breaking news
Hanamkonda District Latest News
-
బుధవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
విద్యారణ్యపురి: ప్రభుత్వ ఉన్నత పాఠశాలు, పలు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో సైన్స్ ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రయోగాత్మక బోధనకు శ్రీకారం చుట్టనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ, ములుగు మహబూబాబాద్ జిల్లాల్లో ఎంపిక చేసిన 26 ఉన్నత పాఠశాలల(కేజీబీవీలతో కలిపి)కు రూ.6.76 కోట్లు సమగ్రశిక్ష నుంచి మంజూరు లభించింది. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్, రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ (సమగ్ర శ్రిక్ష) నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.26 లక్షలు ఒక్కో పాఠశాలకు రూ.26 లక్షల చొప్పున కేటాయించారు. ఈ నిధులతో సైన్స్ ల్యాబొరేటరీ గదుల నిర్మాణం, పరికరాల సేకరణ, సరఫరా, ఇన్స్టాలేషన్ టెస్టింగ్ కమిషనింగ్కు పరిపాలనా అనుమతి ఇచ్చారు. ల్యాబ్ గది నిర్మాణానికి రూ.25లక్షలు, పరికరాలకు రూ.లక్ష కేటాయించారు. పనులను రాష్ట్ర విద్యామౌలిక సదుపాయాల సంస్థ (టీజీఈడబ్లూ ఐడీసీ – హైదరాబాద్)కి అప్పగించారు. ఇ–ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. ఈ నిబంధనలు పాటించాల్సిందే.. సైన్స్ లేబొరేటరీలు నిర్మాణం పూర్తయ్యాక వర్క్స్టేషన్లు, పరికరాలు టీజీఈడబ్ల్యూ ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి సంయుక్తంగా తనిఖీ చేసి నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ధ్రువీకరించాలి. ఆ తర్వాత వాటిని ఆయా పాఠశాలల హెచ్ఎంలకు అప్పగించాల్సి ఉంటుంది. ● ఐదు జిల్లాల్లో 26 ఉన్నత పాఠశాలలకు రూ.6.76 కోట్లు మంజూరు ● జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు కేటాయించని నిధులు -
‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలి
హన్మకొండ అర్బన్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 10న ఉద్యోగ జేఏసీ చేపట్టిన ‘చలో హైదరాబాద్–మహా ధర్నా’ను విజయవంతం చేయాలని టీజీఓ హనుమకొండ, వరంగల్ జిల్లా కమిటీలు పిలుపునిచ్చాయి. హనుమకొండ ఐడీఓసీలోని టీజీఓ భవన్లో మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీజీఈజేఏసీ రాష్ట్ర కార్యదర్శి ఎన్నమనేని జగన్మోహన్రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ డీఏలను విడుదల చేసి, పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. హన్మకొండ అర్బన్: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా మేనేజింగ్ కమిటీ ఎన్నికలు అక్టోబర్ 4న నిర్వహించనున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు రెడ్క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా ఎన్నికల అధికారిని నియమించనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 9 నుంచి 14 వరకు ఓటర్ల జాబితా ప్రదర్శన, సెప్టెంబర్ 15న చేర్పులు, సవరణలకు అవకాశం కల్పించనున్నారు. సెప్టెంబర్ 19న తుది ఓటర్ల జాబితా, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. విద్యారణ్యపురి: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంబీఏ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, యూజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 9 చివరి గడువు అని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థి సేవావిభాగం డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏలో అడ్మిషన్లు తీసుకునే విద్యార్థులు తెలంగాణ ఐసెట్ లోగాని బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశపరీక్షలో అర్హత సాధించి ఉండాలన్నారు. పీజీ కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలనుకునే విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఆర్ఏఓయూఆన్లైన్.ఇన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంచుకున్న స్టడీ సెంటర్లో సంప్రదించాలన్నారు. విద్యారణ్యపురి: ఇన్సర్వీస్ టీచర్ల టెట్ హనుమకొండలోని నాలుగు కేంద్రాల్లో మంగళవారం ప్రారంభమైంది. రెండు సెషన్లలో 2,137 మందికి 1,961 హాజరయ్యారని డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ తెలిపారు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 11–30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4–30 గంటల వరకు నిర్వహించారు. ఈనెల 10న ఒక కేంద్రంలో జరిగే పరీక్షతో టెట్ ముగియనుందని డీఈఓ పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇన్సర్వీస్ టీచర్లు టెట్ రాస్తున్నారని తెలిపారు. వడ్డేపల్లి ప్రాంతంలోని అయాన్ డిజిట్ జోన్ సెంటర్ను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సందర్శించారు. డీఈఓ గిరిరాజ్గౌడ్ తదితరులు ఉన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● టీఎస్యూఈఈయూ నేతల విజ్ఞప్తి హన్మకొండ : విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఈశ్వర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి కోరారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ వర్కర్ల సమస్యలు వివరించి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగదారుల సంఖ్య, కొత్త కనెక్షన్లు, సెక్షన్ కార్యాలయాల పరిధి, రోజువారీ పనిభారం నిరంతరం పెరుగుతున్నా అందుకనుగుణంగా ఆపరేషన్, మెయింటెనెన్స్ సిబ్బంది సంఖ్య పెరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా సిబ్బంది కొరతతో పని ఒత్తిడి పెరుగుతోందన్నారు. దీనిపై స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు. టీఎస్ఈఈయూ టీజీ ఎన్పీడీసీఎల్ అధ్యక్షుడు జి.ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి బొల్లి వెంకటరాజు, ప్రతినిధులు ఎల్.శ్రీనివాస్, సుదర్శన్ వర్మ, కుసుమ శ్రీనివాస్, సురభి శ్రీకాంత్, రాచకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఈవీఎంల భద్రతకు ప్రాధాన్యం
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సుబేదారిలోని రెడ్క్రాస్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ ఎన్.రవి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ మంగళవారం త్రైమాసిక తనిఖీ నిర్వహించారు. హనుమకొండ తహసీల్దార్ రవీందర్రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్సింగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవీ శ్రీనివాసరావు, బి. ప్రవీణ్కుమార్, శ్రీనివాస్, శ్యాంసుందర్ పాల్గొన్నారు. బాధితుల పునరావాసానికి ప్రాధాన్యంమహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను సమర్థవంతంగా అరికట్టడంతో పాటు బాధితులకు సత్వరన్యాయం, పరిహారం అందించడం, వారి పునరావాసానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి అడ్వైజరీ బోర్డు సమావేశంలో ఆమె మాట్లాడారు. డీడబ్ల్యూఓ ఎం.విశ్వజ, జిల్లా వైద్యాధికారి, అదనపు డీఆర్డీఓ, భరోసా సీఐ సువర్ణ తదితరులు పాల్గొన్నారు. మోడల్ సోలార్ గ్రామాల్లో సేవలు వేగవంతం ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం కింద మోడల్ సోలార్ గ్రామాలుగా ఎంపికై న ఆత్మకూరు, కేశవాపురంలో ప్రతి ఇంటికి సోలార్ ప్యానళ్లతో పాటు విద్యుత్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సామ్యనాయక్, రెడ్కో జిల్లా మేనేజర్ రాజేందర్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. నిరంతర వైద్య సేవలందించాలి హసన్పర్తి: ప్రజలకు నిరంతరం వైద్యసేవలంఇంచాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. హసన్పర్తిలోని ఉన్నత శ్రేణి ఆస్పత్రిని కలెక్టర్ సందర్శించారు. అనంతరం పెంబర్తి శివారు దత్తాత్రేయ కాలనీలో వాటర్ ట్యాంక్ పనులను కలెక్టర్ పరిశీలించారు. తహసీల్దార్ కిరణ్కుమార్, డాక్టర్ భార్గవ్, డాక్టర్ కృతిక, సూపర్వైజర్ లచ్చులు, కందుకూరి సంతోష్, కంటి వైద్య నిపుణులు ప్రసాద్, పెంబర్తి సర్పంచ్ కుమారస్వామి, ఆర్ఐ ఫాజిల్, ఈఈ గాయత్రి, రామాంజనేయులు, ఎంపీడీఓ సుమనవాణి ఉన్నారు. -
రామప్ప గర్భగుడిలోకి గోదావరి జలాలు!
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ములుగు జిల్లా వెంకటాపుం(ఎం) మండలం రామప్ప దేవాలయంలోని రామలింగేశ్వరస్వామి వారికి అభిషేకం కోసం గోదావరి జలాలు అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిసింది. గర్భగుడికి చెందిన సోమసూత్రం మూసుకపోవడంతో కేంద్ర పురావస్తుశాఖ అధికారులు శ్రమించి ఇటీవల పునరుద్ధరించారు. రామలింగేశ్వరస్వామి వారిని పంచామృతాలతో అభిషేకం చేస్తే ఆ ద్రవం బయటకు వెళ్లేలా మూడు ఇంచుల స్టీల్ పైపు అమర్చారు. ఈక్రమంలో అధికారులు మరో అడుగు ముందుకు వేసి గర్భగుడిలో నిరంతరం నీరు ఉండేలా బయట నుంచి పైపులను గర్భగుడిలోకి తీసుకెళ్లారు. ఒక పైపును నీటి కోసం అమర్చి గర్భగుడిలో నల్లా ఏర్పాటు చేశారు. మరో పైపును గర్భగుడిలో విద్యుత్ సౌకర్యం కోసం ఏర్పాటు చేశారు. దేవాదుల పైపులైను ద్వారా రామప్ప సరస్సులోకి గోదావరి జలాలు వస్తుండగా, ఇక్కడి నుంచి ఎగువ ప్రాంతాలకు నీటిని తరలించడమే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలకు తాగునీటిని సైతం సరఫరా చేస్తున్నారు. గోదావరి జలాలతో రామలింగేశ్వరస్వామికి అభిషేకం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో రామప్ప ఆలయం శివారు నుంచి వెళ్తున్న తాగునీటి పైపులైన్కు కనెక్షన్ ఇచ్చి గర్భగుడిలోకి ఆ నీటిని అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. స్వామివారికి అభిషేకం చేసేందుకు నల్లా ఏర్పాటు -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
● నీరుకుళ్లలో ఘటన ఆత్మకూరు: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్లలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వెన్నపు లక్ష్మయ్య(55) వ్యవసాయ పెట్టుబడులు, కుటుంబ అవసరాలకు అప్పులు చేశాడు. అలాగే, భార్య అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో పంట దిగుబడి లేకపోవడం, అప్పులు తీర్చలేక కనిపించకపోవడంతో కొన్ని రోజులుగా మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం పంటకు పురుగు మందు పిచికారీ చేస్తానని చేను వద్దకు వెళ్లాడు. కాసేపటి తర్వాత చేను వద్దనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గమనించిన సమీప రైతులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో వారు 108లో వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. -
నిట్ 24వ స్నాతకోత్సవానికి వేళాయె..
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లో ఈనెల 19, 20 తేదీల్లో 24వ స్నాతకోత్సవం (కాన్వొకేషన్) నిర్వహించనున్నట్లు యాజమాన్యం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. యూజీ, పీజీ, పీహెచ్డీ పూర్తి చేసిన 2,350 మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలను అందుకోనున్నారు. తొలిరోజు యూజీ (బీటెక్), రెండో పీజీ(ఎంటెక్), పీహెచ్డీ విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారు. ముఖ్య అతిథిగా టెక్సాస్ ఇన్స్ట్రూమెంట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్కుమార్ హాజరుకానున్నారు. 19, 20 తేదీల్లో కాన్వొకేషన్ వేడుకలు హాజరుకానున్న టెక్సాస్ ఎండీ సంతోష్కుమార్ -
మంత్రి సీతక్కను కలిసిన ‘కుడా’ చైర్ పర్సన్
నయీంనగర్: హైదరాబాద్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూ య (సీతక్క), స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మంగళవారం ‘కుడా’ చైర్ పర్సన్ గుండు సుధారాణి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ‘కుడా’ చైర్ పర్సన్ సుధారాణికి మంత్రి, ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. 16న డాక్ అదాలత్ ఖిలా వరంగల్: వరంగల్ డివిజన్ తపాలాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 16న ఉదయం 11 గంటలకు డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఆ శాఖ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. ఈ కార్య క్రమాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకో వాలని ఆయన పేర్కొన్నారు. ● బల్లార్షా–కాజీపేట నాలుగో రైల్వేలైన్కు సర్వేకాజీపేట రూరల్ : బల్లార్షా–కాజీపేట వరకు నా లుగో రైల్వేలైన్ నిర్మాణ ప్రతిపాదన సర్వే నిమిత్తం బుధ, గురువారాలు రెండు రోజులపాటు రైల్వే అధికారులు పర్యటించనున్నట్లు మంగళవారం రాత్రి కాజీపేట రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే బల్లార్షా–కాజీపేట వరకు 3వ లైన్ నిర్మాణం పూర్తికాగా, రైళ్ల ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు బల్లార్షా–కాజీపేట వరకు సుమారు 230 కి.మీ వరకు నాలుగో రైల్వే లైన్ సర్వే కోసం అధికారులు రెండు రోజులు ఆయా సెక్షన్లలో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. కన్స్ట్రక్షన్, సిగ్నలింగ్, ఆపరేటింగ్, ఇంజనీరింగ్, ఓహెచ్ఈ విభాగాల రైల్వే సూపర్వైజర్లు హద్దులు, ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణాల కోసం సర్వే చేయనున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభారీల నియామకం గీసుకొండ: వరంగల్ జిల్లాలోని పలు మండలాలు, డివిజన్లకు బీజేపీ ప్రభారీలను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రా వు, సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీజీ, జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, జిల్లా ప్రభారీ కొండపల్లి శ్రీధర్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభారీలను నియమించినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మారంపల్లి రాంచంద్రారెడ్డి(దేశాయిపేట), అంబాల రాంగోపాల్(గిర్మాజిపేట), కుమా ర్ (కాశిబుగ్గ), సత్యం (శివనగర్), కోటేశ్వర్(ఖిలావరంగల్), మహేందర్ (కరీమాబాద్), ఆంజనేయులు(వర్ధన్నపేట), బాలినె జగన్ (ఏనుమాముల), వనపర్తి మల్లయ్య (పర్వతగిరి), మాదిరెడ్డి దేవేందర్రెడ్డి (నర్సంపేట టౌన్), కనికుంట్ల రంజిత్కుమార్ (నర్సంపేట రూరల్) కూడికల శ్రీధర్ (నెక్కొండ), బండి సాంబయ్య యాదవ్ (చెన్నారావుపేట)మాచర్ల దీన్దయాల్ (ఖానాపురం), రఘునాథరెడ్డి (నల్లబెల్లి), శ్యాంసుందర్ (దుగ్గొండి)లను ప్రభారీలుగా నియమించినట్లు తెలిపారు. -
ధిక్కార స్వరం ‘కాళోజీ’..
15 ఏళ్ల వయస్సు నుంచే ఉద్యమాలు.. 1914, సెప్టెంబర్ 9వ తేదీన రంగారావు, రమబాయి దంపతులకు కాళోజీ జన్మించారు. కాళోజీ పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. మడికొండలో ప్రాథమిక విద్య, హనుమకొండ, హైదరాబాద్ల్లో ఉన్నతవిద్యనభ్యసించారు. 15 సంవత్సరాల వయస్సు నుంచే రాజకీయ ఉద్యమాలు, కవితా, రచనావ్యాసంగాల్లో మునిగిపోయారు. ఆర్య సమాజం, ఆంధ్రమహాసభ, నిజాంస్టేట్కాంగ్రెస్లో ఉంటూ నైజాం వ్యతిరేక పోరాటంలో పనిచేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1958 నుంచి 1960 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా, ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో సభ్యుడిగా, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాళోజీ సోదరుడు రామేశ్వరరావు ఉర్దూ సాహిత్యంలో గొప్పకవి. షాద్ కలం పేరుతో రచనలు చేసే వారు. రామేశ్వరరావును పెద్దకాళోజీగా పిలిస్తే, నారాయణరావును చిన్న కాళోజీగా పిలిచేవారు. అలాగే, కా ళోజీ సతీమణి రుక్మిణి.. కాళోజీ ఉద్యమాలు, అరెస్ట్లు నేపథ్యంలో ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకున్నారు. సందర్భానికి స్పందించి రాసే రచయిత కాళోజీ.. కాళోజీ జీవితం నిజాం పాలనకు వ్యతిరేకంగా జరి గిన స్వాతంత్రోద్యమం, ఆ తర్వాత తెలంగాణతో ముడిపడి ఉంది. ఉద్యమకార్యాచరణలో స్పందించే అవసరం ఏర్పడినప్పుడు కాళోజీ తన కవితల ద్వారా విజృంభించారు. కాళోజీ కవితలు ప్రజలతో మాట్లాడుతున్నట్లుగానే ఉండేవి. 1942లో నిజాం రాష్ట్రంలో తెలుగు ప్రజలు తమ మాతృభాషైన తెలుగుపై నిరాదరణతో ఉండడం చూసి స్పందించి, ఏ భాషరా నీది యేమి వేషమురా? /ఈ భాష ఈవేష మెవరి కోసమురా?/ ఆంగ్లమందున మాటలాడ గలుగగనే/ ఇంతగా గుల్కెదవు ఎందుకోసమురా?/ అన్యభాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు/ సకిలించు ఆంధ్రుడా ! చావవెందుకురా? అంటూ అలాంటి వారిని అపహస్యం చేశారు. 1944లో జనగామ ప్రాంతంలో జరిగిన దౌర్జన్యాలను నిరసిస్తూ నవయుగంబున నాజీవృత్తుల/ నగ్న నృత్య మింకెన్నాళ్లు? / పోలీసు అండను దౌర్జన్యాలు/ పోషణబొందె దెన్నాళ్లు? / దమననీతిలో దౌర్జన్యాలకు/ దాగిలిమూతలు ఎన్నాళ్లు? / కంచెయె చేనును మేయుచుండగా / కాంచకుండుటింకెన్నాళ్లు ? అంటూ ప్రశ్నించారు. 1946లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించినప్పుడు, ప్రజాసంస్థపై పగసాధించిన/ ఫలితం తప్పక బయటపడున్ / నిక్కుచునీల్గే నిరంకుశత్వము/ నిల్వలేక నేలను గూలున్ / చిలిపి చేష్టకై చిల్లి పొడిచినను / స్థిరమగు కట్టయు శిధిలగున్ / .. అంటూ హెచ్చరించారు. 1946లోనే వరంగల్ కోటలో మొగిలయ్య హత్య జరిగింది. మరొకచోట బాలున్ని పొడిచారు. శిక్ష చంపిన వారికి వేయాల్సిందిపోయి జెండా ఎగురేసిన వారినే శిక్షించారు. కాళోజీకి కూడా ఆరునెలల పాటు దేశబహిష్కరణ శిక్షవిధించారు. ఈ సందర్భంగా ఇక్కడి ఘటనలపై విచారణ చేయాడానికి వచ్చిన ప్రధాని సర్ మీర్జాఇస్మాయిల్ను కాళోజీ తన కవితద్వారా ప్రశ్నించారు.కాళోజీ తెలంగాణ మాండలికంలోనే తన కవితలు, ధిక్కారస్వరం వినిపించేవారు. ఏటా కాళోజీ జన్మదినమైన సెప్టెంబర్ 9వ తేదీని తెలంగాణ భాషా (మాండలిక) దినోత్సవంగా జరుపుకోవాలని 2014, సెప్టెంబర్ 9న నిట్ వరంగల్లో జరిగిన నారాయణరావు 100వ జయంతి సభలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆయనది ఉద్యమాలతో ముడిపడిన జీవితం నిరంతరం పోరాటాల బాటే.. నేడు ప్రజాకవి జయంతిహన్మకొండ కల్చరల్ : ప్రజాకవి కాళోజీ నారాయణరావు.. ధిక్కార స్వరానికి మారుపేరు. నిజాంపాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్రోద్యమం, ఆ తర్వాత తొలి, మలిదశల్లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో జరిగిన అనేక ఉద్యమాలతో ఆయన జీవితం పెనవేసుకుంది. జీవించి ఉన్న కాలంలో ప్రజాస్వామిక ఉద్యమాల్లో ఎలా పాలుపంచుకున్నారో చనిపోయిన తర్వాత కూడా ఆయన భావాలు ప్రజాస్వామ్యవాదులు, కళాకారులకు స్ఫూర్తిని అందించాయి. తన భావాలకే కాదు శరీరానికీ మరణంలేదని నిరూపించిన వ్యక్తి కాళోజీ. ఈ క్రమంలో నేడు( బుధవారం) ప్రజాకవి జయంతి (తెలంగాణ భాషా దినోత్సవం). ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం -
రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్పై విమర్శలా?
హన్మకొండ: ఓడిపోయి ఇంటిలో కూర్చుంటే కేటీఆర్ను పంపి బీఆర్ఎస్లో చేర్చుకుని గల్లీనుంచి ఢిల్లీకి పంపి రాజకీయ భిక్ష పెట్టి.. పార్టీలో ప్రాధాన్యత కల్పించింది.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాదా.. అని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ దళిత వ్యతిరేకి అని మాట్లాడుతాడా అని తూర్పారబట్టారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్య పాలనపై వారం రోజులపాటు చేపట్టిన పోరుబాట కార్యక్రమం చివరి రోజు మంగళవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహానికి వినయ్భాస్కర్, పార్టీ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బులు పదవులకు ఆశపడి కడియం శ్రీహరి కులంపై దూషించిన రేవంత్ను మెచ్చుకుంటున్నాడన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఉధృతంగా సాగుతుంటే గురువు చంద్రబాబుతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని ఉద్యమాన్ని నీరుగార్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలపై అమానుషంగా ప్రవర్తించినందుకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, నాయకులు తాళ్లపల్లి జనార్దన్గౌడ్, నార్లగిరి రమేశ్, జోరిక రమేశ్, పులి రజనీకాంత్, మట్టపల్లి రమేష్, కుమ్మరి లలిత, ఇమ్మడి లోహిత, ఖండేరావు నర్సింహారావు, నయీముద్దీన్, ఉడుతల సారంగపాణి పాల్గొన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరాటంకాశిబుగ్గ : కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తోందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాశిబుగ్గ జంక్షన్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, వినతిపత్రం సమర్పించారు. అలాగే, అసెంబ్లీ ప్రాంగణంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై దాడిని ఖండిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పిన పాలకులు వెయ్యి రోజులు దాటినా ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారని వారు విమర్శించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ చైర్మన్లు, డివిజన్ అధ్యక్షులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ ఫైర్ -
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తి చేసేందుకు ఎల్అండ్టీ కంపెనీకి ప్రభుత్వం గడువు
కాశిబుగ్గ: ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు ఇతర జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని వరంగల్లో నిర్మిస్తోంది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో రూ.1,371 కోట్ల వ్యయంతో 2018 పడకల సామర్థ్యంతో పనులు కొనసాగుతున్నాయి. సుమారు 19.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 56 ఎకరాల 39 గుంటల వరకు క్యాంపస్ను తీర్చిదిద్దుతున్నారు. 35 ఆపరేషన్ థియేటర్లతో పాటు వైద్యులు, ఇతర సిబ్బంది కోసం 186 వరకు నివాస క్వార్టర్లు నిర్మాణం చేయనున్నారు. అలాగే, అటెండెంట్ల కోసం కూడా 250 వరకు ధర్మశాల గదులు, 350 మంది కూర్చునే విధంగా ఆడిటోరియం నిర్మాణం కోసం పనులు చేపడుతున్నారు. ప్రారంభ ప్రణాళికలో భాగంగా 34 వైద్య విభాగాలతో సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులో తీసుకురావడానికి డిజైన్ పూర్తి చేశారు. ఆస్పత్రి బయట కలరింగ్తో పాటు అత్యవసర విభాగం బోర్డును ఏర్పాటు చేశారు. అదేవిధంగా వివిధ విభాగాల ఏర్పాటులో అధికారులు నిమగ్నమయ్యారు. ఎల్అండ్టీ కంపెనీ 50 శాతం, డీఎంఈ ఆధ్వర్యంలో 50 శాతం పనులు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశాల మేరకు డిసెంబర్లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సి ఉంది. అక్టోబర్లో ఆస్పత్రి పనులు పూర్తిచేయాలని ఎల్అండ్టీ కంపెనీకి ప్రభుత్వం డెడ్లైన్ విధించింది. అలాగే, నవంబర్లో ఆస్పత్రి వైద్యసేవల తీరును పరీక్షించడానికి ట్రయల్ రన్ నిర్వహించాలని, డిసెంబర్లో సీఎం రేవంత్రెడ్డితో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని మంత్రి ఆదేశాల్లో పేర్కొన్నట్లు సమాచారం. కాగా, ఎల్అండ్టీ కంపెనీ 50 శాతం, డీఎం ఆధ్వర్యంలో 50 శాతం పనులు పూర్తిచేయాల్సి ఉంది. ఇంకా నీటి వసతి, ఆక్సిజన్ ప్లాంటు, సీటీ స్కాన్, ఎంఆర్ఐ, క్యాన్సర్, ఎక్స్రేకు సంబంధించిన పరికరాలు అమర్చాలి ఉంది. ఈ క్రమంలో తాము చేపడుతున్న పనులను వేగిరం చేసేందుకు ఆర్అండ్బీ అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద కూడా తరచూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలోని చాంబర్లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆర్అండ్బీ, ఎంజీఎం, కేఎంసీ అధికారులతో పాటు సంబంఽధిత శాఖల అధికారులతో మాట్లాడి పనుల వివరాలు తెలుసుకుంటున్నారు. పనుల వేగవంతానికి కమిటీ ఏర్పాటు.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డిసెంబర్లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించాలనే లక్ష్యంతో అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు ఇటీవల ప్రారంభించిన సనత్నగర్ హాస్పిటల్ను దృష్టిలో పెట్టుకుని, ఈ ఆస్పత్రి నిర్మాణ పనులు వేగిరం చేసేందుకు రాష్ట్రస్థాయిలో ఓ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. డీఎంఈ ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో కమిటీని రూపకల్పన చేసినట్లు సమాచారం. ఇందులో డీఎంఈతో పాటు రాష్ట్రస్థాయిలోని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లాకు చెందిన ఆర్అండ్బీ అధికారులు, టీఎస్ఎంఎస్ఐఐసీ అధికారులు, ఎంజీఎం సూపరింటెండెంట్ సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. వీరు సనత్నగర్ హాస్పిటల్ నిర్మాణం తరహా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆధునికీకరించి, పనులు వేగవంతం చేయాల్సి ఉంది. ఆస్పత్రి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ, సలహాలు, సూచనలు ఇస్తూ ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యే దిశగా పనిచేయాల్సి ఉంటుంది. కాగా, ఈ కమిటీ ఆస్పత్రిని ఈ నెలలో సందర్శించే అవకాశం ఉంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో కొనసాగుతున్న పనులు నవంబర్లో ట్రయల్ రన్.. డిసెంబర్లో ప్రారంభించేందుకు అధికారుల కసరత్తు -
అక్షరాస్యతతోనే సమాజాభివృద్ధి
● వరంగల్ డీఈఓ రంగయ్యనాయుడు కాళోజీ సెంటర్: అక్షరాస్యత అనేది కేవలం చదవడం, రాయడం నేర్చుకోవడం మాత్రమే కాదని, మన జీవితాన్ని మనమే నిర్ణయించుకునే శక్తిని సమాజంలో గౌరవంగా జీవించే అవకాశాన్ని అందించే గొప్ప సాధనమని వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి బి.రంగయ్యనాయుడు అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మంగళవారం మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ఓదెల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి డీఈఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అక్షరాస్యత లేని జీవితం చీకటితో సమానమన్నారు. అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలోజిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ డాక్టర్ కట్ల శ్రీనివాస్, అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ రమేష్రెడ్డి, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సదానందం, టాస్–ఉల్లాస్ జిల్లా ఇన్చార్జ్ సీహెచ్.నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి.. విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని డీఈఓ బి.రంగయ్యనాయుడు సూచించారు. సదరన్ ఇండియా సైన్స్ డ్రామా ఫెస్టివల్–2026లో భాగంగా జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు మంగళవారం శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 17 బృందాలు పాల్గొని వైవిధ్యభరితమైన నాటకాలను ప్రదర్శించాయి. ముగింపు కార్యక్రమంలో డీఈఓ పాల్గొని మాట్లాడారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కట్ల శ్రీనివాస్, సైన్స్ అధికారి పి.సురేష్ బాబు, రెహమాన్, కృష్ణమూర్తి, కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం.. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్న చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ఫిజి కల్ సైన్స్ ఉపాధ్యాయుడు పిన్నింటి బాలా జీరావును మంగళవారం డీఈఓ రంగయ్యనాయు డు, అధికారులు, సిబ్బంది అభినందించారు. భవిష్యత్తులోనూ విద్యారంగానికి మరిన్ని సేవలు అందిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. -
నాణ్యతతో కూడిన అభివృద్ధే లక్ష్యం
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతాప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న ఆదేశించారు. నగరంలోని పలు డివిజన్లలో పూర్తయిన అభివృద్ధి పనులను బిల్లుల చెల్లింపుల నిమిత్తం మంగళవారం కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా 49వ డివిజన్లోని రెవెన్యూ కాలనీ, ప్రకాశ్రెడ్డిపేట ప్రాంతాల్లో నిర్మించిన సీసీ రోడ్లు, మురుగు కాల్వలను పరిశీలించారు. అనంతరం పోచమ్మ మైదాన్, ఎల్బీనగర్, చింతల్, ఖిలా వరంగల్ ప్రాంతాల్లో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెయినేజీ కాల్వలు, మంచినీటి పైపులైన్ నిర్మాణ పనుల నాణ్యతను తనిఖీ చేశారు. పోచమ్మ మైదాన్లో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ పనులను పరిశీలించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈఈ రవికుమార్, సంతోష్ బాబు, డీఈలు, ఏఈలు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. ఐఎఫ్ఏటీ సదస్సుకు కమిషనర్ మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈనెల 9 నుంచి 11 వరకు నిర్వహించనున్న 13వ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫర్ వేస్ట్ వాటర్ టెక్నాలజీ (ఐఎఫ్ఏటీ) ఇండియా–2026 సదస్సుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న హాజరుకానున్నారు. పట్టణ నీటి నిర్వహణ, మురుగునీటి శుద్ధి, ఘనవ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, బయోగ్యాస్, ఈవేస్ట్, ఆధునిక పర్యావరణ సాంకేతికతలపై నిర్వహించే ప్రదర్శనలు, సాంకేతిక సమావేశాలు, నిపుణులతో చర్చలు, జ్ఞాన మార్పిడి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న -
ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి
అధికారుల సమీక్షలో హనుమకొండ అదనపు కలెక్టర్ రవి హన్మకొండ అర్బన్: జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్..రవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పౌరసరఫరాలు, డీఆర్డీఏ, వ్యవసాయ, మార్కెటింగ్, తూనికలు–కొలతల శాఖల అధికారులు, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, పీఏసీఎస్ సీఈఓలు, ఏపీఎంలతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 25 తేదీలోగా కొనుగోలు కేంద్రాలకు అవసరమైన టార్పాలిన్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు, తేమ కొలిచే పరికరాలను సమకూర్చుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, పీఏసీఎస్ సీఈఓలు, ఏపీఎంలు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోళ్లను సజావుగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి మహేందర్, డీఆర్డీఓ శ్రీను, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్చంద్ర, జిల్లా సహకార అధికారి మోహన్, జిల్లా మార్కెటింగ్ అధికారి అనురాధ, తూనికలు–కొలతల శాఖ అధికారి జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాల వారీగా పాఠశాలలు, నిధుల వివరాలు..
హనుమకొండ జిల్లాలో హైస్కూళ్లు, కేజీబీవీలు కలిపి తొమ్మిదింటికి రూ.2.34 కోట్లు మంజూరయ్యాయి. హసన్పర్తి, ధర్మసాగర్, ఆత్మకూరు, ఎల్కతుర్తి కేజీబీవీలు, తరాలపల్లి, కడిపికొండ, వంగపహాడ్ జెడ్పీహెచ్ఎస్లు, శాయంపేట జాగీర్, వడ్డేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ● వరంగల్ జిల్లాలో మూడు పాఠశాలలకు రూ.78లక్షలు మంజూరయ్యాయి. సంగెం కేజీబీవీ, చార్బౌలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పైడిపల్లి జెడ్పీహెచ్ఎస్ ఉన్నాయి. ● జనగామ జిల్లాలో నాలుగు పాఠశాలలకు రూ.1.04 కోట్లు వచ్చాయి. కొడకండ్ల, నర్మెట, రఘునాథపల్లి కేజీబీవీలు, చెన్నూరు జెడ్పీహెచ్ఎస్ ఉన్నాయి. ● ములుగు జిల్లా మంగపేట జెడ్పీహెచ్ఎస్కు రూ.26 లక్షలు మంజూరయ్యాయి. ● మహబూబాబాద్ జిల్లాలో 9 పాఠశాలలకు రూ.2.34కోట్లు మంజూరయ్యాయి. చిన్నగూడూరు, పెద్దగూడూరు, మరిపెడ, వంగర కేజీబీవీలు, దాట్ల, హరిపిరాల, జమాండ్లపల్లి, ఆలేరు, పెనుగొండ జెడ్పీహెచ్ఎస్లున్నాయి. ● జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఈ దశలో నిధులు విడుదల కాలేదు -
మార్కెట్లోకి పల్సర్–150 న్యూమోడల్ బైక్
కాజీపేట అర్బన్ : వరంగల్ ములుగు రోడ్డులోని అనికా బజాజ్ షోరూంలో సోమవారం పల్సర్ –150 న్యూ మోడల్ బైక్ను అడిషనల్ డీసీపీ(ఏఆర్) వేముల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఎండీ సురేందర్ రా వు వివరాలు వెల్లడించారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పల్సర్ –150 ప్రస్తుతం ‘ది ఒరిజినల్ మోర్ డ్రైవింగ్ వర్షన్’ అధునాతన టెక్నాలజీతో మార్కెట్లోకి వస్తుందని తెలిపారు. వెల్ఫ్ ఐ హెడ్ లైట్ డీఆర్ఎల్తో సెంగెమెంట్లో మొదటి డీ–క్లాస్ ఎల్ఈడీ లైటింగ్తో రాత్రి వేళ్లలో ప్రయాణం సులభంగా ఉంటుందన్నారు. స్పోర్ట్, రెయిన్, రోడ్డు రైడ్ మొడ్స్తో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో షోరూం జీఎం షైనీదర్, అకౌంట్స్ మేనేజర్ ఎల్. సుధాకర్, అమ్జద్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ఆవిష్కరించిన అడిషనల్ డీసీపీ(ఏఆర్) శ్రీనివాస్ -
విద్యార్థుల సమస్యలపై శ్రద్ధ ఏదీ?
హన్మకొండ: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే రాజకీయ నిరసనలు, కార్యక్రమాలపై చూపిస్తున్న శ్రద్ధను విద్యార్థుల సమస్యలపై కూడా చూపించాలని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి సుబేదారిలోని కలెక్టరేట్ వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలన్నింటినీ ప్రభుత్వం, మంత్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ విద్యార్థి ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. పాలిటెక్నిక్ విద్యకు సంబంధించిన జీఓ 97ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక వందలాది కా లేజీలు ఆర్థిక ఇబ్బందులతో మూసివేత దిశగా వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. సీఎం వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు నడిపెల్లి వెంకటేశ్వరరావు, నాయకులు వీర భిక్షపతి, శ్రీశైలం, రాణి, మాధవి, అనిల్ నాయుడు, సుమన్ పాల్గొన్నారు. రైల్వే కోచ్ఫ్యాక్టరీ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి.. కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీ నిర్మా ణానికి భూములిచ్చిన నిర్వాసితులకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కాజీపే ట మండలం అయోధ్యపురంలో రైల్వే కోచ్ఫ్యాక్టరీ భూ నిర్వాసితులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ లాతూరు, మ హారాష్ట్ర రైల్వే యూనిట్లో మాదిరి కాజీపేట కోచ్ఫ్యాక్టరీ భూ నిర్వాసితులకు, స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు సంజయ్, కిషన్రెడ్డిని కలిసి రైల్వే కోచ్ఫ్యాక్టరీ భూ నిర్వాసితుల సమస్యలు వివరించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం జరిగేందుకు కృషి చేస్తానన్నారు. నాయకులు వెంకటేశ్వర్లు, భిక్షపతి, శ్రీ కాంత్, మాధవి, వనజ పాల్గొన్నారు. కలెక్టరేట్కు ర్యాలీగా వస్తున్న టీఆర్ఎస్ అధినేత్రి కవిత, నాయకులు, విద్యార్థులురైల్వే కోచ్ఫ్యాక్టరీ ఎదుట భూ నిర్వాసితులతో కలిసి నినాదాలు చేస్తున్న కవిత తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా -
నైపుణ్యాలపై అవగాహన పెంచుకోవాలి
రఘునాథపల్లి: ప్రస్తుత పోటీ ప్రపంచంలో బాలికలు చదువుతోపాటు సమకాలీన 21వ శతాబ్దపు జీవన నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని రిఫినిటీ ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) డాక్టర్ శార్వాణి విద్యాధరణి పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని ఖిలాషాపూర్ పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ హెచ్ఎం భారత రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన బాలికల రోల్ మోడల్ ఇంటరాక్షన్ అండ్ మెంటారింగ్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కెరీర్ గైడెన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ రంగాలు సాధిస్తున్న పురోగతిని వివరించారు. భవిష్యత్లో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవా లని సూచించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థిని రేష్మ, ఇన్చార్జ్ ఉపాధ్యాయులు ఎస్. విమలాదేవి, ఎం.రాధ, శాగ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. రిఫినిటీ ఏఐ సీఈఓ శార్వాణి విద్యాధరణి -
‘వనజీవి’ షూటింగ్ ప్రారంభం
బచ్చన్నపేట : పర్యావరణ పరిరక్షణే పరమావధిగా మొక్కలు నాటడాన్ని ఉద్యమంగా మార్చిన వనజీవి రామయ్య జీవితం ఆధారంగా ‘వనజీవి’ చిత్రాన్ని రూపొందిస్తున్నామని సినిమా దర్శకుడు వేముగంటి, నిర్మాత నిడిగొండ నరేశ్కుమార్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని కొడవటూర్లో గల సిద్ధుల గుట్ట పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ప్రా రంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి అందాల నడుమ సిద్ధుల గుట్ట లో ఈ చిత్ర నిర్మాణాన్ని 100 రోజుల పాటు నిర్మించనున్నామని తెలిపారు. ఈ చిత్రంలో వనజీవి పాత్రలో బ్రహ్మాజీ, ఆయన భార్య పాత్రలో నాగరాణి నటిస్తున్నారని, డీఓపీగా తోట రమణ, సంగీత దర్శకుడిగా బల్లేపల్లి మోహన్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. ‘కుడా’ చైర్పర్సన్కు మంత్రి పొన్నం అభినందన నయీంనగర్: హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను సోమవారం కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి మర్యాదపూర్వకంగా కలిశారు. సుధారాణికి మంత్రి అభినందనలు తెలిపి, శాలువాతో సత్కరించారు. దరఖాస్తుల ఆహ్వానం న్యూశాయంపేట: బీసీ మహిళల ఆర్థిక సాధికారతకు వందశాతం సబ్సిడీతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆటోమెటిక్ కుట్టుమిషన్ల పంపిణీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పుష్పలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల మహిళలు టీజీఓబీఎంఎంఎస్.సీజీసీ.ఇన్ అనే వెబ్సైట్లో ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు హనుమకొండ లష్కర్బజార్లోని కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు దుర్మార్గం
● డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి హసన్పర్తి: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్రెడ్డి మండిపడ్డారు. స్పీకర్పై ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ హసన్పర్తి శాఖ ఆధ్వర్యంలో సోమవారం హసన్పర్తి ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. ఆందోళనకు డీసీసీ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. అత్యున్నత స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తిపై బాధ్యతారహితంగా, అవమానకరంగా మాట్లాడడం బీఆర్ఎస్ పార్టీ అహంకారానికి నిదర్శనమన్నారు. తాతా మధు తక్షణమే స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వీసం సురేందర్రెడ్డి, కిరణ్, బల్సుకూరి శ్రీనివాస్, పెద్దమ్మ నర్సింహరాములు, ఆరెల్లి వెంకటస్వామి, రాజు, మధు, సురేశ్, బుచ్చిరెడ్డి, రుగ్వేద్రెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకుల నిరసన కాశిబుగ్గ: శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్న దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్లో కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిలువేరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. అనంతరం మధు దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయనపై బీఆర్ఎస్ తక్షణమే చర్యలు తీసుకోవాలని, స్పీకర్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. కొరివి పరమేష్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
కేయూ 24వ స్నాతకోత్సవం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ 24వ స్నాతకోత్సవం ఈఏడాది నవంబర్ చివరి వారంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి.. రిజిస్ట్రార్ వి. రా మచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్తో కలిసి హైదరాబాద్లోని లోక్భవన్లో రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయం చాన్స్లర్ శివప్రతాప్శుక్లాను కలిసి స్నాతకోత్సవానికి ఆహ్వానించారు. దీనిని గవర్నర్ అంగీకరించినట్లు రిజిస్ట్రార్ వి. రామచంద్రం తెలిపారు. స్నాతకోత్సవానికి సంబంధించిన పలు అంశాలను ఈసందర్భంగా గవర్నర్కు వీసీ ప్రతాప్రెడ్డి వివరించారు. త్వరలోనే లోక్భవన్ నుంచే స్నాతకోత్సవ తేదీని ఖరారు చేసి కేయూకు సమాచారం అందిస్తారు. గోల్డ్మెడల్స్, పీహెచ్డీ పట్టాల ప్రదానం కాకతీయ యూనివర్సిటీ 24వస్నాతకోత్సవంలో 2021–2022, 2022–2023, 2023–2024, 2024–2025 విద్యాసంవత్సరాలకు సంబంధించిన వివిధ కోర్సుల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందించనున్నారు. 380 మందికిపైగా విద్యార్థులకు ప్రదానం చేయనున్నారు. అలాగే, గతేడాది జూలై నుంచి ఈఏడాది అక్టోబర్ నెలాఖరు వరకు కూడా ఆర్ట్స్, సైన్స్, సోషల్సైన్స్సెస్, కామర్స్అండ్బిజినెస్ మేనేజ్మెంట్, ఫార్మసీ, లా, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ విభాగాల్లో పీహెచ్డీ అవార్డు అయిన పరిశోధక అభ్యర్థులకు డాక్టరేట్ పట్టాలు కూడా ప్రదానం చేయనున్నారు. ఈమేరకు ఒకటిరెండు రోజుల్లో పరీక్షల విభాగం అధికారులు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. పీహెచ్డీ పట్టాలు పొందే అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ చివరి వారంలో నిర్వహణ గవర్నర్ను కలిసిన వీసీ, రిజిస్ట్రార్ హాజరయ్యేందుకు గవర్నర్ అంగీకారం -
ఉత్సాహంగా కబడ్డీ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్ : వరంగల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి జూనియర్, సబ్ జూనియర్ బాలబాలికలకు ఎంపికలు ఉత్సాహంగా కొనసాగాయి. దాదాపుగా 500 మంది బాలబాలికలు హాజరైనట్లు వరంగల్ జిల్లా సెక్రటరీ అబ్దుల్లా ఖాన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అజీజ్ ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరై పోటీలు ప్రారంభించారు. ఇందులో ప్రతిభకనబర్చిన బాలబాలికల జట్లు ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరగనున్న ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీల్లో పాల్గొంటారని అబ్దుల్లా ఖాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ సంఘం హనుమకొండ జిల్లా సెక్రటరీ ఆకుల సారంగపాణి, వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ శ్రీరామ్ రెడ్డి, బాధ్యులు ముఖర్జీ, హసన్, కక్కెర్ల మల్లికార్జున్ గౌడ్, ఇనాయత్, గోగు నారాయణ, నాగెల్లి రవీందర్, శ్రీకాంత్, శ్రవణ్, వ్యాయామ ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
● మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ న్యూశాయంపేట/వరంగల్ చౌరస్తా: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆరోపించారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా, వరంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైన ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రైస్ మిల్లర్ల అరెస్ట్, రిమాండ్
● వివరాలు వెల్లడించిన పోలీసులు కొత్తగూడ: ప్రభుత్వానికి బకాయి ఉన్న రైస్ మిల్ల ర్లను జిల్లా సివిల్ సప్లయ్ డీఎం నర్సింహరావు ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు గూడూరు సీఐ వినయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కొత్తగూడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రానికి చెందిన ఈశ్వర ట్రేడర్స్, పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన నర్సింహ ట్రేడర్స్, గంగారం మండలం కామారం గ్రామానికి చెందిన యాకూబ్ అలీ బిన్ని రైస్ మిల్ యజమానులు 20023–24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం సరఫరా చేసిన సీఎంఆర్ ధాన్యం దిగుమతి చేసుకున్నారు. బియ్యం సరఫరా చేయకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారు. ప్రతీ మిల్లు రూ. 3 కోట్ల పైచిలుకు బకాయి పడింది. దీనిపై సివిల్ సప్లయ్ శాఖ నోటీసులు జారీ చేసినా స్పందించడం లేదు. దీంతో ఆ శాఖ డీఎం ఫిర్యాదు మేరకు మూడు మిల్లుల యజమానులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వివరించారు. ఈసమావేశంలో కొత్తగూడ, గంగారం ఎస్సైలు పాల్గొన్నారు. పార్ట్టైం లెక్చరర్కు షోకాజ్ నోటీస్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పార్ట్ టైం లెక్చరర్కు రిజిస్ట్రార్ రామచంద్రం ఈనెల 3న షోకాజ్నోటీస్ జారీ చేశారు. అదే కళాశాల కు చెందిన ఓ పరిశోధకుడు పలు ఆరోపణలు చేస్తూ ఇటీవల రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేశారు. సదరు పార్ట్టైం లెక్చరర్.. వివిధ విభాగాల పార్ట్టైం లెక్చరర్ల నుంచి కాంట్రాక్టు లెక్చరర్లుగా కన్వర్షన్ చేయిస్తానని నమ్మించి కొంత డబ్బులు వసూలు చేయడంతోటు వివిధ ఆరోణలు చేస్తూ అతడిపై రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేశారని సమాచారం. దీంతో రిజిస్ట్రార్ రామచంద్రం.. ఆ ఆరోపణలపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని సదరు పార్ట్టైం లెక్చరర్కు షోకాజ్నోటీస్ జారీచేశారు. -
అవగాహనతోనే ప్రమాదాల నివారణ
● ఉప రవాణా కమిషనర్ అఫ్రీన్ సిద్ధిఖీ హసన్పర్తి: బాల్యం నుంచే విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాలు నివారించవచ్చని ఉపరవాణా కమిషనర్ అఫ్రీన్ సిద్ధిఖీ అన్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలల స్థాయిలో రోడ్డు భద్రత కార్యక్రమాల అమలుపై విశేష కృషి చేసిన ఎంఈఓలను రోడ్డు రవాణశాఖ ఆధ్వర్యంలో చింతగట్టులోని రవాణాశాఖ కార్యాలయంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ప్రశంస పత్రాలతో సత్కరించారు. కార్యక్రమానికి ఉప రవాణా కమిషనర్ అఫ్రీన్ సిద్ధిఖీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉప రవాణశాఖ కమిషనర్ సురేశ్రెడ్డి, డీఈఓ ఎల్వీ గిరిధర్రాజ్గౌడ్, జిల్లా రవాణాధికారి జనార్దన్రెడ్డి, ఎంవీఐలు కిరణ్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి :
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులు పెండింగ్లో ఉంచకుండా గడువులోగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో పాటు అదనపు కలెక్టర్ ఎన్.రవి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో జిల్లాస్థాయిలో 123, డివిజన్ స్థాయిలో 23, మండల స్థాయిలో 123 చొప్పున మొత్తం 269 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ శేషాద్రి, డీఆర్ఓ శ్రీనివాస్, డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు. -
పట్టణాల్లోనే అక్షరాస్యత అధికం
హనుమకొండదే పైచేయి.. ఆరు జిల్లాల్లో హనుమకొండ అక్షరాస్యతలో స్పష్టమైన ఆధిక్యంలో ఉండగా, మహబూబాబాద్ చివరి స్థానంలో ఉంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత గణనీయంగా ఉంది. మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఎక్కువగా గిరిజన మారుమూల ప్రాంతాలు ఉండడం, గ్రామీణ ప్రాంతాల్లో బాల్యవివాహాలు, ఆడపిల్లల చదువుపై సరైన అవగాహన లేకపోవడం వల్ల పురుషులతో పోలిస్తే మహిళల్లో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పత్తి సాగు, మిర్చి కోతలు, ఇతర కూలీ పనుల కోసం కుటుంబాలు పిల్లలను కూడా వెంటబెట్టుకుని వలసలు వెళ్లడం మరో కారణంగా తెలుస్తోంది. కాగా, 2011 గణాంకాల ఆధారంగా ఉన్న ఈ వ్యత్యాసాలను ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే జిల్లాల విద్యాభివృద్ధి మెరుగై ఉంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. వరంగల్ డెస్క్: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాల అక్షరాస్యతలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన సోషియో ఎకనామిక్ ఔట్లుక్ – 2026లో హనుమకొండ జిల్లా 74.13 శాతం అక్షరాస్యతతో అగ్రస్థానంలో ఉండగా.. మహబూబాబాద్ 57.13 శాతంతో చివరి స్థానంలో ఉంది. మిగిలిన జిల్లాల్లో వరంగల్ 64.55, ములుగు 62.26, జనగామ 61.60, జయశంకర్ భూపాలపల్లి 58.97 శాతం అక్షరాస్యతను నమోదు చేశాయి. నేడు (మంగళవారం) అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో అక్షరాస్యత వివరాలతో కథనం. మహిళల్లో వెనుకబాటు నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం -
పోలీసులు సంయమనం పాటించాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతకాజీపేట అర్బన్ : జనసమూహాల్లో పోలీసుల తీరును ప్రజలు గమనిస్తారని, అందుకే సంయమనం పాటించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు. కాజీపేట మండలం మడికొండలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో భద్రాద్రి జోనల్ పరిధి పోలీస్ శిక్షణార్థులకు ఏర్పాటు చేసిన నాలుగు రోజుల తరగతులను సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ శిక్షణ తరగతుల్లో భాగంగా పండుగలు, జాతరలు, ఊరేగింపులు జరిగే సమయాల్లో పోలీసులు వ్యవహరించాల్సిన తీరుపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ట్రైనీలకు తరగతిలో బోధనతోపాటు ప్రాక్టికల్గా అధికారులు వివరించాలన్నారు. అడిషనల్ డీసీపీలు ప్రభాకర్రావు, శ్రీనివాస్, సీటీసీ ఏసీపీ రమణబాబు, ఆర్ఐ సింహాచలం శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు సూర్యప్రసాద్, వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, హెచ్సీలు, కానిస్టేబుళ్లు హాజరయ్యారు. -
మట్టి గణపతుల్ని పూజిద్దాం
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి, సహజ రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కోరారు. సోమవారం కలెక్టరేట్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ఎన్.రవితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈసందర్భంగా పర్యావరణ పరిరక్షణపై రూపొందించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీజీపీసీబీ నోడల్ అధికారి బి.జీమూత వాహన, అధికారులు పాల్గొని ప్రజలకు వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. 75 శాతం నోటీసులు జారీ ఎస్ఐఆర్లో భాగంలో జిల్లాలో అనామలీస్, నో మ్యాపింగ్ జాబితాలోని ఓటర్లకు ఇప్పటివరకు సుమారు 75 శాతం నోటీసులు జారీ చేసినట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో అనామలీస్, నో మ్యాపింగ్ కేటగిరీలో గుర్తించిన ప్రతీ ఓటరుకు నోటీసులు, పురోగతిపై సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి పి.సుదర్శన్రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ చాహత్ మాట్లాడుతూ.. విచారణకు హాజరుకాని వారికి రెండోసారి నోటీసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, ఆర్డీఓ వెంకటేశ్, ఏఈఆర్ఓ రవీందర్రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్సింగ్, తదితరులు పాల్గొన్నారు. వేగంగా పూర్తి చేయాలి హనుమకొండ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. పూర్తయిన పనుల బిల్లుల చెల్లింపులు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం కలెక్టరేట్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ, అంగన్న్వాడీ కేంద్రాలు, మహిళా సంఘాల భవనాల నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ డీఈలు రాజగోపాల్రావు, శ్రీనివాస్రావు, శిరీష, యుగంధర్, రామ్దేవ్ అగర్వాల్, ఏఈలు, అధికారులు పాల్గొన్నారు. వైద్యారోగ్య సేవల్లో జిల్లా ముందుండాలివైద్య, ఆరోగ్య శాఖ కార్యక్రమాల అమలులో హనుమకొండ జిల్లాను ముందంజలో నిలపాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గర్భిణులకు నెలవారీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మాతా శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలు, గర్భిణుల నమోదు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ కేసులపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. డీఎంహెచ్ఓ అప్పయ్య, డీఐఓ డాక్టర్ కృష్ణారావు, అదనపు డీఎంహెచ్ఓ మదనన్ మోహన్రావు, ఎన్సీడీ అధికారి మురళి, మాతా శిశు సంరక్షణ అధికారి రజిత, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రదీప్రెడ్డి, ఐడీఎస్పీ ప్రోగ్రాం అధికారి జ్ఞానేశ్వర్ అధికారులున్నారు. -
వేయిస్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రావణమాసంలోని చివరి సోమవారాన్ని పురస్కరించుకుని వేయిస్తంభాల ఆలయంలో శనివారం రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు రుద్రేశ్వరస్వామికి అఘోర పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. 150 మంది భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. పూజల్లో ఆధ్యాత్మికవేత్త వద్దిరాజు వెంకటేశ్వర్లు, ఉమారాణి దంపతులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అర్చకులు ప్రణవ్, శ్రవణ్ పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కామర్స్ అండ్ బిజినెస్మేనేజ్మెంట్ విభాగాధిపతిగా ఆ విభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కనకయ్య నియమితులయ్యారు. సోమవారం ఈమేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపాల్ ఉత్తర్వుల కాపీని కనకయ్యకు అందించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రెహమాన్, ఫ్యాకల్టీ క్లబ్ చైర్మన్ డాక్టర్ భిక్షపతి, వర్కింగ్ చైర్మన్ డాక్టర్ ఫిరోజ్పాషా, అధ్యాపకులు కనకయ్యను అభినందించారు. హసన్పర్తి: నేత్రదానంతో ఇద్దరికి చూపు ప్రసాదించవచ్చని డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని హసన్పర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో సోమవారం నేత్ర దాన అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఇమ్యూనేజషన్ అధికారి డాక్టర్ కృపారావు, అప్తాల్మిక్ ఆఫీసర్ శ్రీనివాస్రెడ్డి, డీపీఎంఓ దేవ్సింగ్, వైద్యులు భార్గవ్, మునీబ్, హెల్త్ సూపర్వైజర్ లచ్చు తదితరులు ఉన్నారు. హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో ముగ్గురు డీఈలకు యాజమాన్యం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అడ్హక్ పద్ధతిలో వీరికి సూపరింటెండ్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పించారు. హనుమకొండ సర్కిల్లోని ఎమ్మార్టీ, కన్స్ట్రక్షన్ డీఈ ఎ.విజేందర్రెడ్డికి కరీంనగర్ ఆపరేషన్ ఇన్చార్జ్ సూపరింటెండ్గా నియమించారు. భూపాలపల్లి సర్కిల్లో ఎమ్మార్టీ, కన్స్ట్రక్షన్ డీఈ ఎన్.సదానందానికి భూపాలపల్లి ఇన్చార్జ్ సూపరింటెండ్ ఇంజనీర్గా నియమించారు. నిజామాబాద్ సర్కిల్లోని ఆపరేషన్ డీఈగా ఎం.శ్రీనివాస్కు రాజన్న సిరిసిల్ల ఇన్చార్జ్ ఎస్ఈగా నియమించారు. -
వినాయక ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయాలి
సమావేశంలో కమిషనర్ టి.వెంకన్న వరంగల్ అర్బన్: గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఈనెల 13వ తేదీలోగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ టి.వెంకన్న ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై వినాయక చవితి, ప్రతిమల నిమజ్జన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వినాయక విగ్రహాల తరలింపులో ఇబ్బందులు కల్గకుండా రోడ్ల ప్యాచ్వర్క్లు పూర్తి చేయాలన్నారు. మండపాల వద్ద తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జన ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డీఆర్ఎఫ్, రెస్క్యూ, మత్స్య శాఖ సిబ్బంది బోట్లతో సిద్ధంగా ఉండాలని కమిషనర్ సూచించారు. ఎస్ఈ రాజ్కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి శంకర్లింగం, ముఖ్య హార్టికల్చర్ అధికారి లక్ష్మారెడ్డి, సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, కార్యదర్శి అనిల్కుమార్, ఆరోగ్య అధికారి డాక్టర్ రాజేశ్ పాల్గొన్నారు. -
ప్రథమ నవలా పోటీలకు ఆహ్వానం
విద్యారణ్యపురి: నవలా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రథమ నవలా పోటీలను ఈసారి కూడా నిర్వహించనున్నట్లు అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్ కార్యదర్శి డి.స్వప్న ఆదివారం తెలిపారు. రచయిత రాసిన మొట్టమొదటి నవలను మాత్రమే ఈ పోటీలకు పంపాలని, పుస్తక రూపంలో వచ్చిన నవలలు అంగీకరించబోమని పేర్కొన్నారు. డీటీపీ లేదా చేతిరాతతో 200 పేజీలకు మించకుండా 100 పేజీలకు తక్కువ కాకుండా ఉన్న నవలా రెండు ప్రతులను నవీన్ రెసిడెన్సి, 2–7–71 ఎకై ్సజ్కాలనీ, హనుమకొండకు అక్టోబర్ 31లోగా పంపించాలని కోరారు. ప్రథమ బహుమతి రూ.20 వేలు, ద్వితీయ బహుమతి రూ.15వేలు ఉంటుందని ఆమె తెలిపారు. ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ హన్మకొండ కల్చరల్ : రుద్రమ ప్రచురణలు ‘సెలయేటి గలగలలు’ వ్యాస సంపుటి, ‘అనిశెట్టి రజిత సాహిత్యంతో సంభాషణ’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం హనుమకొండలోని లష్కర్బజార్ హైస్కూల్లో ఆదివారం జరిగింది. రుద్రమ ప్రచురణల బాధ్యులు కొమర్రాజు రామలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కొమర్రాజు రామలక్ష్మి రచించిన ‘సెలయేటి గలగలలు’ వ్యాస సంపుటిని కేంద్ర సాహిత అకాడమీ గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ ఆవిష్కరించారు. అలాగే, రామలక్ష్మి, డాక్టర్ బండారు సుజాత సంపాదకత్వంలో వెలువడిన ‘అనిశెట్టి రజిత సాహిత్యంతో సంభాషణ’ పుస్తకాన్ని రిటైర్డ్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి ఆవిష్కరించారు. ముందుగా అనిశెట్టి రజిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంపశయ్య నవీన్ మాట్లాడుతూ.. రచయిత మంచి విశ్లేషణ, సాదాసీదా వచనంతో చక్కగా రాశారని అన్నారు. కార్యక్రమంలో కేయూ విశ్రాంత ఆచార్యులు బన్న అయిలయ్య, కవి పొట్లపల్లి శ్రీనివాసరావు, గిరిజారాణి, వల్లంపట్ల నాగేశ్వరరావు, పల్లేరు వీరస్వామి, నిధి, రమాదేవి, బిల్ల మహేందర్, సింగరాజు రమాదేవి, బిట్ల అంజనీదేవి, మేరాడి శ్యామల, సిరాజుద్దీన్, డాక్టర్ ఆకునూరి విద్యాదేవి పాల్గొన్నారు. మల్లంపల్లి సమీపంలో వ్యక్తి మృతదేహం లభ్యం ములుగు : ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలోని మల్లంపల్లి–మహ్మద్గౌస్పల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారి పక్కన ఆదివారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అక్కడ లభించిన ఆధారాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కాజీపేటకు చెందిన ముక్తార్ మహమ్మద్ (46)గా గుర్తించామని మల్లంపల్లి ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. మృతికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. పేకాట శిబిరాలపై దాడి ఖిలా వరంగల్ : పేకాట శిబిరాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసినట్లు ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. మధ్యకోట రజకవీధి, పడమరకోట ఎరుకల వీధిలో పేకాడుతున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు పేకాట స్థావరాలపై దాడి చేసి రూ.10,080 నగదు స్వాధీనం చేసుకున్నారు. పల్లకొండ సమ్మయ్య, బైరి ప్రతాప్, బీరం బద్రి, బూర అనురాధ, గన్నారపు రాజు, ఎండీ అన్వర్, శ్యాం, రాఘవులు పై కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం కేసును మిల్స్కాలనీ పోలీసులకు అప్పగించినట్లు ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. -
ఉద్యానశాఖ.. ఉద్యోగుల్లేక!
హన్మకొండ: ఉద్యానశాఖను ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాల పునర్విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా హనుమకొండ, ములుగు జిల్లాలకు జిల్లా ఉద్యాన అధికారి పోస్టులు మంజూరు కాలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 78 మండలాలకు కేవలం 17 మంది ఉద్యాన అధికారులు (హెచ్ఓలు) మాత్రమే ఉన్నారు. దీంతో రైతులకు సరైన సమయంలో అవసరమైన సలహాలు ఇచ్చే వారు కరువయ్యారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉద్యాన శాఖ, సూక్ష్మ సేద్యపు ప్రాజెక్టులు వేర్వేరుగా కొనసాగాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ రెండింటినీ ఉద్యాన శాఖ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. జిల్లాల పునర్విభజన తర్వాత పట్టు పరిశ్రమ శాఖను ఉద్యానశాఖలో విలీనం చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్ మినహా కొత్తగా నియామకాలు లేవు. 89,161 ఎకరాల్లో ఉద్యాన పంటలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 89,161 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో వరికి ప్రత్యమ్నాయంగా ఉద్యానపంటల సాగు విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో ఉన్న ఉద్యాన అధికారులపై మరింత పనిభారం పెరుగుతోంది. రాష్ట్రంలో ములుగు, హనుమకొండ జిల్లాలకు జిల్లా ఉద్యానశాఖ అధికారి పోస్టు మంజూరు కాలేదు. ఖమ్మం జిల్లాకు చెందిన హార్టికల్చర్ ఏడీ ములుగు జిల్లా అధికారిగా, వరంగల్ జిల్లా సూక్ష్మసేద్య ప్రాజెక్టు అసిస్టెంట్ డైరెక్టర్ హనుమకొండ జిల్లా ఉద్యాన అధికారిగా కొనసాగుతున్నారు. ఉద్యాన పంటల సాగు విస్తరిస్తున్నప్పటికీ అందుకు అనుగుణంగా అధికారులు, సిబ్బందిని నియమించకపోవడంతో ఉన్నవారిపైనే అదనపు భారం పడుతోంది. ఒక్కో ఉద్యాన అధికారికి 3 నుంచి 6 మండలాల బాధ్యతలు అప్పగించారు. హనుమకొండ జిల్లాలో 14 మండలాలకు ఇద్దరు, వరంగల్ జిల్లాలో 13 మండలాలకు ఐదుగురు ఉద్యాన శాఖ అధికారులున్నారు. కాగా, ఉద్యాన శాఖలో పనిచేస్తున్న హెచ్ఓలకు 30 ఏళ్లుగా పదోన్నతులు లేకపోవడం మరో సమస్యగా మారింది. దీంతో చాలా మంది పదోన్నతి పొందకుండానే రిటైర్డ్ అవుతున్నారని పలువురు హెచ్ఓలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కొరతతో రైతులకు సలహాలిచ్చే వారు కరువు హనుమకొండ, ములుగుకు మంజూరుకాని జిల్లా అధికారి పోస్టు -
గ్రామాభివృద్ధికి భూదానం
ధర్మసాగర్ : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారంలో గ్రామ పంచాయతీ భవనం, రామాలయ నిర్మాణానికి ఓ కుటుంబం తమ ఉదారతను చాటుకుంది. అదే గ్రామానికి చెందిన చింతలపాని సుధీర్రెడ్డి, చింతలపాని సుకన్య ఇరువురు తమకు చెందిన రూ.50లక్షల విలువైన 550 గజాల ఓపెన్ ప్లాటును గ్రామ పంచాయతీకి దానం చేశారు. ఈ మేరకు ఆదివారం నోటరీ పత్రాలను సర్పంచ్ రేణుకవెంకట్, మాజీ ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్కు వారు అప్పగించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ.. తమ తండ్రి చింతలపాని రామచంద్రా రెడ్డికి గ్రామంలో ఉన్న ఆస్తిలో నలుగురు కుమారులకు నాలుగు ఖాళీ స్థలాలు ఉన్నాయని తెలిపారు. అందులో తమ ఇద్దరి వాటాగా వచ్చిన స్థలాన్ని తండ్రి జ్ఞాపకార్ధం గ్రామాభివృద్ధికి కేటాయించినట్లు చెప్పారు. తండ్రి పేరు మీద ఊరికి ఈ చిన్న సేవ చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఎలాంటి ఆర్థిక ప్రతిఫలం ఆశించకుండా ప్రజా ప్రయోజనాల కోసం కోట్ల విలువైన భూమిని దానంగా ఇవ్వడంపై ముప్పారం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మన ఊరి అభివృద్ధి–మన బాధ్యత అనే స్ఫూర్తితో ముందుకు వచ్చిన దాతలను సర్పంచ్ రేణుక, ఉప సర్పంచ్ కుమారస్వామి, గ్రామస్తుల తరఫున ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ భవనాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం గ్రామంలోని మరికొందరు దాతలు కూడా ముందుకు రావాలని సర్పంచ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. చింతలపాని సోదరుల ఉదారత -
ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకొస్తాం
● రాష్ట్రస్థాయి కంప్యూటర్ ఆపరేటర్లుహన్మకొండ చౌరస్తా: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకొచ్చి, న్యాయపోరాటం చేస్తామని ఔట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్లు హెచ్చరించారు. ఆదివారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని పబ్లిక్ గార్డెన్లో ఔట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ల రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేతనాల్లో కోతలు, హోదాల మార్పులు, ఉద్యోగ భద్రత తదితర సమస్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. రూ.500 నుంచి రూ.14,000 వరకు వేతనాలు తగ్గించారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఒకే రకమైన విధమైన విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల హోదా పేరు మార్చి, వేతనం తగ్గించడం ఎంతవరకు న్యాయమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు మున్సిపల్, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, విద్య, పంచాయతీరాజ్, నీటి సరఫరా తదితర అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇది కేవలం కంప్యూటర్ ఆపరేటర్ల సమస్య కాదు, అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్య, ఒకరి హోదా మారితే, రేపు మరొకరి వేతనం తగ్గవచ్చు, అందుకే అన్ని శాఖల ఉద్యోగులు కలిసి పోరాడాలి అని సమావేశంలో ఉద్యోగులు ముక్తకంఠంతో నినదించారు. సమావేశంలో మియాపురం శ్రీకాంతాచారి, చరణ్ నరేశ్, భరద్వాజ్, గాయత్రి, సంతోష్ కుమార్, ప్రవీణ్, మాధవి, ప్రశాంత్ బాబు, రాజునాయక్, మహేశ్కుమార్, రంగా నెహ్రూ, లలిత, గంగాధర్, హరీష్, అబ్దుల్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
రేకులు తొలగిస్తుండగా జారిపడి వ్యక్తి.. మహబూబాబాద్ రూరల్ : పొట్టకూటి కోసం కూలి పనికి వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బయ్యారం మండలానికి చెందిన కందిపాటి యాకన్న (37) స్థానిక శ్రీ వెంకటేశ్వర వెల్డింగ్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ షాపులో పనిచేస్తూ మహబూబాబాద్లోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆ షాపు పక్కనే ఉన్న కొండి లావణ్య, స్వాతిలత ఇంటి వద్ద రేకులు తొలగించే పని ఉండగా యాకన్న అక్కడ పనికి వెళ్లాడు. శనివారం సాయంత్రం రేకులు తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు అతడు జారిపడిపోగా తలకు గాయమైంది. గమనించిన స్థానికులు, షాపు నిర్వాహకులు, కుటుంబ యజమాని ఆయనను చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. యాకన్నకు భార్య ఉమ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఉమా ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్సై సూరయ్య కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. బావిలో పడి మహిళ.. నర్సంపేట రూరల్ : ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళా మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని ఆకులతండా గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై రాజన్బాబు కథనం ప్రకారం.. ఆకులతండాకు చెందిన బానోత్ స్వర్ణలలిత (35) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే కోతుల బారినుంచి పంటను కాపాడేందుకు కావలిగా శనివారం వెళ్లింది. సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు వెతికిన ఆచూకి లభించలేదు. ఆదివారం తెల్లవారుజామున వెళ్లి చూడగా బావిలో మృతిచెంది కనిపించింది. కోతులను కొట్టేందుకు అటువైపు వెళ్తు ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయినట్లు ఫిర్యాదులో కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతురాలికి భర్త సునీల్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రమాదవశాత్తు జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వ్యక్తి, వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని ఆకులతండా గ్రామంలో మహిళ మృతిచెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. -
ప్రజాధనం దుర్వినియోగం
ఖిలా వరంగల్: అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, డ్రెయినేజీలను ఆక్రమించి నిర్మించిన 123 భవనాలను వెంటనే గుర్తించి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని వినియోగదారుల సమాఖ్య దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుడు మొగలిచెర్ల సుదర్శన్ డిమాండ్ చేశారు. వరంగల్ శివనగర్లో వినియోగదారుల సమాఖ్య కార్యాలయంలో మురహరి కార్తీక్ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలు, మట్టికోట ధ్వంసం చేసి అండర్ డ్రెయినేజీ నిర్మాణం చేయడంపై హైకోర్టులో రిట్ ఫిటిషన్ వేశామని తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఇంజనీర్ దిడ్డి లక్ష్మీనారాయణ, న్యాయ సలహా సభ్యులు రాయబారపు భిక్షపతి, ఆర్.ఆనందరావు, బండి అనిల్కుమార్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
కారు ఢీకొని వ్యక్తి..
● రాంపూర్లో ఘటన ధర్మసాగర్ : అతివేగంగా వచ్చిన కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ పరిధి కాజీపేట మండలంలోని రాంపూర్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాంపూర్ గ్రామానికి చెందిన ఇటుక రాజుఈశ్వర్ (60) ఆదివారం మధ్యాహ్నం తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన కారు ఆయనను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజు ఈశ్వర్ను స్థానికులు 108 అంబులెన్స్లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ధర్మసాగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించాలి
విద్యారణ్యపురి : విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర అని హనుమకొండ ఎంఈఓ నెహ్రూ అన్నారు. హనుమకొండ జిల్లా అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (హడుప్సా) ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కళాశాల సెమినార్ హాల్లో 72 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. హడుప్పా అధ్యక్షుడు టి.బుచ్చిబాబు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు తమ సబ్జెక్టుల్లో నైపుణ్యాలను పెంచుకోవాలని, క్రమశిక్షణ పెంచాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలవాలని ఆకాంక్షించారు. రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మూల జితేందర్రెడ్డి, కాజీపేట ఎంఈఓ బి.మనోజ్కుమార్, హడుప్సా ముఖ్య సలహాదారు వర్ధమాన్ జనార్దన్ మాట్లాడారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. హడుప్సా జనరల్ సెక్రటరీ ఎం.సంతోష్రెడ్డి, ట్రెజరర్ డి.శంకర్, సలహాదారులు ఎన్.శ్రీనివాస్రెడ్డి, పి.వెంకటరమణ, వైస్ ప్రెసిడెంట్ టి.రాజేశ్వర్రావు, జాయింట్ సెక్రటరీలు మధుకర్రెడ్డి, శివానందు, స్పెషల్ ఇన్వైటీ ఎం.సతీష్కుమార్, అకడమిక్ కన్వీనర్ రామారావు, జాయింట్ ట్రెజరరీ నవీన్రెడ్డి, కార్యవర్గసభ్యులు సంపత్రెడ్డి, రామచంద్రమూర్తి, అనిల్కుమార్, వాసుదేవరెడ్డి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ‘నెల నెలా సాహిత్య సంగోష్టి’
హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని పింజర్ల వీధిలోని శ్రీ రాజ రాజ నరేంద్ర ఆంధ్రా భాషా నిలయంలో ‘నెల నెలా సాహిత్య సంగోష్టి’ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీరాజరాజనరేంద్ర ఆంధ్ర భాషా నిలయం, జాతీయ సాహిత్య పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి తిరుమల తిరుపతి సంరక్షణ సమితి పూర్వ రాష్ట్ర కార్యదర్శి సౌమిత్రి లక్ష్మణాచార్య అధ్యక్షత వహించారు. ప్రముఖ విద్యావేత్త దహగం సాంబమూర్తి ముఖ్య అతిథిగా హాజరై భగవద్గీతపై ప్రసంగించారు. విశ్రాంత ఉద్యోగులచే రచించబడిన ‘శ్రీ రామాయణం’ ‘భగవద్గీత’ విశిష్ట గ్రంథాల పరిచయ కార్యక్రమం ఈ సంగోష్టిలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భగవద్గీత గ్రంథ పరిచయకర్త పుల్లారెడ్డి గ్రంథంలోని విశేషాలను, ఆధ్యాత్మిక విశిష్టతను శ్రోతలకు వివరించారు. మోహన మురళి సంస్కృతంలో రచించిన భగవద్గీతపై సంస్కృత భారతి అధ్యక్షుడు ప్యాట శ్రీనివాస్ ప్రసంగించారు. జాతీయ సాహిత్య పరిషత్ ,హనుమకొండ ప్రధాన కార్యదర్శి తాడిచర్ల రవి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, దాస్యం రామానుజం, రాచకట్ల లక్ష్మణ సుధాకర్, స్థానిక కవులు, రచయితలు పాల్గొన్నారు. -
ఘోష్.. భేష్
హన్మకొండ కల్చరల్: రాష్ట్ర సేవికా సమితికి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్ భద్రకాళి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం ‘ప్రణవ నాదం’ పేరుతో నిర్వహించిన సామూహిక ఘోష్ (వివిధ రకాల వాయిద్యాల) ప్రదర్శన ఆకట్టుకుంది. 90 మంది సేవికలు ఆనక్ (డ్రమ్), వంశీ, ఝల్లరి, శంఖం తదితర వాయిద్యాలతో భారతీయ సంప్రదాయ వేషధారణలో మహిళలు, యువతులు, బాలికలు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారి సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తిరసంతో పాటు దేశభక్తి, జాతీయ భావనను చాటి చెప్పింది. మహిళల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, పెంపొందించడమే కార్యక్రమ ఉద్దేశమని రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ ప్రొద్దుటూరి రూప తెలిపారు. ధర్మ, సమాజ, సంస్కృతి పరిరక్షణలో మహిళల పాత్ర కీలకమన్నారు. ప్రాచీనయుద్ధ విద్యలు, వాద్యకళలు భారతీయ సంస్కృతిలో భాగమని, వాటిని భావితరాలకు అందించడమే తయ ధ్యేయమని పేర్కొన్నారు. సమయపాలన, క్రమశిక్షణ ప్రతిరోజు అందించే శిక్షణకు ఘోష్ ప్రదర్శన నిదర్శనమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువత, బాలికల్లో ధైర్యం, సన్మార్గం పెంపొందిస్తాయని తెలిపారు. ప్రదర్శన అనంతరం సేవికలు భారతమాతకు ప్రణామం చేస్తూ ప్రార్థన చేశారు. ధర్మరక్షణ, సమాజసేవ రెండు కళ్లుగా రాష్ట్ర సేవికా సమితి పనిచేస్తుందని రూప తెలిపారు. వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ ఎస్. మాలతి, విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అసిస్టెంట్ లెక్చరల్ హరివిజయశ్రీ, వైద్యురాలు మంతెన శిరీష, రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ప్రాంత సంచాలిక డాక్టర్ మాగంటి అరుణ, శ్రీపాద రాధ, సముద్రాల కవిత, అర్చన, వాంకుడోత్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఘోష్ను ప్రదర్శిస్తున్న సేవికలు ఆకట్టుకున్న ప్రణవనాదం శ్రీభద్రకాళి దేవాలయంలో 90 మంది సేవికల ప్రదర్శన క్రమశిక్షణ, దేశభక్తి, ఆధ్యాత్మికతల కలబోతగా కార్యక్రమం -
నాటక ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ
కాజీపేట రూరల్: సురభి నాటకాలను బతికించాలని కాజీపేట రైల్వే సీనియర్ డీఈఈ, రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ జి.సూర్యనారాయణ అన్నారు. కాజీపేట రైల్వే జనరల్ ఇనిస్టిట్యూట్ కళావేదికపై ఆదివారం సమ్మక్క సారలమ్మ జీవిత కథ సురభి నాటక ప్రదర్శన పోస్టర్ను సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ మన సంస్కృతీ, సంప్రదాయాలను బతికించాలని జానపద కళలు, ఆధ్యాత్మికత, మన దేశ రాజుల రాజ్యాల వీరగాథలను తెలిపేందుకు సురభి నాటక ప్రదర్శనకు సహకరిస్తున్న రైల్వే ఇన్స్టిట్యూట్ వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇన్స్టిట్యూట్ సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్ మాట్లాడుతూ.. ఈ నెల 13న కాజీపేట రైల్వే కమ్యూనిటిహాల్లో సాయంత్రం 5 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ జీవిత కథ సురభి నాటక ప్రదర్శన ఉంటుందని, ఈ ప్రదర్శనకు రైల్వే ఉద్యోగులు, కాజీపేట ప్రాంత ప్రజలు కుటుంబసమేతంగా వచ్చి నాటకాన్ని తిలకించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, సురభి నాటక సంస్థ అధ్యక్షుడు సింధురి కొండల్రావు, ట్రెజరర్ కార్తీక్, కార్యదర్శి సురభి సంతోశ్, సభ్యులు నాగరాజు, ఇన్స్టిట్యూట్ జాయింట్ సెక్రటరీ మెరుగు రాజయ్య, ట్రెజరర్ గిరిమిట్ల రాజేశ్వర్రావు, సంస్కృత విభాగం ఇన్చార్జ్ ధారవత్ రఘు, సభ్యులు పి.రవికిరణ్ పాల్గొన్నారు.హన్మకొండ : అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు పిలుపునిచ్చారు. హనుమకొండలోని కాళోజీ విగ్రహం వద్ద రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభల వాల్పోస్టర్లను సంఘం నాయకులు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ.. మంచిర్యాలలో ఈనెల 8, 9వ తేదీల్లో అఖిల భారత రైతు కూలీ సంఘం 9వ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని చెప్పారు. 8న ఉదయం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి అధ్యక్షతన మహాసభ ప్రారంభం అవుతుందని, ప్రముఖ సంపాదకుడు, విమర్శకుడు, రచయిత కె.శ్రీనివాస్ ప్రారంభోపన్యాసం చేస్తారని, ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు వెంకట్రామయ్య ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తారని వివరించారు. రెండో రోజు గత ఉద్యమాల నివేదిక, సమీక్ష ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బండి వెంకటేశ్వర్లు, ఇనుముల కృష్ణ, శంకరయ్య, రమేష్, బన్న నర్సింగం, పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ పాల్గొన్నారు. -
పెండింగ్ బిల్లులు రాక మనస్తాపం..
