breaking news
Hanamkonda District Latest News
-
ఈత కొట్టేదెన్నడో?
వరంగల్ స్పోర్ట్స్: కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల ప్రణాళిక లేమి కారణంగా యువ స్విమ్మర్లు సాధనకు దూరమవుతున్నారు. నిత్యం సాధన చేస్తూ.. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధపడే స్విమ్మర్లకు స్విమ్మింగ్పూల్ మరమ్మతులు అడ్డంకిగా మారాయి. సుమారు ఆరు నెలలుగా సాధన లేక మానసికంగా, శారీరకంగా కుదేలవుతున్నారు. రూ.41 లక్షలు కేటాయింపు.. హనుమకొండ బాలసముద్రంలోని జిల్లా క్రీడా ప్రా ధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్విమ్మింగ్ పూల్ కొనసాగుతోంది. పూల్లో పలు మరమ్మతులు, వసతుల కల్పన కోసం డీఎస్ఏ నిధుల నుంచి రూ.41 లక్షలు కేటాయించారు. ఆయా పనుల్ని పూర్తి చేసేందుకు తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఈడబ్ల్యూడీసీ)కి అప్పగించారు. సుమారు ఆరు నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. త్వరతగతిన పూర్తి చేసి స్విమ్మర్లకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. పనుల్లో జాప్యం.. టీజీఈడబ్ల్యూఐడీసీ శాఖ ఇంజనీరింగ్ అధికారులు అబివృద్ధి పనులను కాంట్రాక్టర్కు అప్పగించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇష్టారీతిన పనులను చేస్తుండడంతో ఆరు నెలలు కావొస్తున్నా.. పూర్తి కాలేదు. హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది స్విమ్మింగ్ పూల్. అలాంటిది ఆరు నెలలుగా మూసివేయడంతో ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా పనుల్లో జాప్యం కారణంగా యువ స్విమ్మర్ల కెరియర్ నష్టపోతుంటే, ఆరోగ్య పరిరక్షణ కోసం స్విమ్మింగ్ పూల్కు వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు. స్విమ్మింగ్ పూల్ మరమ్మతు పనులు 90 శాతం పూర్తయ్యాయి, రెండు రోజుల క్రితం ట్రయల్ రన్ సైతం విజయవంతంగా పూర్తి చేశాం. చిన్న చిన్న పనులు పూర్తి చేయాల్సి ఉంది. మరో వారం రోజుల్లో డీఎస్ఏకు స్విమ్మింగ్ పూల్ను అప్పగిస్తాం. – రవీందర్, డీఈ, టీజీఈడబ్ల్యూఐడీసీ, హనుమకొండ ఆరు నెలలైనా పూర్తికాని మరమ్మతులు సాధనకు దూరమవుతున్న స్విమ్మర్లు -
కారాఘోరం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ● వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పెండ్యాల సుచరిత (36) సబ్జైలులో రిమాండ్ ఖైదీగా ఉండి మృతి చెందారు. సుబేదారి పోలీస్స్టేషన్లో నమోదైన ఓ కేసులో ఆమెను ఆగస్టు 13న నర్సంపేట సబ్ జైలుకు తరలించారు. సబ్జైలులో అనారోగ్యానికి గురైన ఆమెను నర్సంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆగస్టు 21న మృతి చెందింది.● జనగామ సబ్జైలులో ఆత్మహత్యాయత్నం చేసిన ఓ ఖైదీ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగారాజుపల్లికి చెందిన వరాల మల్లేశ్ (42) హత్యాయత్నం కేసులో జనగామ సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి మల్లేశ్ నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన అధికారులు ఖైదీని వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ...ఖైదీల్లో పరివర్తన తీసుకురావాల్సిన కారాగారాలు సహజ మరణాలు, ఆత్మహత్యలకు వేదికలవుతున్నాయి. నేరాలు, నేరస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. ఓ వైపు జైళ్ల కుదింపు, మరోవైపు విచారణలు, శిక్షలు, విడుదల లేక ఖైదీలతో కారాగారాలు కిటకిటలాడుతున్నాయి. కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అధికారులు సబ్జైళ్లలో రకరకాల పనులు చేయిస్తూ వేధిస్తుండడమే ఖైదీల మృతికి కారణంగా చెబుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే జైళ్లలో ఖైదీలకు ఆత్మహత్యకు కారకాలయ్యే వస్తువులను దూరంగా సిబ్బంది ఉంచాలి. వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఖైదీల ఆత్మహత్యాయత్నం ఘటనలు పునరావృతం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అయితే, జైలులో అంతా నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సామర్థ్యానికి మించి జిల్లా, సబ్జైళ్లలో ఖైదీలను ఉంచి.. ఆ మేరకు బడ్జెట్, సౌకర్యాలు, అధికారులు, సిబ్బంది లేక నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోందన్న చర్చ జరుగుతోంది. సిబ్బంది, ఎస్కార్ట్ కొరతతో నెలల తరబడి విచారణలు వాయిదా పడి జైళ్లనుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఫలితంగా జిల్లా, సబ్జైళ్లలో ఓ వైపు సహజ మరణాలు, మరోవైపు ఆత్మహత్యాయత్నాలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయన్న చర్చ జరుగుతోంది. ఖైదీలు పెరుగుతున్నా.. మారని పరిస్థితులు ఖైదీల సంఖ్య పెరుగుతున్నా.. అందుకు అనుగుణంగా జైళ్ల పరిస్థితి మారడం లేదు. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇటీవల విడుదల చేసిన ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా–2023’లో ఇవే అంశాలను ప్రస్తావించింది. ఈ లెక్కల ప్రకారం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగే అయినప్పటికీ.. రాష్ట్రంలో అన్ని రకాల జైళ్లు కలిపి 50 ఉండగా.. అన్నింట్లో సామర్థ్యాన్ని మించి ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్లో వరంగల్ సెంట్రల్ జైలుతోపాటు పరకాల, జనగామ, మహబూబాబాద్, నర్సంపేట సబ్జైళ్లలో కలిపి సుమారు 680 మంది ఖైదీలు ఉండాలి. వరంగల్ సెంట్రల్ జైలు కూల్చివేసే నాటికి ఒక్క ఆ జైలులోనే వెయ్యి మంది వరకు ఉన్నట్లు రికార్డులున్నాయి. 2021లో సెంట్రల్ జైలు ఎత్తివేయగా.. నర్సంపేట సబ్జైలును కూడా రద్దు చేశారు. వీటి స్థానంలో మామునూరు ఒక ఓపెన్ ఎయిర్ జైలును ప్రతిపాదించారు. నర్సంపేట సబ్జైలు స్థానంలో మహిళల ప్రత్యేక జైలు ఏర్పాటు చేశారు. జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, పరకాలతోపాటు ఓపెన్ ఎయిర్ జైలు కలిపితే.. వాటిలో ఖైదీల సామర్థ్యం 50 నుంచి 80 లోపలే. ఆమేరకు పెట్టుకుని ఇతర ఖైదీలను ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్ జైళ్లకు తరలించాల్సి ఉండగా.. ఉమ్మడి వరంగల్లోని పోలీస్స్టేషన్లలో నమోదైన వివిధ కేసుల్లో విచారణ ఖైదీలు, శిక్షలు పడిన వారు సుమారు 300 మంది జిల్లాల్లోని జైళ్లలోనే ఉంటుండడంతో అవి కిక్కిరిసిపోతున్నాయి. వాంతులు, విరేచనాలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ముందుగా ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు ఖైదీల మరణానికి కారణం కావొచ్చు. జైలులో సరైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోతే చిన్న ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రమై ప్రాణాంతకంగా మారుతాయి. జైలులోని ఒత్తిడితో కూడిన వాతావరణం కూడా ఖైదీల ఆరోగ్య పరిస్థితిని క్షీణింపజేసి మరణానికి దారితీస్తుంది. అయితే, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా ఇవి తేలుతాయి. – డాక్టర్ కేశవులు, మానసిక వైద్య నిపుణుడు సబ్జైలులో సహజ మరణాలకు అనారోగ్యమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఉన్న ఆరోగ్య సమస్యలు, జైలులో సరైన వైద్య సంరక్షణ లేకపోవడం, జైలు వాతావరణం వల్ల వచ్చే ఒత్తిడి వంటి కారణాల వల్ల మరణాలు తరచూ సంభవిస్తాయంటున్నారు. జైలు, పోలీసు కస్టడీలో మరణాలకు గుండె జబ్బుల వంటివి సాధారణంగా కనిపిస్తాయని వైద్య నిపుణుల అభిప్రాయం. జైళ్ల కుదింపుతో ఇబ్బడిముబ్బడిగా విచారణ ఖైదీలు కరువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ సంచలనంగా జనగామ సబ్జైలు ఖైదీ ఆత్మహత్య.. -
ఓరుగల్లును మరువలేను
● హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ● ఎక్స్లో ట్వీట్ చేసిన ‘సాక్షి’ క్లిప్పింగ్ ఖిలా వరంగల్: ‘చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఓరుగల్లుతో అనుబంధం మరువలేను. నా హృదయంలో ఓరుగల్లుకు ప్రత్యేక స్థానం ఉంది’ అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మధుర జ్ఞాపకాన్ని ఆదివారం మరోసారి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు. 17 ఏళ్ల క్రితం వరంగల్ ఎస్పీగా ఉన్న సమయంలో తన సతీమణితో కలిసి చారిత్రక ఖిలా వరంగల్ కోటను సందర్శించారు. ‘కోటలో ఖాకీబాస్’ శీర్షికతో సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇలా వరంగల్ నగరంపై తనకు ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేశారు. -
నేడు గ్రేటర్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై రాత పూర్వకంగా ఫిర్యాదులు అందించాలని కోరారు. వరంగల్ కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు అండర్–19 బాలబాలికల క్రీడా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–19 ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి రోజు వాలీబాల్, యోగా, టగ్ఆఫ్వార్, త్రోబాల్, టేబుల్ టెన్నిస్, మకంబ్, సాఫ్ట్టెన్నిస్, బీచ్వాలీబాల్, తంగ్తా మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్, సాఫ్ట్బాల్, అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్, రగ్బీ క్రీడలు, రెండో రోజు (14వ తేదీన) హ్యాండ్బాల్, చెస్, రెజ్లింగ్, షటిల్ బ్యాడ్మింటన్, హాకీ, బెల్ట్ రెజ్లింగ్, సైక్లింగ్ రోడ్, సైక్లింగ్ ట్రాక్, స్కేటింగ్, బేస్బాల్, లాన్టెన్నిస్, బాల్ బ్యాడ్మింటన్, తైక్వాండో, 15వ తేదీన క్రికెట్, క్యారమ్స్, కరాటే, సెపక్తక్రా, కురేష్, కలరిపాయట్టు, ఫెన్సింగ్, పవర్లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, బాక్సింగ్, ఖోఖో క్రీడాంశాల్లో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హన్మకొండ: బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ ఎన్జీఓస్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో రాకేశ్రెడ్డిని విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 200 పాఠశాలల్లో రూ.180 కోట్ల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం 80 నుంచి 200కు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు పెంచి, 8 వేల నుంచి 25 వేల మంది వరకు విద్యార్థుల సంఖ్య పెంచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావొస్తున్నా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులను పాఠశాలల్లోకి అనుమతించడం లేదన్నారు. సమస్యను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో చర్చించి బాధిత తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాలల యాజమాన్యాలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన భరోసా ఇచ్చారు. కాళోజీ సెంటర్: విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ‘ఎ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్’ అనే కొత్త పాఠ్యాంశానికి సంబంధించిన కార్యక్రమంపై ఈనెల 14, 15, 16 తేదీల్లో టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు వరంగల్ డీఈఓ రంగయ్య నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 9వ తరగతికి బోధించే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, గణితం ఉపాధ్యాయులు ప్రభుత్వ, స్థానిక సంస్థల తెలంగాణ రెసిడెన్షియల్ సొసైటీ పాఠశాలలు, కేజీబీవీ ఉపాధ్యాయులు పాల్గొనాలని సూచించారు. ఉపాధ్యాయులు వీలైతే సొంత లాప్టాప్, ట్యాబ్ లేదా ఇటీవల విద్యాశాఖ అందించిన ఏ బుక్ ఆన్ డిజిటల్ ఆర్ని వెంట తెచ్చుకోవాలని సూచించారు. -
నిబద్ధత కలిగిన వారికే డీసీసీ పీఠం
హన్మకొండ చౌరస్తా: నిబద్ధత, సామర్థ్యం, కార్యకర్తల అభిమానం కలిగిన వారికే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పీఠం దక్కుతుందని వరంగల్, హనుమకొండ జిల్లాల ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ అన్నారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్నాయక్ మాట్లాడారు. డీసీసీ అధ్యక్షుల భర్తీ కార్యక్రమంతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంఘటన శ్రీయన్ అభియాన్ పార్టీ పునఃనిర్మాణానికి మొదటి అడుగు పడిందన్నారు. నూతన డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం దరఖాస్తుల స్వీకరణతోపాటు నియోజకవర్గాలు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ప్రతీ కార్యకర్త, ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తామన్నారు. ఈ అభియాన్ ద్వారా అధికారం కొంతమందికి మాత్రమే పరిమితం కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, యువత అన్ని వర్గాలకు నాయకత్వ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. అధ్యక్ష నియామక ప్రక్రియలో భాగంగా సోమవారం డీసీసీ భవన్లో హనుమకొండ జిల్లాస్థాయి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 14న పరకాల, 16న వరంగల్ తూర్పు, 17న వర్ధన్నపేట, 18న నర్సంపేట నియోజకవర్గం పరిధి కాంగ్రెస్ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో పీసీసీ జిల్లా పరిశీలకులు దుర్గం భాస్కర్, మసూద్, రేణుక, కో–ఆర్డినేటర్ ఆదర్శ్జైస్వాల్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఈవీ శ్రీనివాస్రావు, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ బొమ్మతి విక్రమ్, వెంకట్రెడ్డి, శ్రవణ్, సాగరిక, స్వప్న తదితరులు పాల్గొన్నారు.ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ -
బీసీలు బలహీనులు కాదు
● ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ హన్మకొండ: రిజర్వేషన్లు బీసీల పౌర హక్కు అని ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ అన్నారు. ఆదివారం హనుమకొండ రాంనగర్లోని బీసీ భవన్లో సుందర్ రాజు యాదవ్ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల సాధనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. బీసీలు బలహీనులు కాదని, బాహుబలులన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం అవకాశం కల్పిస్తామని ఆశ చూపి మోసం చేశారన్నారు. ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ.. కేంద్రంలో పరిపాలించిన రెండు జాతీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సమావేశంలో ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ టి.విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, ఆయా సంఘాల నాయకులు వడ్లకొండ వేణుగోపాల్, మౌనిక గౌడ్, పులి రజనీకాంత్, మేధావులు పాల్గొన్నారు. -
పచ్చదనం పెంపొందించాలి
వరంగల్ అర్బన్: నగర ప్రధాన రహదారుల నడుమ ఉన్న సెంట్రల్ మీడియమ్స్లో పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి సూచించారు. ఆదివారం హనుమకొండ అదాలత్, సుబేదారి ప్రాంతాల్లో మేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమర్థంగా చేపట్టేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగరంలోని ప్రధాన రోడ్ల మధ్య గ్రీనరీ ఉండేలా చూడాలని, పచ్చదనం కోసం గ్రీన్ బడ్జెట్ పేరిట 10% నిధులు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. మొక్కలు నాటడమే కాకుండా ఏపుగా పెరిగేందుకు సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. మేయర్ వెంట హెచ్ఓ లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.మేయర్ గుండు సుధారాణి -
ఎమ్మెస్సీ సైకాలజీ మరింత దూరం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఫర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీఓఈ) విధానంలో పీజీ కోర్సుగా ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు ఈ విద్యాసంవత్సరం (2025–26)లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)అనుమతించలేదు. దేశవ్యాప్తంగా కూడా ఓడీఎల్మోడ్లో, ఆన్లైన్ మోడ్లో ఈ కోర్సు నిర్వహించకూడదని ఈఏడాది ఆగస్టులో యూజీసీ దూర విద్యవిధానంలో ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సులను నిర్వహిస్తున్న వర్సిటీలకు, ఓపెన్ వర్సిటీలను కూడా ఆదేశిస్తూ లేఖలను పంపింది. ఇప్పటికే 2025–26 విద్యాసంవత్సరంలో కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య సీడీఓఈలో అన్ని పీజీ కోర్సులతోపాటు ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో కొందరు ఇప్పటికే ఈకోర్సులో ప్రవేశాలు పొందారు. ప్రవేశాలు కొనసాగుతుండగానే ఈ సైకాలజీ కోర్సును నిర్వహించవద్దని యూజీసీ లేఖతో ఇక ఆకోర్సులో ప్రవేశాల కల్పన నిలిపేశారు. దూరవిద్య విధానంలో ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సుకు బాగా డిమాండ్ ఉంది. ప్రతీ విద్యాసంవత్సరంలో కేయూలోని దూరవిద్యలో సుమారు 150 నుంచి 200 మంది వరకు విద్యార్థులు అడ్మిషన్లు పొంది చదువుతున్నారు. ప్రధానంగా యువతే కాకుండా వివిధ ఫ్రొఫెషనల్స్ ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సులో దూరవిద్య విధానం ద్వారా చదివారు. చదవుతున్నవారు ఉన్నారు. డిమాండ్ ఉన్న కోర్సు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దూరవిద్య విధానంలో 2004 నుంచి ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సు నిర్వహిస్తున్నారు. సుమారు 21 ఏళ్లలో ఎంతోమంది ఈ కోర్సును పూర్తి చేశారు. సైకాలజీ కోర్సులు పూర్తి చేసిన వారు కొందరు వివిధ విద్యాలయాల్లో ఉద్యోగాలు పొందారు. సైకాలజీ కౌన్సెలర్లుగా కూడా ఉద్యోగాలు పొందారు. బాగా డిమాండ్ ఉన్న కోర్సుతో యూనివర్సిటీకి ఆదాయం కూడా బాగానే సమకూరుతోంది. ఇప్పుడు యూజీసీ ఈకోర్సును నిర్వహించవద్దని లేఖ పంపడంతో ఆకోర్సు చేయాలనుకునేవారికి ఇక అవకాశం లేకుండా పోయింది. అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలోనూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో కూడా ఈ విద్యాసంవత్సరం 2025–26లో ఎమ్మెస్సీ సైకా లజీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తుండగానే ఆన్లైన్ కోర్సుగా నిర్వహించవద్దని యూజీసీ నుంచి ఈఏ డాది ఆగస్టు 12 అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీకి లేఖ పంపారు. దీంతో ప్రవేశాలు నిలిపేశారు. ఇప్పటికే సుమారు 340 మంది వరకు చేరిన విద్యార్థులకు మీరు ఇతర పీజీ కోర్సులకు చేరాలనుకుంటే ఆప్షన్ ఇవ్వాలని సూచించగా అందులో కేవలం 60 మంది విద్యార్థులు మాత్రం ఇతర పీజీ కోర్సుల్లో చేరారు. మిగతా వారికి చెల్లించిన ఫీజును రీఫండ్ చేయాలని నిర్ణయించినట్లు అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ స్టూడెంట్స్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు తెలిపారు. ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, బయోటెక్నాలజీ, క్లినికల్ న్యూ ట్రిషన్ తదితర కోర్సులకు ఓడీఎల్ మోడ్ అండ్ ఆన్లైన్ మోడల్లో నిర్వహించకూడదని కూడా యూ జీసీ వర్సిటీలకు లేఖలు పంపినట్లు సమాచారం. దూరవిద్యలో 2024–25 బ్యాచ్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఈకోర్సు యథావిధిగా కొనసాగనుంది. ఆయా విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఈ విద్యాసంవత్సరం (2025–26) ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సులో మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు వారు చెల్లించిన ఫీజును రీఫండ్ ఇవ్వబోతున్నాం. ఎవరైనా వేరే పీజీ కోర్సు చేస్తామంటే వారికి వేరే కోర్సులోకి మార్చతాం. ఎన్సీఏహెచ్పీ యాక్ట్ 2021 ప్రకారం ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సును నిర్వహించేందుకు వీలులేదనేది యూజీసీ నిర్ణయించినట్లు సమాచారం. అయితే రెగ్యులర్ కోర్సులుగా ఎమ్మెస్సీ సైకాలజీ కోర్సును యథావిధిగా నిర్వహించనున్నారు. కేయూలో ఎమ్మెస్సీ సైకాలజీ రెగ్యులర్ కోర్సు యథావిధిగా కొనసాగనుంది. – వి.రామచంద్రం, కేయూ రిజిస్ట్రార్ డీఎల్, ఆన్లైన్ మోడ్లో నిర్వహించొద్దు యూనివర్సిటీలకు లేఖలు ఇప్పటికే అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఫీజు రీఫండ్ గత విద్యా సంవత్సర విద్యార్థులకు యథావిధిగా.. -
చిన్న తగాదా ప్రాణం తీసింది
జనగామ: రిమాండ్ ఖైదీ.. టాయిలెట్లో ఉన్న బ్లీచింగ్ పౌడర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లికి చెందిన వారాల మల్లయ్య (42), అదే గ్రామానికి చెందిన పడకంటి బ్రహ్మచారి మధ్య గత నెల 23వ తేదీన స్నేహపూరిత వాతావరణంలో చిన్న తగాదా చోటు చేసుకుంది. ఆ ఘటనలో మల్లయ్య కర్రతో కొట్టగా, బ్రహ్మచారి చెయ్యి విరగడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి మల్లయ్యను ఈ నెల 8వ తేదీన కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో మల్లయ్యను అదే రోజు సాయంత్రం జనగామ సబ్జైల్కు పంపించారు. చిన్న తగాదాకు పోలీసులు కేసు నమోదు చేసి తనను జైలుకు పంపించారని మల్లయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. నాలుగు రోజులుగా సబ్జైలులో ఉంటున్న మల్లయ్య ఈ నెల11వ తేదీన ఉదయం అందరి ఖైదీల్లాగే టిఫిన్ చేసేందుకు బయటకు వచ్చాడు. అనంతరం సబ్జైలు ప్రాంగణంలో ఉన్న టాయిలెట్లోకి వెళ్లి అందులో ఉన్న బ్లీచింగ్ పౌడర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి స్వయంగా జైలు అధికారులకు చెప్పాడు. వెంటనే జైలు అధికారులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి (సుమారు మధ్యాహ్నం 12.40 నిమిషాలకు)కి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల12న మృతి చెందాడు. సబ్ జైలు ఎదుట ఆందోళన.. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బాధితులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో సబ్ జైలు ఎదుట ఆందోళన చేపట్టారు. రూ.50 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుడికి భార్య హైమ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విచారణకు రానున్న ఎన్హెచ్ఆర్సీ బృందం జనగామ సబ్ జైలులో రిమాండ్ ఖైదీ మృతి ఘటనలో నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) బృందం ఆధ్వర్యంలో విచారణ జరుపనున్నారు. ఇందుకు సంబంధించి వారికి లేఖ సైతం వెళ్లినట్లు సమాచారం. సబ్ జైలులో బ్లీచింగ్ పౌడర్ తాగిన రిమాండ్ ఖైదీ చికిత్స పొందుతూ మృతి -
శిల్ప కళా సౌందర్యం మహాద్భుతం
వెంకటాపురం(ఎం)/ ఖిలా వరంగల్: కాకతీయుల నిర్మాణాలు, శిల్ప కళా సౌందర్యం మహాద్భుతంగా ఉందని వరల్డ్ హెరిటేజ్ వలంటీర్లు అన్నారు. వరల్డ్ హెరిటేజ్ క్యాంపెయిన్లో భాగంగా రామప్పలో శిక్షణ పొందుతున్న వలంటీర్లు ఆదివారం పలు ఆలయాలను సందర్శించారు. రేగొండ పరిధిలోని పాండవుల గుట్ట, వరంగల్లోని వేయిస్తంభాల గుడి, ఖిలా వరంగల్తో పాటు పలు పర్యాటక ప్రదేశాలను పరిశీలించారు. ఆలయాల విశిష్టత గురించి ప్రొఫెసర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి కాకతీయుల కట్టడాలు, శిల్ప సంపద బాగుందని, వీటిని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో క్యాంపు కోఆర్డినేటర్ శ్రీధర్రావు, ప్రొఫెసర్ పాండురంగారావు, టూరిజం అసిస్టెంట్ ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులు నైపుణ్యం పెంపొందించుకోవాలి
హన్మకొండ: ఉద్యోగులు నైపుణ్యం పెంపొందించుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి అ న్నారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ప ర్యటనలో ఆదివారం వరంగల్ రీజియన్ను సందర్శించారు. హనుమకొండలోని వరంగల్ రీజియన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిపోల వా రీగా ప్రగతిని సమీక్షించారు. ఆర్ఎం డి.విజయభాను, డిప్యూ టీ ఆర్ఎంలు, డిపో మేనేజర్లు డిపో వారీగా కార్యక్రమాలు, వస్తున్న ఆదాయం, తిరుగుతున్న కిలో మీటర్లు తదితర వివరాలు ఎండీకి వివరించారు. అనంతరం హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ను పరిశీలించారు. వరంగల్–1 డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన డ్రైవర్లు, కండక్టర్లకు ప్రగతి చక్రం పురస్కారాలు అందించారు. అనంతరం మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీకి ప్రయాణికులే దేవుళ్లన్నారు. వారిని ఆదరించి మర్యాదగా ప్రవర్తిస్తూ ఆక్యుపెన్షీ రేషియో పెంచుకోవాలన్నారు. ప్రజలకు సేవ చేయడం మన బాధ్యత అన్నారు. ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను స్ఫూర్తిగా తీసుకుని మిగతావారు పోటీ పడి పని చేయాలన్నారు. వ్యయం తగ్గించడంతోపాటు ఆదాయం పెంపుపై దృష్టి సారించాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వరంగల్ నగరానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయన్నారు. వరంగల్ రీజియన్ పనితీరు బాగుందని కితాబు ఇచ్చారు. టెండర్లలో అక్రమాలు జరిగాయని విలేకరుల ఆయన దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి రుజువైతే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ పి.సోల్మన్, ఆర్ఎం డి.విజయభాను, డిప్యూటీ ఆర్ఎంలు కేశరాజు భానుకిరణ్, మహేశ్, డిపో మేనేజర్లు, అద్దె బస్సుల యజమానులు పాల్గొన్నారు. ప్రయాణికులే సంస్థకు దేవుళ్లు ప్రజలకు సేవలందించడం మన బాధ్యత ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి -
నాలుగు రైళ్ల దారి మళ్లింపు
కాజీపేట రూరల్: దానాపూర్–బెంగళూరు–దానాపూర్ మధ్య ప్రయాణించే సూపర్ఫాస్ట్ రైళ్ల సర్వీస్లకు అక్టోబర్ 13 నుంచి 16వ తేదీ వరకు కాజీపేట, సికింద్రాబాద్, గుంతకల్, ధర్మవరం స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు రైల్వే అధికారులు ఆదివారం తెలిపారు. దారి మళ్లించిన రైళ్లు ఇవే.. ఈ నెల 13న దానాపూర్–ఎస్ఎంవీవీ బెంగళూరు (03251) ఎక్స్ప్రెస్, ఈ నెల 15న ఎస్ఎంవీటీ బెంగళూరు–దానాపూర్ (03252) ఎక్స్ప్రెస్, ఈ నెల 14న దానాపూర్–ఎస్ఎంవీటీ బెంగళూరు (03259) ఎక్స్ప్రెస్, ఈ నెల 16న ఎస్ఎంవీటీ బెంగళూరు–దానాపూర్ (03260) సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు వరంగల్, విజయవాడ, ఒంగోలు, గూడూరు, పెరంబూర్, కటిపాడి, జోలర్పెట్టయ్, బంగారపేట్, వైట్ఫీల్డ్ మీదుగా కాకుండా వయా బల్లార్షా, కాజీపేట, సికింద్రాబాద్, సులేహలీ వెస్ట్, గుంతకల్, ధర్మవరం మీదుగా వెళ్లనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. -
బీసీలకు సముచిత స్థానం కల్పించాలి
హన్మకొండ: టీపీసీసీ త్వరలో చేపట్టనున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం సముచిత స్థానం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసిందని గుర్తుచేశారు. ఇందులో భాగంగా సంస్థాగతంగా నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ పదవుల్లో బీసీలకు సరైన వాటా కల్పించాలన్నారు. రాష్ట్రంలో 33 జిల్లాల్లో 17 డీసీసీ అధ్యక్ష పదవులు, వరంగల్ ఉమ్మడి 6 జిల్లాల్లో 3 డీసీసీ అధ్యక్ష పదవులను బీసీలకు కేటాయించి మాట నిలుపుకోవాలని ఏఐసీసీ, టీపీసీసీని కోరారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ కమిటీకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల కళాశాలల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా జె.సోమన్న (ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల) ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కె.సునీల్రెడ్డి (బొల్లికుంట వీసీపీఈ ఫిజికల్ డైరెక్టర్), ఉపాధ్యక్షులుగా పి.అజయ్, ఎస్.కుమారస్వామి, బి.రమేశ్, జి.సునీత, కోశాధికారిగా ఎస్.కిరణ్కుమార్గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా ఎం.కుమారస్వామి, కె.మధుకర్, బి.వెంకట్రామ్, జె.జేత్యాతోపాటు కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మహ్మద్ కరీం వ్యవహరించారు. నాలుగేళ్ల పాటు ఈ కార్యవర్గం కొనసాగుతుంది. క్రెడాయ్ సేవలు అభినందనీయంహన్మకొండ చౌరస్తా: క్రెడాయ్ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. క్రెడాయ్ ఆధ్వర్యంలో ఆదివారం పబ్లిక్గార్డెన్లో నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం గొప్ప పుణ్యకార్యం, అలాంటి కార్యక్రమంలో యువత ముందుండడం సంతోషంగా ఉందన్నారు. మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, రెడ్క్రాస్ పాలకమండలి సభ్యుడు ఈవీ శ్రీనివాస్రావు, క్రెడాయ్ వరంగల్ అధ్యక్షుడు నాయిని అమరేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాఖమూరి అమర్, చైర్మన్ తిరుపతిరెడ్డి, బాధ్యులు శ్రీనివాస్రెడ్డి, రవీందర్రెడ్డి, రజనీకాంత్రెడ్డి, రాజేందర్రెడ్డి, కొండారెడ్డి, నాగరాజు పాల్గొన్నారు. కడిపికొండలో కారు బీభత్సం కాజీపేట అర్బన్ : కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో ఆదివారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కాజీపేట నుంచి వరంగల్ వైపునకు వెళ్తున్న కారు ఓవర్ స్పీడ్తో కడిపికొండ బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న ద్విచక్రవాహనదారుడిని ఢీ కొట్టగా అతడికి తీవ్రగాయాలయ్యా యి. ఇదే కారు కొద్ది దూరంలోని వైన్స్ ఎదుట రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఢీకొట్టగా కాలు విరిగింది. క్షతగాత్రులను 108 సిబ్బంది శివకుమార్, రాజ్సింగ్ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, కారు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం ద్వారానే ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కారును మడికొండ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. -
వావ్.. వరంగల్
‘హైఫై’గా ఓరుగల్లు రైల్వే స్టేషన్..వరంగల్ రైల్వేస్టేషన్ సాక్షి, వరంగల్/ఖిలా వరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునిక సదుపాయాలతో ప్రయాణికులకు సాదర స్వాగతం పలుకుతోంది. అమృత్భారత్ పథకంలోభాగంగా రూ.25.41కోట్ల వ్యయంతో కాకతీయుల కళావైభవం ఉట్టిపడేలా పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఫలితంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ఏమాత్రం తీసిపోకుండా ఈ రైల్వే స్టేషన్లో కార్పొరేట్ సదుపాయాలు అందుబాటులోకి వ చ్చాయి. కాకతీయుల తోరణం, రెండు స్తంభాలపై రెండు ఏనుగులు, విశాలమైన ఫుట్ఓవర్ బ్రిడ్జి, శి ల్ప కళా సంపద ఉట్టిపడేలా ఎలివేషన్, ర్యాంపులు, ల్యాండ్ స్కేపింగ్, టికెట్ కౌంటర్, ప్లాట్ఫామ్ లతో పాటు గోడలకు ఇరువైపులా కళాకృకతులు, నూతన హంగులతో వెయిటింగ్ హాళ్లను తీర్చిదిద్దారు. ఫలితంగా ఐదేళ్ల క్రితం స్టేషన్లో ఉన్న సదుపాయాలతో పోలిస్తే ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీతోకూడిన అభివృద్ధితోపాటు సదుపాయాలు కల్పించారు. స్వచ్ఛభారత్లో ఇప్పటికే ఉత్తమ అవార్డు.. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి, ఆదాయంలో దూసుకెళ్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఉమ్మడి జిల్లాల ప్రజలు ఎక్కువ వరంగల్ రైల్వే స్టేషన్ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు ప్రయాణికుల సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యమినిస్తున్నారు. ఇందులో భాగంగా మూడు ప్లాట్ ఫామ్లతోపాటు స్టేషన్ పరిసరాలు పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నారు. ఈ చర్యలతో స్వచ్ఛ భారత్లో వరంగల్ రైల్వేస్టేషన్కు ఉత్తమ అవార్డు లభించింది. స్టేషన్ ఎదుట, ప్లాట్ఫామ్ల మధ్య పచ్చదనం కోసం గ్రీనరీ, పలు రకాల మొక్కలు పెంచుతున్నారు. వీటిని విధిగా సంరక్షిస్తుండడంతో రైల్వే స్టేషన్ ప్రాంగణం పచ్చగా కళకళలాడుతోంది. ఏఏ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయంటే.. వృద్ధులు, మహిళలు, పిల్లలు మెట్లు ఎక్కడానికి, దిగడానికి ఇబ్బంది పడకుండా లిఫ్ట్లు, ఎస్కలేటర్లు సౌకర్యాలు కల్పించారు. ఒకటి, రెండు, మూడో నంబర్ ప్లాట్ఫామ్ల మధ్య ఆరు లిఫ్ట్లు, ఏడు ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా లగేజీతో వచ్చే ప్రయాణికులకు ఇవి ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయి. రైల్వేస్టేషన్ ప్లాట్ఫామ్పై మినరల్ వాటర్ లీటర్ కేవలం రూ.5కే సరఫరా చేస్తున్నారు. ప్లాట్ ఫామ్లపై పలుచోట్ల మొబైల్ ఫోన్ల చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఇంటర్నెట్ కోసం వైఫై సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికులకు వీవీఐపీ, ఏసీ, నాన్ ఏసీ వెయింటింగ్ హాళ్లు, ప్లాట్ఫామ్పై స్టీల్ కుర్చీలు, గద్దెలు, సిమెంట్ బెంచీలు, విశాలమైన టికెట్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. స్టేషన్ ఆవరణ, ప్లాట్ఫామ్లు పరిశుభ్రంగా ఉంచడానికి పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఇందులోభాగంగా ప్రయాణికులు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పలు చోట్ల డస్ట్ బిన్లు అందుబాటులో ఉంచారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు రుచికరమైన భోజనంతోపాటు రైల్ కోచ్లో ఆహారం తిన్నామన్నా అనుభూతి కలిగించేలా రైల్ కోచ్ హోటల్నే ఏర్పాటుచేశారు. సమీప ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో పాటు సిటీవాసులు ఇక్కడ రుచికరమైన టీ,టిఫిన్, భోజనం చేసి ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరు రైల్వే స్టేషన్ ఎదుట గార్డెనింగ్, పురాతన డీజిల్ రైలు ఇంజన్ చూస్తూ సేదదీరుతూ కనిపిస్తున్నారు. ఓవైపు కాకతీయ కళావైభవం.. ఇంకోవైపు కార్పొరేట్ హంగులు ప్రయాణికులకు అందుబాటులో ఏసీ, నాన్ ఏసీ వెయింటింగ్ హాళ్లు లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ర్యాంపులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి రూ.5కే మినరల్ వాటర్ ఇంటర్నెట్ కోసం వైఫై.. పరిశుభ్రత, పచ్చదనానికి ప్రాధాన్యంప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతోంది..వరంగల్ రైల్వేస్టేషన్కు ప్రతీరోజు సుమారు 24 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరి ద్వారా వార్షిక ఆదాయం 2024–2025లో సుమారు రూ. 82 కోట్లు ఉంది. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని ఇంకా పెంచుకునే దిశగా ఆలోచించి ప్రయాణికులకు కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించాం. ఇందులోభాగంగా స్టేషన్ ప్రాంగణంలో లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, వైఫై, టికెట్ బుకింగ్ కౌంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రతీ ప్లాట్ఫామ్పై లిఫ్ట్, ఎస్కలేటర్ను ఏర్పాటు చేశాం. స్టేషన్ ప్రధాన ప్రవేశ మార్గాన్ని, రిజర్వేషన్ టికెట్ బుకింగ్ కౌంటర్లను అధునాతనంగా తీర్చిదిద్దాం. ఇక్కడి నుంచి ఉన్నత శ్రేణి తరగతుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. – సారయ్య, స్టేషన్ మేనేజర్, వరంగల్ -
294 వైన్స్.. 258 దరఖాస్తులు!
కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైన్స్కు దరఖాస్తు చేసేందుకు మద్యం వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 11 వరకు 294 వైన్స్కు కేవలం 258 దరఖాస్తులు రావడం గమనార్హం. సగటున ఒక వైన్స్కు ఒక దరఖాస్తు కూడా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం వైన్స్ టెండర్ల దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచింది. దీంతో మద్యం వ్యాపారులు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. మరో వైపు దీపావళి బాణసంచా అమ్మే వ్యాపారుల్లో సగం మంది మద్యం వ్యాపారం చేస్తారు. రూ.3 లక్షలు పెట్టి బాణసంచా విక్రయిస్తే రూ.6 లక్షలు వస్తాయి కదా.. ఇక మద్యం దరఖాస్తులు ఎందుకు అని వారు అనుకుంటున్నట్లు సమాచారం. కాగా, మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. వైన్స్కు బదులు ఓటర్లకు సమర్పించుకుంటే ఎన్నికల్లో నైనా నెగ్గుతామంటూ దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు. 23న లక్కీడ్రా.. వైన్స్కు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 18 చివరి తేదీగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దరఖాస్తుకు గడువు 6 రోజులు మాత్రమే మిగిలింది. అక్టోబర్ 23వ తేదీన లక్కీ డ్రా ద్వారా వైన్స్ కేటాయిస్తారు. 2023–25లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 15,926 దరఖాస్తులకు రూ.318 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ, ఈసారి 30 వేల దరఖాస్తులు, రూ.500 కోట్ల ఆదాయం రావాలని పెట్టుకున్న టార్గెట్ను కనీసం చేరుకుంటారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏ జిల్లాలోనూ సెంచరీ దాటని అర్జీలు రూ.3 లక్షల ఫీజు, దీపావళి, స్థానిక ఎన్నికల ఎఫెక్ట్ దరఖాస్తు చేసుకోవడానికి మిగిలింది ఇక 6 రోజులేఉమ్మడి వరంగల్ జిల్లాలో వైన్స్లు, దరఖాస్తుల వివరాలు.. జిల్లా వైన్స్ దరఖాస్తులు వరంగల్ అర్బన్ 67 89 వరంగల్ రూరల్ 57 49 జనగామ 50 34 మహబూబాబాద్ 61 57 భూపాలపల్లి 59 29 -
చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డిహన్మకొండ చౌరస్తా: ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఆదివారం పల్స్పోలియోను నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ కమిషనర్ చాహత్బాజ్పాయ్, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈవీ శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ అప్పయ్య, జీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రెండు చుక్కలతో చిన్నారులకు ఆరోగ్య భద్రత ఖిలా వరంగల్: రెండు పోలియో చుక్కలు చిన్నారుల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తాయని కలెక్టర్ సత్యశారద అన్నారు. పల్స్ పోలియో సందర్భంగా ఆదివారం వరంగల్ 35వ డివిజన్ పుప్పాలగుట్ట పీహెచ్సీ కేంద్రంలో డీఎంహెచ్ఓ సాంబశివరావు ఆధ్వర్యంలో చిన్నారులకు చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్స్పోలియో సక్సెస్.. గీసుకొండ: వరంగల్ నగర పరిధిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైందని డీఎంహెచ్ఓ సాంబశివరావు తెలిపారు. ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో 20,128 (స్థానికేతరులతో కలిపి) మంది చిన్నారులకు చుక్కల మందు వేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
మైక్రోలైట్ విమానంలో ఎయిర్వింగ్ శిక్షణ
ఎన్సీసీ కేడెట్ల గగన విహారం మామునూరు: వరంగల్ మామునూరు విమానాశ్రయంలో తెలంగాణ 4వ ఎన్సీసీ ఎయిర్ వింగ్ బెటాలియన్ ఆధ్వర్యంలో శనివారం మైక్రోలైట్ విమానంలో ఎన్సీసీ కేడెట్లు ఉత్సాహంగా గగనంలో విహరించారు. మైక్రోలైట్ విమాన పనితీరు తెలుసుకున్నారు. ముఖ్య అతిథిగా ఎయిర్ స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్, వింగ్ కమాండర్ ఆశిష్ ధనాకే హాజరై మైక్రోలైట్ విమానంలో సంచరిస్తూ ఎన్సీసీ కేడెట్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అత్యవసర సమయంలో ఎన్సీసీ కేడెట్ల సేవల్ని దేశం కోసం ఉపయోగిస్తామని, అందుకే ఎయిర్ వింగ్ శిక్షణ ఇస్తున్నట్లు కమాండర్ ఆశిష్ధనాకే తెలిపారు. శిక్షణలో వర్ధన్నపేట జిల్లా పరిషత్ పాఠశాల ఎన్సీసీ ఆఫీసర్ నిమ్మ మనుజేందర్రెడ్డి, సార్జెంట్ రెడ్డి, సార్జెంట్ రాయ్, సుమాన్ సింగ్, హెచ్ఎం కాయిత శ్రీనివాస్, ఎన్సీసీ కేడెట్లు పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణలో భారీ అక్రమాలు
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో ధాన్యం సేకరణ ప్రక్రియలో అతి పెద్ద ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చిందని రాష్ట్ర సివిల్ సప్లై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శశిధర్రాజు, ఓఎస్డీ ప్రభాకర్, ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధాన్యం కొనుగోలులో గుర్తించిన అక్రమాలు, తీసుకున్న చర్యలపై ఎస్పీ మాట్లాడుతూ.. రబీ 2024–25 సీజన్లో అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు కలిసి కుట్ర చేసి, నకిలీ రైతులను సృష్టించి ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించారని తెలిపారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా, ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ నిఘా పెట్టి విచారణ జరిపి అక్రమాలు గుర్తించినట్లు తెలిపారు. శాయంపేట, కాట్రపల్లి గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. కమలాపూర్కు చెందిన సాంబశివ మినీ మోడ్రన్ రైస్ మిల్ యజమాని బెజ్జంకి శ్రీనివాస్ ఈ మోసానికి ప్రధాన సూత్రధారిగా దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. నకిలీ ప్రొఫైల్.. బెజ్జంకి శ్రీనివాస్, అతడి కుటుంబ సభ్యులు, మధ్యవర్తులు, కొంతమంది వ్యవసాయ శాఖ అధికారులతో కుమ్మకై ్క ఆన్లైన్ ధాన్యం సేకరణ నిర్వహణ వ్యవస్థ పోర్టల్ను ఉపయోగించి 12 మంది నకిలీ రైతుల ప్రొఫైళ్లు సృష్టించాడని ఎస్పీ తెలిపారు. ఈ నకిలీ రైతులు 278 ఎకరాల భూమిని సాగు చేసినట్లుగా సదరు రైస్ మిల్లుకు 8,049.6 క్వింటాళ్ల ధాన్యాన్ని సరఫరా చేసినట్లుగా చూపించారన్నారు. వాస్తవానికి ఎక్కడా ధాన్యం సేకరించలేదని, రవాణా చేయలేదని తెలిపారు. ఈ అవకతవకల ద్వారా రూ.1,86,63,088 మొత్తాన్ని అక్రమంగా క్లెయిమ్ చేసుకున్నట్లు, ఆ నగదును నకిలీ లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసినట్లు తెలిపారు. సహకరించిన అధికారులు అక్రమాలకు పాల్పడినవారిలో బండ లలిత నకిలీ ఎంట్రీల అక్రమ సృష్టికి మధ్యవర్తిగా వ్యవహరించారని, ప్రైవేట్ ఆపరేటర్ వాంకుడోత్ చరణ్ కీలక పాత్రధారిగా గుర్తించినట్లు తెలిపారు. శాయంపేట కొనుగోలు కేంద్రం ఇన్చార్జ్ బి.హైమావతి, కాట్రపల్లి కొనుగోలు కేంద్రం ఇన్చార్జ్ అనిత ఇతరులకు ట్యాబ్లు ఇచ్చి అక్రమాలకు సహకరించారన్నారు. వ్యవసాయ అధికారులు ఏఓ కె.గంగజమున, ఏఈఓలు బి.అర్చన, ఎం.సుప్రియ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అక్రమాలకు సహకరించారని తెలిపారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ సుధాటి రాజేశ్వర్రావు ధాన్యాన్ని భౌతికంగా రవాణా చేయకుండానే 27 లారీల చిట్టీలకు రవాణా ఛార్జీలను క్లెయిమ్ చేశారని గుర్తించినట్లు తెలిపారు. మొత్తం 12 మంది నకిలీ రైతులు, 278 ఎకరాల భూమి, 8,049 క్వింటాళ్ల దాన్యం ద్వారా రూ.1,86,63,088 కొల్లగొట్టినట్లు విచారణలో తేలిందని తెలిపారు. విచారణ అనంతరం నగదు రికవరీ, పోర్టల్ నుంచి భూమి తొలగింపు, తదుపరి క్రిమినల్, శాఖాపరమైన చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు.రూ.1.86 కోట్లు దుర్వినియోగం రికవరీ, క్రిమినల్ చర్యలకు ఆదేశం రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ అధికారులు శాయంపేట: ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై జక్కుల పరమేశ్ తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఫిర్యాదుతో మిల్లు యజమాని శ్రీనివాస్, వారికి సహకరించిన బండ లలిత, వాంకుడోత్ చరణ్, బలబద్ర హైమావతి, అనిత, వ్యవసాయ అధికారులు గంగాజమున, అర్చన, సుప్రియ, రవాణా కాంట్రాక్టర్ సుధతి రాజేశ్వర్రావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవని, వీటిని యాజమాన్యాలు పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని టీఎస్ ఈఈయూ కార్యాలయం పల్లా రవీందర్ రెడ్డి భవన్లో యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులకు వెంటనే గ్రేడ్ పదోన్నతి కల్పించాలని, రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలన్నారు. కాగా, ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై హై దరాబాద్లో విద్యుత్ సంస్థల్లోని యూనియన్లతో చ ర్చించి జేఏసీ ఏర్పాటు చేశారన్నారు. ఆర్టిజన్ జేఏసీ చైర్మన్గా టీఎస్ఈఈయూ–327కు కేటాయించగా నాలుగు విద్యుత్ సంస్థలకు చైర్మన్లను ఎన్నుకున్న ట్లు తెలిపారు. ఎన్పీడీసీఎల్ చైర్మన్గా డి.సికిందర్, ఎస్పీడీసీఎల్ చైర్మన్గా ఎస్.సతీశ్రెడ్డి, జెన్కో చై ర్మన్గా రమేశ్కుమార్, ట్రాన్స్కో చైర్మన్గా కల్యాణ్ ను ఎన్నుకున్నట్లు వివరించారు. యూనియన్ టీజీ ఎన్పీడీసీఎల్ సెక్రటరీ శ్రీనివాస్, జెన్కో ప్రెసిడెంట్ మాధవరావు, రాష్ట్ర నాయకులు తులసి శ్రీమతి, ధరావత్ సికిందర్, సుంకు సతీశ్ రెడ్డి పాల్గొన్నారు. టీఎస్ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్ -
అత్యంత వైభవంగా నరకాసుర వధ
మంత్రి కొండా సురేఖ ఖిలా వరంగల్: దీపావళి పండుగ సందర్భంగా నరకాసుర వధ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయిస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని మంత్రి స్వగృహంలో మంత్రి కొండా సురేఖను నరకాసుర ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, కార్పొరేటర్ మరుపల్లి రవి కలిసి ఏర్పాట్లపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దీపావళి ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి సురేఖ సంబంధిత అధికారులకు ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్కు చెబు తానని ఆమె పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఉన్నారు హన్మకొండ కల్చరల్: రిటైర్డ్ డీజీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి రచించిన ‘పుంజు తోక’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ ఆదివారం ఉదయం 10గంటలకు హనుమకొండ నయీంనగర్లోని వాగ్దేవి కాలేజీ ఆడిటోరియంలో జరగనున్నట్లు మిత్రమండలి కన్వీనర్ వీఆర్ విద్యార్థి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ ఆధ్యక్షతన జరిగే కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకావిష్కరణ చేస్తారని పేర్కొన్నారు. ప్రొఫెసర్ బన్న అయిలయ్య, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి పుస్తక పరిచయం చేస్తారని తెలిపారు. జిల్లా సాహితీవేత్తలు, అభిమానులు అధికసంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నేడు ‘ఆరెపల్లి మట్టిబిడ్డలు’ పుస్తకావిష్కరణనయీంనగర్: నేడు (ఆదివారం) ఉదయం 10 గంటలకు ఆరెపల్లి గ్రామం సరళి అధ్యయన కేంద్రంలో ‘మట్టిబిడ్డల మావూరి యధార్థ జీవిత కథలు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పుస్తక రచయిత, జర్నలిస్ట్ నాగబెల్లి జితేందర్ తెలిపారు. శనివారం హనుమకొండ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మట్టిబిడ్డల పుస్తకాన్ని సాహితీవేత్త, మాజీ సంపాదకులు కె.శ్రీనివాస్–సుధ దంపతులకు అంకితమిచ్చి నట్లు తెలిపారు. కవులు, సాహితీమిత్రులు పుస్తకావిష్కరణ, అంకితోత్సవ సభకు రావాలని కోరారు. కార్యక్రమంలో రాకేశ్, రఘువీర్, దినేశ్, గోపాల్ పాల్గొన్నారు. విద్యారణ్యపురి: సమగ్ర శిక్ష, ఎస్సీఈఆర్టీ తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లాలోని వివిధ సబ్జెక్టుల టీచర్లకు ఏ బుక్ ఆఫ్ ఆన్ డిజిటల్ లెర్నింగ్పై శిక్షణ ఇస్తున్నారు. ఈనెల 13 నుంచి 15 వరకు జిల్లాలోని భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకు హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఉపాధ్యాయుల్లో డిజిటల్ లెర్నింగ్, కోడింగ్, కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, 21వ శతాబ్ద నైపుణ్యాల్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా శిక్షణ ఉపయోగడనుందని డీఈఓ వాసంతి, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ బండారు మన్మోహన్ తెలిపారు. ఈనెల 13న ఉదయం 9గంటలకు ల్యాప్టాప్లతో, 6 నుంచి 9వ తరగతి డిజిటల్ లెర్నింగ్ పుస్తకాలతో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు హాజరుకావాలన్నారు. ఉపాధ్యాయుల హాజరు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా డిజిటల్గా నమోదు చేయనున్నారు. మూడు రోజులపాటు శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఈ సర్టిఫికెట్లు కూడా జారీ చేస్తారని వారు తెలిపారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఎంటెక్ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) పరీక్షలు ఈనెల 16వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిం ఇక్బాల్ తెలిపారు. ఈ నెల 16, 18, 22, 24, 27, 29 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు ఉంటాయని, విద్యార్థులు సకాలంలో హాజరుకావాలని కోరారు. -
– వెంకటాపురం(ఎం)
ఆదివారం శ్రీ 12 శ్రీ అక్టోబర్ శ్రీ 2025నీటిలో తేలియాడే ఇటుకలు.. నల్లరాతి స్తంభాలు.. సరిగమలు పలికే శిల్పం.. భూకంపాలను తట్టుకునే ఆలయం.. ఓరుగల్లుకు చరిత్ర అందించిన అతిగొప్ప వరం రామప్ప. యునెస్కో గుర్తింపుతో ఈఆలయ గొప్పదనం విశ్వవ్యాప్తమైంది. ఇప్పుడు ఆ కట్టడం ప్రపంచ దేశాలకు ఆదర్శమవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు, చరిత్రకారులు వారి వారి దేశాల్లో రామప్పను పోలిన కట్టడాలు నిర్మించడంలో భాగస్వాములవుతున్నారు. అంతేకాకుండా ఓరుగల్లులోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన అద్భుత కట్టడాలను పరిచయం చేస్తూ వాటి గొప్పదనాన్ని ప్రపంచ నలుమూలలకు తెలిసేలా వరల్డ్ హెరిటేజ్ క్యాంపు వివిధ దేశాల వలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. ఈ క్యాంపు ప్రత్యేకతలే ఈ ఆదివారం ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ. వలంటీర్లకు రామప్ప ఆలయ శిల్పాల ప్రత్యేకతలను వివరిస్తున్న టూరిస్ట్ గైడ్వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఏటా అక్టోబర్లో వివిధ దేశాల వలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. గత నాలుగేళ్లుగా రామప్పలో క్యాంపు కొనసాగుతుండగా.. ప్రస్తుతం ఈనెల 8న క్యాంపు ప్రారంభమైంది. 12 రాష్ట్రాలకు చెందిన 35 మందితో పాటు ఇరాన్ దేశానికి చెందిన మరో ముగ్గురు శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారు. ఈనెల 17తో హెరిటేజ్ క్యాంపు ముగియనుంది. రామప్ప ఖ్యాతిని విస్తరిస్తా.. శిక్షణ శిబిరంలో నేర్చుకున్న మెళకువలతో రామప్ప ఖ్యాతిని విస్తరించేందుకు కృషి చేస్తా. మ్యూజియంలో పని చేయడానికి, మ్యూజియానికి వచ్చిన ప్రజలకు చారిత్రక కట్టడాల గురించి వివరించేందుకు ప్రయత్నం చేస్తా. ఆలయంలోని ఆర్కిటెక్చర్ చాలా డిఫెరెంట్గా బాగుంది. – హమీద్ దాస్, కోల్కతాఇండియా కల్చర్ నచ్చి వచ్చాను.. ఇండియా కల్చర్ అంటే చాలా ఇష్టం. గతంలో కెన్యా, ఇరాన్ హెరిటేజ్ క్యాంపులో పాల్గొన్నా. రామప్పలో హెరిటేజ్ క్యాంపు వాటి కంటే బాగుంది. పర్సనల్గా ఇండియా కల్చర్పై ప్రాజెక్ట్ తీసుకుని ఇక్కడి పాఠాలను అనుభవంగా తీసుకుంటా. రామప్ప టెంపుల్ వండర్ ఫుల్. – నియూషా, ఇరాన్ -
స.హ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి న్యూశాయంపేట: సమాచార హక్కు చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. శుక్రవారం వరంగల్ కలెక్టరేట్ లో అధికారులకు నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడారు. ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వివరించారు. అధికారులు సమాచార హక్కు చట్టంపై జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ను కలిసిన శిక్షణ డిప్యూటీ కలెక్టర్ గ్రూప్–1 ద్వారా డిప్యూటీ కలెక్టర్గా ఎంపికై న నక్క శ్రుతిహర్షిత శుక్రవారం వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారదను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజే శారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. -
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించండి
వరంగల్ అర్బన్: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై–అర్బన్) 2.0 కార్యక్రమంపై ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులకు సూచించారు. శుక్రవారం హనుమకొండ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పీఎంఏవై– అర్బన్–2.0 అవగాహనలో భాగంగా రూపొందించిన అంగీకార్–25 పోస్టర్ను కమిషనర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. పీఎంఏవై–అర్బన్ 2.0 పై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. పేద, బలహీన వర్గాలకు మేలు జరిగేలా చూడడంతో పాటు, రుణ మేళాల ద్వారా లబ్ధిదారులకు గృహ రుణాలు అందేలా చూడాలని కమిషనర్ కోరారు. సమవేశంలో వరంగల్, హనుమకొండ జిల్లాల హౌసింగ్ పీడీలు గణపతి, హరికృష్ణ, బల్దియా డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, రవీందర్, హౌసింగ్ బోర్డు ప్రత్యేకాధికారులు, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
‘ఎస్సార్’లో స్వాగతం–25 సందడి
గ్రేటర్ వరంగల్ పరిధి అన్నాసాగరంలోని ఎస్సార్ యూనివర్సిటీలో శుక్రవారం ‘స్వాగతం–25’ వేడుకలు నిర్వహించారు. టాలీవుడ్ గాయకులు దమనిభట్ల, అర్జున్ విజయ్ ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. తొలుత విద్యార్థినులు ర్యాంప్వాక్ నిర్వహించారు. పెయింటింగ్, షార్ట్ ఫిల్మ్ మేకింగ్ వంటి సృజనాత్మక అంశాల్లో పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రో వైస్ చాన్స్లర్ డాక్టర్ మహేశ్, విద్యార్థి సంక్షేమ డీన్ డాక్టర్ ఏ.వి.వి.సుధాకర్, రిజిస్ట్రార్ డాక్టర్ అర్చనారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. – హసన్పర్తి -
మిషనరీస్ ఆఫ్ చారిటీలో ఉచిత వైద్యశిబిరం
వరంగల్: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (వరల్డ్ మెంటల్ హెల్త్ డే)ను పురస్కరించుకుని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యం.సాయికుమార్ అధ్యక్షతన కాశిబుగ్గలోని ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’లోని మేధో దివ్యాంగులైన చిన్నారులకు ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతాంబ హాజరై, మాట్లాడుతూ.. ‘మానసిక ది వ్యాంగులను చేరదీసి, వారిని ఏ విషయంలోనూ తక్కువ చేసి చూడొద్దన్నారు. న్యాయ సేవలు, సహకారం కోసం న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. భవిష్యత్లో వీరికి కావాల్సిన అన్ని రకాల వైద్య సేవలకు తమను సంప్రదించవచ్చని సూచించారు. దివ్యాంగులకు సేవ చేస్తున్న సిబ్బందిని అభినందించారు. అనంతరం మేధో దివ్యాంగులకు పండ్లు, స్వీట్లు అందించి, వారితో సరదాగా గడిపారు. డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శ్రీనివాసరావు, ఇంతేజార్గంజ్ ఎస్ఐలు తేజ, వెంకటేశ్వర్లు, డాక్టర్ క్యూరీ, డాక్టర్ అనూహ్య, సిస్టర్ సవీన మరియా, సిస్టర్ అంజలిక మరియా పాల్గొన్నారు. -
మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి
హన్మకొండ అర్బన్: విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పట్టాభి రామారావు అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం నగరంలోని బన్ను న్యూరో హెల్త్ అండ్ రిహబిలిటేషన్ సెంటర్లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్ పాండే ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా చిన్నారుల మానసిక ఆరోగ్య స్థితిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. వారు ఒత్తిడిని అధిగమించి మానసిక ఆరోగ్యం పొందేలా ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈ.వి శ్రీనివాస్రావు, కేయూసీ ఈసీ సభ్యురాలు అనితారెడ్డి ఎంజీఎం ఆస్పత్రి సైకియాట్రిక్ విభాగం డాక్టర్ చిమ్మి కృష్ణ, బన్ను ఆరోగ్య ది సేవా సొసైటీ అధ్యక్షుడు వీరమల్ల చంద్రజిత్రెడ్డి, బన్ను స్పెషల్ స్కూల్ ప్రిన్సిపాల్ వీరమల్ల కిరణ్కుమారి, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలోని 67 వైన్స్కు గాను శుక్రవారం 16 దరఖాస్తులను హనుమకొండ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్కు మద్యం వ్యాపారులు అందజేశారు. కాగా, వైన్స్ టెండర్ల ప్రకటన వెలువడినప్పటి నుంచి శుక్రవారం వరకు మొత్తం 65 దరఖాస్తులు అందాయి. వరంగల్ క్రైం: వరంగల్ కమిషనరేట్ ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ హతీరామ్ మే10న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతడి భార్య కీర్తికి శుక్రవారం పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈసందర్భంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందజేయాల్సిన బెనిఫిట్లను సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీపీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, సూపరింటెండెంట్ యాకుబ్ బాబా, సహాయకుడు తులసి పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: సమాజంలో నిట్ విద్యార్థులు ఆదర్శంగా నిలవాలని భారత లోహ సంస్థ మాజీ అధ్యక్షుడు డాక్టన్ సనక్ మిశ్రా అన్నారు. శుక్రవారం నిట్ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్లో నిర్వహించిన నిట్ వరంగల్ 67వ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ‘ది హైపోథీసిస్ ఆఫ్ ది హైయరార్కీ ఆఫ్ నాలెడ్జ్’ అంశంపై మాట్లాడారు. జ్ఞానాన్ని లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా విద్యార్థులకు విజ్ఞానం, మేధస్సు సాధ్యమవుతుందన్నారు. నిట్ వరంగల్ ప్రపంచంలో ప్రత్యేకతను చాటుతోందని నిట్ డైరెక్టర్ బిద్యాదర్ సుబుదీ తెలిపారు. ప్రస్తుతం నిట్ వరంగల్లో 700 మంది అధ్యాపకుల బోధనలో 8 వేల మంది విద్యార్థులు అత్యుత్తమ సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ ఏడాది 81.03 క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగావకాశాలు సాధిస్తున్నారని, రూ.64 లక్షల అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగావకాశాలు సాధించడం నిట్కు గర్వంగా నిలుస్తోందన్నారు. హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో శుక్రవారం సాయంత్రం సంకటహర చతుర్థి పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితుడు గంగు మణికంఠశర్మ, అర్చకులు పెండ్యాల సందీప్శర్మ, పానుగంటి ప్రణవ్, శ్రవణ్ ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం సంకటహర చతుర్థిని పురస్కరించుకుని దేవాలయంలోని ఉత్తిష్ట గణపతికి అభిషేకాలు నిర్వహించారు. -
శనివారం శ్రీ 11 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఫస్ట్ ఆఫ్లో ఆస్తి పన్ను 25% నీటి చార్జీలు కేవలం 12% వసూలు ● నిద్రావస్థలో పన్నుల విభాగం అధికారులు ● జీడబ్ల్యూఎంసీ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం వరంగల్ అర్బన్: పన్నుల వసూళ్లలో గ్రేటర్ వరంగల్ చతికిల పడింది. ఫస్ట్ ఆఫ్ ఆరు నెలల వ్యవధిలో ఆస్తి పన్ను 25 శాతం, నీటి చార్జీలు 12 శాతం వసూళ్లతో ఆయా విభాగా అధికారులు సరిపెట్టుకున్నారు. గణాంకాలను పరిశీలిస్తే బల్దియా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. వరంగల్ మహా నగర పాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ)కి ప్రధాన ఆదాయ వనరు పన్నులు. డిమాండ్ మేరకు ఏటా ఆస్తి, నీటి పన్నులు కచ్చితంగా వసూలు చేస్తేనే స్థానిక సంస్థలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులకు ఆస్కారం ఉండదు. కొత్త ఇంటి నంబర్ల జారీ, భవనాల రివైడ్జ్, పేరు మార్పిడుల పేరిట కాసుల కోసం వేట కొనసాగిస్తున్నారే తప్ప పన్ను వసూళ్లపై సరైన కార్యాచరణతో ముందుకు సాగట్లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిలో పన్నుల వసూళ్లను ఫస్ట్ ఆఫ్, సెకండ్ ఆఫ్గా వసూలు చేస్తుంటారు. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు, రెండో దఫా అక్టోబర్ 1 నుంచి మార్చి 31 వరకు వర్గీకరించి పన్నులు వసూలు చేస్తుంటారు. రాష్ట్ర పురపాలక శాఖ అధికారుల ఆదేశాల మేరకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)సూచనల మేరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏడాదికి ఒకేసారి డిమాండ్ నోటీస్ జారీ చేశారు. కానీ, అందులో ఆర్నెళ్లకోసారి చెల్లించుకునే పొందుపర్చారు. వసూళ్లు ఇలా.. మహా నగర వ్యాప్తంగా ఆస్తి పన్ను అసెస్మెంట్లు 2,28,901 కాగా, 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.81.18 కోట్లు, వడ్డీ రూ.46.06 కోట్లు, పాత బకాయిలు రూ.43.60 కోట్లు మొత్తంగా రూ.170.80 కోట్లు వసూళ్లే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో ఇప్పటి వరకు ఆస్తి పన్ను రూ.42.10 కోట్లు అంటే 25 శాతం వసూలు చేశారు. ఇకపోతే తాగునీటి నల్లా కనెక్షన్లు 1,77,567 ఉండగా.. రూ.49.70 కోట్లు కరెంటు, పాత బకాయిలు రూ.25.28 కోట్లు కాగా, మొత్తంగా రూ.74.99 కోట్లు డిమాండ్ నెలకొంది. ఇందులో 8.87 కోట్లు అంటే 12 శాతం మాత్రమే వసూలు చేశారు. సర్కారీ శాఖల నుంచి పెద్ద మొత్తంలో ఆస్తి, నీటి చార్జీలు వసూలు చేయాల్సి ఉన్నా, ఆ సొమ్మును రాబట్టుకునేందుకు చొరవ తీసుకునే నాథుడే బల్దియా యంత్రాంగంలో కరువయ్యారనే విమర్శలు నెలకొన్నాయి. లోపం యంత్రాంగానిదే.. పన్ను బకాయిలు పెరిగిపోవడానికి, సక్రమంగా వసూలు అవ్వకపోవడానికి యంత్రాంగం వైఫల్యమే ప్రధాన కారణం. ప్రజలకు నోటీసులు జారీ చేయడంతో సరిపెట్టకుకోకుండా ప్రజలు సక్రమంగా చెల్లిస్తున్నారా? చెల్లించని వారికి ఆ సొమ్ముపై 2శాతం వడ్డీ భారం తోడవుతుందని చెల్లింపుదారుల్లో చైతన్యం కల్పించడంతో విఫలమవుతున్నారు. రెవెన్యూ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు కలిసి వసూళ్ల బాధ్యత ఇ–సేవా కేంద్రాల సిబ్బందికి వసూళ్ల బాధ్యతలను అప్పగిస్తూ ఇతర పనుల్లో నిమగ్నమవుతున్నారనే ఆరోపణలున్నాయి. ఆస్తి, నీటి చార్జీలు ఫస్ట్ ఆఫ్లో వెనుకబడిపోవడానికి పన్నుల విభాగం అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఎవరికి వారు దాటవేస్తుండడం గమనార్హం. -
ఇక.. డీసీసీ అధ్యక్షుల ఎంపిక!
సాక్షిప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీఓ 9, ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు నిలిచిపోగా.. ఈలోగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న జిల్లా కాంగ్రెస్ కమిటీల ఖరారుపై ఫోకస్ పెట్టింది. ఈమేరకు శనివారం (ఈ నెల 11వ తేదీ) నుంచి 18వ తేదీ వరకు డీసీసీ అధ్యక్షుల రేసులో ఉన్న ఆశావహుల నుంచి జిల్లాల వారీగా దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఢిల్లీ, ఇతర ప్రాంతాల నుంచి శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్న ఏఐసీసీ పరిశీలకులు శనివారం నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వేదికగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలకు నేడు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు.. వాస్తవానికి పార్టీ సంస్థాగత నిర్మాణం, పటిష్టత కోసం మూడు నెలల కిందటే ఏఐసీసీ కమిటీలు వేసింది. ఉమ్మడి వరంగల్కు ముగ్గురు ఏఐసీసీ పరిశీలకులతోపాటు ఒక్కో జిల్లాకు ఇద్దరు నుంచి ముగ్గురు టీపీసీసీ పరిశీలకులను నియమించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ పరిశీలకులతో భేటీ అయ్యి పలు సూచనలిచ్చారు. ఏఐసీసీ పరిశీలకులు నబజ్యోతి పట్నాయక్ (హనుమకొండ, వరంగల్), జాన్సన్ అబ్రహం (ములుగు, జేఎస్ భూపాలపల్లి), దేబాసిస్ పట్నాయక్ (జనగామ) దరఖాస్తులు, డీసీసీ ఎన్నికలను పరిశీలించనున్నారు. అదే విధంగా టీపీసీసీ పరిశీలకులుగా హనుమకొండ, వరంగల్ జిల్లాలకు గాలి అనిల్కుమార్, దుర్గం భాస్కర్, మక్సూద్ అహ్మద్, గుంజ రేణుకా నారాయణ, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాలకు జంగా రాఘవరెడ్డి, అఫ్సర్ యూసుఫ్ ఝహి, ఇ.సుబ్బారావు, ఎ.సంజీవ్ ముదిరాజ్, జనగామ, మహబూబాబాద్కు కె.శంకరయ్య (ఎమ్మెల్యే), ఎండీ అవేజ్, పీసరి మహిపాల్ రెడ్డి, కె.శ్రీకాంత్జాదవ్, జువ్వాడి ఇందిరారావు పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. జిల్లాల వారీగా కార్యాలయాల్లో డీసీసీ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోటాపోటీగా ఆశావహులు.. ● డీసీసీ కోసం పోటీపడే వారి సంఖ్య జిల్లాల్లో చాంతాడులా పెరుగుతోంది. ● ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షుల మార్పు తథ్యమనుకుంటే కొత్తగా హనుమకొండ జిల్లా నుంచి ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జంగా రాఘవరెడ్డి, ఈవీ శ్రీనివాస్రావు, బట్టి శ్రీనివాస్, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డి, బొమ్మనపల్లి అశోక్రెడ్డి, కట్ల శ్రీనివాస్తోపాటు మరి కొంతమంది దరఖాస్తు చేసుకుంటారనే ప్రచారం ఉంది. ● వరంగల్ నుంచి ఇప్పుడున్న అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నమిండ్ల శ్రీనివాస్, ఎంపీ ఆనంద్, బొంపెల్లి దేవేందర్రావు, గోపాల నవీన్రాజ్, నల్గొండ రమేశ్, నర్సంపేట మాజీ ఎంపీపీ టి.రవీందర్రావు, పిన్నింటి అనిల్రావు, తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ● జయశంకర్ భూపాలపల్లి డీసీసీ కోసం మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధులతోపాటు ఎనిమిది మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ● జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి స్థానంలో హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, బండ శంకర్, లకావత్ ధన్వంతి, లక్ష్మీనారాయణతోపాటు పలువురు ఆశావహులు సిద్ధమయ్యారు. ● ములుగు జిల్లాలో ప్రస్తుత అధ్యక్షుడు పైడాకుల అశోక్, సూర్య(మంత్రి సీతక్క కుమారుడు) మధ్య ఇప్పటికే పొసగడం లేదు. ఇక్కడినుంచి సూర్య సీరియస్గానే ఆశిస్తున్నారు. పైడాకుల అశోక్, కుంజ సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బాదం ప్రవీణ్ తదితరులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ● మహబూబాబాద్లో ఇప్పుడున్న జె.భరత్చంద్రా రెడ్డి, వెన్నం శ్రీకాంత్రెడ్డి, నునావత్ రాధ తోపాటు ఏడెనిమిది మంది పేర్లు వినిపిస్తున్నాయి. ● ఏదేమైనా దరఖాస్తుల ప్రక్రియ 18న ముగియగానే ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు, సీఎం, టీపీసీసీ దృష్టికి జాబితాను తీసుకెళ్లనున్నారని సమాచారం. అనంతరం జిల్లా ఇన్చార్జ్జులు, ఇన్చార్జ్ మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్, మహిళ.. ఇలా సామాజిక కోణాలను దృష్టిలో పెట్టుకుని నవంబర్ మొదటి వారంలో అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. డీసీసీ కోసం దరఖాస్తులు చేసుకోండి.. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ మొదలైందని, ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో కోరారు. ఏఐసీసీ పరిశీలకులు వస్తున్న సందర్భంగా దరఖాస్తుతోపాటు పార్టీకి చేసిన సేవలు, అనుభవం, గతంలో నిర్వర్తించిన బాధ్యతలు తదితర వివరాలను స్పష్టంగా పేర్కొని బయోడేటా శనివారం మధ్యాహ్నంలోగా జిల్లాల అధ్యక్షులకు అందజేయాలని తెలిపారు. ‘సంస్థాగత’ ఎన్నికలపై దృష్టి సారించిన కాంగ్రెస్ నేడు జిల్లాలకు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ 11 నుంచి 18వ తేదీ వరకు ఈ ప్రక్రియ ఆ తర్వాత సీఎం, టీపీసీసీ చీఫ్తో పరిశీలకుల భేటీ నవంబర్ మొదటి వారంలో డీసీసీ అధ్యక్షుల జాబితా? పోటాపోటీగా దరఖాస్తులతో సిద్ధమైన ఆశావహులు -
మార్కెట్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద వరంగల్: పత్తి సీజన్ ప్రారంభమవుతున్నందున రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నాణ్యతా ప్రమాణాల ప్రకారం మద్దతు ధరలకు విక్రయించేలా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఒక హెల్ప్డెస్క్ వెంటనే ఏర్పాటు చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మార్కెట్ను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, యార్డుల్లోని పంట ఉత్పత్తులు పరిశీలించారు. పత్తికి తేమ శాతం ఎక్కువున్నా ఽమద్దతు ధరలు లభించేలా చర్యలు తీసుకోవాలని, మార్కెట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాని చాంబర్ ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. 2025–26 సంవత్సరానికి కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరల పోస్టర్లను మార్కెట్ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి కె.సురేఖ, గ్రేడ్–2 కా ర్యదర్శులు ఎస్.రాము, జి.అంజిత్రావు, సహాయ కార్యదర్శి జి.రాజేందర్, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి, కోశాధికారి అల్లె సంపత్, కార్యవర్గ సభ్యులు గౌరిశెట్టి శ్రీనివాస్, కాటన్ సెక్షన్ కార్యదర్శి కట్కూరి నాగభూషణం, వ్యాపారులు, మార్కెట్ ఉద్యోగులు న్నారు. ఇబ్బందులు రావొద్దు న్యూశాయంపేట: రైతుల నుంచి ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఖరీఫ్ ధాన్యం సేకరణపై మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఇందులో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఇన్చార్జ్ డీఆర్డీఓ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఏఓ అనురాధ, డీసీఓ నీరజ, డీసీఎస్ఓ కిష్టయ్య, డీఎం సంధ్యారాణి, డీఎంఓ సురేఖ, ఆర్టీఓ శోభన్, లీగల్ మెట్రాలిజీ అధికారి మనోహర్, రైస్మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోనెల రవీందర్, కోశాధికారి ఇరుకు కోటేశ్వర్రావు, కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. లేఔట్లకు అనుమతి మంజూరు జిల్లా పరిధిలోని లేఔట్ అనుమతుల కోసం కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్లో లేఔట్ కమిటీ సమావేశం జరిగింది. జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఒక లేఔట్, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో రెండు అనుమతుల కోసం ప్రతిపాదనలను కమిటీ పరిశీలించి అనుమతి మంజూరు చేసింది. ఇందులో అధికారులున్నారు. -
నియామకమెప్పుడో..!
