Hanamkonda
-
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ
సాక్షి, హనుమకొండ: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగిపోయారు. నరహరి భార్యతో పాటు పోలీసులు ఎదుట లొంగిపోయారు. రెండు పదుల వయస్సులో పోరుబాట పట్టి దాదాపు 45 ఏళ్లుగా అజ్ఞాతంలో కొనసాగారు. సోమిడి గ్రామానికి చెందిన పసునూరి నర్సమ్మ–సోమనారాయణకు ఐదుగురు కొడుకులు. వీరిలో రెండో కుమారుడు నరహరి.1980 సంవత్సరంలో ఎల్బీ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా నక్సల్స్ విధానాలకు ఆకర్షితుడయ్యాడు. అప్పటి రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, క్రాంతిరణదేవ్ అలియాస్ బక్కన్నతో ఏర్పడిన స్నేహం ఆయనను ఉద్యమం వైపు అడుగులు వేయించింది. గ్రామంలో ఉంటూ కూలీల రేట్లు పెంచడంతోపాటు భూస్వాములు, రౌడీలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అప్పటి ఆర్ఈసీలో ఉన్న ఉద్యమ నాయకుల మాటలతో ప్రభావితమైన నరహరి పోలీసుల నిర్బంధం పెరగడంతో అడవి బాట పట్టారు. -
నేడు టీజీఎడ్ సెట్
● నిమిషం ఆలస్యమైతే నోఎంట్రీ ● 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు ● హాజరుకానున్న 4,609 మంది అభ్యర్థులు కేయూ క్యాంపస్ : తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం 2026–2027లో ప్రవేశాలకుగాను ఈనెల 12న (నేడు) ప్రవేశ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్)నిర్వహించబోతున్నారు. ఉమ్మడి వరంగల్ జి ల్లా కేంద్రంలో ఏడు, వరంగల్ జిల్లా నర్సంపేటలో ఒకటి మొత్తం 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో కాజీపేట సోమిడిలోని తాళ్ల పద్మావతి ఇంజనీరింగ్ కాలేజీ, బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ, ములుగు ఎక్స్రోడ్లోని (గాయత్రీ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ ఐటీఐ కాలేజీ), ఎర్రగట్టుగుట్టలోని ఐయాన్ డిజిటల్, హసన్పర్తి హైవేలోని నోబుల్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్, గోపాల్పూర్లోని ఎన్ఎస్ గ్లోబల్ టెక్నాలజీస్, హనుమకొండ వడ్డేపల్లిలోని ఐయాన్ డిజిటల్, వరంగల్ జిల్లా నర్సంపేట లక్నెపల్లి సమీపంలోని బాలాజీ ఇన్స్టిటిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు టీజీఎడ్సెట్ కన్వీనర్, కాకతీయ యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి. వెంకట్రామ్రెడ్డి సోమవారం తెలిపారు. టీజీఎడ్సెట్ను రెండు సెషన్లలో నిర్వహించబోతున్నారు. మొదటి సెషన్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహిస్తారు. ఉదయం సెషన్కు 8: 30 నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండబోదు. రెండోసెషన్లో మధ్యాహ్నం 12: 30 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. రెండు గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుతించబోరు. మొదటి సెషన్లో 2,304 మంది, రెండో సెషన్లో 2,305 మంది మొత్తం 4,609 మంది అభ్యర్థులు పరీక్షలు రాయబోతున్నారు. హాల్టికెట్, బ్లూలేదా బ్లాక్ పాయింట్ పెన్, ఐడీ ప్రూప్ తీసుకుని రావాలని వెంకట్రామ్రెడ్డి తెలిపారు. అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. -
అన్నపూర్ణ బేస్ క్యాంపును అధిరోహించిన జంట
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా కేంద్రంలోని లోటస్కాలనీకి చెందిన అక్షయ్–బిందుశ్రీ దంపతులు హిమాలయాల్లోని స ముద్రమట్టానికి 4,130 మీటర్ల ఎత్తులో ఉన్న అన్నపూర్ణ బేస్ క్యాంపునకు చేరుకొని తమ సాహస యాత్రను విజయవంతంగా పూర్తి చే శారు. కాగా, అక్షయ్ సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్గా,బిందుశ్రీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ప నిచేస్తున్నారు. ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ కనబరి చే వీరు ఈ యాత్రకు సిద్ధమైనట్లు తెలిపారు. మక్కలు, ధాన్యాన్ని కొనుగోలు చేయాలిహన్మకొండ అర్బన్: మక్కలు, ధాన్యాన్ని కొ నుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ కొ నుగోలు కేంద్రాల్లో రవాణా, హమాలీల సమస్యల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారని తెలిపారు. గన్నీ సంచుల కొరత కూడా తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం సందర్శించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో రైతు సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సీపీఎం జిల్లా నాయకులు ఎం.చుక్కయ్య, బొట్ల చక్రపాణి, సారంపల్లి వాసుదేవరెడ్డి, తేలూరి ఉప్పలయ్య, వాంకుడోత్ వీరన్న నాయక్, మంద సంపత్, కాడబోయిన లింగయ్య, దొగ్గల తిరుపతి, గుమ్మ డి రాజుల రాములు, మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య, రమేష్, రజిత, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఎం.రమ, ఉపేందర్, దూడపాక రాజేందర్, జీడిమట్ల అరుణ,తదితరులు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2026
మైనర్ ఖనిజాల వేలంలో భారీ మార్పులు హైబ్రిడ్ విధానానికి సర్కారు గ్రీన్సిగ్నల్సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వం మైనర్ ఖనిజ బ్లాకుల వేలం విధానంలో కొత్త మార్గదర్శకాలకు శ్రీకారం చుట్టింది. ఖనిజాల తవ్వకాల్లో పారదర్శకత, ఆదాయం పెంపు లక్ష్యంగా హైబ్రిడ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ద్వారా ఖనిజాల లీజులు కేటాయించనున్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎన్.శ్రీధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనింగ్ రంగానికి ఊతమివ్వనున్నాయి. ముఖ్యంగా గ్రానైట్, స్టోన్ మెటల్, బ్లాక్ గ్రానైట్, రోడ్ మెటల్, మట్టి, ఇసుక వంటి ఖనిజాల తవ్వకాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అధికా రులు భావిస్తున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు.. ఉమ్మడి వరంగల్లో ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు ఉన్నాయి. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అధికంగా క్వారీలు ఉన్నాయి. మైన్స్ అండ్ జియాలజీ శాఖ అంచనాల ప్రకారం ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల పరిధిలో ప్రస్తుతం చిన్నా, పెద్దవి కలిపి సుమారు 250కు పైగా మైనింగ్, క్వారీ లీజులు అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అధిక భాగం స్టోన్ మెటల్, రోడ్ మెటల్ యూనిట్లు, గ్రానైట్ తవ్వకాలు, బ్రిక్ ఎర్త్, మట్టి క్వారీలు, ఇసుక రీచ్లు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు అధికంగా ఉండడంతో గ్రానైట్, స్టోన్ మెటల్ క్వారీల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పట్టాదారులకు తీపి కబురు ఇకపై మైనర్ ఖనిజాల వేలం మొత్తం ఆన్లైన్లోనే జరగనుంది. బిడ్డింగ్ నుంచి లీజు కేటాయింపు వరకు ప్రతీ దశ డిజిటల్ విధానంలో ఉండడంతో అక్రమాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కనీసం ముగ్గురు బిడ్డర్లు తప్పనిసరి చేయడం ద్వారా పోటీ పెరిగి ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, పట్టా భూముల్లో ఖనిజ తవ్వకాలకు అంగీకరించిన భూ యజమానులకు ప్రభుత్వం అదనపు సొమ్ము చెల్లించనుంది. గ్రానైట్, మార్బుల్ మినహా ఇతర ఖనిజాలకు సీనియరేజ్ ఫీజులో 10 శాతం, గ్రానైట్, మార్బుల్కు 5 శాతం పెంచనున్నారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని ప్రైవేట్ భూముల్లో కొత్త క్వారీలకు భూ యజమానులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. రాయల్టీ పెరిగే అవకాశం.. కొత్త వేలం విధానం అమలైతే ఉమ్మడి వరంగల్లో ఖనిజ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సుమారుగా ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తుండడంతో రోడ్ మెటల్, స్టోన్ మెటల్, గ్రానైట్కు డిమాండ్ పెరుగుతోంది. కొత్త లీజులు మంజూరైతే ప్రభుత్వానికి రూ.25–30 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని మైనింగ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త లీజులు గ్రానైట్, స్టోన్ మెటల్, ఇసుక క్వారీలపై ఫోకస్ ఇప్పటి వరకు పర్యావరణ, కాలుష్య నియంత్రణ అనుమతులు లేక వేలం జరగని అనేక ఖనిజ బ్లాకులు కొత్త ‘హైబ్రిడ్ విధానం’ ద్వారా వేలంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్లోనే మరో 40 నుంచి 60 వరకు కొత్త మైనింగ్ లీజులు, క్వారీ బ్లాకులు వేలానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని మైనింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్లో బ్లాక్ గ్రానైట్, భూపాలపల్లిలో రోడ్ మెటల్, ములుగులో స్టోన్ క్వారీలు, వరంగల్, హనుమకొండ పరిసరాల్లో నిర్మాణ రంగానికి అవసరమైన మెటల్ క్వారీలు అధికం. కాగా, ఆయా జిల్లాల్లో కొత్త విధానంతో వేగంగా అనుమతులు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. -
విజ్ఞాన గనులు.. గిరిజన గురుకులాలు
న్యూశాయంపేట: పేద విద్యార్థులకు గిరిజన గురుకులాలు వరంగా మారనున్నాయి. వారికి కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య, వసతి, పౌష్టికాహారం అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలు ఇప్పుడు విజ్ఞాన గనులుగా విరాజిల్లుతున్నాయి. ప్రతిభ ఉండి పేదరికంతో ఇబ్బంది పడుతున్న గిరిజన, గిరిజనేతర విద్యార్థుల కోసం ఈ విద్యాసంస్థలు మరోసారి ద్వారాలు తెరుచుకున్నాయి. 2026–27 విద్యాసంవత్సరానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఐదు గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో అడ్మిషన్ల ప్రక్రియ ఊపందుకుంది. నేరుగా ప్రవేశానికి అవకాశం.. గిరిజన గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి పదో తరగతి పూర్తి చేసిన గిరిజన (ఎస్టీ) విద్యార్థులతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన గిరిజనేతర కోటా ప్రకారం ఎస్సీ, బీసీ, ఇతర వర్గాల విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ప్రవేశ పరీక్ష రాయక పోయినా లేదా మెరిట్ జాబితాలో వెనుకబడిన వారికి ఇదొక అద్భుత అవకాశం అని చెప్పవచ్చు. ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో చేరేందుకు అవకాశం కల్పించింది. ఉచిత భోజన, వసతి, యూని ఫాం, పుస్తకాలతోపాటు నాణ్యమైన బోధన, పోటీ పరీక్షలకు (జేఈఈ, నీట్) ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తుంది. గిరిజన, గిరిజనేతర విద్యార్థులు నేరుగా అడ్మిషన్ పొందడానికి వీలుంది. బాలురకు ఒకటి, బాలికలకు నాలుగు కళాశాలలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగు బాలికల గురుకుల కళాశాలలు, ఒకటి బాలుర గురుకుల కళాశాలలు ఉన్నాయి. హనుమకొండ జిల్లా పరిధిలోని దేవన్నపేట గిరిజన సంక్షేమ గురుకుల (బాలికల) కళాశాల, జనగామ జిల్లా పరిధిలో పాలకుర్తి గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాల, వరంగల్ జిల్లా పరిధిలోని పర్వతగిరి గిరిజన సంక్షేమ బాలికల కళాశాల, నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో గిరిజన సంక్షేమ బాలికల కళాశాల, వరంగల్ జిల్లా నర్సంపేటలో గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో సీట్ల భర్తీ.. ప్రతీ గురుకుల కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గూపుల్లో 40 సీట్ల చొప్పున భర్తీ చేస్తారు. రిజర్వేషన్ ప్రకారం ఎస్టీలకు(34), ఓసీ/ఈబీసీ (1), బీసీ (1), ఎస్సీ (1), అనాథ (1), స్పోర్ట్స్ కోటా (1), పీహెచ్సీ (1)కి కేటాయింపులు ఉంటాయి. అర్హులైన విద్యార్ధులు తమ టీసీ, మెమో, స్టడీ సర్టిఫికెట్, పాస్ఫొటో, ఆదాయ, ఆధార్, కుల, ఆదాయ (రూరల్ పరిధి 1.50 లక్షలు, పట్టణ పరిధి రూ.2 లక్షలు) ధ్రువీకరణ పత్రాలతోపాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను వెంట తీసుకుని నేరుగా వరంగల్ యాకత్పురలోని చింతల్బ్రిడ్జి వద్ద ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలను ఈనెల 16వ తేదీన ఉదయం 10 గంటలకు సంప్రదించాలి. విద్యార్థులకు నాణ్యమైన బోధన, నీట్, జేఈఈలో శిక్షణ ఉమ్మడి జిల్లాలోని ఐదు కళాశాలల్లో అడ్మిషన్లు షురూ దరఖాస్తుకు ఈనెల 16వ తేదీ వరకు గడువుగిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులు ఉన్నత శిఖిరాలు అధిరోహించడానికి మంచి అవకాశం. అర్హులైన వారు గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆలస్యం చేయకుండా తమ సమీపంలోని గిరిజన గురుకుల కళాశాల ప్రిన్సిపాళ్లను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. అవకాశం కోల్పోకుండా తమ భవిష్యత్కు బాటలు వేసుకోవాలి. – డీఎస్ వెంకన్న, ఆర్సీఓ వరంగల్, కరీంనగర్ రీజియన్ -
సెలవులు వినియోగించుకోండి
హనుమకొండ డీఈఓ గిరిరాజ్గౌడ్ హసన్పర్తి: విద్యార్థులు వేసవి సెలవులు వినియోగించుకోవాలని డీఈఓ గిరిరాజ్గౌడ్ అన్నారు. హసన్పర్తి మండల కేంద్రంలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం సోమవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి గిరిరాజ్గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 11 నుంచి ఈనెల 25వ తేదీ వరకు శిక్షణ శిబిరం కొనసాగుతుందని, డ్రాయింగ్, పెయింటింగ్, వర్క్ ఎడ్యుకేషన్, డ్యాన్స్, మ్యూజిక్, కోడింగ్, ఆటలు, ఫన్ గేమ్స్ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమాదేవి అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ మహేశ్, ఏఎంఓ మన్మోహన్, కళాశాల అభివృద్ధి కమిటీ కోశాధికారి చకిలం రాజేశ్వర్రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కేజీవీవీలో... కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం ప్రత్యేక వేసవి శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమానికి డీఈఓ గిరిరాజ్గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్, కో–ఆర్డినేటర్ సునీత, స్పెషల్ ఆఫీసర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు. వేసవి సెలవులను వృథా చేయొద్దు: డీవైఎస్ఓవరంగల్ స్పోర్ట్స్: విద్యార్థులు వేసవి సెలవులను వృథా చేయకుండా ఇష్టమైన క్రీడల్లో శిక్షణ పొందాలని హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ అన్నారు. హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కాజీపేట మండలం సోమిడిలో నిర్వహిస్తున్న తైక్వాండో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సోమవారం డీవైఎస్ఓ ప్రశాంత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లోని ప్రతిభను వెలికితీయడానికి ఇదొక చక్కటి అవకాశమని పేర్కొన్నారు. క్రీడల్లో రాణిస్తే ఆరోగ్యంతోపాటు సాధించాలన్న ఆత్మవిశ్వాసం పెంపొందుతుందన్నారు. డీఎస్ఏ కోచ్లు కూరపాటి రమేశ్, రాయబారపు నవీన్, తైక్వాండో కోచ్ మోహన్లాల్, డీఎస్ఏ సిబ్బంది దుబాసి కిశోర్ పాల్గొన్నారు. -
విద్యార్థుల విజయం జిల్లాకే గర్వకారణం
● మంత్రి కొండా సురేఖ ఖిలా వరంగల్: విద్యార్థులు వార్షిక పరీక్షల్లో సాధించిన విజయాలు జిల్లాకే గర్వకారణమని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఉర్సుగుట్ట సమీపంలోని ఆకుతోట కన్వెన్షన్ హాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో (యంగ్ ఆచీవర్స్ సన్మాన కార్యక్రమం) విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. ముఖ్య అతిథులుగా మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ సత్యశారద, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఈఓ రంగయ్యనాయుడు, ఆర్డీఓ సుమ హాజరై 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో 550 మార్కులకు పైగా, ఇంటర్మీడియట్లో 980 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులతో పాటు రెండుసార్లు చదరంగం పోటీల్లో ప్రపంచ రికార్డు సాధించిన శ్రీయాంశ్ మురళీకృష్ణను ఘనంగా సత్కరించారు. తహసీల్దార్లు శ్రీకాంత్, ఇగ్బాల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖ అధికారులు భాగ్యలక్ష్మి, పుష్పలత, రమేశ్, నారాయణరెడ్డి, డీవైఎస్ఓ అనిల్ పాల్గొన్నారు. -
బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: బాలికల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఆరోగ్యంపై అవగాహన, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. స్నేహ సమ్మర్ క్యాంపుల నిర్వహణపై డీఆర్డీఓ మేన శ్రీను, డీడబ్ల్యూఓ విశ్వజ, డీఈఓ గిరిరాజ్ గౌడ్, డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, డీపీఓ లక్ష్మీ రమాకాంత్ తదితర అధికారులతో కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కౌమార దశలో బాలికల్లో చోటు చేసుకునే శారీరక, మానసిక మార్పులపై అవగాహన కల్పించాలని సూచించారు. గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అంశాలపై బాలికలకు స్పష్టమైన అవగాహన కలిగించాలన్నారు. బాలికలను క్రీడల వైపు ప్రోత్సహించాలని, ప్రతీ గ్రామపంచాయతీలో క్రీడా పోటీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్, డీపీఎం పద్మప్రియ, ఏపీఎం శ్రీలత, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుజాత, అధికారులు పాల్గొన్నారు. ‘ఎస్ఐఆర్ ’మ్యాపింగ్ వేగవంతానికి చర్యలు జిల్లాలో ‘ఎస్ఐఆర్’ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యా పింగ్ ప్రక్రియపై కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మ్యాపింగ్ ప్రక్రియకు అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించి నియమిస్తున్నామని తెలిపారు. డీఆర్ఓ శ్రీనివాస్, ఆర్డీఓలు రమేశ్ రాథోడ్, నారాయణ, తహసీల్దార్లు విజయలక్ష్మి, రవీందర్రెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్ జగత్సింగ్ అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు పూర్తిచేయాలి వరంగల్ అర్బన్: నగరంలోని అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్, గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి, ఇన్చార్జ్ కమిషనర్ చాహత్బాజ్పాయ్ ఆదేశించారు. వరంగల్ నాయుడు పెట్రోల్ పంపు, రామన్నపేట, లక్ష్మీపురం, మట్టెవాడ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులను సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈఈ సంతోశ్బాబు, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, అధికారులు పాల్గొన్నారు. -
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి
ఓరుగల్లు పీఠకాపరి బిషప్ విజయపాల్రెడ్డి కాజీపేట రూరల్: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని రోమన్ క్యాథలిక్ సంఘం 40 ఏళ్లుగా రాజీలేని పోరాటం చేస్తోందని ఓరుగల్లు మేత్రాసనం పీఠాధిపతి బిషప్ దుగ్గుంపుడి విజయపాల్రెడ్డి అన్నారు. దళిత క్రైస్తవుల రాజ్యాంగ హక్కుల సాధన రౌండ్ టేబుల్ సమావేశం కాజీపేట ఫాతిమానగర్లో సోమవారం ఫాదర్ నవీన్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విజయపాల్రెడ్డి మాట్లాడుతూ.. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఏటా ఆగస్టు 10న నిరసన దినం జరుపుకుంటున్నట్లు తెలిపారు. వరంగల్ డీసీసీ అధ్యక్షుడు ఎండీ అయూబ్ కాంగ్రెస్ తరఫున, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ తరఫున సంపూర్ణ మద్దతు తెలిపారు. సీపీఐ నాయకులు రాజమౌళి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి నున్నా అప్పారావు మాట్లాడుతూ.. దేశంలో మతం మారినంత మాత్రాన కుల వివక్ష పోలేదని, కులం ఉన్నంత కాలం ఎస్సీ హోదా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రెవ.అశోక్పాల్, బోడ డిన్నా, ఫాదర్ జోసెఫ్, రాజమోహన్, పొలిమెర సృజన్కుమార్, ప్రవీణ్, ఎన్.కిరణ్, జన్ను ఈర్మియా, అరుణ్జెమ్స్, కొవడవటి రవి తదితరులున్నారు. -
దేవుడంటే రేవంత్రెడ్డికి లెక్కలేదు
ఖానాపురం: దేవుడు, బడులంటే సీఎం రేవంత్రెడ్డికి లెక్కలేదని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. వ రంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్లో కూల్చివేసిన శివాలయాన్ని సోమవారం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయని, ఆలయం వద్ద 24 ఫీట్ల లోతు తవ్వి పూడ్చివేయడంలో కారణం ఏంటన్నారు. ఆర్కియాలజీ అధికారులు ఈనెల 7న ఫిర్యాదు చేస్తే కలెక్టర్ ఎందుకు కేసులు నమోదు చేయించడం లేదని ప్రశ్నించారు. గుప్తనిధుల కోస మే సీఎం రేంవత్రెడ్డి తవ్వకాలు జరిపించారని ఆరో పించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ను అశోక్నగర్కు ఎందుకు మార్చాల్సి వచ్చిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ దేవాలయాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తే సీఎం రేవంత్రెడ్డి కూల్చివేస్తున్నాడని ఎద్దేవా చేశారు.రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్లు వేసి మాటతప్పిన వారిలో దేశంలో తొలిముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్రావు మాట్లాడుతూ రేవంత్రెడ్డి అనేక పా పాలు చేస్తున్నాడన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ కూల్చివేతపై కలెక్టర్ ఎందుకు నోరు విప్పడం లేదని, కూల్చివేతపై కాంగ్రెస్ పెద్దల్లో భయం పుట్టుకుందన్నారు. మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, అరూరి రమేశ్, శంకర్నాయక్, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రో ళ్ల శ్రీనివాస్, మర్రి యాదవరెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీపీ ప్రకాశ్రావు, సర్పంచ్ రమేశ్, నాయకులు వి ద్యాసాగర్రెడ్డి, కిషన్రావు, రాజశేఖర్, శ్రీనివాస్, వెంకటనారాయణ, కోటేశ్వర్రావు, వెంకటనర్స య్య, సంపత్, రాజు, దేవేందర్రావు పాల్గొన్నారు. శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు -
ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధ్యమే..
రామవరం అనే చిన్న ఊరిలో నవ్య, కావేరి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చదువులో ఇద్దరూ తెలివైన వారే. ఆ ఊరిలో పదో తరగతి వరకు చదువుకున్నారు. ఇద్దరికి చదువుంటే చాలా ఇష్టం. నవ్యకు డాక్టర్ కా వా లని కోరిక. కాని ఆత్మవిశ్వాసం తక్కువ. ఎవరైనా ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే అదే ఆలోచించేది. కా వేరి ధైర్యవంతురాలే కాకుండా ఆత్మవిశ్వాసం ఎక్కువ. బాగా చదువుకుని లాయరై పేదలకు సేవ చేయాలనే కోరిక. ఇద్దరు కలిసి వెళ్తుంటే గ్రామంలో పనిపాటలేని కొందరు మీరు అమ్మాయిలు.. మీకు చదువు ఎందుకు చక్కగా పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చు. ఊరోళ్లు గొప్ప ఉద్యోగాలు చే యలేరు. మీ నుంచి కాదు అంటూ నిరుత్సాహ పరుస్తారు. నవ్య అదే ఆలోచించుకుంటూ నేను డాక్టర్ను కాలేనేమో అనే అనుమానంతో ఆలోచిస్తూ పెళ్లి చేసుకోవడమే మేలేమో అనుకుని నిర్ణయం మార్చుకుంటుంది. సంబంధం రావడంతో పెళ్లి చేసుకుంటుంది. కావేరి మాత్రం వారి మాటలు పట్టించుకోకుండా ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో చదువుకుని లాయర్ అవుతుంది. ఎంతో మందికి సేవ చేస్తుంది. చాలా రోజుల తర్వాత నవ్య కావేరిని కలిసి తన కుటుంబ పరిస్థితి, ఆర్థికంగా ఇబ్బందులు వివరిస్తూ నేను ధైర్యంగా చదువుకుని ఉంటే ఈ రోజు డాక్టర్ను అయ్యి ఎంతో మందికి సేవ చేసేదాన్ని. నా పిల్లలను కూడా మంచిగా చూసుకునేదానంటూ బాధపడుతుంది. దీనికి కావేరి ధైర్యం చెప్పింది. ఇప్పటికి బాధపడకు. మించిపోయింది ఏమీలేదు. ఏదో ఉద్యోగం సంపాదించు నేను నీకు సాయం చేస్తానంటూ నవ్యకు భరోసా ఇచ్చింది. దీంతో నవ్య ఆగిపోయిన చదువు కొనసాగిస్తుంది. కావేరి సాయంతో నవ్య మంచి ఉద్యోగం సాధిస్తుంది. ఇద్దరు కలిసి పేదలకు సేవ చేస్తూ స్నేహితులుగా మంచి పేరు తెచ్చుకుంటారు. –లింగాలఘణపురం నీతి: ఆత్మవిశ్వాసం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. – వై.అక్షయ, పదో తరగతి, లింగాలఘణపురం -
నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో విషాదం
● గుండెపోటుతో డీఏఓ మృతి నర్సంపేట రూరల్: నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. డీఏఓ (డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్)గా విధులు నిర్వర్తిస్తున్న తిప్పరి శ్రీనివాస్ (57) గుండెపోటుతో మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా కాజీపేటకు చెందిన తిప్పరి శ్రీనివాస్ వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో మూడు సంవత్సరాల నుంచి డీఏఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. నర్సంపేట ఆర్డీఓ కార్యాలయానికి శ్రీనివాస్ విధులకు హాజరయ్యారు. విధులు నిర్వర్తిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి కిందపడిపోయాడు. వెంటనే సహ ఉద్యోగులు ఆస్పత్రికి తరలించే సరికి మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈతకు వెళ్లి విద్యార్థి మృతి ● మర్రిపల్లిగూడెంలో ఘటన కమలాపూర్ : ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో చోటు చేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. బీనవేని ఉమ, భిక్షపతి దంపతుల చిన్న కుమారుడు అజయ్(16) ఇటీవల పదో తరగతి పూర్తి చేశాడు. సోమవారం తన బంధువులు ఇద్దరితో కలిసి గ్రామంలోని పెద్దిరెడ్డి చెరువులోకి ఈతకు వెళ్లాడు. ఈసమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై మధు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ నవీన్ తెలిపారు. -
పెండింగ్ అర్జీలు వెంటనే పరిష్కరించండి
ప్రజావాణిలో హనుమకొండ కలెక్టర్ చాహత్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో వివిధ రకాల సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. పాత ప్రజావాణి పోర్టల్లో నమోదు చేసిన అర్జీలను తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 126 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. అనంతరం నూతన ప్రజావాణి పోర్టల్కు సంబంధించిన అంశాలను ఈడీఎం శ్రీధర్ కలెక్టర్ సమక్షంలో అధికారులకు వివరించారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, జిల్లా రెవెన్యూ అధికారి కె. శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, జీడబ్ల్యూఎంసీ సీహెచ్ఓ రాజారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమస్యలు సత్వరమే పరిష్కరించండి: వరంగల్ అదనపు కలెక్టర్ వైవీ.గణేశ్ న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన వినతులను సమగ్రంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ అన్నారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 121 దరఖాస్తులు వచ్చాయి. అలాగే, రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహించిన ప్రజావాణిలో వరంగల్ 31, నర్సంపేటలో 14 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో డీపీఓ కల్పన, డీఆర్డీఓ నాగపద్మజ, హౌసింగ్ పీడీ దామోదర్, అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు వారసత్వంగా రావాల్సిన అసైన్డ్ భూమికి జీపీఓ, ఆర్ఐలు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని నర్సక్కపెల్లికి చెందిన రవికుమార్, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేర్చి తమకు న్యాయం చేయాలని తిరుమలాయపల్లి గ్రామస్తులు వినతిపత్రాలు ఇచ్చారు. -
ఇంటర్ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదల
నేటి నుంచి కళాశాలల్లో ప్రవేశాలు విద్యారణ్యపురి: అన్ని యాజమాన్యాల పరిధి జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు సోమవారం ఇంటర్ బోర్డ్ షెడ్యూల్ను విడుదల చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, వివిధ గురుకులాల్లోనూ ప్రవేశాలు కల్పించనున్నారు. పాఠశాల విద్యలో ఇంటర్ విద్యను విలీనం చేయాలని ప్రభుత్వం తొలుత యోచించి ప్రవేశాలకు జారీచేసిన షెడ్యూల్ను నిలిపివేసిన విషయం విధితమే. అయితే ఆ నిర్ణయాన్ని (విలీన ప్రక్రియను) ప్రభుత్వం మార్చుకొని ఈఏడాది యథావిఽధిగానే ఇంటర్ అడ్మిషన్లకు పచ్చజెండా ఊపింది. ఇంటర్ బోర్డు తాజాగా అడ్మిషన్లకు షెడ్యూల్ను విడుదల చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, గురుకుల జూనియర్ కళాశాలల్లోనూ ప్రవేశాలు కల్పించన్నారు. జూన్ 1 నుంచి తరగతులు.. మొదటి దశ ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈనెల 12 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూనియర్ కళాశాలల్లో ఈనెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 1 నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియ జూన్ 30 వరకు పూర్తి చేయాల్సి ఉంటుంది. టెన్త్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఇంటర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఆ తర్వాత ఒరిజినల్ టెన్త్ మెమోలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. -
నేటినుంచి జనగణన ప్రక్రియ
న్యూశాయంపేట : జిల్లావ్యాప్తంగా జనగణన–2027కు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితి, తదితర అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రణాళిక, గణాంక శాఖ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా అధికారులు సన్నద్ధమవుతున్నారు. జనాభా లెక్కలు రెండు విడతల్లో 33 అంశాలపై వివరాలు సేకరించనున్నారు. ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ (ఆదివారం) వరకు ఆన్లైన్లో సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ జనగణన) ప్రక్రియ ముగిసింది. మలివిడతలో సోమవారం(నేటి) నుంచి జూన్ 9వ తేదీ వరకు ఎన్యుమరేటర్స్ బ్లాక్ల వారీగా ఇళ్ల సంఖ్యను లెక్కించనున్నారు. అనంతరం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టే రెండో దశలో జనాభా పూర్తి వివరాలను నమోదు చేస్తారు. వివరాల సేకరణ.. జనగణనలో భాగంగా వ్యక్తి పేరు, ఇంటిపేరు, కుటుంబ యజమానితో బంధుత్వం, వయస్సు, లింగం, చదువు, టీవీ, బైక్, కారు వంటి వివరాలను అధికారులు సేకరించి నమోదు చేస్తారు. ఎస్సీ, ఎస్టీల కులం వివరాలు కూడా సేకరిస్తారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 14 మండలాల్లో (12 మండలాలు, రెండు మున్సిపాలిటీలు) 1,237 హౌజ్ లిస్టింగ్ బ్లాక్స్ (హెచ్ఎల్బీస్) గుర్తించారు. ఇందుకు 933 మంది ఎన్యుమరేటర్స్ను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. వీరితో పాటు 161 మంది సూపర్ వైజర్లను ఎంపిక చేసి ఇందులో భాగస్వాములు చేయనున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 1,094 మంది సిబ్బంది పాల్గొననున్నారు. -
అంతర్జాతీయ సదస్సుకు ఆదిరెడ్డి
కేయూ క్యాంపస్ : అమెరికాలోని ఎరోడెక్స్ రీసెర్చ్ యూనివర్సిటీలో ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆర్ట్స్అండ్ సైన్స్కళాశాల అధ్యాపకుడు, జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ రుక్కిరెడ్డి ఆదిరెడ్డి పాల్గొననున్నారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి ఆదివారం తెలిపారు. ఈ సదస్సులో మీడియా అధ్యయనాలు, డిజిటల్ కమ్యూనికేషన్ సమకాలిన జర్నలిజం ధోరణలపై ఆదిరెడ్డి తన పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారని ఆమె వెల్లడించారు. ఈమేరకు అంతర్జాతీయ సదస్సుకు రావాలని ఆదిరెడ్డికి ఆహ్వానం అందిందన్నారు. ప్రిన్సిపాల్తోపాటు పలువురు అధ్యాపకులు ఆదిరెడ్డిని అభినందించారు. విద్యారణ్యపురి : వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీపీజీఈటీ పరీక్షకు ఉచిత శిక్షణను హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఈ ఉచిత కోచింగ్ను ఈనెల 12 నుంచి ప్రారంభించినున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏటా కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో 40 రోజుల ఉచిత శిక్షణను నిర్వహిస్తున్నట్లు కెమిస్ట్రీ విభాగం అధిపతి ప్రొఫెసర్ వాసం శ్రీనివాస్ తెలిపారు. ఈ సారి కెమిస్ట్రీ సబ్జెక్టుతోపాటు ఇంగ్లిష్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, బాటనీ, కామర్స్, మైక్రోబయాలజీ సబ్జెక్టులో కూడా పీజీ కోర్సుల్లో ప్రవేశాలకోసం విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వివరించారు. ఆసక్తి గల విద్యార్థులు కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తమ తమ సబ్జెక్టు విభాగాల అధిపతులను ఇతర వివరాలకు పీజీ కోఆర్డినేటర్ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ కోరారు. నయీంనగర్ : చారిత్రాత్మక హనుమకొండ కలెక్టర్ బంగ్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆదివారం ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పరిశీలించారు. కుడా హార్టికల్చర్ అధికారి ఆసిఫ్అలీ పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ గ్రీవెన్ సెల్ను నేడు (సోమవారం) నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. గ్రీవెన్స్ సెల్ను సద్వినియోగం చేసుకోవాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హన్మకొండ అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదివారం సూచించారు. జిల్లాలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టేందుకు హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ‘కుడా’ కార్యాలయం సమీపంలోని హనుమకొండ ఆర్డీఓ కార్యాలయం, పరకాల ఆర్డీఓ కార్యాలయాల్లో కూడా ప్రజావాణి చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆయా కేంద్రాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ప్రజలు తమ సమస్యలను సంబంధిత ఆర్డీఓ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిలో వినిపించి, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. జిల్లా, డివిజన్ స్థాయిలో.. న్యూశాయంపేట : ప్రభుత్వం ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ డివిజన్ స్థాయి ప్రజావాణిని సమర్థవంతంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతీ సోమవారం జిల్లాస్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ప్రజావాణితో పాటు రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఆయా ప్రజావాణిలకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. -
ప్రపంచ యవనికపై వరంగల్ 5ఎఫ్
పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతులు ఒకే వేదికపై..సాక్షి, వరంగల్/ గీసుకొండ : కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా 5ఎఫ్ (ఫామ్ టు ఫైబర్.. టు ఫ్యాక్టరీ.. టు ఫ్యాషన్.. టు ఫారిన్) దృక్కోణంతో ఓరుగల్లు ఖ్యాతి ప్రపంచానికి తెలిసేలా మరో అడుగు ముందుకు పడింది. పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతుల దాకా ఒకే వేదికపై పూర్తి విలువ వ్యవస్థను కల్పించేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్తో పాటు తెలంగాణ నుంచి వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పీఎం మిత్ర (ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్కు) పథకం కింద 2023లో ఎంపిక చేశారు. ఈ మేరకు రూ.200 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వేదికగా ఆదివారం వర్చువల్గా ప్రారంభించారు. ఇప్పటికే విడుదల చేసిన రూ.30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా, మరో రూ.170 కోట్ల దశల వారీగా కేంద్రం రాష్ట్రానికి అందివ్వనుంది. దీంతో పాటు ‘కాంపిటిటివ్ ఇన్సెంటివ్ సపోర్ట్’ కింద రూ.300 కోట్ల వరకు ప్రోత్సాహక మద్దతు ఇవ్వనుండడంతో దేశ, విదేశీ కంపెనీలు ఇక్కడికి క్యూ కట్టే అవకాశం ఉంది. గీసుకొండ, సంగెం మండలాల్లోని శాయంపేట హవేలీలో మొత్తం 1,327 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ పార్కులో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. శూన్య ద్రవ వ్యర్థ సాంకేతికతతో నిర్మించిన సార్వత్రిక ద్రవ వ్యర్థాల శుద్ధి ప్లాంటు (సీఈటీపీ)కు సుస్థిర అభివృద్ధిని అందించనుంది. ఇప్పటివరకు ఈ పార్కులో 548 ఎకరాల్లో పరిశ్రమలు వస్తే పీఎం మిత్ర కింద కేఎంటీపీ ఎంపికై న తర్వాతనే 310 ఎకరాల్లో పరిశ్రమలు వచ్చాయని కేంద్ర జౌళి పరిశ్రమ మంత్రిత్వ విభాగాధికారులు అంటున్నారు. ఇందులో భాగంగానే ‘ఎవర్టాప్ టెక్స్టైల్ అండ్ అపెరల్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ వంటి సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకు రావడం దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.1695.54 కోట్ల వ్యయం కాగా, వివిధ మార్గాల ద్వారా రూ.6,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ పార్కు ద్వారా 24,400కు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వార్షికంగా రూ.1,990 కోట్ల వ్యాపార లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, ‘పీఎం మిత్ర’ హోదాతో జాతీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుని, అంతర్జాతీయ జౌళి మ్యాప్పై వరంగల్కు ప్రత్యేక స్థానం కల్పించనుంది. చారిత్రక కాకతీయ నగరం ఇప్పుడు పారిశ్రామిక రంగంలోనూ ప్రపంచ స్థాయి గుర్తింపును అందుకోనుంది. ఈ పార్కు దేశంలోనే తొలి పీఎం మిత్ర పార్కుగా నిలవడం తెలంగాణకు, ముఖ్యంగా వరంగల్కు విశేష గౌరవంగా పేర్కొనవచ్చు. 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పార్కును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కై టెక్స్, యంగ్వన్, గణేశా కంపెనీలు ఉత్పత్తులు ప్రారంభించాయి. కేఎంటీపీకి పీఎం మిత్ర కింద రూ.200 కోట్లు, సీఐఎస్ ద్వారా రూ.300 కోట్లు వర్చువల్గా హైదరాబాద్ నుంచి ప్రారంభించిన పీఎం నరేంద్రమోదీ అంతర్జాతీయ జౌళి మ్యాప్పై ఓరుగల్లుకు ప్రత్యేక స్థానం దిశగా అడుగులు పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పీఎం మోదీ హైదరాబాద్లో ఆదివారం వర్చువల్గా ప్రారంభించగా ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా కలెక్టర్ సత్యశారద, అధికారులు పార్కు వద్ద వీక్షించారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ జోన్ మేనేజర్ స్వామినాయక్ మాట్లాడుతూ.. కేఎంటీపీ నిర్మాణానికి రూ.1,695 కోట్లను అంచనా వేశారని, వాటిలో సుమారు రూ. 800, 900 కోట్ల వరకు పలు అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల పనులతో పాటు భూ సేకరణ పనుల నిమిత్తం ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, వి.గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, సంగెం తహసీల్దార్ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
● వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ కాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్నట్లు వరంగల్ డీఈఐఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఆదివారం హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రథమ సంవత్సరంలో జనరల్ కోర్సులో 3,263 మంది, ఒకేషనల్ కోర్సులో 329 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో జనరల్ కోర్సులో 2,083 మంది, ఒకేషనల్ కోర్సులో 182 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. పరీక్షల పర్యవేక్షణకు జిల్లా పరీక్షల కమిటీ, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్స్, 16 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 16 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించినట్లు వివరించారు. ఏమైనా సందేహాలు ఉంటే 9240205555 నంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో డీఈసీ సభ్యులు కె.మాధవరావు, శారద, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
డాక్టర్ శ్రీలతకు అవార్డు
కాళోజీ సెంటర్: తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీలత అందేకు ప్రతిష్టాత్మకమైన ఉత్తమ మహిళా సైకాలజిస్ట్ అవార్డు అందుకున్నారు. టీపీఏ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో జరిగి కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతు ల మీదుగా ఈ అవార్డు స్వీకరించారు. డాక్టర్ శ్రీలత మనోవిజ్ఞాన శాస్త్ర రంగంలో అందించిన సేవలకు గుర్తింపుగా అవార్డు లభించగా టీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరి రామచందర్ ప్రత్యేక అతిథిగా పాల్గొని అభినందించారు. -
వాహనాల వేగానికి కళ్లెం పడేనా?
కాజీపేట–హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కడిపికొండ బ్రిడ్జి మీదుగా ఖమ్మం బైపాస్ రోడ్డుపై నిత్యం భారీ వాహనాలు వేగంగా వెళ్తున్నాయి.పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలి.. పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు.వాతావరణం జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండ, వడగాలులు వీస్తాయి. రాత్రి ఉక్కపోతగా ఉంటుంది. జఫర్గఢ్: వందలాది మంది అనాథ పిల్లలతో అమ్మ అని ఆప్యాయంగా పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె పుష్పరాణి. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద గాదె ఇన్నయ్య 20 ఏళ్ల క్రితం ‘మా ఇల్లు’ ప్రజాదరణ అనాథ ఆశ్రమాన్ని స్థాపించారు. 32 మంది పిల్లలతో ప్రారంభించిన ఈ ఆశ్రమంలో ఇప్పటి వరకు వందకు పైగా అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రమంలోని ఆడపిల్లల విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ధవహిస్తూ తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్నారు. ఆశ్రమానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలకు సొంత ఖర్చులతో వివాహాలు జరిపించారు. పుష్పరాణి కృషి ఫలితంగా ఆశ్రమానికి చెందిన పిల్లలు లాయర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, నర్సులు, ఉపాధ్యాయులు, కానిస్టేబుల్గా ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా గాదె పుష్పరాణి మాట్లాడుతూ.. ఎంతో మంది అనాథ పిల్లలకు అమ్మలా సేవ చేయడం, వారితో అమ్మ అని పిలిపించుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. -
ఓరుగల్లు బిషప్గా ఫాదర్ విజయపాల్రెడ్డి
అధికారికంగా ప్రకటించిన వాటికన్సిటీ 14వ పోప్ లియో కాజీపేట రూరల్: ఓరుగల్లు కథోళిక పీఠం నూతన బిషప్గా ప్రస్తుత పాలనాధికారి రెవరెండ్ ఫాదర్ దుగ్గింపుడి విజయపాల్రెడ్డిని నియమిస్తూ వాటికన్సిటీలో 14వ పోప్ లియో శనివారం అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు కాజీపేట ఫాతిమానగర్లోని కెథిడ్రల్ చర్చిలో శనివారం విశాఖ ఆర్చ్ బిషప్ డాక్టర్ ఉడుములబాల, ఖమ్మం పీఠకాపరి మోస్ట్ రెవరెండ్ సగినాల ప్రకాశ్.. పోప్ లియో అధికార ప్రకటన నియామకపు బిషప్ పత్రాన్ని చదివి వరంగల్ బిషప్గా విజయపాల్రెడ్డిని ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం ఓరుగల్లు పీఠం ఫాదర్లు, చర్చి కమిటీ బాధ్యులు, ప్రజలు ఫాదర్ విజయపాల్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఫాదర్లు కొమ్మారెడ్డి జెసెఫ్, అనుకిరణ్, మర్రెడ్డి, టి.జోసెఫ్, మత్యాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 34 ఏళ్లుగా ఫాదర్ విజయపాల్రెడ్డి సేవలు వరంగల్ జిల్లా గీసుకొండ మనుగొండ గ్రామంలో రాయపురెడ్డి, ఆగ్నేసమ్మ దంపతులకు 1956 జనవరి 8న విజయపాల్రెడ్డి జన్మించారు. చిన్ననాటి నుంచే వినయం, మృదుత్వం, సేవాభావం గుణాలను ఆయన అలవర్చుకున్నారు. జాన్స్ మేజర్ మిషనరీలో తత్వశాస్త్రం, ధర్మశాస్త్రం, విద్యను పూర్తి చేశారు. 1992 ఏప్రిల్ 2న వరంగల్ డయాసిస్కు యాజకునిగా అభిషేకం పొందారు. ఖమ్మం డయాసిస్లో అసిస్టెంట్ పారిష్ ప్రీస్ట్గా, ఎలూరు డయాసిస్లో హాస్టల్ డైరెక్టర్గా, వరంగల్ డయాసిస్ దేవగిరి పట్నం పారిష్ ఫ్రీస్ట్గా, ఫాతిమా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రినిపాల్గా, పాఠశాల ఉపాధ్యాయుడిగా, కాజీపేట లోడి సాంఘిక సంస్థ డైరెక్టర్గా, జనగామ క్రీస్తు జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ డైరెక్టర్గా సేవలందిస్తూ వరంగల్ డయాసిస్ అడ్మినిస్ట్రేటర్గా బాధ్యతలు చేపట్టారు. -
పారదర్శకంగా మక్కల కొనుగోళ్లు
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లాలో మక్కల కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. శనివారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో శనివారం నాటికి 69,140 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేయాలనే లక్ష్యం కాగా, అందులో 51,302 మెట్రిక్ టన్నులను గోదాంలలో నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వైవీ.గణేశ్, అధికారులు పాల్గొన్నారు. సమన్వయంతో పనిచేయాలి.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భాగంగా.. ఎడ్యుకేషన్ వారోత్సవాలు ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా శనివారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వీయగణనను వినియోగించుకోవాలి.. కాశిబుగ్గ: జనగణనలో భాగంగా నిర్వహిస్తున్న ఆన్లైన్ ద్వారా స్వీయ జనగణనను (సెల్ప్ ఎన్యుమరేషన్) సద్వినియోగం చేసుకొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని కలెక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. పోచమ్మమైదాన్ నుంచి ఐఎంఏ హాల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐఎంఏ హాల్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, సీపీఓ చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు. -
భర్త లేకపోయినా.. బాధ్యత నెరవేర్చింది
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లికి చెందిన గూడ లావణ్య – కీ.శే. భూపాల్రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు అపూర్వ, కుమారుడు అశ్విష్రెడ్డి. కూతురు బీటెక్ మూడో సంవత్సరం చదువుతుండగా, లావణ్య భర్త భూపాల్రెడ్డి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో మృతి చెందాడు. అయినప్పటికీ, తల్లి లావణ్య మనోస్థైర్యంతో తన పిల్ల లను చదివించింది. అపూర్వ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కష్టపడి చదివి ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా పని చేస్తున్నారు. కష్టాలు, కన్నీళ్లు ఎన్ని ఎదురైనా మనోధైర్యం, గుండె నిబ్బరం వీడకుండా ముందుకు సాగాలని, తన తల్లే తనకు ఆదర్శమని ఎస్సై అపూర్వరెడ్డి చెబుతున్నారు. -
ప్రైవేటే దిక్కు..
కాశిబుగ్గ: సంతానం లేని పేదలకు అవసరమైన ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాలు (ఫెర్టిలిటీ సెంటర్లు) అందుబాటులో ఉండడం లేదు. ఆర్థికంగా ఉన్న దంపతులు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ పిల్లలకు జన్మనిస్తారు. ఇటీవల కాలంలో సంతాన సాఫల్య కేంద్రాలు కార్పొరేట్ ఆస్పత్రుల మాదిరిగా పుట్టుకొస్తున్నాయి. పెద్ద పెద్ద నగరాలకు పరిమితమైన ఈ సెంటర్లు పట్టణాలు, జిల్లా కేంద్రాలకు విస్తరించాయి. సంబంధిత వైద్యులు సంతానం పేరుతో నెలల తరబడి వైద్యం అందిస్తూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఐయూఐ, ఐవీఎఫ్ ద్వారా మహిళలకు గర్భం వచ్చేటట్లు చేస్తారు. దీనికోసం ఆర్థికంగా ఉన్న దంపతులు లక్షలాది రూపాయలు ఖర్చు చేయడానికి ముందుకు వస్తారు. ప్రస్తుతం హనుమకొండలో సుమారు 15, వరంగల్లో రెండు ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నట్లు సమాచారం. సీకేఎంలో పరీక్షలు.. తర్వాత గాంధీకి రెఫర్ వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో ఇన్ఫెర్టిలిటీ సెంటర్ లేదు. వైద్యులు మెడికల్ మేనేజ్మెంట్ సేవలు అందిస్తున్నారు. ఈ సంతాన సాఫల్య కేంద్రాన్ని గతేడాది మార్చి 15న ప్రారంభించారు. ముందుగా సంతానం సమస్యతో వచ్చినవారికి కౌన్సెలింగ్ ఇస్తారు. ఆ తర్వాత భర్త, భార్యకు అవసరమైన పరీక్షలు చేయిస్తారు. రిపోర్టుల ఆధారంగా వారికి సలహాలు ఇస్తారు. తర్వాత సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేస్తారు. కాగా, సీకేఎంలో వీరికి ప్రతిరోజు ఓపీ ద్వారా సేవలు అందిస్తారు. దంపతులకు మూడు నెలల పాటు సేవలు అందిస్తామని వైద్యులు చెబుతున్నారు. రూ.25 లక్షల నిధులు వృథా.. సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రి తర్వాత గత సంవత్సరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి ఫెర్టిలిటీ సెంటర్ మంజూరు చేశారు. దీంతో సంతాన లేమితో బాధపడేవారికి ఎంజీఎంలో ఫెర్టిలిటీ సేవలు అందిస్తారని ఆశిస్తే నిరాశే మిగిలింది. తొలుత ఓ భవనంలో ఫెర్టిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని భావించారు. పనులు సగం పూర్తయిన తర్వాత ఎంజీఎంను 24 అంతస్తుల సముదాయానికి మార్చే అవకాశం ఉండడంతో పనులు నిలిపివేశారు. ఈ పనుల కోసం రూ.25 లక్షల నిధులు వృథా అయినట్లు తెలుస్తోంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనూ అంతే.. అధికారుల ఆదేశాల మేరకు ఎంజీఎం నుంచి కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ఫెర్టిలిటీ సెంటర్ మారినా ఫలితం లేకుండా పోయింది. ఇందులోని ఐదో అంతస్తులో దీనిని ఏర్పాటు చేయాలని థర్డ్ పార్టీ కాంట్రాక్టు ఇచ్చినట్లు చెబుతున్నారు. దీని గురించి సూపర్స్పెషాలిటీ ఆస్పత్రికి సంబంధించిన అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. అధికారులు స్పందించి ఫెర్టిలిటీ సేవలు ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు. సీకేఎంలో సేవలు అందిస్తున్నాం.. సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో సంతానం లేనివారికి సంబంధిత వైద్యులు సలహాలు, సూచనలు అందజేస్తారు. ఇక్కడ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా మెడికల్ మేనేజ్మెంట్ సేవలు మాత్రమే అందిస్తాం. దంపతులకు అవసరమైన వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తాం. వారి సమస్యలు గుర్తించి, ఇతర ఆస్పత్రులకు రెఫర్ చే స్తాం. ప్రతీరోజు ఓపీ ద్వారా సేవలందిస్తున్నాం. – డాక్టర్ లక్ష్మీదేవి, సీకేఎం ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేయని ప్రభుత్వం సీకేఎంలో మెడికల్ మేనేజ్మెంట్ సేవలకే పరిమితం సూపర్ స్పెషాలిటీలో అడుగడుగునా జాప్యం -
సికింద్రాబాద్కు రెండు ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్: హైదరాబాద్లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆదివారం కాజీపేట జంక్షన్ మీదుగా సికింద్రాబాద్కు రెండు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల–సికింద్రాబాద్ వెళ్లే ఎక్స్ప్రెస్ మంచిర్యాలలో ఉదయం 10–30 గంటలకు బయలుదేరి కాజీపేట జంక్షన్కు మధ్యాహ్నం 12–45 గంటలకు చేరుకొని వెళ్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా మధిర–సికింద్రాబాద్ వెళ్లే ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్కు ఉదయం 11 గంటలకు చేరుకొని వెళ్తుందని రైల్వే అధికారులు తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక రైళ్లలో తరలివెళ్లనున్నట్లు రైల్వే అధికారులు వివరించారు. -
నేడు మాతృదినోత్సవం
సాక్షి, మహబూబాబాద్: మాది ఉమ్మడి కుటుంబం. అమ్మాన్నాన్న లక్ష్మీ, నరసింహం. నాన్న వ్యవసాయం చేసేవారు. ఇంట్లో నేనే పెద్ద కొడుకును. చిన్నప్పటి నుంచి బాగా చదివి ఉద్యోగం సాధించాలని అమ్మ చెబుతుండేది. అమ్మ చెప్పినట్లుగానే ఉద్యోగం సంపాదించా. నన్ను చూసి మా అన్నదమ్ములు, అక్కా చెళ్లెళ్లు అందరూ బాగా చదివి మంచి పొజీషన్లో ఉన్నారు. నాన్న చనిపోయి పదేళ్లు దాటింది. అప్పటి నుంచి అమ్మ మాతోనే ఉంటోంది. ఇప్పటికీ అమ్మతో మంచీ చెడు అన్నీ పంచుకుంటాం. అమ్మ నింపిన ధైర్యమే నా ఉద్యోగం. – ఎన్.తిరుపతిరావు, డీఎస్పీ, మహబూబాబాద్ -
వివరాలు నమోదు చేసుకోవాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: స్వీయ జనగణనకు ఈ నెల 10వ తేదీ రాత్రి 12 గంటల వరకు మాత్రమే అవకాశం ఉందని, జిల్లా ప్రజలంతా తప్పనిసరిగా కుటుంబ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. బాధ్యతగా పాల్గొని ఈ జాతీయ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి స్వాగతం హన్మకొండ: భారత ప్రభుత్వ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం శమీరావు, టీఎస్ఐఐసీ ఎండీ శశాంకాకు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయి స్వాగతం పలికారు. వరంగల్ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ను ఆదివారం ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వారు హనుమకొండకు వచ్చారు. నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ వారికి మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం వారు భద్రకాళి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. -
కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయండి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హన్మకొండ అర్బన్: ధాన్యం కొనుగోలు, ఫార్మర్ రిజిస్ట్రీ, స్వీయ జనగణన, విద్యా వారోత్సవాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద పాల్గొని జిల్లాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో హనుమకొండ నుంచి అదనపు కలెక్టర్ ఎన్ రవి, డీఆర్డీఓ మేన శ్రీను, డీసీఓ సంజీవ్రెడ్డి, వరంగల్ నుంచి అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ సుబేదారిలోని ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహంలో తెలంగాణ పారా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కమిటీని ఎన్నుకున్నారు. తెలంగాణ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గాడిపెల్లి ప్రశాంత్ అధ్యక్షతన శనివారం జరిగిన దివ్యాంగ క్రీడాకారుల సమావేశంలో కార్యవర్గాన్ని ప్రకటించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ముప్పిడి రాజుకుమార్, సలహాదారుగా సింగారపు బాబు, ప్రెసిడెంట్గా నిషా ఇన్ననీ, నిర్వహణ కార్యదర్శిగా సీవీ జగన్నాథరావు, వైస్ ప్రెసిడెంట్లుగా బొట్ల కార్తీక్, దామెర మనీందర్, కోశాధికారిగా బల్లె రాజు, కార్యవర్గ సభ్యులుగా కృష్ణవేణి, జ్యోతి రఘువరన్, ప్రశాంత్, సంతోష్ ఎన్నికై నట్లు ప్రశాంత్ తెలిపారు. తమకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, పారా ఒలింపిక్స్ కమిటీ, ఖేలో ఇండియా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దరఖాస్తుల స్వీకరణ రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణంహసన్పర్తి: ఎల్కతుర్తి మండలం కేశవపూర్కు చెందిన చల్లా బతుకయ్య(42), లక్ష్మి (39) దంపతులు బతుకుదెరువు నిమిత్తం ఎనిమిదేళ్ల క్రితం హసన్పర్తికి వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడే షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. శనివారం సాయంత్రం వారు బైక్పై హసన్పర్తి నుంచి హనుమకొండ వైపు బయల్దేరారు. హసన్పర్తి సెంటర్ నుంచి అరకిలో మీటరు దూరంలోని 10 రూపాయల టిఫెన్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. ఈక్రమంలో లారీ, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈఘటనలో బతుకయ్య పైనుంచి లారీ వెళ్లగా అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్ర గాయాలైన లక్ష్మిని 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు. మృతురాలికి కుమారుడు, కూతురు ఉన్నారు. బతుకయ్య హెల్మెట్ ధరించినా ప్రాణాపాయం తప్పలేదు. -
ఆలయ అభివృద్ధికి కృషి
కాశిబుగ్గ: వరంగల్ ఓసిటీ కాశిబుగ్గలోని శ్రీ సీతారామాంజనేయస్వామి ఆలయంలో కల్యాణ మండపం నిర్మిస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం సీతారామాంజనేయ హరి హర పుత్ర అయ్యప్పస్వామి ఆలయంలో హనుమాన్ స్వాములకు ప్రత్యేక భిక్ష ఏర్పాటు చేశారు. నాయకులు గోపాల నవీన్రాజు, మీసాల ప్రకాశ్, దాసరి రాజేశ్ పాల్గొన్నారు. హన్మకొండ: పల్లె దవాఖానాల్లో పనిచేస్తున్న డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మహేందర్ రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి.శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని అసోిసియేషన్ ప్రతినిధులు కలిసి సమస్యలు విన్నవించారు. అనంతరం మంత్రిని సన్మానించారు. డాక్టర్లు వెంకటేశ్, శివశంకర్, అనుపచంద్, ఆశాజ్యోతి, స్వప్న, సంగీత, సుష్మ, భార్గవి, ప్రియాంక పాల్గొన్నారు. -
హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలపాలి
నయీంనగర్: హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలపాలని, ప్రజలకు బతుకుదెరువు అవకాశాలు కల్పించాలని తెలంగాణ జనసమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కోరారు. శుక్రవారం హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్క్లబ్ మీటింగ్ హాల్లో ఏర్పాటుచేసిన టీజేఎస్ ఉమ్మడి జిల్లా ప్లీనరీలో ఆయన మాట్లాడారు. టీజేఎస్ ఏర్పాటునుంచి ఉద్యోగ, నిరుద్యోగ, కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేసిందన్నారు. ప్రజా అవసరాలకు తగ్గట్టు పాలన జరగాలని, రియల్ ఎస్టేట్కు ప్రాధాన్యత తగ్గించుకోవాలని అన్నారు. ఉద్యోగులకు పెన్షన్ డబ్బులు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలన్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ కోదండరామ్ను విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి నియమించాలని కోరారు. ఈ నెల 12న హైదరాబాద్లో పార్టీ పార్టీ 4వ ప్లీనరీ కార్యక్రమానికి తరలిరావాలని కోరారు. కాగా, ఉమ్మడి జిల్లా పరిధిలోని గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసితులకు, ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని, ఎన్నికల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు చిల్ల రాజేంద్రప్రసాద్, షేక్ జావిద్, నాయకులు రత్నం కిరన్, శివకుమార్, రాజేష్, బోనగాని రవీందర్, చిల్లా శ్రవన్కుమార్, సంధాని, మల్లేశం, రాధా కిషన్, రాజేష్, శివకుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం -
రక్తదాన ఆవశ్యకతపై అవగాహన అవసరం
● అదనపు డీఎంహెచ్ఓ మదన్మోహన్ రావురామన్నపేట : తలసేమియా వ్యాధిపై, స్వచ్ఛంద రక్తదాన ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని హనుమకొండ అదనపు డీఎంహెచ్ఓ టి.మదన్మోహన్ రావు సూచించారు. ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అవగాహన కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలో బ్లడ్ బ్యాంక్, పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం మానవహారం నిర్వహించి అవగాహన కల్పించారు. బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డాక్టర్ నిఖిల, మాతా శిశు సంక్షేమ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రుబీనా అప్రోజ్, వైద్యాధికారి అనిల్, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి ఎల్.చంద్రశేఖర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రేమలత, రామేశ్వరి,విప్లవ కుమార్, పద్మజ, జ్యోతి, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు. -
సర్కారు భూమి కబ్జా
కాశిబుగ్గ: వరంగల్ దేశాయిపేటలోని సర్కారు భూములపై కబ్జాదారులు కన్నేశారు. ఓ పార్టీ నాయకుడు దర్జాగా తాను నిర్మిస్తున్న వెంచర్కు రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పాటు పవిత్రమైన కై లాసిగిరి ప్రదక్షిణ రోడ్డు మార్గం కూడా మాయం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశాయిపేటలోని లక్ష్మీ టౌన్షిప్ సమీపాన ఉన్న ప్రభుత్వ భూమిని అందినకాడికి కొందరు దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఓ పార్టీకి చెందిన నాయకుడు తన ప్రైవేట్ స్థలంలో వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఈ వెంచర్కు రావడానికి వీలుగా ప్రభుత్వ స్థలంలోనే రోడ్డు నిర్మించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు తనిఖీ చేసి వెళ్లారు. చివరకు దీనిపై కేసు నడుస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మళ్లీ వెంచర్ పక్కనే ఉన్న స్థలాన్ని కూడా కలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాలభైరవ గుడి పక్కనే బండరాళ్లతో కూడిన స్థలాన్ని జేసీబీలు పెట్టి దర్జాగా చదును చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ 15 ఏళ్ల క్రితం బండ్ల బాట రోడ్డు మ్యాప్ ఉన్నట్లు ఆధారాలు ఉన్నప్పటికీ రోడ్డు మార్గాన్ని కబ్జా చేస్తున్నట్లు ఆరోపించారు. ప్రభుత్వ స్థలంలోనే కార్మికులకు సంబంధించిన గుడిసెలు వేసి, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, విల్లాలకు అనుకూలంగా రోడ్డు వేయడం, భూములను చదును చేయడం వెనుక ఎవరి మద్దతు ఉందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా మున్సిపల్, రెవెన్యూ అదికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను అడ్డుకుని సర్కార్ భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. నిర్మాణ పనులు నిలిపేసిన అధికారులు వరంగల్ దేశాయిపేట లక్ష్మీ మెగా టౌన్షిప్ సమీపంలో ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపడుతున్న ప్రాంతాన్ని వరంగల్ రెవెన్యూ అధికారులు శుక్రవారం పరిశీలించారు. భూములను పరిశీలించి, వివరాలను రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణస్వామి, సర్వేయర్ సందీప్ అడిగి తెలుసుకున్నారు. వెంటనే నిర్మాణ పనులను ఆపాలని ఆదేశించారు. సర్వే నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని వారు పేర్కొన్నారు. వెంచర్ కోసం రోడ్డు నిర్మాణ పనులు కై లాసగిరి ప్రదక్షిణ రోడ్డు మాయం -
రైతులకు చేరువలో ‘ఆకాశవాణి’
హన్మకొండ : ఆకాశవాణి వరంగల్ కార్యక్రమాలు రైతులకు చేరువగా వెళ్లాయని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమా రెడ్డి కొనియాడారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా శుక్రవారం ఉదయం వాక్ థాన్ నిర్వహించారు. అందులో భాగంగా హనుమకొండ కేయూ క్రాస్లోని వరంగల్ ఆకాశవాణి ప్రాంగణం నుంచి కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వరకు, తిరిగి ఆకాశవాణి ప్రాంగణం వరకు వాక్ థాన్ సాగింది. డాక్టర్ ఆర్.ఉమా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి వాక్థాన్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆకాశవాణి అనేక కార్యక్రమాలను రైతులకు చేరువ చేయడంలో ఇక్కడి శాస్త్రవేత్తలు, అధికారులు ఎంతగానో తోడ్పడుతున్నారని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో సైతం ఆకాశవాణి సేవలు అద్వితీయమన్నారు. వరంగల్ కేంద్రానికి దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందని, స్థానికంగా ఉన్న ఎంతోమంది మేధావులు సైతం ఆకాశవాణి ద్వారా పలు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమయ్యారని కొనియాడారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యక్రమ నిర్వహణ అధికారి, ప్రోగ్రాం హెడ్, స్టేషన్ ఇన్చార్జ్ ఇల్లందుల రవికుమార్ మాట్లాడుతూ.. ఆకాశవాణి వాకథాన్ విజయవంతమైందని అన్నారు. జూన్ 8వ తేదీ వరకు ఇలాంటి వినూత్న, సృజనాత్మక కార్యక్రమాలు మరెన్నో శ్రోతలకి అందించనున్నామని తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయం పీఆర్ఓ డాక్టర్ వల్లాల పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఆకాశవాణితో తన చిరకాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి సిబ్బంది శ్రీనివాస్, శివ, నరేష్, విజయలక్ష్మి, శ్రీనివాసరాజు, శ్రీనివాస చారి, ఉషశ్రీ, రామ్మూర్తి, రామ్మోహన్, అనిల్ ప్రసాద్తో పాటు వ్యాఖ్యాతలు, విశ్రాంత ఉద్యోగులు, శ్రోతలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాంతీయ వ్యవసాయ స్థానం సహపరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమా రెడ్డి -
సెలవుల్లో యోగాపై ఆసక్తి..
బచ్చన్నపేట : వేసవి సెలవుల్లో విద్యార్థులు యోగాపై ఆసక్తి చూపుతున్నారు. సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోకుండా యోగా నేర్చుకుంటున్నారు. మండలంలో కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో యోగా గురువు మల్లేశం రోజు విద్యార్థులకు యోగాను నేర్పిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్ల లను యోగా తరగతులకు పంపిస్తున్నారు.చిన్నారుల్లో భక్తిభావం..గోవిందరావుపేట : వేసవి సెలవుల్లో సాధారణంగా చిన్నారులు సెల్ఫోన్లు, టీవీలతో సమయం గడుపుతుంటారు. కానీ మండలంలోని చల్వాయి గ్రామంలో చిన్నారులు హనుమాన్ మాలధరించి భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, భక్తి, సంస్కారం అలవడితే భవిష్యత్లో మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుందనే ఆలోచనతో ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం స్నానాలు చేసి దేవాలయాలకు వెళ్లడం, భజనలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణం, పెద్దలకు గౌరవం ఇవ్వడం వంటి అలవాట్లు చిన్నారుల్లో పెంపొందుతున్నాయి. ముఖ్యంగా సెల్ఫోన్లకు అలవాటు పడుతున్న ప్రస్తుత కాలంలో చిన్నారులను ఆధ్యాత్మిక వాతావరణంలో వల్ల చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని తల్లిదండ్రులు భావిస్తున్నారు. వేసవి సెలవులు వృథా కాకుండా పిల్లలకు మంచి మార్గం చూపిస్తున్నామని, చదువుతో పాటు సంస్కారం కూడా అవసరమని, చిన్నప్పటి నుంచే భక్తి భావం అలవడితే జీవితంలో క్రమశిక్షణ పెరుగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. -
యువత ఉన్నతస్థాయికి ఎదగాలి
హన్మకొండ అర్బన్ : యువత అవకాశాలను వినియోగించుకోని ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి భారీ జాబ్ మేళాను శుక్రవారం కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ మేళాకు వేలాది మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరై మాట్లాడారు. జాబ్ మేళాలో 10వ తరగతి నుంచి ఉన్నత విద్య చదివిన వారందరికీ 72 కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు వరంగల్ ప్రాంతంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్వాహకులను కోరారు. రక్తదానం, అవయవదానం వంటి సామాజిక అంశాలపై యువత అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. నైపుణ్యాలను పెంపొందించుకుంటే మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. ఐటీ, ఫార్మా, తయారీ రంగాల్లో సుమారు 4 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. కేవలం డిగ్రీలు సరిపోవని, కమ్యూనికేషన్, సాంకేతిక నైపుణ్యాలు అవసరమని యువతకు సూచించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. 72 ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయని తెలిపారు. ఆన్లైన్ ద్వారా 2,600 మంది నమోదు చేసుకోగా, మొత్తం 4 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వైవీ గణేష్, అధికారులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ మెగా జాబ్ మేళాలో 4 వేల మందికి ఉద్యోగావకాశాలు -
ఆడుదాం.. అష్టాచమ్మా
కాజీపేట : గ్రామాల్లో అష్టాచమ్మా ఆట ట్రేడ్మార్క్ గేమ్గా పేరుగాంచింది. ఈ ఆటను వేసవి సెలవుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు కాలక్షేపం కోసం ఆడుతుంటారు.పల్లెలతోపాటు పట్టణాల్లోనూ చింతగింజలతో ఆడుతూ కనిపిస్తారు. అష్టా చమ్మాను కొన్ని ప్రాంతాల్లో చకార్ ఆటగా పిలుస్తారు. అష్టా చమ్మా ఆడే విధానం.. అష్టా చమ్మా ఆటను భూమిపై లేదా బండలపై చతురస్రాకారంలో 5 గడులు 25 వచ్చేలా గీయాలి. ఈ గీతల కోసం గ్రామాల్లో బొగ్గునే ఎక్కువగా ఉపయోగిస్తారు.ఈ 25 గడుల్లో 9 గడులను సేఫ్టీ రూంలుగా (గదులుగా) భావిస్తూ వాటిలో గుణాకారం వచ్చే విధంగా గుర్తిస్తారు. ఆ తర్వాత ఆట ఆడేందుకు విరగ్గొట్టిన నాలుగు చింత గింజలను (పాచికలుగా) ఆడేందుకు ఉపయోగిస్తారు. మొత్తం నలుగురు ఆడే ఈ ఆటలో ఒక్కొక్కరు తమ ఆట వస్తువులుగా ఏదైనా తీసుకోవచ్చు. ఉదాహరణకు చిన్న, చిన్న రాళ్లు, చాక్లెట్లు, వేపగింజలు తదితరాలను తీసుకోవచ్చు. చింతగింజలు నలుపు రంగులో పడితే 8 గడులను దాటేందుకు అర్హత పొందినట్టు. అదే తెలుపు ఆకారంలో పడితే 4 గడులను దాటొచ్చు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆడుతూ ముందుకెళ్తారు. ఆడుతు వెళ్తున్న సమయంలో ఎదుటి వారి వస్తువు ఉన్న చోటా మనం ఆగేందుకు అవకాశం ఉంటే వారి వస్తువును తిరిగి వెనక్కి గడియలోకి పంపవచ్చు. ఆటలో గుణాకారపు ఆకారం గడిలో మనకు సంబంధించిన వస్తువులు ఉంటే అది సేఫ్టీ జోన్గా భావిస్తారు. కాపాడే సేఫ్టీ జోన్.. అదే బయట ఉన్నప్పుడు ప్రమాదకరంగా ఉన్నట్టు చింత గింజల ద్వారా వేసే పాచికలు ఎక్కువ విలువ పడే విధంగా వేస్తూ త్వరత్వరగా ఆటలోని గడియ మధ్యలో ఉన్న సేఫ్టీజోన్లో చేరితే వారు గెలిచినట్టు లెక్క. ఇలా ఎవరైతే చివరగా సేఫ్టీ జోన్లో చేరుతారో వారు ఓడినట్లు ఇలా నలుగురు కూర్చోని ఆడే అష్టా చమ్మా ఆట టైంపాస్తోపాటు వినోదాన్ని ఇస్తుంది. నలుగురు ఆడే ఆట ఇది.. -
ఆదాయ వనరుల పెంపుతోనే బలోపేతం
హన్మకొండ అర్బన్ : స్థానికంగా అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని ఆదాయ వనరులను పెంపొందించేందుకు స్థానిక సంస్థలు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన సెంట్రల్ తెలంగాణ స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సులో ఎమ్మెల్యే నాగరాజు, సభ్య కార్యదర్శి పి.కాత్యాయనిదేవి, సభ్యుడు ఎస్. సుధీర్ రెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లు స్థానిక సంస్థల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆదాయ వనరులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. స్థానిక సంస్థలు స్వీయ ఆదాయాన్ని పెంచుకుని ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్య, పచ్చదనం, పన్ను వసూళ్లు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. స్థానిక సంస్థలు ఆర్థికంగా బలపడితేనే గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. భద్రకాళిని దర్శించుకున్న నోడల్ అధికారి హన్మకొండ కల్చరల్ : వరంగల్లోని శ్రీ భద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పి.కాత్యాయనిదేవి సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, అధికారులు ఆలయాన్ని సందర్శించిన కాత్యాయనిదేవిని పూర్ణకుంభంతో స్వాగతించారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం అర్చకులు తీర్ధప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య -
విద్యార్థులకు నైపుణ్య ఆధారిత శిక్షణ
కేయూ క్యాంపస్: విద్యార్థులకు నైపుణ్య ఆధారిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కేయూ వీసీ ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం వర్సిటీలోని సెనేట్ హాల్లో అధ్యాపకులకు, డీన్లకు, యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ.. కాకతీయ యూనివర్సిటీ–స్కిల్ డిజైర్తో అవగాహన ఒప్పందం ద్వారా ఫుల్ స్టాక్ జావా, డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులతో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించనున్నామన్నారు. స్కిల్ డిజైర్ డైరెక్టర్ ముప్పల శ్రీకాంత్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు అంశాలు వివరించారు. హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీనివాస్ శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయనను కలిసిన పలువురు అధికారులు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ హిస్టరీ అండ్ టూరిజం విభాగం అధిపతిగా ప్రొఫెసర్ టి.మనోహర్ను నియమిస్తూ రిజి స్ట్రార్ వి.రామచంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రెండేళ్లుగా రాజ్కుమార్ విభాగా ధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన పదవీకాలం పూర్తవడంతో ఆ స్థానంలో మనోహర్ను నియమించారు. ప్రస్తుతం ఆయన ఆ విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా, వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్గా కూడా కొనసాగుతున్నారు. ఈ మేరకు వీసీ కె.ప్రతాప్రెడ్డి చేతులమీదుగా మనోహర్ ఉత్తర్వులు అందుకున్నారు. ఓఎస్డీ బి.వెంకట్రామ్రెడ్డి, అభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ పాల్గొన్నారు. వరంగల్ క్రైం: ఉద్యోగంలో స్థాయి పెరిగినా కొద్ది బాధ్యతలు కూడా పెరుగుతాయని, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలందించేలా అధికారులు కృషి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల ఏఎస్సై స్థాయి నుంచి సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన 25 మంది అధికారులు శుక్రవారం పోలీస్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పదోన్నతి పొందిన ఎస్సై భుజాలపై స్టార్స్ను అలంకరించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. కాజీపేట రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను ఈ నెల 10వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనలో వర్చువల్లో ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నట్లు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట–హసన్పర్తి రైల్వేస్టేషన్ల మధ్య కోమటిపల్లి రైల్వే గేట్సమీపంలో నిర్మించిన సొరంగమార్గం (రైల్ అండర్ రైల్), బల్లార్షా – కాజీపేట – విజయవాడ మూడో రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు. కాగా, కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ–కోచ్ఫ్యాక్టరీ) ప్రధాని ప్రారంభించే ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు లేదని రైల్వే అధికారులు తెలిపారు. పనులు పూర్తి స్థాయిలో కాలేదని పేర్కొన్నారు. -
జనగణనలో భాగస్వాములు కావాలి
వరంగల్ అర్బన్: జనగణన–27లో భాగంగా నిర్వహించనున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియ, స్వీయ గణనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉదయం వరంగల్ ఎంజీఎం సెంటర్ నుంచి హనుమకొండ వేయిస్తంభాల ఆలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ చాహత్బాజ్పాయ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, అధికారులు, ఉద్యోగులు, వివిధ సంస్థల ప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు. ములుగు రోడ్ జంక్షన్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి, ‘జనగణన–27లో పాల్గొని దేశాభివృద్ధికి సహకరిద్దాం’’ అంటూ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, కార్పొరేషన్ విభాగాల అధికారులు, సిబ్బంది, మెప్మా సభ్యులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువజన సంఘాల సభ్యులు, తెలంగాణ సాంస్కతిక సారథి బృందం, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించాలి.. హన్మకొండ అర్బన్: జనగణన–27 విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కోరారు. శుక్రవారం జనగణన–27 అవగాహన ప్రచార వాహనాన్ని హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, డీఆర్డీఓ మేన శ్రీను, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈవీఎం గోడౌన్ తనిఖీ నెలవారీ తనిఖీల్లో భాగంగా.. నగరంలోని రెడ్ క్రాస్ భవనం వెనుక ఉన్న ఈవీఎం గోడౌన్ను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ ఎన్.రవితో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు జగత్ సింగ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మత్స్యకారులకు అవగాహన సదస్సు హన్మకొండ చౌరస్తా: చెరువుల పరిశుభ్రత, నీటి నాణ్యత పరిరక్షణ, చేపల వ్యాధుల నివారణ చర్యలు సమర్థవంతంగా అమలు చేస్తే మత్స్య ఉత్పత్తి పెరిగి మత్స్యకారులకు అధిక ఆదాయం లభిస్తుందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న ‘రైతు వారం’ ఐదో రోజు సందర్భంగా చెరువుల్లో కలుపు మొక్కల నివారణ, చేపల వ్యాధుల నియంత్రణ, చేపల అధికోత్పత్తి సాధనపై హనుమకొండలోని పద్మశాలి భవన్న్లో శుక్రవారం జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆధునిక మత్స్య సాగు పద్ధతులు, చెరువుల నిర్వహణ, చేపల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. హైదరాబాద్ వ్యవసాయ శాఖ స్పెషల్ ఆఫీసర్ నీలం పుష్పరాణి, జిల్లా మత్స్యశాఖ అధికారి పి.శ్రీపతి, మామునూరు కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ గణేశ్ (ఆక్వాకల్చర్), ఎఫ్డీఓ (రిటైర్డ్), ఎస్.వేణుగోపాల్, డీఎఫ్సీఎస్ హనుమకొండ మల్లేశం, మత్స్యకారులు పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్ జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ -
పది రోజులుగా పనిచేయని సీటీ స్కాన్
కాశిబుగ్గ: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 10 రోజుల నుంచి సీటీ స్కాన్ యంత్రం పనిచేయట్లేదు. దీంతో రోగులు ఇక్కట్లకు గురవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు సిటీ స్కాన్ చేయించుకోవాలంటే ఇబ్బందిగా మారుతోంది. వైద్యం కోసం వచ్చిన రోగులకు వైద్యులు సీటీ స్కాన్ ఎక్కడ చేయించుకోవాలో తెలియక ఆందోళనకు గురువుతున్నారు. దీంతో రోగులు ఎంజీఎం ఆస్పత్రి బాట పడుతున్నారు. మండుటెండలో సీటీ స్కాన్ కోసం పేషెంట్తో పాటు అటెండెంట్ ప్రైవేట్ వాహనాల ద్వారా వెళ్తుండడంతో వ్యయ ప్రయాసలు తప్పడం లేదు. అధిక భారం.. ప్రస్తుతం ఎంజీఎంలోని పేషెంట్లకే సీటీ స్కాన్ పరీక్షలు చేయడంలో క్యూ లైన్ పాటించాల్సి వస్తోంది. సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి వచ్చిన పేషెంట్లకు కూడా సిటీ స్కాన్ చేయడం సిబ్బందికి తలకు మించిన భారంగా మారుతోంది. చివరకు సిటీ స్కాన్లు అధికంగా తీయాల్సి రావడంతో ఇక్కడి స్కాన్ పరికరం కూడా పనిచేయకుండా మూలన పడే అవకాశం ఉందని సిబ్బంది చెబుతున్నారు. కాగా, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని పరికరానికి సంబంధించిన వారెంట్ ముగియడంతో సంబంధిత టెక్నీషియన్లు హైదరాబాద్ నుంచి రావట్లేదని తెలుస్తోంది. ఆస్పత్రి నుంచి రావాల్సిన బకాయిలు ఉండడంతో వారు రావట్లేదని సమాచారం. దీంతో స్కాన్ పరీక్షల కోసం ఇంకెన్ని రోజులు పడతాయో అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి నట్లు అధికారులు చెబుతున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్ప్రతిలో రోగులకు ఇక్కట్లు -
సమయపాలన లేకుండా నీటి విడుదల
వాళ్ల ఇష్టం వచ్చినసమయానికి నీళ్లు వదులుతున్నారు. ఒక్కోసారి ఉదయం, మరోసారి రాత్రిపూట వదలడంతో తెలియక పట్టుకోలేకపోతున్నాం. గతంలోకంటే ఎండాకాలం నీరు తక్కువగా వస్తోంది. లైన్మన్ను అడిగితే పైప్లైన్ లీకేజీ ఉందని, అందుకే నీరు ప్రెషర్ తక్కువగా ఉందని చెబుతున్నాడు. – పిల్లల సామ్రాజ్యం, ఉర్సుబొడ్రాయి నల్లా వత్తలేదు నల్లా రాక, తాగు నీరు లేక బాగా ఇబ్బందవుతోంది. మాకు బోరు లేదు. నల్లా వత్తలేదు ఇలా అయితే ఎలా? ఇంటిల్లిపాదికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎండా కాలంలో నీళ్లు లేకుండా ఎలా ఉండగలం? క్యాన్ వాటర్ తాగేందుకు కొంటాం. కానీ ఇంటి అవసరాలకు ట్యాంకర్ కొనలేం కదా. – కూచన రాధ, 54వ డివిజన్, హనుమకొండరోజంతా నీళ్లకాడనే.. నల్లా నీరు ప్రెషర్ తక్కువగా వస్తోంది. సన్నటి ధారలా వస్తుండడంతో రోజంతా నీళ్లకాడనే ఉండాల్సి వస్తోంది. మేం పనికి వెళ్తేనే కుటుంబం గడుస్తుంది. నీటిదగ్గరే సమయమంతా గడిచిపోవడంతో పనికి పోవడం చాలా ఇబ్బందిగా ఉంది. దీంతోపాటు ఏ సమయంలో నీటిని వదులుతారో అర్థంకాని పరిస్థితి. – భాగ్యమ్మ మైసయ్య నగర్ -
గ్రేటర్ ప్రత్యేకాధికారిగా చాహత్
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ)లో గురువారం నుంచి ప్రత్యేకాధికారి పాలన ప్రారంభమైంది. హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ స్పెషల్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ టీ.కే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. బల్దియా పాలక మండలి పదవీ కాలం బుధవారంతో పూర్తయిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే నాటికి ప్రత్యేకాధికారి పాలన కొనసాగనుంది. గ్రేటర్ వరంగల్ ఇన్చార్జ్ కమిషనర్గా, స్పెషల్ ఆఫీసర్గా చాలాతక్కువ మంది కలెక్టర్లకు ఇలాంటి అవకాశం లభిస్తుందని సీనియర్ అధికారులంటున్నారు. ఒకరికే.. నాలుగు అదనపు బాధ్యతలు వరంగల్, హనుమకొండ జిల్లాలకు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అత్యంత కీలకమయ్యారు. గ్రేటర్ వరంగల్ మహానగరం, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) రెండు జిల్లాల్లో విస్తరించి ఉంటుంది. బల్దియా కమిషనర్గా పనిచేసిన ఆమె ఇటీవల పదోన్నతిపై హనుమకొండ కలెక్టర్గా నియామకమయ్యారు. ప్రభుత్వం కమిషనర్ పోస్ట్ను ఇంకా భర్తీ చేయలేదు. ఆమెనే కలెక్టర్గా, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్గా, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) వైస్ చైర్పర్సన్గా, హనుమకొండ జెడ్పీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక మీదట బల్దియా ప్రత్యేకాధికారిగా కొనసాగనున్నారు. ఇలా ఐదు కుర్చీల్లో ఆమె బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది. అయితే అన్నింటినీ చక్కదిద్దడం కత్తిమీద సామే అంటున్నారు విశ్లేషకులు. మహా నగర అభివృద్ధిని కొనసాగిద్దాం : ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్ కిందిస్థాయి నుంచి వింగ్ అధికారి వరకు బాధ్యతాయుతంగా తమ విధులను సమన్వయంతో పనిచేస్తూ, మహా నగర అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేద్దామని గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వింగ్ అధికారులతో సమావేశమై పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. సుమారు రూ.100 కోట్ల విలువైన పెద్ద ప్రాజెక్టులు వేగంగా అమలయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా రహదారులు, పారిశుద్ధ్యం మౌలిక వసతుల కల్పన దృష్టి కేంద్రీకరించాలన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో ప్రజా ఫిర్యాదులకు తక్షణం స్పందించాలని, ఫైళ్లు ఎక్కడా నిలిచిపోకూడదని హెచ్చరించారు. యూజీడీ ప్రాజెక్ట్ డీపీఆర్ అంతిమ దశకు చేరుకున్నందున ఇంజనీరింగ్ అధికారులు అందుకు అవసరమైన సూచనలు చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, సీఎంహెచ్ఓ డా.రాజారెడ్డి, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, ఎంహెచ్ఓ డా.రాజేశ్, ఈఈలు రవికుమార్, సంతోశ్బాబు, మహేందర్, మాధవీలత పాల్గొన్నారు. స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన చాహత్ బాజ్పాయ్కి అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. హనుమకొండ కలెక్టర్కు నాలుగు అదనపు బాధ్యతలు ఇలాంటి అవకాశం రావడం అరుదు అంటున్న సీనియర్లు -
సౌరవిద్యుత్పై అవగాహన ఉండాలి
