Hanamkonda District Latest News
-
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
● వరంగల్ ఎంపీ కడియం కావ్య ధర్మసాగర్: ఇందిరమ్మ ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నెరవేరుతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇళ్లు లేని నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని తెలిపారు. అంతకుముందు పెద్ద పెండ్యాల గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న ఎంపీ కడియం కావ్యకు సర్పంచ్, గ్రామ పంచాయతీ అధికారులు, వార్డు సభ్యులు ఘన స్వాగతం పలికారు. సర్పంచ్ తోట నాగరాజు, ఉప సర్పంచ్ ప్రవీణ్, గ్రామ అధ్యక్షుడు భిక్షపతి, గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. -
బంద్ను విజయవంతం చేయాలి
ఖిలా వరంగల్: వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సోమవారం నిర్వహించే ఫర్టిలైజర్ షాపుల బంద్ను విజయవంతం చేయాలని ది డిస్ట్రిక్ట్ ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొలం సత్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ శివనగర్లోని అసోసియేషన్ భవనంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరువుల సరఫరా విషయంలో డీలర్లు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యల సాధన కోసం ఆల్ ఇండియా, తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపులో భాగంగా స్వచ్ఛందంగా షాపుల బంద్ పాటించాలని సూచించారు. శివనగర్లోని అసోసియేషన్ భవనం వద్ద ఉదయం 8:30 గంటలకు డీలర్లు అధిక సంఖ్యలో హాజరై బంద్కు మద్దతుగా నిర్వహించే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు పల్లె రాజేందర్రెడ్డి, గాయపు రాంచంద్రారెడ్డి, జిల్లా కోశాధికారి బీఎన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ లాహోటి, అచ్చ పరమేశ్వర్, సాంస్కృతిక కార్యదర్శులు దేసు ప్రవీణ్, ముక్కెర సతీశ్, సంయుక్త కార్యదర్శి గోమాత సంపత్రెడ్డి పాల్గొన్నారు. -
అంగట్లో వేలంలా ఇంటినంబర్లు!
సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటి నంబర్లు అంగట్లో వేలంలా మారాయి. సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం లేకున్నా.. చేయి తడిపితే చాలు దరఖాస్తు చేసిన రోజుల వ్యవధిలోనే ఇంటి నంబర్ కేటాయిస్తూ కొందరు అధికారులు అందినకాడికి దండుకుంటున్నారు. విచిత్రమేంటంటే ఏ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం లేకున్నా.. మీ ఓపెన్ ప్లాట్లో రెడీమెడ్ కంటైయినర్ సిద్ధం చేసి ఉంచితే చాలు రోజుల వ్యవధిలో ఇంటి నంబర్లు కేటాయిస్తుండడం వివాదాస్పదమవుతోంది. అనంతరం ఆయా కంటైయినర్లకు ఇంటి పన్నుల రూపంలో వచ్చే పన్నులను సైతం కట్టకుండా ఉండేందుకు లోపాయికారీగా ఒప్పందం చేసుకొని మమ అనిపిస్తున్నారు. వీటిపై బల్దియాకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో కమిషనర్ లేకపోవడం కూడా వారు ఆడిందే ఆట, పాడింది పాటగా మారింది. కొన్ని కేసుల్లో అక్రమ పద్ధతిలో పొందిన ఈ ఇంటి నంబర్లను ఆయా స్థల వివాదాల్లో కోర్టులో ఉపయోగించుకుంటుండడంతో అసలు ప్లాట్ల యజమానులకు ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి కనబడుతోంది. అన్ని అనుమతులు తీసుకొని నిర్మాణం పూర్తైన వాటికి ఇంటి నంబర్ కేటాయించేందుకు నెలల తరబడి తిప్పించుకుంటున్న కొందరు అధికారులు వీటి విషయంలో మాత్రం అడిగినంత డబ్బు చేతికి అందుతుండడంతో రోజుల వ్యవధిలో కేటాయిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇన్నాళ్లు ఓపెన్ ప్లాట్ల చుట్టూ గోడలు కట్టి ఓ చిన్న గది వేసుకుంటే ఎంతో కొంత తీసుకొని ఇంటి నంబర్ కేటాయించిన అధికారులు ఇప్పుడూ ఓపెన్ ప్లాట్లలో రెడీమెడ్ కంటైనర్లకు ఇంటి నంబర్లు కేటాయిస్తూ భారీగా అవినీతికి పాల్పడుతుండడం గమనార్హం. మచ్చుకు కొన్ని.. హంటర్రోడ్డులోని ఓ పెట్రోల్ పంపు ఎదురుగా ఉన్న న్యూశాయంపేట జాగీరులోని ఓ సర్వే నంబర్లోని ఓపెన్ ప్లాట్లో కంటైనర్లు ఏర్పాటుచేసి ఇంటి నంబర్లు పొందారు. దేశాయిపేట నవయుగ కాలనీలో మున్సిపల్ లేఅవుట్ ఖాళీ స్థలం విషయంలో హైకోర్టులో కేసు నడుస్తుండగా కొత్తగా మళ్లీ ఇంటి నంబర్లు కేటాయించడం వివాదాస్పదమవుతోంది. అలాగే జక్కలొద్ది, మామునూరు, తిమ్మాపూర్, రంగశాయిపేట, దేశాయిపేట, పైడిపల్లి, ఉర్సు, భట్టుపల్లి తదితర ప్రాంతాల్లోనూ అక్రమ పద్ధతిలో ఇంటి నంబర్లు కేటాయించారనే ఉన్నతాధికారులకు ఫిర్యాదులొస్తున్నా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఈ అక్రమ పద్ధతిలో ఇంటి నంబర్ల కేటాయింపు అంశంపై బల్దియా అధికారులను ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. హంటర్ రోడ్డులో ఏర్పాటు చేసిన కంటైనర్ కంటైనర్ ఉంటే నంబర్ ఇచ్చుడే.. డబ్బుకు కక్కుర్తి పడి అక్రమ అనుమతులు కొందరు బల్దియా అధికారుల చేతివాటంతోనే దందా అసలు ఇంటి నిర్మాణదారుడికి చుక్కలే.. -
సోమవారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ఏప్రిల్ ఒకటిన వరంగల్ నగర శివారు ఏనుమాముల మార్కెట్ సమీపంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసి నిల్వ ఉంచిన ‘ఉమానాగ్ పాలిమర్స్’ కంపెనీపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.12 లక్షల విలువైన నిషేధిత ప్లాస్టిక్ గ్లాసులు, ముడి సరుకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ అండ్ శానిటేషన్ విభాగం అధికారులు రూ.50,000 జరిమానా విధించడంతోపాటు యూనిట్కు నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 16న వరంగల్ నగర శివారు తిమ్మాపూర్లోని పెన్షన్పురలో ప్రభుత్వం నిషేధించిన తక్కువ మైక్రాన్ కలిగిన ప్లాస్టిక్ కవర్ కోటెడ్ పేపర్ ప్లేట్లు తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. సుమారు రూ.3 లక్షల విలువైన స్టాక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కంపెనీ నిర్వాహకుడికి బల్దియా అధికారులు రూ.13,000 జరిమానా విధించారు. సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్లో తక్కువ మైక్రాన్ కలిగిన ప్లాస్టిక్ గ్లాస్లు, ప్లాస్టిక్ కవర్ కోటెడ్ పేపర్ ప్లేట్ల తయారీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రభుత్వ నిషేధం ఉన్నప్పటికీ కొందరు నిబంధనల్ని పట్టించుకోకుండా యథేచ్ఛగా ఉత్పత్తి చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ముఖ్యంగా టీ స్టాళ్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, చిన్న వ్యాపార కేంద్రాలకు సరఫరా చేస్తూ ఎక్కువ మొత్తంలో లాభాలు పొందుతున్నారు. తక్కువ నాణ్యత గల ప్లాస్టిక్తో తయారైన గ్లాసుల్లో వేడి పానీయాలు పోస్తే రసాయనాలు విడుదలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్ కోటెడ్ పేపర్ ప్లేట్లలో అన్నం తినేవారికి కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందన్నారు. ఇది దీర్ఘకాలంలో కిడ్నీ, కాలేయ సమస్యలకు దారితీసే అవకాశముంది. ప్రజలు తెలియక వాడడంతో వీరి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఈ ప్లాస్టిక్ గ్లాస్, ప్లేట్ల తయారీ పరిశ్రమలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ అండ్ శానిటేషన్ విభాగం అప్పుడప్పుడు దాడులు చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోతోంది. జరిమానాలు తక్కువగా ఉండడంతో తయారీదారులు తిరిగి అదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. పోలీసుల దాడులతో ఇవి వెలుగులోకి వస్తుండడంతో ఈ అక్రమ తయారీ పరిశ్రమలపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. కఠిన చర్యలతోనే దందాకు అడ్డుకట్ట.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అదేవిధంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకు కనీస మందం (మైక్రాన్)ను నిర్దేశించింది. అయితే 40 నుంచి 50 మైక్రాన్ల లోపు ఉండే పలుచని ప్లాస్టిక్తో గ్లాస్లు, ప్లేట్లు తయారు చేయడం చట్టవిరుద్ధం. తక్కువ ఖర్చుతో భారీ లాభాలు వస్తుండడంతో కొందరు వ్యాపారులు ఇష్టారీతిన ఉత్పత్తి చేస్తూ వినియోగదారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇలా.. నగరంలోని పరిశ్రమల్లో చిన్న యూనిట్లలో ఈ వ్యాపారం జోరుగా సాగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బయటకు ఇతర ఉత్పత్తులు చూపిస్తూ, లోపల నిషేధిత గ్లాస్లు, ప్లేట్ల తయారీ కొనసాగిస్తున్న యూనిట్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు తనిఖీలకు వస్తున్నారనే సమాచారంతో యజమానులు ఆ యంత్రాలను ఆపేసి అక్కడి నుంచి తప్పించుకుంటున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించే యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్త్తలు డిమాండ్ చేస్తున్నారు. భారీ జరిమానా, యంత్రాల స్వాధీనం, లైసెన్స్ రద్దు వంటి చర్యలు తీసుకుంటేనే అక్రమ వ్యాపారానికి చెక్ పడే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. -
స్వీయ గణనలో నమోదు చేసుకున్న మేయర్
వరంగల్ అర్బన్: ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్ )కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఆదివారం 28వ డివిజన్న్లోని తన నివాసంలో స్వీయ గణన వివరాలు నమోదు చేసుకున్నారు. ఈసందర్భంగా గణాంక అధికారి మేయర్ నివాసానికి వెళ్లి అవసరమైన వివరాలు సేకరించి నమోదు చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వీయ జన గణన కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. మే 10 లోగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ అనంతరం జనరేట్ అయ్యే ఐడీ నంబర్ భద్రపర్చుకోవాలని కోరారు. మున్సిపల్ పరిధి ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ఇందులో చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, మెప్మా టీఎంసీ రమేశ్, సీఓ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్మికులకు అండగా ప్రభుత్వం
హన్మకొండ: ఆర్టీసీ కార్మికులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ అన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించేందుకు ఒప్పుకున్న సందర్భంగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ రాంనగర్లోని ఆర్టీసీ హనుమకొండ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ముందుగా డ్రైవర్ కోలా శంకర్గౌడ్ మృతికి మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈసందర్భంగా బంక సరళ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 56 రోజుల పాటు సమ్మె చేసినా, 32 మంది కార్మికులు చనిపోయినా పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం సమ్మె మొదలు పెట్టిన మూడు రోజుల్లోనే సమస్యకు పరిష్కారం చూపిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తవుటం ఝాన్సీ, తాళ్లపల్లి మేరీ, విజయ, ఇందిర, శ్వేత, సుజాత, సబితా, కళ్యాణి, తోట వెంకటేశ్వర్లు, బంక సంపత్ యాదవ్, నాయిని లక్ష్మారెడ్డి, పెరుమాండ్ల రామకృష్ణ, తాళ్లపల్లి రవీందర్, తాళ్లపల్లి సుధాకర్, నేహాల్ తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ సీఎం రేవంత్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం -
స్వీయ గణనను సద్వినియోగం చేసుకోవాలి
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జనగణన ప్రక్రియలో భాగంగా ప్రారంభమైన స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఆదివారం కలెక్టరేట్లో జిల్లా అధికారులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పర్సన్స్కి స్వీయ గణన ఎలా చేయాలనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. జనగణన 2027లో భాగంగా జిల్లాలో 12 మండలాలు, రెండు మున్సిపాలిటీలు కలిపి 14 చార్జెస్లోని 1,237 హౌస్లిస్టింగ్ బ్లాక్లో 1,094 ఎన్యుమరేటర్లతో జనగణన చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొదటగా ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ వరకు నిర్వహించనున్న స్వీయగణనలో భాగంగా కేంద్రం తొలిసారిగా ప్రజలు తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. ఈ ప్రక్రియను ఆన్లైన్ ద్వారా లేదా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ద్వారా సులభంగా పూర్తి చేయవచ్చన్నారు. ఎస్ఈ. సీఈఎన్ఎస్యూఎస్.జీఓవీ.ఇన్ లింక్ను ఓపెన్ చేసి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా లాగిన్ అవ్వాలన్నారు. కుటుంబానికి సంబంధించిన సుమారు 33 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాల్సి ఉంటుందని, అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత మరోసారి పరిశీలించి సమర్పించాలన్నారు. సమర్పణ అనంతరం 11 అంకెల ఐడీ నంబర్ జనరేట్ అవుతుందన్నారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఐడీని చూపిస్తే ధ్రువీకరించి ఫైనల్ చేస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.సంధ్యారాణి, వై.వి.గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీబీసీడీఓ పుష్పలత పాల్గొన్నారు. -
సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక
వరంగల్ స్పోర్ట్స్: సైక్లింగ్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా కమిటీ ఎన్నికలు ఆదివారం హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని రెజ్లింగ్ హాల్లో నిర్వహించారు. ఎన్నికల పరిశీలకుడిగా హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్, పర్యవేక్షక్షుడిగా తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ బాధ్యుడు వేణుగోపాల్, ఒలింపిక్స్ సంఘం బాధ్యుడు దుపాకీ సంతోష్ వ్యవహరించారు. 2026 నుంచి 2030 వరకు కొనసాగే కమిటీ వివరాలను పరిశీలకులు వెల్లడించారు. అసోసియేషన్ జిల్లా చైర్మన్గా బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, అధ్యక్షుడిగా ఆడెపు వెంకటేశ్, ప్రధాన కార్యదర్శిగా ఐత కిషన్, కోశాధికారిగా గద్దల అనిల్, ఉపాధ్యక్షులుగా జె.రమేశ్, ఆదిరెడ్డి, మట్టెడ కుమార్, తుపాకుల రవి, తీగల సాధన్, సంయుక్త కార్యదర్శులుగా కోట సునీల్, సంగల ప్రణీత్, బొచ్చు రాకేశ్, ఎం.రాజు, ప్రవీణ్, కార్యవర్గ సభ్యులుగా వైదుగుల శ్రీనివాస్రెడ్డి, థామస్, కల్పన, సుధాకర్, సంపత్, నాగరాజు, కుమారస్వామి, శంకర్, రాజు, సంతోష్ ఎన్నికై నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియముందు జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఒలింపిక్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బైరబోయిన కై లాశ్యాదవ్ హాజరై మాట్లాడారు. జూలైలో సబ్జూనియర్, సెప్టెంబర్లో జూనియర్, డిసెంబర్లో సీనియర్ విభాగాల జిల్లాస్థాయి పోటీలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అసోసియేషన్ నూతన కార్యదర్శి ఐత కిషన్ మాట్లాడుతు సైక్లింగ్ క్రీడలో తెలంగాణలోనే హనుమకొండ జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచేలా కృషి చేస్తానని అన్నారు. -
వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయ సమీపంలోని శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో వీరబ్రహ్మేంద్రస్వామి 333వ ఆరాధనోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. అర్చకుడు కేదారీశ్వరాచారి బ్రహ్మంగారి మూలమూర్తికి పంచామృతాభిషేకం, మేలుకొలుపు, పూజలు జరిపారు. వివిధ పుష్పాలతో చిత్రపటాన్ని ప్రతిష్ఠించి ఆవాహన, గణపతిపూజ, నవగ్రహపూజ, మంటపారాధన, ఆరాధన పూజాకార్యక్రమం నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాల వితరణ అక్షతాశీర్వాదాలు, అన్నప్రసాదాల వితరణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ మారేడోజు సదానందచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 111 సంవత్సరాల వయస్సు గల ఉత్తరాఖండ్కు చెందిన హిమాలయ యోగి సంతు సదానందగిరి స్వామీజీ, తెలంగాణ అర్యక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ నూతనంగా నిర్మించిన దేవాలయం కాలక్షేప మండపాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ భూత, భవిష్యత్, వర్తమాన కాలజ్ఞాన విషయాలను తెలియజేసిన గొప్ప వ్యక్తి బ్రహ్మంగారు సాక్షాత్తు విష్ణుస్వరూపుడని, కులమతాలకు అతీతంగా తన శిష్యులుగా స్వీకరించి మత సమరస్యాన్ని పాటించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గంగు ఉపేంద్రశర్మ, రామోజు జయసాగర్, బాలాజీ, రుద్రోజు సుగ్రీవచారి, పెందోట చక్రపాణి, చొల్లేటి కృష్ణమాచారి, పెంటయాచారి, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
మలేరియా రహిత సమాజమే లక్ష్యం
● హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్యహన్మకొండ చౌరస్తా: మలేరియా రహిత సమాజమే లక్ష్యంగా ప్రజలను భాగస్వాములు చేస్తూ మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శనివారం హనుమకొండలోని పెద్దమ్మగడ్డ పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీని అప్పయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ శుక్రవారం డ్రైడే పాటించేలా ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. పెద్దమ్మగడ్డలోని వీధులన్నీ తిరుగుతూ మలేరియా నిర్మూలన ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మదన్మోహన్రావు, మాజీ కార్పొరేటర్ డిన్నా, మెడికల్ ఆఫీసర్ శ్రీదేవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరినయీంనగర్: గర్భాశయ కాన్సర్ నిరోధకత కోసం 14 ఏళ్లు నిండిన అమ్మాయిలకు హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పకుండా ఇప్పించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. శనివారం హనుమకొండ పోచమ్మకుంటలో నిర్వహించిన వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని డాక్టర్.అప్పయ్య క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అంగన్వాడీ, ఇతర కేంద్రాల్లో నిర్వహిస్తున్న 3 సెషన్స్లో ఎంత మందికి ఏయే టీకాలు ఇవ్వాల్సి ఉంది? వారిలో ఎంతమందికి ఇచ్చారు రాకపోవడానికి కారణాలేంటి అని పరిశీలించారు. 402 మందికి హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా 73 మందికి ఇచ్చినట్లు, సెలవుల్లో పిల్లలు ఇంటి దగ్గర ఉంటారని, నెలలోపు మిగతా వారికి ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో యూపీహెచ్సీ డాక్టర్ దీప్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సిరులిచ్చే తల్లికి సాలభంజిక సేవ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారి స్నపనమూర్తికి గంధోత్సవం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని సాలభంజిక వాహనంపై ఊరేగించారు. పూజా కార్యక్రమాలకు వరంగల్ ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘం, బంజార సమాజం వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. సాలభంజిక సేవలో మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ పాల్గొన్నారు. ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి దంపతులు దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ‘కుడా’ అధికారులు అజిత్రెడ్డి, భీంరావుతో కలిసి దేవాలయం చుట్టూ నిర్మిస్తున్న మాడవీధుల పురోగతిని పరిశీలించారు. అదేవిధంగా ఐసీసీ మెంబర్ కొండపల్లి దయాసాగర్రావు అమ్మవారిని దర్శించుకున్నారు. -
ప్యాక్స్ కిరీటాలు ఎవరికో?
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్) నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లను నియమించే ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. సహకార సంఘాల పదవీ కాలం గతేడాది ఫిబ్రవరి 14తో ముగియడంతో, ప్రస్తుతం వీటి బాధ్యతలను ప్రత్యేకాధికారులు నిర్వహిస్తున్నారు. తిరిగి వారి స్థానంలో అధికార పార్టీకి చెందిన నాయకులను వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల తరహాలో సహకార సంఘాలకూ పాలకమండళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల (ఈ నెల 23న) జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పీఏసీఎస్లతో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), సహకార మార్కెటింగ్ సమాఖ్య (డీసీఎంఎస్)లకు కూడా ఇదే పద్ధతిలో పాలకమండళ్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్కు చెందిన ఆశావహులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇదీ పీఏసీఎస్ల లెక్క.. ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలే కీలకం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారుల వివరాల ప్రకారం 98 సహకార సంఘాలు ఉండగా, సుమారు 2.96 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. నామినేటెడ్ పద్ధతి ద్వారా ఉమ్మడి జిల్లాలో 98 చైర్మన్ పోస్టులు, 98 వైస్ చైర్మన్ పోస్టులతో పాటు మరో 1,260 మందికి డైరెక్టర్లుగా అవకాశం దక్కనుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, స్థానిక నేతలకు మంత్రివర్గం నిర్ణయం ద్వారా ఈ నామినేటెడ్ పదవులు పొందే అవకాశం కలగనుంది. అయితే మార్కెట్ కమిటీల మాదిరిగానే, స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు పాలకవర్గాలను నియమిస్తారు. ఎమ్మెల్యే లేని నియోజకవర్గాల్లో జిల్లా మంత్రి ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది. ఈ ప్రక్రియలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి కూడా కీలకంగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియను అమలు చేయాలని భావించిన ప్రభుత్వం ప్రస్తుత సహకార చట్టంలో మార్పులు, చేర్పులపై ఉన్నతస్థాయి కసరత్తు మొదలెట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎన్నికల నుంచి ‘నామినేటెడ్’ వైపు.. సహకార సంఘాల ఎన్నికలు అధికారికంగా పార్టీ రహితంగా జరిగినా, పంచాయతీ ఎన్నికల మాదిరిగానే వీటిలో రాజకీయ పార్టీల ప్రమేయం పరోక్షంగా ఉండేది. ఆయా సంఘాల్లో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుంది. సభ్యులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారై ఉండడంతో సహకార చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి దశలో సభ్యులు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకోవడం.. రెండవ దశలో ఎన్నికై న ఆ డైరెక్టర్లు తమలో నుంచి ఒకరిని చైర్మన్గా, మరొకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకునేవారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ ఎన్నికల పద్ధతికి బదులుగా, మార్కెట్ కమిటీల తరహాలో నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లను నియమించాలని భావిస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే, సాధారణ సభ్యులు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకునే ప్రక్రియకు బదులుగా, ప్రజా ప్రతినిధుల సిఫార్సుతో నేరుగా ప్రభుత్వం పాలకమండళ్లను ఎంపిక చేయడమే ఈ ‘మార్కెట్ కమిటీ తరహా నియామకం’. త్వరలోనే నామినేటెడ్ ద్వారా పాలకమండళ్లను నియమించనున్నారన్న నిర్ణయం మేరకు పీఏసీఎస్ డైరక్టర్ మొదలుకుని డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల వరకు పదవులు పొందేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నామినేటెడ్ ద్వారానే ‘సహకార’ పదవులు ఎంపికలో మంత్రులు, ఎమ్మెల్యేలే కీలకం ‘పరిషత్’ ఎన్నికలకు ముందే ప్రకటన ఆశల పల్లకిలో అధికార పార్టీ నేతలు... మొదలైన ఆశావహుల పైరవీలు -
నేటినుంచి స్వీయ గణన
హన్మకొండ: జనగణన ప్రక్రియలో భాగంగా.. ఈనెల 26వ తేదీ నుంచి స్వీయ గణన ప్రారంభమవుతుందని, మే 10 వరకు కొనసాగుతుందని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి తెలిపారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం జన గణనలో భాగంగా ఈ సారి స్వీయ గణనను చేపట్టిందన్నారు. ప్రజలు ఈ ప్రక్రియను ఆన్లైన్ ద్వారా, మొబైల్ ఫోన్ ద్వారా సులభంగా వివరాలు నమోదు చేయవచ్చన్నారు. స్వీయ గణన కోసం https://se.census.gov.in లింక్ను ఓపెన్ చేసి కుటుంబానికి సంబంధించిన సుమారు 33 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం 11 అంకెల ఐడీ నంబర్ జనరేట్ అవుతుందని, ఆ ఐడీని భద్రపర్చుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడీ నంబర్ చూపిస్తే, వారు ధ్రువీకరించి ఫైనల్ చేస్తారన్నారు. జిల్లా ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని స్వీయ గణనలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణ రెడ్డి, స్టాటిస్టికల్ ఆఫీసర్ రామ్ దయాకర్రెడ్డి పాల్గొన్నారు. విస్తృతంగా అవగాహన కల్పించాలివరంగల్ అర్బన్: మహా నగర ప్రజలకు స్వీయ గణనపై విస్తృతంగా అవగాహన కల్పించాలని బల్దియా అదనపు కమిషనర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలో స్వీయ గణన నిర్వహణపై ఆర్పీలు, సీఓలు, వార్డు ఆఫీసర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వతంత్రంగా ఆన్ లైన్ ద్వారా వివరాలు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. సెన్సెస్ మాస్టర్ ట్రైనీ కంజర్ల రమేశ్ ఆధ్వర్యంలో ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇచ్చారు. సమావేశంలో ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, బిర్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి -
ప్రజల భాగస్వామ్యంతోనే నియంత్రణ
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద కాశిబుగ్గ: ప్రజల భాగస్వామ్యంతోనే మలేరియా నియంత్రణ సాధ్యమవుతుందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వరంగల్ ఎంజీఎం నర్సింగ్ స్కూల్ నుంచి ప్రారంభమైన అవగాహన ర్యాలీని కలెక్టర్ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎంజీఎం అకడమిక్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2030 నాటికి మలేరియా రహిత సమాజాన్ని నిర్మించేందుకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంచంద్రారెడ్డి, జిల్లా మలేరియా అఽధికారి కె.రజిని, డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ ప్రకాశ్, డాక్టర్ కొమురయ్య, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విజయ్కుమార్, డిప్యూటీ డెమో అనిల్కుమార్ పాల్గొన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి న్యూశాయంపేట: పనితీరు, లక్ష్యాలు సాధించడంలో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఐసీడీఎస్ సూపర్వైజర్లను హెచ్చరించారు. మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యలో వరంగల్ నగరంలో నిర్వహిస్తున్న బాలరక్షాభవన్, స్వధార్ గృహాలను కలెక్టర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రాలను నిర్వహరణ తీరును అడిగి తెలుసుకున్నారు. పనితీరులో వెనుకబడిన కొంతమంది సూపర్వైజర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి నుంచి తక్షణ వివరణ కోరారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమాధికారి రాజమణి, సంబంధిత సీడీపీఓలు, సూపర్వైజర్లు ఉన్నారు. క్రీడలతో మానసికోల్లాసం క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ శంభునిపేట దూపకుంట రోడ్డులోని మైనారిటీ గురుకులంలో ఈనెల 18 నుంచి 13 రోజుల పాటు నిర్వహిస్తున్న వేసవి క్రీడలు ప్రత్యేక క్యాంపును శనివారం ఉదయం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. వారితో కలిసి వాలీబాల్, చెస్ ఆడారు. కార్యక్రమంలో అదనపు కలెక్డర్ సంధ్యారాణి, బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పలత, మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్, ఆర్ఎల్సీ డాక్టర్ సతీశ్, ప్రిన్సిపాల్ నీలిమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ వరంగల్ క్రైం: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0 నిర్వహించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. ఇందులో 2024 , 2025 సంవత్సరాల్లో 3,567 మంది నిందితులు అరెస్టయ్యారని, వీరిలో వరంగల్ కమిషనరేట్కు చెందిన 9 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. స్టేషన్ల వారీగా పర్వతగిరి–ఒకరు, సంగెంలో ఇద్దరు సుబేదారిలో ఒకరు, హనుమకొండలో ఇద్దరు, నర్సంపేటలో ఒకరు, కాజీపేటలో ఒకరు, నర్మెట్టలో ఒకరు ఉన్నట్లు వివరించారు. నిందితులు భవిష్యత్లో ఎలాంటి సైబర్ నేరాలకు పాల్పడవద్దని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వీరు చట్టబద్ధంగా జీవిస్తున్నట్లు తెలిపారు. సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద ఆన్లైన్ కార్యకలాపాలు, మోసాలను గమనించిన వెంటనే సమీప పోలీస్స్టేషన్, సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ ప్లాట్ఫామ్కు సమాచారం ఇవ్వాలని సీపీ సన్ప్రీత్సింగ్ సూచించారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య(సీడీఓఈ/ఎస్డీఎల్సీఈ) డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ (2023–24 బ్యాచ్) పరీక్షలు మే 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొపెసర్ కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. మే 7, 11, 13, 15, 18, 20 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. విద్యారణ్యపురి: రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ వేసవి శిక్షణ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్వీ గిరిరాజ్గౌడ్ శనివారం ఒక ప్రకటనలో కోరా రు. దరఖాస్తులు ఈనెల 29వ తేదీ వరకు స్వీకరిస్తారని పేర్కొన్నారు. శిక్షణ పొందాలనుకునేవారు 2025 జూలై1 వరకు 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు ఉండాలని తెలిపారు. టెన్త్ పరీక్ష ఉత్తీర్ణత, సంబంధిత టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కోర్సులో లోయర్ గ్రేడ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలని సూచించారు. దరఖాస్తులు హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని కోరారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.తెలంగాణ.గౌ ట్.ఇన్ వెబ్సైట్లో చూడాలని సూచించారు. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు మే1 నుంచి జూన్ 11 వరకు 42 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు ఇన్స్పెక్టర్ల బదిలీ.. ఖిలా వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న బొల్లం రమేశ్ శనివారం కరీంనగర్ కమిషనరేట్ పరిధి తిమ్మాపూర్ సర్కిల్కు బదిలీ అయ్యారు. ఈమేరకు మల్టీజోన్–1 ఐజీ ఎస్.చంద్రశేఖర్రెడ్డి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తిమ్మాపూర్ సర్కిల్లో పనిచేస్తున్న గడ్డం సదన్కుమార్ను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శాయంపేట సీఐ..శాయంపేట: శాయంపేట మండలంలో రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్న సీఐ రంజిత్రావు బదిలీల ప్రక్రియలో భాగంగా రామగుండం కమిషనరేట్ పరిధి సుల్తానాబాద్కు బదిలీ అయ్యారు. నేర పరిశోధనలో సీఐ రంజిత్రావు చాకచక్యంగా వ్యవహరించారని ఎస్సై జక్కుల పరమేశ్ అన్నారు. విజయ డెయిరీ వరంగల్ డీడీ శ్రవణ్..హన్మకొండ చౌరస్తా: విజయ డెయిరీ వరంగల్ మిల్క్ షెడ్ డిప్యూటీ డైరెక్టర్ కె.శ్రవణ్కుమార్ను బదిలీ చేస్తూ తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.చంద్రశేఖర్రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో మార్కెటింగ్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న జి.ధన్రాజ్కు వరంగల్ డీడీగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
తల్లడిల్లిన తల్లి ఆవు
● ప్లాస్టిక్ వ్యర్థాలు తినడంతో రెండు గంటలు నరకయాతన హనుమకొండ బస్టాండ్ సమీపంలో ఓ సూడి ఆవు రెండు గంటలు నరకయాతన పడింది. ఆ బాధ చూడలేక ఓ సెక్యూరిటీ గార్డు డయల్ 100కు ఫోన్ చేశాడు. సలహా ఇచ్చారే కానీ, ఎవరూ స్పందించలేదు. చివరికి తెలిసిన వారి నుంచి మడికొండ వెటర్నరీ అసిస్టెంట్ రమేశ్కు సమాచారం ఇవ్వగా.. ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల అజీర్తితో బాధపడుతున్నట్లు గు ర్తించి వైద్యం అందించాడు. కాగా, ఏప్రిల్ 25న పశు వైద్యుల దినోత్సవం.. హనుమకొండ పరిధి పశు వైద్యులకు ఫోన్ చేసినా స్పందించలేదని పలువురు వాహనదారులు చెప్పడం గమనార్హం. – హన్మకొండ చౌరస్తా -
పనైతే కానీ!
