breaking news
Hanamkonda District Latest News
-
ఆర్టీసీలో డివిజన్ల కుదింపు
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో సివిల్ విభాగం డివిజన్ కార్యాలయాలు పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు ఆర్టీసీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. పునర్వ్యవస్థీకరణ పేరుతో డివిజన్ కార్యాలయాలను కుదించేందుకు ఆర్టీసీ యాజమాన్యం పూనుకుంది. 20 ఏళ్లుగా సివిల్ విభాగంలో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ చేపట్టకపోవడంతో ఉన్నతస్థాయి పోస్టులు మినహా మిగతా అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ చేపట్టాల్సి ఉండగా సివిల్ విభాగాన్ని కుదించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా నిరసన, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సివిల్ విభాగం అభివృద్ధి పనులు పర్యవేక్షించే వారు లేకపోగా, డివిజన్లను కుదించడం ద్వారా పర్యవేక్షణ కొరవడుతుందని, అభివృద్ధి పనులు కుంటుపడుతాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈఈగా 6 డివిజన్ కార్యాలయాలు.. టీజీఎస్ ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా బస్భవన్లోని కార్యాలయం కాకుండా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నతాధికారిగా 6 డివిజన్ కార్యాలయాలున్నాయి. వీటి పరిధిలో రీజియన్ కార్యాలయాలు కేంద్రంగా డిప్యూటీ ఇంజనీర్లు అధికారిగా సబ్ డివిజన్ కార్యాలయాలున్నాయి. అదేవిధంగా క్షేత్రస్థాయిలో పనుల నిర్వహణ, పర్యవేక్షణకు అసిస్టెంట్ ఇంజనీర్లు ఉంటారు. రాష్ట్రస్థాయిలో చీఫ్ సివిల్ ఇంజనీర్ ఉంటారు. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ రూరల్, హైదరాబాద్ అర్బన్, సికిందాబాద్, హైదరాబాద్ హెడ్క్వార్టర్ డివిజన్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇందులో వరంగల్, హైదరాబాద్ అర్బన్ డివిజన్ కార్యాలయాలను ఎత్తివేయడానికి రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వరంగల్ సివిల్ డివిజన్లో రెండు రీజియన్లు.. వరంగల్ సివిల్ డివిజన్ పరిధిలో ప్రస్తుతం నల్ల గొండ, వరంగల్, ఖమ్మం రీజియన్లున్నాయి. హైదరాబాద్ అర్బన్ సివిల్ డివిజన్ పరిధిలో సిటీ డిపోలున్నాయి. వరంగల్ సివిల్ డివిజన్ను కరీంనగర్ డివిజన్లో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో వరంగల్ డివిజన్ పరిధిలోని వరంగల్, ఖమ్మం రీజియన్ను కరీంనగర్ సివిల్ డివిజన్ పరిధిలోకి విలీనం చేయనున్నారు. నల్లగొండ రీజియన్ను హైదరాబాద్ జోన్ డివిజన్ కార్యాలయంలో విలీనం చేయనున్నారు. విలీనం అనంతరం హైదరాబాద్ జోన్ సివిల్ డివిజన్ పరిధిలో నల్లగొండతో పాటు మహబూబ్నగర్, మెదక్, రంగారెడ్డి రీజియన్లు ఉండనున్నాయి. కరీంనగర్ సివిల్ డివిజన్ పరిధిలో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం రీజియన్లు ఉండనున్నాయి. ఒక్క ఈఈకి నాలుగైదు రీజియన్ల బాధ్యతలు.. ఈక్రమంలో ఈఈలకు పర్యవేక్షణ కష్టతరం కానుంది. ఒక్క ఈఈ నాలుగైదు రీజియన్లను పర్యవేక్షించడం అంత సులువు కాదు. కరీంనగర్లో ఉంటూ ఖమ్మం, ఆదిలాబాద్ వంటి సుదూర ప్రాంతాల్లోని డిపోల పరిధిలో జరిగే అభివృద్ధ పనులు పర్యవేక్షించడం ఆషామాషీ కాదని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే అన్ని రీజియన్లలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో డీఈఈలు చేయాల్సిన పర్యవేక్షణ కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (ఈఈ)లు చేయాల్సి వస్తోంది. దీంతో పాటు కార్యాలయం పనులు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అభివృద్ది పనుల పర్యవేక్షణ కొరవడనుంది. మాయంకానున్న వరంగల్, హైదరాబాద్ అర్బన్ డివిజన్లు కొరవడనున్న పర్యవేక్షణ.. అభివృద్ధి పనులు మరింత ఆలస్యం 20 ఏళ్లుగా చేపట్టని సివిల్ ఇంజనీర్ల నియామకాలు ఏళ్లుగా డిప్యూటీ ఇంజనీర్లు, ఏఈల పోస్టులు ఖాళీవరంగల్ రీజియన్లో రూ.5.91 కోట్లతో ఏటూరునాగారంలో బస్ డిపో నిర్మాణం, రూ.4.8 కోట్లతో ములుగు బస్స్టేషన్, రూ.51 లక్షలతో మంగపేట బస్ స్టేషన్ నిర్మాణం, ఖమ్మం రీజియన్లో రూ.9.41 కోట్లతో మధిర బస్ స్టేషన్ నిర్మాణం, నల్ల గొండ రీజియన్లో రూ.17 కోట్లతో కోదాడలో బస్ స్టేషన్, రూ.3.53 కోట్లతో హుజుర్నగర్లో బస్ స్టేషన్ నిర్మాణ వంటి మేజర్ పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు ఇతర సివిల్ అభివృద్ధి పనులు సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆయా డివిజన్లలో రూ.కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు సాగుతున్నాయి. డివిజన్ల కుదింపు, డీఈల కొరతతో పర్యవేక్షణ లేక పనులు కుంటుపడే అవకాశముంది.టీజీఎస్ ఆర్టీసీలో 20 ఏళ్లుగా సివిల్ విభాగంలో ఇంజనీర్ల రిక్రూట్మెంట్ చేపట్టలేదు. దీంతో ఖాళీగా ఉన్నా ఏఈ పోస్టుల్లో కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగుల్లో సివిల్ ఇంజనీరింగ్, సివిల్ డిప్లొమా, సివిల్ ఐటీఐ చేసిన వారిని అదనపు డ్యూటీల్లో భాగంగా ఏఈ పనులు చూసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో ఏఈలుగా ఔట్సోర్సింగ్ ద్వారా దాదాపు 37 మంది, సంస్థకు చెందిన 20 మంది ఓడీగా ఏఈలుగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ అర్బన్–1, హైదరాబాద్ అర్బన్–2, మెదక్, మహబూబ్నగర్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం, సికింద్రాబాద్–1 డీఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పాటు డీఈ పీ అండ్ డీ ఈనెల రిటైర్డ్ కానున్నారు. -
ప్రజాప్రతినిధులు భాగస్వాములవ్వాలి
హన్మకొండ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్న్స్ హాలులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై గ్రామీణ, పట్టణ ప్రజాప్రతినిధులకు నిర్వహించిన అవగాహన సదస్సును మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామాలు, డివిజన్ల అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఇందులో పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలను గ్రామాభివృద్ధిలో భాగస్వాములను చేయాలని సూచించారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్, డీఆర్డీఓ మేన శ్రీను, తదితర అధికారులు 99 రోజుల కార్యాచరణపై ప్రజాప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు, పారిశుద్ధ్యం, ఇతర అంశాలపై జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రతిబింబించే విధంగా ఏర్పాటుచేసిన ఫొటోప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఎండీ అజీజ్ ఖాన్, పరకాల మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్, జడ్పీ సీఈఓ శేషాద్రి, అధికారులు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి -
జోయలుక్కాస్ నమ్మకమైన బ్రాండ్
హన్మకొండ: జోయలుక్కాస్ అంటేనే నమ్మకమైన బ్రాండ్ అని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జోయాలుక్కాస్ హనుమకొండ నక్కలగుట్టలో ఏర్పాటు చేసిన రెండో షోరూంను ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్.నాగరాజుతో కలిసి ప్రారంభించారు. షోరూంలో విక్రయానికి ఉంచిన ఆభరణాలను పరిశీలించారు. సినీ నటి అంతారా స్వర్ణకార్ షోరూం ఓపెనింగ్లో సందడి చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ వినియోగదారులకు సరసమైన ధరలకు ఆభరణాలు అందించాలన్నారు. కేరళలోని కొట్టాయంలో ప్రారంభించిన జోయలుక్కాస్ 40 దేశాల్లో 190 షోరూంలు కలిగి ఉందన్నారు. నమ్మకం, విశ్వాసం, మన్నికకు పేరెన్నికగన్నదన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన డైమండ్లను అందిస్తోందన్నారు. జోయ లుక్కాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ మాథ్యు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరుసగా మూడు రోజుల్లో నాలుగు కొత్త షోరూంలు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. దేశంలో వ్యాపార విస్తరణలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అన్నారు. కస్టమర్ డిమాండ్ను అందుకోవడానికి బ్రాండ్ బలమైన నిబద్ధతను ఈ విస్తరణ నొక్కి చెబుతుందన్నారు. జోయలుక్కాస్లో ఒకే చోట బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లు, ప్లాటినం, వివాహ ఆభరణాల విస్తృతి శ్రేణిని చూడొచ్చని వివరించారు. వ్యక్తిగతీకరించిన సేవల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండ్ గుర్తింపు పొందిందన్నారు. ఈ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జోయలుక్కాస్ ఈ నెల 29 వరకు తయారీ చార్జీలపై ఫ్లాట్ 40 శాతం తగ్గింపుతో పరిమిత కాలపు ప్రారంభ ఆఫర్ అందిస్తోందన్నారు. తమ షోరూంల ద్వారా అందిస్తున్న ఆభరణాలు పై నమ్మకాన్ని బలోపేతం చేయడానికి వ్యాపార విస్తరణలో భాగంగా తమ చైర్మన్ జోయలుక్కాస్ కొత్తగా షోరూంలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జోయలుక్కాస్ సీఓఓ హెన్రీ జార్జ్, మార్కెటింగ్ హెడ్ అనిశ్ వర్గీస్, రిటైల్ హెడ్ రాజేశ్ కృష్ణన్ పాల్గొన్నారు. వినియోగదారులకు సరసమైన ధరలకు అందించాలి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ -
దొంగల ముఠా అరెస్ట్..
హసన్పర్తి : వ్యవసాయ మోటార్ల చోరీలకు పాల్ప డుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాకు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాల తనిఖీ సందర్భంగా వంగపల్లి వద్ద సీసీఎస్, కమలాపూర్ పోలీసులు ఆ ముఠాను పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత వివరాలు వెల్లడించారు. పె ద్దపల్లి జిల్లా ఓదెల గ్రామ తారకరామ కాలనీకి చెందిన సిరిగిరి ప్రసాద్, మంచిర్యాల జిల్లా చున్నంబట్టి కాలనీకి చెందిన మోతె రాజు, గోదావరిఖని ప్రగతినగర్కు చెందిన టేకు నవీన్, మంచిర్యాల టౌన్కు చెందిన వారణాసి లక్ష్మణ్, మంచిర్యాల జిల్లా గాంఽధీనగర్కు చెందిన మోటం తిరుపతి, మోటం నరేశ్, మంచిర్యాల జిల్లా భగత్సింగ్ నగర్కు చెందిన వస్తం భీమేశ్ ముఠాగా ఏర్పడ్డారు. మద్యానికి బానిసైన వీరు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకు వ్యవసాయ బావులు, కాల్వల వద్ద అమర్చిన మోటార్లను అపహరిస్తూ జల్సాలు చేస్తున్నారు. ఈక్రమంలో వరంగల్ పోలీస్ కమి షనరేట్ పరిఽధిలోని కమలాపూర్, దామెర పోలీస్స్టేషన్లు, భూపాలపల్లి జిల్లా రేగొండ పీఎస్ పరిధిలోని కేశవపట్నంలో మోటార్లు అపహరించారు. ఫిర్యాదు మేరకు రంగంలోకి.. ఆయా గ్రామాల రైతుల ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కమలాపూర్ మండలం వంగపల్లి వద్ద వాహన తనిఖీలు చేశారు. ఈక్రమంలో ఆటో ట్రాలీ, కారును తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వీరిని అదుపులోకి తీసుకుని వి చారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు. దీంతో ఏడుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 71 వ్యవసాయ మోటార్లు స్వాధీనం చేసుకుని ఆటోట్రాలీ, కారు సీజ్చేసినట్లు డీసీపీ వెల్లడించారు. నిందితులకు నేర చరిత్ర ఉందని డీసీపీ చె ప్పారు. కరీంనగర్, రామగుండం కమిషనరేట్ పరిధిలో ట్రాన్స్ఫార్మర్ల వైర్ను అపహరించిన కేసుల్లో నిందితులు జైలుకెళ్లారని డీసీపీ తెలిపారు. పోలీసు అధికారులకు అభినందనలు.. కేసును ఛేదించిన సీపీఎస్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్, రామకృష్ణ, కమలాపూర్ ఇన్స్పెక్టర్ నవీన్, ఐటీ కోర్ టీం ఏఏఓ మహ్మద్ సల్మాన్ పాషా, ఎస్సై శ్రీనివాస్, రాజు, హెడ్ కానిస్టేబుల్ నసీమ్ మహ్మ ద్, మహేశ్వర్, జంపయ్య, విశ్వేశ్వర్, వంశీ, వినోద్, కమలాపూర్ ఎస్సై దిలీప్ను డీసీపీ అభినందించారు. సీపీఎస్, కాజీపేట ఏసీపీలు సదయ్య, ప్రశాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 71 వ్యవసాయ మోటార్లు స్వాధీనం ఆటో ట్రాలీ, కారు సీజ్ వివరాలు వెల్లడించిన సెంట్రల్ జోన్ డీసీపీ కవిత -
పదవి బాధ్యత.. అలంకారం కాదు
ఇదిలా ఉండగా శిక్షణ కార్యక్రమానికి నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు దొంతి మాధవరె డ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, నాగరాజు హాజరు కాకపోవ డం చర్చనీయాంశంగా మారింది. మంత్రి వెళ్లిపోయిన తర్వాత సాయంత్రం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు.గీసుకొండ: ‘పదవి అనేది బాధ్యత.. అంతేకాని అ లంకారం కాదు.. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజ ల్లో ఉండి వారి సమస్యలు తీర్చడానికి కృషిచేసి ఎ న్నటికీ గుర్తుండిపోయేలా సేవలు అందించాలి’ అ ని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మండలంలోని మరి యపురం శివారులోని ఎస్ఎస్ గార్డెన్స్లో జిల్లాలోని సర్పంచ్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేట ర్లు, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ కౌన్సిలర్లకు ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై గురువారం ఒక ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ మహిళా సర్పంచ్లు భర్త చాటు భార్యలుగా ఉండవద్దని, వారి అభిప్రాయాలు గౌరవిస్తూనే ముందుకు సాగా లని హితవు పలికారు. అధికారం ఉంది కదా అని విర్రవీగితే ప్రజలు తమ ఓటు హక్కుతో బుద్ధి చెబు తారని అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలని సూచించారు. ఏదో దోచుకుందాం అని వచ్చే వారు చరిత్ర హీనులుగా మిగులుతారన్నారు. సమావేశంలో గ్రేటర్ వరంగల్ నగర మేయ ర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట, నర్సంపేట ము న్సిపల్ చైర్మన్లు సారంగపాణి, పెండ్యాల లక్ష్మి, డీసీ పీ అంకిత్కుమార్, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, గీసుకొండ తహసీల్దార్ రియాజుద్దీన్, ఎంపీడీఓ కృష్ణవేణి, ఎంపీఓ శ్రీనివా స్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కాగా, ఇటీవల మరణించిన గంగదేవిపల్లి మాజీ స ర్పంచ్ కూసం రాజమౌళికి ప్రతినిధులు, అధికారులు మౌ నం పాటించి నివాళులర్పించారు. అంతకు ముందు పలు శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్, ఫొటో ఎగ్జిబిషన్ను మంత్రి పరిశీలించి అభినందించారు. సర్పంచ్లకు గుర్తింపు కార్డులను అందించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ -
రామప్ప ఆలయం బాగుంది
● మాజీ మావోయిస్టు ఆశన్న వెంకటాపురం(ఎం): యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం అద్భుత కళా సంపదకు నిదర్శనమని మాజీ మావోయిస్టు తక్కళ్లపల్లి వాసుదేవారావు అలియాస్ ఆశన్న పేర్కొన్నారు. గురువారం మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆశన్నతో పాటు లొంగిపోయిన మావోయిస్టులు సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పాకళాసంపద బాగుందని వారు కొనియాడారు. భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన పోలీసులువరంగల్: వరంగల్ 14 డివిజన్ ఎస్ఆర్నగర్లో ఈనెల 9వ తేదీన భార్యను హత్య చేసిన ఘటనలో భర్తను అరెస్ట్ చేసినట్లు ఏనుమాముల ఇన్స్పెక్టర్ జువ్వాజీ సురేశ్ తెలిపారు. ఈ మేరకు గురువారం పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గాంధీనగర్–2కు చెందిన చిలుకలపల్లి అనిత (40)కు వడ్లకొండ గ్రామానికి చెందిన అబ్బరబోయిన రాజుతో 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా వీరు ప్రస్తుతం 14వ డివిజన్లోని ఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటున్నారు. రాజు కొంతకాలంగా మద్యం, జూదానికి బానిసై భార్యను నిత్యం వేధిస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 9వ తేదీన బంధువుల దశదిన కర్మకు వెళ్లి వచ్చిన భార్యతో రాజు గొడవపడ్డాడు. అనంతరం రోకలితో ఆమె తలపై కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అనితను వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందారు. ఈ ఘటనపై మృతురాలి సోదరి సునీత ఫిర్యాదు మేరకు రాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ సురేశ్ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై రాజు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి ● కేయూ రౌండ్టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్కేయూ క్యాంపస్ : విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. గురువారం కేయూ సెమినార్హాల్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి కేయూ తెలుగు విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు ముఖ్యవక్తలుగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహణపై నిషేధం విధించారన్నారు. నిషేధం విధించి 38 ఏళ్లు గడిచాయన్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక కూడా విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. శాంతిభద్రతల సమస్య అయితే సాధారణ ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నాని ప్రశ్నించారు. ఇప్పటికై నా విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలని, లేని పక్షంలో ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. వివిధ విద్యార్థి సంఘాల నేతలు మర్రి మహేశ్, గుర్రం అజయ్, బాలరాజు, రాజ్మహ్మద్, కుమారస్వామి, తిరుపతి, బొట్ల మనోహర్, వినయ్, అనూష, ఠాగూర్, రాకేశ్, శివ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసుకాజీపేట రూరల్ : నగరంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో బాలికపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సుబేదారి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న బాలికపై ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక విషయం తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సుబేదారి పోలీసులు తెలిపారు. -
ఆన్లైన్లో ఆర్టీఏ సేవలు
ఖిలా వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆర్టీఏ సేవలన్నీ వందశాతం ఆన్లైన్లోకి తెచ్చింది. శుక్రవారం నుంచి పేపర్ రహిత సేవలను పక్కాగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు కార్యాలయాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. జనవరి 24 నుంచి వాహనాలు విక్రయించిన షోరూంలలోనే నాన్ ట్రాన్స్ఫోర్ట్ వాహన రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ విధానాన్ని రవాణాశాఖ డిప్యూటీ ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్ సురేశ్రెడ్డి పర్యవేక్షణలో ఆరు జిల్లాల షోరూం డీలర్ల వద్ద తాత్కాలిక, పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. దరఖాస్తుల సమర్పణ ఆన్లైన్లోనే .. వాహనాల శాశ్వత నమోదు కోసం షోరూం డీలర్ల వద్ద దరఖాస్తుల సమర్పణకు బదులుగా వందశాతం పేపర్ రహిత ఆన్లైన్ విధానం అమలు చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. డీలర్లు.. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఫామ్ –20 (ఫైనాన్షి యర్ సంతకం అవసరమైతే), ఇతర పేపర్ ఆధారిత ప్రతాలను స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా సంబంధిత ఆర్టీఏ కార్యాలయాలకు పంపిస్తున్నారు. ఈ విధానం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆలస్యం జరుగుతున్నట్లు రవాణాశాఖ గుర్తించింది. అన్ని పత్రాలు స్కాన్ చేసి ఆన్లైన్ పంపిస్తే అధికారులు పరిశీలించి ఆదే రోజు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయింపుతోపాటు కార్డు జారీకి ఆదేశాలు వెళ్లనున్నాయి. నేటినుంచి పేపర్రహిత సేవలు .. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో, షోరూం డీలర్లకు ఫామ్ 20, ఇతర పేపర్ పత్రాలను నేరుగా సమర్పించే విధానాన్ని పూర్తిగా రద్దు చేసి శుక్రవారం ఉదయం నుంచి వాహన షోరూంలో జరిగే తాత్కాలిక రిజిస్ట్రేషన్(టీఆర్) వాహనాలకు, డీలర్లు ఫామ్ –20, ఇతర పత్రాలు స్కాన్ కాపీలు ఆప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాహనం తీసుకోగానే పత్రాలన్నీ ఆన్లైన్లో నమోదు చేసే బాధ్యత డీలర్లదే. తప్పుడు లేదా నకిలీ పత్రాలు సమర్పిస్తేయ క్రిమినల్ చర్యలు ఉంటాయని డీటీసీ సురేశ్రెడ్డి స్పష్టం చేశారు. నేటినుంచి వందశాతం పేపర్ రహిత సేవలు ఫామ్20, ఇతర పత్రాలు నేరుగా సమర్పించే విధానం రద్దు పత్రాలన్నీ స్కాన్ చేసి అన్లైన్లో అప్లోడ్ చేయాల్సిందే.. ఆర్టీఏ కార్యాలయాల్లో పక్కాగా అమలుకు నిర్ణయం రెండు పనిదినాల్లో పరిష్కారం.. వాహన షోరూం డీలర్ నుంచి ఆర్టీఏ కార్యాలయానికి ఆన్లైన్లో పంపించిన దరఖాస్తులను రెండు పనిదినాల్లో అధికారులు పరిశీలించి ఆమోదం లేదా రివ్యూ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆలస్యం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం. డీలర్ల వద్ద 7రోజులకు మించి దరఖాస్తులు పెండింగ్లో ఉంచకూడదు. ఉల్లంఘన జరిగితే వారి లాగిన్ నిలిపివేస్తారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. డీలర్లు అందరూ ఆన్లైన్ సేవలను వినియోగించుకుని, వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఫామ్ 20, ఇతర పత్రాలను ఆన్లైన్ విధానంలోనే సమర్పించాలి. – సురేశ్రెడ్డి, డీటీసీ -
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వెంకటరమణ
వరంగల్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా డాక్టర్ వన్నాల వెంకటరమణ నియామకమయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో డాక్టర్ వన్నాల వెంకటరమణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. కాగా, తన సేవలు గుర్తించి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు, రాష్ట్ర నాయకులకు, జాతీయ బీజేపీ నాయకత్వానికి వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, డాక్టర్ వన్నాల వెంకట రమణ తండ్రి మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు బీజేపీ మాజీ జాతీయ కౌన్సిల్ మెంబర్గా పని చేశారు. -
మహా రథ ఊరేగింపు
వైభవోపేతంగా ఫాతిమామాతకాజీపేట రూరల్ : కాజీపేట ఫాతిమామాత స్వరూపంతో మహా రథ ప్రదక్షిణ ఊరేగింపు(ర్యాలీ) గురువారం వైభవోపేతంగా కొనసాగింది. కెథిడ్రల్ చర్చి ప్రాంగణంలో ఓరుగల్లు పీఠం పాలనాధికారి ఫాదర్ రెవరెండ్ డి.విజయపాల్ రెడ్డి ప్రత్యేక ప్రార్థన చేసి ఊరేగింపును ప్రారంభించారు. అనంతరం ఫాదర్లు, మఠకన్యలు, విశ్వాసులు, భక్తజనం మధ్య ఊరేగింపు ఫాతిమానగర్ మెయిన్ రోడ్ మీదుగా శౌరి నగర్, దర్గా పురవీధుల గుండా తిరిగి ఫాతిమా కెథిడ్రల్ చర్చి ప్రాంగణానికి చేరుకుంది. అనంతరం భక్తులు, విశ్వాసులు కొవ్వొత్తులతో దివ్యప్రసాద ప్రదక్షిణ చేశారు. అంతకు ముందు ఫాదర్ డి.విజయపాల్రెడ్డి దివ్యబలిపూజ సమర్పించి మాట్లాడుతూ మానవాళికి మరియతల్లి ప్రార్థన సహాయం శక్తివంతమైందన్నారు. ఫాదర్లు మర్రెడ్డి, కొమ్మారెడ్డి జోసెఫ్, జోసెఫ్, జి.అనుకిరణ్, ఎం.నవీన్, విద్యాసాగర్, 49వ డివిజన్ కార్పొరేటర్ మానసరాంప్రసాద్, కాజీపేట సీఐ సుధాకర్రెడ్డి, ట్రాఫిక్ సీఐ పి.వెంకన్న, ఎన్పీడీసీఎల్ ఏడీఈ పి.శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ర్యాలీని ప్రారంభించిన ఓరుగల్లు పీఠం పాలనాధికారి విజయ్పాల్రెడ్డి -
కృత్రిమ మేధానైపుణ్యాలను పెంపొందించుకోవాలి
కేయూ క్యాంపస్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజలో నిలవాలంటే కృత్రిమ మేధా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్రెడ్డి కోరారు. యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులకు గురువారం రూసా 02 ప్రాజెక్టు కింద రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ ప్రతాప్రెడ్డి పాల్గొని మాట్లాడారు. హ్యాండ్స్ ఆన్ శిక్షణ ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు మంరింతగా మెరుగుపుడుతాయన్నారు. ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్ ఎన్.రమణ, కె.భిక్షాలు, డాక్టర్ ఆసిం ఇక్బాల్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్లోని మిర్చి యార్డులో కొంతమంది దడవాయిలు జీరో దందా సాగిస్తున్నట్లు వెలుగుచూసింది. మార్కెట్లో జీరో జరిగితే అందుకు సూపర్వైజర్లు, ఇతర అధికారులను బాధ్యులను చేస్తూ చర్యలు తప్పవని జేడీఎం లక్ష్మణుడు.. ఇటీవల హెచ్చరించడంతో ఈ దందా వెలుగు చూసినట్లు తెలుస్తోంది. మిర్చి సీజన్లో మార్కెట్ ఉద్యోగులు బిజీగా ఉండడం గుర్తించిన కొంతమంది దడవాయిలు రైతులతో మాట్లాడుకుని సరుకు ధరలను సగానికి తగ్గించి మార్కెట్ ఫీజును దోపిడీ చేస్తున్నట్లు బహిర్గతమైంది. బుధవారం వచ్చిన మిర్చికి పలికిన ధరలను మార్కెట్ అధికారులు ఆన్లైన్లో పరిశీలించగా కొంతమంది రైతుల సరుకులకు సగం ధరలు పలికినట్లు వెల్లడి కావడంతో ఈదందా వెలుగు చూసింది. ఇందుకు కారణమైన దడవాయిలు తూర్పాటి రమేష్, నిమ్మాని నాంపల్లి, ఆకుతోట సతీష్లకు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేషం నోటీసులు జారీ చేసి గురువారం వీరికి డ్యూటీలు వేయవద్దని ఆదేశాలు జారీ శారు. ఈ దందా కొన్నేళ్లుగా సాగుతున్నట్లు మార్కెట్లో చర్చించుకుంటున్నారు. హసన్పర్తి/హన్మకొండ అర్బన్ : వరంగల్ నగరంలో వివిధ ప్రాంతాల్లోని హోటళ్లలో సివిల్ సప్లయ్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. గృహవసరాలకు వినియోగించే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లు అఽధికారులు గుర్తించారు. 73 సిలిండర్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన సిలిండర్లను ఇందు శేఖర్, బోగేస్ గ్యాస్ ఏజెన్సీలకు అప్పగించినట్లు సివిల్ సప్లయీస్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో డీటీలు భద్రునాయక్, వేణుగోపాల్, ఎఫ్ఐ సదానందం పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: చండీఘర్లోని పంజాబ్ యూనివర్సిటీలో ఈనెల 14నుంచి 16వరకు జరగనున్న ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ మహిళా జట్టును ఎంపిక చేసినట్లు గురువారం స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య తెలిపారు. జట్టులో జి.అనూషా, బి.ప్రతూషా, కె.శ్రావణి బి.అంజలి, జె.శ్రావణి ఉన్నట్లు పేర్కొన్నారు. వాగ్దేవి ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ రవీందర్ కోచ్కమ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. -
ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి!
రాంపూర్ డంపింగ్యార్డు నుంచి పొగ, విషవాయువులు● శ్వాసకోశ, చర్మ వ్యాధులబారిన పడుతున్న ప్రజలు ● రూ.కోట్లు ఖర్చుచేసినా ప్రారంభంకాని చెత్త రీసైక్లింగ్ రాంపూర్ చెత్తడంపింగ్ యార్డునుంచి వెలువడుతున్న పొగఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు పంజాల స్వరూప. ఈమెది మడికొండ. రాంపూర్లోని డంపింగ్యార్డు నుంచి వస్తున్న పొగ, విషవాయువులు, దుర్వాసనతో శ్వాస తీసుకోవడానికి ఆమె తీవ్ర ఇబ్బందులు పడింది. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తే 15వేల రూపాయల ఖర్చు అయ్యింది. వైద్యులు ఆమెకు 15 రోజుల కోర్సు ఇచ్చారు. డంపింగ్యార్డుతో నీరు, గాలి కలుషితమైనా అధికారులు పట్టించుకోవడం లేదని, డంపింగ్యార్డు తరలించాలని ఆమె వేడుకుంటోంది. ఈ పరిస్థితి ఒక్క స్వరూపదే కాదు.. మడికొండ, రాంపూర్ గ్రామాల్లోని అనేక మంది ఎదుర్కొంటున్నారు. కాజీపేట అర్బన్: డంపింగ్యార్డు నుంచి వెలువడే పొగతో మడికొండ, రాంపూర్ గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పలువురు వ్యాధులతో బాధపడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. కాజీపేట మండలం రాంపూర్ గ్రామంలో 2011 సంవత్సరంలో 36 ఎకరాల్లో చెత్తను పోగుచేసేందుకు డంపింగ్యార్డును ఏర్పాటు చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు పూట గడవడమే కష్టంగా ఉండగా.. మూలిగే నక్క మీద తాటికాయపడిన చందంగా డంపింగ్యార్డు నుంచి వెలువడుతున్న పొగ, విషవాయువులతో చర్మ వ్యాధులు, శ్వాసకోస వ్యాధుల బారినపడుతున్నారు. చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరి అప్పుల పాలవుతున్నారు. రోజుకు 500 టన్నుల చెత్త.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లు ఉన్నాయి. ప్రతిరోజూ 300 స్వచ్ఛ ఆటోలు, టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా సుమారు 500 టన్నుల చెత్త డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. కాగా, ఎప్పటి చెత్తను అప్పుడు రీసైక్లింగ్ చేయాలి. చెత్త నుంచి కాగితాలు, పీచు, ఖాళీ బాటిళ్లు, మూతలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, సుమారు 24 రకాల వ్యర్థాలను వేరు చేసి సంబంధిత ఫ్యాక్టరీలకు పంపిచాలి. కాగా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.16 కోట్లతో రీసైక్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. 36 ఎకరాల్లోని 16 ఎకరాల్లో పేరుకుపోయిన లక్షల టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేయాలని సంకల్పించా రు. ఆదిలోనే హంసపాదు అన్న చందంగా ప్లాంట్ల నిర్వహణ సరిగాలేక రీసైక్లింగ్ ప్రక్రియ ఆగిపోయింది. తిరిగి ప్రస్తుత ప్రభుత్వ హయంలో రూ. నాలు గు కోట్లతో నాలుగు రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసినా ఫలితం మాత్రం శూన్యం. అవి కూడా పని చేయ డం లేదు. దీంతో గుట్టలుగా పేరుకుపోయిన లక్షల టన్నుల చెత్త మంటల్లో చిక్కుకుంటే ఫైరింజన్లతో ఆర్పివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికైనా అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించి డంపింగ్యార్డును తరలించాలని ప్రజలు కోరుతున్నారు. వాయుకాలుష్యం, పొగమంచు కోరల్లో చిక్కుకున్న దేశరాజధాని ఢిల్లీలో అక్కడి ప్రజలు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. అక్కడి పరిస్థితినే రాంపూర్లోని డంపింగ్యార్డు తలపిస్తోంది. ఉదయం చెత్త డంపింగ్, రాత్రి డంపింగ్ చేసిన చెత్తను కాల్చి వేయడం, చెత్తలో వివిధ రసాయన ప్రక్రియలు చోటుచేసుకుని మిథైన్ వాయువు ఉత్పత్తి అవుతోంది. దుర్వాసనతో కూడిన పొగ వెలువడి మడికొండ–రాంపూర్ రాత్రివేళ పొగమంచు కురిసినట్లు తలపిస్తోంది. డంపింగ్యార్డు పొగతో ఊపిరాడడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డంపింగ్యార్డు ఎత్తివేయాలని రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు చేసినా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. -
ఏ జిల్లా శిశుగృహ ఆ జిల్లాలోనే ఉండాలి
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒకటే శిశుగృహ ఉండడంతో దత్తతలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఏ జిల్లాకు చెందిన శిశుగృహ ఆ జిల్లాలోనే ఉంటే ఇలాంటి సమస్యలు రావని అందరు సమన్వయంతో ముందుకెళ్లవచ్చని హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి అభిప్రాయపడ్డారు. ‘సమన్వయ లోపం.. శిశువులకు పాపం’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనంపై ఆమె స్పందించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న అక్రమ దత్తత కేసులు తొందరగా పరిష్కారమైతే ఐదుగురు శిశువుల దత్తత ప్రక్రియ త్వరగా ముగుస్తుందన్నారు. శిశువుల దత్తతలో ఆలస్యమవడానికి గల కారణాలను లోతుగా పరిశీలించి జిల్లా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. హనుమకొండలోని శిశుగృహలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 13 మంది శిశువులు ఉంటే 10 మంది అక్రమ దత్తత, డీఎన్ఏ పెండింగ్, కిడ్నాప్ కేసుల వల్ల దత్తత వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు. దీంతో నాలుగు గోడల మధ్యే ఉండాల్సిన పరిస్థితి ఉందని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి -
ఎఫ్ఎల్ఎన్ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి
వరంగల్ ఏఎంఓ ఉండ్రాతి సుజన్ తేజ కాళోజీ సెంటర్: ప్రాథమిక విద్యార్థుల్లో ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో విద్యావ్యస్థలో అత్యంత కీలకమైన అంశమని వరంగల్ అకడమిక్ మానిట రింగ్ అధికారి (ఏఎంఓ) ఉండ్రాతి సుజన్ తేజ అ న్నారు. హనుమకొండలోని డైట్ కళాశాలలో గురువారం రెండో రోజు జరిగిన ఎఫ్ఎల్ఎన్ శిక్షణలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు చదవడం, అర్థం చేసుకోవడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు సాధిస్తే వారి భవిష్యత్ విద్యాభ్యాసానికి బలమైన పునాది ఏర్పడుతుందని వివరించారు. నిపుణ్ భారత్ మిషన్ లక్ష్యాలను సాధించడానికి ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. మూడో తరగతి పూర్తయ్యే నాటికి ప్రతీ విద్యార్థి సులభంగా చదివేందుకు, అర్థం చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత పద్ధతులను ఉపయోగించి ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని అంచనా వేయనున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు తరగతి గదిలో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ప్లేవే మెథడ్, చైల్డ్ సెంటర్ టీచింగ్ పద్ధతులను ఉపయోగించాలని సూచించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ రిస్సోర్స్ పర్సన్స్ గంగాధర్, పద్మజ, సౌజన్య, నరేందర్ పాల్గొన్నారు. -
సీఎం హామీని అమలు చేయాలి
ఆజంజాహి మిల్లు కార్మికుల రాస్తారోకో కాశిబుగ్గ: గత ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆజంజాహి మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మిల్లు కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు వరంగల్ వెంకట్రామ జంక్షన్లో గంటపాటు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన విరమింపజేశారు. ఈ సందర్భంగా విశ్రాంత కార్మికుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఇనుముల శ్రీనివాస్, ఆరెల్లి కృష్ణ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 318 మంది కార్మికులకు ఒక్కొక్కరికి 200 గజాల ఇంటిస్థలం కేటాయిస్తానని సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చారన్నారు. ఇంతవరకు ఆ హామీ నెరవేర్చలేదని తెలిపారు. దశలవారీగా అనేక రూపాల్లో ఆందోళనలు చేపడుతున్నప్పటికీ ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా సీఎం రేవంత్రెడ్డి కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేసి, కార్మిక సంక్షేమ భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, సామాజిక కార్యకర్త జనగాం కుమారస్వామి, హరినారాయణ, యశోద, సందీప్, శ్యాం, ప్రవీణ్, సూర్య, భాను, భిక్షపతి, సంజీవ, ప్రభావతి, సనా, ఉమా, ప్రమీల, కుమారస్వామి, మల్లేశం, రాజేశం తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా పదో తరగతి వార్షిక పరీక్షలు
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ తన చాంబర్నుంచి డీఈఓ గిరిరాజ్, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ భువనేశ్వరీలతో కలిసి పరీక్షకేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 12,079 మంది రెగ్యులర్ విద్యార్థులకోసం 64 పరీక్షకేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతీ కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, శాఖా అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించినట్లు చెప్పారు. పరీక్షకేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫ్యా న్లు, లైట్లు, వైద్యసేవలు వంటి సౌకర్యాలు కల్పించామన్నారు. పరీక్ష హాల్స్ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, బాలబాలికలకు వేర్వేరుగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. -
ప్రమాదంలో ప్రజారోగ్యం!
సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నకిలీ వైద్యుల బెడద ఊపందుకుంటుంటే, ఇంకోవైపు ఎంబీబీఎస్ చదివిన కొంతమంది తమకు లేని స్పెషలైజేషన్ అర్హతను చేర్చుకొని వైద్యం చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అనుమతి లేకుండా క్లినిక్లు నిర్వహిస్తూ, వైద్యులమని చెప్పుకుంటూ రోగులకు చికిత్స అందిస్తూ ప్రాణాల మీదికి తెస్తుండడం కలవరానికి గురిచేస్తోంది. చిన్న క్లినిక్ల నుంచి ఆస్పత్రుల వరకు కొందరు తమకు లేని అర్హతను ఉన్నట్లుగా ప్రకటనలు, ప్రిస్కిప్షన్లు ఇస్తూ రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తూ వైద్య వృత్తిని ఓ వ్యాపారంగా మార్చేస్తున్నారు. దీంతో ప్రజలు నిజమైన వైద్యులు ఎవరో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. అయితే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) చేసిన దాడుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 126 కేసులు నమోదయ్యాయి. నకిలీ వైద్యుల సమాచారం 9154382727 వాట్సాప్ ద్వారా ఇస్తే చర్యలు తీసుకుంటోంది. స్పెషలిస్ట్.. సూపర్ స్పెషలిస్ట్ పదాలు వాడుతూ.. ప్రత్యేక వైద్య విద్య (ఎండీ, ఎంఎస్) లేకపోయినా కొందరు వైద్యులు తమ క్లినిక్ల వద్ద ‘స్పెషలిస్ట్’, ‘సూపర్ స్పెషలిస్ట్’ వంటి పదాలను ఉపయోగిస్తూ రోగులను ఆకర్షిస్తున్నారు. దీంతో రోగులు వారికి పూర్తి అర్హతలు ఉన్నాయనే భావనతో చికిత్స పొందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మధ్యస్థ విద్య మాత్రమే ఉన్నవారు కూడా క్లినిక్లు నడుపుతూ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ వంటి మందులు ఇస్తున్న ఘటనలు బయటపడినట్లు ఆరోగ్య శాఖ పరిశీలనల్లో వెల్లడైంది. ఇలాంటి అక్రమ వైద్యంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. మచ్చుకు కొన్ని కేసులిలా.. ● వరంగల్లోని కాశిబుగ్గలో షేక్ నయీంపాషా ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా అనధికారికంగా వైద్యుడిగా చెలామణి అవుతూ చికిత్స, మందులు ఇస్తున్నారని కేసు నమోదైంది. ● వైద్యపరంగా విద్యార్హత లేకుండా వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్న ఏనుమాములలో బోయిని శంకర్ (కల్యాణి క్లినిక్), కర్రు రాజేందర్ (జయశ్రీ ఫర్ట్స్ ఎయిడ్ సెంటర్), పి.రమేశ్ (శ్రీవెంకటేశ్వర ఫస్ట్ఎయిడ్ సెంటర్)పై కూడా టీజీఎంసీ కేసులు నమోదు చేసింది. ● ఎంబీబీఎస్ విద్యార్హత లేకున్నా మడికొండలో టి.రాజయ్య, ఈ.జయరాం, భాగ్యలక్ష్మి వైద్యులుగా చెలామణి అవుతూ చికిత్స అందిస్తుండడంతో కేసు నమోదైంది. ప్రజల ప్రాణాలతో నకిలీ వైద్యుల చెలగాటం అర్హత, అనుభవం లేకున్నా యథేచ్ఛగా క్లినిక్ల నిర్వహణ ఎంబీబీఎస్ చదివినా స్పెషలిస్ట్ అని కొందరు ప్రలోభాలు ఫేక్ డాక్టర్ల సమాచారాన్ని 91543 82727 నంబర్కు వాట్సాప్ చేయండి ప్రజలకు తెలంగాణ వైద్య మండలి విజ్ఞప్తి వైద్య విద్య అర్హతలను తప్పుగా చూపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలపై వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ మర్రి దయాకర్కు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నోటీసు జారీ చేసింది. వాస్తవానికి ఆయన ఎండీ ఫార్మకాలజీ అర్హత కలిగి ఉన్నాడు. తన ప్రిస్క్రిప్షన్లు, ప్రచారంలో ఎండీ జనరల్ మెడిసిన్ – కార్డియాలజీగా పేర్కొంటున్నాడని ఫిర్యాదు వచ్చినట్లు కౌన్సిల్ తెలిపింది. అలాగే, డీసీ (ఈఈ) వంటి గుర్తింపు లేని అర్హతలను కూడా ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. -
స్నేహనగర్లో వింత చోరీ
హన్మకొండ: హనుమకొండ స్నేహనగర్లో వింత చోరీ జరుగుతోంది. దండెంపై ఆరేసిన, ఉతకడానికి ఇంటి ఆవరణలో ఉంచిన మహిళల లోదుస్తులు, డ్రెస్సులు ఎత్తుకెళ్లి తిరిగి వారం పది రోజుల తర్వాత అదే ఇంటి వద్ద వదిలేస్తుండడంతో కాలనీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. మహిళ దుస్తులు ధరించి మాస్క్తో ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఈ వింత చోరీకి పాల్పడుతున్నాడని వారు చెబుతున్నారు. రాత్రి ఒంటి గంట నుంచి 3 గంటల ప్రాంతంలో ఈ చోరీకి పాల్పడుతున్నట్లు సీసీ కెమెరాల్లో నమోదైందని వివరించారు. దుస్తులు ఎత్తుకెళ్తుండడం, తిరిగి వదలి వెళ్తుండడంతో రాత్రి వేళలో మూత్రవిసర్జన, ఇతర కాలకృత్యాలకు రాత్రి బయటకు రావడానికి భయపడుతున్నారు. భారీ చోరీ కోసం కవ్విస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు వాహనాల బ్యాటరీలు ఎత్తుకెళ్తున్నారని వారు తెలిపారు. ఈ మేరకు బుధవారం సుబేదారి పీఎస్లో స్టేషన్ హౌజ్ ఆఫీసర్ రణధీర్కు స్నేహనగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కండేరావు నరసింహారావు, ప్రధాన కార్యదర్శి డి.తిరుపతి రెడ్డి, బాధ్యులు ఫిర్యాదు చేశారు. దుస్తులు ఎత్తుకెళ్లి వారం తర్వాత వదిలేసిన దొంగలు మాయమవుతున్న వాహనాల బ్యాటరీలు -
2025–26 ఆర్థిక సంవత్సరంలో పన్నుల వివరాలు (రూ.కోట్లలో)
మొత్తం ఆస్తి పన్ను : రూ.178.19 ఇప్పటి వరకు వసూలైంది : రూ.66.24 బకాయిలు మొత్తం : రూ.111.95 మొత్తం అసెస్మెంట్లు : 2,28,758ఆస్తి పన్ను : 81.58 వడ్డీ: 49.55 పాత బకాయిలు: 47.06 వసూలైంది: 53.88వసూలైంది: 8.35వసూలైంది: 4.01బ్యాలెన్స్: 27.70 బ్యాలెన్స్: 38.71 బ్యాలెన్స్: 45.54 -
త్వరలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం
కాజీపేట రూరల్: అమృత్ భారత్ పథకం కింద రూ.25 కోట్లతో కాజీపేట రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్రెడ్డి అన్నారు. పార్టీ నాయకులతో కలిసి బుధవారం కాజీపేట రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా సంతోష్రెడ్డి మాట్లాడుతూ రూ.716 కోట్లతో కాజీపేటలోని చేపట్టిన కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు దాదాపు పూర్తయ్యాయని, త్వరలో ప్రారంభానికి సిద్ధం ఉందని పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి, నాయకులు డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి, దొంతి దేవేందర్రెడ్డి, పులి సరోత్తంరెడ్డి, కాచం గురుప్రసాద్, కందగట్ల సత్యనారాయణ, మేకల శ్రావణ్ యాదవ్, మధు, మేఘనాథ్, కార్పొరేటర్లు గుజ్జుల వసంత, బైరి శ్రావణ్, రావుల కిషన్ పాల్గొన్నారు. నానో టెక్నాలజీపై సర్టిఫికెట్ కోర్సు ప్రారంభం విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బుధవారం మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో నానో టెక్నాలజీపై సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించారు. నా నోకణాలు , గ్రీన్నానో టెక్నాలజీ –సంశ్లేషణ విశ్లేషణ వినియోగాలు అనే అంశంపై ఈ సర్టిఫికెట్ కో ర్సు ద్వారా విద్యార్థులకు గ్రీన్ టెక్నాలజీ ప్రాథమిక సూత్రాలు, బయోటెక్నాలజీలో వినియోగాల గురించి అవగాహన కల్పించటమే లక్ష్యంగా ఉందని ప్రిన్సిపాల్ చంద్రమౌళి తెలిపారు. సమావేశాని3కి వరంగల్ నిట్ బయోటెక్నాలజీ విబాగం అసోసియేట్ ప్రొఫెసర్ పెరుగు శ్యాం ముఖ్యఅతిథిగా పాల్గొని నానోటెక్నాలజీలో వస్తున్న మార్పులు, సూక్ష్మజీవ శాస్త్రంలో ప్రాముఖ్యతపై వివరించారు. వైస్ ప్రిన్సిపాల్ జిసుహాసిని, మైక్రోబయాలజీ విభాగం ఆర్డినైజింగ్ సెక్రటరీ డాక్టర్ రేణుక, డాక్టర్ ఆదిత్య పాల్గొని మాట్లాడారు. -
అక్షరం బాగుంటే విజయం మీ వెంటే
ప్రతీ విద్యార్థి దస్తూరిపై దృష్టి సారించాలి. అక్షరం ఆకట్టుకునేలా ఉంటే విజయం విద్యార్థి వెంటే ఉంటుంది. సామాన్య శాస్త్రంలో బొమ్మలు గీస్తే ఆ చిత్రంలోని భాగాన్ని గుర్తించడంలో క్రమపద్ధతి పాటించాలి. స్కెచ్లు, పలు రంగుల పెన్నులను అడ్డదిడ్డంగా ఉపయోగిస్తుంటారు. ఇది సరికాదు. జవాబుల్లో ముఖ్యమైన పదాలు ఉండేలా చూడాలి. క్రమ పద్ధతి పాటించడం, అక్షరాలు, పదాలు, వాక్యాల మద్య తగినంత దూరం ఉండేలా పేజీకి 16 నుంచి 18 వరుసలు మించకుండా రాయాలి. సమాధానం ఆకట్టుకునేలా ఉంటే మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. – బొజ్జ సురేశ్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, (చేతిరాత నిపుణుడు) -
మహిళా న్యాయవాదులకు 30 శాతం రిజర్వేషన్లు
వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం వరంగల్ లీగల్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలస సుధీర్ అధ్యక్షతన కోర్టు హాల్లో బుధవారం జరిగిన వరంగల్ బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో మహిళా న్యాయవాదులకు 30శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఐదు పదవులను వారికి కేటాయిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ కార్యవర్గ కమిటీ తీసుకున్న నిర్ణయాలను సర్వసభ్య సభలో ప్రవేశపెట్టారు. చర్చల అనంతరం పలు తీర్మానాలను సార్వత్రిక సభ ఆమోదించింది. మహిళా న్యాయవాదులకు ఉపాధ్యక్షురాలు, కోశాధికారి పదవులను ఈసారి కొత్తగా ఇవ్వడంతో పాటు గతంలో ఉన్న సంయుక్త కార్యదర్శి, సీనియర్ కార్యవర్గ సభ్యురాలు, జూనియర్ కార్యవర్గ సభ్యురాలు మొత్తం కలిపి ఐదు పదవులను కేటాయించినట్లు వలస సుధీర్ తెలిపారు. మహిళా పదవులతో కలిపి మొత్తం 16 పోస్టులకు వరంగల్ బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల చివరలో నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. సమావేశంలో వరంగల్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి.రమాకాంత్, ఉపాధ్యక్షుడు మైదం జయపాల్, సంయుక్త కార్యదర్శులు ఎం.శ్రీధర్ గౌడ్, శశిరేఖ, క్రీడా సంయుక్త కార్యదర్శి శివప్రసాద్, కార్యనిర్వాహక సభ్యులు సురేశ్, నిర్మలజ్యోతి, రాజు, మహేందర్, తోట అరుణ, కార్యవర్గ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఉద్యమాన్ని
మొదలుపెట్టింది ‘పీపుల్స్వార్’వెంకటాపురం(ఎం): తెలంగాణ సాయుధ పోరాటాన్ని మలిదశ ఉద్యమంగా మొదలుపెట్టింది పీపుల్స్వార్ పార్టీనేనని మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి మండలంలోని స్వగ్రామమైన నర్సింగాపూర్కు బుధవారం చేరుకున్న ఆశన్నకు గ్రామస్తులు, బాల్యమిత్రులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆశన్న అందరిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఆశన్న విలేకరులతో మాట్లాడారు. వరంగల్ డిక్లరేషన్తో మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమంలో పలువురు భాగస్వాములు అయ్యారని వెల్లడించారు. మళ్లీ ఈ నేల మీద(నర్సింగాపూర్లో) అడుగు పెడతానని ఊహించలేదని, తన తండ్రి భిక్షపతిరావు కుటుంబం కంటే గ్రామం కోసమే ఎక్కువ ఆలోచించేవారని గుర్తుచేశారు. గ్రామంలో సూర్యనేని సత్తన్నను నక్సలైట్లు అంతిరెడ్డి హయాంలో చంపితే వారికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు తెలిపారు. నక్సలైట్లకు వ్యతిరేకంగా మాట్లాడితే తనపై పోస్టర్లు వేసిన సందర్భాలు గుర్తు ఉన్నాయన్నారు. ఎంత శత్రువైనా నమ్మి వచ్చినవాళ్లకు ఎలాంటి హానితలపెట్టలేదన్నారు. ఒకప్పుడు నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడా ఆయుధాలు అవసరం లేదు.. ప్రజల్లో చైతన్యం నింపాలి మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు ఆశన్నమావోయిస్టుల్లో ఉండి ప్రజల కోసం పనిచేసినా, లొంగిపోయి ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల కోసం పనిచేసినా విమర్శించే వారే ఎక్కువని ఆశన్న పేర్కొన్నారు. మావోయిస్టులు ఉంటే లొంగి పోవాలన్నారు. లొంగిపోయి బయటకు వస్తే మళ్లీ వారే వ్యతిరేకిస్తున్నారని అన్నారు. సమాజంలో అడ్వాన్స్, తటస్థం, వెనక్కిలాగే మనుషులు ఉంటారని పేర్కొన్నారు. ప్రజల కోసం అడ్వాన్స్, తటస్థం ఉన్న మనుషులతోనే కలిసి ముందుకు వెళ్తామని, నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసే ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తామని ఆశన్న స్పష్టం చేశారు. -
ఎఫ్ఎల్ఎన్ నైపుణ్యాలు ముఖ్యం
కాళోజీ సెంటర్: ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) నైపుణ్యాలు చాలా ముఖ్యమని, మూడో తరగతి నాటికి ప్రతీ విద్యార్థి చదవడం, రాయడం, గణితంలో పటిమ సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ రంగయ్య నాయుడు సూచించారు. డైట్ కళాశాలలో ఎఫ్ఎల్ఎన్ – ఏఎక్స్ఎల్ఏఐ టీచర్స్ ట్రైనింగ్ను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ జిల్లాలోని 11 పాఠశాలలకు చెందిన 50 శాతం మంది ఉపాధ్యాయులు, డీఆర్పీలు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారని, మిగతా 50 శాతం మంది ఉపాధ్యాయులకు 12న ట్రైనింగ్ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం విద్యారంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఏఎక్స్ఎల్ ఏఐ వంటి సాంకేతిక పద్ధతులను ఉపయోగించి విద్యార్థుల అభ్యాసన స్థాయిని అంచనా వేసి బోధనను మెరుగుపర్చాలని అన్నారు. ఏఎంఓ సుజన్తేజ మాట్లాడుతూ ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న విషయాలను పాఠశాల స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. డైట్ కళాశాల అధ్యాపకులు సోమయ్య, డీఆర్పీలు గంగాధర్, సౌజన్య, నరేందర్, పద్మజ పాల్గొన్నారు. -
శిశువులకు శాపం
సమన్వయ లోపం.. ఉమ్మడి వరంగల్ శిశుగృహలో దత్తత పిల్లలకు బాలారిష్టాలు● 13 మందిలో ముగ్గురికి మార్గం సుగమం.. మిగిలిన వారికి అడ్డంకులు ● శిశువుల అక్రమ దత్తత కేసుల్లో ఐదుగురికి తప్పని నిరీక్షణ ● డీఎన్ఏ పెండింగ్, కిడ్నాప్ కేసుల్లో నలుగురికి ఆలస్యం ● అధికారులు, కోర్టుల కేసులతో దత్తతకు ఎదురుచూపులు ● పోక్సో కేసుల మాదిరిగానే ఈ కేసుల్లో వేగం పెంచాలిసాక్షి, వరంగల్: జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, జిల్లా సంక్షేమ అధికారులు, వైద్యారోగ్య విభాగాలు, పోలీసు శాఖల మధ్య సమన్వయం కొరవడడం.. దత్తతకు పోయే శిశువులకు శాపంగా మారుతోంది. అక్రమంగా దత్తత కేసులు, డీఎన్ఏ పెండింగ్ కేసులు, అపహరణ కేసులతో హనుమకొండలోని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యప్తంగా హనుమకొండలో ఉన్న ఒకేఒక శిశుగృహలోని 13 మంది పిల్లల్లో 10 మంది దత్తతకు అనర్హులుగా ఉండడంతో ఆ పిల్లలు.. కుటుంబ ఆలనపాలన దూరమవుతున్నారు. వారి భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని పోక్సో కేసుల మాదిరిగానే ప్రత్యేక దృష్టితో దత్తతకు సంబంధించిన కేసులను పరిష్కరిస్తే శిశువులు త్వరగా కుటుంబ వాతావరణంలోకి వెళ్లే అవకాశం ఉంటుందని బాలల హక్కుల కార్యకర్తలు అంటున్నారు. ఆయా విభాగాధికారులు సమన్వయంతో పనిచేస్తేనే శిశువులకు న్యాయం జరుగుతుందనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇటీవల ఓ కేసులో పిల్లల అక్రమ దత్తతలో వ్యవహారం చైల్డ్ ట్రాఫికింగ్ (అక్రమ రవాణా)కు దారితీసి, వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని, ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే అక్రమంగా దత్తత తీసుకున్న పిల్లలతో.. వారిని పెంచుకుంటున్న తల్లిదండ్రులకు ఎంత అనుబంధమున్నా ఆ దత్తతను అనుమతించలేమని, దత్తత విషయంలో కేంద్రం రూపొందించిన సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ (కారా) మార్గదర్శకాలను పాటించాలని హైకోర్టు ఇటీవల తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో శిశుగృహలో ఉంటున్న నెలల పాపల నిరీక్షణ అంశం తెరమీదకు వచ్చింది. సమన్వయంతోనే ముందుకు సాగాలి అక్రమంగా దత్తత తీసుకున్న శిశువులను తిరిగి పొందేందుకు కొందరు వ్యక్తులు కోర్టుల్లో కావాలనే కేసులు వేస్తుండడం వల్ల దత్తత వ్యవహారాలు ఆలస్యమవుతున్నాయి. చట్టబద్ధంగా కాకుండా పిల్లలను తీసుకున్న సందర్భాల్లో అధికారులు శిశువులను ప్రభుత్వ సంరక్షణలోకి తీసుకుంటారు. అయితే అలాంటి పరిస్థితుల్లో శిశువులను తిరిగి పొందేందుకు కొందరు కోర్టులను ఆశ్రయిస్తూ ప్రక్రియను దీర్ఘకాలం పాటు సాగదీస్తున్నారు. పత్రాల ధ్రువీకరణ, అసలు తల్లిదండ్రుల గుర్తింపు, డీఎన్ఏ పరీక్షలు వంటి అంశాలు కూడా కోర్టు విచారణల్లో కీలకమవుతున్నాయి. ఈ కారణాలతో కేసులు ఎక్కువకాలం పెండింగ్లో ఉండి చట్టబద్ధ దత్తత ప్రక్రియకు అడ్డంకిగా మారుతున్నాయి. ఈ కేసులను అన్ని విభాగాధికారులు సమన్వయంతో పనిచేస్తేనే త్వరగా కోర్టు ఆదేశాలు వచ్చి దత్తతకు మార్గం సుగమం అవుతుంది. ప్రాధాన్యతా క్రమంలో వేగం పెంచాలి దత్తత లేదా శిశువుల మార్పిడి, అపహరణ వంటి కేసుల్లో శిశువు నిజమైన తల్లిదండ్రులను గుర్తించడానికి డీఎన్ఏ పరీక్షలు కీలకం. కేసు నమోదు అనంతరం పోలీసులు శిశువు, అనుమానిత తల్లిదండ్రుల నుంచి నమూనాలు సేకరించి హైదరాబాద్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపాలి. సాధారణంగా ఈ పరీక్షల ఫలితాలు 15 నుంచి 30 రోజుల్లో వెలువడాలి. అత్యవసర పరిస్థితుల్లో కోర్టుల ఆదేశాల మేరకు ప్రాధాన్యతా క్రమంలో పరీక్షలు నిర్వహించి ఒకటి నుంచి రెండు వారాల్లోనే నివేదిక ఇవ్వాలి. అయినా ఈ కేసులను ఆయా అధికారులు ఇతర కేసుల ఒత్తిడితో ఫాలోఅప్ చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో జాప్యం అవుతున్నాయన్న విమర్శలొస్తున్నాయి. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) నిబంధనల ప్రకారం పిల్లల గుర్తింపు, తల్లిదండ్రుల నిర్ధారణ త్వరగా చేయాలి. జువెనల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్ 2015 ప్రకారం శిశువుల సంరక్షణ, దత్తత వ్యవహారాలు త్వరగా పరిష్కరించాలని సామాజికవేత్తలు అంటున్నారు. గుర్తుతెలియని శిశువుల దత్తతలోనూ అదే తీరు కిడ్నాప్ కేసుల్లో పోలీసులకు దొరికిన గుర్తు తెలియని శిశువులను దత్తత ఇవ్వడంలో అనేక చట్టపరమైన ప్రక్రియలు ఉండడంతో ఆ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ముందుగా శిశువు అసలు తల్లిదండ్రులు ఎవరన్నది పోలీసులు గుర్తించాలి. శిశువు అపహరణకు గురైందా లేదా అన్నది నిర్ధారించేందుకు వివిధ ప్రాంతాల్లో మిస్సింగ్ కేసుల వివరాలను పరిశీలించాలి. అలాగే శిశువును తాత్కాలికంగా శిశుగృహలో ఉంచి కోర్టు ఆదేశాలు పాటించాలి. ఇలా శిశువు కేసుల్లో పోలీసులు వేగం పెంచాల్సిన అవసరం ఉంది. ఈ దత్తత ప్రక్రియలో సీడబ్ల్యూసీ అనుమతి, ప్రతి కేసు నివేదిక, ప్రొసీడింగ్స్, ఆర్డర్స్, శిశువు ఆరోగ్య పరీక్షల నివేదికను క్షుణ్ణంగా పరిశీలించడం తప్పనిసరి కావడంతో ఆలస్యమవుతోంది. పెండింగ్లో ఉన్న కేసులు.. 2024 జూలై 25న జనగామ జిల్లాలో పోలీసులకు, జిల్లాల బాలల సంరక్షణ విభాగం, జిల్లా బాలల సంక్షేమ కమిటీకి దొరికిన 25 రోజుల పాప కేసు ఇల్లీగల్ అడాప్షన్ కింద కోర్టులో నడుస్తుండడంతో ఇంకా పాపను దత్తత ఇచ్చేందుకు గ్రీన్సిగ్నల్ రాలేదు. 2024 ఆగస్టు 27న మహబూబాబాద్ జిల్లాలో 39 రోజుల బాబు, 2024 నవంబర్ 19న ములుగు జిల్లాలో దొరికిన ఐదు నెలల 15 రోజుల పాప, 2025 జూన్ 5న ములుగు జిల్లాలో దొరికిన 20 రోజుల పసికందు, 2025 సెప్టెంబర్ 26న వరంగల్ జిల్లాలో దొరికిన రెండు నెలల నాలుగు రోజుల పాప కేసు ఇల్లీగల్ అడాప్షన్ కోర్టు కేసులు నడుస్తుండడంతో దత్తతకు అనర్హులుగా ఉన్నారు. 2025 నవంబర్ 26న లభ్యమైన 36 రోజుల పాప, 2025 డిసెంబర్ 24న లభ్యమైన ఒకరోజు మగబాబు, 2026 ఫిబ్రవరి 8న లభ్యమైన ఒకరోజు పాప డీఎన్ఏ పెండింగ్లో ఉంది. 2026 జనవరి 10న కిడ్నాప్ కేసులో దొరికిన 8నెలల పాప, 16 నెలల పాప తల్లిదండ్రుల ఆచూకీ కనుగొనాల్సి ఉండడంతో వారు కూడా పెండింగ్లో ఉన్నారు. -
మంత్రులను కలిసిన ఎర్రబెల్లి స్వర్ణ
వరంగల్: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ.. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క, అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను బుధవారం హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకుడు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్రావు ఉన్నారు. హసన్పర్తి: క్రమశిక్షణ, నిరంతర సాధన, పట్టుదలతో ఉన్నతస్థాయికి చేరుకుంటారని అంతర్జాతీయ అథ్లెట్ నందిని అన్నారు. ఎస్సార్ యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన 24వ వార్షిక క్రీడోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకుని శ్రమిస్తే విజయం సాధ్యమని పేర్కొన్నారు. బాల్యం నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని కోరారు. ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్లర్ ఎ.వరదారెడ్డి మాట్లాడుతూ క్రీడలతో ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా అవసరమన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడోత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ దీపక్గార్గ్, ప్రొ వైస్చాన్స్లర్ డాక్టర్ మహేశ్, రిజిస్ట్రార్ పీవీ.రమణారావు, ప్రొఫెసర్ సుధాకర్ పాల్గొన్నారు. హన్మకొండ: ఆర్థిక స్వేచ్ఛ లభిస్తే మహిళలు మరింత అభివృద్ధి సాధించవచ్చని హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి రాజమణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, టైలరింగ్, బ్యూటిషియన్ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న 300 మందికి హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్లో బుధవారం సర్టిఫికెట్లు, కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ మహిళలు నైపుణ్యాలు అందిపుచ్చుకుని సాధికారత సాధించాలన్నారు. ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్స్పెక్టర్ శ్యాం సుందర్, సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ అశోక్కుమార్, వరంగల్, మహబూబాబాద్ బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ నాగవాణి, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ కోఆర్డినేటర్లు ఎర్ర శ్రీకాంత్, బత్తుల కరుణ పాల్గొన్నారు. హన్మకొండ: వ్యాక్సినేషన్తో పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారించవచ్చని హనుమకొండ జిల్లా పశువైద్యాధికారి రాధాకిషన్ అన్నారు. హనుమకొండ వడ్డేపల్లిలోని పశువైద్యశాలలో బుధవారం పశువులకు గాలికుంటు నివారణ వ్యాక్సినేషన్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ఆరు నెలలకోసారి పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఏప్రిల్ 9 వరకు టీకాల కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. జిల్లా పశువైద్య, పశుసంవర్థకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.సత్యప్రసాద్రెడ్డి, వడ్డేపల్లి పశువైద్యాధికారి సీహెచ్ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2026
ఇదీ జీడబ్ల్యూఎంసీ పన్ను వసూళ్ల లక్ష్యం● కార్యాచరణ సిద్ధం చేసిన రెవెన్యూ అధికారులు ● చెల్లింపుదారులకు ఎస్ఎంఎస్లు, ఫోన్లలో సమాచారం ● త్వరలో ముగియనున్న ఆర్థిక సంవత్సరం వరంగల్ అర్బన్: ఆర్థిక సంవత్సరం మరో 20 రోజుల్లో ముగియనుంది. దీంతో ఆస్తిపన్ను వసూళ్లను జీడబ్ల్యూఎంసీ వేగవంతం చేస్తోంది. ఇక నుంచి రోజూవారీగా రూ.1.50 కోట్ల చొప్పున నెలాఖరులోగా రూ.30 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో నగర వ్యాప్తంగా ఆస్తిపన్ను అసెస్మెంట్లు 2,28,753 కాగా.. ఈ ఏడాది ఆస్తిపన్ను రూ.81.58 కోట్లు, వడ్డీ రూ.47.06 కోట్లు, పాత బకాయిలు రూ.49.55 కోట్లు. మొత్తంగా రూ.178.19 కోట్లు వసూళ్ల లక్ష్యంగా పెట్టుకున్నారు. 15వ ఆర్థిక సంఘం ఆదేశాల మేరకు ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను, బకాయిల్లో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాల్సిందేనని మేయర్ గుండు సుధారాణి, ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ రెవెన్యూ సిబ్బందికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. వసూళ్లలో వెనుకబడితే శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో బల్దియా పన్నుల వసూళ్లలో దూకుడు పెంచారు. జీడబ్ల్యూఎంసీలో ప్రత్యేక వ్యవస్థ.. పన్నులు చెల్లించాల్సిన వ్యక్తులను అప్రమత్తం చేస్తూ మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్లతో సమాచారం ఇస్తున్నారు. ఇందుకోసం జీడబ్ల్యూఎంసీలో ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తోంది. రూ.లక్షకు పైగా పన్ను చెల్లించాల్సిన వ్యక్తులు, సంస్థలకు జీడబ్ల్యూఎంసీలోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల నుంచి ఉద్యోగులు నేరుగా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. నెలాఖరులోగా పన్నులు చెల్లించి సహకరించాలని సూచిస్తున్నారు. లేదంటే వడ్డీతోపాటు చట్ట ప్రకారం తీసుకోనున్న చర్యలను వివరిస్తున్నారు. మొండిబకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. వింగ్ అధికారులు, గెజిటెడ్ అధికారులను సర్కిళ్ల వారీగా ఇన్చార్జులుగా నియమించారు. ఆస్తి, నీటి పన్ను వసూళ్లపై కఠినంగా వ్యవహరిస్తోంది. బకాయిదారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల నుంచి జబర్దస్తీగా వసూలు చేస్తున్నారు. పేదల ఇళ్ల తలుపులు, ఇతర వస్తువులు జప్తు చేస్తున్నారు. నల్లా కనెక్షన్లు, గ్యాస్ సిలిండర్లు సీజ్ చేస్తుండడంతో తీవ్ర నిరసన తెలుపుతున్నారు. బకాయిలు చెల్లించకుండా మొండికేస్తున్న వారికి రెడ్నోటీస్లు, వారెంట్లు జారీ చేస్తున్నారు. ఏళ్ల తరబడి పన్ను కట్టని వారికి లీగల్ నోటీసులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. వారం రోజులుగా గ్రేటర్ పన్నుల అధికారులు, సిబ్బంది ఆస్తి, నీటి పన్నుల వసూళ్లల్లో దూకుడు పెంచారు. బకాయిలు చెల్లించకుండా ఒత్తిడి తెచ్చేవారికి, రాజకీయ నేతలతో ఒత్తిడి తెచ్చే వారిని గుర్తించి ఆస్తుల జప్తుల కోసం రెడ్నోటీసులు జారీ చేస్తున్నారు. ఆగమాగం.. అయోమయం రాష్ట్ర పురపాలకశాఖ ఆదేశాల మేరకు మేరకు 2023 నుంచి ఆస్తి, నీటి, ట్రేడ్ లైసెన్స్ కార్యకలపాలను ‘ఆన్లైన్’ ద్వారా సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) పర్యవేక్షిస్తోంది. గతంలో బల్దియా సొంత వైబ్సైట్ నుంచి పన్నుల మదింపు, వసూళ్లు తదితర అంశాలకు ఇక్కడే పరిష్కారం లభిస్తుండేది. ప్రస్తుతం సీజీజీ పన్ను అసెస్మెంట్లు, డిమాండ్ ఎక్కువ చూపెడుతోంది. వసూళ్లు తక్కువ చూపెడుతోంది. దీంతో బల్దియా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 34వ డివిజన్కు చెందిన ఒక బిల్ కలెక్టర్ తన పరిధిలో డిమాండ్ రూ.1,23 కోట్లు పన్నుల వసూలు చేయగా.. సీజీజీ విడుదల చేసిన పత్రాల్లో రూ.52 లక్షలు మాత్రమే వసూలు చేసినట్లు ధ్రువీకరిస్తున్నారు. ఇలా ఆస్తి, నల్లా పన్నులు, డిమాండ్ లెక్కల్లో గందరగోళంగా మారాయి. అంతేకాకుండా బల్దియా అధికారులు 65 శాతం పైచిలుకు పన్నులు వసూలు చేసినట్లు చెబుతుండగా.. సీజీజీ సంస్థ నుంచి మాత్రం ఆస్తిపన్ను కేవలం 27 శాతం, నీటి పన్నులు 20 శాతం వసూలైనట్లుగా నివేదికలు అందిస్తున్నారు. దీంతో లెక్కలకు పొంతన లేకపోవడంతో హైరానా పడుతున్నారు. పన్నుల వసూళ్లలో హ్యాండ్ మిషన్లు సాంకేతిక లోపంతో మొరాయిస్తున్నాయని బిల్కలెక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈలోపాలు పన్నుల వసూళ్లపై ప్రభావం పడుతోందని అంటున్నారు. -
చిట్ ఫండ్ పేరుతో మోసం..