● ఆత్మహత్యాయత్నం చేసిన అంకుషాపూర్ మాజీ సర్పంచ్ టేకుమట్ల : పెండింగ్ బిల్లులు రాక మనస్తాపం చెందిన మాజీ సర్పంచ్ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో జరిగింది. బాధితుడు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని అంకుషాపూర్ మాజీ సర్పంచ్ పండుగ శ్రీనివాస్ (సర్పంచ్గా ఉన్నప్పుడు) సుమారు రూ.19 లక్షలను అప్పు తెచ్చి పనులు చేయించారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ బిల్లులు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా వస్తాయని ఎదురు చూశాడు. తీసుకున్న నగదుకు వడ్డీలు కట్టలేక తీవ్ర మనస్తాపానికి నిత్యం గు రయ్యాడు. ఏదో ఒకరోజు బిల్లులు వస్తాయ నుకున్నా ఫలితం లేదు. దీంతో శ్రీనివాస్ శనివారం సాయంత్రం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు య త్నించి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. వెంటనే ఆయన ను చికిత్స కోసం చిట్యాలలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గ్రామ అభివృద్ధి కోసం అప్పులు పనులు చేశానని, సంవత్సరాలు గడుస్తున్నా పెండింగ్ బిల్లులు రాకపోవడంతో చావే శరణ్యమని ఆత్మహత్యకు సిద్ధమయ్యానని శ్రీనివాస్ కన్నీటి పర్యంతమయ్యాడ. -
పైకం మరొకరికి!
సోమవారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026పని ఒకరిది..పారిశుద్ధ్య పనుల్లో ఒకరికి బదులు మరొకరు విధులుఇలా బల్దియాలో పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులు సుమారు 130 మంది వరకు.. బినామీ, సిబ్బందికి కనిపించి ఇంటి ముఖం పడుతూ నెలనెలా వేతనం తీసుకుంటున్నారు. 13వ డివిజన్కు చెందిన ఓ రెగ్యులర్ పారిశుద్ధ్య కార్మికుడు నర్సంపేట నుంచి రాకపోకలు సాగిస్తుంటాడు. శానిటరీ ఇన్స్పెక్టర్ను, జవాన్ను మేనేజ్ చేసుకుంటున్నాడు. పోచమ్మ మైదాన్కు చెందిన 24వ డివిజన్కు చెందిన ఓ మధ్య వయస్సు కార్మికుడు ఉదయం, మధ్యాహ్నం వేళ వచ్చి ఫేస్ ఐడీ ఇచ్చి వెళ్తుంటాడు. 26వ డివిజన్లో ఓ కార్మికురాలిని కేవలం మ్యాన్యువల్ హాజరుతోనే కొనసాగిస్తున్నారు. నగరంలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులు ● రూ.10 వేలు చెల్లిస్తే రెగ్యులర్ కార్మికులకు నెలంతా అటెండెన్స్ ● గ్రేటర్ పారిశుద్ధ్య విభాగంలో అవినీతి! ● చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు -
స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి
హసన్పర్తి: వినూత్న ఉత్పత్తుల తయారీ ద్వారా యువత స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలని కలెక్టర్ చాహత్బాజ్పాయ్ సూచించారు. గోపాలపురంలో అరిస్సా గ్రోత్ ఫామ్స్ మిల్లెట్ పన్నీర్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసిసెంగ్ యూనిట్ను ఆదివారం కలెక్టర్ ప్రారంభించారు. న్యూట్రిహబ్ ప్రోత్సాహంతో ఉజ్వల చంద్రగిరి అనే యువతి ఎంటర్ప్రిన్యూర్షిప్లో భాగంగా ఈ పరిశ్రను నెలకొల్పారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. మిల్లెట్ ఆధారిత ఉత్పత్తుల తయారీలో ఐఐఎంఆర్ వంటి సంస్థల సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కాగా, ఇది దేశంలోనే తొలి మిల్లెట్ పన్నీర్ యూనిట్ అని నిర్వాహకులు కలెక్టర్కు వివరించారు. కార్యక్రమంలో ఐఐఎంఆర్ న్యూట్రిహబ్కు చెందిన డాక్టర్ స్టాన్లే, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్కుమార్, న్యూట్రిహబ్ బృంద ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గోపాలపురంలో మిల్లెట్ పన్నీరు తయారీ పరిశ్రమ ప్రారంభం -
మామూళ్లు ఇస్తూ..
వరంగల్ అర్బన్: మహా నగరం పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకం. బల్దియాలో 168 మంది శాశ్వత ప్రతిపాదికన పనిచేసే పారిశుద్ధ్య కార్మికులున్నారు. 2,873 మంది ఔట్సోర్సింగ్ కార్మికులున్నారు. కార్మికులు తమ స్థానాల్లో మరొకరిని పెట్టుకోవడం, శానిటరీ ఇన్స్పెక్టర్లకు, జవాన్లకు సలామ్ కొడుతూ మేనేజ్ చేసుకుంటూ పూర్తిస్థాయి వేతనం పొందుతున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పారిశుద్ధ్య పనులు చేయాలి. వీరు రోడ్లు ఊడ్చడం, కాల్వలు తీయడం, ఇంటింటా చెత్త సేకరించడం చేయాలి. ఇందుకుగాను పర్మనెంట్ కార్మికులకు నెల వేతనం రూ.50 వేల నుంచి రూ. 80వేల వరకు బల్దియా వేతనం పొందుతున్నారు. ఔట్సోర్సింగ్ కార్మికులు రూ.16 వేల వేతనం తీసుకుంటున్నారు. రెగ్యులర్ కార్మికులకు హాజరు పుస్తకాలతో మ్యాన్యువల్గా హాజరు వేస్తుండగా, ఔట్సోర్సింగ్ కార్మికులకు ఫేస్ అథెంటిక్ ద్వారా వేతనాలు ఇస్తుండడం విమర్శలకు తావిస్తోంది. విధులు నిర్వర్తించని వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.కార్మికులు విధులు నిర్వర్తించకుండా జవాన్లకు రూ.2 వేలు, శానిటరీ ఇన్స్పెక్టర్కు రూ.10 వేల వరకు నెలవారీగా మామూళ్లు అందజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. క్షేత్రస్థాయిలో ఎవరూ పట్టించుకోకపోవడం, అసలు ఎవరు పనిచేస్తున్నారనే విషయంపై అవగాహన కూడా లేకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. వారి హాజరును సైతం సరిగ్గా తీసుకోవట్లేదనే ఆరోపణలున్నాయి. గతంలో ఇదే విషయం వెలుగులోకి రావడంతో ఓ శానిటరీ ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయ్యాడు. పారిశుద్ధ్య కార్మికుల ఫేస్ అటెండెన్స్, మాన్యువల్ హాజరును పరిగణనలోకి తీసుకుంటాం. ఎవరైతే విధులకు వస్తారో వారి ముఖ చిత్రం ద్వారా హాజరు పడుతోంది. విధులు నిర్వర్తించాల్సిన కార్మికులు కాకుండా వేరే వారు వస్తే గుర్తిస్తాం. విధులకు డుమ్మా కొడితే శాఖాపరమైన చర్యలు ఉంటాయి. – రాజేశ్, బల్దియా ఎంహెచ్ఓ -
మద్యం మత్తులో కానిస్టేబుల్పై దాడి
వర్ధన్నపేట : స్థానిక బార్లో ఫుల్గా మద్యం తాగిన యువకులు ఓ పోలీస్ కానిస్టేబుల్పై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన శనివారం రాత్రి వర్ధన్నపేట పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం మత్తులో ఇరువర్గాలు దాడులు చేసుకుని గొడవకు దిగారు. అందులో ఓ వర్గం వారు డయల్–112 సమాచారం అందించారు. దీంతో కానిస్టేబుల్ రాజేష్ అక్కడికి వెళ్లి గొడవను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అందులో నలుగురు యువకులు కానిస్టేబుల్పై దాడికి పాల్పడి అతడి చేతిలోని ట్యాబ్ను సెల్ఫోన్ను ధ్వంసం చేసి కొట్టారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారి నుంచి తప్పించుకున్న రాజేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైనట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే విషయంపై ఎస్సై సాయిబాబును వివరణ కోరగా తోపులాటలో కానిస్టేబుల్ కిందపడగా గాయాలయ్యాయని, ట్యాబ్ దెబ్బతినలేదన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడే విధంగా చూస్తామని పేర్కొన్నారు. మనస్తాపంతో మహిళ బలవన్మరణం నల్లబెల్లి : భర్తకు అనారోగ్యం.. అలాగే కుటుంబ పరిస్థితులు బాగా లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన నల్లబెల్లి మండలంలోని నారక్కపేటలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై మోడెం సాయిప్రసన్న కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నౌగిరి రాధాబాయి (58) భర్త రాజలింగం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. భర్త ఆరోగ్యం కుదుటపడక పోవడం, కుటుంబ భారాన్ని మోయలేక సతమతమవుతున్న ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యేది. ఈక్రమంలో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కాటేసిన విద్యుత్ ఎర్త్వైర్
● మూడేళ్ల చిన్నారి దుర్మరణం ● గొల్లపల్లిలో విషాదం.. భీమదేవరపల్లి : పొలంలో ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిని ఎర్త్వైర్ రూపంలో విద్యుత్ షాక్ బలి తీసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వీరభద్రనగర్కు చెందిన బానోత్ సంపత్, సునీత దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. శనివారం గ్రామ శివారులోని పొలంలో పనులకు వెళ్తూ తమ మూడేళ్ల కుమారుడు రిషిని కూడా వెంట తీసుకెళ్లారు. తల్లిదండ్రులు పనుల్లో నిమగ్నమవగా సమీపంలో ఆడుకుంటున్న రిషి ప్రమాదవశాత్తు విద్యుత్ ఎర్త్వైర్ను తాకాడు. విద్యుత్ సరఫరా వల్ల రిషి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే చూసేసరికి అప్పటికే బాలుడు ప్రాణాలు విడిచాడు. రక్షణగా ఉండాల్సిన ఎర్త్ వైర్లోకి విద్యుత్ ప్రవాహం ఎలా వచ్చిందని గ్రామస్తులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చిన్నారి ప్రాణం పోయిందని మండిపడ్డారు. ప్రమాదానికి బాధ్యులైన విద్యుత్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిరుపేదలైన బానోత్ సంపత్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పొలాలు, నివాస ప్రాంతాల్లోని ఎర్త్ వైర్లు, విద్యుత్ స్తంభాలను తనిఖీ చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. పోషించలేక యువకుడి ఆత్మహత్యచిట్యాల : తల్లిదండ్రులు లేకపోవడంతో తన తోబుట్టువుల పోషణభారం భరించలేక తీవ్ర మనస్తాపానికి గురై ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని పాశిగడ్డతండా గ్రామంలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన భూక్యా తిరుపతి (22), తల్లిదండ్రులు సురేష్–వసంత ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. తిరుపతి తన చదువును ఆపేసి ఓ హోటల్లో పనిచేస్తూ ఇద్దరు తమ్ముళ్లను, చెల్లి బాగోగులు చూసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా తల్లిదండ్రులు లేకపోవడంతో పాటు తోబుట్టిన వాళ్ల పోషణభారం ఎక్కువై మనస్తాపం చెంది, ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. తిరుపతి కుటుంబ సభ్యుడు భూక్య రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పోచంపల్లి సతీష్ తెలిపారు. -
పిలిచి.. కత్తితో పొడిచి..
ఖిలా వరంగల్ : ఇంట్లో ఉన్న ఓ యువకుడిని పిలిచి.. కత్తితో పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశారు. ప్రేమజంట ఏకాంతంగా ఉన్న వీడియో తీసి డబ్బులు డిమాండ్ చేశారని, గ్యాంగ్లుగా విడిపోయి చివరకు ఓ అమాయక యువకుడి ప్రాణం తీశారు. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి సమీపంలోని బెస్తం చెరువు వెళ్లే రోడ్డులో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన కలకలం రేపింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ తిమ్మాపూర్ గ్రామంలోని (మామునూరు) ఝాన్సీనగర్కు చెందిన మేకల గౌతమ్ (27) ప్లంబర్గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన జానకిరామ్ ఆగస్టు 30న రాత్రి భట్టుపల్లి రోడ్డు పక్కన ఓ యువతి, యువకుడు ఏకాంతంగా ఉండగా, వీడియోలు తీసి మండిబాజార్కు చెందిన కృనాల్కు పంపించి రూ.10 వేలు డిమాండ్ చేశారు. ‘నీది ఎక్కడ అని కృనాల్ అడగగా.. నా పేరు జానకిరామ్ నాది తిమ్మాపురం గ్రామం’ అని వివరించాడు. వెంటనే కృనాల్ తన స్నేహితుడైన అదే గ్రామానికి చెందిన నందనబోయిన రోహిత్కు ఫోన్చేసి జరిగింది వివరించాడు. వెంటనే రోహిత్ జానకిరామ్కు కాల్ చేసి కృనాల్ తన మిత్రుడని వదిలేయమని మందలించాడు. సరే అని చెప్పిన తర్వాత జానకిరామ్ కృనాల్కు మళ్లీ ఫోన్ చేసి రెండు బీరుపెట్టెలు లేదా రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కృనాల్ రోహిత్కు ఫోన్చేసి జానకిరామ్కు డబ్బులు ఇచ్చేయమని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పాడు. కానీ రోహిత్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో కృనాల్కు జానకిరామ్కు ఫోన్లోనే గొడవ జరిగింది. ఇదే విషయాన్ని ఈనెల 3న రోహిత్ ఝాన్సీనగర్కు చెందిన మేకల గిరిధర్కు జానకిరామ్ వ్యవహరించిన తీరును వివరించాడు. మర్నాడు రాత్రి గిరిధర్ జానకిరామ్తో ఫోన్లో మాట్లాడుతూ గొడవ పడ్డాడు. అదే రాత్రి గిరిధర్, రోహిత్ ఇద్దరు కలిసి రంగశాయిపేటలోని ఖమ్మం జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ బేకరి వద్దకు చేరుకున్నారు. గిరిధర్, జానకిరామ్కు ఫోన్ చేసి బేకరి వద్దకు రావాలని ఫోన్చేశారు. జానకిరామ్ స్నేహితుడైన మంగళమ్మకుంటకు చెందిన శామల పవన్తో అక్కడికి చేరుకున్నాడు. అక్కడి రాగానే దుర్బాషలాడుతూ రోహిత్.. గిరిధర్ కాలర్ పట్టాడు. అంతలోనే పోలీస్ వాహనం సైరన్ విని అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత గిరిధర్ తన బాబాయి అయిన మేకల గౌతమ్కు ఫోన్చేసి పవన్, జానకిరామ్ ఇద్దరు తన కాలర్ పట్టినట్టు వివరించారు. తాను ఆర్టీఏ జంక్షన్ వద్ద ఉన్నానని చెప్పగా గౌతమ్, సాయి, సంతోష్ ముగ్గురు రెండు వాహనాలపై అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలు కలిసి బెస్తం చెరువు కట్టకు వెళ్లే నిర్మానుష ప్రాంతానికి చేరుకున్నారు. శామల పవన్ గిరిధర్ను తిడుతూ.. ఎంత దైర్యంరా అంటూ ఆడ్డువచ్చిన గౌతమ్ను పవన్ నెట్టివేయగా కిందపడిపోయాడు. వెంటనే వారు ముందుగానే చంపాలని వెంట తెచ్చుకున్న కత్తితో గౌతమ్ చాతి, పొట్టపై విచక్షణ రహితంగా పొడిచారు. దాడిని ఆపే ప్రయత్నం చేసిన రోహిత్కు ఎడమ కాలుపై స్వల్ప గాయమైంది. అయినా.. పవన్, జానకిరామ్ను పట్టుకునే ప్రయత్నం చేయగా.. ఘటన స్థలం నుంచి వారు పారిపోయారు. రక్తపు మడుగులో ఉన్న గౌతమ్ను మేకల సాయి, నందనబోయిన అభి బైక్పై తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో సాయి స్నేహితుడు మదాసి ఇంద్ర ఆటోలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గౌతమ్ మృతిచెందాడు. మృతికి కారణమైన శామల పవన్, జానకిరామ్పై మృతుడి తండ్రి కుమారస్వామి శనివారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పర్వతగిరి ఇన్స్పెక్టర్ సంతోష్ తెలిపారు. మత్తులోనే దాడి..? నిందితులు మద్యం, గంజాయి వంటి మత్తు పదా ర్థాలకు బానిసలై ఇలాంటి దారుణానికి పాల్పడ్డారని గౌతమ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హత్యకు పాల్పడిన నిందితులను కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. పోలీసుల అదుపులో నిందితులు? గౌతమ్ను హత్య చేసిన శామల పవన్, జానకిరామ్ శనివారం తెల్లవారు జామున నేరుగా మామునూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిసింది. గౌతమ్ను ఇంటి నుంచి ఎందుకు పిలిపించారు.? హత్యకు కారణం ఏమిటి.? రెండు గ్యాంగ్ల మధ్య గతంలో ఏమైనా విభేదాలు ఉన్నాయా..? ఈ ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా..? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. యువకుడి దారుణ హత్య గ్యాంగ్ల మధ్య విభేదాలు తిమ్మాపురం ఝాన్సీనగర్లో విషాదం పోలీసుల అదుపులో నిందితులు? -
‘కుడా’ చైర్పర్సన్గా బాధ్యతల స్వీకరణ
సీఎం రేవంత్రెడ్డి బీసీల పక్షపాతి: గుండు సుధారాణి నయీంనగర్: కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్పర్సన్గా గుండు సుధారాణి శనివారం హనుమకొండ ‘కుడా’ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. వరంగల్ పశ్చిమ, ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, హనుమకొండ కలెక్టర్, ‘కుడా’ వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్పాయ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, తదితరుల సమక్షంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా సుధారాణి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. అధికారుల సమన్వయంతో నగరాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కుడా పరిధిలో మౌలిక వసతుల కల్పన, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. కాగా, ప్రమాణ స్వీకార కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్రెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ పాల్గొనలేదు. -
విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీ వేదికగా పోరాటం
హన్మకొండ : విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ సమరభేరిలో భాగంగా విద్యార్థులు, యువకుల సమస్యలు పరిష్కరించాలని, హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, యువత విభాగం ఆధ్వర్యంలో హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు నుంచి సుబేదారిలోని కలెక్టరేట్ వరకు విద్యార్థులు, యువకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు బలంగా ప్రస్తావిస్తారన్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం విద్యార్థులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు కొన్ని కళాశాలల్లో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, ఇలాంటి చర్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కార్యక్రమంలో దివ్యాంకుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, నాయకులు వద్దిరాజు గణేష్, దాస్యం విజయ్ భాస్కర్, జోరిక రమేష్, బైరపాక ప్రశాంత్, బొల్లికొండ వీరేందర్, పోలెపల్లి రామ్మూర్తి, సోదా కిరణ్, పున్నం చందర్, ఖండేరావు నర్సింహారావు, వినీల్ రావు, కేశోజ్ ప్రణయ్, సుమన్, తిరుపతి, వీరస్వామి. రాకేష్ యాదవ్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన -
హెల్త్ వర్సిటీలో విద్యార్థుల నిరసన
వరంగల్ చౌరస్తా: వరంగల్లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్ల జారీలో తీవ్ర జాప్యం చేయడంపై శనివారం వర్సీటీ ఆవరణలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్లాట్ బుక్ చేసుకున్నామని, అపాయింట్మెంట్ రావడంతో పూణే, బెంగళూరు, ముంబై తదితర ప్రాంతాల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉదయం 9 గంటలకే యూనివర్సిటీకి చేరుకున్నారు. సంతకం కాలేదనే సాకుతో ఉదయం నుంచి సాయంత్రం వరకు లిస్ట్ వెల్లడించకపోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. సిబ్బంది కొరత ఉందని, కేవలం నలుగురు స్టాఫ్తోనే పనులు చూసుకోవాల్సి వస్తోందని అధికారులు చేతులెత్తేశారు. ఇంత పెద్ద యూనివర్సిటీలో ఇలాంటి నిర్లక్ష్యం సరికాదని, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి త్వరగా సర్టిఫికెట్లు ఇచ్చి సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ చౌరస్తా: ఎస్ఐఆర్ ప్రక్రియలో సామాన్యుల కష్టాలు వర్ణనాతీతం. వరంగల్ తహసీల్దార్ కార్యాలయం అధికారులు, సిబ్బంది ఎస్ఐఆర్ క్లియరెన్స్పై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది ఈ ఘటన మచ్చుతునక. శనివారం ఎస్ఐఆర్ ఓటు అప్లికేషన్ క్లియరెన్స్ కోసం ఓ తల్లి తన నాన్న, తన పసికందుతో కలిసి కార్యాలయానికి వచ్చారు. రెండు గంటలకుపైగా వేచి ఉండడం.. మరోవైపు పసికందు ఏడుస్తుండడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. పక్కనే ఉన్న టేబుల్పై పడుకోబెట్టి అప్పటికప్పుడు బాటిల్, పాలు కొని ఆకలి తీర్చింది. ఈ దృశ్యం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి న పౌరులను కలచివేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్యులకు సౌకర్యంగా, వేగవంతమైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వరంగల్ అర్బన్: నగరవ్యాప్తంగా ఉన్న నిమజ్జన ప్రదేశాల్లో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలించారు. వరంగల్ ఉర్సుగుట్ట చెరువు, హనుమకొండ బంధం చెరువు నిమజ్జన పాయింట్లను ఇంజనీరింగ్ శానిటేషన్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జన ప్రదేశాలకు వెళ్లే రహదారుల మరమ్మతులు, గుంతల పూడ్చివేత, రహదా రుల చదును, లైటింగ్, చెరువుల్లో గురప్రు డెక్క తొలగింపు, పూడికతీత వంటి పనుల్ని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కమిషనర్ వెంట ఎస్ఈ రాజ్కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మహేందర్, సంతోశ్బాబు, రవికుమార్, మాధవి, ఎంహెచ్ఓ రాజేశ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కాజీపేట: పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలపై మదర్ థెరిస్సా చూపిన ప్రేమ, ఆప్యాయతలను ప్రతిఒక్కరూ అలవర్చుకోవా లని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. మదర్ థెరిస్సా వర్ధంతిని పురస్కరించుకుని కాజీపేట 61వ డివిజన్ ఫాతిమానగర్ జంక్షన్లోని విగ్రహానికి కెథ్రడల్ చర్చి విచారణ గురువు ఫాదర్ కాసు మర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి శనివారం నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్.రాజ్మోహన్ రావు, సాగరిక రెడ్డి, బొక్క దయసాగర్, టీడీ టామి, తిరుణహరి శేషు, పుల్లూరు సుధాకర్, అల్లం ప్రకాశ్ రెడ్డి, ఇన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు విలువలు నేర్పేది ఉపాధ్యాయులే
విద్యారణ్యపురి : విద్యార్థులకు అన్ని రకాల విలువలు నేర్పిస్తున్నది ఉపాధ్యాయులేనని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందించి సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తాను కలెక్టర్గా ఉన్నప్పటికి తనకు విద్యనందించిన గురువులతో ఇప్పటికి సోషల్మీడియాలో టచ్లో ఉంటున్నానని, వారు ఎ ంతో సంతోష పడుతుంటారని గుర్తుచేసుకున్నారు. జిల్లాలో 15 ఏళ్ల సర్వీస్ కలిగి ఉండి వివిధ అంశాల ను పరిగణలోనికి తీసుకుని ఉత్తమ ఉపాధ్యాయులుగా 66 మందిని ఎంపిక చేశామన్నారు. మిగతా ఉపాధ్యాయులంతా తమ వృత్తిలో బాగా పనిచేస్తున్న వారేనన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ ఎల్వీ గిరి రాజ్గౌడ్, ఎంఈఓలు నెహ్రూ, మనోజ్కుమార్, జి ల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ డాక్టర్ బండారు మన్మోహన్, ప్లానింగ్ కోఆర్డినేటర్ బి. మహేష్, ఏసీజీఈ మధుసూదన్రావు, సీఎంఓ సుమాదేవి, జీసీడీఓ సునీత, డీసీఈబీ సెక్రటరీ శైలజ పాల్గొన్నారు . ఉపాధ్యాయుడు డాక్టర్ వల్సపైడి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పీఎంశ్రీ ప్రభుత్వ ప్రాక్టిసింగ్ హైస్కూల్ విద్యార్థినులు స్వాగత నృత్యం చేశారు. అవార్డుల ప్రదానోత్సవానికి రాని ప్రజాప్రతినిధులు అవార్డుల ప్రదానోత్సవవాకి ఈసారి ప్రజాప్రతినిధులెవరూ రాలేదు. కలెక్టర్, డీఈఓ కలిసి అవార్డులు ప్రదానం చేశారు. చివరగా గ్రూప్ ఫొటో దిగే సమయంలో కలెక్టర్ వెళ్లి పోయారు. దీంతో టీచర్లు కొంత అసంతృప్తికి లోనయ్యారు. హనుమకొండ కలెక్టర్ చాహత్బాజ్పాయ్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం -
విద్యుత్ భద్రతకు ప్రాధాన్యం
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో హన్మకొండ : గణపతి నవరాత్రి ఉత్సవాల్లో విద్యుత్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.. వినాయక మండపాలు, నిమజ్జన మార్గాల్లో ప్రత్యేక తనిఖీలు, విద్యుత్ ప్రమాదాల నివారణకు టీజీ ఎన్పీడీసీఎల్ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 14న వినాయక చవితి సందర్భంగా గణపతి మండపాల ఏర్పాటు, విద్యుత్ అలంకరణలు, విగ్రహాల తరలింపు, నిమజ్జనం సమయంలో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రజలు, భక్తులు, మండపాల నిర్వాహకులు, విద్యుత్ ఉద్యోగులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరముంది. నిమజ్జన మార్గాల్లో విద్యుత్ సిబ్బందికి సూచనలు.. విగ్రహాల ఎత్తు, ట్రక్కులు, క్రేన్ల ఎత్తు దృష్ట్యా నిమజ్జన మార్గాలను విద్యుత్ సిబ్బంది ముందుగానే క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులు సూచించారు. నిమజ్జన మార్గంలోని విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పరికరాలను తనిఖీ చేయాలి. ప్రమాదకరంగా లేదా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్లను గుర్తించి అవసరమైన సాంకేతిక చర్యలు చేపట్టాలి. క్రేన్లు, భారీ వాహనాలు, ఎత్తైన విగ్రహాలు విద్యుత్ లైన్లకు తగలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు, మండప నిర్వాహకులకు.. విద్యుత్ లైన్లకు దగ్గరగా గణపతి విగ్రహాలు, క్రేన్లు, మెటల్ ఫ్రేములు లేదా ఇతర అలంకరణ సామగ్రిని తీసుకెళ్లడం ప్రమాదకరం. లైన్లకు దూరం పాటించడం తప్పనిసరి. మండపాలు, నిమజ్జన మార్గాలు, ప్రధాన రహదారుల్లో ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ఎక్కడైనా తెగిపోయిన విద్యుత్ తీగలు, లూజ్ లైన్లు, స్తంభాలు, ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే ప్రజలు వాటిని తాకకూడదు. వెంటనే 1912 నంబర్కు సమాచారం ఇవ్వాలి. గణపతి మండపాల నిర్వాహకులు విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేసేటప్పుడు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలి. కేబుల్ వైర్లపై ప్రత్యేక దృష్టి.. టీవీ, ఇంటర్నెట్ తదితర కేబుల్ వైర్లు విద్యుత్ స్తంభాలపై చిందరవందరగా లేదా తక్కువ ఎత్తులో వేలాడుతూ ఉండకుండా సంబంధిత కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలి. పండుగ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి వైర్లను ప్రత్యేకంగా తనిఖీ చేసి ప్రమాదకరంగా ఉంటే వాటిని తొలగించాలి.అధికారిక సిబ్బందితోనే విద్యుత్ కనెక్షన్ పొందాలివిద్యుత్ కనెక్షన్ను అధికారిక విద్యుత్ సిబ్బంది ద్వారానే పొందాలి. నాణ్యమైన, ఐఎస్ఐ మార్క్ కలిగిన వైర్లు, పరికరాలను మాత్రమే ఉపయోగించాలి. సరైన సామర్థ్యం కలిగిన ఎంసీబీ/రక్షణ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి. వర్షం పడినప్పుడు తడిసిన వైర్లు, స్విచ్లు విద్యుత్ పరికరాలను తాకరాదు. పిల్లలను విద్యుత్ స్తంభాలు, వైర్లు, విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలి. మండపాల వద్ద మెటల్ నిర్మాణాలు విద్యుత్ లైన్లకు దగ్గరగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాల నివారణకు అధికారుల ముందస్తు చర్యలు మండపాల నిర్వాహకులు సిబ్బందికి సహకరించాలి -
డబుల్ బెడ్రూం కోసం పెట్రోల్ బాటిల్తో కలెక్టరేట్కు..