హనుకొండ హంటర్ రోడ్డులో ఓ డివిజన్లో ఆరు నెలల క్రితం రూ.15 లక్షల డ్రెయినేజీ పనిని కాంట్రాక్టర్ ప్రారంభించాడు. స్థానిక కార్పొరేటర్ రూ.60 వేలు కమీషన్ అడిగాడు. కాంట్రాక్టర్ రూ.30 వేలు ఇస్తానన్నాడు. కార్పొరేటర్ పనులు అడ్డుకోవడంతో ఆగిపోయింది. కమీషన్ ఎంతిచ్చినా పర్లేదు పని పూర్తి చేయాలని కార్పొరేటర్ ఒత్తిడి పెంచాడు. కార్పొరేటర్ల పదవీ కాలం సమీపిస్తుండడంతో కమీషన్ ఎంతిచ్చినా ఫర్లేదు పని త్వరగా పూర్తి కావాలంటున్నట్లుగా తెలుస్తోంది.డివిజన్లలో అనుమతి లేని భవన నిర్మాణాలు, అదనపు కట్టడాలు, కొత్త ఇంటి నంబర్లు, వివాదాస్పద స్థలాలు, చివరికి రోడ్లకు ఇరువైపులా ఉన్న చిరువ్యాపారులను కూడా కార్పొరేటర్లు వదలట్లేదనే విమర్శలొస్తున్నాయి. పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసిన వారు ప్ర స్తుతం ఎంతకొంతివ్వాలని, వసూళ్లకు ఆయా విభాగాల అధికారులను, సిబ్బందిని, అనుచరులను రంగంలోకి దింపినట్లు సమాచారం. -
విద్యార్థుల్లో నైపుణ్యం పెంపు
ఆటాపాటల మేళవింపు..న్యూశాయంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ ఇప్పుడు మైనార్టీ గురుకులాల్లో కొత్త కాంతులు నింపుతోంది. కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, క్రీడా పటిమను వెలికి తీసేందుకు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టెమ్రిస్) నడుం బిగించింది. వేసవి సెలవులు, ప్రత్యేక విరామ సమయాలను వృథా చేయకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక క్రీడా సాంస్కృతిక శిబిరాలు (సమ్మర్ స్పెషల్ క్యాంపులు) విద్యార్థుల భవిష్యత్కు బలమైన పునాదులు వేస్తున్నాయి. శిక్షణ శిబిరాల ప్రధాన ఉద్దేశం.. శిక్షణ శిబిరాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచి వారిలోని ప్రత్యేక ప్రతిభను గుర్తించి నైపుణ్య వికా సానికి తోడ్పతాయి. క్రీడలతో క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే తత్వం అలవాటు పడుతుంది. సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగవుతాయి. విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా మైదానాల్లో చెమట చిందించి, వేదికలపై తమ కళను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. చదువుతో పాటు ఆటాపాటల్లోనూ మేటి అని నిరూపించేందుకు వేదికలు గొప్ప అవకాశాలుగా మారుతాయి. వసతులు–క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ శిక్షణ శిబిరాల్లో పాల్గొనే విద్యార్థులకు ప్రభుత్వం పౌష్టికాహారంతోపాటు ప్రత్యేక స్పోర్ట్స్ కిట్స్ అంది స్తుంది. ఎంపిక చేసిన రెండు కేంద్రాల్లో ఉదయం, సాయంత్రం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రొఫెషనల్ కోచ్లు, విషయ నిపుణులు క్షేత్ర స్థాయిలో శిక్షణ అందిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు శిబిరాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కలెక్టర్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి, రీజినల్ లెవల్ కో–ఆర్డినేటర్, విజిలెన్స్ అధికారులు స్వయంగా క్యాంపులను సందర్శించి విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతులు, శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఒకే చోట చేరడం వల్ల వారిలో స్నేహ, సోదరభావం, ఐక్యత నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు.టెమ్రిస్ ఆధ్వర్యంలో సమ్మర్ స్పెషల్ క్యాంపులు క్రీడలు, సాంస్కృతిక తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహణ ఉత్సాహంగా పాల్గొంటున్న ఉమ్మడి జిల్లాలోని 16 గురుకులాల విద్యార్థులురెండు గురుకులాల్లో సమ్మర్ ప్రత్యేక క్యాంపులుఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 16 గురుకుల పాఠశాలల నుంచి 5 నుంచి 8వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న 200 మంది బాలికలు, 200 మంది బాలురను ఎంపిక చేసి మొత్తం 400 మంది బాలబాలికలకు ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు 13 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. వరంగల్ జిల్లా పరిధిలోని రంగశాయిపేట శివారు జక్కలొద్ది వరంగల్(బీ1)లో 200 మంది బాలురకు, వరంగల్(జీ2) శంభునిపేట బాలికల గురుకులంలో మరో 200 మంది బాలికలకు భోజన, వసతులు కల్పించారు. వీరందరికీ క్రీడలు, సాంస్కృతిక అంశాల్లో శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులకు నిపుణులైన కోచ్ల పర్యవేక్షణలో అథ్లెటిక్స్, ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిట్, హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్, ఫుట్బాల్, క్రికెట్, కబడ్డీ, కరాటే, చెస్, కుంగ్ ఫూ, మార్షల్ ఆర్ట్స్తో పాటు మోటివేషన్ క్లాస్లు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి శిక్షణ అందిస్తున్నారు. శిక్షణలో ఎంపికై న విద్యార్థులను రాబోయే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేయాలనే ప్రధాన ఉద్దేశంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. క్రీడలు, కళలు, విద్యను అనుసంధానిస్తూ ప్రభుత్వం చేపట్టిన ఈ చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.సమ్మర్ క్యాంపులు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపుతాయి సమ్మర్ క్యాంపులు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికితీయగానికి ఉపయోగపడుతాయి. క్రీడలు, కళలు, విద్యను అనుసందానిస్తూ ప్రభుత్వ చేపట్టిన చొరవ హర్షణీయం. క్రీడలతో విద్యార్థుల్లో శారీరక దృఢత్వం పెరుగుతుంది. విరామ సమయం వృథా చేయకుండా వేసవి సెలవుల్లో నైపుణ్యాలను నేర్చుకుంటారు. – మహ్మద్ హబీబుద్దీన్, క్రీడాభిమాని, రిటైర్ట్ లేబర్ ఆఫీసర్ -
మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి
● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రాయపర్తి: గన్నీ సంచులతో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సంచుల కొరత సమస్య పరిష్కరించి వర్షం రాకముందే కాంటాలు పెట్టి అన్నదాతలను ఆదుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. మొక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు రైతులు శనివారం మండల కేంద్రంలోని వరంగల్, ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని మాట్లాడారు. గన్నీ సంచుల కొరతతో మొక్కజొన్న రైతులు ఆగమవుతున్నారని, వెంటనే సమస్య పరిష్కరించి కొనుగోళ్లు చేపట్టాలన్నారు. అనంతరం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. తాము వస్తున్నామని కాంటాలను మొదలు పెట్టడం ఏంటని, త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ సత్యశారద, డీఎంతో ఫోన్లో మాట్లాడారు. వర్షం వస్తే ప్రభుత్వానిదే బాధ్యతని, తడిసిన ప్రతీ మొక్కజొన్న గింజను కొనుగోలు చేయాలన్నారు. లేని పక్షంలో ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మూనావత్ నర్సింహానాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, గారె నర్సయ్య, ఐత రాంచందర్, రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘అక్షర కురుక్షేత్రాన్ని’ సమాజంలోకి తీసుకెళ్లాలి
కాశిబుగ్గ: అక్షర కురుక్షేత్రాలాంటి గ్రంథాలను సమాజంలోకి తీసుకెళ్లాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు అన్నారు. శనివా రం భండారు రమాదేవి, చంద్రమౌళీశ్వర్రావు మె మోరియల్ ట్రస్ట్ వరంగల్ ఆధ్వర్యంలో డాక్టర్ భండారు ఉమామహేశ్వర్రావు రచించిన సమగ్ర వచ న ఆంధ్ర మహాభారతంలోని ఆది, సభా, విరాట, ఉద్యోగ పర్వచతుష్టయ గ్రంథావిష్కరణ మహోత్సవం వరంగల్లోని ఐఎంఏ హాల్లో నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ రాజేశ్వర్రా వు మాట్లాడుతూ డాక్టర్ ఉమామహేశ్వర్రావు చి ల్డ్రన్స్ స్పెషలిస్టుగా విధులు నిర్వర్తిస్తూ, మరోవైపు సమాజంలో మార్పు కోసం గ్రంథాలు రచించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం మహాభారతంలోని నాలుగు గ్రంథాలను ఆవిష్కరించి ముందుకు తీసుకెళ్లడం ప్రశంసనీయమన్నారు. వనం లక్ష్మీకాంతారావు సంయోజకత్వంలో సాగిన సభలో డాక్టర్ ఉమామహేశ్వర్రావు ప్రతిష్టాత్మకంగా రచించిన ఆంధ్రభారత వచన కావ్య పర్వాలు, ఆది, సభా, విరాట ఉద్యోగ పర్వాలను ప్రముఖ పండితలు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా డాక్టర్ దహగాం సాంబమూర్తి ఆదిపర్వాన్ని, డాక్టర్ కసిరెడ్డి వెంకట్రెడ్డి సభా ప ర్వాన్ని, గిరిజా మనోహనాబాబు విరాటపర్వం, డాక్టర్ ఎన్వీఎన్ చారి ఉద్యోగ పర్వాన్ని సమీక్షించారు. కవులు ఎస్వీఎన్ శర్మ, డాక్టర్ ఎల్ఎస్ఆర్కె ప్రసాద్, పొట్లపల్లి శ్రీనివాస్, వాసిరెడ్డి కృష్ణారావు, వీఆర్ విద్యార్థి, సీహెచ్ శివరావు, వై.నాగయ్య, మో త్కూరు మనోహరారావు, వాణి ప్రసాద్, అవధాని చేపూరి శ్రీరామ్, అనిల్ ప్రసాద్, కంది శంకరయ్య, జేఎన్ శర్మ, మండువ రామగోపాల్రావు, మండువ రవీందర్రావు, వెలుగు ప్రభాకర్ పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వర్రావు -
ఎంవీఎంఆర్ విశిష్ట ప్రతిభా పురస్కారాల ప్రదానం
హన్మకొండ: వివిధ రంగాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రముఖులకు ఎంవీఎంఆర్ ఫౌండేషన్ స్మారక విశిష్ట ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. శనివారం రాత్రి హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో ఈ ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్యెల్యే గుమ్మడి నర్సయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఫౌండేషన్ లోగో ఆవిష్కరించారు. విద్య, వైద్యం, కళలు, వ్యవసాయం, క్రీడా రంగంలో రాణిస్తున్న వారికి అవార్డులు ప్రదానం చేశారు. అందుకున్న వారిలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ప్రముఖ సాహితీవేత్త అంపశయ్య నవీన్, చెప్యాల మనోహర్ రావు, సంఘ సేవకురాలు కరుకాల అనితా రెడ్డి, విద్యావేత్త ప్రొఫెసర్ తెన్నీటి విజయచంద్ర, ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ సంధ్యారాణి, ఫోరం బెటర్ వరంగల్, ప్రముఖ వ్యాసకర్త పుల్లూరు సుధాకర్, కవి, గాయకుడు వరంగల్ శ్రీనివాస్, ప్రముఖ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు, కోచ్ ఎస్.అప్పారావు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంవీఎంఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఏసీపీ ఎం.జితేందర్రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి, సోదరుడి స్మారకంగా ఈ ఫౌండేషన్ను 2024లో స్థాపించినట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ టి.యాదగిరిరావు, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ ఘంటా సంజీవరెడ్డి, మామునూరు ఏసీపీ ఎన్.వెంకటేష్, కిట్స్ పీఈడీ పి.రమేష్ రెడ్డి పాల్గొన్నారు. -
దసుముడి కవితా సంకలనం ఆవిష్కరణ
హన్మకొండ: ఓరుగల్లు పోరాట వారసత్వాన్ని కవిత్వం రూపంలో వనపాక దిలీప్ రాస్తున్నారని ప్రముఖ సినీ గేయ రచయిత, నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ అన్నారు. శనివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని మాస్టర్జీ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో దిలీప్ రాసిన దసుముడి కవిత సంకలనాన్ని మానవ హక్కుల వేది ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యురాలు, సీనియర్ జర్నలిస్ట్ వేమన వసంత లక్ష్మి ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ బాలగోపాల్ వారసత్వాన్ని, ఆలోచనలు నింపుకున్న దిలీప్ ఈ తరం యువతకు ఆదర్శం అన్నారు. వేమన వసంత లక్ష్మి మాట్లాడుతూ దిలీప్ ఆలోచనలు భావస్పోరకం అన్నారు. ప్రధాన వక్త యాకూబ్ మాట్లాడుతూ.. సంకలనంలోని వివిధ కవితల్లో అతి ముఖ్యమైన పద బంధాలను వివరించారు. కవి తగుళ్ల గోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ‘కుడా’ మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజు యాదవ్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య, ఉపాధ్యక్షులు బాదావత్ రాజు, ప్రముఖ నవలా రచయిత పి.చందు, డాక్టర్ చంద్రబాను, యువకులు కళాకారులు, రచయిత వనపాక దిలీప్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
కేంద్రం నూతన చట్టాలను సవరించాలి
● ఆలిండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సత్యనారాయణకేయూ క్యాంపస్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని ఆలిండియా లాయర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె. సత్యనారాయణ అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కేయూలోని కెమిస్ట్రీ విభాగం సెమినార్హాల్లో శనివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ‘లా’ విద్యార్థుల కన్వెన్షన్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందని, దీనిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాదులుగా సమాజంలో ఏ విధంగా తమ బాధ్యతలు నిర్వర్తించాలనే అంశంపై కూడా వివరించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు మాట్లాడుతూ ప్రైవేట్ ‘లా’ కళాశాలల్లో అధిక ఫీజులు నియంత్రించాలన్నారు. ప్రభుత్వ ‘లా’ కళాశాలల్లో మిగిలిపోతున్న సీట్లను కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అఽధ్యక్షుడు దామెర కిరణ్, రాష్ట్ర ‘లా’ కన్వీనర్ విఘ్నేష్, కోకన్వీనర్ రమ్య, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు స్టాలిన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ , కేయూ కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్కుమార్లోథ్ మాట్లాడారు. బాధ్యులు సహన, సంజన, భరత్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ‘లా’ విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ బాధ్యులు క్యాంపస్లోని గెస్ట్హౌస్ నుంచి కెమిస్ట్రీ విభాగం వరకు ర్యాలీ నిర్వహించారు.వడదెబ్బతో మహిళా కూలీ మృతి గీసుకొండ: వడదెబ్బతో వరంగల్ జిల్లా గీసుకొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఎండీ యాకూబీ(65) మృతి చెందింది. యాకూబీ శుక్రవారం గ్రామంలో మిరప తొడిమెలు ఏరడానికి వెళ్లి అస్వస్థతకు గురై ఇంటికి వెళ్లింది. శనివారం ఉదయం విరేచనాలు అయ్యి నీరసించింది. దీంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిందని గ్రామస్తులు, మృతురాలు బంధువులు తెలిపారు. కాగా, సర్పంచ్ రడం భరత్ ఆధ్వర్యంలో గ్రామస్తులు మృతురాలి కుటుంబానికి రూ. 10 వేల సాయం అందించారు. మర్రిపల్లిగూడెంలో వృద్ధుడు.. కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండంలం మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన సాదుల నరహరి (65) వడదెబ్బతో మృతి చెందాడు. నరహరి గత శుక్రవారం మోదుగ ఆకుల (విస్తరి ఆకులు) సేకరణ కోసం గ్రామ శివారులోకి వెళ్లి వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. శనివారం మరోసారి అస్వస్థతకు గురి కావడంతో కుటుంబీకుల సమాచారం మేరకు 108 సిబ్బంది వచ్చి పరీక్షించగా అప్పటికే మృతి చెందాడని గ్రామస్తులు, బంధువులు తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. -
ఐక్యత విజయాన్ని చేకూరుస్తుంది
హన్మకొండ: ఐక్యత బలం, భరోసా, విజయాన్ని అందిస్తుందని ఆర్టీసీ జేఏసీ వరంగల్ రీజియన్ చైర్మన్ శ్రీనివాస్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్.రాంచందర్ అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా బస్ స్టేషన్లో వరంగల్ రీజియన్ ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికులంతా ఐక్యంగా పోరాడితేనే ప్రభుత్వం దిగివచ్చి చర్చలు జరిపిందన్నారు. ఆర్టీసీలో ఐక్య ఉద్యమాలు, పోరాటాలు చేసి డిమాండ్లు సాధించుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. ఈ ఉద్యమంలో అసువులు బాసిన అమరుడు డ్రైవర్ కోలా శంకర్ గౌడ్కు ఎస్డబ్ల్యూఎఫ్ నివాళులర్పిస్తుందన్నారు. వారి కుటుంబానికి జిల్లా జేఏసీ అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నామన్నారు. యాజమాన్యం నుంచి అందాల్సిన ప్రయోజనాలు కుటుంబానికి అందించేందుకు జేఏసీ కృషి చేస్తుందని తెలిపారు. కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా, ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు రూ.5 లక్షలు, ఇందిరమ్మ ఇల్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి సహకరించి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. జేఏసీ నాయకులు శ్రీనివాస్, బీయూ.చారి, సీహెచ్.యాక స్వామి, డీకే రెడ్డి. ఈఎస్.బాబు, యూఆర్.కృష్ణ, రంజిత్, మహేందర్, వెంకటేశ్వర్లు, కేఎస్ రెడ్డి, శోభన్బాబు, బాబు నాయక్, రమేశ్, కార్మికులు పాల్గొన్నారు. ఆర్టీసీ జేఏసీ వరంగల్ రీజియన్ చైర్మన్ శ్రీనివాస్ -
అన్నదాత కష్టం అగ్గిపాలు
బయ్యారం: పంటచేనుల మధ్య ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను బుగ్గిపాలు చేశాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పండించిన పంట చేతికి వచ్చిన సమయంలో కళ్లెదుటే కాలిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యా రు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా బ య్యారం మండలం కొత్తగూడెం సమీపంలోని ధరావత్ హరిలాల్ మొక్కజొన్న చేనులో శ నివారం వ్యాపించిన మంటలు నిమిషాల్లోనే సమీ పంలోని చేనులకు వ్యాపించాయి. ఈ మంటలు సు మారు వంద ఎకరాల్లోని పంటభూములకు వ్యాపించగా ఇందులో 30 ఎకరాల్లో విరిచి కుప్పలుగా పోసిన కంకులు కాలిపోయాయి. అదేవిధంగా మంటలు వ్యాపించిన భూముల్లో ఉన్న 40 బోర్లతో పాటు పై పులు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ. 30 లక్షల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. కొత్తగూడెం గ్రామాన్ని చుట్టుముట్టిన మంటలు.. మొక్కజొన్న సొప్పతోపాటు కంకులకు అంటుకున్న మంటలు గ్రామాన్ని చుట్టుముట్టాయి. దీంతో స్థానికులతో పాటు ఘటనాస్థలికి చేరుకున్న గార్ల–బయ్యారం సీఐ రవీందర్ మహబూబాబాద్ అగ్నిమాపక సిబ్బంది సహకారంతో గ్రామానికి మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. నిమిషాల్లోనే మంటలు వేగంగా వ్యాపించడంతో కొత్తగూడెం, లింగగిరి గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పెద్దకోమటిపల్లి–గణేశ్పల్లి గ్రామ శివారులో.. మొగుళ్లపల్లి: షార్ట్ సర్క్యూట్తో 30 ఎకరాల మొక్క జొన్న పంట కాలిపోయింది. ఈ ఘటన శనివారం మొగుళ్లపల్లి మండలం పెద్దకోమటిపల్లి–గణేశ్పల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథ నం ప్రకారం.. ట్రాన్స్ఫార్మర్ నుంచి వెలువడిన మంటలతో పక్కనే ఉన్న మొక్క జొన్న పంటకు నిప్పు అంటుకుంది. దీంతో దాదాపు 30 ఎకరాల్లో పంట అగ్నికి ఆహుతైంది. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తమ ను ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు. ఆర్ఐ శివరామకృష్ణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ల నుంచి చెలరేగిన మంటలు పలుచోట్ల అగ్నికి ఆహుతైన మొక్కజొన్న పంట కొత్తగూడెంలో 30 ఎకరాలు, 40 బోర్లు, పైపులు దగ్ధం పెద్దకోమటిపల్లి–గణేశ్పల్లి శివారులో 30 ఎకరాలు లక్షలాది రూపాయల నష్టం కన్నీరుమున్నీరవుతున్న రైతులు -
భూసమస్యల పరిష్కారానికి ‘భూ భారతి’
మహబూబాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో రైతాంగ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని భూ భారతి చట్ట రూపకర్త, రాష్ట్ర రైతు, వ్యవసాయ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ కుమార్ అన్నారు. భూమి చట్టాలు, భూ రికార్డులు, భూ భారతి చట్టంపై మ హబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ హాల్లో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మా ట్లాడారు. ప్రతీ రైతు తప్పనిసరిగా భూ సర్వే చేయించుకోవాలని, పాస్ పుస్తకాలు కలిగి ఉండాలని, ఆ పుస్తకాల్లో తప్పులు ఉంటే వెంటనే సరి దిద్దుకోవాలని సూచించారు. త్వరలో భూమికి భూ ఆధార్, భూయజమానులకు భూఆధార్ కార్డులు రానున్నాయని, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్లలో మార్పులు రానున్నాయన్నారు. రాష్ట్రంలోని 5 మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా భూ భారతి చట్టం పనులు ప్రారంభించారని తెలిపారు. సీనియర్ సివిల్ జడ్జి శాలిని షాకెల్లి, జూనియర్ సివి ల్ జడ్జి స్వాతి మురారి, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మామిడాల సత్యనారాయణ, జంగం సిద్ధార్థ, న్యాయవాదులు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర రైతు, వ్యవసాయ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ కుమార్ -
ప్లేస్మెంట్లో ‘ఎస్సార్’ అగ్రస్థానం
● చాన్స్లర్ ఎ. వరదారెడ్డిహసన్పర్తి : ప్లేస్మెంట్లో ఎస్సార్ యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉందని ఆ యూనివర్సిటీ చాన్స్లర్ ఎ. వరదారెడ్డి అన్నారు. శనివారం ఎస్సార్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్–2026 సక్సెస్ మీట్ నిర్వహించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చాన్స్లర్ ఎ.వరదారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, కృషి, సరైన మార్గదర్శకం విద్యార్థులు సాధించిన విజయాలకు ఫలితమని పేర్కొన్నారు. విద్యార్థులు తమ నైపుణ్యాలు నిరంతరం వృద్ధి చేసుకుంటూ కొత్త సాంకేతికతను ఆచరణలో పెట్టి పరిశ్రమ అవసరాలకనుగుణంగా సిద్ధంగా ఉంచాలన్నారు. ఈఏడాది 1,300 మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించినట్లు చెప్పారు. కొన్ని కంపెనీల్లో నియామక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఈసంఖ్య మరింత పెరుగుతోందని వివరించారు. అదనంగా 1,500మంది విద్యార్థులు ఇంటర్న్షిప్ అవకాశాలు సాధించారని తెలిపారు. కళాశాల వైస్ చాన్స్లర్ దీపక్ గార్గ్ మాట్లాడుతూ విద్యార్థులు సమస్య పరిష్కార నైపుణ్యాలు, విశ్లేషణాత్మక ఆలోచన, ప్రొఫెషనల్ విలువలను పెంపొందించుకోవాలన్నారు. గ్లోబల్ స్థాయిలో పోటీ పడేందుకు అవసరమైన నైపుణ్యాలపై దృష్టి సారించాలన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డీన్ డాక్టర్ అర్చనారెడ్డి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ సునీల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రి రాకతో వేడెక్కిన ముత్తోజిపేట
కేంద్ర హోంశాఖ సహాయ శాఖమంత్రి బండి సంజయ్ మధ్యాహ్నం ఒంటిగంటకు ముత్తోజిపేటకు చేరుకుని శంకర్గౌడ్ మృతదేహానికి నివాళులర్పించారు. అనంత రం శంకర్ భార్య లత, కుమారుడు హేమంత్, కూతురు, అల్లుడిని పరామర్శించారు. తనవంతు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. శంకర్ మృతదేహా న్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులర్పించిన తర్వాత ముత్తోజిపేటకు తీసుకొస్తామని బతిమిలాడినా పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు, కార్మికులు మంత్రికి విన్నవించారు. వెంటనే ఆయన పోలీసులతో మాట్లాడారు. డిపో వద్దకు మృతదేహాన్ని తరలించాలని కార్యకర్తలకు సంజయ్ సూచించడంతో ఫ్రీజర్లో ఉన్న శంకర్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తోపులాటలో ఫ్రీజ ర్ బాక్స్పైన గ్లాస్ మూత పగిలిపోయింది. ఫ్రీజర్బాక్స్ను సుమారు 500 నుంచి 600 మీటర్ల దూరం వరకు కార్యకర్తలు ఒక్కసారిగా లాక్కొని రావడంతో ఒక్కసారిగా ముత్తోజిపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అనుమతించని పోలీసులు.. మృతదేహాన్ని తీసుకెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బీజేపీ కార్యకర్తలు పక్కకు తోసేశారు. సుమారు గంటపాటు మృతదేహం ఎండలోనే ఉండిపోయింది. డిపో వద్ద ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటామని బండి సంజయ్ హామీ ఇచ్చినా పోలీసులు అనుమతివ్వలేదు. ఒక అంబులెన్స్ తీసుకొచ్చి మృతదేహాన్ని ఎక్కించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సీపీ సన్ప్రీత్ సింగ్ వచ్చి కేంద్ర మంత్రి బండి సంజయ్కి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మంత్రి కారు దిగి పక్కనే ఉ న్న ఇంటి రేకుల కిందకు వెళ్లిపోయారు. వెంటనే పోలీసులు మృతదేహం, కుటుంబ సభ్యులను ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఉత్కంఠ మధ్యాహ్నం 3.40 గంటల వరకు కొనసాగింది. పోలీసులు నచ్చజెప్పడంతో బండి సంజయ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, కొండేటి శ్రీధర్, నాయకులు రావు పద్మ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సాయంత్రం 6 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కాగా.. 7.30 గంటలకు అంత్యక్రియలు ముగిశాయి. కాగా, శంకర్ గౌడ్ భార్య లత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
లెక్కాపత్రం లేకపోతే ఎలా?
వరంగల్ అర్బన్: హనుమకొండ ప్రాంతంలోని పలు డివిజన్ల నుంచి వెలువడుతున్న తడి, పొడి చెత్త సేకరణలో లెక్కాపత్రం లేకపోతే ఎలా? అంటూ మేయర్ గుండు సుధారాణి అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సెకండ్ వెహికిల్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా మేయర్ తడి, పొడి చెత్త సేకరణకు సంబంధించిన రిజిస్టర్ను పరిశీలించారు. నగరంలో తడి, చెత్త సేకరణ పరిమాణాన్ని పెంచేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శుభ్రతకు ప్రాధాన్యమిస్తూ.. చెత్త వర్గీకరణను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. తడి చెత్తను వేరు చేసి సేకరించే ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని కోరారు. పనితీరు మార్చుకోవాలని సిబ్బందిని హెచ్చరించారు. మేయర్ గుండు సుధారాణి బాలసముద్రం సెకెండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ తనిఖీ -
ప్రైవేట్ వాహనాల దోపిడీ
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు శుక్రవారం ఉధృతంగా సాగింది. వరంగల్ రీజియన్ వ్యాప్తంగా 8 డిపోల పరిఽధి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నర్సంపేట డిపో డ్రైవర్ కోలా శంకర్గౌడ్ ఆత్మహత్య చేసుకోగా.. ఆర్టీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. దీంతో విద్యుత్ బస్సులతో పాటు ప్రైవేట్ అద్దె బస్సులు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. శంకర్గౌడ్ మృతి నేపథ్యంలో బస్సులు నడిపితే కార్మికులను రెచ్చగొట్టినట్లవుతుందని, బస్సులకు నష్టం చేకూరే అవకాశం ఉంటుందని భావించిన ఆర్టీసీ అధికారులు వరంగల్ రీజియన్ వ్యాప్తంగా సంస్థ బస్సులతో పాటు విద్యుత్, ప్రైవేట్ అద్దె బస్సులను నిలిపేశారు. దీంతో బస్సులు నడుస్తాయని హనుమకొండ జిల్లా బస్స్టేషన్కు వచ్చిన ప్రయాణికులు గంటల కొద్ది నిరీక్షించి కొందరు తిరిగి ఇళ్లకు వెళ్లగా, మరికొందరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. అమాంతం డబుల్.. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బస్సులు నిలిచిపోవడంతో ప్రైవేట్ వాహనదారులు రెచ్చిపోయారు. అధిక చార్జీల పేరిట ప్రయాణికుల నుంచి వసూలు చేశారు. విచ్చలవిడిగా వసూళ్లతో ప్రయాణికులను జేబులకు చిల్లు పెట్టారు. ఆటోవాలాలు సైతం పొరుగు నగరాల వరకు ప్రయాణికులను చేరవేరంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హనుమకొండ నుంచి జగిత్యాల వరకు ఆటోలో ప్రయాణికులను చేరవేర్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రయాణికులు కూడా తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు అందుబాటులో ఉన్న ప్రయాణ వనరుల్ని వినియోగించుకుంటున్నారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోయారు. సమ్మె జరిగిన బుధ, గురువారాల్లో స్వల్పంగా బస్సులు నడిచాయి. బంద్ నేపథ్యంలో శుక్రవారం బస్సులు పూర్తిగా నిలిపేయడంతో ప్రైవేట్ వాహనదారుల పంట పండింది. హనుమకొండ నుంచి హైదరాబాద్కు రూ.350 తీసుకునే ప్రైవేట్ కార్లు రూ.500 వరకు వసూలు చేశారు. హనుమకొండ నుంచి ఏటూరునాగారానికి ఎక్స్ప్రెస్కు రూ.180, మంగపేటకు రూ.200 కాగా, ప్రైవేట్ వాహనదారులు రూ.400 వసూలు చేసినట్లు ప్రయాణికులు తెలిపారు. అధిక చార్జీలు వసూలు చేస్తుండడంతో ఉచిత ప్రయాణం చేద్దామని వచ్చిన మహిళా ప్రయాణికులు ఖంగుతిన్నారు. కొన్ని రూట్లలో ప్రైవేట్ వాహనాలు సైతం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు.రెట్టింపు చార్జీలు వసూలు ప్రయాణికుల జేబులకు చిల్లు మూడోరోజు కొనసాగిన ఆర్టీసీ సమ్మె కదలని ప్రగతి రథ చక్రాలు.. డిపోల వద్ద కార్మికుల ధర్నా -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీలు
వరంగల్ లీగల్: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జూనియర్ సివిల్ జడ్జిల బదిలీల్లో భాగంగా హనుమకొండ జిల్లాకు చెందిన ముగ్గురు జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (విజిలెన్స్) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి (పీజీఎం) ఎన్.శాంతి సోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేస్తూ ఈ స్థానానికి రంగా రెడ్డి జిల్లా కూకట్పల్లి మొదటి అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ప్రతీక్సిహగ్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్.శ్రావణస్వాతిని రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లోని మొదటి జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేసి ఆమె స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా పనిచేస్తున్న తాడూరి మహతివైష్ణవిని నియమించారు. హనుమకొండ మూడం మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి సిరిసల్లా ప్రియాంకను రంగారెడ్డి జిల్లా హయత్నగర్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి (పీడీఎం)గా బదిలీ చేసి, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పీసీఆర్ కోర్టు జడ్జి శ్రద్ధాసేహగల్ను నియమిస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన జడ్జిలు ఈనెల 27 వరకు తమ ప్రస్తుత స్థానాల నుంచి రిలీవ్ కావాలని, మే 2 వరకు బదిలీ అయిన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈనెల 24, 25 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీబీఏ, బీఎస్సీ వివిధ సెమిస్టర్ల పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శుక్రవారం తెలిపారు. ఆర్టీసీ బస్సుల బంద్ నేపథ్యంలో ఈరెండు రోజుల పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు. ఈనెల 27 నుంచి టైంటేబుల్ ప్రకారం యథావిధిగా ఆయా పరీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈనెల 24, 25న వాయిదా పడిన పరీక్షల తేదీలు తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. రిజిస్ట్రార్కు ఏబీవీపీ వినతి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఏబీవీపీ కేయూ కార్యదర్శి మేకల జ్ఞానేశ్వర్, బాధ్యులు మెరుగు సాయి, అఖిల్, రజనీకాంత్, ప్రణయ్ శుక్రవారం ఉదయం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంకు వినతిపత్రం అందించారు. విద్యారణ్యపురి: రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లింపుల విషయంలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని అమలు చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ రాష్ట్ర కో–కన్వీనర్ ధర్మేంద్ర, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండలోని పీఆర్టీయూ భవన్లో నిర్వహించిన ఆసాధన కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ.. వంద రోజుల్లో రెవెన్యూ రీసోర్సెస్ మొబిలైజేషన్ కమిటీ ద్వారా నిధులు సమకూర్చుకుని ఇచ్చిన గడువులోగా చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ రాక మానసికంగా కుంగిపోయి అనారోగ్యంతో ఇప్పటి వరకు 91 మంది మరణించారన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. సమావేశంలో ఆకమిటీ సహ కార్యదర్శి మేకరి దామోదర్, ఇంద్రసేనారెడ్డి, విశ్వనాథం, బత్తిని సారయ్య, శ్యామ్, క్షీర సాగర తదితరులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని శుక్రవారం డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జేఎన్ స్టేడియంలో అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, హ్యాండ్బాల్, క్రికెట్, కబడ్డీ, లాన్టెన్నిస్, వాలీబాల్, ఖోఖో, బాక్సింగ్ క్రీడాంశాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు https://satgasc.telangana.gov.in వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు జేఎన్ఎస్లోని డీవైఎస్ఓ కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. -
నైపుణ్యాభివృద్ధితో ఉపాధి అవకాశాలు
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: నైపుణ్యాభివృద్థితో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఐదో రోజు శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నైపుణ్యాభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే ఉపాధి అవకాశాలు సులభంగా పొందవచ్చని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువత నైపుణ్య అవకాశాలు పెంపొందించుకునే విధానాన్ని సీనియర్ ప్రొఫెసర్ నవీన్ వివరించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నుంచి గణేష్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రతినిధి మురళి వేస్ట్ మెటీరియల్ నుంచి విలువైన మెటీరియల్ ఎలా తయారు చేయాలో వివరించారు. అనంతరం యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో మే 8న నిర్వహించనున్న జాబ్మేళా పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. సదస్సులో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీబీసీడీఓ పుష్పలత, సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
శంకర్గౌడ్కు కొవ్వొత్తులతో నివాళి
హన్మకొండ: ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. శుక్రవారం రాత్రి టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ వరంగల్ రీజియన్ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు ఆర్టీసీ కార్మికులు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద కొలా శంకర్గౌడ్కు నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆర్టీసీ జేఏసీ వరంగల్ రీజియన్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే కోలా శంకర్గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చేస్తున్న కాలయాపనతోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం డిమాండ్లు నెరవేర్చాలన్నారు. సత్తయ్య, వీకే.స్వామి, బట్టు స్వామి, రమేశ్, రంజిత్, మురళి, రంగు శ్రీధర్, మహిళా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ఎంపీ కడియం కావ్యకు సన్మానం
హన్మకొండ: వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యను తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోషియేషన్ సన్మానించింది. శుక్రవారం హనుమకొండ కనుకదుర్గ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రజా సమస్యలపై స్పందిస్తూ, పార్లమెంట్లో తన గళం విప్పుతూ, జిల్లా అభివృద్ధికి పాల్పడుతున్నందుకు ఎంపీ డాక్టర్ కడియం కావ్యను సన్మానించారు. ఈసందర్భంగా అమె మాట్లాడుతూ.. ఉత్తర దక్షణ భారత కూడలిగా ఉన్న వరంగల్ సమగ్రాభివృద్ధి కోసం పార్లమెంట్ వేదికను వందశాతం హాజరుతో తన గళం విప్పుతున్నానన్నారు. కార్యక్రమలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్మోహన్రావు, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకవరం శ్రీనివాస్కుమార్, ప్రతినిధులు అస్నాల శ్రీనివాస్, డాక్టర్ ప్రవీణ్కుమార్, సురేశ్కుమార్, సంజీవరెడ్డి, మాధవరెడ్డి, శ్రీనివాస్, రఘుపతిరెడ్డి, శివాజీ, శ్రీప్రియ, పవిత్ర, వస్కుల శ్రీనివాస్, స్వాతి పాల్గొన్నారు. -
ప్రత్యేక శ్రద్ధతో బోధించాలి : డీఈఓ
కాశిబుగ్గ: విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో బోధించాలని వరంగల్ డీఈఓ రంగయ్యనాయుడు సూచించారు. వరంగల్ ఆటోనగర్లోని గిర్మాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల ప్రతిభను ఉపాధ్యాయులు గుర్తించి ప్రోత్సాహం అందించాలని అన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువుపై దృష్టి పెట్టి ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడాలని కోరారు. ఏఎంఓ సుజన్ తేజ మాట్లాడుతూ ఆధునిక బోధన పద్ధతుల ద్వారా విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం భూపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఎస్ఓ కట్ల శ్రీనివాస్, కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, ఝెలుగం సత్యనారాయణ, చిప్ప వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను డీఈఓ పంపిణీ చేశారు. ప్రతీ విద్యార్థి ఫొటోతో కూడిన ప్రత్యేక క్యాలెండర్ను ఆవిష్కరించారు. -
స్టేడియంలో ఆస్ట్రో టర్ఫ్ పిచ్
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో క్రికెటర్లకు మరింత మెరుగైన శిక్షణ అందించేందుకు ఆస్ట్రో టర్ఫ్ పిచ్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ తెలిపారు. ఈమేరకు గురువారం రెడీమేడ్ టర్ఫ్ పించ్ను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా డీవైఎస్ఓ ప్రశాంత్ మాట్లాడుతూ.. డీఎస్ఏ క్రికెట్ కోచ్ మహ్మద్ అఫ్జల్ ప్రత్యేక చొరవ, కృషితో సుమారు రూ.28 వేల విలువైన ఆస్ట్రో టర్ఫ్ పిచ్ను మీరట్ నుంచి తెప్పించినట్లు తెలిపారు. హన్మకొండ అర్బన్: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ కలెక్టరేట్లో భగీరథ మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, తదితరులు పాల్గొని భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహ స్వామి, జిల్లా సగర సంఘం నాయకులు నలుబోల సతీశ్, సీతా కమలాకర్ రావు, నెక్కొండ కిషన్, వడ్లకొండ కుమారస్వామి, గాండ్ల స్రవంతి, తాడిశెట్టి విద్యాసాగర్, అయోధ్య మంగనూరి రఘు, కోడిపాక గణేశ్ కుమార్, కానిగంటి రవి తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టర్, రెడ్క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు చాహత్ బాజ్పాయ్ని గురువారం జిల్లా రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్తోపాటు పాలకవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలను కలెక్టర్కు వివరించారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ప్రారంభోత్సవం, డైనింగ్ హాల్ భూమిపూజ, రెడ్క్రాస్ డే కార్యక్రమాలకు హాజరుకావాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ చైర్మన్ డాక్టర్ పి.విజయ్ చందర్ రెడ్డి, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు ఈవీ. శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు పుల్లూరి వేణుగోపాల్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, బిళ్ల రమణారెడ్డి పాల్గొన్నారు. వరంగల్ అర్బన్: మహా నగర వ్యాప్తంగా పాఠశాల స్థాయి విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంచేందుకు మే 1 నుంచి 31 వరకు వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బల్దియా ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ సమ్మర్ కోచింగ్ క్యాంప్–26 నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బల్దియా ఇండోర్ స్టేడియంలో బాడ్మింటన్, జూడో, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్ యోగా క్రీడాంశాల్లో పిల్లలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 4–10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా జీడబ్ల్యూఎంసీ ఇండోర్ స్టేడియంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 98499 09333, 97019 99651, 85229 95960, 90325 04143 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
అర్హులందరికీ అక్రిడిటేషన్ కార్డులు
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: అర్హులైన జర్నలిస్టులందరికీ 252 జీఓ ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు అందజేస్తామని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టర్ చాంబర్లో గురువారం జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కమిటీ చైర్పర్సన్ కలెక్టర్ మాట్లాడుతూ ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులు, జీఓను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా పంపిణీ చేసేందుకు కమిటీ సభ్యులు ప్రయత్నించాలన్నారు. నిజమైన సమాచారాన్ని ప్రజ లకు అందిస్తున్న పాత్రికేయులకు నూతన కార్డులు జా రీచేసే ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, ఆందోళనకు గురికా కుండా జర్నలిస్టులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. డీపీఆర్ఓ ప్రేమలత, కమిటీ సభ్యులు శ్రీరాం రాంచందర్, మెండు రవీందర్, దొంతు నవీన్, బొడిగ శ్రీనివాస్, మట్టా దుర్గాప్రసాద్, కోదాటి గోపాలకృష్ణ, పల్లెల సోమేశ్వర్, హుస్సేన్పాషా, బొల్లెపల్లి రాజు పాల్గొన్నారు. -
రెండున్నరేళ్లుగా డైవర్షన్ పాలిటిక్స్
హన్మకొండ: కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండున్నరేళ్లుగా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీర్తిని ఎవరూ తగ్గించలేరని ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గురువారం హనుమకొండ స్నేహనగర్లోని ఎస్వీ కన్వెన్షన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఘోష్ కమిషన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్కు, రేవంత్ సర్కార్కు చెంపపెట్టు వంటిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే గొప్ప సాగు, తాగు నీటి ప్రాజెక్టు అన్నారు. కాంగ్రెస్ కుట్రపూరితంగా కేసీఆర్ని బద్నామ్ చేసేందుకు యత్నిస్తోందని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ వేసి కేసీఆర్ను దోషిగా చూపాలని యత్నిస్తున్నారని, అయితే హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందన్నారు. కేసులు కొట్లాటలు తమకు కొత్త కావని, న్యాయస్థానాల మీద నమ్మకం ఉందన్నారు. ప్రజల తరఫున బాధ్యత గల ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పోరాడుతోందన్నారు. నాయకులు మర్రి యాదవరెడ్డి, మధు, సోదా కిరణ్, సంకు నర్సింగ రావు, లోహిత రాజు, బొంగు అశోక్, జోరిక రమేశ్, పులి రజినీకాంత్, సుధాకర్రెడ్డి, రామ్మూర్తి, చిన్న, వెంకన్న పాల్గొన్నారు.బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ -
ఆర్టీసీ సమ్మెలో విషాదం
పసుపు ధర ౖపైపెకి.. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పసుపు పంట ధర రోజురోజుకూ ౖపైపెకి చేరుకుంటోంది. నర్సంపేటలో డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మహత్యాయత్నంవాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతోపాటు ఉక్కపోత ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది. శుక్రవారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026నర్సంపేట : నర్సంపేట ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ కోల శంకర్గౌడ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడపాలని ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు చేస్తున్న ప్రయత్నాన్ని నిరసిస్తూ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్ప డడం కలకలం రేపింది. ఆర్టీసీ సమ్మెలో భాగంగా రెండో రోజు గురువారం ఉదయమే నర్సంపేట డిపో ఎదుట డ్రైవర్లు, కండక్టర్లు బైఠాయించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న శంకర్గౌడ్ ఇంటికి వెళ్లి మధ్యాహ్నం 3.45 గంటలకు ధర్నా వద్దకు చేరుకున్నాడు. తనవెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన కార్మికులు మంటల్లో చిక్కుకున్న శంకర్ను కాపాడేందుకు 30 నిమిషాలపాటు ప్రయత్నించారు. 75 శాతం కాలిన ఆయనను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం కంచన్బాగ్ డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో వెంటి లెటర్పై చికిత్స పొందుతున్నట్లు రాత్రి ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కాగా, నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు డిపో వద్ద ఆందోళన నిర్వహించి మాట్లాడారు. ప్రైవేట్ డ్రైవర్లను ఏర్పాటు చేసుకొని స్థానిక డిపో మేనేజర్ సమ్మెను నీరుగార్చే ప్రయత్నం చేయడంతోనే మనస్తాపం చెందిన శంకర్గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. భారీ బందోబస్తు... నర్సంపేట డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా డీసీపీ అంకిత్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. బస్టాండ్ ఎదుట, వరంగల్ రోడ్డులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మిక సంఘాలతో నేడు (శుక్రవారం) చర్చలు జరుపుతామని ప్రకటించిన విషయాన్ని కార్మికులకు పోలీసులు తెలిపి ఆందోళన విరమించాలని కోరారు. అనంతరం ఆర్టీసీ కార్మికులు తిరిగి డిపో వద్దకు చేరుకుని ఆందోళనలు చేశారు. ఘటనాస్థలాన్ని సందర్శించిన సీపీ నర్సంపేటలో బస్టాండ్లో ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ నిప్పంటించుకున్న స్థలాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ .. రాత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. ఘటన జరిగిన తీరును పోలీస్ కమిషనర్.. స్థానిక పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీపీ వెంట ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, స్పెషల్ బ్రాంచ్, నర్సంపేట ఏసీపీలు జితేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ముస్క శ్రీనివాస్, సీఐలు శ్రీనివాస్, సాయి రమణ, దుగ్గొండి ఎస్ఐ రణధీర్ ఉన్నారు. డిపో ఎదుట ధర్నా, రాస్తారోకో.. డ్రైవర్ శంకర్గౌడ్ ఘటన గురించి తెలుసుకున్న బీఆర్ఎస్, బీజేపీ, బీసీ సంఘం, కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఆర్టీసీ డిపో వద్దకు చేరుకుని ధర్నా, రాస్తారోకో చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ వైఫల్యంతోనే డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. హనుమకొండ డిపో గేటు వద్ద ధర్నా చేస్తున్న ఆర్టీసీ కార్మికులుబస్సు బయటకు రావడంతో అడ్డుకుంటున్న ఆర్టీసీ కార్మికులుఉర్దూకు రాష్ట్రంలో రెండో అధికార భాషా హోదా కల్పించినా నిధులు కేటాయించడం లేదు. దీంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, లైబ్రరీలు దీనస్థితికి చేరుకున్నాయి. తీవ్రగాయాలతో హైదరాబాద్కు తరలింపు.. వెంటిలెటర్పై చికిత్స ప్రభుత్వ వైఫల్యంతోనే కార్మికుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపణ -
పూడికతీత పనులు పూర్తి చేయండి
హన్మకొండ అర్బన్: భద్రకాళి చెరువు పూడికతీత పనులు వేగవంతం చేసి, మట్టి తరలింపు ప్రక్రియను సాఫీగా నిర్వహిస్తూ మే 15 నాటికి పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో భద్రకాళి చెరువు పూడిక మట్టి తరలింపుపై సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్తో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వరంగల్ కలెక్టర్ సత్యశారద వీడియో కాన్ఫరెన్న్స్లో పాల్గొని పలు సూచనలిచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎన్.రవి, వైవీ.గణేశ్, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, సాగునీటి పారుదల సీఈ సుధీర్, ఎస్ఈ రాంప్రసాద్, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ‘కుడా’ సీపీఓ అజిత్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న, ఈఈ కిరణ్ కుమార్, డీఈఈ మధుసూదన్రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకుంటూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ పథకాల వారోత్సవాల సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘పోషణ్ పక్వాడ’ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ చేతుల మీదుగా చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించారు. గర్భిణులకు సీమంతం చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, జీసీడీఓ సునీత, పోషణ్ అభియాన్ జిల్లా కో–ఆర్డినేటర్ సుమలత, ఆయుష్ జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ మహేందర్ కుమార్, డీపీఎం డాక్టర్ భాను ప్రకాశ్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రుబీనా, డెమో అశోక్ రెడ్డి, మెప్మా డీఎంసీ రజిత రాణి, ఎఫ్ఆర్ఓ రవికృష్ణ, అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, గర్భిణులు, చిన్నారులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ అధికారులతో సమీక్ష -
ఎంజీఎం టు హైదరాబాద్
కాశిబుగ్గ: నర్సంపేటలో ఆర్టీసీ బస్టాండ్లో గురువారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డ్రైవర్ శంకర్ గౌడ్ను చికిత్స నిమిత్తం ఎంజీఎం తరలించారు. ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్లో శంకర్గౌడ్ను హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. శంకర్గౌడ్ ఆత్మహత్యాయత్నం సమాచారం తెలుసుకున్న జేఏసీ నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున ఎంజీఎం చేరుకున్నారు. ముందుగానే కలెక్టర్ సత్యశారద క్యాజువాలిటీకి చేరుకుని వైద్యులను అప్రమత్తం చేశారు. మరోవైపు పలు పార్టీల నాయకులు, బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఎంజీఎం చేరుకున్నారు. దీంతో క్యాజువాలిటీ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సీపీ సన్ప్రీత్ సింగ్ కూడా సిబ్బందితో విచ్చేసి పరిస్థితిని సమీక్షించారు. అప్పటికే పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్తోపాటు సీపీ బాధితుడి వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే క్రమంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పలు పార్టీల నాయకులు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శంకర్ను ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మరోపక్క జేఏసీ నాయకులు డ్రైవర్ ఆత్మహత్యాయత్నం ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలను నిరసించారు. రేపటి నుంచి ఆందోళన మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ ఘటనకు సర్కారు బాధ్యత వహించాలి ఆర్టీసీ డ్రైవర్ శంకర్ ఘటనకు సర్కారే బాధ్యత వహించాలని మాజీ మంత్రి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా సర్కారు బోగస్ మాటలు మాట్లాడుతోందన్నారు. దీనివల్ల కార్మికులు జీవితాలు ఆగమైపోతున్నాయని మండిపడ్డారు. ఎంజీఎంకు తీసుకొచ్చిన శంకర్ గౌడ్ను పరామర్శించిన అనంతరం వారు మాట్లాడారు. ‘నా వాళ్ల కోసం నేను పెట్రోల్ పోసుకున్నా’ అని శంకర్ గౌడ్ చెప్పడం బాధ కలిగించిందన్నారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న శంకర్ గౌడ్ కోరికల తీర్చితే వాటిని విని ఆయన బతుకుతాడన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం దిగొచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు పాల్పడొద్దు.. కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడొద్దని సీపీ సన్ప్రీత్ సింగ్ అన్నారు. ఈ సమయంలో ఏమైనా జరిగితే తమ కుటుంబం రోడ్డు పాలవుతుందన్నారు. ప్రభుత్వం కూడా కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్చలు జరుపుతుందన్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాం ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్కు మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్లో హైదరాబాద్లోని నిమ్స్కు తరలించామని కలెక్టర్ సత్యశారద చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ప్రశాంతంగా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. 60 నుంచి 80 శాతం గాయాలు.. ఆర్టీసీ డ్రైవర్ శంకర్కు 60 నుంచి 80 శాతం గాయాలయ్యాయని ఆర్ఎంఓ అశ్విన్కుమార్ తెలిపారు. నర్సంపేట ఆస్పత్రి నుంచి సాయంత్రం 5.10 గంటలకు ఎంజీఎం వచ్చారని, వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేశామని తెలిపారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ పంపించామన్నారు. ప్లకార్డులతో ఎంజీఎం వద్ద ఆర్టీసీ కార్మికుడు ప్రత్యేక అంబులెన్స్లో శంకర్గౌడ్ తరలింపు ఎంజీఎం వద్దకు తరలివచ్చిన కార్మికులు, నేతలు ముందుగానే చేరుకున్న కలెక్టర్ సత్యశారద, సీపీ సన్ప్రీత్ సింగ్ సర్కారు నిర్లక్ష్యంతోనే ఘటన జరిగిందని ప్రతిపక్షాల మండిపాటుకాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతోనే ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ ఒంటికి నిప్పటించుకున్నాడని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, పోరాడి డిమాండ్లు పరిష్కరించుకుందామన్నారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామన్నారు. -
ఆర్టీసీ డిపోల వద్ద అంబులెన్స్లు
శంకర్గౌడ్ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం హన్మకొండ: వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని డిపోల వద్ద 108 అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గురువారం రాత్రి అంబులెన్స్లు డిపోల వద్దకు చేరుకున్నాయి. హనుమకొండ జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఆదేశాల మేరకు అంబులెన్స్లను అధికారులు అందుబాటులో ఉంచినట్లు 108 సిబ్బంది తెలిపారు. -
29 నుంచి మెగా క్రికెట్ టోర్నీ
ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం జెడ్పీహెచ్ఎస్ క్రీడా మైదానంలో ఈనెల 29 నుంచి మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు షారూ, కై ఫ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాల క్రీడాకారులతో ఈ టెన్నిస్బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టోర్నీలో గెలుపొందిన జట్టుకు మొద టి బహుమతి రూ. 75వేలు, రెండో బహుమతి రూ. 35 వేలు అందజేస్తామన్నారు. ఎంట్రీ ఫీజు రూ. 3,500 చెల్లించి తమ జట్టు పేరు నమోదు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం 7729976116, 8106009317 నంబర్లను సంప్రదించాలన్నారు. మార్కెట్లో రైతుల అందోళన ఖిలా వరంగల్: మార్క్ఫెడ్ అధికారులు మక్కలు కొనుగోలు చేయాలని వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో రైతులు గురువారం ఆందోళన చేశారు. మార్కెట్లో మార్కెఫెడ్ మక్కల కొనుగోళ్లను నిలిపివేయడంతో నిల్వలు భారీగా పేరుకుపోయాయి. కొనుగోలు చేసిన మక్కలకు కాంటాలు వేయడం లేదు. మక్కలు నింపేందుకు గన్నీ సంచులు ఇవ్వకపోడంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పది రోజులుగా మక్కల కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. వర్షం వస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తక్షణమే మార్క్ఫెడ్ అధికారులు స్పందించి మక్కల కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కాగా, వర్షం వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు రైతులకు టార్పాలిన్లు అందజేశారు. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు గురువారం పేరెంట్స్ సమావేశాలు నిర్వహించారు. విద్యార్థులకు ప్రగతి పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా హెచ్ఎంలు వేసవి సెలవుల్లో జాగ్రత్తలపై వ్యవహరించాలని సూచలిచ్చారు. ప్రతీ రోజు కొంత సమయం చదువుకునేలా ప్రోత్సహించాలని, కళలు, క్రీడలు, పెయింటింగ్, సంగీతం వంటివి నేర్పించాలని సూచించారు. సంతోషంగా సెలవులు గడిపేలా సురక్షితంగా ఆరోగ్యం ఉండేలా తల్లిదండ్రులు చూడాలని సూచించారు. ఈనెల 24 నుంచి జూన్ 11 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయని, మళ్లీ జూన్ 12న పాఠశాలు పునఃప్రారంభం అవుతాయని తెలిపారు. -
కొనసాగుతున్న శ్రీభద్రకాళి కల్యాణ బ్రహ్మోత్సవాలు
హన్మకొండ కల్చరల్: వరంగల్ శ్రీభద్రకాళి దేవాలయంలో శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభోవంగా కొనసాగుతున్నాయి. గురువారం ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం అమ్మవారిని సూర్యప్రభవాహనంపై ఊరేగించారు. పూజా కార్యక్రమాలకు ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ దంపతులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్, వరంగల్ మహానగర అధ్యక్షుడు బయ్యస్వామి, ప్రధాన కార్యదర్శి పులి రజనీకాంత్, డాక్టర్ ఆలేటి కృష్ణ, వర్ధిని దంపతులు, బున్న మల్లేశం, చొప్పరి సోమయ్య ఉభయదాతలుగా వ్యవహరించారు. శానబోయిన రాజకుమార్,మొగిలి, సదయ్య, బండి సారంగపాణి, సాధు రఘు, సత్యనారాయణ. బిల్లా శివకుమార్, సత్యనారాయణ, ఉమేష్, రాజమౌళి, శ్రీలత, మాధవి. స్వాతి, అనురాధ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం హంనవాహనంపై ఊరేగించారు. పూజల్లో తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షుడు మోతుకూరి రామేశ్వరరావు, మయూరి, జగన్మోహన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. సూర్యప్రభవాహనం, హంసవాహనంపై అమ్మవారి ఊరేగింపు -
స్నేహితుడే ప్రాణం తీసిండు..
