Hanamkonda
-
రికార్డులు, వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి
ఎంజీఎం: హనుమకొండ జిల్లాలోని ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు పీసీఅండ్పీఎన్డీటీ, ఎంటీపీ యాక్ట్ ప్రకారం విధిగా నిబంధనలు పాటించాలని, గర్భిణుల వివరాలు, రిఫర్ చేసిన డాక్టర్ వివరాలు రికార్డుల్లో రాయడంతోపాటు ఆన్లైన్లో కచ్చితంగా నమోదు చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య సూచించారు. జిల్లాలోని స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలను అరికట్టేందుకు ప్రత్యేక బృందంతో బుధవారం ఆయన నగరంలోని పలు ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, సర్టిఫికెట్లు, స్కానింగ్ మెషీన్లు, ఫామ్ – ఎఫ్, ఆన్లైన్, ఆఫ్లైన్ రికార్డులను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. వెయిటింగ్ హాల్, స్కాన్ రూమ్లో లింగ నిర్ధారణకు సంబంధించిన బోర్డును అందరికీ కనిపించేలా ప్రదర్శించాలన్నారు. స్కాన్ రిపోర్టులు, స్కాన్ ఇమేజ్లను 2 సంవత్సరాల పాటు భద్రపర్చాలన్నారు. సంతాన సాఫల్య కేంద్రాలు ఏఆర్టీ చట్టానికి లోబడి పని చేయాలన్నారు. ఎంటీపీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు మాత్రమే నిబంధనలకు లోబడి అబార్షన్స్ చేయాలని, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు లేకుండా అర్హత లేని డాక్టర్లు అబార్షన్లు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జీఎంహెచ్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేశ్వరి, ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల, ఐసీడీఎస్ సఖి వన్స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ హైమావతి, కమిషనరేట్ భరోసా సెంటర్ ఎస్సై బోయిన మంగ, సందీప్ పాల్గొన్నారు. హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య -
అవినీతి అధికారులకు శిక్షపడాలి
హన్మకొండ చౌరస్తా: లంచం తీసుకుంటూ పట్టుబ డిన అధికారులకు శిక్షపడేలా పటిష్ట చట్టాలు అమలు చేయాలని, అప్పుడే అవినీతి తగ్గుతుందని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారా యణ అభిప్రాయపడ్డారు. జ్వాలా స్వచ్ఛంద సంస్థ, లోక్సత్తా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో లంచం ఆ శించిన అధికారులను ఏసీబీకి పట్టించిన పౌరులను బుధవారం సన్మానించారు. హనుమకొండలోని క ల్యాణి ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమానికి జయప్రకాశ్ నారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజం నుంచి లంచం అనే మహమ్మారిని సమూలంగా నిర్మూలించాలంటే రాజకీయాలు, చ ట్టాల్లో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. రూ. వందల కోట్లతో పోటీ చేసే ధోరణి పో వాలని, ఇటీవల హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడడం కలిచివేసిందన్నారు. ఏసీబీని ఆశ్రయించి అవినీతి అధికారులను పట్టించే యువత మ రింత ముందుకు రావాలన్నారు. స్టేషన్ఘన్పూర్కు చెంది విజయ్, శివరాజ్, కమలాపూర్కు చెందిన గోపాల్ సన్మానించి ఒక్కొక్కరికి రూ.5వేల నగదు పురస్కారం అందజేశారు. లోక్సత్తా సంస్థ సలహాదారుడు కోదండరామారావు, జ్వాలా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు ప్రశాంత్, అంజలీదేవి, పర్యావరణ ప్రేమికుడు ప్రకాశ్, సీకేఎం కళాశాల రిటైర్డ్ అధ్యాపకుడు సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు. లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ ఏసీబీకి పట్టించిన పౌరులకు సన్మానం -
మీ వద్ద స్టోరీ ఉందా.. నటిస్తా...
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ‘మీ వద్ద స్టోరీ ఉందా.. వరంగల్కు వచ్చి నటిస్తా’ అంటూ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఛలోక్తి విసిరారు. బుధవారం హనుమకొండ సర్క్యూట్ హౌజ్ సమీపంలోని గోకుల్నగర్లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఫరియా అబ్దుల్లాను ‘వరంగల్లో సినిమాలు తీసే ఆలోచన ఉందా’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె స్టేజీపై నృత్యం చేసి అభిమానులను అలరించారు. – హన్మకొండ -
ఓరుగల్లే ఫైనల్..!
సాక్షిప్రతినిధి, వరంగల్/ఎల్కతుర్తి : బీఆర్ఎస్ ఉద్యమాలకు సెంటిమెంట్గా భావించే ఓరుగల్లులోనే ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ భారీ సభను నిర్వహించాలన్న తుది నిర్ణయానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చారు. ఆయన ఆదేశాల మేరకు బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నాయకులు స్థల పరిశీలన చేశారు. మొదట గ్రేటర్ వరంగల్ పరిధి హంటర్రోడ్డు, లేదా ఉనికిచర్లలో నిర్వహించాలని ఈ నెల 10న మాజీ మంత్రి, సభ ఇన్చార్జ్ టి.హరీశ్రావు స్థల పరిశీలన చేశారు. ఆతర్వాత హసన్పర్తి మండలం దేవన్నపేట అయితే ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ఉంటుందని భావించి అక్కడ కూడా పర్యటించారు. ఇదే సమయంలో ఈసారి సభను వరంగల్లో కాకుండా హైదరాబాద్ శివారులో పెట్టాల న్న చర్చ పార్టీలో జరిగినట్లు ప్రచారం జరిగింది. వేసవి ఎండలు తీవ్రమయ్యే సమయంలో వరంగల్ కంటే హైదరాబాద్ శివారు ప్రాంతమైతే బాగుంటుందని భావించినట్లు సమాచారం. ఘట్కేసర్లో సభావేదికను ఎంచుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. తాజాగా కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, వొడితెల సతీశ్కుమార్, పెద్ది సుదర్శన్రెడ్డి తదితరులు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధి ఎల్కతుర్తిలో స్థలాన్ని పరిశీలించారు. ఎల్కతుర్తి మండల కేంద్రంతోపాటు గోపాల్పూర్, మడిపల్లి, చింతలపల్లి శివార్లు.. ఎల్కతుర్తి – భీమదేవరపల్లి మధ్యన కుడి, ఎడమల స్థలాలను కూడా పరిశీలించారు. ఈ మేరకు రైతులనుంచి అంగీకారపత్రాలు కూడా తీసుకున్నారు. ఎల్కతుర్తి సభాస్థలిపై కేసీఆర్కు నివేదిక.. నేడో, రేపో నిర్ణయం.. సభావేదిక వివరాలను గురువారం పార్టీ అధినేత కేసీఆర్కు అందజేయనున్నట్లు బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. సుమారు 15లక్షల మంది వరకు హాజరయ్యే రజతోత్సవ సభ కోసం భారీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇదే విషయమై ఎల్కతుర్తి మండలంలో నిర్వహించేందుకు పరిశీలించిన రెండు, మూడు స్థలాల వివరాలు, మ్యాప్లను పార్టీ అధినేత కేసీఆర్కు సమర్పించినట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు. కేసీఆర్తో చర్చించి ఆయన నిర్ణయం మేరకు సభావేదికపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా.. రజతోత్సవ సభపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్.. నేడో, రేపో ఉమ్మడి వరంగల్ నేతలతో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. డ్రోన్ల ద్వారా సభావేదిక మ్యాపింగ్.. ఎల్కతుర్తి మండల కేంద్రంలో అనువైన ప్రదేశాన్ని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్కుమార్, దాస్యం వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి బుధవారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ముల్కనూరు రోడ్డు, చింతలపల్లి రోడ్డు సమీపంలో ని అనువైన ప్రదేశాన్ని చూసి అనువుగా భావించిన వారు.. డ్రోన్ కెమెరా ద్వారా ఆ ప్రాంతాన్ని మ్యాపింగ్ చేయించారు. ఈ భూమికి సంబంధించిన రైతులతో మాట్లాడగా వారు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా ఎల్కతుర్తికి వచ్చే దారులవెంట కిలోమీటర్ దూరంలో గల ప్రదేశాలను వాహనాల పార్కింగ్ కోసం చూశారు. వారి వెంట పార్టీ మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్, తదితరులు ఉన్నారు. ఇక్కడే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కేసీఆర్ సై తాజాగా ఎల్కతుర్తిలో స్థలాన్ని పరిశీలించిన నేతలు.. డ్రోన్ కెమెరాలతో సభాస్థలి, పార్కింగ్ స్థలాల మ్యాపింగ్ కేసీఆర్ దృష్టికి మ్యాప్లతో సహా అన్ని వివరాలు వేదిక దేవన్నపేటా? ఎల్కతుర్తా? నేడో, రేపో తేల్చనున్న అధినేత -
విద్యుత్ ఏడీఈల సీనియారిటీ రెడీ..
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో పెండింగ్లో ఉన్న పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసేందుకు యాజమాన్యం కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా విద్యుత్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ల తాత్కాలిక సీనియారిటీ జాబితా ఎట్టకేలకు రూపొందించింది. ఇప్పటికే ఇంజనీర్ల అసోసియేషన్ నాయకులతో విస్తృత సంప్రదింపులు జరిపి, చర్చించి రూపొందించిన జాబితాపై మరోసారి అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. తాత్కాలిక జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే 15 రోజుల్లో తెలిపేందుకు అవకాశం కల్పించింది. ఈ తాత్కాలిక జాబితా ఈ నెల 25వ తేదీన రాత్రి విడుదల చేసింది. ఈ లెక్కన ఏప్రిల్ 8వ తేదీలోపు అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది. అనంతరం పూర్తి స్థాయిలో తుది జాబితా రూపొందిస్తారు. ఇప్పటికే 10 మంది వరకు ఏఈల రిటైర్డ్.. టీజీ ఎన్పీడీసీఎల్లో పదోన్నతుల కోసం ఏడీఈలు, ఏఈలు కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రక్రియ జాప్యమవుతున్న క్రమంలో ఏఈలు ఒక్కొక్కరుగా రిటైర్డ్ అవుతున్నారు. ఇప్పటికే 10 మంది వరకు రిటైర్డ్ అయ్యారని ఇంజనీరింగ్ వర్గాలు తెలిపాయి. ఇంకా ఆలస్యమైతే మరికొంత మందికి అన్యాయం జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ముందు ఏడీఈలకు డివిజనల్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పిస్తే ఖాళీలు పెరిగే అవకాశముంది. దీంతో పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న ఆశావహులైన ఏఈలకు ఎక్కువ సంఖ్యలో పదోన్నతులు లభించే అవకాశముంది. 70 మందితో ఏడీఈల తాత్కాలిక సీనియారిటీ.. ఏడీఈల తాత్కాలిక సీనియారిటీ జాబి తా 70 మందితో రూపొందించారు. ఇందులో ఇప్పటికే ముగ్గురు పదోన్నతి పొందారు. వీరిలో ఇప్పట్లో అందరికి పదోన్నతి లభించే అవకాశం లేదు. సీని యారిటీ ప్రకారం డీఈ పోస్టులు ఖాళీ అవుతున్న కొద్దీ జాబితాలో పేర్కొన్న సీనియారిటీ ప్రకారం క్రమంగా పదోన్నతి లభించనుంది. ఏడీఈల సీనియారిటీ జాబితాతో తమకు కూడా పదోన్నతి కల్పిస్తారని ఏఈలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసోసియేషన్ నాయకులు పట్టుదలకు పోకుండా పదోన్నతి ప్రక్రియ సజావుగా, త్వరగా ముగిసేలా సహకరించాలని ఆశావహులు కోరుతున్నారు.తాత్కాలిక జాబితాలో 70 మందికి చోటు ఇందులో ఇప్పటికే ముగ్గురికి పదోన్నతి ప్రమోషన్లకు తొలుగుతున్న అడ్డంకులు ఏడీఈలకు డీఈలుగా పదోన్నతులు ఇస్తే.. ఏఈలకు లైన్ క్లియర్ -
మినీ జాతర ఆదాయం రూ.1.08 కోట్లు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మినీ జాతరలో భక్తులు అమ్మవార్లకు సమర్పించిన హుండీల కానుకలను బుధవారం లెక్కించారు. మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయ డార్మెటరీ భవనంలో సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల పూజారుల సమక్షంలో ఈఓ రాజేంద్రం పర్యవేక్షణలో కానుకలు లెక్కించారు. ఇందులో సమ్మక్క హుండీ ఆదాయం రూ. 58,66,409, సారలమ్మ ఆదాయం రూ. 45,61,892, పగిడిద్దరాజు ఆదాయం రూ. 1,61,003, గోవిందరాజు హుండీ ఆదాయం రూ. 2,13,863 మొత్తం రూ. 1,08,03,173 ఆదాయం వచ్చినట్లు ఈఓ రాజేంద్రం తెలిపారు. భక్తులు విదేశీ డాలర్లు సమర్పించినట్లు పేర్కొన్నారు. తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో కానుకల లెక్కింపు వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సూపరింటెండెంట్ క్రాంతికుమార్, ఇన్స్పెక్టర్ కవిత, తదితరులు పాల్గొన్నారు. హుండీ కానుకల లెక్కింపు చేపట్టిన అధికారులు -
సేంద్రియ సాగుపై దృష్టి సారించాలి
● జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ ఖిలా వరంగల్: రైతులు సేంద్రియ సాగుపై దృష్టి సారించి అధిక దిగుబడులు పొందాలని వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ సూచించారు. వరంగల్ నక్కలపల్లి రహదారిలోని జీఎం కన్వెన్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ వరకు జరిగే రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పీఓ) మేళా బుధవారం రెండు రోజు కొనసాగింది. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని స్టాళ్లను తిలకించారు. మేళాలో సేంద్రియ సాగు, విత్తనాలు, పంట సాగు, యాంత్రీకరణ సాగు, ఉద్యాన పంటలు, తదితర అంశాలపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. నూతన పనిముట్లను రైతులకు పరిచయం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో డీఏఓ మాట్లాడారు. రైతులు ఆధునిక సాంకేతికత విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, యంత్రీకరణ సాగుపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారి(డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్) రమన్ సింగ్, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకన్న, నాబార్డు ఏజీఎం రవి, ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వరంగల్ చీఫ్ మేనేజర్లు గిరిబాబు, శివప్రసాద్, లీడ్ బ్యాంకు మేనేజర్ రాజు, కేవీకే శాస్త్రవేత్తలు సాయి కిరణ్, సౌమ్య, జన్యు శాస్త్రవేత్తలు వెంకన్న, సంధ్య కిశోర్, సంగీతలక్ష్మి, ఏడీఏ యాకయ్య, ఏఓ రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మూల్యాంకనంలో నిబంధనలు పాటించాలి
వరంగల్: ఇంటర్మీడియట్ మూల్యాంకనంలో నిబంధనలు పాటించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, వరంగల్ క్యాంప్ ఆఫీసర్ శ్రీధర్ సుమన్ అన్నారు. బుధవారం వరంగల్లోని ఎల్బీ కళాశాల ఆడిటోరియంలో మూల్యాంకన సిబ్బందికి ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కెమిస్ట్రీ, కామర్స్ సబ్జెక్టుల మూల్యాంకన సిబ్బందితో మాట్లాడారు. మూల్యాంకనంలో కచ్చితంగా సమయ పాలన పాటించాలన్నారు. బయోమెట్రిక్ హాజరు నేపథ్యంలో అందరూ సకాలంలో హాజరుకావాలన్నారు. వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాల మూల్యాంకన సిబ్బందికి ఆయా స్పెల్ వారీగా శిక్షణఇచ్చి మూల్యాంకనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూల్యాంకనాన్ని బోర్డు అధికారులు కమాండ్ కంట్రోల్ రూం ద్వారా పరిశీలిస్తున్నారని, సకాలంలో స్పాట్ వాల్యుయేషన్ పూర్తి చేయడానికి అందరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో సహాయక క్యాంపు అధికారులు మాధవరావు, విజయ నిర్మల, కార్యాలయ సిబ్బంది రఫీ తదితరులు పాల్గొన్నారు. డీఐఈఓ శ్రీధర్ సుమన్ -
గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025
అందినకాడికి దండుకునుడే! 2019 నుంచి టీఎస్–బీపాస్ అమల్లోకి వచ్చింది. భవన నిర్మాణాలకు ‘ఆన్లైన్’ ద్వారా మాత్రమే అనుమతులు పొందాలి. కానీ.. కొంత మంది ప్లాన్లు ఒక రకంగా సమర్పించి, మరో రకంగా నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ భవన నిర్మాణాల వ్యవహారంలో కొందరు కార్పొరేటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాణాలకు అనుమతులిచ్చే విషయంలో నగర ప్రణాళిక విభాగం సిబ్బందికి నడుమ కార్పొరేటర్లు లేదా లైసెన్స్ సర్వేయర్లు దళారులుగా వ్యవహరిస్తున్నారు. నగరంలో స్థలం ఎంతో ఖరీదు కావడంతో ఉన్న కొద్దిపాటి స్థలంలో నిబంధనల ప్రకారం భవనం చుట్టూ నిర్దేశిత ఖాళీ వదిలి నిర్మాణం చేపట్టడం కష్టంగా మారింది. దీంతో నిబంధనలు ఉల్లంఘించి చేపడుతున్న నిర్మాణాలు అవినీతి అధికారులకు, దళారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తమ వాటాలు తమకు అందిస్తే సెలవు రోజుల్లో అక్రమ కట్టడాలు, నిర్మాణాలు సాగించాలనే ఉచిత సలహాలు కూడా ఇస్తున్నట్లు సమాచారం. ‘గ్రేటర్’లో యథేచ్ఛగా అనధికారిక భవన నిర్మాణాలుభద్రకాళి ఆలయ హుండీ ఆదాయం రూ.14,97,412హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో బుధవారం హుండీ లెక్కించారు. రూ.14,97,412 ఆదాయం లభించినట్లు నగదును యూనియన్ బ్యాంకులో జమ చేసినట్లు ఆలయ ఈఓ శేషుభారతి తెలిపారు. విదేశీ కరెన్సీ 14 డాలర్లు, 10 ఇంగ్లండ్ పౌండ్స్, 5 యూఏ దిరమ్స్, 10 యూరోలు లభించినట్లు తెలిపారు. లెక్కింపులో పర్యవేక్షణాధికారిగా దేవాదాయశాఖ పరిశీలకులు డి.అనిల్కుమార్ వ్యవహరించారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు, పర్యవేక్షకులు విజయ్కుమార్తోపాటు ఆలయ సిబ్బంది, శ్రీలక్ష్మి శ్రీనివాస సేవా ట్రస్ట్, శ్రీలక్ష్మీ వేంకటేశ్వర సేవా సమితి సభ్యులు 130 మంది లెక్కింపులో పాల్గొన్నారు. నేటినుంచి బాటనీ, జువాలజీ మూల్యాంకనంవిద్యారణ్యపురి: ఈనెల28నుంచి నిర్వహించాల్సిన ఇంటర్ బాటనీ, జువాలజీ సబ్జెక్టుల జవాబుపత్రాల మూల్యాంకనాన్ని గురువారం(27వ తేదీ)నుంచి చేపడుతున్నట్లు స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ ఆఫీసర్, డీఐఈఓ గోపాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని కాలేజీ యాజమాన్యాల అధ్యాపకులను రిలీవ్ చేసి మూల్యాంకనానికి విధిగా పంపాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. కొనసాగుతున్న టెన్త్ పరీక్షలువిద్యారణ్యపురి: పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం హనుమకొండ జిల్లాలోని 67కేంద్రాల్లో నిర్వహించిన మ్యాథ్స్ పరీక్షలో ఆరుగురు విద్యార్దులు గైర్హాజరైనట్లు డీఈఓ డి.వాసంతి తెలిపారు. మొత్తంగా 12,016 మంది విద్యార్థులకుగాను 12,010 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో 49 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలో 15మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా 9,265మంది విద్యార్థులకుగాను 9,250మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. దూరవిద్య డిగ్రీ పరీక్షల్లో 9మంది డీబార్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో బుధవారం కాపీయింగ్ చేస్తూ 9మంది విద్యార్థులు పట్టుబడ్డారని, వారిని డీబార్ చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాఽధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. హనుమకొండలోని ఆర్ట్స్అండ్ సైన్స్కాలేజీ సెంటర్లో ఇద్దరు, వరంగల్ ఎల్బీ కాలేజీలో ఒకరు, ఏఎస్ఎం కాలేజీలో ఆరుగురు పట్టుబడినట్లు పేర్కొన్నారు. ఐదు అంతస్తుల భవనం. ఏడాదిగా నిర్మాణం.. లక్షల్లో ఖర్చు.. క్షణాల్లో ఫట్టుమని కూలిపోయింది. కొంత మంది ఆ శిథిలాల కింద చిక్కుకుపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో బుధవారం జరిగిన ఈఘటన రాష్ట్ర వ్యాప్తంగా భయకంపితుల్ని చేసింది. ఏజెన్సీ ఏరియాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తుండడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా.. నిబంధనలకు విరుద్ధంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన, నిబంధనలు పాటించని భవనాలు అనేకం. భద్రాద్రి తరహాలో మన దగ్గర కూడా ఇలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. నిర్మాణాలు ఎక్కడెక్కడంటే.. ట్రైసిటీ శివారు ప్రాంతాల్లో, వీలీన గ్రామాల్లో అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. నగరంలోని కాజీపేట, హంటర్ రోడ్డు, నందిహిల్స్, కుమార్పల్లి, కరీమాబాద్ తదితర పాంతాల్లో అనుమతులు లేకుండా యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. నగరంలో రద్దీగా ఉండే ఏరియాల్లో, వ్యాపారాలు సాగే ఏరియాల్లో అనధికారిక అంతస్తులు పెరిగిపోతున్నాయి. డీవియేషన్లు, సెట్బ్యాక్లు, అదనపు అంతస్తుల నిర్మాణం, పెంట్ హౌజ్లు తదితర అంశాలను పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ఫైర్ నిబంధనలకు పూర్తి వ్యతిరేకంగా వాణిజ్య, వ్యాపార సముదాయాలు పెరిగిపోతున్నాయి. వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరంలో యథేచ్ఛగా భవనాలు నిర్మిస్తున్నారు. కొంత మంది కార్పొరేటర్లు, క్షేత్ర స్థాయి బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, చైన్మెన్లు చేతులు కలిపి అక్రమ నిర్మాణాలకు అనుమతులిప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. నోటీసులిస్తూ, కూల్చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతూ.. అందినకాడికి దండుకుంటున్నట్లుగా ఆరోపణలున్నాయి. బల్దియాకు ఫీజులు చెల్లించకుండానే భారీ భవంతులు కట్టుకోవడం నగరంలో సర్వసాధారణమైంది. వినకపోతే బెదిరింపులే.. నగర ప్రణాళికా విభాగంలో పని చేస్తున్న కొంత మంది సిబ్బంది, ఆర్అండ్బీ, ఇరిగేషన్, రెవెన్యూ సిబ్బంది డ్యాకుమెంటరీ, ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తున్నారు. వీరు అక్రమ నిర్మాణాలను చూసీచూడనట్లుగా వ్యవహరించకపోతే బదిలీలు తప్పవని కొంత మంది బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు. ఇవన్నీ ఎందుకంటూ క్షేత్ర స్థాయిలో ఆయా విభాగాల అధికారులు లైసెన్స్ సర్వేయర్లు, చైన్మెన్ల ద్వారా కూల్చివేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా, అందినకాడికి దండుకుంటున్నారు. దీంతో బల్దియాకు రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. టాస్క్ఫోర్స్ పాత్ర నామమాత్రమే.. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన వారికి కొత్త చట్టంతో చెక్ పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధిలో రెండు వేర్వేరు టాస్క్ఫోర్స్ బృందాలు వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేశారు. కానీ.. ఈ బృందాల పాత్ర నామ మాత్రమే. ఎవరైనా పదేపదే ఫిర్యాదు చేస్తేనే నోటీసులు జారీ చేస్తున్నారు. ఏమైనా ఒత్తిళ్లు వస్తే వెనక్కి తగ్గుతున్నారు. ఎలాంటి పరపతి లేని మధ్య తరగతి వర్గాల ఇళ్లపై కూల్చివేతలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో నగరంలో అనుమతి లేని, అదనపు అంతస్తుల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అనుమతి లేకుంటే అదనపు పన్ను భవన నిర్మాణాలకు అనుమతులు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే భవనాలు నిర్మించాలి. అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే రెండు వందల శాతం ఆస్తి పన్ను భవన జీవిత కాలం చెల్లించాలి. అక్రమ నిర్మాణాలను కట్టడి చేస్తున్నాం. – రవీందర్ వాడేకర్, బల్దియా ఇన్చార్జ్ సిటీ ప్లానర్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ చాంబర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్న డాక్యుమెంట్ రైటర్● వరంగల్ ఆర్వో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వింత పోకడ ● దస్తావేజులకు భద్రత ఏది? అనుమతులకు సర్వేయర్లే దళారులు! మితిమీరి జోక్యం చేసుకుంటున్న కార్పొరేటర్లు కాసులకు కక్కుర్తి పడి కళ్లు మూసుకుంటున్న టౌన్ప్లానింగ్ యంత్రాంగం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు న్యూస్రీల్ -
కిక్కిరిసిన ఎల్ఆర్ఎస్ హెల్ప్డెస్క్లు
వరంగల్ అర్బన్ : అక్రమ లే ఔట్ స్థలాల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) ఫీజులు చెల్లించేందుకు నగరవాసులు పెద్దఎత్తున బల్దియా హెల్ప్డెస్క్ల వద్ద బారులుదీరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 31లోగా ఫీజులు చెల్లిస్తేనే 25 శాతం రాయితీ లభిస్తుందని, సద్వినియోగం చేసుకోవాలని ప్రకటించడంతో దరఖాస్తుదారుల్లో కదలిక పెరిగింది. దీంతోపాటు నిన్న మొన్నటి వరకు ఎడిట్ ఆప్షన్ లేక అటు అధికార యంత్రాంగం, ఇటు దరఖాస్తుదారులు నానాపాట్లు పడ్డారు. ఎట్టకేలకు ప్రభుత్వం మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడంతో ఎల్ఆర్ఎస్ రుసుముల చెల్లింపులు వేగిరమయ్యాయి. గ్రేటర్ వరంగల్ వ్యాప్తంగా 2020లో 1.10లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో నిబంధనల ప్రకారం ఉన్న సుమారు 60వేలమందికి చెల్లించాల్సిన ఫీజులు తదితర వివరాలను మొబైల్ ద్వారా సమాచారం అందించారు. కొంతమందికి ప్రొహిబిటేడ్, తదితర కారణాలతో పన్ను జనరేట్ కాలేదు. దీంతో వీరంతా బల్దియా కార్యాలయాల చూట్టూ తిరుగుతున్నారు. అందులో 2020 మార్కెట్ ఫీజు కాకుండా గత ఏడాది కాలంగా చేపట్టిన క్షేత్ర స్థాయిలో ఇష్టారాజ్యంగా పన్ను విధించారు. దీంతో వీరంతా హెల్ప్డెస్క్కు వస్తుండడంతో బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, అధికారులు ఆ లోపాలను సరిదిద్దుతున్నారు. -
పర్యావరణ సమతుల్యత పాటించాలి
● కలెక్టర్ ప్రావీణ్య ● జాతీయ సదస్సు ప్రారంభం హన్మకొండ అర్బన్: వనరులను సంరక్షించుకునేందుకు, పర్యావరణ సమతుల్యతను పెంపొందించుకునేందుకు మెటీరియల్ సైన్స్ దోహదపడుతుందని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. నగరంలోని పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాలలో ‘ఇంటర్ డిసిప్లినరీ మెటీరియల్స్ సైన్స్ ఫర్ సస్టేనబుల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ (ఎన్సీఐఎంఎస్ఎస్ఈఈ–2025)’ అంశంపై రెండ్రోజుల జాతీయ సదస్సు బుధవారం హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలు సృజనాత్మక ఆలోచనలతో సుస్తిరాభివృద్ధిలో భాగం కావాలని, వివిధ రకాల నైపుణ్యాల్ని వినియోగించుకొని సూచించారు. ‘లెర్న్ ఇట్ బై డూ ఇట్ ’ అనే భౌతిక శాస్త్ర భావన ద్వారా అవకాశాలను అందుకోవాలన్నారు. అనంతరం సదస్సులో 120 మంది రాసిన పరిశోధక వ్యాసాలను ఐఎస్బీఎన్తో రూపొందించిన సావనేర్ను కలెక్టర్ అవిష్కరించారు. కార్యక్రమంలో వరంగల్ ఎన్ఐటీ ఫిజిక్స్ ప్రొఫెసర్ డి.హరినాథ్, సదస్సు కన్వీనర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.అరుణ, ఎన్వైకే డిప్యూటీ డైరెక్టర్ సీహెచ్.అన్వేశ్, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, కో–కన్వీనర్ కవిత, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ సురేశ్బాబు, అకడమిక్ కో–ఆర్డినేటర్ అరుణ, అధ్యాపకులు హెప్సిబా, ప్రవీణ్కుమార్, పద్మ, సుజాత, మధు, సారంగపాణి పాల్గొన్నారు. స్వయం ఉపాధి శిక్షణను వినియోగించుకోవాలిమామునూరు: మహిళలు స్వయం ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జాతీయ వ్యవసాయ పరిశోధన యాజమాన్య అకాడమీ హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ గోపాల్లాల్ అన్నారు. ఖిలా వరంగల్ మండలం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో కేవీకే కోఆర్డినేటర్ రాజన్న అధ్యక్షతన షెడ్యూల్డ్ కులాల మహిళలకు పర్యావరణహిత జనప నార బ్యాగుల తయారీపై నాలుగు రోజులు శిక్షణ తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. గోపాల్లాల్ ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక గ్రూపులు, మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు జనపనార బ్యాగుల తయారీపై శిక్షణ నిర్వహిస్తున్నామని తెలిపారు. శిక్షణ పొంది న మహిళలకు ఉత్పత్తులకు మార్కెట్ చూపడంతో పాటు ఉపాధి అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ విజయేంద్రరెడ్డి, అరుణ్ జ్యోతి, సౌమ్య, రాజు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు. -
ఓరుగల్లు చరిత్రకారులకు నిలయం..
ఓరుగల్లుకు అద్భుత ఖ్యాతి ఉందని, చరిత్రకారులు, సాహితీవేత్తలకు, కళాకారులకు నిలయమని సోల్జర్ షఫీ పేర్కొంటున్నారు. భారత సైన్యంలో సైనికుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వరంగల్కు చెందిన సోల్జర్ షఫీకి నాటకాలు అంటే ఎనలేని ప్రేమ. ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంకులో క్యాషియర్ ఉద్యోగం చేస్తున్నారు. బ్యాంకు వారు నిర్వహించే కార్యక్రమాల్లో వరంగల్ తరఫున పాల్గొని జాతీయస్థాయిలో ఎన్నో బహుమతులు అందుకున్నారు. ఫ్రీడం ఫైటర్, నీరా ఆర్య, జమీలాబాయ్, మహానటుడు, చల్చల్ గుర్రం నాటకాలకు దర్శకత్వం వహించారు.– సోల్జర్ షఫీ -
ఓరుగల్లు కళారత్నాలు..
వరంగల్ రంగస్థలం.. కాకతీయుల కాలంలో ఎన్నో రకాల కళారూపాలు ప్రదర్శించేవారని క్రీడాభిరామం, నృత్యరత్నావళి, బసవపురాణం తదితర గ్రంథాల్లో పేర్కొనబడింది. చిందుల వారు, జక్కులవారు, తెరచీరల వారు, పేరిణి, ప్రేంకిణి వంటి ఎన్నో కళారూపాలు ప్రదర్శించేవారని తెలుస్తోంది. వాటిలో చాలా కళారూపాలు ఇప్పటికీ జానపదాల రూపంలో వ్యాప్తిలో ఉన్నాయి. ఆధునిక కాలంలో పౌరాణిక పద్యనాటకాలు రూపొందడానికి చరిత్ర ఉంది. 1940కి పూర్వమే మడికొండ, మొదలైన చోట్ల పద్యనాటక సమాజాలు ఏర్పడ్డాయి. 1943లో పాములపర్తి సదాశివరావు కాకతీయ కళాసమితి స్థాపించి భక్తరామదాసు నాటకం ప్రదర్శించారు. 1965లో శ్రీరాజరాజేశ్వరీ నాట్య మండలి, హిందూ డ్రమెటిక్ అసోసియేషన్ స్థాపించారు. ఆ తర్వాత ఓరుగల్లులో పద్యనాటకాల స్వర్ణయుగం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఆజంజాహి మిల్స్ ఆర్ట్స్ అసోసియేషన్, మంజు ఆర్ట్స్ అసోసియేషన్, మారుతి నాట్యమండలి, శ్రీశారదా నాట్యమండలి తదితర అనేక సంస్థలు ప్రారంభమయ్యాయి. ఆజంజాహి మిల్లులో పనిచేసిన జమ్మలమడక కృష్ణమూర్తి శ్రీశారదానాట్య మండలిని ఏర్పాటు చేసి పద్యనాటకాలు ప్రదర్శించారు. వేమూరి శ్రీనివాసమూర్తి హార్మోనియం సహకారం అందించేవారు. మారేడోజు సదానందాచారి పౌరాణిక పాత్రలు పోషించేవారు. పందిళ్ల శేఖర్బాబు తెలంగాణ డ్రమెటిక్ అసోసియేషన్ స్థాపించి వరంగల్ పద్యనాటకానికి రాష్ట్రస్థాయిలో అనేక బహుమతులు వచ్చేలా కృషిచేశారు. మరోవైపు రేకందార్ నాగేశ్వరరావు స్థాపించిన సురభి భానోదయ నాట్యమండలి ఓరుగల్లు పద్యనాటకానికి రంగాలంకరణ సౌరభాలు అందించింది. నాటక రంగంలో ఓరుగల్లు కళాకారులు ప్రతిభ.. భారతీయ సంప్రదాయ నృత్యాలు, నాటక కళలకు ఓరుగల్లు పుట్టిల్లు. ఈ నేపథ్యంలో మన కళాకారులు వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలిస్తూ పలువురు ప్రముఖులతో అవార్డులు, మన్ననలు పొందుతున్నారు. నిత్యం సాధన చేస్తూ పోటీల్లో ప్రతిభ చాటుతున్నారు. ఏదో ఒక పనిచేస్తూనే ఖాళీ సమయంలో వేదికలపై తమ నాటకాలు ప్రదర్శిస్తూ కళారత్నాలుగా విశేష గుర్తింపు తెచ్చుకుంటూ ప్రశంసలందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మన కళాకారులకు నటక రంగంపై గల ఆసక్తి, సాధించిన విజయాలు, ఇతర వివరాలను తెలుసుకుందాం. నాటక రంగంలో విశేష గుర్తింపు తెచ్చుకుంటున్న కళాకారులుపాత్ర ఏదైనా సులభంగా పోషిస్తున్న మహానటులు నేడు అంతర్జాతీయ రంగస్థల దినోత్సవంనాటకం.. సమాజంలో జరిగే యథార్థ ఘటనలకు ప్రతిరూపం. అది మంచి కావొచ్చు లేదా చెడు కావొచ్చు. కళాకారులు ఆయా ఘటనలకు సంబంధించిన పాత్రలు ధరించి ప్రజలను ఆలోజింపచేస్తారు. చైతన్య పరుస్తారు. అందుకే భారతీయ సమాజంలో నాటక రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. క్రీ.పూ నాలుగో శతాబ్దంలోనే భరతముని రచించిన నాట్యశాస్త్రం భారతీయ నాటకానికి ఉన్న ప్రాధాన్యం తెలియజేస్తుంది. ప్రాచీనకాలంలో మహాకవి కాళీదాసు, భవభూతి రచించిన నాటకాలు ప్రసిద్ధి చెందాయి. మార్చి 27 అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం. ఈ నేపథ్యంలో ఓరుగల్లు కళాకారులకు నాటక రంగంపై గల ఆసక్తి.. వారు సాధించిన విజయాలు.. ఇతర వివరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సమాజానికి మంచి సందేశం.. నాటక రంగంలో పదేళ్ల అనుభవం ఉన్న నటుడు మాలి విజయరాజ్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. మార్గదర్శి, అన్నదాత, ఏ నిమిషానికి ఏమీ జరుగునో, కనువిప్పు, వైద్యో నారాయణో హరీ, పరివర్తన, ఇదెక్కడి న్యాయం, ధనకాంక్ష తదితర నాటకాలు ప్రదర్శించి ఎన్నో అవార్డులు అందుకున్నారు. సమాజానికి మంచి సందేశం ఇచ్చేది నాటక రంగమని పేర్కొంటున్నారు మాలి విజయరాజ్. – మాలి విజయరాజ్, నటుడు, దర్శకుడు ● -
పారదర్శకంగా విద్యుత్ సర్వీస్ల మంజూరు
హన్మకొండ: విద్యుత్ సర్వీస్ల మంజూరు సజావుగా, పారదర్శకంగా సాగుతోందని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల పరిధిలోని నూతనంగా విద్యుత్ సర్వీస్లు పొందిన గృహ, గృహేతర, వ్యవసాయ, పరిశ్రమల వినియోగదారులతో ఫోన్ ద్వారా ముఖాముఖి మాట్లాడారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం నూతన సర్వీస్ల మంజూరు జరుగుతున్నదా.. లేదా..? పారదర్శకంగా, నిష్పాక్షికంగా మంజూరు అవుతున్నదా.. లేదా..? అవినీతి రహితంగా సమయానుకూలంగా సర్వీస్ల మంజూరు జరుగుతున్నదా.. లేదా.. అని వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సర్వీస్ల మంజూరులో ఎలాంటి ఇబ్బందులు లేవని, సమయానికి సర్వీస్ విడుదల చేస్తున్నారని వినియోగదారులు తెలిపారు. నేరుగా మాట్లాడడం తమకు సంతోషంగా ఉందని తెలిపారు. సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ తాను ఇలా తరుచూ వినియోగదారులతో మాట్లాడుతానన్నారు. వినియోగదారులతో మాట్లాడడం వల్ల క్షేత్ర స్థాయిలో సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. వినియోగదారులతో మమేకమై వారికి మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
వరంగల్ కలెక్టర్ సత్య శారద వరంగల్: వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. వరంగల్లోని పాత ఆజంజాహి మిల్స్ గ్రౌండ్స్లో 16.7 ఎకరాల విస్తీర్ణంలో రూ.80 కోట్ల వ్యయంతో చేపట్టిన కలెక్టరేట్ నిర్మాణ పనుల పురోగతిని బ్లూ ప్రింట్ మ్యాప్ ప్రకారం మంగళవారం అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 60 శాతం పనులు పూర్తయ్యాయని, ఫినిషింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉందని అధికారులు కలెక్టర్కు వివరించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ 2025 సెప్టెంబర్ చివరి నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, ఆర్అండ్బీ జిల్లా అధికారి రమేశ్, డీఈ శ్రీధర్, కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్, ఏఈ శ్రీకాంత్, తహసీల్దార్ ఇక్బాల్ పాల్గొన్నారు. అభివృద్ధి పనులపై సమీక్ష.. మామునూరు ఎయిర్పోర్టు, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, గ్రీన్ ఫీల్డ్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పనులపై కలెక్టర్ సత్యశారద సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ ఏనుమాముల, గీసుకొండ, ఖిలావరంగల్ ఇన్నర్రింగ్ రోడ్డు పనుల్లో భూములు కోల్పోయిన రైతులకు డబ్బులు చెల్లించుటకు సిద్ధంగా ఉన్నాయని, ఆ పనులు పూర్తి చేసే ప్రక్రియలో వేగం పెంచాలని ఆర్డీఓను ఆదేశించారు. ఎయిర్పోర్టు పనుల్లో భాగంగా ఖిలావరంగల్లోని నక్కలపల్లి, గాడిపల్లిలో సర్వే పూర్తయిందని పనులు పురోగతికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, తహసీల్దార్లు నాగేశ్వరరావు, ఇక్బాల్, రాజ్కుమార్, రియాజుద్దీన్, వెంకట్స్వామి పాల్గొన్నారు. ఔషధ గిడ్డంగిని తనిఖీ చేసిన కలెక్టర్.. ఖిలా వరంగల్: రంగశాయిపేటలోని కేంద్ర ఔషధ గోదాంను కలెక్టర్ సత్యశారద తనిఖీ చేశారు. అనధికారికంగా విధులకు గైర్హాజరైన సూపర్వైజర్ నాగమణి, ప్యాకర్ చక్రపాణికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను కలెక్టర్ ఆదేశించారు. సెలవు పెట్టకుండా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు బండి నాగేశ్వర్రావు, ఇక్బాల్ పాల్గొన్నారు. -
వెంటాడిన మృత్యువు..
టేకుమట్ల: రెక్కాడితే గాని డొక్కాడని రెండు నిరుపేద కుటుంబాలను మృత్యువు వెంటాడింది. ఉదయం కూలీకి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. ఖాళీగా ఉంటే ఏముంటుంది..? అదనపు కూలీకి వెళ్తే పూట అయినా గడుస్తుంది కదా అనే ఆశతో సాయంత్రం కూడా వెళ్లారు. అయితే ఈ కూలే వారికి చివరిది అవుతుందని అనుకోలేదు. పాపం.. పని వెళ్లకున్నా బతికేవారేమో. మృత్యువు లారీ రూపంలో ఇద్దరు మహిళా కూలీలను కబలించింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రామకిష్టాపూర్(టి)లో మంగళవారం చోటు చేసుకుంది. ప్రత్యక్షుల కథనం ప్రకారం.. రామకిష్టాపూర్(టి) గ్రామానికి చెందిన మోకిడి పూలమ్మ(45), మోకిడి సంధ్య(30)తోపాటు మరో ఆరుగురు కూలీలు ఉదయం పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. సాయంత్రం వేళలో కూడా మళ్లీ అదే గ్రామానికి చెందిన సల్పాల బుచ్చయ్య అనే రైతు పొలంలోని పని చేయడానికి వెళ్తున్నారు. సరిగా పొలం వద్దకు చేరుకునే సమయానికి చిట్యాల మండలం శాంతినగర్ శివారు కాటన్ మిల్లు నుంచి అతివేగంగా పత్తి గింజల లోడ్తో మూలమలుపు వద్ద నుంచి వస్తున్న లారీని గమనించిన కూలీలు కొంత దూరం పరుగులు తీశారు. ఇందులో ముగ్గురు పొలంలోకి వెళ్లడంతో అక్కడే లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పత్తి గింజల బస్తాలు పడడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ తృటిలో తప్పించుకుంది. తోటి మహిళా కూలీలు భయంతో కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఏఎస్సై అమరేందర్రెడ్డి సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని జేసీబీ సాయంతో లారీని లేపారు. మృతదేహాలను పత్తి గింజల బస్తాల కింద నుంచి బయటకు తీసి 108లో చిట్యాల సివిల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అప్పటి వరకు అందరి మధ్యలో ఉన్న ఇద్దరు విగత జీవులుగా మారడంతో తోటి మహిళా కూలీల రోదనలు మిన్నంటాయి. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారైనట్లు మహిళా కూలీలు తెలిపారు. పిల్లలు ఎవరిని అమ్మా అని పిలవాలి సంధ్యా.. మన పిల్లలు ఇక నుంచి ఎవరిని అమ్మా అని పిలవాలి సంధ్యా.. ఒక్కసారి చూడు సంధ్యా.. నా ప్రాణం పోయేలా ఉంది.. అయ్యో దేవుడా ఒక్కసారి బతికించమంటూ సంధ్య భర్త రాజు రోదించిన తీరు చిట్యాల సివిల్ ఆస్పత్రిలో ప్రతీ ఒక్కరిని కంట తడి పెట్టించింది. అమ్మా లే.. అమ్మా లే.. అంటూ చిన్నారుల రోదనలు మిన్నంటాయి. పూలమ్మ భర్త, కూతురు సైతం కన్నీరుమున్నీరయ్యారు. లారీ కింద పడి ఇద్దరు మహిళా కూలీలు మృతి రామకిష్టాపూర్(టి)లో ఘటన -
కారును ఢీకొన్న టిప్పర్..
ఎల్కతుర్తి: టిప్పర్.. కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారులో జరిగింది. ఎస్సై సాయిబాబు కఽథనం ప్రకారం..పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ జ్యోతి నగర్కు చెందిన కనుకపుడి కరుణాకర్(58) చర్చ్ ఫాదర్. సోమవారం రాత్రి ఒంటి గంటకు కారులో ఎల్కతుర్తి మీదుగా హుస్నాబాద్ వైపునకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారులోని చాయ్ విహార్ సమీపంలో ముల్కనూరు వైపు నుంచి వస్తున్న టిప్పర్ ఎదురుగా కారును ఢీకొంది. ఈ ఘటనలో కారు నడుపుతున్న కరుణాకర్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయిబాబు తెలిపారు. ● వ్యక్తి దుర్మరణం ● కొత్తపల్లి శివారులో ఘటన -
భద్రకాళి శేషుకు ‘ఆగమ ద్యుమణి’ బిరుదు
హన్మకొండ కల్చరల్: వరంగల్కు చెందిన ఆగమ సామ్రాట్, భద్రకాళి దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త, అర్చకుడు భద్రకాళి శేషు తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి ఆగమ ద్యుమణి బిరుదు అందుకున్నారు. విశ్వవిద్యాలయం వార్షికోత్సవాన్ని వైస్చాన్స్లర్ జీఎస్ ఆర్ కృష్ణమూర్తి అధ్యక్షతన మంగళవారం తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా దేశంలోని నిష్ణాతులైన పలువురు పండితులకు పురస్కారాలు అందించి సన్మానించారు. బెంగళూరుకు చెందిన శాస్త్రవేత్త ఎల్ఎన్ రాఘవేంద్ర ముఖ్య అతిథిగా హాజరై భద్రకాళి శేషుకు ఆగమ ద్యుమణి బిరుదు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శేషుకు భద్రకాళి దేవాలయ ఈఓ శేషుభారతి, సిబ్బంది, వరంగల్ సంగీత విద్వత్ గానసభ, అర్షధర్మరక్షణ సంస్థ సభ్యులు అభినందనలు తెలిపారు. -
జిల్లాల వారీగా ఇలా..