హన్మకొండ : టీజీ ఎన్పీడీసీఎల్లో చేపట్టిన సబ్ ఇ ంజనీర్ల నియామకంలో అన్యాయానికి గురైన తమ ను ఎప్పుడు విధుల్లోకి తీసుకుంటారని అభ్యర్థుల ను ఎదురు చూస్తున్నారు. యజమాన్యం చేసిన త ప్పిదాలు, అక్రమాలకు ఏడేళ్లుగా 24మంది అభ్యర్థులు నియామకాల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఈ క్రమంలో దిగువ కేడర్ ఉద్యోగులకు సబ్ ఇంజనీర్లుగా కన్వర్షన్కు అవకాశం కల్పించడంతో పోస్టులన్ని వారిచే భర్తీ చేస్తే తమకు పోస్టులు లేకుండా పోతా యని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తగ్గిన పోస్టుల సంఖ్య.. టీజీ ఎన్పీడీసీఎల్లో 497 సబ్ ఇంజనీర్ల భర్తీకి 2018, మే 24న నోటిఫికేషన్ విడుదల చేశారు. అదే ఏడాది జూలై 8న రాత పరీక్ష నిర్వహించి, ఆగష్టు 31న ఫలితాలు ప్రకటించారు. మెరిట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు ఒరిజనల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సెప్టెంబర్ లో పాత సర్కిల్ వారీగా వేర్వేరు తేదీల్లో కాల్ లెటర్ పంపించారు. నోటిఫికేషన్లో పేర్కొన్న 497మందికి కాకుండా 427 మందికి మాత్రమే కాల్ లెటర్ పంపి, 70 పోస్టులు తగ్గించారు. అదే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో తాత్కాలికంగా నియామక ప్రక్రియ నిలిపివేశారు. కోడ్ తర్వాత డిసెంబర్లో మరోసారి సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలని కాల్ లెటర్ పంపారు. దీంతో మరో 24 పోస్టులు తగ్గించారని అర్హులైన అభ్యర్థులు తెలిపారు. ముందు కాల్ లెటర్ అందుకుని రెండోసారి రాని అభ్యర్థులు వెంటనే హైకోర్టును ఆశ్రయించగా అందరికీ తిరిగి జారీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు 427 మందికి కాల్లెటర్ పంపి పోస్టులు భర్తీ చేశారు. అయితే ఇక్కడ కోర్టు ఆదేశాలతో కాల్ లెటర్ పొందిన 24 మందిని పక్కన పెట్టారు. తాము అధికారులను ఈ విషయమై సంప్రదిస్తే కోర్టు కాల్ లెటల్ మాత్రమే జారీ చేయమని చెప్పిందని, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పలేదంటూ తప్పించుకున్నారని అభ్యర్థులు వాపోయారు. అక్రమంగా నియామకాలు.. సబ్ ఇంజనీర్ రిక్రూట్మెంట్లో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు టీజీ ఎన్పీడీసీఎల్ యజమాన్యానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీజీ ఎన్పీడీసీఎల్ పాత పాలక మండలిని రద్దు చేసింది. ఐఏఎస్ అధికారి కర్నాటి వరుణ్ రెడ్డిని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా, సీనియర్ సీజీఎంలను ఇన్చార్జ్ డైరెక్టర్లుగా నియమించింది. ఈ కమిటీ రాగానే అభ్యర్థులు సీఎండీని కలిసి వినతి పత్రం అందించి తమకు జరిగిన నష్టాన్ని వివరించారు. దీనికి తోడు ప్రజాపాలనలో ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణకు చేపట్టారు. టీజీ పీఎస్ఎస్సీకి చెందిన ఒకరు, టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి ఇద్దరేసి అధికారులతో ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. నియామకాల ప్రక్రియ మొత్తాన్ని వడపోసి చివరకు అక్రమాలు జరిగినట్లు తేల్చింది. 24 మంది నియామకాలు అక్రమంగా జరిగినట్లు, అర్హత లేని వారిని నియమించినట్లు విచారణ కమిటీ తేల్చింది. దిగువ కేడర్కు సబ్ ఇంజనీర్లుగా అవకాశం ఆందోళనలో అన్యాయానికి గురైన 24 మంది అభ్యర్థులు అక్రమాలను గుర్తించిన ప్రత్యేక కమిటీ427 సబ్ ఇంజనీర్ పోస్టుల్లో 24 మంది అనర్హులను భర్తీ చేశారు. అర్హులైన 24 మందిని పక్కన పెట్టారని విచారణ కమిటీ తేల్చింది. అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్న 24 మందికి యాజమాన్యం నోటీసులు జారీ చేసింది. దీంతో కోర్టును ఆశ్రయించగా వారు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా న్యాయంగా ఉద్యోగాలు దక్కాల్సిన వారు మాత్రం యాజమాన్యం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మరో వైపు ఖాళీగా ఉన్న సబ్ ఇంజనీర్ల పోస్టులు అర్హత ఉన్న దిగువ కేడర్ ఉద్యోగులను కన్వర్షన్ ద్వారా భర్తీ చేస్తుండడంతో నష్టపోయిన అభ్యర్థులు తమ భవిష్యత్ ఏంటనే ఆలోచనలో పడ్డారు. వయోభారం మీద పడుతుండడంతో అభ్యర్థులు రోజు రోజుకూ కృంగిపోతున్నారు. ఇప్పటికై నా తమకు జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని గమనించి వెంటనే తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సబ్ ఇంజనీర్ అభ్యర్థులు కోరుతున్నారు. -
సెంట్రల్ జోన్ డీసీపీ బదిలీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేస్తున్న షేక్ సలీమాను హైదరాబాద్ సీఐడీ విభాగానికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఆమె స్థానంలో ఇంకా ఎవరికి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆర్టీఐతో సుపరిపాలన రామన్నపేట/కాళోజీ సెంటర్: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)–2005 ద్వారా ప్రజలకు సుపరిపాలన అందుతుందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) డాక్టర్ శ్రీధర్ సుమన్ ఆన్నారు. రాష్ట్ర సమాచార కమిషన్, కలెక్టర్ ఆదేశాల మేరకు ‘ఆర్టీఐ ద్వారా సుపరిపాలన‘ అంశంపై జిల్లాలోని పలు జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని ఏవీవీ జూనియర్ కళాశాలలో పోటీలను ఆయన పరిశీలించి మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపాల్ భుజేందర్, కార్యక్రమ నిర్వాహకులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీనివాసరావు, అధ్యాపకులు అనిత, శ్రీధర్, శ్రీనివాస్, సంజీవ, గోపి పాల్గొన్నారు. వైద్యవిద్యకు ఆర్థికసాయం అభినందనీయంహన్మకొండ: వైద్య విద్యలో ప్రవేశం సాధించి ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేని విద్యార్థులకు నీట్–మెడికో పేరెంట్స్ అసోసియేషన్ అండగా నిలిచి చేయూతనందించడం అభినందనీయమని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ పి.వి.నందకుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో నీట్–మెడికో పేరెంట్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సమావేశంలో వైద్యవిద్యలో ప్రవేశం పొందిన 10 మంది విద్యార్థులకు మొత్తం రూ.2.70 లక్షలు వైస్ చాన్స్లర్ డాక్టర్ పి.వి.నందకుమార్రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ కె.నాగార్జునరెడ్డి చేతుల మీదుగా ఆర్థిక సాయం అందించారు. వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ.. ఫీజు చెల్లించే స్థోమత లేని 30 మంది విద్యార్థులకు నెలకు రూ.3,500 వచ్చే ఏర్పాట్లు చేస్తానన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో బుక్స్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తానన్నారు. నీట్–మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణచారి, సభ్యులు రావు ల మధు, ఆకుల భాస్కర్, నరేందర్, యాదగిరి, కందిమల్ల జితేందర్, ఇందిర, రోజా, బాబు రావు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ● చికిత్స పొందుతూ మృతి బచ్చన్నపేట : పాముకాటుతో చికిత్స పొందుతున్న ఓ యువకుడు శుక్రవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని బోనకొల్లూర్ గ్రామానికి చెందిన దయ్యాల పద్మ–కనకయ్య దంపతుల కుమారుడు రాకేశ్ (19) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈ నెల 4వ తేదీన వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన రాకేశ్కు పాముకాటు వేసింది. అయితే పాము కనిపించకపోవడంతో తేనెటీగ కుట్టిందని అదే రోజు గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జనంలో పాల్గొని భోజనం చేసి పడుకున్నాడు. మరుసటి రోజు కాలు తిమ్మిరిగా ఉండడంతో జనగామ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ఎంజీఎంకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
రేపు వరంగల్లో పల్స్పోలియో
మాట్లాడుతున్న డీఆర్ఓ గణేశ్ మాట్లాడుతున్న డీఎంహెచ్ఓ సాంబశివరావు గీసుకొండ: వరంగల్ నగరలో 0–5 ఏళ్లలోపు ఉన్న 20,121 మంది పిల్లలకు ఈ నెల 12న పోలియో చుక్కలు వేయనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ బి.సాంబశివరావు తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో సబ్ నేషనల్ పోలియో వ్యాక్సినేషన్పై శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేవలం వరంగల్ నగర ప్రాంతంలోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రజలు తమ పిల్లలను పోలియో కేంద్రాలకు తీసుకుని వెళ్లి చుక్కల మందు వేయించాలని సూచించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాశ్ మాట్లాడుతూ నగరంలోని సీకేఎం, ఎంజీఎం, చింతల్, దేశాయిపేట, ఫోర్టు వరంగల్, కీర్తినగర్, రంగశాయిపేట, ఎస్ఆర్ఆర్తోట, కాశిబుగ్గలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో చుక్కల మందు వేసే కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. అదేవిధంగా బస్టాండ్, రైల్వే స్టేషన్, ట్రాన్సిస్ట్ పాయింట్లు, మరో ఏడు మొబైల్ టీంలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని, ట్రాన్సిస్ట్ సెంటర్లలో 24 గంటలపాటు చుక్కల మందు వేస్తారని చెప్పారు. సంబంధిత శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ కోరారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోలియో చుక్కలు తప్పనిసరి: డీఆర్ఓ గణేశ్ ఎంజీఎం: ఈనెల 12న(ఆదివారం) చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని హనుమకొండ రెవెన్యూ అధికారి వైవీ గణేశ్ కోరారు. ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై శుక్రవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ సంబంధిత విభాగాల, ప్రోగ్రాం అధికారులతో పల్స్ పోలియో డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఆర్ఓ గణేశ్ మాట్లాడుతూ.. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి అప్పయ్య మాట్లాడుతూ.. జిల్లాలో 5 ఏళ్లలోపు వయస్సున్న 84,301 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు (472) పోలియో చుక్కల కేంద్రాలను (17) ట్రాన్సిట్ పాయింట్లు, మొబైల్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్య వైద్యాధికారి రాజారెడ్డి, అడిషనల్ డీఎంహెచ్ఓ టి.మదన్మోహన్ రావు, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు, ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు -
రైల్వే కార్మికులకు మెరుగైన వైద్యం
కాజీపేట రూరల్ /డోర్నకల్ : రైల్వే కార్మికులకు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రైల్వే శాఖ నిరంతరం కృషి చేస్తోందని దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపాల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ (పీసీఎండీ) డాక్టర్ నిర్మలారాజారాం అన్నారు. కాజీపేట రైల్వే ఆస్పత్రిని శుక్రవారం సికింద్రాబాద్ డివిజన్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సీఎంఎస్) డాక్టర్ నారాయణస్వామితో కలిసి వారు సందర్శించి తనిఖీ చేశారు.అలాగే సకల వసతులతో డోర్నకల్లో పునః నిర్మించిన రైల్వే ఆస్పత్రిని డీఆర్ఎం డాక్టర్ గోపాలకృష్ణణ్, డీఆర్యూసీసీ సభ్యులు ఖాదర్, రైల్వే చీఫ్ మెడికల్ సూపరిండెంటెంట్ నారాయణ స్వామి, రైల్వే ఆస్పత్రి డాక్టర్ సునీల్ కుమార్ కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైల్వే ఆస్పత్రి నుంచి కార్మికులకు అన్ని రకాల మెరుగైన వైద్యం అందించేందుకు నగరంలో మూడు రెఫరల్ ఆస్పత్రుల నుంచి వైద్యం అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఏకశిల ఆస్పత్రి ఆధ్వర్యంలో సీపీఆర్ డెమోను డాక్టర్ ఆసిఫ్ ఇక్బాల్ నిర్వహించగా ఆమె అభినందించారు. రైల్వే ఆస్పత్రి హాల్లో డాక్టర్లు నిరంజన్రావు, నరేందర్ హిర్వాని, యాకూబ్, దీరజ్, హరిబాబులతో సమావేశమై పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో మొక్క నాటారు. రైల్వే నాయకుల వినతులు కాజీపేట రైల్వే ఆస్పత్రిని తనిఖీ చేసేందుకు వచ్చిన డాక్టర్ నిర్మలారాజారాంకు రైల్వే మజ్దూర్ యూనియన్ అన్ని బ్రాంచీల కోఆర్డినేటర్ నాయిని సదానందం, రైల్వే సంఘ్ సీడబ్ల్యూఎస్సీ మెంబర్ సాదినేని వెంకటనారాయణ, ఎస్సీ,ఎస్టీ నాయకులు బి.వీరన్న, కెఎన్.రావు, ఆర్.కుమార్, బి.జక్రియ ఆధ్వర్యంలో వైద్య సమస్యలను పరిష్కరించి, ఆస్పత్రిని అప్గ్రేడ్ చేయాలని వేర్వేరుగా వినతి పత్రాలు అందజేశారు. దక్షిణ మధ్య రైల్వే పీసీఎండీ డాక్టర్ నిర్మలారాజారాం -
పెన్షనర్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి
హన్మకొండ అర్బన్ : రిటైర్డ్ పెన్షనర్లకు వెంటనే బెనిఫిట్స్ చెల్లించాలని శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ సీతారాం మాట్లాడారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2024,మార్చి నుంచి రిటైర్డ్ అయిన పెన్షనర్లకు బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. పెన్షనరీ బెనిఫిట్స్ రాక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.వైఎస్ రాజశేఖర రెడ్డి ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత వైద్యం పొందుతున్నామని, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకం రూపొందించి సత్వరం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండ్యాల బ్రహ్మయ్య, జె.ప్రభాకర్ రెడ్డి, నారాయణగిరి వీరన్న, వన్నాల రాజమల్లు, సుధాకర్, శంకరయ్య, మండువ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. నిరసన అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందించారు. -
కేఎంసీలో వైట్కోట్ సెరిమనీ
ఎంజీఎం : కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో 2025–26 విద్యాసంవత్సరానికి గాను ఎంబీబీఎస్ విద్యార్థులకు వైట్ కోట్ సెరిమనీ ఎన్ఆర్ఐ ఆడిటోరియంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య సుంకరనేని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథులుగా ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్, చికాగో(కేఎంసీ పూర్వ విద్యార్థి) డాక్టర్ సురేష్ రెడ్డి, సీనియర్ అలుమ్నస్ డాక్టర్ వీ.ఎల్.ఎన్.రావు హాజరయా ్యరు. ఈ సందర్భంగా వారు వైద్య వృత్తి ప్రాధాన్య త, సేవా దృక్పథం, నైతిక విలువలౖ పె విద్యార్థుల కు వివరించారు. అనంతరం ప్రి న్సిపాల్ విద్యార్థులతో హిప్పోక్రటిక్ ప్రమాణం చేయించారు. ఎంజీ ఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ పాల్గొన్నారు. -
సికింద్రాబాద్–కాజీపేట మధ్య 3వ, 4వ రైల్వేలైన్
● 110 కి.మీ నిర్మాణానికి రంగం సిద్ధం ● రూ.2,837 కోట్ల వ్యయ అంచనా కాజీపేట రూరల్ : రైల్వేశాఖ సికింద్రాబాద్–కాజీపేట మధ్య 3వ, 4వ రైల్వే లైన్ నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రూ.2,837 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ (ఘట్కేసర్) నుంచి కాజీపేట వరకు 110 కి.మీ.తో మేడ్చల్, యాదాద్రి, జనగామ, హనుమకొండ జిల్లాలను కలుపుతూ 3వ, 4వ రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు శుక్రవారం రాత్రి రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే బల్లార్షా నుంచి కాజీపేట వరకు అక్కడక్కడ చిన్న చిన్న బిట్ వర్క్స్ తప్ప 3వ లైన్ నిర్మాణం పూర్తయ్యింది. కాజీపేట–సికింద్రాబాద్ మధ్య 3వ లైన్ కావాల్సి ఉంది. కొత్తగా చేపట్టనున్న 3, 4వ లైన్ నిర్మాణ ప్రాజెక్ట్ కాలం 4 ఏళ్లు పట్టనుంది. ముఖ్యంగా ఈ మార్గంలో బొగ్గు, సిమెంట్ ఉత్పత్తి రవాణాలో రైళ్ల ట్రాఫిక్ తగ్గుతుంది. ప్రస్తుతం 110 కి.మీ.వేగంతో రైళ్లు వెళ్తుండగా, 3, 4వ రైల్వే లైన్ మార్గాలు పూర్తయితే గంటకు 130 కి.మీ.వేగంతో రైళ్లు ప్రయాణించనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు ప్రస్తుతం సికింద్రాబాద్–కాజీపేట వరకు ఉన్న రైళ్ల సమయంలో అరగంట తగ్గుతుందని భావిస్తున్నారు. -
‘డ్రీమ్బిగ్’ ఆడియో ఆవిష్కరణ
హన్మకొండ చౌరస్తా : వరంగల్ నగరానికి చెందిన ఫిజియోథెరపిస్టు రావుల రామకృష్ణ నిర్మించిన ‘డ్రీమ్ బిగ్’ సినిమా ఆడియో, వీడియో ఆవిష్కరణ శుక్రవారం హనుమకొండలోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఫిజియోథెరపిస్టుల అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి సామాజిక భావాలు ఉన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.ఆలోచనలు గొప్పగా ఉంటేనే విజయం తథ్యమని వివరించారు. భవిష్యత్లో భావితరాలకు ఉపయోగపడే సినిమాలను తీయాలని, తమవంతు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. ఫిజియోథెరపిస్టు ఒక డైరెక్టర్గా సినీ రంగంలో అడుగుపెట్టి ఎన్నో మంచి సినిమాలు నిర్మించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఒడితల రాము, శివరామకృష్ణ, సురేష్, ప్రకాశ్, క్రాంతికుమార్, రాజమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
బ్రోకర్ మాటల్లో నేర్పరి సీఎం రేవంత్
హన్మకొండ: బ్రోకర్ మాటలు మాట్లాడడంలో సీఎం రేవంత్ రెడ్డి నేర్పరి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లు సాధ్యం కాదని జీఓ–9 తీసుసుకువచ్చి బీసీలను మోసం చేశారని ధ్వజమెత్తారు. మాటలతో కాంగ్రెస్ అగ్ర నాయకత్వాన్ని, ప్రజలను మోసం చేసి సీఎం అయ్యారని విమర్శించారు. యూరియా కొరతతో ప్రజలు కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తరిమి కొట్టే పరిస్థితి నెలకొందని, దీంతోపాటు హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసి వారి దృష్టి మళ్లించేందుకు బీసీ రిజర్వేషన్ల డ్రామాను ముందుకు తీసుకువచ్చాడని దుయ్యబట్టారు. కేంద్రంలో, రాష్ట్రంలో 55 ఏళ్లు అధికారంలో ఉండి కాంగ్రెస్ ఎందుకు బీసీలకు రిజర్వేషన్లు పెంచలేదని ప్రశ్నించారు. రాష్ట్రాలకు రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం ఇవ్వాలని అనడం నేరమని, అడిగిన వారిని జైల్లో పెట్టాలని గతంలో రేవంత్ మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సీఎం రేవంత్ ఒక్క మీటింగ్ పెట్టలేదని, మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేదని, దీన్ని బట్టి వీరికి ఎన్నికలు జరగవని ముందే తెలుసని అర్థమవుతుందన్నారు. బీసీలను సీఎం రేవంత్, కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాలని, తాము కూడా మద్దతుగా వస్తామన్నారు. అంతకుముందు కాంగ్రెస్ బాకీ కార్డులను ఆవిష్కరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్ కుమార్, శంకర్ నాయక్, డాక్టర్ తాటికొండ రాజయ్య, నాయకులు జోరిక రమేష్, చింతల యాదగిరి, చల్ల వెంకటేశ్వర్ రెడ్డి, బండి రజనీకుమార్, రామ్మూర్తి, పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు -
బీసీ రిజర్వేషన్లపై అగ్రవర్ణాల కుట్ర
నయీంనగర్ : స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీఓ–9పై హైకోర్టు స్టే విధించడాన్ని బీసీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ నేతృత్వంలో శుక్రవారం కేయూ జంక్షన్లో రాస్తారోకో, ధర్నా చేపట్టారు. అనంతరం జీఓ–9కి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు, హై కోర్టులను ఆశ్రయించిన రెడ్డి జాగృతి సంఘం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరీ రవికృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారీ కింది నుంచి పై కోర్టుల వరకు వేదికగా చేసుకొని రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కోర్టులు కూడా బీసీలకు న్యాయం చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ ఆమోదం ఉంటే బీసీ రిజర్వేషన్లకు కోర్టులో స్టే వచ్చేది కాదని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటోందన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీసీ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఎందుకు బాధ్యత తీసుకోలేదని ప్రశ్నించారు. బీజేపీ గల్లీలో ఒక మాట ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతూ.. బీసీలను తప్పు దోవ పట్టిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం సిగ్గుచేటన్నారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఇచ్చిన స్టే అగ్రవర్ణాల కుట్ర అని అన్నారు. వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ.. రెడ్డి కులస్తులంతా బీసీ వ్యతిరేకులేనని, బీసీ సమాజమంతా రెడ్డి కులస్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లపై రెడ్డి జాగృతి పిటిషన్లు అధర్మమని, బీసీ రిజర్వేషన్లు ధర్మమన్నారు. బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించొద్దని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ నిరసనలో నాయకులు సాయిని నరేందర్, కందికొండ వేణుగోపాల్, బోనగాని యాదగిరి గౌడ్, తాడిశెట్టి క్రాంతి, గడ్డం భాస్కర్, బచ్చు ఆనందం, వైద్యం రాజగోపాల్, దాడి మల్లయ్య యాదవ్, పద్మజాదేవి, శోభారాణి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో రెడ్డి జాగృతి దిష్టిబొమ్మ దహనం -
ఇప్పటికిక ఇంతే..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ విడుదల చేసిన జీఓ 9పై దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు గురువారం స్టే ఇచ్చింది. ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల స్వీకరణ చేపట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. హైకోర్టు తీర్పు తర్వాత ఆ మేరకే వ్యవహరిస్తామని ప్రకటించింది. దీంతో ఆరు వారాలపాటు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనుండగా.. డిసెంబర్ మొదటి వారం తర్వాత ఈ మధ్యకాలంలో జరిగే పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ 29న ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ మేరకు నవంబర్ మాసాంతానికి ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో ‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని అందరూ భావించారు. కానీ, హైకోర్టు స్టేతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతటా కలకలం... రాజకీయ పార్టీల్లో దుమారం... రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్లో భాగంగా ఉమ్మడి వరంగల్లో మూడు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటు వామపక్ష పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సెప్టెంబర్ 29న షెడ్యూల్ విడుదల తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆశావహుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించాయి. రెండు విడతల్లో పరిషత్, మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలకు అనుగుణంగా అభ్యర్థులను ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దసరా పండుగకు ముందే రిజర్వేషన్లు ప్రకటించడం.. ఎన్నికల షెడ్యూల్ వెల్లడి కావడంతో ఆశావహుల సందడి పల్లెల్లో జోరందుకుంది. ఎంపీటీసీ, సర్పంచ్ పదవులను ఆశించేవారు పండగ కావడంతో ఖర్చుకు సైతం వెనకాడలేదు. కాగా, ప్రధాన పార్టీలు గురువారం ఉదయం విడుదలైన నోటిఫికేషన్ తర్వాత దశల వారీగా 11వ తేదీ వరకు నామినేషన్లకు ప్లాన్ చేసుకున్నా.. హైకోర్టు తీర్పు తర్వాతే అభ్యర్థులను ప్రకటించేందుకు నిర్ణయించుకున్నారు. నోటిఫికేషన్ వెలువడిన రెండున్నర గంటల్లోనే హైకోర్టు ఎన్నికలకు బ్రేక్ వేసే విధంగా స్టే ఇవ్వడం కలకలం రేపింది. ఊరించి, ఉసూరుమనిపించి.. మొత్తంగా 12 నామినేషన్లు.. రిజర్వేషన్ల ప్రకటన, ఎన్నికల నోటిఫికేషన్లు ఆశావహులను ఊరించాయి. కొత్తగా ప్రకటించిన రిజర్వేషన్లలో అవకాశం వచ్చిన వారు మురిసిపోయారు. షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో ఉమ్మడి వరంగల్లో 37 జెడ్పీటీసీలు, 393 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ తర్వాత గురువారం ఉదయం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ముహూర్తం ప్రకారం 11వ తేదీలోగా నామినేషన్లు వేసేందుకు ఆశావహులు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతా సజావుగా జరిగితే రెండో విడతకు 13వ తేదీ నుంచి 15వరకు నామినేషన్లు వేసేందుకు కూడా సర్వసన్నద్ధమయ్యారు. ఇదిలా ఉంటే మొదటి విడతలో 37 జెడ్పీటీసీ, 393 ఎంపీటీసీ స్థానాలకు జెడ్పీటీసీలకు మూడు, ఎంపీటీసీలకు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబాబాద్, హసన్పర్తి, సంగెం జెడ్పీటీసీలకు ఒక్కో నామినేషన్ రాగా, మహబూబాబాద్ జిల్లాలో ఎంపీటీసీలకు ఐదు, వరంగల్ జిల్లాలో రెండు (సంగెం, గీసుకొండ), జేఎస్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం బాగిర్తిపేటలో ఒకటి, హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలో ఒకటి చొప్పున దాఖలైనట్లు అధికారులు తెలిపారు. కాగా, నోటిఫికేషన్ను రద్దు చేసిన కారణంగా ఇప్పటివరకు వేసిన నామినేషన్లు కూడా చెల్లుబాటు కావని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జీఓ 9పై హైకోర్టు స్టే.. ‘స్థానిక’ ఎన్నికలకు బ్రేక్ డిసెంబర్ మొదటివారం తర్వాతే... ఆశావహులు అప్పటివరకు ఆగాల్సిందే నోటిఫికేషన్ విడుదలైన రెండున్నర గంటలకు న్యాయస్థానం తీర్పు.. ఉమ్మడి వరంగల్లో జెడ్పీటీసీకి 3, ఎంపీటీసీలకు 9 నామినేషన్లు -
నిర్వహణలో నిర్లక్ష్యమెందుకు?
వరంగల్ అర్బన్: పోతన సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్కు సరిపడా వసతులు కల్పించినా ఆపరేషన్, నిర్వహణలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో కమిషనర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ట్రాన్స్ఫర్ స్టేషన్ అపరిశుభ్రంగా ఉండడంపై అధికారులను మందలించారు. హనుమకొండలోని నయీంనగర్లో ఓల్డ్ విజిటేబుల్ మార్కెట్ వద్ద ఉన్న బయో కంపోస్ట్ యూనిట్ను పరిశీలించారు. హనుమకొండ ఏనుగులగడ్డ ప్రాంతంలో పార్కింగ్ చేసి ఉన్న బస్సుల్ని ఖాళీ చేయాలని బస్సు యజమానులను ఆదేశించారు. పోతన సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను కమిషనర్ సాయంత్రం మరోమారు తనిఖీ చేసి నిర్వహణపై సూచనలిచ్చారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎస్ఈ సత్యనారాయణ, ఎంహెచ్ఓ రాజేశ్, ఈఈలు రవికుమార్, మహేందర్, మాధవీలత, డీఈ సారంగం, ఏఈ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు. బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పోతన సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ తనిఖీ -
శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఎంజీఎం : పది రోజులుగా జలుబు, గొంతునొప్పి, సీజనల్ విషజ్వరాలతో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఔట్ పేషెంట్ల సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతోంది. గత ఎనిమిది రోజుల్లో విషజ్వరాలతో బాధపడుతూ 440 మందికి పైగా ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అయి చికిత్స పొందుతున్నారు. ఇందులో 23 మందికి డెంగీ పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం వీరు చికిత్స పొందుతున్నారు. 9 మంది మలేరియాతో బాధపడుతున్నారు. చిన్నారులను సైతం విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఆస్పత్రిలోని పిల్లల విభాగంలో ఈ సంఖ్య ఏమాత్రమూ తగ్గడం లేదు. వణికిస్తున్న డెంగీ జ్వరాలు.. ఎంజీఎం ఆస్పత్రికి విష జ్వర పీడితులతోపాటు డెంగీ పాజిటివ్గా తేలిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతీరోజు ఇద్దరు, ముగ్గురికి పాజిటివ్ నమోదవుతుండడం..వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ అవుతున్నారు. బాధితులకు అన్ని రకాల రక్తపరీక్షలతోపాటు మెరుగైన వైద్యచికిత్సలు అందిస్తున్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. రక్త పరీక్షలకు తప్పని తిప్పలు.. ఎంజీఎం ఆస్పత్రిలో అన్ని రకాల రక్త పరీక్షలు చేస్తున్నామని వైద్యాధికారులు పేర్కొంటున్నప్పటికీ కొన్నింటిని బయటకు పంపిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి అత్యసవర విభాగానికి దగ్గరలో ఉన్న ఓ డయాగ్నోస్టిక్ నిర్వాహకులు ఏకంగా ఆస్పత్రిలో కొంతమంది సిబ్బందితో అక్రమ దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ సిబ్బంది ఏకంగా ఆస్పత్రి లోపలికి వచ్చి శాంపిళ్లు సేకరిస్తుండడం గమనార్హం. డెంగీ బాధితులపై ప్రత్యేక దృష్టి ఎంజీఎంలో జ్వర పీడితుల కోసం ప్ర త్యేక ఓపీ విభాగాన్ని ఏర్పాటు చేశాం. డెంగీ బాధితులపై ప్రత్యేక దృష్టి సారించి చికిత్స అందిస్తున్నాం. అన్ని రక్త పరీక్షలతోపాటు కావాల్సిన సంఖ్యలో ప్లేట్లెట్లు కూడా అందుబాటులో ఉంచాం. – కిశోర్, ఎంజీఎం సూపరింటెండెంట్ ఎంజీఎం ఆస్పత్రికి పెరుగుతున్న విష జ్వరాల రోగులుఎనిమిది రోజులుగా ఎంజీఎంలో ఇన్పేషెంట్ల వివరాలు ఈ ఫొటోలు చూడండి.. హనుమకొండ జిల్లా పరకాల సివిల్ ఆస్పత్రిలోని ఇన్పేషెంట్ వార్డు. సాధారణ రోజుల్లో ఆస్పత్రిలో 100 నుంచి 150 ఓపీ నమోదవుతుంది. కానీ, ఇటీవల విష జ్వరాలు విజృంభించడంతో నెల రోజులుగా 250కి పైగా ఓపీ నమోదవుతోందని ఆస్పత్రి వైద్యులు తెలుపుతున్నారు. ఇక్కడ 30 పడకలే ఉండడం.. ఇన్పేషెంట్లకు సరిపోకపోవడంతో ఒక్కో మంచంపై ఇద్దరు రోగులను ఉంచుతున్నారు. – పరకాల 8 రోజుల్లో 23 మంది డెంగీతో అడ్మిట్ చిన్నారులను సైతం వణికిస్తున్న జ్వరాలు ప్రత్యేక ఓపీతో ఎంజీఎంలో వైద్యచికిత్సలు -
పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి
హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య హన్మకొండ: ప్రజలు పొగాకు, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండ ఎన్జీఓస్ కాలనీలోని వడ్డేపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో టొబాకో ప్రీ యూత్ క్యాంపెయిన్ను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టొబాకో ప్రీ యూత్ క్యాంపెయిన్ 3.0లో భాగంగా.. డిసెంబర్ 8 వరకు 60 రోజులు యువతే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 60 రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాల ఆవరణకు వంద గజాల దూరం వరకు పొగాకుకు సంబంధించిన దుకాణాలు ఉండకుండా చూడాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. బహిరంగ ప్రదేశంలో పొగాకు ఉత్పత్తులు వినియోగించవద్దని సూచించారు. ర్యాలీ తీసిన అనంతరం ఎన్జీఓస్ కాలనీ కూడలిలో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇక్తేదార్ అహ్మద్, వైద్యాధికారి డాక్టర్ మాలిక, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్రెడ్డి, సోషల్ వర్కర్ నరేశ్, హెల్త్ సూపర్వైజర్ గోవర్ధన్రెడ్డి, కమ్యూనిటీ ఆర్గనైజర్ మానస, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. పొగాకు ఉత్పత్తులపై అవగాహన: వరంగల్ డీఎంహెచ్ఓ సాంబశివరావు దేశాయిపేట: పొగాకు ఉత్పత్తులతో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు వరంగల్ డీఎంహెచ్ఓ డాక్టర్ బి.సాంబశివరావు తెలిపారు. నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా దేశాయిపేటలోని సీకేఎం కాలేజీలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధూమపానంతో వ్యక్తిగత అనారోగ్య సమస్యలు, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని అన్నారు. సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ ధర్మారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ వరప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్ఓ కొమురయ్య, ప్రోగ్రాం అధికారి మోహన్సింగ్, సైకియాట్రిస్ట్ భరత్, స్థానిక వైద్యాధికారి భరత్కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయపాల్రెడ్డి, ఎన్సీసీ అధికారి కెప్టెన్ డాక్టర్ సతీశ్కుమార్, డిప్యూటీ డెమో అనిల్కుమార్, సోమేశ్వర్, ప్రకాశ్రెడ్డి, కోర్నేలు తదితరులు పాల్గొన్నారు. -
అరైస్ సిటీకి అనుగుణంగా చర్యలు
ఢిల్లీ సదస్సులో మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: అరైస్ సిటీకి అనుగుణంగా వరంగల్ నగరంలో పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. న్యూఢిల్లీలో ఇక్లీ సౌత్ ఏసియా సంస్థ 20 వసంతాలు పూర్తి చేసుకున్నందున, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ (ఎన్ఐయూఏ) సంయుక్తంగా అరైస్ సిటీస్పై సదస్సు నిర్వహించారు. బుధ, గురువారాల్లో వివిధ ప్రాంతాల నుంచి 200 మంది డెలిగేట్స్ వేదికపై హాజరవ్వగా.. ఇందులో మేయర్ మాట్లాడుతూ.. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, హుజూరాబాద్ వద్ద రూ.150 కోట్ల వ్యయంతో 25 ఎకరాల స్థలంలో 6 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. వరంగల్ నగరాన్ని విశ్లేషించి అందుకు తగినట్లుగా అడాప్టివ్ మెజర్స్, స్ట్రక్చరల్ మెజర్స్, నాన్ స్ట్రక్చరల్ మెజర్స్గా విభజించినట్లు తెలిపారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశామని, ప్రకృతి సిద్ధమైన పరిష్కారాలను అవలంబిస్తున్నట్లు తెలిపారు. పదిశాతం గ్రీన్ బడ్జెట్తో పచ్చదనం కోసం మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. ● అంతమందిని ఎందుకు తీసుకెళ్లారని బోర్డు చైర్మన్ అసహనం ● బిల్లు సర్దుబాటుపై అధికారుల మల్లగుల్లాలు వరంగల్ అర్బన్: స్టడీ టూర్ గ్రాంట్ సర్దుబాటు సమస్మాత్మకంగా మారింది. స్మార్ట్సిటీ ప్రాజెక్టులో భాగంగా స్టడీ టూర్ కోసం రూ.50 లక్షలు కేటాయింపులు జరిగాయి. కౌన్సిల్ తీర్మానం చేసి, ఈ నిధులతో గత నెల కార్పొరేటర్ల బృందం స్టడీ టూర్కు వెళ్లారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. 55 మంది కార్పొరేటర్లతోపాటు బల్దియాకు చెందిన 8 మంది అధికారులు, 17 మంది ఉద్యోగులు అధ్యయన యాత్రకు వెళ్లడంపై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా, ఇప్పుడు ఈ బిల్లు సర్దుబాటు చేయలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈనెల 7న స్మార్ట్సిటీ బోర్డు సమావేశం (వీడియో కాన్ఫరెన్స్) నిర్వహించారు. గ్రేటర్ వరంగల్ స్మార్ట్సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (డబ్ల్యూఎస్సీసీఎల్) చైర్మన్ డా.టికే శ్రీదేవి హాజరయ్యారు. ఈసందర్భంగా ఈ స్మార్ట్సిటీ టూర్ బిల్లు సర్దుబాటుపై చైర్మన్ దృష్టికి మేయర్ సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ తీసుకెళ్లారు. కార్పొరేటర్లతో పాటు ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులను ఎలా? తీసుకెళ్తారంటూ చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులు టూర్కు వెళ్లడం వల్ల జరిగే ప్రయోజనం ఏంటనే సందేహాలు వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వీరి రవాణా, బస ఖర్చులు చూపడం సరికాదని సూచించారు. దీంతో పాలక వర్గం పెద్దలు, ఉన్నతాధికారులు నివ్వెరపోయారు. స్మార్ట్సిటీ గ్రాంటులో ఉద్యోగుల ఖర్చుల వివరాలను నమోదు చేస్తే ఆడిట్లో అభ్యంతరం వ్యక్తం కానుంది. ఈఖర్చును ఎలా చూపించాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. జనరల్ ఫండ్ లేక ఇతర నిధులను మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరో 6 నెలల పాలక వర్గం గడువు ముగుస్తున్న క్రమంలో టూర్కు వెళ్లడం.. పైగా, ఉద్యోగులను అధిక సంఖ్యలో తీసుకెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
12న పల్స్ పోలియో
ఎంజీఎం: ఈనెల 12వ తేదీన (ఆదివారం) 5 ఏళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయనున్నట్లు హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. జిల్లాలో 0–5 ఏళ్ల వయస్సున్న 84,301 మంది పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు 427 బూత్లు, 17 బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో మొబైల్ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కలు వేయనున్నట్లు వివరించారు. తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకుని వారి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కోరారు. ఈమేరకు గురువారం జూమ్ ద్వారా వైద్యాధికారులు, సూపర్వైజర్లతో ఆయన సమావేశం నిర్వహించి కార్యక్రమం విజయవంతానికి పలు సూచనలు చేశారు. హన్మకొండ అర్బన్: జిల్లాలో పత్తి కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు హనుమకొండ అదనపు కలెక్టర్ ఎ.వెంకట్రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లాలో రైతులు 76,463 ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేశారని, సుమారుగా 9,17,556 క్వింటాళ్ల పత్తి దిగుబడి రానుందని పేర్కొన్నారు. రైతులు తప్పనిసరిగా ‘కపాస్ కిసాన్’ యాప్లో స్లాట్ బుక్ చేసుకుని కొనుగోలు కేంద్రాలకు రావాలన్నారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, అధికారులు పాల్గొన్నారు. హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్ పరిపాలన అధికారి గౌరీ శంకర్ గురువారం రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. సమాచార హక్కు చట్టం అమలులో ప్రతిభ కనబరుస్తూ సరైన సమయంలో దరఖాస్తుదారులకు సమాచారమిస్తూ చట్టం అమలులో ఉత్తమ పనితీరు కనబరుస్తున్నందున ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. గౌరీశంకర్కు అవార్డు రావడంపై కలెక్టరేట్ ఉన్నతాధికారులు, సిబ్బంది అభినందించారు. వరంగల్ క్రైం: ఎంబీబీఎస్లో సీటు సాధించిన పోలీస్ పిల్లలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గురువారం సత్కరించారు. ఇటీవల జరిగిన నీట్ మొదటి విడత కౌన్సెలింగ్లో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా కుమార్తె తాన్యసభ హైదరాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో, హోంగార్డ్ బాలకిషన్ కుమారుడు ముప్పా చందు మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో, మరో హోంగార్డ్ మోహన్ కుమార్తె భవాని ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలో సీటు సాధించింది. పిల్లలు ఎంబీబీఎస్లో సీటు సాధించడానికి కృషి చేసిన తల్లిదండ్రులను సీపీ అభినందించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అడిషనల్ డీసీపీలు శ్రీనివాస్, ప్రభాకర్ రావు, ఏసీపీ నాగయ్య, ఆర్ఐ చంద్రశేఖర్, హోంగార్డ్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే ఆస్పత్రిని శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే ప్రిన్స్పల్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (పీసీఎండీ) డాక్టర్ నిర్మల, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సీఎంఎస్) డాక్టర్ నారాయణస్వామి తనిఖీ చేయనున్నట్లు గురువారం రాత్రి రైల్వే నాయకులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి రైలు ద్వారా కాజీపేట జంక్షన్కు చేరుకుంటారని, రైల్వే ఆస్పత్రి డెవలప్మెంట్, పేషెంట్ల సమస్యలు అడిగి తెలుసుకోనున్నట్లు పేర్కొన్నారు. -
12న మిడ్కో సమగ్ర సాహిత్యం ఆవిష్కరణ సభ
హన్మకొండ కల్చరల్: దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్యమకారిణి, రచయిత గుముడవెల్లి రేణుక (మిడ్కో) సమగ్ర సాహిత్యం పుస్తకాల ఆవిష్కరణ సభ నిర్వహిస్తున్నామని ఫౌండేషన్ ప్రతినిధులు అస్నాల శ్రీనివాస్, బిల్ల మహేందర్, బోనగిరి రాములు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12న (ఆదివారం) ఉదయం 10గంటలకు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో జరుగనున్న సభలో పలువురు వక్తలు ప్రసంగిస్తారని, ఉమ్మడి వరంగల్ జిల్లా సాహితీవేత్తలు, ప్రజాస్వామికవాదులు, పరిశోధక విద్యార్థులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో న్యాయశాస్త్రం పూర్తిచేసిన కడవెండికి చెందిన గుముడవెల్లి రేణుక మూడు దశాబ్దాల పాటు ప్రజాఉద్యమాలలో పూర్తిస్థాయి కార్యకర్తగా పనిచేశారు. తాను పాల్గొన్న, తనకు ప్రేరణనిచ్చిన ఉద్యమాలను పరిశీలించి మిడ్కో, దమయంతి వంటి కలం పేర్లతో కథలు, వ్యాసాలు రాసి 2025 మార్చి 31న చనిపోయారు. ఈ మేరకు అనురాధ సంపాదకత్వంలో, విరసం ప్రచురణలో వెలువరించిన మెట్టమీద, ప్రవాహం, విముక్తిబాటలో అనే మూడు సంపుటాలను ఆదివారం ఆవిష్కరించనున్నారు. -
వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు భవనాల పరిశీలన
నయీంనగర్/కాజీపేట: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) వెల్నెస్ సెంటర్ వరంగల్లో ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సెంటర్ ఏర్పాటుకు గురువారం ‘కుడా’ కార్యాలయంలో పైఅంతస్తు, కాజీపే ట మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో ఖాళీ భవనాలను వరంగల్ ఎంపీ కడియం కావ్య, సీజీహెచ్ఎస్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ రోహిణి పరిశీలించారు. వీటితోపాటు దూరదర్శన్ కార్యాలయం వసతి గృహాన్ని పరిశీలించి భవన స్థితిగతులు, విస్తీర్ణం వంటి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ భవనం ఎంపిక ప్రక్రియను వెంటనే పూర్తిచేసి సెంటర్ ప్రారంభానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, పీఓ అజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
కాజీపేట: కాజీపేట 63వ డివిజన్ విష్ణుపురి కాలనీలో స్నేహితుడి ఇంటికి వచ్చిన ఓ యువకుడు గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ కరీమాబాద్కు చెందిన ఆర్టీసీ డిపో మేనేజర్ తిరుమలగిరి శ్రీనివాస్ కుమారుడు రుషికేశ్ (22) బీటెక్ పూర్తిచేసి హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజులుగా కాజీపేటలో ఉంటున్న స్నేహితుడు కొండా హర్షిత్ ఇంటి వద్ద ఉంటున్నాడు. కాగా, రుషికేశ్ మంచంపై నిద్రపోయాడు. కొద్దిసేపటి తర్వాత హర్షిత్ చూడగా కిందపడి కనిపించడంతో కుటుంబీకులను అప్రమత్తం చేసి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై నవీన్కుమార్ ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరిపారు. రుషికేశ్ మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపర్చినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. -
‘ఓరుగల్లు నుంచి బస్తర్ వరకు’ పుస్తకావిష్కరణ
హన్మకొండ కల్చరల్: నగరానికి చెందిన చరిత్రకారులు అరవింద్ ఆర్య పకిడే, కట్టా శ్రీనివాస్ రచించిన ‘ఓరుగల్లు నుంచి బస్తర్ వరకు ’అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. గురువారం ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ రాజమహల్లో బస్తర్ రాజు మహారాజా కమల్ చంద్ర భంజ్ దేవ్, రాజమాత ఆధ్వర్యంలో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ రమణ్సింగ్ పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రమణ్సింగ్ మాట్లాడుతూ ఈ పుస్తకం తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య ఉన్న ప్రాచీన సంబంధాలను తెలియజేస్తుందని, విలువైన చారిత్రక గ్రంథాన్ని వెలువరించిన అరవింద్, శ్రీనివాస్ కృషి అభినందనీయమన్నారు. మహారాజా కమల్ చంద్ర భంజ్దేవ్ మాట్లాడుతూ వరంగల్ నుంచి బస్తర్ వరకు ఉన్న చారిత్రక కట్టడాలు, వారసత్వ విశేషాల గురించి పుస్తకం తెలుపుతుందని, భవిష్యత్ తరాలకు వారధిగా నిలుస్తుందన్నారు. చరిత్రకారుడు అరవింద్ ఆర్య మాట్లాడు తూ ఈ పుస్తకంలో కాకతీయ వంశంపై పరిశోధనా త్మక విశ్లేషణలు ఉన్నాయని, ఓరుగల్లు నుంచి బస్తర్ వరకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలను ఆధారాలతో వివరించామన్నారు. -
ఏటీఎం కార్డు తస్కరించి రూ.19వేలు డ్రా
కాజీపేట: ఆదరిస్తున్న కుటుంబాన్నే ఓ యువకుడు వంచించాడు. ఏటీఎం కార్డు తస్కరించి రూ.19వేలు డ్రా చేశాడు. బాధితుల కథనం ప్రకారం.. కాజీపేటకు చెందిన బైరి సునీత కుటుంబ సభ్యులు తమకు పరిచయం ఉండి ఉపాధిలేక తిరుగుతున్న కడిపికొండకు చెందిన యువకుడు శివను చేరదీసి చేయూతనందిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం స్కూటీ డిక్కీలో ఉన్న ఏటీఎం కార్డును తస్కరించి రూ.19వేలు డ్రాచేశాడు. బాధితుల సెల్కు డబ్బులు డ్రా అయ్యినట్లు మెస్సేజ్ రావడంతో ఖంగుతిన్నారు. బైక్ డిక్కీలో చూడగా ఏటీఎం కార్డు కనిపించకపోవడంతో శివ డ్రా చేసి ఉంటాడని భా వించారు. అనంతరం ఫోన్ చేయగా తనను దుండగులు కిడ్నాప్ చేశారంటూ పొంతనలేని సమాధానా లు చెప్పాడు. దీంతో సునీత కుటుంబీకులు బ్యాంకులో ఫిర్యాదు చేసి ఖాతా లావాదేవీలను నిలిపివేయించారు. కాగా, శివపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు సునీత విలేకరులకు తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలోని పలు జూ నియర్ కళాశాలల్లో సమాచార హక్కు చట్టం, సుపరిపాలన అంశంపై విద్యార్థులకు గురువారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగశాయిపేట, కృష్ణాకాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పోటీలను జిల్లా ఇంటర్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ పరిశీలించి మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రిన్సిపాళ్లు సంపత్కుమార్, శరదృతి, అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఈవీ.. ఈజీ డ్రైవ్!
