మహాజాతరకు ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

మహాజాతరకు ముస్తాబు

Jan 27 2026 9:52 AM | Updated on Jan 27 2026 9:52 AM

మహాజా

మహాజాతరకు ముస్తాబు

మహాజాతరకు ముస్తాబు

8

లోu

న్యూజిలాండ్‌ టు మేడారం

ఆదివాసీ సాంస్కృతిక

సంబురం!

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : ఆదివాసీల అతి పెద్ద ఉత్సవం, తెలంగాణ కుంభమేళాకు మేడారం ముస్తాబైంది. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు రెండు వారాల ముందునుంచే గిరిజన సంప్రదాయాల ప్రకారం గుడిమెలిగె, మండమెలిగె తదితర పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఓ వైపు సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణ పనులు జరుగుతుండగానే ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాగా, ఈ నెల 28న సారలమ్మ రాకతో మొదలయ్యే జాతర 31 వరకు కొనసాగుతుంది. ఈ మేరకు జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ముస్తాబైన నయా మేడారం..

మేడారం చరిత్రలోనే తొలిసారిగా రూ.251 కోట్ల భారీ నిధులు కేటాయించారు. ఇందులో గద్దెల శాశ్వత పునరుద్ధరణకు రూ.101 కోట్లు, జాతర నిర్వహణ, భక్తుల సౌకర్యాలకు రూ.150 కోట్లకు పైగా నిధులు వెచ్చించారు. ఇది మేడారం చరిత్రలోనే అత్యధిక కేటాయింపు కావడం విశేషం. మేడారం అభివృద్ధి పనుల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నవి కొత్తగా నిర్మించిన శాశ్వత గద్దెలు. వీటితోపాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను గ్రానైట్‌ రాళ్లతో పునర్నిర్మించారు. ప్రాకారం చుట్టూ ఉన్న రాతి శిలలపై కోయ గిరిజనుల వీరగాథలు, సమ్మక్క–సారలమ్మ చరిత్ర, ఆదివాసీల గోత్రాలు, వారి ఆచార వ్యవహారాలు, వీరగాథలను ప్రతిబింబించే చిత్రాలను చెక్కారు.

భద్రతా వలయంలో మేడారం..

గతంలో వనదేవతల గద్దెల ప్రాంతంలో 2–3 వేల మంది ఉంటేనే తొక్కిసలాట జరిగేది. ఈసారి పునరుద్ధరణలో భాగంగా ఒకేసారి 7వేల నుంచి 8 వేల మంది భక్తులు దర్శించుకునేలా భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీఐపీలకు ప్రత్యేక లైన్లు, క్యూలైన్లపై జీఐ షీట్లతో పైకప్పు ఏర్పాటు చేశారు. నాలుగు గద్దెలను ఒకేసారి దర్శించుకునేలా కంపార్టుమెంట్లు నిర్మించారు. మేడారం చుట్టూ 10 కిలోమీటర్ల మేర ఫోర్‌ లేన్‌ రోడ్లు, పార్కింగ్‌కు అదనంగా 63 ఎకరాల స్థల సేకరణ చేశారు. కాగా, ఈసారి 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. 460 సీసీ కెమెరాలు, ఆర్టిిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత టెక్నాలజీ ద్వారా రద్దీని పర్యవేక్షించే సిస్టం ఏర్పాటు చేశారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి రద్దీని పర్యవేక్షిస్తూ, ప్రమాదాల్ని ముందుగానే నివారించే ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. 20 ప్రత్యేక డ్రోన్ల ద్వారా క్రౌడ్‌ మేనేజ్మెంట్‌, 20 మంది ఐపీఎస్‌ అధికారులు, 30 వేల మంది సిబ్బంది జాతర విధుల్లో ఉండనున్నారు. ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రతీ 2 కిలోమీటర్లకు ఒక చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేస్తున్నారు.

నృత్యం చేస్తున్న న్యూజిలాండ్‌కు చెందిన మావోరి తెగ ప్రతినిధులు

రేపటినుంచే మేడారంలో

తెలంగాణ కుంభమేళా

రూ.251 కోట్లతో పునరుద్ధరణ,

జాతర నిర్వహణ పనులు

జాతర ఏర్పాట్లు పూర్తయినట్లు ప్రకటన,

దర్శనానికి తరలివస్తున్న భక్తులు

28 నుంచి 31 వరకు మహా జాతర..

3 కోట్లమంది వస్తారని అంచనా

ఆకట్టుకున్న న్యూజిలాండ్‌ గిరిజనుల

సాంస్కృతిక నృత్యం

నృత్యం.. ఆదివాసీల జీవనాడి,

గుండె చప్పుడు

– ఎస్‌ఎస్‌తాడ్వాయి/ ఏటూరునాగారం

మహాజాతరకు ముస్తాబు 1
1/2

మహాజాతరకు ముస్తాబు

మహాజాతరకు ముస్తాబు 2
2/2

మహాజాతరకు ముస్తాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement