breaking news
Hanamkonda District Latest News
-
రిటైర్డ్ ఉద్యోగులకు అవకాశం కల్పించాలి
టీఎస్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి టి.ప్రభాకర్ హన్మకొండ: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో రిటైర్డ్ ఉద్యోగులకు అవకాశం కల్పించాలని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తిరవరంగం ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ రాంనగర్లోని అసోసియేషన్ కార్యాలయంలో హనుమకొండ యూనిట్ సమావేశం నిర్వహించారు. ఇందులో తిరువరంగం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉద్యోగ జేఏసీలో 200 సంఘాలుండగా.. కేవలం 15 సంఘాలకు మాత్రమే స్టాండింగ్ కౌన్సిల్లో స్థానం కల్పించి మిగతా వాటిని విస్మరించడం.. విభజించి పాలించడం అన్నట్లుగా ఉందన్నారు. సర్వీస్ సంఘాలతో పాటు విశ్రాంత ఉద్యోగుల సంఘాలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో అవకాశం కల్పించాల్సి ఉండగా విస్మరించడం విచారకరమన్నారు. అనంతరం హనుమకొండ యూనిట్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా సాంబయ్య వ్యవహరించగా.. రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడిగా ఖాజామోహినుద్దీన్ వ్యవహరించారు. కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ందని వారు వివరించారు. అధ్యక్షుడిగా ఎం.మల్లారెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా పి.సదానందచారి, కార్యదర్శిగా కె.సంజీవరెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీగా ఎం.భిక్షపతి, ఉపాధ్యక్షులుగా పి.శ్రీరాములు, వి.సుజాత, జాయింట్ సెక్రటరీగా జగదీశ్చంద్రారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.వెంకటయ్య, పబ్లిసిటీ సెక్రటరీగా ఎం.నర్సింహాచారి, జిల్లా కౌన్సిల్ సభ్యులుగా టి.ప్రభాకర్, కె.రాజశేఖర్, కళా రాజేశ్వర్రావు ఎన్నికయ్యారు. -
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తలు ఎమ్మెల్యేను ఘనంగా స్వాగతించారు. ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకున్న అనంతరం దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. దేవాదాయశాఖ కార్యాలయ పర్యవేక్షకుడు కె.కుమారస్వామి ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తగా నియమితులైన కటకం రాములు ప్రమాణస్వీకారం చేశారు. అలాగే, భద్రకాళి దేవాలయ ధర్మకర్తల మండలిలో ఎస్.శ్రీధర్, మూగ శ్రీనివాస్ను సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శైలజారామయ్యర్ ఉత్తర్వులు జారీచేశారు. -
శంకర్దాదా ఎంబీబీఎస్లు!
వరంగల్ నగరం కాశిబుగ్గ ప్రాంతంలో అర్హత లేకుండా నిర్వహిస్తున్న నకిలీ వైద్య కేంద్రాలపై ఆగస్టు 20న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీఎంసీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా మామిడి ఈశ్వరయ్య అనే వ్యక్తి ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తూ డాక్టర్ పోస్టర్ పెట్టుకుని రోగులను మోసం చేస్తున్నట్లు సభ్యులు గుర్తించారు. హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్యకుమార్ ఆదేశాల మేరకు టీజీఎంసీ బృందం ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈతనిఖీల్లో మడికొండ మెయిన్ రోడ్డులో ’సాయిశ్రీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్’ పేరుతో అక్రమంగా ఒక క్లినిక్ను నిర్వహిస్తున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్షిప్రతినిధి, వరంగల్: ..ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నకిలీ సర్టిఫికెట్లు.. పొంతనలేని మందులు.. ఎమర్జెన్సీ వైద్యం చేస్తూ కొందరు ‘నకిలీ’లు నిర్వహిస్తున్న ఆస్పత్రులు పేదలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఖర్చు తక్కువ పేరిట వైద్యం ఎరవేస్తున్న కొందరు ‘శంకర్దాదా ఎంబీబీఎస్’ల తీరు శాపంగా మారుతోంది. ఫేక్ డిగ్రీలు.. సర్టిఫికెట్లతో ‘డాక్టర్’ స్టిక్కర్లు వేసుకుంటున్న అనేక మంది నగరాలు, పట్టణాలతో పాటు పల్లెల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలా ఉమ్మడి వరంగల్లో 3,250కు పైగా అర్హత లేని వైద్యులున్నట్లు సమాచారం. చాలా మంది ఎలాంటి అనుమతులు లేకుండా ఆస్పత్రులు, క్లినిక్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆయుర్వేద వైద్యం పేరిట ఎక్కడ పడితే అక్కడ ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. ఇటీవల తెలంగాణ వైద్య మండలి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో అనేక ఘటనలు వెలుగు చూడడం గమనార్హం. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీలు గ్రేటర్ వరంగల్ నగరంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో నకిలీ పీఎంపీలు, ఆర్ఎంపీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఎక్కడి పడితే అక్కడ ఇష్టారాజ్యంగా క్లినిక్లు, ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు సైతం జ్వరం, ఒళ్లునొప్పులు, వ్యాధి ఏదైనా ముందుగా సమీపంలోని ఆర్ఎంపీల దగ్గరికే వెళ్తున్నారు. రోగాలను నయం చేస్తారనే భరోసాతో వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నారు. తాజాగా నకిలీ డిగ్రీలతో చికిత్స చేస్తున్న కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ కొరడా ఝుళిపిస్తుండడంతో ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ఆగస్టులో 15 కేసులు.. కొన్ని నెలలుగా నకిలీ వైద్యులపై తరచూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్.. ఒక్క ఆగస్టు నెలలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 15 కేసులు నమోదు చేసింది. పలువురి నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మెడికల్ కౌన్సిల్ అధికారులు గత నెలలో వరంగల్, హనుమకొండ, స్టేషన్ఘన్పూర్, గీసుకొండ, హసన్పర్తి, భూపాలపల్లి, జనగామ, ములుగు, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నకిలీలు అని తేలిన వారిపై ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఎంసీ చట్టం 34, 54 (టీఎస్ఎంపీఆర్ చట్టం 22 ప్రకారం కేసులు నమోదు చేశారు. పరిధి దాటి వైద్యం చేసిన మరికొంత మంది ఆర్ఎంపీలు, పీఎంపీలు ఎన్ఎంసీ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు టీఎంసీ అధికారులు ప్రకటించారు. కాగా.. ఆరు నెలల్లో 50 మందికి పైగా కేసులు నమోదైనప్పటికీ కొందరు ఆర్ఎంపీలు, పీఎంపీలు తమ తీరు మార్చుకోకుండా పరిధి దాటి వైద్యం చేస్తూ అమాయక ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మచ్చుకు కొన్ని ఘటనలు..● వరంగల్ నగరం కాశిబుగ్గ ప్రాంతంలో సుహానా ఫస్ట్ ఎయిడ్ సెంటర్పై ఇంతేజార్గంజ్ పోలీసులు ఇటీవల కేసులు నమోదు చేశారు. నకిలీ వైద్యుడు ఆర్ఎంపీ, పీఎంపీ అయిన సదానందం అశాసీ్త్రయంగా హై డోస్ యాంటీ బయాటిక్స్, ఇంజక్షన్లు ఇస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈమేరకు తనిఖీలు నిర్వహించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ● వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రైల్వే స్టేషన్ ఎదురుగా కొందరు అనధికారికంగా హాస్పిటల్ మాదిరిగా బెడ్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అర్హతలు లేకుండా ఆదర్శ వైద్యులమని ప్రజలను మోసం చేసి రిజిస్టర్డ్ వైద్యుల్లా అలోపతి వైద్యం నిర్వహించారు. ముగ్గురు నకిలీ వైద్యులను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు తనిఖీల్లో గుర్తించారు. ఎం.రమేశ్ (లావణ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్), బి.రవి (రుద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్), డి.అశోక్ (అమ్మ ఫస్ట్ ఎయిడ్ సెంటర్)పై కేసులు నమోదు చేసినట్లు ప్రకటించారు. ● గతేడాది అక్టోబర్లో ములుగు జిల్లాకు చెందిన ఓ మహిళ 4 నెలల గర్భంతో మంగపేటకు చెందిన ఆర్ఎంపీని సంప్రదించింది. అతడు గర్భంవిచ్ఛిన్నం అయ్యే మాత్రలు ఇచ్చాడు. అవి వేసుకున్నాక మహిళలకు రక్తస్రావంతో పాటు కడుపునొప్పి రావడంతో మరిన్ని మాత్రలు ఇవ్వగా పరిస్థితి విషమించింది. దీంతో చివరకు వరంగల్ ఎంజీఎంలో ఆమెకు గర్భసంచి తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. ● మహబూబాబాద్ జిల్లా హరిపిరాలలో ఓ బాలికకు జ్వరం, వాంతులు రావడంతో ఓ క్లినిక్కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు సైలెన్ పెట్టి నాలుగు ఇంజక్షన్లు ఇచ్చారు. దీంతో ఆమె అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇలా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా తరచూ అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. జాయింట్ తనిఖీలతో ఫలితాలు నకిలీ వైద్యులపై వైద్య, ఆరోగ్యశాఖాపరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని ఈ విషయంలో అప్రమత్తం చేస్తున్నాం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆర్ఎంపీలపై దాడులు నిర్వహించేటప్పుడు వైద్య, ఆరోగ్యశాఖతో కలిసి చేస్తే మరిన్ని సత్ఫలితాలు వస్తాయి. అనధికారిక క్లినిక్లు సీజ్ చేసే అధికారం వైద్య ఆరోగ్యశాఖ అధికారికి మాత్రమే ఉంటుంది. క్వాలిఫైడ్ ఆర్ఎంపీలు బోర్డు పెట్టుకోకుండా ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేయవచ్చు. – డాక్టర్ అప్పయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, హనుమకొండ పేదలకు శాపంగా మారిన నకిలీ వైద్యులు ఎక్కడపడితే అక్కడ క్లినిక్లు, ల్యాబ్లు యథేచ్ఛగా నిర్వహిస్తున్న అనర్హులు తక్కువ ఖర్చు పేరిట ఫేక్ ట్రీట్మెంట్ వైద్యం వికటించి పలువురికి అస్వస్థత పోలీసు కేసులకు వెరవని కొందరు -
నియంతృత్వ పాలనకు నిదర్శనం..
మహబూబాబాద్ అర్బన్: ప్రజాస్వామ్య మౌలిక సూత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ. అలాంటి స్వేచ్ఛను కాలరాయడం నియతృత్వ పాలనకు నిదర్శనం. వాక్ స్వాతంత్య్రం నిరాకరించడం అంటే ప్రజస్వామ్యంలో నాలుగో స్తంభాన్ని కూలగొట్టడమే. ప్రభుత్వ కాలపరిమితి పరిమితం. కానీ, ప్రజాస్వామ్యం అజేయమైంది. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టి మీడియా గొంతును నొక్కయడం సరికా దు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం సరికాదు. – డాక్టర్ డోలి సత్యనారాయణ, తెలంగాణ ఉద్యమకారుడు, మానుకోట ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే.. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్లో సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై పోలీసులు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతికా స్వేచ్ఛను హరించడమంటే రాజ్యాంగ సూత్రాలను దెబ్బతీయడమే. ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే. ప్రతిక స్వేచ్ఛను కాపాడకుంటే ప్రజలు బుద్ధిచెబుతారు. – పిల్లి సుధాకర్, మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు -
న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించాలి
టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్రావు న్యూశాయంపేట: తెలంగాణలోని ఉద్యోగ, ఉపాధ్యాయ (టీజీఈ జాక్) ప్రభుత్వానికి సమర్పించిన న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ టీజీఓ భవన్లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ముఖ్య అతిథిగా జగన్మోహన్రావు మాట్లాడుతూ.. ఇటీవల ముఖ్యమంత్రి ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లపై మాట్లాడిన మాటలు ఉద్యోగ లోకాన్ని బాధించినా టీజీఓ, టీఎన్జీఓతో పాటు వివిధ సంఘాలకు గుర్తింపునిస్తూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి సమస్యలపై చర్చలకు అవకాశం కల్పించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా సమావేశంలో పలు తీర్మానాలను ఏకగీవ్రంగా ఆమోదించారు. కమిటీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యక్ష పదవుల్లో బి.రాజిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీప్రియను తీసుకున్నారు. సమావేశంలో టీజీఓ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, కార్యదర్శి ఫణికుమార్, ఇతర కార్యవర్గ సభ్యులతో పాటు హనుమకొండ జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్కుమార్, కోశాధికారి రాజేశ్కుమార్, శ్రీనివాస్, యాకయ్య, రాజు, రాజేశ్, సదానందం, మైదం రాజు, సతీశ్కుమార్ రవీందర్రెడ్డి, సుధీర్కుమార్, హేమలత, పవిత్ర తదితరులు పాల్గొన్నారు. -
కేయూలో లా కాలేజీ విద్యార్థుల ధర్నా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ లా కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని మొదటి గేట్ నుంచి పరిపాలనాభవనం వరకు ర్యాలీ నిర్వహించారు. పరిపాలనాభవనం వద్ద బైటాయించి ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న కేయూ పోలీసులు, కేయూ ఇన్చార్జ్ రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, వర్సిటీ లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుదర్శన్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలను వీసీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ విద్యార్థులు తమ సమస్యలకు పరిష్కారం చూపాలని ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఆందోళన కొనసాగించారు. చివరికి పోలీసులు వారికి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. వరంగల్ లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్ పాండే ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ లోక్అదాలత్ను పురస్కరించుకుని వరంగల్, హనుమకొండతోపాటు ఆయా జిల్లాల పరిధి నర్సంపేట, పరకాల కోర్టుల్లో సైతం బెంచ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కక్షిదారులు రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని వారు సూచించారు. కేయూ క్యాంపస్: ఐఐటీ జామ్–2026 ప్రవేశ పరీక్షకు గణిత శాస్త్రంలో ఉచిత శిక్షణ (ఆన్లైన్) అందించనున్నట్లు హనుమకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గణిత శాస్త్ర కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి.నాగయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్లుగా ఐఐటీ జామ్, పీజీ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి ఐఐటీ జామ్ పరీక్షకు తక్కువ మంది విద్యార్థులు నమోదవుతున్నారని ఆయా విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే ఐఐటీ ఆచార్యులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 15 నుంచి ఐఐటీ జామ్ ప్రవేశ పరీక్ష ఉచిత శిక్షణకు ఆన్లైన్లో కోచింగ్ ఇవ్వబోతున్నట్లు ఆసక్తి ఉన్న విద్యార్థులు 97012 75354లో సంప్రదించాలని సూచించారు. హసన్పర్తి: అపరిశుభ్రతతోనే వ్యాధులు వ్యాపించే అవకాశాలున్నట్లు డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. 55వ డివిజన్ సదానంద కాలనీలో డెంగీ నియంత్రణ చర్యలను శుక్రవారం పర్యవేక్షించారు. డెంగీ పాజిటివ్ కేసు నమోదైన బాధితులను పరామర్శించి వారికి అందుతున్న వైద్యం గురించి తెలుసుకున్నారు. స్థానికంగా చేపడుతున్న ఫీవర్ సర్వే, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాల్ని పరిశీలించారు. కాలనీలోని పలు వీధుల్లో పర్యటించి దోమల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్ఓ టి.మదన్మోహన్రావు, స్థానిక వైద్యాఽధికారి భార్గవ్, మానస, జిల్లా మాస్మీడియా అధికారి అశోక్రెడ్డి, సబ్ యూనిట్ అధికారి ఖాదర్ అబ్బాస్, హెల్త్ సూపర్వైజర్ లచ్చు, కమలాకర్, సంతోశ్, ఏఎన్ఎంలు స్వరూప, రాణి, ప్రశాంత, ఆశవర్కర్లు పాల్గొన్నారు. కాజీపేట: యువత విరివిగా మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేశ్ అన్నారు. కాజీపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థి పర్యవరణ పరిరక్షణ ఉద్యమకారుడు కె.ప్రకాశ్ ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కలు నాటారు. కార్యక్రమానికి హాజరైన కేంద్ర సాహిత్య పురస్కార అవార్డు గ్రహీత అంపశయ్య హాజరయ్యారు. కార్యక్రమంలో కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, రిటైర్డ్ అటవీశాఖ అధికారి పురుషోత్తం, హెచ్ఎం ఎం.ఫ్రాన్సిస్, ఉద్యనవన శాఖ అధికారి రమేశ్, ఎంఈఓ మనోజ్కుమార్, సుంకరి జ్వాలా ప్రశాంత్, శ్రీను, అశ్విని, నాగరాజు, వెంకటరమణ, నర్సయ్య పాల్గొన్నారు. -
కలానికి సంకెళ్లేసి సత్యాన్ని నిర్బంధించలేరు!
నిఖార్సయిన జర్నలిజంతో తెలుగు పత్రికా ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న ‘సాక్షి’పై ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అక్కసు పెంచుకుందని ఉమ్మడి వరంగల్ జిల్లా పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలకు అక్షర రూపమిచ్చినందుకు సాక్షి జర్నలిస్టులపై అక్కడి ప్రభుత్వం కేసులు పెట్టించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కలానికి సంకెళ్లు వేసి సత్యాన్ని నిర్బంధించగలరా? అని వారంతా ప్రశ్నిస్తున్నారు. -
సృజనాత్మకతను వెలికితీసేందుకే కళా ఉత్సవ్
హనుమకొండ డీఈఓ వాసంతి విద్యారణ్యపురి: పాఠశాలల స్థాయి విద్యార్థుల్లో సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు కళాఉత్సవ్ దోహదం చేస్తుందని హనుమకొండ డీఈఓ వాసంతి అన్నారు. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కళాఉత్సవ్ను హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో నిర్వహించారు. ఈకళా ఉత్సవ్ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లా స్థాయిలో 12 అంశాల్లో కళా ఉత్సవ్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. 14 మండలాల నుంచి 93 మంది విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు, వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ బండారు మన్మోహన్, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాస్స్వామి, హనుమకొండ ఎంఈఓ నెహ్రూనాయక్, సోషల్ స్టడీస్ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, హైస్కూల్ హెచ్ఎం జగన్, పీఎస్ హెచ్ఎం ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల గొంతు నొక్కడమే..
హన్మకొండ అర్బన్: ప్రతిపక్షాల గొంతు నొక్కడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉన్న ఏకై క గొంతుక పత్రికలు. వాటిని కూడా అణచివేయడం, అక్రమ కేసులతో తొక్కివేయడం వంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టకర పరిణామాలుగా చెప్పాలి. ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. పత్రికలే ప్రజల గొంతుకగా ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పత్రికలు, పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టులను కేసుల పేరుతో నిర్బంధించడం. వేధించడం అమానుషం. ఇది మంచి పరిణామం కాదు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ప్రభుత్వాలు, నాయకులు ప్రజాగ్రహానికి గురవ్వక తప్పదు. – ఎన్నమనేని జగన్మోహన్రావు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రజల స్వేచ్ఛను హరించడమే..హన్మకొండ అర్బన్: అధికార పక్షం విఫలమైనప్పుడు ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా నిలబడేవి పత్రికలు, మీడియా మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు అధికారంలోకి వస్తే వారు తమ స్వలాభం కోసం నిర్బంధాలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అది పూర్తిగా ప్రజలను ఇబ్బంది పెట్టినట్లే, కక్ష సాధించినట్లే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. అధికారంలో ఎవరున్నా పత్రికా స్వేచ్ఛను కాలరాయడమన్నది ప్రజల స్వేచ్ఛను హరించడమే. ఇప్పటికై నా ప్రభుత్వాలు ఉద్దేశపూర్వక చర్యలను మానుకోవాలి. సాక్షి జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. – నిమ్మల శ్రీనివాస్, సామాజికవేత్త -
విజ్ఞాన శాస్త్రంలో మైక్రోబయోమ్ కీలకం
జాతీయ సదస్సులో కేయూ విశ్రాంత ఆచార్యులు రాంరెడ్డి విద్యారణ్యపురి: మానవాళి మనుగడను మైక్రోబయోమ్ నిర్దేశిస్తోందని, జీవుల జీవనాన్ని అర్థం చేసుకోవడంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని కేయూ మైక్రోబయాలజీ రిటైర్డ్ ఆచార్యులు ఎస్.రాంరెడ్డి అన్నారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘మైక్రోబియల్ ఫ్రాంటియర్స్ హార్నెస్సింగ్ జీనోమి క్స్ సింథటిక్ బయాలజీ అండ్ మైక్రోబయోమ్ ఇన్నోవేషన్స్’ అంశంపై శుక్రవారం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో జీనోమిక్స్, మైక్రోబయోమ్ కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. వరంగల్ నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పెరుగు శ్యాం మాట్లాడుతూ.. జీనోమిక్స్ విస్తృతమైన డేటా సెట్లను ఉత్పత్తి చేస్తుందన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ వైద్యకళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రామ్మోహన్ మాట్లాడుతూ.. మన జీవన విధానంలో సమతుల్య ఆహారం నుంచి మంచి ఆరోగ్యాన్ని పొందగలమన్నారు. నాగ్పూర్లోని ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ రీజినల్ సెంటర్ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ.. పంటలకు రసాయన ఎరువులు, పురుగు మందులు అధికంగా వాడితే మానవాళి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. కేడీసీ ప్రిన్సిపాల్ ఆచార్య గుర్రం శ్రీనివాస్, జాతీయ సదస్సు కన్వీనర్ పి.పల్లవి మాట్లాడారు. -
ఆటోడ్రైవర్ ఆత్మహత్య
ఖిలా వరంగల్ : మైక్రో ఫైనాన్స్ వేధింపులు, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన ఓ ఆటో డ్రై వర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. ఖిలా వరంగల్ పడమరకోట ఎస్సీ కాలనీకి చెందిన ఆకులపల్లి కమలాకర్ (40) ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అప్పు తీర్చాలని మైక్రో ఫైనాన్స్లో వేధింపులు, ఆర్థిక ఇబ్బందులతో కమలాక ర్ పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిల్స్కాలనీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, కుమారులు ఉన్నారు. మృతుడి మమత ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఈవీఎం గోదాంల పరిశీలన
వరంగల్ చౌరస్తా/న్యూశాయంపేట: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని జిల్లా వేర్హౌస్ గోదాముల్లో భద్రపర్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషన్ల(ఈవీఎంల)ను వరంగల్ కలెక్టర్ సత్యశారద, అదనవు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి శుక్రవారం అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా స్ట్రాంగ్ రూముల్లో భద్రపర్చిన ఈవీఎంలను కలెక్టర్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ రికార్డులు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు, సీసీ కెమెరాల పర్యవేక్షణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను భద్రపర్చిన గోదాంను కూడా పరిశీలించారు. తనిఖీల్లో ఆర్డీఓలు సత్యపాల్ రెడ్డి, రమాదేవి, తహసీల్దార్ ఇక్బాల్, ఎన్నికల నాయబ్ తహసీల్దార్ రంజిత్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అనిల్, శ్యామ్, ఫైజోద్దీన్, తదితరులు పాల్గొన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జ్కి మెమో వరంగల్ ఏనుమాముల మార్కెట్లోని మండల్ లెవల్ స్టాక్(బియ్యం) పాయింట్ను కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం తనిఖీ చేశారు. కేంద్రంలోని నిల్వలు, బియ్యం నాణ్యత, నిల్వ విధానం, భద్రతా ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ముక్కిన బియ్యం, విద్యార్థులకు సరఫరా చేసే మధ్యాహ్న భోజన పథక బియ్యం ఒకే ప్రాంతంలో ఉండటాన్ని గమనించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసరఫరాల డీఎం, ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జ్కి మెమో జారీచేయాలని అదనపు కలెక్టర్ను ఆదేశించారు. తనిఖీల్లో పట్టుబడిన బియ్యాన్ని వెంటనే వేలం వేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, తదితర అధికారులు పాల్గొన్నారు. నిర్వాసితులతో కలెక్టర్ సమీక్ష మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన గాడిపల్లి గ్రామస్తులతో శుక్రవారం కలెక్టర్ సత్యశారద సమీక్షా సమావేశం నిర్వహించారు. 12 మంది నిర్వాసితులకు పరిహారం చెల్లించే తీరుపై సమీక్షించారు. సమీక్షలో నిర్వాసితుల సందేహాలను నివృత్తి చేశారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డిఓ సత్యపాల్రెడ్డి, ఖిలావరంగల్ తహాశీల్దార్ శ్రీకాంత్, ఏఓ విశ్వప్రసాద్ పాల్గొన్నారు. -
శభాష్.. ఎల్కతుర్తి పోలీస్
ఎల్కతుర్తి : వాగులో చిక్కుకున్న ఓ వ్యక్తిని ఖాకీలు కాపాడారు.హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన గాజుల రాకేశ్.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని శుక్రవారం తెల్లవారుజామున ఇంటికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలోని తాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటే క్రమంలో రాకేశ్ కొట్టుకుపోయి బ్రిడ్జి వద్ద ఉన్న మూడో పిల్లర్ను పట్టుకొని కేకలు వేశాడు. గమనించిన గ్రామస్తులు వెంటనే డయల్–100కు సమాచారం ఇచ్చారు. స్పందించిన ఎల్కతుర్తి సీఐ పులి రమేశ్, ఎస్సై ప్రవీణ్కుమార్ వెంటనే తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని తాడుసాయంతో రాకేశ్ను రక్షించారు. దీంతో పోలీసులను ప్రజలు అభినందించారు. కానిస్టేబుల్ బక్కయ్య, వికిల్, రాజు గ్రామస్తులు పాల్గొన్నారు. -
డీసీసీబీ ‘ఏ’ కేటగిరీ సాధించాలి
హన్మకొండ : నాబార్డు ఇన్స్పెక్షన్లో వరంగల్ డీసీసీబీ ‘ఎ’ కేటగిరీ సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్రాంచ్ల వారీగా ప్రగతిని సమీక్షించి ఆయన మాట్లాడారు. నిర్దేశించిన లక్ష్యాలు గడువులోగా సాధించాలని సూచించారు. వ్యక్తిగత పనితీరు మెరుగుపడని వారిపై చర్యలు తీసుకోవాలని సీఈఓను ఆదేశించారు. రుణాలు, మొండి బకాయిలను రికవరీ చేసి సంఘాలను పటిష్టం చేయాలని పేర్కొరు. నిరర్థక ఆస్తులు 2 శాతానికి లోబడి ఉండేలా, టర్నోవర్ రూ.2,500 కోట్లు చేరుకునేలా కృషి చేయాలని అన్నారు. ప్రతి నెల ఖాతాదారులతో సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం వరంగల్ డీసీసీబీని రాష్ట్రంలో రెండో స్థానానికి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో సీఈఓ వజీర్ సుల్తాన్, జీఎంలు ఉషశ్రీ, పద్మావతి, డీజీఎం అశోక్, ఏజీఎంలు మధు, గొట్టం స్రవంతి, బోడ రాజు, గంప స్రవంతి, కృష్ణ మోహన్, డీఆర్ ఓఎస్డీ విజయకుమారి, బ్యాంకు బ్రాంచ్ల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు -
బొడ్డెమ్మ వేడుకలు షురూ
కాజీపేట/హన్మకొండ కల్చరల్: వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వైభవంగా బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. మహిళలు పుట్టమట్టితో బొడ్డెమ్మలను తయారుచేసి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించారు. సాయంత్రం సమయంలో ఉత్సాహంగా పాటలు పాడుతూ బొడ్డెమ్మ ఆడారు. చెల్పూరులో చైన్ స్నాచింగ్ ● బంగారు పుస్తెలతాడు అపహరణ గణపురం: మండలంలోని చెల్పూరులో గురువారం అర్ధరాత్రి చైన్ స్నాచింగ్ జరిగింది. చెల్పూరుకు చెందిన వృద్ధురాలు కౌటం మొండక్క మూత్రవిసర్జనకు బయటకు వచ్చింది. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడకు వెంట తెచ్చుకున్న టైరును వేసి బంధించాడు. ఒక చేతితో నోటిని మూసి ఆమె మెడలోని నాలుగున్నర తులాల బంగారు పుస్తెల తాడును అపహరించాడు. ఆమె అరుపులు విన్న భర్త మొగిలయ్య బయటకు రావడంతో అప్పటికే దుండగుడు పారిపోయాడు. మెడ ను ంచి పుస్తెల తాడు తెంపే క్రమంలో మొండక్క మెడకు గాయాలయ్యాయి. భర్త మొగిలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ పేర్కొన్నారు. వరుస చోరీలతో ఆందోళన.. గతనెలలో కూడా చెల్పూరు గ్రామానికి చెందిన వృద్ధురాలు నరహరి కమలమ్మను ఇంటి వద్ద దింపుతానని గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలును లాక్కెళ్లాడు. ఈ ఘటన జరిగి నెలగడవక ముందే గురువారం అర్ధరాత్రి చైన్ స్నాచింగ్ చేయడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దొంగతనాలను ప్పాడుతున్న వారు స్థానికుల లేదా ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చారా అని గ్రామస్తులు భయపడుతున్నారు. నిందితులను వెంటనే పట్టుకొని పోలీసులు ధైర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వరంగల్ అర్బన్: బల్దియా వార్డు ఆఫీసర్లుగా రెండేళ్ల క్రితం విధుల్లో చేరిన 27 మంది జీపీఏలు శుక్రవారం రిలీవ్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వీరిని తమ సొంత శాఖకు కేటాయించారు. అంతేకాకుండా ప్రభుత్వం వీరికి నియామకపత్రాలు అందజేసినట్లు బల్దియా అధికారులు తెలిపారు. ముగిసిన కబడ్డీ టోర్నమెంట్కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఇంటర్ కాలేజీయేట్ డిగ్రీ, పీజీ కళాశాలల కబడ్డీ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. ఫైనల్లో ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజీ జట్టు విజయం సాధించింది. హనుమకొండలోని వాగ్దేవి కళాశాల జట్టు రన్నరప్గా నిలిచింది. ఇరు జట్లకు కేయూ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.మనోహర్ బహుమతులు అందజేశారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎస్. కుమారస్వామి, ఫిజికల్ డైరెక్టర్లు సోమన్న, జేత్య, కిరణ్కుమార్, పాషా, పల్లవి, బుచ్చన్న, సుమన్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. -
గొర్రెల మందపై పిడుగు..
కాళేశ్వరం : గొర్రెల మందపై పిడుగు పడి 94 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేట గోదావరి శివారు ప్రాంతంలో గురువారం రాత్రి జరిగింది. స్థానికులు, గొర్రెల కాపరులు తెలిపిన కథనం ప్రకారం.. అంబటిపల్లికి చెందిన సుమారు ఆరు గొర్రెల మందలు పెద్దంపేట–లెంకలగడ్డ గ్రామ శివారులో మేతకు వెళ్లి అక్కడే నిద్రిస్తున్నట్లు చెప్పారు. ఈక్రమంలో రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కాపరులు మంద నుంచి సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న గుడారంలోకి వెళ్లారు. మందపై ఒక్కసారి పిడుగు పడడంతో గొర్రెలన్నీ ఎక్కడిక్కడ చెల్లా చెదురయ్యాయి. రూ.10 లక్షల విలువైన 94 గొర్రెలు మృతిచెందడంతో యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లా పశువైద్యాధికారి కుమారస్వామి, మండల పశువైద్యాధికారి రాజబాపు, తహసీల్దార్ రామారావు చనిపోయిన గొర్రెలకు పంచనామా, పోస్టుమార్టం చేశారు. గోతితీసి పాతిపెట్టినట్లు అధికారులు తెలిపారు. -
16న జాబ్మేళా
న్యూశాయంపేట: ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగులకు వరంగల్ జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి టి.రజిత తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 16న ములుగురోడ్డులోని ఐటీఐ క్యాంపస్లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ముత్తూట్ మైక్రోఫిన్ లిమిటెడ్ కంపెనీలో రిలేషన్ షిప్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్న ట్లు తెలిపారు. వివరాలకు 80790 09659లో నంబర్లో సంప్రదించాలని ఆమె సూచించారు. బిట్ కాయిన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసంమహబూబాబాద్ రూరల్ : బిట్ కాయిన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసం జరగగా ఓ బాధితుడు రూ.32.53 లక్షలు పోగొట్టుకున్నాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మహబూబాబాద్ టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి శుక్రవారం కేసు వివరాలను వెల్లడించారు. మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మొబైల్కు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా షాదీడాట్ కామ్ అని మెసేజ్ చేసి వివరాలు అడిగారు. బాధితుడికి వివాహమైందని తెలియజేసి వారికి వివరాలు ఇవ్వలేదు. కొన్నిరోజుల తర్వాత అదే వాట్సాప్ నంబర్ నుంచి బిట్ కాయిన్ ట్రేడింగ్ గురించి చెప్పి అందులో పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని నమ్మబలికి లింక్ పంపించారు. ఆ లింక్తో బిట్ కాయిన్ ట్రేడింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. అనంతరం వాళ్లు చెప్పిన విధంగా మొదటగా రూ.50వేలు, ఆ తర్వాత రూ.5లక్షలు పంపించాడు. అయితే బాధితుడి వాలెట్లో రూ.పది లక్షలు ఉన్నట్టు చూపించి నమ్మించారు. ఇది నమ్మిన బాధితుడు పలు దఫాలుగా వాళ్లు చెప్పినట్లు వివిధ ఖాతా నంబర్లకు మొత్తం రూ.32,53,447 పంపించాడు. తర్వాత ఎలాంటి నగదు బాధితుడి అకౌంట్లో జమకాలేదు. అయినా కూడా డబ్బులు జమ చేయకుండా మరింతా డబ్బులు అడుగుతుండటంతో తాను సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించాడు. వెంటనే బాధితుడు మహబూబాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ● రూ.32.53లక్షలు పోగొట్టుకున్న బాధితుడు ● కేసు నమోదు చేసిన పోలీసులు -
ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించేలా పనులు
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం గద్దెల ప్రాంగణంలో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పనులు చేపట్టనున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తెలిపారు. ఐటీడీఏ అతిథి గృహంలో శుక్రవారం నిర్వహించిన ఆదివాసీ సంఘాల ముఖ్య ప్రతినిధుల సమావేశంలో ఆర్కిటెక్చర్, కోయల పడిగల గుడ్డల లిపి 3నుంచి 7 గొట్ల మూలాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాలు గుడ్డలో ఉన్న పూర్వ చరిత్ర చిత్రలిపి, ఆదివాసీ జీవన విధానం గోడలపై ఆవిష్కరించాలని సూచించారు. వెయ్యేళ్లు సజీవంగా ఉండేలా, ఆదివాసీల చరిత్ర నిలిచేలా జాతర చరిత్ర బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా గద్దెల ప్రాంగణం, సాలాహారం నిర్మాణంపై ఆదివాసీల బొమ్మలు ఉండాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. కోయ ద్వారాల మాదిరిగానే ఆలయ ద్వారాల నిర్మాణాలు ఉంటాయని వివరించారు. ద్వారాలపై సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు మూలాలు, ఆదివాసీల గొట్లు, గోత్రాలు, సిద్ధబోయిన వారి పూజావిధాన పద్ధతులు కూడా ఉంటాయని చెప్పారు. మిగిలిన 8 ద్వారాల్లో ఐదో గొట్టు సమ్మక్క, మూడో గొట్టు సారలమ్మ, నాలుగో గొట్టు పగిడిద్దరాజు, గోవిందరాజు, వడ్డె (పూజారి) గోత్రాలతో ప్రత్యేక ద్వారాలు ఏర్పాటు చేయడంతోపాటు ఆ వంశ మూల చరిత్ర ఉంటుందని అన్నారు. -
సాంకేతిక లోపంతో నిలిచిన ‘గోల్కొండ’
డోర్నకల్ : రైలులోని ఓ బోగీలో సాంకేతిక లోపం తలెత్తడంతో సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న గోల్కొండ ఎక్స్ప్రెస్ డోర్నకల్ రైల్వే స్టేషన్లో మూడు గంటలకు పైగా నిలిచింది. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన గోల్కొండ ఎక్స్ప్రెస్ కాజీపేట దాటిన తర్వాత రైలులోని డీ–2 బోగీలో సాంకేతిక లోపం తలెత్తింది. వరంగల్ స్టేషన్లో బోగీలోకి ఎస్కార్ట్గా ఎక్కిన సిబ్బంది రైలు ఆగిన ప్రతీ స్టేషన్లో డీ–2 బోగీని పరిశీలించారు. రైలు మహబూబాబాద్ దాటిన తర్వాత డీ–2 బోగీలో హార్డ్ యాక్సిల్ బేరింగ్ దెబ్బతిందని సిబ్బంది డోర్నకల్ రైల్వే స్టేషన్కు సమాచారం అందించారు. డోర్నకల్ స్టేషన్లో సీఅండ్ డబ్ల్యూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. రైలు సాయంత్రం 5:04 గంటలకు డోర్నకల్ స్టేషన్లోని నాలుగో ప్లాట్ఫామ్ చేరుకున్న తర్వాత డీ–2 బోగీని క్షుణ్ణంగా తనిఖీ చేసి రైలు నుంచి తొలగించాలని నిర్ధారించారు. రైలు వెనుకవైపు ఇంజన్ అమర్చి బీ–2 వరకు చివరి ఐదు బోగీలను జంక్షన్లోని యార్డుకు తరలించారు. డీ–2 బోగీని యార్డులో వదిలి మిగతా నాలుగు బోగీలను తిరిగి రైలుకు అమర్చిన తర్వాత రైలు రాత్రి 8:13 గంటలకు డోర్నకల్ నుంచి కదిలింది. సుమారు మూడు గంటలకు పైగా స్టేషన్లో రైలు నిలవడంతో విజయవాడ, గుంటూరు వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఖమ్మం వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. -
ఒకే ఇంటిపై మూడు పిడుగులు
●ఎల్లంపేటలో గృహోపకరణాలు దగ్ధం.. మరిపెడ రూరల్ : ఒకే ఇంటిపై మూడుసార్లు పిడుగులు పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని ఎస్సీ కాలనీలో వంగూరి వెంకన్న, వెంకటమ్మ నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి వారి భవనం మెట్లపై ఒక చోట, డాబాపై రెండు చోట్ల పిడుగు పడింది. భయంతో వణికిపోయిన దంపతులు పక్కింట్లో తలదాచుకున్నారు. సొమ్మసిల్లి పడిపోయిన వెంకటమ్మను ఆస్పత్రికి తరలించారు. పిడుగులు పడి స్లాబుకు పెచ్చులూడి పగుళ్లు ఏర్పడ్డాయి. ఇంట్లోని ఫ్రిడ్జి, ఫ్యాన్లు, టీవీ, విద్యుత్ తీగలు కాలిపోయాయి. మొత్తం రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ఘటన స్థలాన్ని శుక్రవారం గ్రామ పరిపాలన అధికారి గణేశ్ పరిశీలించి పంచనామా నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మరిపెడ పీఏసీఎస్ వైస్ చైర్మన్ గండి మహేశ్తో పాటు గ్రామస్తులు కోరారు. -
వర్షం, పిడుగుల బీభత్సం
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆస్తి నష్టంఉమ్మడి వరంగల్ జిల్లాలో గురువారం రాత్రి పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకు భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. హనుమకొండ జిల్లా నడికూడ మండలం కౌకొండలో రూ.95 వేల విలువైన ఎద్దు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేట గోదావరి శివారు ప్రాంతంలో రూ.10 లక్షల విలువైన 94 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. టేకుమట్ల మండలంలో మానేరులో వరద ఒక్కసారిగా ఉప్పొంగడంతో ట్రాక్టర్లు మునిగిపోగా ఏడుగురిని పోలీసులు రక్షించారు. -
ప్రభుత్వ బడిలో కార్పొరేట్ విద్య
హసన్పర్తి : ప్రభుత్వ విద్యా సంస్థల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందుతోందని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. దాతలు (అరబిందో ఫార్మా ఫౌండేషన్, బ్రెల్చివ్ టర్నాలజీ, స్వాన్ టర్బిన్ సర్వీస్) సహకారంతో హసన్పర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల పాఠశాలలో సుమారు రూ.42లక్షల వ్యయంతో నిర్మించిన ఆడిటోరియం, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయ భవనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కేఆర్.నాగరాజుతో కలిసి కలెక్టర్ స్నేహశబరీష్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. చదువుకు పేదరికం అడ్డుకాదని చెప్పారు. ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ.. ఆడిటోరియంలో ఫర్నిచర్ను సమకూరుస్తానని హామీ ఇచ్చారు. హసన్పర్తికి చెందిన ఈగల్ ఎస్పీ చెన్నూరి రూపేశ్ పేదరికాన్ని జయించి ఐపీఎస్గా ఉద్యోగం సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోటీపరీక్షలకు సంబంధించిన సుమారు రూ.8లక్షల విలువైన మెటీరియల్ను విద్యార్థులకు అందజేశారు. దాతలు స్వాన్ టర్బిన్ సర్వీస్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ, డైరెక్టర్ అరుణ, బ్రెల్చివ్ టర్నాలజీ సీఈఓ డాక్టర్ ఉదయ్కుమార్, మహర్షి ఫౌండేషన్ అధ్యక్షుడు చెన్నూరి రవిని శాలువాలతో సత్కరించారు. డీఐఈఓ గోపాల్, ప్రిన్సిపాల్ సునీత, కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, కాంగ్రెస్ నాయకులు, ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ దాతల సాయంతో హసన్పర్తి కళాశాల, పాఠశాలలో రూ.42 లక్షల వ్యయంతో ఆడిటోరియం, ల్యాబ్ ప్రారంభం -
మహాజాతర పనులు సకాలంలో పూర్తి చేయాలి
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం మహాజాతర అభివృద్ధి పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ దివాకరటీఎస్ అన్నారు. గురువారం మండలంలోని మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్లో ఎస్పీ డాక్టర్ శబరీశ్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, డీఎఫ్ఓ రాహుల్కిషన్ జాదవ్, అడిషనల్ కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావుతో కలిసి మహాజాతర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా చేపట్టనున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర్ టీఎస్ మాట్లాడుతూ పీఆర్, ఆర్అండ్బీ, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ, అటవీశాఖ, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించి వారంలోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. ప్రతీ శాఖకు సంబంధించి టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసిన పనులు క్షేత్ర స్థాయిలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో జరిగిన జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. సంబంధిత అధికారులు మేడారంలో క్షేత్ర స్థాయిలో ఉండాలని, పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదిక అందించాలన్నారు. మహాజాతరకు సుమారు కోటి యాభై లక్షల పైగా భక్తులు హాజరవుతారని అంచనా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో జాతర పనులు భక్తులకు సంతృప్తికరంగా ఉండాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ వెంకటేష్, డీఆర్ఓ శ్రీనివాస్రావు, మేడారం ఈఓ వీరస్వామి, తహసీల్దార్ సురేశ్బాబు, అధికారులు పాల్గొన్నారు. పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలి కలెక్టర్ దివాకరటీఎస్ -
భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు సరికాదు!