ఖిలా వరంగల్: సౌర విద్యుత్పై రైతులకు అవగాహన ఉండాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం తూర్పుకోటలో వ్యవసాయ, రెవెన్యూ, టీజీ ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ పంప్సెట్లకు సౌర విద్యుత్ వినియోగిస్తే పర్యావరణాన్ని కూడా పరిరక్షించవచ్చని పేర్కొన్నారు. విద్యుత్ లైన్ల సమీపంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, విద్యుత్ పరికరాలను సురక్షితంగా వినియోగించాలని కలెక్టర్ సూచించారు. పీఎం కుసుం పథకాలపై వివరించారు. అనంతరం రైతులు, వినియోగదారుల కోసం రూపొందించిన విద్యుత్ భద్రత అవగాహన పోస్టర్ను కలెక్టర్ విడుదల చేశారు. జిల్లా వ్యవసాయాధికారి కె.అనురాధ, శాస్త్రవేత్తలు శ్రావణ్, హరి, ఏఓ విజ్ఞాన్, సాగుకు సంబంధించిన పలు కీలక అంశాలను రైతులకు వివరించారు. విద్యుత్ శాఖ డీఈ మల్లికార్జున్, తహసీల్దార్ ఇక్బాల్, మాజీ కార్పొరేటర్ సువర్ణ, రెడ్కో జనరల్ మేనేజర్ రాజేందర్, ఎస్ఈ ఆనందం, ఏడీఈ కిశోర్, ఏఈ రామకృష్ణ, చంద్రకాంత్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ వీరేశ్బాబు, రైతులు పాల్గొన్నారు. వేసవి శిబిరాలను విజయవంతం చేయాలి..న్యూశాయంపేట: జిల్లాలో వేసవి శిబిరాల విజయవంతానికి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శిబిరాల నిర్వహణపై జిల్లా స్థాయి అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 10 వరకు నిర్వహించనున్న శిబిరాల్లో పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఓ నాగపద్మజ, అదనపు డీఆర్డీఓ రేణుక, డీపీఓ కల్పన, సంక్షేమాధికారి రాజమణి తదితరులు పాల్గొన్నారు. జాబ్మేళా ఏర్పాట్ల పరిశీలన.. హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించనున్న మెగా జాబ్మేళా ఏర్పాట్లను కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పలు కంపెనీలు రానున్నాయని కలెక్టర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నిరుద్యోగ యువత వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, అధికారులు ఉన్నారు. నేడు కాళోజీ కళాక్షేత్రంలో జాబ్ మేళావరంగల్ స్పోర్ట్స్: యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నేడు (శుక్రవారం)బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈజాబ్ మేళాలో ప్రైవేట్ రంగానికి చెందిన పలు ప్రముఖ సంస్థలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, మార్కెటింగ్, సేల్స్, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఐటీ, బిజినెస్ ప్రాసెస్, కస్టమర్ సర్వీస్ తదితర రంగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
ఖానాపురం ఎస్సైకి పురస్కారం
వరంగల్ క్రైం: మూగ జీవాల అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఖానాపురం ఎస్సై జి.రామ్మోహన్ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అభినందించారు. ఈ మేరకు గురువారం సీపీ కార్యాలయంలో నగదు రివార్డు అందజేశారు. కార్యక్రమంలో వెస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: ప్రజాపాలన – ప్రగతిప్రణాళికలో భాగంగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రైతు మేళాలో మూడు రోజులపాటు వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు అలాగే, అవగాహన స్టాల్ను కూడా నిర్వహించినట్లు హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య గురువారం తెలిపారు. 15 మందితో కూడిన వైద్యబృందంతో మూడు రోజుల పాటు రెండు షిఫ్టుల్లో వైద్య సేవలు అందించామని తెలిపారు. 229 మందికి బీపీ, 179 మందికి షుగర్, నాలుగు ఈసీజీ పరీక్షలు 375 ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఒకరు ఫిట్స్, మరొకరు ఛాతి నొప్పితో బాధపడగా.. వారికి ఫస్ట్ ఎయిడ్ చేసి స్టెబిలైజ్ చేశాక మెరుగైన సేవలకు 108 ద్వారా ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఈవైద్యశిబిరంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రదీప్రెడ్డి, డీఐఓ డాక్టర్ జ్ఞానేశ్వర్, డాక్టర్ వి.అశోక్రెడ్డి, డాక్టర్ నవీన్ పర్యవేక్షించారు. వైద్య అధికారులు అరుణ్కుమార్, శ్వేత, స్వాతి, విప్లవకుమార్, పారామెడికల్ సిబ్బంది, ఆశవర్కర్లు సేవలందించారని అప్పయ్య తెలిపారు. వీసీలో రాష్ట్ర ప్రధాన జనగణన అధికారి, సంచాలకులు భారతి హోళికేరి వరంగల్ అర్బన్/న్యూశాయంపేట: జనగణన–27 కార్యక్రమంలో భాగంగా ఇళ్ల, జనగణన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన జనగణన అధికారి, సంచాలకులు భారతి హోళికేరి సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి ఆమె కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 11 నుంచి జూన్ 9వరకు నిర్వహించే ప్రక్రియను సవ్యంగా నిర్వహించాలని, స్వీయ గణనపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజలందరికి తెలిసే విధంగా ప్రచారం చేపట్టాలని సూచించారు. కాగా, స్వీయ గణన కోసం నేడు(శుక్రవారం) ఎంజీఎం కూడలి నుండి వెయ్యి స్తంభాల ఆలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో హనుమకొండ కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్, అదనపు ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారి చంద్రశేఖర్, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, బిర్రు శ్రీనివాస్, టీఎంసీ రమేశ్, వరంగల్ నుంచి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నలుగురు ఇన్స్పెక్టర్ల బదిలీ వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కాజీపేట ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డిని శాయంపేటకు, ఏహెచ్టీయూ ఇన్స్పెక్టర్ జె.శ్యామ్ సుందర్ను కాజీపేటకు, పీసీఆర్లో పనిచేస్తున్న ఏ.మహేందర్ను హసన్పర్తికి, ప్రస్తుతం హసన్పర్తిలో విధులు నిర్వహిస్తున్న వి.చేరాలును వీఆర్కు బదిలీ చేశారు. -
రైతును కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదే
హన్మకొండ: రైతును కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా గురువారం ముగిసింది. చివరి రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు మేళాలో ఏర్పాటుచేసిన స్టాళ్లను సందర్శించి వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతాంగానికి కావాల్సిన అన్ని అవకాశాలు కళ్ల ముందుంచాలని, యాంత్రీకరణ, పురుగు మందులు, ఎరువులు, మార్కెటింగ్ వ్యవస్థ, భవిష్యత్లో రాష్ట్రంలో ఏ రకంగా ముందుకు పోవాలి తదితర అంశాలపై రైతులను అవగాహన కల్పించేందుకే హనుమకొండలో రైతుమేళా నిర్వహించామన్నారు. రైతుకు పాడి–పంట రెండూ అవసరమని, ఈ రెండింటి వైపు రైతును ప్రోత్సహించాలన్నారు. ఆయిల్పాం లాభదాయకమని, రైతులు దీని సాగుపై దృష్టి సారించాలన్నారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లాలన్నారు. రైతుబంధు పేరుతో యాంత్రీకరణ ఆపేసి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అష్టకష్టాల పాలు చేసిందని విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా, యూరియా సరఫరాపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. రైతులు దానం చేయాలని నాడు వైఎస్ చెప్పారు.. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రైతులు దానం చేయాలని, యాచించకూడదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారని, ఈ మేరకు వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ ఉచిత విద్యుత్ అందించారని, ప్రాజెక్టులు నిర్మించారన్నారు. అదే బాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కొనుగోళ్లు వేగంగా జరగడం లేదు.. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ధాన్యం, మక్కల కొనుగోళ్లు వేగంగా జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వర్షాలు రాకముందే కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో చేతులెత్తేసిందని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, రైతులు గోపిరెడ్డి గోపాల్ రెడ్డి, లావణ్య రెడ్డి, భాగ్యలక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యానశాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద, అదనపు కలెక్టర్లు ఎన్.రవి, సంధ్యారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, ఎన్పీడీసీఎల్ అధికారులు, శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.ఆయిల్పాం సాగు లాభదాయకం సేంద్రియ పంటల వైపు రైతులు దృష్టి సారించాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ముగిసిన రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా -
కేటీఆర్కు మతిభ్రమించింది
రామన్నపేట: రైతులకు బేడీలు వేసిన నీచమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని, ఇప్పుడు వారిపై ప్రేమ ఉన్నట్లు కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు నటిస్తున్నారని కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ ఆరోపించారు. వరంగల్ నగరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల వరంగల్లో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు సంగ్రామ సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్రెడ్డిపై పరుష పదజాలంతో మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. అధికారం కోల్పోవడంతో మతిభ్రమించిన కేటీఆర్.. సీఎం రేవంత్రెడ్డిపై ఆరోపణలు చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు వరి వేసుకుంటే ఉరేనని అని అనలేదా? అని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి, కేజీ టు పీజీ ఉచిత విద్య పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో 641 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నది వాస్తవం కాదా, ఇలాంటి నీచమైన పరిపాలన చేసిన బీఆర్ఎస్ నేతలు.. సీఎం రేవంత్రెడ్డిపై పరుష పదజాలం ఉపయోగిస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. నాయకులు ఎద్దు సత్యం, తూల రవి, శ్రీనివాస్, దాడి శివ, మాధవరెడ్డి, ఇండ్ల రవి, ఈగ దామోదర్, నాంపల్లి యాదగిరి, జన్ను అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ది సీఎం రేవంత్పై పరుష పదజాలం ఉపయోగిస్తే ఊరుకోం కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ -
తిట్ల పురాణానికి ఆద్యుడు సీఎం రేవంత్
హన్మకొండ: తిట్ల పురాణానికి ఆద్యుడు రేవంత్రెడ్డి అని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై స్పందించడం లేదని, పంటల కొనుగోళ్లు లేక రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్పై ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. రైతు బంధు వంటి పథకం దేశంలో ఎక్కడా లేదని, వ్యవసాయాన్ని పండుగలా మార్చింది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు మంత్రి పదవులు కోసం పోటీ పడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. హామీల అమలుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు అసహనంగా స్పందిస్తున్నారన్నారు. రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రైతు సంగ్రామ సదస్సు విజయవంతం కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంబేలెత్తిపోతున్నారని, పంటలు కొనుగోలు చేసే సామర్థ్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మర్రి యాదవరెడ్డి, ఉడతల సారంగపాణి, తాళ్లపెల్లి జనార్దన్ గౌడ్, పులి రజినీకాంత్, రామ్మూర్తి, నార్లగిరి రమేశ్, నయీముద్దీన్, పానుగంటి శ్రీధర్, బండి రజినీకుమార్, రవీందర్రావు పాల్గొన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చింది కేసీఆర్ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య -
నోటిఫికేషన్పై హర్షం
హన్మకొండ కల్చరల్: దేవాలయాల్లో పనిచేయడానికి గ్రేడ్ 1, 2, 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల నియామనికి 190 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడడంపై తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తనుగుల రత్నాకర్, గ్రేటర్ వరంగల్ జేఏసీ అధ్యక్షుడు అనిల్కుమార్ శర్మ, రాష్ట్ర కన్వీనర్ పరాశరం రవీంద్రచారి, రాష్ట్ర దేవాలయాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కొండూరు కృష్ణమాచారి తదితరులు హనుమకొండ రాంనగర్లో దేవాదాయధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి దేవాదాయశాఖ ఈఓల నియామకానికి ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఉప ప్రధానార్చక, ప్రధాన అర్చక పోసుల్లో నియామకం చేపట్టాలని, రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు దేవాదాయశాఖలో పనిచేస్తున్నారని, ఖాళీగా ఉన్న పోస్టుల్లో వారిని క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం నియామకాలు చేపట్టాలని కోరారు. మంత్రి సురేఖ సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా విషయాలను చర్చించారు. అలాగే దేవాదాయశాఖలో 190 పోస్టులు కేబినెట్లో తీర్మానం చేసినందుకు అర్చక ఉద్యోగ జేఏసీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఓరుగల్లునుంచే రైతుపోరు
సాక్షిప్రతినిధి, వరంగల్/కాజీపేట అర్బన్: ‘రైతుకు ఓపిక నశిస్తే భూకంపం పుడుతుందని పాలకులు గ్రహించాలి. భూమిని దున్నడం తెలిసిన రైతు నాగలి తిరగేసి కాంగ్రెస్ను బొంద పెడతారు.. వరంగల్ వేదికగా ఏ ఉద్యమం మొదలుపెట్టినా విజయవంతమవుతుంది. ఇప్పుడు జరిగిన ఈ రైతు సంగ్రామ సదస్సు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ హంటర్ రోడ్డులో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు సంగ్రామ సదస్సు నిర్వహించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతుల మృతికి సంతాపంగా తొలుత ఒక నిమిషం మౌనం పాటించి, నివాళులర్పించి సదస్సును ప్రారంభించారు. జై కేసీఆర్ నినాదాలతో సదస్సు ప్రాంగణం మార్మోగింది. ‘కేసీఆర్ సారు మళ్లీ రావాలి. రైతు బంధు రాజ్యం రావాలి. రాబందుల పాల న పోవాలి’ అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు నినదించారు. కాగా, కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ వైఫల్యాలు, ప్రభుత్వ తీరును కేటీఆర్ తన ప్రసంగంలో ఎండగట్టారు. రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు. సదస్సుకు హాజరైన పలువురు రైతులు, రైతు ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తమ అభిప్రాయాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. సదస్సులో పలు తీర్మానాలు ప్రవేశపెట్టి హర్షధ్వానాల మధ్య ఆమోదించారు. రైతు సంగ్రామ సదస్సు బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. సదస్సులో గాయకులు మధుప్రియ, మిట్టపల్లి సురేందర్, రసమయి బాలకిషన్ పాటలతో హోరెత్తించారు. ప్రత్యేక ఆకర్షణగా ఎడ్లబండి.. రైతు సంగ్రామ సదస్సు ప్రాంగణం ఎదుట ఏర్పాటు చేసిన కంకులతో రూపొందించిన పసుపు చీరను కట్టుకున్నట్లుగా ఎడ్లబండి, నాగలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలువురు ఎడ్ల బండి, నాగలి వద్ద సెల్ఫీలు దిగారు. వేసవి తాపానికి అంబలి.. దాహానికి మజ్జిగ, మంచినీళ్లు సదస్సుకు వచ్చిన రైతులకు వేసవి తాపాన్ని తగ్గించేందుకు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, బాటిళ్లను ఏర్పాటు చేశారు. సుమారు 10 వేల మంది రైతులకు తెలంగాణ వంటకాలను ఏర్పాటు చేశారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అంబలి స్టాల్ను ఏర్పాటు చేసి దాహార్తి తీర్చారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత ఉధృతం చేస్తామన్న కేటీఆర్ జై కేసీఆర్.. సారు మళ్లీ రావాలి నినాదాలతో మార్మోగిన రైతు సంగ్రామ సదస్సు పాటలతో హోరెత్తించిన మధుప్రియ, మిట్టపల్లి సురేందర్, రసమయి అభిప్రాయాలు, కష్టాలు పంచుకున్న రైతులు.. పలు తీర్మానాలకు ఆమోదం కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టిన నేతలు.. బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ -
5 ఏళ్లు.. రూ.3,331 కోట్లు.. 6,676 పనులు
వరంగల్ అర్బన్: ఐదేళ్లలో వరంగల్ మహా నగర సమగ్రాభివృద్ధికి రూ.3,331 కోట్ల వ్యయంతో 6,676 పనులు చేపట్టి, అత్యుత్తమ, ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. ఎక్స్ అఫీషియో, పాలక మండలి సభ్యులు, కమిషనర్, అధికారులు, ఉద్యోగుల సేవలు అమూల్యమైనవన్నారు. గ్రేటర్ వరంగల్ పాలక మండలి చివరి కౌన్సిల్ సమావేశాన్ని మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. 20 ఎజెండా అంశాలకు సంబంధించి రూ.76.56 కోట్ల అభివృద్ధి పనులకు సర్వసభ్య సమావేశం ఆమోద ముద్ర వేసింది. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ పార్టీలకతీతంగా పాలకవర్గం సమష్టిగా పని చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టిందన్నారు. వరంగల్ ప్రజల దశాబ్దాల కల అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ప్రాజెక్ట్కు పునాది వేయడం కీలక విజయమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఇది సాధ్యమైందన్నారు. స్మార్ట్ సిటీ పథకం ద్వారా ఆధునిక మౌలిక వసతులు, స్మార్ట్ రోడ్లు, జంక్షన్లు, చెరువుల సుందరీకరణ వంటి పనులు నగరానికి కొత్త రూపును తెచ్చాయని చెప్పారు. తాగునీటి సమస్యను అధిగమించి ప్రతీ రోజూ నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నామని, పారిశుద్ధ్య రంగంలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చామని వెల్లడించారు. వరదల సమయంలో ప్రజలకు అండగా నిలిచాం. భవిష్యత్లో సమస్య లేకుండా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. చర్చ జరిగిందిలా.. 5వేల నుంచి 6 వేల మందితో కూడిన డివిజన్గా పునర్విభజన చేస్తామని ఎమ్మెల్యే నాగరాజు ప్రస్తావించారు. గ్రేటర్ స్థాయి తగ్గించకుండా 12 వేల నుంచి 15 వేల మందితో ఒక డివిజన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్లలో మాట్లాడేందుకు ఒక్కసారి అవకాశం ఇవ్వకపోవడం సరికాదని కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి అన్నారు. గత ఐదేళ్లలో డివిజన్ ప్రజలతో, కౌన్సిల్లో జరిగిన పరిణామాలపై పలువురు కార్పొరేటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. సుదీర్ఘ కాలం నడిచిన ప్రయాణం మధుర జ్ఞాపకంగా నిలుస్తుందన్నారు. రూ.1,24 కోట్ల పనులకు శంకుస్థాపన బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో రూ.95 లక్షలతో స్విమ్మింగ్ పుల్ నిర్మాణం, రూ.29 లక్షల జనరల్ ఫండ్తో మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల విక్రయం కోసం స్టాళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా బల్దియా ఆవరణలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్తో పాటు వివిధ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఫొటో సెషన్ కొనసాగింది. ఆత్మీయ వీడ్కోలు.. గ్రేటర్ వరంగల్ పాలకమండలికి బుధవారం సాయంత్రం ములుగు రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్లో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. సభ్యులకు మెమొంటో అందించి శాలువా కప్పి సత్కరించారు. మనుషులా.. గాడుదులా? కౌన్సిల్ సమావేశ మందిరంలో తాను కూర్చునే సీటు వద్ద తన నేమ్ ప్లేట్ పెట్టకుండా తనను అవమానపర్చారని ఎమ్మెల్సీ సారయ్య అసహనం వ్యక్తం చేశారు. ‘మనుషులా గాడుదులా’ అంటూ సంబోధించడం చర్చనీయాంశంగా మారింది. మరింత అభివృద్ధి చేస్తాం.. వరంగల్ నగరాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాం. నగరాభివృద్ధిలో భాగంగా ఎయిర్పోర్ట్, కోచ్ ఫ్యాక్టరీ, మెగా టెక్స్టైల్ పార్క్ వంటి కీలక ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి. ప్రజ లకు మెరుగైన జీవన వాతావరణం అందిస్తాం. – ఎంపీ కడియం కావ్య మౌలిక వసతులపై ఫోకస్ పెట్టాలి హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. నగరానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తాం. స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్లు ఆ దిశగా ప్రత్యేక చొరవ తీసుకోవాలి. – బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ పదవులు కాదు.. ప్రజా సేవే లక్ష్యం పదవులు శాశ్వతం కాదు. ప్రజల సేవే నిజమైన లక్ష్యం. ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ ప్రజాసేవలో ముందుండాలి. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. – నాగరాజు, ఎమ్మెల్యే, వర్ధన్నపేట కట్టుబడి పనిచేస్తాం.. ప్రతీ సమస్యను ప్రాధాన్యంగా తీసుకొని, వేగంగా పరిష్కరించేలా పనిచేస్తాం. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం. – చాహత్ బాజ్పాయ్, హనుమకొండ కలెక్టర్, బల్దియా కమిషనర్ అందరి సహకారంతో ఆదర్శనగర నిర్మాణం మేయర్ గుండు సుధారాణి చివరి కౌన్సిల్లో రూ.76.56 కోట్ల పనులకు ఆమోదం -
అటవీ సంరక్షణకు ప్రాధాన్యం
వరంగల్ డీఎఫ్ఓ నిఖిత న్యూశాయంపేట: జిల్లాలో అటవీ భూముల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటామని వరంగల్ జిల్లా అటవీశాఖ అధికారి బి.నిఖిత అన్నారు. ఇటీవల జిల్లా అటవీశాఖ అధికారిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం బుధవారం ఆమె క్యాంపు కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ అధికారుల (ఎఫ్ఆర్ఓ)తో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అటవీ ప్రాంతాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా అటవీ చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ సత్యశారదను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించారు. సమావేశంలో ఫారెస్ట్ రేంజ్ అధికారులు రవికిరణ్, రాధిక తదితరులు పాల్గొన్నారు. -
కల్లాల కాడ రైతుల ఎదురు చూపులు
కాంగ్రెస్ వాళ్లకే యూరియా.. వ్యవసాయంలో వ్యత్యాసం చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్లకే ముందుగా యూరియా ఇస్తున్నారు. వాళ్ల పంటనే ముందుగా కొంటున్నారు. వర్షం వచ్చి వడ్లు తడుస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేడు. అంతా అవినీతి, అక్రమాలకు నిలయంగా కాంగ్రెస్ పాలన నిలుస్తోంది. – సుబ్బారావు, రైతు, ఖానాపురం, వరంగల్ పండించిన పంటను ఎప్పుడు కొంటారు? పెట్టిన పెట్టుబడి ఎప్పుడు చేతికందుతుందని రైతులు కల్లాల కాడ.. మక్కల అమ్మకానికి నెల రోజులుగా ఎదురుచూస్తున్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ఎవుసం ఎప్పుడూ అభివృద్ధి చెందదు. కేసీఆర్ పాలనలో రైతు బంధు ద్వారా ఎకరాకు రూ.5 వేలు ఇవ్వగా, ఇప్పుడు ఒక ఎకరానికి మాత్రమే రూ.6 వేలు వేస్తున్నారు. – ఊకంటి రవి, రైతు, దుగ్గొండిరైతుబంధు పడట్లేదు.. యాక్సిడెంట్లో కాలు కోల్పోయినా కూడా కేటీఆర్ను చూసేందుకు, బీఆర్ఎస్పై మక్కువతో ఒక్క కాలితో నేలపై అతి కష్టమ్మీద సదస్సుకు వచ్చా. నాకు మూడెకరాల భూమి ఉంటే రైతు బంధు ఇస్తలేరు. కేసీఆర్ సారే సీఎం కావాలి. ఈసారి ఓటు వృథా చేసుకోం – ఎండీ, మక్బూల్, రైతు, కొత్తపేట, హనుమకొండ ● -
పార్కింగ్ కాంప్లెక్స్కు శంకుస్థాపన
నయీంనగర్: హనుమకొండ అశోక టాకీస్ ఎదురుగా ఉన్న 8వ డివిజన్ మున్సిపల్ స్థలంలో రూ.15 కోట్ల మున్సిపల్ ఎస్పీవీ నిధులతో నిర్మించనున్న మల్టీ లెవల్ సైంటిఫిక్ పార్కింగ్ సముదాయానికి బుధవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నాలుగు అంతస్తులతో నిర్మించనున్న ఈ ఆధునిక పార్కింగ్లో ఒకేసారి 100 కార్లు, 100 టూవీలర్లు పార్క్ చేసే సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. నగర ట్రాఫిక్ సమస్యకు ఈ పార్కింగ్ కాంప్లెక్స్ శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందన్నారు. పనులను నాణ్యతతో, నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్.నాగరాజు, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి, కార్పొరేటర్ బైరి లక్ష్మి ఉన్నారు. -
ఏం అభివృద్ధి చేశావో చర్చకు రా..
కేయూ క్యాంపస్: ‘వరంగల్ జిల్లాను ఎవరు అభివృద్ధి చేశారు? ఎంత అభివృద్ధి చేశారనే చర్చకు రా..’ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు. బుధవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మిన నీచ చరిత్ర బీఆర్ఎస్దే అని, దొంగ మాటలు, దొంగ కన్నీళ్లు కారుస్తూ రైతు సదస్సు నిర్వహించారన్నారు. సదస్సులో రైతులు అంతంత మాత్రంగా ఉన్నారని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే ఎక్కువ ఉన్నారని ఆరోపించారు. రైతులను నమ్మించే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రైతులకు బేడీలు వేసి కేసులు పెట్టిన చరిత్ర మీది కాదా అని ప్రశ్నించారు. ఏనుమాముల మార్కెట్లో నాడు బీఆర్ఎస్ నేతలను రైతులు తరిమికొట్టారని గుర్తుచేశారు. పదేళ్లలో చేయని అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ చేసి చూపించిందన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ.. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొకపోతే తరిమికొడతామన్నారు. బీఆర్ఎస్ అంటే బద్మాష్ రాష్ట్ర సమితి అని ఎద్దేవాచేశారు. సమావేశంలో రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్రెడ్డి, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టీపీసీసి ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్రావు, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సరళ, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కేటీఆర్కు సవాల్ విసిరిన పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
పంట ఉత్పత్తులను మార్కెట్లోనే విక్రయించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఖిలా వరంగల్: రైతులు తమ పంట ఉత్పత్తులను మార్కెట్లోనే విక్రయించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ, అనుబంధశాఖల ఆధ్వర్యంలో మార్కెట్ కార్యదర్శి మల్లేశం అధ్యక్షతన రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పత్తి, మొక్కజొన్న, మిర్చి, ధాన్యం తదితర పంటలను మార్కెట్లో విక్రయిస్తే మద్దతు ధరతో పాటు సరుకులు విదేశాలకు రవాణా చేసే సదుపాయం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, వైవీ గణేశ్, మార్కెటింగ్ హైదరాబాద్ అదనపు సంచాలకులు ఆర్.లక్ష్మణుడు, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీయల్ వరంగల్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ.. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలోని ఈవీఎం గోదాంను బుధవారం అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణితో కలిసి కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. జాబ్మేళా పోస్టర్ ఆవిష్కరణ న్యూశాయంపేట: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా యూత్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈనెల 8న (శుక్రవారం) హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో మెగా జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. -
మంత్రి కొండా సురేఖ స్వీయ జనగణన
వరంగల్ అర్బన్: జనగణన–2027లో భాగంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హనుమకొండ రాంనగర్లోని తన నివాసంలో బుధవారం సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతీ పౌరుడు స్వయంగా వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా జనగణన ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా సాగుతుందని తెలిపారు. ప్రజలంతా సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానాన్ని వినియోగించుకుని ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు. మే 10 వరకు నమోదు చేసుకోవచ్చని, మే 11 నుంచి ఇంటింటికీ వచ్చే ఎన్యుమరేటర్లకు ఐడీ నంబర్ను తెలియజేయాలని సూచించారు. దీంతో తమ వివరాలు అధికారికంగా జనగణనలో నమోదవుతాయని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, రెవెన్యూ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి పద్మ అవార్డును ప్రదానం చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. http:// padmaawards.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. సేవలకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రిక కటింగ్ ఫొటోలతో సహా (4) సెట్లు తయారు చేసి దరఖాస్తుకు జోడించి ఈనెల 25వ తేదీలోగా జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయం, హనుమకొండ జిల్లా, కాకతీయ డిగ్రీ కళాశాల ఎదురుగా, ఆఫీసులో అందజేయాలని సూచించారు. నిర్ణీత తేదీ తర్వాత వచ్చిన ధరఖాస్తులు తిరస్కరించనున్నట్లు ప్రశాంత్ తెలిపారు. హసన్పర్తి: గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితులకు కఠిన శిక్షణ పడేలా కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజ మల్లారెడ్డిని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ బుధవారం అభినందించారు. కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజ మల్లారెడ్డికి నగదు రివార్డు అందించారు. వంద కిలోల గంజాయి కేసులో ఐదుగురికి 20 ఏళ్ల శిక్ష పడడంలో రాజ మల్లారెడ్డి కీలక పాత్ర పోషించడంపై సీపీ అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా సీపీ సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ.. పోలీసులు, ప్రభుత్వ న్యాయవాదులు సమన్వయంతో పనిచేస్తే నిందితులకు శిక్షణ పడుతుందని చెప్పారు. కాశిబుగ్గ: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని బీఎస్సీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులకు షీ టీం ఆధ్వర్యంలో బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో.. షీ టీం ఆధ్వర్యంలో పోలీసులు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సునీత మాట్లాడుతూ.. కళాశాలలో ర్యాగింగ్ జరగలేదని, ఇద్దరు విద్యార్థినులు ఫోన్ విషయంలో గొడవ పడ్డారన్నారు. వెంటనే తాము వారికి నచ్చజెప్పి ఎలాంటి వివాదం లేకుండా చేశామని పేర్కొన్నారు. అలాగే బుధవారం ర్యాగింగ్ జరగలేదని సద రు విద్యార్థితో పాటు సోదరుడు కూడా యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్ పోర్టల్కు మెయిల్ పెట్టారని ఆమె తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యిందని, కంప్లైంట్ను క్లోజ్ చేయండని మెయిల్లో పేర్కొన్నట్లు ప్రిసిపాల్ వివరించారు. న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ కోసం మైనార్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేశ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ఆస్తకిగల మైనార్టీ అభ్యర్థులు (ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జైన్, బౌద్ద, పార్సీ) ఆన్లైన్ ద్వారా ఈనెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు హనుమకొండ సుబేదారి, షరీఫన్ మసీద్ ఎదురుగా రెండవ అంతస్తులోని కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
సీఎంను గద్దె దించేందుకు పోరాటానికి సిద్ధం
రేవంత్రెడ్డిని గద్దె దించేందుకు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. రైతులను గోస పెడుతూ 40 ఏళ్ల నాటి కాంగ్రెస్ పాలనను తిరిగి గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో కల్లాల దగ్గరే పంట కొనుగోలు చేయగా, నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కల్లాల దగ్గర, కాంటాల దగ్గర ఎంత ఇస్తావంటూ అవినీతి రాజ్యమేలుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు నా చాలెంజ్.. రైతు మేళాను రైతుల మార్కెట్లో పెట్టండి.. ఉరికిచ్చి కొడతారు. – ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ మంత్రి కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగం పదేళ్ల కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగంలా ఉండగా, నేటి కాంగ్రెస్ పాలన రైతుల పాలిట రాబందుల పాలనగా మారింది. రైతులను గోస పెట్టుకుంటున్న రేవంత్ పాలన పోయి అన్నం పండించే రైతు మూడు పూటలా కడుపు నిండా భోజనం చేసే బీఆర్ఎస్ పాలన రావాలి. పడించిన పంటలో పావలా వంతు కూడా కొనకుండా రైతులను అరిగోస పెట్టుకుంటున్న ప్రభుత్వం చెర నుంచి రైతులకు విముక్తి రావాలి. – సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి తెలంగాణ ఊపిరి మా సదస్సు పోరాటాలకు పుట్టినిల్లు వరంగల్లో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు పెట్టడానికి అనుమతి ఇవ్వలేదు. ఇక్కడి ఎమ్మెల్యే.. మీది ఏం సదస్సు, ఏం సభ అంటూ వెటకారంగా మాట్లాడారు. మాది తెలంగాణ ఊపిరి సదస్సు. రైతును రాజు చేయాలని, రైతు పక్షపాతి కేసీఆర్.. రైతుబంధు, రైతు భరోసా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని పథకాలు తీసుకొచ్చా రు. కానీ, కాంగ్రెస్ సర్కారు వాటిని తుంగలో తొక్కింది. – పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే, జనగామ -
నేడే ఆఖరు
ముగియనున్న జీడబ్ల్యూఎంసీ సభ్యుల పదవీకాలంవరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ల పదవీ కాలం నేడు ముగియనుంది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ చివరి సమావేశం నిర్వహించనున్నారు. ఐదేళ్ల చివరి రోజు వీడ్కోలు వేళ చివరి కౌన్సిల్ నిర్వహించడంపై సభ్యుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈసమావేశంలో డివిజన్కు రూ.50 లక్షల నిధుల కేటాయింపులు, పరిపాలన, ఆర్థిక స్వావలంబన కోసం మరికొన్ని కీలక నిర్ణయాలు ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. సమావేశంలో ఎజెండా అంశాలను అంత్యంత గోప్యంగా ఉంచారు. తారుమారు.. 2021 మే 2న ఓట్ల లెక్కింపు జరిగింది. 2021 మే 7 పాలక మండలి కొలువుదీరింది. అప్పటి ఎన్నికల్లో మొత్తం 66 డివిజన్లకు బీఆర్ఎస్ 48, బీజేపీ 10, కాంగ్రెస్, స్వతంత్రులు 4 స్థానాల్లో విజయం సాఽ దించారు. బీఆర్ఎస్కు చెందిన మేయర్ సుధారాణి, డిప్యూటీ మేయర్గా రిజ్వానా షమీమ్ ఎన్నికయ్యారు. 2023 డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం మారడంతో గ్రేటర్లోనూ రాజకీయ పరిణామాలు తారుమారయ్యాయి. మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పలువురు కార్పొరేటర్లు ఆమెను అనుసరించారు. దీంతో కౌన్సిల్లో బలాబలాలు మారిపోయాయి. కాంగ్రెస్ సభ్యులు 34 మంది కాగా, బీఆర్ఎస్–21, బీజేపీ 11కు సంఖ్య చేరింది. మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ సభ్యులు అడుగు ముందుకేసినా బెడిసికొట్టింది. ఈనేపథ్యంలో మేయర్, డిప్యూటీలు పదవుల్లో కొనసాగారు. కౌన్సిల్లో కో–ఆప్షన్ సభ్యుల ఉసేలేదు. ఎంతో మంది రాజకీయ నాయకులు ఆ పదవులు కోసం ఎదురు చూసి విసిగివేసారిపోయారు. వార్డు కమిటీల జాడ పత్తా లేకుండా పోయింది. ఎప్పుడెప్పుడు ఎవరంటే! వరంగల్ బల్దియా 1994లో మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటైంది. ఏడాది పాటు స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగింది. 2000 సంవత్సరంలో ఏడాది, 2005లో మూడు నెలలు కొనసాగింది. మళ్లీ 2010 సెప్టెంబర్ 30న అప్పటి పాలకవర్గం గడువు ముగిసింది. దీంతో 2010 అక్టోబర్ 1 నుంచి అప్పటి కలెక్టర్ ఎన్.శ్రీధర్ ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. అదే ఏడాది నవంబర్ 30న కలెక్టర్ శ్రీధర్ బదిలీ అయ్యారు. అతడి స్థానంలో వచ్చిన రాహుల్బొజ్జా ఐదుసార్లు ప్రత్యేకాధికారిగా పనిచేసి రికార్డు సృష్టించారు. 2014లో కలెక్టర్గా కిషన్ బదిలీపై వచ్చారు. సుమారు ఏడాదిన్నర పాటు పనిచేసి కిషన్ బదిలీ కావడంతో వాకాటి కరుణ 2015 జనవరిలో ఇక్కడికి వచ్చారు. కలెక్టర్గా, ప్రత్యేకాధికారిగా కొనసాగారు. 2016 మార్చి 15 నుంచి ఐదేళ్ల పాటు పాలక వర్గం కొనసాగింది. 2021 మార్చి 15న మళ్లీ స్పెషల్ ఆఫీసర్ రాజీవ్ గాంధీ హన్మంతు 51 రోజులు కొనసాగారు. తాజాగా మరో మారు ఈనెల 7 నుంచి ప్రత్యేకాధికారి పాలన ఆరంభం కానుంది. ఆరు నెలల్లోగా ఎన్నికలు జరగకపోతే మరోమారు పొడిగించే అవకాశాలుంటాయి. ఈలోగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. అవినీతి, ఆరోపణలు, పట్టింపులేమితో గడిపిన కొందరు కార్పొరేటర్లు ఐదేళ్లలో 22 కౌన్సిల్ సమావేశాలు మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన నేడు చివరి సమావేశం జీడబ్ల్యూఎంసీలో గురువారం నుంచి ప్రత్యేక అధికారి పాలనకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. హనుమకొండ కలెక్టర్కు స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కాగా, ఇప్పటివరకు అధికారికంగా ఉత్తర్వులు రాలేదు. -
మాది రైతు పక్షపాతి ప్రభుత్వం
హన్మకొండ: రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమని, మాది రైతుపక్షపాతి సర్కార్ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మూడు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి మెగా రైతుమేళాను బుధవారం మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి పొంగులేటి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రగతి ప్రణాళికలో భాగంగా 99రోజులు అధికారులను ప్రజల ముంగిటికి పంపిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే రైతు ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. 2022లో అద్భుతమైన రైతు డిక్లరేషన్ సభ నిర్వహించి ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెరవేరుస్తామని చెప్పి, సీఎం రేవంత్ నాయకత్వంలో రైతు పక్షపాతి ప్రభుత్వం ఏర్పాటు కాగానే అమలు చేస్తున్నామన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా, రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొంటుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు అధికారం పోయిందని కడుపునిండా విషం నింపుకుని మాట్లాడుతున్నారన్నారు. కల్లాల వద్దకు వెళ్లి సినిమాలో ఫోజులు ఇచ్చినట్లు ఇచ్చి పత్రికల్లో ఫొటోలు వేయించుకుంటున్నారన్నారు. ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా, నాలుగు సార్లు ముక్కు నేలకు రాసినా రైతులు పట్టించుకోరన్నారు. ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు.. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ను గెలిపించాలని, సీఎం రేవంత్కు అండగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా బీఆర్ఎస్ నాయకులు కళ్లుండి చూడలేని, చెవులు ఉండి వినలేని దద్దమ్మలని అన్నారు. ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది పెడుతున్న కేంద్రం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేయాలని చూస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. గత ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనలేదని, తాము అన్నీ కొంటున్నామన్నారు. ఈ సందర్భంగా భూసార పరీక్షలు నిర్వహించుకున్న ఐదుగురు రైతులకు మంత్రుల చేతులమీదుగా పత్రాలు అందజేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. రైతును రాజును చేయడమే లక్ష్యం ప్రభుత్వం పోయిందని కడుపునిండా విషం నింపేసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హనుమకొండలో రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా ప్రారంభం వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు, యంత్ర పరికరాలతో ఆకట్టుకున్న స్టాళ్లు సందర్శించి వివరాలు తెలుసుకున్న అన్నదాతలు -
మూగజీవాలను తరలిస్తే చర్యలు
పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ హసన్పర్తి: మూగ జీవాలను అక్రమంగా తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ హెచ్చరించారు. మూగ జీవాల అక్రమ రవాణాకు సంబంధించిన నిబంధనలు, చట్టపరమైన అంశాలపై వరంగల్ కమిషనరేట్ పరిధి గో రక్షణ కమిటీలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ఈ సమావేశంలో మూగజీవాల అక్రమ రవాణా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గోవుల అక్రమ రవాణా సమాచారం ఉంటే తక్షణమే పోలీసులకు విషయాన్ని అందించాలని సూచించారు. గోవులను రక్షించాలనే క్రమంలో రక్షణ కమిటీ సభ్యులు చట్టాలను అతిక్రమించొద్దన్నారు. అక్రమంగా తరలిస్తున్న వాహనాలను వెంబడిస్తూ వేగంగా వాహనాలను నడపడం చాలా ప్రమాదకరమని సూచించారు. మూగజీవాలను అడ్డుకునే క్రమంలో నిందితులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని సూచించారు. సమావేశంలో డీసీపీలు అంకిత్కుమార్, రాజమహేంద్రనాయక్, దార కమిత, ట్రెయినీ ఐపీఎస్ మనీష, నేహ్రా, ఏసీపీలు జీతేందర్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, భీం శర్మ, సతీశ్బాబు, రవీందర్రెడ్డి, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఓరుగల్లు వేదికగా రైతుపోరు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రైతు సంగ్రామ సదస్సు కోసం ఓరుగల్లు ముస్తాబైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా బుధవారం హాజరవుతున్న ఈ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. సదస్సు ఏర్పాట్లను కేటీఆర్ డైరెక్షన్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్రెడ్డి, తదితర ముఖ్య నేతలు, సీనియర్లతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఉమ్మడి వరంగల్ నుంచి సుమారు 10 వేల మంది రైతులు హాజరవుతారని అంచనా వేసిన నేతలు ఆ మేరకు సదస్సులో ఏర్పాట్లు చేశారు. కాగా, వరంగల్ నుంచే రైతుపోరుకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్.. ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. విస్తృత ఏర్పాట్లు... రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ చేసిన మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించనున్న సదస్సుకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. గత నెల 26న హైదరాబాద్లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రైతు సంగ్రామ సదస్సుకు చకచకా ఏర్పాట్లు చేశారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్కు ఎదురుగా ఉన్న సుమారు ఐదెకరాల స్థలంలో సదస్సు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారు 10వేల మంది రైతు ప్రతినిధులు సదస్సుకు హాజరు కానున్న నేపథ్యంలో ఎండ వేడిని తట్టుకునేలా జర్మనీ టెంట్లు వేశారు. ఆ పక్కనే హాజరయ్యే రైతుల కోసం భోజనం ఏర్పాటు చేశారు. కాగా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సదస్సుకు హాజరయ్యే రైతుల వాహనాల పార్కింగ్ కోసం కూడా ప్రత్యేక ప్రాంతాలను సూచించారు. కొలంబో మెడికల్ కాలేజ్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో పాలకుర్తి, ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్, వర్ధన్నపేట నియోజకవర్గాలకు చెందిన వాహనాలు, తేజస్వీ స్కూల్ గ్రౌండ్తో పాటు, భారత్ పెట్రోల్ బంక్కు ఎదురుగా ఉన్న స్థలంలో స్టేషన్ఘన్పుర్, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల వాహనాలు, పాపడమ్స్ ఎదురుగా ఉన్న పద్మాలయ ఫంక్షన్ హాల్లో జనగామ నియోజకవర్గంతో పాటు జనరల్ వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు, గులాబీ తోరణాలు బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు సంగ్రామ సదస్సు సందర్భంగా వరంగల్ నగరంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీమయమయ్యాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్య నేతల రాక సందర్భంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు, గులాబీ తోరణాలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ నేతలు మంగళవారం ప్రెస్మీట్లో వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 9 గంటల వరకే రైతులు సదస్సుకు హాజరయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశారు. సదస్సు ప్రారంభంలో మొదట రైతు ప్రతినిధుల నుంచి ప్రభుత్వం వైఖరి, పరిపాలన విధానాలపై అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఈసందర్భంగా పలువురు రైతు ప్రతినిధులను సదస్సులో మాట్లాడించనున్నారు. ఆతర్వాత మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు కూడా తమ ప్రసంగం ద్వారా అభిప్రాయాలు వెల్లడించనున్నారు. అనంతరం రైతు సదస్సు ద్వారా ప్రస్తుత ప్రభుత్వ విధానాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు వివరించనున్నారు. ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. నేడు బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు హంటర్రోడ్డులో 10వేల మందికి ఏర్పాట్లు ఉదయం 9 గంటలకే వచ్చేలా సమీకరణ మొదట ప్రభుత్వ వైఖరిపై రైతుల అభిప్రాయాలు అనంతరం బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రసంగం ప్రతీ పల్లె నుంచి హాజరుకానున్న రైతు ప్రతినిధులు గులాబీమయమైన వరంగల్ నగరం ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించేందుకే రైతు సదస్సు విలేకరులతో బీఆర్ఎస్ నేతలు -
