breaking news
Hanamkonda District Latest News
-
బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
నగరాన్ని మంగళవారం పొగమంచు కమ్మేసింది. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో మంచు దుప్పటి ఏర్పడింది. మంచువానలోని ఈ ప్రకృతి రమణీయత విశేషంగా అలరించింది. ఊటి, అరకులోయను తలపించే ఆహ్లాదకర దృశ్యాలు చూపరులను కనువిందు చేశాయి. – సాక్షి స్టాఫ్ఫొటోగ్రాఫర్, హన్మకొండ ఉదయం 7.48 గంటలు : పొగమంచులో హనుమకొండ కలెక్టరేట్ఉదయం 8.15 : లైట్లు వేసుకొని వెళ్తున్న వాహనదారులుఉదయం 8.30 : పొగమంచులో రైలు -
మహాశివరాత్రికి ఏర్పాట్లు చేయాలి
● అధికారులకు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని ఆదేశం ● వేయిస్తంభాల ఆలయంలో పోస్టర్ ఆవిష్కరణహన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయంలో ఈనెల 14 నుంచి 18 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, వివిధ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఈఓ అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మతో కలిసి ఉత్సవాల వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని అన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చలువపందిళ్లు, ప్రథమ చికిత్స శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యశాఖ అధికారులకు ఆదేశించారు. రవాణా, పొలీస్శాఖల సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని, భక్తుల భద్రత కోసం పోలీస్ యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతుందని పేర్కొన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిని గంగు ఉపేంద్రశర్మ పూర్ణకుంభంతో స్వాగతించారు. ఫ్లోర్లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ పోతుల శ్రీమాన్, డివిజన్ అధ్యక్షుడు కుమార్యాదవ్, సతీశ్, వివిధ శాఖల అధికారులు, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీకాన్ఫరెన్్స్ హాలులో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారితో కలెక్టర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వైద్యులు, సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు. వైద్యాధికారులు, సంబంధిత సూపరింటెండెంట్లు, గైనకాలజిస్టులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. యాక్షన్ప్లాన్ షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వ వైద్యాధికారులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ నాన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, ఇప్పటి వరకు నిర్వహించిన క్యాంపుల వివరాలను డీఎంహెచ్ఓ సమర్పించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.అప్పయ్య, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ గౌతంచౌహన్, జీఎంహెచ్ ఆర్ఎంఓ డాక్టర్ మంజుల, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రదీప్రెడ్డి, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు, హనుమకొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ జె.కిరణ్కుమార్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. ఖిలా వరంగల్: చారిత్రక ఖిలా వరంగల్లోని రాతికోట ఆనుకొని ఉన్న అగర్త చెరువు పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులు కేటాయించింది. ఇటీవల కుడా ఆధ్వర్యంలో చెరువు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. పరిహారం ఇచ్చిన తర్వాతే అగర్త చెరువు పనులు చేపట్టాలని భూములు కోల్పోతున్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కుడా అధికారులు పనులు నిలిపివేసి మంగళవారం సర్వే ప్రారంభించారు. రాతికోట నుంచి ఎన్ని మీటర్ల వరకు కేంద్ర పురావస్తుశాఖ భూమి ఉంది, ఎంత వరకు నిషేధిత ప్రాంతం, ఎంత దూరం నుంచి నిర్మాణాలు చేపట్టవచ్చు, ఎన్ని పట్టా భూములు ఉన్నాయి, రికార్డుల ప్రకారం ఎవరికి ఎంత భూమి ఉంది, అగర్త చెరువు పునరుద్ధరిస్తే ఎవరికి ఎంత పరిహారం చెల్లించాల్సి వస్తుంది అనే వివరాలు సేకరిస్తున్నారు. -
ముగిసిన జిల్లాస్థాయి సీఎం కప్ క్రీడాపోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో హనుమకొండ జిల్లాస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు మంగళవారం ముగిశాయి. ముఖ్య అతిథిగా ఒలింపిక్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు అజీజ్ఖాన్ హాజరై రెజ్లింగ్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు క్రీడల్లో రాణించి జిల్లా ఖ్యాతిని చాటాలని సూచించారు. సాయంత్రం జరిగిన ముగింపు వేడుకలకు హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పతకాలు అందజేసి మాట్లాడారు. రెండు రోజులపాటు 45 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించినట్లు తెలిపా రు. జిల్లా పరిధిలోని 16 మండలాల నుంచి మూడు వేల మంది క్రీడాకారులు హాజరైనట్లు వివరించారు. పోటీల నిర్వహణకు సహకరించిన ఆయా క్రీడా సంఘాల బాధ్యులు, పీఈటీలు, కోచ్లకు ధన్యవాదాలు తెలిపారు. ఎంజీఎం: ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సాధించడానికి వైద్య, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. శాయంపేట పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమం తీరును పరిశీలించి మాట్లాడారు. 8 అంశాల్లో మహిళలకు పరీక్షల తీరుపై అవగాహన కలిగించాలని, రెఫర్ కేసులను ఫాలోఅప్ చేస్తూ వారికి తగిన సేవలందించాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించి, సక్రమంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. గర్భిణుల నమోదు, వైద్యపరీక్షలు, ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవానికి ప్రోత్సహించడం, ప్రసవానంతరం సేవలందించాలని ఆయన సూ చించారు. వైద్య సేవలకు సంబంధించిన రికా ర్డులు, వివిధ కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతిని ఆయన సమీక్షించారు. అలాగే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేపట్టిన మరమ్మతు పనులను డీఎంహెచ్ఓ పరిశీలించారు. వైద్యాధికారి మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: హైదరాబాద్లోని స్కిల్డిజైర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్తో మంగళవారం కేయూ ఎంఓయూ కుదుర్చుకుంది. కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి సమక్షంలో అవగాహన పత్రాలను రిజిస్ట్రార్ వి.రామచంద్రం, స్కిల్డిజైర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి శ్రీకాంత్ మార్చుకున్నారు. ఈ ఒప్పందం ఒక సంవత్సర కాలం ఉంటుంది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరగుపర్చడం, నైపుణ్యాలను అందించడం, ఉపన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు, వర్క్షాపులు, పరస్పర జ్ఞానమార్పిడిని ప్రోత్సహించడం ఎంఓయూ ఉద్దేశం అని రిజిస్ట్రార్ తెలిపారు. కార్యక్రమంలో సైన్స్డీన్ జి.హనుమంతు, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య టి.మనోహర్, స్టూడెంట్ వెల్ఫేర్ అఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి, కేయూ యూజీసీ కోఆర్డినేటర్ ఆర్. మల్లికార్జున్రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోలా శంకర్ పాల్గొన్నారు. -
ఎంజీఎంలో రక్తం కొరత!
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. ఓపీ చిట్టీ నుంచి మొదలుకుని చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యే వరకు ప్రతీ విభాగంలో పేద రోగులు అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిలో అత్యవసర వైద్య చికిత్స పొందే రోగులు మెరుగైన వైద్యసేవలు పొందడానికి రక్తనిధి కేంద్రం సేవలు అత్యంత కీలకం. ఎంజీఎం ఆస్పత్రిలో 1,500 పడకలతోపాటు సీకేఎం, జీఎంహెచ్, ఆర్ఈహెచ్, టీబీ ఆస్పత్రులతోపాటు చుట్ట పక్కల ప్రభుత్వ ఆస్పత్రులకు పెద్ద దిక్కుగా ఈ బ్లడ్బ్యాంకు కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ బ్లడ్బ్యాంకులో 300 యూనిట్ల కంటే ఎక్కువగా రక్తం నిల్వ లేదనే విషయాన్ని గమనిస్తే దీని నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. ఈ విషయమై సూపరింటెంటెండ్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డిని వివరణ కోరగా ఎంజీఎం బ్లడ్బ్యాంకులో సిబ్బందిని నియమించి, రక్తం కొరత లేకుండా చూస్తామని పేర్కొన్నారు. విధుల్లో ఒక వైద్యాధికారి, ఏడుగురు ల్యాబ్ టెక్నీషియన్లు.. ఎంజీఎం ఆస్పత్రి వంటి అతి పెద్ద రక్తనిధి కేంద్రానికి సిబ్బంది కొరత పెద్ద తలనొప్పిగా మారింది క్యాంపుల నిర్వహణ కోసం కౌన్సిలర్లు లేకుండా ఈ రక్తనిధి కేంద్రం కొనసాగుతుందంటే పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. నాయకుల జన్మదినం, మానవతా దృక్పథంతో వచ్చే రక్తదాతల సహకారం తప్ప గత కొన్ని నెలలుగా ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది ప్రత్యేక క్యాంపులు నిర్వహించడం లేదు. గతంలో మోటిటేటర్గా పనిచేసి అత్యత్తుమ అవార్డులు సాధించిన కల్యాణి అనే ఉద్యోగిని పరిపాలనాధికారులు అకారణంగా తొలగించారు. కొన్ని నెలల క్రితం డిప్యుటేషన్పై వచ్చిన కౌన్సిలర్ను సైతం వెనక్కి పంపించేశారు. బ్లడ్బ్యాంకులో ముగ్గురు వైద్యాధికారులు, 12 మంది ల్యాబ్టెక్నీషియన్లు, నలుగురు ల్యాబ్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్, మోటివేటర్, కౌన్సిలర్లు ఉండాలి. కానీ, ప్రస్తుతం ఒకే ఒక్క వైద్యాధికారి, ఏడుగురు ల్యాబ్ టెక్నీషియన్లు మాత్రమే కొనసాగుతున్నారు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ నిబంధనలు.. రాష్ట్రంలో వైద్యసేవలను మరింత బలోపేతం చేసేందుకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ సెప్టెంబర్ మాసంలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ● ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ రక్తనిధి కేంద్రాల్లో రక్తం కొరత లేకుండా చూడాలి. ● ప్రైవేట్, స్వచ్ఛంద రక్తసేకరణ కేంద్రాలు తాము సేకరించే మొత్తం రక్త యూనిట్లలో 30 శాతాన్ని జిల్లాలో ఉన్న ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ● ఈ ప్రక్రియపై ప్రతి నెల నివేదికలను తెలంగాణ రాష్ట్ర రక్త మార్పిడి మండలికి పంపించాల్సి ఉంటుంది. ● ఈ నివేదిక ప్రకారం ఎంజీఎం బ్లడ్బ్యాంకుకు రావాల్సిన రక్తం యూనిట్ల రాకపోవడం వల్ల పేద ప్రజలకు రక్తం కొరత ఏర్పడుతోంది. ● ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ఆస్పత్రిలో సిబ్బంది నియామకానికి చర్యలు చేపట్టాలని, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ నిర్ణయాలను ఉల్లంఘిస్తున్న కేంద్రాలపై కొరడా ఝుళిపించాలని పేద ప్రజలకు వేడుకుంటున్నారు. రక్తనిధి కేంద్రంలో నియామకానికి నోచుకోని కౌన్సిలర్లు.. కానరాని క్యాంపులు కౌన్సిల్ నిబంధనలు పట్టించుకోని ప్రైవేట్ బ్లడ్బ్యాంకులు రక్తం కోసం పరుగులు తీస్తున్న పేద రోగులు ఏటూరునాగారం నుంచి ఇటీవల ఓ కేన్సర్ పేషంట్ చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి వచ్చాడు. రక్తం కావాలని సదరు పేషంట్ కుటుంబ సభ్యులకు డాక్టర్లు చెప్పారు. వారు బ్లడ్బ్యాంకుకు వెళ్తే సిబ్బంది ఒక యూనిట్ మాత్రమే ఇచ్చారు. ఇంకో యూనిట్ కావాలంటే లేదు అని చెప్పారు. దీంతో వారు ప్రైవేట్ బ్లడ్బ్యాంకు వెళ్లి రక్తం ప్యాకెట్ కొనుక్కొని వచ్చారు. ఈ పరిస్థితి ఒక్క కేన్సర్ పేషంట్ది మాత్రమే కాదు.. ఎంజీఎం ఆస్పత్రిలో అనేకమంది రోగులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. -
ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్
పరకాల: పరకాల మున్సిపల్ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహశబరీష్ తెలిపారు. పరకాలలోని గణపతి డిగ్రీ కళాశాలలో పోలింగ్ సామగ్రి పంపిణీ, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను మంగళవారం ఆమె పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరి శీలించారు. పోలింగ్, కౌంటింగ్కు ఎంతమంది పోలీ సులను నియమించారని అదనపు కలెక్టర్ ఎన్.రవి, పరకాల ఆర్డీఓ డాక్టర్ నారాయణ, పరకాల మున్సిపల్ కమిషనర్ అంజయ్యను అడిగి తెలుసుకున్నారు. పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి సత్యశారద న్యూశాయంపేట: నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో జరగనున్న ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలన్నారు. -
మున్సిపల్ ఎన్నికల సమరం నేడే
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్లో 12 మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడగా.. మంగళవారం పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు జరిగే పోలింగ్లో అభ్యర్థుల భవిష్యత్ తేలనుంది. ఈ నేపథ్యంలో పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, జనగామ, స్టేషన్ఘన్పూర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, కేసముద్రం మున్సిపాలిటీల్లో 3,35,244 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 525 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 106 సమస్యాత్మక, 99 అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన అధికారులు.. ఈ కేంద్రాల్లో పోలింగ్పై ప్రత్యేక నిఘా, బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 3,086 మంది పోలింగ్ అధికారులు, సిబ్బంది సామగ్రితో మంగళవారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. 260 వార్డులు.. 1,074 మంది పోటీ నామినేషన్ల ఉపసంహరణ తర్వాత సుమారు వారం రోజులపాటు హోరాహోరీగా జరిగిన ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు తెరపవడగా.. ఆఖరి రెండు రోజులు అన్ని పార్టీల అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. హనుమకొండ, వరంగల్లో మకాం వేసి జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, ములుగు, హనుమకొండ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో ప్రచారం చేశారు. ఆయా పార్టీల సీనియర్లు, ప్రముఖులు మెజార్టీ సభ్యుల గెలుపే లక్ష్యంగా మంత్రాంగం నిర్వహించారు. కాగా, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు 1074 మంది బరిలో నిలిచారు. ఇందులో కాంగ్రెస్ 248, సీపీఐ, సీపీఎం 12 వార్డులకు పోటీ చేస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి 259 మంది, బీజేపీ అభ్యర్థులు 240 వార్డులకు కౌన్సిలర్లుగా తలపడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు 759 మంది కాగా, మిగతా 315 మంది బీఎస్పీ, ఏఐఎఫ్బీ, రెబల్స్, ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు 12 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను గెలుచుకునేందుకు సీరియస్గా ప్రయత్నం చేస్తుండగా, బీజేపీ సైతం ఈ ఎన్నికల్లో తమ సత్తా చూపాలని భావిస్తోంది. అయితే పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం నేతలు భారీగా ప్రచారం నిర్వహించినా.. గెలుపోటములపై వారు కచ్చితమైన అంచనాలకు రాలేకపోతున్నారు. 13న ఓట్ల లెక్కింపు.. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగి రీపోలింగ్ జరిపే అవకాశం ఉంటే.. గురువారం ఆ ప్రక్రియ ఉంటుంది. 13న ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 12 చోట్ల శుక్రవారం ఉదయమే మున్సిపల్ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇదిలా ఉండగా.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. వరంగల్ పోలీసు కమిషనరేట్లోని నర్సంపేట, పరకాల, జనగామ, స్టేషన్ఘన్పూర్, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలో ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, 11 మంది ఏసీపీలు, 125 మంది ఇన్స్పెక్టర్లు కలిపి మొత్తం 1,100 మంది అధికారులు, సిబ్బంది ఈ ఎన్నికల బందోబస్తులో పాల్గొంటున్నారు. స్ట్రైకింగ్ ఫోర్స్, మొబైల్ పార్టీలు అనుక్షణం పోలింగ్ తనిఖీలు చేయనుండగా, రూట్, జోనల్ అధి కారులు ఎన్ని కల తీరును పర్యవేక్షించనున్నారు. పీఓలు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల సమాచా రాన్ని వెంటవెంటనే అధికారులకు అందించేవిధంగా ఏర్పాట్లు చేశారు. -
ఆర్టీసీ ఆదాయం రూ. 20.24 కోట్లు
● మేడారానికి మొత్తం ట్రిప్పులు 25,027 హన్మకొండ: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ప్రత్యేక బస్సులు నడిపిన టీజీఎస్ ఆర్టీసీ రూ.20,24,28,124 ఆదాయం రాబట్టుకుంది. జాతరకు 1,711 ప్రత్యేక బస్సులు నడిపి, 9,203 బస్ డేస్లలో, 25,027 ట్రిప్పుల ద్వారా మొత్తం 28,06,155 కిలోమీటర్లు నడిపింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. జాతరలో మొత్తం 12,33,585 మంది ప్రయాణికులు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఇందులో 6,08,686 మంది మహిళ(ఉచిత టికెట్)లు కాగా, 5,12,399 మంది చార్జీల చెల్లింపు ప్రయాణికులు ఉన్నారు. ఉద్యోగుల సమష్టికృషితో.. అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషితో జాతరను విజయవంతం చేశాం. ఏర్పాట్లు మొదలు నుంచి జాతర పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేశారు. జాతరను విజయవంతం చేసిన అందరికీ అభినందనలు. – దర్శనం విజయభాను, ఆర్ఎం, వరంగల్ -
విలువలు పెంపొందించుకోవాలి
కేయూ క్యాంపస్: విద్యార్థులు విద్యతోపాటు విలువలను కూడా పెంపొందించుకోవాలని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి సూచించారు. యూత్ ఫర్ సేవాసంస్థ ఆధ్వర్యంలో చిగురు కార్యక్రమం పేరుతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాంస్కృతిక, సాహిత్య, సృజనాత్మక, ప్రతిభాపాటవ పోటీలను ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా కేయూ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని లక్ష్యాలను సాధించాలని కోరారు. కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం మాట్లాడుతూ ఆసక్తి, అభిరుచి అనేవి విద్యార్థులను ముందుకు తీసుకెళ్లే శక్తులని పేర్కొన్నారు. తొలుత అతిథులు భారత మాత చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం విద్యార్థుల ప్రదర్శనలు అలరించాయి. కేయూ పాలకమండలి సభ్యురాలు బి.రమ, వైస్ ప్రిన్సిపాల్ మమత, ఎంఈఓ శ్రీనివాస్, యూత్ఫర్ సేవా సంస్థ బాధ్యులు ఎ.రవీందర్, మల్లికార్జున్ పాల్గొన్నారు. కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి -
కొడవటంచ ఆలయంలో పూజలు..
జిల్లా పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సీఎం రేవంత్రెడ్డి తొలుత రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో స్వామివారిని మంత్రులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ.12.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃనిర్మాణ పనులు, అలాగే రూ.74.15 కోట్లతో అతిథి గృహాలు, అంతర్గత రహదారుల నిర్మాణం తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో రావిమొక్క నాటారు. ఆయా కార్యక్రమాల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ హరీశ్, కనీస వేతనాల కార్పొరేషన్ చైర్మన్ జనక్ప్రసాద్, పీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, డీసీసీ అధ్యక్షుడు కర్ణాకర్ పాల్గొన్నారు. -
నేడు పరీక్షా పే చర్చా
విద్యారణ్యపురి: తెలంగాణ విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు పరీక్షా పే చర్చా కార్యక్రమానికి (చర్చా పీపీసీ 2026) సంబంధించి హనుమకొండ జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని హెచ్ఎంలను హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఆదివారం ఆదేశించారు. ప్రధాని మోదీ న్యూఢిల్లీ నుంచి విద్యార్థులతో పరీక్షా పే చర్చా కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని తెలిపారు. పాఠశాలల్లోని (ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్ (ఐఎఫ్టీ)ల ద్వారా విద్యార్థులు వీక్షించేలా ఏర్పాట్లు చేసుకోవాలని డీఈఓ సూచించారు. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధి పాఠశాలల్లో వినియోగించుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులు అధిక సంఖ్యలో ఈకార్యక్రమాన్ని వీక్షించేలా అవగాహన కల్పించాలని, వీక్షించిన విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు నిర్దేశితఫారంలో సేకరించి మధ్యాహ్నం 2 గంటల్లోపు రాష్ట్రస్థాయిలో విద్యాశాఖ సూచించిన మెయిల్కు పంపాలన్నారు. పరీక్ష పే చర్చా కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసం ప్రేరణ పెంపొందించడమే లక్ష్యంగా ఉందని ఆయన తెలిపారు. పాఠశాలల్లో ఏర్పాట్లు చేసుకోవాలి : డీఈఓ గిరిరాజ్గౌడ్ -
కంటి ఆస్పత్రి.. కళావిహీనం
ఎంజీఎం: వరంగల్ నగరంలోని రీజినల్ ఐ హాస్పిటల్ ప్రస్తుత పరిస్థితి తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది. రోగులు, మహిళా జూనియర్ వైద్యుల భద్రతపై తీవ్ర ఆందోళనలు కలిగిస్తోంది. ప్రజలకు కాంతి పంచాల్సిన ఈ ఆస్పత్రి ప్రస్తుతం అంధకారంలో మగ్గుతోంది. ప్రాంగణంలో సరైన వీధి దీపాలు లేకపోవడం, నిర్వహణ లోపించడం వల్ల రాత్రి వేళల్లో తీవ్ర చీకటి నెలకొంటోంది. దీనివల్ల రోగులు, వారి సహాయకులు, మహిళా జూనియర్ వైద్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుక్కలు, కోతుల బెడద ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో కుక్కల, కోతుల బెడద తీవ్రతరమైంది. సరైన నిర్వహణ లేక రోజురోజుకూ సమస్య జఠిలమవుతోంది. రాత్రి సమయాల్లో డ్యూటీ ముగించుకుని హాస్టల్కు వెళ్లే మహిళా జూనియర్ వైద్యులు భయాందోళనలకు గురవుతున్నారు. హాస్టల్ పరిసరాల్లో కూడా భద్రతా ఏర్పాట్లు తగినంత లేకపోవడం గమనార్హం. రోగులు, వారి కుటుంబ సభ్యులు సైతం ఆస్పత్రి ప్రాంగణంలో తిరగడానికే భయపడే పరిస్థితి నెలకొంది. సరైన లైటింగ్, భద్రతా చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆస్పత్రి ప్రతిష్ట దెబ్బతింటోంది. అధికారులు తక్షణమే స్పందించాలి.. ఆస్పత్రి ప్రాంగణంలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలి. కుక్కలు, కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని రోగులు, వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మహిళా వైద్యులు, రోగుల భద్రత కోసం సెక్యూరిటీ బలోపేతం చేయాలని, హాస్టల్, ఆస్పత్రి ఆవరణలో వసతులు మెరుగుపర్చాలని మహిళా జూనియర్ వైద్యులు కోరుతున్నారు. అంధకారంలో వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల -
మిషనరీ స్థలాల జోలికొస్తే ఊరుకోం
హన్మకొండ చౌరస్తా: ‘హనుమకొండలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చికి 150 ఏళ్ల చరిత్ర ఉంది. ఇవి ముమ్మాటికీ క్రైస్తవ మిషనరీ ఆస్తులే. వీటి జోలికొస్తే ఊరుకోం’ అని సీబీసీ సెక్రటరీ క్రిస్టోఫర్ రూబెన్ అన్నారు. మిషనరీ ఆస్తుల పరిరక్షణ త్రినగర క్రైస్తవ సమాజం ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించింది. చర్చి నుంచి మొదలైన ర్యాలీ ఏషియన్ మాల్ మీదుగా తిరిగి సీబీసీ వరకు కొనసాగింది. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రిస్టోఫర్ రూబెన్ మాట్లాడుతూ.. కొందరు ఇంటి దొంగల సాయంతో మరోసారి మిషనరీ ఆస్తులు అమ్మేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల దాదాపు 200 మంది రౌడీలు మిషనరీ ఆస్పత్రి ప్రహరీని కూల్చి లోపలికి చొచ్చుకొచ్చారని, ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. తమ న్యాయ పోరాటానికి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ డాక్టర్ కావ్య పూర్తి మద్దతుగా నిలుస్తున్నారని, వారికి క్రైస్తవ సమాజం పక్షాన ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో సెంటినరీ బాప్టిస్ట్ చర్చి కమిటీ ప్రెసిడెంట్ టి.విజయ్స్వరూప్, జాయింట్ సెక్రటరీలు కె.విద్యాకర్, ఎన్.సునీల్, వైస్ ప్రెసిడెంట్లు ఎన్.జాన్సన్ ప్రసాద్, జె.డేవిడ్, ట్రెజరర్ డాక్టర్ బి.విల్సన్ వినయ్కుమార్, కార్పొరేటర్ పోతుల శ్రీమన్నారాయణ, మాజీ కార్పొరేటర్ బోడ డిన్నా, కాంగ్రెస్ నాయకులు మోసెస్ ఆనంద్, తోట వపన్, పాస్టర్ జోసెఫ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆస్తుల పరిరక్షణ కోసం క్రైస్తవ సమాజం ర్యాలీ సీబీసీ సెక్రటరీ టి.క్రిస్టోఫర్ రూబెన్ -
స్థానికేతరులు వెళ్లిపోవాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ వరంగల్క్రైం: మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం ముగియనుండడంతో స్థానికేతరులు వెళ్లిపోవాలని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. వెళ్లకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి స్టేషన్ ఘన్పూర్, జనగామ, పరకాల, వర్ధన్నపేట పట్టణాల్లో ప్రచారం ముగియనున్న నేపఽథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రచారం నిమిత్తం వచ్చిన ఆయా పార్టీలకు చెందినవారు గమ్యస్థానాలకు తిరిగి వెళ్లాలని సూచించారు. హన్మకొండ: హనుమకొండ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 9న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబ రెడ్డి తెలిపారు. వెస్ట్ సిటీ ఫీడర్లోని నెహ్రూనగర్, రాక్ గార్డెన్, మెట్టు గుట్ట, బృందావన్ వెంచర్ ప్రాంతంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. వరంగల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ ఎస్.మల్లికార్జున్ తెలిపారు. కాశిబుగ్గ, శ్రీనివాస వీధి, మదీనా వీధి, గుడి వెనుక ప్రాంతంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, కాశిబుగ్గ, ఏనుమాముల మార్కెట్ రోడ్, మధురానగర్, సాయి గణేశ్ కాలనీ ప్రాంతంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, బీఆర్ నగర్, వినాయకనగర్, అమ్మవారిపేట రోడ్డు, మెడికేర్ ఆస్పత్రి, రాజీవ్నగర్, భట్టుపల్లి రోడ్డు, నాని గార్డెన్స్ ప్రాంతంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. -
సోమవారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
కొద్ది రోజులుగా పలు కొత్త జిల్లాలను రద్దు చేస్తారని, రెండు జిల్లాలను కలిపి ఒకటి చేస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ములుగు, భూపాలపల్లిని కలిపి ఒకటే చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో జిల్లాల రద్దు ప్రచారంపై సీఎం రేవంత్రెడ్డి స్పష్టత ఇచ్చారు. జిల్లాలను రద్దు చేయబోమని, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయమని ప్రకటించారు. దీంతో భూపాలపల్లి జిల్లా రద్దు అనే ప్రచారానికి చెక్ పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భూపాలపల్లి జిల్లా చెల్పూరులో జరిగిన సభకు హాజరైన జనం, అభివాదం చేస్తున్న సీఎం రేవంత్పాలకవర్గాలు లేకపోయినా గడిచిన ఏడాదిలో భారీగా విడుదల చేశాం.. -
బ్రహ్మోత్సవాలకు మంత్రికి ఆహ్వానం
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని శనివారం వేయిస్తంభాల ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, సీనియర్ అసిస్టెంట్ మధుకర్ హనుమకొండ రాంనగర్లోని మంత్రి నివాసంలో మంత్రి కొండా సురేఖను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు గట్టు మహేశ్బాబు, మున్నూరు కాపు సంఘం నాయకులు గండ్రతి రాజు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 1వ తేదీన గుజరాత్ పీజియన్ క్లబ్ ఆధ్వర్యంలో గుజరాత్లోని భరూచ్లో నిర్వహించిన ఆలిండియా పీజి యన్ షోలో కాజీపేటలోని బాపూజీనగర్కు చెందిన సయ్యద్ షకీర్కు చెందిన పావురాలు గ్రాండ్ చాంపియన్లుగా నిలిచాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 14 రకాల ఫ్యాన్సీ పీజి యన్ జాతులు ప్రదర్శనలో పాల్గొనగా షకీర్ పది పీజియన్లను పోటీల్లో నిలిపారు. పోటీల్లో పాల్గొన్న పది పీజియన్ జాతుల్లో హంగేరియన్ జెయింట్ హౌస్, లాహోర్ పీజియన్లు ఫిమేల్, మేల్ కేటగిరీలో గ్రాండ్ చాంపియన్ కైవసం చేసుకోవడంతో పాటు మరో ఐదు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి బహమతులు అందుకున్నాయి. హన్మకొండ చౌరస్తా: ‘ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడం మనందరి బాధ్యత, అంతర్గత విభేదాలు వీడి నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలి’ అని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య.. సిబ్బందికి సూచించారు. హనుమకొండ 4వ డివిజన్ పరిధి పెద్దమ్మగడ్డ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన తనిఖీ చేశారు. రిజిస్టర్, రికార్డులు పరిశీలించిన అనంతరం ఔట్ రీచ్ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా 44 మంది పిల్లలకు, గర్భిణులకు 62 డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినట్లు గుర్తించారు. ఈసందర్భంగా సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఇటీవల సిబ్బంది మధ్య విభేదాలు తలెత్తుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలాంటి ఘటనలు పునరావృతం అయితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 9, 10 తేదీల్లో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హనుమకొండ డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ శుక్రవారం తెలిపారు. జేఎన్ స్టేడియంలోని డీఎస్ఏ కార్యాలయంలో క్రీడా సంఘాల బాధ్యులు, పీఈటీలతో శనివారం సీఎం కప్ క్రీడా పోటీల సన్నాహక సమావేశం నిర్వహించారు. క్రీడా సంఘాల బాధ్యులు సారంగపాణి, శ్రీనివాసరెడ్డి, రమేశ్రెడ్డి, సాంబయ్య, రాజేందర్, రామ్రెడ్డి, ఎస్జీఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్, పీఈ టీల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, పీఈటీలు, పీడీలు, కోచ్లు పాల్గొన్నారు. -
నేడు భూపాలపల్లికి సీఎం రేవంత్రెడ్డి
భూపాలపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు (ఆదివారం) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. చాపర్ ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు రేగొండ మండలం కొడవటంచకు చేరుకుంటారు. లక్ష్మీనర్సింహాస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. విశ్రాంతి భవనాన్ని పరిశీలించిన అనంతరం ఆలయంలో రూ.12 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలిస్తారు. అక్కడి నుంచి చాపర్ ద్వారా గణపురం మండలంలోని సింగరేణి వేయి క్వార్టర్ల ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభావేదికపై డీబీఎం–38 కాల్వకు పైప్లైన్ ఏర్పాటు, భీం ఘన్పూర్ రిజర్వాయర్ ఆధునికీకరణ, గణపసముద్రం చెరువు సిమెంట్ లైనింగ్ తదితర పనులకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిసింది. ఏర్పాట్లు పూర్తి.. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సీఎం ప్రత్యేక సెక్యూరిటీ అధికారి వాసుదేవరెడ్డి శనివారం సీఎం రేవంత్రెడ్డి పర్యటించే స్థలాలు, సభాస్థలి, హెలిపాడ్ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భారీ బందోబస్తు.. సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ సభ వద్ద సుమారు 1,100 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. 10 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, ఎస్సైలు విధుల్లో ఉండనున్నారు. కొడవటంచ ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన, ప్రత్యేక పూజలు సింగరేణి వేయి క్వార్టర్ల ఎదురుగా బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
పోటీలో అత్యధికంగా స్వతంత్రులు
● చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికపై ప్రభావం ● ప్రధాన పార్టీలకు గుబులు ● గెలుపు అవకాశం ఉన్న ఇండిపెండెంట్లపై గురి ● ఇప్పటి నుంచే టచ్లో పెట్టుకునే ప్రయత్నం ● మొదలైన ముఖ్యనేతల బేరసారాలు స్వతంత్ర అభ్యర్థులుసాక్షిప్రతినిధి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికపై వారు ప్రభావం చూపుతారనే చర్చ జరుగుతోంది. మొత్తం 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులుంటే.. 1,073 మంది కౌన్సిలర్ సీటు కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు కలిసి 260 మంది, బీఆర్ఎస్ నుంచి 259, బీజేపీ నుంచి 240 మంది పోటీలో ఉన్నారు. ఇండిపెండెంట్గా 314 మంది వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమానంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రధాన పార్టీల్లో గుబులురేపుతున్నారు. ఆశించిన పార్టీలో టికెట్లు రాకపోవడంతో కొందరు స్వతంత్రులుగా రంగంలోకి దిగారు. ఇంకొందరు తమ సత్తా చాటేందుకు యత్నిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీల్లో ఎవరి ఓట్లు చీలుస్తారనే భయం అభ్యర్థుల్లో నెలకొంది. ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. టఫ్ ఫైట్.. స్వతంత్రుల కారణంగా ఎవరి ఓట్లకు గండిపడుతుందనే ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ టికెట్లు రానివారు రంగంలో గట్టిగానే పోరాడుతున్నారు. దీంతో ఓవైపు అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తూనే.. మరో వైపు గెలిచే అవకాశం ఉన్న ఇండిపెండెంట్లను ప్రధాన పార్టీల నేతలు టచ్లో పెట్టుకుంటున్నారు. గెలుపు గుర్రాలను ఎంపిక చేసి ఖర్చులు మోసేందుకు చాటుమాటుగా బేరసారాలు చేస్తున్నారు. 12 మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకునేందుకు పోటాపోటీగా ప్రచారం చేస్తున్న ప్రధాన పార్టీల నుంచి మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు స్వతంత్రులను రాజీ చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అంతర్గత మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మున్సిపాలిటీలు 12మొత్తం వార్డులు 260బరిలో ఉన్న అభ్యర్థులు 1,073 కాంగ్రెస్ 260బీఆర్ఎస్ 259బీజేపీ 240స్వతంత్రులు 314 హనుమకొండ పరకాల మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులకు 100 మంది పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి 22 మంది చొప్పున అభ్యర్థులుండగా, బీజేపీ నుంచి 21 కాగా రెబల్స్, స్వతంత్రులు కలిపి 35 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 12 మందికి విజయావకాశాలున్నాయంటున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ 30 వార్డులకు 120 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అన్ని వార్డులకు అభ్యర్థులను నిలపగా, స్వతంత్రులుగా కూడా 30 మంది తలపడుతున్నారు. ఇందులో ఆరుగురు గెలిచే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు అభ్యర్థులను బరిలో నిలపగా, అత్యధికంగా 50 మంది ఇండిపెండెంట్లు (రెబల్స్ కూడా) పోటీలో ఉన్నారు. మొత్తం 50 మందిలో 20 మంది ఈజీగా గెలుస్తారన్న చర్చ జరుగుతోంది. జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులకు 27 వార్డుల్లో కాంగ్రెస్, 3 చోట్ల సీపీఐ, సీపీఎంలుండగా, బీఆర్ఎస్ నుంచి 29 మంది, బీజేపీ 26 మంది కౌన్సిలర్ కోసం పోటీ పడుతున్నారు. ఇక్కడి నుంచి రెబల్స్ కలుపుకుని 45 మంది స్వతంత్రులు బరిలో నిలిచి ప్రధాన పార్టీలకు చుక్కలు చూపెడుతున్నారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలోని 18 వార్డులకు 82 మంది పోటీ చేస్తుండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్కు మొత్తం వార్డుల నుంచి అభ్యర్థులుండగా, 13 వార్డులకు బీజేపీ అభ్యర్థులను నిలిపింది. ఇక్కడ 33 మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ టికెట్లు ఆశించి స్వతంత్రులుగా నిలిచిన నలుగురు గట్టి పోటీ ఇస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులకు 155 మందిలో.. 58 మంది ఇండిపెండెంట్లుగా పోటీలో నిలిచారు. కాంగ్రెస్ 32, మిత్రపక్షాలు నాలుగు చోట్ల, బీఆర్ఎస్ 35, బీజేపీ నుంచి 30 మంది పోటీ చేస్తున్నారు. ఇక్కడ సుమారు 8 మంది ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తొర్రూరు మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీ చేస్తుండగా, 15 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 63 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తుండగా, స్వతంత్రులు సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరిపెడ మున్సిపాలిటీ నుంచి 15 వార్డులకు మొత్తం 63 మంది పోటీ చేస్తుండగా, అన్ని వార్డులకు మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలో దింపాయి. 18 మంది ఇండిపెండెంట్లుగా పోటీలో నిలబడి పోరాడుతున్నారు. కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులకు 58 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్,బీఆర్ఎస్లు అన్ని వా ర్డులకు అభ్యర్థులను దింపగా, బీజేపీ 15 చోట్ల పోటీ చేస్తుంది. 11మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. డోర్నకల్ మున్సిపాలిటీలో 15 వార్డులకు 64 మంది పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అన్ని వార్డులకు అభ్యర్థులను పెట్టగా, బీఆర్ఎస్ 14, బీజేపీ 14 వార్డుల్లో పోటీ పెట్టింది. 21 మంది ఇక్కడి నుంచి ఇండిపెండెంట్లుగా పోటీలో ఉన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులకు 107 మంది ఉండగా, కాంగ్రెస్ 25, మిత్రపక్షాలు 5 కలిపి 30 వార్డులకు పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ 30 వార్డుల్లో, బీజేపీ 25 వార్డుల్లో అభ్యర్థులను పోటీలో దింపగా 27 మంది స్వతంత్రులు బరిలో నిలిచి పోరాడుతున్నారు. ములుగు మున్సిపాలిటీలో 20 వార్డులకు 83 మంది బరిలో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీలు అన్ని వార్డులకు పోటీ చేస్తుండగా, 23 మంది ఇండిపెండెంట్లుగా కౌన్సిలర్ కోసం కొట్లాడుతున్నారు. -
సమ్మక్క–సారలమ్మ జాతరతోనే ఆదివాసీల గుర్తింపు
హన్మకొండ కల్చరల్: మేడారం హుండీల్లో భక్తుల వింత కోరికల చీటీలు ఆసక్తి కలిగిస్తున్నాయి. సమ్మక్క సారలమ్మ జనజాతర, కుంభమేళాతోనే ఆదివాసీలకు ప్రభుత్వం, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ స్వయం కృషితో గుర్తింపు లభించిందని ఓ ఆదివాసీ భక్తుడు హుండీలో చీటీ రాసి వేశాడు. ‘సురేఖమ్మ నీ మంచి మనసుతో మాకు న్యాయం చేయండి, మేడారం సమ్మక్క సారలమ్మ కోసం మీ కృషి అంతాఇంతా కాదు. మేడారం జాతర ఉన్నంతకాలం మీరు గుర్తుండిపోతారు. కొన్ని గుళ్లు శిథిలావస్థలో ఉన్నాయి. అమ్మా వాటిని పట్టించుకోండి. ఖర్చు మీది... కష్టం మాది తక్కువ వేతనమైన ఫర్వాలేదు, మాకు న్యాయం చేయండి. అమ్మ మా కష్టాలనుంచి ఆదుకోండి’ అంటూ లేఖలో వివరించాడు. అమ్మా నా కొడుక్కి ఆఫర్ లెటర్ ఇప్పించు.. ‘సమ్మక్క సారలమ్మ తల్లి మాపై దయ చూసి మీ ఆశీర్వాద దీవెనలతో నా కొడుక్కు ఉద్యోగ ఆఫర్ లెటర్ ఇప్పించు తల్లి. వచ్చే జాతరకు నీకు నా కొడుకెత్తు బంగారం(బెల్లం) మొక్కులు చెల్లించుకుంటా’ అని ఓ భక్తురాలు చీటీ రాసి హుండీలో వేసింది. సురేఖమ్మ మీ త్యాగం వృథా పోదు.. మేడారం హుండీల్లో ఓ ఆదివాసీ భక్తుడి లేఖ -
వేసవి ప్రణాళిక సిద్ధం
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: వేసవిలో జిల్లాలోని అన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో మిషన్ భగీరథ అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గతేడాదిలో తాగునీటి సమస్యలు ఎదురైన గ్రామాలు, తీసుకున్న పునరుద్ధరణ చర్యలు, జిల్లాకు అవసరమైన నీటి సామర్థ్యం, నీటి వనరుల స్థితిగతులపై అధికారులను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తాగునీటి సరఫరాకు సంబంధించి అన్ని అంశాలపై సమగ్ర నివేదికను మిషన్ భగీరథ ఈఈలు, జిల్లా పంచాయతీ అధికారి త్వరితగతిన అందజేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు ప్రతీ ఇంటికి తాగునీరు అందుతుందా లేదా? అని క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో తాగునీటి సరఫరాకు సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే స్పందించి పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్డీఓ మేన శ్రీను, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ గాయత్రి, ఈఈ రామాంజనేయులు, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, ఎంపీడీఓలు, ఎంపీఓలు, మిషన్ భగీరథ డీఈలు, ఏఈలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ కోటను హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రంలో ‘ఫారం డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్’ అంశంపై శిక్షణ పొందుతున్న 15 దేశాల ప్రతినిధులు సందర్శించారు. శిల్పకళా సంపదను ఆసక్తిగా తిలకించారు. ఖుష్మహల్, శృంగారపు బావి, ఏకశిలగుట్ట, రాతి మట్టికోట అందాలను వీక్షించారు. కాకతీయుల విశిష్టతను అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ సూర్యకిరణ్ వారికి వివరించారు. కేంద్ర పురావస్తు శా ఖ సిబ్బంది, టీజీటీడీసీ అజయ్ ఉన్నారు. గ్రేటర్ కమిషనర్ చాహత్బాజ్పాయ్ కుటుంబసమేతంగా కోటను సందర్శించారు. కాకతీయుల విశిష్టతను కోట గైడ్ రవియాదవ్ వివరించారు. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో ఎక్కడాలోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్ సమావేశపు హాల్లో వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీలకు సంబంధించిన బ్యాలెట్పేపర్లు, సీల్స్, స్టేషనరీ, పోలింగ్కు అవసరమైన ఇతర సామగ్రిని కలెక్టర్ శనివారం క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల సామగ్రి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, స్ట్రాంగ్ రూంలు, పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, మున్సిపల్ కమిషనర్లు సుధీర్కుమార్, భాస్కర్, డీఏఓ ఫణికుమార్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. అక్రిడిటేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026 – 28వ సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం సోమవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్పర్సన్, కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. యాజమాన్యాలు పంపిన జాబితాలో ఉన్న జర్నలిస్టులు మాత్రమే సమాచార శాఖ వెబ్సైట్ ఐఅండ్పీఆర్.తెలంగాణ.జీఓవీ.ఇన్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. -
లక్ష్యం.. సామర్థ్యం