● వ్యక్తి అరెస్ట్, రిమాండ్ ● వివరాలు వెల్లడించిన ఏసీపీ సతీశ్ బాబు శాయంపేట : చిట్టీల పేరుతో మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పరకాల ఏసీపీ సతీశ్ బాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం శాయంపేట పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన పెరుమాండ్ల కిశోర్ రెడ్డి పెరుమాండ్ల చిట్ఫండ్ పేరుతో 117 మంది వద్ద రూ. 1.49 కోట్లు, మరో 59 మంది వద్ద రూ.3.55 కోట్లు అప్పు తీసుకొని మొత్తం 176 మందిని మోసం చేశాడు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యా దు మేరకు పోలీసులు కిశోర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అనంతరం అరెస్ట్ చేసి అతడి వద్ద వద్ద ఉన్న రూ. 25.39లక్షల నగదు, 12 ప్లాట్లు, వ్యవసాయ భూముల పత్రాలు, బంగారం, వెండి ఆభరణాలు, ఓ కారుతో సహా మొత్తం రూ. 8.12 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. కాగా, కేసు వేగంగా చేధించిన సీఐ రంజిత్ రావు, ఎస్సై జక్కుల పరమేశ్తోపాటు సిబ్బందిని ఈస్ట్ జోన్ డీసీసీ అంకిత్ కుమార్, ఏసీపీ సతీశ్ బాబు అభినందించారు. -
ఐసీఏఐ వరంగల్ బ్రాంచ్ కార్యవర్గం ప్రమాణ స్వీకారం
రామన్నపేట: హంటర్రోడ్డులోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్హాల్లో ఐసీఏఐ వరంగల్ బ్రాంచ్ అధ్యక్షుడు సీఏ మదరాపు సుజిత్, ఇతర కార్యవర్గ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యఅతిథిగా సదరన్ ఇండియన్ రీజనల్ కౌన్సిల్ (ఎన్ఐఆర్సీ) చైర్మన్, సీఏ ముప్పాల సుబ్బారావు హాజరై మాట్లాడుతూ వరంగల్ బ్రాంచ్కి సొంత భవనం వచ్చేవిధంగా కృషిచేస్తానని, అన్ని విధాలుగా బ్రాంచ్ అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని హామీ ఇచ్చారు. నూతన అధ్యక్షుడు సుజిత్ మాట్లాడుతూ సీఏ మెంబర్స్, సీఏ విద్యార్థులు, ప్రజలకు ఇన్స్టిట్యూట్ తరఫున ఉత్తమ సేవలందిస్తామని తెలిపారు. సీఏ మెంబర్స్ కోసం సెమినార్స్, విద్యార్థులకు తరగతులు, రీడింగ్ రూం సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్, సీఏ సుధాటి వినీల్రావు, కార్యదర్శి జి.నిఖిత, కోశాధికారి బల్నే భగవాన్, స్టూడెంట్స్ అసోసియేషన్ చైర్మన్ హెచ్.భరత్రాజ్, ఎంసీ మెంబర్ సత్యనారాయణ, రీజనల్ కౌన్సిల్ వైస్ చైర్మన్, సీఏ మండవ సునీల్, రీజినల్ కౌన్సిల్ స్టూడెంట్స్ అసోసియేషన్ చైర్మన్ దీపక్ లడ్డా, సభ్యుడు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ జనగణన
సాక్షి ప్రతినిధి, వరంగల్: దేశవ్యాప్తంగా త్వరలో జనగణన చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనాభా వివరాలపై మళ్లీ చర్చ మొదలైంది. చివరిసారిగా 2011లో జరిగిన జనగణనలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం జనాభా 35,12,576గా నమోదైంది. వాస్తవానికి మళ్లీ 2021లో జనగణన చేపట్టాల్సింది. కరోనాతో అది జరగలేదు. అప్పటి నుంచి 15 ఏళ్లలో జనాభా గణనీయంగా పెరిగినట్లు అంచనాలు చెబుతున్నాయి. అధికారిక గణాంకాలు వెలువడితే ఉమ్మడి జిల్లాలో జనాభా 38 లక్షలు దా టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత మొదటిసారి.. ఉమ్మడి వరంగల్ను హనుమకొండ, వరంగల్ , జనగామ, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలుగా విభజించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జరగనున్న ఇది మొదటి పూర్తిస్థాయి జనగణన కావడం విశేషం. కాగా, కొత్త జిల్లాల వారీగా మొదటి పూర్తి డేటా జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మొదటిసారిగా జరగనున్న ఈ జనగణనలో ప్రతి జిల్లాకు విడిగా పూర్తి గణాంకాలు వెలువడనున్నాయి. దీంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం అందనుంది. దశాబ్దంలో పెరిగిన పట్టణీకరణ.. 2011 గణాంకాల ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత దశాబ్దంలో పట్టణీకరణ వేగంగా పెరిగింది. ముఖ్యంగా వరంగల్–హనుమకొండ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పట్టణాలకు వలసలు, విద్య అవకాశాలు, పరిశ్రమలు, ప్రభుత్వ ఉద్యోగాలు పెరగడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు.. ఉమ్మడి 6 జిల్లాల్లో పకడ్బందీగా జనగణన చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ దశ 11 మే 2026న ప్రారంభమై 9 జూన్ 2026 వరకు కొనసాగుతుంది. రెండో దశలో జనాభా గణన (పాపులేషన్ ఎన్యుమరేషన్) ప్రక్రియ ఫిబ్రవరి 2027లో నిర్వహిస్తారు. 1 మార్చి 1 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారు. కాగా, రెండు విడతల్లో చేపట్టే జనగణనలో ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది సర్వేయర్లు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో వారందరికీ మంగళవారం నుంచి మూడు రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా రెవెన్యూ అధికారి, డీఎఫ్ఓ, ఆర్డీఓలు, వరంగల్ మహానగర పాలకసంస్థ, మున్సిపల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొంటున్నారు.అక్షరాస్యత 65.11% గ్రామీణ జనాభా 71.7% పట్టణ జనాభా 28.3%కరోనాతో వాయిదా.. 15 ఏళ్ల తర్వాత త్వరలో శ్రీకారం కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మొదటిసారి వివరాల నమోదు ఉమ్మడి వరంగల్ జిల్లా జనాభా 38 లక్షలు దాటే అవకాశం పట్టణీకరణతో వరంగల్, హనుమకొండలో జనాభా భారీగా పెరుగుదల డిజిటల్గా జనగణన.. జనగణన ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో చేపట్టే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా కాగితపు దరఖాస్తుల స్థానంలో సర్వేయర్లు మొబైల్ యాప్ల ద్వారా సమాచారాన్ని నమోదు చేయనున్నారు. దీంతో డేటా సేకరణ వేగంగా పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. జనగణనలో ప్రతి ఇంటి కుటుంబ వివరాలు, విద్యస్థాయి, ఉద్యోగం, గృహ పరిస్థితులు తదితర అంశాలను నమోదు చేస్తారు. కొత్తగా ఆన్లైన్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసే అవకాశం కూడా కల్పించే యోచన ఉంది. కాగా, సర్వేలో ఇల్లు, కుటుంబ సభ్యుల సంఖ్య, వయస్సు, లింగం, విద్యస్థాయి, ఉద్యోగం/వృత్తి, ఇల్లు సొంతమా అద్దెనా, తాగునీరు, మరుగుదొడ్డి వంటి సదుపాయాలు.. తదితర 33 ప్రశ్నలతో వివరాలు సేకరించనున్నారు. రెండు విడతల్లో జనగణన సర్వే జరుగుతుంది. -
సకాలంలో లక్ష్యాలు పూర్తిచేయాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: జిల్లాలో ఇందిరా మహిళాశక్తి కార్యక్రమాల లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ఇందిరా మహిళాశక్తి కార్యక్రమాలపై సంబంధిత విభాగాల ప్రాజెక్టు నిర్వాహకులతో బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ ప్రతి విభాగానికి కేటాయించిన పనులను నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలని కోరారు. వ్యవసాయేతర విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన పెట్రోల్బంకు, సౌరవిద్యుత్ యూనిట్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల ఉత్పత్తులను ప్రోత్సహించే మహిళా మార్కెట్ పనులను ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా ప్రారంభించాలని తెలిపారు. డీఆర్డీఓ మేన శ్రీను, అదనపు డీఆర్డీఓ బొజ్జ వెంకటేశ్వర్లు, ప్రాజెక్టు నిర్వాహకులు దయాకర్, రాజేంద్ర ప్రసాద్, అనిత, సరిత, పద్మప్రియ, సీ్త్రనిధి ప్రాంతీయ నిర్వాహకుడు రమేశ్ పాల్గొన్నారు. సమర్థవంతమైన శిక్షణకు ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 12న మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులకు నిర్వహించే శిక్షణ సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను అదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్డీఓ మేన శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
22న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన హనుమకొండలోని పబ్లిక్గార్డెన్ ఎదుట గల టీటీడీ కల్యాణ మండపంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి 4వ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి పి. కన్నా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులు జనవరి 01, 2011న, ఆ తర్వాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఇందులో గెలుపొందిన వారికి ప్రశంస పత్రాలు, ట్రోఫీలు అందజేయనున్నట్లు తెలిపారు. మరిన్ని ఇతర వివరాలకు 90595 22986 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. స్పోర్ట్స్ స్కూల్ దరఖాస్తులకు నేటితో గడువు పూర్తి వరంగల్ స్పోర్ట్స్: రాష్ట్రంలోని స్పోర్ట్స్ స్కూళ్లలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 12వ తేదీతో ముగుస్తుందని హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతిలో ప్రవేశాల కోసం ఫిబ్రవరి 26వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో ప్రతిభ ఉన్న బాలబాలికలకు ఉచిత విద్య, భోజన వసతులతో పాటు నైపుణ్యం గల శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఎంపిక ప్రక్రియ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించి ప్రతిభావంతులైన విద్యార్థుల ను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి, అ ర్హత గల విద్యార్థులు telangana.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆలిండియా ఇంటర్వర్సిటీ పోటీలకు కేడీసీ విద్యార్థులు విద్యారణ్యపురి: పంజాబ్లోని జలంధర్ యూనివర్సిటీలో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు జరగబోయే తైక్వాండో టోర్నమెంట్కు హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు టి.నవీన్, వి.శ్రీయాంశ్, ఎ.మణికంఠలు ఎంపికయ్యారు. బుధవారం వీరిని ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ శశికాంత్ అభినందించారు. బాలికపై సర్పంచ్ భర్త అత్యాచార యత్నంకన్నాయిగూడెం: భయం చెప్పమంటే బాలికపై ఓ సర్పంచ్ భర్త అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై వెంకటేశ్ కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటర్ చదువుతోంది. కూతురు తన మాట వినడం లేదని, భయం చెప్పాలని పెద్దమనిషి, సర్పంచ్ భర్త శ్రీకాంత్కు వారం రోజుల క్రితం చెప్పింది. ఇదే అదునుగా తీసుకున్న శ్రీకాంత్ మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో బాలిక ఇంటికి వెళ్లి ఆమైపె అత్యాచారయత్నం చేశాడు. బాలిక ప్రతిఘటించి బయటకు వచ్చి కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పంచాంగం ఆవిష్కరణహన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవస్థాన శ్రీపరాభవ నామసంవత్సర నూతన పంచాంగాన్ని బుధవారం భద్రకాళి దేవాలయ కార్యాలయంలో ఈఓ రామల సునీత ఆవిష్కరించారు. కా ర్యక్రమంలో జ్యోతిష్య పండితులు అయినవో లు రాధాకృష్ణశర్మ, సాయికృష్ణశర్మ, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, పూర్ణచందర్, మోత్కూరి మయూరి, పార్నంది నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, పరిశీలకుడు క్రాంతికుమార్, ముఖ్యార్చకుడు చెప్పల నాగరాజుశర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుడు, హెచ్ఎంకు షోకాజ్ నోటీసులు
కాళోజీ సెంటర్: విద్యార్థులకు పాఠాలు బోధించని ఉపాధ్యాయుడితో పాటు అందుకు సహకరించిన ప్రధానోపాధ్యాయురాలిపై డీఈఓ చర్యలు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీమాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డీఈఓ రంగయ్య నాయుడు, ఏఎంఓ సుజన్ తేజ ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేయగా 9వ తరగతి విద్యార్థులకు ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు ఎం.నర్సయ్య నెల రోజులుగా పాఠాలు చెప్పడం లేదనే విషయాన్ని గ్రహించారు. అందుకు ప్రధానోపాధ్యాయురాలు ఆర్.మాధవి సహకరించినట్లు గుర్తించారు. ఈ మేరకు వారిద్దరికి డీఈఓ బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా నిర్లక్ష్యం వహించిన నేపథ్యంలో చర్యలు ఎందుకు తీసుకోకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీస్లో పేర్కొన్నారు. కల్తీ మిరప పొడి స్వాధీనం వరంగల్: వ్యర్థ పదార్థాలు, మిరపకాయల పొడిని కలిపి కారం కల్తీ చేస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ బృందం మంగళవారం వరంగల్ ఏనుమాముల పీఎస్ పరిధిలోని సాయి సిద్ధార్థ్ ఇండస్ట్రీ (మిరపకాయల పొడి– గ్రైండింగ్ వర్క్స్)పై దాడి చేసింది. ఇందులో నిందితుడి వద్ద నుంచి రూ. 4 లక్షల విలువైన మిరపకాయ పొడి స్టాక్ను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తుతో పాటు నిందితుడు బీర్తి సురేశ్ను ఏనుమాముల పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఈదాడుల్లో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ పవన్కుమార్, ఎస్సై ఉప్పలయ్య, ఏనుమాముల ఇన్స్పెక్టర్ సురేశ్, ఎస్సై రాజు పాల్గొన్నారు. పొగాకు ఉత్పత్తుల పట్టివేతఖిలా వరంగల్: నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. వరంగల్ తూర్పుకోట చెందిన పోశాల జగదీశ్వర్ నిషేధిత పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లను నిల్వ చేసి పాన్షాపులు, కిరాణాషాపుల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. బుధవారం ఖిలావరంగల్ తూర్పు హనుమాన్ జంక్షన్ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న మిల్స్కాలనీ పోలీసులకు జగదీశ్వర్ అనుమానాస్పదంగా కనిపించాడు. వెంటనే అతడి వద్ద బ్యాగును పరిశీలించగా రూ.44,307 విలువైన పొగాకు ఉత్పత్తులు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు. హసన్పర్తి: కుటుంబ కలహాలతో ఓ ప్రైవేట్ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని సీతంపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తోకల మమత(36) నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. అయితే కొంతకా లంగా కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో మానసిక వేదనకు గురైన మమత ఈనెల 9న పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు వెంటనే ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు బుధవారం తెలిపారు. -
చేనేత ఉత్పత్తుల కొనుగోలుకు టెండర్ వద్దు
కాశిబుగ్గ: చేనేత ఉత్పత్తుల కొనుగోళ్లకు కొత్తగా టెండర్ విధానం అమలు చేయవద్దని వరంగల్ కొత్తవాడకు చెందిన చేనేత సహకార సంఘాల ప్రతినిధులు కోరారు. ఈ మేరకు బుధవారం వారు హుస్నాబాద్లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చేనేత సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఉత్పత్తి అవుతున్న కార్పెట్స్ బెడ్షీట్స్, బెడ్డింగ్ మెటీరియల్ను టెండర్ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తులు, కాంట్రాక్టర్లకు ఇస్తే 60వేల చేనేత కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ చేనేత కార్మికులకు అన్యాయం జరగకుండా చూసుకుంటానని, ఎవరూ ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు, చేనేత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాజుల భగవాన్, చేనేత సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు పంతగాని శ్రీనివాస్, అడిగొప్పుల సంపత్, దూబల రాజేందర్, ఆడెపు రవి, ఝెలుగం సాంబయ్య, పరికిపండ్ల రమేశ్, కూచన ఓదెలు పాల్గొన్నారు. చేనేత పరిశ్రమను పరిరక్షించాలి చేనేత పరిశ్రమ పరిరక్షణకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని లంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాములు వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీనర్సయ్య కోరారు. ఈ మేరకు బుధవారం వారు హైదరాబాద్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, శాసనమండలి సభ్యుడు నెల్లికంటి సత్యంకు వినతిపత్రాలు అందజేసి మాట్లాడారు. 13 సంవత్సరాలుగా ఎన్నికలు లేకపోవడంతో చేనేత సహకార సంఘాలు నిర్వీర్యం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాంబశివరావు, ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ చేనేత సమస్యలను తప్పకుండా చట్టసభల్లో ప్రస్తావించి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
సమయపాలన.. విజయ సాధన
కాళోజీ సెంటర్ : టెన్త్.. ప్రతీ విద్యార్థి దశలో అత్యంత కీలకం. వారి ఉజ్వల భవిష్యత్ను నిర్ణయించే తరగతి ఇదే. కలల సౌధానికి పునాది ఏర్పడేది కూడా ఇక్కడే. అయితే పరీక్షల సమయం దగ్గర పడుతున్న కొద్దీ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంటుంది. పరీక్ష హాల్లో ప్రశ్నపత్రం చూడగానే ఒక్కసారిగా భయాందోళనకు గురై జవాబు రాయలేక పోతుంటారు. ఇలా కాకుండా భయపెట్టే అంశాలను వీడి సానుకూల దృక్పథంతో ఆలోచించాలని, తద్వారా ఏదైనా సాధ్యమేనని సైకాలజిస్ట్లు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ప్రణాళిక, పట్టుదల ఉంటే పరీక్ష సమయంలో ఒత్తిడి అనే భయాన్ని అధిగమించడం చాలా సులభమని వారు పేర్కొంటున్నారు. పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన పలు అంశాలపై పదో తరగతి విద్యార్థులకు వారు పలు సూచనలు చేస్తున్నారు. ప్రతీ విద్యార్థి సానుకూల దృక్పథంతో ఉండాలి.. నేను చేయగలను.. నేను సాధించగలననే సానుకూల దృక్ఫథం పెంచుకున్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. పరీక్షలంటే భయం వీడాలి. అప్పుడే విజయం ధరిచేరుతుంది. నేను సాధించగలను అనే నమ్మకం సగం విజయాన్ని అందించడానికి దోహదపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ముందు పరీక్షలంటే భయం వీడాలి. అప్పుడే విజయం లభిస్తుందన్నారు. భయం జ్ఞాపకశక్తిని తగ్గిస్తుందని తెలుపుతున్నారు.పరీక్షల్లో విద్యార్థుల భవితవ్యం నిర్దేశించేది చేతి రాత. ముత్యాల్లాంటి అక్షరాలు పరీక్షల్లో మార్కులపై ప్రభావం చూపుతాయి. కొట్టి వేతలు లేని కుదురైన దస్తూ రి కనిపిస్తే కచ్చితంగా మూల్యాంకనం చేసే వ్యక్తి సదుభిప్రాయానికి వచ్చి కనీసం 20 మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పొరపాట్లు చేయడం వల్ల మార్కులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. జవాబులో ముఖ్యమైన పాయింట్లను ఇచ్చే సంజ్ఞలను మార్జిన్లో ఒక దాని కింద మరోటి వేయకుండా గీత చివరి వరకు రాస్తూ చివరికి వెళ్లగానే అక్కడ సగం పదం రాసి మరో సగం కింద వరుసలో రాస్తుంటారు. దీంతో పేపర్ మూల్యాంకనం చేసే వారికి ఆ పూర్తి పదం ఏంటో వెంటనే అర్థం కాదు. అందుకే జాగ్రత్తగా పదాల పొందుపరిచే విధానం బాగుండేలా రాయాలని కౌన్సెలింగ్ సైకాలజిస్ట్లు సూచిస్తున్నారు.సానుకూల దృక్పథంతో ఏదైనా సాధ్యమే భయపెట్టే అంశాలను విడనాడాలి దస్తూరిపై దృష్టిపెడితే మంచి మార్కులు టెన్త్ విద్యార్థులకు సైకాలజిస్ట్ల సూచనలు -
ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి
హన్మకొండ: విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పార్లమెంట్లో విద్యుత్ అమైండ్మెంట్ బిల్లు ప్రతిపాదనలు ప్రవేశపెట్టాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట తెలంగాణ పవర్ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈసందర్భంగా టీఎస్ఈఈయూ–327 ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా వినియోగదారులపై భారం పడుతుందన్నారు. ప్రయివేటీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం–1104 ఎన్పీడీసీఎల్ కంపెనీ కార్యదర్శి రమణ, తెలంగాణ పవర్ డిప్లమో ఇంజనీర్స్ అసోసియేషన్ ఎన్పీడీసీఎల్ కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంద్రసేనారెడ్డి, విద్యుత్ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్పీడీసీఎల్ కంపెనీ సెక్రటరీ అజ్మీరా శ్రీరాంనాయక్, బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్పీడీసీఎల్ కంపెనీ సెక్రటరీ నీలారపు రాజేందర్, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్పీడీసీఎల్ కంపెనీ కార్యదర్శి కుమారస్వామి, ఆయా సంఘాల నాయకులు చిట్ల ఓదెలు, మచ్చిక బుచ్చయ్యగౌడ్, లక్ష్మణ్ నాయక్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
నో ఇన్సూరెన్స్, నో సీఎంఆర్ఎఫ్ !
సాక్షి, వరంగల్: వరంగల్ నగరంతో పాటు జిల్లాలోని ఆస్పత్రుల లైసెన్స్ ‘రెన్యువల్’ అంశం రచ్చరచ్చ చేస్తోంది. జిల్లాలో సుమారు 170 ఆస్పత్రులు, క్లినిక్లు ఉన్నాయి. వీటిలో పలు ఆస్పత్రుల లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తులు డీఎంహెచ్ఓ కార్యాలయంలో పెండింగ్లో ఉన్నాయి. గతంలో డీఎంహెచ్ఓ స్థాయిలోనే ఆస్పత్రుల లైసెన్స్ రెన్యువల్ అంశం ఉండేది. రెండేళ్ల క్రితం అమల్లోకి తీసుకొచ్చిన క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ ప్రకారం కలెక్టర్లు పరిశీలించి అనుమతులిస్తున్నారు. రెండేళ్లలో ఒకేసారి ఈ ఆస్పత్రుల రెన్యువల్పై కలెక్టర్ డాక్టర్ సత్యశారద సమీక్ష చేయగా సరాసరిన ఐదు ఆస్పత్రులకు మాత్రమే రెన్యువల్ క్లియర్ అయ్యింది. ఇంకా 40కిపైగా ఆస్పత్రులు, క్లినిక్లు లైసెన్స్ రెన్యువల్ కోసం ఎదురుచూస్తున్నాయి. దీనివల్ల ప్రజలతోపాటు వైద్యులు, వైద్య సిబ్బంది, ఆ ఆస్పత్రి నిర్వాహకులకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్లో 20 పడకలలోపువే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. కలెక్టర్ చొరవచూపితేనే.. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారం అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు తప్పనిసరిగా నమోదు చేసుకుని నిర్దిష్ట కాల వ్యవధిలో తమ లైసెన్స్లు రెన్యువల్ చేయించుకోవాలి. రెన్యువల్ కోసం ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ, మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్, భవన అనుమతులు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ అనుమతి వంటి పలు పత్రాలు సమర్పించాల్సి రావడంతో ప్రక్రియ ఎక్కువ సమయం తీసుకుంటోంది. ఇవి సమర్పించాక కూడా డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆలస్యం కావడమే అసలుకే మోసం వస్తోంది. అన్ని విభాగాల నుంచి కావాల్సిన అనుమతి పత్రాలు తెచ్చుకోవడం ఒక ఎత్తయితే, డీఎంహెచ్ఓ ఆఫీస్లో రెన్యువల్ అప్లికేషన్ పూర్తిగా నింపి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసినా అడుగు ముందుకు పడడం లేదు. ఈ దరఖాస్తుతో బిల్డింగ్ పర్మిషన్ లెటర్, అద్దెకు అయితే ఓనర్ నుంచి లీజు సర్టిఫికెట్, ఓనర్ ఆఫ్ ది హాస్పిటల్, విజిటింగ్ డాక్టర్స్ అగ్రిమెంట్ కాపీ, ఫైర్ సేఫ్టీ, క్వాలిఫైడ్ స్టాఫ్ (నర్సులు, మత్తుడాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్), ఫార్మసి సర్టిఫికెట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి బయో మెడికల్ వెస్ట్ మేనేజ్మెంట్ సర్టిఫికెట్ సమర్పించారు. అయినా 40కిపైగా ఆస్పత్రులు, క్లినిక్ల లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తులు ఏడాదిన్నరకుపైగా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కావాలనే డీఎంహెచ్ఓ ఆఫీస్లో ఆలస్యం చేస్తున్నారా లేదా కలెక్టర్కు సమయం లేక నిర్లక్ష్యం అవుతోందా అన్న అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికై నా కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఎంహెచ్ఓ, పోలీసు అధికారులు, ఐఎంఏ అధ్యక్షుడు లేదా సెక్రటరీలతో సమావేశం నిర్వహించి ఆయా ఆస్పత్రుల డాక్యుమెంట్లు వెరిఫై చేసి రెన్యువల్ చేయాలని ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆస్పత్రుల రెన్యువల్ అంశంపై డీఎంహెచ్ఓ సాంబశివరావును ఫోన్లో సంప్రదిస్తే అందుబాటులోకి రాలేదు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో హాస్పిటల్స్కు ‘రెన్యువల్’ కష్టాలు డీఎంహెచ్ఓ కార్యాలయంలో 40కిపైగా పెండింగ్ దరఖాస్తులు ఫలితంగా రోగులు, ఆస్పత్రులు, వైద్యులకు తప్పని తిప్పలు చికిత్స తీసుకున్నవారికి వర్తించని బీమా, సీఎం సహాయనిధి కలెక్టర్ డాక్టర్ సత్యశారద దృష్టి సారిస్తేనే ప్రయోజనంఎవరెవరికీ నష్టం కలుగుతుందంటే... ఆయా వైద్యులపై ఉన్న నమ్మకంతో ఆ ఆస్పత్రులకు వచ్చి వైద్య పరీక్షలు, సర్జరీలు, ఆపరేషన్లు చేయించుకుంటున్న రోగులు ఆర్థిక సాయం కోసం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకుంటున్నారు.ఆ సమయంలో ఈ ఆస్పత్రులకు రెన్యువ ల్ లేకపోవడంతో తిరస్కరణకు గురవుతున్నాయి. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలకు ఈ ఆస్పత్రుల్లో బిల్లులతో దరఖాస్తు చేస్తే అక్కడ కూడా రిజెక్ట్ అవుతోంది. దీంతో రూ.వేలు, రూ.లక్షల్లో రోగులు నష్టపోతున్నారు. ఇలా ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఆ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య తగ్గుతోంది. ఫలితంగా ఆయా ఆస్పత్రుల నిర్వహణ భారం అధికమై యాజామాన్యాలు అప్పుల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల వైద్యులు, నర్సరీలు, ఫార్మసిస్టులకు కూడా సకాలంలో జీతాలు రావడం లేదు. -
తాగు నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
హసన్పర్తి: వేసవి ప్రారంభంలోనే హసన్పర్తిలోని 66వ డివిజన్లో నీటి ఎద్దడి సమస్య మొదలైంది. తమ ప్రాంతానికి తాగునీరు సరఫరా కావడం లేదని హసన్పర్తి పాత గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. ఈసందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై దేవేందర్ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈసందర్భంగా జీడబ్ల్యూఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ సురేందర్తో మాట్లాడి తాగునీటి ఎద్దడికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధికారులపై సీరియస్ అయ్యారు. తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు డీఈ రవికిరణ్ 66వ డివిజన్లో క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి తాగు నీటి సమస్యలను పరిష్కరిస్తానని స్థానికులకు భరోసా ఇచ్చారు. ఎంజీఎం: హెచ్పీవీ వ్యాక్సినేషన్తో బాలికల్లో గర్భస్థ ముఖ ద్వార క్యాన్సర్ రాకుండా నివారించగలమని హెచ్పీవీ వాక్సిన్ జిల్లా పర్యవేక్షణాధికారి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ప్రకాశ్ అన్నారు. మంగళవారం ఎంజీఎంలో ఆర్ఎంఓ మధుకర్తో కలిసి అయన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమగ్ర ఆలోచనలతో స్థిరాభివృద్ధికేయూ క్యాంపస్: దూర దృష్టి, బాధ్యతాయుత సమగ్ర ఆలోచలనతోనే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని వరంగల్ నిట్ ప్రొఫెసర్ శైలజకుమారి అన్నారు. కేయూలోని మహిళా ఆధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ‘లిటరేచర్ లీడర్షిప్ అండ్ ఇన్నోవేషన్ షేపింగ్ వికసిత్ భారత్ 2047’ అంశంపై రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సు మంగళవారం సాయంత్రం ముగిసింది. సదస్సుకు ముఖ్య అతిథిగా వారు హాజరై మాట్లాడారు. నిజమైన నాయకత్వం ధైర్యమైన నిర్ణయాలతో కూడి ఉండాలన్నారు. అనిశ్చితి పరిస్థితులకు ముందుగానే సిద్ధంగా ఉండాలన్నారు. ఇందులో కేయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్ చిర్రరాజు, కేయూ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి, సోషియాలజీ విభాగాధిపతి, ఎం.స్వర్ణలత, కేయూ మహిళా అధ్యయన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ దీపాజ్యోతి, కేయూ అడ్మిషన్ల డైరెక్టర్ సీజే శ్రీలత పాల్గొన్నారు. దర్గాలో ఇఫ్తార్ విందుకాజీపేట రూరల్: కాజీపేట హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ప్రాంగణంలో మంగళవారం రాత్రి ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. దర్గా పీఠాధిపతి, తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రుపాషా ముస్లిం మతపెద్దలకు, ఆలయ అర్చకులకు, క్రైస్తవ పాస్టర్లకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈసందర్భంగా ఖుస్రు పాషా మాట్లాడుతూ.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అల్లాను ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, కాజీపేట తహసీల్దార్ సీహెచ్.రాజు, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అఽధికారి గౌస్ హైదర్, భక్తియార్ బియాబానీ, వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ అయూబ్, మాజీ కార్పొరేటర్ అబుబక్కర్, అర్చకులు, పాస్టర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ తరలిన రైల్వే జేఏసీ బృందం
కాజీపేట రూరల్: ఈ నెల 15న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎంట్రెన్స్ వద్ద నిర్వహించనున్న నిరసనలో పాల్గొనాలని ఆహ్వానించేందుకు రైల్వే జేఏసీ హైదరాబాద్ తరలింది. కాజీపేటను డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ప్రధాన ఎజెండాపై మహా నిరసన దీక్ష చేపడుతున్నట్లు మంగళవారం రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ తెలిపారు. మంగళవారం కరపత్రాలు తీసుకుని హైదరాబాద్లోని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాంను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావును, అరుణోదయ సంస్కృతి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్కను, ఎన్ఎఫ్ఐఆర్, రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ సెక్రటరి ఎం.రాఘవయ్యను, సంఘ్ ఏజీఎస్ భరణి భానుప్రసాద్, ఎజీఎస్ రుద్రారెడ్డి, సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ ప్రభురాజ్, ప్రెసిడెంట్ కొత్త మురళీకృష్ణ, రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ కె.శ్రీనివాస్, ఏజీఎస్ మురళీధర్, సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ పి.రవీందర్, ప్రెసిడెంట్ ఖాజాపాషా, ట్రెజరర్ నర్సింహారెడ్డిని కలిసి కరపత్రాలు అందించి ఆహ్వానించారు. కార్యక్రమంలో రైల్వే జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు, బృందం పాక వేదప్రకాశ్, వస్కుల రవీందర్, బి.మాధవరావు, వాయిల్ల తిరుపతి, పి.రమేశ్, కె.సాయిరాజ్, అనుముల శ్రీ నివాస్, రవీందర్, ఎం.రాజయ్య, భూ నిర్వాసితులు ఇలాసాగరం ప్రదీప్, కాయిత కుమార్ ఉన్నారు. -
ఆవిష్కరణల వైపు దృష్టి సారించాలి
● వీసీ డాక్టర్ మహేష్హసన్పర్తి : విద్యార్థులు నూతన ఆవిష్కరణల వైపు దృష్టి సారించాలని ఎస్సార్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ మహేష్ పేర్కొన్నారు. ఎస్సార్ యూనివర్సిటీలో రెండ్రోజుల పాటు నిర్వహించిన నేషనల్ ఐపీ యాత్ర–2026 మంగళవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి వీసీ డాక్టర్ మహేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో ఆవిష్కరణలు, స్టార్టప్స్, సృజనాత్మక ఆలోచనలను రక్షించుకోవడానికి మేథో సంపత్తి హక్కులు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. యువ ఆవిష్కర్తలు, విద్యార్థులు తమ ఆలోచనలను పేటెంట్లు, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్ల ద్వారా రక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐ–ఎంఎస్ఎంఈ ప్రతినిధి డాక్టర్ విజయ్కుమార్, ఇన్నోవేషన్ డీన్ బి.గిరిరాజన్, అసోసియేట్ డీన్ ఎ.చంద్రాధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏప్రిల్లో యూజీడీ పనులు
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ మహానగర సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ‘గ్రేటర్’కు కీలకమైన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) నిర్మాణం కోసం రెండు రోజుల క్రితం రూ.5,257 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో యూజీడీతో పాటు ఇతర పనులను వేగవంతం చేయడంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో వరంగల్ జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మంత్రి కొండా సురేఖతో కలిసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి.. సమీక్ష సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి దీటుగా వరంగల్ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నాన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల అమలులో వేగం పెంచాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన వివిధ ప్రగతి పనులు వచ్చే జూన్ 2వ తేదీ కల్లా పూర్తి కావాలని, సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు నిర్విరామంగా పనిచేయాలన్నారు. యూజీడీకి టెండర్ పూర్తిచేయాలి.. వరంగల్లో చేపట్టే భూగర్భ డ్రెయినేజీ పనులకు సంబంధించి వెంటనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి వచ్చేనెలలో పనులను ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇళ్లకు ఈనెల 31లోగా లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించాలని సూచించారు. రెండు పడక గదుల ఇళ్ల కాలనీల్లో కరెంట్, డ్రెయినేజీ, తాగునీరు, రోడ్లు వంటి కనీస సౌకర్యాలను ఆనాటి ప్రభుత్వం విస్మరించిందని తక్షణమే ఆయా కాలనీల్లో వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ఇందు కు అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ‘సూపర్’ ఆస్పత్రిలో సిబ్బందిని నియమించాలి వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు పూర్తి చేశామని, జూన్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్రెడ్డి అధికారులకు సూచించారు. ఈఆస్పత్రి నిర్మాణ పనులు, ఆస్పత్రి సామగ్రి ఏర్పాటు, డాక్టర్ల నుంచి మొత్తం సిబ్బంది నియామకానికి సత్వరమే కార్యాచరణ పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులు, భద్రకాళి చెరువు పూడికతీత అంశాలకు సంబంధించి ఆలయ మాడవీధుల్లో కృష్ణశిలతో నిర్మించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రకాళి చెరువు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో విషయంలో భూ సేకరణను వేగవంతం చేయాలన్నారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా శంకుస్థాపన చేసి గాలికి వదిలేసిన ఇన్నర్ రింగ్రోడ్డు, ఔటర్ రింగ్రోడ్డు, అదేవిధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూసేకరణ వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, చాహత్ బాజ్పాయ్ పాల్గొన్నారు. ఇన్నర్, ఔటర్ రింగురోడ్డు నిర్మాణం వేగవంతం ఈ నెలాఖరులో అర్హులకు ‘డబుల్’ ఇళ్ల పంపిణీ వరంగల్ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు త్వరలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సచివాలయంలో వరంగల్ అభివృద్ధిపై సమీక్ష పాల్గొన్న ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు -
బుధవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2026
సౌరశక్తి ఉత్పత్తి ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు విద్యుత్ వ్యయం తగ్గుతుంది. దీంతోపాటు మిగులు విద్యుత్ను గ్రిడ్కు విక్రయించడం వల్ల ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. స్వయం సమృద్ధిని సాధించే అవకాశం ఉంది. మిగులు విద్యుత్ను గ్రిడ్కు అమ్మడం ద్వారా ఆదాయాన్ని పొందుతారని విద్యుత్ అధికారులు తెలిపారు. ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా నెలకు రూ.612 చొప్పున ఏడాదికి రూ.7,344 ఆదా చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ప్లాంట్ ద్వారా నెలకు రూ.1,328 చొప్పున ఏడాదికి రూ.15,938, మూడు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటు ద్వారా నెలకు రూ.2,252 చొప్పున ఏడాదికి రూ.27,024 ఆదా చేసుకోవచ్చు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా కార్బన్ డయాకై ్సడ్ సమానమైన ఉద్గారాలు తగ్గుతాయి. ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.30,000 రాయితీ అందిస్తోంది. 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటుకు రూ.60,000, మూడు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఫలకల ఏర్పాటుకు రూ.78,000 రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. సోలార్ ప్యానళ్లు 25 ఏళ్ల పాటు విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ఇందులో 4 నుంచి 5 సంవత్సరాల్లో పెట్టుబడి పొందవచ్చు. మిగతా 20 ఏళ్లు పూర్తి లాభదాయకంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. హన్మకొండ: సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, ఉచిత విద్యుత్ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను తీసుకొచ్చింది. దేశంలో ఒక కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.75,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. ఈ పథకం కింద ఇంటి పైకప్పులో సౌర ఫలకాల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. సౌర శక్తిని విని యోగించుకోవడం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచడం దీని ఉద్దేశం. వినియోగదా రుడు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వాడుకోవడంతోపాటు అదనపు విద్యుత్ను గ్రిడ్కు విక్రయించుకునే అవకాశముంది. ఇంటి పైకప్పు సోలార్ ఫలకల ఇన్స్టలేషన్కు అనువుగా ఉండాలి. 20.16 కోట్ల రాయితీని విడుదల ఉమ్మడి వరంగల్ జిల్లాలో గృహ విద్యుత్ సర్వీస్లు 12,73,350 ఉన్నాయి. ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద రూఫ్టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం, సోలార్ ఫలకల బిగింపు కోసం 27.7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సరిపడా 9,058 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 9.95 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 2,939 రూఫ్టాప్ సోలార్ ప్యానల్స్ ఇన్స్టలేషన్ చేశారు. ఇందులో 9.42 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2,595 రూఫ్టాప్ సోలార్ ఇన్స్టలేషన్కుగాను రూ.20.16 కోట్ల రాయితీని విడుదల చేశారు. దరఖాస్తు ఇలా.. ఆసక్తి కలిగిన వినియోగదారులు పీఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇదే వెబ్సైట్లో వెండర్ను ఎంచుకోవాలి. ఎంచుకున్న వెండర్ సంబంధిత వినియోగదారుడిని సంప్రదించి, ఒప్పందం చేసుకుంటాడు. ఆ వెంటనే సోలార్ ఫలకలు బిగిస్తారు. సంబంధిత డిస్కం నెట్మీటరు బిగించి అనుసంధానం చేస్తుంది. తర్వాత సంబందిత వినియోగదారుడి బ్యాంకు ఖాతాకు 15 రోజుల్లో సబ్సిడీ మొత్తం జమవుతుంది. రాయితీ వినియోగించుకోవాలి.. ప్రభుత్వం రూఫ్టాప్ సోలార్ప్లాంట్ (ఫలకల) ఏర్పాటుకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద రాయితీ అందిస్తోంది. ఈ ప్లాంట్ ద్వారా గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. విద్యుత్ను ఉచితంగా వాడుకోవడమే కాకుండా విక్రయించి సైతం ఆదాయం పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. – మహేందర్రెడ్డి, రెడ్కో హనుమకొండ, జనగామ, భూపాలపల్లి జిల్లాల మేనేజర్ఉమ్మడి జిల్లాలో సోలార్ పలకల ఏర్పాటు ఇలా.. (కెపాసిటీ మెగావాట్లలో)పీఎం సూర్యఘర్తో ఉచిత విద్యుత్ ఇంటిపై సోలార్ పలకల ఏర్పాటు 300 యూనిట్ల వరకు వినియోగం ఉమ్మడి జిల్లాలో 27.07 మెగావాట్ల విద్యుత్కు 9,058 దరఖాస్తులు ఇప్పటి వరకు 2,939 రూఫ్టాప్ ఇన్స్టలేషన్ జిల్లా గృహ విద్యుత్ వచ్చిన కెపాసిటీ ఇన్స్టలేషన్ కెపాసిటీ సర్వీస్లు దరఖాస్తులు భూపాలపల్లి 2,04,722 1,485 4.63 195 0.63 హనుమకొండ 3,67,999 4,762 13.40 1633 5.53 వరంగల్ 3,04,030 1,587 5.12 668 2.33 జనగామ 1,76,061 491 1.50 211 0.67 మహబూబాబాద్ 2,20,538 733 2.42 232 0.79 -
‘పది’లో
100% లక్ష్యంవాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. రాత్రివేళ కాస్త చలి తీవ్రత ఉంటుంది. ‘పదో తరగతి పరీక్షలకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలకు హనుమకొండ జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. వందశాతం ఫలితాలు సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం’ అని హనుమకొండ డీఈఓ గిరిరాజ్గౌడ్ అన్నారు. టెన్త్ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై మంగళవారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వివరించారు. ఆయన మాటల్లోనే.. – విద్యారణ్యపురిహనుమకొండ జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఫలితాల సాధనే లక్ష్యంగా విద్యార్థులను సన్నద్ధం చేయించాం. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్స్కూళ్లు అన్నింటిలో కలిపి జిల్లాలో 12,079 మంది పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో 64 పరీక్ష కేంద్రాలు, 64 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 64 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లను నియమించాం. నాలుగు ఫ్లయింగ్స్క్వాడ్లు, 64 మంది సిట్టింగ్ స్క్వాడ్లను నియమించాం. తొలిసారిగా క్లాక్ రూమ్ పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద తొలిసారిగా క్లాక్రూమ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద ఒక క్లాక్ రూమ్ ఉంటుంది. విద్యార్థులు ఏవైనా బ్యాగులు, వస్తువులు తీసుకొస్తే ఈ పరీక్ష కేంద్రం వద్ద ఉన్న క్లాక్ రూమ్ సిబ్బందికి ఇచ్చి లోనకు వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా విద్యార్థుల హాల్టికెట్లపై క్యూర్ కోడ్ కూడా ముద్రించారు. దీనిద్వారా పరీక్ష కేంద్రం ఎక్కడుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ‘ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజుల పేరిట హాల్టికెట్ ఇవ్వకపోతే నేరుగా బీఎస్ఈ, తెలంగాణ జీఓవీ.ఇన్లో డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరవ్వొచ్చు. సెల్ఫోన్లు ఎవరికీ అనుమతిలేదు.. పరీక్ష కేంద్రాల్లో విధులు నిర్వర్తించే వారికి సెల్ఫోన్లు అనుమతి లేదు. సీసీ కెమెరాల నిఘాలోనే చీఫ్ సూపరింటెండెంట్ గదిలోనే సీఎస్ ప్రశ్నపత్రాల బండిళ్లు విప్పాలి. పరీక్షలు ముగిశాక మళ్లీ సీసీ కెమెరా నిఘాలోనే జవాబుపత్రాల బండిల్స్ కట్టాలి. అదేవిధంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వర్తించేందుకు 144 సెక్షన్ను విధించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేస్తారు. విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పరీక్షల విషయంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు హనుమకొండ డీఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లో (79817 67208)కు సంప్రదించవచ్చు. ప్రణాళికాబద్ధంగా టెన్త్ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధత హనుమకొండ జిల్లాలో పరీక్ష రాయనున్న 12,079 మంది పరీక్ష కేంద్రాల్లో ఈసారి కొత్తగా క్లాక్ రూమ్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ఈసారి ఒక్కో పరీక్షకు మూడు నుంచి 4 రోజుల వ్యవధి అన్ని కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు ‘సాక్షి’తో హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ పరీక్షల వేళలుమార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు పదో తరగతి పరీక్షలు కొనసాగనున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పరీక్షల్లో ఒక సబ్జెక్టుకు మరో సబ్జెక్టుకు మధ్య మూడు, నాలుగు రోజుల వ్యవధి సెలవులున్నాయి. దీంతో విద్యార్థులు బాగా ప్రిపేర్ అ య్యేలా అవకాశం కల్పించారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకో వాలి. ఉదయం 9:35 గంటల తర్వాత లోనికి అనుమతి ఉండదు. -
జనగణన సమర్థంగా నిర్వహించాలి
హన్మకొండ: హనుమకొండ జిల్లాలో జనాభా గణనను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి, వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధి అధికారులకు మూడు రోజుల పాటు జరిగే శిక్షణను మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జనాభా గణన ముఖ్య ఉద్దేశాలు, లక్ష్యాలను వివరించారు. జన గణన రెండు దశల్లో నిర్వహించనున్నట్లు, మొదటి దశలో ఇళ్ల జాబితా, గృహాల గణన జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఈ దశ మే 11 ప్రారంభమై జూన్ 9 వరకు కొనసాగుతుందన్నారు. రెండో దశలో ఫిబ్రవరి 2027లో నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో జన గణను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ను గణన ప్రారంభానికి దాదాపు 15 రోజుల ముందు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఇంటింటికీ ఎన్యుమరేటర్లు.. మొదటి దశలో మొత్తం 33 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటికి వెళ్లి సేకరించే విధానాన్ని ఈ శిక్షణలో వివరించనున్నట్లు తెలిపారు. ప్రతీ మండలంలోని రెవెన్యూ గ్రామాలను, పట్టణాల్లోని వార్డులను గణన బ్లాకులుగా ఎలా విభజించాలి? గణన ప్రక్రియను ఎలా నిర్వహించాలి? అనే అంశాలపై అధికారులకు శిక్షణలో వివరిస్తారన్నారు. హైదరాబాద్కు చెందిన జన గణన విభాగం సంయుక్త సంచాలకుడు డి.సుబ్బరాజు, గణాంక అధికారి ఎస్.సతీశ్ మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తారన్నారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి బి.సత్యనారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా రెవెన్యూ అధికారి, డీఎఫ్ఓ, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
దుర్గమ్మ పండుగలో అపశ్రుతి
ఖానాపురం: దుర్గమ్మ పండుగలో అపశ్రుతి చోటుచేసకున్న సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై రఘుపతి, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకమ్మనగర్ పరిధిలోని గోవిందుతండాలో తండావాసులు దుర్గమ్మ పండగను జరుపుకున్నారు. సాయంత్రం సమయంలో సభావత్ భిక్షపతి ఇంటి ఆవరణలో కొందరు తండావాసులు బోనాలు ఎత్తుకుని నృత్యం చేశారు. ఈసమయంలో ఓ ట్రాన్స్జెండర్ బాటిల్లో పెట్రోల్ నింపుకుని సర్కిల్గా అక్కడ పోసింది. పోసిన పెట్రోల్కు నిప్పు అంటించే క్రమంలో బాటిల్, సర్కిల్గా పోసిన చోట మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన ట్రాన్స్జెండర్ మంటలు అంటుకున్న బాటిల్ను విసిరేసింది. అక్కడే ఉన్న బాదావత్ బుజ్జి, నున్సావత్ దేవేందర్, బోడ పూల్య, దేవమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే ఉన్న తండాకు చెందిన నరేశ్, చందు, గణేశ్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ట్రాన్స్జెండర్తో పాటు మరికొంత మందికి గాయాలైనట్లు తెలిసింది. ప్రమాదానికి కారణమైన ట్రాన్స్జెండర్ అక్కడి నుంచి పరారీ అయినట్లు సమాచారం. గాయపడిన తండావాసులను స్థానికులు నర్సంపేటలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై రఘుపతి సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్కు తరలించారు. కాగా, తండాలో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. పెట్రోల్ అంటుకుని పలువురికి గాయాలు చిలుకమ్మనగర్ గోవిందుతండాలో ఘటన వివరాలు సేకరించిన ఎస్సై రఘుపతి -
బీమాతో ఆర్టీసీ ఉద్యోగులకు ధీమా
న్యూశాయంపేట/హన్మకొండ/పరకాల: ఉద్యోగులకు బీమా సౌకర్యంతో ధీమా కల్పించామని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను పేర్కొన్నారు. మంగళవారం హనుమకొండలోని యూనియన్ బ్యాంక్ వరంగల్ రీజియన్ కార్యాలయంలో ఆర్ఎం విజయభాను, యూబీహెచ్ జోనల్ మేనేజర్ టి.కామేశ్వర్ రావు, డిప్యూటీ జనరల్ మేనేజర్ జి.కమలాకర్.. ఆర్టీసీ ఉద్యోగి పుప్పాల రవి మృతిచెందగా అతడి సతీమణి లతాభవానికి రూ.కోటి బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎం విజయభాను మాట్లాడారు. భూపాలపల్లి జిల్లా ఘణపురం మండల కేంద్రంలో నివాసం ఉంటూ పరకాల ఆర్టీసీ డిపోలో మెకానిక్గా ఉద్యోగం చేస్తున్న పుప్పాల రవి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. బాధిత కుటుంబానికి ప్రమాద బీమా క్లెయిమ్ ద్వారా రూ.కోటి సాయాన్ని అందించినట్లు తెలిపారు. ఉద్యోగులు ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉద్యోగులు తమ కుటుంబ భద్రత దృష్ట్యా బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యూనియన్ బ్యాంక్లో ఖాతా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులందరికీ రూ.కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ కె.భానుకిరణ్, పరకాల డిపో మేనేజర్ రామ్ప్రసాద్, వరంగల్–1 డిపో మేనేజర్ పి.అర్పిత, పర్సనల్ ఆఫీసర్ డి.సైదులు, అకౌంట్స్ ఆఫీసర్ ఎల్.రవీందర్ పాల్గొన్నారు. వరంగల్ ఆర్ఎం విజయభాను -
క్రీడా పాఠశాల పిలుస్తోంది..