గ్రేటర్ వరంగల్
(హనుమకొండ – వరంగల్)బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026జాప్యం లేకుండా రుణాలివ్వండివేసవి సెలవులంటే పిల్లలకు ఎంతో ఇష్టం. అమ్మమ్మ, నానమ్మ ఇంటికి వెళ్లడం, వారు చెప్పే నీతి కథలు, ఆటవిడుపుగా బొమ్మలు గీయడం, స్నేహితులతో ఈత నేర్చుకోవడం, ఆటపాటల్లో మునిగితేలుతుంటారు. ఇలాంటి అనుభవాలకు వేదికగా ‘సాక్షి’ నిలుస్తోంది. సెలవుల్లో పిల్లల సందడిపై నేటినుంచి వేస‘వి’కాసం అందిస్తోంది.హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ఎలాంటి జాప్యం లేకుండా లబ్ధిదారులకు రుణాలు అందించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డీఎల్ఆర్సీ), జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ) సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణాల పురోగతిని బ్యాంకర్లతో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. 2025–26 సంవత్సరానికి జిల్లాకు రూ.15,484.29 కోట్ల రుణ లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు రూ.13,733.74 కోట్ల మేర సాధించినట్లు తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరులో ప్రాధాన్యం ఇవ్వాలని, ఈ విషయంలో రాష్ట్రస్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చిన డీఆర్డీఏ అధికారులను అభినందించారు. సమావేశం అనంతరం మహిళా సంఘాలకు రుణాల మంజూరులో కృషి చేసిన ఏపీఎంలు, సీసీలకు కలెక్టర్ ప్రశంసపత్రాలు అందజేశారు. అలాగే నాబార్డ్ పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2026–27ను ఆవిష్కరించారు. సమావేశంలో ఆర్బీఐ ఏజీఎం లక్ష్మీ శ్రావ్య, యూపీఐ డీజీఎం కమలాకర్, నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జన్ను మహేందర్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం నవీన్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వంతో మక్కలు కొనిపిస్తాం..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నర్సంపేట/గీసుకొండ: రైతులు పండించిన మక్కలను రేవంత్రెడ్డి ప్రభుత్వంతో కొనిపిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్, గీసుకొండ మండలం ఊకల్లో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. నర్సంపేట మార్కెట్లో పర్శనాయక్తండాకు చెందిన మహిళా రైతు చెప్పిన మాటలు విని ఆశ్చర్యానికి గురయ్యారు. మక్కలు మార్కెట్కు తీసుకువచ్చిన నాటి నుంచి ప్రతీ పైసా తమ నుంచే వసూలు చేస్తున్నారని కేటీఆర్కు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కరోనా సమయంలో రైతులు పండించిన ప్రతీ గింజను బీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వస్తే 25 క్వింటాళ్లే కొంటామని నిబంధనలు పెట్టడం ఎంతవరకు సమంజసమని. మిగిలిన వాటిని ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. రైతులు అధైర్య పడవద్దని, కేసీఆర్ పంపితే తాను వచ్చానని, మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, నాయకులు పెద్ది స్వప్న, ఏనుగుల రాకేశ్రెడ్డి, చింతం సదానందం, గోలి రాజయ్య, పోలీసు ధర్మారావు, దొంగల రమేశ్, జక్కు మురళి, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, గుర్రం రఘు, సిరిసె శ్రీకాంత్, చల్లా వేణుగోపాల్రెడ్డి, సర్పంచ్ బోడకుంట్ల ప్రకాశ్, అజర్మున్నా, అంకతి నాగేశ్వర్రావు, రాయిడి రవీందర్రెడ్డి, నాడెం శాంతికుమార్, గోనె యువరాజు తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆది,సోమవారాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. బచ్చన్నపేట : బైక్ అదుపు తప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో జరిగింది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెక్క కనుకయ్య (45) తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం హమాలీ పని కోసం బైక్పై గ్రామంలో కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. గమనించిన గ్రామస్తులు 108లో వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య కళ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ముల్కనూరులో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి.. భీమదేవరపల్లి: గుర్తు తెలియని వాహ నం ఢీకొని మార్నింగ్ వాక్కు వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంప రమేశ్(55) రోజుమాదిరిగానే సోమవారం ఉదయం వాకింగ్ వెళ్లాడు. అయితే ఓ గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య వసంత, కుమారుడు రోహిత్ ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ట్రాక్టర్ ఢీకొని రాజుపల్లిలో ఉపాధి హామీ కూలీ.. శాయంపేట : బైక్ను ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ ఉపాధి హామీ కూలీ మృతి చెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజుపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింతనిప్పుల రాధమ్మ (45) రోజు మాదిరిగానే ఉపాధి హామీ పనులకు వెళ్లింది. అనంతరం అదే గ్రామానికి చెందిన చింతం బుచ్చయ్య బైక్పై ఇంటికి వస్తోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పంచనేని దేవేందర్ రావు ట్రాక్టర్పై వస్తున్నాడు. ట్రాక్టర్ అదుపుతప్పి బైక్ను ఢీకొనడంతో రాధమ్మ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని పరకాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చదరంగంలో చిచ్చరపిడుగులు
వరంగల్ స్పోర్ట్స్: మేధస్సుకు ఎంత పదును పెడితే ఆట అంత రక్తి కడుతుంది. ప్రత్యర్థిని ఓడించేందుకు చాకచక్యంగా ఆచితూచి అడుగులు వేయడమే చదరంగం. చదరంగంలో రాణించాలంటే మానసిక స్థైర్యం, ఓపిక, ఆలోచన శక్తి ఎంతో అవసరం. అలాంటి చదరంగంలో పదేళ్లు కూడా నిండని చిన్నారులు చిచ్చరపిడుగుల్లా చెలరేగుతున్నారు. జాతీయస్థాయి పతకాలు, అంతర్జాతీయ స్థాయి రేటింగ్తో దూసుకెళ్తున్న చిన్నారులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. చెస్ అంటే.. చెస్ అంటే తెలియని వారుండరు. కానీ, ఆడడమే కొంత కష్టం. 64 బాక్సుల్లో రెండు రుక్స్ (ఏనుగు), రెండు నైట్స్ (గుర్రం), రెండు బిషప్ (ఒంటె), ఒక కింగ్ (రాజు), ఒక క్వీన్ (రాణి) చొప్పున ఇరు పక్షాలకు ఉంటారు. వీటితో ఇరువురు తలపడడమే చదరంగం. చదరంగంలో విభాగాలు.. ● చదరంగంలో నాలుగు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తుంటారు. అందులో క్లాసిక్ గంటన్నర సమయంపాటు ఆడే సుదీర్ఘమైన ఆట. అంతర్జాతీయ వేదికలపై ఈ ఆటను ఎక్కువగా ఆడుతుంటారు. ● ఐదు నిమిషాల్లోనే ఆట ముగించేది బ్రిడ్జి కాగా.. కేవలం మూడు నిమిషాలపాటు ఆడేది ర్యాపిడ్, ఈ ఆటలో రెండు సెకన్లు ఇంక్రిమెంట్గా ఇస్తారు. ● కేవలం నిమిషంలో ముగించే అత్యంత సాహోసోపేతమైనది బుల్లెట్ విభాగం. ఇంటర్నేషనల్ రేటింగ్.. వయస్సుతో సంబంధం లేకుండా నాలుగు విభాగాల్లోనూ క్రీడాకారుడి ఆట తీరును లెక్కించేది రేటింగ్. ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఇంటర్నేషనల్ రేటింగ్ కోసం టోర్నమెంట్ నిర్వహిస్తుంటారు. అందులో సాధించిన పాయింట్ల వారీగా ర్యాంకింగ్ కేటాయిస్తారు.హనుమకొండలోని ఇన్స్టిట్యూట్లో చిన్నారులకు శిక్షణఇస్తున్న కోచ్ రాంప్రసాద్ చిన్న వయస్సులోనే పతకాల సాధన అంతర్జాతీయ రేటింగ్తో అద్భుతాలు -
బైక్ను ఢీకొన్న టిప్పర్
● ఇద్దరు యువకుల దుర్మరణం మామునూరు: బైక్ను టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి వరంగల్ నక్కపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరుకు చెందిన కనిగిరి వెంకటరత్నం తన కుటుంబ సమేతంగా జగిత్యాల జిల్లా పెగడపల్లికి వలస వచ్చాడు. కుమారులు విష్ణువర్ధన్ (22), శేషయ్య (21)తో కలిసి ఆయన మేసీ్త్ర పనిచేస్తూ మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండలో ఉన్న పెద్దనాన్న కుమారుడిని చూసేందుకు ఆదివారం సాయంత్రం విష్ణువర్ధన్, శేషయ్య బైక్పై పెగడపల్లి నుంచి బయలుదేరారు. ఈక్రమంలో వరంగల్కు అర్ధరాత్రి చేరుకున్నారు. అన్న మరో అరగంటలో నెక్కొండకు చేరుతాం.. టీతాగుతూ సంతోషంగా ఫోన్లో మాట్లాడారు. నెక్కొండ రోడ్డు నక్కలపల్లి గ్రామ శివారుకు చేరుకున్నారు. అంతలోనే నెక్కొండ వైపు నుంచి వరంగల్కు వస్తున్న టిప్పర్ అదుపు తప్పి బైక్ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ ముక్కలైంది. విష్ణువర్ధన్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శేషయ్యను పోలీసులు క్షణాల్లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇద్దరి మృతితో పెగడపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. ఘటన స్థలానికి మామునూరు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చేరుకున్నారు. ఘోర రోడ్డు ప్రమాదాన్ని పరిశీలించారు. విష్ణువర్ధన్ మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి కనిగిరి వెంకటరత్నం ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. -
విద్యుత్ భద్రత బాధ్యత కావాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి హన్మకొండ : విద్యుత్ భద్రత ఉద్యోగుల బాధ్యత కావాలని, విద్యుత్ ప్రమాదాలు లేని సంస్థ మన లక్ష్యమని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని అంబేడ్కర్భవన్లో టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ ఆధ్వర్యంలో విద్యుత్ భద్రత అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పని చేసే ప్రాంతాల్లో ఒక్క నిమిషం నిబంధన పాటించాలన్నారు. ఒక్క నిమిషం ఆగి భద్రతాపరికరాలు ధరించి, లైన్ మీద అవగాహన తెచ్చుకునే పని చేసే నిబంధన తీసుకొస్తామన్నారు. వచ్చే రెండు సంవత్సరాల్లో సాంకేతికతతో పని మొత్తం స్మార్ట్గా మారుతుందన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. దేశ అభివృద్ధిలో విద్యుత్ శాఖ కీలకంగా పనిచేస్తుందన్నారు. ప్రతీ వినియోగదారుడికి విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కలిగిస్తూ, క్షేత్రస్థాయిలో పనిచేసే సమయంలో సిబ్బంది విద్యుత్ భద్రత పరికరాలు కచ్చితంగా వాడాలని ఆదేశించారు. కార్యక్రమంలో హనుమకొండ ఎస్ఈ బి.సామ్య నాయక్, డి.ఈ టెక్నికల్ విజేందర్ రెడ్డి, హనుమకొండ టౌన్ డి.ఈ జి.సాంబారెడ్డి, డి.ఈ హనుమకొండ రూరల్ పి.మల్లికార్జున్, ఎ.డి.ఈలు ఇంద్రసేనారెడ్డి, వంశీ కృష్ణ, అశోక్, దేవేందర్, మధుకర్, శ్రీనివాస్ రెడ్డి, పైడయ్య, రాజేశ్వర్ రావు, ఏఈలు, సబ్ ఇంజనీర్లు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్యాయత్నం● కాపాడిన వాకర్స్ సభ్యులు ● పోలీసులకు అప్పగింత కాజీపేట: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత తన రెండేళ్ల వయసున్న కూతురుతో కలిసి వడ్డేపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించగా వాకర్స్ సభ్యులు చూసి కాపాడారు. ప్రత్యక్షుల కథనం ప్రకారం.. కాజీపేట 63వ డివిజన్ జూబ్లీ మార్కెట్ ప్రాంతానికి చెందిన రాజ్యలక్ష్మి (30) సోమవారం ఉదయం ఇంట్లో గొడవ జరగడంతో తన కూతురును తీసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి వడ్డేపల్లి చెరువు వద్దకు చేరుకుంది. చెరువులోకి దిగుతున్న సమయంలో వాకింగ్ చేస్తూ అటుగా వచ్చిన కురుమని మహేందర్ రెడ్డి ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తమయ్యారు. వెంటనే సమీపంలో ఉన్న సహచర వాకర్ల సహకారంతో బాధితురాలిని బయటకు తీసుకొచ్చి ధైర్యం చెప్పారు. అనంతరం పోలీసులకు అప్పగించగా వారు కుటుంబీకులను పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించి పంపించారు. తల్లీకూతుళ్లను కాపాడిన వాకర్స్ సభ్యులను సీఐ సుధాకర్ రెడ్డి అభినందించారు. -
మొక్కజొన్నలు కొనుగోలు చేయాలి
ఖిలా వరంగల్: మొక్కజొన్నలు అమ్ముకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారని, ప్రభుత్వం మొ ద్దు నిద్ర వీడి వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జనగామ ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు దమ్ముంటే వ్యవసాయ మార్కెట్, కొనుగోలు కేంద్రాల్లో రైతు ఉత్సవాలు చేపట్టి చూడాలని ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వమని, హామీలు విస్మరించిన ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెప్పడం ఖాయమని వారు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులను కలిసి వారి సమస్యలను అ డిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి ద యాకర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం క్వింటాకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించినా దిగుబడి తగ్గట్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో విఫలమైందని ఆరో పించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని పేర్కొన్నారు. థంబ్ ఇంప్రెషన్ కోసం రైతుల వద్ద లంచం తీసుకుంటున్నారని విమర్శించారు. ఈనెల 6లోపు ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న కోనుగోళ్లు చేపట్టక పోతే మంత్రులు, ఎమ్మెల్యేల క్యాంప్ కా ర్యాలయాలను రైతులు ముట్టడించడం ఖాయమన్నారు. 6న నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సుకు అన్నదాతలు పెద్ద ఎత్తున హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు రాకేశ్రెడ్డి, వాసుదేవరెడ్డి, శ్రీనివాస్, టి.రమేశ్బాబు, హరిరమాదేవి, లలితాయాదవ్, రాజశేఖర్, మల్లయ్య పాల్గొన్నారు. రైతులు కాంగ్రెస్కు బుద్ధి చెప్పడం ఖాయం మాజీ మంత్రి దయాకర్రావు, ఎమ్మెల్యే రాజేశ్వర్రెడ్డి వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సందర్శన -
ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి ఎమ్మెల్యే రూ.5 లక్షల ఆర్థిక సాయం
నర్సంపేట: ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ కుటుంబానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యే సోదరుడు అజయ్రెడ్డి సోమవారం నర్సంపేటలో బాధిత కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల నగదు, ఇందిరమ్మ ఇల్లు మంజూరుపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భాస్కర్, రాష్ట్ర యువనాయకుడు పడిదల నవీన్రావు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్యగౌడ్, కౌన్సిలర్ వీణావిజేందర్రెడ్డి, కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి బైరి మురళి, పట్టణ కార్యదర్శి నాంపల్లి వెంకటేశ్వర్లుగౌడ్, నల్లబెల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, నర్సంపేట మండల ఉపాధ్యక్షులు గజ్జి రాజు, మధు, రాజు, యూత్ కాంగ్రెస్ నల్లబెల్లి మండల అధ్యక్షుడు పురుషోత్తం సురేశ్, నాయకులు రాము, శ్రీనివాస్, గిరిగాని రమేశ్, కార్తీక్, ఆర్టీసీ ఉద్యోగులు రూపిక సుమన్, కె.రంగయ్య, మోహన్,తదితరులు పాల్గొన్నారు. నకిలీ నోట్ల ముఠా అరెస్ట్● రూ.28 లక్షల విలువైన ల్యాప్టాప్, ప్రింటర్స్, నకిలీ నోట్లు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన వరంగల్ ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ వరంగల్ క్రైం: నకిలీ నోట్లను తయారుచేసి చలామణి చేస్తున్న 8 మందిని వరంగల్ టాస్క్ఫోర్స్, నర్సంపేట పోలీసులు అరెస్టు చేసినట్లు వరంగల్ ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ తెలి పారు. నిందితుల నుంచి నకిలీ నోట్లు, రూ.1,48,000 నగదు, రూ.28 లక్షల విలువగల ల్యాప్టాప్లు, ప్రింటర్స్, 13 సెల్ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సోమవారం విలేకరుల సమావేశంలో డీసీపీ అంకిత్కుమార్ వివరాలు వెల్లాడించారు. నిందితులు నర్సంపేటకు చెందిన శాగంటి కిరణ్, నీరటి శివ, నీరటి రంజిత్, గుడికందుల రవి, ములుగు గణపురానికి చెందిన పోరిక రాజ్కుమార్ అలియాస్ రాజు, ఖమ్మం జిల్లా వేంసూరుకు చెందిన తనమాల రాజశేఖర్, భువనగిరి తాతానగర్కు చెందిన ముదురుకోల యాకంబరం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రారకగూడేనికి చెందిన చేను సాయికిరణ్ను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. కలర్ ప్రింట్ తీసి.. చలామణి చేసి నర్సంపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు నకిలీ నోట్లు చలామణి చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అసలు రూ.100 నోట్లను ల్యాప్టాప్, ప్రింటర్ ద్వారా కలర్ ప్రింట్ తీసి చలామణి చేస్తున్నారని చెప్పారు. మిగిలిన ఐదుగురు నిందితులను విచారించగా తక్కువ డబ్బులకు ఎక్కువ డబ్బులు (1:3 నిష్పత్తి) తయారుచేసి ఇస్తామని చెప్పి రూ.500 నోట్ల పరిమాణంలో ఉన్న కాగితాలు హైపో ద్రావణంలో ముంచి నల్లగా మారిన తర్వాత ప్రజలకు ఇస్తూ మోసం చేస్తున్నారని చెప్పారు. నల్లకాగితాలు అసలు నోట్లుగా మారుతాయని నమ్మించి ప్రజల నుంచి అసలు నోట్లు తీసుకొని పరారైనట్లు ఆయన తెలిపారు. నిందితులు ములుగు గణపురం, సికింద్రాబాద్ మోండా మార్కెట్, వేంసూర్, కొత్తగూడెం, నర్సంపేట, సుబేదారి తదితర ప్రాంతాల్లో మో సం చేసినట్లు డీసీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కబరిచిన టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ బాబులాల్, నర్సంపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఏఏఓ సల్మాన్పాషా, టాస్క్ఫోర్స్, నర్సంపేట సిబ్బందిని డీసీపీ అభినందించారు. -
ప్రధాని సభను కేసీఆర్, రేవంత్ చూడాలి
● నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హన్మకొండ: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సీఎం ఎ.రేవంత్రెడ్డి వచ్చి చూడాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అ ర్వింద్ అన్నారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని వేద బాంక్వెట్హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 4 లక్షల మందితో నిర్వహించే బహిరంగ స భకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భారీగా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ పంగనామాలు పెడితే.. రేవంత్రెడ్డి కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్ఆర్ఐలను మోసం చేశారని, కాంగ్రెస్ పాలనలో ఏజెంట్ల మో సాలు పెరిగాయని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర పర్యటన బాజాప్తా పొలిటికల్ ట్రిప్ అన్నారు. పశ్చిమబెంగాల్లో పూర్తిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని, తమిళనాడులో ఎన్డీఏ మద్దతుతో ప్రభుత్వం రానుందన్నారు. ఇ క తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యమన్నారు. కనకదుర్గ అమ్మవారిమీద ఒ ట్టేసిన వ్యక్తి రాజకీయంగా, వ్యక్తిగతంగా నాశనమైపోతాడని సీఎం రేవంత్ను ఉద్దేశించి అన్నారు. కొందరికి పార్టీలు పెట్టడం బిజినెస్ అయిపోయిందని కల్వకుంట్ల కవిత పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించా రు. ఇక నుంచి కేసీఆర్కు ఎటువంటి సంబరా లుండవన్నారు. వయోభారంతో ఉన్న కేసీఆర్ను టీవీ చూడనివ్వొద్దని, చూస్తే తట్టుకోలేడన్నారు. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావు పద్మ, కాళీప్రసాద్, దేవేందర్రెడ్డి, నాయకులు కీర్తిరెడ్డి పెసరు విజయ్చందర్ రెడ్డి, రావుల కిషన్, చాడ స్వాతి, సండ్ర మధు పాల్గొన్నారు. -
పిట్ట కొంచెం.. కూత ఘనం
ఈ చిత్రంలో చదరంగ పావులు కదుపుతున్న చిన్నారి పేరు హయాతి. వయస్సు 6 సంవత్సరాలు, హనుమకొండ భవానీనగర్లోని ఓ ప్లే స్కూల్లో ఒకటో తరగతి చదువుతోంది. మాటలు కూడా సరిగా రాని ఈ చిన్నారి ఇప్పటి వరకు 15 వరకు టోర్నమెంట్లలో పాల్గొంది. అందులో ఐదింటిలో మొదటి స్థానంలో నిలిచిందంటే అతిశయోక్తి కాదు. 10 నెలలుగా రాంనగర్లో కోచ్ పవన్ వద్ద శిక్షణ తీసుకుంటున్న హయాతి పిట్ట కొంచె కూత ఘనం అనే సామెతకు సరిగ్గా సరిపోతుంది. ప్రతి రోజు మూడు గంటలు చెస్ సాధన చేస్తోందని తల్లిదండ్రులు రవితేజ, సృజన చెబుతున్నారు. -
సేంద్రియసాగుపై దృష్టి సారించాలి
మామునూరు: ప్రకృతి సిద్ధమైన సేంద్రియ సాగుపై రైతులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. నేల స్వభావంతోనే పంట దిగుబడితోపాటు ఎరువుల ఖర్చులు తగ్గించుకోవచ్చునన్నారు. పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం బొల్లికుంట క్లస్టర్ రైతు భ వనంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల వ్యవసాయాధికారి విజ్ఞాన్ అధ్యక్షతన రైతు వారో త్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడుతూ రసాయన ఎ రువుల వాడకాన్ని తగ్గించాలన్నారు. అనంతరం వ్యవసాయ అధికారి విజ్ఞాన్ మాట్లాడుతూ నానో యూరియా వాడకం, ఎరువుల సమతుల్యం విని యోగంపై అవగాహన కల్పించారు. పశువైద్యుడు కిరణ్, ఏఈఓ సత్యప్రకాశ్, రైతులు పాల్గొన్నారు. -
నేడు ‘గ్రేటర్’ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. గ్రీవెన్స్ సెల్ను సద్వినియోగం చేసుకోవాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా నేటి సోమవారం నుంచి ఇకపై ప్రతీ వారం డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల్లోనూ ప్రజా సమస్యల పరిష్కారానికి వినతులు స్వీకరించేందుకు ఆర్డీఓ ఆఫీస్లో ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని పరకాల, హనుమకొండ ఆర్డీఓ కార్యాలయాల్లో సోమవారం వినతులు స్వీకరించనున్నట్లు, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. వరంగల్ కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ సమస్యల పరిష్కారానికి వినతులు అందించాలని కోరారు. కాగా, ప్రతీ సోమవారం రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హన్మకొండ: ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కదుపుతోందని, ఈ క్రమంలోనే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవాలని జీఓ జారీ చేసిందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకునేందుకు జారీ చేసిన జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రూ.13 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెట్ బకాయిలు ఉన్నాయన్నారు. వరంగల్ ఉద్యమాల వేదిక అని, తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిందన్నారు. రైతు సదస్సు తర్వాత మిగిలిన డిక్లరేషన్లపై పోరాడుతామన్నారు. కామారెడ్డిలో బీసీ సదస్సు, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సదస్సు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. వరంగల్లో ఒక ఆర్టీసీ ఉద్యోగి, రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగించిందన్నారు. ప్రఽభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, విద్యార్థి సంఘం నాయకులు బైరపాక ప్రశాంత్, గండ్రకోట రాకేశ్యాదవ్, పస్తం అనిల్ కుమార్, రాజేశ్నాయక్, వివేక్, శ్యాంకుమార్ పాల్గొన్నారు. -
నీట్ ప్రశాంతం
ఆదివారం దూర ప్రాంతాల నుంచి నీట్ పరీక్ష రాయడానికి వచ్చిన వారికి సోమవారం ఎప్సెట్ రాయడం ఇబ్బందిగా మారుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ‘జమ్మికుంట నుంచి మా అమ్మాయి లాస్యను తీసుకుని సీకేఎం కాలేజీలో పరీక్ష రాయించడానికి వచ్చాం. కేయూ క్రాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బందులు పడ్డాం’ అని అకెనపల్లి మురళీధర్ తెలిపారు. మళ్లీ సోమవారం ఎప్సెట్ రాయించడానికి మామునూరుకు తీసుకెళ్లడం ఇబ్బందవుతుందని, ఇప్పటికే ఎండకు అలిసిపోయామన్నారు.● ముందుగానే చేరుకున్న విద్యార్థులు ● ఆలస్యంగా వచ్చిన ఒక విద్యార్థికి అనుమతి నిరాకరణకేయూ క్యాంపస్/కాశిబుగ్గ: హనుమకొండ, వరంగల్లో నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్)–2026 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఈ పరీక్షను 9 కేంద్రాల్లో నిర్వహించింది. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రం వద్ద గేట్ మూసివేసిన తర్వాత వచ్చిన ఓ విద్యార్థిని అనుమతించలేదు. వరంగల్ నిట్లో రెండు, హనుమకొండ కేడీసీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల (కోఎడ్యుకేషన్), కేంద్రీయ విద్యాలయం, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, యూనివర్సిటీ పీజీ కళాశాల, వరంగల్ సీకేఎం కళాశాల, ఎల్బీ కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 4,643 మందికి 4,544 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 99 మంది గైర్హాజరైనట్లు నీట్ రెండు జిల్లాల కో–ఆర్డినేటర్ భిక్షపతి తెలిపారు. వరంగల్ దేశాయిపేట సీకేఎం కళాశాలలో 320 మంది హాజరుకాగా.. ముగ్గురు గైర్హాజరయ్యారు. సీకేఎం కళాశాలలో నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పిల్లలను తీసుకుని దూర ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఇబ్బందులు పడ్డారు. -
ప్రత్యేక విద్యా వారోత్సవాలు
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ నెల 11 నుంచి ప్రత్యేక విద్యావారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ విద్యావారోత్సవంలో భాగంగా రోజుకో కార్యక్రమంతో రోజువారీ షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఈఓలకు జారీ చేశారు. అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా ఇటీవల హైదరాబాద్ నుంచి కలెక్టర్లకు, డీఈఓలకు వివిధ కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యేక విద్యావారోత్సవాలు, ప్రీ ప్రైమరీ తరగతులపై చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయ్లెట్స్ మరమ్మతులు, లేని చోట నూతన టాయ్లెట్స్ నిర్మాణం, ఎస్సెస్సీ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు రిమిడియల్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను వచ్చే విద్యాసంవత్సరం వరకు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బడిబయటి విద్యార్థులను గుర్తించి పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలన్నారు. ఈవిద్యాసంవత్సరం 2026–27లో విద్యార్థులకు షూస్, టై, బెల్టులు కూడా అందజేయనున్నట్లు తెలిపారు. షెడ్యూల్ ఇలా.. ● మే 11న పీఎంశ్రీ పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులను ప్రారంభిస్తారు. ఈక్యాంపులో అకడమిక్, కోడింగ్, కళలు, క్రీడలు, యోగా నేర్పిస్తారు. ● 12న పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు పీఎంశ్రీ పాఠశాలల్లో రెమిడియల్ క్యాంపులు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహిస్తారు. ● 13న జిల్లా స్థాయిలో అందరు సర్పంచులను ఆహ్వానించి సమావేశం నిర్వహిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, అకడమిక్ కార్యక్రమాలు వివరించాల్సి ఉంటుంది. ● 14న బడిబాట కార్యక్రమం నిర్వహిస్తారు. అన్ని పాఠశాలలను శుభ్రపర్చి అలంకరించి ఇంటింటి కి ప్రవేశాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులతో మెగా పీటీఎం ఉంటుంది. ● మే 15న పాఠశాలలు గ్రామ, కమ్యూనిటీ లైబ్రరీలో కార్యక్రమాలుంటాయి. పుస్తక ప్రదర్శనలు, పఠన పోటీలు నిర్వహిస్తారు. ● మే 16న మండల స్థాయిలో విద్యార్థులకు కళలు, హస్తకళలు, సంగీతం, నృత్యం, నాటకం, సాహిత్య తదితర సాంస్కృతిక పోటీలు ఉంటాయి. పర్యావరణ హిత పదార్థాల వినియోగాన్ని ప్రొత్సహిస్తూ.. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాల్సి ఉంటుంది. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రతిభా ప్రదర్శనలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపాల్సి ఉంటుంది. ● మే 17న ప్రతీ జిల్లాలో జవహర్ బాలభవన్లో విద్యార్థులకు కళలపై కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ● ప్రత్యేక విద్యావారోత్సవాల నిర్వహణకు ప్రతీ జిల్లాకు నిధులు విడుదల చేస్తారని సమాచారం. ఎస్సెస్సీ విద్యార్థులకు రిమిడియల్ క్యాంపులు ఈ నెల 11 నుంచి 17 వరకు వివిధ కార్యక్రమాలు -
హాల్ టికెట్ పోగొట్టుకున్న విద్యార్థికి పోలీసుల సాయం
కాజీపేట: నీట్ హాల్ టికెట్ పోగొట్టుకుని ఏడుస్తున్న వి ద్యార్థినికి కాజీపేట ట్రాఫిక్ పోలీసులు చేయూతనందించి పరీక్ష రాయించారు. హనుమకొండ నక్కలగుట్టలోని శ్రీచైతన్య హైస్కూ ల్కు నీట్ పరీక్ష రాయడానికి శ్రావ్య ఆదివారం చేరుకుంది. ప్రయాణ హడావుడిలో ఆమె హాల్టికెట్ ఎక్కడో పడిపోయింది. దీంతో గేట్ వద్ద ఏడుస్తూ ఉన్న శ్రావ్యను ట్రాఫిక్ సిబ్బంది రాజేందర్, సతీశ్ చూశారు. విషయం తెలుసుకుని స్పందించారు. శ్రావ్యను ద్విచక్ర వాహనంపై జిరాక్స్ సెంటర్ వద్దకు తీసుకెళ్లారు. సెల్ఫోన్లో ఉన్న హాల్టికెట్ను ప్రింట్ తీయించి పరీక్ష కేంద్రం వద్దకు తీసుకెళ్లారు. -
పల్లెల్లో సౌర వెలుగులు
హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు పైలెట్ గ్రామాలను ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులు భరించి పైలెట్గా ఎంపిక చేసిన గ్రామాల్లోని ప్రతీ ఇల్లు, ప్రతీ వ్యవసాయ పంప్సెట్ను సౌర విద్యుద్ధీకరిస్తున్నారు. అయితే వీటిని మరింతంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 81 గ్రామాలను రూ.1,380 కోట్ల వ్యయంతో పూర్తిగా సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ 9 గ్రామాలను సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నారు. వీటికి అదనంగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని పైలట్గా ఎంపిక చేసి సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్ కో) గ్రామాలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో 12 గ్రామాలు సంపూర్ణ సోలార్ గ్రామాలుగా మారనున్నాయి. కొనసాగుతున్న పనులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముందుగా ఎంపిక చేసిన 9 గ్రామాలను సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దేపనులు కొనసాగుతున్నాయి. సోలార్ పలకల బిగింపు పనులు నడుస్తున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంపిక చేయనున్న ఒక్క గ్రామంలో ఒక్కో ఇంటిపై 2 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేస్తారు. ప్రతీ ఇంటికి రూ.1.36 లక్షలు ప్రభుత్వం భరిస్తుంది. ప్రతీ ఇంటికి నెట్ మీటర్ బిగిస్తారు. ఈ మీటర్ ఇంటికి వినియోగిస్తున్న విద్యుత్, మిగిలిన విద్యుత్ గ్రిడ్కు ఎంత సరఫరా జరిగిందో యూనిట్ల వారీగా రికార్డు చేస్తుంది. ప్రతీ ఇంటిపై ఏర్పాటు చేసిన 2 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్రాంట్ ద్వారా నెలకు 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. గృహ సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి జరిగి గ్రిడ్కు సరఫరా చేసిన ప్రతి యూనిట్కు రూ.4.99 చొప్పున చెల్లిస్తుంది. అయితే ఇంటికి వినియోగించుకోగా మిగిలిన విద్యుత్కు మాత్రమే చెల్లింపులు చేస్తారు. గృహ విద్యుత్ వినియోగదారులు తాము వాడుకున్న విద్యుత్కు బిల్లులు చెల్లించాల్సిన అవసరముండదు. దీంతో పరోక్షంగా ఆర్థికంగా లబ్ధిపొందుతారు. గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది... ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని మోడల్ సోలార్ గ్రామంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామాల ఎంపిక పూర్తి కాగానే.. సోలార్ పలకల బిగింపు పనులు మొదలవుతాయి. ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో ప్రజలను సోలార్ విద్యుత్ వైపు మళ్లించేందుకు, ప్రోత్సహించేందుకు మోడల్ సోలార్ గ్రామాలుగా ఎంపిక చేసి పూర్తి సోలార్ గ్రామాలుగా తీర్చిదిద్దుతోంది. – మహేందర్ రెడ్డి, రెడ్కో మేనేజర్, హనుమకొండగ్రీన్ ఎనర్జీ ఉత్పత్తే లక్ష్యం.. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తే లక్ష్యంగా పర్యావరణహిత సౌర విద్యుత్ అందరూ వినియోగించుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈక్రమంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పైలెట్ గ్రామాలను ఎంపిక చేసి సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దుతోంది. ఈ పథకంలో ప్రభుత్వమే ఖర్చు భరిస్తుండడంతో వినియోగదారులపై ఏ మాత్రం ఆర్థిక భారం పడట్లేదు. దీంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా సౌర విద్యుత్ మారనుంది. ఉత్తత్తి అయిన సౌర విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేయడం ద్వారా విద్యుత్ వినియోగదారుడికి ఆర్థిక లబ్ధి చేకూరనుంది.నియోజకవర్గానికో గ్రామం ఎంపిక ప్రభుత్వ ఖర్చుతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ఎంపికపై దృష్టి సారించిన రెడ్ కో -
మొక్కజొన్న రైతులకు అండగా ప్రభుత్వం
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు న్యూశాయంపేట: మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఆదివారం హనుమకొండ ‘కుడా’ కాన్ఫరెన్స్ హాల్లో నియోజకవర్గ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడారు. వరంగల్ హనుమకొండ జిల్లా పరిధిలో విస్తారంగా పండిన మొక్కజొన్న పంట, నిల్వ, కొనుగోళ్లు, రవాణా తదితర అంశాలపై సమీక్ష సమావేశంలో చర్చించారు. హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు చాహత్బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు రవి, సంధ్యారాణి, ఇల్లంద వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్.వెంకటయ్య ఆర్డీఓలు, డీసీఓలు తహసీల్దార్లు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు. -
వడ్డేపల్లిలో యూపీహెచ్సీ ప్రారంభం
హన్మకొండ అర్బన్: గ్రేటర్ వరంగల్ 60వ డివిజన్ వడ్డేపల్లి పరిధిలో కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్, మేయర్ గుండు సుధారాణితో కలిసి కార్పొరేటర్ దాస్యం అభినవ్భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం మొత్తం రూ.4,27,911 కోట్ల గ్రాంట్లను సిఫార్సు చేయగా.. అందులో వైద్య రంగానికి రూ.70,051 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వాటిలో రూ.26,123 కోట్లు పట్టణ స్థానిక సంస్థలకు ప్రత్యేకంగా కేటాయించినట్లు వివరించారు. ఈనిధుల నుంచి రూ.1.43 కోట్లతో వడ్డేపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి వినియోగించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వైద్యరంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ మాలిక, యూపీహెచ్సీ సిబ్బంది, వడ్డేపల్లి వాసులు, డివిజన్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ సైన్యం సిద్ధం
డీసీసీ జంబో కార్యవర్గాన్ని ప్రకటించిన అధిష్టానంసాక్షిప్రతినిధి, వరంగల్: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) హనుమకొండ కార్యవర్గాన్ని ఆ పార్టీ అధిష్టానం ఆదివారం ప్రకటించింది. మొత్తం 96 మందితో కార్యవర్గాన్ని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 12 మందికి జిల్లా ఉపాధ్యక్షులుగా, 25 మంది ప్రధాన కార్యదర్శులు, 44 మంది కార్యదర్శులు, 15 మందికి కార్యవర్గ సభ్యులుగా పార్టీ అవకాశం కల్పించింది. మొట్ట మొదటిసారిగా జిల్లా కాంగ్రెస్ కమిటీలో ట్రాన్న్స్జెండర్ ఓరుగంటి స్నేహకు జిల్లా కార్యదర్శిగా అవకాశం కల్పించారు. ఈ మేరకు ట్రాన్స్ జెండర్ల సంఘం గౌరవ అధ్యక్షుడు ఈవీ శ్రీనివాస్, ఓరుగంటి లైలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, డీసీసీ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. కాగా, అన్ని వర్గాలకు డీసీసీలో అవకాశం కల్పించారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. డీసీసీ కార్యవర్గం ఇలా.. ఉపాధ్యక్షులు: గురప్రు రాజేంద్రప్రసాద్, ఆయాల రాంరెడ్డి, సమ్మెల మహేశ్గౌడ్, చిటంపల్లి ఐలయ్య, పోలెపల్లి శ్రీనివాస్రెడ్డి, బుడ్డా జగన్, అనుకోటి నాగరాజు, బొరిగం స్వామి, ఈర్ల చిన్న, చిన్నాల గోనాథ్, పోలెపల్లి బుచ్చిరెడ్డి, మల్లం కుమార్ను నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా.. కత్తి సంపత్, ఎండీ సద్దాం హుస్సేన్, మట్ల రమేష్, సారంపల్లి శ్రీనివాస్రెడ్డి, బానోత్ కల్పన, ఈరుకొండ శ్రీనివాస్, పుల్లా శ్రీనివాస్, బండా చంటిరెడ్డి, పిడిశెట్టి కనకయ్య, ముప్పు శ్రీనివాస్, ఎస్కే అమర్, సుంచు అశోక్, కారాబు రాజేశ్వర్రావు, గోల్కొండ సాంబయ్య, బాబా షర్ఫుద్దీన్, గుంటి స్వప్న, తోట రాజ్కుమార్, మారంరెడ్డి కౌతిట్ రెడ్డి, బిన్ని లక్ష్మణ్, కమలాపురం రమేష్, బుర్ర దేవేందర్ గౌడ్, పిడి కల్పనదేవి, ఆర్పుల రాజు, రావుల భూపాల్రెడ్డి, రేవూరి రణధీర్రెడ్డిని నియమించారు. కార్యదర్శులుగా.. కమ్మగోని ప్రభాకర్, బత్తిని ఎల్లయ్య గౌడ్, మునిగాల యాకూబ్, బొజ్జా రవీందర్యాదవ్, విష్ణుదాస్ వంశీధర్రెడ్డి, చీరాల విజయ, దూలం సదానందంగౌడ్, కేడారి రణధీన్, పుల్యాల యాదవరెడ్డి, రాయపురం సాంబయ్య, కట్కూరి స్వామి, మాచర్ల మహేందర్, భూక్య రాజు నాయక్, కేతపాక శాంతి, ఆదరి రవియాదవ్, మోడెం రాకేష్, మారపల్లి రవీందర్, చల్లా చక్రపాణి, తమ్మిడి మానస, కట్టా రఘుపాల్రెడ్డి, చాడా శ్రీనివాస్రెడ్డి, ఓరుగంటి స్నేహ, జున్ను హరిసింగ్, మనుపటి శ్రీనివాస్, తాళ్లపల్లి విజయ్, పసునూరి మనోహర్, నలుబోల్ల కష్ణ, మార్క రజనీకర్, కంచ రవికుమార్, చిదురాల శ్రీనివాస్రెడ్డి, కట్కూరి స్రవంతి, పుట్టా రాజు, ముక్కెర సురేష్, బాచటి మోహన్రావు, కక్కెర్ల రాధిక, సదిరాం పోచయ్య, పబ్బా శ్రీనివాస్, కొకిరాల స్వాతి, జాఫర్ రిజ్వీ, మంద నాగరాజు, బొమ్మాతి చంద్రాపాల్, బైరబోయిన రమేష్, దువ్వా వీరేశ్ కుమార్, ఖురేషీ ఇబ్రహీంను నియమించారు. కార్యవర్గ సభ్యులుగా.. బైరి లింగమూర్తి, రితిక సారమ్మ, ఈ.ఎలీష, కొత్త వాసుదేవరెడ్డి, బచ్చు భాస్కర్, నల్లతీగల యాకయ్య, బొజ్జా భాస్కర్, తెల్ల సుగుణ, మామిండ్ల సురేష్, పొంగులేటి సత్యనారాయణ, గన్ను వెంకటేశ్వర్లు, శ్రీపతి పద్మ, జంగిలి లావణ్య, పసుల విజయ, యాకూబ్ పాషాను నియమించారు.జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గంలో పలువురు సీనియర్లకు అవకాశం కల్పించారనే చర్చ జరుగుతోంది. సామాజిక కోణం, సీనియార్టీ ప్రాతిపదికన పలువురిని ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులుగా నియమించారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. 96 మందితో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ 12 మంది ఉపాధ్యక్షులు, 25 మంది ప్రధాన కార్యదర్శులు ట్రాన్స్జెండర్కు కార్యదర్శిగా అవకాశం -
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిహన్మకొండ: రాజకీయాలు, కుల మతాలకతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గ్రేటర్ 52వ డివిజన్ హనుమకొండ నయీంనగర్లో రూ.1.10 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయినేజీ పనులకు మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్ చాడా స్వాతితో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రెండేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనలో గణనీయమైన అభివృద్ధి సాధించామన్నారు. ఈ నెల 6న కార్పొరేటర్ల పదవీకాలం ముగియనున్నందున వారి సేవలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. బీజేపీ నాయకులు చాడా శ్రీనివాస్ రెడ్డి, నాయకుడు అశోక్రావు, మాజీ కార్పొరేటర్ మేకల బాబురావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వినతులు వారంలో పరిష్కరించాలి
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో వివిధ రకాల సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన వినతులను వారం రోజుల్లోగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. ప్రతి వినతిని సంబంధిత పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని, అర్జీలు పెండింగ్లో లేకుండా చూడాలని సూచించారు. వారంలో వినతుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చేలా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. కాగా, ప్రజావాణికి మొత్తం 143 వినతులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్ఓ సత్యపాల్, డీఆర్డీఓ శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు వినతులు త్వరగా పరిష్కరించండి:కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, సమస్యలను పరిష్కరించిన వాటిని ప్రజావాణి పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ఆర్డీఓ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ రెవెన్యూ డివిజన్ స్థాయిలో మొదటిసారిగా నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు వచ్చినట్టు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిలోనూ ప్రజావాణిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజావాణికి 101, వరంగల్ డివిజన్లో 26, నర్సంపేట డివిజన్లో 14 దరఖాస్తులు సమర్పించినట్లు వెల్లడించారు. ఇందులో రెవెన్యూ 63, హౌసింగ్ 14, జీడబ్ల్యూఎంసీ 18 దరఖాస్తులు రాగా ఇతర శాఖలకు సంబంధించి 46 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవి.గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఆర్డీఓ నాగపద్మజ, డీఎంహెచ్ఓ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
అక్రమ నిర్మాణాలపై పట్టింపులేదా?