ఖిలా వరంగల్ : కాలుష్య నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అలాగే, పర్యావరణ పరిరక్షణలో తమ వంతు బాధ్యతతోపాటు పెరిగిన పెట్రోల్ ధరలతో ప్రజలు కూడా ఈవీ వాహనాల వైపు చూస్తున్నారు. ఫలితంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఈ వాహన కొనుగోళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. 2019–2020 వరకు ఉమ్మడి జిల్లాలో 800లోపు ఉండగా.. ఇప్పటికే ఈఏడాది సెప్టెంబర్ వరకు 11వేల దాటింది. విద్యుత్ కార్లు సంఖ్య ఉమ్మడి జిల్లాలో 800 వరకు పెరిగాయని మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు. కాగా, కొనుగోలుదారుల నంచి చార్జింగ్ స్టేషన్లలో ధరలు ఎక్కువ ఉండడం భారమవుతోందనే మాట వినిపిస్తోంది. అని రకాల వాహనాలకు ఉచిత రిజిస్ట్రేషన్ వర్తింపు.. గతంలో వంద సీసీ కన్నా తక్కువ సామర్థ్యమున్న ద్విచక్రవాహనాలకు ఉచిత రిజిస్ట్రేషన్ సదుపాయం ఉండేది. నూతన పాలసీతో అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు ఆర్టీఏలో ఉచిత రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, గూడ్స్, బస్సులు అన్నింటి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ రుసుం ఉచితం. గతంలో వాహనదారుడు రెండో వాహనం కొనుగోలు చేస్తే 2 శాతం పన్ను ఉండేది. ఇప్పుడు ఈవీ రెండో వాహనమైతే పన్ను ఉండకపోవడం చాలా మందికి ఊరటం కలిగించే అంశం. ఉచిత రిజిస్ట్రేషన్ విధానం 31 డిసెంబర్ 2026 వరకు అమలులో ఉండనుంది. విద్యుత్ సంస్థలతోనూ ఒప్పందాలు.. గతంలో పెట్రోల్ బంకుల్లో మాత్రమే చార్జింగ్ స్టేషన్లు ఉండేవి. ఇప్పుడు ప్రధాన జాతీయ రహదారుల పక్కన పెట్రోల్ బంకులు, హోటళ్లు ప్రాంగణంలో ఈవీ వాహనాల చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల పబ్లిక్, ప్రైవేట్ కలిసి 25లోపు ఉన్నాయి. కాగా, ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాలు వాహన షోరూమ్ల్లో మాత్రమే ఉన్నాయి. విక్రయాల అభివృద్ధికి అనుగుణంగా ఇప్పడిప్పుడే చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయని, కార్ల కంపెనీలతోపాటు ప్రైవేట్ సంస్థలు ఆ మేరకు ముందుకొచ్చి విద్యుత్ సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11వేలకు పైగా ఈవీ వాహనాలు ఉన్నాయి. ఇందులో వరంగల్ జిల్లాలో ప్రస్తుతం బైక్లు 2,728, కార్లు 128, ఆటోలు 93, త్రివీలర్ గూడ్స్ 56, లైట్గూడ్స్ 24, క్లాబ్ 1.. మొత్తం 3,030 వాహనాలు ఉన్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈవీ ఆర్టీసీ బస్సులు రోడ్డు ఎక్కాయి. వాటి సేవలను ప్రజలు వినియోగించుకుంటున్నారు. ఈ వాహనాల సంఖ్య పెరగడంతో జిల్లాలో ఈవీ చార్జీంగ్ కేంద్రాల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. తెలంగాణ ఇంధన వనరుల పురుత్పాదక సంస్థ ఆధ్వర్యంలో ప్రధాన రహదారులపై నెలకొల్పేందుకు స్థల సేకరణలో నిమగ్నమయ్యారు.ఆర్టీఏలో ఉచిత రిజిస్ట్రేషన్కు అవకాశం పెట్రోల్ బంక్, హోటల్లలో ఫాస్ట్ చార్జింగ్ మిషన్లు సద్వినియోగం చేసుకుంటే పర్యావరణానికి మేలు జీఎస్టీ తగ్గింపుతో పెరుగుతున్న విక్రయాలు.. జీఎస్టీ తగ్గింపుతోపాటు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీతో విద్యుత్ వాహనాల విక్రయాలు పెరుగుతున్నాయి. రూ.లక్ష విలువైన ద్విచక్రవాహనం కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్, ఇతర చార్జీలకు కనీసం రూ. 8వేల వరకు ఖర్చు అవుతుంది. అదే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేస్తే చార్జీల భారం తగ్గనుంది. ద్విచక్రవాహనానికి రోజుకు కనీసం 5 గంటల చార్జింగ్ పెడితే 3 యూనిట్ల కరెంట్ ఖర్చు కానుంది. ఈ లెక్కన యూనిట్కు రూ.6 చొప్పున రూ.18 ఖర్చు అయితే వంద కిలోమీటర్లు దూరం ప్రయాణించొచ్చు. పెట్రోల్ వాహనమైతే రూ.180 ఖర్చు అవుతుంది. దీంతో ప్రతి ఒక్కరూ ఈవీ వైపుకు మళ్లుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహంతో ఉండడంతో ఈవీ వి నియోగం భాగా పె రిగిపోతోంది. -
ప్రాణదాత.. యుగంధర్
రఘునాథపల్లి : ఓ యువకుడు తాను చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోశాడు. తన అవయవాలు దానం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాడు. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించి అందరితో జేజేలు అందుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామానికి చెందిన గాదె మురళీధర్, శోభ దంపతుల కుమారుడు యుగంధర్ (28) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో దసరా పండుగకు స్వగ్రామంలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. ఈ నెల 5న బైక్పై మేనత్త కుమారుడు చందుతో కలిసి హైదరాబాద్ వెళ్తుండగా ఉప్పల్ దాటాక అదుపు తప్పి కిందపడింది. దీంతో యుగంధర్ తలకు తీవ్ర గాయాలుకాగా స్థానికులు సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న యుగంధర్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు గురువారం ధ్రువీకరించారు. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కాగా, పుట్టెడు దుఃఖంలోనూ వారు మానవత్వం మరువలేదు. కొడుకు బ్రెయిన్ డెడ్ కావడంతో తన అవయవదానానికి అంగీకరించారు. దీంతో వైద్యులు వెంటనే యుగంధర్ గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్ర పిండాలు, కళ్లు సేకరించారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆరుగురు రోగులకు అమర్చారు. ఫలితంగా యుగంధర్ తాను మరణించి ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపగా.. తల్లిదండ్రుల నిర్ణయాన్ని అందరూ అభినందించారు. తమ తనయుడు ఆరుగురికి ఊపిరి పోశాడని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, యుగంధర్ మృతదేహానికి ఆస్పత్రి సిబ్బంది గౌరవ వందనం చేసి అంబులెన్స్లో స్వగ్రామానికి పంపారు. యుగంధర్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు యశోదలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అంతటి బాధలోనూ ఆరుగురికి అవయవ దానం చేసిన తల్లిదండ్రులు -
నా నిశ్శబ్దమే సమాధానం
జనగామ: పొన్నాల నార్టీ మారుతాడని ప్రచారం చేస్తున్న కొంతమంది మూర్ఖులకు తన నిశ్శబ్దమే చెంపదెప్ప లాంటిదని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్యయ్య ఘాటుగా విమర్శించారు. రాజకీయాల్లో తాను ఎప్పుడూ టైగరేనని, అవసరమైనప్పుడే గర్జిస్తానని, ప్రజల పక్షాన నిలబడతానని చెప్పుకొచ్చారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తున్న కేసీఆర్తో కలిసి ముందుకెళ్లేందుకే బీఆర్ఎస్లోకి వచ్చానన్నారు. దేశచరిత్రలో ఎక్కడా లేని విధంగా అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ప్రజాదరణ కోల్పోయిన పార్టీగా కాంగ్రెస్ చరిత్ర పుటల్లో నిలుస్తుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఓటమి తాత్కాలికమేనని, కోట్లాది మంది ప్రజల అభిమానం ఉన్న కేసీఆర్కు అంతకు రెట్టింపు ఆదరణ రానుందన్నారు. లక్షలకు పైగా మైనారిటీ ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్లో గెలవలేని కాంగ్రెస్, ఉపఎన్నికల్లో విజయం తమదే అనడం సిగ్గుచేటన్నారు. నూటికి నూరు శాతం అక్కడ బీఆర్ఎస్ మరోసారి జెండా ఎగురవేయబోతోందన్నారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గాడిపల్లి ప్రేమలతారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం, మాజీ ఎంపీపీ బైరగోని యాదగిరి గౌడ్, సీనియర్ నాయకులు పసుల ఏబేలు, ధర్మపురి శ్రీనివాస్, ఎండీ మాజిద్, ఉల్లెంగుల సందీప్, కొమ్ము రాజు, ఎండీ యాకూబ్, ఉడుగుల కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు. పార్టీ మారుతానని ప్రచారం చేసేవాళ్లకు అదే చెంపదెబ్బ అత్యంత తొందరగా ప్రజాదరణ కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య -
సృజనాత్మకతను వెలికి తీసేందుకే పోటీలు
విద్యారణ్యపురి: విద్యార్థుల్లోని సృజనాత్మకత ను వెలికితీసేందుకు సైన్స్ డ్రామా పోటీలు దో హదం చేస్తాయని జిల్లా విద్యాశాఖలోని క్వాలి టీ కో–ఆర్డినేటర్ బండారు మన్మోహన్ అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా సైన్స్ కేంద్రంలో జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు ముగిశాయి. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈపోటీల్లో ‘హైజీన్ ఫర్ ఆల్ అందరి కోసం పరిశుభ్రత’ అంశంపై శ్యాయంపేట తెలంగాణ బాలికల సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన డ్రామా రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి తెలిపారు. లయన్స్ క్లబ్ హనుమకొండ అధ్యక్షుడు టి.రమేశ్బాబు, బాధ్యులు ప్రభాకర్ పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ రంగస్థల, సినీ నటుడు బీటరవం శ్రీధరస్వామి, హిందీ స్కూల్ అసిస్టెంట్ చెడుపాక రాములు వ్యవహరించారు. ఈపోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. సహ చట్టంపై గవర్నర్ సందేశం న్యూశాయంపేట: సమాచార హక్కు చట్టం– 2005 అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు పూ ర్తయ్యింది. ఈ సందర్భంగా ఈనెల 5 నుంచి 12 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా గురువా రం హైదరాబాద్ రవీంద్రభారతి నుంచి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ వర్చువల్ సందేశం ఇచ్చారు. కలెక్టరేట్లో వరంగల్ కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొని వీక్షించారు. ఈ సందర్భంగా అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ జిల్లా కార్యాలయాల్లో పూర్తి ఆర్టీఐ సమాచారం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నాటికలతో నైపుణ్యాల పెంపు ● వరంగల్ జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ కాళోజీ సెంటర్: నాటికలు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందిస్తాయని వరంగల్ జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ అన్నారు. దక్షిణ భారత సైన్స్ డ్రామా ఫెస్ట్వల్–2025లో భాగంగా జిల్లాస్థాయి సైన్స్ డ్రామా పోటీలు గురువారం మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. మట్టెవాడ ప్రభుత్వ ఉన్న త పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన పరిశుభ్రతే పరమాత్ముడు నాటిక ప్రథమ స్థానంలో నిలిచిందని, ఈనెల 17వ తేదీన హైదరాబాద్లోని ఎన్సీఆర్టీలో జరగనున్న రాష్ట్రస్థాయి సైన్స్ డ్రామా పోటీలకు జిల్లా తరఫున ఎంపికై ందని తెలిపారు. ఖిలా వరంగల్ ఆరెల్లి బుచ్చ య్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన స్మార్ట్ వ్యవసాయం ద్వితీయ స్థానం, రాయపర్తి మండలం కొలనుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన అందరికీ పరిశుభ్రత నాటిక తృతీయస్థానం సాధించింది. న్యాయనిర్ణేతలుగా రహమాన్, మాణిక్య రేఖ, డాక్టర్ స్వప్న, సురేశ్బా బు వ్యవహరించారు. విజేతలకు జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్, వరంగల్ ఎంఈ ఓ వెంకటేశ్వర్లు ప్రశంసపత్రాలు అందజేశారు. పాఠశాల హెచ్ఎం అరుణ, జి ల్లా సైన్స్ రిస్సో ర్స్ పర్సన్స్ కృష్ణంరాజు, సంతోష్, పరమేశ్వర్ పాల్గొన్నారు. -
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
వరంగల్: కుటుంబ గొడవలను మనసులో పెట్టుకుని తనపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన కోడలు పెరుమాండ్ల విద్యారాణి, ఆమె తల్లి పోరండ్ల నిర్మల, తమ్ముళ్లు వేణు, తరుణ్పై చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని వరంగల్ ఎల్బీనగర్కు చెందిన వృద్ధురాలు పెరుమాండ్ల అరుంధతి(70) పోలీసులను కోరారు. ఈ మేరకు గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన పెద్ద కుమారుడు నరేశ్, విద్యారాణికి 14ఏళ్ల క్రితం పెళ్లి అయ్యిందని, హైదరాబాద్లో ఉంటున్న వీరి మధ్య ఏడాది క్రితం గొడవలు జరగడంతో ఆమె తన తల్లి గారింటికి వెళ్లిందన్నారు. మనస్పర్థలు రావడంతో ఇద్దరు వేరుగా ఉంటున్నారన్నారు. ఈ క్రమంలో ఈనెల 6న తాను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తన కోడలు, ఆమె తల్లి, తమ్ముళ్లు దాడికి పాల్పడ్డగా తీవ్రంగా గాయపడ్డానన్నారు. అనంతరం తన సెల్ఫోన్, లాప్టాప్, భూపత్రాలను తమ వెంట తీసుకెళ్లారన్నారు. ఈదాడిపై తాను ఇంతేజార్గంజ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారని, దీనిపై పోలీసు అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు అధికారులకు వృద్ధురాలి విజ్ఞప్తి -
వైన్స్కు 11 దరఖాస్తులు
కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలోని 67 వైన్స్కు బుధవారం 11 దరఖాస్తులను హనుమకొండ జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్కు కలెక్టరేట్లోని డీపీఈఓ కార్యాలయంలో అందజేశారు. కాగా, టెండర్ల ప్రకటన వెలువడిన నాటి నుంచి బుధవారం వరకు 35 దరఖాస్తులు అందాయి. కేయూ క్యాంపస్: పార్ట్టైం అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని కేయూ పార్ట్ టైం అధ్యాపకుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వై.రాంబాబు అన్నారు. బుధవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెగ్యులర్, కాంట్రాక్ట్ అధ్యాపకులతో సమానంగా పనిచేస్తున్నా, అన్ని అర్హతలు ఉన్నా, వేతనాల్లో మాత్రం వివక్ష కొనసాగుతోందన్నారు. పార్ట్ టైం అధ్యాపకులకు కూడా 65 ఏళ్ల వరకు ఉద్యోగ విరమణ ఉండేలా పొడిగించాలని డిమాండ్ చేశారు. ఆ అసోసియేషన్ బాధ్యులు డాక్టర్ తిరుణహరిశేషు మాట్లాడుతూ.. పార్ట్టైం అధ్యాపకులను కాంట్రాక్టు అధ్యాపకులుగా అప్గ్రేడ్ చేయాలన్నారు. సమావేశంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ నరేందర్నాయక్, బాధ్యులు డాక్టర్ బూర శ్రీధర్, డాక్టర్ నివాస్, డాక్టర్ ఎర్రబొజ్జు రమేశ్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ: ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కరీంనగర్ జోనల్ స్థాయి నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. హనుమకొండ రాంనగర్లోని సుందరయ్య భవన్లో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జోనల్ స్థాయి సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కరీనంగర్ జోనల్ అధ్యక్షుడిగా సీహెచ్.రాంచందర్, కార్యదర్శిగా జి.లింగమూర్తి, ఉపాధ్యక్షుడిగా మల్లయ్య, సహాయ కార్యదిర్శిగా ఎం.రాజయ్య, కోశాధికారిగా శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఎంజీఎం: విద్యార్థులు క్రమశిక్షణతో చదివి భవిష్యత్లో ఉన్నత స్థాయికి ఎదగాలని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సంధ్య అన్నారు. ఇటీవల జరిగిన నీట్ కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందిన నూతన విద్యార్థులకు బుధవారం కాలేజీలోని ఎన్ఆర్ఐ ఆడిటోరియంలో ఒరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఈకార్యక్రమాన్ని ప్రిన్సిపాల్.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అమె మాట్లాడుతూ.. కాకతీయ మెడికల్ కాలేజీ చరిత్ర, వైద్యరంగంలో సాధించిన ప్రతిష్టాత్మక విజయాలను వివరించారు. కార్యక్రమంలో కేఎంసీ వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ రామ్కుమార్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీపతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో ఎంఓయూ చేసుకున్నట్లు బుధవారం ఆకాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి తెలిపారు. ఈ ఎంఓయూతో విద్యార్థులకు పోస్టాఫీస్లో పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ద్వారా ఇంటర్న్షిప్ పొందే అవకాశం ఏర్పడిందన్నారు. ఎంఓయూ ద్వారా ట్రైనింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్న్షిప్ సర్టిఫికెట్లు అందజేస్తారని జ్యోతి వెల్లడించారు. కార్యక్రమంలో ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ హనుమకొండ డీహెచ్ఎస్డీ ప్రమోద్ వర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అధికారి ఎల్.జితేందర్, వైస్ ప్రిన్సిపాల్ ఎన్ఎం రెహమాన్, ఫిజిక్స్ విభాగం ఇన్చార్జ్ డాక్టర్ వరలక్ష్మి అధ్యాపకులు తదితరులున్నారు. -
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయండి
హనుమకొండ అర్బన్/న్యూశాయంపేట: నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని కలెక్టర్లను ఆదేశించారు. ఆమె హైదరాబాద్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్ల నుంచి కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద, అధికారులు హాజరయ్యారు. అధికారులతో టెలికాన్ఫరెన్స్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు నిబంధనల మేరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్న్స్ హాల్ నుంచి మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న ఆరు మండలాల ఎంపీడీఓలు, రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జెడ్పీ సీఈఓ రవి, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, ఎంసీసీ నోడల్ అధికారి ఆత్మారామ్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ -
ఆర్టీఐతో కీలక మార్పులు
హన్మకొండ అర్బన్: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకువచ్చేందుకు సమాచార హక్కు చట్టం–2005 అమల్లోకి వచ్చిందని, తద్వారా పాలనలో కీలక మార్పులు వచ్చాయని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో.. సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ప్రజలు కోరిన సమాచారం అందించేందుకు పీఐఓ, ఏపీఓలు చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలు కోరిన సమాచారాన్ని అందించడంలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు. హనుమకొండ కలెక్టరేట్ పీఐఓ రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమంగా నిలిచినందుకు కలెక్టర్ స్నేహ శబరీష్ అభినందనలు తెలిపారు. అనంతరం సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని జిల్లా అధికారులు, పీఐఓలు, ఏపీఐఓలతో కలెక్టర్ సమక్షంలో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వై.వి గణేశ్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, సీపీఓ సత్యనారాయణరెడ్డి, సమాచార హక్కు చట్టం విషయ నిపుణులు ధరమ్సింగ్, జిల్లా స్థాయి అధికారులు, సమాచార హక్కు చట్టం యాక్టివిస్ట్, న్యాయవాది పొట్లపల్లి వీరభద్రరావు, ప్రభుత్వ కార్యాలయాల పీఓలు, ఏపీఐఓలు, అధికారులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల సంరంభం
సాక్షి ప్రతినిధి, వరంగల్: స్థానిక సంస్థల ఎన్నికల సంరంభం నేటి నుంచి మొదలు కానుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేసి పటిష్ట ఏర్పాట్ల మధ్య నామినేషన్ల స్వీకరణకు అధికారులను ఆదేశించింది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని కలెక్టర్లతో బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఈ మేరకు మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. జిల్లాల వారీగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు.. మెదటి విడత ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లోని 37 జెడ్పీటీసీ, 393 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం గురువారం నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. జిల్లాల వారీగా చూస్తే.. హనుమకొండ జిల్లాలోని ఆరు మండలాల్లో తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగన్నాయి. భీమదేవరపల్లి, ధర్మసాగర్, ఎల్కతుర్తి, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు మండలాల్లో 67 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్ జిల్లాలో గీసుకొండ, సంగెం, రాయపర్తి, పర్వతగిరి, వర్ధన్నపేట జెడ్పీటీసీలు, ఆ మండలాల్లోని 64 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. జనగామలో దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, లింగాలఘన్పూర్, చిల్పూరు, స్టేషన్ఘన్పూర్ జెడ్పీటీసీలు, 70 ఎంపీటీసీ స్థానాలకు, మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, గార్ల, గూడూరు, మహబూబాబాద్, నర్సింహులపేట, పెద్దవంగర, తొర్రూరు జెడ్పీటీసీలు... 104 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి జెడ్పీటీసీలు, 58 ఎంపీటీసీ స్థానాలు, ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం జెడ్పీటీసీలు, 30 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడత ఎన్నికలు జరుగనున్నాయి. నేడు ఎన్నికల నోటిఫికేషన్ నామినేషన్ల స్వీకరణకు అధికారుల ఏర్పాట్లు ఉమ్మడి వరంగల్ లో మొదటి విడతలో 37 జెడ్పీటీసీ, 393 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు -
‘బీఏఎస్’ బకాయిలు విడుదల చేయాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏఎస్) ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ డాక్టర్ చందా మల్లయ్య డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి హనుమకొండ కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న బీఏఎస్ బకాయిలను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని కోరారు. లేకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కో–ఆర్డినేటర్ మేకల సుమన్, గుగులోత్ రాజన్న నాయక్, ధర్మ సమాజ్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మైదం రవి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కట్కూరి సునీల్, నాయకులు యేసోబు, మురళి, పేరెంట్స్ కమిటీ బాధ్యులు మహేందర్, శంకర్, రామ్మూర్తి, రాజు, అనిల్, ప్రవీణ్, కవిత, సునీత, వాసు, తదితరులు పాల్గొన్నారు. -
రీయింబర్స్మెంట్ కోసం తల్లిదండ్రుల రాస్తారోకో
హన్మకొండ/న్యూశాయంపేట: బెస్ట్ అవైలబుల్ సూళ్ల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని వరంగల్ జిల్లా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం హనుమకొండ కాళోజీ కూడలిలో రాస్తారోకో చేశారు. వీరికి విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూతో పాటు ఎమ్మార్పీఎస్, బీజేపీ, సీపీఐ మద్దతుగా నిరసనలో పాల్గొన్నాయి. రాస్తారోకో, ధర్నాతో ప్రధాన రాహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను దారిమళ్లించారు. సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న, తన బలగాలతో చేరుకుని రాస్తారోకో చేస్తున్న ఆందోళనకారులను విరమించాలని కోరగా కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే రాస్తారోకో విరమిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పోలీసులు కలెక్టర్తో మాట్లాడిస్తామని కొందరు తల్లిదండ్రులను వరంగల్ కలెక్టరేట్కు తీసుకెళ్లారు. గేట్ దగ్గరకు చేరుకోగానే కలెక్టర్ ఇక్కడికి రావాలని డిమాండ్ చేయడంతో పోలీసులు కలెక్టర్ సత్యశారదతో ఫోన్లో మాట్లాడించారు. కలెక్టర్ సూచనతో పోలీసులు.. జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మిని కలిసి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మార్టిన్ లూథర్, తల్లిదండ్రులు చెన్నకేశవులు, శ్రీనివాస్, అశోక్, జీడి ప్రసాద్, అనిల్, యాదగిరి, విజేందర్, రవీందర్, నాగరాజుతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు. కలెక్టర్ రావాలని డిమాండ్ అదనపు కలెక్టర్కు వినతి పత్రం ఇప్పించిన పోలీసులు -
గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
సాక్షిప్రతినిధి, వరంగల్: కస్టమ్ మిల్లింగ్ ధాన్యం (సీఎంఆర్) కొందరు అధికారులు, రైస్మిల్లర్లకు కాసులు కురిపించే కల్ప తరువుగా మారింది. సీఎంఆర్ దందా మొదలైనప్పటి నుంచి కొంతమంది వ్యాపారులు పైసా ఖర్చు లేకుండా సర్కారు ధాన్యాన్ని దారి మళ్లిస్తూ జల్సాలు చేస్తున్నారు. ఇంకొందరు ధాన్యం మరాడించి పక్క రాష్ట్రాలకు తరలించి బియ్యం అమ్ముకుని.. ఆ డబ్బుతో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేసినట్లు ఆధారాలున్నాయి. మూడేళ్ల కిందట ఇచ్చిన ధాన్యంలో కొందరు సుమారు రూ.236 కోట్ల విలువైన ధాన్యాన్ని ఎగవేశారు. అయినా వారిపైన డబ్బులు రాబట్టుకునేందుకు తీసుకున్న చర్యలు లేవు. దీంతో అవినీతి, అక్రమాలకు అలవాటుపడిన కొందరు అధికారులు, రైస్మిల్లర్లకు సీఎంఆర్ ‘తిలా పాపం తలా పిడికెడు’గా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. మూడేళ్లుగా తాత్సారం.. రైతుల నుంచి వానాకాలం, యాసంగి సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద షరా ‘మామూలు’గా రైస్మిల్లర్లకు సరఫరా చేస్తున్నారు. అలా పంపించిన ధాన్యానికి సంబంధించి బియ్యం చెల్లించని వారిని గుర్తించిన పౌరసరఫరాలశాఖ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఎంతకీ స్పందించకపోవడంతో ఆయా మిల్లులకు సరఫరా చేసిన లెక్కల ప్రకారం ఉండాల్సిన ధాన్యానికి 2022–23లో టెండర్లు నిర్వహించారు. అలా, ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో ఉన్న మిల్లుల్లో 2,92,585 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా.. అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు ఎట్టకేలకు 1,83,985 మెట్రిక్ టన్నులు రాబట్టినట్లు అప్పట్లోనే ప్రకటించారు. సుమారు రూ.217 కోట్ల విలువ చేసే ఆ ధాన్యం ఉమ్మడి వరంగల్కు చెందిన 31 మంది రైస్మిల్లర్ల వద్ద ఉందని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చినప్పటికీ ఇప్పటికీ రాబట్టడం లేదు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉంది. కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో సరిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. వివాదమైనప్పుడే స్పందన.. కొందరు అధికారుల సహకారంతో కస్టం మిల్లింగ్ ధాన్యాన్ని పక్కదారి పట్టించడం ప్రతియేటా కొంతమంది మిల్లర్లకు తంతుగా మారింది. వీటిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్ల వరకూ వెళ్లినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో సీఎంఆర్ పాత బకాయిల మాట పక్కన పెడితే.. కొత్తగా తీసుకునే వాళ్లు సైతం చాలా వరకు మొండికేస్తున్నారు. 2022–23లోని సీఎంఆర్ గడువు దాటినా.. హనుమకొండ, వరంగల్, ములుగు, జేఎస్ భూపాలపల్లి. మహబూబాబాద్ జిల్లాల నుంచి బియ్యం ప్రభుత్వానికి చేరలేదు. ఈ విషయం మీడియా ద్వారా వైరల్, వివాదాస్పదం అయినప్పుడే కొందరు పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆపై అధికారులు స్పందిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే కొందరు ఉన్నతాధికారులకు ‘మిల్లర్లకు నోటీసులు ఇచ్చాం.. ధాన్యం రికవరీ చేస్తున్నాం.. మీడియాలో వచ్చినంత లేదు.. రిజైండర్ ఇచ్చాం..’ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. చర్యలే నిజమైతే.. సర్కారు ధాన్యం ఎగవేసి ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటున్న కొందరు మిల్ల ర్ల నుంచి మూడేళ్లవుతున్నా ఎందుకు రికవరీ కావడం లేదన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. ఈ విషయంలో జిల్లాల కలెక్టర్లు మూలాల్లోకి వెళ్లి విచారణ జరిపి సీరియస్గా యాక్షన్ తీసుకుంటేనే తప్ప బకాయిపడిన మిల్లర్ల నుంచి ధాన్యం డబ్బులు సర్కారు ఖజానాకు చేరే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. మూడేళ్ల కిందట ఇచ్చిన ధాన్యంలో కొందరు సుమారు రూ.236 కోట్ల విలువైన ధాన్యాన్ని మింగేశారు. వారినుంచి డబ్బులు రాబట్టుకునేందుకు తీసుకున్న చర్యలు లేవు. కస్టమ్ మిల్లింగ్ ధాన్యంతో మిల్లర్ల జల్సా మూడేళ్లయినా పట్టించుకోని యంత్రాంగం సర్కారు ధాన్యంతో ట్రేడర్ల వ్యాపారం మిల్లర్లు, అధికారులకు పప్పుబెల్లంలా సీఎంఆర్ రికవరీపై సివిల్ సప్లయీస్ మీనమేషాలు 1.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయంవిచారణలో తేల్చిన ‘ఎన్ఫోర్స్మెంట్’ -
రైతులతో సమావేశం
నయీంనగర్: ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం భూములు సేకరించేందుకు ఆరెపల్లి గ్రామానికి చెందిన రైతులతో బుధవారం ‘కుడా’ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందులో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, ‘కుడా’ వీసీ చాహత్ బాజ్పాయ్, పీఓ అజిత్రెడ్డితో కలిసి ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి రైతులతో మాట్లాడారు. ప్రొజెక్టర్ ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చే ప్రదేశాలను చూపిస్తూ, జరిగే అభివృద్ధిని రైతులకు వివరించారు. భూములు సేకరించి అభివృద్ధి చేస్తామన్నారు. సానుకూలంగా స్పందించిన రైతులు సమయం కావాలని కోరారు. కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ముఖ గుర్తింపు (ఎఫ్ఆర్ఎస్) హాజరు నమోదు వందశాతం పూర్తి చేసినట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. బుధవారం హాజరు రిజిస్ట్రేషన్ తీరుతెన్నులను కళాశాలల వారీగా సమీక్షించినట్లు పేర్కొన్నారు. -
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి..
వరంగల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. వరంగల్ ఓసిటీ స్టేడియంలో బుధవారం 69వ జిల్లాస్థాయి పాఠశాలల క్రీడలను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని కోరారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు, డీపీఆర్ఓ అయూబ్అలీ, జిల్లా యువజన, క్రీడల అధికారి సత్యవాణి, జీసీడీఓ ఫ్లోరెన్న్సా, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, జిల్లా పాఠశాల క్రీడల కార్యదర్శి సోనబోయిన సారంగపాణి, జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు పాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జలగం రఘువీర్, కోశాధికారి వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద ఓ సిటీలో జిల్లాస్థాయి పాఠశాల క్రీడలు ప్రారంభం -
పట్టణ సమాఖ్యకు బల్దియా పెట్రోల్ బంక్!
వరంగల్ అర్బన్: మెప్మాకు చెందిన పట్టణ సమాఖ్యకు బల్దియా పెట్రోల్ బంకు కేటాయించేందుకు ఏర్పాట్లు వేగిరమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా రెండు చోట్ల సెర్ప్కు పెట్రోల్ బంకులు కట్టబెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను మండలానికి ఒకటి చొప్పున బస్సులను సమాఖ్యలకు అప్పగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనేపథ్యంలో.. నగర నడిబోడ్డున ఉన్న బల్దియా బంక్ను కూడా అప్పగిస్తే ఎలా? ఉంటుందనే అంశంపై గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ దృష్టి సారించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన అన్ని విభాగాల సమీక్షలో కమిషనర్ మాట్లాడుతూ.. బంక్ను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించడం సరికాదన్నారు. బంక్ కేటాయింపును రద్దు చేయాలన్నారు. మెప్మాకు అప్పగించాలా? తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, ఎస్ ఈ సత్యనారాయణ, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఎఫ్ఓ శంకర్ లింగం, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఈఈలు డీఈలు తదితరులు పాల్గొన్నారు. కంపోస్ట్ ఎరువును బ్రాండ్తో విక్రయించాలి బయో గ్యాస్ అథారిటీ ప్లాంట్ ద్వారా ఉత్పతవుతున్న విద్యుత్ను వినియోగించుకుంటూ, తద్వారా వెలువడే కంపోస్ట్ ఎరువును బ్రాండ్ల పేరుతో విక్రయించాలని గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. బుధవారం ఉదయం హనుమకొండ పలివేల్పులలో వర్మీ కంపోస్ట్ యూనిట్ ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో కమిషనర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. నిర్మిత ప్లాంట్ స్థలం పరిశీలించి, స్థానికులతో మాట్లాడారు. కేయూ ఫిల్టర్ బెడ్ డ్రైవేస్ట్ రీసోర్స్ సెంటర్ను పరిశీలించారు. వరంగల్ పోతన రోడ్డు నిర్మిత స్థలాన్ని, బల్దియా ప్రధాన కార్యాలయంలోని బయోగ్యాస్ ఆధారిత ప్లాంట్ను సందర్శించారు. కమిషనర్ వెంట సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈ మహేందర్, డీఈ శివానంద్, శానిటరీ సూపర్వైజర్ నరేందర్, ఏఈ హరికుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ బాషానాయక్ తదితరులు పాల్గొన్నారు. సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వండి సమీక్షలో గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
సిమెంట్ పెచ్చులు మీదపడి వ్యక్తికి తీవ్రగాయాలు
కాజీపేట: భవనం పైనుంచి సిమెంట్ పెచ్చులు పడడంతో ఓ బేకరీలో ఆహార పదార్థాలు కొనుగోలు చేసి బయటకు వస్తున్న కస్టమర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. కాజీపేట చౌరస్తాలోని త్రిబుల్ ఎస్ కాంప్లెక్స్కు యజమానులు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టకుండా కొద్ది రోజులుగా మరమ్మతులు చేపడుతున్నారు. బుధవారం హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అలీ(59) తమ బంధువుల పిల్లల కోసం బేకరీలో ఆహార పదార్థాలు కొనుగోలు చేసి బయటకు వస్తున్నాడు. ఈ క్రమంలో పైనుంచి సిమెంట్ పెచ్చులు మహమ్మద్ అలీ కాలిపై పడడంతో పూర్తిగా చిధ్రమైంది. దీంతో అలీ కేకలు వేయగా స్పందించిన బాటసారులు 108లో ఎంజీఎం తరలించారు. కాగా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేసిన భవన యజమానులపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
వనదేవతల హుండీ ఆదాయం రూ.27 లక్షలు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ కానుకల హుండీ ఆదాయం రూ.27,00,177 వచ్చినట్లు ఈఓ వీరస్వామి తెలిపారు. బుధవారం మేడారంలోని ఎండోమెంట్ డార్మెటరీ భవనంలో హుండీలను సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారుల సమక్షంలో లెక్కించారు. సమ్మక్క హుండీ ఆదాయం రూ.15,16,975, సారలమ్మ రూ.10,96,025, గోవిందరాజు రూ.41,956, పగిడిద్దరాజు రూ. 36,321, నోట్లు రూ.8,900 మొత్తం ఆదాయం రూ.27,00,177 వచ్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు పాల్గొన్నారు. కాగా, అమ్మవార్ల హుండీ ఆదాయం ఈసారి తగ్గింది. వర్షాలు, గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మేడారానికి భక్తుల రద్దీ తగ్గడంతోనే ఈసారి ఆదాయం తగ్గినట్లు పూజారులు భావిస్తున్నారు. -
ట్రాఫిక్ నియంత్రణకు కలిసి పనిచేద్దాం
వరంగల్ క్రైం : ట్రాఫిక్ నియంత్రణతోపాటు రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పని చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ ట్రై సిటీ పరిధిలో రోజురోజూకు పెరుగుతున్న ట్రాఫిక్ను అధిగమించేందుకు బుధవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి సీపీ సన్ప్రీత్ సింగ్ ట్రాఫిక్, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ నగరంలో పార్కింగ్ స్థలాల ఏర్పాటు, రోడ్ల ఆక్రమణలు, ప్రధాన మార్గంలో వాహనదారులకు ప్రమాదకంగా మారిన గుంతల మరమ్మతులు చేపట్టాలన్నారు. వడ్డేపల్లి, కాళోజీ సెంటర్, తెలంగాణ జంక్షన్, మడికొండ చౌరస్తా, మరో రెండు ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రధాన రోడ్లపై వ్యాపార సైన్ బోర్డుల తొలగింపుతోపాటు వ్యాపార సముదాయాల్లోని సెల్లారుల్లోనే వాహనాలు పార్క్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, రోడ్లపై వినియోగంలో లేని కరెంట్, టెలిఫోన్ స్తంభాల తొలగించడం, వర్షాకాలంలో వరద రోడ్లపై నిలిచి వాహన రాక పోకలకు ఇబ్బందులు కలిగే ప్రాంతాల్లో ఆ నీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు గుంతలు పడిన ప్రాంతాలతోపాటు డివైడర్ల ఎత్తున పెంపు ప్రాంతాలకు సంబంధించి పూర్తి వివరాలు ట్రాఫిక్ అధికారులు అందజేయాలన్నారు. సమావేశంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్రావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సీతారెడ్డి, వెంకన్న, సుజాత, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.బాణసంచా విక్రయ కేంద్రాల అనుమతికి దరఖాస్తులు దీపావళి సందర్భంగా కమిషనరేట్ పరిధిలో తాత్కాలిక బాణసంచా విక్రయాలతోపాటు బాణసంచా నిల్వ చేసుకొనేందుకు అనుమతి కోసం ఆసక్తి కలిగిన వ్యక్తులు, సంస్థలు ఈనెల 16వ తేదీలోపు సంబంధిత జోన్లకు చెందిన డీసీపీ స్థాయి అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. దరఖాస్తు ఫామ్తో తప్పనిసరిగా అగ్నిమాపక అధికారులు జారీచేసిన ఎన్ఓసీతోపాటు, ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో ఏర్పాటు చేస్తే అధికారులు, యజమానుల అనుమతి పత్రాలు తీసుకోవాలన్నారు. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా అదాలత్ శాఖలో రూ.800 బ్యాంకు చలాన్ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీపీ సన్ప్రీత్ సింగ్ -
బాలగోపాల్ గొప్ప మానవతావాది
కేయూ క్యాంపస్: మానవ హక్కుల నేత బాలగోపాల్ రాజ్యాంగాన్ని ప్రజాసాధికారతకు ఆయుధంగా ఉపయోగించి క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను పునర్నిర్మాణం చేసే యత్నం చేశారని, ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ( ఏపీసీఎల్సీ) తో అనుబంధంగా ఉండి ఖైదీల హక్కుల కోసం, బాధిత కుటుంబాలకు న్యాయ సాయం కోసం నిరంతరం పనిచేశారని హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ (వీసీ) ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు అన్నారు. బుధవారం కాకతీయ యూనివర్సిటీలో సెనేట్హాల్లో డాక్టర్ కె . బాలగోపాల్ 15వ స్మారకోపన్యాసం ‘కాన్సిటిట్యూషనల్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. బాలగోపాల్ అసాధారణ గొప్ప మానవతావాది అన్నారు. ఆయన రచనలు ఎకామి క్ అండ్ పొలిటికల్ వీక్లీ వంటి పత్రికలో ప్రజాజీవితానికి దగ్గరగా ఉండేవన్నారు. బాల గోపాల్ 21వ శతాబ్దపు ప్రత్యేక బహుమఖ ప్రజ్ఞాశాలి అని అభివర్ణించారు. బాలగోపాల్ స్ఫూర్తి కొనసాగించాలి.. బాలగోపాల్ దృక్పథం సమాజ కేంద్రంగా ఉంటుందని, దీనిని నేటి యువత కొనసాగించాలని ప్రముఖ సామాజికవేత్త, సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ఆచార్యుడు జి. హరగోపాల్ అన్నారు. ప్రస్తుతం పుస్తక పఠనం తగ్గడం బాధాకరమన్నారు. న్యాక్ మాజీ డైరెక్టర్ ఆచార్య శివలింగప్రసాద్ మాట్లాడుతూ కేయూ గోల్డెన్ జూబ్లీలోకి అడిగిన సమయంలో బాలగోపాల్ స్మారక ఉపన్యాసం నిర్వహించడం అభినందనీయమన్నారు. కేయూ వీసీ ఆచార్య కె. ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ బాలగోపాల్ కేయూ పూర్వ విద్యార్థి, అలాగే పూర్వ అధ్యాపకుడిగా విశ్వవిద్యాలయంలోనూ భాగమయ్యారని గుర్తుచేశారు. కాగా, బాలగోపాల్ రచించిన వివిధ పుస్తకాలను ఆయన సతీమణి వసంత లక్ష్మి, మానవహక్కులనేత జీవన్కుమార్ కేంద్ర గ్రంథాలయానికి అందజేశారు. విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, సామాజిక ఉద్యమ ప్రతినిధులు పరిశోధకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు కేయూలో బాలగోపాల్ స్మారకోపన్యాసం -
గోదావరి ఎక్స్ప్రెస్లో ఉద్యోగి మృతి
కాజీపేట రూరల్: హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్లో బుధవారం రాత్రి హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఔట్సోర్సింగ్ ఉద్యోగి మృతి చెందాడు. ఈ ఘటనతో రైల్వే అధికారులు గోదావరి ఎక్స్ప్రెస్ను కాజీపేటలో 52 నిమిషాల పాటు నిలిపివేశారు. కాజీపేట జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ వెంకటయ్య, రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా గోపాలపురం వెంకటేశ్వరకాలనీకి చెందిన మారెపల్లి సుజిత్ (45) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్గా పనిచేస్తున్నాడు. ఆయన నాంపల్లి స్టేషన్లో గోదావరి ఎక్స్ప్రెస్ ఎస్–2 కోచ్లో ఎక్కి టాయిలెట్ వెళ్లాడు. హనుమకొండకు చెందిన తోటి ఉద్యోగులు సుజిత్ కనిపించకపోవడంతో ఫోన్ చేస్తూ అటు ఇటు వెతికారు. ఎంతకు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి లాక్ అయి ఉన్న టాయిలెట్ డోర్ను తెరిచి చూడగా అందులో పడి ఉన్నాడు. రైల్వే డాక్టర్ వచ్చి చూడగా అప్పటికే సుజిత్ మృతి చెందినట్లు చెప్పారు. సుజిత్ గుండెపోటుతో మరణించి ఉంటాడని ప్రయాణికులు అంటున్నారు. పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా స్టేషన్కు చేరుకున్నారు. రైలులో నుంచి మృతదేహాన్ని కిందికి దింపి పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీ తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. కాగా, ఈ ఘటనతో కాజీపేట జంక్షన్కు రాత్రి 7:43 గంటలకు చేరుకున్న గోదావరి ఎక్స్ప్రెస్ 8:35 గంటలకు విశాఖపట్టణం బయలుదేరి వెళ్లిందని రైల్వే అధికారులు తెలిపారు. ఆలస్యంపై ప్రయాణికుల ఆందోళన కాజీపేట జంక్షన్లో గోదావరి ఎక్స్ప్రెస్ సుమారు గంటపాటు ఆగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు ఏమైందని ఆరా తీశారు. కాజీపేటలో 52 నిమిషాలు రైలు నిలిపివేత -
జేఎన్ఎస్లో బాక్సింగ్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని డీఎస్ఏ బాక్సింగ్ హాల్లో బుధవారం ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అండర్–17 బాలబాలికల బాక్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. జిల్లా నలుమూలల నుంచి 150 మంది బాలబాలికలు హాజరైనట్లు ఎస్జీఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెలిశెట్టి ప్రశాంత్ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు హనుమకొండలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అండర్–17 బాలబాలికల కన్వీనర్ శీలం పార్ధసారథి, భూపాలపల్లి డీవైఎస్ఓ రఘు, పీఈటీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భోగి సుధాకర్, ఒలింపిక్స్ సంఘం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మంచాల స్వామిచరణ్, పీడీలు సుభాశ్కుమార్, సురేశ్, ప్రేమ్, నాగరాజు, బాక్సింగ్ కోచ్లు దేవరకొండ ప్రభుదాస్, సందెల శ్యాంసన్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి గోవిందరావుపేట : విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈఘటన బుధవారం మండలంలోని పస్రాలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పస్రాలో నిర్మిస్తున్న రైస్ మిల్లు పనుల్లో భాగంగా ఉత్తర్ప్రదేశ్కు బహుగూడ యాదవ్ (20) వెల్డింగ్ చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. సహకార్మికులు స్పందించి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
విద్యుత్ వినియోగం తగ్గింది..
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగం చాలా తగ్గింది. ఈ మేరకు డిమాండ్ కూడా పడిపోయింది. వరుసగా వర్షాలు కురవడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గింది. వర్షాలతో వ్యవసాయ పంటలకు భూగర్భ జలాలు తోడడానికి విద్యుత్ మోటార్ల వినియోగం తగ్గింది. వాతావరణం చల్లబడడంతో గృహాల్లో ఏసీలు, కూలర్ల వినియోగం నిలిచింది. దీంతో విద్యుత్ వినియోగం పడిపోయింది. ఈ మేరకు విద్యుత్ డిమాండ్ కూడా తగ్గింది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో మొత్తంగా ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుంచి 7వ తేదీ వరకు 385.910 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగం జరిగింది. 2024 అక్టోబర్ 1 నుంచి 7వ తేదీ వరకు 542.574 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగింది. అదే విధంగా ప్రస్తుత సంవత్సరం ఈ నెల 1 నుంచి 7 వరకు 22,569 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా, 2024 అక్టోబర్ 1 నుంచి 7 వరకు 29,988 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. దీంతో భారత ఇంధన ఎక్చేంజ్లో విద్యుత్ యూనిట్ కొనుగోలు ధర కూడా కనిష్ఠ స్థాయికి పడిపోయిందని అధికార వర్గాలు తెలిపాయి. అక్టోబర్ మొదటి వారంలో విద్యుత్ వినియోగం, డిమాండ్ వివరాలు.. తేదీ విద్యుత్ వినియోగం విద్యుత్ డిమాండ్ 2025సం. 2024 సం. 2025సం. 2024సం. 1 54.818 81.203 3094 4406 2 56.808 79.554 3397 4526 3 58.423 72.445 3383 4115 4 62.222 78.714 3674 4276 5 55.576 79.616 3325 4322 6 48.365 76.555 2856 4214 7 49.698 74.489 2840 4129 విద్యుత్ వినియోగం (మిలియన్ యూనిట్లలో), డిమాండ్ (మెగావాట్లలో) గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గిన డిమాండ్ ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలో మొత్తం విద్యుత్ వినియోగం 385.910 మిలియన్ యూనిట్లు గత సంవత్సరం ఇదే వారంలో 542.574 మిలియన్ యూనిట్ల వినియోగం -
అక్కడ తప్పించుకున్నారు.. ఇక్కడ పట్టుబడ్డారు
హసన్పర్తి: మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో తప్పించుకున్న గంజాయి విక్రయదారులు హనుమకొండలో పట్టుబడ్డారు. వారి నుంచి సుమారు రూ.20.50 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హనుమకొండ ఏసీపీ నర్సింహారావు మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోచ్బెహార్కు చెందిన రాణాహుస్సేన్ వృత్తిరీత్యా పెయింటర్. సులువుగా డబ్బులు సంపాదించేందుకు తన గ్రామంలో ఉంటున్న గంజాయి వ్యాపారి కృష్ణచంద్ర బర్మన్ను ఆయన సంప్రదించాడు. నాలుగు నెలల క్రితం తన వద్ద ఉన్న డబ్బులతో గంజాయిని ఖరీదు చేసి రైలు ఎక్కి సికింద్రాబాద్ చేరుకున్నాడు. సరుకుని ఇక్కడ విక్రయించినట్లు ఏసీపీ చెప్పారు. ఆ తర్వాత వచ్చిన డబ్బులతో జల్సాలు చేశాడు. ఈవిషయాన్ని తన చిన్న నాటి స్నేహితుడు నూర్ మహ్మద్ మియాకు వివరించాడు. దీంతో నాలుగు రోజుల క్రితం ఇద్దరు చేరో లక్ష రూపాయల చొప్పున సమకూర్చుకున్నారు. గంజాయి వ్యాపారి కృష్ణచంద్ర నుంచి సుమారు 41 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. ఈనెల 4న రైలులో పశ్చిమబెంగాల్ నుంచి సికింద్రాబాద్కు పయనమయ్యారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల తనిఖీల నుంచి వారు తప్పించుకున్నారు. అక్కడి నుంచి బస్సులో హనుమకొండ బస్టాండ్, తర్వాత ముచ్చర్ల క్రాస్లోని జాతీయ రహదారికి చేరుకున్నారు. లారీ ఎక్కి సికింద్రాబాద్కు వెళ్లే క్రమంలో పోలీసులకు చిక్కినట్లు ఏసీపీ నర్సింహారావు చెప్పారు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని రూ.20.50 లక్షల విలువైన 41 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. గంజాయి విక్రయదారులను పట్టుకోవడంతో అత్యంత ప్రతిభ కనబరిచిన పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్పై కల్యాణ్కుమార్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు రూ.20.50 లక్షల గంజాయి స్వాధీనం వివరాలు వెల్లడించిన హనుమకొండ ఏసీపీ నర్సింహారావు -
డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు ఫీజుల పెంపు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సుల్లో (2025–2026) ప్రవేశాలు పొందిన ఫస్టియర్ మొదటి సెమిస్టర్ విద్యార్థులకు వివిధ రకాల ఫీజులు భారీగా పెంచారు. ఈ మేరకు ఆయా ఫీజుల వివరాలను ప్రైవేట్ కళాశాలలకు కూడా సమాచారం అందించారు. ఒక్కో విద్యార్థికి రిజిస్ట్రేషన్ ఫీజు గతంలో రూ. 80 ఉండగా ఇప్పుడు రూ. 1,200కు పెంపుదల చేశారు. రికగ్నిషన్ ఫీజు గతంలో రూ. 400 ఉండగా ఇప్పుడు రూ. 800కు, ఐయూడీఎఫ్ ఫీజు గతంలో రూ. 60 ఉండగా ఇప్పుడు రూ. 300కు, ఎస్డబ్ల్యూఎఫ్ ఫీజు గతంలో రూ. 50 ఉండగా ఇప్పుడు రూ. 200కు పెంపుదల చేశారు. ఒక్క పరీక్ష ఫీజు మాత్రం రూ. 750 గతంలో మాదిరిగానే యథావిధిగా ఉంచారు. గతంలో ఒక్కో విద్యార్థి ఆయా అన్ని రకాల ఫీజుల కింద రూ. 1,340 చెల్లించేవారు. ఇప్పుడు ఏకంగా ఆయా ఫీజులు అన్ని కలిపి రూ.3,250కి పెంపుదల చేశారు. గతంలోకంటే ఒకేసారి ఒక్కో విద్యార్థిపై రూ. 1,910ఫీజు భారం మోపారు. ఒకేసారి ఇంత భారీ మొత్తంలో పెంచిన ఫీజులతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పెంచిన ఫీజులు తగ్గించాలని వినతి.. కేయూ పరిధిలో డిగ్రీకోర్సుల మొదటి సెమిస్టర్ విద్యార్థులకు భారీగా పెంచిన వివిధ రకాల ఫీజులను తగ్గించాలని బుధవారం పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాలు.. రిజిస్ట్రార్ రామచంద్రాన్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయా ఫీజుల స్ట్రక్చర్ను రివైజ్డ్ చేయాలని విన్నవించారు. -
మార్కెట్లో పత్తి కొనుగోళ్లు షురూ
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ అధికారులు బుధవారం కొత్త పత్తి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. బహిరంగ వేలం నిర్వహించగా క్వింటాల్కు గరిష్ట ధర రూ.7,191 పలికింది. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్కు చెందిన రైతు టి.నరేశ్ 10 బస్తాల పత్తిని తీసుకొచ్చాడు. 28 శాతం తేమ ఉండడంతో క్వింటాలుకు రూ.7,191 ధరతో అరవింద్ ట్రేడర్ ద్వారా లక్ష్మీప్రద ట్రేడర్స్ కొనుగోలు చేసినట్లు మార్కెట్ గ్రేడ్ 2 కార్యదర్శి ఎస్.రాము తెలిపారు. సుమారు 3వేల బస్తాలు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి, మాజీ అధ్యక్షుడు కటకం పెంటయ్య, కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతలపల్లి వీరారావు, సాగర్ల శ్రీనివాస్, మార్కెట్ అధికారులు అంజిత్రావు, రాజేందర్, స్వప్న, సలీం తదితరులు పాల్గొన్నారు. సీసీఐ కొనుగోలు చేస్తేనే రైతులకు లాభం.. పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తే అదనంగా ధర పలికి రైతులు ఆదాయం పొందుతారు. పత్తి కొనుగోళ్ల ప్రక్రియలో సీసీఐ కఠిన నిబంధనలు పెట్టడంతో జిన్నింగ్ మిల్లల యజమానులు టెండర్లు దాఖలు చేయలేదు. దీనివల్ల అధికారులు బహిరంగ వేలంతో మార్కెట్లో కొత్త పత్తిని కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ రంగంలోకి వస్తే గరిష్ట మద్దతు ధర రూ.8,110 ఉండి క్వింటాల్కు రూ.500 అధికంగా గిట్టుబాటు అయ్యే అవకాశాలున్నట్లు రైతులు అంటున్నారు. నిబంధనలపై మిల్లర్లతో చర్చలు జరిపి సీసీఐ కొనుగోళ్లు చేపట్టాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. క్వింటాల్కు గరిష్ట ధర రూ.7,191 తొలి రోజు 3వేల బస్తాల రాక -
ఆర్టీసీ ఉద్యోగుల స్థానిక సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల స్థానిక సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి వీఎస్.రావు డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ రాంనగర్లోని సుందరయ్య భవన్లో ఫెడరేషన్ కరీంనగర్ జోనల్ స్థాయి సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాట కార్యక్రమాన్ని తీసుకోనున్నట్లు తెలిపారు. యాజమాన్యం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. ప్రధానంగా విద్యుత్ బస్సుల కొనుగోళ్లను సంస్థకే అప్పగించి సంస్థతోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్మికులపై పని భారం తగ్గించి ఖాళీలు భర్తీ చేయాలన్నారు. ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవీందర్ రెడ్డి, సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్, ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ లింగమూర్తి, ఉపాధ్యక్షుడు సి.హెచ్.రామచంద్రం, నాయకులు ఎల్లయ్య, ఉపేంద్రాచారి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ● స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్.రావు -
పాపయ్యపేటలో వృద్ధుడి ఆత్మహత్య
నర్సంపేట రూరల్ : అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెందిన ఓ వృద్ధుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆవుల వెంకన్న (60)కు మానసిక స్థితి బాగలేదు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం నర్సంపేటకు తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య భూలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటు ఎస్సై రాజేశ్రెడ్డి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో ఎల్లంల గ్రామంలో వ్యక్తి.. జనగామ రూరల్: ఆర్థిక ఇబ్బందులతోఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని ఎల్లంల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల క థనం ప్రకారం.. గ్రామానికి చెందిన బిర్రు వా సు( 55) చేనేత వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నా డు. కుటుంబ పోషణ నిమిత్తం సుమారు రూ. 20లక్షలు అప్పు చేశాడు. అయితే అప్పు తీర్చలేక మార్గం కనిపించకపోవడంతో బుధవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘ టనపై భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విషజ్వరంతో బాలుడి మృతి బయ్యారం: విషజ్వరంతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని జగ్గుతండాలో చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. తండాకు చెందిన చెందిన గోలి సుబ్బారావు కుమారుడు అజయ్(15)కి 10 రోజుల క్రితం విషజ్వరం వచ్చింది. దీంతో మహబూబాబాద్, వరంగల్లోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అయినా తగ్గలేదు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. కాగా, అజయ్ మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. సైబర్ మోసం.. ● యాప్ రివ్యూ పేరుతో డబ్బు కొల్లగొట్టిన కేటుగాళ్లు మహబూబాబాద్ రూరల్ : టెలిగ్రామ్ యాప్ రివ్యూ పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బు కొల్ల గొట్టారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసినట్లు మహబూ బాబాద్ టౌన్ సీఐ మహేందర్ రెడ్డి బుధవారం తెలిపారు. సెప్టెంబర్ 27వ తేదీన సైబర్ నేరగాళ్లు మహబూబాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఫోన్కు వాట్సాప్ ద్వారా టెలిగ్రామ్ యాప్లో రివ్యూలు ఇస్తే డబ్బులు వస్తాయని లింకులు పంపించారు. ఆ లింక్ ద్వారా యాప్లో జాయి న్ అవ్వగా రివ్యూ చెప్పాలంటే రూ.12 వేలు పంపాలని సైబర్ నేరగాళ్లు చెప్పగా బాధితుడు పంపాడు. అనంతరం మరో రూ.38 వేలు పంపాడు. మరోసారి రూ.60 వేలు పంపించాలని అడగగా బాధితుడికి అనుమానం వచ్చింది. వాళ్లు చెప్పిన విధంగా పంపినా తన ఖాతాలో జమ చేయకుండా ఇంకా డబ్బులు అడుగుతున్న విషయాన్ని గుర్తించాడు. తాను సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించి వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి
పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ హన్మకొండ: బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి జరిగిందని పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భద్రకాళి అమ్మవారికి కేసీఆర్ బంగారు కిరీటం చేయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం భద్రకాళి చెరువు మట్టిని అమ్ముకుని అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, నాయకులు మర్రి యాదవరెడ్డి, తాళ్లపల్లి జనార్దన్గౌడ్, రమేష్, పులి రజనీకాంత్ పాల్గొన్నారు. వినయ్భాస్కర్కు పోలీసుల నోటీసులు.. దాస్యం వినయ్భాస్కర్కు పోలీసులు నోటీసులు అందించారు. రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ చౌరస్తాలో గత నెలలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వినయ్భాస్కర్ ధర్నా చేశారు. కాగా, ధర్నా చేసిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో హనుమకొండ ఎస్సై సదానందం నోటీసులు అందించారు. -
‘స్థానికం’లో కాషాయ జెండా ఎగరేస్తాం
బీజేపీ వరంగల్ జిల్లా ఎన్నికల కన్వీనర్ అరూరి రమేశ్ వరంగల్ చౌరస్తా: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ వరంగల్ జిల్లా ఎన్నికల కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. హంటర్ రోడ్డులోని సత్యం కన్వెన్షన్ హాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధిష్టానం ఆదేశానుసారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కారు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మాజీ ఎంపీ అజ్మీరా సీతారానాయక్, నాయకులు కొండేటి శ్రీధర్, డాక్టర్ టి.రాజేశ్వర్రావు, ఎరబ్రెల్లి ప్రదీప్రావు, కంభంపాటి పుల్లారావు, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీశ్, గురుమూర్తి శివకుమార్, రత్నం సతీశ్షా, వన్నాల వెంకటరమణ, జిల్లా నాయకులు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, గోగుల రాణా ప్రతాప్రెడ్డి, జక్కు రమేశ్, వనంరెడ్డి, తాళ్లపల్లి కుమారస్వామి, సునీత తదితరులు పాల్గొన్నారు. -
‘కలెక్టరేట్లో కామాంధుడు’పై వేటు
బుధవారం శ్రీ 8 శ్రీ అక్టోబర్ శ్రీ 2025హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లోని ఓ సీనియర్ అసిస్టెంట్ తన వద్ద పనిచేసే మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ కామాంధుడిపై కలెక్టర్ స్నేహ శబరీష్ కొరఢా ఝుళిపించారు. సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్ ఏ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ సోహెల్ కార్యాలయంలోని మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అతని తీరుపై ‘సాక్షి’లో ప్రత్యేక కథనం వెలువడింది. దీంతోపాటు ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదు మేరకు ప్రాథమిక చర్యల్లో భాగంగా కలెక్టర్ స్నేహ శబరీష్.. అతనిని గత నెల 19న కలెక్టరేట్నుంచి ఎస్సారెస్పీకి బదిలీ చేశారు. ఆ వెంటనే సమగ్ర విచారణకు ఐసీసీ కమిటీని ఏర్పాటుచేశారు. తొమ్మిది మందితో ఏర్పాటైన ఐసీసీ కమిటీ.. బాధితురాలు, నిందితుడు, సాక్షులను విచారించింది. సాంకేతిక ఆధారాలు పరిశీలించింది. ఈ క్రమంలో సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ సోహెల్పై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని కమిటీ నివేదిక ఇచ్చి నట్లు సమాచారం. వీటన్నింటిని పరిశీలించిన కలెక్టర్ న్యాయ సలహా కూడా తీసుకుని ఆ కామాంధుడిపై మంగళవారం సస్పెన్షన్ వేటు వేశారు. కాగా, ఇప్పటికే సదరు సీనియర్ అసిస్టెంట్ ఏర్పాటు చేసుకున్న చాంబర్ను అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. తదుపరి చర్యలకు సిఫారసు.. కలెక్టర్.. సదరు సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ను సస్పెండ్ చేయడంతోపాటు తదుపరి కఠిన చర్యలకు ఉన్నతాధికారులకు సిఫారసు చేసినట్లు తెలిసింది. తన కార్యాలయంలో ఇలాంటి ఘటన జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగానే విచారణ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటూ వచ్చారు. భవిష్యత్లో మహిళా ఉద్యోగుల పట్ల అలాంటి ఆలోచన వస్తే ప్రస్తుత చర్యలు గుర్తుకు రావాలన్నట్లు కలెక్టర్ స్పందించి చర్యలకు ఉపక్రమించారు. కుల సంఘాల ఫిర్యాదు.. బాధితురాలి పక్షాన ఎస్సీ సంఘాలు, ప్రతినిధులు జిల్లా కలెక్టర్ని కలిసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని ఇప్పటికే విన్నవించారు. ఈ ఫిర్యాదుపై కాకుండా నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని, అంతవరకు వేచిఉండాలని కలెక్టర్ వారికి సూచించారు. పలువురు మహిళా సిబ్బందిని వేధించిన సదరు ఉద్యోగి విషయంలో కలెక్టర్ తీసుకున్న చర్యలపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ‘సాక్షి’కి అభినందనలు.. ఈ ఘటన విషయంలో మొదటి నుంచి వాస్తవాలు వెలికి తెస్తూ, కథనాలు రాసిన ‘సాక్షి’కి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాయి. సస్పెండ్ చేసిన హనుమకొండ కలెక్టర్ తదుపరి చర్యలకు సిఫారసు -
‘స్మార్ట్సిటీ’కి డిసెంబర్ డెడ్లైన్
వరంగల్ అర్బన్: నగరంలో చేపట్టిన స్మార్ట్సిటీ పనులు ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి వందశాతం పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ స్మార్ట్సిటీ కార్పొరేషన్ లిమిటెడ్(జీడబ్ల్యూఎస్సీసీఎల్) చైర్పర్సన్, రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో గ్రేటర్ వరంగల్ స్మార్ట్సిటీ 29వ బోర్డు సమావేశం మంగళవారం నిర్వహించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అధికారులు పాల్గొన్నారు. స్మార్ట్సిటీలో పూర్తయి బిల్లులు రాని పనులు, పురోగతిలో ఉన్న వాటి వివరాలను చైర్పర్సన్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్మార్ట్సిటీ నిధులకు సంబంధించి బోర్డులో అప్రూవల్ తీసుకున్న ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు అనుమతి పొందినట్లు వెల్ల డించారు. ఇంకా పూర్తికాని ప్రాజెక్టుల బిల్లుల మంజూరు కోసం అక్టోబర్ వరకు గడువు పొడిగించినట్లు వివరించారు. సమావేశంలో స్మార్ట్ సిటీ బోర్డు సభ్యులు రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఫణికుమార్, ఈఎన్సీ భాస్కర్రెడ్డి, రాష్ట్ర టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ దేవేందర్రెడ్డి, హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, బల్దియా అధికారులు పాల్గొన్నారు. -
10 రోజులు.. 1,622 వాహనాలు
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా రవాణాశాఖకు పది రోజుల వ్యవధిలోనే తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్), రోడ్డు ట్యాక్స్ రూపంలో రూ.5,58,28,420 ఆదాయం వచ్చింది. ఓవైపు దసరా పండుగ, ఇంకోవైపు వాహనాలపై విధించే జీఎస్టీ తగ్గింపుతో ఒక్కసారిగా వాహనాల విక్రయాలు ఊపందుకున్నాయి. తొలి వరుసలో బైక్లు ఉండగా, ఆ తర్వాత స్థానంలో కార్లు ఉన్నాయి. కేవలం పది రోజుల వ్యవధిలో అంటే సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు 1,622 వాహనాల విక్రయాలు జరిగాయని రవాణాశాఖ అధికారులు తెలిపారు. వాటిలో 75 శాతం బైక్లు, కార్లు ఉండగా, మిగిలినవి ఆటోరిక్షాలు, ట్రాక్టర్లు, ఓమ్నీ బస్సులు తదితర వాహనాలు ఉన్నాయి. విక్రయాలు ౖపైపెకి.. జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చిన సెప్టెంబర్ 22న 95 వాహన విక్రయాలు జరిగాయి. 23న 115, 24న 158, 25న 189, 26న 173, 27న 154, 28న 112, 29న 193, 30న 240, అక్టోబర్ ఒకటిన 193 వాహనాల విక్రయాలు జరిగాయి. సెప్టెంబర్ 22న 95 వాహనాలు విక్రయాలైతే, అధికంగా సెప్టెంబర్ 30న 240 వాహనాల అమ్మకాలు జరిగాయి. మిగతా రోజుల్లో సెంచరీపైనే విక్రయాలు జరిగాయని ఆర్టీఏ గణాంకాలు చెబుతున్నాయి. జిల్లా రవాణాశాఖకు దసరా ధమాకా జీఎస్టీ తగ్గింపుతో భారీగా వాహన విక్రయాలు సెప్టెంబర్ 22న 95 విక్రయించగా, అధికంగా 30న 240 వాహనాలు టీఆర్, రోడ్డు ట్యాక్స్ రూపంలో రూ.5,58,28,420 ఆదాయం -
ఓట్లను అపహరించిన బీజేపీ, బీఆర్ఎస్
ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డికాజీపేట రూరల్: బీజేపీ, బీఆర్ఎస్ గతంలో ఓట్లను అపహరించాయని, శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల వ్యత్యాసం ఉందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఆరోపించారు. ఓటు చోరీపై కాజీపేటలో మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వారు హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈసీతో కలిసి ఓట్లను చోరీ చేస్తోందని, దీనిపై రాహుల్గాంధీ కేంద్ర ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారని అన్నారు. ఓటు చోరీపై ఇంటింటికి తిరిగి సంతకాలు సేకరించాలని వారు సూచించారు. కార్పొరేటర్లు జక్కుల రవీందర్యాదవ్, విజయశ్రీరజాలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్రావు, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్రావు, నేషనల్ కోఆర్డినేటర్ పులి అనిల్, మున్సిపల్ ఫ్లోర్లీడర్ తోట వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షురాలు బంక సరళ, కాంగ్రెస్ నాయకులు అరారి సాంబయ్య, ఎండీ అంకూస్, గుంటి కుమార్, సుంచు అశోక్, సిరిల్లారెన్స్, దొంగల కుమార్, అజ్గర్, మనోహర్, నీలక్క, స్వరూప, సుకన్య, మానస, సమతా, రేవతి, శ్వేత పాల్గొన్నారు. -
బలమున్న చోట బరి గీసి..!
● ‘స్థానిక’ ఎన్నికల్లో పొత్తులు.. కాంగ్రెస్తో ‘కామ్రేడ్’లు ముందుకు ● నాలుగు జెడ్పీటీసీ స్థానాలపై గురి... ఎంపీటీసీ, సర్పంచ్లకూ పోటీ సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు కామ్రేడ్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బలమున్న చోట పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనలు చేశారు. ఉమ్మడి వరంగల్లో ఆరు జెడ్పీటీసీ స్థానాల పేర్లను సూచించిన సీపీఐ నేతలు అందులో నాలుగు తప్పకుండా ఇవ్వాలన్న డిమాండ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుపెట్టారు. ఈ మేరకు సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస్రావు తదితరులు టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డితో మంగళవారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లోనూ పొత్తుతో ముందుకు సాగాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రాష్ట్ర వ్యాప్తంగా తమకు బలమున్న చోట పోటీ చేస్తామని సీపీఐ నేతలు చెప్పినప్పటికీ.. ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్లో జెడ్పీటీసీ సీట్ల కేటాయింపుపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి (ఎస్సీ–జనరల్), వరంగల్లో నల్లబెల్లి (బీసీ–జనరల్)ను ఇవ్వాలని సీపీఐ ప్రతినిధుల బృందం కాంగ్రెస్ నేతలకు ప్రతిపాదించింది. మహబూబాబాద్ జిల్లాలో మహబూ బాబాద్ (బీసీ–జనరల్), నెల్లికుదురు (బీసీ–జనరల్)లో ఏదే ని ఒకటి, జనగామ జిల్లాలో రఘునాథపల్లి (బీసీ–మహిళ), జఫర్గఢ్ (బీసీ–జనరల్)లో ఒకచోట జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు చాన్స్ ఇవ్వాలని కోరారు. ఇక ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల విషయంలో సీపీఐకి బలమున్న చోట స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుని అభ్యర్థులను సూచిస్తామని కాంగ్రెస్ నేతలతో స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా, బుధవారం ఉమ్మడి వరంగల్కు చెందిన సీపీఎం నేతలు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డిని పొత్తుల విషయంలో కలువనున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. -
బీసీల రిజర్వేషన్లు అడ్డుకునే యత్నాన్ని విరమించుకోవాలి
హన్మకొండ: బీసీల రిజర్వేషన్ల పెంపును అడ్డుకునే ప్రయత్నాన్ని విరమించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవి కృష్ణ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని కాళోజీ కూడలిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెడ్డి జాగృతి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బైరి రవి కృష్ణ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని రిజర్వేషన్ వ్యతిరేకులైన రెడ్డి జాగృతి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని, ఇటీవల బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవాలని సుప్రీంకోర్టులో గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. బీసీ రిజర్వేషన్లు అన్యాయంగా అడ్డుకోవాలని రెడ్డి జాగృతి చూస్తుంటే ప్రధాన పార్టీల అగ్ర నాయకులు ఎవరు స్పందించడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, నాయకులు దాడి మల్లయ్య యాదవ్, బోనగాని యాదగిరి గౌడ్, మాదం పద్మజ దేవి, మాడిశెట్టి అరుంధతి, తడక సుమన్ గౌడ్, దొడ్డపల్లి రఘుపతి, కాసగాని అశోక్, దాడి రమేశ్ యాదవ్, ఏరుకొండ పవన్ కుమార్, పులి మోహన్ గౌడ్, తంగళ్లపల్లి రమేశ్, పెరుమాండ్ల అనిల్ గౌడ్, పంజాల మధు తదితరులు పాల్గొన్నారు. -
యూరియా వచ్చేసింది..
ఖిలా వరంగల్: వరంగల్ గూడ్స్ షెడ్కు మంగళవారం యూరియా వచ్చింది. ఆర్సీఎఫ్ యూరియా 1,319.220 మెట్రిక్ టన్నులు, క్రిప్కో యూరియా 1,321.20 మెట్రిక్ టన్నులు చేరుకుంది. ఆయా కంపెనీల రికార్డు ప్రకారం ఏఓ రవీందర్రెడ్డి పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలో మార్క్ఫెడ్కు 60శాతం, ప్రైవేట్ ఫర్టిలైజర్ డీలర్లుకు 40శాతం కేటాయించినట్లు రవీందర్రెడ్డి తెలిపారు. తల్లిని చంపిన కేసులో కుమారుడికి జీవిత ఖైదుమొగుళ్లపల్లి: తల్లిని చంపిన కేసులో కుమారుడికి జిల్లా సెషన్స్ జడ్జి సీ.హెచ్. రమేశ్బాబు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ. వంద జరిమానా విధించినట్లు ఎస్సై బొరగాల అశోక్ మంగళవారం తెలిపా రు. మండలంలోని కొర్కిశాల గ్రామానికి చెందిన అప్పం సమ్మక్క, రాజుకుమార్ తల్లీకుమారులు. తోబుట్టువులను మంచిగా చూసుకుంటూ తనను పట్టించు కోవడం లేదని, తల్లిని చంపితే ఆస్తి మొత్తం తనకే వస్తుందనే ఉద్దేశంతో రాజుకుమార్ 2024 జూలై 26న రోకలిబండతో తల్లిని కొట్టాడు. తీవ్రంగా గాయపడిన సమ్మక్క చికిత్స పొందుతూ రెండు రోజుల అనంతరం మృతి చెందింది. ఈ ఘ టనపై మృతురాలి చిన్న కుమారుడు అశోక్ కుమార్ ఫిర్యాదు మేరకు ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం చార్జ్షీట్ దాఖలు చేసి రాజుకుమార్ను కోర్టులో హాజరుపరిచారు. సాక్ష్యధారాలు పరిశీలించిన మేజిస్ట్రేట్.. నేరస్తుడు రాజుకుమార్కు జీవితఖైదు శిక్షతోపాటు జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు. చీడపీడల నివారణపై అవగాహన పెంచుకోవాలి ● వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు గీతారెడ్డి ఖిలా వరంగల్: చీడపీడల నివారణపై రైతులు మరింత అవగాహన పెంచుకోవాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు గీతారెడ్డి అన్నారు. మంగళవారం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ బయో సైన్స్ ఇంటర్నేషనల్ ( సీఏబీఐ) సహకారంతో కోఆర్డినేటర్ అరుణ జ్యోతి అధ్యక్షతన ఆధునిక డిజిటల్ వ్యవసాయ విధానం, చీడీపీడల యాజ మాన్యంపై శిక్షణ నిర్వహించారు. ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమయానుసారంగా సాంకేతిక సమాచారాన్ని రైతులకు చేరచేయ డం అత్యంత కీలకమన్నారు. ఏఓలు, ఏఈఓలు డిజిట ల్ యాప్ల వినియోగంపై పూర్తి అవగాహన పెంచుకుని రైతులకు పురుగుల మందుల వినియోగంపై మార్గ నిర్దేశం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అఽధికారి అనురాధ, మధు మంజరి, డాక్టర్ అనీఫా, నర్సింగం, పాల్గొన్నారు. బోధనలో నూతన పద్ధతులు పాటించాలి ● హనుమకొండ జిల్లా సైన్స్ అఽధికారి శ్రీనివాసస్వామి విద్యారణ్యపురి: ѧéÅ-»Z«§ýl-¯]l-ÌZ ¯]l*™èl¯]l ç³§ýl®-™èl$-Ë$ AÐ]l-ÌS…¼…-^éÌS° çßæ¯]l$-Ð]l$-Mö…yýl hÌêÏ OòܯŒSÞ A«¨M>Ç G‹Ü.}°-Ðé‹ÜÝëÓ-Ñ$ MøÆ>Æý‡$. Ð]l$yìl-Mö…yýl ï³G…} OòßæçÜ*-PÌŒæ-ÌZ BVðSÃ…sñæyŠæ ÇĶæ*-Ísîæ (H BÆŠ‡), Ð]lÆý‡$a-Ð]lÌŒæ ÇĶæ*-Ísîæ (ÒBÆŠ‡), 3yîl Eç³-MýS-Æý‡-×êÌS ѰÄñæ*-VýS…Oò³ Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… HÆ>µ-r$-^ól-íܯ]l Õ„ýS-׿ M>Æý‡Å-{MýS-Ð]l$…-ÌZ BĶæ$¯]l MøÆý‡$Þ OyðlÆð‡-MýSt-ÆŠ‡-V> ´ë ÌŸY° Ð]l*sêÏ-yéÆý‡$. »Z«§ýl-¯]l-ÌZ {ç³Äñæ*-V>ÌS-™ø´ër$ yìlhrÌŒæ Eç³-MýS-Æý‡-×êË$, HBÆŠ‡, 3yîl ç³ÇMýS-Æ>ÌS¯]l$ E´ë-«§éÅ-Ķæ¬-Ë$ ѰÄñæ*-W…-^éÌS° çÜ*_…^éÆý‡$. ï³G…} J…sìæ-Ð]l*-Ñ$yìl-ç³-ÍÏ hÌêÏ ç³ÇçÙ™Œæ E¯]l²™èl ´ëuý‡-Ô>ÌS, Ð]l$yìl-Mö…yýl hÌêÏ ç³ÇçÙ™Œæ E¯]l²™èl ´ëuý‡-Ô>ÌS íœhMýSÌŒæ OòܯŒSÞ, ºÄ¶æ*-Ìêh-MýSÌŒæ OòܯŒSÞ, Ð]l*Å£ŠlÞ, B…VýSÏ E´ë-«§éÅ-Ķæ¬-Ë$ ´ëÌŸY¯]l² D Õ„ýS-׿ÌZ hÌêÏ M>ిÓÏsîæ MøBÇ-z¯ól-rÆŠ‡ yéMýStÆŠ‡ º…yéÆý‡$ Ð]l$¯ŒS-Ððl*-çßæ¯Œl, ï³i òßæ^Œl-G… ¼.çÜ…-«§éÅ-Æ>×ìæ Ð]l*sêÏ-yéÆý‡$. Oòßæ§ýl-Æ>»ê§Šæ-ÌZ° òÜÌêP¯ŒS {Oò³ÐólsŒæ ÍÑ$sñæyŠæ ¯]l$…_ Ð]l_a¯]l ÇÝùÆŠ‡Þ ç³Æý‡Þ¯ŒS A¯ólÓÔŒæ ç³Ë$ A…Ô>-ÌSOò³ AÐ]l-V>çßæ¯]l MýS͵…^éÆý‡$. -
జేఎన్ఎస్లో కబడ్డీ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: పాఠశాల క్రీడల సమాఖ్య (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–19 బాలబాలికల కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 200 మంది క్రీడాకారులు హాజరైనట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన బాలుర నుంచి 12 మంది, బాలికల నుంచి 12 మందిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు మహబూబాబాద్ జిల్లా కొమ్ములవంచలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఒలింపిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.డి. అజీజ్ఖాన్, డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్, డీఐఈఓ ఎ. గోపాల్, ప్రభుత్వ వ్యాయామ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి దరిగె కుమార్, ఫిజికల్ డైరెక్టర్లు బరుపాటి గోపి, కోట సతీష్, రఘువీర్, టెక్నీకల్ అఫీషియల్స్ పాల్గొన్నారు. -
అంతర్జాతీయ సదస్సుకు ముగ్గురు అధ్యాపకులు
కేయూ క్యాంపస్: తమిళనాడులోని మదురై కామరాజు యూనివర్సిటీలో ఈనెల 9,10,11తేదీల్లో ‘విశ్వర్షి వాసలి వాజ్మయం దృక్పథాల ఆవిష్కరణ’ అనే అంశంపై జరగనున్న అంతర్జాతీయ సదస్సులో ముగ్గురు కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకులు పాల్గొననున్నారు. కేయూ తెలుగు విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ కర్రె సదాశివ్, డాక్టర్ చిర్రరాజు, హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ తెలుగు విభాగం పార్ట్టైం లెక్చరర్ డాక్టర్ ఆగపాటి రాజ్కుమార్ పాల్గొని ఆయా అంశాల్లో పరిశోధన పత్రాలు సమర్పించనున్నారు. సదాశివ్చిర్ర రాజురాజ్కుమార్ -
చట్టం ప్రకారం 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి
కేయూ క్యాంపస్ : రాజ్యాంగం ప్రకారం సమాచారం పొందడం ప్రతీ భారతీయ పౌరుడి ప్రాథమిక హక్కు అని, సమాచార హక్కు చట్టం ప్రకారం పౌరులు అడిగిన సమాచారం 30 రోజులలోపు ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయం నుంచి మంగళవారం ఆన్లైన్లో అన్ని యూనివర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లు, పరిపాలన అధికారులు, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లకు సమాచారం హక్కుచట్టంపై అవగాహన కల్పించారు. కేయూ నుంచి వీసీ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం, ‘లా’ కళాశాల డీన్ ఎం. శ్రీనివాస్, వివిధ పరిపాలన అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ పౌరులు అడిగిన సమాచారం 30 రోజులలోపు ఇవ్వకపోతే సంబంధిత అధికారులు రాష్ట్ర సమాచార హక్కుచట్టం కమిషన్కు బాధ్యులవుతారన్నారు. 2005నుంచి సమాచారహక్కుచట్టం అమల్లోకి వచ్చిందని, దీనిని కచ్చితంగా అమలుచేయాల్సిందే అన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి -
హెచ్ఐవీపై అవగాహన ఉండాలి
● జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టాంజిన్ డైకిడ్ ఎంజీఎం: కౌమార దశ నుంచే విద్యార్థులకు హెచ్ఐవీపై అవగాహన ఉండాలని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టాంజిన్ డైకిడ్ సూచించారు. జాతీయ స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ కన్సల్టెంట్ రాజీవ్తివారీతో కలిసి హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా కడిపికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో సమావేశమై మాట్లాడుతూ హెచ్ఐవీ బాధితులపై వివక్ష చూపకూడదని పేర్కొన్నారు. అనంతరం కడిపికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి హెచ్ఐవీ టెస్టులు, గర్భిణులకు పరీక్షలు, కౌన్సెలింగ్ను పరిశీలించారు. హనుమకొండ టీబీ ఆస్పత్రిలోని సంపూర్ణ సురక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఎంజీఎం ఆస్పత్రిలోని ఏఆర్టీ సెంటర్, ఐసీటీసీ, హెచ్ఐవీ వైరల్ లోడ్ టెస్టింగ్ ల్యాబోరేటరీ, కౌన్సెలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టాంజిన్ డైకిడ్, బృందం సభ్యులు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమకొండ, వరంగల్ డీఎంహెచ్ఓలు అల్లెం అప్పయ్య, సాంబశివరావు, ఎంజీఎం సూపరింటెండెంట్ కిశోర్కుమార్, అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్రావు, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జాయింట్ డైరెక్టర్లు రవికుమార్, శిల్ప, టి.అనురాధ, కె.ప్రసాద్, రమేష్, మధుసూదన్, డీడీ ల్యాబ్ సర్వీసెస్ హరిత, ఏఆర్టీ సెంటర్ వైద్యులు సీహెచ్ సూర్యప్రకాశ్, రాంమనోహర్రావు, ప్రోగ్రాం అధికారి మోహన్సింగ్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మేనేజర్ స్వప్న మాధురి, జిల్లా మాస్మీడియా అధికారి అశోక్రెడ్డి, రామకృష్ణ, కమలాకర్, ట్రాన్స్జెండర్స్ రాష్ట్ర అధ్యక్షులు లైలా, ఇక్బాల్ పాషా పాల్గొన్నారు. -
‘కుడా’ చైర్మన్కు పురస్కారం
నయీంనగర్: ‘కుడా’ చైర్మన్ కార్యాలయంలో చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డిని శ్రీ శాంతికృష్ణ సేవా సమితి అధ్యక్షుడు శాంతికృష్ణ మంగళవారం కాకతీయ కీర్తి సేవా పురస్కారంతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కాకతీయ కళా వైభవం–శ్రీశాంతికృష్ణ సేవా సమితి 40వ వార్షికోత్సవం, 1,112వ అంతర్జాతీయ కళా మహోత్సవాల సందర్భంగా శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఇనగాల వెంకట్రాంరెడ్డిని కాకతీయ కీర్తి సేవా పురస్కారానికి ఎంపిక చేసింది. కుడా చైర్మన్కు విజ్ఞప్తి సమస్యలు పరిష్కరించాలని ఇన్నర్రింగ్ రోడ్డు బాధితులు మంగళవారం కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డిని ఆయన నివాసంలో కలిసి విజ్ఞప్తి చేశారు. త్వరలోనే వారి సమస్యలు పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ‘బీఏఎస్’ బకాయిలు విడుదల చేయాలి న్యూశాయంపేట: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కీం (బీఏఎస్)కు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వరంగల్ కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో ప్రైవేట్ స్కూళ్ల యజమాన్యాలు తమ పిల్లలను పాఠశాలల్లోకి అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని వారు కోరారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని ఏఓ విశ్వప్రసాద్కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో కందిక చెన్న కేశవులు, కళ్యాణి, రాకేష్, వెంకన్న, రాజు, భద్రు, రాజేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తెగులు.. దిగులు
దుగ్గొండి: పసుపు.. పచ్చ బంగారం. రైతులకు సిరులు కురిపించే పంట. అయితే కొన్ని సంవత్సరాలు గా గిట్టుబాటు కావడం లేదు. మద్దతు ధర లేకపోవడం, దిగుబడి రాకపోవడంతో అన్నదాతలు నష్టా ల పాలవుతున్నారు. గతేడాది వరంగల్ జిల్లా వ్యాప్త ంగా 9 వేల ఎకరాలలో పసుపు పంట సాగుకాగా ఈ సారి 6 వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఈ క్రమంలో విస్తీర్ణం తగ్గిన కారణంగా పసుపుకు అధి క ధర దక్కే అవకాశం ఉందని, రైతులు పంటను జాగ్రత్తగా కాపాడుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు సూచించారు. అధిక వర్షాల కారణంగా పసుపులో తాటాకు తెగులు, ఆకుమచ్చ, దుంప పుచ్చు, దుంప ఈగ తెగుళ్లు ఆశించాయని, వెంటనే అన్నదాతలు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పసుపు పంటకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు అత్యంత కీలకమని ఆయన తెలిపారు. ఈగ పిల్ల పురుగులు తెల్లరంగులో బియ్యం గింజల మాదిరి ఉండి భూమి లోపల ఉన్న దుంపల్లోకి చొచ్చుకుని వెళ్లి దుంపను తిని నాశనం చేస్తాయి. ఈ పురుగు వల్ల సుడి ఆకు దాని దగ్గరలో ఉండే లేత ఆకులు వాడి గోధుమ రంగుగామారి ఎండి రాలుతాయి. మువ్వను పీకితే సులభంగా ఊడి వస్తుంది. నివారణ.. ఈ పురుగు లక్షణాలు కనిపిస్తే ఎకరాకు 100 కిలోల వేపపిండిని మొక్కల మొదళ్ల వద్ద వేయాలి. వేప పిండి వేయడానికి వీలుకాకపోతే 10 కిలోల కార్బోఫ్యూరాన్ గుళికలను 10 కిలోల ఇసుకలో కలిపి ఎకరం భూమిలో సమంగా చల్లాలి. పసుపు పంటకు మూడు నెలలు కీలకం.. ఆకుమచ్చ, దుంపకుళ్లుతో పంటకు తీవ్ర నష్టం జాగ్రత్తగా ఉండాలి రైతులకు వరంగల్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసరావు సలహాలు -
పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
● వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారదన్యూశాయంపేట: స్థానిక సంస్థల ఎన్నికలు, కౌంటింగ్కు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ఏనుమాముల మార్కెట్ యార్డులో జిల్లాలోని 11 మండలాలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను మంగళవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మండలాల వారీగా బ్యాలెట్ బాక్సులు భద్రపర్చడానికి స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాళ్లు పక్కపక్కనే ఉండేలా చూడాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సదుపాయాల కల్పనలో ఎలాంటి సమస్య రాకుండా ఉండాలని పేర్కొన్నారు. నిరంతరం సీసీ కెమెరాల నిఘా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఆమెవెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి ఉన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన.. వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులో జిల్లా గోదాములను కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. భద్రత చర్యలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో డీపీఓ కల్పన, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, హౌసింగ్ పీడీ గణపతి, తహసీల్దార్ శ్రీకాంత్, నాయబ్ తహసీల్దార్ రంజిత్, తదితరులు పాల్గొన్నారు. ప్రింటింగ్ ప్రెస్ యజమానులు నిబంధనలు పాటించాలి.. ఎన్నికల కమిషన్ నిబంధనలు, మార్గదర్శకాలను స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల ప్రింటింగ్ ప్రెస్ల యాజమాన్యం కచ్చితంగా పాటించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రింటింగ్, ముద్రణ యాజమాన్యంతో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన పాల్గొన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం –2018 ప్రకారం ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ముద్రణ, ప్రచురణలపై దిశానిర్దేశం చేశారు. -
మ్యూజియం పనులు పూర్తిచేస్తాం
● రాష్ట్ర పురావస్తుశాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.అర్జున్రావు ఖిలా వరంగల్: మ్యూజియం అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని రాష్ట్ర పురావస్తుశాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.అర్జున్రావు తెలిపారు. మంగళవారం ఖిలా వరంగల్కోటను రాష్ట్ర పురావస్తుశాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు, అడిషనల్ డైరెక్టర్ బుజ్జి, పర్యాటక శాఖ జిల్లా అధికారి శివాజీతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శిల్పాల ప్రాంగణంలోని శిల్పసంపదను తిలకించారు. అనంతరం నిర్మాణంలోని మ్యూజియం భవనాన్ని సందర్శించి మాట్లాడారు. దీర్ఘకాలిక కొనసాగుతున్న మ్యూజియం అభివృద్ధి పనులు పూర్తిచేసి పర్యాటకులు, జిల్లా వాసులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. భక్తులు, పర్యాటకులకు చరిత్ర తెలిసేలా సైన్ బోర్డులు, వివరణాత్మక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆదేవిధంగా ఆలయ గోడలపై ఉన్న వైట్వాష్ను రసాయనాలతో శుద్ధి (కెమికల్ క్లీనింగ్) చేయాలని సూచించాచారు. అంతకుముందు స్వయంభూ దేవాలయంలోని శంభులింగేశ్వరుడిని దర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి శంభులింగం పూర్ణకుంభంతో ఆయనను స్వాగతించారు. కార్యక్రమంలో కోట గైడ్ రవియాదవ్, సౌండ్ అండ్ లైటింగ్ షో ఇన్చార్జ్ అజయ్, సిబ్బంది పాల్గొన్నారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ఎంజీఎం: కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల పెండింగ్ వెతనాలు వెంటనే చెల్లించాలని, అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదానాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఆస్పత్రి ఎదుట సిబ్బందితో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యాదానాయక్ మాట్లాడుతూ 6 నెలలుగా వేతనాలు రాకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. అనంతరం ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యకు వినతిపత్రాలు అందించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి జె.సుధాకర్, ఆస్పత్రి సిబ్బంది శోభ, సంధ్య, భానురేఖ, విక్రం, కోమల, సంతోష్కుమార్, లావణ్య, మౌనిక, స్రవంతి, హిమబిందు, శ్రావణి పాల్గొన్నారు. కేసు తారు మారు ● హైకోర్టును ఆశ్రయించిన బాధితుడు ● ఎస్సైతోపాటు ౖవైద్యులపై కేసు నమోదుకు ఆదేశం హసన్పర్తి: ప్రత్యర్థులు దాడి చేస్తే గాయపడిన తనను రోడ్డు ప్రమాదానికి గురైనట్లు కేసు తారుమారు చేశారని బాధితుడు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో సదరు అధికారులపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు ఎస్సై సాంబయ్యతోపాటు వైద్యులపై కేసు నమోదైనట్లు హనుమకొండ పోలీస్స్టేషన్ ఎస్సై సతీష్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. హసన్పర్తి మండలం వంగపహాడ్కు చెందిన ప్రశాంత్కుమార్ అనే యువకుడిపై 2022లో కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. సంఘటనస్థలాన్ని పరిశీలించిన అప్పటి ఎస్సై సాంబయ్యతోపాటు వైద్యులు కూడా తాను రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు నివేదిక ఇచ్చారంటూ ప్రశాంత్కుమార్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో కేసును తారుమారు చేసిన ఎస్సై సాంబయ్యతోపాటు వైద్యసిబ్బందిపై కేసు నమోదు చేయాలని హైకోర్టు.. హనుమకొండ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు ఎస్సైతోపాటు వైద్యులపై కేసు నమోదైంది. -
పర్యాటక రంగ అభివృద్ధికి కృషి
హన్మకొండ కల్చరల్/ హన్మకొండ చౌరస్తా: ఉమ్మ డి వరంగల్ జిల్లా పర్యాటక రంగ అభివృద్ధికి అధి కారులు సమన్వయంతో కృషి చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ కనకదుర్గ కాలనీలోని తన కార్యాలయంలో పురావస్తుశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని చారిత్రక ఆలయాలు, కాకతీయ వారసత్వ సంపదను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. వేయిస్తంభాల దేవాలయంలోని కల్యాణమండపం మరమ్మతులు, విగ్రహప్రతిష్ఠాపన, భద్రకాళి దేవాలయం, చిల్పూరులోని బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధి, భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్పాక ఆలయం, కోటగుళ్లు, రెడ్డిగుడి ప్రత్యేక శిలలపై నిర్మితమైన ఆలయాల పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలన్నారు. అలాగే, వరంగల్ కోటలో ఉన్న 14 ఆలయాల పునరుద్ధరణ పనులను పూర్తి చేయాలన్నారు. అనంతరం పురావస్తుశాఖ అధికారులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డితో కలిసి వేయిస్తంభాల దేవాలయాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్కియాలజిస్ట్ సూపరింటెండెంట్ నిహిల్ దాస్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ రోహిణి పాండే, ఇతర అధికారులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య -
‘టెక్స్టైల్’ పనులు వేగవంతం చేయాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పనులను వేగవంతం చేయాలని అధికారులను వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మితో కలిసి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని గ్రీన్ కవరింగ్, ఆర్ఓబీ, ‘కుడా’ లేఔట్, డ్రెయినేజీ, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ తదితర పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పార్కులో 12 వేల ప్లాంటేషన్ పనులను 15రోజుల్లో పూర్తి చేయాలని హర్టికల్చర్ అధికారిని ఆదేశించారు. సమావేశంలో ఇండస్ట్రియల్ జోనల్ మేనేజర్ స్వామి, ‘కుడా’ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్రెడ్డి, ట్రాన్స్కో ఎస్ఈ గౌతంరెడ్డి, మిషన్ భగీరథ ఈఈ మాణిక్యరావు, ఆర్అండ్బీ డీఈ దేవిక, తహసీల్దార్లు రియాజుద్దీన్, రాజ్కుమార్, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా నోడల్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో నోడల్ అధికారులతో కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి సోమవారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీపీఓ కల్పన, అధికారులు పాల్గొన్నారు. -
ఎన్నిసార్లుఫిర్యాదు చేయాలి?