భూపాలపల్లి అర్బన్ : తెలంగాణలోని పలు క్రీడా పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులు తమ దరఖాస్తును https://tgss.telangana.gov.in/ వెబ్సైట్లో సమర్పించాలన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు స్పోర్ట్స్ స్కూల్లో సీటు సాధిస్తే క్రీడా రంగాన్ని శాసించేలా ఎదుగుతారనేది క్రీడా పాఠశాల లక్ష్యం. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలు ఎలా చేసుకోవాలి. ఎప్పుడు జరుగుతాయి, ఎలాంటి టెస్టులు ఉంటాయో.. తదితర విషయాలపై సాక్షి కథనం.. ఎంపిక విధానం.. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు ఎంపిక పోటీల తేదీలను తెలంగాణ జిల్లాస్థాయిలో స్పోర్ట్స్ స్కూల్ అధికారులు ప్రకటించారు. మేడ్చల్ జిల్లాలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండ జిల్లాల్లో క్రీడా పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థులకు కొన్ని శారీరక సామర్థ్యంతో పాటు పలు టెస్టులు నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎవరైతే ప్రతిభ కనబర్చి ఎక్కువ స్కోర్ సాధిస్తారో వారికి ప్రవేశం ఉంటుంది. రాష్ట్రంలో నాలుగు స్కూళ్లు ఉండగా హనుమకొండలోని పాఠశాలలో 40 బాలికలు, 40 బాలురు మిగితా స్కూళ్లలో 20 మంది బాలురు, 20 మంది బాలికలకు అవకాశం ఉంటుంది. మండలస్థాయి పోటీలకు.. మండల స్థాయి ఎంపిక పోటీలకు హాజరయ్యే విద్యార్థులు పాఠశాల హెచ్ఎంతో పాటు మున్సిపాలిటీ, పంచాయతీకి సంబంధించిన వయస్సు ధ్రువీకరణ పత్రాలు వెంట తెచ్చుకోవాలి. రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు 3వ తరగతి పాస్ సర్టిఫికెట్లతో మండలస్థాయి పోటీలకు హాజరు కావాలి. ఎంపికలు.. ఈ నెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఎంఈఓ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. విద్యార్థులు శారీరక సామర్థ్య పరీక్షల్లో కనీసం 10 పాయింట్లు సాధిస్తే జిల్లా స్థాయికి పంపిస్తారు. జిల్లాలోని అన్ని మండలాల కేంద్రంల్లో ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో ఎంపికలు.. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 1వ తేదీలోపు జిల్లా కేంద్రాల్లో జిల్లా క్రీడా శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. విద్యార్థులు శారీరక సామర్థ్య పరీక్షల్లో కనీసం 10 పాయింట్లు సాధిస్తే 10 మంది బాలురు, 10 మంది బాలికలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో.. ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు హాకీంపేట స్పోర్ట్స్ న్కూల్లో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. జూన్ రెండో వారంలో ప్రవేశాలు కల్పిస్తారు. మూడో తరగతి చదువుతున్న విద్యార్థులకు 4వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. 2017, సెప్టెంబర్ 1నుంచి 2018 ఆగస్టు 31వ తేదీ మధ్య పుట్టిన విద్యార్థులు అర్హులు. దొడ్డి కాళ్లు, ప్లాట్ఫీట్, వెన్నెముక వంగి ఉన్నవారు, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు, బౌ లెగ్స్ ఉన్న వారు. ఎక్కడైనా ఎముకలు విరిగిన వారు అనర్హులు. ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల రన్నింగ్, 6, 10 మీటర్ల షటిల్ రన్, మెడిసన్ బాల్ త్రో (కిలో బరువు), వర్టికల్ జంప్, ప్లెక్సిబిలీటీ టెస్ట్ (ముందుకు వంగి భూమిని తాకడం), మెడికల్ టెస్ట్.స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండలో పాఠశాలలు ఒక్కో స్కూల్లో 20 మంది బాలురు, 20 మంది బాలికలకు అవకాశంఅర్హులు వినియోగించుకోవాలి క్రీడాకారులుగా ఎదగాలనే విద్యార్థులకు ఇది సువర్ణావకాశం. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ఎంఈఓలను సంప్రదించాలి. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో చదివి అంతర్జాతీయ స్థాయితో పాటు ఒలింపిక్స్ వంటి ఈవెంట్లో పాల్గొని సత్తాచాటిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. స్పోర్ట్స్ స్కూల్లో ఉన్నత, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ లభిస్తుంది. అర్హులైన చిన్నారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – రఘు, డీవైఎస్ఓ, జయశంకర్ భూపాలపల్లి -
డ్రగ్స్కు దూరంగా ఉండాలి
వరంగల్ క్రైం: విద్యార్థులు ఉన్నత అశయాలతో చదువులో రాణించి డ్రగ్స్కు దూరంగా ఉండాలని నార్కోటిక్స్ ఎస్పీ గిరిధర్ సూచించారు. మంగళవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హనుమకొండ పోలీసులు జక్రియ ఫంక్షన్ హాల్లో, సుబేదారి పోలీసులు మాస్టర్ జీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. డ్రగ్స్ మహమ్మారిని కలిసి కట్టుగా తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు విలువైన జీవితాలను డ్రగ్స్ నాశనం చేస్తున్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీ హనుమకొండ ఏసీపీ నరసింహరావు, హనుమకొండ ఎంఈఓ నెహ్రూ నాయక్, ఎంఈఓ హనుమకొండ, 10 డివిజన్ కార్పొరేట్ తోట వెంకటేశ్వర్లు, కేయూ ఇన్స్పెక్టర్ రవికుమార్, సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్ పాల్గొన్నారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. విద్యారణ్యపురి: మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని హైదరాబాద్కు నార్కొటిక్ విభాగం ఎస్పీ గిరిధర్ అన్నారు. మంగళవారం హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి డిగ్రీ అండ్పీజీ కళాశాలలో నిర్వహించిన మాదక ద్రవ్యాల నిర్మూలన ఆవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇందులో ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బి.చంద్రమౌళి, ఎస్సైలు ఎస్.వెంకన్న, డీవీ ఫణి, రంజిత్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు కవిత, రామరత్నమాల, వి.మమత, బి.సువర్ణ విద్యార్థులు పాల్గొన్నారు. హసన్పర్తి: చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని తెలంగాణ ఎన్ఏబీ ఎస్పీ గిరిధర్ అన్నారు. మంగళవారం నగరంలోని శుభం గార్డెన్లో ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ‘డ్రగ్స్ వ్యతిరేక, మహిళా రక్షణ’ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా గిరిధర్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్షక్రమంలో హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సైలు నవీన్, కళ్యాణ్తో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంకాజీపేట అర్బన్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత అన్నారు. కాజీపేట మండలం మడికొండలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల సదస్సులో భాగంగా మడికొండ పీఎస్ పరిధిలో టీజీన్యాబ్ సౌజన్యంతో నిర్వహించిన మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ పాల్గొని మాట్లాడారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని ఉజ్వల భవిష్యత్ను అంధకారం చేసుకోకుడదని తెలిపారు. డ్రగ్స్ నివారణకు పోలీస్ డిపార్ట్మెంట్ ఆవిశ్రాంతంగా కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్, ఎకై ్సజ్ సీఐ చంద్రమోహన్, కార్పొరేటర్ ఆవాల రాధికరెడ్డి, మహిళా ప్రాంగణం అధికారి జయశ్రీ పాల్గొన్నారు. ఆటో ఢీకొని కానిస్టేబుల్ మృతి వరంగల్ క్రైం/కాజీపేట : వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సిటీ ఆర్మ్డ్ విభాగంలో సిటీ గార్డ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న కె.వెంకటరెడ్డి (45) మృతిచెందారు. మంగళవారం మధ్యాహ్నం కాజీపేట ఫాతిమా జంక్షన్ వద్ద వెంకట రెడ్డి తన బైక్పై వెళ్తుండగా వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో వెంకటరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. వెంకట్రెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు కాజీపేట సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. వెంకట్రెడ్డి మృతి చెందడంతో పోలీస్ అధికారులు, సిబ్బంది తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. -
ఆరోగ్యం భద్రం
పరీక్షల వేళ..ఖిలా వరంగల్ : పదో తరగతి పరీక్షల సమయం ముంచుకొస్తోంది. త్వరలో ఒకదాని తర్వాత ఒక్కో పరీక్షలున్నాయి. ప్రతి విషయానికి విద్యార్థులు హైరానా పడుతుంటారు. తిండి సరిగా తినరు. సమయానికి నిద్ర పట్టదు.. మనసులో ర్యాంకులు, మార్కులు చక్కర్లు కొడుతుంటాయి. ఈ సమయంలో పరీక్షలకు సిద్ధమయ్యే పిల్లలు తినే ఆహార నియమాలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. సమతుల్య ఆహారం అందిస్తూ మనసుకు ప్రశాంతత చేకూరే వాతావరణం కల్పిస్తే ఒత్తిడిని అధిగమిస్తారని నిపుణులు చెబుతున్నారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులైతే పరీక్షల సమయంలో బరువు తగ్గిపోతున్నారు. సిలబస్ పూర్తికాకపోతే ఆహారంపై కూడా ధ్యాస తగ్గిపోతుంది. దీనికి తోడు పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు బాగా చదవాలని పిల్లలపై ఒత్తిడి పెంచడంతో ఆకలి నుంచి దూరం చేస్తుంది. పరీక్షలకు ఎంత కష్టపడి సిద్ధం అవుతుంటారో.. అదేస్థాయిలో ఆరోగ్యంపై కూడా జాగ్రత్త తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన ఆహారం తీసుకోని విద్యార్థుల్లో ఎక్కువగా చిరాకు, జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుందని నిర్ధారించారు. రోజూ తీసుకునే ఆహారం కంటే పరీక్షల సమయంలో పదిశాతం అధికంగా మెదడుకు అవసరమని అధ్యయనంలో తేలింది. సమయానికి భోజనం చేయాలిపరీక్షల వేళ ఉదయం అల్పాహారం తీసుకోవడం మంచిది. రోజు సమయానికి భోజనం చేయాలి. ఉదయం త్వరగా జీర్ణమయ్యే అల్పాహారం, మధ్యాహ్నం మితంగా భోజనం మాత్రమే తీసుకోవాలి. రాత్రి నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందు భోజనం చేయడం ఉత్తమం. కనీసం 15 నిమిషాల పాటు నడవడం వల్ల మానసిక ఒత్తిడి దూరమై ఆరోగ్యంగా ఉంటారు.సమయానికి నిద్ర తప్పనిసరి విద్యార్థులకు సమతుల ఆహారం ఇవ్వాలి ఈ విషయంలో తల్లిదండ్రులదే బాధ్యత -
ఆరోగ్య సంరక్షణకే 5 కే రన్
5 కే రన్ను ప్రారంభిస్తున్న మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారదమేయర్ గుండు సుధారాణి రామన్నపేట: ఆరోగ్య సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు 5కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి తెలిపారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా.. సోమవారం జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పోచమ్మ మైదాన్ నుంచి హనుమకొండ వేయిస్తంభాల ఆలయం వరకు నిర్వహించిన 5కే రన్ను వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, చాహత్ బాజ్పాయ్తో కలిసి మేయర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతీరోజు ప్రజల భాగస్వామ్యంతో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆరోగ్య పరిరక్షణతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ హెల్త్ రన్ నిర్వహించామని తెలిపారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. ఆరోగ్య పరిరక్షణకు 5 కే రన్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని, ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం పెంచేందుకు ఇవి దోహదపడతాయన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని, ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో విజయాలు సాధించగలమని తెలిపారు. అనంతరం అధికారులు, యువత, ప్రజలు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సురేశ్ జోషి, బస్వరాజు కుమారస్వామి, జన్ను శిభారాణి, అదనపు కమిషనర్ చంద్రశేఖర్, సీహెచ్ఎంఓ రాజారెడ్డి, సీహెచ్ఓ రమేశ్, హనుమకొండ డీవైఎస్ఓ అశోక్, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్ఓ రాజేశ్, తదితరులు పాల్గొన్నారు. -
వరే.. సరి..!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఈ యాసంగిలోనూ రైతులు వరి సాగువైపే మొగ్గు చూపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ సీజన్లో వరిసాగు గతంతో పోలిస్తే కొంత మేర పెరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనాలు సూచిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మొత్తం సుమారు 6.35 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు ప్రాథమిక అంచనా. గత యాసంగిలో ఇది 5.98 లక్షల ఎకరాల వరకు మాత్రమే నమోదైంది. దీంతో ఈసారి దాదాపు 37 వేల ఎకరాలకు పైగా పెరుగుదల కనిపించింది. యాసంగి సాగు ఇలా... గతంతో పోలిస్తే ఈ యాసంగిలో వరిసాగు పదిశాతం మేర తగ్గుతుందని వ్యవసాయశాఖ అధికారులు మొదట అంచనా వేశారు. ఈ మేరకు ఈ సీజన్లో మొత్తం సాగు విస్తీర్ణం 9,12,880 ఎకరాలని అంచనా వేసిన అధికారులు 5.75 లక్షల ఎకరాల్లో వరి పంటలకు అవకాశం ఉందన్నారు. అందుకు భిన్నంగా మొత్తం పంటలు 9,82,880 ఎకరాల్లో వేయగా, 6,34,579 (64.56 శాతం) ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. మొక్కజొన్న, ఇతర పంటలన్నీ కలిపితే 35.44 శాతంగా నమోదయ్యాయి. ఈ లెక్కన గతంతో పోలిస్తే 37 వేల పైచిలుకు ఎకరాల్లో ఈసారి వరి సాగు కాగా, ఈసారి కూడా వరిసాగులో ఉమ్మడి వరంగల్ది రికార్డేనని వ్యవసాయశాఖ జిల్లా అధికారి ఒకరు పేర్కొన్నారు. సాగునీటి లభ్యత, సాగు సౌకర్యాలు మెరుగుపడడం, ప్రభుత్వం వరి కొనుగోలుపై హామీ ఇవ్వడం, సన్నరకం మీద బోనస్ ఇవ్వడం వంటి కారణాలతో రైతులు ఇతర పంటల కంటే వరి సాగును ఎక్కువగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది తొమ్మిదెకరాల్లో వరి వేసిన.. నాకున్న ఆరు ఎకరాలకు తోడు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. ఇందులో మూడెకరాలు సన్నాలు, మరో మూడెకరాలు దొడ్డు రకం, ఇంకో మూడెకరాలు సీడ్ వరి వేసిన. వరి పంటకు మంచి డిమాండ్ ఉండడంతో పాటు మద్దతు ధర కూడా వస్తుండడంతో మొత్తానికి మొత్తం వరి వేసిన. – ఎండపెల్లి తిరుపతిరెడ్డి, రైతు, కమలాపూర్ యాసంగిలో మళ్లీ వరిసాగు వైపు ఉమ్మడి జిల్లా రైతుల మొగ్గు మొత్తం విస్తీర్ణంలో 64.56 శాతం వరి నమోదు మిగతా పంటలతో పోలిస్తే మేలంటున్న రైతులు జిల్లా మొత్తం పంటలు వరి వరంగల్ 1,96,722 95,152 హనుమకొండ 1,77,735 1,11,380 జనగామ 2,07,353 1,79,010 మహబూబాబాద్ 2,13,665 1,07,617 జెఎస్ భూపాలపల్లి 1,17,085 89,000 ములుగు 70,320 52,420 మొత్తం 9,82,880 6,34,579 -
దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలి
ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సవాల్హన్మకొండ చౌరస్తా: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే కీలక అభివృద్ధి పనులు చేపట్టామని, మరో మూడేళ్లలో చేయనున్న పనులతో ఉమ్మడి వరంగల్ జిల్లా రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని డీసీసీ భవన్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డితో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీఓలను కరపత్రాల మాదిరిగా జారీ చేశాసిందని, కమీషన్ల కక్కుర్తి కోసం పనుల ఆలస్యం చేసే పరిస్థితి తమ పాలనలో లేదని అన్నారు. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి మాదిరిగా ప్రతిపక్షాల వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన ప్రతీ హామీ అమల్లో భాగంగానే ట్రైసిటీలో యూజీడీ (అండర్గ్రౌండ్ డ్రెయినేజీ)నిర్మాణానికి రూ.5,257 కోట్లు కేటాయిస్తూ పరిపాలనా అనుమతులను మంజూరు చేశారన్నారు. ఇది ఏ ఒక్కరి కృషి కాదు ప్రజల ఆశీస్సులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషి ఫలితమన్నారు. అనంతరం డీసీసీ భవన్ ఎదుట బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. -
మంగళవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2026
హన్మకొండ కల్చ రల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని సోమవారం సినీనటుడు రచ్చ రవి సందర్శించి అమ్మవారి సన్నిధిలో తాను రాసిన ‘నీ రుణం తీరేది ఎట్ల?’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అమ్మవారికి పూజలు నిర్వహించుకున్న అనంతరం రచ్చ రవికి అర్చకులు తీర్థప్రసాదాలు, మహదాశీర్వచనం అందించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, మయూరి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎంజీఎం: రిటైల్ మందుల వ్యాపారులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్న వారికి మాత్రమే మందులు విక్రయించాలని డ్రగ్ కంట్రోల్ శాఖ వరంగల్ ఏడీ డాక్టర్ జి.రాజ్యలక్ష్మి సూచించారు. సరైన డ్రగ్ లైసెన్స్ ఉన్న రిటైల్ సంస్థలకు హోల్సేల్ వ్యాపారులు విక్రయించాలని పేర్కొన్నారు. డ్రగ్ లైసెన్స్ లేకుండా ఎవరూ మందులను విక్రయించరాదని వివరించారు. ఏదైనా మెడికల్ షాపు ఆర్ఎంపీలకు మందులు విక్రయిస్తే డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 596 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. హనుమకొండ జిల్లాలో మొత్తం 19,821 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. వారిలో 19,225 మంది (97 శాతం) హాజరైనట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. వరంగల్ క్రైం: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని వరంగల్ సైబర్ క్రైమ్ ఏసీపీ కల్కోట గిరికుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల భద్రత, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వరంగల్ సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్క్వార్టర్స్ నుంచి కేయూ సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఏసీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఇన్న్స్పెక్టర్ కె.అశోక్, షీ టీమ్స్ ఇన్స్పెక్టర్ సువర్ణ, ఎస్సైలు శివ, చరణ్, మహిళా ఎస్సైలు, మహిళా కానిస్టేబుళ్లు, సైబర్ క్రైమ్ సిబ్బంది, ఎన్సీసీ విద్యార్థినులు పాల్గొన్నారు. వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్కు ఈసీజన్లో మొదటిసారిగా 50 వేల వరకు మిర్చి బస్తాలు విక్రయించేందుకు రైతులు యార్డుకు తీసుకొచ్చారు. శనివారం యార్డు బంద్, ఆదివారం వారంతపు బంద్ కావడంతో సోమవారం భారీగా మిర్చిని తీసుకొచ్చారు. తేజ, యూఎస్–341 రకానికి చెందిన మిర్చిని రైతులు ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చారు. ఇందులో క్వింటా మిర్చి తేజ రకానికి గరిష్టంగా రూ.19,500, యూఎస్–341కు రూ.21,600, వండర్ హాట్కు రూ.35,000, దేశీ రకానికి రూ.42 వేలు, ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్లో కండక్టర్, డ్రైవర్ పోస్టులను అవుట్ సోర్సింగ్కింద తీసుకోవాలన్న నిర్ణయాన్ని ఏజెన్సీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయా.. ఒక్కో ఉ ద్యోగానికి రేటు కడుతున్నా యా.. ఇందుకోసం దళారులను నియమించుకుని నిరుద్యోగులనుంచి బేరసారాలకు దిగుతున్నాయా... ఇందుకు సంస్థలోని కొందరు ఉద్యోగులు సహకారం అందిస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏ డిపోలో ఏయే పోస్టులు ఎన్ని భర్తీ చేస్తున్నారో కనీసం నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఇష్టానుసారంగా నియామకాలు చేపడుతున్న తీరు ఇందుకు నిదర్శనమన్న టాక్ వినిపిస్తోంది. పోస్టుల సంఖ్య బయటకు తెలిస్తే తమ ఆటలు సాగవని భావించిన అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు.. ముందస్తు ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులను మేనేజ్ చేస్తున్నట్లు సంస్థ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వివాదాస్పదంగా నియామకాలు.. వరంగల్ రీజియన్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగ ని యామకాలు వివాదాస్పదం అవుతున్నాయి. రిటైర్ ్డ అయిన వారిస్థానంలో.. కొత్తగా అవసరం మేరకు ఉద్యోగ నియామకాలన్నీ అవుట్సోర్సింగ్ కింద తీసుకుంటున్నారు. ఆర్టీసీ వరంగల్ రీజినల్ కార్యాలయం కేంద్రంగా ఈ నియామకాలు సాగుతుంటాయి. ఈ కార్యాలయంలోని పర్సనల్ విభాగంలోని ఓ ఉద్యోగి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ప్రతినిధులు వస్తే వారిని ‘అన్న’ అంటూ రాచమర్యాదలు చేస్తున్నాడనే ఆరోపణలున్నాయి. అద్దెబస్సు డ్రైవర్ల వివరాలు ‘ఉప్పులా’ అందిస్తున్నాడని ఆరోపణలున్నాయి. అదే విధంగా ఓ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఏకంగా గతంలో అద్దె బస్సుపై డ్రైవర్గా పనిచేసిన వ్యక్తిని దళారీగా నియమించుకుని అద్దెబస్సు డ్రైవర్లకు గాలం వేస్తున్నాడని సమాచారం. రెగ్యులర్ నియామకాల్లో అవుట్ సోర్సింగ్ డ్రైవర్లకు ప్రాధాన్యత ఉంటుందని, తర్వాత పర్మనెంట్ చేయిస్తామని ఆశ చూపుతూ, వారినుంచి రూ.20 నుంచి 50 వేల వరకు వసూళ్లు చేస్తూ అవుట్ సోర్సింగ్ డ్రైవర్గా నియమిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఏజెన్సీకి ఆర్ఎం కార్యాలయం పర్సనల్ విభాగం ఉద్యోగి ఒకరు అద్దెబస్సు డ్రైవర్ల జాబితాను అందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాను ముందు పెట్టుకుని ఏజెన్సీ నిర్వాహకులు.. దళారీ ద్వారా అద్దెబస్సు డ్రైవర్లను పిలిపించుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సహకరించిన ఉద్యోగులు, అధికారులకు మామూళ్లు సమర్పించుకుంటున్నారనే ఆరోపణలు ఆర్టీసీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు.. ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ విధానంలో కండక్టర్, డ్రైవర్లను తీసుకుంటున్నాం. ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు, అవినీతికి పాల్పడినట్లు, మామూళ్లు తీసుకున్నట్లు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. – డి.విజయభాను, ఆర్ఎం, వరంగల్ వరంగల్ డీఎంహెచ్ఓ సాంబశివరావు కాశిబుగ్గ: గర్భస్థ ముఖద్వార క్యాన్సర్ రాకుండా హెచ్పీవీ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, ఈ టీకా బాలికలకు రక్షలాంటిదని వరంగల్ డీఎంహెచ్ఓ డాక్టర్ బి.సాంబశిరావు తెలిపారు. వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 – 15 ఏళ్లలోపు బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించాలని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సూచించారు. అర్హత గల ఆడపిల్లలు తప్పనిసరిగా యు విన్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకుని వ్యాక్సినేషన్ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీకేఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మిదేవి, ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాశ్, డాక్టర్ స్వరూప, డాక్టర్ స్వర్ణసుధ, ఆర్ఎంఓ డాక్టర్ మురళి, డాక్టర్ దిలీప్కుమార్, డిప్యూటీ డెమో అనిల్కుమార్ పాల్గొన్నారు.కాజీపేట మండలం భట్టుపల్లి గ్రామంలోని ఓ ఫంక్షన్హాల్లో సోమవారం మాజీ మావోయిస్టులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అమరులైన మావోయిస్టుల కుటుంబాలకు అండగా ఉండాలని, అజ్ఞాతంలో ఉన్న మావోలు జనజీవన స్రవంతిలో కలిసి కుటుంబంతో జీవనం సాగించాలని తదితర అంశాలపై చర్చించుకున్నారు. కార్యక్రమంలో తక్కళ్లపెల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న, రాజమన్ భాస్కర్, వెంకటేశ్, శ్యామ్, రజిత పాల్గొన్నారు. – కాజీపేట అర్బన్పలువురు అధికారుల సహకారం? వరంగల్ రీజియన్లోని ఓ రెండు డిపోల్లో మంచిస్థాయిలో ఉన్న అధికారులు ఏజెన్సీలకు సంపూర్ణగా సహకరిస్తున్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది. వీరి కనుసన్నల్లోనే అవుట్ సో ర్సింగ్ నియామకాలు జరుగుతున్నాయని తెలి సింది. హనుమకొండ జిల్లాలోని ఓ మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న డిపోతోపాటు, ఉద్యమ నేత పేరుతో ఉన్న జిల్లాలోని ఓ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులు అవినీతి, అక్రమార్జనకు అలవాటు పడి నిరుద్యోగుల అవసరాలను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా సొమ్ము చేసుకుంటున్నారని ఆ శాఖ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కండక్టర్ నియామకం కోసం రూ.20 వేల నుంచి 80 వేల వరకు, లేదా ముందుగా రూ.20 వేలు తీసు కోవడంతోపాటు నియామకమైన తర్వాత మూ డు నెలల జీతం ఏజెన్సీలు తీసుకుంటున్నాయని ప్రచారం ఉంది. యాజమాన్యం స్పందించి నియమకాలపై విచారణ జరిపించి వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అవసరం మేరకు కొత్తవారి నియామకం అన్నీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా భర్తీ.. ఏజెన్సీలకు ‘సహకారం’ అందిస్తున్న సంస్థ ఉద్యోగులు! వరంగల్ రీజినల్ కార్యాలయం కేంద్రంగా అక్రమాలు? -
పరిష్కారం చూపరా?