జనగామ: డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు కాలేదన్న మనస్తాపంతో ఓ వృద్ధురాలు పెట్రోల్ బాటిల్తో కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన శనివారం జనగామలో కలకలం రేపింది. దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామానికి చెందిన కాంటారి లక్ష్మి తనకు డబుల్ బెడ్రూం ఇల్లు రాలేదని ఆవేదన చెందుతూ పెట్రోల్ బాటిల్తో కలెక్టరేట్కు వచ్చింది. బందోబస్తులో ఉన్న పోలీసులు ఆమెను గమనించి వెంటనే అడ్డుకున్నారు. ఎస్సై రతీష్ సిబ్బందితో కలిసి ఆమెను పక్కకు తీసుకెళ్లి మా ట్లాడారు. అ ర్హత ఉన్న ప్ర తి ఒక్కరికీ ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇల్లు కేటాయిస్తుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నచ్చజెప్పారు. దీంతో లక్ష్మి పెట్రోల్ బాటిల్ ను పోలీసులకు అప్పగించి అక్కడినుంచి వెళ్లిపోయారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో ఎ లాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకపోవడ ంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.● వృద్ధురాలికి నచ్చజెప్పి పంపిన పోలీసులు ● జనగామ కలెక్టరేట్లో ఘటన -
కాంగ్రెస్, బీఆర్ఎస్ బాహాబాహీ
హసన్పర్తి: భీమారంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాలిటెక్నిక్ విద్యార్థులకు శాపమైన 97 జీఓను, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదలపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందునకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కోసం భీమారం నుంచి ఎర్రగట్టు వరకు ర్యాలీకి సన్నద్ధం చేశారు. కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రారంభించాల్సి ఉండగా.. అప్పటికే అధిక సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. అక్కడే వెయ్యి రోజుల రాష్ట్ర ప్రభుత్వ పాలన విజయోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరిపేందుకు ఏర్పాటు చేశారు. ఓ వైపు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన డీజే.. మరో వైపు బీఆర్ఎస్ నాయకుల డీజేలతో ఆ ప్రాంతం మార్మోగింది. మాజీ ఎమ్మెల్యే రాక.. ఉద్రిక్తత భీమారం సెంటర్కు మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ నాయకుడి వాహనాన్ని అడ్డుకున్నారని, కార్యకర్త చొక్కా చించేశారని బీఆర్ఎస్ నాయకులు ఘర్షణకు దిగారు. తమ కార్యకర్తలను నెట్టేశారంటూ ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు ప్రతిఘటించారు. ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. హనుమకొండ ఏసీపీ నర్సింహరాములు, పోలీసులు పరిస్థితి సమీక్షించారు. బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ర్యాలీ ముందుకు సాగింది. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నేరవేర్చలేదన్నారు. మరో వైపు కాంగ్రెస్ నాయకులు అక్కడే కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. కాగా, శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న తమను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని బీఆర్ఎస్ నాయకులు కేయూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ సంబురాలు, బీర్ఎస్ నిరసన భీమారంలో ఉద్రిక్తత -
ముమ్మరంగా పునర్నిర్మాణ పనులు
కాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరం ఆలయ పునర్నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. శనివారం విజయగణపతి ఆలయం స్టోన్తో పునాది నిర్మాణం చేపట్టగా దాన్ని ఆనుకొని ప్రాకార మండపాలకు పిల్లర్స్ కోసం రాడ్స్ అమర్చుతున్నారు. మరో వైపు ప్రధానమైన ద్విలింగాల గర్భగుడి నిర్మాణానికి నాలుగు పిల్లర్లకు ముగ్గుపోశారు. శ్రీశుభానందాదేవి (పార్వతి)అమ్మవారి ఆలయానికి 12ఫీట్ల లోతు నుంచి నిర్మాణం చేయడానికి కాంక్రీటు ప్రారంభించారు. ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా, ఇతరులు లోపలికి రాకుండా చుట్టూ రేకులతో రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో రాత్రిపగలు పనులు చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. -
డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములు కావాలి
● సీపీ శ్వేత వరంగల్ క్రైం : డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత పిలుపునిచ్చారు. శనివారం బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వయం సహాయక గ్రూపులు, గ్రామ దీపికలు, మెప్మా భాగస్వామ్యంతో డ్రగ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సంఘమిత్ర కార్యక్రమం ద్వారా కమిషనరేట్ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. పోలీసులు–ప్రజల భాగస్వామ్యంతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నం మొదలు పెట్టినట్లు వివరించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములవుదాం అంటూ ప్రతిజ్ఞ చేశారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. డ్రగ్స్ సమస్య కేవలం పోలీస్ శాఖకు సంబంధించిన అంశం కాదని, మొత్తం సమాజానికి సంబంధించిన సమస్య అని దీనిని ఎదుర్కొవాలన్నారు. అదనపు కలెక్టర్ వైవీ గణేష్, ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్, పీడీ డీఆర్డీఓ నాగపద్మజ, జిల్లా వైద్యాధికారి రాజిరెడ్డి, అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, మామునూర్ ఏసీపీ వెంకటేష్, గీసుగొండ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్, సైకియాట్రిస్ట్ డాక్టర్ భరత్, జిల్లా సమైక్య సంఘం అధ్యక్షురాలు రజిత, టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు పద్మ సుమారు 1000మంది మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
రామప్పలో సోమసూత్రం పునరుద్ధరణ
వెంకటాపురం(ఎం) : శతాబ్దలుగా మూసుకుపోయిన రామప్ప గర్భగుడి సోమసూత్రాన్ని కేంద్ర పురావస్తు శాఖ అధికారులు శనివారం పునరుద్ధరించారు. ఆలయంలో విధ్వంసం లేని శాసీ్త్రయ పద్ధతులను అవలంబించి ఆధునిక పరికరాల సాయంతో సోమసూత్రాన్ని శుభ్రం చేశారు. సోమసూత్రాన్ని పునరుద్ధరించే క్రమంలో అంతర్గత అడ్డంకులకు సంబంధించి శాసీ్త్రయ 3డీ మ్యాపింగ్, ఎండోస్కోపిక్, గోప్రో కెమెరాలతో రియల్ టైమ్ మానిటరింగ్ స్క్రీన్ల ద్వారా తనిఖీ చేశారు. దేవాలయ నిర్మాణానికి ఎటువంటి నష్టం కలగకుండా సాఫ్ట్ డ్రిల్లింగ్ విధానంతో పొరలు పొరలుగా (లేయర్ బై లేయర్) అడ్డుగా ఉన్న రాతి భాగాలను తొలగించినట్లు ఆర్కాలాజికల్ డీఈ కృష్ణచైతన్య, సీఎలు మల్లేష్, కన్నియప్పన్, ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్తెలిపారు. భూకంపంతోనే మూసుకుపోయింది 17వ శతాబ్దంలో వచ్చిన భూకంపంతో రామప్పలోని సోమసూత్రం మూసుకుపోయి ఉంటుందని దేవాదాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. 1911లో నిజాం ప్రభుత్వం ఆలయాన్ని పునరుద్ధరించినప్పటికీ 1944 నుంచి రామప్ప ఆలయంలో నిత్యపూజలు జరిగాయి. 2001లో రామప్ప (పాలంపేట)కు చెందిన ప్రముఖులు గర్భగుడిలోని రా మలింగేశ్వరస్వామికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ క్రమ ంలో సోమసూత్రం మూసుకపోయిందని గ్రహించిన అర్చకులు ప్రధాన శివలింగం వద్ద పంచలోహ శివలింగాన్ని పెట్టి చిలకరింపు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఎట్టకేలకు పురావస్తుశాఖ సూపరింటెండెంట్ నిహిల్దాస్ ఆదేశాల మేరకు పురావస్తుశాఖ అధికారులు రెండ్రోజులుగా శ్రమించి సోమసూత్రాన్ని పునరుద్ధరించారు. దీంతో పర్యాటకులు, స్థాని కులు, శివభక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
గురువులోనూ అపారశక్తి
కాళోజీ సెంటర్ : విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దే అపారమైన శక్తి గురువు చేతుల్లో ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని వరంగల్ జిల్లావిద్యాశాఖ ఆధ్వర్యంలో ఉర్సుగుట్టలోని ఆకుతోట కన్వెన్షన్ హాల్లో శనివారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతిప్రజ్వలన చేసి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీఈఓ రంగయ్యనాయుడు అధ్యక్షతన వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో ఉపాధ్యాయుల చేతిలో బెత్తం, పోలీసుల చేతిలో లాఠీ లేదని పేర్కొన్నారు. విద్యార్థి దశలో తనను ఉపాధ్యాయుడు కొడితే చేతివేలు పగిలి రక్తం వస్తే తల్లిదండ్రులకు కూడా చెప్పలేదని చెప్పారు. ఇంకా కొట్టినా ఫర్వాలేదు అని తన తండ్రి ఉపాధ్యాయుడికి అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు ఉంటే.. నేడు అందుకు భిన్నంగా హత్యచేసే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే గొప్ప అవకాశం ఉపాధ్యాయులకే దక్కుతుందని చెప్పారు. అనంతరం 50 మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ఐదుగురు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు అవార్డులు అందజేసి ఘనంగా సత్కరించారు. మేర కార్పొరేషన్ చైర్మన్ వెంకట్రాజం, అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, డీఆర్డీఓ నాగపద్మజ, జెడ్పీ సీఈఓ వసంతకుమారి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, ఉపాధ్యాయులు డీపీఆర్ఓ ప్రేమలత, ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, సీఎంఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్ జిల్లాలో 55 మంది ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం హాజరైన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్పర్సన్ సుధారాణి, కలెక్టర్ సత్యశారద -
సీఎంపై నోరు జారితే ఊరుకునే ప్రసక్తే లేదు
‘కుడా’ చైర్పర్సన్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్/నయీంనగర్: సీఎం రేవంత్ రెడ్డిపై ఎవరైనా నోరు జారితే ఊరుకునే ప్రసక్తే లేదని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్పర్సన్ గుండు సుధారాణి హెచ్చరించారు. శుక్రవారం వరంగల్లో ఆమె మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించడంపై అధిష్టానం మంత్రి పదవి నుంచి ఎమ్మెల్యే కొండా సురేఖను బర్తరఫ్ చేశారన్నారు. ఇందులో ఎవరి ప్రమేయం లేదన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పార్టీ వరంగల్ జిల్లా నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ముగ్గురు బీసీ మహిళలకు పదవులు ఇవ్వడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. అదేవిధంగా సుధారాణి హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. నేడు ప్రమాణ స్వీకారం హనుమకొండలోని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) కార్యాలయంలో శనివారం చైర్పర్సన్గా గుండు సుధారాణి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, హనుమకొండ జిల్లా కలెక్టర్, అధికారులు హాజరుకానున్నారు. -
శనివారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
విద్యార్థులతో ప్రయోగం చేయిస్తున్న ఉపాధ్యాయుడు రామ సంతోశ్ కుమార్ విద్యార్థులు తయారు చేసిన కృత్యాధార చిత్రాలతో ఉపాధ్యాయుడు రవి నడక నేర్పే నాన్న.. నడవడిక నేర్పే చదువు.. పలుకు నేర్పే అమ్మ. పలుకుబడినిచ్చే సమాజం. అజ్ఞానంనుంచి అందరూ కీర్తించేలా మార్చే దిక్సూచి.. నాలుగు గోడల నడుమ భవిష్యత్ను తీర్చిదిద్దే నిర్మాత.. చాక్పీస్ ముక్కలతో తలరాతను మార్చే ఆధునిక బ్రహ్మ.. అన్నీ ఉపాధ్యాయుడే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జ్ఞాన తరంగాలను.. విజ్ఞాన భాండాగారాలను తయారు చేస్తున్న వారి సేవలకు సలాం పలుకుతూ నేడు (శనివారం) ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు. కృత్యాధార బోధన.. సామర్థ్యాల సాధనమహబూబాబాద్ రూరల్: విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి పాఠ్యాంశంలోని విషయాలను అర్థం చేసుకుని సామర్థ్యాలను సాధించేలా విద్యా బోధన చేస్తున్నారు. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఆవునూరి రవి. 14 ఏళ్లుగా ప్రయోగాత్మక కృత్యాధార బోధన చేస్తున్నారు. కృత్యాధార బోధనతో విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై ఇష్టం పెంచుతున్నారు. నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం జెడ్పీఎస్ఎస్లో స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న రామ సంతోశ్ కుమార్ బోధనలో వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఆయన నిత్యం ఉదయం 5 గంటలకే జూమ్ తరగతులు నిర్వహిస్తున్నారు. యూట్యూబ్ చానల్ ప్రారంభించి ఇప్పటి వరకు దాదాపు 50 పాఠ్యంశాల వీడియోలు అప్లోడ్ చేశారు. రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్, సైన్స్ఫేర్ గైడ్ టీచర్గా పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు ఇస్రో శాస్త్రవేత్తలతో అతిథి ఉపన్యాసాలు నిర్వహించారు. ఎన్సీఈఆర్టీ నిర్వహించే ఆన్లైన్ పోర్టల్ కోసం ఈ–కంటెంట్ రూపొందించి 40కి పైగా వీడియోలు అందించారు. మన టీవీలో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా పాఠ్యాంశాలు బోధించారు.ఏటూరునాగారం: ములుగు మండలం జంగాలపల్లి క్రాస్కు చెందిన పోతు రాజశేఖర్ ఏటూరునాగారం నార్త్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఆ పాఠశాలలో చేరినప్పుడు విద్యార్థుల సంఖ్య 90 మాత్రమే. ప్రస్తుతం 170 మందికి చేరింది. దాతల సహకారంతో పాఠశాలలో నూతనంగా కంప్యూటర్ ల్యాబ్, రేకుల షెడ్డు, ప్రొజెక్టర్, టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టారు. పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేసి పుస్తక పఠనంపై మక్కువ పెంచుతున్నారు. ఇప్పటికీ ఏ విద్యార్థి బడికి రాకపోయినా ఇంటికి వెళ్లి బండిమీద పాఠశాలకు తీసుకొస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పలువురు ఉపాధ్యాయుల అంకితభావం విద్యార్థుల నమోదు పెంపు.. అకుంఠిత దీక్షతో విధులు బడులను కాపాడుతూ ఆదర్శంగా నిలుస్తున్న టీచర్లు నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం -
‘కొండా’ అనుచరవర్గంలో మౌనం
తాజా పరిణామాల తర్వాత కొండా సురేఖకు మద్దతుగా ఉండే నాయకులు, కార్యకర్తల నుంచి పెద్దగా బహిరంగ ప్రకటనలు కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. దీన్ని మొత్తం అనుచరవర్గం మౌనంగా ఉందని చెప్పడం కంటే.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆచితూచి వ్యవహరిస్తున్న వాతావరణంగా చూడాల్సి ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. కొండా సురేఖ కాంగ్రెస్లోనే కొనసాగుతానని స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆమె అనుచరుల రాజకీయ వైఖరి కూడా పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే ఉండే అవకాశముంది. భవి ష్యత్తులో ఏదైనా కీలక రాజకీయ నిర్ణయం వస్తే.. స్థానికంగా ఆమె వెంట ఎవరెవరు నిలు స్తారన్నది అప్పుడే స్పష్టం కానుంది. కాంగ్రెస్లో కొనసాగుతున్న కొండా సురేఖకు ఇప్పుడు ప్రధాన సవాలు పార్టీ బయట కంటే సొంత పార్టీలోనే తన రాజకీయ స్థానాన్ని నిలబెట్టుకోవడమే. కాంగ్రెస్లోనే ఉంటూ రాజకీయ బలాన్ని పునర్నిర్మించుకోవడమా? పార్టీలోని విభేదాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడమా? తూర్పులో తన కేడర్ను మరింత బలోపేతం చేసుకోవడమా? వీటిలో ఏ మార్గాన్ని ఎంచుకుంటారన్నది వారి తదుపరి రాజకీయ చర్యలతోనే స్పష్టం కానుంది. -
సీఎం రేవంత్ను బర్తరఫ్ చేయాలి
ప్రజల కన్నీళ్లపై కాంగ్రెస్ సంబరాలా? మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హన్మకొండ: సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న, వారి ఇళ్లను కూల్చేస్తున్నందుకు, ఎన్నికల హామీలు అమలు చేయనందుకు సీఎం రేవంత్రెడ్డిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు నిరసనగా ధర్నా, వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. సహపంక్తి భోజనం చేశారు. ఈసందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయ్యిందని సంబరాలు చేసుకునే ముందు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హామీల అమలుకు ప్రజలు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మర్రి యాదవరెడ్డి, జోరిక రమేశ్, పోలెపల్లి రా మ్మూర్తి, నయీముద్దీన్, రంగారెడ్డి, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పాల్గొన్నారు. వరంగల్ పోచమ్మ మైదాన్ జంక్షన్లో.. వరంగల్ చౌరస్తా: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విమర్శించారు. శు క్రవారం వరంగల్ పోచమ్మమైదాన్ జంక్షన్లో వంటావార్పు, నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు, మాజీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. -
ఒక్కటవుతున్న ‘కొండా’ వ్యతిరేక వర్గీయులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీ ఓరుగల్లు రాజకీయాల్లో ఆట మొదలైంది. ఒకవైపు కొండా సురేఖ రాజకీయ భవిష్యత్పై చర్చ.. మరోవైపు వరంగల్ తూర్పులో అంతర్గత సమీకరణాలపై ఆసక్తి.. వెరసి ‘కొండా’ దంపతులకు ‘అక్కడ సెగ.. ఇక్కడ పొగ..’ అన్నట్టుగా పరిస్థితి మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో సురేఖ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారానికి ఆమె స్వయంగా తెరదించారు. కాంగ్రెస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. దీంతో తక్షణ రాజకీయ సంక్షోభంపై కొంత స్పష్టత వచ్చింది. వరంగల్ తూర్పుపై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ‘కుడా’ చైర్మన్ గుండు సుధారాణి పట్టు బిగిస్తుండడం.. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా దంపతుల వ్యూహం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో తూర్పులో కొండా కుటుంబానికి భిన్నంగా వేగమందుకున్న కాంగ్రెస్ నేతల కదలికలపై చర్చ మొదలైంది. కాంగ్రెస్లోనే.. సురేఖ స్పష్టత పార్టీ మారతారనే ప్రచారం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే చర్చ మధ్య సురేఖ తన వైఖరిని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి కాంగ్రెస్లోనే కొనసాగుతానని ప్రకటించారు. దీంతో వెంటనే పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా వంటి అంశాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్టయింది. ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్లోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. మంత్రి పదవి లేకుండా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో.. పార్టీలో తన ప్రాధాన్యాన్ని ఎలా కొనసాగిస్తారు? తన వర్గాన్ని ఎలా సమన్వ యం చేసుకుంటారు? అన్నది కీలకంగా మారింది. పెరుగుతున్న వ్యతిరేక స్వరం.. వరంగల్ తూర్పు కాంగ్రెస్లో కొండా సురేఖకు భిన్నమైన రాజకీయ వర్గాలు గతంలోనూ ఉన్నాయి. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ మేయర్ గుండు సుధారాణి వంటి నేతలు వరంగల్ తూర్పు రాజకీయాల్లో తమదైన ప్రాధాన్యం కలిగిన నాయకులు. గత రాజకీయ పరిణామాల్లో కొండా కుటుంబంతో వీరికి భిన్నాభిప్రాయాలు కనిపించిన సందర్భాలున్నాయి. తాజాగా శుక్రవా రం మీడియాతో మాట్లాడిన గుండు సుధారాణి.. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించారు. దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్ పోటీ చేయాలని, తాను సైతం ఇండిపెండెంట్గా బరిలో ఉంటానని బస్వరాజు సారయ్య.. సురేఖకు సవాల్ విసిరారు. ఈ పరిస్థితుల్లో వీరి రాజకీయ వైఖరి ఎలా ఉంటుంది? కొండా సురేఖతో పార్టీ అంతర్గతంగా సమన్వయం జరుగుతుందా? లేక కాంగ్రెస్లో వేర్వేరు రాజకీయ శక్తులుగా కొనసాగుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయబోనని స్పష్టత ‘తూర్పు’ రాజకీయాల్లో వేగంగా పెరిగిన పరిణామాలు కొండా దంపతుల భవిష్యత్ వ్యూహం ఏంటి? -
గోకులాష్టమి వేడుకలు
హన్మకొండ కల్చరల్: శ్రీకృష్ణజన్మాష్టమిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో గోకులాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ‘కుడా’ మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, సత్యం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు, ఒగ్గుడోలు నృత్యాలు ఆకట్టుకున్నాయి. ముందుగా నగరానికి చెందిన గొల్లకురుమలు హనుమకొండ గోకుల్నగర్ నుంచి కాళోజీ కళాక్షేత్రం వరకు శ్రీకృష్ణ విగ్రహంతో ర్యాలీగా వచ్చి కళాక్షేత్రం వేదికపై శ్రీకృష్ణుడి విగ్రహాన్ని నిలిపి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ అంజన్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మార్తినేని ధర్మారావు, బీజేపీ నాయకురాలు రావు పద్మ యాదవసంఘం నాయకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు
● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ములుగు : బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ప్రజాప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క మండిపడ్డారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేని అభివృద్ధిని ప్రజా ప్రభుత్వం చేస్తుండడాన్ని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులపై కేటీఆర్ విమర్శలు చేసే ముందు తన పార్టీ నేతల రాజకీయ నేపథ్యాన్ని చూసుకోవాలని సూచించారు. దళిత ముఖ్యమంత్రి, ప్రతీ దళిత కుటుంబానికి మూడెకరాల భూమి వంటి హామీలను గతంలో బీఆర్ఎస్ ఇచ్చి నెరవేర్చలేదని విమర్శించారు. రాజకీయాలు మానుకుని హుందాగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి న నిధులు విడుదల చేయించడంలో బీజేపీ నాయకులు చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు హుందాగా వ్యవహరించాలని, లేనిపక్షంలో ప్రజల చేతిలో మరోసారి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, నాయకులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, పల్లె జయపాల్ రెడ్డి, ముసినపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాజీపేట–బల్హర్షా మధ్య ఆటోమెటిక్ బ్లాక్.. ● రెండు రైళ్లు రద్దు, నాలుగు పాక్షికంగా.. ● ఈ నెల 9, 10వ తేదీల్లో చేపట్టనున్న రైల్వే బ్లాక్కాజీపేట రూరల్ : కాజీపేట–బల్హార్షా సెక్షన్ల మధ్య గల జమ్మికుంట, పొత్కపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ కమిషనింగ్ కోసం చేపట్టే నాన్ ఇంటర్లాకింగ్ వర్క్స్తో ఈనెల 9, 10వ తేదీన పలు రైళ్ల రద్దు, పాక్షికంగా రద్దు, రీషెడ్యూలింగ్, రెగ్యులేషన్ చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వోశ్రీధర్ శుక్రవారం తెలిపారు. 10న రద్దయిన రైళ్లు.. ఈ నెల 10వ తేదీన కాజీపేట–సిర్పూర్కాగజ్నగర్ (17003) రైలు, బల్హార్షా–కాజీపేట (17004) రైలును రద్దు చేశారు. పాక్షికంగా రద్దయిన రైళ్లు.. 10వ తేదీన భద్రాచలంరోడ్–బల్హార్షా (17033) సింగరేణి వరంగల్–బల్హార్షా మధ్య, సిర్పూర్టౌన్–భద్రాచలంరోడ్ (17034) సింగరేణి సిర్పూర్టౌన్–వరంగల్ మధ్య, హైదరాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17011) ఇంటర్సిటీ కాజీపేట–సిర్పూర్కాగజ్నగర్ మధ్య, సిర్పూర్కాగజ్నగర్–బీదర్ (17012) బీదర్ ఎక్స్ప్రెస్ సిర్పూర్కాగజ్నగర్–కాజీపేట మధ్య రద్దు చేశారు. రీషెడ్యూలింగ్ ఆఫ్ ట్రైన్స్.. 10వ తేదీన సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17233) ఎక్స్ప్రెస్ గంట, సిర్పూర్ టౌన్–కరీంనగర్ (6777) పుష్పుల్ గంట, కరీంనగర్–బోధన్ (67773) పుష్పుల్ గంట రీషెడ్యూలింగ్తో నడవనున్నాయి. రెగ్యులేషన్ ఆఫ్ ట్రైన్స్.. ఈ నెల 9వ తేదీన వరంగల్ మీదుగా వెళ్లే దానాపూర్–ఎస్ఎంవీటీ బెంగళూరు (22365) ఎక్స్ప్రెస్ 75 నిమిషాలు, ఎస్ఎంవీటీ బెంగళూరు–దానాపూర్ (22366) ఎక్స్ప్రెస్ 45 నిమిషాలు, న్యూఢిల్లీ–చైన్నె సెంట్రల్ (12622) ఎక్స్ప్రెస్ 30 నిమిషాలు, ఈ నెల 10న చైన్నె సెంట్రల్–ఎంఎంవీడీ కాట్రా (160 31) ఎక్స్ప్రెస్ 30 నిమిషాలు రెగ్యులేషన్ చేశారు. -
వెయ్యి రోజుల పాలన పూర్తిగా విఫలం
వర్ధన్నపేట: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తిగా విఫలమైందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ విమర్శించారు. వెయ్యి రో జుల పాలన వైఫల్యంపై బీఆర్ఎస్ చేపట్టిన పోరుబాటలో భాగంగా మూడోరోజు శుక్రవారం అరూరి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ ఆవరణలో వంటావార్పుతో నిరసన చేపట్టారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన గ్యారెంటీలను విస్మరించి మోసం చేసిందన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో బొందపెట్టడం ఖాయమన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.● వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ -
లారీ, బైక్ ‘ఢీ’.. ఒకరి దుర్మరణం
● మృతుడు ఏపీ నెల్లూరు జిల్లావాసి నెక్కొండ: ఎదురుగా వస్తున్న బైక్ను లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ–వరంగల్ ప్రధాన రహదారిలో శుక్రవారం రాత్రి చోటుకుంది. ఏఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బసినేనిపల్లి గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ (50) వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సాయిరెడ్డిపల్లిలో తాపీమేసీ్త్రగా పనిచేస్తున్నాడు. మస్తాన్ నెక్కొండ నుంచి బైక్పై వస్తుండగా మార్గమధ్యలోని క్రషర్ మిల్లు వద్ద లారీ అదుపుతప్పి బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మస్తాన్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని ఏఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతుడికి భార్య మస్తానమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
సీఎం రేవంత్రెడ్డిని కించపరిచేలా పోస్టు
ఖిలా వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కించపరిచేలా ఏఐ సాంకేతికతతో రూపొందించిన చిత్రాన్ని ఎక్స్ (ట్విటర్) వేదికగా సోషల్ మీడియాలో పోస్టు చేశారంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ మహమ్మద్ బాబు అలియాస్ బాబు మియాపై గురువారం రాత్రి కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు మహ్మద్ కమాలుద్దీన్ మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు నిందితుడిపై 196,353(2),356 బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ స్వామి తెలిపారు. శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా..రిమాండ్కు తరలించకుండా పర్సనల్ బెయిల్పై నిందితుడిని విడుదల చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. విడుదల చేయాలని ధర్నా.. తమ పార్టీ కార్యకర్తపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపిస్తూ శుక్రవారం మధ్యాహ్నం మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కార్యకర్తలు బైఠాయించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించడం, ప్రజాసమస్యలను ప్రస్తావించడం ప్రతీ ఒక్కరి హక్కు అని పేర్కొన్నారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తపై కేసు.. అరెస్ట్ -
కై లాసయాత్రికుడి గల్లంతు..
ఖిలా వరంగల్ : మామునూరు గ్రామానికి చెందిన డాక్టర్ రేగూరి బుచ్చిరెడ్డి కుమారుడు వినయ్కుమార్ రెడ్డి కై లాస యాత్ర అనంతరం నేపాల్–టిబెట్ సరిహద్దులో గల్లంతయ్యాడు. మానస సరోవర్, కై లాస పర్వత యాత్రను పూర్తి చేసుకుని ఆగస్టు 26న నేపాల్కు తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇమ్మిగ్రేషన్ పక్రియలో ఉన్న సమయంలో వెనుక నుంచి అకస్మాత్తుగా భారీగా బురదతో కూడిన వరద దూసుకురావడంతో ఆయన గల్లంతయ్యాడు. నేపాల్లోని రసువా ప్రాంతంలో ఆగస్టు 26న సంభవించిన భారీ వరదల నేపథ్యంలో పలు వురు విదేశీయులు గల్లంతయ్యారు. ఈఘటనకు సంబంధించి విడుదలైన గల్లంతైన వారి జాబితాలో రేగూరి వినయ్కుమార్రెడ్డి పేరు కూడా నమోదైంది. అధికారిక వివరాల ప్రకారం ఆయన వయసు 44 ఏళ్లు కాగా కెనడా పౌరుడిగా పేర్కొన్నారు. చివరిసారిగా తల్లిదండ్రులతో మాటలు.. కై లాస పర్వత యాత్రలో ఉన్న వినయ్కుమార్ రెడ్డి ఆగస్టు 24న తన తల్లిదండ్రులతో చివరి సారి మాట్లాడినట్లు కుటుంబీకులు తెలిపారు. కై లాస పర్వతానికి ఉత్తర, దక్షిణ వైపులను చూపిస్తూ వారితో మాట్లాడినట్లు చెప్పారు. ఆతర్వాత ఆయన నుంచి ఎలాంటి సమాచారం లేకపోవంతో కుటంబంలో ఆందోళన నెలకొంది. కెనడాలో నివసిస్తున్న వినయ్కుమార్ రెడ్డి.. ఇషా ఫౌండేషన్కు చెందిన ఎస్–3 బృందంతో కై లాస యాత్రకు వెళ్లాడు. యాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో ప్రకృతి విపత్తు వినయ్కుమార్రెడ్డిని కబలించిందనే సమాచారం శుక్రవారం అందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆచూకీ కోసం ఎదురుచూపులు.. వరదల్లో గల్లంతైనప్పటి నుంచి వినయ్కుమార్ రెడ్డి ఆచూకీ లభించలేదు. అతడు క్షేమంగా బయటపడి తిరిగి వస్తారన్న ఆశతో కుటుంబీకులు ఎదురు చేస్తున్నారు. మరో వైపు నేపాల్ అధికారులు గల్లంతైన వారిని గుర్తించే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. భారీ వరద ఉధృతికి అనేక ప్రాంతాల్లో రాకపోకలు, సమాచార వ్యవస్థలు దెబ్బతినడంతో గాలింపు చర్యలు సవాలుగా మారాయనే సమాచారం తమకు ఆలస్యంగా చేరిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతూ పేర్కొన్నారు. వినయ్ కుమార్రెడ్డి కోసం గాలింపు నేపాల్–టిబెట్ సరిహద్దులో గల్లంతు సొంతూరు మామునూరు.. కెనడాలో సెటిల్ -
విశ్వాస ఘాతుక ప్రభుత్వం
హన్మకొండ : రాష్ట్రంలో రేవంత్రెడ్డి నేతృత్వంలో విశ్వాసఘాతుక ప్రభుత్వ పాలన సాగుతోందని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి దుయ్యబట్టారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులైనా నెరవేర్చకుండా సంబురాలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. పెన్షన్ రూ.4 వేలకు పెంపు, మహిళలకు నెలకు రూ.2,500, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, నియోజకవర్గానికి 3,500 ఇళ్లు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం సీఎం వికృత పాలనకు నిదర్శనమన్నారు. మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందన్నారు. అనుమతి తీసుకుని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపడుతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నాయకులు బొంగు అశోక్ యాదవ్, నయీమొద్దిన్, తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, సల్వాజి రవీందర్రావు, తదితరులు పాల్గొన్నారు. సంబురాలు జరుపుకోవడం సిగ్గుచేటు శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి -
గ్లోబల్ డిమాండ్!
వరంగల్ బ్రాండ్..ఎగుమతుల బాటలో ఓరుగల్లు ఉత్పత్తులు సాక్షి, వరంగల్: చేనేత, టెక్స్టైల్, వ్యవసాయ ఉత్పత్తులతో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందిన జిల్లా.. ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేందేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పంపిన ఎక్స్పోర్ట్ హబ్ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే జిల్లా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఏర్పడనుంది. స్థానిక చేనేత ఉత్పత్తులతోపాటు మామిడి, మొక్కజొన్న, వరి, పత్తి వంటి వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లను అనుసంధానం చేస్తే జిల్లాలోని వేలాది కుటుంబాలకు ఉపాధి, ఆదాయం మరింత పెరిగే అవకాశముంది. ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు, బ్రాండింగ్, ప్యాకేజింగ్, నిల్వ, కోల్డ్స్టోరేజీ, రవాణా, అంతర్జాతీయ మార్కెటింగ్ వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తే స్థానిక ఉత్పత్తుల విలువ పెరుగుతుంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్కతా, కాన్పూర్ వంటి దేశీయ మార్కెట్లకు చేరుతున్న వరంగల్ ఉత్పత్తులు.. భవిష్యత్లో అంతర్జాతీయ మార్కెట్లకు చేరుతాయి. కేంద్రం ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తే చేనేత, టెక్స్టైల్, వ్యవసాయ ఉత్పత్తుల సమ్మిళిత ఎగుమతి కేంద్రంగా వరంగల్ కొత్త పారిశ్రామిక అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉంది. రూ.40.25 కోట్ల చేనేత వ్యాపారం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 92 చేనేత, మ్యాక్స్ సొసైటీలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా సుమారు రూ.40.25 కోట్ల విలువైన వ్యాపారం జరుగుతోంది. రూ.17.50 కోట్ల విలువైన సుమారు ఐదు లక్షల కార్పెట్లు ఉత్పత్తి అవుతున్నాయి. అలాగే, 5.50 లక్షల బెడ్షీట్లు ఉత్పత్తి చేసి రూ.19.25 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. ఇక షర్టింగ్ విభాగంలో సుమారు 1.60 లక్షల మీటర్ల ఉత్పత్తి ఉండగా రూ.1.27 కోట్లు, టవల్స్ 80 వేల వరకు ఉత్పత్తి అవుతుండగా రూ.92 లక్షల వ్యాపారం జరుగుతోంది. డోర్ మ్యాట్స్, కలంకారి, ఇంటర్లాక్, పట్టుచీరలు తదితర ఉత్పత్తుల ద్వారా మరో రూ.1.31 కోట్ల మేర వ్యాపారం సాగుతోంది. వరంగల్లోని కొత్తవాడ, కమలాపూర్, శాయంపేట మండలాల్లో బెడ్షీట్లు, కార్పెట్ల ఉత్పత్తి అధికంగా ఉండగా.. జనగామ, మహదేవపూర్ ప్రాంతాల్లో పట్టుచీరల తయారీకి ప్రాధాన్యం ఉంది. మొత్తంగా సుమారు 7,500 కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. చేనేతకు తోడు జిల్లాలో టెక్స్టైల్ రంగం వేగంగా విస్తరిస్తోంది. మడికొండ, రాంపూర్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పరిధిలో రెడీమేడ్ దుస్తుల తయారీకి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్న్ సంస్థ ఇక్కడ తయారయ్యే కాటన్న్ టీషర్టులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కేరళకు చెందిన కై టెక్స్ సంస్థ చిన్నపిల్లల రెడీమేడ్ దుస్తుల తయారీ రంగంలో కార్యకలాపాలు సాగిస్తోంది. ఉత్తరప్రదేశ్కు చెందిన గణేశ్ ఎకోటెక్ వంటి సంస్థలు ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి దారం తయారు చేసే ప్రక్రియలో ఉన్నాయి. దీంతో వరంగల్ టెక్స్టైల్ పరిశ్రమకు ఉత్పత్తి నుంచి ఎగుమతి వరకు ఏటా రూ.వందల కోట్లలో వ్యాపారం జరుగుతోంది. చేనేత, టెక్స్టైల్, మామిడి, పత్తి, వరి తదితరపంటలకు ప్రాధాన్యం ‘ఎక్స్పోర్ట్ హబ్’కు కేంద్రం ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తే పెరగనున్న ఉపాధి అవకాశాలు, ఆదాయం మామిడి, ఇతర పంటలకు అంతర్జాతీయ మార్కెట్.. జిల్లాలో 5,964 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. 2025–26 సీజన్న్లో 1,16,878 క్వింటాళ్ల మామిడి దిగుబడి వచ్చినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇందులో 72.867 క్వింటాళ్ల సరుకును ఢిల్లీ, మధ్యప్రదేశ్, బిహార్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేశారు. స్థానిక మామిడికి ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే మార్కెట్ ఉంది. కోల్డ్ స్టోరేజీ, ప్యాకింగ్, గ్రేడింగ్, రవాణా సదుపాయాలు పెంచితే విదేశీ మార్కెట్లకు కూడా విస్తరించే అవకాశం ఉంది. మొక్కజొన్న 18,966 ఎకరాల్లో సాగవుతుండగా సుమారు 4.82 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. 69,542 ఎకరాల్లో వరి, 1,20,044 ఎకరాల్లో పత్తి సాగవుతుండగా లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీంతో వ్యవసాయ ఆధారిత ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, ఎగుమతి పరిశ్రమల విస్తరణతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండనున్నాయి. -
‘గ్రేటర్’లో హస్తానికి ‘కొండ’ంత హీటేనా?
సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముందుండడంతో కాంగ్రెస్లో రగిలిన అసంతృప్తి జ్వాలలు ఆ పార్టీని పుట్టి ముంచుతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సురేఖను మంత్రి పదవినుంచి బర్తరఫ్ చేయడంతో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసిన కొండా సురేఖ ఎమ్మెల్యేగా ప్రాతినిఽథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండడం పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి కొద్ది నెలల క్రితం వరకు బల్దియా మేయర్గా పనిచేసిన గుండు సుధారాణికి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్పర్సన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం రాజకీయ వ్యూహంలో భాగంగానే కనిపిస్తున్నా ఆమె ప్రభావం బల్దియా ఎన్నికల్లో ఏమేరకు ఉంటుందనేది అంచనా వేయడం కష్టమే. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో అప్పటి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్తో విభేదాలు తారస్థాయిలో ఉండడంతో అప్పుడు కార్పొరేటర్లు ఆమెకు పెద్దగా సహకరించిన దాఖలాలు లేవనే చర్చ కూడా ఉంది. ఇంకో వైపు బీఆర్ఎస్నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీ సారయ్య, కాంగ్రెస్ పార్టీ విధేయురాలిగా ఉంటూ వస్తున్న ఎర్రబెల్లి స్వర్ణ కూడా కొండాను వ్యతిరేకిస్తూ వస్తున్నా క్షేత్రస్థాయిలో వీరు ఎంతవరకు బల్దియా ఎన్నికల్లో పార్టీని గాడినపెడతారోనన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఏ రకంగా చూసుకున్న ఫైర్బ్రాండ్గా పేరున్న కొండా సురేఖ ఇప్పటికే గత పంచాయతీ ఎన్నికల్లో గీసుకొండ మండలం నుంచి ఏడుగురు తమ వర్గీయులను గెలిపించుకున్నారు. వీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే మాత్రం కొండా వర్గీయులను కార్పొరేటర్లుగా బరిలోకి దింపి హస్తం పార్టీని ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేదన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఇలా ఒకే పార్టీ లో వేర్వేరు రాజకీయాలతో బల్దియా ఎన్నికలు కొండంత ఆందోళన కలిగిస్తున్నాయి. కొండా వర్గం బరిలో ఉంటుందనే ప్రచారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి కొండా దంపతులు తమ వర్గీయులకు డివిజన్లలో ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. బస్వరాజు సారయ్య, గుండు సుధారాణి, ఎర్రబెల్లి స్వర్ణ అసంతృప్తి వ్యక్తం చేసినా అవేమీ పట్టించుకోకుండా బల్దియా ఎన్నికల కోసం ఇప్పటికే ఓ బృందాన్ని రెడీ చేశారనే చర్చ జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా అడుగులు ఎటువైపు ఉంటాయోనన్న చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తమ సొంత ఎజెండాను అమలు చేస్తారా? లేదా ఇతరత్రా రాజకీయ నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారా అన్నది వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీలో పుట్టిన ఈ కల్లోలాన్ని గ్రేటర్ ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలచుకోవాలని అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ భావిస్తుండడం పొలిటికల్ హీట్ను పెంచుతున్నాయి. తూర్పులో పోలీసుల భారీ బందోబస్తువరంగల్ చౌరస్తా : కొండా సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో వరంగల్ పరిధి పోచమ్మమైదాన్, వరంగల్ చౌరస్తా, హెడ్ పోస్టాఫీస్, ఆర్టీసీ బస్ స్టేషన్, వెంకట్రామా జంక్షన్, లేబర్ కాలనీ, కాశిబుగ్గ తదితర ప్రాంతాల్లో మట్టెవాడ, ఇంతేజార్గంజ్ స్టేషన్ల పో లీసులు గురువారం సాయంత్రం భారీ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రభావంపై చర్చ మంత్రిగా సురేఖ బర్తరఫ్తో మారిన లెక్కలు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అలజడి అందుకే కుడా చైర్పర్సన్గా గుండు సుధారాణికి చాన్స్ కొండా, కాంగ్రెస్ వర్గాలుగా పోటీ ఉంటుందనే చర్చ -
జేఎన్ఎస్లో ఉద్యోగుల క్రీడా ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్ : జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడా ఎంపిక పోటీలు నిర్వహించారు. శాట్ ఆదేశాలతో నిర్వహించిన పోటీలకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి 150 మంది ఉద్యోగులు హాజరైనట్లు డీవైఎస్ఓ ప్రశాంత్ తెలిపారు. అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్, చెస్, క్యారం, కబడ్డీ, లాన్టెన్నిస్, స్విమ్మింగ్, వాలీబాల్, రెజ్లింగ్, ఖోఖో.. ఇలా 19 క్రీడాంశాల్లో ఎంపికలు నిర్వహించినట్లు వివరించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను త్వరలో హైదరాబాద్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ బ్యాడ్మింటన్ జట్టు కోచ్గా రమేశ్ వరంగల్ స్పోర్ట్స్ : బెంగళూరులో ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు జరగను న్న సౌత్జోన్ ఇంటర్స్టేట్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పాల్గొనే తెలంగా ణ జట్టు కోచ్గా హనుమకొండ డీఎస్ఏ కోచ్ కూరపాటి రమేశ్ ఎంపికయ్యారు. ఈ మేరకు తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లెల గోపీచంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర జట్టుకు కోచ్గా ఎంపికై న రమేశ్ను హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్, బ్యాడ్మింటన్ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్, కార్యదర్శి రమేశ్ రెడ్డి, కోశాధికారి నాగ కిషన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి అభినందించారు. -
విచారణ వేగవంతం చేయండి
హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: నోటీసులు జారీ అయిన ఓటర్లతో విచారణ అనంతరం ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై గురువారం కలెక్టరేట్లో ఈఆర్ఓలు, ఆర్డీఓలు, ఏఈఆర్ఓలు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నో మ్యాపింగ్, అనామలీస్ జాబితాలోని ఓటర్లకు నోటీసుల జారీ, విచారణ కేంద్రాల ద్వారా ధ్రువపత్రాల స్వీకరణ, వాటిని డీఈఓ/కలెక్టర్ లాగిన్కు పంపే అంశాలపై సమీక్షించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు వెంకటేశ్, డీఎస్.వెంకన్న, కాజీపేట డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్సింగ్, ఏఈఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. భూసేకరణ వేగవంతం చేయాలి.. జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ భూసేకరణ కేసులను సంబంధిత రైతులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని సూచించారు. పరకాల డివిజన్లో జాతీయ రహదారులకు సంబంధించి చేపట్టాల్సిన భూసేకరణపై కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గురువారం కలెక్టరేట్లో ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పరకాల ఆర్డీఓ వెంకన్న, భూసేకరణ విభాగం సూపరింటెండెంట్ జగత్సింగ్, పరకాల డివిజన్ తహసీల్దార్లు పాల్గొన్నారు. త్వరగా పూర్తి చేయండి: బల్దియా కమిషనర్ టి.వెంకన్న వరంగల్ అర్బన్: ‘భద్రకాళి బండ్ అభివృద్ధి ప నులు ఇంకా ఎన్నేళ్లు చే స్తారు’ అని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ నగరంలోని భద్రకాళి బండ్పై కొనసాగుతున్న అభివృద్ధి పనులను గురువారం ఆయన బల్దియా ఇంజనీరింగ్, ‘కుడా’ అధికారులతో కలిసి బండ్పై కొనసాగుతున్న పనులు తనిఖీ చేశారు. బండ్పై నిర్మిస్తున్న టాయిలెట్లు, పరిసరాల సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. తనీఖీల్లో ‘కుడా’ సీపీఓ అజిత్రెడ్డి, బల్దియా ఎస్ఈ రాజ్కుమార్, ఈఈ రవికుమార్ పాల్గొన్నారు. -
క్రీడల్లోనూ పోలీసులు సత్తా చాటాలి
● వరంగల్ పోలీసు కమిషనర్ ఎన్. శ్వేత మామునూరు: పోలీసులు విధుల్లో రాణిస్తూ క్రీడల్లోనూ సత్తా చాటాలని వరంగల్ పోలీస్ కమిషనర్ (సీపీ) శ్వేత అన్నారు. మామునూరు టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్లో కమాండెంట్ ఎన్. వి. సత్య శ్రీనివాస ఆధ్వర్యంలో మూడు రోజులుగా ఉత్సాహంగా సాగిన ఇంటర్ –కంపెనీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 గురువారం ముగిసింది. ముఖ్యఅతిథిగా సీపీ హాజరై మాట్లాడారు. క్రీడలు మానసిక ఉల్లాసంతోపాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయన్నారు. అనంతరం విజేతలకు ట్రోఫీ అందజేసి అభినందించారు. ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, ఏసీపీ వెంకటేష్, మామునూరు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఏసీ బాలయ్య, వీరన్న, రాజేందర్, విజయ్, కార్తీక్, రవి, రాజిరెడ్డి, సర్వర్, వెంకటేశ్వర్లు, ఆరజ్కుమార్, రాంప్రసాద్, పోలీస్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
కమ్యూనిస్టులు లేని ప్రాంతాలు వెనుకబాటు
హసన్పర్తి : కమ్యూనిస్టులు లేని ప్రాంతాలు వెనుకబాటుకు గురయ్యాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. గురువారం హసన్పర్తి భీమారంలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి సంతాప సభ నిర్వహించారు. రాఘవులు ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడుతూ భూమి, భుక్తి కోసం పో రాటం చేసింది కమ్యూనిస్టులేనన్నారు. వారి పో రాటంతోనే ప్రాజెక్ట్లు, కాల్వలు వచ్చాయన్నారు. మల్లారెడ్డి తన గ్రామంలో సర్పంచ్గా పనిచేసి ప్ర జలకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చారన్నారు. ఆయన చివరి శ్వాస వరకు పార్టీ కోసం పనిచేశారని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మా ట్లాడుతూ మల్లారెడ్డి మృతి పార్టీకి తీరని లో న్నా రు. రాజ్యాంగాన్ని ధిక్కరించేలా పాలకవర్గాలు వ్య వహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ పశ్చిమ, పరకాల ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్య, మాజీ ఎంపీ వినోద్కుమార్, మాజీ మేయర్ టి.రాజేశ్వర్రావు మాట్లాడారు. జిల్లాలో సాగునీరు కోసం, రైతాంగ సమస్యల కోసం నిరంతర పోరాటాలు నడిపిన నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి అని కొనియాడారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య మాట్లాడుతూ మల్లారెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగయ్య, సుదర్శన్, సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, నాయకులు రంగయ్య, వాసుదేవారెడ్డి, రమేశ్, చుక్కచయ్య, రాములు, మల్లారెడ్డి పాల్గొన్నారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు మల్లారెడ్డికి ఘన నివాళి -
కాజీపేట జంక్షన్ మీదుగా ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల సౌకర్యార్థం కాజీపేట జంక్షన్ మీదుగా సుబేదార్ఘంజ్–యశ్వంత్పూర్–సుబేదార్ఘంజ్్ మ ధ్య సెప్టెంబర్ 11వ తేదీ నుంచి 26 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ గురువారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. సెప్టెంబర్ 11 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు 13 సర్వీస్లుగా సుబేదార్ఘంజ్లో ప్రతీ శుక్రవారం బయలుదేరే సుబేదార్ఘంజ్–యశ్వంత్పూర్ (04135) ఎక్స్ప్రెస్ మరుసటి రోజు కాజీపేట జంక్షన్కు చేరుకుని వెళ్తుంది. సెప్టెంబర్ 14 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు 13 సర్వీస్లుగా యశ్వంత్పూర్లో ప్రతీ సోమవారం బయలుదేరే యశ్వంత్పూర్–సుబేదార్ఘంజ్ (04136) ఎక్స్ప్రెస్ మరుసటి రోజు కాజీపేట జంక్షన్కు చేరుకుని వెళ్తుంది. 33 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీస్లుకు అప్ అండ్ డౌన్లో శంకర్ఘర్, దాబుర, మాణిక్పూర్, సంత, కఠ్ని, జబల్పూర్, ఇటార్జీ, నాగ్పూర్, బల్హర్షా, సిర్పూర్కాగజ్నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, కాజీపేట, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, యాద్గిరి, కృష్ణ, రాయ్చూర్, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యెలహంక స్టేషన్లో హాల్టింగ్ కల్పించారు. నేడు జన్సాధరణ్ రైళ్లు.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాజీపేట జంక్షన్ మీదుగా శుక్రవారం సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్, సిర్పూకాగజ్నగర్–హైదరాబాద్ మధ్య రెండు అన్రిజర్వుడ్ జన్సాధరణ్ ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ గురువారం తెలిపారు. వివరాలు.. ఈనెల 4వ తేదీన (శుక్రవారం) సికింద్రాబాద్లో 12:10 గంటలకు బయలుదేరే సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (07235) జన్సాధరణ్ ఎక్స్ప్రెస్ కాజీపేటకు 14:10 గంటలకు చేరుకుని సిర్పూర్కాగజ్నగర్కు 17:30 గంటలకు చేరుకుంటుంది. సిర్పూర్కాగజ్నగర్లో 18:00 గంటలకు బయలుదేరే సిర్పూర్కాగజ్నగర్–హైదరాబాద్ (07236) జన్సాధరణ్ ఎక్స్ప్రెస్ కాజీపేట 21: 15 గంటలకు చేరుకుని హైదరాబాద్కు 23:15 గంటలకు చేరుకుంటుంది. ఈ రైళ్లకు చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్లో హాల్టింగ్ కల్పించారు. 11వ తేదీ నుంచి అమలు -
వెయ్యిరోజుల పాలనపై సంబురాలు
హన్మకొండ చౌరస్తా: పదేళ్లలో చేయని అభివృద్ధిని రెండున్నరేళ్లలో చేసి చూపించామని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం హనుమకొండలోని డీసీసీ భవన్లో సంబురాలు జరుపుకున్నారు. డీసీసీ భవన్ నుంచి అశోకా జంక్షన్ వరకు ప్రదర్శనగా వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు బాణసంచా కాల్చి, స్వీట్లు తినిపించుకున్నారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. గత పాలనకు, ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, శ్రేణులు పాల్గొన్నారు. -
వినూత్న బోధకులు..