● హనుమకొండ వడ్డేపల్లిలో అపార్ట్మెంట్ మోడల్లో 744 ఫ్లాట్లు నిర్మించారు. వీటిని 1990లో లబ్ధిదారులకు కేటాయించగా చాలా మంది క్రయవిక్రయాలు జరిపారు. ఇక్కడ రూ.3,67,81,668 బకాయిలు పేరుకుపోగా ఇప్పుడు 142 మందికి నోటీసులు జారీ చేశారు. ● వరంగల్ గొర్రెకుంట కాలనీలో 1376 ఇళ్లు నిర్మించారు. వీటిని దశల వారీగా 1992, 1993, 2003, 2012లో లబ్ధిదారులకు కేటాయించారు. ఈ కాలనీలో రూ.9,43,58,063 బకాయిలు పేరుకుపోగా వీటిని రాబట్టుకునేందుకు 103 మందికి నోటీసులు జారీ చేశారు. ● మహబూబాబాద్ జిల్లా మరిపెడలో 79 ఇళ్లు నిర్మించి 1997లో లబ్ధిదారులకు కేటాయించారు. ఇక్కడ రూ.7,19,45,743 బకాయిలు ఉండగా, వీటిని రాబట్టుకునేందుకు 64 మందికి నోటీసులు జారీ చేశారు. ● జనగామ హౌసింగ్ బోర్డు కాలనీలో 127 ఇళ్లు నిర్మించగా రూ.2,18,90,827 బకాయిలు పేరుకుపోయాయి. వీటిని రాబట్టుకునేందుకు 17 మందికి నోటీసులు జారీ చేశారు. -
మట్టి తరలింపులో జాగ్రత్తలు తీసుకోవాలి
చెరువు పూడికతీత పనులు పరిశీలించిన కలెక్టర్లు హన్మకొండ కల్చరల్: భద్రకాళి చెరువు పూడికతీత మట్టి తరలింపును పగలు మాదిరిగానే రాత్రివేళల్లోనూ జాగ్రత్తగా తరలించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవార రాత్రి 10గంటలకు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్లు వెంకట్రెడ్డి, సంధ్యారాణి, ఇతర శాఖల అధికారులతో కలిసి మట్టి తరలింపు ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించారు. రాత్రివేళల్లో మట్టి తరలింపు ఏర్పాట్లను సాగునీటి పారుదలశాఖ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ శంకర్ చౌహన్లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రావీణ్య మాట్లాడుతూ రాత్రివేళ కూడా ఎక్కువ ట్రిప్పులు వెళ్లే విధంగా చూడాలన్నారు. చెరువులో మరిన్ని అంతర్గత రహదారులు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో కుడా పీఓ ఆజిత్రెడ్డి, ఈఈ భీమ్రావు, ఏసీపీలు దేవేందర్ రెడ్డి, సత్యనారాయణ, ఇతరశాఖల అధికారులు పాల్గొన్నారు. బస్టాండ్ ప్రదేశంలో బాంబుల పేల్చివేత ● బస్సులో పడిన బండరాయి. డ్రైవర్కు స్వల్ప గాయాలు? వరంగల్: వరంగల్ బస్డాండ్ స్థానంలో ప్రభుత్వం నూతనంగా మోడల్ బస్టాండ్ నిర్మిస్తోంది. పనుల్లో భాగంగా పిల్లర్లు నిర్మించే క్రమంలో భూమిలో బండరాళ్లు ఉండడంతో తొలగించడం అనివార్యమైంది. ఈ రాళ్లను తొలిగించేందుకు కాంట్రాక్టర్ మంగళవారం జిలెటిన్ స్టిక్స్ (బాంబులు)పెట్టి పేల్చివేసినట్లు తెలిసింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సమీపంలోని తాత్కాలిక బస్టాండ్లో నిలిచిఉన్న భూపాలపల్లి డిపోకు చెందిన బస్సులో పెద్ద బండరాయి పడింది. ఈ రాయి తాకడంతో బస్సు కిటికీల అద్దాలు పగిలి డ్రైవర్, కండర్లకు స్వల్పగాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈఘటనలో బస్సు ధ్వంసం కావడంతో కాంట్రాక్టర్ రూ.10వేలు పరిహారంగా ఇచ్చినట్లుగా స్థానికులు తెలిపారు. ఈవిషయంపై ఇంతేజార్గంజ్ పోలీసులను వివరణ కోరగా ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. నాడు నేడు నిర్లక్ష్యమే... బస్టాండ్లో జరుగుతున్న ప్రతి పనిలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఏడాదిన్నర క్రితం పాత బస్టాండ్లోని వాటర్ ట్యాంక్ను కూల్చివేసిన సమయంలో భద్రత ఏర్పాట్లు చేయకపోవడంతో ఒక కూలీ శిథిలాల కింద పడి మృత్యువాత పడ్డారు. ఇప్పుడు బండరాళ్ల తొలగింపు కోసం పేల్చివేతతో పెద్ద బండరాయి బస్సులో పడింది. న్యాయవాదుల ధర్నాహైదరాబాద్లోని చంపాపేటలో న్యాయవాది హత్య కేసు నిందితుడిని కఠినంగా శిక్షించడంతోపాటు రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మంగళవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి జిల్లా కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు. – వరంగల్ లీగల్ -
రేపు ‘నిధి ఆప్కే నికట్’
హన్మకొండ అర్బన్ : ఈపీఎఫ్ఓ సభ్యులు, య జమానులు, పెన్షనర్ల ఫిర్యాదులు పరిష్కరించడానికి ఈనెల 27న (గురువారం) నిధి ఆప్కే నికట్ 2.0 కార్యక్రమం నిర్వహించనున్నట్లు వరంగల్ రీజియన్ అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ తానయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు సంబంధించి వరంగల్లోని వైభవ్ లక్ష్మి షాపింగ్ మాల్, హనుమకొండలోని గ్రీన్వుడ్ హైస్కూల్, తొ ర్రూరులోని సెయింట్ పాల్స్ హైస్కూల్, జనగామలోని శాన్ మారియా హైస్కూల్, భూపాలపల్లిలోని ఎస్ఆర్ డీజీ స్కూల్, ములుగులోని శ్రీ అరవింద ఉన్నత పాఠశాల, ఖమ్మంలోని మమత హాస్పిటల్ రోడ్డులో గల ఎస్బీఐటీ కళాశాల, ఇల్లందులోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదుల స్వీకరణతో పాటు పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పీఎఫ్ సభ్యులు, పెన్షనర్లు సద్వినియోగించుకోవాలని సూచించారు. తాళం వేసిన ఇంట్లో భారీ చోరీరూ.2.39లక్షల విలువైన సొత్తు అపహరణ ఖిలా వరంగల్: వరంగల్ కరీమాబాద్లో తాళం వేసి ఊరెళ్లిన ఇంట్లో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. రూ.2.39లక్షల విలువైన సొత్తు అపహరించారు. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. కరీమాబాద్కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి గంజి శ్యాం మోహన్, స్వర్ణలత దంపతులు ఈ నెల 17న ఇంటికి తాళంవేసి హైదరాబాద్కు వెళ్లారు. హైదరాబాద్నుంచి మంగళవారం మధ్యాహ్నం కరీమాబాద్లోని ఇంటికి చేరగా.. తాళం తీసి ఉండటంతో చోరీ చేసి ఉంటారని గ్రహించి వెంటనే ఆయన మిల్స్కాలనీ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు క్లూస్ టీమ్తో ఘటనస్థలానికి చేరుకుని పరిశీలించారు. బీరువాలో దాచిన బంగారు గొలుసు 24గ్రాములు, మాటీలు నాలుగు గ్రాములు, ఉంగరం 3గ్రాములు, 5గ్రాముల బంగారు నాణెం.. మొత్తం 36 గ్రాముల బంగారం పాత విలువ ప్రకారం రూ.1 44 లక్షలు, వెండి పట్టిలు 150 గ్రాములు, రూ.80వేలు చోరీకి గురైనట్లు బాధితుడు శ్యాం మోహన్ ఫిర్యాదులో తెలిపారు. మంగళవారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వెంకటరత్నం తెలిపారు. పెట్రేగి పోతున్న గిరిగిరి వ్యాపారులు ● బాకీ ఇవ్వలేదని భౌతికదాడి వరంగల్: వరంగల్లో గిరిగిరి వ్యాపారులు పెట్రేగి పోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొమ్మిదేళ్ల క్రితం గిరిగిరిలో తీసుకున్న డబ్బుల్లో కొంత బకాయి ఇవ్వలేదనే కోపంతో తాజాగా బకాయిదారుడిపై భౌతిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. కాశిబుగ్గలోని ఓ ప్రైవేట్ వైద్యుడు ఓ గిరిగిరి వ్యాపారి వద్ద రూ.లక్ష అప్పుగా తీసుకుని వాయిదాలు చెల్లించగా రూ.9వేలు బకాయి పడినట్లు సమాచారం. అప్పు ఇచ్చిన వ్యాపారి కుమారుడు పలుమార్లు వైద్యుడి వద్దకు వచ్చి బకాయిని ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అయినా సదరు వైద్యుడు స్పందించపోవడంతో వ్యాపారుడి కుమారుడు ఇంతేజార్గంజ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా వారు వైద్యుడికి ఫోన్ చేసి అప్పు చెల్లించాలని సూచించిగా నేను ఏసీపీ వద్దకు వస్తాను. అక్కడ తేల్చుకుంటానని చెప్పడంతో పోలీసులు మిన్నకుండి పోయి ఈవిషయం ఫిర్యాదు చేసిన వారికి తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన వ్యాపారి కుమారుడు తన మిత్రులతో కలిసి రెండు రోజుల క్రితం వైద్యుడిపై భౌతిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. అయితే అప్పు ఇవ్వకుంటే దాడికి పాల్ప డం సరికాదని స్థానికులు అంటున్నారు. వైద్యుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. -
‘డిగ్రీ’ ఉత్తీర్ణత అంతంతే..
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీలో ఒకప్పుడు వార్షిక ఫలితాల విధానం ఉండేది. సంవత్సరం మొత్తం పాఠాలు చెప్పిన తర్వాత పరీక్షలు నిర్వహించే వారు. అనంతరం ఫలితాలు ప్రకటించేవారు. అయితే ఇందులో విద్యార్థులు తక్కువ ఉత్తీర్ణత సాధించేవారు. దీంతో ఈ విధానాన్ని రద్దు చేసి కొన్ని సంవత్సరాల క్రితం సెమిస్టర్ సిస్టం తీసుకొచ్చారు. అయినా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించలేకపోతున్నారు. సెమిస్టర్ విధానంలో ఉదాహరణకు ఒక సబ్జెక్టుకు 100 మార్కులు ఉంటే అందులో 20 ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. ఇక ప్రతీ సబ్జెక్టుకు 80 మార్కుల సెమిస్టర్ పరీక్ష ఉంటుంది. అందులో వచ్చిన మార్కులు, ఇంటర్నల్లో వచ్చిన మార్కులు కలిపే ఉత్తీర్ణత ప్రకటిస్తారు. అయినా ఈ విధానం వల్ల వివిధ సబ్జెక్టుల్లో పాస్ మార్కులు కూడా రాక వేలాది మంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. ప్రతీ సెమిస్టర్ పరీక్షల్లోనూ అప్పటివరకు పూర్తయిన పాఠ్యాంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి. కొద్దిపాటిగా చదువుకున్నా ఉత్తీర్ణత సాధించే పరిస్థితి ఉంటుంది. ఎక్కువ మార్కులు రావాలంటే కొంచెం కష్టపడాల్సిందే. కేయూ పరిఽధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకులాలు డిగ్రీ కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, ‘బి’ ఒకేషనల్, బీఎస్సీ హానర్స్ కోర్సుల్లో నిర్వహించిన డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలతోపాటు రెండో సంవత్సరం మూడో సెమిస్టర్, ఫైనల్ ఇయర్ ఐదో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను కొద్దిరోజుల క్రితం అధికారులు ప్రకటించారు.ఈ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం అంతంతమాత్రంగానే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. సెమిస్టర్ సిస్టంలోనూ మెరుగైన ఫలితాలేవి? డిగ్రీ కోర్సుల సెమిస్టర్ సిస్టంలో విద్యార్థులు సక్రమంగా తరగతులకు హాజరై కొంచెం కష్టపడినా ఉ త్తీర్ణత సాధించే అవకాశం ఉంది. అయితే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించలేకపోవడానికి ప లు కారణాలున్నాయని భావిస్తున్నారు. ఇందులో ప్రధానంగా తరగతులకు సరిగా హాజరుకాకపోవ డం. వాస్తవంగా 75శాతం హాజరు ఉండాలనే ని బంధన ఉన్నప్పటికీ ఏ కళాశాలలోనూ అమలు చే యడం లేదు. ప్రభుత్వ కళాశాలలే కాదు ప్రైవేట్ క ళాశాలల్లోనూ నాణ్యమైన విద్యనందించడం లేదనే అంశం ఈఫలితాలను బట్టి తెలుస్తోంది. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో ఎక్కువమంది పేదవర్గాలకు చెందిన వారే ఉంటారు. కొందరు కళాశాలకు అప్పుడప్పుడు వస్తూ కుటుంబ పరిస్థితులు బట్టి ప్రైవేట్లో ఉపాధి పొందుతున్న పరిస్థితి కూ డాఉందని తెలుస్తోంది. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లోనూ విద్యార్థులకు నాణ్యమైన విద్య నందించేందు కు యాజమాన్యాలు సరిపడా బోధనా సిబ్బందిని నియమించుకోవడం లేదు. మూడేళ్లుగా ఫీజు రీ యింబర్స్మెంట్ రాకపోవడంతో కొన్ని ప్రైవేట్ కళా శాలలు సైన్స్ విద్యార్థులకు సరిగా ప్రాక్టికల్స్ కూడా నిర్వహించడం లేదు. మరోవైపు విద్యార్థులు ఎక్కు వ సమయం సెల్లో ముగినిపోవడం కూడా ఉత్తీర్ణతపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అటానమస్ డిగ్రీ కాలేజీల్లో ఉత్తీర్ణత ఇలా.. అటానమస్ కాలేజీల్లో మాత్రం విద్యార్థులు మెరుగై న ఫలితాలు సాధిస్తున్నారు. హనుమకొండ కేడీసీ (అటానమస్) డిగ్రీ మొ దటి సెమిస్టర్ పరీక్షల్లో 56 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్ర భుత్వ పింగిళి మహిళా కళాశాల మొదటి సెమిస్టర్లో 61,93 శాతం, మూడో సెమిస్టర్లో 73,27 శా తం, ఐదో సెమిస్టర్లో 82.52శాతం ఉత్తీర్ణత సా ఽధించారు. నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సెమిస్టర్లో 38,64 శాతం, 3వ సెమిస్టర్లో 53.33శాతం ఉత్తీర్ణత సాధించారు. హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ మొదటి సెమిస్టర్లో 43, 59శాతం, మూడో సె మిస్టర్లో 58,69శాతం, 5వ సెమిస్టర్లో 65.04శాతం ఉత్తీర్ణత సాధించారు. డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాల్లో 21.93 శాతమే ఉత్తీర్ణతకేయూ పరిధిలో ఆయా డిగ్రీ కోర్సుల్లో మొత్తం 70,661 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే అందులో 15,495మంది (21.93శాతమే) ఉత్తీర్ణత సాధించారు. బాలురు 36,504మంది పరీలకు హాజరైతే అందులో 5,278మంది (14.46శాతం)ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 34,157మందికిగాను 10,217 మంది 29.91శాతం ఉత్తీర్ణత పొందారు. ఇందులో బాలుర కంటే బాలికలదే పైచేయిగా ఉంది.డిగ్రీ ఐదో సెమిస్టర్ పరీక్షల్లో 40.73 శాతం ..ఆయా డిగ్రీకోర్సుల్లో మొత్తం 46,828మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా అందులో 19,074 మంది ఉత్తీర్ణత (40.73శాతం) సాధించారు.బాలురు 23,402 మందికిగాను 6,808మంది( 29,09శాతం) ఉత్తీర్ణత, బాలికలు 23,426 మందికిగాను 12,266మంది( 52.36శాతం ) ఉత్తీర్ణత సాధించారు. బాలురకంటే బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది.డిగ్రీ మూడో సెమిస్టర్లో 28.97శాతం ఉత్తీర్ణతడిగ్రీ ఆయా కోర్సుల్లో మూడో సెమిస్టర్ పరీక్షల్లో మొత్తం 59,916మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా అందులో 17,356మంది ఉత్తీర్ణత (2 8.97శాతం)సాధించారు. బాలురు 29,771మందికి గాను 5,924 మంది (19.90శాతం), బాలికలు 3 0,145 మందికి గాను 11,432మంది (37.92శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలుర కంటే బాలికలే ఎక్కవశాతం ఉత్తీర్ణత పొందారు.సెమిస్టర్ సిస్టంలోనూ మెరుగైన ఫలితాలేవి! ఇటీవల ఫలితాలు ప్రకటించిన అధికారులు ఇందులో బాలికలదే హవా.. రీవాల్యుయేషన్కు వెల్లువెత్తిన దరఖాస్తులు అటానమస్ కాలేజీల్లో మెరుగైన ఫలితాలు -
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి
ఖిలా వరంగల్: రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించాలని రాష్ట్ర శాసన మండలి సభ్యుడు బస్వరాజు సారయ్య సూచించారు. వరంగల్ నక్కలపల్లి రహదారిలోని జీఎం కన్వెన్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించే రైతు ఉత్పత్తుల మేళాను మంగళవారం రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వరంగల్ కలెక్టర్ సత్యశారద, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ జిల్లా అధికారి అనురాధతో కలిసి ఎమ్మెల్సీ సారయ్య.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి రైతు పక్షపాతి అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్కే దక్కుతుందన్నారు. రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాలతో రైతులు మోసపోవద్దని, రైతును బలోపేతం, చైతన్య పర్చడానికే ఎఫ్పీఓ మేళా ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ రైతులు ఆర్థిక బలోపేతం, లాభసాటి సాగుకు ఎఫ్పీఓల పాత్ర కీలకమన్నారు. 40 ఉత్పత్తి దారుల సంఘాలు స్టాళ్లు ఏర్పాటు చేయగా .. ఆ ఉత్పత్తుల అమ్మకాలు చేపడుతున్నామన్నారు. ఎఫ్పీఓ మేళాకు స్పందన.. ఎఫ్పీఓ మేళాకు స్పందన లభించింది. రాష్ట్రం నలు మూలాల నుంచి భారీగా రైతులు, నగర ప్రజలు చేరుకున్నారు. స్టాళ్లను ఆసక్తిగా తిలకించి అవసరమైన పనిముట్లు, గృహోపకరణాలు, విత్తనాలు కొనుగోలు చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఏసీ డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ రామన్సింగ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, పీజేటీఏయూ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, అగ్రికల్చర్ జూయింట్ డైరెక్టర్ సుజాత, డీఆర్డీఓ కౌసల్యాదేవి, తహసీల్దార్లు బండి నాగేశ్వర్రావు, ఇక్బాల్, ఉద్యాన శాఖ అధికారి సంగీత లక్ష్మి, ఏడీఏ యాకయ్య, ఏఓ రవీందర్రెడ్డి, కార్పొరేటర్ ఈదుల అరుణ్, రైతులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య జీఎం కన్వెన్షన్ హాల్లో రాష్ట్రస్థాయి (ఎఫ్పీఓ) రైతు ఉత్పత్తుల మేళా ప్రారంభం -
పీఎన్డీటీ చట్టం ఉల్లంఘిస్తే చర్యలు
హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి హన్మకొండ అర్బన్: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ (పీసీ అండ్ పీఎన్డీటీ) చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన పీసీఅండ్ పీఎన్డీటీ అథారిటీ సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఆస్పత్రులు, ల్యాబ్ల నిర్వాహకులు నిబంధనలను పాటించాలని, రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, ప్రతి ఆస్పత్రిలో చట్టా నికి సంబంధించిన బోర్డు అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించాలని తెలిపారు. వైద్యాధికారులు రిజిస్టర్ అయిన కేంద్రాలతోపాటు రిజిస్టర్ కాని ఆస్పత్రులను కూడా తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పబ్లిక్ స్థలాల్లో వాల్పోస్టర్లు ప్రదర్శించడంతోపాటు స్వచ్ఛంద సంస్థలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఎన్హెచ్జీ గ్రూపులను కూడా అవగాహన సదస్సుల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. గ్రామాల్లోని మహిళలకు అవగాహన కల్పించడమే కాక గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, డీఆర్డీఓ మేన శ్రీను, డీడబ్ల్యూఓ జయంతి, కమిటీ సభ్యులు ఈవీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ కరుణాకర్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల పాల్గొన్నారు. -
తరాలపల్లి నుంచి దండకారణ్యం వరకు..
ముగిసిన అంకేశ్వరపు సారయ్య ఉద్యమ ప్రస్థానంసాక్షిప్రతినిధి, వరంగల్/కాజీపేట అర్బన్ : అంకేశ్వరపు సారయ్య అలియాస్ సుధీర్, ఎల్లన్న, సుధాకర్.. హనుమకొండ జిల్లా తరాలపల్లి ముద్దుబిడ్డ.. రెండు పదుల వయస్సులో ఆయిడిసి, బాయిడిసి అడవిబాట పట్టిన మావోయిస్టు నేత. దళసభ్యుడి నుంచి దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడి వరకు ఎదిగిన సారయ్య అలియాస్ సుధీర్ 35 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ముగిసింది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందాడు. దంతెవాడ జిల్లా బీజాపూర్ ప్రాంతంలోని గీడం పోలీస్స్టేషన్ పరిధిలోని గిర్సాపర, నెల్గోడ, బోడ్గా, ఇకెలి గ్రామాల సరిహద్దు ప్రాంతాల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు ఎస్పీ గౌరవ్రాయ్ మంగళవారం ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్లో మొత్తం ముగ్గురు మృతిచెందగా.. మృతుల్లో సారయ్య ఉన్నట్లు వెల్లడించారు. బీజాపూర్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో సారయ్య మృతి చెందాడన్న వార్తతో తరాలపల్లిలో విషాధఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు.. తరాలపల్లి గ్రామానికి చెందిన సారయ్య కొండపర్తి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. 1982లో 10వ తరగతి చదువుతున్న తరుణంలోనే నాడు మావోయిస్టులు ఇచ్చిన ‘గ్రామాలకు తరలండి’ పిలుపునకు ఆకర్షితుడై, తరాలపల్లి విలేజ్ ఆర్గనైజర్ బండి ఆశాలు, హనుమకొండ సిటీ ఆర్గనైజర్ తిప్పారపు రాములు అలియాస్ తాత సారథ్యంలో తరాలపల్లి గ్రామ అధ్యక్షుడిగా తన ప్రస్థానం ప్రారంభించాడు. అంచలంచెలుగా మావోయిస్టు పార్టీలో ఎదుగుతున్న తరుణంలో 1990లో బీఎస్ఎఫ్ సిబ్బంది గ్రామాల్లో రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 1993లో జరిగిన ఎన్కౌంటర్లో సిటీ ఆర్గనైజర్ తాత చనిపోవడంతో.. అజ్ఞాతంలోకి వెళ్లిన సారయ్య నేటి వరకు గ్రామానికి తిరిగి రాలేదు. 35 ఏళ్ల అజ్ఞాతవాసం... దళసభ్యుడి నుంచి డీకేఎస్జడ్సీ వరకు దంతెవాడ ఎన్కౌంటర్లో అసువులు బాసిన సుధీర్ విషాదంలో తరాలపల్లి.. నేడు గ్రామానికి మృతదేహం అమరుల పల్లె తరాలపల్లి..తరాలపల్లి ఉద్యమాలకు కేరాఫ్. ఎందరో ఈ గ్రామం నుంచి విప్లవోద్యమాల వైపు ఆకర్షితులై ఎన్కౌంటర్లలో అసువులు బాశారు. 1991లో వేల్పుల జగదీశ్ అలియాస్ ఉప్పలన్న, 1992లో బండి ఆశాలు అలియాస్ శ్రీను పగిడేరు ఎన్కౌంటర్లో చనిపోయారు. 1998 నుంచి గాజుల శ్రీకాంత్ అలియాస్ శ్రీనాథ్, ముప్పిడి నాగేశ్వర్రావు అలియాస్ విశ్వనాథ్, చిరబోయిన సదానందం, సంపత్, కొత్తపల్లి సాంబయ్య మృతిచెందగా.. మంగళవారం ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో అంకేశ్వరపు సారయ్య చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. సారయ్య మృతదేహం బుధవారం తరాలపల్లికి రానుంది. -
మే1 నుంచి ఉచిత వేసవి క్రీడాశిక్షణ శిబిరాలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31 వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వేసవి క్రీడాశిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ శిబిరాలను నిర్వహించేందుకు పీడీ, పీఈటీ, సీనియర్ క్రీడాకారులు వచ్చే నెల 15 వరకు హనుమకొండ ఇండోర్ స్టేడియంలోని డీఎస్ఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నెల రోజులపాటు శిబిరాలను నిర్వహించే శిక్షకులకు గౌరవ వేతనం అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు కొనసాగే శిక్షణ శిబిరాలను గ్రామీణ ప్రాంతాల్లోని బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రెండు రోజులపాటు జాతీయ కాన్ఫరెన్స్ విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాలలో ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో జాతీయ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.చంద్రమౌళి, కన్వీనర్ డాక్టర్ పి.అరుణ, కోకన్వీనర్ కవిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఇంటర్ డిసిప్లినరీ మెటీరియల్స్ సైన్స్ ఫర్ సస్టయినబుల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్’అంశంపై ఈ జాతీయ కాన్ఫరెన్స్ ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ పి.ప్రావీణ్య, నిట్ ఫిజిక్స్ ప్రొఫెసర్ హరినాఽథ్ కీలక ఉపన్యాసం చేస్తారని, నెహ్రూ యువకేంద్రం డిప్యూటీ డైరెక్టర్ ఆన్వేశ్, సీసీఈటీ ఏజీఓ ప్రొఫెసర్ బాలభాస్కర్ పాల్గొంటారని వివరించారు. ఐఎస్ఎఫ్తో నిట్ ఒప్పందం కాజీపేట అర్బన్: ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ఐఎస్ఎఫ్) కర్నాటకతో నిట్ వరంగల్ మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. నిట్ డైరెక్టర్ కార్యాలయంలో డైరెక్టర్ బిద్యాధర్ బిద్యాధర్ సుబుదీ, ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జేఏ చౌదరి పరస్పర ఒప్పందపత్రాలను అందజేసుకున్నారు. కాగా, స్టార్టప్ల అభివృద్ధికి ఎంఓయూ తోడ్పడుతుందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు ఏప్రిల్ 2కేయూ క్యాంపస్: కేయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకులాలకు సంబంధించిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సుల 2,4, 6 సెమిస్టర్ పరీక్షల ఫీజులు చెల్లించేందుకు అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 2వరకు గడువు పొడిగించారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 9 వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు తిరుమలాదేవి, వెంకటయ్య తెలిపారు. ఏప్రిల్, మేలో పరీక్షలు నిర్వహించనున్నారని, వివిధ కోర్సుల ఫీజుల వివరాలు, పూర్తి సమాచారం కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉందని వారు పేర్కొన్నారు. -
ఏడాది జైలుపాలే..
బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025వరంగల్ క్రైం: తీవ్రమైన నేరాలకు పదేపదే పాల్పడే అక్రమార్కులు, నేరస్తులపై పీడీయాక్టులతో పోలీసులు ఉక్కుపాదం మోపుతారు. ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు ఇబ్బందిగా పరిణమించే వారిపట్ల ఇదో చట్టపరమైన ఆయుధం. కానీ, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండేళ్లుగా పీడీయాక్టుల కేసు నమోదు అంతంతమాత్రమే. గత ఏడాది కేవలం రెండు కేసులు నమోదు చేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్కకేసు కూడా పెట్టలేదు. కానీ, అక్రమార్కుల ఆగడాలు, కబ్జాదారులు, గంజాయి, డ్రగ్స్ సరఫరాకు అడ్డుకట్ట పడిందంటే లేదనే చెప్పాలి. వరంగల్ పోలీస్ కమిషనర్గా సుధీర్బాబు, రవీంద్రకుమార్, తరుణ్జోషి హయాంలో ఎక్కువగా పీడీ యాక్టులు నమోదు చేశారు. ఏవీ రంగనాఽథ్ పనిచేసిన సమయంలో అక్రమార్కులు, భూకబ్జాదారులపై ఉక్కపాదం మోపారు. పేదల భూముల్లో అడుగు పెట్టాలంటే ఒంట్లో వణుకు పుట్టించారు. ఆ తర్వాత వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలు, ఉదాసీనతతో అక్రమార్కులు పనులు యథాతథమయ్యాయి. మళ్లీ భూకబ్జాలు అక్కడక్కడా వెలుగు చూస్తూనే ఉన్నాయి. రోజుకు ఎక్కడో ఒకచోట గంజాయి లభిస్తూనే ఉంది. దొంగలు పగలు, రాత్రి తేడా లేకుండా చోరీల మీద చోరీలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.● తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిపట్ల పోలీస్ అధికారులు కేసుల తీవ్రతను బట్టి పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తారు. ● సంచలనం కలిగించే హత్య కేసులు ఒక్కటి, మూడు నెలల్లో రెండు కేసులు, 20 కిలోల గంజాయి, డ్రగ్స్ వంటి కేసుల్లోని నిందితులపై పీడీయాక్టు నమోదు చేశారు. ● ఈ కేసులో సంవత్సరం వరకు బెయిల్ మంజురు కాదు. ● నిందితులను జైల్లోనే ఉంచి వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని, వారివల్ల ప్రజలు ఇబ్బందులకు గురి కావొద్దు అనే ఆలోచనలతో పీడీయాక్టు నమోదు చేస్తారు. ● పోలీస్ కమిషనరేట్లో ఇప్పటివరకు మొత్తం 254 మందిపై పీడీయాక్టు పెట్టారు.హద్దుమీరితే పీడీ యాక్టు నమోదు హద్దుమీరి నేరాలకు పాల్పడే వారిపై కచ్చితంగా పీడీ యాక్టు నమోదు చేస్తాం. ఈ కేసులతో నేరస్తుల్లో భయంతోపాటు వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిదిలో నేరాలకు పాల్పడే అంతర్రాష్ట్ట్ర దొంగల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. భూకబ్జాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతాం. – సన్ప్రీత్సింగ్, వరంగల్ సీపీ కోర్టు ఇబ్బందులతో వెనుకడుగు..వివిధ రకాల నేరాలకు పాల్పడే అంతర్రాష్ట్ర నేరస్తులపై పీడీయాక్టు కేసులు నమోదు చేస్తున్న క్రమంలో పోలీసు అధికారులకు కోర్టుల్లో చేదు అనుభవం ఎదురవుతుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్ద నేరాలు ఒక్కటి చేసినప్పటికి వారిపై పీడీయాక్టు నమోదు చేసే నిబంధనలు అడ్డొస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నిందితులకు పీడీయాక్టు నివేదికలను వారి సొంత భాషలో ఇవ్వడంలో అధికారులు ఇబ్బంది పడుతున్నారు. దీని వల్ల పీడీయాక్టు కేసులు నమోదైనప్పటికీ అన్ని కేసులు చివరి వరకు నిలవడం లేదు. హత్యలు చేసిన వారు8పీడీఎస్ బియ్యం రవాణా4డెకాయిట్, రాబరీ22భూకబ్జాదారులు4సీ్త్రల అక్రమ రవాణా1దొంగలు87మోసాలు22గంజాయి, డ్రగ్స్ సరఫరా104అత్యాచారాలకు పాల్పడే వారు2వరంగల్ కమిషనరేట్లో ఈ ఏడాది సున్నా -
లేకపోతే ఇళ్లు ఖాళీ చేయాలని హౌసింగ్ బోర్డు నోటీసులు
కాలనీవారీగా బకాయిలు (రూ.లలో)హన్మకొండ: పెండింగ్ బకాయిలను రాబట్టుకునేందుకు తెలంగాణ హౌసింగ్ బోర్డు కఠిన చర్యలకు పూనుకుంది. ఈ నెల 31లోపు బకాయిలు చెల్లించకపోతే ఇళ్లు ఖాళీ చేయాల్సి ఉంటుందని అల్టిమేటం ఇచ్చింది. ఈ మేరకు హౌసింగ్ బోర్టు నోటీసులు జారీ చేసింది. హౌసింగ్ బోర్డు వరంగల్ డివిజన్ పరిధిలోని పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో తెలంగాణ హౌసింగ్ బోర్డు పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు కేటాయించింది. వాయిదాల మేరకు సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండగా కొంతమంది నిర్లక్ష్యం చేశారు. బకాయిలు తడిసి మోపెడు కావడంతో హౌసింగ్ బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేయడంతో లబ్ధిదారులు మొత్తుకుంటున్నారు. అసలుకు వడ్డీలపై వడ్డీలు వేసి అధిక మొత్తం చెల్లించాలని నోటీసులు జారీ చేశారని లబోదిబోమంటున్నారు. వరంగల్ డివిజన్ పరిధిలో 528 మందికి నోటీసులు.. తెలంగాణ హౌసింగ్ బోర్డు వరంగల్ డివిజన్ పరిధిలోని హనుమకొండ వడ్డేపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, వరంగల్ గొర్రెకుంట కాలనీ, జగిత్యాల, మంచిర్యాల నస్పూర్ కాలనీ, మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ కాలనీ, కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ, జమ్మికుంటలోని హౌసింగ్ బోర్డు కాలనీ, జనగామలోని హౌసింగ్ బోర్డు కాలనీ, కొత్తగూడెం చుంచుకాలనీకు చెందిన బకాయిలు మొత్తం రూ.44,69,99,904 పేరుకుపోయాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 528 మందికి నోటీసులు జారీ చేశారు. ఒక్కో కాలనీలో రూ.3లక్షల నుంచి రూ.18 లక్షలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.22,49,76,301 బకాయిలు పేరుకుపోయినట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారులు తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపు బకాయిలు చెల్లించేందుకు గడువు విధించారు. గడువులోగా బకాయిలు చెల్లించకపోతే ఇళ్లు ఖాళీ చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఒక్కో కాలనీలో బకాయిదారులు రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు బకాయిలున్నారు. బకాయిలు సంస్థకు గుదిబండగా తయారయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి బకాయిలు వసూలు చేయాల్సిందేనని సీరియస్గా చెప్పినట్లు సమాచారం. దీంతో అధికారులు హుటాహుటినా నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేశాం... పేరుకుపోయిన బకాయిలు వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ మేరకు బకాయిదారులకు నోటీసులు జారీ చేశాం. ఈ నెల 31వ తేదీలోపు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరాం. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – అంకం రావు, హౌసింగ్ బోర్డు వరంగల్ డివిజన్ ఈఈ -
రైతు ఉత్పత్తుల మేళాకు సర్వం సిద్ధం
ఖిలా వరంగల్: వరంగల్ నక్కలపల్లి రహదారిలోని జీఎం కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేయనున్న రైతు ఉత్పత్తుల మేళా ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల నేతృత్వంలో మంగళవా రం నుంచి 27వ తేదీ వరకు మేళా జరగనుంది. జిల్లాలోని రైతులు ఉత్పత్తి చేసిన గృహ, వంటగది అవసరాలు, ఆరోగ్యకర ఆల్పాహారాలు, అందం, ఆరోగ్య సంరక్షణ.. ఇలామరెన్నో ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. జిల్లా వ్యవసాయ అధికారులు జిల్లాలోని ప్రజలందరినీ మేళాకు ఆహ్వానిస్తున్నారు. సహజ సిద్ధమైన, మేలైన ఉత్పత్తులను ఆసక్తి ఉన్న ప్రజలు కొనుగోలు చేసేందుకు 42 స్టాళ్లు ఏర్పాటు చేశారు. రైతులు తాము ఉత్పత్తి చేసిన వస్తువులను మేళా ద్వారా అధిక రాబడి పొందడానికి స్టాళ్లలో విక్రయించుకునే అవకాశం కల్పించారు. ప్రజలకు ఆయా ఉత్పత్తులపై అవగాహన కల్పించనున్నారు. ప్రభుత్వ అందించే ప్రోత్సాహకాలను అధికారులు వివరించనున్నారు. వ్యవసాయ సాగుకు ఉపయోగపడే అన్ని రకాలు పరికరాలు, పనిముట్లు ప్రదర్శనలో ఉంచనున్నారు. వీటిలో ప్రధానంగా పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడం, సాంకేతిక పరిజ్ఞానం పొందడం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సస్యరక్షణ మందులు, పంట రుణాలు పొందేందుకు అవగాహన కల్పించనున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రైతు ఉత్పత్తుల మేళా ఏర్పాట్లను కలెక్టర్ సత్యశారద సోమవారం జిల్లా వ్యవసాయ అధికారి అనురాధతో కలిసి పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఉత్పత్తులపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, ఏసీపీ తిరుపతి, ఇన్స్పెక్టర్ రమేశ్, ఏఓ రవీందర్రెడ్డి, ఏఈఓలు పాల్గొన్నారు. విజయవంతం చేయాలి.. వరంగల్: వరంగల్ నక్కలపల్లి రోడ్డులోని జీఎం కన్వెన్షన్ హాల్లో ఈనెల 25నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్న ‘తెలంగాణ రాష్ట్ర స్థాయి రైతు ఉత్పత్తిదారు సంఘాల మేళా’ను విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా వ్యవసాయధికారి కె.అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మేళాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన 40 రైతు ఉత్పత్తిదారు సంఘాల ఉత్పత్తులను స్టాళ్లలో ప్రదర్శించడంతోపాటు అమ్మకాలు చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహణ వరంగల్ నక్కలపల్లి రోడ్డులోని జీఎం కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు 42 స్టాళ్లపై గృహ, వంటగది అవసరాలు, ఆరోగ్యకర అల్పాహారాలు, తదితర ఉత్పత్తుల ప్రదర్శన మేళా ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ సత్యశారద -
చేపల పెంపకంతో ఆర్థికంగా ఎదగాలి
మామునూరు : చేప పిల్లల పెంపకంతోపాటు చేప పిల్లల ఉత్పత్తికేంద్రాలు, నర్సరీలు ఏర్పాటు చేసుకుని గ్రామీణ నిరుద్యోగ యువత, మహిళా రైతులు ఆర్థికంగా ఎదగాలని మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాజన్న సూచించారు. ఖిలా వరంగల్ మండలం మామునూరు కృషి వి జ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ మత్స్య అభివృద్ధి మండలి, హైదరాబాద్ సౌజన్యంతో నర్సరీల్లో తెల చేపల పెంపకంపై ఐదు రోజుల శిక్షణ శిబిరం సోమవారం ప్రారంభమైంది. ఆయన ముఖ్యఅ తిథిగా హాజరై శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత మహిళలు, నిరుద్యోగ యువత ముందుకు వచ్చి నర్సరీల్లో చేపల పంపకం చేపడితే లాభాలు అర్జించొచ్చని పేర్కొన్నారు. అనంతరం చేపల పెంపకం, చేపలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. శాస్త్రవేత్తలు జె.సాయి కిరణ్, గణేశ్, రాజు, తదితరులు పాల్గొన్నారు. మూమునూరు కేవీకే కోఆర్డినేటర్ రాజన్న -
నరేందర్ స్పందించడం హాస్యాస్పదం
● మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వరంగల్ చౌరస్తా : ఆజంజాహీ మిల్లు కబ్జాపై వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ స్పందించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. సోమవారం వరంగల్ రాంకీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే ఆజంజాహి మిల్లు కబ్జా పురుడు పోసుకుందని విమర్శించారు. పదేళ్ల పాలనలో ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జాకు గురయ్యాయని పేర్కొన్నారు. కార్పొరేషన్ను అదుపులో ఉంచుకొని ఇష్టం వచ్చినట్లుగా దొంగ కాగితాలను సృష్టించింది ఎవరని ప్రశ్నించారు. పది సంవత్సరాల పరిపాలనలో వరంగల్ మేయర్గా, ఎమ్మెల్యేగా వ్యవహరించి అనేక అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. పూటకో మాట రోజుకో వేషం వేసేవాడిని నేను కాదని స్పష్టం చేశారు. ఎవరి హయాంలో పర్మిషన్లు వచ్చాయని తేల్చుకుందామని సవాల్ విసిరారు. నమ్మిన ప్రజలను మోసం చేయడం నాకు రాదని, నిఖార్సైన రాజకీయాలు చేసే వాడిని తాను అని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యే కుమ్మక్కు అయ్యారా.. మరి ఎందుకు కార్మికుల కోసం పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. సామాజిక సేవలో భాగస్వాములు కావాలి ● ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి హసన్పర్తి : రెడ్డి సహకార పరపతి సంఘం సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్ది పిలుపునిచ్చారు. రెడ్డి సహకార పరపతి సంఘం 15వ వార్షిక వేడుకలు గోపాలపురంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీపాల్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..తన గెలుపులో రెడ్డి సామాజిక వర్గం సభ్యులు కష్టపడ్డారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు. సంఘం అధ్యక్షుడు కేతిరెడ్డి దామోదర్, విజేందర్రెడ్డి, మిర్యాల సతీష్ రెడ్డి, వంశీ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, పింగిలి విజయ్పాల్ రెడ్డి, పద్మ, కామడి సతీష్ రెడ్డి, మాలకొండ రెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పదవివిమరణ పొందిన ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. -
రాష్ట్రస్థాయి యూత్ పార్లమెంట్కు ఎంపిక
కేయూ క్యాంపస్ : వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ జిల్లా స్థాయిలో ఈనెల 22, 23 తేదీల్లో కాకతీయ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ అనే అంశంపై ప్రసంగ పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్ర స్థాయి యూత్పార్లమెంట్కు ఎంపిక చేసినట్లు కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ సోమవారం తెలిపారు. ఈ పోటీల్లో హనుమకొండ, ములుగు, ఏటూరునాగారం, భూ పాలపల్లి జిల్లాల నుంచి వివిధ డిగ్రీ కళాశాలల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొని తమకు ఇచ్చిన సమ యం ప్రకారం ప్రసంగించారు. ఇందులో పదిమందిని రాష్ట్రస్థాయి యూత్పార్లమెంట్ ఎంపిక చేశారు. అందులో బి.సంధ్య బైరెడ్డి, ఎం. శ్రావ్య, శ్రీజయాదవ్, కాలాజ్ఞ (కేయూ బయోటెక్నాలజీ ), మహ్మద్ హాసన్ (యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీ, హ నుమకొండ), ఎం. శ్రావ్య, కార్తీక్ (కేయూ కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజీ), ఎ.వినీలా (ప్రభుత్వ పింగిళి మహిళా కాలేజీ హనుమకొండ), అలేఖ్య, సిద్దార్థ (వరంగల్ కిట్స్ కాలేజీ), రచన (ములుగు ప్రభుత్వడిగ్రీ కాలేజీ), శంకర్ (భూపాలపల్లి ప్ర భుత్వ డిగ్రీకాలేజీ) ఉన్నారు. వీరు రాష్ట్ర అసెంబ్లీలో జరగబోయే స్టేట్లెవ్ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్లో పాల్గొనబోతున్నారు. ఈనెల 23న ఎన్ఎస్ఎస్ వలంటీర్లు మాక్ పార్లమెంట్ కూడా నిర్వహించుకున్నారు. ఈ యూత్పార్లమెంట్ పోటీల సమావేశంలో కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, ప్రిన్సిపాల్ టి. మనోహర్, నెహ్రూ యువకేంద్రం జి ల్లా డిప్యూటీ ఆఫీసర్ అన్వేశ్, ఈ ప్రోగ్రాం కన్వీనర్ రాధిక, జ్యూరీ మెంబర్, కేయూ జూవాలజీ విభా గం ఆచార్యుడు మామిడాల ఇస్తారి పాల్గొన్నారు. -
మార్కెట్కు 16 టన్నుల మామిడి
వరంగల్: వరంగల్ ఏనుమాముల పరిధిలోని ముసలమ్మకుంట సమీపంలో ఏర్పాటు చేసిన మార్కెట్కు 21 వాహనాల్లో 16 టన్నుల మామిడి అమ్మకానికి వచ్చింది. గరిష్ట ధర క్వింటాకు రూ.10వేలు, కనిష్ట ధర రూ.2వేలు (రాలిన కాయలు), మోడల్ ధర రూ.6,700 పలికినట్లు ఉద్యోగులు తెలిపారు. దారి తవ్వకంతో రాకపోకలకు అంతరాయం మామిడి మార్కెట్కు వెళ్లే దారిని ఆ స్థల యాజమానులు తవ్వడంతో రైతులు, వ్యాపారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. ఈవిషయం తెలిసిన మార్కెట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థలానికి సంబంధించిన పత్రాలు తీసుకురావాలని పేర్కొనడంతో స్థల యజమానులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి యార్డులో వ్యాపారిపై హమాలీ చేయి చేసుకున్నట్లు తెలిసింది. ఈవిషయంపై వ్యాపార వర్గాలను విచారించగా దాట వేశారు. నాట్యాచార్యులు సుధీర్రావుకు జాతీయస్థాయి ఫెలోషిప్ హన్మకొండ కల్చరల్ : నగరానికి చెందిన నాట్యాచార్యులు, సద్గురు శివానంద నృత్యమాల వ్యవస్థాపకుడు బొంపల్లి సుధీర్రావు కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ నుంచి జాతీయస్థాయి సీనియర్ ఫెల్షిప్నకు ఎంపికయ్యారు. ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా అత్యుత్తమ నాట్యకళాకారులను తీర్చిదిద్దిన సుధీర్రావు జిల్లాకు అవార్డులు తేవడం ప్రారంభించారు. ఇద్దరు దొంగల అరెస్ట్వరంగల్ క్రైం: తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసినట్లు హనుమకొండ ఏసీపీ దేవేందర్రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వినయ్కుమార్, భద్రాది కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపేట మండలం అనిశెట్టిపల్లి గ్రామానికి చెందిన తంబళ్ల నితిన్ తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. బంగారు ఆభరణాలు, నగదు చోరీకి పాల్పడుతున్నారు. ఈనెల 19న సంతోశ్నగర్ కాలనీలో విజయగిరి రాజు తన ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగా తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. సుబేదారి ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా, స్థానిక ఇంటెలిజెన్స్ను వినియోగించుకుని సోమవారం అదాలత్ వద్ద నిందితులను గుర్తించి విచారించగా.. నేరం ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రూ.1.70 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రూ. 90 వేలు స్వాధీ నం చేసుకుని రిమాండ్కు తరలించారు. -
నీళ్లపాలు..
