రభుత్వం కరీంనగర్ కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓగా ఇంకా ఎవరినీ నియమించలేదు. పూర్తి పేరు: చాహత్ బాజ్పాయ్ కేడర్, బ్యాచ్ : ఐఏఎస్, 2019 బ్యాచ్ (తెలంగాణ కేడర్) స్వస్థలం: ఢిల్లీ సివిల్స్ ర్యాంకు: యూపీఎస్సీ, 2018 పరీక్షలో జాతీయ స్థాయిలో 59వ ర్యాంకు సాధించారు. విద్యార్హతలు : ప్రాథమిక విద్య ఢిల్లీలో సాగింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్లో విజయం సాధించడం ఆమె ప్రతిభకు నిదర్శనం. కాగా, తెలంగాణలో యువ ఐఏఎస్ అధికారిగా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా శిక్షణ తీసుకున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా (స్థానిక సంస్థలు) పనిచేశారు. అక్కడ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కషి చేశారు. 2025 జూన్లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా నియమితులైన బాజ్పాయ్.. స్నేహ శబరీష్ బదిలీ తర్వాత ప్రభుత్వం ఆమెను హనుమకొండ కలెక్టర్గా గురువారం నియమించింది. చాహత్ బాజ్పాయ్ టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సతీమణి. పూర్తి పేరు: పి.స్నేహ శబరీష్ కేడర్, బ్యాచ్ : ఐఏఎస్, 2017 బ్యాచ్ (తెలంగాణ కేడర్) స్వస్థలం: కేరళ రాష్ట్రం కుటుంబం: ఆమె భర్త డాక్టర్ శబరీష్, ఐపీఎస్ (2017 బ్యాచ్). ఆయన ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె ఉన్నారు. విద్యార్హతలు: ప్రాథమిక, ఉన్నత విద్య కేరళలో పూర్తిచేశారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో (యూపీఎస్సీ 2016) జాతీయస్థాయిలో 47వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. నిజామాబాద్ జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా శిక్షణ పొందారు. కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్గా పనిచేశారు. జీహెచ్ఎంసీలో జాయింట్ కమిషనర్గా, జోనల్ కమిషనర్గా సేవలందించారు. 2025 జూన్ 12న హనుమకొండ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అభివృద్ధి పనులు, ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. గురువారం జరిగిన బదిలీల్లో మహబూబాబాద్ కలెక్టర్గా నియమితులు కాగా.. ఒకే జిల్లాలో భార్యాభర్తలు కలెక్టర్, ఎస్పీగా పనిచేసే అరుదైన అవకాశం కలిగింది.సందీప్కుమార్ ఝా వివరాలు..సందీప్ కుమార్ ఝా 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పంత్నగర్లోని జీబీ పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ నుంచి అగ్రికల్చర్లో డిగ్రీ, ఆనంద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ నుంచి పీజీ డిప్లొమా పొందారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా, టీఎస్ ట్రాన్స్కో జేఎండీగా సందీప్కుమార్ పనిచేశారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఉన్నత న్యాయస్థాన ఉత్తర్వులను పట్టించుకోలేదని, ప్రజాపాలన దినోత్సవానికి ఆలస్యంగా వెళ్లారన్న ఆరోపణలు ఉన్నాయి. విధుల పరంగా గ్రామాల్లో పర్యటిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కీలకంగా వ్యవహరించారన్న పేరున్నా.. 2025 అక్టోబర్లో ఆయనను హైదరాబాద్కు బదిలీ చేశారు. జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న సందీకుమార్ ఝాకు ప్రభుత్వం జనగామ కలెక్టర్ బాధ్యతలు అప్పగించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఏడుగురికి స్థానచలనం హనుమకొండ కలెక్టర్గా చాహత్బాజ్పాయ్.. ‘గ్రేటర్’ కమిషనర్గా అదనపు బాధ్యతలు మహబూబాబాద్కు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కేంద్ర సర్వీసులకు మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్సింగ్ జోగుళాంబ గద్వాలకు జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆయన స్థానంలో సందీప్ కుమార్ ఝా నియామకం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా కరీంనగర్ కలెక్టర్గా బదిలీగ్రేటర్ వరంగల్ ఇన్ ? అవుట్ చాహత్ బాజ్పాయ్ హనుమకొండ ఇన్ చాహత్ బాజ్పాయ్ అవుట్ స్నేహ శబరీష్ జనగామ ఇన్ సందీప్కుమార్ ఝా అవుట్ షేక్ రిజ్వాన్ బాషా మహబూబాబాద్ ఇన్ స్నేహ శబరీష్ అవుట్ అద్వైత్సింగ్ ఏటూరునాగారం ఐటీడీఏ ఇన్ ? అవుట్ చిత్రామిశ్రాచాహత్ బాజ్పాయ్ వివరాలు.. -
నిట్లో వసంతోత్సవం సందడి
శుక్రవారం శ్రీ 27 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లో విద్యార్థులే నిర్వాహకులుగా 1978లో ప్రారంభమైన స్ప్రింగ్ స్ప్రీ (వసంతోత్సవం) దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్గా పేరుగాంచింది. ఈనెల 27, 28 తేదీల్లో స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకలను నిర్వహించేందుకు విద్యార్థులు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల విద్యార్థులు సంస్కృతీ సంప్రదాయాలను పంచుకునే వేదికగా వసంతోత్సవం నిలువనుంది. రెండు రోజుల పాటు 40కుపైగా ఈవెంట్స్, డైరెక్టర్స్ కట్లో కై లాశ్ కొలను, స్వయంభూ మూవీ టీం ఇంటరాక్షన్, ప్రోషోలో జోనితా గాంధీ, రాణీనారెడ్డి మ్యూజిక్ ప్రదర్శనలు అలరించనున్నాయి. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని నిట్ క్యాంపస్ను గోల్డెన్ లైట్స్తో ప్రత్యేకంగా అలంకరించారు. హలో ఎన్ఐటీ.. హవ్ ఆర్ యూ.. హలో ఎన్ఐటీ.. హవ్ ఆర్ యూ.. ఎంజాయ్ కల్చరల్ఫెస్ట్ స్ప్రింగ్ స్ప్రీ–26 అంటూ సినీహీరో, దర్శకుడు అడవి శేషు సందడి చేశారు. నిట్ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన స్ప్రింగ్ స్ప్రీ–26ని జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన మాట్లాడారు. డెకాయిట్ మూవీ షూటింగ్ యూరప్లో జరుగుతోంది. విద్యార్థుల ఆహ్వానం మేరకు యూరప్ నుంచి నిట్కు వచ్చానని తెలిపారు. డెకాయిట్ మూవీలోని రూబరు సాంగ్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ సాంగ్కు విద్యార్థులు ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. స్ప్రింగ్ స్ప్రీ–26 ప్రారంభోత్సవంలో సందడిగా గడిపారు. కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ కిరణ్కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.ప్రారంభించిన సినీహీరో అడవి శేషు రూబరు సాంగ్కు విద్యార్థుల స్టెప్పులు నేడు, రేపు స్ప్రింగ్ స్ప్రీ–2026 వేడుకలు -
నేడు రాకెట్ ట్రయల్ రన్
నయీంనగర్: జాతీయ సైన్స్ దినోత్సవం (ఫిబ్రవరి 28) సందర్భంగా భద్రకాళి బండ్ ప్రామినాడ్ వద్ద నిర్వహించనున్న రుద్రమ–1 రాకెట్ ప్రయోగానికి ముందు శుక్రవారం ఉదయం 11 గంటలకు ట్రయల్ రన్ చేయనున్నట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. కుడా కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, విద్య, కుడా, మున్సిపల్ శాఖల అధికారులు, రాకెట్ రూపకర్త శశాంక్ భూపతి, నిట్ ప్రొఫెసర్ అంజన్కుమార్తో కలెక్టర్ గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. భద్రతా చర్యులు, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయాలు, ప్రజల రాకపోకలు, సమన్వయ విధానాలు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శనివారం సాయంత్రం 5:30 గంటలకు భద్రకాళి బండ్ వద్ద రాకెట్ లాంచింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అదేరోజు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కాళోజీ కళాక్షేత్రంలో ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్ సెక్రటరీ, డైరెక్టర్ ఎన్.రఘునందన్ కుమార్, ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ శేషగిరిరావు వెల్లంకి రాకెట్ ప్రయోగంపై ప్రసంగిస్తారని తెలిపారు. రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు విద్యార్థులు, ప్రజలకు సాయంత్రం 4 గంటల నుంచి ఉచిత ప్రవేశం ఉందని తెలిపారు. సమావేశంలో డీఈఓ గిరిరాజ్గౌడ్, ఎంఆర్ఓ రవీందర్రెడ్డి, కుడా సీపీఓ అజిత్రెడ్డి, ఈఈ భీంరావు, అధికారులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కుడా కార్యాలయంలో అధికారులతో సమీక్ష -
5 వరకు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల స్వీకరణ
వరంగల్ అర్బన్/హన్మకొండ చౌరస్తా: ఖాళీ స్థలాలు కలిగి ఉండి, అర్హులైనవారు ఇందిరమ్మ ఇళ్ల కోసం మార్చి 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ కోరారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దరఖాస్తులను హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేరుగా అందజేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదు చేస్తే బహుమానం ఇస్తామని తెలిపారు. ఫ్లోర్లీడర్ ఆఫీస్లో ఫ్లోర్లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అభివృద్ధి పనులపై ఫోకస్ చేయాలని ఎమ్మెల్యే నాయిని కోరారు. కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో నిర్వహించిన కార్పొరేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఫ్లోర్లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు జక్కుల రవీందర్యాదవ్, విజయశ్రీ రజాలీ, మామిండ్ల రాజు యాదవ్, దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, చీకటి ఆనంద్, మానస రాంప్రసాద్, మాజీ కార్పొరేటర్ విద్యాసాగర్ పాల్గొన్నారు. డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు.. ఫిర్యాదు చేస్తే బహుమానం పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
చెత్త సేకరణలో సమయపాలన పాటించాలి
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: ఇంటింటా చెత్త సేకరణలో సమయపాలన పాటించాలని, సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లకు నిర్ణీత సమయంలో వాహనాలు చేరుకోవాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. హనుమకొండలోని బాలసముద్రంలో బల్దియా నిర్వహిస్తున్న ట్రాన్స్ఫర్ స్టేషన్ను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వెహికల్ షెడ్కు చేరే స్వచ్ఛ ఆటోలు, వాహనాలు తడి, పొడి చెత్తను వేరు గా తీసుకొస్తున్నాయా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మరమ్మతు చేయాల్సిన వాహనాలు ఎన్ని ఉన్నాయి, షెడ్లో కాంఫ్యాక్టర్ల స్థితిగతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చెత్త తరలించే స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లు, జేసీబీలు, వివిధ శానిటేషన్ వాహనాల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని సీఎంహెచ్ఓను ఆదేశించారు. వాహన మరమ్మతులను సకాలంలో చేపట్టాలని ఈఈకి సూచించారు. తనిఖీల్లో ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఈఈలు మాధవీలత, మహేందర్, డీఈ రాజ్కుమార్, శానిటరీ సూపర్వైజర్ నరేందర్ పాల్గొన్నారు. గ్రీవెన్స్ ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు.. ఆక్రమణలు, అనుమతి లేని నిర్మాణాలపై సీరియస్గా దృష్టి సారించాలని కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రీవెన్స్ ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని సూచించారు. ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఏసీపీలు ఖలీలొద్దీన్, శ్రీనివాస్రెడ్డి, ప్రశాంత్, నుస్రత్, రజిత తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు షురూ