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక పత్రికా స్వేచ్ఛ, ప్రశ్నించే గొంతుకలను భౌతికదాడులతో పాటు పోలీసులను ఉపయోగిస్తూ తప్పుడు కేసులతో తీవ్ర అణచివేతకు గురిచేస్తుండడంపై పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజా సమస్యలపై కథనాలు ప్రచురిస్తే సాక్షి దినపత్రిక జర్నలిస్టులపై కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఫిర్యాదులు ఇప్పిస్తూ కేసులు నమోదు చేస్తుండడాన్ని ఖండించారు. వివిధ అంశాలపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏర్పాటు చేసే ప్రెస్కాన్ఫరెన్స్ల వార్తలు రాసిన సందర్భంలోనూ సాక్షి దినపత్రికతో పాటు ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – హన్మకొండ -
పొగాకు ఉత్పత్తులు స్వాధీనం
రామన్నపేట: మట్టెవాడ పీఎస్ పరిధిలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు(అంబర్ ప్యాకెట్లు) విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు వ్యాపారి కొలారియా ముకేశ్ ఇంటిపై టాస్క్ పోలీసులు గురువారం దాడులు చేశారు. ఈ మేరకు రూ.8.82 లక్షల విలువైన అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. దాడుల్లో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీధర్, ఎస్సై టి.వీరస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. 13 నుంచి రోలర్ స్కేటింగ్ ఎంపికలు వరంగల్ స్పోర్ట్స్: అండర్–5 నుంచి 18 బాలబాలికలకు ఈ నెల 13, 14వ తేదీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి రోలర్ స్కేటింగ్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు స్కేటింగ్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి సిద్ధార్థ, ఓం ప్రకాశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలు 13వ తేదీన ఉనికిచర్లలో ఎస్ఎస్హౌస్ వద్ద, 14న రాంపూర్లోని ఢిల్లీ పబ్లిక్స్కూల్ ఆవరణలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు వివరాల కోసం 6301591754 నంబర్లో సంప్రదించాలని వారు కోరారు. 13,14వ తేదీల్లో వాగ్దేవిలో క్రీడాపోటీలు మామునూరు: ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి క్రీడామైదానంలో ఈనెల 13,14 తేదీల్లో కాకతీయ యూనివర్సిటీ స్థాయి (ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలా బాద్ జిల్లాల) క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల మేనేజ్మెంట్, ప్రిన్సిపాల్ సు నీల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీ డా పోటీల్లో 32 కళాశాలకు చెందిన డిగ్రీ, పీజీ , ప్రొఫెషనల్ కోర్సుల క్రీడాకారులు హాజరవుతున్నారని తెలిపారు. క్రీడా పర్యవేక్షకులుగా వాగ్దేవి కళాశాలల కార్యదర్శి సి.హెచ్. దేవేందర్రెడ్డి, సి.హెచ్.వాణిదే వి, డైరెక్టర్ సుదర్శన్రెడ్డి, ఆర్గనైజర్ సెక్రటరీ రామాంజనేయులు వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ‘ఆల్ ఇండియా’ చెస్ పోటీల విజేతగా రామకృష్ణ వరంగల్ చౌరస్తా: హైదరాబాద్లో జరిగిన ఏడో ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్–25 చెస్ పోటీల్లో వరంగల్ జిల్లా సబ్ జైళ్ల జైలర్ గొట్టె రామకృష్ణ విజేతగా నిలిచారు. ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్కుమార్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నుంచి మెడల్, ట్రోఫీ అందుకున్నారు. ఈసందర్భంగా ఆ శాఖ అధికారులు, సిబ్బంది, మిత్రులు ఆయనను అభినందించారు. సకాలంలో టీకాలు వేయాలి గీసుకొండ: చిన్న పిల్లలకు వేసే టీకాలను సకాలంలో క్రమం తప్పకుండా వేయాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు వైద్య సిబ్బందికి సూచించారు. జి ల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం వాక్సినేషన్పై వైద్య సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాశ్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఆచార్య, డాక్టర్ విజయ్కుమార్, డిప్యూటీ డెమో అనిల్కుమార్,వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
తల్లిదండ్రులకు భారమైన శిశువు మృతదేహం
● ఎంజీఎం మార్చురీలో వదిలేసిన కన్నవారు ● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనఎంజీఎం: ఎంజీఎం మార్చురీలో ఓ పసికందు మృతదేహాన్ని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మామిడాల గ్రామానికి చెందిన హైమవతి–అనిల్ దంపతులు వదిలివెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైమావతి 7 నెలల గర్భిణి. కాగా, ఇటీవల తొర్రూరు ఆస్పత్రిలో శిశువుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో శిశువుకు గుండె సమస్య ఉందని చెప్పడంతో అక్కడి నుంచి ఎంజీఎంలోని నవజాత శిశు కేంద్రానికి తీసుకొచ్చి చికిత్స చేస్తుండగా ఈనెల 8వ తేదీన మృతి చెందింది. కాగా, పసికందు మృతదేహాన్ని తల్లిదండ్రులు మార్చురీలో వదిలివెళ్లారా, డబ్బులు లేకపోవడంతో మున్సిపల్ సిబ్బంది ఖననం చేస్తారు అని వదిలివెళ్లారో తెలియదు. కానీ, గురువారం సాయంత్రం ఆస్పత్రిలో ఈ విషయం చర్చకు దారితీసింది. వెంటనే సమాచారం తెలుసుకున్న మట్టెవాడ పోలీసులు మార్చురీలో ఉన్న పసికందు మృతదేహం గురించి సదరు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు మరోసారి ఎంజీఎం మార్చురీకి రానున్నట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. -
ఆర్టీసీలో భద్రతకు పెద్దపీట..
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం రోడ్డు భద్రతకు ప్రాధాన్యమిస్తోంది. రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతోంది. డ్రైవర్ ఆరోగ్యంగా ఉండి, మంచి నడవడిక, ఆరోగ్యకరమైన జీవన శైలి ఉంటే, మానసికంగా దృఢంగా ఉంటారని... తద్వారా ప్రమాదాలు అరికట్టవచ్చనే ఆలోచనతో వరంగల్ రీజియన్ ముందుకు పోతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సేఫ్టీ వార్డెన్లను నియమించారు. ప్రమాదాలు చేయని, అనుభవజ్ఞులు, సత్ప్రవర్తన, ఎలాంటి దురలవాట్లు లేని డ్రైవర్లు, కండక్టర్లను సేఫ్టీ వార్డెన్లుగా ఎంపిక చేశారు. వరంగల్ రీజియన్లో 9 డిపోలకు ఒకరి చొప్పున నియమించారు. సేఫ్టీ వార్డెన్ల విధులు.. సేఫ్టీ వార్డెన్లు డ్రైవర్లను ప్రతీరోజు నిశి త పరిశీలన చేస్తా రు. సెలవులో ఉ న్న వారిని వదిలి పెట్టరు. వారి ఆరోగ్యాన్ని, జీవనశైలిని దగ్గరగా గమనిస్తారు. వారాంతపు సెలవు రోజులు, స్పెషల్ ఆఫ్లో ఉన్న సమయంలో తగిన విశ్రాంతి తీసుకుంటున్నారా..? మద్యం సేవిస్తున్నారా..? ఇతర దురలవాట్లకు పాల్పడుతున్నారా.. అనారోగ్యంగా ఉంటే అవసరమైన మందులు సమయానుకూలంగా వాడుతున్నారా.. తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. డ్రైవర్ల కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు తీసుకుని విశ్రాంతి రోజు వారి జీవన విధానాన్ని గమనిస్తున్నారు. వారి నడవడిక, ప్రవర్తనలో ఏ మాత్రం తేడా వచ్చినా డిపో, రీజియన్ అధికారులకు వివరించి సన్మార్గంలో నడిచేలా చూస్తారు. ఇలా చేయడం ద్వారా డ్రైవర్లు ఆరోగ్యంగా ఉంటారని, ఎలాంటి అలజడులకు తావు లేకుండా మానసికంగా ఉంటారని అధికారులు తెలిపారు. వరంగల్ రీజియన్లో సంస్థ డ్రైవర్లు 1100, ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్లు 258 మంది ఉన్నారు. ఉద్యోగులు, కార్మికులకు వైద్య పరీక్షలు.. గ్రాండ్ హెల్త్ చాలెంజ్ కార్యక్రమం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు యాజమాన్యం వైద్య పరీక్షలు నిర్వహించింది. వారి ఆరోగ్యాన్ని బట్టి ఉద్యోగులకను కేటగిరీలుగా విభజించింది. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించింది. హెల్త్ డేటా బేస్లో ఉద్యోగి వారీగా ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర సమాచారం పొందుపరిచారు. వైద్య పరీక్షల ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు. మందులు వాడుతున్నారా లేదా అని సేఫ్టీ వార్డెన్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. విధులకు వచ్చిన సందర్భంలోనూ వారి వ్యక్తిగత రికార్డులు పరిశీలించి వాడాల్సిన ఔషధాలు వెంట తెచ్చుకున్నారా లేదా అని తెలుసుకుంటున్నారు. అదేవిధంగా భోజనం, తాగునీరు కూడా ఇంటి వద్ద నుంచి తెచ్చుకునేలా మార్గదర్శనం చేస్తున్నారు. నైట్ డ్యూటీకి వెళ్లే వారు, రెస్ట్లో ఉండే వారు దోమతెర, ఓడోమస్ వెంట తీసుకొచ్చేలా వారిని ప్రోత్సహిస్తున్నారు. తద్వారా డ్రైవర్ల ఆరోగ్యం బాగుండడంతోపాటు రోడ్డు ప్రమాదాలు తగ్గుతున్నాయని అధికారులు తెలిపారు. వ్యక్తిగత రికార్డుల పరిశీలన.. డ్రైవర్ల పనితీరుపై కూడా వ్యక్తిగత రికార్డులు నిర్వహిస్తున్నారు. డ్రైవర్ ఉద్యోగంలో చేరిన తేదీ, ప్రవర్తన తీరు.. ప్రమాదాలు జరిగాయా.. జరిగితే ప్ర మాదానికి కారణం ఎవరు.. మామూలు ప్రమాదా మా, మేజర్ ప్రమాదమా.. ప్రాణాలుపోయిన ప్ర మాదమా వంటి వివరాలు నమోదు చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సురక్షిత డ్రైవింగ్ చేసే డ్రైవర్లను ‘ఏ’ కేట గిరీలో, మైనర్ ప్రమాదాలు చేసిన వారిని ‘బి’ కేట గిరీ, మేజర్ ప్రమాదాలకు పాల్పడిన వారిని ‘సి’ కే టగిరి, ప్రమాదంలో ప్రాణాలు పోతే ‘డి’ కేటగిరీలో చేర్చారు. డిపో డ్రైవర్లు హనుమకొండ 199 వరంగల్–1 286 వరంగల్–2 19 పరకాల 90 జనగామ 172 తొర్రూరు 120 మహబూబాబాద్ 83 నర్సంపేట 121 భూపాలపల్లి 119డిపోల వారీగా సేఫ్టీ వార్డెన్ల నియామకం..ఆర్టీసీ వరంగల్ రీజియన్లో సేఫ్టీ వార్డెన్స్ను డిపో వారీగా నియమించారు. వరంగల్–1కు ఎంఎం రావు, వరంగల్–2 డిపోకు ఎస్.బాబురావు, హనుమకొండ డిపోకు ఎ.శ్రీనివాస్రెడ్డి, జనగామ డిపోకు సురేందర్, పరకాల డిపోకు శంకరయ్య, భూపాలపల్లి డిపోకు రమేశ్, తొర్రూరు డిపోకు యాకూబ్రెడ్డి, నర్సంపేట డిపోకు బాబు, మహబూబాబాద్ డిపోకు నర్సయ్యను సేఫ్టీ వార్డెన్లుగా నియమించారు.డిపోల వారీగా సేఫ్టీ వార్డెన్ల నియామకం..ఆర్టీసీ వరంగల్ రీజియన్లో సేఫ్టీ వార్డెన్లను డిపో వారీగా నియమించారు. వరంగల్–1కు ఎంఎం రావు, వరంగల్–2 డిపోకు ఎస్.బాబురావు, హనుమకొండ డిపోకు ఎ.శ్రీనివాస్రెడ్డి, జనగామ డిపోకు సురేందర్, పరకాల డిపోకు శంకరయ్య, భూపాలపల్లి డిపోకు రమేశ్, తొర్రూరు డిపోకు యాకూబ్రెడ్డి, నర్సంపేట డిపోకు బాబు, మహబూబాబాద్ డిపోకు నర్సయ్యను సేఫ్టీ వార్డెన్లుగా నియమించారు. సేఫ్టీ వార్డెన్స్ ద్వారా నిత్య పరిశీలన మారుతున్న డ్రైవర్ల జీవన శైలి తగ్గుతున్న ప్రమాదాలు వరంగల్ రీజియన్లో 9 డిపోలు -
ఉద్రిక్తంగా మారిన ఏబీవీపీ ఆందోళన
హన్మకొండ అర్బన్: విద్యార్థుల పెండింగ్ ఉపకార వేతనాలు చెల్లించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. ముఖ్యమంత్రిని విమర్శిస్తూ నినాదాలతో హోరెత్తిన ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు కలెక్టరేట్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. కలెక్టరేట్ గేట్ను తోసుకుని, గేట్లు ఎక్కి లోపలికి దిగేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో పోలీసులు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా సుమారు గంటకుపైగా ఆందోళన కొనసాగింది. ఈసందర్భంగా ఏబీవీపీ వరంగల్ విభాగ్ కన్వీనర్ ఆరెపల్లి సుజిత్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డికి విద్యార్థులు గుర్తుకొస్తారని ఆరోపించారు. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయకపోతే సీఎం, మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కన్వీనర్ దూళిపూడి హరిచరణ్, వరంగల్ మహానగర్ కార్యదర్శి బెల్లం కార్తీక్, రోహిత్, రాహుల్, నవీన్, త్రినేష్, అభిలాష్, శ్రీశాంత్, సిద్ధు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నం సీఎంను విమర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని ధర్నా -
కేయూలో తీజ్ ఉత్సవాలు
కేయూ క్యాంపస్: కేయూలో గురువారం ఉత్సాహంగా గిరిజన విద్యార్థులు తీజ్ ఉత్సవాలు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, మహబూబాబాద్ మాజీ ఎంపీ ఆజ్మీరా సీతారాంనాయక్, కేయూ పాలకమండలి సభ్యులు బి.సురేశ్లాల్, సైన్స్విభాగాల డీన్ జి.హనుమంతు, ప్రొఫెసర్ రమేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థి సంఘం నాయకులు మాలోత్ తిరుపతినాయక్, రాజునాయక్, ఉషన్నాయక్, రమేశ్నాయక్, వెంకట్నాయక్, నవ్య, స్నేహ, అనిత, స్వరూప, ధరావత్ సూర్య, యాదగిరి, సురేశ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ వేధింపులపై అవగాహన ఉండాలి
సైబర్ క్రైం ఏసీపీ గిరి కుమార్ హన్మకొండ: సైబర్ నేరాలు, ఆన్లైన్ లైంగిక వేధింపులపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైం ఏసీపీ గిరికుమార్, యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ ఇన్స్పెక్టర్ జె.శ్యాంసుందర్ అన్నారు. గురువారం హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్లో వనం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిస్టర్ నిర్మల ఆధ్యక్షతన సైబర్ క్రైమ్, మానవ అక్రమ రవాణా అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసదస్సులో వారు మాట్లాడుతూ.. ఈ డిజిటల్ యుగంలో అందరూ ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఆర్థిక, ఇతర వేధింపులకు గురవుతున్నారని, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రతీ మహిళ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉంటే వాటి బారిన పడకుండా ఉంటారన్నారు. మహిళలను, పిల్లలను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు గమనిస్తే వెంటనే పోలీస్ 100, 1930 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ బత్తుల కరుణ ఆన్లైన్లో బాలలపై జరుగుతున్న లైంగిక దాడులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో వనం మహిళా సంఘం రీజియన్ ప్రెసిడెంట్ రుమాల్డిన, ట్రెజరర్ రిజి అబ్రహం, కౌ న్సిలర్ అన్నామేరి, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల హామీలు నెరవేర్చాలి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నాగయ్యన్యూశాయంపేట: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లాకమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగయ్య పాల్గొని, మాట్లాడుతూ.. వరంగల్ నగరంలోని 30 సెంటర్లలో పేదలు గుడిసెలు వేసుకుని అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్నారని తెలిపారు. అనంతరం కలెక్టర్ సత్యశారదకు వినతిపత్రం, ప్రజల దరఖాస్తులను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ బషీర్, వలదాసు దుర్గయ్య, సాంబమూర్తి, ప్రశాంత్, రమేష్, దివ్య, వాణి, ఆలం, గాలయ్య, భవాని, విజయ తదితర నాయకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు
హసన్పర్తి: ప్రభుత్వ భూమికే ఓ ప్రబుద్ధుడు ఎసరుపెట్టాడు. డాక్యుమెంట్లతో స్థలాన్ని కబ్జా చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టాడు. వివరాలిలా ఉన్నాయి. హసన్పర్తి మండలం వంగపహాడ్ శివారులోని సర్వే నంబర్ 516లో సుమారు 600 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇందులో 400 ఎకరాల మేరకు అసైన్డ్ చేశారు. మిగిలిన భూమి పడావుగా ఉంది. అదే గ్రామానికి చెందిన రాజమౌళి కన్ను ప్రభుత్వ స్థలంపై పడింది. దీంతో మూడు డాక్యుమెంట్లు తయారుచేసి ఆ భూమి కబ్జా చేశాడు. ఆ ఇంటి నంబర్తో తన కుమారుడు, కూతుళ్ల పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా చేశాడు. కబ్జా చేసుకున్న భూమిని పట్టాగా నమ్మించాడు. అందులో కుమారులు, కూతుళ్ల పేర్లపై నిర్మాణాలు చేపట్టాడు. ఈ నిర్మాణాలకు కార్పొరేషన్ అధికారులు ఇంటి నంబర్లు కూడా జారీ చేశారు. కాగా, ప్రభుత్వ భూమి కబ్జా అయ్యిందని స్థానిక ఓ యువకుడు అధికారులను ఆశ్రయించాడు. ఫలితం లేకపోవడంతో కార్పొరేషన్, రెవెన్యూ అధికారులను కక్షిదారులుగా చేర్చుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. హైకోర్టు సూచనల మేరకు అధికారులు సర్వే చేసి ఆ భూమి ప్రభుత్వానిదని నిర్ధారించి కమిషనర్కు నివేదిక అందించారు. ఈమేరకు వారం రోజుల క్రితం కబ్జాదారుడికి అధికారులు నోటీసులు జారీ చేశారు. అతడి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆర్ఐ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం మూడు ఇళ్లు సీజ్ చేశారు. ఈక్రమంలో కబ్జాదారుడి బంధువులు, స్నేహితుల నుంచి కొంత అవాంతరం ఎదురైంది. అప్పటి రెవెన్యూ, కార్పొరేషన్ అధికారుల సహకారంతోనే ప్రభుత్వ భూమి జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. గతంలో ఇక్కడ వీఆర్ఓగా పనిచేసిన వ్యక్తి కబ్జాదారుడికి సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టును ఆశ్రయించిన స్థానికుడు కోర్టు ఆదేశంతో మూడు ఇళ్లు సీజ్ -
‘కేరళ అర్బన్ కాన్ క్లేవ్’కు నగర మేయర్
వరంగల్ అర్బన్: కేరళ అర్బన్ కాన్ క్లేవ్–2025 సదస్సుకు గురువారం నగర మేయర్ గుండు సుధారాణి వెళ్లారు. కేరళ అర్బన్ పాలసీ 2025–50లో భాగంగా ‘ఆకాంక్షించే నగరాలు, అభివృద్ధి చెందుతున్న సమాజాలు‘ అనే అంశంపై ఈనెల 12,13 తేదీల్లో కేరళలోని కొచ్చిన్ బోగ్గట్టిలో గ్రాండ్ హాయ్ సదస్సు జరుగనుందని అధికారులు తెలిపారు. స్థిరమైన పట్టణ అభివద్ధిలో వినూత్న అంతర్జాతీయ పద్ధతులు పాటించడం, నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిని సదస్సులో మేయర్ వివరించనున్నారు. కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం కేయూ క్యాంపస్: విద్యార్థులు విద్యతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలతో శారీరక దారుఢ్యం మానసికోల్లాసం కలుగుతుందని కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం అన్నారు. గురువారం కేయూలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ, పీజీ కళాశాలల కాలేజీఝెట్ పురుషుల కబడ్డీ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈసందర్భంగా రిజిస్ట్రార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. క్రీడాపోటీల్లో గెలుపోటములు సహజమని క్రీడాస్ఫూర్తితో క్రీడాపోటీల్లో పాల్గొనాలని ఆయన కోరారు. యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ మాట్లాడుతూ.. మొత్తం 22 టీంలు పాల్గొంటున్నాయని ఈనెల 12న కూడా కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య, ఫిజికల్ డైరెక్టర్లు డాక్టర్ జె.సోమన్న, డాక్టర్ బి.కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
రోబోటిక్స్ సైన్స్ వర్క్షాప్ రిపోర్ట్ అందజేత
న్యూశాయంపేట: నర్సంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో ఇటీవల నిర్వహించిన రోబోటిక్స్ సైన్స్ వర్క్షాప్ రిపోర్ట్ను ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ గురువారం కలెక్టర్ సత్యశారదకు అందజేశారు. కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసిన కలిసిన నవీన్.. కళాశాలలో తరగతి గదుల నిర్మాణం, కంప్యూటర్ ల్యాబ్, క్రీడా సౌకర్యాల కల్పనకు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో వర్క్షాప్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు బి.సత్యనారాయణ, కందాల సత్యనారాయణ, రుద్రాణి, వి.పూర్ణచందర్ పాల్గొన్నారు.కలెక్టర్ను కలిసిన జీపీఓలు న్యూశాయంపేట: ఇటీవల నియమితులైన గ్రామపంచాయతీ ఆఫీసర్(జీపీఓ)లు గురువారం కలెక్టర్ సత్యశారదను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. జిల్లాలో జీపీఓ కౌన్సెలింగ్లో ఎటువంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా నిర్వహించి పోస్టింగ్లు ఇచ్చినందుకు కలెక్టర్, అదనపు కలెక్టర్, ఏఓ తదితర అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ను కలిసిన వారిలో బి.శ్రీనివాసులు, ఏ.శ్రీకాంత్, విజయజ్యోతి, జ్యోతి, రమేష్, శ్రావణ్, క్రాంతి, విశ్వేశ్వర్, సుభాష్ తదితరులు ఉన్నారు. -
ఎఫ్ఓబీ నిర్మాణం ఎప్పుడో?
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకోషెడ్ (ఈఎల్ఎస్) వద్ద రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు నిర్మిస్తారని రైల్వే కార్మికులు అంటున్నారు. కాజీపేట జంక్షన్లో 2004లో రైల్వే శాఖ ఎలక్ట్రిక్లోకో మెయిన్ షెడ్ నిర్మించింది. అప్పటి నుంచి రైల్వే అధికారులు, కార్మికులు రైలుపట్టాలు దాటి షెడ్కు వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం షెడ్లో 250 లోకోల నిర్వహణతో సుమారు 410 మంది రైల్వే కార్మికులు వివిధ సెక్షన్లలో విధులు నిర్వర్తిస్తున్నారు. షెడ్లోకి వెళ్లి రావాలంటే రైలు పట్టాలు దాటి వెళ్లాల్సి వస్తోంది. రన్నింగ్ ట్రైన్స్, షట్టింగ్ ట్రైన్స్, డీజిల్షెడ్, ఫిట్లైన్ నుంచి వచ్చి వెళ్లే రైళ్ల వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు రైల్వే కార్మికులు అంటున్నారు. ఉదయం డ్యూటీకి వెళ్లేటప్పుడు, లంచ్ టైం, డ్యూటీ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో రైళ్లు వెళ్లే వరకు గేట్ వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. రైళ్ల రాకపోకలతో విధులకు అంతరాయం ఏర్పడినప్పుడు షెడ్లో 8 గంటల పని వేళలో ఆలస్యం కావడం వల్ల పని భారం పడుతోందని రైల్వే ట్రేడ్ యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో షెడ్ వద్ద ఆర్యూబీ మంజూరైందని, ఏమైందో ఏమో గాని రద్దు కూడా అయిందని అంటున్నారు. షెడ్ కార్మికుల కోసం ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని రైల్వే జీఎం, డీఆర్ఎం, పీఎన్ఎం మీటింగ్తోపాటు రైల్వే బోర్డు స్థాయి వరకు వెళ్లిందని చెబుతున్నారు. ఇప్పటికై నా రైల్వే శాఖ బ్రిడ్జిని నిర్మించాలని షెడ్ రైల్వే నాయకులు, కార్మికులు కోరుతున్నారు. ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ లోకోషెడ్ రైల్వే కార్మికులు -
అంతర్జాతీయ క్రీడా సదస్సుకు డీవైఎస్ఓ అశోక్
వరంగల్ స్పోర్ట్స్: నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ సైన్స్ (ఎన్ఏపీఈఎస్ఎస్) ఆధ్వర్యంలో మలేషియాలో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న మొదటి అంతర్జాతీయ క్రీడా సదస్సులో పాల్గొనేందుకు హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్కు ఆహ్వానం అందింది. మలేషియాలోని యూనివర్సిటీ టెక్నాలజీ మారా, షా ఆలంలో మూడు రోజులపాటు జరిగే సదస్సులో అశోక్కుమార్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఎన్ఎపీఈఎస్ఎస్ చైర్మన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజామహ్మద్ ఫిర్హరాజాఅజిదిన్ ఆహ్వాన పత్రికను పంపించారు. కాకతీయ యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్పై పీహెచ్డీ చేస్తున్న అశోక్కుమార్ సెమినార్లో పేపర్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. -
విద్యుదాఘాతంతో కార్మికుడికి గాయాలు
● సీపీఆర్ చేసి కాపాడిన రౖడైవర్ హన్మకొండ అర్బన్: విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడు గాయపడిన సంఘటన గ్రేటర్ 49వ డివిజన్ పరిధిలోని దర్గా వంద ఫీట్ల రోడ్డులో గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. దర్గా వందఫీట్ల రోడ్డులో ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ ఎదుట నిర్మాణంలో ఉన్న భవనం రెండో అంతస్తులో మాలోత్ సారయ్య సెంట్రింగ్ పనిచేస్తున్నాడు. ప్రమాదవశాత్తు 33 కేవీ విద్యుత్ లైన్కు ఇనుపరాడు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి రెండో అంతస్తుపై నుంచి కింద పడిపోయాడు. కుప్పకూలిన సారయ్య మరణించాడని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితిని గమనించిన స్థానిక ఎకై ్సజ్ ఆఫీస్లో డ్రైవర్గా పనిచేస్తున్న సాంబరాజు ధైర్యంగా ముందుకు వచ్చి సారయ్యకు సీపీఆర్ చేశాడు. దీంతో కొద్దిసేపటికి సారయ్యకు స్పృహ వచ్చింది. ఆర్ఈసీ ఎన్పీడీసీఎల్ ఏ ఈ, లైన్ఇన్స్పెక్టర్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. భవన నిర్మాణ క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోని ఇంటి యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి పత్రాలు చూపించాలని యజమానిని అదేశించారు. బాధితుడికి ఒక కాలు విరిగిపోవడంతోపాటు తీవ్రంగా గాయాలయ్యాయి. 108 పైలట్ బాలాజీ, ఈఎంటీ సురేందర్ బాధితుడికి ప్రథమ చికిత్స చేసి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సీపీఆర్ చేసిన డ్రైవర్ సాంబరాజును స్థానికులు అభినందించారు. -
ప్రక్షాళన ఇట్టే!
ఎంజీఎంలో సత్ఫలితాలిస్తున్న కంప్లెయింట్ బాక్స్లుఎంజీఎం: ఎంజీఎం ప్రక్షాళనకు వరంగల్ కలెక్టర్ సత్యశారద వినూత్నంగా అడుగులు వేస్తున్నారు. ఆస్పత్రిలో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వైద్యవిభాగాధిపతుల వరకు నిత్యం విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వాటన్నింటినీ తెలుసుకునేందుకు కలెక్టర్ తమదెన శైలిలో ప్రయత్నిస్తున్నారు. వివిధ సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో వస్తున్న కథనాలపై రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు తమకు అనుకూలంగా వివరణలు ఇస్తుండడం తెలిసిందే. ఈనేపథ్యంలో క్షేత్రస్థాయిలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కలెక్టర్ సత్యశారద ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆస్పత్రిలోని ఏఎంసీ, పిడియాట్రిక్, సర్జరీ, డైట్, సూపరింటెండెంట్ చాంబర్ వద్ద ఈ బాక్స్లు ఏర్పాటు చేశారు. వాటి తాళాలు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది వద్ద ఉంచి కలెక్టర్ సూచించిన అధికారులు మాత్రమే ఈ బాక్స్ను తెరిచేలా ఆదేశించారు. వారు తరచూ ఫిర్యాదులు పరిశీలిస్తూ చర్యలకు ఉపక్రమించారు. వైద్యుల్లో, సిబ్బందిపై వేటు పడుతున్న క్రమంలో కిందిస్థాయిలో అవినీతి తగ్గి కొద్ది మేర మార్పు మొదలైంది. వినతులు బహిర్గతం చేయాలి.. ఎంజీఎం ఆస్పత్రిలోని ఫిర్యాదుల బాక్స్లో వస్తున్న ఫిర్యాదులను బహిర్గతం చేస్తే అవినీతి, వైద్యసిబ్బంది నిర్లక్ష్యం తగ్గే అవకాశం ఉంది. ప్రచారం జరగడం వల్ల కిందిస్థాయి సిబ్బంది భయంతో పాటు బాధ్యతగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఫిర్యాదు బాక్స్ను పది రోజులకోసారి తెరుస్తూ కచ్చితమైన చర్యలు తీసుకుంటున్నారనే నమ్మకం ప్రజల్లో కలిగినప్పుడు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్స్లకు మరింత స్పందన లభిస్తుంది. చర్యలు తీసుకున్న సిబ్బంది వివరాలను బహిర్గతంగా పత్రిక ముఖంగా ప్రచురించడం వల్ల అవినీతికి పాల్పడే ఉద్యోగుల్లో భయం ఏర్పడి ఆస్పత్రిలో సేవలు మెరుగుపడుతాయని పలువురు పేర్కొంటున్నారు. వేటు.. మెమోలు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సీజనల్ వ్యాధులపై 15 రోజుల క్రితం ఎంజీఎం ఆస్పత్రిలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పత్రికా ముఖంగా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది చేత ఫిర్యాదు బాక్స్లో వేసిన ఫిర్యాదులను తెరిచి చదివి వినిపించారు. ఈక్రమంలో ఓ సెక్యూరిటీ గార్డు వార్డులో రోగిని డబ్బులు అడిగిన విషయంతోపాటు సర్జరీ విభాగంపై ఫిర్యాదులు అందాయి. అలాగే నర్సింగ్ సిబ్బందిపై సైతం ఫిర్యాదులు రావడంతో వారిపై వేటు వేయాలని కలెక్టర్ సూపరింటెండెంట్ కిశోర్ను ఆదేశించారు. ఈక్రమంలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేసినప్పటి నుంచి సెక్యూరిటీ, శానిటేషన్ విభాగంలో నలుగురు కార్మికులు, పలువురు నర్సింగ్ సిబ్బందిపై సైతం వేటు వేశారు. మరికొన్ని బాక్స్లు ఏర్పాటు చేయాలి.. ఎంజీఎం ఆస్పత్రి సుమారు 15 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఉంటుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో నాలుగు ఫిర్యాదు బాక్స్లు మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్యను పెంచి నిత్యం రద్దీగా ఉండే ఓపీ, క్యాజువాలిటీ, వంటి విభాగాల్లో ఏర్పాటు చేస్తే ఫిర్యాదుల సంఖ్య మరింత పెరుగుతుంది. సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంది. పది రోజులకోసారి ఫిర్యాదు బాక్స్ తెరిచి తీవ్రమైన విషయాలపై చర్యలు తీసుకుని వాటిని బహిర్గతం చేసి చర్యలు తీసుకుంటే మరిన్నీ సత్ఫలితాలు ఉంటాయని రోగులు వేడుకుంటున్నారు. నలుగురు సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బందిపై వేటు నర్సింగ్ ఉద్యోగులకు మెమోలు జంకుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది ఓపీ విభాగంతోపాటు మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని వినతి ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవల కోసం కలెక్టర్ వినూత్న ప్రయత్నాలు -
సేఫ్టీ వార్డెన్లతో సత్ఫలితాలు..
సేఫ్టీ వార్డెన్ల నియామకం సత్ఫలితాలనిస్తోంది. డ్రైవర్లు వ్యసనాలు, దురలవాట్లకు దూరమవుతున్నారు. మానసికంగా దృఢంగా తయారై సురక్షిత డ్రైవింగ్ చేస్తున్నారు. తద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గుతున్నాయి. గత సంవత్సరంలో చూసుకుంటే గడిచిన నాలుగు నెలల కాలంలో 8 ఫ్యాటల్ ఆక్సిడెంట్లు తగాయి. గతేడాది నాలుగు నెలల కాలంలో 19 ఫ్యాటల్ ఆక్సిడెంట్లు జరుగగా ఈ ఏడాది 11 ప్యాటల్ ఆక్సిడెంట్లు జరిగాయి. 11 ప్రమాదాల్లో మూడు మాత్రమే సంస్థ, సంస్థ అద్దెకు తీసుకున్న డ్రైవర్ల పొరపాటుతో జరిగాయి. మిగతా ప్రమాదాలు ఇతరుల తప్పిదాలతో జరిగాయి. డి.విజయభాను, రీజినల్ మేనేజర్ , వరంగల్ -
మాడవీధుల నిర్మాణ పనుల పరిశీలన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని బుధవారం సాయంత్రం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు. ఆమ్మవారిని దర్శించి పూ జలు చేసిన అనంతరం అర్చకులు శేషవస్త్రాలు, మ హదాశీర్వచనం అందజేశారు. అనంతరం మాడవీధుల పురోగతిని ‘కుడా’ అధికారులతో చర్చించి పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల నుంచి మాడవీధి గుండా ప్రవేశం మార్గం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అడ్డంగా ఉన్న నిర్మాణాలను తొలగించి నవరాత్రులకు రెండు రోజుల ముందుగానే ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయం ముందు ఉన్న, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. అనంతరం బతుకమ్మ పండుగను పురస్కరించుకుని వేయిస్తంభాల దేవాలయాన్ని ఆమె సందర్శించారు. బతుకమ్మ వేడుకల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఆమె వెంట ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, ఆలయ చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం, ఆలయ అర్చకులు భద్రకాళి శేషు, ‘కుడా’ అధికారులు అజిత్రెడ్డి, భీంరావు, ఆర్డీఓ రమేశ్, వరంగల్ ఏసీపీ సత్యనారాయణ, మట్వాడ సీఐ కరుణాకర్, తహసీల్దార్ రవీందర్ ఉన్నారు. -
ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన కుమార్తె
పాలకుర్తి టౌన్: ఆస్తి కోసం భర్తతో కలిసి కుమార్తె.. తల్లిని హత్య చేసింది. ఈ ఘటన జనగామ జి ల్లా పాలకుర్తి మండలం పెద్దతండా (కే) గ్రామంలో జరిగింది. సీ ఐ జానకీరాంరెడ్డి కథనం ప్రకా రం.. పెద్దతండా(కే)కు చెందిన బాదావత్ లక్ష్మి (42) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త తిరుపతి 15 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఈ దంపతులకు సంగీత ఏకై క సంతానం. ఈమెకు ఐదేళ్ల క్రితం ఇదే మండలంలోని దుబ్బతండా(ఎస్పీ) గ్రామానికి చెందిన బానోత్ వీరన్నతో వివాహం చేశారు. తల్లి పేరిట ఉన్న 20 గుంటల వ్యవసాయ భూమి తన పేరుతో పట్టా చేయాలని సంగీత పలుమార్లు అడిగింది. ఇందుకు తల్లి నిరాకరించింది. దీంతో ఎలాగైనా ఆ భూమిని దక్కించుకునేందుకు తల్లిని హత్య చేయాలని ప్లాన్ వేసింది. ఈ విషయాన్ని భర్తతో చర్చించింది. ఇరువురు హత్య చేయాలని నిర్ణయం తీసుకొని మంగళవారం రాత్రి పెద్దతండాకు చేరుకున్నారు. కూతురు సంగీత, అల్లుడు వీరన్న కలిసి నిద్రలో ఉన్న లక్ష్మి మొఖంపై దిండుపెట్టి హత్య చేశారు. కూలి పని కోసం పిలవడానికి వెళ్లిన స్థానిక మహిళ చూసి తండావాసులకు బుధవారం తెలుపగా వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తండ్రి నేనావత్ చంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జానకీరాంరెడ్డి తెలిపారు. పాలకుర్తి మండలం పెద్దతండా (కే)లో దారుణం -
బెల్ట్షాపులపై దాడులు
ఖిలా వరంగల్: వరంగల్ మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో వరంగల్ ఏఎస్పీ శుభం ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్ బుధవారం బెల్ట్షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ మేరకు రూ.12 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకుని, బెల్ట్షాపు నిర్వాహకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. తెల్లవార్లు బెల్ట్షాపులు కొనసాగించడం వల్ల నిత్యం గొడవలు జరుగుతున్నాయని, పద్ధతి మార్చుకోకుంటే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ శుభం హెచ్చరించారు. హసన్పర్తి: కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధి గుండ్లసింగారంలోని ఎస్సారెస్పీ కాల్వకట్టతో పాటు పెగడపల్లి డబ్బాల ప్రాంతాల్లోని బెల్ట్షాపులపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు రూ.25 వేల మద్యంతోపాటు రూ.5 వేల విలువైన గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో హనుమకొండ ఏసీపీ నర్సింహరాములు స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సైలు రవీందర్, శ్రీకాంత్, కల్యాణ్, నవీన్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
బిల్లింగ్లో మానవ రహిత సేవలు
హన్మకొండ: ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ టీజీ ఎన్పీడీసీఎల్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రతీవిభాగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తూ సేవల్లో కచ్చితత్వాన్ని తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే హెచ్టీ మీటర్ రీడింగ్ నమోదులో ఆధునిక సాంకేతికతను చొప్పిస్తోంది. మానవ ప్రమేయం లేకుండా మీటర్ రీడింగ్ నమోదు చేసే పరికరాన్ని అమరుస్తున్నారు. ఇప్పటివరకు హెచ్టీ సర్వీస్ల స్థాయిలను బట్టి ఏడీఈ, ఏఈలు వెళ్లి మీటర్ రీడింగ్ నమోదు చేసేవారు. విద్యుత్ వాడుకునే కేటగిరీ వారీగా 55 హెచ్పీకి మించిన సామర్థ్యం ఉన్న మీటర్ల రీడింగ్ను ఏడీఈలు, 55 హెచ్పీలోపు ఉన్న సర్వీస్ల మీటర్ రీడింగ్లను ఏఈలు, నాన్ స్లాబ్ రీడింగ్ను లైన్ ఇన్స్పెక్టర్లు, స్లాబ్ రీడింగ్ను జేఎల్ఎంలు తీస్తున్నారు. వీరు హెచ్టీ మీటర్లను సందర్శించి వాటి రీడింగ్ తీసుకువచ్చి కార్యాలయాల్లో కంప్యూటర్లలో నిక్షిప్తం చేసి విద్యుత్ వినియోగదారులకు బిల్లులు పంపేవారు. దీంతో సమయం వృథా అయ్యేది. లోపాలు తలెత్తేవి. వీటిని అధిగమించి కచ్చితత్వంతో బిల్లులు అందించేందుకు అటోమేటిక్ మీటర్ రీడింగ్ సిస్టంను అమలు చేస్తున్నారు. ఆటోమేటిక్ మీటర్ రీడింగ్కు మోడెంల ఏర్పాటు.. హెచ్టీ సర్వీస్ మీటర్లతోపాటు, ఎల్టీలోనూ హెచ్టీ మీటర్లు వినియోగిస్తున్న సర్వీస్ల్లో ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ నమోదు చేసే మోడమ్ను బిగిస్తున్నారు. ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది. డిసెంబర్ నాటికి అన్ని సర్కిళ్లలో పూర్తి చేస్తామని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి సర్కిల్లో పనులు జరుగుతున్నాయి. హెచ్టీ మీటర్లకు అమర్చుతున్న మోడెం ద్వారా కచ్చితమైన సమాచారం వస్తుందని అధికారులు తెలిపారు. మీటర్ స్థితి, విద్యుత్ వినియోగం, సరఫరా సమాచారం రియల్ టైంలో వస్తుంది. దీంతో పొరపాట్లకు తావుండదు. జీఎస్ఎం/జీపీఆర్ఎస్ టెక్నాలజీతో రూపొందించిన ఈ మోడెంను హెచ్టీ మీటర్కు అనుసంధానం చేయడం ద్వారా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వినియోగమైన యూనిట్ల వివరాలను కచ్చితత్వంతో కార్పొరేట్ కార్యాలయానికి చేరవేస్తుంది. టీజీ ఎన్పీడీసీఎల్లో మొత్తం హెచ్టీ మీటర్లు 4,013, ఎల్టీ సర్వీస్ల్లో హెచ్టీ మీటర్లు 2,254 ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 1,650 మీటర్లకు ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ నమోదు చేసే మోడెంలను అమర్చారు. హెచ్టీ మీటర్లో ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ సులువుగా హెచ్టీ సర్సీస్ల బిల్లింగ్ మోడెంలు బిగిస్తున్న ఎన్పీడీసీఎల్ మీటర్ స్థితి, విద్యుత్ వినియోగం, సరఫరా సమాచారం వెంట వెంటనే చేరవేత -
డే కేర్ సెంటర్లో ఉచిత న్యాయ సలహాలు
హన్మకొండ: హనుమకొండ జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోని వయోవృద్ధుల డే కేర్ సెంటర్లో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రారంభించిన లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లా న్యాయసేవాధికార సంస్థ న్యాయ సలహాదారుగా పారాలీగల్ వలంటీర్ ఎం. ఉపేందర్ను నియమించింది. ప్రతీ బుధ, శనివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు న్యాయ సలహాలు అందిస్తారని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి తేరాల యుగేంధర్ తెలిపారు. వివరాలకు 8074979359 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తాడూరి లక్ష్మీనారాయణ, గంగారపు యాదగిరి, సుమతి, డాక్టర్ ఉష, తదితరులు పాల్గొన్నారు. -
ఐలమ్మ చరిత్ర భావితరాలకు తెలియజేయాలి
హన్మకొండ: చాకలి ఐలమ్మ చరిత్ర భావితరాలకు తెలియజేయాలని ఓబీసీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ అన్నారు. నక్కలగుట్టలోని హోటల్ హరితకాకతీయలో చాకలి ఐలమ్మ వర్ధంతి, మహిళా చైతన్య సదస్సు ఓబీసీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ టి.విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం జరిగింది. ముందుగా ఐలమ్మ చిత్రపటానికి సుందర్రాజ్ యాదవ్, అతిథులు, మహిళలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా మేధావులు, ఉద్యోగులు, అధ్యాపకులు, సామాజిక ఉద్యమకారులతో కలిసి ఓబీసీ ఏర్పాటు చేశామన్నారు. భూమి.. భుక్తి.. వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ పోరాటం చేసిందని గుర్తు చేశారు. మలిదశ తెలంగాణ కోసం త్యాగాలు చేసిన 1200 మందిలో 80 శాతం మంది బీసీలేనన్నారు. అయినా ప్రభుత్వ పాలసీల్లో బీసీల ఊసేలేదని లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ బిల్లు ప్రకారం పెరిగే సీట్లతో 153 స్థానాల్లో 51 మంది మహిళలు ఉండబోతున్నారన్నారు. 51 మందిలో 26 సీట్లు బీసీ మహిళలు సాధించేలా కొట్లాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్కాలర్షిప్లు ఇవ్వకపోవడంతో బీసీ విద్యార్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఓబీసీ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, కార్పొరేటర్లు చీకటి శారద, బైరి లక్ష్మి, రావుల కోమల, విజయశ్రీ, మహిళా ప్రతినిధులు దాసోజు లలిత, డాక్టర్ నాగవాణి, డాక్టర్ రమ, అరుణ, లక్ష్మి, ఓబీసీ నాయకులు అరవింద్ స్వామి, ఎంఎన్ మూర్తి, వేణుమాధవ్, సరిత, మౌనిక, భవాని, సరస్వతి, పద్మజ, ప్రవళ్లిక, శ్రావణి, షైన్, పల్లవి, శ్రీలత, విద్యార్థినులు, మహిళలు పాల్గొన్నారు. ఓబీసీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ -
సాహితీవేత్త రంగారావు మృతి
విద్యారణ్యపురి: అనారోగ్య సమస్యలతో కవి, కథకుడు, వ్యాసకర్త సంధ్య రంగారావు (82) బుధవారం హైదరాబాద్లో మరణించారని కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, కార్యదర్శి వీఆర్విద్యార్థి తెలిపారు. కాళోజీ సోదరులు స్థాపించిన మిత్రమండలికి సుమారు 12 ఏళ్లపాటు రంగారావు కన్వీనర్గా సేవలందించారని గుర్తుచేశారు. ఆయన మృతిపై కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్, పొట్లపల్లి శ్రీనివాస్రావు, గంట రామిరెడ్డి, ప్రొఫెసర్ బన్న అయిలయ్య, పందిళ్ల అశోక్కుమార్, డాక్టర్ ఆగపాటి రాజ్కుమార్ సంతాపం తెలిపారు. -
బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్రం
తొర్రూరు: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని విశ్రాంతి భవనంలో బుధవారం బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవికృష్ణతో కలిసి శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు. రాష్ట్రపతి భవన్, రాజ్భవన్ను కేంద్రం జేబు సంస్థలుగా మార్చుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి మండల్ నుంచి నేటి బీసీ బిల్లు వరకు బీజేపీ బీసీలను మోసగిస్తోందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టిందని, కేంద్రం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టి అమలు చేస్తుందా లేదా చెప్పడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరడం హాస్యాస్పదమన్నారు. రిజర్వేషన్ల అమలు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై త్వరలో సింహగర్జన నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కేయూ ప్రొఫెసర్ మల్లేశ్వర్, నాయకులు గుండగాని వేణు, గట్టు ప్రభాకర్, పెదగాని సోమయ్య, మురళి యాదవ్, భిక్షంగౌడ్, తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ -
ఉపాధి శిక్షణతో ఆర్థికాభివృద్ధి
హన్మకొండ: మహిళల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు ఉపాధి శిక్షణ దోహదపడుతుందని హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్పాండే అన్నారు. బుధవారం హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్లో మహిళా సాధికారత మేళా కార్యక్రమం జరిగింది. మగ్గం శిక్షణ, టైలరింగ్, బ్యూటిషన్ ట్రైనింగ్ పొందిన 350 మంది మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఉపాధి శిక్షణతో కుటుంబం ఆర్థికాభివృద్ధి సాధిస్తుందన్నారు. అడిషనల్ డీసీపీ రవి, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ, సంస్థ రీజినల్ అధ్యక్షులు రుమాల్డిన, ప్రాజెక్టు కోఆర్డినేటర్లు ఎర్ర శ్రీకాంత్, బత్తుల కరుణ, ఆయా సంస్థల ప్రతినిధులు అనితారెడ్డి, కె.నాగవాణి, ఆల్బటా అమృత, ఎం,అజయ్కుమార్, ఈసంపల్లి సుదర్శన్, పరికి సుధాకర్, సుదర్శన్ గౌడ్, ప్రభాకర్, శివప్రసాద్, కొమ్ముల నవీన్ పాల్గొన్నారు. -
ధూపదీపనైవేద్య అర్చకులకు వేతనాలు అందించాలి
హన్మకొండ కల్చరల్ : గ్రామాల్లోని ధూపదీపనైవేద్య అర్చకులకు సక్రమంగా ప్రతీనెలా వేతనాలు అందేలా ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగజాక్ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు బుధవారం హైదరాబాద్లోని రాష్ట్ర చేనేత భవన్లో నూతనంగా పదవీబాధ్యతలు చేపట్టిన దేవాదాయధర్మాదాయశాఖ కమిషనర్, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజరామయ్యర్ను గంగు ఉపేంద్రశర్మ, పరాశరం రవీంద్రాచారి, దేవాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాండూరి కృష్ణమాచారి, ఇతర అర్చకులు కలిసి శుభాకాంక్షలు తెలిపి వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అర్చక ఉద్యోగుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు. అనేక దేవాలయాల్లో క్యాడర్ స్ట్రెంత్లేక ఇబ్బంది పడుతున్నారని, ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుందని వివరించారు. ప్రమోషన్ల విషయంలో సంబంధిత అధికారులతో జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకుంటానని కమిషనర్ పేర్కొన్నారు. 11,12 తేదీల్లో ఇంటర్ కాలేజీ కబడ్డీ టోర్నమెంట్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ, పీజీ కాలేజీలకు ఇంటర్ కాలేజీ కబడ్డీ టోర్నమెంట్ ఈనెల 11, 12వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ టి. మనోహర్ తెలిపారు. ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్, సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్కు సెలక్షన్స్ కూడా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కేయూ పరిధి లోని డిగ్రీ, పీజీ కాలేజీల నుంచి కబడ్డీ క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనబోతున్నారని తెలిపారు. ఈ టోర్నమెంట్ ప్రారంభ కా ర్యక్రమంలో ముఖ్యఅతిథులుగా కేయూ రిజి స్ట్రార్ వి రామచంద్రం, స్పౌర్ట్స్బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య పాల్గొంటారని చెప్పారు. ప్రతినెలా 1న జీతాలు చెల్లించాలి హన్మకొండ: విద్యుత్ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు కోరారు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ గెస్ట్హౌస్లో జేఏసీ ఎన్పీడీసీఎల్ శాఖ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 9వ తేదీ వరకు ఉద్యోగులకు జీతాలు అందకపోవడంపై చర్చించారు. అనంతరం టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఫైనాన్స్ డైరెక్టర్ వి.తిరుపతి రెడ్డి, సీఎండీ పేషీలో అధికారికి వినతి పత్రాలు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ జీతాలు ఆలస్యమైతే వైద్య ఖర్చులు, అప్పుల వాయిదాలు, కుటుంబ అవసరాలకు అవస్థలు పడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎ.విజేందర్ రెడ్డి, కేవీ.జాన్సన్, ఎస్.మల్లికార్జున్, బండారి ప్రభాకర్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
డెంగీతో చిన్నారి మృతి
లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం వనపర్తి గ్రా మానికి చెందిన కౌడె ఉపేందర్, అనిత దంపతుల కూతురు సంహిత(07) బుధవారం హైదరాబాద్లోని నిమ్స్లో చికి త్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలి పారు. ఉపేందర్, అనిత దంపతులు జనగామలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల గ్రామంలో బోనాలు, ఇతర పండుగలు రావడంతో అనిత స్వగ్రామం కోడూరుకు, అత్తగారిల్లు వనపర్తికి వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో సంహితకు పదిహేను రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు, అనంతరం చంపక్హిల్స్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్లోని నిలోఫర్కు తరలించగా డెంగీ అని నిర్ధారణ అయ్యింది. దీంతో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చిన్నారి సంహిత మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషయంపై స్థానిక వైద్యురాలు స్వర్ణలతను వివరణ కోరగా ఆ కుటుంబం జనగామలో నివాసం ఉంటోందని తెలిపారు. -
బైక్.. భద్రం!