ఖిలా వరంగల్: డబ్బు కోసం స్నేహితుడే నమ్మించి ప్రాణం తీసిండు. ఇటీవల సంచలనం సృష్టించిన బిహార్ కార్మికుడి హత్య కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు గురువారం వరంగల్ మిల్స్కాలనీ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ వివరాలు వెల్లడించారు. బిహార్లోని సలర్పూర్ థానా గ్రామానికి చెందిన ఎండీ తాన్వీర్ ఆలం ఉపాధి నిమిత్తం మూడు నెలల క్రితం వరంగల్ వచ్చి రామన్నపేటలో ఉంటూ కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అప్పుల ఒత్తిడి కారణంగా డబ్బులు సమకూర్చుకోవాలని యత్నిస్తున్న క్రమంలో వరంగల్ అండర్ బ్రిడ్జి సమీపంలోని ఓ వైన్షాపు వద్ద నిందితుడికి బిహార్కు చెందిన దూరిషా (60)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని నిందితుడు స్నేహంగా మార్చుకున్నాడు. దూరిషా వద్ద డబ్బు ఉందని గమనించి చోరీ చేయాలని పథకం రచించాడు. ఇందులో భాగంగా ఈనెల 18న వరంగల్ శంభునిపేట దూపకుంటరోడ్డులోని బుడిగజంగాల కాలనీలో దూరిషా అద్దెకుంటున్న గదికి వెళ్లి ఇద్దరు కలిసి మద్యం సేవించారు. అనంతరం దూరిషా నిద్ర పోతున్న సమయంలో అతడి వద్ద ఉన్న నగదును చోరీ చేయడానికి యత్నించాడు. ఈ సమయంలో దూరిషా మేల్కోని ప్రతిఘటించాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ సమయంలో తనపై కేసు నమోదవుతుందనే భయంతో తాన్వీర్ ఆలం అక్కడే ఉన్న కత్తితో దూరిషా గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం రూ.4,500 నగదు తీసుకుని పరారయ్యాడు. ఆ తర్వాత శంభునిపేట జంక్షన్ నుంచి నేరుగా రామన్నపేటలోని అద్దె గదికి చేరుకున్నాడు. చోరీ చేసిన డబ్బును ఖర్చు చేశాడు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులు సాంకేతిక ఆధారాల సహకారంతో నిందితుడిని శంభునిపేట జంక్షన్ వద్ద గురువారం ఉదయం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ రమేశ్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు నరేశ్, శ్రవణ్కుమార్, హెడ్కానిస్టేబుల్ నరేందర్, ఎండీ వాజీద్పాషా, ప్రవీణ్రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. డబ్బు కోసమే కార్మికుడి దారుణ హత్య నిందితుడి అరెస్ట్, రిమాండ్ వివరాలు వెల్లడించిన ఇన్స్పెక్టర్ రమేశ్ -
సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని సంస్థ ‘భారతి’
● మేనేజర్ మార్కెటింగ్ జె.రాజేశ్వర్రెడ్డి కాజీపేట అర్బన్ : సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా వికాట్ గ్రూపునకు చెందిన భారతి సిమెంట్ ఎదుగుతోందని, వికాట్ గ్రూప్ కంపెనీ ప్రపంచంలో 12 దేశాల్లో విస్తరించి ఉందని వికాట్ గ్రూప్ భారతి సిమెంట్ సంస్థ మేనేజర్ మార్కెటింగ్ జె.రాజేశ్వర్రెడ్డి తెలిపారు. గురువారం కాజీపేట మండలం మడికొండలోని శ్రీ తిరుమల ఏజెన్సీలో బిల్డర్లకు టెక్నికల్ మీట్ ఏర్పాటు చేయగా వికాట్ గ్రూప్కు చెందిన భారతి సిమెంట్ టెక్నికల్ మేనేజర్ సునీల్తో కలిసి మాట్లాడారు. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్తో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్తో నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందని తెలిపారు. అల్ట్రాఫాస్ట్ ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారులకు సరైన ఎంపిక అని పేర్కొన్నారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సాయం అందజేస్తామని, స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకే వచ్చి సహాయపడుతారని తెలిపారు. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్స్తో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్ రూ. 20 అధికంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ మార్కెటింగ్ శివప్రసాద్, డీలర్ జయధీర్రెడ్డి, కంపెనీ ప్రతినిధులు, బిల్డర్లు తదితరులు పాల్గొన్నారు. -
నిధుల కేటాయింపులేవి?
న్యూశాయంపేట : తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూకు రెండో అధికార భాషా హోదా కల్పించినా క్షేత్రస్థాయిలో ఆ భాషా వికాసానికి తోడ్పడే సంస్థలు మాత్రం నిర్వేదంలో ఉన్నాయి. ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నడుస్తున్న రెండు కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, లైబ్రరీలు కొన్నేళ్లుగా నిధులు నిలిచిపోవడంతో దీనస్థితికి చేరుకున్నాయి. అధికారికంగా ప్రాధాన్యం ఉన్నా నిధుల కేటాయింపులో చూపుతున్న వివక్ష ఉర్దూ భాషా అభిమానుల భవిష్యత్ అంధకారంలో నెడుతోంది. పనిచేయని కంప్యూటర్లు.. మైనార్టీ యువతకు సాంకేతిక పరిజ్ఞానం అందించి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉర్దూ అకాడమీ ద్వారా కంప్యూటర్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటుకు సంకల్పించారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు సెంటర్లు మంజూరు చేశారు. ఒకటి వరంగల్లో రెండోది హనుమకొండలో ఏర్పాటు చేశారు. దీంతో పాటు హనుమకొండ రాయపురలో లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారు. మహోన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ సెంటర్లు ఇప్పుడు షో–పీస్లుగా మారాయి. కేంద్రాల్లో కంప్యూటర్లు పాతపడి మరమ్మతులకు కూడా నోచుకోవడం లేదు. ఆధునిక సాఫ్ట్వేర్ పక్కన పెడితే కనీసం అప్డేట్ చేయడానికి కూడా నిధులు లేకుండా పోయాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెలవెలబోతున్న లైబ్రరీలు.. విజ్ఞాన కేంద్రాలుగా విరాజిల్లాల్సిన లైబ్రరీలు నిధు ల లేమితో వెలవెలబోతున్నాయి. పుస్తకాల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఉర్దూ విద్యార్థులకు అవసరమైన కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు రావడం నిలిచిపోయాయి. అద్దెలు చెల్లించలేక, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో లైబ్రరీల నిర్వహణ భారంగా మారింది. రెండో అధికార భాష పరిరక్షణ అంటే కేవలం జీఓలకు పరిమితం కాకూడదని విద్యార్థులు పేర్కొంటున్నారు.కాగితాలకే పరిమితమైన ఉర్దూ హోదా రెండో అధికార భాషకు నిధుల గ్రహణం డబ్బులు లేక మూతబడుతున్న కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు లైబ్రరీల పరిస్థితి దయనీయం సర్కారు నిర్లక్ష్యంపై మైనార్టీల ఆగ్రహంకంప్యూటర్ సెంటర్లలో పనిచేసే సిబ్బందికి, ఇన్స్ట్రక్టర్లకు నెలల తరబడి వేతనాలు అందడం లేదు. రెండో భాష వికాసంలో భాగస్వాములు అవుతున్నామని సంబురపడాలో లేక పస్తులుండాలో అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు. పదేళ్లుగా కేంద్రాలకు సరైన భవనాలు లేక అద్దెభవనాలకు కిరాయిలు కూడా చెల్లించకపోవడంతో యజమానులు ఖాళీ చేయాలంటున్నారని సిబ్బంది తెలిపారు. ఐదు,ఆరు సంవత్సరాలుగా శిక్షణ కేంద్రాలను మూసివేసి ఇన్స్ట్రక్టర్లు, సిబ్బందిని మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయాలకు వెళ్లాలని అకాడమీ అధికారులు ఆదేశాలు జారీ చేయగా తాత్కాలికంగా వస్తూ పోతు కాలం గడుతున్నారు. కానీ మళ్లీ కొన్ని రోజుల క్రితం అధికారులు మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయాల్లో పనిచేయడానికి వీలు లేదని ప్రభుత్వ భవనాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు రావడంతో ఎక్కడ ఉండాలో.. ఎక్కడ పనిచేయాలో తెలియక సతమతమవుతున్నారు. -
పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలి
కేయూ క్యాంపస్: గ్రంథాలయాలు విజ్ఞానభాండాగారాలని, విద్యార్థులు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని హనుమకొండలోని ఇంటర్నేషనల్ నేచురోపతి లైబ్రరీ వ్యవస్థాపకుడు ఆచార్య గజ్జల రామేశ్వరం అన్నారు. గురువారం కేయూలోని కేంద్ర గ్రంథాలయంలో ప్రపంచ పుస్తక అండ్ కాపీరైట్ దినోత్సవం వేడుకల్లో ‘బుక్స్ యాజ్ బ్రిడ్జెస్ కనెక్టింగ్ కల్చర్స్, ఐడియాస్ అండ్ జనరేషన్’ అనే అంశంపై ప్రసంగించారు. పుస్తకాలు, సంస్కృతులు తరాల మధ్య అనుసంధానాన్ని కల్పించే శక్తి కలిగి ఉన్నాయన్నారు. తొలుత ఈ పుస్తక ప్రదర్శనను కేయూ పాలకమండలి సభ్యుడు సుదర్శన్ ప్రారంభించారు. కేంద్ర గ్రంథాలయ మెంబర్ ఇన్చార్జ్, లైబ్రరీ సైన్స్ విభాగం అధిపతి బి.రాధికారాణి, లైబ్రరీ అసిస్టెంట్ టి. జువేర్, బ్రహ్మచారి, శ్రీనివాస్, టి. రవీందర్, చంద్రమోహన్, నవీన్, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. నేచురోపతి లైబ్రరీ వ్యవస్థాపకుడు రామేశ్వరం -
రుణ పరిమితి ఖరారు..
హన్మకొండ: వ్యవసాయానికి బ్యాంకులు అందించే పంట రుణ పరిమితికి రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ ఆమోదం తెలిపింది. రోజురోజుకూ పెరుగుతున్న సాగు వ్యయం మేరకు అధికారులు, రైతు ప్రతినిధులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంటల వారీగా అయ్యే సాగు ఖర్చులపై చర్చించి రుణ పరిమితి ప్రతిపాదనలు రూపొందించి, రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీకి పంపారు. దీంతో కమిటీ రుణ పరిమితికి తుది రూపు ఇచ్చి పంటల వారీగా ఎకరాకు ఇవాల్సిన రుణాలను ఖరారు చేసింది. ఈ మేరకు 2026–2027 వానాకాలం, యాసంగిలో బ్యాంకులు నూతనంగా ఖరారైన రుణ పరిమితి మేరకు రుణ వితరణ చేస్తాయి. రాష్ట్ర సాంకేతిక కమిటీ సమావేశంలో జరిగిన చర్చల్లో సభ్యులు ప్రతీ జిల్లా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా అన్ని ప్రధాన పంటలకు సంబంధించి సాగు విస్తీర్ణం, ఖర్చు, స్థూల దిగుబడి విలువపై సవివరంగా చర్చించి, స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఆర్థిక సహాయ స్థాయిల సూచనాత్మక శ్రేణిని ఆమోదించారు. పంటల వారీగా ఖరారైన రుణ పరిమితి (ఎకరాకు)... వరి ఎకర సాగుకు రూ.48,000 రుణం ఇవ్వాలి. వరి విత్తనోత్పత్తికి రూ.51,000, జొన్న సాగుకు 20,000 నుంచి రూ.22,000, జొన్న విత్తనోత్పత్తికి రూ.26,000, సజ్జ రూ.19,000, రాగి రూ.18,000, మొక్కజొన్నకు రూ.38,000, మొక్కజొన్న (స్వీట్ కార్న్, విత్తనోత్పత్తికి)రూ.43,000, మిల్లెట్స్కు రూ.23,000, గోధుమకు రూ.22,000, కందికి రూ.27,000, కంది ఆర్గానిక్కు రూ.25,000, మినుములుకు రూ.23,000, మినుము (ఆర్గానిక్)కు రూ.22,000, పెసరకు రూ.20,000, పెసర ఆర్గానిక్కు 22,000, శనగకు రూ.28,000, బొబ్బెరకు రూ.13,000, పొద్దు తిరుగుడుకు రూ.32,000, సోయాబీన్కు రూ.32,000, సోయాబీన్ విత్తనోత్పత్తికి రూ.38,000, వేరుశనగకు రూ.34,000, నువ్వుకు రూ.23,000, కుసుమలకు రూ.21,000, ఆవాలుకు 15,000, ఆముదకు రూ.22,000, పత్తికి రూ.52,000, పత్తి విత్తనోత్పత్తికి రూ.1,50,000, చెరుకు పంటకు రూ.84,000, ఆయిల్ ఫామ్కు రూ.50,000, మిరప పంట సాగుకు రూ.90,000, మిరప (మల్చింగ్)కు రూ.1,00,000, పొగాకు సాగుకు రూ.35,000, టమాటకు రూ.58,000, టమాట మల్చింగ్కు రూ.72,000, వంకాయ మల్చింగ్కు రూ.58,000, వంకాయ సాధారణ సాగుకు రూ.43,000, చామదుంప సాగుకు రూ.46,000, మునగ సాగుకు రూ.40,000, అల్లం సాగుకు రూ.72,000, స్వీట్ పొటాటో సాగుకు రూ.32,000, పొట్లకాయ సాగుకు రూ.36,000, పొట్లకాయ ఆర్గానిక్కు రూ.38,000, ఉల్లిగడ్డకు రూ.49,000, క్యారట్కు రూ.36,000, బంగాళదుంపకు రూ.52,000, బెండకు రూ.33,000, కీర దోసకు రూ.36,000, క్యాబేజీకి రూ.36,000 క్యాలీఫ్లవర్కు రూ.36,000, కరివేపాకు సాగుకు రూ.26,000, కొత్తిమీరకు రూ.28,000, పుదీనా సాగుకు రూ.35,000, నూరు వరాల పూల సాగుకు రూ.50,000, క్యాప్సికం సాగుకు రూ.53,000, అరటికి (టిష్యూ) రూ.49,000, స్వీట్ ఆరెంజ్కు రూ.50,000, నిమ్మ సాగుకు రూ.53,000, దానిమ్మకు రూ.79,000, జామకు రూ.51,000; కస్టర్డ్ ఆపిల్కు రూ.42,000, సపోటకు రూ.37,000, ద్రాక్షకు రూ.1,02,000, ద్రాక్ష (సీడ్లెస్)కు రూ.1,33,000, బేర్ సాగుకు రూ.36,000; వాటర్ మిలన్కు రూ.38,000, మస్క్ మిలన్కు రూ .57,000, బొప్పాయికి రూ.70,000; మామిడికి రూ.67,000 నుంచి రూ.98,000 వరకు, కొబ్బరికి రూ .53,000, కోకా సాగుకు రూ.39,000, డ్రాగన్ సాగుకు రూ.82,000 రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ ఆమోదించిన రుణ పరిమితి మేరకు పౌల్ట్రీ పరిశ్రమ (గుడ్లు) ఒక్కొక్క కోడి పిల్లకు రూ.450 చొప్పున, బాయిలర్ ఒక్కో కోడి పిల్లకు రూ.230 చొప్పున, పాడిపరిశ్రమకు ఒక గేదెకు రూ.37,500, ఆవుకు రూ.38000, గొర్రెలకు (20 ప్లస్ 1) రూ.32,000, మేకలకు (20 ప్లస్ వన్)కు రూ.35,000, పందుల (3 ప్లస్ 1) పెంపకానికి రూ.67,000, చేపల పంపకానికి హెక్టార్కు రూ. 40,00,000 చొప్పున రుణ వితరణ చేయాలి. పెరిగిన సాగు ఖర్చుల మేరకు రుణాలు రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ ఆమోదం -
ధరిత్రి సంరక్షణలో భాగస్వాములవ్వాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: భూమిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్, కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా ఈనెల 15 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న ‘ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ ఫోర్ట్ నైట్’ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. పక్షం రోజుల పాటు జరుగుతున్న మదర్ ఎర్త్ ఉత్సవాల సందర్భంగా విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సైకిల్ ర్యాలీలు, ఉదయం నడక నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. వెంకట గిరిరాజ్గౌడ్, డీపీఆర్ఓ అయూబ్ అలీ, ‘కుడా’ ప్లానింగ్ అధికారి అజిత్రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి, ఏజీసీ కన్వీనర్ ఎస్.శ్రీనివాసస్వామి, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ మహేశ్, తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలివరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద కాళోజీ సెంటర్: సహజవనరులను వినియోగించుకుని పర్యావరణాన్ని పరిక్షించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్డేను పురష్కరించుకొని ఈనెల 15 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం కలెక్టరేట్లో తెలంగాణ నేషనల్ గ్రీన్క్రాప్స్ వారి పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూమిని సంరక్షించడంలో పర్యావరణ సమతుల్యత ఎంతో కీలకమన్నారు. అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ 50 మొక్కలు నాటాలని కోరారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇంటింటికి ఇంకుడు గుంత తప్పనిసరిగా నిర్మించుకుంటే భూగర్భజలాలు పెరుగుతాయని తెలిపారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఈఓ బి.రంగయ్య నాయుడు, జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆగిన ఆర్టీసీ చక్రం..
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో కార్మికులు పూర్తి స్థా యిలో సమ్మెలోకి వెళ్లారు. ఫలితంగా బస్సులు అరకొరగా నడవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ప డ్డారు. కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్లగా అధి కారులు, కొందరు కార్యాలయ ఉద్యోగులు విధులు నిర్వర్తించారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, శ్రా మికులు, ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లారు. సమ్మెతో బుధవారం వేకువజామున మొదటి బస్సు నుంచి సర్వీస్లు నిలిచిపోయాయి. వరంగల్ రీజియన్లో ని 8 డిపోల్లో సంస్థకు చెందిన 596 బస్సులకు 592 డిపోలకే పరిమితమయ్యాయి. హనుమకొండ, మహబూబాబాద్ డిపోలకు చెందిన రెండేసి బస్సులు రోడ్డెక్కాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా వరంగల్–2 డిపోకు చెందిన విద్యుత్ బస్సులు, ప్రైవేటు అద్దె బస్సులను అధికారులు నడిపించారు. సమ్మెలోకి వెళ్లిన కార్మికులు ఉదయమే డిపోలకు వద్దకు చేరుకుని ధర్నాలు చేపట్టారు. ఆర్టీసీ సమ్మె సమాచారంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు డిపోల వద్ద భారీ బందోబస్తు చేపట్టా రు. హనుమకొండ డిపో వద్ద అద్దె బస్సులను నడిపించాలని చూడగా కార్మికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కార్మికులను వారించి బస్సులను పంపించారు. అనంతరం కార్మికులను డిపో ఎదుట ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు పంపించారు. దీంతో వారు అక్కడే నిరసన తెలిపారు. వరంగల్–1 డిపో వద్ద ధర్నా చేశారు. విద్యుత్ బస్సులకు కేటాయించడంతో వరంగల్–2 డిపో పూర్తిగా జేబీఎం నిర్వహణలోకి వెళ్లింది. వరంగల్ రీజియన్ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు తిరగలేదు. సమ్మె మొదటి రోజు కావడంతో అధికారులు ప్రైవేట్ అద్దె బస్సులను పూర్తి స్థాయిలో తిప్పడంపై దృష్టి సారించారు. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం..హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్–1 డిపో, రాంనగర్లోని హనుమకొండ డిపో వద్ద సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, నాయకులు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. ఔట్ సోర్సింగ్ కండక్టర్లతో నిర్వహణ.. సమ్మె ప్రభావం లేదని చూపడానికి ప్రభుత్వం, యాజమాన్యం తమ ప్రయత్నాలు చేశాయి. సమ్మె మొదటి రోజు రీజియన్ వ్యాప్తంగా 228 బస్సులు నడిపారు. ప్రజారవాణాకు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో విద్యుత్ బస్సులు పూర్తి స్థాయిలో నడిచాయి. ఔట్ సోర్సింగ్ కండక్టర్లతో అద్దె, విద్యుత్ బస్సులు నడిపించారు. బస్టాండ్లలో టికెట్లు జారీ చేస్తూ వన్మ్యా న్ సర్వీస్గా కొన్ని బస్సులు తిప్పారు. కొన్ని విద్యు త్ బస్సు డ్రైవర్లకు టిమ్లు అప్పగించి బస్సులు నడిపారు. మరికొన్ని బస్సులో టికెట్ జారీ చేసే వారు లేకపోవడంతో మహిళలతో పాటు పురుషులు కూడా ఉచిత ప్రయాణం చేశారు. విద్యుత్ బ స్సులు 115 ఉండగా 79 మాత్రమే నడిచాయి. ప్రై వేట్ అద్దె బస్సులు 325 ఉండగా 145 మాత్రమే తి రిగాయి. మహబూబాబాద్లో అద్దె బస్సులు 24 ఉండగా 2 మాత్రమే నడిచాయి. అదే విధగా తొ ర్రూరులో 43 ఉండగా ఒక్కటి మాత్రమే, భూపాలపల్లిలో 24 ఉండగా 9 మాత్రమే, పరకాలలో 23 ఉండగా 7 మాత్రమే నడిచాయి.వరంగల్ రీజియన్లో డిపో వారీగా నడిచిన బస్సులు డిపో ఆర్టీసీ అద్దె మొత్తం బస్సులు నడిచినవి వరంగల్–1 38 38 – వరంగల్–2 79 36 115 హనుమకొండ 02 16 18 జనగామ 27 27 – తొర్రూరు 01 01 – పరకాల 07 07 – భూపాలపల్లి 09 09 – నర్సంపేట 11 11 – మహబూబాబాద్ 02 02 –టికెట్ల జారీ కోసం తాత్కాలికంగా ఉద్యోగుల భర్తీ..మరో వైపు సంస్థ బస్సులను నడిపేందుకు రవాణ శాఖ అధికారుల ద్వారా అర్హులైన డ్రైవర్ల జాబితా సేకరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి కూడా రవాణ శాఖ అధికారులకు అర్హులైన, అనుభవం కలిగిన డ్రైవర్లను గుర్తించాలని ఆదేశాలు అందినట్లు సమాచారం. అదే విధంగా టికెట్ల జారీ కోసం పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రైవేట్ వ్యక్తులను తా త్కాలిక, రోజువారీ వేతనం ప్రాతిపదికగా తీసుకునేందుకు అధికారులు ముందుకొచ్చారు. ఆసక్తి కలిగిన వారిని సంప్రదించాలని డిపో మేనేజర్లు ప్రకటన విడుదల చేశారు. వీరికి రోజుకు రూ.800 చొప్పున చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి సమ్మెలోకి కార్మికులు డిపోలకే పరిమితమైన బస్సులు అక్కడక్కడ ప్రైవేట్ అద్దె సర్వీస్లను అడ్డుకున్న కార్మికులు -
నేటినుంచి వేసవి ప్రత్యేక రైళ్లు
● ఈనెల 23 నుంచి మే 3వ తేదీ వరకు.. కాజీపేట రూరల్ : వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాజీపేట జంక్షన్ మీదుగా ఏప్రిల్, మే నెలల్లో పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. వేసవి ప్రత్యేక రైళ్ల వివరాలు.. ఈనెల 23న చర్లపల్లి–జషిధి (07580) ఎక్స్ప్రెస్, ఈ నెల 28న చర్లపల్లి–ముజఫర్పూర్ (07582) ఎక్స్ప్రెస్, ఈ నెల 24న చర్లపల్లి–ముజఫర్పూర్ (07584) ఎక్స్ప్రెస్, జషిధి–చర్లపల్లి (07581) ఎక్స్ప్రెస్, చర్లపల్లి–ముజఫర్పూర్ (07584) ఎక్స్ప్రెస్, ఈ నెల 30న చర్లపల్లి–జషిధి (07586) ఎక్స్ప్రెస్, ముజఫర్పూర్–చర్లపల్లి (07583) ఎక్స్ప్రెస్, ఈ నెల 26న చర్లపల్లి–బరోని (07588) ఎక్స్ప్రెస్, ముజఫర్పూర్–చర్లపల్లి (07585) ఎక్స్ప్రెస్, మే 1వ తేదీన జషిధి–చర్లపల్లి (07587) ఎక్స్ప్రెస్, చర్లపల్లి–ముజఫర్ఫూర్ (07590) ఎక్స్ప్రెస్, మే 3న ముజఫర్పూర్–చర్లపల్లి (07591) ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్కు చేరుకుని వెళ్లనున్నట్లు, ప్రయాణికులు ఈ వేసవి ప్రత్యేక రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ కుట్రలకు చెంపపెట్టు ● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హన్మకొండ: ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ కుట్రలకు చెంపపెట్టులాంటిందని, బీఆర్ఎస్ పార్టీ నిజాయితీకి నిదర్శనమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. రాజకీయ కక్షసాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ కాంగ్రెస్ రైతులను ఆగం చేసిందని ఆయన బుధవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ఇప్పటికై నా రాజకీయ కుట్రలు పక్కన పెట్టి రైతుల కోసం పని చేస్తూ సాగునీరు విడుదల చేయాలన్నారు. రెండున్నరేళ్లుగా కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పటికై నా ముక్కు నేలకు రాసి అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అది పీసీ ఘోష్ కమిషన్ కాదని, ముమ్మాటికీ పీసీసీ నివేదికని బీఆర్ఎస్ ముందు నుంచి చెబుతున్న మాట ఈ రోజు అక్షరాలా నిజమని తేలిందన్నారు. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కుట్రలకు బ్రేక్ పడినట్లయ్యిందన్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మేడిగడ్డ బ్యారేజీలో స్వల్పంగా దెబ్బతిన్న రెండు పిల్లర్లకు మరమ్మతులు చేసి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల సాగునీటి కష్టాలు తీర్చాలన్నారు. కాజీపేట అర్బన్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకులాల సంస్థ నిర్వహిస్తున్న సీఓఈ కళాశాలల్లో రెగ్యులర్ గురుకుల జూనియర్ కళాశాలల్లో వృత్తి విద్య, సైనిక కళాశాలల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షకు ఈనెల 25వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సోషల్ వెల్ఫేర్ కో–ఆర్డినేటర్ ఉమామహేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో హాజరైన ఆసక్తిగల విద్యార్థులు ఈఅవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రవేశ పరీక్ష మే 13వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. -
గురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
వరంగల్ విశ్వబ్రాహ్మణ వీధిలో బాలుడిని వెంబడిస్తున్న కుక్కహనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రైసిటీలోని సుభాష్నగర్, ఎన్యూఆర్ నగర్, మార్కెట్ ఏరియాతో పాటు నగరంలో సుమారు వంద చోట్ల సమస్య తీవ్రంగా ఉంది. ఎనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) కార్యక్రమం సరైన స్థాయిలో అమలు కాకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. నిపుణులు చెబుతున్న ప్రకారం కనీసం 70 శాతం కుక్కలను స్టెరిలైజ్ చేస్తేనే నియంత్రణ సాధ్యమవుతుంది. దీంతో పాటు మాంసం దుకాణాల్లోని వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా చూడాలి. బల్దియా సిబ్బంది ఇంటింటా చెత్తను సేకరించాలని, నగర పాలక సంస్థ అధికారులు స్పందించి కుక్కల నుంచి తమను రక్షించాలని నగరవాసులు కోరుతున్నారు. గ్రేటర్ వరంగల్ నగరంలో వీధికుక్కల సమస్య పెనుసవాలుగా మారింది. రోజురోజుకూ నమోదవుతున్న కుక్క కాట్ల కేసులు ప్రజల్లో భయాన్ని పెంచుతున్నాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీలో సుమారు 55 వేల నుంచి 65 వేలకుపైగా స్ట్రే డాగ్స్(వీధి కుక్కలు) సంచరిస్తున్నాయి. రోజుకు 20 నుంచి 25 వరకు కుక్క కాట్ల కేసులు నమోదవుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) స్టెరిలైజేషన్, ఎనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెబుతున్నా.. ఆ మేరకు ఫలితాలు కనిపించట్లేదు. గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు నగర ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. చర్యలేవి? 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు 2,257 మంది కుక్కకాటుకు గురైనట్లు వరంగల్ ఎంజీఎం రికార్డులు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో 600 మందికిపైగా కుక్కకాటుకు గురయ్యారు. కాగా, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఆస్పత్రులు, రద్దీ ప్రాంతాల్లో కుక్కల సంచారం లేకుండా చర్యలు తీసుకోవాలని, వాటిని షెల్టర్ హోంకు తరలించాలని న్యాయస్థానాలు ఆదేశించినా బల్దియా అధికార యంత్రాంగం చొరవ తీసుకోవట్లేదు. ఫిర్యాదు వస్తే కాలనీల్లోకి వెళ్లి 15 నుంచి 20 కుక్కలను పట్టుకోవడం, శస్త్ర చికిత్సలు నిర్వహించడం, ఐదు రోజుల తర్వాత తిరిగి అదే ప్రాంతంలో వదిలేయడం సర్వసాధారణమైపోయింది. వణుకు పుడుతోంది.. మా గల్లీలో కుక్కలు విపరీతంగా ఉన్నాయి. నెల క్రితం ఇంటి నుంచి దుకాణానికి వెళ్తుంటే కుక్క కరిచింది. కాలు పిక్క, చేయి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లి వ్యాక్సిన్ వేసుకున్నా. కార్పొరేటర్కు విషయం చెబితే ఇంటికి వచ్చి నా ఫొటోలు తీసుకున్నాడు. ఇప్పటి వరకు మున్సిపాలిటీ వాళ్లు ఒక్క కుక్కను కూడా పట్టుకుపోలేదు. బయటికి పోవాలంటేనే వణుకుపుడుతోంది. – పులి కవిత, మచిలీబజార్ ఎవరికి చెప్పినా బాధ తప్పట్లేదు.. గల్లీలో ఎటు చూసినా కుక్కల గుంపు కనబడుతోంది. వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఇంటి బయట ఆడుకోవాలంటేనే వణుకుతున్నారు. రాత్రి వేళ ఇంటికి వస్తుంటే కుక్కల కంట పడకుండా జాగ్రత్తగా రావాల్సి వస్తోంది. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారు. – ఎర్రం రవికాంత్, గుడిబండల్కాపువాడలో జనావాసాల మధ్య చెత్త కుప్ప వద్ద వీధి కుక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జనసంచారం రోజుకు 20–25 మందికి కుక్కకాట్లు.. ఆస్పత్రుల చుట్టూ జనం వీధి కుక్కల నియంత్రణలో జీడబ్ల్యూఎంసీ విఫలం రూ.కోట్లు ఖర్చవుతున్నా కానరాని నియంత్రణ కుక్కల నుంచి కాపాడాలని నగర ప్రజల వేడుకోలు గ్రేటర్ వరంగల్ నగరంలో కుక్కల బెడదకు ప్రధానంగా చెత్త నిర్వహణలో లోపాలే కారణం. ఓపెన్ డంపింగ్ యార్డులు, మాంసం వ్యర్థాలను వీధుల్లో పడేయడం వంటి వాటి వల్ల కుక్కల సంచారం పెరిగింది. నగరంలో చాలా ఏరియాల్లో నిత్యం చెత్తను తీసుకెళ్లే ఆటోలు రావట్లేదు. ఏం చేయాలో పాలుపోక చాలా మంది వీధి చివరన చెత్తను పడేస్తున్నారు. ఆయా ప్రదేశాల్లో కుక్కలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. అటువైపుగా వెళ్తున్న వృద్ధులు, చిన్నపిల్లలను కరుస్తున్నాయి. -
శ్రీభద్రకాళీభద్రేశ్వరుల కల్యాణోత్సవం
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి ఆలయంలో శ్రీభద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం శోభాయమానంగా జరిగింది. అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఉదయం అమ్మవారి ఉత్సవమూర్తిని సింహవాహనంపై, సాయంత్రం గజవాహనంపై ఊరేగించారు. సేవాకార్యక్రమాలకు వరంగల్ ఆర్యవైశ్య (పట్టణ) సంఘం, చాత్తాద శ్రీవైష్ణవ సంఘం ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆర్యవైశ్య నాయకులు గుండా ప్రకాశ్రావు, తొనుపునూరి వీరన్న, శ్రీవైష్ణవ సంఘం ప్రముఖులు వరయోగుల సురేశ్, రమాదేవి దంపతులు పాల్గొన్నారు. భూదాన్ పోచంపల్లి పద్మశాలీలు రుద్రవంశీయులు రుద్ర శ్రీశైలం, లావణ్య, రుద్ర చెన్న కేశవులు, వాణి, రుద్ర పాండురంగశాస్త్రి, వాసవి దంపతులు అమ్మవారి కల్యాణానికి రెండు పోచంపల్లి పట్టుచీరలు, పట్టుదోవతులు, సారె అందజేశారు. రాత్రి శ్రీభద్రకాళీభద్రేశ్వరుల కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈఓ రామల సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమ్మవారికి సింహవాహన సేవ, గజవాహనసేవ -
డిపోలో బస్సులు.. ప్రయాణికుల అవస్థలు
వరంగల్ రీజియన్లో టీజీఎస్ ఆర్టీసీ కార్మికులు బుధవారం పూర్తిస్థాయిలో సమ్మెలోకి వెళ్లారు. ఉదయమే కార్మికులు డిపోల వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. హనుమకొండ డిపో వద్ద అద్దె బస్సులను నడిపించాలని చూడగా కార్మికులు అడ్డుకున్నారు. అధికారులు కొన్ని విద్యుత్, ప్రైవేట్ అద్దె బస్సులను నడిపించారు. సరిపడా బస్సులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. అత్యవసర పనులున్న వారు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. – హన్మకొండ సమ్మెలోకి ఆర్టీసీ కార్మికులు -
నాటు వైద్యం వద్దు..
కుక్క కరిచిన వెంటనే కనీసం 15 నిమిషాల పాటు సబ్బుతో, శుభ్రమైన నీటితో బాగా కడగాలి. తర్వాత యాంటీసెప్టిక్ ద్రావణం ఉపయోగించాలి. మిరియాలు, పసుపు, మూలికలు రాయడం లేదా గాయాన్ని గట్టిగా కట్టడం వంటి పద్ధతులు ఉపయోగించవద్దు. ఇవి రేబిస్ను నివారించవు. రేబిస్ ఒక అత్యంత ప్రమాదకర వ్యాధి. లక్షణాలు ప్రారంభమైన తర్వాత దాని మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రేబిస్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ (టీకాలు), టెటనస్ టీకా గురించి సలహా తీసుకోండి. పిల్లలకు అవగాహన కల్పించండి. అపరిచిత కుక్కలను తాకవద్దు, వాటిని వేధించవద్దు, వాటి ముందు పరుగెత్తవద్దు. – డాక్టర్ శ్రీనివాస్, ఆర్ఎంఓ, ఎంజీఎం ● -
ఎట్టకేలకు పదోన్నతులకు నోటిఫికేషన్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఎట్టకేలకు సూపరింటెండెంట్లకు అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతులకు కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం బుధవారం సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేశారు. గత కొన్నేళ్లుగా నిరీక్షిస్తున్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు చివరి గడువు మే 6గా నిర్ణయించారు. యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు ఆరు ఖాళీలున్నాయి. అర్హులైన ఆరుగురు సూపరింటెండెంట్లకు పదోన్నతులు లభించనున్నాయి. అర్హతలు ఇలా.. అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పదోన్నతులకు దరఖాస్తులు చేసుకునేవారు యూనివర్సిటీలో సూపరింటెండెంట్గా పని చేస్తూ 5 ఏళ్ల పాటు సర్వీస్ కలిగి ఉండాలి. ఓవరాల్గా యూనివర్సిటీలో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు 15 ఏళ్ల సర్వీస్ కలిగి ఉండాలి. సీనియార్టీ కమ్ మెరిట్ ఆధారంగా సెలక్షన్ గ్రేడ్ పోస్టుగా పదోన్నతులకు చేపడతారు. పదోన్నతుల కల్పనకు నూతన విధి విధానాలు ఖరారు చేశారు. రాత పరీక్ష, సర్వీస్ వెయిటేజ్, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్, ఇంటర్వ్యూలు కలిపి మొత్తంగా 100 మార్కులకు అర్హత సాధించినవారికి సెలక్షన్ విధానంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ మెరిట్ ప్రాతిపదికన సూపరింటెండెంట్లకు అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతులు కల్పిస్తారని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాత పరీక్ష ఈఏడాది జూన్ 10న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. 30 మార్కుల రాత పరీక్షకు 100 ప్రశ్నావళికి సంబంధించి ప్రిపేరేషన్ క్వశ్చన్ బ్యాంకు పుస్తకాన్ని ముందుగానే యూనివర్సిటీ అధికారులు అర్హులైన సూపరింటెండెంట్లకు అందిస్తారు. 50 మార్కులు సర్వీస్ వెయిటేజ్, కాన్ఫిడెన్షియల్ రిపోర్టుకు 10 మార్కులు, ఇంటర్వ్యూకు10 మార్కులు కేటాయించారు.● ఆరు ఏఆర్ పోస్టుల వేకెన్సీల్లో ప్రమోషన్స్ ● దరఖాస్తులకు చివరి గడువు మే 6 ● జూన్ 10న రాత పరీక్ష -
‘సీకేఎం’లో ఆర్ఓ ప్లాంట్కు మరమ్మతులు
కాశిబుగ్గ: ‘దవాఖానల్లో దప్పిక’ శీర్షికన ఈ నెల 18న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో ఆర్ఓ వాటర్ ప్లాంట్కు మరమ్మతులు చేసి, అవసరమైన కెమికల్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. పక్కనే ఉన్న నల్లాను కూడా రిపేర్ చేసి కొత్త నల్లాలు బిగించి, రోగుల అటెండెంట్లు నీరు పట్టుకునేలా ఏర్పాట్లు చేశారు. వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. క్రీడలపై ఆసక్తి ఉన్న బాలబాలికలు https./satgasc. telangana.gov.in వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో సాట్ నిర్ణయించిన ఫీజులు వర్తిస్తాయని, గ్రామీణ శిబిరాల్లో మాత్రం ఎలాంటి ఫీజు ఉండదని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులు సైతం ఆన్లైన్ ద్వారా నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. క్రీడాసదుపాయాల మెరుగుదల కోసం నమోదు ఫీజులను వినియోగించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ క్రీడా ప్రతిభను మెరుగుపర్చుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని డీఎస్ఏ కార్యాలయంలో సంప్రదించవచ్చని డీవైఎస్ఓ ప్రశాంత్ తెలిపారు. వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. ఈ నెల 21న హైదరాబాద్ గచ్చిబౌలిలోని గోిపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో 2026–30 కాలానికిగాను రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో జిల్లాకు చెందిన డాక్టర్ పింగిళి రమేశ్రెడ్డి ఉపాధ్యక్షుడిగా, డాక్టర్ మూల జితేందర్రెడ్డి జాయింట్ సెక్రటరీగా ఎన్నికై నట్లు వారు తెలిపారు. హసన్పర్తి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్స్టేషన్ల్లో ఎస్సైలుగా విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మందిని బదిలీ చేస్తూ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. సాయి ప్రసన్నకుమార్ (సీసీఎస్, వరంగల్ నుంచి నల్లబెల్లి) వి.గోవర్ధన్ (నల్లబెల్లి నుంచి వీఆర్, వరంగల్), జి.రామారావు(మడికొండ నుంచి ఘన్పూర్), ీసీహెచ్.రఘుపతి (ఘన్పూర్ నుంచి వీఆర్, వరంగల్), ఈ.నర్సింహారావు (ధర్మసాగర్ నుంచి ఎల్కతుర్తి), ఎ.ప్రవీణ్కుమార్ (ఎల్కతుర్తి నుంచి వీర్, వరంగల్), ఎ.శ్రీకాంత్ (వీఆర్, వరంగల్ నుంచి బచ్చన్నపేట), ఎస్.కె.హమీద్ (బచ్చన్నపేట నుంచి వీఆర్, వరంగల్), బి.మంగ (వీఆర్, వరంగల్ నుంచి ట్రాఫిక్ కాజీపేట)కు బదిలీ అయ్యారు. ఇద్దరిపై వేటు ఇద్దరు ఎస్సైలపై సస్పెన్షన్ వేటు వేస్తూ సీపీ సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్క తుర్తి ఎస్సైగా విధులు నిర్వహించిన ఎ.ప్రవీణ్కుమార్కు అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇటీవల ఆయనను వీఆర్కు అటాచ్ చేశారు. బుధవారం బదిలీల్లో భాగంగా ఆయనకు వీఆర్కు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బదిలీ చేసిన మరుక్షణమే ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు వేశారు. అదేవిధంగా నర్సంపేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రవిపై సస్పెన్షన్ వేటు వేశారు. అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టారు. విచారణలో రుజువు కావడంతో సస్పెన్షన్ వేటు వేస్తూ సీపీ సన్ప్రీత్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
వడదెబ్బతో మహిళ మృతి
గూడూరు: వడదెబ్బతో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండకు చెందిన పుల్పం ఎల్లమ్మ (48) మృతి చెందింది. గ్రామానికి చెందిన ఓ రైతు మిరప తోటలో పనికి వెళ్లిన ఎల్ల మ్మ అక్కడ వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురైంది. దీంతో సహ కూలీలు బాధితురాలిని ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. మృతురాలి కుమారుడు సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.గిరిధర్రెడ్డి తెలిపారు. ఖిలా వరంగల్: వడదెబ్బతో అస్వస్థతకు గురైన ఓ యువకుడు ఎంజీఎంలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వరంగల్ లేబర్ కాలనీ 100 ఫీట్ల రోడ్డుకు చెందిన సింగారపు రాకేశ్ (25) తొర్రూరులోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఆర్ఓగా పనిచేస్తున్నాడు. వ్యక్తిగత పని నిమిత్తం ఈనెల 20న నర్సంపేట వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. భోజనం చేసిన అనంతరం అస్వస్థతకు గురికాగా కుటుంబీకులు వెంటనే ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి చిరంజీవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు. -
త్వరలో కామన్ అకడమిక్ క్యాలెండర్
కేయూ క్యాంపస్ : ఉన్నత విద్య సిలబస్లో విస్తృతంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని, తదనుగుణంగా విశ్వవిద్యాలయాలు సిలబస్లతో సిద్ధంగా ఉండాలని, త్వరలోనే కామన్ అకడమిక్ క్యాలెండర్ అమలుల్లోకి రానుందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. బుధవారం కేయూ అకడమిక్ కమిటీ హాల్లో వీసీ కె. ప్రతాప్రెడ్డి సమక్షంలో అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ నూతన విద్యావిధానం (ఎన్ఈపీ)కు అనుగుణంగా క్రెడిట్ విధానం అమలుచేయబోతున్నామన్నారు. ఈ దిశగా యూనివర్సిటీల వీసీలతో ఇప్పటికే వివిధ సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. కేయూ వీసీ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ 2026–2027 విద్యాసంవత్సరానికి సీపీజీఈటీ నిర్వహణను కేయూకు అప్పగించినందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్కు ధన్యవాదాలు తెలిపారు. కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, ఓఎస్డీ బి. వెంకట్రామ్రెడ్డి, వివిధ పరిపాలన అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డిను సన్మానించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి -
మేలో టీజీసీపీజీఈటీ– 2026 నోటిఫికేషన్!
కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించబోయే తెలంగాణ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీసీపీజీఈటి) 2026 నోటిఫికేషన్ మే మొదటివారంలో ఇచ్చే అవకాశాలున్నాయి. ఈసారి టీజీసీపీజీఈటీని కాకతీయ యూనివర్సిటీ నిర్వహించబో తోంది. ఈ మేరకు బుధవారం కాకతీయ యూనివర్సిటీలో వీసీ, సీపీజీఈటీ చైర్మన్ ప్రతాప్రెడ్డి అధ్యక్షతన అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. టీజీసీపీజీఈటీ– 2025 ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి, సీపీజీఈటీ– 2026 కన్వీనర్ కేయూ ప్రొఫెసర్ కె. రాజేందర్, రిజిస్ట్రార్ వి. రామచంద్రం తదితరులతో నిర్వహించిన సమావేశంలో సీపీజీఈటీ అర్హత ప్రమాణాలు, ప్రవేశ పరీక్ష దరఖాస్తు, పరీక్ష నిర్వహణ, షెడ్యూల్ తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో సోషల్ సైన్స్ డీన్ బి. సురేశ్లాల్, సైన్స్ డీన్ జి. హనుమంతు, ఓఎస్డీ బి. వెంకట్రామ్రెడ్డి, ప్రొఫెసర్లు టి. మనోహర్, ఎస్.జ్యోతి, సీజే శ్రీలత, వై. వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హన్మకొండ: వ్యవసాయ విద్యార్థులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులకు అత్యుత్తమ సేవలు అందించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం వరంగల్ పైడిపల్లిలోని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆవరణలో వ్యవసాయ కళాశాల దశమ వార్షికోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వర్చువల్గా పాల్గొని మాట్లాడుతూ.. వ్యవసాయ రంగం అతి ముఖ్యమైందన్నారు. అనంతరం క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందించారు. వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందించారు. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతపై నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఆర్.ఉమా రెడ్డి, వరంగల్ జిల్లా వ్యవసాయాధికారి జి.అనురాధ, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వి.రవీందర్ నాయక్, అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
హాష్ ఆయిల్ స్మగ్లింగ్.. నలుగురి అరెస్ట్
వరంగల్ క్రైం: హాష్ ఆయిల్ (గంజాయి మొక్కల నుంచి తీసిన నూనె)ను స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిని వరంగల్ డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్గంజ్ పోలీసులు అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ప్రకటించారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్ల డించారు. నిందితులు ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా చిత్రకొండ మండలం సువ్వపల్లి గ్రామానికి చెందిన హంటల్ సన్ను, రేకపల్లి గ్రామానికి చెందిన హంటల్ సన్యాసి, కృష్ణా హంటల్, ఏపీలోని అల్లూరి జిల్లా గూడెం మండలం దారకొండకు చెందిన కండెల చిన్నబాబును అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ముంబైకి వెళ్లేందుకు కోణార్క్ రైలు ఎక్కి.. ఈముఠా సభ్యులు గంజాయి మొక్కల ద్వారా 40 కిలోల హాష్ ఆయిల్ను సేకరించినట్లు ఆయన తెలిపారు. 20 కిలోల హాష్ ఆయిల్ను పాండు తీసుకోగా, మిగిలిన 20 కిలోల హాష్ ఆయిల్ను కిలో చొప్పున ప్యాకెట్లలో భద్రపరిచారు. నిందితులు ఐదు కిలోల చొప్పున హాష్ ఆయిల్ను తీసుకుని ముంబైలో విక్రయించేందుకు ఆంధ్రప్రదేశ్లోని తుని రైల్వే స్టేషన్ నుంచి ఈ నెల 19న అర్ధరాత్రి కోణార్క్ రైలులో బయలుదేరినట్లు ఆయన తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్లో ఈనెల 20న దిగి 21న ఉదయం ముంబై వెళ్లేందుకు వరంగల్ బస్టాండ్ వద్ద ఉన్న రైల్వే గూడ్స్ షెడ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.2.50 కోట్ల విలువైన 20కిలోల హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సన్ప్రీత్సింగ్ తెలిపారు. మరో నిందితుడు కిలో పాండు పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, వరంగల్ ఏఎప్పీ శుభం, ఏసీపీలు జితేందర్రెడ్డి, జానీ నర్సింహులు, డ్రగ్ కంట్రోల్ టీం ఇన్స్పెక్టర్ వై.సతీశ్, ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ షూకూర్, ఎస్సైలు సందీప్, తేజ ఆర్ఎస్సైలు పూర్ణ చందర్ రెడ్డి, మనోజ్ రెడ్డి, క్యాట్పార్టీ లింగారావు, ఏఆర్ఏ ఎస్సైలు సుబ్బిరామి రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు బాల రాజు,శ్రీరాములు, ఎండీ రబ్బానీ, రాజ్కుమార్, ఇంతేజార్గంజ్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. రూ.2.50 కోట్ల విలువైన హాష్ ఆయిల్ స్వాధీనం వివరాలు వెల్లడించిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ -
భద్రకాళి దేవాలయంలో ఎదుర్కోలు ఉత్సవం
హన్మకొండ కల్చరల్: కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం భద్రకాళి దేవాలయంలో ఎదుర్కోలు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన, ఆదిశంకరుల జయంతిని నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు హనుమకొండ జిల్లా నాయీ బ్రాహ్మణ సంఘం ఉభయదాతలుగా వ్యవహరించారు. పూజల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, నాగుర్ల వెంకటేశ్వర్లు, సంఘం జిల్లా అధ్యక్షులు సురేశ్కుమార్, ఉపాధ్యక్షులు కురిమిల్ల రమేశ్, శ్రీరాముల రమేశ్, నరేందర్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్లు విజయ్కుమార్, నర్సింహారావు, హనుమకొండ జిల్లా వ్యవసాయాధికారి రవీందర్సింగ్ అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం పూజల్లో వరంగల్ జిల్లా వడ్డెరకులస్తులు ఉభయదాతలుగా వ్యవహరించారు. గండికోట సంపత్, స్వప్న, మల్ల య్య, సరోజ, మహేష్, అనూష, కంది సురేష్, మేరి, వెంకటేశ్, కమల పాల్గొన్నారు. బుధవారం రాత్రి ఏడు గంటలకు భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఈఓ రామల సునీత తెలిపారు. -
భక్తిమార్గం.. భారతీయ తత్వశాస్త్రం
బ్రాహ్మణసేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ హన్మకొండ కల్చరల్ : ఆది శంకరాచార్యులు, శ్రీభగవద్ రామానుజాచార్యులు భారతీయ తత్వశాస్త్రంలోని అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలను ప్రచారం చేసిన మహనీయులని వీరి ఉపదేశాలు హిందూ ధర్మంపై ప్రభావాన్ని చూపాయని బ్రాహ్మణసేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా మంగళవారం హనుమకొండ రాగన్న దర్వాజలోని బ్రాహ్మణభవన్లో బ్రాహ్మణ, వైష్ణవ సంఘాల ఆధ్వర్యంలో ఆది శంకరాచార్యులు, శ్రీభగవద్ రామానుజాచార్యుల జయంతి ఉత్సవాలు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సతీమణి నీలిమా జ్యోతిప్రజ్వలన చేసి ఆచార్యుల జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. ఆదిశంకరులు, శ్రీభగవద్ రామానుజాచార్యుల బోధనలను వారి సిద్ధాంతాల ప్రాముఖ్యతను వివరించారు. అనంత రం ఆచార్యుల చిత్రపటాలతో బ్రాహ్మణభవన్ నుంచి చిన్నకొవెల వరకు శోభాయాత్ర నిర్వహించారు. -
సామాజిక సేవలో విద్యుత్ ఉద్యోగులు
టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి హన్మకొండ : వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించడమే కాకుండా, సామాజిక సేవలోనూ తమ ఉద్యోగులు ముందుంటారని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి కొనియాడారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని వరుణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాటసారుల దాహార్తిని తీర్చడానికి అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఉద్యోగి తమవంతు బాధ్యతగా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు వి.మోహన్ రావు, టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు కె.తిరుమల్ రావు, రాజు చౌహన్, వెంకటరమణ, హనుమకొండ, వరంగల్ ఎస్ఈలు మధుసూదన్, ఆనందం, జీఎం సామ్య నాయక్, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ రెడ్డి, సెక్రటరీ జనరల్ తాజుద్దీన్ బాబా, ఎన్పీడీసీఎల్ అధ్యక్షుడు నార్ల సుబ్రహ్మణేశ్వర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంద్రసేనా రెడ్డి, జనరల్ సెక్రటరీ పి.మల్లికార్జున్, బాధ్యులు అనిల్ కుమార్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
నేటి నుంచి వరంగల్ రీజియన్ వ్యాప్తంగా నిలిచిపోనున్న బస్సులుప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అధికారులుహన్మకొండ: సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు వెళ్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి మొదటి బస్సు నుంచి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ నిర్ణయం తీసుకుంది. దీంతో బుధవారం ఉదయం నుంచి వరంగల్ రీజియన్లోని 8 డిపోల పరిధిలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వరంగల్ రీజియన్లో మొత్తం 1,036 బస్సులు సేవలు అందిస్తున్నాయి. ఇందులో 596 సంస్థ బస్సులు, 325 ప్రైవేట్ అద్దె బస్సులు, 115 విద్యుత్ బస్సులు ఉన్నాయి. మొత్తం 986 షెడ్యూల్స్ నడుస్తున్నాయి. రోజుకు 4.11 లక్షల కిలోమీటర్లు తిరిగి 4.16 లక్షల మంది ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేరవేస్తూ రూ.2.06 కోట్ల ఆదాయాన్ని పొందుతుంది. సంస్థకు చెందిన 1,123 మంది డ్రైవర్లు, 1,436 మంది కండక్టర్లు సేవలు అందిస్తున్నారు. వీరితో పాటు ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ విధానంలో 140 మంది డ్రైవర్లు, 286 మంది కండక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా సంస్థ ఉద్యోగులైన 368 మెకానిక్లు, 250 మంది ట్రాఫిక్ సూపర్వైజర్లు, కార్యాలయం సిబ్బంది 60 మంది, సెక్యూరిటీ సిబ్బంది 44 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఔట్ సోర్సింగ్ విధానంలో కొనసాగుతున్న 140 మంది డ్రైవర్లు, 286 మంది డ్రైవర్లు మినహా మిగతా వారంతా సమ్మెలోకి వెళ్లనున్నారు. ఔట్ సోర్సింగ్ విధానంలో 104 మంది మెకానిక్లు, కార్యాలయ స్టాఫ్ 38 మంది. సెక్యూరిటీ 36 మంది ఉన్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది విధులకు హాజరయ్యే అవకాశలున్నాయి. వీరితో బస్సులు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్–2 డిపోలో 115 విద్యుత్ బస్సులున్నాయి. ఇవి పూర్తిగా ప్రైవేట్ డ్రైవర్లతో నడుస్తున్నాయి. వీటితోపాటు మరో 325 ప్రైవేట్ అద్దె బస్సులున్నాయి. విద్యుత్ బస్సులు, ప్రైవేట్ అద్దె బస్సులు తిప్పడంతో పాటు, సంస్థ బస్సులను తిప్పేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉన్నంతలో కనీసం ప్రధాన రూట్లలో బస్సులు నడిపేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. సగటున రోజుకు 4.16 లక్షల మంది ప్రయాణం రోజుకు 4.11 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్న బస్సులుసంస్థ పరిరక్షణ ముఖ్యం ఆర్టీసీ కార్మికులుగా సంస్థ పరిరక్షణ కోసం కృషి చేస్తాం. కార్మికుల ప్రయోజనాలు, సంస్థ కోసమే సమ్మెకు వెళ్తున్నాం. విద్యుత్ బస్సులు తీసుకువచ్చి సంస్థను ప్రైవేట్పరం చేస్తున్నారు. ఇది సమంజసం కాదు. ఆర్టీసీకే విద్యుత్ బస్సులు ఇవ్వాలి. యాజమాన్యం, ప్రభుత్వం ముందుంచిన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. శ్రీనివాస్, ఎంప్లాయీస్ యూనియన్ రీజియన్ సెక్రటరీ డిమాండ్లు పరిష్కరించాలి సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. సమ్మెకు ఒక రోజు ముందు చర్చల పేరుతో కాలయాపన చేయాలని చూస్తోంది. ముందుగా డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. పీఆర్సీ అమలు చేయాలని, పనిభారం తగ్గించాలి. ఎరియర్స్ ఇవ్వాలి. పని గంటలు తగ్గించాలి. ఔట్ సోర్సింగ్ విధానం తగ్గించి సంస్థ నియామకాలు చేపట్టాలి. – రాంచందర్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
నూతన కార్యవర్గం ఎన్నిక
కాశిబుగ్గ : తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (కేఎంసీ, వరంగల్ యూనిట్) నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాకతీయ వైద్య కళాశాలలోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు రిటర్నింగ్ అధికారి డాక్టర్ రాంకుమార్ రెడ్డి తెలిపారు. కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ అంబి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీగా డాక్టర్ చిన్ని కృష్ణ, కోఽశాధికారిగా డాక్టర్ చాడ రమేశ్ ఎన్నికయ్యారు. అలాగే జనరల్ కౌన్సిల్ మెంబర్లుగా డాక్టర్ బి. త్రిలోక్ చందర్, సీహెచ్ మురళి, జె.సురేందర్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ పి.సమ్మయ్య, కె.మురళి, ఎస్.సునీల్ దత్, జాయింట్ సెక్రటరీలుగా డాక్టర్ పి.రవి, బి.సునిల్కుమార్, ఎల్. దివ్యశ్రీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా డాక్టర్ బి.రమేష్చంద్ర, కె.రజని, మానస నరహరి, వి.మురళీక్షృష్ణ, పి.వాసుప్రకాశ్, ప్రసన్నకుమార్ ఎన్నికయ్యారు. వరంగల్ అర్బన్: ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచాలని మేయర్ గుండు సుధారాణి అదేశించారు. మంగళవారం మేయర్, ఇన్చార్జ్ కమిషనర్ కలిసి రెవెన్యూ అధికారులు, సిబ్బందితో పన్ను రాయితీ, సేకరణ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఐదు శాతం రాయితీని ప్రజలకు వివరించాలని కోరారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్, ఉప కమిషనర్లు బిర్రు శ్రీనివాస్, సమ్మయ్య, ప్రసన్నరాణి తదితరులు పాల్గొన్నారు. వేసవిలో నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి వేసవిలో నీటిసరఫరాపై దృష్టిసారించాలని మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. మంగళవారం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి ఇంజనీరింగ్ అదికారులతో మేయర్ తాగునీటి సరఫరా, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈఈలు రవికుమార్, మహేందర్, సంతోష్బాబు, మాదవి, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
పదోన్నతులతో బాధ్యతలు పెరుగుతాయి : సీపీ
వరంగల్ క్రైం : పోలీస్ అధికారులకు పదోన్నతులతో బాధ్యతలు పెరుగుతాయని సీపీ సన్ప్రీత్సింగ్ పేర్కొన్నారు. వరంగల్, జనగామ ఏ ఎస్పీలుగా పనిచేస్తూ పరిపాలన విభాగం అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొంది బదిలీపై వెళ్తు న్న ఏఎస్పీలు, శుభం ప్రకాష్, చేతన్ నితిన్ను మంగళవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. డీసీపీలు అంకిత్కుమార్, రాజమహేంద్రనాయక్, దార కవిత, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్రా, అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు. హన్మకొండ: తెలంగాణ కేడర్కు చెందిన 2025 బ్యాచ్ ఐఏఏస్ ప్రొబేషనర్లకు ప్రభుత్వం జిల్లాలు కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు ఐఏఎస్లను వివిధ జిల్లాలకు కేటాయించారు. ఇందులో భాగంగా సాయిశివానిని ప్రొబేషనరీ అసిస్టెంట్ కలెక్టర్గా హనుమకొండ జిల్లాకు నియమించారు. వీరు 27 వరకు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హన్మకొండ : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆర్టీసీ హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అద్దె బస్సుల సమస్యలపై చర్చించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారని అసోసియేషన్ వరంగల్ రీజియన్ కార్యదర్శి మారిపల్లి రాంరెడ్డి తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు లక్కం ప్రభాకర్, అధ్యక్షుడు అబ్బ మధుకర్, సభ్యుడు కాటన్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. -
ప్రజావాణి అర్జీల పరిష్కారానికి చర్యలు
కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజలు తమ సమస్యలు వినిపిస్తూ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్కి వినతి పత్రాలు అందించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 129 అర్జీలు అందినట్లు తెలిపారు. వేసవి నేపథ్యంలో వడగాలుల ప్రభావం నుంచి ప్రజలను రక్షించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పక్షులు, పశుసంపదకు తాగునీటి వనరులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కన్నం నారాయణ, జెడ్పీ సీఈఓ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. వరంగల్లో 139 దరఖాస్తులు..న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొని ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 139 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తుదారుల సమక్షంలోనే చర్చించి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ పరి ష్కారం చూపాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన వినతుల్లో రెవెన్యూశాఖకు 54, హౌసింగ్ 21 జీడబ్ల్యూఎంపీ 18 , ఇతర శాఖలకు చెందిన 46 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో వైవీ.గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి ఆర్డీఓ సుమ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.కాగా, తమ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం దగ్గరలో కాకుండా మరో కూడలిలో శివాజీ విగ్రహాన్ని పెట్టాలని బొల్లికుంట ఎస్సీ కులస్తులు విన్నవించారు. అదేవిధంగా నా తండ్రి నాగవెల్లి సారంగపాణి ఖోఖో క్రీడలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించారు. గతేడాది ఆగస్టులో మృతిచెందాడని, మా కుటుంబానికి ఎలాంటి ఆధారం లేదని, ఆర్థిక సాయం లేదా కనీస నివాస సదుపాయం కల్పించాలి’అని సారంగపాణి కూతురు నాగవెళ్లి మహాలక్ష్మి వేడుకున్నారు. -
ఎంజీఎంలో మొరాయించిన ల్యాబ్ మిషన్లు
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి క్యాజువాలిటీలోని రక్త పరీక్షలకు ఉపయోగించే మిషన్లు మొరాయించడంతో రోగుల పరీక్షల కోసం అటెండెంట్లు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సోమవారం ఉదయం నుంచి సీబీపీ, ఏబీజీ మిషన్లు పని చేయకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పలేదు. అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగుల పరీక్షలు ఈ ల్యాబ్లో చేయాల్సి ఉంది. అయితే, సీబీపీ పరీక్ష కోసం 91వ నంబర్ గదిలోని ల్యాబ్కు పేషెంట్ల అటెండెంట్లు బ్లడ్ శ్యాంపిళ్లు తీసుకుని పరుగులు తీయాల్సి వచ్చింది. ఇక ఏబీజీ పరీక్షల కోసం మాత్రం ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయించాల్సి వచ్చిందని పేషెంట్ల కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే పరీక్షల కోసం అధిక డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని వాపోయారు. అయితే సాయంత్రం నుంచి ఏబీజీ మిషన్ పనిచేయడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు. సతాయించిన సీబీపీ, ఏబీజీ మిషన్లు వైద్య పరీక్షల కోసం సిబ్బంది పరుగులు -
ఫ్లెక్సీలో నా ఫొటో ఏది?
హసన్పర్తి: జిల్లా సహకార సంఘం అధికారులపై వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. హసన్పర్తి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనంలో డీసీసీ బ్యాంక్ నూతన శాఖను సోమవారం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, స్థానిక ఎమ్మెల్యే కేఆర్.నాగరాజుతో కలిసి ఎంపీ కావ్య ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. జిల్లా సహకార బ్యాంక్ సీఈఓ వజీర్ సుల్తాన్పై మండిపడ్డారు. బ్యాంక్ ప్రారంభోత్సవానికి తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే నాగరాజు ఆహ్వానిస్తేనే ఇక్కడికి వచ్చానని, కనీసం ఫ్లెక్సీలో కూడా తన ఫొటో ఎందుకు పెట్టలేదని అడిగారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీసీసీ బ్యాంక్వి ఏడు శాఖలు ఉండగా, ఇందులో నాలుగు శాఖలు తన పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం బ్యాంక్ అధికారుల సన్మానాన్ని ఎంపీ కావ్య సున్నితంగా తిరస్కరించి అక్కడినుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో ‘కుడా’ చైర్మన్, హ నుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, డీసీసీ బ్యాంక్ సీఈఓ వజీర్సుల్తాన్ పీఏసీఎస్ ఇన్చార్జ్ జగన్మోహన్రావు, కార్పొరేటర్ శివకుమార్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పింగిలి వెంకట్రామ్ నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ‘సహకార’ సీఈఓపై ఎంపీ కడియం కావ్య ఆగ్రహం డీసీసీబీ హసన్పర్తి శాఖ ప్రారంభం -
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రావొద్దు..
మంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026కాళేశ్వరాలయ పునరుద్ధరణ భూమి పూజలో సీఎం రేవంత్రెడ్డి, చిత్రంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి, పొన్నం, తదితరులు, మేడిగడ్డలో జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు పరిశీలిస్తున్న సీఎం రేవంత్, సభకు హాజరైన జనంవిద్యారణ్యపురి: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. హనుమకొండ జిల్లాలో 11 పరీక్ష కేంద్రాల్లో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో–ఆర్డినేటర్ ఎ.సదానందం ఆరు పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. డీఈఓ ఎల్వీ గిరిరాజ్ గౌడ్ నాలుగు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కేయూ క్యాంపస్: కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో 115 పరీక్ష కేంద్రాల్లో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ రెండో సెమిస్టర్, ఆరో సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. హనుమకొండ జిల్లా కేంద్రంలో నాలుగు పరీక్ష కేంద్రాలను పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి వెంకటయ్య సందర్శించి పర్యవేక్షించారు. హన్మకొండ అర్బన్: మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడి జయంతి వేడుకలను సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. బసవేశ్వరుడి సేవలు అమూల్యమన్నారు. బోధించిన సూత్రాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిదన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి నరసింహ స్వామి, వీరశైవ లింగాయత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరి ధి సీడీఓఈ (దూరవిద్య) డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల 2024–2025, 2025–2026 బ్యాచ్లు, 2023–2024 బ్యాచ్లోని ఎక్స్ అభ్యర్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షలు మంగళవారంనుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ సోమవారం తెలిపారు. ఈనెల 21, 23, 28, 30, మే 2వ తేదీన పరీక్షలు మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు. రెండో సెమిస్టర్ పరీక్షలు మే7 నుంచి మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ 2023–24 బ్యాచ్ విద్యార్థులకు మే 7వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్నాయి. మే 7, 11, 13, 15, 18, 20వ తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తారని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. మొదటి, రెండో సెమిస్టర్లు కలిపి మొత్తంగా 3,766 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, ఇందుకోసం 12 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కాజీపేట అర్బన్ : వరంగల్ ఆర్ఓ కార్యాలయంలో చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్గా తస్లీమా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఏడాదిన్నర క్రితం బదిలీల్లో భాగంగా యామిని చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్గా రాగా, కొద్ది నెలల తర్వాత ఖమ్మంకు సబ్ రిజిస్ట్రార్గా బదిలీపై వెళ్లారు. నాటినుంచి ఇన్చార్జ్గా అసిస్టెంట్ రిజిస్ట్రార్ ప్రశాంతి విధులు నిర్వహిస్తున్నారు. ఏడాదిన్నర తర్వాత పూర్తిస్థాయి చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్గా తస్లీమా బాధ్యతలు స్వీకరించగా కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు. హన్మకొండ: ఆర్టీసీ కార్మికుల సమ్మె విచ్ఛిన్నకర చర్యలను ప్రభుత్వం, యాజమాన్యం ఆపాలని, కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్.రాంచందర్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సులు ఆర్టీసీకి ఇచ్చే విధానంలో మార్పులు చేసి కార్మికుల ఉద్యోగాలకు భద్రత కల్పించాలని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. జేఏసీతో కలిసి ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు తెలిపారు.సాక్షిప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల బృందం జేఎస్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం సుడిగాలి పర్యటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై సమీక్ష, రెండో విడత రైతు భరోసా విడుదల తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా కాళేశ్వరాలయ పునరుద్ధరణ పూజల్లో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు అనంతరం మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్లారు. పియర్స్ వద్ద శాంపిళ్లను పరి శీలించారు. కుంగిన ఏడో బ్లాక్ వద్ద డ్రిల్లింగ్ పనులు చూసిన సీఎంకు బ్యారేజీ వద్ద చేస్తున్న పరీ క్షలను అధికారులు వివరించారు. సీఎంతో పాటు ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్జైన్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. జియో టెక్నికల్, జియో ఫిజికల్, జీపీఆర్ శాంపిళ్లు ఎలా తీస్తున్నారో చూశారు. ప్రభుత్వం మొత్తం 520 శాంపిళ్లు సేకరించి సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూఆర్పీఎస్)కు పంపనుంది. ల్యాబ్లో పరీక్షల తర్వాత మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై పూర్తి అవగాహన వస్తుందని ఈ సందర్భంగా డ్రోన్ బేస్డ్ జీపీఆర్ టెస్ట్కు సంబంధించి అధికారులు సీఎంకు వివరించారు. ప్యార్లర్ క్రాస్ హోల్ సెస్మిక్ టెస్ట్ వివరాలను వివరించారు. సుమారు గంటపాటు అధికారులతో సమీక్ష.. మూడు బ్యారేజీల పరిస్థితిపై అధ్యయనం చేసిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి కాళేశ్వరం వద్ద ఎల్ అండ్ టీ గెస్ట్హౌస్లో అధికారులతో సమీక్ష జరిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లోపాలపై ఎలా ముందుకెళ్లాలో చర్చించారు. ఇటీవల నియమించిన స్టీరింగ్ కమిటీ చైర్మన్ కల్నల్ పరిచిత్ మెహ్రా బృందంతో కూడా సీఎం చర్చించి పలు సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరంలో అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదలమని, అలాగే రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టును కూడా గాలికి వదలమని, నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్న సీఎం రేవంత్రెడ్డి.. అధికారులు పూర్తిగా సహకరించాలని, ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని కోరారు. ప్రతిపక్షాలపై నిప్పులు.. అభివృద్ధి, సంక్షేమానికి హామీ.. కాటారం మండలం నస్తూర్పల్లిలో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తుమ్మిడిహెట్టిప్రాజెక్టును యథాతథంగా కొనసాగిస్తే లాభం ఉండదని భావించిన కేసీఆర్ పేరు మార్చి, అంచనాలు మార్చి అవినీతికి తెరతీశారని, రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.50 లక్షల కోట్లకు పెంచారని అన్నారు. తనకు రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని భావించారని, ఆనాడు గవర్నర్ నరసింహన్ను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పించారన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు ఉన్నాయని 2020లోనే ఇంజనీర్లు చెప్పారని గుర్తు చేశారు. ఇంజనీర్ల లేఖలను సీఎం, ఎల్అండ్టీ సంస్థ పట్టించుకోలేదని, ఫలితంగా 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలి పోయిందని ఆరోపించారు. అన్ని దాచిపెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నించినా, ప్రకృతి మరొకటి తలచి అది పూర్తిగాకుంగిపోవడంతో ప్రపంచానికి అసలు విషయం తెలిసిందన్నారు. సీబీఐ విచారణకు అప్పగించి 9 నెలలు అవుతున్నా కేంద్రం నుంచి స్పందన లేదని, కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరంపై ఇప్పటికీ సీబీఐ విచారణకు ఆదేశించలేదని, 2019 నుంచి ఈ ప్రాజెక్టు ద్వారా 162 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశామని తెలిపారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును వృథాగా పోనీయలేమని, మరమ్మతులు పూర్తి చేసి ప్రాజెక్టును ఉపయోగంలోకి తెస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క, తుమ్మల, గడ్డం వివేక్, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేమ్సాగర్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. నస్తూర్పల్లి బహిరంగ సభలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‘రైతు ఉత్సవాలు’ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి భూపాలపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానానికి రూ.200 కోట్లు నిధులు ఇచ్చామని, ఆలయ పునర్నిర్మాణ పనులు, ఇతర కట్టడాలు చేపట్టి అంగరంగ సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి వెల్లడించారు. ప్రజాపాలనలో భాగంగా.. కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామ సమీపంలో సోమవారం ‘రైతు ఉత్సవాలు’ బహిరంగ సభ నిర్వహించారు. సభాస్థలి సమీపంలో రూ.203 కోట్లతో ఆరెంద–దామెరకుంట గ్రామాల మధ్య ఉన్న మానేరు వాగుపై రూ.203 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే సత్యనారాయణరావు కోరిన ప్రతీసారి అభివృద్ధి పనులకు సరిపడా నిధులు ఇస్తున్నామన్నారు. సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించుకున్నామని, త్వరలోనే జరుగనున్న అంత్య పుష్కరాలకు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామన్నారు. కాళేశ్వరం దేవస్థానం, ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులకు అవసరమైన నిధులిస్తామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు.వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కల్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. జిల్లాలో యాసంగి 2026–27 సంవత్సరానికి సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. స మావేశంలో అదనపు కలెక్టర్లు, అధికారులున్నారు. గార్బేజ్ పికింగ్ స్టిక్తో చెత్త సేకరణ సులభం గార్బేజ్ పికింగ్ స్టిక్ ఉపయోగించడం ద్వారా కవర్లు, చిత్తు కాగితాలను సులభంగా సేకరించవచ్చని కలెక్టర్ సత్యశారద అన్నారు. స్టిక్ వినియోగంపై సోమవారం కలెక్టరేట్లో అవగాహన కల్పించారు. ఇదిలా ఉండగా.. అడవులు, వన్యప్రాణులను సంరక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్య తను కాపాడాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం కలెక్టరేట్లో వన మహోత్సవం, వన్యప్రాణుల సంరక్షణ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అనంతరం ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వై.వీ.గణేష్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, ఆర్డీఓలు సుమ, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. మందుగా మేడిగడ్డను సందర్శించిన సీఎం, మంత్రులు, నిపుణులు ఎన్డీఎస్ఏ, స్టీరింగ్ కమిటీ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష 3 బ్యారేజీల మరమ్మతులకు నిర్ణయం బహిరంగసభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన సీఎం రూ.407 కోట్లతో పథకాలకు శంకుస్థాపన -
అద్దె బస్సుల స్కీం కొనసాగించాలి
హన్మకొండ: ఆర్టీసీలో అద్దె బస్సుల స్కీం కొనసాగించాలని ఆర్టీసీ హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు లక్కం ప్రభాకర్ కోరారు. హనుమకొండ హంటర్రోడ్డులోని అభిరాం గార్డెన్స్లో ఆర్టీసీ హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ రీజియన్ స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో లక్కం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగులు 25 సంవత్సరాలుగా ఆర్టీసీలో అద్దె బస్సులు నడుపుతూ ఉపాధి పొందుతున్నారన్నారు. దేశ వ్యాప్తంగా ఆర్టీసీలకు అనుసంధానంగా 0.033 వాహనాలు నడుస్తున్నాయన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతూ నిరుద్యోగుల పొట్ట కొట్టాలని చూడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాలుష్యం నివారణ పేరుతో ఆర్టీసీలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడితే సరిపోదని, ఇతర వాహనాలపై దృష్టి సారించాలని సూచించారు. ఆర్టీసీ హైర్బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్బ మధుకర్రెడ్డి మాట్లాడుతూ 2007, 2009 బస్సుల స్థానంలో రిప్లేస్మెంట్ బస్సులను ఇవ్వాలని, డిపో మేనేజర్లతో ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఆర్ఎం కార్యాలయంలో సంయుక్త సమావేశం నిర్వహించాలని యాజమాన్యాన్ని కోరారు. అసోసియేషన్ వరంగల్ రీజియన్ అధ్యక్షుడు మారిపల్లి రాంరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు బాలవర్ధన్రెడ్డి, ఎన్.ప్రసాద్, హబీబ్, జె.వెంకట్రెడ్డి, కె.సదానందం, ఎండి పర్వేజ్, జి.వెంకన్న, కె.భాస్కర్రెడ్డి, కుమార్, బి.రామలింగారెడ్డి పాల్గొన్నారు. ఆర్టీసీ హైర్బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు లక్కం ప్రభాకర్ -
మండే ఎండ.. ఠండా ఠండా!
● జూపార్కులో చల్లదనం కోసం స్ప్రింక్లర్లు, చలువ పందిళ్ల ఏర్పాటు ● ఉష్ణోగ్రతలు పెరగకుండా అధికారుల ఏర్పాట్లు న్యూశాయంపేట: ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జంతువులు, పక్షులు, సరీసృపాలకు ఉపశమనం కలిగించేందుకు మూగజీవాలు వడదెబ్బ బారిన పడకుండా వరంగల్ నగరంలోని హంటర్రోడ్డు కాకతీయ జూవలాజికల్ పార్కులో జూ క్యూరేటర్ బి.లావణ్య, అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి నేతృత్వంలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. జంతువులకు వేసవి తాపం తెలియకుండా ఉండేందుకు అటు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్క్లోజర్లో ఉండే క్రూర మృగాల కోసం ఉష్ణోగ్రతలు పెరగకుండా వాటర్ స్పింక్లర్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పక్షుల కోసం చలువ పందిళ్లు, తడి తడకలు, గడ్డితో కూడిన పందిళ్లు ఏర్పాట్లు చేసి రోజుకు మూడు నాలుగు సార్లు నీటితో తడుపుతున్నారు. జంతువుల శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు అధికారులు ఆహార నియమాల్లో కీలక మార్పులు చేసి నీటితో కలిపి ఎలక్ట్రోలైట్స్ తదితర బలవర్థక ద్రావణాలు, ఆహారం అందిస్తున్నారు. జంతువులకు, పక్షులకు చల్లటి నీటితో స్నానాలు చేయించి ఎండ వేడి బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
పరిసరాల పరిశుభ్రతలో ఓసిటీ కాలనీ ఆదర్శం
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద కాశిబుగ్గ: వరంగల్ ఓసిటీలోని ప్లాస్టిక్ నిర్మూలన, పచ్చదనాన్ని ఇతర కాలనీలవాసులు ఆదర్శంగా తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. వరంగల్ ఓసిటీ కాలనీలో నిర్వహిస్తున్న క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో కలెక్టర్ ఆదివారం పాల్గొని మాట్లాడారు. కాలనీవాసులంతా కలిసి ఏడు విడతలుగా ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తూ, పచ్చదనం కాపాడుతుండడం అభినందనీయమని ప్రశంసించారు. వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, టెర్రస్ గార్డెనింగ్ను కూడా ప్రోత్సహించాలని వారికి సూచించారు. అనంతరం, పచ్చదనం, ప్లాస్టిక్ నిర్మూలనపై ఓసిటీ వెల్ఫేర్ అసోసియేషన్ రూపొందించిన కరపత్రాలను ఆమె ఆవిష్కరించి, క్లాత్ సంచులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు జోగు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి బొబ్బల శ్రీనివాస్రెడ్డి, కోశాధికారి బజ్జూరి వేణుగోపాల్, ఉద్యాన శాఖ అధికారి లక్ష్మారెడ్డి, డీపీఆర్ఓ ప్రేమలత, శానిటరీ ఇన్స్పెక్టర్ భూమయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.విద్యారణ్యపురి: మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఆదివారం పరీక్ష నిర్వహించారు. హనుమకొండ జిల్లాలో ఎల్కతుర్తి, కమలాపూర్, భీమదేవరపల్లి మోడల్ స్కూళ్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం సెషన్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షకు 160 మంది విద్యార్థులకు 113 మంది హాజరుకాగా 47 మంది గైర్హాజరయ్యారని డీఈఓ కార్యాలయ ఏసీజీ భువనేశ్వరి తెలిపారు. అలాగే, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం మధ్యాహ్నం సెషన్లో నిర్వహించిన పరీక్షకు 114 మంది విద్యార్థులకు 67 మంది హాజరుకాగా.. 47 మంది గైర్హాజరయ్యారని ఆమె పేర్కొన్నారు. కాశిబుగ్గ: పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్షాలపై బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ అయూబ్ అన్నారు. ఎల్బీనగర్లోని అబ్నూస్ ఫంక్షన్లో హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా బిల్లుతో డీలిమిటేషన్ బిల్లును పాస్ చేసుకోవాలని చూసిన కేంద్ర ప్రభుత్వ వ్యూహాలను తిప్పికొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తుచేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తూ పాకిస్తాన్తో పోల్చి మాట్లాడడం బీజేపీ నాయకులకు సరైంది కాదని హెచ్చరించారు. గతంలో మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టే తీసుకువచ్చిందని, మహిళలకు పెద్దపీట వేసి దేశానికి ఇందిరాగాంధీని ప్రధానమంత్రిని చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని ఆయన కొనియాడారు. కాశిబుగ్గ : వరంగల్ 23వ డివిజన్ కొత్తవాడలో కలుషితమైన పసుపు పచ్చని నీళ్లు సరఫరా అవుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల నుంచి వాసనతో కూడిన నల్లా నీళ్లు రావడంతో వాటిని పట్టుకోవడానికి వెనుకాడుతున్నారు. పచ్చని రంగుతో పాటు దుర్వాసనతో కూడి ఉండడంతో తాగునీటిగా వాడట్లేదు. అలాగే వాడుకోవడానికి సైతం ఈ నీళ్లు పనికిరావడం లేదంటూ స్థానికులు వాపోతున్నారు. ఈ నీటితో ముఖం కడుక్కోవడానికి ఉపయోగిస్తే నీటి వాసన భరించలేకపోతున్నామంటూ స్థానికుడు యాకుబ్పాషా ఆవేదన వెలిబుచ్చారు. అధికా రులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటి కైనా గ్రేటర్ అధికారులు, పాలకవర్గం స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని వారు కోరుతున్నారు. -
22 నుంచి సమ్మెకు సిద్ధం
నయీంనగర్: సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ బస్టాండ్ ఆవరణలోని వరంగల్–1 డిపో ఎదుట రీజియన్ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, లేకపోతే ఈ నెల 22వ తేదీ నుంచి కార్మికులమంతా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. జేబీఎం ఎలక్ట్రిక్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తులుగా ఉండి మోడీ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. గత రెండేళ్లుగా ముఖ్యమంత్రిని, రవాణా శాఖ మంత్రిని కలిసినా పట్టించుకోని పక్షంలో సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. రవాణా కమిషనర్ చర్చలకు పిలిచిన యాజమాన్యం, ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదన్నారు. అధిక పని భారమైనప్పటికీ మహాలక్ష్మీ పథకాన్ని ఆర్టీసీ కార్మికులు విజయవంతం చేశారన్నారు. కొందరు యాని యన్ నాయకులు, అధికారులు సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని వారికి కార్మికులు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో రీజియన్ జేఏసీ నాయకులు ఎం.శ్రీనివాస్, యాకస్వామి, టి.శ్రీనివాస్, జీఎస్.పాణి, మండరాజు, బాలరాజు, రమేశ్, పోతరాజు, వలీధర్, కుమార్, రవీందర్, అర్చన, కల్పన, నవత, ఉమారాణి, కవిత, సుమతి, కార్మికులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న -
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
భూపాలపల్లి అర్బన్: ముఖ్యమంత్రి నేడు (సోమవారం) కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామానికి రానున్న నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. పరకాల నుంచి మహదేవపూర్ వరకు ఉన్న ఎన్హెచ్ 353–సీ రహదారిపై బొగ్గు, ఇసుక లారీలు, ట్రాక్టర్లు, ఇతర భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు స్థానిక సీఐ నరేష్శ్మార్ ప్రకటనలో తెలిపారు. రహదారి ఇరువైపులా వాహనాల పార్కింగ్కు అనుమతి లేదని స్పష్టం చేశారు. మంజూర్నగర్ నుంచి బాంబులగడ్డ వరకు ఈ నిబంధనలు కఠినంగా అమలులో ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయి కాటారం వైపు ప్రయాణించనున్నందున ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియంత్రణకు సహకరించి, పోలీసుల సూచనలు పాటించాలని ఆయన కోరారు. -
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
న్యూశాయంపేట: విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, ఆర్ట్, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించి నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థ(టెమ్రిస్) రీజినల్ కో–ఆర్డినేటర్ జంగా సతీశ్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మైనార్టీ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న (5 నుంచి 8వ తరగతి) విద్యార్థులకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణలో భాగంగా పదిరోజుల పాటు నిర్వహించే సమ్మర్ క్యాంప్ను ఆదివారం వరంగల్ శంభునిపేట, వరంగల్(జి2) గురుకులంలో ప్రారంభించారు. ప్రిన్సిపాల్ తాళ్ల నీలిమాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జంగా సతీశ్ మాట్లాడుతూ.. సమ్మర్క్యాంపునకు బాలికలకు, శంభునిపేట గురుకులంలో, బాలురకు జక్కలొద్ది గురుకులంలో సౌకర్యాలు కల్పించి పదిరోజుల పాటు క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 400 మంది విద్యార్థులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్ అధి కారులు సయ్యద్ అక్బర్, మక్బూల్పాషాతో పాటు, పీఈటీలు, ఆర్ట్స్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. టెమ్రిస్ ఆర్ఎల్సీ సతీశ్ -
జేఎన్ శర్మకు ‘నాటక మణిచంద్ర’ బిరుదు ప్రదానం
హన్మకొండ కల్చరల్: వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ పద్యనాటక కళాకారుడు, పోతన విజ్ఞానపీఠం మేనేజర్ జేఎన్శర్మ ‘నాటక మణిచంద్ర’ బిరుదు అందుకున్నారు. ఈ మేరకు ఆదివారం జనగామలోని సెయింట్ మేరీ స్కూల్లో కవులు, కళాకారులు ఐక్యవేదిక ఏడో వార్షికోత్సవాన్ని నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు నెల్లుట్ల రవీంద్రరావు అధ్యక్షతన జరిగిన వేడుకలో ముఖ్య అతిథిగా శాసనసభ కార్యదర్శి బేతి శివారెడ్డి, డాక్టర్ నామోజు బాలాచారి హాజరై జేఎన్ శర్మకు బిరుదు ప్రదానం చేశారు. -
నేడు ముఖ్యమంత్రి కాళేశ్వరం టూర్
భూపాలపల్లి/కాళేశ్వరం: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం పర్యటనకు సోమవారం (నేడు) రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం హెలిపాడ్కు చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా కాళేశ్వరం దేవస్థానం చేరుకుని ముందుగా శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకుంటారు. తర్వాత కాళేశ్వరం దేవస్థానంలోని తూర్పు ఈశాన్య స్థలంలో రూ.200 కోట్ల వ్యయంతో రాతి నిర్మాణ పనుల భూమిపూజలో పాల్గొంటారు. కాళేశ్వరాలయం గర్భాలయం, శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయాల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. మేడిగడ్డలో జియో ఫిజికల్, టెక్నికల్ పరీక్షల పరిశీలన.. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్లో 19, 20వ పియర్లు, వంతెన కుంగిన విషయం తెలిసిందే. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కూడా సీపేజీ లీకేజీలు ఏర్పాడ్డాయి. అప్పటి నుంచి ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యాంసేఫ్టీ అథారిటీ) సూచనల మేరకు నీటిని నిల్వ చేయడం లేదు. దీంతో ప్రభుత్వం మరమ్మతులు చేసి నీటిని ప్రజలకు అందించడానికి ముందుకు రావడంతో సీఎం పర్యటన ఖరారు చేసినట్లు తెలిసింది. దీంతో 3.45 గంటలకు హెలికాప్టర్లో మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటారు. మేడిగడ్డ బ్యారేజీలో జరుగుతున్న జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు, బోర్హోల్స్ పనులను పరిశీలిస్తారు. అక్కడ ఇరిగేషన్శాఖ ఇంజనీర్లతో సమీక్షిస్తారు. సాయంత్రం 6 గంటలకు రోడ్డు మార్గం ద్వార నస్తుర్పల్లికి చేరుకుంటారు. 6.30 గంటలకు రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం ప్రారంభిస్తారు. ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. రాత్రి 7.45 గంటల అనంతరం రోడ్డు మార్గం ద్వార వెళ్తారని అధికారులు తెలిపారు. మూడు చోట్ల హెలిపాడ్ల ఏర్పాటు.. సీఎం పర్యటన నేపథ్యంలో కాళేశ్వరం దేవస్థానం, మేడిగడ్డ, నస్తుర్పల్లిలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మూడు చోట్ల హెలిపాడ్లు సిద్ధం చేశారు. కాళేశ్వరం దేవస్థానంలో పూలతో డెకెరేషన్స్ చేశారు. పూజా కార్యక్రమాలు, భూమిపూజ కోసం దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మేడిగడ్డలో సమీక్ష నిర్వహిస్తుడండంతో అంబట్పల్లిలోని గెస్ట్హౌస్లో ఏర్పాట్లు చేశారు. నస్తుర్పల్లిలో సుమారు 40 ఎకరాల్లో సభాప్రాంగణం, విద్యుత్ లైట్లు, ఇతర ఏర్పాట్లు చేశారు. 20 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు, హెలిపాడ్ సిద్దం చేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, డీఎస్పీ సూర్యనారాయణతో పాటు జిల్లా అధికారుల పనులు పూర్తి చేశారు. జనసమీకరణ.. కాటారం సబ్డివిజన్తో పాటు పక్క జిల్లాల నుంచి భారీ ఎత్తున సభకు ప్రజలు, రైతులు తరలి రావడానికి నాయకులు జన సమీకరణ చేపట్టారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు, ఆహార పదార్థాలు సమకూర్చనున్నారు. భారీగా ప్రజలను సభకు తీసుకురావాలని సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులకు మంత్రి శ్రీధర్బాబు సూచించారు. రూ.200 కోట్లతో కాళేశ్వరాలయం రాతి నిర్మాణ పనులకు భూమి పూజ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ సందర్శన కాటారం మండలం నస్తుర్పల్లిలో రైతు భరోసా నిధుల విడుదల ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
మీరే ఓ ఎన్యుమరేటర్..