ఉమ్మడి జిల్లాలో పలువురు రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయులుగా ఎంపిక జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయ అవార్డులు ప్రకటించింది. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ఆ అవార్డులకు ఎంపికయ్యారు. వీరికి ఈ నెల 5వ తేదీన కొడంగల్లోని ఓ కళాశాలలో అవార్డుల ప్రదానోత్సవం జరగబోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రిగా ఈ అవార్డులను ప్రదానం చేయబోతున్నారు. అవార్డులతోపాటు రూ. 10వేల నగదు పురస్కారం కూడా అందించనున్నారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యారంగంలో వినూత్నంగా బోధించడం, పరిశోధనలు చేయడంతోపాటు పరిశోధకులకు మార్గదర్శకం వహించడం, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయడం లాంటి కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపకులు, ఉపాధ్యాయులుగా ఎంపికై న వారిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. -
శుక్రవారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, వరంగల్: మంత్రి పదవినుంచి బర్తరఫ్తో సుమారు 18 రోజుల కొండా సురేఖ ఎపిసోడ్కు గురువారం ఎండ్ కార్డు పడింది. పరకాల వేదికగా మొదలైన రాజకీయ వివాదం.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను దాటి ఢిల్లీకి చేరింది. అక్కడ కాంగ్రెస్ అధిష్టానం స్థాయిలో జరిగిన చర్చలు.. మంత్రివర్గం నుంచి బయటకు పంపే స్థాయికి చేరాయి. కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం.. ఆ తర్వాత వరుస ఫిర్యాదులు, ఎమ్మెల్యేల నివేదికలు, క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్, ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం.. హైకమాండ్ను ఆగ్రహానికి గురి చేశాయి. చివరకు సురేఖను కేబినెట్ నుంచి తప్పించారు. ఆగస్టు 16 తర్వాత మొదలైన పరిణామాలు గురువారం నాటి కొండా సురేఖ బర్తరఫ్ వరకు జరిగిన తంతు ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కూతురు మాటలనుంచి కేబినెట్ వేటు దాకా.. ఆగస్టు 16న సీఎం రేవంత్రెడ్డి పరకాల పర్యటన తర్వాత చోటుచేసుకున్న పలు ఘటనలు కొండా సురేఖ రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మలుపునకు నాంది పలికాయి. సురేఖ జన్మదినం సందర్భంగా ఆగస్టు 19న ఆమె కుమార్తె సుస్మిత.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటిని ఉద్దేశించి సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. అధిష్టానం సీరియస్గా తీసుకుంది. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తాను బాధ్యురాలిని కాదని, వాటితో తనకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. పార్టీ వర్గాల్లో మాత్రం సురేఖ వైఖరిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సురేఖపై ఈ ఒక్క అంశమే కాకుండా.. మరికొన్నింటితో కూడిన ఫిర్యాదుల ఫైల్ అధిష్టానం ముందుకు వెళ్లినట్లు ప్రచారం. కూతురు చేసిన వ్యాఖ్యల వివాదంపై రంగంలోకి దిగిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సైతం సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయడం ఈ వ్యవహారంలో కీలక మలుపుగా మారింది. ఇదే సమయంలో సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్పై నమోదైన కేసు, అందులో వెలుగులోకి వచ్చిన ఆరోపణలు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు చెబుతున్నారు. వీటన్నింటిపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత సురేఖ స్వచ్ఛందంగా తప్పుకునే పరిస్థితి లేదని భావించి బర్తరఫ్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇప్పటికై తే ఇంతే.. ఎమ్మెల్యేగా సురేఖ మంత్రి పదవి పోయినా.. సురేఖ రాజకీయ ప్రస్థానం ముగి సినట్లు కాదు. ఇప్పటికే ఈ విషయమై మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. తానేమీ తప్పు చేయలేదని, పదవిపోతే బాధ పడాల్సిన అవసరం లేదన్న ఆమె.. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యేగా కొనసాగుతానన్నా రు. కేబినెట్ నుంచి బర్తరఫ్ అయినప్పటికీ సోనియా, రాహు ల్, ప్రియాంకా గాంధీలంటే ఇష్టమన్న ఆమె.. ఎమ్మెల్యేగా తన తదుపరి అడుగులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే చెప్పలేమనడం ఆసక్తికరంగా మారాయి. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలపై ఈ పరిణామాలు భవిష్యత్లో ఎలాంటి ప్రభావం చూపుతాయన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. హనుమకొండ రాంనగర్లో నిర్మానుష్యంగా ఉన్న తాజా మాజీ మంత్రి కొండా సురేఖ నివాసం ‘పరకాల’నుంచి మొదలైన మాటల దాడి.. ఎమ్మెల్యేల నివేదికలతో ముదిరిన పంచాయితీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుతో కీలక మలుపు ఉత్కంఠ రేపిన ఢిల్లీ మంతనాలు.. చివరకు కేబినెట్నుంచి వేటు 18రోజులపాటు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో రాజకీయ ప్రకంపనలు -
క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో క్రీడల మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని వీసీ కె.ప్రతాప్రెడ్డి అన్నారు. గురువారం యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని కళాశాలల ఫిజికల్ డైరెక్టర్ల(పీడీ)తో యూనివర్సిటీలోని సెనెట్హాల్లో నిర్వహించిన మీట్లోఆ యన మాట్లాడారు. ఖేల్ ఇండియా పథకంకింద క్రీడా వసతుల అభివృద్ధికి రూ.40 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. విశ్వవిద్యాలయం పరిధిలో 386 కళాశాలలున్నాయని, వీటిలో ప్రిన్సిపాల్ తర్వాత ఫిజికల్ డైరెక్టర్ పాత్రే కీలకమన్నారు. అంతర్ విశ్వవిద్యాలయాల క్రీడాపోటీల్లో సుమారు 32 రకాలు ఉంటున్నాయని, కొత్త క్రీడలను కూడా పరిచయం చేసి విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్ వి.రామచంద్రం, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ, పాలకమండలి సభ్యుడు బి.సురేశ్లాల్, యూనివర్సిటీ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ టి.మనోహర్, కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జె. సోమన్న మాట్లాడారు. మాజీ కేయూ స్పోర్ట్స్బోర్డు కార్యదర్శి వై. వెంకయ్య 2025–2026 క్రీడావార్షిక నివేదికను ప్రవేశపెట్టారు. నాణ్యతతోకూడిన ట్రాక్సూట్ అందించాలి క్రీడాకారులకు నాణ్యతతో కూడిన ట్రాక్స్యూట్ అందించాలని వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు అధికారులను కోరారు. సౌత్జోన్, ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ, తదితర జాతీయస్థాయి పోటీలకు వివిధ ప్రాంతాలకు వెళ్లే కోచ్లుగా మేనేజర్లుగా బాధ్యతలు నిర్వర్తించే ఫిజికల్ డైరెక్టర్లకు, వివిధ క్రీడాపోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు టీఏ,డీఏలు పెంపుదల చేయాలన్నారు. ట్రాక్సూట్ ఈ–టెండర్ విధానంలోకాకుండా కొటేషన్ పద్ధతిలో కొనుగోలుకు కాకతీయ యూనివర్సిటీకి ఎంపిక చేసిన కలర్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పీడీలు ప్రస్తావించిన సమస్యలపై యూనివర్సిటీ అధికారులు స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆచార్య రమేశ్రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు సావిత్రి, వెంకన్న, శ్రీనివాస్రెడ్డి, రాజేశ్, ఎటీబీటీప్రసాద్ పాల్గొన్నారు. కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి -
హనుమకొండ జిల్లా నుంచి ముగ్గురు..
విద్యారణ్యపురి : హనుమకొండ జిల్లా నుంచి ముగ్గురు టీచర్లు రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. మడికొండలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ కలసాని మాధవరెడ్డి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా విద్యాబోధన చేస్తున్నారు. 2016,2019లో రాష్ట్రస్ధాయి చెకుముకి సైన్స్టాలెంట్ టెస్టులో గైడ్ టీచర్గా భాగస్వాములయ్యారు. 2026లో రాష్ట్రస్థాయి ఫిజికల్సైన్స్ టాలెంట్ టెస్టులోనూ ఆయన మార్గదర్శకంలో ఓ విద్యార్థి టాప్–5లో నిలిచారు. అలాగే, హసన్పర్తి మండలం జయగిరి ఎంపీయూపీఎస్ ఎస్జీటీ ఎ. కుమారస్వామి టీఎల్ఎం టీచింగ్లెర్నింగ్ మెటీరియల్తో విద్యాబోధన చేస్తున్నారు. అంతేగాకుండా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారిస్తూ వారిలో అభ్యసనా సామర్థ్యాలు సాధించేలా కృషిచేస్తున్నారు. అలాగే, హసన్పర్తి టీజీఆర్ఎస్ గర్ల్స్ టీజీటీ సైన్స్ టీచర్ కేఎన్వీ రాజగోపాల్ విద్యార్థులకు అర్థమయ్యేలా సులభంగా బోధిస్తూ వారిలో ఆ శాస్త్రంపై ఆసక్తి పెంపొందడానికి కృషి చేస్తున్నారు. -
‘చేయూత’ దరఖాస్తులు @12,347
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో చేయూత కొత్త పింఛన్ల కోసం మొత్తం 12,347 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో వితంతువులవి 6,954, ఒంటరి మహిళలు 634, దివ్యాంగులు 3,286, చేనేత కార్మికులు 343, కల్లు గీత కార్మికులు 1,130 దరఖాస్తులు ఉన్నాయి. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 31న ఆఖరు అయినా మళ్లీ ప్రభుత్వం ఈనెల 15వ తేదీ వరకు గడువు పొడిగించడంతో మరికొందరికి ఊరట దక్కినట్లయింది. పూర్తిగా నింపిన నూతన దరఖాస్తు ఫారంతో పాటు అభ్యర్థి జత చేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవడంతో ఆయా దరఖాస్తులకు ఎదురువుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని పొడిగింపు నిర్ణయం తీసుకోవడంతో హర్షం వ్యక్తమవుతోంది. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్.. ఖిలా వరంగల్ : జల్సాలు, తాగుడుకు బానిసై తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏనుమాముల ఇన్స్పెక్టర్ జవ్వాజి సురేశ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై గోవర్ధన్తో కలిసి వివరాలు వెల్లడించారు. ఇటీవల దుండగులు ఆరెపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించి బీరువా పగుల గొట్టి అందులో ఉన్న 15 గ్రాముల బంగారం, రూ.10వేల నగదు చోరీ చేశారు. బాధితురాలు ఎదులాపురం మంజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆరెపల్లి వద్ద రహదారిపై ఎస్సై గోవర్ధన్ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఎంహెచ్నగర్కు చెందిన ఊరడి అభిలాశ్, ఇసెంపల్లి లోకేశ్ ఆటోలో అనుమానాస్పదంగా కనిపించారు. వారిని వెంబడించి పట్టుకుని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారు. దీంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
స్కాలర్షిప్లు, కెరీర్ సేవలు..
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ.. ప్ర ముఖ స్వచ్ఛంద సంస్థ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) జరిగాయి. ఈ మేరకు బుధవారం కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్ వి. రామచంద్రం ఆ సంస్థ సీఈఓ రేఖాశ్రీనివాసన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. మొద టి అవగాహన ఒప్పందం ప్రకారం కాకతీయ యూ నివర్సిటీ పరిధిలో డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సులు అభ్యసిస్తూ ఆర్థికంగా వెనకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు, కెరీర్ మార్గదర్శకత్వం, మెంటార్షిప్ సేవలు అందిచనున్నారు. టెన్త్, ఇంటర్మీడియట్లో 75 శాతం మార్కులు కలిగి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8లక్షల లోపు ఉన్న విద్యార్థులు ఈస్కాలర్షిప్లకు అర్హులని రిజిస్ట్రార్ రామచంద్రం తెలిపారు. దివ్యాంగులు, ఆర్మీ వెటరన్స్ పిల్లలకు ప్రాధాన్యత నిస్తారు. ఈ కార్యక్రమాల అమలుకు కేయూ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ. సిద్దార్థ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. ప్లాంట్ ఫర్ ప్లానెట్ ద్వారా వెయ్యి మొక్కలు రెండో కీలక ఒప్పందం ప్రకారం ‘ప్లాంట్ ఫర్ద ప్లానెట్’ ద్వారా 1000 మొక్కలతో హరిత క్యాంపస్గా అభివృద్ధి పరిచేలా ఒప్పందం కుదుర్దుకున్నారు. ఇందులో భాగంగా కేయూలోని కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఎకరం భూమిలో 1000 మొక్కలు నాటనున్నారు. ఈ మొక్కల పరిరక్షణకు అవసరమైన ప్రహరీ ఏర్పాటుచేయడంతోపాటు నిర్వహణ బాధ్యతను ఆ స్వచ్ఛంద సంస్థ మూడేళ్లపాటు చేపట్టనుందని రిజిస్ట్రార్ రామచంద్రం తెలిపారు.ఈ ప్రాజెక్టు అమలుతో యూనివర్సిటీకి ఎలాంటి ఆర్థికపరమైన భారం ఉండబోదని తెలిపారు. కేయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎన్. రమణ, ఆ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కేయూ, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ఎంఓయూ -
భూముల రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి
హన్మకొండ: హనుమకొండ జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నెమురుగొమ్ముల రవి అన్నారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో కొనసాగుతున్న భూముల రీసర్వేపై భూములు కొలతలు శాఖ అధికారులు, సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఏడు గ్రామాల్లో రెండు సర్వే బృందాలతో 14 రోవర్లతో భూముల రీసర్వే కొనసాగుతుందన్నారు. గ్రామపాలన అధికారులు (జీపీఓలు) సర్వే జరుగుతున్న చోటకు రానట్లయితే సమాచారం ఇవ్వాలన్నారు. భూముల రీసర్వేలో జిల్లాకు, సర్వేయర్లకు మంచి పేరు ఉందని, ఇదే స్ఫూర్తితో రీ సర్వే కొనసాగిస్తూ నవంబర్ మాసానికి జిల్లాలోని 70 గ్రామాల్లో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో పరకాల ఆర్డీఓ డీఎస్.వెంకన్న, భూములు కొలతలు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నూర్ సింగ్, డీఐలు సారంగపాణి, రాజనర్సయ్య, సర్వేయర్లు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ రవి -
కేఎన్ఆర్యూహెచ్ఎస్ రెక్టార్గా ప్రవీణ్కుమార్ బాధ్యతల స్వీకరణ
వరంగల్ చౌరస్తా : కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్యూహెచ్ఎస్) రెక్టార్గా డాక్టర్ దేవులపల్లి ప్రవీణ్కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రవీణ్కుమార్ 2017 నుంచి 2022 వరకు రెండు పర్యాయాలు కేఎన్ఆర్యూహెచ్ఎస్ రిజిస్ట్రార్గా పనిచేశారు. అనంతరం నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా సేవలందించారు. ప్రస్తుతం నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో అనస్థీషియ విభాగం ప్రొఫెసర్, హెచ్ఓడీగా విధులు నిర్వర్తిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్కు వీసీ రమేశ్రెడ్డి, రిజిస్ట్రార్ జె. వెంకటేశ్వర్లు, పరీక్షల నియంత్రణాధికారి వందన శుభాకాంక్షలు తెలిపారు. యాంత్రీకరణతో రైతుకు భరోసా.. ● అడ్వాంట గ్లోబల్ సీఈఓ భూపెన్ వి.దూబెరఘునాథపల్లి: ఆధునిక, యాంత్రీకరణ, నా ణ్యమైన విత్తనోత్పత్తితోనే రైతులకు దిగుబడులు, ఆర్థిక భరోసా సాధ్యమవుతుందని అడ్వాంట గ్లోబల్ సీఈఓ భూపేన్ వి. దూబె అన్నారు. బుధవారం మండలంలోని భాంజీపేట శివారులో అడ్వాంట కంపెనీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విత్తన రంగంలో ఆధునిక సాంకేతికతను అనుసంధానం చేస్తూ రైతులకు ప్రయోజనం చేకూర్చే దిశగా సంస్థ పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో గ్లోబల్ చీఫ్ సప్లయ్ ఆఫీసర్ చెరుకు రమేశ్, ఆసియా, ఆఫ్రికా ప్రాంతీయ ప్రతినిధి బెళగంవార్, యూపీఎల్ సీఈఓ చెరుకు రవిశంకర్, జాతీయ ప్రతినిధి తుషార్ త్రివేది, భారతి గ్రూపు ఇండస్ట్రీస్ చైర్మన్ బొత్స బ్రహ్మానందరెడ్డి, సర్పంచ్ గైని శ్రీనివాస్, గొరిగ రవి, యూనిమార్ట్, అడ్వాంట ప్రతినిధులు పాల్గొన్నారు. ఒరిజినల్ టీసీ లేకుంటే అడ్మిషన్ చెల్లదు ● వరంగల్ డీఐఈఓ శ్రీధర్ సుమన్కాళోజీ సెంటర్: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు విద్యార్థుల ఒరిజినల్ ఎస్సెస్సీ ట్రానన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ)లను తప్పనిసరిగా కళాశాలల్లో భద్రపరచాలని వరంగల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ ఆదేశించారు. ఒరిజినల్ టీసీ సమర్పించని విద్యార్థుల అడ్మిషన్లను నిబంధనల ప్రకారం క్రమరహిత అడ్మిషన్లుగా పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒరిజినల్ టీసీ అందుబాటులో లేని విద్యార్థుల ప్రవేశాలను ఇంటర్ బోర్డు పోర్టల్లోని ‘డిటీల్’ ఆప్షన్న్ ద్వారా ఈనెల 7వ తేదీలోపు తొలగించాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థులకు టీసీలు ఇవ్వకుండా ఏ కళాశాల ప్రిన్సిపాల్ లేదా యాజమాన్యం ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఈ ప్రక్రియను ఎలాంటి మినహాయింపులు లేకుండా నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే కళాశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఐఈఓ శ్రీధర్ సుమన్ హెచ్చరించారు. -
బల్దియా సావనీర్ బుక్కుల చించివేత
వరంగల్ అర్బన్: బల్దియా గత పాలకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ చేపట్టినట్లు సావనీర్లో పొందుపర్చడంపై బీఆర్ఎస్కు చెందిన మాజీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో సావనీర్ బుక్లను వారు చించేశారు. అనంతరం గ్రీవెన్స్ సెల్లో కమిషనర్ టి.వెంకన్నకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మసూద్, మాజీ కార్పొరేటర్లు మరుపల్ల రవి, ఆవాల రాధికారెడ్డి, గుగులోత్ రాజునాయక్ వినతిపత్రం ఇచ్చారు. నూతనంగా సావనీర్ బుక్కును ప్రచురించాలని లేకపోతే మాజీ కార్పొరేటర్లంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నేడు టీపీటీఎస్ నిరసనలు కాళోజీ సెంటర్: తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు నేడు (మంగళవారం) మధ్యాహ్న భోజన సమయంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీపీటీఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి అశోక్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేస్తామని హామీ ఇచ్చి మూడేళ్లు గడిచినా అమలు చేయకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొందన్నారు. కలెక్టరేట్, మండల తహసీల్దార్ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయంలో నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సంచార జాతుల విముక్తి దినోత్సవం న్యూశాయంపేట: సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మహాత్మా జ్యోతిరావుపూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పుష్పలత, టీపీసీసీ చేనేత విభాగం వర్కింగ్ ప్రసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు నేత, వివిధ కుల సంఘాల బాధ్యులు, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. 2, 5న తిరుపతి–రక్సోల్–తిరుపతి ఎక్స్ప్రెస్లు రద్దు కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా తిరుపతి–రక్సోల్–తిరుపతి ఎక్స్ప్రెస్ రైళ్ల సర్వీస్లను నవంబర్ 2, 5వ తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో చక్రాధర్పూర్ డివిజన్లో బగ్దేహి–జర్సుగూడ మధ్య 4 లైన్ల నిర్మాణంతో చేపట్టిన రైల్వే నాన్ ఇంటర్ లాకింగ్ వర్క్తో ఈ రెండు రైళ్ల సర్వీస్లను రద్దు చేసినట్లు తెలిపారు. రద్దయిన రైళ్లు.. 2వ తేదీన తిరుపతి–రక్సోల్ (17433) ఎక్స్ప్రెస్, నవంబర్ 5వ తేదీన రక్సోల్–తిరుపతి (17434) ఎక్స్ప్రెస్లను రద్దు చేసినట్లు సీపీఆర్వో తెలిపారు. -
ఘనంగా పోచమ్మ బోనాలు
వరంగల్ చౌరస్తా: నగరంలోని కాశిబుగ్గలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బుధవారం పోచమ్మ బోనాల జాతర నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ హాజరై పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి బోనం ఎత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బయ్యస్వామి, ముదిరాజ్ సంఘం నాయకులు, ఇతర సంఘాల ప్రతినిధులు రత్నం కృష్ణ కిషోర్, జూలూరి నైనేష్, గొడిశాల కార్తీక్ గౌడ్, కార్యకర్తలు, మహిళలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు. -
వీసా రూల్స్లో ఎన్ఐఆర్లకు సడలింపులివ్వండి..
నయీంనగర్ : ఐటీ జాబ్, ఉన్నత చదువు కోసం అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ ఎన్ఐఆర్లకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వాలని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న రవీందర్ రావు వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ప్రతినిధి సుహాస్ సుబ్రహ్మణ్యం, 11వ డిస్ట్రిక్ట్ ప్రతినిధి జేమ్స్ వాకిన్ షాను కలిశారు. అమెరికాలో 12 లక్షల మందికిపైగా తెలుగువాళ్లు నివసిస్తున్నారని, అందులో 6 లక్షల మంది వరకూ తెలంగాణ వాసులు ఉన్నారని, టూరిస్ట్ వీసాల్లో ఆ కుటుంబాల ఇబ్బందులను రవీందర్ రావు వారికి వివరించారు. లక్ష డాలర్ల ఫీజు చెల్లింపును తగ్గించే విషయమై పార్లమెంట్లో ప్రస్తావించాలని వారికి విన్నవించారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించి, హామీ ఇచ్చారు. అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులను కలిసిన వారిలో రవీందర్ రావుతో పాటు పులి రవి, డాక్టర్ భిక్షం గుజ్జ ఉన్నారు. -
అక్కసుతోనే బీఆర్ఎస్ విమర్శలు
హన్మకొండ చౌరస్తా: అధికారం కోల్పోయామన్న అక్కసుతోనే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై పదేపదే విమర్శలు చేస్తున్నారని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య విమర్శించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్ష బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు. బుధవారం హనుమకొండ డీసీసీ కార్యాలయంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్రెడ్డితో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టిందని కావ్య తెలిపారు. ‘చెప్పినవి చేస్తున్నాం.. చెప్పనివి కూడా చేస్తున్నాం. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనే మా ప్రోగ్రెస్ రిపోర్ట్’ అని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆరు గ్యారంటీల అమలుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమం సమయంలో విద్యార్థులను ఉపయోగించుకున్న బీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి భవిష్యత్ కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్సిటీలకు వీసీల నియామకాలు చేపట్టిందని, పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుందని తెలిపారు. డీఎస్సీ ద్వారా సుమారు 10 వేల మంది ఉపాధ్యాయులను నియమించినట్లు, వివిధ శాఖల్లో సుమారు 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎంపీ కావ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనే మా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎంపీ కడియం కావ్య -
ఎఫ్ఆర్ఎస్ వద్దని పార్ట్టైం అధ్యాపకుల నిరసన
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాలు, వర్సిటీ కాలేజీల్లో 16 పీరియడ్ల వర్క్లోడుతో పనిచేస్తున్న పార్ట్టైం అధ్యాపకుల ముఖ గుర్తింపు హాజరు నమోదు కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధిత అధికారులు ఉపక్రమించగా తమకు ఈ విధానం వద్దంటూ కొందరు పార్ట్టైం అధ్యాపకులు సోమవారం పరిపాలన భవనం వద్ద ఆందోళన చేపట్టారు. తమకు ఎఫ్ఆర్ఎస్ వద్దని, ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలను పెంపుదల చేసి ప్రతీ నెల చెల్లించాలని, పార్ట్టైం లెక్చరర్లను కాంట్రాక్టు లెక్చరర్లుగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగించారు. పార్ట్టైం అధ్యాపకులకు ముఖగుర్తింపు హాజరు నమోదు ప్రక్రియకు సంబంధించి పరిపాలన భవనంలోని సెనెట్ హాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను సోమవారం చేసుకోవాలని రిజిస్ట్రార్ రామచంద్రం ఇటీవల సర్క్యూలర్ జారీచేశారు. ఈ నేపథ్యంలో తమకు ముఖ గుర్తింపు హాజరు నమోదు విధానం అమలు వద్దంటూ పార్ట్టైం అధ్యాపకులు ఆందోళన చేపట్టగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగలేదు. ఆందోళన సమయంలో వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం హైదరాబాద్లో ఉన్నారు. రిజిస్ట్రార్ రామచంద్రం పార్ట్టైం అధ్యాపకులతో ఫోన్లో మాట్లాడారు. ముఖ గుర్తింపు హాజరు ప్రభుత్వ విధానమని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. బుధవారం వీసీ ప్రతాప్రెడ్డి యూనివర్సిటీలో అందుబాటులో ఉంటారని, తాను మంగళవారం అందుబాటులో ఉంటానని పార్ట్టైం అధ్యాపకులకు తెలిపారు. వీసీ వచ్చాక కలిసి చర్చించాలని సూచించారు. అనంతరం పార్ట్టైం అధ్యాపకులు కేయూ ఇన్చార్జ్ రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్కు వినతిపత్రం సమర్పించారు. -
నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించాలి
హన్మకొండ: వినాయక చవితి, గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులకు సూచించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు, నిర్వహణపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ.. పోలీస్, అధికారుల సూచనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో, స్నేహపూర్వక వాతావరణంలో వేడుకలు నిర్వహించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తే స్థానిక ఏసీపీ అనుమతి తీసుకోవాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లు, గజ ఈతగాళ్లు, లైటింగ్, బారికేడ్లు, వైద్య సిబ్బందిని ముందుగానే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. ప్రజలు, ఉత్సవ కమిటీలు మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ సమీప నిమజ్జన ప్రాంతాలను గుర్తించాలన్నారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ గణపతి నవరాత్రుల సందర్భంగా ఇబ్బందులు ఎదురైతే పోలీస్ కంట్రోల్ రూమ్ 87126 85048 నంబర్కు సమాచారమందించాలని కోరా రు. సమావేశంలో హనుమకొండ అదనపు కలెక్టర్ రవి, డీసీపీలు దార కవిత, అంకిత్కుమార్, రాజమహేంద్ర నాయక్, జనగామ అదనపు కలెక్టర్ బెన్ షాలోం, అధికారులు, పోలీసులు కమిషనరేట్ పరిధి ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. సైబర్ భద్రత పోస్టర్ ఆవిష్కరణవరంగల్ క్రైం: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా రూపొందించిన సైబర్ భద్రత అవగాహన పోస్టర్ను బుధవారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ శ్వేత ఆవిష్కరించారు. సైబర్ క్రైం స్టేషన్ ఏసీపీ వెంకటరమణ, ఎస్బీ–2 ఏసీపీ జానీ నర్సింహులు, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్సైలు చరణ్, శివ పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమావేశం -
‘రూట్లెంగెన్’తో కేయూ అవగాహన ఒప్పందం
కేయూ క్యాంపస్ : అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్య అవకాశాలు అందించేందుకు కాకతీయ యూనివర్సిటీ మరో కీలక ముందడుగు వేసింది. జర్మనీలోని రూట్లెంగెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో జర్మనీ రూట్లెంగెన్ యూనివర్సిటీ ప్రత్యేక ప్రతినిధి రాజ్వంగపండు, కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం, ఓఎస్డీ బి. వెంకట్రామ్రెడ్డి పాల్గొని అవగాహన ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఓయూ వీసీ కుమార్ సమక్షంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. కేయూ యూజీసీ కోఆర్డినేటర్, రూసా నోడల్ అఽధికారి ఆర్. మల్లికార్జున్రెడ్డి పాల్గొన్నారు. రూట్లెంగెన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ బ్రూనె జోచెన్, ప్రోగ్రాం మేనేజర్ స్టెఫాన్ డెగ్లిమాన్ ప్రతినిధులుగా ఆన్లైన్లో పాల్గొన్నారు. ఈ ఎంఓయూతో ప్రయోజనం.. జర్మనీ రూట్లెంగెన్ యూనివర్సిటీతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంతో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు 3 ప్లస్ 2 మాస్టర్స్ కోర్సు ద్వారా తమ ఉన్నత విద్యను జర్మనీలో కొనసాగించే అవకాశం పొందనున్నారు. ఇందులో మొదటి మూడు సంవత్సరాల విద్యను కాకతీయ యూనివర్సిటీలో పూర్తిచేసి తదుపరి రెండేళ్లు మాస్టర్స్ విద్యను జర్మనీ రూట్లెంగెన్ యూనివర్సిటీలో అభ్యసించే అవకాశం ఉంటుంది. మొదటి మూడు సంవత్సరాల డిగ్రీ అనంతరం ఆ జర్మనీ యూనివర్సిటీ మాస్టర్స్ డిగ్రీని ప్రదానం చేస్తుంది. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన విద్యార్థులు రూట్లెంగెన్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇతర వి భాగాలకు చెందిన విద్యార్థులు మాస్టర్ ఆఫ్ డిజి టల్ బిజినెస్ మేనేజ్మెంట్ వంటి మాస్టర్స్ కోర్సుల్లో విద్యను కొనసాగించేందుకు అవకాశం కల్పించనున్నారని కేయూ వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం తెలిపారు. తొలుత ఈ కార్యక్రమంద్వారా కేయూ నుంచి 20మంది విద్యార్థులను మెరిట్ కమ్ రిజర్వేషన్ ప్రాతిపదికన ఎంపిక చేయబోతున్నారు. ఎంపికై న విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి విద్యనభ్యసించడంతోపాటు జర్మనీలో ఉన్నత విద్య, భవిష్యత్ ఉపాధి అవకాశాలను పొందేందుకు ఈ ఒప్పందం దోహపడుతుందని వారు తెలిపారు. -
ఉద్యమకారుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి
హన్మకొండ : ఉద్యమకారుల విగ్రహాలు ఏర్పాటు చేయాల్సిందేనని పూర్వ తెలంగాణ జేఏసీ చైర్మన్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో పూర్వ తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే, ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి యాది సభ నిర్వహించారు. ఇందులో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటుకు తెలంగాణ జన సమితి సహకారం అందిస్తుందన్నారు. ఇది న్యాయమైన డిమాండ్ అన్నారు. ఉద్యమకారులపై కేసులు ఎత్తి వేయాలని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పానన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. తెలంగాణ జేఏసీ ద్వారా నర్సంపేటలో తెలంగాణ ఉద్యమకారులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని, విగ్రహం ఏర్పాటు పెద్ది సుదర్శన్ రెడ్డికి నిజమైన నివాళి అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధసూదనాచారి అన్నారు. తామంతా వెనుకాముందు ఆలోచిస్తే పెద్ది సుదర్శన్ రెడ్డి.. కేసీఆర్కు నేరుగా సూచనలు చేసే వారని, నిక్కచ్చి నాయకుడని కొనియాడారు. నర్సంపేటలో సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటును అడ్టుకోవడం దుర్మార్గమన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ నర్సంపేటను జిల్లా చేస్తారా? మెడికల్ కాలేజీ ఇస్తారా అని పట్టుబట్టి మెడికల్ కాలేజీ సాధించిన అభివృద్ధి కాముకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. మెడికల్ కాలేజీకి పెద్ది పేరు పెట్టడంతోపాటు విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్సీ కోదండరాం చొరవ తీసుకోవాలన్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతను ఆకలింపు చేసుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారన్నారు. అతడి శక్తిని చూసి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు గుర్తు చేశారు. సభలో ఆయా పార్టీల నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. ● పూర్వ తెలంగాణ జేఏసీ చైర్మన్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం -
గురువారం శ్రీ 3 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
ఇసుక లారీలో మె.టన్నుకు అదనంగా.. రూ.2వేలు వసూలుజ్యోతి ఆదిరెడ్డిసాక్షిప్రతినిధి, వరంగల్: ఇసుక లారీల్లో ఓవర్లోడ్కు ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే. ఇసుక రవాణాలో నిర్ణీత సామర్థ్యానికి మించి తరలించే ప్రతీ మెట్రిక్ టన్ను ఇసుకకు రూ.2 వేల చొప్పున జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఒకే వాహనం రెండు సార్లకు మించి ఓవర్లోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే సాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్లో ఆ వాహనాన్ని తదుపరి బుకింగ్లకు బ్లాక్ చేయనున్నారు. మైన్స్ సర్వేలెన్స్ సిస్టం ద్వారా ఓవర్లోడ్ను గుర్తించి జరిమానాను ఆన్లైన్లో వసూలు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 28లో స్పష్టం చేసింది. ఈనిబంధనలతో ఉమ్మడి జిల్లాలోని రీచ్ల నుంచి అదనపు ఇసుక తరలించే వందలాది లారీలకు చెక్పడనుంది. క్వారీ నుంచి స్టాక్యార్డు వరకు.. కొన్ని రీచ్ల్లో నేరుగా భారీ వాహనాల్లో ఇసుక లోడ్ కాకుండా రీచ్ నుంచి స్టాక్యార్డుకు ట్రాక్టర్లు/చిన్న వాహనాల ద్వారా తరలించి, అక్కడినుంచి లారీ ల్లోకి రీలోడ్ చేసే విధానం ఉంది. తాడిచెర్ల తాజా టెండర్లలోనూ రీచ్ నుంచి స్టాక్ యార్డుకు ఇసుక తరలించి, తిరిగి లారీల్లోకి లోడ్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కొత్త నిబంధన కేవలం లారీ డ్రైవర్పైనే కాకుండా రీచ్–స్టాక్యార్డు–లోడింగ్–రవాణా మొత్తం వ్యవస్థపై జాగ్రత్త పెంచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఓవర్లోడ్ పూర్తిగా నియంత్రితమై తే ఒక్క ట్రిప్పులో తరలించే ఇసుక పరిమాణం త గ్గుతుంది. మరోవైపు రోడ్లపై ఒత్తిడి, రోడ్డు నష్టం, ప్రమాదాల ముప్పు తగ్గే అవకాశం ఉంది. ఓవర్లోడ్ లారీలకే సమస్య.. కొత్త జీఓతో అసలు సమస్య ఓవర్లోడ్ చేసే లారీలకే. ఒక లారీలో నిర్ణీత పరిమితికి మించి టన్ను ఇసుక ఉంటే రూ.2వేల జరిమానా. 3 టన్నులు అదనంగా ఉంటే రూ.6వేలు, ఐదు టన్నులు అయితే రూ.10వేలు.. అంటే ఒక్క ట్రిప్పులో ఎక్కువ ఇసుక వేసుకుని అదనపు ఆదా యం పొందాలనుకునే ప్రయత్నం జరిమానాతో పోలిస్తే నష్టదాయకంగా మారే అవకా శంఉంది. జీఓ ప్రకారం అదనంగా తరలించిన ఇసుక పరిమాణంపై జరిమానా విధించనున్నారు. లారీ యజ మానులకు ఇది మరింత కీలకమైన నిబంధన. రెండుకంటే ఎక్కువ ఓవర్లోడ్ ఉల్లంఘనలు గుర్తించిన వాహనాన్ని సాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్లో తదుపరి బుకింగ్ల నుంచి బ్లాక్ చేయనున్నారు. ఆ వాహనంతో టీజీఎండీసీ ఇసుకను బుక్ చేసుకునే అవకాశమే కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. రెండుసార్లు ఓవర్.. మూడోసారికి బుకింగ్ కట్ రీచ్ నుంచి స్టాక్యార్డు.. అక్కడినుంచి లారీ వరకు నిఘా కొత్త నిబంధనలు విధించిన ప్రభుత్వం తారుమారు కానున్న వ్యాపారుల లెక్కలుఉమ్మడి జిల్లాలో ఇసుక రీచ్లు ఇలా.. గోదావరి పరీవాహక ప్రాంతం కారణంగా ఉమ్మడి వరంగల్లోని ముఖ్యంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇసుక తవ్వకాలు, రవాణా కార్యకలాపాలు సాగుతున్నాయి. టీజీఎండీసీ వివరాల ప్రకారం.. ములుగు జిల్లాలో టీజీఎండీసీ రికార్డుల్లో మారికాల, సూరవీడు, ముత్తారం, కొండాపురం, కొరకల్లు వంటి ఇసుక రీచ్ల వివరాలు ఉన్నాయి. ఉదాహరణకు మారికాల రీచ్కు1,59,680 మెట్రిక్ టన్నులు, కొరకల్లు రీచ్కు 99,948 క్యూబిక్ మీటర్ల పరిమాణం కేటాయించారు. సూరవీడు రీచ్కు 70 వేల క్యూబిక్ మీటర్లు, ముత్తారం రీచ్కు 99,400 క్యూబిక్ మీటర్ల ఇసుక తరలింపునకు అనుమతి ఉంది. జేఎస్ భూపాలపల్లి జిల్లాలో ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో ఇసుక డీ–సిల్టేషన్ పనులకు టీజీఎండీసీ టెండర్లు పిలిచింది. తాడిచెర్ల–1, తాడిచెర్ల–2 రీచ్లలో సుమారు 14 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక డీ–సిల్టేషన్కు సంబంధించిన టెండర్ అయ్యింది. ఆయా రీచ్ల నుంచి ఇసుక తరలించే లారీలకు ‘ఓవర్లోడ్’ నిబంధన ప్రభావం పడనుంది. దీంతో ఇసుక వ్యాపారుల, లారీ ఓనర్ల లెక్కలు తారుమారు కానున్నాయి. -
ప్రయోగాలకు ప్రోత్సాహం
విద్యారణ్యపురి: గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ విద్యాసంవత్సరం (2026–27) ఆరంభంలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని ప్రయోగశాలలకు ఇంటర్ బోర్డు ఇటీవల నిధులు మంజూరు చేసింది. ఈమేరకు ఈవిద్యాసంవత్సరంలో ఇంటర్మీ డియట్లో వివిధ సంస్కరణలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈసారి ఇంటర్ సెకండియర్ విద్యార్థులతోపాటు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కూడా ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రథమ సంవత్సరంలో సైన్స్ సబ్జెక్టు ప్రయోగ పరీక్షకు 15 మార్కుల చొప్పున కేటాయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రయోగశాలలు బలోపేతం చేసేలా పరికరాలు, కెమికల్స్ అవసరమైన సామగ్రి కొనుగోలు కోసం నిధులను ఇంటర్బోర్డు మంజూరు చేసింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా.. ఈవిద్యా సంవత్సరంలో జూలై 17వ తేదీ వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నమోదు అయిన విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇంటర్ బోర్డు నిధులను మంజూరు చేసింది. ఒక్కో జూనియర్ కళాశాలకు విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కో కాలేజీకి రూ.24 వేల నుంచి రూ.లక్ష వరకు మంజూరు చేసింది. ఈ నిధుల నుంచి అవసరమైన ప్రాక్టికల్స్ నిర్వహణ పరికరాలు, కెమికల్స్, ఇతర సామగ్రిని కొనాల్సి ఉంటుంది. జిల్లాల వారీగా కళాశాలలు, మంజూరైన నిధులు (రూ.లక్షల్లో)మొత్తం కళాశాలలునిధులు5.804.64 ప్రభుత్వ కళాశాలల్లోని ప్రయోగశాలలకు నిధులు మంజూరు ఉమ్మడి జిల్లాలోని 48 కళాశాలలకు కేటాయింపు4.803.082.841.84 -
విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాడి
● కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రగాయాలు ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ఉనికిచర్ల సమీపంలో గల ఓ ప్రైవేట్ పాఠశాలలో బుధవారం ఓ విద్యార్థిని వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రతో తీవ్రంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. కోమటిపల్లి ప్రాంతంలోని నిరూప్నగర్కు చెందిన ఓ విద్యార్థి ఉనికిచర్ల సమీపంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. వ్యాయామ ఉపాధ్యాయుడు అతడిని కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. గతంలో విరిగిన కుడిచేయిని పట్టుకుని లాగుతూ దారుణంగా కొట్టాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తీవ్ర గాయాలపాలైన ఆ బాలుడు అండర్–14 తైక్వాండో విభాగంలో బ్లాక్బెల్ట్ సాధించాడు. సదరు వ్యాయామ ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం
కేయూ క్యాంపస్: చైన్నెలోని వ్యవసాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్న అగ్రిటెక్–20 అంతర్జాతీయ సదస్సుకు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ ఎస్.జ్యోతికి, జర్నలిజం విభాగం అధ్యాపకుడు డాక్టర్ ఆర్.ఆదిరెడ్డికి ఆహ్వానం అందింది. జ్యోతి, ఆదిరెడ్డి సంయుక్తంగా వ్యవసాయ గ్రామీణాభివృద్ధి, సుస్థిర సమ్మిళిత అభివృద్ధి సమగ్ర రూపకల్పన అంశంపై పరిశోధన పత్రాన్ని ఈ సదస్సులో సమర్పించనున్నారు. వరంగల్ చౌరస్తా: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో బుధవారం వైద్యులకు, రోగుల బంధువులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలోని యూరాలజీ విభాగంలో ముగ్గురు రోగులను ఆపరేషన్ కోసం థియేటర్కు తీసుకెళ్లి పరికరాలు పనిచేయట్లేదని రోగులను వెనక్కి పంపించారు. దీంతో రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. రోజుల తరబడి ఆస్పత్రిలో ఉంచి ఆపరేషన్ సమయానికి మరమ్మతులని దాటవేస్తున్నారని రోగుల అటెండెంట్లు నిరసన వ్యక్తం చేశారు. ఈవిషయంమై ఆర్ఎంఓ డాక్టర్ ప్రదీప్ను వివరణ కోరగా, పరికరం మరమ్మతుల కారణంగా ఆపరేషన్లు నిలిపేసినట్లు వెల్లడించారు. నీటి సరఫరా లేకపోవడం వల్ల కొద్ది రోజులుగా న్యూరో సర్జరీ, యూరాలజీ విభాగాల ఆపరేషన్లు నిలిచినట్లు సమాచారం. హన్మకొండ కల్చరల్: పందిళ్ల శేఖర్బాబు స్మారక నాటకోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ రంగస్థల నటుడు పందిళ్ల శేఖర్బాబు 65వ జయంతి సందర్భంగా సంస్మరణ సభ బుధవారం సాయంత్రం హనుమకొండ నయీంనగర్లోని వాగ్దేవి కళాశాలలో నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంతరావు అధ్యక్షతన జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు తడకమళ్ల రామచంద్రరావు, సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల సదానందం, కమిటీ సహాదారు పందిళ్ల అశోక్కుమార్, రాధారపు సంజీవరెడ్డి, శ్రీరామోజు సుందరమూర్తి పాల్గొని శేఖర్బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇటీవల తిరుపతిలో జాతీయస్థాయి నాటకోత్సవాల్లో ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై న మహారాణి రుద్రమదేవి పద్యనాటక కళాకారులను, బృందాన్ని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల అన్ని డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఇంజనీరింగ్, లా కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లతో స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వై.వెంకయ్య తెలిపారు. 2026–27 సంవత్సరానికి సంబంధించిన అంతర్ విశ్వవిద్యాలయాల క్రీడా క్యాలెండర్ రూపకల్పన, క్రీడా మైదానాల అభివృద్ధిపై చర్చించనున్నట్లు తెలిపారు. ఫిజికల్ డైరెక్టర్లంతా పాల్గొనాలని కోరారు. హన్మకొండ కల్చరల్: డాక్టర్ చింతపల్లి వసుంధరరెడ్డి జానపద విజ్ఞాన సాఫల్య పురస్కారాన్ని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బాసని సురేశ్కు ప్రదానం చేశారు. ఈమేరకు హైదరాబాద్లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఆత్మీయ అతిథి పమిడికాల్వ మధుసూదన్ సురేశ్కు పురస్కారం ప్రదానం చేశారు. ఈసందర్భంగా సురేశ్కు రాష్ట్ర తెలుగు అకాడమీ డైరెక్టర్ ఆచార్య భట్టు రమేశ్, కేయూ విశ్రాంత ఆచార్యులు పాకనాటి జ్యోతి, జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి ఆచార్య గడ్డం వెంకన్న, జూనియర్ అసిస్టెంట్ అమేర్ అలీఖాన్, అధ్యాపకులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. -
ఐదు దశాబ్దాలు.. ఆగని పరుగులు!