విద్యారణ్యపురి/హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. 52 కేంద్రాల్లో మొదటి రోజు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ల పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ జనరల్, ఒకేషనల్ కలిపి 19,638 మంది విద్యార్థులకు 19,099 మంది (97 శాతం) హాజరయ్యారని డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. హనుమకొండలోని వడ్డేపల్లి ప్రభుత్వ పింగిళి జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ ఎన్.రవి తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును డీఐఈఓ, చీఫ్ సూపరింటెండెంట్ సునీత, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ రమేశ్ను అడిగి తెలుసుకున్నారు. వరంగల్లో 262 మంది గైర్హాజరు.. కాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రశాంతంగా ప్రారంభమైనట్లు వరంగల్ డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. తొలి రోజు ప్రథమ సంవత్సరం పరీక్షకు జనరల్ కోర్సులో మొత్తం 5,680 మంది విద్యార్థులకు 5,491 మంది హాజరు కాగా 189 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ కోర్సులో మొత్తం 767 మంది విద్యార్థులకు 694 మంది హాజరు కాగా 73 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 26 పరీక్ష కేంద్రాలకు ఇద్దరు జిల్లాస్థాయి డీఈసీ సభ్యులు, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, 4 సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేసినట్లు తెలిపారు. డీఈసీ సభ్యులు మాధవరావు, విజయనిర్మల పూర్తి స్థాయిలో పర్యవేక్షించారని డీఐఈఓ తెలిపారు. ఇదిలాఉండగా.. నేటి(గురువారం) నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. హనుమకొండ జిల్లాలో 97 శాతం విద్యార్థుల హాజరు -
బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు : సీపీ
వరంగల్ క్రైం: బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ హెచ్చరించారు. బాల్య వివాహాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మహిళాశిశు సంక్షేమ శాఖ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డన్ర్స్ షేర్ స్వచ్ఛంద సంస్థ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వరంగల్ విభాగం రూపొందించిన ప్రచార రథాన్ని కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం సీపీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాల్యవివాహాలు పిల్లల చదువు, ఆరోగ్యం, శారీరక, మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. పిల్లలు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని కోరారు. అదనపు డీసీపీ రవి, ఏహెచ్టీయూ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, ఎస్సై సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ సమీయుద్దీన్, షేర్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ శిరీష, జ్ఞానేశ్వరి, జమున, ప్రశాంతి, కల్పన, గాయత్రి, చామంతి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: మంగళూరు యూనివర్సిటీలో ఈనెల 27న నిర్వహించనున్న ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ క్రాస్కంట్రీ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ ఉమెన్ జట్టును ఎంపికచేసినట్లు స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య బుధవారం తెలిపారు. పి.ఉషారాణి, ఎం.టాబు, పి.హర్షిత, ఎం.రోషిణి, ఎం.అరుణ, జె.భీంబాయి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ సీహెచ్ బుచ్చయ్య జట్టుకు కోచ్కం మేనేజర్గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు. హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఎన్. రవి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో బుధవారం జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎన్.రవి మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించాలని డీఈఓను ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో నిరంతర చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత మాట్లాడుతూ పాఠశాలలు, హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, మత్తుపదార్థాల విక్రయాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హన్మకొండ: హనుమకొండ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బి.శేషాద్రి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఫారిన్ డిప్యుటేషన్పై రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన శేషాద్రి మాతృ సంస్థ పంచాయతీరాజ్ శాఖకు తిరిగి వెళ్లగా హనుమకొండ జిల్లా పరిషత్ సీఈఓగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కలెక్టర్ స్నేహ శబరీష్ను మర్యాద పూర్వకంగా కలిశారు. నయీంనగర్: భూసేకరణ కోసం కుడా డిప్యూటీ కలెక్టర్గా అడ్ల రవీందర్రెడ్డిని బుధవారం ప్రభుత్వం నియమించింది. ఆర్డీఓ నుంచి పదోన్నతి పొందిన ఆయన డిప్యూటీ కలెక్టర్గా డిప్యుటేషన్పై కుడాకు వచ్చారు. -
టెన్త్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: టెన్త్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. కలెక్టరేట్లో బుధవారం అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. పరీక్ష కేంద్రాలను చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశించారు. డీఈఓ గిరిరాజ్గౌడ్, ఏసీజీఈ భువనేశ్వరి, హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి.. కాజీపేట అర్బన్: పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించాలని కలెక్టర్ స్నేహశబరీష్ సూచించారు. కాజీపేట మండలం రాంపూర్లోని జెడ్పీ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పదో తరగతి, ఏడో తరగతి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థులు ఒత్తిడి జయించి, విజయం సాధించాలని కోరారు. డీఈఓ గిరిరాజ్గౌడ్, తహసీల్దార్ రాజు, ఎంఈఓ మనోజ్కుమార్, హెచ్ఎం వేణుఆనంద్ పాల్గొన్నారు. -
ఇటు కుడాకు.. అటు రైతుకు లాభం
సాక్షి, వరంగల్: కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) రియాల్టీ బిజినెస్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. తమకు కావాల్సిన ఆదాయాన్ని రాబట్టుకుంటూనే, భూములిచ్చే రైతులను రారాజుగా చేసే విధానాన్ని అలవాటు చేస్తోంది. గతంలో భూముల కొనుగోలు, లేదా కుడాకు సంబంధించిన భూముల్లో లేఅవుట్లు చేసి ప్లాట్ల విక్రయం ద్వారా ఆదాయం ఆర్జించింది. ఉనికిచర్లలో ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో రైతుల నుంచి 140 ఎకరాలు సేకరించి మహా లేఅవుట్ చేయడం ద్వారా భూమిచ్చిన రైతులకు భారీగా లబ్ధి చేకూరింది. ఈ క్రమంలోనే కుడా పరిధిలోని ఇతర రైతులూ ల్యాండ్ పూలింగ్కు సై అంటున్నారు. ఆత్మకూరు, చింతగట్టు, ఎల్కతుర్తి, చింతలపల్లి గ్రామ రైతులు తమ భూములు కుడాకు ఇవ్వాలనే అంగీకారానికి వచ్చారు. అధికారికంగా అంగీకార పత్రం ఇచ్చి నోటిఫికేషన్ వచ్చిన ఆత్మకూరులోని 30 ఎకరాల్లో లేఅవుట్ పనులు ఇప్పుడే మొదలయ్యాయి. తొలుత రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్ స్తంభాలు వేసి ఆ తర్వాత ప్లాట్ల విక్రయంతో అక్కడి అవసరాలకనుగుణంగా మౌలిక వసతులు కల్పించనున్నారు. నగరాభివృద్ధిలోనూ భూములిచ్చే రైతుల పరోక్ష పాత్ర.. కుడా ఆధ్వర్యంలో రూ.70 కోట్లతో వరంగల్ మోడ్రన్ బస్టాండ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం అవసరమయ్యే భూసేకరణకు కుడానే రూ.200 కోట్ల వరకు చెల్లించింది. ఖమ్మం రోడ్డు నుంచి ఏనుమాముల వరకు రూ.80 కోట్లతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భద్రకాళి మాడ వీధులకు రూ.30 కోట్లు అవసరమవుతుండగా, ప్రభుత్వం రూ.20 కోట్లు ఇస్తుండగా, మరో రూ.10 కోట్లు కుడానే భరిస్తోంది. ఇలా నగరాభివృద్ధికి అవసరమయ్యే ప్రాజెక్టుల్లో కుడాను భాగస్వామ్యం చేస్తుండడంతో ఆ డబ్బులను ఇలా లేఅవుట్ల ద్వారా వచ్చే ఆదాయంతో ఖర్చు పెడుతోంది. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో కుడాకు భూములిచ్చే రైతులు తాము ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు పరోక్షంగా నగరాభివృద్ధికి తమ సహకారాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఉనికిచర్లలో అభివృద్ధి చేసిన 140 ఎకరాల్లోని 250 ప్లాట్లలో 50 ప్లాట్లు వేలం పాట ద్వారా విక్రయిస్తే దాదాపు రూ.10 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకుముందు 120 ఎకరాల్లోని ఓసిటీ, 100 ఎకరాల్లోని హసన్పర్తి మండలం మడిపల్లి మాసిటీలోని ప్లాట్ల విక్రయం ద్వారా దాదాపు రూ.200 కోట్ల ఆదాయం కుడాకు సమకూరింది. వీటితోనే వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ల్యాండ్ పూలింగ్ రైతులను ఒప్పించి 50:50 పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు ఉనికిచర్ల లేఅవుట్ సక్సెస్తో ముందుకొస్తున్న రైతులు ఆత్మకూరులో 30 ఎకరాల్లో ఇప్పటికే మొదలైన పనులు చింతగట్టు, ఎల్కతుర్తి, చింతలపల్లిలోనూ 155 ఎకరాలు వీటి విక్రయం ద్వారా రూ.కోట్ల ఆదాయం వస్తుందని అంచనా అభివృద్ధి పనుల కోసమే నిధుల సేకరణ ఈ నాలుగు ప్రాంతాల్లోని చింతగట్టులో గజం రూ.15వేలు, ఆత్మకూరు, ఎల్కతుర్తిలో రూ.8వేలు, చింతలపల్లిలో గజం రూ.8వేల నుంచి రూ.10వేల వరకు ధర పలకొచ్చని ‘కుడా’ అధికారులు భావిస్తున్నారు. ఈ లే అవుట్లలో 50:50 (కుడా, రైతులకు సగం సగం) పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు చేయనున్నారు. ఈ ప్లాట్ల విక్రయించడం ద్వారా సుమారు రూ.200 కోట్లకుపైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే తరహాలో రైతులు ఎకరం అమ్ముకుంటే వచ్చే డబ్బుల కంటే రెండింతల నగదు రావడంతో భారీగా లాభం పొందే అవకాశం ఉంది. వారికివచ్చిన ప్లాట్లను విక్రయించుకునే సౌలభ్యం ఉండడం కలిసిరానుంది. రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ స్తంభాలు, ఇతర మౌలిక వసతుల కోసం ‘కుడా’నే నిధులు వెచ్చించనుంది. దీంతో రైతుకు రూపాయి ఖర్చు లేకుండానే భారీ ఆదాయం రానుంది. ల్యాండ్ పూలింగ్లో ఎవరికి ఎంత అంటే.. (ప్లాట్ల విస్తీర్ణం గజాల్లో) గ్రామం ఎకరాలు ప్లాట్ల విస్తీర్ణం రైతులకు కుడాకు ఆత్మకూరు 30 84,000 42,000 42,000 చింతగట్టు 25 70,000 35,000 35,000 ఎల్కతుర్తి 80 2,24,000 1,12,000 1,12,000 చింతలపల్లి 50 1,40,000 70,000 70,000 -
ఎథినిక్ నైట్ జోష్..