వరంగల్ అర్బన్: గ్రీవెన్స్ సెల్లో అందించిన ఫిర్యాదులకు పరిష్కారం చూపరా? అంటూ పలు కాలనీలవాసులు గ్రేటర్ వరంగల్ అధికారులను నిలదీశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హాల్లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ ఫిర్యాదులు స్వీకరించారు. ఈసందర్భంగా పలు కాలనీల ప్రజలు వినతి పత్రాలు అందించే క్రమంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసిన ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడతామని, వివాద రహిత అంశాలపై విచారించి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రీవెన్స్ సెల్కు మొత్తం 53 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్ ప్లానింగ్కు 21, ఇంజనీరింగ్ సెక్షన్కు 16, రెవెన్యూ విభాగానికి 4, ప్రజారోగ్యానికి 7, నీ టి సరఫరాకు 4, ఉద్యాన వన విభాగానికి 1 ఫిర్యాదులు అందినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ వాడేకర్, ఏసీపీలు, డీఈలు పాల్గొన్నారు. గ్రీవెన్స్ వెలవెల బల్దియా గ్రీవెన్స్ సెల్ అధికారులు, ఉద్యోగులు లేక వెలవెలబోయింది. బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఇటీవల హనుమకొండ కలెక్టర్గా పదోన్నతిపై బదిలీ కాగా, ఆమె స్థానంలో ఎవరినీ నియామించక ఇన్చార్జ్ కమిషనర్గా కొనసాగుతున్నారు. కమిషనర్ గ్రీవెన్స్సెల్కు హాజరు కాకపోవడంతో 50 శాతం మందికిపైగా అధికారులు, ఉద్యోగులు గ్రీవెన్స్ సెల్కు డుమ్మా కొట్టారు. కొందరు దూరంగా ఉండగా, మరికొందరు కార్యక్రమం జరుగుతున్న క్రమంలో జారుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదుల్లో కొన్ని.. ● 27వ డివిజన్లో 2024–25 జనరల్ ఫండ్ ద్వారా వివిధ పనులు మంజూరు చేసినట్లు టెండర్లు జరిగి ఏడాదైనా పనులు మొదలు పెట్టలేదని, వెంటనే ప్రారంభించాలని కార్పొరేటర్ చింతాకుల అనిల్ కోరారు. ● 38వ డివిజన్ నలింగంటి వాడలో వాటర్ పైప్ లైన్ మీద, సీసీ రోడ్డు మెట్లు కట్టారని చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. ● 3వ డివిజన్ పైడిపల్లి లక్ష్మీగణపతి కాలనీలో తాగునీటి పైపులైన్లు నిర్మించి, కనెక్షన్లు ఇవ్వాలని కాలనీ కమిటీ ప్రతినిధులు విన్నవించారు. ● హనుమకొండ కంచరకుంట 6–1–120 ప్రాంతంలో ‘కూడా’ ప్లాట్లలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి ముంపునకు గురువుతోందని నూతనంగా నిర్మించాలని కాలనీ వాసులు వినతి పత్రం అందించారు. ● 66వ డివిజన్లోని ఎంప్లాయీస్ కాలనీ సర్వే నంబరు 168లో పార్కు స్థలం అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు అందించారు. ● హనుమకొండ ప్రకాశ్ రెడ్డి పేట మైత్రి వనం కాలనీలో రోడ్డు వెడల్పు చేసి, డ్రెయినేజీని విస్తరించాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ● వడ్డేపల్లి సూర్యప్రకాశ్ రెసిడెన్సీ కాలనీలో డ్రెయినేజీ నిర్మించాలని ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ● కడిపికొండ రాజీవ్ గృహ కల్పన కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు విన్నవించారు. అధికారుల్ని నిలదీసిన కాలనీల ప్రజలు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్కు 53 ఫిర్యాదులు -
వినతులు సత్వరమే పరిష్కరించండి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన వినతులు సత్వరమే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ప్రజల నుంచి 200 ఆర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్ఓ సత్యపాల్రెడ్డి, హనుమకొండ ఆర్డీఓ రమేశ్, తదితరులు పాల్గొన్నారు. పరిష్కార మార్గం చూపండి:వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజావాణికి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో దివ్యాంగుల సౌకర్యార్థం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో ప్రజల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్కు 113 దరఖాస్తులు రాగా, వాటిలో రెవెన్యూకు సంబంధించిన అర్జీలు 46, జీడబ్ల్యూఎంసీకి 21, ఇతర శాఖలకు సంబంధించి 46 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంధ్యారాణి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, హౌసింగ్ పీడీ శ్రీవాణితో పాటు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాగా, మామునూరును మండలకేంద్రం చేయాలని మామునూరు మండల సాధన కమిటీ సభ్యులు కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. ఖైదీగా శిక్ష అనుభవిస్తూ తన భర్త చనిపోయాడని, తనకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి, ఆర్థిక సాయం అందించాలని కాశిబుగ్గకు చెందిన మనుపాటి సారమ్మ కోరారు. -
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
వరంగల్: అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం వరంగల్ కాశిబుగ్గ 20 డివిజన్ పరిధిలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు డివిజన్కు చెందిన క్యాతం రవీందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరగా మంత్రి సురేఖ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాశిబుగ్గ జంక్షన్ నుంచి తిలక్ రోడ్డు కేవీఎస్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీపీసీసీ కార్యదర్శి మీ సాల ప్రకాశ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడుతూ లబ్ధిదారులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలను గుర్తించి తన దృష్టికి తీసుకురావాలన్నారు. నాయకులు నవీన్రాజ్, ఓని భాస్కర్, డి.రాజేశ్, సతీశ్, లావణ్య, రాజమణి, సంతోష్ పాల్గొన్నారు. కనిపించని పార్టీ జిల్లా అధ్యక్షుడు.. తూర్పు నియోజవర్గంలోని 20వ డివిజన్లో నిర్వహించిన చేరికల సభలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయూబ్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో చేరిన రవీందర్ కాశిబుగ్గలోని పలు కూడళ్లలో ఏర్పాటు చసిన ఫ్లెక్సీల్లో సైతం డీసీసీ అధ్యక్షుడి ఫొటో లేక పోవడంపై సీనియర్ నాయకులు, కార్యకర్తలు తప్పుపట్టారు. డీసీసీ అధ్యక్షుడు స్థానికంగా ఉన్నా చేరికల సభకు ఆహ్వానించలేదని తెలిసింది. ఈవిషయంపై ఆయన పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ -
పల్లెల్లో పారిశ్రామికవేత్తలు
● సబ్బుల వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతున్న ఆదివాసీ మహిళలు ● రూ. కోట్ల టర్నోవర్ సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న అతివలుఏటూరునాగారం : పట్టుదల, ఆసక్తి ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఎంతటి కష్టతర లక్ష్యమైనా సులువుగా అధిరోహించొచ్చు. దీనికి నిదర్శమే ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శివాపురం గ్రామానికి చెందిన ఆదివాసీ నిరక్షరాస్య మహిళలు. నిత్యం కూలీ, వ్యవసాయ పనుల్లో లీనమయ్యేవాళ్లంతా సాధికారత దిశగా అడుగులు వేశారు. స్వయం ప్రతిపత్తి సాధించాలనే ఉద్దేశంతో సబ్బుల (డిటర్జెంట్) తయారీకి శ్రీకారం చుట్టారు. ‘సమ్మక్క సారలమ్మ’ జాయింట్ లయబిలిటీ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఆరంభంలో ఒడుదొడుకులు ఎదురైనా తట్టుకొని నిలబడ్డారు. ప్రస్తుతం ఆర్థికంగా బలపడి పల్లెల్లో పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా వారిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. చేయి చేయి కలిపి గ్రామానికి చెందిన ధనసరి సౌజన్య, పూనెం రమ, పూనెం సీతమ్మ, కోసం సమ్మక్క, చింత జ్యోతి, సిద్ధబోయిన శరత్, ధనసరి నర్సయ్యకు ఐటీడీఏ ద్వారా 2019లో రూ.23 లక్షలతో ఎంఎస్ఎంఈ పథకంలో భాగంగా సబ్బుల తయారీ యూనిట్ మంజూరైంది. గ్రామంలోనే ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. వాళ్లు తయారు చేసిన సబ్బులను గిరిజన సహకార సంస్థ కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. ఈ సబ్బులను ఉట్నూరు, భద్రాచలం, మన్ననూరు, ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమశాఖ పాఠశాలలు, హాస్టళ్లకు సరఫరా చేసేవాళ్లు. అలా ఆదాయం సమకూరడంతో ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేశారు. పొదుపు మంత్రం పఠిస్తూ జీవితంలో పైకి ఎదుగుతున్నారు. సమష్టిగా పని చేస్తూ సబ్బులను తయారు చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నాం. రోజూ పది వేల వరకు సబ్బులు తయారు చేస్తున్నాం. ఇప్పుడు కూలీకి స్వస్తి పలికాం. ప్రభుత్వం సహకరిస్తే పెద్ద యూనిట్ నెలకొల్పుతాం. – పూనెం రమ, గ్రూపు ప్రధాన కార్యదర్శి -
అప్రమత్తతే ఆయుధం..
వరంగల్ క్రైం: మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, సమాన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగుతున్నారని వరంగల్ పోలీస్ కమి షనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత పేర్కొన్నారు. అప్రమత్తతే ఆయుధమని, పరిచయం లే ని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల ని సూచించారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల భద్రత, సవాళ్లు, సమస్యలను అధిగమించడం ఎలా తదితర అంశాలపై డీసీపీ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ప్రతి పోలీస్స్టేషన్లో ‘సన్నిహిత’ కేంద్రం ఏర్పాటు.. గతంతో పోలిస్తే ఇప్పుడు పోలీస్ స్టేషన్ పరిసరాలు, పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం బాధిత మహిళలు వారి కష్టాలు, ఇబ్బందులను ధైర్యంగా చెప్పుకునేందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో ‘సన్నిహిత’ కేందంర ఏర్పాటు చేశాం. సన్నిహిత విధులను మహిళా పోలీస్ అధికారి నిర్వహిస్తారు. దీంతో పోలీస్ స్టేషన్కు వచ్చే మహిళలు ఎవరికి సమస్యలను సన్నిహితతో చెప్పుకుంటారు. మహిళల కేసుల ఛేదనలో పురోగతి.. మహిళలు, యువతులు, బాలికలకు సంబంధించిన కేసుల ఛేదనలో పురోగతి ఉంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో మహిళల కేసుల్లో కన్వెక్షన్ గతంలో 11 శాతం ఉండేది. గతేడాది కన్వెక్షన్ శాతం 16కు పెరిగింది. పోక్సో కేసుల్లో 35 శాతం ఉంది. అన్యాయం జరిగితే ఫిర్యాదు చేయాలి.. సుబేదారి పీఎస్ పరిధిలో తల్లిదండ్రులు లేని ఓబాలిక తన పెద్దమ్మ దగ్గర ఉంటోంది. 43 ఏళ్ల వ్యక్తి ఓరాత్రి బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక పరిస్థితిని చూసి అడగడంతో విషయం వెలుగు చూసింది. దీంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించాం. ఎల్కతుర్తి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని ఓ యువతిపై యువకుడు అత్యాచారం చేశాడు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశాం. అన్యాయం జరిగితే ఫిర్యాదు చేయాలి. సమాచారం ఇస్తే ఇంటి వద్దకే వచ్చి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. చాలామంది యువతులు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చదువు, ఉద్యోగాల కోసం వస్తున్నారు. అందులో కొంతమంది పరిచయం లేని వ్యక్తులతో దగ్గరవుతున్నారు. ఇలాంటివి చివరకు బాధను మిగిలుస్తున్నాయి. సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. యువకులతో ఇష్టారాజ్యంగా తిరిగితే ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తారు. కొంతమంది బాలికలతో డ్రగ్స్ తెప్పించుకుని వాడుతున్నారు. హాస్టళ్లలో ఉంటున్న వారు ఒకటికి రెండుసార్లు ఎక్కడైనా సీక్రెట్ కెమెరాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత -
షార్ట్ సర్క్యూట్ హోమ్నీడ్స్ షాపు దగ్ధం
● రూ. 50 లక్షల విలువైన ఆస్తి నష్టం వరంగల్ చౌరస్తా : షార్ట్ సర్క్యూట్తో ఓ హోమ్నీడ్స్ షాపు దగ్ధమైంది.ఈ ఘటన వరంగల్ జేపీఎన్ రోడ్డులో చోటు చేసుకుంది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. దత్తాత్రేయ హోమ్ నీడ్స్ షాపు యజమాని సతీశ్ శనివారం ఉదయం పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్తో మొయిన్ రోడ్డు వద్ద చేలరేగిన మంటలతో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. మొదటి ఫ్లోర్లోని హోమ్ నీడ్స్ మొత్తం మంటల్లో కాలిపోయింది. అనంతరం మంటలు మొదటి అంతస్తులో ఉన్న డెంటల్ షాపునకు ఎగబాకే క్రమంలో నాలుగు ఫైర్ ఇంజినీర్లు చేరుకుని ఆర్పాయి. ఈ ఘటనలో సుమారు రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని యాజమాని సతీశ్ లబోదిబోమన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నవీన్ , హనుమకొండ ఫైర్ ఆఫీసర్ దిలీప్, సిబ్బంది పాల్గొన్నారు. -
ముగిసిన రూబిజెస్ట్–26
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో రెండురోజులుగా నిర్వహిస్తున్న రూబిజెస్ట్– 26 శనివారం రాత్రి ముగిసింది. ఫెస్ట్లో భాగంగా వివిధ ఈవెంట్లలో ప్రాజెక్టు ఎక్స్పో, టెక్నికల్ క్విజ్, కోడింగ్, పోస్టర్ల ప్రజెంటేషన్స్, లాజికల్ ఫజిల్స్ వంటిపలు పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటుకున్నారు. అలాగే, కల్చరల్ ఫెస్ట్ కూడా నిర్వహించారు. ఫ్యాషన్ షోలు, మోడలింగ్ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ముగింపు సందర్భంగా సింగర్లు పవన్కల్యాణ్, అనన్యభాస్కర్ పాటలు పాడారు. ఈవెంట్ల విజేతలకు బహుమతులు అందజేశారు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ భిక్షాలు, స్టూడెంట్స్ అకడమిక్ కోఆర్డినేటర్ అర్చనను సన్మానించారు. కన్వీనర్ సురేందర్ అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
బిజినెస్ ఉమెన్.. కల్పన
● మరో ఆరుగురికి కూడా..● ఓవెన్ బ్యాగ్ తయారీ వ్యాపారంలో రాణింపు ● ప్రస్తుతం ఏడాదికి రూ. కోటిన్నర టర్నోవర్ ● మహిళా సంఘాల లోన్లతో స్వయం ఉపాధి శాయంపేట : ఆమె ఓ డ్వాక్రా సంఘంలో సాధారణ సభ్యురాలు. మండల సమాఖ్య తరఫున లోన్ తీసుకుని నానో ఓవెన్ బ్యాగ్ తయారీ పరిశ్రమ ఏర్పా టు చేశారు. తాను స్వయం ఉపాధి పొందడంతో పాటు మరో ఆరుగురికి ఉపాధి చూపించారు. కొద్ది కాలంలోనే రూ. కోటిన్నర టర్నోవర్ సాధించారు. ఫలితంగా మహిళా పారిశ్రామిక వేత్తగా ఎదిగి ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె హనుమకొండ జిల్లా శాయంపేటకు చెందిన దాసరి కల్పన. నేడు అంతర్జాతీయ మహిళాదినోత్సవం. ఈ సందర్భంగా కల్పన విజయ గాథపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 2001లో డ్వాక్రా గ్రూపులో సభ్యురాలిగా చేరిక ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న కల్పనకు భర్త, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ క్రమంలో కల్పన.. సరస్వతి డ్వాక్రా సంఘంలో 2001లో సభ్యురాలిగా చేరారు. కుట్టు మిషన్ ద్వారా జాకెట్లు కుడుతూ ఉపాధి పొందేవారు. ఈ నేపథ్యలో ఉమ్మడి జిల్లా తరఫున సీఆర్పీ ట్రైనింగ్కు ఎంపికయ్యారు. సీఆర్పీగా ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు వెళ్లి పని చేశారు. 2020లో నానో ఓవెన్ బ్యాగ్ తయారీ పరిశ్రమ ఏర్పాటు కల్పన.. శాయంపేట మండల సమాఖ్య తరఫున రూ. 15 లక్షల లోన్ తీసుకుని శాయంపేటలోనే 2020లో నాన్ ఓవెన్ బ్యాగ్ తయారీ పరిశ్రమ ప్రారంభించారు. సొంతంగా మరో రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం ఏడాదికి రూ.కోటిన్నర టర్నోవర్ సాధించారు. కుట్టు మిషన్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నా. నా ఇద్దరు కూతుళ్లను ఒంటరిగా వదిలేసి సీఆర్పీగా పని చేయడానికి పొరుగు రాష్ట్రాలకు వెళ్లా. ఈక్రమంలో ‘లక్పతి దిది’ కార్యక్రమం ద్వారా నాకు గొప్ప అవకాశం దక్కింది. నానో ఓవెన్ బ్యాగ్ పరిశ్రమ స్థాపించా. ఈ పరిశ్రమ నడపడంలో నా భర్త సహకారం మరువలేనిది. – దాసరి కల్పన, మహిళాపారిశ్రామికవేత్త, శాయంపేట -
విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యం
హన్మకొండ అర్బన్ : హనుమకొండ జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమన్వయంతో అమలుచేస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంతోపాటు విద్య, వైద్య రంగాల ప్రాధాన్యతను ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ఎంపీ కడియం కావ్య అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. సమావేశంలో మహిళా శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య, విద్య, వ్యవసాయం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, రహదారులు తదితర శాఖల పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ పాఠశాలల్లో డ్రాపౌట్లను తగ్గించి విద్యార్థుల ప్రవేశాలను పెంచాలని సూచించారు. బాల్యవివాహాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని, వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పదో తరగతి ఫలితాల్లో జిల్లా అగ్రస్థానంలో నిలవాలని సూచించారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుకు అధికారులు సమష్టిగా పనిచేయాలని సూచించారు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా కార్యాచరణతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చై ర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, మేయర్ సుధారాణి, అదనపు కలెక్టర్ రవి, తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ స్కూల్స్ అడ్మిషన్ల పోస్టర్ ఆవిష్కరణహన్మకొండ అర్బన్ : రాష్ట్రంలోని క్రీడా పాఠశాలలలో 2026–27 విద్యాసంవత్సరానికి ప్రవేశాల సంబంధించిన పోస్టర్ను శనివారం జిల్లా కలెక్టరేట్లో హనుమకొండ కలెక్టర్ చాహత్ జాబ్పాయ్, ప్రజా ప్రతినిధులు ఆవిష్కరించారు. రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండ, తదితర క్రీడా పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. క్రీడల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి వారికి నాణ్యమైన విద్యతోపాటు ప్రత్యేక క్రీడా శిక్షణ అందించడమే స్పోర్ట్స్ స్కూల్స్ లక్ష్యమని తెలిపారు. ‘దిశ’ సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య -
రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనుల తనిఖీ
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ–కోచ్ ఫ్యాక్టరీ) నిర్మాణ పనులను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) అధికారులు శనివారం తనిఖీ చేశారు. ఆర్వీఎన్ఎల్ సికింద్రాబాద్ డీజీఎం శర్మ, ఆర్వీఎన్ఎల్ ఆర్ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వికాస్రెడ్డి.. ఆర్ఎంయూ నిర్మాణం, ఎలక్ట్రిఫికేషన్ పనులు తనిఖీ చేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పవర్మెక్ప్రాజెక్ట్ కాంట్రాక్టర్కు సూచించినట్లు అధికారులు తెలిపారు. కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వరంగల్ మీదుగా పొదనూర్–బరోని మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ శనివారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. మార్చి 16, 23వ తేదీల్లో పొదనూర్–బరోని (06021) ప్రత్యేక రైలు మరుసటి రోజు వరంగల్కు చేరుకుని వెళ్తుంది. అదేవిధంగా మార్చి 16,19వ తేదీల్లో బరోని–పొదనూర్ (06022) ప్రత్యేక రైలు మరుసటి రోజు వరంగల్కు చేరుకుని వెళ్తుంది. ఈ రైళ్ల సర్వీస్లకు తినుప్పుర్, ఈరోడ్, సేలం, జోలర్పెట్టాయ్, కట్పడి, పె రంబూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగ ల్, రామగుండం, సిర్పూర్కాగజ్నగర్, బల్లా ర్షా, చంద్రపూర్, నాగ్పూర్, బెతూల్, ఇటార్సీ, జబల్పూర్, సంత, మానిక్పూర్, ప్రయాగ్రా జ్, చౌకీ, చూనర్, పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ, బాక్సర్, ఆరా, దానాపూర్, పాటలీ పుత్ర, హాజిపూర్, షాపూర్ పాటూరి స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు సీపీఆర్వో తెలిపారు. -
భోజనం పెట్టమని అడిగినందుకు..