సాక్షిప్రతినిధి, వరంగల్ : సింగరేణి ప్రాంత ప్రజలతోపాటు ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు, విద్యార్థుల జీవితాలతో విడదీయరాని బంధం పెనవేసుకున్న ‘సింగరేణి’ రైలు అర్ధ శతాబ్దం పూర్తి చేసుకుంది. 1976 సెప్టెంబర్ 2న భద్రాచలం రోడ్ నుంచి బెల్లంపల్లి వరకు ఎక్స్ప్రెస్గా ప్రారంభమైన ఈ రైలు.. ఐదు దశాబ్దాల కాలంలో ఎన్నో రూపాలు మార్చుకుంది. ఎక్స్ప్రెస్గా మొదలై ప్యాసింజర్గా మారింది. సిర్పూర్ టౌన్ వరకు పొడిగింపునకు నోచుకుంది. కరోనా తర్వాత మళ్లీ ఎక్స్ప్రెస్ హోదాలోకి వచ్చింది. ప్రస్తుతం మెమూ ఎక్స్ప్రెస్గా పట్టాలపై పరుగులు తీస్తోంది. రైల్వే చరిత్రలోనూ దీని ప్రారంభ తేదీ 1976 సెప్టెంబర్ 2గానే నమోదై ఉంది. గనుల ప్రాంతాలకు ‘రైలు’బాట సింగరేణి బొగ్గు గనుల విస్తరణతోపాటు కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబాలు, బొగ్గు ఆధారిత పరిశ్రమలు, వ్యాపార కార్యకలాపాలు పెరుగుతున్న సమయంలో ఉత్తర–దక్షిణ సింగరేణి ప్రాంతాలను అనుసంధానించేందుకు, కార్మికుల రాకపోకలను సులభతరం చేసేందుకు, గనుల ప్రాంతాలకు వేగవంతమైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ఈ రైలుకు రూపకల్పన జరిగింది. అందుకే దీనికి ‘సింగరేణి’ అనే పేరు సార్థకమైంది. ప్రారంభంలో భద్రాచలం రోడ్–బెల్లంపల్లి మధ్య ఎక్స్ప్రెస్గా నడిచిన ఈ రైలుకు కేవలం ఎక్స్ప్రెస్ హాల్టులే ఉండేవి. అనంతరం ప్యాసింజర్గా మార్చడంతో చిన్న స్టేషనలో ఆగుతూ వేలాది మందికి అందుబాటులోకి వచ్చింది. ఇంజిన్ మార్చేందుకు కాజీపేటకు.. కరోనా తర్వాత ఎక్స్ప్రెస్.. ఒక దశలో సింగరేణి ప్యాసింజర్ కాజీపేట జంక్షన్ వరకు వచ్చి ఇంజిన్ మార్చుకుని తిరిగి సిర్పూర్ టౌన్ వైపు వెళ్లేది. ఈ ప్రయాణం అప్పట్లో రైల్వే ప్రయాణికులకు ప్రత్యేక అనుభూతిగా ఉండేది. కాలక్రమంలో రైలు సిర్పూర్ టౌన్ వరకు పొడిగించారు. కాగా, కరోనా సమయంలో దేశవ్యాప్తంగా రైళ్ల నిర్వహణలో చోటుచేసుకున్న భారీ మార్పుల క్రమంలో సింగరేణి రైలుకూ ప్యాసింజర్ హోదా నుంచి మెమూ ఎక్స్ప్రెస్ రూపంలోకి వచ్చింది. దీంతో గతంలో ఉన్న అన్ని స్టాప్లలో ఆగే అవకాశం లేకుండా కొన్ని హాల్టులు తొలగిపోయాయి. సింగరేణి రైలుకు కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో ప్రత్యేక అనుబంధం ఉంది. బల్హర్షా, సిర్పూర్ టౌన్–భద్రాచలం రోడ్ మధ్య సింగరేణి మెమూ ఎక్స్ప్రెస్గా నడుస్తోంది. వయా కాజీపేట, వరంగల్, చింతలపల్లి, ఎల్గూరు, నెక్కొండ, మహబూబాబాద్, డోర్నకల్ క్రాస్నుంచి భద్రాచలం వెళ్తుంది. భద్రచాలం టు బల్హర్షా రూట్లో డోర్నకల్ క్రాస్నుంచి మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, హసన్పర్తి, ఉప్పల్నుంచి వెళ్తుంది. ఉద్యోగానికి వెళ్లే సింగరేణి కార్మికుడి నుంచి ఉన్నత విద్య కోసం ప్రయాణించే విద్యార్థి వరకు.. వ్యాపార అవసరాల కోసం రాకపోకలు సాగించే వ్యాపారి నుంచి వైద్యం కోసం జిల్లా కేంద్రాలకు వచ్చే సామాన్యుడి వరకు.. ఈ రైలు ఐదు దశాబ్దాలుగా అనేక వర్గాలకు ప్రయాణ సాధనంగా నిలిచింది. అలాగే, సింగరేణి రైలు రేక్ను రామగిరి రైలు తదితర సర్వీసులతోపాటు రేక్ షేరింగ్ విధానంలో వినియోగిస్తున్నారు.అర్ధ శతాబ్దం దాటిన సింగరేణి రైలు ప్రయాణం 1976 సెప్టెంబర్ 2న భద్రాచలం రోడ్–బెల్లంపల్లి మధ్య ఎక్స్ప్రెస్గా ప్రారంభం ప్యాసింజర్గా మారి.. సిర్పూర్ టౌన్ వరకు పొడిగింపు కరోనా తర్వాత మళ్లీ ఎక్స్ప్రెస్ హోదా ఉమ్మడి వరంగల్కు ప్రత్యేక అనుబంధం -
సహకార సంఘాలను బలోపేతం చేయాలి
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద కాళోజీ సెంటర్: జిల్లాలోని పాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అభివృద్ధి, కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సహకార సంఘాల పరిదిలో పెద్ద ఎత్తున గోడౌన్ల నిర్మాణం చేపట్టి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు అదనపు ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లాలో సహకార సంఘాల అభివృద్ధికి దోహదపడే ఉత్తమ ప్రాజెక్టులను గుర్తించి, వాటి అమలుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి ఎం.నీరజ, పలు శాఖల అధికారులు పేర్కొన్నారు. అదనపు కలెక్టర్తోనే ముఖ్య శాఖల ఫైళ్ల క్లియరెన్స్ జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పాలన వ్యవహారాల్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళాశిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వి ద్యాశాఖకు సంబంధించిన ఫైళ్లు ఇకపై అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ద్వారానే పంపించాలని బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు తమ ఫైళ్ల ప్రక్రియను తక్షణమే అదన పు కలెక్టర్ ద్వారానే నిర్వహించాలని పేర్కొన్నారు. -
ప్రజాసేవలో వైఎస్సార్ది చెరగని ముద్ర
డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి హన్మకొండ చౌరస్తా: ప్రజాసేవలో మాజీ సీఎం వైఎస్సార్ది చెరగని ముద్ర అని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇనగాల వెంట్రాంరెడ్డి అన్నారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని హనుమకొండలోని డీసీసీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో వై ఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈసందర్భంగా ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి వైఎస్సార్ అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్గౌడ్, బత్తిని శ్రీనివాస్రావు, వరంగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి ప్రియాంక, ఐవైసీ జాతీయ కార్యదర్శి గొట్టిముక్కుల సాగరిక, డీసీసీ మీడియా కమిటీ చైర్మన్ మార్క విజయ్కుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పత్తి కొనుగోళ్లకు సన్నాహాలు
అద్దెకు జిన్నింగ్ మిల్లులు..ఖిలా వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2026–27 సీజన్కు సంబంధించి పత్తి కొనుగో ళ్లకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సన్నాహాలు చేస్తోంది. ఈమేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు జిన్నింగ్ మి ల్లుల్లో బేళ్ల కోసం టెండర్లు పిలిచి పూర్తి చేసింది. గతంలోని ధరలతోపాటు ఇతర నిబంధనలతో ఒకే టెండర్ ప్రకటన ఇచ్చేవారు. ఈ సీజనల్లో తొలివిడత ధరల ప్రస్తావన లేకుండా ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని టెండర్ ప్రకటన వచ్చింది. మరో రెండు నెలల్లో పత్తి పంట చే తికొచ్చి క్రయవిక్రయాలు ప్రారంభించే అవకా శం ఉంది. దీంతో వ్యాపారులతోపాటు సీసీఐ ప త్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తోంది 7.24 లక్షల ఎకరాల్లో పత్తిసాగు ఉమ్మడి జిల్లాలో ఈ సీజన్లో పత్తి సాగు సు మా రు 7.24 లక్షలకు పైగా ఎకరాలకు చేరుకుంది. 50.25 లక్షల క్వింటాళ్ల పత్తి వస్తుందని అధి కా రులు అంచనా వేశారు. మద్దతు ధరతో కొనుగోలు చేసే సీసీఐ.. బేళ్లుగా మార్చి ఎగుమతి చేయడానికి ఏటా టెండర్లు ఆహ్వానిస్తుంది. అదే తరహాలో టెండర్లను పిలిచింది. గతేడాది 6.53 లక్షల బేళ్లను సిద్ధం చేసి ఎగుమతి చేసింది. ఈ సీజనలో పత్తి క్రయవిక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 16 మార్కెట్ యార్డుల పరిధిలో 19 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ములు గు, కేసముద్రం–ఏ, బీ, తొర్రూరు, మహబూబాబాద్, కాటారం, చిట్యాల, భూపాలపల్లి, కొడకండ్ల, నర్సంపేట, జనగామ–ఏ, బీ, ఘన్పూర్, ఆత్మకూరు, రాంపూర్, పరకాల, ఎల్కతుర్తి, వరంగల్–ఏ, బీ కేంద్రాలున్నాయి. గత కేంద్రాలను ఈసారీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నా రు. కేంద్రాల వారీగా కొనే పత్తిని బేళ్లుగా మార్చేందుకు ఏటా జిన్నింగ్ మిల్లులను అద్దెకు తీసుకుంటున్నారు. జిన్నింగ్ మిల్లులు, గిడ్డంగులు, బేళ్ల రవాణాకు వాహనా లు, తాత్కాలిక ఉద్యోగులు తదితర వాటికి కూడా టెండర్లను ఆహ్వానించినట్లు మార్కెటింగ్ శాఽఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెండర్లు పూర్తిచేసిన సీసీఐ 16 మార్కెట్ యార్డుల పరిధిలో 19 కేంద్రాలు ఏర్పాటు 50.25 లక్షల క్వింటాళ్ల పత్తి వస్తుందని అధికారుల అంచనా -
బీఆర్ఎస్, కాంగ్రెస్లు ఎంఐఎంకు రెండు కోరలు
పరకాల: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు రజాకార్ల వారసత్వ పార్టీ ఎంఐఎంపై ఉన్న అభిమానం.. తెలంగాణ ప్రజలపై ఏమాత్రమూ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. ఆ రెండు పార్టీలు ఎంఐఎంకు రెండు కోరలని, వాటిని పీకేస్తే తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం సిద్ధిస్తుందన్నారు. 1948, సెప్టెంబర్ 2న పరకాల చాపలబండ వద్ద జరిగిన దక్కన్ జలియన్వాలాబాగ్ ఘటనను స్మరించుకుంటూ స్థానిక అమరధామంలో అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుతోపాటు మాజీ ఎంపీ బూర నర్సయ్య, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. ముందుగా రాంచందర్రావు, రాష్ట్ర నాయకులకు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అమరధామం వద్ద తెలంగాణ అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుల సతీమణులను సన్మానించారు. ఈ సందర్భంగా రాంచందర్రావు మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అఽధికారికంగా నిర్వహించడంతోపాటు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్ చేశారు. మరో రెండేళ్లలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు తెలంగాణ ప్రజలంతా గర్వపడేలా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో విమోచన దినోత్సవం ప్రాధాన్యతను చేర్చి భావితరాలకు తెలియజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పి.కాళీప్రసాద్రావు, డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి, డాక్టర్ సిరంగి సంతోష్కుమార్, రావు పద్మ, జిల్లా, పట్టణ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు మండిపాటు పరకాల అమరధామంలో తెలంగాణ అమరవీరులకు నివాళి -
ఎఫ్ఆర్ఎస్ హాజరుపై ప్రత్యేక దృష్టి
కాళోజీ సెంటర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సిబ్బంది, విద్యార్థుల హాజరును పకడ్బందీగా నమోదు చేసేందుకు ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని అమలు చేయనున్నట్లు వరంగల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. సోమవారం ఇంటర్ విద్యా కార్యాలయం నుంచి ప్రభుత్వ జూనియర్ కళా శాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు టీజీబీఐఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ వినియోగంపై గూగుల్ మీట్ ద్వారా శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ ముఖ గుర్తింపు రిజిస్ట్రేషన్, రోజువారీ హాజరు, ఆన్ డ్యూటీ నమోదు, ప్రిన్సిపాళ్ల మానిటరింగ్, రిపోర్టింగ్ తదితర ప్రక్రియలను యాప్ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 200 మందికి పైగా సిబ్బంది, 2,400 మంది విద్యార్థులకు హాజరు విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ కేశవ్ రెడ్డి, ప్రిన్సిపాళ్లు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. -
గాజరాంపల్లి గానకోకిల
మహాముత్తారం: ‘ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానల్లో సింగిల్ సెషన్ గాయకుల ఎంపిక వేదిక అది. ఆర్కెస్ట్రాతో ఓ పాట పాడిన ఆమెను న్యాయనిర్ణేతలో ఒకరైన ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడి జోక్యం చేసుకుని ఇదే పాటను ఆర్కెస్ట్రా లేకుండా పాడగలవా అని కోరతాడు.. ఆమె అదే బేస్ వాయిస్తో రేలారే..రేలారె.. నీళ్లల్ల నిప్పల్లె.. వచ్చింది నిజమల్లె’ అంటూ పాడడంతో ఆయనతోపాటు మరో జడ్జి, ప్రముఖ నేపథ్య గాయకురాలు శైలజ మంత్రముగ్ధులవుతారు. చప్పట్లతో హోరెత్తిస్తారు. ఇదే క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభకు కొదవలేదు. సరైన ప్రోత్సాహం లభిస్తే పల్లె ముద్దుబిడ్డలు కూడా అద్భుతాలు సృష్టిస్తారని నిరూపిస్తోంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం గాజరాంపల్లి తండాకు చెందిన బంజారా బిడ్డ, గాయని అశ్విని రాథోడ్. నల్లబంగారం కొ లువైన నేలపై పుట్టిన ఆమె.. తన గానామృతంతో ఆ నేలకు, పుట్టిన ఊరికి ప్రత్యేక గుర్తింపు తెస్తోంది. చిన్నప్పటి నుంచే ఆమె సంగీతంపై ఆసక్తి పెంచుకుని తన మధుర గాత్రంతో పాటలు పాడుతోంది. ఏడేళ్ల సంగీత ప్రయాణం.. అశ్విని ఏడేళ్లుగా నిరంతర సాధన చేస్తూ సంగీతలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రారంభంలో గ్రామాల్లో జరిగే సాంస్కృతిక కా ర్యక్రమాల వేదికలపై పాటలు పాడుతూ ప్రేక్షకుల ను అలరించిన ఆమె క్రమంగా స్టూడియో రికార్డింగ్స్, సింగిల్ సెషన్స్ పాడే స్థాయికి ఎదిగింది. భావోద్వేగాలను పలికించే గాత్రం స్పష్టమైన ఉచ్ఛరణ ఆమె సొంతం. సరిగమప వేదికపై ప్రతిభ ఇటీవల ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానల్ తెలుగు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సరిగమప సింగింగ్ రియాలిటీ షోలో అశ్విని పాల్గొని తన ప్రతిభను చాటుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఎందరో గాయనీగాయకుల మధ్య పోటీపడి తన గాత్ర మాధుర్యంతో న్యాయనిర్ణేతలను మెప్పించారు. మారుమూల పల్లెటూరు నుంచి వెళ్లి అంతటి ప్రతిష్టాత్మక వేదికపై పాడి జిల్లా కీర్తిని దశదిశలా చాటారు. ఇటీవల కాలంలో విడుదల అవుతున్న సింగిల్ ట్రాక్స్, స్టూడియో సెషన్స్లో తన గానంతో అశ్విని రాథోడ్ ప్రతిభ కనబరుస్తోంది. జానపద, భక్తి, సినీ గీతాలను సునాయాసంగా ఆలపిస్తూ సంగీత దర్శకుల మన్ననలు పొందుతోంది. మారుమూల తండా నుంచి వచ్చి ఎలాంటి పెద్ద సంగీత నేపథ్యం లేకపోయినా స్వయంకృషితోనే ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎందరో గ్రామీణ కళాకారులకు ఆదర్శంగా నిలుస్తోంది. మరిన్ని అవకాశాలు రావాలి.. అశ్విని సంగీతంలో రాణిస్తుండడంతో గాజరాంపల్లి తండావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మారుమూలతండా నుంచి వచ్చిన ఇలాంటి ప్రతిభావంతురాలికి ప్రభుత్వం, సినీ పరిశ్రమ మరిన్ని అవకాశాలు కల్పించి ప్రోత్సహించాలని ప్రజలు, కళాభిమానులు కోరుతున్నారు. నల్లసిరుల నేల బంజారా బిడ్డ అశ్విని రాథోడ్ తండానుంచి సరిగమప వరకు ఏడేళ్ల సాధన.. సింగిల్ సెషన్స్లో ప్రత్యేక ముద్రసింగిల్ సెషన్స్లో ప్రత్యేక ముద్రసంగీతమే నా ప్రాణం. చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే ఎంతో ఇష్టం. ఏడేళ్లుగా ఎన్నో అనుభవాలు, సవాళ్లను ఎదుర్కొంటూ పాటలే సర్వస్వంగా ముందుకుసాగుతున్నా. ప్రముఖ వేదికలపై పాడడంతోపాటు గొప్ప నేపథ్య గాయనిగా ఎదడగమే నా జీవిత ఆశయం. నాకు సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. – అశ్విని, గాయని -
బీఆర్ఎస్ నిరసనలో ఉద్రిక్తత
హన్మకొండ: కాంగ్రెస్ ప్రభుత్వ వేయి రోజుల వైఫల్య పాలనపై బీఆర్ఎస్ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. వారం రోజుల బీఆర్ఎస్ సమరభేరి కార్యక్రమంలో భాగంగా బుధవారం 420 హామీలతో కూడిన 420 అడుగుల ఫ్లెక్సీతో హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీపై పోలీసులు ముందు నుంచి అభ్యంతరం తెలుపుతూ వచ్చారు. ర్యాలీ కాళోజీ కూడలికి చేరుకోగా పోలీసులు రోప్ పార్టీతో అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీసు వలయాన్ని ప్రతిఘటిస్తూ ముందుకు సాగారు. ర్యాలీ తెలంగాణ అమరవీరుల స్తూపం కూడలికి చేరుకోగానే ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ను అరెస్ట్ చేసేక్రమంలో ఆయన తీవ్ర ఒత్తిడితో నొప్పి భరించలేక కేకలు వేశారు. చివరికి ఆయనను పోలీసు వాహనంలోకి ఎక్కించి సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న క్రమంలో పార్టీ కార్యకర్తలు వాహనానికి అడ్డుగా బైఠాయించారు. మరోవైపు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీతో హనుమకొండ కలెక్టరేట్కు చేరుకుని ధర్నా చేశారు. వినయ్భాస్కర్ను అరెస్ట్ చేశారని సమాచారం అందుకున్న మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సుబేదారి పోలీస్ స్టేషన్కు చేరుకుని పరామర్శించారు. అనంతరం వినయ్భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా పీడిత పాలన సాగుతోందని విమర్శించారు. వేయి రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతునే ఉంటామన్నారు. ఒకరోజు ముందు అనుమతి ఇచ్చిన పోలీసులు నిరసన కార్యక్రమం చేపడితే అక్రమ అరెస్టు చేశారన్నారు. వీధి రౌడీల మాదిరిగా పండ్ల బండ్ల వారి కత్తులతో 420 హామీల ఫ్లెక్సీపై దాడి చేశారని ఆరోపించారు. వినోద్కుమార్ మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన చేస్తున్న నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. నిరసనలో నాయకులు మర్రి యాదవరెడ్డి, కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, వద్దిరాజు గణేష్, బీరవెళ్లి భరత్కుమార్, జోరిక రమేష్, పోలేపల్లి రామ్మూర్తితోపాటు నాయకులు, కారకర్తలు పాల్గొన్నారు.420 అడుగుల ఫ్లెక్సీతో ర్యాలీ తీస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు 420 అడుగుల ఫ్లెక్సీతో ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా అడ్డుకున్న పోలీసులు.. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అరెస్ట్ -
మహిళా డెయిరీ పాలసేకరణ ధరల పెంపు
భీమదేవరపల్లి : ముల్కనూరు మహిళా సహకార డెయిరీ పాల సేకరణ ధరలను పెంచుతున్నామని, పెరిగిన ధరలు సెప్టెంబర్ 1 (మంగళవారం) ఉద యం నుంచే అమల్లోకి వస్తాయని డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ, జనరల్ మేనేజర్ మార్పాటి భాస్కర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపా రు. తాజా నిర్ణయం ప్రకారం సగటున ఆవు పాలపై లీటరుకు రూ. 1.25/, గేదె పాలపై లీటరుకు రూ. 3.50/ చొప్పున పెంచినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంత మహిళలు పాడి పశుపోషణపై ఆధారపడి పాల ఉత్పత్తిని పెంచుకుంటూ తమ కుటుంబాలకు ప్రధాన ఆర్థిక వనరుగా మా ర్చుకుంటున్నారన్నారు. మా ర్కెట్లో పోటీ, పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పాల సేకరణ ధరలను పెంచినట్లు పేర్కొన్నారు. సభ్యులందరూ పరస్పర సహకారంతో డెయిరీని విజయవంతంగా నడిపిస్తూ, లాభాలను ఏటా బోనస్ రూపంలో తిరిగి పొందుతున్నారని గుర్తుచేశారు. పెరిగిన పాల ధరలు, డెయిరీ అందిస్తున్న వివిధ సేవలను సభ్యులందరూ సద్వినియోగం చేసుకుని, పాల సేకరణను మరింత పెంచి ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. ఆవు పాలకు సగటున లీటర్కు రూ. 1.25, గేదె పాలకు రూ. 3.50 పెంపు -
బైక్ ఇచ్చి వస్తానని వెళ్లి.. అనంతలోకాలకు..
కేయూ క్యాంపస్ : స్నేహితుడిని రక్తదానం చేయించేందుకు తీసుకెళ్లిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృత్యుఒడికి చేరాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి హనుమకొండలోని పబ్లిక్ గా ర్డెన్ సమీపం గ్రంథాలయం రోడ్డులో చోటు చేసుకుంది. కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళా శాల ప్రిన్సిపాల్ రమణ, హాస్టల్ జాయింట్ డైరెక్టర్ దయాకర్ కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ప్రాంతానికి చెందిన గుగులోత్ భరత్(21) కేయూ ఇంజనీరింగ్ కళాశాలలో ట్రిపుల్ఈ మూడో సంవత్సరం చదువుతూ కాలేజీ హాస్టల్లో ఉంటున్నాడు. భరత్కు హనుమకొండ బస్టాండ్ సమీపంలోని ఓ బ్లడ్ బ్యాంకు నిర్వాహకులతో పరి చయం ఉంది. వారు అర్జెంట్గా ఓ బ్లడ్ గ్రూప్నకు సంబంధించి రక్తం కావాలని భరత్కు ఫోన్ చేశారు. దీంతో భరత్ తన స్నేహితుడు సాయినికేతన్తో రక్తదానం చేయించేందుకు అదే కళాశాలకు చెందిన వేరే వ్యక్తి బైక్పై మంగళవారం అర్ధరాత్రి ఆ బ్లడ్ బ్యాంకు వెళ్లారు. సాయినికేతన్ రక్తదానం చేస్తుండగా కొంత సమయం పడుతుందని భావించిన భరత్.. ఆ బైక్ను సదరు వ్యక్తికి ఇచ్చి వస్తానని అంబేడ్కర్ సెంటర్ రోడ్డు వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో పబ్లిక్గార్డెన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగి తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. భరత్ ఎంతకూ రాకపోవడంతో అతనికి సాయినికేతన్ ఫోన్ చేయగా లిఫ్ట్ చేసిన పోలీసులు భరత్ మృతిచెందాడని సమాచారం ఇచ్చారు. కాగా, భరత్ బైక్పై వస్తూ లైబ్రరీ వద్ద డివైడర్ ఢీకొనగా ప్రఽమాదం జరిగిందా? లేదా వేరే వాహనం ఏమైనా ఢీకొందా అనే విషయంపై ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీ పరిశీలించనున్నట్లు సుబేదారి ఎస్సై లక్ష్మి తెలిపారు. బుధవారం ఎంజీఎంలో భరత్ మృతదేహానికి పోస్టుమార్టం చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మి తెలిపారు. ఇదిలా ఉండగా మృతదేహం వద్దకు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.రమణ, హాస్టళ్ల జాయింట్ డైరెక్టర్ దయాకర్ చేరుకుని తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడారు. మృతదేహాన్ని స్వగ్రామం తరలించేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ రమణ తెలిపారు. భరత్ మృతితో తల్లిదండ్రులకు శోకసముద్రంలో మునిగిపోయారు. రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం స్నేహితుడిని రక్తదానం చేయించేందుకు వేరే వ్యక్తి బైక్పై బ్లడ్బ్యాంకుకు.. బైక్ ఇచ్చి వస్తానని బయలుదేరిన భరత్.. హనుమకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలో ప్రమాదం మృతుడు సూర్యాపేట జిల్లావాసి -
బాలల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే చర్యలు
వరంగల్ సిటీ క్రైమ్ స్టేషన్ ఏసీపీ పి.సదయ్యహన్మకొండ: బాలల అభివృద్ధికి అటంకం కలిగించే వారిపై చర్యలు తప్పవని, చట్ట ప్రకారం శిక్షలు పడేలా చూస్తామని వరంగల్ సిటీ క్రైం స్టేషన్ ఏసీపీ పి.సదయ్య అన్నారు. బుధవారం హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్లో ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ, వరంగల్ పోలీస్ కమిషనరేట్ యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ యూనిట్ ఆధ్వర్యంలో పోలీస్, ఇతర శాఖల అధికారులకు మానవ అక్రమ రవాణ నిర్మూలన, బాలలపై హింసను నిరోధించడంపై శిక్షణ నిర్వహించారు. ఏసీపీ పి.సదయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. జూలైలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పరిస్థితుల్లో ఉన్న బాలలు, బాల కార్మికులు, చదువు మానేసిన, భిక్షాటన చేసే, వివిధ రకాలుగా హింసకు, దోపిడి గురైన 314 బాలలను రిస్క్ చేసి వారిని సంరక్షించినట్లు తెలిపారు. ఈసందర్భంగా జూలైలో ఆపరేషన్ ముస్కాన్లో రెస్క్యూ చేసి బాలలను రక్షించిన పోలీసు, ఇతర శాఖల అధికారులకు ప్రశంస పత్రాలు అందించారు. ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ రమేశ్, వరంగల్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ కె.వసుధ, జనగామ సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ఉప్పలయ్య, ఆయా సంస్థల ప్రతినిధులు ఫాదర్ కోసి, డాక్టర్ ఆనంద్, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ కో–ఆర్డినేటర్స్ ఎర్ర శ్రీకాంత్, బత్తుల కరుణ, సిబ్బంది ఇక్బాల్ పాపా, ఎం.అజయ్ కుమార్ పాల్గొన్నారు. -
చేయూత దరఖాస్తు గడువు పెంపుపై హర్షం
● మహిళా సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు గుంటిపల్లి రేణుకధర్మసాగర్ : చేయూత పెన్షన్ల దరఖాస్తు గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించడం పట్ల రాష్ట్ర మహిళా సర్పంచుల ఫోరం హర్షం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహిళా సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు గుంటిపల్లి రేణుక సోమవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామాలలో సర్పంచులు వినియోగించుకోవాలని కోరారు. సదరన్ క్యాంపుల ద్వారా మండల రెవెన్యూ కార్యాలయాల ద్వారా, సంబంధిత కార్యాలయాలనుంచి తగు ధ్రువపత్రాలు తీసుకొని నిర్ణీత గడువులోగా ఆన్లైన్ చేసేలా అధికారులకు సహకరించాలని పేర్కొన్నారు. గ్రామాలలో అర్హులైన ప్రతీ ఒక్కరికి పెన్షన్ ఇప్పించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. దరఖాస్తు గడువు పెంపు అంశం పేదలపై ముఖ్యమంత్రి కనబరుస్తున్న చిత్తశుద్ధికి నిదర్శనంగా పేర్కొన్నారు. -
కమిషనరేట్లో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్ శ్వేత సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.శ్రీనివాస్ వీఆర్ నుంచి స్టేషన్ ఘన్పూర్, జి.వేణు స్టేషన్ ఘన్పూర్ నుంచి సీఐ రఘునాథపల్లి, ఎ.శ్రీనివాస్ రఘునాథపల్లి నుంచి ఎస్బీ వరంగల్, పి.దేవేందర్ టాస్క్ఫోర్స్ నుంచి సీఐ నర్మెట్ట, టి.రవికుమార్ పీటీసీ వరంగల్ నుంచి మహిళా పోలీస్ స్టేషన్–2, ఎ.సువర్ణ మహిళా పోలీస్ స్టేషన్ నుంచి సీసీఎస్, పి.మంగిలాల్ టాస్క్ఫోర్స్ నుంచి అటాచ్డ్ మిల్స్కాలనీ, భరత్ సుమన్ సీఐ పాలకుర్తి, వి.జానకీరామ్రెడ్డి పాలకుర్తి నుంచి ఎస్బీ వరంగల్, టి.కిరణ్ పీసీఆర్, ఎ.ప్రవీణ్కుమార్ వీఆర్ వరంగల్ నుంచి పరకాల, వి.క్రాంతికుమార్ పరకాల నుంచి టాస్క్ఫోర్స్, జి.బాబులాల్ టాస్క్ఫోర్స్ నుంచి ఆత్మకూరు, ఆర్.సంతోశ్ ఆత్మకూరు నుంచి పర్వతగిరి సర్కిల్, బి.రాజగోపాల్ పర్వతగిరి నుంచి టాస్క్ఫోర్స్, కె.శ్రీను వీఆర్ వరంగల్ నుంచి ఎల్కతుర్తి, పి.రమేశ్ ఎల్కతుర్తి నుంచి మహిళా పోలీస్ స్టేషన్–1, కె.సూర్యప్రసాద్ మహిళా పోలీస్ స్టేషన్–1 నుంచి సీటీసీ వరంగల్, కె.సాయిరమణ వీఆర్ వరంగల్ ఎస్బీ వరంగల్, వై.సంజీవ్రావు సీసీఆర్బీ వరంగల్ నుంచి సీఐ వర్ధన్నపేట, కె.శ్రీనివాస్రావు వర్ధన్నపేట నుంచి సీసీఆర్బీ వరంగల్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మొత్తం కమిషనరేట్ పరిధిలో 22 మంది ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. ఒకేసారి 22 మందికి స్థానచలనం ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్ శ్వేత -
వినతులు త్వరగా పరిష్కరించేలా చర్యలు
● హనుమకొండ అదనపు కలెక్టర్ రవి ● ప్రజావాణిలో 275 దరఖాస్తులు స్వీకరణహన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి అధికారులను అదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ శేషాద్రి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్తో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ.. దరఖాస్తులు పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. జిల్లా, ఆర్డీఓ, ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 275 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి న్యూశాయంపేట: ప్రజావాణిలో అందించే దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వరంగల్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వైవీ గణేశ్ తెలిపారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినతులు సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 136 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. వరంగల్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో రెండు దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఆర్డీఓ నాగపద్మజ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వినతులు ఇలా.. ● నా వాటాకు సంబంధించిన భూమిని అత్తామామ, మరిది కుమారులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఖిలావరంగల్ మండలం వసంతాపూర్కు చెందిన కె. కవిత వినతిపత్రం అందించారు. ● వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధి 37, 38 డివిజన్ పరిధి ఖిలావరంగల్ పడమర కోట ప్రాంతంలో తాగునీటి ఎద్దడిని నివారించాలని అఖిల పక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో విన్నవించారు. ● ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని 16వ డివిజన్కు చెందిన గొర్రె అరుణ కోరారు. ● హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రెడ్డిపాలేనికి ఎనిమిది నెలల నుంచి గ్యాస్ సరఫరా కావడం లేదని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. -
మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
హనుమకొండ uవరంగల్ uజనగామ uములుగు uమహబూబాబాద్ uభూపాలపల్లి uఆరు జిల్లాల్లోని పాఠశాలలకు రూ.643.20 లక్షల నిధులు ● జీరో నుంచి 10 మంది విద్యార్థులుంటే కేటాయింపుల్లేవువిద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లకు గిరిజన సంక్షేమశాఖ పాఠశాలలకు 2026–27 సంవత్సరానికి కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ మంజూరు చేస్తూ ఇటీవల రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలకు, పీఎంశ్రీ పాఠశాలలకు, జీరో నుంచి 10 మధ్య విద్యార్థుల నమోదు ఉన్న పాఠశాలలకు ఈ నిధులు మంజూరు చేయలేదు. పాఠశాలల వారీగా నిధులు ఒకటినుంచి 30 మంది విద్యార్థులున్న పాఠశాలలకు రూ.10 వేల చొప్పున, 31 నుంచి 100 మంది విద్యార్థులుంటే రూ.25 వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.50 వేలు, 251 నుంచి 1,000 మంది విద్యార్థులుంటే రూ.75 వేలు, 1,000పైన విద్యార్థులుంటే రూ.లక్ష చొప్పున నిధులు కేటాయించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలకు మొత్తం రూ.643.20 లక్షలు గ్రాంటు నిధులు మంజూరు చేశారు. ఈనిధులు వేటికి వినియోగించాలంటే.. ● పాఠశాలలకు అవసరమైన స్టేషనరీ చాక్పీస్లు, వైట్ పేపర్లు, రిజిస్టర్లు తదితరాలు సమకూర్చుకోవడం పరీక్షల నిర్వహణకు వినియోగించుకోవచ్చు. ● స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగల నిర్వహణకు వినియోగించుకోవచ్చు. ● పాఠశాలలో ఇంటర్నెట్ చార్జీలకు వినియోగించుకోవచ్చు. ● కంప్యూటర్లు, ప్రొజెక్టర్ కే–యాన్ టీవీ, తదితర పరికరాల మరమ్మతులకు వినియోగించుకోవచ్చు. ● తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ వంటి చిన్న చిన్న మరమ్మతులకు వినియోగించుకోవచ్చు. ● తాగునీటి సదుపాయం కల్పించుకునేందుకు కూడా ఈగ్రాంట్లో 10 శాతం మొత్తాన్ని స్వచ్ఛత, యాక్షన్ప్లాన్లో భాగంగా చేతులు కడుక్కునేందుకు లిక్విడ్ సోప్, టాయిలెట్ శుభ్రపర్చే సామగ్రి తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ● దివ్యాంగ విద్యార్థులున్న పాఠశాలల్లో, పాఠశాల ఆవరణలో సురక్షితమైన అవరోధాలు లేని ప్రవేశం కోసం రెయిలింగ్ ఇతర చిన్న సదుపాయాల కోసం గ్రాంటు నుంచి నిధులు వినియోగించుకోవచ్చు. ● పాఠశాలల్లో ఆవరణను క్రమం తప్పకుండా శుభ్రపర్చాలి. శానిటైజ్ చేయాలి. తగిన వెంటిలేషన్లో డిస్ ఇన్స్పెక్ట్ చేయాలి ● సబ్బు, హ్యాండ్ శానిటైజర్, క్లోరిన్ సొల్యూషన్ ఇతర శుభ్రపర్చే సామగ్రిని ఎల్లప్పుడూ నిల్వ ఉంచాలి. ● గ్రాంట్ వినియోగానికి సంబంధించి పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (ఏఏపీసీ) తీర్మానం చేసి రికార్డుల్లో పేర్కొనాలి. ● గ్రాంటును మార్గదర్శకాలకు అనుగుణంగా సక్రమంగా వినియోగించే బాధ్యత హెచ్ఎం/ ప్రిన్సిపాళ్లదే.. మొత్తం పాఠశాలలుమొత్తం గ్రాంటు (రూ.లక్షల్లో) -
వడివడిగా భూ సర్వే
సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, దొంతి మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పక్కన మంత్రి ధనసరి సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యే మురళీనాయక్సాక్షి, మహబూబాబాద్ : ‘ఏ గ్రామంలో చూసినా భూ సమస్య కనిపిస్తోంది. భూమి ఒకరికి, హక్కు మరొకరికి అన్నట్లు ఉంది. వీటన్నింటికి పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిన భూ సర్వేను వడివడిగా చేయాలి. ఈ ప్రక్రియను తహసీల్దార్లనుంచి కలెక్టర్ల వరకు పర్యవేక్షించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా వారిపై వేటు తప్పదు’ అని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెవెన్యూ, రీ–సర్వే, రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై మహబూబాబాద్ ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం ఆయన మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, గృహ నిర్మాణ శాఖల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల నిర్మాణాలు పూర్తిచేయాలి జూలై 7న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నర్సంపేట, పరకాల, ములుగు, జనగామ, భూపాలపల్లి ప్రాంతాల్లో ఐదు సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాలు, వరంగల్లో ఒక డీఐజీ కార్యాలయం మంజూరైనట్లు అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లా పలివేల్పులలో డీఐజీ కార్యాలయం కోసం ఎకరం 20 గుంటల ఎస్సారెస్పీ స్థలాన్ని కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. పరకాలలో నూతన భవన నిర్మాణం 7 శాతం పూర్తయిందని తెలిపారు. భీమదేవరపల్లి, పరకాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు హౌసింగ్ శాఖకు అప్పగించాలని నిర్ణయించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం వద్దు జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పురోగతి ఆశించిన స్థాయిలో లేదని మంత్రి పొంగులేటి అసంతృప్తి వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లాలో 4,600 ఇళ్లు మంజూరు కాగా, 3,946 ఇళ్లకు ప్రాసెస్ పూర్తయినప్పటికీ ఇప్పటివరకు 854 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. ములుగు జిల్లాలోనూ ఇళ్ల పూర్తిశాతం 50 శాతానికిలోపే ఉందని పేర్కొన్నారు. పెండింగ్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి సెప్టెంబర్ 15నాటికి గరిష్ట సంఖ్యలో పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశించారు. రెండో విడతలో ప్రతీ నియోజకవర్గానికి 2వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, ఎంపీలు బలరాంనాయక్, కడియం కావ్య, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, మురళీనా యక్, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, యశస్వినిరెడ్డి, గ్రంథాల య చైర్మన్లు, వెన్నం శ్రీకాంత్ రెడ్డి, మీసాల ప్రకాశ్, లాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ లోకేష్ కుమార్, రెవెన్యూ, రిజిస్టేషన్, స్టాంప్స్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్గాంధీ హన్మంతు, భూ భారతి డైరెక్టర్, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి గౌతమ్, కలెక్టర్లు స్నే హ శబరీష్, సత్యశారద, చాహత్ బాజ్పాయ్, సందీప్కుమార్ ఝా, బోర్ఖడే హేమంత్ సహదేవరావు, రాహుల్ శర్మ, అన్ని జిల్లాల అధికారులున్నారు. తహసీల్దార్లనుంచి కలెక్టర్ల వరకు పర్యవేక్షించాలి ప్రతీ అంగుళం శాసీ్త్రయంగా ఉండాలి నిర్లక్ష్యం చేసే అధికారులపై వేటు తప్పదు నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లలో మొదటి ప్రాధాన్యం ఉమ్మడి జిల్లా సమీక్షలో రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హాజరైన మంత్రి సీతక్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈసందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ప్రతీ జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను లక్ష్యంగా ఎంపిక చేసి మొదటి విడత భూ సర్వేను నవంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతీ అంగుళం భూమిని వ్యవసాయ, వ్యవసాయేతర, ఆబాదీ ఆస్తుల వా రీగా శాసీ్త్రయంగా సర్వే చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 31 నాన్–కెడస్ట్రల్ గ్రామాలకుగాను 18 గ్రామాల్లో రీసర్వే పనులు ప్రారంభమయ్యాయని, వీటిలో 5 గ్రామాల్లో సర్వే పూర్తయిందని, మరో 13 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయని అధి కారులు మంత్రికి వివరించారు. మిగిలిన 13 గ్రా మాల్లో, భూపాలపల్లి జిల్లాలో 8, జనగామ జిల్లాలో 5 గ్రామాల్లో సర్వే పనులను తక్షణమే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. సర్వే గ్రామాలకు తహసీల్దార్లు ప్రతీరోజు, నెలలో ఐదు రోజు లు ఆర్డీఓలు, మూడుసార్లు కలెక్టర్లు పరిశీలించాలని, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని చెప్పారు. క్షేత్రస్థాయికి వెళ్లకుండా సర్టిఫికెట్లు జారీ చేయడం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు.22–ఏ భూముల విషయంలో జాగ్రత్త ప్రతీ జిల్లాలో 22–ఏ కింద ఉన్న భూములు ఏవి? వాటిలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ఎన్ని? ఇతర వివరాలు ఏంటి అనే అంశాలను నాలుగు కాలమ్స్తో కూడిన సమ గ్ర నివేదికగా సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. సర్వేనంబర్ల వారీగా పూర్తి వివరాలను రెండు రోజుల్లో అధికారులకు సమర్పించాలని స్పష్టం చేశారు. 22–ఏ జాబితాలో పొరపాటున చేరిన రైతుల భూముల వివరాలను పరిశీలించి, అర్హత ఉన్న భూములను జాబితా నుంచి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అటవీ, రెవెన్యూ భూ ముల సరిహద్దు వివాదాలను శాశ్వతంగా పరి ష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా సమావేశమై, శాసీ్త్రయ పద్ధతుల్లో భూముల కొలతలు చేపట్టి సరిహద్దులు నిర్ధారించాలని సూచించారు. -
సంచార జాతుల సమస్యలకు ప్రాధాన్యం
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: సంచార జాతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హామీ ఇచ్చారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జె.రంగారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో సంచార జాతుల విముక్తి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు కలెక్టర్ చాహత్, అదనపు కలెక్టర్ రవి, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పి ంచారు. కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి సహాయ అధికారులు ఎస్.లక్ష్మణ్, ఆర్.సంపూర్ణ, పరిపాలనా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రీసర్వే వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలి హనుమకొండ జిల్లాలో చేపట్టిన భూముల రీ సర్వే వివరాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నమోదు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని భూములు, కొలతల శాఖ కార్యాలయంలో జిల్లాలోని 70 గ్రామాల్లో చేపట్టిన రీ సర్వే వివరాలు సాఫ్ట్వేర్లో నమోదు చేస్తున్న ప్రక్రియను ఆమె పరిశీలించారు. రీసర్వేను ఐదు దశల్లో చేపట్టినట్లు అధికారులు వివరించారు. -
విఫల పాలనపై బీఆర్ఎస్ సమరభేరి
మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హన్మకొండ: కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్య పాలనపై బీఆర్ఎస్ సమరభేరి చేపట్టనుందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ వైఫల్యాలపై పోరుబాటకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2 నుంచి వారం పాటు కాంగ్రెస్ మోసాలపై బీఆర్ఎస్ పోరుబాట చేపట్టనుందని వివరించారు. వారం పాటు వినూత్న నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నాయకులు తాళ్లపల్లి జనార్దన్గౌడ్, వద్దిరాజు గణేశ్, పులి రజనీకాంత్, బొంగు అశోక్, సోదా కిరణ్, కమరున్నీసా బేగం, ఇమ్మడి లోహిత, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
వరంగల్ క్రైం: హైదరాబాద్లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేపై కులవివక్ష జరిగినట్లు ఆరోపిస్తున్న ఘటనకు బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని వరంగల్, హనుమకొండ జిల్లాల కాంగ్రెస్ ఎస్సీ విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతను కలిసి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కులం పేరుతో అవమానించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల ఎస్సీ విభాగం నాయకులు ఆరూరి సాంబయ్య, చిలువేరు శ్రీనివాస్, నాయకులు పెరుమాండ్ల రామకృష్ణ, అర్షం అశోక్, చిరంజీవి, రవి, రాజభద్రయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. విద్యారణ్యపురి: విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలను పెంచాలని హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ కోరారు. సోమవారం సాయంత్రం డీఈఓ కార్యాలయంలోని డీసీఈబీ భవనంలో ఎఫ్ఎల్ఎన్పై ఎంఈఓలకు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాల అమలు తీరుపై స్కూల్ కంప్లెక్స్ హెచ్ఎంలు ప్రతినెలా రెండుసార్లు, ఎంఈఓలు ఒకసారి సందర్శించాలని సూచించారు. ఎఫ్ఎల్ఎన్ అమలులో జిల్లాలో ముందు వరుసలో ఉండేలా కృషి చేయాలన్నారు. ఎఫ్ఎల్ఎన్పై రాష్ట్ర స్థాయి పరిశీలనకు సాయికుమార్ ఎంఈఓలకు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలకు ఓరియెంటేషన్లో పలు సూచనలిచ్చారు. సమావేశంలో జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ డాక్టర్ బండారు మన్మోహన్, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ బి.మహేశ్, కమ్యూనిటీ మొబిలైజింగ్ కో–ఆర్డినేటర్ సుమాదేవి తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో సోమవారం సంకటహర చతుర్థి పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్, వేముగంటి దత్తు శర్మ ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, నీలిమ దంపతులు పాల్గొని గణపతికి, రుద్రేశ్వరస్వామికి అభిషేకం చేశారు. దాతల సహకారంతో అన్నప్రసాదాల వితరణ జరిగింది. రుద్రేశ్వరసేవా సమితి సభ్యులు పులి రజనీకాంత్, వెంకటేశ్వరసేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ చౌరస్తా: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ విజ్ఞఫ్తి మేరకు 28 రోజులుగా చేస్తున్న శాంతియుత సమ్మెను ఆయుష్ విద్యార్థులు సోమవారం విరమించారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. -
అర్వింద్.. స్థాయి మరిచి మాట్లాడొద్దు..