నిట్ వరంగల్లో కల్చరల్ ఫెస్ట్ స్ప్రింగ్ స్ప్రీ–26 బ్యానర్ను ఎథినిక్ నైట్ పేరిట మంగళవారం రాత్రి ఆకాశంలో ఆవిష్కరించారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కిరణ్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై డ్రోన్ సాయంతో ఆకాశంలో బ్యానర్ను ఆవిష్కరించారు. ఈ నెల 27, 28 తేదీల్లో సంస్కృతీసంప్రదాయాలను తెలిపే వేదికగా స్ప్రింగ్ స్ప్రీ–26 నిలవనుందని డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. వసంతోత్సవానికి స్వాగతం పలుకుతూ విద్యార్థినులు చీరకట్టు, విద్యార్థులు పంచకట్టులో అదరగొట్టారు. – కాజీపేట అర్బన్ -
పార్కు స్థలం కబ్జాకు యత్నం!
● నగరం నడిబొడ్డున విలువైన 450 గజాల భూమి ● డాక్యుమెంట్లు పట్టుకుని ఈ స్థలం చుట్టూ తిరుగుతున్న నలుగురైదుగురు ● కబ్జాలో భాగంగా బోరు వేసిన ఆక్రమణదారులు.. అడ్డుకున్న స్థానికులుహన్మకొండ: హనుమకొండ 59వ డివిజన్ పరిధి ఎకై ్సజ్ కాలనీలో విలువైన కార్పొరేషన్ పార్కు స్థలం కబ్జాకు కొందరు వ్యక్తులు తీవ్రంగా యత్నిస్తున్నారని కాలనీవాసులు తెలిపారు. రూ.కోట్ల విలువ చేసే ఈ స్థలం కబ్జాకు నలుగురైదురు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు చెబుతున్నారు. ఈ నెల 24న కొందరు వ్యక్తులు ఆ స్థలంలో బోరు తవ్విస్తుండగా స్థానికులు అభ్యంతరం తెలిపారు. స్థానిక కార్పొరేటర్ గుజ్జుల వసంత.. సుబేదారి పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. భవన నిర్మాణానికి అనుమతి ఉంటేనే బోరు వేయాలని, అనుమతి పత్రాలు చూపించాలని వారు కోరగా త్వరలో పర్మిషన్ వస్తుందని కబ్జాదారులు బదులిచ్చారు. పర్మిషన్ వచ్చిన తర్వాతనే బోరు తవ్వాలని పోలీసులు, కార్పొరేటర్ ఆదేశించడంతో కబ్జాదారులు వెళ్లిపోయారు. ఇప్పటికే కొంతభాగం ఆక్రమణ.. పార్కు స్థలం దాదాపు 450 గజాలుంటుందని, దీని విలువ రూ.2కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. స్థలంలో కొంతభాగం ఇప్పటికే కొందరు ఆక్రమించుకుని భవనాలు నిర్మించుకున్నారని, ఇందులో ఒకరు ఓ భవనాన్ని అమ్మకానికి పెట్టారని స్థానికులు తెలిపారు. -
దళసభ్యుడి నుంచి రాష్ట్ర కార్యదర్శి వరకు..
ఏటూరునాగారం–మహదేవపూర్ ప్రాంత దళంలో పార్టీ సభ్యుడిగా చేరిన దామోదర్, 1999లో కొత్తగూడెం–పాల్వంచ ఏరియా కమిటీకి బదిలీ అయ్యి అక్కడ దళ కమాండర్ దిలీప్ నాయకత్వంలో పనిచేశారు. ఆ తర్వాత 2000లో ఏటూరునాగారం దళంలో డిప్యూటీ కమాండర్గా, 2001లో కొత్తగూడెం–పాల్వంచ ఏరియా కమిటీ కమాండర్గా, 2003లో మేడారం ఎల్ఓఎస్ ఇన్చార్జ్గా, 2005లో ఏరియా కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొంది ఏటూరునాగారం – మహదేవపూర్ ప్రాంతానికి నియమితులయ్యారు. 2006లో ఖమ్మం–కరీంనగర్–వరంగల్ (కేకేడ బ్ల్యూ) డివిజనల్ కమిటీ సభ్యుడు, 2007లో డివి జనల్కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2009లో డివిజనల్ కమిటీ కార్యదర్శి పనిచేసి, 2015లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు (ఎస్సీఎం) గా పదోన్నతి పొంది, అదే సమయంలో కేకేడబ్ల్యూ డివిజనల్ కమిటీ ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టారు. మార్చి 2019లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సైనిక వ్యవహారాల ఇన్చార్జ్గా నియమితులైన దామోదర్.. యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ మరణం తర్వాత ఆయన స్థానంలో జనవరి 2025లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొందారు. అప్పటి నుంచి జనజీవన స్రవంతిలో కలిసే వరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. -
వ్యక్తిగత వివరాలు.. కుటుంబ నేపథ్యం..
పేరు: బడే చొక్కారావు అలియాస్ దామోదర్ వయస్సు: 47 సంవత్సరాలు స్వస్థలం: కాల్వపల్లి గ్రామం, తాడ్వాయి మండలం, ములుగు జిల్లా. మావోయిస్టు పార్టీలో హోదా: తెలంగాణ రాష్ట్ర కమిటీ (టీఎస్సీ) కార్యదర్శి. తండ్రి పేరు: బడే ఎల్లయ్య (రైతు) తల్లి పేరు: బడే బతుకమ్మ (లక్ష్మమ్మ). ఇతర కుటుంబసభ్యులు: ఇద్దరు సోదరులు, నలుగురు అక్కాచెల్లెళ్లు (వీరిలో ఒక సోదరుడు, ఇద్దరు అక్కాచెల్లెళ్లు చనిపోయారు) వివాహ జీవితం: జనవరి 2001లో ఏటూరునాగారం మండలం గోగుపల్లి గ్రామానికి చెందిన ఎర్ర నర్సమ్మ అలియాస్ సబితతో వివాహం, 2012లో ఎన్కౌంటర్లో సబిత మృతి, అక్టోబర్ 2016లో చర్ల ఎల్ఓఎస్ సభ్యురాలు మడకం కోసి అలియాస్ రజితతో వివాహం కాగా 2022లో ఆమె అరెస్టయి ప్రస్తుతం ఛత్తీస్గఢ్ జైలులో ఉన్నారు.సగర్వంగా స్వాగతం పలుకుతాం.. చదువుకున్న రోజుల్లో నేను, దామోదర్ స్నేహితులం. కాల్వపల్లి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన వారిలో ఏడుగురు మృతి చెందారు. ప్రస్తుతం దామోదర్ పోలీసుల ఎదుట లొంగిపోవడం సంతోషంగా ఉంది. ఆయనకు గ్రామస్తులమందరం సగర్వంగా స్వాగతం పలుకుతాం. దామోదర్ లొంగుబాటు స్నేహితుడిగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. – కొప్పుల జగన్నాథరావు, దామోదర్ స్నేహితుడు, కాల్వపల్లి ● -
పదేళ్లలో ఏంచేశారో చెప్పండి?
హన్మకొండ చౌరస్తా: అధికారంలో ఉన్న పదేళ్లలో ఏంచేశారో ఒక్కటి చెప్పాలని, రెండేళ్లలో తాను చేసిన పనులు చెబుతానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నేతలపై ఆయన మండిపడ్డారు. ఉనికిని చాటుకోవడానికి బావబామ్మర్దులు దిగజారి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అధికారం పోయినా కేటీఆర్లో అహంకారం తగ్గలేదని, స్థాయిని మించి సీఎంను విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. వరంగల్లోని సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిని బయటి నుంచి కాదని లోపలికి వెళ్లి పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి నిర్మాణంలో దోచుకుతిన్న సొమ్మును త్వరలోనే కక్కిస్తామని స్పష్టం చేశారు. రెండు నెలల్లో పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థలకు డెడ్లైన్ విధించామని చెప్పారు. ఉమ్మడి జిల్లాను ఆరు ముక్కలు చేసి నాశనం చేసినప్పుడు జిల్లా బీఆర్ఎస్ నాయకులు నోరు మూసుకున్నారని, పదేళ్లలో నిధుల కోసం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఏనాడైనా కేసీఆర్ను కలిసే ధైర్యం చేశారా అని ప్రశ్నించారు. బ్లేడ్బ్యాచ్కు గౌరవ అధ్యక్షుడే కేసీఆర్.. మాజీ సీఎం కేసీఆర్ బ్లేడ్బ్యాచ్కు గౌరవ అధ్యక్షుడని, హరీశ్రావు, కేటీఆర్, వినయ్భాస్కర్ సభ్యులని విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చారు. నాలుగో డివిజన్లోని యాదవనగర్లో యువకుడిపై కత్తితో దాడి చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్ అశోక్ను పరీక్షించగా 86 శాతం ఆల్కహాల్ తీసుకున్నట్లు తెలిసిందన్నారు. మేధావులు ఓటుకు దూరంగా ఉండడంతోనే ఇలాంటి రౌడీలు, గూండాలు ప్రజాప్రతినిధులు అవుతున్నారని అన్నారు. కార్పొరేషన్ ఫ్లోర్లీడర్ తోట వెంకటేశ్వర్లు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ, నాయకులు నాయిని లక్ష్మారెడ్డి, కొండా నాగరాజు, నలుబోలు సతీశ్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు ముక్కలు చేసినా నోరు మెదపలే.. బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ఫైర్ -
పారాత్రోబాల్ పోటీల్లో కృష్ణవేణికి గోల్డ్మెడల్