ఖిలా వరంగల్: వర్షాకాలంలో ద్విచక్రవాహనాలను భద్రంగా చూసుకోవాలి. వర్షం కురుస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించొద్దు. అప్పుడే బైక్లు కొద్దికాలంపాటు మన్నికగా ఉంటాయి. ఇలా కాకుండా నిర్లక్ష్యంగా నడిపితే వాహనాలు మరమ్మతులకు గురవుతాయి. అప్పుడు కనీసం రూ.2వేలు చేతిలో ఉండాల్సిందే. ఇంజన్ పాడైతే రూ.6వేల నుంచి రూ.8వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన అదనపు భారం పడే అవకాశముంది. ఒక్కసారిగా ఇంత ఖర్చు చేయాలంటే సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు భారమే. కనీస జాగ్రత్తలు పాటిస్తే వాహనాలు మన్నికగా ఉంటాయని సీనియర్ మెకానిక్ అంకాల సతీశ్ చెబుతున్నారు. బైక్ల నిర్వహణ గాలికి.. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3.50లక్షల పైగా ద్విచక్రవాహనాలు ఉన్నాయి. ఏటా సుమారు రూ.20వేలకు పైగా కొత్త వాహనాలు రహదారులపైకి వస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసిన చాలా మంది వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. ఫలితంగా మరమ్మతులకు గురవడంతో వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడే పార్క్.. వర్షం కురుస్తున్న సమయంలో పలువురు తమ వాహనాలను నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ ఆపుతారు. దీంతోపాటు వాహనాన్ని రహదారులపై మె కాలి లోతులో నిలిచిన నీటి నుంచి నడుపుకుంటూ వెళ్తారు. ఇలా చేయడం వల్ల పలు భాగాల్లోకి నీరు చేరి బైక్ మొరాయిస్తుంది. లాక్ సిస్టమ్, ప్లగ్, కేబుళ్లు, బ్రేకులు, ఇంజన్, ఫైరింగ్ సిస్టమ్.. ఇలా వాహనంలో ప్రతీ వస్తువు పాడయ్యే అవకాశముంది. వాహనం నీటిలో నానితే బ్రేక్ సిస్టమ్పై ప్రభావం.. వాహనం నీటిలో నానితే బ్రేక్ సిస్టమ్పై ప్రభావం చూపుతుంది. మరో వైపు ప్రతీ వాహనదారుడు తమ వాహనానికి సంబంఽధించి టైర్లు, బ్రేకులు బాగున్నాయా..? లేవా..? అని తనిఖీ చేయాలి. దీంతోపాటే చైన్ను కూడా లూబ్రికేషన్ చేయించాలి. తడిస్తే తుప్పు పడుతుంది. ఈనేపథ్యంలో చైన్ లూబ్రికేంట్ను వాడడం మంచిది. వర్షాకాలంలో తడి, నీళ్ల రోడ్లపై చాలా మంది ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలో మొదట వాహన టైర్లును తనిఖీ చేయాలి. అరిగిపోయి ఉంటే వాటిని మార్చుకోవాలి. బ్యాటరీ పూర్తిగా చార్జీంగ్ చేసి మంచి స్థితిలోఉందో.. లేదో చూసుకోవాలి. వర్షానికి వాహనం తడిస్తే ఆ ప్రఽభావం పలు భాగాలపై పడుతుంది. విజిబిలిటీ బాగుండాలంటే బ్యాటరీ ఫుల్గా ఉండాలి. బల్బుపోతే వెంటనే మార్చుకోవాలి.బైక్ను భద్రంగా కాపాడుకోవాలి..వర్షం కురుస్తున్న సమయంలో బైక్పై ప్రయాణం ప్రమాదకరం. బ్రేక్లు, క్లచ్లు పనిచేయక బైక్ అదుపు తప్పి ప్రమాదం జరుగుతుంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రయాణిస్తే సైలెన్సర్ ద్వారా ఇంజిన్లోకి వరదనీరు చేరి బైక్ పాడవుతుంది. తద్వారా మరమ్మతుకు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా కాకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ వర్షాకాంలో బైక్ను భద్రంగా కాపాడుకోవాలి. అంకాల సతీశ్, సీనియర్ బైక్ మెకానిక్వర్షాకాలంలో ద్విచక్రవాహనాలను జాగ్రత్తగా చూసుకోవాలి ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మెకానిక్ షెడ్కు వెళ్లాల్సిందే మరమ్మతుకు చేతిలో వేలాది రూపాయలు ఉండాల్సిందే.. వర్షపు నీటిలో ప్రయాణించొద్దని మెకానిక్ల సూచన -
దానాపూర్ రైలుకు చర్లపల్లిలో హాల్టింగ్
కాజీపేట రూరల్ : ప్రయాణికుల సౌకర్యార్థం దీపావళి, దసరా, చాత్పూజా పండుగల సందర్భంగా కాజీపేట జంక్షన్ మీదుగా వెళ్లే సికింద్రాబాద్–దానాపూర్ డైలీ ఎక్స్ప్రెస్కు చర్లపల్లిలో తాత్కాలికంగా హాల్టింగ్ కల్పించినట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 10 రోజులపాటు పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లిలో హాల్టింగ్ కల్పించినట్లు తెలిపారు. హాల్టింగ్ వివరాలు.. సికింద్రాబాద్–దానాపూర్ (12791) ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్లో 9: 25 గంటలకు బయలుదేరి చర్లపల్లికి 9:40 గంటలకు, కాజీపేటకు 11:08 గంటలకు చేరుతుంది. అదేవిధంగా దానాపూర్–సికింద్రాబాద్ (12792) ఎక్స్ప్రెస్ దానాపూర్లో బయలుదేరి మరుసటి రోజు కాజీపేటకు 18:23 గంటలకు, చర్లపల్లికి 20:42 గంటలకు, సికింద్రాబాద్కు 21:30 గంటలకు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. నేడు నాలుగు ప్యాసింజర్ రైళ్లు రద్దు.. కాజీపేట రూరల్ : కాజీపేట–విజయవాడ మార్గంలో నెక్కొండ–కేసముద్రం–మహబూబాబాద్ మ ధ్య చేపడుతున్న థర్డ్ లైన్ కమిషనింగ్ ఎన్ఐ వర్క్స్ కారణంగా గురువారం పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ బుధవారం తెలిపారు. నేడు రద్దయ్యే రైళ్ల వివరాలు.. కాజీపేట–డోర్నకల్ (67765) ప్యాసింజర్, డోర్నకల్–కాజీపేట (67766) ప్యాసింజర్, డోర్నకల్–విజయవాడ (67767) ప్యాసింజర్, విజయవాడ–డోర్నకల్ (67768) ప్యాసింజర్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. పాక్షికంగా రద్దు.. భద్రాచలం రోడ్–బల్లార్షా (17033) సింగరేణి ప్యాసింజర్ను భద్రాచలంరోడ్–కాజీపేట మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు సీపీఆర్వో తెలిపారు. పండుగల రద్దీ దృష్ట్యా 10 రోజులపాటు అమలు.. -
మద్యం టెండర్లకు కసరత్తు
సాక్షిప్రతినిధి, వరంగల్: వైన్స్ (ఏ4)లకు 2025–27 సంవత్సరాలకు సంబంధించి టెండర్లు నిర్వహించేందుకు ఆబ్కారీ శాఖ సన్నద్ధమవుతోంది. వాస్తవానికి నవంబర్ నెలాఖరుతో గడువు ముగియనుండగా.. ఒక నెల ముందుగానే టెండర్లు నిర్వహించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. గత ప్రభుత్వం 2023 ఆగస్టులోనే వైన్స్ల టెండర్లు నిర్వహించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1 నుంచి కొత్త ఎకై ్సజ్ పాలసీ అమల్లోకి వస్తున్నప్పటికీ అక్టోబర్లో టెండర్లు నిర్వహించాలని ఆబ్కారీ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఈనేపథ్యంలోనే మద్య నిషేధ, ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్లతో ఇటీవల హైదరాబాద్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. దీంతో అక్టోబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడవచ్చని అధికారులు భావిస్తున్నారు. డిసెంబర్ 1 నుంచే కొత్త దుకాణాలు ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్ల సందర్భంగా 2023–25 ఎకై ్సజ్ పాలసీనే అమలు చేయనున్నట్లు చెబుతున్నారు. ఈసారి కూడా ఆరు స్లాబుల విధానాన్నే అమలు చేయనున్నట్లు తెలిసింది. గతంలో 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షల లైసెన్స్ ఫీజు వసూలు చేశారు. 5 వేల నుంచి 50 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభాకు రూ.60 లక్షలు, లక్ష జనాభా నుంచి 5 లక్షల్లోపు ఉన్న ప్రాంతాలకు రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల్లోపు జనాభా ప్రాంతాలకు రూ.85 లక్షలు, 20 లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.10 కోట్లు లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. ఈసారి కూడా అదే పాలసీ అమలు చేయనుండడంతో ఎప్పటిలాగే టెండర్లు వేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. కాగా, డిసెంబర్ ఒకటి నుంచి రాబోయే రెండేళ్లకు సంబంధించి కొత్త పాలసీ అమలుల్లోకి రానుండగా.. గతంలో మాదిరిగానే దుకాణాలకు సంబంధించి మూడు సామాజికవర్గాల (గౌడ, ఎస్సీ, ఎస్టీ) వ్యాపారులకు 30 శాతం వరకు రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఈసారి మద్యం దుకాణాల టెండర్లు పోటాపోటీగా సాగనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ–జాతరతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగనున్నాయన్న చర్చ ఇప్పటికే సాగుతోంది. రిజర్వేషన్లు యథాతథం.. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు యథాతథంగా అమలు కానున్నట్లు, ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా.. టెండర్లు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈమేరకు మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించేలా జిల్లాల వారీగా మద్యనిషేధ, ఆబ్కారీ శాఖ చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరినట్లు సమాచారం. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జేఎస్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో 2021–23 సంవత్సరాల నుంచి ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. ఈసారి కూడా ఉమ్మడి వరంగల్లో 294 మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు పాటించనున్నారు. ఈలెక్కన ఉమ్మడి వరంగల్లో 15 శాతం రిజర్వేషన్ల కింద గౌడ సామాజికవర్గానికి 39 నుంచి 44 దుకాణాలు రానున్నాయంటున్నారు. ఎస్సీలకు 27 లేదా 29, ఎస్టీలకు 13 నుంచి 15 దుకాణాలు కేటాయించనున్నారు. సుమారు 206 నుంచి 215 మద్యం దుకాణాలకు ఓపెన్ కేటగిరీ కింద కేటాయించే అవకాశం ఉండగా.. ఇందులోనూ అన్ని సామాజికవర్గాలు పాల్గొనే వీలుంటుంది. కాగా, ఈసారి కూడా 2011 జనాభా ప్రకారమే షాపులు కేటాయించనుండగా, స్లాబ్ల విధానం కూడా గత పాలసీ ప్రకారమే కొనసాగించనున్నారు. అయితే గతంలో టెండర్ దరఖాస్తు ధర రూ.2 లక్షలు ఉండగా.. ఈ సారి రూ.3 లక్షలకు పెంచారు. ఉమ్మడి వరంగల్లో 294 దుకాణాలు దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంపు త్వరలో టెండర్ల తేదీల ప్రకటన డీసీ కార్యాలయాలకు అందిన మార్గదర్శకాలు ఉమ్మడి వరంగల్లో జిల్లాల వారీగా మద్యం దుకాణాలుజిల్లా పేరు వైన్స్ సంఖ్య హనుమకొండ 65 వరంగల్ 63 జనగామ 47 మహబూబాబాద్ 59 జేఎస్ భూపాలపల్లి, ములుగు 60 -
ఆర్మీ ర్యాలీకి పకడ్బందీ ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: హనుమకొండ జేఎన్ఎస్లో నవంబర్ 10 నుంచి 23 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఆర్మీ అధికారులు, కలెక్టర్, వివిధ శాఖల అధికారులు ర్యాలీ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమావేశమై చర్చించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ఈ ఏడాది హనుమకొండ జిల్లాలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించే అవకాశం దక్కడంతో విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. సికింద్రాబాద్ లోని ఆర్మీ రిక్రూట్మెంట్ కల్నల్ సునీల్ యాదవ్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఆన్లైన్ విధానంలో నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన 9 వేల మంది అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీ నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో డీఆర్ఓ వై.వి. గణేశ్, ఆర్మీ మేజర్ ప్రకాశ్ రాయ్, ఆర్మీ అధికారులు గురు దయాల్ సింగ్, సుభాష్, వి.వి.నాయుడు, వినోద్కుమార్ శర్మ, మనీశ్కుమార్, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, డీఎంహెచ్ఓ అప్పయ్య, సీపీఓ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీపీఓలకు కౌన్సెలింగ్ జిల్లాలోని 123 క్లస్టర్లకు 125 మంది జీపీఓల కేటాయింపు ప్రక్రియ బుధవారం కలెక్టరేట్లో పారదర్శకంగా జరిగినట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కౌన్సెలింగ్ వీడియోగ్రఫీతో డీఆర్ఓ వైవీ గణేశ్ ఆధ్వర్యంలో సాగినట్లు పేర్కొన్నారు. 128 మందిలో ముగ్గురు విముఖత చూపించగా 125 మంది జీపీఓలు కౌన్సెలింగ్కు హాజరైనట్లు వివరించారు. కలెక్టర్ స్నేహ శబరీష్ ఈసారి వేదికవ్వనున్న జేఎన్ఎస్ నవంబర్ 10 నుంచి నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం -
నిషేధం నిర్వీర్యం
వరంగల్ అర్బన్: మహా నగరంలో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసుల నిషేధం వ్యాపారులకు మాత్రమే కాదు.. బల్దియా ప్రజారోగ్యం అధికారులు, సిబ్బందికి కాసుల పంట పండిస్తోంది. నిషేధిత ప్లాస్టిక్ను ఆసరాగా చేసుకుని కార్పొరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు ఎక్కడికక్కడ మామూళ్ల ఒప్పందంతో కాలం వెళ్లదీస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాలకవర్గం పెద్దలు, ఉన్నతాధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు వినియోగించిన ప్రజలు అనారోగ్యం పాలవుతూ వ్యయప్రయాసలకు గురవుతున్నా పట్టించుకునే నాథులే కరువయ్యారు.కాసుల పంట..ప్లాస్టిక్ వాడకం వల్ల జరుగుతున్న నష్టాలను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దశాబ్ద కాలంగా 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణానికి విపత్తుగా మారుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్లాస్టిక్ కవర్లు, గ్లాసుల వినియోగం తగ్గి పేపర్, నార సంచుల వినియోగం పెరుగుతుందని ప్రభుత్వం భావించింది. కానీ, ఇది క్షేత్రస్థాయిలో అమలుకు సాధ్యం కాకపోవడంతో వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది.రూ.50 వేల వరకు జరిమానా..చిరువ్యాపారుల నుంచి హోల్సేల్ ప్లాస్టిక్ అమ్మకందారుల వరకు బల్దియా అధికారులు తనిఖీ చేసి రూ.500 నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధించే స్థాయి ఉంది. అధికారుల తనిఖీల్లేవు, సిబ్బంది పర్యవేక్షణ లేదు. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన కవర్లను హోల్సేల్ వ్యాపారులు బహిరంగంగా అమ్ముతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే చిన్న దుకాణం నుంచి భారీ హోల్సేల్ దుకాణం నుంచి నెలవారీ మామూళ్లు అందిస్తున్నామంటూ బహిరంగంగా వెల్లడిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్లాస్టిక్ను నియంత్రించాల్సిన అధికారులు, సిబ్బంది కన్నెత్తి చూడకపోగా.. శానిటరీ ఇన్స్పెక్టర్లు మాత్రం గుట్టుచప్పడు కాకుండా ఒప్పందాలు కుదుర్చుకుని చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్లాస్టిక్ నిషేధం పేరిట స్పెషల్ డ్రైవ్ అంటూ పారిశుద్ధ్య కార్మికులతో బృందాలు ఏర్పాటు చేసి టిఫిన్ సెంటర్లు, కిరాణా దుకాణాలు, బేకరీలు, కూరగాయల, మాంసం దుకాణాల్లో మొక్కుబడిగా దాడులు చేస్తూ జరిమానా విధిస్తున్నారు. నిషేధిత ప్లాస్టిక్పై పుండు ఒక చోట ఉంటే మందు ఒక చోట పెట్టినట్లు ఉంది బల్దియా శానిటరీ ఇన్స్పెక్టర్ల పనితీరు. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు అమ్ముతున్న బడా వ్యాపార సంస్థలను వదిలేసి, చిరువ్యాపారులపై దాడులు చేస్తూ నానాయాగీ చేస్తుండడంపై పలువురు మండిపడుతున్నారు. ప్లాస్టిక్ అమ్మకం నిషేధమే కానీ, హోల్సేల్ దుకాణాల్లో ఎందుకు అరికట్టడం లేదని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.రూ.కోట్లలో దోపిడీ..ప్లాస్టిక్ నిషేధం పేరుతో కవర్లు, గ్లాసుల ధరలను వ్యాపారులు ధరలను రెట్టింపు చేశారు. గతంలో నామామాత్రపు సొమ్ముతో కవర్లు లభించేవి. కానీ, ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ధరలు భగ్గుమంటున్నాయి. ఒక్కో వినియోగదారుడి నుంచి కవర్, గ్లాసుకు రూ.2 నుంచి రూ.5వరకు వసూలు చేస్తుండడాన్ని బట్టి చూస్తే గ్రేటర్ వరంగల్లో దోపిడీ రూ.కోట్లల్లోనే జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. రోజుకు స్థానికంగా 4 టన్నుల నుంచి 5 టన్నుల వరకు ప్లాస్టిక్ కవర్లు, గ్లాసుల వినియోగం జరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇలా నిషేధం పేరిట వ్యాపారులు ధరలు పెంచి పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. వరంగల్ పిన్నావారి వీధి, బీట్బజార్, హనుమకొండ కుమార్పల్లిలోని హోల్సేల్ వ్యాపారులు రోజుకు భారీగా ఆర్జిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.హోల్సేల్ షాపులపై దాడులు చేస్తాంనిషేధిత ప్లాస్టిక్ను విక్రయిస్తున్న హోల్సేల్ షాపుల్లో తనిఖీలు చేస్తాం. చిరువ్యాపారుల కంటే ముందుగా హోల్సేల్ వ్యాపారులను కట్టడి చేస్తే అమ్మకం, వాడకం తగ్గుముఖం పడుతోంది. ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ రాజారెడ్డి, బల్దియా సీఎంహెచ్ఓ -
మైసూరును తలపించేలా ఉత్సవాలు నిర్వహిద్దాం
● మంత్రి కొండా సురేఖకు రంగలీల మైదానం దసరా ఉత్సవ కమిటీ వినతి ఖిలా వరంగల్: రంగలీల మైదానంలో జరిగే సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలను మైసూరు ఉత్సవాలను తలపించేలా నిర్వహించుకుందామని మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం దసరా ఉత్సవ కమిటీ సభ్యులు వరంగల్ ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సురేఖను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి కొండా సురేఖకు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. రంగలీల మైదానంలో నిర్వహించే సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని కోరుతూ మంత్రికి కమిటీ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. వచ్చే నెల 2న రంగలీల మైదానంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలకు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో దసరా ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు గోపాల నవీన్రాజు, కమిటీ అధ్యక్షుడు ఎన్.సంజయ్బాబు, ప్రధాన కార్యదర్శి మేడిది మధుసూదన్, ఉపాధ్యక్షుడు గోనే రాంప్రసాద్, కమిటీ ప్రతినిధులు వెంకటేశ్వర్లు, వేణు, అఖిల్గౌడ్, అజయ్, మహేశ్, శ్రీను, గోవర్ధన్, సంతోశ్, మధు, రంజిత్, వంశీ, రమేశ్, మనోహర్, కృష్ణ, చరణ్, శ్రీధర్, నరేందర్, అరుణ్, సాయి, రాజశేఖర్, క్రాంతి, అక్తర్, కిషోర్ పాల్గొన్నారు. -
‘అబాస్’ హాజరు విధానాన్ని రద్దు చేయాలి
ఎంజీఎం: క్షేత్రస్థాయి ఆరోగ్య పర్యవేక్షణ సిబ్బందికి అబాస్ (బయో మెట్రిక్ హాజరు) విధానాన్ని రద్దు చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య పర్యవేక్షణ సిబ్బంది జిల్లా జేఏసీ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్యను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్కో పీహెచ్సీ పరిధిలో 4 నుంచి 13 ఉపకేంద్రాలు ఉన్నాయని, వాటిలో పీహెచ్సీకి వెళ్లి బయోమెట్రిక్ హాజరు నమోదు చేసుకుని ఫీల్డ్కు వెళ్లాలంటే కనీసం 10 నుంచి 20 కి.మీ దూరం ప్రయాణించాల్సి వస్తోందని పేర్కొన్నారు. 24 గంటలు అత్యవసర సేవల్లో ఉండే క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందిని పీహెచ్సీ కార్యాలయంలోని సిబ్బంది, పర్యవేక్షణ సిబ్బందితో జతకట్టి చూడొద్దని కోరారు. ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బంది అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు నిర్విరామంగా, నిరంతరాయంగా సమయపాలన లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయి సిబ్బందికి అబాస్ నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బానోతు నెహ్రూ చంద్నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీరం మధుసూదన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు తోకల మాధవరెడ్డి, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నాయకులు కత్తి రవీందర్, కె.రమేష్, జ్యోతి, సులోచన, ప్రసన్నకుమారి, శ్రీకాంత్, రాజేశ్వర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కొలిక్కిరాని టెండర్లు
హన్మకొండ చౌరస్తా: ఉచిత చేప పిల్లల పంపిణీపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. చెరువుల్లో జూన్, జూలై నెలల్లో వదలాల్సిన చేపపిల్లలను ఇంతవరకూ అందించలేదు. సెప్టెంబర్ మొదటి వారం గడిచినా టెండర్ల ప్రక్రియ కొలిక్కి రాకపోవడం ఇందుకు నిదర్శనం. సరైన సమయానికి చేప పిల్లలను అందిస్తే ఇప్పటి వరకు చేప ఎదిగి కనీసం పావుకిలో ఉండేదని, ఇప్పుడు చెరువుల్లో వదిలితే అవి ఎప్పుడు ఎదగుతాయని మత్స్యకారులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. హనుమకొండ జిల్లాలో మొత్తం 813 చెరువులు ఉన్నాయి. గత సంవత్సరం 763 చెరువుల్లో రూ.82.82 లక్షల విలువైన 111.21 లక్షల ఉచిత చేపపిల్లల్ని పంపిణీ చేసినట్లు, సుమారు రూ.3.67 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. సొంతంగా కొని.. మత్స్యశాఖ అధికారులపై నమ్మకం లేని పలు మత్స్య సొసైటీలు ఇప్పటికే వారి పరిధిలోని కొన్ని చెరువుల్లో చేప పిల్లలను వదిలినట్లు సమాచారం. రెండు నెలల క్రితమే జిల్లాలోని పలువురు సొసైటీ సభ్యులు సొంత డబ్బులతో చేప పిల్లలను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆయా చెరువుల్లో 200 గ్రాముల మేర చేప ఎదిగిందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత చేప పిల్లల్లో నాణ్యతపై మత్స్యకారులు ఏటా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. చేప పిల్లల కనీస సైజు 35 నుంచి 40 ఎంఎం ఉండాలని అధికారులు చెబుతున్నప్పటికీ అమలులో ఎక్కడా కనిపించడం లేదని మత్స్యకారులు బహిరంగంగానే వాపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. టెండర్లను ఆహ్వానించాం.. జిల్లాలోని 813 చెరువుల్లో 220.55 లక్షల ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం టెండర్లను ఆహ్వానించాం. ఇప్పటి వరకు వరంగల్ జిల్లాకు ఇద్దరు, హనుమకొండ జిల్లా నుంచి ఒక్కరు టెండర్లు దాఖలు చేశారు. ఈ నెల 12వ తేదీ వరకు టెండర్లు వేయడానికి అవకాశం ఉంది. – నాగమణి, ఇన్చార్జ్ జిల్లా మత్స్యశాఖ అధికారి, హనుమకొండ ఉచిత చేప పిల్లల పంపిణీలో అలసత్వం చెరువుల్లో ఇప్పుడు వదిలితే ఎదుగుదల అంతంతే.. అధికారుల తీరుపై మత్స్యకారుల అసహనం -
కేఎంసీకి పార్థివదేహం అప్పగింత
ఎంజీఎం: నగరంలోని అడ్వకేట్స్ కాలనీ సంతోష్నగర్కు చెందిన సముద్రాల ప్రమీల (84) మంగళవారం మృతి చెందింది. ప్రమీల పార్థివదేహాన్ని ఆమె కుమార్తెలు అనిత, కవిత, కుమారుడు విజయగోపాల్ కాకతీయ వైద్య కళాశాల సిబ్బందికి అప్పగించారు. అనాటమీ ప్రొఫెసర్ డాక్టర్ శశికాంత, అనాటమీ విద్యార్థులు, సిబ్బంది ప్రేమ్కుమార్, యాదగిరి, ప్రణయ్ తదితరులు పార్థివ దేహాన్ని అనాటమీ విభాగానికి తరలించారు. ఈ సందర్భంగా అనాటమీ విభాగం డాక్టర్ శశికాంత మాట్లాడుతూ శరీర దానం వైద్యవిద్యార్థుల పరిశోధనకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. శరీరదానం చేసిన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అనంతరం నేత్ర అవయవ, శరీర దాతల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పెండ్లి ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ మరణానంతరం నేత్ర, అవయవ, శరీర దానానికి ముందుకు రావాలని కోరారు. మరిన్ని వివరాలకు 87905 48706, 94901 33650 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. అడ్వకేట్ తిరుమల, సునీత, రమాదేవి, లింగారెడ్డి, సుదర్శన్రెడ్డి, అ సోసియేషన్ ఉపాధ్యక్షురాలు మునిగాల పద్మ, హనుమకొండ జిల్లా అధ్యక్షులు పరికిపండ్ల వేణు, కా ర్యదర్శి సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షులు మొహీనుద్దీన్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలి
హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లా పునర్నిర్మాణంలో వేగం పెంచాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలన్నారు. మంగళవారం హనుమకొండ అదాలత్ కూడలిలోని రాచకొండ ప్రవీణ్ నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల వివక్షకు గురికాగా, స్వరాష్ట్రంలో కల్వకుంట్ల పాలకుల కుటుంబ ప్రయోజనాల కోసం వరంగల్ జిల్లాను ముక్కలు చెక్కలు చేసి తీవ్ర విధ్వంసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని ప్రకటించిన మేరకు వరంగల్, హనుమకొండ జిల్లాలను ఒకే వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా రూ.6,000ల కోట్ల అభివృద్ధి నిధులను సమకూర్చి అండర్గ్రౌండ్ డ్రైనేజీ, మామునూరు ఎయిర్పోర్టు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన అమలు చేయాలన్నారు. సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక కోఆర్డినేటర్ సోమ రామమూర్తి, ఆయా సంఘాల నాయకులు రాచకొండ ప్రవీణ్, సోమిడి శ్రీనివాస్, చాపర్తి కుమార్ గాడ్గే, సోయం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ -
ఎక్కడి చెత్త అక్కడే..
వరంగల్ అర్బన్ : వరంగల్ మహానగరంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. మూడువేలకు పైగా ఔట్సోర్సింగ్, తాత్కాలిక కార్మికులతో పనులు చేయించాల్సిన అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. చెత్త సేకరణకు బల్దియాకు చెందిన 250 స్వచ్ఛఆటోలు, 152 ఓనర్ కమ్ డ్రైవర్ ఆటోలు తిరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నారు. వాటికి రోజు డీజిల్ కేటాయిస్తున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే 150 ఆటోలు కూడా తిరగడం లేదనే ఫిర్యాదులున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకఎక్కడ చూసినా చెత్త కుప్పులే దర్శనమిస్తున్నాయి. చెత్త సేకరణలో చిత్తశుద్ధి కరువు రోజు చెత్త సేకరణకు రావాల్సిన స్వచ్ఛ ఆటోలు రావడం లేదని పలు కాలనీల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వాహనం మరమ్మతు కొస్తే వారం, పది రోజుల వరకు చెత్త సేకరించే నాథుడే కనిపించరు. ఒకవేళ వస్తే సమయపాలన ఉండదు. స్వచ్ఛ ఆటో డ్రైవర్ అనారోగ్యానికి గురైతే ప్రత్యామ్నయంగా మరో ఆటో లేదా ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించాల్సి ఉంది. కానీ, అలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఇళ్లలోని చెత్తను నిల్వ చేయలేక ప్రజలు ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. వరుసగా పండుగలు, వర్షాలు ఇలాంటి పరిస్థితుల్లో నెలకొన్న అపరిశుభ్రత ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గ్రేటర్ వరంగల్ ప్రజారోగ్యం అధికారులు, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, జవాన్లు నామమాత్రంగా పనిచేస్తున్నారు. కమిషనర్ రోజు డివిజన్లలో పర్యవేక్షిస్తూ హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అపరిశుభ్రంగా పలు కాలనీలు.. హనుమకొండలోని ఎన్జీఓస్ కాలనీ, ఇందిరానగర్, భవానీనగర్, టీచర్స్ కాలనీ–1,2, నక్కలగుట్ట, కేఎల్రెడ్డి కాలనీ, హౌసింగ్బోర్డు కాలనీ, బాలసముద్రం తదితర ప్రాంతాలు చెత్తతో దర్శనమిస్తున్నాయి. వరంగల్లోని రామన్నపేట, గంగపుత్ర వీధి, బీసీ కాలనీ, గాంధీ విగ్రహం, ఓఎస్ఆర్నగర్, రఘునాథ్ కాలనీ, పాత బీటుబజారు, రైల్వేగేట్, హంటర్ రోడ్డు, సంతోషిమాత కాలనీ, కొత్తవాడ, రంగంపేట, కాశీబుగ్గ, లేబర్కాలనీ, శివనగర్, విద్యానగర్, కరీమాబాద్, రంగశాయిపేట, శంభునిపేటలో చెత్తసేకరణ చేయడం లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో అపరిశుభ్రత నెలకొంది. విలీన గ్రామాల్లో ఇంటింటా చెత్తసేకరణ నామమాత్రంగా కొనసాగుతోంది. ఇప్పటికై నా గ్రేటర్ అధికారులు స్పందించి కాలనీల్లో రోజూ చెత్త సేకరించేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రోజూ చెత్త సేకరించాల్సిందే.. నగరంలోని అన్ని డివిజన్లకు సరిపడా స్వచ్ఛ ఆటోలు ఉన్నాయి. రోజూ చెత్తను సేకరించాల్సిందే. ఏమైనా రిపేర్లు వస్తే అప్పుడప్పుడు సమాచారం ఇవ్వాలని సూచించాం. కానీ, కొంత మంది డ్రైవర్లు తెలియజేయడం లేదు. ప్రత్యామ్నాయంగా కొన్ని కాలనీల్లో తోపుడు బండ్లు, ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరిస్తున్నారు. ఏమైనా ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కరిస్తాం. – రాజారెడ్డి, బల్దియా సీఎంహెచ్ఓ స్వచ్ఛ ఆటోల కోసం ప్రజల ఎదురుచూపులు మరమ్మతులు, సెలవుల పేరుతో విధులకు డ్రైవర్ల డుమ్మా కొరవడిన పర్యవేక్షణ.. అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య పనులు ఆదివారం, ఇతర సెలవులు, పండుగలు, స్వచ్ఛ ఆటో రిపేర్ ఉందని, చెత్త సేకరణకు కార్మికుడు తోడు లేడని డ్రైవర్ కారణాలు చెబుతున్నాడు. రెండుమూడు రోజులకోసారి చెత్త సేకరిస్తున్నట్లు వరంగల్ ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన సుజాత ఆందోళన వ్యక్తం చేశారు.. ఇలా ఏదో ఒకరి చెత్త బాధలు కావు ఇవి. నగర వ్యాప్తంగా 60 శాతం కాలనీల్లో ఇదే పరిస్థితి దాపురించింది. చెత్త సమస్యతో నగరవాసులు సతమతమవుతున్నారు. చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటో రాక పది రోజులవుతోంది. ఇళ్లల్లో చెత్త నిల్వ చేయలేకపోతున్నాం. కంపు వాసన భరించ లేకపోతున్నాం. స్వచ్ఛ ఆటో డ్రైవర్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నాడు. హనుమకొండ టీచర్స్ కాలనీ–1కు చెందిన రజిత ఆవేదన ఇది. -
నకిలీ విత్తనాలు విక్రయించిన వ్యక్తిపై పీడీ యాక్ట్
వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తూ పట్టుబడిన హైదరాబాద్లోని మెహిదీపట్నానికి చెందిన ముద్దంగుల ఆదిత్యపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పరకాల జైలులో ఉన్న నిందితుడు ఆదిత్యకు పరకాల ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు అందజేసి చర్లపల్లి జైలుకు తరలించారు. పీడీయాక్ట్ అందుకున్న నిందితుడు మరో ఆరుగురితో కలిసి ఒక ముఠా ఏర్పాటు చేశాడు. కాలం తీరిన పురుగు మందులను ఫర్టిలైజర్ డీలర్ల నుంచి తక్కువ డబ్బులకు కొనుగోలు చేయడంతో పాటు నకిలీ విత్తనాలు, పురుగు మందులను రైతులకు విక్రయిస్తూ గత జూన్ 6వ తేదీన పరకాల పోలీసులకు పట్టుబడినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై గతంలోనూ మట్టెవాడ, పరకాల పోలీస్స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్లు వివరించారు. రైతులకు నకిలీ విత్తనాలు, పురుగుల మందులను విక్రయించిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. -
ఆలస్యం.. ఆందోళన!
హన్మకొండ అర్బన్: జిల్లాలో ఎంపికై న గ్రామ పాలనాధికారుల (జీపీఓలు)కు కలెక్టర్ స్నేహ శబరీశ్ బుధవారం కలెక్టరేట్లో కౌన్సెలింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వనున్నారు. అయితే, ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేనివిధంగా ఒక్క హనుమకొండ జిల్లాలోని అధికారులు నియామక ప్రక్రియను ప్రహసనంగా మార్చారని ఆరోపణలు వచ్చాయి. ఒకవైపు ఆప్షన్లు తీసుకున్న అధికారులు అసలు జాబితా, అభ్యర్థుల వివరాలు వెల్లడించలేదని విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు సీనియారిటీ జాబితాలో నాన్ లోకల్ లోకల్ క్యాడర్లో వేరే విధంగా చూపెట్టినప్పటికీ.. లోకల్ క్యాడర్లో చూపెట్టిన కొందరు అభ్యర్థుల్లో నాన్లోకల్ వారు ఉన్నారని, వేరే జిల్లాల్లో పరీక్షలు రాసిన వారిని ఇక్కడి జిల్లా అభ్యర్థుల జాబితాలో చూపెట్టారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధానం రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో ఇప్పటికే కౌన్సెలింగ్ పూర్తి చేసి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేశారు. కానీ, హనుమకొండ జిల్లాలో మాత్రం అధికారులు ఈ ప్రక్రియ సాగదీయడం అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలో 128 మంది.. హనుమకొండ జిల్లాకు మొత్తం 128 మంది జీపీఓలను ప్రభుత్వం కేటాయించింది. కాగా, వీరిని జిల్లాలోని 164 రెవెన్యూ గ్రామాలకు కేటాయించాల్సి ఉంది. రెవెన్యూ గ్రామాల వారీగా కాకుండా జిల్లాలో 123 రెవెన్యూ క్లస్టర్లు ఏర్పాటు చేసి క్లస్టర్కు ఒకరు చొప్పున కేటాయించాలని నిర్ణయించారు. జిల్లాకు వచ్చిన 128 మందిలో ఒకరు మెడికల్ గ్రౌండ్లో తిరిగి వెనక్కి వెళ్లారు. మిగిలిన వారిలో 121 మంది లోకల్ కేటగిరీలో చూపారు. ఆరుగురిని నాన్ లోకల్ కేటగిరీలో అంటే కరీంనగర్, మహబూబాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల నుంచి వచ్చినట్లు చూపెట్టారు. పోస్టులు మొదట లోకల్ వారికి తర్వాత నాన్ లోకల్ వారికి ఇవ్వనున్నారు. అదేవిధంగా రెండోసారి జీపీఓ పరీక్ష రాసి ఉత్తీర్ణులైన వారిలో మొదట లోకల్ వారికి తర్వాత నాన్లోకల్ వారికి పోస్టులు ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా రిజర్వేషన్ రోస్టర్ అమలు చేసే పరిస్థితి లేనందున కేవలం వారి వివరాలు నమోదు చేసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. స్థానిక నియోజకవర్గం కాకుండా.. ప్రస్తుతం జిల్లాకు కేటాయించిన 128 మందిని మొదట వారి నుంచి ఆప్షన్స్ స్వీకరించారు. ఇందులో ప్రాధాన్యతా క్రమంలో 14 మండలాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఎంపిక చేసుకున్న మండలాల్లో ఏ గ్రామానికి కేటాయించాలన్నది మాత్రం అధికారుల ఇష్టంగా చూపెట్టారు. మండలం మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. ఒక్కో మండలంలో ఉన్న ఖాళీల ఆధారంగా వారికి ఇష్టం ఉన్న గ్రామాలు అధికారులు కేటాయించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అభ్యర్థులు తమ సొంత నియోజకవర్గం కాకుండా ఇతను నియోజకవర్గానికి కేటాయించాలని నిబంధనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వారి సొంత నియోజకవర్గానికి కేటాయించాల్సి వస్తే.. ఆ నియోజకవర్గంలో వారి సొంత మండలం కాకుండా ఇతర మండలాలకు కేటాయిస్తామని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా అర్బన్ మండలాలకు ప్రాధాన్యం పెరిగింది. దీంతోపాటు ఒక మండలంలో నాలుగు గ్రామాలు ఉంటే.. వాటిలో రెండు గ్రామాలు హెచ్ఆర్ఏ కింద ఉన్నాయి ఇలాంటి మండలాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అభ్యర్థులు సైతం ఈ విషయంలోనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు 128 మందిలో కొందరు స్థానికులు కారని, వేరే మండలాల్లో పరీక్షలు రాసి అక్కడ స్థానికత చూపెట్టుకున్నారని, వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అక్కడే పూర్తయిందని, జాబితాలో మాత్రం ఇక్కడి వారీగా చూపెడుతుండడంతో తాము సీనియార్టీ నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు సీనియారిటీ జాబితాలో కూడా పేర్లు, నంబర్లు మూడు రోజుల్లో మూడుసార్లు మారినట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ నియామక ప్రక్రియ నిర్వహిస్తున్న సెక్షన్ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. గ్రామ పాలనాధికారులకు పోస్టింగ్లో అధికారుల జాప్యం హనుమకొండ జిల్లాలో ప్రహసనంగా నియామక ప్రక్రియ సీనియారిటీ జాబితాలో పేర్లు, నంబర్లు మారాయని అభ్యర్థుల ఆరోపణ నేడు కలెక్టరేట్లో జీపీఓలకు కౌన్సెలింగ్ -
కదంతొక్కిన లంబాడీలు
హన్మకొండ : లంబాడీలు ఆత్మగౌరవ శాంతి ర్యాలీతో కదం తొక్కారు. ఎస్టీ హోదా పరిరక్షణకు లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఆత్మగౌరవ ర్యాలీలకు పిలుపునిచ్చింది. ఈక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో మంగళవారం హనుమకొండ బాలసముద్రం ఏకశిలా పార్కు ఠాణూ నాయక్ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు లంబాడీలు ఆత్మగౌరవ ర్యాలీని నిర్వహించ తలపెట్టారు. ర్యాలీ ఉందనే సమాచారంతో పోలీసు బలగాలు అక్కడికి పెద్దఎత్తున చేరుకున్నాయి. బారికేడ్లు అడ్డుపెట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యువకులు, విద్యార్థులు, మహిళలతో పాటు లంబాడీలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఠాణూనాయక్ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభం కాగానే పోలీసులు వారిని వారించారు. అనుమతి లేదని ఇక్కడి నుంచి కదలవద్దని సూచించారు. అయినా ఆందోళనకారులు పోలీసులను తోసుకుంటూ ముందుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు ప్రతిఘటించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. దీంతో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులకు పరిస్థితులు వివరించి సర్దిచెప్పడంతో శాంతించారు. ఠాణూనాయక్ విగ్రహం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. కోయ, గోండులకు చెందిన కొద్దిమంది రాజకీయ నాయకుల వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆ రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలి.. ఈ ర్యాలీ సందర్భంగా లంబాడీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ..లంబాడీలపై నిరాధార ఆరోపణలు చేస్తున్న కోయ, గోండు వర్గాలకు చెందిన రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని లంబాడీలను రాజ్యాంగబద్ధంగా ఎస్టీ జాబితాలో చేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉందని, లంబాడీల ఎస్టీ రిజర్వేషన్లను కాపాడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదేని వారు పేర్కొన్నారు. లంబాడీలను నిర్లక్ష్యం చేసిన, సుప్రీంకోర్టులో లంబాడీల పక్షాన కేంద్ర.,రాష్ట్ర ప్రభుత్వాలు పోరాడకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో లంబాడీల వ్యతిరేకమైన పార్టీలను బొందపెడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. వెంటనే కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. లంబాడీల శాంతి ర్యాలీకి జిల్లా యంత్రాంగం, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా నిరసించారు. కార్యక్రమంలో లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ (ఎల్–జేఏసీ) కన్వీనర్లు జాటోత్ కిషన్నాయక్, జైసింగ్ రాథోడ్, సమన్వయకర్త వి.ఎన్.నాయక్, నాయకులు రాజు నాయక్, అంగోత్ వినోద్, వాంకుడోత్ వీరన్న, పోరిక గోవింద నాయక్, వీరమ్మ, గోపిసింగ్, బానోత్ వసంత్ నాయక్, బానోత్ వెంకన్న నాయక్, డాక్టర్ ఉదయ్ సింగ్ నాయక్, నునావత్ జవహర్, బానోత్ మంగీలాల్, సమ్మయ్య రాథోడ్, లకావత్ కరుణాకర్, పాడియా గాంగు నాయక్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. హనుమకొండలో లంబాడీల ఆత్మగౌరవ శాంతిర్యాలీ అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు ఇరువర్గాల తోపులాట, స్పల్ప ఉద్రిక్తత ఠాణూ నాయక్ విగ్రహం వద్ద ధర్నా తమ ఎస్టీ హోదాను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే: లంబాడీ జేఏసీ -
అగ్నికణం ఐలమ్మ
పాలకుర్తి టౌన్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చిట్యాల ఐలమ్మ పాత్ర వీరోచితమైనది. ఆమె జీవితం ఇప్పటికీ అనేక పోరాటలకు ప్రేరణగా నిలుస్తోంది. భూమి, భుక్తి, పేదల బతుకుల విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్నికణం చాకలి ఐలమ్మ. అనేక మందికి విప్లవభావాలు మండించిన నిప్పుల కొలిమి ఐలమ్మ. విస్నూర్ దొర రాపాక రాంచంద్రారెడ్డి ఆగడాలపై అగ్నికణంలా మారి ముందుకు దూంకిన తొలి వీరనారి చాకలి ఐలమ్మ. తన పంటపొలాల్లో పండించిన ధాన్యం విషయంలో ప్రారంభించిన ఉద్యమం యావత్ తెలంగాణ జిల్లాలకు వ్యాపించింది. రాంచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఎర్రజెండాను చేతపట్టి ప్రజలను సమీకరించి సాగించిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఐలమ్మ తన చాకలి వృత్తిలో ఆర్థికంగా నిలదొక్కు కోలేకపోయింది. దీంతో కుటుంబీకులు మల్లంపల్లి జమీందార్ ఉత్తంరాజు కొండల్రావు దగ్గర 40 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. దేశ్ముఖ్ ఏజెంట్ అయిన పాలకుర్తి పోలీసు పటేల్ వీరమనేని శేషగిరిరావు గ్రామంలో పెత్తనం చెలాయిస్తూ వెట్టి చేయించుకునే వాడు. ఓ రోజు పోలీస్ పటేల్ ఐలమ్మను, ఆమె భర్త నర్సయ్యను పశువులతో సహా వచ్చి తన వ్యవసాయ పొలంలో పనిచేయాలని ఆదేశించారు. అప్పటికే ఆంధ్ర మహాసభలో చేరిన ఐలమ్మ కుటుంబంపై కక్షగట్టి ఆంధ్ర మహాసభల్లో చేరిందని, నాయకులకు ఆశ్రయం కల్పించి అన్నం పెడుతోందని ఆరోపిస్తూ దాడులు చేయించారు. ఐలమ్మ భర్త నర్సయ్య, సంఘం నాయకులు ఆరుట్ల రాంచంద్రారెడ్డి, బీంరెడ్డి నర్సింహరెడ్డి, నల్లా నర్సింహులు, నల్లు ప్రతాప్రెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వర్రావును తీసుకు వచ్చారు. పాలకుర్తి తదితర ప్రాంతాల్లో జరిగిన కొన్ని సంఘటనల్లో ఐలమ్మ, ఆమె భర్త నర్సయ్య, కుమారుడు సోమయ్య, లచ్చయ్యపై రాంచంద్రారెడ్డి కుట్ర కేసు పెట్టి జైలుకు పంపాడు. మల్లంపల్లి జమీందార్ కొండల్రావును దేశ్ముఖ్ పిలిపించి ఐలమ్మకు కౌలుకు ఇచ్చిన భూమిని తనకు కౌలుకు ఇచ్చినట్లుగా ఒక అగ్రిమెంట్ రాయించుకుని దానిని ఆధారంగా చేసుకుని ఐలమ్మ పంటను ధ్వంసం చేసేందుకు గుండాలను పంపించాడు. ఐలమ్మ పొలంలోని పంటను కాపాడుకునేందుకు బీంరెడ్డి నర్సింహారెడ్డి నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు, గుండాలను అడుగుపెట్టనియ్యకుండా ప్రతిఘటించారు. ఐలమ్మ కుటుంబానికి ఆంధ్రమహాసభ అండగా నిలిచింది. ఐలమ్మ పోరాటం గురించి తెలుసుకున్న పుచ్చలపల్లి సుందరయ్య ఆమె ఇంటికివచ్చి ఇల్లునే కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంగా మార్చి ఇంటి ఆవరణలో అరుణపతాకాన్ని ఎగురవేశారు. ‘ఐలమ్మ భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటుకు చిహ్నంగా నిలిచిందని’ పుచ్చలపల్లి సుందరయ్య కొనియాడారు. చాకలి ఐలమ్మ పేరుతో స్మృతివనం ఏర్పాటు చేయాలి హైదరాబాద్ సచివాలయం ఎదుట, ఢిల్లీ పార్లమెంట్లో ఐలమ్మ విగ్రహం పెట్టాలని, ఏదైనా జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని పలువురు కోరుతున్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో ఐదెకరాల్లో ఐలమ్మ పేరుతో పార్కు, స్కృతివనం ఏర్పాటు చేయాలని ఐలమ్మ అభిమానులు కోరుతున్నారు. భూస్వాములు, రజాకార్లను తరిమికొట్టిన వీరనారి దేశ్ముఖ్లకు ముచ్చెమటలు పట్టించిన ధీశాలి నేడు చాకలి ఐలమ్మ వర్ధంతిఐలమ్మ 1895 సెప్టెంబర్ 26వ తేదీన రాయపర్తి మండలంలోని కిష్టాపురం గ్రామంలో జన్మించింది. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో 1908లో తన 13వ యేటా వివాహం జరిగింది. వృద్ధాప్యంతో 90 ఏళ్ల వయస్సులో 1985, సెప్టెంబర్ 10న ఐలమ్మ కన్నుమూసింది. ఆమె పోరాటానికి చిహ్నంగా మండల కేంద్రంలో ఐలమ్మ స్మారక స్థూపం, భవనం, కాంస్య విగ్రహం నిర్మించారు. -
సమయపాలన పాటించాలి
ఎంజీఎం: సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. లష్కర్ సింగారం పీహెచ్సీ పరిధిలో టీబీ చికిత్స పొందుతున్న వారికి దాతల సహకారంతో పోషకాహార కిట్లను మంగళవారం డీఎంహెచ్ఓ అందించారు. ఈ సందర్భంగా పోషకాహార కిట్లను అందించిన దాతలను ఆయన అభినందించారు. అనంతరం పీహెచ్సీ పరిధి లో నిర్వహిస్తున్న వైద్యశిబిరాన్ని సందర్శించి చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. వాజ్పేయి కాలనీలో డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం శాయంపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్లినిక్ను సందర్శించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహె చ్ఓ డాక్టర్ మదన్మోహన్రావు, జిల్లా టీబీ నియంత్రణాధికారి డాక్టర్ హిమబిందు, వైద్యాధికారులు హైదర్, మౌనిక, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి, సూపర్వైజర్ బాబు, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి ఈనెల 12 నుంచి 20వ తేదీవరకు అమెరికా అధికార పర్యటన చేస్తారని రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం మంగళవారం తెలిపారు. అమెరికాలోని న్యూజెర్సీ అట్లాంటాలో నిర్వహించనున్న కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఫార్మసీ విభాగం చాప్టర్ సమ్మేళనంలో వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని, టెక్సాస్లోని ఏ అండ్ ఎం యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మకాలజీ అండ్ న్యూరో థెరిప్యూటిక్స్తో ఒక అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంటారని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం విద్య, పరిశోధన రంగాల్లో అంతర్జాతీయ సహకారానికి దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు వివరించారు. రెండు విశ్వవిద్యాలయాల మధ్య పరిశోధనల మార్పిడి మరింతగా సులభతరం అవుతుందని తెలిపారు. రామన్నపేట: నగరంలోని ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ మంగళవారం సందర్శించారు. స్టేషన్కు చేరుకున్న సీపీకి మొక్క అందించి సిబ్బంది గౌరవ వందనంతో ఆహ్వానించారు. అనంతరం సీపీ స్టేషన్ పరిసరాలను పరిశీలించి శుభ్రత, భద్రతా ఏర్పాట్లతోపాటు సిబ్బంది విధి నిర్వహణపై సమీక్షించారు. స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరు, కేసుల నమోదు వివరాలను పరిశీలించారు. అదేవిధంగా స్టేషన్ పరిఽధిలో ముఖ్యమైన కేసులు, కాలనీల పరిస్థితులు, రౌడీషీటర్ల జాబితా తదితర వివరాలను స్టేషన్ ఇన్స్పెక్టర్ షుకూర్ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మరింత సమన్వయంతో వ్యవహరించి, ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని సీపీ సూచించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్సలీమా, ఏఎస్పీ శుభమ్, సిబ్బంది పాల్గొన్నారు. న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదు నుంచి 9వ తరగతిలో ఉన్న ఖాళీలను ప్రవేశ పరీక్ష రాసిన మెరిట్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసి సీట్లను భర్తీ చేస్తామని సాంఘిక సంక్షేమ గురుకులాల సమన్వయ అధికారి పి.అపర్ణ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ హాల్టికెట్తో పాటు ఒరిజినల్ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 12న వరంగల్ జిల్లా పరిధి రాయపర్తి మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో హాజరు కావాలన్నారు. అదే రోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఎస్సీ కేటగిరీ వారికి ప్రాధాన్యం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. -
కాళోజీ నారాయణరావుకు ఘన నివాళి
హన్మకొండ: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని మంగళవారం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, కవులు, కళాకారులు, పలు పార్టీల నాయకులు, సంఘాల నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. హనుమకొండ నక్కలగుట్టలోని కాళోజీ నారాయణరావు విగ్రహానికి హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీశ్, వరంగల్ కలెక్టర్ సత్యశారద, హనుమకొండ ఆర్డీఓ రమేశ్రాథోడ్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, కుడా మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు తాళ్లపల్లి జనార్దన్గౌడ్, పులి రజినీకాంత్, కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధులు పొట్లపల్లి శ్రీనివాస్రావు, నాగిళ్ల రామశాస్త్రి, అంపశయ్య నవీన్, పందిళ్ల అశోక్కుమార్, బన్న అయిలయ్య తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
కుటీర పరిశ్రమలకు తగ్గిన విద్యుత్ బిల్లులు
హన్మకొండ: కుటీర పరిశ్రమలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గింది. తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎల్టీ కేటగిరీ–3 నుంచి ఎల్టీ కేటగిరీ–4కు కుటీర పరిశ్రమలను తీసుకొచ్చారు. దీంతో కుటీర పరిశ్రమ వినియోగదారులపై భారం తగ్గింది. 25 హెచ్పీ లోపు లోడ్ కలిగిన కుటీర పరిశ్రమలు ఈ కేటగిరీ–4లోకి వస్తాయి. 25 హెచ్పీ లోడ్కు పైన ఉన్న పరిశ్రమలు కేటగిరీ–3 కిందికి వస్తాయి. కేటగిరీ మారడంతో యూనిట్ చార్జీలు మారాయి. కేటగిరీ–3లో యూనిట్ చార్జీ రూ.7.70 ఉండగా కేటగిరీ–4లో యూనిట్ చార్జీ రూ.4గా ఉంది. అదే విధంగా ఫిక్స్డ్ చార్జీలు కిలో వాట్కు రూ.100 ఉండగా కేటగిరీ మార్పుతో రూ.20 తగ్గింది. యూనిట్ పరంగా చూస్తే రూ.3.70, కిలోవాట్ పరంగా రూ.80 భారం వినియోగదారులపై తగ్గింది. పవర్లూమ్స్, వడ్రంగి, కమ్మరి, కంచరి, గోల్డ్స్మిత్, శిల్పి, కొవ్వొత్తుల తయారీ, పాపడ్ లెదర్ వస్తువులు, చెప్పుల తయారీ, లాక్ టాయ్ మేకింగ్, పాప్ టాయ్స్, ప్లాస్టర్ ఆప్ పారిస్ ఉత్పత్తులు, బొమ్మల తయారీ పరిశ్రమలు, ఊరగాయల తయారీ, మామిడి జెల్లి యూనిట్లకు 25 కిలోవాట్లకు మించకుండా లోడ్ ఉన్న కుటీర పరిశ్రమలు మాత్రమే ఎల్టీ కేటగిరీ–3లోకి వస్తాయి. కేటగిరీ మార్పు చేయించామని దళారుల వసూళ్లు.. ఇదిలా ఉండగా తామే కేటగిరీ మార్పు చేయించి బిల్లులు తగ్గించామని చెబుతూ కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిసింది. ప్రధానంగా మడికొండ టెక్స్టైల్స్ పార్కు కేంద్రంగా కొందరు ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) కుటీర పరిశ్రమలపై భారం పడుకుండా, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేటగిరీ మార్పు ద్వారా భారం తగ్గిస్తే కొందరు ఇదే అదనుగా సొమ్ము చేసుకుంటున్నారు. కాగా, విద్యుత్ అధికారులు, సిబ్బంది పేరుతో ఎవరైనా వసూళ్లకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి సూచించారు. విద్యుత్ నియంత్రణ మండలి తీసుకున్న ఈ నిర్ణయంతో ఇతరులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కేటగిరీ మార్పు కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. హనుమకొండ టౌన్ డివిజన్లోని 25 హెచ్పీకి తక్కువ లోడ్ ఉన్న కుటీర పరిశ్రమల వినియోగదారులు కేటగిరీ మార్పు, వివరాల కోసం డివిజన్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఎల్టీ కేటగిరీ–3 నుంచి కేటగిరీ–4కు మార్పు యూనిట్ ధర రూ.7.70 నుంచి రూ.4కు తగ్గింపు -
క్యాన్సర్ కేర్ సెంటర్ ప్రారంభం
ఎంజీఎం : వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో హనుమకొండ, వరంగల్ జిల్లాల ప్రజల కోసం పది పడకల సామర్థ్యంతో క్యాన్సర్ కేర్ సెంటర్ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా మంగళవారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీ ణ, పట్టణవాసులకు క్యాన్సర్ చికిత్సను సమీప ప్రాంతంలో అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సెంటర్ను ఏర్పాటు చేసిందన్నారు. వివిధ జిల్లాలకు చెందిన రోగులు ప్రాథమిక క్యాన్సర్ నిర్ధారణ అనంతరం కిమోథెరఫి సేవలను హైదరాబాద్ వంటి దూరప్రాంతాలకు వెళ్లకుండానే స్థానికంగా పొందుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంజీఎం అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
క్యూలో పాస్బుక్కులు!
మండలంలోని సిద్ధాపురం సొసైటీకి మంగళవారం రైతులు క్యూకట్టారు. రాత్రి యూరియా లారీ సొసైటీకి చేరుకోవడంతో బుధవారం ఉదయం యూరియా విక్రయిస్తారని భావించిన రైతులు అక్కడకు భారీగా చేరుకుని పట్టాదార్ పాస్పుస్తకాల జిరాక్స్ ప్రతులను క్యూలైన్లో పెట్టారు. ఇప్పటివరకు చెప్పులు లైన్లో పెట్టిన రైతులు ఈసారి పట్టాదార్ పాస్పుస్తకాలు పెట్టడం గమనార్హం. అయితే కొంతమంది రైతులు అర్ధరాత్రి వరకు అక్కడ నిరీక్షించి ఇంటి దారిపట్టగా, మరికొంత మంది రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద కునుకు తీసినట్లు స్థానికులు చెప్పారు. –హసన్పర్తి -
‘ఉద్యాన’ సాగుకు రైతులను ప్రోత్సహించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్హన్మకొండ అర్బన్: జిల్లాలో పండ్లు, కూరగాయల సాగులో రైతులను ప్రోత్సహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీశ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులు, మహిళా సమాఖ్య అధ్యక్షురాళ్లతో పండ్లు, కూరగాయల సాగు, వాటి అమ్మకాలు, పట్టుపరిశ్రమ, తదితర అంశాల పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీశ్ మాట్లాడుతూ.. జిల్లాలో చాలా మంది రైతులు వరి సాగుకే మొగ్గు చూపిస్తున్నారన్నారు. పండ్లు, కూరగాయలకు ఎప్పుడూ మంచి మార్కెట్ ఉంటుందని, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోకుండా జిల్లాలోనే పండ్లు, కూరగాయలు సాగయ్యే విధంగా అధికారులు రైతులను ప్రోత్సహించాలన్నారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కొంత భూమి లీజుకు తీసుకొని పట్టు సాగు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలుపైనే కాకుండా పండ్లు, కూరగాయల మార్కెటింగ్ చేయడంపై ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, మహిళా సమాఖ్యలు లాభాల బాటలో సాగాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, ఉద్యానశాఖ అధికారి అనసూయ, మార్కెటింగ్ శాఖ అధికారి అనురాధ, జిల్లా వ్యవసాయాధికారి రవీందర్సింగ్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం నవీన్కుమార్, మహిళా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. -
చరిత్రలో నిలిచేలా గద్దెల నిర్మాణాలు
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మల కీర్తిప్రతిష్టను నిలబెడుదామని, వందేళ్ల అమ్మవార్ల చరిత్ర నిలిచేలా శాశ్వత నిర్మాణాలను చేపట్టేందుకు మేడారం మాస్టర్ ప్లాన్ రూపొందించిన్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. మంగళవారం మేడారంలోని ఐటీడీఏ అతిథిగృహంలో కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరీశ్, పీఆర్శాఖ ఇంజనీరింగ్, దేవాదాయశాఖ, పూజారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత మాస్టర్ ప్లాన్లో గద్దెల ప్రాంగణంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల డిజైన్ను అర్కిటెక్ బృందం ప్రొజెక్టర్ ద్వారా చూపించారు. గద్దెల ప్రాంగణంలోని అభివృద్ధి ప నుల ఏర్పాట్లపై సమీక్షించిన అనంతరం సీతక్క మాట్లాడారు. పూజారుల అభిప్రాయాలు, నిర్ణయా ల మేరకు గద్దెల ప్రాంగణంలో మార్పులు చేర్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులను వంద రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క ఈనెల, 13,14వ తేదీన సీఎం రేవంత్రెడ్డి మేడారానికి వచ్చే అవకాశం ఉంది. దీంతో మంత్రి సీతక్క అధికారులతో కలిసి మేడారం వైజంక్షన్ సమీపంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సీఎం సమావేశం నిర్వహణకు స్థలాన్ని పరిశీలించారు. శివరాంసాగర్ సమీపంలోని వీఐపీ రోడ్డును సీతక్క పరిశీలించి, వరద కోతతో పైపులు బయటికి కనిపించడంతో మరమ్మతులు చేయాలని ఆదేశించారు. సీఎం పర్యటన సందర్భంగా వచ్చే వీఐపీ, వీవీఐపీల విశ్రాంతి కోసం హరితహోటల్ను పరిశీలించి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, ఎస్పీ డాక్టర్తో చర్చించారు. అనంతరం అమ్మవార్లను మంత్రి సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీందర్, ఈఓ వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, అర్కిటెక్ బృందం పాల్గొన్నారు. పూజారుల అభిప్రాయాల స్వీకరణ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ స్థపతి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి డాక్టర్ శివనాగిరెడ్డి, అర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అధికారులు, దేవాదాయశాఖ ఇంజనీరింగ్ అధికారులు, పూజా రులు గద్దెల వద్దకు వెళ్లి మాస్లర్ ప్లాన్లో చేయాల్సిన మార్పులు,చేర్పులను అడిగి తెలుసుకున్నా రు. నూతన సాలహారంపై ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయల చిత్రాలు, పడిగలను ఏర్పాటు చేయాలని పూజారులు వివరించారు. బుధవారం ఫైనల్ మాస్టర్ ప్లాన్ డిజైన్ను రూపొందించాలని శివనాగిరెడ్డి అర్కిటెక్ డిజైనర్ల బృందానికి సూచించారు. సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలన -
ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తాం..
ఖిలా వరంగల్: వరంగల్ జిల్లాలోని 509 రేషన్ దు కాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం తరలింపునకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేద ని, ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి తరలింపునకు చర్యలు తీసుకుంటామని అదనపు జిల్లా కలెక్టర్ సంధ్యరాణి, జిల్లా పౌర సరఫరాల అధికారి తెలి పారు.‘దొడ్డు బియ్యం ఎలుకల పాలు’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ఈనెల 6 న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా వ్యాప్తంగా 509 రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయని, ప్రభుత్వ ఆదేశాల మేరకు బియ్యం తరలింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. అధికార పార్టీ నాయకుడు, తహసీల్దార్పై కేసు● ఉద్యోగి ఆత్మహత్యాయత్నం ఘటనపై పోలీసుల విచారణనల్లబెల్లి : ఉద్యోగి ఆత్మహత్యాయత్నం ఘటనలో అధికార పార్టీ నాయకుడు మాలోత్ చరణ్సింగ్, తహసీల్దార్ ముప్పు కృష్ణపై మంగళవారం కేసు నమోదైంది. ఎస్సై గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్ శివారు బజ్జుతండాకు చెందిన వాంకుడోత్ కల్పన తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తోంది. అధికారి అండదండలతో బిల్నాయక్ తండాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు మాలోత్ చరణ్సింగ్ లైంగికంగా వేధిస్తూ, కార్యాలయానికి వస్తూ చంపుతానని ఆమెను బెదిరించేవాడు. ఈనెల 5న పలు తప్పుడు ఆరోపణలతో కల్పనపై చరణ్సింగ్ కలెక్టర్కు ఫిర్యా దు చేసినట్లు మేడపల్లి మాజీ ఎంపీటీసీ భర్త మాలోత్ మోహన్ ఆమెకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాడు. చరణ్సింగ్ వేధింపులు, త ప్పుడు ఆరోపణలపై కల్పన సోమవారం తహసీల్దార్కు వినతిపత్రం అందించింది. దీంతో నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇప్పటికై నా చరణ్సింగ్తో బయట వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలని తహసీల్దార్ దురుసుగా సమాధానం చెప్పి బయటకు వెళ్లగొట్టా డని ఎస్సై తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన కల్పన కార్యాలయంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి భర్త ధూప్సింగ్ ఫిరా ్యదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
నల్లా పన్ను బకాయిలు వసూలు చేయాలి
బుధవారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025వరంగల్ అర్బన్: నల్లా పన్నుల బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలని నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఆర్ఓలు, ఆర్ఐలతో నల్లా పన్ను బకాయిల వసూళ్లపై మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నల్లా బకాయిల వసూళ్ల లక్ష్యం రూ.45 కోట్లు ఉందని తెలిపారు. ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి వసూలు చేయాలని పేర్కొన్నారు. గత సంవత్సరం కంటే ఈసారి సుమారు 12 శాతం అధిక లక్ష్యాన్ని సాధించాలని సీడీఎంఏ నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. పెద్ద మొత్తంలో బకాయి ఉన్న 150 మంది జాబితా తయారు చేయాలని సూచించారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఆర్ఓ లు షెహజాది బేగం, శ్రీనివాస్, ఆర్ఐలు పాల్గొన్నారు. రోడ్ల పక్కన దేవతామూర్తుల విగ్రహాల అమ్మకాలు నిషేధం.. రోడ్ల పక్కన దేవతామూర్తుల విగ్రహాల అమ్మకాలు నిషేధమని అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నందున బల్దియా పరిధిలో రోడ్ల పక్కన దేవతామూర్తుల విగ్రహాలు అమ్మడం నిషేధమని పేర్కొన్నారు. వరంగల్ నగరానికి సంబంధించి ఉర్సు రంగలీల మైదానం, హనుమకొండ పరిధిలో హయగ్రీవాచారి గ్రౌండ్ (కాళోజీ కళాక్షేత్రం పక్క మైదానం) ప్రాంతాల్లో అమ్మకాలు జరుపుకోవాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్ల పక్కన విక్రయాలు జరిపితే చర్యలు తప్పవని అదనపు కమిషనర్ హెచ్చరించారు. అధికారుల సమీక్షలో నగర మేయర్ గుండు సుధారాణి -
ఉద్యమ ధ్వజం..
అక్షరాలను అగ్ని కణాలుగా విరజిమ్మావు.. అఖిలాండంలోని అనాథలగాథలను వినిపించావు అణగదొక్క గర్జించావు అధికారం ముసుగులో కాళికవై కదిలావు ప్రశ్నించేతత్వానికి ప్రహ్లాదుడే గురువని ప్రవచించావు ఉప్పెనలా ఎగిసిపడే ఉద్యమాలకెన్నిటికో ఊపిరిగా నిలిచావు ప్రజల భాషలో ప్రజల గొడవకు పట్టం కట్టావు నిర్మోహ్మటం, నిజాయతీలనే త్రికరణశుద్ధిగా పాటించావు సామాన్యుడిగా ఉంటూనే సాహసంతో సత్యాగ్రహిగా బతికావు తెలంగాణ పోరు తేరుపై ‘ఉద్యమ ధ్వజం’గా మిగిలావు– కాళోజీ జయంతి సందర్భంగా పాలకుర్తికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ శంకరమచి శ్యాంప్రసాద్. (9989148305) –పాలకుర్తి టౌన్ -
వైద్య రంగంలో ఫిజియోథెరపీ కీలకం
హన్మకొండ: వైద్య రంగంలో ఫిజియోథెరపీ చికిత్స కీలకమని వర్ధన్నపేట ఎమ్మె ల్యే కె.ఆర్.నాగరాజు అన్నారు. సోమవారం హనుమకొండ సుబేదారిలోని ఎస్ఆర్ కన్వెన్షన్లో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా లయన్స్ క్లబ్ హనుమకొండ ఫిజియోథెరపిస్ట్ ఆవిర్భావ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రోగుల ఆరోగ్య పునరుద్ధరణలో ఫిజియోథెరపీ చికిత్స కీలకమన్నారు. శరీర నొప్పులు, గాయాలు, స్ట్రోక్లు, శస్త్ర చికిత్సల అనంతర పునరావాసంలో ఫిజియోథెరపిస్ట్ల సేవలు అమూల్యమన్నారు. వీరి కృషితోనే అనేక మంది సాధారణ జీవితం గడుపుతున్నారన్నారు. వృత్తి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహాయం పొందేందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ సందర్భంగా ఫిజియోథెరపీ వైద్యులు, విద్యార్థులను సన్మానించారు. ఫిజియోథెరపీ వైద్యులు కూడా ఎమ్మెల్యే నాగరాజును సన్మానించారు. కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, ఫిజియోథెరిపీ వైద్యుల కమిటీ, లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు -
కుర్చీ మీద ప్రేమతోనే బీజేపీ హిందూ నినాదం
హన్మకొండ: కుర్చీ మీద ప్రేమతోనే బీజేపీ హిందూ నినాదం ఎత్తుకుందని, అధికారం కోసం అడ్డదారులు తొక్కుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు దుయ్యబట్టారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ సె క్యులరిజం, సోషలిజం పదాలను రాజ్యాంగం నుంచి తీసివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సీ బీఐ, ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలను వారికి అనుకూలంగా మలుచుకున్నారని, ప్ర శ్నిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారని తూర్పారబట్టారు. ఉప రాష్ట్రపతిగా పోటీ చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుకు బీజేపీ వక్రభాష్యం పలుకుతుందని విమర్శించారు. కమ్యూనిస్టులంటే ప్రధాని మోదీ, బీజేపీకి భయమన్నారు. భగత్ సింగ్, సుభాశ్చంద్రబోస్, దొడ్డి కొమురయ్య, చివరకు చాకలి ఐలమ్మ, తెలంగాణ సాయుధపోరాటాన్ని బీ జేపీ హైజాక్ చేసిందని మండిపడ్డారు. దేశానికి క మ్యూనిస్టుల అవసరం ఉందని, తామంత ఒకట య్యే సమయం వస్తుందన్నారు. బీఆర్ఎస్పై రాష్ట్రంలో రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయని, బీ జేపీలో విలీనం కానుందని, ఇతర చర్చలు జరుగుతున్నాయన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి ఆశయ సాధనకు పార్టీ మందుకెళ్తుందన్నారు. సభలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు, సీపీఎం, సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శులు జి.ప్రభాకర్ రెడ్డి, కర్రె భిక్షపతి, సీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ బాషుమియా, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, నాయకులు నేదునూరి జ్యోతి, టి.వెంకట్రాములు, సదాలక్ష్మి, పనాస ప్రసాద్, మేక ల రవి, సిరబోయిన కరుణాకర్, వలీఉల్లాఖాద్రి, టి.విశ్వేశ్వర్ రావు, పల్లె నర్సింహ, తోట భిక్షపతి, మద్దెల ఎల్లేశ్, అరూరి కుమార్ పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు -
కాజీపేట జంక్షన్ మీదుగా ప్రత్యేక రైళ్లు
● 11వ తేదీ నుంచి అమల్లోకి.. కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణికుల సౌకర్యార్థం దసరా, దీపావళి పండుగల సందర్భంగా చర్లపల్లి–ససరమ్ మధ్య 22 ప్రత్యేక రైళ్ల సర్వీస్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. సెప్టెంబర్ 11 నుంచి నవంబర్ 20వ తేదీ వరకు చర్లపల్లి–ససరమ్ (07021) మధ్య 11 ప్రత్యేక రైళ్లు ప్రతీ గురువారం కాజీపేట జంక్షన్కు చేరుకుని వెళ్తాయి. అదేవిధంగా సెప్టెంబర్ 12 నుంచి నవంబర్ 21వ తేదీ వరకు ససరమ్–చర్లపల్లి (07022) మధ్య 11 ప్రత్యేక రైళ్లు ప్రతీ శనివారం కాజీపేట జంక్షన్కు చేరుకుని వెళ్తాయి. 1 –ఏసి, 2 –ఏసి, 3 –ఏసి, స్లీపర్ క్లాస్ అండ్ జనరల్ సెకంగ్ క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీస్లకు జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, సిర్పూర్కాగజ్నగర్, బల్లార్షా, నాగ్పూర్, ఇటార్సీ, పిపరియా, మదన్ మహల్, కట్నీ, సంత, మణిక్పూర్, ప్రయాగ్రాజ్, దీన్దయాల్ ఉపాధ్యాయ స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు ఆయన తెలిపారు. పలు స్టేషన్లలో హాల్టింగ్ కొనసాగింపు కాజీపేట జంక్షన్, వరంగల్ రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణించే పలు రైళ్లకు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన తాత్కాలిక హాల్టింగ్లను కొనసాగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. హాల్టింగ్ స్టేషన్లు ఇవే దానాపూర్–సికింద్రాబాద్ (12792) దానాపూర్ ఎక్స్ప్రెస్కు జమ్మికుంట, నర్సాపూర్–నాగర్సోల్ (12787) ఎక్స్ప్రెస్కు మహబూబాబాద్, నాగర్సోల్–నర్సాపూర్ (12788) ఎక్స్ప్రెస్కు మహబూబాబాద్, పూణె–కాజీపేట (22151) ఎక్స్ప్రెస్కు మంచిర్యాల, కాజీపేట–పూణె (22152) ఎక్స్ప్రెస్కు మంచిర్యాల రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు సీపీఆర్వో తెలిపారు. -
ఆలయాల్లో శుద్ధి.. సంప్రోక్షణ
హన్మకొండ కల్చరల్ : సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల ఆదివారం నగరంలోని పలు ఆలయాలను మూసివేశారు. సోమవారం ఉదయం ఆయా దేవాలయాల్లో గ్రహణ సంప్రోక్షణలు శుద్ధిచేసి దేవతామూర్తులకు అభిషేకం, పూజలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతించారు. వేయిస్తంభాల దేవాలయంలో గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో శ్రీరుద్రేశ్వరస్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. శ్రీభద్రకాళి దేవాలయంలో ఆలయ వేదపండితులు పార్నంది నరసింహమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు సంప్రోక్షణలో భాగంగా హోమం నిర్వహించారు. అలాగే దసరా నవరాత్రుల సందర్భంగా దాతల సహకారంతో దేవాలయానికి రంగులు, సున్నాలు వేయించారు. వరంగల్లోని ఎంజీఎం ఎదురుగా గల శ్రీరాజరాజేశ్వరీదేవి దేవాలయంలో అర్చకులు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హన్మకొండ : అక్రమ కేసులపై న్యాయస్థానాల్లో పోరాడుదామని, బీఆర్ఎస్ శ్రేణులకు లీగల్ సెల్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, లీగల్ సెల్ హనుమకొండ, వరంగల్ జిల్లా బాధ్యులు కేటీఆర్ను కలిసి ప్రత్యేకంగా మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గ పరిధి లో యూరియా పంపిణీ, కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం హనుమకొండ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించిన నేపథ్యంలో పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని లీగల్ సెల్ బృందం కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గులాబీ శ్రేణుల పక్షాన పార్టీ లీగల్ సెల్ పోరాడుతుందని అన్నారు. అక్రమ కేసులకు భయపడబోమని, బీఆర్ఎస్ శ్రేణులకు ఉద్యమాలు కొత్త కాదని తెలిపారు. కార్యక్రమంలో లీగల్ సెల్ బాధ్యులు, సీనియర్ న్యాయవాది తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, వినోద్ కుమార్ పాల్గొన్నారు. -
రెనోవా బన్ను ఆస్పత్రి ప్రారంభం
● సామాన్యులకు అందుబాటులో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స ఎంజీఎం : ప్రజలకు ప్రపంచ స్థాయి నాణ్యతతో క్యాన్సర్ చికిత్స అందించేందుకు రెనోవా బన్ను ఆస్పత్రిని ప్రారంబించినట్లు రెనోవా గ్రూపు ఆస్పత్రి ఫౌండర్ సీఈఓ శ్రీధర్ పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ములుగు రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రిని సోమవారం ఆరోగ్యవర్సిటీ వీసీ నందకుమార్రెడ్డి, రిజిస్ట్రార్ నాగార్జునారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ పెద్దిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ ప్రాంతంలో తొలి సమగ్ర క్యాన్సర్ ఆస్పత్రిగా రెనోవా బన్ను ఆస్పత్రి నిలుస్తుందని తెలిపారు. ఈ ఆస్పత్రిలో అత్యాధునిక సదుపాయాలైన దాదాపు రూ. 20 కోట్ల విలువైన హెల్కాయిన్ ఇమేజ్ గైడెడ్ రేడియేషన్, దాదాపు రూ.6 కోట్ల విలువైన పెట్ సిటీ పరికరాలతో అంతర్జాతీయ స్థాయి చికిత్స సదుపాయాలు వరంగల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ప్రభాకర్రావు, ఐఎంఏ ప్రతినిధులు పాల్గొన్నారు. -
సినీఫక్కీలో కిడ్నాప్..?
● డబ్బుల కోసం 32 ఏళ్ల యువకుడి హైడ్రామా ● ఐదు గంటల్లో కథ సుఖాంతంరామన్నపేట : బెట్టింగ్లకు అలవాటు పడిన ఓ యువకుడు అప్పులపాలయ్యాడు.. తల్లిదండ్రుల నుంచి ఎలాగైనా డబ్బులు లాగాలని తనకు తానే కిడ్నాప్ డ్రామాకు తెరలేపాడు. అతనికి పరిచయమైన ఓ ఆటో డ్రైవర్తో తానే కిడ్నాప్ అయ్యి తన తండ్రికి రూ.10లక్షలు కావాలని ఫోన్ చేయించాడు. ఈ క్రమంలో సదరు యువకుడి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. వరంగల్ పోచమ్మ మైదాన్ ప్రాంతానికి చెందిన 32ఏళ్ల అదిల్ సోనీ జకోటియా కాంప్లెక్స్ సమీపంలో ఆటో స్పేర్ పార్ట్స్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో విలాసాలతోపాటు బెట్టింగ్లకు అలవాటు పడి రూ.5లక్షలకు పైగా అప్పులయ్యాయి. ఎలాగైనా అప్పు తీర్చాలని తనకు పరిచయమైన యాకూబ్ అనే ఆటో డ్రైవర్తో కిడ్నాప్ చేయాలని ప్రణాళిక రూపొందించుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం నిజమైన తరహాలో కిడ్నాప్ అయినట్లు సీసీ కెమెరాలకు చిక్కకుండా ఆటోలో కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ నటించారు. అక్కడినుంచి వెళ్లిన తర్వాత తన తండ్రి అశోక్ సోనీకి యాకూబ్ ఫోన్ చేసి శ్రీమీ కొడుకును కిడ్నాప్ చేశాం. రూ.పది లక్షలు కావాలి.. శాయంపేట జంక్షన్ను రావాలనిశ్రీ అని బెదిరించారు. ఈ విషయాన్ని అశోక్ సోనీ పోలీసులకు చెప్పడంతో అప్రమత్తమయ్యారు. సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా రాత్రి 9గంటల ప్రాంతంలో బృందాలుగా విడిపోయి చింతల్ వద్ద వారిని పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా అసలు విషయం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. దీనిపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. -
కాళోజీ.. ధిక్కారస్వరం
హన్మకొండ కల్చరల్ : పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు.. ధిక్కార స్వారానికి మారుపేరు. ప్రశ్నించేతత్వానికి చిరునామా. ‘ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తం.. ప్రాంతేతరులు దోపిడీ చేస్తే తన్ని తరుముతాం.. దోస్తుగ ఉండే వారితో మే మూ దోస్తే చేస్తం.. ప్రాణమిస్తం.. ఎంతకు అంత అన్న ధోరణితో చింతమాని బతుకు సాగిస్తం’ అంటూ తన కవితల ద్వారా నిరంత రం పాలకులపై ధిక్కారస్వరం వి నిపించేవారు. తెలంగాణ మాండలికంలో తన రచనల ద్వారా ప్రజలను చైతన్య పరిచేవారు.ఈక్రమంలో మంగళవారం కాళోజీ జయంతి, తెలంగాణ భా షా (మాండలిక) దినోత్సవాన్ని పురస్కరించుకు ని కాళోజీ నారాయణరావుపై‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఏకీభవించనోని పీక నొక్కుటే ఫాసిజం.. శాంతిని అందరూ కోరుకుంటున్నట్లు మాట్లాడుతారు. శాంతిగా మెలగుటమంచిదే. కానీ శాంతి పరిస్థితి కలదా సఖుడా! అన్నది నా ప్రశ్న. ‘శాంతి శాంతట శాంతి గుండె మండిపోతుంటే, కండ కరిగిపోతుంటే బతుకు చితికిపోతుంటే, ఎముక విరిగిపోతుంటే శాంతి శాంతట శాంతి’. హింస హింస అని వూరికే అంటుంటారు. నా దృష్టిలోనూ హింస తప్పు. రాజ్యహింస మరీ తప్పు. ప్రతి హింస తప్పుకాదు. ఏకీభవించనోని పీక నొక్కు సిద్ధాంతం అంటే మరేమిటోకాదు అచ్చమైన ఫాసిజం. నాగొడవలో హిరణ్యకశిపుడు అచ్చమైన ఫాసిస్టు ప్రహ్లదుడు సత్యాగ్రహి, సత్యాగ్రహం వల్ల ఫాసిస్టుల్లో పరివర్తన జరగనప్పుడు నరసింహుల్లా ప్రతిహింస తప్పదు. అన్యాయాన్నెదిరించిన వాడే ఆరాధ్యుడు.. మ్రోగుతున్న ప్రజల వాణి/ ఆగి మూగపోతున్నద?/ దోపిడీ పెత్తన్దారికి / తోడా? ఆ చావు కూడా/ ఎదిరించిన ప్రతీ వ్యక్తికి / ఈ వ్యవస్థలో అవస్థ/ రాజీపడు ‘మేతావి’/ పాజీలకు మజామజా.. అన్యాయాన్నెదిరించిన/ వాడు నాకు ఆరాధ్యుడు/ పేరుకు బతికున్న ప్రభుత్వం/ పేరుకు చస్తున్న ‘రాజు’ / అన్నాయాన్నేదిరిస్తే నాగొడవకు సంతృప్తి / అన్యాయం అంతరిస్తే/ నాగొడవకు ముక్తిప్రాప్తి. ప్రశ్నించడం మానొద్దు.. ప్రశ్నలడగడంలో నేనేప్పుడు ప్రథముడినే. 1946లో నైజాం రాజును అడిగా నేను అడగడం మాత్రం మానలేదు. నిజమైన కవి అన్నవాడు జనం కోసం న్యాయం అడుగుతాడు. ఎవరి పనుల్లో వారు మునిగిపోగుడదు. ఎవరి బాగు వాళ్లు చూసుకుంటూ కూర్చోకూడదు. నిలదీసి ప్రశ్నించినవారిని ప్రభుత్వం బందిస్తుంది. వాళ్లమీద కక్షగడుతుంది. అయినా ప్రభుత్వం చూపించే ఎరలకు లొంగిపోకూడదు. ఆలోచించాలి.. అడగాలి. ప్రశ్నలు అందరూ అడగాలి. చైతన్యం కలిగించాలి. తిరగబడాలి. ఎదురించాలి. రైతుబాధలు.. రాణివాసములోన రంజిల్లు రాజా/ రైతు బాధలు తీర్చి రక్షించ లేవా/ పట్టణపు సొగసుకై పాటుపడురాజా/ పల్లెకందము గూర్చు బాధ్యత తెలియదా?/ ప్రజలను హింసించు ప్రభువు మాకేల? / వధియించి భక్షించ వనరాజు లేడా?/ సామాన్య ప్రజలకు చైతన్య మొదవ/ చతురంగ బలముండ జంకేల రాజా? జాగ్రత్త.. మనసు సంతలో బేరమాడబోకు/ బతుకు పెన్నిధిని గవ్వల కమ్మబోకు నిన్ను మించినదేమున్నది కోరుకొనగ/ ఆశనిరాశల వసతి మనసు కాగూడదెప్పుడు/ కలము గారడీ చేయకు కవితనెపుడు. నడత – నాణ్యం.. దొంగవలె అందాల తొంగిచూచుట తప్పు/ ఆగుపడిన అందాన్ని అరయకుండుట తప్పు/ కనపడ్డ ప్ర తీదాని కానపడుటయు తప్పు/ భంగపడి వాంఛల కు లొంగిపోవుట తప్పు/ కినుకతో మదిలోన కృంగిపోవుట తప్పు/ పైకి ప్రహ్లదువలె పలుకుచుండుట తప్పు/ సహజ ప్రవృత్తులను చంపివేయట తప్పు/ సహజమని వృత్తుల చంకచేరుట తప్పు.. స్వేచ్ఛ.. బాధ్యత ఎరుగని స్వేచ్ఛ బానిసత్వ లక్షణము బాధ్యత ఎరిగిన స్వేచ్ఛ స్వాతంత్రపు రక్షణము వ్యక్తిత్వం.. ‘ప్రతివారికి వ్యక్తిత్వం ఉంటేనే పౌరత్వం వ్యక్తిత్వం భద్రంగా ఉంటేనే వ్యక్తి బతుకు వ్యక్తిత్వం భద్రంగా ఉంటేనే జాతి బతుకు’ కాళోజీ నారాయణరావు (ఫైల్) కవితలతో ప్రజల్లో నిత్యం చైతన్యం నింపిన స్ఫూర్తి ప్రదాత అన్యాయాలను ఎదురిస్తూ ప్రజాస్వామ్య విలువలు బోధించిన శక్తి.. నేడు కాళోజీ జయంతి, తెలంగాణ భాషా (మాండలిక) దినోత్సవంమానవత్వ విలువలు ప్రబోధించిన శక్తి.. తన భావాలకే కాదు శరీరానికి మరణం లేదని నిరూపించిన వ్యక్తి పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు. 1914 సెప్టెంబర్ 9వ తేదీన రంగారావు, రమబాయి దంపతులకు కాళోజీ జన్మించారు. పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. మడికొండలో ప్రాథమిక విద్య, హనుమకొండ, హైదరాబాద్లలో ఉన్నతవిద్యనభ్యసించారు. కాళోజీ పదిహేనేళ్ల వయసు నుంచే రాజకీయ ఉద్యమాలు, కవిత, రచనా వ్యాసంగాలలో మునిగిపోయారు. ఆర్య సమాజం, ఆంధ్రమహాసభ , నిజాంస్టేట్ కాంగ్రెస్లో సభ్యుడిగా ఉంటూ నైజాం వ్యతిరేకపోరాటంలో పనిచేశారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత 1958 నుంచి 1960 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా , ఆంధ్రసారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీల్లో సభ్యుడిగా, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, కాళోజీ సతీమణి రుక్మిణి కాళోజీ ఉద్యమాలు, అరెస్ట్ల నేపథ్యంలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకున్నారు. కాళోజీ అభిప్రాయాలు ... -
ప్రయత్నాలు వినూత్నం.. ఫలితాలు శూన్యం
న్యూశాయంపేట: ప్రజావాణిలో గత రెండు, మూడు వారాలుగా ఉన్నతాధికారులు వినూత్న ఆలోచనతో ఫిర్యాదుదారుల సమస్యల్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక వారం అధికారులు కలెక్టర్ వెనకాల కూర్చోగా.. ఎదురుగా ఎదురుగా ఫిర్యాదు దారులు కూర్చున్నారు. సమస్యల్ని అధికారులకు వివరించారు. ఈవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ముందుగా అర్జీదారులందరితో మాట్లాడించారు. సమస్యలను అక్కడున్న సంబంధిత అధికారులకు వివరించే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారుల ఆలోచనలు బాగున్నప్పటికీ.. కింది స్థాయి అధికారులు ప్రజల వినతులను పరిష్కరించేందుకు శ్రద్ధ చూపడం లేదని ఫిర్యాదుదారులు వాపోతున్నారు. ఆలోచనలు సరే ఆచరణేది? అంటూ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. వినతులు సత్వరమే పరిష్కరించండి ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల్ని సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా శాఖల అధికారులకు అందజేశారు. ప్రజావాణిలో 136 ఫిర్యాదులు రాగా.. అధికంగా రెవెన్యూ సమస్యలు 60, జీడబ్ల్యూఎంసీ 21, విద్యాశాఖ 11, సహకార శాఖ 9, గృహ నిర్మాణ శాఖ 7, వైద్య ఆరోగ్యశాఖ, ఉపాధికల్పన శాఖలకు 3 చొప్పున, ఇతర శాఖలకు సంబంధించి 22 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ‘వరంగల్ జిల్లా మీదుగా వెళ్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే ఆలైన్మెంట్ మార్చాలని పోరాడాం. పరిష్కారం కాలేదు’ అని బాధిత రైతులు కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీఏఓ అనురాధ, డీఎంహెచ్ఓ సాంబశివరావు, గృహనిర్మాణ శాఖ పీడీ గణపతి, డీసీఓ రాజమణి, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, ఆర్సీఓ అపర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దారులు, విభాగాల పర్యవేక్షకులు పాల్గొన్నారు. అనాలోచిత ఏర్పాట్లు.. దివ్యాంగులకు ఇక్కట్లు అధికారుల అనాలోచిత చర్యతో సోమవారం ప్రజావాణికి వచ్చిన దివ్యాంగులు ఇబ్బందులు పడ్డారు. కలెక్టరేట్ సమావేశ హాల్ వెనుక డోర్ వద్ద దరఖాస్తులు స్వీకరించి వరుస క్రమంలో ఫిర్యాదులను స్కాన్ చేసి ఫిర్యాదుదారులను వరుస క్రమంలో పంపేవారు. కానీ సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో సమావేశ హాల్లోకి వచ్చే దారిలో ర్యాంపు ఎదురుగానే కంప్యూటర్ పెట్టుకుని సిబ్బంది కూర్చున్నారు. దీంతో ర్యాంపు మీదుగా రాలేక దివ్యాంగులు మెట్లు, ఎక్కుతూ, దిగుతూ ఇబ్బందులు పడి కలెక్టర్కు వినతి పత్రాలు ఇచ్చి వచ్చారు. ఫిర్యాదుదారులతో మాట్లాడించిన కలెక్టర్ ఆతర్వాత అర్జీల స్వీకరణ సమస్యలు సత్వరమే పరిష్కరించాలని అర్జీదారుల మొర హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో ప్రజలనుంచి స్వీకరించిన వినతుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె పాల్గొని ప్రజలనుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా శాఖల అధికారులు వినతుల పరిష్కారంలో జాప్యం చేయొద్దని సూచించారు. ప్రజావాణిలో హౌసింగ్ పీడీ–20, తహసీల్దార్ హసన్పర్తి–15, ఆర్డీఓ హనుమకొండ–14, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ –13లతో పాటు వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 150 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వై.వి గణేష్, డీఆర్డీఓ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేష్, నారాయణ, సీపీఓ సత్యనారాయణరెడ్డి, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
అభ్యంతరాలు ఉంటే తెలపాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్ : జిల్లాలోని 12మండలాల్లో గ్రామ పంచాయతీల వారీగా ముసాయిదా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో వారితో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి 10వ తేదీన ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జెడ్పీ సీఈఓ రవి సమాధానమిచ్చారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ.వి శ్రీనివాసరావు, శ్యామ్సుందర్, ప్రభాకర్రెడ్డి, సయ్యద్ ఫైజుల్లా, నిశాంత్, రజనీకాంత్, ఎండీ నేహాల్, ఇండ్ల నాగేశ్వర్రావు, ప్రవీణ్కుమార్, జయంత్లాల్, తదితరులు పాల్గొన్నారు. 17నుంచి స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాలు.. మహిళల ఆరోగ్యమే ధ్యేయంగా ఈనెల 17వ తేదీనుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడంపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మహిళలకు నిర్దేశించిన ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులతో అన్ని రకాల పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. డీఎంహెచ్ఓ అప్పయ్య, జెడ్పీ ఇన్చార్జ్ సీఈఓ రవి, డీపీఓ లక్ష్మీరమాకాంత్, డీఈఓ వాసంతి, డీడబ్ల్యూఓ జయంతి, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ నిర్మల, అధికారులు పాల్గొన్నారు. రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీల తుది జాబితా న్యూశాయంపేట: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈనెల 10న(బుధవారం) వెలువరించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 10న తుది జాబితా వెలువరిస్తామని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సీఈఓ రామిరెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నేత్రదానంపై అవగాహన ఉండాలి
ఎంజీఎం : నేత్రదానం చేసి మరణానంతరం కూడా జీవించాలని, ప్రతీ ఒక్కరికి నేత్రదానంపై అవగాహన ఉండాలని కేఎంసీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీపతి పేర్కొన్నారు. 40వ నేత్రదాన పక్షోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం కేఎంసీ నుంచి ప్రభుత్వ ప్రాంతీయ నేత్రవైద్యశాల వరకు నిర్వహించిన ర్యాలీని లక్ష్మీపతి జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.ఆర్ భరత్కుమార్, శ్రీకుమార్, హరిదేవ్, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, పీజీ డాక్టర్లు, ఆప్టోమెట్రి, బీఎస్సీ, జీఎన్ఎం నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి వరంగల్ క్రైం: ఈనెల 13న నిర్వహించే జాతీ య మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వి నియోగం చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్లో క్రిమి నల్, సివిల్, ఆస్తి, కుటుంబ, వైవాహిక జీవిత, బ్యాంక్ రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్, తదితర కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకొని కోర్టు చుట్టూ తిరుగుతూ విలువైన సమయం, డబ్బులను వృథా చేసుకోవద్దని పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు, ఇతర పోలీస్ సిబ్బంది రాజీపడ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సెలింగ్ చేసి రాజీపడేలా అవగాహన కల్పిస్తారని వివరించారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యా యం జరుగుతుందని, రాజీపడదగే వారు పో లీస్ అధికారులను సంప్రదించాలని కోరారు.తరగతి గదిలో టీఎల్ఎంలు వినియోగించాలి: హనుమకొండ డీఈఓ వాసంతివిద్యారణ్యపురి : తరగతిగదిలో విద్యార్థులకు బోధించేటప్పుడు టీఎల్ఎంలను (కృత్యాధార పద్ధతులు) వినియోగించాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి పేర్కొన్నారు. సోమవారం హనుమకొండలోని లష్కర్బజార్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి టీఎల్ఎం మేళాను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు రెడీమెడ్గా తయారుచేసిన టీఎల్ఎంలు కాకుండా వారే సొంతంగా తయారు చేసుకోవాలని సూచించారు. 14 మండలాల నుంచి 140మంది ఉపాధ్యాయులు టీఎల్ఎం చార్టులను ప్రదర్శించారు. ప్రదర్శనలోని టీఎల్ఎంల నుంచి తెలుగు ఉర్దూ, ఇంగ్లిష్ భాషలో మూడు, గణితంలో రెండు, ఈవీఎస్లో ఒకటి రాష్ట్రస్థాయి మేళాకు ఎంపికయ్యాయి. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ బండారు మన్మోహన్, ఎంఈఓ నెహ్రూ నాయక్, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి, వేణుఆనంద్, మధుసూదన్ రెడ్డి, ఎం.సోమయ్య, కేశవరావు, అశోక్కుమార్, వెంకట్రామ్రెడ్డి పాల్గొన్నారు. డీఈఓ వాసంతి ఆయా ఉపాధ్యాయులకు ప్రశంసపత్రాలు అందజేశారు.కేఎంసీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశాలకు.. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ సంధ్య అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారు. ఉస్మానియా, గాంధీ, కాకతీయ అండ్ తెలంగాణ మెడికల్ అలూమ్ని వార్షిక మహాసభ–2025 (ఓజీకేటీఎంఏ) అమెరికాలోని కెంటకీ లూయిస్వీల్ మారియట్ ఈస్ట్లో ఈనెల 6వ తేదీన నిర్వహించారు. ఇందులో భాగంగా డాక్టర్ సుంకరనేని సంధ్య క్రిటీ–2025 (కాకతీయ రీసెర్చీ ఇన్సెటివ్ ఫర్ ట్రాన్స్ఫర్మెటివ్ ఇన్నోవేషన్) పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య కేఎంసీ అభివృద్ధికి అల్యూమ్ని చేస్తున్న సహకారాన్ని అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ అవకాశాల కోసం విద్యార్థులకు ఎన్ఆర్ఐ పూర్వ విద్యార్థుల మెంటర్షిప్ అవసరాన్ని వివరించారు. ఈ ప్రతిపాదనలకు ఎన్ఆర్ఐ అల్యూమ్ని పూర్తి మద్దతు ప్రకటించి కళాశాల అభివృద్ధి తోడ్పాడుతామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. -
పింఛన్లు పెంచే వరకు పోరాటం
వీహెచ్పీఎస్, సీపీహెచ్పీఎస్, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి హన్మకొండ అర్బన్ : దివ్యాంగులకు రూ.6 వేలు, వృద్ధులు, వితంతువులు, ఇతరులకు రూ.4వేల పింఛన్ పెంచే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ వై.కే విశ్వనాథ్ మాదిగ, జిల్లా ఇన్చార్జ్ కందుకూరి సోమన్న హెచ్చరించారు. సోమవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్), చేయూత పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి (సీపీహెచ్పీఎస్), ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 20 నెలలు గడుస్తున్నా పింఛన్ల పెంపుపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదన్నారు. ఈనెల 12వ తేదీన తహసీల్దార్ కార్యాలయాలు, 20వ తేదీన హైదరాబాద్ ఎల్బీనగర్ నుంచి కోదాడ వరకు జాతీయ రహదారిని దిగ్భందం చేసి ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నాయకులతో కలిసి కలెక్టర్ స్నేహశబరీష్కు అందజేశారు. ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బండారి సురేందర్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్, వీహెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దూడల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు సింగారపు స్వామి, కార్యదర్శి రాజు, వీహెచ్పీఎస్ జిల్లా మహిళా నాయకులు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
పూల వ్యర్థాలు డ్రెయినేజీలో వేయొద్దు
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్ : పూల వ్యర్థాలను డ్రెయినేజీలో వేయకుండా వ్యాపారులకు అవగాహన కల్పించాలని నగర మేయర్ గుండు సుధారాణి తెలిపారు. శానిటేషన్ తనిఖీల్లో భాగంగా మేయర్ సోమవారం వరంగల్ పోస్టాఫీస్ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోస్టాఫీస్ ప్రాంతంలో బల్దియా ఏర్పాటు చేసిన ఫ్లవర్ కంపోస్టు యూనిట్ను మేయర్ క్షేత్రస్థాయిలో సందర్శించి నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. పూలు, గుమ్మడికాయల వ్యాపారులతో మాట్లాడారు. ప్రధాన రహదారినుంచి సీకేఎం ఆస్పత్రికి వెళ్లే మార్గంలో ఏర్పడిన లీకేజీని స్థానికులు మేయర్ దృష్టికి తీసుకురాగా వెంటనే అరికట్టాలని ఏఈని ఆదేశించారు. అనంతరం బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మేయర్ మాట్లాడుతూ.. భారీ వర్షాలతో ఇటీవల పోస్టాఫీస్ ప్రాంతంలో వరద నీరు రోడ్డుపై చేరి ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బందులు కలిగిందన్నారు. డ్రెయినేజీల్లో పూల వ్యర్థాలు వేసి వరదనీరు ప్రవహించకుండా అడ్డుపడితే కార్పొరేషన్ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్పొరేటర్ చింతాకుల అనిల్కుమార్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, రాజేష్, సంతోష్బాబు, భాస్కర్ పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించండి
బల్దియా గ్రీవెన్స్లో నగరవాసుల మొర వరంగల్ అర్బన్ : తమ సమస్యలు పరిష్కరించాలంటూ పలు కాలనీల వాసులు బల్దియా ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదులు చేశారు. సోమవారం గ్రేటర్ కౌన్సిల్ హాల్లో అధికారులు పలు సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. ఆక్రమణలపై అధికంగా ఫిర్యాదులందాయి. కార్యక్రమంలో బల్దియా ఎస్ఈ మహేందర్, సీఈ రవీందర్ వాడేకర్, ీసీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● 3వ డివిజన్ పైడిపల్లి అయ్యప్ప కాలనీలో పదేళ్లుగా నివాసం ఉంటున్నామని, సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని కాలనీవాసులు విన్నవించారు. ● కాజీపేట మండలం కడిపికొండ రెవెన్యూ గ్రామంలో భూముల చుట్టూ ప్రహరీ నిర్మించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని చర్యలు తీసుకోవాలని కోరారు. ● 14వ డివిజన్ మణికంఠ కాలనీ రోడ్డు–2లో నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్మిస్తున్నారని చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. ● 17వ డివిజన్ బొల్లికుంటలో రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ● 15వ డివిజన్లో వీధికుక్కలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ● 11 డివిజన్లోని రోడ్డుపై మ్యాన్హోల్, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేస్తున్నారని విజ్ఞప్తి చేశారు. ● వంగపహాడ్ రోడ్డులో ఎత్తైన ర్యాంపు నిర్మించారని చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ● 58వ డివిజన్ శ్రీనగర్ కాలనీ–2 అనుమతి లేకుండా డ్రెయినేజీ నిర్మిస్తున్నారని చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విన్నవించారు. -
‘ఓరుగల్లు’కు బీజేపీ మొండిచెయ్యి
సాక్షిప్రతినిధి, వరంగల్: భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఉమ్మడి వరంగల్కు మొండిచెయ్యి చూపింది. రాష్ట్ర కమిటీలో ఈసారి ఒక్కరికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సోమవారం ప్రకటించిన రాష్ట్ర కమిటీలో ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్లకు ఉద్వాసన పలికింది. కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది కార్యదర్శులు, ఇద్దరు కోశాధికారులు, ఒక జాయింట్ ట్రెజరరీ, ఒక అధికార ప్రతినిధి కలిపి 22 మంది ని ప్రకటించారు. ఈ కమిటీలో ఉమ్మడి జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్లకు అవకాశం ఇవ్వకపోడంపై పెద్ద చర్చే జరుగుతోంది. మొండిచెయ్యి ఇదే మొదటి సారి.. ప్రతీసారి రాష్ట్ర కమిటీలో ఉమ్మడి వరంగల్కు తగిన ప్రాధాన్యత దక్కేది. సీనియర్లుగా ఉన్న ముగ్గురునుంచి ఐదుగురికి అవకాశం కల్పించిన సందర్భాలే ఉన్నాయి. బండి సంజయ్కుమార్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. ఆ తర్వాత వచ్చిన కిషన్ రెడ్డి కూడా సీనియర్లకు అవకాశం కల్పించారు. 2023, జూలై 4న బండి సంజయ్.. ఆ తర్వాత పగ్గాలు చేపట్టి జి.కిషన్ రెడ్డిలు పూర్తిస్థాయిలో రాష్ట్ర కమిటీ వేశారు. అందులో ఉమ్మడి జిల్లానుంచి డాక్టర్ గుండె విజయ రామారావు (ఉపాధ్యక్షుడు), గుజ్జుల ప్రేమేందర్రెడ్డి (ప్రధాన కార్యదర్శి), ఏనుగుల రాకేష్ రెడ్డి (అధికార ప్రతినిధి, ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారు), చందుపట్ల కీర్తిరెడ్డి (అధికార ప్రతినిధి), జాటోత్ హుస్సేన్ నాయక్ (ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు), కొండేటి శ్రీధర్ (ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు)లకు అవకాశం కల్పించారు. ఈసారి కూడా ఉమ్మడి వరంగల్కు రాష్ట్ర కమిటీలో సముచిత స్థానం దక్కుతుందని భావించినా.. ఒక్కరికీ కూడా అవకాశం కల్పించకపోవడంపై సీనియర్లు భగ్గుమంటున్నారు. 1980లో పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర కమిటీలో జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా సందర్భం లేదని, సుమారు నాలుగున్నర దశాబ్దాల తర్వాత బహుశా ఇది మొదటి సారని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఓరుగల్లు నుంచి మహామహులు... బీజేపీ, జనసంఘ్.. పార్టీలకు ఉమ్మడి వరంగల్ పెద్దపీట వేసింది. బీజేపీ ఆవిర్భావం తర్వాత ఈ జిల్లాలో ఉన్నంత బలం బలగం ఎక్కడా లేదన్న వ్యాఖ్యలు నాయకత్వం చేసిన సందర్భం. ఎంపీగా పోటీ చేసిన చందుపట్ల జంగారెడ్డి ఏకంగా పీవీ నర్సింహరావును ఓడించడం.. ఎమ్మెల్యేగా కూడా ఓసారి పార్టీ బ్యానర్ మీదే గెలిచారు. బీజేపీనుంచి ఎమ్మెల్యేలుగా టి.రాజేశ్వర్రావు, జయపాల్, వన్నాల శ్రీరాములు, మార్తినేని తదితరులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. పార్టీ అధిష్టానం కూడా ప్రతీసారి సంస్థాగత పదవుల విషయంలో వరంగల్కు పెద్దపీట వేస్తూ వచ్చింది. ఈసారి కూడా రాంచందర్రావు టీములో సీనియర్లకు ఛాన్స్ ఉంటుందని భావిస్తే తీవ్ర నిరాశకు గురి కావాల్సి వచ్చింది. రాష్ట్ర కమిటీలో సీనియర్ల ఊసేది..? పూర్వ వరంగల్ జిల్లాలో వన్నాల శ్రీరాములు, మాజీ మంత్రి గుండె విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేష్, కొండేటి శ్రీధర్, మార్తినేని ధర్మారావు, డాక్టర్ టి.రాజేశ్వర్రావు, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, చందుపట్ల కీర్తిరెడ్డి, రావు పద్మలలో ఎవరికీ ఈసారి కమిటీలో చోటు దక్కలేదు. అదేవిధంగా పార్టీలో సీనియర్లుగా ఉన్న ఆరుట్ల దశమంతరెడ్డి, కేవీఎల్ఎన్ రెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్, ఎడ్ల అశోక్రెడ్డి, చాడ శ్రీనివాస్ రెడ్డి, రావుల కిషన్, కోరబోయిన సాంబయ్య, గుజ్జ సత్యనారాయణరావు, గంట రవికుమార్, ముక్కెర తిరుపతిరెడ్డిలతో పాటు పలువురు కూడా రాష్ట్ర కమిటీలో పదవులు ఆశించగా.. అధిష్టానం సీనియర్లను విస్మరించిందన్న చర్చ పార్టీలో జరుగుతోంది. రాష్ట్ర కమిటీలో ఎవరికీ చోటివ్వని హైకమాండ్ సీనియర్లను పట్టించుకోని పార్టీ అధిష్టానం పార్టీ ఆవిర్భావం తర్వాత ఇదే మొదటిసారి ప్రతీసారి కమిటీలో ముగ్గురు నుంచి ఐదుగురు అధిష్టానం తీరుపై ‘కాషాయం’ నేతల కారాలు, మిరియాలు -
ఆలయాల మూసివేత
హన్మకొండ కల్చరల్: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా వేయిస్తంభాల దేవాలయాన్ని ఆదివారం మధ్యాహ్నం ద్వారబంధనం చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్భలు వేసి ద్వారబంధనం చేశారు. తిరిగి సోమవారం తెల్ల వారుజామున ద్వారాలు తెరిచి సంప్రోక్షణ చేసి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ఆలయ ఈఓ అనిల్కుమార్ తెలిపారు. అదేవిధంగా భద్రకాళి ఆలయంలో మధ్యాహ్నం ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ద్వారబంధనం చేశారు. కార్యక్రమంలో సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. ఐలోని ఆలయం మూసివేతఐనవోలు: చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయాన్ని మూసివేశారు. సోమవారం ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ చేసిన అనంతరం భక్తులకు స్వామి వారి దర్శనాన్ని కల్పించనున్నట్లు ఆలయ ఈఓ కందుల సుధాకర్ తెలిపారు. -
ఏడాదిగా పెండింగ్లోనే..
● ‘ఓ రిటైర్డ్ తహసీల్దార్ తల్లికి రూ.90 వేలు వైద్య ఖర్చులయ్యాయి. ఇవి మెడికల్ రీయింబర్స్మెంట్ కోసం వరంగల్ కలెక్టరేట్కు తిరుగుతున్న సమయంలోనూ ఆయన అనారోగ్యం బారిన పడడంతో రూ.50వేల వరకు ఖర్చైంది. తొలుత ఆయా ఆస్పత్రుల్లో అతనే భరించారు. సంబంధిత వైద్య నివేదికలతో మెడికల్ రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఏడాదిగా వరంగల్ కలెక్టరేట్లోనే పెండింగ్ ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.’● ‘ఓ తహసీల్దార్ కుమార్తెకు రోడ్డు ప్రమాదం జరగడంతో సుమారు రూ.మూడు లక్షల వరకు వైద్య ఖర్చులయ్యాయి. ఇవి మెడికల్ రీయింబర్స్మెంట్ కింద తెచ్చుకునేందుకు దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి ఇంకా వరంగల్ కలెక్టరేట్లోనే పెండింగ్లో ఉండడంతో ఆందోళన చెందుతున్నారు.’సాక్షి, వరంగల్: ...వీరే కాదు ఇలా జిల్లాలో సుమారు 45కుపైగా రెవెన్యూ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్ రీయింబర్స్మెంట్ దరఖాస్తులు కలెక్టరేట్లో పెండింగ్లో ఉండడం వారికి ఆందోళన కలిగిస్తోంది. ఈ ఫైళ్లు రూ.50వేల లోపు ఉంటే జిల్లా మెడికల్ బోర్డు, ఆపై రూ.మూడు లక్షల లోపు ఉంటే సంబంధిత విభాగ ఉన్నతాధికారి నుంచి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కు కలెక్టర్ ద్వారా వెళ్లాల్సి ఉండగా దాదాపు ఏడాదిగా జిల్లా కలెక్టరేట్లోనే మూలుగుతుండడంతో వారి వెతలు వర్ణనాతీతంగా మారాయి. చాలా మంది ఉద్యోగులు కలెక్టరేట్కు వచ్చి సంబంధిత అధికారులను కలిసి అడుగుతున్నా, రేపు మాపు అంటూ, కలెక్టర్ వద్ద పెండింగ్లో ఉందంటూ తిప్పి పంపిస్తుండడంతో బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే ఈ పెండింగ్ ఫైళ్లు కలెక్టరేట్లో ఎక్కడ ఉన్నాయో తెప్పించుకొని కలెక్టర్ డాక్టర్ సత్యశారద క్లియర్ చేయాలని అభ్యర్థిస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా వీటిని క్లియర్ చేస్తే ఆర్థికంగా తమ కుటుంబాలను అదుకున్నవారవుతారని వేడుకుంటున్నారు.2023 మార్చి నుంచి 2025 జూన్ 20 వరకు పెండింగ్లో ఉన్న బిల్లులను కొద్ది నెలల క్రితం ప్రభుత్వం క్లియర్ చేసేందుకు నిధులిచ్చినా జిల్లాలో మాత్రం విచిత్ర పరిస్థితి ఉందని వాపోతున్నారు. దేవుడి కరుణించినా, పూజారి వరమివ్వలేదన్నట్టుగా తమ పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కలెక్టరేట్లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ను ఫోన్లో సంప్రదిస్తే కలెక్టరేట్లో ఏమీ పెండింగ్లో లేవని, అంతా క్లియర్ అయ్యాయని చెబుతుండడం గమనార్హం. ఇదిలాఉండగా ఈ పెండింగ్ ఫైళ్లు క్లియర్ చేయకపోతే కలెక్టరేట్ కార్యాలయంలోనే ఆందోళన చేస్తామని కలెక్టరేట్లోని సిబ్బందిని శనివారం కలిసి వచ్చిన ఓ రిటైర్డ్ ఉద్యోగి అన్నారు. ఈ 45 మెడికల్ రీయింబర్స్మెంట్ ఫైళ్లు కలిపి సుమారు రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉండొచ్చన్నారు.కలెక్టరేట్లో మెడికల్ రీయింబర్స్మెంట్ దరఖాస్తులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఉద్యోగులు, పెన్షనర్లు రేపు, మాపు అంటూ సిబ్బంది దాటవేస్తుండడంతో ఆందోళన పెండింగ్ ఫైళ్లు లేవంటున్న అధికారులు -
నగరాన్ని వణికించిన వాన
సాక్షి, వరంగల్/హన్మకొండ/వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ నగరంలో ఆదివారం ఉదయం కురిసిన మోస్తరు వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో రెండు గంటలపాటు దంచికొట్టిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హనుమకొండలోని ఎన్జీఓస్ కాలనీ రోడ్డులోని భవానీనగర్, వికాస్నగర్ కూడలి, అంబేడ్కర్ భవన్ వద్ద వరదనీరు రోడ్డుపైకి చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హనుమకొండ జిల్లా బస్స్టేషన్ ఆవరణలో వరద నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. హనుమకొండ చౌరస్తా, పెట్రోల్ పంపు ప్రాంతాల, గోకుల్నగర్ కాలనీవాసులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రాకపోకలకు అంతరాయం.. ఖిలావరంగల్ రాతికోట చుట్టూ ఉన్న మాల అగర్త చెరువు అలుగు పోయడంతో మైసయ్యనగర్, అక్కడి నుంచి శివనగర్ రహదారుల మీదుగా అండర్ బ్రిడ్జి వరకు వరద చేరింది. గంట పాటు వాహనాల రాకపోకలు నిలిచాయి. ఆర్టీసీ బస్సుల్లోకి నీరు రావడంతో మధ్యలోనే ఆగిపోయాయి. ప్రయాణికులు 8 ఫీట్ల టేబుల్పై నుంచి నడిచి అండర్ బ్రిడ్జి గద్దె దాటారు. ఇంతేజార్గంజ్ సీఐ షుకూర్, పోలీసు సిబ్బంది నడుములోతులో ఉన్న నీటి నుంచి ఓ తాడు సాయంతో ప్రయాణికులను రోడ్డుకు చేర్చారు. మట్టికోట చుట్టూ ఉన్న అగర్తల చెరువులు పూడ్చివేసి అక్ర మ నిర్మాణాలు చేపట్టడంతోనే ఇక్కడి కాలనీలు చిన్నపాటి వర్షానికే జలమయమవుతున్నాయి. అశోకా కాలనీలో కూలిన వృక్షం.. వర్షానికి హనుమకొండలోని అశోకా కాలనీలో వృక్షం కూలిపోయి విద్యుత్ లైన్ తెగిపోయింది. రెండు విద్యుత్ స్తంభాలు విరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. డీఆర్ఎస్ సిబ్బంది చేరుకుని వృక్షాన్ని తొలగించారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది చేరుకుని యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి విద్యుత్ లైన్ను పునరుద్ధరించారు. వరంగల్ జిల్లా పైడిపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో అత్యధికంగా 70.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లపైకి నీరు రావడంతో ప్రజలకు ఇబ్బందులు అండర్ బ్రిడ్జి వద్ద వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులు పోలీసుల సమయస్ఫూర్తితో ప్రయాణికులు సురక్షితం -
మంజూరు నుంచి పంపిణీ వరకు అవాంతరాలే..
సాక్షిప్రతినిధి, వరంగల్: .. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పథకానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోక్షం కలగడం లేదు. నిర్మాణాలు పూర్తయినా ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఫలితంగా మూడేళ్ల కిందట పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీకి నోచుకోక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వివిధ స్థాయిల్లో నిలిచిపోయిన నిర్మాణాల్లో గడ్డి, ముళ్లపొదలు ఏర్పడ్డాయి. పంపిణీ చేసిన వాటిలో సరైన మౌళిక సదుపాయాలు లేక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకాశం రాక అర్హులైన వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అసంపూర్తి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, పూర్తయిన వాటిని పంపిణీ చేయాలన్న డిమాండ్ వస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకాశం రాని వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. నెరవేరని సొంతింటి కల.. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పడకల గదుల ఇళ్ల పథకాన్ని అమలు చేసింది. ఉమ్మడి వరంగల్లో ఈ పథకం కింద రెండు విడతల్లో 26,284 ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం సుమారు రూ.860 కోట్ల వరకు ఖర్చు చేసి 10,939 (41.62 శాతం) ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. అందులో నుంచి అర్హులైన వారిని ఎంపిక చేసి 4,874 (44.56 శాతం) పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా మంజూరైన మొత్తం 26,284లో 4,100 వరకు వివిధ కారణాలతో నిర్మాణాలు మొదలు పెట్టలేదు. నిర్మాణాలు ప్రారంభించిన 22,184 ఇళ్లలో 10,939 పూర్తయ్యాయి. 11,245 ఇళ్లు వివిధ స్థాయిల్లో నిర్మాణ దశలోనే నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా పలు చోట్ల కొన్నేళ్ల క్రితం చేపట్టిన ఈ ఏళ్ల కిందటి నిర్మాణాలు నేటికీ పూర్తి కాలేదు. పూర్తయిన 10,939 ఇళ్లలో 4,874 మాత్రమే పంపిణీ చేశారు. 6,065 ఇళ్ల మంజూరులో జాప్యం జరుగుతుండడంతో ఉండడానికి గూడులేక వేలాది మంది నిరుపేదలు ఏళ్లపాటు గుడిసెల్లో జీవిస్తూ పక్కా ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. త్వరగా తమ ఇంటి కలను సాకారం చేయాలని వారంతా వేడుకుంటున్నారు.జిల్లా మంజూరు పూర్తి పంపిణీ హనుమకొండ 4,326 2,143 1,200 వరంగల్ 6,350 2,350 1,250 భూపాలపల్లి 3,882 1,615 710 జనగామ 4,400 1,600 750 ములుగు 1,800 950 300 -
ఎస్సారెస్పీ భూమి కబ్జా
హసన్పర్తి: సుమారు కోటిన్నర రూపాయల విలువైన ఎస్సారెస్పీ భూమి కబ్జాకు గురైంది. ఓ రియల్టర్ సుమారు పది గుంటల భూమిని ఆక్రమించుకున్నాడు. ప్రస్తుతం ఇక్కడ ఒక గుంట భూమి విలువ సుమారు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు పలుకుతోంది. గండ్లసింగారం నుంచి పెగడపల్లి, సీతానాగారంతో పాటు కింద రైతులకు సాగు నీరందించడానికి భూములు సేకరించారు. గుండ్లసింగారం ప్రధాన కాల్వ నుంచి ెపెగడపల్లి వైపునకు సాగునీరందించడం కోసం కాల్వ(డీబీఎం–26) నిర్మించారు. కాల్వకు ఇరువైపులా సుమారు మధ్యలో నుంచి 40 ఫీట్ల నుంచి 50 ఫీట్ల వరకు స్థలాన్ని ఇన్స్పెక్షన్ పాత్ కోసం వదిలిపెట్టారు. మరి కొంత భూమి కూడా పడవుగానే ఉంది. రియల్టర్ కన్ను గుండ్లసింగారం–ముచ్చర్ల మధ్య ప్రధాన రహదారికి ఆనుకుని పడావుగా ఉన్న కాల్వ భూమిపై ఓ రియల్టర్ కన్ను పడింది. ఇటీవల ఆ భూమిని చదును చేశాడు. అప్పటికే భూమి ఆక్రమణకు గురవుతోందని నీటి పారుదలశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేశాడు. అధికారుల కన్నసన్నల్లోనే ఈవ్యవహారం సాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కబ్జాపై పూర్తిస్థాయి విచారణ జరుపుతాం. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకుంటాం. కబ్జాదారుడిపై చర్యలు తీసుకుంటాం. – కిశోర్, ఏఈ రూ.కోటిన్నర విలువైన స్థలానికి ఎసరు? అంతా అధికారుల కన్నుసన్నల్లోనే! -
నేడు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)లో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. న్యూశాయంపేట: ప్రజా సమస్యల పరిష్కారానికి వరంగల్ కలెక్టరేట్లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు గ్రీవెన్స్ ఉంటుందని తెలిపారు. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. శుక్రవారం నుంచి ఆదివారం ఉదయం వరకు 6,619 విగ్రహాల నిమజ్జనం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, అన్నివర్గాల ప్రజలకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు. విద్యారణ్యపురి: జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్ష (ఎన్ఎంఎంఎస్)కు 8వ తరగతి చదవుతున్న విద్యార్థులు అక్టోబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి ఒక ప్రకటనలో కోరారు. జనరల్ విద్యార్థులు ఏడో తరగతి పరీక్షల్లో 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు సాధించిన వారు అర్హులని పేర్కొన్నారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 23న పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలకు హెచ్టీటీపీ//బీఎస్ఈ.తెలంగాణ. గౌట్.ఇన్లో సంప్రదించాలని పేర్కొన్నారు. రాజ్కుమార్కు గురుబ్రహ్మ అవార్డుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం ఇన్చార్జ్ అధిపతి డాక్టర్ సీహెచ్ రాజ్కుమార్కు గురుబ్రహ్మ అవార్డు లభించింది. విశాఖపట్నంలోని సెయింట్ మదర్ థెరిస్సా ఆర్గనైజేషన్ ఆయనను అవార్డుకు ఎంపిక చేసింది. ఈమేరకు ఆదివారం విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మదర్ థెరిస్సా ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.కృష్ణమూర్తి, రి టైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ డి.రూథ్మేరీ తదితరులు రాజ్కుమార్కు అవార్డు ప్రదానం చేశారు. ప్ర శంసపత్రం, జ్ఞాపిక అందించి సన్మానించారు. సండే సందడి ఖానాపురం: వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పర్యాటక ప్రాంతమైన పాకాలలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. పాకాల సరస్సు మత్తడి పోస్తుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు పాకాలకు భారీగా తరలివచ్చారు. మత్తడి వద్ద స్నానాలు చేస్తూ పాకాల అందాలను సెల్ఫీ రూపంలో బంధించుకున్నారు. బోటింగ్ చేస్తూ ఉత్సాహంగా గడిపారు. -
వేతనాలకు ఎదురుచూపులు
కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఏడాదిగా వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ ఏజెన్సీల అనుసంధానంతో వీరంతా విధులు నిర్వహిస్తున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. ‘ప్రభుత్వాన్ని అడగాలంటే వారి భర్తీతో పని చేయట్లేదు. పోనీ ఏజెన్సీని అడగాలంటే ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేయలేదు’ ఇలా ఏం చేయాలో పాలుపోక విధులు నిర్వహించాలా? వద్దా అనే మీమాంసలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. విధులు ఇలా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 13 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా, షెరఫ్లుగా, అటెండర్లుగా సుమారు 30 ఏళ్లుగా కొనసాగుతున్నారు. మధ్య వయస్సులోకి చేరుకున్న తామంతా మరో ఉద్యోగం చేయలేమని, ఏజెన్సీలకు ప్రభుత్వం బడ్జెట్ను రిలీజ్ చేసి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇటీవలి కాలంలో కేవలం రెండు నెలలకు సరిపడే వేతనాలతో కూడిన బడ్జెట్ను ప్రభుత్వం ప్రకటించింది, కాగా, రాబోయే దసరా పండుగకై నా చేతికి డబ్బులు అందుతాయనుకుంటే.. ఇంకా బడ్జెట్ రిలీజ్ అయ్యి తమ ఖాతాల్లోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్శాఖ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అందని వేతనాలు బడ్జెట్ ప్రకటించినా చేతికందక ఇబ్బందులు -
ప్రమాణాలు పాటిస్తేనే అనుమతులు
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్ : నిర్దేశిత ప్రమాణాలు పాటిస్తేనే భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తామని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ కోసం నగర పరిధిలోని బాలసముద్రం, వడ్డేపల్లి, సుబేదారి, శాయంపేట ప్రాంతాల్లో శనివారం కమిషనర్ క్షేత్రస్థాయిలో సందర్శించి భవన నిర్మాణదారులు సమర్పించిన ధ్రువపత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భవన నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో వాస్తవ సమాచారం, సూచించిన ధ్రువ పత్రాలను జత చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించిన తర్వాత సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు. ఏమైనా తేడాలు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఏసీపీలు రజిత, ఎర్షాద్ పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో విగ్రహాల నిమజ్జనం నగరంలో 36 గంటలపాటు గణేశ్ శోభాయాత్రలు జరిగాయని, రికార్డు స్థాయిలో 10వేల పైచిలుకు విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది కంటే ఈసారి వినాయక ప్రతిమల సంఖ్య పెరగడం వల్ల శుక్రవారంనుంచి శనివారం సాయంత్రం వరకు నిమజ్జనాలు జరిగినట్లు పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులు షిఫ్టుల వారీగా విధులు నిర్వహించినట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలో 6,500 విగ్రహాలు వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6,500 వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండడంతో నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని పేర్కొన్నారు. పోచమ్మ మైదాన్ నుంచి చిన్న వడ్డేపల్లి చెరువు వరకు బారులుదీరిన వినాయక విగ్రహాలు -
ఆలస్యం.. జలచరాలకు విషం!