నిబంధనలుబకాయిలు లేవు డెయిరీ నిబంధనల ప్రకారం డిస్ట్రిబ్యూటర్ నుంచి రెండు రోజులకు సంబంధించిన అమ్మకాల మొత్తం విలువ రూ.12 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చేసుకున్నాం. డిస్ట్రిబ్యూటర్ ద్వారా ప్రతీ రోజు 240 ప్రభుత్వ సంస్థలు, సివిల్ మార్కెట్ కలుపుకుని 10వేల లీటర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. నిబంధనల మేరకు డిస్ట్రిబ్యూటర్ ఏరోజు చెల్లించాల్సిన డబ్బులను అదే రోజు చెల్లిస్తున్నాడు. ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎలాంటి బకాయిలు లేవు. – శ్రవణ్కుమార్, డిప్యూటీ డైరెక్టర్, విజయ డెయిరీ, వరంగల్ హన్మకొండ చౌరస్తా : ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ నిర్వహణపై రోజురోజుకూ నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రైవేట్ డెయిరీల పోటీని తట్టుకుని.. పాల అమ్మకాలు పెంచేందుకు అధికారులు చేపట్టిన చర్యలు ఫలితాలు ఇవ్వకపోగా.. నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అధికారుల అనాలోచిత నిర్ణయాలు, నిర్లక్ష్యం కారణంగా పాల అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయ పాలను ప్రజలకు మరింత చేరువచేసి అమ్మకాలు పెంచాలనే ఉద్దేశంతో గతేడాది నవంబర్లో డిస్ట్రిబ్యూటర్కు అప్పగించారు. నిబంధనల ప్రకారం వరంగల్ యూనిట్ పరిధిలో రోజుకు 10 వేల లీటర్ల పాల అమ్మకాలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్కు డెయిరీ అనుమతులు ఇచ్చింది. అయితే రెండు రోజుల అమ్మకాల మొత్తాన్ని ముందే చెల్లించేలా (కాషన్ డిపాజిట్) రూ.15 లక్షలు చెల్లించాలని షరతులు విధించింది. కాగా, రూ. 15 లక్షలు డిపాజిట్ చేసిన సదరు డిస్ట్రిబ్యూటర్.. నిబంధనల ప్రకారం ఏ రోజు అమ్మకాలకు సంబంధించిన మొత్తం (డబ్బు) చెల్లించాల్సి ఉన్నప్పటికీ తన ఇష్టానుసారంగా చెల్లిస్తూ ప్రస్తుతం డెయిరీ రూ.40 లక్షలు బకాయి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్కు అనధికారికంగా సాయం.. డెయిరీకి ఏ రోజు డబ్బులు అదే రోజు చెల్లించాల్సి ఉండగా రోజుల తరబడి బకాయిలు పేరుకుపోతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. రోజు చెల్లిస్తున్నట్లు డిస్ట్రిబ్యూటర్కు అనధికారికంగా డెయిరీ అధికారుల్లో కొందరు సాయం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పొంతన లేని లెక్కలు చూపెడుతూ ఉన్నతస్థాయి అధికారులను సైతం పక్కదోవపట్టిస్తున్నారనే ఆరోపణలు డెయిరీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. లాభాలు గడిస్తున్నా బకాయిలు చెల్లించడం లేదు.. ఒక్కో లీటర్ పై డిస్ట్రిబ్యూటర్కు రూ. 8 చెల్లిస్తున్నామని డెయిరీ అధికారులు చెబుతున్నప్పటికీ అధికారికంగా రూ.10.50 పైసలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. రోజుకు 10వేల లీటర్ల పాలు విక్రయిస్తున్న డిస్ట్రిబ్యూటర్ లాభాలను గడిస్తున్నప్పటికీ డెయిరీకి చెల్లించాల్సిన లక్షలాది రూపాయలు పెండింగ్లో పెడుతూ సంస్థకు నష్టాలు చవిచూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు చోద్యం చూస్తుండడం పై పాడి రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ పాల అమ్మకాలపై పూర్తిస్థాయి విజిలెన్స్ విచారణ జరిపిస్తే మరిన్ని అక్రమాలు, అవినీతి బయటపడుతుందని పాడిరైతులు పేర్కొంటున్నారు. -
ఉగాది ఉత్సవంలో భక్తులు పాల్గొనాలి
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న ఉగాది ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని దేవాలయ ఈఓ అనిల్కుమార్, ఆలయప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఈనెల 30న శ్రీవిశ్వావసు నామ సంవత్సరం ఉగాది, శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయంలో సోమవారం ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఈఓ అనిల్కుమార్ మాట్లాడుతూ.. ఉగాది రోజున రుద్రేశ్వరస్వామికి పాశుపత రుద్రాభిషేకం జరుగుతుందని, సాయంత్రం పంచాంగ శ్రవణం, కవిసమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే సుదర్శనహోమంలో పాల్గొనే భక్తులు రూ. 2,116, ఏప్రిల్ 6న జరిగే శ్రీసీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు రూ.1,116 చెల్లించి రశీదు పొందాలని తెలిపారు. గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాల్లో ప్రతీ రోజు శ్రీరాములకు ప్రత్యేకపూజలు, సుదర్శనహోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఋగ్వేద పండితులు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, శ్రవణ్, సిబ్బంది మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
మహంకాళి దేవాలయ భూమిపై వివాదం
హసన్పర్తి: హసన్పర్తి మండల కేంద్రంలోని మహంకాళి దేవాలయ భూమిపై వివాదం నెలకొంది. కబ్జాకు గురైన ఆలయ భూమిని స్వాధీనం చేసుకుని హద్దులు నిర్ధారించాలని స్థానికులు సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, తమ భూమిలో నిర్మాణాలు చేపట్టడానికి యత్నిస్తుండగా కొంతమంది అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వల్లాల జగన్ అనే వ్యక్తి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు. ఫిర్యాదుపై విచారణ జరుపుతామన్నారు. వివరాలు ఉన్నాయి. మండల కేంద్రంలో పురాతన మహంకాళి ఆలయం ఉంది. గతంలో ఈ ఆలయంలో అమ్మవారికి దీపదూప నైవేద్యాలు సమర్పించేవారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఆలయం పూజలకు నోచుకోలేదు. ఇదే అవకాశంగా భావించిన ఆలయం పక్క ఉన్న జగన్ సోదరులు ఇక్కడ కట్టెల మండీ ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెప్పారు. ఇది కొన్నాళ్లు కొనసాగుతూ వచ్చింది. అయితే ఆరేళ్ల క్రితం స్థానిక పద్మశాలి సేవా సంఘం మహంకాళి ఆలయం ఉన్నట్లు వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో జగన్కు స్థానికుల మధ్య వివాదం నెలకొంది. ఈ విషయంలో అప్పుడు కార్పొరేటర్గా పనిచేసిన నాగమళ్ల ఝాన్సీ భర్త నాగమళ్ల సురేశ్ ఇరువురితో మాట్లాడి సమస్యను సద్దుమణిగించారు. అయితే వారం రోజులుగా మళ్లీ వివాదం తెరపైకి వచ్చింది. ఇటీవల స్థానిక కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పిట్టల కుమారస్వామి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్ పంచాయితీ చేశారు. అది కొలిక్కి రాలేదు. చివరికి పంచాయితీ వాయిదా పడింది. కాగా, సోమవారం స్థానికులు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేయగా, జగన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కబ్జా చేశారని స్థానికులు కలెక్టర్కు.. చేయలేదని మరోవర్గం పీఎస్లో ఫిర్యాదు -
చెత్త నుంచి సంపద సృష్టించాలి
వరంగల్ అర్బన్: చెత్త నుంచి సంపద సృష్టించుకునేలా వివిధ యూనిట్లు ఏర్పాటు చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా మేయర్ హనుమకొండ బాలసముద్రంలోని కొబ్బరి బోండాల (కోకో పిట్) ప్రాసెసింగ్ యూనిట్, అంబేడ్కర్ గెస్ట్ హౌస్ ఆవరణలోని విండో కంపోస్ట్ యూనిట్ను తనిఖీ చేశారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. కొబ్బరి బొండాలను ప్రాసెస్ చేయడం ద్వారా అనేక లాభాలున్నట్లు తెలిపారు. కోకో పిట్ యూనిట్ నిర్వహణ ద్వారా 10 మంది ఎస్ హెచ్ జీ మహిళలు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. కోకో పిట్ యూనిట్ను బలోపేతం చేయడానికి వరంగల్ ప్రాంతంలో కోకోపిట్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రిజిస్టర్లను పరిశీలించారు. వర్మి కంపోస్ట్ ఎరువు తయారు చేసే ప్రాంతంలో పర్యటించి ఎరువు తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. బయో మిథనైజేషన్ ప్లాంట్కు వెంటనే మరమ్మతులు చేసి నిర్వహణలోకి తీసుకోవాలని సీఎంహెచ్ఓను ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్లు సంపత్రెడ్డి, అనిల్ వావ్ ప్రతినిధి పవన్ తదితరులు పాల్గొన్నారు. మేయర్ గుండు సుధారాణి బాలసముద్రం డీఆర్సీసీ కేంద్రం తనిఖీ -
మా మొర ఆలకించండి..
వరంగల్ అర్బన్: ప్రజావాణి లక్ష్యం నెరవేరట్లేదు. వారానికి కనీసం 60 నుంచి 80 వరకు దరఖాస్తులు వస్తున్నప్పటికీ చాలా వరకు అర్జీలు పెండింగ్లోనే ఉంటున్నాయి. నగరంలో అత్యధికంగా అక్రమ భవన నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు, సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, వీధిలైట్లు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, దోమలు, కుక్కలు, కోతులు తదితర సమస్యల పరిష్కారానికి వస్తున్నారు. కానీ.. వాటిలో ఎన్ని పరిష్కారమవుతున్నాయి? ఎన్ని పెండింగ్లో ఉన్నాయనే వాటిపై ఉన్నతాధికారులు దృష్టి సారించట్లేదు. ప్రతీ వారం అర్జీలు పెరుగుతూనే ఉన్నాయి. గ్రీవెన్స్కు 103 అర్జీలు.. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్లో కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే దరఖాస్తులు స్వీకరించారు. సమస్యల పరిష్యారానికి పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో బల్దియా కౌన్సిల్ హాల్ ఆవరణంతా కిక్కిరిసింది. మౌలిక వసతుల కల్పనకు ఇంజినీరింగ్ సెక్షన్కు 16, ప్రజారోగ్యానికి 15, పన్నుల విభాగానికి 20, అక్రమ భవన నిర్మాణాలు, అనధికారిక కట్టడాలపై టౌన్ ప్లానింగ్కు 45, తాగునీటి సరఫరా సమస్యలపై 7 ఇలా మొత్తం 103 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, బయాలజిస్ట్ మాధవరెడ్డి, సెక్రటరీ అలివేలు, హెచ్ఓ రమేశ్, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్కు అందిన ఫిర్యాదుల్లో కొన్ని.. ● 29వ డివిజన్ మోక్షారామం హిందూ శ్మశాన వాటిక ప్రహరీ కూలిపోయిందని తిరిగి నిర్మించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు సదాంత్ వినతిపత్రాన్ని అందజేశారు. ● 29వ డివిజన్ రఘునాథ్ నగర్ కాలనీలో హోల్డర్ నంబరు రద్దు చేసి పర్మినెంట్ నెంబర్ వేయాలని సీపీఎం నాయకులు అరూరి రమేశ్ తదితరులు ఫిర్యాదు ఇచ్చారు. ● హంటర్ రోడ్డులో 2 నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. ● మామునూరులో నివాసాల నడుమ రోడ్డుపై కంకర కుప్పలు, ఇసుక వేసి రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ● 15వ డివిజన్లో నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసి మూడు నెలలు గడిచినా ఇంత వరకు వెరిఫికేషన్ చేయడం లేదని సుప్రియ కోల్డ్ స్టోరేజీ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ● 16వ డివిజన్ గొర్రెకుంట హరిహర ఎస్టేట్ 60 ఫీట్ల రోడ్డు ఆక్రమణకు గురవుతోందని ఇప్పటి వరకు 13 సార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదని బాబురావు వినతిపత్రం అందించారు. ● హనుమకొండ నయీంనగర్ ఇంటి నంబరు 2–1–315కు గతేడాది ఆస్తి పన్ను రూ.1,856 ఉండగా, ఈ ఏడాది రూ.10,187 చెల్లించాలని నోటీసు అందించారని భాగ్యలక్ష్మి ఫిర్యాదు చేశారు. ● వరంగల్ గాంధీనగర్లో ఆస్తి పన్ను అధికంగా నమోదైందని, తగ్గించాలని పంచగిరి రమేశ్ విన్నవించారు. ● 50వ డివిజన్ బృందావన్ కాలనీలో కుక్కల బెడద ఉందని నివారించాలని శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు చేశారు. ● 8వ డివిజన్లో అనధికారిక నిర్మాణాల్ని అరికట్టాలని కార్పొరేటర్ బైరి లక్ష్మీకుమారి ఫిర్యాదు చేశారు. బల్దియా గ్రీవెన్స్కు వెల్లువెత్తిన ఫిర్యాదులు వ్యయ ప్రయాసలు.. సమయం వృథా కాళ్లరిగేలా తిరిగినా అధికారుల తీరు మారట్లేదని ప్రజల ఆందోళన -
కలెక్టర్ రాక కోసం పడిగాపులు
హన్మకొండ అర్బన్: ఓవైపు అర్జీదారులు వినతులిస్తారని అధికారులు.. మరోవైపు కలెక్టర్ వస్తే వినతులిద్దామని అర్జీదారులు పడిగాపులు కాశారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి వినతులు స్వీకరించేందుకు వేచి చూశారు. కానీ అర్జీలిచ్చేవారు లేకపోవడంతో అధికారులు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. మరో వైపు అదే హాల్లో వెనుకవైపు కూర్చున్న వారంతా కలెక్టర్ ప్రావీణ్య వస్తే వినతులు ఇద్దామని వేచి చూశారు. కానీ.. అత్యవసర పనుల కారణంగా, లెప్రసీ డే కార్యక్రమాల వల్ల ఈవారం కలెక్టర్ ప్రజావాణికి రాలేదు. చివరికి అధికారులు వెళ్లే సమయంలో అంతా వచ్చి తమ వినతులు ఇచ్చి రసీదు తీసుకుని వెళ్లారు. -
సీపీని కలిసిన ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సన్ప్రీత్సింగ్ను డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సంతోషినితో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. నేరానికి పాల్పడిన నిందితులకు శిక్ష పడేందుకు కృషి చేసి బాధితులకు న్యాయం అందించాలని కోరారు. సీపీని కలిసిన వారిలో అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మురళీధర్రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రవికిరణ్, బృంద, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పావని, దుర్గాబాయి ఉన్నారు. కొనసాగుతున్న టెన్త్ పరీక్షలువిద్యారణ్యపురి: పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం హనుమకొండ జిల్లాలో 67కేంద్రాల్లో ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించగా 11,994మంది విద్యార్థులకుగాను 11,987మంది హాజరుకాగా, ఏడుగురు గైర్హాజరయ్యారని డీఈఓ వాసంతి తెలిపారు. వరంగల్ జిల్లాలో 49కేంద్రాల్లో 9,221మంది విద్యార్థుకుగాను 9,208 మంది హాజరుకాగా, 13మంది గైర్హాజరయ్యారని సంబంధిత జిల్లా అధికారులు తెలిపారు. ‘ఇంటర్’ మూల్యాంకనంవిద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం కొనసాగుతోంది. కెమిస్ట్రీ, కామర్స్, హిస్టరీ సబ్జెక్టుల జవాబుపత్రాలను ఈనెల 25నుంచే దిద్దనున్నారు. ఆయా అధ్యాపకులు హాజరుకావాలని డీఐఈఓ గోపాల్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. విద్యతోనే ఉన్నతస్థాయికాజీపేట అర్బన్ : విద్యతోనే ఉన్నతస్థాయికి చేరుకుంటారని, విద్యార్థులు ఇష్టపడి చదవాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్నాయక్ అన్నారు. నిట్ వరంగల్ను సోమవారం ఆయన సందర్శించి మాట్లాడారు. నిట్లో పేద, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని సూచించారు. అదే విధంగా టీచింగ్ ,నాన్ టీచింగ్ సిబ్బందితో సమావేశమై సమస్యలను తెలుసుకున్నారు. హాస్టల్స్, డైనింగ్హాల్, లైబ్రరీలను పరిశీలించారు. కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, సిబ్బంది పాల్గొన్నారు. ఎంజీఎం ఇన్చార్జ్ ఆర్ఎంఓల నియామకంఎంజీఎం : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి ఇద్దరు ఇన్చార్జ్ ఆర్ఎంఓలను నియమించారు. ఆస్పత్రికి కొంతకాలంగా పూర్తిస్థాయి ఆర్ఎంఓలు లేకపోవడంతో పేరుకుపోయిన సమస్యలు, ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు రాష్ట్ర, జిల్లాస్థాయి అఽధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కలెక్టర్ సత్యశారద ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా కొనసాగుతున్న డాక్టర్ అంబి శ్రీనివాస్ను సివిల్ సర్జన్ ఆర్ఎంఓగా, డాక్టర్ శశికుమార్ను డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ నియమిస్తూ డీఎంఈ ఎ.నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్ఎంఓలకు సన్మానంసోమవారం బాధ్యతలు చేపట్టిన ఆర్ఎంఓలు శ్రీనివాస్, శశికుమార్ను హెల్త్, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్–3194 (ఐఎన్టీయూసీ) ఉమ్మడి జిల్లా చైర్మన్ బత్తిని సుదర్శన్గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు, ఉద్యోగులు శాలువాలతో సత్కరించారు. పూలబొకేలు అందించి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఎంజీఎం బ్రాంచ్ నాయకులు ప్రీతీ సజిని, సాల్మ, నార్ల వేణు, సుజాత, సరళారాణి, కొడిపాక కార్తీక్, సంజీత, రజినీ తదితరులున్నారు. -
ప్రజల ముందుకు జాబితా..
హన్మకొండ: ప్రజలకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏంచేసిందో చెప్పుకోవాలని నిర్ణయించింది. ప్రతీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం, పథకాలను ప్రజల ముందుంచనుంది. ఈ మేరకు ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రూ.2లక్షల రుణమాఫీ, రైతుభరోసా లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లో ప్రదర్శించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం రూ.లక్షలోపు రుణం మాఫీ చేయగా అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల్లోపు రుణాలు మాఫీ చేసింది. ఈ ఘనతను ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ శాఖ రుణమాఫీ లబ్ధిదారుల జాబితాతో ఫ్లెక్సీలు రూపొందించనుంది. ఈ మేరకు జిల్లాల వారీగా జిల్లా వ్యవసాయాధికారులు ఫ్లెక్సీల ప్రింటింగ్, ప్రదర్శనకు టెండర్లు పిలిచారు. ప్రతీ గ్రామంలో మూడు ముఖ్య కూడళ్లలో లబ్ధిదారుల జాబితాతో ముద్రించిన ఫ్లెక్సీలను ప్రదర్శిస్తారు. దీంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా లబ్ధిదారుల వివరాలు కూడా ప్రదర్శించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా ప్రభుత్వం విడుదల చేసింది. ఉగాది పండుగ నాటికి గ్రామాల్లో రుణమాఫీ, రైతు భరోసా లబ్ధిదారుల వివరాలతో కూడిన ఫ్లెక్సీలు కళకళలాడనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.2 లక్షలలోపు రుణాలు రూ.96,89,400లు మాఫీ అయింది. రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేస్తున్న క్రమంలో ఫ్లెక్సీ ప్రింటిగ్ నాటికి ఎంత మందికి ఎంత మొత్తంలో జమ చేసిన మేరకు జాబితాను ప్రదర్శించనున్నారు. హనుమకొండ జిల్లాలో మొత్తం 1,47,970మంది రైతులకు రూ.154,23,04,019 జమ చేయాల్సి ఉంది. ఈనెల 23 వరకు నాలుగు ఎకరాల వరకు భూమి కలిగిన 1 18,348 రైతుల ఖాతాల్లో రూ.90,29,09,744 జమ చేశారు. విమర్శలను తిప్పికొట్టేందుకేనా.. సర్కారు రుణమాఫీ సరిగా చేయలేదని విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. యాసంగి సాగు పూర్తయి, పంటలు చేతికి వచ్చే సమయం వచ్చినా పూర్తిస్థాయిలో రైతు భరోసా ఇవ్వలేదని ఎండగడుతున్నాయి. ఈ క్రమంలో వారి విమర్శలు తిప్పికొట్టేలా నేరుగా రుణమాఫీ, రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను బహిరంగంగా గ్రామాల్లోని ముఖ్య కూడళ్లలో ప్రదర్శించి వారి నోళ్లు మూయించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఏ రైతుకు ఎంత రుణమాఫీ జరిగింది, ఎంత రైతు భరోసా వచ్చిందన్న వివరాలతో కూడిన జాబితాను గ్రామాల్లో ప్రదర్శించడం ద్వారా తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నంగా తెలుస్తోంది. తద్వారా గ్రామ పంచాయతీ, మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఆలోచన ఇందులో దాగి ఉందనే చర్చ కూడా సాగుతోంది. ప్రతీ గ్రామంలోని మూడు కూడళ్లలో రుణమాఫీ లబ్ధిదారుల వివరాల ప్రదర్శన ఫ్లెక్సీల తయారీ ప్రదర్శనకు టెండర్లు పిలిచిన వ్యవసాయ శాఖ ఉగాది నాటికి ప్రదర్శించాలని నిర్ణయం ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.96,89,400 రుణమాఫీ -
ఎంజీఎంలో ‘టూడీ’కి స్వస్తి..
ఎంజీఎం : ఎంజీఎం.. ఉత్తర తెలంగాణకు గుండె. పేదలకు పెద్ది దిక్కు. ఇంతటి ఘన కీర్తి కలిగిన ఈ ఆస్పత్రిలో రోజురోజూకూ సేవలు క్షీణించిపోతున్నాయి. నాలుగు ఉమ్మడి జిల్లాలు, కొత్తగా ఏర్పడిన పది జిల్లాలకు చెందిన రోగులు ఆపత్కాళంలో ఎంజీఎంకు వస్తారు. ఇలాంటి ఆస్పత్రిపై దృషి సారించాల్సిన రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఆస్పత్రి పాలనపై దృష్టి సారించకపోవడంతో వామ్మో ఎంజీఎం ఆస్పత్రా అనే విధంగా తయారైంది పరిస్థితి. ఆస్పత్రి విభాగాధిపతులు వారాని రెండు రోజులు విధులకు హాజరువుతున్నారు. వచ్చినా రోజు రెండు, మూడు గంటల పాటు మాత్రమే విధులు నిర్వర్తించడంతో ఒక్కొక్క విభాగం మూత పడుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో అత్యంత కీలకమైన కార్డియాలజీ విభాగం సేవలు పూర్తి అధ్వానంగా తయారయ్యాయి. ఈసీజీ పరికరాల్లో సాంకేతిక లోపాలు, ఏకంగా 24 గంటల పాటు అత్యవసర సేవలు అందించాల్సిన టూడీ ఎకో పరీక్షల పరికరాలను కేఎంసీ తరలించారు. నామామాత్రపు విధులు నిర్వర్తిస్తూ ఎంజీఎంలో టూడీ ఎకో సేవలు బంద్ చేశారు. నిత్యం అందించాల్సిన టూడీ ఎకో సేవలకు స్వస్తి పలికి రెండు, మూడు రోజులకోమారు ఓ ప్రత్యేక అంబులెన్స్లో 20 మంది, 30 మందిని తరలిస్తూ నామామాత్రపు సేవలందిస్తూ పేద రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. శస్త్రచికిత్సల్లో టూడీ ఎకో సేవలు కీలకం.. ఎంజీఎంలో అన్ని విభాగాల్లో నిర్వహించే శస్త్రచికిత్సల్లో ఈసీజీ, టూడీ ఎకో నివేదికలు కీలకం. ఆస్పత్రిలో రోజూ 10 నుంచి 20 శస్త్రచికిత్సలను నిర్వహిస్తుంటారు. ఇలాంటి సేవలను నిలిపివేసి కేఎంసీలోని సూపర్ ఆస్పత్రికి పరిమితి చేసి విధులకు ఏగనామం పెట్టి ప్రైవేట్ కేంద్రాలతో కుమ్మక్క అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి విభాగాలను పర్యవేక్షించే విభాగాధిపతులు విధులకు ఏగనామం పెడుతున్నారు. వారానికి రెండు రోజులు విధులు నిర్వర్తించడం వల్ల ఇలాంటి సమస్యలు తలెతుత్తున్నాయి.ఆస్పత్రిలో ఎకో సేవలు నిలిపివేత.. కేఎంసీకి తరలింపు వారానికి రెండు రోజులు మాత్రమే పరీక్షలు ఇక్కడ కూడా మధ్యాహ్నం తరువాత సేవలు నిలిపివేత చేసేదేమిలేక ప్రైవేట్కు తరలుతున్న పేద రోగులు ప్రైవేట్ కేంద్రాలతో కుమ్మక్కు.. ఎంజీఎంలో టూడీ ఏకో సేవలు కీలకం. ఈసీజీలో ఏమైనా తేడాలు వస్తే వెంటనే టూడీ ఏకో పరీక్షలకు రెఫర్ చేస్తారు. ఈ సమయంలో ఆస్పత్రిలో టూడీ ఏకో సేవలు లేకపోవడంతో కేఎంసీలోని సూపర్ ఆస్పత్రిలో చేయించుకోవాలని రెఫర్ చేస్తారు. కేఎంసీలో మధ్యాహ్నం 12 గంటలు దాటితే సేవలు నిలిపివేస్తారు. ఈ క్రమంలో ఎంజీఎంలో టూడీ ఏకో సేవలను నిలిపివేయడంతో పేద రోగులు, ఖైదీలను రిమాండ్ పంపించే విషయంలోనూ పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అత్యవసర రోగులు.. పోలీసు సిబ్బంది సైతం ప్రైవేట్ కేంద్రాలకు వెళ్లి టూడీ ఎకో పరీక్షలు చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.సమస్య పరిష్కారానికి కృషి టూడీ ఎకో సేవలు అవసరం ఉన్న వారిని కేఎంసీలోని సూపర్ ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నాం. వివిధ విభాగాల్లో ఫోర్టబెలిటీ పరికరంతో సేవలందిస్తున్నాం. రోగులకు ఇబ్బంది కలగకుండా ఎంజీఎంలోనే టూడీ ఏకో సేవలపై ఆయా విభాగాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. – కిశోర్, సూపరింటెండెంట్, ఎంజీఎం -
సకాలంలో చికిత్సతో క్షయవ్యాధి నిర్మూలన
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఎంజీఎం : సకాలంలో వైద్యపరీక్షలతోపాటు క్రమం తప్పకుండా మందుల వాడకం వల్ల క్షయవ్యాధి నిర్మూలించవచ్చని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం కాకతీయ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్షయ వ్యాధి ప్రాణాంతకమైనది కాదని, వ్యాధి నిర్మూలన డాక్టర్లు సిఫారసు చేసిన ప్రకారం క్రమం తప్పకుండా మందులు వాడాలన్నారు. సకాలంలో పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. జిల్లాలో 26 ప్రభుత్వ ఆస్పత్రులు కలుపుకొని సేవలందించేందుకు మూడు ట్రీట్మెంట్ యూనిట్లుగా హనుమకొండ, ముల్కనూరు, పరకాలలో పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 363 కేసులు గుర్తించినట్లు తెలిపారు. ముందుగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉదయం నగరంలోని భద్రకాళిఆలయ ఆర్చినుంచి కేఎంసీ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వ్యాధిగ్రస్తులకు స్వచ్ఛందంగా సేవలందిస్తామని వైద్యాధికారులు, సిబ్బంది, వైద్య శాఖ ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయకుమార్, అదనపు డీఎంహెచ్ఓ మదన్మోహన్రావు, జిల్లా టీబీ నియంత్రణాధికారి హిమబిందు, కేఎంసీ ఎస్పీఎం విభాగాధిపతి శ్రీధర్, టీబీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత తదితరులున్నారు. -
సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోuఇన్నర్ రింగ్రోడ్(ఐఆర్ఆర్) ప్రాజెక్టు వ్యయం : రూ.742.00 కోట్లు మొత్తం పొడవు : 38 కిలోమీటర్లు ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ ఐఆర్ఆర్ : 13 కిలోమీటర్లు మొదటి దశ : 8 కిలోమీటర్లు రెండో దశ : 5 కిలోమీటర్లు ● ఐఆర్ఆర్ వల్ల కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, విమానాశ్రయంతో నాయుడు పెట్రోల్ పంపు నుంచి ఉర్సు, తిమ్మాపూర్, ఫోర్ట్ వరంగల్, గొర్రెకుంట, ఏనుమాముల, పైడిపల్లి, ఆరెపల్లి ఓఆర్ఆర్ అనుసంధానం అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) ప్రాజెక్టు వ్యయం : రూ.1,500 కోట్లు మొత్తం పొడవు : 71 కిలోమీటర్లు పూర్తయిన రోడ్డు : ఉత్తరం వైపు 30 కిలోమీటర్లు ఖర్చయిన నిధులు : రూ.700 కోట్లు నిర్మాణం చేయాల్సింది : దక్షిణం వైపు 41 కిలోమీటర్లు చేయాల్సిన భూసేకరణ : 911 ఎకరాలు ● ఓఆర్ఆర్ పరిధిలోకి రాంపూర్, నష్కల్, ధర్మపురం, వెంకటాపూర్, ఐనవోలు, పున్నెలు, బొల్లికుంట, కాపులకనిపర్తి, వసంతాపూర్, ధర్మారం, బొడ్డుచింతలపల్లి ప్రాంతాలు వస్తాయి. మొగిలిచర్ల, కొత్తపేట నుంచి ఓఆర్ఆర్కు అనుసంధానం చేయనున్నారు.న్యూస్రీల్ -
పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి
వరంగల్ అర్బన్: పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే విజ్ఞప్తి చేశారు. సోమవారం మండిబజార్లో ఓ కమర్షియల్ కాంప్లెక్స్కు చెందిన రూ.1,57 లక్షల చెక్కును కమిషనర్ స్వీకరించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. 2024– 25 ఆర్థిక సంవత్సర పన్నులు చెల్లించడానికి కేవలం 8 రోజులు మాత్రమే మిగిలి ఉందన్నారు. నగరావాసుల సౌకర్యార్థం గ్రేటర్ వరంగల్ నగర పరిధి లో ఉన్న 10 ఈ–సేవ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయని తెలిపారు. కాజీపేట సర్కిల్ కార్యాలయం, సుబేదారి వాటర్ ట్యాంక్, హనుమకొండ నక్కలగుట్ట వాటర్ ట్యాంక్, హనుమకొండ అశోకా హోటల్ ఎదురుగా ఉన్న మీసేవ కేంద్రం, హనుమకొండ నయీంనగర్, హనుమకొండ బల్దియా ప్రధాన కార్యాలయం, వరంగల్ పోచమ్మమైదాన్ ఈ సేవ, వరంగల్ కాశిబుగ్గ సర్కిల్ కార్యాలయం, వరంగల్ హెడ్ పోస్టాఫీస్, వరంగల్ కరీమాబాద్ ఈ సేవ కేంద్రంలో పన్నులు చెల్లించే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. ఆన్లైన్లో చెల్లించేవారు డబ్ల్యూడబ్ల్యూడబ్యూ.జీడబ్ల్యూఎంసీ.జీవోవీ. ఇన్ ద్వారా పన్నులు చెల్లించాలని కోరారు. సకాలంలో పన్నులు చెల్లించకపోతే ఆస్తులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రసూనారాణి, ఎంహెచ్ఓ రాజారెడ్డి, ఆర్ఐ సోహెల్ తదితరులు పాల్గొన్నారు. బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే -
సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్తా..
విద్యారణ్యపురి: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని విద్యాశాఖ టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ఆర్ రాజ్కుమార్ అన్నారు. ఆదివారం ఆసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ ఫకృద్దీన్ అహ్మద్ ఇతర బాధ్యులతో కలిసి హనుమకొండలోని డీఈఓ కార్యాలయం వద్దకు వచ్చారు. ఈసందర్బంగా ఆయా ఉద్యోగులతో మాట్లాడారు. వివిధ సమస్యలపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. ఈసందర్భంగా రాజ్కుమార్ను, ఫకృద్దీన్ అహ్మద్ను విద్యాశాఖ ఉద్యోగులు సన్మానించారు. కార్యక్రమంలో ఆసంఘం రాష్ట్ర కోశాధికారి పవన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్, బాధ్యులు జె.రాజేశ్వర్రావు, ఎండీ అలీం, ఎండీ జాకీర్, ఎస్.శ్రీనివాస్, బి.హరీశ్, ఎఫ్ఏఓ మధుసూదన్రెడ్డి వివిధ జిల్లాల బాధ్యులు పాల్గొన్నారు. -
వెయ్యిలో 56 మాత్రమే!
● వరంగల్ ప్రజావాణిలో పరిష్కారమైన వినతులు వరంగల్: వరగల్ కలెక్టరేట్లో ఈనెల 10, 17వ తేదీల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో వివిధ సమస్యలపై ప్రజలు వెయ్యి దరఖాస్తులు సమర్పించారు. అందులో 56 వినతులు మాత్రమే పరిష్కారమైనట్లు అధికార లెక్కలు చెబుతున్నా యి. గతంలో ఇచ్చిన వినతులు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు పదే పదే అందజేస్తున్నారు. ‘కుడా’, పోలీస్ నో రెస్పాన్స్.. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్(కుడా), పోలీసు శాఖలో వచ్చిన వినతులను అధికారులు పరిష్కరించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సమస్యలపై 202 మంది దరఖాస్తులు సమర్పించగా 10 మాత్రమే పరిష్కారమయ్యాయి. పోలీసు శాఖలో 123 సమర్పిస్తే మూడు, జెడ్పీలో 116 వస్తే రెండు, ‘కుడా’ పరిధిలో 107 వస్తే ఒకటి, నర్సంపేట ఏసీపీ పరిధిలో 45 వస్తే ఒకటి, ఈస్ట్జోన్ పోలీసు అధికారి పరిధిలో 43 వస్తే మొత్తం పెండింగ్లోనే ఉన్నాయి. మూడు నెలలుగా వస్తున్నా.. ఉమ్మడి ఆస్తికి సంబంధించిన సమస్య పరిష్కరించాలని డిసెంబర్ 2న జరిగిన ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చాను. పరిష్కారం కాకపోవడంతో మళ్లీ వచ్చి ఈనెల 10న జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశాను. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. – చిలుక సుధాకర్, పైడిపల్లి ● -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
● ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి ఖిలా వరంగల్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. విజయోత్సవ ర్యాలీలో భాగంగా ఆయన ఆదివారం వరంగల్ రంగశాయిపేటకు చేరుకోగా ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు ఘన స్వాగతం పలికారు. శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నాక బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ దేవతకు కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం దామెరకొండ సదానందం అధ్యక్షతన జరిగన సమావేశంలో శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ.. మండలిలో ఉపాధ్యాయుల గొంతుకనై ఉంటానని అన్నారు. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రవీందర్రెడ్డి, సతీశ్, తిరుపతిరెడ్డి, అబ్దుల్ గోపాల్, విజయపాల్రెడ్డి, వెంకటేశ్వర్లు, నరసింహస్వామి, దయాకర్ పాల్గొన్నారు. నేడు గ్రేటర్ గ్రీవెన్స్వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు వినతులు స్వీకరిస్తామని, ప్రజలు సమస్యల పరిష్కారానికి ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వరంగల్ ప్రజావాణి..వరంగల్: వరంగల్ కలెక్టరేట్లో నేడు(సోమవారం) ఉదయం 11 గంటలకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యలపై వివిధ శాఖల అధికారులకు వినతులు సమర్పించేందుకు రావాలని సూచించారు. భద్రకాళి సన్నిధిలో జ్ఞానేశ్వర్హన్మకొండ కల్చరల్: రాష్ట్ర ముదిరాజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ ఆదివారం శ్రీభద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. అనంతరం జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులకు కార్పొరేషన్ నుంచి వచ్చే ప్రతీ సంక్షేమ పథకం అందేలా కృషి చేస్తానని అన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం● ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంచందర్ హన్మకొండ: కార్మిక వ్యతిరేక విధానాలపై స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పోరాటం చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్.రాంచందర్ అన్నారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యాన నేడు(సోమవారం)ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిర్వహించే బహరంగ సభలో పాల్గొనేందుకు ఆర్టీసీ కార్మికులు ఆదివారం కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరారు. ఈ సందర్భంగా రాంచందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ బస్సులు రావడం మూలంగా ఆర్టీసీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని, బస్సులను ఆర్టీసీకి సంబంధం లేని సంస్థలకు అప్పగించి వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయడంతోపాటు మోటార్ వెహికల్ చట్టం–2019ను సవరించాలన్నారు. విద్యుత్ బస్సు ల నిర్వహణ ఆర్టీసీకి అప్పగించి సబ్సిడీని సంస్థకు కేటాయించి ప్రజారవాణాను కాపాడాలని డిమాండ్ చేశారు. -
బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం
విద్యారణ్యపురి/హన్మకొండ చౌరస్తా: కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న హనుమకొండలోని కొత్తూరు జెండా ప్రాంతానికి చెందిన మార్త సంపత్కు బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.10వేలు ఆదివారం అందజేశారు. ఈసందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పులి దేవేందర్ మాట్లాడుతూ.. తమ ఫౌండేషన్ ద్వారా వివిధ సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సంపత్ పిల్లలు బీ ఫార్మసీ, ఇంజనీరింగ్ చదువుతున్నారని తండ్రి అనారోగ్యంతో వారు ఉన్నత చదువులకు దూరం కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం సంపత్ భార్య అనురాధ బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ బాధ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్ బాధ్యులు వెంకటేశ్వర్లు, పొన్నం రాజు, చిరంజీవి, రాజు, విజయ్, కొండల్రెడ్డి, మధు, పతంగి భాస్కర్, బరిగెల భాస్కర్, బోనాల రమేష్, సుధాకర్ పాల్గొన్నారు. ఆర్థిక చేయూత ఖిలా వరంగల్: కరీమాబాద్ ఉర్సు బొడ్రాయి ప్రాంతానికి చెందిన స్వర్ణకారుడు రాగి సోమేశ్వరాచారీ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ఆదివారం రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం అధ్యక్షుడు వేములవాడ మదన్మోహన్, ప్రధాన కార్యదర్శి కృష్ణమాచార్యులు, రవీంద్రాచారి పరామర్శించారు. బాధిత కు టుంబానికి రూ.10వేలు, నిత్యావసర వస్తువులు అందజేశారు. సదానందం, వీరన్న, సత్యనారాయణ, పణికుమార్, సరిత, జగదీశ్వర్ పాల్గొన్నారు. -
పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం ఎన్నిక
రామన్నపేట : వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా ఈ.వీ. శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శిగా మేకల అక్షయ్కుమార్, కోశాధికారిగా పడిశాల ఆనంద్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళా శాల పూర్వ విద్యార్థుల సంఘం స్వరసభ్య సమావేశాన్ని ఆదివారం కళాశాల ఆవరణలో నిర్వహించా రు. ఈ సందర్భగా ఐదేళ్ల కాలానికి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం సీనియర్ సలహాదారులు గా సుధాకర్రెడ్డి, స్వామి, ప్రకాశ్, రాంబ్రహ్మం, కొండల్రావు, రాఘవులు, ఎల్లయ్య, ఉమేందర్ సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 70 సంవత్సరాల పాలిటెక్నిక్ కళాశాలకు అధ్యక్ష బాధ్యతలు పొందడం సంతోషంగా ఉందన్నారు. బొద్దిరెడ్డి సతీష్రెడ్డి, రాజ్కుమార్, భిక్షపతి, ధర్మ శ్రీనివాస్రెడ్డి, మహేందర్, శ్రీనివాస్రావు, వసంత్కుమార్, మధు, అజీజ్, శ్రీవిద్య, జయశ్రీ, గిరివర్మ, దొడ్డిపల్లి కుమార్, శ్రీకాంత్ పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక హన్మకొండ కల్చరల్ : మున్నూరు కాపు పరపతి సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం హనుమకొండ పద్మాక్షి రోడ్లోని మున్నూరు కాపు పరపతి సంఘం కార్యాలయంలో ఎన్నుకున్నారు. సంఘం 41వ వార్షిక సర్వసభ్య సమావేశంలో.. సంఘం అధ్యక్షుడిగా తోటప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా కనుకుంట్ల రవికుమార్, కోశాధికారిగా బొల్లం అశోక్కుమార్, ఉపాధ్యక్షుడిగా బండారి మహేందర్, సహా యకార్యదర్శిగా పోలు లక్ష్మణ్, ఆడిటర్గా గందె మధు, కార్యవర్గ సభ్యులుగా కనుకుంట్ల శ్రీనివాస్, యావశెట్టి లక్ష్మణ్, కర్రు మనోజ్కుమార్, రాకేష్, రే వంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్పొరేటర్ తో ట వెంకటేశ్వర్లు, గందె కృష్ణ, అంబటి కుమారస్వామి, పొటి శ్రీనివాస్, కర్రె సుదర్శన్ పాల్గొన్నారు. -
చికెన్ వ్యర్థాల అడ్డగింత
మడికొండ: చికెన్ సెంటర్ నుంచి సేకరించిన వ్యర్థాలను వ్యాన్లో మడికొండలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నట్లు సమాచారం అందగా అడహక్ కమిటీ సభ్యులు డంపింగ్ యార్డుకు చేరుకుని అడ్డుకున్నారు. వాహనదారుడిని నిలదీయగా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చా రు. దీంతో వాహనాలను తిరిగి మరో చోటుకు తరలించారు. ఎన్ని రోజుల నుంచి చికెన్ వ్యర్ధాలను వేస్తున్నారో తెలియడం లేదని అడ్హక్ కమిటీ సభ్యులు, ప్రజలు వాపోతున్నారు. అధి కారులు స్పందించి డంపింగ్ యార్డును ఇక్కడ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పనులు ప్రారంభించండి హసన్పర్తి: వచ్చే నెల 27వ తేదీన దేవన్నపేటలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ పనులు ప్రారంభించాలని మాజీ మంత్రి దయాకర్రావు సూచించారు. బహిరంగ సభ నిర్వహించనున్న ప్రదేశాన్ని మాజీ మంత్రి దయాకర్రావు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్, చల్లా ధర్మారెడ్డి ఆదివారం సందర్శించారు. ఈసందర్భంగా పార్కింగ్, సమావేశపు వేదిక ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దివ్యారాణి, నాగుర్ల వెంకటేశ్వర్లు, నాయకులు ఏనుగుల రాకేష్రెడ్డి, చింతం సదానందం, రాజునాయక్, బండి రజనీకుమార్, రవి, రఘు, పావుశెట్టి శ్రీధర్ పాల్గొన్నారు. సందీప్కుమార్కు డాక్టరేట్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ జియాలజీ విభాగం పరిశోధకుడు సందీప్కుమార్కు యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రకటించింది. ఆ విభాగం ప్రొఫెసర్ మల్లికార్జున్రెడ్డి పర్యవేక్షణలో సందీప్ కుమార్ తన పీహెచ్డీ పూర్తిచేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధి కారి ఆచార్య రాజేందర్ పేర్కొన్నారు. చైతన్యడీమ్డ్ వర్సిటీనుంచి.. కేయూ క్యాంపస్: హైదరాబాద్లోని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ హనుమకొండకు చెందిన మహ్మద్ముఖీద్కు డాక్టరేట్ను ప్రకటించింది. మహ్మద్ ముఖీద్ ప్రొఫెసర్ నర్సింహాస్వామి పర్యవేక్షణలో తన పరిశోధన పూర్తిచేశారు. ఈనెల 22న హైదరాబాద్లోని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మహ్మద్ ముఖీద్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. బొడ్రాయికి పూజలు ఖిలా వరంగల్: వరంగల్ ఎస్ఆర్ఆర్తోటలో ఆదివారం గ్రామదేవత శ్రీలక్ష్మీ, భూలక్ష్మి బొ డ్రాయి ప్రథమ వార్షికోత్సవం వైభవంగా జరి గింది. బొడ్రాయి ప్రతిష్టాపన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు తాటిపాముల భిక్షపతి, చిలువే రు రవీందర్, బండారి పూర్ణచందర్ ఆధ్వర్యంలో గ్రామ దేవత బొడ్రాయికి పూజలు నిర్వహించారు. బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవానికి ప్రజలు పెద్దఎత్తన తరలివచ్చి పూజలు చేశా రు. ముఖ్యఅతిథులుగా కార్పొరేటర్లు పద్మ, ర వి, అరుణ, సుధాకర్, మాజీ కార్పొరేటర్ వేణు , నాయకులు కుమారస్వామి, శంకర్ హాజరయ్యారు. బొడ్రాయి ఉత్సవాల ఆదాయ లావా దేవీల పుస్తకాన్ని ఆవిష్కరించారు. పొదుపుతో ఉపయోగం వరంగల్: ప్రతి వ్యక్తి కుటుంబ ఆర్థిక అవసరాలకు పొదుపు ఎంతో ఉపయోగపడుతుంద ని కాశిబుగ్గలోని యునైటెడ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షుడు, కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్ అన్నారు. ఆదివారం సంఘం 40వ సర్వసభ్య వార్షికోత్సవ సమావేశం తిలక్రోడ్లోని కేవీఎస్ గార్డెన్స్లో జరిగింది. రామ రమేష్, ప్రకాష్, థామస్, రామకృష్ణ, శ్వేతాబాబు, భాస్కర్, రాజు, స్వామి పాల్గొన్నారు. ‘కార్మికులను మోసం చేసింది కాంగ్రెస్ నాయకులే’ నయీంనగర్: అజాంజాహి మిల్లు కార్మికులు ఎక్కడ కోరితే అక్కడ స్థలం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విమర్శించారు. ఆదివారం హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో నరేందర్ మాట్లాడుతూ అజాంజాహి మిల్లు స్థలాలనే ఇస్తామని కార్మికులను నమ్మించి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని మోసం చేశారన్నారు. 2015లో కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంఆర్ఓ ద్వారా సర్వే నంబర్ మార్చారన్నారు. కార్మిక భవనం సర్వే నంబర్ మార్చి గొట్టిముక్కల నరేష్ రెడ్డికి అప్పగించారని, మున్సిపల్ పరిధిలో ఇంటి నంబర్ ఉన్న భవనాన్ని మ్యుటేషన్ చేసిన ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కాంగ్రెస్ హయాంలో అజాంజాహీ మిల్లు మూతపడిందన్నారు. -
సన్మానాలు.. సత్కారాలు
హన్మకొండ: తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మ న్ బొర్ర జ్ఞానేశ్వర్ను ము దిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో సన్మానించారు. ఆదివా రం హనుమకొండ పర్యట నకు వచ్చిన ఆయనను హ నుమకొండలోని రహదారులు, భవనాల శాఖ అతిథి గృహంలో ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోషియేషన్–తెలంగాణ రాష్ట్ర కమిటీ మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా మెపా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పులి దేవేందర్, నాయకులు.. జ్ఞానేశ్వర్ను సన్మానించి, పెద్దమ్మతల్లి చిత్రపటాన్ని బహూకరించారు. బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ సొసైటీల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజ్ కార్పొరేషన్ నిధులను ప్రతి జిల్లాకు పంచి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, ఆయా సంఘాల నాయకులు పొన్నం రాజు, రాజబోయిన రాజన్న, వినోద్ కుమార్, పల్లెబోయిన అశోక్, పులి రజనీకాంత్, రాజకుమార్, రాజన్న, అశోక్, కుమార్, చిరంజీవి, ఎన్.రాజు, రామకృష్ణ, భాస్కర్, సమ్మయ్య, రమేష్, రవీందర్, కృష్ణ, శ్యామ్, వినోద్, లావణ్య, తదితరులు పాల్గొన్నారు. ఆలయ చైర్మన్కు.. హసన్పర్తి: ఎర్రగట్టు వేంకటేశ్వరస్వామి దేవస్థాన కమిటీ చైర్మన్గా నియమితులైన ఆరెల్లి వెంకటస్వామి దంపతులను ఆదివారం ఘనంగా సన్మానించారు. వేంకటేశ్వరస్వామి కల్యాణ మండపంలో వినాయక పరపతి సంఘం(1989–90 ఎస్ఎస్సీ బ్యాచ్) ఆధ్వర్యంలో ఈకార్యక్రమం నిర్వహించా రు. సంఘం అధ్యక్షుడు గుడికందుల సురేష్, కార్యదర్శి యాదగిరి, వంశీ, నాగేందర్, రవి, కిరణ్, సంపత్, కుమారస్వామి, రమేష్ పాల్గొన్నారు. సత్కారం ఖిలా వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమాఖ్య అధ్యక్షు డు వరంగల్ శివనగర్ ప్రాంతానికి చెందిన మొగి లిచెర్ల సుదర్శన్ 34 సంవత్సరాలుగా వినియోగదా రుల విశేషమైన సేవలు అందిస్తున్నారు. ఈమేరకు ఆదివారం హిమాచల్ సిమ్లాలో జరిగిన జాతీ య సమాఖ్య సమావేశంలో సుదర్శన్కు జాతీయ సమాఖ్య చైర్మణ్ డాక్టర్ అనంతశర్మ, ఎంపీ భూపేంద్ర కశ్యాప్ మెమోంటోను అందజేసి సత్కరించారు. -
ఐకమత్యంతో అన్ని సాధించవచ్చు
వరంగల్: సమాజంలో ఐకమత్యంతో ఉంటే అన్ని రంగాల్లో ఫలితాలను సాధించవచ్చని కల్యాణినగర్ వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గోలి చెన్నారెడ్డి అన్నారు. ఆదివారం దేశాయిపేటలోని కల్యాణి నగర్ కాలనీ వాసులు అరేపల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా కాలనీలోని కుటుంబ సభ్యులంతా ఆనందంగా గడిపారు. అనంతరం కాలనీలోని కుటుంబ సభ్యులకు బహుమతులు అందజేశారు. కాలనీ పెద్దలు, కల్యాణి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, కోశాధికారి మధుసూదన్, గౌరవ అధ్యక్షుడు హరినాథ్, సలహాదారులు మల్లారెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు. -
బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం
విద్యారణ్యపురి/హన్మకొండ చౌరస్తా: కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న హనుమకొండలోని కొత్తూరు జెండా ప్రాంతానికి చెందిన మార్త సంపత్కు బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.10వేలు ఆదివారం అందజేశారు. ఈసందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పులి దేవేందర్ మాట్లాడుతూ.. తమ ఫౌండేషన్ ద్వారా వివిధ సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సంపత్ పిల్లలు బీ ఫార్మసీ, ఇంజనీరింగ్ చదువుతున్నారని తండ్రి అనారోగ్యంతో వారు ఉన్నత చదువులకు దూరం కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం సంపత్ భార్య అనురాధ బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ బాధ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్ బాధ్యులు వెంకటేశ్వర్లు, పొన్నం రాజు, చిరంజీవి, రాజు, విజయ్, కొండల్రెడ్డి, మధు, పతంగి భాస్కర్, బరిగెల భాస్కర్, బోనాల రమేష్, సుధాకర్ పాల్గొన్నారు. ఆర్థిక చేయూత ఖిలా వరంగల్: కరీమాబాద్ ఉర్సు బొడ్రాయి ప్రాంతానికి చెందిన స్వర్ణకారుడు రాగి సోమేశ్వరాచారీ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ఆదివారం రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం అధ్యక్షుడు వేములవాడ మదన్మోహన్, ప్రధాన కార్యదర్శి కృష్ణమాచార్యులు, రవీంద్రాచారి పరామర్శించారు. బాధిత కు టుంబానికి రూ.10వేలు, నిత్యావసర వస్తువులు అందజేశారు. సదానందం, వీరన్న, సత్యనారాయణ, పణికుమార్, సరిత, జగదీశ్వర్ పాల్గొన్నారు. -
రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణ పనులు ప్రారంభించాలి
మామునూరు: స్మార్ట్ సిటీలో భాగంగా మంజూరైన రూ.25లక్షల నిధులతో 43వ డివిజన్ గణేష్నగర్ కాలనీలో రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదివారం స్థానికులు నిరసన తెలిపారు. మంజూరైన అభివృద్ధి పనులు తక్షణమే చేపట్టాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు కలిసి వినతిపత్రాలు అందజేసినా.. పట్టింపులేదని వాపోయారు. ఈ కాలనీకి మంజూరైన నిధులను ఇతర కాలనీలకు మళ్లించొద్దని స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్థానిక కార్పొరేటర్ కాలనీపై వివక్షత చూపుతున్నాడని ఆరోపించారు. కాలనీలో మట్టి రోడ్లు మరింత గుంతలు పడి ఆధ్వానంగా తయారయ్యాయని వాపోయారు. అధికారులు స్పందించి కాలనీ కి మంజూరైన నిధులతో పనులు చేపట్టాలని కాలనీ ప్రతినిధి ఉమ్మగాని ఉమేష్గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో గంట సుమన్, చంద్రమౌళి పాల్గొన్నారు. గణేష్నగర్లో స్థానికులు నిరసన -
పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
● 40 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు హన్మకొండ: సుదీర్ఘ కాలం తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థుల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. హనుమకొండ జిల్లా పరకాల సీఎస్ఐ 1984–1985 బ్యాచ్ పదోతరగతి విద్యార్థులు ఆది వారం హనుమకొండ 100 ఫీట్ల రోడ్లోని వెంకటేశ్వరకాలనీలో కలుసుకున్నారు. 40సంవత్సరాల తర్వా త కలుసుకున్న వారు ఒకరినొకరు అప్యాయంగా పలుకరించుకున్నారు. పదో తరగతి తర్వాత ఉన్నత విద్య అభ్యసించేందుకు వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారు. అనంతరం ఉద్యోగాలు, వాప్యారాలు చేస్తూ బిజీగా గడుపుతూ ఎక్కడెక్కడో స్థిరపడ్డవారు.. 40ఏళ్ల తర్వాత ఆదివారం కలుసుకుని పాఠశాల నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఆనాడు విద్యాబుద్దులు నేర్పిన గురువులను సన్మానించారు. కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులు నరసింహ రామయ్య, పీఈటీ జేమ్స్, డి.కోర్నేల్, ఫౌల్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న మోదీ
హన్మకొండ చౌరస్తా: భారత రాజ్యాంగాన్ని మోదీ సర్కారు అవహేళన చేస్తోందని కాంగ్రెస్ హనుమకొండ జిల్లా కమిటీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని డీసీసీ భవన్లో ఆదివారం వరంగల్, హనుమకొండ జిల్లాల పార్టీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తోందని పేర్కొన్నారు. సమావేశానికి వరంగల్, హనుమకొండ జిల్లాల ఇన్చార్జ్లుగా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, రాయల నాగేశ్వర్రావు నియమితులైనట్లు వెల్లడించారు. అనంతరం బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ విధానాలపై ఏర్పాటు చేసిన ప్రాజెక్టు వీడియోను ప్రదర్శించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, టీపీసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాలతో నిర్వహించిన సమావేశంలో వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, మేయర్ సుధారాణి పాల్గొన్నారు. హన్మకొండ: జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. నాయిని విశాల్రెడ్డి ట్రస్టు ఆధ్వర్యాన ఫాక్స్కాన్ సంస్థ నేతృత్వంలో హనుమకొండ నయీంనగర్లోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాలలో ఆదివారం మహిళల మెగా జాబ్ మేలా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట వేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తరువాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నిరంతరం కొనసాగుతోందని, కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నదని తెలిపారు. రానున్న రోజుల్లో ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి సారించి ప్రముఖ కంపెనీలతో జాబ్ మేలా నిర్వహిస్తామన్నారు. ఫాక్స్కాని సంస్థ ప్రతినిధి ఆనంద్కుమార్, పరమేష్, పార్వతి వాగ్దేవి కళాశాల కరస్పాండెంట్ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి -
మార్కెట్కు మోక్షమెప్పుడో..?