కేయూ క్యాంపస్: ఇండోనేషియాలోని సురకర్ణా నగరంలో ఉన్న గోర్ ఎఫ్కోర్ యూనివర్సిటీలో ఈనెల 15న నిర్వహించిన ఇండోనేషియా ఇంటర్నేషనల్ పారా త్రోబాల్ మ్యాచ్ సిరీస్లో కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం పరిశోధక విద్యార్థిని మాచర్ల కృష్ణవేణి గోల్డ్మెడల్ సాధించింది. మంగళవారం కాకతీయ యూనివర్సిటీలో వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం కృష్ణవేణిని అభినందించారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ డిఫెరెంట్లీఏబుల్డ్ సెల్ డైరెక్టర్ డాక్టర్ రాజు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో వాయిదావేసిన పీజీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ను మంగళవారం పరీక్షల విభాగం అధికారులు విడుదల చేశారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంటీఎం, ఎంఎస్డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, లైబ్రరీ సైన్స్ తదితర కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలను మార్చి 5 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి శ్రీనివాస్ తెలిపారు. మార్చి 5, 7, 10, 12, 16, 18 తేదీల్లో పరీక్షలను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. హన్మకొండ: త్వరితగతిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ ఎస్ఈ కె.గౌతంరెడ్డి తెలిపారు. నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా గరిష్టస్థాయిలో వ్యవసాయ విద్యుత్ సర్వీస్లు విడుదల చేశామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. 2025 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు మొ త్తం 355 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేసినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో అవసరమైన విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్లు ఇతర అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఎంజీఎం: హనుమకొండ జిల్లాలో టీబీ నియంత్రణకు కృషిచేయాలని డీఎంహెచ్ఓ అప్పయ్య వైద్యాధికారులు, క్షయ వ్యాధి నివారణ సిబ్బంది సూచించారు. వరంగల్ డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీబీ మరణాలు తగ్గించడానికి ఇలాంటి శిక్షణ ఉపయోగకరమని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి డాక్టర్ బ్లెస్సి మాట్లాడుతూ క్షయ నియంత్రణలో భాగంగా హైరిస్క్ వ్యాధిగ్రస్తులను త్వరగా గుర్తించి, మందులు అందించాలని అన్నారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్ధారణ కోసం 1,93,935 మందికి పరీక్షలు చేశామని తెలిపారు. 73,711 మందికి ఎక్స్రేలు తీశామని, వీరిలో 1,104 మందికి టీబీ గుర్తించినట్లు తెలిపారు. కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో ఈ ఏడాది స్ప్రింగ్స్ప్రీ–26 వసంతోత్సవం ఈనెల 27,28 తేదీల్లో నిర్వహించనున్నట్లు సమాచారం. వేడుకల వివరాలను నిట్ అఫీషియల్ వెబ్సైట్, సోషల్ మీడియాలో విద్యార్థుల రిజిస్ట్రేషన్ నిమిత్తం ఏర్పాటు చేశారు. వేడుకలకు సినీనటి నటులు అడివి శేషు, నిఖిల్ సిద్ధార్థ్, సంయుక్త మీనన్ హాజరుకానున్నట్లు సమాచారం. -
పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 (144 )సెక్షన్ అమలులో ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొత్తం 94 పరీక్ష కేంద్రాల్లో (హనుమకొండ 52, వరంగల్ 24, జనగామ 16) ఈనెల 24 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ పేర్కొన్నారు. -
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ రామకృష్ణారావు కాళోజీ సెంటర్/హన్మకొండ అర్బన్: టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్ల నుంచి కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, రవి, ఇంటర్ విద్యాశాఖ అధికారులు గోపాల్, డాక్టర్ శ్రీధర్ సుమన్, డీఈఓలు గిరిరాజగౌడ్, బి.రంగయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షల కోసం విద్య, వైద్య, పోలీస్ తదితర సంబంధిత శాఖల సమన్వయంతో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. -
ఆధునిక శతావధానిగా చేపూరి శ్రీరాం
కేయూ క్యాంపస్: లెక్కల మాస్టారు చేపూరి శ్రీరాం తెలుగుభాషపై వచన పద్యకవిత్వం, సాహిత్యంపై మక్కువ పెంచుకుని ప్రవృత్తిగా అవధానాలు చేస్తూ వచ్చిన ఆయన శతావధానం ప్రక్రియను మంగళ వారం విజయవంతంగా పూర్తిచేశారు. కేయూ సెనేట్హాల్లో శతావధానం ప్రక్రియలో మూడో రోజు ఽ75 చందోబద్ధ పద్యాలను ధారణ చేశారు. కంది శంకరయ్య సంచాలకత్వంలో అవధాని చతురతతో మొదటిరోజు 25 సమస్యాపూరణలు, 25 దత్తపదులు, రెండో రోజు 25 వర్ణణలు, 25 ఆశువులు కూడా పూర్తిచేశారు. దీంతో ఇప్పటినుంచి శ్రీరాంను ‘శతావధాని చేశ్రీగా’ పిలుస్తారని నిర్వాహకులు, పృచ్చకులు (ప్రాశ్నికులు)ప్రకటించారు. ఈ సందర్భంగా వీసీ కె.ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ బహువిద్యలో సమాహారం నైపుణ్యాల సమ్మేళనమే శతావధానమని పేర్కొన్నారు. తెలుగు ప్రాచీన, సజీవ భాష అని రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్ అన్నారు. అనంతరం అతిథులు, నిర్వాహకులు.. చేపూరి శ్రీరాం, విజయ దంపతులను సత్కరించారు. కాకతీయ పద్యకవితావేదిక అధ్యక్షుడు కందిశంకరయ్య, అవధాన పద్యవికాస పరిషత్ అధ్యక్షుడు మరుమాముల దత్తాత్రేయశర్మ,కేయూ పాలకమండలి సభ్యుడు చిర్రరాజు, తెలుగు విభాగం అధిపతి మామిడి లింగయ్య, అధ్యాపకుడు కర్రె సదాశివ్, ఉదయమని కృష్ణయ్య,దర్శనం వెంకట్రమణశర్మ పృచ్చకులు పాల్గొన్నారు. ఆద్యంతం ఆసక్తికరంగా శతావధానం 75 చందోబద్ధపద్యాలనుధారణ ఇక నుంచి‘చేశ్రీగా’ పిలవాలని నిర్ణయం -
అండర్ బ్రిడ్జి పనులు పూర్తిచేయాలి
వరంగల్ ఆర్డీఓ సుమ ఖిలా వరంగల్: వరంగల్ 17వ డివిజన్లోని ఆదర్శనగర్ రైల్వేగేట్ వద్ద రూ.13 కోట్ల వ్యయంతో చేపట్టిన అండర్ బ్రిడ్జి పనులు పూర్తిచేయాలని వరంగల్ ఆర్డీఓ సుమ సూచించారు. కుడా పీఓ అజిత్రెడ్డి, ఈఈ భీంరావు, రైల్వే జేఈ వెంకట్రెడ్డి, తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, కార్పొరేటర్ గద్దె బాబు, రైల్వే కాంట్రాక్టర్ ప్రసాద్రెడ్డితో కలిసి ఆదర్శనగర్ను సందర్శించారు. నిధులు విడుదలైనా పనుల జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానికులు ఆమెకు సమస్యలు వివరించారు. ఇరుకుగా మారిన అండర్ బ్రిడ్జితో అనేక ఇబ్బందులు ఉన్నాయని, భవిష్యత్ రాకపోకలకు అనుకూలంగా అండర్ బ్రిడ్జి నిర్మించాలని, తక్షణమే రీసర్వే చేపట్టాలని ఆర్డీఓను కోరారు. బ్రిడ్జి నిర్మాణంపై త్వరలోనే రైల్వే అధికారులతో చర్చించి ప్రజలకు న్యాయం చేస్తానని ఆర్డీఓ హామీ ఇచ్చారు. ఆర్ఐ కీర్తన్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోపగాని శంకర్, ప్రధాన కార్యదర్శి షేక్మాశుక్, గౌరవ అధ్యక్షుడు ఎండీ జానీ, రావుల యాదగిరి, హిమయతుల్లా, వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల రాజు, తాజొద్దీన్, మాజీ ఎంపీటీసీ షమీంబేగం, ఉపాధ్యక్షులు సలీం, గఫూర్, రబ్బానీ, ఎండీ అఫ్జల్, రవీందర్, నర్సింహారెడ్డి, జానీ, రహ్మత్, వేణు, షబ్బీర్, ఇమ్రాన్, మసూద్, రాజేశ్, కరుణాకర్ పాల్గొన్నారు. -
టీజీ ఎన్పీడీసీఎల్లో అక్రమార్కులు!