వరంగల్ అర్బన్: ‘అనధికారిక, అక్రమ భవన నిర్మాణాల ఫిర్యాదులపై అధికారులకు, టౌన్ ప్లానింగ్ సిబ్బందికి పట్టింపు కరువైంది’ అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రీవెన్స్ సెల్కు మొత్తం 88 ఫిర్యాదులు రాగా, టౌన్ ప్లానింగ్కు 48, ఇంజనీరింగ్కు 13,రెవెన్యూ 11, హెల్త్ –శానిటేషన్కు 8, నీటి సరఫరాకు 8 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో బల్దియా అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, డీఎఫ్ఓ శంకర్ లింగం, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, పన్నుల అధికారి రామకృష్ణ, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, హెచ్ఓ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● కేయూ గేట్–2లో డ్రెయినేజీ స్తంభించిపోయిందని, ఇంటి లైన్లో డ్రెయినేజీ నిర్మించాలని అనిల్కుమార్ కోరారు. ● 15వ డివిజన్ గొర్రెకుంటలో వీధిలైట్లు వెలగడం లేదని, దొంగతనాలు జరుగుతున్నాయని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, లైట్లు ఏర్పాటు చేయాలని ఎస్.రవి ఫిర్యాదు చేశారు. ● 1వ డివిజన్ పలివేల్పుల మురికి కాల్వలను పూడ్చేసి, అక్రమంగా కబ్జా చేశారని చర్యలు తీసుకోవాలని కాలువ రాజయ్య పేర్కొన్నారు. ● శివనగర్లో తాగునీటి సమస్య జఠిలంగా ఉందని పరిష్కరించాలని బీజేపీ పార్టీ ఖిలా వరంగల్ మండల అధ్యక్షుడు మహ్మద్ రఫీ వినతి పత్రం అందించారు. ● బక్రీద్ దగ్గర పడుతోందని దర్గా, ఈద్గాల్లో కనీస వసతులు కల్పించాలని మహ్మద్ అబ్దుల్ ఖాలీద్ తన్వీర్ కోరారు. ● 1వ డివిజన్ పెగడపల్లిలో ఇళ్ల మధ్యలో కోళ్ల ఫాం ఏర్పాటు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నామని చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. ● రంగశాయిపేట 19–9–449/2 ఇంటికి రెండు నల్లాలు ఉన్నాయని, ఒకదాన్ని తొలగించాలని దొడ్డ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ● 8వ డివిజన్ 3–7–114/1 మురుగునీరు స్తంభించిందని చర్యలు తీసుకోవాలని కొమురయ్య పేర్కొన్నారు. ● హనుమకొండ గోపాలపురంలో సీసీ రోడ్డు, డ్రె యినేజీ నిర్మించాలని, బల్దియాకు రూ.50 వేలు గతేడాది కిందట చెల్లించామని ఇంత వరకు ఏర్పాటు చేయలేదని శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ● హనుమకొండలోని కుమార్పల్లిలో పలు ఇళ్లకు సెప్టిక్ ట్యాంకు లేదని, మోరీలోకి మల, వ్యర్థాలను వదులుతున్నారని చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ● హనుమకొండ కాకతీయ కాలనీ–2లో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని అభివృద్ధి కాలనీ కమిటి ప్రతినిధులు విన్నవించారు. ● 31, 10వ డివిజన్లోని మారుతి హిల్స్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు ఆక్రమణలకు గురవుతున్నాయని చర్యలు తీసుకోవాలని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ● 18వ డివిజన్ టీఆర్టీ కాలనీలో విద్యుత్ స్తంభాలు, డ్రెయినేజీలు, నల్లా పైప్లైన్ ఏర్పాటు చేయాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. ‘గ్రేటర్’ గ్రీవెన్స్ సెల్లో ప్రజల ఆవేదన 88 వినతులు స్వీకరించిన అధికారులు -
భూసేకరణలో గోల్మాల్!
సాక్షిప్రతినిధి, వరంగల్: హసన్పర్తి మండలం భీమారం శివారులోని సర్వే నంబర్ 353 (ప్లాటు నంబర్–64)లో భూమి కలిగిన డి.వర్షారావు తనకు నష్టపరిహారం అందించలేదని, అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని హైకోర్టును ఆశ్రయించింది. ఆర్డీఓ ప్రొసీడింగ్ నంబర్ ఎఫ్/4438/2012 తేదీ 31–3–2016 దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు బాధితురాలికి నష్టపరిహారం ఇవ్వాలని ఆర్డీఓను ఆదేశించింది. భూమికి డబ్బులు చెల్లించామని, తమ వద్ద డబ్బులు లేవని ఆర్డీఓ సమాధానం ఇచ్చారు. ...ఇలా 353 సర్వే నంబర్ (4.30 ఎకరాలు)లో 19,223.253 చదరపు గజాల భూసేకరణ చేపట్టారని, ఇందుకు ప్రభుత్వం రూ.9,54,93,576 నిధులు పక్కదారి పట్టాయి. భూసేకరణ పేరిట నిధులు స్వాహా.. కథా కమామీషు ఇదీ.. యాదాద్రి–ఆరెపల్లి జాతీయ రహదారి భూసేకరణలో భారీగా నిధుల గోల్మాల్ జరిగింది. ఈ రోడ్డు మార్గమధ్యలోని భీమారం, చింతగట్లు, వంగపహాడ్, దేవన్నపేటలో పెద్ద ఎత్తున డబ్బులు మాయం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నష్టపరిహారం జాబితాలో భూమి కోల్పోయిన బాధితుల పేర్లు పేర్కొనకుండా అపరిచిత వ్యక్తులుగా పొందుపరచడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2016లో యాదాద్రి–ఆరెపల్లి–163 జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ రోడ్డు నిర్మాణం సందర్భంగా రైతుల నుంచి గ్రామాల వారీగా భూములు సేకరించారు. అప్పటి మార్కెట్ విలువ ప్రకారం రైతులకు నష్టపరిహారం అందించారు. హసన్పర్తి మండలం భీమారం శివారులోని సర్వే నంబర్ 353 (ప్లాటు నంబర్–64) యజమానురాలు డి.వర్షారావు తనకు నష్టపరిహారం అందించలేదని హైకోర్టును ఆశ్రయించింది. ఆర్డీఓ ప్రొసీడింగ్ నంబర్ ఎఫ్/4438/2012 తేదీ 31–3–2016 దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు బాధితురాలికి నష్టపరిహారం ఇవ్వాలని ఆర్డీఓను ఆదేశించింది. కలెక్టర్ దృష్టికెళ్లకుండా జాగ్రత్త.. ఆర్ఆర్యాక్టుకు జంకుతున్న ‘రెవెన్యూ’.. రియల్ ఎస్టేట్ లేఅవుట్ ప్లాట్లు, రోడ్లు, గ్రీన్ల్యాండ్ను భూసేకరణ కింద చూపి అక్రమంగా రూ.9.55 కోట్లు ‘అన్నౌన్’ పేరిట ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి రెవెన్యూ అధికారులు చెల్లించారు. ఆ డబ్బులను రెవెన్యూ రికవరీ యాక్టు పెట్టి వసూలు చేసే అవకాశం ఉన్నా స్పందించడం లేదు. 2022–23 వరకు ఆర్డీఓగా ఉన్న అధికారి దృష్టికి రైతులు తీసుకెళ్లారు. సదరు వ్యాపారికి నోటీసులు ఇచ్చామని, త్వరలోనే వసూలు చేస్తామని చెప్పినా ఆమలు కాలేదు. కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్లోనూ అప్పట్లో బాధితులు ఫిర్యాదు చేయగా.. అప్పుడున్న కలెక్టర్ను ఆర్డీఓ స్థాయి అధికారి ఒకరు తప్పుదోవ పట్టించారన్న ప్రచారం ఉంది. అధికారులు మారినప్పుడల్లా బాధితులు రూ.9.55 కోట్ల అక్రమాలపై ఫిర్యాదులు చేస్తున్నా ఆర్డీఓ, తహసీల్దార్ స్థాయి అధికారులు కలెక్టర్లకు తప్పుడు సమాచారం ఇస్తూ దాటవేస్తున్నారని అంటున్నారు. నిజాయితీ అధికారిగా పేరు తెచ్చుకున్న హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఈ వ్యవహారంపై స్పందించి ప్రభుత్వ ఖజానకు రూ.9.55 కోట్లు లూటీ చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆర్ఆర్ యాక్టు ద్వారా డబ్బులు రికవరీకి చేయాలని కోరుతున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు నష్టపరిహారం అందించామని ఆర్డీఓ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆర్డీఓ ప్రొసీడింగ్ నంబర్ ఎఫ్/4438/ 2012 తేదీ 31–3–2016 ప్రకారం 353 సర్వే నంబర్ భూమి (4.30 ఎకరాలు) 19223.253 చదరపు గజాల భూసేకరణ చేపట్టారని ఇందుకు ప్రభుత్వం ద్వారా రూ.9,54,93,576 చెల్లించామని చెప్పారు. తమ వద్ద డబ్బులు లేవని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని బాధితురాలు వర్షారావుకు మెమో ద్వారా తెలిపారు. అయితే ఆర్డీఓ రమేశ్ రాఽఽథోడ్ మాత్రం సర్వేనంబర్ 353లో మొత్తం 19223.253 చదరపు గజాలు సేకరించి డబ్బులు చెల్లించినట్లు లేఖలో వివరించారే తప్ప బాధితుల పేర్లు మాత్రం అందులో పేర్కొనలేదు. నష్టపరిహార జాబితాలో భూమి కోల్పోయిన బాధితుల పేర్లు పేర్కొనకుండా అపరిచిత వ్యక్తిగా పొందుపరచడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అపరిచిత వ్యక్తులకు నష్టపరిహారం చెల్లించినట్లు పేర్కొనడం ద్వారా అవినీతికి పాల్పడినట్లు ఇక్కడ ఉన్న ఆధారాల ద్వారా స్పష్టమవుతోంది. అక్షరాల రూ.9,54,93,576 నిధులు స్వాహా పరిహారం కోసం కోర్టుకు బాధితులు అప్పటి అధికారుల తీరుపై అనుమానాలు డబ్బులిచ్చామని ఆర్డీఓ వివరణ అపరిచితుల పేరిట రియల్టర్కు చెల్లింపులు -
టెక్నాలజీతో లైబ్రరీ సేవల్లో మార్పులు
కేయూ క్యాంపస్: టెక్నాలజీతో లైబ్రరీ సేవల్లో వినూత్న మార్పులు వచ్చాయని గుజరాత్ రాష్ట్రంలోని ఇన్ఫ్లిబినెట్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ దేవికా పి.మదల్లి అన్నారు. కేయూలో లైబ్రరీ అసిస్టెంట్లకు సోమవారం నిర్వహించిన ఇన్ఫ్లిబినెట్ రీజినల్ ట్రైనింగ్ ప్రోగ్రాం లైబ్రరీ ఆటోమేషన్ ప్రారంభ సమావేశంలో ఆమె మాట్లాడారు. వన్నేషన్ ఇన్ సబ్స్క్రిప్షన్ కార్యక్రమం కింద సుమారు 6,500 సంస్థలు నమోదు చేసుకున్నామని పేర్కొన్నారు. కేయూ వీసీ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీ లైబ్రరీకి రూసా నిధుల కింద రూ.2 కోట్లు, ప్రాజెక్టు కింద రూ.49 లక్షలు, సాధారణ బడ్జెట్లో రూ.కోటి మంజూరు చేసినట్లు తెలిపారు. బెంగళూరుకు చెందిన విశ్రాంత ప్రొఫెసర్లు ఏఆర్డీ ప్రసాద్, నిట్ లైబ్రేరియన్ ప్రొఫెసర్ వై.శ్రీనివాస్రావు, సోషల్ సైన్స్, ఆర్ట్స్ డీన్ బి.సురేశ్లాల్, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్లు కేయూ లెబ్రరీ సైన్స్ విభాగాధిపతి రాధికారాణి, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి రమ, నీలిమ, రవీందర్ పాల్గొన్నారు. -
విజయ డెయిరీ వరంగల్ డీడీగా ధన్రాజ్
హన్మకొండ చౌరస్తా: విజయ డెయిరీ వరంగల్ మిల్క్ షెడ్ డిప్యూటీ డైరెక్టర్గా జి.ధన్రాజ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీడీగా విధులు నిర్వర్తించిన శ్రవణ్కుమార్ను మెగా డెయిరీ మార్కెటింగ్ జీఎంగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ధనరాజ్ను డీడీగా నియమిస్తూ ఏప్రిల్ 25న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నూతన డీడీగా బాధ్యతలు స్వీకరించిన ధన్రాజ్ను విజయ డెయిరీ పాడి రైతుల సంక్షేమ, పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఇరుకు దేవేందర్ రావు, బీఎంసీయూ అధ్యక్షులు రాసాల సమ్మయ్య, మెట్టు సురేందర్, గోపాల్ అభినందించారు. హన్మకొండ అర్బన్: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారని హనుమకొండ జిల్లా తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ, టీఎన్జీఓస్ నాయకులు సోమవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిని ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞ్ఞతలు తెలిపారు. జేఎసీ, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, నేతలు ఈవీ శ్రీనివాస్, బైరి సోమయ్య, పుల్లూరు వేణుగోపాల్, పనికెల రాజేశ్, శ్యాంసుందర్, కత్తి రమేశ్, రామునాయక్, సారంగపాణి, లక్ష్మీప్రసాద్, సీతారాం, సలీం, రాజమౌళి, సురేశ్, రాజేశ్ ఖన్నా, భరత్, శ్రీనివాస్, రాజీవ్ అనూప్, ఎర్రాప్రగడ, రాజే శ్, ఉప్పు భాస్కర్, వెంకట్రామిరెడ్డి, మల్లేశం, మన్సూర్, సాంబయ్య, రంజిత్ పాల్గొన్నారు. . రామన్నపేట: పీసీ పీఎన్డీటీ, ఎంటీపీ చట్టం నియమాలను డాక్టర్లు తప్పనిసరిగా పాటించాలని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి అప్పయ్య సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో పీడీ అండ్ పీఎన్డీటీ జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జీఎంహెచ్ గైనకాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ నిర్మల, పరకాల సీహెచ్సీ గైనకాలజిస్ట్ కవిత, జిల్లా అడ్వైజరీ కమిటీ సభ్యులు రేవతి దేవి, మాతా శిశు సంక్షేమ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రూబీనా, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తాళ్లూరి లత, రాజు, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి, ప్రసన్నకుమార్, హెల్త్ సూపర్వైజర్ పద్మజ, సందీప్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ అర్బన్: ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని డివిజనల్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం హనుమకొండ జిల్లాలోని హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించారు. హనుమకొండ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్డీఓ రాథోడ్ రమేశ్, పరకాల రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్డీఓ డాక్టర్ కన్నం నారాయణ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు వినిపించిన సమస్యలపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓలు తెలిపారు. హనుమకొండ ఆర్డీఓ కార్యాలయంలో 10 దరఖాస్తులు, పరకాల ఆర్డీఓ కార్యాలయంలో 27 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆర్డీఓలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్యూరి‘ఫియర్’!
వరంగల్ అర్బన్: సజావుగా తాగునీటిని అందించలేని దైన్యం మన ఇంజనీర్లు, పాలకులది. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు రూ.వంద కోట్లకుపైగా నీటి వ్యాపారం అక్రమంగా చేస్తున్నా ప్రభుత్వం నియంత్రించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ నగరంలోని కాలనీలు, శివారు ప్రాంతాల్లో అడ్డాగా సాగుతున్న ఈ అక్రమ దందాకు ప్రజాప్రతినిధులు, గ్రేటర్ వరంగల్, ఆహార కల్తీ నియంత్రణ శాఖ, రెవెన్యూ శాఖల అధికార యంత్రాంగం అండదండలు ఉంటున్నాయని విమర్శలున్నాయి. ఖాళీ స్థలాలు, ప్లాట్లలో బోర్లు వేసి భూగర్భ జలాలను విచ్చలవిడిగా లాగేస్తున్నారు. ఈ దందాతో పలు కాలనీల్లో బోర్లకు నీళ్లు రావడం లేదని ప్రజలు మొత్తుకుంటున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. వేసవి వచ్చిందంటే చాలు నగరవాసుల అవసరాలు రెండింతలు అవుతున్నాయి. ఫలితంగా అక్రమ నీటి వ్యాపారాలు మూడు మూడు ప్లాంట్లు, ఆరు క్యాన్లు అన్నట్లుగా కొనసాగుతోంది. ప్యూరిఫయర్ పేరుతో.. నల్లా నీళ్ల మీద నమ్మకం లేదు. ఇంట్లోని వాటర్ క్యాన్ పట్టుకొని సమీపంలో ఉన్న ప్లాంట్కు వెళ్లి రూ.10 ఇచ్చేసి నీళ్లను తెచ్చుకుంటున్నారు. మరొకొందరు ట్రాలీ ఆటోలకు సమాచారం అందించి క్యాన్కు రూ.20 చెల్లించి నీటిని నింపుకుంటున్నారు. కూల్ వాటర్ క్యాన్ను రూ.30 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఆ నీరు శుద్ధి చేసిందా లేదా? అని పట్టించుకోవడం లేదు. తాగేందుకు ఉపయోగపడుడుతుందా? అని ఎవరూ పరిశీలించడం లేదు. బోరు నుంచి తోడుతున్న నీళ్లను నేరుగా ఫిల్టర్ మిషన్లోకి పంపుతున్నారు. తాగునీటి శుద్ధీకరణ అయి పోయిందని చెప్పి స్టీల్ ట్యాంకులోకి వస్తున్నాయి. అక్కడి నుంచి నేరుగా వినియోగదారుడికి వాటర్, కూల్ క్యాన్లలో నింపుతున్నారు. కొన్ని మినరల్స్ను ఉపయోగిస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో వాటర్ బాటిళ్ల తయారీ యఽథేచ్ఛగా సాగుతోంది. హోల్సేల్గా వాటర్ బాటిల్ను రూ.5 నుంచి 9 అమ్ముతున్నారు. వ్యాపారులు రిటైల్ ధర రూ.20కి అమ్ముతున్నారు. వాటర్ప్లాంట్ అనుమతి తీసుకోవాలంటే తప్పనిసరిగా బీఐఎస్ అనుమతి ఉండాలి. ఏడాదికోమారు రెన్యువల్ చేసుకోవాలి. రూ.1.20 లక్షల ఫీజు చెల్లించాలి. విశాలమైన గదుల్లో హెచ్డీపీ పైపులైన్ ఏర్పాటు చేసి, నీటి ట్యాంకులు, ఇతర సామగ్రి నాణ్యమైనవి ఉండాలి. ట్రస్టీలు, స్వయం సహాయక సంఘాలు, ఇతర సామాజిక వర్గాల పేరు చెప్పి వాటర్ప్లాంట్ల నిర్వాహకులు నిబంధనలను గాలికి వదులుతున్నారు. అనుమతి ఉన్నవి 30 మాత్రమే.. గ్రేటర్ వరంగల్లో సుమారు 5 వేల ప్లాంట్లు ఉన్నాయి. వీరిలో చాలా మంది నిబంధనలను గాలికి వదిలి.. నీటి వ్యాపారాన్ని కొనసాగిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియాన్ స్టాండర్డ్స్ కార్యాలయంలో హైదరాబాద్లో ఉంది. ఆ విభాగం అధికారులు వీటిని ఏ మాత్రం పట్టించుకోరు. యథేచ్ఛగా వాల్టా (వాటర్ ల్యాండ్ ట్రీ యాక్ట్)ను ఉల్లంఘిస్తూ బోర్లు వేస్తున్నా తహసీల్దార్లు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. జల గరళాన్ని అమ్ముతున్నా కార్పొరేషన్ ప్రజారోగ్యం, ఆహార కల్తీ నియంత్రణ, జిల్లా ఉన్నతాధికారులు అధికారులు దృష్టి పెట్టడం లేదు. దీంతో నగరంలో మినరల్ మాఫీ హవా కొనసాగుతోంది. ట్రేడ్లైసెన్స్, బీఐఎస్ (ఐఎస్ఐ) అనుమతి ఉన్న ప్లాంట్లు 30 మాత్రమే ఉన్నాయి. మిగిలినవి నాన్ ఐఎస్ఐ ప్లాంట్లే. అనుమతి లేని వాటర్ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. నల్లా నీటిని కాగబెట్టి తాగాలి.. నల్లా నీళ్లు శుద్ధి చేసినవి. నీళ్లను కాగబెట్టి చల్లారిన తర్వాత వడబోసుకొని తాగాలి. క్యాన్ వాటర్ నీళ్లను తాగితే మోకాళ్ల నొప్పులు వస్తాయి. వాటర్ ప్లాంట్లలో నిబంధనలు పాటించడం లేదు. ఆహార కల్తీ నిరోధక శాఖ, రెవెన్యూ, గ్రేటర్ కలిసి దాడులు చేయాల్సి ఉంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. – రాజారెడ్డి, బల్దియా సీఎంహెచ్ఓ గ్రేటర్లో యథేచ్ఛగా వాటర్ప్లాంట్ల ఏర్పాటు నిబంధనలు ఉల్లంఘించి దర్జాగా వ్యాపారం ఏటా రూ.వంద కోట్లకుపైగా లావాదేవీలు వ్యాధులబారిన ప్రజలు.. పట్టించుకోని అధికారులు -
ఎరువు.. బరువు!
గీసుకొండ: యాసంగి సీజన్ ముగింపు దశలో ఉంది. వానాకాలం పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్నుకుని విత్తనాలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కంపెనీలు ఇదే అదునుగా భావించి ఎరువుల ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే డీలర్లకు ఆయా కంపెనీల వారు పెంచుతున్న ఎరువుల ధరల గురించి సమాచారం ఇస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని రైతులపై మోయలేని విధంగా ఆర్థిక భారం పడనుంది. గ్రామాల్లో ఒకవైపు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల పేరిట సదస్సులు నిర్వహిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో మేలైన రకాలను సాగుచేసి వ్యవసాయాన్ని లాభదాయకంగా మలచుకోవాలని సూచిస్తున్నారు. మరో వైపు రైతు నెత్తిన మరింత పెట్టుబడి భారాన్ని మోపుతూ కంపెనీలు ఎరువుల ధరలను పెంచుతున్నాయి. రకాన్ని బట్టి కొన్ని రసాయన ఎరువులపై రూ.75 నుంచి రూ.350 వరకు ఒక్కో బస్తాకు పెరగడం గమనార్హం. పశ్చిమాసియా దేశాలలో జరుగుతున్న యుద్ధ ప్రభావంతో ఎరువుల తయారీకి వాడే ముడి సరుకుల ధరలు పెరిగాయని అంటున్నారు. సరుకును రవాణా చేసే నౌకలకు బీమా సంస్థలు విధించే ప్రీమియం, ఇతర పన్నులు ఎక్కువ కావడంతో సహజంగానే ఎరువుల ధరలు పెరిగాయని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని ఓ కంపెనీ ప్రతినిధి తెలిపారు. యాప్తో రైతులకు ఇబ్బందులు.. ప్రస్తుతం ముగుస్తున్న యాసంగి సీజన్ ప్రారంభంలో సకాలంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎరువులు అధికంగా వాడుతున్నారని ప్రభుత్వం ప్రత్యేక యాప్ను తీసుకురావడంతో ఇబ్బందులు తొలగలేదు. బస్తా డీఏపీ వాస్తవ ధర రూ.1,350 ఉంటే గిట్టుబాటు కావడం లేదని డీలర్లు విక్రయించడానికి ఆసక్తి చూపలేదు. బస్తా యూరియా నిర్ణీత ధర రూ.265 ఉండగా మొన్నటి వరకు రూ.300 వరకు విక్రయించారు. పశుసంపద తగ్గిపోవడంతో.. గ్రామాల్లో పశు సంపద తగ్గిపోయింది. దీంతో పేడ, గొర్రె ఎరువు, పెంట తదితర కంపోస్టు ఎరువులతోపాటు సేంద్రియ ఎరువుల లభ్యత తక్కువగా ఉంటోంది. రైతులు తమ పంటలకు పోషకాలను అందించేందుకు రసాయన ఎరువులను వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా వానాకాలంలో వరి, పత్తి, కందులు, జొన్నలు, కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు. ఈ పంటల సాగుకు అవసరమైన ఎరువులను కొనుగోలు చేయాలంటే పెరిగిన ధరలతో రైతులపై మరింత భారం పడుతుంది.ఎరువుల పాత, కొత్త ధరల వివరాలు.. ఎరువు రకం పాత ధర కొత్త ధర (50 కిలోలు) (రూపాయల్లో) (రూపాయల్లో) 20–20–013 1,500 1,800 16–20–013 1,400 1,750 14–35–14 2,150 2,350 15–15–15–09 1,650 1,950 10–23–26 1,950 2,025 సింగిల్ సూపర్ పాస్ఫేట్ 615 775 పొటాష్ 1,850 1,975 16–16–16 1,675 2,050 24–24–0 2,000 2,300 వానాకాలం సాగు వేళ పెరిగిన ధరలు రైతులపై మరింత పెట్టుబడి భారం పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభావమే కారణం -
డిక్లరేషన్లను అమలు చేయని కాంగ్రెస్
● ప్రభుత్వ మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ హన్మకొండ: అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, చేసిన డిక్లరేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ధ్వజమెత్తారు. హనుమకొండ హంటర్రోడ్డులోని రైతుసదస్సు నిర్వహణ స్థలంలో రైతు సంగ్రామ సదస్సు పోస్టర్ను దాస్యం వినయ్భాస్కర్, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, బీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. 420 హామీలు, 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని తూర్పారబట్టారు. కేసీఆర్ ఎకరాకు రైతుబంధు రూ.10 వేలు ఇస్తే, రేవంత్రెడ్డి రూ.12 వేలు ఇస్తానని చెప్పి మూడుసార్లు ఎగ్గొట్టాడని విమర్శించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య మాట్లాడుతూ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు రైతుసదస్సు బీఆర్ఎస్ పెడితే పోటీగా కాంగ్రెస్ సభ పెడతామని అంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ వస్తున్నారు.. అంటే అధికార పక్షం భయపడుతోందన్నారు. రైతు రుణవిమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నాయకులు మర్రి యాదవరెడ్డి, పులి రజనీకాంత్, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఎల్లావుల లలితాయాదవ్, డాక్టర్ హరి రమాదేవి, ప్రశాంత్, రామ్మూర్తి, మాచర్ల శరత్చంద్ర పాల్గొన్నారు. టేకుమట్ల: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బోర్నపల్లిలో చో టుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రామకృష్ణాపూర్ (వి) గ్రామానికి చెందిన అప్పని లింగయ్య (50) ఆదివారం ఉదయం బైక్పై పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. సాయంత్రం స్వగ్రామం రామకృష్ణాపూర్ (వి)కు వ స్తుండగా బోర్నపల్లిలో ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో లింగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పంచనామ నిర్వహించి మృతదేహాన్ని చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అమూల్య తెలిపారు. -
మెసేజ్ల పేరుతో మోసం..