కాజీపేట: కాజీపేట పట్టణంలో చేపల మార్కెట్ నిర్మాణానికి స్థల గ్రహణం వీడడం లేదు. దీంతో వినియోగదారులు, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం బాపూజీనగర్ ప్రధాన రహదారిపైనే కొన్నేళ్లుగా చేపల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ప్రధాన రహదారిపై పరదాలు కట్టుకుని వ్యాపారులు విక్రయాలు సాగిస్తున్నారు. చేపల వ్యాపారులను మార్కెట్లోకి తరలించాలనే ప్రతిపాదనలు ఉన్నా.. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కడిపికొండ శివారులోని ప్రభుత్వ భూమిలో ఇటీవల రూ.60 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన రేకుల షెడ్డులు నిరుపయోగంగా మారాయి. వీటిలోకి చేపల మార్కెట్ను తరలించాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించినా అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో రోడ్డునే నమ్ముకుని చేపలు అమ్మకుంటూ మహిళలు ఇబ్బందులు పడ్తున్నారు. రోడ్డు వెడల్పుతో ఉపాధి కరువు... ఇటీవల నగర విస్తరణలో భాగంగా అధికారులు చేపట్టిన కూల్చివేతలతో చేపల విక్రయదారులు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారులు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేతలు చేపట్టడంతో ఉపాధిని కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికై నా చేపల మార్కెట్కు అనువైన స్థలాన్ని కేటాయించాలని వ్యాపారులు, వినియోగదారులు కోరుతున్నారు. సమస్య పరిష్కరించాలి.. కాజీపేట పట్టణంలో సరైన చేపల మార్కెట్ లేకపోవడంతో కొనుగోలుదారులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్కు సరైన స్థలాన్ని కేటాయించడానికి అధికారులు చొరవచూపి, సమస్యను త్వరగా పరిష్కరించాలి. – అప్పాల మహేందర్, కాజీపేట స్థల సేకరణలో జాప్యం ఇక్కట్లలో చేపల వ్యాపారులు, వినియోగదారులు -
ప్రైవేట్ అప్పులు తీర్చేందుకు అదనపు రుణాలు
వరంగల్ లీగల్ : రైతుల ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం బ్యాంకుల నుంచి పంట రుణాలకు అదనంగా దీర్ఘకాలిక రుణాలు పొందేందుకు రైతులు దరఖాస్తులు చేసుకోవాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల న్యాయసేవాధికార సంస్థల కార్యదర్శులు జడ్జి క్షమాదేశ్ పాండే, ఎం.సాయికుమార్ సూచించారు. శుక్రవారం తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు అధ్యక్షతన జిల్లా కోర్టు ఆవరణలో బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయాధికారులు, రైతులతో హనుమకొండ, వరంగల్ న్యాయసేవాధికారి కార్యదర్శులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరిరావు మాట్లాడుతూ.. జిల్లా న్యాయసేవాధికార సంస్థల కార్యదర్శుల సూచన మేరకు అర్హులైన రైతులందరికీ ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి అదనపు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. సమావేశంలో తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కిషన్రావు, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్, తిరుపతి, రాజు, బాపురావు, సీఐఎస్ఎఫ్ కోఆర్డినేటర్ తోకల్ ఆదిరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి రవికుమార్, బ్యాంకర్లు, వ్యవసాధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలి
ఖిలా వరంగల్: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కొనసాగుతున్న వరంగల్ రైల్వేస్టేషన్ పునరుద్ధరణ పనులను శరవేంగా పూర్తి చేయాలని దక్షణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం వరంగల్ రైల్వేస్టేషన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అమృత్ భారత్ స్టేషన్ స్కిమ్ (ఎబీఎస్ఎస్) కింద రూ.25.41కోట్లలో జరుగుతున్న పాదచారుల వంతెన(ఫుట్ ఓవర్ బ్రిడ్జి), 3 లిఫ్టులు, 4 ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, గ్రీనరీ పనులను పరిశీలించారు. అంతకు ముందుగా రైల్వే కోచ్ రెస్టారెంట్ను తిలకించారు. అనంతరం జీర్పీ పోలీసులకు నూతన భవనం నిర్మించాలని జీఎంకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఎం భరతేష్కుమార్, సీనియర్ డీసీఎం బాలాజీ కిరణ్, స్టేషన్ మేనేజర్ బాలరాజ్నాయక్, సీసీఐ రాజగోపాల్, ఆర్పీఎఫ్ సీఐ సీఎస్ ఆర్ కృష్ణ, జీర్పీ సీఐ సురేందర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జీఎం అరుణ్కుమార్ జైన్ -
ఉత్సాహంగా రూబిజెస్ట్ – 2025
ర్యాంప్ వాక్, నృత్యం చేస్తున్న విద్యార్థినులు● కేయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహణ ● ఆకట్టుకున్న విద్యార్థినుల ర్యాంప్ వాక్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో రూబిజెస్ట్– 2025లో భాగంగా శుక్రవారం థిమ్ డే వేడుకలను ఉత్సాహంగా కొనసాగాయి. ప్రోగ్రాం కన్వీనర్ సాయి తరుణ్, వివిధ ఆర్గనైజర్ల ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆడిటోరియంలో కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయా ఉత్సవాలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో కేరళ సంప్రదాయ దుస్తులు ధరించి మహిళా అధ్యాపకులు చేసిన ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది. అంతే కాకుండా వారు ఇచ్చిన సోలో, గ్రూప్ డ్యాన్స్లు ఆకర్షణగా నిలిచాయి. జాతీయ స్థాయిలో ఉన్న వివిధ ప్రాంతాల, సంప్రదాయ నత్య రీతులవారు ధరించే దుస్తులను ధరించి కళాశాల విద్యార్థినులు చేసిన ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ర్యాంప్ వాక్ ప్రదర్శనలో నిలిచిన బీటెక్ ఈసీఈ విభాగం ప్రథమ సంవత్సరం విద్యార్థిని సుదూప్తికి ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్రెడ్డి బహుమతి అందజేశారు. -
అర్ధరాత్రి.. మూగజీవాల మృత్యుఘోష
ఖిలా వరంగల్ : ఆ మూగజీవాలు ప్రమాదమని గుర్తించలేవు. కాపాడండి అని అరవలేవు. మద్యం మత్తులో ఆకతాయిలు చేసిన పనికి అర్ధరాత్రి మాంసంముద్ధలయ్యా యి. వాటినే నమ్ముకున్న ఓ వ్యక్తి కుటుంబం రోడ్డున పడింది. ఇంతటి ఘాతుకానికి పాల్పడిందెవరు?.. అన్నది పోలీసులు తేల్చాల్సి ఉంది. ఖిలావరంగల్ మట్టికోట ఎల్పీగండి సమీపాన గొర్రెలు, మేకల ఫామ్లో గురువా రం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 450 గొర్రెలు, మేకలు సజీవ దహనమైన విషయం తెలిసిందే. సుమారు రూ.30లక్షల ఆస్తినష్టం జరిగిందని బాధితులు బోరున విలపిస్తున్నారు. ఫామ్ను సందర్శించిన పోలీసులు అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని శుక్రవారం ఉదయం వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా, ఏసీపీ నందిరామ్నాయక్తోపాటు పశసంవర్థకశాఖ జేడీ బాలకృష్ణ, తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, ఎంహెచ్ఓ రాజేష్, ఇన్స్పెక్టర్ వెంకటరత్నం, స్థానిక కార్పొరేటర్ ఉమ సందర్శించారు. మాంసం ముద్దలైన మూగజీవాలను పరిశీలించా రు. బాధితులైన దుగ్గిరాల లక్ష్మణ్, దుగ్గిరాల కుమారీలను పరామర్శించి ధైర్యాన్ని కల్పించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని, భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా అదుకుంటామని డీసీపీ హామీ ఇచ్చారు. మొదలైన దర్యాప్తు గొర్రెల ఫామ్లో గురువారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టం మీద బాధితురాలు దుగ్గిరాల కుమారీ మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫామ్లో కరెంట్ సరఫరా లేదని, బ్యాటరీ సహాయంతో సీసీ కెమెరాలు పనిచేస్తాయని, అవికూడా మంటల్లో పూర్తి కాలిబూడిదైనట్లు తెలిపింది. ఆంధ్రానుంచి బతుకు దెరువు కోసం వలస వచ్చి.. కోట ప్రాంతంలో స్థలాన్ని లీజుకు తీసుకుని ఫామ్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని, శతృవులంటూ ఎవరూ లేరని, మద్యం, గంజాయికి బానిసైన ఆకతాయిలే ఫామ్కు నిప్పు అంటించి ఉంటా రని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కళేబరాల పూడ్చివేత బల్దియా అధికారులు పరిసర ప్రాంతాల్లో వ్యాధులు ప్రభలకుండా గొర్రెలు, మేకల కళేబరాలను వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలించి పూడ్చివేశారు.. అంతకుముందు పశువైద్యులు కళేబరాలనుంచి షాంపిల్స్ సేకరించారు. లేని ఫైర్ స్టేషన్ ఖిలావరంగల్ మండల పరిధిలో ఫైర్స్టేషన్ లేదు. చుట్టూ పది కిలోమీటర్ల మేర మండలం విస్తరించి ఉంది. ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వర్ధన్నపేట, హనుమకొండ, మట్టెవాడ పరిధిలోనుంచి ఫైరింజన్లు రావాలి. ఆ లోగా మంటలు పూర్తిగా అంటుకుని బుగ్గి అవుతోందని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి.. ఆకతాయిలు చేసిన పనికి నా కుటుంబం రోడ్డు మీద పడింది. జీవనాధారమైన 450 మూగజీవాలు మంటల్లో మాంసం ముద్దలయ్యాయి. సుమారు రూ.30లక్షల విలువైన గొర్రెలు, మేకల మృతి చెందాయి. ప్రభుత్వమే నా కుటుంబాన్ని ఆదుకోవాలి. దుగ్గిరాల లక్ష్మణ్, బాధితుడు గొర్రెలు, మేకల ఫామ్లో వ్యాపించిన మంటలు సజీవదహనమైన 450 జీవాలు.. సుమారు రూ.30లక్షల నష్టం ఆకతాయిల పనేనంటున్న బాధితులు ఘటన స్థలాన్ని సందర్శించిన డీసీపీ సలీమా, ఏసీపీ నందిరాంనాయక్ -
ఒకే దేశం, ఒకే ఎన్నిక నష్టమే..
కేయూ క్యాంపస్: భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన భారతీయ సమాజానికి ‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ నష్టదాయకమని ప్రముఖ సామాజిక వేత్త హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ సెనెట్ హాల్లో రాజనీతిశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘భారత సమాజంలో సంకీర్ణ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు ఓటర్లను ఆకర్షించడానికి ఉపయోగపడుతున్నప్పటికీ వాటి అమలులో మాత్రం చిత్తశుద్ధి లోపిస్తోదన్నారు. దేశంలోని విభిన్న జాతులు, కులాలు, మతాలు, బహుళ సంస్కతి, సంప్రదాయాలతో కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజల హక్కులు, ప్రజాస్వామ్యానికి సంకీర్ణ ప్రభుత్వాలతోనే రక్షణ సాధ్యమని ఆయన అన్నారు. నిత్యం ప్రజలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరిస్తూ.. ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పులు తెచ్చి సమాజాన్ని శాసీ్త్రయంగా విశ్లేషిస్తూ ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడమే రాజకీయ పార్టీల ప్రధాన కర్తవ్యంగా ఉండాలన్నారు. నేటి రాజకీయ పార్టీలు కార్పొరేట్ శక్తుల ధన ప్రలోభాలకు లోనై ఓటర్లను ప్రభావితం చేయడం ప్రజాస్వామ్య ఉనికికి ప్రమాదకరమన్నారు. 1960 దశకం చివరి నుంచి దేశంలో ప్రభుత్వాల ఏర్పాటులో ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరిగిందన్నారు. 1991లో దేశంలో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు, గ్లోబలైజేషన్ ప్రభావంతో సమాజంలో మానవీయ సంబంధాలు కనుమరుగై, మార్కెట్ సంబంధాలు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాద సంస్థల్లో మార్పు తీసుకొచ్చేందుకు కార్పొరేట్ శక్తులతో ఏర్పడిన అసమాన సమాజాన్ని తొలగించేందుకు మానవీయ శాస్త్రాలు, రాజనీతి శాస్త్ర ప్రాముఖ్యత అవసరమన్నారు. నేటితరం విద్యార్థులు సమాజ అభివృద్ధి కోసం ప్రశ్నించేతత్వాన్ని, ప్రజాస్వామిక లక్షణాలను పెంపొందించుకోవాలని హరగోపాల్ సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉంటాయని గుల్బర్గా యూనివర్సిటీ యాక్టింగ్ వీసీ ప్రొఫెసర్ శ్రీరాములు అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణమైన పాలన అందిస్తేనే ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు, సంకీర్ణ ప్రభుత్వాలకు మనుగడ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, ముంబాయి యూనివర్సిటీ ప్రొఫెసర్ జోష్ జార్జ్, సోషల్ సైన్స్ డీన్ మనోహర్, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సంకినేని వెంకటయ్య, బీఓఎస్ చైర్మన్ డాక్టర్ గడ్డం కృష్ణ, అధ్యాపకులు సత్యనారాయణ, నాగరాజు, లక్ష్మీనారాయణ, సంజీవ్, భాగ్యమ్మ, లలిత కుమారి, విజయ్, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను రిజిస్ట్రార్ రామచంద్రం ప్రారంభించారు. సంకీర్ణ ప్రభుత్వాలతోనే ప్రజాస్వామ్యానికి రక్షణ ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ -
ఎంటీపీ యాక్ట్ నిబంధనలు కఠినంగా పాటించాలి
● హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య ఎంజీఎం: జిల్లాలో పీసీఅండ్ పీఎన్డీటీ, ఎంటీపీ యాక్ట్ నిబంధనలను ఆస్పత్రులు, క్లినిక్లు, స్కానింగ్ సెంటర్ల యాజమాన్యాలు కఠినంగా పాటించాలని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. ఈ మేరకు రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శుక్రవారం నగరంలోని నాలుగు స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేశారు. రికార్డులు, సర్టిఫికెట్లు, స్నానింగ్ మెషీన్లు, ఫామ్ – ఎఫ్, ఆన్లైన్, ఆఫ్లైన్ రికార్డులను పరిశీలించారు. ఎంటీపీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు మాత్రమే నిబంధనలకు లోబడి ఇద్దరు డాక్టర్ల సమక్షంలో అబార్షన్స్ చేయాలని, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు లేకుండా అర్హత లేని డాక్టర్లు అబార్షన్స్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతినెలా చేసిన అబార్షన్స్ వివరాలు డీఎంహెచ్ఓ కార్యాలయంలో అందించాలని సూచించారు. కార్యక్రమంలో జీఎంహెచ్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేశ్వరి, ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల, డాక్టర్ జమున, మహిళా శిశు సంక్షేమశాఖ సఖి వన్స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ హైమావతి, వరంగల్ కమిషనరేట్ భరోసా సెంటర్ ఎస్సై బోయిన మంగ, హెచ్ఈఓ రాజేశ్వర్ రెడ్డి, సందీప్, పాల్గొన్నారు. -
కల్తీ, కాలంచెల్లిన ఐస్క్రీమ్ ఉత్పత్తుల స్వాధీనం
ఖిలా వరంగల్: ఐస్క్రీమ్ డిస్ట్రిబ్యూటర్ షాపుపై దాడిచేసి రూ.93,200ల విలువైన కల్తీ, కాలం చెల్లిన ఐస్ క్రీమ్ ఉత్పత్తులను స్వాధీన పర్చుకుని, షాపు నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ జి.బాబులాల్ తెలిపారు. మామునూరు పోలీస్ స్టేషన్ పరిధి నాయుడు పెట్రోల్బంక్ సమీపంలో ఏనుగంటి సురేష్ ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూటర్ షాపులో కల్తీ, కాలం చెల్లిన ఐస్ క్రీమ్ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్కు అందింది. ఆయన ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఆ షాపుపై టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ బాబులాల్ ఆధ్వర్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి నేతృత్వంలో దాడి చేశారు. నిల్వ చేసిన రూ.93,200ల విలువైన కల్తీ, కాలం చెల్లిన ఐస్క్రీమ్ ఉత్పత్తులను స్వాధీన పర్చుకుని, వ్యాపారి సురేష్పై కేసు నమోదు చేసి తదిపరి చర్యల నిమిత్తం కేసును మామునూరు పోలీసులకు అప్పగించినట్లు ఇన్స్పెక్టర్ బాబులాల్ తెలిపారు. -
25నుంచి ఎఫ్పీఓఎస్ రాష్ట్రస్థాయి మేళా
వరంగల్: రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పీఓఎస్) రాష్ట్రస్థాయి మేళా ఈనెల 25నుంచి 27వ తేదీ వరకు వరంగల్ రంగశాయిపేటలో నిర్వహించనున్నట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, జిల్లా వ్యవసాయశాఖ అధికారి (డీఏఓ) అనురాధ తెలిపారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల రాష్ట్రస్థాయి మేళాపై శుక్రవారం అధికారులతో సమన్వయ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఈ మేళాలో రైతు ఉత్పత్తిదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ శాఖలు ఎలా సమన్వయంతో పనిచేయాలానే అంశంపై దిశానిర్దేశం చేశారు. అనంతరం అధికారులతో కలిసి రంగశాయిపేటలోని మేళా స్థలాన్ని కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, డీఆర్డీఓ, ఉద్యాన శాఖ అధికారి సంగీతలక్ష్మి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రమేశ్, మత్స్యశాఖ అధికారి నాగమణి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్పై ప్రత్యేక దృష్టి.. ఎల్ఆర్ఎస్ ఆమోదించిన దరఖాస్తుల ఫీజు వసూలుపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. హైదరాబాద్ నుంచి మున్సిపల్ ప్రధాన కార్యదర్శి దానకిశోర్ శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జీడబ్ల్యూఎంసీ, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ఎల్ఆర్ఎస్కు 41,443 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అందులో 18,943 మంజూరు చేసి, 1,081 దరఖాస్తులకు ఫీజు సేకరించి, 1,081 ప్రొసీడింగ్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అదనవు కలెక్టర్ సంధ్యారాణి, అధికారులు పాల్గొన్నారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, డీఏఓ అనురాధ -
డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు నిర్వహించలేం
● కేయూ రిజిస్ట్రార్కు ప్రైవేట్ యాజమాన్యాల వినతి కేయూ క్యాంపస్: ‘కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం విడుదల చేయడంలేదు.. దీంతో ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాం.. అందుకే రాబోయే రోజుల్లో యూనివర్సిటీ డిగ్రీ కోర్సుల 2,4,6 సెమిస్టర్ల పరీక్షలు నిర్వహించలేం’ అని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు స్పష్టం చేశారు. ఈమేరకు శుక్రవారం రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రాన్ని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్రావు మాట్లాడుతూ గత 20 నెలలకు సంబంధించిన ఫీజులు చెల్లించకపోవడంతో కళాశాలల యాజ మాన్యాలు ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దని, ఆర్టీఎఫ్ ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పడంతో నిరీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని యాజమాన్యాలు అప్పులు చేసి కళాశాలలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కళాశాలలు నిర్వహించే పరిస్థితి లేదని, ఈనెల 25 వరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు చెల్లించని పక్షంలో ఏప్రిల్లో డిగ్రీకోర్సుల 2,4,6 సెమి స్టర్ల పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. రిజిస్ట్రార్ను కలిసిన వారిలో అసోసియేషన్ కేయూ అధ్యక్షుడు ఉపేందర్రెడ్డి, కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, ఆర్థిక కార్యదర్శి జి.వేణుమాధవ్, ఇతర బాధ్యులు ఉన్నారు. -
శనివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2025
స్టేజీల వారీగా ఎన్ని టికెట్లు జారీ అవుతున్నాయి.. ఇందులో డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఎన్ని, నగదు రూపేణా ఎన్ని, జీరో టికెట్లు ఎన్ని జారీ అయ్యాయో తెలుసుకునే సౌకర్యం ఉంది. ● ఆర్టీసీ డిపోలు, వరంగల్ రీజియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్యాష్ బోర్డు ద్వారా ప్రతీబస్లో జారీ అవుతున్న టికెట్ల వివరాలు స్టేజీల వారీగా అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ● ఈ టిమ్స్ పూర్తిస్థాయిలో పని చేయడానికి మరికొంత సమయం పట్టనుంది. ● ముందుగా ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం (ఓపీఆర్ఎస్) వర్తింపజేస్తున్న బస్సులో వీటిని వినియోగించనున్నారు. ● కండక్టర్లు, డ్రైవర్లకు శిక్షణ ఇచ్చిన తర్వాత పల్లె వెలుగు బస్సుల వరకు క్రమంగా అమలు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు ఆర్టీసీ ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుంటోంది. ప్రయాణికులకు సౌకర్యవంతంగా టికెట్ జారీకి ఇ–టిమ్స్ను ప్రవేశ పెట్టింది. దీనిలో భాగంగా ఆర్టీసీ వరంగల్ రీజియన్లోని ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈమేరకు కండకర్లు, డ్రైవర్లకు శిక్షణ ఇస్తూ క్రమంగా ఇ–టిమ్స్ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటివరకు ఉపయోగించిన టిమ్స్తో చూసుకుంటే మరిన్ని ఫీచర్లతో వీటిని రూపొందించారు. ఆధునిక సాంకేతిక పద్ధతులతో ఇ–టిమ్స్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇ–టిమ్స్ను రూపొందించారు. ప్రస్తుతం రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్న బస్సుల్లో మాత్రమే వీటిని వినియోగిస్తున్నాం. క్రమంగా పల్లె వెలుగు వరకు అమలు చేస్తాం. వీటి ద్వారా ప్రయాణికులకు సులువుగా టికెట్ జారీ చేయవచ్చు. – డి.విజయ భాను, ఆర్టీసీ వరంగల్ ఆర్ఎంవరంగల్ రీజియన్లో ప్రతిరోజూ 936 బస్సులు వివిధ రూట్లలో తిరుగుతుంటాయి. 3.76 లక్షల కిలోమీటర్లు తిరిగి సగటున రోజుకు రూ.2.20 కోట్ల ఆదాయాన్ని సంస్థ రాబట్టుకుంటుంది. 936 బస్సులకుగాను ప్రస్తుతం 750 ఇ–టిమ్స్ మాత్రమే చేరుకున్నాయి. అన్ని బస్సుల్లో అమలుచేయాలంటే మరో 186 అవసరం. ఎప్పుడైనా టిమ్ మొరాయిస్తే బాగు చేసే వరకు వినియోగించుకునేలా అదనంగా మరికొన్ని అవసరం. ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులతో టికెట్ల జారీ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న సంస్థ వరంగల్ రీజియన్కు చేరుకున్న 750 ఇ–టిమ్స్ టికెట్ జారీపై మరింత స్పష్టత ప్రతి స్టేజీ వారీగా వివరాలు తెలుసుకునే సౌకర్యం ప్రతీది ఆన్లైనే.. -
సిటిజన్ ఫీడ్బ్యాక్పై అవగాహన కల్పించండి
బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వరంగల్ అర్బన్ : స్వచ్ఛ సర్వేక్షణ్–2024 పోటీల్లో ఫీడ్ బ్యాక్ (ప్రజాభిప్రాయం) విస్తృతంగా అందించేలా ప్రచారం చేయాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. శుక్రవారం మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్లు (సీఓ)లతో బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్–2024 సిటిజన్ ఫీడ్ బ్యాక్లో నగరానికి ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రజలను భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందన్నాఉ. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 31తో 25శాతం రిబేట్ ముగుస్తున్నందున సద్వినియోగం చేసుకునేలా ఆర్పీలు ఫోన్ల ద్వారా సమాచారం అందించాలని కోరారు. ఆస్తి, నల్లా పన్నులకు చెల్లించని వారికి రెడ్ నోటీసులు అందజేసి చెల్లించేలా కృషి చేయాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ (అడ్మిన్) రాజేశ్వరరావు, టీఎంసీ రమేష్, సీఓలు సఫియా, శ్రీలత, సకినాల రమేష్, స్వాతి, అలీ తదితరులు పాల్గొన్నారు. -
నీటి సరఫరాలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు
నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్ : తాగునీటి నీటి సరఫరాలో నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం సహించేది లేదని, ఇంజనీర్లు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ గుండు సుధారాణి సూచించారు. ఉర్సు కరీమాబాద్ వాటర్ ట్యాంక్ను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. నీటి సరఫరాలో సమయ పాలన పాటించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. మేయర్ మాట్లాడుతూ ఉర్సు కరీమాబాద్ వాటర్ ట్యాంక్నుంచి పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోతున్నట్లు పెద్దఎత్తున ఫిర్యాదులు అందినట్లు మేయర్ తెలిపారు. వాల్వ్ లో సమస్య కారణంగా నీటి సరఫరా ఆగిపోయిందని ఏఈ సమాధానం ఇచ్చారు. నీటి సరఫరాలో ఏర్పడే సమస్యల పరిష్కార బాధ్యత ఏఈలు వర్క్ ఇన్స్పెక్టర్లదేనని అన్నారు. యూజీడీ, ఎస్ఎఫ్టీల స్థలాల పరిశీలన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటులో భాగంగా నిర్మించనున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)లకు స్థలాలను శుక్రవారం మేయర్ గుండు సుధారాణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 3వ డివిజన్లోని ఆరేపల్లిలోని వ్యవసాయ కళాశాల క్షేత్రం, 43వ డివిజన్ బొల్లికుంటలో ప్రభుత్వ స్థలాలను చూశారు. 66 డివిజన్లలో 11 జోన్లుగా అండర్గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని డీపీఆర్లో పొందుపర్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు 8 ఖరారు అయ్యాయని, మరో 3 ప్రాంతాలను గుర్తించాల్సి ఉందన్నారు. -
ఐపీఎల్ వేళ యాప్లతో పందేల జోరు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన రాజ్కుమార్ హనుమకొండలో స్నేహితులతో కలిసి ఉంటూ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకునేవాడు. ఈ క్రమంలోనే ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటుపడి సుమారు రూ.30 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఇందుకోసం అప్పులు చేశాడు. చివరకు తండ్రికి విషయం చెప్పి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో ఆయన ఉన్న ప్లాటును అమ్మి అప్పులు తీర్చాడు. అయితే ఎలాగైనా పోయిన డబ్బులు సంపాదించాలని రాజ్కుమార్ మళ్లీ అప్పులు చేసి యాప్లో బెట్టింగ్ కాశాడు. ఈ క్రమంలోనే అప్పుల వాళ్ల వేధింపులు పెరగడంతో ఈ ఏడాది జనవరి ఐదున తండ్రిని రూ.నాలుగు లక్షలు అడిగాడు. తండ్రి లేవని చెప్పడంతో రాజ్కుమార్ ఉరేసుకుని జనవరి 10న ఆత్మహత్య చేసుకున్నాడు. రాయపర్తికి చెందిన కొండపల్లి ధర్మరాజు డిగ్రీ చదివి బిర్యానీ సెంటర్ నిర్వహించి నష్టపోయాడు. హనుమకొండకు మకాం మార్చి పోస్టల్కాలనీలో తాను విద్యార్థినని చెప్పి అద్దె గదిలో నివాసం ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటుపడి అప్పులై దొంగ అవతారం ఎత్తాడు. హనుమకొండ, హసన్పర్తి, కేయూసీ, సుబేదారి, సంగెం, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి, దేవరుప్పుల పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 17 చోరీల్లో 334 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలో 640 గ్రాముల వెండి చోరీ చేశాడు. చివరకు గత అక్టోబర్ 28న పోలీసులకు చిక్కాడు. అత్యాశకు వెళితే ఆర్థికంగా నష్టపోవుడే.. ● పిల్లలపై ఓ కన్నేసి ఉంచాల్సిందే ● తల్లిదండ్రుల అప్రమత్తత అవసరమే ● గత ఘటనలను గుర్తు చేస్తున్న పోలీసులుసాక్షి, వరంగల్: ఐపీఎల్ రానే వచ్చింది. శనివారం నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. దీంతో ఈ జోష్ను క్యాష్ చేసుకునేందుకు బెట్టింగ్ రాయుళ్లు సిద్ధమవుతున్నారు. గతంతో నగరాలకే పరిమితమైన ఈ బెట్టింగ్ ప్రస్తుతం పల్లెలకు సైతం విస్తరిస్తోంది. ఎవరితో సంబంధం లేకుండానే ఫోన్లోనే క్రికెట్ బెట్టింగ్ యాప్లు నిక్షిప్తం చేసుకొని ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ ఐడీలతో డబ్బులు బదిలీ చేస్తూ బెట్టింగ్ చేస్తున్నారు. కొందరేమో తమ తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలు అనుసంధానం చేసి ఉన్న యూపీఐ ఐడీల ద్వారా, మరికొందరు కాలేజీలో పరీక్షలు, హాస్టల్ ఫీజు అని తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసి ఈ బెట్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఐపీఎల్ మొదలవుతుండడంతో ఈ బెట్టింగ్ యాప్ల జోరు పెరగొచ్చని వరంగల్ కమిషనరేట్ పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే పిల్లలు వాడే సెల్ఫోన్లు, వారి ప్రవర్తనపై కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు. యాప్ల్లో డబ్బులు పోయి ఏకంగా ప్రాణాలు తీసుకున్న యువకులు ఉన్నారు. ఆ దిశగా ఎవరూ వెళ్లొద్దని పోలీసులు అంటున్నారు. బెట్టింగ్ పెట్టే వాళ్లపై కేసులు నమోదుచేసే అవకాశం ఉండడంతోనే దందా నిర్విరామంగా సాగుతోందని, బెట్టింగ్ చేసిన వారు పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉండకపోవడం కూడా ఓ కారణమని చెప్పవచ్చు. రేషియో యాప్ల జోరు.. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు ఒప్పుడు ఫోన్ల ద్వారా ఆయా జట్టు విజయాలపై బుకీలకు సమాచారం ఇచ్చేవారు. ఫంటర్లను పెట్టుకొని దందా నడిపేవారు. ఇప్పటికీ ఈ దందా ఉన్నా.. ఇప్పుడు రూపు మార్చుకుంటోంది. ముఖ్య నిర్వాహకుడే యాప్ రూపొందించి బుకీలకు యూజర్ నేమ్, పాస్వర్డ్లు ఇచ్చి నయా దందాకు శ్రీకారం చుడతాడు. ప్రధాన నిర్వాహకులు ఆయా జట్ల విజయాలకు సంబంధించిన రేషియోను ఆ యాప్లో నిక్షిప్తం చేస్తుండడంతో ఇందుకు అనుగుణంగా బుకీలు తమ ఫంటర్లకు చెప్పి దందా చేస్తారు. ఇలా బుకీలకు వచ్చిన ఆదాయంలోనే కొంత డబ్బును ప్రధాన నిర్వాహకుడికి అందిస్తారు. యూపీఐ చెల్లింపులతో పోలీసులకు దొరికే అవకాశం ఉండడంతో బిట్కాయిన్ల రూంలో దందా చేస్తుండడం గమనార్హం. గతంలో పోలీసులకు చిక్కిన బెట్టింగ్ బుకీలతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. యాప్ల సమాచారం ఇవ్వాలి.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డప్ఫాబెట్, 1 ఎక్స్ బెట్. స్కై ఎక్స్చేంజ్, ఫ్యాన్సీ లైఫ్, క్రికెట్ మజా, లైవ్లైన్ గురూ, లోటస్, బెట్ 65, బెట్ ఫెయిర్ వంటి ఆన్ లైన్క్రికెట్ బెట్టింగ్ యాప్లు డౌన్ లోడ్ చేసి పందెంకాస్తూ నష్టపోయిన వారు గతంలో చాలా మంది ఉన్నారు. బెట్టింగ్ యాప్ల గురించి సమాచారం తెలిస్తే ఇవ్వాలి. బెట్టింగ్ ఎవ్వరూ చేయవద్దు. ఈ బెట్టింగ్లతో యువత కెరీర్ ఇబ్బందుల్లో పడుతుంది. – సన్ప్రీత్సింగ్, వరంగల్ పోలీస్ కమిషనర్ 75 బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్లుస్పోర్ట్స్ బెట్టింగ్ కార్యకలాపాల విలువ భారత్లో ప్రతి ఏటా రూ.8,20,000 కోట్ల దాకా ఉంటుందని థింక్ చేంజ్ ఫోరమ్ (టీసీఎఫ్) నివేదిక చెబుతోంది. భారత్లో 14 కోట్ల మంది బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారు. ఐపీఎల్ సీజన్లో ఈ సంఖ్య 37 కోట్ల దాకా పెరుగుతోందని టీసీఎఫ్ నివేదిక పేర్కొనడం చూస్తే బెట్టింగ్ యాప్ జోరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 75 వెబ్సైట్లు, యాప్లు బెట్టింగ్కు సంబంధించినవి పనిచేస్తున్నాయి. -
‘హైపర్’తో సత్వర సేవలు
హన్మకొండ: హైపర్తో సత్వర సేవలు అందిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ, వరంగల్ ఎస్ఈలు పి.మధుసూదన్రావు, కె.గౌతం రెడ్డి శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, ఈదురు గాలులు సంభవించినపుడు అతి తక్కువ సమయంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి ‘హైపర్‘ అనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. హైపర్ అంటే.. ‘హెచ్’ అంటే హెడ్ క్వార్టర్లో అప్రమత్తంగా ఉండడం, ‘ఎ’అంటే సిబ్బంది, సామగ్రి సమీకరణ, ‘ఐ’ అంటే సమాచార సేకరణ, చేరవేయడం, ‘పీ’ అంటే పటిష్ట వ్యూహాన్ని అమలు పర్చడం, ‘ఇ’ అంటే నిర్ధిష్ట కార్యాచరణ అమలు, ‘ఆర్’ అంటే విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం అని ఎస్ఈలు వివరించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డిష్యుం డిష్యుంకాజీపేట అర్బన్ : వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కమీషన్ విషయంలో శుక్రవారం రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. నగరంలోని ఓ భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం భూక్రయవిక్రయదారులతోపాటు రియల్టర్లు కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రేషన్ సాయంత్రం ఆరు గంటలకు పూర్తి కాగా కార్యాలయ ఆవరణలోనే భూమి అమ్మకంలో పాత్ర పోషించిన తమకు రావాల్సిన కమీషన్ ఇవ్వాలని రియల్టర్లు గొడవకు దిగారు. గొడవ కాస్త ఘర్షణకు దారి తీసి ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. చొక్కాలు చింపుకునే స్థాయికి చేరుకోవడంతోపాటు కార్యాలయ ఆవరణలో కుర్చీలను విసిరేసుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. కుర్చీలు ధ్వంసమయ్యాయి. ఇరువర్గాల వారు డయల్ 100కు ఫోన్ చేయగా, పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే సరికి పలాయనం చిత్తగించారు. శాంతిని కోరుతూ కవి సమ్మేళనంహన్మకొండ కల్చరల్ : ప్రపంచ కవితాదినోత్సవాన్ని పురస్కరించుకుని వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం హనుమకొండలోని హోటల్ అశోక కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన బహుభాషా కవి సమ్మేళనం అలరించింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు కవులు పాల్గొని ‘కవులు ప్రపంచానికి ఏమవుతారు ?’ అనే ఆంశంపై తమ కవితలు వినిపించారు. అనంతరం హనుమకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ కూజ విజయ్కుమార్ ఉత్తమ కవితలు వినిపించిన కవులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, మిగిలిన వారికి ప్రశంసపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ వ్యవస్థాకుడు సిరాజుద్దీన్, ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఆచార్య బి.సురేష్, సంస్థ ప్రధాన కార్యదర్శి సుదాకర్రావు, కోశాధికారి విష్ణువర్ధన్, సంస్థ బాధ్యులు పాల్గొన్నారు. ‘కుడా’కు భూమి అప్పగింత నయీంనగర్: కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా) పరిధిలోని పైడిపల్లి రైతులు వారి గ్రామానికి చెందిన 10 ఎకరాల వ్యవసాయ పట్టా భూమిని అభివృద్ధి కోసం ‘కుడా’కు అప్పగించారు. ఈ మేరకు కుడా కార్యాలయంలో శుక్రవారం చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డిని కలిసి భూమికి సంబంధించిన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ గ్రామం ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ‘కుడా’కు భూమి ఇచ్చినట్లు తెలిపారు. -
బాలికా సంరక్షణకు మరిన్ని కార్యక్రమాలు
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్ : సమాజంలో బాలికా సంరక్షణ కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. బేటీ బచావో – బేటీ పఢావో కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు మహిళా పోలీసులు, ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ బాలికా సంరక్షణ కార్యక్రమాలను సమాజంలో మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి జయంతి, డీఆర్డీఏ పీడీ మేన శ్రీను, డీఎంహెచ్ఓ అప్పయ్య, డెమో అశోక్రెడ్డి, షీ టీమ్, భరోసా ఇన్స్పెక్టర్లు సుజాత, సువర్ణ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ వెంకన్న, సీడీపీఓ విశ్వజ పాల్గొన్నారు. -
విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలి
కేయూ క్యాంపస్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంజనీరింగ్ విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. గురువారం మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో క్యాంపస్లోని ఆడిటోరియంలో ‘రూబిజెస్ట్– 2025’ ఉత్సవాలు నిర్వహిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రిజిస్ట్రార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం కూడా ముఖ్యమన్నారు. తమ లక్ష్యాలు నెరవేరాలంటే కష్టపడి చదువుకోవాలన్నారు. రూబిజెస్ట్ కార్యక్రమం ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థుల్లో టెక్నికల్ ఈవెంట్స్లో ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. వ్యోమగామి సునీతా విలియమ్స్లా ధైర్యం, ఆత్మవిశ్వాసం అందిపుచ్చుకొని ఇంజనీరింగ్ విద్యలో రాణించాలన్నారు. అకడమిక్ కోఆర్డినేటర్ వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ ‘రూబిజెస్ట్– 2025’ ఉత్సవాలకు వివిధ కళాశాలల విద్యార్థులు తమ ఈవెంట్స్కు సంబంధించిన ప్రాజెక్టుల డెమోల ద్వారా ప్రతిభ చూపొచ్చన్నారు. ఉత్సవాల కన్వీనర్ సాయితరుణ్.. టెక్నికల్ ఫేస్ అండ్ కల్చరల్ ఫెస్ట్లో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల వివరాలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం -
జిల్లాలో ఓటర్లు 5,08,379 మంది
హన్మకొండ అర్బన్: జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం 5,08,379 మంది ఓటర్లు ఉన్నారని అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు. తొలగింపులకు సంబంధించి నిర్ణీత దరఖాస్తు పూర్తి చేసి ఇస్తే పరిశీలించి తొలగిస్తారన్నారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు రావు అమరేందర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, శ్యాం, రజినీకాంత్, ప్రవీణ్ ఉన్నారు.పలు ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణకాజీపేట రూరల్: దక్షిణ మధ్య రైల్వే వివిధ సెక్షన్లలో అభివృద్ధి పనుల నేపథ్యంలో.. ఈనెల 13వ తేదీ నుంచి రద్దు చేసిన పలు ప్యాసింజర్ రైళ్లను యథావిధిగా ఈనెల 22వ తేదీ నుంచి నడిపిస్తున్నట్లు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట–డోర్నకల్ (67765) ప్యాసింజర్, డోర్నకల్–కాజీపేట (67766) ప్యాసింజర్, డోర్నకల్–విజయవాడ (67767) ప్యాసింజర్, విజయవాడ–డోర్నకల్ (67768) ప్యాసింజర్ రైళ్లు యథావిధిగా నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రాష్ట్ర స్థాయి టెక్ ఫెస్ట్లో విద్యార్థుల ప్రతిభరామన్నపేట: సికింద్రాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి టెక్ ఫెస్ట్లో వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ తెలిపారు. గర్భిణుల ఆరోగ్యాన్ని సమగ్రంగా పర్యవేక్షించేందుకు రూపొందించిన ప్రత్యేక సెన్సార్ల సాయంతో బ్లడ్ప్రెజర్, బ్లడ్ షుగర్, హార్ట్ రేట్ వంటి ముఖ్యమైన ఆరోగ్య సూచికలను నిరంతరం ట్రాక్ చేస్తూ.. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అలర్ట్ చేయబడే పరికరాన్ని ప్రదర్శించి (కృతిమ మేధస్సు) బహుమతిని గెలుపొందినట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ప్రథమ బహుమతి సాధించిన విశాల్, రేవంత్, టి.శ్రీచరణ్, రఘువీర్, ప్రసాద షాహ్బాజ్, వర్షిత్రాజును ప్రిన్సిపాల్ ప్రత్యేకంగా అబినందించారు. -
మా బంగారం ఇప్పించండి..
రాయపర్తి: బ్యాంకులో తామెంత బంగారం తనా ఖా పెట్టామో అంతే ఇప్పించాలంటూ డిమాండ్ చే స్తూ ఖతాదారులు గురువారం రాయపర్తి మండలకేంద్రంలోని ఎస్బీఐ ఎదుట ఆందోళన చేపట్టారు. గత సంవత్సరం నవంబర్ 19వ తేదీన రాయపర్తి ఎస్బీఐలో ఖాతాదారుల 19 కిలో బంగారం చోరీకి గురైన విషయం విధితమే. ఈ ఘటనలో బ్యాంకు అధికారులు సదరు బంగారంలో తరుగు తీసి డ బ్బులు చెల్లిస్తామని కొంతకాలంగా ఖాతాదారులకు చెబుతున్నారు. అయితే ఖాతాదారులు మాత్రం బ్యాంకులో తామెంత బంగారం తనాఖా పెట్టామో అంతే ఇవ్వాలని, లేనిపక్షంలో తరుగు తీయకుండా డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి వారి నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని, మరో రెండు రోజుల్లో సమాచారం అందజేస్తానమ ని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఖాతాదారులు వెనుదిరిగారు. కాగా, బ్యాంకులో ఎలాంటి గొడవలు జరగకుండా ఎస్సై శ్రవణ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఖాతాదారుల డిమాండ్ రాయపర్తి ఎస్బీఐ ఎదుట ఆందోళన -
‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం
విద్యారణ్యపురి: హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో టెన్త్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. శుక్రవారం (నేటి) నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. అందుకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. హనుమకొండ జిల్లాలో అన్ని యాజమాన్యాలు కలిపి 12,010 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 318 పాఠశాలల్లో బాలురు 6,339 మంది, బాలికలు 5,671 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు 67 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 41 ప్రభుత్వ యాజమాన్యాల పరిధి పాఠశాలల్లో, 26 ప్రైవేట్ హైస్కూళ్లలోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 67 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 67 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లను, 600 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తారు. ఫిజికల్ సైన్స్, బయాలాజికల్ సైన్స్ పరీక్షలు మాత్రం ఉదయం 9–30 గంటల నుంచి 11 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు నిర్దేశించిన సమయానికి గంట ముందుగానే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలి. నిర్దేశించిన సమయం ఉదయం 9:30 గంటల తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. ఆతర్వాత అనుమతించరు. జవాబులు రాసేందుకు ఈసారి 24 పేజీల బుక్లెట్ను అందించనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ హనుమకొండ జిల్లాలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ను విధించారు. ఎగ్జామ్ సెంటర్ల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేస్తారు. ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్షల సమయంలో ఆర్టీసీ సంస్థ బస్సులను నడుపనుంది. అలాగే.. విద్యుత్ అధికారులు పరీక్షల సమయంలో విద్యుత్ కోతలు లేకుండా చూస్తారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రతీ పరీక్ష కేంద్రానికి ఒకరు అందుబాటులో ఉంటారు. పరీక్షల కేంద్రాల సీఎస్లు విద్యార్థులు తాగునీటి వసతిని కల్పించాల్సి ఉంటుంది. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద బ్యానర్లను కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఏ సందేహాలున్నా విద్యాశాఖాధికారుల నంబర్లు అందులో పేర్కొన్నారు. సీఎస్ గదుల్లో సీసీ కెమెరాల నిఘా హనుమకొండ జిల్లాలోని 67 పరీక్ష కేంద్రాల్లోని చీఫ్ సూపరింటెండెంట్ గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో ఒక్కో సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలోనే ప్రశ్నపత్రాల బండిళ్లను సీఎస్లు విప్పాల్సి ఉంటుంది. అదే నిఘాలో మళ్లీ జవాబుపత్రాల బండిళ్లను సీల్ వేయాల్సి ఉంటుంది. అయితే ప్రహరీ గోడలు లేని జెడ్పీహెచ్ఎస్ వేలేరు, జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ కమలాపూర్, జెడ్పీహెచ్ఎస్ దామెర పరీక్ష కేంద్రాల్లో మాత్రం ఒక్కో కేంద్రంలో సీఎస్ గదితో పాటుగా ఆవరణలోనూ ఒక్కో సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు హనుమకొండ జిల్లాలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాలో నాలుగు ఫ్లయింగ్ స్వ్కాడ్లను నియమించారు. ప్రతీ కేంద్రానికి ఒకరు చొప్పున 67 మందిని సిటింగ్ స్వ్కాడ్లను నియమించారు. సంబందిత జిల్లా అధికారులు కూడా పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారు. హనుమకొండ జిల్లాలో పరీక్షలకు సంబంధించి విద్యార్థులు 83095 43630 నంబర్లో సంప్రదించవచ్చు. జిల్లాలో పరీక్షలు రాయనున్న 12,010 మంది విద్యార్థులు 67 కేంద్రాలు ఏర్పాటు వరంగల్ జిల్లాలో 9,237 మంది విద్యార్థులు 49 పరీక్ష కేంద్రాలు సీఎస్ గదుల్లో సీసీ కెమెరాల నిఘా నాలుగు బృందాల ఫ్లయింగ్ స్క్వాడ్లు 67 మంది సిట్టింగ్ స్క్వాడ్లు పకడ్బందీగా నిర్వహిస్తాం.. హనుమకొండ జిల్లాలో ఈనెల 21 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు లోనవ్వకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే.. హనుమకొండ డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్లలో సంప్రదించవచ్చు. – డి.వాసంతి, డీఈఓ, హనుమకొండ -
వరంగల్ మామిడికి ప్రత్యేక గుర్తింపు
వరంగల్: వరంగల్ పండ్ల మార్కెట్ నుంచి ఎగుమతి అయ్యే మామిడికి దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం వరంగల్ ఏనుమాముల మార్కెట్ పరిధిలో గల ముసలమ్మ కుంటలో ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్ను వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్.నాగరాజు, వరంగల్ కలెక్టర్ సత్యశారదతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని రైతు సంక్షేమ ప్రభుత్వం ప్రతీ అన్నదాత అభివృద్ధి, సంక్షేమం కోసమే కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే వరంగల్ మార్కెట్ నుంచి ఎగుమతి అయ్యే మామిడికి దేశ వ్యాప్తంగా ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో సంప్రదాయ(ఆర్గానిక్)పద్ధతిలో సాగు చేసే పండ్లను విక్రయించేందుకు వ్యాపారులు ముందుకు రావాలన్నారు. మామిడి మార్కెట్లో మౌలిక వసతుల ఏర్పాటుకు రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ నిధులతో మార్కెట్ రోడ్డు అభివృద్ధి చేయిస్తామని హామీ ఇచ్చారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్నాగరాజు మాట్లాడుతూ మార్కెట్లో టాయిలెట్లు నిర్మాణానికి నియోజకవర్గ నిధుల నుంచి రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో అదనవు కలెక్టర్ సంధ్యారాణి, జేడీఎం ఉప్పుల శ్రీనివాస్, డీడీఎం పద్మావతి, డీఎంఓ సురేఖ, మార్కెట్ కార్యదర్శి జి.రెడ్డి, హార్టికల్చర్ అధికారి సంగీతలక్ష్మి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్రెడ్డి, ఫ్రూట్ మర్చంట్ అసోసియే షన్ అధ్యక్షుడు వెల్ది సాంబయ్య, కార్పొరేటర్లు తూర్పాటి సులోచన, అనిల్కుమార్, స్థానిక నాయకుడు ఇంతియాజ్, ప్రజాప్రతినిధులు, ట్రేడర్స్, రైతులు తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం కృషి.. మహిళా సాధికారతకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం వరంగల్ దేశాయిపేటలో దుర్గాబాయి మహిళాశిశు వికాస కేంద్రం ఆధ్వర్యంలో నిర్మించిన ప్రభుత్వ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ను ప్రారంభించారు. 9,462 స్వయం సహాయక బృందాలకు రూ.20 కోట్ల 84 లక్షల 73 వేల బ్యాంక్ లింకేజీ చెక్ను అందజేశారు. అనంతరం వరంగల్, ఖిలావరంగల్ మండలాల పరిధిలోని 457మంది కుటుంబాలకు రూ. 4 కోట్ల 87 లక్షల 56 వేల 492 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాగారాజు, కలెక్టర్ సత్యశారద అందజేశారు. రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ముసలమ్మకుంటలో మామిడి మార్కెట్ ప్రారంభం మామిడి క్వింటా రూ.11.220 వరంగల్ ఏనుమాముల పరిధిలోని ముసలమ్మకుంటలో ఏర్పాటు చేసిన మామిడి మార్కెట్లో గురువారం తొలిసారి పండ్ల వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు వెల్ది సాంబయ్య వేలం నిర్వహించారు. ఈ వేలంలో టన్ను మామిడి గరిష్టంగా రూ.లక్షా 22వేల ధర పలింది. క్వింటాకు రూ.11,220కి కొనుగోలు చేశారు. -
భూకబ్జాలు, రౌడీషీటర్లపై సమాచారం సేకరించండి
హన్మకొండ చౌరస్తా: రౌడీషీటర్ల కదలికలపై ఆరా తీసి, భూకబ్జాలకు పాల్పడే వారి సమాచారాన్ని సేకరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అధికారులకు సూచించారు. వరంగల్ కమిషనరేట్ ఎస్బీ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బందితో కమిషనరేట్లో గురువారం సీపీ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ముందుగా.. పోలీస్ అధికారులు నిర్వహిస్తున్న విధులు, తీరు తెన్నులపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ.. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ముందస్తు సమాచారాన్ని సేకరించడం ఎస్బీ సిబ్బంది ప్రధాన కర్తవ్యమన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే స్పెషల్ బ్రాంచ్ అధికారులు కచ్చితమైన సమాచారాన్ని, కచ్చితమైన సమయానికి అందించాలని, ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ భవిష్యత్లో జరిగే ఘటనలపై పటిష్ట నిఘా ఉంచాలన్నారు. పాస్పోర్ట్ విచారణ త్వరగా పూర్తి చేయాలన్నారు. నిజాయితీగా పని చేయాలని విధుల్లో ప్రతిభ కనబర్చిన వారికి రివార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. వరంగల్ కీర్తి ప్రతిష్టలు స్పెషల్ బ్రాంచ్పైనే ఆధారపడి ఉన్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్బీ ఏసీపీలు జితేందర్రెడ్డి, పార్థసారథి, రాజు, గురుస్వామి, శేఖర్, సంజీవ్, చంద్రమోహన్, డీఏఓ ఇషాక్, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో సమీక్ష -
– సాక్షి ప్రతినిధి, వరంగల్
జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలు ఈసారి కూడా వెనుకబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో విడుదల చేసిన తెలంగాణ సామాజిక–ఆర్థిక దృక్పథ నివేదిక – 2025 గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో 32, 33వ స్థానంతో అట్టడుగున నిలిచాయి. ఈ జిల్లాల వృద్ధి రేటు రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడి ఉంది. 2022–23 సంవత్సరాలకు ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటీకి రాష్ట్రస్థాయిలో మిగతా జిల్లాలతో పోలిస్తే చాలా వెనుకబడ్డాయి. ఉమ్మడి జిల్లా పరిస్థితులపై రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ విడుదల చేసిన ‘‘తెలంగాణ సామాజిక–ఆర్థిక దృక్పథ నివేదిక – 2025’’ గణాంకాల ఆధారంగా ప్రత్యేక కథనం – 8లో.. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులవైపు చూపు
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన భారీ బడ్జెట్ అంచనాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. బడ్జెట్లో పేర్కొన్న అంచనాలు పరిశీలిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే గ్రాంట్లవైపు ఆశలు ఉన్నట్లు కనిపిస్తోంది. సొంత ఆదాయం రూ.32 శాతం కాగా.. ప్రభుత్వాల గ్రాంట్లే 68 శాతంగా అంచనా వేశారు. గురువారం ఉదయం కార్పొరేషన్ కార్యాలయ కౌన్సిల్హాల్లో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బడ్జెట్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది. రూ.1,071.48 కోట్లతో కూడిన ప్రతిపాదనలను అధికారులు సభ ముందుంచారు. బల్దియా జేఏఓ సరిత పద్దులను చదివి వినిపించారు. బడ్జెట్పై మాట్లాడేందుకు బీఆర్ఎస్, బీజేపీ సభ్యులకు ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు. కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వర్ రావు, చాడ స్వాతి సొంత ఆదాయాన్ని పెంచుకోవాలని, భవన నిర్మాణాల ఆక్రమణలు, కమర్షియల్ కనెక్షన్ల క్రమబద్ధీకరణ, నాన్ లే అవుట్ల క్రమబద్ధీరణ చేయాలని కోరారు. ఆ తర్వాత బల్దియా బడ్జెట్ను ‘మమ’అనిపించారు. 30వ డివిజన్లో సీసీరోడ్లు నిర్మించిన వారానికే పగుళ్లు పట్టాయని బీజేపీ కార్పొరేటర్లు కొద్దిసేపు ప్లకార్డులు ప్రదర్శించారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్ ఏకుల కోర్నేలు మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించారు. గంటా ఇరవై నిమిషాల పాటు బడ్జెట్ సమావేశం కొనసాగింది. అంచనాలు ఘనం.. ఆచరణలో సాధ్యమేనా? బల్దియా ప్రతీ ఏడాది వేసుకున్న ఆదాయ, వ్యయ అంచనాలను అందుకోవడంలో తలకిందులవుతోంది. అయినా.. తదుపరి ఏడాదికి ఇంకా పెంచి లెక్కలు వేస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. అధికార యంత్రాంగం సొంత ఆదాయాన్ని కేటాయింపుల్లో 60 శాతం వసూళ్లు దాటడం లేదు. గతేడాది రూ.650.12 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి, తదుపరి రివైజ్డ్ బడ్జెట్ రూ.776.20 కోట్లుగా మార్చేశారు. అందులో సొంత ఆదాయం తొలుత రూ.237 కోట్లు చూపించి, తదుపరి రూ.383 కోట్లుగా అంచనాలు రూపకల్పన చేశారు. ఈ ఏడాది రూ.274 కోట్లను జోడించి ఈ దఫా బడ్జెట్ను రూపకల్పన చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ గ్రాంట్లపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకోవడంతోనే అంకెలు పైకి ఎగబాకినట్లుగా స్పష్టమవుతోంది. గతేడాది బడ్జెట్ను పరిశీలిస్తే ప్రధానంగా ప్రభుత్వాల నుంచి రూ.410 కోట్లను ఆశించగా కేవలం రూ.200 కోట్ల మేరకు నిధులు బల్దియా ఖజానాకు చేరాయి. ఇకపోతే గత బడ్జెట్ కంటే రెవెన్యూ తగ్గించినట్లుగా చూపించి, మరోవైపు ఆస్తి పన్నులు, భవన నిర్మాణాల ఫీజులను కొంత మేరకు పెంచారు. గతేడాది ఆస్తి పన్ను ద్వారా రూ.87.93 కోట్లు వస్తాయని అంచనా వేశారు కానీ ఇప్పటి వరకు 60 శాతం కూడా వసూలు చేయలేకపోయారు. ఇలా టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాలకు వివిధ రూపాల్లో రావాల్సిన రెవెన్యూ వసూలు చేయడంలో బల్దియా అధికార యంత్రాంగం చతికిలపడుతోంది. సమావేశంలో హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, డిప్యూటీ మేయర్ రిజ్వానా శమీమ్, కార్పొరేటర్లు, బల్దియా వింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.1,071.48 కోట్లతో గ్రేటర్ వరంగల్ బడ్జెట్ సొంత ఆదాయం రూ.337.38 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రూ.728.10 కోట్లు కేటాయింపులు చదివి వినిపించిన జేఏఓ సరిత మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆమోదం హాజరైన మంత్రి సురేఖ, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, నాగరాజు ఇద్దరితోనే మాట్లాడించి మమ.. అనిపించిన పాలకవర్గం సీసీ రోడ్ల పగుళ్లపై బీజేపీ సభ్యుల ప్లకార్డుల ప్రదర్శన -
డిపాజిట్లు, అడ్వాన్సులు రూ. 6కోట్లు
1/3 నిధులు కేటాయించాలి.. విలీన గ్రామాలు కాకుండా సిటీ వాతావరణం పెంపొందేలా అభివృద్ధి పనులు చేపట్టాలి. బడ్జెట్లో 1/3 నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. వివిధ పన్నుల సేకరణ ద్వారా ఆదాయ వనరుల్ని సమకూర్చుకోవాలి. – రేవూరి ప్రకాశ్రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రూపురేఖలు మారుతాయి.. కీలక ప్రాజెక్టులు పూర్తయితే రానున్న రోజుల్లో వరంగల్ నగర రూపురేఖలు మారిపోతాయి. విలీన గ్రామాల సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. – కేఆర్.నాగరాజు, ఎమ్మెల్యే, వర్ధన్నపేట -
ఓరుగల్లు కవి పరిమళాలు
నాటి పాల్కుర్కి సోమనాథుడు, మొల్ల, బమ్మెర పోతన తదితరుల నుంచి.. నేటి జైనీ ప్రభాకర్, పొట్లపల్లి శ్రీనివాస్రావు, ఆచార్య బన్న అయిలయ్య, మెట్టు మురళీధర్, అనిశెట్టి రజిత, అన్వర్, మహమ్మద్ సిరాజుద్దీన్, ఎన్వీఎన్ చారి, బిల్ల మహేందర్, బాలబోయిన రమాదేవి, గట్టు రాధికమోహన్, బిట్ల అంజనీదేవి, కార్తీకరాజు, చల్ల కుమారస్వామి వరకు ఎందరో కవులు సమాజానికి స్ఫూర్తిగా నిలిచారు. తిరగబడు కవులు, విప్లవకవులు, చేతనావర్త కవులు, జాతీయ కవులు, సీ్త్రవాద కవులు, తెలంగాణవాద కవులు.. ఇలా ఎవరు ఏ వాదాన్ని ఎత్తుకున్నా.. వారందరి ధ్యేయం సమాజాన్ని ముందుకు నడపడమే. భాషాభేదం లేకుండా తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్ వివిధ భాషల్లో కవిత్వం రాస్తున్నారు. కళలకు పుట్టినిల్లు.. వరంగల్ కళలకు, జానపద కళాకారులకు పుట్టినిల్లుగా చెప్పొచ్చు. కుల పురాణాలు చెప్పే జానపదులు, పద్యనాటకాలను ప్రదర్శించి సందర్భాన్ని బట్టి అలవోకగా సంభాషణను మారుస్తూ తమకు తెలియకుండానే కవిత్వాన్ని ఆశువుగా వల్లెవేయగలిగిన కళాకారులు వేలాది మంది ఇక్కడ ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం మిగిల్చిన అనుభవాలను పాటలుగా పాడేవాళ్లు.. తత్వాలు పాడే గాయకులు, జానపద కథలు కళ్లకు కట్టినట్లు చెప్పే అమ్మమ్మలు.. ఇలా ఎందరో మౌఖిక సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా వరంగల్ జిల్లాలో ఉన్న జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఇప్పటి వరకు అనేక కళారూపాలపై డాక్యుమెంటేషన్ నిర్వహిస్తూ వాటిని సేకరిస్తున్నది. అలాగే, గ్రామాలకు సంబంధించిన విజ్ఞానాన్ని పుస్తకాల రూపంలోకి తీసుకొస్తోంది. యువ కవులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు చేస్తోంది. కాళోజీ కళా క్షేత్రంలో కవిత్వ పఠనం కోసం కూడా ప్రత్యేకంగా ఏసీ హాల్, కవుల కోసం లైబ్రరీ నిర్మించారు. కవితా.. ఓ కవిత నా యువకాశల సుమపేశల నవగీతావరణంలో అంటూ శ్రీ శ్రీ లిఖించినా.. నగరాల్లో అత్యద్భుతంగా అస్థిపంజరాల్ని చెక్కే ఉలి ఆకలి అంటూ అలిశెట్టి ఆకలి పేగుల రాగాన్ని వర్ణించినా.. పల్లెటూరి పిల్లగాడ అంటూ ‘సుద్దాల’ జనపదాన్ని జనబాహుళ్యంలోకి తెచ్చినా.. ఓ చైతన్యం పరిఢవిల్లుతుంది. ఓ ఆవేశం ఉప్పొంగుతుంది. ఆ కవుల అడుగుజాడల్లో సమాజ చైతన్యానికి నడుం కట్టారు ఓరుగల్లు కవన సేవకులు. నేడు (శుక్రవారం) ‘అంతర్జాతీయ కవితా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – హన్మకొండ కల్చరల్ వ్యవస్థ జాగృతమయ్యేలాకవితాసేద్యం స్ఫూర్తిగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లా కవులు వృత్తి ఏదైనా రచనల్లో మేటి నేడు అంతర్జాతీయ కవితా దినోత్సవం నిజ జీవితంలోనూ కవిత్వం.. నిత్యజీవితంలో ఎన్నో కవితాత్వక పదాలుంటాయి. రామసక్కనోడు, అక్క చుట్టమైతే.. లెక్క చుట్టం కాదు.. చిదిమి దీపం పెట్టవచ్చు. పొట్టివానికి పుట్టెడు బుద్ధులు వంటి పదాలు సామాన్యులు సైతం మాట్లాడుతుంటారు. కవులు మాత్రం తాము అనుకున్న అంశాన్ని విస్తృతం చేసి అందంగా, ఆనందం కలిగించేలా రాస్తారు. కవిత్వం ద్వారా ఎన్నో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లొచ్చు. – ప్రొఫెసర్ భూక్య బాబురావు, పీఠాధిపతి, జానపద గిరిజన విజ్ఞాన పీఠం, వరంగల్ -
సొంత ఆదాయం రాక ఇలా.. (రూ.కోట్లలో)
శుక్రవారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2025– IIలోuబడ్జెట్ చదివి వినిపిస్తున్న జేఏఓ సరిత, చిత్రంలో మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావీణ్య, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే(ఆస్తిపన్నులు, పబ్లిక్, ప్రైవేట్) 100.50స్టాంపు డ్యూటీ 40మిగులు నిధులు 66 డివిజన్ల అభివృద్ధి పనులకు రూ.39.15 కోట్లు (రోడ్లకు రూ.17.50 కోట్లు, డ్రెయినేజీ, కల్వర్టులు రూ.15.45 కోట్లు, వాటర్ సరఫరా రూ.1.50 కోట్లు, లైటింగ్ రూ.50 లక్షలు, ఆఫీస్ బిల్డింగ్, ఫర్నిచర్ రూ.2.20లక్షలు, జంక్షన్ల అభివృద్ధికి రూ.2కోట్లు) టౌన్ ప్లానింగ్ 136.05(బిల్డింగ్ పర్మిషన్లు, ఎల్ఆర్ఎస్, ఇతరత్రా)అందరి సహకారంతో అభివృద్ధి పథంలో.. ప్రజాప్రతినిధులందరి సహకారంతో నగరం అభివృద్ధిలో పురోగతి సాధిస్తోంది. రానున్న రోజుల్లో వరంగల్ నగరాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ నగరంగా అభివృద్ధి చేస్తాం. అభివృద్ధికి బడ్జెట్ దిక్సూచీ అని, ప్రజలపై భారం లేకుండా పాలకవర్గ బడ్జెట్ను ప్రవేశపెట్టాం. – గుండు సుధారాణి, నగర మేయర్ శానిటేషన్ ద్వారా 21.76(ట్రేడ్ లైసెన్స్, సర్వీసులు)చివరి బడ్జెట్లో పద్దుల్లో సల్ప మార్పులు తప్ప మక్కీకిమక్కిగా రూపొందించారు. రూ.1,071.8 కోట్లతో రూపొందించిన పద్దుల వివరాలు ఇలా ఉన్నాయి. సొంత ఆదాయం రూ.337.38 కోట్లు(32 శాతం) కాగా.. అందులో రెవెన్యూ వ్యయాలు రూ.197.96 కోట్లుగా కేటాయింపులు చేశారు. ప్రభుత్వ గ్రాంట్స్ రూ.728 కోట్లు (68 శాతం)గా అంచనా వేశారు. అందులో కేంద్రంనుంచి రూ.55.28 కోట్లు (8శాతం), రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 672.82 కోట్లు(92శాతం)గా నిర్ణయించారు.అద్దెలు, ఫీజులు, ఇతర 9.25ఇంజినీరింగ్ సెక్షన్ నుంచి 29.82 డంపింగ్ యార్డు రూ.3.50 లక్షలు పబ్లిక్ టాయిలెట్లు రూ.50 లక్షలు వీధి వ్యాపారుల జోన్లు రూ.50 లక్షలు ఓపెన్ జిమ్ రూ.60 లక్షలు ప్రణాళికాబద్ధంగా నగరాభివృద్ధి వరంగల్ నగరాభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఇతర పనుల కోసం ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయించింది. మామునూరు విమానాశ్రయం, టైక్స్టైల్ పార్కు, ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుతో నగరానికి పెట్టుబడులు అధికంగా వస్తాయి. ఉపాధి పెద్ద ఎత్తున లభిస్తుంది. రాజకీయాలకు అతీతంగా వరంగల్ నగరాభివృద్ధికి అందరూ సమష్టిగా కృషి చేయాలి. రాష్ట్ర బడ్జెట్ తరహాలో బల్దియా బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నేరవేర్చేలా ఉంది. నగరంలోని ఖాళీ స్థలాలకు పన్ను విధించి, అక్రమ కట్టడాలు జరగకుండా చూడాలి. అనుమతి పొంది ఇల్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటే బల్దియా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వీధి వ్యాపారులకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించి వ్యాపారం చేసుకునేలా ఏర్పాటు చేయాలి. పన్నుల వసూలు కోసం అన్ని విభాగాలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి. – కొండా సురేఖ, రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి అమృత్, మార్కెట్లు, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా :15మెప్మా నిధులు : 01రెవెన్యూ గ్రాంట్ : 01డిస్ట్రిక్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ : 1రెవెన్యూ ఆదాయం మొత్తం337.38బడ్జెట్ స్వరూపం ఇలా.. న్యూస్రీల్ప్రభుత్వ గ్రాంట్లు (రూ.కోట్లలో) మొత్తం: 728.10 -
సంక్షేమం, ఐటీ, అభివృద్ధిపైన ఆశలు
ఎస్సీ, బీసీ, ఎస్టీ, మహిళా సంక్షేమం కోసం ఈసారి భారీ కేటాయింపులే జరి గాయి. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా కలిగిన జిల్లాలో ఆ వర్గాలకు మేలు జరుగనుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎస్సీ సంక్షేమం కోసం రూ.40,232, ఎస్టీలకు రూ.17,169 కోట్లు కేటాయించడం పట్ల ఉమ్మడి వరంగల్కు ప్రాధాన్యం ఉంటుందంటున్నారు. ఐటీ, పరిశ్రమల రంగంపైన దృష్టి సారించిన నేపథ్యంలో రెండో నగరంగా వరంగల్ వృద్ధి చెందుతుందన్న ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది. పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉండగా, ఐటీ హబ్, టెక్స్టైల్ పార్కు, మడికొండ పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలపై ఆశలు రేకెత్తుతున్నాయి. ఎకో టూరిజానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు మహర్దశ రానుంది. -
అందరినోటా ఆరు గ్యారంటీలు..
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చేర్చిన ఆరు గ్యారంటీ పథకాలకు ఈ బడ్జెట్లోనూ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో 8,77,173 మంది రైతులకు రైతుభరోసా పథకం ఈ ఏడాది కూడా అమలు కానుంది. ఒక కార్పొరేషన్, 9 మున్సిపాలిటీలు, 1,708 గ్రామపంచాయతీలుండగా మహాలక్ష్మి పథకం కింద సుమారు ప్రతి మహిళకు రూ.2.500 చొప్పున సుమారు 7.21 లక్షల మందికి అందే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సుల్లో వరంగల్ రీజియన్లో రోజుకు సగటున సుమారు 55 వేల మంది మహిళలు ఉచితంగా రాకపోకలు సాగించేందుకు ఢోకా లేదు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్లపై రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకంలో 6,10,220 మంది లబ్ధిదారులకు కొనసాగనుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే 2.50 లక్షల మందిని రెవెన్యూ అధికారులు అర్హులుగా గుర్తించగా, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్ వాడిన 6,12,901 మందికి ఉచిత విద్యుత్ సౌకర్యం కలగనుంది. -
రోగులంటే ఇంత చులకనా?
● సురేఖమ్మా.. ఎంజీఎం గోస పట్టదా? ● ఆస్పత్రి సమస్యలపై బీజేపీ మహాధర్నా ఎంజీఎం: జిల్లా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలకు కావాల్సింది ఓట్లు మాత్రమే, వారికి పేద ప్రజల గోస.. ఎంజీఎం ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు కానరావు అంటూ.. బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంజీఎం ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. ప్రజలు సురేఖను నమ్మి గెలిపించి మంత్రి పదవి ఇస్తే ఒరగబెట్టిందేంటని ప్రశ్నించారు. జిల్లా నుంచి ఇద్దరు మంత్రులున్నా ఏం లాభమని ప్రశ్నించారు. ఆస్పత్రిలో వీల్చైర్లు, స్ట్రెచర్లు, టూడీ ఎకో, ఈసీజీ పరీక్షలు సక్రమంగా చేయని దుస్థితి నెలకొందన్నారు. ఓరుగల్లు రెండో రాజధానిగా పేర్కొంటున్న సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రులు ఆస్పత్రిలో సమస్యలు తాండవం చేస్తుంటే ఒక్కసారైనా సందర్శించారా? అని ప్రశ్నించారు. ఆస్పత్రికి వెంటనే అడిషనల్ డీఎంఈ పోస్టును భర్తీ చేసి పూర్తి స్థాయి సూపరింటెండెంట్ను నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, డాక్టర్ కాళీప్రసాద్, తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు, వన్నాల వెంకటరమణ, కుసుమ సతీశ్, రత్నం సతీశ్, చాడ శ్రీనివాస్రెడ్డి, సముద్రాల పరమేశ్వర్ పాల్గొన్నారు. -
పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద వరంగల్: జిల్లాలో ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో బుధవారం పరీక్షల నిర్వహణపై సమీ క్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు పరీక్షలు నిర్వహిస్తారని, జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 49 మంది ముఖ్య పర్యవేక్షకులు, 49 మంది శాఖ అధికారులు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు, నలుగురు కస్టోడియన్లు, 461 మంది ఇన్విజిలేటర్లను నియమించామని వెల్లడించారు. సమావేశంలో డీఆర్వో విజయలక్ష్మి, డీఈఓ జ్ఞానేశ్వర్, డీఈఏసీ కె.అరుణ, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజమణి ఆధ్వర్యంలో కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన దివ్యాంగుల హక్కుల చట్టం జిల్లా కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కలెక్టరేట్ కాన్ఫరెన్న్స్ హాలులో జరిగింది. జిల్లా కమిటీ సభ్యులు దివ్యాంగుల సమస్యలను వివరించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద స్పందించి సంబంధిత చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, జీడబ్ల్యూఎంసీ డీసీ రాజశేఖర్, డీఈఓ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సమ్మర్ యాక్షన్ప్లాన్పై సమీక్ష సమ్మర్ యాక్షన్ప్లాన్, విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, ఎల్ఆర్ఎస్ అంశాలపై వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ప్రొసీడింగ్ ఇస్తే ప్రజలు ముందుకు వస్తారని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. ‘ఆయుష్మాన్’ సేవలు వినియోగించుకోవాలిడీఎంహెచ్ఓ అప్పయ్య మడికొండ: ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సేవల్ని ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య తెలిపారు. ధర్మసాగర్ పీహెచ్సీ పరిధి ఉనికిచర్ల, హసన్పర్తి పీహెచ్సీ పరిధిలోని దేవన్నపేట ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రాలను బుధవారం అప్పయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయూష్మాన్ కేంద్రంలో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, లెప్రసీ సర్వే, ఎన్సీడీ రీస్క్రినింగ్ వివరాల్ని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ రూతమ్, హెల్త్ అసిస్టెంట్ సంతోశ్, మురళి, ఏఎన్ఎంలు అరుణ, రమ్యశ్రీ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. -
ట్రేడ్ వసూళ్లకు 14 ప్రత్యేక బృందాలు
వరంగల్ అర్బన్: నగర వ్యాప్తంగా కమర్షియల్ ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూళ్ల కోసం ప్రత్యేకంగా 14 బృందాలను ఏర్పాటు చేసినట్లు బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. బుధవారం కమర్షియల్ ట్రేడ్ పన్ను వసూళ్లపై ప్రజారోగ్య విభాగ ఉన్నతాధికారులు డిప్యూటీ కమిషనర్లతో ఏర్పాటు చేసిన సమీక్షలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించేందుకు సూచనలిచ్చారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. కమర్షియల్ ట్రేడ్ వసూళ్లను వేగవంతం చేయడానికి శానిటరీ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ అధికారులు జవాన్లతో కాజీపేట సర్కిల్కు 7, కాశిబుగ్గ సర్కిల్కు 7 బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు. కేటాయించిన ప్రాంతాల్లో ప్రతీ రోజు పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్న కమర్షియల్ షాపులపై ప్రత్యేక దృష్టి సారించి ట్రేడ్ వసూళ్లు జరిపేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రవీందర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఐటీ మేనేజర్ రమేశ్, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. నూతన ఓటర్ల నమోదుకు సహకరించాలి నూతన ఓటర్ల నమోదుకు రాజకీయ పార్టీలు సహకరించాలని వరంగల్ (తూర్పు) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి/బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో వరంగల్ (తూర్పు) నియోజకవర్గ పరిధి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పలు సూచనలి చ్చారు. అర్హులు తప్పకుండా ఓటర్లుగా నమోదు చేసుకోవాలన్నారు. సమావేశంలో వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కుసుమ శ్యామ్సుందర్, బాకం హరిశంకర్, రజనీకాంత్, ఎండీ హెబ్దుల్ల తదితరులు పాల్గొన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు సమీక్షలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే -
మహిళలకు పెద్దపీట
ప్రతి మండలంలో మహిళలతో రైస్ మిల్లులు, మినీ గోదాముల ఏర్పాటు.. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్ మిల్లుల్లో మిల్లింగ్ చేయిస్తాం మహిళా స్వయం సహాయక సంఘాలకు మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎఫ్సీఐకి సరఫరా చేసే బాధ్యత అప్పగిస్తామని ప్రకటించారు. దీంతో ఉమ్మడి వరంగల్లోని 48,717 మహిళా స్వయం సహాయక సంఘాల్లోని 8,76,906 మందికి లబ్ధి చేకూరనుంది. బడ్జెట్ కేటాయింపుల్లో ప్రత్యక్షంగా ఉమ్మడి వరంగల్కు ప్రతిపాదించిన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. సాగునీటిరంగం కేటాయింపుల్లో జేఎస్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ నుంచి ఉమ్మడి ఏడు జిల్లాలకు విస్తరించి ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.2,685 కోట్లు ప్రతిపాదించింది. ఇందులో పనుల కంటే పెండింగ్ బిల్లుల చెల్లింపులకే ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది. ● విద్య, వైద్య రంగాలకు కేటాయింపులపై భిన్నస్వరాలు ● అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఎయిర్పోర్టు, ‘సూపర్’ ప్రస్తావన లేదు ● కాళేశ్వరానికి రూ.2,685 కోట్లు.. దేవాదులకు రూ.245 కోట్లు ● స్మార్ట్సిటీకి రూ.179, కేయూసీ, జీడబ్ల్యూఎంసీకి రూ.100 కోట్లు ● రామప్ప, పాకాలకు రూ.ఐదేసి కోట్లు.. ‘కాళోజీ’కి రూ.రెండు కోట్లే ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఊతం ● ఎకో టూరిజం ప్రస్తావన.. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆశలు ఉమ్మడి వరంగల్లో 15,01,109 ఎకరాల్లో 4,33,229 మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో 4,09,098 మంది రైతులకు బీమా సౌకర్యం కొనసాగనుంది. 9,02,099 ఎకరాలకు పంటల బీమా వర్తించనుంది. అలాగే, రైతు కూలీలకు బీమా వర్తింపజేసే ప్రతిపాదనలు తక్షణమే అమల్లోకి వస్తే.. ఉమ్మడి జిల్లాలో 18,45,326 మందికి ప్రయోజనం కలుగుతుంది. సాక్షి ప్రతినిధి, వరంగల్: అసెంబ్లీలో ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన 2025–26 రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు దక్కిన ప్రాధాన్యంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్కు పోటీగా అభివృద్ధి చేస్తామంటున్న ప్రభుత్వం.. బడ్జెట్లో ఆ మేరకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమ రంగాలకు చేసిన కేటాయింపుల్లోనే ఉమ్మడి వరంగల్కు ప్రయోజనాలు కలుగుతాయన్న మరో వాదన వినిపిస్తోంది. సీఎంగా మొదటిసారి వరంగల్లో పర్యటించిన రేవంత్రెడ్డి.. నగర అభివృద్ధి కోసం 8 అంశాలు ప్రాధాన్యంగా రూ.6,115 కోట్ల విడుదలకు ఉత్తర్వులు జారీ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సూపర్ ఆస్పత్రి, ఇన్నర్, ఔటర్ రింగు రోడ్లు, ఎయిర్పోర్టు తదితర అంశాలు అందులో ఉన్నాయి. వీటికి నేరుగా నిధులు ఇచ్చినట్లు బడ్జెట్లో కనిపించలేదు. కాగా, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపించిందన్న చర్చ ఉంది. బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు.. మహిళా పథకాలకు పెద్దపీటఉమ్మడి వరంగల్కు నిధుల ప్రతిపాదనలు ఇలా.. ప్రస్తుతం 91 శాతం పనులు పూర్తయి.. భూసేకరణ జరగక అసంపూర్తిగా ఉన్న దేవాదుల ప్రాజెక్టు కోసం రూ.245 కోట్లు ఇచ్చారు. ఏఐబీపీ కింద రెండు పద్దుల్లో మరో రూ.58 కోట్లను పేర్కొన్నారు. స్మార్ట్సిటీ పనుల కోసం రూ.179.09 కోట్లు, ఎస్సారెస్పీ స్టేజ్–2కు రూ.25 కోట్లు, కాకతీయ యూనివర్సిటీకి రూ.50 కోట్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు రూ.50 కోట్లు కేటాయించారు. మామునూరు వెటర్నరీ సైన్స్ కళాశాలకు రూ.25 కోట్లు, కాళేశ్వరం టూరిజం సర్క్యూట్కు రూ.10 కోట్లు, టీఎస్ స్పోర్ట్స్ స్కూల్స్ కోసం వరంగల్, కరీంనగర్కు కలిపి రూ.41 కోట్లు ప్రతిపాదించారు. రామప్ప, పాకాలకు ఐదేసి కోట్ల రూపాయలు, లక్నవరానికి రూ.2 కోట్లు, మల్లూరువాగుకు రూ.కోటి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి రూ.2 కోట్లు బడ్జెట్లో ప్రకటించారు. రైతులు, రైతుకూలీలకు బీమా.. విద్యారంగానికి మంచి రోజులు.. -
పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ అమలు : సీపీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగే పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పరీక్షల సమయంలో 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. సెంటర్లకు 5 కిలోమీటర్ల దూరం వరకు ఇద్దరికి మించి గుంపులు గుంపులుగా ఉండరాదని, ఎలాంటి సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు, ఉరేగింపులు, ప్రచారాలు నిర్వహించరాదని, డీజేలు వినియోగించవద్దని వివరించారు. కేంద్రాల సమీపంలో పరీక్ష సమయంలో ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పెట్రోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలుంటాయని హెచ్చరించారు. పూర్తిస్థాయిలో కల్యాణ మండపం నిర్మించాలిహన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో కల్యాణ మండప పనులు పూర్తి స్థాయిలో జరగాలని రాష్ట్ర హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి, బీసీ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. బుధవారం ఉదయం జస్టిస్ చంద్రయ్య, రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ నారాయణ వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఈఓ అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు వారిని ఘనంగా స్వాగతించారు. వారు స్వామివారిని దర్శించి బిల్వార్చన చేశారు. అనంతరం వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ.. కేంద్ర పురావస్తుశాఖ ఆఽధీనంలో ఉన్న ఈ ఆలయంలో భక్తులకు వేసవిలో తగిన సౌకర్యాలు కల్పించాలని, ఆలయ విశిష్టతను తెలిపేందుకు పూర్తి స్థాయిలో గైడ్ను నియమించాలన్నారు. వారి వెంట జిల్లా కోర్టు సిబ్బంది ఉన్నారు. ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలువిద్యారణ్యపురి: ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం ముగిశాయి. చివరి రోజు నిర్వహించిన పరీక్షల్లో హనుమకొండ జిల్లాలో 55 కేంద్రాల్లో జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి 20,568 మందికిగాను 19,873మంది విద్యార్థులు హాజరయ్యారు. 695మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. డీటీఎఫ్ వరంగల్ జిల్లా నూతన కమిటీ వరంగల్: డీటీఎఫ్ వరంగల్ జిల్లా నూతన కమిటీని వరంగల్లో మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కె.యాకయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎ.గోవిందరావు, ఉపాధ్యక్షులుగా డి.మహేందర్రెడ్డి, ఎస్.సుధారా ణి, డి.రవీందర్, కార్యదర్శులుగా ఎం.రామస్వామి, టి.సూరయ్య, టి.ఆనందాచారి, కె.నర్సింహులు ఎన్నికయ్యారు. అదేవిధంగా రాష్ట్ర కౌన్సిలర్లుగా బి.జాన్నాయక్, టి.అరుణ, ఆర్. రాంరెడ్డి, కె.కొమ్మయ్య, వి.సదానందం, ఆడిట్ కమిటీ కన్వీనర్గా కె.రమేశ్, సభ్యులుగా డి. శ్రీనివాస్, టి.యాకయ్యలను ఎన్నుకున్నారు. -
ముగిసిన ‘ఎర్రగట్టు’ బ్రహ్మోత్సవాలు
● నేడు హుండీ లెక్కింపు హసన్పర్తి : ఎర్రగట్టు శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఐదు రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు ఎర్రగట్టు దేవాలయం నుంచి స్వామివారిని రథాలపై ప్రతిష్ఠించి భారీ ప్రదర్శన చేపట్టారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మాజీ వైస్ ఎంపీపీ నమిండ్ల రాజేశ్వరి దంపతులు స్వామివారికి మొక్కులు సమర్పించారు. దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ ఆరెల్లి వెంకటస్వామి, ఈఓ వెంకట్రామ్, కనపర్తి రాజు, సంగాల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నేడు (బుధవారం) హుండీ లెక్కింపు చేపట్టనున్నట్లు కమిటీ చైర్మన్ తెలిపారు. వైద్యపరికరాలు అందించడం అభినందనీయంఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అపోలో హాస్పిటల్ బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ ద్వారా సంస్థ ప్రతినిధి సుధా జిజారియా అందించిన రేడియంట్ వార్మర్స్, ఫొటోథెరపీ వైద్యపరికరాలను మంగళవారం వరంగల్ జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ అపోలో హాస్పిటల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధులతో ఈ వైద్య పరికరాలను అందించడం అభినందనీయమన్నారు. అనంతరం డీఆర్ఓ విజయలక్ష్మి, ఫౌండేషన్ ప్రతినిధి సుధా జిజారియాలకు ఎంజీఎం వైద్యాధికారులు మొక్క అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ అపర్ణ, ప్రొఫెసర్ అలిమేను, ఆర్ఎంఓలు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల ఓట్లు ఒకే బూత్లో ఉండాలివరంగల్: ఒకే కుటుంబానికి చెందిన వారి ఓట్లు అన్ని ఒకే పోలింగ్ బూత్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు వరంగల్ కలెక్టర్ సత్యశారదను కోరారు. కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 7,72,824 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, ఎలక్షన్ డీటీ రంజిత్, రాజకీయ పార్టీల నాయకులు ఈవీ.శ్రీనివాసరావు, బాకం హరిశంకర్, కె.శ్యాం, ఫిరోజుల్లా, జె.అనిల్కుమార్, నాగరాజు పాల్గొన్నారు. మార్కెట్లో సమస్యలు పరిష్కరించాలి వరంగల్: ఏనుమాములలోని వ్యవసాయ మార్కెట్లో సమస్యలు పరిష్కరించాలని మార్కెటింగ్శాఖ అధికారులు కోరారు. ఈ మేరకు మంగళవారం వారు వరంగల్ కలెక్టర్ సత్యశారదను కలిశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వేసవి దృష్ట్యా రైతులకు మజ్జిగ ప్యాకెట్లు అందించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. అన్నపూర్ణ క్యాంటీన్లో ఇప్పటివరకు అందజేస్తున్న వెయ్యి భోజనాలను రెండు వేలకు పెంచాలని చాంబర్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సీసీ కెమెరాలు, అన్నపూర్ణ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. కార్యక్రమంలో మార్కెటింగ్శాఖ ఆర్జేడీఎం శ్రీనివాస్, డీఎంఓ సురేఖ, మార్కెట్ కార్యదర్శి జి.రెడ్డి, ఏఎస్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
వినియోగదారులతో సీఎండీ ముఖాముఖి
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులతో టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. మంగళవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి విద్యుత్ వినియోగదారులతో ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడారు. నూతనంగా సర్వీస్లు పొందిన గృహ, వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల వినియోగాదారులకు స్వయంగా ఫోన్ చేసి వారితో సంభాషించారు. సర్వీస్ మంజూరు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కొత్త సర్వీస్ మంజూరులో జాప్యం జరిగిందా? కాల పరిమితికి లోబడి మంజూరు చేశారా? విద్యుత్ అధికారులు నిబంధనల మేరకు మంజూరు చేస్తున్నారా? అధికారులు ఎలా పని చేస్తున్నారు? వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు ఇతర సేవలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరుణ్ రెడ్డి మాట్లాడుతూ మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడానికి వినియోగదారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు నేరుగా వారితో మాట్లాడానన్నారు. ఫీడ్ బ్యాక్ తీసుకోవడం, అభిప్రాయాలు తెలుసుకోవడం ద్వారా అవసరమైన మార్పులు తీసుకొచ్చే అవకాశముందన్నారు. అదే విధంగా సత్సంబంధాలు పెరుగుతాయన్నారు. వినియోగదారుల్లో కంపెనీపై విశ్వాసం, సేవల పట్ల నమ్మకం కలుగుతుందన్నారు. వినియోగాదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి ప్రతీ ఉద్యోగి నిబద్దతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. -
సామాజిక అభ్యున్నతికి దోహదం
భారత రాజ్యాంగం.. కేయూ క్యాంపస్ : భారత రాజ్యాంగం సామాజిక వ్యవస్థ అభ్యున్నతికి దోహదపడుతున్న విలువైన డాక్యుమెంట్ అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నారాయణ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ‘75 ఏళ్ల భారత రాజ్యాంగం మైలు రాయి.. సమస్యలు– సవాళ్లు’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు మంగళవారం సెనేట్హాల్లో నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతీయ సమాజం విభిన్న సంస్కృతుల జాతుల కలయిక అని, ఇండియాలో నివసించే వ్యక్తులందరూ రాజ్యాంగం పరిధిలో జీవిస్తున్నారన్నారు. సమసమాజ స్థాపనకు భారత రాజ్యాంగ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సెక్యులర్ భావాలతో రాజ్యాంగంలో పేర్కొన్న ప్రతీ ఆర్టికల్ దేశ ప్రజలందరికీ ఉపయోగపడుతుందన్నారు. మానవ అభివృద్ధికి విద్య దోహదం.. మానవ అభివృద్ధికి విద్య ఎంతో దోదపడుతుందని తెలంగాణ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య అన్నారు. బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు సమాజ అభ్యున్నతికి దోహదపడుతున్నాయన్నారు. భగవద్గీత, వేదాలు ఉపనిషత్తులు, అన్ని గ్రంథాలతోపాటు రాజ్యాంగాన్ని కూడా ప్రతి ఒక్కరూ చదవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అధిక నిధులు కేటాయించాలన్నారు. విద్య, వైద్యం ఉచితంగా అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలి.. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో విలువలు లేవని, దీనివల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదని, అందుకే ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలని కేయూ మాజీ రిజిస్ట్రార్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. దేశంలో నిజాయితీ గల రాజకీయ వ్యవస్థ లేకుండా పోయిందన్నారు. సెక్యులర్ భావాలు కలిగిన వ్యవస్థ.. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగ వ్యవస్థను కలిగిన భారతదేశంలో భిన్న సంస్కృతులు, ఆచార వ్యవహారాలు ఉన్నాయని, ముఖ్యంగా సెక్యులర్ భావాలతో కలిగిన వ్యవస్థ ఉందని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్ అన్నారు. తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రజాపాలనలో అనేక సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతోందన్నారు. యూనివర్సిటీల్లో కూడా టీచింగ్ ఫ్యాకల్టీని నియమించబోతున్నారని వెల్లడించారు. అనంతరం కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి, కేయూ ఎస్సీ,ఎస్టీ సెల్ డైరెక్టర్, సెమినార్ డైరెక్టర్ తుమ్మల రాజమణి, ఓయూ ‘లా’ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ద్వారకానాథ్ మాట్లాడారు. కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, సైన్స్కోర్సుల డైరెక్టర్ బి. వెంకటగోపినాథ్, డాక్టర్ మేఘనరావు, డాక్టర్ ప్రగతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ నారాయణ కేయూలో జాతీయ సదస్సు ప్రారంభం -
భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
ఖిలా వరంగల్ : మామునూరు ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని వరంగల్ ఆర్డీఓ సత్యపాల్రెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్ నక్కలపల్లి , గాడిపల్లి గ్రామాల్లో తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, ఆర్అండ్బీ, హార్టికల్చర్, ఇరిగేషన్ అధికారులు, రైతులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా సర్వే ద్వారా గుర్తించిన 253 ఎకరాల భూములతోపాటు వ్యవసాయ బావులు, బోర్లును పరిశీలించారు. బోర్లు, బావుల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని అంచనా వేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం ఆర్టీఓ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్వర్వుల ప్రకారం విమానాశ్రయం రన్వే విస్తీర్ణం కోసం 253 ఎకరాల భూమిని సేకరించే పనిలో ఉన్నామని, సర్వే ద్వారా నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాల్లో 253 ఎకరాలను గుర్తించమన్నారు. భూమి విలువతోపాటు బావులు, బోర్లు విలువను సైతం పరిహారంలో చెల్లిస్తామని తెలిపారు. ప్రతీ రైతుకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని, త్వరలో నివేదిక తయారు చేసి కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల ఆర్ఐ ఆనంద్ కుమార్, సర్వేయర్ రజిత, ఇతర శాఖల సిబ్బంది, భూ నిర్వాసితులు పాల్గొన్నారు. శరవేగంగా రన్వే భూ సేకరణ పనులు వరంగల్ ఆర్డీఓ సత్యపాల్రెడ్డి నక్కలపల్లి, గాడిపల్లిలో వ్యవసాయ బావులు, బోర్ల పరిశీలన -
ప్రణాళిక ప్రకారం చదివితేనే విజయం
● గ్రూప్–1 టాపర్ తేజస్విని రెడ్డి విద్యారణ్యపురి: ప్రణాళిక ప్రకారం కష్టపడి చదివి తేనే పోటీ పరీక్షల్లో విజయం సాధ్యమని గ్రూప్ –1 టాపర్ జిన్నా తేజస్విని రెడ్డి అన్నారు. మంగళవా రం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెరీర్ గైడెన్స్ కౌన్సెలింగ్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో తేజ స్వినిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సరైన ప్రణాళికతో సొంతంగా నోట్స్ రాసుకోవాలన్నారు. పోటీ పరీక్షల్లో తమకు ఏ సబ్జెక్ట్పై ఆసక్తి ఉందో దానిపైపట్టు సాధించేలా అందుకు సంబంధించిన పుస్తకాలు చదవవాలన్నారు. శాస్త్ర,సాంకేతిక అంశాలపై శిక్షణ నిపుణలు చల్లా నారాయణరెడ్డి, ఆ కళాశాల ప్రిన్సిపాల్ జి. రాజారెడ్డి, వైస్ప్రిన్సిపాల్ కె. రజనీలత, స్టాఫ్సెక్రటరీ ఎం. రవికుమార్,కెరీర్ అండ్ గైడెన్స్సెల్ కోఆర్డినేటర్ బి.కవిత, డాక్టర్ చి న్నా మాట్లాడారు. అనంతరం తేజస్వినిరెడ్డిని ప్రిన్సి పాల్ రాజారెడ్డి ఇతర అధ్యాపకులు సన్మానించారు. 33శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి● ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి న్యూశాయంపేట : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. మంగళవారం అంబాల స్వరూప అధ్యక్షతన హనుమకొండలో జరిగిన తెలంగాణ వ్యవసాయ మహిళా కూలీల జిల్లా సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కరువైందని తెలిపారు. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు కాకుండా బతుకు మార్చే విధానాలు తీసుకు రావాలని పేర్కొన్నారు. మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ బి.పద్మ మాట్లాడుతూ మహిళా సాధికారత పేరుతో మాటలు చెబుతున్నారు తప్ప, ఆచరణలో లేదని విమర్శించారు. మనుధర్మ శాస్త్రం అమలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ సదస్సులో నాయకులు బి.ప్రసాద్, జి.రాములు, వాసుదేవరెడ్డి, స్వరూప, రజిత, రమ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలో 488మంది గైర్హాజర్ విద్యారణ్యపురి : ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. హనుమకొండ జిల్లాలో మంగళవారం 55 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగగా అందులో 488 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. మొత్తంగా 18,946మంది విద్యార్థులకు గాను 18,458 మంది హాజరు కాగా 488 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. -
సినీఫక్కీలో హరిబాబు కోర్టుకు..
న్యాయస్థానం వెనుక గేటు నుంచి రిమాండ్కు తరలింపు భూపాలపల్లి : సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడు హరిబాబు, అతడి పరారీకి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు కోర్టుకు తీసుకొచ్చి రిమాండ్కు తరలించారు. కోర్టుకు రాజలింగమూర్తి భార్య సరళ, బంధువులు రావడం.. అక్కడే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా ఉండడంతో సుమారు అరగంటపాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం 9 గంటలకే కోర్టుకు.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భూపాలపల్లి పట్టణానికి చెందిన రాజలింగమూర్తి గత నెల 19న హత్యకు గురి కాగా, ఈ హత్య కేసులో ఏ–8గా ఉన్న నిందితుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, అతడి పరారీకి సహకరించి, వెంటే ఉన్న ములుగు జిల్లాకు చెందిన వట్టే రమణయ్య, రమను ఏ–11, ఏ–12గా చేర్చిన భూపాలపల్లి పోలీసులు మంగళవారం ఉదయం 9 గంటలకే జిల్లా కేంద్రంలోని ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపర్చగా నిందితులకు జడ్జి ఎన్. రాంచందర్రావు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు నిందితులను ఖమ్మం జైలుకు తరలించారు. కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత.. కోర్టు వద్ద ఘర్షణ చోటు చేసుకునే అవకాశం ఉందని భావించిన పోలీసులు సినీ ఫక్కీలో హరిబాబు ను రిమాండ్కు తరలించారు. రమణయ్య, రమను కోర్టు ముందు గేటు ద్వారా తీసుకెళ్లారు. హరిబాబు ను మాత్రం వెనుక గేటు నుంచి తీసుకెళ్లి పోలీసు వాహనంలో రిమాండ్కు తరలించారు. విషయాన్ని గమనించిన సరళ, ఆమె బంధువులు.. హరిబాబు ను తమకు చూపించాలని పోలీసులను డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులను సరళ నిలదీసింది. ఏ–11, ఏ–12కు బెయిల్? హరిబాబు పరారీకి సహకరించి, అతడి వెంట ఉన్న రమణయ్య, రమకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలిసింది. జమానతులు సమర్పిస్తే నేడు బెయిల్ రానున్నట్లు సమాచారం. ఆరుగురు నిందితుల కస్టడీకి పోలీసుల అప్పీలు.. హత్య కేసులో ఏ–1గా ఉన్న రేణికుంట్ల సంజీవ్, ఏ–2 పింగిలి సేమంత్, ఏ–3 మోరె కుమార్, ఏ–4 కొత్తూరి కిరణ్, ఏ–6 దాసారపు క్రిష్ణ, ఏ–8 కొత్త హరిబాబును విచారణ నిమిత్తం ఏడు రోజుల కస్టడీ కోసం పోలీసులు కోర్టులో నేడు పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. హరిబాబు బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ.. కొత్త హరిబాబు పరారీలో ఉండి ఈ నెల 4వ తేదీన హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. మూడు, నాలుగుసార్లు వాదనలు జరగగా విచారణ మంగళవారం(నిన్న)కు వాయిదా పడగా అదే రోజున హరిబాబును పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో హరిబాబు తరపున లాయర్ ముందస్తుకు బదులు సాధారణ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా బుధవారం విచారణ జరగనున్నట్లు సమాచారం. ముగ్గురి అరెస్ట్.. రాజలింగమూర్తి హత్య కేసులో ప్రధాన నిందితుడు కొత్త హరిబాబుతో పాటు, అతడు పారిపోవడానికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ డి. నరేశ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు జిల్లాకు చెందిన వట్టే రమణయ్య, రమ.. హరిబాబు పారిపోవడానికి సహకరించారని, ముగ్గురిని ఒకే దగ్గర అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. హరిబాబుతోసహా మరో ఇద్దరు సహాయకుల అరెస్ట్, కోర్టులో హాజరు కోర్టుకు వచ్చిన రాజలింగమూర్తి భార్య సరళ, బంధువులు నిందితుడిని చూపించాలని డిమాండ్ అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులను నిలదీత .. అరగంటపాటు ఉద్రిక్తత హరిబాబు పరారీకి సహకరించిన ఇద్దరికి బెయిల్ మంజూరు? -
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు..
బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టమ్చిన్న పట్టణాలు, నగరాల్లో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) సిస్టమ్ ఉంది. వరంగల్ మహా నగరంలో మాత్రం కలగానే మిగిలింది. 1996లో రూ.1,500 కోట్లతో రూపకల్పన చేసిన ప్రతిపాదనలు 2022 నాటికి రివైజ్డ్గా రూ.2,400కోట్లకు పెరిగింది. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం రూ.4170 కోట్లు మంజూరు చేసినా ఆ మేరకు నిధులు కేటాయించలేదు. కాకతీయ మెగా జౌళి పార్కుకు రాష్ట్ర ప్రభుత్వం 1,200 ఎకరాల భూసేకరణ చేసి, టీజీఐఐసీ ద్వారా మౌలిక వసతులు కల్పించింది. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు పని మొదలు పెట్టినా... కేంద్రంనుంచి పీఎం మిత్ర కింద రూ.200 కోట్లు రాబట్టేందుకు ’ఎస్పీవీ’(ప్రత్యేక ప్రయోజన వాహకం) ఏర్పాటు చేయడంతోపాటు రూ.500 కోట్లు కేటాయించాల్సి ఉంది. -
సీపీని కలిసిన ఏసీబీ అధికారులు
వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సన్ప్రీత్సింగ్ను ఏసీబీ అధికారులు మంగళవారం ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, ఇన్స్పెక్టర్లు ఎస్.రాజు, ఎల్.రాజు ఉన్నారు. అనంతరం సీపీకి పూలమొక్కను అందజేశారు. అదేవిధంగా బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే సీపీని కలిసి పూల మొక్క అందజేశారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. కలెక్టర్ ప్రావీణ్య రక్తదానం హన్మకొండ అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్ ఐడీఓసీలోని జిల్లా ఖజానా కార్యాలయ ప్రాంగణంలో రెడ్క్రాస్ సౌజన్యంతో తలసేమియా బాధితుల కోసం మంగళవారం ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో కలెక్టర్ ప్రావీణ్య స్వయంగా రక్తదానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జిల్లా ఖజానా అధికారి ఎ.శ్రీనివాస్కుమార్, డీఆర్డీఓ మేన శ్రీను, బీసీ సంక్షేమ శాఖ అధికారి రామ్రెడ్డి, ఉద్యోగ సంఘాల బాధ్యులు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. నేటినుంచి ఎంఎల్హెచ్పీ పోస్టులకు దరఖాస్తులు ఎంజీఎం : జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న మిడ్ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ) పోస్టుల భర్తీకి నేటి (బుధవారం)నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 13 పోస్టులు (జనరల్–5, బీసీ–ఏ–1, బీసీ–బీ–1, ఎస్సీ–1, ఈడబ్ల్యూఎస్–4, దివ్యాంగులు–1 కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు 18 నుంచి 46 సంవత్సరాల వయస్సులోపు ఉండి బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎంలో కమ్యూనిటీ హెల్త్ బ్రిడ్జి కోర్సు చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. దరఖాస్తులు hanamkonda. telangana.gov.in వెబ్సైట్నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని, దరఖాస్తు పత్రంతో పాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, హనుమకొండ పేరున ఎస్సీ, ఎస్టీలు రూ.250, ఇతరులు రూ.500, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉందని తెలిపారు. విద్యార్హతలు, కుల, నివాస సర్టిఫికెట్లు జత చేసి హనుమకొండ కలెక్టరేట్ (ఐడీఓసీ)లోని రెండో అంతస్తు ఎస్–16లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. డీఆర్డీఏ పరిధిలోకి మెప్మా!హన్మకొండ అర్బన్ : మహిళా సంఘాలను ఒకే గూటికి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందజేస్తున్న మెప్మాను ఇకపై డీఆర్డీఏలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో విలీనం కానున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడగానే మెప్మా పరిధిలోని మహిళా సంఘాలు, పరకాల మున్సిపాలిటీ పరిధిలోని మహిళా సంఘాలు, ఉద్యోగులు, ఆర్పీలంతా సెర్ప్ పరిధిలోకి వెళ్లనున్నారు. ఇప్పటి వరకు కమిషనర్ల ఆధ్వర్యంలో విధులు నిర్వహించిన మెప్మా ఉద్యోగులు, ఆర్పీలు ఇక నుంచి సెర్ప్ ఆధ్వర్యంలో విధులు నిర్వహించనున్నారు. -
‘దేవాదుల’ గట్టెక్కించేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్/హసన్పర్తి/ధర్మసాగర్: వేసవి ఎండల తీవ్రత.. అడుగంటుతున్న భూగర్భజలాలు.. దీంతో జనగామ, హనుమకొండ జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో అక్కడక్కడ పంటలు ఎండుతున్నాయి. చేతికందే దశలో దేవాదుల ప్రాజెక్టు పరిధిలో వరి పంటలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు కింద 50 నుంచి 60వేల ఎకరాలకు సాగునీరందించేలా దేవాదుల ప్రాజెక్టు మూడో దశలో భాగంగా దేవన్నపేటలో నిర్మించిన పంప్హౌజ్ మోటార్లను జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రారంభించేందుకు మంగళవారం సాయంత్రం పంపుహౌజ్కు చేరుకున్నారు. కానీ, మోటారు మరమ్మతుకు రావడం, ఆస్ట్రియానుంచి వచ్చిన బృందం చేపట్టిన రిపేర్లు పూర్తి కాకపోవడంతో మంత్రులు రాత్రి ఎన్ఐటీ గెస్టుహౌస్లో ఉన్నారు. అసెంబ్లీలో బుధవారం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో రాత్రి 11.30 గంటలకు హైదరాబాద్కు వెళ్లిపోయారు. ఫేజ్–3 పనులపైనే దృష్టి... దేవన్నపేట పంపుహౌజ్లో ప్రస్తుతం ఒక్కో మోటారు 800 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఇక్కడ మూడు మోటార్లు ఏర్పాటు చేయగా.. అందులో ఒకటి ఆన్చేసి జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో సుమారు 60వేల నుంచి 65వేల ఎకరాల వరకు సాగునీరు అందించడంపై దృష్టి పెట్టారు. మంగళవారం రాత్రి వరకు మోటారు మొరాయించడంతో ఈ యాసంగి పంట చేతికందే వరకు నీటి సరఫరా అవుతుందా? అన్న ఆందోళన ఆ నాలుగు నియోజకవర్గాల్లోని రైతుల్లో వ్యక్తమవుతోంది. హడావుడిగా సాగిన మంత్రుల పర్యటన.. దేవాదుల చివరి ఆయకట్టుకు సాగునీరందిచేందుకు యుద్ధప్రాతిపదికన ఖరారైన మంత్రుల టూర్ హడావిడిగా సాగింది. మొదట మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా హసన్పర్తి మండలం దేవన్నపేటకు పంప్హౌజ్కు చేరుకున్నారు. అక్కడినుంచి ధర్మసాగర్ రిజర్వాయర్లో నీరు పంపింగ్ అయ్యేలా మోటార్ ఆన్ చేయాల్సి ఉంది. అనంతరం ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరుకుని అక్కడ పూజలు చేసి.. మీడియా సమావేశంలో మాట్లాడుతారనేది షెడ్యూల్. కానీ, అనుకున్న ప్రకారం దేవన్నపేటకు మంత్రులు చేరుకున్నప్పటికీ మోటార్ మొరాయించడంతో స్విచాన్ చేయకుండా అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద వేసిన టెంట్లు, కుర్చీల వద్దే ప్రజలు, కార్యకర్తలు ఉండిపోయారు. చివరి నిమిషంలో మీడియా సమావేశం దేవన్నపేటలోనే ఉంటుందనడంతో ధర్మసాగర్ నుంచి దేవన్నపేటకు మీడియాతోపాటు నాయకులు, కార్యకర్తలు, అధికారులు పరుగులు పెట్టారు. పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల పక్కన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి తదితరుల ఫొ టోలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అధికారులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం దేవాదుల ప్రాజెక్టు దశలు ఎప్పుడు ప్రారంభమ య్యాయని, ఇతర అంశాలపై మంత్రులు అడిగిన ప్రశ్నలకు నీటిపారుదల శాఖ అధికారుల నుంచి సరైన సమాధానం లేదు. దీంతో వారిపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షకు సమాచారం లేకుండా వట్టి చేతులతో వస్తారా అని మండిపడ్డారు. చిన్న చిన్న సమస్యలతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, బల్దియా కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, టీపీసీసీ మాజీ కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు సురేందర్రెడ్డితోపాటు దేవాదుల ఉన్నతాఽధికారులు పాల్గొన్నారు. రాత్రి వరకు కాని మోటార్ మరమ్మతు చివరి ఆయకట్టు రైతుల్లో ఆందోళన హడావుడిగా సాగిన మంత్రుల పర్యటన ‘ధర్మసాగర్ రిజర్వాయర్’ కార్యక్రమం రద్దు దేవన్నపేట పంపుహౌజ్కు హుటాహుటిన అధికారులు -
ఆయిల్పామ్తో అధిక ఆదాయం
వరంగల్: తక్కువ నీరు, అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్పామ్ సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మంగళవారం కరప్రతాలను ఆవిష్కరించి ఆమె మాట్లాడారు. ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు అందిస్తుందని, కోతకు వచ్చిన పంటను కూడా కొనుగోలు చేస్తుందని తెలిపారు. అదనవు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా ఉద్యానశాఖ అధికారి సంగీతలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు 84 దరఖాస్తులు జిల్లాలో టీజీ ఐపాస్ చట్టం ద్వారా వివిధ శాఖలకు సంబంధించి పరిశ్రమలు నెలకొల్పేందుకు 52 యూనిట్లకు 84 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. అందులో 52 యూనిట్లకు అనుమతులు ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పరిశ్రమల శాఖ జీఎం రమేశ్, అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన, పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు 41,422 దరఖాస్తులు రాగా.. అందులో 14,899 మంజూరు చేశామని, ఫీజు చెల్లించిన 665 మందికి పత్రాలు అందించినట్లు తెలిపారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, అధికారులు పాల్గొన్నారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద -
మొండికేస్తే ఆస్తుల జప్తు..
వరంగల్ అర్బన్ : బల్దియా పన్నుల విభాగం అధికారులు, సిబ్బంది ఆస్తిపన్ను వసూళ్లపై దూకుడు పెంచారు. పన్ను చెల్లించని బకాయిదారులకు డిమాండ్, రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. అయినా స్పందించకపోవడంతో ఆస్తులను సీజ్ చేసి జప్తు చేస్తున్నారు. మూడేళ్లుగా రూ.44 లక్షల ఆస్తి పన్ను బకాయి ఉన్న హనుమకొండలోని జయ నర్సింగ్ కళాశాలను మంగళవారం సీజ్ చేశారు. ఇలా వారం రోజుల్లో 356 ఆస్తులను సీజ్ చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.118.06కోట్లకు గాను రూ.61.39కోట్లు మాత్రమే వసూలు చేశారు. మరో 13 రోజుల్లో గడువు ముగియనుంది. మెమోల జారీతో.. బల్దియాకు ఆస్తి పన్ను ప్రధాన వనరు. పన్నుల వసూలులో మొదటినుంచి నిర్లక్ష్యంగా ఉంటూ మార్చిలో హడావుడి చేస్తుండడంతో మేయర్, కమిషనర్ ఇటీవల సమావేశాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తాజాగా డిప్యూటీ కమిషనర్లకు, టీఓకు, ఆర్ఓ,ఆర్ఐ, వార్డు ఆఫీసర్లకు మెమోలు జారీ చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతధికారులు వందశాతం పన్నుల వసూలు చేయకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు చేశారు. అద్దె వ్యాపార సంస్థలకు తాళాలే.. అద్దె భవనంలో వ్యాపారం చేస్తున్నా.. ఆస్తిపన్ను చెల్లించాల్సిన బాధ్యత భవన యజమానిదే. ఇకపై అలా కుదరదని తాముంటున్న భవనానికి సంబంధించి ఆస్తిపన్ను చెల్లింపు బాధ్యతను అద్దెదారులు పట్టించుకోవాలంటున్నారు బల్దియా అధికారులు. లేని పక్షంలో చట్టప్రకారం తీసుకునే చర్యలతో నష్టపోవాల్సి వస్తుందని, తాజాగా సుబేదారిలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ను సీజ్ చేశారు. దీంతో చేసేదేమి లేక సదరు యజమాని ఆస్తి పన్ను చెల్లించాల్సి వచ్చింది. ప్రతినెలా ఆస్తిపన్నుపై 2శాతం వడ్డీ, అంటే ఏడాదికి 24శాతం అవుతోంది. ఇలా ఏళ్ల తరబడి చెల్లించని పన్ను బకాయిదారులకు ఆస్తిపన్ను భారంగా మారుతోంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు చేరడంతో ఎంత మేరకు లక్ష్యాన్ని సాధిస్తారో చూడాలి. గ్రేటర్ పరిధిలో వారంలో 356 ఆస్తులు సీజ్ రూ.44లక్షలు చెల్లించని జయ నర్సింగ్ కాలేజీకి తాళం పన్ను బకాయిదారులపై అధికారుల కొరడా -
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి : డీఈఓ
విద్యారణ్యపురి : ప్రత్యేక అవసరాల పిల్లలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని డీఈఓ డి.వాసంతి కోరారు. సోమవారం హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో జిల్లాలో ఎంపిక చేసిన ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాలను అందజేసి ఆమె మా ట్లాడారు. భారతీయ కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ (అలీంకో) ఉపకరణాలను అందజేసిందని తెలిపారు. ప్రత్యేక అవసరాల పిల్లలను భవిత కేంద్రంలో చేర్చి సమీపంలోని పాఠశాలల్లో వారి స్థాయికి తగిన తరగతిలో చేర్పించాలని చెప్పారు. ఈ సందర్భంగా వారికి వీల్చైర్లు, రోలెటర్స్, క్రష్ ఎల్బో అడ్జస్ట్ మెంటు, హియరింగ్ ఎయిడ్స్, బ్రెయిలీ కిట్స్ అందజేశారు. కార్యక్రమంలో సమ్మిళిత విద్య సమన్వయకర్త బద్దం సుదర్శన్రెడ్డి, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్ రెడ్డి, జెండర్ ఈక్విటీ కోఆర్డినేటర్ సునీత, ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేష్, ఎంఈఓ నెహ్రూ, ప్రత్యేక అవసరాల పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
అడ్డదారి లైసెన్స్లకు చెక్
వాహనం సరిగా నడపగలిగితేనే లైసెన్స్.. లేదంటే అంతేస్మార్ టెస్ట్ ట్రాక్ ఏర్పాటుకు ప్రణాళికలు రెడీ ● ట్రాక్పై డ్రైవింగ్ పరీక్ష పద్ధతికి స్వస్తి ● ఉమ్మడి జిల్లాలో అన్ని ఆర్టీఏల్లో స్థలాల సేకరణకు చర్యలు ● ఇప్పటికే ఆయా కలెక్టర్లకు ఆర్టీఓల వినతి ఖిలా వరంగల్ : రహదారులపై ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా వాహనాలు. లక్షలాది సంఖ్యలో బైకుల.. వేలాది సంఖ్యలో కార్లు కనిపిస్తున్నాయి. అయితే వీటన్నింటినీ నడిపే వారికి లైసెన్స్ ఉందా అంటే.. కొందరికి మాత్రమే ఉంటోంది. మరికొందరికి ఉండడం లేదు. మరి ఉన్నవాళ్లయినా సక్రమంగా తీసుకున్నారా అంటే.. బ్రోకర్ల ద్వారా అడ్డదారుల్లో తీసుకుంటున్నారు. ఫలితంగా ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో రవాణాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి పాత విధానం ట్రాక్పై డ్రైవింగ్ పరీక్ష పద్ధతికి చెక్ పెడుతూ.. స్మార్ట్ సెన్సార్ కెమెరాల నిఘాతో అధునాతన ట్రాక్పై కొత్త పరీక్ష తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని వల్ల అడ్డదారిలో లైసెన్స్లు తీసుకునే వాహనచోదకులకు చెక్ పడనుంది. అడ్డదారులు మూత! ప్రస్తుతం.. ప్రతి ఇంట్లో ద్విచక్రవాహనం తప్పని సరి అయ్యింది. కొన్ని ఇళ్లల్లో ఒకటికి మించి ఉంటున్నాయి. ఆర్థికంగా ఉన్న వారు కారు కూడా కలిగి ఉంటున్నారు. ఫలితంగా రోజు రోజుకూ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరిగిపోతున్నాయి. అందుకు నిదర్శనమే రహదారులపై పెరిగిపోతున్న ట్రాఫిక్ జామ్. కొంత మంది డ్రైవింగ్పై పూర్తి అవగాహన లేకుండానే రోడ్డెక్కేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. మరి వాళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదా.. అంటే ఉంటుంది. కానీ అది అడ్డదారిలో తీసుకున్నదై ఉంటుంది. డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన లేకుండా వాహనాలతో రోడ్కెక్కడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకు అడ్డదారుల్లో డ్రైవింగ్ లైసెన్స్లు పొందడమే కారణమని గ్రహించిన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం కొత్త పరీక్ష ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఉన్న మ్యానువల్ పరీక్షను తీయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆధునికతకు చర్యలు.. తాజాగా వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను ఆధునీకరించాలని ఆర్టీఏ అధికారులు నిర్ణయించారు. అందుకోసం ప్రస్తుతం కొనసాగుతున్న పాత విధానం కంటే మరింత ప్రామాణికంగా డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆటోమేటిక్ స్మార్ట్ సెన్సార్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించేందుకు స్థలాల సేకరణలో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో అడ్డదారిలో డ్రైవింగ్ లెసెన్స్ పొందడం కష్టమే.. వాహనం నడిపితేనే లైసెన్స్.. త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న కొత్త పద్ధతిలో రహదారులపై నిత్యం ఎదురువుతున్న ఇబ్బందులను డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్పై కృత్రిమంగా కల్పిస్తారు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు తప్పని సరిగా పరీక్ష రాయాల్సిందే.. ట్రాక్ మీద వాహనం నడిపిన తర్వాతే లైసెన్స్ పొందుతారు. అయితే ట్రాక్ మీద వాహనం నడిపేటప్పుడు కంప్యూటర్లో రికార్డవుతుంది. ఏదైనా చిన్న తప్పు చేసినా పరీక్ష ఫెయిల్ అయినట్లే.. కొత్త పద్ధతులు ఇలా.. కొత్తగా ఆర్టీఏ అమలు చేయబోయే ఆటో మెటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ పరీక్షలో 5 ట్రాక్లు ఏర్పాటు చేస్తారు. ముందు ‘హెచ్’ అనే ట్రాక్లో ఆర్టీఏ ప్రమాణాల్లో పేర్కొన్న విధంగా వాహనాన్ని రివర్స్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ‘ఎస్’ అనే ట్రాక్లో ఒక మూల నుంచి మరో మూలకు వాహనాన్ని టర్న్ చేయాలి. అలాగే ‘కే’ అనే ట్రాక్లో బాగా మలుపులు, ఎత్తు పల్లాలు, ఎత్తయిన ప్రదేశాలు, చిన్న లోయలు వంటింటి ఏర్పాటు చేస్తారు. ఆ ట్రాక్లో వాహనాన్ని నడిపి చివరిగా పార్కింగ్ చేసి చూపించాల్సి ఉంటుంది. అయితే ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కారు డ్రైవింగ్ చేసే వారు సీటు బెల్ట్ పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ అంతా కంప్యూటర్లో రికార్డవుతుంది. వాహనాన్ని నడిపేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేసినా కంప్యూటర్లో రికార్డు అవుతుంది. ఏ చిన్న మిస్టేక్ చేసినా టెస్ట్లో ఫెయిల్ అయినట్లు చూపిస్తుంది. ఒక వేళ పరీక్షలో ఫెయిలైతే మరో నెల పాటు శిక్షణ తీసుకుని రమ్మంటారు. పూర్తిగా కంప్యూటరీకరణ కావడం వల్ల ఇక్కడ అధికారులను సిబ్బందిని మేనేజ్ చేసేందుకు ఏమాత్రం అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. బ్రోకర్లకు కూడా ఎలాంటి అవకాశం ఉండదని చెబుతున్నారు. దీంతో అడ్డదారుల్లో లైసెన్స్ పొందడం ఇక కష్టతరం కానుంది. ట్రాక్ స్థలం కోసం వినతిపత్రం అందజేశాం అధునాతన డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ కోసం వరంగల్ ఆర్టీఏకు 5 ఏకరాల భూమి అవసరం ఉంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇటీవల కలెక్టర్ను కలిసి స్థలం కావాలని కోరుతూ వినతిపత్రం అందజేశాం. కలెక్టర్ సానుకూలంగా స్పందించి స్థలం ఇప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. – శోభన్బాబు, ఇన్చార్జ్ ఆర్టీఏ, వరంగల్ ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లిలో రవాణాశాఖ కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో వరంగల్లో తప్ప మరెక్కడా డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ లేదు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలో ఆధునిక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ల కోసం వచ్చే వారికి వరంగల్ రవాణాశాఖ తనిఖీ అధికారులే పరీక్షలు నిర్వహించి లైసెన్స్లు అందజేసే పద్ధతి చాలాకాలం నుంచి కొనసాగుతోంది. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు వరంగల్ ఆర్టీఏకు 5 ఎకరాలు, మిగతా జిల్లాలో రోడ్డు పక్కాన 10 ఎకరాల స్థలాలు కావాలంటూ ఆర్టీఏ అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇటీవల వినతి పత్రాలు అందజేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు కావాల్సిన స్థలాల కోసం పరిశీలిస్తున్నారు. -
నేడు కోర్టు ముందుకు కొత్త హరిబాబు?