ప్రశ్నావళికి సమాధానాలివ్వండివరంగల్ అర్బన్: జనగణన ప్రక్రియ ఆరంభమైంది. ప్రజలే స్వచ్ఛందంగా పొర్టల్లో స్వీయ గణన చేసుకునే వెలుసుబాటును ప్రభుత్వాలు కల్పించాయి. గతంలో ఎన్యుమరేటర్లు ఇంటింటికి వచ్చి వివరాలు సేకరించే వారు. ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్, ల్యాప్టాప్ ద్వారా స్వయంగా ఎవరికి వారే వివరాలు నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం నిర్వహించే జనాభా గణన లేదా ఇతర సరేల్లో ప్రజలు ఎన్యుమరేటర్లు కీలక పాత్ర పోషించేవారు. కానీ, జనగణనలో ఎన్యుమరేటర్ల సహాయం లేకుండానే అధికారిక పోర్టల్ ద్వారా తమ కుటుంబ సభ్యులు, ఇతర వివరాలు నమోదు చేసుకునేందుకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ తీసుకొచ్చారు. సమాచార గోప్యంతోపాటు సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. లాగిన్ అవ్వండిలా.. తొలుత ఎస్ఈ.సీఈఎన్ఎస్యూఎస్.జీవోవి.ఇన్’ అనే అధికారిక పొర్టల్ను సందర్శించాలి. అక్కడ లాగిన్ ప్రక్రియలో రాష్టం, క్యాప్చా నమోదు చేసి వెరిఫై చేయాలి. అనంతరం యాజమాని పేరు, ఫోన్ నంబరు. ఈ మెయిల్ ఐడీ నమోదు చేస్తే ఫోన్కు ఆరు అంకెల ఓటీపీ వస్తోంది. వీటిని నమోదు చేసిన అనంతరం ప్రక్రియ ప్రారంమవుతుంది. శాటిలైట్ మ్యాప్ కనిపిస్తూనే చిరునామా, పిన్కోడ్ నమోదు చేయమని అడుగుతుంది. మీరిచ్చే సమాచారం ఆధారంగా ఆక్షాంశాలు, రేఖాంశాల వివరాలు తీసుకుని.. మీ ఇంటిని మ్యాప్లో నమోదు చేస్తోంది. అనంతరం ప్రశ్నావళి మొదలవుతుంంది. మీ ఇల్లు మట్టితో కట్టిందా? సిమెంట్ ఇటుకలతోనా? గోడల పరిస్థితి ఏంటి? ఇల్లు ప్రస్తుతం ఏస్థితిలో ఉంది? ఇలా సూమారు 30 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాలి. కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు, విద్యార్హతలు, ఇలా అన్నీ నమోదు చేశాక సేవ్ చేసుకుంటూ వెళ్లాలి. చివరకు ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక ఓ రెఫరెన్స్ నంబర్ వస్తుంది. దాన్ని ము న్ముందు ఎన్యుమరేటర్ మన ఇంటికి వచ్చినప్పుడు ఇస్తే చాలు. మళ్లీ మన వివరాలను వారికీ చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈనెల 16 నుంచి 30 వరకు స్వీయ లెక్కింపునకు అవకాశం కల్పించారు. పోర్టల్లో తెలుగు సహా అన్ని ప్రాంతీయ భాషల్లో వివరాలు నమో దు చేసుకునే సౌకర్యం కల్పించారు. ఈ పోర్టల్ ద్వారా ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా చూడాలని హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మహా నగర ప్రజలంతా ఈ ప్రక్రియలో భాగస్వాములై స్వీయ గణన చేసుకునే వెసులుబాటును వినియోగించుకోవాలని, అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. వివరాల్ని సొంతగా నమోదు చేసుకునే అవకాశం నగరంలో ప్రారంభమైన స్వీయ జనగణన విస్తృతంగా ప్రచారం చేయండి: హనుమకొండ కలెక్టర్ -
మే మాసంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందడి
778సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వేళయ్యింది. ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని శనివారం కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెలలోనే ‘పరిషత్’ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహించిన ప్రభుత్వం.. ‘పరిషత్’ ఎన్నికలకు పచ్చజెండా ఊపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రక్రియ పూర్తయితే వచ్చే నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 23వ తేదీలోపే ఓటర్ల జాబితా.. 2025, జూలై 10 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం నవీకరించిన జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని కలెక్టర్లకు జారీ చేసిన ఆదేశాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ జాబితాలో నియోజకవర్గాల్లోని అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించి, వాటిని సంబంధిత పంచాయతీ, పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలకు జత చేయాలని ఆదేశించింది. వీటి ఆధారంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీల పరిధి గ్రామ పంచాయతీలు, పోలింగ్ స్టేషన్ల వారీగా కొత్త జాబితాలను రూపొందించాలని తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ జాబితాలను జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) ధ్రువీకరణ అనంతరం, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) యూజర్ మాన్యువల్ సూచనల ప్రకారం పోలింగ్ సెంటర్లకు అనుసంధానించాలని పేర్కొంది. ఆ డేటాలో ఏవైనా తేడాలున్నట్లు గమనిస్తే, వాటిని ఈ నెల 23వ తేదీలోపు ఎన్నికల సంఘానికి నివేదించాలని సూచించింది. ఈ మేరకు ఈ నెల 23లోపు ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేసి ప్రచురించేందుకు వీలుగా జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. 23 తర్వాత అభ్యంతరాలు, సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని తుది జాబితాను విడుదల చేసి, ఆ తర్వాత పోలింగ్ సెంటర్లు, బ్యాలెట్ బాక్సులు, ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించనున్నారు. ‘పరిషత్’లో ‘ఆమె’కే ప్రాధాన్యం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో మొత్తం 30,43,540 మంది ఓటర్లు ఉంటే, అందులో పురుషులు 14,89,606 కాగా, మహిళా ఓటర్లు 15,51,289 మంది ఉన్నారు. ఇతరులు (థర్డ్జండర్) 504 కాగా, సర్వీసు ఓటర్లు 2,141. ఆరు జిల్లా ప్రజా పరిషత్లు ఉండగా ములుగు ఎస్టీ మహిళ, హనుమకొండ, జనగామ ఎస్సీ మహిళలకు కేటాయించారు. అదే విధంగా 75 జెడ్పీటీసీలకు 38, 39 ఎంపీపీ స్థానాలు మహిళలకు దక్కనున్నాయి. అలాగే 778 ఎంపీటీసీ స్థానాల్లో 399 చోట్ల మహిళలకే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనాలు చెబుతున్నాయి. ఉమ్మడి వరంగల్లో ‘స్థానిక’ వివరాలు ఇలా... జెడ్పీపీపీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు ఈ నెల 23లోపు ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశం ముసాయిదా జాబితాపై అధికారుల కసరత్తు రాజకీయ పార్టీల్లో మొదలైన సందడి... మహిళలకు భారీగా అవకాశాలు మొత్తం జిల్లాలు 06ప్రయత్నాలు మొదలెట్టిన ఆశావహులు.. 7506ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో ‘పరిషత్’ సందడి మొదలైంది. వాస్తవానికి 2025 సెప్టెంబర్లో ఈ ఎన్నికలు జరుగుతాయని భావించినా రిజర్వేషన్లు, కోర్టు కేసుల కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలతో ఆశావహులు కొందరు సరిపెట్టుకోగా.. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులపై కన్నేసిన మరికొందరు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. తాజాగా ఓటర్ల ముసాయిదా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆశావహుల్లో సందడి మొదలైంది. మే మాసంలో ఎన్నికలు ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల టికెట్లపై పోటీ చేసేందుకు ఆశావహులు ఆయా పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలను కలిసే పనిలో పడ్డారు. -
స్విమ్మింగ్.. బెట్టింగ్!
హనుమకొండ గోపాలపురంలోని వెంకటేశ్వరకాలనీకి చెందిన గట్ల రాజేశ్ ఇంటిలో ఈనెల 10న ఐపీఎల్ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. అతడితో పాటు 11 మంది బెట్టింగ్రాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1,06,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఖిలా వరంగల్ మండలంలోని ఓ స్విమ్మింగ్ పూల్ ప్రాంగణంలో ఐపీఎల్ క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న టి.భరత్తో పాటు బెట్టింగ్రాయుళ్లు ఎం.శ్రీనివాస్, ఎల్.వెంకన్న, పి.శ్రీధర్, వి.రమేశ్ను టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1,02,000 నగదు, ఐదు స్మార్ట్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో నిర్వాహకుడు, ఇద్దరు బెట్టింగ్రాయుళ్లు అక్కడి నుంచి పరారయ్యారు. సాక్షి, వరంగల్: ఐపీఎల్ వేళ బెట్టింగ్ నిర్వాహకులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు సరికొత్త పంథాలో అడ్డాలను ఎంచుకుంటూ వ్యాపారం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఇళ్లు, హోటళ్లు, హాస్టళ్లు ఉంటే.. ఇప్పుడు పోలీసులు పెద్దగా దృష్టి సారించని స్విమ్మింగ్ పూల్స్, రిసార్ట్లు, ఫాంహౌస్ల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఖిలా వరంగల్ మండలంలోని ఓ స్విమ్మింగ్ పూల్లో శుక్రవారం రాత్రి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తితోపాటు నలుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని మిల్స్కాలనీ పోలీసులకు అప్పగించారు. ఎంజాయ్మెంట్ పేరుతో యువతను ఆకర్షించి బెట్టింగ్లోకి లాగుతున్నట్లు పోలీసులు దాడులతో తెలుస్తోంది. అయితే రిసార్ట్లు, ఫాంహౌస్లపై కూడా పోలీసులు దృష్టి సారిస్తే బెట్టింగ్ను నిలువరించవచ్చన్న డిమాండ్ వినిపిస్తోంది. నిర్వాహకులకు కమీషన్, లాభాల్లో వాటా.. ఇన్స్ట్రాగామ్లో యాడ్స్గా వస్తున్న క్రిక్ఎక్స్బెట్.99.విన్, బీఎస్ఎఫ్2020.కామ్ తదితర క్రికెట్ బెట్టింగ్ యాప్ల్లో నిర్వాహకులు కొందరు యూజర్ ఐడీ, పాస్వర్డ్ పొందుతున్నారు. వీరికి ప్రతి బెట్టింగ్పై ఐదు నుంచి పది శాతం కమీషన్, అలాగే లాభాలను 70ః30 నిష్పత్తిలో ఇస్తున్నారు. వీరే బెట్టింగ్రాయుళ్లను ఒక ప్రదేశానికి రప్పించి వారి నుంచి డబ్బు తీసుకొని ఈ బెట్టింగ్ వైపు మళ్లిస్తున్నారు. ప్రతి మ్యాచ్, ప్రతి బాల్పై కూడా లైవ్ యాడ్స్ చూపించి బెట్టింగ్ కాసేలా చూస్తున్నారు. ఇలా డిపాజిట్, బెట్టింగ్, ఫలితం, విత్ డ్రా నిమిషాల్లోనే ముగుస్తుంది. కొన్ని సైట్లు చిన్న మొత్తాలు చెలించి నమ్మకం కలిగించి పెద్ద మొత్తాలు పెట్టగానే వారి ఆశను క్యాష్ చేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో మ్యూల్ అకౌంట్ల ద్వారా చెల్లించి ట్రేస్ కాకుండా చూసుకుంటున్నారు. ఎ క్కువ మంది బెట్టింగ్రాయుళ్లు ఓడిపోవడమే వారి కి ప్రధాన ఆదాయ వనరు అని పోలీసులు గుర్తించారు. ఇళ్లు, హోటళ్లు కాదు.. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్ అడ్డా ఖిలా వరంగల్ మండలంలో టాస్క్ఫోర్స్ దాడులతో వెలుగులోకి ఎంజాయ్మెంట్ పేరుతో యువకులకు వల.. ఆపై దందా -
మిద్దె తోటలతో ఆహ్లాదం
వరంగల్ అర్బన్: మిద్దె తోటల (టెర్రాస్ గార్డెనింగ్)తో పచ్చదనం, ఆహ్లాదం, ఆరోగ్యం కలుగుతుందని, అందుకోసం బల్దియా ప్రోత్సాహం ఇస్తుందని మేయర్ గుండు సుధారాణి తెలిపారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పురపాలక శాఖ డైరెక్టర్ అండ్ కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణ ప్రాంతాల్లో మిద్దె తోటల పెంపకంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మేయర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టెర్రాస్ గార్డెనింగ్ వల్ల గాలిలోని హానికర వాయువులు నియంత్రణలోకి వస్తాయని పేర్కొన్నారు. మిద్దైపె సహజ పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలు సాగు చేసుకోవడంతో ఆరోగ్యకర ఆహారం అందుబాటులోకి వస్తుందని, శుద్ధమైన గాలి లభిస్తుందన్నారు. ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రత్యేకంగా ఉద్యానవన విభాగ సిబ్బందిని నియమించాలన్నారు. అనంతరం సీడీఎంఏ నుంచి వచ్చిన హార్టికల్చర్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా బాలసముద్రం ప్రాంతంలో సీటీజీ సభ్యురాలు రాణి ఇంటి వద్ద నిర్వహిస్తున్న మిద్దె తోటను పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర టెర్రస్ గార్డెన్ నోడల్ అధికారి హేమలత, రాష్ట్ర అర్బన్ ఫార్మింగ్ హార్టికల్చర్ అధికారి మంగ, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్ఓ రమేశ్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, హెచ్ఓ లక్ష్మారెడ్డి, రిటైర్డ్ ఎఫ్ఆర్ఓ పురుషోత్తం, శానిటరీ సూపర్వైజర్లు భాస్కర్, గోల్కొండ శ్రీనివాస్, నరేందర్, టెర్రస్ గార్డెన్ నిర్వాహకులు, ఔత్సాహికులు తదితరులు పాల్గొన్నారు. మేయర్ గుండు సుధారాణి పెంపకంపై అవగాహన సదస్సు -
ఘన చరిత్రను భావితరాలకు అందించాలి
హన్మకొండ కల్చరల్: వరంగల్ నగరానికి ఉన్న ఘనమైన చరిత్రను భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అని పలువురు వక్తలు అన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని (వరల్డ్ హెరిటేజ్ డే) పురస్కరించుకుని శనివారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో ‘కుడా’, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రా మ్రెడ్డి, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ట్రస్టీలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు బీవీ పాపారావు, బీపీ ఆచార్య, ప్రొఫెసర్ పాండురంగారావు పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. వరంగల్ ప్రత్యేకమైన చారిత్రక ప్రదేశాలు కలిగి ఉన్న నగరమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారసత్వ పరిరక్షణకు కృషి చేస్తున్నాయన్నారు. అనంతరం నగరానికి చెందిన పేరిణి నృత్యగురువు గజ్జెల రంజిత్ శిష్యబృందం చేసిన పేరిణి లాస్యం, పేరిణి శివతాండవం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి, కుడా సీపీఓ అజిత్రెడ్డి, ఈఈ భీమ్రావు, జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. వరల్డ్ హెరిటేజ్ డేలో వక్తల పిలుపు ఆకట్టుకున్న గజ్జెల రంజిత్ శిష్య బృందం పేరిణి శివతాండవం -
దళితుడి భూమి కబ్జాకు యత్నం
హసన్పర్తి: ఎర్రగట్టు గుట్ట సమీపంలోని దళితుడి భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ తెలిపారు. ఈమేరకు శనివారం ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాంచందర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎర్రగట్టు గుట్ట సమీపంలోని కుమారస్వామి రిజిస్ట్రేషన్ ద్వారా స్థలాన్ని పొందినట్లు పేర్కొన్నారు. మాజీ ప్రజాప్రతినిధి, ప్రస్తుత ప్రజాప్రతినిఽధితో పాటు ఓ జిల్లా అధికారి సహకారంతో ఆ భూమి చుట్టూ గోడ నిర్మాణానికి యత్నిస్తున్నారన్నారు. బాధితుడిని కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యారణ్యపురి: ప్రభుత్వ, హనుమకొండ జిల్లాలో ఎయిడెడ్, ప్రైవేట్ తదితర యాజమాన్యాల పరిధి పాఠశాలల్లో ఒకటి నుంచి 9వ తరగతి వరకు ఈ నెల 8నుంచి ప్రారంభమైన ఎస్ఏ–2 పరీక్షలు శనివారంతో ముగిశాయి. వెంటనే జవాబుపత్రాలను సంబంధిత ఉపాధ్యాయులు మూల్యాంకనం పూర్తిచేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. 23న అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించి విద్యార్థుల ప్రగతి పత్రాలు అందజేయాల్సింటుందని డీసీఈబీ సెక్రటరీ డాక్టర్ బిరాంధన్ తెలిపారు. ఈనెల 24నుంచి జూన్ 11వరకు వేసవి సెలవులు ఉంటాయి. మళ్లీ పాఠశాలలు జూన్12 నుంచి పునఃప్రారంభం అవుతాయని డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ తెలిపారు. కాజీపేట అర్బన్: రైతు భవిష్యత్ను ఆయిల్పామ్ సాగు మారుస్తుందని, తెలంగాణలో కొత్త వ్యవసాయ విప్లవం మొదలైందని తెలంగాణ ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తెలిపారు. కాజీపేట మండలం టేకులగూడెంలో శనివారం ఏర్పాటు చేసిన ఆయిల్పామ్ సాగు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, హర్టికల్చర్ అధికారులు, ఆయిల్ఫెడ్ ప్రతినిధులు, రైతులున్నారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ యువజన, క్రీడల శాఖ అధికారిగా కొత్త ప్రశాంత్ను నియమిస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వీసీఅండ్ఎండీ సోనీబాలాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు డీడీగా పదోన్నతి పొందిన డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ నుంచి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రశాంత్ కరీంనగర్, హనుమకొండ డీఎస్ఏలో బాస్కెట్బాల్ కోచ్గా విధులు నిర్వహించారు. హన్మకొండ: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ కోసం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు ఇండియా కూటమి తూట్లు పొడిచిందని మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్ విమర్శించారు. మహిళా సాధికారత, నియోజకవర్గాల పునర్విభజన భారత ప్రజాస్వామ్యానికి ఎంతో ముఖ్యమైన అంశమని శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ఈ దేశాన్ని 64 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ పాలనలో బిల్లులు పెట్టి అమలు చేయక మహిళలను మోసం చేసిందని తూర్పారబట్టారు. రాహుల్ గాంధీ వంటి నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నంతకాలం కాంగ్రెస్ అధికారంలోకి రాదని విమర్శించారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా, బీదరికం పెరుగుతుందని కుటుంబ నియంత్రణ పేరుతో దాదాపు 50 ఏళ్లుగా డీలిమిటేషన్కి అడ్డుపడింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. దేశంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం 1953లో ఆర్టికల్ 340 మేరకు కాకాకలేల్కర్ కమిషన్ వేసి అందించిన నివేదికను అమలు చేయలేదని విమర్శించారు. 50 ఏళ్లుగా ఎదురుచూస్తున్న దేశ ప్రజల కోరిక, ఆశయం.. నరేంద్ర మోదీ నాయకత్వంలో నెరవేరితే, భవిష్యత్లో అధికారంలోకి రాలేమని ఇండియా కూటమి అడ్డుపడడం దుర్మార్గమని దుయ్యబట్టారు. -
నియోజకవర్గంలో విస్తృత అభివృద్ధి
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి రామన్నపేట: నియోజకవర్గంలో రూ.కోట్ల నిధులతో విస్తృతంగా డ్రెయినేజీలు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం ప్రజాపాలన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 29వ డివిజన్ పోతననగర్ ప్రాంతంలో యుఐడీఎఫ్ అండ్ సా డ్యూటీ నిధుల ద్వారా రూ.8.25 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయిని కలెక్టర్, మేయర్తో కలిసి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా బల్దియా జనరల్ ఫండ్ ద్వారా రూ.1.87 కోట్లతో కుంటి భద్రయ్య దేవస్థానం సమీపంలో డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, 11వ డివిజన్ పోతన రోడ్డులో రూ. 99.50 లక్షలతో మరో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ విజయలక్ష్మి సురేందర్, మాజీ కౌన్సిలర్ బుద్దజగన్, తదితరులు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
వరంగల్ క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, నిత్యం తాగి ఇబ్బందులకు గురిచేస్తున్నాడనే నెపంతో రూ.5లక్షలు సుఫారీఇచ్చి భర్తను హత్య చేయించింది ఓభార్య. ఈ ఘటనకు సంబంధించి ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈనెల 8న పరకాలకు చెందిన మడికొండ సాంబయ్య తన కుమారుడు మడికొండ సుమన్ భరత్ (38) కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మడికొండ సుమన్ భరత్కు 2012 సంవత్సరంలో భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రాములపల్లికి చెందిన లావణ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అనంతరం లావణ్యకు పరకాల పట్టణంలోని ఇమ్మడి నరేశ్తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ విషయంలో మడికొండ సుమన్ భరత్ రోజు తాగి వచ్చి లావణ్యను హింసించేవాడు. దీంతో లావణ్య తన తమ్ముడు పెండల రాజు, ప్రియుడు ఇమ్మడి నరేశ్తో కలిసి సుమన్ భరత్ను హత్య చేయడానికి ప్లాన్ వేసింది. దీంతో ప్రియుడు ఇమ్మడి నరేష్కు పరిచయం ఉన్న గోవిందరావుపేటకు చెందిన చిరంశెట్టి వెంకటేశ్వర్లతో హత్యకు బేరం కుదుర్చుకున్నారు. బంగారం కుదువపెట్టి సుపారీ ఇచ్చి.. లావణ్య తన బంగారం కుదువ పెట్టి రూ.1,59,000, ఇమ్మడి నరేశ్, పెండల రాజు కలిసి రూ.3లక్షలు పోగు చేసి మొత్తం రూ.4,59,000 చిరంశెట్టి వెంకటేశ్వర్లుకు ఇచ్చి సుమన్భరత్ను హత్య చేయించారు. వెంకటేశ్వర్లు మరో వ్యక్తి భూక్య రాకేశ్తో కలిసి సుమన్ భరత్కు మద్యం, డబ్బులు ఆశ చూపి ఈనెల 3న రాత్రి 8 గంటలకు ములుగుకి పిలిపించారు. అక్కడినుంచి చిరంశెట్టి వెంకటేశ్వర్లు వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లి సుమన్ భరత్కి మద్యం తాగించారు. అతను మత్తులో లేవలేని స్థితిలో ఉండగా చిరంశెట్టి వెంకటేశ్వర్లు బీర్ బాటిల్తో భరత్ తల వెనక భాగంలో కొట్టగా సుమన్ భరత్ పడిపోయాడు. అనంతరం వారు ముందే తెచ్చి పెట్టుకున్న పెట్రోల్ భరత్ ఒంటిపై పోసి నిప్పంటించారు. భరత్ మృతదేహం కాలుతుండగా.. భూక్యా రాకేశ్, చిరంశెట్టి వెంకటేశ్వర్లు ఫోన్లో ఫోటోలు, వీడియో తీసి, మరుసటి రోజు ములుగుకు వచ్చిన లావణ్య, పెండల రాజుకు చూపించారు. దీంతో సుఫారీలో మిగిలిన డబ్బులను వారు అప్పగించారు. అనంరతం లావణ్య తన అత్తగారి ఇల్లు అయిన పరకాలకి వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉంది. ఈనెల 5న చిరంశెట్టి వెంకటేశ్వర్లు రాత్రి 10 గంటలకు పొలం వద్దకు వెళ్లి భరత్ కాలిపోగా మిగిలిన ఎముకలను పక్కనే ఉన్న వాగులో పడేశాడు. దర్యాప్తులో భాగంగా పరకాల పోలీసులు చిరంశెట్టి వెంకటేశ్వర్లు, భూక్య రాకేశ్ను గోవిందరావుపేట శివారులోని చిరంశెట్టి వెంకటేశ్వర్లు వ్యవసాయ భూమి వద్దకు తీసుకెళ్లి కాల్వలోని భరత్ ఎముకలు, బూడిద, కాలిచ్చి పడేసిన సిగరెట్ పికలు, బీర్ బాటిల్ ముక్కలు, మందు బాటిళ్ల మూతలు, ప్లాస్టిక్ ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా.. హత్య కేసును చేధించి నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన పరకాల ఏసీపీ సతీష్బాబు, ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్నాయక్ను డీసీపీ అంకిత్ కుమార్ అభినందించారు. భర్తను హత్య చేయించిన భార్య హత్యకు రూ.5 లక్షల సుపారీ ప్రియుడు, తమ్ముడితో కలిసి హత్యకు ప్రణాళిక మృతదేహాన్ని దహనం చేస్తూ వీడియో తీసిన నిందితులు వివరాలు వెల్లడించిన ఈస్ట్ జోన్ డీసీపీ -
అథెరా ఫెస్ట్ షురూ
కేయూ క్యాంపస్: ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకే టెక్నికల్ ఫెస్ట్ దోహదం చేస్తుందని కేయూ వీసీ ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలోని కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు మూడు రోజుల టెక్నికల్ ఫెస్ట్ ‘అథెరా 2026’ ఆడిటోరియంలో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా వీసీ ప్రతాప్రెడ్డి హాజరై మాట్లాడుతూ.. సాంకేతిక, సాంస్కృతిక క్రీడాకార్యక్రమాల సమ్మేళనంగా రూపుదిద్దుకున్న ఈ ఉత్సవం విద్యార్థుల్లో ఉత్సాహం నింపుతుందన్నారు. తొలిరోజు ప్రాజెక్ట్ ఎక్స్పో, పేపర్ ప్రజెంటేషన్లు వంటి సాంకేతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈనెల 18న సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తమ సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శించనున్నారు. ఈనెల 19న పూర్వవిద్యార్థుల సమ్మేళనం, వివిధ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎన్.రమణ, నిట్ ప్రొఫెసర్ పి.శ్రీహరి రావు, కన్వీనర్లు డాక్టర్ బి.రాధిక, ఎండీ ఆసిం ఇక్బాల్, కె.సుమలత, వి.మహేందర్, ఎన్.సత్యప్రసాద్, కె.శ్రీధర్కుమార్ పాల్గొన్నారు. -
పెరిగిన విద్యుత్ వినియోగం
హన్మకొండ: మండుతున్న ఎండలు.. వడగాలలు.. ఉక్కపోతతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఇళ్లకే పరిమితమైన జనం భానుడి ప్రతాపం నుంచి ఉపశమం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే పంటలు చేతికొచ్చే దశ కావడంతో వ్యవసాయానికి విద్యుత్ వినియోగం తగ్గుతోంది. గతఏడాదికంటే ఎక్కువే.. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఏప్రిల్లో కరెంట్ వాడకం పెరిగిందని సంబంధిత శాఖ వెల్ల డించిన లెక్కల ప్రకారం తెలుస్తుంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఈ నెల 11న విద్యుత్ డిమాండ్ 5,195 మెగావాట్లకు చేరుకుంది. గత ఏడాది ఏప్రిల్ 11న కేవలం 3,249 మెగావాట్లే ఉండడం గమనార్హం. ఈ నెల 12న 5,209 మెగావాట్లు ఉండగా గతేడాది 3,297 మెగావాట్లు ఉంది. 13న 4,649 మెగావాట్లు నమోదవ్వగా గతేడాది ఇదే సమయంలో 3,214 మెగావాట్లుగా ఉంది. ఈ నెల 14న 4,438 మెగావాట్లు నమోదవగా గతేడాది ఇదే సమయంలో 3,127గా ఉంది. ఈ నెల 15న 4,380 మెగావాట్లు నమోదవగా గతేడాని ఇదే రోజు 3,115గా ఉంది. ఈ నెల 16న 4,245 మెగాట్లు నమోదవగా గతేడాది ఇదే తేదీన 2,800 మెగావాట్లుగా ఉంది. యూనిట్ల వినియోగం(మిలియన్లలో..) టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగం ఈ నెల 11న 87.54 మిలియన్ యూనిట్లుగా ఉండగా గతేడాది ఇదే తేదీన 61.21 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగింది. ఏప్రిల్ 12న గతేడాది 62.89 మిలియన్ యూనిట్లు వినియోగించగా ఈ నెల 12న 87.13 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఏప్రిల్ 13న గతేడాది 62.01 మిలియన్ యూనిట్లు ఉండగా ఈ ఏడాది 82.17కు చేరుకుంది. ఏప్రిల్ 14న గతేడాది 60.46 మిలియన్ యూనిట్లు ఉండగా ఈ ఏడాది 80.76కు చేరుకుంది. ఏప్రిల్ 15న గతేడాది 59.87 మిలియన్ యూనిట్లు ఉండగా ఈ ఏడాది 79.42కు చేరుకుంది. ఏప్రిల్ 16న గతేడాది 52.43 మిలియన్ యూనిట్లు ఉండగా ఈ ఏడాది 74.32 యూనిట్లకు చేరుకుంది. ప్రతి ఏటా విద్యుత్ వినియోగం వేసవిలో ఎక్కువగానే ఉంటుంది. వేసవిని దృష్టిలో ఉంచుకుని నాలుగు నెలల ముందుగానే విద్యుత్ అధికారులు వేసవి కార్యచరణ తయారు చేసుకుని పెరుగనున్న విద్యుత్ వినియోగం, డిమాండ్ను అంచనా వేసుకుని ముందస్తు చర్యలు చేపట్టి అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగనుండడంతో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశముంది. ఇదే క్రమంలో వ్యవసాయానికి సాగు నీటి వినియోగం తగ్గనుండంతో విద్యుత్ వినియోగం, డిమాండ్ నిలకడగా ఉండే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు భావిస్తున్నారు. మండుతున్న ఎండలు ఉక్కపోతతో పెరిగిన కూలర్లు, ఏసీలు, ఫ్యాన్ల వినియోగం పంటలు చేతికొస్తుండడంతో వ్యవసాయానికి తగ్గిన వినియోగం ఈ నెల 16న టీజీ ఎన్పీడీసీఎల్ 4,245 మెగావాట్ల డిమాండ్ గతేడాది ఏప్రిల్ 16న 2,800 మెగావాట్లే.. -
సీకేఎం కళాశాలలో మూడు కొత్త కోర్సులు
కాశిబుగ్గ: వరంగల్ దేశాయిపేటలోని ప్రభుత్వ సీకేఎం డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి మూడు నూతన డిగ్రీ కోర్సులు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన వాల్పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ డె యిరీ అండ్ పౌల్ట్రీ మేనేజ్మెంట్, బీకాం హ్యూమన్ రిసోర్స్ ఆపరేషన్స్ అనే కొత్త కోర్సులు ఈ సంవత్సరం నుంచి ప్రారంభమైనట్లు తెలిపారు. అడ్మిషన్ల కోసం దోస్త్ నోటిఫికేషన్ అనుసరించి ఆన్లైన్లో వరంగల్ సీకేఎం కళాశాలను సెలెక్ట్ చేసుకుని, విద్యాభ్యాసం కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైఎస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వరప్రసాద్, విజయ్పాల్రెడ్డి, దోస్త్ అండ్ అడ్మిషన్స్ కన్వీనర్ సతీశ్కుమార్, వెంకటేశ్వర్లు, లైబ్రేరియన్ అనిల్కుమార్, శ్రీనివాస్, పాషా, స్రవంతి, హరిబాబు, మమత, జయంతి పాల్గొన్నారు. -
గాయత్రి చిల్లీస్ ట్రేడర్స్ యజమాని అరెస్టు
ఖిలా వరంగల్: వ్యాపారుల నుంచి మిర్చి కొనుగోలు చేసి బోర్డ్ తిప్పేసి పరారైన గాయత్రి చిల్లీస్ ట్రేడర్స్ యజమానిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏనుమాముల ఇన్స్పెక్టర్ జవ్వాజి సురేష్ శుక్రవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ దేశాయిపేట శివారు లక్ష్మీ టౌన్షిప్కు చెందిన లడే తిరుపతి.. గాయత్రి చిల్లీస్ ట్రేడర్స్ పేరుతో లైసెన్స్ తీసుకుని మిర్చి వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల 49 మంది మిర్చి వ్యాపారుల నుంచి సుమారు రూ.2కోట్లపైగా మిర్చి కొనుగోలు చేసి బోర్డ్ తిప్పేసి పరారయ్యాడు. వ్యాపారుల ఫిర్యాదు మేరకు లడే తిరుపతి, అతని భార్య మాధవి, కుమార్తె సిరిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో నిందితుడి భార్య, కుమార్తె పరారీలో ఉండగా.. శుక్రవారం ఉదయాన్నే వరంగల్ లక్ష్మీ టౌన్ షీప్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న తిరుపతిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు. నస్తూర్పల్లి నుంచి ‘రైతు భరోసా’ రెండో విడత భూపాలపల్లి: కాటారం మండలం నస్తూర్పల్లిలో ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి రైతు భరో సా రెండో విడత నిధులను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ ఠాకూర్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్తో కలిసి జిల్లా అధికా రులతో మంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 20వ తేదీన సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్రెడ్డి.. మేడిగడ్డ, కాళేశ్వరం సందర్శిస్తారని తెలిపా రు. అనంతరం కాటారం మండలం నస్తూర్పల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభలో రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేస్తారని తెలిపా రు. ఆయా కార్యక్రమాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సీఎం బహిరంగ సభకు ప్రజాప్రతినిధులు, ప్రజలు, రైతులు అధికసంఖ్యలో తరలిరావాలని శ్రీ ధర్బాబు కోరారు. సమావేశంలో డీఎఫ్ఓ నవీన్రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి పాల్గొన్నారు. ధర్మ పరిరక్షణకు కృషి చేయాలిఖిలా వరంగల్: హిందూవులు తమ ఐక్యతను చాటుతూ సనాతన హిందూ ధర్మ పరిక్షణకు కృషి చేయాలని భువన్వేరీ పీఠాధిపతి కమలానంద భారతి స్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి వరంగల్ కరీమాబాద్ రోడ్డులోని రామస్వామి గుడి ఆవరణలో ఓరుగల్లు హిందూ సమ్మేళన సమితి, కరీమాబాద్ శాఖ అధ్యక్షుడు కుసుమ దయాకర్, కార్యదర్శి బాల్నె అనిల్కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీశ్ అధ్యక్షతన హిందూ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిఽథి గా స్వామిజీ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో కాచం రమేశ్జీ, డాక్టర్ సునిత రాంమోహన్ రెడ్డి, కార్పొరేటర్లు అరుణ, పోశాల పద్మ, పల్లం పద్మ, నాగరాజు, దీన్దయాళ్, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
గోల్డెన్ అవర్లో చికిత్స అందిస్తే బతుకుతారు
● ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్రావు వరంగల్ క్రైం: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ప్రమాదం జరిగిన గంటలోపు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తే బతికే అవకాశాలు అధికమని ట్రాఫిక్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్రావు తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘అరైవ్ అలైవ్’రోడ్డు భద్రతా కార్యక్రమంలో 5వ రోజు రోడ్డు ప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనపై ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండ పోలీస్ స్టేషన్ ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రభాకర్రావు మాట్లాడారు. అనంతరం వైద్యులు సీపీఆర్ చేయడంపై వివరించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రాహ్–వీర్’పథకం, ‘పీఎం రాహత్’పథకాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సిబ్బందికి అధికారుల చేతుల మీదుగా కూలింగ్ గ్లాసులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏసీపీలు సత్యనారాయణ, నర్సింహారావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సీతారెడ్డి, వెంకన్న, సుజాత, ఇన్స్పెక్టర్ శివకుమార్ , సిబ్బంది పాల్గొన్నారు. -
యువజనోత్సవాలతో సృజనాత్మకత
కేయూ క్యాంపస్: విద్యార్థుల్లోని ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకు జాతీయ సేవాపథకం (ఎన్ఎస్ఎస్ )యువజనోత్సవాలు దోహదం చేస్తాయని కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పరిపాలనా భవనంలోని సెనెట్ హాల్లో నిర్వహించిన యువజనోత్సవాల ప్రారంభ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చదువుతోపాటుగా సాంస్కృతి ప్రతిభను కూడా పెంపొందించుకోవాలన్నారు. పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య ఈసం నారాయణ, కేయూ స్డూడెంట్స్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల కోఆర్డినేటర్లు ప్రసన్నకుమార్, అనిల్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం యూనివర్సిటీ స్థాయిలో వ్యాసరచన, వృక్తత్వ పోటీలు, పద్య రచన, క్విజ్, డిబేట్, రంగోళి, పోస్టర్ పేయింటింగ్, సోలో ఇన్స్ట్రుమెంటేషన్, గ్రూప్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్, ఎగ్జిబిషన్ పోటీలను నిర్వహించారు. 12 ఈవెంట్స్లతో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విజేతలకు వీసీ ప్రతాప్రెడ్డి బహుమతులను అందజేశారు. క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై టాస్క్ఫోర్స్ దాడిఖిలా వరంగల్: ఖిలావరంగల్ మధ్యకోటలోని ఓ రహస్య స్థావరంలో ఐపీఎల్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు టాస్క్ఫోర్స్ అధికారులకు శుక్రవారం పక్కా సమాచారం అందింది. ఆ స్థావరంపై ఆకస్మికంగా దాడిచేసి ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి వారినుంచి రూ.1.02లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. తదిపరి చర్యల నిమిత్తం కేసును మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ● కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి ● ఉత్సాహంగా ఎన్ఎస్ఎస్ యువజనోత్సవాలు -
కేయూ డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 20వ తేదీ నుంచి నిర్వహించనున్న డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ రెండు, నాలుగు, ఐదు, ఆరో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్లో జిల్లాలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు శుక్రవారం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్కు వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి తీవ్రత అధికంగా ఉందని, దీంతో ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్ తదితర చోట్ల వివిధ గ్రామీణ ప్రాంతాలనుంచి విద్యార్థులు 25 కిలోమీట్లర్ల నుంచి 50 కిలోమీటర్లవరకు పరీక్షా కేంద్రాలకు వెళ్లి పరీక్షలు రాయాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని రిజిస్ట్రార్ రామచంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలున్నాయని విద్యార్థులు పరీక్షలు హాజరయ్యేందుకు.. ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బంది పడతారని తెలిపారు. ఈనేపథ్యంలో కనీసం 15 రోజులు డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. స్పందించిన రిజిస్ట్రార్ రామచంద్రం పరీక్షల నియంత్రణాధికారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సతీష్రెడ్డి, ఎస్.రవి, శ్రీధర్, అహ్మద్పాషా, లక్ష్మీనర్సయ్య, పరిమల్ తదితరులు పాల్గొన్నారు. రిజిస్ట్రార్కు ప్రైవేట్ యాజమాన్యాల అసోసియేషన్ వినతి -
బీజేపీ మంత్రులు క్షమాపణ చెప్పాలి
● ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: తెలంగాణ ప్రజలకు బీజేపీ మంత్రులు, తేజస్వి సూర్య తక్షణమే క్షమాపణలు చెప్పాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వీసూర్య తెలంగాణను పాకిస్తాన్తో పోల్చడం అత్యంత దుర్మార్గమన్నారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపడం మానుకుని సమానత్వంతో వ్యవహరించాలని కోరారు. వ్యాఖ్యలు హాస్యాస్పదం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు హనుమకొండ వేదికగా చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల మనో భావాలను దెబ్బతీసేలా బీజేపీ నేతలు మాట్లాడుతుంటే వాటిని సమర్థించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోకాలడ్డుతున్న బీజేపీ నేతలకు వరంగల్ ప్రజలు తగిన బుద్ది చెబుతారని వెంకట్రామ్రెడ్డి తెలిపారు.డీసీసీ చీఫ్ ఇనగాల ఎమ్మెల్యే నాయిని -
శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
● ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్లో 3,945 మంది ● ఇంటర్లో 7,187 మంది విద్యార్థులువిద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల 20నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2–30నుంచి సాయంత్రం 5–30గంటల వరకు జరుగుతాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఆరు జిల్లాల్లో కలిపి టెన్త్లో 3,945మంది విద్యార్థులకునుగాను 22 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. 197మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఇంటర్లో 7,187మందికిగాను 35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 359మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు హనుమకొండ జిల్లాలో ఏర్పాట్లు పూర్తిచేసినట్లు డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ ఎ.సదానందం శుక్రవారం తెలిపారు. హాల్టికెట్లు సంబంధిత వెబ్సైట్(తెలంగాణఓపెన్స్కూల్.ఓఆర్జీ)లో అందుబాటులో ఉంచారని, విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు కోరారు.కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ను ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకుల బృందం నేడు (శనివారం) ఉదయం 11గంటలకు సందర్శిస్తారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, భూపాలపల్లి జెడ్పీ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి శుక్రవారం ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, శంకర్నాయక్, నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణరెడ్డి, నడిపల్లి దివాకర్రావు, దాసరి మనోహర్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ జ్యోతితో పాటు ముఖ్య నేతలు సందర్శిస్తారని పేర్కొన్నారు. దీంతో ఈనెల 20న సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు మేడిగడ్డ సందర్శనకు రానున్న నేపథ్యంలో ముందుగానే బీఆర్ఎస్ బృందం రానుండడంపై రాజకీయంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల మెయిన్ సెంట్రల్ సర్వర్ మొరాయించింది. దీంతో శుక్రవారం ఒక్క రిజిస్ట్రేషన్ కూడా పూర్తి కాలేదు. రిజిస్ట్రేషన్ నిమిత్తం వచ్చిన వారు నిరాశతో వెనుదిరిగారు. వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 98 స్లాట్లు ప్రతీ రోజు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉండగా.. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వర్ మొరాయించడంతో శుక్రవారం సెంటిమెంట్తో వచ్చిన భూక్రయవిక్రయదారులకు నిరాశే మిగిలింది. కాగా, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఒక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాలేదని సబ్ రిజిస్ట్రార్ సైదులు తెలిపారు. శనివారం సర్వర్ అందుబాటులోకి వస్తే శుక్రవారం నాటి స్లాట్లు రీషెడ్యూల్ చేసుకుని రిజిస్ట్రేషన్లు పూర్తి చేసే అవకాశం ఉంది. కాగా, శుక్రవారం సర్వర్ మొరాయించడంతో ఖజానాకు భారీగా ఆదాయం గండిపడినట్లు అయ్యింది. కాజీపేట: ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) వరంగల్లో నేడు శనివారం ఉదయం 10.30 గంటలకు నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి.వెంకటేశ్వర్ రావు తెలిపారు. కాజీపేట ఐటీఐ భవనంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. దేశంలో పేరొందిన ఎల్అండ్టీ కంపెనీతో పాటు 5 కంపెనీలు జాబ్మేళాకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు జాబ్మేళాకు రావాలని సూచించారు. ఎంపికై తే శిక్షణతో పాటు శాశ్వత ఉద్యోగావకాశం కల్పించేందుకు కంపెనీలు సి ద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు అనిల్కుమార్ 70133 97132, ఎండీ వాసిక్ 9533354944, బి.బాలస్వామి 95333 96401 నంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించారు. హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నేడు (శనివారం) ఉదయం 10 గంటలకు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షురాలు బంక సరళ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి మంత్రి ధనసరి అనసూయ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొంటున్నారని తెలిపారు. ఈపార్టీ ముఖ్య నేతలు పాల్గొనే సమావేశానికి మహిళా కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని సరళ కోరారు. హన్మకొండ: గ్రామాలు, పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటరు జాబితాను నవీకరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా ప్రజాపరిషత్ కార్యనిర్వహణాధికారులు, మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. భారత ఎన్నికల సంఘం 2025 జూలై 10 వరకు ఎన్రోల్ చేసుకున్న ఓటర్లతో తయారు చేసిన తుది జాబితాను 2025 సెప్టెంబర్ 2న విడుదల చేసింది. అనంతరం 2026 ఫిబ్రవరి వరకు నూతనంగా ఓటు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకున్న వారి వివరాలతో తుది జాబితాను సిద్ధం చేసుకోవాలని సూచించింది. పరిశీలనలో ఏమైనా వ్యత్యాలు గుర్తిస్తే ఈ నెల 23లోపు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తద్వారా ఓటర్ల జాబితా కచ్చితత్వంతో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. తాగునీటి కోసం రోగుల తండ్లాట ప్రాణాలు నిలుపుకునేందుకు వచ్చే రోగులు ఆస్పత్రుల్లో నీరు దొరక్క అల్లాడుతున్నారు. గ్రేటర్ నగరంలోని ఎంజీఎం, జీఎంహెచ్, సీకేఎం ఆస్పత్రుల్లో అంతంత మాత్రంగానే ఏర్పాటు చేసిన నల్లాలు రోగుల దాహార్తి తీర్చట్లేదు. రోగుల బంధువులు తాగు నీటి కోసం ఆస్పత్రుల చుట్టూ ఉన్న దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. లీటర్ రూ.20 చొప్పున రోజుకు నాలుగైదు బాటిళ్లు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండ వేడి పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో రోగులు పడుతున్న తాగునీటి తండ్లాటపై ‘సాక్షి’ ఆయా ఆస్పత్రుల్లో శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. – హన్మకొండ చౌరస్తా/ కాశిబుగ్గపనిచేయని నీటి శుద్ధి కేంద్రంహనుమకొండలోని జీఎంహెచ్లో పోలీసులు కొంటున్న మినరల్ నీళ్లుఎంజీఎంలో నీటి కోసం...అలంకారప్రాయంగా ఆర్ఓ ప్లాంట్ వేసవిలో పేషెంట్లు, అటెండెంట్లకు అవసరమైన తాగునీటి సరఫరా చేయడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి, తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ఈ ఆస్ప్రతిలో ప్రారంభించిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ మూలన పడింది. దాదాపు ఏడాదికిపైగా ఈ ప్లాంట్ను మరమ్మతు చేయించకుండా అలాగే వదిలేశారు. కనీసం వేసవిని దృష్టిలో పెట్టుకునైనా మరమ్మతులు చేపట్టాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. నగర మేయర్ గుండు సుధారాణి గతంలో ఎంపీగా పనిచేసినప్పుడు ప్రారంభించిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ మాత్రమే ప్రస్తుతం పనిచేస్తోంది. దీనిద్వారా సరఫరా చేస్తున్న తాగునీరు రోగులకు సరిపోవట్లేదు. ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన వాటర్ కూలర్ ద్వారా తాగునీళ్లు వాడుకుంటున్నప్పటికీ నీళ్లు అందరికీ అందట్లేదని అటెండెంట్లు వాపోతున్నారు. పూర్తిగా తాగునీటి సదుపాయం లేకపోవడంతో బయట దుకాణాల్లో బాటిళ్లు కొంటున్నట్లు వారు చెబుతున్నారు. ఈ ఆస్పత్రిలో సుజల్ పథకం అమలు కావట్లేదు. ఎంజీఎంలో.. పేదల ఆస్పత్రిగా పేరొందిన ఎంజీఎంలో తాగునీరు పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. పలు వార్డుల్లో నల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ నీళ్లు సరిగ్గా రావట్లేదు. దాతలు బహూకరించిన రెండు వాటర్ కూలర్లు ఓపీతో పాటు ఏఎంసీ దగ్గర ఏర్పాటు చేశారు. అయితే వీటి ద్వారా 24 గంటలు తాగునీరు రావట్లేదని తెలుస్తోంది. కిచెన్ షెడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన తాగునీటి పాయింట్ వద్ద రెండు మాత్రమే పనిచేస్తున్నాయి. వేసవిలో తాగునీటి కొరత తీర్చడానికి ఇక్కడ ప్రత్యేకంగా మూడు చలివేంద్రాల ద్వారా చల్ల టి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈఎన్టీ విభాగం పక్కనే ఉన్న వాటర్ కూలర్ ద్వారా సన్నటి ధార మాదిరిగా నీళ్లు రావడంతో తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. ఆస్పత్రి ఆవరణలో ఒక రూపాయికి ఒక లీటర్ మినరల్ వాటర్, సుజల్ ఏటీడబ్ల్యూ ద్వారా కూల్ వాటర్ను రూ.2కు అందజేస్తున్నారు. దీంతో అటెండెంట్లు దాహార్తిని తీర్చుకుంటున్నారు. మరో రెండు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తేనే పూర్తి స్థాయిలో తాగనీరందుతుంది.జీఎంహెచ్లో రోగులకు సంపు నీటినందిస్తున్న వాటర్ కూలర్సీకేఎంలో పని చేయని నల్లా ఆస్పత్రిలోని మెడికల్ షాపు వద్ద నీటిని కొంటున్న మహిళఉద్యోగ సంఘాల జేఏసీ హన్మకొండ అర్బన్: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని హనుమకొండ జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు పేర్కొన్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి పోరుబాటలో భాగంగా శుక్రవారం జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన నిర్వహించారు. నిరసనలో జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నమనేని జగన్మోహన్రావు, జేఏసీ కో–చైర్మన్ లింగారెడ్డి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు అకవరపు శ్రీనివాసకుమార్, ఉపాధ్యాయ సంఘాల నాయకుడు తిరుపతిరెడ్డి, సంఘాల ప్రతినిధులు పెండెం రాజు, సర్వర్ హుస్సేన్, గోపాల్ రెడ్డి, సీతారాం, డాక్టర్ ప్రవీణ్, బైరి సోమయ్య, పుల్లూరు వేణుగోపాల్, పనికిల రాజేశ్, కోల రాజేశ్కుమార్, వెంకటేశ్వర్లు, అన్వర్, సురేశ్, రఘుపతిరెడ్డి తదితరులున్నారు.సాక్షిప్రతినిధి, వరంగల్ : ..ఇలా కొందరు పోలీసుల వ్యవహారశైలి ఆ శాఖను అభాసుపాలు చేస్తోంది. కొందరు యువ ఎస్ఐలు క్రమశిక్షణ గీత దాటి వేటుకు గురవుతుండడం ఆ శాఖలో చర్చనీయాంశమవుతోంది. వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి సన్ప్రీత్సింగ్.. కట్టుతప్పి అక్రమాలకు పాల్పడే పోలీసు అధికారులను హెచ్చరిస్తూనే ఉన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని మందలించినా ఫలితం లేకపోవడంతో చర్యలు తీసుకుంటున్నారు. గ్రేటర్ వరంగల్లోని ఇన్స్పెక్టర్(ఎస్హెచ్ఓ)లు, ఎస్ఐలపై ఉన్న ఫిర్యాదులపై విచారణ జరుగుతోంది. పలువురిపై చర్యలు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ కొందరు పోలీసు అధికారులు తీరు మారట్లేదు. దీనికి కారణం వారికి రాజకీయ అండే కారణమన్న విమర్శలు లేకపోలేదు. వరుస ఘటనలతో కలకలం.. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన పోలీసులు అవినీతికి పాల్పడడం, సివిల్ సెటిల్మెంట్లలో తలదూర్చడాన్ని వరంగల్ కమిషనర్ సీరియస్గా తీసుకుంటున్నారు. సుమారు 20 రోజుల వ్యవధిలో నలుగురిపై చర్యలు తీసుకున్నారు. మిల్స్ కాలనీలో ఎస్సైగా పనిచేస్తున్న సురేశ్ను సస్పెండ్ చేసిన సీపీ.. ఆ ఠాణా పరిధి కొన్ని ఘటనలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆత్మకూరు ఎస్సై సతీశ్ సస్పెన్షన్పైనా చర్చ జరుగుతోంది. ఇదివరకే బచ్చన్నపేట ఎస్సై హమీద్ను పోలీస్ హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేయగా, తాజాగా ఎల్కతుర్తి ఎస్ఐ ప్రవీణ్కుమార్ను ఏఆర్కు అటాచ్ చేశారు. కాగా వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మరికొందరిపైనా విచారణ జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో ఆ జాబితాలో ఎవరున్నారు? అన్న చర్చ మొదలైంది. సీరియస్గా ‘లేఖల’ పంచాయితీ.. గతేడాది డిసెంబర్లో వరంగల్ పోలీస్ డివిజన్లో ఏసీపీ, ఇన్స్పెక్టర్, ఎస్సైలపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి, ముగ్గురిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో మరికొందరిపై త్వరలోనే బదిలీ లేదా సస్పెన్షన్ వేటు పడొచ్చన్న ప్రచారం పోలీసుశాఖలో జరుగుతోంది. గ్రేటర్ వరంగల్ పరిధి నలుగురు ఇన్స్పెక్టర్ల తీరుపై ఇప్పటికే విచారణ జరుగుతున్నట్లు సమాచారం. అవినీతి అక్రమాలు, కేసులు కట్టడంలో నిర్లక్ష్యం, తప్పుడు కేసులు కట్టడం వంటి ఆరోపణలు ప్రధానంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ఇద్దరు ఎస్హెచ్ఓలు పొరుగు నియోజకవర్గాలకు బదిలీ చేయించుకునేందుకు ‘లేఖ’లు పొందడం కూడా వివాదాస్పదంగా మారినట్లు సమాచారం. విచారణ అనంతరం తీవ్రతను బట్టి వారిని సస్పెండ్ చేయడమా? వీఆర్కు పంపడమా? లేదా ఇతర జిల్లాలకు బదిలీ చేయడ మా? అన్నది త్వరలోనే తేలనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే వారం, పది రోజుల్లో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు ఉంటాయన్న ప్రచారం జరుగుతుండగా.. సుమారు 10 మందికి పైగా సీఐలు వరంగల్ నగరంలోని ఆరు కీలక ఠాణాలకు లేఖలు పొంది ఒత్తిడి తీసుకొస్తున్నట్లు పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది.వరంగల్ అర్బన్: మహా నగర భౌగోళిక స్వరూపం అరచేతిలోకి రానుంది. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్)కు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లో తాజ్ దక్కన్ హోటల్లో రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ టీకే.శ్రీదేవి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జీఐఎస్ ఏర్పాటుకు రాష్ట్రంలోని జీహెచ్ఎంసీ, ఖమ్మం, జగిత్యాల, జడ్చర్ల మున్సిపాలిటీలు ఉండగా, అందులో గ్రేటర్ వరంగల్కు స్థానం లభించింది. నూతన విధానంతో నగర సమగ్ర సమాచారం అరచేతిలో ఇమిడిపోనుంది. నగరంలో ఏ ప్రదేశానికి సంబంధించిన సమాచారం కావాలన్నా క్షణాల్లో కళ్ల ముందుంచేలా రాష్ట్ర పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది. ఆధునిక మ్యాపింగ్ వ్యవస్థతో బల్దియా ఆస్తి పన్ను కొలతల లెక్క పక్కాగా తేలనుంది. 3డీ మ్యాపింగ్ విధానం సైతం అందుబాటులోకి రానుంది. ఇందులో హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, ఐటీ మేనేజర్ రమేశ్ పాల్గొన్నారు. జీఎంహెచ్లో కొనకతప్పదు! హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వచ్చే గర్భిణులు, బాలింతలు, వారికి సహాయకులుగా వచ్చే వారు తాగునీరు (శుద్ధజలం)ను కొనాల్సిందే. వంద పడకల సామర్థ్యం గల ప్రసూతి ఆస్పత్రి ఆవరణలో సుమారు పదేళ్ల క్రితం ఎస్బీహెచ్ వారు బహూకరించిన రిఫ్రిజిరేటర్ ఉంది. దాని ద్వారా మున్సిపల్ సంపు నీరును అందిస్తున్నారు. పనిచేయని శుద్ధ జల కేంద్రం ఆస్పత్రిలో లీటరుకు రూ.2 చొప్పున విక్రయించే శుద్ధ జల కేంద్రం పనిచేయడం లేదు. సుమారు ఐదు సంవత్సరాల క్రితం ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన ఈ యంత్ర నిర్వహణను ఆస్పత్రి ఉన్నతాధికారులు గాలికి వదిలేశారు. ఆస్పత్రి ఆవరణలోనే వ్యాపారం.. ఆస్పత్రిలో నీటి కొరతను అదునుగా ప్రసూతి ఆస్పత్రి ఆవరణలోని ప్రధాన ద్వారం ఎదుట ఉన్న మెడికల్ షాపు యాజమాని రూ.10కి రెండు లీటర్ల చొప్పున నీటిని అమ్ముతూ యథేచ్ఛగా వ్యాపారం సాగిస్తున్నాడు. ఆస్పత్రి ప్రధాన ద్వారం ఎదుటే నీటి వ్యాపారం సాగుతున్నప్పటికీ ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంఓలు కనీసం చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. కాగా, ఆస్పత్రి ఆవరణలోని పోలీస్ ఔట్ పోస్ట్ పోలీసులు ప్రతీ రోజు రెండు వాటర్ క్యాన్లను కొంటున్నట్లు చెబుతున్నారు. నెలకు రూ.300ల నుంచి రూ.400ల వరకు తాగునీటికి వెచ్చిస్తున్నట్లు చెబుతున్నారు. ఒక రంజన్ సరిపోతుందా? ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకుల దాహార్తి తీర్చేందుకు పోలీస్ ఔట్పోస్ట్ పక్కనే ఒక రంజన్, రెండు గ్లాసులు ఉంచారు. వంద పడకల సామర్థ్యం గల ఆస్పత్రికి ప్రతీ రోజు గర్భిణులు, బాలింతలు, సహాయకులతో కలిసి దాదాపు 500 మంది వస్తుంటారు. వారందరికీ ఒకే రంజన్ నీళ్లు సరిపోతాయా? అనేది ఆస్పత్రి అధికారులే ఆలోచించాలి. సీకేఎం, ఎంజీఎం ఆస్పత్రుల్లో తీరని దాహం హనుమకొండ ప్రసూతి ఆస్ప్రతిలో మూలనపడ్డ ఆర్ఓ వాటర్ ప్లాంట్ బయటినుంచి కొనుగోలు చేస్తున్న రోగులు రెండు లీటర్లకు రూ.10 తీసుకున్నడు మా మనుమరాలిని చూసేందుకు వచ్చా. తాగేందుకు నీళ్లు లేవంటే ఎదురుగా మందుల షాపు వద్ద రూ.10 ఇచ్చి రెండు లీటర్ల నీళ్లు కొన్నా. మా పక్కన ఉన్న వాళ్లు కూడా మూడు రోజులుగా నీళ్లు కొంటున్నారు. లోపల ఫ్రిడ్జ్ నుంచి వచ్చే నీరు బాగాలేదు. అందుకే బయట కొంటున్నాం. – సత్తెమ్మ, తాటికొండ తాగునీటి సమస్య లేదు ప్రతీ రోజు సుమారుగా 200ల మంది గర్భిణులు, బాలింతలు, ఇతర గైనిక్ సమస్యలతో బాధపడే మహిళలు ఓపీ కోసం వస్తుంటా రు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యం అందిస్తున్నాం. తాగునీరు ఇతర సదుపాయాలు కలెక్టర్ సైతం పరిశీలించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ విజయలక్ష్మి, సూపరింటెండెంట్, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, హనుమకొండ యువ ఎస్ఐల అత్యుత్సాహం.. అడ్డంగా బుక్కవుతున్న పరిస్థితి అత్యాచారం, వేధింపుల కేసుల్లో వారే.. వరుస ఘటనలతో పోలీస్ శాఖలో కలకలం పలువురిపై సస్పెన్షన్, బదిలీ వేటు ఇన్స్పెక్టర్లపైనా ఆరోపణలు.. విచారణ స్థాయిలో ఫిర్యాదులు చర్చనీయాంశంగా కొందరు పోలీసుల తీరు -
ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఫీజుల దోపిడీ
కాశిబుగ్గ: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ, తల్లిదండ్రులను పీడిస్తున్నాయని మెడికో పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణచారి అన్నారు. శుక్రవారం ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ కోర్సులకు అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ వివిధ జిల్లాల నుంచి వచ్చి న మెడికోల తల్లిదండ్రులు వరంగల్లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సీటీని ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో విద్యార్థులు నాలుగున్నర సంవత్సరాల ఎంబీబీఎస్ కోర్సు చదివితే ఐదు సంవత్సరాల ఫీజులను బీ, సీ కేటగిరిల్లో వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఎంబీబీఎస్ కోర్సు నాలుగున్న ర సంవత్సరాలు కాగా అదనంగా ఆరునెలల ఫీజు వసూలు చేయడం వల్ల బీ కేటగిరి విద్యార్థి అదనంగా రూ.6 లక్షలు, సీ కేటగిరి విద్యార్థికి రూ.12 లక్షలు వసూలు చేస్తున్నారని తెలిపారు. వీటిపై తాము ప్రీ రెగ్యులేటరీ కమిటీ చైర్మన్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని తెలిపారు. ఏ కేటగిరి సంబంధించి యూనివర్సీటీ ఫీజు రూ.60వేలు చెల్లించాల్సి ఉండగా, కాలేజీలు మాత్రం ఇతర ఫీజుల పేరుతో రూ.లక్షా యాభై వేల నుంచి రూ.2లక్షల 60వేల వరకు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. దీనిపై కాళోజీ హెల్త్ యూనివర్సీటీ అధికారులు స్పందించి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వీసీ రమేష్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అసోసియేషన్ నాయకులు కట్ట వెంకట్రావు, సుజాత, సంధ్య స్ఫూర్తి, శ్రీనివాస్ గౌడ్, దుర్గాప్రసాద్, రామకృష్ణ, నాగేందర్, రవికిషన్ ఉన్నారు.● మెడికో పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణచారి ● కాళోజీ యూనివర్సిటీ ముట్టడి -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
న్యూశాయంపేట: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వరంగల్ జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్ రాంకిషన్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు భోజన విరామ సమయంలో శుక్రవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ, హెల్త్ స్కీం అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, పాతపెన్షన్ విధానాన్ని పునఃరుద్ధరించాలని కోరారు. సమస్యలు పరిష్కారం కాకపోతే దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఫణికుమార్, రాంరెడ్డి, వేణుగోపాల్, రవీందర్రెడ్డి, రాజ్కుమార్, రియాజుద్దీన్, మధులిమియో, సాంబయ్య, అశోక్, గోవిందరాజు, ధర్మరాజు, కిషన్, సోమయ్య, రవి తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలిహన్మకొండ అర్బన్: దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, న్యాయబద్ధమైన డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఎంప్లాయీస్ టీచర్స్–పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) పిలుపులో భాగంగా శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో హనుమకొండ ఆర్డీఓను కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్ రాంకిషన్ కలెక్టరేట్ ఎదుట నిరసన -
జాగ్రత్తతోనే సురక్షితంగా గమ్యస్థానానికి..
అరైవ్–అలైవ్ కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: వేగం కాదు.. జాగ్రత్తే మనల్ని గమ్యానికి సురక్షితంగా చేరుస్తుందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన అరైవ్–అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమంలో బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా హెల్మెట్, సీట్బెల్ట్ ధరించిన వాహనదారులను గులాబీపూలతో అభినందించారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, ఆర్టీఓ శోభన్బాబు, డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి పాల్గొన్నారు. ‘నో హెల్మెట్.. నో పెట్రోల్’ అమలు చేయాలి నో హెల్మెట్.. నోపెట్రోల్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని పెట్రోల్ బంకు యజమాన్యాలను కలెక్టర్ ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా కలెక్టరేట్లో శుక్రవారం పెట్రోల్బంక్ యజమానులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ప్రజల్లో చైతన్యం పెంచేందుకు పెట్రోల్ బంక్ యజమానులు కీలకపాత్ర పోషించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. సమావేశంలో బంక్ యజమానులు, అధికారులు పాల్గొన్నారు. గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉండాలి ఏప్రిల్ 20–26 తేదీల్లో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతిపై కలెక్టరేట్లో సమీక్షించారు. చిన్నారుల భవిష్యత్తే అభివృద్ధికి పునాది ఖిలా వరంగల్: చిన్నారుల భవిష్యత్తే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్లోని శంభునిపేట, గుంటూరుపల్లి అంగన్వాడీ కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. పిల్లలకు అందిస్తున్న పోషకాహారం, రిపీ స్కూల్ విద్య, ఆరోగ్య సేవలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా సంక్షేమాధికారి రాజమణి, అఽధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వం చొరవ చూపాలి
పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికుమార్ హన్మకొండ: ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని బీఎంఎస్ అనుబంధ తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నె శశికుమార్ డిమాండ్ చేశారు. ఆర్టిజన్ల సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో టీఆర్పీఈయూ నాయకులు మహేశ్, వెంకటరమణ, ఆర్టిజన్ జేఏసీ హనుమకొండ జిల్లా చైర్మన్ కోరుకొప్పుల రాంబాబు. నాయకులు రాపాక రవీందర్, మట్ల భిక్షపతి, నల్ల రాంబాబు, మహేందర్, అన్నం రాజు, గజ్జల కుమార్ పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలి: ఎర్రబెల్లి ప్రదీప్రావు ఆర్టిజన్ ఉద్యోగులు, ఆన్మ్యాన్డ్ వర్కర్ల అపరిష్కృత సమస్యలు వెంటనే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, వరంగల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు డిమాండ్ చేశారు. హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులు, ఆన్మ్యాన్డ్ వర్కర్లను కలిసి ఎర్రబెల్లి ప్రదీప్రావు సంఘీభావం తెలిపారు. -
సేఫ్ జర్నీనే ‘అరైవ్–అలైవ్’ లక్ష్యం
హసన్పర్తి: ప్రమాదాల బారిన పడకుండా వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు కచ్చితంగా పాటించేలా అవగాహన కల్పించడమే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమ లక్ష్యమని రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సీఐడీ) ఉమెన్ ‘సేఫ్టీ వింగ్ యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్, ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ డైరెక్టర్ చారు సిన్హా అన్నారు. గురువారం హసన్పర్తి మండలం భీమారం పరిధి కేఎల్ఎన్ కన్వన్షన్ హాల్లో పోలీస్ కమిషనరేట్, రవాణాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి చారు సిన్హా ముఖ్య అతిథిగా హాజరై రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, వరంగల్ కలెక్టర్ సత్యశారద, జిల్లా రవాణాశాఖ అధికారి సురేశ్రెడ్డి మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. ఈసందర్భంగా రోడ్డు ప్రమాదాలకు కారణాలు, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలపై వీడియో ప్రదర్శించారు. సదస్సులో నగరానికి చెందిన ఓ కళాశాల విద్యార్థి తన తండ్రి హెల్మెట్ ధరించకపోవడంతో రోడ్డు ప్రమాదంలో మరణించాడని చెప్పడం అందరినీ ఆలోచింపజేసింది. ఈసందర్భంగా ద్విచక్రవాహనదారులకు హెల్మెట్లు అందించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీపీలు దార కవిత, అంకిత్కుమార్, వరంగల్ ఏఎస్పీ శుభం, ట్రెయినీ ఐపీఎస్ మనీషా నెహ్రూ, వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఎంవీఐలు వేణుగోపాల్, కిశోర్కుమార్, రాధోత్, శోభన్ బాబు, ఏసీపీలు నర్సింహారావు, ప్రశాంత్రెడ్డి, పోలీస్ ఇన్స్పెక్టర్లు చేరాలు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ డీజీపీ చారుసిన్హా వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ -
బస్ షెల్టర్లో స్ప్రింక్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయండి
హనుమకొండ కలెక్టర్. బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: వేసవితాపం నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగేందుకు సిటీలోని బస్షెల్టర్లలో స్ప్రింక్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. గురువారం హనుమకొండ పరిధిలోని పబ్లిక్ గార్డెన్, అమృత థియేటర్తోపాటు పలు బస్ షెల్టర్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీడీఎంఏ ఆదేశాల మేరకు నగరవ్యాప్తంగా మిస్టింగ్ స్టేషన్లు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఇది బహిరంగ శీతలీకరణ వ్యవస్థ అని, అధిక పీడన పంపులు, నాజిల్లను ఉపయోగించి సూక్ష్మ నీటి బింధువులను వెదజల్లుతూ వాటి ఆవిరికి పరిసర ఉష్ణోగ్రతలను 20 ఫారెన్ వేడిని తగ్గిస్తుందన్నారు. బస్టాండ్లో వేచి ఉండే ప్రయాణికులపై నీటి బిందువులు పడి వేడిమినుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయని తెలిపారు. నగర పరిధిలోని పబ్లిక్ గార్డెన్, అమృత థియేటర్ వద్ద శంఖం నమూనాలో ఏర్పాటు చేయాలన్నారు. నిత్యం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ఇతర షెల్టర్లలో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్ఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఫుట్పాత్లపై ఆక్రమణలను తొలగించండిహనుమకొండ జిల్లా కోర్టు, సర్క్యూట్ గెస్ట్ హౌజ్ రోడ్డులో ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. గురువారం రాత్రి హనుమకొండలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. కడాయి రెస్టారెంట్ చౌరస్తా రోడ్డులో పెద్ద ఎత్తున ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించిన కలెక్టర్.. ఆధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత భవన నిర్మాణంలోపు వ్యాపారాలను నిర్వహించుకోవాలని, ఫుట్పాత్లు, డ్రెయినేజీలను ఆక్రమిస్తే చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఇలాంటి ఆక్రమణల వల్ల పారిశుద్ధ్య పనులకు తీవ్ర విఘాతం కలుగుతుందని సూచించారు. ఏదో రోజు కాకుండా నిత్యం రహదారులు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. డీఎఫ్ఓ శంకర్ లింగల, కాజీపేట ట్రాఫిక్ సీఐ వెంకన్న, తదితరులు ఉన్నారు. -
శుక్రవారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జనాభా 36,88,217 మంది అని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే నివేదిక తేల్చి చెప్పింది. అదే సమయంలో 12,32,892 ఇళ్లు ఉన్నట్లు ఉన్నాయని వెల్లడించింది. జనాభా పరంగా చూసుకుంటే 18,37,374 మంది బీసీలు తొలిస్థానంలో ఉంటే, 1,74,440 మందితో బీసీ ముస్లిం మైనారిటీలు చివరి స్థానంలో ఉన్నారు. ఇల్లు ఉన్నవారి విషయానికొస్తే ఓసీలు 35.35 శాతంతో తొలిస్థానంలో ఉండగా, 30.60% బీసీ ముస్లిం మైనారిటీలు చివరి స్థానంలో ఉన్నారు. అదేవిధంగా ఎస్టీలు అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 3,22,361 మంది ఉంటే...అత్యల్పంగా హనుమకొండలో 29,139 మంది ఉన్నారు. ఓసీలు అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 89,410 మంది ఉంటే అత్యల్పంగా ములుగులో 20,684 మంది ఉన్నారని వెల్లడించింది. ఇక ఎస్సీలు అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 1,83,984 మంది ఉంటే ములుగు జిల్లాలో అతి తక్కువగా 49,746 మంది ఉన్నారని తెలిపింది. బీసీలు అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 4,50,150 మంది ఉంటే అతి తక్కువగా ములుగు జిల్లాలో 1,18,254 మంది ఉన్నారని పేర్కొంది. జనాభాలో వరంగల్ జిల్లా ముందు... ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల మొత్తం జనాభా 36,88,217 ఉంటే వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా 8,36,811 మంది ఉన్నట్టు సర్వే తేల్చింది. ఆ తర్వాత 8,04,515మందితో మహబూబాబాద్, 7,99,448మందితో హనుమకొండ, 5,45,449మందితో జనగామ, 4,07,896మందితో జయశంకర్ భూపాలపల్లిలు ఉండగా, చిట్టచివరగా 2,94,098 జనాభాతో ములుగు జిల్లా ఉంది. ఉమ్మడి వరంగల్లోని మొత్తం జనాభా 36,88,217లో 18,37,374 మంది వారే.. ఆ తర్వాతి వరుసలో ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు చివరి స్థానంలో బీసీ ముస్లిం, మైనారిటీలు మొత్తం 12,32,892 ఇళ్లు ఉన్నట్టు నిర్ధారణ తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, కులగణన సర్వేలో వెల్లడి -
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బదిలీ
వరంగల్ లీగల్: వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.సాయికుమార్ను హైదరాబాద్ ఏడో చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్గా బదిలీ చేస్తూ.. హైకోర్టు రిజిస్టార్ జనరల్ (విజిలెన్స్) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సీనియర్ సివిల్ జడ్జిల బదిలీల్లో భాగంగా భూపాలపల్లి సినియర్ సివిల్ జడ్జి ఎ.నాగరాజు గద్వాల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీకాగా.. జనగామ సినియర్ సివిల్ జడ్జి ఇ.సుచరితను రంగారెడ్డి జిల్లా రాజేందర్నగర్లోని ప్రిన్సిపల్ సీనియర్ జడ్జిగా బదిలీ చేశారు. బదిలీ అయిన న్యాయమూర్తులు ఈనెల 20వ వరకు చార్జ్ అప్పగించి 25వ తేదీలోపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో రిజిస్ట్రార్ జనరల్ ఆదేశించారు. -
తెల్లవార్లు ‘బార్లా’!
కాజీపేట: వ్యాపారులు ఇష్టారీతిన మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం.. ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు వైన్షాపులు, ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం విక్రయించేందుకు అనుమతులున్నాయి. కానీ, ఈ నిబంధనలు ఉల్లంఘిస్తూ కాజీపేటలోని పలు బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు ఉదయం 6 గంటల నుంచే యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నాయి. మందుబాబుల బలహీనతలను సొమ్ము చేసుకుంటూ ఆయా మద్యం షాపుల్లో ఈ విక్రయాలు బహిరంగంగానే సాగిస్తున్నారు. పట్టని అధికారులు ఈ విషయం ఎకై ్సజ్ శాఖ, సంబంధిత ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందికి తెలిసినా మామూళ్ల మత్తులో మునగడంతో ఈ వ్యవహారంపై దృష్టిసారించలేకపోతున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచే మద్యం మత్తులో ఉన్న మందు బాబులు వివిధ అవసరాల నిమిత్తం రోడ్లపై రాకపోకలు సాగించే మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పలువురు వాపోతున్నారు. దీనికితోడు రాత్రి సమయాల్లో వీధుల్లో మందుబాబులు వీరంగం సృష్టిస్తూ భయందోళనలు రెకెత్తిస్తున్నారు. సీపీ ఆదేశించినా ఆగని అమ్మకాలు మద్యం దుకాణాల కౌంటర్లపై మద్యం విక్రయించోద్దని, రోడ్లపై నిలబడి తాగడం సరైంది కాదంటూ నగర పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసినా ఎక్కడా ఆగట్లేదు. మద్యం వ్యాపారులు సిండికేట్గా మారి తెల్లవారుజామున 6 గంటల్లోపే దుకాణాలు తెరచి అర్ధరాత్రి వరకు విక్రయాలు సాగిస్తున్నారు. కౌంటర్లపై లూజ్ సేల్స్ చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఏ ఒక్క దుకాణంపై దాడి చేసి కేసులు పెట్టిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, దేవాలయాలకు దూరంగా మద్యం దుకాణాలు ఉండాలనే నిబంధనలు పట్టణంలో ఎక్కడా అమలు కాకపొవడం చర్చనీయంశంగా మారింది. ఇప్పటికై నా సమయం సందర్భం లేకుండా విక్రయాలు సాగిస్తున్న దుకాణాదారులపై ఎకై ్సజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. సమయపాలన పాటించకపోతే చర్యలు పట్టణంతోపాటు రూరల్ ప్రాంతాల్లో మద్యం వ్యాపారులు ప్రభుత్వం నిర్దేశించిన వేళలను పాటించకుండా విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. అక్కడక్కడా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుండొచ్చు. వెంటనే విచారణ జరిపి చర్యలు చేపడతాం. – చంద్రమోహన్, ఎకై ్సజ్ సీఐ, కాజీపేట విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు నిబంధనలు పాటించని వ్యాపారులు అమలుకు నోచుకోని ప్రభుత్వ ఆదేశాలు -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు
ఖిలా వరంగల్: వరంగల్ ఉర్సుగుట్ట సమీపంలోని ఖిలా వరంగల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ఉదయం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అఽధికారుల ఆకస్మిక తనిఖీలు కలకలకం సృష్టించాయి. అధికారులు కార్యాలయానికి ప్రవేశించి ప్రధాన ద్వారాన్ని మూసేశారు. రిజిస్ట్రేషన్లను నిలిపి ఎవ్వరినీ లోపలికి రానివ్వలేదు. స్టాంప్ డ్యూటీ చెల్లింపు, గడిచిన కొన్ని నెలలుగా జరిగిన రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను డీఎస్పీ మల్లయ్య, తహసీల్దార్ లక్ష్మణ్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు పరిశీలించారు. ఇన్చార్జ్ సబ్రిజిస్ట్రార్ వెంకట్లాల్కు పలు ప్రశ్నలు వేసి స్టాంప్ డ్యూటీల అవకతవకలపై ఆరా తీశారు. ఇటీవల జరిగిన లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు. భూముల క్రయవిక్రయాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం స్టాంపు డ్యూటీ ఫీజులు కట్టించకపోవడం, అనధికారిక లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు చేశారని అధికారులు తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. లావాదేవీలను నమోదు చేసిన రికార్డుల ఫైళ్ల జిరాక్స్లను అధికారులు వెంట తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. మూతపడిన డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాలు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జనసందడిగా ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయం ఒక్కసారిగా బోసి పోయి కనిపించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపడుతుండగానే డాక్యుమెంట్ రైటర్స్ హడావుడిగా షట్టర్లు మూసివేశారు. తొలుత కార్యాలయంపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయని ప్రచారం సాగింది. తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అఽధికారులు తనిఖీలు చేపడుతున్నట్లు తెలుసుకుని డాక్యుమెంట్ రైటర్లు తమ కార్యాలయాలను మూసివేసి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 3 గంటలకు 18 డాక్యుమెంట్లు, రిజిస్టేషన్ల ప్రక్రియ యథావిధిగా కొనసాగింది. కీలక ఫైళ్లను పరిశీలించిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్టాంప్ డ్యూటీలో అవకతవకలపై ఇన్చార్జ్ సబ్రిజిస్ట్రార్కు ప్రశ్నలు -
వరంగల్ నగర అభివృద్ధికి కృషి
హన్మకొండ/ వరంగల్ చౌరస్తా/మామునూరు : వరంగల్ నగర అ భివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. మహిళా మోర్చా, యువ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నారీ శక్తి వంధన్ అధినియం కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎన్.రాంచందర్ రావు ప్రారంభించారు. అలాగే, వరంగల్ స్టేషన్ రోడ్డులోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో, రాత్రి తిమ్మాపురంలో జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కోచ్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ పంజాబ్కు తరలిస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం వరంగల్కు తీసుకొచ్చిందన్నారు. అ జాంజాహి మిల్లు మూసివేస్తే కేంద్ర ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు తీసుకొ చ్చిందన్నా రు. స్మార్ట్సిటీ, అమృత్, హృదయ్ పథకాలు, సూ పర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, వేయి స్తంభాల దేవాలయం అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్ను గాలికి వదిలేసిందని విమర్శించారు.కాగా, శ్రమజీవుల పక్షాన బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ చీఫ్ రాంచందర్రావు అన్నారు. అంబేడ్కర్ను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. అదేవిధంగా హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో ఆర్టిజన్ ఉద్యోగుల సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, గంట రవికుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావు పద్మ, దేవేందర్ రెడ్డి, నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్, వన్నాల వెంకటరమణ, కుసుమ సతీశ్, నవీన్, హరిశంకర్, రఘునా రెడ్డి, రత్న లక్ష్మి, కోమల, వసంత, జరీనా, ఉషా రెడ్డి, ధనలక్ష్మి, కవిత, కరుణ, కార్పొరేటర్ జలగం అనిత, రంజిత్, బన్న ప్రభాకర్, మాదిరెడ్డి దేవేందర్రెడ్డి, మల్లాడి తిరుపతి పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు -
వేసవిలో జాగ్రత్తలు పాటించాలి
● డీఎంహెచ్ఓ అప్పయ్య రామన్నపేట: ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ప్రజలంతా తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని హనుమకొండ వైద్యారోగ్యశాఖ అధికారి అప్పయ్య సూచించారు. బుధవారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాధాన కూడళ్లలో వ్యాపారులకు ఆయన వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఎండలు అధికంగా ఉన్నందున, అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని తెలిపారు. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆశాభోంస్లేకు నివాళిహన్మకొండ కల్చరల్: వరల్డ్ పీస్ సొసైటీ, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు సంగీత సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి హనుమకొండలోని శ్రీసాయిమీరా కళామందిరంలో ప్రఖ్యాత గాయని ఆశాభోంస్లే సంతాపసభ నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు మహమ్మద్ సిరాజుద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు పలువురు కవులు, కళాకారులు, గాయకులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు హాజరై ఆశాభోంస్లేకు నివాళులు అర్పించి ఆమె జ్ఞాపకాలు, పాటలను స్మరించుకున్నారు. ర్యక్రమంలో కాకతీయ విశ్రాంతాచార్యులు విజయబాబు, పోతానా చారి, ఏసీపీ విజయ్కుమార్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రూ. 7.65 లక్షల ఓపీఎం పట్టివేతఖిలా వరంగల్: నిషేధిత ఓపీఎం (నల్లమందు) విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 7.65లక్షల విలువైన 1.530 కిలోల సరుకు, స్కూటీ, రెండు మొబైళ్లు స్వాఽధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు. రాజస్థాన్లోని జీజీవాల్ కంకర్ల గ్రామానికి చెందిన గాషిరామ్, దినేష్ దేశాయిపేట్రోడ్లో మిఠాయి షాపు నడిపిస్తూ కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నారు. రాజస్థాన్ జోధాపూర్లో రైతులు ఓపీఎంను సాగుచేస్తుంటారు. ఆ నల్లమందును వరంగల్లో తక్కువ ధరకు విక్రయిస్తే లక్షలు సంపాదించొచ్చని ఆ రాష్ట్రానికి చెందిన సునీల్ వద్ద నుంచి రూ. 7.65 లక్షల విలువైన సరుకును రూ.50వేలకే కొనుగోలు చేశారు. బుధవారం కాశీరాం, దినేష్ కరీమాబాద్లో విక్రయించేందుకు రాగా మిల్స్కాలనీ ఎస్సై శ్రవణ్కు అనుమానస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నిషేదనల్ల మందు విక్రయించేందుకు వచ్చామని ఒప్పుకున్నారు. దీంతో వారి నుంచి రూ. 7.65 లక్షల విలువైన 1.530 కిలోల సరుకు, స్కూటీ, రెండు మొబైళ్లు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసిటన్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
హెల్మెట్ ధారణతోనే ప్రాణరక్షణ
ఖిలా వరంగల్: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలన – ప్రగతి కార్యాచరణలో భాగంగా వరంగల్ ఉర్సు రంగలీల మైదానం జంక్షన్ వద్ద వరంగల్ జిల్లా రవాణాశాఖ, ట్రాఫిక్, మిల్స్కాలనీ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో అరైవ్ – అలైవ్ రోడ్డు భద్రతపై బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్, ఏఎస్పీ శుభం ప్రకాశ్, వరంగల్ జిల్లా ఇన్చా ర్జ్ ఆర్టీఓ శోభన్బాబు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, తహసీల్దార్ ఇక్బాల్, విద్యార్థులతో ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ రమేష్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలి న్యూశాయంపేట: రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, అందుకు పాఠశాలల యాజమాన్యాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రవాణాశాఖ, పోలీస్శాఖల ఆధ్వర్యంలో బుధవారం అరైవ్ – అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్లోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న వారందరితో రోడ్డు భద్రతపై కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేష్ జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా అధికారులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పాల్గొన్నారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
డీలిమిటేషన్పై కావాలనే సీఎం తప్పుడు ప్రచారం
సాక్షి, వరంగల్: డీలిమిటేషన్ (పునర్విభజన)పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతూ ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆరోపించారు. వరంగల్ నగరంలో బుధవారం జరిగిన వివిధ కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు. ప్రధానమంత్రి మోదీ 2011 జనాభా లెక్కల ప్రకారం రాజ్యాంగంలోని నిబంధనల మేరకు డీలిమిటేషన్ చేస్తున్నారని, అయితే రాజ్యాంగంపై అవగాహన లేని సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని అన్నారు. దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల పేరుతో విభజన తీసుకువస్తూ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని విమర్శించారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి కూడా నష్టం జరగదని, ఉత్తర, దక్షిణ రాష్ట్రాలను సమాన దృష్టితో చూసేలా పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయన్నారు. 55 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికా రంలో ఉన్నప్పుడు డీలిమిటేషన్ చేశారని, ఆనాడు ఎవరూ కూడా వ్యతిరేకించలేదని పేర్కొన్నారు. సీ ఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ను మూడు ముక్కలు చేశారని, ఇదీ ఎవరికీ చెప్పి చేశారని పేర్కొన్నారు. నెహ్రూ కుమార్తె కావడం వల్లనే ఇందిర ప్రధాని కాగలిగారు... ఈనెల 16,17,18 తేదీల్లో పార్లమెంట్లో రాజ్యంగబద్ధమైన మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెడుతోందని, గత 30 ఏళ్లకు పైగా నానుతున్న ఈ బిల్లును కేంద్రం తీసుకొస్తుండడంతో మహిళలకు ఆర్థిక,సామాజిక, సాధికారత లభిస్తుందని రామచందర్రావు స్పష్టం చేశారు. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ కావడం వల్ల పార్టీ అధ్యక్షురాలు ప్రధాన మంత్రి అయ్యారని, అదే తరహాలో రాజీవ్గాంధీ సతీమణి సోని యాగాంధీకి పార్టీ పగ్గాలు వంశపరంపార్యంగా వచ్చాయని గుర్తు చేశారు. గిరిజన మహిళకు అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి అప్పగించింది బీజేపీనేనని గుర్తు చేశారు. బీజేపీలో మహిళల ప్రాతినిధ్యంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ ఆయన పైవిధంగా స్పందించారు. హైదరాబాద్ను మూడు ముక్కలు ఎవరికీ చేసి చెప్పారు వరంగల్ పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు -
శతశాతం ఫలితాలతో తాళ్ల పద్మావతి పాఠశాల సత్తా
కాజీపేట: తాళ్ల పద్మావతి స్కూల్ విద్యార్థులు బుధవారం వెలువడిన సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారని ఆ విద్యాసంస్థల చైర్మన్ తాళ్ల మల్లేశం తెలిపారు. ఆసియా 485, నిత్య 473, కార్తీక 472, నిగ్నేశిత 469, పూర్వి దహారియా 461, హేమంత్ రెడ్డి 462, విగ్నేస్ రెడ్డి 462 మార్కులు సాధించి పాఠశాల ప్రతిష్టను మరింతగా పెంచారని పేర్కొన్నారు. విద్యారంగంతో పాటు ఇతర ప్రతిభా రంగాల్లోనూ రాణిస్తున్న విద్యార్థులను చైర్మన్ తాళ్ల మల్లేశం, డైరెక్టర్లు తాళ్ల వంశీ, చైతన్య, డాక్టర్ వరుణ్, వైష్ణవిలు అభినందించారు. -
రైల్వే సీసీఎస్ సభ్యుల ఆర్థిక భరోసే లక్ష్యం
కాజీపేట రూరల్: రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (రైల్వేఈసీసీఎస్) సభ్యుల ఆర్థిక భరోసే ప్రధాన లక్ష్యంగా సీసీఎస్ను ముందుకు తీసుకెళ్తున్నట్లు ఆ సొసైటీ సికింద్రాబాద్ జోన్ ప్రెసిడెంట్ చిలుకుస్వామి అన్నారు. కాజీపేట రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో మంగళవారం రాత్రి 11 మంది సీసీఎస్ సభ్యుల నామిని కుటుంబాలకు సుమారు రూ.40 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిలుకు స్వామి మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వేలో 42 వేలపై చిలుకు సీసీఎస్ సభ్యులు ఉన్నారని, రూ.2 వేల కోట్ల టర్నోవర్తో సీసీఎస్ నడుస్తోందన్నారు. సభ్యుల సంక్షేమం కోసం, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. కాజీపేట సీసీఎస్ డైరెక్టర్లు డి.శ్రీనివాస్యాదవ్, దేవులపల్లి రాఘవేందర్, బెల్లంపల్లి సీసీఎస్ డైరెక్టర్ ఓ.వై.స్వామి, తదితరులు పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే సీసీఎస్ ప్రెసిడెంట్ చిలుకుస్వామి -
సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల పోరుబాట
● కలెక్టర్ను కలిసిన జేఏసీ నేతలు హన్మకొండ అర్బన్: జిల్లాలో ఉద్యోగుల పెండింగ్ సమస్యల సాధన కోసం పోరుబాట ప్రారంభిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. ఈమేరకు బుధవారం జేఏసీ చైర్మన్, టీఎన్జీఓస్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో జేఏసీ నేతలు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ను కలిసి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. అనంతరం జేఏసీ నేతలు మాట్లాడుతూ.. ఈనెల 17న భోజన విరామ సమయంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మే 5న జిల్లా కేంద్రాల్లో సామూహిక దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. జూన్ 2లోపు పీఆర్సీ ప్రకటించడం, పెండింగ్ బిల్లులు, డీఏలు చెల్లించడం, హెల్త్ కార్డులు జారీ చేయడం, సీపీఎస్ రద్దు చేయడం సహా అన్ని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు ఆకవరపు శ్రీనివాసకుమార్, బైరి సోమయ్య, అన్వర్, పెండెం రాజు, కె.శ్రీనివాస్, సర్వర్ హుస్సేన్, పుల్లూరు వేణుగోపాల్, పనికెల రాజేశ్, శ్రీనివాస్ రెడ్డి, రాము నాయక్, కోమల్ రెడ్డి, భాను ప్రకాశ్రెడ్డి, సబీర్, సీతారాం, సరస్వతి, శ్యాంసుందర్, మల్లారెడ్డి, రవిప్రకాశ్, విజయ్ కుమార్, రాజమౌళి, రజిత, నాగరాణి, అశోక్, ప్రణయ్, పృథ్వీ, అఫ్జల్, కుమారస్వామి, వీరన్న, సదానందం తదితరులు పాల్గొన్నారు. -
‘ఏకశిల’ విజయ దుందుభి..