● డబ్బులు పంపించాలంటూ రెక్వెస్ట్లు కాశిబుగ్గ: సైబర్ నేరగాళ్ల రోజుకో రకమైన విధానాలతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఈజీగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా బ్యాంకుల ఖాతాలను నుంచి డ్రా చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఆదివారం ఓ చేనేత వ్యాపారిని టార్గెట్ చేసుకుని మెసేజ్ల పేరుతో నేరుగా డబ్బులు తీసుకోకుండా మిత్రుల ద్వారా గుంజడానికి యత్నించారు. సదరు వ్యాపారి వాట్సాప్లో ఉన్న సెల్నంబర్ల ఆధారంగా వారికి రిక్వెస్ట్ మెసేజ్లు పెడుతూ పోన్పే ద్వారా డబ్బులు తీసుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తవాడలో ఓ చేనేత వ్యాపారికి ‘మీకు గుజరాత్ నుంచి కొరియర్ వచ్చింది, మీ ఇల్లు, షాపు దొరకడం లేదు’ అంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. కొరియర్ బాయ్ మీ వద్దకు రావడానికి అడ్రస్ కోసం ఫోన్ చేయమని ఓ నంబర్ చెప్పాడు. దీంతో సదరు వ్యాపారి కొరియర్ వచ్చిందనే నమ్మకంతో గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన నంబర్కు ఫోన్ చేశాడు. ఇంకేముంది సదరు వ్యాపారి నంబర్ తీసుకుని అతడి సెల్లో ఉన్న దాదాపు 40 మంది కాంట్రాక్టు నంబర్లకు డబ్బులు అర్జెంట్గా కావాలంటూ మెసేజ్లు పెట్టడం మొదలు పెట్టాడు. ‘నాకు మీ అవసరం ఉంది, మీరు వెంటనే రూ.48 వేలు ఫోన్ పే ద్వారా పంపించండి. రెండు గంటల్లో మీకు రిటర్స్ ఇస్తా’ అంటూ మెసేజ్ పెట్టి నమ్మించే ప్రయత్నం చేశాడు. నా యూపీఐ లిమిట్ ఈరోజు పూర్తయింది. ఒక వ్యక్తికి అర్జెంట్గా డబ్బులు ఇవ్వాలంటూ మెసేజ్ పెడుతూ, పోన్ పే కోసం ఓ సెల్ నంబర్ కూడా ఇచ్చాడు. ఈ సమాచారం కాంట్రాక్టులో ఉన్న నంబర్లకు వెళ్లడంతో కొందరు నమ్మి డబ్బులు పంపించినట్లు తెలుస్తోది. ఓ ఇద్దరు సదరు వ్యాపారికి డబ్బులు పంపడం, పంపించిన వ్యక్తులు ఫోన్ చేయడంతో అనుమానం వచ్చి, జరుగుతున్న మోసాన్ని గ్రహించాడు. వెంటనే సెల్ సెంటర్కు వెళ్లి తన నంబర్ హ్యాక్ కాకుండా చేసుకున్నాడు. అనంతరం సైబర్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. -
ప్రయాణంలో జరపైలం
ఖిలా వరంగల్: విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించడంతో చాలామంది కుటుంబ సమేతంగా విహారయాత్రలు, బంధువుల ఇళ్లు, స్వగ్రామాలకు వెళ్తున్నారు. దీంతో వారం రోజులుగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఆర్పీఎప్, జీఆర్పీ అధికారులు. ప్రధానంగా రైలు ప్రయాణాల్లో ఎక్కువగా చోరీలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యలో ఆయా శాఖల అధికారులు ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. వరంగల్ రైల్వేస్టేషన్లో రైల్వే రక్షణ దళం(ఆర్పీఎఫ్) ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్పీ) ఇన్స్పెక్టర్ సురేందర్ సంయుక్తంగా కొద్దిరోజులుగా రైలు ప్రయాణ భద్రతపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులు రైల్వేస్టేషన్ ప్లాట్ఫామ్లపై గస్తీ ముమ్మరం చేశారు. 139కు ఫిర్యాదు చేయండి ప్రయాణంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే రైలులో విధుల్లో ఉండే సిబ్బందికి తెలపాలి. వారు కనిపించపోయినా, పట్టించుకోకపోయినా వెంటనే 139 నంబరకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. మీ వివరాలకు అనుగుణంగా సమీప రైల్వే స్టేషన్కు అనుసంధానం చేస్తారు. రైల్వే యాప్ల్లో కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ప్రయాణికులకు పలు సూచనలు.. రైల్వే స్టేషన్కు రైలు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు ఎక్కే వారిని, దిగే వారిని గమనిస్తూ ఉండాలి. బంగారు ఆభరణాలు, ఎక్కువ మొత్తంలో నగదు ఇతర విలువైన వస్తువులు వెంట తీసుకెళ్లకూడదు. అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను గుర్తిస్తే రైల్వే రక్షణ దళం సిబ్బందికి సమాచారం అందించాలి. తోటి ప్రయాణికులు ఎవరైనా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే ఆర్పీఎఫ్ లేదా రైల్వే టీసీకి ఫిర్యాదు చేయాలి. రైలులో ప్రయాణిస్తూ రాత్రి సమయాల్లో సెల్ఫోన్లు చార్జింగ్లో పెట్టుకుని వదిలేయకూడదు. పిల్లలను రైలు తలుపుల దగ్గర తిరగనివ్వకూడదు. అపరిచితులతో తక్కువగా మాట్లాడాలి. వారు ఇచ్చే ఆహారపదార్థాలు తీసుకోవద్దు. ఇతరులకు వ్యక్తిగత సమాచారం చెప్పొద్దు. వేసవి సెలవులతో జనం విహారయాత్రలు రైలు, బస్సుల్లో చోరీలు జరిగే అవకాశం ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారుల అవగాహన అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని సూచన -
మహిళ ఆత్మహత్య
రేగొండ: ఆర్థిక కారణాలతో మనస్తాపం చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం జోగయ్యపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై సుధాకర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సూర సరోజన (55) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆర్థిక పరిస్థితులతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబీకులు పరకాలలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఈతకు వెళ్లి మరో యువకుడి గల్లంతు
బచ్చన్నపేట : ఈతకు వెళ్లిన ఓ దివ్యాంగ యువకుడు గల్లంతయ్యాడు. ఈఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చీర పద్మ, భిక్షపతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు కరుణాకర్ (30) దివ్యాంగుడు. ట్రాలీ ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఈత కొట్టడానికి ఊరు పక్కన ఉన్న తుమ్మలబావి వద్దకు వెళ్లాడు. బావిలోకి దూకి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో గమనించిన స్నేహితులు ఎంత వెతికినా ఫలితం కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై ఎ. శ్రీకాంత్ ఘటనాస్థలికి చేరుకుని గజ ఈతగాళ్లతో వెతికించినా మృతదేహం కనిపించలేదు. ఈ నేపథ్యంలో మోటార్ల ద్వారా నీటిని బయటకు తోడిస్తూ సోమవారం మృతదేహం కోసం ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడతామని ఎస్సై తెలిపారు. వరుస ఘటనలతో బెంబేలెత్తుతున్న ప్రజలు.. మండల కేంద్రంలోని రాజన్న బావిలో మండల కేంద్రానికి చెందిన ఎనుగుల కరుణాకర్ ఇదే తరహాలో ఈత కొట్టడానికి వెళ్లి శనివారం గల్లంతు కాగా మృత దేహం లభించలేదు. ఆదివారం పోలీసులు గజఈతగాళ్ల సాయంతో కరుణాకర్ మృతదేహాన్ని బయటకు తీశారు. అది మరవక ముందే మూడు గంటల వ్యవధిలో రామచంద్రాపురంలో మరో ఘటన జరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈత వచ్చిన వ్యక్తులే ఇలా మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంటలు కోసిన తర్వాత మోటార్లు బంద్ చేయడంతో వ్యవసాయ బావుల్లో నీరు నిల్వ ఉంటుంది. ఆ నీరు చాలా రోజులు నిల్వ ఉండడంతో ఆకులు పడి మురుగడంతో ఏమైనా విషపదార్థాలు తయారవుతున్నాయా అని అర్థం కావడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. బచ్చన్నపేట ఘటన మరువకముందే రామచంద్రాపురంలో మరోటి.. -
ప్రశాంతంగా టీజీఆర్జేసీ సెట్
● 78 శాతం మంది అభ్యర్థుల హాజరు విద్యారణ్యపురి: తెలంగాణ రాష్ట్రంలో రెసిడెన్షియల్ గురుకుల జూనియర్ కళాశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ ఎక్సలెన్స్) ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు గాను టీజీఆర్జేసీ సెట్ –2026 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రైసిటీలో 35 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఉమ్మడి వరంగల్జిల్లాలో 8,357మంది అభ్యర్థులకు గాను 6,415 మంది పరీక్షకు హాజరుకాగా 1,842మంది గైర్హాజరయ్యారని టీజీఆర్జేిసీ సెట్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ కె. ఇంధుమతి తెలిపారు. హనుమకొండ జల్లా డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, ఏసీజీఈ భువనేశ్వర్, కోఆర్డినేటర్ ఇంధుమతి, డీఆర్ఓ పలు కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరు పరిశీలించారు. పిడుగుపాటుకు కాడెడ్లు మృత్యువాత కేసముద్రం: పిడుగుపాటుతో మూడు కాడెడ్లు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు బి.సమయ్య తన మూడు కాడెడ్లు, ఓ గేదెను వ్యవసాయ భూమి వద్ద చెట్టు కింద కట్టేశాడు. ఈ క్రమంలో సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఒక్కసారిగా ఆ పశువులు ఉన్నచోట పిడుగు పడడంతో మూడు కాడెడ్లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. విషయం తెలుసుకున్న బాధిత రైతు కుటుంబీకులు ఘటనాస్థలికి చేరుకుని బోరున విలపించారు. సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు కన్నీరుమున్నీరయ్యాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నాడు. వైద్యం వికటించి బాలుడి మృతి!దంతాలపల్లి: ఆర్ఎంపీ వైద్యం వికటించి బా లుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు. వారి కథనం ప్రకారం.. మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన ఏడెల్లి అశోక్–ఊర్మిల దంపతులకు సుశాంత్త్, మల్లికార్జున్ కుమారులు ఉన్నారు. అశోక్ బైకు మెకానిక్గా పనిచేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి మండల కేంద్రంలో నివాసం ఉంటున్నాడు. పెద్ద కుమారుడు సుశాంత్ (15) మండల కేంద్రంలోని ఎ ంజేపీ పాఠశాలలో 9 వతరగతి పూర్తిచేశాడు. ఆదివారం కడుపు నొప్పి రావడంతో స్థానికంగా ఓ ఆర్ఎంపీ వైద్యుడి దగ్గర చూపించారు. వైద్యం అనంతరం బాలుడు మరింత అస్వస్థత కు గురికావడంతో తొర్రూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరిస్థితి విషమించిందని చెప్పడంతో వరంగల్ ఎంజీఎం తరలి స్తుండగా చని పోయాడు. ఆ ర్ఎంపీ వైద్యంతోనే తమ కు మారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు. -
ఖరీఫ్కు సన్నద్ధం
ఖిలా వరంగల్ : అన్నదాతకు భరోసా కల్పించేందు కు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే రైతు ముగింట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం ద్వారా వరంగల్ జిల్లాలోని ఊరూరా చైతన్యం చేస్తోంది. ఈ క్రమంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్య వసాయశాఖ ఆధ్వర్యంలో ఈనెల 4 నుంచి 9 వర కు రైతు వారోత్సవాలు నిర్వహించనుంది. వానా కాలం సాగుకు అన్నదాతలను జాగృతం చేసేందుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రకటించింది. అవగాహన సదస్సులు ఇలా.. 4న నేలఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, సన్న వరి ర కాల సాగు, 5న ఉద్యాన పంటల సాగు, ఆయిల్పా మ్ సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంట ల సాగు, 6న బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్ప కాలిక పంట పంట రుణాలు, 7న వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు, పీఎం కుసుమ్ వ్యవసాయ యాంత్రీకరణ డ్రోన్స్, 8న పశుసంవర్థక శా ఖ, పాడి పరిశ్రమ– పశుజాతి అభివృద్ధి, దూడల ప్రదర్శన, గడ్డి విత్తనాలు, వేసవిలో పశు సంరక్షణ, మత్స్యశాఖ–చెరువుల్లో కలుపు మొక్కల నివారణ, వ్యాధుల నియంత్రణ, అధికోత్పత్తికి చర్యలు, 9న నీటిపారుదల శాఖ–చెరువుల్లో కంపచెట్లు, గుర్రపు డెక్క తొలగింపు, నీటి వినియోగం, కార్యాలయాల పరిశుభ్రత కార్యక్రమాలు జరగనున్నాయి. మట్టి నమూనా ఫలితాలు.. జిల్లాలో మొదటి విడతగా భూసార పరీక్షలు చేశా రు. గత మార్చి 25 నుంచి ఏప్రిల్ 25 వరకు నెల రోజుల పాటు జిల్లాలోని ప్రతీ రెవెన్యూ గ్రామం నుంచి పది మట్టి నమూనాలను సేకరించారు. వీటి ని వరంగల్ ములుగు రోడ్డులోనిభూసార పరీక్ష కేంద్రం కార్యాలయానికి పంపించారు. నిర్వహించిన మట్టి శాంపిల్ ఫలితాలను వ్యవసాయాధికారి చేతికి రానున్నాయి. రైతు వారోత్సవాల్లో మట్టి పరీక్ష ఫలితాలు సంబంధిత రైతులకు వెల్లడించనున్నారు. 5 నుంచి 7వతేదీ వరకు మెగా రైతు మేళా.. హనుమకొండ ఆర్ట్స్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో ఈ నెల 5,6,7 తేదీల్లో ఉమ్మడి జిల్లా మెగా రైతు మేళా జరగనుంది. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లలో అధి కారులు నిమగ్నమయ్యాయి. ఉమ్మడి జిల్లా నుంచి రోజుకు 5వేల మంది రైతులు హాజరుకానున్నారు. భోజన సౌకర్యాలు కల్పించనున్నారు. ఈరైతు మే ళాకు జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, జి ల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వ్య వసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. 4 నుంచి 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలు ఆర్ట్స్ కళాశాల మైదానంలో 5,6,7వ తేదీల్లో మెగా రైతుమేళా ఉమ్మడి జిల్లా నుంచి ప్రతీ రోజు 5వేల మంది రైతుల రాక ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం -
పంట పొలాల్లో అగ్ని ప్రమాదాలు
కమలాపూర్: పంగిడిపల్లి, కన్నూరు గ్రామాల్లోని పంట పొలాల్లో ఆదివారం భా రీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రైతులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పంగిడిపల్లిలో సుమారు40 ఎకరాల మొక్కజొన్న చేలల్లో మంటలు వ్యాపించాయి. కొంతమంది రైతులకు చెందిన మగ మొక్కజొన్న కంకులతో పాటు పైపులు, కరెంట్ మోటార్ల వైర్లు, మొక్కజొన్న చొప్ప దగ్ధమై సుమారు రూ. లక్ష వరకు నష్టం వాటిల్లింది. కన్నూరులో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని నాలుగైదు ఎకరాల్లో కోసి కుప్పలుగా పోసిన మగ ధాన్యంతో పాటు పశుగ్రాసం దగ్ధమైనట్లు స్థానికులు చెప్పారు. స్థానిక గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుండగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేసినట్లు రైతులు తెలిపారు. హుస్సేన్పల్లిలో.. శాయంపేట: హుస్సేన్పల్లి గ్రామ శివారులోని హనుమాన్ దేవాలయ సమీపంలో ఆదివారం ప్రమాదవశాత్తు మొక్కజొన్న చేనుకు నిప్పంటుకుంది. మంటలు గాలికి వేగంగా వ్యాపించి పదెకరాల్లో పంట చేలను ఆవరించాయి. స్థానిక రైతులు, గ్రామస్తులు చెట్టుకొమ్మలు, గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకర్తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ పొలాల వద్దకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో సిబ్బంది, రైతులు చెట్ల కొమ్మలు, నీటితో మంటలను ఆర్పివేశారు. -
నీట్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. జిల్లా పరిధి పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల రక్షణలో భాగంగా సెక్షన్ 163 బీఎన్ఎస్ (144 సెక్షన్) అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 11 పరీక్ష కేంద్రాల్లో హనుమకొండలో 4, వరంగల్లో 2, కాజీపేటలో 3, జనగామలో 2 కేంద్రాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు, పరీక్ష సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.నిబంధనలు ఇలా.. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు గుమిగూడరాదు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిషేధం. పరీక్ష కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధి అన్ని జిరాక్స్ కేంద్రాలు ఈనెల 3న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలి. ఎవరైనా ఈ ఉత్తర్వులు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ హెచ్చరించారు. -
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ఖిలా వరంగల్: వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధి, రైతు సంక్షేమానికి సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణం, లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు, వరంగల్ కలెక్టర్ సత్యశారదతో కలిసి మంత్రి సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం మార్కెట్లో ఆధునిక సౌకర్యాలు కల్పించిందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో క్రయవిక్రయాల్లో భద్రత ఉంటుందని వివరించారు. మార్కెట్లో 100 సీసీ కెమెరాలు, లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ ఏనుమాముల పోలీస్ స్టేషన్ భవన మంజూరు కోసం త్వరలోనే సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా మార్కెట్ అధికారి కె.సురేఖ, కార్యదర్శి మల్లేశం, చాంబర్ ఆఫ్కామర్స్ వరంగల్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి, కార్యదర్శి మాడూరి వేదప్రకాశ్, జాయింట్ సెక్రటరీ సాగర్ల శ్రీనివాస్, కాటన్ సెక్షన్ అధ్యక్షుడు వీరారావు, గ్రేడ్–2 కార్యదర్శి రాము, సహాయ కార్యదర్శి అశోక్, శ్రీనివాస్, గులామ్ సర్వమున్నా, బాబురావు, కార్పొరేటర్లు అనిల్, సోమిశెట్టి ప్రవీణ్, మాజీ కార్పొరేటర్ రమేష్ పాల్గొన్నారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ -
జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్ తెచ్చిన ఘనత మాదే..
● ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ● జేఎన్ఎస్లో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభంవరంగల్ స్పోర్ట్స్: గత ప్రభుత్వం వరంగల్ క్రీడాభివృద్ధిని 20ఏళ్లు వెనక్కి తీసుకెళ్తే జిల్లాకు స్పోర్ట్స్ స్కూల్ తీసుకొచ్చిన ఘనత సీఎం రేవంత్రెడ్డి సర్కార్దే అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నెల రోజులపాటు కొనసాగనున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని శనివారం సాయంత్రం ఎమ్మెల్యే నాయిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం వేసవిలో 21 క్రీడాంశాల్లో శిక్షణ అందిస్తోందని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు 350 మంది శిక్షణకు పేర్లు నమోదు చేసుకోవడం అభినందనీయమన్నారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ కార్యదర్శి బైరబోయిన కై లాస్యాదవ్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు శ్యామల పవన్కుమార్, తోట శ్యామ్ప్రసాద్, దుబాకీ సంతోష్, ఎర్రగట్టు స్వామి, మర్కాల యాదిరెడ్డి, ఎ.సాంబయ్య, లిల్లీ ఫ్లోరెన్స్, ఎన్.శ్రీధర్, డీఎస్ఏ కోచ్లు పాల్గొన్నారు. -
వేల దరఖాస్తులు ఎల్–1లోనే.. స్పాట్ వెరిఫికేషనే సమస్య
సాక్షి ప్రతినిధి, వరంగల్: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) అమల్లో గ్రేటర్ వరంగల్తోపాటు ఉమ్మడి జిల్లాలో తీవ్ర జాప్యం నెలకొంది. 2020లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం 25శాతం రాయితీ ఇచ్చింది. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఎల్ఆర్ఎస్ కోసం ఫీజు చెల్లించారు. 2026 మార్చి నాటికి కూడా పూర్తిస్థాయి క్లియరెన్స్ లేకపోవడం దరఖాస్తుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ప్రభుత్వం మరోసారి లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 25 శాతం రాయితీ ఇస్తూ జూలై 31వరకు గడువు ఇచ్చింది. ఈసారైన ఆశించిన స్థాయిలో ముందుకు వస్తారా? ఆ మేరకు ఫైళ్లు క్లియరెన్స్కు నోచుకుంటాయా? అన్న చర్చ జరుగుతోంది. స్పాట్ వెరిఫికేషన్ లేక ‘బ్లాక్’... ఐదేళ్లుగా అపరిష్కృతం... ఫీల్డ్ స్థాయిలో స్పాట్ వెరిఫికేషన్ జరగకపోవడంతో వేలాది ఫైళ్లు ముందుకు కదలడం లేదు. అధికారులు రేపు, మాపు అంటూ నెలల తరబడి వాయిదా వేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఐదేళ్లయినా పూర్తిస్థాయిలో ఫైళ్లు పరిష్కారానికి నోచుకోలేదన్న ఫిర్యాదులున్నాయి. ‘గ్రేటర్‘ మున్సి పల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)తో పాటు ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా 1.58 లక్షల దరఖాస్తులు రాగా, ఇందులో 1.43 లక్షల మంది ఫీజు చెల్లించారు. ఇప్పటికీ కూడా 40శాతం ఫైళ్లు పెండింగ్లోనే ఉండగా.. రాయితీ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు. ప్రభుత్వం 25శాతం రాయి తీ ప్రకటించి ప్రజలను ప్రోత్సహించినా, క్లియరెన్స్ లేకపోవడంతో ఆ ప్రయోజనం వృథా అవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్–1లోనే ఎల్ఆర్ఎస్ లాక్... 2026లో మళ్లీ రాయితీ ప్రకటించినప్పటికీ, పాత దరఖాస్తులు క్లియర్ కాకపోవడం వల్ల కొత్త ప్రకటనపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం రాయితీతో భారీగా రుసుములు వసూలు చేసినప్పటికీ, వాటిలో సుమారు 40 శాతం దరఖాస్తులు ఇప్పటికీ ఎల్–1 దశలోనే పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్–1 నుంచి ఎల్–2, ఎల్–3 దశలకు ఫైళ్లు వెళ్లడంలో ఆలస్యం ప్రధాన సమస్యగా మారిందని అధికారులే చెబుతున్నారు. ప్రధానంగా మూడు శాఖల మధ్య కుదరని సమన్వయం కూడా దరఖాస్తుదారులకు శాపంగా మారుతుందంటున్నారు. అధికారులు మాత్రం నిబంధనల ప్రకారం దశల వారీగా క్లియరెన్స్ జరుగుతోందని, త్వరలో పరిష్కరిస్తామని చెబుతున్నారు.మొత్తం దరఖాస్తులు (2020): 1,58,265ఫీజు చెల్లించినవి: 1,43,121జీడబ్ల్యూఎంసీ పరిధిలో: 96,000మొత్తం పెండింగ్ దరఖాస్తులు: 40 శాతం పైగా క్లియరెన్స్ దశలు: ఎల్–1, ఎల్–2, ఎల్–3 పెండింగ్ స్టేజ్: ప్రధానంగా ఎల్–1 కీలక సమస్య: స్పాట్ వెరిఫికేషన్ ఆలస్యం మరోసారి రాయితీ.. 25% రిబేట్ ఇస్తూ ఉత్తర్వులు జూలై 31 వరకు గడువు... పాత దరఖాస్తుదారులకే చాన్స్ ఫైళ్ల పరిష్కారంపైనే అనుమానాలు.. గతంలో ఫీజు చెల్లించినవే అపరిష్కృతం ఇప్పటికీ పెండింగ్లో 40 శాతం దరఖాస్తులు ఐదేళ్లు గడిచినా పూర్తిస్థాయి క్లియరెన్స్ జరగనప్పటికీ తాజాగా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై 25శాతం రాయితీ మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ రాయితీ జూలై 31 వరకు ఉంటుంది. కొత్తగా అప్లై చేసే వారికి ఈ రాయితీ వర్తించదు. పాత దరఖాస్తుదారులకు మాత్రమే ప్రయోజనం. ఇదిలా ఉండగా గతంలో ఫీజు చెల్లించిన దరఖాస్తులే ఇంకా అపరిష్కృతంగా ఉండగా.. అందుకు అనేక కారణాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయకపోవడం, ఎఫ్టీఎల్(చెరువుల పరిధి), నిషేధిత భూముల వివాదాలు, పేర్లు, సర్వే నంబర్లలో పొరపాట్లు, ఫీల్డ్ వెరిఫికేషన్ ఆలస్యం తదితర కారణాలు చెబుతున్నారు. రాయితీ ఇవ్వడం కాదు.. స్పాట్ వెరిఫికేషన్కు ప్రత్యేక బందాలు ఏర్పాటు చేసి పెండింగ్ దరఖాస్తులను వేగంగా క్లియర్ చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఆన్లైన్ సమస్యలు పరిష్కరించి, పారదర్శకత పెంచాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. -
ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలందించాలి
హన్మకొండ చౌరస్తా: ఆస్పత్రికి వచ్చే గర్భిణి, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్బాజ్పాయ్ అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం శనివారం ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్హాల్లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్.. ఆస్పత్రి అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ బిల్లులు, సర్జికల్ ఐటమ్స్, మెడిసిన్స్, ఆస్పత్రి నిర్వహణ, బడ్జెట్, కావాల్సిన వనరులు, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అన్ని మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రధాన భవనానికి రంగులు వేసేందుకు ప్రతిపాదనలు అందించాల ని సూచించారు. వెయిటింగ్ హాల్, బిల్డింగ్ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని సిద్ధమైతే రోగుల సహా యకులకు ఉపయోగపడుతుందని, ఆరోగ్యశ్రీ కేసుల సంఖ్య పెరిగేలా చూడాలని సూచించారు. సమావేశంలో జీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ అప్పయ్య, అడిషనల్ డీఎంఈ రాజలింగం, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, ఐఎంఏ బాధ్యులు డాక్టర్ రాధిక, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఇకనుంచి రెవెన్యూ డివిజన్ స్థాయిలోనూ సమర్థంగా అమలు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న మాదిరిగా రెవెన్యూ (ఆర్డీఓ) కార్యాలయాల్లోనూ నిర్వహించాలని సూచించారు. ప్రజలనుంచి దరఖాస్తులను స్వీకరించి ఆన్లైన్లో నమోదు చేసి 30 రోజుల్లో పరిష్కారమయ్యే విధంగా చూడాలని స్పష్టం చేశారు. -
డీటీఎఫ్ వరంగల్ జిల్లా నూతన కార్యవర్గం
కాళోజీ సెంటర్: డీటీఎఫ్ వరంగల్ జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి తెలిపారు. అధ్యక్షుడిగా డి.మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షులుగా డి.రవీందర్, ఎస్.సుధారాణి, డి.కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా ఎ.గోవిందరావు, కా ర్యదర్శులుగా టి.సూరయ్య, ఎం.రామస్వామి, టి.సదానందచారి, కె.నర్సింహులను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా బి.జాన్నాయక్, టి.అరుణాదేవి, ఆర్.రామిరెడ్డి, కె.కొ మ్మ య్య, డి.శ్రీనివాస్, ఫ్రాన్సిస్ జేవియర్, ఆడిట్ కమి టీ కన్వీనర్గా పి.వెంకటేశ్వర్రావు, సభ్యులుగా అశోక్, భద్రయ్యను ఎన్నుకున్నటు, నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. -
పలె ్లవింపు!
‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం భువన ఘోషకు వెర్రిగొంతుక విచ్చిమోశాను’ అని శ్రీశ్రీ చెప్పినట్లుగా హనుమకొండలోని ఐనవోలు మండలంలోని ఉడుతగూడెం సైతం దేశాభివృద్ధిలో భాగమవుతోంది. గ్రామస్తులకు మౌలిక వసతులు, ఆహ్లాదకర వాతావరణం, చక్కని జీవనాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామ పంచాయతీలకు ఏటా అందించే అచీవర్ అవార్డుకు గ్రామం ఎంపికైంది. వెల్లివిరిస్తున్న ఆ పల్లైపె ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. ఐనవోలు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని ఉడుతగూడెం గ్రామ పంచాయతీ స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో అచీవర్ అవార్డు సాధించింది. ఉడుతగూడెంలో సుమారు 800 మంది జనాభా నివసిస్తున్నారు. 494 మంది ఓటర్లున్నారు. 180 ఇళ్లు ఉండగా, ప్రతీ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతతో పాటు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. ఆరు బయట మల, మూత్ర విసర్జన లేని (ఓడీఎఫ్) గ్రామంగా పేరుపొందింది. గ్రామంలో స్వయం సమృద్ధిగా సీసీ రోడ్లు నిర్మించుకున్నారు. మిషన్ భగీరథలో భాగంగా ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్తో స్వచ్ఛమైన తాగునీరు అందుతోంది. విద్యుత్ కనక్షన్లున్నాయి. ఇంటికో పాడి గేదె ఉండగా.. గోపాలమిత్ర కేంద్రం ఏర్పాటు చేసుకుని పశువుల ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకున్నారు. గ్రామంలో పచ్చదనం వెల్లివిరిసేలా నర్సరీ ఏర్పాటు, మొక్కల పెంపకం చేపట్టారు. 100 శాతం పన్నులు చెల్లించి గ్రామస్తులు పల్లె అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, తడిపొడి చెత్త సేకరణ తదితర పనుల ని ర్వహణలో ముందుంది. ఈ మేరకు ఉడుతగూడెంలో పర్యటించిన అప్పటి కేంద్ర బృందం అన్ని అంశాలను పరిశీలించి స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాల విభాగంలో 92.5 స్కోర్ ఇచ్చింది. దీంతో ఏ+ గ్రేడ్ సాఽధించి అచీవర్ అవార్డుకు ఎంపికై ంది. సంతోషకరం..గ్రామంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి. వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, క్రీడా ప్రాంగణంతో పాటు నర్సరీ ఏర్పాటైంది. అయితే గతంలోనే ఓడీఎఫ్ గ్రామంగా ఉన్నది. అలాగే ఇంటికో ఇంకుడుగుంత ఉండగా.. ప్రతీ ఇంటికి నల్ల కనెక్షన్ ఉంది. నీరు, విద్యుత్ సమస్యలు లేవు. గ్రామంలో సరిపడా అంతర్గత సీసీ రోడ్లు ఉన్నాయి. ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక కావడం సంతోషదాయకం. – తోట రాజేందర్, గ్రామస్తుడు అచీవర్ అవార్డుకు హనుమకొండ ఐనవోలు మండలంలోని ఉడుతగూడెం ఎంపిక స్వయం సమృద్ధి, మౌలిక వసతుల కల్పన అంశాల్లో ఎంపిక -
జనరల్ సర్జన్ అవుతా..
నేను బిహార్ నుంచి వచ్చినప్పటికీ కేఎంసీ నాకు ఎంతో నేర్పింది. ఇక్కడ పేషెంట్లకు ఇబ్బందవుతుందని తెలుగు భాష నేర్చుకున్నా. మా నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్సై అయినప్పటికీ నన్ను డాక్టర్గా చూడాలనుకున్నారు. చదువుతో పాటు ఆటల్లోనూ రాణించా. తోటి విద్యార్థులు ఇక్కడ కుటుంబ సభ్యుల్లా అందరం కలిసి చదువున్నాం. కేఎంసీలో జీవితం విలువ తెలుసుకున్నా. భవిష్యత్లో ఎలా ఉండాలో ఇక్కడే శిక్షణ పొందినట్లుగా ఉంది. జనరల్ సర్జన్ అవ్వాలన్నది నా డ్రీమ్. – డాక్టర్ అంకిత్కుమార్, గోల్డ్ మెడలిస్ట్, బిహార్ -
ఆర్టీఎం పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
● పదవీ విరమణ చేసిన అధికారులకు అవకాశం హన్మకొండ అర్బన్: హైదరాబాద్లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇనిస్టిట్యూట్ సూచనల మేరకు హనుమకొండ ట్రైనింగ్ సెంటర్కు రీజినల్ ట్రైనింగ్ మేనేజర్ల (ఆర్టీఎం) ఎంపిక కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. ఇటీవల పదవీ విరమణ చేసిన ఆర్డీఓ, పీడీ, డీఆర్డీఏ, డీడీ కేడర్కు చెందిన అధికారులు, పూర్వ వరంగల్ జిల్లాలో స్థిరనివాసం ఏర్పాటుచేసుకున్న వారు తమ దరఖాస్తులను శనివారం నుంచి 4వ తేదీ వరకు హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించవచ్చని పేర్కొన్నారు. బోధన, శిక్షణపై ఆసక్తి, నిబద్ధత కలిగి ఉండాలని తెలిపారు. సేవా రికార్డు నిర్దోషంగా ఉండడంతోపాటు కంప్యూటర్లపై తగిన పరిజ్ఞానం ఉండాలని కూడా స్పష్టం చేశారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.30వేల పారితోషికం అందజేయనున్నట్లు తెలిపారు. వివరాల కోసం కలెక్టరేట్ పరిపాలన అధికారి, హనుమకొండను సంప్రదించవచ్చని, ఫోన్ నంబర్ 92475 86909 ద్వారా సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం జనగామ రూరల్ : వరంగల్– హైదరాబాద్ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యవసాయ రైతు మృతిచెందాడు. మండలంలోని పెంబర్తి గ్రామానికి చెందిన రైతు మేకల శ్రీనివాస్(55) శుక్రవారం తన ద్విచక్రవాహనంపై వ్యవసాయ బావి వద్దనుంచి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో బైపాస్ రోడ్డు క్రాస్ చేస్తుండగా హనుమకొండ వైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అదే కారులో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ట్రాక్టర్పై నుంచి జారిపడి బాలుడి మృతి తొర్రూరు రూరల్: ట్రాక్టర్ పైనుంచి జారిపడి బాలుడు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై జి.ఉపేందర్ తెలిపిన వివరాల మేరకు.. మానుకోట జిల్లా తొర్రూరు మండలంలోని కంఠాయపాలెం గ్రామానికి చెందిన చెట్టుపల్లి మహేష్, స్వరూప దంపతుల కుమారుడు ఆరుష్ అయాన్ (3) ట్రాక్టర్ పైకి ఎక్కించమని మారాం చేయగా తండ్రి ఎక్కించాడు. తండ్రి డ్రైవర్ సీట్లో ఉండగా కుమారుడు పక్కన కూర్చుని ఆడుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్పైనుంచి జారి సీసీ రోడ్డుపై పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయమై స్పృహ కోల్పోయాడు. తండ్రి బైక్పై ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
మోదీ సభను విజయవంతం చేయాలి
వరంగల్ చౌరస్తా/ఖిలా వరంగల్: హైదరాబాద్లో మే 10న జరిగే ప్రధాని నరేంద్ర మోదీ జనాగ్రహ సభను విజయవంతం చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపెల్లి వెంకటరమణారెడ్డి కోరారు. వరంగల్ హంటర్ రోడ్డులో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షతన సత్యం కన్వెన్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడోసారి ప్రధానిగా ఎనికై న తర్వాత మొదటిసారి హైదరాబాద్కు వస్తున్నారని, ఇక్కడ అధికారం లేకపోయినా తెలంగాణ అభివృద్ధి కోసం రూ.7,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లును విగిపోయే విధంగా చేయడం సిగ్గు చేటన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని అబద్దపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. గ్రీన్ ఫీల్డ్, యాదాద్రి గుట్టకు ఎంఎంటీఎస్, వరంగల్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాకతీయ మెగా టెక్స్ టైల్స్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీకి నిధులు కేటాయించినట్లు గుర్తు చేశారు. తెలంగాణలో గ్రామ సచివాలయాలకు వీబీజీరామ్ ద్వారా నిధులు మంజూరు చేశారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మహిళల గోస తగులుతుందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీలు జనార్ధన్ రెడ్డి, వన్నాల శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, రాష్ట్ర అధికార ప్రతినిధులు దశమంతరెడ్డి, వన్నాల వెంకటరమణ, చాడ శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల అశోక్ రెడ్డి, కంభపాటి పుల్లారావు, మల్లాడి తిరుపతి రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, జలగం రంజిత్, నరేష్, హరిశంకర్, ప్రభాకర్, రాణాప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి -
పేదల గుండెకు భరోసానవుతా..