మూడో తరగతి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపునకు కసరత్తు విద్యారణ్యపురి: ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు హనుమకొండ జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పట్టణ, గ్రామీణ పాఠశాలలకు మధ్య ఉన్న అభ్యసన వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రణాళిక రూపొందించింది. 2024 న్యాస్ (నేషనల్ అసెస్మెంట్ సర్వే) ఫలితాలు, పాఠశాల స్థాయిలో లోటుపాట్లు, విద్యార్థులు సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంది. ఈనెల 26న ఎస్సీఈఆర్టీ జాతీయస్థాయిలో మూడో తరగతి విద్యార్థులకు భాష, గణితంలో సామర్థ్యాలపై ఎఫ్ఎల్ఎస్ (ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ) నిర్వహించనుంది. ఇప్పటికే మాక్టెస్ట్.. ఈప్రణాళికలో భాగంగా గత డిసెంబర్ 23న జిల్లాస్థాయిలో మూడో తరగతి విద్యార్థులకు బేస్లైన్ ఎఫ్ఎల్ఎస్ మాక్ టెస్టును భాష, గణితంలో నిర్వహించారు. విద్యార్థులకు పఠన అవగాహన, గణిత సామర్థ్యాలు ఎస్ఈఆర్టీ, ఎన్సీఈఆర్టీ నిర్దేశించిన అభ్యాస ఫలితాలను విశ్లేషిస్తారు. మాక్ టెస్టులో ఆశించిన విధంగా ఫలితాలు రాలేదని సమాచారం. దీంతో విద్యార్థిస్థాయిలో విడివిడిగా అధ్యయనం చేసి అవసరమైన అకడమిక్ పరంగా సామర్థ్యాల పెంపుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. టీచర్లలో విద్యాబోధన నైపుణ్యాలు జిల్లాలోని ఉపాధ్యాయుల్లో విద్యాబోధన నైపుణ్యాల బలోపేతం కోసం స్కూల్కాంప్లెక్స్లను అకడమిక్ హబ్లుగా అభివృద్ధి చేసేందుకు జిల్లా విద్యాశాఖ దృష్టి సారించింది. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన వ్యూహాల్లో పఠనవ్యూహాలు, గణిత భావనాత్మక బోధన నమూనాలు, విద్యార్థుల అభ్యసనస్థాయికి సరిపడే వర్క్షీట్లు వినియోగంలోనికి తీసుకరానున్నారు. డ్యూయల్ పీరియడ్.. జిల్లాలోని ప్రతి పాఠశాలలో అమలుచేయనున్న రోజువారీ ద్వికాలిక (డ్యూయల్ పీరియడ్) విధానం ద్వారా మూడో తరగతి విద్యార్థులకు ఉదయం అభ్యాసన బోధన, మధ్యాహ్నం నైపుణ్యాల ఆధారిత మూల్యంకనం జరగనుంది. దీంతో విద్యార్థులు నేర్చుకున్న అంశంపై అదేరోజు నిర్ధారణ అవుతుంది. జిల్లాలో ప్రత్యేకంగా రూపొందించింది ఇలా.. విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో రీడ్స్ అండ్ కౌంట్స్ కార్యక్రమంలో భాగంగా స్థానిక కథలు, పరిసరాల ఆధారంగా పఠన కార్యకలాపాలు, దైనందిన జీవితానికి అనుసంధానమైన గణిత సమస్యలు, సహచర విద్యార్థుల ద్వారా అభ్యాసం (పీర్లెర్నింగ్) వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తారు. మాక్ పరీక్షలు, విశ్లేషణలు మూడో తరగతి విద్యార్థుల భాషా, గణితం అభ్యసనాలను ఎఫ్ఎల్ఎస్కు సన్నద్ధతకు ఇప్పటికే డిసెంబర్లో ఒకమాక్ పరీక్ష నిర్వహించారు. ఇటీవల ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలు విద్యార్థులకు మాక్ పరీక్ష నిర్వహించారు. ఇందులో విద్యార్థుల సామర్థ్యాలు ఏమేరకు పెరిగాయనేది తెలియనుంది. ఆ తర్వాత లోటుపాట్లను సరిచేసి ఎన్సీఈఆర్టీ ద్వారా జాతీయస్థాయిలో నిర్వహించనున్న ఎఫ్ఎల్ఎస్ టెస్టుకు కూడా విద్యార్థులను సన్నద్ధం చేస్తారు. విద్యార్థుల పురోగతిని పర్యవేక్షించేందుకు జిల్లాలో ఇప్పటికే అమలులో ఉన్న ఎఫ్ఎల్ఎన్ అండ్ లిప్ మానిటరింగ్ వ్యవస్థలను ఎఫ్ఎల్ఎస్తో సమన్వయం చేస్తూ డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోనున్నారు. మాక్ పరీక్షల విశ్లేషణలు ఉపాధ్యాయుల బోధనా ప్రణాళికల్లో ప్రతిబింబించేలా చర్యలు తీసుకోనుతున్నారు. తల్లిదండ్రులతో సమావేశాలు కూడా నిర్వహించి ఇంటి విద్యార్థుల్లో అభ్యసనానికి అనుకూల వాతావరణం కల్పించడంపై దృష్టి సారించనున్నారు. 26న ఎఫ్ఎల్ఎస్ నిర్వహించాలని ఆదేశాలు.. రాష్ట్ర వ్యాప్తంగా మూడో తరగతి విద్యార్థుల కోసం ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీని ఈనెల 26న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ డీఈఓలకు ఆదేశాలు జారీచేశారు. స్థానిక సంస్థలు, యూఆర్ఎస్ పాఠశాలల్లో ఈ అధ్యయనం చేయనున్నారు. మూడో తరగతి విద్యార్థుల్లో భాష నైపుణ్యాలు (తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ), గణిత నైపుణ్యాలు అంచనా వేయనున్నట్లు తెలిపారు. ఏ మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులకు ఆ మాధ్యమంలో భాషానైపుణ్యాలు అంచనా వేస్తారు. ఎస్సీఈఆర్టీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఎఫ్ఎల్ఎస్ ఐటమ్ బ్యాంకు అసెస్మెంట్ విధానాల సమాచారాన్ని కూడా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో ఉన్న ప్రాథమిక స్థాయిలోని మూడో తరగతి విద్యార్థులకు ఈ ఎఫ్ఎల్ఎస్ ఉంటుంది. విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం.. హనుమకొండ జిల్లాలో మూడో తరగతి విద్యార్థులను ఎఫ్ఎల్ఎస్ (టెస్టుకు)కు సన్నద్ధత చేస్తున్నాం. ఇందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తున్నాం. జిల్లాస్థాయిలో హెచ్ఎంలు, మూడో తరగతి విద్యార్థులు, విద్యాభోజనచేసే ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం జారీచేశాం. ఎస్సీఈఆర్టీ వెబ్సైట్లో ఎఫ్ఎల్ఎస్ ఐటం బ్యాంకు ,మాక్టెస్టు పత్రాల వినియోగంపై దృష్టిసారించాం. మరో రెండు మాక్టెస్టులు నిర్వహించి, రెమిడియల్ బోధనచేపట్టి ఈనెల 26న జరగనున్న ఎఫ్ఎల్ఎస్కు విద్యార్థులను సిద్ధం చేస్తున్నాం. – బండారు మన్మోహన్, జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించిన పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే మాక్ టెస్ట్ల నిర్వహణ.. ఈ నెల 26న ఎఫ్ఎల్ఎస్ -
15న ఆధ్యాత్మిక సమ్మేళనం
ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేశ్ రెడ్డి హన్మకొండ: ఓరుగల్లు వైభవాన్ని చాటేలా మహా శివరాత్రి రోజున ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనాన్ని ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు భద్రకాళి దేవాలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేశ్ రెడ్డి తెలిపారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ నెల 15న హనుమకొండ బాలసముద్రంలోని ‘కుడా’ మైదానంలో సాయంత్రం 5:30 నుంచి 16న ఉదయం 5 గంటల వరకు ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈసమ్మేళనానికి పలువురు ఆధ్యాత్మికవేత్తలు, కళాకారులు హాజరుకానున్నట్లు, విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సమ్మేళన కరపత్రాలను భద్రకాళి శేషు ఆవిష్కరించారు. సమావేశంలో విశ్వహిందూ పరిషత్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి ఎలగందుల రాజు, కార్పొరేటర్ రవి నాయక్, ప్రముఖ యోగా గురువు పోశాల శ్రీనివాస్, ఇండస్ ఫౌండేషన్ కార్యదర్శి పురుషోత్తం యాదవ్, మహాశివరాత్రి కార్యక్రమ నిర్వాహకులు అభిషేక్, సుకాంత్, దీపక్, అఖిల్రెడ్డి పాల్గొన్నారు. -
రేపు కేయూలో మెగా జాబ్ మేళా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 7న ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కేయూ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ చిర్రరాజు తెలిపారు. యూనివర్సిటీలోని ప్లేస్మెంట్ సెల్, హైదరాబాద్ మేజిక్ బస్ ఫౌండేషన్ సంయుక్తంగా సీఐఎస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాబ్ మేళాకు సంబంఽధించి గురువారం పోస్టర్లను కేయూ వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఆవిష్కరించారు. ఈ మెగా జాబ్ మేళాకు 2023, 2024, 2025లో డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు, బీటెక్ కోర్సులు పూర్తి చేసిన వారు హాజరు కావొచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కేయూ పాలకమండలి సభ్యులు ఆచార్యులు బి.సురేశ్లాల్, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, ప్రొఫెసర్ ఎస్.నర్సింహాచారి, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య, ఇంజనీరింగ్ కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్లు సంతోశ్, బొల్లం కిరణ్, మేజిక్ బస్ ఫౌండేషన్ బాధ్యులు సందేశ్వర్, రాకేశ్ ల్యాదెల్ల పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ (సెల్ట్) ఆధ్వర్యంలో గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన స్పోకెన్ ఇంగ్లిష్ అండ్ కమ్యూనికేషన్ తరగతులు వాయిదా వేసినట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.మేఘనరావు తెలిపారు. ఈతరగతులు మార్చి 5వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లుగా రీషెడ్యూల్ చేసినట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈస్పోకెన్ ఇంగ్లిష్ తరగతులకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. చైర్పర్సన్గా ప్రొఫెసర్ స్వర్ణలత కేయూ క్యాంపస్: విద్యార్థులకు మానసిక ఆరోగ్యాన్ని అందించేందుకు, వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు కాకతీయ యూనివర్సిటీలో నూతనంగా స్టూడెంట్ సపోర్ట్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. కేయూ వీసీ ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ రామచంద్రం ఒక సర్క్యూలర్ను గురువారం జారీ చేశారు. కేయూ స్టూడెంట్స్ కౌన్సిల్ కోసం చైర్పర్సన్గా సొషియాలజీ విభాగాధిపతి ఎం.స్వర్ణలత, సభ్యులుగా సైకాలజీ విభాగం అధ్యాపకులు సంపత్రెడ్డి, డాక్టర్ మాలతి, అకడమిక్ విభాగం అసిస్టెంట్ రిజిస్ట్రార్ మెంబర్ కన్వీనర్గా ఉన్నారు. వర్సిటీ క్యాంపస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలోని సైకాలజీ విభాగం వద్ద ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి మానసిక సమస్యలతో బాధపడే కేయూ పరిధి విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తారు. ఫోన్లో కానీ, నేరుగా కానీ సంప్రదించవచ్చని సభ్యులు చెబుతున్నారు. అవసరమైన వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలి మానసిక ఆరోగ్య మద్దతు కోసం అవసరమైన విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని కేయూ వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం అన్నారు. గురువారం కేయూలో స్టూడెంట్స్ సపోర్ట్ కౌన్సిల్ చైర్పర్సన్, సభ్యులతో వారు సమావేశం నిర్వహించారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ, హైదరాబాద్ టీహబ్ సంయుక్తంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు క్యాంపస్లోని ఆడిటోరియంలో ఓరియంటేషన్ సెషన్ నిర్వహించనున్నట్లు రూసా కేయూ నోడల్ అధికారి ప్రొఫెసర్ మల్లికార్జున్ రెడ్డి, కేహబ్ డైరెక్టర్ ప్రొఫెసర్ సవితాజ్యోత్స్న గురువారం తెలిపారు. ముఖ్యఅతిథిగా కేయూ వీసీ ప్రొఫెసర్ ప్ర తాప్రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం, హైదరాబాద్ ఏఐసీ టీహబ్ ప్రతినిధులు రాజేష్కుమార శ్రవణ ఏర్ల, చైతన్య, మహ్మద్ హఫీజుద్దీన్ పాల్గొననున్నారని పేర్కొన్నారు. -
నగరాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ఖిలా వరంగల్: హైదరాబాద్కు దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం వరంగల్ 40వ డివిజన్ కరీమాబాద్లోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి ఖమ్మం బైపాస్ రోడ్డు నుంచి అమ్మవారిపేట రోడ్డు వరకు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో రూ.1.09 కోట్ల నిధులతో సీసీ రోడ్డు, డ్రెయినేజీల నిర్మాణ పనులను మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్ మరుపల్లి రవితో కలిసి మంత్రి సురేఖ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, నగరాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సమస్యలు లేని నగరంగా వరంగల్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్రాజు, మీసాల ప్రకాశ్, కేడల పద్మ, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ సీసీ రోడ్లు, డ్రెయినేజీలకు శంకుస్థాపన -
రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి
వరంగల్ లీగల్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కోర్టుకు చెందిన యువ న్యాయవాది స్వప్న హత్యకు గురవడం బాధాకరమని, పోలీసు అధికారుల నిర్లక్ష్య వైఖరే స్వప్న హత్యకు ప్రధాన కారణమని వరంగల్, హనుమకొండ ఉభయ జిల్లా న్యాయవాదులు ఆ రోపించారు. న్యాయవాది స్వప్న హత్యను ఖండిస్తూ శుక్రవారం ఉభయ జిల్లా బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి జిల్లా కోర్టు ప్రధాన గేట్ ఎదుట నిరసన తెలి పారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఆస్తి పంపకాల్లో తన అన్నతో గొడవలు జరుగుతున్నాయని, ఆయన వల్ల తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఏసీపీ నుంచి ఎస్సై స్థాయి అధికారి వరకు న్యాయవాది స్వప్న ఫిర్యాదు చేసిందని తెలిపారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంతోనే దుండగులు అతి దారుణంగా కత్తులతో స్వప్న గొంతు కోసి హత్య చేశారన్నారు. తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో పలువురు సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులతో పాటు కార్యవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. యువ న్యాయవాది స్వప్న హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణం వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయవాదుల నిరసన -
‘పుర’పోరుకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లు
సాక్షిప్రతినిధి, వరంగల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. మున్సిపాలిటీల వారీగా సీనియర్ నాయకులను ఇన్చార్జ్లుగా నియమించిన టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్.. వార్డుల వారీగా అభ్యర్థుల గెలుపు బాధ్యతలను వారిపైనే పెట్టారు. నియోజకవర్గాల వారీగా ఆయా మున్సిపాలిటీల పరిధి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను సమన్వయం చేసుకుంటూ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ వరంగల్, మహబూబాబాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్ లుగా ఉన్నారు. వీరికి తోడు మున్సిపాలిటీల వారీగా కో–ఆర్డినేటర్లను గురువారం నియమించారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధి జనగామ మున్సిపాలిటీకి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, పాయం వెంకటేశ్వర్లుకు మున్సిపల్ ఎన్నికల కో–ఆర్డినేటర్లుగా బాధ్యతలు ఇచ్చారు. వరంగల్ పార్లమెంట్ పరిధి తొర్రూరు మున్సిపాలిటీకి ఎంపీ డాక్టర్ కడియం కావ్య, కొలను హనుమంతరెడ్డిని నియమించారు. పరకాలకు టెస్కాబ్ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, స్టేషన్ఘన్పూర్కు భీమగాని సౌజన్య, భూపాలపల్లికి ఎర్రబెల్లి వరద రాజేశ్వర్రావు, వర్ధన్నపేటకు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని డోర్నకల్ మున్సిపాలిటీకి గాజర్ల అశోక్, మరిపెడకు ఎంపీ పోరిక బలరాంనాయక్, కేసముద్రంకు దూడ వెంకటరమణ, మహబూబాబాద్కు సీహెచ్ వెంకటేశ్, ములుగుకు ఈవీ శ్రీనివాస్రావు, నర్సంపేటకు డాక్టర్ పులి అనిల్కుమార్ను సమన్వయకర్తలుగా టీపీసీసీ నియమించింది. కో–ఆర్డినేటర్లుగా నియమితులైన వారికి అభ్యర్థుల గెలుపు బాధ్యతలను అప్పగించింది. కో–ఆర్డినేటర్లుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు మినహా ఇతర సీనియర్లకు భవిష్యత్లో నామినేటెడ్ పోస్టులకు మున్సిపల్ ఎన్నికల విజయాలకు కూడా పార్టీ అధిష్టానం లింకు పెట్టినట్లు సమాచారం. కాగా, టీపీసీసీ నియమించిన సమన్వయకర్తలు అభ్యర్థుల గెలుపు కోసం వెంటనే రంగలోకి దిగారు. 12 మున్సిపాలిటీలకు సీనియర్ల నియామకం జనగామ, తొర్రూరు, మరిపెడకు ఎంపీలు చామల కిరణ్కుమార్రెడ్డి, కడియం కావ్య, బలరాంనాయక్ ఉత్తర్వులు జారీచేసిన టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అభ్యర్థుల గెలుపునకు.. నామినేట్ పదవులకు లింకు -
సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్
హన్మకొండ: దేశ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ జాఫర్ ఇస్లాం అన్నారు. గురువారం హనుమకొండ హంటర్ రోడ్డులోని వేద బాంక్వెట్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందన్నారు. అభివృద్ధి, ఉపాధి, మౌలిక వసతులే లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైళ్లను ప్రవేశపెట్టేందుకు హైదరాబాద్ కేంద్రంగా రైల్వేకు బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.5,454 కోట్లు కేటాయించినట్లు, హైదరాబాద్–చైన్నె, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–పుణే మధ్య బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రతిపాదించినట్లు వివరించారు. టెక్స్టైల్, మాన్యుఫాక్చరింగ్, స్టార్టప్ రంగాల్లో కొత్త అవకాశాలు రానున్నాయన్నారు. సమావేశంలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, వరంగల్ జిల్లా అధ్యక్షడు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్, నాయకులు గురుమూర్తి శివకుమార్, రావు అమరేందర్రెడ్డి, ఎం.తిరుపతి రెడ్డి, కుమారస్వామి, నాను నాయక్, శ్రీనివాస్ పాల్గొన్నారు. అభివృద్ధి, ఉపాధి, మౌలిక వసతులే ప్రధాని మోదీ లక్ష్యం బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాం -
ఇళ్లు కోల్పోతున్న వారిని ఆదుకునేందుకు సిద్ధం
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: భద్రకాళి మాఢవీధుల నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారిని ప్రభుత్వం తరఫున ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో భద్రకాళి మాడవీధుల నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న కుటుంబాలతో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, ‘కుడా’, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఇళ్లు కోల్పోతున్న వారు తమ అభిప్రాయాలు కలెక్టర్కు తెలిపి తమకు మరో చోట ఇళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. మాఢవీధుల నిర్మాణ పనులకు సహకరిస్తున్నందుకు కాలనీవాసులకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, ‘కుడా’ సీపీఓ అజిత్రెడ్డి, హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ నాయక్, మైనింగ్ ఏడీ రవిశంకర్, జీడబ్ల్యూఎంసీ కాజీపేట డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, సిటీ ప్లానర్ రవీంద్ర రాడేకర్, మాజీ కార్పొరేటర్ బోడ డిన్నా, కాలనీవాసులు పాల్గొన్నారు. -
బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాలి
హన్మకొండ: రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు సబ్ ప్లాన్ ప్రకటించాలని బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కె.మురళీ మనోహర్ డిమాండ్ చేశారు. హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్లో సబ్ ప్లాన్ అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి హామీని విస్మరించిందన్నారు. 2023 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సబ్ ప్లాన్ ప్రకటించడంతోపాటు బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.20వేల కోట్ల నిధులు కేటాయించా లని సూచించారు. సమావేశంలో ప్రొఫెసర్లు ఎం. సారంగపాణి, గోపు సుధాకర్, కేయూ బీసీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం కృష్ణయ్య, ఎంబీసీ నాయకుడు పాలడుగుల సురేందర్, బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు, బీసీ నాయకులు ఎదునూరి రాజమొగిళి, దారబోయిన సతీశ్, ఎర్రబొజ్జు రమేశ్, డాక్టర్ కత్తెరశాల దామోదర్ పాల్గొన్నారు. -
సెటిలయ్యాకే వివాహం చేసుకోవాలి..
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హసన్పర్తి: ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాతే వివాహం చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. 55వ డివిజన్ భీమారంలోని ప్రభుత్వ బాలికల గురుకుల కళాశాలలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ సామాజిక వర్గానికి సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈసందర్భంగా సామాజిక న్యాయం, సమానత్వం, సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ ప్రతిజ్ఞ చేశా రు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి నరసింహాహస్వామి, తహసీల్దార్ కిరణ్కుమార్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి సంపూర్ణ, ప్రియాంక, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఓటర్ల సర్వే వేగవంతానికి చర్యలుహన్మకొండ అర్బన్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ఓటర్ల మ్యాపింగ్ సర్వే వేగవంతంగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వెరిఫికేషన్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, వెరిఫికేషన్ అధికారులు పాల్గొన్నారు. -
తల్లులకు తనివితీరా మొక్కులు
8 లోuమేడారం బుధవారం భక్తజనసంద్రమైంది.. తిరుగువారం పండుగను మేడారం, కన్నెపల్లిలోని సమ్మక్క, సారలమ్మ ఆలయాల్లో పూజారులు ఘనంగా నిర్వహించారు. తల్లులకు పూజారులు ధూపదీపాలు వెలిగించి యాటలను నైవేద్యంగా సమర్పించారు. తిరుగువారం పండుగకావడంతో భక్తులు సైతం అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. – ఎస్ఎస్ తాడ్వాయి ● మేడారం, కన్నెపల్లిలోని సమ్మక్క, సారలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ● అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు..మేడారంలో తిరుగువారం పండుగ -
బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించాలి
ఖిలా వరంగల్: మిల్లింగ్ చేసిన బియ్యాన్ని తిరిగి పౌరసరఫరాల శాఖకు అప్పగించాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణితో కలిసి కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 30 డిఫాల్ట్ మిల్లర్లకు సంబంధించి వివరాలను సమర్పించాలని తహసీల్దార్లను ఆదేశించారు. వరంగల్ ఆర్టీఓ సుమ, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్, సంధ్యారాణి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిష్టయ్య, తహసీల్దార్లు ఇక్బాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ న్యూశాయంపేట: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జనరల్ అబ్జర్వర్ శివకుమార్నాయుడు సమక్షంలో వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద పోలింగ్ సిబ్బంది రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియను బుధవారం కలెక్టర్ చాంబర్లో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓ సుమ, డీపీఓ కల్పన పాల్గొన్నారు. మీడియా సెంటర్ ప్రారంభం ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టరేట్లోని డీపీఆర్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను కలెక్టర్ సత్యశారద ప్రారంభించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఎంసీఎంసీ విధుల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. కలెక్టరేట్లో సామాజిక న్యాయ దినోత్సవం కలెక్టరేట్ సమావేశహాల్లో సామాజిక న్యాయదినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద.. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. -
చదరంగంలో చిన్నారికి రేటింగ్
వరంగల్ స్పోర్ట్స్: కాజీపేట మండలం టేకులగూడేనికి చెందిన పెండ్రు ప్రదీప్, చరిత్ర దంపతుల కుమార్తె సాన్విక చదరంగంలో అంతర్జాతీయ రేటింగ్ సాధించింది. ఇటీవల తమిళనాడులోని ఏతేన్స్ ఆఫ్ ఈస్ట్ బీ లో 1800 రేటెడ్ చెస్ టోర్నమెంట్లో పాల్గొని 1,576 రేటింగ్ను సాధించినట్లు కోచ్ రాజు తెలిపారు. హనుమకొండ రామ్నగర్లోని చిల్డ్రన్స్ మాంటిసోరి స్కూల్ లో ఐదో తరగతి చదువుతున్న సాన్విక, రుద్రమదేవి అకాడమీలో శిక్షణ పొందుతోంది. సాన్వికను వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య బాద్యులు పి.కన్నా, శ్రీనివాస్, ప్రేమ్సాగర్ అభినందించారు.కేఎంసీలో ఎన్ఎంసీ ఇన్స్పెక్టర్ తనిఖీఎంజీఎం: కాకతీయ మెడికల్ కళాశాలలో ప్లాస్టిక్ సర్జన్ విభాగంలో రెండు సూపర్స్పెషాలిటీ సీట్ల మంజూరు కోసం ఎన్ఎంసీ ఇన్స్పెక్టర్ నీరజ్ఖాన్ అగర్వాల్ బుధవారం తనిఖీలు నిర్వహించారు. 1,500 పడకలతో కొనసాగుతున్న ఎంజీఎం ఆస్పత్రిలో నెఫ్రాలజీ విభాగంలో మాత్రమే రెండు సూపర్స్పెషాలిటీ పీజీ సీట్లు మంజూరయ్యాయి. వీటితో కార్డియాలజీ, సీటీవీసీ, యూరాలజీ, పిడియాట్రిక్ సర్జన్ వంటి విభాగాల్లో సూపర్స్పెషాలిటీ పీజీ సీట్ల అనుమతి కోసం నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) విన్నవించింది. ఈక్రమంలో బుధవారం వారణాసికి చెందిన నీరజ్ఖాన్ ఎంజీఎం ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్లు, ప్లాస్టిక్ సర్జరీ వార్డుతో పాటు ఓపీ విభాగాలను సందర్శించారు. వైద్యుల వివరాలు సేకరించారు. కేఎంసీలో ప్రిన్సిపాల్తో సమావేశమయ్యారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ హరీశ్చంద్రారెడ్డి, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య అనిల్, ప్లాస్టిక్ సర్జన్ వైద్యులు రంగనాథ్, విరాజ్ పాల్గొన్నారు.ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలిహసన్పర్తి: సర్కార్ ఆస్పత్రిలో ప్రసవాలు జరిగేలా చూడాలని జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి అప్పయ్య సూచించారు. హసన్పర్తి మండలం భీమారంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. వ్యాక్సినేషన్ను పరిశీలించారు.7న మెగా జాబ్ మేళాహన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేలా ఈనెల 7న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి అధికారి మల్లయ్య తెలిపారు. వివిధ కంపెనీల్లో సుమారు 60కి పైగా ఖాళీల భర్తీకి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియెట్, డిగ్రీ ఉత్తీర్ణులై 18 నుంచి 30 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 7న ఉదయం ములుగు రోడ్డులోని ఐటీఐ కళాశాల ప్రాంగణంలోని ఉపాధి అధికారి కార్యాలయంలో విద్యార్హతల జిరాక్స్ ద్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు 78933 94393లో సంప్రదించాలని కోరారు. -
మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా ‘మున్సిపల్’ పోరు
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగియగా.. 260 వార్డులకు 1,073 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఎంతో పొత్తులతో సాగుతుండగా, బీఆర్ఎస్, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ప్రచారానికి మరో ఐదు రోజులే సమయం ఉండడంతో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. రెబల్స్పై బుజ్జగింపుల అస్త్రం మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు ఇంకా ఆరు రోజులే ఉండడంతో రెబల్స్ను దారికి తెచ్చుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఎంతో పొత్తులతో పోటీ చేస్తుండగా.. 40 చోట్ల రెబల్స్ బెడద ఉంది. ఒంటరి పోరు చేస్తున్న బీఆర్ఎస్కు సైతం రెబల్స్ సెగ తాకుతోంది. నర్సంపేట, వర్ధన్నపేటలో ఎనిమిది చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ రెబల్స్ ఉన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది, బీఆర్ఎస్ నుంచి 6 ఆరుగురు రెబల్ అభ్యర్థులుగా పోటీలో ఉండగా, వారితో పార్టీ నేతలు మంతనాలు చేస్తున్నారు. డోర్నకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, మరిపెడలో కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్ఎస్ నుంచి నలుగురు, కేసముద్రంలో కాంగ్రెస్ నుంచి ఒక్కరు, బీఆర్ఎస్లో ఇద్దరు చొప్పున రెబల్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరందరితో ఆ పార్టీల నేతలు చేస్తున్న ప్రయత్నాలు నేడో రేపో కొ లిక్కి రావొచ్చన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కా గా, 12 మున్సిపాలిటీల్లో మొత్తం 260 వార్డులకు ఒ కచోట బీజేపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గు రెంది. 26 చోట్ల ఆపార్టీ అభ్యర్థులు పోటీలో లేరు. జోరందుకున్న ‘పుర’పోరు.. అన్ని మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఏఐఎఫ్బీ తదితర పార్టీలు, స్వతంత్రులు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇదే సమయంలో ‘పుర’ పీఠాలు లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. ఆ పార్టీల అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు అగ్రనేతలను రంగంలోకి దింపుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్లుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (వరంగల్), పొన్నం ప్రభాకర్ (మహబూబాబాద్)ను నియమించింది. వారు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలను కలుపుకుని సమన్వయం చేస్తున్నారు. ఏఐసీసీ పరిశీలకుడు పి.విశ్వనాథన్ ఉమ్మడి జిల్లాలో బుధవారం పర్యటించగా.. ఈ నెల 8న సీఎం రేవంత్రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఏర్పాటు చేసే సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 12 మున్సిపాలిటీలకు ఇన్చార్జ్లను నియమించారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, అరూరి రమేశ్ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ నుంచి అభ్యర్థుల గెలుపు కోసం కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ జిల్లా అధ్యక్షులను సమన్వయం చేస్తున్నారని, త్వరలోనే వారి పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతల ప్రచారం ఈనెల 8న భూపాలపల్లికి సీఎం రేవంత్ బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు కేంద్ర మంత్రులు వస్తారంటున్న బీజేపీ నేతలు నామినేషన్ల ఉపసంహరణ తర్వాత హోరెత్తుతున్న ప్రచారం -
ఏజెన్సీపై చర్యలు తీసుకోండి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ నయీంనగర్: గడువులోగా భద్రకాళీ బండ్ పనులు పూర్తి చేయాలని, బండ్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సుచీర్ ఇండియా ఏజెన్సీపై తగిన చర్యలు తీసుకోవాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్, ‘కుడా’ వీసీ చాహత్ బాజ్పాయ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ భద్రకాళి బండ్పై జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సూచనలిచ్చారు. భద్రకాళి బండ్ డీ, ఈ జోన్లలో జరుగుతున్న ఫ్లోరింగ్, హార్టికల్చర్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ‘కుడా’ అధికారులు సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, బల్దియా ఈఈలు రవికుమార్, మాధవీలత తదితరులు పాల్గొన్నారు. పనుల్లో వేగం పెంచండివరంగల్ బస్ టెర్మినల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ‘కుడా’ వైస్ చైర్మన్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. బుధవారం ‘కుడా’ కార్యాలయం మినీ మీటింగ్ హాల్లో అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. బస్ టెర్మినర్ త్వరగా పూర్తిచేయడానికి సూచనలిచ్చారు. -
డీసీపీకి ‘ఉత్కృష్ట’ పతకం అందజేత
వరంగల్ క్రైం: పోలీస్ విభాగంలో ఉత్తమ సేవలందించినందుకు కేంద్ర ప్రభుత్వం వరంగల్ పోలీస్ కమిషనరేట్ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్కు ఉత్కృష్ట పతకాన్ని అందజేసింది. ఈమేరకు బుధవారం సీపీ క్యాంపు కార్యాలయంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ డీసీపీ రాజమహేంద్ర నాయక్కు పతకాన్ని అందించి అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చే అధికారులకు శాఖాపరమైన గుర్తింపుతో పాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు కూడా లభిస్తుందన్నారు. 2010 డీఎస్పీగా పోలీస్ శాఖలో చేరిన రాజమండ్రి నాయక్ నెల్లూరు జిల్లాతో పాటు వరంగల్ సీసీఎస్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో డీఎస్పీగా పని చేసి 2017 అదనపు ఎస్పీగా భూపాలపల్లి, ఇంటెలిజెన్స్లో పనిచేసి, 2021లో ఎస్పీగా పదోన్నతి పొంది ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. ప్రస్తుతం వెస్ట్ జోన్ డీసీపీగా ఎంతో సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా ఎన్నో కీలక కేసులను పరిష్కరించడం డీసీపీ రాజ మహేంద్ర నాయక్ కీలకంగా నిలిచారు. ఈసందర్భంగా వెస్ట్ జోన్ పరిధి పోలీస్ అధికారులు, సిబ్బంది డీసీపీ అభినందనలు తెలిపారు. -
కేయూలో సైక్లింగ్ సెలక్షన్స్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్ , ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల విద్యార్థులకు బుధవారం కేయూలో సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు పలువురిని ఎంపిక చేశారు. ఈ ఎంపికలను రిజిస్ట్రార్ రామచంద్రం.. స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వెంకయ్యతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. కుమార్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేష న్ కే యూ అధ్యక్షుడు జె. సోమన్న, వైస్ ప్రెసిడెంట్ రమేశ్, పీడీలు కిరణ్ గౌడ్, కిషన్, ఆంజనేయులు, మట్టెడ కుమార్, సుమన్ పాల్గొన్నారు. -
జీఐతో వస్తువుకు ప్రత్యేక గుర్తింపు
రామన్నపేట : జీఐ(భౌగోళిక గుర్తింపు)తో ఒక వస్తువుకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్డీసీ) ప్రాంతీయ ఇన్చార్జ్ గణేశ్ తెలిపారు. బుధవారం వరంగల్ కొత్తవాడలోని పద్మశాలి ట్రస్ట్ ఫంక్షన్ హాల్లో వరంగల్ చేనేత దర్రీకి జీఐ ద్వారా ప్రపంచ గుర్తింపు లభించేలా చేనేత కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ శిబిరాన్ని జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ప్రాంతీయ ఇన్చార్జి గణేశ్, భౌగోళిక గుర్తింపు సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి తేజస్, వరంగల్ ప్రాంతీయ ఉప సంచాలకుడు జయరావు, వరంగల్ నేతదారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిప్ప వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రారంభించారు. గణేశ్ మాట్లాడుతూ భౌగోళిక గుర్తింపుతో ఎగుమతులు పెరగడంతోపాటు చేనేత ఉత్పత్తులకు అదనపు విలువ చేకూరుతుందన్నారు. ఈ గుర్తింపు ద్వారా నేతదారులు ఆర్థికంగా బలోపేతమవుతారన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త అవకాశాలు ఏర్పడతాయని వివరించారు. ఈ శిబిరంలో చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకుడు శ్రీకాంత్ రెడ్డి, టెస్కో జిల్లా నిర్వహణ అధికారి వెంకటేశ్వర్లు, వీవర్స్ సేవ కేంద్రం సహాయ సంచాలకుడు పుగులేంటి, హనుమకొండ అభివృద్ధి అధికారి సునీత, హస్తకళ సేవా కేంద్రం ప్రోత్సాహక అధికారి ప్రవీణ్ కుమార్, సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు పంతగాని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ ప్రాంతీయ ఇన్చార్జ్ గణేశ్ -
జంప్జిలానీ..!
● బీజేపీకి షాక్ ఇచ్చిన ఆ పార్టీ అభ్యర్థి ● మాజీ ఎమ్మెల్యే చల్లా సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక పరకాల: పరకాలలో బీజేపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే మున్సిపాలిటీ 10, 14 వార్డులో బీజేపీ అభ్యర్థులు ఆకుల రమ్య, సిరంగి భాగ్యలక్ష్మి నామినేషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. 10వ వార్డు నుంచి అవకాశం లేకపోవడంతో 14వ వార్డు నుంచి బొల్లెడ్ల సుష్మకు అవకాశం కల్పించింది. అయితే ఆమె.. ఆ పార్టీకి షాక్ ఇస్తూ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు. దీంతో సుష్మ చేరికను బీజేపీ నేతలు ఖండించారు. మాజీ ఎమ్మెల్యే చల్లా తమ అభ్యర్థిని కొనుగోలు చేశారని బీజేపీ నేతలు పి.కాళీప్రసాద్రావు, సిరంగి సంతోష్కుమార్ మండిపడ్డారు. కాగా, జంప్జిలానీలతో పరకాల మున్సిపల్ ఎన్నికల వాతావరణం మరింత ఉద్రిక్తలకు దారితీసే అవకాశాలు లేకపోలేదని స్థానికులు పేర్కొటున్నారు. 71 నుంచి 23 ఏళ్ల యువ నాయకురాలి వరకు.. ● జనగామ మున్సిపల్ ఎన్నికల బరిలో అనుభవజ్ఞులు, విద్యావంతులు జనగామ: జనగామ మున్సిపల్ ఎన్నికల్లో వయసు, విద్య, అనుభవం కలిగిన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 1వ వార్డులో 71 ఏళ్ల మూడ్ లక్ష్మణ్ నాయక్ మరోసారి బరిలో నిలిచారు. గ్రాడ్యుయేటైన ఆయన గతంలో కౌన్సిలర్గా సేవలందించారు. 5వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గజవెల్లి ప్రతాప్, అలాగే టీఆర్ఏపీ నుంచి రిటైర్డ్ టీచర్ రేణిగుంట్ల మురళి ఇద్దరూ పోస్ట్ గ్రాడ్యుయేట్లు. 13వ వార్డులో పోస్ట్ గ్రాడ్యుయేట్, బీఆర్ఎస్ అభ్యర్థి పానుగంటి సువార్త పోటీ చేస్తుండగా, అదే వార్డులో 24 ఏళ్ల మహమ్మద్ భాష అతి అత్కవ వయసు ఉన్న అభ్యర్థిగా బరిలో ఉండడం విశేషం. 14వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి ఎండి కాసిం, 15వ వార్డులో బీజేపీ అభ్యర్థి పెద్ది శశిధర్, 28వ వార్డులో బీఆర్ఎస్ తరఫున పోస్ట్ గ్రాడ్యుయేట్ హఫీజ్ ఫాతిమా, 29వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి, రిటైర్డ్ ఉద్యోగి మరుకుల శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. 16వ వార్డులో 23 ఏళ్ల అక్కల దేవి ఆకాంక్ష అతి చిన్న వయసు మహిళా అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అప్పడు భార్య .. ఇప్పుడు భర్త.. ● మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా పోటీ.. వర్ధన్నపేట : గత ఎన్నికల్లో ము న్సిపాలిటీ 5వ వార్డు నుంచి బానోత్ అనిత గెలుపొందింది. ఈక్రమంలో ప్రస్తుతం 8వ వా ర్డు ఎస్టీ రిజర్వ్ కావడంతో ఆ మె భర్త శ్రీనివాస్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. కా గా, గత ఎన్నికల్లో ఒక్కో ఓటుతో గెలుపొందిన అని త కౌన్సిలర్గా అనేక సేవలు అందించారని, ప్రస్తు త ఎన్నికల్లో తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని శ్రీనివాస్ ప్రచారం నిర్వహిస్తున్నాడు. -
● గరం గరం చాయ్.. తీసుకో భాయ్
ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపల్ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ సందర్భంగా అభ్యర్థులతోపాటు ఆయా పార్టీల నాయకులు వినూత్న ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఇంటింటికీ వెళ్లి ఓటు అభ్యర్థించారు. అంతేకాకుండా వివిధ షాపులు, పని ప్రదేశాల్లో ప్రచారం నిర్వహించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ● చిన్నారికి స్నానం.. ఓటుకు గాలం● మగ్గం నేస్తూ.. ఓటు అభ్యర్థిస్తూ● చాయ్.. చాయ్ -
బాల్యవివాహాల నిర్మూలనకు సహకరించాలి
● వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య హన్మకొండ: బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. బుధవారం హనుమకొండ కనుకదుర్గ కాలనీలో మహిళ శిశు సంక్షేమ శాఖ, షేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన బాల్య వివాహాల అవగాహన ప్రచార రథాన్ని ఎంపీ కడియం కావ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యం అమూల్యమైన దశ అన్నారు. బాల్యవివాహాలు పిల్లల చదువు, ఆరోగ్యం, శారీరక–మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో షేర్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, కోఆర్డినేటర్ శిరీష, వరంగల్ సీడబ్ల్యూసీ చైర్పర్సన్ వసుధ, సభ్యురాలు మధు, హనుమకొండ సీడబ్ల్యూసీ సభ్యుడు సుధాకర్, శ్రీకాంత్ రెడ్డి, కమ్యూనిటీ మొబిలైజర్లు జ్ఞానేశ్వరి, జగన్, చామంతి, జమున, ప్రశాంతి, కల్పన, ప్రభాకర్, గాయత్రి పాల్గొన్నారు. -
నగారా పోరులో ‘నగదు’ ఉపాయం
పరకాల: టికెట్ (బీఫామ్) ఇవ్వాలంటే ఆ నాయకుడి ముందు ఎన్నికల్లో ఖర్చు పెట్టాల్సిన రూ.లక్షలనగదు ప్రత్యక్షంగా చూపించాలి. కానీ, అప్పటికప్పుడు లక్షల్లో డబ్బు కావాలంటే దొరకలేదు. దీంతో ఓ ఇద్దరు ఆశావహులు.. తెల్లపేపర్లను రూ.500 సైజులో కట్ చేశారు. వంద చొప్పున ఉండే కట్టలో పైన, కింద అసలు నగదు..లోపల అన్నీ తెల్లపేపర్లు పెట్టారు. ఇదిగో తమ దగ్గర ఉన్న డబ్బు అంటూ చూపించి టికెట్ ఖరారు చేసుకున్నారు.. సాయంత్రానికి అసలు నగదును ముట్టచెప్పారు. ఈ ఘటన పరకాల మున్సిపాలిటీలో జరిగినట్లు తెలుస్తోంది. ప్రజల్లో ఆదరణ ఉన్నా.. పార్టీలో కష్టపడి పనిచేసినా నగదు లేకపోతే పనికాదు.. టికెట్ రాదు. ఇవీ పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పెట్టిన షరతులు. కనీసం రూ.15లక్షల నుంచి రూ.20లక్షల వరకు నగదు చేతిలోఉంటే పోటీలో ఉండాలనే షరతులతో ఆశావహులు పడరాని పాట్లు పడ్డారు. టికెట్ కోసం చాలామంది ఇంటి ఆస్తి పేపర్లు .. బంగారం తాకట్టుపెట్టి వస్తే.. కొందరు బ్యాంక్ల నుంచి రూ.లక్షల్లో విత్డ్రా చేశారు. జమచేసుకున్న డబ్బు సంచులతో నేతల ముందు వాలాల్సి వచ్చింది. పరకాల మున్సిపాలిటీలో ఓ ఇద్దరు ఆశావహులు మాత్రం ఓ ప్రజాప్రతినిధి ముందు ఓ సంచిలో కింద తెల్లకాగితాలు..పైనా కొంత నగదుతో ప్రత్యక్షమయ్యారు. ఆయన చెప్పిన నగదుతో వచ్చినట్లు స్పష్టం చేయడంతో టికెట్ ఖరారు అయినట్లు సమాచారం. అప్పటివరకు తమ వద్దనే సంచిని ఉంచుకున్న ఆశావహులు ఓ రెండు గంటల తర్వాత కావాల్సినంత నగదు జమ చేసి తమ నేత సూచించిన నాయకుడికి ముట్టజెప్పిట్లు తెలిసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ ఇద్దరు అభ్యర్థుల తీరు చూసి నాయకులు నివ్వెరపోయినట్లు సమాచారం. రాజకీయ నేతల ముందు ఖాళీ డబ్బు సంచులు అభ్యర్థుల తీరు చూసి నివ్వెరపోయిన నేతలు -
తల్లులకు తనివితీరా మొక్కులు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో తిరుగువారం పండుగను సమ్మక్క–సారలమ్మ పూజారులు ఘనంగా నిర్వహించారు. మహాజాతర పూజా కార్యక్రమాల్లో భాగంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం ఉదయమే స్నానాలు ఆచరించిన పూజారులు.. మేడారంలోని సమ్మక్క గుడిని శుద్ధి చేశారు. అమ్మవార్ల శక్తిపీఠాన్ని పవిత్రమైన మట్టితో పూజారి కొక్కెర కృష్ణయ్య అలికి సిద్ధం చేయగా ఆడపడుచులు ముగ్గులతో అలంకరించారు. సమ్మక్క గుడిగుమ్మం, ఆవరణలో ముగ్గులతో అలంకరించారు. అనంతరం సమ్మక్క పూజారులు సిద్ధబోయిన మునీందర్, కొక్కెర కృష్ణయ్య, సిద్ధబోయిన మహేశ్, నితిన్, బాబురావు, దూపవడ్డె నాగేశ్వర్రావు, జలగంవడ్డె మల్లెల సత్యం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమ్మక్క తల్లికి ధూపదీపాలు వెలిగించి యాటను నైవేద్యంగా సమర్పించారు. సారలమ్మ ఆలయంలో.. కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో ప్రధాన పూజారి కాక సారయ్య, కాక కిరణ్, కాక వెంకటేశ్వర్లు, భుజంగరావు, కనుకమ్మ, అమృత ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఉదయమే గుడిని శుద్ధి చేసి అమ్మవారి వస్త్రాలు, పూజా సామగ్రిని మరోసారి పవిత్రమైన నీటితో శుద్ధి చేశారు. అమ్మవారి వడెరాల కుండలను పసుపు, కుంకుమతో అలంకరించి ధూపదీపాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు పూజారులు సారలమ్మ గుడిలో సమ్మక్క తల్లికి యాటను నైవేద్యంగా సమర్పించి మరోసారి పూజలు నిర్వహించనున్నారు. పూజా రుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు పాల్గొన్నారు. ఆలయాల వద్ద పూజా రుల కుటుంబీకులతోపాటు స్థానిక ఆదివాసీలు, ఆదివాసీయేతరులు మొక్కులు చెల్లించుకున్నారు. కిక్కిరిసిన గద్దెల ప్రాంగణం.. మహాజాతర శనివారంతో ముగిసినా మేడారానికి భక్తుల తాకిడి తగ్గడం లేదు. బుధవారం తిరుగువారం పండుగ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘట్టాల షవర్ల కింద పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో మేడారం మరో సారి జాతర కళను సంతరించుకుంది. దర్శనాల అ నంతరం భక్తులు అటవీ ప్రాంతాల్లో విడిది చేసి స హపంక్తి భోజనాలు ఆరగించారు. భక్తులు మేడారానికి అధిక సంఖ్యలో తరలిరావడంతో రోడ్ల వెంట వాహనాలు బారులుదీరాయి. ప్రధానంగా జంపన్నవాగు నుంచి ఊరట్టం స్తూపం వరకు వాహనాల రద్దీ నెలకొంది. పోలీసులు వెంటనే వాహనాలను క్లియర్ చేశారు. మేడారంలో తిరుగువారం పండుగ మేడారం, కన్నెపల్లిలోని సమ్మక్క, సారలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు భారీగా తరలివచ్చిన భక్తులు.. -
మద్యం తాగి 11సార్లు చిక్కాడు..