హసన్పర్తి: సీబీఎస్ఈ ఫలితాల్లో ఏకశిల విద్యాసంస్థలు విజయదుందుభి మోగించాయి. పాఠశాల విద్యార్థులు వరుసగా 492 మార్కులు, 492 , 490 ,489 ,488 ,488, 488 ,487 ,484 ,482, 480 మార్కులు సాధించినట్లు ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. ఇంటర్తో పాటు సీబీఎస్ఈ ఫలితాల్లో కూడా ఏకశిల విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. ఈసందర్భంగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఏకశిల విద్యాసంస్థల డైరెక్టర్లు బేతి కొండల్రెడ్డి, గౌరు సువిజారెడ్డి, చిదురాల దినేశ్రెడ్డి, చిదురాల శ్రావణిరెడ్డి,వైస్ ప్రిన్సిపాల్స్ బాబా, కెడి స్వర్ణ రాజ్, రాంప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
19 నుంచి భద్రకాళి అమ్మవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు
హన్మకొండ కల్చరల్: ఈ నెల 19 ఆదివారం నుంచి శ్రీభద్రకాళి అమ్మవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, 30వ తేదీ గురువారం వరకు జరిగే కల్యాణ బ్రహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వరంగల్ జోన్ దేవాదాయశాఖ డీసీ, ఆలయ ఈఓ రామల సునీత తెలిపారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం రామల సునీత మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కల్యాణోత్సవం సందర్భంగా ఒక్కోక్కరోజు వివిధ కులసంఘాల వారు అమ్మవారి సేవలలో పాల్గొనడానికి ముందుకు వచ్చారని ఆ రోజున వారి నిర్వహణలోనే పూజాకార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. కల్యాణోత్సవంలో పాల్గొనదల్చిన భక్తులు రూ.516 చెల్లించి రశీదు పొందాలని వారికి ప్రసాదం, అక్షింతలు, శేషవస్త్రాలు అందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం, ఆలయ పరిశీలకులు క్రాంతికుమార్, ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు. కుడా చైర్మన్కు ఆహ్వానం నయీంనగర్: భద్రకాళి బ్రహ్మోత్సవాలకు రావాలని ప్రధాన అర్చకులు శేషు, ఈఓ సునీత హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డికి బుధవారం ఆహ్వానపత్రిక అందించారు. విజయవంతం చేయాలి: ఆలయ ఈఓ రామల సునీత ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ -
‘తేజస్వి’ విద్యార్థుల విజయకేతనం..
కాజీపేట అర్బన్ : హంటర్రోడ్డులోని తేజస్వి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు బుధవారం వెలువడిన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో విజయకేతనం ఎగురవేసినట్లు తేజస్వి విద్యా సంస్థల అధినేత రేవూరి జెన్నారెడ్డి తెలిపారు. పాఠశాలకు చెందిన శ్రీ వైభవి దుడుక 486 మార్కులు, అవ్ని బిజ్జాల 485, విష్ణుప్రియ చింతం 480 మార్కులు సాధించి తేజస్వి కీర్తి ప్రతిష్టలు జాతీయ స్థాయిలో నిలబెట్టారని తెలిపారు. 35 మంది విద్యార్థులు 90 శాతంపైన, 42 మంది విద్యార్థులు 80 శాతంపైన, 34 మంది 70 శాతంపైన, 23 మంది 60 శాతం, 10 మంది 60 శాతంలోపు మార్కులు సాధించారని తెలిపారు. ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్పై శ్రధ్ధ తీసుకుంటామని తెలిపారు. పాఠశాల డైరెక్టర్లు రేవూరి భగవాన్రెడ్డి, ముదిగంటి అన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీబీఎస్ఈ ‘పది’ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ విజయభేరి
హన్మకొండ చౌరస్తా: సీబీఎస్ఈ బోర్డు బుధవారం ప్రకటించిన పదో పరీక్ష ఫలితాల్లో ఎస్ఆర్ విద్యా సంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారని ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఎస్ఆర్ విద్యా సంస్థలకు చెందిన బొక్క హర్షవర్ధన్ (28145278) జాతీయ స్థాయిలో 491/500 మార్కులు సాధించినట్లు తెలిపారు. వంగపెల్లి సంహిత(28145399) జాతీయ స్థాయిలో 485/500 మార్కులు, పెంచాల క్షేత్రిక(28145396) 482 /500 మార్కులు, బానోత్ వర్షిత్(28145277) జా తీయ స్థాయిలో 482/500, బానోత్ సుదేష్న (28 160170) 480/500 మార్కులు సాధించి ఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలు జాతీయ స్థాయిలో నిలబెట్టారని హ ర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జేఈఈ (మెయి న్)–2026 లో జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించారని, ఈ ఫలితాలు విద్యార్థుల అందరికీ స్పూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు. ఈ విజ యం సాధించిన విద్యార్థులను ప్రోత్సహించిన తల్లి దండ్రులు, అధ్యాపక బృందాన్ని అభినందించారు. అభినందించిన వారిలో డైరక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి ఉన్నారు. -
అత్యుత్తమ మార్కులు.. అభినందనీయం
● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం అభినందనీయమని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీ డియట్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన కేజీబీవీలు, మోడల్ స్కూల్–కళాశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు బుధవారం కలెక్టరేట్లో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కు చెందిన 36 మంది మెరిట్ విద్యార్థులు, ఆయా కళాశాల అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి గోపాల్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్వీ.గిరిరాజ్ గౌడ్, జీసీడీఓ సునీత, వివిధ కళాశాలల అధ్యాపకులు, మెరిట్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
విధుల్లో చేరిన వరంగల్ డీఆర్డీఓ పీడీ నాగపద్మజ
కాళోజీ సెంటర్: ఇటీవల జరిగిన బదిలీలో భాగంగా ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న నాగపద్మజను వరంగల్ డీఆర్డీఓ పీడీగా నియమించిగా, ఆమె బుధవారం విధుల్లో చేరారు. ఈ మేరకు ఇప్పటివరకు ఇన్చార్జ్గా కొనసాగిన జెడ్పీ సీఈఓ రాంరెడ్డి,.. నాగపద్మజకు బాధ్యతలు అప్పగించారు. ఆమెకు ఉద్యోగులు బొకేలు అందిచేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ సత్యశారదను నాగపద్మజ మర్యాదపూర్వకంగా కలిశారు.ఏఐ వర్క్షాపు విజయవంతం.. హన్మకొండ : విద్యార్థుల లెర్నింగ్ అవుట్కమ్ను మెరుగుపరుచడానికి జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ఏఐ వినియోగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సంభూతి లెర్నింగ్ ప్రతినిధులు బుధవారం హనుమకొండలోని అశోక హోటల్లో నిర్వహించిన శ్రీఫ్యూచర్ ప్రూఫింగ్ స్కూల్స్ విత్ ఏఐ వర్క్షాపుశ్రీ విజయవంతంగా ముగిసింది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచి 80 పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు పాల్గొన్నాయి. సీబీఎస్ఈ హైదరాబాద్ ప్రాంతీయ అధికారి సునీల్ కుమార్ జంగం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పాఠశాలో ఏఐ విద్య అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో ట్రస్మా ప్రధాన కార్యదర్శి రమేశ్ రావు, సంభూతి సీటీఓ శ్రీనివాస్రావు పోలాడి, సీఈఓ ఉమా మహేశ్వర్, స్కూల్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ శంకరాచారి, నారాయణ రెడ్డి, సంగం రెడ్డి సుందర్ రాజు యాదవ్ పాల్గొన్నారు. గిన్నిస్ రికార్డు సాధించిన వెంకటేశ్వర్లు కాశిబుగ్గ: వరంగల్ కొత్తవాడకు చెందిన బిట్స్ అసోసియేట్ ప్రొఫెసర్ వెల్దే వెంకటేశ్వర్లు గి న్నిస్ రికార్డు సాధించారు. వరంగల్ కొత్తవాడలోని భారత్ పబ్లిక్ స్కూల్లో 64 గంటల 12 ని మిషాల పాటు నిరవధికంగా కంప్యూటర్ విద్యౖ పె బోధన చేస్తూ ప్రపంచ రికార్డు సాధించారు. విద్యారంగంలో అరుదైన ఘనత సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తూ లాంగెస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లెసన్ విభాగంలో గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. దీంతో వెంకటేశ్వర్లును బిట్స్ గ్రూప్ చైర్మన్ రాజేంద్రప్రసాద్ రెడ్డి, ప్రిన్సిపాల్ హరిహరన్, ఏఓ సురేశ్ అభినందించారు. మీ సేవ సెంటర్పై ఏసీబీ దాడులు కాశిబుగ్గ: వరంగల్ శ్రీనివాస కాలనీలోని ఓ మీ సేవ సెంటర్పై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎంజీఎం ఎదుట ఉన్న వీధిలో చాలా కాలం నుంచి నడుస్తున్న మీ సేవ సెంటర్లో దాడులు జరిపారు. ప్రజల నుంచి ధృవీకరణ పత్రాల కోసం ఎంత డబ్బులు వసూలు చేస్తున్నారు, సర్టిఫికెట్ల పంపిణీ ఎలా జరుగుతుందో తెలుసుకున్నారు. వినియోగదారులు సమర్పిస్తున్న దరఖాస్తులు, ఆన్లైన్ నమోదు విధానం తెలుసుకున్నట్లు సమాచారం. మీ సేవ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది పరిశీలించారు. దా దాపు గంటసేపు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. అలాగే మీ సేవ తీరుతెన్నులను పరిశీలించినట్లు సమాచారం. -
ప్రభుత్వానికి కరెంట్ షాక్ తప్పదు
● బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ హన్మకొండ: కాంగ్రెస్ ప్రభుత్వానికి కరెంట్ షాక్ తప్పదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. విద్యుత్ ఆర్టిజన్లు చేస్తున్న నిరవధిక సమ్మె బుధవారానికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో సమ్మె చేస్తున్న ఆర్టిజన్లకు, హనుమకొండ ములుగు రోడ్డులోని ట్రాన్స్–కో జోనల్ కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్న ఆర్టిజన్లకు దాస్యం వినయ్భాస్కర్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం తక్షణమే ఆర్టిజన్లతో చర్చించి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హనుమకొండ జెడ్పీ మాజీ చైర్మన్ మారపల్లి సుధీర్కుమార్, కార్పొరేటర్లు సోదా కిరణ్, బొంగు అశోక్ యాదవ్, నాయకులు జోరిక రమేశ్, పులి రజనీకాంత్, గొర్రె విజయ్, ఈసంపల్లి సంజీవ, టీఎస్ఈఈయూ–327 వరంగల్ జిల్లా కార్యదర్శి మచ్చిక బుచ్చయ్యగౌడ్, హనుమకొండ జిల్లా కార్యదర్శి చిట్ల ఓదెలు, యూనియన్ నాయకులు సంఘీబావం తెలిపారు. ఈ సమ్మెలో ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ వర్కర్లు పాల్గొన్నారు. -
ఈజీఎస్ లక్ష్యాన్ని పూర్తి చేయండి
హన్మకొండ అర్బన్: ఉపాధి హామీ పనుల లక్ష్యాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఉపాధి పనుల ప్రగతిపై డీఆర్డీఏ అధికారులు, ఎంపీడీఓలు, ఏపీఓలు, ఈసీలతో సమీక్ష నిర్వహించారు. ఉపాధి పనుల్లో అధిక సంఖ్యలో కూలీలను భాగస్వామ్యం చేసినందుకు ఎర్రబెల్లి గ్రామానికి చెందిన సీనియర్ మేట్ను కలెక్టర్ శాలువాతో సన్మానించి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, డీఆర్డీఏ ఏఓ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓలు, ఏపీఓలు, ఈసీలు తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించండి వరంగల్ అర్బన్: భవన నిర్మాణాల్లో ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ టౌన్ ప్లానింగ్ అధికారులను హెచ్చరించారు. బుధవారం హనుమకొండ, పలివేల్పుల, మంత్రపూర్ కాలనీ, శ్రీనివాసనగర్, బాలాజీ నగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ పనులు పరిశీలించారు. తనిఖీల్లో ఎంహెచ్ఓ రాజేశ్, సూపర్వైజర్ నరేందర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ బాషానాయక్, టౌన్ ప్లానింగ్ అధికారులు రంజిత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నత లక్ష్యాలు సాధించాలి.. హన్మకొండ/కాజీపేట అర్బన్: బాలసదనంలోని బాలికలు ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ఇష్టపడి చదవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. హనుమకొండ సుబేదారిలోని బాలికల బాలసదనాన్ని బుధవారం కలెక్టర్ చాహత్బాజ్పాయ్ తనిఖీ చేశారు. కిచెన్, ఆహార పదార్థాలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, సూపరింటెండెంట్ ఎం.కళ్యాణి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఇన్చార్జ్ ఎస్.ప్రవీణ్కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం.మౌనిక, కౌన్సిలర్లు త్రివేణి, గౌతమి తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులతో సమీక్ష -
గురువారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
మ్యాపింగ్ రూపకల్పనలో నిమగ్నమైన అధికారులు సెన్సస్ కోసం 150 నుంచి 200 నివాసాలతో కూడిన మ్యాపింగ్ తయారు చేస్తున్నారు. 750 నుంచి 800 మంది వరకు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్నే హౌస్ లిస్టింగ్ బ్లాక్(హెచ్ఎల్బీ)గా వ్యవహరిస్తారు. హెచ్ఎల్బీల మ్యాపింగ్లో స్లమ్స్ను సాధారణ కాలనీలతో కలపవద్దని హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. సెన్సస్ ద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడంతో పాటు ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించేందు కు తోడ్పడనుంది. ఈ ప్రక్రియ డివిజన్ల పునర్విభజనకు ఎంతగానో ఉపయోగపడనుంది. 26 నుంచి సెల్ఫ్ ఎన్యుమరేషన్ మే 10 నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలన, నమోదు గడువులోగా పూర్తి చేసేందుకు యంత్రాంగం కసరత్తువరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్లో జనగణన (సెన్సస్) మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సెన్సస్కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో బల్దియా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల అధికారులు, సిబ్బంది మ్యాపింగ్ తయారీలో నిమగ్నమయ్యారు. నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. స్వచ్ఛంద నమోదుకు అవకాశం జనగణన పదేళ్లకోసారి జరగాల్సి ఉంటుంది. 2011లో జరిగిన ఈ కార్యక్రమం 2021లో చేపట్టాల్సి ఉండేది. కానీ, 2021లో కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ప్రభుత్వ ఆదేశాలతో ఇటీవల మొదలుపెట్టారు. గతంలో ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు చేసేవారు. ఈ దఫా డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎన్యుమరేటర్లకంటే ముందుగా ప్రజలు స్వచ్ఛందంగానే సంబంధిత పోర్టల్ ద్వారా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సదరు పోర్టల్ ఈనెల 26 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. మే 9 వరకు ప్రజలు స్వచ్ఛందంగా నివాస వివరాలు, ఇంటి చిరునామాతో కుటుంబంలోని సభ్యుల వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అనంతరం జూన్ 12 వరకు ఎన్యుమరేటర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్న వారి వివరాలు ధ్రువీకరిస్తారు. లేని వారి వివరాలు నమోదు చేస్తారు. ప్రిన్సిపల్ చార్జ్ ఆఫీసర్గా ఇన్చార్జ్ కమిషనర్ జనగణనకు ప్రిన్సిపల్ చార్జ్ ఆఫీసర్గా బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్కి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. కాశి బుగ్గ సర్కిల్కు డిప్యూటీ కమిషనర్ ప్రసన్నారాణి, కా జీపేట సర్కిల్కు బిర్రు శ్రీనివాస్, వీరికి తోడు సిటీ ప్లా న ర్ రవీందర్, టెక్నికల్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తారు. 18 నుంచి ఎన్యుమరేటర్లకు శిక్షణ ఈనెల 18 నుంచి మే 5 వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడు విభాగాలుగా వర్గీకరించి ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. జూన్ 12తో ఈ సంవత్సరానికి సంబంధించి ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాపులేషన్ సెన్సస్ ప్రారంభం కానుంది. ఈప్రక్రియ నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసేందుకు సుమారు 1,600 మందికిపైగా ఎన్యుమరేటర్లు అవసరం. ప్రభుత్వ విభాగాల నుంచి తీసుకోనున్నారు. 4–6 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ను నియమిస్తారు. -
విగ్రహాల ఏర్పాటుకు కృషి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలోని విష్ణు, సూర్య ఆలయాల్లో విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తానని, పునఃప్రతిష్ఠ కోసం కేంద్రానికి నివేదిక అందజేస్తానని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. వరంగల్ పర్యటన సందర్భంగా బుధవారం రాత్రి వేయిస్తంభాల ఆలయంలోని రుద్రేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు ఆయనను ఆలయ మర్యాదలతో స్వాగతించారు. రుద్రేశ్వరస్వామికి పూజల అనంతరం అర్చకులు మహదాశీర్వచం అందించారు. అనంతరం ఆయన ఆలయాన్ని పరిశీలించారు. -
శ్వేతార్కుడికి న్యాయమూర్తి పూజలు
కాజీపేట: కాజీపేట స్వయంభు శ్రీశ్వేతార్క మూలగణపతి దివ్యక్షేత్రాన్ని బుధవారం జిల్లా న్యాయమూర్తి సునీత కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కొలువుదీరిన 29 దేవతామూర్తుల వివరాలు, ఆలయంలో జరుగు పూజలు, ఉత్సవాల జరుగు తీరును ఆలయ వైదిక కార్యక్రమాల నిర్వాహకులు అయినవోలు రాధాకృష్ణ శర్మ.. న్యాయమూర్తికి వివరించారు. స్వామి వారి శేషవస్త్రాలతో పాటు చిత్రపటాన్ని అందించి పాలక మండలి సభ్యులు సాయికృష్ణ శర్మ సత్కరించారు. కేయూ క్యాంపస్: విద్యార్థులు చదువుతోపాటు తమకిష్టమైన క్రీడల్లోనూ ఆసక్తి పెంచుకుని రాణించాలని కేయూ వీసీ ప్రతాప్రెడ్డి అన్నారు. బుధవారం కేయూలోని స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ విభాగం ఆధ్వర్యంలో కేయూ యూత్ స్పోర్ట్స్ ఫెస్టివల్ను రిజిస్ట్రార్ రామచంద్రంతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలిరోజు క్రికెట్ పోటీలను వీసీ ప్రతాప్రెడ్డి బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. పదిరోజుల పాటు జరిగే ఈక్రీడల్లో వాలీబాల్, అథ్లెటిక్స్, ఖోఖో పోటీలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ విభాగం ప్రొఫెసర్ మా మిడాల ఇస్తారి, కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వెంకయ్య, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్లు నిరంజన్ శ్రీనివాస్, రాధిక తదితరులు పాల్గొన్నారు. రామన్నపేట: అర్హత కలిగిన కంటి వైద్య నిపుణుల ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే ఆప్టికల్ షాపుల వారు కంటి అద్దాలు తయారు చేసివ్వాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య ఆదేశించారు. బుధవారం హనుమకొండలోని ఆప్టికల్స్కు సంబంధించిన పలు షాపులను ఆయన తనిఖీ చేశారు. ఆప్టికల్స్ షాపులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఉచితంగా పరీక్షలు చేసి అద్దాలు ఇస్తామని బోర్డులు ప్రదర్శించకూడదన్నారు. ఈ తనిఖీలో స్టాటిస్టికల్ అధికారి ప్రసన్నకుమార్, రంజిత్ పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్సైన్స్ కళాశాల చరిత్ర విభాగం అధ్యాపకులు డాక్టర్ అరూరి రంజిత్కుమార్ రచించిన ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యావ్యవస్థ 1956–14’ పుస్తకాన్ని బుధవారం కేయూ వీసీ ప్రతాప్రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రామచంద్రం యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, డీన్ సురేశ్లాల్, హిస్టరీ విభాగాధిపతి రాజ్కుమార్, విశ్రాంత ఆచార్యులు దయాకర్రావు, అధ్యాపకులు చందర్రావు, రాజేందర్రెడ్డి, అరూరి సూర్యం, కె.రాజయ్య, అరూరి రంజిత్ పాల్గొన్నారు. -
ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయం
వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ కాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలో మార్కులు సాధించడం ప్రశంసనీయమని వరంగల్ ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. జిల్లా ఇంటర్ విద్య కార్యాలయంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను శాలువాలు, జ్ఞాపికలతో సోమవారం సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖానాపురం జూనియర్ కళాశాల విద్యార్థి ఎంపీసీలో 989/1000 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు యశ్వంత్, అల్ఫియా ఆనం, జి.పల్లవి, నందిని ని ప్రిన్సిపాల్స్ సంపత్కుమార్, శరదృతి ఉన్నారు. -
తునికాకు సేకరణకు సిద్ధం!
సాక్షిప్రతినిధి, వరంగల్: తునికాకు సేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు స్టాండర్డ్ బ్యాగుకు రూ.3,300 ధరను ఖరారు చేస్తూ అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా ఆరు సర్కిళ్ల పరిధిలో 104 యూనిట్ల ద్వారా ఈ బీడి ఆకు సీజన్లో తునికాకుసేకరణ చేయనున్నట్లు అధికారులు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. కాళేశ్వరం, కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) మంచిర్యాల, బాసర, రాజన్న, భద్రాద్రి, చార్మినార్ సర్కిళ్లలో 104 యూనిట్లు ఏర్పాటు చేసి 1,22,000 స్టాండర్డ్ బ్యాగు (ఎస్బీలు)లు కొనుగోలు లక్ష్యంగా ప్రకటించారు. అయితే, అటవీశాఖ ఉమ్మడి వరంగల్ (కాళేశ్వరం, భద్రాద్రి సర్కిళ్లు) 14 డివిజన్లల పరిధి ఎనిమిది డివిజన్లలో 77 యూనిట్ల ద్వారా 80,200 స్టాండర్డ్ బ్యాగుల ఆకు సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నారు. ధర నిర్ణయం.. ఈసారి ఆకు సేకరణ చేసిన కూలీలకు స్టాండర్డ్ బ్యాగు (50 ఆకుల కట్టలు వెయ్యి)కు రూ.3,300 చెల్లించనున్నట్లు అధికారులు ఆ ఉత్తర్వుల్లో వెల్ల డించారు. తెలంగాణ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ (రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్) చట్టం, 1971లోని సెక్షన్ 7 ప్రకారం.. సలహా కమిటీతో సంప్రదించిన తర్వాత ప్రభుత్వం ఈ ధరలను ఖరారు చేసింది. ఈ లెక్కన ఆకు సేకరణ కోసం రూ.54.90 కోట్లు విడుదల చేశారు. కాళేశ్వరం సర్కిల్ పెద్దపల్లి, జేఎస్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మహదేవపూర్, భూపాలపల్లి, ములుగు, తాడ్వాయి, వెంకటాపురం, ఏటూరునాగారం డివిజన్లలో 37 యూనిట్ల ద్వారా 32,900 స్టాండర్డ్ బ్యాగులు కొనుగోలు చేయనున్నారు. భద్రాద్రి సర్కిల్ కేజీఎం భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లోని భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, కేడబ్ల్యూఎస్ కిన్నెరసాని, కొత్తగూడెం, ఇల్లందు అటవీశాఖ డివిజన్లలో 40 యూనిట్లలో 47,300, చార్మినార్ సర్కిల్లో మూడు యూనిట్ల ద్వారా 800 స్టాండర్డ్ బ్యాగుల బీడీ ఆకు సేకరించనున్నట్లు రాష్ట్ర పరిసరాల, అడవుల ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీం ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. కాగా, బీడీ ఆకు సేకరణ వ్యవహారంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎఫ్డీసీఎల్) ప్రభుత్వ ఏజెంట్గా వ్యవహరించనుంది. సేకరణకు రూ.54.90 కోట్లు తునికాకు సీజన్ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం బడ్జెట్ రూ. 54.90 కోట్లు వివిధ విభాగాలకు కేటాయించింది. ఇందులో తునికాకు సేకరణకు స్టాండర్డ్ బ్యాగు (ఎస్బీ)కి రూ.3,300 చొప్పున రూ.40.26 కోట్లు కాగా, ఇది మొత్తం బడ్జెట్లో అతిపెద్ద వాటా. నిర్ణీత ధర రూ.3,300 చొప్పున 1,22,000 స్టాండర్డ్ బ్యాగుల సేకరణ కోసం ఈ నిధులు కేటాయించారు. అదేవిధంగా సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో డేటా ఎంట్రీ, మానిటరింగ్ పనుల కోసం 12 నెలల కాలానికి ఔట్ సోర్సింగ్ సిబ్బంది కోసం రూ.4.90 కోట్లు, గోదాం రికార్డు కీపర్లు, టీఎంలకు 45 రోజుల కోసం రూ.5 లక్షలు కేటాయించారు. మిగతా రూ.14,54,10,000లు కార్యాలయ, అటవీశాఖ క్వార్టర్ల నిర్వహణ, పోస్టల్, విద్యుత్, మున్సిపల్ పనులు, టెలిఫోన్, వాహనాలు తదితర అవసరాల కోసం ఖర్చు చేయనున్నారు. తగ్గిన యూనిట్లు! ఐదేళ్ల క్రితానికి.. ఇప్పటికీ తునికాకు యూనిట్లు గణనీయంగా తగ్గింది. 309 యూనిట్ల ద్వారా 3,569 కల్లాలు ఏర్పాటు 5,42,70 స్టాండర్డు బ్యాగుల ఆకు సేకరణ చేసేవారు. నూటికి నూరు శాతం లక్ష్యాలు నెరవేరగా, రాను రానూ 243 యూనిట్లు, 2,41,700 స్టాండర్డ్ బ్యాగులకు పడిపోయింది. ఈ ఏడాది మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 104 యూనిట్లు, 1,22,000 స్టాండర్డ్ బ్యాగుల సేకరణ లక్ష్యం కాగా.. ఉమ్మడి వరంగల్లో 8 డివిజన్లలోనే ఆకు సేకరించనున్నారు. ఆకు సేకరణ లక్ష్యాలు తగ్గడం ద్వారా ఉపాధి కూలీలు ఆదాయం, పనిదినాలు కోల్పోతున్నారు. ఇదిలా ఉండగా ఫ్రూనింగ్ (కొమ్మలు కొట్టె) ఈ నెలాఖరు వరకు ముగియనుండగా, అటవీశాఖ అధికారులు, కాంట్రాక్టర్లు మే 1 నుంచి తునికాకు సేకరణ ప్రారంభించి సుమారు 30–45 రోజుల్లో ఆకు సేకరణ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 77 యూనిట్లు.. 80,200 ఎస్బీలు లక్ష్యం వరంగల్ సర్కిల్ లోని 14 డివిజన్లలో సేకరణ స్టాండర్డ్ బ్యాగుకు రూ.3,300 ధర ఖరారు రూ.54.90 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం -
ఆర్టిజన్ల సమ్మెతో సర్కారుకు షాక్
హన్మకొండ : కరెంటోళ్ల సమ్మెతో కాంగ్రెస్ సర్కార్కు షాక్ తప్పదని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ములుగు రోడ్డులోని ట్రాన్స్కో జోనల్ కార్యాలయం వద్ద విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె శిబిరాన్ని రాకేశ్రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం బైక్ ర్యాలీ చేపట్టి అంబేడ్కర్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తొమ్మిది రోజులుగా ఆర్టిజన్ కార్మికులు సమ్మె చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులది కీలక పాత్ర అని కొనియాడారు. కొట్లాడి తెచ్చిన తెలంగాణలో అభివృద్ధి ఫలాలు ఉద్యోగులకు అందాలని చరిత్రలో ఎక్కడ లేని విధంగా అప్పటి సీఎం కేసీఆర్ పీఆర్సీ ఇచ్చారని గుర్తు చేశారు. కాంట్రాక్ట్ అన్న మాటే ఉండకూడదన్న సంకల్పంతో కాంట్రాక్ట్ ఉద్యోగాలను పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించి, వారికో గుర్తింపునిచ్చారని తెలిపారు. విద్యుత్ రంగంలో కాంట్రాక్టు ఉద్యోగులను 23 వేల మందిని ఆర్టిజన్ ఉద్యోగులుగా గుర్తించిన ఘనత కేసీఆర్దేనన్నారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఉద్యోగులకు, ఆర్టిజన్ కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విస్మరించిందని దుయ్యబట్టారు. విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగుల కన్వర్షన్ చేయాలని, రెగ్యులర్ ఉద్యోగులతో వర్తింపజేస్తున్న సర్వీస్ రూ ల్స్ వీరికి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టిజన్ ఉద్యోగులు పాల్గొన్నారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క సమ్మె శిబిరానికి రావాలి బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్రెడ్డి -
బుధవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
నగర దశ దిశను చూపించే కీలకమైన పట్టణ ప్రణాళిక విభాగానికి సిటీప్లానర్ పోస్టు ఏడాదిన్నరగా ఖాళీ ఉంటుంది. అప్పట్లో పూర్తిస్థాయి సిటీప్లానర్ రాజకీయ కారణాలతో హైదరాబాద్కు బదిలీపై వెళ్లారు. ఆ స్థానంలో డిప్యూటీ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా రెండు డీసీపీ, మూడు ఏసీపీ, టీపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో అనుమతి లేని భవనాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. అనుమతి తీసుకున్నా ఇష్టారాజ్యంగా భవన నిర్మాణాలు చేపడుతున్నారు. రోడ్లు, జంక్షన్ల విస్తరణ అటకెక్కింది. వరంగల్ మహానగర పాలకసంస్థకు కొత్త కమిషనర్తోపాటు కీలక విభాగాలకు పూర్తిస్థాయి అధికారులను నియమిస్తేనే పాలన గాడిలో పడే అవకాశం ఉంది. ● ఫిర్యాదులు, ఫైళ్లు, అభివృద్ధిని పట్టించుకునే వారే లేరు! ● కార్యాలయాల చుట్టూ నగరవాసుల ప్రదక్షిణ ● మరికొద్ది రోజుల్లో స్పెషల్ ఆఫీసర్ పాలనవరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఒకవైపు పాలకవర్గం పదవి కాలం మరో 22 రోజుల్లో ముగియనుంది. మరోవైపు పూర్తిస్థాయి కమిషనర్ను ప్రభుత్వం నియమించలేదు. హనుమకొండ కలెక్టర్ చాహత్బాజ్పాయ్ ఇన్చార్జ్ కమిషనర్గా పని చేస్తున్నారు. పూర్తిస్థాయి అధికారులు లేక ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ కీలకవిభాగాల్లో ఇన్చార్జులే కొనసాగుతున్నారు. దీంతో పరిపాలన అదుపు తప్పింది. పాలకవర్గం గడువు ముగిస్తే హనుమకొండ కలెక్టర్.. బల్దియా స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆమె కలెక్టర్గా, ఇన్చార్జ్ కమిషనర్గా, కుడా వైస్ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. ఈ కీలక బాధ్యతలు నిర్వర్తించడం ఆమెకు సవాల్గా మారనుంది. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే పెద్ద నగరమైన వరంగల్ సాంస్కృతిక, వారసత్వ, కాకతీయుల రాజధానిగా ఘనకీర్తి చెందింది. భవిష్యత్ అభివృద్ధికి మెరుగైన అవకాశాలున్నాయి. భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ (యూజీడీ), ఇన్నర్ రింగ్ రోడ్డు, మామునూరు ఎయిర్పోర్టు, రైల్వే కోచ్ఫ్యాక్టరీ, నగర శివారులో టైక్స్టైల్ పార్కు పనులు ఊపందుకున్నాయి. అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నతాధికారులు చాలా విషయాల్లో చొరవ తీసుకోవడం లేదు. సమస్యల సవాళ్లు.. మహా నగర ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. విలీన గ్రామాలు, శివారు కాలనీల్లో కనీస వసతుల్లేవు. ప్రతి సోమవారం గ్రేటర్ గ్రీవెన్స్లో ప్రజలు వందల సంఖ్యలో వినతులు అందజేస్తున్నారు. ప్రధాన కార్యాలయం, కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాల్లో పౌరసేవలు ఆలస్యమవుతున్నాయి. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కనీసస్థాయిలో కూడా జవాబుదారీ తనం కరువైంది. నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. సిటిజన్ చార్టర్ ఉద్దేశమే లేదు. బాధ్యత లేని సిబ్బంది ఫిర్యాదులను ఉల్లంఘిస్తే జరిమానా విధించి బాధితులకు అందజేయాలి. ఈ నిబంధన బేఖాతర్ చేస్తున్నారు. ఇంజినీర్లు, టౌన్ప్లానింగ్ అధికారులు చూద్దాం.. చేద్దామంటున్నారు. పలు కాలనీల్లో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. వేసవికి సరిపడా నీళ్లున్నా ఇంజనీర్లు ఫిల్టర్ బెడ్ల నిర్వహణపై అశ్రద్ధ చూపెడుతున్నారు. పైపులైన్ల లీకేజీలతో నీరు వృథాగా కాల్వల్లో పారుతోంది. తాగునీటి శాశ్వత పరిష్కారం కోసం రూ.వందల కోట్లు వెచ్చించినా ఇంకా మురికివాడలు, విలీన గ్రామాల్లో వాటర్ ట్యాంకర్లే శరణ్యంగా మారాయి. విద్యుత్ లైట్లు వెలగక కాలనీలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఇంటింటా చెత్త సేకరణ క్రమం తప్పింది. 3వేల మంది పారిశుద్ధ్య కార్మికుల్లో సుమారు 400 మంది పనులు చేయకుండానే అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లను మేనేజ్ చేసుకుంటూ జీతాలు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కుక్కలు, కోతులు, దోమలతో నిత్యం ప్రజలు పాట్లు పడుతున్నారు. అన్ని విభాగాల్లో పైసలిస్తేనే పనులు ముందుకు సాగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండున్నర నెలలుగా ఎస్ఈ పోస్టు ఖాళీ..నగర అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించే ఎస్ఈ సత్యనారాయణ రెండున్నర నెలల కిందట పదవి విరమణ చేశారు. పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనివాస్కు అదనంగా బల్దియా ఎస్ఈ బాధ్యతలు అప్పగించారు. రూ.వందల కోట్లతో నగరంలో మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన పెద్ద దిక్కు లేరు. మూడు ఈఈ పోస్టులు, నాలుగు డీఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కిందస్థాయి అధికారులకు అదనపు బాధ్యతలు కట్టబెట్టి కాలం వెళ్లదీస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏఈల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యవసర పనులు చేయలేకుండా పోతున్నారు. అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. -
దేశ ఐక్యతకు రాజ్యాంగమే ఆధారం
హన్మకొండ : దేశ ఐక్యతకు రాజ్యాంగమే బలమైన ఆధారమని హనుమకొండ కలెక్టర్ చాహత్బాజ్పాయ్ అన్నారు. సమాన హక్కులు, సామాజిక న్యాయం సాధనలో అంబేడ్కర్ పాత్ర అనిర్వచనీయమన్నారు. హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీఆర్ అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్, అతిథులు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎండీ రియాజ్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, అదనపు కలెక్టర్ రవి, ప్రజా సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేడ్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ చాహత్బాజ్పాయ్ మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని బలపర్చేందుకు ఓటు హక్కు వినియోగించాలని పిలుపునిచ్చారు. ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కన్నం నారాయణ, డీఆర్డీఓ మేన శ్రీను, మెప్మా పీడీ జోనా, డీఎంహెచ్ఓ అప్పయ్య, డీడబ్ల్యూఓ విశ్వజ, హౌసింగ్ పీడీ సిద్ధార్థనాయక్, మహనీయుల ఉత్సవ కమిటీ చైర్మన్ బండారి సురేందర్, నాయకులు మంద కుమార్, పుట్ట రవి, అంకేశ్వరపు రామచంద్రరావు, చుంచు రాజేందర్, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆలోచనలు అందరికీ ఆదర్శం కాశిబుగ్గ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనలు అందరికీ ఆదర్శమని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా కాశి బుగ్గ సెంటర్లోని విగ్రహానికి సిరిసిల్ల రాజయ్యతో పాటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఎమ్మెల్యే నాగరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ పరిరక్షణకు చేసిన సేవలు ప్రతీ ఒక్కరికి మార్గదర్శకమన్నారు. అంబేడ్కర్ భవన నిర్మాణానికి ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తానన్నారు. అనంతరం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలోని ‘ఆరైవ్ –అలైవ్’ కార్యక్రమంలో రోడ్డు భద్రత అవగాహనపై కలెక్టర్ సత్యశారద ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఆయూబ్, అదనపు కలెక్టర్లు వైవీ గణేశ్, సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఏసీపీ డాక్టర్ శుభంప్రీత్, గజ్జెల రాంకిషన్, జన్ను భాస్కర్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.అంబేడ్కర్ జయంతి వేడుకల్లో హనుమకొండ కలెక్టర్ చాహత్బాజ్పాయ్ -
ప్రణాళికాబద్ధంగా ‘అరైవ్–అలైవ్’ నిర్వహించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు చేపట్టిన అరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశా నిర్దేశనం చేశారు. రోజువారీ షెడ్యూల్ ప్రకారం వారం రోజుల పాటు నిర్వహించాలన్నారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. అగ్నిమాపక వారోత్సవాలు షురూ.. కాశిబుగ్గ : వరంగల్లోని అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం కాకతీయ వైద్య కళాశాల ఎన్ఆర్ఐ భవనంలో వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ డాక్టర్ సత్యశారద, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, అగ్నిమాపక శాఖ అధికారులు ఆవిష్కరించారు. -
తనిఖీలు ఫలితాలిస్తున్నాయి..