మాది కరీంనగర్లోని జ్యోతినగర్. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి చవివా. మూడు గోల్డ్ మెడల్స్ సాధించా. ఐదున్నరేళ్లు కష్టడి పడి, పరీక్షల సమయంలో పన్నెండు గంటలు చదివా. పీజీ పూర్తి చేసిన తర్వాత సూపర్స్పెషలిస్ట్ కోర్సు చదివి, కార్డియాలజిస్ట్ కావాలని ఉంది. పేద ప్రజల గుండెలను భద్రంగా ఉంచుకోవాలని చెప్పడానికి అవకాశం రావాలని కోరుకుంటున్నా. జీవితంలో స్టేబుల్గా, బ్యాలెన్స్గా ఎప్పుడు ఎలా ఉండాలో కేఎంసీ నేర్పింది. – డాక్టర్ శివకోటి రోహన్ రాయ్, గోల్డ్ మెడలిస్ట్ కరీంనగర్ -
బాలలకు భరోసా ఎంతో అవసరం
కాశిబుగ్గ: ప్రస్తుత పరిస్థితుల్లో బాలలకు భరోసా కల్పించడం ఎంతో అవసరమని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా చైల్డ్ సేఫ్టీ అండ్ ప్రొడక్షన్– డ్రగ్స్ నో అనే అంశంపై ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో మహిళా అభివృద్ది, శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖల సమన్వయంతో శుక్రవారం ఓ సిటీ స్టేడియంలో బాలభరోసా కార్యక్రమం ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. బాలల భరోసా కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సూ చించారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి పౌష్టికాహారం తీసుకోవా లని పేర్కొన్నారు. సరైన పోషణ ఉన్నప్పుడే పిల్లలు శారీరక, మానసిక ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు. బాలల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, కార్పొరేటర్ ఓని భాస్కర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ ఆరోగ్య శిబిరం వద్ద ఉన్న ప్రత్యేక అవసరాల ఉన్న పిల్లల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వారికి తగిన వైద్య చికిత్సలు అందే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపును ప్రారంభించారు. వివిధ రకాల క్రీడలను తిలకించారు. ఈసందర్భంగా మంత్రి కొండా సురేఖతోపాటు కలెక్టర్ సత్యశారద క్రికెట్ ఆడారు. అభివృద్ధిలో కార్మికుల శ్రమ కీలకం ఖిలా వరంగల్: అభివృద్ధిలో కార్మికుల శ్రమ ఎంతో కీలకమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి సురేఖ పేర్కొన్నారు. వరంగల్ లక్ష్మీపు రం కూరగాయల మార్కెట్లో హమాలీ యూనియ న్ నాయకుడు సురేశ్ అధ్యక్షతన శుక్రవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిఽథి గా మంత్రి హాజరై కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ ఆర్డీఓ సుమ, మార్కెట్ కార్యదర్శి మల్లేశం, కార్మిక నాయకులతో కలిసి జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికులకు ప్రతినెల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం రూ.50 వేలు మందుల కు మంజూరు చేస్తామని హమీ ఇచ్చారు. సంఘటి త కార్మికులకు రూ.549తో పోస్టాఫీస్ ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తోందని పేర్కొన్నారు. మార్కెట్ అధికారులు 1,325 మంది కార్మికులకు డబ్బులు చెల్లించి బీమా సౌకర్యం కల్పిస్తారని ఆమె వివరించారు. కార్మికుల విశ్రాంతికి, భోజనాలు చేయడానికి రూ.60 లక్షలతో కమ్యూనిటీహాల్ నిర్మాణానికి పంపిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయన్నారు. అనంతరం మార్కెట్లో వ్యాపారు లతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అనిల్, నాయకులు గోపాల నవీన్రాజు, మీసాల ప్రకాశ్, సోమిశెట్టి ప్రవీణ్, కొత్తపల్లి శ్రీనివాస్, జారతి రమేశ్, సత్యనారాయణ, వర్తక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జారతి శ్రీనివాస్, మున్నాభాయ్, వేణుగోపాల్, చందర్, శ్రీనివాస్, సాంబయ్య పాల్గొన్నారు. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ -
ప్రాణం తీసిన భూ పంచాయితీ
కురవి: అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూమి పంచాయితీ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ ఘటనకు సంబంధించి కురవి ఎస్సై సతీష్ తెలిపిన వివరాలు ప్రకారం.. మానుకోట జిల్లా కురవి మండలంలోని నేరడ గ్రామానికి చెందిన చందు శ్రీను, చందు లింగయ్య(52) అన్నదమ్ములు. వీరి మధ్య కొంతకాలంగా భూ పంచాయితీ కొనసాగుతోంది. ఈక్రమంలో లింగయ్య గత నెల 22న కురవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం 24వ తేదీన పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరుగుతున్న క్రమంలో లింగయ్యపై అతని అన్న శ్రీను కుమారులతోపాటు మరికొందరు దాడిచేశారు. దీంతో తీవ్రగాయాలైన లింగయ్యను మానుకోటలోని ఓ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు.● తమ్ముడిపై అన్న, అతడి కుమారుల దాడి ● చికిత్స పొందుతూ మృతి ● ఐదుగురిపై కేసు నమోదు -
రేవంత్ది దుష్టపాలన
హన్మకొండ: రేవంత్ది నీచ, దుష్టపాలన అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనచారి విమర్శించారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు అని... రేవంత్ పాలనలో రెండు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన చరిత్ర సమస్తం హీనం అని అన్నారు. కేసీఆర్ కొట్లాడి తెలంగాణ సాధించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారన్నారు. కాంగ్రెస్ తన పాత చరిత్రను పునరావృతం చేస్తోందని తూర్పారబట్టారు. సాగు, తాగు నీటిఎద్దడి ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో సీఎం, మంత్రులు హామీల అమలు, పాలన గాలికొదిలేశారని విమర్శించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రైతు ద్రోహి రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. రైతుల పక్షాన కేటీఆర్ని తీసుకొచ్చి రైతు సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది కేసీఆర్ రైతు సభ నిర్వహిస్తామన్నారు. ఒక్క ఎమ్మెల్యే అయినా కొనుగోలు కేంద్రాలను సందర్శించారా.. అని ప్రశ్నించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాతూ.. కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టేందుకు మే 6న వరంగల్లో బీఆర్ఎస్ రైతు సదస్సు నిర్వహిస్తుందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, డీఎస్ రెడ్యా నాయక్, దాస్యం వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, వాసుదేవ రెడ్డి, జోరిక రమేష్, బడే నాగజ్యోతి, లక్ష్మణ్ రావు, హరి రమాదేవి, పులి రజినీకాంత్, నయీముద్దీన్, రాజ్ కిషోర్, జానకిరాములు, శ్యామ్ కుమార్ పాల్గొన్నారు. రైతు సదస్సు సభాస్థలి పరిశీలన వరంగల్ మహానగరంలో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సదస్సు కోసం హనుమకొండ హంటర్ రోడ్డులో స్థలాన్ని శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి -
ఉత్తమ ఫలితాలకు ‘సాక్షి’
దేవరుప్పుల : ఇటీవల విడుదలైన పదో తరగతి వార్షిక ఫలితాల్లో అనేకమంది విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించారు. విద్యార్థుల విజయంలో సాక్షి యాజమాన్యం అందించిన మెటీరియల్ ఎంతగానో దోహదపడిందని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. సాక్షి మెటీరియల్తో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ఈసందర్భంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సులభతరంగా మెటీరియల్.. పదో తరగతి విద్యార్థులకు గణితం, ఫిజికల్ సైన్స్ పాఠ్యాంశాలపై కొంత ఆందోళన ఉంటుంది. ఈ భయాన్ని పోగొట్టేందుకు సాక్షి దినపత్రిక ప్రముఖ విద్యానిపుణులు, సీఎస్ఆర్ సంస్థ సౌజన్యంతో అత్యంత సులభమైన పద్ధతిలో మెటీరియల్ రూపొందించి విద్యార్థులకు అందించడంతో వారు ఉత్తమ మార్కులు సాధించారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు హైస్కూళ్లకు చెందిన అనేక మంది విద్యార్థులకు దాతల సాయంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఉచితంగా మెటీరీయల్ అందజేశారు. విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణతోపాటు సాక్షి దినపత్రిక పదో తరగతి పాఠ్యాంశాలపై సమగ్ర సమాచారం, మోడల్ పేపర్లను ప్రచురించింది. దీంతో విద్యార్థులు గతంకంటే మెరుగైన ఫలితాలను సులభంగా సాధించగలిగారు. టెన్త్ విద్యార్థులకు మెటీరియల్ అందించిన సాక్షి యాజమాన్యం వినియోగించుకున్న విద్యార్థులు మెరుగైన మార్కులతో ఉత్తీర్ణత -
ప్రజాపాలన – ప్రగతి సభలకు సకల ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం జిల్లాలో నియోజకవర్గ స్థాయి సమావేశాలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్నుంచి రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు.. ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలు, నీట్, ధాన్యం సేకరణ, డివిజనల్ స్థాయిలో ప్రజావాణి నిర్వహణ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. నియోజకవర్గ సభలు ఉదయమే.. వీసీ అనంతరం కలెక్టర్ చాహత్ బాయ్పాయ్ జిల్లా అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఉదయం వేళలోనే సభలు నిర్వహించాలని సూచించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సభ హనుమకొండ కలెక్టరేట్లో, పరకాల సభ అక్కడి మహాదేవ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సభలకు హాజరయ్యే ప్రజలకు తాగునీరు, కూర్చునే సదుపాయం, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 4 నుంచి 9 వరకు రైతు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ సక్రమంగా సాగేందుకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రతీ సోమవారం పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఆదివారం జరగనున్న నీట్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు నిర్వహించే స్వీయ గణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రవి, జిల్లా రెవెన్యూ అధికారి సత్యపాల్ రెడ్డి, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, డీసీఓ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైవేలు, ఆర్ఓబీల పనులపై సమీక్ష నయీంనగర్: హనుమకొండ ‘కుడా’ కార్యాలయంలో జాతీయ రహదారులు, రైల్వే, ఆర్అండ్బీ, ‘కుడా’ అధికారులతో జిల్లాలోని జాతీయ రహదారులు, ఆర్ఓబీల పనులపై కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణాపురం వద్ద ఉన్న ఆర్ఓబీ, బావుపేట, కోమటిపల్లి ఆర్ఓబీల పెండింగ్ అనుమతులపై సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. కరుణాపురం ఆర్ఓబీ అలైన్మెంట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో జాతీయ రహదారుల శాఖ మేనేజర్ లింగయ్య, సికింద్రాబాద్ రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ కౌశల్ పాండే, అధికారి దేవరాజ్, ఆర్అండ్బీ ఈఈ సురేశ్ బాబు, ‘కుడా’ సీపీఓ అజిత్ రెడ్డి, భూ సేకరణ విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయిలో నేడు సమావేశాలు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు
నిబంధనలు కఠినం.. ● అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, 4x6 సైజ్ ఫొటో ఒకటి, ఏదైనా గుర్తింపుకార్డు వెంట తీసుకునిరావాలి. ● పెన్ను, పెన్సిల్ తీసుకురావొద్దు. వీటిని పరీక్ష కేంద్రాల్లోనే అందజేస్తారు. ● బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారు. ● మహిళలు బంగారు నగలు పెట్టుకొని వస్తే కేంద్రం వద్ద తీసివేయిస్తారు. ● కాళ్లకు షూ ధరించకూడదు. జీన్స్లాంటివి కాకుండా ఇతర సాధారణ దుస్తులు ధరించి రావాలి. ● పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్స్ను తీసుకురావచ్చు. ● డయాబెటిక్ కలిగిన అభ్యర్థులుంటే వారు పండ్లు (అరటి, యాపిల్) తీసుకొని రావచ్చు. ● ప్రతి గదిలో, మెయిన్ గేట్వద్ద అందరికీ కనిపించేలా గడియారాలు ఏర్పాటు చేస్తారు. ఉమ్మడి జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఇలా.. ● వరంగల్ నిట్లో రెండు సెంటర్లు, హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీకళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్), వరంగల్లో సీకేఎం కళాశాల, ఎల్బీ కళాశాల, కేంద్రీయ విద్యాలయం, యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల, యూనివర్సిటీ పీజీ కళాశాల. ● జయశంకర్ భూపాలపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో), ప్రభుత్వ జూనియర్ కళాశాల. ● జనగామలోని ఏవీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెంబర్తిలోని ఎంజేపీ బాలికల విద్యాలయం. ● మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోగల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల. ● మహబూబాబాద్లో నీట్ నోడల్ ఆఫీసర్గా కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ ముఖేశ్కుమార్ వ్యవహరించనున్నారు. రేపు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలు ఉదయం 11 గంటల నుంచే సెంటర్లలోకి అనుమతి మధ్యాహ్నం 1–30 గంట తర్వాత నో ఎంట్రీ హాజరుకానున్న 6,016 మంది అభ్యర్థులుజిల్లాల వారీగా పరీక్షకేంద్రాలు, అభ్యర్థుల వివరాలు ఇలా.. జిల్లా సెంటర్లు అభ్యర్థులు హనుమకొండ, వరంగల్ 09 4,600 జయశంకర్ భూపాలపల్లి 02 374 జనగామ 02 566 మహబూబాబాద్ 01 476 -
శనివారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2026
ఈ చిత్రంలో కట్టెల పొయ్యిపై మిర్చీ బజ్జీలు కాలుస్తున్న మహిళ పేరు తేజావత్ మంగమ్మ. హనుమకొండలో ఈమె బజ్జీల బండి పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తోంది. ఇదివరకు తక్కువ ధరలో గ్యాస్ తీసుకుని వ్యాపారం సాగించేది. యుద్ధం నేపథ్యంలో గ్యాస్ దొరక్కపోవడం, ఒక్కసారిగా గ్యాస్ ధర పెరగడంతో కట్టెలపొయ్యి వాడకం తప్పనిసరైందని ఆమె చెప్పింది.హన్మకొండఅర్బన్: కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గృహ వినియోగ గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది మరింత భారంగా మారే పరిస్థితి నెలకొంది. ఇంత వరకు రూ.2,350గా ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్, ప్రస్తుతం రూ.1,000 పెరగడంతో రూ.3,350కి పెరిగింది. దీంతో వ్యాపారులను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టినట్లయ్యింది. యుద్ధ ప్రభావం కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం, ధరల పెంపు ‘పిడుగుపాటు’గా మారిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధివ్యాపారులు కుదేలు గ్యాస్పై ఆధారపడి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నవారు ధర పెంచడంతో కుదేలయ్యే పరిస్థితి ఏర్పడింది. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, కట్లెట్ బండ్లు, టీ స్టాల్స్, ఇడ్లీ బండ్లు ఇతర వీధి వ్యాపారులకు ఇది భారంగా మారింది. వ్యాపారాలు నడపడం కష్టమవుతోందని పలువురు చెబుతున్నారు. గతంలోనూ ఇంత మొత్తంలో ఒక్కసారిగా ధరలు పెంచిన సందర్భాలు లేవని, కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని వారు కోరుతున్నారు. గృహ వినియోగంపై దెబ్బ కమర్షియల్ సిలిండర్ ధరల పెంపు ప్రభావం గృహ వినియోగంపైనా పడే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికే విచ్చలవిడిగా అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాలు ఏర్పడిన నేపథ్యంలో, గృహ వినియోగ సిలిండర్లను దొడ్డి మార్గంలో కమర్షియల్ అవసరాలకు మళ్లించే ప్రమాదం ఉంది. దీంతో కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉంది. అక్రమాలకు అడ్డుకట్ట ఏది? గ్రేటర్ వరంగల్లో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా విచ్చలవిడిగా సాగుతున్నప్పటికీ పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గృహ వినియోగ సిలిండర్ అధికారికంగా ధర రూ.984గా ఉండగా, బ్లాక్ మార్కెట్లో రూ.1,800 నుంచి రూ.2,000 వరకు విక్రయిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడంతో, గృహ వినియోగ సిలిండర్లను అక్రమంగా వినియోగించే అవకాశం మరింత పెరిగే అవకాశం ఉంది. అప్పుడప్పుడూ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ, కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హనుమకొండ జిల్లాలో గ్యాస్ గణాంకాలు ఇలా.. గ్యాస్ ధర పెంచడంతో వ్యాపారుల విలవిల కమర్షియల్ గ్యాస్ ధర ఇదివరకు 2,350 రూ.1,000 పెంపుతో 3,350 హోటల్ నిర్వాహకులు రేట్లు పెంచే అవకాశం గృహ వినియోగంపైనా ప్రభావం కమర్షియల్ సిలిండర్లు: 2,622గృహ వినియోగ సిలిండర్లు: 4,15,359గ్యాస్ ఏజెన్సీలు: 18 వరంగల్ జిల్లాలో..గ్యాస్ ఏజెన్సీలు : 16డొమెస్టిక్ కనెక్షన్లు : 3,15,056కమర్షియల్ కనెక్షన్లు : 1,452 -
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి
డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి కాళోజీ సెంటర్: ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. హనుమకొండలోని లష్కర్బజార్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన డీటీఎఫ్ వరంగల్ జిల్లా శాఖ ఐదో వార్షిక కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్ కేటాయించకుండా విద్యారంగంలో మార్పులు తీసుకురావడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన విద్యాకమిషన్ నివేదిక ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేలా లేదని, ప్రైవేట్ విద్య సంస్థలను పెంచి పోషించేలా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు విషయంలో స్పష్టత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావ బాబు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 5న జిల్లా కేంద్రాల్లో నిర్వహించే దీక్షలను జయప్రదం చేయాలని కోరారు. డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.యాకయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకుడు డాక్టర్ ఎం. గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.గోవిందరావు, జిల్లా నాయకులు డి.మహేందర్రెడ్డి, ఎస్.సుధారాణి పాల్గొన్నారు. -
‘ప్రత్యేక’ పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి
కాశిబుగ్గ: ప్రత్యేక అవసరాలున్న పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని హనుమకొండ వైద్యారోగ్యశాఖ అధికారి ఎ.అప్పయ్య సూచించారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చైల్డ్ సేఫ్టీ వీక్లో భాగంగా.. ఎంజీఎంలో బాల భరోసా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్ చంద్రారెడ్డి, ఎంజీఎం ఆర్ఎంఓ మధుకర్ యాదవ్, జిల్లా సంక్షేమాధికారి ఎం.విశ్వజ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి జ్ఞానేశ్వర్, హనుమకొండ జిల్లా ఆర్బీఎస్కే నోడల్ అధికారి బి.దుర్గాప్రసాద్, సీడీపీఓలు, ఆర్బీఎస్కే టీం వైద్యులు, డీ ఈఐసీ సిబ్బంది, సూపర్వైజర్లు పాల్గొన్నారు. కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే పిట్ లైన్లను శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ (డీఆర్ఎం) గోపాలకృష్ణన్ తనిఖీ చేశారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో అధికారుల బృందంతో కలిసి డీజిల్ షెడ్డు వద్ద రైలు దిగి పిట్ లైన్లను తనిఖీ చేశారు. రైళ్ల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఆర్ఎం డీజిల్ కాలనీలోని రైల్వే కమ్యూనిటీ హాల్, రైల్వే చిల్డ్రన్స్ పార్కును తనిఖీ చేశారు. ఈనెల 10న ప్రధాన మంత్రి మోదీ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వర్చువల్లో ప్రారంభించనున్న నేపథ్యంలో.. రైల్వే కమ్యూనిటీ హాల్లో ఉండేందుకు కావాల్సిన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. అనంతరం ప్రత్యేక రైలులో డీఆర్ఎం కాజీపేట మీదుగా నిజామాబాద్కు తనిఖీల నిమిత్తం వెళ్లారు. ఈ తనిఖీల్లో డీఆర్ఎం వెంట రైల్వే అధికారులు, రైల్వే నాయకులు పాల్గొన్నారు. వరంగల్ క్రైం: పోలీసుల వద్దకు వెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏసీపీలుగా పదోన్నతి పొందిన గొర్ల సీతారెడ్డి, బోలగాని శ్రీనివాస్గౌడ్, సార్ల రాజు శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ను సీపీ క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ గౌరవ మర్యాదలు పెంపొందించేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. కేయూ క్యాంపస్: ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాల సాధనలో నైపుణ్యాలే కీలకపాత్ర పోషిస్తాయని కేయూ వీసీ ప్రతాప్రెడ్డి అన్నారు. కేయూలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో వివిధ బ్రాంచ్ల ఫైనల్ ఇయర్ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లలో వివిధ ఉద్యోగాలు సాధించిన సందర్భంగా.. శుక్రవారం పరిపాలనా భవనంలోని సెనేట్హాల్లో అభినందన సభ నిర్వహించారు. సుమారు 250 మందిని అభినందించారు. కేయూ రిజి స్ట్రార్ రామచంద్రం, ఆ కళాశాల ప్రిన్సిపాల్ భిక్షాలు, ఓఎస్డీ వెంకట్రామ్రెడ్డి, కళాశాల ప్లేస్మెంట్ అధికారి బొల్లం కిరణ్, పాలకమండలి సభ్యులు చిర్రరాజు పాల్గొన్నారు. రామన్నపేట: కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ అయూబ్ శుక్రవారం తన జన్మదినం సందర్భంగా హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ను వేర్వేరుగా కలిశారు. తనకు ఫోన్ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డికి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య,శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. -
కాజీపేట అభివృద్ధికి కట్టుబడి ఉన్నా..
ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కాజీపేట: వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి ముఖ ద్వారంగా ఉన్న కాజీపేట పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయడానికి కట్టుబడి పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. కాజీపేట 61వ డివిజన్ వడ్డేపల్లి ట్యాంక్బండ్పై రూ.34.65కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు శుక్రవారం మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. పట్టణంలోని వడ్డేపల్లి ట్యాంక్బండ్ పర్యటకులను ఆకర్షించేలా సుందరీకరణ పనులు త్వరగా అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దాస్యం అభినవ్భాస్కర్తో పాటు మున్సిపల్, ‘కుడా’ అధికారులు పాల్గొన్నారు. ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో అధిక మార్కులు సాధించిన హనుమకొండ జిల్లాలోని 17 ప్రభుత్వ, జెడ్పీ, కేజీబీవీ విద్యార్థులను శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, అధికారులు సత్కరించారు. – హన్మకొండ అర్బన్ -
7న ఉప ముఖ్యమంత్రి పర్యటన
హన్మకొండ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 7న స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటనలో భాగంగా విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయన్నారు. వేలేరు మండలం పీచరలో 132/33 కేవీ సబ్ స్టేషన్, చిల్పూరు మండలం కొండాపూర్, జఫర్గడ్ మండలం సాగరం, రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామాల్లో 33/11 కేవీ సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవం, జఫర్గడ్ మండలం కేంద్రంలో 132/33కేవీ సబ్ స్టేషన్, చిల్పూరు మండలం లింగంపల్లి, పల్లగుట్ట, నష్కల్ గ్రామాల్లో 33/11 కేవీ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా జఫర్గడ్లో 5 వేల మందితో బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలివ్వాలని సీఎండీ వరుణ్ రెడ్డికి సూచించారు. జఫర్గడ్ 132/33కేవి సబ్ స్టేషన్కు సంబందించిన భూ కేటాయింపునకు ట్రాన్స్ కో అధికారులు వెంటనే చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలన్నారు. ఈ మేరకు సీఎండీ వరుణ్ రెడ్డి సంబంధిత అధికారులకు సభ, భూ కేటాయింపుపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. లోటుపాట్లు లేకుండా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేసి ఉప ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. -
నాణ్యమైన విత్తనాలను విక్రయించాలి
● వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఖిలా వరంగల్: విత్తన డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలని, నకిలీ విత్తనాలు విక్రయించినా, నిబంధనలు ఉల్లంఘించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి హెచ్చరించారు. వరంగల్ శివనగర్లోని సాయి కన్వెన్షన్ హాల్లో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. డీలర్లు ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ మాట్లాడుతూ నాసిరకం విత్తనాలు విక్రయించినా, నకిలీ బిల్లులు ఇచ్చినా, లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. టాస్క్ఫోర్స్, తనిఖీ బృందాలు నిరంతరం విత్తన షాపులను తనిఖీ చేస్తాయని పేర్కొన్నారు. ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ నిర్మల, వర్ధన్నపేట ఏడీఏ నర్సింగం, ఇన్చార్జ్ ఏడీఏ నర్సంపేట నగేశ్, ఏడీఏ టెక్ కల్పన, ఏసీపీ వెంకటేశ్, ఏఎంవీఐ ఉదయ్కుమార్, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజర్ శ్రీనివాస్, ఎఫ్సీఓ ల్యాబ్ ఏడీఏ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఏఓలు రవీందర్రెడ్డి, విజ్ఞాన్, డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్లు వెంకటేశ్వర్లు, డీలర్లు పాల్గొన్నారు. -
క్షేత్రస్థాయి సిబ్బందికి రక్షణ కల్పించాలి
హన్మకొండ: క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న విద్యుత్ సిబ్బందికి రక్షణ కల్పించాలని తెలంగాణ విద్యుత్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ పి.శ్రీనివాస్, కన్వీనర్ మన్నె శశికుమార్ టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్న వా రిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఒక ప్రకట నలో కోరారు. టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ రూరల్ డివిజన్ పరిధి కాపుల కనపర్తి సెక్షన్ రామచంద్రాపురంలో బకాయి విద్యుత్ బిల్లుల వసూళ్లకు వెళ్లిన విద్యుత్ సిబ్బందిని ఓ వినియోగదారుడు భయభ్రాంతులకు గురి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. జేఎల్ఎం జన్ను మధుమోహన్ ఇంటికి వెళ్లి బకాయిదారు డు అసభ్యపదజాలంతో దూషించి కుటుంబీకులను భయభ్రాంతులకు గురి చేశాడని వివరించారు. అంతటితో ఆగకుండా మధుమోహన్పై దాడి చేసేందుకు లో హిత, కాపుల కనపర్తి సబ్ స్టేషన్లకు వెళ్లి వెతికాడని, కనిపించకపోవడంతో సబ్ స్టేషన్లోని సిబ్బందిని బెదిరించాడని తెలిపారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేఎల్ఎం మధుమోహన్ కుటుంబానికి నైతిక మద్దతు ఇవ్వడంతో పాటు రక్షణ కల్పించాలన్నారు. దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి తెలంగాణ విద్యుత్ జేఏసీ విజ్ఞప్తి -
కుడాలో ఏం జరుగుతోంది?
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)లో గతంలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిధుల దుర్వినియోగంపై గతంలో పలువురిపై ఆరోపణలు రాగా, విచారణలు సైతం జరిగాయి. తాజాగా ‘కుడా’లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన మాజీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బాదం వెంకటేశ్వర్లుపై వచ్చిన అవినీతి ఆరోపణలు ఇప్పుడు చివరి దశకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు ప్రారంభిస్తూ తుది విచారణకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అవినీతి, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన.. వెంకటేశ్వర్లు అవినీతి చర్యలకు పాల్పడినట్లు, అలాగే తెలంగాణ సివిల్ సర్వీసెస్ (ప్రవర్తన) నియమావళి–1964లోని రూల్ 3(1), 3(2), 3(3లను ఉల్లంఘించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగిగా సమగ్రత, విధి పట్ల నిబద్ధత, సముచిత ప్రవర్తన వంటి ప్రాథమిక నిబంధనలను అతిక్రమించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై చార్జ్ మెమో జారీ చేసి క్రమశిక్షణ చర్యలు ప్రారంభించారు. ఏసీబీ నివేదికల ఆధారంగానే.. వెంకటేశ్వర్లు వ్యవహారంలో యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) నివేదికలు కీలకంగా మారాయి. 2015లో వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ అక్టోబర్ 15, 16 తేదీల్లో నివేదికలు సమర్పించగా, 2017 జనవరి 3న, 2023 సెప్టెంబర్ 12న, అలాగే 2026 ఫిబ్రవరి 18న ఏసీబీ డైరెక్టర్ జనరల్ నుంచి నివేదికలు అందాయి. ఈ నివేదికల ఆధారంగానే ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. కాగా, ఈ విచారణలో పురపాలక పరిపాలన శాఖ, కుడా, ఏసీబీ, విజిలెన్స్ కమిషన్ కీలకపాత్ర పోషిస్తున్నాయి. అధికారిక ఉత్తర్వుల ప్రతులను సంబంధిత శాఖలకు పంపడంతోపాటు కేసు పురోగతిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. మొత్తంగా ఏసీబీ నివేదికల ఆధారంగా ప్రారంభమైన ఈ కేసు ఇప్పుడు పూర్తిస్థాయి విచారణ దశలోకి ప్రవేశించింది. విచారణాధికారిగా అజిత్ రెడ్డి.. ఈ కేసు సమగ్ర విచారణ కోసం ‘కుడా’లో చీఫ్ ప్లా నింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఇ.అజిత్ రెడ్డినే విచారణాధికారిగా ప్రభుత్వం నియమించింది. తెలంగాణ సివిల్ సర్వీసెస్ (క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్) రూల్స్–1991లోని రూల్ 20(2) ప్రకారం విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. విచారణాధికారి ఉత్తర్వులు అందిన తేదీ నుంచి మూడు నెలలలోపు విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుందని, గడువులోగా నివేదిక ఇవ్వకపోతే దానిని ప్రభుత్వం ‘అత్యంత తీవ్రంగా’ పరిగణిస్తుందని ఉత్తర్వుల్లో హెచ్చరించింది. కాగా, విచారణలో భాగంగా నిందితుడు బాదం వెంకటేశ్వర్లు 2024 ఫిబ్రవరి 14న లిఖితపూర్వక వివరణ సమర్పించినప్పటికీ.. మరోసారి తన వాదన వినిపించే అవకాశం కల్పించారు. మాజీ ఇంజనీర్పై అవినీతి ఆరోపణలు.. భారీ అక్రమాలు జరిగినట్లు ఏసీబీ నివేదిక మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశాలు ఆ అథారిటీ సీపీఓకే విచారణ బాధ్యతలు ఒక్కొక్కటిగా అవినీతి, అక్రమాలు బట్టబయలు -
విద్యుత్ వినియోగం.. ప్రమాద రహితం!
హన్మకొండ: విద్యుత్ వినియోగంలో భద్రతపై అవగాహన పెంపొందించేందుకు మే 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు టీజీ ఎన్పీడీసీఎల్ పరిధి 18 సర్కిళ్లలో విద్యుత్ భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 సర్కిళ్లకు నియమించిన నోడల్ అధికారులు వినియోగదారులకు, రైతులకు విద్యుత్ భద్రతపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతీ అధికారి క్షేత్ర స్థాయిలో పర్యటించి, సమావేశాలు నిర్వహించి విద్యుత్ భద్రతపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాలను జీరో స్థాయికి తీసుకురావడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యుత్ వినియోగంలో నిర్లక్ష్యం, అజాగ్రత్త, అలసత్వం కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటి నివారణకు స్వీయ నియంత్రణ ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రధాన కారణాలివే.. ● విద్యుత్ పరికరాల నిర్లక్ష్యపు వినియోగం, పాడైన, నాసిరకం, అతుకుల వైర్ల వినియోగం, ఎర్తింగ్ లేకపోవడం, తడిసిన చేతులతో విద్యుత్ పరికరాలను ముట్టుకోవడం వంటివి చేయొద్దు. ● తెగిన విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకొద్దు. వెంటనే అధికారులకు సమాచారమివ్వాలి. ● తడి చేతులతో స్విచ్లు, పరికరాలు ఆపరేట్ చేయవద్దు. గృహాల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో సరైన ఎర్తింగ్ వ్యవస్థ ఉండాలి. ● మీటర్లు, సర్వీస్ వైర్లు, స్విచ్ బోర్డులు తనిఖీ చేయించుకోవాలి. ● చిన్నపిల్లలను విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలి. ● రైతులు మోటార్ స్టార్టర్ల వద్ద ఇన్సులేషన్ సరిగ్గా ఉంచుకోవాలి. తడి నేలపై నిలబడి స్విచ్ ఆన్ చేయొద్దు. ● విద్యుత్ లైన్లకు సమీపంలో నీటి పైపులు, లోహపు పరికరాలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అవగాహన కల్పిస్తున్నాం.. విద్యుత్ భద్రతపై గ్రామాలు, పట్టణాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. వాల్పోస్టర్లు, కరపత్రాల పంపిణీ ద్వారా ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నాం. విద్యుత్ శాఖ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ప్రమాదకర లైన్లు, వంగిన విద్యుత్ స్తంభాలు, పాత వైర్లను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపడుతున్నాం. ప్రజలు జాగ్రత్తలు పాటించి, ఎలాంటి ప్రమాద సూచనలు గమనించిన వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలి. 24/7 పనిచేసే 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి విద్యుత్ సమస్యలు పరిష్కరించుకోవాలి. – వరుణ్ రెడ్డి, సీఎండీ, టీజీ ఎన్పీడీసీఎల్ నేటి నుంచి విద్యుత్ భద్రతా వారోత్సవాలు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి -
వడదెబ్బతో కౌలు రైతు మృతి
నెక్కొండ : వడదెబ్బతో వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన కౌలురైతు ఒర్రె మల్లయ్య (52) గురువారం మృతి చెందాడు. మల్లయ్య మండలంలోని దేవునితండా జీపీ పరిధి లోని దుబ్బతండాలో 4 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఇందులో రెండెకరాల్లో మొక్కజొన్న, మరో రెండు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. రెండు రో జులుగా మక్కల ఆరబెట్టేందుకు చేను వద్దకు వెళ్లా డు. ఈ క్రమంలో వడదెబ్బ తగలడంతో అక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య శోభ, కుమారు డు, కూతురు ఉన్నారు. దుబ్యాలలో మహిళా కూలీ.. టేకుమట్ల: వడదెబ్బతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం దుబ్యాలకు చెందా న మహిళా కూలీ సంగి సుజాత(38) మృతి చెందింది. రోజుమాదిరిగానే సుజాత గురువారం ఉదయం మొక్కజొన్న కంకిపొట్టు తీ సేందుకు వెళ్లింది. ఇంటికి వచ్చిన అనంతరం మ ధ్యాహ్నం అస్వస్థకు గురి కావడంతో చికిత్స నిమి త్తం చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, సుజాత కుటుంబాన్ని మాజీ ఎంపీటీసీ సంగి, బి.ఉమేందర్రావు పరామర్శించారు. -
మేడిగడ్డ, అన్నారం బోర్హోల్స్ పనుల్లో వేగం పెంచాలి
కాళేశ్వరం: మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో బోర్హోల్స్ పనుల్లో వేగం పెంచాలని ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్.. ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను గురువారం ఆయన కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేడిగడ్డలో కొనసాగుతున్న బోర్హోల్స్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్ట్ల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి పనులను వేగవంతం చేయాలని సూచించారు. సిబ్బంది కోసం గతంలో సీఆర్పీఎఫ్ పోలీసులు ఉపయోగించిన షెడ్లను పరిశీలించి విద్యుత్, నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. అనంతరం అన్నారంలోని ఇరిగేషన్ కార్యాలయం వద్ద అదనపు సిబ్బంది వసతి కోసం గదులను పరిశీలించారు. అన్నారం బ్యారేజీ అప్ స్ట్రీమ్ను పరిశీలించి బోర్ హోల్స్ పనులను ప్రారంభించాలని ఆదేశించారు. ప్రాజెక్టులో సాంకేతిక పరిశీలన పనులను శుక్రవారం( నేడు) నుంచి ప్రారంభించాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక పరీక్షలను దశల వారీగా చేపట్టాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా పరిశీలన పనుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. డ్రిల్లింగ్ పనులు చేపట్టేటప్పుడు గట్టి శిలా పొర వచ్చేంతవరకు కొనసాగించాలని సూచించారు. ప్రాజెక్టులో వివిధ దశల్లో సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తూ పనుల నాణ్యతను నిర్ధారించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ సరఫరాను నిరంతరం అందుబాటులో ఉంచాలని, ప్రతిరోజూ ఇరిగేషన్ అధికారులు పనులను సమగ్రంగా పర్యవేక్షించాలని ఆయన తెలిపారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈఎన్సీ రమేశ్ కుమార్, సీఈ శ్రీనివాస్ గుప్తా, ఈఈలు తిరుపతిరావు, డీఈఈ సతీశ్, రమేశ్ బాబు, తదితరులు పాల్గొన్నారు. -
గ్రాడ్యుయేషన్.. కొత్త భవిష్యత్కు నాంది
● కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రమేష్ రెడ్డి ● కేఎంసీలో ఘనంగా గ్రాడ్యుయేషన్ వేడుకలు ● పట్టాలు అందుకున్న 2020 బ్యాచ్ వైద్య విద్యార్థులు కాశిబుగ్గ: గ్రాడ్యుయేషన్ అనేది విద్యార్థుల ప్రయాణానికి ముగింపు కాదని, నూతన భవిష్యత్కు ఆరంభమని కాళోజీ యూనివర్సీటీ వైఎస్ ఛాన్స్లర్ డాక్టర్ రమేష్రెడ్డి అన్నారు. గురువారం రాత్రి హనుమకొండలోని కాకతీయ వైద్య కళాశాలలో 2020 బ్యాచ్కు చెందిన వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సును విజయవంతంగా ముగించుకున్న సందర్భంగా కేఎంసీ మైదానంలో 62వ గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహిహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ రానున్న కాలంలో ఇంటెలిజెన్స్ (ఏఐ) వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని, వచ్చే ఐదేళ్లలో వ్యాధుల నిర్వహణ పూర్తిగా మారిపోతుందని తెలిపారు. ప్రతి వైద్యుడు నైతిక విలువలు. శాసీ్త్రయ ఆధారాలతో కూడిన వైద్య సేవలు అందించాలని సూచించారు. కేఎంసీ పూర్వ విద్యార్థిగా తాను ఎంతగానో గర్వపడుతున్నానని అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుంకరనేని సంధ్య మాట్లాడుతూ కేఎంసీ వంటి పేరొందిన కళాశాల నుంచి తాను కూడా గ్రాడ్యుయేట్ కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, డాక్టర్ రాంకుమార్రెడ్డి పాల్గొన్నారు. భావోద్వేగానికి గురైన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సందర్భంగా 250 మంది వైద్య విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. ఆ సమయంలో తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. తెల్లకోటు ధరించి వేదికపై పట్టాలు అందుకుంటున్న తమ పిల్లలను చూసి చప్పట్లు, కేరింతలతో తల్లిదండ్రులు ఆనందంలో మునిగారు. తమ పిల్లలు వైద్యులుగా ఎదిగి సమాజానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని సంతోషపడ్డారు. ● ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్ ● ఆయా బ్యారేజీల పరిశీలన -
హ్యాండ్బాల్ చాంపియన్ తమిళనాడు
వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించిన 41వ సౌత్జోన్ మెన్ అండ్ ఉమెన్ చాంపియన్షిప్ పోటీలు ముగిశాయి. ఆరు రాష్ట్రా ల నుంచి పాల్గొన్న జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. గురువారం జరిగిన ఫైనల్లో పురుషుల విభాగంలో తమిళనాడు, తెలంగాణ జట్టు తలపడ్డాయి. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో 32–22 గోల్స్తో తమిళనాడు విజేతగా నిలిచింది. ఆతిథ్య తెలంగాణ రన్నరప్గా నిలిచింది. మహిళల విభాగంలో తమిళనాడు, కేరళ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తమిళనాడు విజయం సా ధించింది. రెండో స్థానంలో కేరళ నిలవగా, ఆతిథ్య తెలంగాణ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ము గింపు వేడుకలకు షైన్ విద్యా సంస్థల చైర్మన్ మూ గల కుమార్, హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ హాజరై విజేతలకు ట్రోఫీ, పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పోటీలతో క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి, తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్కుమార్ మాట్లాడుతూ ఈ పోటీలకు సహకరించిన రెఫరీ, అధికారులు, పీఈటీలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు, తెలంగాణ జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ బైరబోయిన కై లాస్యాదవ్, ఖోఖో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తోట శ్యామ్ప్రసాద్, హ్యాండ్బాల్ అసోసియేషన్ బాధ్యులు బసరవేణి లక్ష్మణ్గాయు, తిరుమల్రెడ్డి, పుల్లయ్య, శంకర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. పురుషుల విభాగంలో రన్నరప్ తెలంగాణ మహిళల విభాగంలో మూడో స్థానం.. -
శోభాయమానం.. పుష్పయాగం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో చివరిరోజు గురువారం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం పూర్ణాహుతి, బలిహరణ, ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగించారు. దేవాలయం చుట్టూ అమ్మవారి ఊరేగింపు జరపడానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి విరాళంగా అందజేయనున్న కోటి రూపాయలతో 30 అడుగుల రథం తయారీకి ఉపయోగించే కలపకు పూజలు చేశారు. శిల్పి గిర్మాజీ ప్రవీణ్ ఆధ్వర్యంలో నాగపూర్ నుంచి తెప్పించిన మేలు రకం టేకు కలపకు అర్చకులు పూజలు చేసి పని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రామల సునీత, ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, శ్రవణ్కుమార్, పూర్ణచందర్, వెంకటేశ్వర్లు, సతీశ్, అంజనేయులు, శ్రీనివాస్, శ్రీనివాసారావు పాల్గొన్నారు. అమ్మవారికి పుష్పయాగం అమ్మవారికి శతఘటాభిషేకం జరిపి రాత్రి స్నపనమందిరంలో అమ్మవారికి వేదపండితులు మంత్రోచ్ఛరణ చేస్తుండగా రంగురంగుల పూలతో ఘనంగా పుష్పయాగం నిర్వహించారు. భద్రకాళి ఆలయంలో ముగిసిన కల్యాణ బ్రహ్మోత్సవాలు -
8న ఉమ్మడి జిల్లా జాబ్మేళా
హన్మకొండ అర్బన్ : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈనెల 8న నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్ను గురువారం హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ నగరంలోని నాక్ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సమీపంలో ఈ మేళా ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ రంగానికి చెందిన పలు ప్రముఖ సంస్థలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని వివరించారు. ఉద్యోగార్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, బయోడేటాలతో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
మాతృత్వానికి మరో మార్గం దత్తత
హన్మకొండ అర్బన్: మాతృత్వానికి మరో మార్గం చట్టబద్ధమైన దత్తత అని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అడాప్షన్ డ్రైవ్స్ ఫాస్టర్ కేర్పై అవగాహన కార్యక్రమంలో భాగంగా.. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో అడాప్షన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు, ‘ఊయల ’ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, డీఆర్డీఓ మేన శ్రీను, డీఎంహెచ్ఓ అప్పయ్య, సీడీపీఓ స్వరూప, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఇన్చార్జ్ అధికారి ప్రవీణ్కుమార్, శిశు గృహ మేనేజర్ మాధవి, చైల్డ్ హెల్ప్ లైన్ కో–ఆర్డినేటర్ భాస్కర్, సోషల్ వర్కర్ సంగి చైతన్య, ప్రొటెక్షన్ ఆఫీసర్ మౌనిక, హబ్ కో–ఆర్డినేటర్ కళ్యాణి, చైల్డ్ హెల్ప్లైన్ జయవర్ధన్, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు. చట్ట విరుద్ధమైన దత్తతను అరికట్టాలి కాళోజీ సెంటర్: చట్ట విరుద్ధమైన దత్తతను ప్రోత్సహించడం నేరమని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో గురువారం దత్తత సహాయ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించి ఆమె ప్రారంభించి మాట్లాడారు. దత్తత సమాచారం తెలపడం, అనుమానాలను నివృత్తి చేయడం కోసం ఈ కేంద్రం ప్రతి సోమవారం పనిచేస్తుందని తెలిపారు. చట్ట విరుద్ధమైన దత్తతను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యరాణి, వైవీ గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, డీడబ్ల్యూఓ రాజమణి, బీఆర్బీ భవన్ కో–ఆర్డినేటర్ ఉమ తదితరలు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
చక్కని ఆదాయ మార్గం
హన్మకొండ : జాతీయ, రాష్ట్ర రహదారులు, ప్రధాన నగరాల్లో రోడ్డు పక్కన మీకు స్థలం ఉందా? ఉంటే మీకో శుభవార్త. తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్ కో) ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకునే అద్భుత అవకాశం కల్పించింది. దీని ద్వారా 200 గజాల స్థలం ఉంటే చాలు ఈవీ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకుని స్థిర ఆదాయం పొందొచ్చు. దీనికి ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. రెడ్కో వెబ్సైట్లో ఈనెల 3వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ప్రైవేట్ వ్యక్తుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం.. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం ఈ –డ్రైవ్ స్కీమ్లో భాగంగా తెలంగాణలో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. వాహనాల రద్దీ ఉన్న రోడ్డుకు పక్కన 200 చదరపు గజాల స్థలం కలిగి ఉంటే యజమానులు ఈవీ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఈవీ చార్జింగ్ మౌలిక వసతులను అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు.. రోజురోజుకూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఈ క్రమంలో వాహనదారులు చార్జింగ్ ఖర్చయి మార్గమధ్యలో ఇబ్బందులు పడకుండా జాతీయ, రాష్ట్ర రహదారులతోపాటు నగరాల్లోనూ ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రెడ్కో నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్, వరంగల్, సంగారెడ్డి, కరీంనగర్, నల్లగొండ వంటి ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రైవేట్ వ్యక్తులకు ఈవీ చార్జింగ్స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం కల్పించింది. స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయల వ్యయంలో 80 శాతం రాయితీ అందించనున్నారు. దీంతో పెట్టుబడి భారం గణనీయంగా తగ్గించుకోవచ్చు. చార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన విద్యుత్ లైన్ నిర్మాణ వ్యయం, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు వ్యయంలో ప్రభుత్వం 80 శాతం రాయితీ అందిస్తుంది. చార్జింగ్ మిషన్, షెడ్ నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చులు స్టేషన్ ఏర్పాటు చేసుకునే వారు భరించాలి. దరఖాస్తు ఇలా చేసుకోవాలి.. ఆసక్తి కలిగిన వారు రెడ్కో వెబ్సైట్లో ఇ మొబిలిటీలోకి వెళ్లి క్లిక్ చేయాలి. ఇక్కడ పీఎం ఈ డ్రైవ్పై క్లిక్ చేయగానే పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్స్ అండర్ కాంపోనెంట్ సి ఆఫ్ పీఎం ఇ డ్రైవ్ స్కీమ్ దరఖాస్తు కనిపిస్తుంది. ఆన్లైన్లో ఈ దరఖాస్తులో వివరాలు నమోదు చేయడంతోపాటు భూమి యాజమాన్య పత్రాలు, దరఖాస్తుదారు గుర్తింపు పత్రాలు, భూమి ఎక్కడ ఉందనే ఫొటోలు, లేఅవుట్ వివరాలు, విద్యుత్ కనెక్షన్ సమాచారం వంటి పత్రాలు అప్లోడ్ చేయాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం రోడ్డు పక్కన 200 గజాల స్థలం ఉంటే చాలు.. ఆసక్తి ఉన్న వారి నుంచి రెడ్కో దరఖాస్తుల ఆహ్వానం ఈనెల 3వ తేదీ దరఖాస్తుకు చివరి గడువు ఎలాంటి డిపాజిట్, రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు -
ఎంజీఎంలో విద్యుత్కు అంతరాయం
నిలిచిన వైద్యసేవలు కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో రోగుల వైద్యసేవలు నిలిచిపోయాయి. తెల్లవారుజామున ఎంజీఎం పాతగేట్ సైకిల్ స్టాండ్ నుంచి క్యాజువాలిటీకి వెళ్లే దారిలో విద్యుత్ స్తంభం కూలిపోయింది. స్తంభం తీగల మీద పడి విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఈ ఘటన తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జరిగింది. ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న ఎంజీఎం అధికారులు విద్యుత్ సిబ్బందితో మరమ్మతు పనులు ప్రారంభించారు. విద్యుత్ లేకపోవడంతో మాన్యువల్ పద్ధతిలో ఓపీ చిట్టీలు ఇచ్చారు. ఫిజియోథెరపీ విభాగంలో కూడా రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. మధ్యాహ్నం వరకు ఎక్స్రేల కోసం పడిగాపులు కాసి ఇంటికి తిరుగుముఖం పట్టారు. మధ్యాహ్నం వరకు విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో కొందరు కొందరు ఎక్స్రేలు తీయించుకున్నట్లు తెలుస్తోంది. హన్మకొండ కల్చరల్: అధికార దుర్వినియోగం పరిపాలన నిర్లక్ష్యం, దేవాలయ భూముల ఆక్రమణలపై ఆర్హెచ్పీ, దేవాలయ పరిరక్షణ సమితి ప్రతినిధుల ఆరోపణలు నిరాధారమైనవని, అవాస్తమైనవని దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్, భద్రకాళి దేవాలయం ఈఓ రామల సునీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రకాళి ఆలయంలో పూజ టికెట్లు, పులిహోర, ప్రసాద వితరణ కుంభకోణం, 13 తులాల బంగారు అభరణాల కాజేసే విషయాలపై పారదర్శకంగా విచారణ చేపట్టామని, ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు జిల్లా స్థాయి బాలబాలికలు, మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రమేశ్కుమార్, డాక్టర్ రమేశ్రెడ్డి, కోశాధికారి నాగకిషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హసన్పర్తి మండల పరిధి భీమారంలోని ఎర్రగట్టుగుట్ట సమీపంలోని కిట్స్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈటోర్నమెంట్లో పాల్గొనేందుకు (జనగామ, మహబూబాబాద్ మినహా) ఉమ్మడి వరంగల్ జిల్లా క్రీడాకారులు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ, సాయంత్రం 5 గంటల్లోగా https: badminton telangana.com ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు డాక్టర్ పి.రమేశ్రెడ్డి 94405 99888, నాగకిషన్ 98480 27755 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల సెమిస్టర్ల పరీక్షలు, దూరవిద్య డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం హనుమకొండలోని పలు పరీక్ష కేంద్రాలను కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ సందర్శించారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. హన్మకొండ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులతో సమావేశమై, పదో తరగతి, ఇంటర్మీడియెట్లో అనుతీర్ణులైన విద్యార్థులకు వెంటనే తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. ఇంటర్ విద్యార్థులకు ఆఫ్లైన్ తరగతులు నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి గోపాల్, సమగ్ర శిక్ష ప్లానింగ్ కో–ఆర్డినేటర్ మహేశ్, జీసీడీఓ సునీత తదితరులు పాల్గొన్నారు. -
హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపర్చండి
హన్మకొండ అర్బన్: జిల్లాలోని సంక్షేమ గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. గురుకులాలు, హాస్టళ్లలో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, టాయిలెట్ సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, జిల్లా రెవెన్యూ అధికారి సత్యపాల్రెడ్డి, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీఈఓ గిరిరాజ్ గౌడ్ పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి విద్యార్థులు భవిష్యత్లో ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన జిల్లాలోని తొమ్మిది సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. మడికొండ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థి కె.అలేఖ్య 571 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానం సాధించగా.. కలెక్టర్ ఆమెను సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా సమన్వయ అధికారి ఉమామహేశ్వరి, వివిధ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రిన్సి పాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
రైతు డిక్లరేషన్ అమలులో ప్రభుత్వం విఫలం
● ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు హన్మకొండ : రైతు డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. గురువారం హన్మకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ పేరిట రేవంత్రెడ్డి తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్లో సభ పెట్టారన్నారు. అయితే రెండేళ్లు పూర్తయిన రైతు డిక్లరేషను అమలు చేయలేదని దుయ్యబట్టారు. రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని రెండుసార్లు ఎగ్గొట్టారన్నారు. రైతులకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని వివరించేందుకు వరంగల్లో ఈనెల 6న రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ధ్వజమెత్తారు. మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య మాట్లాడుతూ రెండున్నరేళ్లలో రాష్ట్రంలో 813 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రాజకీయ లబ్ధికోసం సీఎం రేవంత్రెడ్డి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రియాదవ రెడ్డి, సీనియర్ నాయకుడు భరత్ కుమార్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు యాదగిరి, సారంగపాణి, రమేశ్, నాయకులు నయిమొద్దీన్, వేణు, రజినీకాంత్, రవీందర్ రావు, వెంకన్న, శ్రీధర్, రాజు, సుమిత్ జోసఫ్, గౌస్ ఖాన్, ఇస్మాయిల్, రజినీకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
గజ్జెల రంజిత్కు ‘నాట్యఘృణి’ అవార్డు
హన్మకొండ కల్చరల్: అంతర్జాతీయ నాట్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ శాసీ్త్రయ నృత్య కళాకారుల సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో వరంగల్కు చెందిన పేరిణి నాట్య గురువు గజ్జెల రంజిత్కు నాట్యఘృణి అవార్డు ప్రదానం చేశారు. ఈ మేరకు బుధవారం ఆంధ్రప్రదేశ్ కాకినాడలో జరిగిన అంతర్జాతీయ నాట్య దినోత్సవ వేడుకల్లో గత 28 ఏళ్లుగా పేరిణి, ఆంధ్రనాట్యం, శాసీ్త్రయ నృత్య విద్యలో మెలకువలను నేర్పుతూ విద్యార్ధులను కళాకారులుగా తీర్చిదిద్దుతూ, సంప్రదాయ బాణీలను పెంపొందిస్తూ నాట్యకళకు చేస్తున్న కృషికిగాను నిర్వాహకులు గజ్జెల రంజిత్కు నాట్యఘృణి అవార్డు ప్రదానం చేశారు. -
‘షైన్’ విజయకేతనం..
హన్మకొండ : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో షైన్ విద్యా సంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. తమ పాఠశాల విద్యార్థులు ఎ.అక్షర 588 మార్కులు, ఎల్.రేవంత్, ఎండి అఫ్రోజ్ 586, సమీరా నయీం 585, వెలుదండి సీమ, జి.సంహిత, కె.సుమిత్ 584, టి హాసిని, ఎ.ప్రశాంతి, ఎ.సుశాంత్, సీహెచ్.సిరి 583, వి.జాహ్నవి, మార్క శ్రీధన్ 582, ఎ.హరిణి 581, పి.యతిస్, పి.హర్షిత 580 మార్కులు సాధించారని షైన్ విద్యాసంస్థల అధినేత మూగల కుమార్ యాదవ్ వివరించారు. ఐఐటీ ఫౌండేషన్, నీట్తోపాటు పదో తరగతి పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోనే ఈ ఫలితాలు సాధించామన్నారు. ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో కూడా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించారన్నారు. బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు, వారి ఉన్నతికి శ్రమించిన అధ్యాపకులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో కరెస్పాడెంట్ మూగల రమ, షైన్ పబ్లిక్ స్కూల్ ఎరగ్రట్టుగుట్ట బ్రాంచ్ సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్, ఐఐటీ కోఆర్డినేటర్ మూగల రమేశ్ యాదవ్, ప్రిన్సిపాళ్లు పి.విశాల్, కె.దినేశ్, రాజ్ కుమార్, కవిత, ప్రగతిరెడ్డి, సబిత, మానస, కాలేజీ ప్రిన్సిపాళ్లు రాజుగౌడ్, పి.శ్రీనివాస్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. -
క్రీడాకారులకు పరికరాల లోటు రావొద్దు
● శాట్ చైర్మన్ శివసేనారెడ్డి హన్మకొండ చౌరస్తా: క్రీడాకారులకు అవసరమైన క్రీడా పరికరాల కల్పనలో లోటురాకుండా చూసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్(శాట్) శివసేనారెడ్డి సూచించారు. జిల్లా న్యాయస్థానంలో ఓ కేసు విషయంలో బుధవారం జిల్లాకు వచ్చిన ఆయన హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని పరిశీలించారు. ముందు డీవైఎస్ఓ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం ఇండోర్ స్టేడియం, స్టోర్ రూం, స్టేడియంలో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా క్రీడా వసతులు, సమస్యలు, క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణ, కోచ్ల వివరాలను డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ను అడిగి తెలుసుకున్నారు. క్రీడాభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. డీఎస్ఏ ఆఫీస్ సూపరింటెండెంట్ విజయశ్రీ, సిబ్బంది పాల్గొన్నారు. కేసీఆర్ బొమ్మ మార్చి పంపిణీ చేయండి.. హనుమకొండలోని జిల్లా క్రీడాప్రాధికార సంస్థను పరిశీ లించేందుకు విచ్చేసిన శివసేనారెడ్డికి వింత అనుభవం ఎదురైంది. ఇండోర్ స్టేడియం లోపల పై అంతస్తులోని స్టోర్ రూంలో లక్షలాది రూపాయల విలువైన క్రీడా పరికరాలపై దుమ్ము పేరుకుపోయి కనిపించింది. నిరుపయోగంగా ఉన్న ఆట వస్తువుల కిట్లపై మాజీ సీఎం చంద్రశేఖర్రావు బొమ్మ ఉండడాన్ని గమనించారు. కేసీఆర్ బొమ్మ మార్చి అర్హులైన క్రీడాకారులకు క్రీడా సామగ్రి వెంటనే అందించాలని డీవైఎస్ఓ ప్రశాంత్ను ఆదేశించారు. -
‘పది’ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ విజయభేరి
విద్యారణ్యపురి: పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఎస్ఆర్ స్కూల్స్ విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి బుధవారం తెలి పారు. సి. సంస్కృతారెడ్డి 600 మార్కులకు 589, పిరంజి వంశీ 588, ఎస్.కీర్తన 587, అంకం సౌజన్య 587, ఎ. సంజయ్ 586, టి. వైష్ణవి 585, బాశెట్టి సాయిశ్రీ 584 మార్కులు సాధించారని వారు తెలి పారు. క్రమశిక్షణతో కూడిన విద్యనందిస్తున్నామని, పాఠ్యప్రణాళిక, అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందం విద్యాబోధన చేశారని వారు పేర్కొన్నారు. తమ విద్యార్థులు పోటీ పరీక్షలను ఎదుర్కొనేలా ఐఐటీ అండ్ మెడికల్ ఫౌండేషన్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా బృహత్తర పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రైమ్స్కూళ్లను ప్రారంభించామని వారు వివరించారు. -
‘తేజస్వి’ విద్యార్థుల సత్తా..
నయీంనగర్ : పదో తరగతి ఫలితాల్లో తేజస్వి పాఠశాల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. 591 మార్కులతో కందిక సాహిత్య ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎం.అభివర్షిని 590, ఎం.శ్రీతిక 588, జి.సాయి శ్రేష్ఠ, ఆర్. తన్మయి, ఎ.హర్షిత్, ఎండి.సుమేర్ అహ్మద్, అమృత వర్షిణి 587, కె.హిమవర్షిత, కె.నాగస్వామి, మణి సాయి ప్రణవ్ 586, జి.సౌమ్య శ్రీ, ఎల్.కిరణ్ తేజ్, సిహెచ్.మహిన్వద, ఎం.దీప్తి, ఎన్.కార్తికేయ 585, పి.సాయిసాన్వి, పి.శ్రీపాద రెడ్డి 584, సి.హెచ్.శ్రేష్ఠ 583, జునైరియా నౌరిన్, ఎల్.వర్ష, ఎ.రేష్మిత, ఎ.వర్షిణిశ్రీ 582, ఎం.గీతిక, ఎం.మేద, బి.లాస్య, ఎ.నీలిమైథిలి, టి.శశిధర్ 581, జి.సింధు 580 మార్కులు సాధించింది. 570– 579 మధ్య 78 మంది విద్యార్థులు, 560– 569 మధ్య 67 మంది, 550–559 మధ్య 73 మంది, 540 – 549 మధ్య 48 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 539 కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు 161 మందితో నయీంనగర్, పోచమ్మకుంట, ప్రశాంత్నగర్ బ్రాంచ్లలో జిల్లా స్థాయిలో అధిక మార్కులు సాధించడం తేజస్వి ఘనత. విజయ పరంపర కొనసాగించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులకు పాఠశాల చైర్మన్ రేవూరి జెన్నారెడ్డి, పిల్లలమర్రి చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు. -
‘బాలయేసు’ విజయదుందుభి..
దేవరుప్పుల : జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో మరోసారి విజయదుందుభి మోగించారు. 582 మార్కులతో బాకి అభిజ్ఞాన్ దేవరుప్పుల మండలంలో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. మహ్మద్ రైసున్నీసా 576, కున్సోతు స్వాతి 566 మార్కులు, మొత్తం 32 మంది విద్యార్థుల్లో 22 మంది 500కు పైగా మార్కులు సాధించారని, ఇది ఎంతో గర్వకారణమని పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ జేసురాజ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతీ విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు మదన్ మోహన్, మహేశ్, కృష్ణ, పాషా, షబానా, సంధ్య.. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. -
డీజిల్ లోకో షెడ్ అభివృద్ధికి సమష్టి కృషి
కాజీపేట రూరల్: కాజీపేట డీజిల్ లోకో షెడ్కు సమష్టి కృషితోనే దేశంలో మంచి గుర్తింపు లభించిందని డీజిల్ షెడ్ సీనియర్ డీఎంఈ ఎన్.వి.వెంకటకుమార్ అన్నారు. మంగళవారం రాత్రి డీజిల్ లోకో షెడ్ 53 వసంతాల వేడుకలు కనులపండువగా జరిగాయి. రైల్వే సీనియర్ డీఎంఈ వెంకటకుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించి మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ అధికారుల సహకారంతో డీజిల్ షెడ్ రైల్వే అధికారులు, సూపర్వైజర్లు, రైల్వే కార్మికులు విధుల నిర్వహణలో మంచి ఫలితాలతో 53 వసంతాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీనియర్ డీఈఈ కేవీ.హరికృష్ణ కేక్ కట్ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఎంఈ అనికేత్ ఖడ్గే, ఎడీఎంఈలు శ్రీనివాస్రావు, నాగరాజశేఖర్, ఏడీఈ సతీశ్కుమార్, ఏసీఎంటీ మల్లికార్జునరావు, ఎ.ఎం.ఎం రాజేశ్, కాజీపేట స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ జోనల్ ప్రెసిడెంట్ కాల్వ శ్రీనివాస్, యూనియన్ డీజిల్ బ్రాంచ్ నాయకులు పాక వేదప్రకాశ్, ఎస్.కె.జానీమియా, ట్రెజరర్ గిరిమిట్ల రాజేశ్వర్రావు, రవికిరణ్, రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ డీజిల్ బ్రాంచ్ నాయకులు సీడబ్ల్యూసీ మెంబర్ ఎ.మధుసూదన్రావు, ఎస్.సమ్మయ్య, ఇ.రాములు, ఆర్.వెంకటేశ్వర్లు, టి.ప్రవీణ్, ఎ.ప్రదీప్కుమార్, రైల్వే ఓబీసీ సంఘం నుంచి ఎ.సంతోష్కుమార్, శ్యామ్, ఆంజనేయులు, రైల్వే ఎస్సీ ఎస్టీ సంఘం నుంచి పాండు, నాయక్, దేవేందర్, రైల్వే కార్మికులు, కార్మిక కుటుంబసభ్యులు పాల్గొన్నారు. రైల్వే సీనియర్ డీఎంఈ వెంకటకుమార్ ఘనంగా డీజిల్ షెడ్ 53 వసంతాల వేడుకలు -
‘ఏకశిల’ విద్యార్థుల ప్రతిభ..
హసన్పర్తి: టెన్త్ పరీక్ష ఫలితాల్లో ఏకశిల విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వరుసగా 585,582,580,578 ,577,576,574,573,572,571,570 మార్కులతో రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలిచినట్లు ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. ఈసందర్భంగా హసన్పర్తి మండలం పెంబర్తిలోని ఏకశిల టెక్నో స్కూల్లో బుధవారం అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకశిల విద్యాసంస్థలో విద్య అంటే మార్కులు మాత్రమే కాదు.. భవిష్యత్ను నిర్మించే శక్తి అన్నారు. నాణ్యమైన విద్యతోపాటు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, జీవిత నైపుణ్యాలను పెంపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫలితాలతో ఏకశిల విద్యాసంస్థకు మరింత గౌరవం పెరిగిందన్నారు. అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఏకశిల విద్యాసంస్థల డైరెక్టర్లు బేతి కొండల్రెడ్డి, గౌరు సువిజారెడ్డి, ప్రిన్సిపాళ్లు బేతి శైలజారెడ్డి, ముచ్చ స్వప్నరెడ్డి, ఎం.డి. బాబా, కె.డి. స్వర్ణరాజ్, లవకుమార్, అడ్మినిస్ట్రేషన్ ఇన్చార్జ్ జి.రాంప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘లా’ ఫలితాలు వెల్లడి..
సాక్షి, వరంగల్ : కాకతీయ యూ నివర్సిటీ ‘లా’ విద్యార్థులకు ఫలి తాల వెల్లడి ఆలస్యమవుతుండడంతో ‘ఆలిండియా బార్ కౌన్సి ల్ ఎగ్జామ్’కు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతున్నారంటూ బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘లా’ విద్యార్థులకు టెన్షన్’ అనే కథనంపై కదలిక వచ్చింది. ఏమాత్రం బ్యాక్లాగ్స్ లేని మూ డేళ్ల కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఐదో సెమి స్టర్ మెమో, ఐదేళ్ల కోర్సు చదువుతున్న విద్యార్థులకు తొమ్మిదో సెమిస్టర్ మెమో ఈ పరీక్షకు అవసరం ఉండడంతో ఆయా విద్యార్థుల్లో ఆందోళన నెలకొందంటూ వారి వెతలను వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగాధికారులు చాలెంజ్గా తీసుకుని రాత్రంతా శ్రమటోడ్చి బుధవారం సాయంత్రం ఫలితాలు ప్రకటించారు. కేయూఎగ్జామ్స్.ఆర్గ్లో ఫలితాలు అందుబాటులో ఉంచారు. దీనిపై పలువురు వి ద్యార్థులు ‘సాక్షి’కి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపా రు. అయితే ‘ఆలిండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్’ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ‘లా’ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు విడుదల కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని మూడేళ్ల ‘లా’ కోర్సు ఐదో సెమిస్టర్ , ఐదేళ్లలా కోర్సు తొమ్మిదో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ తెలిపారు. మూడేళ్ల ‘లా’ కోర్సు ఐదో సెమిస్టర్ పరీక్షలు మార్చి 24నుంచి ఏప్రిల్ 2వ తేదీవరకు నిర్వహించారు. ఐదేళ్ల ‘లా’ కోర్సు తొమ్మిదో సెమిస్టర్ పరీక్షలు మార్చి 24 నుంచి ఏప్రిల్ 2వ తేదీవరకు నిర్వహించారని, 27 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించినట్లు తెలిపారు. ఆలిండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ దరఖాస్తుకు సుగమం నేటితో అఖరు కావడంతో అప్లయ్ చేసుకునేందుకు ఛాన్స్ ‘సాక్షి’కి విద్యార్థుల కృతజ్ఞతలు -
ముగ్గురు ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి లభించింది. రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో హనుమకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గొర్ల సీతారెడ్డి, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సార్ల రాజు, ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఇన్స్పెక్టర్ బోలగాని శ్రీనివాస్గౌడ్ ఉన్నారు. పదోన్నతి పొందిన వారిని అధికారులు అభినందించారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో మే 3న నిర్వహించనున్న నీట్ పరీక్షను ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి సూచించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లతో కలిసి ఆయన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 8 పరీక్ష కేంద్రాల్లో 4,320 మంది పరీక్షలు రాయనున్నారని, వారికి మౌలిక వసతులు కల్పించాలని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో నీట్ జిల్లా కో–ఆర్డినేటర్ భిక్షపతి, ఏసీపీ నరసింహారావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఉద్యోగులపై దాడి సహించం
హన్మకొండ అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే సహించమని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీఓ) నాయకులు హెచ్చరించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఘటనను సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్మోహన్రావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నాయకులు చట్ట పరిధిలోనే వ్యవహరించాలని సూచించారు. ఉద్యోగులను బెదిరించే చర్యలను ఉపేక్షించమని స్పష్టం చేశారు. హనుమకొండ టీజీఓ అధ్యక్షుడు ఆకవరం శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ తదితరులు ఈ ఘటనను ఖండిస్తూ నిరసన తెలిపారు. ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గెజిటెడ్ అధికారులు, జీడబ్ల్యూఎంసీ సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు బుధవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ ధరంసింగ్ తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హనుమకొండ డిపో నుంచి ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జమ్మికుంట, వేలేరు, ఐనవోలు, హనుమకొండ, ఖిలా వరంగల్, వరంగల్, హసన్పర్తి, కమలాపూర్, పర్వతగిరి, సంగెం మండలాల ప్రజలు, ప్రయాణికులు 8977781103 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు వివరించి, సలహాలు, సూచనలు అందించాలని కోరారు. హన్మకొండ అర్బన్ : జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో పెట్రోలు, డీజిల్ సరఫరాపై పెట్రోలియం సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఎనర్జీ కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పెట్రోలియం సంస్థల వద్ద ఉన్న ఇంధన నిల్వల వివరాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంధన కొరత లేనప్పటికీ బంకుల వద్ద క్యూలు కనిపిస్తున్నాయని, ఇది అసత్య ప్రచారం వల్లేనని తెలిపారు. పెట్రోల్ బంకులు వాహనదారులకు ప్రాధాన్యత ఇచ్చి ఇంధనం సరఫరా చేయాలని, బాటిళ్లు, క్యాన్లలో తీసుకెళ్లడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఇంధన కొరత అపోహలను తొలగించేందుకు పెట్రోలియం సంస్థలు ప్రజ లకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎండీ వాజీద్ అలీ, జిల్లా రవాణాశాఖ అధికారి వేణుగోపాల్, డీడబ్ల్యూఓ విశ్వజ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ప్రేమకళ, ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్, భారత్ పెట్రోలియం సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
‘నీట్’ నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలి
న్యూశాయంపేట: నీట్ (యూజీ–2026) పరీక్ష నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం కలెక్టరేట్ చాంబర్లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు, దివ్యాంగులకు 6 గంటల వరకు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అభ్యర్థులు సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రంలో వసతులు కల్పించాలన్నారు. సీకేఎం ప్రిన్సిపాల్ ధర్మారెడ్డి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారి భిక్షపతి పాల్గొన్నారు. పెట్రోల్ కొరత లేదు.. జిల్లాలో పెట్రోల్ కొరత లేదని కలెక్టర్ సత్యశారద స్పష్టం చేశారు. కలెక్టరేట్ నుంచి పెట్రోల్ బంక్ యాజమాన్యాలతో మొబైల్ కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను సమీక్షించారు. పుకార్లు నమ్మవద్దని, ప్రజలు ఆందోళనలకు గురికావొద్దని సరఫరా సాధారణంగా కొనసాగుతుందన్నారు. విమానాశ్రయాన్ని సందర్శించిన కలెక్టర్ ఖిలా వరంగల్: మామునూరు విమానాశ్రయాన్ని కలెక్టర్ సత్యశారద ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులతో కలిసి మంగళవారం సందర్శించారు. రన్వే, రన్ వే విస్తీర్ణం కోసం రైతుల నుంచి సేకరించిన భూమిని పరిశీలించారు. అంతకుముందు ఎయిర్పోర్ట్ అధికారులతో చర్చించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఎయిర్పోర్టు అథారిటీ ఈడీ ఎస్కే గుప్తా, జై గౌరవ్ చౌదరి, జేజీఎం బాలేందర్కుమార్ తివారి, డీజీఎం ఉమేశ్కుమార్ తివారి, ఏజీఎం గోపాలకృష్ణ, తహసీల్దార్ ఇక్బాల్ పాల్గొన్నారు. -
హనుమకొండకు 4, వరంగల్కు 2
విద్యారణ్యపురి: వచ్చే విద్యాసంవత్సరం (2026–2027) నుంచి హనుమకొండ జిల్లాలో నాలుగు, వరంగల్ జిల్లాలో రెండు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటుకానున్నాయి. నియోజకవర్గానికి ఒక స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుతినిచ్చింది. ఈ మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ, జిల్లాపరిషత్ స్కూళ్లలోనే ఈ స్కూల్స్ ఏర్పాటుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడెక్కడంటే.. హనుమకొండ జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లోని వరంగల్ పశ్చిమలోని కాజీపేట ప్రభుత్వహైస్కూల్ (బాయ్స్), ఽస్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలం నారాయయణగిరి జెడ్పీహెచ్ఎస్, వర్ధన్నపేట నియోజకవర్గంలోని హసన్పర్తి ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్, పరకాలలోని ఆత్మకూరు మండలం నీరుకుళ్ల జెడ్పీహెచ్ఎస్లను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ఎంపిక చేశారు. వరంగల్ జిల్లాలో నర్సంపేట ప్రభుత్వ హై స్కూల్, తూర్పు నియోజకవర్గంలో శుంభునిపేట జెడ్పీహెచ్ఎస్లో ఏర్పాటుచేయనున్నారు. కో ఎడ్యుకేషన్గానే ఈ పబ్లిక్ స్కూల్స్ ఉండనున్నాయి. ఒక్కో స్కూల్ కోసం రూ.15 కోట్లు ఒక్కో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేయనుందని అధికారులు చెబుతున్నారు. సంబంధిత హైస్కూల్లో ఇప్పటివరకు ఉన్న తరగతి గదులతోపాటు అదనపు గదులు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ ల్యాబ్లు, అటల్ టింకరింగ్, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తారు. ఇంగ్లిష్, మ్యాథ్స్, ఒకేషనల్ ల్యాబ్స్, లైబ్రరీ, మోడర్న్ కిచెన్, డైనింగ్హాల్ ఉంటుంది. క్రీడలకు మైదానం, మ్యూజిక్, డ్యాన్స్ నేర్పించేందుకు కూడా విశాలమైన గదులను నిర్మించనున్నారు. తరగతి గదులే కాకుండానే మిగతా ల్యాబ్స్ తోపాటు యాక్టివిటీస్ కోసం అదనంగా 25 గదులను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అంటే ఒక్కో పాఠశాలలో మొత్తంగా 56 తరగతి గదులుంటాయి. విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన, వివిధ క్రీడలు, కళల్లో ఆసక్తి పెంచుకునేలా శిక్షణ ఉంటుంది. డిజిటల్ విద్య అందిస్తారు. ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కు ఇచ్చే నిధులతో ఆయా స్కూల్ డెవలప్మెంట్ (పేరెంట్స్తో కూడిన) కమిటీనే నిర్మాణాలు చేపట్టాల్సింటుంది. ఈ కమిటీలో హెడ్మాస్టర్ కన్వీనర్గా, ఇంజనీర్, 24 మంది తల్లిదండ్రులు సభ్యులుగా ఉంటారు. ప్రీ ప్రైమరీలో 20 మంది, ప్రైమరీలో ఒక్కో తరగతికి 30 మంది, హైస్కూల్లో ఒక్కో తరగతికి 40 మంది చొప్పున విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. మోడల్ కోసం రంగారెడ్డి జిల్లా ఆరుట్ల పబ్లిక్ స్కూల్ సందర్శన.. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం హనుమకొండ నుంచి పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి, డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, ప్లానింగ్ కోఆర్డినేటర్ బి.మహేష్, ఎంఈఓలు డాక్టర్ బి.రాంధన్, ఎ.శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లాలోని అరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ను సందర్శించారు. అక్కడ మోడల్ స్కూల్లో గత విద్యాసంవత్సరంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్గా అభివృద్ధి చేశారు. సుమారు 2వేల మంది విద్యార్థులు చదువుతున్నారని చెబుతున్నారు. రాష్ట్ర విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి.. ఆర్జేడీ, డీఈఓలతో సమావేశం నిర్వహించి స్కూల్ ఏర్పాటు, విధివిధానాలు వివరించడంతోపాటు అక్కడి వసతులను ప్రత్యక్షంగా చూపించారు. 15 రోజుల్లోనే ఈ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుందని మురళి వెల్లడించారని జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు. ఏర్పాటుకానున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే సెమీ రెసిడెన్షియల్గా విద్యతోపాటు క్రీడలు, కళలు ఒక్కో స్కూల్కు రూ.15కోట్ల వరకు నిధులు -
గ్రేటర్లో విలువైన దస్త్రాలకు బూజు, చెదలు
వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర ప్రజలకు సంబంధించిన అత్యంత విలువైన భవనాల రికార్డులు గల్లంతయ్యాయి. బల్దియా సిబ్బంది సమన్వయ లోపంతో ఫైళ్లు మాయమయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రికార్డు సెక్షన్ నిర్వహణపై భద్రత కరువై అధ్వానంగా తయారైంది. ఆస్తుల రుజువులు లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ముక్కుపిండి ఆస్తిపన్నులు వసూలు చేసే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం అందుకు సంబంధించిన దస్త్రాలను జాగ్రత్తగా భద్రపర్చకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏం మతలబో ఏమో.. ప్రభుత్వ కార్యాలయమంటే సాధారణంగా సంవత్సరాల నాటి దస్త్రాలు ఎన్ని ఉన్నా సరే జాగ్రత్తగా భద్రపరుస్తారు. ఉన్నతాధికారులైనా, పౌరులైనా సమాచారం కావాలంటే అందించేందుకు వీలుగా రికార్డు గదిలో భద్రపరుస్తుంటారు. కానీ, బల్దియా కార్యాలయంలో మాత్రం అందుకు భిన్నం. అక్కడ ఏ ఫైల్ ఎక్కడుందో అంతుచిక్కడం అంత సులువైన విషయం కాదు. కీలకమైన దస్త్రాం ఎక్కడుందో కనిపెట్టడానికి అష్టకష్టాలు పడాల్సిందే. బల్దియా ప్రధాన కార్యాలయంలో 1965 సంవత్సరం నుంచి భవనాలకు సంబంధించిన, ఆస్తుల అసెస్మెంట్లు, రికార్డులు, భవన నిర్మాణ అనుమతులు, ఇంజనీరింగ్ అభివృద్ధి పనులు, ఉద్యాన విభాగం, ప్రజారోగ్యం, సాధారణ పరిపాలన విభాగం తదితర విభాగాల రికార్డులు, దస్త్రాలను భద్రపర్చాలి. రికార్డు సెక్షన్లో రూ.వేల కోట్ల ఆస్తులకు సంబంధించిన వివరాల ఆనవాళ్లు నిక్షిప్తంగా భద్రపర్చాల్సి ఉంటుంది. రికార్డు రూం నిర్వహణ సరిగా లేకపోవడంతో 1984, 1993 సంవత్సరాలకు చెందిన కొన్ని పైళ్లను మాత్రమే ‘ఆన్లైన్’ నమోదు చేసి చేతులు దులుపుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆగమాగం.. అస్తవ్యస్తం అత్యంత విలువైన రుజువుల పత్రాలు, పుస్తకాలు చెదల పాలవుతున్నాయి. ఆస్తులు, ఇతర కార్యకలపాలకు సంబంధించి పత్రాలు గల్లంతవుతున్నాయి. వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతుండడంతో ఫైళ్ల రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రజల ఆస్తులకు సంబంధించిన రికార్డులు, పత్రాలను సరిగా భద్రపరచడం లేదు. దీంతో అవి నేలపాలవుతున్నా సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తప్పించుకుంటున్న సిబ్బంది.. ప్రజలకు తప్పని తిప్పలు బల్దియాకు చెందిన కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాల్లోని పైళ్లను ప్రధాన కార్యాలయంలోని రికార్డుల గదికి అప్పగించడం లేదు. రెండేళ్ల క్రితం ఎంబీ రికార్డులు మాయం కావడంతో పలువురు ఉద్యోగులు సస్పెన్షన్కు గురయ్యారు. అయినప్పటికీ బల్దియా సిబ్బందిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఏళ్ల తరబడి ఉన్న భవనాల స్థానంలో కొత్త ఇంటి నిర్మాణం కావాలంటే అసెస్మెంట్ కాపీని సమర్పించాలి. ఆ రికార్డులు బల్దియాలో అందుబాటులో లేవు. ఎవరికి వారు యమునాతీరే అన్న చందంగా ఆయా సెక్షన్లలోని సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దస్త్రాలు కావాలంటే ఒకరిపై ఒకరు నెపం మోపుతూ తప్పించుకుంటున్నారు. దీంతో వివిధ రుజువుల కోసం వస్తున్న ప్రజలు వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. ఏ ఫైల్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు సాఫ్ట్వేర్ రూపొందించిన ఫైల్ ట్రాకింగ్ విధానం అమలు కొంత మేరకు చేపట్టారు. ఏమైందో తెలియదు కానీ ఆన్లైన్లో భద్రపర్చే సంస్థకు బల్దియా సొమ్ము చెల్లించకపోవడంతో సిబ్బంది పెట్టెబేడ సర్దుకొని వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఆస్తులు, ఫైళ్లు, రికార్డులకు సంబంధించిన పాత కాలపు రుజువుల ఆచూకీ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయమై బల్దియా పరిపాలన విభాగం డిప్యూటీ కమిషనర్ను వివరణ కోరితే గతంలో జరిగిన విషయాలు తనకు తెలియదని దాటవేశారు. ఆస్తుల ఆనవాళ్లు లేక ప్రజల ఇబ్బందులు పట్టించుకోని పాలక, అధికార వర్గాలు -
బుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
నాన్నా.. చాక్లెట్లు కొనిస్తానన్నావు.. ఊరంతా తిప్పి ఊరవతలికి తీసుకువచ్చావు ఎందుకు నాన్నా.. చెట్టుకిందికి తీసుకువచ్చి తాడు తీస్తుంటే ఏదో ఊయల కడుతున్నావు అనుకున్నాం. నాకు, తమ్ముడి మెడకు చుట్టావు. ఏదో ఆట అనుకున్నాం. కొమ్మపైనుంచి తీసి లాగుతున్నావు. ఊపిరి ఆడట్లేదు నాన్న. ఇంకోసారి చాక్లెట్లు అడగము. గొంతు బిగుసుకుపోతోంది. తాడు తీయ్ నాన్నా.. నేను తమ్ముడు బాధ భరించలేకపోతున్నాం. మమ్ముల్ని కిందికి దింపు నాన్నా.. అమ్మకు, నీకు మధ్య మేము అడ్డుగా ఉన్నామా.. మీరిద్దరు పంచాయితీ పెట్టుకుంటే మాదా తప్పు. మేమేం చేశాం నేరం.. మీ పిల్లలుగా పుట్టడమా.. ’ అంటూ ఆ చిన్నారులు తమ ఆఖరి క్షణాల్లో తండ్రిని వేడుకున్నారేమో.. ఆ మాటలకు తండ్రి మనస్సు కరిగి కిందికి దించి ఉంటే రెండు ప్రాణాలు దక్కేవి. కానీ, పిల్లల రోదనలు వినే పరిస్థితిలో లేని తండ్రి.. ఇద్దరి ప్రాణాలు పోయేవరకు అక్కడే రాయిలా నిలబడి చూశాడు. విగతజీవులయ్యారని నిర్ధారించుకున్నాక సమాజం తనను ఛీ కొడుతుందని భావించి తనూ అదే చెట్టుకు ఉరివేసుకున్నాడు. – సాక్షి, మహబూబాబాద్/తొర్రూరు బిడ్డలకోసం నూటొక్క ముడుపులు కట్టి.. కోటొక్కా.. పూజలు చేసిన వారు ఉన్నారు.. ఇది సమాజంలో ఒకవైపు ఉంటే.. భార్యాభర్తల తగాదాలు, వివాహేతర సంబంధాలు, క్షణికావేశాలతో కన్నబిడ్డలను కర్కశంగా చంపిన ఘటనలు మరోవైపు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సోమవారం జరగగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని ఆ పసికూనలను ఓ తండ్రి చంపి తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. కింద పడితేనే తండ్రి గుండె పగిలినంత బాధ ఉంటుందంటారు.. కానీ, పిల్లలను ఉరివేసి వారి ప్రాణం పోయేదాక చూసిన అతను ఎంత కర్కోటకుడోనని, అతనికి మనస్సెట్టా వచ్చిందని.. ఆ బిడ్డలు ఎంత తల్లడిల్లిపోయారో అంటూ ఈ ఘ టన చూసిన, విన్న స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పిల్లలను తన దగ్గరికి రానివ్వడం లేదన్న అక్కసుతో.. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి (29), అదే గ్రామానికి చెందిన కిన్నెర కాంతను 11 ఏళ్ల క్రితం వివాహమాడాడు. వారికి కూతురు విన్య, కుమారులు విలాస్ (5), వికేష్ (3) ఉన్నారు. గుంశావలి తొర్రూరులోని ఓ బైక్ మెకానిక్ షాప్లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన గుంశావళి రోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. ఈ బాధలు భరించలేక కాంత పది రోజుల క్రితం అదే గ్రామంలోని నానమ్మ సీతమ్మ ఇంటికి పిల్ల లను తీసుకొని వెళ్లింది. గుంశావలి.. పది రోజులుగా పిల్లల కోసం వెళ్తే ఆమె పంపించడం లేదు. దీంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. తనకు దక్కని పిల్లలు భార్య వద్ద కూడా ఉండొద్దని కక్ష గట్టాడు. కాంత సోమవారం రోజువారీగా కూలి పనికి వెళ్లగా ఇద్దరు కుమారులు ఇంటి వద్దనే ఉన్నారు. కూతురు ఆడుకోవడానికి మరోచోటికి వెళ్లింది. సమయం చూసి వచ్చిన గుంశావలి పిల్లలకు చాక్లెట్లు కొనిస్తానని ఆశ చూపగా మానాన్న కొనిస్తాడు అంటూ హుషారుగా తండ్రి బైక్పై ఎక్కారు. గుంశావలి తొర్రూరుకు వచ్చి ఓ దుకాణంలో తాళ్లు కొనుగోలు చేశాడు. పిల్లలు నాన్నా చాక్లెట్లు ఏవీ అంటే కొనిస్తానని నమ్మబలికాడు. సాయంత్రం వరకు అటు ఇటు బైక్పై తిప్పాడు. పిల్లలు కూడా సరదాగా ఉందనుకున్నారు. సాయంత్రం తొర్రూరు మార్కెట్ సమీపంలో చెట్టుకు మొదట ఇద్దరు పిల్లలకు ఉరివేసి తరువాత తనూ ఉరేసుకున్నాడు. కాగా, కాంతకు సొంత ఇల్లు, జాగ లేదు. బంధువులింటి సమీపంలో ఓ టెంట్ వేసుకుని భర్త, పిల్లల మృతదేహాల కోసం ఎదురుచూడడం గమనార్హం. కిన్నెర గుంశావలి (ఫైల్)విలాస్ (ఫైల్)వికేష్ (ఫైల్)పనికి వెళ్లిన భార్య కాంత సాయంత్రం ఇంటికి వచ్చి తమ్ముళ్లు ఎక్కడికి వెళ్లారని కుమార్తె విన్యను అడగగా నాన్న తీసుకువెళ్లాడని బదులిచ్చింది. ఆందోళన చెందిన కాంత స్థానికుల సహాయంతో ఆటో తీసుకొని బావులు, చెరువులు, సమీప ప్రాంతాల్లో గాలించగా ఆచూకీ తెలియరాలేదు. మంగళవారం ఉదయం తొర్రూరులో పిల్లలు చంపిన ఘటన వెలుగులోకి రావడం.. పోలీసులు వివరాలు సేకరించి తల్లికి సమాచారం అందించారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై భార్య కాంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు. చాక్లెట్లు కొనిస్తానని చెప్పి మెడకు తాళ్లు బిగించావు.. ఎప్పుడూ చాక్లెట్లు అడగము.. నొప్పిగా ఉంది.. తాడు విప్పి దించు నాన్నా.. అయినా నీ మనస్సు కరగలేదా..తొర్రూరులో ఇద్దరు కొడుకులకు మరణశాసనం రాసి తనూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి కుటుంబ కలహాలకు పిల్లలు బలి గుండెలవిసేలా రోదించిన తల్లి, బంధువులు -
నిర్ణీత గడువులోగా కమిటీలు
హన్మకొండ చౌరస్తా: పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు నిర్ణీత గడువులోగా జిల్లా, మండల, గ్రామ కమిటీల నియామకాలను పూర్తిచేయాలని కాంగ్రెస్ కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ (డీపీఏసీ) తీర్మానించింది. హనుమకొండలోని డీసీసీ భవన్లో మంగళవారం జిల్లా పీఏసీ మొదటి సమావేశం జరిగింది. డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హాజరై మాట్లాడారు. సంస్థాగత నిర్మాణం, పార్టీ బలోపేతం కోసం ప్రతి యూనిట్కు ఒక అధ్యక్షుడిని నియమించి బాధ్యతలను వికేంద్రీకరించాలని అన్నారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. ఎన్నికల్లో విజయం బూత్ స్థాయిలోనే ఖరారవుతుందని, అందుకే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బీఎల్ఏ–2 నియామకాలను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఓటర్ల జాబితా పరిశీలన నుంచి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని సూచించారు. గిగ్ వర్కర్లకు ప్రత్యేక చట్టం తీసుకురావడం పట్ల సీఎం రేవంత్రెడ్డిని అభినందించారు. డీసీసీ కార్యాలయానికి మడికొండ శివారులో స్థలం కేటా యిస్తే ఎలా ఉంటుంద నే అంశంపై చర్చించారు. టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, హుజూరాబాద్ ఇన్చార్జ్ వొడితెల ప్రణవ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ దుద్దిళ్ల శ్రీనుబాబు, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ, నాయకులు వీసం సురేందర్రెడ్డి, బొమ్మతి విక్రమ్, శనిగరం సుధాకర్, బొచ్చు చందర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ తీర్మానం డీసీసీ ఆఫీస్కు స్థలం కేటాయింపు పై చర్చ -
యువతను కాపాడుకుందాం
నేర సమీక్షలో పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: డ్రగ్స్కు బానిసగా మారకుండా యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నగర పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నెలవారి నేరసమీక్ష మంగళవారం జరిగింది. కమిషనరేట్ పరిధిలోని పెండింగ్ కేసులు, నిందితుల అరెస్ట్, కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ కోసం సంబంధిత అధికారులు తీసుకుంటున్న చర్యలను ఎస్హెచ్ఓలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పురోగతిపై తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ మత్తుపదార్థాల నియంత్రణలో భాగంగా ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలోని విద్యాసంస్థలు, గ్రామాల ప్రధాన కూడళ్లల్లో అవగాహన కల్పించాలని సూచించారు. మూగజీవాల అక్రమ రవాణాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నిర్ణీత సమయంలో షాపులు మూసివేసేవిధంగా తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమయపాలన పాటించని నిర్వాహకులపై కేసులు నమోదు చేయడంతో వారిని డీసీపీస్థాయి అధికారుల ఎదుట బైండోవర్ చేయాలని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్ కొరతపై తప్పడు ప్రచారం కారణంగా బంక్లకు తరలివస్తున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి శాంతి భద్రత సమస్యలు రాకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాల నియంత్రణ, పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారుకావడంలో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి నగదు, ప్రశంసపత్రాలు అందించారు. డీసీపీలు అంకిత్కుమార్, రాజమహేంద్రనాయక్, కవిత, ట్రెయినీ ఐీపీఎస్ మనీషా, నేహ్రా, అదనపు డీసీపీలు రవి, బాలస్వామి, సురేశ్కుమార్ ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.