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో కొంతమంది అందినకాడికి దోచుకుంటూ సంస్థ పరువు తీస్తున్నారని విద్యుత్ ఉద్యోగ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అత్యున్నతస్థాయి అధికారి కూడా అక్రమాలకు పాల్పడితే సంస్థకు రక్షణ ఎక్కడుందని విద్యుత్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తన కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు నకిలీ మెడికల్ బిల్లులు సృష్టించి టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అత్యున్నత స్థాయి అధికారి సొమ్ము రీయింబర్స్మెంట్ చేసుకున్నారని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రతి నెల రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు అధికారులు సొంత సంస్థకు కన్నం వేస్తున్నారని సమాచారం. కిందిస్థాయి ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే నియంత్రించాల్సిన అధికారే అక్రమాలకు పాల్పడితే సంస్థను కాపాడే వారు ఎవరని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. నవ్విపోదురు గాక నాకేంటి అన్న చందంగా ఎవరేమనుకుంటే నాకేంటి తన జేబులు నిండితే చాలు అన్నట్లు యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సదరు అధికారి ఇలాంటి నకిలీ బిల్లులతో రీయింబర్స్మెంట్ చేసుకోవడం ఇదే మొదటి సారా? గతంలోనూ ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై టీజీ ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ విభా గం విచారణ చేపట్టినట్లు తెలిసింది. విజిలెన్స్ విచా రణ నివేదిక వచ్చిన తర్వాత సమగ్ర విచారణ చేపట్టనున్నారు. దీంతో పాటు ఎన్పీడీసీఎల్ పరిధిలో ఇలాంటి అక్రమాలు ఎక్కడైనా జరిగాయా అనే కోణంలో యాజమాన్యం దృష్టి సారించింది. మెడికల్ బిల్లులపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. నకిలీ మెడికల్ బిల్లులు సృష్టించి రీయింబర్స్మెంట్ కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు బిల్లులు తయారు చేశారని ఆరోపణలు అత్యున్నత స్థాయిలో ఉండి ఓ అధికారి సొంత సంస్థకే కన్నం -
మంగళవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
సిబ్బంది ఎంతమందంటే..చీఫ్ సూపరింటెండెంట్లు: 52 మంది, అదనపు చీఫ్ సూపరింటెండెంట్లు 42. డిపార్టుమెంటల్ ఆఫీసర్లు 52 మంది. ఫ్లయింగ్ స్క్వాడ్లు: 3, సిట్టింగ్ స్క్వాడ్లు: 4 పకడ్బందీగా నిర్వహిస్తాం.. హనుమకొండ జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. సీఎస్లకు, డీఓలకు ఇప్పటికే పలు సూచనలిచ్చాం. ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహించాలని ఆదేశించాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి సదుపాయాలు కల్పించనున్నాం. మాల్ ప్రాక్టీస్కు ఎవరైనా పాల్పడితే చర్యలు తప్పవు. ఏమైనా పిర్యాదులు, సందేహాలకు డీఐఈఓ కార్యాలయం కంట్రోల్ రూమ్ 93816 72094, 95027 43435 ఫోన్ చేయవచ్చు. – గోపాల్, డీఐఈఓ, హనుమకొండ టెక్నాలజీతో పకడ్బందీగా.. ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా డౌన్లోడ్ చేసిన హల్టికెట్లను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే క్రిమినల్ కేసులుంటాయి. సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడికి గురైతే 14416 టోల్ఫ్రీ నంబర్కు సంప్రదించవచ్చు. ఏమైనా ఇతర సమస్యలుంటే వరంగల్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్: 99668 88118 (ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు), 89770 81640 (మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు) నంబర్లలో సంప్రదించవచ్చు. – శ్రీధర్, జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి, వరంగల్ వరంగల్ జిల్లాలో.. పరీక్షా కేంద్రాలు: 26 (ప్రభుత్వ కాలేజీలు 10, ఎయిడెడ్ 4, సెక్టార్ 5, ప్రైవేట్ 7) ప్రశ్నపత్రాల నిల్వకోసం స్టోరేజీ సెంటర్లు: 11 పోలీసు స్టేషన్లు, సీసీటీవీ కెమెరాలు: 240. సిబ్బంది ఎందరంటే: ఇన్విజిలేటర్లు: 380, ఫ్లయింగ్ స్క్వడ్లు: 1, సిట్టింగ్ స్క్వడ్లు: 4, కస్టొడియన్స్: 4, చీఫ్ సూపరింటెండెంట్లు: 26, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు: 26, పోలీసు సిబ్బంది: 52, వైద్య సిబ్బంది: 52 (ఫస్ట్ ఎయిడ్ కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసమైన మందులు ఉంటాయి) కోడ్ దారి చూపిస్తుందిగతంలో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న సెంటర్ లోకేటర్ యాప్లో సెంటర్ కోడ్ టైప్ చేస్తే ఆయా పరీక్షా కేంద్రాలకు దారి చూపేది. ఇది వాడే క్రమంలో చాలా మందికి గతేడాది ఇబ్బందులు ఎదురయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆయా కేంద్రాల గూగుల్ జియో కో ఆర్డినేట్స్ తీసుకొని మరీ హాల్ టికెట్పై క్యూఆర్ కోడ్ తీసుకొచ్చారు. ఈ క్యూఆర్ కోడ్ను గూగుల్ లెన్స్ ద్వారా స్కాన్ చేస్తే నేరుగా ఆ కేంద్రానికి తీసుకెళ్లనుంది. హనుమకొండ జిల్లాలో పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య సంవత్సరం జనరల్ ఒకేషనల్ ఫస్టియర్ 17,463 1,133 సెకండియర్ 18,968 1,036 ఫస్టియర్ 5210 793 సెకండియర్ 5356 807వరంగల్ జిల్లాలో -
పార్టీ సిద్ధాంతాలపై అవగాహన ఉండాలి
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ హన్మకొండ: పార్టీ విధానాలు, సిద్ధాతాలపై ప్రతీ కార్యకర్తకు అవగాహన ఉండాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్గౌడ్ అన్నారు. సోమవారం హనుమకొండ దీన్దయాళ్ కాలనీలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి అధ్యక్షతన బీజేపీ హనుమకొండ జిల్లా ప్రశిక్షణ అభియాన్–2026 కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తూళ్ల వీరేందర్గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. 2028లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి మాట్లాడుతూ మండల స్థాయి శిక్షణ శిబిరాలు మార్చి 7 నుంచి ఏప్రిల్ 14 వరకు ఐదు వారాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బూత్ కమిటీలను మరింత బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు డాక్టర్ విజయ్ చందర్రెడ్డి, సండ్ర మధు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
విన్నపాలు వినవలె..
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ కిటకిటలాడింది. వివిధ సమస్యలపై అధిక సంఖ్యలో వినతులు అందించారు. అనేక రకాల సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలు సమర్పించారు. కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఫిర్యాదులు స్వీకరించి ఆయా విభాగాలకు సిఫార్సు చేస్తూ పరిష్కరించాలని ఆదేశించారు. వ్యక్తిగత సమస్యల నుంచి కనీస సదుపాయాలు కల్పించాలనే ఇక్కట్లు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా కమిషనర్ గ్రీవెన్ సెల్లోని వివిధ సమస్యలపై సమీక్షించి, అధికారులకు సిబ్బందికి సూచించారు. మొత్తం 114 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ సెక్షన్కు 54, ఇంజనీరింగ్ విభాగానికి 32, రెవెన్యూ సెక్షన్కు 8, హెల్త్ – శానిటేషన్ 12, తాగునీటి సరఫరా 7, విపత్తు నిర్వహణ 1 అందినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్ఓ రమేశ్, డీఎఫ్ఓ శంకర్ లింగం, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, టీఓ రామకృష్ణ, ఎంహెచ్ఓ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● 32వ డివిజన్ పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, స్వచ్ఛ ఆటోలు చెత్త సేకరించడం లేదని, డివిజన్ అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని కార్పొరేటర్ పల్లం పద్మరవి కోరారు. ● రామన్నపేటలో 12–8–171 ఇంటి డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాలని సత్యనారాయణ ఫిర్యాదు అందించారు. ● గొర్రెకుంటలో తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ల్యాదల్ల సుప్రియ విన్నవించారు. ● దేశాయిపేట అంబేడ్కర్ వీధిని విస్తరించి, సెంట్రల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని అంబేడ్కర్ యువజన సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ● హనుమకొండలోని చాకలి ఐలమ్మ కమ్యూనిటీ హాల్, విద్యా భవన్ నిర్మాణానికి అదనంగా నిధులు కేటాయించాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి లేఖను కమిషనర్కు సంఘం నాయకులు అందించారు. ● నల్లా కనెక్షన్కు దరఖాస్తు చేసి 20 రోజులు గడిచినా మంజూరు చేయడం లేదని తిమ్మాపురానికి చెందిన బీరం లత ఫిర్యాదు చేశారు. ● 57వ డివిజన్ పలు అభివృద్ధి పనులకు టెండర్లు జరిగాయని, పనులు మొదలు పెట్టడం లేదని కార్పొరేటర్ నల్లా స్వరూప రాణి రెడ్డి వినతి పత్రం సమర్పించారు. ● 2వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో నల్లా కనెక్షన్లు మంజూరు చేయాలని, డ్రెయినేజీలు నిర్మించా లని పలుమార్లు దరఖాస్తు చేసినా స్పందించడం లేదని సీపీఎం నాయకులు వినతి అందించారు. ● హనుమకొండ 10వ డివిజన్ కాపువాడలో డ్రెయినేజీ పూడిక తీయించాలని, రోడ్లు, డ్రెయినేజీ పునర్నిర్మించాలని కాలనీవాసులు కోరారు. ● 53వ డివిజన్లో 8 నెలలుగా తాగునీటి సరఫరా నిలిచిందని, 5 సార్లు దరఖాస్తు అందించినా ఇంజనీర్లు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. ● కాజీపేటలో శాశ్వత భవనం నిర్మించి గ్రంథాలయాన్ని నిర్మించాలని కె.ప్రకాశ్ విజ్ఞప్తి చేశారు. ● 2వ డివిజన్ వంగపహాడ్ ఎస్సీ కాలనీలో నిలిచిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, పైప్ లైన్లు వేయాలని ఎ.సుమన్ ఫిర్యాదు అందించారు. ● భవానీనగర్, ఎన్జీఓస్ కాలనీలో జంక్షన్లలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు విన్నవించారు. కిటకిటలాడిన గ్రేటర్ వరంగల్ కార్యాలయం గ్రీవెన్స్కు 114 వినతులు తక్షణమే అర్జీలకు పరిష్కారం చూపండి కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
ఆర్జీలు వేగంగా పరిష్కరించాలి
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను ఆయా శాఖల అధికారులు వేగంగా పరిష్కరించాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారాన్ని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు (పీఐఓలు) నిర్దిష్ట గడువులోగా అందించాలని సూచించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 165 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ వై.వి గణేశ్, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కన్నం నారాయణ, సీపీఓ సత్యనారాయణరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. -
‘చెత్త’పై నిర్లక్ష్యం.. కమిషనర్ ఆగ్రహం