మద్యం మత్తులో వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రజల ప్రాణాలను రక్షించేందుకే నగర వ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నాం. దీనివల్ల వాహనదారులకు అవగాహన పెరగడంతోపాటు మద్యం తాగేవారు నియంత్రణలోకి వస్తారు. పెద్ద దిక్కుగా ఉండే యజమాని ప్రమాదంలో మృతి చెందితే ఆ కుటుంబానికి ఆధారం లేకుండాపోతుంది. అందుకే నగరంలోని అన్ని ప్రాంతాలోనూ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. దీంతో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. టి.సత్యనారాయణ, నగర ట్రాఫిక్ ఏసీపీ -
ఎస్ఆర్ యూనివర్సిటీకి ఐసీఏఆర్ గుర్తింపు
హన్మకొండ చౌరస్తా: భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) నుంచి స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, బీఎస్సీ (హాన్స్) అగ్రికల్చర్ ప్రోగ్రాం రెండింటికీ తమకు గుర్తింపు లభించిందని ఎస్ఆర్ యూనివర్సిటీ చాన్స్లర్ ఎ.వరదారెడ్డి తెలిపారు. హనుమకొండ కాకాజీకాలనీలోని ఆయన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ గుర్తింపుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్కూల్, కాలేజీ ప్రోగ్రాం స్థాయిలో ఐసీఏఆర్ గుర్తింపు పొందిన మొదటి ప్రైవేట్ యూనివర్సిటీగా నిలిచిందని అన్నారు. 16 మార్చి 2026 నుంచి ఐదేళ్లు అమలులో ఉంటుందని, నేషనల్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అక్రిడిటేషన్ బోర్డు (ఎన్ఏఈఏబీ) 42వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలపై విశ్వవిద్యాలయం చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శనమన్నారు. తద్వారా ఐసీఏఆర్ స్కాలర్షిప్స్, ఫెలోషిప్కు అర్హత పొందుతారని, విశ్వవిద్యాలయానికి నిధులు, పరిశోధన అవకాశాలు లభిస్తాయని ఆనందం వ్యక్తం చేశారు. ఎస్ఆర్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ దీపక్గార్గ్ మాట్లాడుతూ ఈ గుర్తింపు విశ్వవిద్యాలయ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని అన్నారు. స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ డీన్ ప్రొఫెసర్ జి.భూపాల్రాజ్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో 13 ఆధునిక ప్రయోగశాలలు, వ్యవసాయభూములు, పాలీహౌస్, షేడ్నెట్, హైడ్రోపోనిక్స్, వాతావరణ పరిశీలన కేంద్ర సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల కోసం గ్రామీణ వ్యవసాయ పనుల అనుభవ కార్యక్రమాలు, పదికి పైగా అనుభవ ఆధారిత అభ్యాసంతోపాటు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో 25కు పైగా ఒప్పందాలు ఉన్నాయని అన్నారు. ఈ ఇంటర్న్షిప్ 75 శాతం కంటే ఎక్కువ ప్లేస్మెంట్ రేటును సాధిస్తున్నారని, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ దాదాపు 90 శాతం అధ్యాపకులు డాక్టరేట్, పోస్ట్ డాక్టరేట్ అర్హతలు కలిగిన వారని తెలిపారు. దేశవిదేశాల నుంచి విద్యార్థులు చేరడం వలన విద్యా ప్రమాణాలు మరింత బలపడుతున్నాయని అన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీవీ రమణరావు, డీన్ ఆపరేషన్స్ అండ్ గ్రోత్ ప్రొఫెసర్ అర్చనారెడ్డి, ఐక్యూఏసీ డైరెక్టర్ ప్రొఫెసర్ పీవీ రాజశేఖర్, ఐక్యూసీ ప్రతినిధులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. చాన్స్లర్ ఎ.వరదారెడ్డి -
ఫీజు రీయింబర్స్మెంట్పై కుట్ర
విద్యారణ్యపురి: మహిళా రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీల వాటా ఎంత అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ ప్రశ్నించారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం రాత్రి నిర్వహించిన బహుజనుల ఓరుగల్లు పోరు గర్జన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ ఆశయాలను కాన్షీరాం, మాయావతి మినహా ఎవరూ ముందుకు తీసుకెళ్లలేదన్నారు. అంబేడ్కర్తోనే రిజర్వేషన్లు, ఓటు హక్కు వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. దళిత క్రైస్తవులను ఎస్సీల్లోనే కొనసాగించాలని ప్రధానికి మాయావతి పలు సార్లు లేఖలు రాశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం పేదల భూములను లాక్కుంటోందని ఆరోపించారు. ఖమ్మంలో వెలుగుమట్ల, హైదరాబాద్లో మూసిపేరిట పేదల ఇళ్లను కూల్చుతున్నారని మండిపడ్డారు. నాడు కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో పేదలకు ఇచ్చేందుకు భూములు లేవని చెబుతూ ప్రైవేట్ కంపెనీలకు మాత్రం భూములు ఇస్తున్నారని ఆరోపించారు. పేద విద్యార్దులకు ఇచ్చే పీజు రీయంబర్స్మెంట్పై కుట్ర జరగుతోందని, విద్యార్థులే ఫీజులు చెల్లించాలని ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోగ్యశాఖ మంత్రి వరంగల్ ఎంజీఎంను సందర్శించాలని సూచించారు. వరంగల్ ఎయిర్పోర్టుపై సాగదీత ఎందుకు అని శేఖర్ ప్రశ్నించారు. కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. విశిష్ట అతిథి దాగిల్ల దయానంద్రావు, బీఎస్పీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు అంబాల ప్రశాంత్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు బష్కే నాగరాజు, ఉమ్మడి వరంగల్లోని వివిధ జిల్లాల అధ్యక్షులు ఎం.సదానందం, కల్పల నరేష్, చంద్రశేఖర్, విజ యకాంత్, నర్సయ్య, పార్లమెంట్ ఇన్చార్జ్లు వైనా ల కార్తీక్, బాధ్యులు వారికిల్ల మల్లేశ్, కాదాసి రవీందర్, తాండ్ర వెంకటేశ్వర్లు, శ్వేత, ఇందిర, ఉపేందర్ సాహు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీల వాటా ఎంత? బహుజన సమాజ్పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ కేడీసీలో బహుజనుల ఓరుగల్లు పోరుగర్జన సభ -
సూర్యుడు సలసల..జనం విలవిల
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ ఆరు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు వడదెబ్బతో ఇప్పటికే నలుగురు మృతిచెందారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటుండడంతో జనాలు రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు. సోమవారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రెండు వడదెబ్బ మరణాలు, అంతకుముందు రెండు ఘటనలు జరగడంతో హైరానా పడుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జిల్లా వైద్యారోగ్యవిభాగాధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు గ్రామ పంచాయతీ, మండల కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి సంచాలకురాలు దివ్యదేవరాజన్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటించండి..ఉదయం 10 గంటల్లోపు పనులు పూర్తి చేసుకోవాలి. మళ్లీ సాయంత్రం ఐదు గంటల తర్వాత చేపట్టాలి. తెల్లని కాటన్ వస్త్రాలు ధరించడం, తలకు తెల్లని టోపీ, చెవులలోకి వేడి గాలి వెళ్లకుండా వస్త్రం, రుమాలు కట్టుకోవాలి. గొడుగు వాడితే మంచిది. ద్రవ పదార్థాలు, నీరు, తరచుగా ఓఆర్ఎస్ తీసుకోవాలి. వెంట కొద్దిగా ఉప్పు, చక్కెర కలిపిన సాధారణ నీటి సీసా ఉంచుకోవాలి. వృద్ధులు, పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. నీరసంగా ఉంటే వెంటనే దగ్గరలోని వైద్యుడికి చూపించాలి. – డాక్టర్ సాంబశివరావు, వరంగల్ జిల్లా వైద్యారోగ్య విభాగాధికారి 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఇప్పటికే నాలుగు వడదెబ్బ మరణాలు నమోదు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు రానున్న రోజుల్లో మరింత తీవ్రమయ్యే అవకాశం అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు -
ప్రధానితో ముఖాముఖికి వ్యవసాయ విద్యార్థులు
హన్మకొండ: ప్రధాని నరేంద్ర మోదీతో ముఖాముఖి కార్యక్రమానికి వరంగల్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. హైదరాబాద్లోని కన్హా శాంతి వనంలో ఈ నెల 12, 13 తేదీల్లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అధ్యక్షతన ‘మై భారత్ బడ్జెట్ క్వెస్ట్–2026’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ వ్యవసాయ కళాశాల మూడో సంవత్సరం విద్యార్థి బి.విష్ణుతేజ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు జి.అరవింద్, ఎస్.శైలు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి విజేతలుగా నిలిచి ప్రధాన మంత్రి ముఖాముఖి కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుక్ మండవియాతో నేరుగా మాట్లాడే అవకాశం పొందారు. ఈ సందర్భంగా 2026–27 కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించిన రూ.1.32 లక్షల కోట్ల నిధులు, ముఖ్యంగా ‘భారత్–విస్తార్’ వంటి సాంకేతిక విప్లవాల గురించి చర్చించారు. ప్రతిభ కబరిచిన విద్యార్థులను వరంగల్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ వి.రవీందర్ నాయక్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు బి.రాజు, గోపిక, అధికారులు అభినందించారు. -
నేడు విధుల్లో చేరకపోతే టర్మినేషన్
హన్మకొండ: సమ్మె చేస్తున్న విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులకుల టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం నోటీసు జారీ చేసింది. ఈ నెల 15న ఉదయం 11 గంటల్లోపు విధులకు హాజరు కాకపోతే టర్మినేషన్ చేస్తామని మెమో జారీ చేసింది. ఈ మెమోను ఆర్టిజన్ ఉద్యోగులకు వక్తిగతంగా పంపింది. విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ముందుగానే సమ్మె నోటీసు ఇచ్చారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ ఈ నెల 8వ తేదీ నుంచి నిరవధిక సమ్మె లోకి వెళ్లింది. ఏడు రోజులుగా ఆర్టిజన్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో బుదవారం విధుల్లోకి హాజరు కావాలని మెమో జారీ చేయడంతో ఆర్టిజన్లో సందిగ్ధంలో పడ్డారు. అయినా సమ్మెలోనే కొనసాగాలని ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ నిర్ణయం తీసుకుంది. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 15 (నేటి)నుంచి క్యాంపస్లోని క్రీడా మైదానంలో వివిధ యూనివర్సిటీ కాలేజీలు, వివిధ విభాగాలతోపాటు హనుమకొండలోని సుబేదారిలో ఉన్న యూనివర్సిటీ కాలేజీల విద్యార్థులకు వివిధ క్రీడలు నిర్వహించబోతున్నారు. కాకతీయ యూత్ స్పోర్ట్స్ ఫెస్టివల్ పేరిట ఈ క్రీడలు నిర్వహించనున్నట్లు స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ మామిడాల ఇస్తారి మంగళవారం తెలిపారు. క్రికెట్, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించబోతున్నామన్నా రు. పది రోజులపాటు ఈ క్రీడాపోటీలు కొనసాగుతాయన్నారు. కేయూ స్పోర్ట్స్బోర్డు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ సహకారంతో ఈ క్రీడలు నిర్వహించబోతున్నామన్నారు. నేడు స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ఆఫీస్ ప్రారంభోత్సవం కాకతీయ యూనివర్సిటీలో హాస్టళ్ల డైరెక్టర్కార్యాలయం సమీపంలోనే స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనిని బుధవారం ఉదయం 10 గంటలకు వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం ప్రారంభించనున్నారని డీన్ ఇస్తారి తెలిపారు. బాలికపై అత్యాచారం..● నలుగురిపై పోక్సో, అట్రాసిటి కేసు నమోదు భీమదేవరపల్లి: మండలంలోని ఓ గ్రామంలో దివ్యాంగ బాలికపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనలో నలుగురు నిందితులపై పోలీసులు పోక్సో, అట్రాసిటి కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నాలుగు రోజుల కిత్రం ఇంటిలో ఒంటరిగా ఉన్న బాలికను మల్లారం గ్రామానికి చెందిన నిందితుడు శివ బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అతడికి అదే గ్రామానికి చెందిన స్నేహితులు మణికంఠ, వేణు, టోనీ సహకరించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నలుగురిపై పోక్సో, అట్రాసిటి కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు. వ్యాపారిపై యాచకుడి దాడి మహబూబాబాద్ రూరల్ : ఓ యాచకుడు తనకు దానం చేసిన వ్యాపారిపై కత్తితో దాడి చేసి స్వల్పంగా గాయపరిచాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యాచకుడు ఓ మహిళతో కలిసి జిల్లా కేంద్రంలో భిక్షాటన చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక నెహ్రూ సెంటర్ ప్రాంతంలో స్వాతి మార్కెటర్స్ షాపు వద్దకు రాగానే షాపు యజమాని వడ్డేపల్లి శ్రీనివాస్.. యాచకుడికి రూ.5 దానంగా ఇచ్చాడు. అప్పటికే పెద్దమ్మలోడు (పోతురాజు) వేషధారణలో ఉన్న ఆ యాచకుడు దానం సరిపోదని షాపులోకి వెళ్లి కత్తితో దాడి చేయగా శ్రీనివాస్ కుడిచేయి మణికట్టు వద్ద స్వల్ప గాయమైంది. వెంటనే ఘర్షణ చోటు చేసుకోగా స్థానికులు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రామచందర్ ఘ టనాస్థలికి చేరుకుని సదరు యాచకుడితో పాటు అతడితో ఉన్న మహిళను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి అప్పగించారు. దానం ఇచ్చిన వ్యక్తిపై యాచకుడు కత్తితో దాడి చేయగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. -
తాగి నడిపితే తంటాలే!
కాజీపేట: వాహనాలను జాగ్రత్తగా నడపాలి. మామూలుగానే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక తాగి నడిపితే.. మృత్యువును కోరి తెచ్చుకున్నట్లే.. తద్వారా తమపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డు పాలవుతాయి. ఇలాంటి విపరీత పరిణామాలు చోటుచేసుకోకుండా పోలీసులు కల్పిస్తున్న అవగాహన, నిరంతర తనిఖీలు వాహనదారులపై బాగా ప్రభావం చూపుతున్నాయి. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు చేపడుతున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు సత్ఫలితాలనిస్తున్నాయి. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే ఇక అంతే సంగతులు. పైరవీలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకవేళ అధికారులకు ఎవరైనా చెప్పిన వారి నుంచి వచ్చేది సారీ సార్ అని మాత్రమే. తరచూ పట్టుబడితే మొదటికే మోసం.. ఆరోగ్యానికి మద్యం చేసే చేటు అంతా ఇంతా కా దనే విషయం అందరికీ తెలిసిన విషయమే. మ ద్యం తాగిన తర్వాత వాహనాలతో రోడ్లపైకి వస్తామంటే మాత్రం ఇకపై కుదరదు. మందు బాబులు వాహనం నడుపుతూ వరుసగా మూడుసార్లు పట్టుబడితే వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు పోలీసులు ఆర్టీఓ అధికారులకు ప్రతిపాదనలు పంపిస్తున్నారు. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుంది. ఒకసారి లైసెన్స్ రద్దు చేస్తే మళ్లీ తీసుకోవడం చాలా కష్టం. వాహనదారులతోపాటు రోడ్ల వెంట వెళ్లే వారికి భద్రత కల్పించడం కోసమే ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. గుబులు పుట్టిస్తున్న జైలు శిక్షలు.. వరంగల్ మహానగరం ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోంది. పర్యాటక ప్రాంతం కావడంతో వారంతాపు సెలవుల్లో అనేక మంది నగరానికి వచ్చిపోతుంటారు. అధిక శాతం కార్లు, వాహనాల్లో వస్తున్నారు. వెంట మద్యం తెచ్చుకోవడం, కొందరు తాగి నడపడంలాంటివి చేస్తున్నారు. దీనివల్ల స్థానికులు, పర్యాటకులకు ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాదు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యను నివారించడానికి, వీరిని అదుపు చేయడానికి నిత్యం రహదారులపై పోలీసులు బ్రీత్ ఎనలైజర్ పట్టుకొని సిద్ధంగా ఉంటున్నారు. తాగి వాహనం నడిపిన వారిని పట్టుకుంటున్నారు. ఇటీవల మద్యం తాగి పట్టుబడిన వారిపై న్యాయస్థానాలు కఠిన తీర్పులను వెలువరిస్తున్నాయి. మోతాదుకు మించి మద్యం తాగిన వాహనదారులకు రెండు నుంచి వారం రోజులపాటు జైలు శిక్షలు ఖరారు చేస్తుండడం గమనార్హం. దీనికితోడు ఒక్కొక్కరికి రూ.2వేలకు పైగా జరిమానా విధిస్తున్నారు. నగరంలో సగటున రోజుకు 20 నుంచి 35 కేసుల వరకు నమోదవుతున్నాయి. మోతాదుకు మించి మద్యం తాగినట్లు వెల్లడయ్యితే చాలు కోర్టులు ఇటు జరిమానా, అటు జైలు శిక్ష విధిస్తున్నాయి. ప్రతిజ్ఞ చేయిస్తున్నారు.. రోడ్డు ప్రమాదాలను వీలైనంతగా తగ్గించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తాగి వాహనాలు నడిపే వారికి పోలీసులు ఎక్కడికక్కడే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. వారితో పాటు కుటుంబ స భ్యులను కూడా పిలిపించి వారి ముందే తాగివాహనాలు నడపడంతో వచ్చిన సమస్యల గురించి వివరిస్తున్నారు. ఇంటి వద్ద వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. మరోసారి దొరికితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించి ప్రతిజ్ఞ కూడా చేయిస్తున్నారు. పట్టుబడితే వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు జరిమానాతోపాటు జైలుశిక్ష విధిస్తున్న కోర్టులు కౌన్సెలింగ్తో అవగాహన కల్పిస్తున్న పోలీసులు -
మిర్చి బస్తాలు దగ్ధం
వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటపురం(కె) మండల పరిధిలోని బెస్తగూడెం గ్రామంలో మిర్చి బస్తాలు ప్రమాదవశాత్తు దగ్ధమైన సంఘటన మంగళవారం జరిగింది. బాధిత రైతు నవీన్ కథనం ప్రకారం.. బెస్తగూడెం గ్రామ శివారులో రైతు మిర్చి కోత కోయించి 58 బస్తాల్లో నిల్వ చేశాడు. కాగా, తన చేను పక్కనే ఉన్న మొక్కజొన్న పంట పనులు పూర్తయ్యాయి. మొక్కజొన్న పంటను సాగుచేసిన రైతు చేనుకు నిప్పు పెట్టాడని తెలిపాడు. మొక్కజొన్న మంటలు గాలికి మిర్చి బస్తాలకు అంటుకున్నాయి. ఈ ఘటనలో మిర్చి బస్తాలు పూర్తిగా కాలిపోయి రూ.రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆయన కన్నీరుమున్నీరయ్యాడు. ప్రభుత్వం ఆదుకోవాలని నవీన్ కోరాడు. -
సమసమాజ స్థాపకుడు అంబేడ్కర్
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిహన్మకొండ: సమసమాజ స్థాపకుడు డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేడ్కర్ అని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎండీ వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు, అధికారులు పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్ పాత్ర అద్వితీయమైందని, ఆయన దేశానికి మూలస్తంభం వంటివారన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సి.ఈలు కె.తిరుమల్ రావు, రాజుచౌహాన్, అశోక్, వెంకటరమణ, అన్నపూర్ణ, సీజీఎం రవీంద్రనాథ్, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జాయింట్ సెక్రటరీ కె.రమేశ్, జీఎంలు శ్రీకాంత్, హేమంత్ కుమార్, కళాధర్ రెడ్డి, కృష్ణ మోహన్, నాగ ప్రసాద్, వెంకట కృష్ణ, జయరాజ్, తదితరులు పాల్గొన్నారు. -
బావి నుంచి యువకుడి మృతదేహం వెలికితీత
ఖిలా వరంగల్: వేసవి తాపం తట్టుకోలేక స్నేహితులతో కలిసి బావిలో ఈతకు వెళ్లిన ఓ యువకుడు నీటమునిగి చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో డీఆర్ఎఫ్ సిబ్బంది సదరు యువకుడి మృతదేహం వెలికితీశారు. మిల్స్కాలనీ పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ ఉర్సు ప్రతాప్నగర్కు చెందిన ఆకునూరి రాజేందర్ కుమారుడు మనీశ్ (19) తన ముగ్గురు స్నేహితులతో కలిసి సోమవారం హంటర్ రోడ్డులోని గణపతి కళాశాల సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు ఈతకు వెళ్లాడు బావిలోకి దిగిన ముగ్గురు క్షేమంగా బయటపడగా.. మనీశ్ నీటిలో మునిగి చనిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రాత్రి ఎన్ని ప్రయత్నాలు చేసినా బావి నుంచి మృతదేహం బయట తీయలేకపోయారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం మృతదేహాం తేలడంతో డీఆర్ఎఫ్ సిబ్బంది బయటకు తీశారు. దీంతో కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. తండ్రి రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అంబేడ్కర్ ఆశయ సాధనకు పునరంకితం కావాలి
వరంగల్ అర్బన్: అంబేడ్కర్ ఆశయ సాధనకు పునరంకితం కావాలని మేయర్ గుండు సుధారాణి పిలుపునిచ్చారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో మంగళవారం అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యాలయ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహానికి మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ మేయర్ చాహత్ బాజ్పాయ్, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేశారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్, సీహెచ్ఓ రమేశ్ పీఆర్వో అయూబ్అలీ, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ పాల్గొన్నారు. జనగణనకు మ్యాపులు రూపొందించాలి జనగణనకు మ్యాపులను రూపకల్పన చే యాలని నగర మేయర్ గుండు సుధారాణి హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలోజనగణన హౌస్ బ్లాక్ లిస్టింగ్ ప్రక్రియను మేయర్ గుండు సుధారాణి ఆకస్మికంగా తనిఖీ చేసి పనితీరును సమీక్షించారు. డిప్యూటీ కమిషనర్ ప్రసునారాణి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాశిబుగ్గ: వరంగల్ దేశాయిపేటలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతిచెందగా, భర్త తీవ్ర గాయాలపాలై ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వరంగల్ నాయుడు పంపు మంగలికుంట ప్రాంతానికి చెందిన జెట్టి విజయలక్ష్మి (45), భర్త సదానందం తమ కుమార్తె వివాహం గురించి ఆరెపల్లిలోని బంధువులకు చెప్పడానికి బైక్పై బయలుదేరారు. మార్గమధ్యలో దేశాయిపేట పోచమ్మ దేవాలయం వద్ద వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ.. బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో విజయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, సదానందం తీవ్ర గాయాలపాలై అపస్మారకస్థితికి చేరుకున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సదానందంను ఎంజీఎం తరలించారు. అతడి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు లారీ డ్రైవర్ను చితకబాది పోలీసులకు అప్పగించారు. కాగా, తమ కుమార్తె పెళ్లి గురించి ఆరెపల్లిలోని బంధువులకు చెప్పడానికి సంతోషంతో వెళ్తున్న తల్లిదండ్రులను లారీ మృత్యురూపంలో బలితీసుకోవడంతో కుటుంబ సభ్యులను కన్నీరుమున్నీరుగా విలపించారు. -
ఔటర్పై రోడ్డు ప్రమాదం
అబ్దుల్లాపూర్మెట్ : ఔటర్ రింగ్రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ను వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తితో పాటు రెండున్నరేళ్ల బాలుడు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ హనుమకొండకు చెందిన వేద ప్రకాశ్రెడ్డి (37) భార్య హిమబిందు, కుమారుడు అర్జున్ (2)తో పాటు బంధువైన దుర్గాప్రసాద్రెడ్డి, అతని భార్య శ్రీజతో కలిసి మంగళవారం హనుమకొండ నుంచి కారులో హైదరాబాద్లోని బొంగ్లూర్కు బయలుదేరారు. ఈ క్రమంలో ఘట్కేసర్లో ఔటర్ రింగ్రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్న వీరి కారు సాయంత్రం 4గంటల సమయంలో పెద్దఅంబర్పేట టోల్ గేట్ దాటి కొంత దూరంగా వెళ్లగానే అప్పటికే డివైడర్ మధ్యలో ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ను వెనుక నుంచి ఢీ కొట్టారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న వేద ప్రకాశ్రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా, అతని కుమారుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. భార్య హిమబిందు, బంధువైన దుర్గాప్రసాద్రెడ్డి, శ్రీజకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సంతోష్నగర్లోని డీఆర్డీఓ ఆ స్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చే సుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడి న ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. డివైడర్ మధ్యలో మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ను ఢీకొట్టిన కారు తండ్రితో పాటు రెండున్నరేళ్ల కుమారుడు మృతి మరో ముగ్గురికి తీవ్రగాయాలు, పరిస్థితి విషమం -
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
వరంగల్ అర్బన్ : మహా నగర ప్రజలు చెబుతూ, రాతపూర్వకంగా అందజేసిన సమస్యలకు జవాబు దారీగా ఉండాలని బల్దియా అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ హాల్లో జరిగిన గ్రీవెన్స్ సెల్లో వింగ్ అధికారులతో కలిసి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 85 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి ఆక్రమణలు, అతిక్రమణలపై 40 వినతులు అధికంగా నమోదయ్యాయి. ఇంజనీరింగ్ సెక్షన్కు 20, రెవెన్యూ విభాగానికి 7, ప్రజారోగ్యం, శానిటేషన్కు 8, నీటి సరఫరాకు 5, హర్టికల్చర్కు 1 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ సిటీ ప్లా నర్ రవీందర్ వాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నా రాణి, ఎంహెచ్ఓ రాజేశ్, హెచ్ఓ లక్ష్మారెడ్డి, డీఎఫ్ ఓ శంకర్ లింగం, వెటర్నరీ వైద్యులు గోపాల్ రావు, పన్నుల అధికారి రామకృష్ణ పాల్గొన్నారు. ● వరంగల్లోని 11–18–3/2 ఇంటినంబర్కు 2021లో మిషన్ భగీరథ పైపులైన్ కనెక్షన్ ఇచ్చినా నీళ్లు రాలేదని, గతనెల మరోసారి నల్లా కనెక్షన్ ఇచ్చి సిబ్బంది రూ.6వేలు వసూలు చేసినట్లు రాజ్యలక్ష్మి ఫిర్యాదు చేశారు. ● 48వ డివిజన్ సిద్ధివినాయక కాలనీ రోడ్డు 2లో రోడ్డు, డ్రెయినేజీ అధ్వానంగా ఉందని, నూతనంగా నిర్మించాలని గుజా సోమేశ్వర్రావు, ప్రణతి, విజయ్కుమార్ కోరారు. ● చింతల్ 16–11–371/1ఇంటినంబర్లో నల్లా కనెక్షన్ లేకున్నా రూ.7వేల బిల్లు వేశారని, తొలగించాలని మహ్మద్ రాజీయొద్దీన్ విజ్ఞప్తి చేశారు. ● శివనగర్ 24 ఫీట్ల రోడ్డు, డ్రెయినేజీపై అక్రమ నిర్మాణం చేపట్టి తప్పడు పత్రాలతో ఇంటినంబర్ తీసుకున్నారని, రద్దు చేయాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. ● 14వ డివిజన్ సుందరయ్య నగర్లో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాలని స్థానికులు వినతిపత్రం సమర్పించారు. ● ఫోర్టు రోడ్డులోని శ్రీరాంనగర్లో సీసీరోడ్డు, డ్రె యినేజీ, లైటింగ్ ఏర్పాటు చేయాలని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు విన్నవించారు. ● 37, 38వ డివిజన్లలో డ్రెయినేజీ నిర్మాణం పూర్తిచేయాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. ● వరంగల్లోని 19–12–23/ఎ/3లో ఇంటికి 3 నల్లా కనెక్షన్లు, 1వ డివిజన్ 52–3–154 ఇంటికి రెండు బిల్లులు వస్తున్నాయని, రద్దు చేయాలని కృష్ణమూర్తి , ప్రసాద్ వేర్వేరుగా కోరారు. ● పెద్దమ్మగడ్డ పీఈఎస్ జూనియన్ కాలేజీ వద్ద వరద, మురుగు నీరు స్తంభిస్తుందని, డ్రెయినేజీ నిర్మించాలని థానా ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ● కడిపికొండలో రోడ్డు ఆక్రమిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ● హనుమకొండ 9వ డివిజన్ కాకతీయ కాలనీలో డ్రెయినేజీ నీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు వివరించారు. ● 1వ డివిజన్ ముచ్చర్ల నాగారంలో డ్రెయినేజీ ని ర్మించాలని పలుమార్లు ఫిర్యాదు చేసినాపట్టించుకోవడం లేదని ఎ.ప్రసాద్ వినతి అందజేశారు. ● బాలసముద్రం ఏకశిల పార్కు దగ్గర పెద్ద ఇనుప డబ్బాను ఏర్పాటు చేశారని, ప్రధాన రహదారిలో రాకపోకలకు అంతరాయం కలుగుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. బల్దియా అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ గ్రేటర్ గ్రీవెన్స్కు 85 ఫిర్యాదులు -
సాదా బైనామా చిక్కులకు చెక్!
సాదాబైనామాల క్రమబద్దీకరణకు భూ క్రయ,విక్రయదారుల ‘అఫిడవిట్’ల నిబంధన చిక్కులు తొలగాయి. ఆర్డీఓలే విచారణాధికారులగా దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నిబంధనల పేరిట ముందుకు సాగని సాదాబైనామాల క్రమబద్ధీకరణ ఇకపై ఫాస్ట్ట్రాక్లో జరగనుంది. ఉమ్మడి వరంల్ జిల్లాలో 2020 నవంబర్ 10 నుంచి పెండింగ్లో ఉన్న సుమారు 1.90 లక్షల దరఖాస్తులకు పరిష్కారం దొరకనుంది. రైతులకు ఊరట కలగనుంది. ఈ ఫొటోలోని రైతు పేరు జేరుపోతుల విజయ్ కుమార్. హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామం. ఈయనకు మొత్తం నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తాతల నుంచి వారసత్వంగా వచ్చింది. కాస్తులో ఉన్నా.. విజయ్కుమార్ తాతకు పట్టా కాలేదు. తండ్రికి అందులోనుంచి అర ఎకరం మాత్రమే పట్టా కాగా.. నాలుగు ఎకరాల కోసం సాదాబైనామానుంచి పట్టా కోసం ఐదున్నరేళ్లలో రెండు పర్యాయాలు దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని నెలల క్రితం భూ భారతిలో కూడా దరఖాస్తు చేశాడు. అధికారుల ఇప్పటివరకు పట్టా గురించి ఎలాంటి సమాచారం రాలేదని, ఇప్పటికై నా సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలిగించాలని రైతు విజయ్కుమార్ కోరుతున్నారు. సాక్షిప్రతినిధి, వరంగల్ : ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సాదాబైనామా ఫైళ్లకు ఎట్టకేలకు కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్కు సిద్ధమవుతూ, జిల్లాల వారీగా పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయడానికి చర్యలు ప్రారంభించింది. దీనివల్ల వేలాది మంది రైతులు, పేదలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన 112జీఓ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకురావడంతో పాటు ఆ జీఓపై వచ్చిన అభ్యంతరాలు, సాదా బైనామాల పరిష్కారంపై విధివిధానాలను హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. దీంతో హైకోర్టు తన ముందు ఉన్న పిల్ను కొట్టివేసింది. ప్రభుత్వం సాదా బైనామాల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు ఆదేశాలు ఇచ్చినా.. భూక్రయ, విక్రయదారులు ఇద్దరి అఫిడవిట్లు, తదితర నిబంధనల కారణంగా ముందుకు సాగలేదు. తాజాగా అఫిడవిట్ల నిబంధనలను సడలించడంతోపాటు దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించే అధికారాలు పూర్తిగా ఆర్డీఓలకు ఇవ్వడంతో ఆ ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది. ఐదున్నరేళ్లుగా పెండింగ్లో.. సాదాబైనాల క్రమబద్ధీకరణ కోసం జీఓలు ఎన్ని తెచ్చినా దరఖాస్తులు పెండింగ్లోనే ఉంటున్నాయి. 2016లో జీఓనం.153, 2020లో జీఓ 112లను తీసుకువచ్చారు. 2014 జూన్ 2కు ముందు సాదాబైనామాలు కలిగిన భూములను క్రమబద్ధీకరించడం.. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేసే ఉద్దేశంతో రెండు పర్యాయాలు, ఈ రెండు జీఓలు తెచ్చారు. జీఓ నం.112పై ‘పిల్’దాఖలు కావడంతో దానిని అమలు కాకుండా నిలిపివేశారు. ఆ తర్వాత రెవెన్యూ సదస్సుల ద్వారా దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం వాటి పరిష్కారం మంత్రివర్గ ఉపసంఘం వేసింది. గతేడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రెవెన్యూ గ్రామ సదస్సులను నిర్వహించింది. ఈ సదస్సుల్లో అత్యధికంగా సాదాబైనామాలపైనే దరఖాస్తులు వచ్చాయి. గతంలో దరఖాస్తు చేసుకున్న రైతులు మరోసారి భూభారతి సదస్సులో దరఖాస్తులు చేశారు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు, అంతకు ముందున్న మొత్తం దరఖాస్తుల సంఖ్య 1,89,739లకు చేరింది. దీంతో ప్రభుత్వం హైకోర్టును అశ్రయించి, సాదాబైనామాలపై మధ్యంతర స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరింది. విచారణ అనంతరం సాదాబైనామాలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వగా, క్షేత్రస్థాయి పరిశీలన పేరిట తాత్సారం జరుగుతూ వచ్చింది. నిబంధనల సడలింపు, ఆర్ర్డీఓల క్షేత్రస్థాయి పరిశీలన ఉత్తర్వుల నేపథ్యంలో రైతుల దరఖాస్తులను పరిశీలించి, అర్హత కలిగిన వాటిని పరిష్కరించనున్నారు. ‘అఫిడవిట్’ నిబంధనల సడలింపు.. ‘రెవెన్యూ’కు ఆదేశాలు ఫాస్ట్ట్రాక్లో పెండింగ్ ఫైళ్ల పరిష్కారం ఉమ్మడి వరంగల్లో 1.90 లక్షల దరఖాస్తులు 2020 నుంచి వెయిటింగ్.. ఆర్డీఓలకు కీలక అధికారాలు త్వరలోనే సాదాబైనామాలకు పరిష్కారం.. -
ఇంటర్ ఫలితాల్లో ‘సువిద్య’ విజయభేరి
కాజీపేట అర్బన్ : హనుమకొండ నక్కలగుట్టలోని సువిద్య జూనియర్ కాలేజీ ఫర్ గర్ల్స్ ఆదివారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో విద్యార్థినులు ఉత్తమ మార్కులు సాధించి విజయభేరి మోగించారు. ఎంపీసీ సెకండియర్లో ఎన్.ధృతిరెడ్డి 994, కె.సాయినందిని 990, కె.యశస్విని 987, కె.మానస 985, ఎస్.జీవిక 984, బైపీసీలో పి.షన్మూఖి ప్రియా 980, ఎంపీసీ ఫస్టియర్లో ఎస్.చక్రిత 456, జి.ప్రహర్షిత 454, బైపీసీలో వి.మానస 433, బి.హర్షిత 430 మార్కులు సాధించారు. వీరిని కళాశాల కరస్పాండెంట్ కె.శ్రీనివాస్రెడ్డి, డైరెక్టర్లు ఏ.జితేందర్రెడ్డి, ఎన్.వెంకట్రెడ్డి అభినందించారు.తిరుపతి కుటుంబానికి రూ.1,04,203 అందజేత భీమదేవరపల్లి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలానికి చెందిన కాంటింజెంట్ వర్కర్ తిరుపతి ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, సోమవారం బాధిత కుటుంబానికి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ అప్పయ్య చేతుల మీదుగా రూ. 1,04,203 మొత్తం అందించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ తిరుపతి అంకితభావంతో విధులు నిర్వర్తించేవారన్నారు. అనంతరం అధికారులు, సిబ్బంది నివాళులర్పించారు. దాడి కేసులో ఐదుగురి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన ఏఎస్పీ ఖిలా వరంగల్ : వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటనలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ శుభం ప్రకాశ్ తెలిపారు. ఈమేరకు సోమవారం వరంగల్ మిల్స్కాలనీ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ రమేశ్తో కలిసి వివరాలు వెల్లడించారు. వరంగల్ గాంధీనగర్కు చెందిన పగిండ్ల సురేశ్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడి కుమార్తె ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా.. మంత్రాలు చేయడంతోనే మృతి చెందిందని ఆవేదనతో తిట్టాడు. అయితే తమనే తిట్టాడని రాయలమ్మ అనే మహిళ భావించింది. గత నెల మార్చి 17న కల్యాణ్, జగన్, నరేందర్ అనే వ్యక్తుల వద్దకు చేరుకుంది. సురేశ్పై దాడి చేస్తే రూ.5వేలు సుపారీ ఇస్తానని ఒప్పందం చేసుకుంది. దీంతో వారు ఒప్పుకుని మార్చి 17న కల్యాణ్, జగన్, నరేందర్.. బైక్పై సురేశ్ను ఎక్కించుకుని కోటిలింగాల గుడి సమీప ప్రాంతానికి తీసుకెళ్లి దాడికి పాల్పడ్డారు. అనంతరం చనిపోయాడని భావించి ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని కల్యాణ్ తన అమ్మ, అన్నకు వివరించగా.. వారు శివతోపాటు జశ్వంత్ అనే ఆటో డ్రైవర్ సాయంతో క్షతగాత్రుడు సురేశ్ను ఆటోలో తీసుకుని అతడి ఇంటి సమీపంలో పడేసి పరారయ్యారు. స్థానికులు చూసి సురేశ్ను ఎంజీఎం తరలించారు. క్షతగాత్రుడి సోదరి గంటి జ్యోతి మిల్స్కాలనీ పీఎస్లో ఫిర్యాదు చేయగా.. 24గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించారు. ఎనిమిది మందిలో ముగ్గురు పరారీలో ఉండగా.. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రాజ్కుమార్, శివ, పసునూరి సరిత పరారీలో ఉండగా.. అదే ప్రాంతానికి చెందిన కల్యాణ్, రాయలమ్మ, జగన్నాయక్, నరేందర్, యశ్వంత్ పట్టుపడ్డారు. ఎస్సైలు నరేశ్, మహేష్, శ్రవణ్కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. -
భావిభారతం.. ఆరోగ్యమే ప్రధానం
కాజీపేట: భావిభారత పౌరులు ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా వయసుకు తగ్గట్టు ఎత్తు, బరువు పెరగడంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. దీనికోసం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతీ చిన్నారికి ప్రత్యేక ప్రొఫైల్ తయారు చేయిస్తోంది. దీంతో ఇక నుంచి ప్రతీ నెలా పిల్లల ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ.. ఆ ప్రొఫైల్లో నమోదు చేస్తారు. దీనిప్రకారం ఏ చిన్నారైనా పౌష్టికాహార లోపంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటే వారిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా ఆరోగ్య కార్డులను ముద్రించి అంగన్వాడీ కేంద్రాలకు చేరవేసింది. దీని ప్రకారం ప్రతీ నెల 1 నుంచి 5వ తేదీలోపు ప్రతీ కేంద్రంలో చిన్నారుల వివరాలను నమోదు చేసి వాటిని తల్లిదండ్రులకు అందిస్తారు. ఆటపాటలతో విద్యాబుద్ధులు... రాష్ట్ర ప్రభుత్వం చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆటాపాటలతో విద్యాబుద్ధులు నేర్పుతూ ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం అందిస్తోంది. కేంద్రానికి వచ్చే ప్రతీ చిన్నారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఐదేళ్లలోపు చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యత, భద్రత, పంపిణీలో అక్రమాలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపడుతోంది. దీనికితోడు వివిధ రకాల ఆహార పదార్థాలు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఇక నుంచి చిన్నారుల బరువు,ఎదుగుదల వివరాలను ప్రతీనెల రికార్డులలో నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా పౌష్టికాహారం ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటున్నారనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా శిశు, సంక్షేమ శాఖ అధికారులు బాలల ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పుట్టుక నుంచి వివరాలు.. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల వివరాలు నమోదు చేసుకుంటున్నారు. పాఠశాలలో చేరే ఐదేళ్లలోపు పిల్లలకు సంబంధించి బరువు, ఎత్తు ఎదుగుదల వివరాలను నమోదు చేసి నివేదికల రూపంలో భద్రపరిచేందుకు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి వివిధ రంగులతో బాల బాలికలకు వేర్వేరుగా రికార్డులను పంపిణీ చేశారు. చిన్నారి పుట్టగానే వివరాలు నమోదు చేసి అంగన్వాడీ ఉపాధ్యాయుల దగ్గర భద్రపరిచేలా చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలకు వెళ్లే ఐదేళ్లలోపు చిన్నారుల వివరాలను ప్రతీనెలా ప్రొఫైల్లో నమోదు చేస్తారు. నమోదు అంశాలు ఇవీ.. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతీ చిన్నారి ఎత్తు, బరువు, భుజం చుట్టు కొలతను ప్రతీ నెలా నమోదు చేస్తారు. వయసుకు తగిన విధంగా పెరుగుదల, ఎత్తు సక్రమంగా ఉందా? లేదా అనేది చిన్నారి ప్రొఫైల్ చూస్తే ఇట్టే తెలిసిపోనుంది. దీనికితోడు ఏటా చిన్నారి ఫొటో సేకరించి పాఠశాలకు వెళ్లే ఐదేళ్ల సమయానికి ప్రొఫైల్లో అతికించాల్సి ఉంటుంది. ఎవరైనా పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తేలితే ఆరోగ్యశాఖ అధికారుల సూచనల మేరకు వారికి బలవర్థకమైన ఆహారం అందించేందుకు చర్యలు చేపడతారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతీ చిన్నారికి ప్రత్యేక ప్రొఫైల్ పౌష్టికాహార లోపం ఉంటే ప్రత్యేక శ్రద్ధ పుట్టుక నుంచి ప్రతీ వివరాలు నమోదు చేస్తున్న ప్రభుత్వంజిల్లా కేంద్రాలు పిల్లలు హనుమకొండ 788 43,095 భూపాలపల్లి 644 21,691 వరంగల్ 919 47,292 ములుగు 640 18,548 జనగామ 695 18,548 మహబూబాబాద్ 1437 39,187 -
దండెంపై టవల్ ఆరేస్తూ మృత్యుఒడికి..
● విద్యుదాఘాతంతో మహిళ మృతి వర్ధన్నపేట : దండెంపై తడిసిన టవల్ ఆరేస్తూ ఓ మహిళ మృత్యుఒడికి చేరింది. విద్యుదాఘాతంతో మృతి చెందింది. ఈ ఘటన సోమవారం మండలంలోని ఇల్లందలో చోటు చేసుకుంది. ఎస్సై సాయిబాబు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఊర సమ్మక్క(35) తెల్లవారుజామున తడిసిన టవల్ను దండెంపై ఆరేస్తోంది. ఈ సమయంలో దండేనికి తాకి ఉన్న విద్యుత్ తీగలను గమనించలేదు. చూడకుండా తగలడంతో షాక్ తగిలి కింద పడింది. దీంతో భర్త రాజ్కుమార్ ఆమె అరుపులు విని బయటకు వచ్చి చూడగా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. మృతురాలి భర్త రాజ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి చెందిన యువ రైతు గాదం వినయ్(38) సోమవారం వడదెబ్బతో మృతి చెందాడు. ఉదయం తన మామ రాజాలుతో కలిసి వ్యవసాయ బావివద్దకు వెళ్లాడు. పనులు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. మృతుడికి భార్య శిరీష, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రణధీర్ రెడ్డి తెలిపారు. చిన్నరామన్చర్లలో వ్యక్తి.. బచ్చన్నపేట : వడదెబ్బతో మండలంలోని చిన్నరామన్చర్ల గ్రామానికి చెందిన రామగళ్ల మల్లయ్య (55) సోమవారం మృతి చెందాడు. రోజు మాదిరిగానే మల్లయ్య ఆదివారం బచ్చన్నపేటలో కూలీ పనులు చేశాడు. అనంతరం రాత్రి ఇంటికి వెళ్లలేదు. దీనిపై మృతుడి భార్య పుష్ప.. బంధువులకు ఫోన్ చేసి వాకబు చేసినా ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో మండల కేంద్రంలోని కేజీబీవీ పక్కన ఉన్న గుంతలో చనిపోయి కనిపించాడు. రోడ్డు భద్రతపై వాల్పోస్టర్ల ఆవిష్కరణహన్మకొండ అర్బన్/ఖిలావరంగల్: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల సందర్భంగా సోమవారం హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్లలో కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారద వాల్పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు. ఇన్చార్జ్ ఆ ర్టీఓ శోభన్ బాబు, రవాణా శాఖ అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. సూపర్వైజర్ల మార్పుకాశిబుగ్గ: వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో ఇద్దరు శానిటేషన్ సూపర్వైజర్లను మార్పు చేశారు. సదరు శానిటేషన్ సూపర్వైజర్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయడంతో సూపర్వైజర్ల బాధ్యతల నుంచి వారిని తొలగించారు. సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులకు సూపర్వైజర్లుగా బాధ్యతలు అప్పగించారు. కాగా, గత నెల 30న డబ్బులు తీసుకుంటున్నట్లు వచ్చిన ఆరోపణల్లో రెగ్యులర్ స్వీపర్కు మెమో జారీ చేయగా, ప్రైవేట్ స్వీపర్ను విధులకు దూరంగా ఉంచారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ లక్ష్మిని వివరణ కోరగా ఆస్పత్రిలో మార్పుల్లో భాగంగానే మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు వివరించారు. -
ఈత వెళ్లిన యువకుల్లో ఒకరు గల్లంతు
● బయటపడిన ముగ్గురు స్నేహితులు ● కరీమాబాద్లో విషాదం ఖిలా వరంగల్: ఈత సరదా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముగ్గురు స్నేహితులతో కలిసి ఈత వెళ్లిన యువకుడు నీటిలో మునిగి మృతిచెందాడు.. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం వరంగల్ హంటర్ రోడ్డులోని గణపతి కళాశాలకు ఎదురుగా ఉన్న బావిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ 40వ డివిజన్ కరీమాబాద్ ఉర్సు ప్రతాప్నగర్ ప్రాంతానికి చెందిన ఆకునూరి రాజేందర్ కుమారుడు మనీష్ (19) అలియాస్ సన్నీ వెల్డింగ్ వర్కర్గా పనిచేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం మనీష్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి గణపతి కళాశాల ఎదురుగా ఉన్న బావికి ఈతకు వెళ్లారు. బావిలోకి దిగిన నలుగురిలో మనీష్ నీటిలో మునిగిపోయాడు. మిగతా ముగ్గురు యువకులు భయాందోళనకు గురై రోడ్డుపైకి వచ్చి మా స్నేహితుడిని కాపాడండి అంటూ కేకలు వేశారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు ఆగి బావి వద్దకు వెళ్లి చూడగా నీట మునిగిన మనీష్ కనిపించలేదు. మిల్స్కాలనీ పోలీసులకు సమాచారమివ్వగా.. వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బావిలోనుంచి తీసేందుకు అగ్నిమాపక ఆధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది రాత్రి పొద్దుపోయే వరకు గాలించినా మృతదేహం ఆచూకీ తెలియరాలేదు. మృతుడి తండ్రి రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు శ్రీపతిపల్లిలో యువకుడు.. చిల్పూరు: మిత్రులతో కలిసి శుభకార్యానికి వచ్చిన ఓ యువకుడు సరదాగా ఈతకు వెళ్లి నీటమునిగి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం మండలంలోని శ్రీపతిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై నవీన్కుమార్ కథనం ప్రకారం.. ర ఘునాథపల్లి మండలం కోమళ్ల గ్రామానికి చెందిన వెలిశాల పెంటమ్మ కుమారుడు భిక్షపతి (34) హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిల్పూరు మండలం శ్రీపతిపల్లి గ్రామంలో మిత్రు డి వివాహ విందు ఉండగా ఉదయం గ్రామానికి వచ్చాడు. ఈ సందర్భంగా మిత్రులతో కలిసి మ ద్యం సేవించాడు. అనంతరం మధ్యాహ్న సమయంలో గ్రామ సమీపంలోని బావి వద్దకు ఈతకు వెళ్లారు. మద్యం మత్తులోనే బావిలో దూకాడు. ఎంతసమయమైనా తేలకపోవడంతో మిత్రులు భ యంతో గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులకు తెలిపారు. దీంతో వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాలించగా అప్పటికే మృతి చెందాడు. కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