● మద్యంప్రియుడికి నెలరోజుల జైలు కాజీపేట/వరంగల్ క్రైం: మద్యం తాగి వాహనం న డుపుతూ 11వ దఫా పోలీసులకు పట్టుబడిన వ్యక్తికి న్యాయమూర్తి ఫాతిమా చిన్నప్ప 30 రోజులపాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు ట్రాఫిక్ సీఐ పి.వెంకన్న తెలిపారు. కాజీపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం ఆయన మాట్లాడుతూ జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామానికి చెందిన శివరాత్రి దేవయ్య మద్యం సేవించి వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబ డ్డాడు. దేవయ్య వివరాలను ఆన్లైన్లో నమోదు చే యగా అప్పటికే 10 సార్లు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడినట్టుగా రికార్డు అయ్యి ఉంది. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి దేవయ్యను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి సదరు వ్యక్తికి 30 రోజులు జైలుశిక్ష విధించారు. మరో 14 మందికి జరిమానా విధించి వదిలేశారు. విద్యార్థులకు విస్తృత అవకాశాలువిద్యారణ్యపురి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ టీసీఎస్ఐఓఎన్ జాబ్ అచీవర్ బిజినెస్ అపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం విద్యార్థులకు విస్తృత అవకాశాలున్నాయని యూనివర్సిటీ కామ ర్స్ విభాగం ప్రొఫెసర్ అండ్ ఈఎంఆర్ఆర్సీ డైరెక్టర్ రబీంద్రనాథ్ అన్నారు. బుధవారం హనుమకొ ండలోని కేడీసీలో జాబ్ అచీవర్ బిజినెస్ ఆఫరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో డాక్టర్ వై .వెంకటేశ్వర్లు, కే డీసీ ప్రిన్సిపాల్ ఆచార్య గుర్రం శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు. -
తాగునీటిపై కసరత్తు
వరంగల్ అర్బన్ : వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో వరంగల్ మహానగరంలో తాగునీటి సరఫరాపై మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ దృష్టి సారించారు. ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై మంగళవారం గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ, బల్దియా ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. నగరానికి తాగునీటిని సరఫరా చేసే రిజర్వాయర్లలో ప్రస్తుతం నీటి లభ్యత, వాటిని సమర్థవంతంగా వినియోగించుకునే ఆంశమై ఇంజనీరింగ్ అధికారుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్కు ఆదేశాలు సమ్మర్ యాక్షన్ ప్లాన్కు యుద్ధప్రాతిపదికన రూపొందించాలని మేయర్, కమిషనర్ సూచించారు. ఆయా ఇంజనీరింగ్ విభాగాల అధికారులు పరస్పర సహకారంతో ప్రణాళికలు రూపొందించాలన్నారు. నిల్వలను ఎప్పటికప్పుడు గుర్తిస్తుండాలన్నారు. ధర్మసాగర్, వడ్డేపల్లి, కేయూ, దేశాయిపేట ఫిల్టర్ బెడ్లలో మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఫిల్టర్ బెడ్లలో రసాయనాలను అందుబాటులో ఉంచుకోవాలని, రా వాటర్ శుద్ధీకరణపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. నీటి సరఫరాలో సమయపాలన పాటించాలని, లీకేజీలను వెంటనే అరికట్టి అవాంతరాలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో ఆటంకాలు ఏర్పడితే మీడియా ద్వారా సంబంధిత ప్రాంత ప్రజలకు తెలియజేసి ప్రత్యామ్నాయంగా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని తెలిపారు. మురికివాడల్లో బోర్ల మరమ్మతులు, పైపులైన్ లేని ఏరియాల్లో వాటర్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు. గత వేసవిలో మాదిరిగా ప్రధాన కూడళ్లు, జనావాస ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి, తాగునీరు అందించాలని సూచించారు. సమీక్ష సమావేశంలో బల్దియా ఇన్చార్జ్, పబ్లిక్హెల్త్ ఎస్ఈ ఎన్.శ్రీనివాస్, ఈఈలు మహేందర్, రవికుమార్, సంతోష్ బాబు, మాధవి లత, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.వేసవిలో ఇబ్బందులు రాకుండా ముందస్తు యాక్షన్ప్లాన్ మేయర్ సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ దిశానిర్దేశం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఇంజనీర్లకు ఆదేశాలు గ్రేటర్ వరంగల్లో మంచినీటి సరఫరాపై సమీక్ష నగర ప్రజలకు రోజుకు 160 ఎంఎల్డీ(మిలియన్ ఫర్ డే) నీరు అవసరమవుతోంది. ప్రస్తుతం ధర్మసాగర్, వడ్డేపల్లి రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలు 4 నెలలకు సరిపడా ఉన్నట్లు బల్దియా ఇంజనీర్లు వెల్లడించారు. అదేవిధంగా దేవాదులనుంచి పంపింగ్ ఉంటుందని, ఎల్ఎండీ నుంచి మిషన్ భగీరథ వాటర్ సరఫరా జరుగుతుంది. దీంతో ఈ వేసవి కాలంలో 66 డివిజన్ల పరిధిలోని 11 లక్షలమందికిపైగా ఉన్న జనాభాకు నీటి సరఫరాలో ఆరు నెలలపాటు ఎలాంటి ఢోకా ఉండదని స్పష్టం చేస్తున్నారు. -
మహా జాతరనూ వదల్లేదు!
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరను దొంగల ముఠాలు వదల్లే. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి మేడారం జాతరలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని హల్చల్ చేసిన దొంగల వివరాలు ఆలస్యంగా వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా జంపన్న వాగు, గద్దెల పరిసరాల్లో భక్తుల మొబైల్ ఫోన్లు, బంగారు గొలుసులు, నగదును దొంగిలించిన ఘటనల్లో కీలక వ్యక్తుల సమాచారం లభమైంది. ‘వ్యాల్యూ పిచ్’ సాఫ్ట్వేర్ ఆధారంగా ఫేస్ రికగ్నైజేషన్ సిస్టంతో ఈ దొంగతనాలకు సంబంధించి కొందరు నిందితులను, దొంగిలించిన వస్తువులను కొనుగోలు చేసేవారిని పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశం అవుతోంది. మేడారం జాతరలో ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా గతంలో దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాలకు చెందిన దొంగలను గుర్తించినట్లు క్రైం ఇన్వెస్టిగేషన్ విభాగం ప్రకటించింది. సాంకేతిక సహకారంతో దొంగల ఆటకట్టు.. సమ్మక్క–సారలమ్మను దర్శించుకునే భక్తులపై పటిష్టమైన పర్యవేక్షణ, వారి కదలికలు, వాహనాల రాకపోకలను నిశితంగా గమనించేందుకు ఈ జాతరలో ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)తో కూడిన ప్రత్యేక కెమెరాలు పెట్టారు. ఆటోమెటిక్ నంబర్ ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలను (ఏఎన్పీఆర్) పది చోట్ల అమర్చారు. దొంగతనాలకు పాల్పడే పాత నేరస్తులను గుర్తించేందుకు ఆటోమెటిక్ ఫేస్ రికగ్నైజేషన్ కోసం ప్రత్యేక సీసీ కెమెరాలను జనం రద్దీ ఉండే అన్ని ప్రాంతాల్లో పెట్టారు. గతంలో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బిహార్ ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ఫొటోలను కంప్యూటర్లో ఫీడ్ చేశారు. వ్యాల్యూ పిచ్ అనే సాఫ్ట్వేర్తో అనుసంధానం చేయడంలో వల్ల కంప్యూటర్లో ఫీడ్ చేసిన ఫొటోల్లోని వ్యక్తులు ఎవరు వచ్చినా పోలీసులకు అలర్ట్ ఇస్తుంది. ఇదంతా గద్దెల పక్కనే ఉన్న కమాండ్ కంట్రోల్ రూంలో అమర్చిన పెద్ద ఎల్సీడీ స్క్రీన్లను 24/7 నిరంతర పర్యవేక్షణ చేసేలా ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఈ విధానం ద్వారా జాతర జరిగిన నాలుగు రోజుల్లో పాత దొంగలు వచ్చినట్లు 70 అలర్ట్లు వచ్చాయి. డ్రోన్, సీసీ కెమెరాలు ఆ దొంగలను గుర్తించి కమాండ్ కంట్రోల్ రూంకు వారి ముఖాలను పంపడంతో అప్రమత్తమైన పోలీసులు మహారాష్ట్ర, ఏపీలోని నంద్యాల గ్యాంగ్లకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. మేడారంలో మహారాష్ట్ర, నంద్యాల దొంగలు ట్రేస్ చేసిన వ్యాల్యూ పిచ్ సాఫ్ట్వేర్ ‘ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం’తో దొరికిన ఆచూకీ 70 మంది గుర్తింపు, ఐదుగురి అరెస్టు.. విచారణ -
వృత్తి నైపుణ్యంతో ఆర్థికంగా ఎదగాలి
హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి కాజీపేట అర్బన్: మహిళలు వృత్తి నైపుణ్యం సాధించి ఆర్థికంగా ఎదగాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి సూచించారు. కాజీపేట మండలం మడికొండలోని దుర్గాబాయి మహిళా శిశువికాస కేంద్రంలో టైలరింగ్, కంప్యూటర్, నర్సింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మంగళవారం సర్టిఫికెట్లను ఆయన అందజేసి మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, మహిళల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న ఫోర్టిఫైడ్ రైస్ను తప్పకుండా తినాలని కోరారు. స్వధార్హోంకు చెందిన 25 మంది టైలరింగ్, మహిళా ప్రాంగణం నుంచి 25 మంది టైలరింగ్, ఏఎన్ఎంలు 55 మంది, 25 మంది కంప్యూటర్లో శిక్షణ తీసుకున్నారు. ఏఎన్ఎంలకు కిట్లు, కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ప్రాంగణం మేనేజర్ జయశ్రీ, సిబ్బంది హేమారాణి, కల్యాణి, కృష్ణవేణి, మధు, పుష్ప తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్ఫర్ స్టేషన్ల నిర్వహణ మెరుగుపడాలి
మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ వరంగల్ అర్బన్: చెత్త సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల నిర్వహణ మెరుగుపడాలని, సౌకర్యాలు కల్పించాలని నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. హనుమకొండ బాలసముద్రంలోని సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లను మంగళవారు వారు వేర్వేరుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ హైమాస్ట్ లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. నిర్మాణంలో ఉన్న రోడ్డు, కాంపౌండ్ వాల్ను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. ట్రాన్స్ఫర్ స్టేషన్లోని ర్యాంపులు శుభ్రంగా ఉంచాలని కమిషనర్ సూచించారు. స్వచ్ఛ ఆటో డ్రైవర్లు తడి, పొడి చెత్తను కలిపి తీసుకురాకూడదని హెచ్చరించారు. వారి వెంట సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈలు రవికుమార్, మహేందర్, సంతోష్ కుమార్, శానిటరీ సూపర్వైజర్ నరేందర్, గోల్కొండ శ్రీను, భాస్కర్ ఉన్నారు. -
శరణ్ (తెల్లపులి) ఇక లేదు
తెల్లపులి (ఫైల్) జూపార్కులో గుండెపోటుతో మృతి న్యూశాయంపేట: వరంగల్ నగరంలోని కాకతీయ జులాజికల్ పార్కు సందర్శకులకు కనువిందు చేసిన తెల్లపులి (శరణ్, 14 సంవత్సరాలు) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందింది. మగ తెల్లపులిని హైదరాబాద్ నుంచి గతేడాది జూలైలో తీసుకొచ్చి రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చేతులమీదుగా ఎన్క్లోజర్ను ప్రారంభించి సందర్శకులు వీక్షించేందుకు వదిలారు. కొద్ది రోజులుగా జూపార్కులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా తెల్లపులి సగటు వయస్సు 15 ఏళ్లు ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. సుమారు 14 ఏళ్లు ఉన్న తెల్లపులి వృద్ధాప్యం వల్ల బీపీ, గుండె సంబంధిత, మూత్రపిండాల సమస్యలతో రెండు నెలలుగా బాధపడుతోందని తెలిపారు. పులికి వైద్య సిబ్బంది నిరంతరం చికిత్స అందించినప్పటికి మంగళవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చనిపోయిందని జూపార్కు ఇన్చార్జ్ ఎఫ్ఆర్ఓ మయూరి తెలిపారు. కాగా, చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ ఆదేశాల మేరకు సీనియర్ వెటర్నరీ వైద్యులు, మామునూరు వెటర్నరీ కళాశాల వైద్యబృందం తెల్లపులికి పోస్టుమార్టం నిర్వహించి జూ పార్కులోనే ఖననం చేసినట్లు చెప్పారు. -
నేడు తిరుగువారం పండుగ
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో సమ్మక్క– సారలమ్మకు బుధవారం పూజారులు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుగువారం పండుగలో భాగంగా మేడారం, కన్నెపల్లి అమ్మవార్ల ఆలయాలను పూజారులు శుద్ధి చేసి ధూపదీపాలు వెలిగించి యాటను నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం పూజారుల కుటుంబీకులు, స్థానిక ఆదివాసీలు, గిరిజనేతరులు అమ్మవార్ల ఆలయాలకు చేరుకుని మొక్కులు చెల్లించనున్నారు. అనంతరం పూజారులు అమ్మవార్ల పూజాసామగ్రి, వస్త్రాలను తిరిగి ఆలయాల్లో భద్రపర్చనున్నారు. తిరుగువారం పండుగతో మహాజాతర పూజా కార్యక్రమాల తంతు ముగియనుంది. తిరుగువారం పండుగ సందర్భంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవార్లను దర్శించుకోనున్నారు. పుణ్యస్నానాలు.. మొక్కులు జాతర ముగిసి మూడు రోజులు గడిచినా మేడారానికి భక్తులు వస్తూనే ఉన్నారు. మంగళవారం భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల వద్ద పూజలు చేశారు. -
జీవన శైలిలో మార్పుతోనే క్యాన్సర్
ఎంజీఎం: జీవనశైలిలో మార్పుతోనే క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి అప్పయ్య అన్నారు. అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వడ్డేపల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డీఎంహెచ్ఓ మాట్లాడారు. జిల్లాలో 692 క్యాన్సర్ కేసులను గుర్తించినట్లు తెలిపారు. త్వరలో ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతుందని పేర్కొన్నారు. సదస్సులో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కవిత, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కె.రవి, కిరణ్సింగ్, డాక్టర్ శ్రీనివాస్రావు, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్, వైద్యాధికారి మాలిక, డీఈఎంఓఅశోక్రెడ్డి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 23 కేంద్రాల్లో (నాన్ ప్రొఫెషన్నల్) ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సుల మూడో సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరిగాయి. క్యాంపస్లోని పలు కేంద్రాలను పరీక్షల విభాగం అధికారులు సందర్శించారు. పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, యూనివర్సిటీ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య టి.మనోహర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పి.శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ కె.మమత పరిశీలించారు. పలు పరీక్షలు వాయిదా..మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 7, 10వ తేదీల్లో నిర్వహించనున్న బీటెక్ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలను వాయిదావేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ మంగళవారం తెలిపారు. ఈపరీక్షలను ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహిస్తామని, 10న నిర్వహించాల్సిన పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు, 11న నిర్వహించా ల్సిన ఎంబీఏ పరీక్షలను 19వ తేదీకి వాయిదా వేశామని ఆయన పేర్కొన్నారు. ఈమార్పును కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు. విద్యారణ్యపురి: పదిలో వంద శాతం ఫలితాలు సాధించాలని హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ కోరారు. హనుమకొండ హంటర్రోడ్డులోని న్యూశాయంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పోచంపల్లి ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలు సమీపిస్తున్నందున బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని హెచ్ఎం సరోజన, ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాల ఆవరణ పచ్చగా ఉండడంతో హెచ్ఎం ఉప్పలయ్యను అభినందించారు. ఖిలా వరంగల్: కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోటను మంగళవారం ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అధికారి అఖిల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నల్ల రాతిలో శిల్పులు చెక్కిన శిల్పకళాసంపదను తిలకించారు. అనంతరం ఖుష్మహల్, శృంగారపు బావి, ఏకశిలగుట్ట, రాతిమట్టికోట అందాలను వీక్షించారు. కోట గైడ్ రవియాదవ్ కాకతీయుల శిల్పకళాసంపద, విశిష్టతను ఆయనకు వివరించారు. కోట అందాలను అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. కార్యక్రమంలో కేంద్రపురావస్తుశాఖ సిబ్బంది, టీజీటీఎస్టీడీసీ అజయ్ తదితరులు ఉన్నారు. -
ప్రకృతి సాగుకు ప్రోత్సాహం
హన్మకొండ: సంప్రదాయ సాగును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయాన్ని శాసీ్త్రయ దృక్పథంతో పునరుద్ధరించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతూ రైతు కుటుంబాలు, వినియోగదారులకు రసాయనాల అవశేషాలు లేని ఆరోగ్యకర ఆహారాన్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకాన్ని (నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్) పథకాన్ని తీసుకొచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని రాష్ట్రంలో రెండు సంవత్సరాలపాటు అమలు చేయనున్నాయి. హనుమకొండ జిల్లాలోని 10 మండలాల్లో 10 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఒక్కో గ్రామాన్ని క్లస్టర్ (సమూహం)గా గుర్తించారు. ఒక్కో సమూహంలో 125 మంది రైతులను ఎంపిక చేశారు. ఒక్కో సమూహంలో 125 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని చేసేలా రైతులను ప్రోత్సహిస్తారు. ప్రకృతి వ్యవసాయంలో రసాయనాలు, ఎరువులు, పురుగుమందులు వాడరు. ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో జీవామృతం, ఘనజీవామృతం, ఆచ్ఛాదన, వాపస వంటివి వాడుతూ చేసే వ్యవసాయ విధానం. ఇది భూసారాన్ని పెంచి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. పర్యావరణ పరిరక్షణతోపాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే ఈ విధానంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. జిల్లాలో 7 బయోరిసోర్స్ సెంటర్స్.. ప్రతి మండలం నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 10 మండలాలకు 20 మంది కృషి సఖిల (క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్)ను ఎంపిక చేశారు. ముందుగా పురుషులు, మహిళలు ఎవరినైనా ఎంపిక చేయొచ్చని చెప్పిన ప్రభుత్వం తర్వాత మహిళళా రైతులను మాత్రమే ఎంపిక చేయాలని సూచించింది. ఈ మేరకు 20 మంది మహిళా రైతులను కృషి సఖిలుగా ఎంపిక చేసింది. వీరికి ప్రకృతి వ్యవసాయంపై ఈనెల నాలుగు నుంచి హనుమకొండ భీమారంలోని రైతు వేదికలో ఐదు రోజులపాటు శిక్షణ ఇస్తారు. వీరు శిక్షణ పొందిన అనంతరం గ్రామాల్లో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చి అవగాహన కల్పిస్తారు. ఎంపిక చేసిన 125 మంది రైతుల పొలాల్లో నుంచి మట్టి పరీక్ష కోసం మట్టి నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపారు. జిల్లాలో 7 బయోరిసోర్స్ సెంటర్స్ ఏర్పాటు చేస్తారు. మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తి కేంద్రాలను బయోరిసోర్స్ సెంటర్గా ఎంపిక చేశారు. వీటి ద్వారా ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన జీవామృతం, ఘనజీవామృతం, ఆచ్ఛాదన, వాపస వంటి సహజ సిద్ధమైన ఎరువులను రైతులకు అందిస్తారు. ఈ పథకంలో భాగంగా ప్రతి రైతుకు రూ.4 వేలు చెల్లిస్తారు. పైలట్ ప్రాజెక్టుగా హనుమకొండ జిల్లాలోని 10 మండలాల్లో 10 గ్రామాల ఎంపిక ఒక్కో గ్రామంలో 125 మంది రైతుల గుర్తింపు సహజసిద్ధమైన ఎరువులు అందించనున్న ప్రభుత్వాలు మండలానికి ఇద్దరు కృషి సఖిల ఎంపిక.. నేటి నుంచి శిక్షణ -
టిప్పర్ను ఢీకొన్న గూడ్స్ ట్రాలీ.. యువకుడి దుర్మరణం
ఆత్మకూరు : దైవ దర్శనానికి వెళ్లొస్తూ.. ఓ యువకుడు మృత్యుఒడికి చేరాడు. గూడ్స్ ట్రాలీ..టిప్పర్ను ఢీకొన్న ప్రమాదంలో దుర్మరణం చెందాడు. అలాగే, ఒకరికి స్వల్పంగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలకేంద్రం సమీపంలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. సీఐ సంతోష్ కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా నార్కట్పల్లికి చెందిన బోడ శేఖర్(28)తోపాటు మరో ఆరుగురు మొత్తం ఏడుగురు గూడ్స్ ట్రాలీలో ఆదివారం మేడారం వెళ్లారు. తల్లుల దర్శనం అనంతరం తిరిగొస్తున్న క్రమంలో ఆత్మకూరు సమీపంలో ముందు వెళ్తున్న టిప్పర్ను ట్రాలీ ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ పక్కన కూర్చున్న బోడ శేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ బుర్ర శివకు స్వల్ప, దైత అనిల్, యామనగంటి వెంకన్న, జిల్ల ప్రవీణ్తోపాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగ్రాతులను 108లో వరంగల్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంతోష్ తెలిపారు. -
రైల్వే కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి
కాజీపేట రూరల్ : కేంద్ర ప్రభుత్వం రైల్వే కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ జోనల్ ప్రెసిడెంట్ కాల్వ శ్రీనివాస్, కాజీపేట కోఆర్డినేటర్ నాయిని సదానందం డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం కాజీపేట రైల్వే డీజిల్షెడ్, ఎలక్ట్రిక్షెడ్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల పనిభారం, ఖాళీ పోస్టుల భర్తీ , 8వ పే కమిషన్ సిఫార్సుల అమలు, సేఫ్టీ కేటగిరీ కార్మికుల రిస్క్ అలవెన్స్ తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ నిరసనలో యూనియన్ నాయకులు ఎస్.కె.జానీ, పి.వేదప్రకాశ్, జి.రాజేశ్వర్, ఎ.సత్యనారాయణ, నరేశ్యాద వ్, యాదగిరి, భాస్కర్రెడ్డి, రవికిరణ్, శివప్రసాద్, ఎం.డి.ఇబ్రహీం, బి.రవీందర్రెడ్డి, ఎస్.గోపి, వి.ప్రభాకర్, ఎస్.స్వర్ణకుమారి, ఆర్.ప్రజాపతి, వి.అశో క్, ఎన్.అరుణ్కుమార్, పి.రాజు, సీసీఎస్ డెలిగేట్లు నాగరాజు, రాజ్కుమార్, బి.సునీల్ పాల్గొన్నారు. మజ్దూర్ యూనియన్ నేతలు శ్రీనివాస్, సదానందం -
అట్టహాసంగా టీ–20 మహిళా క్రికెట్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ వేదికగా ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగనున్న అంతర్జిల్లాల టీ–20 మహిళా క్రికెట్ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కరుణాపురం సమీపం వంగాలపల్లిలోని డబ్ల్యూడీసీఏ మైదానం, వరంగల్ శివారు మొగిలిచర్ల క్రీడా మైదానంలో క్రికెట్ పోటీలు కొనసాగాయి. వంగాలపల్లి మైదానంలో జరిగిన తొలి మ్యాచ్లో మెదక్పై 56 పరుగుల తేడాతో వరంగల్ జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వరంగల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 113 పరుగులు సాధించింది. అనంతరం 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెదక్ కేవలం 12.4 ఓవర్ల ఎదుర్కొని 57 పరుగుల వద్ద అన్ని వికెట్లు కోల్పోయింది. మొగిలిచర్ల మైదానంలో జరిగిన మరో మ్యాచ్లో నిజామాబాద్పై ఖమ్మం జట్టు 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నిజామాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు 16.1 ఓవర్లలో 103 పరుగులు చేసి విజేతగా నిలిచింది. మొదటి రోజు వరంగల్ శుభారంభం -
సోలార్ సొబగులు..
పైలట్ గ్రామాల్లో సంపూర్ణ సౌర విద్యుత్ వెలుగులు హన్మకొండ: సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పైలట్ గ్రామా లను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వమే ఖర్చులు భరించి పైలట్ గ్రామాల్లోని ప్రతీ ఇల్లు, ప్రతీ వ్యవసాయ పంపుసెట్ను సౌర విద్యుతీకరిస్తోంది. రూ.1,380 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 81 గ్రామాలను పూర్తిగా సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 గ్రామాలను సంపూర్ణ సౌర విద్యుత్ పల్లెలుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పథకం బహుళ ప్రయోజనకారిగా ఉంది. ప్రభుత్వమే ఖర్చు భరిస్తుండడంతో వినియోగదారులపై ఏ మాత్రం ఆర్థిక భారం పడడం లేదు. దీంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా సౌర విద్యుత్ మారనుంది. ఉత్పత్తి అయిన సౌర విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేయడం ద్వారా వినియోగదారుడికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. మార్చి నాటికి పైలట్ గ్రామాల్లో సంపూర్ణంగా సోలార్ వెలుగులు నిండనున్నాయి. ఒక్కో ఇంటిపై 2 కిలో వాట్లు, వ్యవసాయ పంపుసెట్లకు 7.5 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేస్తారు. ప్రతీ ఇంటికి రూ.1.36 లక్షలు, ప్రతీ వ్యవసాయ బావికి రూ.4.85 లక్షలు ప్రభుత్వం భరిస్తుంది. ప్రతీ ఇంటికి నెట్ మీటర్ బిగిస్తారు. ఈ మీటర్ ఇంటికి వినియోగిస్తున్న విద్యుత్, మిగతా విద్యుత్ గ్రిడ్కు ఎంత సరఫరా జరిగిందో యూనిట్ల వారీగా రికార్డు చేస్తుంది. అదే విధంగా వ్యవసాయ పంపుసెట్లకు బిగించే నెట్ మీటర్ గ్రిడ్కు సరఫరా చేసే విద్యుత్ను మాత్రమే రికార్డు చేస్తుంది. వ్యవసాయానికి ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుండడంతో ఈ వినియోగాన్ని రికార్డు చేయదు. ప్రతీ ఇంటిపై ఏర్పాటు చేసిన ప్లాంట్ ద్వారా నెలకు 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అదే విధంగా వ్యవసాయ పంపు సెట్ల వద్ద ఏర్పాటు చేసిన ప్లాంట్ ద్వారా వెయ్యి యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వ్యవసాయ పంపుసెట్ల వద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం యూనిట్కు రూ.2.59 చొప్పున చెల్లిస్తుంది. దీని ద్వారా రైతుకు నెలకు రూ.2,590 ఆదాయం వస్తుంది. అలాగే, గృహ సోలార్ ప్లాంట్ ద్వారా ప్రతీ యూనిట్కు రూ.4.99 చొప్పున చెల్లిస్తుంది. అయితే ఇంటికి వినియోగించుకోగా మిగిలిన విద్యుత్కు మాత్రమే చెల్లింపులు చేస్తారు. ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పలకల బిగింపు ప్రతీ ఇల్లు, వ్యవసాయ పంపుసెట్లకు కనెక్షన్ ఇంటికి 2 కిలో వాట్లు, వ్యవసాయానికి 7.5 కిలో వాట్లు రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరు యూనిట్కు రూ.2.59 చెల్లింపు 7.5 కిలో వాట్ల సామర్థ్యంతో నెలకు వెయ్యి యూనిట్లు ఉత్పత్తిఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 9 గ్రామాలను సంపూర్ణ సౌర విద్యుత్గా తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు సోలార్ పలకల బిగింపు కార్యక్రమం మొదలైంది. వరంగల్ జిల్లాలో రాయపర్తి మండలం పోతిరెడ్డి పల్లి, కిష్టాపూర్, ములుగు జిల్లాలో ములుగు మండలం జగ్గన్నపేట, అన్నంపల్లి, చిన్నగుంటూరుపల్లి, పులిగుండం, హనుమకొండ జిల్లాలో ఆత్మకూరు, ఎల్క తుర్తి మండలంలోని కేశవాపూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారాన్ని పైలట్ గ్రామాలుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ గ్రామాలన్నింటిలో మొత్తం 3,854 గృహాలకు 7,708 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ పలకలు బిగించనున్నారు. అదే విధంగా 1,729 వ్యవసాయ విద్యుత్ సర్వీస్లకు 12967.5 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పలకలు బిగిస్తారు. దీంతో ఈ గ్రామాలన్నీ సోలార్ మయం కానున్నాయి. -
ఆఫ్టికల్ ఫైబర్ నెట్వర్క్ పనులకు శంకుస్థాపన
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో రూ సా నిధులతో పది కిలోమీటర్ల మేర అండర్గ్రౌండ్ ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్ నెట్ వర్క్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన పనులకు సోమవారం వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం శంకుస్థాపన చేశారు. ఈ పనులను రూసా నిధులు రూ. కోటి 52 లక్షల అంచనా వ్యయంతో బీఎస్ఎన్ఎల్ ద్వారా అమలు చేయబోతున్నట్లు వీసీ తెలిపారు. కార్యక్రమలో కేయూ పాలకమండలి సభ్యులు సుదర్శన్, బి. రమ, చిర్ర రాజు, కేయూ అభివృద్ధి అధికారి ఎన్. వాసుదేవరెడ్డి, యూజీసీ కోఆర్డినేటర్ ఆర్. మల్లికార్జున్రెడ్డి, ఫైనాన్స్ ఆఫీసర్ హబీబుద్దీన్, వెబ్సైట్ నెట్ వర్కింగ్ ఇన్చార్జ్ డైరెక్టర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అర్మాకొండను అధిరోహించిన యశ్వంత్
● శిఖరంపై త్రివర్ణ పతాకం ఎగరవేసిన పర్వతారోహకుడుమరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్య తండాకు చెందిన పర్వతారోహకుడు భూక్య యశ్వంత్ మరో విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్లోని ఎత్తైన అర్మాకొండ (1,680 మీటర్లు) (జిందగడ శిఖరం) పర్వతాన్ని ఆదివారం రాత్రి అధిరోహించి త్రివర్ణ పతాకం ఎరగవేశారు. దేశంలోని 28 రాష్ట్రాల్లోఎత్తైన శిఖరాలతో పాటు ఏడు ఖండాలలోని అతి ఎత్తైన ఏడు శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యం మేరకు యశ్వంత్ మరో మైలురాయి అధిగమించాడు. ఇప్పటికే భారత్లోని అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అసోం, రాజస్తాన్తో పాటు ఒడిశాలోని ఎత్తైన శిఖరాలు అధిరోహించారు. ప్రపంచ ప్రసిద్ధ పర్వతారోహణ ఇప్పటికే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో (5,895 మీటర్లు), రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ (5,642 మీటర్లు), ఆస్ట్రేలియాలోని మౌంట్ కోసిస్కో (2,228 మీటర్లు), నేపాల్లోని మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (5,364 మీటర్లు), లడఖ్లోని మౌంట్ కాంగ్ యాట్సే–2 (6,250 మీటర్లు), అరుణాచల్ ప్రదేశ్లోని మౌంట్ గోరిచెన్ (6,488 మీటర్లు) పర్వతాలను అతి పిన్న వయస్కుడిగా విజయవంతంగా అధిరోహించారు. జాతీయ, అంతర్జాతీయ పర్వతాలను అధిరోహించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటాలనే లక్ష్యం మేరకు సాధన కొనసాగిస్తునట్లు యశ్వంత్ తెలిపారు. -
నేడు కాజీపేట మీదుగా ప్రత్యేక రైలు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల సౌకర్యార్థం కాజీపేట జంక్షన్ మీదుగా కాన్పూర్ సెంట్రల్ –బెంగళూరు ప్రత్యేక రైలును నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీన కాన్పూర్లో బయలుదేరే కాన్పూర్ సెంట్రల్–బెంగళూరు (04005) ఎక్స్ప్రెస్ మరుసటి రోజు మంగళవారం కాజీపేట జంక్షన్కు చేరుకుని వెళ్తుంది. ఈ రైలుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాగ్పూర్, బల్లార్షా, సిర్పూర్కాగజ్నగర్, కాజీపేట, కాచిగూడ, మహబూబ్నగర్, కర్నూల్ సిటీ, అనంతపురం, ధర్మవరం స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. -
లారీ కిందికి దూసుకెళ్లిన బైక్ : ఇద్దరు యువకుల మృతి
మహబూబాబాద్ రూరల్ : బైక్ అదుపు తప్పి లారీ కిందికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యు వకులు మృతి చెందారు. మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. టౌన్ సీఐ మహేందర్ రెడ్డి కథనం ప్రకారం... మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పాతదుబ్బ తండా గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ధరావత్ మహేందర్ (20), బానోత్ వెంకటేష్ (20) అలియాస్ చంటి, బానోత్ శ్రీనివాస్.. బైక్కు సంబంధించిన ఫైనాన్స్ డబ్బులు చెల్లించడానికి జిల్లా కేంద్రానికి వచ్చారు. పని పూర్తయిన కొంత సమయానికి వాహనానికి సర్వీసింగ్ చేయించుకుని భోజనం చేయడానికి నర్సంపేట బైపాస్ వైపునకు వెళ్తున్నారు. వెంకటేష్ బైక్ నడుపుతుండగా శ్రీను, మహేందర్ వెనుక కూ ర్చున్నారు. ఈ క్రమంలో యశోద గార్డెన్స్ సమీపానికి చేరుకుంటుండగా పక్కనుంచి లారీ వెళ్తోంది. బైక్ అదుపు తప్పి లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహేందర్ అక్కడికక్కడే మృతి చెందగా వెంకటేష్, శ్రీనివాస్కు తీవ్రగాయాలయ్యా యి. టౌన్ ఎస్సైలు ప్రశాంత్, షాకీర్, బ్లూకోల్ట్స్ పీసీ కుంజ రాంబాబు ఘటనాస్థలికి చేరుకుని 108లో క్షతగాత్రులను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా వెంకటేష్ మృతి చెందాడు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని సీఐ పేర్కొన్నారు. పాతదుబ్బతండాలో విషాదం.. డోర్నకల్: మహబూబాబాద్లో జరిగిన రోడ్డు ప్ర మాదంలో డోర్నకల్ మండలం పాతదుబ్బతండా కు చెందిన మహేందర్(20), వెంకటేష్(20) మృతి చెందారు. దీంతో తండాలో విషాదం నెలకొంది. మహేందర్ తండ్రి శ్రీను ఆటోడ్రైవర్ కాగా వెంకటేష్ తండ్రి మోతీలాల్ భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఒకే తండాకు చెందిన వీరు సమీప బంధువులు. కాగా, న లుగురు కూతుళ్ల తర్వాత జన్మంచిన వెంకటేష్ను తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచారు. ఈ క్ర మంలో వెంకటేష్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడండంతో కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు. -
వెండి ఆభరణాల దొంగ అరెస్ట్
రామన్నపేట : ఇంతేజార్గంజ్ పీపీఎస్ పరిధిలో ఈ నెల 29న వెండి ఆభరణాలను అపహరించిన దొంగను పట్టుకున్నట్లు వరంగల్ ఏసీపీ శుభం ప్రకాశ్ తెలిపారు. హైదరాబాద్కు చెందిన పంకజ్యాదవ్ తన అనుచరులు విమల్యాదవ్, ముఖేష్ సోనీకు ఐదు కిలోల వెండి ఆభరణాలు అప్పగించి వరంగల్లో విక్రయించి రావాలని సూచించారు. దీంతో ఈ నెల 29వ తేదీన విమల్, సోనీ ఆభరణాలతో హనుమకొండకు చేరుకుని ఆటోలో వరంగల్ వైపునకు ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో వెండి ఆభరణాల విషయం గురించి మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్.. విమల్యాదవ్, ముఖేష్ సోనీ ఆటో దిగిన వెంటనే వెండి ఆభరణాలు ఉన్న బ్యాగుతో పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆటోను గుర్తించి అపహరించిన వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని కాశిబుగ్గ చెందిన ఆటో డ్రైవర్ మెరుగు వెంకట్ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. -
రేపు తిరుగువారం పండుగ
ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో సమ్మక్క, సారలమ్మకు ఈనెల 4న (బుధవారం) తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. మహాజాతర ప్రారంభమైన వారం రోజుల అనంతరం అమ్మవార్లకు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పూజారులు ఆలయాలను శుద్ధి చేసి ధూపదీపాలు వెలిగించి యాటను నైవేద్యంగా సమర్పించి పూజలు నిర్వహించనున్నారు. తిరుగువారం రోజున పూజారుల కుటుంబీకులు, స్థానిక ఆదివాసీలు, గిరిజనేతరులు అమ్మవార్ల ఆలయాలకు వచ్చి మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం పూజా సామగ్రి, వస్త్రాలను ఆలయాల్లో భద్రపర్చనున్నారు. తిరుగువారం పండుగతో మహాజాతర పూజా కార్యక్రమాలు పరిసమాప్తమవుతాయి. అంతేకాకుండా ఈనెల 8న (ఆదివారం) జాతర విజయవంతమైన సందర్భంగా పూజారులు, గ్రామస్తులు వనభోజనాలకు వెళ్లి అమ్మవార్లకు పూజలు నిర్వహించనున్నారు. హుండీల తరలింపు ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతర హుండీలను లెక్కింపు కోసం దేవాదాయ శాఖ అధికారులు హనుమకొండకు తరలించారు. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో ఈనెల 5 నుంచి హుండీల్లోని కానుకలు లెక్కించనున్నారు. సోమవారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలోని 787 హుండీలను పోలీస్ భద్రత నడుమ ప్రత్యేక వాహనాల్లో హనుమకొండకు తరలించినట్లు ఆలయ ఈఓ వీరస్వామి తెలిపారు. భక్తుల కానుకల కోసం గద్దెల ప్రాంగణంలో మరో 40 హుండీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఏటూరునాగారం: మేడారం జాతరలో విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు ఊరట్టం ఆశ్రమ పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించామని, జాతర ముగి యడంతో మిగిలిన సరుకులను మేడారం ఇంగ్లిష్ మీడియం గోదాంకు తరలించామని హెడ్మాస్టర్ కల్తి శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘జాతరకు కేటాయించిన బియ్యం పక్కదారి’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి వివరణ ఇచ్చారు. బియ్యం ఎలాంటి దుర్వినియోగం జరగలేదన్నారు. గిరిజన సంక్షేమశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఊరట్టం గోదాం ఇన్చార్జ్ రాజయ్య క్యాంప్ నుంచి ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు తరలించామని, సామగ్రి పక్కదారి పట్టలేదన్నారు. ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతరకు వచ్చి ఓ మహిళ తప్పిపోయింది. ఈ ఘటన సోషల్ మీడియా ద్వారా సోమవారం వెలుగులోకి వచ్చింది. మేడారం మహాజాతరకు కుటుంబీకులతో వచ్చి తప్పిపోయిన ఓ మహిళ తాడ్వాయి మండల కేంద్రంలోని నర్సింగాపూర్ గ్రామంలో సంచరిస్తుంది. గ్రామస్తులు సదరు మహిళ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా తాను కుటుంబ సభ్యులతో వచ్చి తప్పిపోయానని.. కుటుంబీలకు తెలిసేలా వాట్సాప్లోని అన్ని గ్రూపుల్లో షేర్ చేయాలని వేడుకుంటుంది. తన అక్క పేరు రజిత అని మాత్రమే చెబుతోంది. మిగతా వివరాలు తెలపడం లేదు. తెలిసిన వారు ఉంటే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఈసారైనా విదిల్చేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు(ఆదివారం) ప్రవేశపెట్టే 2026–27 బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఏ మేరకు నిధుల వాటా దక్కనుంది? అన్న చర్చ ప్రధానాంశమైంది. ఈసారైనా కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపుల విషయమై సీతమ్మ కరుణిస్తుందన్న ఆశతో ఓరుగల్లు ప్రజలు ఎదురు చూస్తున్నారు. 2025–26 కేంద్ర బడ్జెట్ ఊరించి.. ఉసూరుమనిపించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు నేరుగా పద్దులేవీ ప్రకటించలేదు. పేదలు, యువత, రైతులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యంతో ఈ బడ్జెట్ను రూపకల్ప న చేసినట్లు చెప్పినా.. నేరుగా ఆ వర్గాలకు చెందిన అందరికీ మేలు జరిగే పరిస్థితి కనిపించలేదు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులైన కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీ, కాకతీయ టెక్స్టైల్ పార్కుకు పీఎం మిత్ర హోదా, నిధుల కేటాయింపు, ములుగు ట్రైబల్ యూనివర్సిటీ, వరంగల్ నగరంలో నియో రైలు, భూగర్భ డ్రెయినేజీ, ఎయిర్పోర్ట్ బడ్జెట్లో ప్రస్తావనకు రాలేదు. హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నా.. బడ్జెట్లో ఆ మే రకు నిధులివ్వలేదు. ఫలితంగా అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉంటున్నాయి. ఈసారి బడ్జెట్లోనైనా ప్రాధాన్యమిస్తారా? అన్న చర్చ జరుగుతోంది. కీలక ప్రాజెక్టులపై చిన్నచూపు.. ములుగు ట్రైబల్ యూనివర్సిటీ, వరంగల్ నగరంలో నియో రైలు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఎయిర్పోర్ట్ తదితర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలన్న ప్రతిపాదనలకు మోక్షం కలగడం లేదు. పలు ప్రతిష్టాత్మక పథకాలకు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు జరగకపోవడంపై ప్రజలు ప్రతీసారి పెదవి విరుస్తున్నారు. కాజీపేట రైల్వే కోచ్ను ఈ ఏడాది ఆగస్టు వరకు పూర్తి చేయాల్సి ఉన్నా.. గత బడ్డెట్లో నేరుగా పద్దుల్లో చేర్చకపోవడం వల్ల పూర్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు రూ.350 కోట్లు ఇవ్వాలని చేసిన ప్రతిపాదనలు గత బడ్డెట్లో బుట్టదాఖలే అయ్యాయి. లెదర్ పార్కు, సైనిక్ స్కూల్తో పాటు వివిధ పథకాల కోసం చేసిన ప్రతిపాదనలను పట్టించుకోకపోగా.. రూ.4,174 కోట్ల అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిధుల్లో కేంద్రం వాటా తేలలేదు. ఈసారి నిధులిచ్చి వాటాను క్లియర్ చేయాలని కోరుతున్నారు. నిధులు కేటాయించని కారణంగా సైనిక్ స్కూల్ను ఇతర జిల్లాలకు తరలించాలని చూస్తున్నారు. రైల్వేశాఖకు కేటాయింపులపై ఆశలు..ఈసాధారణ బడ్జెట్లోనైనా రైల్వేశాఖకు కేటాయింపులు జరిగితే పలు కొత్త, అసంపూర్తి రైల్వేలైన్లకు మోక్షం కలుగుతుంది. మణుగూరు–రామగుండం రైల్వేలైన్ సర్వే కోసం గతంలో బడ్జెట్ కేటాయించారు. ఆ మేరకు భూసేకరణ, నిర్మాణం పూర్తి కోసం నిధులు ఇవ్వలేదు. హసన్పర్తి–కరీంనగర్, డోర్నకల్–మిర్యాలగూడ రైల్వేలైన్ల సర్వే, భూసేకరణ, నిర్మాణం కోసం చేసిన కేటాయింపులు పెరగాల్సి ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన రైల్వే కోచ్ఫ్యాక్టరీని పూర్తి చేసేందుకు ఆ మేరకు నిధులు ఇవ్వాల్సి ఉంది. కాజీపేట రైల్వే టౌన్ స్టేషన్, రైల్వే ఆస్పత్రిని సబ్ డివిజన్ ఆస్పత్రి మార్పుపైన ఆశలు ఉన్నాయి. స్టేషన్ఘన్ఫూర్ నుంచి సూర్యాపేట వరకు కొత్త లైన్కు నిధులివ్వడంతో పాటు కాజీపేట జంక్షన్ నుంచి ముంబై. విజయవాడ, కాగజ్నగర్ వరకు మరిన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించాలన్న డిమాండ్ ఉంది. కాగా, గ్రేటర్ వరంగల్ నగర అభివృద్ధి కోసం స్మార్ట్సిటీ గడువును పెంచి అదనంగా నిధులు కేటాయించాలని నగరవాసులు కోరుతున్నారు. నేడు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్.. నిర్మలమ్మపైనే ఆశలు ట్రైబల్ యూనివర్సిటీ, కోచ్ఫ్యాక్టరీ పూర్తికి నిధులు అవసరం ఉమ్మడి వరంగల్లో కీలక ప్రాజెక్టులు పెండింగ్ రైల్వే లైన్లు, స్టేషన్లకు విడుదల కాని నిధులు గత బడ్జెట్లో ప్రతిపాదించినా దక్కని ప్రాధాన్యం ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర ప్రాజెక్టులకు కేటాయింపులపై ఆశలు -
ఎన్నికల నియమావళి పాటించాలి
న్యూశాయంపేట: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం నియమ, నిబంధనలు, మార్గదర్శకాలను అధికారులు కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు కె.శివకుమార్ నాయుడు సూచించారు. వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద, ఎన్నికల వ్యయ పరిశీలకుడు వీరారెడ్డితో కలిసి జిల్లా నోడల్ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేశారు. సమష్టిగా, సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున నోడల్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు భాస్కర్, సుధీర్కుమార్, జిల్లా నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
ఎస్ఐఆర్పై వీడియో కాన్ఫరెన్స్
కాజీపేట: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహణపై శనివారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హనుమకొండ కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ జిల్లా అధికారులతో కలిసి వీసీకి హాజరయ్యారు. అదనపు కలెక్టర్ రవి, ఆర్డీఓలు రమేష్ రాథోడ్, డాక్టర్ నారాయణ, తహసీల్దార్లు పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: హనుమకొండ ఎకై ్సజ్ కాలనీలోని నవీన్ రెసిడెన్సీలో వంశీ ఇంటర్నేషనల్, ఇండియా అధ్యక్షుడు వంశీ రామరాజు తన భార్యపేరుతో రచించిన డాక్టర్ ‘తెన్నేటి సుధాదేవి కథా సంపుటి’ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. అంపశయ్య నవీన్ అధ్యక్షతన జరిగిన సభలో సుధాదేవి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రొఫెసర్ రామాచంద్రమౌళి పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సుధాదేవి కుటుంబమంతా సాహిత్యకారులేనని కొనియాడారు. ఆమె తండ్రి విద్వాన్ టీ.వి.సుబ్బారావు గురించి, తల్లి అహల్యాదేవి అనుబంధం గురించి వంశీ రామరాజు వర్ణించారు. కథా సంపుటిలోని కథ శ్రేష్టత గురించి నెల్లుట్ల రమాదేవి విశ్లేషించారు. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఈనెల 2 నుంచి 11 వరకు నిర్వహించనున్న ఇంటర్ ప్రాక్టికల్స్కు ఏర్పాట్లు చేసినట్లు డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు. 64 కేంద్రాల్లో జనరల్ కోర్సులు, 10 కేంద్రాల్లో ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. మొత్తం 17,670 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, 406 మంది అధ్యాపకులను ఎగ్జామినర్లుగా, 71 మందిని చీఫ్ సూపరింటెండెంట్లుగా, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు నియమించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. శనివారం హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లకు ఓరియెంటేషన్ నిర్వహించినట్లు డీఐఈఓ గోపాల్ వివరించారు. ఎల్కతుర్తి: ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు కెనాల్ (పిల్ల) కాలువలో పడి ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్కు చెందిన చదిరం ప్రశాంత్–అనూష దంపతుల కుమారుడు శశివర్ధన్(4) మృతి చెందాడు. గ్రామంలో ఇళ్ల సమీపంలో ఉన్న డీబీఎం–20 కెనాల్ పిల్ల కాలువ వద్ద మిగతా పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రులు హైదరాబాద్లో నివాసముంటున్నారు. కాగా, ఇటీవలే సమ్మక్క–సారలమ్మ జాతర నిమిత్తం స్వగ్రామానికి వచ్చారు. బాలుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థుల ఆందోళనకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కామన్మెస్లో స్టీల్ ప్లేట్ల కొరతతో విద్యార్థులు ఆందోళన చేశారు. మెస్ కార్డులు కలిగిన విద్యార్థులకు అనుగుణంగా స్టీల్ ప్లేట్లను అధికారులు అందుబాటులో ఉంచారు. కొందరు విద్యార్థులు ప్లేట్లలో భోజనం తీసుకొని గదుల్లోకి వెళ్లి అక్కడే భోజనం చేయడంతో సరిపోవడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, శనివారం రాత్రి కామన్మెస్లో సూపర్వైజర్, కేర్టేకర్ కూడా విధుల్లో లేరని సమాచారం. పర్యవేక్షించాల్సిన హాస్టళ్ల డైరెక్టర్ ప్రొఫెసర్ రాజ్కుమార్ అందుబాటులో లేరు. వివరణ కోసం ఫోన్చేస్తే కూడా ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. కామన్మెస్లో ప్లేట్ల కొరతపై విద్యార్థుల ఇబ్బందులు పడుతున్నారని, పలువురు విద్యార్థులు టేబుల్స్ కిందపడేసిన విషయాన్ని కామన్ మెస్ జాయింట్ డైరెక్టర్ సుమంత్ కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి పేపర్ప్లేట్స్ కొనుగోలు చేయాలని ఆయన సూచించినట్లు సమాచారం. -
విద్యుత్ ఉద్యోగుల బదిలీలు లేనట్టే!