వరంగల్ అర్బన్: ‘మౌలిక వసతులు కల్పించరా? ఆక్రమణలు, అతిక్రమణలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు’ అంటూ పలు కాలనీలవాసులు బల్దియా గ్రీవెన్స్లో అధికారుల ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ చాహత్ బాజ్పాయ్ దరఖాస్తులు స్వీకరించి, అభివృద్ధి పనుల్ని ప్రాధాన్యతా క్రమంలో ప్రతిపాదనలు అందజేయాలని, ఇతర సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో విస్తృతంగా తనిఖీలు చేయాలని ప్రజల సమస్యలపై ఫోకస్ పెట్టాలన్నారు. గ్రీవెన్స్ సెల్కు 61 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్ ప్లానింగ్కు 29, ఇంజనీరింగ్ సెక్షన్కు 18, హెల్త్– శానిటేషన్ 7, పన్నుల విభాగానికి 6, తాగునీటి సరఫరాకు 1 ఫిర్యాదు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, ఎస్ఈ సత్యనారాయణ, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, డీఎఫ్ఓ శంకర్ లింగం, సీహెచ్ఓ రమేశ్, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు రవీందర్, సమ్మయ్య, పన్నుల అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయండి
మేయర్ గుండు సుధారాణి రామన్నపేట: డివిజన్లో పెండింగ్లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. నగరంలోని 29వ డివిజన్లో సోమవారం పర్యటించి పెండింగ్లో ఉన్న పైప్లైన్ పనులు, సీసీ కెమెరాలు, నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు, శానిటేషన్, తదితర పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. డివిజన్లో పైప్లైన్ పనుల్ని వెంటనే పూర్తి చేయాలని, ప్రధాన జంక్షన్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసి వాటికి సీసీ కెమెరాలు అమర్చాలని అధికారులను ఆదేశించారు. పాత విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈ శ్రీకాంత్, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు. చెత్తను తొలగించండి.. డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని 24వ డివిజన్ మట్టెవాడ వాటర్ ట్యాంక్తో పాటు గోపాలస్వామి గుడి ఎదురు గల్లీ ప్రాంతాల్లో మేయర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి సిబ్బంది నిర్వహించాల్సిన విధులపై ఆదేశాలు జారీ చేశారు. 24, 28, 29 డివిజన్లో నీటి సరఫరాలో అంతరాయం కలిగిన నేపథ్యంలో వాటర్ ట్యాంక్ పరిశీలించి నూతన వాల్వ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గోపాలస్వామి గుడి ప్రాంతంలో మేయర్ డ్రెయిన్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ రామ తేజస్వి శిరీష్, శానిటరీ డీఈ రాగి శ్రీకాంత్, సూపర్వైజర్ శీను, ఏఈ హబీబ్ పాల్గొన్నారు. -
ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు ఓకే!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో 2010లో నియామకమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఎట్టకేలకు పదోన్నతులు కల్పిస్తూ కేయూ పాలకమండలి సమావేశం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరి నియామకాలను గత పాలకమండలిలో ఆమోదించినా పెండింగ్లో ఉండిపోయింది. తాజా సమావేశంలో పదోన్నతి అంశం చర్చకు వచ్చి పదోన్నతులకు చివరికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరలోనే వీరికి క్యాస్ పదోన్నతులు లభించనున్నాయి. సోమవారం హైదరాబాద్లోని సచివాలయంలో నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సమావేశంలో ఎజెండాలోని పలు అంశాలపై చర్చించి ఆమోదించినట్లు తెలిసింది. యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో రెగ్యులర్ ఆచార్యుల కొరతతో వర్క్లోడ్ అధికంగా ఉంది. ఇందుకు అనుగుణంగా పార్ట్టైం లెక్చరర్లను నియమించడం లేదు. ఇటీవల వివిధ విభాగాల్లో పేపర్ వైజ్గా నియామకాలు చేపట్టారు. పార్ట్టైం లెక్చరర్లను నియమించాలనే విషయంపై పాలక మండలిలో చర్చించారు. వర్క్లోడ్కు అనుగుణంగా 130 మందిని నియమించుకునేందుకు పాలక మండలి ఆమోదించింది. ఇందుకోసం నోటిఫికేషన్ ఇచ్చి అర్హులైనవారిని నిబంధనలకు అనుగుణంగా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారి ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ నుంచి 65 ఏళ్లవరకు పెంచుతూ ఆమోదించింది. రెగ్యులర్ ఆచార్యులకు మాదిరిగానే వీరికి ఉద్యోగ విరమణ ఉండనుంది. టీచింగ్, నాన్టీచింగ్ ఉద్యోగులు మరణిస్తే అంత్యక్రియల ఖర్చు రూ.20వేల నుంచి రూ.30వేలకు పెంచుతూ ఆమోదించింది. యూనివర్సిటీ భూమిలో ఇల్లు కలిగి ఉండడంతో పాటు పలు ఆరోపణలతో ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్న ఓ అసిస్టెంట్ రిజిస్ట్రార్పై విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్లాలని పాలకమండలి సూచించినట్లు సమాచారం. ప్రహరీ నిర్మాణంపై ప్రస్తావన.. కాకతీయ యూనివర్సిటీలోని భూమి చుట్టూ ప్రహరీ నిర్మించాలనే విషయంపై మళ్లీ పాలకమండలిలో చర్చకు రాగా రూ.20 కోట్ల వ్యయంతో కొంత ఎత్తుగా ఉండేలా నిర్మాణాన్ని ప్రభుత్వ సంస్థ టీజీడబ్ల్యూఐడీసీకి అప్పగించాలని చర్చించినట్లు సమాచారం. పాలక మండలిలో నిర్ణయించిన ప్రకారం యూనివర్సిటీ అధికారులు ముందుకెళ్లాలని నిర్ణయించారని విశ్వసనీయంగా తెలిసింది. సమావేశంలో కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా, ఉన్నత విద్య కమిషనర్ శ్రీదేవసేన, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, పాలకమండలి సభ్యులు ఆచార్య బి.సురేశ్లాల్, డాక్టర్ కె.అనితారెడ్డి, డాక్టర్ రమ, డాక్టర్ చిర్రా రాజు, సుకుమారి, మల్లం నవీన్, బాలు చౌహాన్ టి.సుదర్శన్ పాల్గొన్నారు. ఇక పార్ట్టైం లెక్చరర్ల నియామకం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంపు రూ.20 కోట్లతో ప్రహరీ నిర్మాణం కేయూ పాలక మండలి సమావేశంలో ఆమోదం -
రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ ఆరోపణలు
సాక్షిప్రతినిధి, వరంగల్/హన్మకొండ చౌరస్తా: రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నాయకులు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ పేరుతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండ డీసీసీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య ‘‘బీఆర్ఎస్ కా ధోకా కార్డు’’ను విడుదల చేశారు. తెలంగాణలో పదేళ్లలో ప్రజలకిచ్చిన ఏమేం హామీలను నెరవేర్చలేదో వాటిలో కొన్నింటిని ఆ కార్డులో పేర్కొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. విశ్వాసంతో మమ్మల్ని గెలిపించి, అభివృద్ధిలో భాగస్వాములను చేసిన ప్రజలకు జీవితాంతం బాకీ ఉంటామనేది వాస్తవమేనన్నారు. మిగులు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రంలో 11 శాతం వ డ్డీపై అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీయించిన బీఆర్ఎస్ నేతలే ప్రజలకు అసలైన బాకీదారులని ఆరోపించారు. పదేళ్ల పాలనలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్థిక భారాన్ని మోపిన బీఆర్ఎస్ నేతలు బాకీ కార్డ్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అక్రమాలకు మారుపేరుగా నిలిచిన కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు గిన్నిస్ బుక్లో స్థానం కల్పించాలని వారు ఎద్దేవా చేశారు. సమావేశంలో వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీ డర్ వెంకటేశ్వ ర్లు, కార్పొరేటర్లు రవీందర్, విజ యశ్రీ, కిసాన్సెల్ జిల్లా చైర్మన్ వెంకట్రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సరళ, పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య హనుమకొండలో ‘బీఆర్ఎస్ కా ధోకా కార్డు’ విడుదల -
గణేశ్ వైద్య విద్యకు కేటీఆర్ భరోసా
హన్మకొండ : హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన ఆర్ముళ్ల గణేశ్ వైద్య విద్య ఖర్చును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు భరిస్తారని ఆపార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భా స్కర్ అన్నారు. తల్లిదండ్రులు లేని గణేశ్కు ఎంబీబీఎస్లో సీటు రాగా, ఖర్చులు భరించే ఆర్థిక స్థోమత లేక ‘ఎక్స్’ ద్వారా సహాయం చేయాలని కోరగా కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు సోమవారం హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన కా ర్యక్రమంలో గణేశ్కు వినయ్భాస్కర్ రూ.1.50 లక్షలు అందించారు. గణేశ్ ఎంబీబీఎస్ విద్య పూర్తయ్యే వరకు ఖర్చును కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ అందిస్తుందన్నారు. కాజీపేట అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్లోని ఎక్సైజ్ కార్యాలయంలో సోమవారం వైన్స్ టెండర్లలో భాగంగా 7 దరఖాస్తులను మ ద్యం వ్యాపారులు అందజేశారు. జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, కాజీపేట ఎకై ్స జ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని 67 వైన్స్కు ఇప్పటి వరకు 14 దరఖాస్తులు అందాయి. హసన్పర్తి : దేవాదుల ప్రాజెక్ట్–3వ దశలో భాగంగా నిర్వహించిన ట్రయన్ రన్ విజయవంతమైంది. సోమవారం మొదటి మోటారును రన్ చేశారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటలోని పంప్హౌజ్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేశారు. ఐదు నెలల క్రితం రెండో మోటారు భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రారంభించారు. మూడో మోటారు ట్రయల్ రన్కు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఈఈ మంగీలాల్, బాలకృష్ణ, డీఈఈ రమాకాంత్, ఓంసింగ్, ఏఈ శ్రీనివాస్, రాకేశ్, యశ్వంత్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యారణ్యపురి: ఈనెల 9న హనుమకొండలోని లష్కర్బజార్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 9:30 గంటలకు జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ డి.వాసంతి, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి సోమవారం తెలిపారు. ‘డ్రామా ఉమెన్ ఇన్ సైన్స్, స్మార్ట్ అగ్రికల్చర్, డిజిటల్ ఇండియా ఎంపవరింగ్ లైఫ్స్, హైజిన్ ఫర్ ఆల్, గ్రీన్ టెక్నాలజీస్’ అంశాల్లో డ్రామా పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి 94901 12848 నంబర్లో సంప్రదించాలని డీఈఓ వాసంతి కోరారు. హన్మకొండ: వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈనెల 7న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ శెంకేశి మల్లికార్జున్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, ఏఎస్ఎం కళాశాల, రంగశాయిపేట కూడలి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, మై మాస్టర్ స్కూల్ ప్రాంతంలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. హనుమకొండలో.. హనుమకొండలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీచర్స్ కాలనీ–1, బ్యాంక్ కాలనీ, చైతన్యపురి ప్రాంతంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, కుమార్పల్లి, ఈద్గా, శ్యామల గార్డెన్స్, నాగరాజ దేవాలయం, అమరావతి నగర్, టీవీ టవర్ కాలనీ ప్రాంతంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, కుమార్పల్లి మార్కెట్, తోటబడి, కొత్తూరు ప్రాంతంలో ఉదయం 11 నుంచి మధ్యాహం ఒంటి గంట వరకు గుడిబండల్, ఎస్సీ హాస్టల్ ప్రాంతంలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, నయీంనగర్, లష్కర్ సింగారం, రాజాజీనగర్ ప్రాంతంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. -
వైద్య విద్యార్థులకు ఆర్థిక చేయూత
హన్మకొండ: వైద్య విద్యలో ప్రవేశాలు పొంది ఫీజు చెల్లించే స్థోమత లేని విద్యార్థులకు దాతలు అండగా నిలిచారు. హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యవిద్యలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు దాతలు ఆర్థికసాయం అందించారు. ఎంబీబీఎస్లో సీటు సాధించి ఫీజు చెల్లించలేని దీనస్థితిని నీట్ పేరెంట్ మల్లోజు సత్యనారాయణ చారి వీడియో రూపొందించి యూట్యూబ్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన దాతలు స్పందించి ఆర్థిక సాయాన్ని అందించారు. రవికుమార్ కొప్పకుల రూ.50 వేలు, కోర శ్రీనివాస్ రూ.25 వేలు, లక్క రాజేశ్వరి రూ.25 వేలు, ఇతరులు కలిసి మొత్తం రూ.2.50 లక్షలు విరాళంగా అందించారు. ఆమొతాన్ని ప్రతిమ వైద్య కళాశాలలో ప్రవేశం పొందిన తల్లితండ్రి లేని హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన ఆరుమల్లి గణేశ్కు రూ.60 వేలు, జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించిన నిజామాబాద్కు చెందిన నునావత్ దివ్యకు రూ.50 వేలు, ప్రతిమ మెడికల్ కళాశాలలో సీటు సాధించిన సిరిసిల్లకు చెందిన చెప్యాల గౌతమి రూ.50 వేలు, ప్రతిమ మెడికల్ కళాశాలలో ప్రవేశం పొందిన మహబూబ్నగర్కు చెందిన నానికి రూ.50 వేలు అందించారు. ఇందులో నీట్ పేరెంట్స్ రావుల మధు, లడే శ్రీనివాస్, మానస, రాచమల్ల రవీందర్, దుర్గ ప్రసాద్, రాచకొండ ప్రవీణ్ పాల్గొన్నారు. -
10 రోజులు.. 7 దరఖాస్తులు
కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలోని (వరంగల్ అర్బన్) 67 వైన్స్లకు దరఖాస్తులు అందజేసేందుకు మద్యం వ్యాపారులు అనాసక్తి చూపుతున్నారు. ఇకపై వైన్స్కు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని ఆబ్కారీ శాఖ ఎదురుచూస్తోంది. 2025–27 రెండేళ్ల కాల పరిమితితో వైన్స్ నిర్వహణకు ప్రభుత్వం సెప్టెంబర్ 25న ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ, అక్టోబర్ 23న లక్కీ డ్రా ద్వారా వైన్స్ కేటాయింపునకు షెడ్యూల్ను విడుదల చేసింది. కాగా, వైన్స్ టెండర్ల పిలుపు నుంచి 10 రోజుల కావొస్తున్నా.. అరకొరగా కేవలం 7 దరఖాస్తులు మాత్రమే ఎకై ్సజ్ శాఖకు అందాయి. ఎన్నికలపై ఫోకస్తో.. గతంలో వైన్స్ దరఖాస్తుల ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. ఈ సారి 3 లక్షలుగా దరఖాస్తుల ఫీజును ప్రభుత్వం ఖరారు చేయడంతో మద్యం వ్యాపారులు నాన్ రీఫండ్ కదా దరఖాస్తులు వేద్దామా.. లేదా? అనే ఆలోచనలో పడ్డారు. వైన్స్ టెండర్ల తరుణంలోనే స్థానిక ఎన్నికల నిర్వహణ ఉండడంతో ఎలక్షన్స్లో తేల్చుకుందాం. వైన్స్ దరఖాస్తులకు ఎందుకు ఖర్చు. వస్తే వైన్షాపు. పోతే రూ.3 లక్షలు అంటూ వెనుకంజ వేస్తున్నట్లు 10 రోజుల దరఖాస్తులతోనే తెలిసిపోతోంది. లక్ష్యం చేరేనా? హనుమకొండ జిల్లాలోని గతంలోని 65 వైన్స్కుగాను 2023–25 రెండేళ్ల కాలపరిమితికి 5,859 దరఖాస్తులు రాగా, ఖజానాకు రూ.117 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా 2025–27 వైన్స్ టెండర్లకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల దరఖాస్తు ఫీజు కాగా, ఎప్పటికప్పుడు దరఖాస్తులు డబుల్ అవడంతో పాటు ఆదాయం డబుల్ అవుతుండగా.. 13 రోజుల్లో గత టార్గెట్ రీచ్ అయ్యేనా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైన్స్ అప్లికేషన్లపై అనాసక్తి 13 రోజుల్లో 5,859 దరఖాస్తుల టార్గెట్ చేరేనా? -
నిర్వహణ కనుమరుగు
మరుగుదొడ్ల పేరిట కాసుల వేట● రూ.10 కోట్లతో 88 నిర్మాణాలు ● వినియోగంలో ఉన్నవి 10 శాతమే.. లేకున్నా బిల్లుల చెల్లింపులు ● ఇబ్బందులు పడుతున్న ప్రజలువివిధ పనుల నిమిత్తం రోజూ వరంగల్ నగరానికి వచ్చేవాళ్లు వేల సంఖ్యలో ఉంటారు. వారికి ఒకటికో రెంటికో వస్తే నరకమే. ఏ షాపింగ్ మాలో.. పెట్రోల్ బంకో.. బస్టాండ్, రైల్వే స్టేషన్కో పరుగులు పెట్టాల్సిందే. నగరంలో అక్కడక్కడా మరుగుదొడ్లు కనిపించినా ఆ కంపునకు దరిదాపుల్లోకి వెళ్లలేని పరిస్థితి. రూ.కోట్ల ప్రజాధనంతో నిర్మించిన మరుగుదొడ్ల నిర్వహణను గాలికొదిలేశారు. కొన్ని చోట్ల ప్రజా మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నప్పటికీ నిర్వహణ పేరిట పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతోందనే ఆరోపణలు సైతం ఉన్నాయి. – వరంగల్ అర్బన్ నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన ప్రజా మరుగుదొడ్లు.. స్థలాల లేమి పేరుతో ఇష్టారాజ్యంగా నిర్మించారు. ఈ నిర్మాణల్ల్లో పెద్ద ఎత్తున చేతులు మారాయనే విమర్శలున్నాయి. అవేమీ చాలవన్నట్లుగా ఇప్పుడు నిర్వహణ పేరిట ప్రజా సొమ్ము వాటాలుగా పంపిణీ చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. గ్రేటర్ వరంగల్లో రెండున్నరేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లు చాలా వరకు మాయమయ్యాయి. అక్కడక్కడా మిగిలిన కొన్ని ప్రస్తుతం చెత్త కుప్పల్లా మారాయి. లూకేఫ్ సంస్థకు ఇచ్చిన కంటైనర్ తరహాలో ఏర్పాటు చేసినవి వ్యాపార కేంద్రాలుగా మారాయి. ఆర్టీసీ బస్సుల్లో ఏర్పాటు చేసిన సంచార మరుగుదొడ్లు రెండు బల్దియా ప్రధాన కార్యాలయంలో పార్కింగ్కే పరిమితయ్యాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో ఏర్పాటు చేసిన వాటికి కూడా అదే దుస్థితి. ప్రజా మరుగుదొడ్లు ప్రజలకు ఏమేర అక్కరకు వస్తున్నాయో తెలియదు కానీ, ఏజెన్సీ, అధికారులు, సిబ్బందికి మాత్రం ఆర్థిక మేలు చేకూరుస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిర్వహణకు ప్రతీ నెల రూ.50 లక్షలు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలు అంటూ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రజా మరుగుదొడ్లలో సగం కనుమరుగయ్యాయి. రూ.10 కోట్లతో ఏర్పాటు చేసిన వాటిలో కొన్ని పని చేయడం లేదు. మరికొన్ని అపరిశుభ్ర వాతావరణంలో చెత్తకుప్పలుగా మారాయి. ప్రతీ నెల పబ్లిక్ మరుగుదొడ్ల నిర్వహణకు రూ.50 లక్షలు వెచ్చిస్తున్నా.. ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంపై పౌరులు మండిపడుతున్నారు. మూడేళ్లుగా అధునాతన మరుగుదొడ్ల నిర్వహణకు ఓ ఏజెన్సీకి కట్టబెడుతున్నట్లు రికార్డులు చూపుతున్నారు. కానీ, 90 శాతానికిపైగా పనిచేయడం లేదు. చాలా చోట్ల నీటి, విద్యుత్ సదుపాయాలు లేక కొన్ని మూలకు చేరాయి. కనీసం డోర్లు లేక మరికొన్ని అధ్వానంగా మారాయి. ఈ లెక్కాపత్రాలను వెల్లడించేందుకు ప్రజారోగ్యం, శానిటేషన్ అధికారులు ససేమిరా.. అంటుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా మరుగుదొడ్ల నిర్వహణను తనిఖీ చేస్తాం. నిర్వహణ ఉన్న టాయిలెట్లకు నిధులు మంజూరు చేస్తాం. లేకపోతే రద్దు చేస్తాం. – రాజారెడ్డి, బల్దియా సీఎంహెచ్ఓ జీడబ్ల్యూఎంసీ అధికారులు కొన్ని ప్రాంతాల్లో బీఓటీ (బిల్డ్, ఓన్, ఆపరేట్) పద్ధతిలో నిర్మించి, రుసుము వసూలు చేసుకునేందుకు ప్రైవేట్ వ్యక్తులకు అనుమతి ఇచ్చారు. అలాంటివి నగరంలో సుమారు 60 వరకు 676 సీటర్లు ఉన్నాయి. అవి కూడా కొన్ని చోట్ల (సులభ్ కాంప్లెక్స్)లు అపరిశుభ్రంగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రజల నుంచి రూ.5 చొప్పన రుసుము వసూలు చేయాల్సి ఉండగా, ఒక్కొకరి నుంచి రూ.10 చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. నగరంలో ప్రజా మరుగుదొడ్ల నిర్వహణను పర్యవేక్షించాల్సిన అధికారులు, సిబ్బంది చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరుగుదొడ్ల తనిఖీలపై బల్దియా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.●నగరంలో ప్రత్యేకంగా ఆరు చోట్ల షీ టాయిలెట్లను నిర్మించారు. బల్దియా ప్రధాన కార్యాలయం, బాలసముద్రం, సుబేదారి, ఖిలా వరంగల్ కోట, కాజీపేట, నయీంనగర్లో ఉండగా.. ఇవి నామ మాత్రంగానే నడుస్తున్నాయి. రూ.30 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన రెండు మొబైల్ షీ టాయిలెట్లు బస్సులు మూలకు చేరి తప్పుపడుతున్నాయి. హైదరాబాద్ తరహాలో నగరంలో ఆరు ఆధునిక టాయిలెట్లను సర్వాంగ సుందరంగా నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. కాజీపేట, నిట్, హనుమకొండ కలెక్టరేట్, భీమారం, టీబీ ఆస్పత్రి, హనుమకొండ పాత బస్డిపో, వరంగల్ పోచమ్మ మైదాన్, ఖిలా వరంగల్ కోట ఖుష్మహల్ దగ్గర ప్రస్తుతం ఇవి వాడకంలో ఉన్నాయి. వీటిలో సగం సీట్లు మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ములుగురోడ్డు, మట్టెవాడ పోలీస్ స్టేషన్ ఎదురుగా, చార్బౌళి, అండర్ బ్రిడ్జి, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో అధునాతన టాయిలెట్లు మొత్తంగా రూ.10 కోట్లతో 88 చోట్ల 324 సీటర్లు నిర్మించారు. అందులో పది శాతం మాత్రమే ఉపయోగంలో ఉండగా.. 40ఽ శాతం నామమత్రంగా, మరో 50 శాతం తాళాలు పడ్డాయి. -
స్లాట్ బుకింగ్.. స్పాట్ సెల్లింగ్
పత్తి విక్రయానికి ఇక ఇబ్బందులుండవ్హన్మకొండ: పంట అమ్ముకునే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి పత్తి రైతులకు ఇక విముక్తి లభించనుంది. కనీస మద్దతు ధర అందించడంతోపాటు దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా పత్తి అమ్ముకునేందుకు, క్రయవిక్రయాలు పారదర్శకంగా జరిగేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ‘కాపాస్ కిసాన్’ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి రైతులు ఈ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని పంటను అమ్ముకోవాలి. ఈ నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ యాప్పై ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన అధికారులు రైతుల మొబైల్ ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేయించి పత్తి బుక్ చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తారు. తద్వారా పత్తి క్రయవిక్రయాలు పూర్తిగా యాప్ ద్వారానే సాగనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి దాదాపు 5,23,848 ఎకరాల్లో సాగు చేశారు. స్లాట్ బుక్ చేసుకుంటేనే అమ్మకం.. రైతులు ‘కాపాస్ కిసాన్’ యాప్లో స్లాట్ బుక్ చేసుకుంటేనే పత్తి అమ్ముకోగలుగుతారు. రైతులు ఏ మిల్లులో అమ్ముకుంటారో తెలుపుతూ స్లాట్ బుక్ చేయగానే తేదీ, సమయాన్ని అధికారులు యాప్ ద్వారా సమాచారం అందిస్తారు. అదే నిర్ణీత రోజు, నిర్ణీత సమయానికి రైతు పత్తిని తీసుకెళ్లి విక్రయించుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకోకపోతే పత్తిని అమ్ముకోలేరు. రైతులు మూడుసార్లు స్లాట్ బుక్ చేసుకుని, స్లాట్ను రద్దు చేసుకోకుండా పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి విక్రయించకపోతే ఆ రైతు పేరు బ్లాక్లిస్టులోకి వెళ్తుంది. బ్లాక్ లిస్టులో నుంచి పేరు తొలగించి, తిరిగి పత్తి అమ్ముకోవాలాంటే సీసీఐ అధికారులతో ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. పత్తి క్వింటాకు రూ.8,110 మద్దతు ధర.. కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర ప్రకటించింది. ‘కాపాస్ కిసాన్’ యాప్ ద్వారా మద్దతు ధర పొందే అవకాశాన్ని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కల్పించింది. స్మార్ట్ ఫోన్లేని రైతులు ఇతరుల స్మార్ట్ ఫోన్ నుంచి కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రైతు పాస్బుక్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ‘కాపాస్ కిసాన్’ యాప్లో రైతు పట్టాదారు పాస్బుక్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేయగానే పంట ఎంత సాగు చేశారో వివరాలు అందులో వస్తాయి. వ్యవసాయ శాఖ ఇప్పటికే డిజిటల్ క్రాప్ సర్వే చేస్తూ పంట సాగు వివరాలు నమోదు చేస్తోంది. డిజిటల్ క్రాప్ సర్వే దాదాపు పూర్తి కావొచ్చింది. పంట సాగు విస్తీర్ణాన్ని బట్టి దిగుబడి లెక్కిస్తారు. ఈ యాప్ ద్వారా రైతులకు దళారుల నుంచి విముక్తి కలుగుతుంది. రైతులు నిరీక్షించాల్సి న బాధ తప్పుతుంది.జిల్లా విస్తీర్ణం (ఎకరాలు) వరంగల్ 1,18,547హనుమకొండ 74,849మహబూబాబాద్ 85,480ములుగు20,593భూపాలపల్లి 98,260జనగామ 1,26,119‘కాపాస్ కిసాన్’ యాప్ను స్మార్ట్ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాక ముందుగా రైతు పేరు, జెండర్, పుట్టిన తేదీ, కులం, చిరునామా, ఆధార్, ఫోన్ నంబర్, కౌలురైతు/సొంతమా అనే వివరాలు నమోదు చేయాలి. పట్టాదారు పాస్ పుస్తకం నంబర్, సర్వే నంబర్, రైతుకు ఉన్న మొత్తం భూమి, ఇందులో పత్తి సాగు విస్తీర్ణం, పంట రకం వివరాలు యాప్లో నిక్షిప్తం చేయాలి. రైతుకు సంబంధించిన ఆధార్ కార్డు, పాస్బుక్, రైతు ఫొటోను యాప్లో అప్లోడ్ చేయాలి. ప్రత్యేక యాప్ను రూపొందించిన సీసీఐ ‘కాపాస్ కిసాన్’ యాప్ ద్వారా బుకింగ్ యాప్పై వ్యవసాయ అధికారులు, విస్తరణాధికారులకు శిక్షణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5,23,848 ఎకరాల్లో పత్తి సాగు -
వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు భవనాల పరిశీలన
కాజీపేట : వరంగల్ నగరంలో పెన్షన్దారులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ను మంజూరు చేసింది. ఎంపీ కడియం కావ్య ప్రత్యేక చొరవతో వెల్నెస్ సెంటర్కు అనుమతి లభించింది. కాగా ట్రైసిటీలోని కాజీపేట మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న భవనాలతో పాటు హనుమకొండలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం, వరంగల్ నగరంలో ఉన్న భవనాలను శుక్రవారం ఎంపీ కావ్య, కలెక్టర్ స్నేహశబరీష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి పరిశీలించారు. కాజీపేట సర్కిల్ కార్యాలయం ఆవరణలో గతంలో 30 పడకల ఆస్పత్రికి కేటాయించిన భవనాలు ఖాళీగా ఉండటంతో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు వెసులుబాటుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వరంగల్చౌరస్తా : తెలంగాణ రాష్ట్ర జాగృతి వరంగల్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా నగరానికి చెందిన నూకల రాణిని నియమిస్తూ వ్యవస్థాపకురాలు కవిత ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించినందుకు రాణి కవితకు కృతజ్ఞతలు తెలిపారు. వీరన్న సన్నిధిలో భక్తుల సందడికురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం స్వామి, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామిని దర్శించుకునేందుకు క్యూలో వేచి ఉన్నారు. దసరా సందర్భంగా వాహన పూజలు అధికంగా జరిగాయి. ఆలయం ఎదుట వాహనాలు బారులుదీరి కనిపించాయి. రూ.2,50,002 ధర పలికిన దుర్గామాత పట్టుచీరమహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్టణంలోని జై భవాని యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు అలంకరించిన పట్టుచీరను రూ.2,50,002 కు కాంగ్రెస్ నాయకుడు పద్మం ప్రవీణ్ కుమార్–ధనలక్ష్మి దంపతులు శుక్రవారం దక్కించుకున్నారు. దుర్గామాత భక్తులకు మహాలక్ష్మి అవతారంలో దర్శనం ఇచ్చిన సందర్భంలో అలంకరించిన పట్టుచీరను వారు కై వసం చేసుకున్నారు. -
రుద్రేశ్వరాలయంలో త్రిశూల తీర్థోత్సవం
హన్మకొండ కల్చరల్ : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలోని ప్రాచీన కోనేటిలో త్రిశూల తీర్థోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, సందీప్శర్మ, ప్రణవ్ రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం చేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు చేసి రాజరాజేశ్వరీదేవిగా అలంకరించారు. గంగు ఉపేంద్రశర్మ శ్రీరుద్రేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహం, త్రిశూలం, ఆయుధాలను పూజించిన అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి దేవాలయంలోని ప్రాచీన కోనేరులో శ్రీసూక్తవిధానంతో అవబృధస్నానం, జలాధివాసం నిర్వహించారు. అనంతరం శ్రీరుద్రేశ్వరీదేవి ఉత్సవమూర్తిని తిరిగి నిత్యపూజా కై ంకర్యాల కోసం దేవాలయంలో రుద్రేశ్వరుడిని సన్నిధిలో ప్రతిష్ఠించారు. త్రిశూల స్నానంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులతోపాటు అమరేందర్రెడ్డి, రవీందర్రెడ్డి, మామిడాల గణపతి, కొడిశాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
గాంధీ మార్గం అనుసరించాలి
హన్మకొండ : మహాత్మా గాంధీ చూపిన మార్గం అనుసరణీయమని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి సీఎండీ వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీ ఎంచుకున్న శాంతి, అహింసా మార్గం అందరికి మార్గదర్శనీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీ చూపిన మార్గాన్ని అనుసరిస్తేనే ఆయన కలల సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న, వాటిని అధిగమించి మహాత్ముడు ఓ వ్యక్తి నుంచి మహాశక్తిలా మారాడని కొనియాడారు. ప్రపంచం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచిన మహోన్నత వ్యక్తి, జాతిపిత బాపూజీ అని పేర్కొన్నారు. ఆయన సూక్తులను స్మరించుకుంటూ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి ఉద్యోగులు కంకణ బద్ధులై పనిచేయాలని పిలుపు నిచ్చారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, చీఫ్ ఇంజనీర్లు రాజు చౌహన్, వెంకట రమణ, సీజీఎం రవీంద్రనాథ్, జీఎం సత్యనారాయణ, డీఈలు సంపత్ రెడ్డి, అనిల్ కుమార్, భాస్కర్, ఏఎస్ హేమంత్ కుమార్, రమణ రెడ్డి, ఎస్ఏఓ ఎన్.ఉపేందర్ పాల్గొన్నారు. రామప్ప శిల్పకళాసంపద అద్భుతంవెంకటాపురం(ఎం) : రామప్ప శిల్పకళాసంపద అద్భుతమని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన సతీమణి వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. గైడ్ తాడబోయిన వెంకటేష్ ఆలయ విశిష్టత గురించి వివరించగా రామప్ప శిల్పాకళాసంపద బాగుందని వారు కొనియాడారు, కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ ములుగు డీఈ నాగేశ్వర్రావు, విద్యుత్ అధికారులు వేణుగోపాల్, రమేష్, సాంబరాజు, సురేష్, కృష్ణాకర్తో పాటు తదితరులు పాల్గొన్నారు.టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
ఉర్సుగుట్ట అభివృద్ధికి కృషి..
● రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెడుపై మంచి విజయం సాధించడమే విజయ దశమి అని, రంగలీల మైదానం విస్తరణకు కృషి చేస్తానని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రంగలీల మైదానంలో గురువారం రాత్రి ఆమె దసరా వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. భారతదేశంలో మైసూరు తర్వాత వరంగల్ రంగలీల మైదానంలో భారీగా దసరా వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన రంగలీల మైదానాన్ని అభివృద్ధి చేసి, మరింత పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ కోరారు. కళలు, సంస్కృతికి పుట్టినిల్లయిన ఓరుగల్లులో వైభంగా దసరా వేడుకలు నిర్వహించడం అభినందనీయమని మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. హైదరాబాద్తోపాటు నగర నలుమూలల నుంచి హాజరైన భక్తులకు ఆమె దసరా శుభాకాంక్షలు తెలిపారు. తహసీల్దార్ ఇక్బాల్, కార్పొరేటర్లు మరుపల్లి రవి, పోశాల పద్మ, ముస్కమల్ల అరుణ, జలగం అనిత, పల్లం పద్మ, దసరా ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రంగలీల మైదానంలో దహనమవుతున్న 70 అడుగుల రావణుడి ప్రతిమ -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
న్యూశాయంపేట: ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద అన్నారు. శుక్రవారం కలెక్టర్లో ఆమె మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని తెలిపారు. ఏదైనా అసౌకర్యం కలిగితే ప్రజలు టోల్ఫ్రీ నంబర్ 1800 425 3424, 91542 52936, 0870 2530812 నంబర్లకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రత్యేక హెల్ప్డెస్క్కు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి పుష్పలత నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, హెల్ప్డెస్క్లో సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులు ఉంటే టోల్ఫ్రీ నంబర్లకు తెలియజేయాలని, సజావుగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. మహాత్మాగాంధీకి నివాళి మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గాంధీ చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు శ్రీనివాస్రావు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు.వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద -
భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణోత్సవం
హన్మకొండ కల్చరల్ : భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణోత్సవం శుక్రవారం శోభాయమానంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో భాగంగా ఉదయం పూజారులు నిత్యావాహికం జరిపి అమ్మవారిని పూలమాలలతో అలంకరించారు. రాత్రి శోభాయమానంగా అలంకరించిన వేదికపై నిర్వహించిన భద్రకాళిభద్రేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని వీక్షించిన వందలాది మంది భక్తులు తన్మయత్వం చెందారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు, గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం తదితర కార్యక్రమాల అనంతరం శతఘటాభిషేకం నిర్వహించారు. వివాహమహోత్సవాన్ని పురస్కరించుకుని భద్రేశ్వరస్వామికి ద్వితీయ స్వర్ణ యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. అనంతరం వరపూజ, మధుపర్కవిధి, కాల్లుకడిగి కన్యాదానం చేయడం, మహాసంకల్పం మంగళాష్టకముల చూర్ణిక తదితర తంతు నిర్వహించారు. వధూవరులకు జీలకర్రబెల్లం పెట్టడం, మాంగల్యధారణ కార్యక్రమాలు జరిపించారు. కల్యాణం అనంతరం పుష్పయాగం చేశారు. ఆలయ ఈఓ సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు.. విజయ దశమితో దేవాలయంలో గురువారం శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఉదయం నిత్యావాహికం, కలశోద్వాసన జరిపి అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం, చక్రతీర్థోత్సవం, ధ్వజారోహణం జరిపారు.పూజల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి దంపతులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి
హసన్పర్తి : కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం హసన్పర్తి మండలంలోని జయగిరి గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేయగా దయాకర్రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను హామీల అమలుపై ప్రశ్నించాలని, బాకీ కార్డులు చూపించాలని పిలుపునిచ్చారు. వృద్ధులకు రూ.4వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటీ వరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు బండి రజనీకుమార్, పావుశెట్టి శ్రీధర్, విక్టర్బాబు, భగవాన్రెడ్డి, జట్టి రాజేందర్, రాణి, అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
కమిషనరేట్లో ఆయుధ పూజ
వరంగల్ క్రైం: విజయదశమి పండుగను పురస్కరించుకోని వరంగల్ పోలీస్ కమిషనరేట్లో గురువారం ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. ఆయుధ భాండాగారం వద్ద, ఎంటీ విభాగం, దుర్గామాతకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఆయుధ పూజలు నిర్వహించారు. శమీ వృక్షానికి పూజలు నిర్వహించిన అనంతరం జమ్మి ఆకులను పోలీసు అధికారులు, సిబ్బందికి పంచి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్, క్రైం డీసీపీ గుణశేఖర్, అదనపు డీసీపీలు సురేశ్కుమార్, శ్రీనివాస్, ఏఎస్పీ శుభం, ఏసీపీలు నాగయ్య, మధుసూదన్, అనంతయ్య, సరేంద్ర, ఆర్ఐలు స్పర్జన్రాజ్, శ్రీనివాస్, శ్రీధర్, చంద్రశేఖర్, ఆర్ఎస్సైలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఓరుగల్లు ఖ్యాతి చాటేలా ఉత్సవాలు
సాక్షి, వరంగల్/ఖిలా వరంగల్: వరంగల్ ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో ఓరుగల్లు ఖ్యాతి చాటేలా గురువారం దసరా వేడుకలు నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహించనున్న ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరుకానున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాతలు 70 అడుగుల రావణుడి ప్రతిమను తయారు చేయించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మంత్రి కొండా సురేఖ స్విచ్ నొక్కి రావణ దహనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించనున్నాయి. ఊరేగింపుతో సీతారాములు రాక.. కరీమాబాద్లోని రంగనాథస్వామి దేవాలయం నుంచి సీతారాముల ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు అలంకరించిన ఎడ్లబండిపై ఉత్సవమూర్తులను ఉంచి భారీ ఊరేగింపుతో రంగలీల మైదానానికి తీసుకొస్తారు. అక్కడ రాముడు, రావణుడి డిజిటల్ బొమ్మలు ఏర్పాటు చేశారు. రావణుడి బొమ్మను బాణాలతో రాముడు కాల్చే ప్రక్రియ నేత్రపర్వంగా నిర్వహిస్తారు. పటిష్టమైన భద్రత.. వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ పర్యవేక్షణలో ఏఎస్పీ శుభం నేతృత్వంలో దసరా ఉత్సవాలు జరుగనున్నాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా వేర్వేరుగా విశాలమైన పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. డీసీపీ సలీమా, ఏసీపీలు, ఐదుగురు ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్సైలు, 200 మంది కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించనున్నారు. కాగా, బుధవారం సాయంత్రం ఏఎస్సీ శుభం రంగలీల మైదానంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. 10 రోజులుగా అధికారుల ఏర్పాట్లు వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ పరిధిలో దసరాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 10 రోజులుగా వివిధ శాఖల అధికారులు చేశారు. వరంగల్లోని ఉర్సు రంగలీల మైదానం, పద్మాక్ష్మిగుట్ట వద్ద విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రోడ్లను చదును చేసి తుమ్మ, పిచ్చి మొక్కలను తొలగించారు. తాత్కాలికంగా వీధిలైట్లు అమర్చారు. ప్రత్యేకంగా నాలుగు వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసినట్లు బల్దియా ఇంజనీర్లు తెలిపారు. ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు వరంగల్ క్రైం: ఉర్సు రంగలీల మైదానంలో జరిగే దసరా ఉత్సవాల సందర్భంగా గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. ● ఖమ్మం నుంచి వరంగల్ మీదుగా కరీంనగర్, హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు పున్నేలుక్రాస్ నుంచి ఐనవోలు ఆర్చ్, వెంకటాపురం, కరుణాపురం మీదుగా వెళ్లాలి. ● కరీంనగర్ నుంచి ఖమ్మం వెళ్లాల్సిన వాహనాలు, కొత్తపేట, ఏనుమాముల, లేబర్కాలనీ, తెలంగాణ జంక్షన్, ఫోర్ట్రోడ్డు జంక్షన్ మీదుగా వెళ్లాలి. ● హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లాల్సిన వాహనాలు కరుణాపురం, వెంకటాపురం, ఐనవోలు, పున్నేలు క్రాస్ నుంచి వెళ్లాలి. ● హనుమకొండ హంటర్ రోడ్డు నుంచి ఉర్సు గుట్టకు వచ్చే వాహనాలు కొలంబో హాస్పిటల్ ఎదుట ఉన్న గానుగ ఆయిల్ పాయింట్ దగ్గర, ఆకుతోట ఫంక్షన్హాల్, నాని గార్డెన్, జేఎస్ఎం స్కూల్లో పార్కింగ్ చేసుకోవాలి. కడిపికొండ నుంచి వచ్చే వాహనాలు భారత్ పెట్రోల్ పంపు దగ్గర పార్కింగ్ చేసుకోవాలి. ● ఆర్టీఓ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలు లవ్లీ ఫంక్షన్ హాల్ ఓపెన్ ప్లేస్, తాళ్ల పద్మావతి కళాశాల దగ్గర పార్కింగ్ చేసుకోవాలి. ● కరీమాబాద్ నుంచి వచ్చే వాహనాలు బీరన్న గుడి దగ్గర పార్కింగ్ చేసుకోవాలి. రంగలీల మైదానంలో దసరాకు ఏర్పాట్లు హాజరుకానున్న లక్షలాది మంది భక్తులు ఈసారి 70 అడుగుల రావణుడి ప్రతిమ దహనం -
వినూత్నం.. విజయదశమి
గార్ల: దేశభక్తిని చాటుతూ దసరా రోజు మహబూబాబాద్ జిల్లా గార్లలో జాతీయ జెండాను ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తోంది. పండుగకు ఒకరోజు ముందు స్థానిక మసీదు సెంటర్లోని జెండా గద్దెకు రంగులు వేసి సిద్ధం చేస్తారు. ని జాం కాలంలో ప్రతీ దసరా రోజున నాటి తహసీల్దార్లు నెలవంక జెండాను ఎగురవేసేవారు. 1952లో గార్ల టౌన్ ము న్సిపల్ చైర్మన్ మాటేడి కిషన్రావు కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య ఘర్షణలు జరిగాయి. మెజారిటీ కౌన్సిలర్లు కమ్యూనిస్టు పార్టీకి చెందిన వారే ఉండడంతో వారు హైకోర్టును ఆశ్రయి ంచారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు దేశభక్తికి చిహ్నంగా పార్టీలకు అతీతంగా దసరా రోజు జాతీయజెండాను ఎగురవేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో 1958 నుంచి మాటేడి కిషన్రావు జాతీయజెండాను ఎగురవేశారు. కొన్నేళ్ల తర్వాత గార్ల మున్సిపాలిటీని మేజర్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. నాటి నుంచి ప్రథమ పౌరుడైన సర్పంచ్ దసరా రోజు జాతీయజెండా ఆవిష్కరిస్తున్నారు. గత ఏడాది సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ మంగమ్మ జెండా ఆవిష్కరించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి (దసరా)ని జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో కొలిచిన అనంతరం ఈరోజు విశిష్ట పూజలు చేస్తారు. అయితే, ఈసారి దసరా, గాంధీ జయంతి (అహింసా దినోత్సవం) ఒకేరోజు రావడంతో ఉమ్మడి జిల్లాలో పలువురు మద్యం, మాంసానికి దూరంగా ఉండాలని తీర్మానించారు. పలు ప్రాంతాల్లో వినూత్నంగా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకు న్నారు. పులివేషధారణ, కత్తిసాము, విన్యాసాలు, పిట్టల దొర, బొమ్మల కొలువులు ఇలా ఎన్నోరకాలుగా పల్లెలు, పట్టణాల్లో సందడి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు (గురువారం) వినూత్నంగా నిర్వహించనున్న దసరా వేడుకలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..మైసంపల్లిలో హోమం నిర్వహిస్తున్న ప్రజలు (ఫైల్) ప్రత్యేకంగా వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు మద్యం, మాంసాహారానికి పలువురు దూరం ఉమ్మడి జిల్లాలో నేడు దసరా ఉత్సవాలు -
భద్రకాళి అమ్మవారికి పుష్పరథ సేవ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పదో రోజు బుధవారం అమ్మవారిని మహిషాసురమర్దినిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో అర్చకులు నిత్యాహ్నికం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి శరభవాహన సేవ, శుంభహాదుర్గార్చన జరిపారు. నవరాత్రి మహోత్సవాల చండీహోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. హోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందికొండ నర్సింగరావు దంపతులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి–నీలిమ దంపతులు, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, హుజూ రాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, దేవాలయ చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమాలకు గోవా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే, గోవా ఎమ్మెల్యేలు దేవ్యారాణే, ఐశ్వర్యరాణే, అరుంధతి రాణే ఉభయదాతలుగా వ్యవహరించారు. సాయంత్రం పుష్పరథసేవ నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ రామల సునీత పర్యవేక్షించారు. హన్మకొండ కల్చరల్: మహిషాసురమర్దిని అమ్మవారిని కొలిచిన వారికి సర్వశత్రు భయాలు తొలుగుతాయని వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో జరుగుతున్న దేవీశరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా యాగశాలలో బుధవారం మహాచండీహోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, ప్రణవ్, సందీప్శర్మ రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఉత్సవమూర్తిని మహిషాసురమర్దినిగా అలంకరించి పూజలు నిర్వహించారు. బెల్లం అన్నం, పులిహోర నైవేద్యం నివేదన చేశారు. వేదపండితులు గుదిమెళ్ల విజయకుమారాచార్యులు లోకకల్యాణార్థం గణపతినవగ్రహ సుదర్శన మహా చండీహోమం నిర్వహించారు. అనంతరం ఫలపుష్పాలు, సుగంధపరిమళ ద్రవ్యాలు, పట్టువస్త్రంతో మహాపూర్ణాహుతి చేశారు. హోమంలో శాసనమండలి వైస్చైర్మన్ బండా ప్రకాశ్ పాల్గొన్నారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ సౌజన్యంతో భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్ నందికొండ నర్సింగరావు దంపతులు, కేంద్ర పురావస్తుశాఖ తెలంగాణ రాష్ట్ర సూపరింటెండెంట్ నిఖిల్దాస్ దంపతులు పూజలు నిర్వహించారు. సాయంత్రం తిరునగరి శ్రవణ్కుమార్ భక్తిగీతాలు అలరించాయి. ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. వరంగల్ డీఐఈఓ శ్రీధర్సుమన్ విద్యారణ్యపురి: జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి బోర్డు వెబ్సైట్ ద్వారా ప్రత్యేక యూనిక్ ఐడీని జారీ చేయనున్నట్లు వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్సుమన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్ ద్వారా స్టాఫ్ డేటా, ఎంట్రీలో ఆధార్, బ్యాంకు అకౌంట్ నంబర్, పాన్ నంబర్, అపాయింట్మెంట్ తేదీ తదితర వివరాలను స్పష్టంగా నమోదు చేయాలన్నారు. ఇంటర్బోర్డు భవిష్యత్లో నిర్వహించే పరీక్షలు మూల్యాంకనం, రెమ్యునరేషన్ చెల్లింపులు యూనిక్ ఐడీ ద్వారానే చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. అన్ని కళాశాలల యాజమాన్యాలు పూర్తి వివరాలను నమోదు చేయించాలన్నారు. త్వరలో సంబంధిత డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేస్తామని పేర్కొన్నారు. -
గురువారం శ్రీ 2 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
నాలుగు కత్తులు కలిస్తేనే దసరా!గీసుకొండ: ఆ గ్రామంలో నాలుగు కత్తులు ఒక చోట కలిస్తేనే దసరా. ఈ ఆచారం సంవత్సరాలుగా కొనసాగుతోంది. గ్రేటర్ 16వ డివిజన్ ధర్మారంలో 4 కుటుంబాలకు చెందిన 4 కత్తులను గ్రామంలోని ‘కచ్చీర్’కు తీసుకుని వచ్చి దసరా ఉత్సవాలను నిర్వహించడం ఆచారంగా వస్తోంది. గంగుల వీరయ్య కుటుంబం నుంచి ఒకటి, కొట్టె లక్ష్మయ్య కుటుంబం నుంచి ఒకటి, పోలెబోయిన వారి కుటుంబాల నుంచి రెండు కత్తులకు పూజలు చేసి ఇళ్ల నుంచి మందీ మార్బలంతో అట్టహాసంగా తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత ఆయుధ పూజ చేసి కత్తుల(ఆయుధాల)తో సోరకాయను కట్చేసి కంకణాలు కట్టి దసరా పండుగను జరుపుకుంటారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. -
జాతీయ జెండాల ఆవిష్కరణ
లింగాలఘణపురం: మండలంలోని నెల్లుట్ల, వనపర్తి గ్రామాల్లో దసరా ఉత్సవాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించడం ప్రత్యేకం. నెల్లుట్లలో పంచాయతీ కార్యాలయ సమీపంలోని బురుజుపై ఆనవాయితీగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పూర్వం పటేల్, పట్వారీ వ్యవస్థ ఉన్న కాలంలో మాల్పటేల్ అనే వ్యక్తి విజయానికి సూచికగా దసరా పండుగకు జాతీయ జెండా ఎగురవేశారు. అది నేటికీ కొనసాగిస్తూ ప్రస్తుతం చిట్ల వంశానికి చెందిన వారు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. వనపర్తిలో బొడ్రాయి వద్ద ఒక రాతి స్తంభానికి జెండాను కట్టి స్థానికులు ఎగుర వేస్తారు. కొన్నేళ్లుగా ఆయా గ్రామాల పెద్దలు ఉదయమే అక్కడికి వచ్చి జెండాలను ఆవిష్కరించిన అనంతరం సాయంత్రం దసరా వేడుకలు నిర్వహిస్తారు. -
మద్యం, మాంసం ముట్టరు
దుగ్గొండి: దసరా అంటే మద్యం, మాంసం. ఇదే సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనూ బొడ్రాయి వద్ద గొర్రెపిల్లను బలిచ్చే ఆనవాయితీ ఉంది. కానీ, మైసంపల్లి గ్రామంలో 50 ఏళ్లుగా ఆర్య సమాజ్ పద్ధతిలో దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులంతా బొడ్రాయి వద్ద చలువ పందిళ్ల కింద సామూహిక హోమాలు చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోమం చేసి సాయంత్రం ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిష్టగా ఉండి నేలపై పడుకుంటారు. ఆ రోజు మద్యం, మాంసం ఆ ఊరిలో నిషేధం. కనీసం ఇంట్లో మద్యం బాటిల్ కూడా ఉండనివ్వరు. కాగా, చుట్టు పక్క గ్రామాల ప్రజలు వేడుకలు చూసేందుకు వందల సంఖ్యలో తరలివస్తారు. నిష్టగా ఉంటారు.. మా గ్రామంలో చాలా సంవత్సరాలుగా ఆర్యసమాజ్ పద్ధతిలో దసరా జరుగుతోంది. అన్ని గ్రామాల్లో మద్యం, మాంసం ఏరులై పారినా మా గ్రామస్తులు దసరా పండుగ రోజున నిష్టగా ఉంటారు. కుల దైవాలు, ఇష్టదైవాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. అందరూ కలిసి ఒక్కచోట చేరి హోమాలు నిర్వహిస్తాం. గ్రామం అంతా ఒక్కచోటికి వచ్చిన తరుణం చాలా సంతోషంగా ఉంటుంది. ఐకమత్యానికి అద్దం పడుతుంది. – వేముల ఇంద్రదేవ్, గ్రామస్తుడు -
పంటకు ప్రమాదకారి..
మహబూబాబాద్ రూరల్ : తెల్లదోమ మిర్చి పంటకు ప్రధాన శత్రువు. ఇది ఆకుల రసాన్ని పీల్చి మొక్కలను బలహీనపరుస్తుంది. అంతేకాకుండా చిల్లి లీఫ్ కర్ల్ వైరస్ వ్యాధిని వ్యాప్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పంటలో తెల్లదోమ నియంత్రణ చర్యలు, నాటిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రతలపై మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలోని జెన్నారెడ్డి వెంకటరెడ్డి ఉద్యాన పరిశోధన స్థానం ప్లాంట్ పాథాలజీ శాస్త్రవేత్త ఎ.ప్రశాంత్ కుమార్.. రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 30 నుంచి 40 రోజులు అత్యంత కీలకం.. మిర్చి పంటను నాటిన తర్వాత మొదటి 30 నుంచి 40 రోజులు అత్యంత కీలకం. ఈ సమయంలో తెల్లదోమల సంఖ్య పెరిగితే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. అందుకే రైతులు పొలంలో నాటిన మొదటి రోజునుంచే పర్యవేక్షణ, నియంత్రణ చర్యలు చేపట్టాలి. ప్రారంభ వృద్ధి దశ (10 నుంచి 30 రోజులు) : నీమాయిల్ 1500 పీపీఎం 5 మిల్లీ లీటర్లను లీటర్ నీటిలో పిచికారీ చేయాలి. వర్టిసిలియం లెకానీ/ బ్యావేరియా బాసియానా 5 గ్రాములను లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయాలి. ట్రాప్ క్లోఫ్స్ పై తెల్లదోమలు చేరితే అక్కడే ప్రత్యేకంగా స్ప్రే చేయాలి. మధ్య వృద్ధి దశ (30 నుంచి 50 రోజులు) : పొలాన్ని ప్రతీ 3 నుంచి 4 రోజులకు పర్యవేక్షించాలి. తెల్లదోమల సంఖ్య పెరిగితే మారుస్తూ వాడాలి. ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్ఎల్ 0.3 మిల్లీ లీటర్లను లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలి. లేదా థియామెథాక్సామ్ 25 డబ్ల్యూజీ 0.25 గ్రాములను లీటర్ నీటితో స్ప్రే చేయాలి. ఒకే ఔషధాన్ని పునరావృతం చేయకుండా మారుస్తూ వాడాలి. నియంత్రణ కొనసాగించాలి (50 రోజులుపైగా) : తెల్ల దోమల నివారణకు ఎర పంటలపై దృష్టి పెట్టి నియంత్రణ కొనసాగించాలి. వర్షాభావం / పొడిగాలి సమయంలో ప్రత్యేక పర్యవేక్షణ చేయాలి. రసాయనాలను అవసరమైతే మాత్రమే వాడాలి.పర్యావరణం, పొలం నిర్వహణ : ఉష్ణోగ్రత 25 నుంచి 35 డిగ్రీల సెల్సియస్, తేమ 60 నుంచి 80 శాతం ఉన్నప్పుడు తెల్లదోమలు ఎక్కువ పెరుగుతాయి. ఈ సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. గాలి ప్రసరణకు అనుకూలంగా మొక్కల మధ్య దూరం పెట్టాలి. పొలంలో నీరు నిల్వ లేకుండా చూడాలి. నాటిన వెంటనే (0 నుంచి 10 రోజులు) ఎకరానికి 10 నుంచి 12 పసుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయాలి. పొలంలో కలుపు మొక్కలను తొలగించాలి. పత్తి, పొద్దు తిరుగుడు, ఆముదం మొక్కలను పొలం అంచుల్లో నాటాలి.తెల్లదోమ.. మిర్చి పంటకు ప్రధాన శత్రువు ఆకుల రసాన్ని పీల్చి మొక్కలను బలహీనం చేస్తుంది పంటలో నియంత్రణ చర్యలు చేపట్టాలి నాటిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలి రైతులకు శాస్త్రవేత్త ఎ.ప్రశాంత్ కుమార్ సలహాలు -
ఆహారం.. ఆరోగ్యం
ఖిలా వరంగల్ : ఆధునిక జీవన శైలిలో ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సహజ సిద్ధంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పాలు, గుడ్లు తదితర ఆహార పదార్థాలను తగ్గించి పాశ్చాత్య ఆహారపు అలవాట్లను అలవర్చుకుంటున్నారు. ఫలితంగా కడుపు నిండుతున్నా శరీరానికి మాత్రం నష్టం జరిగి యుక్త వయసులోనే వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉంటోంది. ఇందుకు కారణం తీసుకునే ఆహారమేనని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కుటుంబీకులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇంట్లో ఆనందం వెళ్లివిరుస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుత రోజుల్లో మానవుడు ఆరోగ్యంగా ఉండానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏమిటో వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. సంప్రదాయ వంటలతోనే ఆరోగ్యం పదిలం పాశ్చాత్య అలవాట్లతో శరీరానికి నష్టం ఆకుకూరలు అన్నింటికీ ప్రయోజనం సేంద్రియ పంటలైతే మరీ మంచిదిరోజు వారీ తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా సహజ సిద్ధమైన ఆకుకూరలు, కూరగాయలతోపాటు పప్పుదినుసులు ఉండేలా తీసుకోవాలి. సజ్జలు, రాగులు, జొన్నలు, తోటకూర ఎక్కువ తీసుకోకపోవడం వల్ల గర్భిణులు, బాలింతలు అధిక శాతం మందులు వాడాల్సి వస్తుంది. గుడ్డు, పాలు రోజూ పరిమితంగా తీసుకోవాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీరు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. – అచ్చ వరుణ్, జనరల్ సర్జన్, వరంగల్ -
అధిక వడ్డీ ఆశచూపి మోసం..
● పోలీసులను ఆశ్రయించిన బాధితులు మహబూబాబాద్ రూరల్ : ఓ ప్రైవేట్ సంస్థలో డబ్బులు పెట్టుబడి పెడితే అధిక డబ్బులు వస్తాయని ఓ వ్యక్తి నమ్మించగా పలువురు ఆ సంస్థలో పెట్టుబడిపెట్టారు. ఏడాది కావొస్తున్న నిర్వాహకుడు పెట్టుబడి డబ్బులు ఇవ్వకుండా కాలం వెల్లదీయడంతోపాటు చంపుతానని బెదిరిస్తున్నాడు. దీంతో పలువురు బాధితులు లబోదిబోమంటూ తమకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు భావనారుషి మౌనిక, అలేఖ్య, సుజాత కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పత్తిపాక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన బత్తుల రవికిరణ్ ‘అమ్మానాన్న ట్రస్ట్’ పేరిట కార్యాలయం ఏర్పాటు చేశాడు. సదరు వ్యక్తి తన సంస్థలో పెట్టుబడిపెడితే డబ్బులు అధికంగా వస్తాయని నమ్మించాడు. దీనిని నమ్మిన పలువురు మొత్తం సుమారు రూ.12 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. అయితే పెట్టుబడిపెట్టి ఏడాది కావొస్తున్నా డబ్బులు ఇవ్వమని అడిగితే సదరు సంస్థ నిర్వాహకుడు మాయమాటలు చెప్పి కాలం వెళ్లదీస్తూ మోసం చేస్తున్నాడు. బంగారం తాకట్టుపెట్టి మరి డబ్బులు తీసుకొచ్చి ఆ సంస్థలో పెట్టుబడి పెట్టామని, తమ డబ్బులు ఇవాలని అడిగితే చంపుతామని బెదిరిస్తున్నాడని బాధితులు పేర్కొన్నారు. దీనిపై తమకు న్యాయం చేయాలని కోరుతూ మహబూబాబాద్ టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. కాగా, ఈ ఘటనపై టౌన్ సీఐ మహేందర్ రెడ్డిని వివరణ కోరగా బాధిత మహిళలు ఫిర్యాదు చేశారని, దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, ‘అమ్మానాన్న ట్రస్ట్’ నిర్వాహకుడు బత్తుల రవికిరణ్ను వివరణ కోరగా తాను ఎవరిని మోసం చేయలేదని, మహిళల ఆరోపణలు అవాస్తవమన్నారు. -
గోదావరి వరదతో మునిగిన మిర్చి పంటలు
● 20 ఎకరాల్లో నష్టం.. ● లబోదిబోమంటున్న రైతులుఏటూరునాగారం: గోదావరి రెండు రోజులుగా ఉగ్రరూపం దాల్చుతోంది. మండలంలోని రామన్నగూడెం వద్ద వరద రెండో ప్రమాద హెచ్చరికకు చేరింది. దీంతో ఏటూరునాగారంలోని మానసపల్లి, ఓడవాడ శివారు ప్రాంతాల్లోని మిర్చి పంటలు వరదతో మునిగాయి. మొక్కలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. అంతేకాకుండా వరద రెండు రోజుల నుంచి నిలిచి ఉండడంతో మిర్చి నారు కుళ్లి మొక్క చనిపోయే ప్రమాదం ఉందని రైతులు లబో ది బోమంటున్నారు. కందకట్ల రమేశ్, గండెపల్లి ఈశ్వ దరయ్య, గంప శ్రీను, వంగరి రామయ్య, పడాల మల్లికార్జున్, సాయిరి అశోక్, ఐయినాల రాములు, నామని సాంబశివరావుకు చెందిన సుమారు 20 ఎకరాల్లో మిర్చితోట మొత్తం మునిగింది. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పంటలు సాగు చేస్తుంటే వరద నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పరిహారం ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు. గోదావరి కాస్త తగ్గుముఖం కాళేశ్వరం: ఎగువన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం వద్ద గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 12 మీటర్ల ఎత్తులో నీటిమట్టం పుష్కరఘాట్లను తాకుతూ ప్రవహించింది. దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 10.37లక్షల క్యూసెక్కుల వరద చేరింది. దీంతో బ్యారేజీలోని మొత్తం 85గేట్లు ఎత్తి నీటిని దిగువకు తరలిస్తున్నారు. కాగా, సోమవారం 13.290 మీటర్లకు వరద నీటిమట్టం చేరగా మొదటి ప్రమాదహెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద 11.37 లక్షల క్యూసెక్కులు తరలిపోయాయి. కాగా, సాయంత్రం వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. హన్మకొండ అర్బన్: గతంలో భీమదేవరపల్లి, కాజీపేట తహసీల్దార్గా పని చేసి ఎన్నికల సమయంలో జిల్లా నుంచి బదిలీ అయిన కిరణ్ కుమార్ను ప్రభుత్వం హనుమకొండ జిల్లాకు కేటాయించింది. దీంతో ఆయన మంగళవారం కలెక్టరేట్లో రిపోర్టు చేశారు. ప్రస్తుతం ఆయన కలెక్టరేట్లో సెక్షన్ సూపరింటెండెంట్గా విధులు కేటాయిస్తారని సమాచారం. -
భద్రకాళి అమ్మవారికి చతురన్త, విమానక సేవ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మంగళవారం మహా ష్టమి (దుర్గాష్టమి) శ్రీభద్రకాళి జన్మోత్సవం సందర్భంగా అమ్మవారిని మహాదుర్గాదేవిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో అర్చకులు నిత్యాహ్నికం నిర్వహించారు. ఉదయం అమ్మవారిని మహా గౌరీ క్రమంలో దుర్గార్చన జరిపి చతురన్త సేవ నిర్వహించారు. సాయంత్రం విశుంభహాదుర్గార్చన జరిపి విమానకసేవ (సర్వభూపాల వాహన సేవ) నిర్వహించారు. అనంతరం శ్రీభద్రకాళి జన్మోత్సవ విధిని నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ కేఎన్.సంధ్యారాణి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు నిర్వహించుకున్న ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. అదేవిధంగా ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అమ్మవారిని ఆలయ ఈఓ రామల సునీత, ధర్మకర్తలు పర్యవేక్షించారు. దేవాలయంలో మహిళలు బతుకమ్మలు ఆడారు. -
గొర్రెలను తప్పించబోయి లారీ బోల్తా
పరకాల : మండలంలోని కామారెడ్డిపల్లి వద్ద గొర్రెల మందను తప్పించబోయి కంకర లోడ్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి హెడ్ కానిస్టేబుల్ ద్విచక్రవాహనంతో పాటు గొర్రెల కాపరిని ఢీకొంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలపాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ ఆకుల రవీందర్ మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మాందారిపేట నుంచి పరకాల వైపునకు కంకర లోడ్తో లారీ వేగంగా వస్తోంది. ఈ క్రమంలో లారీ డ్రైవర్ గొర్రెల మందను తప్పించే క్రమంలో పరకాల పోలీస్స్టేషన్లో విధులు ముగించుకొని స్వగ్రామం పత్తిపాకకు బైక్పై వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆకుల రవీందర్ను ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా గొర్రెల కాపరి పాలకుర్తి సాంబయ్యను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ విషయం తెలియగానే స్థానికులు 108కు సమాచారం అందజేసి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సాయంత్రం వరకు తమతో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో పోలీసు అధికారులు, ఉద్యోగులు ఒక్కసారిగా విషాదంలో మునిగారు. గొర్రెల కాపరి సాంబయ్య వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఈ ఘటనపై పరకాల పోలీసులు కేసు నమోదు చేశారు. అదుపు తప్పి బైక్ను ఢీకొనడంతో హెడ్ కానిస్టేబుల్ మృతి మరొకరికి తీవ్రగాయాలు -
ఘన్పూర్ అభివృద్ధికి రూ.50 కోట్లు
స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ అ భివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈఏడాది జనవరిలో స్టేషన్ఘన్పూర్ను మున్సిపాలిటీగా చేశామని, సీఎం రేవంత్రెడ్డి సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు తీసుకొచ్చానన్నారు. మున్సిపాలిటీ కార్యాలయ భవనం, టౌన్హాల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సీసీ రోడ్లు, డ్రెయినేజీ లు, రోడ్డు వెడల్పు, తదితర పనులకు నిధులు మంజూరయ్యాయన్నారు. సదరు పనులన్నీంటినీ ఏడా ది లోపు పూర్తి చేస్తానని, వీటితో పాటు వంద పడక ల ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ డివిజనల్ ఆఫీస్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల తదితర పనులు పూర్తయితే స్టేషన్ఘన్పూర్ రూపురేఖలు మారుతాయన్నారు. అలా గే, దేవాదుల మూడో దశ పనులకు రూ.1,001 కో ట్లు కోట్లు మంజూరు చేశారని తెలిపారు. బీసీల రిజ ర్వేషన్పై సీఎం రేవంత్రెడ్డి దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నా రు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా స్పందన లేదని, బీసీలపై ప్రేమ వల్లించే పార్టీలు బీసీ రిజర్వేషన్కు మద్దతు తెలపాలని కోరారు. ఏఎంసీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య శిరీశ్రెడ్డి, గ్రంథలయ సంస్థ జిల్లా చైర్మన్ మారుడోజు రాంబాబు, మార్కెట్ వైస్ చైర్మన్ ఐలయ్య, చిల్పూరు దేవస్థాన చైర్మన్ శ్రీధర్రావు, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
అత్యున్నత శక్తికి నిదర్శనం దుర్గాదేవి
హన్మకొండ కల్చరల్: దుర్గాదేవి విశ్వవ్యాప్తమై ఉన్న అత్యున్నత శక్తికి నిదర్శనమని వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. వేయిస్తంభాల ఆలయంలో జరుగుతున్న శ్రీరుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజు మంగళవారం అమ్మవారు దుర్గదేవిగా దర్శనమిచ్చారు. గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్శర్మ, సందీప్శర్మ సుప్రభాతసేవ, స్వామివారికి అభిషేకాలు, చతుషష్టి ఉపచార పూజలు నిర్వహించి దుర్గాదేవిగా అలంకరించారు. ఆధ్యాత్మిక వేత్త, ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ భరత్ జీ, తెలంగాణ రాష్ట్ర శాప్ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి దంపతులు దేవాలయాన్ని సందర్శించి పూజలు జరుపుకున్నారు. యాగశాలలో చండీహోమం నిర్వహించారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ సౌజన్యంతో భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. సేవా కార్యక్రమంలో రేపల్లె రంగనాఽథ్, చొల్లేటి కృష్ణమాచారి, గండ్రాతిరాజు, సిబ్బంది బధుకర్, రామకృష్ణ పాల్గొన్నారు. ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. -
సీఈఏ నిబంధనలు తప్పక పాటించాలి
డీఎంహెచ్ఓ అప్పయ్య ఎంజీఎం: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, క్లినిక్లు, స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ (సీఈఏ) నిబంధనలు పాటించాలని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. మంగళవారం నగరంలోని కనెక్ట్ డయాగ్నస్టిక్స్, విజేత స్కాన్స్ డయాగ్నోస్టిక్స్లను క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ బృందంతో కలిసి తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయా కేంద్రాల అనుమతి పత్రాలను తనిఖీ చేశారు. రేడియేషన్కు సంబంధించి అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు అనుమతి పత్రాలు పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. సీఈఏ నియమాల ప్రకారం ధరలు నిర్ణయించే అధికారం జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీకి లేదన్నారు. డయాగ్నోస్టిక్స్ సెంటర్లు, హాస్పిటల్ల్లో తాము తీసుకునే ఫీజు, టెస్టులకు సంబంధించి ధరలను తెలుగు, ఇంగ్లిష్లో ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. యాజమాన్యాలు ప్రజలకు ఇబ్బంది కల్గ కుండా మానవతా దృక్పథంలో వ్యవహరించి సేవలందించాలన్నారు. టారిఫ్ లిస్ట్ ప్రదర్శించని విజేత స్కాన్స్ డయాగ్నస్టిక్స్ కేంద్రానికి నోటీసు జారీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్రసన్నకుమార్, మురళి పాల్గొన్నారు. -
అయినా తగ్గేదేలే..
కాజీపేట అర్బన్: మందుబాబులకు మద్యం కిక్కు, ప్రభుత్వ ఖజానాకు ఎకై ్సజ్ శాఖ వైన్స్ షాపుల టెండర్లతో కిక్కు అన్న చందంగా ఉంది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్న లిక్కర్ సేల్స్తో ఎకై ్సజ్ శాఖ తన మార్క్ను నిలబెట్టుకుంటుంది. దీంతో మద్యం వ్యాపారాన్ని ఎంచుకున్న వారికి ఓన్లీ బెనిఫిట్స్ తప్ప లాస్ లేని బిజినెస్గా మద్యం వ్యాపారం అంటూ ఏటా మద్యం వ్యాపారాన్ని తమ బిజినెస్గా ఎంచుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టెక్స్టైల్స్తో పాటు పొలిటీషియన్లు సైతం లిక్కర్ బిజినెస్లోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పెరిగిన ఫీజు.. ఎకై ్సజ్ టెండర్ల ప్రకటనను ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా? అంటూ వేచి ఉండేవారు తమ లక్కు కిక్కును పరీక్షించుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దీంతో రెండేళ్ల కాల పరిమితితో వచ్చే వైన్స్ టెండర్లలో దరఖాస్తుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం దరఖాస్తుల ఫీజును సైతం పెంచుకుంటూ పోతూ దరఖాస్తుల ఫీజు తగ్గేదేలే ఆదాయం తగ్గేదేలే అంటూ రేట్లు పెంచేస్తున్నారు. కాగా.. 2019–21 వరకు రూ.1 లక్ష ఉన్న దరఖాస్తు ఫీజును 2021–23, 2023–25 వరకు దరఖాస్తు ఫీజును రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలు పెంచారు. కాగా తాజాగా 2025–27 రెండేళ్ల కాలపరిమితితో వైన్స్ టెండర్లకు దరఖాస్తు ఫీజును రూ.3 లక్షలుగా ఖరారు చేశారు. నాన్ రీఫండ్ అయినా.. ‘వైన్స్ దరఖాస్తుల ఫీజు నాన్ రీఫండ్ అయినా ఫర్వాలేదు టెండర్లలో పాల్గొంటాం’ అంటూ మద్యం వ్యాపారులు దూసుకొస్తున్నారు. రియల్, టెక్స్టైల్, పొలిటీషియన్లతో పాటు సిండికేట్ రాయుళ్లు వంద సంఖ్యలో దరఖాస్తులను వేస్తూ ఖజానాకు ఆదాయాన్ని దండిగా ఇస్తున్నారు. కాగా, వరంగల్ అర్బన్ (హనుమకొండ) జిల్లాలోని గతంలో 65 వైన్స్గాను 2023–25కు 5,859 దరఖాస్తులకుగాను రూ.117 కోట్లు ఆదాయం రాగా, ఈసారి 2025–27కు దరఖాస్తులు డబుల్ అయ్యి 250 కోట్ల ఆదాయం టార్గెట్గా వస్తుందని అంచనా. వైన్స్ దరఖాస్తుల ఫీజు రూ. లక్ష నుంచి రూ.3 లక్షలకు ఎకై ్సజ్ శాఖ టెండర్లతో ఖజానా గలగల వివరాలు ఇలా.. సంవత్సరం దరఖాస్తులు ఆదాయం 2021–23 2,983 రూ.59 కోట్లు 2023–25 5,859 రూ.117 కోట్లు -
ఎన్నికలపై సందేహాల నివృత్తి
హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహశబరీష్, సత్యశారద అన్నారు. మంగళవారం ఆయా కలెక్టరేట్లలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి నవంబర్ 11 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. హనుమకొండ జిల్లా నుంచి అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, ఆర్డీఓ నారాయణ, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, జెడ్పీ సీఈఓ రవి, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవి శ్రీనివాస్రావు, కొలను సంతోశ్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, శ్యాంసుందర్, ప్రవీణ్కుమార్, నాగవెల్లి రజనీకాంత్ పాల్గొన్నారు. వరంగల్ నుంచి అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, అధికారులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. దసరా ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన ఖిలా వరంగల్: రంగలీల మైదానంలో అక్టోబర్ 2న జరిగే దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులకు ఆదేశించారు. ఏర్పాట్లను మంగళవారం బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, డీసీపీ సలీమా, ఏఎస్పీ శుభం, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
ప్రయాణం ఇక సాఫీ!
కాజీపేట: కాజీపేట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మరమ్మతులకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.59 లక్షలు మంజూరు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దాదాపు 50 ఏళ్ల కింద అప్పటి ప్రజల రవాణా కష్టాలను పరిగణనలోకి తీసుకుని నిర్మించిన బ్రిడ్జి నానాటికీ శిథిలావస్థకు చేరుకుంటోంది. బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న రేలింగ్ ముట్టుకుంటే ఊడిపడేలా ఉంది. ఏటా ఎంతో కొంత నిధులు మంజూరు అవుతున్నప్పటికీ గోడలకు రంగులు వేయడంతోనే సరిపెడుతున్నారు. బ్రిడ్జి కింది వైపు నుంచి రాకపోకలు సాగించే వెంకటాద్రి నగర్ కాలనీవాసులకు ఈ గోడలు పెను ప్రమాదంగా మారాయి. పెళ్లలు పడి స్థానికులు, బాటసారులు స్వల్పంగా గాయపడిన ఘటనలు అనేకం. వర్షాకాలం వచ్చిందంటే చాలు బ్రిడ్జిపై గుంతలు పడడం సర్వసాధారణమైంది. ఈ గుంతలను సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో నిత్యం రాత్రి వేళ ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. వాహనదారుల బాధలను చూడలేక ట్రాఫిక్ పోలీసులు జోక్యం చేసుకుని గుంతలను పూడుస్తున్నారు. స్పందించిన ఎమ్మెల్యే నాయిని కాజీపేట రైల్వే బ్రిడ్జి వల్ల కలుగుతున్న ఇబ్బందులను చూసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సమస్య తీవ్రతను సీఎం దృష్టికి తీసుకెళ్లి రూ.59 లక్షలు మంజూరు చేయించారు. ఈనిధులతో బ్రిడ్జికి సంబంధించిన మరమ్మతులకు అంచనాలు తయారు చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించడంతో చాలాకాలం తర్వాత బ్రిడ్జికి పూర్తి స్థాయిలో మరమ్మతులు జరగనున్నాయని పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు రంగంలోకి దిగి చేపట్టాల్సిన పనులకు ప్రతిపాదనలు చేయడంలో నిమగ్నమయ్యారు. రూపు మార్చుకోనున్న కాజీపేట రైల్వే ఫ్లై ఓవర్ మరమ్మతులకు రూ.59 లక్షలు మంజూరు హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు -
పీడీఎం కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా అమృతరావు
వరంగల్ లీగల్: వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా రోడ్డ అమృతరావును నియమిస్తూ రాష్ట్ర న్యాయ వ్యవహారాల శాఖ సెక్రెటరీ బి.పాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు అమృతరావు ప్రభుత్వ సంబంధిత సివిల్ కేసులు వాదించనున్నట్లు పేర్కొన్నారు. ఈహోదాలో అతను మూడు సంవ్సరాల కాల పరిమితి లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా ఉండనున్నట్లు వివరించారు. ఈసందర్భంగా అమృతరావు మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, వర్ధన్నపేట అధికార ప్రతినిధి నిమ్మని శేఖర్రావు, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ ముదాసిర్ ఖయ్యూం, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఎట్టకేలకు మోగిన ‘లోకల్’ ఎన్నికల నగారా
వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం వివరాలుజెడ్పీలు 06జెడ్పీటీసీలు 75 ఎంపీపీలు 75 ఎంపీటీసీలు 778 సర్పంచ్లు 1,708గెలుపు గుర్రాల వేటలో పార్టీలు.. షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తుండగా.. బీఆర్ఎస్, బీజేపీ కూడా చాలెంజ్గా తీసుకుంటున్నాయి. వామపక్షాలు, ఇతర పార్టీలు సైతం ‘స్థానిక’ంలో సత్తా చాటేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలు, ఆరు జిల్లా పరిషత్లను గెలుచుకునేందుకు ఆ పార్టీలు పావులు కదుపుతున్నాయి. అధికార పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలపై అధి ష్టానం ఈ బాధ్యతలు మోపనుండగా.. బీఆర్ఎస్, బీజేపీ సైతం త్వరలోనే ఇన్చార్జ్లను నియమించనున్నాయి. సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు సోమవారం నగారా మోగింది. పొలిటికల్ కొలువులు ఎన్నికల ద్వారా భర్తీకి సమయం ఆసన్నమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు రెండు విడతలు.. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కానుండగా.. నవంబర్ 11న ఓట్ల లెక్కింపుతో ముగియనుంది. మొత్తం ఐదు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 9, 17 తేదీల్లో నోటిఫికేషన్.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం ఐదు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో, సర్పంచ్ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహిస్తారు. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడుత పోలింగ్, అదే నెల 27న రెండో విడత పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబర్ 17న సర్పంచ్ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అక్టోబర్ 31న సర్పంచ్ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఉంటుంది. అక్టోబర్ 21 నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 4న రెండో విడత పోలింగ్, మూడో విడత ఎన్నికలకు అక్టోబర్ 25 నుంచి నామినేషన్లు స్వీకరించి, నవంబర్ 8న పోలింగ్ నిర్వహిస్తారు. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు వెల్లడిస్తారు. ఉమ్మడి వరంగల్లోని 6 జిల్లాల్లో 6 జిల్లా పరిషత్లు, 75 జెడ్పీటీసీలు, 75 ఎంపీపీలు, 778 ఎంపీటీసీలు, 1,708 జీపీలు, 15,006 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు 15,258 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 45 రోజులపాటు ఎన్నికల కోడ్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని అధికారులు ప్రకటించారు. మండల, జిల్లాల సరిహద్దుల్లో 25 చెక్పోస్టుల ఏర్పాటుకు పోలీస్ కమిషనర్, ఎస్పీలు స్థల పరిశీలన చేశారు. సుమారు 45 రోజులు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుండగా, అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలకు బ్రేక్ పడనుంది. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా పోలీసు నిషేధాజ్ఞలు అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు. సర్పంచ్ ఎన్నికల వివరాలు ఎంపీటీసీ, జెడ్పీటీటీలకు రెండు విడతలు మూడు విడతల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ఉమ్మడి వరంగల్లో అమల్లోకి ఎన్నికల కోడ్ మండల, జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటు. గెలుపు గుర్రాల వేటలో ప్రధాన రాజకీయ పార్టీలు జిల్లాల వారీగా జెడ్పీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, వార్డుల వివరాలుజిల్లా జెడ్పీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్ వార్డులుహనుమకొండ 1 12 12 129 210 1,986 వరంగల్ 1 11 11 130 317 2,754 భూపాలపల్లి 1 12 12 109 248 2,102 మహబూబాబాద్ 1 18 18 193 482 4,110 ములుగు 1 10 10 83 171 1,520 జనగామ 1 12 12 134 280 2,534తొలి, రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వివరాలువిడత నామినేషన్లు చివరి తేదీ పరిశీలన ఉపసంహరణ ఎన్నికలు ఓట్ల లెక్కింపు 1 అక్టోబర్ 9 అక్టోబర్ 11 అక్టోబర్ 12 అక్టోబర్ 15 అక్టోబర్ 23 నవంబర్ 11 2 అక్టోబర్ 13 అక్టోబర్ 15 అక్టోబర్ 16 అక్టోబర్ 19 అక్టోబర్ 27 నవంబర్ 11 1 అక్టోబర్ 17 అక్టోబర్ 19 అక్టోబర్ 20 అక్టోబర్ 23 అక్టోబర్ 31 అక్టోబర్ 31 2 అక్టోబర్ 21 అక్టోబర్ 23 అక్టోబర్ 24 అక్టోబర్ 27 నవంబర్ 4 నవంబర్ 4 3 అక్టోబర్ 25 అక్టోబర్ 27 అక్టోబర్ 28 అక్టోబర్ 31 నవంబర్ 8 నవంబర్ 8 -
శిక్షణ కోసం ఎస్డీసీ రోహిత్
హన్మకొండ అర్బన్: ఇటీవల గ్రూప్–1 ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ఎంపికై న తౌటం రోహిత్ నేతను ప్రభుత్వం శిక్షణ కోసం హనుమకొండ జిల్లాకు కేటాయించారు. ఈమేరకు సోమవారం విధుల్లో చేరిన రోహిత్ కలెక్టర్ స్నేహ శబరీష్ను మర్యాదపూర్వకంగా కలిసి తన వివరాలు తెలియజేశారు. కాగా, రోహిత్ తండ్రి పోలీస్ శాఖలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. రోహిత్ అక్క వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఎస్సైగా, బావ హనుమకొండ కలెక్టరేట్లో నాయబ్ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులంతా దాదాపు ప్రభుత్వ ఉద్యోగులేనన్న సమాచారం తెలియడంతో అధికారులు వారిని అభినందించారు. -
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సమర్థవంతంగా ఏర్పాట్లు చేయనున్నట్లు హనుమకొండ, వరంగల్ కలెక్టర్ స్నేహ శబరీష్ , సత్యశారద తెలిపారు. సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్ల నుంచి హాజరైన కలెక్టర్లు మాట్లాడుతూ.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు, ఎన్నికల విధులకు సంబంధించి రెండు దఫాలుగా ఉద్యోగులకు శిక్షణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి తూ.చ తప్పకుండా పాటిస్తూ పటిష్టంగా ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. ఆయా సమావేశంలో హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, డీఆర్డీఓ మేన శ్రీను, డీపీఓ లక్ష్మీరమాకాంత్, జెడ్పీ సీఈఓ రవి, వరంగల్ డీపీఓ కల్ప న, వాసుమతి, నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
గ్రేటర్ వరంగల్
(హనుమకొండ – వరంగల్)మంగళవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025ఉర్సు రంగలీల మైదానంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలుపద్మాక్షి గుండం వద్ద బతుకమ్మలతో మహిళల కోలాహలం7వరంగల్ ఆకారపు విశ్వేశ్వర దేవాలయంలో..ఉర్సు రంగలీల మైదానానికి బతుకమ్మలతో వస్తున్న ఆడపడుచులువేయిస్తంభాల దేవాలయంలో..12 ఫీట్ల బతుకమ్మ చుట్టూ ఆడిపాడుతున్న గాంధీనగర్ మహిళలుపద్మాక్షి గుండం వద్ద బతుకమ్మ ఆడుతూ..సంబురంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ముద్దబంతులు మురిసిపోయాయి. చామంతులు చెమక్కున మెరిశాయి. తంగేడు వనాలు బంగారు వర్ణాలయ్యాయి. అల్లిపూలు అందంగా విరిశాయి. కట్లపూలు, కనకాంబరాలు కనువిందు చేశాయి. సీతజడలు సిగ్గుపడ్డాయి. స్వస్తికాలు సంబురపడగా.. గుమ్మడి పూలు గౌరమ్మగా మారాయి. గునుగు గుభాలించగా.. మహిళల చేతుల్లో పూల శిఖరాలు పురుడుపోసుకున్నాయి. వారంతా చల్లని తల్లిని పాటలతో స్మరిస్తూ.. చప్పట్లతో గొప్పదనాన్ని వర్ణిస్తూ బతుకునివ్వమని వేడుకున్నారు. గౌరమ్మకు పూజలు చేసి ఘనంగా వీడ్కోలు పలికారు. సోమవారం గ్రేటర్ వరంగల్ నగరంలో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఖిలా వరంగల్, ఉర్సు గుట్ట రంగలీల మైదానం, పద్మాక్షి దేవాలయ పరిసరాల్లో సద్దుల వేడుకలు వైభవంగా నిర్వహించారు. తీరొక్కపూలతో బతుకమ్మలు పేర్చి ఆడపడుచులు ఆడిపాడి సందడి చేశారు. – హన్మకొండ కల్చరల్ -
ప్రహరీ పనులు పూర్తి చేయండి
కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: హనుమకొండలోని బాలసముద్రం బల్దియా వెహికిల్ షెడ్డు ప్రహరీ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం వెహికల్ షెడ్ ప్రాంతంలో నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ నిర్మిత పనులతో పాటు సమీపంలోని రెండు పడకల గదులు సముదాయం (2 బీహెచ్కే)లో నీటి సరఫరా వసతి కల్పన కోసం చేయాల్సిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆమె వెంట ఎంహెచ్ఓ రాజేశ్, ఈఈ రవికుమార్, డీఈలు రాజ్కుమార్, రాగి శ్రీకాంత్, శానిటరీ సూపర్వైజర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
కమిషనరేట్లో పోలీస్ అధికారుల బదిలీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ కంట్రోల్ రూం ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న డి.విశ్వేశ్వర్ గీసుకొండకు, గీసుకొండ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆకునూరి మహేందర్ పోలీస్ కంట్రోల్ రూంకు బదిలీ అయ్యారు. టాస్క్ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న కె.వంశీకృష్ణ గీసుకొండ పోలీస్ స్టేషన్కు, సంగెంలో పని చేస్తున్న నరేశ్ను మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్కు, బి.రామారావు సుబేదారి నుంచి జఫర్గఢ్ పోలీస్ స్టేషన్నుకు బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ గణితశాస్త్ర విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా (బీఓఎస్)గా ఆవిభాగం ప్రొఫెసర్ పి.మల్లారెడ్డిని నియమిస్తూ కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు బీఓఎస్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బీఎస్ఎల్ సౌజన్య కొనసాగారు. ఆమె పదవీ కాలం పూర్తి కావడంతో మల్లారెడ్డిని నియమించారు. మల్లారెడ్డి రెండేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కేయూ వీసీ ప్రతాప్రెడ్డి బీఓఎస్ ఉత్తర్వులు మల్లారెడ్డికి అందించారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ విద్యా కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ అండ్ ఇన్చార్జ్ విభాగాధిపతిగా దూర విద్యా కేంద్రంలోని డాక్టర్ నల్లాని శ్రీనివాస్ను నియమిస్తూ కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం విద్యా కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ అండ్ హెడ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈపదవిలో నల్లాని శ్రీనివాస్ ఒక సంవత్సరం పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఉంటారని రిజిస్ట్రార్ ఉత్తర్వులో పేర్కొన్నారు. వీసీ ప్రతాప్రెడ్డి ఉత్తర్వులను నల్లాని శ్రీనివాస్కు అందజేశారు. -
పండుగకు స్వగ్రామానికి వస్తూ మృత్యుఒడికి..
ఆలేరురూరల్/చిల్పూరు: దసరా పండుగకు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కుమారుడితో కలిసి బైక్పై వస్తున్న మహిళ రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ఈ ఘటన సోమవారం హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కందిగడ్డతండా శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా చిల్పూరు మండలం పల్లగుట్ట గ్రామానికి చెందిన సాదం కోమలి(42) తన భర్త రవి, కుమారుడు రాజుతో కలిసి హైదరాబాద్లోని యూసుఫ్గూడలో నివాసముంటోంది. అక్కడే ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కోమలి, ఆమె భర్త రవి కలిసి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. దసరా పండుగకు కోమలి, ఆమె కుమారుడు రాజు కలిసి సోమవారం బైక్పై హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరు మండలం కందిగడ్డతండా శివారులోని ఛత్రపతి శివాజీ దాబా వద్దకు రాగానే అదే మార్గంలో మరో బైక్పై వస్తున్న అందె భాస్కర్ వీరి బైక్ను వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో కోమలి ఎగిరి రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కుమారుడి ఎలాంటి గాయాలు కాలేదు. కోమలిని వెంటనే ఆమె కుమారుడు ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆలేరు సీఐ యాలాద్రి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం కోమలి మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం -
కేబుళ్లు క్రమపద్ధతిలో ఏర్పాటు చేయాలి
హన్మకొండ: విద్యుత్ స్తంభాలకు కేబుళ్లును క్రమ పద్ధతిలో అమర్చాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సంస్థ పరిధిలోని 16 సర్కిళ్ల (జిల్లా) కేబుల్ అపరేటర్లు, బ్రాడ్ బ్యాండ్ ఆపరేటర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ లైన్ల పైనుంచి బ్రాడ్ బ్యాండ్ కేబుల్ వైర్లు ఏర్పాటు చేయొద్దన్నారు. భూమి నుంచి 18–20 ఫీట్ల ఎత్తులో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. రోడ్ క్రాస్సింగ్స్ లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఉపయోగంలో లేని కేబుల్ వైర్లను 3 నెలలలోపు తొలగించాలని ఆదేశించారు. ప్రతీ బ్రాడ్ బ్యాండ్ కేబుల్ వైర్లను జీఐఎస్ మ్యాపింగ్ చేసుకుని వాటి కోఆర్డి నెట్స్ ఎన్పీడీసీఎల్కు అందజేయాలన్నారు. ఆరునెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. డైరెక్టర్లు వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు రాజు చౌహాన్, అశోక్, సి.జి.ఎం ఆర్. చరణ్ దాస్, వరంగల్ ఎస్ఈ కె.గౌతమ్ రెడ్డి, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, జీఎంలు సురేందర్, డివిజనల్ ఇంజనీర్లు జి.సాంబరెడ్డి, ఎస్.మల్లికార్జున్, అనిల్ కుమార్, బీఎస్ఎన్ఎల్ డీజీఎం కిషన్, అజయ్, ఎయిర్ టెల్, జియో, యాక్ట్ ఫైబర్ నెట్, ఐ రీచ్ ప్రతినిధులు, స్థానిక కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
భద్రకాళి అమ్మవారికి భద్రపీఠసేవ, అశ్వవాహన సేవ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో అర్చకులు నిత్యాహ్నికం నిర్వహించారు. ఉదయం అమ్మవారిని కాళరాత్రి క్రమంలో దుర్గార్చన జరిపి భద్రపీఠ సేవ నిర్వహించారు. సాయంత్రం అశ్వవాహనసేవ నిర్వహించారు. ఆలయ ఈఓ రామల సునీత, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, రాములు, శ్రవణ్రెడ్డి, అంజేయులు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, మూగ శ్రీనివాస్రావు పర్యవేక్షించారు. -
ఆర్టీసీలో అప్రెంటిస్షిప్నకు అవకాశం
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ లో చేరడానికి ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను తెలిపారు. 2020–మే 2025 మధ్య ఉత్తీర్ణులైన ఇంజనీరింగ్, డిప్లొమా, ఏదేని గ్రాడ్యుయేట్స్ అర్హులని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. వరంగల్ రీజియన్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా అభ్యర్థులు అప్రెంటిస్షిప్నకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు తప్పని సరిగా https://nats.education.gov.in వెబ్ఐట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు హనుమకొండ బస్ స్టేషన్ రెండో అంతస్తులోని వరంగల్ రీజియన్ కార్యాలయంలో అక్టోబర్ 7న ఉదయం 10.30 నుంచి 5 గంటల వరకు వాక్–ఇన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు 99592 26045 నంబర్లో సంప్రదించాలని కోరారు. బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ● ద్విచక్రవాహనదారుడికి తీవ్ర గాయాలు కాటారం: బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం మండల కేంద్రం సమీపం సబ్స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎర్రగుంటపల్లికి చెందిన మాచెర్ల మల్లేశ్ సొంత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై మండల కేంద్రంలోని గారెపల్లికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కాళేశ్వరం వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. బైక్ను వెనుక నుంచి ఢీకొంది. దీంతో మల్లేశ్ రోడ్డుపై ఎగిరిపడగా తీవ్రగాయాలయ్యాయి. దీంతో కుటుంబీకులు క్షతగాత్రుడిని 108లో ఎంజీఎం తరలించారు. ప్రస్తుతం మల్లేశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఆర్టీసీ బస్సును స్టేషన్కు తరలించారు. జఫర్గఢ్ ఎస్సై రాంచరణ్ సస్పెన్షన్జఫర్గఢ్: జఫర్గఢ్ ఎస్సై రాంచరణ్ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలపై ఉన్నతాఽధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా సీపీ సన్ప్రీత్సింగ్ రాంచరణ్ను సస్పెండ్ చేశారు. గతంలో ఇదే పోలీస్స్టేషన్లో పనిచేసిన ఇద్దరు ఎస్సైలు సైతం పాత కేసుల విషయంలో సస్పెన్షన్కు గురయ్యారు. వరుసగా ముగ్గురు ఎస్సైలపై వేటుపడడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో జఫర్గఢ్ పోలీస్స్టేషన్ అంటేనే ఎస్సైలు హడలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చిల్పూరు: కుమారుడు చనిపోయాడనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరంలో చోటుచేసుకుంది. కు టుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాములు(48) కుమారుడు గతేడాది మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి రాములు మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సిరిపురం నవీన్కుమార్ తెలిపారు. -
సరస్వతీదేవిగా రుద్రేశ్వరి అమ్మవారు
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయంలో జరుగుతున్న రుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్శర్మ, సందీప్శర్మ సుప్రభాతసేవ, స్వామివారికి అభిషేకాలు, ఉత్సవమూర్తికి అభిషేకాలు, చతుషష్టి ఉపచార పూజలు నిర్వహించారు. అనంతరం మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని తెలుపు వస్త్రాలు ధరింపజేసి తెల్లకలువలతో పూజలు నిర్వహించారు. భక్తులు సమర్పించిన వివిధ రంగుల గాజులతో అమ్మవారిని అలంకరించారు. యాగశాలలో రుద్రహోమం, సుదర్శన, చండీహోమం నిర్వహించారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ సౌజన్యంతో భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. సాయంత్రం దేవాలయంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సద్దుల బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. -
గోదావరి ఉగ్రరూపం..
కాళేశ్వరం : గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకల్లోకి వరద నీరు చేరుతోంది. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద పుష్కరఘాట్లను తాకుతూ 13.240 మీటర్ల ఎత్తులో తరలిపోతుంది. దీంతో సీడబ్ల్యూసీ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాళేశ్వరం తీరంపైగల చిరు దుకాణాల్లోకి వరదనీరు చేరడంతో అధికారులు ఖాళీచేయించారు. ఇప్పటికే నీటిమట్టం 12.210మీటర్ల ఎత్తు దాటగా మొదటి ప్రమాదహెచ్చరిక జారీ చేశారు. చివరి ప్రమాదహెచ్చరిక 13.460 మీటర్లు దాటితే జారీ చేస్తారు. రాత్రి వరకు దాటే అవకాశం ఉందని అధికారుల ద్వారా తెలిసింది. దీంతో అధికార యంత్రాంగం దిగువ లోతట్టు గ్రామాలను అప్రమత్తం చేస్తోంది. ఎప్పటికప్పుడు వరద సమాచారం సమీక్షిస్తున్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. గోదావరి వరదనీరు కమ్మేయడంతో చండ్రుపల్లి, మద్దులపల్లి వాగులు ఉప్పొంగాయి. ఫలితంగా పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మేడిగడ్డకు.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 11.37 లక్షల క్యూసెక్కుల వరద తరలివస్తోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు ఎత్తినీటిని దిగువకు తరలిస్తున్నారు. ఈ వర్షాకాలం సీజన్లో ఇంత వరద రావడం ఇదే మొదటిసారని ఇరిగేషన్శాఖ అధికారులు చెబుతున్నారు. నీటమునిగిన పంటలు.. మహదేవపూర్ మండలం అన్నారం, చండ్రుపల్లి, నాగేపల్లి, మద్దులపల్లి, పలుగుల, బల్జాపూర్, పూస్కుపల్లి, కాళేశ్వరం, మహదేవపూర్, బొమ్మాపూర్ తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పత్తి, వరి, మిర్చి పంటలు నీటమునిగాయి. దీంతో రైతులు ఈ సీజన్లో నాలుగో సారి పంటలు మునిగి నష్టపోయామని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. పలిమెలలో.. పలిమెల: గోదావరి వరద ప్రవాహానికి మండల పరిధిలోని పలు గ్రామాల్లో పంట పొలాలు, చేలు నీట మునిగాయి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగు చేస్తే గోదావరి వరదతో తీరని నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. కాళేశ్వరం వద్ద 13.240 మీటర్ల ఎత్తున నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు వందలాది ఎకరాల్లో పత్తి, వరి, మిర్చి పంటలు నీటమునక ఆందోళనలో రైతులు -
మైసూర్ ఉత్సవాలను తలపించేలా దసరా వేడుకలు
ఖిలా వరంగల్: వరంగల్ ఉర్సు రంగలీల మైదానంలో ప్రభుత్వ యంత్రాంగం, ఉత్సవ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 2న నిర్వహించనున్న దసరా ఉత్సవాలను మైసూర్ ఉత్సవాలను తలపించేలా ఘనంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపూరి సంజయ్బాబు గౌడ్ అన్నారు. వరంగల్ కరీమాబాద్లోని ఆదర్శ పరపతి సంఘం భవనంలో ప్రధాన కార్యదర్శి మేడిది మధుసూదన్, కోశాధికారి మండ వెంకన్న, ఉపాధ్యక్షుడు గోనె రాంప్రసాద్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో సంజయ్బాబు మాట్లాడుతూ పూర్వీకుల నుంచి రంగలీల మైదానంలో రావణవధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైందన్నారు. ఉత్సవాలను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు శివమూర్తి, ట్రస్ట్ చైర్మన్ వంగరి కోటేశ్వర్, రంజిత్గౌడ్, సందీప్, వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, అఖిల్గౌడ్, పూజారి అజయ్, సంజీవ్, వాసు, అశోక్, బిట్ల క్రాంతి, మహేశ్, శ్రీను, గోవర్ధన్, చిరంజీవి, రంజిత్, వంశీ, నాగరాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
తోటకూర..
రక్తహీనతతో బాధపడేవారికి దీనిని మించిన పోషకాహారం లేదు. ఎందుకంటే రిటోప్లేవిన్, పోలేట్, విటమిన్–ఏ, కే, బీ,సీలతోపాటు కాల్షియం, పోటాషియం, పాస్పరస్, జింక్, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. విత్తనాల నుంచి తీసిన నూనె గుండె వ్యాధిగ్రస్తులకు ఎంతో ఉపయోగకరం. బీపీని నియంత్రిస్తుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ప్రజలు ఎక్కువ తినేది ఇదే. పోషక విలువలు ఇందులో ఎక్కువ ఉంటాయి. శరీరానికి చలు వ. దగ్గు, ఆస్తమా, ఇతత్రా రుగ్మతలను నివారిస్తుంది. ఐరన్, పోలిక్ యాసిడ్, విటమిన్–‘ఏ’ తోపాటు కీలకమైన ఆమైనో అమ్లాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. పోటాషియం, సల్పర్, సిలికాన్, మాంగనీస్, సోడియం వంటివి సమపాళ్లలో లభిస్తాయి. కడుపులో మంట తగ్గిస్తుంది. దీని జ్యూస్ కాలేయ రుగ్మతలను తొలగిస్తుంది. అద్భుత ఔషధ ఆహారం. రోజు తింటే ఆరోగ్యానికి మంచిది. కాల్షియం, ఇనుము, పాస్పరస్తోపాటు ప్రొటీన్లు ఎక్కువే. ఆకలి పుట్టిస్తుంది. అంతేగాకుండా దగ్గు, వాంతులు, కీళ్ల వ్యాధులు, నులిపురుగులను నివారిస్తుంది. ఆవకాయ తర్వాత తెలుగు వారు గోంగూర పచ్చడికే ప్రాధాన్యం ఇస్తారు. పచ్చడి పెట్టినా.. పప్పు చేసినా.. మాంసంలో కలిపి వండినా ఇలా ఏ విధంగా చేసినా దీని రుచి అమోఘం. దీని పుంటి కూర అని కూడా పిలుస్తారు. ఐరన్ నిల్వలకు గోంగూర పెట్టింది పేరు. ఇతర విటమిన్లు ఎక్కువ. తెల్లది, ఎర్ర, పుల్ల గోంగూర పేర్లతో ఇది లభిస్తుంది. జీర్ణక్రియను పెంచుతోంది. ఆకలి పుట్టిస్తుంది. చల్లదనం ఇస్తుంది. కళ్లకు మంచిది. అందుకే దీనిని రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవడం మంచిది. ఇందులో ఐరన్, కాల్షియం, పాస్పరస్, విటమిన్ –ఏ, సీలు ఎక్కువ ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఇతర కూరలతో కలిపి వండినా మంచి వాసన ఇస్తుంది. -
కీటకం.. కీలకం
హన్మకొండ: ఆయిల్ పామ్ సాగులో అధిక దిగుబడికి పరాగ సంపర్కం కీలకం. పరాగ సంపర్కం జరగడానికి కీటకాలు అవసరం. ఇందులో ఎలాయిడోబియస్ కామెరూనికస్ కీటకాలు ఆయిల్ పామ్ తోటల్లో పరాగ సంపర్కం జరగడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆయిల్ పామ్ పుష్పాలను పరాగ సంపర్కం చేయడంలో కీటకాలు కీలకంగా పని చేస్తాయి. కాత కోసం రైతులు, అధికారులు పరగా సంపర్కానికి కీటకాలను తోటల్లో వదులుతున్నారు. ఇవి పూతను పిందెగా మార్చి దిగుబడిని పెంచుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ తోటలు సాగు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 15 వేల ఎకరాల్లో సాగు చేశారు. 2022 ఆగష్టులో ముందుగా హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలో సాగు చేశారు. అప్పుడు దాదాపు 5,500 ఎకరాల్లో సాగు చేశారు. మూడేళ్ల క్రితం సాగు చేసిన తోటలు కొన్ని దిగుబడి ఇస్తుండగా మరికొన్ని తోటలు కాతకు వచ్చాయి. కాతకు వచ్చిన తోటల్లో పరాగ సంపర్కం కోసం రైతులు, అధికారులు ఆఫ్రికన్ పురుగులను తోటల్లో వదులుతున్నాయి. ఆయిల్ పామ్ తోటల్లో పురుగుల యాజమాన్యం.. ఎలాయిబోడియస్ కామెరూనికస్ పురుగు క్యూర్క్యులియోనిడే కుటుంబానికి చెందింది. ఆఫ్రికా ప్రాంతానికి చెందిన కీటకం. ఆడ కీటకం పుష్పాల లోపల గుడ్లు పెడుతుంది. లార్వా పుష్పంలోని కణజాలంలో పెరిగి ఆహారం తీసుకుంటుంది. ప్యూపా దశలో పుష్పం లేదా ఇన్ఫ్లోరెన్స్ లోపల రూపాంతరం చెందుతుంది. ఈ కీటకం చిన్న పరిణామంలో దాదాపు 4 మిల్లీ మీటర్ల పొడవు ఉండి నల్లని గోధుమ రంగులో ఉంటుంది. వీటి ఆయుష్షు 1 నుంచి 2 నెలలు. ఒక్క సారి వదిలితే సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ తోటల్లోనే ఉంటుంది. ఇది ఆయిల్ పామ్ పరాగ సంపర్కంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ పురుగులను పరాగ సంపర్కానికి ఉపయోగించడం ద్వారా దిగుబడిని పెంచొచ్చని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. మగ పుష్పాల నుంచి ఆడ పుష్పాలకు పుప్పొడి తరలిస్తూ సహజ పరాగ సంపర్కం చేస్తాయి. దీంతో ఆయిల్ పామ్లో ఫలసాధన శాతం పెరుగుతుంది. ఆయిల్పామ్ సాగు చేసిన 30 నెలలకు కాతకు వస్తుంది. అంతకు ముందు గెలలు వేసినా వాటిని తొలగించాలి. మొక్కలు నాటిన 26, 27 నెలలకు ఈ పరాగ సంపర్క కీటకాలను తోటల్లో వదిలిపెట్టాలి. 30 నెలలకు గెలలు వదిలిపెట్టాలి. గెల వేసిన 4 నుంచి 5 నెలలకు పక్వానికి వచ్చి కోతకు వస్తాయి. ఈ కీటకాలతో మానవ శ్రమ లేకుండా పుప్పొడి బదిలీ జరిగి సహజ పరాగ సంపర్కం జరుగుతుంది. ఫలగుచ్ఛంలో గింజల నింపుదల బాగా పెరుగుతుంది. ఖర్చు తగ్గుతుంది. రసాయనాల అవసరం లేకుండా సహజంగా పనిచేస్తుంది. నిరంతర పుప్పొడి వ్యాప్తి జరుగుతుంది. పుష్పించే కాలమంతా వీటివల్ల ఫలసాధన కొనసాగుతుంది. ఆయిల్ పామ్ సాగులో ఎలాయిబోడియస్ కామెరూనికస్ ప్రవేశపెట్టిన తర్వాతే ప్రపంచవ్యాప్తంగా ఆ పంటలో దిగుబడులు గణనీయంగా పెరిగాయని ఉద్యాన అధికారులు తెలిపారు. ఈ కీటకాలు సహజంగానే నిరంతరం పని చేస్తాయి. ఇవి సహజసిద్ధంగా పని చేయడం వల్ల ఖర్చు తగ్గి, నూనె ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా అధిక ఆదాయం వస్తుంది. ఎలాయిడోబియస్ కామెరూనికస్ కీటకం ఈ ప్రక్రియ జరగ డంలో పురుగుల పాత్ర ప్రధానంఆయిల్ పామ్ తోటల్లో పరాగ సంపర్క కీటకాల పాత్ర కీలకం. మానవ అవసరం లేకుండా పుప్పొడిని చేరవేస్తాయి. పూతను పిందె, కాయగా మార్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. దిగుబడి పెరుగుతుంది. రైతులు లాభసాటి అయిన ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలి. శ్రీనివాస్ రావు, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి,వరంగల్ -
ఆకుకూరలతో ఆరోగ్యం..!
ఖిలా వరంగల్ : ఆధునిక యుగంలో అందరిలోనూ అనారోగ్య సమస్యలు. చిన్న వయసులోనే పలు రోగాలు. అందుకు వైద్యులు చెప్పే సమాధానం ఆహారపు అలవాట్ల మార్చుకోవాలని. ఈ మాట మాంసాహార ప్రియులకు మింగుడు పడకపోయినా.. ఆరోగ్యం కోసం శాఖాహారం తీసుకోవాలని చెబుతున్నారు. ఫలితంగా వరంగల్ నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే చాలా మంది ఆహారపు అలవాట్లు మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజా ఆకుకూరలపై దృష్టిసారిస్తున్నారు. ఆకుకూరల్లో కేలరీలు తక్కువ ఉండడంతో బరువు నియంత్రణకు ఎంతో ఉపయోగపడుతాయి. శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రొటీన్లను ఆకుకూరల ద్వారా పొందొచ్చు. కొవ్వు తక్కువ ఉండడంతోపాటు ఆహారాన్ని రుచిగా చేయడం ఆకుకూరల ప్రత్యేకత. ఈ నేపథ్యంలో ప్రతీ రోజు ఆహారంలో ఆకుకూరను తప్పని సరిగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆకుకూరలతో ఎన్నో ప్రయోజనాలు.. ఆకుకూరలు, కూరగాయలు తినడం ద్వారా ఎలాంటి రోగాలు ధరిచేరవని పలువురు వైద్యులు వెల్లడిస్తున్నారు. వ్యాధులు రాకుండా ఉండాలంటే పిల్ల లకు చిన్నప్పటి నుంచే శాఖాహారం అలవాటు చేయాలని వైద్యులతోపాటు కేవీకే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకుకూరలో పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శారీరక పెరుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి. ఖనిజ పోషకాలు, ఇనుము, కాల్షియం, కెరోటిన్, విటమిన్ ‘సీ’ పుష్కలంగా లభిస్తాయి. ఇనుములోపంతో బాధపడే గర్భిణులు, బాలింతలకు ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి. ఆకుకూరల్లో విటమిన్ ‘ఏ’ ఉంటుంది. ఇది కంటి చూపును పరిరక్షిస్తుంది. ఐదేళ్లలోపు చిన్నారులు కంటిచూపు ఎక్కువ కోల్పోతున్న తరుణంలో ఆకుకూరలు మేలు చేసి అంధత్వం రాకుండా తోడ్పడతాయి. చిన్న వయసులోనే జబ్బులు.. నేటి పోటీ ప్రపంచంలో ఆరేళ్ల చిన్నారి నుంచి.. 60 ఏళ్ల వృద్ధుల వరకు పరుగులు పెడుతున్నారు. తద్వారా అతి చిన్న వయసు నుంచే వివిధ రోగాల బారిన పడుతున్నారు. దీనిని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్న ప్రజలు మాంసాహారానికి బదులు ఆకుకూరలు, కూరగాయలపై ఆసక్తి చూపుతున్నారు. కాగా, కూరగాయలు తోడుంటే ఆరోగ్యం మీ వెంటే అంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెరటి కూరలే ఆకుకూరలు.. ఆకు కూరల కోసం ప్రత్యేకంగా కష్టపడాల్సిన పనిలేదు. మార్కెట్ వెంట పరుగులు తీసి కొనుగోలు చేయాల్సిన అవసరమూ లేదు. శ్రద్ధ వహించి ఇంటి ఆవరణలో కొద్దిపాటి ఖాళీ స్థలం ఉన్నా ఎంచక్కా పెంచుకోవచ్చు. రక్తహీనత నివారణ, కండరాల పటిష్టతకు దివ్య ఔషధం కంటి చూపుకు మేలు ఆకుకూరలు తినాలంటున్న వైద్యులుఆకుకూరలు, కూరగాయలు తినడం ద్వారా ఎలాంటి రోగాలు ధరిచేరవు. పిల్లలకు వ్యాధులు రాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే శాఖాహారం అలవాటు చేయాలి. నిత్యం మనం తినే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి రోగ నిరోధక శక్తినిచ్చే ఖనిజ లవణాలు, విటమిన్లు ఆకుకూరల్లో ఉంటాయి. ఇవి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. -
భద్రతపై భయం వద్దు..
వరంగల్ క్రైం: భద్రతపై ప్రజలు భయపడొద్దని హనుమకొండ ఏసీపీ నరసింహారావు సూచించారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. శనివారం హనుమకొండ ఏసీపీ పూనాటి నరసింహారావుతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించింది. ప్రజలు ఫోన్చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రశ్న : గోపాల్పూర్లో రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ కనిపించడం లేదు. – డాక్టర్ కట్కూరి నరసింహ, గోపాల్పూర్ జవాబు: ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహిస్తాం. ముఖ్య కూడళ్ల వద్ద చెక్ పాయింట్లు ఉంటాయి. పెట్రోలింగ్ చేసే అధికారి కచ్చితంగా సందర్శించి రిజిస్టర్లో సంతకాలు చేస్తారు. ప్రశ్న : దసరాకు ఊరెళ్తున్నాం.. ఎవరికి సమాచారం ఇవ్వాలి? – దొమ్మటి భద్రయ్య, రేణుకాఎల్లమ్మ కాలనీ జవాబు: మీరు ఉంటున్న కాలనీ కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అక్కడకు వెళ్లి వివరాలు ఇవ్వండి. మీ ప్రాంతంలో రాత్రి పూట గస్తీని పెంచుతారు. బీరువా తాళాలు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచరాదు. ఇంటి బయట లైట్లు వేసి ఉంచాలి. దొంగలు కాలనీల్లో తిరిగినప్పటికీ ఇంటికి తాళం వేసినట్లు అనుమానం రాదు. ప్రశ్న : ఇంటి ఎదుట పార్కింగ్ చేసిన బైక్ పోయింది. ఇప్పటి వరకు దొరకలేదు. – బండారి శివ, బాలసముద్రం జవాబు: రోడ్ల మీద వాహనాలను పార్కింగ్ చేయడం సరికాదు. దీంతో వాహనాలు చోరీకి గురయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఇంటి ఆవరణలోనే వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో వాహనాలకు తాళాలు ఉంచి మరిచిపోరాదు. ప్రశ్న : మేం హైదరాబాద్ వెళ్తుండగా బ్యాగు ఎవరో దొంగిలించారు. ఇప్పటి వరకు దొరకలేదు. –సురేశ్, బాలసముద్రం జవాబు: బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు వెంట తీసుకెళ్లిన బ్యాగులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ముఖ్యమైన వస్తువులు ఉన్న బ్యాగును ఎట్టి పరిస్థితుల్లో పరిచయం లేని వ్యక్తులకు అప్పగించొద్దు. ముఖ్యంగా మహిళలు ఒంటిమీద ఉన్న నగలపై అప్రమత్తంగా ఉండాలి. ప్రశ్న : మా కాలనీలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? అనే అనుమానం ఉంది. – జి.కవిత జులైవాడ, పి.రమేశ్ పోస్టల్ కాలనీ జవాబు: హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని 5,300, కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో 2,500, సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో 6,400 కెమెరాలు పనిచేస్తున్నాయి. దొంగలను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చే కాలనీ ప్రజలకు పోలీసుల సహకారం ఉంటుంది. ప్రశ్న : జంక్షన్ల వద్ద ఆకతాయిలు ఉంటున్నారు. బయటకు వెళ్లాలంటే భయం వేస్తోంది? –రేణుకుంట్ల రమాకాంత్, కుమార్పల్లి జవాబు : కొంతమంది యువకులు పుట్టిన రోజు వేడుకలను రాత్రి పూట రోడ్లపై చేసుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టాం. తీరుమార్చుకోని వారిపై కేసులు కూడా నమోదు చేశాం. ఎవరికై నా ఇబ్బంది కలిగితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వండి. ఆకతాయిల ఆట కట్టిస్తాం. తల్లిదండ్రులు తమ పిల్లలు రాత్రి పూట ఎక్కడ తిరుగుతున్నారో గమనించాలి. ప్రశ్న : హనుమాన్ జంక్షన్, డబ్బాల వద్ద ఉదయం పూట ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి సరిచేయండి? – వెంకటేశ్వర్రెడ్డి, హన్మాన్ జంక్షన్ జవాబు: కచ్చితంగా ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు అక్కడి సమస్య త్వరలో పరిష్కరిస్తారు. ప్రశ్న : దొంగతనం జరగకుండా ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – డాక్టర్ రహీం, గోపాల్పూర్ జవాబు: రెండు మూడు ఇళ్ల వారు కలిిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. స్మార్ట్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకుంటే గుర్తు తెలియని వ్యక్తులు తాళం తీసినా, పగులగొట్టినా వెంటనే ఫోన్కు సమాచారం వస్తుంది. దీంతో దొంగలను దొంగతనం చేయకముందే పట్టుకోవచ్చు. కాలనీల్లో ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి సాక్షి ఫోన్ ఇన్లో హనుమకొండ ఏసీపీ నరసింహారావు