● అరెస్ట్ చూపించి కోర్టులో హాజరుపరుచనున్న పోలీసులు ● సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న సమయంలోనే పట్టుకున్న ఖాకీలు ● నిందితుడితో పాటు సహకరించిన మరో ఇద్దరు అదుపులోకి? భూపాలపల్లి: సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో ఏ8గా ఉన్న భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబును నేడు(మంగళవారం) పోలీసులు అరెస్ట్ చూపించనున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల 19న రాజలింగమూర్తి దారుణ హత్యకు గురికాగా, ఈ కేసులో నిందితుడి(ఏ8)గా ఉన్న హరిబాబు పరారీలో ఉండగా పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే హన్మకొండకు చెందిన అతడి సన్నిహితుడి క్రెడిట్ కార్డు తీసుకెళ్లి వినియోగించడంతో హరిబాబు శనివారం రాత్రి ఢిల్లీలో పట్టుబడగా కారులో భూపాలపల్లికి తీసుకురాగా సోమవారం తెల్లవారుజామున చేరుకున్నట్లు సమాచారం. అయితే సోమవారం హరిబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ఉన్న కారణంగా అరెస్ట్ చూపించలేదని తెలుస్తోంది. నేడు(మంగళవారం) జిల్లా కేంద్రంలో అరెస్ట్ చూపించి, కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టును ఆశ్రయించే యత్నం.. రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కొత్త హరిబాబు ఈనెల 4న హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, బెయిల్ వచ్చే అవకాశం లేదని గమనించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు యత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే క్రెడిట్ కార్డు వినియోగం ఆధారంగా అతడిని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో మరో ఇద్దరు..? కొత్త హరిబాబుతో పాటు అతడికి పని మనుషులుగా, సహకరించిన మరో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఢిల్లీలో హరిబాబును పోలీసులు పట్టుకోగా అక్కడే అతడికి సహకరించిన హైదరాబాద్కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని సోమవారం తమదైన శైలిలో పోలీసులు విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులకు చిక్కకుండా ప్రాంతాలు మార్చి.. హత్య కేసులో నిందితుడిగా ఉన్న హరిబాబు, ఇద్దరు సహాయకులతో కలిసి ప్రాంతాలు మార్చి పోలీసులకు చిక్కకుండా ప్రయత్నించినట్లు సమాచారం. ఢిల్లీ, సిమ్లా, అమృత్సర్ లాంటి ప్రదేశాలను సందర్శించి చివరకు ఢిల్లీకి వచ్చి బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే క్రమంలోనే పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. -
న్యాయవాదులు నైతిక విలువలు కలిగి ఉండాలి
వరంగల్ లీగల్ : న్యాయవాద వృత్తిలో ఉన్నవారు నైతిక విలువలు కలిగి ఉండాలని రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య పేర్కొన్నారు. సోమవారం వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ‘లా అండ్ హ్యూమన్ రైట్స్’ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ చంద్రయ్య హాజరై మాట్లాడారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నారాయణ మాట్లాడుతూ న్యాయవాదులకు చట్టాలపై అవగాహన, అమలు చేసే విధానాలపై వారి అనుభవాలను తెలుపుతూ రాష్ట్ర జల వివాదాల చట్టం గురించి వివరించారు. అనంతరం ఉభయ బార్ అసోసియేషన్ల అధ్వర్యంలో జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ నారాయణలను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ, ఉభయ బార్ అసోసియేషన్ల అధ్యక్షులు జీవన్గౌడ్, యం.రమేష్ బాబు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
ప్రతిభతోనే ఉజ్వల భవిష్యత్
● కేయూ వీసీ ప్రతాప్రెడ్డి ● ఘనంగా ఇంజనీరింగ్ కాలేజీ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డే కేయూ క్యాంపస్ : ప్రతిభతోనే ఇంజినీరింగ్లో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ను కూడా పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. సోమవారం రాత్రి కాకతీయ యూనివర్సిటీలోని కో ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్ కాలేజీ వార్షికోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డేను ఘనంగా నిర్వహించారు. అతిథులు జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో ఇంజినీరింగ్ యువత 40శాతం మంది ఉద్యోగ, ఉపాధి రంగాల్లో దూసుకుపోతున్నారని తెలిపారు. జాతీయ హాకీ జట్టు రిటైర్ట్ కోచ్ మధుచరణ్ మాట్లాడుతూ యువత సక్సెస్కు చదువుతోపాటు క్రీడలు కూడా అత్యంత ప్రాధాన్యత వహిస్తాయని తెలిపారు. పాలక మండలి సభ్యులు డాక్టర్ చిర్ర రాజు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.రమణ మాట్లాడారు. వివిధ క్రీడల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కల్చరల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలతోపాటుగా ఆధునిక డ్యాన్స్లతో హోరెత్తించారు. అధ్యాపకులు సీహెచ్ రాధిక, ఆసిం ఇక్బాల్, వి.మహేందర్, శ్రీధర్ కుమార్, సుమలత, దాసరి శైలజ, రాజేశ్వరి, పర్వీన్,శిరీష బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. -
పరిపూర్ణమైన శిక్షణ ఇవ్వాలి
● అదనపు కలెక్టర్ సంధ్యారాణి హసన్పర్తి : ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని ప్రజలకు సేవలందించే విధంగా ఆపద మిత్రలకు పరిపూర్ణమైన శిక్షణ ఇవ్వాలని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణిి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సంస్కృతీ విహార్లో వరంగల్ జిల్లాకు సంబంధించిన ఆపదమిత్ర పథకం ద్వారా ఎంపికై న 120 మంది వలంటీర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయలక్ష్మి, జిల్లా అగ్నిమాపక నియంత్రణ అఽధికారి సతీష్, జిల్లా ప్రణాళిక అధికారి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. తెలుపు మచ్చలుంటే నిర్లక్ష్యం వద్దు ● డీఎంహెచ్ఓ అప్పయ్య ఎంజీఎం : శరీరంపై స్పర్శ లేని తెలుపు మచ్చలుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యసిబ్బందిని కలిసి పరీక్షించుకోవాలని జిల్లా వైద్యాధికారి అప్పయ్య ప్రజలకు సూచించారు. కుష్ఠు లక్షణాలు కలిగిన వారిని గుర్తించేందుకు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ (ఎల్సీడీసీ) ఇంటింటి సర్వేను సోమవారం అప్పయ్య బాలసముద్రంలో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో వివక్షకు గురవుతామన్న ఆలోచనతో బయటకు చెప్పకపోవడంతో వ్యాధి ముదురుతోందని అన్నారు. స్పర్శ లేని మచ్చలు ఉన్న వారు స్వచ్ఛందంగా వచ్చి మొదట్లో చికిత్స తీసుకుంటే వ్యాధి పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. జిల్లాలోని 17 పీహెచ్సీలు, 7 యూపీహెచ్సీ పరిధిలో కుష్ఠు సోకిన వారిని గుర్తించేందుకు ఆశ కార్యకర్తల ద్వారా ఈనెల 31వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు, అనంతరం బాధితులకు చికిత్స అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ టి.మదన్మోహన్రావు, వైద్యాధికారి గీత, వి.అశోక్రెడ్డి, హెల్త్ ఎడ్యుకేషన్ ఎస్.శ్రీనివాస్, డీపీఎంఓ సతీష్రెడ్డి, సూపర్వైజర్ బజిలి సమ్మ, విప్లవ్కుమార్, రాజేష్, ఏఎన్ఎం అరుణ, ఆశకార్యకర్తలు స్వప్న, అరుణ, తదితరులు పాల్గొన్నారు. -
నగరాభివృద్ధికి సహకరించాలి
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్ : ఆస్తి, నల్లా పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని నగర మేయర్ గుండు సుధారాణి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి పన్నుల వసూలు, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కరణ పురోగతిని, రంజాన్ పండుగ సందర్భంగా ఏర్పాట్లపై సమీక్షించారు. ఆస్తి పన్ను వసూలు లక్ష్యం రూ.118.06 కోట్లు కాగా.. ఇప్పటివరకు రూ.60.17 కోట్లు వసూలయ్యాయని, కేవలం పక్షం రోజుల సమయమే మిగిలి ఉన్నదని చెప్పారు. ఎల్ఆర్ఎస్కు సంబంధించి లక్ష దరఖాస్తులు రాగా 14,088 మంది క్రమబద్ధీకరించుకోవడానికి ఫీజులు చెల్లించారని, 680 మందికి క్రమబద్ధీకరణ ధ్రువపత్రాలు అందజేసినట్లు చెప్పారు. 25శాతం రిబేట్తో ఈనెల 31లోపు ఫీజులు చెల్లించి క్రమబద్ధీకరించుకునే విధంగా ప్రచారం నిర్వహించాలని చెప్పారు. రంజాన్ పండుగ ఏర్పాట్లు విస్త్రతంగా చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు రవీందర్, ప్రసన్న రాణి, రాజేశ్వర్, టాక్సేషన్ ఆఫీసర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వర్సిటీల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
● కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి కేయూ క్యాంపస్ : రాష్ట్ర పరిధిలోని ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధికి, పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని, యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయొద్దని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో సోమవారం కేయూ సెనేట్హాల్లో ‘యూజీసీ నూతన నిబంధనలు, రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి’ అనే అంశంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. యూజీసీ నూతన ముసాయిదాతో యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. అందుకే నూతన ముసాయిదాను వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో నాణ్యమైన విద్య బోధన జరగాలంటే సరిపడా అధ్యాపకుల నియామకాలు జరగాలన్నారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్, కేయూ రిటైర్డ్ ఆచార్యుడు కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్.. యూనివర్సిటీల అభివృద్ధికి ఇచ్చే నిధులు బాగా తగ్గించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఇచ్చే యూజీసీ ఫెలోషిప్స్, స్కాలర్షిప్స్లో కోత విధించిందన్నారు. యూజీసీ నూతన ముసాయిదాతో యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిని కాలరాయడమేనని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐఎంఏ న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి నున్న అప్పారావు, పీడీఎస్యూ జాతీయ నాయకుడు ఇ. విజయ్కన్నా, రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. సాంబ, రాష్ట్ర సహాయ కార్యదర్శి మిశ్రీన్సుల్తానా పాల్గొన్నారు. -
సంకటహర చతుర్ధి పూజలు
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో సోమవారం సంకటహర చతుర్ధి పూజలు నిర్వహించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో పండితులు గంగు మణికంఠ శర్మ, అర్చకులు పెండ్యాల సందీప్ శర్మ, పానుగంటి ప్రణవ్లు ఉదయం నుంచే ప్రభాత పూజ, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం చేపట్టారు. సాయంత్రం 7గంటలకు సంకటచతుర్ధిని పురస్కరించుకుని దేవాలయంలోని కాకతీయుల కాలంనాటి ఉత్తిష్టగణపతికి పంచసూక్తులతో జలాభిషేకం క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం నవరస సుగంధ ద్రవ్యాలతో, హరిద్రాకుంకుమ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. గణపతికి ఇష్టమైన గరికతో అష్టోత్తర శతనామాలు పఠిస్తూ షోడశోపచారపూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించాలి ● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హన్మకొండ : విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ లోడ్ పెరిగే అవకాశం ఉన్న అన్ని చోట్ల అన్ని సర్కిళ్ల పరిధిలో పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏ ర్పాటు చేశామన్నారు. ఇంటర్ లింకింగ్ పనులు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పా టు, వీసీబీల ఏర్పాటు, పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్ఈలను ఆదేశించారు. ఏప్రిల్లో పంట కోతలు పూర్తి కాగానే వ్యవసాయ సర్వీసుల త్వరితగతిన రిలీజ్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, టి.మధుసూదన్, సీఈలు తిరుమల్రావు, రాజు చౌహాన్, అశోక్, బీకం సింగ్, వెంకటరమణ, డీఈ అనిల్ కుమార్ పాల్గొన్నారు. 20న జాబ్ మేళాహన్మకొండ అర్బన్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు ఈనెల 20న(గురువారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పనా అధికారి ఎం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో వర్చువల్ సెల్స్ ఎగ్జిక్యూటివ్, యాక్సిస్ బ్యాంక్లో బిజినెస్ డెవెలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ 20 పోస్టుల భర్తీకి ములుగు రోడ్డు ప్రభుత్వ ఐటీఐ బాయ్స్ క్యాంపస్లోని జిల్లా ఉపాఽధి కార్యాలయంలో ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థుల వయసు 18–35 ఏళ్ల లోపు ఉండాలని, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని, ఆసక్తి ఉన్న యువతీ యువకులు బయోడేటా, రెజ్యూమ్, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ఉదయం 11 గంటలకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 98488 95937 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. ఉద్యోగిని పట్ల డాక్టర్ అనుచిత ప్రవర్తనప్రైవేట్ ఆస్పత్రిలో ఘటన హన్మకొండ చౌరస్తా: ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్న ఓ ఉద్యోగిని పట్ల ఆస్పత్రి యజమాని అయిన డాక్టర్ అనుచిత వ్యాఖ్యలతో అవమానించిన ఘటన హనుమకొండలో చోటు చేసుకుంది. బాధితురాలు, ఆమె తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ పోచమ్మైదాన్కు చెందిన మహిళ ఏడాది కాలంగా హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నది. సోమవారం మధ్యాహ్నం ఆస్పత్రికి వచ్చిన డాక్టర్ రిసెప్షన్ వద్ద చిందరవందరగా ఉన్న ఫైళ్లను చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఆస్పత్రి సిబ్బంది ఎదుట అవమానించడంపై బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ భర్తకు ఫోన్ చేసి తెలియజేసింది. దీంతో అతను 100 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. అయితే.. సదరు ఉద్యోగిని డాక్టర్ క్షమాపణ చెప్పడంతో సద్దుమణిగింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. -
దైవదర్శనానికి వస్తూ.. అనంతలోకాలకు
హసన్పర్తి: దైవదర్శనానికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందగా మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి పరకాల–కిట్స్ కళాశాల ప్రధాన రహదారిలోని ముచ్చర్ల క్రాస్ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఖిలా వరంగల్ తూర్పుకోటకు చెందిన మేకల సుశాంత్(19), మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొక్కురు గ్రామానికి చెందిన తాండ్ర విజయ్(19), జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనా గ్రామానికి చెందిన సి.వర్ధన్ (18) స్నేహితులు. సుశాంత్ పరకాలలోని పాలిటెక్నిక్లో థర్డ్ ఇయర్ చదువుతుండగా, వర్ధన్ అదే కళాశాలలో పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ అభ్యసిస్తున్నాడు. విజయ్ మాత్రం పరకాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వీరు ముగ్గురు అదే ప్రాంతంలోని బీసీ హాస్టల్ ఉంటూ చదువు కొనసాగిస్తున్నారు. రాత్రి 9.30 గంటలకు హాస్టల్ నుంచి జాతరకు.. ఆదివారం రాత్రి 9.30గంటలకు సుశాంత్, విజయ్, సి. వర్ధన్ పరకాల నుంచి బైక్పై ఎర్రగట్టు జాతరకు బయలుదేరారు. సుశాంత్ బైక్ నడుపుతుండగా, విజయ్, వర్ధన్ వెనుక కూర్చున్నారు. వీరితో పాటు మరికొంత మంది విద్యార్థులు కూడా వారి వెంట తమతమ బైక్లపై జాతరకు పయనమయ్యారు. సుశాంత్ నడుపుతున్న బైక్ ముచ్చర్ల శివారులోని జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్న ప్రాంతానికి చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలింపు.. వెనుక నుంచి బైక్లపై వస్తున్న స్నేహితులు క్షతగాత్రులను 108లో ఎంజీఎం తరలించారు. అప్పటికే సుశాంత్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చికిత్స పొందుతూ విజయ్ సోమవారం తెల్లవారు ప్రాణాలు వదిలాడు. వర్ధన్ పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు. మృతుడు సుశాంత్ తండ్రి సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నుట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం మరొకరికి తీవ్ర గాయాలు ముచ్చర్ల క్రాస్ సమీపంలో ఘటన -
గబ్బర్సింగ్ కావాలి
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులకు దేశ స్థాయిలో మంచి పేరుంది. ఇక్కడి వారు సాధించిన విజయాలను ఐపీఎస్ ట్రైనింగ్లో సైతం చెబుతారు. అంతటి ఘన చరిత్ర ఉన్న కమిషనరేట్ చరిత్ర క్రమక్రమంగా మసకబారుతోంది. కొంత మంది పోలీస్ అధికా రుల తీరు పోలీస్ శాఖ పరువును బజారున పడేలా చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తు న్న అధికారులపై కొంత కాలంగా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు లేకపోవడంతో వారి అక్రమ సంపాదన ‘మూడు పువ్వులు.. ఆరు కాయలుగా’ వర్ధిల్లుతోంది. మూడు జిల్లాలకు విస్తరించి ఉన్న వరంగల్ పోలీస్ కమిషనరేట్కు నూతన కమిషనర్గా ఈనెల 10న సన్ప్రీత్సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎదుట అనేక సవాళ్లు కనిపిస్తున్నాయి. ఎన్ఫోర్స్మెంట్పై పట్టింపేది..? కమిషనరేట్లోని అనేక మంది పోలీస్ అధికారులు ఎన్ఫోర్స్మెంట్పై దృష్టిసారించడం లేదనే ఆరోపణలున్నాయి. టాస్క్ఫోర్స్ పోలీసులు కమిషనరేట్ వ్యాప్తంగా దాడులు నిర్వహించి పట్టుకున్న గుట్కాలు, గంజాయి, పీడీఎస్ బియ్యం, నకిలీ వస్తువులతో తరువాత ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిషేధించిన గుట్కా, ఇసుక రవాణా, పీడీఎస్ బియ్యం వంటి వాటిల్లో నెలవారీ మాముళ్లతో పోలీసులు తరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. హసన్పర్తి పోలీస్స్టేషన్ పరిధిలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేసే డాన్ ’కోటీ‘కి పడగలెత్తినట్లు ప్రచారంలో ఉంది. భూపంచాయితీలకే ప్రాధాన్యం.. కమిషనరేట్ పరిధి చాలాపోలీస్స్టేషన్లలో భూముల పంచాయితీల హవా కొనసాగుతోంది. పలువురు పోలీస్ అధికారులు(ఎస్హెచ్ఓలు) పోలీసింగ్ను ఎస్సైలకు అప్పగించి వారు భూముల పంచాయితీ ల్లో తరిస్తున్నట్లు బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలోని ఓ సబ్ డివిజన్లో పనిచేసే పోలీసు అధికారులు భూములకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. కొంత మంది పోలీస్ అధికారులు మరో అడుగు ముందుకేసి వారి బినామీల పేరు మీద వివాదంలో ఉన్న భూములను తక్కువ ధరకు కొనుక్కుని వివాదాన్ని పరిష్కరించుకుంటూ లక్షలు కూడబెట్టుకుంటున్నట్లు గుసగులు వినిపిస్తున్నాయి. పోలీసింగ్పై మారిన ప్రాధాన్యం..! శాంతి భద్రతలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పోలీస్ అధికారుల ప్రాధాన్యత మారింది. రాత్రి పూట పెట్రోలింగ్ కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. విజుబుల్ పోలీసింగ్ లేక పట్టపగలే చోరీలు, హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సన్ప్రీత్సింగ్ పోలీసింగ్కు మొదటి ప్రాధాన్యం అని ప్రకటించారు. దీంతో ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. పోలీస్ శాఖలో అక్రమాలకు పాల్పడుతు న్న కొంత మంది అధికారులపై చర్యలు తీసుకుంటే శాఖ గాడిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కేసుల నమోదు ఇలా.. ట్రైసిటీ పరిధిలో ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మూడు నెలల్లో ఐదు చైన్స్నాచింగ్ కేసులు నమోదయ్యయి. ద్విచక్ర వాహనాలపై వచ్చి మహిళల మెడలో నుంచి గొలుసులు లాక్కెళ్లారు. చోరీ కేసులు సుమారు 36 చోటుచేసుకున్నాయి. లక్షల రూపా యల విలువ కలిగిన బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరణకు గురైంది. సీసీఎస్లో సంవ త్సరాల తరబడి పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది కారణంగా రికవరీ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న, విక్రయిస్తున్న వ్యాపారులపై 47 కేసులు నమోదు చేశారు. అలాగే 19 మహిళా కిడ్నాప్ కేసులు, 22 అత్యాచారం కేసులు, 91 వేధింపుల కేసులు నమోదయ్యాయి. కమిషనరేట్ పరిధిలో జనవరి నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు చైన్ స్నాచింగ్ : 5చోరీలు : 36గంజాయి రవాణా మహిళల కిడ్నాప్అత్యాచారం 22 వేధింపులు 91కొత్త పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్కు సమస్యల సవాళ్లు వదలని గంజాయి మత్తు.. పట్టపగలే చైన్స్నాచింగ్లు భూపంచాయితీలకే ప్రాధాన్యం అడ్రస్ లేని పోలీసింగ్..? ఎన్ఫోర్స్మెంట్పై కసరత్తు కరువు గంజాయి మత్తుతో కిక్కు.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధితోపాటు గ్రామాల్లోనూ గంజాయి మత్తు కిక్కు ఎక్కిస్తోంది. ట్రైసిటీ పరిధిలో అనేక హాస్టళ్లలో గంజాయి గుట్కాల మాదిరిగా సులువుగా లభిస్తున్నదని పోలీసులు గ్రహించినప్పటికీ అరికట్టడంలో విఫలమయ్యారు. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు గంజాయి మత్తులో తరగతి గదుల్లో తన్నుకున్నారు. గ్రామాల్లో అనేక మంది యువకులు గంజాయి మత్తుకు బానిసలయ్యారు. గతంలో ఇక్కడ సీపీగా పనిచేసిన తరుణ్ జోషి గంజాయి అమ్మకాలపై దృష్టిసారించారు. గంజాయి సేవించే వారిపైనా కేసులు నమోదు చేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో గంజాయి బానిసైన సుమారు 100 మంది యువతను రిహాబిటేషన్ సెంటర్కు తరలించి వారిని తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి గంజాయి వరంగల్ మీదుగా మహారాష్ట్రకు తరులుతోంది. ఈ రవాణాను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. పట్టపగలే చైన్ స్నాచింగ్లు.. కమిషనరేట్ పరిధి ట్రైసిటీలో పట్టపగలే చైన్స్నాచింగ్లు జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది మూడు నెలల్లో ఆరు చైన్స్నాచింగ్లు చోటుచేసుకోవ డం గమనార్హం. ఒక పక్క పోలీస్ అధికారులు బ్లూకోల్ట్ సిబ్బంది విజుబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతున్నదానికి విరుద్ధంగా పట్టపగలే చోరీలు జరగడం గమనార్హం. 4719 -
మొక్కుబడిగా గ్రేటర్ గ్రీవెన్స్
అధికారుల తీరుపై అర్జీదారుల అసంతృప్తి వరంగల్ అర్బన్: బల్దియా గ్రీవెన్స్కు అందిన ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి మధ్య సమన్వయం కొరవడింది. అయినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. సమస్యల పరిష్కారానికి అర్జీదారులు వారం వారం వచ్చి వినతులు ఇచ్చి వెళ్లడం పరిపాటిగా మారింది. సోమవారం గ్రేటర్ వరంగల్ గ్రీవెన్ కార్యక్రమంలో ప్రజల నుంచి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వినతులు స్వీకరించారు. ఈ క్రమంలో కమిషనర్ ఆశీనులైన వేదికపైనే కొంతమంది అధికారులు తమ మొబైల్ ఫోన్లను చూడడం, చిట్చాట్ చేయడం కనిపించింది. మరికొంతమంది ఉద్యోగులు కునుకు తీయడాన్ని ఫిర్యాదుదారులు గమనించి అసహనం వ్యక్తంచేశారు. వెల్లువలా ఫిర్యాదులు గ్రేటర్ గ్రీవెన్కు వివిధ విభాగాలకు సంబంధించి 88 ఫిర్యాదులు రాగా.. అందులో ఇంజినీరింగ్ సెక్షన్కు 24, ప్రజారోగ్యానికి 4, పన్నుల విభాగం 10, టౌన్ ప్లానింగ్ 46, తాగునీటి సరఫరా 4 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసున్నా రాణి, రాజేశ్వర్, హెచ్ఓలు రమేష్, లక్ష్మారెడ్డి, బయాలజిస్ట్ మాధవ రెడ్డి, పన్నుల విభాగం అధికారి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ● 3వ డివిజన్ ములుగు రోడ్డు కేఎస్ఆర్ గార్డెన్ సమీపంలో సొంతంగా విద్యుత్ స్తంభాలు ఏర్పా టు చేసుకున్నా లైట్లు ఏర్పాటు చేయడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లా పైపులైన్లు ఏర్పాటు చేసి, కనెక్షన్లు ఇవ్వాలని కోరారు. ● మడికొండలోని కృష్ణ స్క్రాప్ షాపునుంచి దుర్గంధం వెదజల్లుతోందని, చర్యలు తీసుకోవాలని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ● వరంగల్ 16వ డివిజన్ గొర్రెకుంట మెయిన్ రోడ్డులో బస్షెల్టర్ నిర్మించాలని ఆమనగంటి ఏలేంద్ర విజ్ఞప్తి చేశారు. ● మడికొండలోని 1631 సర్వే నంబర్లో 770 గజాల పార్కు స్థలం కబ్జాకు గురైందని, తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఎస్సీ, బీసీ కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ● హనుమకొండ కాకతీయ కాలనీ ఫేస్–2లో 10 ఫీట్ల రోడ్డును వెడల్పు చేయాలని స్థానికులు వేడుకున్నారు. ● భీమారంలోని 101 సర్వే నంబర్ వద్ద కమర్షి య ల్ బిల్డింగ్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, తాము ఇబ్బంది పడుతున్నామని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. ● 66వ డివిజన్ హసన్పర్తిలో ఆక్రమణకు గురైన మహంకాళి ఆలయ స్థలాన్ని రక్షించాలని కోరినా పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. ● 43వ డివిజన్ బృందావన కాలనీలో మిషన్ భగీరథ నల్లాలు, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు వినతి పత్రం అందజేశారు. ● కరీమాబాద్ శాకరాశికుంటలో అసంపూర్తిగా నిర్మించిన అండర్ డ్రెయినేజీ, రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని బర్కత్, హబీబ్ కోరారు. -
మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్ విద్యార్థుల వివరాలుఏడాదంతా చదివింది ఒక ఎత్తయితే.. దాన్ని పరీక్షల్లో ప్రజెంట్ చేయడం మరో ఎత్తు.. కొందరు విద్యార్థులు బాగా చదువుతారు. తీరా పరీక్ష సమయానికి మరిచిపోతుంటారు.. మరికొందరేమో ఎంత చదివినా హ్యాండ్ రైటింగ్ బాగోలేక మార్కులు కోల్పోతారు.. ఇంకొందరైతే పరీక్ష అంటే గాబరా పడిపోయి ప్రశ్నల కు సమాధానం తెలిసినా నిర్ణీత సమయంలో రాయలేకపోతారు.. ఇలా చాలా మంది విద్యార్థులు ఏదో ఒక సమస్యతో బాధపడేవారే. వీరంతా మంచి మార్కులు సాధించేందుకు, పరీక్షలను ఈజీగా రాసేందుకు సబ్జెక్టు నిపుణులు సూచనలిస్తున్నారు. ఈనెల 21 నుంచి పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. మంచి మార్కులు సాధించడానికి ఆయా సబ్జెక్టుల నిపుణులను ‘సాక్షి’ పలకరించింది. విద్యార్థుల కోసం వారు తమ సూచనలు, సలహాలు వెల్లడించారు. – మహబూబాబాద్ అర్బన్ మొత్తం విద్యార్థులు 42,262బాలికలు 20,600బాలురు 21,662ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలిపదో తరగతి వార్షిక పరీక్షలు మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలి. బాగా చదివాను.. పరీక్షలు బాగా రాస్తాను.. అనే భావనతో వెళ్లాలి. నెగెటివ్ ఆలోచనలను దరిచేర నీయొద్దు. గతంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలి. టీవీ, సెల్ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు వహించాలి. ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్ జోలికి వెళ్లొద్దు. సాత్విక ఆహారం తీసుకుంటే తొందరగా జీర్ణమవుతుంది. తగినంతగా నీరు తాగాలి. ఎవరైనా ఒత్తిడికి లోనైనా.. పరీక్షలంటే భయం కలిగినా 93911 17100, 94408 90073 నంబర్లకు ఫోన్ చేస్తే తగిన సూచనలిస్తాం. – పోగు అశోక్, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వివరాలు 8లోu -
వినతులు త్వరగా పరిష్కరించాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన వినతులను సత్వరమే పరిష్కరించాల ని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించి న గ్రీవెన్స్లో ఆమె అర్జీలు స్వీకరించిన అనంతరం మాట్లాడారు. ప్రజావాణిలో జీడబ్ల్యూఎంసీ, డీపీఓ ఏడు చొప్పున, మిగతా వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 76 వినతులు వచ్చినట్లు చెప్పా రు. వినతులను పెండింగ్ లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డీఆర్ఓ వై.వి.గణేష్, డీఆర్డీఏ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, తహసీల్దార్లు పాల్గొన్నారు. పింఛన్ ఇప్పించాలి నడికూడ మండలం కంఠాత్మకూరు గ్రామానికి చెందిన సురేష్–మాలతి దంపతుల కుమారుడు అశ్విన్తేజ(8) పుట్టుకతో దివ్యాంగుడు. నరాలు చచ్చుబడి ఎదుగుల లేకుండా జన్మించాడు. ‘నాలుగు సంవత్సరాలుగా దివ్యాంగుల పింఛన్ కోసం తిరుగుతున్నాం.. సదరం ధ్రువీకరణ పత్రం కూడా ఉంది. తల్లిదండ్రులిద్దరం వ్యవసాయ కూలీలమే. ఎలాగైనా కొడుక్కి దివ్యాంగుల పింఛన్ ఇప్పించాలి’ అని కలెక్టర్ను సురేష్–మాలతి దంపతులు ఈ సందర్భంగా వేడుకున్నారు. వరంగల్ గ్రీవెన్స్కు 94 దరఖాస్తులు వరంగల్: వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు వివిధ సమస్యలపై 94 దరఖాస్తులు రాగా.. కలెక్టర్ సత్యశారద, అదనవు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ ప్రజల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూశాఖకు సంబంధించి 20, పోలీసు శాఖ 11, వైద్య ఆరోగ్యశాఖ 7, పౌర సరఫరాల శాఖ 7, కలెక్టరేట్ 6, జీడబ్ల్యూఎంసీ–6, విద్యాశాఖ–4 దరఖాస్తులతో పాటు వివిధ శాఖలకు సంబంధించి పలు సమస్యలపై దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. -
నేడు రక్తదాన శిబిరం
హన్మకొండ అర్బన్ : తలసేమియా బాధిత పిల్లల కోసం నేడు(మంగళవారం) హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం ఐడీఓసీ మొదటి అంతస్తు ఎఫ్–1లోని జిల్లా ట్రెజరీ కార్యాలయ ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్న ట్లు డీటీఓ ఆకవరం శ్రీనివాస్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధికారులు, టీజీఓస్, టీఎన్జీఓస్, డీఆర్డీఏ, ట్రెసా, క్లాస్–4, అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు, బా ధ్యులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 309 మంది గైర్హాజరుసాక్షి వరంగల్: వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు కొనసాగాయి. జనరల్ కోర్సుకు 5,568 మందికిగాను 5,342 మంది విద్యార్థులు హాజ రయ్యారు. 226 మంది విద్యార్థులు గైర్హాజరైన ట్లు ఇంటర్ విద్యాధికారి శ్రీధర్సుమన్ తెలిపా రు. ఒకేషనల్ విద్యార్థులు 939 మంది కాగా 856 మంది పరీక్షకు హాజ రవ్వగా 83మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. టెక్నికల్ ఉద్యోగుల సంఘం ఎన్నికలు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 28న నిర్వహిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం పలువు రు నామినేషన్లను దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి డాక్టర్ పుల్లా శ్రీనివాస్, జనరల్ సెక్రటరీగా ఎన్.రాము, ఉపాధ్యక్షుడిగా మెట్టు రవి, జాయింట్ సెక్రటరీ(ఆర్గనైజేషన్)గా వై.రవికుమార్, జాయింట్ సెక్రటరీ రిక్రియేషన్గా వై.బాబు, కోశాధికారిగా వి.ప్రేమ్సాగర్ నామినేషన్లను యూనివర్సిటీ కళాశాల ప్రిన్సి పాల్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి టి.మనోహర్కు అందజేశారు. ఈనెల 20వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. నేటినుంచి జాతీయ సదస్సుకేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 18, 19 తేదీల్లో రెండ్రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ తుమ్మల రాజమణి తెలిపారు. ‘ఇండియన్ కాన్సిట్యూషన్ మైల్స్టోన్స్–ఇష్యూస్ అండ్ చాలెంజెస్’ అనే అంశంపై యూనివర్సిటీ సెనేట్హాల్లో సదస్సు ఉంటుందని వెల్లడించారు. క్రైమ్ డీసీపీగా జనార్దన్ బాధ్యతలువరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్ డీసీపీగా బి.జనార్దన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి వరంగల్లో ఎస్సైగా, ఇన్స్పెక్టర్గా, ఏసీపీగా పనిచేశారు. క్రైమ్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వరంగల్ సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు జిల్లా కోర్టు జీపీగా నర్సింహారావు వరంగల్ లీగల్ : హనుమకొండ జిల్లా కోర్టు ప్రభుత్వ న్యాయవాది(గవర్నమెంట్ ప్లీడర్)గా కాకిరాల నర్సింహారా వును నియమిస్తూ రాష్ట్ర న్యాయశాఖ వ్యవహా రాలు, న్యాయపాలన సెక్రటరీ ఆర్.తిరుపతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూ రు మండలం కుందూరుకు చెందిన నర్సింహా రావు 33 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. -
మెరుగైన ర్యాంకు సాధించాలి
● మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: స్వచ్ఛ సర్వేక్షణ్–24లో మెరుగైన ర్యాంకు సాధించేలా కృషి చేయాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. ఆదివారం నగరంలోని బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో, హనుమకొండ డీఈఓ కార్యాలయం వద్ద, అదాలత్ వద్ద టాయిలెట్లను ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్–24లో నగరం మరో మారు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ సర్టిఫికెట్ సాధించేలా ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ ఉండాలన్నారు. నగరవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ టాయిలెట్లలో ఏమైనా మరమ్మతులు అవసరమైతే వెంటనే చేపట్టి వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట ఎంహెచ్ఓ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. నేడు గ్రేటర్ గ్రీవెన్స్గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ చక్కని వేదిక అని, ప్రజలు వినియోగించుకోవాలని ఆమె కోరారు. -
హైదరాబాద్తో
సోమవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2025– 8లోuసభలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిబహిరంగ సభకు హాజరైన ప్రజలు, రిమోట్ ద్వారా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, ప్రజాప్రతినిధులుసాక్షి ప్రతినిధి, వరంగల్/జనగామ/స్టేషన్ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ శివారు శివునిపల్లిలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఓరుగల్లుపై వరాల జల్లు కురిపించారు. మరోవైపు బీఆర్ఎస్, కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులపై విమర్శలు గుప్పించారు. శివునిపల్లిలో ఈ కార్యక్రమం రాజకీయ పార్టీగా ఏర్పాటు చేసింది కాదని, ఓట్ల కోసం రాలేదన్న ఆయన.. స్టేషన్ఘన్పూర్ అభివృద్ధిలో భాగంగా రూ.800 కోట్ల నిధులతో ప్రగతి కోసం తలపెట్టిన బహిరంగ సభ అని స్పష్టం చేశారు. వరంగల్ నగరాన్ని హైదరాబాద్తో పోటీ పడేలా అభివృద్ధి చేస్తామని, ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ ఇందుకోసం ఎన్ని నిధులైనా కేటాయిస్తామని ప్రకటించారు. మరోవైపు వరంగల్ అంటే తనకు ప్రత్యేక అభిమానమన్న ముఖ్యమంత్రి.. ఉమ్మడి జిల్లాను విద్య, వైద్యం, పర్యాటక, ఐటీ హబ్లుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు. సీఎం సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. కడియం శ్రీహరిని నేనే రమ్మన్నా.. ఈ ప్రభుత్వం వచ్చాకే వరంగల్కు ఎయిర్పోర్టు, కాజీపేటకు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, వరంగల్కు రింగ్రోడ్డు వచ్చాయని రేవంత్రెడ్డి గుర్తు చేశారు. ఎంపీ కడియం కావ్య ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా జీఎంఆర్ నుంచి క్లియరెన్స్ తీసుకుని కేంద్ర మంత్రులను కలిసి ఎయిర్పోర్టు సాధించామని తెలిపారు. అలాగే, రైల్వే కోచ్ఫ్యాక్టరీని సాధించామని, కాజీపేట రైల్వే డివిజన్ చేయడం కోసం ఎంపీ కావ్యతోపాటు తన కృషి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. వరంగల్ నగరంలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, ఔటర్ రింగ్రోడ్డు, ఇన్నర్ రింగ్రోడ్డుతోపాటు పలు అభివృద్ధి పథకాల కోసం రూ.6,500 కోట్లు మంజూరు చేశామని, త్వరలోనే ఆ పనులు మొదలవుతాయన్నారు. జయశంకర్ సర్ స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా చేసింది ఈ ప్రభుత్వమేనన్న ఆయన.. మహిళలకు వెయ్యి బస్సులు ఇచ్చి ఆర్టీసీలో అద్దెకు తీసుకున్నామని చెప్పారు. మహిళల చేత వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయించడం ద్వారా ఉమ్మడి వరంగల్కు చెందిన మహిళలకు మేలు జరిగిందని తెలిపారు. అభివృద్ధిలో భాగంగా ఇంటిగ్రేటెడ్ హాస్టల్, వంద పడకల ఆస్పత్రి, ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు వంటి శాశ్వత ప్రాతిపదికన స్టేషన్ఘన్పూర్ అభివృద్ధికి రూ.800 కోట్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక కడియం శ్రీహరి సేవలు గుర్తెరిగి ఆయన నిజాయితీ, అనుభవం కావాలని, తానే అక్కున చేర్చుకొని పార్టీలో చేరాలని కోరినట్లు రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మా కోరిక మేరకు ఆయన పార్టీలో చేరగా.. చెల్లెలు డాక్టర్ కావ్యను ఎంపీగా గెలిపించారన్నారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తికావాలంటే శ్రీహరి నాయకత్వాన్ని బలపర్చాలని ప్రజలను కోరారు. కేసీఆర్, ఆయన కుటుంబంపై ఘాటైన విమర్శలు.. జనగామ జిల్లా శివునిపల్లి వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబంపై సీఎం రేవంత్రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, టి.హరీశ్రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపైన ఆయన కామెంట్స్ చేశారు. ‘అధికారం ఉంటే తప్ప కేసీఆర్ ప్రజల్లోకి రాలేరా? ఆయన బయటకు రాకుండా కొడుకు, అల్లుడిని ఊరు మీదకు వదులుతున్నారు. బయటకు రానప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా ఎందుకు? జీతభత్యాలు ఎందుకు?.. ఇలా చేస్తేనే కదా కాంగ్రెస్ దెబ్బ ఎలా ఉంటుందో 2023లో ప్రజలు చూపించారు’ అంటూ విమర్శలు చేశారు. ‘క్యాప్సికం పండిస్తే రూ.కోట్లు వస్తాయన్న కేసీఆర్.. ఆ టెక్నిక్ ఏంటో ప్రజలకు చెప్పండి.. నీ లక్ష కోట్ల సంపాదన నైపుణ్యం ఏంటో ప్రజలకు చెప్పండి.. వెయ్యి మంది యువకులను నీ ఫామ్ హౌస్కు పంపిస్తాం. ఆ టెక్నిక్ ఏంటో వారికి నేర్పించండి’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ము దోచుకుని పేపర్, టీవీ చానళ్లు పెట్టుకున్న వ్యక్తి జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించిన సీఎం రేవంత్రెడ్డి.. ఆయనతోపాటు కేటీఆర్, హరీశ్రావు, కవితకు ఫామ్హౌస్లు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్కుమార్రెడ్డి, పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్.నాగరాజు, యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, తెలంగాణ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్, కలెక్టర్ షేక్ రిజ్వాన్బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్, నాయకులు ఝాన్సీరెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్య పాల్గొన్నారు. న్యూస్రీల్ పక్కాగా సంక్షేమ పథకాల అమలు మామునూరు ఎయిర్ పోర్ట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ ఘనతే.. ప్రతిష్టాత్మకంగా విమానాశ్రయాన్ని నిర్మిస్తామని స్పష్టీకరణ విద్య, వైద్యం, పర్యాటక, ఐటీ హబ్గా ఓరుగల్లుకు ప్రాధాన్యం.. ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభ విజయవంతం -
రేవంత్ టీ–20 మ్యాచ్ ఆడుతున్నారు..
● సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎదుర్కొంటూ ప్రజాపాలన సాగిస్తున్నారు ● స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రూ.630.27 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు సీఎం సభలో తెలంగాణ ఉద్యమ కళాకారుల నిరసన –8లో -
ఆకట్టుకున్న ఫ్లాష్ మాబ్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డేని పురస్కరించుకొని ఆదివారం ప్లాష్ మాబ్, ట్రెడిషనల్ డేను నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించారు. కళాశాల ఆవరణలో సంప్రదాయ వంటకా లు తయారు చేసుకుని తోటి విద్యార్థులకు పంచి పెడుతూ సందడి చేశారు. విద్యార్థులు మెహందీ డిజైన్లు వేసుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఫొటోఫ్రేమ్లు సుందరంగా తయారు చేశారు. ఫొటోలను విభిన్న రూపాల్లో ఆకర్షణీయంగా సృష్టించారు. కళాశాల ఆవరణలో ఫ్లాష్మాబ్తో అదరగొట్టారు. నేడు ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం కాకతీయ యూనివర్సిటీ కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవాన్ని ఈనెల 17వ తేదీన సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్డే అండ్ కల్చరల్ డేను కూడా నిర్వహించనున్నట్లు ఆకళాశాల ప్రిన్సిపాల్ ఎన్.రమణ తెలిపారు. -
కేటీఆర్, జగదీశ్రెడ్డి దిష్టిబొమ్మలు దహనం
హన్మకొండ చౌరస్తా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అసెంబ్లీలో స్పీకర్పై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆదివారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవన్ నుంచి అశోకా జంక్షన్ వరకు దిష్టిబొమ్మలను శవయాత్రగా తీసుకొచ్చి దహనం చేశారు. ఈసందర్భంగా హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రాజ్యాంగం, గవర్నర్ అంటే కనీస గౌరవం లేదన్నారు. ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీని హుందాగా నడిచేలా చూసుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ పెరుమాండ్ల రామకృష్ణ, కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బంక సరళ, నాయకులు కుమార్యాదవ్, మంద రాకేశ్, అంబేడ్కర్ రాజు, అంకూస్, సంపత్, గణేశ్, స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
చారిత్రక కట్టడాల్ని కాపాడుకోవాలి
హన్మకొండ కల్చరల్: చారిత్రక కట్టడాలు, చరిత్ర మరుగున పడిపోకుండా కాపాడుకోవాలని భవిష్యత్ తరాలకు చరిత్ర తెలియాల్సిన అవసరం ఉందని హైకోర్టు జడ్జి జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం వేయిస్తంభాల ఆలయాన్ని లక్ష్మీనారాయణ దంపతులు సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్కుమార్, అర్చకులు జస్టిస్ను ఆలయ మర్యాదలతో స్వాగతించారు. స్వామివా రికి సహస్రనామార్చన నిర్వహించుకున్న అనంతరం గంగు ఉపేంద్రశర్మ వారికి తీర్థప్రసాదాలను, శేషవస్త్రాలను, మహదాశీర్వచనం అందజేసి ఆలయ ప్రాశస్థ్యాన్ని వివరించారు. వారు ఆలయ పరిక్రమ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆలయ శిల్ప సంపదను, కల్యాణ మండపాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్బాబు, ఆర్డీఓ నారాయణ, తహసీల్దార్ శ్రీపాల్రెడ్డి, మట్టెవాడ పోలీసులు, దేవాలయ సిబ్బంది మధుకర్, తదితరులు పాల్గొన్నారు. భద్రకాళి దేవాలయం సందర్శన రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ దంపతులు భద్రకాళి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ శేషుభారతి, అర్చకులు ఆయనను స్వాగతించారు. జస్టిస్ దంపతులు ఆదిశంకరులను, వల్లభ గణపతిని దర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అర్చకులు మహదాశీర్వచనం అందజేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు -
12 గంటలు.. నిర్విరామ సంగీత విభావరి
హన్మకొండ కల్చరల్: తెలుగు బుక్ ఆఫ్ రికార్ట్స్లో స్థానం పొందడానికి ప్రముఖ గాయకుడు టీవీ రమేశ్, మాధవి గాయనీగాయకులతో కలిసి 12 గంటల పాటు నిర్విరామంగా సంగీ త విభావరి నిర్వహించారు. ఆదివారం ఉద యం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు హనుమకొండ నయీంనగర్లోని వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తెలుగు బుక్ రికార్డ్ జ్యూరీ మెంబర్ టీవీ అశోక్కుమార్, ప్రముఖ సంగీత విద్వాంసులు తిరుపతయ్య, సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ డీఎఫ్ఓ పురుషోత్తం, తొగరు శ్రీనివాస్, చంద్రశేఖర్, పరమేశ్వరి, వనపర్తి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులు, డీఏలు విడుదల చేయాలివిద్యారణ్యపురి: ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ బిల్లులు, డీఏలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలో ఆ ఉపాధ్యాయ సంఘం కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో పొందుపర్చిన సీపీఎస్ విధానం రద్దు, ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్ ఎం.రఘుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు ఇప్పకాయల కుమారస్వామి, చంద్రగిరి లక్ష్మ య్య, జిల్లా కార్యదర్శి గొడిశాల రమేశ్, బాధ్యులు భిక్షపతి, భాస్కర్, పి.సదానందం తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మల ఐక్యతకు కృషి హన్మకొండ: విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాతి ఐక్యత కోసం కృషి చేస్తానని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్కుమార్ అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని స్వగృహంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నాయకులు ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికై న దాసోజు శ్రావణ్కుమార్ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతీ సంఘీయుడు తమ పేరు చివరన విశ్వకర్మగా రాసుకోవాలని, అలాగే పిలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వేములవాడ మదన్మోహన్, గౌరవాధ్యక్షుడు లాలుకోట వెంకటాచారి, ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచార్యులు, నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో శశాంక్కు గోల్డ్ మెడల్కాజీపేట అర్బన్: 31వ డివిజన్ న్యూశాయంపేటకు చెందిన సెయింట్ పీటర్స్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న గుజ్జేటి శశాంక్ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈనెల16న ఆదివారం కొత్తగూడెంలో నిర్వహించిన ఏపీ, తెలంగాణ రాష్ట్ర స్థాయి 14వ ఓపెన్ పోటీల్లో శశాంక్ 48 కేజీల విభాగంలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు. తైక్వాండో పోటీల్లో ప్రత్యేకతను చాటుతూ జాతీయ స్థాయిలో గోల్డ్మెడల్ సాధించడమే తన లక్ష్యమని శశాంక్ చెబుతున్నాడు. -
కష్టార్జితం.. పోతుందని..
వరంగల్ చౌరస్తా : తమ కష్టార్జితాన్ని బ్యాంక్ అధికారులు ఇతరులకు అడ్డగోలుగా విక్రయిస్తున్నారంటూ ఓ కుటుంబం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో మగ్గురికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన వరంగల్ ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేపీఎన్ రోడ్డులో శనివారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చెల్లుపూరి హేమ్ కుమార్, ఆనంద్ కుమార్ అనే సోదరులు వ్యాపార అవసరాల నిమిత్తం జేపీఎన్ రోడ్లోని తమ ఇంటిని తనఖా పెట్టి యూనియన్ బ్యాంక్ కాజీపేట బ్రాంచ్ నుంచి సుమారు కోటికి పైగా రుణం తీసుకున్నారు. వీరినుంచి బ్యాంకు లావాదేవీలు నిలిచిపోవడంతోపాటు రుణం గడువు ముగియడంతో బ్యాంక్ అధికారులు తనఖాలో ఉన్న ఇంటిని సంపత్ కుమార్ అనే వ్యక్తికి వేలంలో అమ్మకం జరిపారు. అమ్మకం జరిపిన ఆస్తిని సంపత్ కుమార్కు అప్పగించడం కోసం బ్యాంక్ అధికారులు శనివారం సంబంధిత భవనం వద్దకు చేరుకుకోగా, హేమ్ కుమార్, ఆనంద్ కుమార్ల కుటుంబ సభ్యులు వారిని అడ్డుకున్నారు. తమ ఆస్తిని ఇతరులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ వారు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటనలో ఆనంద్ కుమార్ (60), తేజశ్రీ (35) హేమ్ కుమార్ కోడలు ప్రశాంతి(32), ఆనంద్ కుమార్ అల్లుడికి తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. బాధితులు మాత్రం తమ కష్టార్జితం అడ్డగోలుగా అమ్మకానికి పెట్టడం వల్ల తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు యత్నించినట్లు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయమై బ్యాంకు అధికారులు మాట్లాడుతూ నిర్ణీతసమయంలో రుణం చెల్లించకపోవడంతో నిబంధనలు ప్రకారం వేలం వేశామని తెలిపారు. -
బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రీడలు నిర్లక్ష్యం
వరంగల్ స్పోర్ట్స్ : బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలను నిర్లక్ష్యం చేస్తే, స్వయంగా క్రీడాకారుడైన సీఎం రేవంత్రెడ్డి క్రీడల అభ్యున్నతికి నిధులు కేటాయిస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర 10వ టెన్నికాయిట్ చాంపియన్షిప్ పోటీలు శనివారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ప్రారంభానికి ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం కప్ క్రీడాపోటీలు ఘనంగా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారుల్లో నూతనోత్తేజం తీసుకొచ్చామన్నారు. క్రీడల అభివృద్ధి, క్రీడాకారుల సంక్షేమం కోసం తామెప్పుడు ముందుంటామన్నారు. టెన్నికాయిట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పీఎన్. వెంకటేశ్ మాట్లాడుతూ నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తున్న పోటీల్లో రాష్ట్రం నుంచి 300 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఒలింపిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండి. అజీజ్ఖాన్, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, సాట్ కోచ్ సద్గురు, టెన్నికాయిట్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ బీఆర్ అంబేడ్కర్, హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు అలువాల రాజ్కుమార్, గోకారపు శ్యాంకుమార్, కోశాధికారి జాహుర్, టెక్నికల్ అఫిషియల్స్ వై. సురేందర్, సలహాదారులు కె. జితేందర్నాథ్, జి. రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి -
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్
నయీంనగర్: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు కచ్చితంగా అక్రిడిటేషన్ కార్డులు దక్కేలా తమ సంఘం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ భరోసా ఇచ్చారు. శనివారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి అధ్యక్షతన హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యవర్గ సమావేశంలో విరాహత్ అలీ మాట్లాడారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలో సీనియర్ పాత్రికేయులతో కూడిన కమిటీ నాలుగైదుసార్లు సమావేశమై కొత్త నిబంధనలు రూపొందించిందని, ఈ నేపథ్యంలో అక్రిడిటేషన్ల జారీలో జాప్యమైందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఆరోగ్య పథకం, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే డిమాండ్తో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) పోరాడుతోందన్నారు. ఇటీవల ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రులకు విన్నవించామని, ప్రభుత్వ ఉద్యోగులతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా జేహెచ్ఎస్ ప్రారంభించాలని కోరగా వారు సానూకూలంగా స్పందించారని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, ఉపాధ్యక్షుడు గాడిపెల్లి మధు, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యులు ఎ.రాంచందర్, తోట సుధాకర్, దుర్గా ప్రసాద్, సీనియర్ నాయకులు దాసరి కృష్ణారెడ్డి, కంకణాల సంతోశ్, పి.వేణుమాధవ్, గ్రేటర్ వరంగల్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య తదితరులు పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ -
సీపీని కలిసిన కలెక్టర్ సత్యశారద
వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సన్ప్రీత్సింగ్ను వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలి కాళోజీ సెంటర్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ డీఆర్ఓ ఎం.విజయలక్ష్మి అన్నారు. జిల్లాలోని ప్రత్యేక అవసరాల పిల్లలకు వరంగల్ శంభునిపేట పాఠశాలలో అలింకో కంపెనీ సహకారంతో శనివారం ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ సమగ్రశిక్ష ద్వారా ఉచిత ఉపకరణాలు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్ష కోఆర్డినేటర్ కుడికాల సుభాష్, కార్పొరేటర్ పోశాల పద్మస్వామి, ఖిలా వరంగల్ ఎంఈఓ బి.ప్రసాద్, స్థానిక పాఠశాల హెచ్ఎం శారదాబాయి, ఉన్నత పాఠశాల హెచ్ఎం ప్రకాశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభల తరలింపులో ఉద్రిక్తత..