హన్మకొండ: విద్యుత్ ఉద్యోగుల బదిలీలు ఇప్పట్లో లేవనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీజీ ఎన్పీడీసీఎల్ షెడ్యూల్ ప్రకారం.. శనివారం బదిలీ ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఎన్పీడీసీఎల్లోని అన్ని స్థాయిల్లో బదిలీలు నిలిపేశారు. అధికారికంగా ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు ఇవ్వలేదు. అయితే, రాష్ట్రంలో పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నందున ఎలాంటి బదిలీలు చేపట్టవద్దని యాజమాన్యం నుంచి అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. దీంతో బదిలీల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మరోవైపు విద్యాసంవత్సరం మధ్యలో బదిలీలు చేయవద్దని, మే, జూన్ మాసంలో బదిలీలు చేయాలని, మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే బదిలీ చేయాలనే డిమాండ్తో గత నెల 28న హైదరాబాద్లోని టీజీ ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ, తెలంగాణ ఎలక్ట్రిసిటీ జేఏసీ సంయుక్తంగా రాష్ట్రస్థాయి మహాధర్నా నిర్వహించాయి. బీఎంఎస్ అనుబంధ సంఘాలతో కూడిన జేఏసీ మినహా మి గతా రెండు జేఏసీలు బదిలీలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలు రావడం, ఎన్నికల నిబంధనలు అమల్లోకి రావడంతో బదిలీలు నిలిచిపోయాయి. తిరిగి ఎప్పుడు బదిలీలు చేపడతారనే విషయంపై విద్యుత్ సంస్థల యాజమాన్యాలు స్పష్టత ఇవ్వలేదు. మే, జూన్ మాసం వరకు నిలిపివేస్తారా? మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియగానే బదిలీలు చేపడతారా అనే మీమాంస నెలకొంది. షెడ్యూల్ ప్రకారం వెలువడని ఉత్తర్వులు పురపాలక ఎన్నికల దృష్ట్యా వాయిదా తిరిగి ఎప్పుడు చేపడతారనే అంశంపై స్పష్టత కరువు -
అరణ్యానికి ఆదిశక్తులు
సమ్మక్క: రాత్రి 7.58 గంటలకుమేడారం(ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి): ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వన ప్రవేశం కార్యక్రమంతో సమ్మక్క–సారలమ్మ మహాజాతర శనివారం ముగిసింది. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క–సారలమ్మతోపాటు పగిడిద్దరాజు, గోవిందరాజును పూజారులు ఆదివాసీ సంప్రదాయ రీతిలో పూజలు చేసి తల్లులను వనం చేర్చారు. సాయంత్రం గద్దెల వద్ద ప్రారంభమైన వన ప్రవేశ కార్యక్రమం రాత్రి వరకు కొనసాగింది. పూజారులు కన్నెపల్లికి సారలమ్మను, చిలకలగుట్టకు సమ్మక్క తల్లిని తీసుకెళ్లారు. కొండాయికి గోవిందరాజును పూజారులు దబ్బగట్ల గోవర్ధన్, రాజారం, వడ్డె బాబు, పూనుగొండ్లకు పగిడిద్దరాజును పూజారులు పెనక బుచ్చిరాములు పడగలను తీసుకెళ్లారు. భక్తులు.. అమ్మల ఆశీస్సులతో గమ్యస్థానానికి చేరుకున్నారు. డోలు వాయిద్యాలు, కొమ్ముబూర ధ్వనులేమీ లేకుండా తల్లుల వన ప్రవేశం నిశ్శబ్దఽంగా సాగింది. శని వారం సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. తల్లులారా వెళ్లొస్తాం.. తల్లులూ వెళ్లొస్తాం.. అంటూ తీరొక్క మొక్కులు చెల్లించిన భక్తులు శనివారం స్వస్థలాలకు బయల్దేరి వెళ్లారు. బస్టాండ్ పరిసరాలు కిక్కిరిసి కనిపించాయి. బోసిపోయిన మేడారం.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాది ప్రైవేట్ వాహనాల్లో భక్తులు తరలివచ్చారు. వాహనాల పార్కింగ్కు కేటాయించిన స్థలాలు జాతర ముగియడంతో నిర్మానుష్యంగా మారాయి. ఇసుకేస్తే రాలనంత మంది జనంతో ఉన్న మేడారం ఒక్కసారిగా బోసిపోయింది. చెట్లు పుట్టలు అంటూ తేడా లేకుండా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మలకు మొక్కులు చెల్లించి తిరుగు ప్రయాణం చేశారు. పోలీసులు వన్ వే చేయడంతో వచ్చిన దారి కాకుండా పోలీసులు సూచించిన దారిలో వాహనాలు తరలించారు. భక్తుల రద్దీతో విరిగిన గ్రిల్స్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా శుక్రవారం వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల తాకిడికి అర్ధరాత్రి సమయంలో సమ్మక్క గద్దె సమీపంలోని ఇనుప గ్రిల్స్ విరిగిపోయాయి. భక్తుల రద్దీ, తోపులాటతో గ్రిల్స్ విరిగి పక్కకు పడ్డాయి. ఆ సమయంలో భక్తులు అనేక మంది అక్కడే ఉన్నప్పటికీ ఎలాంటి గాయాలు కాలేదు. విరిగిన గ్రిల్స్కు ఎండోమెంట్ అధికారులు వెల్డింగ్ చేయించారు. దాంతో దర్శనాలు యథావిధిగా కొనసాగాయి. జనం నుంచి వనం చేరిన తల్లులు ఆదివాసీ సంప్రదాయంతో వన ప్రవేశంవరాల మూటలు భక్తులకిచ్చారు.. వారిచ్చిన ప్రేమను మూటగట్టుకున్నారు. ఆసీనులై అందరి మొర ఆలకించారు.. ఎనలేని కాస్మిక్ ఎనర్జీని ప్రసరించారు. భక్తుల ప్రేమకు మురిసిపోయారు. వెళ్లొస్తామంటూ తల్లులు ముందుకు కదిలారు.. ఆ దారులు.. సెలయేరులై పాదాలు తడపగా గాలులు సుమగంధాలై నాట్యం చేశాయి. వనాలు గొంతెత్తి సుస్వరాలు పలుకగా. ‘సాహో.. అంటూ విశ్వం స్వాగతించింది! -
అమ్మల దీవెన
మేడారం(ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం): వరాల తల్లులకు భక్తులు మనసారా మొక్కులు చెల్లించారు. నలుగురు దేవతలు గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాల అనంతరం గద్దెలకు చేరుకున్నారు. కోరిన కోర్కెలు నెరవేరడంతో మొక్కులు అప్పగించారు. గద్దెల వద్ద పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, చీరసారె, యాటపోతులు, కోళ్లు, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో గద్దెల ప్రాంగణం కళకళలాడింది. గ్రిల్స్ బయట నుంచి అమ్మవార్లను తనివితీరా మొక్కుకున్నారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. జయజయధ్వానాలతో గద్దెల ప్రాంగణం మార్మోగింది. ఆదివాసీ సంప్రదాయంగా జరిగిన పూజలు, డోలు వాయిద్యాలతో మేడారం ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. కోటి మందికిపైగా మొక్కులు.. వనదేవతలను ఇప్పటి వరకు కోటి మందికిపైగా.. దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు సుమారు 45 లక్షల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, మంగళవారం నుంచి మొదలైన భక్తుల రద్దీ శుక్రవారం వరకు కొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పక్క రాష్ట్రాల నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో మేడారానికి చేరుకున్నారు. మేడారం పరిసరాల ప్రాంతంలోని 20 కిలోమీటర్ల దూరంలో విడిది చేసిన భక్తులు అమ్మవార్లు గద్దెలపైకి రావడంతో బుధవారం రాత్రి నుంచి లక్షల సంఖ్యలో దర్శనానికి పోటెత్తారు. మేడారం ఎక్కడ చూసినా భక్త జన గుడారంలా కనిపించింది. అటవీ ప్రాంతంలోని వనంలో భక్తులు చెట్ల కింద గుడారాలు వేసుకుని మూడు రోజులు సందడిగా గడిపారు. సమీప గ్రామాల్లో భక్తుల సందడి మహా జాతర సందర్భంగా మేడారంతో పాటు చుట్టు పక్కల గ్రామాలైన రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, నార్లాపూర్, కాల్వపల్లి, బయ్యక్కపేట, వెంగళాపూర్ గ్రామాల్లో సందడి నెలకొంది. ఆయా గ్రామాల్లో గదులను అద్దెకు తీసుకుని విడిది చేశారు. పండుగ వాతావరణంలో పల్లెలన్నీ కళకళలాడాయి. ఇంటి యజమానులు భక్తులను బంధువులుగా ఆదరించారు. బస చేసింది మూడు రోజులే అయినప్పటికీ వారిలో కొందరు బంధువులుగా మారిపోయారు. తిరుగు ప్రయాణం.. తల్లుల దర్శనం అనంతరం శుక్రవారం భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో వేలాది మంది తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. ఆర్టీసీ బస్టాండ్ భక్తులతో కిక్కిరిసిపోయింది. మేడారం ఆర్టీసీ బస్టాండ్ నుంచి తాడ్వాయి వరకు 14 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఆర్టీసీ బస్సుల రాకపోకలతో బారులుదీరాయి. సాధారణంగా 20 నిమిషాల్లో తాడ్వాయికి చేరుకోవాల్సి ఉండగా.. ఆర్టీసీ బస్సులు బారులుదీరడంతో గంటకు పైగా సమయం పట్టింది. ప్రైవేట్ వాహనాల్లో వచ్చిన భక్తులు సైతం గుడారాలు ఖాళీ చేసి తిరుగు ప్రయాణం కావడంతో పస్రా వరకు ప్రైవేట్ వాహనాలతో దారులన్నీ కిక్కిరిసి కనిపించాయి. భక్త కోటి జనంతో పూజలు అందుకున్న సమ్మక్క–సారలమ్మను నేడు (శనివారం) సమ్మక్క సారలమ్మ పూజారులు వన ప్రవేశం చేయనున్నారు. అదేవిధంగా ఏటూరునాగారం మండలంలోని కొండాయికి గోవిందరాజులు, గంగారం మండలం పూనుగొండ్లకు పగిడిద్దరాజు పడిగలను గద్దెలపై నుంచి పూజారులు తీసుకెళ్లనున్నారు. సారలమ్మతో పాటు గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెల వద్ద నుంచి ముందు బయల్దేరగా, వీరి తర్వాత సమ్మక్కను పూజారులు వన ప్రవేశం చేయించనున్నారు. సంపెంగలో నీళ్లు సంబురపడ్డాయి.. పూనకాలతో పులకించి పోయాయి. తలనీలాలు తన్మయత్వం చెందాయి.. ఎనలేని భక్తిని చాటాయి. పసుపు, కుంకుమలు ప్రణమిల్లాయి.. పొడిసేటి పొద్దులై ప్రభవించాయి. కోళ్లు, యాటలు సై సై అన్నాయి.. మొక్కుల లెక్కల్లో తరించిపోయాయి. సాక చుక్కలు నేలపై పారాయి.. ఆనవాయితీకి అద్దం పట్టాయి. ఎత్తు బంగారపు మూటలు నెత్తిన చేరాయి.. భక్తి నిండిన మనసుల్ని ఉరకలెత్తించాయి. ఒడిబియ్యం, చీర సారెలు పోటీపడ్డాయి.. వనదేవతల ఒడికి వడివడిగా చేరాయి. గద్దెలు పసిడి కాంతులై ధగధగ మెరిశాయి.. భక్తకోటికి ఆడబిడ్డల దీవెనలు అందాయి.మేడారం (కాళేశ్వరం): మేడారం జాతరకు లక్షలాదిగా భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి పునీతులయ్యారు. వాగులో ఇసుకతో తల్లుల ప్రతిమలు చేసి పూజించారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. శివసత్తులు పూనకా లతో నీరాజనం పలికారు. వరం పట్టారు. భ క్తులతో జంపన్నవాగు ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. అనంతరం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు చెల్లించారు. అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. మేడారంలో కిక్కిరిసిన గద్దెల ప్రాంగణం వనదేవతలను లక్షలాదిగా దర్శించుకుని పూజలు తిరుగు ప్రయాణంలో వాహనాల బారులు -
సైద్ధాంతిక విలువలకు ప్రతీక ‘చరఖా’
సాక్షిప్రతినిధి, వరంగల్: మహాత్మా గాంధీ సైద్ధాంతిక విలువలను తెలిపేదే చరఖా అని ఏఐసీసీ నేత, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. ఈ చరఖా ద్వారా గాంధీ ఆలోచనలను వ్యక్తపర్చవచ్చని, దూది నుంచి నూలు దారాన్ని ఎలా తీస్తామో సమాజంలో ఉన్న సమస్యలను వీడడానికి మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. గాంధీ 78వ వర్ధంతిని పురస్కరించుకుని హనుమకొండలోని డీసీసీ భవన్లో శుక్రవారం సర్వోదయ చరక సంఘటన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ.. హనుమకొండలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని గాంధీ వర్ధంతి రోజున నిర్వహించడం సంతోషాన్నిచ్చింందన్నారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, నాగరాజు, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు ఇనగాల వెంకట్రాంరెడ్డి, అయూబ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఈవీ శ్రీనివాస్రావు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలపై నాయకులతో భేటీ.. సర్వోదయ చరక సంఘటన్ను హనుమకొండలో ప్రారంభించిన మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులతో భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలపై మార్గదర్శనం చేసినట్లు పార్టీవర్గాలు తెలిపాయి. ఉమ్మడి వరంగల్లో 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా.. అన్నింట్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించేలా చూడాలని ఆమె సూచించారు. గాంధీ చూపిన మార్గమే నేటికీ దిశానిర్దేశం కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ -
జయహో జగజ్జనని మేడారంలో గద్దెకు చేరిన సమ్మక్క
● 7.13 గంటలకు మూడోసారి కాల్పులు● 7.14 గంటలకు నాలుగోసారి కాల్పులు ● 7.33 గంటలకు ప్రధాన గేటు దాటి అమ్మవారు బయటకు రాక ● 7.52 గంటలకు ఎదురుకోళ్ల మండపం చేరిక ● 8.29 గంటలకు సమ్మక్క గుడి చేరిక ● 9.47 గంటలకు ప్రధాన ద్వారం వద్దకు రాక ● 9.58 గంటలకు గద్దైపె సమ్మక్క ప్రతిష్ఠాపన వెన్నెల వెల్లివిరిసిన వేళ.. కుంకుమ భరిణె వెలిసింది. లక్షల నయనాల నిరీక్షణల నడుమ.. చిలకలగుట్ట చిందులు వేసింది. గాల్లో పేలిన తూటాల సాక్షిగా మనస్సు ఉప్పొంగింది. దారులన్నీ రంగులు రంగరించుకుంటుంటే.. ఇసుకేస్తే రాలనంత జనం జయజయధ్వానాలు పలికారు. డోలు వాయిద్యాలు.. బూరకొమ్ముల శబ్దాలు తల్లిని కీర్తించగా.. రోప్ పార్టీ వెంట సాహో.. సమ్మక్క నినాదాలు హోరెత్తాయి. అవనినేలే తల్లి ఆసీనురాలవ్వగా.. ధరణి పూల వనమై పులకించిపోయింది. ● జాతరలో మహాఘట్టం ఆవిష్కృతం ● అడుగుడుగునా భక్తుల నీరాజనాలు ● గద్దెలపై కొలువైన నలుగురు దేవతలు ● నేడు మొక్కులు సమర్పించనున్న భక్తులు మేడారం(ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం): మేడారం మహాజాతరలో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. చిలకలగుట్ట నుంచి కల్పవల్లి సమ్మక్క తల్లి వస్తుండగా జై సమ్మక్క అంటూ భక్తుల నినాదాలు హోరెత్తాయి.. గద్దెల వరకు నీరాజనాలు పలికారు. గుట్ట దిగి సమ్మక్క తల్లిని పూజారులు డోలు వాయిద్యాలు, బూరకొమ్ముల శబ్దాలతో తీసుకొచ్చి గద్దైపె ప్రతిష్ఠించారు. గుట్టపై రహస్య పూజలు.. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్ ఇంటి వద్ద పూజాసామగ్రి, పసుపు, కుంకుమ, కంకనాలు, అమ్మవారికి కావాల్సిన వస్త్రాలను తీసుకొని పూజారులు గుట్టపైకి వెళ్లారు. అమ్మవారిని తీసుకొచ్చే పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు మరో నలుగురు పూజారులు కలిసి సమ్మక్క కొలువై ఉన్న రహస్య స్థావరం వద్దకు చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి కొన్ని గంటల పాటు రహస్య పూజలు చేశారు. కృష్ణయ్య కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను తీసుకొని గుట్టదిగే మధ్యలో మరికొంతమంది పూజారులు కలిసి గుట్టదిగారు. అధికారికంగా తుపాకీతో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గాల్లోకి నాలుగు సార్లు కాల్పులు జరిపి అమ్మవారికి గౌరవ వందనం సమర్పించారు. చిలకలగుట్ట దారిమధ్యలో ఉన్న ఎదురుకోళ్ల పూజా మందిరానికి అమ్మవారిని తీసుకెళ్లి పూజారులు విశ్రాంతి తీసుకుని బయల్దేరారు. అక్కడి నుంచి మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కలెక్టర్ దివాకర టీఎస్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, జాతర చైర్పర్సన్ ఇర్ప సుకన్య, అధికారులు కలిసి అమ్మవారిని గద్దె వరకు తీసుకొచ్చారు. చిలకలగుట్ట వద్ద మంత్రి సీతక్కతోపాటు పలువురు మంత్రులు, అధికారులు, ఆదివాసీలు నృత్యాలు చేశారు. హరివిల్లు.. చిలకలగుట్ట దారి సమ్మక్కకు స్వాగతం పలికేందుకు మహిళలు దారిలో రంగు రంగులముగ్గులు వేశారు. అమ్మవారికి యాటపోతులు, కోళ్లు, కొబ్బరికాయలు కొట్టి స్వాగతించారు. చెట్టు, పుట్ట, గుట్టలు, ఎత్తయిన భవనాలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తల్లి రాకను తిలకించారు. మూడుసార్లు లైట్ల ఆర్పివేత.. గద్దైపె సమ్మక్కను ప్రతిష్ఠించిన సమయంలో మూడుసార్లు హైమాస్ట్ లైట్లను ఆర్పివేశారు. పూజారులు గద్దైపెన అమ్మవారిని ప్రతిష్ఠించి గౌరవ వందనాన్ని సమర్పించారు. ఇదేక్రమంలో ఫొటోలు, డ్రోన్లు తిరగకుండా నిషేధం విధించారు. సమ్మక్క రాకకు ముందు గద్దైపె ఉన్న బంగారం, కానుకలను తీసుకెళ్లేందుకు గ్రామస్తులు పోటీ పడ్డారు. ఈ ఆచారం అనాదిగా వస్తోందని పూజారులు తెలిపారు. నలుగురు వనదేవతలకు పూజలు.. సమ్మక్కను గద్దైపె ప్రతిష్ఠించడంతో నలుగురు వనదేవతలు కొలువుదీరారు. ఈఓ వీరస్వామి, ఎండోమెంట్ అధికారులతో కలిసి ముందుగా మంత్రులు అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. ఆ తర్వాత దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇచ్చారు. సమ్మక్కను గద్దైపె ప్రతిష్ఠించిన అనంతరం పూజలు చేస్తున్న పూజారులు, ఆదివాసీ యువత, అధికారులు సాయంత్రం 5.30 గంటలకు సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు పూజారులు చిలకలగుట్ట మీదకు వెళ్లారు. 6.45 గంటలకు ములుగు ఎస్పీ సుధీర్రామ్నాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరిపారు. రాత్రి 7.12 గంటలకు గేటు వద్ద కాల్పులు పోటెత్తిన భక్తజనం మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు గురువారం భక్తులు పోటెత్తారు. జంపన్నవాగు, గద్దెల ప్రాంగణం, చిలకలగుట్ట పరిసర ప్రాంతాలు ఎటుచూసినా జనం కిక్కిరిశారు. కుటుంబ సమేతంగా మేడారానికి వచ్చిన వారు తప్పిపోకుండా ఉండేందుకు కర్రలకు జెండాలు, బెలూన్స్, వాటర్ బాటిళ్లను గుర్తుగా పెట్టుకొని ముందుకు సాగారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించే క్రమంలో శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. ఉహించని విధంగా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. వనదేవతల గద్దెల ప్రాంగణం భక్తులు సమర్పించిన బంగారంతో కళకళలాడింది. సమ్మక్క రాకముందు ప్రత్యేక పూజలు.. చిలకలగుట్ట పైనుంచి సమ్మక్కతల్లి గురువారం రాత్రి కొలువుదీరడానికి ముందు సమ్మక్క పూజారులు తల్లి గద్దైపె ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సమ్మక్క గుడి నుంచి సమ్మక్క దేవతను తీసుకొచ్చే ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, దూప వడ్డె దొబె నాగేశ్వర్రావు, జలకం వడ్డె మల్యెల సత్యంతోపాటు పూజారులు కలిసి సమ్మక్క వడెరాలు, పసుపు, కుంకుమలను తీసుకుని డోలు వాయిద్యాలు, బూరకొమ్ముల శబ్దాల నడుమ గద్దైపెకి వె ళ్లి పూజలు చేశారు. గద్దెలపై నలుగురు వనదేవతలు కొలువుదీరడంతో నేడు (శుక్రవారం) భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని దర్శించుకుంటారు. తీరొక్క మొక్కులు చెల్లించి ఆశీర్వాదాన్ని పొందుతారు. ఇప్పటికే కోటి మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. శనివారం సమ్మక్క, సారలమ్మ వనప్రవేశం చేస్తారు.సమ్మక్క గద్దైపె కంకవనం ప్రతిష్ఠమేడారంలోని జెండాగుట్ట నుంచి సమ్మక్క పూజారులు కంకవనాన్ని తీసుకొచ్చి గురువారం ఉదయం పది గంటలకు గద్దైపె ప్రతిష్ఠించారు. మొదట జెండాగుట్టలో పూజారులు కంకవనానికి పూజలు నిర్వహించారు. కర్రలతో కంకవనాన్ని బందోబస్తు మధ్య గద్దె వద్దకు తీసుకొస్తున్న సమయంలో ఆడపడుచులు ఎదురెళ్లి పూజారుల పాదాలకు నీళ్లు ఆరగించి హారతి పట్టారు. తల్లి వచ్చే దారిలో చిలకలగుట్ట వద్ద ఆనవాయితీగా కింద కూర్చొని పైకి లేచి నమస్కరించారు. గద్దె వద్దకు చేరుకున్న పూజారులు ముందుగా గద్దె పక్కనే ఉన్న రహస్య పూజా మందిరంలోకి పూజలు చేశారు. అనంతరం గద్దైపె ప్రతిష్ఠించారు. ఈ సమయంలో భక్తులను గద్దెలపైకి రాకుండా పోలీసులు అదుపు చేశారు. సారలమ్మ గద్దె వద్ద పూజలు నిర్వహించారు. ఈ వనమహోత్సవానికి మంత్రి సీతక్క హాజరై పూజారులతో కలిసి గద్దైపెకి వచ్చారు. -
రెండేళ్లలో ‘మామునూరు’కు రెక్కలు
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయం మరో రెండేళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కేంద్రం ముందుకెళ్తోంది. రూ.850 కోట్ల వ్యయంతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆధ్వర్యంలో పూర్తిచేయనుంది. ఇక్కడ టెర్మినల్ బిల్డింగ్ కూడా నిర్మించనుంది. త్వరలోనే ఈ నిర్మాణ పనుల టెండర్లపై దృష్టి సారించనుంది. ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వద్ద ఉన్న 696.14 ఎకరాలకు అదనంగా కావాల్సిన 253 ఎకరాలను సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి గురువారం అధికారికంగా అప్పగించింది. హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ భూమికి సంబంధించి పత్రాలను కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖతో కూడిన బృందం అందించింది. దీంతో ఇక కేంద్ర ప్రభుత్వమే సాధ్యమైనంత తొందరగా నిర్మాణ పనులు చేయడం ద్వారా వరంగల్ అభివృద్ధి బాటలో పయనించే అవకాశముంది. ఈ మేరకు కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడి వ్యాఖ్యలతో ఏళ్లుగా ఆకాశంలో విహరించాలన్న వరంగల్ వాసుల కలనెరవేరే అవకాశముంది. ఇది అందుబాటులోకి వస్తే 150 నుంచి 186 మంది ప్రయాణించేలా వీలున్న 37.6 మీటర్లు(123 ఫీట్ల)పొడవనున్న ఏ 320, బీ–737 విమానాల రాకపోకలు సాగించనున్నాయి. 253 ఎకరాలను ఏఏఐకి అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.850 కోట్ల వ్యయంతో విమానాశ్రయ నిర్మాణం త్వరలోనే ఆయా పనుల టెండర్లపై కేంద్రం దృష్టి -
భక్తులకు బస్సులు అందుబాటులో ఉంచాలి
● టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డిహన్మకొండ: మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీజీఎస్ ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా బస్ స్టేషన్తోపాటు హనుమకొండ, వరంగల్, కాజీపేటలోని మేడారం ప్రత్యేక బస్ పాయింట్లను పర్యవేక్షించారు. క్యూ లైన్లను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. బస్సుల రాకపోకల వివరాలు అధికారులను ఆడిగి తెలుసుకున్నారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు గంటల తరబడి వేచి ఉండకుండా బస్సులు నిరంతరం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉన్నందున, అదనపు బస్సులను సిద్ధం చేశామన్నారు. ఆర్ఎం దర్శనం విజయభాను, డిప్యూటీ ఆర్ఎం కేశరాజు భానుకిరణ్, డిపో మేనేజర్లు బి.ధరంసింగ్, పి.అర్పిత, రవిచంద్ర పాల్గొన్నారు. -
నాలుగురోజులుంటేనే మనసు నిమ్మలం!
● సకుటుంబసమేతంగా అమ్మవార్ల దర్శనానికి.. ● దశాబ్దాలుగా మేడారానికి వస్తున్న కుటుంబాలు మేడారం (ములుగు): ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు భక్తులు అమ్మవార్లపై ఉన్న అపార నమ్మకంతో వస్తుంటారు. కోరిన కోర్కెలు నెరవేర్చే సమ్మక్క–సారలమ్మ తల్లులకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అనాదిగా అమ్మవార్లపై ఎనలేని విశ్వాసాన్ని చూపుతూ రెండేళ్లకొకసారి జరిగే మహాజాతరకు కుటుంబసమేతంగా హాజరై తల్లుల చెంత నాలుగు రోజుల పాటు ఆధ్మాత్మిక సేద్యం చేస్తుంటారు. బుధవారం జాతరకు వచ్చి శనివారం సాయంత్రం దాక నాలుగు రోజులు ఇక్కడే గడుపుతారు. అవసరమైన ఆహార సామగ్రి, ఇతర వంట సరుకులు తెచ్చుకుంటారు. అమ్మవార్లు గద్దెలపై కొలువుదీరిన వెంటనే నిలువెత్తు బంగారాన్ని సమర్పించి కోరికలు నెరవేర్చినందుకు యాటలను, కోళ్లలను బలిచ్చి చల్లంగా చూడు తల్లి అంటూ వేడుకుంటారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వచ్చి సమ్మక్క–సారలమ్మను దర్శించుకుంటారు. మేడారం జాతర జరిగే నాలుగు రోజుల పాటు పౌర్ణమి వెలుగుల్లో గుడారాలు వేసుకొని సమ్మక్క తల్లిని వేడుకుంటారు. 30ఏళ్లుగా జాతరకొస్తున్నాం.. అడవి బిడ్డలైన సమ్మక్క–సారలమ్మను భక్తితో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. 1998 నుంచి ప్రతీ రెండేళ్లకొసారి మేడారం జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటాం. అమ్మవార్ల మహిమను, మహాత్మ్యాన్ని స్నేహితులకు కూడా తెలియజేయడంతో వారు కూడా మేడారం జాతరకు వస్తున్నారు. అమ్మవార్లను నమ్ముకుంటే అనుకున్న పని జరుగుతుందని స్నేహితులు కూడా చెప్పారు. – దామెర రాజు, సికింద్రాబాద్ ఙ అమ్మవారి ఆశీస్సులతో బాబు పుట్టాడు.. తల్లుల మహిమల గురించి విని జాతరకు వచ్చి పెళ్లి కావాలని అమ్మవార్లకు మొక్కులు చెల్లించాను. దీంతో మరుసటి జాతర వచ్చేలోపు వివాహం జరగడమే కాకుండా బాబు పుట్టాడు. దీంతో కుటుంబ సమేతంగా మేడా రం చేరుకొని బాబు పుట్టువెంట్రుకలను మేడారంలోనే తీశాం. 20 ఏళ్లుగా ప్రతీ మేడారం జాతరకు వస్తూ ఎన్ని ఇబ్బందులైనా నాలుగు రోజుల పాటు మేడారంలో ఉండి అమ్మవార్లు గద్దెల పైకి వచ్చిన తర్వాత మొక్కులు చెల్లిస్తున్నాం. – వెంకటగిరి కిశోర్బాబు, అమీర్పేట, హైదరాబాద్ నాలుగు రోజులు ఉంటం.. 16 ఏళ్లుగా మేడారం జాతరకు వస్తున్నాం. కష్టాలు తీర్చమని అమ్మవార్లను వేడుకుంటాం. కోరికలు నెరవేర్చాలని అమ్మవారికి పూజలు నిర్వహిస్తాం. కోరికలు నెరవేరిన వెంటనే అమ్మవార్లకు యాటపోతులను బలిస్తాం. ప్రతీ రెండేళ్లకు ఒకసారి మేడారానికి కుటుంబంతో కలిసి రావడం ఆనందంగా ఉంటుంది. జాతరలో సౌకర్యాలు ఉన్నా లేకున్నా..నాలుగు రోజు పాటు ఉండి అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లిస్తాం. సరిపడా వంట సరుకులు తెచ్చుకుంటాం. నాలుగు రోజులుంటేనే మనసు నిమ్మలంగా ఉంటుంది. – వరికుప్పల పుష్ప, పాలకుర్తి, జనగామ -
చారిత్రక ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఖిలా వరంగల్: వరంగల్లోని చారిత్రక దేవాలయాల అబివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో కుడా అధికారులు, రాష్ట్ర పురావస్తుశాఖ అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. వరంగల్ టూరిజంగా హబ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. పురావస్తుశాఖ రాష్ట్ర డైరెక్టర్ అర్జున్రావు మాట్లాడుతూ ప్రస్తుతం కోట పురావస్తుశాఖ మ్యూజియాన్ని కోటకు తరలించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం మ్యూజియం, శంభునిగుడిని పరిశీలించారు. కుడా వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్పాయ్, సీపీఓ అజిత్రెడ్డి, ఆర్డీఓ సుమ, ఇన్చార్జ్ టూరిజం ఆఫీసర్ అనిల్కుమార్, తహసీల్దార్ శ్రీకాంత్ పాల్గొన్నారు. -
జాతీయస్థాయిలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
వరంగల్ స్పోర్ట్స్: దేశంలో మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా గిరిజన క్రీడా ఎంపిక పోటీల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి గుగులోత్ అశోక్కుమార్ అన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఎంపికలు అట్టహాసంగా కొనసాగాయి. ముఖ్య అతిథిగా హాజరైన డీవైఎస్ఓ అశోక్కుమార్ లాంఛనంగా పోటీలను ప్రారంభించి క్రీడాకారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ఈ ఎంపికలు ఎంతో దోహదపడుతాయని అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆప్ తెలంగాణ ఆదేశాలతో అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, రెజ్లింగ్, వెయిట్లిఫ్టింగ్ క్రీడాంశాల్లో ఎంపికలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధజిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు హాజరైనట్లు వివరించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను వచ్చే నెల 15న ఛత్తీస్గఢ్లో జరగనున్న జాతీయస్థాయి ఖేలో ఇండియా పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన రెజ్లింగ్ కోచ్ కొండ నర్సింగరావు ను శాలువాతో ఘనంగా సత్కరించారు. అథ్లెటిక్స్ సంఘం రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, రెజ్లింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అహ్మద్జాబ్రీ, స్విమ్మింగ్, రెజ్లింగ్ల సంఘాల జిల్లా కార్యదర్శులు స్వామిచరణ్, మహ్మద్ కరీం, సీనియర్ రెజ్లింగ్ కోచ్ నర్సింగరావు, డీఎస్ఏ కోచ్లు శ్రీమన్నారాయణ, జైపాల్, రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ డీవైఎస్ఓ అశోక్కుమార్ అట్టహాసంగా గిరిజన క్రీడాకారుల ఎంపిక పోటీలు -
మళ్లీ గులాబీ జెండా పట్టిన ‘అరూరి’
హసన్పర్తి: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ గులాబీ జెండా పట్టుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట తారకరామారావు సమక్షంలో బుధవారం హైదరాబాద్లో పార్టీలో చేరారు. అదేవిధంగా 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత, 56వ డివిజన్ కార్పొరేటర్ సిరంగి సునీల్, 6వ డివిజన్ కార్పొరేటర్ మునిగాల సరోజన, మాజీ జెడ్పీటీసీ సభ్యులు సుభాశ్, రేణుకుంట్ల సునీత, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు బండా రత్నాకర్రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్లు జక్కుల రమేష్, వనంరెడ్డి తిరిగి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉండగా మరో ముగ్గురు కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్లో చేరడానికి సిద్ధమైనట్లు తెలిసింది. మంగళవారం వారితో అరూరి రమేశ్ రహస్య సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. చివరి క్షణంలో ఆ కార్పొరేటర్లు మనసు మార్చుకున్నారని, ఫోన్ చేసినా ఎలాంటి స్పందన రాలేదని తెలిసింది. -
వనం దారిపట్టిన భక్తజనం
అడవిబిడ్డలు అందరికీ అమ్మలైన సన్నివేశం. తెలంగాణకు శతాబ్దాల కిందటే పోరాటం అబ్బిన సందర్భం. సమ్మక్క–సారలమ్మ దివ్య చరితం. వారి త్యాగాన్ని గుర్తు చేసుకునే వేళ ఇది. పర్యావరణాన్ని రక్షించడానికి ప్రాణాలు ఫణంగా పెట్టిన వారి ధైర్యసాహసాలను స్మరించుకునే సమయం ఇది. రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర ప్రకృతిని ఆరాధించమని ఉద్బోధిస్తుంది. దైవం ముందు ధనిక, పేద తారతమ్యాలు లేవన్న సత్యాన్ని స్పష్టం చేస్తుంది. మాఘశుద్ధ పౌర్ణమితో మొదలు మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్క పున్నం) నుంచి జాతర మొదలవుతుంది. నాలుగు రోజుల పాటు ప్రధాన జాతర అంతా ఆదివాసీ సంప్రదాయం ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ భక్తుల నమ్మకాలే సహస్ర నామాలు, పూనకాలే హోమాది క్రతువులు. న మ్మిన వారి కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఆ తల్లీకూతుళ్ల వీరత్వమే దైవత్వం. ఆసాహసాన్ని త లుచుకొని భక్తి పారవశ్యం పొందడమే మానవత్వం. ప్రతీ మనిషిలోనూ దైవత్వం ఉందని నిరూపించే అరుదైన జాతర మేడారంలో సాక్షాత్కరిస్తుంది. గద్దెలే దేవతామూర్తులుగా.. మేడారంలో సమ్మక్క– సారలమ్మకు ఎలాంటి విగ్రహాలు ఉండవు. రెండు గద్దెలు ఉంటాయి. ఒకటి సమ్మక్క గద్దె, ఇంకోటి సారలమ్మ గద్దె. వీటినే దేవతామూర్తులుగా కొలుస్తారు. మనిషి ఎత్తు ఉండే కంక మొదళ్ల వంక కన్నార్పకుండా చూస్తూ వన దేవతలను మనసులో ప్రతిష్ఠించుకుంటారు. దట్టమైన అడవి నుంచి దేవతలను తోడ్కొని వచ్చే వడ్డెలు (పూజారులు) తమ మీది నుంచి దాటుకుంటూ వెళ్తే జన్మ సార్థకం అవుతుందని భక్తుల నమ్మకం. పసుపు, కుంకుమ స్వరూపంగా నిలిచిన దైవాలను వాటితోనే ఆర్చిస్తారు. అమ్మవారి రూపంలో ముఖానికి పసుపు పూసుకుని పెద్దబొట్టు పెట్టుకుని వచ్చి వన దేవతలను దర్శించుకుంటారు. కంకబియ్యం (ఒడిబియ్యం), ఎదురుకోళ్లు, లక్ష్మీదేవర (గుర్రం ఆకారపు తొడుగును ముఖానికి కట్టుకుని వచ్చి దానిని అమ్మవారికి సమర్పించడం) వంటి రకరకాల మొక్కులు ఇక్కడ చెల్లించుకుంటారు. దేవతల గద్దెలపై ఉండే కుంకుమను ఎంతో పవిత్రంగా నమ్ముతారు. -
కోటలో విదేశీయుల సందడి
ఖిలా వరంగల్ : కాకతీయుల కాలంలో నిర్మించిన కట్టడాలు, నల్లరాతి శిల్పకళా సౌందర్యం మహాద్భుతంగా ఉన్నాయని రష్యా, జర్మనీ, థాయిలాండ్, అమెరికా, బ్రిటన్ దేశాలకు చెందిన పర్యాటకులు కొనియాడారు. మంగళవారం ఖిలా వరంగల్ మధ్యకోటను విదేశీయులు సందర్శించి నల్లరాతి శిల్పాలను వీక్షించారు. అనంతరం ఏకశిల గుట్ట, ఖుష్మహాల్, రాతి, మట్టి కోట అందాలను తిలకించారు. కాకతీయుల విశిష్టతను కోట గైడ్ రవియాదవ్ వారికి వివరించారు. కాకతీయుల చరిత్రను కాపాడి భావితరాలకు అందజేయాలని విదేశీ పర్యాటకులు పేర్కొన్నారు. కేంద్ర పురావస్తు శాఖ ఇన్చార్జ్ శ్రీకాంత్, టీజీటీడీసీ ఇన్చార్జ్ అజయ్, సిబ్బంది పాల్గొన్నారు. భక్తులకు ప్రత్యేక వైద్యశిబిరాలుఎంజీఎం : మేడారం మహాజాతరలో, అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మజాతరతో సహా హనుమకొండ జిల్లా పరిధిలో మొత్తం 22 ప్రదేశాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్ఓ అప్పయ్య మంగళవారం పేర్కొన్నారు. మేడారం మహాజాతరలో 48 మందిని డిప్యూటేషన్పై పంపించినట్లు తెలిపారు. హనుమకొండ బస్స్టేషన్, హయగ్రీవాచారి గ్రౌండ్, మేడారం, అగ్రంపహాడ్ దారిలో గల ఊరుగొండ, గూడెప్పాడ్ ఎక్స్ రోడ్డు, ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కటాక్షపూర్ చెరువు ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లాలో సమ్మక్క–సారలమ్మ జాతర నిర్వహిస్తున్న అగ్రంపహాడ్, అమ్మవారిపేట, పీచర, ఎర్రబెల్లి, దామెర, మాధన్నపేట, మరిపల్లి గూడెం, కమలాపూర్, పులిగిల్ల, జోగంపల్లి, రాయపర్తి, ఐనవోలు ఇతర ప్రాంతాలకు స్థానిక వైద్యసిబ్బందితో పాటు అదనంగా ఇతర ప్రాంతాల నుంచి వైద్యులను డిప్యూటేషన్ చేసినట్లు తెలిపారు. ఈ నెల 28నుంచి 31వ తేదీ వరకు 348 మంది వైద్యసిబ్బంది సేవలందించనున్నట్లు, 108 వాహనాలను అత్యవసర ప్రదేశాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్కు వరుసగా ఐదు రోజులు బంద్ ఉండనున్నట్లు మార్కెట్ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మేడారం జాతర సందర్భంగా వ్యాపారులు, దడువాయి, హమాలీ కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు బుధ, గురు, శుక్రవారాలు సెలవులు ఇవ్వాలని వినతి మేరకు మూడు రోజులు మార్కెట్కు సెలవులు ప్రకటించారు. వీటితోపాటు శనివారం యార్డు బంద్, ఆదివారం వారంతపు సెలవు ఉన్నందున వరుసగా బుధవారం నుంచి ఆదివారం వరకు (5 రోజులు) మార్కెట్ బంద్ ఉంటుందన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని మార్కెట్ అధికారులు పేర్కొన్నారు. పీపీగా రాజేంద్రనాథ్ వరంగల్ లీగల్ : హనుమకొండ రెండో అదనపు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)గా వరంగల్ ర్పుకోటకు దిన సీనియర్ న్యాయవాది సంగరబోయిన రాజేంద్రనాథ్ను ప్రభుత్వం నియమించింది. జిల్లా పరిధిలోని సెషన్స్ కేసుల్లో బాధితుల పక్షాన వీరు వాదిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తనను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించిన సీఎం రేవంత్రెడ్డికి రాజేంద్రనాథ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
రారండోయ్ మేడారం
నేటినుంచి మహా జాతర ● కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెలపైకి రాక మలుగు/ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం: మేడారం సమ్మక్క– సారలమ్మ మహా జాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారం గద్దైపె కొలువుదీరనుంది. ఈ మేరకు మంగళవారం సారలమ్మ పూజారులు సమావేశమయ్యారు. వన దేవతను గద్దైపెకి తీసుకెళ్లే ముందు గుడిలో నిర్వహించే పూజాకార్యక్రమాలకు సామగ్రి సిద్ధం చేసుకున్నారు. కొత్త వెదురు బుట్టను తయారు చేసి సారయ్య ఇంటి వద్ద పవిత్రంగా ఉంచారు. సారలమ్మ గద్దైపెకి రానున్న సందర్భంగా బుధవారం ఉదయం కన్నెపల్లి గుడి నుంచి పసుపు కుంకుమ, కంకణాలు, పవిత్ర జలం తీసుకొని ఆడపడుచులు సారలమ్మ గద్దెను అలికి ముగ్గులు వేసి ముస్తాబు చేస్తారు. సారలమ్మ పూజారులతో పాటు ఆ గ్రామంలోని స్థానిక ఆదివాసీలు, కాక వంశస్తులు తమ ఇళ్లను శుద్ధి చేసుకొని మంగళహారతి ఇచ్చి మొక్కుతారు. అదేవిధంగా కొండాయి నుంచి గోవిందరాజులును ప్రధాన పూజారి దబ్బగట్ల గోవర్ధన్ తదితరులు పూజలు చేసి పడిగ రూపంలో తీసుకొస్తారు. గోవిందరాజులును వడ్డె బాబుతో కలిసి డప్పుచప్పుళ్లతో బయలుదేరగా పడిగను పట్టుకున్న వడ్డె కాళ్లకు నీళ్లు అంటకుండా మోసుకొస్తారు. కోరికలు నెరవేర్చేందుకు నిలువెత్తు బంగారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునే భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరాలని నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకుంటారు. అమ్మలను కొలిచే జాతర కావడంతో అన్ని సమయాల్లోనూ మేడారానికి మహిళలు రావచ్చు. ఇక్కడే కాన్పులు అయిన మహిళలు వేలల్లో ఉంటారు. రూ.101 కోట్లతో గద్దెల ప్రాంగణం విస్తరణ.. మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ.150 కోట్లు నిధులను మంజూరు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ 20 రోజులుగా మేడారంలో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గద్దెల ప్రాంగణాన్ని రూ.101 కోట్లతో విస్తరించారు. ఈసారి 3 కోట్ల మంది భక్తులు దర్శించుకోవడానికి అధికా రులు ఏర్పాట్లు చేశారు.హనుమాన్ జెండా నీడలో సారలమ్మ.. సారలమ్మను బుధవారం కన్నెపల్లి నుంచి పూజారులు కాక సారయ్య ప్రత్యేక పూజలు చేసి మేడారంలోని గద్దెకు తీసుకువస్తారు. ఇందులో భాగంగానే హనుమాన్ జెండా నీడలోనే సారలమ్మ ముందుకు సాగుతుంది. కన్నెపల్లి నుంచి మేడారం సారలమ్మ గద్దెల వరకు హనుమాన్ జెండా రక్షణలోనే సారలమ్మ గద్దెకు చేరుకుంటారు. గుడారాలతో నిండిన మేడారం..గుడారాలతో మేడారం నిండిపోయింది. నార్లాపూర్ స్తూపం నుంచి మొదలుకొని జంపన్నవాగు పరిసర ప్రాంతాలు, చిలకలగుట్ట నుంచి మొదలుకొని ఆర్టీసీ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఎడ్లబండ్లు, ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చిన భక్తులు మేడారం చుట్టు పక్కల ప్రాంతాల్లో గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎటుచూసినా మేడారం పరిసర ప్రాంతాల్లో ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి మొదలుకుని జంపన్నవాగు వరకు రోడ్లన్నీ భక్తులతో బారులుదీరాయి. బుధవారం ఉదయం వరకు వేలాది సంఖ్యలో వాహనాలు, లక్షల సంఖ్యలో భక్తులు రానుండడంతో మేడారం కిటకిటలాడనుంది. -
వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్య
గంగారం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లకు చెందిన పగిడిద్ద రాజు పెళ్లి కొడుకయ్యాడు. సమ్మక్కను వివాహం చేసుకునేందుకు ములుగు జిల్లా ఎస్ఎస్తాడ్వాయి మండలం మేడారానికి మంగళవారం బయలుదేరి వెళ్లాడు. ఈ మేరకు పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయంలో వడ్డెలు గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి కల్తీ జగ్గారావు, పూజారులు పడిగను పట్టుకొని తరలివెళ్లారు. పగిడిద్దరాజు గ్రామం దాటే వరకు మహిళలు నీళ్లు ఆరబోశారు. వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్యా అంటూ భక్తులు మొక్కులు చెల్లించారు. 70 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి గోవిందరావుపేట మండలం కర్లపల్లి లక్ష్మీపురంలోని పెనక సాంబయ్య ఇంట్లో రాత్రి బసచేశారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు మేడారంలోని గద్దెకు చేరుకుంటారు. సమ్మక్కతో వివాహం అనంతరం జాతర తర్వాత పగిడిద్దరాజు తిరిగి పూనుగొండ్లకు చేరుకుంటారు. రెండురోజుల అనంతరం మరుబెల్లి జాతరను పూనుగొండ్లలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ మొక్కులు చెల్లిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని గిరిజనులు, గిరిజనేతరుల నమ్మకం. పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయం వద్ద గిరిజన యువకులు వలంటీర్లుగా పనిచేశారు. మంత్రి ధనసరి సీతక్క ,మేడారం ట్రస్ట్బోర్డు చైర్పర్సన్ సుకన్య, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, డీఎస్పీ తిరుపతిరావు, సీఐలు వినయ్, సూర్యప్రకాశ్, ఎస్సై రవికుమార్, రాజ్కుమార్, ఎండోమెంట్ ఈఓ వీరస్వామి, రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ నారాయణరెడ్డి పూజలు చేశారు. పూనుగొండ్ల నుంచి మేడారానికి సమ్మక్క భర్త పగిడిద్దరాజు 70 కిలోమీటర్లు అడవిలో కాలినడకన పడిగతో బై లెల్లిన పూజారులు -
అంకెల్లో మేడారం
మహా జాతరకు భారీ ఏర్పాట్లుఫైర్ బ్రిగేడ్ వాహనాలు: 15ఫైర్ ఫైటర్లు: 268ట్రాన్స్ఫార్మర్లు: 196విద్యుత్ స్తంభాలు: 911విద్యుత్ లైన్లు: 65.75 కి.మీ విద్యుత్ సిబ్బంది: 350 డీజిల్ జనరేటర్లు (బ్యాకప్): 28తాగునీటి నల్లాలు: 5,482జంపన్నవాగు వద్ద డ్రెస్సింగ్ రూములు: 119పార్కింగ్ స్థలాలు: 42మొత్తం విస్తీర్ణం: 1,418 ఎకరాలు టీజీఎస్ఆర్టీసీ బస్సులు: 4,000మొత్తం ట్రిప్పులు: 51,000ఆర్టీసీ సిబ్బంది: 10,441కమ్యూనికేషన్ – టెక్నాలజీశాశ్వత మొబైల్ టవర్లు: 27తాత్కాలిక మొబైల్ టవర్లు: 33వీహెచ్ఎఫ్ సెట్లు: 450వైద్య సిబ్బంది: 5,192అంబులెన్సులు: 30 బైక్ అంబులెన్సులు: 40 ప్రధాన ఆస్పత్రి: 50 పడకలు రోజుకు మెడికల్ క్యాంపులు: 30బ్లాకులు: 285టాయిలెట్లు: 5,700గజ ఈతగాళ్లు: 210సింగరేణి రెస్క్యూ: 12ఎస్డీఆర్ఎఫ్ బృందాలు: 100– ములుగుపారిశుద్ధ్య సిబ్బంది: 5,000ట్యాంకర్లు: 150 ట్రాక్టర్లు: 100స్వీపింగ్ మెషిన్లు: 18 జేసీబీలు : 12స్వచ్ఛ ఆటోలు: 40 డోజర్లు: 16భక్తుల అంచనా: సుమారు 3 కోట్లు విధుల్లో సిబ్బంది: 21 శాఖలు, 42,027 మంది ఆదివాసీ వలంటీర్లు: పరిపాలనా విభజన: 08 జోన్లు 42 సెక్టార్లు 2,000 మంది -
కొలువుదీరిన జంపన్న
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలోని జంపన్నవాగు గద్దైపె జంపన్న మంగళవారం రాత్రి కొలువుదీరాడు. సమ్మక్క కుమారుడు అయిన జంపన్నను కన్నెపల్లిలోని పోలెబోయిన వంశస్తుల ఇంటినుంచి పడిగరూపంలో సాయంత్రం 6 గంటలకు పూజారులు పోలెబోయిన శ్రీను, సురేశ్తోపాటు మరికొంతమంది కలిసి డోలువాయిద్యాలతో బయలుదేరారు. ముందుగా ప్రత్యేక పూజలు చేశారు. ఆదివాసీ యువత రోప్పార్టీతో రాత్రి 8 గంటలకు గద్దె వద్దకు తీసుకు వచ్చి పూజలు చేసి ప్రతిష్ఠించారు. మంత్రి సీతక్క వాగు వరకు జంపన్న వెంట తోడుగా వచ్చారు. జంపన్నను గద్దైపెకి తీసుకొస్తున్నప్పుడు దారి పొడవునా భక్తులుబారులుదీరి మొక్కులు చెల్లించారు. -
జాతరలో సాంకేతికత వినియోగం..