సాక్షి, వరంగల్: నగరంలో నిమజ్జన తంతు ముగిసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర రసాయనాలతో చేసిన గణపతి ప్రతిమలతో చెరువుల్లో వేల టన్నుల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. ఫలితంగా చెరువులు కాలుష్యానికి కేంద్రాలవుతున్నాయి. ఈ ఘనవ్యర్థాలను రోజుల వ్యవధిలో తీయాల్సిన బల్దియా, నీటి పారుదల శాఖ అధికారులు ఆలసత్వం వహిస్తున్నారు. పీఓపీ, ఇతర హానికారక రసాయనాలు, రంగులు నీళ్లలో కలిసిపోవడంతో ఆయా చెరువులు మరింత కలుషితమవుతున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా జలచరాలతో పాటు భూగర్భజల మట్టం హానికారంగా మారనుంది. ఆ నీటిని సాగుకు ఉపయోగిస్తే పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. గతేడాది నిమజ్జనం చేసిన గణేశ్ విగ్రహాలకు ఉండే ఇనుము, కలప చిన్న వడ్డేపల్లి చెరువులో కనిపించింది. చెరువుల పరిరక్షణ సొసైటీ సభ్యులు ఇటీవల బల్దియా అధికారులతో వాగ్వాదానికి దిగడంతో వాటిని తొలగించారు. బతుకమ్మ పండుగ తర్వాత? బతుకమ్మ పండుగ సమయంలో చెరువుల్లో పూలను వేస్తారు. వాటితో పాటుగానే నిమజ్జన వ్యర్థాలను నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి తొలగిస్తారని బల్దియా ఉన్నతాధికారులు చెబుతున్నారు. వినాయకులు నిమజ్జనం చేసిన గంటల వ్యవధిలోనే ఈ వ్యర్థాలను తొలగించడం ద్వారా కొంతమేర జల కాలుష్యానికి అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. గ్రేటర్ వరంగల్లో 22 చెరువుల్లో కలిపి చిన్న, పెద్దవి కలిపి 15,000 విగ్రహలు నిమజ్జనమైనట్లు బల్దియా అధికారులు చెబుతున్నారు. అధిక మోతాదులో హానికారక రసాయనాలు, వ్యర్థాలు, మూలకాలు నీటిలో ప్రవేశించడంతో జలాయశంలో ప్రతీ లీటర్ నీటిలో జీవరాశుల మనుగడకు అత్యావశ్యకమైన బయాలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరగడం, అదేసమయంలో నీటిలో ఆక్సిజన్ స్థాయి పడిపోతుందన్న ఆందోళన ఉంది. ఇది ప్రతి లీటర్ నీటిలో సున్నాగా నమోదయ్యే ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ చెరువుల్లో చేపల పెంపకం ఎక్కువగా ఉండడంతో మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వెంటనే వ్యర్థాలను తొలగించాలి.. చెరువుల్లో చేపలు, పక్షులు, వృక్ష, జంతు, అణుకీట కాల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతోంది. భూగర్భజ లాలు హాని కారకాలుగా మారతాయి. ఆయా చెరువుల్లో పట్టిన చేపలను తిన్న వారికి శరీరంలోకి హాని కారక మూలకాలు చేరతాయి. చేపల ద్వారా మాన వ శరీరంలోకి మెర్క్యురీ మూలకం చేరితే మెదడులో సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. మలేరి యా, డెంగీ వ్యాధులు ప్రబలే అవకాశముంది. వీట న్నింటినీ దృష్టిలో ఉంచుకుని నిమజ్జనం జరిగిన గంటల వ్యవధిలోనే వ్యర్థాలను తొలగించాలి. – పెరుమాండ్ల లక్ష్మణ్, చెరువుల పరిరక్షణ సొసైటీ అధ్యక్షుడు తక్షణమే చర్యలు తీసుకోవాలి.. చెరువుల్లో నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాల వ్యర్థాల తొలగింపునకు చర్యలు తీసుకోవాలి. ఆలస్యమైతే ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారైన విగ్రహాలు, రసాయనాలతో పూసిన రంగులు చెరువులో కలిసి చేపలు మృత్యువాత పడతాయి. మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోకముందే వినాయక విగ్రహాల వ్యర్థాలను వెంటనే తొలగించాలి. – శీలం సాంబయ్య, అల్లీపురం, వరంగల్ఏటా నిమజ్జనం అనంతరం చెరువుల్లో లభ్యమయ్యే వ్యర్థాలు గ్రేటర్ నగరంలోని చెరువులు : 22 ఘన వ్యర్థాలు : 5 వేల టన్నులు అధిక గాఢత ఉన్న రసాయనాలు : 10 వేల లీటర్లు ఇనుము : 100 టన్నులు కలప : 50 టన్నులు, పీఓపీ 20 టన్నులు గ్రేటర్ వరంగల్లోని 22 చెరువుల్లో వేల టన్నుల వ్యర్థాలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఘన వ్యర్థాల తొలగింపుపై నిర్లక్ష్యం రోజుల వ్యవధిలో తొలగిస్తేనే జలచరాలకు మంచిది బతుకమ్మ పండుగ తర్వాతే తొలగింపు ఉంటుందనడంతో ఆందోళన ప్రజలకు డెంగీ, మలేరియా ప్రబలే అవకాశం త్వరగా వ్యర్థాలు తొలగించాలంటున్న పర్యావరణ ప్రేమికులు -
ఆదివారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
వివిధ భాషల్లో 5వేల పుస్తకాలు, వందలాది జర్నల్స్, పురాతన స్క్రిప్ట్లు.. ఒకేచోట కొలువై ఉన్న ప్రొఫెసర్ గజ్జెల రామేశ్వరం ఇంటర్నేషనల్ నేచురోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇక.. అనేక మంది విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడనుంది. అరుదైన విజ్ఞాన సంపద ఉన్న ఈ ప్రకృతి గ్రంథాలయంతో ఇటీవల కాకతీయ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకుంది. గత జూలైలో పుణే జాతీయ ప్రకృతి వైద్య సంస్థ కూడా పరస్పర ఒప్పందం చేసుకుంది. భారతీయ సంప్రదాయ విజ్ఞాన వ్యవస్థ అభివృద్ధి వ్యాప్తికి పరిశోధనలు, శిక్షణ వంటి విద్యా కార్యక్రమాల్లో పరస్పర ప్రయోజనాలు పొందనున్నారు. ఈ ప్రకృతి వైద్య గ్రంథాలయం ప్రత్యేకతలు, విద్యార్థులకు ఉపయోగం, తదితర అంశాలపై ఈ వారం ప్రత్యేక కథనం.నేచురోపతి లైబ్రరీ రీసెర్చ్ సెంటర్తో కేయూ, పుణే సంస్థల ఎంఓయూకేయూతో ఎంఓయూతో కలిగే ప్రయోజనాలు.. కాకతీయ యూనివర్సిటీ వారు ఈ నెల ఒకటో తేదీన ప్రకృతి వైద్య గ్రంథాలయంతో ఎంఓయూ చేసుకున్నారు. ● ప్రకృతి వైద్యజ్ఞానాన్ని సమయానికి పొందేలా ఈ లైబ్రరీ రీసెర్చ్ సెంటర్లోని పుస్తకాల క్యా టలాగ్, వర్గీకరణ చేపడతారు. ఇందుకు కేయూ లైబ్రరీ సైన్స్ విద్యార్థులను వినియోగిస్తారు. ● ఇరు సంస్థల వర్క్షాప్లు, సేవల మార్పిడి కోసం ఎలాంటి ఆర్థిక భారం ఉండబోదు. సదస్సులు, సమావేశాలను సంయుక్తంగా నిర్వహించేందుకు అవకాశం ఉంది. ● ఎంఎల్ఐఎస్సీ విద్యార్థులు, పీహెచ్డీ పరిశోధకులు తమ ప్రాజెక్ట్ వర్క్స్, ఇంటర్న్షిప్లకు అధ్యయనం చేసేందుకు ఈ ప్రకృతి వైద్య లైబ్రరీలోకి అనుమతి ఉంటుంది. ● ఆర్ట్స్ విద్యార్థులు ప్రకృతి వైద్య విజ్ఞాన సంపదను వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు తెలుగు భాషలో ప్రకృతివైద్యంపై పద్యాలు, కవితల రూపంలో కూడా చికిత్స విధానాలున్నాయి. ● అమెరికా సిలికాన్ యూనివర్సిటీలో ఆయుర్వేద డిప్లొమా కోర్సు నడుస్తున్నది. తెలుగు, హిందీ భాషల్లో ప్రకృతి వైద్యానికి సంబంధించిన పుస్తకాలు, జర్నల్స్ ఉన్నాయి. ఆయా భాషల్లో ప్రకృతి వైద్యంపై పరిశోధన చేయాలనుకునేవారికి ఎంతో ఉపయోగపడనుంది. ● ఫార్మసీ విద్యార్థులకు ఫార్మాకాగ్నెన్స్ నేచురోపతికి సంబంధించిన ఆయుర్వేదం, యోగా, నేచురోపతి మీద ఒక పేపర్ ఉంది. ఆయా విద్యార్థుల సిలబస్కు అనుగుణంగా నూట్రిషన్స్, రోగ నిరోధకత పరిశోధనలకు ఉపయోపడే ప్రకృతి వైద్యం, విజ్ఞాన పుస్తకాలను ఉపయోగించుకోవచ్చు. ● ఇంటినే గ్రంథాలయంగా మార్చిన గజ్జెల రామేశ్వరం ● వివిధ భాషల్లో 5 వేల పుస్తకాలు, జర్నల్స్ అందుబాటులో.. ● ప్రకృతి వైద్యపరిజ్ఞానం పెంపొందించుకునే అవకాశం కేయూ క్యాంపస్: హనుమకొండ ప్రకాశ్రెడ్డిపేటలోని ఇంటర్నేషనల్ నేచురోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్లో దేశ, విదేశీ భాషా గ్రంథాలు ఉన్నాయి. ప్రకృతివైద్యానికి సంబంధించిన 50 పత్రికలు లభిస్తాయి. కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం విశ్రాంత ఆచార్యులు గజ్జెల రామేశ్వరం 2018 జూలై 24న తన ఇంటిలోనే ఈ లైబ్రరీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రకృతి వైద్యంపై ఆసక్తి ఉన్నవారు ఈ లైబ్రరీలో ఉచితంగా ప్రవేశించి చదువుకునే అవకాశం కల్పించారు. పుణే జాతీయ ప్రకృతివైద్య సంస్థతో.. పుణేలోని జాతీయ ప్రకృతివైద్య సంస్థ గత జూలై 1న ఈ ప్రకృతి వైద్య గ్రంథాలయ పరిశోధన కేంద్రంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ సత్యలక్ష్మి, రామేశ్వరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. పుణే జాతీయ ప్రకృతి వైద్యసంస్థలో ఆస్పత్రి ఉంటుంది. అక్కడి నేచురోపతి కోర్సుల విద్యార్థులకు క్లినికల్ రీసెర్చ్కు సంబంధించిన ప్రకృతి వైద్య విజ్ఞాన పుస్తకాలు, జర్నల్స్ ఇక్కడి లైబ్రరీ రీసెర్చ్సెంటర్లో ఉన్నాయి. ఆ విద్యార్థులు ఇక్కడికి వచ్చి వినియోగించుకుంటారు. ఇతర దేశాల శాస్త్రవేత్తలు, ప్రకృతి వైద్యులు తమ సంస్థను సందర్శించిన సమయంలో పరిశోధనల విజ్ఞాన పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉండడం వల్ల వారిని తరచూ ఇక్కడికి పంపే అవకాశాలున్నాయి. ఇది హెల్త్ ఎడ్యుకేషన్ టూరిజానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. యోగా, హిస్టరీ, లైఫ్ సైన్సెస్ వారికి ఉపయుక్తం కేయూ దూరవిద్యలో యోగా డిప్లొమా కోర్సు నడుస్తోంది. ఈ విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు 300 వరకు ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్లోనూ నేచురోపతిపై ఒక పేపర్ ఉంది. సైకాలజీ విద్యార్థులకు మానసిక వైద్య విద్యకు సంబంఽధించి ప్రకృతి వైద్యపరంగా విజ్ఞానసంపద ఉంది. భారత ప్రకృతివైద్య చరిత్ర, ప్రకృతి వైద్య ఉద్యమ వైతాళికులు ఎవరు అనే అనేక అంశాలు, చారిత్రక పరంగా ప్రకృతి వైద్యవిధానం ఎలా వచ్చిందనే దానిపై హిస్టరీ విద్యార్థులు, పరిశోధనలకు ఈలైబ్రరీ రీసెర్చ్సెంటర్లో అనేక దేశ, విదేశాల పుస్తకాలు, జర్నల్స్ అందుబాటులో ఉన్నాయి. లైఫ్సైన్సెస్ పీజీకోర్సుల విద్యార్థులకు ఉపయోగపడే జ్ఞాన సంపద అందుబాటులో ఉంది. ప్రకృతి వైద్యవిజ్ఞానం ప్రజాబాహుళ్యంలోకి.. మూడున్నర దశాబ్దాలుగా సేకరించిన అరుదైన ప్రకృతి వైద్యవిద్య, సాహిత్య విజ్ఞాన సంపదను అందుబాటులో ఉంచా. కేయూ, పుణేలోని జాతీయ ప్రకృతివైద్య సంస్థతో మా లైబ్రరీ రీసెర్చ్ సెంటర్తో ఎంఓయూ కుదుర్చుకున్నాం. విజ్ఞాన సంపదను విద్యార్థులు, పరిశోధకులు ఉపయోగించుకోవాలి. – గజ్జెల రామేశ్వరం, ప్రకృతి వైద్య లైబ్రరీ రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకుడుఇంటర్న్షిప్నకు కూడా.. ఈ ఎంఓయూతో ఎంఎల్ఐఎస్సీ విద్యార్థులకు ఇంటర్న్షిప్నకు అవకాశం లభించింది. తొలుత ఒకటి రెండురోజుల్లోనే ఇద్దరు విద్యార్థులను ఆ లైబ్రరీ సెంటర్కు పంపనున్నాం. మా లైబ్రరీ సైన్స్ విభాగంనుంచి ఆ లైబ్రరీలో పుస్తకాల క్యాట్లాగ్, క్లాసిఫికేషన్కు విద్యార్థులు సహకారం అందిస్తారు. –డాక్టర్ రాధికారాణి, కేయూ లైబ్రరీ సైన్స్ విభాగం అఽధిపతి -
రేపు అప్రెంటిస్షిప్ మేళా
హన్మకొండ: హనుమకొండ ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ వరంగల్ క్యాంపస్లో ఈనెల 8న అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి ప్రముఖ కంపెనీలు ఈమేళాలో పాల్గొంటున్నాయని తెలిపారు. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, మెకానిస్ట్, వెల్డర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మేచినిస్ట్ గ్రాంస్డర్, కోపా ట్రేడ్లలో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ మేళాలో పాల్గొనాలని కోరారు. ఎంపికై న విద్యార్థులకు నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు స్టైఫండ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఐటీఐ పాస్ సర్టిఫికెట్ తీసుకొని సోమవారం ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో హాజరుకావాలని కోరారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగంలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ చిర్రరాజు అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు. డిగ్రీ కోర్సులో ఈవిద్యాసంవత్సరం తెలుగు ఫస్టియర్, సెకెండియర్ సిలబస్పై చర్చించి రాష్ట్ర ఉన్నత విద్యామండలి పంపిన సిలబస్కు అనుగుణంగా యాథాతథంగా సభ్యులు ఆమోదించారు. సమావేశంలో ఇన్చార్జ్ విభాగాధిపతి డాక్టర్ మామిడి లింగయ్య, అధ్యాపకులు డాక్టర్ సీతారాములు, డాక్టర్ ఎం.రమణ, హరీశ్ పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: సాహితీవేత్త స్వర్గీయ డాక్టర్ నమిలికొండ బాలకిషన్రావు స్మారక పురస్కారాన్ని నగరానికి చెందిన కవి పొట్లపల్లి శ్రీనివాసరావుకు అందజేయనున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాన్. పాంచాలరాయ్, తెరసం ప్రధాన కార్యదర్శి బిల్ల మహేందర్ తెలిపారు. నబారా (నమిలికొండ బాలకిషన్రావు)ట్రస్ట్ సౌజన్యంతో వరంగల్ తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో శనివారం నమిలికొండ బాలకిషన్రావు జయంతిని పురస్కరించుకుని సమావేశమయ్యారు. 2025 సంవత్సరానికి పలు కవితా సంపుటాలు వెలువరించి సాహితీసేవ చేస్తున్న కవి పొట్లపల్లి శ్రీనివాసరావుకు త్వరలో నిర్వహించే కార్యక్రమంలో స్మారక పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు నిర్ణయించారు. హనుమకొండలోని నక్కలగుట్టలో జరిగిన ఈకార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్రావు, తెరసం సభ్యులు రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: గత నెల 30, 31వ తేదీల్లో మహబూబ్నగర్లో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో ఓవరాల్ చాంపియన్షిప్ను కైవసం చేసుకున్న బాలికలను హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రశంసించారు. కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈనెల 23నుంచి 25 వరకు గుంటూరులో జరగనున్న సౌత్జోన్ నేషనల్ మీట్కు ఎంపికై నట్లు క్రీడాకారిణులు కలెక్టర్కు తెలిపారు. అథ్లెట్ల వెంట డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్, క్రీడా సంఘాల బాధ్యులు రమేశ్రెడ్డి, నాగకిషన్, సారంగపాణి, కోచ్లు శ్రీమన్నారాయణ, రమేశ్, నాగరాజు ఉన్నారు. హన్మకొండ కల్చరల్: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం వేయిస్తంభాల ఆలయాన్ని ద్వారబంధనం చేస్తున్నట్లు ఆలయ ఈఓ ధరణికోట అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ శనివారం ఒకప్రకటనలో తెలిపారు. సోమవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు, సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. -
ఉత్తమ టీచర్ల ఎంపికలో పారదర్శకత ఏది?
విద్యారణ్యపురి : గతంలో ఎన్నడులేని విధంగా హనుమకొండ జిల్లాలో ఉత్తమ టీచర్ల ఎంపికపై విమర్శలు వెల్లువెత్తాయి. గురుపూజోత్సవం సందర్భంగా ఈనెల 4న మధ్యాహ్నం జిల్లాలో 48మందితో కూడిన ఎంపిక జాబితాను డీఈఓ ప్రకటించారు. ఎల్ఎఫ్హెచ్ఎంలు, ఎస్జీటీలకు తగిన విధంగా అవార్డుల్లో ఎంపిక చేయలేదనే ఆరోపణలు పలు ఉపాధ్యాయ సంఘాలు డీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో అదేరోజు రాత్రి కొంతమంది టీచర్ల పేర్లను తొలగించి మరికొందరిని చేర్చి 40మందితో ఉపాధ్యాయుల జాబితాను రాత్రి 11గంటల సమయంలో ప్రెస్ గ్రూప్, ఉపాధ్యాయ సంఘాల గ్రూప్ల్లో పోస్టు చేశారు. దీంతో అయోమయం నెలకొంది. ఒకసారి అవార్డుకు ఎంపికై నట్లు ప్రకటించి తొలగించడం ఆయా టీచర్లకు ఇబ్బందికరంగా మారిందని ఇది సరికాదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు శుక్రవారం డీఈఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పీఆర్టీయూ సంఘం జిల్లా బాధ్యులు.. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారని తెలిసింది. దీంతో ఎమ్మెల్యే కూడా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారని సమాచారం. దీంతో మొదటి జాబితా నుంచి తొలగించిన టీచర్ల పేర్లను యథావిధిగా నిర్ణయించారు. అయితే పీఆర్టీయూ బాధ్యులు మరికొన్ని పేర్లను ప్రతిపాదించారని సమాచారం. ఇక శుక్రవారం ఉదయం కలెక్టరేట్లో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం ఉండగా పీఆర్టీయూ బాధ్యులు అక్కడికి విచ్చేశారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ను కలిసి తాము సూచించిన పలువురికి అవార్డుకు ఎంపిక చేయాలని కోరినట్లు సమాచారం. ఈవిషయంపై చర్చించిన తర్వాత 55మందితో కూడిన మూడో జాబితా వెల్లడించారు. ఆ తర్వాత మరో ఏడుగురి పేర్లను కూడా చేర్చాలని ఓ ఉపాధ్యాయ సంఘం కోరడంతో చివరికి 62మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేశారు. అందులో దరఖాస్తులు చేసిన వారందరీతో పాటుగా నామినేటెడ్గా మరికొందరికి అవార్డులు అందజేశారు. తొలి జాబితాను సవరించి రెండోజాబితా ఆయాసంఘాల ప్రాతినిథ్యంతో మూడోజాబితా కూడా.. -
శాంతిమార్గం చూపిన మహ్మద్ ప్రవక్త
కాజీపేట రూరల్: శాంతి మార్గం చూపే మహ్మద్ ప్రవక్త దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కాజీపేట హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా పీఠాధిపతి, తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా అన్నారు. కాజీపేట దర్గా ప్రాంగణంలో శుక్రవారం మిలాద్ ఉన్ నబీ–మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మక్కా నుంచి తీసుకొచ్చిన ప్రవక్త దుస్తులు, తల వెంట్రుకలను భక్తుల సందర్శనను ఖుస్రూపాషా ప్రారంభించారు. ఈసందర్భంగా ఖుస్రుపాషాను ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సుమారు 6 వేల మంది భక్తులు, ప్రజలకు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తియార్ బియాబానీ, మాజీ కార్పొరేటర్ మమ్మద్ అబుబక్కర్, సయ్యద్ రజాలి, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. సర్వమానవాళిని కాపాడుతూ.. ఖిలా వరంగల్: సర్వ మానవాళిని కాపాడేందుకు ప్రవక్త శాంతి సందేశమిచ్చారని ఉర్సు దర్గా పీఠాధిపతి నవీద్బాబా, తవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఎంఏ జబ్బార్ అన్నారు. మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా శుక్రవారం వరంగల్ ఫోర్ట్ రోడ్డులోని ఈద్గా మైదానంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు నిర్వహించారు. భారీ జెండాను ఊరేగించి ఈద్గా మసీద్లో ప్రతిష్ఠించారు. మతాలకు అతీతంగా వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. అనంతరం మహా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉబేద్ బాబా, ఎండీ చాంద్పాషా, మహ్మద్ ముగ్దుం తదితరులు పాల్గొన్నారు. దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు -
పశువైద్య ఆరోగ్య నిర్వహణ భేష్
● నవాబుపేట సంతలో ఫిలిప్పీన్స్ వైద్యులు లింగాలఘణపురం : తెలంగాణలో పశువైద్య ఆరోగ్య నిర్వహణ తీరు బాగుందని ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన వైద్యులు ప్రాన్సిస్, వోవేల్ సంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం జనగామ జిల్లా మండలంలోని నవాబుపేట సంతలో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ మురళీధర్ రావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. పశువుల్లో వ్యాధుల నియంత్రణ, యాజమాన్య పద్ధతులు, రవాణాకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. భారతదేశ పశుమాంస ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు అఫ్జల్ అజీజ్, పశువైద్యులు దేవేందర్, భగవాన్రెడ్డి, సాయికార్తీక్, పశువైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. -
బ్యాలెన్సింగ్ తప్పిన క్రేన్
● భయాందోళనకు గురైన మేయర్, కలెక్టర్, కమిషనర్ వరంగల్ అర్బన్ : గణపతి నిమజ్జనం సందర్భంగా వరంగల్ నగరంలోని ఓ చెరువు వద్ద క్రేన్ బ్యాలెన్సింగ్ తప్పడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం వరంగల్ చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద వినాయకుల నిమజ్జనాన్ని ప్రారంభించేందుకు మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ సత్యశారద, కమిషనర్ చాహత్ బాజ్పాయ్, ఏసీపీ శుభం, డీసీపీ సలీమా, కార్పొరేటర్లు, అధికారులు సుమారు 24 మంది వరకు క్రేన్లోకి ఎక్కారు. క్రేన్ మొరాయించడంతో కొంత మంది అధికారులను సిబ్బంది దించారు. అనంతరం వినాయక ప్రతిమలతో చెరువులో తెప్పమీదికి దిగారు. మేయర్, కలెక్టర్లు కొబ్బరికాయ కొట్టి నిమజ్జనాన్ని ప్రారంభించారు. తిరిగి క్రేన్లోకి వీరితోపాటు గజ ఈతగాళ్లు మొత్తం 17 మంది వరకు ఎక్కారు. క్రేన్ కొద్ది మేరకు పైకి వెళ్లిన తర్వాత బ్యాలెన్సింగ్ తప్పి ఊగింది. దీంతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ మళ్లీ క్రే న్ను తెప్ప మీదికి తీసుకొచ్చి, కొంతమందిని దించారు. తదుపరి వీరిని ఒడ్డుకు చేర్చడంతో ఊపిరి పీ ల్చుకున్నారు. సేఫ్టీ లైఫ్ జాకెట్లు లేకుండా చెరువులో నిమజ్జనానికి ఆయా శాఖల అధికారులు అనుమతి ఎలా ఇస్తారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎంజీఎం/కమలాపూర్: గణపతి నిమజ్జనం చేసే 12 ప్రదేశాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, 108 వాహనాలు అందుబాటులో ఉంచినట్లు హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. ఈశిబిరాల వద్ద మూడు షిఫ్టులలో వైద్యాధికారి, సిబ్బందిని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. ఈమేరకు డీఎంహెచ్ఓ అప్పయ్య శుక్రవారం కటాక్షపూర్, పెద్దాపూర్ చెరువు, ప్రగతి సింగారెడ్డి బ్రిడ్జి, గుండ్ల సింగారం చెరువు, కమలాపూర్, హసన్పర్తి, సిద్ధేశ్వర గుండం, బంధం చెరువు ప్రాంతాల్లో ఏర్పాటు చేసి వైద్య శిబిరాలను సందర్శించి సిబ్బంది సూచనలి చ్చారు. కార్యక్రమంలో వైద్యాధికారులు స్వాతి, సా యికృష్ణ, నాగరాజు, శాంతిప్రియ, నవీన్, కవిత, రోహిత్, విజయరెడ్డి, ఇర్ఫాన్, సౌమ్య, సురేశ్, సా యిశ్రీ, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. కిడ్నాప్.. ఆపై కిరాతంగా హత్య భూపాలపల్లి అర్బన్ : ఓ యువకుడిని కిడ్నాప్ చేసి..ఆపై కిరాతంగా హత్య చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణంలోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన ఎండీ బాసిత్ (20)ను, ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమీపంలో నిందితులు కాళ్లు, చేతులు కట్టేసి పెట్రోల్ పోసి కాల్చి హత్య చేశారు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. బాసిత్ నాలుగు రోజుల క్రితం భూపాలపల్లి పట్టణంలో కిడ్నాప్నకు గురైనట్లు మృతుడి తల్లి సబియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన బబ్లూ, ప్రశాంత్, కుషాల్, మరికొందరిపై అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు విచారణ చేపడుతున్న క్రమంలో తాడ్వాయి సమీపంలో కాల్చిన మృతదేహం శుక్రవారం కనిపించింది. దీంతో సీఐ నరేష్కుమార్, ఎస్సై సాంబమూర్తి ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మార్చురికి తరలించారు. మృతుడిపై ఇప్పటికి అనేక కేసులు నమోదై ఉన్నాయి. మద్యం, గంజాయి మత్తులో గతంలో జరిగిన గొడవల నేపథ్యంలో హత్య చేసినట్లు పట్టణంలో చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. -
ఆ నలుగురు లేక..
ఆగస్టు 28వ తేదీన మరిపెడకు చెందిన భద్రయ్య వైద్యం కోసం ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు. రెండ్రోజుల అనంతరం చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడి కోసం ఎవరైనా వస్తారేమోనని వారంపాటు మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. ఎవరూ రాకపోవడంతో స్వచ్ఛంద సంస్థ సహాయంతో అంత్యక్రియలు చేశారు.కాజీపేట : ‘మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకై నా లేడు మానవత్వం ఉన్నవాడు ’అంటూ ఓ సినీకవి అన్నట్లు వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు సేవ చేయలేక కొందరు, మంచాన పడితే సపర్యలు చేయాల్సి వస్తోందని మరికొందరు, అంత్యక్రియల ఖర్చు భరించలేక ఇంకొందరు.. కార ణం ఏదైనా కన్నపేగుకు చివరి మజిలీ చేయకుండా వదిలించుకుంటున్నారు. ఆస్పత్రులు, రోడ్ల వెంట, ఆశ్రమాల్లో అనాథ శవాలుగా మారడంతో స్వచ్ఛంద సంస్థలు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాయి.వైద్యంపేరుతో వదిలించుకుంటున్నారుదీర్ఘకాల వ్యాధులు, వృద్ధాప్యంతో బాధపడేవారిని ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రులకు తీసుకొచ్చే క్రమంలో కొందరు వివరాలు నమోదు చేయకుండానే వార్డుల్లో చేర్చి వెళ్లిపోతున్నారు. సపర్యలు చేసేవారు లేక మల,మూత్ర విసర్జనలు మంచంలోనే చేస్తుండటంతో ఇతర రోగులకు ఇబ్బంది కలుగుతోంది. వారికి ఆయా వార్డుల్లో పనిచేసే సిబ్బందే సేవలు చేయాల్సి వస్తోంది. ఆస్పత్రులు, వృద్ధాశ్రమాల్లో వృద్ధులను చేరుస్తున్న వారిలో కొందరు పేర్లు, సెల్ఫోన్ నంబర్లు రాస్తున్నారు. తర్వాత ఫోన్ చేస్తుంటే అందులో నిజాలు ఉండడం లేదని వైద్యులు, ఆశ్రమాల నిర్వాహకులు చెబుతున్నారు. ధర్మసాగర్ మండలం సాయిపేటకు చెందిన ఓ వృద్ధురాలిని కాజీపేట రైల్వే జంక్షన్ ప్రాంతంలో వదిలేసి వెళ్లి పోయారు. స్థానికులు చేరదీసి దగ్గరలోని సహృదయ అనాథ ఆశ్రమంలో చేర్పించారు. వివరాలు తెలుసుకుని కుమారులు, కుమార్తెలకు సమాచారం ఇచ్చినా వచ్చి తీసుకెళ్లని పరిస్థితి.8నెలల్లో 58 మంది..జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి నేటివరకు ప్రభుత్వ ఆస్పత్రులు, రోడ్ల పక్కన, అనాథ ఆశ్రమాల్లో కలిపి 58మంది వరకు మృతిచెందారు. పత్రికలు, అధికారులు, ఆస్పత్రి వర్గాల ద్వారా సమాచారం తెలుసుకొని వారికి స్వచ్ఛంద సంస్థలు అంత్యక్రియలు నిర్వహించాయి. రహదారుల పక్కన గుర్తు తెలియని మృతదేహాలు కనిపిస్తే పోలీసులకు చుక్కలు కనిపిస్తాయి. వాటిని మార్చురీల్లో భద్రపర్చడం ఒక ఎత్తు అయితే.. గుర్తించడం వేచి ఉండి అంత్యక్రియలు సొంత ఖర్చులతో చేయడం తలకు మించిన భారంగా మారుతోంది. -
ఉమ్మడి జిల్లాకు 2,607.300 మెట్రిక్ టన్నుల యూరియా
ఖిలా వరంగల్ : వరంగల్ రైల్వే స్టేషన్లోని గూడ్స్ షెడ్కు ఐపీఎల్ కంపెనీకి చెందిన యూరియా శుక్రవారం చేరింది. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, వ్యవసాయ అధికారి అనురాధ సూచనల ప్రకారం వరంగల్ జిల్లాకు 427.3, హనుమకొండకు 570, ములుగు 280, భూపాలపల్లి 400, జనగామకు 480, మహబూబాబాద్ 450 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించారు. దిగుమతి అయిన యూరియాను ఆయా జిల్లాలోని మండలాలకు చేరవేసేందుకు వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఐపీఎల్ కంపెనీకి చెందిన 2,607.300 మెట్రిక్ టన్నుల యూరియా రాగా.. వ్యవసాయ శాఖ అధికారులు విజ్ఞాన్, రవీందర్రెడ్డి పర్యవేక్షణలో జిల్లాలకు యూరియాను పంపిస్తున్నారు. -
మాస్టర్ ప్లాన్ ప్రకారం సౌకర్యాలు
ఎస్ఎస్తాడ్వాయి : మాస్టర్ ప్లాన్ ప్రకారం మేడారంలో వనదేవతల గద్దెల ప్రాంగణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరీష్ శుక్రవారం పరిశీలించారు. నూతన మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా భక్తుల సౌకర్యార్థం చేపట్టనున్న ఏర్పాట్లపై క్షుణ్ణంగా పర్యవేక్షించారు. సమ్మక్క–సారలమ్మ గద్దెల వరుస క్రమంలో పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల ఏర్పాటు స్థలాన్ని, వనదేవతలను భక్తులు సులువుగా దర్శించుకునేలా ఈసారి కొత్త క్యూలైన్ల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లపై పోలీసుల భద్రతతోపాటు వీఐపీ, వీవీఐపీల ఎంట్రి తదితర ఆంశాలపై చర్చించారు. ఈసారి నిర్వహించే మహాజాతర వరకు గద్దెల ప్రాంగణంలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు అఽ దికారులు కసరత్తు చేస్తున్నారు. ఈఓ వీరస్వామి, డీ ఎస్పీ రవీందర్, డీఈ రమేశ్బాబు, పస్రా సీఐ దయాకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరుస క్రమంలో వనదేవతల గద్దెల మార్పుపై పరిశీలన మేడారంలో పర్యటించిన కలెక్టర్, ఎస్పీ -
దొడ్డు బియ్యం ఎలుకల పాలు!
● ఐదు నెలలుగా రేషన్ షాపుల్లో నిల్వ ● లక్కపురుగు పట్టి, ముక్కిపోతున్న రైస్ ● తరలించేందుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదంటున్న అధికారులు ఖిలా వరంగల్: చౌకధరల దుకాణాల్లో ఈ ఏడాది మార్చి వరకు లబ్ధిదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేశారు. ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. దీంతో రేషన్ దుకాణాల్లో ఐదు నెలలుగా దొడ్డు బియ్యం నిల్వలు వృథాగా ఉంటున్నాయి. చాలాచోట్ల వీటికి లక్కపురుగు పట్టడంతోపాటు ముక్కిపోతున్నాయి. ఎలుకలు బస్తాలు కొరికి బియ్యం కుప్ప పోస్తున్నాయని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిని ఇలాగే ఉంచితే పనికి రాకుండా పోయే ప్రమాదం ఉందని వారు పేర్కొంటున్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 509 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఆహార భద్రతాకార్డు (ఎఫ్ఎస్సీ) ఒక్కో యూనిట్కు ఆరు కిలోలు, అంత్యోదయ ఆహార భద్రతాకార్డు (ఏఎఫ్ఎస్సీ)కు 35 కిలోల చొప్పున పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15 వరకు లబ్ధిదారులకు బియ్యం అందించాల్సి ఉంది. కోటా కేటాయింపులో ఆలస్యం కారణంగా ఈ తేదీల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కార్డుదారులు రాష్ట్రంలో ఏ దుకాణంలోనైనా బియ్యం తీసుకునే వెసులుబాటు ఉండడంతో కొంతమంది డీలర్లు లబ్ధి పొందుతుంటే, మరికొంతమంది నష్టపోతున్నారు. అద్దె ఇళ్లలో షాపులు.. జిల్లాలో 85 శాతం రేషన్షాపులు అద్దె ఇళ్లలోనే కొనసాగుతున్నాయి. అవి కూడా చిన్నగా ఉండడం, వాటిలోనే దొడ్డు బియ్యం నిల్వలు ఉంచడంతో డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేయడంతో 60 రోజులకు పైగా డీలర్లు దుకాణాలు తెరవలేదు. దీంతో నిల్వ ఉన్న బియ్యం ఎలా ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. జిల్లాలో సుమారు 32 వేల క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిల్వలున్నట్లు తెలుస్తోంది. వీటిని ఎప్పుడు తరలిస్తారో ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇప్పటికే ఐదు నెలలు గడిచింది. ఎక్కువ సమయం అలాగే ఉంచితే చేతికి వచ్చే పరిస్థితి లేదు. వాటిలో ఇప్పటికే దుమ్ము, పురుగులు కనిపిస్తున్నాయి. దొడ్డు బియ్యం నిల్వలు ఉండడంతో సన్నబియ్యం ఉంచేందుకు స్థలం లేక అదనపు గదులు అద్దెకు తీసుకొని ఆర్థికంగా నష్ట పోతున్నామని డీలర్లు చెబుతున్నారు. వీలైనంత త్వరగా దొడ్డు బియ్యాన్ని ఖాళీ చేయించి విక్రయిస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. ఈవిషయమై పౌర సరఫరాల అధికారులను వివరణ కోరగా దొడ్డు బియ్యం వెనక్కి తీసుకోవాలనే విషయమై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని, ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు -
‘ఇందిరమ్మ’ ఇటుకలకు వచ్చి..
భూపాలపల్లి అర్బన్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బాంబులగడ్డ జాతీయ ప్రధాన రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపక్కన ఆగి ఉన్న బైక్ను ఎదురుగా వస్తున్న టాటాఏస్ ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందారు. చిట్యాల మండలం భావుసింగ్పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సిమెంట్ ఇటుకలు కొనుగోలు చేసేందుకు వచ్చి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. సీఐ నరేష్కుమార్, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. భావుసింగ్పల్లికి చెందిన కొడపాక నర్సయ్య (50), కాల్వల సంజీవ్ (38) శుక్రవారం మధ్యాహ్నం భూపాలపల్లికి ద్విచక్ర వాహనంపై వచ్చి బాంబులగడ్డ సమీపంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకల ప్లాంట్కు వెళ్లి ధర మాట్లాడుకొని తిరిగి రోడ్డుకి చేరుకున్నారు. ఈక్రమంలో కాళేశ్వరం వెళ్లి భూపాలపల్లి వైపు వస్తున్న టాటాఏస్ వాహనం రోడ్డుకు ఎడమ వైపు నుంచి కుడి వైపునకు దూసుకు వచ్చింది. రోడ్డు పక్కనే ఆగి ఉన్న బైక్తో పాటు ఇరువురిని ఢీకొట్టింది. దీంతో వారికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. తలకు, శరీరం లోపల బలమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోలీసులు టాటాఏస్ వాహనం హనుమకొండ జిల్లా కమలాపూర్దిగా గుర్తించారు. మృతుడు నర్సయ్యకు కుమారుడు, భార్య, సంజీవ్కు ఇద్దరు కూతుళ్లు, భార్య ఉన్నారు. బాధిత కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మార్చురీకి వెళ్లి పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో ఇరువురు దుర్మరణం చిట్యాల మండలం భావుసింగ్పల్లిలో విషాదంకమలాపూర్ గ్రామానికి చెందిన టాటాఏస్ వాహనంలో వినాయకుడి విగ్రహాన్ని కాళేశ్వరంలో నిమజ్జనం చేసి వస్తున్నారు. మార్గమధ్యలో మద్యం తాగినట్లు తెలిసింది. మద్యం మత్తులో డ్రైవర్ వాహనం నడుపుతుండగా అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే డ్రైవర్తో పాటు వాహనంలో ఉన్నవారు పరారయ్యారు. ప్రమాదానికి గురైన వాహనాలను పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. -
విద్యార్థుల భవిష్యత్ గురువుల చేతుల్లోనే..
విద్యారణ్యపురి: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది వారి భవిష్యత్కు బంగారు బాటలు వేయాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదేనని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. శుక్రవారం గురుపూజోత్సవం సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్లో ఎంపికై న వివిధ కేటగిరీల టీచర్లు 62మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి ప్రదానం చేశారు. శాలువా కప్పి సన్మానించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బండా ప్రకాశ్ మాట్లాడుతూ సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ పదవిలో తనలాంటి వారు నిలబడటానికి తనకు విద్యాబుద్ధులు నేర్పి వారి విజ్ఞానాన్ని పంచిన గురువులే కారణమన్నారు. కలెక్టర్ స్నేహ శబరీస్ మాట్లాడుతూ టీచర్లలో బెస్ట్ అని ఆర్డనరీ అంటూ ఉండరని, తన దృష్టిలో అందరూ ఉత్తమ టీచర్లనేనన్నారు. విద్యతోనే విద్యార్థుల జీవితాల్లో మార్పు వస్తుందన్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరినీ ఉత్తములుగా ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. డీఈఓ డి.వాసంతి మాట్లాఉడతూ విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమను తాము మార్పుకోవాలన్నారు. న్యాస్ సర్వేలో మూడు తరగతుల్లో జిల్లా అత్యున్నతస్థాయిలో ఉందన్నారు. మర్కజీ పాఠశాల విద్యార్థులు సంస్కృతిక కార్యాక్రమాలు ప్రదర్శించారు. వల్సపైడి వాఖ్యాతగా వ్యవహరించగా, సమావేశంలో మైనార్టీ కమిషన్ సభ్యుడు దర్శన్సింగ్, కార్పొరేటర్ ఏనుగుల మానస, డీఐఈఓ గోపాల్, ఎంఈఓ నెహ్రూనాయక్ . డీసీఈబీ సెక్రటరీ డాక్టర్ బి.రాంధన్ పాల్గొన్నారు. గురువులు ఆరాధ్య దైవాలు : మేయర్ గుండు సుధారాణిఖిలా వరంగల్: గురువులు ఆరాధ్యదైవాలని, దేశ భవిష్యత్ తీర్చిదిద్దే మార్గదర్శకులని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా వరంగల్ ఉర్సుగుట్టలోని ఓ కన్వెన్షన్హాల్లో కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన శుక్రవారం ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ సారయ్య, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్తో కలిసి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. రూ.21వేల కోట్లతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. గురువులు నేర్పిన విద్యతోనే ఈస్థాయికి ఎదిగామన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలలు, విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందని అన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ ఉపాధ్యాయులు భావితరాల నిర్మాతలని, వారి చేతుల్లోనే విద్యార్థులు, సమాజ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అన్నారు. ఆనంతరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 68 మందికి అతిథుల చేతుల మీదుగా జ్ఞాపికలు, ప్రశంసపత్రాలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. వేడుకల్లో డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఈఓ రంగయ్యనాయుడు. ఎంఈఓలు, సమగ్రశిక్షణ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. హనుమకొండలో తొలి జాబితాను సవరించి రెండో జాబితా సంఘాల ప్రాతినిథ్యంతో మూడో జాబితా శాసనమండలి డిప్యూటి చైర్మన్ డాక్టర్బండా ప్రకాశ్ జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం -
నేరస్తులకు భయం కలిగించాలి : సీపీ
వరంగల్ క్రైం: ఏదైనా నేరం చేస్తే కోర్టులో శిక్ష పడుతుందనే భయాన్ని నేరస్తులకు కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ న్యాయస్థానాల్లో జరిగిన ట్రయల్స్ కేసుల్లో నిందితులకు శిక్షలు పడడంలో కృషి చేసిన పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల అభినందన సభను వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని నిందితులకు కోర్టులో శిక్షలు పడడంలో కృషి చేసిన జాయింట్ డిప్యూటీ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, దర్యాప్తు అధికారులు, కోర్టు, ప్రాసెస్ విధులు నిర్వహించే పోలీస్ అధికా రులను వరంగల్ పోలీస్ కమిషనర్ ఘనంగా సత్కరించి ప్రశంస పత్రాలు అందజేశారు. పెరిగిన శిక్షల శాతం ఈసందర్భంగా పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేరాలు చేసిన వారికి కోర్టుల్లో పడిన శిక్షల శాతం పెరిగిందన్నారు. ట్రయల్ కేసుల్లో మొత్తం 16 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయని, ఇందులో 6 హత్య కేసులు, 5 కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్ష పడగా, ఒక కేసులో పదేళ్ల జైలు శిక్షను కోర్టు విధించినట్లు తెలిపారు. నాలుగు అత్యాచారం కేసుల్లో రెండు కేసుల్లో జీవితఖైదు, మరో రెండు కేసుల్లో ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించగా, ఎస్టీ, ఎస్సీ మానభంగం కేసులో ఏడేళ్లు, చోరీ, ఇతర కేసులకు సంబంధించి ఐదు కేసుల్లో మూడేళ్ల చొప్పున జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, వరంగల్ ప్రాసిక్యూషన్ ఆఫ్ జాయింట్ డిప్యూటీ డైరెక్టర్ రాములు, సంగారెడ్డి జిల్లా ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ, సీసీ ఆర్బీ ఏసీపీ డేవిడ్ రాజు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సంతోషి, శ్రీనివాస్, వాసుదేవరెడ్డి, పావని, రాజ మల్లారెడ్డి, దుర్గాబాయి, భరోసా కేంద్రం న్యాయధికారి నీరజ, ఇన్స్పెక్టర్లు శ్రీధర్, ముస్కా శ్రీనివాస్, రవికుమార్, కరుణాకర్, పుల్యాల కిషన్, ఎస్ఐ నర్సింహరావుతో పాటు సీసీఆర్బీ సిబ్బంది, కోర్టు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు. -
ఘనంగా త్రిశూల స్నానం
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో శుక్రవారం దేవాలయంలోని ప్రాచీన కోనేటిలో పంచలోహ ఉత్తిష్ట గణపతికి త్రిశూల స్నానం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, సందీప్శర్మ, ప్రణవ్ మూల మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తిష్ట గణపతిని, గౌరీ గణపతిని పల్లకిలో ప్రతిష్టించి నగరంలో ఊరేగింపుగా తీసుకెళ్లి వచ్చి ప్రాచీన కోనేరు జలంలో త్రిశూల తీర్థోత్సవం ఉత్తిష్టగణపతికి పంచసూక్తవిధానంతో అవబృధస్నానం జలాధివాసం నిర్వహించారు. గౌరీగణపతిని నిమజ్జనం చేశారు. అనంతరం ఉత్తిష్ట గణపతిని తిరిగి రుద్రేశ్వరుడి సన్ని ధిలో ప్రతిష్టించారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. సాయంత్రం గణపతి ఉత్సవ విగ్రహాన్ని సిద్ధేశ్వర గుండంలో నిమజ్జనం చేశారు. -
‘గ్రేటర్’లో భక్తిపారవశ్యంతో వినాయక శోభాయాత్ర
వరంగల్ అర్బన్: ‘గణేశ్ మహరాజ్కు జై’ అంటూ.. గణనాథులను గంగమ్మ ఒడికి చేర్చారు నగరానికి చెందిన భక్తజనులు. అత్యంత భక్తి శ్రద్ధలతో వరంగల్ మహా నగర ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రతీ వీధిలో కొలువైన వినాయకులను వాహనాలపై డప్పు చప్పళ్లతో ఊరేగింపుగా యువకులు, పిల్లలు, మహిళలు, పెద్దలు నృత్యాలు, కోలాటం చేస్తూ, రంగులు చల్లుకుంటూ నగరానికి సమీపంలో ఉన్న 19 చెరువుల్లో నిమజ్జనం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి మొదలై అర్ధరాత్రి వరకు నిమజ్జనం కొనసాగింది. గ్రేటర్ వరంగల్ పరిధిలో చిన్నవడ్డేపల్లి చెరువు, గొర్రెకుంట కట్టమల్లన్న, ఖిలా వరంగల్ అగర్తలా, బెస్తం చెరువు, ఉర్సు రంగ సముద్రం, హనుమకొండలోని సిద్ధేశ్వర గుండం, బంధం చెరువు, హసన్పర్తి పెద్ద చెరువు, మడికొండ చల్లా చెరువు, భీమారం, గోపాలపురం చెరువులతోపాటు విలీన గ్రామాల్లో మరో 9 చెరువుల్లో, చిన్న కుంటల్లో గణేశ్ ప్రతిమల్ని నిమజ్జనం చేశారు. ప్రారంభించిన మేయర్, కలెక్టర్, కమిషనర్ గణేశ్ నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. శుక్రవారం వరంగల్ పరిధి చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద మొక్కులు సమర్పించి, కొబ్బరి కాయ కొట్టి నిమజ్జనాన్ని మేయర్, కలెక్టర్ సంయుక్తంగా ప్రారంభించారు. శోభాయాత్ర, నిమజ్జనాలను మేయర్ గుండు సుధారాణి సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీపీసీ) సెంటర్నుంచి పర్యవేక్షించారు. నోడల్ అధికారులతో మొబైల్ ఫోన్లో మాట్లాడి అప్రమత్తం చేశారు. అదేవిధంగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను, నిమజ్జన ప్రాంతాలు, శోభాయాత్ర నిర్వహించే మార్గాల్లోని స్థితిగతులను సీపీ సన్ప్రీత్సింగ్ పోలీస్ కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్నుంచి పర్యవేక్షించారు. నిమజ్జనం, శోభాయాత్ర కోసం ఏర్పాటు చేసిన 583 సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు తిలకిస్తారని సీపీ పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సురేశ్ జోషి, కావేటి కవిత, బస్వరాజు కుమారస్వామి, డీసీపీ షేక్ సలీమా, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఏసీపీ శుభం, ఇరిగేషన్ బల్దియా ఈఈలు కిరణ్, భీమ్రావు ఏంహెచ్ఓ రాజేశ్, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ తహసీల్దార్ ఇక్బాల్ పాల్గొన్నారు. గణపతులను గంగమ్మ ఒడికి చేర్చిన భక్తజనం నిమజ్జనాన్ని ప్రారంభించిన మేయర్, కలెక్టర్, కమిషనర్ అధికారుల విస్తృత ఏర్పాట్లు -
గ్రేటర్ వరంగల్
(హనుమకొండ – వరంగల్)శనివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్ శ్రీ 20257నయీంనగర్లో శోభాయాత్రలో నృత్యం చేస్తున్న యువత వరంగల్లోని చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద భక్తజన కోలాహలంహనుమకొండ సిద్ధేశ్వర గుండం వద్ద..చిన్నవడ్డేపల్లి చెరువులో..వరంగల్లోని చిన్న వడ్డేపల్లి చెరువులో క్రేన్తో నిమజ్జనంబైక్పై, తోపుడు బండిపై గణనాథులను తీసుకొస్తున్న భక్తులు -
నిమజ్జనం.. సర్వం సిద్ధం
వరంగల్ అర్బన్: విశేష పూజలందుకున్న బొజ్జగణపయ్యకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు సర్వం సన్నద్ధమైంది. వరంగల్ మహా నగర వ్యాప్తంగా గణనాథులను వాహనాలపై కొలువుదీర్చి శోభాయాత్రతో ఆయా ప్రాంతాల్లోని 19 చెరువుల వద్ద శుక్రవారం నిమజ్జనం చేయనున్నారు. అందుకోసం వివిధ శాఖల అధికారులు, సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు. వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధి చిన్నవడ్డేపల్లి చెరువు, ఉర్సు రంగ సముద్రం, గొర్రెకుంట కట్ట మల్లన్న, గుండు చెరువు అగర్తలా, మామునూరు బెస్తం చెరువుల్లో నిమజ్జనం జరగనుంది. హనుమకొండ, కాజీపేటలోని సిద్ధేశ్వర గుండం, బంధం చెరువు, హసన్పర్తి పెద్ద చెరువు, గోపాలపురం, భీమారం, కడిపికొండ, మడికొండ, సోమిడి, ఎల్లాపూర్, గుండ్ల సింగారం, రాంపేట, రాంపూర్, సింగారం, చల్ల చెరువు వద్ద నిమజ్జన కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి. మేయర్, కలెక్టర్లు, పోలీస్, నగర కమిషనర్ ఇప్పటికే ఆయా శాఖల అధికారులకు ఏర్పాట్లు దిశానిర్దేశం చేశారు. ఆయా కేంద్రాల్లో నిమజ్జనం కోసం బల్దియా రూ.1.50 కోట్లతో నిధుల్ని వెచ్చించింది. ఇక వివిధ శాఖల అధికారులు తమ పరిధి సౌకర్యాలు కల్పించారు. ఏర్పాట్లు ఇలా.. ● మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో 32 క్రేన్లను ఏర్పాటు చేశారు. వరంగల్ చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద 7 క్రేన్లను, ఉర్సు రంగ సముద్రం 3, బెస్తం చెరువు, ఖిలా వరంగల్ అగర్తలా ఒకటి చొప్పన ఏర్పాటు చేశారు. హనుమకొండ సిద్ధేశ్వర గుండం వద్ద 3, బంధం చెరువుల వద్ద 3, హసన్పర్తి పెద్ద చెరువు 2, కడిపికొండ, భీమారం, చల్ల చెరువు వద్ద ఒకటి విలీన గ్రామాల్లో క్రేన్లను అందుబాటులో ఉంచారు. ● బల్దియా ఆధ్వర్యంలో రోడ్లు చదును చేసి, ప్యాచ్ వర్క్లు, రోడ్ల విస్తరణ ఇరువైపులకు రూ.35లక్షలు ఖర్చు చేశారు. అన్ని చెరువుల వద్ద జిగేల్మనేలా లైటింగ్ ఏర్పాటుకు రూ.14 లక్షలు కేటాయించారు. ఆయా ప్రాంతాల్లో మంచినీటిని సరఫరా చేసేందుకు వాటర్ ట్యాంకర్లను సిద్ధం చేశారు. పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ప్రత్యేక అధికారులను, సిబ్బందిని నియమించారు. ఐదు చోట్ల సీసీ కెమెరాలు: బల్దియా ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా ఐదు చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వరంగల్లోని చిన్నవడ్డేపల్లి, కోట చెరువు, ఉర్సు రంగసముద్రం, హనుమకొండ బంధం చెరువు, హసన్పర్తి పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేశారు. ● అదేవిధంగా అన్ని నిమజ్జన ప్రాంతాల్లో ఎన్పీడీసీఎల్ విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసింది. విద్యుత్ ఎం వినియోగించారో పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా పోలీసులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రధాన చెరువుల వద్ద బల్దియా జనరేటర్లను అందుబాటులో ఉంచుతారు. ● ఆర్అండ్బీ శాఖ నేతత్వంలో ఆరు కేంద్రాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ● మత్స్య శాఖ 1,200 మంది గజ ఈతగాళ్లు, 26 తెప్పలు, బ్యాలెన్సింగ్ల ద్వారా సేవలు అందించనున్నారు. ● రెవెన్యూ శాఖ ద్వారా ఐదుగురు తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ● మెడికల్ అండ్ హెల్త్ శాఖ ప్రతీ నిమజ్జన కేంద్రం వద్ద ఉచితంగా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా 108 వాహనాలను ఆయా సెంటర్లలో ఏర్పాటు చేయనున్నారు. గురువారం తెల్లవారు జాము వరకు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది సేవలు అందించనున్నారు. ఆర్అండ్బీ: అన్ని చోట్ల బారికేడ్లు ● మెడికల్ అండ్ హెల్త్: ఉచిత వైద్య శిబిరాలు, 108 వాహనాలు అందుబాటులో ఉంచారు. ● పోలీస్ శాఖ: బందోబస్తు, శాంతిభద్రత పర్యవేక్షణ, ట్రా ఫిక్ నియంత్రణను పకడ్బందీగా నిర్వహించనున్నారు.నేడు బొజ్జ గణపయ్యకు ఘనంగా వీడ్కోలు ప్రమాదాలకు తావులేకుండా అన్ని శాఖలు అప్రమత్తం నగరంలోని 19 కేంద్రాల్లో రూ.1.50 కోట్ల నిధులతో ఏర్పాట్లు 32 క్రేన్లు, 1,200 మంది గజ ఈతగాళ్లు ప్రధాన కేంద్రాల్లో సీసీ కెమెరాలు పర్యవేక్షించిన మేయర్, కలెక్టర్లు, కమిషనర్, అధికారులువరంగల్ అర్బన్/ఖిలావరంగల్ : గణేశ్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. గురువారం సాయంత్రం వరంగల్ నగరంలోని చిన్నవడ్డేపల్లి, ఉర్సు రంగసముద్రం, పడమరకోట మాల అగర్త, బెస్తం చెరువు, కట్టమల్లన్న చెరువుల వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను మేయర్, పోలీస్ కమిషనర్ సన్ ప్రీతీ సింగ్, వరంగల్ కలెక్టర్ సత్య శారద, కమిషనర్ చాహత్ బాజ్పాయ్, వివిధ శాఖల అధికారుల బృందం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించింది. హనుమకొండలోని సిద్ధేశ్వర గుండం, బంధం చెరువులను కలెక్టర్ స్నేహ శబరీష్, కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పర్యవేక్షించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ చెరువుల వద్ద ఏర్పాట్ల కోసం రూ.1.50 కోట్లు నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసినట్లు సీపీ సన్ప్రీత్సింగ్ తెలిపారు. కమిషనరేట్ పరిధి మూడు జోన్లలో నలుగురు డీసీపీలు, ఇద్దరు అదనపు డీసీపీలు, 15 మంది ఏసీపీలు, 53 మంది ఇన్స్పెక్టర్లు, 70 మంది ఎస్సైలతో పాటు ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో కలిపి మొత్తం 2,100 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. ప్రత్యేకించి ట్రై సిటీ పరిధిలో 1,600 మందికిపైగా పోలీసులు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. శోభాయాత్రతోపాటు నిమజ్జనం సజావుగా కొనసాగేందుకు అధిక సంఖ్యలో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. శోభాయాత్ర నిర్వహించే మార్గంలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా శుక్రవారం నుంచి ట్రాఫిక్ మళ్లిపు కొనసాగించడంతో పాటు అన్ని ముఖ్యమైన జంక్షన్లతో పాటు ముఖ్యమైన మార్గాల్లో సిబ్బందిని నియమించినట్లు వివరించారు. ఆడియో సిస్టమ్స్ నిర్ణీత స్థాయిలో ఉయోగించాలని, డీజేలు పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. కోట చెరువులో నిమజ్జనం నిషేధం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కోట చెరువులో ఈ ఏడాది కూడా గణేశ్ విగ్రహాల నిమజ్జనం నిషేధించారు. ఈ చెరువుకు బదులుగా సమీపంలో గల దేశాయిపేటలోని చిన్నవడ్డేపల్లి చెరువులో ఏర్పాట్లు చేశారు. -
నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి
నయీంనగర్: తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్ధలతో గణపతి పూజలు నిర్వహించిన భక్తులు ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, వరంగల్ పశ్చిమ ఎంఎల్ఎ నాయిని రాజేందర్ రెడ్డి సూచించారు. గురువారం గణపతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన గణపతి ఉత్సవ కమిటీలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో వరంగల్ సీపీ, ఎమ్మెల్యే నాయిని, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొని బహుమతులు అందజేశారు. పర్యావరణాన్ని కాపాడే మట్టి గణపతి ప్రతిమలు, సంస్కృతి సంప్రదాయాల ఆచరణ, నిత్యపూజా విధానాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని 109 గణపతి మండపాలను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గణపతి ఉత్సవ సమితి బాద్యులు జైపాల్ రెడ్డి, నందాల చందర్ బాబు, భజరంగ్ దళ్ బాద్యులు శివరాములు, శ్రీరామ్ ఉదయ్కుమార్, వెలగందుల రాజు, సాయి, వేణు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగేళ్ల తర్వాత తెరుచుకున్న బడి..
శాయంపేట: మండలంలోని కొప్పులలో నాలుగేళ్ల క్రితం మూతబడిన గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలను జూన్ 30న ఎంఈఓ భిక్షపతి తిరిగి ప్రారంభించారు. ప్రభుత్వ విద్యను బతికించే ప్రయత్నం చేయడం అభినందనీయమని, విద్యే ప్రగతికి సోపానమని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలనే ఉద్దేశంతో ఎంఈఓ భిక్షపతి ప్రత్యేక చొరవ తీసుకుని గొల్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తిరిగి తెరిపించారు. నాలుగేళ్లుగా మూతబడిన బడిని ఎంఈఓ భిక్షపతి ప్రత్యేక చొరవ తీసుకుని తెరిపించినందుకు మాజీ జెడ్పీటీసీ వంగాల నారాయణరెడ్డి, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
తల్లిదండ్రులను ఒప్పించి.. విద్యార్థుల సంఖ్య పెంచి
దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు వేముల గంగాధర్ విద్యార్థుల సంఖ్య పెంచారు. నెక్కొండ ప్రాథమిక పాఠశాల నుంచి గతేడాది బదిలీపై ఇక్కడకు వచ్చిన ఆయన పూర్వవిద్యార్థుల సహకారంతో విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించారు. మెరుగైన బోధన చేస్తామని, ఒక సంవత్సరం అవకాశం ఇవ్వాలని వారిని కోరారు. ఇలా విద్యార్థుల సంఖ్య 10 నుంచి 36 వరకు పెంచారు. అదేవిధంగా 10 మంది ఐదేళ్ల చిన్నారులు కూడా ప్రీప్రైమరీ స్కూల్కు వచ్చే విధంగా ఆయన కృషిచేశారు. పూర్వ విద్యార్థులు, దాతల సహకారంలో ఐడెంటిటీ కార్డులు, టైలు, బెల్టులు అందించారు. ఇక తమ గ్రామ ఉన్నత పాఠశాలకు బేస్ గట్టిగా ఏర్పడింది. మరో ఐదేళ్ల పాటు బడి బతుకుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు. -
విద్యార్థులతో ఫిజికల్ సైన్స్ టీచర్ రాజేందర్ అద్భుతాలు..
కాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరం జెడ్పీహెచ్ఎస్ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు దొనికల రాజేందర్.. విద్యార్థులతో అద్భుతాలు చేసి జూన్ 29న వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని అక్షయ భౌతిక శాస్త్రంలో న్యూటన్ సిద్ధాంతాలపై నిర్వహించిన దశవధానంపై చేసిన అంశం ఆకట్టుకుంది. మరో 12 మంది విద్యార్థులు రసాయనశాస్త్రంలోని 118 మూలకాల పేర్లు 8 సెకన్ల వ్యవధిలో చదివారు. ఇందుకుగాను ‘వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ చోటులో లభించింది. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను అభినందించారు. అక్షయ.. భౌతికశాస్త్రంలో ఒకేసారి పది మంది విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మధ్యలో ఇతర అంశాలతో మిళితంగా సమాధానాలు ఇవ్వడమేకాక, శాస్త్రవేత్తల పేర్లు, చిత్రాలను గుర్తుపెట్టుకొని అద్భుతంగా వివరించిన విధానం ఆకట్టుకుంది. -
రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకులు వీరే..
కేయూ క్యాంపస్: తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక అవార్డుల జాబితాను గురువారం ప్రకటించింది. గురుపూజోత్సవం రోజున (నేడు, శుక్రవారం) వీరికి హైదరాబాద్ మాదాపూర్లోని శిల్ప కళా వేదికలో జరిగే వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్రెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందించనున్నారు. ఇందులో కేయూలోని ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ ఎన్.ప్రసాద్, హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాల కెమిస్ట్రీ విభాగాధిపతి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లారం అరుణ, ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కళాశాల కెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ప్రశాంతి, హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాటనీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మాలోతు గన్సింగ్ హనుమకొండ జిల్లాలోని పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హిస్టరీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ ఎన్. మల్లయ్య ఎంపికయ్యారు. పరిశోధనల్లో మేటి.. కేయూలోని ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ ఎన్.ప్రసాద్ పరిశోధనల పరంగా 12 పేటెంట్లు కలిగి ఉన్నారు. వీటిలో క్యాన్సర్ బయాలజీపై పరిశోధనలు చేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో క్యాన్సర్ థెరఫీ పోస్ట్ డాక్టరల్ ఫెలోగా, స్ట్టాన్ఫోర్డ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్లో పని చేశారు. ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్గా హాస్టళ్ల డైరెక్టర్గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రసాద్ పర్యవేక్షణలో ఏడుగురు పీహెచ్డీ పూర్తి చేశారు. బోధనలో ఘనాపాటి హనుమకొండ ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాల కెమిస్ట్రీ విభాగాధిపతి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లారం అరుణ రెండు జాతీయ సదస్సులు నిర్వహించారు. కెమిస్ట్రీకి సంబంధించిన పది పాఠ్యపుస్తకాలు రచించారు. టీసాట్ నిపుణ విద్య చానల్లో 12 ప్రత్యక్ష ప్రసారాలు అందించారు. ఆమె పర్యవేక్షణలో విద్యార్థులు జిజ్ఞాస స్టడీ ప్రాజెక్టు పోటీల్లోనూ మొదటి బహుమతి సాధించారు. లేరెవ్వరు సాటి.. ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కళాశాల కెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ప్రశాంతి విద్యార్థులకు సృజనాత్మక డిజిటల్ పద్ధతుల ద్వారా కెమిస్ట్రీ బోధిస్తున్నారు. విద్యార్థులకు ఉపయుక్తమైన మూడు పుస్తకాలు రాశారు. పరిశోధనలపరంగా రెండు పేటెంట్లు కలిగి ఉన్నారు. ఆమెకు సంబంధించిన 22 రీసెర్చ్ పేపర్లు అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. సామాజిక సేవ.. ఆయన తోవ.. హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాటనీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మాలోతు గన్సింగ్ బోధనతో పాటు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లతో సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. హరితహారం ఇన్చార్జ్గా సేవలు అందిస్తున్నారు. ‘ప్రాజెక్టు’ల రూపకల్పనలో దిట్ట హనుమకొండ జిల్లా పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హిస్టరీ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ ఎన్.మల్లయ్య ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్గా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈమేరకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిగా కూడా అవార్డు ఇప్పటికే అందుకున్నారు. ఐదు పుస్తకాలు రాశారు. జిజ్ఞాస స్టూడెంట్స్ స్టడీ ప్రాజెక్టులను రూపొందించడంలోనూ దిట్ట. 25 పరిశోధన పత్రాలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమాయ్యయి. అంతరించిపోతున్న కళారూపాలకు జీవం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వరంగల్లోని జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న గత 30 ఏళ్లుగా గిరిజన విజ్ఞానపీఠంలో వివిద హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. పటం కథలు, కథకులు అనే అంశంపై పరిశోధనచేసి గ్రంథాన్ని వెలువరించారు. అంతరించిపోతున్న జానపద గిరిజన కళారూపాలను, కళాకారులను గుర్తించి పలు కళారూపాలను ఆడియో, వీడియో ఫొటో మాధ్యమాల్లో డాక్యుమెంటేషన్ చేశారు. జానపద గిరిజన విజ్ఞాన బహుముఖ అంశాలపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో పర్యటించి 20కి పైగా పుస్తకాలు రాశారు. వివిధ జర్నల్స్లో, పుస్తకాల్లో 70 వరకు వ్యాసాలు రాశారు. జాతీయ స్థాయి సదస్సుల్లో 50 వరకు పరిశోధన పత్రాలు సమర్పించారు. మాలోతు గన్సింగ్, ఎన్.మల్లయ్య, గడ్డం వెంకన్న ఎన్.ప్రసాద్ మల్లారం అరుణ ప్రశాంతి నేడు హైదరాబాద్లో సీఎం చేతులమీదుగా అవార్డులు వృత్తిలో వారి సేవలు గుర్తించి ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం -
రోడ్డు ప్రమాదంలో సాక్షి డెస్క్ జర్నలిస్టుకు గాయాలు
ధర్మసాగర్: రోడ్డు ప్రమాదంలో సాక్షి డెస్క్ జర్నలిస్ట్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాజీపేట మండలం రాంపూర్లో జాతీయ రహదారిపై జరిగింది. స్థానికుల కథనం ప్రకా రం.. హనుమకొండలోని వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన మహమ్మద్ రబ్బాని పాషా రాంపూర్ శివారులోని సాక్షి వరంగల్ యూనిట్ కార్యాలయంలో డెస్క్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్నాడు.ఈ సమ యంలో రాంపూర్ శివారులోని జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడి ని చికిత్స నిమిత్తం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రబ్బాని పాషా ఆరోగ్యం విషమంగా ఉందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. -
12న ఆర్టీసీల పరిరక్షణ దినం
న్యూశాయంపేట: దేశంలోని 59 ఆర్టీసీ (రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్)లను పరిరక్షించాలనే డిమాండ్తో ఈనెల 12వ తేదీన చేపట్టనున్న ఆర్టీసీల పరిరక్షణ దినాన్ని(సేవ్ ఆర్టీసీ) విజయవంతం చేయాలని వరంగల్ రీజియన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు టి.ఎల్లయ్య, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండ రాంనగర్లోని సుందరయ్యభవన్లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. ఆర్టీసీలకు సంబంధించి కొన్ని విలువైన భూములు ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోని దాదాపు 59 ఆర్టీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వడం లేదని, ఫలితంగా ఆర్టీసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. దీంతో కార్మికులు పని భారం పెరిగి అనారోగ్యాల పాలు అవుతున్నారన్నారు. అందుకోసం ఈనెల 12న ఆర్టీసీల మనుగడ కోసం ‘ఆర్టీసీల పరిరక్షణ దినం’ (సేవ్ ఆర్టీసీ)డిమాండ్ డే పాటించాలని, ఆ రోజున కార్మికులందరూ నిరసన బ్యాడ్జీలు ధరించి విధుల కు హాజరు కావాలని కోరారు. రీజియన్ కార్యదర్శి బి.ఉపేంద్రాచారి, ఉపాధ్యక్షులు ఎన్.శ్రీనివాస్, పి.మహేందర్, కొమ్మాలు, ఎండి.పాషా, సాధిక్, రవి, సంపత్, శ్రీనివాస్, రమణ, తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మసీతో కేయూ ప్రతిష్ట విశ్వవ్యాప్తం
కేయూ క్యాంపస్ : యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్తో కాకతీయ యూనివర్సిటీ ప్రతిష్ట విశ్వవ్యాప్తమైందని వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. గురువారం యూనివర్సిటీలోని ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను పరిపాలనభవనంలోని సెనేట్హాల్లో నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 50 వసంతాల్లో ఫార్మసీ కాలేజీ స్ఫూర్తిదాయకమైన అధ్యాపకులు, విద్యార్థులను అందించిందని కొనియాడారు. ఫార్మసీలో ఇంకా మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు జరిగాలన్నారు. ఫార్మసీ కళాశాల ప్రథమ ప్రిన్సిపాల్ విశ్రాంత ఆచార్యులు పరమేశ్వర్ మాట్లాడుతూ ఫార్మసీ కాలేజీ ఎంతోమంది గొప్ప విద్యార్థులను అందించిందని గుర్తుచేశారు. యూరో మెడికేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అఽధినేత జె. రాజమౌళి మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ద్వారా ఈ కళాశాలను నిలబెట్టుకున్నామన్నారు. కేయూ ఫార్మసీ అలుమ్ని వైస్ ప్రెసిడెంట్ ఏవీ శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమం కోసం పూర్వ విద్యార్థుల సంఘం పనిచేస్తుందన్నారు. ప్రొఫెసర్ రామ్బహూ మాట్లాడుతూ ఫార్మసీ రంగం ఎక్కువమందికి ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు. విశ్రాంత ఆచార్యులు ఎ.వి.ఎన్ అప్పారావు మాట్లాడుతూ ఫార్మసీ కళాశాలకు రుణపడి ఉంటామన్నారు. విశ్రాంత ఆచార్యులు మల్లారెడ్డి మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులను చూసి గర్విస్తున్నామన్నారు. కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు (అకుట్) బి. వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ ఫార్మసీ కళాశాల పూర్వ విద్యార్థులు ఈ కళాశాల అభివృద్ధికి సహకరించాలన్నారు. అనంతరం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల చైర్మన్, ప్రిన్సిపాల్ జె. కృష్ణవేణి, కన్వీనర్ గాదెసమ్మయ్య మాట్లాడారు. సాయంత్రం నిర్వహించిన ముగింపు సమావేశంలో కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ విశ్వవిద్యాలయానికి వన్నెతెచ్చి న ఫార్మసీ కాలేజీలో గొప్పపరిశోధనలకు అవకాశాలున్నాయన్నారు. ఆచార్యలు వై. నర్సింహారెడ్డి, ఎన్ప్రసాద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వీసీ కె. ప్రతాప్రెడ్డి ఉత్సాహంగా ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు -
అభివృద్ధి పనులు పూర్తి చేయండి
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కాజీపేట అర్బన్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ స్నేహ శబరీష్, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో పాటు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పాల్గొని మాట్లాడారు. భద్రకాళి ఆలయ మాఢ వీధుల నిర్మాణం, కాకతీయ మ్యూజి కల్ గార్డెన్ పునరుద్ధరణ, వేయి స్తంభాల ఆలయం, సివిల్ సప్లై గో దాంలు, కాజీపేట ఆర్వోబీ నిర్మాణం తదితర పనుల్ని పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి, ఆర్డీఓ రమేశ్రాథోడ్, ‘కుడా’ పీఓ అజిత్రెడ్డి పాల్గొన్నారు. న్యూశాయంపేట: ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఇంజనీరింగ్ బృందం ప్రిలిమినరీ సర్వేలో భాగంగా గురువారం మామునూరు ఎయిర్పోర్ట్ను పరిశీలించింది. అనంతరం బృంద సభ్యులు వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై చర్చించారు. సమావేశంలో ఏఏఐ ఏజీఎంలు నటరాజ్, మనీష్ జోన్వాల్, మేనేజర్లు ఓం ప్రకాశ్, రోషన్ రావత్, ఎన్పీడీసీఎల్, ఇరిగేషన్ ఎస్ ఈలు గౌతంరెడ్డి, రాంప్రసాద్, ఆర్అండ్బీ ఈఈ రాజేందర్ పాల్గొన్నారు. కాజీపేట అర్బన్: విద్యుత్ సమస్యల పరిష్కారానికి, వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు లోకల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం కన్సూమర్స్ గ్రీవెన్స్ రిడ్రసల్ ఫోరం చైర్పర్సన్ ఎన్వీ.వేణుగోపాలచారి ఒక ప్రకటనలో తెలిపారు. లోకల్ కోర్టులను ఈనెల 6 నుంచి 19వ తేదీల్లో ఎన్పీడీసీఎల్ పరిధి వరంగల్, హనుమకొండ, పెద్దపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్ సర్కిళ్లలోఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి లోకల్ కోర్టులను వినియోగించుకోవాలని సూచించారు. లోకల్ కోర్టులు నిర్వహించే ప్రదేశాలివే.. 6వ తేదీ: హనుమకొండ సర్కిల్, భీమదేవరపల్లి, నారాయణగిరి, కొత్తకొండ 12న: వరంగల్ సర్కిల్, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ 16న: మహబూబాబాద్ సర్కిల్, డోర్నకల్, కురవి, కొత్తపేట -
కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకోషెడ్లో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఎలక్ట్రికల్ లోకో ఇంజనీర్ (సీఈఎల్ఈ) బి.పి.ఎస్.రాథోర్ అన్నారు. గురువారం సీఈఎల్ఈ షెడ్లో వివిధ విభాగాలను తనిఖీ చేశారు. అనంతరం లోకోల నిర్వహణ పనితీరుపై విజయవాడ, లాలాగూడ, మౌలాలి, కాజీపేట డీజిల్షెడ్, ఎలక్ట్రిక్షెడ్ నుంచి పాల్గొన్న అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాగా, షెడ్ అభివృద్ధి, రైల్వే కార్మికుల సమస్యలను స్థానిక షెడ్ సీనియర్ డీఈఈ సూర్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. సీఈఎల్ఈకి నాయకుల వినతి సీఈఎల్ఈ రాథోర్కు రైల్వే మజ్దూర్ యనియన్ కాజీపేట ఈఎల్ఎస్ బ్రాంచ్ నాయకులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. షెడ్లో లోకోల నిర్వహణకు సరిపడా స్టాఫ్ పెంచాలని, ఈఎల్ఎస్కు వచ్చే మార్గంలో రైల్వే ట్రాక్పై ఫుట్ఓవర్బ్రిడ్జి నిర్మించాలని, వెహికిల్ పార్కింగ్ ఏర్పాటు చేయాలనే తదితర సమస్యలను వివరించారు. దీనిపై సీఈఎల్ఈ స్పందించి సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు బ్రాంచ్ సెక్రటరీ నాయిని సదానందం, చైర్మన్ ఇబ్రహీం తెలి పారు. కార్యక్రమంలో ఈఎల్ఎస్ బ్రాంచ్ ట్రెజరర్ బి.రవీందర్రెడ్డి, ఆఫీస్ బేరర్స్ వైస్ చైర్మన్ ఎస్. గోపి, ప్రభాకర్, ఎస్.స్వర్ణకుమారి, అసిస్టెంట్ సెక్రటరీ పి.రాజు, అరుణ్కుమార్, అశోక్ పాల్గొన్నారు. ● కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకోషెడ్ తనిఖీ రైల్వే సీఈఎల్ఈ రాథోర్ -
వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి కృషి
హన్మకొండ కల్చరల్: కల్యాణ మండపం పునర్నిర్మాణానికి తోడ్పాటునందించానని, వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి నిధులు వచ్చేలా కృషి చేస్తానని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. వేయిస్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలుగా నిలిచిన కళాకారులకు గురువారం రాత్రి బహుమతులు ప్రదానం చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బండా ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. -
సులభ గణితం.. ఆ సార్ స్పెషాలిటీ
జనగామ రూరల్: ఈ ఫొటోలో విద్యార్థులతో కనిపిస్తున్న ఉపాధ్యాయుడి పేరు అల్లూరి రవీందర్. జనగామ మండలం ఓబుల్ కేశ్వాపూర్ జెడ్పీ హైస్కూల్లో గణిత శాస్త్రం బోధిస్తున్నారు. పాఠశాల స్థాయిలో పిల్లలకు గణితం అంటే భయం. వారిలో ఆ భయాన్ని తొలగిస్తేనే ఆ శాస్త్రం నేర్చుకోవడానికి ఆసక్తి కనబర్చుతారు. దీనిని గమంచిన టీచర్ రవీందర్.. 12 సంవత్సరాల నుంచి గణితం సులువుగా అర్థమయ్యేందుకు ఆ శాస్త్ర నమూనాలు తయారు చేసి బోధిస్తున్నారు. బట్టిపట్టే విధానం కాకుండా కృత్యాధార పద్ధతిలో గణితం బోధించడం ఆయన ప్రత్యేకత. 200కి పైగా గణిత మోడల్స్ తయారు చేసి బోధన సమయంలో ఉపయోగిస్తున్నానని రవీందర్ చెబుతున్నారు. కాగా, బెంగళూరు, చైన్నెలో జరిగిన సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్లో రవీందర్ రెండు సార్లు బహుమతులు గెలుచుకున్నారు. -
రెట్టింపు సంఖ్యలో బడికి
ఆత్మకూరు: మండలంలో ని చౌళ్లపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం చల్లా రమ ప్రభుత్వ పాఠశాలపై ప్రజలకు మక్కువ కలిగిస్తున్నారు. పాఠశాలలో డ్రాపవుట్స్ లేకుండా.. విద్యార్థుల సంఖ్య 20 నుంచి 40కి చేరాలా కృషి చేశారు. 2024 జూన్లో చౌళ్లపల్లి పాఠశాలలో హెచ్ఎంగా విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఆకర్షనీయ కార్యక్రమాలు చేపడుతూ.. పిల్లల్ని పాఠశాలకు దగ్గర చేస్తున్నారు. విద్యార్థులతో కో కరిక్యులర్ యాక్టివిటీస్ చేయిస్తూ వారిని మరింత చురుకుదనాన్ని కలిగిస్తున్నారు. సంస్కృతీ సంప్రదాయాల్ని నేర్పిస్తూ.. వేడుకల్ని పాఠశాలలో నిర్వహిస్తూ సృజనాత్మకత పెంచుతున్నారు. మండల అధికారుల ప్రశంసలు అందుకుంటున్నారు. -
శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
హిందీపై పిల్లల్లో ఇష్టం పెంచేలా బోధన విద్యారణ్యపురి: రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా హనుమకొండ లష్కర్ బజార్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల హిందీ స్కూల్ అసిస్టెంట్ చెడిపాక రాములుకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈనెల 5న హైదరాబాద్లోని మాదాపూర్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి గురు పూజోత్సవం అవార్డుల ప్రదానంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నారు. సులభ పద్ధతిలో హిందీ బోధన విద్యార్థుల్లో భాషపై ఇష్టాన్ని పెంచుతూ.. హిందీ బోధిస్తున్నారు. పేద విద్యార్థులకు పలకలు, త్రిభాషా డిక్షనరీలు, చార్టులు, పెన్సిళ్లు, స్కెచ్లు అందిస్తున్నారు. వృత్తి రీత్యా హిందీ స్కూల్ అసిస్టెంట్ అయినప్పటికీ ప్రవృత్తి పరంగా తెలుగులో పలు సినిమాపాటలు రాశారు. సోగ్గాడే శోభన్కృష్ణ, కేసీఆర్ బయోపిక్ ఉద్యమసింహం, నేను కీర్తన సినిమాలకు పాటలు కూడా రాశారు. 10 యూట్యూబ్ చానళ్లకు ఆయన రాసిన జానపద గీతాలు ప్రచారంలో ఉన్నాయి. ప్రైవేట్ ఆల్బమ్స్ 14 ఉన్నాయి. జానపద గీతాలు రచించి రాణిస్తున్నారు. ‘మహాగేయ ప్రస్థానం’ అనే పుస్తకాన్ని రచించారు. దేశభక్తి గీతాలు అందులో ఉన్నాయి. కవి, రచయిత గాయకుడిగా రాణిస్తున్నారు.రాములు తనకు రాష్ట్ర స్థాయి అవార్డు రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. -
7న భద్రకాళి దేవాలయం మూసివేత
హన్మకొండ కల్చరల్ : భాద్రపద శుద్ధ పూర్ణిమ ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్నందున భద్రకాళి దేవాలయాన్ని ఆరోజు మధ్యాహ్నం 1 గంటకు పూజల అనంతరం మూసివేయనున్నట్లు అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ రామల సునీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రహణమోక్షానంతరం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేసి సోమవారం ఉదయం 7గంటలకు భక్తులకు సర్వదర్శనం, ఆర్జిత సేవలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. భక్తులు గమనించాలని కోరారు. హసన్పర్తి: ఎస్సారెస్పీ జలాలు గురువారం సాయంత్రం హనుమకొండ జిల్లాకు చేరాయి. చివరి (ఖమ్మం, నల్లగొండ) ఆయకట్టు వరకు నీరందించనున్నట్లు అధికారులు తెలిపారు. లోయర్ మానేరు నుంచి 3,000 క్యూసెక్కుల నీరు విడుదలైనట్లు, వార బందీ పద్ధతిలో నీటిని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఖరీఫ్ పంటకు నీరందిస్తామన్నారు. వరంగల్ స్పోర్ట్స్: ఈనెల 7న హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ బాల్బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా బాల్బ్యాడ్మింటన్ కార్యదర్శి బేరే వీరన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఈనెల 13, 14 తేదీల్లో జనగామ జిల్లా కూనూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపా రు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఈనెల 25 నుంచి 29వ తేదీ వరకు మద్రాసులోని దిండిగల్లో జరగనున్న జాతీ య స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిలో క్రీడాకారులు 7న ఉదయం 9 గంటలకు జేఎన్ఎస్లోని బ్యాడ్మింటన్ గ్రౌండ్ వద్దకు ఆధార్కార్డుతో హాజరు కా వాలని సూచించారు. పూర్తి వివరాలకు 98492 01467లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. హసన్పర్తి/ ఖిలావరంగల్: హసన్పర్తి మండల కేంద్రంలోని సుజాత విద్యానికేతన్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆకుతోట రాంబాబు, వరంగల్ కివీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ దాసి సతీశ్మూర్తి(ఎస్ఆర్ఎఫ్ ఎక్స్లెన్స్) రాష్ట్ర స్థాయి గురు బ్రహ్మ అవార్డుకు ఎంపికయ్యారు. బుధవారం రాత్రి సురవరం ప్రతాప్రెడ్డి (పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ)లో నిర్వహించిన కార్యక్రమంలో లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. హన్మకొండ అర్బన్/ ఖిలా వరంగల్: రేషన్ డీలర్లకు గౌరవ వేతనం, కమిషన్ పెంపు జాప్యంపై నిరసన తెలుపుతూ.. నేడు (శుక్రవారం) రేషన్ షాపులు బంద్ చేస్తున్నట్లు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బత్తుల రమేశ్బాబు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జిల్లా ధారావత్ మోహన్నాయక్ గురువారం వేర్వేరుగా ప్రకటనల్లో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్లుగా రేషన్ డీలర్లకు రూ.5 వేల గౌరవ వేతనం, 21 నెలలు గడిచినా కమిషన్ పెంపు వర్తింపజేయకుండా జాప్యం, 5 నెలల కమిషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులను బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఐదు నెలలుగా రేషన్ షాపుల్లో పాడైపోతున్న దొడ్డు బియ్యం నిల్వలను తరలించేందుకు నిర్ణయం తీసుకోవాలని, క్వింటాలుకు రూ.140 నుంచి రూ.300కు కమీషన్ పెంచాలని డిమాండ్ చేశారు. ఒక రోజు బంద్తోనైనా ప్రభుత్వం స్పందించాలని, లేనిపక్షంలో తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
బడిని బాగు చేసి.. విద్యార్థులను తీర్చిదిద్ది
వెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం ఒడ్డెరగూడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు టి.రాజేశ్కుమార్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. నేడు హైదరాబాద్లోని శిల్పారామంలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు. రాజేశ్ బాధ్యతలు స్వీకరించిన సమయంలో స్కూల్లో జీరో స్టెంత్ ఉంది. దీంతో పాఠశాలను బాగుచేసి పిల్లలను బడిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 2018లో జీరో స్టెంత్ స్కూల్ను రీఓపెన్ చేసి రూ.40 వేలు సొంత డబ్బులు వెచ్చించి పాఠశాల పరిసరాలను శుభ్రం చేయించారు. సహచార ఉపాధ్యాయుడు విజయ్భాస్కర్ సాయంతో ఇంటింటికీ తిరిగి 15మంది పిల్లలను బడిలోకి తీసుకొచ్చాడు. అనంతరం పాఠశాల అభివృద్ధికి తీవ్రంగా కృషి చేశారు. దీంతో 2023లో జిల్లా స్థాయిలో టీచింగ్ లార్నింగ్ మెటీరీయల్ తయారు చేయగా జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు వచ్చింది. జూలైలో ఢిల్లీలో జరిగిన సీసీఆర్టీ ట్రైనింగ్ ప్రోగ్రాంకు తెలంగాణ నుంచి 10 మంది వెళ్లగా అందులో రాజేశ్ ఉన్నారు. ఆదర్శం.. ఆ ఉపాధ్యాయుడు గూడూరు: అతనో మారుమూల ఏజెన్సీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. ఎక్కడ పనిచేసినా విద్యాభివృద్ధే లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తారు. అతనే గూడూరు మండలం రాజనపల్లి మండల పరిషత్ ప్రాఽథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎండి. యాకూబ్. పాఠశాలలో పిల్లల సంఖ్య పెంచాలనుకున్న సహచర ఉపాధ్యాయుల నిర్ణయానికి యాకూబ్ తన అభిప్రాయం తెలిపారు. తాను సొంత డబ్బులు రూ. లక్షా 50 వేలు వెచ్చించి ఓ వ్యాన్ కొనుగోలు చేశారు. అంతేకాకుండా విద్యార్థులను రోజూ పాఠశాలకు తీసుకొచ్చి సాయంత్రం ఇంటి వద్ద చేర్చుతూ తానే వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. దీంతో గతంలో ఆ పాఠశాలలో 26 మంది విద్యార్థులు ఉండగా, వ్యాన్ కొనుగోలు తర్వాత ఆ సంఖ్య 75కి పెరిగింది. కాగా, విద్యాభివృద్ధికి ఉపాధ్యాయుడే డ్రైవర్గా మారడంపై ఉన్నతాధికారులు గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.● ప్రభుత్వ పాఠశాల, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తున్న టీచర్లు ● నాణ్యతగా, వినూత్నంగా బోధిస్తూ విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు -
దేవాలయ భూముల్లో భవనాలు ఖాళీ చేయాలి
● గోవిందరాజుల గుట్ట భూమి ఆక్రమణపై దేవాదాయ శాఖ నోటీసులు వరంగల్ చౌరస్తా : వరంగల్లోని చారిత్రక గోవిందరా జుల గుట్ట దేవాలయ భూముల ఆక్రమణలపై మల్ల గుల్లాలు పడిన దేవాదాయశాఖ అధికారులు ఎట్టకేలకు కదిలారు. దేవాలయానికి చెందిన భూములపై పలు మార్లు సర్వే చేసిన అధికారులు.. రెండు రోజుల క్రితం వ్యాపార సంస్థలు, ఇళ్లవాసులకు నోటీసులు జారీ చేశా రు. ఆలయానికి చెందిన సర్వే నంబర్ 15/1, 15/2. 38లో సుమారు 8 ఎకరాలు ఉందని నిర్ధారించారు. అయితే సర్వేలో 5 ఎకరాల 25 గుంటలు మాత్రమే తేలింది. మిగతా స్థలంలో అక్రమంగా వ్యాపార సంస్థలు, నివాస గృహాలను నిర్మించుకున్నట్లు భావిస్తున్నా రు. సుమారు 54 నిర్మాణాలుండగా, అందులో 15 వ్యా పార సంస్థలు, 39 నివాస గృహాలు ఉన్నాయి. వీరందరూ వ్యాపార సంస్థలు, నివాసాలను ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేయగా, కొంత మంది స్వీకరించగా, మరికొందరు నిరాకరించారు. సీపీఎం నేతలు, గృహ యజమానుల నిరసన గోవిందరాజుల గుట్ట చుట్టూ ఉన్న నివాస గృహాలకు దేవాదాయ శాఖ అధికారులు ఇళ్లు ఖాళీ చేయాలని ఇచ్చిన నోటీస్లను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఆ లయ సమీపంలో నిరసన వ్యక్తం చేశారు. 120 ఏళ్ల క్రితం నుంచి ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకుని జీ విస్తున్న పేద, మధ్యతరగతి 54 కుటుంబాలకు అకస్మాత్తుగా ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి ఆందోళన గురి చేస్తున్నారని మండిపడ్డారు. నాయకులు బాబు, మా ధవి, కుమార్, శివ, సంపత్, రమేశ్,యాదగిరి, రామ సరోజన, సదానందం, గోవర్ధన్ పాల్గొన్నారు. -
గురవేనమః
నేడు ఉపాధ్యాయ దినోత్సవంగురు స్థానం గొప్పది. రంగమేదైనా గురువుంటే గురి ఛేదించాల్సిందే. ఉపాధ్యాయులు తమ ఉద్యోగ జీవితంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మందికి గురువుగా మారుతారు. పాఠ్యపుస్తకంలోని పాఠాలే కాకుండా బతుకు పాఠాలు నేర్పిన వారు కొందరైతే.. జీవితాల్ని నిలబెట్టిన వారూ మరెందరో.. బాధ్యతగల పౌరుల్ని తీర్చిదిద్ది సమాజంలో మంచిని పెంచడంలో గురువులే కీలకం. ఉపాధ్యాయ దినోత్సవం వేళ వారందరికీ గురవేనమః మరిన్ని కథనాలు : 8లో -
మల్లన్నగండి కుడి కాల్వ నిర్మాణం అద్భుతం
స్టేషన్ఘన్పూర్: గండి రామారం (మల్లన్నగండి) కుడి కాల్వ నిర్మాణం అద్భుతమని, గుట్టల నుంచి సైతం కాల్వలు తీయొచ్చు.. గోదావరి జలాలు పా రించొచ్చు.. పంటపొలాలు పండించొచ్చని నిరూపితమైందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఎమ్మెల్యే కడియం ప్రత్యేక చొరవతో రూ.29 కోట్ల వ్యయంతో మండలంలోని మీది కొండ శివారులో 11 గ్రామాల్లో 5,600 ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించిన మల్లన్నగండి కుడి కాల్వను ఎంపీ డాక్టర్ కావ్యతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఉమ్మ డి వరంగల్ జిల్లాలో ఎత్తైన, కరువు ప్రాంతాలు జనగామ, చేర్యాల, వర్ధన్నపేట, పాలకుర్తి తదితర ప్రాంతాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 2003లో దేవాదుల మొదటి దశ పనులు ప్రారంభించామన్నారు. నాడు దేవాదుల పేరుతో కడియం డ్రామా ఆడుతున్నారని, దేవాదుల దేవతలకే సాధ్యం కాదని పలువురు విమర్శలు చేశారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కాల్వలో పారుతున్న నీరు చూస్తే వారికి జ్ఞానోదయం అవుతుందన్నారు. రూ.1,015 కోట్ల ప్యాకేజీతో పలు పనులకు ఆమోదం దేవాదుల మూడో దశ 6వ ప్యాకేజీ ద్వారా నాలుగు నియోజకవర్గాల్లో 78వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగానే సవరించిన అంచనాలతో రూ.1,015 కోట్ల మంజూరుకు ఆమోదం తెలిపారని ఎమ్మెల్యే కడియం చెప్పారు. ఏడాది లోపు పనులు పూర్తి చేయిస్తానన్నారు. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి ఏడాదిన్నరలోనే రూ.వెయ్యి కోట్ల నిధులు తీసుకొచ్చానన్నారు. రాజకీయ జన్మనిచ్చిన నియోజకవర్గ అభివృద్ధికి తన చివరి శ్వాస వరకు కృషి చేస్తానన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కడియం.. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవజ్ఞులైన స్థానిక ఎమ్మె ల్యే కడియం శ్రీహరి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని, ఎడారి వంటి వాతావరణంలో జీవిస్తున్న రైతుల సంక్షేమం కోసం భారీ ఎత్తున నీటిని విడుదల చేయడం చారిత్రక ఘట్టమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, ఏఎంసీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు నరేందర్రెడ్డి, కరుణాకర్, చిల్పూరు దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, మాజీ వైస్ ఎంపీపీ చల్లా సుధీర్రెడ్డి, నాయకులు రాపోలు మధుసూదన్రెడ్డి, నాగరబోయిన యాదగిరి, వెంకటేశ్వర్రెడ్డి, నాగరబోయిన శ్రీరాములు, కొలిపాక సతీశ్, ఈఈ వినయ్, డీఈ సంపత్, నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఎమ్మెల్యే కడియం ఎంపీ డాక్టర్ కడియం కావ్య -
వడివడిగా అడుగులు..
సాక్షి, వరంగల్: గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మరో రెండు ప్రధాన కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నాయి. కేరళ కేంద్రంగా ఉన్న చిన్నపిల్లల దుస్తులు తయారుచేసే కై టెక్స్ కంపెనీతోపాటు దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్ కంపెనీ కూడా కొన్ని షెడ్లు నిర్మించి తమ ఉత్పత్తుల కోసం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నాయి. మరో రెండు నుంచి మూడు నెలల్లో తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఈ కంపెనీల ఉత్పత్తులు ప్రారంభించేందుకు ఆలోచన చేస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెక్స్టైల్ పార్కులో 22 కంపెనీలు ఎంఓయూ కుదుర్చుకుంటే రెండు కంపెనీలు ఉత్పత్తులు ప్రారంభించాయి. ఇప్పుడు మరో రెండు ప్రధాన కంపెనీలు ఆ దిశగా ముందుకెళ్తున్నాయి. వీటి ద్వారా 35వేలకుపైగా ఉద్యోగాలు రానున్నాయి. కై టెక్స్ రూ.1200 కోట్ల పెట్టుబడి.. కై టెక్స్ కంపెనీ యార్న్, ఫ్యాబ్రిక్, ఇన్నర్, ఔటర్ వియర్, సాక్స్లు, అసెసరీస్, ప్యాకింగ్ మెటీరియల్స్ తయారీ చేసేందుకు సకల హంగులతో నిర్మాణాలు చేస్తోంది. ఇప్పటి వరకు ఒక్కొక్కటి 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు పెద్ద షెడ్లను నిర్మించారు. రూ.1200 కోట్ల పెట్టబడులతో 191 ఎకరాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ప్రస్తుతం కంపెనీలో ముడి పత్తి నుంచి జిన్నింగ్, ప్రెస్సింగ్, స్పిన్నింగ్ ప్రాసెస్ ప్రారంభమై ట్రయల్ రన్ నడుస్తోంది. మరో రెండు నెలల్లో పూర్తి స్థాయిలో కంపెనీ ప్రారంభమయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇందులో 25,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి కంపెనీ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. యంగ్వన్ రూ.980 కోట్ల పెట్టుబడి.. దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్ (ఎవర్ టాప్ టెక్స్టైల్ అండ్ అపెరల్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీ 297.59 ఎకరాల్లో రూ.980 కోట్ల పెట్టుబడితో క్రీడా దుస్తులు, బూట్లు, ఇతర దుస్తులు తయారుచేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే నిర్మించిన ఐదు షెడ్లలో ఉత్పత్తుల కోసం ట్రయల్ రన్ నడుస్తోంది. ఈ కంపెనీ ద్వారా 11,700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇది కూడా సాధ్యమైనంత తొందర్లోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే యూపీలోని కాన్పూర్ కేంద్రంగా ఉన్న గణేశ్ ఎకోటెక్ కంపెనీ 50 ఎకరాల్లో రూ.500 కోట్ల పెట్టుబడితో రెండు యూనిట్లు స్థాపించింది. వాడిన ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి యార్న్, బాటిల్స్ను తయారు చేస్తోంది. ఇందులో సుమారు 450 మంది పనిచేస్తున్నారు. వస్త్ర పరిశ్రమలో కై టెక్స్, యంగ్వన్ కంపెనీల ట్రయల్ రన్ రెండు నెలల్లో మార్కెట్లోకి రానున్న ఉత్పత్తులు 35వేల మందికిపైగా ఉద్యోగావకాశాలు చకచకా వసతుల కల్పన..1350 ఎకరాల్లోని మెగా టెక్స్టైల్ పార్కులో గత బీఆర్ఎస్ సర్కారు రూ.500 కోట్లు ఖర్చు చేసింది. అందులో రూ. 160 కోట్లు భూసేకరణ కోసం రైతులకు పరిహారం చెల్లించింది. పార్కులో వరద కాల్వ నిర్మాణం కోసం రూ.159తో పనులు జరుగుతున్నాయి. పీఎం మిత్రలో రూ.200 కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినా ఇంత వరకు మంజూరు కాలేదు. విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం, రెండు 132 కేవీ లైన్ల కోసం రూ.209 కోట్లు కేటాయించారు. చలివాగు నుంచి నీటిని సరఫరా కోసం సుమారు 45 కి.మీ పొడవులో పైపులైన్ బిగించారు. ఒక ఎంఎల్డీ, ఐదు ఎంఎల్డీ (ఒక ఎంఎల్డీ అంటే పది లక్షల లీటర్ల నీరు) అందించనున్నారు. భూ నిర్వాసితులకు 823 ప్లాట్లు కేటాయించి రాజీవ్ టౌన్షిప్గా అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో వాటర్ సప్లయ్, సీవరేజ్ ప్లాంట్, వీధి దీపాలు, ఎల్టీ లైన్, మురుగు వాటర్ డ్రెయిన్, ట్రీట్మెంట్ ప్లాంటు, వాటర్ ట్యాంకు కోసం రూ.14 కోట్ల నిధులతో పనులకు టెండర్లు పూర్తయ్యాయి. 50 గజాల స్థలం వచ్చిన వారికి 70 గజాలు చేస్తూ 187 మందికి ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చారు. రూ.5.50 కోట్లతో స్కూల్, పీహెచ్సీ, జీపీ భవనం, వెటర్నరీ ఆస్పత్రి పనులు జరుగనున్నాయి. మౌలిక వసతుల కోసం రూ.14 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయి. 2024 నవంబర్ 19న వరంగల్ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్రెడ్డి రాజీవ్ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన చేశారు. -
అర్ధశతాబ్దపు ఆనందోత్సవం..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఫార్మసీ కళాశాల ఏర్పాటై 50 వసంతాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు (ఈనెల 4న) గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు కేయూలో ప్రారంభమై అమెరికా, హైదరాబాద్లో కూడా జరగనున్నాయి. ఉస్మానియా నుంచి షిఫ్ట్.. బీ ఫార్మసీ కోర్సు తొలుత హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో 1974లో ఏర్పాటుచేశారు. ఆ తర్వాత 1975లోనే వరంగల్కు షిఫ్ట్ అయ్యింది (కేయూకు). తొలుత ఆర్ఈసీ, కేఎంసీలో కూడా తరగతులు జరిగేవి. ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీలో బీఫార్మసీ కోర్సుతో ప్రారంభమైన ఈ ఫార్మసీ కాలేజీ అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది ఎం.ఫార్మసీ, పీహెచ్డీ ప్రోగ్రామ్స్ కూడా కొనసాగుతున్నాయి.ఈ ఫార్మస్యూటికల్ సైన్సెస్లో పరిశోధనలు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 2024లో ఈ ఫార్మసీ కాలేజీ ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్లో 88వ స్థానంలో నిలిచింది. పలువురి ప్రొఫెసర్లు వివిధ పరిశోధనల్లో 12 పేటెంట్లు కలిగి ఉన్నారు. ఇప్పటివరకు 350మంది పైగా పరిశోధకులు పీహెచ్డీ పూర్తిచేశారు. దేశ, విదేశాలలో స్థిరపడిన పూర్వవిద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో (కాలేజీ) చదివిన, పరిశోధనలు చేసిన ఎంతోమంది విద్యార్థులు దేశ, విదేశాల్లో స్థిరపడ్డారు. ముఖ్యంగా అమెరికాలో ఎక్కువ మంది ఫార్మసీ రంగంలో సైంటిస్టులు, ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. అలాగే, కొందరు ఔషధ పరిశ్రమలు స్థాపించారు. యూకే, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, న్యూజిలాండ్, ఇథియోపియా, సౌతాఫ్రికా అరబ్ దేశాల్లోనూ ఉన్నతస్థానంలో స్థిరపడ్డారు. ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు సుమారు 300 మంది పూర్వవిద్యార్థులు తరలి రానున్నారు. ప్రస్తుత విద్యార్థులు 250మందికిపైగా పాల్గొనబోతున్నారని గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల కన్వీనర్, డీన్ ప్రొఫెసర్ గాదె సమ్మయ్య బుధవారం తెలిపారు. గురువారం ఉదయం 10గంటలకు సెనేట్హాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీసీ కె. ప్రతాప్రెడ్డి ముఖ్యఅతిథిగా, గౌరవ అతిథిగా రిజిస్ట్రార్ వి. రామచంద్రం, రిటైర్డ్ ప్రొఫెసర్లు డి. రాంబహు, వి. మల్లారెడ్డి, పి. అమరేశ్వర్, ఏవిఎన్ అప్పారావు, హైదరాబాద్లోని యూరో మెడికేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జె. రాజమౌళి, హైదరాబాద్ ఎస్ఎన్వీపీఎంవీ సీఎండీ బి. ప్రభాశంకర్ పాల్గొననున్నారు. ఉత్సవాలకు చైర్మన్గా ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్ జె. కృష్ణవేణి, కన్వీనర్గా గాదె సమ్మయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వై. నర్సింహారెడ్డి వ్యవహరిస్తున్నారు. అమెరికాలో స్థిరపడిన కేయూ ఫార్మసీ కాలేజీ పూర్వ విద్యార్థులు ఈనెల 12,13తేదీల్లో అక్కడే అట్లాంటాలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించకోబోతున్నారు. అక్కడ నుంచి కేయూకు రాలేనివారు ఈ ఉత్సవాలను నిర్వహించుకున్నారు. హైదరాబాద్లోని కేయూ ఫార్మసీ కాలేజీ పూర్వవిద్యార్థు అక్టోబర్ 11,12 తేదీల్లో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించుకోబోతున్నారు. మళ్లీ కేయూలో డిసెంబర్ 27, 28తేదీల్లో ముగింపు సమావేశాలు నిర్వహించనున్నారు. తరలిరానున్న పూర్వ, ప్రస్తుత విద్యార్థులు ఈనెల 12,13 తేదీల్లో అమెరికాలో కూడా.. -
క్రీడల అభివృద్ధికి కృషి..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో క్రీడల అభివృద్ధికి అవసరమైన వనరులు సమకూరుస్తామని, విద్యార్థులు క్రీడల్లోనూ రాణించేలా ఫిజికల్ డైరెక్టర్లు (పీడీ) సమన్వయంతో పనిచేయాలని వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. బుధవారం కేయూలోని పరిపాలన భవనంలోని సెనేట్హాల్లో నిర్వహించిన స్పోర్ట్స్ బోర్డు సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల క్రీడాప్రతిభను ఫిజి కల్ డైరెక్టర్లు గుర్తించి వారిని ప్రోత్సహించాల్సిన అ వసరం ఉందన్నారు.క్రీడారంగంలో యూనివర్సిటీ ప్రతిష్ట పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. రిజిస్ట్రార్ వి. రామచంద్రం మాట్లాడుతూ క్రీడలను క్రమశిక్షణతో నిర్వహించాలన్నారు. స్పోర్ట్స్ బోర్డు చైర్మన్ టి. మనోహర్ మాట్లాడుతూ యూనివర్సిటీపరిధిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఉన్నారని, వారికి క్రీడలపై ఆసక్తి పెరిగేలా కృషిచేయాలన్నారు. అనంతరం పలువురు ఫిజికల్ డైరెక్టర్లు మాట్లాడుతూ క్రీడలకోసం మౌలిక వసతులు పెంచాలన్నారు. కేయూ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య, ఫైనాన్స్ ఆఫీసర్ హబీబుద్దీన్, జె. సోమన్న, వెంకన్న, ప్రొఫెసర్ రమేశ్రెడ్డి, వర్సిటీ పరిఽధిలోని ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు. అనంతరం కేయూ ఇంటర్ కాలేజీయేట్ టోర్నమెంట్ షెడ్యూల్ వెల్లడించారు. కబడ్డీ, అథ్లెటిక్స్, క్రికెట్ తదితర క్రీడాపోటీలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. కాగా, ఈనెల 11 నుంచి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. లారీ ఢీకొని యువకుడి దుర్మరణం ● వరంగల్ ఆర్టీఏ జంక్షన్ సమీపంలో ఘటన మామునూరు: లారీ ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన వరంగల్ ఆర్టీఏ జంక్షన్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. హనుమకొండ గోపాల్పూర్కు చెందిన పెద్దూరి భవాని రెండో కుమారుడు సాకేత్(23) డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పని నిమిత్తం బైక్పై వరంగల్ రంగశాయిపేటకు వచ్చాడు. పని ముగిసిన అనంతరం బుధవారం తెల్లవారుజామున ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఆర్టీఏ జంక్షన్ సమీపానికి చేరగానే ఖమ్మం నుంచి ఉర్సు గుట్టవైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొంది. దీంతో అదే లారీ కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే మామునూరు ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి తల్లి భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రమేశ్ తెలిపారు.● పీడీలు సమన్వయంతో పనిచేయాలి ● కేయూ వీసీ ప్రతాప్రెడ్డి -
7న ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–15 చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–15 చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వహణ కార్యదర్శి పి. కన్నా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ పబ్లిక్గార్డెన్ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జనవరి 01, 2010, ఆ తర్వాత జన్మించిన వారు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఇందులో గెలుపొందిన నలుగురు బాలురు, నలుగురు బాలికలు అక్టోబర్లో నిజామాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ వెంట చెస్ బోర్డు తెచ్చుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 90595 22986 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. అక్షిత్చౌహాన్కు అంతర్జాతీయ రేటింగ్ హనుమకొండ రాంనగర్కు చెందిన ఆరేళ్ల లావుడ్య అక్షిత్ చౌహాన్ అంతర్జాతీయ చదరంగం రేటింగ్ సాధించాడు. గత నెలలో నాగ్పూర్లో జరిగిన 1,700 అంతర్జాతీయ ఫిడే రేటింగ్లో పాల్గొని 1,439 రేటింగ్ సాధించినట్లు జిల్లా చదరంగ సమైఖ్య బాధ్యుడు పి. కన్నా తెలిపారు. అక్షిత్ చౌహాన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మొదటి తరగతి చదువుతున్నాడు. దీనిపై బాలుడి తల్లిదండ్రులు శశికాంత్, అఖిలానాయక్ హర్షం వ్యక్తం చేశారు. -
రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదు
బీసీ రిజర్వేషన్లపై ● బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్హన్మకొండ: బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షు డు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బుధవారం హనుమకొండలోని హోటల్ హరిత కాకతీయలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లకు గల్లీలో మద్దతు ఇస్తూ ఢిల్లీలో అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు పెంచుకుండా ప్రధాన పార్టీలు కుట్రలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం, అగ్రకులాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించి 60 శాతంగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా మోసం చేస్తున్నాయన్నారు. నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగినా ఇండియా కూటమి ఎంపీలు, బీజేపీ ఎంపీలు బీసీ రిజర్వేషన్లపై నోరు విప్పలేదని మండిపడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు సిండికేట్ అయ్యాయని, ఈ కుట్రలను బీసీలు అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రపతి ఆమోదానికి బిల్లు పంపి 5 నెలలవుతున్నా మోక్షం లేదన్నారు. అఖిలపక్షాన గవర్నర్ను కలిస్తే బీజేపీ కలిసి రాలేదని, పైగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టేది లేదని చెప్పుతున్నారని మండిపడ్డారు. అఖిలపక్షం కలిసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమయం ఇవ్వడం లేదన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, నాయకులు సంగని మల్లీశ్వర్, వరంగల్ శ్రీనివాస్, దాడి మల్ల య్య యాదవ్, అరుంధతి, తమ్మల శోభారాణి, పద్మజ, బీమగాని యాదగిరి గౌడ్, పాండవుల శ్రీనివాస్, కొట్టే మహేందర్ పాల్గొన్నారు. -
ఎస్సార్లో అంతర్జాతీయ విద్యామేళా
హసన్పర్తి: నగర శివారులోని ఎస్సార్ యూనివర్సిటీలో అంతర్జాతీయ విద్యా మేళా–2025 నిర్వహించారు. ఎస్సార్ ఐ ఎక్స్ ఆడిటోరియంలో బుధవారం ఈకార్యక్రమం జరిగింది. యూనివర్సిటీ హబ్, అబాకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అడ్వయిజర్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎస్సార్ యూనివర్సిటీ వీసీ దీపక్గార్గ్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈమేళాలో అమెరికా, యూకే, యూరప్, కెనడా, న్యూజిలాండ్ దేశాలకు చెందిన సుమారు 30 యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. 2,500 మంది విద్యార్థులు హాజరై ఉన్నత విద్య అవకాశాలు, స్కాలర్షిప్స్, గ్లోబల్ కెరీర్ మార్గాలు, అడ్మిషన్, వీసా ప్రక్రియ గురించి తెలుసుకున్నారు. నార్త్ ఈస్టర్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, సిటీ యూనివర్సిటీ ఆఫ్ సియాటిల్, వెబ్స్టర్ యూనివర్సిటీ, నయాగరా యూనివర్సిటీ, జావియర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వైకాటో, యూనివర్సిటీ కాటోలికా డెల్ సాక్రో కుటర్, డబ్ల్యూసీఐ, గానస్ యూనివర్సిటీ, రేవన్స్బోర్స్ యూనివర్సిటీ లండన్, తదితర యూనివర్సిటీలకు చెందిన ప్రతినిధులతో పాటు ఇంటర్నేషనల్ ఎఫైర్స్ అండ్ కార్పొరేట్ ఔట్రీచ్ డైరెక్టర్ప్రతినిధి ప్రీతా చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు. -
పరిశోధన ఫలితాలు రైతులకు చేరాలి
● వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు ఎం.యాకాద్రి హన్మకొండ: పరిశోధన ఫలితాలు రైతులకు చేరాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డాక్టర్ ఎం.యాకాద్రి అన్నారు. వరంగల్ జిల్లాలోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, పంటపొలాల్లో నిర్వహిస్తున్న వివిధ పరిశోధనలు, నూతన వంగడాల పరీక్ష క్షేత్రాలు, గీసుకొండ మండలం మచ్చాపూర్లో అధిక సాంద్రత విధానంలో సాగు చేస్తున్న పత్తి పంట, నర్సంపేట మండలంలో గురిజాలలో నేరుగా విత్తే పద్ధతిలో సాగు చేస్తున్న వరి పంటను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డితో కలిసి బుధవారం యాకాద్రి పరిశీలించారు. జిల్లాలో రైతుల కోసం నిర్వహిస్తున్న వివిధ విస్తరణ కార్యక్రమాల పురోగతి గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎ.విజయభాస్కర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.వీరన్న, డాక్టర్ రాజ్కుమార్, డాక్టర్ విశ్వతేజ, ఏఈఓ అశోక్ తదితరులు పాల్గొన్నారు. వనదేవతలను దర్శించుకున్న వైస్చాన్స్లర్లుఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మను బుధవారం ఐదు రాష్ట్రాలకు చెందిన వివిధ యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లు (వీసీ) దర్శించుకున్నారు. హిమాచల్ ప్రదేశ్, (సిమ్లా) త్రిపుర, పాండిచ్చేరి, కర్ణాటక, (బెంగుళూర్) గుజరాత్ (రాజ్కోట్) రాష్ట్రాలకు చెందిన వీసీలు సంజయ్శర్మ, మిలాని రాణి, వెంకటరావు, విష్ణకంటి, నవీన్చంద్ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద పూజలు చేశారు. దేవాదాయశాఖ అధికారులు, పూజారులు డోలివాయిద్యాలతో వీసీలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైస్ చాన్స్లర్లను పూజారులు అమ్మవారి శేషవస్త్రాలతో సన్మానించి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్లు మధు, బాలకృష్ణ, పూజారులు పాల్గొన్నారు. -
పెరిగిన భూగర్భ జలాలు
● ఇటీవల కురిసిన భారీ వర్షాలు ● తగ్గిన భూగర్భ జల వినియోగంహన్మకొండ: గ్రేటర్ వరంగల్ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జల వినియోగం తగ్గింది. చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి. వరంగల్ జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 3.14 మీటర్ల లోతు, హనుమకొండ జిల్లాలో 4.70 మీటర్ల లోతులో ఉన్నాయి. ఈ వర్షాకాలంలో వరంగల్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. హనుమకొండ జిల్లాలో సాధారణ వర్షం కురిసింది. ఈ మేరకు భూగర్భ జలాల పెరుగుదలలో స్వల్ప తేడా ఏర్పడింది. వరంగల్ జిల్లాలో సగటు భూగర్భ జలమట్టంతో పోలిస్తే హనుమకొండ జిల్లాలో 1.6 మీటర్ల లోతుకు పడిపోయింది. ఇప్పటి వరకు వరంగల్ జిల్లా సగటు సాధారణ వర్షపాతం 698.4 మిల్లీమీటర్లు కాగా.. 868.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్ధన్నపేట, గీసుకొండలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఖిలా వరంగల్, వరంగల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. హనుమకొండ జిల్లాలో సగటు సాధారణ వర్షపాతం 657.5 మిల్లీమీటర్లు కాగా.. 660 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. హసన్పర్తి, హనుమకొండ, కాజీపేట, ఐనవోలు, మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతంతో హనుమకొండ జిల్లాలో భూగర్భ జలాల పెరుగుదల స్వల్పంగానే ఉంది. -
గురువారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
గ్రేటర్ పరిధిలో చకచకా ఏర్పాట్లు ● రేపు (శుక్రవారం) గణపతుల నిమజ్జనం ● నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్వేయిస్తంభాల ఆలయంలో సింహగణపతిగా అలంకరణహన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో బుధవారం మూల మహా గణపతిని శ్రీసింహగణపతిగా అలంకరించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు మూల గణపతికి సింధువర్ణాభిషేకం జరిపి సింహగణపతిగా అలంకరించి, పల్లకిసేవ నిర్వహించారు. సాయంత్రం నృత్యగురువు పిండి సుభాషిణి శిష్య బృంద కూచిపూడి నృత్యాలు అలరించాయి. ఈఓ అనిల్కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. 6న జరగాల్సిన ఎల్ఎల్బీ పరీక్షలు వాయిదాకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిఽధిలో ఈనెల 6న జరగాల్సిన ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సు రెండో సెమిస్టర్ పరీక్షలు మూడో పేపర్, ఎల్ఎల్బీ ఐదేళ్ల లా కోర్సు ఆరో సెమిస్టర్ మూడో పేపర్ పరీక్షలు గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిం ఇక్బాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా పరీక్షలు ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు. మిగతా పరీక్షల్లో ఎలాంటి మార్పులు లేవని, విద్యార్థులు గమనించాలని సూచించారు. వివరాలకు కేయూ వెబ్సైట్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ.ఇన్’లో చూడవచ్చని తెలిపారు. ముగిసిన సీఓఈ ప్రవేశ పరీక్షన్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ గురుకులాల ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు సీఓఈ (సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్)లో ప్రవేశానికి వరంగల్ నగరంలోని రంగశాయిపేట శివారు జక్కలొద్ది, కేయూ క్రాస్రోడ్డులోని గురుకులాల్లోని రెండు కేంద్రాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్ష బుధవారం ముగిసినట్లు రీజినల్ కో–ఆర్డినేటర్ జే.సతీష్ తెలిపారు. ఐఐటీ కోసం 164 మంది దరఖాస్తు చేసుకోగా, ఏడుగురు గైర్హాజరయ్యారని, 157 మంది పరీక్షలో ఉత్తీర్ణత సాధించారన్నారు. నీట్ కోసం 96 మంది దరఖాస్తు చేసుకొని పరీక్షకు హాజరు కాగా, ఏడుగురు గైర్హాజరయ్యారని వివరించారు. పరీక్షకు హాజరైన వారిలో 89 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. టీజీ ఎన్పీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా బోనాల కిషన్హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా బోనాల కిషన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పోలీసు శాఖ నుంచి డిప్యూటేషన్పై వచ్చిన బోనాల కిషన్ను ఎన్పీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా నియమిస్తూ ట్రాన్స్ కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండలోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరణ అనంతరం ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కేయూ విద్యా కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా రిజిస్ట్రార్కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని విద్యా కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్, విభాగాధిపతిగా రిజిస్ట్రార్ వి.రామచంద్రం బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆకళాశాలలో రెగ్యులర్ ఆచార్యులు ఎవరూ లేక ఇన్నాళ్లు హిస్టరీ విభాగం ప్రొఫెసర్ ఆచార్య టి.మనోహర్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్, హెడ్గా బాధ్యతలు నిర్వర్తించారు. విద్యారణ్యపురి: అడ్మిషన్ల ప్రక్రియలో జూనియర్ కళాశాలలు ఇంటర్ బోర్డు నియమ నిబంధనలను పాటించాలని వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్సుమన్ కోరారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ కళాశాలలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. దరఖాస్తులు, టీసీలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ ఇంటర్బోర్డు ఆదేశాల మేరకు ఇంటర్ అడ్మిషన్లకు టీసీ తప్పనిసరి అన్నారు. నిబంధనలను పాటించని కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్, అభ్యసన తరగతులు నిర్వహించాలన్నారు. కళాశాలల్లో రోజువారీ హాజరు, అంతర్గత పరీక్షలు, ప్రమాణాల పెంపుపై పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ఇంటర్ అడ్మిషన్ల లాగిన్లో విద్యార్థుల వివరాలు, ఫొటో, సంతకం, యూడైస్ పెన్ నంబర్ తదితర వివరాలను నవీకరించాలని పేర్కొన్నారు.సంపూర్ణ చంద్రగ్రహణం ఆదివారం సంభవిస్తున్నందున, గురువారంతో నవరాత్రులు పూర్తవుతున్నందున వారంతో సంబంధంలేకుండా గణపతుల నిమజ్జనం రేపు (శుక్రవారం) నిర్వహించనున్నారు. ఈ మేరకు గ్రేటర్ వరంగల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్ర గ్రహణం కారణంగా దేవాలయాల్లో ఆదివారం మధ్యాహ్నం 12గంటల్లోపు నివేదనలు జరిపి మూసివేసి, తిరిగి సోమవారం ఉదయం సంప్రోక్షణలు నిర్వహించిన అనంతరం యథావిధి పూజాకార్యక్రమాలు జరుపుకోవాలని రాష్ట్ర అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, నిమజ్జనం సందర్భంగా గ్రేటర్ వరంగల్ పరిధి పలురూట్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అదేవిధంగా విగ్రహాలు నిమజ్జనం చేసే చెరువులు, రూట్లలో పారిశుద్ధ్యం, రోడ్ల మరమ్మతులు, ఇతర సదుపాయాల నిమిత్తం ప్రత్యేక అధికారులను నియమిస్తూ బల్దియా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.వరంగల్ అర్బన్: వరంగల్ నగరంలో బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాలని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ (ఎన్ఐయూఏ) సెక్రటరీ నితేష్ అనిరుత సూచించారు. బుధవారం ఢిల్లీనుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వరంగల్నుంచి బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా నితేష్ అనిరుత మాట్లాడుతూ నగరంలో కంప్రెషెడ్ బయోగ్యాస్ ప్లాంట్ (సీబీజీ) ఏర్పాటు కోసం డీపీఆర్ సిద్ధం చేయాలన్నారు. దీనిపై కమిషనర్ బాజ్పాయ్ స్పందిస్తూ నగరంలో రెండు బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరిన్ని ప్లాంట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని తెలిపారు. వీసీలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. శానిటేషన్ నిర్వహణ పక్కాగా జరగాలి నగరంలో శానిటేషన్ నిర్వహణ పక్కాగా జరగాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హల్లో ప్రజారోగ్యం, శానిటేషన్ అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. కార్మికులు, స్వచ్ఛ ఆటో డ్రైవర్లు, వాహనాలు, రోజూ ఇంటింటా చెత్త సేకరణ, తరలింపు తదితర అంశాలపై సీరియస్గా దృష్టి సారించాలన్నారు. ములుగు, పరకాల వైపు నుంచి వచ్చే బస్సులు వయా పెద్దమ్మగడ్డ నుంచి కేయూసీ, సీపీఓ, అంబేడ్కర్ సెంటర్, ఏషియన్ శ్రీదేవి మాల్ మీదుగా బస్టాండ్ చేరుకోవాలి. హనుమకొండ బస్టాండ్ నుంచి బయల్దేరి ములుగు, కరీంనగర్ వెళ్లాల్సిన బస్సులు వయా ఏషియన్ శ్రీదేవి మాల్, అంబేడ్కర్ సెంటర్, సీపీఓ ద్వారా కేయూసీ జంక్షన్ మీదుగా వెళ్లాలి. హనుమకొండ బస్టాండ్ నుంచి బయల్దేరి నర్సంపేట, కొత్తగూడెం, భద్రాచలం, తొర్రూరు, ఖమ్మం వైపు వెళ్లే బస్సులు వయా బాలసముద్రం, అదాలత్, హంటర్ రోడ్డు మీదుగా వెళ్లాలి. వరంగల్ బస్టాండ్ నుంచి హనుమకొండ వైపు వచ్చే బస్సులు చింతల్బ్రిడ్జి నుంచి రంగశాయిపేట మీదుగా నాయుడు పెట్రోల్ పంప్ సెంటర్, ఉర్సు గుట్ట, అదాలత్, బాలసముద్రం మీదుగా హనుమకొండకు చేరుకోవాలి. కాజీపేట నుంచి వరంగల్ వైపు వెళ్లాల్సిన కార్లు, ఇతర చిన్న వాహనాలు ఫాతిమా జంక్షన్, వడ్డ్డేపల్లి చర్చి, కేయూసీ జంక్షన్, పెద్దమ్మగడ్డ, ములుగు రోడ్డు, ఎంజీఎం, జెమిని, పోతన జంక్షన్, అండర్ బ్రిడ్జి, హెడ్ పోస్టాఫీస్, వరంగల్ బస్టాండ్, వెంకట్రామ మీదుగా ప్రయాణించాలి. వరంగల్ నుంచి కాజీపేట వైపు వెళ్లాల్సిన వాహనాలు వెంకట్రామ, వరంగల్ బస్టాండ్, హెడ్ పోస్టాఫీస్, అండర్ బ్రిడ్జి, పోతన జంక్షన్, జెమిని, ఎంజీఎం, ములుగు రోడ్డు, పెద్దమ్మగడ్డ, కేయూసీ జంక్షన్, వడ్డ్డేపల్లి చర్చి, ఫాతిమా జంక్షన్ మీదుగా ప్రయాణించాలి.బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మించండి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో ఎన్ఐయూఏ సెక్రటరీ నితేష్ అనిరుత 6న సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు క్రీడా పోటీలువరంగల్ స్పోర్ట్స్: ఈనెల 6న నగరంలోని జేఎన్ఎస్లో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. 6న ఉదయం 8గంటలకు ఐడెంటిటీ కార్డు, ప్రస్తుత సర్వీస్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు. మహిళలు, పురుషులకు అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, షటిల్ బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్, హాకీ, కబడ్డీ, లాన్టెన్నిస్, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బెస్ట్ ఫిజిక్, యోగా, ఖోఖో క్రీడాంశాల్లో, పురుషులకు క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు 9, 10వ తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పూర్తి వివరాలకు డీఎస్ఏ అథ్లెటిక్స్ కోచ్ శ్రీమన్నారాయణ 94410 86556 లో సంప్రదించాలని పేర్కొన్నారు. 7న ఉద్యోగులకు జిల్లాస్థాయి పోటీలు న్యూశాయంపేట: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ (ఏఐసీఎస్)లో పాల్గొనేందుకు ఈనెల 7న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లాస్థాయి క్రీడాపోటీలు నిర్వహించి ఎంపిక చేయనున్నట్లు వరంగల్ జిల్లా యువజన, క్రీడల అధికారి టీవీఎల్.సత్యవాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ ఓసిటీ స్టేడియంలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగల ఉద్యోగులు ఐడీ కార్డు, ఆధార్కార్డు, క్రీడాసామగ్రి వెంట తెచ్చుకోవాలని సూచించారు. 19 క్రీడాంశాల్లో ఎంపిక పోటీలు ఉంటాయని తెలిపారు. వివరాలకు ఓసిటీలోని కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. వరంగల్ క్రైం: వినాయక నిమజ్జనం సందర్భంగా ఈనెల 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 7వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు వరంగల్ ట్రై సిటీ పరిధిలో భారీ వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ బుధవారం వెల్లడించారు. ఈ మేరకు ట్రాఫిక్ మళ్లింపు వివరాలను మీడియాకు వెల్లడించారు. నిమజ్జనం రోజున శోభాయాత్ర వెళ్లే మార్గంలో, నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో వాహనాలు రోడ్డుపై నిలుపరాదని, ఈ విషయంలో ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు. ములుగు – భూపాలపల్లివైపు నుంచి వచ్చే భారీ వాహనాలు హైదరాబాద్కు ఆరెపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డునుంచి వెళ్లాలి. భూపాలపల్లి – పరకాల నుంచి ఖమ్మం వెళ్లాల్సినవి ఆరెపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి కరుణాపురం– వెంకటాపురం–ఐనవోలు–పున్నేలు క్రాస్ రోడ్డు మీదుగా ఖమ్మం రోడ్డు ఎక్కి వెళ్లాలి. భూపాలపల్లి – పరకాల నుంచి వచ్చే వాహనాలు నర్సంపేట వైపునకు కొత్తపేట – రెడ్డిపాలెం – జాన్పీరీలు– గొర్రెకుంట నుంచి వెళ్లాలి. కరీంనగర్ నుంచి ఖమ్మం వైపు వెళ్లే భారీ వాహనాలు చింతగట్లు వద్ద ఓఆర్ఆర్ ఎక్కి యూటర్న్ తీసుకొని కరుణాపురం – వెంకటాపూర్ – ఐనవోలు– పున్నేలు క్రాస్ రోడ్డు వద్ద ఖమ్మం రోడ్డు ఎక్కి వెళ్లాలి. ఖమ్మం నుంచి కరీంనగర్ – హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలు పున్నేలు క్రాస్ రోడ్డు– ఐనవోలు ఆర్చి–వెంకటపూర్– కరుణాపురం మీదుగా వెళ్లాలి. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే భారీ వాహనాలు కరుణాపురం – వెంకటాపూర్–ఐనవోలు– పున్నేలు క్రాస్ రోడ్డు నుంచి ఖమ్మం వెళ్లాలి. నిమజ్జన సమయంలో సిటీ లోపలికి భారీ వాహనాలకు అనుమతి లేదని, నగరం అవతలే నిలుపుకోవాలి. హైదరాబాద్ నుంచి నర్సంపేట వైపు వెళ్లే భారీ వాహనాలు కరుణాపురం నుంచి ఓఆర్ఆర్ మీదుగా వచ్చి ఆరెపల్లి వద్ద దిగి కొత్తపేట– రెడ్డిపాలెం – జాన్పీరీలు– గొర్రెకుంట మీదుగా వెళ్లాలి. నర్సంపేట వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు గొర్రెకుంట – జాన్పీరీలు– రెడ్డిపాలెం– కొత్తపేట – ఓఆర్ఆర్ మీదుగా ప్రయాణించాలి. సిద్ధేశ్వర గుండంలో నిమజ్జనం చేసిన తర్వాత వాహనాలు శాయంపేట వైపు వెళ్లే రోడ్డు ద్వారా ఎగ్జిట్ అవ్వాలి. శాయంపేట వైపు నుంచి వచ్చే వినాయక విగ్రహ వాహనాలు వయా హంటర్రోడ్డు, అదాలత్, హనుమకొండ చౌరస్తా మీదుగా ప్రయాణించాలి. ఎకై ్సజ్ కాలనీ, రెవెన్యూ కాలనీ, వడ్డేపల్లి ప్రాంతాల నుంచి వచ్చే వినాయక విగ్రహాలు అన్ని బంధం చెరువులో నిమజ్జనం చేయాలి. చిన్నవడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేసిన వాహనాలు ఏనుమాముల రోడ్డు నుంచి నర్సంపేట రోడ్డు వైపునకు వెళ్లాలి. -
కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్రంనుంచి బహిష్కరించాలి
● పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిహన్మకొండ చౌరస్తా: తెలంగాణ సెంటిమెంట్తో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుతిన్న కేసీఆర్ కుటుంబాన్ని, వారి బినామీలను రాష్ట్రంనుంచి బహిష్కరించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన 1,200 మంది అమరుల ఆత్మలు కవిత రూపంలో నిజాలు మాట్లాడిస్తున్నాయన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న సొమ్ముల పంపకంలో వచ్చిన పంచాయితీలను కవిత బయట పెడుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన అధికారుల ఇళ్లలో సోదాలు చేస్తే వందల కోట్లు దొరికింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కవిత చేసిన ఘనకార్యానికి వరంగల్ బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు, నిరసనలు చేయడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, కార్పొరేటర్ జక్కుల రవీందర్, నాయకులు నాయిని లక్ష్మారెడ్డి, బంక సరళ, బంక సంపత్ పాల్గొన్నారు. -
పన్ను వసూళ్లకే పరిమితం
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డు (డివిజన్) ఆఫీసర్ల పాలన గాడి తప్పింది. అన్ని విభాగాల అధికారులు, సిబ్బందికి సమన్వయకర్తలుగా వ్యవహరించాల్సిన వార్డు ఆఫీసర్లు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దిశానిర్దేశం చేయాల్సిన అధికారులు ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో వార్డు ఆఫీసర్లు కేవలం పన్నుల వసూళ్లు, సంక్షేమ పథకాలకే పరిమితమయ్యారు. వార్డు ఆఫీసర్ పాలన లక్ష్యం గ్రేటర్ వరంగల్లో నెరవేరడం లేదు. 66 డివిజన్లకు 66 మంది.. వార్డు పరిపాలనను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రెండేళ్ల క్రితం సిబ్బందిని నియమించింది. రెవెన్యూ శాఖకు చెందిన 38 మంది వీఆర్ఏలను పురపాలక శాఖలో విలీనం చేసింది. వీరితోపాటు బల్దియాలోని 36 మంది పర్మనెంట్ ఉద్యోగులు బిల్ కలెక్టర్లు, వివిధ విభాగాలకు చెందిన వారిని గుర్తించారు. 66 డివిజన్లకు 66 మంది వార్డు ఆఫీసర్లను, 8 మందిని మీ సేవ కేంద్రాల్లో క్యాషియర్లుగా నియమించారు. అంతేకాకుండా 9నెలల క్రితం మరో 25 మందిని వార్డు ఆఫీసర్లను ప్రభుత్వం బల్దియాకు కేటాయించింది. వీరిలో 23 మందికి టౌన్ప్లానింగ్ విభాగంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన, అప్లోడ్ బాధ్యతలు అప్పగించారు. ఏం చేయాలి? మేయర్, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల దృష్టికి రాని అనేక సమస్యలు క్షేత్రస్థాయిలో ఉత్పన్నమవుతుంటాయి. సమస్యలను ఎప్పుటికప్పుడు పరిష్కరించేందుకు కృషిచేయాలి. పౌర సేవల పట్టిక అమలు కోసం పనిచేయాల్సి ఉంటుంది. అధికారుల దృష్టికి వచ్చే ఫిర్యాదులే కాకుండా సామాజిక మధ్యమాలు, కంట్రోల్ రూం, టోల్ఫ్రీ నంబర్ ఫిర్యాదులపై స్పందించాలి. ఆస్తి, నీటి, గార్బేజ్ చార్జీలు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు వసూలు చేయాలి. జనన, మరణ ధ్రువ పత్రాల జారీకి విచారణ చేయాలి. రోడ్లపై గుంతలు, నీటినిల్వలు, మట్టి కప్పులు, మూతల్లేని మ్యాన్హోళ్లు, ఫుట్పాత్ కబ్జాలు, వెలగని వీధి లైట్లు, ఇంటింట చెత్త సేకరణ తీరు, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ, నాలాలు, డ్రెయినేజీల్లో వ్యర్థాలు పేరుకుపోవడం, దోమల సమస్య, జంతు, పక్షుల కళేబరాలు, దివ్యాంగులు, వృద్ధులకు గుర్తింపు కార్డులు తదితర సమస్యలను క్షేత్రస్థాయిలో తెలు సుకోవాలి. అనధికారి భవన నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల కబ్జాలు, అక్రమంగా వెలిసిన ఫ్లెక్సీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై విచారణ, పురోగతిపై దృష్టిసారించాలి. ఆయా విభాగాలకు చెందిన ఏఈలు, ఆర్ఐలు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, హెల్త్ ఇన్స్పెక్టర్లు, డివిజన్ల సిబ్బంది, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలి. ఏం చేస్తున్నారు?వార్డు ఆఫీసర్లు ఆస్తి, నీటి, గార్బేజ్ చార్జీలను అరకొరగా వసూలు చేస్తున్నారు. దీనికి కూడా బిల్ కలెక్టర్ల సహకారం తీసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే, పురోగతి, గృహలక్ష్మి, పెన్షన్ల కోసం లబ్ధిదారుల విచారణ చేసి చేతులు దులుపుకుంటున్నారు. వార్డు ఆఫీసర్ పాలనకు సంబంధించిన ఇతర పనులపై ఏ మాత్రం చొరవ తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆయా వార్డుల్లో సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోతున్నాయి. ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతూ నామామత్రంగా విధులు నిర్వర్తిస్తూ కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సమస్యల పరిష్కారానికి చొరవచూపని వార్డు ఆఫీసర్లు పట్టించుకోని జీడబ్ల్యూఎంసీ పాలకవర్గం, అధికారులు ఇబ్బందులు పడుతున్న గ్రేటర్లోని 66 డివిజన్ల ప్రజలు కొరవడిన పర్యవేక్షణ..వార్డు ఆఫీసర్లపై బల్దియా ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 15 రోజులు, నెలవారీ వారీగా డిప్యూటీ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్ సమీక్షించి సమస్యలపై పరిష్కార మార్గాలు సూచించాలి. కానీ, అవేమి అమలు కాకపోవడంతో వార్డు ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారని నగర ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా జీడబ్ల్యూఎంసీ పాలకవర్గం, ఉన్నతాధికారులు స్పందించి వార్డు ఆఫీసర్ల పాలనను గాడిలో పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
‘మీ మొక్కతో వరంగల్ నగర భవిష్యత్’
బల్దియా కమిషనర్ చాహత్బాజ్పాయ్ వరంగల్ అర్బన్: భవిష్యత్ తరాలకు చక్కని జీవితాన్ని ఇవ్వాల్సిన బాధ్యత నగరపౌరులపై ఉందని, ‘మీ మొక్కతోనే వరంగల్ నగర భవిష్యత్’ అనే నినాదంతో ముందకు సాగాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. ఉద్యాన విభాగ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కేర్ అండ్ క్యూర్ ఆధ్వర్యంలో ‘నగరాన్ని పచ్చదనం చేద్దాం’ అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో (సీఎస్ఆర్) భాగంగా బల్దియా పరిధిలో ఉన్న ఓపెన్ గ్రీన్ ల్యాండ్స్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కోరారు. తల్లి, తండ్రి ఎవరైనా మరణిస్తే వారి పేరుతో స్మృతివనం ఏర్పాటు చేసి మొక్కలు నాటించనున్నట్లు తెలిపారు. అనంతరం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో సీహెచ్ఓ రమేశ్, హెచ్ఓ లక్ష్మారెడ్డి, కేర్ అండ్ క్యూర్ వ్యవస్థాపక కార్యదర్శి ఆచార్య వెలుదండి రవి పాల్గొన్నారు. -
వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘన నివాళి
హన్మకొండ చౌరస్తా : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతిని పురస్కరించుకుని హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పలువురు కాంగ్రెస్ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాల రూపంలో ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్ఆర్ అని కొనియాడారు. ఆయన చూపిన ప్రజా సంక్షేమ మార్గంలో కాంగ్రెస్ పార్టీ నేటికి కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, మామిండ్ల రాజు, విజయశ్రీ, నాయకులు నాయిని లక్ష్మారెడ్డి, ఎస్.కుమార్యాదవ్, నసీంజాహన్, రహమున్నీసా, జాఫర్ పాల్గొన్నారు. -
నగరాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం..
ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్ల సమావేశంలో మేయర్ సుధారాణివరంగల్ అర్బన్ : వరంగల్ నగరాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. హరియాణాలోని కర్నాల్లో మంగళవారం నిర్వహించిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ (ఏఐసీఏం) 53వ వార్షిక సర్వసభ్యసమావేశంలో మేయర్ మాట్లాడారు. వరంగల్ నగరం యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్లో ఎంపికైందని తెలిపారు. మామునూరు విమానాశ్రయం ఏర్పాటు కల త్వరలో సాకారం కానుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 3–10 లక్షల జనాభా కేటగిరీలో వరంగల్ 3వ అత్యంత వేగంగా అభివృద్ది చెందే నగరంగా నిలిచిందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్లో దేశంలో 42వ స్థానం, తెలంగాణలో 2వ స్థానంలో ఉందని ఆమె వివరించారు. -
మెరుగైన వైద్య సేవలందించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ: పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. హనుమకొండ ఎన్జీవోస్ కాలనీలోని వడ్డేపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, గర్భిణులు, బాలింతల నమోదు, ఔషధాల నమోదు రిజిస్టర్లను పరిశీలించారు. రికార్డుల్లో సమగ్ర వివరాలు నమోదు చేయకపోవడంతో సిబ్బందిని మందలించారు. పలు విభాగాల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ అందుబాటులో లేకపోవడంపై కలెక్టర్ ఆరా తీయగా తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్కు డిప్యుటేషన్పై పంపించినట్లు డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. రోగులకు వైద్య పరీక్షలు ఎలా చేస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించగా వారంలో రెండు రోజులపాటు (సోమ, శుక్రవారం) స్టాఫ్నర్స్ ద్వారా రక్త నమూనాలు సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్కు పంపిస్తున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు. అదేవిధంగా వడ్డేపల్లిలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శాశ్వత భవన నిర్మాణ పనులు కలెక్టర్ పరిశీలించి త్వరగా పూర్తిచేయాలని సూచించారు. కలెక్టర్ వెంట హనుమకొండ తహసీల్దార్ రవీందర్రెడ్డి, వడ్డేపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మాలిక, సిబ్బంది ఉన్నారు. -
టూరిజం స్పాట్గా ఉర్సు రంగసముద్రం
న్యూశాయంపేట: వరంగల్ నగరంలోని ఉర్సు రంగసముద్రం చెరువును టూరిజం స్పాట్గా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద.. అధికారులను ఆదేశించారు. మంగళవారం కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, బల్దియా కమిషనర్ చాహత్బాజ్పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితర అధికారులతో కలిసి ఉర్సుగుట్ట రంగసముద్రం చెరువును పరిశీలించారు. నగర ప్రజలు సాయంత్రం వేళలో సేదతీరేందుకు చెరువుకు ఆనుకుని రోడ్డువైపు వాకింగ్ ట్రాక్ తదితర ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఇన్నర్రింగ్ రోడ్డు, భూసేకరణ పురోగతి, గుండు చెరువు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపు తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏకవీరదేవి దేవాలయంలోని పెండింగ్ పనులు ఈనెల 27వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఎస్ఈ రాంప్రసాద్, ఈఈ కిరణ్కుమార్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ స్వామి, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్రావు, గౌతమ్రెడ్డి, సత్యపాల్రెడ్డి, అజిత్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. వార్డెన్పై కలెక్టర్ ఆగ్రహం వరంగల్ చౌరస్తా: రెసిడెన్షియల్ ఆవరణలో వరదనీరు నిల్వ ఉండటం, అంతర్గత లైటింగ్ లేకపోవడం, మెనూ పాటించకపోవడంతో వార్డెన్పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వరంగల్ యాకుబ్పురలోని ప్రభుత్వ కాలేజీ ఆఫ్ ఎక్సలెన్స్ బాలుర ఎస్టీ హాస్టల్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, స్టోర్ రూం, మరుగుదొడ్లు, వంట సరుకులను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా..అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిస్తూ ఏమైన సమస్యలు ఉంటే నేరుగా పెట్టెలో వేయాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం నూతనంగా ప్రారంభించిన డార్మెటరీ షెడ్ను పరిశీలించారు. కలెక్టర్ వెంట డీటీడీఓ సౌజన్య, డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ వీరభద్రం, డీసీఓ సురేందర్, ప్రిన్సిపాల్ హేమంత్, వైస్ ప్రిన్సిపాల్ మధు, ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేయాలి వరంగల్ కలెక్టర్ సత్యశారద