వరంగల్ అర్బన్: ఖాళీ ప్రదేశాల్లో, కుండీల్లో పేరుకుపోయిన చెత్తను స్వయంగా పరిశీలించిన కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆగ్రహానికి లోనయ్యారు. జవాన్ల తీరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇద్దరికి రూ.2 చొప్పున జరిమానాలు విధించి వసూలు చేయాలని సీఎంహెచ్ఓను ఆదేశించారు. సోమవారం ఉదయం కమిషనర్ 4, 8 డివిజన్లలోని కాకతీయ కాలనీ, అక్షర కాలనీ. కేయూసీ రోడ్డు, ఓల్డ్ రాయపుర ప్రాంతాల్లో కమిషనర్ పారిశుద్ధ్య నిర్వహణపై ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్దేశిత సమయంలో గార్బేజీ బిన్లను శుభ్రం చేయకపోవడం, ఓపెన్ డంప్ గార్బేజీ ఎక్కువగా నిలిచి ఉండడం వల్ల సీరియస్ అయ్యారు. జవాన్లకు కేటాయించిన రిజిస్టర్లో ఆ రోజు చేసిన శానిటేషన్ కార్యక్రమాలను నమోదు చేయాలన్నారు. పెద్దమ్మ గడ్డ వద్ద ఉన్న కల్వర్టు వద్ద ఉన్న ఓపెన్ డంప్ను శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో సీఎం హెచ్ఓ రాజారెడ్డి, ఈఈ రవికుమార్, శానిటరీ సూపర్వైజర్ నరేందర్, ఏఈ హరికుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రకాశ్ తదితరులు ఉన్నారు. ఇద్దరు జవాన్లకు పెనాల్టీ ఆకస్మిక తనిఖీలు -
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి
హన్మకొండ: రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని, వారి ప్రాణాలు కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్– తెలంగాణ (ఎస్జీపీఏటీ) రాష్ట్ర అసోషియేట్ అధ్యక్షుడు జి.వీరస్వామి, ప్రధాన కార్యదర్శి వి.రామ మనోహర్ డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్–తెలంగాణ హనుమకొండ, వరంగల్ జిల్లా శాఖల ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. మార్చి 2024 నుంచి ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షకు బీజేపీ రాష్ట్ర నాయకుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల బాధ్యులు ఆకుల రాజేందర్, పుల్లూరు వేణుగోపాల్, కే.శ్రీనివాస్, శ్రీరామ్, సత్యనారాయణ, టి.కుమార్ సంఘీభావం తెలిపారు. -
రోగులకు ఇబ్బంది కలగొద్దు
● డీఎంహెచ్ఓ అప్పయ్య ఎంజీఎం: ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా వారితో మర్యాదగా ప్రవర్తిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించాలని హనుమకొండ జిల్లా వైద్యాధికారి అప్పయ్య వైద్యాధికారులు, వైద్య సిబ్బందికి సూచించారు. సోమవారం ఆయన హసన్పర్తి ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి ఆస్పత్రిలోని హాజరు పట్టికతో పాటు రోగులకు అందిస్తున్న సేవలకు సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం నక్కలగుట్టలోని వీఆర్స్ హెయిర్ క్రియేషన్స్పై వచ్చిన కంప్లైంట్ ఆధారంగా తనిఖీ నిర్వహించారు. కంప్లైంట్కు సంబంధించి వివరణ అడగగా.. ప్రొసీజర్స్ చేసే ముందు అవసరమైన పరీక్షలు చేసుకుని రమ్మని కోరగా.. సదరు వ్యక్తి దురుసుగా ప్రవర్తించినందున అతడికి చికిత్స చేయడానికి నిరాకరించినట్లు డాక్టర్ నవ్య డీఎంహెచ్ఓ వివరించారు. డాక్టర్ ఇచ్చిన వివరణ సంతృప్తిగా లేకపోవడం, ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసినందున షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు డీఎంహెచ్ఓ అప్పయ్య వివరించారు. అనంతరం నక్కలగుట్టలోని కిడ్స్ కేర్ హాస్పిటల్ను సందర్శించి ప్రదర్శించిన వివిధ అనుమతి పత్రాలను, రిపోర్టులను పరిశీలించారు. టారీఫ్లకు సంబంధించిన బోర్డు చిన్నగా ఉన్నందున, అందరికీ కనిపించేలా సూచించిన సైజులో ప్రదర్శించాలన్నారు. ఆసక్తికరంగా శతావధానం కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో స్వర్ణోత్సవాల సందర్భంగా తెలుగు విభాగం, కాకతీయ పద్య కవితా వేదిక ఆధ్వర్యంలో కేయూలోని సెనేట్హాల్లో చేపట్టిన అవధాన ప్రియ చేపూరిశ్రీరాం శతావధానం రెండో రోజు సోమవారం ఆసక్తికరంగా కొనసాగింది. కాకతీయ పద్య కవితా వేదిక అధ్యక్షుడు కందిశంకరయ్య సంచాలకత్వంలో అవధాని చతురతతో సమర్థవంతంగా 25 సమస్యా పూరణలు, 25 దత్త పదులను, 25 వర్ణణలను రెండు అవృత్తాలను పూర్తి చేశారు. మధ్యలో 25 ఆశువులను కూడా నిర్వహించారు. పృచ్ఛకులు అడిగిన వివిధ అంశాలపై సమస్యలపై పద్యరూపంలో పూరణలు చేశారు. దుష్కర ప్రాసలను, అసందర్భ సమస్యలను దత్తపదులను అలవోకగా అవధాని చేపూరిశ్రీరాం పూరణ చేశారు. కార్యక్రమంలో కేయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్ చిర్రరాజు తెలుగు విభాగం అధిపతి డాక్టర్ మామిడి లింగయ్య, అధ్యాపకుడు డాక్టర్ కర్రె సదాశివ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ: విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు రెండు నెలల్లో పరిష్కరించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యాన్ని ఆదేశించారు. సోమవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ముందు హెచ్ఆర్డీ డైరెక్టర్ సి.ప్రభాకర్ ఎన్పీడీసీఎల్లో ఉద్యోగుల నియామకం, రిజర్వేషన్ రోస్టర్ అమలు తీరు పోస్టుల వారీగా వివరించారు. 2025లో సెప్టెంబర్లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, కార్యాచరణ వివరించారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘాల నాయకులు, ఉద్యోగులు తమ సమస్యలు, ఇబ్బందులు కమిషన్కు వివరించారు. రాష్ట విభజన నేపథ్యంలో టీజీ ఎన్పీడీసీఎల్కు కేటాయించిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు సుప్రీం కోర్టు తీర్పు మేరకు తిరిగి ఏపీకి వెళ్లారని, అయితే వారు ఇక్కడ పని చేసిన కాలంలో పదోన్నతి కల్పించడంతో స్థానికులకు నష్టం, అన్యాయం జరిగిందన్నారు. ఏపీ వారు ఇక్కడి వచ్చి సీనియర్లు కావడంతో అప్పటి వరకు ఉన్నత పదవుల్లో ఉన్న వారిని రివర్షన్ చేసి పదోన్నతి కల్పించారని, వారు తిరిగి వెళ్లిపోయిన క్రమంలో ఖాళీ అయిన పోస్టుల్లో తిరిగి స్థానిక ఎస్సీ అధికారులకు పదోన్నతి కల్పించకపోవడంతో అ న్యాయం జరిగిందన్నారు. యాజమాన్యానికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికై నా న్యాయం చేయాలని కోరారు. స్పందించిన సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఈ ప్రక్రియపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని చెప్పారు. అదే విధంగా ఇతర సమస్యలు వివరించిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు నిర్ణీత కాలంలో సమస్యలు పరిష్కరించాలని కోరగా, ఎప్పటి లోగా పరిష్కరిస్తారో చెప్పాలని కమిషన్ ఆదేశించగా రెండు నెలల సమయం కావాలని చెప్పారు. దీంతో అన్ని సమస్యలు రెండు నెలల్లో పరిష్కరించాలని చైర్మన్ సూచించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కొంకటి లక్ష్మీనారాయణ, వి.మోహన్ రావు, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సి.ఈలు టి.తిరుమల్ రావు, టి.సదర్ లాల్, మాధవ రావు, రాజు చౌహాన్, అశోక్, అన్నపూర్ణ, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ నాయకులు ఎ.ఆనందం, కుమారస్వామి, బక్క దానయ్య, ఉపేందర్, దయానంద్, మాతంగి శ్రీనివాస్, సుదర్శన్, అజ్మీరా శ్రీరాం నాయక్, జాటోత్ హర్జీ పాల్గొన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
రోడ్డు ప్రమాదాల్లో భవితను కోల్పోతున్నాం..
సీపీ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: రోడ్డు నిబంధనలు పాటించకపోవడంతో దేశ భవిష్యతైన ఎంతో మంది యువతను రోడ్డు ప్రమాదాల్లో కోల్పోతున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ప్రతీ నెల చివరి వారం నిర్వహించే ‘అరైవ్ అలైవ్ ’ రెండో విడత కార్యక్రమంలో భాగంగా సోమవారం కమిషనరేట్ ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో నగరంలోని వాగ్దేవి కళాశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ప్రతీ వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. తన థ్రిల్ కోసం వాహనదారుడు వాహనం నడపడం చాలా ప్రమాదకమని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని, ఇలాంటి చర్యల కారణంగా కుటుంబ సభ్యులు ఎంతో నష్టపోతారని సూచించారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల కారణంగా 7,500 మంది మృత్యువాత పడడం చాలా బాధాకరమని, ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిన అవశ్యకతను వివరించాలని సీపీ సూచించారు. అనంతరం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. సెంట్రల్ డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ఏసీపీ సత్యనారయణ, ఇన్స్పెక్టర్లు వెంకన్న, సీతారెడ్డి, సుజాత, వాగ్దేవి కళాశాల ప్రిన్సిపాల్ శేషాచలం, కరస్పాడెంట్ శ్రవణ్ రెడ్డి, హరిచంద్రారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. -
రైలు ఎక్కించేందుకు వెళ్తూ మృత్యుఒడికి..
● బైక్ను ఢీకొన్న టిప్పర్.. అన్నదమ్ములకు తీవ్ర గాయాలు ● చికిత్స పొందుతూ తమ్ముడి మృతి..నక్కలపల్లిలో ఘటన మామునూరు : అప్పటి వరకు తల్లితోపాటు కుటుంబీకులతో ఆనందంగా గడిపిన కుమారులు కొద్దిసేపటికే తీరని విషాదం మిగిల్చారు. అన్నను రైలు ఎక్కించేందుకు తమ్ముడు బైక్ తీసుకొచ్చాడు. దీంతో ఇద్దరు కలిసి సంతోషంగా బయలుదేరారు. ఇంతలోనే ఘోరం జరిగి పోయింది. మార్గమధ్యలో టిప్పర్.. బైక్ను ఢీకొనడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తమ్ముడు మృతి చెందాడు. దీంతో చేతికొచ్చిన కుమారుడు కనిపించనిలోకాలకు తరలడంతో తల్లిదండ్రులతోపాటు బంధుమిత్రులు గుండెలవిసేలా రోదించారు. పోలీసుల కథనం ప్రకారం.. మామునూరు పీఎస్ పరిధి గుంటూరుపల్లికి చెందిన కొల్లం సుగుణకు ఇద్దరు కుమారులు రామకృష్ణ, వెంకటేష్(28) ఉన్నారు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో అన్నను వరంగల్ స్టేషన్లో రైలు ఎక్కించేందుకు తమ్ముడు వెంకటేష్ తన బైక్పై ఆదివారం రాత్రి 7.45 గంటలకు బయలుదేరారు. మార్గమధ్యలో వరంగల్–నెక్కొండ ప్రధాన రహదారిపై ఖిలా వరంగల్ మండలం నక్కలపల్లి శివారులో బైక్ను వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బైక్పైనుంచి పడడంతో అన్నదమ్ములిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షణాల్లో 108లో వరంగల్ ఎంజీఎం తరలించగా వెంకటేష్ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 9.30 గంటలకు మృతి చెందాడు. రామకృష్ణ చికిత్స పొందుతున్నాడు. అప్పటి వరకు తల్లితో గడిపిన కుమారులు రోడ్డు ప్రమాదంలో గాయపడడం.. చిన్న కుమారుడు వెంకటేష్ మృతి చెందడంతో కుటుంబీకులు బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో గుంటూరుపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. కష్టాలు తీరాయనుకునే సమాయాన కొడుకు మృతి చెందడంతో తల్లి సుగుణ గుండెలవిసేలా రోదిస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. మృతుడి తల్లి సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సోమవారం తెలిపారు. -
ఆర్ట్స్ కళాశాల మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూని వర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల్లోని మొదటి సెమి స్టర్ పరీక్షల ఫలితాలను ఆ కళాశాల ప్రిన్సిపా ల్ ఎస్.జ్యోతి సోమవారం విడుదల చేశారు. మొత్తం 1,445 మంది విద్యార్థులు పరీక్షలు రా యగా అందులో 482 మంది (33.35శాతం) ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. విద్యార్థులు రీవాల్యుయేషన్కు దరఖాస్తులు చేసుకోవచ్చునని, మార్చి 9వతేదీవరకు గడువు ఉందన్నారు. ఫలితాలు సంబంధిత నోటీస్బోర్డుతో పాటు కళాశాల వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వైస్ప్రిన్సిపాల్ రెహమాన్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. కేయూ పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా ఈనెల 25వ తేదీ నుంచి నిర్వహించాల్సిన పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ సోమవారం రాత్రి ప్రకటించారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ నాన్ప్రొఫెషనల్కోర్సులతోపాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల పరీక్షలు కూడా వాయిదావేసినట్లు తెలిపారు. పలు విభాగాల్లో సిలబస్ పూర్తికాని నేపథ్యంలో వాయిదావేసినట్లు పేర్కొన్నారు. మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహించే తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని రాజేందర్ చెప్పారు. ఘర్షణ పడిన విద్యార్థుల హాస్టల్ అడ్మిషన్ రద్దు యోచన?కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో న్యూపీజీ బాయ్స్ హాస్టల్లో ఎంబీఏ, ఎంఏ ఎకనామిక్స్ విభాగాల విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్న ఘటనను వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం సీరియస్గా పరిగణిస్తున్నారు. చికెన్ కోసం జరిగిన ఈ ఘర్షణలో 20మందిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఆ రెండు విభాగాల పలువురు విద్యార్థులు ఆ మెస్ కమిటీ మెంబర్లుగా ఉన్నారు. గొడవ జరిగినప్పుడు తీసిన వీడియోలను పరిశీలించనున్నట్లు కేయూసీ సీఐ రవికుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం వివిధ విద్యార్థి సంఘాలతో వీసీ, రిజిస్ట్రార్, సీఐ సమావేశమై చర్చించారు. కాగా, కేసులు నమోదైన విద్యార్థులను న్యూపీజీబాయ్స్ హాస్టల్నుంచి అడ్మిషన్ రద్దుచేయాలనే యోచనలో యూనివర్సిటీ అధికా రులు ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని వివరాలు సేకరించాక పోలీస్ కేసులను బట్టి నిర్ణయం తీసుకుంటామని కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం సోమవారం రాత్రి వెల్లడించారు. అవసరమైతే అకడమిక్ పరంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదన్నారు. లోకోపైలెట్కు అస్వస్థత కాజీపేట రూరల్ : రైలులో ఓ లోకోపైలెట్ సోమవారం అస్వస్థతకు గురి కాగా కాజీపేట జంక్షన్లో దింపి చికిత్స నిమిత్తం రైల్వే ఆస్పత్రికి తలించారు. యశ్వంత్పూర్–నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్లో విధులు నిర్వర్తిస్తున్న సికింద్రాబాద్కు చెందిన లోకోపైలెట్ ప్రసాద్ మార్గమధ్యలో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో సికింద్రాబాద్ రైల్వే అధికారులకు స మాచారం అందించి కాజీపేట జంక్షన్లో దింపారు. అనంతరం కాజీ పేట రైల్వే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని కాజీపేట రైల్వే అధికారులు తెలిపారు. -
స్పోర్ట్స్ హబ్గా హనుమకొండ
వరంగల్ స్పోర్ట్స్ : జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు నిలయమైన హనుమకొండ జిల్లాను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నాలుగు రోజులు నిర్వహించిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు సోమవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పతకాలు అందజేశారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఫలితాలను స్ఫూర్తితో స్వీకరించాలని సూచించారు. డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 1,518 మంది అథ్లెట్లు పాల్గొనగా, 32 ఈవెంట్లలో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీల్లో పురుషుల విభాగంలో ఖమ్మం జిల్లా ఓవరాల్ చాంపియన్షిప్ కై వసం చేసుకోగా, మహిళల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాంపియన్గా నిలిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్ఖాన్, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు సారంగపాణి, వెంకటేశ్వర్ రెడ్డి, గట్టు మహేశ్బాబు, మహ్మద్ కరీం, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్ ఖమ్మం ముగిసిన సీఎం కప్ పోటీలు -
మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలోనూ రాణిస్తాం
వరంగల్ క్రైం : మరింత శ్రమిస్తే భవిష్యత్లో జాతీయ స్థాయిలో కూ డా పతకాలు సాధిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. ఇటీవల సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో పతకాలు సాధించిన వరంగల్ కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులకు సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీపీ సన్ప్రీత్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులు ఈసారి రాష్ట్ర స్థాయి క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారన్నారు. గతేడాది కంటే ఎక్కువ సంఖ్యలో పతకాలు కై వసం చేసుకోవడం సంతోషం కలిగిస్తోందన్నారు. క్రీడల్లో రాణించే వారికి తమ సహకారం కచ్చితంగా ఉంటుందని తెలిపారు. డీసీపీలు దార కవిత, అంకిత్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్రా, అదనపు డీసీపీలు సురేశ్ కుమార్, రవి, శ్రీనివాస్, ఏసీపీలు నాగయ్య, సురేంద్ర, జితేందర్ రెడ్డి, మధుసూదన్, అంతయ్య, ఆర్ఐలు స్పర్జన్ రాజ్, సతీశ్ ఇన్స్పెక్టర్ షూకూర్, ఆర్ఎస్సై శరత్, మణికృష్ణ పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ -
డెంగీ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి
● జిల్లా మలేరియా విభాగం అధికారి రజిని దేశాయిపేట: నగర ప్రజలు డెంగీ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా విభాగం అధికారి కె.రజనీ సూచించారు. వరంగల్ డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు ఆదేశాల మేరకు దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నజ్రేతుపురంలో నమోదైన డెంగీ బాధితుడి ఇంటిని రజనీతో పాటు జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి అనిల్కుమార్ సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, ఇంటి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్పారు. దోమల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని వివరించారు. అనిల్కుమార్ మాట్లాడుతూ ప్రజలు కూడా తమ సామాజిక బాధ్యతలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను విధిగా పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారులు సదానందం, విజయేంద్రకుమార్, మున్సిపల్ హెల్త్ సూపర్వైజర్ మధుకర్, సిబ్బంది రవి తదితరులు పాల్గొన్నారు. -
గడువులోగా పనులు పూర్తి చేయండి
● తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలి ● మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: అభివృద్ధి పనులు మార్చి నెలఖారులోగా పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగర పరిధిలో జనరల్ ఫండ్ పనులు వేగంగా పూర్తి కావాలన్నారు. వేసవి దష్ట్యా నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా నగరంలోని అన్ని ఫిల్టర్ బెడ్లలో కెమికల్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నగరంలోని సుందరయ్య నగర్ పార్క్, కీర్తి నగర్ పార్క్, చిల్డ్రన్ పార్క్, ఉర్సు బండ్ నిమజ్జనం పాయింట్ వద్ద గల స్ట్రెచ్తో పాటు హనుమకొండ జంక్షన్ పునరుద్ధరణ పనులు సమీక్షించి వేగంగా పూర్తి చేసేందుకు సూచనలిచ్చారు. గత కౌన్సిల్ సమావేశాల్లో ఆమోదం పొంది టెండర్ పూర్తయిన ఎలక్ట్రికల్ లైట్లు ఏర్పాటు పురోగతి పనులు సమీక్షించారు. సమావేశంలో ఈఈలు రవికుమార్, సంతోశ్బాబు, మాధవీలత, మహేందర్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. కాశిబుగ్గ: చేనేత కళాకారులకు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుల కోసం దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకుడు వై.శ్రీకాంత్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. చేనేత కళాకారులు, చేనేత డిజైనర్లను వారి వృత్తిలో నైపుణ్యం, ప్రత్యేకతల ఆధారంగా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. చేనేత కళాకారులు 2025 డిసెంబర్ 31 నాటికి 30 ఏళ్లు పైబడి ఉండాలని, పదేళ్ల అనుభవం ఉండాలన్నారు. చేనేత డిజైనర్లకు ఐదేళ్ల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. మార్చి 31లోపు దరఖాస్తులు పంపాలని సూచించారు. -
అచల చిట్ఫండ్ బాధిత సభ్యులకు చెక్కుల పంపిణీ
వరంగల్ లీగల్ : అచల చిట్ ఫండ్ బాధిత సభ్యులకు వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ చేతుల మీదుగా సోమవారం చెక్కులు పంపిణీ చేశారు. అర్హులైన 79 మంది లబ్ధిదారులకు రూ.3,67,27,224ల విలువైన చెక్కులు అందజేశారు. చిట్ఫండ్ యాజమాన్యం, బాధితుల పట్ల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఎం.సాయికుమార్ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వ న్యాయవాది తీగల జీవన్ గౌడ్ పారదర్శకంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారి లబ్ధిదారులకు చిట్ఫండ్ నుంచి రావాల్సిన డబ్బును తిరిగి చెల్లించేలా న్యాయసేవాధికార సంస్థ కృషి అభినందనీయమన్నారు. చిట్ ఫండ్ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించకుండా కార్యకలాపాలు చేయాలని సూచించారు. న్యాయ సేవాధికార సంస్థ ప్రజల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని మరోసారి నిరూపించుకుందని బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్ర మంలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. సాయికుమార్, బాధితుల తరఫున న్యాయవాది వై. విశ్వేశ్వరరావు, అచల చిట్ఫండ్ తరపున సీనియర్ న్యాయవాది చొల్లేటి రామకృష్ణ, వరంగల్ జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరావు, అచల చిట్ ఫండ్ సంస్థ చైర్మన్ పి.సత్యనారా యణ, తదితరులు పాల్గొన్నారు. -
వేసవిలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి
హన్మకొండ అర్బన్ : వేసవి కాలంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని 108 ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ పి.శివకుమార్ అన్నారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో జిల్లా 108 ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని సన్స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది వేగంగా స్పందించి బాధితులను ఆస్పత్రులకు తరలించాలన్నారు. కాగా, శివకుమార్ జన్మదినం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా 108 ఉద్యోగులు ఆయనకు శుభా కాంక్షలు తెలిపారు. ప్రోగ్రాం మేనేజర్లు శ్రీనివాస్, భరత్, రాజ్కుమార్, రాజు నాయక్, 108 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లకావత్ బాలాజీ నాయక్, ప్రధాన కార్యదర్శి బోయినపల్లి దేవేందర్ రావు, తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ -
అర్జీలను త్వరగా పరిష్కరించాలి