హన్మకొండ : సమ్మక్క, సారలమ్మ మహాజాతర జరిగే మేడారం విద్యుత్ వెలుగులతో జిగేల్మంటోంది. రాత్రి సమయంలోనూ పగలు మాదిరి కనిపిస్తుంది. ఈ నెల 28, 29, 30, 31 తేదీల్లో జరిగే వన దేవతల జాతరలో నిరంతరాయంగా విద్యు త్ సరఫరా జరిగేలా టీజీ ఎన్పీడీసీఎల్ అన్ని ఏర్పా ట్లు చేసింది. విద్యుత్ లైన్లు తెగిపడితే ప్రమా దం జరిగే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో లైన్లు తెగి భూమి పడకుండా ఫోర్ వైర్ స్పేషర్స్ ఏర్పాటు చేసింది. దీని వల్ల నాలుగింటిలో ఏ ఒక్క వైరు తెగినా నేలపై పడుకుండా ఫోర్ వైర్ స్పేషర్స్ అడ్డుకుంటా యి. ఈ క్రమంలో మంగళవా రం మేడారంలో విద్యుత్ ఏర్పాట్లను టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి పర్యవేక్షించారు. రూ.15 కోట్ల అంచనా వ్యయంతో విద్యుత్ ఏర్పాట్లు.. మేడారం మహాజాతరలో రూ.15 కోట్ల అంచనా వ్యయంతో విద్యుత్ ఏర్పాట్లు చేపట్టారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరైన మేడారానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి విద్యుత్ సమస్య తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు. ఇందులో భాగంగా మేడారంలోని రెండింటితో పాటు తాడ్వాయి, నార్లాపూర్లో కొత్తగా నిర్మించిన సబ్ స్టేషన్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. మేడారం కొత్తూరు 33/11 కేవీ సబ్ స్టేషన్లో 8 ఎంవీఎ సామర్థ్యం కలిగిన 2 పవర్ టాన్స్ఫార్మర్లు, సమ్మక్క సబ్ స్టేషన్ (కొత్త)లో 5 ఎంవీఏ సామర్థ్యం కలిగిన రెండు పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఈ రెండు సబ్ స్టేషన్లకు విద్యుత్ అంతరాయం కలగకుండా రెండు వైపుల నుంచి కరెంట్ సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు. అదే విధంగా విద్యుత్ సరఫరాలో వైఫల్యాలకు తావు లేకుండా వివిధ సామర్థ్యం కలిగిన అదనంగా 196 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. 49 కిలో మీటర్ల హెచ్టీ, ఎల్టీ లైన్లు వేశారు. మేడారంలోనే గద్దెల ప్రాంతం మొదలు.. భక్తులు ఆవాసం ఏర్పరుచుకునే అన్ని ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. దీంతో మేడారంలో ఎటు చూసిన విద్యుత్ వెలుగులు జిగేలుమంటున్నాయి. మేడారం తరలిన సిబ్బంది.. టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం అధికారులు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బంది మంగళవారం మేడారం చేరుకుని తమకు కేటాయించిన ప్రాంతాల్లో విధుల్లో చేరారు. వీరు ఫిబ్రవరి ఒకటి వరకు జాతరలో సేవలు అందిస్తారు. ఇద్దరు డైరెక్టర్లు టి.మధుసూదన్, వి.మోహన్ రావు, చీఫ్ ఇంజనీర్లు కె.రాజు చౌహాన్, అశోక్ పర్యవేక్షణలో నలుగురు సూపరిండెంట్ ఇంజనీర్లు, ఏడుగురు డివిజన్ ఇంజనీర్లు, 20 మంది అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, సబ్ ఇంజనీర్లు 150 మంది, 350 మంది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులు మూడు బ్యాచ్ల్లో 30 మంది చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. వీరు తమకు కేటాయించిన ప్రాంతాల్లో లైన్ పెట్రోలింగ్ చేస్తూ లోపాలను గుర్తిస్తూ సరి చేస్తారు. రాత్రి, పగలు నిరంతరాయంగా విధులు నిర్వర్తిస్తూ భక్తులకు విద్యుత్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా చూస్తారు. కాగా, విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద గద్దెల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.ఈసారి జాతరలో సాంకేతికతను వినియోగిస్తున్నారు. రియల్ టైమ్ ఫీడర్ మానిటరింగ్ సిస్టం ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్లలో రియల్ టైమ్లో లోడ్ను పర్యవేక్షించనున్నారు. తద్వారా లోడ్ను నియంత్రిస్తారు. ట్రాన్స్ఫార్మర్ల ఫ్యూజ్లు పోవడం, ఇతరత్రా అంతరాయాలు, డీటీఆర్లపై ఓవర్ లోడ్ పెరిగితే వెంటనే సమాచారం అందుతుంది. తద్వారా వెంటనే లోపాలను సరిదిద్ది వినియోగదారులకు అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా అందిస్తారు. ట్రిప్పింగ్లను నివారించడానికి జాతరలో 26 కిలో మీటర్లు కవర్డ్ కండక్టర్ లైన్ వేశారు.33 కేవీ విద్యుత్ లైన్లో 24 గంటలు గస్తీ నిర్వహించడానికి పస్రా, గోవిందరావుపేట, ములుగు, ఏటూరునాగారం, కమలాపూర్ సబ్ స్టేషన్ ప్రాంగణాల్లో నిర్వహణ బృందాలు మొహరించారు. టీజీ ట్రాన్స్కో పస్రా, ములుగు, కమలాపూర్, చెల్పూరు, వరంగల్ ఈహెచ్టీ సబ్ స్టేషన్లలో 20 మంది ఇంజనీర్లు, ఆపరేషన్ మెయింటెనెన్స్ సిబ్బందిని నియమించారు. వీరితోపాటు మరో 40 మంది కాంట్రాక్ట్ కార్మికులను సిద్ధంగా ఉంచారు. అత్యవసర పనుల నిర్వహణకు 20 రవాణ, మరో 10 ఇతర వాహనాలు సిద్ధంగా ఉంచారు. -
వాహనాలను ఓవర్టేక్ చేయవద్దు
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ వరంగల్ క్రైం: మేడారం మహా జాతరకు వచ్చే లక్షలాది వాహనాలు పోలీసులు సూచించిన విధంగా క్రమపద్ధతిలో రావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఒక ప్రకటనలో కోరారు. ఇంటి నుంచి జాతరకు వచ్చి, తిరిగి జాతర నుంచి ఇంటికి చేరుకునే వరకు భక్తులు వాహనాలను నడిపే విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని, ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను ఓవర్టేక్ చేయవద్దని ఆయన సూచించారు. మద్యం తాగి వాహనాలను నడపొద్దని, వరంగల్ కమిషనరేట్తో పాటు భూపాలపల్లి, కరీంనగర్, ఏటురునాగారం, ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ఆయన కోరారు. రోడ్లపై వాహనాలను నిలిపి షాపింగ్ చేయవద్దని, ఇంటి నుంచి బయలుదేరే సమయంలో కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకోవాలని చెప్పారు. రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలను నిలుపుకోవాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని పోలీసు అధికారులకు సహకరించాలని సీపీ సన్ప్రీత్ సింగ్ విజ్ఞప్తి చేశారు. -
జాతరకు విద్యుత్ శాఖ సిద్ధం..
హన్మకొండ/ములుగు: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు విద్యుత్ శాఖ సిద్ధంగా ఉందని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఎన్పీడీసీఎల్ అధికారులతో కలిసి మేడారంలో పర్యటించి విద్యుత్ సరఫరా తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్ కె.రాజు చౌహాన్, సీఈ ఐటీ శ్రవణ్ కుమార్, జీఎం ఐటీ శ్రీనివాస్, ములుగు, భూపాలపల్లి ఎస్ఈలు ఎ.ఆనందం, మల్చూరు, డీఈలు పి.నాగేశ్వర రావు, సదానందం, భాస్కర్, ఈఈ సివిల్ వెంకట్ రామ్, ఏడీఈలు రాజేశ్, వేణుగోపాల్, సందీప్ పాటిల్ పాల్గొన్నారు. -
తల్లి అనుమతితోనే గద్దైపెకి సారలమ్మ
ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం: తల్లి అనుమతి తీసుకున్న తర్వాతనే మేడారంలో గద్దైపె సారలమ్మ కొలువుదీరనుంది. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మను పూజారులు నేరుగా మేడారంలోని గద్దైపెకి తీసుకెళ్లకుండా సమ్మక్క గుడికి చేరుకుంటారు. గుడిలో సారలమ్మ పీఠానికి ముగ్గులు వేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈసందర్భంగా సమ్మక్క పూజారులు కట్టడి చేసి కంకణాలు కట్టి శాంతింపజేసిన తర్వాత సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులును గద్దెలపైకి తీసుకెళ్లి ప్రతిష్ఠిస్తారు. సమ్మక్క గుడికి పగిడిద్దరాజు రావడంతో పెళ్లి తంతు జరిపిస్తారు. నేడు చిలకలగుట్ట వద్ద పూజలు మేడారం చిలకలగుట్ట వద్ద సమ్మక్క పూజారులు పూజలు నిర్వహించనున్నారు. గురువారం తల్లి గద్దైపెకి రానుంది. ఈ నేపథ్యంలో సమ్మక్క పూజారులు బుధవారం గుట్టపైకి వెళ్లి తల్లిని శాంతింపజేసేందుకు కోళ్లను సమర్పించి పూజలు చేస్తారు. గుట్ట దారిని శుభ్రం చేసి తల్లి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తారు. -
ముగిసిన శ్రీధమ్ వేడుకలు
హసన్పర్తి: అన్నాసాగరంలోని సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సందడి వాతావరణం నెలకొంది. కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన శ్రీధమ్–26 వేడుకలు మంగళవారం ఘనంగా ముగిశాయి. విద్యార్థినులు వివిధ అంశాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ప్రముఖ గా యకుడు కశ్యప్ బృంద ప్రదర్శనలు అలరింపజేశా యి. కశ్యప్ ఆటాపాటలు ఊర్రూతలుగించాయి. వరదారెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అవసరమన్నారు. తొ లుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ రాజశ్రీ రెడ్డి, ప్రో గ్రాం కో–ఆర్డినేటర్ ఝాన్సి రాణి, ఆక్టర్ వేదిక, సు దర్శన్, కుమారస్వామి, ఎన్. శ్రీవాణి, డాక్టర్ ప్ర శాంత్,ఏవో వేణుగోపాలస్వామి పాల్గొన్నారు. -
సంక్షేమం.. సాధికారత
ఖిలా వరంగల్: ప్రజా పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వినూత్న పథకాలకు శ్రీకారం చుడుతూ జిల్లా సమగ్రాభివృద్ధి, పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖిలా వరంగల్ మధ్యకోటలోని ఖుష్మహల్ మైదానంలో సోమవారం జరిగిన గణతంత్ర దినోత్సవంలో జాతీయ జెండాను కలెక్టర్ ఆవిష్కరించి, పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. రైతు సంక్షేమమే ధ్యేయం రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెట్టపీట వేస్తోందని కలెక్టర్ సత్యశారద తెలిపారు. వానాకాలంలో 1,56,400 మంది రైతులకు 2,70,618 ఎకరాలకు నేరుగా వారి ఖాతాల్లో రూ.162.30 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు గుర్తు చేశారు. 54,226 మంది రైతులకు రూ.422.37 కోట్ల రుణమాఫీ చేసినట్లు చెప్పారు. మొంథా తుపాను కారణంగా 22,860 మంది రైతులకు రూ.20.54 కోట్ల పరిహారం అందించామన్నారు. మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యం.. మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంగా బ్యాంకు లింకేజీ కింద 11,112 స్వశక్తి సంఘాలకు రూ.1094.14 కోట్లు మంజూరు చేశామని, శ్రీనిధి కింద రూ.114.40 కోట్ల రుణాలు, రూ.44.25 కోట్ల వడ్డీలేని రుణాలు మంజూరు చేశామని కలెక్టర్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 6,391 మందికి రూ.134.30 కోట్లు కేటాయించామని, 6,391 మంది డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులు ఖాతాల్లో రూ.134.30 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. అభయ హస్తం కింద 5.99 కోట్ల మంది మహిళలకు రూ.247.57 కోట్లు ప్రభుత్వం చెల్లించిందన్నారు. నగరంలో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనం నిర్మాణంలో ఉందని, ఏప్రిల్ నాటికి పూర్తిచేసి, వైద్య సేవలను అందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. శరవేగంగా అభివృద్ధి పనులు మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.295 కోట్లు విడుదల చేయగా, 253 ఎకరాల అదనపు భూమి సేకరించామని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని అన్నారు. రాతికోట చుట్టూ రూ.2 కోట్ల వ్యయంతో మోటు పునరుద్ధరణ పనులు, ఇన్నర్రింగ్ రోడ్డు, నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే పనులు, రూ.80 కోట్ల అంచనా వ్యయంతో సమీకృత కలెక్టరేట్, నివాస గృహాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. నగరంలో 2057 నాటి జనాభాను దృష్టిలో ఉంచుకొని రూ.4,170 కోట్ల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ వ్యవస్థకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. వరంగల్ పాత బస్స్టేషన్ స్థలంలో రూ.120 కోట్ల ఖర్చుతో ఐదు అంతస్తులతో అధునాతన సౌకర్యాలతో కూడిన భవనం నిర్మిస్తున్నామన్నారు. పాకాలలోని ఫారెస్ట్ పార్కులో సీతాకోక చిలుకల వనం ఏర్పాటు చేశామని, భద్రకాళి చెరువు ముంపు నివారణకు రూ.158 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. గణతంత్ర వేడుకల్లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, నగర మేయర్ గుండు సుధారాణి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, ఆర్టీఓ సుమ, తహసీల్దార్లు ఇక్బాల్, శ్రీకాంత్, ఏసీపీలు సత్యనారాయణ,వె వెంకటేష్, ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్, ఎస్సైలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న స్టాళ్లు, నృత్య ప్రదర్శనలు ఖుష్మహల్ మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ సత్యశారద సందర్శించారు. ఆసక్తిగా తిలకించి అధికారులను అభినందించారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో దేశభక్తిని చాటేలా నిర్వహించిన సాంస్కృతిక నృత్యాలు కనువిందు చేశాయి. జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. జిల్లా సమగ్రాభివృద్ధికి పెద్దపీట రైతు అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి విద్యా, వైద్యం, శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం వరంగల్ గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
బీజేపీకి ‘అరూరి’ గుడ్బై
సాక్షిప్రతినిధి, వరంగల్: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత అరూరి రమేశ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఆ పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపారు. అనంతరం పత్రికా ప్రకటన విడుదల చేశారు. గతంలో బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అరూరి రమేశ్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆతర్వాత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయన వరంగల్ నుంచి పార్టీ టికెట్ ఆశించారు. అప్పటికే స్టేషన్ఘన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి.. తన కూతురు కావ్య వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టడంతో బీఆర్ఎస్ అధిష్టానం కొద్ది రోజులు ఎటూ తేల్చకపోవడంతో కడియం శ్రీహరి తన కూతురు వైపే మొగ్గు చూపుతున్నారని భావించిన రమేశ్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో రమేశ్ పార్టీ మారకుండా ఉండేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్దకు చేర్చారు. కేసీఆర్తో పాటు ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్ నాయకులు పార్టీ మారొద్దని రమేశ్కు హితవు పలికారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన తనను ఎంపీ టికెట్ రేసులో పరిగణనలోకి తీసుకోపోవడంపై రమేశ్ మనస్తాపం చెందారు. బీజేపీలో చేరేందుకు వెళ్తున్న రమేశ్ కాన్వాయ్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర నాయకులు అడ్డగించగా.. ఆ వాహనాలను జనగామ జిల్లా పెంబర్తి వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా అడ్డుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత రమేశ్ బీజేపీలో చేరి వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన ఆయన కొద్ది రోజులుగా స్తబ్ధంగా ఉంటున్నారు. ఆదివారం అరూరి తల్లి సంవత్సరీకం జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి తదితరులు మంతనాలు జరిపినట్లు సమాచారం. అక్కడినుంచే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఫోన్లో మాట్లాడించినట్లు తెలిసింది. ఈమేరకు మంగళవారం బీజేపీ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. కాగా, త్వరలోనే అధిక సంఖ్యలో కార్యకర్తలతో తరలి వెళ్లి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా కేసీఆర్ ఫోన్.. త్వరలో బీఆర్ఎస్లోకి.. -
సమగ్రాభివృద్ధే లక్ష్యం..
హన్మకొండ అర్బన్: ‘జిల్లాను వ్యవసాయ, పరిశ్రమలు, విద్య, ఆరోగ్య, మహిళా సాధికారత, మౌలిక వసతులు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యం’ అని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. సోమవారం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 77వ భారత గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ స్నేహ శబరీశ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్తో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ప్రగతి నివేదికపై కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో హనుమకొండ జిల్లా పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తూ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యం వ్యవసాయ రంగాన్ని తొలి ప్రాధాన్యంగా తీసుకుని ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 1.58 లక్షల మంది రైతులకు రూ.157.23 కోట్ల పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. రైతు బీమా పథకం కింద మరణించిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రతీ నెలా ఉచిత సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తూ లక్షలాది కుటుంబాలకు ఊరట కల్పిస్తున్నామని చెప్పారు. గృహ కల నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్లు పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణంలోనూ గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు. మహిళల సాధికారతే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ స్నేహ శబరీష్ స్పష్టం చేశారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద జిల్లాలో కోట్ల సంఖ్యలో జీరో టికెట్ ప్రయాణాలు నమోదైనట్లు తెలిపారు. విద్యలో నాణ్యతపై దృష్టి జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో 96 శాతానికిపైగా ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమని తెలిపారు. కేజీబీవీలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాల విద్య అందిస్తున్నట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకం ద్వారా లక్షలాది పని దినాలు కల్పించి కోట్ల రూపాయలు వెచ్చించినట్లు తెలిపారు. వన మహోత్సవం కింద లక్షల సంఖ్యలో మొక్కలు నాటామని చెప్పారు. మౌలిక వసతులు, పట్టణాభివృద్ధి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో మాస్టర్ ప్లాన్–2041 అమలుతో పట్టణాభివృద్ధికి దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, కళాక్షేత్రాలు, జంక్షన్ల అభివృద్ధి వంటి కీలక పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. ఉత్తములకు ‘ప్రశంస’లు.. విధుల్లో ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సామాజిక సేవలు అందించిన పలువురికి కలెక్టర్ ప్రశంస పత్రాలు అందించారు. స్వాతంత్య్ర సమరయోధులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. డీఆర్డీఓ, మెప్మా, మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య, టెస్కో, హౌజింగ్, వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశుసంవర్థక శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవితతో కలిసి తిలకించారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్ఓ వైవీ గణేశ్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు గణతంత్ర వేడుకల్లో హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఉత్తమ ఉద్యోగులు, సామాజిక సేవలందించిన పలువురికి ప్రశంస పత్రాలు అలరించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్తములకు ప్రశంసలు మరిన్ని ఫొటోలు.. -
మహాజాతరకు ముస్తాబు
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఆదివాసీల అతి పెద్ద ఉత్సవం, తెలంగాణ కుంభమేళాకు మేడారం ముస్తాబైంది. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు రెండు వారాల ముందునుంచే గిరిజన సంప్రదాయాల ప్రకారం గుడిమెలిగె, మండమెలిగె తదితర పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఓ వైపు సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణ పనులు జరుగుతుండగానే ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాగా, ఈ నెల 28న సారలమ్మ రాకతో మొదలయ్యే జాతర 31 వరకు కొనసాగుతుంది. ఈ మేరకు జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ముస్తాబైన నయా మేడారం.. మేడారం చరిత్రలోనే తొలిసారిగా రూ.251 కోట్ల భారీ నిధులు కేటాయించారు. ఇందులో గద్దెల శాశ్వత పునరుద్ధరణకు రూ.101 కోట్లు, జాతర నిర్వహణ, భక్తుల సౌకర్యాలకు రూ.150 కోట్లకు పైగా నిధులు వెచ్చించారు. ఇది మేడారం చరిత్రలోనే అత్యధిక కేటాయింపు కావడం విశేషం. మేడారం అభివృద్ధి పనుల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నవి కొత్తగా నిర్మించిన శాశ్వత గద్దెలు. వీటితోపాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను గ్రానైట్ రాళ్లతో పునర్నిర్మించారు. ప్రాకారం చుట్టూ ఉన్న రాతి శిలలపై కోయ గిరిజనుల వీరగాథలు, సమ్మక్క–సారలమ్మ చరిత్ర, ఆదివాసీల గోత్రాలు, వారి ఆచార వ్యవహారాలు, వీరగాథలను ప్రతిబింబించే చిత్రాలను చెక్కారు. భద్రతా వలయంలో మేడారం.. గతంలో వనదేవతల గద్దెల ప్రాంతంలో 2–3 వేల మంది ఉంటేనే తొక్కిసలాట జరిగేది. ఈసారి పునరుద్ధరణలో భాగంగా ఒకేసారి 7వేల నుంచి 8 వేల మంది భక్తులు దర్శించుకునేలా భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీఐపీలకు ప్రత్యేక లైన్లు, క్యూలైన్లపై జీఐ షీట్లతో పైకప్పు ఏర్పాటు చేశారు. నాలుగు గద్దెలను ఒకేసారి దర్శించుకునేలా కంపార్టుమెంట్లు నిర్మించారు. మేడారం చుట్టూ 10 కిలోమీటర్ల మేర ఫోర్ లేన్ రోడ్లు, పార్కింగ్కు అదనంగా 63 ఎకరాల స్థల సేకరణ చేశారు. కాగా, ఈసారి 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. 460 సీసీ కెమెరాలు, ఆర్టిిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీ ద్వారా రద్దీని పర్యవేక్షించే సిస్టం ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రద్దీని పర్యవేక్షిస్తూ, ప్రమాదాల్ని ముందుగానే నివారించే ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. 20 ప్రత్యేక డ్రోన్ల ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్, 20 మంది ఐపీఎస్ అధికారులు, 30 వేల మంది సిబ్బంది జాతర విధుల్లో ఉండనున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రతీ 2 కిలోమీటర్లకు ఒక చెక్పోస్ట్ ఏర్పాటు చేస్తున్నారు. నృత్యం చేస్తున్న న్యూజిలాండ్కు చెందిన మావోరి తెగ ప్రతినిధులురేపటినుంచే మేడారంలో తెలంగాణ కుంభమేళా రూ.251 కోట్లతో పునరుద్ధరణ, జాతర నిర్వహణ పనులు జాతర ఏర్పాట్లు పూర్తయినట్లు ప్రకటన, దర్శనానికి తరలివస్తున్న భక్తులు 28 నుంచి 31 వరకు మహా జాతర.. 3 కోట్లమంది వస్తారని అంచనా ఆకట్టుకున్న న్యూజిలాండ్ గిరిజనుల సాంస్కృతిక నృత్యం నృత్యం.. ఆదివాసీల జీవనాడి, గుండె చప్పుడు – ఎస్ఎస్తాడ్వాయి/ ఏటూరునాగారం -
త్రివర్ణాలతో రుద్రేశ్వరస్వామికి అలంకరణ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వెండి కవచానికి జాతీయ జెండా వర్ణాలైన త్రివర్ణాలను అద్ది తెల్లజిల్లెడు పూలమాలలతో అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్ స్వామివారికి రుద్రాభిషేకం, పూజలు జరిపారు. శివ ప్రీతికరమైన సోమవారం వందలాది మంది భక్తులు దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఎంజీఎం: పుట్టబోయే బిడ్డ ఆడైనా, మగైనా తల్లిదండ్రులు సమానంగా ఆదరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ను కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు. ‘బాలికా పరిరక్షణ–తల్లిదండ్రులకు అవగహన’పై చేపడుతున్న కార్యక్రమాలకు సంబంఽధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీపీ ధార కవిత, అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, డీఎంహెచ్ఓ అప్పయ్య, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్రావు, ప్రోగ్రాం అధికారి శ్రీని వాస్, డెమో వి.అశోక్ రెడ్డి తదితరులున్నారు. కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే స్డేడియంలో ఏర్పాటు చేసిన మేడారం జాతర ఆర్టీసీ బస్ పాయింట్ను సోమవారం టీజీఎస్ ఆర్టీసీ కరీంనగర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాల్మన్ తనిఖీ చేశారు. రెండో రోజు వరంగల్ ఆర్టీసీ–2 డిపో మేనేజర్ ఎం.రవిచందర్, అసిస్టెంట్ మేనేజర్ భవాని, ఇన్చార్జ్ బైరి రవీందర్, ఆర్టీసీ సిబ్బంది 19 బస్సుల్లో 644 మంది ప్రయాణికులను మేడారానికి పంపించారు. వాసవి క్లబ్ వారు ప్రయాణికుల కోసం ఉచిత మినరల్ వాటర్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. కాజీపేట: కాజీపేట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై సోమవారం రాత్రి రెండు వాహనాలు సాంకేతిక లోపంతో నిలిచిపోయాయి. దీంతో అరగంటకు పైగా ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. హనుమకొండ వైపు వెళ్తున్న ఓ కారు, ఎలక్ట్రికల్ బస్సు బ్రిడ్జిపైకి రాగానే సాంకేతిక లోపం తలెత్తడంతో ఆగిపోయాయి. దీంతో బ్రిడ్జికి రెండు వైపులా వాహనాలు బారులుదీరాయి. మేడారం జాతరకు వెళ్లే వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకుపోయాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం అందుకున్న సీఐలు సుధాకర్రెడ్డి, వెంకన్న సిబ్బందితో అక్కడికి చేరుకుని వన్ వే పద్ధతిలో వాహనాలు కొద్దిసేపు పంపించి పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. -
నవ మేడారం
వనదేవతలు సమ్మక్క–సారలమ్మ ఖ్యాతి విశ్వవ్యాప్తంకారడవిలో, వాగు వంకల నడుమ మొదలైన చిన్న జాతర.. ప్రస్తుతం దేశాన్ని ఆకర్షిస్తోంది. గూడెం ప్రజలు కొలిచిన ఆ సన్నిధి.. ప్రస్తుతం కోట్లాది భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. మట్టి గద్దెల నుంచి విస్తృత సౌకర్యాల దాకా.. దిగబడే ఎగుడు దిగుడు రోడ్ల నుంచి డబుల్ బీటీ రోడ్డు దాకా.. ఎడ్ల బండ్ల ప్రయాణం నుంచి హెలికాప్టర్ దాకా మేడారంలో ఆధునికత సంతరించుకుంది. సెల్ఫోన్ టవర్లు, అత్యాధునిక సీసీ కెమెరాలు.. డ్రోన్లు ఒక్కటేమిటి వన మేడారం ఇప్పుడు నవ మేడారమైంది. – ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయిప్రస్తుతం స్నానఘట్టాలు గతంలో..జాలితో ఉన్న శివసత్తులు జంపన్నవాగులో..సమ్మక్క–సారలమ్మగద్దెలు క్యూలైన్లుఅడవిలో చిన్న గద్దెల వద్ద ప్రారంభమైన మేడారం జాతర నేడు దేశంలోనే ప్రఖ్యాత జాతరగా రూపుదిద్దుకుంది. గద్దెలు తప్ప శాశ్వత నిర్మాణాలు లేని స్థితి నుంచి నేడు విస్తృత సౌకర్యాలతో మేడారం రూపాంతరం చెందింది. అప్పుడు ఎడ్ల బండ్లు, గాటు రోడ్లు దుమ్ము ధూళితో ఉన్న మేడారానికి వారం రోజుల పాటు బస చేసేలా అడవిలో సరంజామాతో దిగేవారు. జాతర ముగిసే వరకు ఉండి పిల్లాపాపలతో అడవిలో ఆహ్లాదంగా గడిపేవారు. ఎలాంటి సౌకర్యాలు లేకున్నప్పటికీ అమ్మలపైనే భారం వేసేవారు. వారి కాలుకు ముల్లు కూడా అంటకుండా ఉండేది. మట్టి రోడ్డు నుంచి జంట వంతెనల స్థాయికి.. మేడారం జాతరకు ఎడ్లబండలో జంపన్నవాగు దాటేందుకు నలుగురైదురుగు వెనక నుంచి నెడితేగానీ బండి ముందుకు కదిలే పరిస్థితి. కాలక్రమేణా జంట వంతెల నిర్మాణాలయ్యాయి. మారుమూల గ్రామాల భక్తులు ఆనవాయితీగా ఎండ్లబండ్లలో వస్తున్నప్పటికీ నేరుగా జంట వంతెనలను దాటి జాతరలోకి ప్రవేశిస్తున్నారు. జాతర సమయంలో జంపన్నవాగులో ఉన్న నీటితోనే స్నానాలు చేసి వనదేవతలను దర్శించుకునే వారు. మారిన కాలానికి అనుగుణంగా వాగు ఒడ్డు వెంట స్నాన ఘట్టాలు ఏర్పాటు చేసి వాగులో ఇన్ఫిల్టరేషన్ బావులను నిర్మించి నీటిని తోడి పోస్తున్నారు. జల్లుల స్నానాలను ఏర్పాటు చేశారు. ఎడ్లబండి, ట్రాక్టర్ల ద్వారా మేడారం చేరుకునేవారు. ఒకటి రెండు ట్రిప్పుల బస్సులు మాత్రమే మేడారం వచ్చేవి. వాటిద్వారా వచ్చే భక్తులు అరుదుగా ఉండేవారు. ఇప్పుడు ఐదు ఎకరాల్లో ఆర్టీసీ బస్టాండ్ విస్తరించింది. నాలుగు వేల బస్సులను ఈ జాతరకు రాష్ట్ర నలుమూలలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా సర్వీసులను ఏర్పాటు చేశారు. నాడు మట్టి గద్దెలు.. నేడు రాతి శిలలు 1950లో మట్టి గద్దెలతో ఉన్న అమ్మవారి గద్దెలను నేడు నానాటి అభివృద్ధి చెందుతూ వస్తోంది. మట్టి గద్దెలు, కంక వనాలు, జువ్వి చెట్టు నీడలోనే అమ్మవార్లను వేలాది మంది భక్తులు దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించేవారు. కానుకలను వేసేందుకు మట్టికుండలు, క్లాత్తో తయారు చేసిన హుండీలు ఉండేవి. వాటి స్థానంలో ఇప్పుడు ఐరన్, స్టీల్ హుండీలతోపాటు డిజిటల్ కానుకలు కూడా మొదలయ్యాయి. ఒకప్పుడు గూడేలకే పరిమితమైన జాతర తల్లుల ప్రాంగణానికి హైటెక్ హంగులు భక్తుల సౌకర్యార్థం విస్తృత అభివృద్ధి -
దుమ్మురేపిన డీజే నైట్
హసన్పర్తి: హసన్పర్తి మండలం అన్నాసాగరంలోని ఎస్సార్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న స్పార్క్రిల్–26 వేడుకలు ఉల్లాసంగా.. ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమాన్ని పురస్కరించుకుని రెండో రోజు ఆదివారం వివిధ అంశాల్లో నిర్వహించిన సోలో, గ్రూప్ డ్యాన్స్తో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్టెప్పులేసిన విద్యార్థులు ప్రత్యూష డీజే నైట్ కార్యక్రమం దుమ్మురేపింది. వేదికపై ప్రత్యూష బృందం ప్రదర్శన ఇస్తుండగా, వేదిక కింద విద్యార్థులు అనుసరిస్తూ స్టెప్పులేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్లో ఐటమ్స్ నోరూరించాయి. స్టూడెంట్ కౌన్సిల్ కన్వీనర్లు ఎల్.రుషింద్రసాయి, ఎ.సంతోషినిరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. నేడు ర్యాంప్వాక్ సోమవారం స్పార్క్రిల్–26 వేడుకలు ముగియనున్నాయి. కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రీరామచంద్ర బృందం ప్రదర్శన ఇవ్వనుంది. అదేవిధంగా కళాశాల విద్యార్థులు ర్యాంప్ వాక్ చేయనున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉల్లాసంగా ఉత్సాహంగా స్పార్క్రిల్ వేడుకలు నేటితో ముగింపు -
ప్రజాస్వామ్యానికి ఓటు పునాది
హన్మకొండ అర్బన్: ప్రజాస్వామ్యానికి ఓటు పునాది అని వరంగల్ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుదీ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బిద్యాధర్ సుబుదీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రపంచంలోనే మన దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని అన్నారు. ఓటు హక్కు వినియోగంతోనే దేశ నిర్మాణం జరుగుతుందన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జిల్లాలోనూ 2002 ఓటర్ల జాబితాలోని వివరాలను 2025 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యువ ఓటర్లు, సీనియర్ ఓటర్లతో పాటు బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు, ఏఈఆర్ఓలు, ఈఆర్ఓలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులను కలెక్టర్ సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముందుగా విద్యార్థులు, యువత, అధికారులు డీఈఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్కు ర్యాలీగా వచ్చారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కె.నారాయణ, డీటీఓ శ్రీనివాస్ కుమార్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, రెడ్క్రాస్ రాష్ట్ర ఈసీ మెంబర్ ఈవీ శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుదీ -
వీరికి పదోన్నతి, బదిలీలు లేవు!
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం తమపై వివక్ష చూపుతోందని విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కంపెనీలో పనిచేస్తున్న అన్నిస్థాయిల్లోని అధికారులు, ఉద్యోగులకు ఇన్చార్జ్ పదోన్నతి కల్పించిన యాజమాన్యం ఆర్టిజన్లపై సవతి తల్లి ప్రేమ చూపుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టిజన్లకు పదోన్నతి కల్పించడానికి ఎలాంటి అభ్యంతరాలు, వివాదాలు లేకున్నా యాజమాన్యం ఎందుకు చొరవ తీసుకోవడం లేదని ఆయాసంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు పదోన్నతి కల్పించడానికి వివాదాలు, కోర్టు కేసులున్నా.. ఇన్చార్జ్ పదోన్నతి కల్పించిన ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఎలాంటి వివాదాలకు తావులేని, గ్రేడ్ మార్పు ద్వారా పదోన్నతి కల్పించాలని స్టాండింగ్ రూల్స్ చెబుతున్నా పట్టించుకోకపోవడంలో ఉన్న ఆంతర్యమేంటని వారు నిలదీస్తున్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 సర్కిళ్లలో మొత్తం 4,678 మంది ఆర్టిజన్ ఉద్యోగులున్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని చేసిన పోరాటం ఫలితంగా గత ప్రభుత్వం 2017 జూలై 29న వీరిని సంస్థల్లోకి విలీనం చేస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఆర్టిజన్లుగా గుర్తించింది. విద్యార్హతలను బట్టి నాలుగు గ్రేడ్లుగా విభజించింది. వీరిని సంస్థల్లోకి తీసుకున్నా.. రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే సర్వీస్ రూల్స్ వర్తింపజేయడం లేదు. వీరి కోసం ప్రత్యేకంగా స్టాండింగ్ రూల్స్ ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు తీసుకొచ్చాయి. ఈ స్టాండింగ్ రూల్స్లో ఆర్టిజన్లకు గ్రేడ్ మార్పు ద్వారా పదోన్నతి కల్పించాలని ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. గ్రేడ్–4 వారికి గ్రేడ్–3గా, గ్రేడ్–3 వారికి గ్రేడ్–2గా, గ్రేడ్–2 వారికి గ్రేడ్–1గా, గ్రేడ్–1 వారికి గ్రేడ్ వన్ ప్లస్గా పదోన్నతి కల్పించాల్సి ఉండగా ఏళ్లుగా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆర్టిజన్లు వాపోతున్నారు. పదోన్నతి ఇవ్వకపోవడంతోపాటు బదిలీ చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు, బాధ్యతలు నిర్వర్తిస్తున్నా తమకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని, తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని, జీతాలు, హక్కుల్లోనూ అన్యాయం జరుగుతోందని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి తమకు పదోన్నతి, బదిలీ అవకాశం కల్పించాలని ఆర్టిజన్లు కోరుతున్నారు. సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఆర్టిజన్లు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు, బాధ్యతలు స్టాండింగ్ రూల్స్ పట్టించుకోని ఎన్పీడీసీఎల్ యాజమాన్యం -
ఉత్తమ డివిజన్గా హనుమకొండ టౌన్
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉత్తమ డివిజన్గా హనుమకొండ టౌన్ ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 16 సర్కిళ్లలో హనుమకొండ సర్కిల్లోని హనుమకొండ టౌన్ డివిజన్ 60.01 పాయింట్లతో ఉత్తమ డివిజన్లలో మొదటి స్థానం దక్కించుకుంది. ఇదే డివిజన్ పరిధిలో నయీంనగర్ సబ్డివిజన్ 65.71 పాయింట్లతో మొదటి స్థానం, హనుమకొండ సబ్ డివిజన్ 62.78 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. కరీంనగర్ టౌన్ సబ్ డివిజన్ 63.84 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకుంది. అర్బన్ సెక్షన్ల విభాగంలో ఇదే డివిజన్లోని గోపాల్పూర్ సెక్షన్ 74.81 పాయింట్లతో ప్రథమ స్థానం దక్కించుకుంది. కాగా, సర్కిల్ విభాగంలో హనుమకొండ సర్కిల్ 48.58 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో పెద్దపల్లి సర్కిల్ 54.81 పాయింట్లతో మొదటి, జగిత్యాల 53,45 పాయింట్లతో ద్వితీయ, కరీంనగర్ 52.88 పాయింట్లతో తృతీయ, నిజామాబాద్ 45.18 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాయి. అదే విధంగా సర్కిల్ స్థాయిలో హనుమకొండ సర్కిల్లోని మడికొండ సెక్షన్ 55.30 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో 67.21 పాయింట్లతో నక్కలగుట్ట ఉత్తమ సెక్షన్గా ఎంపికై ంది. ర్యాంకుల వారీగా చూసుకుంటే గోపాల్పూర్ ఏఈ మొదటి ర్యాంకు, నక్కలగుట్ట ఏఈ 7వ ర్యాంకు, సుబేదారి ఏఈ 11వ ర్యాంకు, యాదవనగర్ ఏఈ 14వ ర్యాంకు, హనుమకొండ చౌరస్తా ఏఈ 23, నిట్ ఏఈ 24వ ర్యాంకు పొందారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారుల అత్యుత్తమ సేవలతోనే టీజీ ఎన్పీడీసీఎల్ పరిధి 16 సర్కిళ్లలో ఉత్తమ డివిజన్లలో హనుమకొండ టౌన్ మొదటి స్థానంలో నిలిచింది. అంతరాయాలు లేని మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం. వినియోగదారులకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నాం. సరఫరా మెరుగుకు అవసరమైన సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. డివిజన్లోనే అగ్రస్థానంలో నిలిపిన డివిజన్ ఉద్యోగులు, అధికారులకు అభినందనలు. – జి.సాంబరెడ్డి, డీఈ, టీజీ ఎన్పీడీసీఎల్, హనుమకొండ టౌన్ -
రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న వరంగల్ కలెక్టర్
న్యూశాయంపేట: ఎన్నికల నిర్వహణలో ఓటర్లకు అవగాహన, కార్యక్రమాల శిక్షణ సామర్థ్యాభివృద్ధి రంగంలో చేసిన ఉత్తమ కృషికి వరంగల్ జిల్లాకు విశిష్ట గౌరవం దక్కింది. ఈ మేరకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డును వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అందుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం, ఎన్నికల అధికారులు, సిబ్బంది అందరి సమష్టి కృషితో ఈ గుర్తింపు లభించిందన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన వారందరికీ కలెక్టర్ అభినందనలు తెలిపారు. వరంగల్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ కాశిబుగ్గ సాయిగణేశ్ నగర్కు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కుసుమ లింగమూర్తి.. బియ్యపు గింజపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇంతకుముందు వినాయక చవితి సందర్భంగా శనగపప్పు దినుసుపై వినాయకుడి ప్రతిమ, శ్రీరామనవమి సందర్భంగా పల్లి గింజపై శ్రీరాముడి ప్రతిమ, వివేకానందుడి జయంతి సందర్భంగా శనగపప్పు దినుసుపై వివేకానందుడి చిత్రం, తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా బియ్యపు గింజలతో తెలంగాణ పటాన్ని లింగమూర్తి తయారు చేశారు. గత వినాయక చవితికి పప్పు దినుసుపై వినాయకుడి ప్ర తిమను 39 సెకండ్లలో గీసి ఔరా అనిపించారు. హన్మకొండ కల్చరల్: సమస్త జీవులకు సూర్యుడే ఆధారమని, సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రు బాధలు నశిస్తాయని శాస్త్రాల్లో పేర్కొనబడిందని వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం రథసప్తమి పూజలు నిర్వహించారు. గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితుడు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, ప్రణవ్, శ్రవణ్కుమార్ ఉదయం నుంచి ప్రభాతసేవ, శ్రీరుద్రేశ్వరస్వామివారికి రుద్రాభిషేకం, భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు చేశారు. అనంతరం సూర్యభగవానుడి ఉత్సవమూర్తికి అభిషేకాలు, పల్లకీ సేవ నిర్వహించారు. వేలాదిమంది భక్తులు దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. మేడారం జాతరకు వెళ్లే భక్తులు రుద్రేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షణలో సిబ్బంది మధుకర్, రజిత భక్తులకు సేవలందించారు. -
ఎడ్లబండి నుంచి హెలికాప్టర్..
ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి: కీకారణ్యంలో కొలువై ఉన్న వనదేవతలను దర్శించుకునేందుకు నాడు లక్షలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఎడ్లబండ్లు కట్టుకొని రెండు రోజుల ముందే మేడారం జాతరకు బయలుదేరేవారు. గ్రామాల్లో ఎడ్లబండ్ల చక్రాలు, బండికానీలకు రంగులు వేసి, ఎడ్ల కొమ్ములకు రంగురంగుల రిబ్బన్లను చుట్టి ముస్తాబు చేసేవారు. ఎడ్లబండిని గుడారంగా తయారు చేసుకునే బయలుదేరేవారు. ఎడ్లకు సైతం కావాల్సినంత ఎండుగడ్డి మోపును బడిలో వేసుకొని వచ్చేవారు. చెట్లే గుడారాలు.. అడవిమార్గంలో జాతరకు వెళ్లే భక్తులు చెట్లనే గుడారాలుగా మల్చుకొని అక్కడే విడిది చేసేవారు. స్థానిక అడవుల్లో లభించే వెదురు కర్రలతో బండ్లకు పందిళ్లను వేసుకొని చీరలను అడ్డుగా కట్టుకునేవారు. జంపన్నవాగు, చిలకలగుట్ట, ఊరట్టం, కన్నెపల్లి, నార్లాపూర్, పడిగాపూర్, ఎలుబాక, మేడారం ప్రాంతాల్లోనే బస చేసేవారు. అడవి మార్గంలో మేడారానికి.. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి భక్తులు అడవిమార్గంలో ఎడ్ల బండిలో పిల్లాపాపలతో కలిసి కుటుంబ సమేతంగా ప్రయాణం సాగించేది. రాత్రి వేళ అడవుల్లో నెగడ్లు పెట్టుకొని అక్కడ బస చేసి తెల్లవారి మేడారానికి బయలుదేరేవారు. మంగళవారం సాయంత్రానికి జంపన్నవాగుకు చేరుకొని అక్కడ స్నానాలు, తలనీలాలను సమర్పించి నిద్రచేసేవారు. తెల్లారి బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్కను దర్శించుకొని మొక్కులు చెల్లించేది. ఆరోజు రాత్రి ఇక్కడ నిద్ర చేసి శుక్రవారం రాత్రి బయలుదేరి వారి గ్రామాలకు బయలుదేరేవారు. ఇంటికాడి నుంచే యాటపోతు, నాటు కోళ్లు ఎడ్ల బండిలో బయలుదేరిన భక్తులు ఇంటి నుంచి యాటపోతులు, నాటుకోళ్లు, ఆహారం పదార్థాలు, వంట పాత్రలు, నీటి బుర్రలతో జాతరకు వచ్చేవా రు. అడవిలో విడిది చేసి సారలమ్మ వచ్చిన రోజు యాట పోతులను కోసి అమ్మవారికి మొక్కు చెల్లించేవారు. తిరుగు ప్రయాణం శుక్రవారం కోడి కొసుకొని చల్లంగా చూడు తల్లి అని పయనమయ్యేవారు. తంబి హెలికాప్టర్ సేవలు.. ఎడ్లబండి నుంచి మారుతున్న కాలానికి అనుగుణంగా భక్తులు హెలికాప్టర్లో సైతం మేడారం జాతరకు వచ్చి వనదేవతలను దర్శించుకుంటున్నారు. ఆ కాలంలో రెండు రోజుల ప్రయాణం చేసిన భక్తులు ఇప్పుడు హెలికాప్టర్లో 45 నిమిషాల నుంచి గంటలోపు అమ్మవార్లను దర్శించుకొని మేడారం ఏరియల్ సర్వే చేసి తిరుగు ప్రయాణం అవుతున్నారు. హెలికాప్టర్లో వచ్చిన భక్తులకు ప్రత్యేక దర్శనం చేయిస్తున్నారు. అమ్మవారి ప్రసాదాన్ని తీసుకొని తిరుగు ప్రయాణం చేస్తున్నారు. దీంతో ఖర్చు ఎక్కువ అయినప్పటికీ భక్తులు సౌకర్యాలపై మొగ్గు చూపుతున్నారు. దాంతో తంబి హెలికాప్టర్ సర్వీస్లను కొనసాగిస్తోంది. మేడారం జాతరకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల భక్తులు ఒక రోజు ముందు సద్దికట్టుకొని జాతరకు చేరుకునేవారు. కోడి కూయగానే ఇంటివద్ద స్నానాలను చేసుకొని కాలినడకన అడవి మార్గం, ఎడ్లబండ్ల దారుల నుంచి నడుచుకుంటూ మేడారం జాతరకు చేరుకునేవారు. వచ్చే దారిలో చీకటి పడితే ఆ ఇంటి వద్ద ఒక కునుకు తీసి మళ్లీ ప్రయాణాన్ని సాగించేవారు. తెచ్చుకున్న సద్దిమూటలే తిని సేద దీరేవారు. అభివృద్ధిలో భాగంగా రోడ్ల నిర్మాణాలు జరగడంతో అనేక మంది భక్తులు వాహనాలు, కార్లు, బైక్లపై మేడారానికి తరలివస్తున్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో గోదావరి నదిని పడవల ద్వారా దాటేవారు. ఎడ్లబండ్లను కాలిరేవు ఉన్న గోదావరి నీటిలో నుంచి దాటించేవారు. అలా వారి ప్రయాణం సాగేది. ఇప్పుడు గోదావరి నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించడంతో అనేక మంది భక్తులు వాహనాల్లో తరలివస్తున్నారు. దీంతో ప్రయాణ మార్గం సులభతరంగా మారింది. నాడు రెండు రోజులు.. నేడు 45 నిమిషాల ప్రయాణం మేడారం మహాజాతరకు తరలివెళ్తున్న భక్తజనం -
కేరళలో వివాహిత ఆత్మహత్య
గీసుకొండ/నెక్కొండ: కేరళలో వరంగల్ జిల్లాకు చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన సింగారపు కుమారస్వామి, మంజుల దంపతుల కూతురు శ్వేత (25)కు రెండేళ్ల క్రితం సంగెం మండలం కుంటపల్లికి చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబు ల్ జంగం విక్రంతో వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా విక్రం కేరళలో విధులు నిర్వర్తిస్తుండగా బీటెక్ చదివిన శ్వేత అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. వారి మధ్య గొడవలు జరుగుతుండేవని, ఈనెల 21న శ్వేత బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆదివారం గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ జాన్పాకలోని విక్రం ఇంటికి తీసుకొచ్చారు. తన కూతురు మృతికి అల్లుడే కారణం అంటూ మృతురాలి బంధువులు, సూరిపల్లి గ్రామస్తులు అతడి ఇంటిపై దాడి చేశారు. కొట్టడంతోపాటు ఇంటిలోని సామగ్రిని ధ్వంసం చేశారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ మృతదేహంతో అక్కడే నిరసన తెలిపారు. విక్రంకు సంబంధించిన జాన్పాక, కుంటపల్లిలోని ఆస్తిని మృతురాలి బంధువులకు రాసి ఇవ్వాలంటూ పట్టుబట్టి అంగీకార పత్రం రాయించుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న గీసుకొండ సీఐ విశ్వేశ్వర్, ఎస్సై కు మార్, సిబ్బంది వెళ్లి గొడవ చేస్తున్న వారికి నచ్చజెప్పి శాంతింపజేశారు. చివరికి రాత్రి బంధువులు శ్వేత మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి సూరిపల్లికి తీసుకెళ్లారు.● భర్త సీఆర్పీఎఫ్ కానిస్టేబులే చంపాడని బంధువుల ఆరోపణ ● జాన్పాకలో ఇంటిపై దాడి, ఉద్రిక్తత.. నచ్చజెప్పిన పోలీసులు -
పోలీసుల అత్యుత్సాహం
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల చుట్టు పక్కల, గద్దెల వద్ద విధులు నిర్వర్తించే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఆదివారం గద్దెల వద్ద భక్తుల దర్శనాలు, ఇతర కార్యక్రమాల కవరేజ్కు వచ్చిన మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించకుండా అడ్డుకున్నారు. ఐడీ కార్డు చూపించినా ఎస్పీ తమకు చెప్పలేదని నిర్లక్ష్య సమాధానం చెబుతూ గేటువద్దే అడ్డుకున్నారు. ఇదేకాకుండా ఎండోమెంట్ సిబ్బంది, పూజారులను సైతం అడ్డుకోవడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, గద్దెల వద్ద పారిశుద్ధ్య పనులు చేయించే పంచాయతీ కార్యదర్శులు తమ డ్యూటీ ఐడీ కార్డులను చూపినా తమకేమి తెలియదని, డీఎస్పీ, ఎస్పీ చెప్పాలని తెలుపడంతో కార్యదర్శులు అవమానంగా భావించి విధుల్లో పాల్గొనబోమని డీపీఓ వెంకయ్యకు ఫిర్యాదు చేశారు. ముందే ఇలా ఉంటే జాతర సమయంలో మరేలా ఉంటుందని విధులకు హాజరవుతున్న సిబ్బంది, అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. కేవలం పోలీసు సిబ్బంది కుటుంబాలు, వారి బంధువులను మాత్రమే గద్దెల వద్దకు తీసుకెళ్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, పోలీసులు తీరు మారకుంటే జాతరలో వివాదాలు మరింత ముదిరే అవకాశాలున్నాయి. మంత్రి ఆదేశాలు బేఖాతరు.. తల్లుల దర్శనం కోసం మేడారంలో పని చేసే అధికారులు, సిబ్బంది, మీడియా వారికి ప్రత్యేకంగా ఒక సీఐని నియమిస్తానని ఇటీవల జరిగిన కోఆర్డినేషన్ సమావేశంలో మంత్రి సీతక్క వెళ్లడించారు. కానీ అలాంటి అధికారిని ఎవరూ నియమించలేదు. దీంతో ఏ పోలీసు అధికారికి ఫోన్ చేసినా స్పందించలేని స్థితి ఉన్నట్లు తెలిపారు. మీడియా, పూజారుల అడ్డగింత.. -
భక్తుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా..
ములుగు: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తుల ఆరోగ్య రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయడమే కాకుండా జాతర పరిసర ప్రాంతాల్లో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ సుమారు 800 మంది వైద్యులతో భక్తులకు మెరుగైన సేవలు అందించనుంది. 5,192 మంది మెడికల్, పారా మెడికల్ సిబ్బందిని రంగంలోకి దించింది. జాతర సమయంలో 24 గంటలు వైద్య సేవలందించేందుకు గాను 649 వైద్యాధికారులు, 154 మంది ఆయుష్ వైద్యాధికారులు, 673 నర్సింగ్ అధికారులు, 1,905 ఆశ వర్కర్లు, 1,111 పారామెడికల్ సిబ్బంది, 331 సూపర్వైజర్ స్టాఫ్, 700 మంది ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. జాతర అనంతరం 10 మెడికల్ క్యాంపులు జాతర ముగిసిన అనంతరం కూడా స్థానిక గిరిజనులకు ఏ విధమైన ఆరోగ్య సమస్యలు కలగకుండా 10 మెడికల్ క్యాంపులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు మేడారం చుట్టూ పక్కల ఉన్న ఏటూరు నాగారం, ములుగు, పస్రా, గోవిందరావు పేట, మంగపేట సి.ఎస్.సి. ఆస్పత్రులను పటిష్టపరిచారు. జాతర తిరుగువారం వరకు వైద్యసేవలు అందించనున్నారు. జంపన్నవాగు వద్ద 325 మంది సిబ్బంది మేడారం భక్తులు విధిగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇందులో ప్రమాదవశాత్తు పడి ప్రమాదాలకు గురి కాకుండా వాగు పొడువునా స్విమ్మర్లు, సింగరేణి, ఎస్.డి.ఆర్.ఎఫ్ సిబ్బందిని మొత్తం 325 మందిని నియమించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా 268 సిబ్బంది జాతర పరిధిలో ఏ విధమైన అగ్నిప్రమాదాలు జరగకుండా రాష్ట్ర అగ్నిమాపక శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. 15 ఫైర్ బ్రిగేడ్స్, 12 మిస్ట్ బుల్లెట్స్, రెండు ఫైర్ ఇంజిన్లను జాతర ప్రాంగణంలో మోహరించారు. మొత్తం 268 ఫైర్ సిబ్బంది జాతరలో విధుల్లో పాల్గొంటారు. మేడారంలో 800 మంది వైద్యులతో సేవలు 50 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి జాతర పరిసర ప్రాంతాల్లో 30 వైద్య శిబిరాలు -
చెస్ పోటీల్లో టీజీ ట్రాన్స్కోకు ద్వితీయ బహుమతి
హన్మకొండ: ఆల్ ఇండియా చెస్ టోర్నమెంట్లో టీజీ ట్రాన్స్కో ద్వితీయ బహుమతి కై వసం చేసుకుంది. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో 47వ ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు చెస్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తెలంగాణ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో మొదటి బహుమతి ఉత్తరప్రదేశ్, తృతీయ బహుమతి తమిళనాడు సాధించాయి. తెలంగాణ ట్రాన్స్కో నుంచి టీజీ ఎన్పీడీసీఎల్ మడికొండ ఏఈ ఎం.అనిల్ కుమార్ రెడ్డి, ఖమ్మం సర్కిల్లోని ఖమ్మం ఫోర్మెన్ ఎం.రత్నాకర్ రావు, టీజీ ఎస్పీడీసీఎల్ విజిలెన్స్ హెడ్ కానిస్టేబుల్ వి.నర్సింహారావు, సికింద్రాబాద్ సర్కిల్ ఏఏఈ ఎం.మాధవ్ ప్రాతినిథ్యం వహించారు. ఐనవోలు ఏడీఈ పి.రాజిరెడ్డి మేనేజర్గా వ్యవహరించారు. విజేతలకు యూపీ పవర్ సెక్టార్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ జాన్ మథాయ్ బహుమతులు అందజేశారు. ఆర్డీ పరేడ్కు ఎన్సీసీ కేడెట్లువిద్యారణ్యపురి: ఢిల్లీలో ఈనెల 26న నిర్వహించనున్న రిపబ్లిక్ డే పరేడ్కు హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి డిగ్రీ, పీజీ మహిళా కళాశాలకు చెందిన ముగ్గురు ఎన్సీసీ కేడెట్లు హాజరవుతున్నారని కళాశాల ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి తెలిపారు. 8వ గర్ల్స్ బెటాలియన్ నుంచి నలుగురు ఎన్సీసీ కేడెట్లు ఎంపిక కాగా.. అందులో ముగ్గురు కేడెట్లు వెంకటలక్ష్మి, త్రిష, భార్గవి పింగిళి కళాశాలకు చెందినవారని పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై దుష్ప్రచారాన్ని ఆపాలి● ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావుహన్మకొండ అర్బన్: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై దుష్ప్రచారం, కుట్రలు ఆపాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పో లాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్రెడ్డి అన్నారు. హనుమకొండ పోస్టల్ కాలనీలోని హనుమాన్ దేవాలయ ఆవరణలో ఓసీ జేఏసీ రాష్ట్ర ఉమ్మ డి జిల్లాల నాయకులతో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈడబ్ల్యూఎస్ వి ద్యార్థులకు విద్య, ఉద్యోగ, పోటీ పరీక్షలకు వయోపరిమితిని పెంచాలని, ఈడబ్ల్యూఎస్ బ్యాక్లాగ్ పోస్టులను ఆ వర్గాల వారితోనే వెంటనే భర్తీ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి రూ.10 లక్షల ఆదాయ పరిమితి పెంచాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ఓసీలలోని నిరుపేదలకు వర్తింపజేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకు ఫిబ్రవరి 23న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఓసీ జేఏసీ నిర్వహించ తలపెట్టిన జాతీయస్థాయి ఓసీల మహా ధర్నాకు తరలిరావాలని ఆయన కోరారు. అనంతరం ధర్నా వాల్పోస్టర్ ఆవిష్కరించారు. అంతకు ముందు మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావును కలిసి మహాధర్నాకు మద్దతు కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు వివరించారు. ఓసీ ఐకాస రాష్ట్ర సలహాదారు రావుల నర్సింహారెడ్డి, ప్రచార కార్యదర్శి కామిడి సతీశ్రెడ్డి, రాష్ట్ర, జిల్లాల నాయకులు నల్లా రాజిరెడ్డి, చాడ జైహింద్ రెడ్డి, కోరెళ్ల సంజీవరెడ్డి, గంగిడి ప్రభాకర్రెడ్డి, బుచ్చిరెడ్డి, కామిడి శ్రీధర్రెడ్డి, గణపతిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, పాల్గొన్నారు. -
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
విద్యారణ్యపురి: రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ తరహాలోనే తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు వర్తింపజేయాలని, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్, కేజీబీవీ టీచర్లకు మినిమం టైంస్కేల్ అమలు చేయాలని కోరారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) ఉపాధ్యాయులకు మినిమం టైమ్స్కేల్ ను అమలుచేయాలన్నారు. టీఆర్టీఎఫ్ చీఫ్ ప్యాటర్న్ లక్కిరెడ్డి సంజీవరెడ్డి, ఉభయ రాష్ట్రాల కోకన్వీనర్ డి.విష్ణుమూర్తి, రాష్ట్ర బాధ్యులు నరేంద్రనాయక్, కుమారస్వామి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జనగామ, జయశంకర్భూపాలపల్లి జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు రాజబాబురావు, శ్రీనివాస్నాయక్, కిషన్, రాజుగౌడ్, పెండెం మధుసూదన్, కె.రవీందర్, కె.శ్రీనివాస్, రమేశ్బాబు, వి.సత్యనారాయణ, భూక్యా కిరణ్నాయక్, కార్యవర్గసభ్యుడు రవీందర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్ -
మేడారంలో ట్రాఫిక్జామ్
ఎస్ఎస్తాడ్వాయి/ఏటూరునాగారం: తాడ్వా యి మీదుగా మేడారానికి భక్తులు ఆదివారం ప్రైవేట్ వాహనాల్లో భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు వీఐపీ రోడ్డు నుంచి పార్కింగ్కు ప్రదేశాలకు వాహనాలను మళ్లీంచారు. ఒక్కసారిగా ఈ రోడ్డుకు వాహనాల తాకిడి పెరగడంతో వీఐపీ డైవర్షన్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకొని వాహనాలను క్లియర్ చేశారు. అదేవిధంగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు గద్దెల వైపు రావడంతో ఆరోడ్డు అంతా కిక్కిరిసిపోయింది. వాహనాలు సైతం అడవులు, పార్కింగ్ల్లో రద్దీగా కనిపించాయి. ప్రైవేట్ వాహనాలను గద్దెల సమీపంలోకి అనుమతించకుండా జంపన్నవాగు అవతల నార్లాపూర్ వరకు నిలిపివేశారు. తాడ్వాయి మీదుగా వచ్చే వాహనాలను కొంగలచెరువు వద్ద ఏర్పాటు చేసిన వీఐపీ పార్కింగ్ ప్రదేశానికి మళ్లించారు. -
క్యాంటీన్ శ్రీదేవిగా ‘ముద్ర’
● పీఎం ముద్ర రుణాలు వినియోగించుకుని వ్యాపారం ● గణతంత్ర వేడుకలకు పీఎం నుంచి అందిన ఆహ్వానంగొప్ప విజయాలన్ని చిన్న సంకల్పంతోనే మొదలవుతాయనేందుకు నిదర్శనం వరంగల్ జిల్లాకు చెందిన మొగిలి శ్రీదేవి. కష్టకాలంలో భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబానికి ఆర్థికంగా ఆసరా అయ్యేందుకు కాలేజీల్లో మొదలైన క్యాంటీన్ల ప్రస్థానం.. ఆ తర్వాత మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ (ఎంజీఎం)లో క్యాంటీన్.. పీఎం ముద్ర రుణాలను పక్కాగా వినియోగించుకుని వ్యాపారిగా మారారు. ఇప్పుడు వరంగల్ కలెక్టరేట్ ప్రాంగణంలో సీ్త్ర టీ క్యాంటీన్ నిర్వహిస్తూ డిజిటల్ లావాదేవీల నిర్వహణతో ఆర్థిక, సామాజిక పురోగతి సాధించినందుకు ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానాన్ని అందుకున్నారు. పదో తరగతి వరకు చదివిన ఆమె తన ప్రయాణాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆమె విజయ ప్రస్థానం ఆమె మాటల్లోనే..మాది వరంగల్ నగరంలోని మట్టెవాడ. నా భర్త మొగిలి వెంకటేశ్వర్లు గతంలో పదేళ్లపాటు ఎంజీ ఎం ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు. చాలీచాలని జీతంతో కొడుకులు నిఖిల్ కుమార్, అఖిల్ కుమార్ చదువులకు ఇబ్బందిగా మారింది. తొలుత కాలేజీల్లో క్యాంటీన్లు నిర్వహించా. సీకేఎం కాలేజీలో క్యాంటీన్ నిర్వహిస్తున్న సమయంలో అప్పటి కలెక్టర్ వాకాటి కరుణ మా టీ రుచి చూసి ఎంజీఎం ఆస్పత్రిలో క్యాంటీన్ నిర్వహించుకునేందుకు అనుమతించారు. అలా.. పదేళ్ల పాటు ఎంజీఎంలో క్యాంటీన్ నడిపా. ఈ సమయంలోనే 2016 నుంచి 2017 మధ్య ప్రధాన మంత్రి ముద్ర యోజన ద్వారా రూ.20 వేలు రుణం తీసుకుని క్యాంటీన్ అవసరాల కోసం ఖర్చు చేశా. ఈ రుణం సకాలంలో తీర్చా. రూ.4.5 లక్షలతో క్యాంటీన్ ప్రారంభం.. ఎంజీఎం ఓపీకి రద్దీ పెరగడంతో అక్కడ క్యాంటీన్ తొలగించాలన్న కలెక్టర్ డాక్టర్ సత్యశారద వరంగల్ కలెక్టరేట్ ప్రాంగణంలో సీ్త్ర క్యాంటీన్ ప్రారంభించుకునేందుకు అవకాశమిచ్చారు. 2025 ఫిబ్రవరిలో ప్రధాన మంత్రి ముద్ర యోజన ద్వారా నక్కలగుట్ట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) శాఖలో రూపాయి వడ్డీతో రూ.4.5 లక్షల రుణం తీసుకుని వరంగల్ కలెక్టరేట్లో క్యాంటీన్ ప్రారంభించా. పది నెలలుగా స్థిర ఆదాయం వస్తోంది. భర్త వెంకటేశ్వర్లు, ఎంఎల్టీ చదువుతున్న మా చిన్నబాబు అఖిల్ క్యాంటీన్ నిర్వహణలో నాకు సహాయంగా ఉంటున్నారు. ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగులతో పాటు వివిధ పనుల కోసం కలెక్టరేట్కు వచ్చేవారు నా క్యాంటీన్లో టీ తాగుతుండడంతో వచ్చే ఆదాయంతో వడ్డీని కూడా సమయనుకూలంగా చెల్లించే అవకాశం ఏర్పడింది. ఇలా ప్రభుత్వం నుంచి సహాయం పొంది ఆర్థిక పురోగతి సాధించడంతో జనవరి 26న న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్రం నుంచి పిలుపు అందింది. కష్టకాలంలో ప్రభుత్వం అందించిన సా యం నన్ను నిలబెట్టింది. రాష్ట్రంలో ఎంపిక చేసి న ముగ్గురు మహిళ వ్యాపారవేత్తల్లో నేను ఒకదాన్ని కావడం సంతోషంగా ఉంది. విమాన చా ర్జీలు, ఇతర ప్రయాణ ఖర్చులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భరిస్తోంది. – సాక్షి, వరంగల్ -
గ్రీన్ఎనర్జీ కోసం ప్రభుత్వం పాలసీ
హన్మకొండ: గ్రీన్ఎనర్జీ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీని తీసుకొచ్చిందని టీజీ ఎన్పీడీసీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ వి.తిరుపతిరెడ్డి అన్నారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్రస్థా యి సమావేశం, అసోసియేషన్ 2026 డైరీ, క్యాలెండర్ను ఆదివారం ఆవిష్కరించారు. సమావేశంలో తిరుపతిరెడ్డి ము ఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కర్బన ఉద్గారాలు నిరోఽధి చేందుకు సోలార్, బ్యాటరీ ఎనర్జీ, స్టోరేజీ ఎనర్జీని ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. ఈ దిశగా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటును పెద్ద ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. గృహజ్యోతి ప థకం సఫలీకృతం కావడంలో అకౌంట్స్ ఆఫీసర్స్ ముఖ్య భూమిక పోషించారని కొనియాడారు. విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఏ నాజర్ షరీఫ్, ప్రధాన కార్యదర్శి పి.అంజయ్య మాట్లాడుతూ అకౌంట్స్ వి భాగం ఉద్యోగులకు పదోన్నతి కల్పించిన ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. టీజీ జెన్కో ఫైనాన్స్ డైరెక్టర్ వీర మహేందర్, విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు అశోక్, వేణుబాబు, అనిల్, అనురాధ, ఉపేందర్, వెంకటేశ్, సీజీఎంలు రవీంద్రనాథ్, చరణ్ దాస్, కిషన్, దేవేందర్, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, టీజీ ట్రాన్స్కో, టీజీ జెన్కో విద్యుత్ అకౌంట్స్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ ఇన్చార్జ్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్: త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ సమాయత్తం అవుతోంది. నోటిఫికేషన్ కు ముందే సన్నాహక సమావేశాలు, అభ్యర్థుల ఎంపికలపై దృష్టి సారించింది. ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ఎన్నికలు జరగనున్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ప్రత్యేక సమన్వయకర్తలను శనివారం నియమించారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్లోని ప్రతీ మున్సిపాలిటీకి ఒక సీనియర్ నాయకుడికి ఎన్నికల ఇన్చార్జ్ గా బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఏకం చేయడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాలను రూపొందించడం ఈ సమన్వయకర్తల ప్రధాన బాధ్యత. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు వీరు నిరంతరం ఆయా మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉంటారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఈ సమన్వయకర్తలు కీలక పాత్ర పోషిస్తారు. స్థానిక నాయకత్వంతో చర్చించి, గెలుపు గుర్రాలను గుర్తించి, నివేదికలను ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి సమర్పిస్తారు. అంతేకాకుండా, పార్టీ రూపొందించిన ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం, బూత్ లెవల్ ఏజెంట్లను సమన్వయం చేయడం వంటి అంశాలను వీరు పర్యవేక్షిస్తారు. 12 మున్సిపాలిటీలకు ఇన్చార్జ్లు వీరే.. ఉమ్మడి వరంగల్లోని 12 మున్సిపాలిటీలకు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను, సీనియర్ నాయకులను ఇన్చార్జ్లుగా కేటీఆర్ నియమించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఇన్చార్జ్గా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జనగామకు క్యామ మల్లేశ్ను నియమించారు. భూపాలపల్లికి ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, ములుగుకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, నర్సంపేటకు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పరకాలకు వాసుదేవరెడ్డి, మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మున్సిపాలిటీకి మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మరిపెడకు ఏనుగుల రాకేశ్రెడ్డి, తొర్రూరుకు మర్రి యాదవరెడ్డి, డోర్నకల్ మెట్టు శ్రీనివాస్, కేసముద్రం వై.సతీశ్రెడ్డి, వర్ధన్నపేటకు నాగుర్ల వెంకన్న బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు. నియామక ఉత్తర్వులు జారీ చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
మునీందర్ ఇంటి నుంచే పాన్పు
ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026లక్షలాది మంది భక్తులు.. తల్లులను కీర్తిస్తూ జయజయధ్వానాలు.. డోలు వాయిద్యాలు.. కొమ్ము బూరల నాదాలు.. సుగంధ ధూపాల పరిమళాలు.. వీటన్నింటి నడుమ శక్తి స్వరూపాలను వనం నుంచి జనంలోకి తీసుకొచ్చే ఆ చేతులు మరెంతో శక్తివంతమైనవి.. ఎన్ని పదవులు అధిరోహించినా, ఎంత ధనమున్నా అంతటి అదృష్టం ఆ అడవి బిడ్డలకు మాత్రమే దక్కుతుంది. తల్లులను గద్దెకు చేర్చడంలో ఆదివాసీ పూజారుల పాత్ర కీలకం. నిష్టతో వనదేవతల సేవలో లీనమైన దాదాపు 25 మంది పూజారులపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.. – ఏటూరునాగారం/ఎస్ఎస్ తాడ్వాయిఅడవి తల్లులను వనంలోంచి జనంలోకి తీసుకువచ్చే పూజారులది ఎంతో అదృష్టం. సుమారు 25 మంది పూజారులు ఈ మహా ఘట్టంలో పాలుపంచుకుంటుండగా ప్రధానంగా సారలమ్మ పూజారులు ఆరుగురు, సమ్మక్క పూజారులు ఐదుగురు కీలక పాత్ర పోషిస్తారు. కన్నెపల్లి గుడిలోని సారలమ్మను పూజారి కాక సారయ్య ఈనెల 28న గద్దైపెకి తీసుకురానున్నారు. కాళ్లకు పారాణి ధరించి ఎర్రని వస్త్రాల ముసుగుతో అమ్మవారి రూపంలో వెదురుబుట్టలో అమ్మవారిని తీసుకుని కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలకు బయల్దేరుతారు. అమ్మవారిని తీసుకొచ్చే ఉదయాన ప్రత్యేకంగా కుట్టించిన జాకెట్ని మాత్రమే సారయ్య ధరిస్తాడు. తండ్రి వారసత్వంగా ఈ బాధ్యతను సారయ్య గత 8 జాతరల ముందు నుంచి నిర్వర్తిస్తున్నాడు. కాకవంశ పూజారులు అమ్మవారి వెదురు బుట్ట సారయ్య చేతులోకి అందివ్వగానే ఆయనను అమ్మవారు ఆవహిస్తుంది. మిగతా పూజారులు ఆయనను పట్టుకొని గద్దెల వరకు తీసుకొస్తారు. గద్దైపె ప్రతిష్ఠించేంతవరకు ఆయన స్పృహలో ఉండరు. సారలమ్మను తీసుకొస్తున్న కాక సారయ్య(ఫైల్)సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్ ఇంటి నుంచి సమ్మక్క దేవతకు చేయాల్సిన పూజా క్రతువు, సామగ్రి అంతా ఈ ఇంటి నుంచి వెళ్తుంది. సమ్మక్కను తీసుకురావడానికి ముందుగా మునీందర్ ఇంటి వద్ద పసుపు, కుంకుమ, కంకణాలు, నైవేద్యం, ఊదు, అక్షింతలు, పసుపు బియ్యం, ఇతరత్రా పూజారులకు పూజా సామగ్రి (పాన్పు)ని తయారు చేసుకుని వెళ్తారు. మేడారం సమ్మక్క జాతరలో జరిగే ఏ పూజా కార్యక్రమం అయినా ఈ ఇంటి నుంచి వెళ్లడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ అని మునీందర్ చెబుతున్నాడు. సమ్మక్కను తీసుకొస్తున్న పూజారులు (ఫైల్)చిలకలగుట్ట నుంచి ధూపం లేనిదే అమ్మవారు గుట్ట దిగదు. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. ధూపం వడ్డె దొబె నాగేశ్వర్రావు ధూపదీప నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తారు. గుట్ట పైనుంచి గద్దెకు చేరే వరకు అమ్మవారికి వడ్డె.. ధూపం వేస్తూనే ముందుకు సాగుతాడు. -
శక్తిని ప్రసాదించే జలకం..
సమ్మక్క తల్లి గుట్ట దిగే సమయం నుంచి గద్దెలకు చేరే వరకు జలకపు వడ్డె మల్లెల సత్యం పూజారులతో కలిసి ముందుకు సాగుతాడు. తొమ్మిది రకాల పానీయాలతో జలకాన్ని ప్రత్యేకంగా పూజారులు తయారు చేస్తారు. ఈ జలకాన్ని సమ్మక్క పూజారుల వడ్డె మల్లెల సత్యం చేతుల పట్టుకుని అమ్మవారిని తీసుకువస్తున్న కృష్ణయ్యతో కలిసి ముందుకు సాగుతాడు. జలకం చల్లితేనే అమ్మవారు ముందుకు కదులుతుంది. అమ్మవారిని తీసుకొచ్చే కృష్ణయ్య ఎక్కడా నీరస పడకుండా జలకాన్ని దప్పికగా అందిస్తారు. దీంతో ఆయన మరింత శక్తిని పుంజుకుని ముందుకు సాగుతాడు. డోలు దరువుతో తల్లుల యాత్ర షురూ.. సమ్మక్క–సారలమ్మను వారి స్థలాల నుంచి గద్దెలపైకి తీసుకురావాలంటే డోలు దరువు ఉండాల్సిందే. డోలు శబ్దాలు ధ్వనిస్తుంటే పూనకాలతో తల్లుల యాత్ర జోరుగా సాగుతుంది. అమ్మలు వచ్చే తరుణంలో ఒక్క క్షణం ఆగకుండా కళాకారులు డోలు వాయిస్తారు. అలసట లేకుండా కళాకారులు అమ్మవారి శక్తిని ప్రసాదించుకుని వాయిస్తారని పూజారులు చెబుతున్నారు. -
రౌడీ.. ముదిరితే వెలివేతే!
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్ల ఆగడాలను కట్టడి చేసేందుకు పోలీసుశాఖ మళ్లీ ‘బహిష్కరణ’ అస్త్రం ప్రయోగిస్తోంది. ఇటీవల కొందరు రౌడీషీటర్ల ఆగడాలు హద్దు మీరాయి. రియల్ఎస్టేట్ వ్యాపారులతో చెట్టాపట్టాల్ వేసుకుని భూదందాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు సైతం వీరికి అండదందడగా నిలిచి ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. వరంగల్ మహానగరంలో పోలీసు కమిషనరేట్, బల్దియా, కలెక్టరేట్లలో నిర్వహించిన ప్రజావాణికి అందిన ఫిర్యాదుల్లో భూదందాలు, సెటిల్మెంట్ల వివాదాలే ఎక్కువ. అందులో రౌడీషీటర్ల ప్రమేయం కూడా ఉంటుందన్న ఫిర్యాదులున్నాయి. పోలీస్ స్టేషన్లకు కూడా అందిన ఫిర్యాదులపై కేసులు నమోదయ్యాయి. దీంతో ముదురుతున్న నేరగాళ్లను అదుపు చేసేందుకు పోలీసులు హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం 1,348, వరంగల్ మెట్రో పాలిటన్ పోలీసు చట్టం 2015లోని సెక్షన్ 28(1) ప్రకారం నగర బహిష్కరణ అస్త్రం ప్రయోగిస్తున్నారు. కౌన్సెలింగ్తో మారని వారిపై పీడీయాక్ట్ గతంలో ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం (పీడీ యాక్టు) ఒక్కటే పరిష్కారంగా భావించిన పోలీసులు ఒక్క 2021 సంవత్సరంలోనే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 141 మందిపై ఈ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో సత్ప్రవర్తనతో నడుచుకుని మారిన సుమారు 60 మందిపైన రౌడీషీట్ కూడా ఎత్తి వేశారు. ఇందులో రౌడీషీటర్లు, గంజాయి, పీడీఎస్ బియ్యం రవాణా చేసేవారు, భూకబ్జాదారులు, హత్యకేసుల్లో నిందితులుగా ఉన్న వారు కూడా ఉన్నారు. కరుడుగట్టిన నేరగాళ్ల ఆటకట్టించడంతోపాటు నేరాలను అదుపు చేసేందుకు పీడీ యాక్టుకు మరింత పదును పెట్టాలని పోలీసు ఉన్నతాధికారులు ఆ తర్వాత కూడా కేసులను కొనసాగించారు. అయితే ఆ తర్వాత ఎన్నికలప్పుడే బైండోవర్ చేసి వదిలేయడం వరకే చేయడంతో కొంతకాలం ఈ ప్రక్రియలో స్తబ్ధత నెలకొంది. ఇటీవల మళ్లీ ఫిర్యాదులు పెరుగుతుండడంతో వరంగల్, హనుమకొండ, కాజీపేటలో భూదందాలు, సెటిల్మెంట్లు, బెదిరింపుల ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టిసారించారు. ఒకటికి రెండుసార్లు మందలించినా మారని వారిని గుర్తించి పీడీ యాక్టును ప్రయోగించడంతోపాటు ఆరు నెలల నగర బహిష్కరణ విధించేందుకు సిద్ధమయ్యారు. ఏటేటా పెరుగుతున్న రౌడీషీటర్లు.. మూడేళ్ల క్రితం వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని పోలీస్స్టేషన్ల వారీగా రౌడీషీట్ నమోదై ఉన్న 783 మందిలో 133 మంది సత్ప్రవర్తనతో ఉన్నారని గుర్తించి రౌడీషీట్ ఎత్తివేశారు. అప్పుడున్న డీసీపీ రఘునాథ్ గైక్వాడ్ కౌన్సెలింగ్ నిర్వహించి ఈ కార్యక్రమం నిర్వహించగా.. నేరాలకు పాల్పడిన వారిపైన కొత్తగా రౌడీషీట్లు తెరిచారు. అయితే కౌన్సెలింగ్ నిర్వహించి ఎత్తివేసినా.. ఏటా రౌడీషీటర్లు పెరుగుతున్నారు. 2024 డిసెంబర్ వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిఽధిలో రౌడీషీటర్ల సంఖ్య 719 ఉండేది. 2025 డిసెంబర్ 27 నాటికి 45 మంది పెరిగారు. ప్రస్తుతం రౌడీషీటర్ల సంఖ్య కమిషరేట్ పరిధిలో 764కు చేరింది. ఈ నేపథ్యంలో పద్ధతి మార్చుకోని రౌడీషీటర్లను నగర బహిష్కరణ ద్వారా కట్టడి చేయాలని పోలీసుశాఖ భావిస్తోంది. ఈ క్రమంలోనే మిల్స్కాలనీ పోలీసుస్టేషన్ పరిధిలోని వంచనగిరి సురేశ్ అలియాస్ కోతి సురేశ్పై ఆరు నెలల నగర బహిష్కరణ విధిస్తూ పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనూ పలువురు రౌడీషీటర్లపైన ఇదే అస్త్రం ప్రయోగించారు. రౌడీషీటర్ల సెటిల్మెంట్లు, భూదందాలపై పోలీసుల దృష్టి పద్ధతి మార్చుకోకపోతే పీడీ యాక్టు తప్పదని హెచ్చరిక వరంగల్ పోలీస్ కమిషనరేట్లో 764 మంది రౌడీషీటర్లు మిల్స్కాలనీ పీఎస్ పరిధిలో కోతి సురేశ్ నగర బహిష్కరణ -
ఆడపిల్లలను చిన్నచూపు చూడొద్దు..