● భారీగా తరలిరావడంతో గిర్నిబావిలో ట్రాఫిక్ జామ్ ● నిలువరించే ప్రయత్నంలో పోలీసుల లాఠీచార్జ్ ● పరుగులు తీసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ● ఐదుగురికి గాయాలు, బీఆర్ఎస్ ఆందోళన ● డీసీపీ అంకిత్ రాకతో పరిస్థితి అదుపులోకి.. సాక్షి, వరంగల్/దుగ్గొండి: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల జాతరకు రాజకీయ ప్రభలు (బండ్లు) తరలుతుండగా దుగ్గొండి మండలం గిర్ని బావిలో ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయి. ఒక్కసారిగా తరలిరావడంతో నిలువరించే ప్రయత్నంలో పోలీసులు లాఠీకి పని చెప్పారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ప్రభల ఎదుట పేలుస్తున్న షార్ట్ బాణాసంచా బోర్లా పడడంతో రోడ్డు పక్కల వారికి తగిలి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో బాంబుల పేలుడు శబ్ధం వినిపించడంతో ఫైరింగ్ జరుగుతుందని భ్రమపడిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాల కార్యకర్తలు పరుగులు తీశారు. దీంతో పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయగా పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. ఒకానొక దశలో ఈ ఉద్రిక్త పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు వాటర్ కేనన్ ప్రయోగించబో యారు. ఏసీపీ కిరణ్కుమార్ తన ఏకే 47 గన్ లోడ్ చేసి ఫైర్ చేస్తానని బెదిరించే ప్రయత్నం చేశారు. అనంతరం డీసీపీ అంకిత్కుమార్ ఘటనా స్థలికి చేరుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.జాతరకు స్వయంగా వాహనాలు, ప్రభలను పంపించారు. కాగా లాఠీచార్జ్ బాధితులు ఆందోళన నిర్వహించగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అండగా నిలిచి ధర్నాలో పాల్గొన్నారు. సీఐ సాయిరమణ సర్ది చెప్పే ప్రయత్నం చేయగా పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. గిర్నిబావి వద్ద కాల్పులు జరగలేదు కొమ్మాల జాతర సందర్భంగా గిర్నిబావి ప్రాంతంలో ప్రభ బండ్లు వరుస క్రమంలో తరలివెళ్లే సమయంలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించడంతోపాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆదేశాలను పాటించకుండా ముందుకెళ్లే క్రమంలో పోలీసులకు ప్రభబండ్లను తరలించే వారి మధ్య తోపులాట మాత్రమే జరిగిందని వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. అంతేకాని ఈ ఘటనలో ఎలాంటి పోలీస్ కాల్పులు జరగలేదన్నారు. కొన్ని ప్రచార మాధ్యమాల్లో ఈ ఘటనలో కాల్పులు జరిగినట్లు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలకు ఆందోళన కలిగించే రీతిలో ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు అప్లోడ్ చేసినా, వార్తలు రాసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. -
‘స్టేషన్’ అభివృద్ధికి రూ.800 కోట్లు
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి ● సీఎం సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే, ఎంపీ, సీపీ, కలెక్టర్ స్టేషన్ఘన్పూర్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టితో పలు అభివృద్ధి పనులకు రూ.800 కోట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని శివునిపల్లిలో వ్యవసాయ మార్కెట్ సమీపాన ఆదివారం నిర్వహించనున్న సీఎం బహిరంగ సభా స్థలిని ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ షేక్ రిజ్వాన్బాషా, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్తో కలిసి శనివారం పరిశీలించారు. అనంతరం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ లకు అనుగుణంగా నియోజవకర్గ అభివృద్ధే ఽధ్యేయంగా కాంగ్రెస్లో చేరానని, కేవలం పది నెలల్లోనే సీఎం రేవంత్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లి అభివృద్ధి పనులకు రూ.800 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి నేడు శంకుస్థాపన చేసిన వెంటనే పనులను ప్రారంభించి 18 నెలల్లోనే పూర్తి చేయిస్తామన్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన సీఎంకు కృతజ్ఞతగా నేడు 50వేల మందితో ‘కృతజ్ఞత సభ’ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం రేవంత్ : ఎంపీ కావ్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ప్రధానంగా వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక చొరవతో పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి లేని విధంగా స్టేషన్ఘన్పూర్కు ఏడాదిలోనే రూ.800 కోట్లు మంజూరు చేశారన్నారు. సభావేదికను పరిశీలించిన సీపీ.. సీఎం సభాస్థలి, సభావేదికను వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ పరిశీలించారు. సభాస్థలి వద్ద ఏర్పాట్లు, బందోబస్తు, పార్కింగ్, ట్రాఫిక్ తదితర అంశాలపై డీసీపీతో మాట్లాడారు. సీఎం సభ కోసం 800 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆయన వెంట డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీలు భీమ్శర్మ, అంబటి నర్సయ్య, సీఐలు జి.వేణు, శ్రీనివాస్రెడ్డి, ఎస్సైలు వినయ్కుమార్, శ్రావణ్, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు బెలిదె వెంకన్న, సీహెచ్.నరేందర్రెడ్డి, జూలుకుంట్ల శిరీశ్రెడ్డి, అన్నం బ్రహ్మారెడ్డి, బూర్ల శంకర్, నాగరబోయిన శ్రీరాములు, నీల గట్టయ్య, అంబటి కిషన్రాజ్, నీల శ్రీధర్, నీల వెంకటేశ్వర్లు, రాములు, పోశాల క్రిష్ణమూర్తి, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు. -
సీఎం రేవంత్రెడ్డి సభను అడ్డుకుంటాం
స్టేషన్ఘన్పూర్: ఎన్నికల ముందు పలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. ఆ హామీలను అమలు చేయకుండా నిరంకుశ పాలన సాగిస్తున్నారని, నేడు ఘన్పూర్లో నిర్వహించనున్న సీఎం ‘కృతజ్ఞత సభ’ అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. అసెంబ్లీలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని అక్రమంగా సస్పెండ్ చేశారని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం అంబేడ్కర్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ జగదీశ్రెడ్డి అసెంబ్లీలో కేవలం ఆరు నిమిషాలు మాత్రమే మాట్లాడారని, రైతుల సమస్యలపై ప్రశ్నించిన జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయడం అమానుషమన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కుతూ నియంతపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారిన వారిని రాళ్లతో కొట్టాలని గతంలో చెప్పిన రేవంత్రెడ్డి.. ప్రస్తుతం కడియం శ్రీహరి నిర్వహించే సభకు ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణుల కష్టంతో ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి దొడ్డిదారిన స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్లో చేరారని ఎద్దేవా చేశారు. కడియంకు ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సభకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మారపాక రవి, ఆకుల కుమార్, మాచర్ల గణేశ్, తాటికొండ సురేశ్, కుంభం కుమార్, బంగ్లా శ్రీను, మునిగెల రాజు, మారెపల్లి ప్రసాద్, గుండె మల్లేశ్, గుర్రం శంకర్, శ్రీను, గాదె రాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య -
టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్●
● ఈనెల 20 వరకు నామినేషన్ల ప్రక్రియ ● 28న ఓటింగ్.. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ ఎన్నికలకు యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి టి. మనోహర్ శనివారం నోటిఫికేషన్ జారీచేశారు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీలు, ఆర్గనైజేషన్ –1, ఆర్గనైజేషన్ –2 (ఉమెన్), రిక్రియేషన్ పదవులకు ఒక్కో పదవికి నోటిఫికేషన్ ఇచ్చారు. మూడేళ్ల పదవి కాలానికి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం స్క్రూటీని చేసి ఈనెల 21న నామినేషన్ల వివరాలు వెల్లడిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈనెల 22న మధ్యాహ్నం 3గంటల వరకు ఉంటుంది. తుదిగా అభ్యర్థుల జాబితా 22న సాయంత్రం 4. 30 గంటలకు వెల్లడిస్తారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు 24న గుర్తులు కేటాయిస్తారు. ఓటింగ్ ప్రక్రియ 28న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు క్యాంపస్లోని యూని వర్సిటీ కాలేజీలో ఉంటుంది. 29న సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడిస్తారు. కాగా, ఈ ఎన్నికల నోటిఫికేషన్తో కేయూ టెక్నికల్ స్టాఫ్ ఎంప్లాయీస్లో ఎన్నికల సందడి మొదలైంది. యూట్యూబ్ విలేకరిపై కేసు ఖిలా వరంగల్: నిజ నిర్ధారణ లేకుండా ఫొటోలతో సహా సామాజిక మధ్యమాల్లో ఓ కథనం పోస్టు చేసిన ఓ యూట్యూబ్ విలేకరిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ వెంకటరత్నం తెలిపారు. ఓ యువతి విషయంలో పూర్తి సమాచారం లేకుండా.. కనీసం నిబంధనలు పాటించకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన క్లిప్పింగ్స్ ఆధారంగా సదరు విలేకరిపై శుక్రవారం రాత్రి కేసు నమోదైంది. శనివారం అతడిని పోలీసులు స్టేషన్లో విచారించినట్లు సమాచారం. సీకేఎంలో ఫెర్టిలిటీ ఓపీ సేవలు షురూఎంజీఎం: వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో శనివారం ఫెర్టిలిటీ ఓపీ సేవలను సూపరింటెండెంట్ షర్మిల ప్రారంభించారు. ప్రస్తుతం అందిస్తున్న గర్భిణులకు సేవలతో పాటు సంతాన భాగ్యం లేని దంపతులకు మరింత మెరుగైన ఓపీ వైద్యసేవలందించేందుకు ప్రత్యేక ఓపీ విభాగాన్ని ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యేక ఓపీ ప్రారంభించి ఔషధాలు సైతం ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఈసేవలు ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. సంతాన లేమితో ఇబ్బందులు పడుతున్న దంపతులు.. ఈ విభాగంలో నమోదు చేసుకుని ఉచిత వైద్యసేవలు పొందొచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎంఓలు మురళి, సత్యజిత్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాలి
● ఉద్యాన శాఖ వరంగల్ జిల్లా అధికారి సంగీత లక్ష్మి మామునూరు: రైతులు సంప్రదాయ పంటలు కాకుండా ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాలని ఉద్యాన శాఖ వరంగల్ జిల్లా అధికారి సంగీత లక్ష్మి సూచించారు. మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రధాన శాస్త్రవేత్త రాజన్న ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాల సంస్థ వరంగల్ సౌజన్యంతో సుగంధ ద్రవ్యాల సాగుపై మూడు రోజులుగా జరుగుతున్న శిక్షణ శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు పసుపు, మిరప, కూరగాయల విత్తనాలు పంపిణీ చేసి మాట్లాడారు. ఉద్యాన పంటల సాగును పంట మార్పిడిగా ఉపయోగించాలని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందన్నారు. అంతకు ముందు సుగంధ ద్రవ్యాల పంట సాగు విధానాలపై శిక్షణ పొందిన రైతులకు ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సౌమ్య, రాజు, నాగరాజు, వేణుగోపాల్, హర్షరెడ్డి, సాయిచంద్, సుశ్రాత్, తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకుంటున్న వైరెటీలు
మహిళల షాపింగ్ కోసం మండిబజార్లో ప్రత్యేక దుకాణాలు వెలిశాయి. ఢిల్లీ, ఆగ్రాల నుంచి బ్రైడల్ వెడ్డింగ్ వియర్ చీరలు, కుర్తా పైజామాలు ఆకట్టుకుంటున్నాయి. డ్రెస్ మెటీరియల్స్, పట్టు శారీస్, రెడీమేడ్, కిడ్స్వేర్, బ్యాంగిళ్లు, చెప్పులు, జ్యువెల్లరీ వంటివి ఇక్కడ లభిస్తున్నాయి. రంజాన్ నెలలో సంప్రదాయబద్ధంగా ఉపయోగించే సుర్మా టోపీలు, సుగంధ ద్రవ్యాలు, అత్తరులు, ప్రత్యేక దుస్తులు, కుర్తా పైజామా వంటి వాటికి గిరాకీ పెరుగుతోంది. అలాగే మహిళలు విభిన్న డిజైన్లతో కూడిన గాజులు, ముత్యాలు కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పిల్లలు, యువతకు సంబంధించిన వైరెటీ దుస్తులు కూడా అందుబాటులో ఉండడంతో షాపింగ్ చేస్తున్నారు. -
బడ్జెట్ అంచనాల్లో ఆలస్యమెందుకు?
వింగ్ అధికారులపై మేయర్, కమిషనర్ల అసహనం వరంగల్ అర్బన్: ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఆమోదానికి గడువు దగ్గర పడింది. అంచనాల తయారీలో ఎందుకు అలక్ష్యం ప్రదర్శిస్తున్నారని మేయర్ గుండు సుధారాణి వింగ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘హద్దు పద్దు లేదు’ కథనానికి స్పందించిన మేయర్, కమిషనర్ వింగ్ అధికారులతో శనివారం సమావేశమై 2025–26 అర్థిక సంవత్సరం సమగ్ర సమాచారంతో బడ్జెట్కు రూపకల్పన చేయాలని హెచ్చరించారు. గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బడ్జెట్కు సంబంధించి వివిధ విభాగాల వారు ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే కమిషనర్కు సూచించాలని తద్వారా బడ్జెట్ సమగ్రంగా ఆమోదయోగ్యంగా ఉండేలా రూపకల్పన చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్ఈ ప్రవీణ్చంద్ర, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, బయాలజిస్ట్ మాధవరెడ్డి, డీఎఫ్ఓ శంకర్ లింగం, సెక్రటరీ అలివేలు, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, జేఏఓ సరిత, హెచ్ఓలు రమేశ్, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మొక్కల పెంపకానికి షెడ్లు ఏర్పాటు చేయాలి..మొక్కల పెంపకానికి వీలుగా నర్సరీల్లో అదనపు షెడ్లు ఏర్పాటు చేయాలని మేయర్ గుండు సుధారాణి హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. శనివారం బాలసముద్రంలో బల్దియా నిర్వహిస్తున్న రెండు నర్సరీలను మేయర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఏర్పాట్లపై అధికారులకు సూచనలిచ్చారు. -
సర్వం సిద్ధం
‘సీఎం కృతజ్ఞత సభ’కునేడు ఘన్పూర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనజనగామ: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో సీఎం రేవంత్రెడ్డి నేడు(ఆదివారం) పర్యటించనున్నారు. రూ.700 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు వర్చువల్గా శంకుస్థాపనలు, అలాగే ప్రారంభోత్సవాలు చేయనుండగా.. సెల్ఫ్హెల్ప్ గ్రూపులకు రూ.100 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను సీఎం చేతుల మీదుగా అందజేయనున్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సమీపాన ‘సీఎం కృతజ్ఞత సభ’కు సర్వం సిద్ధం చేశారు. బహిరంగ సభతోపాటు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేతృత్వంలో సీపీ సన్ప్రీత్ సింగ్, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, ఎంపీ కడియం కావ్య శనివారం పరిశీలించారు. శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు జఫర్గఢ్ మండలం కోణాయచలం సమీపాన రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్(గురుకులం) కాంప్లెక్స్, రూ.146 కోట్లతో ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబుపేట వరకు మెయిన్ కెనాల్ లైనింగ్, రూ.46 కోట్ల వ్యయంతో ఘన్పూర్లో విద్యుత్ సబ్స్టేషన్ సమీపాన 100 పడకల ఆస్పత్రి, రూ.26 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ (ప్రభుత్వ కార్యాలయాల సముదాయం), రూ.50 కోట్లతో పంచాయతీరాజ్ రహదారులు, రూ.26 కోట్లతో అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, రూ.250 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల(మొదటి విడత) నిర్మాణ పనులను సీఎం వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రూ.100 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులు అందజేస్తారు. అనంతరం సీఎం మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను సందర్శిస్తారు. అలాగే.. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు మంజూరైన నాలుగు ఆర్టీసీ బస్సులను ప్రారంభిస్తారు. శంకుస్థాపనలకు సంబంధించి సభా వేదిక సమీపంలోనే ఒకే చోట శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. రెండు రూట్లలో తరలింపు.. సభకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో 50 వేల మందిని తరలించనున్నారు. ఇందుకు సంబంధించి వేలేరు, ధర్మసాగర్, స్టేషన్ఘన్పూర్, చిల్పూరు మండలాల నుంచి వచ్చే వారు ఘన్పూర్ టౌన్ మీదుగా.. జఫర్గఢ్, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల వారు ఇప్పగూడెం మీదుగా రానున్నారు. ఈరెండు రూట్లలో పోలీసుల నిఘా ఉంటుంది. శివునిపల్లి వ్యవసాయ మార్కెట్, విశ్వనాథపురం సమీపంలో రెండు చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తుండగా.. స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ వర్గాలు నిరంతరం నిఘా ఉంచాయి. సీఎం పర్యటన నేపథ్యంలో 850 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టనున్నారు. – 8లోu రూ.700 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మహిళా సంఘాలకు రూ.100 కోట్ల రుణాలు.. వ్యవసాయ మార్కెట్ సమీపంలో బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే కడియం, ఎంపీ కావ్య, అధికారులుసీఎం టూర్ షెడ్యూల్ ఇలా.. మధ్యాహ్నం 12.10 గంటలకు ఇంటినుంచి (హైదరాబాద్లో) బయల్దేరి బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. 12.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయల్దేరుతారు. ఒంటి గంటకు స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లి హెలిపాడ్కు చేరుకుంటారు. 1.10 నుంచి 1.20 గంటల వరకు ఇందిర మహిళా శక్తి స్టాళ్లను పరిశీలించి, వివిధ గ్రూపులకు కేటాయించిన బస్సులను ప్రారంభిస్తారు. 1.25 గంటల నుంచి 3 గంటల వరకు శివునిపల్లిలో ప్రజాపాలన కార్యక్రమాలు, కృతజ్ఞత సభలో పాల్గొంటారు. 3.10 గంటలకు శివునిపల్లి హెలిపాడ్ నుంచి బయల్దేరి 3.45 గంటలకు హెలికాప్టర్లో బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు.‘స్టేషన్’ అభివృద్ధికి రూ.800 కోట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎం రేవంత్రెడ్డి సభను అడ్డుకుంటాం.. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య -
మజారే.. మండి బజారే!
శనివారం రాత్రి మండిబజార్లో కిక్కిరిసిన జనంముక్కుపుటాలదిరేలా మాంసాహార వంటకాలు. మనసుకు హత్తుకునేలా అత్తరు సువాసనలు.. చూపుతిప్పనివ్వని బ్యాంగిళ్లు. ఆహార్యానికి అందం తెచ్చే కుర్తా పైజామాలు. మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ కాంతులు. అవన్నింటికీ కేరాఫ్ మన మండి బజార్. నగరానికి ఐకాన్గా నిలుస్తున్న ఈ ప్రాంతం ఓ మినీ చార్మి నార్. రంజాన్ వేళ రాత్రి సైతం రద్దీగా ఉండే ఈ ప్రాంతంపై ‘సాక్షి’ సండే స్పెషల్. – సాక్షి, వరంగల్రంజాన్ సమయంలో మండిబజార్లో దొరికే తినుబండారాలకు ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా పత్తర్ కా ఘోష్, మరగ్, పాయా, హలీం, అచార్ కా ఘోష్, బోటి కబాబ్, ఫిష్ కబాబ్, చికెన్–65, చికెన్ మెజెస్టిక్ వంటి మాంసాహార వంటకాలు ఆ ప్రాంతం నుంచి మనల్ని కదలకుండా చేస్తాయి. చికెన్ రోల్, 65 రోల్, మెజెస్టిక్, స్టిక్ చికెన్, బంజారా చికెన్, కేఎఫ్సీ చికెన్, మటన్ హలీమ్, చికెన్ హరీస్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అతారీ చికెన్, మలై చికెన్, సాదిక్ ముర్గీ వంటకాలు నోరూరిస్తున్నాయి. వీటితో పాటు పలు రకాల మిఠాయిలు ఆహారప్రియుల నోరూరిస్తున్నాయి. సోరకాయ స్వీట్, డబుల్కమీటా, బాదమ్కా కీర్, గుమ్మడికాయ స్వీట్లు తెగ తినేస్తున్నారు. కాజు, బాదం, పిస్తాలు కలిపి తయారుచేసే సన్రైజ్ ఫుటింగ్ కేక్, ఐస్క్రీమ్లు ఇక్కడ ప్రత్యేకం అని దుకాణాదారులు చెబుతున్నారు. అలాగే మహబత్కా షర్బత్ (పాలలో పుచ్చకాయ రసం మిక్స్ చేస్తారు)కు కూడా ఆహారప్రియులు ఫిదా అవుతున్నట్లు చెబుతున్నారు. నోరూరిస్తున్న రంజాన్ స్పెషల్స్.. -
చట్టంపై అవగాహన తప్పనిసరి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్పాండే కాజీపేట అర్బన్: ప్రతి ఒక్కరూ వినియోగదారుల రక్షణ చట్టంపై అవగాహన తప్పనిసరిగా పెంపొందించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్పాండే తెలిపారు. హనుమకొండ ఎకై ్సజ్ కాలనీలోని సఖి వన్స్టాప్ సెంటర్లో శనివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్పాండే హాజరై మాట్లాడారు. వినియోగదారులు కొన్న వస్తువులు నాణ్యతగా లేకపోయినా, కల్తీ జరిగినా.. డబ్బులు చెల్లించి పొందే సేవల్లో లోపాలున్నా.. వినియోగదారుల పరిష్కార కమిషన్ ద్వారా పరిహారం పొందే అవకాశం ఉందన్నారు. వస్తువుల కొనుగోలులో మహిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేసి నష్టపోయినప్పుడు నేషనల్ కన్జూమర్ హెల్ప్లైన్ 1915కు లేదా 88000 01915కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని, బీఐఎస్–కేర్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఐఎస్ఐ మార్క్ ఉన్న వస్తువులను కొనుగోలు చేయాలని వినియోగదారుల సమన్వయ సమితి అద్యక్షుడు డాక్టర్ పల్లెపాడు దామోదర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమాధికారి జయంతి, సఖిసెంటర్ అడ్మిన్ హైమావతి, సీడీపీఓ విశ్వజ, ఇందిర, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షల్లో 359 మంది గైర్హాజరువిద్యారణ్యపురి: ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో శనివారం 359 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ ఎ.గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి 17,277 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వాల్సి ఉండగా.. వారిలో 16,918 మంది హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. -
ముసాయిదాను వెనక్కి తీసుకోవాలి
కేయూ క్యాంపస్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి న యూజీసీ నూతన ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని టీపీటీఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి కడారి భోగేశ్వర్ డిమాండ్ చేశారు. శనివారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో.. కేయూ దూర విద్యాకేంద్రంలో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2020 యూజీసీ ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీడీఎస్యూ జాతీయ నాయకులు పి.మహేశ్, పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేశ్, కోశాధికారి పవన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మంద శ్రీకాంత్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు నాగరాజు, పీడీఎస్యూ నాయకులు గణేశ్, పండు, సంపత్ తదితరులు పాల్గొన్నారు. డ్రైవింగ్లో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానంకాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలో వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువతకు మెటార్ డ్రైవింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రాంరెడ్డి శనివారం తెలిపారు. అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హెచ్ఎంవీ (హెవీ మోటర్ వెహికిల్), ఎల్ఎంవీ(లైట్ మోటర్ వెహికిల్) డ్రైవింగ్ శిక్షణను టీజీఆర్టీసీ సౌజన్యంతో తెలంగాణ వెనుకబడిన తరగతుల సహకార సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత ఈనెల 31 లోపు హనుమకొండ కలెక్టరేట్లోని బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. నేడు అటల్ జీ యాదిలో ఆత్మీయ సమ్మేళనంహన్మకొండ: మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా.. ఈనెల 16న ‘అటల్ జీ యాదిలో ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు హనుమకొండ హంటర్ రోడ్లోని డీ కన్వెన్షన్ మినీ హాల్లో ఈసమ్మేళనం జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆయన తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అటల్ బీహారీ వాజ్పేయి అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మైక్రో ఫైనాన్స్ వలలో మహిళలుకలెక్టర్ను కలిసే యోచనలో కడిపికొండవాసులు కాజీపేట అర్బన్: మండలంలోని కడిపికొండ గ్రామంలో నిరుపేద కుటుంబాలు మైక్రోఫైనాన్స్ వలలో పడి కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామంలో సుమారు 10 వేల జనాభా ఉండగా.. 500 మంది మహిళలు మైక్రో ఫైనాన్స్ బాధితులుగా ఉన్నట్లు తెలుస్తోంది. వారం వారం కట్టాల్సిన చిట్టీలు కట్టలేకపోతుండడంతో మైక్రోఫైనాన్స్ సిబ్బంది మహిళలపై, వారి కుటుంబ సభ్యులపై వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. చిన్న బ్యాంకులు, ప్రైవేట్ మైక్రోఫైనాన్స్ సంస్థల నిర్వాహకులు రుణం తీసుకున్న వారి ఇంటికి సాయంత్రం, రాత్రి పూట వెళ్తున్నట్లు.. రాత్రి వేళల్లో ఇళ్లకు రావొద్దని బాధితులు సిబ్బందిని వేడుకుంటున్నట్లు తెలిసింది. కాగా.. కేవలం ఆధార్ కార్డే ప్రామాణికం కావడంతో, ఎలాంటి ష్యూరిటీ సంతకం అవసరం లేకపోవడంతో మహిళలు ముందు ఒక సంస్థ నుంచి రుణం తీసుకుంటున్నారు. ఆ అప్పు, వడ్డీ కట్టలేక 5 నుంచి 6 మైక్రో ఫైనాన్స్ సంస్థల నుంచి రుణం పొందుతున్నారు. చివరికి అసలు, వడ్డీ చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. మహిళలు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. -
18, 19 తేదీల్లో ఎంబీఏ అడ్మిషన్ల కౌన్సెలింగ్
విద్యారణ్యపురి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీఏ హాస్పిటిల్ అండ్ హెల్త్కేర్ మేనేజ్మెంట్(హెచ్హెచ్సీఎం) అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 18, 19 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆ వర్సిటీ అభ్యాసక సహాయ సేవా విభాగం(ఎల్ఎస్ఎస్బీ) డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ ప్రవేశ పరీక్ష, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టీజీఐసెట్లో అర్హత సాధించిన వారికి అవకాశం ఉందన్నారు. ఆసక్తి ఉన్న వారు అంబేడ్కర్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఆయా తేదీల్లో నిర్వహించే అడ్మిషన్ల కౌన్సెలింగ్కు అర్హత పరీక్ష, ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఒరిజనల్ సర్టిఫికెట్లు ఒకసెట్ జిరాక్స్ కాపీలు, రెండు పాస్పెర్ట్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. అంబేడ్కర్ వర్సిటీ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుని ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ కాల్వలో పడి మహిళ మృతి పర్వతగిరి: ఎస్సారెస్పీ కాల్వలో కొట్టుకుపోయి మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని హట్యతండా శివారు ఎర్రకుంట తండాలో చోటు చేసుకుంది. ఎస్సై బోగం ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎర్రకుంటతండాకు చెందిన బాదావత్ నేజి(78) గురువారం ఉదయం దుస్తులు ఉతకడానికి ఎస్సారెస్పీ కాల్వలోకి వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి కొట్టుకుపోయింది. శుక్రవారం ఉదయం నెక్కొండ మండలం బొల్లికొండ తండా వద్ద ఎస్సారెస్పీ కెనాల్లో శవమై తేలి కన్పించింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. భూపాలపల్లి అటవీ గ్రామాల్లో మరో పులి ? భూపాలపల్లి రూరల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని కమలూ పూర్, రాంపూర్ గ్రామాల మధ్య ఫార్టెస్టు అధి కారులు శుక్రవారం పులి పాదముద్రలు గుర్తించారు. కాటారం, మండలం జాదారావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో రఘుపల్లి అటవీ ప్రాంతంలో చెరువుకట్టపై ఈ నెల 12న ఆవుదూడను చంపి తిన్నట్లు ఆనవాళ్లు లభించాయి. పాదముద్రలు వేరేనా..? శుక్రవారం కాటారం మండలం మేడిపలి, కొత్తపల్లి గ్రామాల మీదుగా భూపాలపల్లి మండలంలోని రాంపూర్, కమలాపూర్ అటవీ గ్రామాల మధ్య పులి అడుగుజాడలను ఫారెస్టు అధికారులు గుర్తించారు. కాటారం పులి పాదముద్రలు, ఈ పులి పాదముద్రలు సరిపోకపోవడంతో మరో ఆడ పులిగా అనుమానిస్తున్నారు. కాటారం మండలంలో మగ పులి, భూపాలపల్లి మండలలో ఆడ పులి తిరుగుతున్న నేపథ్యంలో భూపాలపల్లి అటవీ గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రామస్తులకు పులి కనపడిన, అటవీలో ఉచ్చులు, విద్యుత్ తీగలు అమర్చి పులులకు ప్రమాదాన్ని కలిగించినా.. కఠిన చర్యలు తప్పవని ఫారెస్టు అధికారులు హెచ్చరిస్తున్నారు. -
పట్టుదల, ఏకాగ్రతే వారధిగా ఉద్యోగ వేట సాగించిన ఉమ్మడి జిల్లాలోని పలువురు యువత తమ లక్ష్యాన్ని ఛేదించారు. కష్టానికి ప్రతిఫలాన్ని పొంది గెలుపుబావుటా ఎగురవేశారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులను ఎదిరించి ఉన్నత ఉద్యోగాలను కై వసం చేసుకుని సత్తా చాటారు. గ్రూప్–1, గ్రూ
చిరు వ్యాపారి బిడ్డకు మూడు ఉద్యోగాలు మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా కేంద్రంలోని కేసముద్రం రోడ్డులో ఆర్టీసీ బస్టాండ్ వద్ద చిన్నహోటల్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్న డోలి వెంకటేశ్వర్లు –పద్మ దంపతులు. వారి కుమారై డోలి సంధ్య గ్రూప్–3లో 450 మార్కులకు 269.9 మార్కులతో 1,125 ర్యాంక్ సాధించింది. జోనల్ స్థాయిలో బీసీ(ఏ) మహిళల విభాగంలో 2వ ర్యాంక్ సాధించింది. అయితే ఇప్పటీకే గ్రూప్–4లో ఉన్నత ర్యాంకు సాధించిన సంధ్య మానుకోట మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్గా విధుల్లో కొనసాగిస్తోంది. అదేవిధంగా ఈ నెల 11న విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో సంధ్య 600 మార్కులకు 382.4 మార్కులతో 205 ర్యాంక్ సాధించింది. రాష్ట్రస్థాయిలో మహిళల విభాగంలో 16 స్థానం, బీసీ(ఏ)లో మహిళా విభాగంలో మొదటి ర్యాంక్ సాధించారు. గ్రూప్–2లో మంచి పోస్ట్ వస్తే ఆ ఉద్యోగంలో చేరుతానని చెబుతున్న సంధ్యను తల్లిదండ్రులు, స్నేహితులు అభినందించారు. గ్రూప్–3లో సత్తా చాటిన ప్రణీత్ కొడకండ్ల: గ్రూప్–2 ఫలితాల్లో ప్రతిభను చాటుకున్న కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన చెన్న ప్రణీత్ గ్రూప్–3 ఫలితాల్లో 285 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 395 ర్యాంక్ను సాధించి సత్తా చాటాడు. 2019లో సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చేసిన ప్రణిత్ సివిల్స్ సాధించాలనే సంకల్పంతో ఉండగా గ్రూప్స్ నోటిఫికేషన్లు రావడంతో వాటిపై దృష్టి సాఽరించాడు. గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 55వ ర్యాంక్ సాధించి ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న ప్రణీత్ గ్రూప్–2 ఫలితాల్లో 388 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 138వ ర్యాంక్ సాధించడమే కాకుండా గ్రూప్–3 ఫలితాల్లోనూ ప్రతిభను చాటుకున్నాడు. నిరుపేద పద్మశాలీ కుటుంబానికి చెందిన ప్రణీత్ ఉత్తమ ర్యాంక్ పొందడంపై తల్లిదండ్రులు చెన్న సోమనారాయణ నాగలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. గ్రూప్స్లో మెరిసిన యువత రెండుకు మించి ఉద్యోగాలు -
గ్రూప్–3లో స్టేట్ 57వ ర్యాంక్
బచ్చన్నపేట : మండల కేంద్రానికి చిమ్ముల అరుణ–మల్లారెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి కూతురు ప్రస్తుతం జనగామ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తుండగా.. కుమారుడు చిమ్ముల రాజశేఖర్రెడ్డి శుక్రవారం వెలువడిన గ్రూప్–3 ఫలితాల్లో రాష్ట్ర స్థాయి 57వ ర్యాంక్ సాధించారు. గ్రూప్–2 ఫలితాల్లో 423.933 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి 8వ ర్యాంక్ సాధించాడు. గతంలో రాజశేఖర్రెడ్డి వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం గ్రూప్స్లో ఉత్తమ ర్యాంక్లు సాధించడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రారంభమైన కొమ్మాల జాతర
గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర హోలీ పండుగతో శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యల్లో వచ్చి స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. కొమ్మాల స్టేజీ నుంచి రాజకీయ పార్టీల ప్రభబండ్లు బయలుదేరడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ప్రయాణికులు, భక్తులు, అంబులెన్స్లలోని రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు విఫలమయ్యారని భక్తులు అసహనం వ్యక్తం చేశారు. నిషేధం ఉన్నా కూడా జాతరలో డీజేల జోరు కొనసాగింది. కాంగ్రెస్ ప్రభను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖఃసంతోషాలతో ఉండాలన్నారు. బీఆర్ఎస్ ప్రభను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ పదేళ్లలో జాతర ఎంతో ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. అధికార పార్టీలోనే రెండు వర్గాలు కావడంతో జాతరలో ప్రశాంతత దెబ్బతిందన్నారు. బీజేపీ ప్రభను డాక్టర్ కాళీప్రసాద్ ప్రారంభించారు. కొండా వర్గం ప్రభను అల్లం బాలకిశోర్రెడ్డి, వీరగోని రాజ్కుమార్ ఏ ర్పాటు చేయగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు ప్రారంభించారు. కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నా యకులు వరద రాజేశ్వర్రావు, దొమ్మాటి సాంబయ్య, గన్నోజు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, అధికార ప్రతినిధి కొమురారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాస్, ఉత్సవ కమిటీ చైర్మన్ కడారి రాజుయాదవ్, రాంబాబు, శ్రీనివాస్, ములక ప్ర సాద్, ప్రవీణ్, పోలీస్ ధర్మారావు, బోడకుంట్ల ప్రకా శ్, జయపాల్రెడ్డి, రాజయ్య, నాగేశ్వర్రావు, భరత్ పాల్గొన్నారు. అంతకుముందు ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, ట్రెయినీ ఐపీఎస్ మనన్భట్, ఏసీపీ తిరుపతి స్వామివారిని దర్శించుకున్నారు. లక్ష్మీనర్సింహస్వామికి భక్తుల పూజలు కొమ్మాల స్టేజీ వద్ద స్తంభించిన ట్రాఫిక్ అట్టహాసంగా రాజకీయ ప్రభలు -
కోచింగ్ లేకుండానే..
జనగామ రూరల్: జనగామ మండలం సిద్దంకి గ్రామానికి చెందిన సుంకరి కేదారేశ్వర్రెడ్డి ఎలాంటి కోచింగ్లేకుండానే ఇటీవల విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో 112వ ర్యాంక్, గ్రూప్–3 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంక్ సాధించి సత్తాచాటాడు. సిద్దంకి గ్రామానికి చెందిన సుంకరి శ్రీనివాస్రెడ్డి కుమారుడు కేదారేశ్వర్రెడ్డి సివిల్ సప్లయీస్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూనే గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యాడు. ఈ సందర్భంగా కేదారేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ఎలాంటి కోచింగ్ లేకుండానే గ్రూప్– 2లో ఉత్తమ ర్యాంక్ రావడం సంతోషంగా ఉందన్నారు. కేదారేశ్వర్రెడ్డి రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
ప్రజలకు ఉత్తమ సేవ అందిస్తా..
● గ్రూప్–3 26వ ర్యాంకర్ అజయ్కుమార్ చిట్యాల: ప్రజలకు ఉత్తమ సర్వీస్ అందిస్తానని గ్రూప్–2 స్టేట్ 43వ ర్యాంక్ సాధించిన నల్ల అజయ్ కుమార్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల తిర్మలాపూర్ గ్రామానికి చెందిన నల్ల కోంరయ్య–నీలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడైన అజయ్ కుమార్ ఒకటి నుంచి పదో తరగతి వరకు మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్లో చదివాడు. ఇంటర్ హనుమకొండలోని శివానీ కాలేజీలో, బీటెక్ హైదరాబాద్లో చదివాడు. 2018లో కానిస్టేబుల్ ఉద్యోగం, 2024లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో ఇటీవల విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 43వ ర్యాంక్, కాళేశ్వరం జోన్లో 7వ ర్యాంక్ సాధించాడు. శుక్రవారం విడుదలైన గ్రూప్–3 ఫలితాల్లో స్టేట్ 26వ ర్యాంక్ సాధించాడు. గ్రూప్–2 ద్వారా వచ్చే ఉద్యోగాన్ని ఎంపిక చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలందిస్తానని చెబుతున్నాడు.. అజయ్కుమార్. -
భద్రాచలానికి గోటి తలంబ్రాలు
ఖానాపురం: మండల కేంద్రంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో గత తొంబై రోజులుగా గోటితో ఒలిచిన తలంబ్రాలకు పూజారి పర్వతపు శివప్రసాద్శాస్త్రి ప్రత్యేక పూజలు చేశారు. గోటితో ఒలిచిన తలంబ్రాలను భద్రాచలం సీతారామచంద్ర స్వామి కల్యాణమహోత్సవానికి తరలించారు. అక్కడ ఆలయంలో తలంబ్రాలతో కలిపి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మరికొన్ని తలంబ్రాలను తీసుకొచ్చి కల్యాణ వేడుకలను చేపట్టనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ గొల్లపూడి సుబ్బారావు తెలిపారు. గూడూరు: సీతారాముల కల్యాణోత్సవంలో ఉపయోగించే గోటి తలంబ్రాలను భక్తులు శుక్రవారం గూడూరు నుంచి భద్రాచలం చేర్చారు. శ్రీరామ నవమికి ముందు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు గోటితో ఒలిచిన బియ్యాన్ని తలంబ్రాల కోసం తరలిస్తారు. ఈ క్రమంలో గూడూరు మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీనారాయణస్వామి దేవాలయ ప్రాంగణంలో హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో గత నెల 24 నుంచి భక్తులు ధాన్యాన్ని గోటితో ఒలిచే కార్యక్రమం చేపట్టారు. హిందూ జాగరణ సమితి, సేవికా సమితి మహిళలు అందరూ కలిసి గోటి తలంబ్రాలను భద్రాచల రాములవారి దేవాలయానికి చేర్చారు. హోలీ పండుగ సందర్భంగా అక్కడ రంగులు చల్లుకొని సంబురాన్ని పంచుకున్నట్లు మహిళలు తెలిపారు. -
ఇక ‘కృత్రిమ’ పాఠాలు!
విద్యారణ్యపురి: రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్ల సాయంతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) ద్వారా పాఠాలు బోధించనుంది. ఇప్పటికే ఆరు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా కార్యక్రమాన్ని ప్రారంభించింది. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం అమలు చేయనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దీన్ని అమలు చేయనున్నారు. సంబంధిత ఎంఈఓ, కాంప్లెక్స్ హెడ్మాస్టర్, ఉపాధ్యాయులకు హైదరాబాద్లో ఒకరోజు శిక్షణ ఇచ్చారు. పాఠశాలలివే.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపెల్లి, ముల్కనూరు ప్రాథమిక పాఠశాల, ధర్మసాగర్ మండలం దేవనూరు ప్రాథమిక పాఠశాల, హనుమకొండ మండలం కుమార్పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, హసన్పర్తి మండలం దేవన్నపేట, నాగారం, మడిపల్లి ప్రాథమిక పాఠశాలలు, ఐనవోలు మండలం కక్కిరాలపల్లి ప్రాథమిక పాఠశాల, పరకాల మండలం నాగారం ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ ద్వారా బోధనను ప్రారంభించనున్నారు. కలెక్టర్ ప్రావీణ్య, డీఈఓ వాసంతి కలిసి ఐనవోలు మండలం కక్కిరాలపల్లి ప్రాథమిక పాఠశాలలో నేటి (శనివారం) నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అయితే 9 పాఠశాలల్లో 404 మంది విద్యార్థులుండగా.. అభ్యసన సామర్థ్యాల్లో బాగా.. వెనుకబాటులో ఉన్న సీగ్రేడ్ విద్యార్థులైన 109 మందికి ఈకృత్రిమ మేధ ద్వారా పాఠాలు అందించేలా ఏర్పాట్లు చేశారు. కృత్రిమ మేధను అనుసరించి ఏక స్టెప్ ఫౌండేషన్ రూపొందించిన కంప్యూటర్ ఆధారిత కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. ఒక్కో హైస్కూల్లోని విద్యార్థుల కోసం ఐదు కంప్యూటర్లు ఇప్పటికే అందించారు. వివిధ సబ్జెక్టుల్లో బోధన విద్యార్థులకు తెలుగు, ఆంగ్లానికి సంబంధించి ప్రమాణాలు నేర్పుతారు. గణితంలో సంఖ్యా భావనలు, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు, ఆరోహణ, అవరోహణ సామర్థ్యాలు నేర్పిస్తారు. ఇందుకు సంబంధించి హనుమకొండ జిల్లాలోని 10 పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు 5 కంప్యూటర్లు చొప్పున అందించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా విద్యార్థికి దృశ్య, శ్రవణ జ్ఞానం చేకూరుతుంది. సామర్థ్యాలు పెరుగుతాయి. వరంగల్ జిల్లాలో 11 ప్రభుత్వ పాఠశాలలు.. కాళోజీ సెంటర్: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు)తో ప్రభుత్వ పాఠశాలల్లో బోధన చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద వరంగల్ జిల్లాలో 11 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేయగా.. విద్యార్థులకు ఏఐ సహకారంతో వర్చువల్ రియాల్టీ విధానంలో పాఠాలు చెప్పేలా కసరత్తు జరుగుతోంది. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచే లక్ష్యంగా శనివారం నుంచి ఏఐ బోధన ప్రారంభించనుంది. ఎఫ్ఎల్ఎన్కు సాంకేతికత జోడించి ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్జీటీలకు శిక్షణ ఇచ్చారు.విద్యార్థులకు ఏఐతో బోధన అభ్యసన సమర్థ్యాల సాధన కోసం అమలు నేడు అధికారికంగా ప్రారంభం జిల్లాలోని తొమ్మిది ప్రాథమిక పాఠశాలలు ఎంపిక -
కొలతలు, తూకాల్లో మోసం
● సంబంధిత అధికారుల్లో నిర్లిప్తత ● నష్టపోతున్న వినియోగదారులు ● ప్రశ్నించి పోరాడితేనే దగాకు చెక్ నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సాక్షి, వరంగల్: మార్కెట్లో కొందరు వ్యాపారులు తూకాలు, కొలతల్లో వినియోగదారులను మోసం చేస్తున్నారు. కూరగాయలు, నిత్యావసారాలతోపాటు అన్నింటిలోనూ చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. అక్రమాలను అరికట్టాల్సిన తూనికలు, కొలతలు, ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం.. వినియోగదారుల హక్కులపై ప్రచారం చేయడంలోనూ విఫలమవడం ఇందుకు కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. కమిషన్ను ఎప్పుడు ఆశ్రయించాలంటే.. ఆన్లైన్ సేవలు విస్తృతం కావడంతో ఇంటి నుంచి వివిధ వస్తువుల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈనేపథ్యంలో ఆన్లైన్ వ్యాపార లావాదేవీలను కూడా వినియోగదారుల రక్షణ చట్టం–2019 పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కొనుగోలు చేసిన వస్తువుల్లో నాణ్యత లోపించినా.. వాటి వల్ల నష్టం జరిగినా.. తూకాల్లో మోసాలకు పాల్పడినా పరిహారం కోరే హక్కు వినియోగదారుడికి ఉంటుంది. నాణ్యతలేని, కల్తీ సరుకులు విక్రయించినప్పుడు.. కాలం చెల్లిన ఔషధాలు అమ్మినా.. గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువకు విక్రయించినా.. ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యం, సేవల్లో లోపం కారణంగా నష్టం వాటిల్లినా.. ఎలక్టాన్రిక్ పరికరాలు సక్రమంగా పని చేయకపోయినా.. విత్తనాలు, ఎరువులు, పురుగు ముందులు కల్తీ జరిగినా.. బ్యాంకులు, విద్యుత్ సంస్థలు, విమానయాన సంస్థలు, బీమా సంస్థలు అందించే సేవల్లో లోపాలు ఉంటే వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. ఏ ఫిర్యాదు ఎక్కడ.. ఎంత నగదు? జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కన్జూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (వినియోగదారుల కమిషన్) పని చేస్తుంది. జిల్లా స్థాయి ఫోరం వస్తువులు/సేవల విలువ రూ.50 లక్షల్లోపు ఫిర్యాదులు పరిష్కరిస్తుంది. రూ.కోటి నుంచి రూ.2 కోట్ల మధ్య రాష్ట్ర స్థాయి, రూ.2 కోట్లకు మించిన విలువైన ఫిర్యాదులను జాతీయ స్థాయి ఫోరం పరిష్కరిస్తుంది. వస్తు సేవల్లో నష్టపోయి పరిహారం కోరాలనుకుంటే.. వివరాలను నాలుగు ప్రతులతో దరఖాస్తు చేయాలి. వస్తువుసేవల కొనుగోలు రుజువులు జతపర్చాలి. ఫోరం ఫీజు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రూ.200, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రూ.400, రూ.10 లక్షలు ఆపైన పరిహారం కోసం రూ.500 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఫిర్యాదును పరిశీలించిన తర్వాత ఫోరం స్వీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. వివిధ కారణాలతో తిరస్కరిస్తే ఫిర్యాదుదారుడు తనవాదన వినిపించవచ్చు. ఫోరంలో వినియోగదారుడే తన కేసును వాదించుకోవచ్చు. లేదా న్యాయవాదిని నియమించుకోవచ్చు.వరంగల్కు చెందిన భద్రయ్య అనే వ్యక్తి ఓ హోల్సేల్ షాపులో కారం ప్యాకెట్ కొన్నాడు. ఇంటికి వెళ్లి తెరచి చూశాడు. అది కల్తీ కారం అని గుర్తించి షాపు యాజమాని వద్దకు వెళ్లి అడిగితే అతను గొడవకు దిగాడు. శివనగర్కు చెందిన శ్రీను ఆన్లైన్లో ఓ ప్రముఖ కంపెనీకి చెందిన సెల్ఫోన్ ఆర్డర్ చేశాడు. కొరియర్లో ఇంటికి వచ్చిన బాక్స్ తెరచి చూశాడు. అందులో పనిచేయని మొబైల్ ఫోన్ ఉండడంతో బిత్తరపోయాడు. -
కొమ్మాల జాతర షురూ..
గీసుకొండ: బండ్లు తిరిగే కార్యక్రమంతో శుక్రవారం మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. రాజకీయ ప్రభబండ్ల రావడంతో ట్రాఫిక్ జాం ఏర్పడి భక్తులు, అంబులెన్స్లలోని రోగులకు ఇక్కట్లు తప్పలేదు. కాంగ్రెస్ ప్రభను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, బీఆర్ఎస్ ప్రభను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, బీజేపీ ప్రభను డాక్టర్ కాళీప్రసాదరావు ప్రారంభించారు.విద్యుత్ దీపాల వెలుగుల్లో కొమ్మాల జాతర ప్రాంగణం (ఇన్సెట్లో) నర్సింహస్వామి వారు -
సభా వేదిక దేవన్నపేట !
సాక్షిప్రతినిధి, వరంగల్ : బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతోత్సవ సభకు గ్రేటర్ వరంగల్ పరిధి దేవన్నపేట శివారును నాయకులు ఎంపిక చేశారు. 14 ఏళ్ల అవిశ్రాంత పోరాటాన్ని, పదేళ్ల పరిపాలనపై ఏడాది పాటు వేడుకలు నిర్వహించాలని భావించిన బీఆర్ఎస్.. వరంగల్ సభ ద్వారా ప్రారంభించాలని తలపెట్టింది. ఈనేపథ్యంలో గ్రేటర్ వరంగల్ పరిధి ఉనికిచర్ల, భట్టుపల్లి, దేవన్నపేట ప్రాంతాల్లో మాజీ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో ముఖ్యనేతలు ఈనెల 10న స్థలాన్ని పరిశీలించారు. అయితే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా.. సభకు హాజరయ్యే జనం ఈజీగా వచ్చిపోయేలా ఉండాలని భావించి శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, దాస్యం వినయభాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ తదితరులతో కలిసి హరీశ్రావు స్థల పరిశీలన చేశారు. జాతీయ రహదారి పక్కన ఉండడంతో పాటు నలుమూలల నుంచి వాహనాల ద్వారా వచ్చిపోయేందుకు దేవన్నపేట అనువుగా ఉంటుందని భావించి అధినేత కేసీఆర్ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. చివరికి దేవన్నపేటను ఫైనల్ చేసినట్లుగా చెప్పారు. స్థలపరిశీలన అనంతరం హరీశ్రావు సుమారు గంటపాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో మాట్లాడారు. సుమారు 15 లక్షల మందితో భారీ సభ నిర్వహించడానికి నాయకత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇదే సమయంలో సభ సక్సెస్ కోసం ఉమ్మడి వరంగల్కు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ కానున్నారని సమాచారం. బీఆర్ఎస్ రజతోత్సవ సభా స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి హరీశ్రావు తదితరులు విజయవంతానికి త్వరలో కమిటీలు.. ఉమ్మడి జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ?