breaking news
Hanamkonda District Latest News
-
చెత్త శాంపిళ్లను సమర్థంగా సేకరించాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: నగరవ్యాప్తంగా పలు డివిజన్ల నుంచి ఏరకమైన తడి, పొడి చెత్త సేకరణ జరుగుతుందని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, నివేదిక సమర్పించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. శుక్రవారం వరంగల్ పరిధి పోతన నగర్, బల్దియా ఆవరణలోని బయో మిథనైజేషన్ ప్లాంట్తో పాటు ఎన్ఐయూఏ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫ్సైర్స్) వారు సేకరిస్తున్న చెత్త శాంపిళ్ల తీరును కమిషనర్ పరిశీలించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏ రకమైన చెత్త వస్తుందో ఎన్ఐయూఏ ప్రతినిధులు చేస్తున్న అధ్యయనానికి సిబ్బంది సహకరించాలని కోరారు. కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్లు గోల్కొండ శ్రీను, నరేందర్. శానిటరీ ఇన్స్పెక్టర్లు మధు, రాజు పాల్గొన్నారు. -
సకాలంలో పరిహారం అందించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో అత్యాచార కేసుల్లో బాధితులకు సకాలంలో పరిహారం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అత్యాచార కేసుల్లో బాధితులకు పరిహారం చెల్లింపుపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అత్యాచార బాధితులకు పరిహారం చెల్లింపులో ఆలస్యం జరగకుండా చూడాలన్నారు. ప్రతీ రెండు నెలలకోసారి కమిటీ సమావేశమవ్వాలని, అందులో చర్చించే అంశాలను ముందస్తుగా తెలియజేయాలన్నారు. అదేవిధంగా అధికారులు అత్యాచార ఘటనలు జరగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీడబ్ల్యూఓ జయంతి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ నిర్మల, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ప్రేమకళ, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి, సీఎంఓ సుదర్శన్ రెడ్డి, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సంజీవరావు, ఇన్చార్జ్ డీసీపీఓ ఎస్.ప్రవీణ్ కుమార్, ఈఓ సింధురాణి, డీవీ యాక్ట్ కౌన్సిలర్ పావని, భరోసా ఎస్సై శ్రీలత, పీఎంహెచ్ఎన్ డాక్టర్ రూబీన, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులున్నారు. -
ప్రజాస్వామ్య పరిరక్షణ అందరి బాధ్యత
విద్యారణ్యపురి: ప్రజాస్వామ్య పరిరక్షణ అందరి బాధ్యత అని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.కోదండరాం అన్నారు. హనుమకొండ ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ‘ఇండియా 2047 రియలైజింగ్ ది విజన్ ఆఫ్ ఎ డెవలప్డ్ ఈక్విటబుల్ అండ్ సస్టెయినబుల్ రిపబ్లిక్’ అంశంపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ.. ఇలాంటి జాతీయ సదస్సుల్లో చర్చల ద్వారా పలు అంశాలపై అవగాహన పెంపొందుతుందన్నారు. ఈసదస్సులో విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ కన్వీనర్, ఆల్ఇండియా ఫోరం ఫర్ రైట్ ఎడ్యుకేషన్ మెంబర్ ప్రిసిడియం డి రమేష్ పట్నాయక్ హాజరై మాట్లాడారు. పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్ అండ్ కన్సల్టెంట్ ఎట్ది ఫెస్టిసైడ్ ఆక్షన్ నెట్వర్క్స్ ఇండియా ప్రొఫెసర్ దొంతి నర్సింహారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి, సదస్సు కన్వీనర్ డాక్టర్ సామ్యూల్ ప్రవీణ్కుమార్, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వాగేషన్, ప్రఖ్యాత ట్రాన్స్జెండర్ రచన మందరబోయిన, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.సుహాసిని, అధ్యాపకులు సురేశ్బాబు, ఎం.అరుణ, సుజాత, మధు, కె.శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, పద్మ, సారంగపాణి, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. 46 మంది పరిశోధన పత్రాలు సమర్పించారు. పాల్గొన్న ప్రతినిధులకు సర్టిఫికెట్లు అందజేశారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ముగిసిన జాతీయ సదస్సు -
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, భూపాలపల్లి జిల్లా ఎలక్షన్ అబ్జర్వర్, టీజీఎంఎస్ఐడీసీ, ఏండీ ఫణింద్రరెడ్డి ఐఏఎస్ సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు భద్రకాళి శేషు, పార్నంది నరసింహమూర్తి వారిని ఆలయ మర్యాదలతో స్వాగతించారు. వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు ఓరుగంటి పూర్ణచందర్, పాలడుగుల అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అమ్మవారిని దర్శించుకున్న భారతీయ హిందూ పరిషత్ అంతర్రాష్ట్రీయ సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోల శివరామకృష్ణ మాట్లాడుతూ.. భారతదేశాన్ని హిందూ దేశంగా, గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు దేవాలయ ప్రాంగణంలో ఐదు కోట్ల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంప శ్రవణ్కుమార్, సభ్యులు వరుణ్కుమార్, దిడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్ఎస్లో శుక్రవారం 11వ సబ్ జూనియర్స్ అండర్–14 బాలబాలికల జిల్లా స్థాయి టెన్నికాయిట్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. కాంగ్రెస్ యువజన నాయకుడు విష్ణురెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎంపికలు ప్రారంభించారు. ఉజ్వల భవిష్యత్కు క్రీడలు దోహదపడతాయన్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు మేడ్చల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ వరంగల్ జిల్లా సెక్రటరీ గోకారపు శ్యామ్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర, ఉమ్మడి జిల్లా కోశాధికారులు రాజ్కుమార్, మహ్మద్ జాహూర్, పీఈటీ, పీడీలు నర్సయ్య, శ్రీధర్, శ్రీనివాస్, నిర్మల, సీనియర్ క్రీడాకారులు సీతారాం, శ్రీనివాస్ పాల్గొన్నారు.వరంగల్ క్రైం: ఈనెల 21వ తేదీన జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు వినియోగించుకోవాలని, రాజీమార్గం ద్వారా వారి కేసులు పరిష్కరించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం లోక్ అదాలత్కు సంబంధించి వరంగల్ కమిషనరేట్ పోలీసులు రూపొందించిన వాల్ పోస్టర్లను సీపీ సన్ప్రీత్ సింగ్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఈ జాతీయ మెగా లోక్ అదాలత్లో రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, ఆస్తి, కుటుంబ, వైవాహిక, బ్యాంకు రికవరీ, విద్యుత్, చెక్ బౌన్స్, తదితర కేసులు పరిష్కరించుకోవచ్చని సూచించారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దన్నారు. ఎవరైనా కేసుల్లో రాజీ కావాలనుకున్నవారు పోలీస్ అధికారులను సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమం వరంగల్ ఏఎస్పీ శుభం, ఏసీపీ డేవిడ్ రాజు, ఇన్న్స్పెక్టర్లు రమేశ్, కరుణాకర్ పాల్గొన్నారు. ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ కోటను ప్రపంచ పర్యాటకులను ఆకర్శించే స్థాయిలో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వర్చువల్ రియాల్టీని అందుబాటులో తీసుకుని రావడానికి మంత్రి కొండా సురేఖ కసరత్తు చేశారు. ఆమె ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం ఖిలా వరంగల్ మధ్యకోటలోని శిల్పాల ప్రాంగణాన్ని హైదరాబాద్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి రంజిత్ నాయక్, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, వరంగల్ డీఆర్ఓ విజయలక్ష్మి, తహసీల్దార్ ఇక్బాల్, డీటీఓ శివాజీ సందర్శించారు. ఆనాటి కట్టాడాలు, నిర్మాణాల్ని వారు పరిశీలించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి పనులపై కసరత్తు చేశారు. చేయాల్సిన అభివృద్ధి పనులపై ప్రత్యేక నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు బైరబోయిన ఉమ, వేల్పుగొండ సువర్ణ, టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య, గైడ్ రవియాదవ్, కాంగ్రెస్ నేతలు బోగి సురేశ్, బైరబోయిన దామోదర్ తదితరులు పాల్గొన్నారు. -
డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ల ఏర్పాటు
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాల్లోని ఐదు మండలాల్లో ఈనెల 14న రెండో విడత ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండో విడతలో ఎన్నికలు నిర్వహించే ధర్మసాగర్, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల ఎంపీడీఓలు, ఇతర అధికారులు ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. ధర్మసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, హసన్పర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో, ఐనవోలు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో, వేలేరు, పరకాల మండల కేంద్రాలలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో టెంట్లు, కౌంటర్లు, ఫర్నిచర్, తాగునీరు, భోజన వసతి, తదితర ఏర్పాట్లు కల్పించారు. శనివారం ఉదయం నుంచి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. -
సేవల వినియోగంపై చైతన్యపర్చాలి
ఎంజీఎం: ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకునేలా చైతన్యపర్చాలని హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది ఎం.కవిత అన్నారు. శుక్రవారం లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రంలో లీగల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో న్యాయవాది కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకుని వైద్య పరంగా ప్రజలు ఖర్చు తగ్గించుకునేలా అవగాహన కలిగించడంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితోపాటు పారా లీగల్ వలంటీర్లు కూడా కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వపరంగా అందిస్తున్న ఆరోగ్య కుటుంబ సంక్షేమ సేవలు, ఉచితంగా అందించే డయాగ్నస్టిక్ సేవలు, మందులు, వైద్య సలహాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒత్తిడిని అధిగమించడం అలాగే మంచి ఆహారపు అలవాట్ల ద్వారా జీవనశైలి వ్యాధులు నియంత్రించవచ్చన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా హనుమకొండ డీఎల్ఎస్ఏ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా ఈకార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి హైదర్, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్రెడ్డి, హెల్త్ సూపర్వైజర్లు ఈ.బాబు, మరియా థామస్, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. -
ఘనంగా ఐఎంఏ ప్రమాణ స్వీకారం
ఎంజీఎం: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 2025–26 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. వరంగల్ నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్, యాక్షన్ కమిటీ చైర్మన్ రవీందర్రెడ్డితో పాటు నూతన కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా నూతన అధ్యక్షుడు డాక్టర్ మన్మోహన్రాజు, ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ నాగర్జునరెడ్డి నుంచి అధ్యక్ష మెడల్ను స్వీకరించారు. అనంతరం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న శిరీష్కుమార్, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, రంజిత్కుమార్, కూరపాటి రాధిక, జాయింట్ సెక్రటరీలు షఫీ, ప్రసన్నకుమార్, దిడ్డి స్వప్నలత, ఆర్థిక కార్యదర్శి వేములపల్లి నరేశ్తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సెంట్రల్ కౌన్సిల్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈకార్యక్రమానికి విశిష్ట అతిథులుగా డాక్టర్ కాళీ ప్రసాద్, శేషుమాధవ్, కస్తూరి ప్రమీల, డీఎంహెచ్ఓ అప్పయ్య, డాక్టర్ సుధీర్, విజయ్చందర్రెడ్డి, బందెల మోహన్రావు హాజరయ్యారు. -
‘కోచ్’.. చకచకా...
శరవేగంగా కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులుకాజీపేట రూరల్: కాజీపేట మండలం అయోధ్యపురంలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ–కోచ్ ఫ్యాక్టరీ) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 200 మల్టిపుల్ కోచ్ల సామర్థ్యం గల యూనిట్ను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, పవర్ మెక్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అత్యాధునిక టెక్నాలజీ సిస్టంతో రాత్రి, పగలు నిర్మిస్తున్నాయి. 160 ఎకరాల్లో రూ.586 కోట్లతో 2023లో ప్రారంభించిన ఆర్ఎంయూ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్లో మల్టీపర్పస్ కోచ్ల తయారీ, వందేభారత్ కోచ్లను తయారు చేయనున్నారు. ఇప్పటి వరకు రైల్వే జీఎం, ఎంపీ, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు ఈ ప్రాజెక్ట్ను తనిఖీ చేసి పనులు పరిశీలించారు. త్వరగా ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని అధికాలను ఆదేశించారు. ఆర్ఎంయూ ప్రధాన షెడ్లలో యంత్రాల ఫిట్టింగ్ జరుగుతోంది. ఇప్పటికే 80 శాతం నిర్మాణ పనులు పూర్తయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 2026 మార్చి లేదా ఏప్రిల్ నెలలో కోచ్ల ఉత్పత్తి ప్రారంభించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 10 వేల మందికి ఉపాధి లభించనుంది. చిన్న పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ట్రాక్ పనులు, ఆర్యూబీ నిర్మాణం ఆర్ఎంయూలో తయారైన ఇంజన్లు బయటకు వెళ్లేందుకు రైల్వే ట్రాక్ నిర్మిస్తున్నారు. ఈ ట్రాక్ 15 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయోధ్యపురం గ్రామ ప్రజల కోసం, రైల్వే గేట్లో నుంచి వివిధ గ్రామాలకు రాకపోకలు సాగించే ప్రజల సౌకర్యార్థం రోడ్ అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వారం రోజుల్లో ఆర్యుబీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. భూములిచ్చాం.. ఉద్యోగాలివ్వాలి: నిర్వాసితులు ‘జీవనోపాధికి ఆధారమైన భూములను రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇచ్చాం. ఫ్యాక్టరీలో మాకు ఉద్యోగాలు కల్పించాలని ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాగరాజు, రైల్వే అధికారులు, జిల్లా అధికారులను కలిసి కోరాం. ఇప్పటికై నా మా గోడును ఆలకించి ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలి’ అని 114 మంది అయోధ్యపురం భూనిర్వాసితుల కుటుంబాలు కోరుతున్నాయి. రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధాన షెడ్లలో కొనసాగుతున్న యంత్రాల ఫిట్టింగ్ షెడ్డునుంచి బయటకు కనెక్టివిటీ ట్రాక్ సిద్ధం రాకపోకలకు ఆర్యూబీ నిర్మాణం వచ్చే ఏప్రిల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు ఆర్ఎంయూ ప్రాజెక్ట్లో నిర్మించేవి ఇవే..మెయిన్షాప్, పేయింట్ షాప్, స్టోర్ వార్డు, టెస్ట్ షాప్, క్యాంటీన్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎలక్ట్రిక్ సబ్స్టేషన్, సెక్యూరిటీ పోస్ట్, రెస్ట్ హౌజ్, సేవగ్ ట్రీట్మెంట్ ప్లాంట్, పంప్హౌజ్, టాయిలెట్ బ్లాక్, ప్యాకెజ్ సబ్స్టేషన్, శౌవర్ టెస్ట్, రోడ్ వే బ్రిడ్జి, పంప్ హౌజ్, జీఎల్ఆర్, పిట్ ట్రావెర్సర్, వ్యాగన్ వే బ్రిడ్జి, గార్డు పోస్టు, ట్రాక్ గేట్, ఆర్యూబీ, పార్కింగ్, 2,000 కేఎల్ కెపాసిటీ పాండ్, స్కార్ప్ బిన్స్, టర్న్బ్రిడ్జి, బౌండ్రివాల్, బాలెస్ట్ట్రాక్, రోడ్, పాత్వే, డ్రెయినేజీలు నిర్మిస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో నిట్ అసోసియేట్ ప్రొఫెసర్ మృతి
ధర్మసాగర్ : అనుమానాస్పద స్థితిలో నిట్ ప్రొఫెసర్ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని రిజర్వాయర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట సుబ్బారెడ్డి(43) వరంగల్ ఎన్ఐటీలో కంప్యూటర్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తూ ఎన్ఐటీ క్యాంపస్లో నివాసం ఉంటున్నాడు. కొన్ని రోజులుగా మానసిక రుగ్మతతో బాధపడుతూ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అతని మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో రిజర్వాయర్లో పడి మృతి చెందాడు. ప్రమాదవశాత్తు మృతిచెందాడా.. లేదా.. ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. సుబ్బారెడ్డికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీధర్ రావు తెలిపారు. మహిళా న్యాయవాదిపై హత్యాయత్నం కాజీపేట: కాజీపేట మండలం దర్గాకాజీపేటలో మహిళా న్యాయవాది యామినిపై ప్రవీన్ కుమార్ అనే యువకుడు హత్యాయత్నం చేసినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. బాధితురాలి తండ్రి వీరస్వామి గురువారం రాత్రి ఫిర్యాదు చేసిన మేరకు.. సీఐ తెలిపిన వివరాలి ఉన్నాయి.. న్యాయవాదిగా పనిచేసే యామినికి ఓ కేసు విషయంలో ప్రవీన్కుమార్తో వివాదం తలెత్తింది. దీంతో ఆగ్రహించిన ప్రవీన్కుమార్ చేతిలో ఉ న్న కత్తెరతో దాడిచేయగా స్వల్పంగా గాయపడింది. వెంటనే బాధితురా లిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతుంది. వీరస్వామి ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్యాయత్నం చేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. హనుమకొండ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్త రవి బాధితురాలిని ఆస్పత్రిలో పరామర్శించినట్లు సమాచారం. -
గైర్హాజరైన వారికి నోటీసులు జారీ చేయాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: మొదటి విడతలో ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీచేయాలని జిల్లా పంచాయతీ అధికారి కల్పనను వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరాన్ని అధికారులకు గుర్తుచేశారు. అధికారులు పోలింగ్ రోజున ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, నోడల్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వాలీబాల్ జట్టు కోచ్గా జీవన్గౌడ్ వరంగల్ స్పోర్ట్స్: రాజస్తాన్ రాష్ట్రం ఝాంజహు జిల్లాలోని పీలానీలో ఈనెల 16వ తేదీ నుంచి జరగనున్న 49వ జూనియర్ జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొనే తెలంగాణ బాలుర జట్టు కోచ్గా హనుమకొండ డీఎస్ఏ కోచ్ బత్తిని జీవన్గౌడ్ నియమితులయ్యాడు. ఈ మేరకు తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గజ్జెల రమేష్బాబు, ఎన్వీ హన్మంతరెడ్డి శుక్రవారం నియామక ఉత్తర్వులను జారీ చేశారు. హనుమకొండ జిల్లా పంథిని గ్రామానికి చెందిన జీవన్గౌడ్ జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ వాలీబాల్ కోచ్గా జేఎన్ స్టేడియంలో విధులు నిర్వహిస్తున్నాడు. జాతీయస్థాయిలో తెలంగాణ నుంచి ప్రా తినిధ్యం వహిస్తున్న రాష్ట్ర జట్టుకు కోచ్గా ఎంపికై న జీవన్గౌడ్ను డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్, వాలీబాల్ అసోసియేషన్ బాధ్యులు, క్రీడాకారులు అభినందించారు. 15నుంచి ఎఫ్ఆర్ఎస్ హాజరుకేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిపాలనాభవనంలో ఉద్యోగులకు ముఖ గుర్తింపు (ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్) హాజరును ఈనెల 15నుంచి అమలుచేయనున్నట్లు శుక్రవారం రిజిస్ట్రార్ వి.రామచంద్రం తెలిపారు. వీసీ కె.ప్రతాప్రెడ్డి సమక్షంలో ఈ కొత్త హాజరు విధానాన్ని ప్రారంభించనున్న ట్లు పేర్కొన్నా. మొదటి విడతగా యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీ, దూరవిద్యాకేంద్రం, ఫార్మసీ కాలేజి, కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల, పరీక్షల విభాగం, హా స్టళ్ల కార్యాలయాల్లో ఈ ముఖగుర్తింపు హాజ రును తప్పనిసరి చేయనున్నట్లు వివరించారు. ‘ఓపెన్’ అడ్మిషన్లకు అవకాశం విద్యారణ్యపురి: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్లో ఈ విద్యాసంవత్సరం 2025–26లో ప్రవేశాలకుగాను తత్కాల్ స్కీంలో భాగంగా మరోసారి అవకాశం కల్పించారు. అపరాధ రుసుంతో ఈనెల 15, 16, 17 తేదీల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని హనుమకొండ డీఈఓ ఎల్వి గిరిరాజ్గౌడ్, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ ఎ.సదానందం ఒక ప్రకటనలో తెలిపారు. టాస్ వెబ్సైట్ హెచ్టీటీఎస్//డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తెలంగాణస్కూల్.ఓఆర్జీ లేదా మీసేవా , టీజీఆన్లైన్ సెంటర్లలో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న తర్వాత సంబంధిత డాక్యూమెంట్లు అక్రిడిటెడ్ విద్యాసంస్థలో హైస్కూల్స్, కాలేజీల్లో సంబంధిత దరఖాస్తుతోపాటు సమర్పించాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. -
లక్ష్యంతో చదివితే ఉన్నతస్థితికి..
కేయూ క్యాంపస్: విద్యార్థులు పట్టుదల, లక్ష్యంతో చదివితే ఉన్నత స్థితికి చేరుకోవచ్చని కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజీ పరిధిలోని అన్ని విభాగాల్లో ఈ విద్యాఏడాది పీజీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేయూలోని ఆడిటోరియంలో ఇండక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ ప్రతాప్రెడ్డి పాల్గొని మాట్లాడారు. కాకతీయ స్వర్ణోత్సవ విద్యార్థిగా గర్వపడాలన్నారు. యూనివర్సిటీలో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు. పరిపక్వత చెందిన పీజీ విద్యార్థులుగా నాలెడ్జ్ అటిట్యూడ్ స్కిల్స్, లీడర్షిప్, వ్యక్తిత్వంపై దృష్టి సారించాలన్నారు. కాకతీయ యూనివర్సిటీని డ్రగ్స్ రహిత, ఆల్కాహాల్ రహిత క్యాంపస్గా మార్చుకుందామన్నారు. త్వరలో ఎఫ్ఆర్ఎస్ హాజరును కూడా ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ కలిగిన కేయూలోని కే హబ్ను రూసానిధులతో వినియోగంలోనికి తీసుకురానున్నట్లు చెప్పారు. టీ హబ్తో ఎంఓయూతో కూడా ముందుకెళ్లబోతున్నామన్నారు. ఆంగ్ల భాషపై పట్టు సాధించాలన్నారు. ఏసీపీ జితేందర్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్కు దూరంగా ఉండాలన్నారు. ర్యాంగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. నార్కోటిక్స్ డిప్యూ టీ కమిషనర్ రమేష్కుమార్ మాట్లాడుతూ.. మా దక ద్రవ్యాలకు బానిసలు కావొద్దన్నారు. మాదక ద్రవ్యాలు వాడిని విక్రయించినా నేరమేనన్నారు. ప్రముఖ న్యాయవాది మాతంగి రమేష్బాబు మాట్లాడుతూ లీగల్ అవేర్నెస్ ఆన్ సెక్సువల్ హరాస్మెంట్ అండ్ స్టూడెంట్ రైట్స్ అనే అంశంపై మాట్లాడారు. ప్రతి కళాశాలలో ఇంటర్నల్ కంప్లెయింట్ సెల్ ఉండాలన్నారు. సమావేశంలో కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, కేయూ పాలకమండలి సభ్యులు సురేష్లాల్, డాక్టర్ చిర్ర రాజు, డాక్టర్ రమ, సైన్స్ డీన్ ఆచార్య హనుమంతు, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి, కేయూ యూజీసీ కోఆర్డినేటర్ మల్లికార్జున్రెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, ఆచార్య వెంకయ్య, డాక్టర్ సుజాత, డాక్టర్ రాధికారాణి, దీపాజ్యోతి, డాక్టర్ మేఘనరావు, మమత, డాక్టర్ శంకర్, హాస్టల్ డైరెక్టర్ రాజ్కుమార్ పాల్గొన్నారు. ఆంగ్ల భాషపై పట్టుసాధిస్తే ఉపాధి అవకాశాలు కేయూ వీసీ ప్రతాప్రెడ్డి -
ఎమ్మెల్సీ వర్గంలోకి నల్గొండ రమేష్
వరంగల్: వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొండా దంపతులకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నల్గొండ రమేష్ మరో వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వర్గంలోకి చేరినట్లు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తూర్పులో కొండా దంపతులు పార్టీ వ్యవహరాలతోపాటు ఇతర విషయాలు చక్కదిద్దే బాధ్యతలను ఒక నాయకుడికి అప్పగించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ నాయకుడికి రమేష్కు పొసగక పోవడంతో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చినట్లు తెలిసింది. ఈక్రమంలోనే రమేష్కు చెందిన నాయకుడిని పోలీసు కేసులు పెట్టించి కొట్టించడం వల్ల ఆయన తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్కు వెళ్లి తన వర్గం వారికి ఏమైనా చేసేందుకు ప్రయత్నిస్తే అధికార వ్యవహరాలు చేస్తున్న నాయకుడి సూచనలతో అధికారులు వ్యతిరేకం కావడమే కాకుండా కేసులు నమోదు అవుతున్నాయని ఆయన ఎమ్మెల్సీ వర్గం నాయకుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతుంటే ఆ వర్గంలో ఎందుకు ఉండడం తమ వర్గంలోకి రావాలని సూచించడంతో పార్టీ కార్యక్రమాల్లో కొండ వర్గీయులతో కాకుండా ఎమ్మెల్సీ వర్గంతో పాల్గొంటున్నారు. దీనికి తోడుగా ఎమ్మెల్సీకి అత్యంత దగ్గరగా ఉన్న అయూబ్ డీసీసీ అధ్యక్షుడు కావడంతో మరింత ధైర్యంతో నల్గొండ రమేష్ ఎమ్మెల్సీ సారయ్య వర్గంలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అందువల్ల శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ సారయ్య తన వర్గంతో కలసి నల్గొండ రమేష్ ఇంటికి వెళ్లారు. ఈసందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో పార్టీ వాళ్లపై కేసులు పెట్టించే సంస్కృతి నెలకొందన్నారు. అందువల్ల ఎమ్మెల్సీ సారయ్యతో తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోరంటల రాజు, మాజీ నాయకులు తత్తర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సదరు నాయకుడి చర్యలతో తూర్పులోని మరిమంది నాయకులు సారయ్య వర్గంలోకి మారే అవకాశాలున్నట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. -
కాజీపేట టు పెంబర్తి..
విద్యారణ్యపురి : మూడేళ్లక్రితం మహబూబాబాద్, ములుగు జిల్లా కేంద్రాల్లో మహాత్మాజ్యోతిబా పూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటుచేశారు. వివిధ డిగ్రీకోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించగా అప్పట్లో అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో కాలేదు. దీంతో ఆ తర్వాత మహబూబాబాద్, ములుగులోని ఆ రెండు బీసీ మహిళా డిగ్రీ కళాశాలలను అదే పేర్లతోనే కాజీపేటలోని మహాత్మాజ్యోతిబా పూలే బీసీ ఐదేళ్ల ‘లా’కోర్సు నడుస్తున్న భవనంలోనికి షిఫ్టింగ్ చేశారు. రెండేళ్ల నుంచి ఆ భవనంలోనే అరకొర సౌకర్యాలతోనే ఆయా డిగ్రీ కళాశాలలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఐదు కోర్సుల్లోనే అడ్మిషన్లు అయ్యాయి. బీఏ, బీకాం సీఏ, ఎంపీసీఎస్, ఎంఎస్డీఎస్, బీఎస్సీ బీజెడ్సీ కోర్సుల్లో సుమారు 230 మంది వరకు విద్యార్థినులు చదువుతున్నారు. ఫస్టియర్, సెకండియర్ కోర్సులు కొనసాగుతుండగా వచ్చే సంవత్సరం ఫైనలియర్ విద్యార్థినులు కూడా ఉంటారు. పది మంది రెగ్యులర్ లెక్చరర్లు ఉండగా ఆరుగురు గెస్ట్ ఫ్యాకల్టీ విద్యాబోధన చేస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్గా విశ్రాంత అధ్యాపకుడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ‘లా’విద్యార్థినుల ఆందోళన ఒకే భవనంలో ఐదేళ్ల ‘లా’కోర్సులో మూడు సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థినులు చదువుతున్నారు. ఈభవనంలోనే డిగ్రీ కళాశాల విద్యార్థినులు కూడా ఉండడంతో తమకు కూడా సదుపాయాలు సరిపోవడం లేదని ‘లా’విద్యార్థినులు ఇటీవల ఆందోళనకు దిగారు. డిగ్రీ కళాశాలల వేరే చోట నిర్వహించుకోవాలని ఆందోళన చేపట్టారు. డిగ్రీ కళాశాలను పెంబర్తికి షిఫ్టింగ్ చేయాలని ఆదేశాలు ‘లా’కళాశాల భవనంలోనే కొనసాగుతున్న బీసీ మహిళా డిగ్రీ కళాశాలల (మహబూబాబాద్, ములుగు)ల్లోని విద్యార్థినులను జనగామ జిల్లా పెంబర్తిలో ఇప్పటికే నిర్వహిస్తున్న మహాత్మాజ్యోతిబాపూలే బీసీ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలకు షిష్టింగ్ చేయాలని (ఈనెల 20వతేదీవరకు) బీసీ గురుకులాల వెల్ఫేర్ రాష్ట్ర కార్యదర్శి సైదులు ఇటీవల ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఇందుకు సంబంఽధించిన ఉత్తర్వులు ఉమ్మడి వరంగల్ బీసీ గురుకులాల ఆర్సీఓకు, మహబూబాబాద్, ము లుగు డిగ్రీ కళాశాలల కలిపి నిర్వహిస్తున్న డిగ్రీ కళా శాల స్పెషల్ ఆఫీసర్కు అందాయి. దీంతో కొన్నినెలలుగా ఈ కళాశాలకు వివిధ చోట్ల అద్దెభవనం చూశారు.కానీ అనువైన భవనం లభించడం లేదంటున్నారు. ఇప్పుడు కళాశాలలోని విద్యార్థినులను పెంబర్తి కళాశాలకు తరలించాలని యోచిస్తున్నారు. ససేమిరా అంటున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఈ కళాశాల మహబూబాబాద్, ములుగు జిల్లాలకు సంబంధించినది కావడంతో ఆయా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత విద్యార్థినులు కూడా కాజీపేటలోని ఈ కాలేజీలో చదువుకుంటున్నారు. తాము పట్టణ ప్రాంతంలో ఉందని ప్రవేశాలు పొందామని, ఇప్పుడు మళ్లీ తమను పెంబర్తి మహిళా గురుకుల కళాశాలకు తరలిస్తే దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము వెళ్లబోమని స్పెషల్ ఆఫీసర్ ,అధ్యాపకులతోనూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈవిషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఇటీవల కొందరు కాజీపేటకు వచ్చి ఇక్కడి నుంచి తరలించొద్దని స్పెషల్ ఆఫీసర్కు విన్నవించుకున్నారు. పలువురు తల్లిదండ్రులు బీసీ గురుకులాల ఉమ్మడి వరంగల్ ఆర్సీఓతోనూ మాట్లాడారని సమాచారం. ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్డీసీ రాష్ట్ర సెక్రటరీ ఆదేశాల మేరకు పెంబర్తిలోని బీసీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలకు తరలించాలనే యోచనలో ఉన్నారు.బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల షిఫ్టింగ్కు ఆదేశాలు వ్యతిరేకిస్తున్న విద్యార్థినులు, తల్లిదండ్రులు మహబూబాబాద్, ములుగు జిల్లాలకు కలిపి కాజీపేటలో ఏర్పాటు మరోసారి తరలింపునకు ఆదేశాలు జారీ -
వెట్టి చాకిరీపై.. కదిలిన యంత్రాంగం
వరంగల్ క్రైం: విద్యార్థులతో బలవంతంగా అంట్లు తోమించి.. టిఫిన్లు తయారు చేయించిన ఓగ్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వ్యవహారంపై శుక్రవారం సాక్షిలో ‘చిట్టి చేతులు.. వెట్టి చాకిరీ’ పేరిట కథనం ప్రచురితమైంది. దీంతో రాష్ట్ర, జిల్లా అధికారులు కదిలారు. సాక్షి కథనంపై స్పందించిన పరకాల కోర్టు న్యాయమూర్తి జి.సాయి శరత్ పాఠశాలను సందర్శించడంతో వెట్టి చాకిరీ వ్యవహారం ఒక్కసారిగా వెడెక్కింది. దామెర తహసీల్దార్, జ్యోతి వరలక్ష్మి, డీసీఓ ఉమామహేశ్వరి, భద్రాది కొత్తగూడెం జోనల్ అధికారి అలివేలు, దామెర ఎస్సై అశోక్ కుమార్, ఎంఈఓ రాజేష్ ఉదయం పాఠశాలను సందర్శించారు. ముందుగా టిఫిన్ చేసిన విద్యార్థులను వేర్వేరుగా ప్రశ్నించారు. విచారణలో విద్యార్థులు తమతో బలవంతంగా పనులు చేయించినట్లు అధికారులకు చెప్పినట్లు సమాచారం. పాఠశాలలో పనిచేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ తన దగ్గర వంట మనుషులు లేకపోవడంతో విద్యార్థులను పనిలో పెట్టుకున్నట్లు అధికారులకు చెప్పినట్లు తెలిసింది. చిట్టి వెట్టి చాకిరి కథనంపై స్పందించిన న్యాయమూర్తి సాయి శరత్ ఈఅంశాన్ని సుమోటాగా తీసుకుని పాఠశాల లో విచారణ చేపట్టి నివేదికను జిల్లా ప్రధాన న్యామూర్తికి అందజేసినట్లు తెలిసింది. సమస్యల స్వాగతం.. పాఠశాలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో అధికారులు ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్లు తెలిసింది. పాఠశాలలో చోటుచేసుకున్న ఘట నపై లోతుగా విచారణ చేసినట్లు తెలిసింది. భద్రా ది కొత్తగూడెం జోనల్ అధికారి అలివెలు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి వివరాలు సేకరించారు. విద్యార్థులు టిఫిన్ వండటం, విద్యార్థులను కులం పేరుతో దూషించిన ఘటనలపై సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శికి నివేదిక సమర్పిస్తామని, ఆ తర్వాత శాఖాపరమైన చర్యలు ఉంటాయని జోనల్ అధికారి అలివేలు తెలిపారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి: విద్యార్థి సంఘాలు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న ప్రిన్సిపాల్ సమ్మయ్య ను సస్పెండ్ చేయాలని కోరుతూ టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునిల్, టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత్ కుమార్, విద్యార్థి సంఘాల జేఏసీ కోఆర్డినేటర్ అనిల్ భద్రాది కొత్తగూడెం జోనల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. విద్యార్థులతో మాట్లాడిన పరకాల జడ్జి ప్రిన్సిపాల్ సస్పెన్షన్కు విద్యార్థి సంఘాల డిమాండ్ ‘సాక్షి’ కథనంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు -
14న షైన్ స్కాలర్ షిప్ టెస్ట్
హన్మకొండ : హనుమకొండ బాలసముద్రంలోని షైన్ జూనియర్ కళాశాలలో ఈనెల 14న షైన్ స్కాలర్ షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్యాదవ్ తెలిపారు. శుక్రవారం కళాశాలలో స్కాలర్షిప్ టెస్ట్ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ టెస్ట్లో 96 నుంచి 100 శాతం మా ర్కులు సాధించిన విద్యార్థులకు ఇంటర్ ప్రవేశంలో పూర్తి రాయితీ అందించనున్నట్లు తెలిపారు. 91 నుంచి 95 మార్కులు సాధించిన విద్యార్థులకు 75 శాతం, 86 నుంచి 90 మార్కులు సాధించినవారికి 50 శాతం, 81 నుంచి 85 మార్కులు సాధించిన విద్యార్థులకు 25 శాతం ట్యూషన్ ఫీజు రాయితీ మొదటి ఐదుగురు విద్యార్థులకు అందించనున్నట్లు వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో షైన్ విద్యాసంస్థల డైరెక్టర్లు మూగల రమ, ఏ.కవిత, మూగల రమేష్, ప్రిన్సిపాల్స్ పి.శ్రీనివాస్, ప్రశాంత్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
జాతర పనులు త్వరగా పూర్తి చేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం, మేడారంలో రోడ్ల విస్తర్ణ పనులతోపాటు భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న పనులన్నీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని ఇది లాస్ట్ డెడ్లైన్ అని మంత్రి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మంత్రి సీతక్కతో కలిసి అమ్మవార్ల గద్దెల ప్రాంగణం అభివృద్ధి పనులు, సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్దరణ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలు, గద్దెల ప్రాంగణంలో ఫ్లోరింగ్ పనులు, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం రోడ్ల నిర్మాణం, జంపన్న వాగు వద్ద ఏర్పాట్లు, వాగులో ఇసుక లెవలింగ్ పనులను పరిశీలించారు. అనంతరం జాతర అభివృద్ధి పనులపై ఆయాశాఖల అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించి జాతర పనుల పురోగతి వివరాలపై ఆరా తీశారు. గద్దెల ప్రాంగణం సాలహారం, గద్దెల విస్తర్ణ, ఆర్చీ ద్వారా స్థంబాల స్థాపన పనుల్లో నెమ్మదిగా సాగుతున్నాయని పూజారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా పొంగులెటి మాట్లాడుతూ.. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులతోపాటు, జాతర అభివృద్ధి పనులన్నీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు కార్మికుల సంఖ్యను పెంచడంతోపాటు అదనంగా మరో రెండు క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. క్యూలైన్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. అంతకుముందు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్శన్ రేగ కల్యాణి. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పాల్గొన్నారు. పనులను పరిశీలించిన మంత్రులు పొంగులేటి, సీతక్క ఈనెల 30 లాస్ట్ డెడ్లైన్ అధికారులతో సమీక్ష సమావేశం -
పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్
కమలాపూర్: మండలంలోని శంభునిపల్లి ప్రాథమిక పాఠశాల, ఉప్పల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలల్లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం పరిశీలించారు. కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించి, పోలింగ్ కేంద్రాల వారీగా త్వరగా పూర్తి చేసేలా అధికారులకు పలు సూచనలిచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ నిర్వహణతో పాటు కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ గుండె బాబు, తహసీల్దార్ సురేశ్కుమార్, స్పెషల్ ఆఫీసర్ నరసింహస్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు.రాయపర్తి87.34%పర్వతగిరి86.59%వర్ధన్నపేట85.65%కమలాపూర్72.75%ఎల్కతుర్తి86.17%భీమదేవరపల్లి82.61%సాక్షి, వరంగల్/హన్మకొండ అర్బన్: హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో మొదటి విడత పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్, లెక్కింపు, ఫలితాల వెల్లడి కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగియడంతో ఆయా జిల్లాల యంత్రాంగాలు ఊపిరి పీల్చుకున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో ఉదయం నుంచి ఉత్సాహంగా ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి కేంద్రాల్లో ఉన్న ఓటర్లకి అధికారులు స్లిప్పులు ఇచ్చి నంబర్లు వేసి పోలింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు బారులుదీరి ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని మూడు మండలాల్లో ఓట ర్లు 1,28,651 ఉండగా 1,08,003 ఓట్లు పోలయ్యాయి. , వీరి లో పురుషులు 62,653మందికిగాను 53,026మంది, మహిళలు 65,997 మందికిగాను 54,976మంది ఓటు హక్కు విని యోగించుకోగా, మొత్తం 83.95శాతం పోలింగ్ నమోదైంది. ఉత్సాహంగా ఓటేసిన గ్రామాలు వరంగల్ జిల్లాలో ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లాలోని 731 పొలింగ్ స్టేషన్లలో ఓట్ల జాతర సాగింది. జిల్లాలోని 80 గ్రామ పంచాయతీలు, 585 వార్డు స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 1,10,487 మంది ఓటర్లకు గానూ 95,939 మంది ఓటేశారు. ఈ లెక్కన 86.83 శాతం పోలింగ్ నమోదైంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేశారు. మహిళలే ఎక్కువున్నా ఓటేసింది ఎక్కువగా పురుషులే జిల్లాలోని ఈ మూడు మండలాల్లో 54,519 మంది పురుష ఓటర్లు, 55,967 మంది మహిళ ఓటర్లు, ఇతరులు ఒకరు ఉన్నారు. అయితే వీరిలో 47,593 మంది పురుషులు, 48,345 మంది మహిళలు, ఇతరులు ఒకరు ఓటేశారు. అయితే పురుషుల కన్నా మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఎక్కువగా 87.30 శాతం మంది పురుషులు ఓటేయగా, 86.38 శాతం మహిళలు ఓటేశారు. రెండో స్థానంలో బీఆర్ఎస్, 56 మంది ఇతరుల విజయం స్వతంత్రులతో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మంతనాలుతొలి విడతఓటింగ్ జరిగిందిలా..హనుమకొండ జిల్లా.. మండలం ఓటర్లు ఓటేసినవారు భీమదేవరపల్లి 40,897 33,783 ఎల్కతుర్తి 31,915 27,621 కమలాపూర్ 55,839 46,599 వరంగల్ జిల్లాలో.. వర్ధన్నపేట 28,358 24,290 పర్వతగిరి 38,631 33,449 రాయపర్తి 43,498 38,200 మరిన్ని ఎన్నికల వార్తలు : 10లో.. -
‘నమస్తే’ను వినియోగించుకోవాలి
వరంగల్ అర్బన్: డీ స్లడ్జింగ్ ఆపరేటర్లు,సెప్టిక్ ట్యాంక్ వర్కర్లు ‘నమస్తే (నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైడ్జ్ శానిటేషన్ ఏకో సిస్టిమ్)ను సద్వియోగం చేసుకోవాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి సూచించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో బుధవారం ‘నమస్తే’ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ.. మల వ్యర్థాలు నిర్వహించే సిబ్బందికి ఈకార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రతీ మూడు నెలలకోసారి సెప్టిక్ ట్యాంకుల డీ–స్లడ్జింగ్ తప్పనిసరిగా చేపట్టేలా షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లు టోల్ ఫ్రీ నంబర్ 11420పై ప్రజల్లో చైతన్యం కలిగించాలని కోరారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్, ఆస్కీ ప్రతినిధి డాక్టర్ రాజ్మోహన్, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ప్లాంట్ ఏర్పాటు వేగం చేయండిగ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బయో మిథనైజేషన్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి చర్యలు వేగంగా కొనసాగుతున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. గురువారం హనుమకొండలోని మున్సిపల్ అతిథి గృహంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్యూఏ) ప్రతినిధులు, పి.డబ్ల్యూసి నిపుణులు, అధికారులతో కలిసి మేయర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎస్యూఐ కన్సల్టెంట్ రాహుల్, సీఎంహెచ్ఓ రాజిరెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మేయర్ గుండు సుధారాణి సెప్టిక్ ట్యాంక్ వర్కర్ల అవగాహన సదస్సు -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
వరంగల్ లీగల్: రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఈనెల 21న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వీబీ నిర్మలాగీతాంబ, డాక్టర్ కె.పట్టాభిరామారావు సూచించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసదన్ భవన్లో వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. లోక్ అదాలత్లో రాజీ పడదగు కేసులను పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇన్సూరెన్న్స్, బ్యాంకు, చిట్ఫండ్ అధికారులు తమ కేసులను పరిష్కరించుకోవాలని, కోర్టుల్లో లేని కేసులను ప్రీ–లిటిగేషన్ ద్వారా న్యాయసేవాధికార సంస్థలో పరిష్కరించుకోవాలని కోరారు. సలహాలు, సూచనల కోసం న్యాయసేవాధికార సంస్థను నేరుగా సంప్రదించాలని సూచించారు. అధిక కేసుల పరిష్కారానికి ఈనెల 4 నుంచే ప్రీలోక్ అదాలత్ను వరంగల్ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించామని తెలిపారు. కక్షిదారుల కేసులను ఇరుపక్షాల అంగీకారంతో రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి సులభతరం అవుతుందని వివరించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార సంస్థల కార్యదర్శులు ఎ.ప్రదీప్, జి.రామలింగం పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో 8, హనుమకొండ జిల్లాలో 12 బెంచ్లు లోక్ అదాలత్ కోసం వరంగల్ జిల్లా కోర్టులో 7, నర్సంపేట కోర్టులో 1 బెంచ్లు ఏర్పాటు చేసినట్లు జడ్జిలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 692 రాజీపడదగిన వివిధ రకాల పెండింగ్ కేసుల్లోని కక్షిదారులకు నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కోర్టులో 10, పరకాల కోర్టులో 2 బెంచ్లు ఏర్పాటు చేసినట్లు, అలాగే జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 743 పెండింగ్ కేసుల్లోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు.వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు నిర్మలాగీతాంబ, పట్టాభిరామారావు -
రెండో విడతకు పటిష్ట ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: జిల్లాలో రెండో విడత జీపీ ఎన్నికలు జరగనున్న ధర్మసాగర్, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్నేహ శబరీష్ ఆయా మండలాల ఎంపీడీఓలను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల ఎంపీడీఓలు, నోడల్ అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల వారీగా సర్పంచ్, వార్డు స్థానాల బ్యాలెట్ పేపర్లను సరిగ్గా ఉన్నాయా లేదా? అని ఎంపీడీఓలు, ప్రత్యేకాధికారులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచించారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసే డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల (డీఆర్సీ)లో గ్రామపంచాయతీలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వారీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. డీఆర్సీలలో పోలింగ్ సిబ్బందికి సరిపోయేలా టేబుల్స్, కుర్చీలు, టెంట్లు వేయించాలన్నారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వివరాలు తెలిసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. డీఆర్సీతో పాటు, పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. ఈసందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, డీఆర్డీఓ మేన శ్రీను పోలింగ్ నిర్వహణ, కౌంటింగ్ ఏర్పాట్లపై ఎంపీడీఓలకు పలు సూచనలిచ్చారు. సమావేశంలో ఎంపీడీఓలు అనిల్ కుమార్, సుమనవాణి, నర్మద, లక్ష్మీ ప్రసన్న, ఇతర అధికారులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ -
డీఈఓగా గిరిరాజ్గౌడ్ బాధ్యతల స్వీకరణ
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్ఏసీ ) డీఈఓగా ఎల్వీ గిరిరాజ్గౌడ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. డీఈఓ కార్యాలయంలో సమగ్ర శిక్ష కో–ఆర్డినేటర్లు బి.మహేశ్, బద్దం సుదర్శన్రెడ్డి, బండారు మన్మోహన్, సునీత, రఘుచందర్, ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ ఎ.సదానందం, ఫైనాన్స్ అకౌంటింగ్ ఆఫీసర్ మధుసూదన్, డీఈఓ కార్యాలయ ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందించి సన్మానించారు. ఈసందర్భంగా గిరిరాజ్ మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని, కలిసికట్టుగా పని చేద్దామని ఉద్యోగులకు సూచించారు. డీఈఓకు సన్మానం గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, జనరల్ సెక్రటరీ నెహ్రూనాయక్, ట్రెజరర్ సంధ్యారాణి, పీఆర్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, జనరల్ సెక్రటరీ ఫలితశ్రీహరి ఇతర బాధ్యులు డీఈఓను కలిసి సన్మానించి పూలమొక్క అందించారు. హన్మకొండ కల్చరల్: తొలి వేద పాఠశాలను ఏర్పాటు చేసి, వేలాది మంది వేద పండితులను అందించిన విశ్వనాథ శాస్త్రి కృషితోనే వేద శాస్త్రాలు పరివ్యాప్తమయ్యాయని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ అన్నారు. వరంగల్ శంభునిపేటలోని నాగేశ్వరస్వామి దేవస్థానం కల్యాణ మండపంలో తెలంగాణ వైతాళికులు, జ్ఞాననిధి, ఆయుర్వేద ఆచార్యులు శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి జయంతోత్సవం వైభవంగా నిర్వహించారు. శృంగేరి శారదాపీఠం దర్శనం పత్రిక సంపాదకులు మరుమాముల వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు జ్యోతిప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. విశ్వనాథ శాస్త్రి పాదుకలకు శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో వేదపండితులు పాల్గొన్నారు. ఎంజీఎం: అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హనుమకొండలోని మైత్రి శ్రీ ఫెర్టిలిటీ సెంటర్లో గురువారం డ్రగ్ అధికారులు దాడి చేశారు. విక్రయానికి సిద్ధంగా ఉన్న రూ.5.82 లక్షల విలువైన డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ను స్వాధీనం చేసుకున్నట్లు డ్రగ్ కంట్రోల్ అఽధికారులు తెలిపారు. డ్రగ్స్ నిబంధనలకు విరుద్ధంగా అమ్మకానికి ఉంచిన ఈ నిల్వలను డీసీఏ అధికారులు గుర్తించారు. ఈప్రాంగణంలో వంధ్యత్వానికి చికిత్స చేయడానికి ఉపయోగించే స్టెరాయిడ్లు, హర్మోన్ల కోసం ఉపయోగించే ఔషధాలు, మొత్తం 35 రకాల మందులను గుర్తించినట్లు తెలిపారు. ఈదాడిలో వరంగల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి.రాజ్యలక్ష్మి, హనుమకొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్, జనగామ డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎంజీఎం: సీకేఎం ఆస్పత్రిలో పాలన రోజురోజుకూ ఆస్తవ్యస్తంగా మారుతోంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ పాలనపై పరిపాలనాధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో సమస్యలు పేరుకుపోతున్నాయి. వరంగల్ సీకేఎం ఆస్పత్రికి ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచే కాకుండా.. ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ప్రసవ చికిత్సలు పొందుతుంటారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యసేవలతో పాటు పారిశుద్ధ్యం, భోజన సౌకర్యాలు కల్పించాలి. ఈక్రమంలో సెక్యూరిటీ, శానిటేషన్ టెండర్ ప్రక్రియ రాష్ట్ర పరిధిలో ఉండగా, రోగులకు భోజనం అందించే డైట్ టెండర్ జిల్లా పరిధిలో ఉంటుంది. వరంగల్ కలెక్టర్ సత్యశారద స్వయంగా డైట్ను పరిశీలించిన సమయంలో టెండర్ను రెన్యూవల్ చేయకుండా నూతన టెండర్ పిలవాలని ఆదేశించారు. ఏప్రిల్లో డైట్ టెండర్ పిలిచారు. ఇందులో భాగంగా పలువురు కాంట్రాక్టర్లు టెండర్లో పాల్గొని ఈఎండీలు సైతం చెల్లించారు. ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రాక్టర్ టెండర్ ప్రక్రియలో ఉన్న చిన్నపాటి తప్పిదాలతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు టెండర్ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొన్న కాంట్రాక్టర్లకు 8 నెలలుగా ఈఎండీలు చెల్లించకపోవడంతో పాటు కోర్టులో సమస్యను పరిష్కరించడంలో పరిపాలనాధికారులు విలఫమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
పార్ట్ టైం లెక్చరర్ల నియామకానికి ఓకే..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో, యూనివర్సిటీ కాలేజీల్లో విద్యాబోధనకు పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈమేరకు గురువారం సాయంత్రం కేయూ స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. విద్యార్హతలతోపాటు ఇంటర్వ్యూల ద్వారా రోస్టర్ ద్వారా పార్ట్టైం లెక్చరర్లను నియమించనున్నారు. ఏవిభాగంలోని ఆవిభాగం అధిపతి, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్, డీన్, ఇద్దరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏదైనా కోర్సులో సబ్జెక్టులో గోల్డ్మెడల్కు ఎవరైనా తమపేరును పెట్టాలనుకుంటే ఇక నుంచి రూ.5 లక్షలు యూనివర్సిటీకి చెల్లించాల్సి ఉంటుంది 2025–26 వరకు ఆయా కోర్సుల్లో డిటెన్షన్ను ఎత్తి వేయాలని స్టాండింగ్ కమిటీలో నిర్ణయించారు. కేయూ పరిధి ఏ పీజీ కోర్సులోనైనా ఈవిద్యాసంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో 15లోపు విద్యార్థులు ప్రవేశాల సంఖ్య ఉంటే.. వేరేచోటకు షిఫ్ట్ చేయాలని స్టాండింగ్ కమిటీలో నిర్ణయించారు. కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ల పదవులకు స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ లభించింది. సుమారు 4:30 గంటలపాటు నిర్వహించిన ఈ కమిటీ సమావేశంలో వివిధ కోర్సుల సిలబస్లపై చర్చించారు. 35 అంశాలకుపైగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, వివిధ విభాగాల అధిపతులు, డీన్లు, ప్రిన్సిపాళ్లు, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ పాల్గొన్నారు. రూ.5 లక్షలిస్తే వారిపేరుపై గోల్డ్ మెడల్ ఫార్మసీ, బీటెక్ కోర్సుల్లో డిటెన్షన్ ఎత్తివేత! కేయూ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం -
నేడు తొలి సంగ్రామం
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో మొదటి విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల పరిధిలో మొత్తం 69 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 5 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 64 గ్రామపంచాయతీల్లో నేడు (గురువారం) పోలింగ్ జరగనుంది. మొత్తం 658 వార్డుస్థానాల్లో 150 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగి లిన 505 వార్డు స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 1.30 లక్షల ఓటర్లు తొలి విడత ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు 1,30,734 ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 63,681 మంది కాగా, మహిళలు 67,052 మంది. ఒకరు ఇతరుల కేటగిరీకి చెందిన ఓటరు ఉన్నారు. పటిష్ట ఏర్పాట్లు ఎన్నికల ప్రక్రియను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికల కోసం మొత్తం 1,931 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 789 మంది పోలింగ్ ఆఫీసర్లు కాగా, 1,142 మంది అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు ఉన్నారు. పోలింగ్ సిబ్బందితో పాటు, ఎన్నికల పర్యవేక్షణ కోసం 65 మంది స్టేజ్–2 రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. ప్రతీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి, భద్రత, బ్యాలెట్ పేపర్లు, ఓటింగ్ సామగ్రి వంటి ఏర్పాట్లన్నీ పక్కాగా ఉన్నాయని అధికారులు ధ్రువీకరించారు. ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు వచ్చి, తమ ఓటు హక్కును మధ్యాహ్నం ఒంటి గంటవరకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అనంతరం భోజన విరామం గంట.. తర్వాత బ్యాలెట్స్ లెక్కిస్తారు. బందోబస్తుకు సంబంధించి బలగాలు ఇప్పటికే క్షేత్రస్థాయికి తరలాయి. పోలింగ్ జరిగే గ్రామాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలకు సంబంధించిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఓటు హక్కుపై అవగాహన కల్పించామని, ప్రలోభాలకు లోనవ్వకుండా ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరంగల్ జిల్లాలో..సాక్షి, వరంగల్: జిల్లాలోని పర్వతగిరి, వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో 80 సర్పంచ్ స్థానాలు, 585 వార్డులకు మొదటి విడత పోలింగ్ జరగనుంది. వర్ధన్నపేట మండల పరిషత్ కార్యాలయం, రాయపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పర్వతగిరి తెలంగాణ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సామగ్రిని ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ బూత్లకు బుధవారం సాయంత్రం పీఓ, ఓపీఓలతో కూడిన బృందం పోలీసుల బందోబస్తుతో తరలించింది. మూడు మండలాల్లో 91 పంచాయతీలకు 11 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 80 స్థానాలకు 305 మంది సర్పంచ్ అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 800 వార్డులకు 215 ఏకగ్రీవం కాగా.. మిగిలిన 585 వార్డులకు 1,427 మంది పోటీలో ఉన్నారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద.. పర్వతగిరి, వర్ధన్నపేట పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను సందర్శించి అధికారులు, సిబ్బందికి సూచనలిచ్చారు. హనుమకొండ జిల్లాలోని మూడు మండలాల్లో పోలింగ్కు సర్వం సిద్ధం ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఓటు వేయనున్న 1.30 లక్షల ఓటర్లు -
యాక్షన్ ప్లాన్ రెడీ
సాక్షిప్రతినిధి, వరంగల్: యాసంగి పంటలకు సాగునీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఉమ్మడి వరంగల్లో 9,48,114 ఎకరాలకు 5,29,726 ఎకరాలకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. 15 రోజులు ఆన్.. 15 రోజులు ఆఫ్ పద్ధతిన యాసంగి పంటలకు సాగునీరు అందించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈనెల 24 నుంచి వరంగల్, ములుగు ఇరిగేషన్ సర్కిళ్ల పరిధిలోని 5,29,726 ఎకరాల తడి, మెట్ట భూములకు 41.28 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు కూడా రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈమేరకు యాసంగిలో సాగు చేస్తున్న పంటలకు సాగునీరు అందేలా అధికారులు కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఎక్కడెక్కడ ఎలా? ఇరిగేషన్ వరంగల్ చీఫ్ ఇంజినీర్ పరిధిలో మొత్తం 7,92,894 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ యాసంగిలో 4,35,172 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందులో 2,68,598 ఎకరాల తడి, 1,66,574 ఎకరాల మెట్ట భూములు ఉన్నాయి. జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల ద్వారా 1,95,095 ఎకరాలకు 11.30 టీఎంసీలు, ఎస్సారెస్పీ కాకతీయ కాల్వ (ఎల్ఎండీ దిగువ) ద్వారా 1,57,038 ఎకరాలకు 12.88 టీఎంసీలు, ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద 83,039 ఎకరాలకు 6.82 టీఎంసీలు సరఫరా చేయనున్నారు. నీటి లభ్యతను బట్టి యాసంగి పంటలకు సాగునీరు అందేలా నీటిపారుదలశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈమేరకు రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అత్యధికంగా ఆరుతడి పంటలపై మొగ్గు చూపాలని సూచిస్తున్నారు. ములుగు ఇరిగేషన్ సర్కిల్లో ఇలా.. ములుగు ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం పరిధిలో మొత్తం 1,55,220 ఎకరాల ఆయకట్టు ఉంది. 94,554 ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించనున్నారు. ఇందులో తడి 34,958 ఎకరాలు కాగా, మెట్ట 59,596 ఎకరాలు. ఇందుకోసం 10.28 టీఎంసీల నీరు సిద్ధంగా ఉన్నట్లు నీటిపారుదలశాఖ ప్రతిపాదనల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్ (ఎల్ఎండీ దిగువన) కింద 1,03,883 ఎకరాలకు 58,901 ఎకరాలకు ఆరు టీఎంసీలు సరఫరా చేయనున్నారు. పాకాల చెరువు కింద 18,193 ఎకరాలకు మొత్తంగా, రామప్ప లేక్ కింద 5,180 ఎకరాలకు 1,600 ఎకరాలకు అదనంగా కలిపి 6,780 ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించనున్నట్లు ‘స్కివం’ కమిటీ పేర్కొంది. అలాగే లక్నవరం చెరువు కింద 8,794 ఎకరాలకు 4,550, మల్లూరు వాగు కింద 7,500 ఎకరాలకు 1,500, పాలెంవాగు ప్రాజెక్టు కింద 7,500 ఎకరాలకు 1,500 ఎకరాలకే ఈసారి సాగునీటిని అందించనున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రకటించారు. ఆన్అండ్ఆఫ్ పద్ధతే.. ఉమ్మడి వరంగల్లో ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2, దేవాదుల, రామప్ప, పాకాల, లక్నవరం సరస్సులు, చిన్ననీటి వనరుల ద్వారా స్థిరీకరించిన ఆయకట్టు కింద 9,48,114 ఎకరాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు, నీటి లభ్యతను బట్టి 5,29,726 ఎకరాలకు ఆన్ అండ్ ఆఫ్ (వారబందీ) పద్ధతిన సరఫరా చేయనున్నారు. అయితే, గత యాసంగిలో 6,46,664 ఎకరాలకు నీరిచ్చిన అధికారులు ఈసారి 5,29,726 ఎకరాలే ప్రతిపాదించారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి 1,16,938 ఎకరాలు తగ్గింది. కాగా, 15 రోజులు విడుదల చేసి 15 రోజులు ఆఫ్ చేసే పద్ధతిలో ఈ నెల 24 నుంచి ఆయకట్టుకు నీటి విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఎల్ఎండీ, దేవాదుల, రామప్ప, లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వాగుల పరిధి ఆయకట్టు రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. ఈ నెల 24 నుంచి ఉమ్మడి వరంగల్లో యాసంగి పంటలకు సాగు నీరు 5.30 లక్షల ఎకరాలు.. 41.28 టీఎంసీలు! యాసంగి యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన ఇరిగేషన్ శాఖ వరంగల్, ములుగు సర్కిళ్లలో ఆయకట్టుకు సాగునీరు 15 రోజులకోసారి ఆన్అండ్ఆఫ్గత యాసంగిలో 6,46,664 ఎకరాలకు సాగు నీరు ప్రస్తుతం 5,29,726 ఎకరాలకు అందించేలా ప్రణాళిక గతేడాదితో పోలిస్తే తగ్గిన 1,16,938 ఎకరాలు వరంగల్ ములుగు ఇరిగేషన్ సర్కిళ్ల పరిధి మెట్ట భూములకు 41.28 టీఎంసీలు -
ఎన్నికలకు భారీ బందోబస్తు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు అధికారులు కమిషనరేట్ పరిధిలో 6 చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. వాహనాలు తనిఖీ చేస్తూ డబ్బు, మద్యం అక్రమంగా రవాణా చేయకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను స్థానిక పోలీసులతోపాటు ఏసీపీ స్థాయి అధికారులు సందర్శించి పరిస్థితులను తెలుసుకున్నారు. 272 సమస్యాత్మక కేంద్రాల్లో భద్రత వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 272 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీస్ ఉన్నతాధికారులు గుర్తించి భద్రతను పటిష్టం చేశారు. కమిషనరేట్లో మొత్తం 807 పోలింగ్ స్టేషన్లు, 887 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొదటి విడత 269 పోలింగ్ స్టేషన్లు, 282 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విధుల్లో 2,028 మంది సిబ్బంది.. ఎన్నికల నిర్వహణ కోసం పోలీసు ఉనతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, 13 మంది ఏసీపీలు, 122 మంది ఇన్స్పెక్టర్లు, 412 మంది ఎస్సైలు, 1,154 ఏఎస్సై, హెడ్కానిస్టేబుళ్లు, 285 హోంగార్డులు, డిస్ట్రిక్ట్ గార్డ్స్, బాంబ్ డిస్పోజల్ సిబ్బందితో కలిపి మొత్తం 2,028 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొననున్నారు. తుపాకుల డిపాజిట్ కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ కలిగిన తుపాకులను ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే లైసెన్స్ హోల్డర్లు డిపాజిట్ చేశారు. బ్యాంకు సిబ్బంది తుపాకులు మినహాయించి 181 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా 36 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. భద్రత కట్టుదిట్టం.. కమిషనరేట్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. అనుమానిత వ్యక్తులను బైండోవర్ చేశాం. చెక్పోస్టులను ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశాం. ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. – సన్ప్రీత్సింగ్, పోలీస్ కమిషనర్ కమిషనరేట్ పరిధిలో 887 పోలింగ్ కేంద్రాలు 6 చెక్పోస్టులు ఏర్పాటు.. 36 ఫ్లయింగ్ స్క్వాడ్స్ 181 తుపాకులు స్వాధీనం -
భద్రకాళి బండ్ పనులు పూర్తి చేయండి
వరంగల్ అర్బన్: స్మార్ట్సిటీ కల్వర్టు పనులు ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా పరిధి పద్మాక్షి రోడ్డు శాయంపేట ప్రాంతంలో చేపట్టిన కల్వర్టు పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్మార్ట్సిటీ పథకంలో భాగంగా చేపట్టిన ఈ పనులు 31వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. 39, 40 డివిజన్లలో తడి, పొడి చెత్త సేకరణపై తనిఖీ చేసి, స్థానికులను వివరాలు అడిగారు. కార్యక్రమంలో ఈఈ రవికుమార్, డీఈలు రాజ్కుమార్, రాగి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పనులు పూర్తి చేయండి: మేయర్ సుధారాణి భద్రకాళి బండ్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం భద్రకాళి బండ్పై తుది దశకు చేరుకున్న పనులను కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్ఈ సత్యనారాయణ ఈఈలు రవికుమార్, మాధవీలత, ఏఈ సంతోశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. చెత్త తరలింపులో జాప్యం వద్దు.. సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ నుంచి చెత్త తరలింపులో జాప్యం లేకుండా చూడాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం పోతననగర్లోని సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె వెంట సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్ శానిటరీ సూపర్వైజర్ శ్రీను ఉన్నారు. కమిషనర్ చాహత్ బాజ్పాయ్ మేయర్తో గుండు సుధారాణితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన -
ఎఫ్ఏసీ డీఈఓగా గిరిరాజ్గౌడ్
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్ఏసీ) విద్యాశాఖ అధికారిగా ఎల్వి.గిరిరాజ్గౌడ్ నియమితులయ్యారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గిరిరాజ్గౌడ్ సూర్యాపేట డీఈఓ కార్యాలయంలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, రాష్ట్ర విద్యాశాఖ డీఈఓ నియామకంలో జాప్యం చేస్తోందని కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం అదనపు కలెక్టర్ రెవెన్యూ అండ్ డీఆర్ఓ (ఎఫ్ఏసీ) వైవీ.గణేశ్కు ఇన్చార్జ్ డీఈఓగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఈఓలు, ఉపాధ్యాయ సంఘాలకు సమాచారం అందింది. సామాజిక మాధ్యమాల్లోనూ వచ్చింది. ఆ తర్వాత కొంతసేపటికే ఎఫ్ఏసీ డీఈఓగా గిరిరాజ్గౌడ్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎంజీఎం: జిల్లాలోని వైద్యాధికారులు ప్రతీ వారం అన్ని ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును సమీక్షించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రోగ్రాం అధికారులు, నగరంలోని యూపీహెచ్సీ, పీహెచ్సీల వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ.. ముక్త్ భారత్ అభియాన్, మాతా శిశు సంక్షేమం, ఎన్సీడీ, ఇమ్యూనైజేషన్ కార్యక్రమాల లక్ష్యాలను, సాధించిన ప్రగతిని ఏఎన్ఎంల వారీగా సమీక్షించారు. సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్ఓ టి.మదన్మోహన్రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రదీప్రెడ్డి, ప్రోగ్రాం అధికారులు ప్రభుదాస్, జ్ఞానేశ్వర్, శ్రీనివాస్, రుబీనా, తదితరులు పాల్గొన్నారు. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా కేంద్రంలోని డీజీటీబీఎస్ఓలో మేనేజర్గా పని చేస్తున్న జె.పద్మావతిని సూపరింటెండెంట్ (టెంపరరీ)గా అదనపు బాధ్యతలు నిర్వర్తించేందుకు డిప్యూట్ చేస్తూ బుధవారం వరంగల్ పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. డీఈఓ కార్యాలయంలో సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జీఎస్ ప్రసాద్రావు ఆరునెలలపాటు సెలవుపై వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో బాధ్యతలు నిర్వర్తించేందుకు టెంపరరీగా పద్మావతికి బాధ్యతలు అప్పగించారు. శ్రీవాణి డీఈఓ ఆఫీస్కు.. హనుమకొండలోని ప్రభుత్వ హైస్కూల్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రీవాణిని టెంపరరీగా హనుమకొండలోని డీఈఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ విధులను నిర్వర్తించేందుకు డిప్యూట్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమెను సీనియర్ అసిస్టెంట్ విధు ల నుంచి రిలీవ్ చేయాలని సంబంధిత ప్రభు త్వ హైస్కూల్ హెడ్మాస్టర్ను ఆదేశించారు. వరంగల్ లీగల్: మానవ హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత అని హనుమకొండ జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి బి.అపర్ణాదేవి అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా కోర్టులో మానవ హక్కులపై అవగాహన సదస్సును న్యాయమూర్తి బి.అపర్ణదేవి ప్రారంభించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలు, హ్యూమన్ రైట్స్ అడ్వకేసి అడ్వైసరీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతీ మనిషికి హక్కులు, స్వేచ్ఛ, న్యాయం చేరేలా కృషి చేయాలని కోరారు. న్యాయవ్యవస్థలో పనిచేసే ప్రతి ఒక్కరూ మానవ హక్కుల పరిరక్షకులేనని తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తి క్షమాదేశ్ పాండే, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయమూర్తులు, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలుస సుధీర్, బార్ కౌన్సిల్ మెంబర్ భైరపాక జయాకర్, హ్యూమన్ రైట్స్ అడ్వకేసి అడ్వైజరీ సత్య, కొంగర అనిల్కుమార్, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. -
టెట్ నుంచి మినహాయించాలి
టీపీయూఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ విద్యారణ్యపురి: ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం హనుమకొండ, వరంగల్ జిల్లాల సర్వసభ్య సమావేశం హనుమకొండలోని సామజగన్మోహన్ స్మారక భవన్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సురేశ్ మాట్లాడుతూ.. టెట్ మినహాయింపుపై ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ, ఎన్సీటీఈ చైర్మన్, కేంద్రంలోని విద్యాశాఖ ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వరంగల్ టీపీయూఎస్ అధ్యక్షుడు బత్తిని వెంకటరమణగౌడ్, టీపీయూఎస్ రాష్ట్ర నాయకులు చిదురాల సుధాకర్, పిన్నింటి బాలాజీరావు, దాస్యం రామానుజస్వామి, ఆముదాల దాత మహర్షి, రెండు జిల్లాల్లోని వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు టీపీయూఎస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రెండు జిల్లాల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర ఎన్నికల అఽధికారిగా అయిల్నేని నరేందర్రావు, కె.వెంకటకృష్ణ పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉప్పుల సతీశ్, ప్రధాన కార్యదర్శిగా ఎ.శేఖర్ ఎన్నికయ్యారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా బత్తిని వీరస్వామి, ప్రధాన కార్యదర్శిగా ప్రతాప్గిరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. వీరిచే ఎన్నికల అధికారులు ప్రమాణం స్వీకారం చేయించారు. -
మరో మెగా రైల్వే ప్రాజెక్ట్
● ఒక రైలు ఇంజన్ సుమారు రూ.3 కోట్లు విలువ ఉంటుంది. దాని జీవిత కాలం సుమారు 16ఏళ్లు, ఆరు నెలలకోసారి ఇంజన్ పీఓహెచ్కు వెళ్తుంది. ● ఒక వ్యాగన్ సుమారు రూ.60 లక్షలు, జీవిత కాలం 35ఏళ్లు, వ్యాగన్ల రకాల దృష్ట్యా 4 లేదా 6 ఏళ్లకు ఒకసారి పీఓహెచ్కు వెళ్తుంది. ● ఆర్వోహెచ్ అంటే–రొటీన్ ఓవర్హాలింగ్. వ్యా గన్ 18 నెలలకోసారి ఆర్వోహెచ్కు వెళ్తుంది. ● పీఓహెచ్ అంటే పీరియాడికల్ ఓవర్హాలింగ్. ● సిక్లైన్ అంటే వ్యాగన్ల రిపేర్ ● యార్డు ఎగ్జామినేషనల్ లైన్ అంటే–గూడ్స్ వ్యాగన్ల ఫార్మేషన్ చెకింగ్ పాయింట్. ● రామగుండం, బెల్లంపల్లి, సనత్నగర్లో ఆర్వోహెచ్ డిపోలు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే జోన్లో వ్యాగన్ల రిపేర్ కోసం రాయన్పాడ్ వర్క్షాప్, తిరుపతి సీఆర్ఎస్ వర్క్షాప్, కర్ణాటక యద్గిరి వర్క్షాప్లు అందుబాటులో ఉన్నాయి. కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ సమీపంలో నష్కల్–ఘన్పూర్ మధ్య రైల్వేశాఖ రూ.908 కోట్లతో 300 ఎకరాల్లో మెగా రైల్వే వ్యాగన్ వర్క్షాప్ (మెగా ఫ్రైట్ పీఓహెచ్ వ్యాగన్ వర్క్షాప్, డిపో) నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు బుధవారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేటకు మూడేళ్ల క్రితం రైల్వే వ్యాగన్ పీఓహెచ్ షెడ్ మంజూరైంది. అనివార్య కారణాల వల్ల నిర్మాణ ప్రతిపాదనలు ముందుకు సాగలేదు. ఇప్పటికే కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం స్పీడ్గా జరుగుతుండగా, 2026 మార్చి లేదా ఏప్రిల్లో ప్రా రంభించేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. రైల్వే దినాదినాభివృద్ధిలో భాగంగా రైళ్ల రద్దీ, గూడ్స్ వ్యా గన్లు, ప్యాసింజర్స్ ట్రాఫిక్ను అధిగమించేందుకు, రవాణా, పాలనా సౌలభ్యం, ఎకానమీ, టైంను దృష్టిలో ఉంచుకుని అన్నీ ఒకేచోట ఉండేలా భావించిన రైల్వేశాఖ మెగా రైల్వే వ్యాగన్ వర్క్షాప్ డిపో ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు అధికారులు ప్రకటించారు. వ్యాగన్ ఆర్వోహెచ్, వ్యాగన్ పీఓ హెచ్, సిక్లైన్, యార్డు ఎగ్జామినేషన్ లైన్లను కలిపి ఒకే చోట ఉండేలా ఈ మెగా ప్రాజెక్ట్ను నిర్మిస్తోంది. కాజీపేట ఎలక్ట్రిక్ లోకోషెడ్, డీజిల్ లోకోషెడ్ను భవిష్యత్లో అక్కడికే తరలించి అన్ని ఒకేచోట ఉండేలా అధికారులు డిజైన్ చేస్తున్నారు. ఉత్తర, దక్షిణ దేశ ప్రాంతాలకు గేట్ వేగా ఉంటున్న కాజీపేట జంక్షన్ను మరింత అభివృద్ధి చేసే దిశలో భాగంగా ఈ మెగా పీఓహెచ్ షెడ్ నిర్మాణం ఉండనుంది. ఆ రెండు చోట్ల అనుకున్నా.. ఒక దశలో మహబూబాబాద్, డోర్నకల్–కొత్తగూడెం మధ్య పోచారంలో ఈ మెగా రైల్వే ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ వచ్చింది. రైల్వేశాఖ మాత్రం అన్నింటికీ అనువుగా ఉండేలా, ట్రాక్ కనెక్ట్టివిటీ, అధికారుల పర్యవేక్షణ, రోడ్డు రవాణా, ఆపరేటింగ్ మూవ్మెంట్ను దృష్టిలో ఉంచుకుని 90 శాతం వరకు నష్కల్–ఘన్పూర్ మధ్య ప్రాజెక్ట్ నిర్మాణానికి ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. ప్రతి పాదనలు, సర్వేచేసిన నివేదికను రైల్వే బోర్డుకు పంపించనున్నట్లు తెలుస్తోంది. రైల్వే బోర్డు అన్నింటినీ పరిశీలించి ఆమోదం తెలిపి టెండర్ ప్రక్రియకు గ్రీన్సిగ్నల్ ఇస్తే ప్రాజెక్ట్ పనులు ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు తెలుపుతున్నారు. కాగా, రైల్వే బోర్డునుంచి ఆమోదం ఆలస్యమైతే ప్రాజెక్ట్కు మంజూరైన రూ.908 కోట్లు వృథా అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. కాజీపేట–ఘన్పూర్ మధ్య నిర్మాణానికి రైల్వేశాఖ శ్రీకారం ఆర్వోహెచ్, పీఓహెచ్, సిక్లైన్, యార్డు ఎగ్జామినేషన్ లైన్లను కలిపి ఒకేచోట రైల్వే మెగా వ్యాగన్ వర్క్షాప్ డిపోనకు డిజైన్ రూ.908 కోట్లు.. 300 ఎకరాల్లో నిర్మాణానికి ప్రతిపాదనలు భూమి సర్వే చేసిన అధికారులు.. మహబూబాబాద్, డోర్నకల్లో సెక్షన్లోనూ డిమాండ్ చివరికి నష్కల్–ఘన్పూర్ మధ్య ఫైనల్ -
సృజనాత్మకత పెంచేందుకు ‘నోబెల్ ప్రైజ్ డే’
● కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం కేయూ క్యాంపస్: విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించేందుకు నోబెల్ ప్రైజ్డే ఉత్సవాలు దోహదం చేస్తాయని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం అన్నారు. కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం మైక్రోబయాలజీ విభాగంలో యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య టి.మనోహర్, స్టూడెంట్స్ ఆఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి, ఆ విభాగం అధిపతి డాక్టర్ సుజాతలో కలిసి రిజిస్ట్రార్ వి.రామచంద్రం, నోబెల్ ప్రైజ్డే ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు ప్రదర్శించిన పోస్టర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ విభాగాల కోఆర్డినేటర్లు డాక్టర్ బి.వెంకటగోపీనాఽథ్, సంగీత, చంద్రశేఖర్, రంగారెడ్డి, ప్రియాంక, కవిత, మహేందర్, రాజేందర్, సాధు రాజేశ్ పాల్గొన్నారు. విద్యార్థుల పోస్టర్ ప్రజంటేషన్.. లైఫ్ సైన్సెస్ విభాగాలకు చెందిన బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మసీ విభాగాల్లో 212 మంది విద్యార్థులు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, ఇంగ్లిష్ విభాగాల్లో 123 మంది విద్యార్థులు పోస్టర్ ప్రజంటేషన్ పోటీల్లో పాల్గొన్నారు. ఆయా విభాగాల అధిపతులు ప్రొఫెసర్ కృష్ణవేణి, శాస్త్రి, సుజాత, మధుకర్, లక్ష్మారెడ్డి, పొఫెసర్ వై.వెంకయ్య, ప్రొఫెసర్ సురేశ్లాల్, డాక్టర్ మేఘనారావు పాల్గొన్నారు. ఈనెల 10న పోస్టర్ ప్రజంటేషన్, వక్తృత్వపోటీల విజేతలకు సెనేట్హాల్లో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ ఆచార్య మామిడాల ఇస్తారి తెలిపారు. -
ప్రచారం కాదు.. పరీక్ష!
● ఓటు కావాలంటే బురదలో దిగాల్సిందే ● ఉదయం, సాయంత్రం పొలంబాట ● సర్పంచ్ అభ్యర్థుల వినూత్న ప్రచారంజనగామ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈసారి ప్ర చారం ఊళ్లలో కాదు.. పొలాల్లో దూసుకుపోతోంది. ఓటు అడగాలంటే బురదలో అడుగేయాలన్న ని బంధనలను అభ్యర్థులు అక్షరాలా అనుసరిస్తున్నా రు. రైతు తెల్లవారుజామున పొలాల్లోకి దిగితే, నేతలు వెంటపడి మట్టిలో మునిగిపోతున్నారు. ఉమ్మ డి వరంగల్ జిల్లాలో జీపీ ఎన్నికల్లో అభ్యర్థులు ఓ టు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. వానాకా లం వరి కోతలు, పత్తి సేకరణ, అమ్మకాలు చివరి దశకు చేరుకోగా.. మరోవైపు యాసంగి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సూర్యోదయానికి ముందే రైతులు పనిముట్లు భుజాన వేసుకుని వ్యవసాయ బావుల వద్దకు వెళ్తున్నారు. సాయంత్రం వరకూ మట్టితో మమేకమైపోతున్నారు. దీంతో అభ్యర్థులకు మెజార్టీ ఓటర్లు దొరకడం లేదు. ఎన్నికల ప్రచారం సమయంలో గంట నుంచి రెండు గంటలపాటు పొలం గట్లకు కేటాయిస్తున్నారు. ఓటరు ఇంట్లో లేడా.. పొలంలో ఉన్నాడా.. అయితే మన ప్రచారం కూడా అక్కడికే అనే ఫార్ములాతో అభ్యర్థులు కొత్త పంథాను ఎంచుకున్నారు. ఉదయం పది గంటల వరకు గ్రామాల్లో తిరిగి, ఆ తర్వాత పొలం బాట పడుతున్నారు. బురదలో మునిగిన పొలం అంచుల్లో అభ్యర్థుల ప్రచార హడావుడి కనిపిస్తోంది. చాలా గ్రామాల్లో కొంతమంది అభ్యర్థులు రైతులతోపాటు బురదలోకి దిగుతూ.. గట్లను చదును చేయడం, నీటి కాల్వలు వదలడం వంటి పనులు చేస్తున్నారు. అన్నయ్య.. తాతా.. ఇదే మా గుర్తు, ఇదే మా మాట అంటూ చేతిలో బ్యాలెట్ పత్రం నమూనా పట్టుకుని బురదలో నిల్చున్న దృశ్యాలు ఈ ఎన్నికల్లో సాధారణం అయ్యాయి. రాజకీయాలు ఈసారి నిజంగానే మట్టిలో పుట్టి, మట్టిలోనే పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో ప్రచారం ఉత్సాహంగా సాగుతున్నా అసలు హడావుడి పొలాల్లోనే కనిపిస్తోంది. రైతు పనుల్లో మునిగిపోయిన వేళ అభ్యర్థులు సైతం అతడి వెంటే నడుస్తున్నాడు. పొలంలో పనిచేస్తే ఓటు అన్నట్లు ఈసారి సర్పంచ్ అభ్యర్థుల ప్రచార శైలి రోజుకో కొత్త మలుపు తిరుతోంది. -
350 ప్రత్యేక సైలెన్సర్ల ధ్వంసం
కాజీపేట : కాజీపేట చౌరస్తాలో మంగళవారం 360 ద్విచక్ర వాహనాల ప్రత్యేక సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు. భీకర శబ్దంతో నగరంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ పట్టుబడిన బుల్లెట్ వాహనాల సైలెన్సర్లను అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు రోలర్తో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లను బిగిస్తే జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, సీఐలు వెంకన్న, సుజాత, సీతారాంరెడ్డి, ఎస్సైలు సంపత్, కనకచంద్రం, తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ ఇలా.. విద్యార్థులు భళా..
ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులతో నిర్వహించిన మాక్పోలింగ్ ఆకట్టుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో పోలింగ్ బూత్వద్ద విద్యార్థులు క్రమశిక్షణగా క్యూలో నిల్చోవడం, వారితో ఓటు వేయించడం.. ఓటేశాక బ్యాలెట్ మడతబెట్టి బాక్సులో ఎలా వేయాలో.. ఇలా ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా వివరించారు. –వాజేడునీ ఓటు నాకే..సాధారణంగా ఎన్నికల్లో తాము గెలవడానికి అభ్యర్థులు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పిస్తుంటారు. జనగామ జిల్లా చౌడారం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి కర్ల పద్మ భార్గవరాంరెడ్డి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థి ముక్క ఉమ మంగళవారం ప్రచారంలో ఎదురుపడ్డారు. ఒకరికి ఒకరు ఓటు వేయాలని చేతులు కలుపుతూ అభ్యర్థించడం చూసిన కార్యకర్తలు, గ్రామస్తులు ముసిముసిగా నవ్వుకున్నారు. – జనగామ రూరల్చికెన్ రెడీ ..మొదటి విడత జీపీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం ముగిసింది. కొందరు అభ్యర్థులు ఓ టర్లను ప్రసన్నం చేసుకునేందుకు జోరుగా మద్యం, మాంసం పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా మానుకోట జిల్లా కేంద్రంలో ఓ చికెన్ సెంటర్లో మాంసం ప్యాకింగ్ చేయిస్తున్న దృశ్యం ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. –‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ మహబూబాబాద్ -
భద్రకాళి ఆలయంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
● భక్తులకు నకిలీ టికెట్లు విక్రయించినందుకు చర్యలు హన్మకొండ కల్చరల్: వరంగల్ భద్రకాళి దేవాలయంలో నకిలీ పూజా, సేవా టికెట్ల జారీ వెనుక ఇద్దరు ఉద్యోగుల పాత్ర ఉందని విచారణలో తేలింది. వారిపై సస్పెన్షన్ వేటు వేస్తూ వరంగల్ దేవాదాయశా ఖ అసిస్టెంట్ కమిషనర్, దేవాలయ ఈఓ రాముల సునీత నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఉద యం 11 గంటలకు ఆలయ కార్యాలయంలో ఈఓ అధ్యక్షతన అర్చకులు, సిబ్బంది, ధర్మకర్తల అత్యవసర సమావేశం నిర్వహించారు. దేవస్థానం బుకింగ్ కౌంటర్లో విధులు నిర్వహిస్తున్న ఎస్.నరేందర్, పి.శరత్ కుమార్ నకిలీ టికెట్లు విక్రయించినట్లు గుర్తించారు. దీంతో వారిపై సస్పెన్షన్ వే టు వేశారు. ఈ ఘటనపై రాష్ట్ర దేవా దాయశాఖ మంత్రి కొండా సురేఖ స్పందిస్తూ పూజా, సేవా టికెట్ల విషయంలో అవకతవకలు జరిగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవా రం ప్రకటించారు. కాగా, ఆలయ ప్రాంగణంలోని చెప్పు ల స్టాండ్ వద్ద, వాహన పూజలు జరిగే స్థలంలో భక్తుల వద్ద డ బ్బులు వసూలు చేయరాదని, ఎవరైనా డిమాండ్ చేస్తే ఈ ఓ కు ఫిర్యాదు చేయాలని ఫోన్ నంబర్తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. -
ఎవ్రీడే 90 ఎంఎల్..!
గీసుకొండ: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం ఆసక్తి కలిగిస్తోంది. ఓటర్లకు మద్యం పంపిణీ చేసేందుకు అభ్యర్థులు ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. పోలింగ్ జరిగే రెండు, మూడు రోజుల ముందు నుంచి గ్రామాల్లో తమకు అనుకూలమైన వారికి, వ్యతిరేకులకు మద్యం తాగిస్తున్నారు. తమ గెలుపు కోసం రోజూ ప్రచారం చేసే బ్యాచ్తో పాటు.. తమకు తప్పకుండా ఓటు వేస్తారనే నమ్మకం ఉన్నవారికి, తమకు ఓటు వేయరేమో అనే అనుమానంతో ఉన్న వారికి ప్రతీ రోజు 90 ఎంఎల్ మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. దీంతో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని వైన్ షాపుల నిర్వాహకులు 90 ఎంఎల్ మద్యం బాటిళ్లను ఎక్కువ స్టాక్ చేసుకుంటున్నారు. ఇలా ప్రతీ రోజూ 90 ఎంఎల్ మద్యం అభ్యర్థులు ఇంటికే పంపిస్తుండడంతో కొందరు ఓటర్లు ఆనంద పడుతున్నారు. వాళ్ల దావత్కు పోయివస్తా.. ఓటు మాత్రం నీకే సంగెం: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల విచిత్రాలు సర్పంచ్ అభ్యర్థులను ఖంగుతినిపిస్తున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు దావత్లు ఏర్పాటు చేసి ఓటర్లను ఆహ్వానిస్తున్నారు. దీంతో ఓటర్లు ఎవరి మాట కాదనలేక పిలిచిన ప్రతీ అభ్యర్థి దావత్కు, విందులకు వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు ఎవరైనా అభ్యర్థి తారసపడి గా దావత్కు ఎందుకు పోయినవే అడితే పిలిస్తే పోకపోతే బాగుండదని వెళ్లిన గాని ఓటు మాత్రం నీకే వేస్తా అంటూ మభ్యపెట్టుతున్నారు. ఇంకాకొందరైతే ముందుగానే అభ్యర్థితో గా అభ్యర్థి దావత్కు పిలిచిండు పోయి వస్తా ఏమి అనుకోవద్దు అంటూ వెళ్లొస్తున్నారు. అంతేగాక అక్కడ గా మందు బ్రాండ్ పెట్టారని, ఇక్కడ ఈ మందు బ్రాండ్ పెట్టుతున్నారని విమర్శలు సైతం చేస్తూ దావత్లు ఇచ్చిన వారినే మాటలు అంటున్న పరిస్థితి గ్రామాల్లో కొనసాగుతుందని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు.● ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డోర్ డెలివరీ -
భక్తులకు మెరుగైన సేవలు అందించాలి
● ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం డి.విజయభాను హన్మకొండ: మేడారం భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి. విజయభాను సూచించారు. మంగళవారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో రీజియన్లోని అన్ని డిపోల మెకానికల్ సూ పర్ వైజర్లు, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు, సేఫ్టీ వార్డెన్లు, స్టోర్ సూపర్ వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం జాతర–2026కు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. జాతరకు సంబంధించిన పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జాతర సమయంలో బస్సులు మరమ్మతులకు గురికాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జాతర విధుల్లో పాల్గొనే డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితిపై సేఫ్టీ వార్డెన్లు అవగాహన కలిగి ఉండాలన్నారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులందరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని కోరారు. ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం వర్తిస్తుందన్నారు. ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంలు పి.మహేశ్, కేశరాజు భాను కిరణ్, అకౌంట్స్ మేనేజర్ ఎ.రవీందర్ పాల్గొన్నారు. సీపీని కలిసిన ఆర్టీసీ ఆర్ఎం.. వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ను టీజీ ఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను కలిశారు. మంగళవారం హనుమకొండలోని పోలీసు హెడ్క్వార్టర్స్లో సీపీని మర్యాద పూర్వకంగా కలిసి మేడారం జాతరకు ఆర్టీసీ చేస్తున్న ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. పోలీసు శాఖ ద్వారా సహకారం అందించాలని కోరుతూ లేఖ అందించారు. హనుమకొండ డీఎం ధరమ్ సింగ్ పాల్గొన్నారు. -
అండర్–16 అంతర్ జిల్లాల విజేత వరంగల్
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5న ప్రారంభమైన అండర్–16 అంతర్ జిల్లాల స్థాయి క్రికెట్ పోటీలు మంగళవారం ముగిశాయి. కరుణాపురం సమీపంలోని వంగాలపల్లి, మొగిలిచర్లలోని క్రీడా మైదానాల్లో ఐదు రోజుల పాటు హనుమకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాలకు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఎంపిక పోటీలు నిర్వహించారు. వంగాలపల్లి మైదానంలో వరంగల్, ములుగు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్లో వరంగల్ విజయం సాధించి ఇంట్రాడిస్ట్రిక్ట్ చాంపియన్గా నిలిచింది. ఐదు జిల్లా జట్లలో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 20 మందితో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాబబుల్ జట్టును ఎంపిక చేసినట్లు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. ఎంపికై న జట్టు ఈ నెలలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. కార్యక్రమంలో సెలక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ పుల్లూరి శ్రీనివాస్గౌడ్, క్రికెట్ సంఘం జిల్లా అధ్యక్షుడు అచ్చా వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు రఘురామ్, నిజాముద్దీన్, తోట రాము, సంయుక్త కార్యదర్శి ఉపేందర్, కార్యవర్గ సభ్యులు అభినవ్వినయ్, ఆవాల వేణుగోపాల్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
పన్ను వసూళ్లపై నిర్లక్ష్యం వద్దు
● మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: పన్ను బకాయిల వసూళ్ల లక్ష్యాలు చేరుకోవాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని మేయర్ గుండు సుధారాణి రెవెన్యూ అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో పన్ను వసూళ్లపై రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లతో కమిషనర్ చాహత్ పాల్గొని సమీక్షించారు. ఈసందర్భంగా మేయర్ వార్డు అధికారులు బిల్ కలెక్టర్ల వారీగా ఇప్పటి వరకు వసూలు చేసిన పన్ను వసూళ్ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 31లోగా సూచించిన పన్ను వసూళ్లను చేరుకోవాలని ఆర్ఐలు, ఆర్ఓలు నిరంతరం క్షేత్రస్థాయిలో పన్ను వసూళ్లను పరిశీలించాలని పన్ను వసూళ్లకు సమాంతరంగా నీటి పన్ను వసూళ్ల చేయాలని బడా బకాయిదారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చాలా వరకు నగరవాసులు నల్లా పన్నులు చెల్లించడం లేదని ఆస్తి పన్నులతో పాటుగా నల్లా పన్నులు చెల్లించి కార్పొరేషన్కు సహకరించాలని ఈసందర్భంగా మేయర్ నగర ప్రజలు కోరారు. సమావేశంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ ప్రసన్నరాణి, ఆర్ఓలు శ్రీనివాస్, షహజాదీ బేగం, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
రెండు వాడల మధ్య పోటీ!
హసన్పర్తి: మండలంలోని గంటూరుపల్లి గ్రామపంచాయతీలో అవతలి వాడ, ఇవతలి వాడల మధ్య పోటీ ఉంది. ఆయా వాడల్లో ఓట్లు మాత్రం పార్టీలకతీతంగా వేయడం ఆనవాయితీగా వస్తోంది. గంటూరుపల్లిలో మొత్తం 702 ఓట్లు ఉన్నాయి. ఇవతలి వాడలో 398 ఓట్లు, అవతలి వాడలో 304 ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ గ్రామంలో ఇవతలి వాడ నుంచి మాజీ సర్పంచ్ చల్లా రాకేశ్రెడ్డి, అవతలి వాడ నుంచి మాజీ సర్పంచ్ సుంకరి రమాదేవి, కందుల ప్రశాంత్రెడ్డి పోటీ చేస్తున్నారు. రెండు వాడల నుంచి ఇద్దరు చొప్పున బరిలో ఉండడంతో ఆయా ప్రాంతాలకు చెందిన ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. రాకేశ్రెడ్డి అధికార పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. సుంకరి రమాదేవి, కుమారస్వామి అధికార పార్టీ నుంచి రెబల్స్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ప్రశాంత్రెడ్డి బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్నారు.కాగా, గతంలో జరిగిన ప్రతీ ఎన్నికల్లో ఈవతలి వాడ, అవతలి వాడల నుంచి ఒక్కొక్కరే పోటీలో ఉండే వారు. అయితే ఈసారి మాత్రం ఇద్దరి చొప్పున బరిలో నిలిచారు. రెండు వాడల నుంచి ఇద్దరు చొప్పున బరిలో ఉండడంతో ఆయా ప్రాంతాలకు చెందిన ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. -
ఎన్నికలకు నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
● ఎన్నికల జిల్లా పరిశీలకులు శివకుమార్ నాయుడు హన్మకొండ అర్బన్: ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని గ్రామ పంచాయతీ ఎన్నికల హనుమకొండ జిల్లా సాధారణ పరిశీలకులు శివకుమార్ నాయుడు అఽధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో మూడో ర్యాండమైజేషన్ పూర్తి చేసిన అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి అయన అధికారుతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా ఎన్నికల పరిశీ లకులు శివకుమార్ నాయుడు మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ రోజున ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని, కౌంటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ఈనెల 11న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించే భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్ రోజున ఈ మూడు మండలాలకు సెలవు దినంగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వై.వి గణేశ్, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, డీఆర్డీఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నాకా బందీలో 173 వాహనాలు సీజ్ వరంగల్ క్రైం : జీపీ ఎన్నికల సందర్భంగా వరంగల్ పోలీసు కమిషనరేట్ వ్యాప్తంగా 57 ముఖ్యమైన ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం 6 నుంచి 9గంటల వరకు నిర్వహించిన నాకా బందీ తనిఖీల్లో ఎలాంటి ప్రతాలు లేని 173 వాహనాలు సీజ్ చేసినట్లు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. అలాగే, ఈ తనిఖీల్లో అక్రమ మద్యం సంబంధించి మొత్తం 7 కేసులు నమోదు చేసి రూ.1.18 లక్షల మద్యంతోపాటు మూడు లీటర్ల గుడుంబా, రూ.1.50 లక్షల నగదు, అనుమతులు లేకుండా వాహనంలో రవాణా చేస్తున్న రూ. 49వేల విలువైన బాణాసంచా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఐదు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు వివరించారు. భట్టుపల్లిలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మిస్సింగ్ కేసులో కనిపించకుండా పోయిన ఓ వ్యక్తిని గుర్తించినట్లు సీపీ వెల్లడించారు. -
ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు
వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేలా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని సీపీ పోలీస్ అధికారులతో మంగళవారం వీడియో సమావేశాన్ని నిర్వహించారు. తొలి విడత ఎన్నికలు జరిగే పరిధి పోలీస్ అధికారులతో మాట్లాడి తీసుకుంటున్న బందోబస్తు ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలిచ్చారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడానికి ప్రతీ పోలీస్ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎన్నికల వేళ పోలీసులు గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తూ పోలింగ్ కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో గుంపులుగా లేకుండా జాగ్రత్త పడాలన్నారు. ఏదైనా సమస్య తలెత్తితే సమాచారమివ్వాలని, అదనపు బలగాల్ని పంపించనున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు సమయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, లెక్కింపు పూర్తయ్యి సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నికయ్యే వరకు బందోబస్తు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీసీపీలు అంకిత్కుమార్, కవిత, రాజమహేంద్ర నాయక్తో పాటు అదనపు డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు. సీపీ సన్ప్రీత్ సింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ -
హీటెక్కిన ‘పంచాయతీ’!
సాక్షిప్రతినిధి, వరంగల్: పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సంరంభం తారస్థాయికి చేరింది. మొదటి విడత ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం తెరపడగా.. అభ్యర్థులకు ఒక్కరోజే సమయం మిగిలింది. దీంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు వారు పడరాని పాట్లు పడుతున్నారు. మంగళవారం రాత్రి నుంచే మద్యం, కానుకలు, నగదుతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. రెండో విడత ప్రచారానికి శుక్రవారం తెరపడనుంది. మూడో విడత గ్రామ పంచాయతీలకు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియగా.. బరిలో ఉన్న అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తమ మద్దతుదారుల గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మరో వారం హడావుడి ఉమ్మడి వరంగల్లో ములుగు జిల్లాలోని మంగపేట మండలం మినహా.. 1,683 గ్రామ పంచాయతీలు, 14,776 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి విడత ఎన్నికలు గురువారం జరగనుండగా.. రెండో విడత 14, మూడో విడత ఎన్నికలు 17న నిర్వహించనున్నారు. కాగా, మొదటి విడత ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియగా.. గురువారం ఉమ్మడి జిల్లాలోని 555 పంచాయతీలకు ఏకగ్రీవాలను మినహాయించి 512 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. 4,901 వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి పోలింగ్ అధికారులు, సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకుని పోలింగ్ సామగ్రితో కేంద్రాలకు తరలేలా ఏర్పాట్లు చేశారు. కాగా, హనుమకొండ జిల్లాలో మొదటి విడత భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపుర్ మండలాల్లోని 69 జీపీలు, 658 వార్డులకు ఎన్నికల ఏర్పాట్లు జరిగాయి. ఇందులో ఐదు గ్రామ పంచాయతీ సర్పంచ్లు, నాలుగు గ్రామాల వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. అవి మినహాయించి మిగతా చోట్ల ఎన్నికలు నిర్వహించనున్నారు. రసవత్తరంగా రెండు, మూడు విడతలు.. మొదటి విడత ప్రచారం ముగియడంతో ప్రధాన పార్టీలు రెండు, మూడు విడతలపై దృష్టి సారించాయి. అధికార కాంగ్రెస్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు పల్లెల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, బీజేపీ నుంచి జిల్లా అధ్యక్షులు, నేతలు ఆయా పార్టీల అభ్యర్థుల కోసం శ్రమిస్తున్నారు. అవసరాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కోతీరుగా సీపీఐ, సీపీఎం, ఇతర పార్టీల మద్దతు తీసుకుంటున్నాయి. మొదటి విడత ప్రచారానికి తెర.. ప్రలోభాలకు ఎర పోలింగ్ సామగ్రితో నేడు పల్లెలకు అధికారులు రెండో విడతకు శుక్రవారం సాయంత్రం వరకే ప్రచారం మూడో విడత ముగిసిన ‘ఉపసంహరణ’.. గుర్తుల కేటాయింపుతో ప్రచార హోరు -
కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంగళవారం కలెక్టర్ స్నేహ శబరీష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతంతో కలెక్టరేట్ ప్రాంగణం మార్మోగింది. అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. కలెక్టరేట్ను సందర్శించే ప్రజలు, అధికారులకు ఈ విగ్రహం ప్రేరణగా నిలుస్తుందన్నారు. తెలంగాణ గౌరవం, సంప్రదాయాలు, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా విగ్రహం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, ఆర్అండ్బీ ఈఈ సురేశ్బాబు, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీటీఓ శ్రీనివాస్కుమార్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.21 కోట్ల సైబర్ దోపిడీ
బుధవారం శ్రీ 10 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఏకంగా రూ. 21,74,51,300 కొల్లగొట్టారు. 68 కేసుల్లోనే ఇంత భారీగా నగదు దోచుకోవడం సంచలనంగా మారింది. 2024లో 772 కేసుల్లో రూ.24,70,43,738 సొత్తు సైబర్ నేరగాళ్ల చేతికిపోతే, ఈసారి 69 కేసుల్లో రూ.21,74,51,300 నగదు పోయిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే కేసుల సంఖ్య భారీగా తగ్గినా, తక్కువ మంది బాధితులే ఎక్కువ మొత్తంలో నగదు పోగొట్టుకోవడం విస్తుగొల్పుతోంది. ముఖ్యంగా ఈ మోసపోయిన వారిలో ఉన్నత విద్యావంతులు, వైద్యులు, న్యాయవాదులు, ఉద్యోగులు ఉండడం గమనార్హం. ముఖ్యమైన కేసులిలా.. మోనార్క్ నెట్వర్క్ క్యాపిటల్ పేరుతో ఇన్స్టాగ్రా మ్లో యాడ్ రావడంతో చూసిన నగరానికి చెందిన ఇద్దరు వైద్యులు క్లిక్ చేయడంతో ఆటోమేటిక్గా వీరి ఫోన్ నంబర్లు సైబర్ నేరగాళ్లు నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూప్ల్లో యాడ్ చేశారు. వారు ప్రొఫెషనల్ అడ్వయిజర్లుగా చెప్పుకుంటూ రోజువారీగా ఐదు నుంచి 20 శాతం లాభాలొస్తాయంటూ నమ్మబలికారు. ఇలా ఆ మాటలు నమ్మి వారు చెప్పిన విధంగా నకిలీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ యాప్ మోనార్క్ ఫిన్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇందులో 41 ఏళ్ల ఓ వైద్యుడు 27 ట్రాన్సక్షన్ల ద్వారా రూ.1.4 కోట్లు బదిలీ చేశారు. మరో వైద్యుడు 13 ట్రాన్సక్షన్ల ద్వారా రూ.కోటి ఇన్వెస్ట్ చేశారు. ఈ డబ్బులు డ్రా చేసేందుకు ట్యాక్స్ కట్టాలని, టీం డిపాజిట్ కింద రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. ఇవీ చెల్లించాక కూడా విత్డ్రా ఆప్షన్ డిసబుల్ చేసి మరో రూ.20 లక్షలు డిమాండ్ చేయడంతో మోసమని సైబర్ క్రైం పోలీసులను ఈ నెల 3న సంప్రదించారు. నగరానికి చెందిన ఓ న్యాయవాదికి వరుసగా వివిధ శాఖల అధికారులమని కాల్స్ చేసి ‘మీపై నగ్న వీడియోలు సర్క్యులేట్ నుంచి మానవ అక్రమ రవాణా వరకు వివిధ కేసులు పెండింగ్లో ఉన్నాయని, నకిలీ ఎఫ్ఐఆర్, తప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు చూపించి అరెస్ట్ చేస్తామంటూ భయభ్రాంతులకు గురిచేశారు. చివరగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారిగా మళ్లీ ఫోన్కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ అంటూ.. ఈ కేసులు క్లియర్ చేసేందుకు సెక్యూరిటీ అమౌంట్ ఇవ్వమనడంతో అప్పటికే భయపడిన న్యాయవాది రూ.42 లక్షలు నేరగాళ్లు ఇచ్చిన బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశారు. మరుసటిరోజు కాల్ చేసి రూ.32 లక్షలు ఇవ్వాలనడంతో మోసమని సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన 68 కేసుల్లో బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ (వ్యాపార, పెట్టుబడి మోసాలు) 43 కేసులున్నాయంటే మనిషి ఆశను సైబర్ నేరగాళ్లు ఎలా ‘క్యాష్’ చేసుకుంటున్నారో తెలుస్తోంది. తక్కువ, డబ్బులతో పెట్టుబడి.. ఒక్కరోజులోనే రెండింతలు అంటూ వివిధ ప్రముఖ కంపెనీల పేర్లతో సోషల్ మీడియా వేదికగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు చేస్తున్నారు. ఆరంభంలో రూ.100 పెడితే రూ.200 రావడంతో ఇది నిజమని అనేక మంది రూ.వేలు, రూ.లక్షలు వరకు పెట్టుబడి పెట్టాక అసలు మోసం అర్థం అవుతోంది. లాభాలు దేవుడెరుగు కానీ, పెట్టిన డబ్బులు కూడా పోవడంతో అది మోసమని గుర్తించిన బాధితులు సైబర్ క్రైం పోలీసులను సంప్రదిస్తున్నారు. జనవరి నుంచి సైబర్ మోసాలు, సొత్తు (రూ.లలో) ఇలా.. జనవరి నుంచి ఇప్పటివరకు నయా నేరగాళ్ల పంజా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 68 కేసులు వీటిలో అత్యధికంగా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ 43 ఆ తర్వాత స్థానంలో డిజిటల్ అరెస్ట్తో బాధితులకు టోకరా 1930 ద్వారా 24 గంటల్లో ఫిర్యాదు చేస్తేనే రికవరీకి చాన్స్ -
రేవంత్ పాలనలో అంతా విధ్వంసమే
హన్మకొండ: సీఎం రేవంత్రెడ్డి పాలనలో అంతా విధ్వంసమేనని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. విజయ్ దివస్ను పురస్కరించుకుని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం నుంచి బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్ చేసిన గొప్పపని వేయి ఇళ్లు కూల్చడమేనని ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి పైశాచికత్వం నుంచి పుట్టుకొచ్చింది నేటి తెలంగాణ తల్లి అని అన్నారు. కేసీఆర్ ఉద్యమాన్ని అవమానిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ ఒక్కసారి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ రాసిన పుస్తకం చదవాలని హితవు పలికారు. మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ దుర్మార్గపు పాలన నుంచి బయటపడేందుకు ప్రజలు కార్యోణ్ముకులు కావాలని పిలుపునిచ్చారు. నాయకులు తాళ్లపల్లి జనార్దన్గౌడ్, పులి రజనీకాంత్, బొంగు అశోక్ యాదవ్, చెన్నం మధు, ఇమ్మడి లోహిత, నయీముద్దీన్, సోదా కిరణ్, లక్ష్మీనారాయణ, జానకి రాములు, వెంకన్న రమేశ్ పాల్గొన్నారు. విజయ్ దివస్లో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ -
పార్లమెంట్ ముట్టడికి తరలిరావాలి
నయీంనగర్: జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించాలని బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్గౌడ్ బీసీలకు పిలుపునిచ్చారు. హనుమకొండలోని ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నెల 15, 16 తేదీల్లో చేపట్టనున్న పార్లమెంట్ ముట్టడి వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వేణుగోపాల్గౌడ్ మాట్లాడుతూ పార్లమెంట్ ముట్టడికి బీసీలందరూ వేలాదిగా తరలిరావాలని, 16న జరిగే అఖిలపక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు దొడ్డపల్లి రఘుపతి, చిర్ర రాజు, శోభారాణి, సుగుణ, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకినాడలోని జేఎన్టీయూలో ఈనెల 10 నుంచి 14 వరకు నిర్వహించనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య మంగళవారం తెలిపారు. జట్టులో ఆర్.వెంకటేశ్వర్రావు, కె.ఉదయ్కిరణ్, జె.సాయికిరణ్, బి.శివకుమా ర్, సి.వసంత్రావు, ఎ.సంజీవ్కుమార్, టి.రాంచరణ్ అంజి, భీంరావు, కె.సాయికుమార్, పి.ఆదినారాయణ, పి.ప్రమోద్, బి.రోషన్, టి.జస్వంత్, ఎం.లక్ష్మణస్వామి ఉన్నారని పేర్కొన్నారు. బొల్లికుంటలోని వాగ్దేవి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ రామాంజనేయులు జట్టుకు కోచ్ కమ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య తెలిపారు. ఎంజీఎం: కాళోజీ హెల్త్ వర్సిటీ ప్రాంగణంలోని పార్కింగ్ ప్రదేశంలో మంగళవారం ఉదయం కొండచిలువ కలకలం సృష్టించింది. ఉదయం 10 గంటల సమయంలో కార్యాలయ సిబ్బంది వాహనాలు పార్కింగ్ చేస్తున్న సమయంలో కొండచిలువ కనిపించింది. దానిని పట్టుకునేందుకు సిబ్బంది యత్నించారు. కానీ, నిర్మాణంలో ఉన్న సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిలోకి కొండచిలువ వెళ్లిపోయినట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. కాళోజీ సెంటర్: కరీమాబాద్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పోగు అశోక్ 14వ జాతీయస్థాయి సదస్సుకు ఎంపికయ్యారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం జాతీయ స్థాయిలో విద్యాసదస్సు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ‘ఎన్హ్యాన్సింగ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ ఇన్ సెకండరీ స్కూల్ స్టూడెంట్స్’ అనే అంశంపై ఉపాధ్యాయుడు అశోక్ సమర్పించిన పరిశోధన పత్రం జాతీయ సదస్సుకు ఎంపికై ంది. ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు రాజస్తాన్ అజ్మీర్లోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో జరగనున్న జాతీయ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. జాతీయస్థాయి సదస్సుకు ఎంపికై న అశోక్ను ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్, ప్రొఫెసర్ సురేష్, డీఈఓ రంగయ్యనాయుడు, సుజన్తేజ, ఉపాధ్యాయులు అభినందించారు. -
ఫాగింగ్.. ఫ్రాడింగ్!
దోమల నియంత్రణ పేరిట ఏటా రూ.7 కోట్లు ఖర్చు‘దోమలతో బతకలేకపోతున్నాం. చలికాలం కూడా ఫ్యాన్ కిందే ఉండాల్సి వస్తోంది. రోజూ సాయంత్రం ఇంట్లో వేపాకుతో పొగ వేస్తున్నాం. లేకపోతే దోమలు నిద్రపోనివ్వవు’ అని దర్గా కాజీపేటకు చెందిన మహమ్మద్ జరీనా ఆవేదన వ్యక్తం చేసింది...ఇది ఒక్క జరీనా పరిస్థితే కాదు. నగరంలోని ప్రతీ కుటుంబం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. రోజురోజుకూ దోమలు వృద్ధి చెందుతుండడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. పాలకులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ అర్బన్: దోమల నియంత్రణ పేరిట కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమవుతున్నాయనే ఆరోపణలున్నాయి. నిఘా పెట్టి చర్యలు తీసుకోవాల్సిన అర్బన్ మలేరియా అధికారి, పర్యవేక్షకులు ఎక్కడికక్కడ అక్రమాలకు పాల్ప డుతూ అందినకాడికి దండుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. మహా నగరంలో ప్రజారోగ్య పరిరక్షణ ఉందా లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఖాళీ ప్రదేశాల్లో నీరు నిల్వతో దోమల వృద్ధి అధికమైంది. దోమ కాటుతో జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రుల్లో చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఫాగింగ్తో ప్రయోజనమెంత? దోమల నివారణకు నగర వ్యాప్తంగా ప్రతీ రోజు 66 డివిజన్లలో 8 పెద్ద ఫాగింగ్ యంత్రాలు, 34 హ్యాండ్ యంత్రాల ద్వారా నిత్యం ఫాగింగ్ జరగాలి. ఇందుకోసం పెద్ద యంత్రాలకు 16 మంది, చిన్న యంత్రాలకు 34 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఈ పెద్ద పొగ మిషన్లకు రోజుకు 50 లీటర్లు, హ్యాండ్ యంత్రాలకు 5 లీటర్లతో పాటు పెట్రోల్ లీటరు చొప్పున కూపన్లు పంపిణీ చేస్తుంటారు. ఇలా ఇంధనం పేరిట ఒక్కో యంత్రానికి రోజుకు పెద్ద మిషన్కు రూ.49 వేలు, చిన్న యంత్రాలకు రూ.20,500, చొప్పున సుమారు రూ.70 వేలు వెచ్చిస్తున్నారు. ఏడాదంతా ఇంధనం పేరిట మొత్తం రూ.2.10 కోట్లు కాగా, ఎంఎల్, కిరోసిన్, కెమికల్స్ కోసం రూ.1.50 కోట్లు. వీరి వేతనాలు రూ.కోటి చొప్పున చెల్లిస్తున్నారు. ఇలా రూ.4.60 కోట్లు, దోమల నియంత్రణ కోసం క్షేత్రస్థాయి కార్మికులకు రూ.1.98 కోట్లు, ఇతరుల వేతనాలతో కలిపి మొత్తం వీటి పర్యవేక్షణ సిబ్బంది జీతభత్యాలు కలిపి ఏడాదికి దోమల నియంత్రణ కోసం రూ.7 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో దోమల బెడద అరికట్టడానికి అధికారులు తీసుకుంటున్న చర్యలు తగిన ఫలితాలివ్వడం లేదు. ఈవ్యవహారంపై విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు. కానరాని కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు దోమలు వృద్ధి చెందకుండా నిత్యం అన్ని డివిజన్లలో పర్యటించాలి. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో చెరువులు, నాలాల్లో, డ్రెయినేజీల్లో మందు స్ప్రే చేయాలి. ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపులు, బావుల్లో రసాయనాలు వేయాలి. 90 మంది కార్మికులు తిరుగుతున్న దాఖలాలు నామామాత్రమే. ఉదయం 5గంటలకు ఫేస్ హాజరు వేసి మధ్యాహ్నం 1 గంట వరకు విధులు నిర్వర్తించాల్సి ఉండగా, హాజరు వేసుకుని, క్షేత్ర స్థాయిలోకి వెళ్లి అప్పుడప్పుడు నోట్ బుక్కుల్లో కాలనీవాసుల నుంచి సంతకాలు తీసుకుని ఇళ్లల్లోకి జారుకుంటున్నా రు. డివిజన్ల వారీగా కార్మికులు చేస్తున్న పనులు భూతద్దంలో వెతికినా కనిపించట్లేదని నగరవాసులు పేర్కొంటున్నారు. చర్యలు తీసుకుంటాం.. డీజిల్, పెట్రోల్ కూపన్లు రోజు వారీగా ఫాగింగ్ యంత్రాలకు సరిపడా జారీ చేస్తున్నాం. తక్కువ ఇంధనం పోస్తున్నారనే విషయం నా దృష్టికి రా లేదు. ఏమైనా లోపాలుంటే చర్యలు తీసుకుంటా. – రాజారెడ్డి, అర్బన్ మలేరియా ఇన్చార్జ్ బయాలజిస్ట్8 పెద్ద ఫాగింగ్ యంత్రాలకు రోజు 50 లీటర్ల డీజిల్, 1 లీటరు పెట్రోల్ కూపన్లు ఇవ్వాలి. కానీ, కూపన్లు జారీ చేసిన పెట్రోల్ బంక్లో 25 లీటర్ల డీజిల్ మాత్రం పోస్తున్నారు. అందుకు గాను ప్రతీ ఫాగింగ్ డ్రైవర్కు వారానికి రూ.3 వేలు చెల్లిస్తున్నారు. ఇక హ్యాండ్ ఫాగింగ్ యంత్రానికి 5 లీటర్ల డీజిల్, లీటరు పెట్రోల్ పోస్తారు. అందుకు ప్రతీ కార్మికుడు ఫాగింగ్ చేసినా, చేయకపోయినా నెలకు హెల్త్ ఇన్స్పెక్టర్లకు రూ. 5 వేల చొప్పున చెల్లించాలి. ఈ వ్యవహారంలో కార్మికుడి నుంచి విభాగం ఉన్నతాధికారి వరకు నెలనెలా దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. అధికారులు ఈవిషయంపై దృష్టిసారిస్తే మరి కొన్ని నిజాలు వెలుగు చూసే అవకాశం ఉంది. డీజిల్, పెట్రోల్ రూపంలో ప్రజాధనం పక్కదారి! మందుల కొనుగోళ్లలో మాయ వృద్ధి చెందుతున్న దోమలు.. రోగాలబారిన పడుతున్న ప్రజలు -
ఎంజీఎంలో గందరగోళం!
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రి పాలన రోజురోజుకూ అధ్వాన్న స్థితికి చేరుకుంటోంది. పూర్తి స్థాయి పరిపాలనాధికారుల అధికారుల లేమితో, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్థాయి వైద్యులను ఆర్ఎంఓలుగా నియమించుకుని కీలక బాధ్యతలు అప్పగించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆస్పత్రిలో రోగులకు అందించాల్సిన ఔషధాలు, రక్త పరీక్షలు, రోగులకు అందించాల్సిన పారిశుద్ధ్యం వంటి టెండర్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పూర్తి చేయడంలో సూపరింటెండెంట్ స్థాయి అధికారికి ఆర్ఎంఓ–1, ఆర్ఎంఓ–2 వంటి అధికారుల సహాయం తప్పనిసరి. రోగులకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందడం, వారికి సంబంధించి ఎంఓయూలను పరిశీలిస్తూ నిబంధనలు ఎలా పాటిస్తున్నారు అనే అంశాలు పరిశీలిస్తూ బిల్లుల చెల్లింపుల్లో కీలకంగా వ్యవహరిస్తూ రోగులకు మెరుగైన సేవలందించాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఎంజీఎంలో ఇలాంటి ప్రక్రియ సరిగ్గా జరగకపోవడంతో రెండేళ్లుగా ఆయా సేవలు అధ్వాన్న స్థితికి చేరుకున్నాయి. 20 నెలలు గడుస్తున్నా పూర్తికాలే.. ఆస్పత్రిలో చికిత్స పొందే వేలాది మంది రోగులకు సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి పూర్తిస్థాయిలో మందులు సరఫరా కాని క్రమంలో ఆస్పత్రిలో సర్జికల్, మెడికల్ విభాగాల్లో టెండర్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసిన ఏజెన్సీల ద్వారా రోగులకు ఔషధాలు సరఫరా చేస్తారు. గత 20 నెలల క్రితం టెండర్ సమయం ముగిసింది. ఈప్రక్రియను పూర్తి చేయడంలో పరిపాలనాధికారులు పూర్తిస్థాయిలో విఫలమవడంతో రోగులకు పూర్తిస్థాయిలో ఔషధాలు అందకపోవడంతో పాటు, కొన్ని రక్తపరీక్షలకు సైతం ప్రైవేట్కు పరుగులు తీయక తప్పట్లేదు. స్టేషనరీ విభాగం పరిస్థితి అంతేనా? ఎంజీఎంలో రోగులకు చికిత్సలందించడంలో ఔషధాలతో పాటు స్టేషనరీ విభాగం సైతం కీలకం. ఈ విభాగం ద్వారా రోగులకు కేస్షీట్లు, ఓపీ స్లిప్లు, వార్డులకు సంబంధించిన ఎలక్ట్రిక్ సామగ్రి, ఫర్నిచర్, పెన్నులు, బుక్లు వంటి ఇతరత్రా సామగ్రి కొంటుంటారు. స్టేషనరీ విభాగ టెండర్ను పూర్తిచేయడంలో పరిపాలనాధికారులు వైఫల్యం చెందారు. ముగిసిన ఐహెచ్ఎంఎస్ టెండర్ మరో కీలక విభాగం పారిశుద్ధ్య సేవలు. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో కొనసాగుతున్న ఏజెన్సీ సమయం మూడు నెలల క్రితమే ముగిసింది. వెంటనే టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని పలు కార్మిక సంఘాలు సూపరింటెండెంట్కు వినతి పత్రాలు సైతం అందించాయి. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఏజెన్సీ నిర్వాహకులు ఎంఓయూలో పేర్కొన్నట్లుగా కూడా వేతనాలు చెల్లించట్లేదని ఎన్ని సార్లు పరిపాలనాధికారులకు మొరపెట్టుకున్నా.. పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఏజెన్సీ పర్యవేక్షించే ఆర్ఎంఓ స్థాయి అధికారులు రోగులకు సేవలందించే పేషెంట్ కేర్, పారిశుద్ధ్య సేవలు పట్టించుకోకపోవడం వల్ల ప్రస్తుతం కొనసాగుతున్న కార్మికులకు పని ఒత్తిడి సైతం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి కాని సర్జికల్, మెడికల్ టెండర్లు అధ్వానస్థితిలో పేషెంట్ కేర్ సేవలు పట్టించుకోని పాలనాధికారులు -
11, 14, 17 తేదీల్లో స్థానిక సెలవు
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లాలో ఈనెల 11, 14, 17వ తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫై చేసిన ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయా తేదీల్లో స్థానిక సెలవుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ జరిగే ప్రదేశాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ సెలవు, ప్రైవేట్ ఉద్యోగులకు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అందుబాటులో యాసంగి విత్తనాలు వరంగల్ జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం పంటల సరళి, విత్తనాలు, ఎరువుల లభ్యత, అమ్మకాలపై కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖాధికారి అనురాధ, జిల్లా సహకార అధికారి నీరజ, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి జీపీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది కేటాయింపులో మొదటి, రెండో విడతకు ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు బాలమాయదేవి, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సత్యశారదల సమక్షంలో సోమవారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, డీఈఓ రంగయ్యనాయుడు, ఆర్డబ్ల్యూఎస్ అధికారి నిర్మల పాల్గొన్నారు. సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం వరంగల్: ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకురాలు బాలమాయదేవి, కలెక్టర్ సత్యశారద అన్నారు. జీపీ ఎన్నికల్లో భాగంగా సోమవారం వరంగల్ డీఆర్డీఓ కార్యాలయంలో సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మూడు దశల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ విధులను నిర్వర్తించి నివేదికలను సకాలంలో అందజేయాలన్నారు. ఈవీఎం గోదాంల పరిశీలన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని జిల్లా వేర్ హౌస్ గోదాంలో భద్రపర్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎంల) వరంగల్ కలెక్టర్ సత్యశారద, అదనవు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి సోమవారం తనిఖీ చేశారు. వివరాలు నమోదు చేయాలి ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) ఆన్లైన్ పోర్టల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను నిర్దేశిత గడువులోగా నమోదు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం వరంగల్లోని పైడిపల్లి, దేశాయిపేట, తిమ్మాపూర్, దూపకుంట ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
సాధారణ ప్రసవాలపై గర్భిణులకు వివరించాలి
ఎంజీఎం: గర్భిణులకు సాధారణ ప్రసవాలతో కలిగే లాభాలు, సీజేరియన్లతో తల్లీబిడ్డకు కలిగే నష్టాల గురించి కౌన్సెలింగ్ నిర్వహించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య వైద్యులకు సూచించారు. సోమవారం నగరంలోని దేవిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సీ సెక్షన్ ఆడిట్ నిర్వహించారు. నవంబర్లో మొత్తం 39 ప్రసవాలు జరగగా.. 38 సీ సెక్షన్, 1 నార్మల్ ప్రసవాలు చేసినట్లు గుర్తించి ఎందుకు అన్ని సిజేరియన్ ఆపరేషన్లు చేశారని వైద్యులను ప్రశ్నించారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. తప్పనిసరి పరిస్థితులు, సూచించిన కారణాల్లో మాత్రమే సిజేరియన్ నిర్వహించాలన్నారు. ఆయన వెంట మాతా శిశు సంక్షేమం ప్రోగ్రాం అధికారి డాక్టర్ రుబీనా, స్టాటిస్టికల్ అధికారి ప్రసన్నకుమార్, హెచ్ఈఓ రాజేశ్వర్ రెడ్డి, సందీప్ పాల్గొన్నారు. వరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా సి.రామును నియమిస్తూ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సాంబశివారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం రాము బాధ్యతలు స్వీకరించారు. తదుపరి నియామకాలు జరిగే వరకు ఉమ్మడి జిల్లాకు రాము అదనపు ఇన్చార్జ్గా కొనసాగుతారని తెలిపా రు. సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతోషి.. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా కొనసాగుతారని నియామక ఆదేశాల్లో పేర్కొన్నారు. భూ కబ్జాపై సమగ్ర నివేదిక కోరిన కలెక్టర్ హన్మకొండ అర్బన్: నగరంలోని వడ్డేపల్లి ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారంపై సమగ్ర వివరాలతో ‘పెద్దలా.. గద్దలా’ శీర్షికతో సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనం జిల్లాలో సంచలనం రేపింది. దీనిపై స్పందించిన హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. ఆ భూమిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలో దిగిన హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి సంబంధిత వ్యక్తులను భూమికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పినట్లు తెలిపారు. ఆవివరాలతోపాటు రెవెన్యూ రికార్డులు పరిశీలించి క్షేత్రస్థాయి వాస్తవాలను కలెక్టర్ నివేదిస్తానని ఆయన పేర్కొన్నారు. కాగా, అక్కడ రెవెన్యూ రికార్డుల ప్రకారం మూడు గుంటల ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఈ విషయంలో అక్కడ బోర్డు ఏర్పాటు చేయగా కొందరు తొలగించారన్నారు. ఈ విషయంలో విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీపీ సన్ప్రీత్సింగ్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రంనుంచి రాత్రి వరకు ఆకస్మిక తనిఖీలు జరిగాయి. పలుచోట్ల సీపీ తనిఖీల్లో పాల్గొన్నారు. పోలీస్ అధికారులు వాహనాలతోపాటు ఇళ్లలోనూ సోదాలు చేశా రు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని కమిషనర్ కోరారు. -
పోలింగ్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈనెల 11న భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల్లో ఎన్నికల ఏర్పాట్లపై ఎంపీడీఓలతో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. కార్యక్రమంలో డీపీఓ లక్ష్మీరమాకాంత్, డీఆర్డీఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ రవి, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల ప్రత్యేకాధికారులు అనసూయ, శ్రీనివాసులు, నరసింహస్వామి, ఎంపీడీఓలు వీరేశం, విజయ్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు కృషి జిల్లాలో ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ‘స్టూడెంట్ వెల్ నెస్’ కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇందులో డీఎంహెచ్ఓ అప్ప య్య, డీడబ్ల్యూఓ జయంతి, డీఐఈఓ గోపాల్, డీటీడీఓ ప్రేమకళ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ నిర్మల, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి గౌస్ హైదర్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్కుమార్ తదితరులున్నారు. పోస్టర్ ఆవిష్కరణ అవినీతి నిరోధక విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన అవినీతి వ్యతిరేక వారోత్సవాల పోస్టర్ను కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో వరంగల్ ఏసీబీ డీఎస్పీ పి.సాంబయ్య, ఇన్స్పెక్టర్ రాజు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ -
అస్తవ్యస్త ప్రణాళిక
అనాలోచిత నిర్ణయాలు.. అడ్డగోలు నిర్మాణాలువరంగల్ అర్బన్ : ప్లానింగ్, శాసీ్త్రయత బొమ్మాబొరుసు లాంటివి. ఈ రెండు లేకుండా ఇష్టారాజ్యంగా రూ.కోట్లు వెచ్చించి భారీ భవనాలు నిర్మించడం గ్రేటర్ వరంగల్కే చెల్లుబాటు అవుతోంది. ఇంజనీర్లు, ప్రణాళిక అధికారులు భవిష్యత్ తరాల అభివృద్ధికి పాటుపడాల్సి ఉండగా.. అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రతి పైసా సద్వినియోగం అయ్యేలా అన్నిస్థాయిల్లో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఏం చేయాలన్నా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలి. అయితే బల్దియా అధికారులు ఎప్పుడు ఏది నిర్మిస్తారో? ఏది ఎందుకు కూలగొడతారో తెలియదు. అనాలోచిత నిర్ణయాలతో అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ భవన నిర్మాణానికి కసరత్తు.. బల్దియా ప్రధాన కార్యాలయానికి సమీపంలోని మెప్మా ఆఫీస్ పక్కన రూ.32 కోట్ల నిధులతో ఐదు అంతస్తుల్లో భారీ భవనాన్ని నిర్మించేందుకు కసరత్తు వేగవంతమైంది. ఈ భవనం పక్కనే కాకతీయ మ్యూజికల్ గార్డెన్, ఇండోర్ స్టేడియం, ప్లానిటోరియం, స్విమ్మింగ్పూల్ నిర్మాణం చేపట్టారు. అయితే, ఆయా నిర్మాణాలను ముందు చూపులేకుండా ఇష్టారాజ్యంగా చేపట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 50 నుంచి 60 రకాల అవసరాలకు ఉపయోగపడే విధంగా పరిపాలన విభాగాలు, కమిషనర్, వింగ్ అధికారులు, సిబ్బందికి చాంబర్లు, మేయర్, డిప్యూటీ కమిషనర్తోపాటు దాదాపు 200 మంది సిట్టింగ్ సామర్థ్యంతో కౌన్సిల్ హాల్, ప్రతిపక్ష సభ్యుల చాంబర్లు, వాహనాల పార్కింగ్ డిజైన్ చేశారు. బల్దియాలో పెద్ద పనులు చేసే బడా కాంట్రాక్టర్కు ఇప్పటికే టెండర్ ఖరారైంది. త్వరలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా భారీ భవనానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. గ్రేటర్ పరిపాలన భవన నిర్మాణంపై విమర్శలు వృథాకానున్న రూ.32 కోట్ల ప్రజాధనం పాలక, అధికార వర్గాలు ఆలోచిస్తేనే ఫలితం -
శాంతితోనే అభివృద్ధి సాధ్యం
హన్మకొండ: శాంతితోనే అభివృద్ధి పరుగులు పెడుతుందని పూర్వ వరంగల్ జిల్లా కలెక్టర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో ‘ఎగిరే శాంతి కపోతం’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శాంతి దిశగా ఆలోచించాలన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్ మహమ్మద్ ఇక్బాల్అలీ, కేయూ పాలక మండలి సభ్యుడు సురేశ్లాల్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, గంటా రామిరెడ్డి మాట్లాడారు. మహమ్మద్ సిరాజుద్దీన్ పుట్టిన రోజును పురస్కరించుకుని విశ్రాంత ఆచార్యులు గూడ నరసింహమూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు కొక్కండ విజయ్బాబు, విప్పనపల్లి రవికుమార్, డాక్టర్ పొడిశెట్టి విష్ణువర్ధన్, డాక్టర్ వెలుదండి రవికుమార్, పగడాల సరళ, సాగంటి మంజుల, శ్రీపాద సుధాకర్ రావు, నల్ల లక్ష్మీనారా యణ, బీటవరం శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి ‘ఎగిరే శాంతి కపోతం’ పుస్తకావిష్కరణ -
తేలిన లెక్క
వరంగల్: వరంగల్ జిల్లాలోని 317 పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండు విడతల్లో ఇప్పటి వరకు 16 మంది సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదటి విడత ఎన్నికలు జరిగే 91 పంచాయతీల్లో 11 మంది సర్పంచ్లు ఏకగ్రీవం కావడంతో 80 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 214 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 800 వార్డుల్లో 214 మంది ఏకగ్రీవం కావడంతో 585 వార్డులకు 1,533 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈనెల 11న మొదటి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో విడత ఎన్నికలు జరిగే 117 పంచాయతీల్లో ఐదుగురు సర్పంచ్లు ఏకగ్రీవం కావడం, సంగెం మండలంలోని ఒక పంచాయతీలో సర్పంచ్ స్థానానికి నామినేషన్ పడకపోవడంతో మిగిలిన 111 సర్పంచ్ స్థానాలకు 360 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 1,008 వార్డుల్లో 97 వార్డులు ఏకగ్రీవం కావడం మరో ఐదు వార్డుల్లో నామినేషన్లు పడకపోవడంతో మిగిలిన 906 వార్డుల్లో 2,142 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈనెల 14వ తేదీన రెండో విడత పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. మూడో విడత నామినేషన్ల పరిశీలన పూర్తి కాగా ఈ నెల 9వ తేదీన ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల లెక్క తేలనుంది. ఇప్పటికే మూడు విడత ఎన్నికలకు పోలింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశారు. హనుమకొండ జిల్లాలో 11 జీపీలు.. హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో మొదటి విడత 69 గ్రామపంచాయతీలు, 658 వార్డులకు, రెండో విడతలో 73 గ్రామ పంచాయతీలు, 694 వార్డుల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. ఈ క్రమంలో మొదటి విడత భీమదేవరపల్లి మండలంలోని వీర్లగడ్డ తండా, ఎల్కతుర్తి మండలంలోని గుంటూరుపల్లి, శాంతినగర్, కమలాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీలు వార్డు సభ్యులతో సహా ఏకగ్రీవమయ్యాయి. ఈ లెక్కన 69 గ్రామ పంచాయతీలకు నాలుగు పూర్తిస్థాయిలో ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా భీమదేవరపల్లి మండలంలోని గాంధీనగర్ సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. ఇందుకు సంబంధించిన వివరాలు జిల్లాస్థాయిలో అధికారులు శుక్రవారం వెల్లడించారు. రెండో విడత ధర్మసాగర్ మండలంలోని కేశవనగర్, నర్సింగరావుపల్లి, హసన్పర్తి మండలం కొత్తపల్లి, వేలేరు మండలం బండతండా, చింతల్తండా పూర్తి కార్యవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. హసన్పర్తి మండలంలోని అర్వపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ స్థానం మాత్రమే ఏకగ్రీవమైది. ఈ వివరాలు అధికారులు ప్రకటించారు. ఇక తుది విడత ఎన్నికలు జరిగే మండలాల్లో ఏకగ్రీవాలు తేలాల్సి ఉంది. జిల్లాలో మొత్తం రెండు విడతల్లో ఇప్పటి వరకు 11 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వరంగల్ జిల్లాలో రెండు విడతల్లో 16 ఏకగ్రీవాలు జోరుగా సాగుతున్న ప్రచారం -
ఐలోని మల్లన్నకు వర్ణలేపనం
ఐనవోలు: బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఐనవోలు మల్లికార్జునస్వామివారి మూల విరాట్, అమ్మవార్లకు సుధావళి వర్ణలేపనం (రంగులు అద్దడం) చేయనున్నారు. ఈ మేరకు ఈనెల 10 నుంచి 15 వరకు ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేయనున్నారు. గర్భాలయం మూసి ఉంచి అంతరాలయంలో రంగులు అద్దనున్నారు. భక్తులకు స్వామివారి ఉత్సవమూర్తుల దర్శనం మాత్రం అర్ధ మండపంలో ఉంటుంది. ఈ నెల 16న ఉదయం 4 గంటలకు నిర్వహించే దృష్టికుంభం కార్యక్రమంతో స్వామి, అమ్మవార్ల దర్శనం, ఆర్జిత సేవలు పునరుద్ధరించనున్నట్లు ఆలయ ఈఓ కందుల సుధాకర్, ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, దేవాలయ ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ తెలిపారు. దర్శనాల నిమిత్తం ఆలయానికి వచ్చే భక్తులు గమనించి సహకరించాలని ఈఓ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు ఆలయం మూసివేత 16న దృష్టికుంభంతో దర్శనాల పునరుద్ధరణ -
సోమవారం శ్రీ 8 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
కబ్జా చేసిన ప్రభుత్వ భూమిలో చేపట్టిన నిర్మాణ ం (ఇన్సెట్లో) అధికారులు ఏర్పాటు చేసిన బోర్డు (ఫైల్)రూ.కోట్ల విలువైన ఈ ప్రభుత్వ స్థలం కబ్జా వెనుక అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పెద్ద తలకాయలు ఉన్నట్లు గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. ఇలా ఉండగా.. రెవెన్యూ, సర్వే శాఖల్లోని కొందరు ఉన్నతాధికారులు కబ్జాదారులకు సహకరిస్తామని హామీ ఇచ్చి మరీ పోస్టులు పొందారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో పనిచేసిన తహసీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్వోలు ఈ భూమి ప్రభుత్వానిదని బోర్డులు పెట్టి, అప్పటి నిర్మాణాలను తొలగించారు. దశాబ్దాలుగా కాపాడుతూ వచ్చారు. అయితే కాసులకు కక్కుర్తిపడిన కొందరు అధికారులు తప్పుడు పత్రాలు సృష్టించడానికి రాజకీయ నాయకులకు సహకారం అందించారని, దాని ద్వారానే ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం అవుతోందని స్థానికులు అంటున్నారు. హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా కేంద్రం నడిబొడ్డున రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కలెక్టరేట్కు కూతవేటు దూరంలోని ప్రస్తుత రిజిస్ట్రేషన్ కార్యాలయం పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించారు. దీని వెనుక అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొంతమంది అగ్రనేతలు ఉన్నారని, వారి ఒత్తిడితోనే అధికారులు ముందుకు రావట్లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించకపోతే తర్వాత ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం కష్టమని స్థానికులు పేర్కొంటున్నారు. ఇంతకాలం కాపాడినా.. హనుమకొండ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన సర్వే నంబర్ 690లో 33 గుంటల భూమి ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో చెరువు కట్ట, ప్రధాన రోడ్డు, అంతర్గత రోడ్లు పోగా కొంత ప్రభుత్వ భూమి మిగిలి ఉంది. ఈ స్థలాన్ని గతంలో కొందరు తప్పుడు పత్రాలతో కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. అదికూడా మినహాయించినా అక్కడ ఇంకా మూడు గుంటల ప్రభుత్వ భూమి ఉందని సర్వే డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. దీని ఆధారంగా కొన్ని రోజుల క్రితం రెవెన్యూ అధికారులు ఆ భూమి ప్రభుత్వానిదే అంటూ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అయితే కబ్జా కోరులు రెవెన్యూ అధికారులు బోర్డు పెట్టిన రోజు రాత్రి ఆ బోర్డును తొలగించి, స్థలాన్ని చదును చేసి కబ్జా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలిసినా రెవెన్యూ అధికారులు కనీసం పోలీసు కేసు నమోదు చేయకపోవడం విమర్శలకు దారితీసింది. సమీప సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్.. గతంలో బతుకమ్మ ఆడడంతో ఈ స్థలాన్ని బతుకమ్మ బండ అని పిలిచేవారు. బతుకమ్మ ఆడినట్లు ఫొటోలు, ఆధారాలు కూడా గ్రామస్తుల వద్ద ఉన్నాయి. కొంతకాలం తర్వాత పరిస్థితి అనుకూలించకపోవడంతో అక్కడ బతుకమ్మ ఆడడం ఆపేశారు. ఆ తర్వాత క్రమంగా కబ్జాదారుల కన్ను ఈ భూమిపై పడింది. క్రమక్రమంగా పరిస్థితులు తమకు అనుకూలంగా మలుచుకుంటూ, తమకు కావాల్సిన అధికారులను తీసుకొచ్చి రహస్యంగా పనులు చక్కబెట్టుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. పక్క సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకుని ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని విమర్శలు వచ్చినా అధికారులు చర్యలు తీసుకోలేదు. నిర్మాణాలను అడ్డుకున్న గ్రామస్తులు కొద్దిరోజుల క్రితం రాత్రికి రాత్రి ఇక్కడ నిర్మాణాలు జరుగుతుండగా అడ్డుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యేలను కలిసి సమస్య వివరించారు. ఊరంతా ఏకమై నిర్మాణదారులపై తిరగబడ్డారు. అయితే, అప్పట్లో నిర్మాణాలను ఆపిన కబ్జాదారులు తర్వాత క్రమంగా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని నిర్మాణాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అంతా అన్యాక్రాంతం అయినా.. చివరకు మూడు గుంటలు ప్రభుత్వ భూమి ఉందని నిర్ధారించిన అధికారులు ఆభూమిని కాపాడే చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు ఊతమిస్తోంది. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.నిర్మాణాలు కనిపించకుండా అడ్డుగా పెట్టిన రేకులుఅక్కడ మూడు గంటల ప్రభుత్వ స్థలం ఉంది. సర్వేయర్ రిపోర్టు ద్వారా ఈ విషయం వెల్లడైంది. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ స్థలమని ఏర్పాటు చేసిన బోర్డును కొందరు తొలగించారు. ఈ విషయం మా దృష్టికి రాగానే ఉన్నతాధికారులకు తెలియజేశాం. వారి ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. – దశరథ రాంరెడ్డి, హనుమకొండ రెవెన్యూ ఇన్స్పెక్టర్ హనుమకొండ నడిబొడ్డున ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు కొంతమంది అధికార, ప్రతిపక్ష పార్టీల అగ్రనాయకుల దందా పట్టించుకోని రెవెన్యూ అధికారులు.. స్థలం స్వాధీనం చేసుకోవాలని స్థానికుల డిమాండ్ -
పైసలిస్తేనే పనులు!
ప్రైవేట్ స్కూళ్ల నుంచి వసూళ్లు.. ● ప్రైవేట్ స్కూళ్ల రెన్యువల్, కొత్త స్కూళ్ల అనుమతికి భారీగా వసూళ్లు ● తాజాగా ఏసీబీకి చిక్కిన హనుమకొండ ఇన్చార్జ్ డీఈఓ, ఇద్దరు ఉద్యోగులువిద్యారణ్యపురి: ఉమ్మడి జిల్లా విద్యాశాఖలో అవినీతి భూతం రాజ్యమేలుతోంది. ఏ పని కావాలన్నా పైసలు ముట్టజెప్పాల్సిందే. అవినీతి ఆరోపణల నేపథ్యంలో గతంలో డీఈఓలుగా పనిచేసిన పలువురిని విద్యాశాఖ బదిలీ చేయడంతోపాటు బాధ్యతల నుంచి తప్పించింది. ఒకరిద్దరు మాత్రం వారికివారే తప్పుకున్నారు. హనుమకొండ డీఈఓగా పనిచేసిన వాసంతిపై పలు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదుల నేపథ్యంలో ఆమెను డీఈఓ బాధ్యతల నుంచి తప్పించగా సెలవుపై వెళ్లారు. అదనపు కలెక్టర్ వెంకటరెడ్డికి ఎఫ్ఏసీ డీఈఓగా బాధ్యతలు అప్పగించారు. రెగ్యులర్ డీఈఓలు లేక.. విద్యాశాఖ డీలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యాశాఖ గాడి తప్పింది. రెగ్యులర్ డీఈఓలు లేక డీలా పడింది. ములుగు జిల్లాలో కొంతకాలం క్రితం అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) ఇన్చార్జ్ డీఈఓగా పనిచేస్తూ ఏసీబీకి పట్టుబడ్డాడు. వరంగల్ జిల్లాలో ఏడీ అధికారికే డీఈఓ బాధ్యతలు అప్పగించగా.. అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు వేరే జిల్లాకు బదిలీ చేశారు. హనుమకొండ జిల్లాలో గత డీఈఓను విధులనుంచి తప్పించి అదనపు కలెక్టర్కు బాధ్యతలు అప్పగించినా అదే పరిస్థితి దాపురించింది. డీఈఓ కార్యాలయానికి అప్పుడప్పుడు మాత్రమే వచ్చివెళ్లేవారు. ఎక్కువ ఫైళ్లను కలెక్టరేట్లోని తన చాంబర్కు సిబ్బంది తీసుకెళ్తే సంతకాలు చేసేవారు. దీంతో డీఈఓ కార్యాలయంలో పర్యవేక్షణ కొరవడింది. పలు సెక్షన్లలోని సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో టీసీ బుక్స్ ఇస్తే సెక్షన్లో ఉండే సిబ్బంది ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల నుంచి వసూలు చేసేవారు. దీంతో ఫిర్యాదు రాగా, అక్కడ సెక్షన్లో పనిచేసే ఉద్యోగిని తప్పించి టీసీ బుక్స్ ఇచ్చే బాధ్యతలు అప్పటి డీఈఓ అబ్దుల్హై హయాంలో డీసీఈబీకి అప్పగించారు. అప్పటి నుంచి డబ్బులు వసూలు చేయకుండా నిబంధనల ప్రకారమే టీసీ బుక్స్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు ఇస్తున్నారు. అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి బాధ్యతలు స్వీకరించాక టీసీ బుక్స్ మళ్లీ డీఈఓ కార్యాలయంలో సంబంధిత సెక్షన్కే అప్పగించాలని ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. టీసీ బుక్స్కు కూడా డబ్బులు వసులు చేసేందుకే సెక్షన్ సిబ్బంది చక్రం తిప్పి డీఈఓతో ఉత్తర్వులు జారీ చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి.హనుమకొండ జిల్లాలో 200కుపైగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఒకటి నుంచి ఐదో తరగతి పాఠశాలలు డీఈఓ పరిధిలో, 6 నుంచి 10వ తరగతివరకు పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ పరిధిలో అనుమతులు రెన్యువల్ చేస్తారు. అయితే, హైస్కూళ్లు ప్రతీ 10 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. గతంలో ఒక స్కూల్లో ఒకటి నుంచి 5 తరగతుల వరకు డీఈఓ అనుమతి, రెన్యువల్ చేస్తే సంబంధిత సెక్షన్లో రూ.30 వేల వరకు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు డీఈఓ రెన్యువల్, అనుమతి ఇచ్చాక.. 6 నుంచి 10వ తరగతి వరకు అనుమతికి పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీకి కూడా రెకమండ్ చేయాలి. ఒక కాపీని ఆర్జేడీ కార్యాలయానికి పంపుతారు. గత డీఈఓ హయాంలో కార్యాలయ సెక్షన్లో రూ.60 వేల వరకు వసూలు చేశారని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు పేర్కొన్నారు. కొత్తగా ప్రైవేట్ పాఠశాలల అనుమతికి రూ.లక్షకుపైగానే సెక్షన్ సిబ్బంది వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. రెన్యువల్ ఫీజుగా ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించేది రూ.5వేలు మాత్రమే. డీఈఓ కార్యాలయ సెక్షన్లో మాత్రం రూ.60 వేలు ఇవ్వాల్సి రావడంతో యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. నూతన పాఠశాలల అనుమతికి ప్రభుత్వానికి చలాన్ రూ పంలో రూ.10 వేలు మాత్రమే చెల్లించాలి. హనుమకొండ కొత్తూరు జెండాలోని క్రియేటివ్ మోడల్ హైస్కూల్ 10 సంవత్సరాల రెన్యువల్కు డీఈఓ కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ గౌస్, జూనియర్ అసిస్టెంట్ మనోజ్ రూ.లక్ష డిమాండ్ చేశారు. శుక్రవారం రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు వీరు పట్టుబడ్డారు. వీరితోపాటు ఇన్చార్జ్ డీఈఓ ఎ.వెంకటరెడ్డిని కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఎఫ్ఏసీ డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన 35 రోజులకే వెంకటరెడ్డి అవినీతి నిరోధక శాఖకు పట్టుబడడం కలకలం రేపింది. -
ఎన్నికలకు సిద్ధం కావాలి
న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో జరిగే సర్పంచులు, వార్డు సభ్యుల ఎన్నికలకు అన్ని విధాలా సిద్ధం కావాలని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ఈనెల 11వ తేదీన జిల్లాలోని వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాల్లో జరిగే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ తదితర ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, బస్సులు, పోలీసు బందోబస్తు, ఓటర్ స్లిప్పుల పంపిణీ ఈనెల 8వ తేదీలోగా పూర్తి కావాలన్నారు. ప్రతీ మండలానికి రెండు హరిత పోలింగ్ కేంద్రాలు ఉండేటట్లు చూడాలని అధికారులకు సూచించారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా.. ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, మండల ప్రత్యేకాధికారులు, నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద -
ఇద్దరు సర్పంచ్లు ఏకగ్రీవం
హసన్పర్తి: హసన్పర్తి మండలంలో ఇద్దరు సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. అలాగే, అర్వపల్లి సర్పంచ్ ఏకగ్రీవం కాగా, కొత్తపల్లి సర్పంచ్తో పాటు పాలకవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తపల్లిలో ఉపసర్పంచ్ ఎన్నిక కూడా జరిగింది. కొత్తపల్లి జీపీ పాలకవర్గం ఏకగ్రీవం కొత్తపల్లి సర్పంచ్ దండి సాంబయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపసర్పంచ్గా చిరంజీవి, వార్డు సభ్యులుగా వేముల మానస, పుట్ట నర్మద, అన్న బాలయ్య, అన్న తిరుపతి, పుట్ల నీల ఎన్నికయ్యారు. అర్వపల్లి సర్పంచ్గా ప్రభాకర్ అర్వపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా అంబాల ప్రభాకర్ ఏకగ్రీవమయ్యారు. అన్ని వార్డు సభ్యులకు పోటీ అనివార్యమైంది. ఫలించిన సీనియర్ల చర్చలు ఏకగ్రీవానికి కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్ నర్సంహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఉదయ్కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ మదన్గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ ఎల్లేష్ రాజకీయ పార్టీలతో చర్చలు జరిపారు. బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో నామినేషన్ దాఖలు చేసిన దండి సాంబయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసిన అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకున్నారు. గంటూరుపల్లి కాంగ్రెస్ బలర్చిన అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ గంటూరుపల్లి కాంగ్రెస్పార్టీ మద్దతుతో నామినేషన్ వేసిన చాణిక్యరెడ్డి పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న రాకేష్రెడ్డిని కాంగ్రెస్లోకి చేర్చుకుని మద్దతు ప్రకటించారు. 1వ వార్డు స్థానంలో లోకనబోయిన దేవిక, 2వ వార్డు కడిపికొండ పల్లవి, 4వ వార్డు సుంకరి రాంరెడ్డి, 5వ వార్డు కొండ సోమయ్య, 6వ వార్డు గంట రమణారెడ్డి, 7వ వార్డు పోరెడ్డి, వాణి, 8వ వార్డు మడపల్లి రాజు ఏకగ్రీవమయ్యారు. 3వ వార్డుల్లో గన్నోజు రవీందర్, పురుషోత్తం మధ్య పోటీ అనివార్యమైంది. సీతంపేటలోని 3వ వార్డులో గిన్నారపు స్వప్న, 4వ వార్డులో గిన్నారపు సంధ్య ఏకగ్రీవమయ్యారు. -
ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
● రోడ్డు ప్రమాదాల్లో 377 మంది మృతిచెందితే అత్యధికంగా 128 మంది బైకర్లు ఉన్నారు. ఇందులో దాదాపు 90 మంది వరకు 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారుంటే, మైనర్లు కూడా 12 మంది ఉన్నారు. మిగిలిన 26 మంది 45ఏళ్లపైబడిన వారు. ● ఆ తర్వాత అత్యధికంగా రోడ్లు, డివైడర్లు క్రాస్ చేస్తూ.. రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న 85 మంది పాదచారులు వివిధ ప్రమాదాల్లో మృతిచెందారు. వీరిలో 26 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలే ఎక్కువ శాతం మంది ఉన్నారు. ● కార్లు, జీపులు, వ్యాన్లు వాహనాల్లోని 42 మంది, లారీల్లోని 32 మంది, సైకిల్స్ నడుపుతున్న పది మంది, ఆటోరిక్షాల్లోని ఏడుగురు, బస్సుల్లోని ఐదుగురు, ఈ–ఆటోరిక్షాలోని నలుగురు మృతి చెందారు. 64 మంది ఇతర వాహనాలకు చెందిన వారున్నారు.సాక్షి, వరంగల్: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆ మూడు గంటల్లోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం, మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్యలో 271 ప్రమాదాలు జరిగి 84 మంది మృతిచెందగా... మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్యలో 270 ఘటనలు జరిగి 65 మంది చనిపోయారు. ఆ సమయాల్లో డ్రైవింగ్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలనే సంకేతాలను ఈ గణాంకాలు చెబుతున్నాయి. సాయంత్రం సమయంలోనే వాహనాలు ఎక్కువగా రోడ్డు మీదకు రావడం, గమ్యస్థానాలకు తొందరగా చేరుకోవాలనుకునే క్రమంలో అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్తో తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. తమకు ఏం సంబంధం లేని ఎదుటివారి ప్రాణాలను బలిగొంటున్నారు. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు అంటే పది నెలల కాలంలో 1,250 రోడ్డు ప్రమాదాలు జరిగితే 377 మంది మృతి చెందగా, 1,253 మంది క్షతగాత్రులయ్యారని ట్రాఫిక్ పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండడంతోపాటు ట్రాఫిక్ నియమాలను పాటిస్తే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుతారని పోలీసులు అంటున్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు271 84 240 వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి నుంచి అక్టోబర్ వరకు 1,250 రోడ్డు ప్రమాదాలు మృతులు 377, క్షతగాత్రులు 1,253 అప్రమత్తతోపాటు ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే సురక్షితంగా గమ్యస్థానాలకు -
పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, ప్రశాంతంగా వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 11న నిర్వహించనున్న మొదటి విడత ఎన్నికలను పురస్కరించుకుని పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలని సూచించారు. తాగునీరు, విద్యుత్, శానిటేషన్, ర్యాంపులు, లైట్లు, టెంట్ల వంటి సౌకర్యాలపై సమీక్షించి లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని సూచించారు. అదేవిధంగా పోలింగ్ సిబ్బంది నియామకం, సామగ్రి పంపిణీ, రవాణా భద్రతా చర్యల కోసం విభాగాల వారీగా తగిన ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ, ఇన్చార్డ్ డీఆర్డీఓ రాంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఎన్నికలయ్యే వరకూ కోడ్ అమలు ఎన్నికలు పూర్తయ్యే వరకు కోడ్ అమలులో ఉంటుందని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 11, 14, 17 తేదీల్లో గ్రామపంచాయతీ, వార్డు స్థానాలకు ఎన్నికలకు జరుగుతాయని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, నాయకులు, ప్రజలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు పూర్తిగా పాటించాలని కోరారు. -
స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
వరంగల్ క్రైం : స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా.. ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనర్ శనివారం కాజీపేట ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయ సిబ్బంది అధికారులు సీపీకి పూలమొక్కను అందజేసి స్వాగతం పలకగా, సాయుధ పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం కార్యాలయ పరిసరాలు, స్పెషల్ గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ పెండింగ్ కేసులతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల నిబంధనలను అతిక్రమించే వారిపై అలసత్వం వహించొద్దని సీపీ పోలీసు అధికారులకు సూచించారు. సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు పుల్యాల కిషన్, సుధాకర్ రెడ్డి, చేరాలు, శ్రీధర్ రావు, రమేష్ పాల్గొన్నారు. కాజీపేట : కాజీపేటలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో (ఐటీఐ) ఈ నెల 12న జాతీయ మెగా అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్లతో పాటు అన్ని ట్రేడ్ల అభ్యర్థులు మేళాకు హాజరు కావాలని కోరారు. బయోడేటా, అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ కాపీ, పదో తరగతి, ఐటీఐ మెమో, ఎన్టీసీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు వెంట తెచ్చుకోవాలని సూచించారు. www.apprenticeshipindia. gov.in వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని టీచింగ్, నాన్టీచింగ్ ఉద్యోగుల ముఖగుర్తింపు (ఎఫ్ఆర్ఎస్) హాజరును త్వరలోనే అమలు చేయబోతున్నారు. దీంతో ఉద్యోగుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను శనివారం యూనివర్సిటీలోని పరిపాలన భవనంలో ప్రారంభించగా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం పర్యవేక్షించారు. విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కార్యాలయాలు, విద్యావిభాగాలు ఆఫీసుల్లో ఈ ప్రక్రియను కొనసాగిస్తామని రిజిస్ట్రార్ రామచంద్రం తెలిపారు. ఈనెల 8న కూడా వివిధ విభాగాల ఉద్యోగులకు నమోదు ప్రక్రియ కొనసాగనుందని వివరించారు. కాజీపేట అర్బన్ : భీమదేవరపల్లిలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కపిల్ ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్గా అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడగా జిల్లా రిజిస్ట్రార్ ప్రవీన్కుమార్ శనివారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్గా అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడడంతో షోకాజ్ నోటీ సు అందజేసి కొడకండ్లకు బదిలీ చేశారు. హసన్పర్తి: హసన్పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సీతంపేట ఉపకేంద్రాన్ని శనివారం హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపకేంద్రంలో నిర్వహిస్తున్న వ్యాధినిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. వ్యాక్సిన్ రికార్డులను సరిచూశారు. గర్భిణుల నమోదును అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. -
‘వనితవనం’లో మహిళా శక్తి భవనం
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్ : మహిళా శక్తి భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని నగర మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో మేయర్ క్షేత్రస్థాయిలో మహిళా శక్తి భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేసి సమర్థవంతంగా పనులు చేపట్టేందుకు అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలోని వనితవనం ప్రాంతంలో మహిళా శక్తి భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేశామని, అక్కడే లోటస్ పాండ్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదే ప్రాంతంలో ప్రవహిస్తున్న నాలాను మేయర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్ఈ సత్యనారాయణ, సీహెచ్ఓ రమేశ్, ఏంహెచ్ఓ డాక్టర్ రాజేష్, హెచ్ఓ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. వ్యర్థాల ఎనర్జీ ప్లాంట్ పరిశీలనగోవాలో వ్యర్థాల నిర్వహణకు అనుసరిస్తున్న సాంకేతిక విధానాలను బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ శనివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. నిర్వహణ తీరును అక్కడి సాంకేతిక నిపుణులను అడిగి తెలుసుకున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణలో అత్యాధునిక పద్ధతులు శక్తి ఉత్పాదిత సాంకేతికత పర్యావరణ పరిరక్షణ సంబంధిత చర్యలను కమిషనర్ పరిశీలించారు. యంత్రాల సామర్థ్యం, డిజిటల్ మానిటరింగ్ తదితర అంశాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు. -
సర్పంచ్ వేతనం @ రూ.6,500
భూపాలపల్లి అర్బన్ : గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి, గెలువడానికి ఆశావహులు పెద్దసంఖ్యలో ఉత్సాహపడుతుంటారు. పదవిని దక్కించుకోవడానికి రూ.లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. వారి ఉత్సాహం, గెలుపొందడానికి వారు పె డుతున్న ఖర్చు చూసి ప్రజలు సర్పంచ్కు ఎంత వేతనమొస్తుందో, ఆ పదవి ద్వారా ఎంత ఆదాయం ఉంటుందో, అందుకే అంతగా ఖర్చు చేస్తున్నారని అనుకుంటుంటారు. రూ.లక్షలు ఖర్చు పెట్టి ఒక్కొక్కరిని బతిమిలాడి సర్పంచ్గా గెలిస్తే వారికి నెలకు వచ్చే వేతనం రూ.6,500 మాత్రమే. అది కూడా నెలనెలా రాదు. ఎప్పుడో ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేసినప్పుడే తీసుకోవాలి. ఇదిలా ఉండగా 1992కు ముందు సర్పంచ్కు వేత నం లేదు. ఆ తర్వాత చిన్న జీపీలకు సర్పంచ్కు రూ.600, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్కు రూ.వెయ్యి మాత్ర మే ఇచ్చేవారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2015, ఏప్రిల్ 1 నుంచి సర్పంచ్ వే తనం రూ.5 వేలు చేశారు. ఆ తర్వాత 2021లో రూ.6,500 పెంచారు. కాగా, 2018 తర్వాత నుంచి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినా ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచడంతో చిల్లిగవ్వ ఆదాయం రాకపోగా పనులు చేయడానికి తెచ్చిన అప్పులకు వడ్డీలు మీదపడుతున్నాయని పలువురు వాపోతున్నారు. మరీ ఇంత తక్కువ వేతనం, పనులు చేసినా పైసలు రాకున్నా అంత పోటీ ఎందుకు? అంత ఖర్చు చేస్తారంటే సర్పంచ్ ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు. ఆ హోదా, దర్పం, దర్జా దక్కించుకోవడం కోసం ఉన్న ఆస్తి అమ్మి అయినా, అప్పు చేసైనా విజయం సాధించాలని ఖర్చు చేస్తున్నారు. అభ్యర్థులూ.. ఆలోచించండి గెలిచేందుకు రూ.లక్షల్లో ఖర్చు అభివృద్ధి పనులు చేస్తే బిల్లుల కోసం ఏళ్లుగా ఎదురుచూపులే.. -
పల్లె పరిపుష్టికి బాట..
జనగామ: ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు.. రాష్ట్రపతి నుంచి గవర్నర్ వరకు.. వివిధ కార్యక్రమాల నిమి త్తం పల్లెకు ఏ ప్రజాప్రతినిధి, ఏ అధికారి వచ్చినా సభకు అధ్యక్షత వహించేది గ్రామ సర్పంచే. దేశ అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న గ్రామాల నుంచి వచ్చే ఆర్థిక వనరులే అత్యంత ప్రధానం. అందుకే గ్రామ ప్రజాస్వామ్యానికి బాటలు వేసిన పంచాయతీరాజ్ వ్యవస్థ దేశ అభివృద్ధికి పునాదిగా నిలిచింది. బల్వంత్రాయ్ మెహతా కమిటీ సూచనల మేరకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1959లో గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పాటుకు నాంది పలికారు. రాజస్థాన్లో మొదట అమలైన ఈ వ్యవస్థ.. వెంటనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు విస్తరించింది. పల్లె పాలనను బలపర్చేందుకు పంచాయతీల నుంచి మూడు శాఖలను వేరుచేసి గ్రామీణాభివృద్ధి, శానిటేషన్, వసతి వంటి 15 కీలక శాఖలను జీపీల పరిధిలోకి చేర్చారు. సర్పంచ్ ఆధ్వర్యంలోని ఈ వ్యవస్థ గ్రామాలకు స్వయం పాలన అందించే ప్రజాస్వామ్య వేదికగా నిలుస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో 65 ఏళ్లు దాటి.. 66వ సంవత్సరంలోకి అడుగిడిన పంచాయతీ శాఖ ప్రయాణంపై పల్లె పాలన గుర్తు చేస్తూ ‘సాక్షి’ ప్రత్యేక కథనం. పంచాయతీరాజ్ గొడుగు కింద 29 శాఖలు గ్రామ పంచాయతీ పరిధిలో 15 శాఖలు పనిచేస్తున్నాయి. పంచాయతీరాజ్ శాఖ కింద రెవెన్యూ మినహా మొత్తం 29 శాఖలు ఉండగా, 15 శాఖలు మాత్రమే ఈ శాఖ పరిధిలోకి వస్తాయి. నేటికీ వందశాతం బదలాయింపు జరగలేదు. ప్రధానంగా విద్యుత్, వైద్యం, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, విద్య, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, వ్యవసాయం, పశువైద్యం, పౌరసరఫరాలు, రోడ్ల భవనాలు, మత్స్యశాఖ, గృహనిర్మాణం, ఇరిగేషన్ శాఖలు గత కొంతకాలం వరకు కొనసాగాయి. పంచాయతీల్లో సేవలందించేది ఎవరు? పంచాయతీల్లో గ్రామపాలన కొనసాగించడానికి వీరంతా చాలా ముఖ్యం. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శి, కారోబార్ సేవలు క్షేత్రస్థాయిలో ఉంటాయి. గ్రామ పంచాయతీ పాలన , గ్రామీణాభివృద్ధి, ఈజీఎస్, గ్రామీణ గృహ నిర్మాణ శాఖలు, శానిటేషన్, స్వచ్ఛ భారత్ మిషన్, తాగునీరు, గ్రామీణాభివృద్ధి, రహదారులు, సామాజిక భద్రత, పెన్షన్ విభాగం, గ్రామ స్థాయి ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ, ఆరోగ్య శాఖ సబ్ సెంటర్లు, వ్యవసాయ అనుబంధ శాఖ, పశుసంవర్థక శాఖ, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, అంగన్వాడీ ఆయాలు.. వీరంతా నిత్యం గ్రామస్థాయిలో సేవలు అందిస్తారు. వీరంతా పంచాయతీ పాలనకు జవాబుదారీగా ఉంటారు. పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం.. పంచాయతీ వ్యవస్థ గతంతో పోలిస్తే నిర్వీర్యం దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం పంచాయతీరాజ్ వ్యవస్థలో జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, మండల పరిషత్(మూడు అంచెలు) మాత్రమే పరిగణనలోకి ఉండగా వీటికి అదనంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. 1959లో పంచాయతీల ఆవిర్భావంలో రెవెన్యూ మినహా అన్ని శాఖలు ఒకే గొడుగు కిందకు ఉండడంతో సర్పంచ్లదే పై చేయిగా ఉండేది. సర్వాధికారాలు సర్పంచ్లకే ఉండడంతో వివిధ శాఖల అధికారులకు ఇబ్బందులు తలెత్తేవి. దీంతో స్వయం ప్రతిపత్తి హోదా కావాలని వ్యవసాయం, విద్యుత్, విద్యాశాఖ అధికారులు పట్టుబడ్డారు. దీంతో మూడు శాఖలతో పాటు ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు ఇందులో నుంచి విడిపోవడంతో ప్రత్యేక శాఖలుగా ఆవిర్భవించాయి. దీంతో పంచాయతీరాజ్ వ్యవస్థలో సర్పంచ్ల పాత్ర నామమాత్రంగా మారిపోయింది. కాళేశ్వరం: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతున్నాయి. ఈసారి రాష్ట్ర ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపర్లో కూడా ‘నోటా’ ఓటును వినియోగించుకునేలా ఓటర్లకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లాలో నిరక్ష్యరాస్యుడైన మామ, అక్షరాస్యుడైన తన అల్లుడితో ‘నోటా’ వినియోగంపై జరిగిన సరదా సంభాషణ ‘సాక్షి’ పాఠకులకు అందిస్తుంది. అల్లుడు: మామ నమస్తే మనఊళ్లో సర్పంచ్ ఎలక్షన్లు ఎలా జరుగుతానయే. మామ: ఏమి అల్లుడా బాగేన. పట్నం (హైదరాబాద్ ) నుంచి ఎప్పుడచ్చినవ్. ఏమి ఎలచ్చన్లు రా. ధూంధాం నడస్తనయ్. కని నాకు నచ్చనోళ్లు సర్పంచ్కు నలుగురు ఏసిండ్రు. మనోళ్లే లేరు. అల్లుడు: ఏ మామ నీకు తెల్వదానే. ఎందుకు బాధ పడుతవ్. ఈసారి బ్యాలెట్ పేపర్లో కూడా నోటాకు రాష్ట్ర ఎనికల సంఘం అవకాశం కల్పించింది. మామ: గీ నోటా ఓటు ఏంది అల్లుడా.. అల్లుడు: నోటా అంటే (నన్ ఆఫ్ ది ఎబో) పైవి ఏవి కావు అని అర్థం. నీకు నచ్చని వారు పోటీలో ఉంటే నోటాకు నీ ఓటు వేయొచ్చు. నీ ఓటు వినియోగించుకున్నట్లు కూడా అవుతుంది. మామ: నోటాకే ఓట్లు బాగా పడితే ఎట్లా రా? అల్లుడు: నోటాకు ఓట్లు ఎక్కువ పడితే రెండో అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారట. మామ: గిదెప్పటి నుంచి అమలవుతోంది. అల్లుడు: పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో 2013లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈవీఎంలలో నోటా అవకాశం కల్పించారు. కానీ ఈసారి బ్యాలెట్ పేపర్లో ఇవ్వడంతో పల్లెల్లో కూడా వినియోగిస్తారు. మామ: సరే అల్లుడా..మాఊళ్ల అందరికీ నోటా ఓటు గురించి సెప్పుతా. ఇగ ఉంటా. ఓట్లయినంక కలుద్దాం. గెలిచినోళ్లం గురించి మాట్లాడుకుందాం.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్(45) ప్రకారం జీవో 138 పీఆర్ ప్రకారం తాగునీరు, సరఫరా, పారిశుద్ధ్యం, లైటింగ్, అంటువ్యాధుల నివారణ.. వంటి సేవలు అందిస్తున్నారు. అలాగే వంతెనలు, కల్వర్టులు, రహదారుల పునరుద్ధరణ తదితర మరమ్మతుల నిర్వహణతో పాటు పబ్లిక్ స్థలాల్లో విద్యుత్ సరఫరా అందించాలి. డ్రైనేజీ, వర్షపునీరు నివాస ప్రాంతాలకు రాకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీలపై ఉంటుంది. శానిటేషన్ నిర్వహణలో పంచాయతీల పర్యవేక్షణ చాలా కీలకం. ప్రధాన కూడళ్లలో కుండీల ఏర్పాటు, తడి, పొడి చెత్త వేరుచేయడంతో పాటు సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలి. శ్మశాన వాటికలు, జంతు కబేళాలు, సామూహిక మరుగుదొడ్లు, డంపింగ్ యార్డుల నిర్వహణ, పరిశుభ్రత బాధ్యత కీలకం. వీటితోపాటు స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుని దీర్ఘకాలికంగా ప్రజావసరాలను చేపట్టాల్సి ఉంటుంది. జనన, మరణాల ధ్రువీకరణ నమోదు, వరదనీరు, తాగునీటి పరిరక్షణ తదితర అంశాలను పంచాయతీలే పర్యవేక్షించాలి. పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 46 ప్రకారం గ్రంథాలయాల నిర్వహణ, దివ్యాంగులు, నిరాదరణకు గురై దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రోత్సాహం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 66 ఏళ్ల పీఆర్ ప్రయాణంలో అభివృద్ధిలో దూసుకుపోతున్న గ్రామాలు పల్లె పాలనకు మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పునాది.. -
భారీ రాతి పిల్లర్ ఏర్పాటు
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణంలో భాగంగా గద్దెల చుట్టూ రాతి పిల్లర్లతోపాటు సాలహారం నిర్మిస్తున్నారు. గద్దెల చుట్టూ ఎనిమిది ఆర్చ్ ద్వారాలు నిర్మిస్తున్నారు. శుక్రవారం ఆర్చ్ ద్వారం భారీ రాతి పిల్లర్ను పునాది(పీడిస్టల్) లో భారీ క్రేన్ల సాయంతో నిలబెట్టారు. పిల్లర్ పై చెక్కిన ఆదివాసీల గొట్టుగొత్రాల, వంశ వృక్షం చిత్రాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు. కాగా, పిల్లర్ను నిలబెట్టంత వరకు పస్రా సీఐ దయాకర్.. భక్తులను సమీపంలోకి రాకుండా చూశారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి రాయపర్తి: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరులో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఛత్తీస్గఢ్కు చెందిన రాంసింగ్(22), సీతారాం, తుళ్లు బోరు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటిపై ఉన్న 11కేవీ విద్యుత్లైన్ తాకడంతో షాక్కు గురై రాంసింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సీతారాం, తుళ్లు అనే వ్యక్తులకు తీవ్రగాయాలు కావడంతో గ్రామస్తులు 108లో ఆస్పత్రికి తరలించారు. ఎస్సై రాజేందర్ ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, మృతుడి కుటుంబీకుల నుంచి ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు. -
పొత్తు.. గమ్మత్తు
వాజేడు: రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మ ధ్య రాజకీయ వైరం ఉంది. అయితే వాజేడు మండలం పేరూరులో మాత్రం ఆయా పార్టీల నాయకులు కలిసిపోయారు. ఇక్కడ సర్పంచ్గా పోటీ చేస్తు న్న మహిళకు కాంగ్రెస్లోని ఒక వర్గంతోపాటు బీ ఆర్ఎస్ మద్దతు ఇవ్వడం విశేషం. ఇప్పటికే పేరూ రు సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ మద్దతుతో గొడ్డె వరలక్ష్మి నామినేషన్ దాఖాలు చేశారు. అయితే నా మినేషన్లకు చివరి రోజైన శుక్రవారం అనూహ్యంగా పేరూరు మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దివంగత గొడ్డె నాగేశ్వరరావు భార్య సరోజని నామినేషన్ దాఖలు చేశారు. ఈమెకు కాంగ్రెస్లోని ఒక వర్గంతోపాటు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. దీంతో సరోజన రెండు పార్టీల కార్యకర్తలతో వెళ్లి నామినేషన్ దాఖలు చేయడం కొసమెరుపు. ● ఒకే అభ్యర్థికి కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతు -
చిల్లర నాణేలతో డిపాజిట్
● వినూత్న రీతిలో నామినేషన్ కురవి: రూపాయి.. రూపాయి కూడబెట్టిన చిల్లర నాణేలతో ఫీజు చెల్లించి నామినేషన్ దాఖలు చేశారో ఓ మహిళా వార్డు అభ్యర్థి. మండలంలోని తాట్యతండాకు చెందిన బోడ వీరన్న భార్య సునీత అదే జీపీలో 8వ వార్డు మహిళకు రిజర్వ్ కావడంతో ఏ పార్టీ మద్దతు లేకుండా పోటీకి దిగారు. నామినేషన్కు సంబంధించిన ఫీజు రూ.250 చెల్లించాల్సి ఉంది. దీనికి ఆమె అప్పుడప్పుడు కవర్లో దాచుకున్న రూపాయి నాణేలను తీసుకుని భర్తతో కలిసి కొత్తూరు(జీ) గ్రామ పంచాయతీలోని నామినేషన్ కేంద్రంలో అధికారులకు చెల్లించి నామినేషన్ వేసింది. అధికారులు ఆ చిల్లర నాణేలు లెక్కించుకుని నామినేషన్ పత్రాలు స్వీకరించారు. -
బొట్టు పెట్టి.. ఓటు అడిగి..
వీఓఏకు రాజీనామా చేసి సర్పంచ్ బరిలో..సంగెం: వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన పెంతల సువర్ణ వీఓఏ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ బరిలో నిలిచింది. ఈ గ్రామం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో గ్రామస్తులు, మహిళలంతా కలిసి ‘సువర్ణ నీవు సర్పంచ్గా బరిలో నిలిచి గ్రామాభివృద్ధికి పాటుపడాలి’ అని కోరుకున్నారని, అందుకే సర్పంచ్గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. వీఓఏగా ఉంటూ మహిళలకు సేవలందించానని, సర్పంచ్గా గెలిపి మరిన్ని సేవలందిస్తానని సువర్ణ తెలిపారు.నాడు భర్త.. నేడు భార్య ● గతంలో నీలికుర్తి సర్పంచ్గా భర్త మనోహర్ ఎన్నిక ● ఈ ఎన్నికల్లో భార్య పార్వతికి అవకాశం..నామినేషన్ దాఖలు మరిపెడ రూరల్: మరిపెడ మండలం నీలికుర్తి జీపీ పరిధి రేఖ్యతండాకు చెందిన బానోత్ మనోహర్ గతంలో ఉమ్మడి నీలికుర్తి గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం రేఖ్యతండా నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు అయ్యింది. దీంతో సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించగా మనోహర్ భార్య పార్వతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా, పార్వతి గెలుపొందితే దంపతులు ఇద్దరూ సర్పంచ్ పదవి చేపట్టిన వారిగా అరుదైన గౌరవం దక్కనుంది.దాట్ల..ఆ దంపతులదే.. ● 20 ఏళ్లుగా గ్రామపాలన వారిదే.. దంతాలపల్లి : 20 ఏళ్లుగా ఆ కుటుంబం గ్రామపాలన సాగిస్తోంది. భర్త ఇప్పటికే మూడు పర్యాయాలు సర్పంచ్గా కొనసాగగా భార్య ఒకసారి.. మొత్తం నాలుగు పర్యాయాలు గెలుపొందారు. ప్రస్తుతం గ్రామం జనరల్ ఉమెన్గా రిజర్వ్ కావడంతో ఐదోసారి ఆ కుటుంబం బరిలో నిలిచింది. మండలంలోని దాట్లకు చెందిన కొమ్మినేని రవీందర్ 2001, 2005లో సర్పంచ్గా గెలుపొందాడు. 2010లో తన భార్య మంజుల సర్పంచ్గా గెలుపొందింది. 2019లో రవీందర్ మళ్లీ సర్పంచ్గా గెలుపొంది ప్రస్తుతం తాజా మాజీగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో గ్రామంలో ఐదోసారి జనరల్ ఉమెన్కు రిజర్వ్ కావడంతో మరోసారి మంజుల బరిలో నిలిచింది. కాళ్లు మొక్కి.. ఓటు అభ్యర్థించి..మహబూబాబాద్ మండలం దామ్యాతండా గ్రామపంచాయతీలో వృద్ధురాలి కాళ్లు మొక్కి ఓటు అభ్యర్థిస్తున్న సీపీఐ బలపరిచిన అభ్యర్థి బానోత్ లింగ్యా నాయక్ ప్రచార పదనిసలు.. -
ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
హనుమకొండ జిల్లా ఎన్నికల పరిశీలకుడు శివకుమార్నాయుడు హన్మకొండ అర్బన్: ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని గ్రామపంచాయతీ ఎన్నికల హనుమకొండ జిల్లా పరిశీలకుడు శివకుమార్నాయుడు అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ పరిశీలకులు ఎలక్షన్ కమిషన్కు కన్నులాంటి వారని, వీరి ద్వారానే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ప్రక్రియ చూస్తుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 58 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి, 70 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు పేర్కొన్నారు. మూడు దశల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వీరు విధులు నిర్వర్తించి నివేదికలు అందించాలని సూచించారు. జిల్లా అదనపు ఎన్నికల అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, జెడ్పీ సీఈఓ రవి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మహేందర్, మాస్టర్ ట్రైనర్స్ సుధాకర్రెడ్డి, రవి, శ్రీనివాస్ స్వామి పాల్గొన్నారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్..గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల నిర్వహణకు సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను హనుమకొండ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు శివకుమార్నాయుడు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ సమక్షంలో శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించారు. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. జిల్లాలో మొదటి విడత 69 గ్రామ సర్పంచ్, 658 వార్డు స్థానాల ఎన్నికల నిర్వహణ కోసం 20 శాతం రిజర్వ్ స్టాఫ్ కలుపుకుని మొత్తం 761 ప్రిసైడింగ్ అధికారులు, 1149 ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించినట్లు అధికారులు తెలిపారు. -
శనివారం శ్రీ 6 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
నర్సంపేటలో జరిగిన ప్రజా పాలన–ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్రెడ్డి, పక్కన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, నాయిని, రేవూరి, రాంచంద్రునాయక్, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ సారయ్యఅభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డినర్సంపేట సీఎం సభ సక్సెస్.. కార్యకర్తల్లో జోష్ ● భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులుహెలిపాడ్ వద్ద రేవంత్రెడ్డికి ఘనస్వాగతం ● పంచాయతీ ఎన్నికలపై దిశానిర్దేశం ● పోలీసుల భారీ బందోబస్తుసాక్షి, వరంగల్/నర్సంపేట/నర్సంపేట రూరల్ : నర్సంపేటలో కాంగ్రెస్ శ్రేణులు కదంతొక్కాయి. పట్టణంలో శుక్రవారం జరిగిన ప్రజాపాలన–ప్రజావిజయోత్సవ సభ సక్సెస్ కావడంతో కార్యకర్తల్లో జోష్ నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి సీఎం అయిన తర్వాత తొలిసారి నర్సంపేట వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం 3.32 గంటలకు చేరుకున్న సీఎంకు ఉమ్మడి జిల్లా నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి ప్రజాపాలన–విజయోత్సవ సభా వేదిక వద్దకు భారీ కాన్వాయ్తో బయలుదేరారు. సీఎం రేవంత్రెడ్డి రోడ్డు పొడువునా ప్రజలకు అభివాదం తెలుపుతూ సభాస్థలికి చేరుకున్నారు. ముందుగా సభా వేదిక వద్ద సుమారు రూ.600 కోట్లతో అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య మంత్రి రేవంత్ ప్రసంగించారు. పంచాయతీ ఎన్నికల్లో యువత, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సభకు నర్సంపేట డివిజన్లోని ఆరు మండలాల నుంచే కాకుండా ఉమ్మడి జిల్లా నుంచి పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రజల రాకతో సభా ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. సభలో మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పింగిలి శ్రీపాల్రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ రియాజ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, డాక్టర్ మురళీనాయక్, రేవూరి ప్రకాశ్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. సీఎం రేవంత్రెడ్డి హెలికాప్టర్ రాజుపేట గ్రామ శివారులోని హెలిపాడ్ వద్ద దిగింది. హెలికాప్టర్ దిగి బయటకు వచ్చిన సీఎంకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి అనసూయ( సీతక్క), కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితోపాటు మరి కొందరు ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. శాలువాలతో సన్మానించారు. ఔటర్ రింగ్ రోడ్డు, యూజీడీ తీసుకొస్తున్నాం కొత్త ఏడాది మేడారం జాతరకు మళ్లీ వస్తా నర్సంపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి -
బాల్య వివాహాలు చట్ట విరుద్ధం
వరంగల్ జిల్లా సంక్షేమ అధికారి రాజమణి వరంగల్ చౌరస్తా: బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, ఆ వివాహాల నిర్మూలనలో పురోహితుల పాత్ర కీలకమని వరంగల్ జిల్లా సంక్షేమ అధికారి బి.రాజమణి అన్నారు. వరంగల్ గోవిందరాజుల ఆలయంలో బాల్యవివాహాల నిర్మూలన కోసం షేర్ స్వచ్ఛంద సంస్థ, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సమన్వయంతో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజమణి హాజరై మాట్లాడుతూ 18 సంవత్సరాల్లోపు బాలికలు, 21 సంవత్సరాల్లోపు బాలురకు వివాహాలు చేస్తే బాల్య వివాహ నిరోధక చట్టం–2006 ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. 27వ డివిజన్ కార్పొరేటర్ అనిల్కుమార్ మాట్లాడుతూ బాల్యవివాహాల నిర్మూలన కోసం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ వసుధ, షేర్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ శిరీష, ఆలయ చైర్మన్ మరిపల్లి సంజీవరావు, ఆలయ ప్రధాన అర్చకుడు వరయోగుల శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో ఇన్చార్జ్ డీఈఓ
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ వెంకట్రెడ్డి శుక్రవారం ఏసీబీకి చిక్కారు. పాఠశాల అనుమతుల పునరుద్ధరణ కోసం రూ.లక్ష లంచం డిమాండ్ చేసి, అందులో రూ.60 వేలు తీసుకున్న అదనపు కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ వెంకట్రెడ్డితోపాటు విద్యాశాఖ సిబ్బంది గౌస్, మనోజ్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ కొత్తూరు జెండా ప్రాంతంలో ఉన్న క్రియేటివ్ మోడల్ హైస్కూల్ పదేళ్ల పునరుద్ధరణ అనుమతుల కోసం యాజమాన్యం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంది. ఎంతకీ అనుమతులు రాకపోవడంతో స్కూల్ యజమానులు.. డీఈఓ కార్యాలయ సెక్షన్ అసిస్టెంట్లు గౌస్, మనోజ్ను సంప్రదించారు. ఫైల్ ఆమోదానికి రూ.లక్ష ఇవ్వాలని, ఇస్తే డీఈఓ ఆమోదిస్తారని గౌస్, మనోజ్ వారికి తెలిపారు. అంతమొత్తం ఇవ్వలేమని నేరుగా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ వెంకట్రెడ్డిని కలిశారు. సిబ్బందికి చెబుతాననని, వారిని కలవమని ఆయన చెప్పారు. ఈసారి వారు రూ.75 వేలు ఇవ్వాలని చెప్పారు. మరోమారు వెంకట్రెడ్డిని కలిసి అంతమొత్తం ఇవ్వలేమని చెప్పడంతో కొంత తగ్గించి ఇవ్వమని తాను చెబుతానని భరోసా ఇచ్చారు. చివరగా శుక్రవారం రూ.60 వేలు మనోజ్కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8 గంటల వరకు దాడులు సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమైన దాడులు దాదాపు రాత్రి 8 గంటల వరకు కొనసాగాయి. అనంతరం ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మీడియాకు వివరాలను వెల్లడించారు. ముగ్గురిని శనివారం కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్లో తొలిదాడి హనుమకొండ కలెక్టరేట్ కొత్త భవనం ప్రారంభించి నాలుగేళ్లు పూర్తవుతున్న తరుణంలో, ఈ భవనంలో ఏసీబీ దాడులు జరగడం ఇదే తొలిసారి. ఉద్యోగులు విధులు ముగించుకొని బయటకు వెళ్లే సమయం కావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎదురుగా ఉన్న కలెక్టర్ చాంబర్లోనే దాడులు జరుగుతున్న సమయంలో కలెక్టర్ స్నేహ శబరీష్ సమావేశాలు ముగించుకొని తన చాంబర్లోనే ఉన్నారు. ఏసీబీ చర్యలు కొనసాగుతుండగా గంటకుపైగా అదే భవనంలో కలెక్టర్ ఉన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. గతంలో కూడా.. ఈ కేసులో పట్టుబడిన అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, గతంలో ఉమ్మడి జిల్లాలో జనగామ ఆర్డీఓగా, ఆపై నల్లగొండ జిల్లాలో పనిచేశారు. నల్లగొండలో చేసిన కాలంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, జనగామలో భూసేకరణ విషయంలో ఆరోపణలు, విచారణలు జరిగాయని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. అసలు గురి తప్పిందా..? ప్రస్తుతం ఇన్చార్జ్ డీఈఓగా ఉన్న అదనపు కలెక్టర్ ఏసీబీకి పట్టుబడిన విషయంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. గతంలో విద్యాశాఖలో పనిచేసిన ఉన్నతాధికారులు అక్రమాలకు పాల్పడ్డారని, తీవ్ర ఆరోపణలతో వారిని రాష్ట్ర అధికారులు తప్పించారని ప్రచారం సాగుతోంది. అక్కడికి ఇన్చార్జ్గా వచ్చిన వెంకట్రెడ్డి ఏసీబీకి బుక్కయ్యారని అంటున్నారు. లేదంటే గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు చిక్కేవారని చర్చ సాగుతోంది. బదిలీ కోసం ప్రయత్నిస్తూ.. ఏసీబీకి పట్టుబడ్డ జిల్లా అదనపు కలెక్టర్, ఇన్చార్జ్ డీఈఓ వెంకట్రెడ్డి జిల్లా నుంచి బదిలీ కోసం ఇటీవల తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు వస్తాయని ఆయన ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇన్చార్జ్గా బాధ్యతలు తీసుకున్న విద్యాశాఖ వ్యవహారంలో ఆయన ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయన బదిలీ దరఖాస్తు చేసిన నేపథ్యంలో జిల్లాకు అదనపు కలెక్టర్గా వచ్చేందుకు గతంలో ఉమ్మడి జిల్లా సమయంలో వరంగల్(ప్రస్తుతం హనుమకొండ) ఆర్డీఓగా పనిచేసిన అధికారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల జిల్లాకు వచ్చి ఒకరిద్దరు రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకునే పని పూర్తి చేసుకున్నట్లు సమాచారం. హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డితో పాటు ఇద్దరు ఉద్యోగుల అరెస్ట్ పాఠశాల అనుమతుల పునరుద్ధరణకు రూ.60 వేల లంచం కలెక్టరేట్ భవనంలో డబ్బులు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టివేత డీఈఓ ఆఫీస్ నుంచి కలెక్టరేట్కు మారిన సీన్... మొదట డబ్బులు గౌస్కు ఇచ్చేందుకు బాధితులు డీఈఓ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ గౌస్లేడు.. మనోజ్ ఒక్కడే ఉన్నాడు. డబ్బులు తెచ్చామని చెప్పడంతో కలెక్టరేట్లో ఉన్న అదనపు కలెక్టర్తో ఫైనల్ ఫిగర్ నిర్ధారించుకునేందుకు మనోజ్ కూడా కలెక్టరేట్కు వచ్చాడు. సార్తో మాట్లాడిన తరువాత ఐడీఓసీ వెనుక సీసీ కెమెరాలు లేని ప్రాంతానికి తీసుకెళ్లి వారి నుంచి రూ.60వేలు తీసుకున్నాడు. ఈ క్రమంలో అక్కడే కాపు కాస్తున్న ఏసీబీ అధికారులు మనోజ్ను అదుపులోకి తీసుకుని అదనపు కలెక్టర్చాంబర్కు తీసుకుచ్చారు. విచారణ అనంతరం వెంకట్రెడ్డి, మనోజ్, గౌస్లను అదుపులోకి తీసుకున్నారు. -
అధ్యాపకులు సమర్థవంతంగా పని చేయాలి
కేయూ క్యాంపస్: యూనివర్సిటీలో అకడమిక్ ప్రమాణాల్ని అభివృద్ధి చేసేలా అధ్యాపకులు మరింత సమర్థవంతంగా పని చేయాలని కేయూ వీసీ ప్రతాప్రెడ్డి కోరారు. గురువారం సాయంత్రం వర్సిటీలోని క్యాంపస్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించే వార్షిక ఇండక్షన్ ప్రోగ్రాం ఎక్సోప్లోర్ ఎంగేజ్ ఎక్సెల్ పోస్టర్లను అకడమిక్ కమిటీ హాల్లో కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, అన్ని విభాగాల అధిపతులతో కలిసి విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈవిద్యాసంవత్సరంలో వర్సిటీ కాలేజీలో వివిధ పీజీ కోర్సుల్లో 1,150 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని విద్యార్థులకు తరగతులు సక్రమంగా నిర్వహించాలన్నారు. విశ్వవిద్యాలయం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్, మెరుగైన స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకుని కృషి చేయాలన్నారు. 2028లో న్యాక్ గ్రేడింగ్ దృష్ట్యా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలన్నారు. విధుల్లో అనుచితంగా వ్యవహరించే వారిపై చర్యలకు వెనుకాడబోమని వీసీ ప్రతాప్రెడ్డి స్పష్టం చేశారు. ప్రతీ నెల విభాగాల వారీగా పురోగతిని పోర్టల్స్లో అప్లోడ్ చేసి రిపోర్ట్ చేయాలన్నారు. విద్యార్థులు కూడా సక్రమంగా తరగతులకు హాజరయ్యేలా విభాగాల అధిపతులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 12న ఉదయం 10 గంటలకు యూనివర్సిటీ ఆడిటోరియంలో పీజీ కోర్సుల మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇండక్షన్ ప్రోగ్రాంను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కేయూ వీసీ ప్రతాప్రెడ్డి విభాగాధిపతులతో సమావేశం -
కొలతలు పక్కాగా నమోదు చేయాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: భవన నిర్మాణాల అసెస్మెంట్ల కొలతలు పక్కాగా నమోదు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం హంటర్ రోడ్డు ప్రాంతంలో న్యూశాయంపేట జంక్షన్ విల్లాస్ రోడ్, భద్రకాళి బండ్ వైపు వెళ్లే ప్రాంతాల్లో నమోదు చేసిన అసెస్మెంట్ల కొలతలను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమర్థవంతంగా లెక్కించాలని సూచించారు. ఈసందర్భంగా బల్దియా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన కొలతలను కమిషనర్ పునఃపరిశీలించి నిర్ధారణ చేసి నమోదు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. నూతనంగా నిర్మించిన భవనాలకు పర్మిషన్ డాక్యుమెంట్లను, అనధికారిక నిర్మాణాలను పరిశీలించి అందుకు అనుగుణంగా వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ కమిషనర్ రవీందర్ ఆర్ఐ రజనీ, వార్డు ఆఫీసర్ శిరీష బిల్ కలెక్టర్ రాజేశ్, తదితరులు పాల్గొన్నారు. -
బుజ్జగింపులు.. నజరానాలు
హసన్పర్తి: ఎన్నికల నామినేషన్ ఉపసంహరించడానికి ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారు ప్రయత్నాలు ప్రారంభించారు. రెండో దశ నామినేషన్ల ఘట్టం శుక్రవారం ముగియనుంది. ఆయా గామాల్లో సర్పంచ్ పదవి కోసం అధికార పార్టీకి చెందిన పోటీదారుల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. సర్పంచ్ పదవి కోసం అధికార పార్టీలోనే పోటీ ఎక్కువైంది. వీరిని బుజ్జగించడానికి మండలానికి చెందిన సీనియర్ నాయకులు రంగంలోకి దిగారు. ఇదిలా ఉండగా.. నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఆయా పార్టీల నాయకులు ఇరువురు పోటీదారులతో మంతనాలు సాగిస్తున్నారు. నామినేషన్ ఉపసంహరిచుకుంటే నజరానాలు కూడా ప్రకటిస్తున్నారు. మద్దతు కోసం ఒత్తిడి కష్టకాలంలో పార్టీని కాపాడిన తమకు మద్దతివ్వాలని ఆయా గ్రామాల్లో సీనియర్ల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. పదేళ్ల పాటు బీఆర్ఎస్ నాయకుల వేధింపులు భరించిన తమకే పార్టీ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మరో వైపు పార్టీలో చేరిన వారు సైతం తమకు మద్దతు పలికాలని కోరుతున్నారు. మద్దతు ఇవ్వకుంటే మరో పార్టీలోకి జంప్ చేస్తామని అభ్యర్థులను హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బైరాన్పల్లి, సీతంపేట, అన్నాసాగరం, మల్లారెడ్డిపల్లిల్లో అధికార ప్రతిపక్షాల నుంచి నామినేషన్ దాఖలు చేసిన వారి నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. రెండు రోజుల క్రితం బైరాన్పల్లిలో సర్పంచ్ పదవి ఆశిస్తూ నామినేషన్ దాఖలు చేసిన అధికార పార్టీకి చెందిన పోటీదారుల నుంచి ఒకరిని ఉపసంహరించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గంటూరుపల్లిలో ఏకంగా సర్పంచ్ పదవి కోసం వేలం వేయగా బెడిసి కొట్టింది. చివరికి ఆరుగురు నామినేషన్ వేశారు. సూదన్పల్లిలో తల్లి, కూతురు, కొడళ్లు సర్పంచ్ పదవి కోసం నామినేషన్లు వేశారు. చివరికి వీరు పోటీల్లో ఉంటారా? ఒకరికే మద్దతు ప్రకటిస్తూ మిగతా ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకుంటారా? అనే చర్చ జరుగుతోంది. వేటుకు రంగం సిద్ధం.. పార్టీ ఆదేశాలు ధిక్కరించి బరిలో ఉండే వారిపై వేటుకు ఆయా పార్టీలు రంగం సిద్ధం చేసినట్లు తె లిసింది. పోటీదారులు కూడా అఽధిష్టానం వద్ద మొరపెట్టుకున్నట్లు సమాచారం. ఒకే పార్టీ పేరు చెబుతూ.. ఓట్లు అడిగినట్లయితే ఓటర్లు గందరగోళపడే అవకాశం ఉన్నట్లు పార్టీ భావిస్తోంది. ఏకగ్రీవం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు మద్దతివ్వకుంటే పార్టీ మారుతామని బెదిరింపు -
మందగించిందా..!?