హన్మకొండ: ఆడ పిల్లలను చిన్నచూపు చూడొద్దని హనుమకొండ అదనపు కలెక్టర్ రవి అన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికా రత కేంద్రం ఆధ్వర్యంలో శనివారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో జాతీయ బాలికా దినోత్సవం జరిగింది. డీడబ్ల్యూఓ జె.జయంతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీ్త్ర, పురుషులు అనే అసమానతలు రూపుమాపేందుకు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని 2017లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఆడ పిల్లలు సెల్ఫోన్కు దూరంగా ఉండాలని, మంచి ఆరోగ్యం, చదువు ఉంటే ఆర్థిక స్వావలంబన సాధిస్తారన్నారు. డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండడానికి ఆడపిల్లలు, మహిళలు మంచి పోషకాహారాన్ని తీసుకోవాలన్నారు. బేటీ బచావో– బేటీ పడావో క్యాలెండర్ను అదనపు కలెక్టర్ రవి ఆవిష్కరించారు. సాంస్కృతిక ప్రదర్శనల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అదనపు కలెక్టర్ రవి సర్టిఫికెట్లు, మెడల్స్ అందించారు. డీఐఈఓ గోపాల్, మెప్మా డీపీఎం రజితారాణి, గైనకాలజిస్ట్ రాధిక, ఆయా విభాగాల అధికారులు విశ్వజ, స్వరూప, ఉమాదేవి, కల్యాణి, సుమలత, సింధూరాణి, వెంకటరాము, రవికృష్ణ, స్వర్ణలత, మానస, లావణ్య, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. బాలికలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు.. ఎంజీఎం: బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా లష్కర్సింగారం పీహెచ్సీ నుంచి గోపాల్పూర్ వరకు నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. అనంతరం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సూపరింటెండెంట్ విజయలక్ష్మితో కలిసి ఆయన ఆడ శిశువులకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్ అందించి తల్లిదండ్రులను సత్కరించి అభినందన పత్రం అందించారు. కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రత్యేకంగా రూపొందించిన ‘సంక్షిప్త సందేశాన్ని 386 మంది గర్భిణులను మొబైల్స్కు పంపించినట్లు తెలిపారు. ఆర్ఎంఓ డాక్టర్ మంజుల, అదనపు డీఎంహెచ్ఓ మదన్ మోహన్రావు, డీటీసీఓ హిమబిందు, అధికారులు ప్రభుదాస్, శ్రీనివాస్, రుబీనా, అశోక్ రెడ్డి, ప్రసన్న కుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. జాతీయ బాలికా దినోత్సవంలో హనుమకొండ అదనపు కలెక్టర్ రవి -
వనదేవతలను దర్శించుకున్న వరంగల్ సీపీ
వరంగల్ క్రైం: మేడారంలో వనదేవతలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ శనివారం సతీసమేతంగా దర్శించుకున్నారు. సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. సీపీ దంపతులకు పూజారులు అమ్మవారి కండువా కప్పి సన్మానించి ప్రసాదం అందించారు. ఈసందర్భంగా ఆయన జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, డీఎస్పీ రవీందర్తో జాతర బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు. ఖిలా వరంగల్: చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధానిలో పర్యాటకులు బోటు షికారు చేసేందుకు, కోట అందాలను వీక్షించేందుకు ‘కుడా’ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్లు కేయించగా.. మంత్రి కొండా సురేఖ ఇటీవల శంకుస్థాపన చేశారు. ఈనేపథ్యంలో శనివారం మొదటి దశ పనులు ప్రారంభమయ్యాయి. తొలుత రాతికోట ఉత్త ద్వారం నుంచి తూర్పు ద్వారం వరకు అభివృద్ధి చేయనున్నారు. అగర్త చెరువులో జేసీబీతో పూడికతీత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే వర్షాకాలంలోపు సుందరీకరణ పనులు పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తేనున్నట్లు అఽధికారులు పేర్కొన్నారు. విద్యారణ్యపురి: న్యూడిల్లీలో ఈనెల 26న జరగనున్న రిపబ్లిక్డే వేడుకలను వీక్షించేందుకు హనుమకొండ ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఎ.శివాని 100 బెస్ట్ మై భారత్ వలంటీర్స్లో ఎంపికయ్యారని ప్రిన్సి పాల్ బి.చంద్రమౌళి శనివారం తెలిపారు. ఈ మేరకు శివానిని కళాశాలలో శనివారం అభినందించారు. వైస్ ప్రిన్సిపాల్ జి.సుహాసిని, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఇ.కవిత, రామరత్నమాల, వి.మమత అభినందించారు. హన్మకొండ: ప్రయాణికుల సమస్యలు తెలుసుకునేందుకు, సలహాలు, స్వీకరించేందుకు ఈనెల 25న డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ బి.ధరంసింగ్ తెలిపారు. జమ్మికుంట, వేలేరు, ఐనవోలు, పర్వతగిరి, సంగెం, ఖిలా వరంగల్, వరంగల్, హనుమకొండ, కాజీపేట, హసన్పర్తి, కమలాపూర్ మండలాల ప్రయాణికులు 89777 81103కు ఫోన్ చేసి సలహాలివ్వాలని ఒక ప్రకటనలో కోరారు. -
అట్టహాసంగా ‘స్పార్క్రిల్’ ప్రారంభం
హసన్పర్తి: అన్నాసాగరం శివారులోని ఎస్సార్ యూనివర్సిటీలో మూడురోజుల పాటు నిర్వహిస్తున్న స్పార్క్రిల్–26 పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటరమణారావు ముఖ్యఅతిథిగా హాజరై పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సాంస్కృతిక పోటీలు దోహదపడుతాయన్నారు. పోటీలతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. డీన్ డాక్టర్ అర్చనారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఇలాంటి పోటీలు దోహదపడుతాయని చెప్పారు. స్టూడెంట్స్ కౌన్సిల్ కన్వీనర్ డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ మూడు రోజులపాటు నిర్వహిస్తున్న పోటీల్లో ప్రతీ విద్యార్థి పాల్గొనాలని సూచించారు. తొలి రోజు మార్షల్ ఆర్ట్స్, ఓపెన్ మైక్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో ప్రదర్శన ఇచ్చారు. సృజనాత్మకతను వెలికి తీయడానికి పోటీలు ఎస్సార్ వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటరమణారావు -
తల్లి మరణం తట్టుకోలేక..
● రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య ఖిలా వరంగల్: తల్లి మరణం తట్టుకోలేక జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి.. రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్– చింతలపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ధర్మారం రైల్వేగేట్ స మీపంలో చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఎస్. రవీందర్రెడ్డి కథనం ప్ర కారం.. గీసుగొండ మండలం ధర్మారం గ్రామానికి చెందిన పర్ష స్వామి(65) తల్లి గతేడాది క్రితం మృతి చెందింది. శుక్రవారం సంవత్సరీక కార్యక్రమం నిర్వహించాడు. తల్లిని గుర్తు చేసుకుని జీవితంపై విరక్తి చెంది అదేరోజు రాత్రి ధర్మారం రైల్వేగేట్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించిన అనంతరం మృతుడి కుమారుడు రాజుకు అప్పగించినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి శనివారం తెలిపారు. -
ఉత్సాహంగా టీ 20 క్రికెట్ మహిళా జట్టు ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వంగాలపల్లిలోని మైదానంలో శనివారం నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా టీ–20 క్రికెట్ మహిళా జట్టు ఎంపికలు ఉత్సాహంగా కొనసాగాయి. ఈ సందర్భంగా డబ్ల్యూడీసీఏ ప్రధాన కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 60 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 19 మంది క్రీడాకారులతో ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేశామన్నారు. ఎంపికై న వారిలో సి.హెచ్. సాయిసహస్ర, ఎన్. సాయిదృవిజ్ఞ, వి. చైతన్య, వి. స్నేహ, ఎన్. సాయిశ్రీజ, బి.నేహ శాన్విసాగర్, డి.సహస్రరాజ, ఎం. సౌమ్యశ్రీ, జి. వాసవి, డి. సాయిప్రసన్నరాజ్, టి. కృష్ణవేణి, పి. హర్షిత, బి. అక్షిత, ఆర్. సిరి, జి. మోహనశ్రీ, ఎం. నవ్య, జె. అనూష, ఎస్. జ్యోతిర్మయి, బి. నవ్య ఉన్నట్లు వెల్లడించారు. కాగా, ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు వరంగల్లో జరగాల్సిన అంతర్జిల్లాల స్థాయి టీ–20 క్రికెట్ మహిళా పోటీలను మేడారం జాతర నేపథ్యలో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. కొత్త షెడ్యూల్ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు త్వరలో వెల్లడిస్తారన్నారు. మార్నేని ఉదయభాను రావు, మట్టెడ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
హైటెక్ మేడారం..
శాశ్వత కట్టడాలతో ఇప్పటికే మహాజాతరకు కొత్త రూపు సాక్షి, వరంగల్: మేడారం మహా జాతర హైటెక్ హంగులు అద్దుకుంటోంది. ఇప్పటికే సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను ఒకే వరుసలోకి తీసుకొచ్చారు. గ్రానైట్ రాతితో శిలాతోరణాలు, ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాలు, ఆచారాలు, గొట్టుగోత్రాలు, చరిత్రను తెలిపేలా 32 గ్రానైట్ స్తంభాల రూపకల్పనతో సరికొత్తగా దర్శనమిస్తోంది. ఇంకోవైపు వాహన రాకపోకలు, పార్కింగ్, వైద్య శిబిరాలు, నీటి వసతులు, క్యాంపులు, తప్పిపోయిన వారి ఆచూకీ, అంబులెన్స్లు, చలివేంద్రాలు.. ఇలా భక్తులకు ఎక్కడెక్కడ ఏ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయనే విషయాలు అరచేతిలోనే కనిపించేలా ‘మేడారం జాతర యాప్’ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే, జాతరకు ఎన్ని వాహనాలు వచ్చాయి, పార్కింగ్లో ఎన్ని వాహనాలు ఉన్నాయి, ఇంకా ఎన్ని వాహనాలకు ఆస్కారముందనే పక్కా లెక్కల కోసం స్మార్ట్ అనలిటిక్స్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేజేషన్ వ్యవస్థను అనుసంధానం చేసి ట్రాఫిక్పై ఫోకస్ చేశారు. ముఖ్యంగా డ్రోన్లతో పాటు హీలియం బెలూన్లకు అమర్చిన పాన్టిల్ట్ జూమ్ కెమెరాల సహకారం తీసుకొని ఏఐ టెక్నాలజీతో ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. మెరుగైన మొబైల్ నెట్వర్క్ కోసం 27 శాశ్వత సెల్టవర్లు, 33 వీల్సెల్ టవర్లు అందుబాటులో ఉంచారు. ఇలా మేడారం జాతర సాఫీగా నిర్వహించేందుకు హైటెక్ సాయంతో అధికారులు ముందుకెళ్తున్నారు. హెల్ప్డెస్క్ ఫీచర్లో ల్యాండ్లైన్ కాల్ సెంటర్ : 08717–243055, మాస్టర్ కంట్రోల్ రూం : 94919 35321, 9493416719, 7382760241, 73829 06844, టీజీఆర్టీసీ హెల్ప్ డెస్క్ : 99592 26056, 99592 26049 మేడారం భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు 76589 12300 నంబర్కు హాయ్ అని మెసేజ్ పంపితే జాతర రూట్ మ్యాప్, ట్రాఫిక్ అప్డేట్స్, పార్కింగ్, వైద్య కేంద్రాలు, స్నానఘట్టాలు తదితర సమాచారం నేరుగా వాట్సాప్లో లభించ నుంది. హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి మేడారం వరకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 24 నుంచి 31 వరకు బుకింగ్ చేసుకునే రానుపోను ఒకరికి రూ.35,999 చార్జీ ఉంటుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి. టికెట్ బుకింగ్ కోసం 96763 20139, 85300 04309, 76609 39509 నంబర్లలో సంప్రదించాలి. అలాగే, మేడారం జాతరలో ఆరు నుంచి ఏడు నిమిషాల జాయ్ హెలికాప్టర్ రైడ్ కోసం ఒక్కరికి రూ.4,800 చార్జీ నిర్ణయించారు. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్తో వాహనాల లెక్కింపు డ్రోన్లకు అమర్చిన కెమెరాల దృశ్యాలతో పార్కింగ్పై క్లారిటీ 76589 12300 వాట్సాప్ నంబర్కు హాయ్ అని టైప్ చేస్తే సమాచారం ఆన్లైన్, ఆఫ్లైన్లో అందుబాటులో మేడారం జాతర యాప్ -
భక్తులు ప్లాస్టిక్ను తీసుకురావొద్దు
హన్మకొండ చౌరస్తా: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ వస్తువులు, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను తీసుకురావొద్దని కాలుష్య నియంత్రణ మండలి వరంగల్ రీజినల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సునీత విజ్ఞప్తి చేశారు. ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు పర్యావరణహిత జాతరగా జరుపుకునేందుకు సహకరించాలని కోరారు. ప్లాస్టిక్తో కలిగే అనర్థాలను భక్తులకు తెలియజేసేందుకు ప్రచార, చైతన్య కార్యక్రమాలను కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు తెలిపారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడానికి జాతరలో పోస్టర్లు, బ్యానర్ల ఏర్పాటుతోపాటు కళా బృందాలతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ప్లాస్టిక్కు బదులు వస్త్ర సంచులు, స్టీల్ గ్లాసులు, ప్లేట్లు వినియోగించాలని సూచించారు. అంతేకాకుండా జాతర జరిగే పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత, జంపన్న వాగులో నీటి నాణ్యత పర్యవేక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆలయ కల్యాణకట్ట దగ్గర క్షురకులు ఉపయోగించే బ్లేడ్లు, ఆరోగ్య శిబిరాల నుంచి వెలువడే బయోమెడికల్ వ్యర్థాలను వరంగల్లోని శుద్ధి కేంద్రాలకు పంపించే విధంగా ఏర్పాట్లు చేశామని ఈఈ సునీత పేర్కొన్నారు. పర్యావరణహిత మేడారం జాతర నిర్వహించుకుందాం కాలుష్య నియంత్రణ మండలి వరంగల్ రీజినల్ ఈఈ సునీత -
దొంగను పట్టుకొచ్చారు..
హసన్పర్తి: చోరీ చేసిన సొత్తుతో స్వరాష్ట్రం పశ్చిమబెంగాల్కు వెళ్లిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు హనుమకొండ ఏసీపీ నర్సింహారావు తెలిపారు. కేయూ పోలీస్స్టేషన్లో శనివారం ఆయన నిందితుడి వివరాలు వెల్ల డించారు. పశ్చిమబెంగాల్కు చెందిన ఫెరోజ్ షేక్, సుక్చంద్, యామీన్ ముఠాగా ఏర్పడి ఇళ్లలో చోరీలు చేయడం ప్రారంభించారు. చోరీలు చేసిన నగలను అమ్ముకుని జల్సాలు చేసేవారు. ఇటీవల ఈ ముఠాను అదుపులోకి తీసుకుని విచారించగా.. అదే ప్రాంతానికి చెందిన ఫిరోజ్ కూడా తమ ముఠా సభ్యుడిగా పేర్కొన్నారు. డిసెంబర్ 17న పరిమళ కాలనీ, సప్తగిరి కాలనీల్లో జరిగిన చోరీల్లో ఫిరోజ్ కూడా ఉన్నాడని, చోరీకి సంబంధించిన ఆరున్నర తులాల బంగారు ఆభరణాలు ఫిరోజ్ వద్ద ఉన్నట్లు ముఠా సభ్యులు పోలీసుల విచారణలో పేర్కొన్నట్లు ఏసీపీ తెలిపారు. అయితే అనారోగ్య కారణంగా మళ్లీ ఫిరోజ్ తమతో రాలేదని ముఠా సభ్యులు చెప్పారు. పశ్చిమ బెంగాల్కు ప్రత్యేక బృందం.. పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఆదేశాల మేరకు ఫిరోజ్ను అరెస్టు చేయడానికి ఎస్సైలు నవీన్, రాజ్కుమార్, హెడ్కానిస్టేబుళ్లు మహేశ్, అంజయ్య, కానిస్టేబుళ్లు వంశీ, మధుకర్, చంద్రశేఖర్, రాములు, వెంకటన్న, రాజశేఖర్, జితేందర్, కల్యాణి బృందం పశ్చిమ బెంగాల్కు బయల్దేరినట్లు ఏసీపీ చెప్పారు. 9 రోజుల పాటు అక్కడ ఉండి నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ వరంగల్ క్రైం: చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట దొంగను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు హనుమకొండ ఏసీపీ నర్సింహారావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలానికి చెందిన గుగులోతు నవీన్ 2023 నుంచి ఇప్పటి వరకు సుమారు 17 చోరీలకు పాల్పడి, ఆ కేసుల్లో జైలుకెళ్లి వచ్చాడు. మళ్లీ ఈ సంవత్సరం సంక్రాంతి సెలవుల సందర్భంగా హనుమకొండ, మట్టెవాడ, కుషాయిగూడ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. ఈనెల 23న దొంగతనం చేసేందుకు హనుమకొండ బస్స్టేషన్కు రాగా పోలీసులు పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. అతడి నుంచి వద్ద నుంచి ఇళ్ల తాళాలు పగులగొట్టడానికి ఉపయోగించే వస్తువులు, 12 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.51 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ నర్సింహారావు వివరించారు. కాగా, దొంగను పట్టుకున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది హరిప్రసాద్, కుమార్ను ఏసీపీ అభినందించారు. హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ ఎస్సైలు పరశురాం, సతీశ్, సిబ్బంది పాల్గొన్నారు.● పశ్చిమ బెంగాల్కు చెందిన నిందితుడి నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ● వివరాలు వెల్లడించిన హనుమకొండ ఏసీపీ నర్సింహారావు -
ఇంతింతై వటుడింతై..
ఏటేటా పెరుగుతున్న మేడారం ఆదాయం ములుగు: రెండేళ్లకు ఒకసారి జరిగే ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఆదాయం ఇంతింతై వటుడింతై అన్నట్లు ఏటేటా పెరుగుతోంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం ప్రసిద్ధి చెందింది. ఈ క్రమంలో ఈ జాతరకు వచ్చే భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయం కూడా క్రమంగా పెరుగుతూ రికార్డు సృష్టిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం కూడా భక్తుల సౌకర్యార్థం నిధులు కేటాయిస్తూ సౌకర్యాలు కల్పిస్తోంది. 1946లో గిరిజనులు మాత్రమే జరుపుకున్న జాతర.. 1946లో చిలకలగుట్టపై గిరిజనులు మాత్రమే మేడారం సమ్మక్క సారలమ్మను జాతర జరుపుకున్నారు. దీనికి 15వేలకు పైగా మంది భక్తులు హాజ రుకాగా రూ. 17,173 ఆదాయం సమకూరింది. 1958లో అధికారికంగా మేడారం జాతరను రెవె న్యూ రికార్డుల్లో చేర్చారు. దీంతో 1970లో అప్పటి ప్రభుత్వం జాతరను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. అనంతరం 1996లో మేడారాన్ని రాష్ట్ర జాతరగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది. 1996 నుంచి మేడారం జాతర ఆదాయంలో ప్రభుత్వానికి 67శాతం, పూజారులకు 33 శాతం వాటా ఇచ్చేలా ఒప్పందం జరిగింది. 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించి భక్తుల సౌకర్యాలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. 2014లో జరిగిన జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అంచనా వేసి ప్రభుత్వం రూ.60 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ నెల 28 నుంచి జరగనున్న మేడారం మహాజాతరకు మూడు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన ప్రభుత్వం.. భక్తుల సౌకర్యాల కోసం రూ.150 కోట్లు విడుదల చేయగా పనులు 90శాతం మేర పూర్తయ్యాయి. పెరుగుతున్న భక్తులు, ఆదాయం రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతర ఆదాయ వివరాలను పరిశీలిస్తే, భక్తుల సంఖ్య పెరగడంతోపాటు ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. జాతర ద్వారా వచ్చిన హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ, కోయ పూజారుల మధ్య 67:33 నిష్పత్తిలో పంచుతారు. మొత్తం 13 మంది పూజారులు 33శ ాతం ఆదాయాన్ని సమానంగా పంచుకుంటారు. ప్రభుత్వం హుండీ ఆదాయంపై ఆధారపడకుండా, భక్తుల సౌకర్యార్థం ప్రతీ జాతరకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులు ప్రధానంగా మౌలిక సదుపాయాలు, రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, భద్రత, తదితర ఏర్పాట్ల కోసం ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఈసారి తల్లుల గద్దెల ప్రాంగణాన్ని రూ.101 కోట్లతో అభివృద్ధి చేసి ముఖ్యమంర్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఈనెల 19న ప్రారంభించారు. ఈనెల 28 నుంచి 31 వరకు సమ్మక్క సారలమ్మ మహాజాతర అంగరంగవైభవంగా జరగనుంది. 2014 నుంచి మేడారం జాతర ఆదాయం.. 2014: రూ. 7.43 కోట్లు 2016: రూ. 8.91 కోట్లు 2018: రూ. 10.17 కోట్లు 2020: రూ. 11.64 కోట్లు 2022: రూ. 11.44 కోట్లు (2020 కంటే 20 లక్షలు తక్కువ) 2024 : రూ. 13.25 కోట్లు (రికార్డు) 2014 నుంచి మేడారం జాతరకు కేటాయించిన నిధులు 2014: రూ. 60 కోట్లు 2016: రూ. 108 కోట్లు 2018: రూ. 85 కోట్లు 2020: రూ. 75 కోట్లు 2022: రూ. 75 కోట్లు 2024: రూ. 105 కోట్లు 2026: రూ.150 కోట్లు 1996లో రాష్ట్ర జాతరగా గుర్తింపు 2014 రాష్ట్ర పండుగగా గుర్తించి నిధులు కేటాయింపు రూ. 17 వేల ఆదాయం నుంచి రూ. 13 కోట్ల వరకు.. ఆదాయంలో 67 శాతం ప్రభుత్వానికి, 33 శాతం పూజారులకు వాటా -
అమ్మవార్ల దర్శనానికి అక్కాచెల్లెళ్లకు ఉచిత ప్రయాణం
ములుగు: మేడారంలోని సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు అక్కాచెల్లెళ్లకు రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని కొనసాగిస్తూ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క–సారలమ్మను రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్తో కలిసి శనివారం దర్శించుకున్నారు. అనంతరం మేడారం తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. వచ్చే జాతర వరకు మేడారంలో శాశ్వత బస్టాండ్ నిర్మిస్తామని, షెడ్లతో శాశ్వత క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. మేడారం జాతరకు 4 వేల బస్సులు నడుపుతున్నట్లు, భక్తుల రద్దీని బట్టి మరిన్ని బస్సులు నడిపిస్తామన్నారు. జాతరలో పిల్లలు తప్పిపోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 11 బస్ పాయింట్లలో చైల్డ్ ట్రాకింగ్ సిస్టం ఉపయోగి స్తున్నట్లు తెలిపారు. భక్తులు తప్పనిసరిగా తమ పిల్లలకు స్టిక్కర్తో కూడిన ట్యాగ్ను చేతికి వేయించాలని సూచించారు. ఫిబ్రవరి 1వరకు మేడారానికి ఆర్టీసీ సేవలు కొనసాగించనున్నట్లు తెలిపారు. భక్తులు తమ ప్రయాణాన్ని సురక్షితంగా పూర్తి చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ 2024లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతరకు రవాణా, మౌలిక వసతులు కల్పించాలనే దూర దృష్టితో ముందడుగు వేశారని గుర్తు చేశారు. జాతర సందర్భంగా అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడమే కాకుండా, ఈసారి మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా మేడారానికి వచ్చి రవాణా ఏర్పాట్లను పరిశీలించారని తెలిపారు. భక్తులు, ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యాలు ఎదుర్కొకుండా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కాగా, మంత్రి ప్రభాకర్ తన తులంభారంగా 89 కిలోల బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించారు. కార్యక్రమంలో స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ వికాస్రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ములుగు కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఆర్టీసీ ఉన్నతాధికారులు,తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మేడారంలో తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభం -
థర్డ్లైన్ వర్క్స్..
● పలు రైళ్లు రద్దు, మరికొన్ని పాక్షికంగా.. కాజీపేట రూరల్ : కాజీపేట –బల్లార్షా సెక్షన్లో మందమర్రి–బెల్లంపల్లి మధ్య జరుగుతున్న మూడో రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన నాన్ ఇంటర్లాకింగ్ పనులతో పలు రైళ్లను ఈ నెల 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు కాజీపేట రైల్వే అధికారులు శనివారం రాత్రి తెలిపారు. రద్దయిన రైళ్ల వివరాలు.. కాజీపేట–సిర్పూర్టౌన్ (17003) ఎక్స్ప్రెస్, బల్లార్షా–కాజీపేట (17004) మెము ప్యాసింజర్, బల్లార్షా–కాజీపేట (17036) ఎక్స్ప్రెస్, కాజీపేట–బల్లార్షా (17035) ఎక్స్ప్రెస్ను రద్దు చేసినట్లు తెలిపారు. భద్రాచలంరోడ్–బల్లార్షా (17033) సింగరేణి, సిర్పూర్టౌన్–భద్రాచలంరోడ్ (17034) సింగరేణి ప్యాసింజర్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. భద్రకాళి అమ్మవారికి పూజలుహన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని శనివారం హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు సందర్శించి అమ్మవారికి పూజలు జరుపుకున్నారు. దేవాలయ అర్చకులు వారిని స్వాగతించి పూజల అనంతరం తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. అనంతరం దేవాదాయశాఖ వరంగల్జోన్ డిప్యూటీ కమిషనర్గా అదనపు బాధ్యతలు స్వీకరించిన ఈఓ రామల సునీతను దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం, సభ్యులు ఘనంగా సన్మానించారు. అర్చకులు శేషు, ధర్మకర్తలు వీరన్న, శ్రవణ్కుమార్, పూర్ణచందర్, మయూరి, సుగుణ, శ్రీనివాస్, సతీశ్, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు పాల్గొన్నారు. ప్రజల రక్షణ కోసం 24 గంటలు పనిచేస్తాంవరంగల్ క్రైం: సమాజ రక్షణ కోసం పోలీసులు 24 గంటల పనిచేయాల్సి ఉంటుందని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్ పోలీసులకు 15 రోజులపాటు నిర్వహించిన పునఃశ్చరణ శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. కార్యక్రమానికి వరంగల్ పోలీస్ క మిషనర్ సన్ ప్రీత్సింగ్ ముఖ్య అతిథిగా హాజరై సా యుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, పోలీ స్ పరేడ్ను తిలకించారు. సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, శ్రీని వాస్, ట్రెయినీ ఐపీఎస్ మనీషా నెహ్రా, ఏసీపీలు జితేందర్రెడ్డి, నాగయ్య, సురేంద్ర, అంతయ్య, ఆర్ఐలు సతీశ్, చంద్రశేఖర్, శ్రీధర్ పాల్గొన్నారు. మేడారం బస్సుల కోసం భక్తుల ధర్నాహన్మకొండ: మేడారం జాతర ప్రత్యేక బస్సుల కో సం భక్తులు హనుమకొండ బస్స్టేషన్ శనివారం రా త్రి ధర్నా చేశారు. వివరాలిలా ఉన్నాయి. మేడారం వెళ్లేందుకు హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ చేరుకున్నారు. ఆర్టీసీ సిబ్బంది బాలసముద్రంలోని కుడా మైదానం నుంచి మే డారం బస్సులు వెళ్తాయని మైక్లో అనౌన్స్ చేశారు. దీంతో భక్తులు కుడా మైదానం చేరుకున్నారు. అక్కడికి చేరుకునే సరికి బస్సులు అందుబాటులో లేవు. అప్పటి వరకు వెలిగిన లైట్లు ఆర్పివేయడంతో ఆగ్రహానికి గురైన భక్తులు బాలసముద్రంలోని ప్రధాన రహదారిపైకి చేరుకుని రెండు గంటలపాటు ధర్నా, రాస్తారోకో చేశారు. సీఎం, ఆర్టీసీ అధికారులు డౌన్డౌన్ అంటూ ఆందోళన చేయడంతో వాహనాల రా కపోకలకు ఆటంకం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు రాత్రి 9 గంటలకు చేరుకుని భక్తులను శాంతిపజేసి కుడా మైదానంలోకి పంపించారు. వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత చేరుకున్నారు. ప్రత్యేక బస్సులను తెప్పించి భక్తులను మేడారం పంపించారు. -
సరస్వతీదేవిగా రుద్రేశ్వరి అమ్మవారు
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో వసంత పంచమిని పురస్కరించుకుని శుక్రవారం సరస్వతీ అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. వందలాది మంది భక్తులు, విద్యార్థులు దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఉదయం నుంచి రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం రుద్రేశ్వరీ అమ్మవారిని శ్రీసూక్తంతో నారీకేళ జల పంచామృతాభిషేకం నిర్వహించి సరస్వతీదేవిగా అలంకరించి పూజలు జరిపారు. విద్యార్థులు సరస్వతీదేవి నామాలను పటిస్తూ ప్రార్థన చేశారు. ఈసందర్భంగా ఆలయ ఈఓ అనిల్కుమార్ విద్యార్థులకు సరస్వతీదేవి శ్లోకాల పుస్తకాలు అందజేశారు. ప్రతీరోజు శ్లోకాలను పఠించడం ద్వారా మానసిక ప్రశాంతత కలిగి చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని గంగు ఉపేంద్రశర్మ విద్యార్థులకు వివరించారు, ఎంజీఎం: మాతాశిశు సంరక్షణే ప్రధాన ధ్యేయమని హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య సూచించారు. వరంగల్ డీఎంహెచ్ఓ కాన్ఫరెన్స్ హాల్లో హనుమకొండ జిల్లాలోని ఏఎన్ఎంలకు ‘సమీకృత అధిక ప్రమాద గర్భధారణ నివారణ నియమాలు–హైరిస్క్ ప్రెగ్నెన్సీ’పై శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి డీఎంహెచ్ఓ అప్పయ్య హాజరై మాట్లాడుతూ.. గర్భిణుల్లో ప్రమాద సూచికలను గుర్తించడానికి ఏఎన్ఎంలకు శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రమాదకర లక్షణాలు ఏఎన్ఎంలు ముందే గుర్తిస్తే గర్భిణులకు ప్రత్యేక వైద్యసేవలు అందించవచ్చని చెప్పారు. అర్మాన్ శిక్షణ సంస్థ కన్సల్టెంట్ డాక్టర్ సౌజన్య హైరిస్క్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని అంశాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. శిక్షణ పొందిన ఏఎన్ఎంలకు డీఎంహెచ్ఓ అప్పయ్య చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అర్మాన్ సంస్థ నుంచి డాక్టర్ కె.ప్రసాద్, డెమో వి.అశోక్రెడ్డి, స్టాటిస్టికల్ అధికారి ప్రసన్నకుమార్, డీడీఎం ప్రవీణ్, హెచ్ఈఓ సీహెచ్ రాజేశ్వర్రెడ్డి, వినోద్, రంజిత్ పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్: వరంగల్ ఎంజీఎం ఎదుట ఉన్న శ్రీరాజరాజేశ్వరీదేవి ఆలయంలో శిశిర నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదో రోజు శుక్రవారం అమ్మవారిని ఆలయ అర్చకుడు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ వహ్నివాసినిగా అలంకరించి పూజలు చేశారు. కాజీపేట అర్బన్: నిట్ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో రెండు రోజుల థర్మల్ సైన్స్ అండ్ సస్టేనబుల్ ఎనర్జీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ శుక్రవారం ప్రారంభమైంది. మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వేదికగా నిలవాలని అన్నారు. కార్యక్రమంలో నిట్ ప్రొఫెసర్లు సోనావానే శిరీశ్, రవికుమార్, అంబ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మేడారం.. గుడారం
మేడారంలో వెలిసిన గుడారాలుఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి: సుదూర ప్రాంతాల నుంచి మేడారం జాతరకు వచ్చే భక్తులు విడిది చేసేందుకు వ్యాపారులు పెద్ద ఎత్తున గుడారాలు ఏర్పాటు చేశారు. సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో సారలమ్మ వచ్చే ముందు రోజు స్వయంగా గుడారాలు ఏర్పాటు చేసేవారు. కానీ, ఇప్పుడు 15 రోజుల ముందు నుంచే ఏర్పాటు చేసి భక్తులకు అద్దెకిస్తున్నారు. వనదేవతలను దర్శించుకుని పిల్లాపాపలతో ఉండేలా ఇక్కడ అద్దె గదులు ఏర్పాటు చేశారు. వాటిలో సేద తీరితే 24 గంటలకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే టెంట్ సిటీ లగ్జరీతో ఏర్పాటు చేయగా మిగతా ప్రాంతాల్లో తాత్కాలిక పందిళ్లు వేశారు. తడకలు, బర్కాలు, పాలిథిన్ కవర్లు, గ్రీన్ మ్యాట్లతో అద్దె గదులు రూపొందించారు. వాటికి నంబర్లు వేసి భక్తులకు కేటాయిస్తున్నారు. మేడారం ఇప్పడు మెగాసిటీ మేడారం జాతరంటే ఒకప్పుడు చెట్లు, పుట్టలు. భ క్తులు తల్లులను దర్శించుకుని చెట్ల కింద వంటా వార్పు చేసుకొని అడవిలో మూడు రోజులపాటు గడిపేవారు. కంప్యూటర్ యుగంలో మేడారం ఇప్పుడు మెగాసిటీగా మారింది. చాలా మంది వ్యా పారులు జాతర సందర్భంగా మేడారంలోని స్థానిక భూములను గజాల చొప్పున అద్దెకు తీసుకుని గుడారాలు ఏర్పాటు చేశారు. కాంక్రీట్ భవనాలతో వందలాది అద్దె గదులు నిర్మించి కూడా భక్తులకు అద్దెకు ఇస్తున్నారు. ఇవేకాకుండా భవనాలపై తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసి అద్దెకు ఇస్తున్నారు. అద్దెకు ఉండే వారికి వేడి నీళ్లు, మొబైల్ చార్జింగ్, రెడీ టు ఫుడ్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముందస్తు సందడి.. జాతరకు 15 రోజుల ముందు నుంచి మేడారంలో భక్తుల రద్దీ మొదలైంది. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా డెన్లు ఏర్పాటు చేశారు. జంపన్నవాగు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు, గద్దెల నుంచి చిలకలగుట్ట వరకు ఇరువైపులా గుడారాలు వెలిశాయి. 15 రోజుల క్రితం మూడు వేల వరకు ఉన్న జనాభా నేడు లక్ష వరకు పెరిగింది. ఏ రోడ్డు చూసినా పట్టణ ప్రాంతంగా దర్శనమిస్తోంది. భక్తుల రాకపోకలు మరింత పెరగడంతో ఏ గుడారాలు నిండుగా కనిపిస్తున్నాయి. జోరుగా వ్యాపారాలు మేడారం జాతరలో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. భక్తుల కోసం ఏర్పాటు చేసిన గూడారాలు, తాత్కాలిక షెడ్లలో అనేక వ్యాపారాలు వెలిశాయి. ఇదే జోరులో వ్యాపారులు కొనసాగుతున్నాయి. కూల్డ్రింక్స్, వాటర్, రెస్టారెంట్ స్థాయిలో ఆహార పదార్థాలు లభిస్తున్నాయి. భక్తులు కుటుంబాలతో దర్శనం కోసం వచ్చి అన్నిరకాల సౌకర్యాలతో ఆహ్లాదాన్ని పొందుతున్నారు. రెండేళ్లకోసారి ఉపాధి మేడారం జాతర రెండేళ్లకోసారి రావడంతో వనదేవతలను దర్శించుకునే భక్తులు సేద తీరేందుకు అద్దె గదులు ఏర్పా టు చేస్తున్నాం. వాటి ద్వారా మేం కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటాం. ప్రతీ జాతర మాకు జీవనోపాధి కల్పిస్తుంది. భక్తులను కుటుంబ సభ్యుల మాదిరిగానే చూసుకుంటాం. – సంకెపల్లి జైపాల్రెడ్డి, రెడ్డిగూడెం వేలాదిగా వెలిసిన తాత్కాలిక పందిళ్లు అడుగడుగునా భక్తులకు అద్దె గదుల స్వాగతం సౌకర్యాలపై ప్రత్యేక దృష్టిసారించిన వ్యాపారులుమేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం, నార్లాపూర్ తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానికులు సైతం వారు ఉండే ఇళ్లను భక్తులకు అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటారు. భక్తులను ఆకట్టుకునేలా గుడారాలను తీర్చిదిద్దుతున్నారు. -
జాతరను సక్సెస్ చేద్దాం..
వరంగల్ క్రైం: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను పోలీస్, ఆర్టీసీ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి సక్సెస్ చేద్దామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. ఈ మేరకు సీపీ సన్ప్రీత్ సింగ్ పోలీస్, ఆర్టీసీ అధికారులతో శుక్రవారం కమిషనరేట్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. గత జాతరలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తిన ప్రాంతాలు, కారణాలతో పాటు, పోలీస్, ఆర్టీసీ సంయుక్తంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా మేడారం జాతరకు చేసిన ఏర్పాట్లపై ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయ భాను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు మేడారం వస్తున్న భక్తుల రద్దీని గమనిస్తూ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో సమస్యలు సృష్టించిన డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవద్దని, డ్రైవర్లకు తప్పనిసరిగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు. హనుమకొండ బాలసముద్రం నుంచి జాతరకు వెళ్లే బస్సులకు ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, దార కవిత, ఆర్టీసీ, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్రావు, ఏసీపీలు సత్యనారాయణ, జితేందర్రెడ్డి, జానీ నర్సింహులు, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంలు భానుకిరణ్, మహేశ్, డిపో మేనేజర్లు రవిచందర్, అర్పిత,ఽ ధర్మాసింగ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సీతారెడ్డి, వెంకన్న, సుజాత, ఇతర పోలీస్, ఆర్టీసీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆర్టీసీ, పోలీసు అధికారులతో సమావేశం -
గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలి
న్యూశాయంపేట: మైనార్టీ గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థల (టెమ్రిస్) కౌన్సిలర్ సర్వర్ మొహియొద్దీన్ ఘాజీ కోరారు. వరంగల్ నగరంలోని పలు మసీదుల్లో మత పెద్దలను కలిసి గురుకులాల్లో అందిస్తున్న విద్య, సౌకర్యాలను వివరించారు. కార్యక్రమంలో మత పెద్ద రఫీ, అరబిక్ టీచర్ అహ్మద్ పాల్గొన్నారు. అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణ.. రంగశాయిపేట శివారు వరంగల్(బీ1) మైనార్టీ గురుకులంలో వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ అడ్మిషన్ల వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్ జి.భిక్షపతి మాట్లాడుతూ ఆసక్తిగల విద్యార్థులు గురుకులం, ఆన్లైన్లో ఫిబ్రవరి 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
ఎస్సీ విద్యార్థులకు లబ్ధి చేకూర్చాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లాలోని అర్హులైన ప్రతీ ఎస్సీ విద్యార్థి ప్రీ మెట్రిక్ పథకం ద్వారా లబ్ధి జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం రిజిస్ట్రేషన్పై కలెక్టరేట్లో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి భాగ్యలక్ష్మి, డీఈఓ రంగయ్యనాయుడు పాల్గొన్నారు. బాలికల భవిష్యత్ తీర్చిదిద్దే బాధ్యత కీలకం కాళోజీ సెంటర్: కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్లు, కేర్ టేకర్లుగా పనిచేయడం కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, అది ఓ గొప్ప సేవ అని, బాలికల భవిష్యత్ను తీర్చిదిద్దే కీలక బాధ్యత అని వరంగల్ కలెక్టర్ సత్యశారద గుర్తుచేశారు. హనుమకొండ నక్కలగుట్ట హరిత హోటల్లో శుక్రవారం జరిగిన వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల కేజీబీవీ వార్డెన్ల సాధికారత శిక్షణ ముగింపు సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వరంగల్ డీఈఓ రంగయ్య నాయుడు, వరంగల్ జీసీడీఓ కె.ఫ్లోరిన్స్, హనుమకొండ జీసీడీఓ ఎం.సునీత, మాస్టర్ ట్రైనర్, కరీంనగర్ జీసీడీఓ కృపారాణి, జ్యోతి, సరస్వతి, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రణాళికా విభాగం.. పనితీరు నిస్తేజం!