హన్మకొండ చౌరస్తా: ‘నీ వెకిలి చేష్టలతో స్థాయి మరిచి సీఎంపై మాట్లాడుతున్నావు. కర్మకాలి నువ్వు హనుమకొండకు వస్తే నీ గుండు గీయిస్తా బిడ్డా’ అంటూ నిజామబాద్ ఎంపీ అర్వింద్పై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హనుమకొండలోని డీసీసీ భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘పీసీసీ చీఫ్గా మీ నాన్న ఉన్నప్పుడు మీరు బ్లాక్ టికెట్లు అమ్మారు.. మరిచిపోయారా’ అని ప్రశ్నించారు. రామాలయాన్ని రూ.2 కోట్లకు కొని రూ.16 కోట్లకు అమ్ముకున్న చరిత్ర, పేపర్ల లీకేజీతో దోచుకున్న చరిత్ర బీజేపీదే అన్నారు. ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు హనుమకొండకు హరీశ్ రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సిద్దిపేటను బాగు చేసుకోవడానికి వరంగల్ను నాశనం చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ వచ్చి అండర్గ్రౌండ్ డ్రెయినేజీ అన్నరు.. పోయిండ్లు, ఇప్పుడేమో దొంగ ఏడుపులు, సింపతి కోసం ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతిని ప్రశ్నించినందుకు తనపై 54 కేసులు బనాయించారన్నారు. నగరాభివృద్ధిపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చర్చకు రావాలని సవాల్ విసిరారు. సమావేశంలో టీపీసీసీ కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, నాయకులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, అర్శం అశోక్, బంక సరళ, రహిమున్నీసా తదితరులు పాల్గొన్నారు. బ్లాక్ టికెట్లు అమ్ముకున్న చరిత్ర మీదే ఉద్యోగులకు హరీశ్ సంఘీభావం తెలపడం హాస్యాస్పదం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
త్వరితగతిన పరిష్కారం చూపండి
గ్రేటర్ వరంగల్ కమిషనర్ వెంకన్న వరంగల్ అర్బన్: ప్రజాఫిర్యాదుల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యమని, దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా, సత్వరమే పరిష్కరించాలని బల్దియా కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు. గతవారం ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై విభాగాల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా, ప్రజావాణికి 72 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. టౌన్ ప్లానింగ్కు 27, ఇంజనీరింగ్ విభాగానికి 21, హెల్త్ అండ్ శానిటేషన్కు 9, రెవెన్యూ 11, నీటి సరఫరా 3, హార్టికల్చర్ 1 చొప్పున నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్ఈ రాజ్కుమార్, సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్బాబు, హార్టికల్చర్ అధికారి లక్ష్మారెడ్డి, పన్నుల అధికారి రామకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు. -
జలం.. జర పదిలం
సాక్షిప్రతినిధి, వరంగల్: నీటితో కళకళలాడాల్సిన చెరువులు, కుంటలు విషాదాలు నింపుతున్నాయి. ఈత రాకపోవడం, నీటి లోతు తెలియకపోవడం, చెరువుల చుట్టూ రక్షణ చర్యలు లేకపోవడం.. కారణం ఏదైనా నిండు ప్రాణాలను నీటిగుంతలు బలితీసుకుంటున్నాయి. తాజాగా ములుగు మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం ఇద్దరు అన్నదమ్ములు కుంటలో పడి మృతి చెందడం ఉమ్మడి వరంగల్లో చెరువులు, కుంటల వద్ద భద్రతా చర్యలపై మరోసారి ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. తమ్ముడిని కాపాడబోయి అన్న.. ములుగు మున్సిపాలిటీ పరిధి గణేశ్లాల్పల్లిలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని మొండి కుంటలో పడి మాలోతు వినయ్ (15), రాజేశ్ (12) అన్నదమ్ములు మృతి చెందారు. మంగపేట మండలం కమలాపురానికి చెందిన వీరు రాఖీ పౌర్ణమి సందర్భంగా తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వచ్చారు. ఆదివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు కుంటలో పడిపోయారు. ఇద్దరూ నీటిలో మునిగిపోవడంతో స్థానికులు బయటకు తీసి ములుగు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నగురిజాలలో ఘటన విషాదకరం.. 2022 మార్చి 13న నర్సంపేట మండలం చిన్నగురిజాలలో జరిగిన ఘటన మరింత విషాదకరం. పొలం పనులు ముగించుకుని కాళ్లు, చేతులు కడుక్కునేందుకు చెరువు వద్దకు వెళ్లిన కృష్ణమూర్తి (65) ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు మనవడు దీపక్ అలియాస్ లక్కీ (12) నీటిలోకి వెళ్లాడు. ఇద్దరూ మునిగిపోతుండడాన్ని చూసిన నాగరాజు (35) వారిని కాపాడేందుకు చెరువులోకి దూకాడు. చివరకు ముగ్గురూ నీటిలో మునిగి మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన తాత, కొడుకు, మనవడు ఒకేసారి మృత్యువాత పడడం అప్పట్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చేపల వేటకు వెళ్లి.. ముగ్గురు చిన్నారులు 2020 జనవరి 30న వరంగల్ జిల్లా గొర్రెకుంట శివారులోని కట్టమల్లన్న చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. బరిగెల రుచిత (7), ప్రణయ్పాల్ (9), రణధీర్ (11) మృతి చెందారు. కోటచెరువులో.. 2023 మార్చి 31న వరంగల్ నగరంలోని ఏనుమాముల ప్రాంతం కోటచెరువు వద్ద మరో విషాదం జరిగింది. బహిర్భూమికి వెళ్లిన కిరణ్సింగ్ (12), దీపక్సింగ్ (9) ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు. స్థానికులు వారిని బయటకు తీసి ఎంజీఎం ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హెచ్చరికల బోర్డులెక్కడ? ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, నీటి గుంతలు విస్తారంగా ఉన్నాయి. వర్షాకాలంలో నీరు చేరితే ప్రమాదం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా బహిర్భూమికి వెళ్లే సమయంలో, చేపలు పట్టేందుకు వెళ్లినప్పుడు, పశువులను నీటిలో నుంచి బయటకు తీసే క్రమంలో, స్నానానికి వెళ్లినప్పుడు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. చెరువులు, కుంటల వద్ద హెచ్చరిక బోర్డులు, ప్రమాద ప్రాంతాల గుర్తింపు, రక్షణ కంచెలు, అవసరమైన చోట్ల గస్తీ వంటి చర్యలు లేకపోవడం వల్ల ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు స్పందిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈత రాక.. లోతు తెలియక చిన్నారులు ప్రమాదాలకు గురవడానికి కారణం ఈత రాకపోవడం, ఒకరు నీటిలో పడితే వారిని రక్షించే క్రమంలో మరొకరు కూడా మునిగిపోయిన ఘటనలు అనేకం.చెరువులు, కుంటల్లో పలువురి జలసమాధి! పిల్లలు, రైతులు, కాపరులు.. ఒకరిని కాపాడబోయి మరొకరు ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం నింపిన పలు ఘటనలుచెరువులు, కుంటల వద్ద ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, లోతైన ప్రాంతాల వద్ద కంచెలు ఏర్పాటు చేయడం, గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పాఠశాలలు, గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థలు కలిసి చిన్నారులు చెరువుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులకు, విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నీరు జీవనాధారం.. కానీ, అప్రమత్తత లేకుంటే అదే నీరు ప్రాణాంతకంగా మారుతోంది. ఉమ్మడి వరంగల్లో వరుసగా చోటుచేసుకుంటున్న జల ప్రమాదాలు దీనికి నిదర్శనం. -
టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
విద్యారణ్యపురి: ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం పీఆర్టీయూ టీఎస్ హనుమకొండ జిల్లాస్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం లేదని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన రూ.14 వేల బిల్లులు చెల్లించాలని, 50 శాతం ఫిట్మెంట్తో నూతన పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని పీఆర్టీయూ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు వివరించారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మంద తిరుపతిరెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఫలిత శ్రీహరి నివేదికను ప్రవేశపెట్టారు. నివేదికపై చర్చించి సభ్యులు ఆమోదించారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నియమావళి కమిటీ చైర్మన్ రేగూరి సుభాకర్రెడ్డి, పీఆర్టీయూ ఉమ్మడి జిల్లా బాధ్యులు, ఉపేందర్రెడ్డి, రవీందర్రెడ్డి, పట్టాభి మహేందర్, మహిపాల్రెడ్డి, సతీశ్రెడ్డి, కిరణ్, యాకూబ్రెడ్డి, తిరునగరి శ్రీనివాస్ మహిళా అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షురాలు సుమాదేవి, బాధ్యులు అనురాధ మాట్లాడారు. హనుమకొండ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక పీఆర్టీయూటీఎస్ హనుమకొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఈ సమావేశంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఫలిత శ్రీహరి, ప్రధాన కార్యదర్శిగా ఎడ్ల ఉపేందర్రెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా నల్లగొండ జిల్లా పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు కాలం నారాయణరెడ్డి, మేకల జానారెడ్డి వ్యవహరించారు. జిల్లాలోని 14 మండలాల సంఘం బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రేపు పీఆర్టీయూ మహాధర్నా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి -
వనదేవతలకు మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులతో మేడారం పరిసరాలు సందడిగా మారాయి. ముందుగా జంపన్నవాగుకు చేరుకున్న భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం(బెల్లం), చీర సారె, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కొందరు భక్తులు తలనీలాలు సమర్పించారు. దర్శనం అనంతరం భక్తులు అటవీ ప్రాంతంలో వంటావార్పు చేసుకున్నారు. -
సోమవారం శ్రీ 31 శ్రీ ఆగస్టు శ్రీ 2026
● నాటి తప్పులతో నగర ప్రజలకు తప్పని ఇబ్బందులు ● తొలగించాలని బల్దియా గ్రీవెన్స్లో వేలాది ఫిర్యాదులు ● పట్టించుకోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఉన్నతాధికారులువరంగల్ లేబర్ కాలనీలోని 18వ డివిజన్లో 16–12–97/1 ఇంటి నంబర్కు నల్లా లేదు. కానీ, బిల్లు రూ.12వేలు ఉంది. బిల్లు మాఫీ చేయాలని యజమాని మాధవి పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఇంజనీర్లు పట్టించుకోవడం లేదు. వరంగల్ చింతల్లోని 16–11–371/1 ఇంటి నంబర్లో నల్లా కనెక్షన్ లేకున్నా రూ.7వేల బిల్లు వేశారు. బిల్లు రద్దు చేయాలని మహ్మద్ రజీయొద్దీన్ అధికారులను కోరారు.వరంగల్ అర్బన్: ఒకవైపు నల్లా మీటర్లు లేని వాణిజ్యసంస్థలు, అపార్ట్మెంట్లు, మరోవైపు అక్రమ కనెక్షన్లతో గ్రేటర్ వరంగల్ ఆదాయానికి గండి కొడుతున్న జలగలను చూసీచూడనట్లుగా విడిచిపెడుతున్న ఇంజనీర్లు.. ఇంకో వైపు లేని నల్లాలకు మాత్రం బిల్లులు పంపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నాడు మెప్మా రిసోర్స్ పర్సన్స్ (ఆర్పీలు) చేసిన తప్పిదాలు సరిచేసుకోకుండా.. వారు అనుకున్నదే తడవుగా బిల్లులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో వినియోగదారులు పరేషాన్ అవుతున్నారు. తప్పు ఎక్కడ జరిగింది? అమృత్–01 పథకంలో భాగంగా నగరంలో రూ.630,36 కోట్లు తాగునీటి కోసం కేటాయించారు. 33 ఈఎస్ఆర్లు, డిస్ట్రిబ్యూషన్ పైప్లైన్లు, అంతర్గత పైప్లైన్లు, వాల్వ్లు ఏర్పాటు చేశారు. నగరంలో 50 శాతానికిపైగా కాలనీల్లో పైప్లైన్లు నిర్మించారు. గతంలో ఉన్న పైప్లైన్లకు నల్లాలు ఉన్నాయి. వాటికి నీటి సరఫరా బంద్ చేశారు. అమృత్ పైప్లైన్లకు కొత్త నల్లాలు పెట్టి, మీటర్లు ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కొత్త నల్లా కనెక్షన్ల పైపులైన్లకు బిగించిన నల్లాలు, ఇంటి నంబర్లను క్షేత్రస్థాయిలో వెళ్లి గతంలో నల్లా ఉందా? లేకపోతే కొత్తగా ఏర్పాటు చేశారని పరిశీలించే బాధ్యత మెప్మా ఆర్పీలకు అప్పగించారు. అందుకు కొంత సొమ్ము అందజేసే ఒప్పందం చేసుకున్నారు. కొందరు ఆర్పీలు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఉన్నా లేనట్లుగా బల్దియా వెబ్సైట్లో నల్లా కనెక్షన్లు నమోదు చేశారు. నల్లా కనెక్షన్ అసలే తీసుకొని ఇంటి నంబర్లకు, నల్లా ఉన్నప్పటికీ అదనపు కనెక్షన్ జోడించారు. ఇళ్లకే కాదు అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లకు నల్లా కనెక్షన్లు ఉన్నట్లు చూపడం దారుణం. దీంతో నగర వ్యాప్తంగా సుమారు 8వేల ఇళ్లకు అదనపు కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. గత ఐదేళ్లుగా కనెక్షన్ లేని ఇళ్లకు, ఒక ఇంటి నంబర్పై రెండేసి బిల్లుల బకాయిలను లెక్కలతో చూపిస్తూ నోటీసులు జారీ చేస్తున్నారు. పనితీరే కొలమానంగ్రేటర్ వరంగల్ నగరంలో నల్లా లేకున్నా బిల్లులు రంగశాయిపేటలోని 19–9–449/2 ఇంటి నంబర్కు రెండు నల్లాలు ఉన్నాయి. ఒకదానిని తొలగించాలని దొడ్డ శ్రీనివాస్ పలుమార్లు ఇంజనీర్లను వేడుకున్నా స్పందించడం లేదు. బకాయి చార్జీలు నెలనెల వస్తున్నాయి. నల్లా కనెక్షన్ లేదు. బిల్లు రూ.7,200 వేశారని హనుమకొండ లష్కర్బజార్కు చెందిన విజయలక్ష్మి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదు. గుండ్లసింగారంలో 39–1–18 ఇంటి నంబర్కు నల్లా కనెక్షన్ లేకున్నా బిల్లు వస్తోందని మినహాయించాలని రవీందర్రెడ్డి కోరారు. నల్లా కనెక్షన్ ఇవ్వకముందే, నల్లా లేకున్నా, ఒక ఇంటికి ఒక కనెక్షన్ ఉండగా, అదనపు కనెక్షన్ ఇలా.. లేని నల్లాలకు బిల్లులు మంజూరు చేశారని తొలగించండి మహాప్రభో అంటూ వినియోగదారులు బల్దియా ప్రధాన కార్యాలయం గ్రీవెన్స్లో ప్రతి వారం పెద్ద ఎత్తున దరఖాస్తులు అందిస్తున్నారు. గతంలో ఉన్న నల్లా కనెక్షన్, అదనపు నల్లా, లేని నల్లాలకు బిల్లులు చేస్తే తొలగిస్తామని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. అయినప్పటికీ కొంతమంది ముందుకొచ్చి బిల్లులు చెల్లించినా కూడా రద్దు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. కానీ, బల్దియా ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో విచారణ చేయడంలో తాత్సరం చేస్తున్నారు. లేని కనెక్షన్లు తొలగించాలని సుమారు 4వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రతి నెల నల్లా బిల్లు రూ.150 చొప్పన పెరిగి తడిసిమోపెడవుతోంది. కానీ, ఇంజనీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ప్రజలకు శాపంగా మారుతోందని ఆరోపణలు వస్తున్నాయి. లేని నల్లా కనెక్షన్లను తొలగించాలని బల్దియా కమిషనర్, ఎస్ఈకి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అదనపు నల్లా కనెక్షన్లు తొలగించాలని దరఖాస్తులు ప్రతివారం అందుతున్నాయి. పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయాలని ఆదేశాలిచ్చాను. క్షేత్రస్థాయిలో ఏఈలు, లైన్మెన్లు విచారణ చేసి రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటా. – రాజ్కుమార్, బల్దియా ఎస్ఈ -
సాంకేతిక నైపుణ్యంతో మెరుగైన సేవలు
సాంకేతికంగా నైపుణ్యం కలిగిన మానవవనరులను తయారు చేయడం ద్వారా వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందుతాయి. ఉద్యోగుల పనితీరు మెరుగుదల, క్షేత్రస్థాయి పనుల నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, వినియోగదారులకు పారదర్శక సేవల కోసం వంద మార్కుల విధానం తీసుకొచ్చాం. తద్వారా విద్యుత్ అధికారులు, ఉద్యోగులు పోటీతత్వంతో మరింత మెరుగైన సేవలు అందిస్తారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. – కర్నాటి వరుణ్రెడ్డి, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ● -
ప్రయాణికుల వసతులపై దృష్టి
కాజీపేట రూరల్/ఖిలా వరంగల్: కాజీపేట రూరల్ : సికింద్రాబాద్–కాజీపేట మధ్య శుక్రవారం రాత్రినుంచి శనివారం తెల్లవారుజాము వరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీ వాస్తవ సికింద్రాబాద్ నుంచి మణుగూరు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్లో ప్రయాణిస్తూ నైట్ పుట్ప్లేట్ తనిఖీ నిర్వహించారు. కాజీపేట వరకు రైలు ఇంజన్లో తనిఖీలో భాగంగా రైల్వే జీఎం సిగ్నల్స్, వాటి స్పష్టత, ఓవర్హెడ్ ట్రాక్షన్ ట్రాక్ పరిస్థితి, వేగ పరిమితి, హెచ్చరికలు, వేగాలు తదితర వాటిని సమీక్షించారు. రైలు నడుపుతున్న లోకోపైలట్లు, ట్రైన్ మేనేజర్ల పనివిధానం, సిగ్నల్స్ మార్పిడి చేయడంలో మాస్టర్స్ పాయింట్స్మెన్, గేట్మెన్ వంటి మార్గమధ్య సిబ్బంది అప్రమత్తతను గమనించారు. కాజీపేటలో దిగిన ఆయన రోడ్డు మార్గంలో నేరుగా వరంగల్ రైల్వేస్టేషన్కు వెళ్లారు. డీఆర్ఎం గోపాల కృష్ణన్తో కలిసి స్టేషన్లోని ప్లాట్ఫారాలు, ప్రాంగణం, వెయిటింగ్ హాళ్లు పరిశీలించారు. స్టేషన్లో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రయాణికుల సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రత, తాగునీరు, ఇతర మౌలిక వసతుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అమృత్ బారత్స్టేషన్ పథకంలో భాగంగా రూ.25.41 కోట్ల వ్యయంతో చేపట్టిన పనుల్లో ఫుట్ఓవర్ బ్రిడ్జి, అధునిక ప్రవేశ ద్వారం, వెయిటింగ్ హాళ్లు, ప్లాట్ఫామ్స్ షెల్టర్లు, లిప్టులు, ఎస్కలేటర్లను పరిశీలించి..వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం కాజీపేట జంక్షన్కు చేరుకుని ప్రత్యేక రైలులో సికింద్రాబాద్కు తరలివెళ్లారు. కార్యక్రమంలో రెండు స్టేషన్ల మేనేజర్లు ఆగ్గి రవీందర్, వి.సుదర్శన్రావు, డీఓఎం నరేందర్ వర్మ, ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్గౌడ్, వడ్డె నరేష్కుమార్, ఇన్స్పెక్టర్లు జాఫర్, మధు, సిగ్నలింగ్ అధికారి రాంఖీ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ సికింద్రాబాద్–కాజీపేట మధ్య నైట్ పుట్ప్లేట్ తనిఖీ కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ల సందర్శన -
ఆర్టీసీకి గిరాఖీ
హన్మకొండ: రాఖీ పండుగతో టీజీఎస్ ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరింది. వరంగల్ రీజియన్లో రెగ్యులర్ బస్సులతో పాటు వివిధ రూట్లలో ప్రత్యేక బస్సులు నడిపి పెద్ద సంఖ్యలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు రీజియన్ పరిధిలో రెగ్యులర్ బస్సులకు తోడు 386 ప్రత్యేక సర్వీసులు నడిపారు. బస్సులు మొత్తం 12,52,897 కిలోమీటర్లు తిరిగి, 15,44,158 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసి రూ.8,62,41,648 ఆదాయం రాబట్టుకుంది. వరంగల్ ఆర్ఎం భవాని ప్రసాద్ నేతృత్వంలో డిప్యూటీ ఆర్ఎంలు, డిపో మేనేజర్లు ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా డిమాండ్ ఉన్న రూట్లలో అదనపు, ప్రత్యేక బస్సులు సమకూర్చి సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశారు. అధికారులు బస్టాండ్లో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. -
పన్ను బకాయిదారులపై ఆర్ఆర్ చట్టం
● గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న వరంగల్ అర్బన్: పెద్ద మొత్తంలో పన్ను బకాయిలు ఉన్న డిఫాల్టర్లపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో పన్నుల విభాగం సర్కిళ్ల వారీగా శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పన్నుల వసూళ్ల లక్ష్యాలను సర్కిల్, వార్డుస్థాయిలో విభజించి, రోజువారీ పురోగతిని తప్పనిసరిగా పర్యవేక్షించాలని సూచించారు. కొత్త అసెస్మెంట్లు, పెండింగ్ బకాయిలు, వీఎల్టీ, డబుల్ అసెస్మెంట్లు, కమర్షియల్ భవనాలను గుర్తించేందుకు రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం కూల్చిన భవనాల ఇంటి నంబర్లను గుర్తించి పూర్తి వివరాలను సమర్పించాలని పేర్కొన్నారు. పన్ను వసూళ్లను పెంచడానికి త్వరలోనే వార్డు ఆఫీసర్లు బిల్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్లు బిర్రు శ్రీనివాస్, ప్రసన్నరాణి, టీఓ రామకృష్ణ, ఐటీ మేనేజర్ రమేశ్, అధికారులు పాల్గొన్నారు. -
స్పోర్ట్స్ హబ్ దిశగా హనుమకొండ
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దే దిశగా అడుగులు పడుతున్నాయని, క్రీడాకారులు త్వరలోనే తీపి కబురు వింటారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలో పునర్నిర్మించిన స్విమ్మింగ్పూల్, జేఎన్ ఇండోర్ స్టేడియంలోని షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులను శనివారం ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఇండోర్స్టేడియంలో హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ స్పోర్ట్స్ స్కూల్కు సొంత భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏసీపీ జితేందర్రెడ్డి, హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్, తెలంగాణ జూడో అసోసియేషన్ బాధ్యుడు బి.కైలాశ్యాదవ్, వాలీబాల్ సంఘం రాష్ట్ర బాధ్యుడు మర్కాల యాదిరెడ్డి, వరంగల్ క్లబ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్, బ్యాడ్మింటన్ సంఘం జిల్లా కార్యదర్శి రమేష్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, డీఎస్ఏ కోచ్లు పాల్గొన్నారు. క్రీడల అధికారిపై కలెక్టర్ ఆగ్రహం.. ఇండోర్స్టేడియంలో ఏర్పాటు చేసిన సభా వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కలెక్టర్ చాహత్బాజ్పాయ్ ఫొటో స్థానంలో మరో అధికారి ఫొటోను ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. వేదిక పైకి రాగానే ఫొటోను గమనించిన కలెక్టర్ అక్కడే ఉన్న డీవైఎస్ఓ ప్రశాంత్ను పిలిచి ఇదేంటని ప్రశ్నించారు. తనకు ఆ ఫొటోకు ఏమైనా సంబంధం ఉందా అంటూ సీరియస్ అయ్యారు. ఇదిలా ఉండగా ప్రారంభోత్సవ ఉపన్యాసం చేసిన బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి పై అసహనం వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ స్కూల్ పిల్లలు చాలాసేపు నుంచి నిలబడి ఉన్నారు, ప్రసంగాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఫ్లెక్సీలో ఎంపీ ఫొటో లేకపోవడంపై చర్చ.. ప్లెక్సీలో వరంగల్ ఎంపీ కడియం కావ్య ఫొటో లేకపోవడం చర్చకు దారి తీసింది. ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఫొటో లేదన్న విషయం తెలుసుకుని స్విమ్మింగ్ పూల్ వద్దకు వచ్చిన ఎంపీ కావ్య స్టేడియం ప్రారంభోత్సవానికి రాకుండానే వెళ్లిపోయారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు
వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత వరంగల్ క్రైం: వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నిర్వహించే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష 2026కు అయా పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 6నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ అమలులో ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని సూచించారు. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డీజేలతో ఊరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాల్లోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తుతోపాటు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, మహిళా పీజీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఖాళీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాలల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి శనివారం తెలిపారు. ఆర్ట్స్ కళాశాలలో ఎంసీఏ, మహిళా పీజీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏలో సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. టీఎస్ ఐసెట్–2026లో ఉత్తీర్ణత సాధించిన, ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఆయా కళాశాలల్లో ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వివరించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరై ఫీజు చెల్లించి ప్రవేశాలు పొందాలని సూచించారు. స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశాలు పొందే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు రావని తెలిపారు. హన్మకొండ కల్చరల్: ఆలయాల ఆభరణాలు, భూముల విషయంలో దేవాదాయశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ మల్లెల రామకృష్ణారావు ఆదేశించారు. ఈ మేరకు శనివారం హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయాన్ని మల్లెల రామకృష్ణారావు దంపతులు సందర్శించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు, సిబ్బంది ఆయనను ఆలయ మర్యాదలతో స్వాగతించారు. రుద్రేశ్వరస్వామికి పూజలు చేసిన అనంతరం ఆయనకు అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 16 పీరియడ్ల వర్క్లోడ్తో విధులు నిర్వర్తిస్తున్న పార్ట్టైం అధ్యాపకుల ముఖ గుర్తింపు హాజరు నమోదును సోమవారం చేపట్టనున్నట్లు రిజిస్ట్రార్ వి.రామచంద్రం తెలిపా రు. ఉదయం 10–30 నుంచి సాయంత్రం 5 గంటలవరకు యూనివర్సిటీ పరిపాలనా భవనంలోని సెనెట్హాల్లో నమోదు ఉంటుందని తెలిపారు. ప్రతి పార్ట్టైం అధ్యాపకుడు తప్పనిసరిగా ముఖ గుర్తింపు హాజరు కోసం నమోదు చేసుకోవాలని రిజిస్ట్రార్ కోరారు.హన్మకొండ: వరంగల్ సర్కిల్ పరిధిలో 919, హనుమకొండ సర్కిల్ పరిధిలో 98 అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్ అందించినట్లు ఆయా సర్కిళ్ల ఎస్ఈలు ఎ.అనందం, బి.సామ్యానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటార్లు, ఇతర విద్యుత్ పరికరాలు వినియోగించుకునే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. చిన్నారులు వేడి, ఉక్కపోత వంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన వాతావరణంలో ఉండొచ్చని తెలిపారు. -
ఏదైనా వారి కనుసన్నల్లోనే!
వరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగర పాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ)లో పనులు, బిల్లులు కొందరు బడా కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళుతున్నాయా..? లీకేజీల నుంచి మొదలుకొని అభివృద్ధి పనులు కొందరికే దక్కుతున్నాయా..? మధ్య, చిన్న తరహా కాంట్రాక్టర్లకు చోటు లభించడం లేదా..? అధికారులు కూడా పెద్దస్థాయి కాంట్రాక్టర్లను ప్రోత్సహిస్తున్నారా..? అంటే ప్రస్తుతం బల్దియా పనుల్లో జరుగుతున్న తంతు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంజనీర్లకు కొందరు కాంట్రాక్టర్లకు మధ్య ఉన్న అవగాహన ‘ఒప్పందం’ అలాంటిదని, అందుకే కొందరు చేతుల్లో పనులన్నీ వెళ్లడం, పనులు కొంత మేరకు జరిగినా, ఒకవేళ పూర్తయినా బిల్దియా నుంచి బిల్లుల స్వీకరణలో వీరే ముందంజలో ఉంటుండడంతో కొందరి కనుసన్నల్లోనే బల్దియా కాంట్రాక్ట్లు నడుస్తున్నాయన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది. దీంతో సాధారణ, ఔత్సాహిక కాంట్రాక్టర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇదే విషయమై శనివారం గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయ వేదికగా సుమారు అరగంటపాటు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పనుల పంపకాలు జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం నల్లా పైపులైన్ల లీకేజీల నుంచి పార్కులు, నర్సరీల నిర్వహణ, అభివృద్ధి పనులు, ఎలక్ట్రికల్ పనులన్నీ టెండరింగ్ నడుస్తోంది. వరంగల్, హనుమకొండ ప్రాంతాలుగా వేర్వేరు యూనియన్లు ఏర్పాటయ్యాయి. యూనియన్ల ప్రతినిధులే పనుల పంపకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బల్దియాలో ఇంజనీరింగ్, ఉద్యాన వన విభాగాల్లో అత్యధికంగా నిధులు ఖర్చవుతుంటాయి. వీటికి ఈ–ప్రొక్యూర్మెంట్ విధా నం ద్వారా టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రెండు వేర్వేరు యూనియన్ నాయకులు కలిసి టెండర్ నోటిఫికేషన్ పనుల వివరాలను తెలుసుకొని కాంట్రాక్టర్ల నుంచి 4శాతం చొప్పన కమీషన్ ముందస్తుగా వసూలు చేస్తూ పనులు పంపకాలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆర్థిక స్థోమత కలిగిన బడా కాంట్రాక్టర్లు తమ లైసెన్సులే కాకుండా నాలుగైదు బినామీ లైసెన్ల పేర్లతో కమీషన్లు ముట్టజెప్పి పనులను దక్కించుకుంటున్నట్లు విమర్శలున్నాయి. చిన్నాచితక వారు ఒకవేళ టెండర్ వేసినా డీబీ సెక్షన్ సిబ్బందితో అనేక కొర్రీలు పెట్టించి, నానా రకాలుగా ఒత్తిళ్లు చేయిస్తూ ఆ టెండర్ నుంచి తప్పుకుంటున్నట్లు రాత పూర్వకంగా లేఖలు ఇప్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసినా.. చిన్నాచితక కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నా వారికి కంఠశోష తప్ప ప్రయోజనం లేకుండా పోతోంది. వరంగల్ ప్రాంతానికి చెందిన ఓ బడా కాంట్రాక్టర్ సీకేఎం కళాశాల వద్ద డ్రెయినేజీ, లేబర్ కాలనీ–బాలాజీనగర్లో యూజీడీతోపాటు మరో 6 పనులు మొత్తంగా ఆయన చేతిలో రూ.15కోట్ల విలువైన వర్క్లున్నాయి. చేసిన మేరకు బిల్లులిస్తేనే మిగతా పనులు చేపడుతానని నిబంధన పెడుతున్నాడు. హనుమకొండలో యూనియన్ పెద్దలతో ఒకరు లోపాయికారీ ఒప్పందంతో 8 డివిజన్లలో రూ.20కోట్ల విలువైన పనులు చేస్తున్నాడు. ఇవ్వాల్సిన పర్సంటేజీలిస్తూ పనులు, బిల్లులు పొందుతున్నాడు. ఉద్యాన విభాగంలో కాంట్రాక్టర్ నామినేషన్ పద్ధతిలో సుమారు రూ.2కోట్ల విలువైన పనులు పూర్తి చేసి బిల్లులు పొందాడు. గ్రేటర్ వరంగల్లో గుత్తాఽధిపత్యం పనుల పంపకాలు, పరపతితోనే బిల్లులు అండగా ఇంజనీర్లు.. ఆందోళనలో చోటామోటా కాంట్రాక్టర్లు బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో లొల్లిలొల్లి -
ఈ సస్పెన్స్ కొద్దిరోజులే... ఢిల్లీ నిర్ణయమే కీలకం..
సీఎంతో భేటీ ఆధారంగా పార్టీ వివాదం సమసిపోయిందని చెప్పలేని పరిస్థితి. సుస్మిత వ్యాఖ్యలతో సంబంధం లేదన్న మంత్రి సురేఖ పేర్కొనగా.. కొండా మురళీధర్రావు ‘సుస్మితకు ప్లాన్–ఎ అది.. ప్లాన్–బీ ఏముందో చెప్పలేం కదా’ అని చేసిన వ్యాఖ్యలపై కూడా వారి వ్యతిరేకవర్గంలో చర్చ జరుగుతోంది. అమెరికా పర్యటనలో ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తిరిగొచ్చిన తర్వాతే హైకమాండ్ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ వివాదానికి ఎప్పుడు తెరపడుతుంది? సురేఖపై చర్యలు ఉంటాయా? ఉంటే ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది? ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ వర్గాల్లో ఇదే హాట్టాపిక్గా మారింది. -
పార్కింగ్ స్థలాలను ఇతర అవసరాలకు వాడొద్దు
హన్మకొండ అర్బన్ : భవన నిర్మాణ అనుమతుల ప్రకారం కేటాయించిన పార్కింగ్ స్థలాలను ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తప్పని హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ హెచ్చరించారు. నగరంలోని స్కానింగ్, డయాగ్నొస్టిక్ సెంటర్లను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాకాజీ కాలనీలోని మెప్సన్, న్యూ విజయ డయాగ్నొస్టిక్ సెంటర్లను పరిశీలించారు. మెప్సన్లో ఆల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, ఎంఆర్ఐ గదులను తనిఖీ చేసి పరీక్షల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల ధరల పట్టికను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. న్యూ విజయ డయాగ్నొస్టిక్ సెంటర్కు తాళం వేసి ఉండటంతో సెల్లార్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రెండు కేంద్రాల్లోనూ భవన నిర్మాణ అనుమతుల ప్రకారం పార్కింగ్కు కేటాయించిన స్థలాలను డయాగ్నొస్టిక్ సేవలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆయా కేంద్రాలకు నోటీసులు జారీ చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.అప్పయ్యను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డాక్టర్ అప్పయ్య కాకతీయ కిడ్నీ సెంటర్, సిద్ధార్థ కార్డి యాక్ సెంటర్, వినోద డెంటల్, మల్లిక చిల్డ్రన్స్ ఆస్పత్రులను తనిఖీ చేశారు. పార్కింగ్ ప్రదేశాలను మెడికల్ షాపులు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్న వాటికి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ పలు డయాగ్నొస్టిక్ సెంటర్లకు నోటీసులు ఇవ్వాలని ఆదేశం -
చికిత్స పొందుతూ చిన్నారి మృతి
లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చెందిన గోపగోని శ్రీదేవి (14) ఉత్తరప్రదేశ్లో ఈ నెల 25వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు గ్రా మస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన గోపగోని స్వర్ణలత, నాగరాజు కూతురు శ్రీదేవి అనారోగ్యంతో ఉండడంతో సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఓ బాబా మహిమను చూసి కారులో యూపీలోని అత డి వద్దకు వెళ్తుండగా వాహనం డివైడర్ను ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో జనగామ మండలం పెంబర్తికి చెందిన కారు డ్రైవర్ పల్లపు సంపత్ (26) అక్కడికక్కడే దుర్మరణం చెందగా శ్రీదేవి, స్వర్ణలత, నాగరాజు గాయపడ్డారు. శ్రీదేవికి తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లి అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసు కొస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో డ్రైవర్ సంప త్, శ్రీదేవి మృతితో మృతుల సంఖ్య రెండుకు చేరింది. కాగా, మూఢనమ్మకాలు ఆ కుటుంబాని చిందవందర చేశాయంటూ గ్రామస్తులు కన్నీ రుమున్నీరయ్యారు. శ్రీదేవి మృతితో కుటుంబంతోపాటు గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. -
నిట్లో తెలుగు భాషా దినోత్సవం
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్ని కెమికల్ ఇంజనీరింగ్ విభాగం సెమినార్ హాల్లో శుక్రవారం తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. స్టూడెంట్స్ యాక్టివిటీస్ సెంటర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ వెలగపూడి వాసు ఆధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మార్క శంకర్ మాట్లాడుతూ నాడు గ్రంథాల్లో అచ్చమైన తెలుగు ఉండాలని గిడుగు రామ్మూర్తి పోరాడారని గుర్తు చేశారు. తెలుగు భాష కమ్మనైనది అనే పాటను ప్రొఫెసర్ వెలగపూడి వాసు ఆలపించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు సోమశేఖర్, రాజమోహన్, సూర్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు. -
హైస్పీడ్ కారిడార్ కవచ్ ట్రయల్ రన్ సక్సెస్
కాజీపేట రూరల్ : రైలు ప్రమాదాలను నివారించేందుకు చేపట్టిన హైస్పీడ్ కారిడార్ కవచ్ రైల్వే ప్రాజెక్ట్ ట్రయల్ రన్ శుక్రవారం విజయవంతమైంది. బల్లార్షా నుంచి కాజీపేట వరకు చేపట్టిన ఈ ప్రాజెక్ట్ తొలుత బల్లార్షా–మకోడి వరకు పూర్తి చేశారు. మకోడి నుంచి కాజీపేట వరకు పనులు కొనసాగుతున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. దక్షిణమధ్య రైల్వే సీఎస్టీఈ ప్రాజెక్ట్ ఎం.కోటేశ్వర్రావు, డిప్యూటీ సీఎస్టీఈ ప్రాజెక్ట్ జి.కుమరన్ ఆధ్వర్యంలో రైల్వే కవచ్ ప్రాజెక్ట్ పనులు నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నాలుగు నెలల క్రితం ప్రారంభించిన ఈ పనులు డబుల్ లైన్లో శరవేగంగా సాగుతున్నట్లు చెప్పారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం (2026–2027) ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.నర్సింహాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్పాట్ అడ్మిషన్లు ఈనెల 31నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఉంటాయని పేర్కొన్నారు. టీఎస్ఐసెట్ –2026లో అర్హత సాధించిన అభ్యర్థులతోపాటు అర్హత సాఽధించని వారు కూడా హాజరుకావచ్చునని తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతోపాటు అవసరమైన ఫీజు తీసుకొని రావాలని సూచించారు. స్పాట్ అడ్మిషన్ల ద్వారా ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు పొందే అభ్యరులు ఫీజు రీయంబర్స్మెంటుకు అర్హులు కాదని పేర్కొన్నారు. మార్గదర్శకాలు టీజీఐసెట్ అధికారిక వెబ్సైట్తోపాటు యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల నోటీస్ బోర్డులో ఉంచామని ప్రిన్సిపాల్ నర్సింహాచారి వివరించారు. స్కూల్ ఆఫ్ లెర్నింగ్లోనూ.. కాకతీయ యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రంలోని స్కూల్ ఆఫ్ లెర్నింగ్ (కేయూ ఎస్ఎల్)లో ఈ విద్యాసంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు దూరవిద్యాకేంద్రం డైరెక్టర్ బి.సురేష్లాల్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీజీఐసెట్ –2026 అర్హత సాధించిన, అర్హత సాధించని అభ్యర్థులు కూడా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 31నుంచి సెప్టెంబర్ 3 వరకు హాజరై ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. కాజీపేట రూరల్ : కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లలో శనివారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డీఆర్ఎం, ఇతర విభాగాల రైల్వే ఉన్నతాధికారుల బృందం పర్యటించనున్నట్లు శుక్రవారం రాత్రి రైల్వే అధికారులు తెలిపారు. బృంద సభ్యులు ఆయా రైల్వేస్టేషన్లలో తనిఖీలు చేస్తారని పేర్కొన్నారు. సికింద్రాబాద్నుంచి ప్రత్యేక రైలులో రైల్వే జీఎం 23:45 గంటలకు బయలుదేరి కాజీపేట జంక్షన్ వరకు పుట్ ప్లేట్ ఇన్స్పెక్షన్ చేసుకుంటూ శనివారం తెల్లవారుజూమున 01:39 గంటలకు కాజీపేట జంక్షన్కు చేరుకుంటారని తెలిపారు. కాజీపేట నుంచి వరంగల్కు రోడ్ మార్గంలో వెళ్తారని, వరంగల్ స్టేషన్ తనిఖీ అనంతరం రోడ్డు మార్గంలో కాజీపేట జంక్షన్కు చేరుకొని సాయంత్రం 16:30 గంటలకు బయలుదేరుతారని వివరించారు. 20:00 గంటలకు చర్లపల్లికి చేరుకుంటారని తెలిపారు. హన్మకొండ అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్లో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుబేదారిలోని బాలసదన్ బాలికలు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్కి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, బాలసదన్ సూపరింటెండెంట్ కళ్యాణి, సిబ్బంది, బాలికలు పాల్గొన్నారు. -
ఫుల్ జోష్లో...
భిన్నమైన ప్రేమకథ ఆ విజయం కొనసాగాలి ● శ్రీని, వివేక్ ఆత్రేయ, రవితేజ, లక్ష్మణ్● మంగా శ్రీనివాస్, పూరి జగన్నాథ్, హేమారావు‘ఇరుముడి’ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నారు రవితేజ. వరుసగా సినిమాలను ప్రకటిస్తున్నారు. రవితేజ హీరోగా హసిత్ గోలి డైరెక్షన్లోని సినిమా ప్రకటన ఈ వారంలో వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రవితేజ హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందనున్న మూవీని ప్రకటించారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్పై లక్ష్మణ్, శ్రీని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఇరుముడి’తో సూపర్ హిట్ అందుకున్న రవితేజను లక్ష్మణ్, శ్రీని కలిసి అభినందించి, ఈ చిత్రాన్ని ప్రకటించారు. ‘‘రవితేజ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్కు తగ్గట్లు ఈ సినిమా ఉంటుంది. వివేక్ ఆత్రేయ తనదైన శైలిలో రూపొందించే కొత్త ప్రపంచంలోకి రవితేజ అడుగు పెట్టనున్నారు’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా నటిస్తున్న సినిమా ‘చకోర: లూనార్ లవ్ బర్డ్’. దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన మంగా శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వీఐపీ వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ సారథ్యంలో డా. చింతాడ హేమారావు నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 8న విడుదల కానుంది. ఈ చిత్రం టైటిల్ మోషన్ పోస్టర్ని పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ‘‘ఇప్పటివరకు తెలుగులో వచ్చిన ప్రేమకథలకు భిన్నమైన లవ్స్టోరీతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త లవ్ ఫీల్ను అందిస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: ప్రిన్స్ హెన్రీ. -
మురుగుకు.. ముకుతాడు!
‘గ్రేటర్’లో యూజీడీకి కీలక ముందడుగుసాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ (కాంప్రెన్సివ్ అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ స్కీం) పనులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎస్టీపీలు, మురుగునీటి పంపింగ్ స్టేషన్లు (ఎస్పీఎస్), లిఫ్ట్ స్టేషన్లు, సెప్టిక్ ట్యాంకుల నిర్మాణానికి అవసరమైన ప్రైవేట్ భూముల సేకరణకు మార్గం సుగమం చేసింది. భూసేకరణ, పునరావాస చట్టం–2013 కింద సాధారణంగా చేపట్టాల్సిన సామాజిక ప్రభావ అంచనా (సోషల్ ఇంపాక్ట్ అసెసెమెంట్ (ఎస్ఐఏ)) ప్రక్రియ నుంచి ఈ ప్రాజెక్టుకు మినహాయింపు ఇస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ శుక్రవారం జీఓ ఎంఎస్ నంబర్ 225 జారీ చేసింది. నగరానికి కీలకం ఈ ప్రాజెక్టు... గ్రేటర్ వరంగల్ పరిధి విస్తరిస్తున్న కొద్దీ నివాస, వాణిజ్య ప్రాంతాలు పెరుగుతున్నాయి. దీంతో రోజురోజుకూ మురుగునీటి ఉత్పత్తి కూడా పెరుగుతోంది. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో స్థానిక డ్రెయినేజీలు, నాలాలు, సెప్టిక్ ట్యాంకులపైనే ఆధారపడాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మురుగునీరు వర్షపు నీటి కాలువల్లోకి చేరుతుండటంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వర్షాకాలంలో ప్రధాన సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. డ్రెయినేజీ వ్యవస్థ సామర్థ్యం సరిపోకపోవడం, నాలాలు ఆక్రమణలకు గురికావడం, మురుగు ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడటం వంటి కారణాలతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరానికి ఒక సమగ్ర అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నెట్వర్క్ అవసరం ఏర్పడింది. కాగా కొత్త వ్యవస్థలో మురుగునీటిని నేరుగా బయటకు వదలకుండా వివిధ ప్రాంతాలనుంచి సేకరించి శుద్ధి కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఐదు ప్రాంతాల్లో భూములు.. ఎస్ఐఏనుంచి మినహాయింపు.. తాజా ఉత్తర్వుల ప్రకారం బొల్లికుంట, ఉర్సు, ఖిలా వరంగల్, దేశాయిపేట, పైడిపల్లి ప్రాంతాల్లోని ప్రైవేట్ భూములను సేకరించనున్నారు. మొత్తం 11 నిర్మాణాలకు భూములు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. అందులో బొల్లికుంటలో ఎస్టీపీ–7 కోసం 2 ఎకరాల 8.8 గుంటలు సేకరించనుండడం అత్యధిక విస్తీర్ణం. మిగిలిన ప్రాంతాల్లో ఎస్పీఎస్లు, లిఫ్ట్ స్టేషన్లు, సెప్టిక్ ట్యాంకుల కోసం కొన్ని వందల చదరపు గజాల చొప్పున భూములు తీసుకోనున్నారు. కాగా, ప్రాజెక్టు ప్రజాప్రయోజనాలకు సంబంధించినదిగా పేర్కొంటూ, తెలంగాణ సవరణ చట్టం–2016లోని సెక్షన్ 10ఏ (బీ) కింద సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఎస్ఐఏ) ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చారు. భూసేకరణ కోసం అవసరమైన భూమిని సాధ్యమైనంత కనిష్ట విస్తీర్ణంలోనే తీసుకుంటున్నట్లు ప్రభుత్వ కార్యదర్శి టీకే శ్రీదేవి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్ఐఏ మినహాయింపుతో భూసేకరణ ప్రక్రియలో ఒక దశ తగ్గడంతో ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వం గెజిట్ ప్రచురణకు ఆదేశాలు జారీ చేయడంతో తదుపరి భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. భూముల సేకరణ పూర్తయిన తర్వాత ఆయా ప్రాంతాల్లో ప్రతిపాదిత ఎస్టీపీలు, ఎస్పీఎస్లు, లిఫ్ట్ స్టేషన్లు తదితర నిర్మాణాలకు మార్గం సుగమం కానుంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు సమగ్ర భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థకు అవసరమైన ప్రైవేట్ భూముల సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పనులు వేగంగా ముందుకు సాగే అవకాశం ఏర్పడింది. నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మురుగునీటి పారుదల వ్యవస్థను ఆధునికీకరించడం చాలా అవసరం. ఇందుకోసం సీఎం రేవంత్రెడ్డిని అందరం కలిసి చాలాసార్లు విన్నవించాం. ప్రజలు ఎదుర్కొంటున్న డ్రెయినేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిన ముఖ్యమంత్రికి, ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు. – నాయిని రాజేందర్రెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే ఐదు ప్రాంతాలు, 11నిర్మాణాలకు ప్రైవేట్గా భూముల సేకరణకు ప్రభుత్వం ఓకే సామాజిక ప్రభావ అంచనానుంచి మినహాయింపు ప్రజాప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం.. తక్షణమే గెజిట్ ప్రచురణకు ఆదేశాలు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ కార్యదర్శి టీకే శ్రీదేవి -
సయోధ్యకు ఇంజనీర్ల ఆరాటం
వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర పాలక సంస్థ ఆదాయానికి గండి పడకుండా చూడాల్సిన ఇంజనీర్లే కాంట్రాక్టర్ల మధ్య సయోధ్య కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కమిషన్ల కోసం కక్కుర్తి పడుతూ అను యాయులకు పనులు కట్టబెట్టేందుకు విశ్వప్రయత్నాలు చే స్తున్నారన్న విమర్శలున్నాయి. తాము చెప్పిన ప్రాంతాల్లో టెండర్లు వేసుకోవాలని ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్ విధానాలకు తూట్లు పొడిచారని, తక్కువ లెస్కు పోవా లని నిబంధనలు పెట్టి, చిన్నాచితక కాంట్రాక్టర్లను భయబ్రాంతులకు గురిచేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముగిసిన గడువు.. సెప్టెంబర్లో జరగనున్న గణేశ్ విగ్రహాల నిమజ్జన ప్రాంతాల్లో లైట్లు, జనరేటర్లు ఏర్పాటు చేసేందుకు వరంగల్ నగరంలోని 12 ప్రాంతాల్లో సుమారు రూ.30 లక్షలతో ఈ నెల 21న ‘ఆన్లైన్’ టెండర్లకు ఆహ్వానించగా, ఈ నెల 27 (గురువారం) మధ్యాహ్నంతో గడువు ముగిసింది. గత మూడు, నాలుగు రోజులుగా బల్దియా ఎలక్ట్రికల్ విభాగా నికి చెందిన ఇద్దరు ఇంజనీర్లు రంగంలోకి దిగారని, పలా నా ప్రాంతంలో సదరు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ టెండర్ వేస్తారని, అక్కడ మీరు వేస్తే నష్టపోతారని నచ్చచెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ టెండర్ వేస్తే సద రు కాంట్రాక్టర్కు సగం పనులు అప్పగించాలని ఒత్తిళ్లు తెచ్చినట్లు కరొందరు బాహాటంగా వెల్లడించడం గమనార్హం. అందరూ కలిసి పనులు పంచుకోవాలని తక్కువశాతం టెండర్ వేయాలని చెప్పడంపై ఇంజనీర్ల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సివిల్, ఉద్యానవన అభివృద్ధి పనుల టెండర్లలో కాంట్రాక్టర్లు రింగ్గా మారి పనులు పంచుకుంటుండడం.. బడా కాంట్రాక్టర్లకు ఇంజనీర్లు ఇతోధికంగా సహకరిస్తున్నారన్నది బల్దియా బహిరంగ సత్యం. ఈ విషయంపై సదరు ఎలక్ట్రికల్ ఇంజనీర్లను వివరణ కోరగా సమాధానం దాటవేశారు. ఎవరు ఎక్కువ లెస్కు టెండర్ వేస్తే వారికే దక్కుతుందని చెప్పుకొచ్చారు. అనుయాయులకు పనులు కట్టబెట్టేందుకు యత్నాలు ‘గ్రేటర్’ పరిధిలోని గణేశ్ నిమజ్జన ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ పనులకు ముగిసిన టెండర్ల గడువు చిన్నాచితకా కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారనే ఆరోపణలు -
ఒకే హృదయ స్పందన
శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భోగి’. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఓ కల్పిత గ్రామంలో 1960 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్స్గా నటిస్తున్నారు. గంగ పాత్రలో శర్వానంద్, సులోచనగా అనుపమ, మందారంగా డింపుల్ హయాతి కనిపిస్తారు. శుక్రవారం రాఖీ పండగ సందర్భంగా ‘భోగి’ నుంచి స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘‘మా గంగ ఆత్మ ఇది. ఐదుగురు సోదరీమణులు... ఒకే ప్రపంచం... ఒకే హృదయ స్పందన’’ అంటూ ఈ పోస్టర్ను ఉద్దేశించి ‘ఎక్స్’లో సంపత్ నంది పేర్కొన్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
ఫీనిక్స్ రాజా ఫిక్స్
● శ్రీవాస్దర్శకుడు శ్రీవాస్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. మాధవి క్రియేషన్స్పై మహంకాళి నాగరాజు నిర్మించనున్న ఈ చిత్రానికి ‘ఫీనిక్స్ రాజా’ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో ‘ఫీనిక్స్ రాజా’ ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు రెండు నిమిషాల 2డీ మోషన్ టీజర్ను విడుదల చేశారు. శ్రీవాస్ మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనలను, ప్రభావవంతమైన కథనంతో కొత్త బెంచ్మార్క్ సెట్ చేయడమే లక్ష్యంగా ఈ సినిమా రూపొందిస్తున్నాం. ఈ చిత్రకథ ఓ నిజాయితీగల వ్యాపారవేత్త చుట్టూ తిరుగుతుంది. రాజకీయ పలుకుబడి, అధికారాన్ని ఉపయోగించుకోకుండా కష్టపడి, విలువలు, నిజాయితీతో జీవితాన్ని నిర్మించుకోవాలని భావించే అతడి జీవితంలోకి పవర్ఫుల్ వ్యక్తులు ప్రవేశించినప్పుడు అతడి వ్యక్తిగత పోరాటం నిజం, గౌరవం, భవిష్యత్ తరాల కోసం జరిగే పెద్ద పోరాటంగా మారుతుంది. ఈ చిత్రంలో మరో కీలక అంశంగా జెన్ జీపై పెరుగుతున్న డ్రగ్ మాఫియా ప్రభావాన్ని చూపించనున్నాం. ఇంగ్లిష్తో పాటు పలు భాషల్లో రూపొందించనున్న ఈ చిత్రాన్ని భారత్లోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లోనూ చిత్రీకరిస్తాం’’ అని చెప్పారు. -
అధికారులూ.. ఖాళీ ప్లాట్లపై కన్నేయండి
సాక్షి, వరంగల్: వర్షాకాలం వచ్చిందంటే చాలు గ్రేటర్ వరంగల్లో ఖాళీగా ఉంటున్న ఓపెన్ ప్లాట్లలో పిచ్చి మొక్కలు పెరగడంతో పాటు దోమల స్వైరవిహారం చేయడంతో నగరవాసుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలను కలుపుకొని ట్రైసిటీలో 3వేలకుపైగా ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. ట్రైసిటీలోనే ఒక్క ఆగస్టు నెలలోనే 500కుపైగా జ్వరాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఒక్క ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీల్లో నమోదైన గణాంకాలు మాత్రమే. ఇక ప్రైవేట్ ఆస్పత్రులను పరిగణనలోకి తీసుకుంటే సీజనల్ వ్యాధుల సంఖ్య వెయ్యికిపైగానే ఉండొచ్చని వైద్యవర్గాల్లోనే చర్చ జరుగుతోంది. యజమానుల నిర్లక్ష్యంపై కఠిన వైఖరి ఏదీ..? యజమానులు స్థలాలను కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టకుండా వదిలేస్తున్నారు. కనీసం పిచ్చిమొక్కలు తొలగించడం, చెత్తను శుభ్రం చేయించడం లేదు. ఫలితంగా పిచ్చి మొక్కలు పెరిగి దోమలు, విష పురుగులకు ఆవాసాలుగా మారుతున్నాయి. దోమల తీవ్రత పెరగడంతో ప్రజల్లో డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాల భయం నెలకొంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, అనారో గ్యంతో ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీ ప్లాట్లపై ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణిలో ఫిర్యాదులు సైతం వస్తున్నాయి. ఖాళీ ప్లాట్లపై తొలుత వారంలో స్థలాన్ని చదును చేసుకోవాలని బల్దియా ఆదేశించవచ్చు. లేదంటే కార్మికులతో శుభ్రం చేయించాలి. చివరికి స్థల యజమానికి రూ.10వేల వరకు జరిమానా విధించే అధికా రం కమిషనర్కు ఉంటుంది. అయినా స్పందించకపోతే అక్కడ బోర్డు ఏర్పాటుచేసి భవిష్యత్లో ఇంటి నిర్మాణం నిలిపివేసే అవకాశం కూడా ఉంటుంది. దీనిపై ప్రజారోగ్య విభాగాధికారి రాజారెడ్డి మాత్రం ఖాళీస్థలాల విషయంలో బల్దియా నుంచి నోటీసులివ్వడంతో కొందరు యజమానులు ముందుకొచ్చి పరిశుభ్రం చేసుకుంటున్నారని సమాధానమిచ్చారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో 3వేలకుపైగా ఓపెన్ప్లాట్లు నివాసాల మధ్యలో ఉండడంతో దోమల విజృంభణ సీజనల్ వ్యాధుల బారిన నగరవాసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటేనే రోగాలకు కల్లెం -
అన్నాచెల్లెళ్ల అనుబంధం.. జన్మజన్మల సంబంధం
వర్ధన్నపేటకు చెందిన వడ్లకొండ సాయి చరణ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అతడి జ్ఞాపకార్థం తల్లిదండ్రులు తమ వ్యవసాయ క్షేత్రంలో విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అన్న లేకపోయినా అతడి జ్ఞాపకాలు శాశ్వతమని నిరూపిస్తూ చెల్లి శ్రీకృతి శుక్రవారం సాయిచరణ్ విగ్రహానికి రాఖీ కట్టి ప్రేమానురాగాలను చాటుకుంది. –వర్ధన్నపేట● సోదరుల విగ్రహాలకు రాఖీ కట్టి ఆప్యాయతను పంచిన చెల్లెళ్లు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన గుగులోత్ లక్ష్మణ్ మూడేళ్ల క్రితం మృతి చెందాడు. అతడి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు తమ వ్యవసాయ క్షేత్రంలో విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఏటా చెల్లెళ్లు బానోత్ లింగమ్మ, వాంకుడోత్ రాధా.. లక్ష్మణ్ విగ్రహానికి రాఖీ కడుతున్నారు. ఈ ఏడాది కూడా లక్ష్మణ్ విగ్రహంతోపాటు మరో సోదరుడు రవి రాఖీ కట్టి తమ ఆప్యాయతను చాటుకున్నారు. –ఇనుగుర్తి డ్యూటీలో ఉన్న తమ్ముడికి రాఖీ ఆ అక్కా తమ్ముళ్ల ప్రేమాభిమానాలు చక్కటి అనుబంధానికి ప్రతీకగా నిలిచాయి. టీజీఎస్ ఆర్టీసీ వరంగల్–1 డిపోలో కండక్టర్గా ఉద్యోగం చేస్తున్న తమ్ముడు శ్రీనివాస్కు శుక్రవారం రాఖీ కట్టేందుకు అక్క కడారి రేణుక దామెర నుంచి హనుమకొండకు వచ్చింది. తమ్ముడు డ్యూటీలో ఉన్నాడని తెలుసుకుని హనుమకొండ బస్స్టేషన్కు చేరుకుంది. గంట సేపు తర్వాత పాలకుర్తి రూట్లో డ్యూటీచేస్తూ బస్స్టేషన్కు తమ్ముడు శ్రీనివాస్ చేరుకోగానే బస్సు ఎక్కి రాఖీ కట్టింది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు అక్కాతమ్ముడి మధ్య ఉన్న ప్రేమను అభినందించారు. –హన్మకొండ -
నవజాత శిశు, మాతృ మరణాల అదుపే లక్ష్యం
హన్మకొండ అర్బన్ : నవజాత శిశువులు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణతోపాటు శిశు, మాతృ మరణాల రేటును తగ్గించడమే లక్ష్యంగా వరంగల్లో సెంట్రల్ జోన్ పిడియాట్రిక్స్ కాన్ఫరెన్స్ ప్రారంభమైనట్లు కాన్ఫరెన్స్ వర్క్షాప్ చైర్మన్ డాక్టర్ బలరామ్ తెలిపారు. శుక్రవారం ప్రారంభమైన ఈ కాన్ఫరెన్స్లో యువ వైద్యులకు ఆరు కీలక అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర వెంటిలేషన్, పాయింట్ ఆఫ్ కేర్ అల్ట్రాసౌండ్ (పీఓసీయూఎస్), పోషకాహార లోపాల నివారణ, అలర్జీ, చిన్నారులపై హింస నివారణ తదితర అంశాలపై వైద్యులకు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. 2026 ఐఏపీ ప్రెసిడెన్షియల్ యాక్షన్ ప్లాన్ లోని అంశాలపైనా శిక్షణ అందిస్తున్నారని, 2030 నాటికి ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా శిశు, మాతృ మరణాలను గణనీయంగా తగ్గించడమే సదస్సు ప్రధాన ఉద్దేశమని వైద్య నిపుణులు తెలిపారు. సీఐఏపీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు డాక్టర్ బి. సుగుణాకర్ రెడ్డి, డాక్టర్ కె. రాజశేఖర్ రావు, డాక్టర్ కె. వెంకటేశ్వర్ రావు, డాక్టర్ ఎం. శేషు మాధవ్, పీఏటీఎస్ ప్రతినిధులు డాక్టర్ గుడురు విజయ్ కుమార్, డాక్టర్ ఎస్. కష్ణమూర్తి, డాక్టర్ సుంకోజ్ భాస్కర్, డాక్టర్ ఎన్.ఎల్. శ్రీధర్, డాక్టర్ శ్రీకృష్ణ ఆర్ఎస్వీ, వరంగల్ పీడియాట్రిక్ సొసైటీ నాయకులు డాక్టర్ జి. రమేశ్, డాక్టర్ పి. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ జోన్ పిడియాట్రిక్స్ కాన్ఫరెన్స్ వర్క్షాప్ చైర్మన్ బలరామ్ -
శ్రీభద్రకాళి అమ్మవారికి పవిత్రోత్సవం
శ్రీభద్రకాళి దేవాయంలో శ్రావణపౌర్ణమి అమ్మవారికి పవిత్రోత్సవం నిర్వహించారు. శ్రావణ శుక్రవారం కూడా కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయాన్ని సందర్శించారు ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఊర్ణసూత్రాల దండలను శాస్త్రోక్తంగా అమ్మవారిమూర్తికి అలంకరించారు. పసుపు, ఎరుపు, నారింజ, నీలి, గులాబీ తదితర రంగుల ఊలు దారాలతో అలంకృతమైన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు దేవాలయాన్ని సందర్శించిన భక్తులకు రక్షాకంకణాలు అందించారు. – హన్మకొండ కల్చరల్ -
ఘనంగా మేజర్ ధ్యాన్చంద్ జయంతి
వరంగల్ స్పోర్ట్స్: భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను శుక్రవారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ‘ఖేలే గా భారత్ – జీతేగా భారత్’ అనే నినాదంతో 30వ తేదీ వరకు వివిధ క్రీడా, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందుగా మేజర్ ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎస్ఏ కోచ్లు నరేందర్, నవీన్, విష్ణువర్దన్, రమేష్, ప్రభుదాస్, వెంకటేశ్వర్లు, సిబ్బంది జ్యోతి, వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ఇన్చార్జ్ నయిం, సిబ్బంది సోనీ, నిఖిత, శైలజ, సంపత్ పాల్గొన్నారు. -
పెళ్ళి సూపర్... కాపురం హారర్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’ ఒకటి. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. మన సంస్కృతిలో పెళ్ళికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అలాగే పెళ్ళయ్యాక పెళ్ళి కూతురిని అత్తగారింటికి సాగనంపేంత వరకు ఎన్నో గొప్ప సాంప్రదాయాలున్నాయి. కన్న కూతురిని ఆర్భాటంగా, ఆనందంగా ఓ అయ్య చేతిలో పెట్టి అత్తగారింటికి సాగనంపడం తరతరాలుగా వస్తున్న మన ఆనవాయితీ. కానీ అలా జరగకపోతే ఎలా ఉంటుంది అన్న ఇతివృత్తంతో తెర మీదకు తీసుకువచ్చిన ప్రయత్నమే ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’. అలాగని ఇది అత్తగారింటికి అల్లుడు ఇల్లరికం వచ్చే సినిమా మాత్రం కాదు. మరీ ముఖ్యంగా నేటి తరానికి పెళ్ళి, ఆ పై కాపురానికి సంబంధించిన సరైన పాఠమే ఈ సినిమా. తమిళ యువ దర్శకుడు ఏలన్ తాను రాసుకున్న కథకు దర్శకత్వం వహించి, నిర్మించి, నటించిన సినిమా ఇది. అలాగే తెలుగు నటి మేఘన, ప్రముఖ నటి రాధిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదో రొమాంటిక్ కామెడీ మూవీ. యువతకు కావాల్సిన అంశాలు మెండుగా ఉన్న ఈ సినిమా కథ విషయానికొస్తే... ఏలన్ అనే కుర్రాడు దుబాయ్లో సివిల్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అయితే తల్లిదండ్రులను వదిలి ఎక్కువ రోజులు ఉండలేక అక్కడి నుండి వచ్చేసి ఇక్కడ ఉద్యోగంతో పాటు పెళ్ళి ప్రయత్నాల్లో ఉంటాడు. అయితే అదే సమయంలో ఏలన్ అనుకోకుండా పవిత్ర అనే అమ్మాయితో ప్రేమలో పడి, పెళ్ళి దాకా తెచ్చుకుంటాడు. పైళ్ళెతే అద్భుతంగా జరుగుతుంది. పెళ్ళి కూతురుని అత్తగారింటికి సాగనంపే సమయంలోనే అసలు కథ ప్రారంభమవుతుంది. ఏలన్తో పైళ్ళెన తరువాత పవిత్ర తన తల్లితండ్రులను వదిలి ఉండడం ఇష్టంలేక మండపం నుండే తప్పించుకుని పరిగెడుతుంది. ఇక చేసేదేమిలేక ఏలన్ నిస్సహాయంగా పవిత్ర ఇంట్లోకి ఆర్భాటంగా అడుగుపెడతాడు. కొత్తల్లుడి సంబరం అలవాటైనంత వరకే అన్నట్టు ఏలన్ మెల్లమెల్లగా ఆ ఇంట్లో కొత్త పెళ్ళి కొడుకులా కాక కొత్త పనివాడిలా తయారవుతాడు. ఇక అక్కడి నుండి కథ అనేక మలుపులు తిరుగుతూ ప్రేక్షకులను గిలిగింతలు పెడుతుంది. మరి... పవిత్రను ఏలన్ తన ఇంటికి తీసుకువెళతాడా? లేదా అన్నది మాత్రం నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. – హరికృష్ణ ఇంటూరు -
అన్నపూర్ణ క్యాంటీన్ తనిఖీ
వరంగల్ అర్బన్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో బల్దియా సహకారంతో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని బల్దియాకమిషనర్ టి.వెంకన్న శుక్రవారం తనిఖీ చేశారు. భోజనం శుచి, శుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత, వడ్డించే విధానం తది తర అంశాలను కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలించా రు. రూ.5కే వినియోగదారులకు అందిస్తున్న భోజ నాన్ని స్వయంగా రుచి చూశారు. ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు, పేదలు, ఇతరులకు అందుబాటులో ఉండే ఈ సేవలో ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో రాజీ ఉండకూడదని కమిషనర్ స్పష్టం చేశారు. కమిషనర్ వెంట ఎంహెచ్ఓ రాజేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
దద్దరిల్లిన కలెక్టరేట్
ఉద్యోగుల ఆందోళన..హన్మకొండ అర్బన్ : ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన మహాధర్నాతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ధర్నాలో ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలు, నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. జేఏసీలోని వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పాటు ప్రజాసంఘాలు కూడా సంఘీభావం ప్రకటించాయి. అధికార పార్టీ నేతలు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వగా, ప్రతిపక్ష నేతలు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. భారీగా ఉద్యోగులు తరలిరావడంతో కలెక్టరేట్ పరిసరాలు జనసందోహంగా మారాయి. హనుమకొండ–హైదరాబాద్ ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడగా పోలీసులు క్రమబద్ధీకరించారు. ఈసందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ ఆరు డీఏలు విడుదల చేయడం, మెరుగైన పీఆర్సీ ప్రకటించడం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను కూడా ఆలస్యం చేయకుండా అందించాలని డిమాండ్ చేశారు. డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాధర్నాను విజయవంతం చేశారని తెలిపారు. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్కు వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం: ఎమ్మెల్యే నాయిని ధర్నాకు హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ఇప్పటికే చర్చించానన్నారు. రెండో పీఆర్సీ, పెండింగ్ డీఏలు, పాత పెన్షన్ విధానం, హెల్త్కార్డులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర అంశాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని తెలిపారు. ఆరు డీఏలు వెంటనే విడుదల చేయాలి: మాజీ మంత్రి హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు విమర్శించారు. ఆరు డీఏలు పెండింగ్లో ఉండడం సిగ్గుచేటన్నారు. ఈహెచ్ఎస్ పేరుతో ఉద్యోగుల జీతాల నుంచి డబ్బులు కట్ చేస్తున్నా ఆస్పత్రులతో ఒప్పందాలు లేక సేవలు అందడం లేదని ఆరోపించారు. పెండింగ్ డీఏలు విడుదల చేయడంతోపాటు మెరుగైన పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. హాజరైన అన్ని ఉద్యోగ సంఘాలు.. సంఘీభావం తెలిపిన ప్రజాసంఘాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మహాధర్నా.. అక్కడే భోజనాలు అధికార, ప్రతిపక్ష నేతల హామీలు.. విమర్శలతో వేడెక్కిన వేదిక మాజీ మంత్రి హరీశ్రావుతోపాటు బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్.. స్టేషన్కు తరలింపు