‘గ్రేటర్’లో సీసీ రోడ్లు వేసిన ఏడాదిలోపే తవ్వకాలువరంగల్ అర్బన్ : ప్రజల సొమ్మంటే గ్రేటర్ వరంగల్లో లెక్క లేకుండా పోతోంది. వివిధ పన్నుల రూపేణా మహానగర ప్రజలు చెల్లిస్తున్న ప్రజాధనం అశాసీ్త్రయమైన నిర్ణయాలతో దుర్వినియోగమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ నగరం నడిబొడ్డున వరంగల్ కాశిబుగ్గ వివేకానంద కాలేజీనుంచి కూరగాయల మార్కెట్ వరకు వెళ్లే రోడ్డు పనులే. ఈ రోడ్డును ఏడాది కిందట రూ.40 లక్షలతో నిర్మించారు. పైప్లైన్ లీకేజీతో తాగునీరు వృథాగా పోతుండడంతో రోడ్డు దెబ్బతింది. దీంతో తాజాగా రోడ్డు తవ్వకాలు చేసి, ౖపైప్లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడే కాదు. అన్ని డివిజన్లలో ఇదే తరహాలో ఇంజనీర్లు పనులు చేపడుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇష్టారాజ్యంగా తవ్వకాలతో రోడ్లు ధ్వంసం ఏదైనా సీసీరోడ్డు, డ్రెయినేజీ నిర్మించే ముందు ఆయా కాలనీల్లో తాగునీటి పైప్లైన్లు నాణ్యత, లీకేజీలను పరిగణనలోకి తీసుకోవాలి. లీకేజీలు ఉంటే ముందుగా సరిచేయాలి. కానీ, బల్దియా ఇంజనీర్లు ఆవేమీ పట్టించుకోవట్లేదు. వివిధ కాలనీల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించగానే కార్పొరేటర్ల ఒత్తిళ్లతో ముందు చూపులేకుండా గ్రేటర్ ఇంజనీర్లు రోడ్డు పనులు చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనులు చేపట్టడం తదుపరి పైప్లెన్లు, కేబుళ్ల పేరుతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తూ రూపురేఖలను మార్చేస్తున్నారు. దీంతో ఏర్పడిన గుంతలతో వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. వాహనాదారులు నడుములు హూనమవుతున్నాయి. ప్రమాదాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ సమస్యలను బల్దియా ఇంజనీర్లు, కార్పొరేటర్లు ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకింత నిర్లక్ష్యం? ఆయా డివిజన్లలో ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేపడతారనే విషయం రెండు విభాగాల ఇంజనీర్లకు తెలిసి ఉండాలి. ఆ పనులను పక్కా ప్రణాళికతో చేపట్టాలి. ముందుగా ఆ ప్రాంతంలో తాగునీటి లీకేజీలు, నాణ్యతా ప్రమాణాలు గుర్తించాలి. ఒకవేళ లీకేజీలు తరచూ ఉత్పన్నమైతే ముందుగా పైప్లైన్ వేయాలి. తదుపరి సీసీ రోడ్డు, ఆ తర్వాత డ్రెయినేజీని నిబంధనలకు మేరకు నిర్మించాలి. కానీ, రూల్స్ను ఇంజనీర్లు అతిక్రమిస్తూ ప్రజాధనం నేలపాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. కమీషన్ల కోసం ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇంజనీర్లు, పాలకవర్గ సభ్యులు మాత్రం లీకేజీల వల్ల తాగునీటి సమస్య ఎదురవుతుండడంతో రోడ్లతవ్వకాలు చేసి కొత్త పైప్లైన్లు నిర్మిస్తున్నారని పేర్కొంటున్నారు. తాగునీటి పైప్లైన్ల లీకేజీలు సరిచేసేందుకేనని సమర్థన కమీషన్ల కోసమే అన్న అనుమానాలు వృథా అవుతున్న ప్రజాధనం కార్పొరేటర్ల ఒత్తిడే కారణమంటున్న ఇంజనీర్లు -
వరాలు కురిపిస్తారా?
సాక్షిప్రతినిధి, వరంగల్ : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సుమారు 35 రోజుల తర్వాత మళ్లీ ఓరుగల్లులో పర్యటిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు శుక్రవారం తొలిసారి వస్తున్న ఆయన... ‘ప్రజాపాలన – ప్రజావిజయోత్సవాల’ సందర్భంగా పలు అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావొస్తున్నా.. తరుణంలో నర్సంపేట సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన పథకాలు, నిధులపై స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. గ్రేటర్ వరంగల్తోపాటు ఉమ్మడి వరంగల్పై ఏం వరాలు కురిపిస్తారనే చర్చ జరుగుతోంది. అలాగే ‘మొంథా’ తుపాన్ నష్టం సందర్భంగా ఇళ్లు కూలిపోయిన వారికి ఒక్కొక్కరికి రూ.15 వేలు చెల్లించిన ప్రభుత్వం.. పంటల నష్టంపై నివేదికలు పంపిన చాలామందికి పరిహారం అందలేదు. వీటిపైన సీఎం ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. డీపీఆర్ స్థాయిలోనే ‘గ్రేటర్’ పనులు.. ఉమ్మడి వరంగల్కు కావాలి నిధులు ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వరంగల్పై పలు హామీలు కురిపించారు. హైదరాబాద్తో పోటీ పడేలా అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. ఈ మేరకు సుమారు దశల వారీగా రూ.6,500 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు. ఇందులో మామునూరు ఎయిర్పోర్టుకు రూ.150 కోట్ల వరకు నిధులు విడుదలై భూసేకరణ జరుగుతోంది. భద్రకాళి చెరువు పూడిక, మాఢ వీధులు నిర్మాణం తదితర పనులు నడుస్తున్నాయి. వరంగల్ నగరంలో సుమారు నాలుగు వేల కోట్ల విలువైన అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ ప్రతిపాదనలు డీపీఆర్ల దశలో ఉన్నాయి. ఔటర్ రింగ్రోడ్డు, ఇన్నర్ రింగ్రోడ్డుతోపాటు పలు అభివృద్ధి పథకాలకు నిధులు మంజూరైనా ఆ పనులు సాగడం లేదు. స్మార్ట్సిటీ పనులకు తోడు రాష్ట్రం వాటా కింద నిధులు మరిన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు రావాల్సి ఉంది. అలాగే ఉమ్మడి వరంగల్లో మేడారం అభివృద్ధి, గిరిజన యూనివర్సిటీలకు మరిన్ని నిధులు అవసరం ఉందని ఇటీవల ప్రజాప్రతినిధులు సీఎంను కోరారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కూడా ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఆ మూడు పథకాలపై స్పష్టత... కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇటీవల వరంగల్లో పర్యటించారు. కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూ నిట్ (ఆర్ఎంయూ), కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మామునూరు ఎయిర్పోర్ట్ పనులను ఆయ న ప్రత్యేకంగా పరిశీలించి సమీక్షించారు. ఈ సందర్భంగా 7 మెగా టెక్స్టైల్ పార్కుల్లో ఒకటైన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు పనులపై కేంద్రం మొత్తం రూ.200 కోట్లతో చేపట్టగా రూ.1,700 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 12,500 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. వరంగల్ మామునూ రు ఎయిర్ పోర్టు విషయంలో 696 ఎకరాల భూమి ఎయిర్ పోర్టు అధికారుల వద్ద ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం సుమారు 243 ఎకరాల భూమి సేకరించి ఎయిర్ పోర్టు అథారిటీకి అందజేస్తే త్వరగా నిర్మా ణం ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. కాజీపేటలోని రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రం భావిస్తుందన్నారు. ఈ మూడు పథకాల విషయంలో పలుమార్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుందని పార్టీవర్గాల సమాచారం. ఉమ్మడి జిల్లా నేతలతో భేటీ కానున్న సీఎం? ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ సభ’లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సభలో మాట్లాడనున్న ఆయన ఉమ్మడి వరంగల్పై నిధుల జల్లు కురిపిస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అంతకు ముందు గ్రామ పంచాయతీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీకి చెందిన ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో తాజా పరిస్థితి ఏంటి? పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏం జరుగుతోంది? అని మాట్లాడనున్నారు. మెజార్టీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచేలా రేవంత్రెడ్డి మరోసారి మార్గదర్శనం చేయనున్నారని తెలిసింది. నేడు నర్సంపేటకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. గత పర్యటనలో రూ.6,500 కోట్లు మంజూరు చేసిన సీఎం.. మందకొడిగా పనులు.. ఇటీవల జిల్లాకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. మామునూరు, కేఎంటీపీ, ఆర్ఎంయూలపై వ్యాఖ్యలు ఈ మూడు ప్రాజెక్టులలో రాష్ట్రం పాత్రపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశం ఉమ్మడి వరంగల్ అభివృద్ధికి మరిన్ని నిధులపై ఆశలు సాక్షి, వరంగల్/నర్సంపేట/నర్సంపేట రూరల్: నర్సంపేట నియోజకవర్గానికి తొలిసారి వస్తున్న సీఎం రేవంత్రెడ్డి పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ సభకు జనసమీకరణ చేయనున్నారు. ప్రజాపాలన–ప్రజా విజయోత్సవ సభలో భాగ ంగా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి రూ.1,023 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యేలు, నాయకులు హాజరుకానున్నారు. సభా ఏర్పాట్లను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఆర్డీఓ ఉమారాణి, ఏసీపీ రవీందర్ పరిశీలించారు. హెలిపాడ్, సభా ప్రాంగణాన్ని బాంబ్ స్క్వాడ్ బృందాలు, జాగీలాలు తనిఖీ చేశాయి. సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా.. సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 1.15 గంటలకు హైదరాబాద్ బేగంపేటనుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. 2 గంటలకు నర్సంపేటలోని బంజారాభవన్లో ఏర్పాటుచేసిన హెలి పాడ్లో దిగుతారు. మధ్యాహ్నం 2.15 నుంచి 3.55 వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి బహిరంగసభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్కు వెళ్తారు. -
నిబంధనలు పకడ్బందీగా అమలు చేయండి
హన్మకొండ అర్బన్: జిల్లాల్లోని గ్రామ పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లను ఆదేశించారు. గురువారం లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మహేశ్ భగవత్తో కలిసి ఆమె కలెక్టర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాణి కుముదిని మాట్లాడుతూ.. వార్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికై న గ్రామాల్లో ఉప సర్పంచ్ నియామకం నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలన్నారు. ఏకగ్రీవంగా ఎంపికై న గ్రామ సర్పంచ్ స్థానాలకు ఫారం–10 ప్రకారం ఫలితాల ప్రకటన చేపట్టాలన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత సంబంధిత గ్రామాల్లో స్టేజ్–2 రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తి చేయాలన్నారు. అలాగే టి–పోల్లో పెండింగ్ లేకుండా తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. సమావేశంలో హనుమకొండ కలెక్టర్ శబరీష్, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీపీఓ అధికారి లక్ష్మీరమాకాంత్, డీఆర్డీఓ పీడీ శ్రీను, జెడ్పీ సీఈఓ రవి, అధికారులు పాల్గొన్నారు. వరంగల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, నోడల్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని -
‘గుర్తు’కు మొదటి అక్షరమే ఆధారం
హన్మకొండ అర్బన్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీచేసే వారికి అధికారులు ఈ విధంగా గుర్తులు కేటాయిస్తారు. నామినేషన్న్పత్రాల పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. ఉదాహరణకు ‘అ’ అనే పేరుతో నామినేషన్ వేసిన అభ్యర్థికి అంతకు తర్వాత వచ్చే అక్షరం కంటే ముందు గుర్తును కేటాయిస్తారు. అంటే పేరుకు ముందు ఉండే అక్షరం మేరకు గుర్తుల కేటాయింపు ఉంటుంది.శబరిమల రైళ్ల పొడిగింపుకాజీపేట రూరల్: అయ్యప్ప మాలధారుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన శబరిమల ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు బుధవారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. 2026 జనవరి 3వ తేదీన సి ర్పూర్కాగజ్నగర్–కొల్లం (07117) ఎక్స్ప్రెస్, 20 26 జనవరి 5వ తేదీన కొల్లం–చర్లపల్లి (07118) ఎ క్స్ప్రెస్ వరంగల్ మీదుగా ప్రయాణించనున్నాయి. 2026 జనవరి 3వ తేదీన వరంగల్, కాజీపేట మీ దుగా కొల్లం–చర్లపల్లి (17125) రైలును పొడిగించి నడిపిస్తున్నారు. ఈ రైలుకు కాయన్కుళం, చెంగనూర్, తిరువల, కొట్టాయం, ఎర్నాకులం, అలువా, త్రి శూరు, పాలక్కడ్, పొదనూర్, తిరుపూర్, ఈరోడ్, సేలం, జోలెర్పెట్టయ్, కట్పడి, చిత్తూరు, పాకల్, తిరుపతి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, కేసముద్రం, వరంగల్, కాజీపే ట, జనగామ, భువనగిరిలో హాల్టింగ్ కల్పించారు. మామపై కత్తితో అల్లుడి దాడి రామన్నపేట : మామపై కత్తితో అల్లుడి దాడికి పా ల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి వరంగల్ రామన్నపేటలో చోటుచేసుకుంది. మట్టెవాడ పోలీ సుల కథనం ప్రకారం.. రామన్నపేటకు చెందిన శ్రీకన్యతో హనుమకొండ నయీంనగర్కు చెందిన వాకిటి అనిల్కు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన రెండు మూడు సంవత్సరాల వరకు అనిల్ బాగానే ఉన్నాడు. అనంతరం మద్యానికి బానిసై భార్యను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. దీంతో శ్రీకన్య తన తండ్రి గున్నాల ప్రభాకర్ వద్దకు వచ్చింది. గొడవల అనంతరం రెండేళ్ల నుంచి అనిల్, శ్రీకన్య దంపతులు రామన్నపేటలో ప్రభాకర్ ఇంటికి సమీపంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈక్రమంలో మంగళవారం శ్రీకన్యపై అనిల్ దాడికి యత్నించగా సమీపంలో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్లింది. అక్కడికి చేరుకున్న అనిల్.. తన అత్తామామ ప్రభాకర్, అనితతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం ప్రభాకర్పై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనలో అనిత వెనుకకు నెట్టె క్రమంలో అనిల్కు కూడా గాయాలయ్యాయి. ప్ర భాకర్ మరో కూతురు లావణ్య ఫిర్యాదు మేరకు అనిల్పై కేసు న మోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. -
మేడారంలో వేగంగా విద్యుత్ పనులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతరలో భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న విద్యుత్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి తెలిపారు. బుధవారం మేడారంలో ములుగు సర్కిల్ పరిధిలోని అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 8 కిలోమీటర్ల మేర కవర్డ్ కండక్టర్ పనులు పూర్తి కా గా, భక్తుల రద్దీ పెరిగే సందర్భంలో విద్యుత్ లోపాలు లేకుండా ఉండేందుకు 70 కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 25 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్ పనులు పూర్తయినట్లు వెల్లడించారు. మిగతా పనులను ఈ నెల 20వ తేదీలోపు పూర్తి చేయాలని సంబంధిత అధి కారులను ఆదేశించారు. అదనంగా మేడారంలోని సమ్మక్క సబ్స్టేషన్లో 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫా ర్మర్ ఏర్పాటు చేస్తున్నామని, విద్యుత్ అంతరాయం లేకుండా జంపన్న వాగు వద్ద 6 టవర్ల నిర్మాణం చేపట్టగా, అందులో 4 టవర్లు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. అనంతరం నిర్మాణంలో ఉన్న 33/11 కేవీ నార్లాపూర్ సబ్స్టేషన్ను పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఏజెన్సీలను ఆదేశించారు. పస్రా సెక్షన్ ఆఫీస్లో నిర్మిస్తున్న కంట్రోల్ రూం, డ్యూటీ రూం పనులను పర్యవేక్షించారు. ములుగు ఎస్ఈ ఆనందం, డీఈఈలు సదానందం, పురుషోత్తం , ఏడీఈలు రాజేశ్, వేణుగోపాల్, సందీప్ పాటిల్, ఈఈ (సివిల్) వెంకట్రామ్ పాల్గొన్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు మరింత సులువు.. హన్మకొండ: విద్యుత్ బిల్లుల చెల్లింపు మరింత సులవని, అధునాతన సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగదారుల ముంగిటకు తీసుకొచ్చామని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ బిల్లుల చెల్లింపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆన్లైన్ పేమెంట్ సిస్టం (కియోస్క్)ను బుధవారం లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. విద్యుత్ సేవలను పూర్తిగా డిజిటల్ వైపునకు మళ్లిస్తున్నామన్నారు. వినియోగదారులు మరింత వేగంగా తమ బిల్లులను చెల్లించుకునేలా రూపొందించిన ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ (కియోస్క్)ను యూనియన్ బ్యాంకు సహకారంతో పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టామని తెలిపారు. త్వరలో మరిన్ని ఈఆర్వో కేంద్రాల్లో ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఫైనాన్స్ డైరెక్టర్ వి.తిరుపతి రెడ్డి, చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్.చరణ్ దాస్, చీఫ్ ఇంజనీర్ శ్రవణ్ కుమార్, జనరల్ మేనేజర్లు శ్రీనివాస్, వెంకట కృష్ణ, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ నవీన్ కుమార్, డీఈలు విజయేందర్ రెడ్డి, జి. సాంబరెడ్డి, యూనియన్ బ్యాంకు ఏజీఎంలు వై.శ్రీకాంత్ కుమార్, మహేశ్, చీఫ్ మేనేజర్ పి.వి.చైత్యన్య రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి అధికారులతో జాతరలో విద్యుత్ పనుల పురోగతిపై సమీక్ష -
అమీనాబాద్ నుంచి అసెంబ్లీ వరకు..
నర్సంపేట : నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.. అమీనాబాద్ నుంచి అసెంబ్లీ వరకు రాజకీయంగా అంచలంచెలుగా ఎదిగారు. పుట్టి పెరిగిన గ్రామానికి సర్పంచ్గా ఎన్నికై గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. అలాగే, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామంలో జన్మించిన మాధవరెడ్డి.. చదువుకునే రోజుల్లోనే విద్యార్థి సంఘం నాయకుడిగా కొనసాగారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 1981లో అమీనాబాద్ సర్పంచ్గా గెలుపొంది ప్రజాసేవలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ, నిబద్ధత గల నాయకుడిగా కొనసాగుతూ 1995లో డీసీసీబీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడిగా కొనసాగుతూ డీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. అయినా 2014లో నమ్ముకున్న పార్టీ నుంచి నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫాం లభించలేదు. దీంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొంది రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించాడు. పార్టీ ఆదరించకున్నా ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అధికార పార్టీ (బీఆర్ఎస్)లో చేరలేదు. తిరిగి కాంగ్రెస్లోనే చేరి నిజాయితీ గల నాయకుడిగా పార్టీలో ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. గత ఎన్నికలో ఎమ్మెల్యేగా రెండో సారి గెలుపొంది నర్సంపేట అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా అంచలంచెలుగా ఎదిగిన ‘దొంతి’ -
మార్కెట్ హమాలీలకు ఇన్సూరెన్స్ కల్పించాలి
వరంగల్: Ð]lÅÐ]l-ÝëĶæ$ Ð]l*Æð‡PsŒæ çßæÐ]l*-ÎÌSMýS$ VýS$Ç¢…ç³# M>Æý‡$z-ÌS-™ø´ër$ C¯]l*ÞÆð‡¯ŒæÞె¯ŒSÞ ÝûMýS-Æý‡Å… MýS͵…^éÌS° Ð]lÅÐ]l-ÝëĶæ$ Ð]l*Æð‡PsŒæ çßæÐ]l*ΠĶæÊ°Ä¶æ$¯ŒS Æ>çÙ‰ A«§ýlÅ-„ýS$yýl$ VýS$…ò³ÍÏ Ð]l¬±ÔèæÓ-Æý‡$yýl$ A¯é²Æý‡$. º$«§ýl-ÐéÆý‡… H¯]l$-Ð]l*-Ð]l¬ÌS Ð]lÅÐ]l-ÝëĶæ$ Ð]l*Æð‡PsŒæ çßæÐ]l*ΠĶæÊ°Ä¶æ$¯ŒS A«§ýlÅ-„ýS$yýl$ çßæïœgŒæ B«§ýlÓ-Æý‡Å…ÌZ °Æý‡-çܯ]l ^ólç³-sêtÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> Ð]l¬±ÔèæÓ-Æý‡$yýl$ Ð]l*sêÏ-yýl$™èl* Ð]lÅÐ]l-ÝëĶæ$ Ð]l*Æð‡P-sŒæ-ÌZ §é§éç³# 6ÐólÌS Ð]l$…¨ çßæÐ]l*Î, §ýlyýl$-Ð鯇$$, ïÜÓç³-ÆŠæ, ^ér, GyýlÏ-º…yýlÏ M>ÇÃMýS$-Ë$ ç³°^ól-çÜ$¢-¯é²-Æý‡-¯é²Æý‡$. AÆý‡$á-OÌñæ¯]l çßæÐ]l*-ÎÌSMýS$ OÌñæòܯŒSÞ-Ë$ CÐéÓ-ÌS° Mö¯ól²-â¶æ$Ï-V> yìlÐ]l*…yŠæ ^ólíܯ]l ÐéÆý‡…-™é Ð]lĶæ$çÜ$ Oò³ºyìl ç³°^ól-Ķæ$-Ìôæ° íܦ†MìS ^ólÆý‡$-MýS$-¯é²-Æý‡-¯é²Æý‡$. ÐéÇ Ý릯]l…-ÌZ Ð]l_a¯]l Mö™èl¢ çßæÐ]l*Î M>ÇÃMýS$-ÌSMýS$ OÌñæòܯŒSÞ-Ë$, VýS$Ç¢…ç³# M>Æý‡$z, C¯]l*Þ-Æð‡¯ŒSÞ ÝûMýS-Æý‡Å… MýS͵…^éÌS-¯é²Æý‡$. ™ðlÌS…V>׿ Æ>çÙ‰ çßæÐ]l*Î, §ýlyýl-Ð鯇$$, ^ér, ïÜÓç³ÆŠ‡Þ Ð]lÆý‡PÆŠ‡Þ ĶæÊ°Ä¶æ$¯ŒS Æ>çÙ‰ E´ë-«§ýlÅ-„ýS$-Ë$ §éÐðl$Æý‡ MýS–çÙ~, í³rtÌS Ððl…MýS¯]l², VýS…«§ýl… ¿êçÜP-ÆŠæ, ÔóæQÆŠæ, }°Ðé‹Ü, MýS$Ð]l*-ÆŠæ, Æ>…»êº$, Æ>k, f¯éÆý‡ª¯Œl, Æ>k, MýSÐ]l$-ÌêMýS-ÆŠæ, Ð]l$¯øçßæ-ÆŠæ, §éçÜ$, çܨ, çÙ…Ô¶æ$ ™èl¨™èl-Æý‡$-Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. రాష్ట్ర అధ్యక్షుడు గుంపెల్లి మునీశ్వరుడు -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
● టీఎస్ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్హన్మకొండ: విద్యుత్ ఎమ్మార్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని టీఎస్ఈఈయూ–327 కార్యాలయం (పల్లా రవీందర్రెడ్డి భవన్)లో ఆ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ఎమ్మార్టీ విద్యుత్ ఉద్యోగుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ఇనుగాల శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎమ్మార్టీ ఉద్యోగులకు పదోన్నతి చానల్ పెంచేందుకు చేసిన కృషి ఫలించిందన్నారు. జూనియర్ లైన్మెన్లకు అసిస్టెంట్ లైన్మెన్లుగా పదోన్నతి లభించే అవకాశం వచ్చిందన్నారు. ఈ మేరకు ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఎమ్మార్టీ విభాగంలో కొత్తగా అసిస్టెంట్ లైన్మెన్ పోస్టులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–327 ఎమ్మార్టీ విభాగం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పి.సారంగపాణి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ ర్.శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎస్.శోభారాణి, యు.రవీందర్, ఎం.శ్రీదేవి, కార్యదర్శిగా కె.రాజు, సంయుక్త కార్యదర్శులు గా ఆర్.ప్రణయిత, ఎన్.వనజ, డి.సుజాత, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పి.అంబేడ్కర్, ఆర్.హరి, ఎస్.కమలాకర్, జా కీర్, కోశాధికారిగా జె.విద్యాసాగర్ ఎన్నికయ్యారు. టీఎస్ఈఈయూ టీజీ ఎన్పీడీసీఎల్ శాఖ అధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దొనికల సదయ్య, కార్యదర్శి చిట్ల ఓదెలు, ఎమ్మార్టీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
తుపాను సాయం అందించండి
హన్మకొండ చౌరస్తా: మోంథా తుపాను కారణంగా వరంగల్ నగరానికి తీవ్ర భారీ నష్టం వాటిల్లిందని, తక్షణమే సాయం అందించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య బుధవారం లోక్సభలో జీరో అవర్లో గళమెత్తారు. మోంంథా తుపాను కారణంగా వరంగల్ నగరంలో 200 మీల్లీ లీటర్ల భారీ వర్ష కురిసిందని, తద్వారా నగరంలో 45 కాలనీలు నీట మునిగాయని వివరించారు. కొన్ని చోట్ల రహదారులు నదులుగా మారాయని, ఓ గర్భిణినీ ట్రాక్టర్లో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నగరంలో అమృత్, స్మార్ట్సిటీ పథకాల ద్వారా చేపట్టిన డ్రైనేజీ పనులు 66 శాతం మాత్రమే పూర్తికావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇది పూర్తిగా ప్రణాళిక వైఫల్యమే అని పార్లమెంట్లో తెలిపారు. అమృత్ 2.0 ద్వారా ప్రత్యేక నిధులు మార్చి 2026లో విడుదల చేయాలని, జీడబ్ల్యూఎంసీ, మౌలిక వసతులపై ఉన్నత స్థాయి ఆడిట్కు ఆదేశించాలని, రహదారుల పునఃనిర్మాణానికి రూ.100 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఎంపీ కేంద్రాన్ని కోరారు. హెరిటేజ్, స్మార్ట్సిటీ అయిన వరంగల్ ఏటా వర్షాలతో నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కార దిశగా మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. లోక్సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య -
ఖర్చుకు పైసలెట్లా?
సంగెం: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. నామినేషన్లు, పరిశీలన పర్వం ముగియడంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీ రహిత ఎన్నికలు జరుగుతున్నా ఆయా పార్టీల నేతలు తమ నాయకులు, అనుచరులను బరిలో దింపారు. అయితే పోటీలో ఉన్న అభ్యర్థులకు పైసల రంది పట్టుకుంది. తమ గెలుపు కోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి ముందుకొస్తున్న అభ్యర్థులు తమ ఆస్తులను తనఖా పెట్టడానికి, కొందరు అమ్మడానికి సిద్ధపడుతున్నారు. రూ.10 నుంచి రూ.30 లక్షలకు పైగా ఖర్చు.. చిన్న పంచాయతీల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ. 10 లక్షలు, మేజర్ గ్రామపంచాయతీల పరిధిలో పోటీ చేసే అభ్యర్థులు రూ. 20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఖర్చు చేసేందుకై నా వెనుకాడడం లేదు. జనరల్, బీసీలకు రిజర్వ్ అయిన గ్రామాల్లో పోటాపోటీగా ఖర్చు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామాల్లో సర్పంచ్ కీలకం కావడం.. నిధులన్నీ సర్పంచ్ ఆధ్వర్యంలోనే ఖర్చుచేయనుండడంతో పోటీకి సై అంటున్నారు. ఒక వేళ ఓడిపోతే సెంటిమెంట్తో వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనైనా పదవి దక్కుతుందనే ఆశాభావంతో ముందుకు సాగుతున్నారు. గెలిచినా.. ఓడినా కష్టాలే.. డబ్బులు భారీగా ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచిన వారికి మొదట పదవి ఆనందపరిచినా, వెంటనే అప్పులు తీర్చడం మొదటి ప్రాధాన్యతగా మారనుంది. ఓడిపోయిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉండనుంది. అప్పులు చెల్లించలేక కుంటుంబం మొత్తం ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఇలా ఎన్నికల్లో యథేచ్ఛగా డబ్బులు ఖర్చు చేసి గెలిచినా, ఓడినా ఇరువురు అభ్యర్థులు సైతం కష్టాలు తప్పకపోవచ్చనే చర్చ జరుగుతోంది. పోటీ చేసిన అభ్యర్థులు సంయమనం పాటించి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే కంటే నిజాయితీగా ప్రచారం చేసి నిస్వార్థంతో సేవ చేస్తామని ఓట్లు పొందితే బాగుంటుదని యువత అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఓటర్లు కూడా ఎన్నికల సమయంలో వచ్చే మద్యం, డబ్బులకు ఆశపడి ఓటును అమ్ముకుంటే ఐదేళ్లు కష్టాలు తప్పవని ఆలోచించాలి. అందుకే డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా గ్రామాభివృద్ధికి సేవ చేసేవారికి ఓట్లు వేసి ఎన్నుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. డబ్బుల సర్దుబాటుకు ఇబ్బందులు ఆస్తుల తనఖాకు సిద్ధమవుతున్న పోటీదారులు -
ఆ వృద్ధుడు.. పట్టు వదలని విక్రమార్కుడు
మరిపెడ రూరల్: ఏడు పదుల వయస్సులో కూడా ఓ వృద్ధుడు పట్టు వదలని విక్రమార్కుడిలా సర్పంచ్ పదవికి సై అంటున్నాడు. తాను చనిపోయే సమయంలోపు ఒక్కసారైనా సర్పంచ్ కావాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా బుధవారం నామినేషన్ దాఖలు చేశాడు. తన నిర్ణయాన్ని గ్రామస్తులు కూడా అంగీకరించారు. ఆయనే మండలంలోని ధరావత్ తండాకు చెందిన ధరావత్ తేజానాయక్. తాను చనిపోయే సమయంలోపు ఒక్కసారైనా సర్పంచ్గా కావాలనే తన కోరికను గ్రామస్తులకు తెలుపగా వారు అంగీకరించారు. అదేవిధంగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రెండున్నర గుంటల స్థలం, భవనానికి దారి, ఖర్చులకు రూ.2 లక్షలు నగదును తాయిలాలుగా ప్రకటించాడు. ఇంకేముంది గ్రామస్తులంతా ఏకగ్రీవానికి మద్దతు తెలపడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఏడు పదుల వయస్సులో కూడా సర్పంచ్ పదవికి నామినేషన్ ఏకగ్రీవం వైపుగా అడుగులు -
ప్రజాసేవ కోసం ఉద్యోగానికి రాజీనామా..
మరిపెడ రూరల్: ప్రజా సేవ చేయలనే దృఢ సంకల్పంతో ఓ మహిళ తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. మరిపెడ మండలం గాలివారిగూడెం గ్రామ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. విషయం తెలియగానే గ్రామానికి చెందిన రాములమ్మ అంగన్ వాడీ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. బుధవారం తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంగన్వాడీ టీచర్ ఉద్యోగానికి మరో 8 ఏళ్లు సర్వీస్ ఉన్నట్లు ఆమె తెలిపారు. కాగా, ప్రజాసేవ కోసం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమెను గ్రామస్తులు అభినందించారు. గాలివారిగూడెం సర్పంచ్ అభ్యర్థిగా రాములమ్మ నామినేషన్ దాఖలు -
దివ్యాంగులకు ప్రత్యేక హక్కులు
రామన్నపేట: దివ్యాంగులకు అందరితో సమానమైన హక్కులతోపాటు కొన్ని ప్రత్యేక హక్కులు ఉంటాయని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ పేర్కొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆటోనగర్లోని లూయిస్ ఆదర్శ బ్లైండ్ స్కూల్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకులకు ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి మాట్లాడుతూ ఎలాంటి వైకల్యం కలిగి ఉన్న వారికై నా ఉన్నత చదువుల్లో 5 శాతం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 4 శాతం, ప్రభుత్వేతర ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు. దివ్యాంగులకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయవాదిని సమకూర్చి వారి కేసులు వాదించే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపీ పేపర్లను, బిస్కెట్లను అందించారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి సాయికుమార్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శ్రీనివాసరావు, కల్యాణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ -
పాఠశాల సందర్శన
కాళోజీ సెంటర్: వరంగల్ నగరం ఎల్బీ నగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మాసూమ్అలీని పూర్వ విద్యార్థి కేంద్ర మాజీ సమాచార శాఖ కమిషనర్ మాడభూషి శ్రీధర్ సందర్శంచారు. 55 సంవత్సరాల క్రితం ఈ పాఠశాల విద్యార్థి అని తన గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. తాము చదువుకునే రోజుల్లో కూర్చునేందుకు బల్లలు లేవని.. పాఠశాలకు డెస్క్ బెంచీలు అందజేసిన వన్నా ఖన్నాను అభినందించారు. హెచ్ఎం, ఉపాధ్యాయులతో చర్చించి పాఠశాలకు కావాల్సిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పేద విద్యార్థులకు పూర్వవిద్యార్థులతో కలిసి స్కాలర్షిప్లు అందజేస్తానని తెలిపారు. తనకు తెలిసిన ఫౌండేషన్ సహాయ సహకారంతో పాఠశాల అభివృద్ధికి కృషిచేస్తానని వివరించారు. కార్యక్రమంలో హెచ్ఎం డాక్టర్ బీవీఎం స్వామి, ఉపాధ్యాయులు జయబాలరెడ్డి, కనకయ్య, భిక్షపతి, ఠయ్యాల శ్రీధరాచార్యులు, దేవేందర్, మోహన్, భాష్కర్, తదితరులు పాల్గొన్నారు. -
వేయిస్తంభాల ఆలయ ఆదాయం రూ.12,04,168
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయంలో బుధవారం ఉదయం హుండీ లెక్కింపు నిర్వహించారు. 50 రోజుల హుండీ ఆదాయం రూ.4,57,768, పూజా టికెట్ల ద్వారా రూ. 7,46,400.. మొత్తం ఆదాయం రూ.12,04,168 వచ్చిందని ఈఓ ధరణికోట అనిల్కుమార్ తెలిపారు. పర్యవేక్షకుడిగా దేవాదాయశాఖ పరిశీలకుడు ప్రసాద్ వ్యవహరించారు. దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకుడు మణికంఠ శర్మ అవధాని, సిబ్బంది మధుకర్, లింగబత్తుల రామకృష్ణ, రజిత, రాజరాజేశ్వర సేవాసమితి మహిళా సభ్యులు పాల్గొన్నారు. హన్మకొండ చౌరస్తా: హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి (జీఎంహెచ్) ఆర్ఎంఓగా డాక్టర్ అన్నెపాక మంజులను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ ఉత్తర్వులు జారీ చేసింది. హనుమకొండ జిల్లా దామెర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న మంజుల డిప్యూటీ సివిల్ సర్జన్గా పదోన్నతిపై జీఎంహెచ్ ఆర్ఎంఓగా బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఆమె ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేశారు. ఖిలా వరంగల్: ఫిర్యాదుదారులతో గౌరవంగా మెదులుతూ, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. ఈ మేరకు బుధవారం వరంగల్ మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సన్నిహిత సెంటర్ (హాల్)ను సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత, ఏఎస్పీ శుభం ప్రకాశ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్కు వివిధ పనులపై వచ్చే ప్రజలు, ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపాలని ఆయన ఆదేశించారు. సైబర్నేరాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని, రౌడీషీటర్లు, ఆకతాయిలు ఆగడాలను అరికట్టి ప్రజలకు రక్షణగా నిలవాలని సూచించారు. అనంతరం పోలీస్స్టేషన్ సీపీ సందర్శించారు. సిబ్బంది వివరాలు, పెండింగ్ కేసులను ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరగా ఛేదించాలని ఆదేశించారు. అంతకు ముందుగా పోలీస్ సిబ్బంది ఆయనను స్వాగతిస్తూ గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్, ఎసైలు సుమన్, శ్రావణ్కుమార్ పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని క్యాంపస్ నెట్వర్కింగ్ను ఆధునికీకరించేందుకు బీఎస్ఎన్ఎల్కు వర్క్ ఆర్డర్ జారీచేసినట్లు కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం బుధవారం తెలిపారు. కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి సమక్షంలో వర్క్ ఆర్డర్పై విధివిధానాలపై సమీక్షించారు. రూసా నిధులతో విశ్వవిద్యాలయం కే హాబ్ స్టార్టప్స్, అంకుర సంస్థలను ప్రోత్సహించడం, మౌలిక వసతులు, క్యాంపస్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని మెరుగుపరుస్తారు. రూసా అనుమతి పొందిన, మంజూరైన ప్రాజెక్టులు, అలాగే, ఇంజనీరింగ్ కళాశాలల్లో కొనాగుతున్న రీసెర్చ్ ప్రాజెక్టులకు అవసరమైన నెట్వర్క్ విస్తరించడం లక్ష్యంగా ఈవర్క్ ఆర్డర్ను బీఎస్ఎన్ఎల్కు జారీ చేసినట్లు రామచంద్రం తెలిపారు. క్యాంపస్ నెట్వర్కింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు బీఎస్ఎన్ఎల్ సహకారంతో రూ.1.29 కోట్లు యూనివర్సిటీ వెచ్చించనున్నట్లు రిజిస్ట్రార్ రామచంద్రం తెలిపారు. బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ అరవింద్కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.కిషన్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సురేశ్, డివిజనల్ ఇంజనీర్ రజనీకరెడ్డి, రూసా నోడల్ అధికారి ఆర్.మల్లికార్జున్రెడ్డి, కేయూ అభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి, కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి బి.రమ పాల్గొన్నారు. -
దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ: దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ స్నేహ శబరీష్ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. దివ్యాంగుల సౌకర్యార్థం అంబేడ్కర్ భవన్, కలెక్టరేట్లో ర్యాంపు సౌకర్యం ఏర్పాటు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వేడుకల్లో భాగంగా దివ్యాంగ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన దివ్యాంగులకు కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రశంసపత్రాలు, జ్ఞాపికలు అందించారు. జిల్లా సంక్షేమ అధికారి జె.జయంతి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో డీఆర్డీఓ మేన శ్రీను, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఇసంపల్లి జోనా, డీఎంహెచ్ఓ అప్పయ్య, కేయూ పాలకమండలి సభ్యురాలు డాక్టర్ కె.అనితారెడ్డి, విద్య ఫౌండేషన్ చైర్మన్ బిల్లా మహేందర్, దివ్యాంగ సంఘం ప్రతినిధులు రాజు, శ్రీనివాస్, సీడీపీఓ విశ్వజ, ఎఫ్ఆర్ఓ రవి కృష్ణ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఇన్చార్జ్ అధికారి ఎస్.ప్రవీణ్ కుమార్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ భాస్కర్, పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ సుమలత పాల్గొన్నారు. మిల్లర్లు తరుగు తీయొద్దు.. హన్మకొండ అర్బన్: రైతులు విక్రయించిన ధాన్యంలో రైస్ మిల్లర్లు తరుగు తీయొద్దని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. కలెక్టరేట్లో సీఎంఆర్, ధాన్యంలో తరుగు తీస్తున్నారని రైతుల ఫిర్యాదు మేరకు పౌరసరఫరాలు శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో కలెక్టర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తరుగు పేరుతో రైతులను మిల్లర్లు ఇబ్బంది పెట్టొద్దన్నారు. అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వాజీద్ అలీ, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మేనేజర్ మహేందర్, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. -
గురుకుల పాఠశాల నిర్వహణపై ఆగ్రహం
వరంగల్: ఆరెపల్లిలోని పాకాల కొత్తగూడకు చెందిన మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల నిర్వహణపై కలెక్టర్ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్, డిప్యూటీ వార్డెన్లకు మెమోలు జారీ చేయాలని డీబీసీడీఓ పుష్పలతను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ సత్యశారద గురుకల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా స్టోర్ రూం, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. స్టోర్స్ అపరిశుభ్రంగా ఉండడం, మెనూ ప్రకారం భోజనం ఉండకపోవడంతో డిప్యూటీ వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా, మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సబ్జెక్టుల్లో విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలున్నాయా అని అడిగారు. ఏమైనా సమస్యలుంటే ఫిర్యాదు బాక్స్లో వేయాలని సూచించారు. ప్రిన్సిపాల్, డిప్యూటీ వార్డెన్లకు మెమోలు జారీ చేయాలి వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదేశం -
ఘనంగా వ్యవసాయ విద్యా దినోత్సవం
హన్మకొండ/వరంగల్: వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలోని వ్యవసాయ కళాశాలలో ఘనంగా వ్యవసాయ విద్యా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని పాఠశాలల విద్యార్థులు వ్యవసాయ కళాశాలను సందర్శించారు. 396 మంది విద్యార్థులు, 16 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వ్యవసాయ రంగంలో సాధిస్తున్న ప్రగతి, పరిశోధనలను వివరించారు. అనంతరం విద్యార్థులు కళాశాలలోని సేద్య విభాగం, మృత్తిక శాస్త్రం, ఇంజనీరింగ్, పంటల సంరక్షణ ప్రయోగశాల, వృక్ష ప్రజనన విభాగాలు, ఉద్యాన ప్రయోగశాలలను సందర్శించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ అంశాలు తెలుసుకున్నారు. విత్తనరకాలు, విత్తే పద్ధతులు, మట్టి పరీక్ష విధానం, నేల రకాలు, నేలలో పోషకాలు, వివిధ పనిముట్లు, వాటి వినియోగం, ఉద్యాన పంటలు, వాటి యాజమాన్యం, పంటల్లో వచ్చే తెగుళ్లు, పురుగుల యాజమాన్యంపై కళాళాలలో వ్యవసాయ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు పాఠశాల విద్యార్థులకు వివరించారు. కళాశాలలో వానపాముల ఎరువు తయారీవిధానం, వ్యవసాయంలో వాటి వినియోగాన్ని తెలుసుకున్నారు. క్షేత్ర సందర్శన చేసిన విద్యార్థినీవిద్యార్థులకు ‘భారతదేశంలో వ్యవసాయరంగం పాత్ర’ అంశంపై క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల డీన్ డాక్టర్ వి.రవీంద్ర నాయక్, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
పూర్తికాలే!
గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పుష్కరం దాటినాపిల్లర్లకే పరిమితమైన వరంగల్ కళాభవనంవాహనాల పార్కింగ్ స్టాండ్గా మారిన కళాభవనం ప్రాంగణ స్థలం వరంగల్: కళాకారులను ప్రోత్సహించేందుకు వరంగల్లో నిర్మించతలపెట్టిన కళాభవనం పిల్లర్లకే పరిమితమైంది. పుష్కర కాలం పూర్తయినా పనులు పూర్తికావడం లేదని కళాకారులు ఆందోళన చెందుతున్నారు. కాకతీయుల రాజధాని వరంగల్లో కళాభవనం (మినీ రవీంద్రభారతి) నిర్మించాలని కోరుతూ కళాకారులు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించారు. వీరి అభ్యర్థన మేరకు బహుళ సాంస్కృతిక కళాభవనం నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. కాగా, వరంగల్ పోచమ్మమైదాన్ సమీపంలో మల్టీపర్సస్ కల్చరల్ కాంప్లెక్స్ పేరిట నిర్మాణానికి రెండుసార్లు శంకుస్థాపన చేశారు. అప్పటి మంత్రిగా ఉన్న బస్వరాజు సారయ్య ముచ్చటగా మూడోసారి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. 24–05–2013లో రూ.నాలుగు కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఏడాదిలో నిర్మించాలన్న నిబంధనలతో టెండర్లు నిర్వహించగా హైదరాబాద్కు చెందిన శ్రీకో ప్రాజెక్టు నిర్మాణ సంస్థ పనులు దక్కించుకుంది. మొదటి విడత పర్యాటకశాఖ మంజూరు చేసిన కోటి రూపాయలతో పనులు ప్రారంభమయ్యాయి. బెస్మెంట్, పిల్లర్లు, జనరేటర్ రూం నిర్మించిన కాంట్రాక్టర్కు రూ.69.88 లక్షలు చెల్లించారు. నిధులు విడుదలైతేనే మిగిలిన పనులు చేస్తామని కాంట్రాక్టర్ భీష్మించుకున్నాడు. 12 ఏళ్ల క్రితం ప్రారంభమైన కళాభవనం బేస్మెంట్తో అగిపోయింది. నిర్మాణం కోసం తీసుకొచ్చిన సిమెంట్ గడ్డ కట్టగా, ఇనుము తుప్పు పట్టిపోయింది. స్థలం టాక్సీ స్టాండ్ అడ్డాగా మారింది. తూర్పు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడకపోవడంతో అసంపూర్తి పిల్లర్లు ఆకాశాన్ని చూస్తున్నాయి. హనుమకొండలో రూ.12 కోట్లతో చేపట్టిన కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ వ్యయం పెరిగింది. వరంగల్ పశ్చిమ ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సుమారు రూ.100 కోట్ల నిధులు మంజూ రు చేయించి పూర్తి చేశారు. కేవలం రూ.నాలుగు కోట్ల వ్యయంతో చేపట్టిన కళాభవనానికి నిధులు తేవడంలో తూర్పు ప్రజాప్రతినిధులు విఫలమయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కలగానే హరిత హోటల్.. కళాభవనం కోసం కేటాయించిన స్థలంలో హరిత హోటల్ నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే నరేందర్ సూచనల మేరకు అప్పటి పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్థలాన్ని పరిశీలించారు. డిజైన్లో మార్పులు చేసి కళాభవన్ నిర్మిస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేని వరంగల్ నగర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కళాభవనంపై దృష్టి సారించాలి.. ఆర్ట్స్ కాలేజీ, నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియం, పోతన ఆడిటోరియం, కాశోజీ కళారక్షేతం హనుమకొండ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. వరంగల్ జిల్లా కేంద్రంలో ఆడిటోరియాలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ భవన నిర్మాణం ప్రారంభమైనందున గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సైతం కాంగ్రెస్లో ఉన్నందన కళాభవనం (ఆడిటోరియం) నిర్మాణంపై దృష్టి పెట్టాలని నగరవాసులు, కళాకారులు కోరుతున్నారు. నిధులు లేక పనులు ఆపేసిన కాంట్రాక్టర్ పార్కింగ్ స్టాండ్గా మారిన స్థలం పట్టించుకోని తూర్పు ప్రజాప్రతినిధులు కళాభవనం పూర్తిచేయాలి.. నృత్యంలో శిక్షణ తీసుకున్నప్పటికి పోటీల్లో పాల్గొనేందుకు ప్రాక్టీస్ చేసేందుకు వరంగల్లో కళాభవనం లేక ఇబ్బందులు పడుతున్నాం. నేరుగా పోటీలకు వెళ్లడం వల్ల అనుకున్న ఫలితాలు రావడం లేదు. స్థానిక కళాకారుల కోసం కళాభవనం వెంటనే పూర్తి చేయాలి. – ఇప్పకాయల శ్రుతిక, భరతనాట్యం కళాకారిణి, లేబర్ కాలనీ, వరంగల్ ఇబ్బందులు పడుతున్నాం... వరంగల్లో ప్రత్యేకంగా కళావేదిక లేక పోవడంతో దూరం వెళ్లి ప్రదర్శనలు ఇవ్వాల్సి వస్తోంది. శిక్షణ అకాడమీలు ఒకే సమయంలో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే ఆడిటోరియం అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నాం. ఆడిటోరియం ఉంటే కళాకారులు దుస్తులు మార్చుకునేందుకు, అలంకరణ చేసుకునేందుకు ఇబ్బంది ఉండదు. –గజ్జెల రంజిత్, పేరిణి అధ్యాపకుడు, వరంగల్ -
గర్భిణులకు జాగ్రత్తలు వివరించాలి
హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య ఎంజీఎం: వ్యాధినిరోధక టీకాల కేంద్రాల్లో గర్భిణులు, పిల్లలకు టీకాలు ఇప్పించడంతోపాటు వారు తీసుకోవాల్సిన పోషకాహారం, పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యాధికారి డాక్టర్ అప్పయ్య వైద్య సిబ్బందికి సూచించారు. బుధవారం ఆయన నగరంలోని లష్కర్సింగారం పీహెచ్సీ పరిఽధిలోని గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రం, గోపాలపూర్ వార్డు ఆఫీస్, గణేశ్నగర్ అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ కోసం ఉన్న లిస్టు, అందుల్లో ఎంత మందికి వ్యాక్సిన్ వాశారు, సమాచారం అందించేందుకు ఫోన్ మెసేజెస్, ఏఈఎఫ్ఐ కిట్లు, కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ చేస్తున్నారా అనే వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గర్భిణిగా నమోదైనప్పటి నుంచి అన్ని జాగ్రత్తలు వివరించడంతోపాటు ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవం జరిగేలా కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది తమకు కొత్త హబ్ కట్టర్లు, వ్యర్థాల నియంత్రణకు రెడ్, బ్లాక్ బ్యాగులను అందజేయాలని డీఎంహెచ్ఓను కోరారు. త్వరలోనే అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. గోపాల్పూర్లో ప్రైవేట్ క్లినిక్ తనిఖీ గోపాల్పూర్లోని మహీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ను స్థానిక వైద్యాధికారి హైదర్తో కలిసి డీఎంహెచ్ఓ అప్పయ్య తనిఖీ చేశారు. ఆస్పత్రి అనుమతి పత్రాలను పరిశీలించారు. అలాగే, కంట్రోల్ అథారిటీ జారీ చేసిన ఆదేశాల మేరకు మెడికల్ షాపుల్లో ఎంటీపీ కిట్లను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదని, వివరాలను రిజిస్టర్లో తప్పక నమోదు చేయాలని ఆదేశించారు. -
‘గుర్తింపు’ లేక ఇబ్బందులు
వరంగల్: వ్యవసాయ మార్కెట్ కమిటీల్లోని ఉద్యోగులకు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు, పింఛన్దారులకు ఐడీ (ఎంప్లాయ్కోడ్)లు లేక రెండు నెలలుగా వేతనాలు, పెన్షన్లు రావట్లేదు. కాగా, ఇప్పటి వరకు ప్రతీ నెల చెక్కులను ఫైనాన్స్శాఖకు పంపిస్తే నిధులు విడుదలయ్యేవి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నిబంధనలు మార్చడంతో ఉద్యోగులు, పింఛన్దారులకు అవస్థలు తప్పడం లేదు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా బినామీ పేర్లతో పలు డిపార్ట్మెంట్లలో వేతనాలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. 010 పద్దు కింద ఉన్న ఉద్యోగులకు, పింఛన్దారులకు వేతనాలు, పింఛన్లు చెల్లించేందుకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రతీ ఉద్యోగి నుంచి గుర్తింపు పత్రాలు సేకరించింది. ఈపద్దు కింద ఉన్న ఉద్యోగులకు వేతనాలు, పింఛన్దారులకు ఐడీ (గుర్తింపు నంబర్) ఉంటుంది. బిల్లులు ఎలా? మార్కెట్ కమిటీల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు, ఫించన్దారులకు ఐడీలు లేని కారణంగా బిల్లులు చేయలేని పరిస్థితుల్లో మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఈవిషయంపై మార్కెటింగ్శాఖ ఉన్నతాధికారులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సమస్య వివరించడంతో మార్కెట్ కమిటీల్లోని ఉద్యోగులకు మాత్రమే యూనిక్ ఐడీలను ఇచ్చింది. వీటిని హైదరాబాద్లో అప్లోడ్ చేసినట్లు తెలిసింది. అందుకని ఉద్యోగులకు మాత్రమే నెట్ అమౌంట్ రూపంలో కేటాయింపులు జరిగినట్లు సమాచారం. కాగా, వెంటనే ఐడీలు ఇచ్చి వేతనాలు, పింఛన్లను మంజూరు చేయాలని ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయ్స్, ఫించన్దారులు విజ్ఞప్తి చేస్తున్నారు ఐడీలు లేని మార్కెట్ ఉద్యోగులు, పింఛన్దారులు రెండు నెలలుగా పింఛన్లు, వేతనాల నిలిపివేత -
తడి, పొడి చెత్తను వేరు చేయాలి
నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: నగర స్వచ్ఛత కోసం తడి, పొడి చెత్తను వేర్వేరు బుట్టల్లో వేసి అందించాలని మేయర్ గుండు సుధారాణి విజ్ఞప్తి చేశారు. బుధవారం వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని 38వ డివిజన్ ఖిలా వరంగల్, 42వ డివిజన్ రంగశాయిపేటలో ఇంటింటా తడి, పొడి చెత్త వేరుపై మేయర్, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం మేయర్ సుధారాణి మాట్లాడుతూ నగర వ్యాప్తంగా 66 డివిజన్లలో ప్రతి డివిజన్కు ముగ్గురు వలంటీర్ల చొప్పున, ప్రతి స్వచ్ఛ ఆటోకు ఒకరిని నియమించి తడి, పొడి చెత్తను వేరు చేసి అందించేలా సూచిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేటర్లు గుండు చందన పూర్ణచందర్ , బైరబోయిన ఉమాదామోదర్ యాదవ్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, హెచ్ఓ లక్ష్మారెడ్డి, టీఎంసీ రమేశ్, శానిటరీ సూపర్ వైజర్ గోల్కొండ శ్రీను, ఆస్కీ ప్రతినిధులు డాక్టర్ రాజ్మోహన్, అవినాష్ పాల్గొన్నారు. -
రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్ పుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరు
కాజీపేట రూరల్: కాజీపేట ఎలక్ట్రిక్ లోకో షెడ్డు వద్ద కార్మికుల సౌకర్యార్థం రైల్వే అధికారులు పుట్ ఓవర్ బ్రిడ్జిని మంజూరు చేశారు. 2004లో నిర్మించిన ఎలక్ట్రిక్ లోకో షెడ్డుకు వెళ్లి వచ్చే కార్మికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక పట్టాలు దాటి వెళ్లాల్సి వస్తోంది. రైళ్ల రాకపోకలు ఉన్న సమయంలో గేట్ వద్ద కార్మికులు వేచి చూడాల్సి వస్తోంది. దీంతో విధులకు ఆలస్యమవుతోంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని అనేక సార్లు రైల్వే నాయకులు, కార్మికులు సికింద్రాబాద్ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చా రు. ఈమేరకు మంగళవారం సికింద్రాబాద్లో జరి గిన సికింద్రాబాద్ డివిజన్, జోనల్ స్థాయి పీఎన్ఎం మీటింగ్లో కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్ కార్మికుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని ప్రస్తావించగా.. రైల్వే జీఎం మంజూరు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ పి.రవీందర్ తెలిపారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరుతో రైల్వే కార్మికులు, స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : అయ్యప్ప మాలధారుల సౌకర్యార్థం శబరిమలకు వెళ్లేందుకు కాజీపేట, వరంగల్ మీదుగా ఆరు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు. రైళ్ల వివరాలు.. డిసెంబర్ 13వ తేదీన సిర్పూర్కాగజ్నగర్–కొల్లం జంక్షన్ (07117) ట్రైన్ వరంగల్కు చేరుకుని వెళ్తుంది. డిసెంబర్ 20వ తేదీల్లో చర్లపల్లి–కొల్లం జంక్షన్ (07121) ట్రైన్ వరంగల్కు చేరుకుని వెళ్తుంది. డిసెంబర్ 24వ తేదీన హజూర్ సాహిబ్ నాందేడ్ –కొల్లం జంక్షన్ (07123) ట్రైన్ వరంగల్కు చేరుకుని వెళ్తుంది. డిసెంబర్ 15వ తేదీన కొల్లం జంక్షన్–చర్లపల్లి (07118) ట్రైన్ వరంగల్, కాజీపేటకు చురుకుని వెళ్తుంది. డిసెంబర్ 22వ తేదీన కొల్లం జంక్షన్–చర్లపల్లి (07122) ట్రైన్ వరంగల్, కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. డిసెంబర్ 26వ తేదీన కొల్లంజంక్షన్–చర్లపల్లి (07124) ట్రైన్ వరంగల్, కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. కాళేశ్వరం మాస్టర్ ప్లాన్కు డ్రోన్తో సర్వే కాళేశ్వరం: వచ్చే ఏడాది జూలై చివరన జరగనున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరినది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన క్షేత్ర కన్సల్టెన్సీ ఆర్కిటెక్చర్ల ఆధ్వర్యంలో మంగళవారం కాళేశ్వరం మాస్టర్ ప్లాన్పై డ్రోన్ కెమెరాతో సర్వే చేపట్టారు. వివిధ రహదారులు, పురాతన ఆలయాలు, వీఐపీ, మెయిన్ఘాట్ల నుంచి అంతర్రాష్ట్ర వంతెన వరకు సర్వే చేపట్టారు. ముఖ్యంగా మరుగునపడిన ఆలయాలన్నింటినీ పునరుద్ధరణ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు తె లిసింది. దీంతో కాళేశ్వరం అభివృద్ధికి నిధులు మంజూరై పాలన అనుమతులు రావడమే ఆలస్యమని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆత్మవిశ్వాసం చాటిన యాసిడ్ బాధితురాలు● వైద్యసిబ్బంది, పోలీసుల సహకారంతో పరీక్షకు హాజరు ఎంజీఎం : కాజీపేట మండలం కడిపికొండ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం సాయంత్రం యాసిడ్ దాడిలో గాయాలపాలై ఎంజీఎంలో చికిత్స పొందుతున్న నర్సింగ్ విద్యార్థిని సునంద తన ఆత్మవిశ్వాసాన్ని చాటుకుంది. సదరు నర్సింగ్ విద్యార్థిని వైద్యసిబ్బంది, పోలీసులు సహకారంతో మంగళవారం నిర్వహించిన నర్సింగ్ పరీక్షకు హాజరైంది. పరీక్షకు హాజరయ్యేందుకు ఎంజీఎం సూపరింటెండెంట్ అనుమతి కోరడంతోపాటు పోలీసులను సంప్రదించింది. ఈ క్రమంలో పోలీసులు, వైద్యసిబ్బంది పర్యవేక్షణలో పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతిచ్చారు. కేఎంసీలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి వైద్యసిబ్బంది పర్యవేక్షణలో ప్రత్యేక అంబులెన్స్లో తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విచారణ వేగవంతం.. కాజీపేట అర్బన్: నర్సింగ్ విద్యార్థిని సునందపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు విచారణ వేగవంతం చేసినట్లు మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ తెలిపారు. ఘటన చోటు చేసుకున్న ప్రాంతంతోపాటు కాజీపేట, కడిపికొండ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. -
40ఏళ్లు ఒక్కరే సర్పంచ్!
సాక్షి, మహబూబాబాద్ : ఒకసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన నాయకుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఐదేళ్లు పూర్తిగా పనిచేస్తారో లేదో తెలియని పరిస్థితి. కానీ, ఏకంగా నాలుగు దశాబ్దాలపాటు తిరుగులేని స ర్పంచ్గా రికార్డు సృష్టించారు మహబూబాబాద్ జి ల్లా నర్సింహులపేట గ్రామ మాజీ సర్పంచ్ నాయి ని మనోహర్ రెడ్డి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో జరిగిన ఎన్నికల్లో గ్రామ తొలి సర్పంచ్గా చెక్కల చంద్రారెడ్డి గెలిచారు. ఆయన మూడేళ్లు పని చేసిన తర్వాత 1955లో నాయిని మనోహర్ రెడ్డి సర్పంచ్గా నియమితులయ్యారు. అప్పటినుంచి వ రుసగా గెలుస్తూ.. 1995 వ రకు ఆయనే సర్పంచ్గా పనిచేశారు. పోటీ చేసిన ప్రతీసారి మనోహర్ రెడ్డి గెలుపొందారు. చివరకు వయస్సు మీద పడడంతో పోటీనుంచి తప్పుకుని మరో నాయకుడికి సర్పంచ్గా అవకాశం కల్పించారు ఆ గ్రామస్తులు. సౌమ్యుడిగా పేరున్న మనోహర్ రెడ్డి ఎన్నికల సమయంలో తప్ప.. మిగిలిన సమయంలో అన్ని వర్గాలతో మమేకమే ఉండటం.. గ్రామంలో ఎలాంటి గొడవలకు తావులేకుండా చూడడం ఆయన ప్రత్యేకత. అందుకోసమే ఇప్పటికీ ఆ గ్రామంనుంచి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేందుకు గ్రామస్తులు ఇష్టపడరని.. అది ఆయన గ్రామస్తులకు నేర్పించిన మంచితనంగా గ్రామస్తులు చెప్పుకుంటారు. పోటీచేసిన ప్రతీసారి గెలుపే విరమణ తర్వాతనే మరో సర్పంచ్ రికార్డు సృష్టించిన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట సర్పంచ్ నాయిని మనోహర్రెడ్డి -
పెన్షనర్లను భారంగా చూస్తున్న ప్రభుత్వాలు
● సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య హన్మకొండ: పెన్షనర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భా రంగా భావిస్తూ తమ కర్తవ్యం నుంచి వైదొలగాలని చూస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా 7వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎల్.అరుణ మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తూపురాణి సీతారాం, ప్రధాన కార్యదర్శిగా నారాయణగిరి వీరన్న, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా బేతి శంకర లింగం, ఆర్థిక కార్యదర్శిగా సిద్ధి రాజయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా గౌరవ సలహాదారుడు సముద్రాల రాంనర్సింహాచారి, డిప్యూటీ డైరెక్టర్ అండ్ జిల్లా కోశాధికారి ఆకవరం శ్రీనివాస్ కుమార్, ప్రముఖ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స నిపుణుడు కంచర్ల సుధీర్, శరత్ మాక్స్ విజన్ ఐ హాస్పిటల్స్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సి.శరత్ బాబు, నాయకులు ప్రభాకర్ రెడ్డి, పరికిపండ్ల వేణు, సంపత్ కుమార్, శంకర్ రావు, రహమాన్, ఎం.దామోదర్, తది తరులు పాల్గొన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎఫ్ ఆర్టీఏ చట్టాన్ని, వాలిడేషన్ ఆఫ్ పెన్షనర్స్ యాక్ట్, సీపీఎస్ను రద్దుచేయడంతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. -
సీఎం సభాస్థలి పరిశీలన
నర్సంపేట: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ఈనెల 5న సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేటకు రానున్నారు. ఈ నేపథ్యంలో హెలిపాడ్, బహిరంగ సభ స్థలాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంగళవారం సీపీ సన్ప్రీత్సింగ్, డీసీపీ అంకిత్కుమార్తో కలిసి పరిశీలించారు. నర్సంపేట నుంచి సభా స్థలికి వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, శంకుస్థాపన చేసే ప్రాంతాల్లో పోలీసు అధికారులు ఉండాలని సూచించారు. అలాగే, కలెక్టర్ సత్యశారద మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించనున్న బహిరంగ సభ, హెలి పాడ్ను పరిశీలించారు. కార్యక్రమంలో ఏసీపీ పు న్నం రవీందర్రెడ్డి, ఎస్బీ ఏసీపీ జితేందర్రెడ్డి, ము న్సిపల్ కమిషనర్ కాట భాస్కర్, టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్, డాక్టర్ పులి అనిల్, నర్సంపే ట పీఏసీఎస్ చైర్మన్ బొబ్బాల రమణారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబరెడ్డి, మాజీ మార్కెట్ చై ర్మన్ ఎర్ర యాకూబ్రెడ్డి, మాజీ ఎంపీపీ కేతిడి వీరా రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఓర్సు అంజలి, గంధం నరేష్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి సందీప్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ మోడెం ఎల్లగౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రూపిక శ్రావణ్కుమార్, మా జీ పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాల్వాయి రవికుమార్, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్ పాల్గొన్నారు. -
రక్తదానం మానవత్వానికి ప్రతీక
వరంగల్ లీగల్: రక్తదానం సేవా కార్యక్రమం మాత్రమే కాదని, అది మానవత్వానికి ప్రతీక అని వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు నిర్మలా గీతాంబ, పట్టాభిరామారావు అన్నారు. వరంగల్ డీఎల్ఎస్ఏ, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా మంగళవారం జిల్లా కోర్టులోని డీఎల్ఎస్ఏ హాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని న్యాయమూర్తులు ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసిన దాతలకు పండ్లు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయికుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలుస సుధీర్, ఉపాధ్యక్షుడు మైదం జయపాల్, ప్రధాన కార్యదర్శి రమాకాంత్, సంయుక్త కార్యదర్శి శ్రీధర్, మహిళా సంయుక్త కార్యదర్శి శశిరేఖ, కోశాధికారి సిరిమల్ల అరుణ, కార్యవర్గ సభ్యులు సురేశ్, కళకోట్ల నిర్మల జ్యోతి, రాజు, రవి, అరుణ, ఇతర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
జీతం సరిపోక పని చేస్తున్న షాపులోనే చోరీ..
● వ్యక్తి అరెస్ట్, రిమాండ్ ● వివరాలు వెల్లడించిన పోలీసులు కాజీపేట అర్బన్ : జీతం సరిపోక పని చేసిన షాపులోనే చోరీకి పాల్పడిన వ్యక్తిని మడికొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ కథనం ప్రకారం.. మడికొండ పీఎస్ పరిధిలోని రాంపూర్ ఇండస్ట్రీయల్ ఏరియాలో మంగళవారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అదుపులోకి విచారించగా తాను ఉత్తరప్రదేశ్లోని హర్బస్పూర్ గ్రామానికి చెందిన ఉమాకాంత్యాదవ్గా తెలిపాడు. రెండేళ్ల క్రితం వరంగల్కు విచ్చేసి మడికొండ ఇండస్ట్రీయల్ ప్రాంతంలోని నల్ల రాజ్యలక్ష్మి పవర్లూమ్ కంపెనీలో పని చేసే వాడినని తెలిపాడు. యజమాని ఇచ్చే జీతం సరిపోక రూ. 6.5లక్షల విలువైన ప్యానల్ బోర్డ్స్, ఫిల్టర్స్, డ్రాప్ పిన్ బాక్స్లను రెండేళ్ల క్రితమే చోరీ చేశాడు. అప్పుడే విక్రయిస్తే పట్టుబడుతానని ఓ కంటైనర్లో దాచి తాళం వేసి స్వగ్రామం వెళ్లిపోయాడు. మంగళవారం ఆ వస్తువులు అమ్మేందుకు వచ్చి పోలీసులకు పట్టుబడగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
సందడే.. సందడి..
కాజీపేట : పల్లెల్లో స్థానిక సంస్థల హడావిడి మొదలైంది. ఎక్కడ నలుగురు కలిసినా సర్పంచ్, వార్డు సభ్యుల పోటీపైనే చర్చ జరుగుతోంది. మొదటి, రెండో విడత ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసే సమయం దగ్గర పడింది. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో వివిధ వర్గాల వారితో మంతనాలు ప్రారంభమయ్యాయి. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ సర్పంచ్గా బరిలో ఉంటున్నా.. ఓటువేసి గెలిపించాలని కోరుతున్నారు. హనుమకొండ జిల్లాలో పలు మండలాల్లో నేటితో రెండు విడతల నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. మూడో విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ బుధవారం మొదలైంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్తో పోల్చితే జనరల్ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. వీటిలో అన్ని సామాజిక కులాలకు చెందిన యువకులు పోటీ చేస్తుండడంతో ఓటరు ఎవరికి అనుకూలంగా ఉన్నారో అర్థంగాని పరిస్థితులున్నాయి. ఉదయం నుంచే ప్రచారం.. ఇప్పటికే గ్రామాల్లో ఉదయం 6 గంటలకే ప్రచారం జోరుగా సాగుతోంది. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి తమను గెలిపించాలని వేడుకుంటున్నారు. యువత ఆసక్తి.. సర్పంచుల పదవీకాలం ముగిసి రెండేళ్లు కావొస్తోంది. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో యువకులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో గ్రామ పెద్దలకు అవకాశం ఇచ్చే యువత.. మార్పు కోసమంటూ నేరుగా బరిలోకి దిగేందుకు ఆసక్తి కనబరుస్తోంది. తమ బంధుమిత్రులు, యువజన సంఘాల సభ్యుల మద్దతు కోరుతోంది. యువతతోనే మార్పు సాధ్యమని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటోంది.మండలంలోని పలు గ్రామాల్లో ఏఏ గ్రామాల్లో ఏ రిజర్వేషన్ వచ్చింది..ఎవరు పోటీ చేస్తున్నారు.. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆరా తీస్తున్నారు. టీ పాయింట్లలో మొదలు.. ప్రధాన కూడళ్లు, కార్యాలయాలు, తదితర ప్రాంతాల వరకు ఇలా ఏ నలుగురు కలిసినా ఇదే ముచ్చట మాట్లాడుకుంటున్నారు. జీపీ ఎన్నికలతో పల్లెల్లో కోలాహలం ఓటర్లకు దగ్గరవుతున్న అభ్యర్థులు బలాబలాలపై చర్చ -
ఏకగ్రీవానికి వేలం!
● జోరుగా నామినేషన్లు హసన్పర్తి : హసన్పర్తి మండలం గుంటూరుపల్లి సర్పంచ్ పదవి ఏకగ్రీవానికి గ్రామస్తులు మంగళవారం సమావేశమయ్యాయి.ఈ సందర్భంగా ఎన్నికకు వేలం వేశారు. ఇందులో వచ్చిన డబ్బులను గ్రామాభివృద్ధికి ఖర్చుచేయాలని నిర్ణయించారు. సర్పంచ్ పదవికి ఐదుగురు అభ్యర్థులు ముందుకొచ్చారు. రూ.10 లక్షల నుంచి రూ.16.50లక్షల వరకు వేలం పాడారు. అయితే చివరికి ఓ అభ్యర్థి తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో నామినేషన్ల దాఖలు సంఖ్య ఐదు నుంచి ఆరుకు చేరుకుంది. బైరాన్పల్లిలో కుదరని సయోధ్య.. బైరాన్పల్లి సర్పంచ్ పదవి ఏకగ్రీవానికి నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లు పూరించారు. అయితే ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో అదనంగా మరో మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ ఏకగ్రీవానికి స్థానికులు యత్నిస్తున్నట్లు తెలిసింది. జోరుగా నామినేషన్లు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామాల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా అధికార పార్టీ మద్దతు కోరుతూ పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్కే కాకుండా వార్డు సభ్యుల స్థానాలకు కూడా భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. -
బీసీ రిజర్వేషన్లపై ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాలి
హన్మకొండ: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి నుంచి బీసీ రిజర్వేషన్లపై ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను బీసీ ప్రధాని అని నరేంద్ర మోదీ చెప్పుకోవడం మినహా బీసీలకు ఆయన చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు హామీ ఇచ్చిందని, బీసీల ఓట్లతో అధికారంలోకొచ్చి అమలు చేయకుండా మోసం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇండియా కూటమి ఎంపీలతో పార్లమెంట్ను స్తంభింపజేయాలని, అప్పుడే బీసీ లకు న్యాయం జరుగుతుందన్నారు. బీ సీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీలు మోసం చేస్తున్నాయని, బీసీలకు కాంగ్రెస్ మొదటి శత్రువైతే.. బీ జేపీ రెండో శత్రువన్నారు. చట్టబద్ధంగా బీసీ రిజర్వేషన్ల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 9న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టామన్నారు. ఉ మ్మడి వరంగల్ జిల్లా నుంచి వేలాదిగా తరలొచ్చి పార్లమెంట్ ముట్టడిని విజయవంతం చేయాలన్నారు. అనంతరం చలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవి కృష్ణ గౌడ్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, నాయకులు సంగని మల్లీశ్వర్, బొనగాని యాదగిరి గౌడ్, పల్లపు సమ్మయ్య, దొడ్డిపల్లి రఘుపతి, తమ్మల శోభారాణి, తేళ్ల సుగుణ, పద్మజ, చిర్ర రాజు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ -
గోడ మీద రాతలేదు.. మైక్ మోత లేదు
కాజీపేట: ఒకప్పుడు స్థానిక ఎన్నికల్లో బరిలో ఉంటే వ్యక్తి తన ప్రచారాన్ని గోడల మీద రాతలతో ప్రారంభించేవాడు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత ఎన్నికల అధికా రులు ఇచ్చే గుర్తులతో పోస్టర్లు అంటించడం, గోడల మీద గుర్తులను వేయడం, ఆటోల్లో ప్రచారం నిర్వహించేవారు. నేడు మారుతున్న కాలానుగుణ పరిస్థితుల నేపథ్యంలో పల్లె పోరులో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు కీలకపాత్ర పో షిస్తున్నాయి. పోటీచేసే అభ్యర్థుల అనుచరులు, కుటుంబ సభ్యులు ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారంతో మొదలు పెట్టి గ్రామానికి చేసే పనులు ఎజెండా, యువతకు చక్కటి సందేశాలను రూపొందించి సోషల్మీడియాలో పోస్టు చేయడం పల్లెల్లో చర్చనీయాంశంగా మారింది. మారిన ఎన్నికల ప్రచార పర్వం.. సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ -
ఏకగ్రీవం నుంచి పోటీ దిశగా ఆశాలపల్లి గ్రామం
సంగెం: వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం నుంచి పోటీ దిశగా వెళ్లింది. గతంలో గ్రామంలో అందరికి తెలిసి ఉన్న ఎకై క ఎస్సీ మహిళ కొంగర మల్లమ్మనే జాక్పాట్ సర్పంచ్ అవుతారనే ఊహాగానాలకు మంగళవారం తెరపడింది. గ్రామానికి చెందిన రాయపురం కార్తీక్ కొంతకాలం క్రితం ఖిలావరంగల్ మండలం నక్కలపల్లికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రొడ్డ నవ్యశ్రీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇంటర్ వరకు చదువుకున్న నవ్యశ్రీని అనూహ్యంగా బీఆర్ఎస్, బీజేపీలు సంయుక్తంగా తెరపైకి తీసుకుని వచ్చి మంగళవారం నామినేషన్ దాఖలు చేయడంతో సర్పంచ్ పదవికి పోటీ అనివార్యమైంది. దీంతో ప్రేమలో గెలిచి పెళ్లి చేసుకున్న నవ్యశ్రీ సర్పంచ్ ఎన్నికల్లో నెగ్గి గ్రామ ప్రఽథమ పౌరురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుందో లేక అధికార పార్టీ మద్దతు పొందిన కొంగర మల్లమ్మ సర్పంచ్గా అదృష్టాన్ని పొందుతుందో వేచిచూడాల్సిందే. కొంగర మల్లమ్మకు పోటీగా నామినేషన్ వేసిన ప్రేమ వివాహం చేసుకున్న యువతి -
ఒంగోలు ఆర్ట్ ఫెస్ట్కు సాగంటి మంజుల పెయింటింగ్
హన్మకొండ చౌరస్తా: ఒంగోలు ఆర్ట్ ఫెస్ట్–2025 (ఆర్ట్ ఎగ్జిబిషన్)కు హనుమకొండలోని గోపాలపూర్కు చెందిన సాగంటి మంజుల గీసిన చిత్రం ఎంపికైంది. హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ కేంద్రంగా.. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు ఈ ఫెస్ట్ నిర్వహించనున్నారు. ‘భారతీయ సాంప్రదాయ గృహాలు’ అంశంపై రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు వంద మంది ప్రముఖ ఆర్టిస్టులు పాల్గొనే ప్రదర్శనకు తన పెయింటింగ్ ఎంపికవడంపై సాగంటి మంజుల సంతోషం వ్యక్తం చేశారు. వరంగల్ స్పోర్ట్స్: ఈనెల 4న హనుమకొండ, వరంగల్, జనగామ, ములుగు, భూపాలపల్లి, మహబూబ్బాద్ జిల్లాల అండర్–16 క్రికెట్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరుణాపురం సమీపంలోని వంగాలపల్లి డబ్ల్యూడీసీఏ క్రికెట్ మైదానంలో ఉదయం 10గంటలకు ఎంపిక పోటీలు ఉంటాయని తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికై న ఉమ్మడి వరంగల్ జట్టు హెచ్సీఏ ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయిలో పాల్గొంటుందని పేర్కొన్నారు. జిల్లా స్థాయి ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు సెప్టెంబర్ 01, 2009 నుంచి ఆగస్టు 31, 2011 మధ్య జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు మీసేవ నుంచి తీసుకున్న పుట్టినతేదీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, సొంత క్రికెట్ కిట్తో 6న ఉదయం 10గంటలకు వంగాలపల్లి మైదానం వద్ద హాజరు కావాలని సూచించారు. హన్మకొండ చౌరస్తా: హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి మంగళవారం గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్, ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. ఇనగాల వెంట ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జనగామ, మహబూబాబాద్ డీసీసీ చైర్పర్సన్లు ధన్వంతి, ఉమ ఉన్నారు. హన్మకొండ: వరంగల్ ఓసిటీలోని టీజీ ఎన్పీడీసీఎల్ 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లో ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న లైన్మెన్ పి.ప్రభాకర్ మద్యం సేవించి విధులకు హాజరైనట్లు గుర్తించి సస్పెండ్ చేసినట్లు ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ శెంకేశి మల్లికార్జున్ తెలిపారు. విద్యుత్ సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వహిస్తూ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. హన్మకొండ: పెగడపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి ఎం.యశ్వంత్ను విధుల నుంచి తొలగిస్తూ హనుమకొండ జిల్లా శాఖ అధికారి బి.సంజీవరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్థానంలో మల్లారెడ్డిపల్లి సెక్రటరీ గణేశ్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. పెగడపల్లి సొసైటీలో రుణమాఫీ ప్రతిపాదనల్ని నిబంధనలకు విరుద్ధంగా పంపడం, రైతుల రుణ ఖాతాల నిర్వహణలో వైఫల్యం, సంఘానికి చెందిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లను సకాలంలో ఆదాయపు పన్ను శాఖకు సమర్పించకుండా నిర్లక్ష్యం, అలసత్వం వహించినందుకు ఎం.యశ్వంత్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. జిల్లాస్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు వాయిదావిద్యారణ్యపురి: ఈనెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు నిర్వహించాల్సిన హనుమకొండ జిల్లా స్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు వాయిదా వేసినట్లు జిల్లా ఇన్చార్జ్ డీఈఓ ఎ.వెంకటరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సేయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్లో ఇన్స్పైర్, సైన్స్ఫెయిర్ను నిర్వహించేందుకు నిర్ణయించినప్పటికీ కొందరు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో ఉన్నందున ఆయా వైజ్ఞానిక ప్రదర్శనలు వాయిదా వేసినట్లు తెలిపారు. ఎన్నికల అనంతరం మళ్లీ ఎప్పుడు వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తారనేది ప్రకటిస్తామని తెలిపారు. -
అనర్థం.. ఈ–వ్యర్థం!
బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025వరంగల్ అర్బన్: ఓరుగల్లు నగరాన్ని ఈ–భూతం వెంటాడుతోంది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు నగర ప్రజానీకానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. హైదరాబాద్ తర్వాత అంతగా అభివృద్ధి చెందుతున్న వరంగల్లో ఐటీ కంపెనీలు క్రమేపీ విస్తరిస్తున్నాయి. హార్డ్వేర్ ఆధారిత పరిశ్రమలు, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, స్మార్ట్ ఫోన్లు, ప్రింటర్లు, టెలిఫోన్స్, రిఫ్రిజిరేటర్స్, ఏసీలు, కూలర్లు వంటివి ఉత్పత్తి జరుగుతోంది. పెరిగిపోతున్న వినియోగం, వేస్టేజ్ సౌకర్యవంతమైన జీవనం కోసం కొందరు విచ్చలవిడిగా ఎలక్ట్రానిక్ వస్తువులు, ఉపకరణాలు వినియోగిస్తున్నారు. మరికొందరు విలాసాలకోసం ఎలక్ట్రానిక్స్ వస్తువులు వాడుతున్నారు. ఇలా.. రోజురోజుకూ వినియోగం పెరుగుతోంది. అదే స్థాయిలో ఈ–వేస్టేజ్ పెరిగిపోతోంది. ఒక్కో ఇంటి నుంచి ఏటా 5 కిలోల ఈ–వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. పాత, పనికిరాని ఎలక్ట్రానిక్ పరికరాలు గుట్టల్లా పేరుకుపోతున్నాయి. వీటి కారణంగా పర్యావరణం దెబ్బతింటోంది. నగరంలో ఏటా సగటున్న 3,650 మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పొగుపడుతుండగా, వీటిలో 75 శాతం గృహాల నుంచి వెలువడుతుంటం గమనార్హం. ఇక పరిశ్రమలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, శిక్షణ కేంద్రాల నుంచి వెలువడే వాటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరల్లేదు. నగరంలో వెలువడుతున్న ఈ–వ్యర్థాలపై అవగాహన కల్పించడంతో కాలుష్య నియంత్రణ మండలి అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. రీసైక్లింగ్ చేయాలి.. తడి, పొడి చెత్తను వేరుచేస్తున్న క్రమంలో ఈ–వేస్ట్ను వేరు గృహ యజమానులు వేరు చేసి, స్వచ్ఛ ఆటో సిబ్బందికి అందజేయాలి. అందుకోసం బల్దియా అధికార యంత్రాంగం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలి. సేకరించిన వేస్ట్ను బల్దియా రీసైక్లింగ్ ప్రాసెస్ను ప్రారంభించాలి. ప్రజల్లో ఈ వ్యర్థాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. ఈభూతం నుంచి ప్రజల్లో మేల్కోలుపు కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు ఏడాదికి 360 మెట్రిక్ టన్నులు చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం క్యాథోడ్ రేటూబ్య్లు: టీవీల్లో వినియోగించే ఈ ట్యూబుల్లో లెడ్, బేరియం, ఇతర భార లోహాలు, నీటిని విషంగా మార్చే సల్పర్ భూగర్భ జలాల్లో చేరుతాయి. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులను వృథాగా పడేయడంపై బ్రోమిన్, ఈ–చిప్స్, బ్రోమిన్, కాడ్మియం, మోర్యూరీ, ఇతర భార లోహాలు, భూగర్భ జల్లాల్లో చేరుతున్నాయి. ఇనుము, జింక్, నికెల్, పెల్లాడియం తదితర లోహాలు వినియోగించడం వల్ల సహవనరులపై ఒత్తిడి పెరుగుతోంది. నైట్రోజన్ ఆకై ్సడ్, లెడ్, అర్సినిక్, కాడ్మియం ఆమ్ల వర్షాలకు కారణమవుతున్నాయి. కంప్యూటర్ విడి భాగాలు, రబ్బరు, ప్లాసిక్ వస్తువులు, పాలీ ఆరో మాటిక్ హైడ్రో కార్బన్లు వెలువడే పీల్చే గాలి విషతుల్యమవుతోంది. సెమీ కండకర్లు రసాయనాలు, మూలకాలు, శ్వాస క్రియ, రక్త ప్రసరణ వ్యవస్థ, కాలేయం, వినాళ గ్రంథులు దెబ్బతింటున్నాయని చెబుతున్నారు. ఎల్సీడీలు మో ర్క్యూరీ మెదడు, రక్త నాళాలు దెబ్బతింటున్నాయి. ప్రత్యుత్పుత్తి వ్యవస్థ ఊపిరితి త్తులు, మూత్రపిండాలు దెబ్బతింటాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
భవిత.. ‘ప్రత్యేక’ పిల్లలకు భరోసా
విద్యారణ్యపురి: ప్రత్యేక అవసరాల పిల్లలకు భవిత కేంద్రాలు భరోసాగా నిలుస్తున్నాయి. ఈకేంద్రాల్లో ప్రత్యేక అవసరాల పిల్లలకు విద్యతోపాటు వివిధ స దుపాయాలు కల్పిస్తున్నారు. అవసరమైన పిల్లలకు ఫిజియోథెరపీ అందిస్తున్నారు. భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ ద్వారా అర్హత కలిగిన ప్రత్యేకావసరాల పిల్లలకు కృత్రిమ అవయవాలను కూడా పంపిణీ చేస్తున్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు (బుధవారం) హనుమకొండ జిల్లాలోని 14 మండలాల్లో ఉన్న భవిత కేంద్రాల్లో దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు విద్యార్థులకు క్రీడాపోటీలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. ఈమేరకు ఇన్చార్జ్ డీఈఓ ఎ.వెంకటరెడ్డి ఈ వేడుకలను భవిత కేంద్రాల్లో నిర్వహించాలని ఎంఈఓలను ఆదేశించారు. మండలానికి రూ.10 వేలు భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించేందుకు రూ.10 వేల నిధులు కూడా కేటాయించారు. ఎంఈఓలు ఆయా నిధులు వినియోగించాల్సి ఉంటుంది. కాగా, నేటి దివ్యాంగుల దినోత్సవానికి ప్రత్యేక అవసరాలుగల చిన్నారుల తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాల్సి ఉంటుంది. భవిత కేంద్రాల్లో పిల్లలకు అందిస్తున్న సదుపాయాల గురించి వారికి తెలియజేయాల్సి ఉంటుంది. హనుమకొండ జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రత్యేక అవసరాల పిల్లలు 5 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వారు 1,801 మంది ఉన్నట్లుగా గుర్తించారు. 14 భవిత కేంద్రాల్లో 158 మంది ప్రత్యేక అవసరాల పిల్లలు విద్యాభ్యాసం చేస్తుండగా.. 72 మందికి గృహ ఆధారిత విద్య అందిస్తున్నారు. జిల్లాలో 143 మంది పిల్లలు ఫిజియోథెరపీ సేవలు పొందుతున్నారు. మిగతా కొందరు పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. 153 మంది పిల్లలకు ఉపకరణాలు.. ఈవిద్యాసంవత్సరం ఆగస్టులో నిర్వహించిన ప్రత్యేక అవసరాల పిల్లలకు వైకల్య స్థాయి నిర్ధారణ శిబిరం నిర్వహించగా 174 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 153 మందికి 225 ఉపకరణాలు మంజూరయ్యాయి. ఈవిద్యాసంత్సరం మొదటి నాలుగు నెలలకుగాను పీఎం శ్రీ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రూ.37,680 ఉపకార వేతనం కూడా మంజూరైంది. జిల్లాలోని 14 మండలాల్లో గల ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఫిజియోథెరపీ అందించేందుకు ప్రస్తుతం ఆరుగురు ఫిజియోథెరపిస్టులు అందుబాటులో ఉన్నా రు. మరో 8 మందిని ఈనెలలో నియమించనున్నారు. క్రీడా సాంస్కృతిక పోటీలు జిల్లాలోని ప్రత్యేక అవసరాల పిల్లలకు భవిత కేంద్రాల్లో ఈనెల 3న దివ్యాంగుల దినోత్సవ వేడుకల సందర్భంగా క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేయాల్సి ఉంటుంది. మండలానికి రూ.10 వేల చొప్పున కేటాయించిన నిధులు వినియోగించుకోవాల్సి ఉంటుంది. – బద్దం సుదర్శన్రెడ్డి, జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కో–ఆర్డినేటర్, హనుమకొండ విద్యతోపాటు పలు సదుపాయాలు కల్పిస్తున్న కేంద్రాలు నేడు దివ్యాంగుల దినోత్సవం తల్లిదండ్రులకు ఆహ్వానం -
డంప్ యార్డు శాశ్వత పరిష్కారానికి బయోమైనింగ్
బస్తీ మే సవాల్!ఈ అడ్డా మాదే ఎవరొస్తారో రండి అన్నట్లుగా నడిరోడ్డుపై గుంపులుగా తిరుగుతున్నాయి కుక్కలు. హనుమకొండలోని కుమార్పల్లి మార్కెట్ వద్ద మంగళవారం గుమిగూడిన శునకాల్ని ‘సాక్షి’ క్లిక్మనిపించింది. – హన్మకొండ చౌరస్తాకాజీపేట అర్బన్: గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ పరిధి రాంపూర్లోని డంపింగ్ యార్డు సమస్య శాశ్వత పరిష్కారానికి బయోమైనింగ్ లెగెస్సీ వేస్ట్ ప్రాసెసింగ్ వర్క్ తోడ్పడుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. రాంపూర్లోని డంపింగ్ యార్డులో బయోమైనింగ్ ప్రాజెక్టును మంగళవారం మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారని, తాను సైతం మడికొండ డంపింగ్ యార్డు సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించినట్లు తెలిపారు. వరంగల్లోని చెరువులు, నాళాల అక్రమణల నివారణకు హైడ్రా మాదిరిగా వాడ్రా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్.దిలీప్రాజ్, మెట్టుగుట్ట ఆలయ చైర్మన్ పైడిపాల రఘుచందర్, పార్టీ మండల అధ్యక్షుడు సారంపల్లి శ్రీనివాస్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు వస్కుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రుల ఆదేశాలు అమలయ్యేనా?
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ గద్దెల వరుస క్రమంలో గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను పునర్నిర్మిస్తున్నారు. నూతన గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ఈనెల 4వ తేదీ(గురువారం)న పూజారులు ధ్వజస్తంభాల పునఃప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. గత నెల 28న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్కలు గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులు పరిశీలించి రెండు గద్దెలపై రాతి పిల్లర్ల ఏర్పాటు పనులన్నీ బుధవారం(నేడు) వరకు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కానీ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై స్టోన్స్ ఏర్పాట్ల పనులు ఇంకా పూర్తి కాలేదు. మంత్రుల ఆదేశాల మేరకు బుధవారం నాటికల్లా పూర్తయ్యేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మిగిలింది ఒకరోజే.. గోవిందరాజు, పగిడిద్దరాజులను పునర్నిర్మిస్తున్న గద్దెలపై పునఃప్రతిష్ఠ పూజా కార్యక్రమాలకు ఒక రోజు మాత్రమే మిగిలింది. రెండు గద్దెల చుట్టూ రెండు వరుసల స్టోన్స్ ఏర్పాటు చేశారు. ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాలతో లిఖించిన రాతి పిల్ల ర్ను మంగళవారం పగిడిద్దరాజు గద్దైపె ఏర్పాటు చేశారు. రెండు గద్దెల చుట్టూ రాతి పిల్లర్ల ఏర్పాటుతోపాటు డిజైన్కు సంబంధించిన స్టోన్స్ను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పనులన్నీ బుధవారం ఒక రోజులోనే పూర్తి చేస్తారా? అన్న అనుమానాలు పూజారులు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పరిశీలించినా పనులు అంతంతే.. ప్రతిరోజూ జిల్లాస్థాయి ఉన్నతాధికారి మేడారం జాతర అభివృద్ధి పనులను పరిశీలిస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నా పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పనుల పురోగతి విషయంలో కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారుల పనితీరులో మార్పు రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునర్నిర్మాణం పనులు పూర్తి కాకపోవడంపై ఆర్అండ్బీశాఖ అధికారులు హైరానా పడుతున్నారు. బుధవారంకల్లా రాతి పిల్లర్ల పనులు పూర్తి కాకపోతే మంత్రులనుంచి ఎలాంటి మాట వస్తుందోనన్న టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. రేపే గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ధ్వజస్తంభాల పునఃప్రతిష్ఠ ముహూర్తం ఖరారు చేసిన పూజారులు మిగిలింది ఒక రోజే.. గద్దెల పనులు పూర్తయ్యేది అనుమానమే -
ఇండోర్, జైపూర్కు పోటీనిద్దాం..
వరంగల్ అర్బన్: ‘చేయి చేయి కలుపుదాం.. దేశంలోనే మొదటి స్థానాల్లో నిలిచిన ఇండోర్, జైపూర్ సిటీలకు పోటీనిద్దామని మేయర్ గుండు సుధారాణి విజ్ఞప్తి చేశారు. మంగళవారం వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలో బల్దియా, ఆస్కీ సంయుక్త ఆధ్వర్యంలో వలంటీర్లు, శానిటరీ జవాన్లు, ఔత్సాహిక మహిళా సంఘ సభ్యులు, స్వచ్ఛ ఆటోడ్రైవర్లకు తడి పొడి చెత్త సేకరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ‘మన కోసం –మన స్వచ్ఛ వరంగల్‘ నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. ప్రతీ డివిజన్కు ముగ్గురు వలంటీర్లను నియమిస్తామని, వీరు 4 నెలల పాటు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తారని తెలిపారు. కమిషనర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. ప్రతీ వార్డులోని మూడు స్వచ్ఛ ఆటోలకు ముగ్గురు వలంటీర్లను కేటాయిస్తామని వలంటీర్లు నిబద్ధతతో పని చేయాలన్నారు. ఈసందర్భంగా వలంటీర్లు ధరించే యూనిఫాంను మేయర్, కమిషనర్ ఆవిష్కరించి పొడి చెత్తగా పరిగణించబడే వస్తువులను ప్రదర్శించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఎంహెచ్ఓ రాజేశ్, టీఎంసీ వెంకట్రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు నరేందర్, గోల్కొండ శ్రీను, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. మేయర్ గుండు సుధారాణి ‘మన కోసం మన స్వచ్ఛ వరంగల్’ సదస్సు -
రెండో విడత నామినేషన్ల స్వీకరణ పూర్తి
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఐదు మండలాల్లోని 73 గ్రామపంచాయతీ, 694 వార్డులకు మూడు రోజులుగా అధికారులు నామినేషన్లు స్వీకరించారు. మంగళవారం రాత్రి సుమారు పది గంటల వరకు హసన్పర్తి మండలంలోని కొన్ని గ్రామపంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగింది. మొత్తంగా రెండో విడతలో గ్రామపంచాయతీలకు – , వార్డు స్థానాలకు – నామినేషన్లు అందినట్లు అధికారులు తెలిపారు. వీటి స్క్రూటినీ కార్యక్రమం బుధవారం ఉంటుందన్నారు. మూడో విడత ... మూడో విడతలో ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట మండలాల్లో బుధవారం నుంచి సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతున్నట్టు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. మొత్తం 68 గ్రామపంచాయతీలు, 634 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. సంబంధిత మండలాల ఎంపీడీఓలు, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పర్యవేక్షించారు. అర్ధరాత్రి వరకు బారులుదీరిన అభ్యర్థులు వరంగల్: వరంగల్ జిల్లాలో రెండో విడత కింద దుగ్గొండి, నల్లబెల్లి, సంగెం, గీసుకొండ మండలాల్లోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పోటెత్తారు. అర్ధరాత్రి వరకు దాఖలు ప్రక్రియ కొనసాగడంతో ఎన్ని నామినేషన్లు దాఖలైన విషయాన్ని అధికారులు ప్రకటించలేదు. బుధవారంనుంచి మూడో విడతలో నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని మొత్తం 109 సర్పంచ్, 946 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
సేవ కోసం సమయం కేటాయించాలి
సీపీ సన్ ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: ఉద్యోగ విరమణ అనంతరం పోలీస్ సిబ్బంది సేవా కార్యక్రమాలకు సమయం కేటాయించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సుధీర్ఘకాలం విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను మంగళవారం ఆయన ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈసందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ పొందుతున్న అధికారులు నేటి తరం పోలీసులకు ఆదర్శంగా నిలుస్తారని, వారు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత ప్రభుత్వం నుంచి అందే డబ్బును భవిష్యత్ అవసరాలకు భద్రపర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి, సురేశ్ కుమార్, శ్రీనివాస్, ఏసీపీ సురేంద్ర, ఆర్ఐ సతీశ్, స్పర్జన్తో పాటు, ఇతర పోలీస్ సిబ్బంది, పదవీ విరమణ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
టీబీ నియంత్రణకు స్క్రీనింగ్ నిర్వహించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో టీబీ నియంత్రణకు స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులను హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బందితో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. టీబీ నియంత్రణ కార్యక్రమాలకు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దానికి అనుగుణంగా స్క్రీనింగ్, ఎక్స్ రే, నాట్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. స్క్రీనింగ్ పరీక్షలు తక్కువగా నిర్వహించిన వడ్డేపల్లి, లష్కర్ సింగారం, కడిపికొండ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులను కారణాలు అడిగి తెలుసుకున్నారు. వందశాతం ప్రసవాలను ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగడానికి ప్రోత్సహించిన ఆరుగురు ఆశాలను శాలువాలతో సత్కరించా రు. డీఎంహెచ్ఓ అప్పయ్య, అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్ మోహన్రావు, టీబీ నియంత్రణ అధి కారి డాక్టర్ హిమబిందు,ప్రదీప్రెడ్డి, ప్రభుదాస్, జ్ఞానేశ్వర్, అశోక్రెడ్డి, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
ఎన్నికల్లో నేరాలకు పాల్పడితే అనర్హతే..
నానమ్మ.. నామినేషన్ ఖర్చులు మావే‘జాక్పాట్ సర్పంచ్’ మల్లమ్మ నామినేషన్ ఏం జేయాల్నో తెలుస్తలేదు..! గీసుకొండ : నాకు బాగా గుబులైతాంది.. ఏం జేయాల్నో తెలుస్తలేదు. సర్పంచ్ ఎలచ్చన్ల ఎవరికి ఓటేయాల్నో సమజైత లేదు.. పిచ్చి లేత్తాంది. మైండ్ గరమైతాంది. మా ఊళ్లే అందరూ నాకు గావాల్సిన వాళ్లే.. ఒకాయన సర్పంచ్గా నన్ను గెలిపిస్తే తన భూమిని ఊరికి రాసిస్తానంటాండు. మరొకాయన పంచాయతీలో పొటీకి భూమిని అమ్మకానికి బేరం పెట్టిన అంటాండు.. కొందరైతే ఎన్నడూ లేంది గుడి, బడి కట్టిస్తామంటుండ్లు. సొంత ఖర్చులతోటి రోడ్డు వేయిస్తామని చెబుతాండ్లు.. ఇంకొందరైతే ఓటుకు రూ.వెయ్యి ఇస్తామంటుడ్లు. రోజూ మందు పోయిస్తమని, చికెన్, మటన్ కూరలను వండించి పెడుతమని చెబుతాండ్లు. నన్ను రాజులా చూసుకుంటమని అంటుండ్లు.. నాకై తే వారి మాటలను వింటే పిచ్చిపిచ్చి అయితాంది. ఏం జేయాల్నో తెల్వడం లేదు. ఎవరికి ఓటోయాల్నో తెల్వక తలకాయను బండకు గుద్దుకోవాలనిపిస్తాంది.. ఓరీ దేవుడా.. నీవైనా నాకేమైన దారి చూపు..ఎవరికి ఓటేయాల్నో జర చెప్పు.. నీకు జన్మజన్మలా రుణపడి ఉంటా..దంతాలపల్లి : ‘నానమ్మ నీ నామినేషన్ ఖర్చులు మావే’ అంటూ ఇద్దరు చిన్నారులు తాము దాచుకున్న చిల్లర నగదును ఓ పల్లెంలో తీసుకు వచ్చి అందజేసిన ఘటన గ్రామస్తులను ఆకట్టుకుంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ‘నువ్వే సర్పంచ్గా ఉండాలని’ ఓ గ్రామస్తుడు కొమ్మినేని రాములమ్మ కాళ్లు పట్టుకున్న విషయం విదితమే. కాగా గ్రామస్తుల కోరిక మేరకు సర్పంచ్గా నామినేషన్ దాఖలు చేయబోతున్న రాములమ్మకు తన మనుమరాళ్లు జీవనశ్రీ, దేవాన్షి మరుపు రాని చిరుకానుక ఇచ్చారు. తల్లిదండ్రులు తమకు ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులను గల్లగురిగిలో దాచుకున్నారు. నామినేషన్ వేయబోతున్న తమ నానమ్మ వాటిని పగులకొట్టి ఆ చిన్నారులు కానుకగా ఇచ్చారు. ఈ విషయం గమనించిన గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.ఇట్లు.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేని ఓటరుజనగామ: భారత శిక్షాస్మృతి 1860లోని 9వ విభాగంలో ఎన్నికల్లో నేరానికి శిక్ష పడిన లేదా 242వ విభాగం ప్రకారం విచారణ జరిగిన శిక్షవిధించే అవకాశముంది. శిక్ష తేదీ నుంచి లేదా తీర్పు వెలువడిన నాటి నుంచి ఆరేళ్లపాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి వారు అనర్హులు. లెక్కలు చూపకపోతే మూడేళ్ల వేటు.. సర్పంచ్, మండల, జిల్లా ప్రజాపరిషత్ సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థి ఎన్నికల ఖర్చుల లెక్కలను నిర్ణీత గడువులో దాఖలు చేయాలి. ఒకవేళ చూపించని పక్షంలో ఎన్నికల సంఘానికి సరైన జవాబు ఇవ్వాలి. ఈ రెండు ఇవ్వని పక్షంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు తెలంగాణ గెజిట్ను అనుసరించి ఉత్తర్వు విడుదల చేస్తుంది. దీని ద్వారా ఆ ఉత్తర్వుల తేదీ నుంచి మూడు సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హత వేటు పడుతుంది. ఇప్పటికే ఎన్నికై పదవిలో ఉన్నా వారిని తొలగించినట్టు ప్రకటించవచ్చు. విధినిర్వహణలో వైఫల్యంపై అనర్హత.. గ్రామ పంచాయతీ సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ తమ బాధ్యతల్లో విఫలమై పదవి నుంచి తొలగిపోతే వారు తర్వాత ఆరేళ్ల పాటు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఇది పంచాయతీ పరిపాలనలో బాధ్యతను పెంచే కీలక నిబంధనగా భావించబడుతోంది. ఈ నిబంధన ఎన్నికల్లో పారదర్శకతను పెంచడంతో పాటు ప్రజాప్రతినిధుల బాధ్యతను బలోపేతం చేసే లక్ష్యంగా నిలుస్తున్నాయి. కోతులను నియంత్రించిన వారికే ఓటు.. మరిపెడ రూరల్ : కోతుల బెడదను నియంత్రించిన వారికి తమ ఓటు వేసి సర్పంచ్గా గెలిపిస్తామని మండలంలోని వీరారం గ్రామస్తులు తెగేసి చెబుతున్నారు. కోతుల బెడద కారణంగా పంటలు ధ్వంసం కావడంతో పాటు ఇళ్లలోకి చొరబడి వస్తువులన్ని చిందరవందర చేస్తున్నాయని అంటున్నారు. కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపిన వారికే సర్పంచ్గా ఓటు వేస్తామన్నారు. వానరాల నివారణకు సర్పంచ్ అభ్యర్థులు ఎవరు ముందుకు వస్తారో వారికే తాము ఓటు వేస్తామన్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.పోటీకి కలిసొచ్చిన ప్రేమపెళ్లిళ్లు.. కాజీపేట : పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఎంతో కాలంగా గ్రామానికి మొదటి పౌరుడిగా ఎంపిక కావాలని ఎదురు చూస్తున్న కొందరికి ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు నిరాశను మిగిల్చాయి. ఇదే రిజర్వేషన్లు మరికొంత మందికి తాము పోటీచేసే అవకాశం లేకున్నా తమ జీవిత భాగస్వాములకు పోటీ చేసే అవకాశాన్ని కల్పించాయని సంబుర పడుతున్నారు. ధర్మసాగర్ మండల కేంద్రం ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గాలకు చెందిన యువతులను ప్రేమించి పెళ్లి చేసుకున్న ముగ్గురు యువకులు తమ భార్యలతో పోటీ చేయించేందుకు సమయత్తమయ్యారు. ముగ్గురు ఒకే రోజు తమ శ్రీమతులతో నామినేషన్ దాఖలు చేయించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఓటరు దేవుళ్లు ఎవరి పక్షాన నిలబడి ఆశీర్వదిస్తారో వేచిచూడాల్సిందే. ● తెరపైకి ప్రేమవివాహం చేసుకున్న యువతి! సంగెం : మండలంలోని ఆశాలపల్లి జాక్పాట్ సర్పంచ్గా పిలుచుకునే ఒకే ఒక ఎస్సీ మహిళ కొంగర మల్లమ్మ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మాజీ సర్పంచ్ బొల్లెబోయిన కిశోర్ యాదవ్, నాయకులు కొంతం దశరథంతో కలిసి ఆమె గవిచర్ల కేంద్రంలో నామినేషన్ వేశారు. గ్రామంలో ఎస్సీ జనాభా లేకపోవడం.. ఉన్న ఒకే ఒక్క మహిళ మల్లమ్మ ఏకగ్రీవంగా సర్పంచ్ కావడం ఖాయమని అందరూ భావిస్తున్న తరుణంలో గ్రామానికి చెందిన ఇతర కులానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువతిని రంగంలోకి దింపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు గ్రామంతో పాటుగా మండలంలో చర్చ జరుగుతోంది. నామినేషన్లకు ఒక్క రోజే గడువు ఉండడంతో మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి ఉత్కంఠకు తెరపడనుందని ఊహగానాలు వినవస్తున్నాయి. జాక్పాట్ సర్పంచ్గా మల్లమ్మ ఎన్నిక కానుందా లేక ప్రేమవివాహం యువతి తెరపైకి వస్తే, పోటీ పడి మల్లమ్మ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. -
ట్రాఫిక్ ఉల్లంఘనులు
సాక్షి, వరంగల్ : రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలన్న సదుద్దేశంతో వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపే వారితో పాటు ట్రాఫిక్ జంక్షన్ల వద్ద సిగ్నల్ జంపింగ్ చేయడం, అత్యవసర పని ఉందంటూ రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న వారిని నియంత్రించాలన్న ఉద్దేశంతో పోలీసులు కెమెరాలతో క్లిక్మనిపిస్తున్నారు. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు 8,99,983 ఈ – చలాన్లు జారీచేసి రూ.25,42,12,482 జరిమానా విధించారు. అయినా కూడా వాహనదారుల్లో ఆశించినంత మార్పు కనిపించకపోవడంతో ఇటీవలి కాలంలో ప్రత్యేక డ్రైవ్లతో వాహనదారులకు ఈ – చలాన్ల రూపంలో షాకిస్తున్నారు. నో హెల్మెట్.. అయినా డ్రైవింగ్ ఉరుకులు.. పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యం భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లిస్తున్న వాహనదారులు కోకొల్లలు ఉన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ లేకపోవడంతో చాలామంది అక్కడికక్కడే మృతిచెందడం, గాయాలు కావడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో మెదడుకు దెబ్బ తగిలిన చోట న్యూరాన్లు నశించడం వల్ల అవయవాలు శాశ్వతంగా చచ్చుబడిపోతున్నాయి. అనేక రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు ఈ ఘటనలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో తలకు ప్రాధాన్యమిచ్చి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని పోలీసులు పదేపదే చెబుతున్నారు. అయితే, ట్రాఫిక్ ఉల్లంఘనుల్లో అత్యధికంగా హెల్మెట్ ధరించనివారే 7,76,740 మంది ఉండడం గమనార్హం. అదే సమయంలో 1,330 మంది పిలియన్ రైడర్ (బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి)లు హెల్మెట్ ధరించలేదని రూ.1,31,800 జరిమానా విధించారు. ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపినవారు, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్తో ఉల్లంఘనలు చేస్తున్నారు. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అందుకే ట్రాఫిక్ ఉల్లంఘనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ చెబుతున్నారు. అలాగే, రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వరంగల్ కమిషనరేట్లో 10 నెలల్లో 8,99,983 ఈ – చలాన్ల జారీ వాహనదారులకు రూ.25 కోట్లకుపైగా పోలీసుల జరిమానాలు ఓవైపు అవగాహన కల్పిస్తూనే ఇంకోవైపు ఇంటికే ఈ – చలాన్లు హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన వారు 7,76,740 మందిఈ – చలాన్లు, జరిమానాలు ఇలా.. -
ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలి
న్యూశాయంపేట: ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సజావుగా సాగేలా నోడల్ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలో నియమించిన నోడల్ అధికారుల విధులపై వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొదటి విడత నామినేషన్లు పూర్తై స్క్రూటీని జరుగుతోందని, అదేవిధంగా రెండో విడత నామినేషన్ల ప్రక్రియ సాగుతోందని చెప్పారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, అధికారులు పాల్గొన్నారు.వరంగల్ కలెక్టర్ సత్యశారద -
రెండో రోజు నామినేషన్ల స్వీకరణ
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో రెండో విడత పోలింగ్ జరగనున్న ఐదు మండలాల్లోని 73 గ్రామపంచాయతీల సర్పంచ్ స్థానాలకు సోమవా రం రెండో రోజు 170 నామినేషన్లు వచ్చాయి. అదేవిధంగా 694 వార్డులకు 350 నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేశారు. రెండు రోజుల్లో సర్పంచ్ స్థానా లకు 221 నామినేషన్లు, వార్డు సభ్యులకు 694 394 నామినేషన్లు అధికారులకు అందినట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలో.. వరంగల్: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండో రోజు సోమవారం నామినేషన్ల జోరు పెరిగింది. దుగ్గొండి మండలంలో 34 సర్పంచ్ స్థానాల్లో 46, 282 వార్డు సభ్యుల స్థానాల్లో 75 నామినేషన్లు, నల్లబెల్లి మండలంలోని 29 సర్పంచ్ స్థానాల్లో 45 నామినేషన్లు, 252 వార్డు సభ్యుల స్థానాల్లో 71, గీసుకొండ మండలంలోని 21 సర్పంచ్ స్థానాల్లో 54 నామినేషన్లు, 188 వార్డు సభ్యుల స్థానాల్లో 113 నామినేషన్లు, సంగెం మండలంలో 33 సర్పంచ్ స్థానాల్లో 70 నామినేషన్లు, 286 వార్డు సభ్యుల స్థానాలకు 164 నామినేషన్లు దాఖలు అయ్యాయి. -
వాడీవేడి చర్చ
రసాభాసగా గ్రేటర్ కౌన్సిల్ సమావేశంవరంగల్ అర్బన్: జిల్లా ఇన్చార్జ్ మంత్రి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం జారీ చేసిన ఉత్తర్వులను 8 నెలల క్రితం పట్టించుకోలేదని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ ఉత్తర్వులను ముక్కలుగా చించేసి మేయర్, కమిషనర్, అధికారులపై ఎమ్మెల్సీ అక్కసు వెళ్లగక్కారు. గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన సోమవారం బల్దియా కార్యాలయంలో రసాభాసగా సాగింది. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కేంద్ర బిందువుగా చర్చ గరంగరంగా సాగింది. ముందుగా కవి అందెశ్రీ, మాజీ కౌన్సిలర్ బైరి సాంబయ్య మృతికి 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడు తున్న టౌన్ప్లానింగ్ అధికారులు పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 39 ఎజెండా అంశాలు, రూ.130 కోట్ల అభివృద్ధి పనులపై తీర్మానాలు ఆమోదించారు. కాగా, పాలకవర్గం 55 నెలల కాలంలో పెద్ద మొత్తం నిధులతో మొదటిసారి తీర్మానించడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీకి గౌరవం లేదా? ఎజెండా అంశాలను చదువుతుండగా ఎమ్మెల్సీ సారయ్య జోక్యం చేసుకుని.. ‘నేను కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. మంత్రిగా పనిచేశా. ఎమ్మెల్సీని అయిన నాపై అధికారులకు ఏ మాత్రం గౌరవం లేదు. హంటర్రోడ్డులో రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జారీచేసిన ఉత్తర్వులు 8 నెలల క్రితం సమర్పించినా పట్టించుకోలేదు. కనీసం ఫోన్ ఎత్తడం లేదు’ అంటూ మండిపడ్డారు. కమిషనర్ చాహత్బాజ్పాయ్ మాట్లాడుతూ.. అన్ని కమ్యూనిటీ హాళ్లను బల్దియా స్వాధీనం చేసుకొని నిర్వహణ బాధ్యతలు తీసుకుంటుందని సమాధానమిచ్చారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. బల్దియా స్థలాలను సామాజిక అవసరాలకు కేటాయించిన నిధులతో కమ్యూనిటీహాళ్లు నిర్మించినట్లు తెలిపారు. అన్ని కులాలు, ఆలయాలకు ప్రభుత్వం నిధులు కేటాయించి నిర్మించిన కమ్యూనిటీహాళ్ల నిర్వహణ బల్దియాకు ఎలా సాధ్యమవుతుందని మండిపడుతూ ఉత్తర్వులను చించిపడేశారు. ఫెన్సింగ్ వేయకపోవడంతో ఖాళీ స్థలాలు కబ్జాకు గురవుతున్నా అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తన వాహనాన్ని అడ్డుకున్నారని, కార్పొరేటర్లను ఫొటోలు తీసి పంపిస్తున్నారని మేం ఏమైనా మావోయిస్టులమా? అని ప్రశ్నించారు. పోలీసులు బల్దియా కౌన్సిల్హాల్ సమీపంలో ఉండకుండా చర్యలు తీసుకుంటామని మేయర్ హామీ ఇచ్చారు. అంతకుముందు సమావేశానికి రాకముందే ఆవరణలో తన వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో మట్టెవాడ సీఐని ఎమ్మెల్సీ మందలించారు. అధికారుల తీరుపై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గరంగరం టౌన్ ప్లానింగ్ వ్యవహారాలపై ఎమ్మెల్యే నాయిని అసహనం రూ.135 కోట్ల అభివృద్ధి పనులకు తీర్మానం -
కటకటాలపాలైన నకిలీ డీఎస్పీ
వరంగల్ క్రైం : చదివింది ఏడో తరగతి.. చేసేది మోసాలు.. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న నకిలీ ఏసీబీ డీఎస్పీ పేరుతో చలామణి అయిన నిందితుడితోపాటు అతడికి సహకరించిన నలుగురు ముఠా సభ్యులను వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. సీపీ సన్ప్రీత్సింగ్ నిందితుల వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. సత్యసాయి పుట్టపర్తి జిల్లా నల్లమాడ మండలం వేలమద్ది గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్, కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాంనగర్ జిల్లా హరోహళ్లీ గ్రామానికి చెందిన నవీన్ జేఆర్, బెంగళూరు, యశ్వంత్పూర్కు చెందిన మంగళ రవీందర్, మురళి, ప్రసన్న అరెస్టు కాగా సూర్యప్రకాశ్, తాటిమర్రి వేణు, కొత్తకోట రమణ పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. నిందితుల నుంచి 13 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై దగ్గర డ్రైవర్గా పనిచేసి.. ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్ ఓ ఎస్సై వద్ద రెండేళ్లు ప్రైవేట్ డ్రైవర్గా పనిచేశాడు. ఆ సమయంలో పోలీసులు దర్యాప్తు ఎలా చేస్తారనే విషయంపై పూర్తి అవగాహన పెంచుకున్నాడు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వారికి ఏసీబీ డీఎస్పీని అని ఫోన్ చేసేవాడు. ‘మీ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి, కేసు నమోదు చేశారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు ఇవాల్సి ఉంటుంది’ అని బెదిరించేవాడు. ఈక్రమంలో నిందితుడు వరంగల్ జిల్లా రోడ్డు రవాణా శాఖలో ఎంవీఐగా విధులు నిర్వర్తిస్తున్న తుమ్మల జైపాల్రెడ్డికి ఫోన్ చేసి ఏసీబీ డీఎస్పీ అని బెదిరించాడు. సుమారు రూ.9.96 లక్షలు వివిధ మార్గాల్లో అతడి నుంచి దోచుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో మిల్స్కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని నిందితుడు శ్రీనివాస్, అతడికి సహకరించిన మరో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు సీపీ తెలిపారు. రాయలసీమలో నకిలీ పోలీస్గా.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ప్రధాన నిందితుడు 2002లో మొదట ద్విచక్ర వాహనం చోరీ చేశాడు. నకిలీ పోలీస్ అధికారిగా అవతారమెత్తి రాయలసీమలో జరిగిన పలు దొంగతనాల్లో అరెస్టు అయిన నిందితుల కుటుంబ సభ్యులను టార్గెట్ చేశాడు. దొంగసొత్తు దాచి ఉంచారని వారిని బెదిరించి బంగారం, డబ్బు దోపిడీకి పాల్పడ్డాడు. సుమారు 50 కేసుల్లో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు తెలిపారు. జైలు నుంచి విడుదలైన అనంతరం నిందితుడు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, రాయలసీమ ప్రాంతాల్లో 41కి పైగా చైన్స్నాచింగ్లకు పాల్పడ్డాడు. పోలీసులు మరోమారు అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడు జైలు నుంచి విడుదలైన అనంతరం నకిలీ ఏసీబీ డీఎస్పీగా అవతారం ఎత్తి ప్రభుత్వ ఉద్యోగులను ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. పలు ఘటనల్లో 19 కేసులు నమోదు కాగా రూ.50 లక్షలు దోపిడీకి పాల్పడినట్లు సీపీ పేర్కొన్నారు. తెలంగాణలో 9 నేరాలు, ఆంధ్రాలో 10 నేరాలకు పాల్ప డి 8 కేసుల్లో అరెస్టయ్యాడు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో మిల్స్కాలనీ, స్టేషన్ఘన్పూర్తోపాటు కరీంనగర్, హైదరాబాద్, రాచకొండ, రామగుండం, వికారాబాద్, జగిత్యాల, వనపర్తి, ఏపీలోని కర్నూలులో చేసిన నేరాల్లో 11 కేసులు నమోదు కాగా.. అరెస్ట్ కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. పోలీసుల సహకారంతో చైన్స్నాచింగ్ చోరీ చేసిన సొత్తుతో జల్సాలు చేయడం, ఆన్లైన్ గేమ్స్ ఆడడం, గోవాలో క్యాసినో, గోవా, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల్లో వ్యభిచార గృహాలకు నిందితుడు వెళ్లినట్లు తెలిపారు. సినిమాటిక్ తరహాలో మోసాలు చేశాడు. పత్రికలు, యాప్ ల ఆధారంగా డబ్బులు వసూలు చేశాడు. పోలీసులకు చిక్కి జైలు జీవితం గడిపే క్రమంలో అనా రోగ్యం పేరిట ఆస్పత్రిలో చేరాడు. అక్కడ పోలీసులను మచ్చిక చేసుకుని చైన్స్నాచింగ్లకు పా ల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడికి సహకరించిన 9 మంది కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. అధికారులకు అభినందనలు.. ఘరానా మోసగాడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సెంట్రల్ జోన్ డీసీపీ డి.కవిత, వరంగల్ ఏసీపీ ఎన్.శుభం ప్రకాశ్, టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, ఇన్స్పెక్టర్లు పవన్కుమార్, శ్రీధర్, ఎల్.మంగీలాల్, మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ రమేశ్, ఎస్సైలు మహేశ్, ఎం.సురేశ్, టాస్క్ఫోర్స్, మిల్స్ కాలనీ సిబ్బందికి పోలీస్ కమిషనర్ రివార్డులు అందజేసి అభినందించారు. సహకరించిన నలుగురి అరెస్ట్.. ముగ్గురు పరారీ నిందితుల నుంచి 13 సెల్ఫోన్లు స్వాధీనం ఆన్లైన్ గేమ్స్, జల్సాలు, సినిమాటిక్ తరహాలో మోసాలు వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ -
హెచ్ఐవీపై అపోహలు తొలగించాలి
ఎంజీఎం: హెచ్ఐవీపై అపోహలు తొలగించాలని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ కె.పట్టాభిరామారావు సూచించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం వరంగల్ భద్రకాళి ఆలయ ఆర్చ్ నుంచి కేఎంసీలోని ఎన్ఆర్ఐ ఆడిటోరియం వరకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, నర్సింగ్ విద్యార్థులు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎన్ఆర్ఐ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తి పట్టాభిరామారావు మాట్లాడారు. డీఎంహెచ్ఓ అప్పయ్య, అదనపు డీఎంహెచ్ఓ మదన్మోహన్రావు, ఎంజీఎం సూపరింటెండెంట్ హరీశ్చంద్రారెడ్డి, కేఎంసీ వైస్ ప్రిన్సిపాల్ రమేశ్చంద్ర, జీఎంహెచ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, టీబీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి, టీబీ నియంత్రణ అధికారి హిమబిందు, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రదీప్రెడ్డి, ప్రభుదాస్, జిల్లా ఎయిడ్స్ ని యంత్రణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ సీహెచ్ సుధాకర్, రామకృష్ణ, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. సమష్టితత్వంతో చెడు అలవాట్లు దూరం గతంలో కుటుంబ వ్యవస్థ సమష్టిగా ఉండడం వల్ల చెడు అలవాట్లకు గురికాకుండా చూసుకునేవారని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ అన్నారు. ఎయిడ్స్ డేను పురస్కరించుకుని వరంగల్ డీఎంహెచ్ఓ బి.సాంబశివరావు ఆధ్వర్యంలో కేఎంసీ గేట్ నుంచి ఐఎంఏ హాల్ వరకు సోమవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని న్యాయమూర్తి నిర్మలాగీతాంబ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఐఎంసీ హాల్లో ఎయిడ్స్ నిర్మూలనపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిచందర్ రెడ్డి, సీకేఎం సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. -
33 పార్కింగ్ స్థలాలు
1,462 ఎకరాలు.. ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల ప్రైవేట్ వాహనాలు నిలిపేందుకు ములుగు జిల్లా పోలీసుశాఖ పార్కింగ్ స్థలాలను సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర జరుగనుంది. ఈసారి జాతరకు కోటిమందికిపైగా భక్తులు తరలివస్తారని అధికారుల అంచనా. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా భక్తుల ప్రైవేట్ వాహనాలు నిలిపేందుకు 1,462 ఎకరాల్లో 33 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ స్థలాల్లో భక్తుల సౌకర్యార్థం విద్యుత్, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ఈసారి అదనంగా పార్కింగ్ స్థలాలను పెంచేందుకు పోలీసులు అధికారులు సన్నాహలు చేస్తున్నారు. ఈసారి జాతరలో కొంగలమడుగు ప్రాంతంలో 30 ఎకరాల్లో కొత్త ఎమర్జెన్సీ పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయనున్నారు. జాతరకు భక్తులు ప్రైవేట్ వాహనాల్లో అంచనాకు మించి తరలివస్తే.. అత్యవసర సమయంలో వాహనాలను పార్కింగ్ చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, వీవీఐపీలు కూడా గతంలోకంటే ఈసారి జాతరకు ఎక్కువగా రానున్న సందర్భంగా చిలకలగుట్ట ప్రాంతంలో అదనంగా 150 ఎకరాల్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయనున్నారు.ఖమ్మం, మణుగూరు, ఇల్లందు, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటూరునాగారం నుంచి కొండాయి మీదుగా ప్రైవేట్ వాహనాల్లో వచ్చే భక్తులు ఊరట్టం చేరుకుని ఏ1 ఊరట్టం బసాగూడెం, ఏ2, ఏ3 ఊరట్టం పార్కింగ్ స్థలాల్లో వాహనాలను పార్కింగ్ చేయనున్నారు. కరీంనగర్, మంథిని, మహదేవపూర్, మహారాష్ట్ర, సిరోంచ, కాటారం నుంచి సింగారం, కాల్వపల్లి మీదుగా నూతనంగా నిర్మిస్తున్న కాల్వపల్లి నుంచి ఊరట్టం రోడ్డు మార్గాన బీ1 నుంచి బీ5 ఊరట్టం, సీ1, సీ2 , డీ1, డీ2 కన్నెపల్లి పార్కింగ్ స్థలాలకు మళ్లించనున్నారు. హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, పస్రా నుంచి నార్లాపూర్ మీదుగా సీ1, సీ2, డీ1, డీ2 కన్నెపల్లి, ఈ1 జంపవాయి, ఈ2 మరసుర ఆర్ఎఫ్ పార్కింగ్ స్థలాలకు వాహనాలను మళ్లించనున్నారు. హనుమకొండ నుంచి ఏటూరునాగారం ప్రాంతాల నుంచి వీవీఐపీల తాడ్వాయి నుంచి మేడారానికి వెళ్లి శివరాంసాగర్ చెరువు సమీపం నుంచి వీవీఐపీ రోడ్డు ద్వారా చిలకలగుట్ట పార్కింగ్ స్థలాలకు వాహనాలను మళ్లించనున్నారు. కొంగలమడుగులో అత్యవసర పార్కింగ్ స్థలం అదనంగా 150 ఎకరాల్లో వీవీఐపీ పార్కింగ్ -
లేబర్కోడ్ల రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలి
హన్మకొండ: లేబర్ కోడ్ల రద్దు కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని పల్లా రవీందర్రెడ్డి భవన్లో సోమవారం సీఐటీయూ హనుమకొండ జిల్లా రెండో మహాసభ ప్రారంభమైంది. ముందుగా సీఐటీయూ పతకాన్ని ఆవిష్కరించి భాస్కర్ మాట్లాడారు. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై మరింత ఉధృతంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. సింగరేణి, ఎల్సీ, గనులు, బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించి ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందన్నారు. మహాసభలో భవిష్యత్ ఉద్యమాలకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేశ్, కాసు మాధవి, కూరపాటి రమేశ్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు టి.ఉప్పలయ్య, కార్యదర్శి రాగుల రమేశ్, ఆఫీస్ బేరర్స్ జి.ప్రభాకర్ రెడ్డి, మెట్టు రవి, పుల్లా అశోక్, సంఘాల మొగిలి, బొల్లారం సంపత్, కె.ఐలయ్య, రజిత, బి.మహేశ్, ఉద్యోగులు కార్మికులున్నారు. లేబర్ కోడ్లు రద్దు చేయాలి.. ఖిలా వరంగల్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మికుల నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షుడు కూరపాటి రమేశ్, కార్యదర్శి కాసు మాధవి డిమాండ్ చేశారు. సోమవారం వరంగల్ ఉర్సు గుట్ట సీపీఎం జిల్లా కార్యాలయం రామ సురేందర్ భవనంలో ఎండీ.బషీర్, బోళ్ల కొమురయ్య, చాకలి కోమల అధ్యక్షతన సీఐటీయూ జిల్లా పదో మహాసభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ బషీర్, కార్యదర్శిగా అరూరి కుమార్, కోశాధికారి జన్ను ప్రకాశ్, ఉపాధ్యక్షులు గడ్డం రమేశ్, ఇనుముల శ్రీనివాస్, సింగారపు కృష్ణ, తుమ్మల సాంబయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ -
భవిష్యత్ను తీర్చిదిద్దుకోవాలి
హన్మకొండ: విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి భవిష్యత్ను తీర్చిదిద్దుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. హనుమకొండ న్యూశాయంపేటలోని శ్రీవ్యాస ఆవాసంలో సులక్ష్య సేవా సమితి బాధ్యులు పేద గిరిజన విద్యార్థులకు సోమవారం యూనిఫాం పంపిణీ చేశారు. సీఎండీ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్కూల్ యూనిఫాం అందించి మాట్లాడారు. విద్యార్థులు పట్టుదలతో చదువుకుని మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని కోరారు. సులక్ష్య సేవా సమితి అధ్యక్షుడు మండువ సంతోశ్, ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, శ్రీవ్యాస ఆవాసం అధ్యక్షురాలు వసుంధర, కార్యదర్శి శ్రీనివాస్, ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి, ఎమ్మార్టీ, విజిలెన్స్ డీఈ అనిల్కుమార్, ఏడీఈ ఇంద్రసేనారెడ్డి, ఏఈ అరుణ్ పాల్గొన్నారు.టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి -
అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది
హన్మకొండ: తెలంగాణ అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కేసీఆర్ దీక్షా దివస్ను పురస్కరించుకుని 11 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని కాళోజీ విగ్రం నుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. స్తూపం వద్ద నివాళి అర్పించారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, చింతం సదానందం, నాయకులు సంకు నర్సింగరావు, కుసుమ లక్ష్మీనారాయణ, తాళ్లపెల్లి జనార్దన్గౌడ్, పులి రజినీకాంత్, నయీముద్దీన్, చల్ల వెంకటేశ్వర్రెడ్డి, సదాంత్, ఖలీల్, కోటేశ్వర్రావు, రాజు, ఎస్కే మహమూద్, రామ్మూర్తి, రాకేశ్యాదవ్, ప్రశాంత్, వినయ్, సంజీవ్, వినీల్రావు, శ్రీకాంత్చారి, నరేంద్ర, సృజన్, సందీప్ యాదవ్, శేఖర్, సారిక, దేవమ్మ, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ -
రెండో విడత నామినేషన్లు షురూ
హన్మకొండ అర్బన్: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రెండో విడత నామినేషన్ల ప్రకియ ఆదివారం మొదలైంది. ఇందుకు సంబంధించి జిల్లాలోని 5 మండలాల్లో ఉన్న సర్పంచ్ స్థానాలకు 69, వార్డు స్థానాలకు 1,699 నామినేషన్లు దాఖలైనట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. కాగా, ధర్మసాగర్, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లోని 73 గ్రామ పంచాయతీలు, 694 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వరంగల్ జిల్లాలో.. వరంగల్: వరంగల్ జిల్లాలో మూడు విడతలుగా 11 మండలాల్లోని 317 గ్రామ పంచాయతీలకు జరిగే ఎన్నికల్లో 3,83,738 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పంచాయతీల్లో ప్రతీ వార్డుకు ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున జిల్లాలోని 2,754 వార్డుల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారం పూర్తికాగా.. రెండో విడత నామినేషన్ల స్వీకరణ ఆదివారం ప్రారంభమైంది. రెండో విడతలో భాగంగా డిసెంబర్ 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆదివారం సర్పంచ్ స్థానాలకు 32, వార్డు సభ్యుల స్థానాలకు 24 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని 5 మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 69, వార్డు స్థానాలకు 1,699 దాఖలు -
గద్దెల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి
ఎస్ఎస్తాడ్వాయి : మేడారంలో సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణ పునఃనిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని మంత్రి సీతక్క సూచించారు. వరుస క్రమంలో నిర్మిస్తున్న వనదేవతల పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల నిర్మాణ పనులను ఆదివారం సీతక్క పరిశీలించారు. నూతనంగా నిర్మించిన గద్దెలపై పగిడిద్దరాజు, గోవిందరాజును ఈనెల 4న పూజారులు ప్రతిష్ఠించే అవకాశం ఉందని త్వరగా పనులు పూర్తి చేయాలని ఆమె కాంట్రాక్టర్ను అదేశించారు. గద్దెల ప్రాంగణంలో సీసీ ఫోర్లింగ్ పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్య తా ప్రమాణాలు పాటించాలని అధికారులను అదేశించారు. ఆమె వెంట జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, అధికారులు ఉన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు పాటుపడాలి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని మంత్రి సీతక్క తెలిపారు. ఆదివారం మేడారంలోని హరితహోటల్లో మండలంలోని ఎల్బాక గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొక్క రాజు, సుశీల, మడ్డి వెంకన్న, సమ్మక్క, గుండ్లపల్లి సమ్మయ్య, పాయం వెంకటరావు, శాంతమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరగా మంత్రి సీతక్క కండువా కప్పి వారిని ఆహ్వానించారు. ఈసందర్భంగా సీతక్క మాట్లాడుతూ మండలంలోని ప్రతీ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అభ్యర్థుల విజయానికి కష్టపడి పని చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, జాతర చైర్మన్ అరెం లచ్చుపటేల్, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్, మాజీ ఎంపీపీ ఎనగంటి రాములు, నార్లాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. మంత్రి సీతక్క -
నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
హసన్పర్తి: నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మండల పరిఽధి సీతంపేట, నాగారం క్లస్టర్ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నామిషన్ల స్వీకరణ కేంద్రాలను ఆదివారం కలెక్టర్ సందర్శించారు. ఈసందర్భంగా ఆయా క్లస్టర్ల్లో ఏ గ్రామాల నామినేషన్లు స్వీకరిస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ కేంద్రాల వద్ద ఓటరు జాబి తాను ప్రదర్శించాలని, హెల్ప్డెస్క్ ద్వారా అభ్యర్థులకు సమాచారాన్ని అందించాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణకు తగిన కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, పంచాయతీ కార్యదర్శులు గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట సీఈఓ రవి, ఎంపీడీఓ సుమణవాణి, తహసీల్దార్ కిరణ్కుమార్, అధికారులు ఉన్నారు.హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ -
కొల్లగొడుతూ.. కోట్లు గడిస్తూ!
మైనింగ్ మాఫియా ధనదాహానికి గుట్టలు లూటీ అవుతున్నాయి. గోరంత అనుమతి.. కొండంత తవ్వకాలు పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నాయి. రాయల్టీ ఎగవేతతో సర్కారు ఖజానాకు రూ.కోట్లలో గండి పడుతోంది. అనుమతి ఒకచోట.. తవ్వకాలు మరోచోట చేపడుతున్న మైనింగ్ వల్ల ప్రభుత్వ ఆదాయం రూ.లక్షల్లో పక్కదారి పడుతోంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్, పర్యావరణ శాఖలు ‘మామూలు’ గా తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. సాక్షిప్రతినిధి, వరంగల్: సహజ వనరుల దోపిడీ వ్యాపారులకు వరంగా, ప్రజలకు శాపంగా మారుతోంది. మొరం, మట్టి, కంకర, గ్రానైట్.. ఇలా విచ్చలవిడిగా తరలిపోతున్నాయి. టెంపరరీ, పర్మనెంట్ అనుమతుల పేరిట ప్రభుత్వ భూములు, గుట్టలను మైనింగ్ మాఫియా కొల్లగొడుతోంది. మొరం తవ్వకాలు, క్రషర్లు, గ్రానైట్ల కోసం పేల్చే బ్లాస్టింగ్తో గాలి, పొలాలు, నీటి వనరులు కాలుష్యం బారిన పడుతున్నాయి. మొరం, కంకర, గ్రానైట్ తరలింపు కోసం పావలా రాయల్టీ చెల్లించి బారాణా లాభం పొందుతున్నా అధికారులు ‘కొలతలు’ పట్టించుకోవడం లేదు. మటి, కంకర తరలింపుతో గుట్టలు ఆనవాళ్లు కోల్పోతున్నా చర్యలు తీసుకోవడం లేదు. క్రషర్ క్వారీలు, గ్రానైట్ బ్లాకులు.. గ్రానైట్, కంకర క్రషర్ దందాకు గుట్టలు గుల్ల అవుతున్నాయి. పచ్చదనం నేలకొరుగుతోంది. కొన్నిచోట్ల అసలు అనుమతే లేకుండా తవ్వుకుపోతున్నారు. మరికొన్నిచోట్ల అనుమతి తీసుకున్నా.. పరిమితికి మించి, హద్దులు దాటి కొండలను కరిగిస్తున్నారు. విలువైన రాళ్లను యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాదు.. జీవవైవిధ్యం అలరారే అందాల అడవులను, వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆది మానవుల ఆవాస ప్రాంతాలనూ ధ్వంసం చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో 64 కలర్, బ్లాక్ గ్రానైట్ క్వారీలు, 85 స్టోన్, మెటల్ క్రషర్లు ఉన్నాయి. హసన్పర్తి, శాయంపేట, కాజీపేట, హనుమకొండ, పరకాల ఏరియాల్లోని స్టోన్, మెటల్ క్రషర్లకు బాగా డిమాండ్ ఉంది. దీంతో చాలా మంది భారీ మిషన్లను పెట్టి రాత్రింబవళ్లూ బ్లాస్టింగ్ చేస్తూ గుట్టలను కొల్లగొడుతున్నారు. స్టోన్ తీసిన పరిమితి.. రాయల్టీకి లెక్కలు కుదరడం లేదు. రెండు నెలల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చిన స్పెషల్ టాస్క్ఫోర్స్ తనిఖీల్లో రూ.లక్షలాది రూపాయల బాగోతం బయట పడగా.. 22 గ్రానైట్, స్టోన్ క్రషర్లకు పెనాల్టీ వేశారు. కొన్నింటిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదులు వెళ్లాయి. మునులు కొలువున్న మునిపల్లి గుట్ట పూర్తిగా ఆనవాళ్లు కోల్పోతోంది. మునుల జ్ఞాపకార్థం నిర్మించిన గుడి వరకు తవ్వకాలు వెళ్లాయి. ఇలా చాలా చోట్ల ఇష్టారాజ్యంగా సాగుతున్న మైనింగ్పై మైనింగ్ శాఖ, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రెవెన్యూ శాఖ, దుమ్ముధూళిపై పర్యావరణ శాఖలు మౌనం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఈ విషయమై మైనింగ్ శాఖ అధికారితో ‘సాక్షి’ మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఫోన్లో అందుబాటులోకి రాలేదు. అనుమతులు గోరంత.. తవ్వేది, తరలించుకుపోయేది కొండంత పొంతన లేకుండా రాయల్టీ లెక్కలు.. సర్కారు ఖజానాకు గండి రెవెన్యూ, మైనింగ్, పర్యావరణశాఖ అధికారుల ప్రేక్షక పాత్రగ్రేటర్ వరంగల్ పరిధి హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం భీమారం రెవెన్యూ శివారులోని కోమటిపల్లి గుట్ట ఆనవాళ్లు కోల్పోయింది. 340/1 సర్వేనంబర్ పేరిట 3.260 రెండున్నర హెక్టార్ల భూమిని ఒకరికి క్వారీకి అనుమతి ఇచ్చింది. 2017 జూలై 25 నుంచి 5 ఏళ్ల పాటు నిబంధనల ప్రకారం క్వారీ నిర్వహించేలా 4097/ క్యూఎల్అండ్1/ డబ్ల్యూజీఎల్/2017 ద్వారా ఈ అనుమతులు ఇచ్చారు. అయితే ఇందులో అప్పటి భూపాలపల్లి ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కూడా స్లీపింగ్ పార్ట్నర్గా ఉండగా.. సరిగ్గా పట్టించుకోలేదు. 29,90,900 క్యూబిక్ మీటర్ల మొరం అందుబాటులో ఉన్న ఈ క్వారీ నుంచి తీసే ప్రతీ క్యూబిక్ మీటరుకు రూ.30 చొప్పున ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. అంతకు ఐదింతలు మొరం తరలించి కోమటిపల్లి గుట్టను ఆనవాళ్లు కోల్పోయేలా చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా లక్షలాది రూపాయలు మైనింగ్ మాఫియా జేబుల్లోకి వెళ్లాయి. -
మత్తు వదిలి మైదానానికి రండి
హసన్పర్తి: మత్తు వదిలి మైదానంలోకి రావాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పిలుపునిచ్చారు. హసన్పర్తి మండలం భీమారంలో అంతర్ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలు ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. హసన్పర్తి ప్రాంతంలో మినీ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు బోయిని శశికాంత్, కాంగ్రెస్ నాయకులు వీసం సురేందర్రెడ్డి, పుల్లా రవీందర్, బండి చైతన్యరెడ్డి, కనపర్తి కిరణ్, పెద్దమ్మ సురేశ్, యాదగిరి పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం -
కలెక్టరేట్లలో నేటి గ్రీవెన్స్ రద్దు
హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ను రద్దు చేసినట్లు కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాల అధికారులు ఎన్నికల నిర్వహణలో ఉన్నందున ఈ కార్యక్రమం రద్దు చేసినట్లు పేర్కొన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లా ల ప్రజలు గమనించాలని కలెక్టర్లు కోరారు. గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్.. వరంగల్ అర్బన్: బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నందున గ్రీవెన్స్ సెల్ రద్దు చేసినట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలు గ్రీవెన్స్కు రావొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. 9, 10 తేదీల్లో నోబెల్ డే ఉత్సవాలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 9, 10 తేదీల్లో నోబెల్ డే ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి తెలిపారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లిష్, ఎకనామిక్స్, బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మసీ విభాగాల విద్యార్థులకు 9వ తేదీన పోస్టర్ ప్రజెంటేషన్, వక్తృత్వ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు తమ పేర్లను ఈనెల 5వ తేదీ లోపు తమ విభాగాలకు ఆన్లైన్లో సమర్పించాలని మామిడాల ఇస్తారి కోరారు. 10వ తేదీన నోబెల్ బహుమతి, పరిశోధన అంశంపై విషయ నిపుణులతో సెమినార్లు ఉంటాయని పేర్కొన్నారు. సాయంత్రం సెనేట్ హాల్లో నిర్వహించనున్న ముగింపు సమావేశంలో విజేతలకు బహుమతుల ప్రదానం ఉంటుందని తెలిపారు. అలరించిన కార్తీక నృత్యోత్సవంహన్మకొండ: హనుమకొండ గోకుల్నగర్లోని అంబేడ్కర్ భవన్లో ఆదివారం నిర్వహించిన కార్తీక నృత్యోత్సవం అలరించింది. శ్రీభారతి కళాక్షేత్రం కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో కార్తీక సంగీత, నృత్య, వాయిద్యాల ఉత్సవం–25 నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 90 మంది కూచిపూడి నృత్య కళాకారులు, 60 మంది కర్ణాటక సంగీత కళాకారులు, ఇద్దరు వీణా, ఐదుగురు వయోలిన్, ఇద్దరు ఫ్లూట్ కళాకారులు పాల్గొని అత్యుత్తమ ప్రదర్శనతో ప్రతిభ చాటారు. ఈసందర్భంగా శ్రీభారతి కళాక్షేత్రం కల్చరల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు బొల్లం మాధవి మాట్లాడుతూ.. కళలపై అభిరుచిని పెంపొందించేందుకు, కళలను ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి పోటీల నిర్వహణతో కళాకారుల్లో పోటీతత్వం పెరుగుతుందని, కళల్లో రాణించేందుకు సాధన చేస్తారన్నారు. కార్యక్రమంలో ఆర్గనైజర్ బొల్లం రవి, వ్యాఖ్యాత ఉమ్మడి లక్ష్మణాచార్యులు, కళాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. న్యూశాయంపేట: వరంగల్ జిల్లా పంచాయతీ ఎన్నికల జనరల్ అబ్జర్వర్గా రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషనర్ బి.బాల మాయాదేవి నియమితులైనట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లాలో పరిశీలిస్తారని తెలిపారు. ఎన్నికల నిబంధనలు, ఉల్లంఘనకు సంబంధించిన సమస్యల్ని నంబర్ 87127 35548 ద్వారా పరిశీలకులకు తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు. -
సమస్యలు ప్రస్తావించేనా
నగరంలో నత్తనడకన స్మార్ట్సిటీ పనులువరంగల్ అర్బన్: క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు గుర్తించి, చర్చించే పరిష్కార మార్గాలను అన్వేషించడం లేదు. పౌర సేవలు, ధ్రువీకరణ పత్రాలు, నిర్మాణ అనుమతులు, ఆక్రమణలు తదితర ఫిర్యాదులపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కొర్రీలు పెడుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సేవలు ఏవైనా కొంతమంది డబ్బులు డిమాండ్ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొందరు కార్పొరేటర్లు, అధికారులు తమ విన్నపాలు లెక్కచేయడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. సోమవారం ఉదయం 11:30 గంటలకు మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. ఎజెండాలో 29 అంశాలు పొందుపర్చారు. సర్వసభ్య సమావేశంలో ప్రజల సమస్యలు ప్రస్తావించి పరిష్కారం చూపుతారా? కేవలం తీర్మానాల ఆమోదంతోనే మమ అనిపిస్తారా? అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వారానికోసారి కాల్వలు శుభ్రం.. రోడ్లు, లేఔట్లు, ఖాళీ స్థలాలను ఆక్రమిస్తున్నారని గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చెత్త సేకరణకు ప్రతీ ఇంటికి ఏడాదికి రూ.720 వసూలు చేస్తున్నారు. వాస్తవంగా పరిశీలిస్తే స్వచ్ఛ ఆటోలు రోజూ రావట్లేదు. కాలనీల్లో మురుగు కాల్వలు వారానికోసారి శుభ్రం చేస్తున్నారు. వీధి దీపాలు వెలుగక చాలా కాలనీలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఫిర్యాదులను పట్టించుకోవట్లేదు. కాలనీల్లో దోమలు, కుక్కలు, కోతులు, పందుల బెడద తప్పట్లేదు. వీటి నివారణకు ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా.. ప్రజలకు ఉపశమనం కలగడం లేదు. రోడ్ల వెంట నడవాలంటే భయపడుతున్నారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, కోతులను అడవుల్లోకి తరలిస్తున్నామని రికార్డుల్లో చూపిస్తున్నా.. ప్రజలు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. నగరంలో ఫుట్పాత్ల ఆక్రమణకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు సతమతమవుతున్నారు. కాలనీల్లో రోడ్లను ఆక్రమించి భవనాలు కడుతున్నారు. లేఔట్ ఖాళీ స్థలాలు, పార్కులు, శ్మశానవాటిక స్థలాలు దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణ అనుమతులు, అనుమతి లేని నిర్మాణాలు, కొత్త ఇంటి నంబర్లు, పేరు మార్పిడి, ట్రేడ్ లైసెన్స్ల పేరిట పెద్ద ఎత్తున ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అభివృద్ధి పనుల పేరిట పర్సంటేజీల మత్తులో జోగుతున్నారు. అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపు నుంచి తేరుకోలేదు. కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేటర్లలో నిరాశ అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్లు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. నాలుగున్నరేళ్లు గడిచింది. కానీ, ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టలేకపోయామనే భావన నెలకొంది. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు కరువయ్యారని వాపోతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు తమ ఆదేశాలను లెక్క చేయడం లేదని విమర్శలున్నాయి. కౌన్సిల్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షం ఏం చెప్పినా అధికార పక్షం అడ్డు చెప్పడం, అధికార పార్టీ ఏం ప్రస్తావించినా, ప్రతిపక్షం వ్యతిరేకించడం ఇక్కడ పరిపాటిగా మారింది. కొంతమంది సభ్యులు తమ లాభాపేక్ష కోసం అధికారులను టార్గెట్ చేస్తున్నారని, వారి ఉనికి చాటుకోవడానికి అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారే తప్ప సమస్యల పరిష్కారంపై దృష్టిసారించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాలనీల్లో అస్తవ్యస్తంగా తాగునీటి సరఫరా నేడు గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశం -
‘పంచాయతీ’ పోరు.. పల్లెల్లో జోరు!
సాక్షిప్రతినిధి, వరంగల్: మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనుండగా.. శనివారం మొదటి విడత నామినేషన్ల ఘట్టం ముగిసింది. రెండో విడత ఎన్నికలకు ఆదివారం నోటిఫికేషన్ వెలువడనుండగా.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఉమ్మడి వరంగల్లో ఒక్క ములుగు జిల్లాలోనే రెండు విడతల్లో పల్లెపోరు పూర్తికానుండగా, మిగతా జిల్లాల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో నామినేషన్ల ప్రారంభం రోజున ఎన్నికలు మళ్లీ నిలిపేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో గురువారం, శుక్రవారం రెండు రోజుల్లో మందకోడిగా నామినేషన్లు సాగాయి. శుక్రవారం ‘ఈ సర్పంచ్ ఎన్నికలను ఎవరూ ఆపలేరు’ అంటూ జీఓ 46పై స్టే నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో మొదటి విడత ముగింపు రోజైన శనివారం నామినేషన్లు ఉత్సాహంగా సాగాయి. ఆదివారం నుంచి రెండో విడత నామినేషన్ల పరంపర కూడా సాగనుంది. ● హనుమకొండ జిల్లాలోని 12 మండలాల్లో 210 గ్రామ పంచాయతీలు, 1,986 వార్డులున్నాయి. మొదటి విడతలో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపుర్ మండలాల్లోని 69 జీపీలు, 658 వార్డులకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండో విడతలో ధర్మసాగర్, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లోని 73 జీపీలు, 694 వార్డులకు నామినేషన్లు నేటి నుంచి ఉంటాయి. ● వరంగల్ జిల్లాలో రెండో విడతలో దుగ్గొండి, నల్లబెల్లి, గీసుకొండ, సంగెం మండలాల్లోని 117 జీపీలు, 1,008 వార్డులకు ఎన్నికలు జరగనుండగా, నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. .. ఇదిలా ఉండగా నామినేషన్ల సందర్భంగా రిజర్వేషన్ల వారీగా గెలుపు గుర్రాలపై దృష్టి సారించి రంగంలోకి దింపుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు.. అభ్యర్థుల గెలుపు కోసం ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రెండో విడత అన్ని ఏర్పాట్లు చేశాం..హన్మకొండ అర్బన్ : స్థానిక ఎన్నికల రెండో విడత ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణకు ఎంపీడీఓలు, నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారుల సిద్ధంగా ఉన్నట్లు హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్యశారద శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. రౌడీషీటర్ల బైండోవర్లు హసన్పర్తి: ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు హసన్పర్తి పరిధి ఆయా గ్రామాల్లోని రౌడీషీటర్లు, బెల్ట్షాపుల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని శనివారం తహసీల్దార్ కిరణ్కుమార్ ఎదుట హాజరుపర్చారు. హైకోర్టు తీర్పు తర్వాత ఆశావహుల్లో జోష్ మూడు రోజులు వేచి చూసే ధోరణి ముగిసిన మొదటి విడత.. నేటి నుంచి రెండో విడత అభ్యర్థుల గెలుపుపై వ్యూహాత్మకంగా పార్టీలు -
సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో దేశ ఐక్యత
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే దేశం నేటికీ ఐక్యతతో ఉందని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. శనివారం జీడబ్ల్యూఎంసీ కార్యాలయ ఆవరణలో కేంద్ర యువజన సర్వీసులు క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మై భారత్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ సంస్థల ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యత పాదయాత్రను మేయర్ జెండా ఊపి ప్రారంభించారు. పోచమ్మ మైదాన్ వరకు పాదయాత్ర సాగింది. బల్దియా కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి మేయర్ సుధారాణి జ్యోతి ప్రజలన చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా సంస్థానాలుగా విడివిడిగా ఉన్న దేశాన్ని ఒక్కటి చేయడంలో సర్దార్ పటేల్ కృషి చేశారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. అలాగే డ్రగ్స్ రహిత భారతదేశంగా తీర్చిదిద్దడానికి భారత ప్రభుత్వం చేపట్టిన నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మేరా యువభారత్ వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేశ్, సూపరింటెండెంట్ బానోతు దేవీలాల్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య ఎంఎస్ఓ రాజేశ్ టీఎంసీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. లీకేజీలు అరికట్టాలి.. లీకేజీలు అరికట్టి నీటి సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం బల్దియా కార్యాలయంలో ఇంజనీరింగ్, శానిటేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. నగరంలో దెబ్బతిన్న వీధి దీపాల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయాలన్నారు. శానిటేషన్ నిర్వహణలో భాగంగా శానిటరీ ఇన్స్పెక్టర్లు వారికి కేటాయించిన డివిజన్లలో కచ్చితంగా చెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోకు అందించేలా చూడాలని పేర్కొన్నారు. -
కేసీఆర్తోనే తెలంగాణ వచ్చింది..
శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారిహన్మకొండ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వీరుడు కేసీఆర్ అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శనివారం హనుమకొండలోని కాళోజీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ హనుమకొండ జిల్లాశాఖ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఫ్లెక్సీకి మధుసూదనాచారి, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతారావు, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు చల్లాధర్మారెడ్డి, వొడితల సతీశ్కుమార్, పార్టీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. అమరవీరుల స్తూపానికి, కాళోజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిరికొండ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా 14ఏళ్లు అకుంఠిత దీక్షతో ఉద్యమాన్ని నడిపిన యోధుడు కేసీఆర్ అన్నారు. రాష్ట్రం అణువణువూ తెలిసి, ప్రజల గోసలను ప్రపంచానికి తెలిపి, స్వరాష్ట్రాన్ని సాధించారన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. 11 రోజులపాటు ప్రాణాలకు తెగించి, కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణను సాధించారన్నారు. ప్రస్తుత పాలకులకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో పాలన వికాసం జరిగితే.. నేడు కాంగ్రెస్ హయాంలో పరిపాలనా విధ్వంసం జరుగుతోందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు నాగూర్ల వెంకటేశ్వర్లు, లింగంపల్లి కిషన్రావు, మర్రి యాదవ రెడ్డి, ఎల్లావుల లలితా యాదవ్, నాయకులు రిజ్వానా మసూద్, పులి రజనీకాంత్, సోదా కిరణ్, బొంగు అశోక్ యాదవ్, చెన్నం మధు, సంకు నర్సింగరావు, బోయినపల్లి రంజిత్రావు, ఇమ్మడి లోహితా రాజు, జోరిక రమేశ్, కుసుమ లక్ష్మీనారాయణ, ఉడతల సారంగపాణి, తాళ్లపల్లి జనార్దన్గౌడ్, రవీందర్ రావు, నయీముద్దీన్, బండి రజినీకుమార్, హరి రమాదేవి, దూలం వెంకన్న పాల్గొన్నారు. -
తరగతి గది ప్రయోగశాల కావాలి
● పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి ● ముగిసిన వరంగల్ జిల్లాస్థాయి ఇన్స్పైర్, బాల వైజ్ఞానిక ప్రదర్శన ఖిలా వరంగల్: తరగతి గది ప్రయోగశాల కావాలని పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ) సత్యనారాయణరెడ్డి సూచించారు. వరంగల్ హంటర్ రోడ్డులోని తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్లో మూడు రోజులుగా నిర్వహించిన వరంగల్ జిల్లాస్థాయి ఇన్స్పైర్, బాల వైజ్ఞానిక ప్రదర్శన శనివారం సాయంత్రం ముగిసింది. ముఖ్య అతిథిగా ఆర్జేడీ హాజరై మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో విజ్ఞానశాస్త్రం పాత్ర అమోఘమని పేర్కొన్నారు. శాసీ్త్రయ ఆలోచనలు ఉన్న విద్యార్థులు భవిష్యత్ తరాల అభివృద్ధికి మార్గదర్శకులవుతారని తెలిపారు. డీఈఓ రంగయ్య నాయుడు మాట్లాడుతూ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను చూస్తే గర్వంగా ఉందన్నారు. జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇన్స్పైర్, బాల వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీస్తాయని చెప్పారు. 16 ఇన్స్పైర్ ప్రాజెక్టులు, 14 ఆర్బీవీపీ ఎగ్జిబిట్లను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో అధికారులు ఉండ్రాతి సుజన్తేజ, కృష్ణమూర్తి, బి.ప్రసాద్, తాళ్ల పద్మావతి విద్యాసంస్థల చైర్మన్ తాళ్ల మల్లేశం, డైరెక్టర్లు వంశీ, వరుణ్, రాహుల్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, ట్రస్మా ప్రతినిధులు భూపాల్రావు, డి.రామ్మూర్తి, వడుప్సా బాధ్యులు రవి, శ్యాం పాల్గొన్నారు హసన్పర్తి: హసన్పర్తి మండలం పెగడపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అవకతవకలపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా సహకార అఽధికారి సంజీవరెడ్డి తెలిపారు. ఈ మేరకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ కె.రవీంద్రను విచారణాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. రుణమాఫీతో పాటు అధిక వడ్డీ, రుణాల్లో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎనిమిది మంది పాలకవర్గ సభ్యులతో పాటు రైతులు లిఖిత పూర్వకంగా కలెక్టర్, డీసీఓకు ఫిర్యాదు చేశారు. అలాగే, ఇన్కం టాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సహకార సంఘం చట్టం సెక్షన్ 51 కింద విచారణకు ఆదేశించినట్లు డీసీఓ వివరించారు. -
ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్ శ్రీ 2025
హసన్పర్తి: హనుమకొండ మండలం గోపాలపురానికి చెందిన కందుకూరి కాంతయ్య గ్రామానికి తొలి సర్పంచ్. 1979 నుంచి 1995 వరకు వరుసగా 17 ఏళ్ల పాటు సర్పంచ్గా సేవలందించారు. హనుమకొండ సమితి డిప్యూటీ ప్రెసిడెంట్గా, ఏనుమాముల మార్కెట్ కమిటీ డైరెక్టర్గా, వరంగల్ కో–ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా పదవులు నిర్వర్తించారు. మాజీ మంత్రి హయగ్రీవాచారికి ముఖ్య అనుచరుడిగా వ్యవహరించారు. 1999లో ఆయన హత్యకు గురయ్యారు. ఆయన సేవలకు గుర్తుగా గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం వద్ద కాంతయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏటా కాంతయ్య వర్ధంతి, జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. కాంతయ్య స్ఫూర్తితో ఆయన కుటుంబీకులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. దామెర: హనుమకొండ జిల్లా దామెర మండలం కోగిల్వాయికి చెందిన గట్ల మల్లారెడ్డి సేవలు ఇప్పటికీ గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. 1984–90, 1996–2001 రెండు పర్యాయాలు సర్పంచ్గా సేవలందించారు. గ్రామంలో ప్రైమరీ, హై స్కూల్ నిర్మించారు. పలు గ్రామాల్లో వాటర్ ట్యాంకులు, పైపులైన్, బస్షెల్టర్ నిర్మాణం, అంతర్గత రోడ్లు, వీఽధి దీపాల ఏర్పాటు వంటి ఎన్నో వసతులు కల్పించారు. ఆయన సేవలకు గుర్తుగా గ్రామంలోని కూడలిలో మల్లారెడ్డి ప్రతిమను ప్రతిష్ఠించారు. మల్లారెడ్డి కుమారుడు గట్ల విష్ణువర్ధన్రెడ్డి అమెరికా నుంచి వచ్చి 2018 నుంచి 2024 వరకు సర్పంచ్గా, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడిగా సేవలందించారు. టేకుమట్ల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని రామకిష్టాపూర్(వి) గ్రామానికి చెందిన లింగంపల్లి మోహన్రావు నాలుగు పర్యాయాలు సర్పంచ్గా ఎన్నికయ్యారు. సొంత ఖర్చులతో రోడ్ల విస్తరణ, సబ్స్టేషన్ ఏర్పాటు, రోడ్లు, డ్రెయినేజీ, నీటి వసతి ఇలా అనేక సేవలందించారు. సర్పంచ్గా కొనసాగుతున్న సమయంలోనే 2009లో మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యారు. గ్రామస్తుల కోరిక మేరకు గ్రామ పంచాయతీ వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయనది వీరమరణమని స్థానికులు చెప్పుకుంటారు. పాలకుర్తి టౌన్: పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో రెండు పర్యాయాలు 1981–1994 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా పనిచేసిన గంట సోమయ్య ప్రజలకు విశిష్ట సేవలందించారు. చివరకు తనకున్న ఆస్తినంతా ప్రజా సేవకు ధారపోశారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని వావిలాల గ్రామానికి రప్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గ్రామానికి బస్సు సర్వీసులు నడిపించారు. గ్రామంలో 13 నీళ్ల ట్యాంకులు నిర్మించారు. అప్పటి ప్రధాని రాజీవ్గాంధీ చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్గా పురస్కారం, ప్రశంసపత్రం అందుకున్నారు. గ్రామంలో టెలిఫోన్ ఎక్స్ఛేంజ్, విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు చేయించారు. 1991 ఆగస్టు 19న సీపీఐ(ఎంఎల్) పీపుల్స్వార్ నాగన్న దళం సర్పంచ్ సోమయ్యను కిడ్నాప్ చేయడంతో అప్పటి కలెక్టర్ బీపీ ఆచార్య చొరవతో నాలుగు రోజుల తర్వాత విడుదలయ్యారు. 2021లో కన్నుమూశారు. గ్రామ ప్రజలు ఆయన సేవలకు గుర్తుగా 2022 ఏప్రిల్లో వావిలాల ప్రధాన కూడలిలో విగ్రహం ఏర్పాటు చేసి ప్రతీ ఏటా స్మరించుకుంటున్నారు. మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చెందిన వెలిశాల రాధాకృష్ణ 1975 నుంచి 1995 వరకు నాలుగు పర్యాయాలు సర్పంచ్గా పనిచేశారు. అనంతరం 2000 నుంచి 2005వ సంవత్సరం వరకు మళ్లీ ఎన్నికై ప్రజలకు సేవలందించారు. గ్రామ అభివృద్ధికి తనవంతు కృషి చేశారు. భూ సమస్యలు, కుటుంబ తగాదాలను పరిష్కరించారు. మృధుస్వభావిగా ఉంటూ అందరి మన్ననలు పొందారు. నిస్వార్థంగా సేవ చేసిన ఆయన 2006 మార్చిలో మృతిచెందారు. పలు పార్టీల నేతలు, గ్రామస్తుల సహకారంతో 2014 జనవరి 27న రాధాకృష్ణ విగ్రహాన్ని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేశారు.గూడూరు: మండలంలోని పొనుగోడు సర్పంచ్గా నూనావత్ ధంజ్యానాయక్ 7 పర్యాయాలు పనిచేశారు. నిరుపేద గిరిజనులు పోడు భూమి సాగు చేసుకునేలా, మారుమూల ఏజెన్సీ పొనుగోడులో రోడ్లు, బడి, తాగునీటి వసతిపై దృష్టి సారించారు. 1992లో ధంజ్యానాయక్ మృతిచెందగా సేవలకు గుర్తుగా గూడూరులోని ప్రధాన బస్టాండ్ సెంటర్లో ఆయన విగ్రహం ఏర్పాటుచేశారు. -
ఊరు వెలగాలని మూడెకరాలు అమ్మేశారు..
దుగ్గొండి: మండలంలోని తిమ్మంపేట గ్రామ సర్పంచ్గా విశిష్ట సేవలందించిన సారంపల్లి రాజిరెడ్డి 1970 నుంచి 11 ఏళ్లపాటు సర్పంచ్గా పనిచేశారు. ఈసమయంలో ఇంటింటికీ విద్యుత్ను తీసుకొచ్చేందుకు తన మూడెకరాల పొలాన్ని అమ్మేశారు. నాలుగు కిలోమీటర్ల దూరంలోని లక్నెపల్లి గ్రామం నుంచి విద్యుత్ లైన్ వేయించారు. గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని వందలాది మంది పేదల ఇళ్ల కోసం ఇచ్చారు. ఆయన మరణానంతరం 2008లో రాజిరెడ్డి విగ్రహాన్ని గ్రామ పంచాయతీ ఎదుట ప్రధాన రహదారి పక్కన గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇప్పటికీ రాజిరెడ్డి పేరు ప్రస్తావన రాగానే కరెంట్ తెచ్చిన మహానుభావుడు అంటూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆయనను గుర్తు చేసుకుంటారు. -
ముగిసిన పీఎం శ్రీ పాఠశాలల క్రీడలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించిన పీఎంశ్రీ పాఠశాలల క్రీడా పోటీలు శనివారం ముగిశాయి. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడల్లో నిర్వహించిన పోటీలను ఇన్చార్జ్ డీఈఓ వెంకట్రెడ్డి, డీవైఎస్ఓ అశోక్కుమార్ పర్యవేక్షించగా, కో–ఆర్డినేటర్ మహేశ్, ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ ప్రశాంత్, ప్రాక్టీసింగ్ స్కూల్ హెచ్ఎం జగన్నాథం, పీఈటీలు పార్థసారథి, సుధాకర్, ప్రభాకర్రెడ్డి, సుభాశ్, వాసు, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల న్యాయమూర్తులు డాక్టర్ కె.పట్టాభిరామారావు, నిర్మలా గీతాంబ, ఏసీబీ కోర్టు వరంగల్ న్యాయమూర్తి క్షమాదేశ్పాండే అన్నారు. హంటర్రోడ్డులోని వ్యాసవాసంలో శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ హనుమకొండ, వరంగల్ ఆధ్వర్యంలో ఇండియన్ బ్యాంక్ కాజీపేట సౌజన్యంతో ఏర్పాటు చేసిన చట్టాలపై అవగాహన శిబిరానికి ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. నేర రహిత సమాజ నిర్మాణానికి చట్టాలు దోహదపడతాయని, అవగాహనతో చట్టాల వినియోగం సాధ్యమవుతుందన్నారు. వ్యాసవాసంలోని చిన్నారులకు కంప్యూటర్, ప్రింటర్ను బహూకరించారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ సెక్రటరీలు ఉషాక్రాంతి, సాయికుమార్, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ: భారతీయ జనతా పార్టీ జిల్లాల వారీగా ఇన్చార్జ్లను నియమించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు ఇన్చార్జ్ల పేర్లను శనివారం ప్రకటించారు. హనుమకొండ జిల్లాకు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ (భువనగిరి)ను ఇన్చార్జ్గా నియమించారు. వరంగల్కు కొండపల్లి శ్రీధర్ రెడ్డి (ఖమ్మం), జయశంకర్ భూపాలపల్లికి దశమంత రెడ్డి (జనగామ), మహబూబాబాద్కు డాక్టర్ జరుపులావత్ గోపి (నల్లగొండ), ములుగు జిల్లాకు డాక్టర్ కోరండ్ల నరేశ్ (రంగారెడ్డి), జనగామ జిల్లాకు కట్ట సుధాకర్రెడ్డి (నాగర్ కర్నూల్)ను ఇన్చార్జ్గా నియమించారు. ఖిలా వరంగల్: చారిత్రక ప్రసిద్ధి చెందిన మధ్యకోటను శనివారం కేంద్ర పురావస్తుశాఖ హైదరాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ నిహాల్ దాస్ సందర్శించారు. ఈసందర్భంగా శిల్పాల ప్రాంగణంలోని శిల్పకళా సంపదను తిలకించారు. అనంతరం శృంగారపు బావి, ఇటీవల కూలిపోయిన రాతికోట ముఖద్వారం పక్కన రాళ్లు, రాతికోట ఉత్తరద్వారంలో నిలిచిన నీటిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శృంగారపు బావితోపాటు రాతికోట ఉత్తర ద్వారం వద్ద నిలిచిన నీళ్లను పంపించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పడమరకోట ముఖ ద్వారం వద్ద కూలిన భారీ రాళ్లను క్రమ పద్ధతిలో పెట్టేందుకు చర్యలు చేపడతామన్నారు. ఆయన వెంట కేంద్ర పురావస్తుశాఖ డీఈ కృష్ణ చైతన్య, సీఏలు, సిబ్బంది పాల్గొన్నారు హసన్పర్తి: సర్వర్ డౌన్ కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించాల్సిన ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. నగరంలోని టీఎస్ ఆయాన్ డిజిటల్ (వడ్డేపల్లి సమీపంలోని ఫిల్టర్ బెడ్ ప్రాంతం) సెంటర్ను కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు ఎనిమిది వందల మంది పరీక్ష రాసేందుకు ఇక్కడి వచ్చారు. ఉదయం 7 గంటలకే రిపోర్ట్ చేయాలని నిబంధన ఉండడంతో సెంటర్ ఎక్కడుందో తెలియక అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. సర్వర్ డౌన్ కారణంగా ఉదయం 5 గంటలకు పరీక్ష కోసం బయల్దేరి అభ్యర్థులు మధ్యాహ్నం ఒంటి గంటకు పరీక్ష రాసి బయటకు వచ్చారు. -
నిస్వార్థ సేవలకు గుర్తింపుగా గ్రామాల్లో సర్పంచ్ల విగ్రహాలు
వారు గ్రామానికి ప్రథమ పౌరులు.. ఏళ్ల క్రితమే సేవ కోసం నడుము కట్టారు. అభివృద్ధిని పల్లెకు పరిచయం చేశారు. తమకున్న పరిధిలో ప్రజలకు సేవ చేశారు. కాలక్రమంలో వారు గతించారు. కానీ, వారి అమూల్యమైన సేవలను ఇప్పటికీ ఆయా గ్రామాల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. పల్లె సారథుల యాదిలో స్థానికులు కూడళ్లలో ప్రతిమల్ని ఏర్పాటు చేశారు. వారి జయంతి, వర్ధంతులను ఇప్పటికీ ఘనంగా జరుపుతున్నారు. వారిని నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని ఆయా గ్రామాలవాసులు చెబుతున్నారు. పల్లె మకుటాలై.. ప్రతిమలై నిలిచిన ఆనాటి సర్పంచ్ల సేవలపై ‘సాక్షి’ సండే స్పెషల్. అభివృద్ధిని స్మరిస్తూ సేవల్ని గుర్తు చేస్తూ.. ఇప్పటికీ ఘనంగా జయంతి, వర్ధంతులు ఉమ్మడి జిల్లాలోని నేటితరం నాయకులకు ఆదర్శం -
సీఎం సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే
నర్సంపేట: నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో డిసెంబర్ 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన ఖరారైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బహిరంగ సభ కోసం నర్సంపేట మెడికల్ కాలేజీ ఆవరణలోని స్థలాన్ని పరిశీలించారు. అలాగే, మరో రెండు చోట్ల స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రవీందర్రెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, తదితరులు పాల్గొన్నారు. నేడు డయల్ యువర్ డీఎం హన్మకొండ : ప్రయాణికుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించడానికి ఈ నెల 29న డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు. హనుమకొండలోని వరంగల్–1 డిపో నుంచి శనివారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో వివరించారు. హైదరాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల తదితర రూట్ల ప్రయాణికులు 9959226047 నంబర్కు ఫోన్ చేసి మెరుగైన సేవలు అందించడానికి అవసరమైన సలహాలు, సూచనలు, సమస్యలు వివరించాలని కోరారు. -
బాధితులకు భరోసా..
ఫిర్యాదుల పరిశీలన తర్వాత చిట్టీ సొమ్ము చెల్లింపుచిట్ఫండ్ బాధితుల ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం వారు చెల్లించిన చిట్టీ డబ్బులను తిరిగి చెల్లిస్తాం. ఫిక్స్డ్ డిపాజిట్ రిలీజ్లో భాగంగా జాయింట్ అకౌంట్ తెరుస్తాం. ఇందులో సంబంధిత చిట్ఫండ్ కంపెనీ చైర్మన్తో పాటు నేను ఉంటా. చిట్టీ సొమ్మును జాయింట్ అకౌంట్లో నుంచి చెక్కు రూపంలో అందజేస్తాం. ఫిర్యాదు చేయని వారు కూడా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తాం. ప్రవీణ్కుమార్, రిజిస్ట్రార్, వరంగల్ కాజీపేట అర్బన్ : సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు తమ పిల్లల పెళ్లిళ్లు, విద్య, సొంతింటి కల నెరవేర్చుకోవడానికి తమ నెలసరి ఆదాయంలో కొంత వెచ్చించి పలు చిట్ఫండ్స్ కంపెనీల్లో పొదుపు చేసుకుంటారు. అయితే కాలపరిమితి ముగిసినా ఖాతాదారుల సొమ్ము తిరిగి ఇవ్వకుండా చిట్ఫండ్, బోర్డు తిప్పేసిన కంపెనీలు వారిని తిప్పుకుంటున్నాయి. దీంతో బాధితులు వివిధ శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కావడం లేదు. ఫలితంగా కన్నీరుమున్నీరవుతున్నారు. ఇలాంటి వారికి శుభవార్త. ఇక నుంచి ఆ గోస తీరనుంది. రిజిస్టర్డ్ చిట్ఫండ్ కంపెనీలు తాము ప్రారంభించే చిట్టీకి అనుగుణంగా ఫిక్స్డ్ డిపాజిట్ను చేస్తే తప్పా చిట్టీ ప్రారంభించే అవకాశం లేదు. దీంతో తాము ప్రారంభించే చిట్టీకి సరిపోయే విధంగా అందుకు అనుగుణంగా ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చిట్స్ కార్యాలయానికి చెల్లిస్తారు. చిట్ఫండ్ కంపెనీలు చెల్లించిన ఎఫ్డీ రూపంలోని సొమ్మును బాధితులకు అందజేయాలని ఎఫ్డీ రిలీజ్ పేరిట రిజిస్ట్రేషన్ అండ్ చిట్స్ శాఖ కమిషనరేట్ అక్టోబర్లో ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, చిట్ఫండ్ కంపెనీల్లో బాధితుల ఫిర్యాదులను పరిశీలించి సొమ్మును చెల్లించేందుకు జాయింట్ అకౌంట్ ప్రక్రియను ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. తొలుత ఆ ఐదు చిట్ఫండ్ కంపెనీలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 168 రిజిస్డర్డ్ చిట్ఫండ్ కంపెనీలు తమ లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ రిలీజ్ ఉత్తర్వుల్లో తొలుత అక్షర, కనకదుర్గ, అచల, భవితశ్రీ, శుభనందిని చిట్ఫండ్ కంపెనీల్లో ఫిర్యాదులు పరిశీలించి బాధితులకు చిట్టీ డబ్బులు అందజేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, ఐదు చిట్ఫండ్ కంపెనీలు 40 బ్రాంచ్లతో లావాదేవీలను కొనసాగించాయి. రూ. 30 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు..315 ఫిర్యాదులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అక్షర, అచల, కనకదుర్గ, శుభనందిని, భవితశ్రీ చిట్ఫండ్ కంపెనీలు 40 బ్రాంచ్లతో రూ.50 వేల నుంచి రూ. 50లక్షల వరకు చిట్టీలను ప్రారంభించి లావాదేవీలను కొనసాగించాయి. అయితే ఖాతాదారులకు తిరిగి చెల్లింపు చేయక తిప్పుతుండడంతో కొందరు వరంగల్ ఆర్వో కార్యాలయంలోని సహాయ చిట్స్రిజిస్ట్రార్తో పాటు జిల్లా రిజిస్ట్రార్కు ఫిర్యాదులు చేశారు. అక్కడ సమస్య పరిష్కారం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఐదు చిట్ఫండ్ కంపెనీలకు గాను రూ.30 నుంచి రూ.40 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని, 315కు పైగా ఫిర్యాదులు ఉన్నాయని, ఫిర్యాదుదారులకు తమ సొమ్మును అందించే అవకాశం ఉందని సమాచారం. ఫిర్యాదు చేస్తేనే చిట్టీ సొమ్ము.. తాము చిట్ఫండ్ కంపెనీలో చేరి చిట్టీ డబ్బులను చెల్లించిన అనంతరం తిరిగి తమకు చెల్లింపులు చేయని పక్షంలో బాధితులు జిల్లా చిట్స్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తేనే ఫిర్యాదుకు అనుగుణంగా చిట్టీ డబ్బులు పొందే అవకాశం ఉంది. కాగా, ఫిర్యాదు చేయని వారికి చిట్ఫండ్ కంపెనీలు మొండిచేయ్యి చూపించే అవకాశం ఉంది. అందుకే బాధితులు ఫిర్యాదు చేస్తే సొమ్ము పొందే ఛాన్స్ ఉంటుంది. తీరనున్న చిట్స్ ఖాతాదారుల గోస ఫిర్యాదు చేస్తేనే డబ్బులు.. ఫిక్స్డ్ డిపాజిట్ రిలీజ్ ఉత్తర్వులు జారీ తొలుత ఆ ఐదు చిట్ఫండ్స్ కంపెనీలకు అవకాశం -
సీకేఎం ఆస్పత్రి సమస్యలు పరిష్కరించాలి
● ఏఐఎఫ్డీడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగసుధఎంజీఎం : సీకేఎం ఆస్పత్రిలో సౌకర్యాల లేమితో గర్భి ణులు అవస్థలు పడుతున్నారని, వెంటనే ఆస్పత్రిలో నె లకొన్న సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య (ఏఐఎఫ్డీడబ్ల్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కార్యదర్శి కనకం సంధ్య ఆధ్వర్యంలో శుక్రవారం సీకేఎం ఆస్పత్రిని సందర్శించి గర్భిణులు, బాలింతలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ సీకేఎం 60 నుంచి 100 పడకల ఆస్పత్రిగా అప్గేడ్ అయినా వసతుల లేమితో గర్భిణులు, బా లింతలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోజుకు 300 నుంచి 400 మంది ఓపీ పేషెంట్స్ వస్తున్నారని, 20 నుంచి 30 డెలివరీలు జరుగుతున్నాయన్నారు. కానీ సిబ్బంది కొరతతో సేవలు అందక రోగుల సంరక్షణ ప్ర మాదంలో పడుతుందన్నారు. వెంటనే ఆస్పత్రిల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం బృందం సభ్యులు గుర్తించిన సమస్యలను ఆస్పత్రి అఽ దికారులకు వివరించారు. ఈక యమున, లలిత, భార తి, మంజుల, కోమల, తదితరులు పాల్గొన్నారు. -
పదకొండేళ్లు మహిళా రాజ్యం!
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామం గంగదేవిపల్లిలో పదకొండేళ్ల పాటు గ్రామపంచాయతీ పాలనను మహిళలే చేపట్టారు. సర్పంచ్ సహా వార్డు సభ్యులందరూ రెండు పర్యాయాలు మహిళలే ఎన్నికై పాలన సాగించడం విశేషం. గంగదేవిపల్లి 1994లో మచ్చాపురం నుంచి విడిపోయి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. తర్వాత 1995లో గ్రామపంచాయతీకి తొలి ఎన్నికలు నిర్వహించారు. సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడం, గ్రామంలో 8 వార్డులు ఉండడంతో వారందరినీ మహిళలనే ఎన్నకోవాలని ఆ రోజుల్లో గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా సర్పంచ్ పదవికి పోటీ ఉండగా కూసం లలిత ఎన్నికయ్యారు. ప్రశాంత పాలన సాగించాలనే ఉద్దేశంతో నాడు గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామ తొలి సర్పంచ్గా కూసం లలిత, వార్డు సభ్యులుగా పెండ్లి సరోజన, కూసం రాజేశ్వరి, దేవులపల్లి విజయ, జంగం వీరలక్ష్మి, మామిండ్ల లక్ష్మి, సల్ల కట్టమ్మ, సింగిరెడ్డి నర్సమ్మ, గోనె లక్ష్మి ఎన్నికై ఐదేళ్లపాటు ( 2001 వరకు) పాలన సాగించారు. ప్రజల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేశారు. దీంతో రెండో సారి కూడా సర్పంచ్ సహా వార్డు సభ్యులను అందరు మహిళలనే ఎన్నుకోవాలని కొంత మేరకు గ్రామస్తులు అనుకున్నారు. అయితే 2001లో సర్పంచ్ పదవి ఎవరైనా పోటీ చేసే విధంగా జనరల్కు రిజర్వ్ చేశారు. దీంతో సర్పంచ్, 8 వార్డు సభ్యుల ప్యానల్గా మహిళలు పోటీ చేయగా ఆయా స్థానాల్లో వారితో పురుషులు పోటీ పడ్డారు. అయినా అన్ని స్థానాల్లో మహిళలే గెలుపొంది సత్తా చాటారు. సర్పంచ్గా మరో మారు కూసం లలిత ఎన్నికయ్యారు. వార్డు సభ్యులుగా దేవులపల్లి విజయ, కూసం రాజేశ్వరి, సల్ల సాంబలక్ష్మి, సల్ల కట్టమ్మ, మేడిద లక్ష్మి, మేడిద మల్లికాంబ, గూడ రాధమ్మ ఎన్నికై 2006 వరకు పాలన సాగించారు. రెండు పర్యాయాల వారి పాలనతో గ్రామం ఆదర్శంగా నిలవడంతో పాటు ప్రపంచంలోని సుమారు 99 దేశాల ప్రజలు, భారత దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వారు గ్రామ సందర్శనకు రావడానికి నాంది పలికారు. అనంతరం 2006 ఎన్నికల్లో సర్పంచ్ పదవిని బీసీ జనరల్కు రిజర్వ్ చేయగా సర్పంచ్గా కూసం రాజమౌళి, వార్డు సభ్యులు అందరూ ఏకగ్రీవంగా గెలుపొందారు. ఆ తర్వాత 2013లో సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ కాగా ఇట్ల శాంతి గెలుపొంది 2018 వరకు కొనసాగారు. 2019లో సర్పంచ్ స్థానం జనరల్కు కేటా యించడంతో గోనె మల్లారెడ్డి గెలుపొంది 2024న వరకు పాలన సాగించారు. ఈ సారి సర్పంచ్ పదవి జనరల్ మహిళకు కేటాయించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు ఎలా నిర్ణయిస్తారో వేచి చూడాల్సిందే. సర్పంచ్, వార్డు సభ్యులందరూ నారీమణులే.. ప్రత్యేకత చాటుకున్న జాతీయ ఆదర్శ గ్రామం గంగదేవిపల్లి ఈ సారి సర్పంచ్ పదవి జనరల్ మహిళకు కేటాయింపు -
గ్రామాభివృద్ధిలో సర్పంచ్ కీలకం
ప్రధాన అధికారం..పరిపాలన, కార్యనిర్వాహక అధికారాలు● విస్తృత అధికారాలు, బాధ్యతలు ● పాలన వ్యవస్థ మొత్తం ప్రథమ పౌరుడి చుట్టే.. గ్రామ పారిశుద్ధ్యం, చెత్త తొలగింపు, మురుగు నీటిపారుదల వ్యవస్థల పర్యవేక్షణ. పరిశుభ్ర నీటి సరఫరా, ట్యాంకులు – పైపులైన్ల నిర్వహణ. వీధి దీపాల ఏర్పాటు, మరమ్మతు. అంతర్గత రహదారులు, కాల్వలు, శ్మశానవాటికలు, వైకుంఠధామాల నిర్మాణం –పర్యవేక్షణ. ప్రభుత్వ స్థలాల్లో సంతలు, మార్కెట్లు, పబ్లిక్ స్థలాల నిర్వహణ నిర్ణయాలు. సంక్షేమ, ప్రభుత్వ పథకాల అమలు బాధ్యతలు.. ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ), పింఛన్లు, గృహ పథకాలు, అంగన్వాడీలు, పాఠశాలలు తదితర సంక్షేమ పథకాల అమలుపై పర్యవేక్షణ. అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం, వారికి ప్రయోజనాలు చేకూరేలా చూసుకోవడం. బలహీన వర్గాలు, మహిళలు, దివ్యాంగులకు సామాజిక భద్రత–సాయం అందేలా చర్యలు. గ్రామారోగ్యం, పాఠశాలల పనితీరు, అంగన్వాడీ సేవల పర్యవేక్షణ. గ్రామ ప్రణాళిక–నియంత్రణాధికారాలు.. గ్రామ పంచాయతీ పరిధిలో కొత్త భవన నిర్మాణాలకు అనుమతులు జారీ. ప్రభుత్వ ఖాళీ స్థలాల వినియోగంపై పంచాయతీకి సలహాలు, అవసరాలకు అనుగుణంగా అవి కేటాయించే చర్యలు. గ్రామాభివృద్ధి ప్రణాళిక (విలేజ్ డెవలప్మెంట్ ప్లానింగ్) తయారీ, అమలు. పంచాయతీ తీర్మానాలను అమలు చేయడం, పౌరుల భాగస్వామ్యంతో పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహించడం.హన్మకొండ అర్బన్ : గ్రామపాలనలో స ర్పంచ్ పాత్ర అత్యంత కీలకం. గ్రామ పంచా యతీకి అధిపతిగా, ప్ర భుత్వానికి గ్రామ స్థా యిలో ప్రతినిధిగా, ప్ర జలకు అతి చేరువలో ఉంటూస్థానిక సమస్యల పరిష్కారానికి సర్పంచ్ కృషి చేస్తారు. అభివృద్ధి పనుల రూపకల్పన నుంచి అమలు వరకు.. ప్ర జాసేవల పర్యవేక్షణ నుంచి ప్రభుత్వ పథకాల ప్రవర్తన వరకు మొత్తం గ్రామ పాలన వ్యవస్థ సర్పంచ్ చుట్టూ తిరుగుతుంది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018 అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలకు మరింత అధికా రం, బాధ్యతలు చేకూరాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. సర్పంచ్ గ్రామ పంచాయతీకి సంపూర్ణ పాలన అధిపతి. పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహించడం, ఎజెండా నిర్ణయించడం, తీర్మానాలను అమలు చేయించడం. గ్రామ సభలను సంవత్సరానికి కనీసం రెండుసార్లు నిర్వహించడం, వాటిలో తీసుకున్న నిర్ణయాలకు చట్టబద్ధత ఇవ్వడం. పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పని తీరు పర్యవేక్షణ. గ్రామ పంచాయతీ రికార్డులు, ఆస్తుల జాబితా, డాక్యుమెంట్ల నిర్వహణ పర్యవేక్షణ. ప్రభుత్వ చట్టాలు, ఆదేశాలు, పథకాల అమలు గ్రామస్థాయిలో సక్రమంగా జరిగేలా చర్యలు. ఆర్థిక, నిధుల నిర్వహణాధికారాలు.. పంచాయతీ బ్యాంకు ఖాతాలపై సంయుక్త సంతకం అధికారం (సర్పంచ్–కార్యదర్శి). గ్రామ పన్నులు (ఇంటి పన్ను, నీటి పన్ను, వత్తి పన్ను, డ్రైనేజీ పన్ను) విధించడం, వసూలు చేయించడం. వార్షిక బడ్జెట్ పరిశీలన, ఆమోదం. అభివృద్ధి పనుల ఖర్చులకు పరిమితి మేరకు ఆమోదం ఇవ్వడం. పంచాయతీ ఆర్థిక లావాదేవీలన్నింటిపై పర్యవేక్షణ, పారదర్శకత కాపాడడం.