వరంగల్ అర్బన్: మహా నగరాభివృద్ధి దశదిశను నిర్దేశించే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు అత్యంత కీలకమైన ప్రణాళిక విభాగానికి పూర్తిస్థాయి సిటీప్లానర్ లేక భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఏడాదిన్నర క్రితం పాలకవర్గం పెద్దల ఒత్తిడి తాళలేక సిటీప్లానర్ శైలజ హైదరాబాద్కు బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి డిప్యూటీ సిటీప్లానర్.. ఇన్చార్జ్ సిటీప్లానర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ప్రణాళికా విభాగం పనితీరు నిస్తేజంగా మారింది. కిందిస్థాయి నుంచి వేళ్లూనుకున్న అవినీతి సర్వసాధారణమైంది. ప్రజాప్రతినిధుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలక నగరం ఇలా.. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్లో రహదారుల విస్తరణ, అభివృద్ధికి బృహత్ ప్రణాళికలు, ఇంటి నిర్మాణాలు, బహుళ అంతస్తులు, షాపింగ్ కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్లు.. ఫైర్సేఫ్టీ ఇలా ఏదైనా నిర్మించుకోవాలంటే కార్పొరేషన్ టౌన్ప్లానింగ్ విభాగం నుంచి అనుమతి పొందాల్సిందే. మార్ట్గేజ్ రిలీజ్, లే–ఔట్ల అనుమతులు, ప్రకటనలు, వాటి నుంచి పన్నుల వసూలు, ఖాళీ స్థలాల పరిరక్షణ, ఫైర్ సేఫ్టీపై ఇలా ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. దీనికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి. భవన నిర్మాణదారులతో కుమ్మక్కు నగరంలో నూతన భవనాలను నిబంధనల మేరకు నిర్మిస్తున్నారా లేదా? అని పరిశీలించే సిబ్బంది ముడుపులకు కక్కుర్తిపడి మిన్నకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విభాగానికి ఏటా సుమారు 3వేల వరకు దరఖాస్తులు వస్తుంటాయి. నిబంధనల ప్రకారం ప్లాన్ స్థలం, సర్వేయర్లు కొలతలు వేసిన తర్వాత అనుమతులివ్వాలి. అనంతరం ప్లాన్ ప్రకారం నిర్మాణం జరుగుతుందా అని పూర్తయ్యే వరకు పనులు పర్యవేక్షించాలి. 200 చదరపు మీటర్లకు పైగా ఉన్న స్థలంలో నిర్మాణాలు జరుగుతంటే మాత్రం ఆ స్థలంలో 10 శాతం బల్దియా కమిషనర్ పేరిట రిజిస్టర్ చేయాలి. భవన నిర్మాణం పూర్తయితే ఆ తర్వాత విడుదల చేస్తారు. నగరంలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు పట్టణ ప్రణాళిక విభాగంలో అనుమతుల దగ్గర నుంచి నిర్మాణం వరకు కొందరు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. 100 మీటర్ల నుంచి 200 మీటర్ల మేరకు ఉన్న స్థలంలో మూడు అంతస్తుల నిర్మాణానికి అధికారులు అనుమతిస్తారు. కానీ, నిర్మాణంలో 10 శాతం తనాఖా పెట్టాల్సి ఉంటుంది. 300 నుంచి 500 మీటర్లలోపు స్థలంలో నాలుగు అంతస్తులు, 12 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణానికి అధికారులు అనుమతిస్తారు. 500 మీటర్ల నుంచి 1,000 మీటర్ల వరకు ఖాళీ స్థలానికి 8 అంతస్తుల వరకు నిర్మాణాలకు ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. అయితే భవనాల చుట్టూ ఖాళీ స్థలం (సెట్ బ్యాక్) వదలడం లేదు. అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్, బహుళ అంతస్తుల నిర్మాణాలపై పెంట్హౌస్ల స్థానంలో నిబంధనలకు విరుద్ధంగా అదనంగా ఇంటి నిర్మాణాలు సాగుతున్నాయి. ఫైర్సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేయడం లేదు. పార్కింగ్ కోసం నిర్మించే సెల్లార్లలో కూడా గదులు నిర్మిస్తున్నారు. దీంతో వాహనాలను రోడ్డుపై పార్కింగ్ చేయాల్సి వస్తోంది. ఇదే క్రమంలో సైడ్ కాల్వలు, రోడ్లు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు సాగిస్తున్నారు. సైడ్ కాల్వలు కుదించి వాటి మీద ర్యాంపులు, ఫోర్టికోలు, మెట్లు నిర్మిస్తుండడంతో వర్షాకాలంలో అనేక ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఏవి? అనుమతి లేని కట్టడాలను ఆదిలోనే అడ్డుకునేలా జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక ఎన్ఫోర్స్(ఎస్టీఎఫ్)బృందాలను ఏర్పాటు చేయాలి. ఈ బృందాలకు డిప్యూటీ కమిషనర్లు బాధ్యులుగా వ్యవహరించాలి. 20 రోజులకోసారి ఆయా డివిజన్లలో మొత్తాన్ని తనిఖీ చేయాలి. అనుమతి లేని నిర్మాణానికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించి ఎన్ఫోర్స్మెంట్కు చేర్చాలి. కానీ, అవేమి బల్దియాలో లేవు. ఈ విషయమై బల్దియా ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్ వాడేకర్ను వివరణ కోరగా అనధికారిక నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని, ఇవి మా దృష్టికి ఏమి రాలేదని పేర్కొన్నారు. పూర్తిస్థాయి సిటీప్లానర్ లేక ఇబ్బందులు విభాగంలో వేళ్లూనుకుంటున్న అవినీతి యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన -
లక్ష్యం ‘మిషన్ ఎక్స్లెన్స్’
కాజీపేట అర్బన్: గురుకుల విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు మిషన్ ఎక్స్లెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. కాజీపేట మండలం మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల ఆవరణలో శుక్రవారం గురుకుల విద్యార్థులకు 70 రోజుల ఉచిత నీట్, ఐఐటీ కోచింగ్ ‘మిషన్ ఎక్స్లెన్స్’ కార్యక్రమాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈఐఓ అజ్మీరా గోపాల్, డీసీఓ, గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన కర్ణాటక బృందం హన్మకొండ అర్బన్: నగరంలోని యూత్ హాస్టల్లో జరుగుతున్న అంతర్రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కర్ణాటక బృందం శుక్రవారం హనుమకొండ కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో కొత్తవాడలో జరీ వస్త్ర పరిశ్రమను సందర్శించారు. రంగశాయిపేటలోని వారాహి హోమ్ ఫుడ్స్ను సందర్శించి తెలంగాణ పిండి వంటల గురించి తెలుసుకున్నారు. హంటర్రోడ్డులోని తాళ్లపద్మావతి ఫార్మసీ కళాశాలలో కల్చరల్ ప్రోగ్రాంకు హాజరయ్యారు. ఓటు హక్కును వినియోగించుకోవాలి.. ప్రజాస్వామ్యంలో 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కోరారు. ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని క లెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించా రు. అనంతరం అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. పరిమితి దాటిన వాహనాలపై చర్యలుకాల పరిమితి ముగిసిన వాహనాలపై సత్వరమే చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ గురుకుల విద్యార్థులకు ఉచిత శిక్షణ -
ఓటు హక్కును వినియోగించుకోవాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి హన్మకొండ: ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవంలో భాగంగా శుక్రవారం ఓటర్ల ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సీఎండీ వరుణ్ రెడ్డి ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంరతం వరుణ్ రెడ్డి మాట్లాడతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులలో ఓటు హక్కు అత్యంత కీలకమైందన్నారు. ప్రతీ ఒక్కరు బాధ్యతాయుతంగా తమ ఓటును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ ఇంజనీర్లు టి.సదర్ లాల్, కె.రాజు చౌహన్, అశోక్, మాధవ రావు, కె.వెంకటరమణ, సురేందర్, శ్రవణ్ కుమార్, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, జాయింట్ సెక్రటరీ శ్రీకృష్ణ, జీఎంలు శ్రీనివాస్, వాసుదేవ్, నాగ ప్రసాద్, సామ్య నాయక్, జయరాజ్, వెంకట కృష్ణ, వేణు బాబు, కృష్ణ మోహన్, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం పాల్గొన్నారు. -
ఛత్తీస్గఢ్ సీఎంకు ఆహ్వానం
ఏటూరునాగారం: మేడారం మహాజాతరకు రావాలని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్సాయిని సమ్మక్క–సారలమ్మ పూజారులు సిద్ధబోయిన సురేందర్, ఆదివాసీ రాష్ట్ర నాయకుడు పొదెం రవీందర్, మైపతి సంతోష్ ఆహ్వాన పత్రికను అందజేశారు. రాయ్పుర్లోని ముఖ్యమంత్రి నివాసంలో వారు కలిసి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాద్యక్షుడు భరతపురం నరేశ్, మండల ప్రధాన కార్యదర్శి బొల్లికొండ సాంబయ్యగౌడ్ పాల్గొన్నారు. రౌడీషీటర్ కోతి సురేశ్ నగర బహిష్కరణ ● కమిషనరేట్ పరిధిలో తొలి బహిష్కరణ ఇదే వరంగల్ క్రైం: మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ వంచనగిరి సురేష్ అలియాస్ కోతి సురేష్ను ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ జారీ చేసిన ఉత్తర్వులను మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్ నిందితుడు సురేష్కు శుక్రవారం అందజేశారు. కోతి సురేష్ పై హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం 1348, వరంగల్ మెట్రోపాలిటన్ పోలీస్ చట్టం, 2015లోని సెక్షన్లోని 26(1) ప్రకారం ఆరు నెలల బహిష్కరణ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రౌడీషీటర్ సురేష్ పలుసార్లు ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తూ శాంతియుత జనజీవన విధానానికి ఆటంకం కలిగించినట్లు పోలీస్ రికార్డులు నమోదయ్యాయి. ఇతని అక్రమ కార్యకలాపాలకు భయపడి ప్రజలు ఫిర్యాదు చేయడానికి కూడా భయపడటంతో ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని నగర బహిష్కరణ విధించారు. విద్యారణ్యపురి: ఇంటర్ విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని హనుమకొండ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. శ్రీధర్ కోరారు. కళాశాలలో శుక్రవారం నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ఎస్ఎస్ ఫ్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఆర్.ప్రవీణ్కుమార్, డాక్టర్ సవ్వాసి శ్రీనివాస్, అధ్యాపకులు రాజేంద్రప్రసాద్, నీరజాదేవి, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడారు. దేశవిముక్తి కోసం పోరాడిన నేతాజీకేయూ క్యాంపస్: దేశవిముక్తి కోసం పోరాడిన గొప్ప నాయకుడు నేతాజీ సుభాష్చంద్రబోస్ అని ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రావుల కృష్ణ అన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని బాటనీ విభాగం సెమినార్హాల్లో శుక్రవారం నేతాజీ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు, యూనివర్సిటీస్ ప్రముఖ్ అంబాల కిరణ్, కేయూ ఇన్చార్జ్ నిమ్మల రాజేశ్, సెక్రటరీ మేకల జ్ఞానేశ్వర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫణీంద్ర, వరంగల్ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆగపాటి రాజ్కుమార్ పాల్గొన్నారు. -
మేడారం భక్తులకు గాయాలు
ఎస్ఎస్తాడ్వాయి: సమ్మక్క– సారలమ్మ గద్దెలపై బెల్లం, కొబ్బరికాయలు విసిరేయడంతో భక్తులు గాయలపాలువుతున్నారు. తల్లులకు మొక్కులు తీర్చేందుకు భక్తులు గద్దెల వద్ద ఎత్తు బంగారం(బెల్లం) సమర్పించడం అనవాయితీ. కానీ, భక్తులు నేరుగా గద్దెలపైకి బెల్లం, కొబ్బరికాయలు విసరడంతో భక్తులకు భద్రత సమస్యగా మారింది. శుక్రవారం గద్దెలపైకి బెల్లం, కొబ్బరికాయలు విసరడంతో 81 మంది భక్తులు గాయపడ్డారు. గాయపడినవారిని సింగరేణి రిస్క్యూ టీం గద్దెల సమీపంలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రం వద్ద చికిత్స అందించారు. ఎక్కువగా గాయపడిన భక్తులను టీటీడీ కల్యాణ మండపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గద్దెల వద్ద సొమ్మసిల్లిన యువతి .. మేడారం సమ్మక్క సారలమ్మల గద్దెల ప్రాంగణంలో ఓ యువతి సొమ్మసిల్లి పడిపోయింది. ఖమ్మం జిల్లాకు చెందిన వెన్నెల తల్లుల దర్శనానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చింది. గద్దెల వద్ద మొక్కులు చెల్లిస్తున్న సమయంలో ఒక్కసారి సొమ్మసిల్లి పడిపోయిన వెన్నెలను గుర్తించిన రెస్క్యూ టీం సభ్యులు కార్వెంట్ (కృత్రిమ గాలి) అందించి కాపాడారు. హోర్డింగ్ కూలడంతో భక్తుడికి.. ఏటూరునాగారం: జాతరకు వచ్చే భక్తులకు స్వాగతం, ఇతర ప్రచారం చేసేలా మేడారంలో పలుచోట్ల స్వాగతం హోర్డింగ్ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అయితే శుక్రవారం హరితహోటల్ సమీపంలోని హోర్డింగ్ మరిపెడ బంగ్లాకు చెందిన ఎడ్ల నర్సయ్యపై పడింది. తలకు స్వల్పంగా గాయాలయ్యాయి. భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు కూలితే పెనుప్రమాదం జరిగేదని, ప్రధాన రోడ్ల వెంట ఉన్న హోర్డింగ్లను తొలగించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సంబంధిత నిర్వాహకులు హోర్డింగ్లను తొలగించే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా.. హోర్డింగ్ ఎల్ఈడీ స్క్రీన్ మీద పడ్డప్పుడు పక్కనే కానిస్టేబుల్ ఉన్నా.. ఎలాంటి సాయం చేయలేదని చుట్టు పక్కలవారి సాయంతోనే ప్రాణాలతో బయటపడ్డానని ఎడ్ల నర్సయ్య చెప్పడం గమనార్హం. బెల్లం, కొబ్బరికాయలు గద్దెలపైకి విసురుతున్న భక్తులు -
రైతులకు వసతులు కల్పించాలి
వరంగల్: వరంగల్ రీజియన్లోని వ్యవసాయ మార్కెట్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని ఆర్జేడీఎం లక్ష్మణుడు ఆదేశించారు. శుక్రవారం వరంగల్ రీజియన్ పరిధిలోని అన్ని వ్యవసాయ మార్కెట్ల కార్యదర్శులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. మిర్చి సీజన్ ప్రారంభమైనందున మార్కెట్లకు వచ్చే రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఈఏడాది మార్కెట్ ఫీజుల లక్ష్యాలను సాధించాలని, బకాయిలను వెంటనే వసూలు చేయాలన్నారు. వరంగల్ మార్కెట్లోని మిర్చి యార్డుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కార్యదర్శి మల్లేశంకు సూచించారు. అనంతరం ఆయన చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి, పండ్ల సెక్షన్ అధ్యక్షుడు వెల్ది సాంబయ్యతో కలసి ముసలమ్మకుంటలోని మామిడి మార్కెట్ను సందర్శించారు. గత ఏడాది మామిడి మార్కెట్లోవసతులు కల్పించేందుకు రూ.10 కోట్లతో ప్రతిపాదనలు పంపించగా మంజూరు కాలేదని జేడీఎంకు వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం రోడ్డు సౌకర్యం కల్పిస్తే రైతులకు, వ్యాపారులకు సౌకర్యంగా ఉంటుందని రవీందర్రెడ్డి చెప్పగా ప్రత్యేకంగా ప్రతిపాదనలు పంపించాలని మార్కెట్ అధికారులను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో డీడీఎం పద్మావతి, డీఎంఓ సురేఖ, మార్కెటింగ్ ఇంజనీరింగ్ ఈఈ ఎల్లేశ్ , గ్రేడ్–2 కార్యదర్శి రాము, ఏఎస్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.● వీడియో కాన్ఫరెన్స్లో ఆర్జేడీఎం లక్ష్మణుడు -
జాతరకు ఆర్టీసీ సిద్ధం
హన్మకొండ: మేడారం జాతరకు ఆర్టీసీ సమాయత్తమైంది. ఈనెల 28, 29, 30, 31 తేదీల్లో వన దేవతల జాతర జరగనుంది. భక్తులను చేరవేసేందుకు ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు ప్రత్యేక బస్సులు నడపనుంది. మేడారంలో ప్రత్యేక బస్ పాయింట్ను ఈనెల 24న(నేడు) మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఈసారి జాతరకు ఆర్టీసీ బస్సుల ద్వారా 20 లక్షల మంది వరకు భక్తులు ప్రయాణం చేస్తారని అధికారుల అంచనా. 51 బస్ పాయింట్ల నుంచి భక్తులను మేడారానికి చేరవేసేందుకు 3,495 ప్రత్యేక బస్సులు సిద్ధంగా ఉంచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 31 ప్రత్యేక పాయింట్లు, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 21 పాయింట్లు, మహారాష్ట్రలోని సిరోంచ నుంచి కూడా బస్సులు నడిపించనున్నారు. వరంగల్ రీజియన్లో మొత్తం 1,100 బస్సులు నడుపనున్నారు. ఇందులో 150 కొత్త బస్సులు రానున్నాయి. మిగతా బస్సులను హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్నగర్ రీజియన్ల నుంచి సమకూర్చుకున్నారు. మిగిలిన ప్రత్యేక బస్సులు ఇతర రీజియన్లలోని ప్రత్యేక పాయింట్ల నుంచి నడుపుతారు. విధుల్లో 11 వేల మంది సిబ్బంది.. ● మేడారం జాతరలో మొత్తం 11 వేల మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ● మేడారంలో 50 ఎకరాల స్థలంలో ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 35 ఎకరాల్లో బస్ల పార్కింగ్, బస్ల మరమ్మతులకు షెడ్, కార్మికులు, అధికారులకు వసతి, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు బస్సుల్లో తిరిగి వెళ్లేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు 20 ఎకరాల్లో తాత్కాలిక బస్స్టేషన్, భక్తులు బస్సుల్లోకి చేరేందుకు రెయిలింగ్, 50 క్యూ లైన్లు సిద్ధం చేశారు. తాడ్వాయి వద్ద 10 ఎకరాల్లో పార్కింగ్, టికెట్ల జారీకి ఏర్పాట్లు చేశారు. కామారంలో 10 ఎకరాలు, మహావీర్ వద్ద 8 ఎకరాలు బస్సుల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. మేడారంతోపాటు వివిధ ప్రాంతాల్లోని ఆర్టీసీ తాత్కాలిక బస్స్టేషన్లలో భక్తులకు చలువ పందిళ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలల సౌకర్యం కల్పించారు. 78 సీసీ కెమెరాలు ఏర్పాటు.. ● మేడారంలో ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంతంలో 78 సీసీ కెమెరాలు బిగించారు. వాటిని ఆర్టీసీ కమాండ్ కంట్రోల్ రూం, పోలీసు కమాండ్ కంట్రోల్ రూంకు కూడా అనుసంధానించారు. కాజీపేట, హనుమకొండ, వరంగల్ ప్రత్యేక బస్ పాయింట్లలో సర్వేలైన్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. తిరుగు ప్రయాణం భక్తులను నేరుగా బస్సు ఎక్కించి తాడ్వాయిలో టికెట్లు ఇస్తారు. ఆర్టీసీ ఉద్యోగులు అస్వస్థతకు గురైతై వెంటనే వైద్య సేవలు అందించేందుకు ఆర్టీసీతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ మేడారంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. తాడ్వాయి వద్ద స్టాటికల్ సిబ్బందిని ఉంచి ఎన్ని బస్సుల్లో ఎంత మంది భక్తులు వచ్చారో నివేదిక తయారు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మేడారంలో కార్మికులు విశ్రాంతి తీసుకునేందుకు షెడ్లు వేశారు. రాత్రి సమయంలో లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ● జాతరలో విధులు నిర్వర్తించే అధికారులు, ఉద్యోగులకు తాగు నీటి వసతికి 9 ఆర్ఓ వాటర్ప్లాంట్లను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. అధికారులు, సిబ్బందితో పాటు బస్సు బోర్డింగ్ పాయింట్లలో భక్తులకు శుద్ధిచేసిన నీటిని అందిస్తారు. ఆర్టీసీ ఉద్యోగులకు రాయితీపై భోజన సౌకర్యం కల్పించారు. దీని కోసం ప్రత్యేక క్యాంటీన్ ఏర్పాటు చేశారు. భోజనం రూ.20, అల్పాహారం రూ.10, టీ రూ.7గా నిర్ణయించారు.రేపటి నుంచి ప్రత్యేక బస్సులు ప్రారంభం 51 కేంద్రాల నుంచి మేడారానికి 3,495 సర్వీస్లు నేడు మేడారంలో బస్ పాయింట్ ప్రారంభంఆర్టీసీ బస్సుల్లో ఇంధనం నింపుకునేందుకు మేడారం రూట్లో ఏడు ప్రైవేట్ పెట్రోల్, డీజిల్ బంకులను లీజ్కు తీసుకున్నారు. మల్లంపల్లిలో రెండు, చెల్పూరు, భూపాలపల్లి, జవహర్నగర్ నగర్, చిన్నబోయినిపల్లి, గోవిందరావుపేటలో ఒక్కో ప్రైవేటు పెట్రోల్ బంకును లీజుకు తీసుకున్నారు. మేడారం, తాడ్వాయి, పస్రా, గట్టమ్మ వద్ద బస్సుల మరమ్మతు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఆరుగురు మెకానిక్లు, ఇద్దరు ఎలక్ట్రీ షియన్లు పని చేస్తారు. ఈ కేంద్రాలతో పాటు 13 మెయింటెనెన్స్ కేంద్రాలు, 15 మొబైల్ వ్యాన్లు, 10 మోటార్ సైకిల్ స్క్వాడ్స్, రెండు క్రేన్లు, 25 ట్రాక్టర్ను సమకూర్చుకున్నారు. ప్రతి మొబైల్ వ్యాన్లో ఒక మెకానిక్, ఒక ఎలక్ట్రీషియన్ ఉంటారు. 12 పెట్రోలింగ్, రిలీఫ్ స్క్వాడ్ బృందాలు, ఒక్క పెట్రోలింగ్ వాహనంలో ఒక అధికారి, సెక్యూరిటీ, మెకానిక్తో పాటు వైర్లెస్, మొబైల్ ఫోన్ కలిగి ఉంటారు. బస్సులకు సమస్య ఉత్పన్నమైనా, ట్రాఫిక్ జామ్ అయినా వీరు వెంటనే చేరుకుని క్లియర్ చేస్తారు. ప్రతి 20 కిలో మేటర్లకు ఒక పెట్రోలింగ్ స్టాఫ్ ఉంటారు. గత ఐదు జాతర్లలో బస్సులు, ప్రయాణికులు, ఆదాయం వివరాలు.. సంవత్సరం 2014 2016 2018 2020 2,022 2,024 బస్సుల సంఖ్య 3,331 3,382 3,563 3,546 3,845 3,491 నడిచిన బస్సుల ట్రిప్పులు 37,963 41,01 46,815 50,600 54,566 36,450 ప్రయాణికుల చేరవేత (లక్షల్లో) 15.32 14.86 17.54 19.10 10.86 16.83 ఆదాయం రూ.కోట్లలో 21.00 24.16 26.46 30.07 21.81 38.05భక్తులు ఆందోళన చెందొద్దు.. భక్తులను సురక్షితంగా, సుఖవంతంగా మేడారానికి చేరవేస్తాం. తిరుగు ప్రయాణంలో బస్సులు లేవనే ఆందోళన చెందొద్దు. భక్తులకు సరిపడా బస్సులు ఉన్నాయి. నైపుణ్యం కలిగిన డ్రైవర్లతో బస్సులు నడుపుతాం. బస్సులు కండీషన్ ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రత్యేక బస్ పాయింట్లలో భక్తులకు సౌకర్యం కల్పించాం. క్యూలైన్ల ద్వారా వెళ్తే తోపులాట లేకుండా బస్సుల్లోకి చేరుకుంటారు. – దర్శనం విజయభాను, ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం -
ముగిసిన రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలు
కమ్మర్పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21న ప్రారంభమైన రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ టోర్నమెంట్ శుక్రవారం ము గిసింది. అండర్–17 బాలబాలికల విభాగంలో ని ర్వహించిన ఈ పోటీల్లో బాలుర విభాగంలో నిజా మాబాద్ జిల్లా జట్టు విజేతగా నిలువగా, రన్నర్గా వరంగల్, తృతీయ స్థానంలో ఆదిలాబాద్ జట్లు నిలిచాయి. బాలికల విభాగంలో విజేతగా నిజామాబాద్, రన్నర్గా మెదక్, తృతీయ స్థానంలో మహబూబ్నగర్ జట్లు నిలిచాయి. ఈ టోర్నమెంట్లో ఒ క్కో విభాగంలో 10 జిల్లా జట్ల చొప్పున 350మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ టోర్నమెంట్లో ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగమణి తెలిపారు. రాష్ట్ర జట్టు వివరాలను శనివా రం జిల్లా కేంద్రంలో వెల్లడిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూలో జరిగే 69 వ జాతీయ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రజట్టుగా పాల్గొంటారని వివరించారు. ఎస్జీఎఫ్ రాష్ట్ర పరిశీలకులు నాగరాజు , వీరేశం, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగా మోహన్, సంయుక్త కార్యదర్శులు ఎం సుజాత, చిప్ప నవీన్, వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఎన్వీ హనుమంత్రెడ్డి, ఎంఈఓ ఆంధ్రయ్య, ఎంపీడీఓ రాజశ్రీనివాస్, పీడీ నాగభూషణం, ఏఎంసీ చైర్మన్ పి.నర్సయ్య, సర్పంచ్ హారిక పాల్గొన్నారు. -
రాజన్నకు తొలిమొక్కులు
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనానికి ముందు వేములవాడ రాజన్నకు తొలి మొక్కులు చెల్లించడం అనాదిగా వస్తున్న ఆచారం. వేములవాడ రాజన్న ఆలయం పునఃప్రతిష్ఠ అభివృద్ధి పనులు చేపట్టారు.. భీమన్న ఆలయంలో రాజన్న దర్శనాలను ఏర్పాటు చేశారు.. అయినప్పటకీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడంలేదు. శివసత్తుల హోరు మేడారం జాతర వచ్చిందంటే అడుగడుగునా శివసత్తుల హోరు కనిపిస్తోంది. శివవసత్తులు జోలెపట్టుకొని బియ్యాన్ని సేకరించి, ఆ బియ్యాన్ని నైవేధ్యంగా వండి ఇంటిలోని శంకరుడికి సమర్పిస్తారు. ఆ తర్వాత ఇంటిలో ఐదుగురు పార్వతులను ఆహ్వానించి ఒడిబియ్యం, కుడుక, పోక, ఖర్జూర, రవికముక్కను అందజేస్తారు. అనంతరం ఇంట్లో పూజ చేసుకుని వేములవాడలో రాజన్నను దర్శించుకుని.. కోడె కట్టడం, కుంకుమ పూజ, ఆకు పూజ, అన్నపూజ చేసి శివపార్వతులకు మొక్కులు, కానుకలను సమర్పిస్తారు. అనంతరం వేములవాడలోనే ఉన్న బద్దిపోచమ్మకు ఒడిబియ్యం, కోళ్లు, మేకలు, బోనం, బెల్లం శాఖ, కల్లు ఆరబోసి మొక్కులు చెల్లిస్తారు. వనదేవతలకు మొక్కులు వేములవాడకు వెళ్లివచ్చిన భక్తులు మేడారం సమ్మక్క సారలమ్మల వద్దకు చేరుకొని అటవీ ప్రాంతంలో బస చేసి అక్కడే తల్లులకు మొక్కులు చెల్లిస్తారు. తల్లులకు ఎంతో ఇష్టమైన ఎత్తుబంగారం(బెల్లం) సమర్పించి చల్లంగ చూడండి తల్లులారా.. అంటూ వేడుకుంటారు. ఆతర్వాత కోళ్లు, మేకలను తల్లులకు బలిచ్చి వంటలు చేసుకొని సహపంక్తిభోజనాలు చేస్తారు ఒడిబియ్యం, చీర సారెతో బద్దిపోచమ్మకు బోనం తర్వాత సమ్మక్క–సారలమ్మకు బంగారం మహాజాతరకు ముందు అనాదిగా వస్తున్న ఆచారం 52 ఏళ్ల నుంచి పోతున్నా..వేములవాడ రాజన్న గుడికి 52 ఏళ్ల నుంచి పోతున్నా. మేడారం జాతరకు కూడా పోయి వస్తున్నా. పిల్లాపాపలు కుటుంబాన్ని తల్లులు సల్లంగ ఉంచుతారు. మేడారం జాతర ముందు వేములవాడకు పోయిరావడం ఆనవాయితీగా వస్తుంది. శివసత్తులను ఇంటింటికీ పిలిచి ఒడిబియ్యం పోస్తారు. –గాజుల కొమురమ్మ, శివసత్తి -
వనదేవతలు ఆత్మగౌరవానికి ప్రతీకలు
హన్మకొండ కల్చరల్: వనదేవతలు సమ్మక్క–సారలమ్మ ఆత్మగౌరవానికి ప్రతీకలని, జానపద గిరిజన పీఠంలో సమ్మక్క–సారలమ్మ జాతరపై పరిశోధనలు జరిగాయని, 2008లో మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర పుస్తకాన్ని తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిందని జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న తెలిపారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, తెలంగాణ డ్రమెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 29న హనుమకొండలోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో సమక్క–సారలమ్మ పద్యనాటక ప్రదర్శన జరుగనుంది. ఈ మేరకు శుక్రవారం వరంగల్ హంటర్రోడ్డులోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠంలో నాటక ప్రదర్శన వాల్పోస్టర్ను వెంకన్న ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు అకుల సదానందం, పీఠం జూనియర్ అసిస్టెంట్ అమేర్అలీఖాన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ శ్రీమంతుల దామోదర్, డాక్టర్ బాసాని సురేశ్, డాక్టర్ చూరేపల్లి రవికుమార్, అబ్బు గోపాల్రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ డాక్టర్ గంపా సతీశ్, సిబ్బంది విజయలక్ష్మి, అంజనేయులు, అశోక్, విద్యార్థులు శాంతి, శాలిని పాల్గొన్నారు. జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న సమ్మక్క–సారలమ్మ పద్యనాటక ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ -
కలెక్టరేట్లో క్యాంటీన్ నిర్వాహకురాలికి సన్మానం
న్యూశాయంపేట: వరంగల్ మట్టెవాడకు చెందిన మొగిలి శ్రీదేవి.. ప్రధానమంత్రి ముద్ర యోజన ప్రథకం ద్వారా యూబీఐ నక్కలగుట్ట శాఖలో రూపాయి వడ్డీకి రుణం పొంది వరంగల్ కలెక్టరేట్ ప్రాంగణంలో టీ స్టాల్ నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. న్యూఢిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి ఆహ్వానం అందుకున్న ఆమెను భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం సన్మానించారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎండీ డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఆర్గనైజర్ శ్రవణ్, సభ్యులు శైలజ, ఆడెపు రవివర్మ, డోలి ఎల్లయ్య, ఇనుముల రమేష్, కట్టమల్లు, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో ఆలస్యమెందుకు?
వరంగల్ అర్బన్: టెండర్లు, అగ్రిమెంట్లు పూర్తయినా అభివృద్ధి పనులు ప్రారంభించడంలో ఆలస్యమెందుకని నగర మేయర్ గుండు సుధారాణి ఇంజనీర్లపై అసహనం వ్యక్తం చేశారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో అభివృద్ధి పనులపై గురువారం మేయర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. పెండింగ్లో ఉన్న పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు స్పందించకపోతే నోటీసులు ఇచ్చి టెండర్ రద్దు చేసి, రీకాల్ చేయాలని మేయర్ సూచించారు. అనంతరం హనుమకొండ బాలసముద్రంలోని వెహికిల్ షెడ్డును మేయర్ తనిఖీ చేశారు. సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ వాహనాల మరమ్మతుల్లో వేగం పెంచాలని సూచించారు. సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈలు రవికుమార్, మాధవీలత, మహేందర్, డీఈలు కార్తీక్రెడ్డి, రాజ్కుమార్, రాగి శ్రీకాంత్, శానిటరీ సూపర్వైజర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయండి నగర మేయర్ గుండు సుధారాణి -
వరంగల్ బస్టాండ్ పనుల్లో వేగం పెంచాలి
అధికారుల సమీక్షలో కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: వరంగల్లో చేపట్టిన బస్టాండ్ పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆ జిల్లా కలెక్టర్ సత్యశారద అన్నారు. కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, వైస్ చైర్ పర్సన్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టరేట్లో గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇన్నర్ రింగ్రోడ్డుకు సంబంధించిన పెండింగ్ చెల్లింపులు సమీక్షించి బిల్లులు క్లియర్ చేయాలన్నారు. రోడ్డు పనుల విషయంలో ఫేజ్–1లో పూర్తయిన పనుల పురోగతిని పరిశీలించి ఫేజ్–2లో రోడ్ల నిర్మాణానికి భూసేకరణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నగరంలోని ఉర్సుగుట్ట, దామెర చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులు వేగంగా చేయాలని ఆదేశించారు. పైడిపల్లి ప్రాంతం సుందరీకరణ, పాకాల సరస్సులో కొనసాగుతున్న పనులపై సమీక్ష నిర్వహించి మరింత అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఖిలావరంగల్ పురావస్తుశాఖ మ్యూజియంలోని మౌలిక వసతుల నిర్వహణ, సందర్శకుల సౌకర్యాలపై ఆరా తీశారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో 5 ఎకరాల స్థలాన్ని అభివృద్ధి కోసం కుడాకు అప్పగించాలని జోనల్ మేనేజర్ను ఆదేశించారు. సమావేశంలో వరంగల్ ఆర్డీఓ సుమ, కుడా సీపీఓ అజిత్రెడ్డి, కాకతీయ మెగాటెక్స్టైల్ పార్క్ జీఎం స్వామి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పనిచేయాలి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. ఈనెల ఒకటి నుంచి 31 వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం నేపథ్యంలో కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. బాలలను పనిలోకి తీసుకునే యాజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి రాజమణి, డీఈఓ రంగయ్యనాయుడు, డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీసీపీఓ ఉమ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ వసుధ, సభ్యులు షాహెదా, మధు, సుజాత, రామలీల పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 2026
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం : ఫైరింగ్ సాధనలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి రివార్డులను అందజేయనున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. వార్షిక ఫైరింగ్ సాధనలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్ విభాగానికి చెందిన పోలీస్ సిబ్బందితో పాటు శాంతి భద్రతలకు చెందిన పోలీస్ అధికారులు రెండు రోజులుగా ధర్మసాగర్ మండల కేంద్రం శివారు ప్రాంతంలోని ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ సాధన చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సీపీ సన్ప్రీత్ సింగ్తో పాటు పోలీస్ అధికారులు పాల్గొని వివిధ రకాల తుపాకులతో సాధన చేశారు. కార్యక్రమంలో డీసీపీలు అంకిత్కుమార్, కవిత, రాజమహేంద్రనాయక్, ఏఎస్పీలు చేతన్, శుభం, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్రా, అదనపు డీసీపీలు సురేశ్కుమార్, రవి, ప్రభాకర్ రావు, శ్రీనివాస్, బాలస్వామి పాల్గొన్నారు. -
రాతికోట కూలిన చోట మరమ్మతులు
ఖిలా వరంగల్: వారసత్వ సంపదను పరిరక్షించేందుకు ఏఎస్ఐ ముందుకొచ్చింది. గత ఏడాది అక్టోబర్లో మోంథా తుపాన్ ప్రభావం వల్ల ఖిలావరంగల్ రాతికోట పశ్చిమ ముఖ ద్వారం వద్ద కూలింది. దీనిని మరమ్మతు చేసేందుకు కేంద్ర పురావస్తుశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాతికోట కూలిన బండరాళ్లను తిరిగి యథాస్థానంలో అమర్చేందుకు గురువారం పనులు ప్రారంభించింది. చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం కలగకుండా నిపుణుల పర్యవేక్షణలో పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. బండరాళ్లను పైకి లిఫ్ట్ చేసి పాతస్థానంలో అమర్చేందుకు భారీయంత్రాలను వినియోగించనున్నారు. మరమ్మతుల వల్ల స్థానికులకు ఎలాంటి ఆసౌకర్యం కలగకుండా ముందుస్తుగానే బారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతా చర్యలు తీసుకుంది. -
పీఎంశ్రీ ఉన్నత పాఠశాలల టీచర్లకు శిక్షణ షురూ
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని 16 పీఎంశ్రీ ఉన్నత పాఠశాలల టీచర్లకు రెండో విడత కరుణాపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇంటిగ్రేటెడ్ కంప్యూటర్ ట్రైనింగ్ (ఐసీటీ)పై గురువారం శిక్షణ ప్రారంభించారు. విద్యార్థులకు కంప్యూటర్ బోధించేందుకు ఐసీటీపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. గూగుల్ స్టోర్, గూగుల్ షీట్, గూగుల్ డాక్యుమెంట్ తదితర కంప్యూటర్ సంబంధిత ప్రాథమిక అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ సమగ్రశిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్ మన్మోహన్ తెలిపారు. హైదరాబాద్లో శిక్షణ పొందిన డీఆర్పీలు రెండు రోజుల్లో 185 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. హన్మకొండ కల్చరల్: వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్గా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత గురువారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ ధార్మిక భవన్లోని దేవాదాయ ధర్మాదాయశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భద్రకాళి ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు, ఆలయ పరిశీలకుడు క్రాంతికుమార్, సిబ్బంది కూచన హరినాఽథ్, అలుగు కృష్ణ, చింత శ్యాం, దేవాదాయశాఖ సిబ్బంది తదితరులు డీసీ రామల సునీతను శాలువాతో సత్కరించారు. అలాగే, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొనుపునూరి వీరన్న, వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి శ్రీనివాసులు, జాయింట్ సెక్రటరీ దాచేపల్లి సీతారాం, డిస్ట్రిక్ట్ గవర్నర్ మంచాల విజయ్కుమార్ తదితరులు సునీతకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. విద్యారణ్యపురి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యార్థులు, అధ్యాపకులకు ఎఫ్ఆర్ఎస్ హాజరును అమలు చేస్తున్న విషయం విదితమే. ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా అధ్యాపకులతో గత ఏడాది సెప్టెంబర్లో తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించారు. మళ్లీ కొనసాగింపుగా ఈనెల 23న అధ్యాపకులు, తల్లిదండ్రుల సమావేశాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 50 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 2 నుంచి, 25 నుంచి ఇంటర్ థియరీ పరీక్షలు నిర్వహించనున్నారు. హనుమకొండ జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్, ఒకేషనల్ కలిపి 2,689 మంది విద్యార్థులు, సెకండియర్లో 2,018 మంది విద్యార్థులు చదువుతున్నారు. వరంగల్ జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం 1,200 మంది సెకండియర్లో 1,150 మంది విద్యార్థులు చదువుతున్నారని అధికారులు తెలిపారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ 9వ సమావేశం నిర్వహించనున్నట్లు హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ విభాగం అధిపతి డాక్టర్ చిలువేరు రాజ్కుమార్ తెలిపారు. ఈమేరకు క్యాంపస్లో గురువారం పోస్టర్ను వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ టి.మనోహర్, ఆచార్యులు బి.సురేశ్లాల్, ఆర్.మల్లికార్జున్రెడ్డి, చంద్రకళ, వీఎస్ నరేందర్, కుమారస్వామి, ఎంకే సుమంత్, శంకర్ పాల్గొన్నారు. -
బలవంతపు బదిలీలు
హన్మకొండ: ఉద్యోగులను విద్యుత్ సంస్థల యాజమాన్యాలు బలవంతంగా బదిలీ చేస్తున్నాయి. జూన్, జూలైలో మాత్రమే చేయాలని, మధ్యలో బదిలీలు ఎలా చేస్తారని సంఘాలు, అసోసియేషన్లు ప్రశ్నించినా పట్టించుకోవడం లేదు. టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం డిసెంబర్ 27న హనుమకొండలోని ప్రధాన కార్యాలయంలో ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పుడే బదిలీలు వద్దని సంఘాలు, అసోసియేషన్ల ప్రతినిధులు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అయినా టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం బదిలీలు చేపట్టేందుకు బుధవారం రాత్రి షెడ్యూల్ విడుదల చేసింది. బదిలీ షెడ్యూల్.. బదిలీకి అర్హులైన జాబితాను ఈనెల 23 నాటికి టీజీ ఎన్పీడీసీఎల్ పోర్టల్లో నిక్షిప్తం చేస్తారు. జాబితాపై 25న మధ్యాహ్నం 2 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. 26 నుంచి 27 వరకు బదిలీ దఖాస్తులు, ఆప్షన్లు ఇవ్వాలి. 30న బదిలీల ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ నెల 31 నుంచి యథావిధిగా బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుంది. సాధారణంగా ఫోకల్ పోస్టుల నుంచి నాన్–ఫోకల్ పోస్టులకు బదిలీలు ఉంటాయి. పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు బదిలీ అయ్యే వారికి, ఖాళీగా ఉన్న గ్రామీణ ప్రాంత పోస్టులను భర్తీ చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. గుర్తింపు పొందిన కొన్ని సంఘాల నాయకులకు రెండుసార్లు మాత్రమే బదిలీల నుంచి మినహాయింపు ఇస్తారు. ఇద్దరు ఉద్యోగుల మధ్య పోటీ ఏర్పడితే, ప్రస్తుత కేడర్లో ఎక్కువ సర్వీసు ఉన్నవారికి, ఆ తర్వాత వయస్సులో పెద్దవారికి ప్రాధాన్యం ఇస్తారు. బదిలీలకు అర్హతలు.. జనవరి ఒకటి నాటికి ప్రస్తుత స్థానంలో రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారు బదిలీకి అర్హులు. ప్రతి కేడర్లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సంఖ్యలో గరిష్టంగా 50 శాతానికి మించకుండా ఉద్యోగులను బదిలీ చేస్తారు. ఈ సంవత్సరం డిసెంబర్ 31లోపు రిటైర్మెంట్ అయ్యే వారికి బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. వారు కావాలని కోరుకుంటే బదిలీ చేస్తారు. బదిలీ చేసే అధికారులు.. డివిజన్స్థాయిలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ స్టాఫ్ అయిన జేఎల్ఎం నుంచి లైన్ ఇన్స్పెక్టర్ వరకు సెక్షన్ల మధ్య డివిజనల్ ఇంజనీర్ బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు. సర్కిల్స్థాయిలో సబ్ ఇంజనీర్, ఇతర ఉద్యోగుల్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వరకు జిల్లా ఎస్ఈ సర్కిల్ పరిధిలో బదిలీ చేస్తారు. డిస్కం స్థాయిలో ఏడీఈ, ఏఈ, డీఈ, అకౌంట్స్ ఆఫీసర్ల బదిలీలు కార్పొరేట్ కార్యాలయం నుంచి ఉంటాయి. కార్పొరేట్ కార్యాలయంలో పనిచేసే ఆయా ఇంజనీర్లు, ఆయా అకౌంట్స్ ఆఫీసర్లు, పీ ఆండ్ జీ, పర్సనల్ విభాగం అధికారులను కార్పొరేట్ కార్యాలయంలో వేరే విభాగానికి లేదా ప్రాంతానికి బదిలీ చేస్తారు. రెక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్.. ఒక సర్కిల్ నుంచి మరొక సర్కిల్కు రెక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కోసం జనవరి 1 నాటికి సంవత్సరం సర్వీస్ పూర్తి చేసుకుని ఉండాలి. జేఎల్ఎం, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులు సర్కిల్ మారితే సీనియారిటీని కోల్పోతారు. కొత్త యూనిట్లో చివరి ర్యాంకులకు అంగీకరించాల్సి ఉంటుంది. క్రమశిక్షణ చర్యలు, సస్పెన్షన్లు ఉన్న వారి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోరు. వీరికి ప్రాధాన్యం.. బదిలీల సమయంలో వీరికి ప్రాధాన్యం ఉంటుంది. భార్యాభర్తలు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులైతే వారికి ప్రాధాన్యం ఇస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం డిసెంబర్ 31లోపు రిటైరయ్యే వారికి, 70 శాతం పైబడి అంగవైకల్యం కలిగిన వారికి, మానసిక వికలాంగులు లేదా ఆటిజం ఉన్న పిల్లల తల్లిదండ్రులు, వితంతువులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు (క్యాన్సర్, కిడ్నీ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ వంటివి) ఉన్నవారు, 5 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు. వద్దని ముక్తకంఠంతో చెప్పిన సంఘాలు, అసోసియేషన్లు అయినా షెడ్యూల్ విడుదల చేసిన టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం కసరత్తు ప్రారంభించిన అధికారులు -
‘స్నేహ’ను పటిష్టంగా అమలు చేయాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: కిశోర బాలికలు, బాలుర కోసం జిల్లాలో చేపట్టిన ‘స్నేహ’ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో డీఆర్డీఓ, సెర్ప్, ఇందిరా మహిళాశక్తి మిషన్లో భాగంగా స్నేహ కార్యక్రమం గురువారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. 15–18 సంవత్సరాల వయస్సున్న కిశోర బాలబాలికలకు కౌన్సెలింగ్తో పాటు వైద్య పరీక్షలు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేట్ పాఠశాలల్లోనూ స్నేహ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డీఆర్డీఓ మేన శ్రీను, డీడబ్ల్యూఓ జయంతి, డీఈఓ గిరిరాజ్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, బీసీ వెల్ఫేర్ అధికారి నరసింహస్వామి, డీఐఈఓ గోపాల్, జిల్లా యువజన, క్రీడల అధికారి అశోక్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్సింగ్, మెప్మా డీఎంసీ రజితారాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓలు మదన్మోహన్రావు, ప్రదీప్రెడ్డి, డీఆర్డీఏ డీపీఎం పద్మప్రియ తదితరులు పాల్గొన్నారు. పదిలో వంద శాతం ఫలితాలు సాధించాలి.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా అధికారులు, ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన అధికారుల సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో బోధించాలని, స్లిప్ టెస్టులు నిర్వహించి వారి అభ్యసన స్థాయిని మెరుగుపరచాలని ఆదేశించారు. ఆంగ్ల భాషలో విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. సమావేశంలో డీఈఓ గిరిరాజ్, అసిస్టెంట్ కంట్రోలర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ భువనేశ్వరి, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, జీసీడీఓ సునీత, ఎంఐఎస్ కోఆర్డినేటర్ మహేశ్, ఏఎస్సీ రఘుచంద్రారావు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు
హసన్పర్తి: నగరంలోని 65, 66వ డివిజన్లలో సుమారు రూ.2 కోట్ల విలువైన అభివృద్ధి పనులను బుధవారం మేయర్ గుండు సుధారాణి, ఎంపీ కడియం కావ్యతో కలిసి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. 65వ డివిజన్ దేవన్నపేటలో సుమారు రూ.60 లక్షలు, 66వ డివిజన్ హసన్పర్తిలో సుమారు రూ.1.40 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. రూ.8 లక్షలతో హసన్పర్తి పెద్ద చెరువు కట్టపై ఓపెన్ జిమ్ ఏర్పాటుకు బుధవారం పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గురుమూర్తి శివకుమార్, దివ్యరాణి, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి, దేవస్థాన కమిటీ చైర్మన్ ఆరెల్లి వెంకటస్వామి, ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు వీసం సురేందర్రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్రె కిరణ్, దేవస్థాన మాజీ చైర్మన్ జె.రవి, పెద్దమ్మ నర్సింహారావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పిట్టల కుమారస్వామి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ చకిలం రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు మార్కండేయ స్వామి జయంతిని పురస్కరించుకుని ఆలయంలో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సట్కూరి సంతోశ్, కేదారి రాకేశ్, కేదారి, వెంకటేశ్వరు, కిరణ్, చీరాల రవి తదితరులు పాల్గొన్నారు. పెద్ద చెరువుకట్టపై ఓపెన్ జిమ్ ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్ -
మద్యం మత్తులోనే ప్రమాదాలు
హసన్పర్తి: మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. రహదారి ప్రమాదాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్–అలైవ్’లో భాగంగా భీమారంలోని స్కిల్ స్టోక్ ఇంటర్నేషనల్ పాఠశాలలో కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీపీ సన్ప్రీత్సింగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతేడాది తెలంగాణలో రోడ్డు ప్రమాదాల కారణంగా 7,500 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రూపొందించిన ‘అరైవ్–అలైవ్’ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, సెంట్రల్ జోన్ డీపీపీ దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్ర భాకర్రావు, ఏసీపీ సత్యనారాయణ, ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్లు సీతారెడ్డి, సుజాత, వెంకన్న, శ్రీనివాస్, కేయూసీ ఇన్స్పెక్టర్ రవికుమార్, స్కిల్ స్టోక్ పాఠశాల డైరెక్టర్ ఎర్రబెల్లి అనూప్కుమార్ పాల్గొన్నారు. క్రమశిక్షణతో వాహనాలు నడపాలి పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ -
రీ సర్వేతో భూ సమస్యలకు చెక్
హసన్పర్తి: భూవివాదాల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు అడుగులు వేసింది. భూభారతి చట్టం ద్వారా 1922 నాటి రికార్డులకు స్వప్తి పలకనున్నారు. అత్యాధునిక సాంకేతికతో భూసర్వేకు ముందడుగు వేసింది. గ్రామాల్లో భూ కమతాలు విడిపోవడం, విీస్తీర్ణాలు మారడం వల్ల క్షేత్రస్థాయిలో హద్దులు వివాదాలు పెరిగిపోతున్నాయి. ఈవివాదాలను అధిగమించడానికి ప్రతీ ఇంచు భూమిని కూడా డిజిటల్ పద్ధతిలో సర్వేకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈసర్వే పూర్తయిన తర్వాత ప్రతీ భూకమతానికి ప్రత్యేక భూధార్ నంబర్ కేటాయించనున్నారు. ఇది రైతులకు తమ భూమిపై పూర్తి భద్రత, యాజమాన్య హక్కులను కల్పిస్తోంది. రెండు పైలట్ గ్రామాల ఎంపిక రీ సర్వే కోసం హనుమకొండ జిల్లాలోని హసన్పర్తి మండలం ముచ్చర్ల, ధర్మసాగర్ మండలంలోని జానకీపురం గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. సర్వేను వేగంగా పూర్తి చేసేందుకు లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించింది. సాగులో ఉన్న భూమి ఆధారంగా ఎంజాయ్మెంట్ సర్వే చేపట్టనున్నారు. సాధ్యమైనంత త్వరలోనే పని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద వివాదాలు ఉన్న గ్రామాలను ఎంపిక చేయనున్నారు. కాగా, రీ సర్వే చేపట్టడానికి గ్రామాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. గ్రామాల రైతులతో పాటు వివిధ వర్గాలకు చెందిన వారిని ఆహ్వానించనున్నారు. రీ భూసర్వే ద్వారా ఉన్న ప్రయోజనాలు వివరించనున్నారు. సర్వే నంబర్ల వారీగా కొత్త మ్యాప్లు భూధార్ నంబర్ల కేటాయింపు పైలట్ ప్రాజెక్ట్గా రెండు గ్రామాల ఎంపిక -
మహాశివరాత్రి, రంజాన్కు పటిష్ట ఏర్పాట్లు
● హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: జిల్లాలో మహాశివరాత్రి, రంజాన్ పండుగల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ స్నేహ శబరీష్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. మహాశివరాత్రి సందర్భంగా నగరంలోని ప్రధాన శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని వసతులు కల్పించాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహించాలని సూచించారు. రంజాన్ ప్రార్థనల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ముసీదులు, ఈద్గా ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, మంచినీటి సదుపాయం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ గతంలో చేసిన ఏర్పాట్ల కంటే ఈసారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, దేవాదాయ శాఖ ఉప కమిషనర్ రామల సునీత, జిల్లా అదనపు కలెక్టర్ రవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ అజీజ్ ఖాన్, డీఆర్ఓ వైవీ గణేశ్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, ఏసీపీ నరసింహారావు, విద్యుత్ శాఖ ఎస్ఈ మధుసూదన్, ఇతర శాఖల అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు. -
మండమెలిగె.. జాతర మొదలాయె..
చలిగంజి, పాలు, సారా, బెల్లంపాకం, పవిత్ర శుద్ధజలాన్ని ధూపంతో నేలపై ఆరగింపు చేస్తున్న పూజారులు బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు సమ్మక్క, సారలమ్మ పూజాసామగ్రితో మేడారం గద్దెల వద్దకు చేరుకుంటున్న పూజారులు సంప్రదాయబద్ధంగా నిర్వహించిన మండమెలిగె పూజలతో మేడారం మహాజాతర ఆరంభమైంది. బుధవారం మేడారం, కన్నెపల్లిలోని ఆలయాల్లో సమ్మక్క– సారలమ్మ పూజారులు ఆచార సంప్రదాయాలతో అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు జరిపారు. దిష్టి తగలకుండా ప్రధాన కూడళ్లలో సొరకాయ, కోడిపిల్ల, మామిడి ఆకులతో తోరణాలు కట్టారు. రాత్రంతా గద్దెల వద్ద జాగారాలు చేసి సంబురాలు జరిపారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. – ఎస్ఎస్తాడ్వాయి● మేడారం, కన్నెపల్లిలో ఆలయాల్లో పూజలు ● అమ్మవార్ల గద్దెల వద్ద జాగారాలతో రాత్రంతా సంబురాలు