ప్రజావాణిలో పాల్గొన్న వరంగల్ కలెక్టర్ సత్యశారద, అధికారులువిద్యార్థులకు ప్రశ్నలు వేసి జవాబును రాబడుతున్న కలెక్టర్ సత్యశారదన్యూశాయంపేట: ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన అర్జీలను అధికారులు త్వరగా పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. గ్రీవెన్స్లో భాగంగా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారుల సమక్షంలోనే సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు. ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణికి 150 దరఖాస్తులు రాగా, అందులో రెవెన్యూశాఖకు సంబంధించినవి 56, జీడబ్ల్యూఎంసీ 38, ఇతర శాఖలకు సంబంధించినవి 56 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ‘మేము వరంగల్ నగరంలోని కాశిబుగ్గ వివేకానంద కాలనీలో ముప్పై ఏళ్లుగా నివాసముంటున్నాం. మా కాలనీలో రోడ్డు వేశారు కానీ డ్రెయినేజీలు నిర్మించలేదు. దాంతో రోడ్లపై మురుగు పారుతోంది. మురుగునీటి కాల్వలు నిర్మించాలని పలుమార్లు కలెక్టర్, కమిషనర్కు విన్నవించినా ఫలితం లేదు’ అని వరంగల్ కాశిబుగ్గకు చెందిన అమ్జద్ పాషా విన్నవించారు. ‘సర్’పై సమీక్ష ప్రజావాణి అనంతరం జిల్లాలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) మ్యాపింగ్ ప్రక్రియపై తహసీల్దారులతో కలెక్టర్ సత్యశారద సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ సంబంధిత రికార్డుల కచ్చితత్వం కోసం చేపట్టిన సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఎలాంటి పొరపాట్లు లేకుండా గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి,, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, హౌసింగ్ పీడీ శ్రీవాణిలతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు కష్టపడి చదవాలి ఖిలా వరంగల్: లక్ష్యాన్ని ఎంచుకొని కష్టపడి చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని పదో తరగతి విద్యార్థులకు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఖిలా వరంగల్ మధ్యకోటలోని ఆరెల్లి బుచ్చ య్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం సాయంత్రం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా బోధన తీరు, ప్రత్యేక తరగతులు, అందిస్తున్న స్నాక్స్ను పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలపై అవగాహన కల్పించారు. ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్త మ ఫలితాలు సాధించాలన్నారు. సమయపాలన పాటిస్తూ వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. పరీక్ష సమయంలో ఎదురయ్యే భయాందోళనలను తొలగించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. డీఈఓ రంగయ్య నాయుడు, ఎంఈఓ ప్రసాద్, తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
సాగునీరివ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం
హన్మకొండ: రైతులకు సాగునీరు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ విమర్శించారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలో బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దేవాదుల ప్రాజెక్టు 90 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. మిగిలిన 10శాతం పనులు రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేక పోయిందని దుయ్యబట్టారు. మాజీ మంత్రి హరీశ్రావు దేవన్నపేట పర్యటనతోనే సీఎం రేవంత్రెడ్డిలో కదలిక వచ్చిందని, గాలిలో దేవాదులకు వచ్చి గాలి మాటలు మాట్లాడి వెళ్లారని తూర్పారబట్టారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కేరళలో జరిగే ఎన్నికల ఫండ్ కోసం మాత్రమే దేవాదుల నిర్మాణంపై ఈ సమీక్షిస్తున్నారని, దేవాదుల మూడో ఫేజ్ నిర్మాణ వ్యయాన్ని రూ.17వేల కోట్ల నుంచి రూ.24 వేల కోట్లకు పెంచిందని ఆరోపించారు. పెంచిన రూ.7వేలకోట్లతో కాంట్రాక్టర్నుంచి కాంగ్రెస్ రూ.వేల కోట్లు దండుకోనుందని ఆరోపించారు. మాజీ మంత్రి తాటికొండ రాజయ్య మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేనందుకు మరోసారి పిండాలు పెట్టె కార్యక్రమాలు చేయబోతున్నామన్నారు. సమావేశంలో నాయకులు నాగూర్ల్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవ రెడ్డి, జోరిక రమేష్, పులి రజనీకాంత్, జానకి రాములు, చందర్, అఫ్జల్, మటపెల్లి రమేష్, నార్లగిరి రమేష్, జనార్దన్ గౌడ్, దశరథం, రఘు, నయీమొద్దీన్, కోటిలింగం, వినోద్ కుమార్, రామ్మూర్తి, రాజు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీశ్ రాకతో సీఎం రేవంత్లో కదలిక బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ -
చెరబండరాజు కాలనీ సందర్శన..
రామన్నపేట : నగరంలోని 11వ డివిజన్ చెరబండరాజు నగర్ కాలనీని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యుడు కొంకటి లక్ష్మీనారాయణ సోమవారం సందర్శించారు. కొద్దిరో జులుగా కాలనీవాసులకు మంచినీరు సరఫరా నిలిచిపోవడంతో పడిన ఇబ్బందులు, వారిని ఖాళీ చేయాలన్న ఆదేశాలను తెలుసుకున్న ఆయన.. వెంటనే జీడబ్ల్యూఎంసీ కమిషనర్కు ఫోన్ చేసి పూర్తి నివేదికతో తమ కమిషన్ ఆఫీస్కు రావాలని ఆదేశించారు. అనంతరం చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ దేవాలయ అధికారులు.. దళితులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేసినా శిక్షార్హులవుతారని తెలిపారు. విద్యుత్ అధికారులు కరెంట్ అందించాలని, పోలీస్ అధికారులు సైతం ఎలాంటి ఇబ్బందులు పెట్టరాదని ఆదేశించారు. అనంతరం భద్రకాళ్లి దేవస్థానం ఎదురుగా దళితబంధు పథకంకింద ఏర్పాటు చేసిన హోటల్ను మున్సిపల్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించిన తీరును పరిశీలించి బాధ్యులైన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, కంజర్ల మనోజ్, కొడకండ్ల సదంత్, ప్రదీప్, దశరథ్, రఘ, అనిల్, సాయి, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు. కాలనీవాసులతో మాట్లాడిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య పూర్తి నివేదికతో రావాలని బల్దియా కమిషనర్కు ఆదేశం -
చికెన్ అడిగినందుకు చితక్కొట్టారు!
హనుమకొండ: చికెన్ కోసం కాకతీయ వర్సిటీ లోని న్యూపీజీ బాయ్స్ హాస్టల్ విద్యార్థులు ఆదివారం రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నా రు. ఆరుగురికి గాయాలుకాగా, అందులో ఒకరి తలకు తీవ్రగాయమైంది. పోలీసులు ఇరువర్గాల ఫిర్యాదు మేరకు 20మందిపై కేసు నమోదు చేశారు. సోమవారం సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. న్యూపీజీ బాయ్స్ హాస్టల్లో మూడు విభాగాలకు చెందిన పలువురు విద్యార్థులు మెస్ కమిటీలో ఉన్నారు. ఆదివారం బాయ్స్ హాస్టల్ మెస్లో చికెన్తో కూడిన భోజనం పెట్టారు. కొంత చికెన్ మిగిలి ఉండడంతో ఓ విభాగానికి చెందిన విద్యార్థి తనకు భోజనంలోకి చికెన్కావాలని అడిగారని సమాచారం. దీంతో మరో విభాగానికి చెందిన విద్యార్థి గదిలో ఉందని పిలిచి అక్కడికి వెళ్లాక అతనిపై దాడిచేసి కొట్టినట్లు సమాచారం. ఆ తరువాత ఆ విద్యార్థి తన విభాగానికి చెందిన విద్యార్థులకు తెలియజేయగా, సాయంత్రం కొట్టిన మరోవర్గం విద్యార్థులను ఓ గదిలోకి తీసుకెళ్లి కొట్టినట్లు తెలిసింది. ఇలా రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ చివరికి పోలీసుల దృష్టికి వెళ్లడంతో కొందరు పోలీసులు హాస్టల్ వద్దకు వెళ్లారు. వారి ముందే తోపులాట, దాడులకు ప్రయతి్నంచారని సమాచారం. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు ఆయా రెండువర్గాల విద్యార్థులను అదుపులోకి తీసుకుని కొద్దిసేపటి తరువాత వదిలేశారు. రాత్రి 11గంటల ప్రాంతంలో రెండు వర్గాల విద్యార్థుల మధ్య మళ్లీ ఘర్షణ తలెత్తింది. కర్రలతో దాడి చేసుకున్నట్లు సమాచారం. వీడియోల ఆధారంగా దాడులకు పాల్పడిన విద్యార్థులను గుర్తిస్తున్నట్లు సీఐ తెలిపారు.కాగా, విద్యార్థి సంఘాల నేతలతో వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజి్రస్టార్ రామచంద్రం, ఏసీపీ నర్సింహారావు చర్చించారు., ఘర్షణ వీడియోలు పరిశీలించి వివరాలు సేకరించాక కేసులు నమోదైన విద్యార్థుల హాస్టల్ అడ్మిష న్ రద్దుచేయాలనే యోచనలో వర్సిటీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. -
భార్య పక్కనే తన విగ్రహం పెట్టుకున్న భర్త..
జనగామ జిల్లా: భాగస్వామి చనిపోతే విగ్రహం ఏర్పాటు చేయడం అక్కడక్కడా చూస్తుంటాం. భార్య మరణాన్ని తట్టుకోలేక విగ్రహం ఏర్పాటు చేసిన ఓ భర్త.. ఆమె పక్కనే నేనుండాలి అంటూ తన విగ్రహం పెట్టుకున్నాడు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిప్పరాళ్లబండ తండాకు చెందిన భూక్య నానునాయక్. ఆయనకు దస్లీతో వివాహమై అరవై ఏళ్లు అయ్యింది. ఆమె ఏడాదిన్నర క్రితం కన్నుమూసింది.భార్య భౌతికంగా లేకపోయినా.. జ్ఞాపకమై నిలవాలని తన వ్యవసాయ భూమిలో దస్లీ విగ్రహాన్ని పెట్టాడు నానూ నాయక్. ఏనాటికైనా ఆమె ధరిచేరతానని.. బతుకులోనూ, మరణంలోనూ, చివరికి విగ్రాహాల్లోనూ ఆమెకు తోడుగా ఉండాలని భావించాడు. బతికుండగానే తన విగ్రహాన్ని తయారు చేయించి దస్లీ విగ్రహం పక్కన ముసుగేసి ఉంచాడు. తన మరణానంతరం విగ్రహాన్ని ఆవిష్కరించాలని సంతానాన్ని కోరాడు. -
భద్రకాళికి సంగీత దర్శకుడు తమన్ పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని ఆదివారం సంగీత దర్శకుడు ఎస్ఎస్ ఽతమన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ, వరంగల్ జోన్ డీసీ రామల సునీత, ప్రధానార్చకుడు శేషు ఆయనను ఘనంగా స్వాగతించారు. తమన్ అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు తోనుపునూరి వీరన్న, ఓరుగంటి పూర్ణచందర్, మోత్కురి మయూరి, అనంతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, జబర్దస్త్ ఫేం రాకేష్ కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. -
నేటి దీక్షలు విజయవంతం చేయాలి
● ఎస్జీపీఏటీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డివిద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఈ నెల 23న హనుమకొండలోని ఏకశిల పార్కు వద్ద చేపట్టనున్న నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని అసోసియేషన్ ఎస్జీపీఏటీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల శాఖలు సంయుక్తంగా ఆదివారం హనుమకొండలో పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మార్చి 2024నుంచి జనవరి 2026 వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈనెల 23న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నిరాహరదీక్షలు కొనసాగుతాయన్నారు. సమావేశంలో అసోసియేపన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జి.వీరస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సమ్మారెడ్డి, జిల్లా కమిటీ బాధ్యులు సింగారెడ్డి రత్నాకర్, హనుమకొండ జనరల్ సెక్రటరీ కందుకూరి దేవదాసు, బాధ్యులు గొవిందరెడ్డి, సక్మారెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, జలందర్ తదితరులు పాల్గొన్నారు.