కాజీపేట అర్బన్ : ‘ఆకలవుతోంది భోజనం పెట్టు బిడ్డా’ అని అడిగినందుకు ఓ ప్రబుద్ధుడు తన తల్లి పట్ల కర్కషంగా వ్యవహరించాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ఈ ఘటన మడికొండలో చోటు చేసుకుంది. మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ కథనం ప్రకారం.. మడికొండకు చెందిన వస్కుల శాంత రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆమె కు ఐదుగురు కుమారులు ఉండగా వారి వద్ద ఉంటోది. ఈ క్రమంలో శుక్రవారం ఆకలవుతోంది భో జనం పెట్టు బిడ్డా అని మూడో కుమారుడు రా మును కోరింది. అంతే దీనికి ఒక్కసారిగా కోపోద్రెకుడైన రాము.. తల్లిని ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. అ నంతరం రాము భార్య సుమలత, నాలుగో కుమారుడు భార్య కల్పన కూడా ఇష్టం వచ్చినట్లు కొట్టా డు. కుమారుడు బండతో కొట్టగా కింద పడింది. ఈ ఘటనలో తల పగిలిపోడంతోపాటు చేయి విరిగింది. దీనిపై సమాచారం అందుకున్న మరో కుమారుడు శంకర్ వెంటనే ఘటనా స్థలికి చేరకుని శాంతను చికిత్స నిమిత్తం ఎంజీఎం తరలించారు. నడవలేని స్ధితిలో ఉన్న బాధితురాలు శాంత డయల్ 100కు కాల్ చేసి విషయం తెలిపింది. దీంతో స్వయంగా వృద్ధురాలి ఇంటికే వెళ్లి విచారణ చేపట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ కాపీని కాపీని శాంతకు అప్పగించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. వృద్ధులను దూషించిన, ఎలాంటి ఇబ్బందులు కలగజేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిపై కుమారుడి దాడి బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇంటి వద్దే ఎఫ్ఐర్ నమోదు -
గోల్ సాధించారు..
సివిల్ సర్వీస్.. ఇది పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే ప్రతీ అభ్యర్థి కల. జాతీయ స్థాయిలో సేవ చేసేందుకు దోహదపడే ఐఏఎస్.. ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ వంటి ఉన్నతస్థానాల్లో కొలువుదీరేందుకు దోహదపడేదే సివిల్స్. ఈ కలను నిజం చేసుకునే ప్రయాణంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పలువురు అభ్యర్థులు విజయం సాధించారు. శుక్రవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులతో ‘గోల్’ సాధించారు. సివిల్స్ ర్యాంకులు సాధించి ఉమ్మడి వరంగల్ జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలిపిన అభ్యర్థుల వివరాలతో ప్రత్యేక కథనం. సివిల్స్ ఫలితాల్లో మెరిసిన ఉమ్మడి జిల్లా అభ్యర్థులుఉత్తమ ర్యాంకులతో కల సాకారం చేసుకున్న యువకులు మొన్న గ్రూప్–1, ఇప్పుడు సివిల్స్ ఐనవోలు: ఐఏఎస్ లక్ష్యంగా కష్టపడి చదివిన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన బేతి మల్లేశం– అరుణ దంపతుల కుమారుడు బేతి విక్రమ్ సివిల్స్లో 472వ ర్యాంకు సాధించారు. తెలంగాణ గ్రూప్–1 ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సా ధించి సిద్దిపేట జిల్లా మార్కూర్ మండల ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తూనే సివిల్స్కు ప్రి పేరై 472వ ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలి చారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఐటీ ఉద్యోగాని కి ఎంపికై సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన విక్రమ్ ఐఏ ఎస్ తండ్రి సహకారంతో యూపీపీఎస్సీ పరీ క్షకు హాజరయ్యారు. ఈసందర్భంగా విక్రమ్ తండ్రి మల్లేశం మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతం నుంచి తన కుమారుడు సివిల్స్ ర్యాంకు సాధించడం గర్వంగా ఉందన్నారు.ఐఏఎస్కు తరుణ్ తేజ ఎంపికకాజీపేట/విద్యారణ్యపురి: కాజీపేట 61వ డివిజన్ ప్రశాంత్నగర్ కాలనీ–3కి చెందిన అట్ల తరుణ్ తేజ శుక్రవారం సివిల్స్ ఫలితాల్లో 123వ ర్యాంకు సాధించి ఐఏఎస్కు ఎంపికయ్యారు. తరుణ్ తేజ తల్లి అమరావతి వర్ధన్నపేట మండలం రామ్ధన్తండాలో స్కూల్ అసిస్టెంట్గా, తండ్రి రవీందర్ పంథినిలో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. కాజీపేట సెయింట్ గాబ్రియల్ హైస్కూల్లో టెన్త్ వరకు చదివిన తరుణ్.. ఇంటర్ హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కాలేజీలో చదివారు. జేఈఈ మెయిన్స్లో అఖిల భారతీయ స్థాయిలో 8వ ర్యాంకు సాధించి ఐఐటీ ముంబైలో సీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగంలో చేరారు. అనంతరం ఐఏఎస్ లక్ష్యంగా సివిల్స్ రాశారు. తొలిసారి 770వ ర్యాంకు సాధించి ఐఆర్ఎంఎస్లో ఉద్యోగం సాధించారు. గతేడాది మరోసారి సివిల్స్ పరీక్ష రాసి ప్రస్తుతం 123వ ర్యాంకు సాధించి ఐఏఎస్కు ఎంపికయ్యారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కామారం వీరి స్వగ్రామం. -
డీఎస్పీ శిక్షణలోనే సివిల్స్ ర్యాంకు..
ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రానికి చెందిన దైనంపల్లి ప్రవీణ్ గ్రూప్–1 పరీక్షల్లో 105వ ర్యాంక్ సాధించి డీఎస్పీగా హైదరాబాద్లో శిక్షణ పొందుతున్నారు. శుక్రవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 793వ ర్యాంక్ సాధించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ప్రవీణ్ను పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న ఎల్లమ్మ(నానమ్మ) కష్టపడి పెంచారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ చదువులో ముందుకు సాగిన ప్రవీణ్ ఈ విజయాన్ని అందుకోవడంపై స్థానిక ప్రజలు, స్నేహితులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. -
భరత్కు 900 ర్యాంకు
జనగామ: నర్మెట మండలం మచ్చుపహాడ్ గ్రామానికి చెందిన దస్రు నాయక్, అనసూయ దంపతుల పెద్ద కుమారుడు భరత్ సివిల్స్లో 900వ ర్యాంకు సాధించారు. సివిల్స్ –2023లో 135వ ర్యాంకుతో ఐఎఫ్ఎస్ సాధించి ప్రస్తుతం డెహ్రాడూన్లో శిక్షణ పొందుతున్నారు. జిల్లా కేంద్రంలోనే టెన్త్ పూర్తి చేసిన భరత్ ఐఐటీ మద్రాస్లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో బీటెక్ చదివారు. అనంతరం బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తూనే యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యారు. తెలంగాణ గ్రూప్–1 పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించి మున్సిపల్ కమిషనర్గా ఎంపికయ్యే అవకాశం ఉన్నా.. సివిల్స్ లక్ష్యంగా తన ప్రిపరేషన్ కొసాగించారు. భరత్ తండ్రి దస్రూ లింగాలఘనపురం మండలం గుమ్మడవెల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తుండగా, భరత్ తమ్ముడు కాన్పూర్లోని ఆర్టిఫిషియల్ లిమ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్లో ఆఫీసర్ కేడర్లో పనిచేస్తున్నారు. కాగా, ఐఏఎస్ లక్ష్యంగా మరోసారి యూపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతానంటున్నారు.. భరత్. -
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
హసన్పర్తి: నూతన సాంకేతికతను ఆస్వాదించాలని దర్శకుడు, కిట్స్ కళాశాల పూర్వ విద్యార్థి ప్రశాంత్ ఆర్.విహారి అన్నారు. కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న స్టూడెంట్ కల్చరల్ కార్నివాల్ ‘సంస్కృతి– 26’ వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రశాంత్ విహారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి వేడుకలు దోహదపడుతాయన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న అసంబద్ధమైన అంశాలకు అలవాటు పడొద్దని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కిట్స్ కళాశాల అదనపు కార్యదర్శి సతీష్కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నాయకత్వపు లక్షణాలు పెంపొందించడానికి వేడుకలు ఉపకరిస్తాయని తెలిపారు. విద్యార్థులు సానుకూల దృక్ఫథాన్ని అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్రెడ్డి, కళాశాల యాజమాన్య వర్గ సభ్యుడు వెంకట్రామ్రెడ్డి, ప్రోగ్రాం చైర్పర్సన్ ప్రొఫెసర్ శ్రీధర్, కన్వీనర్ డాక్టర్ పీఎస్ఎస్ మూర్తి, డాక్టర్ శిరీష, డాక్టర్ ప్రభాకరాచారి, విద్యార్థి ఐటీ విభాగం అధ్యక్షురాలు సంహిత, ఉపాధ్యక్షురాలు శ్రీలాస్య విద్యార్థి విభాగం ప్రతినిధులు సాయి సుమంత్, సాయి ధనుష్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా..కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రదీప్ డీజీ బ్యాండ్ ఆకట్టుకుంది. దర్శకుడు ప్రశాంత్ ఆర్.విహారి కిట్స్లో ప్రారంభమైన సంస్కృతి –26 వేడుకలు -
గుండు అఖిలేశ్కు 462 ర్యాంకు
కాజీపేట అర్బన్: కాజీపే ట మండలం న్యూశాయంపేటకు చెందిన గుండు సరస్వతి శివకుమార్ కుమారుడు గుండు అఖిలేశ్ సివిల్స్లో 462వ ర్యాంకు సాధించారు. శివకుమార్ భూపాలపల్లిలో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. టెన్త్ వరకు వరకు హనుమకొండలోని వరంగల్ పబ్లిక్ స్కూల్లో, ఇంటర్ ఓ ప్రైవేట్ కళాశాలలో, ఐఐటీ ఖరగ్పూర్లో ఐదేళ్ల బీటెక్, ఎంటెక్ పూర్తిచేశారు. 2021లో ఐఈఎస్ ఇంజనీరింగ్ సర్వీస్లో ఇండియాలో 6వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఢిల్లీలో సీపీడబ్ల్యూ విభాగంలో సివిల్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అఖిలేశ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సమాజ సేవే లక్ష్యంగా సివిల్స్కు ప్రిపేరై.. 462వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఐపీఎస్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. -
ముందస్తు ఫ్లాట్ల బుకింగ్ పేరుతో మోసం
● రూ.81 లక్షలు వసూలు చేసిన నిందితుడి రిమాండ్ వరంగల్ క్రైం: ఫ్లాట్ల ముందస్తు బుకింగ్ పేరుతో డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని రిమాండ్కు తరలించినట్లు హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. హైదరాబాద్ గుండ్లపోచంపల్లిలో 2018లో ఎస్వీబీ వైభవ్ పేరుతో ఏడు అంతస్తుల్లో 164 ఫ్లాట్లు నిర్మిస్తున్నామని సోలిపేట ప్రభాకర్రెడ్డి, కోడూరు లక్ష్మి ఆశ చూపారు. హనుమకొండ ఏనుగులగడ్డకు చెందిన బందెల్లి స్వర్ణ దగ్గర రూ.81 లక్షలు తీసుకొని మోసం చేశారు. సంవత్సరాలు గడుస్తున్నా పనులు మొదలుపెట్టకపోవడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు సోలిపేట ప్రభాకర్రెడ్డిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
మెరిసిన జనగామ డీపీఓ
జనగామ: జనగామ జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న అంగరాజు నవీన్ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 715వ ర్యాంక్ సాధించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లకు చెందిన సైదులు– లింగమ్మ కుమారుడు నవీన్ వరంగల్లోని కేఎంసీలో తన వైద్య విద్యను 2021లో పూర్తి చేశారు. అనంతరం నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్గా పనిచేశారు. సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా కృషి చేసిన ఆయన నాల్గో ప్రయత్నంలో 715వ ర్యాంకు సాధించారు. గతంలో గ్రూప్–1లో ఉత్తమ ర్యాంకు సాధించి ప్రస్తుతం డీపీఓగా విధులు నిర్వర్తిస్తూనే సివిల్స్కు ప్రయత్నించి విజయం సాధించారు. ఇదే పట్టుదలతో ఐఏఎస్ దిశగా ప్రిపరేషన్ కొనసాగిస్తానంటున్నారు.. నవీన్. -
జువైనల్ హోంకు ఇద్దరు బాలురు
కాజీపేట: కాజీపేట పోలీస్స్టేషన్ పరిధిలో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన ఇద్దరు మైనర్లను శుక్రవారం న్యాయమూర్తి ఆదేశం మేరకు జువైనల్ హోమ్కు తరలించినట్లు ట్రాఫిక్ సీఐ వెంకన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల నిర్వహించిన ప్రత్యేక తనిఖీ ల్లో ఇద్దరు బాలురు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ద్విచక్ర వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లు చెప్పారు. వీరిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి పిల్లలను జువైనల్ హోమ్కు పంపించినట్లు సీఐ వెల్లడించారు. హసన్పర్తి: మండల కేంద్రంలోని తెలంగాణ బాలిక గురుకుల విద్యాలయంలో ఎలుకల దాడి ఘటన మరువక ముందే మరో సంఘటన చోటుచేసుకుంది. పాఠశాల భవన స్లాబ్పై నాగుపాము బుసలు కొడుతున్నట్లు శబ్దాలు రావడంతో విద్యార్థినులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్క్యాచర్ను పిలిచారు. గంట పాటు యత్నించిన తర్వాత పాము చిక్కింది. సుమారు ఆరడుగుల పొడవు గల పామును నల్లగట్టులో వదిలారు. ఇదిలా ఉండగా నల్లగట్టుగుట్ట వద్ద పాము వదిలిపెట్టడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 8, 9 తేదీల్లో మహిళా రైతు మేళాహన్మకొండ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్లో మెగా మహిళా రైతు మేళా నిర్వహించనున్నట్లు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ రైతు మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్న కీలక సవాళ్లు – వాటి పరిష్కారాలపై శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులతో ముఖాముఖి’ నిర్వహించనున్నట్లు తెలిపారు. అధిక రసాయన ఎరువుల వాడకం వల్ల వచ్చే దుష్ప్రభావాలు, నేల–పర్యావరణ పరిరక్షణపై మహిళా రైతులకు అవగాహన కల్పించడం ఈకార్యక్రమ లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన రైతు మేళాలో పాల్గొనే మహిళా రైతులు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలను సంప్రదించాలని సూచించారు. దీంతో పాటు ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో దామెర మండలంలోని పులకుర్తిలో పెరటి తోటలు, నాటు కోళ్ల పెంపకం, నిత్య జీవితంలో బలవర్ధక ఆహారం ప్రాధాన్యంపై మహిళా రైతులు – శాస్త్రవేత్తల ‘ముఖాముఖి’ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ద్వారా సీతారాముల తలంబ్రాలుహన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్ పార్శిల్ ద్వారా సీతారాముల కల్యాణం త లంబ్రాలు భక్తులకు అందించాలని నిర్ణ యం తీసుకున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజిన ల్ మేనేజర్ విజయభాను తెలిపారు. శుక్రవారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో ఆర్ఎం డి.విజయభాను, డిప్యూటీ ఆర్ఎం భాను కిరణ్ తలంబ్రాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ.. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలు ప్రతీ ఇంటికి డోర్ డెలివరీ చేయనున్నట్లు తెలిపారు. తలంబ్రాలు కావాలని కోరుకునే భక్తులు రూ.151 చెల్లించి బుక్ చేసుకోవాలని సూచించారు. ఎగ్జిక్యూటివ్లు, మోబైల్ ఫోన్, గూగుల్ బ్రౌజర్లో, అడ్రస్ బార్లో టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ అని టైప్ చేసి తలంబ్రాలు బుక్ చేసుకోవాలన్నారు. ఎగ్జిక్యూటివ్స్ ఎస్.రామయ్య 91542 98759, సతీశ్కుమార్ 91542 98761, చైతన్య కుమార్ 91542 98766, ఎం.నవత 91542 98758ను సంప్రదించాలని కోరారు. -
ఉన్నత విద్య స్వయంప్రతిపత్తి కలిగి ఉండాలి
విద్యారణ్యపురి: ఉన్నతవిద్య స్వయంప్రతిపత్తి కలిగి ఉండాలని సామాజికవేత్త, సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘అకడమిక్ ప్రీడమ్ ఇన్స్టిట్యూషనల్ అటానమీ అండ్ డెమొక్రాటిక్ రెసిలియన్స్’ అంశంపై శుక్రవారం జాతీయ సదస్సు నిర్వహించారు. ఫ్యాకల్టీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యారంగంలో శాసీ్త్రయ విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలని కోరారు. పాలకవర్గాలు అనుసరిస్తున్న విధానాలతో అకడమిక్ పరంగా బోధన చేసే పరిస్థితులు అధ్యాపకుల చేతుల్లో లేకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఉన్నత విద్యారంగానికి రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెసర్ హరిజందర్సింగ్ మాట్లాడుతూ డిజిటల్ మాధ్యమాలను సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కె. శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ విద్య, వైద్యం నాణ్యతగా లభిస్తే ప్రైవేట్రంగాలు అభివృద్ధి చెందవని పేర్కొన్నారు. జాతీయ సదస్సు ఈనెల 7న ముగియనుంది. సదస్సుకు కేడీసీ ప్రిన్సిపాల్ ఆచార్య గుర్రం శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. కన్వీనర్ శ్రీనివాస్రెడ్డి, ఫాక్యల్టీ ఫోరం బాధ్యులు మధుసూదన్రెడ్డి, అరుణకుమార్ మాట్లాడారు. సామాజికవేత్త, రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాల్ కేడీసీలో జాతీయ సదస్సు -
ముగ్గురికి జైలు
కాజీపేట: కాజీపేట పట్టణంలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 18 మందిని శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్ష, 15 మందికి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఫాతిమా చిన్నప్ప తీర్పునిచ్చారు. ట్రాఫిక్ సీఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో ఇటీవల పోలీస్ సిబ్బంది నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 18 మంది పట్టుపడ్డట్లు తెలిపారు. వీరిలో బత్తుల దిలీప్, శివరాత్రి రాజు, అంబాల రాజులకు జైలు శిక్ష విధించగా హుజూరాబాద్ సబ్ జైలుకు పంపించినట్లు తెలిపారు. -
24 గంటల విద్యుత్ ఉత్తమాట
హన్మకొండ: వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్న మాట ఉత్తదేనని విద్యుత్ వినియోగదారులు చెప్పారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటైల్ విద్యుత్ సరఫరా వ్యాపారం కోసం సవరణ చేసిన సమగ్ర ఆదాయ అవసరాలు, విద్యుత్ ధరల ప్రతిపాదనలు, ఓపెన్ యాక్సెస్, వినియోగదారులపై క్రాస్ సబ్సిడీ, సర్చార్జీల ప్రతి పాదనలపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్, ఫైనాన్స్ మెంబర్ చెరుకూరి శ్రీనివాస రావు, టెక్నికల్ మెంబర్ రఘు కంచెర్ల బహిరంగ విచారణ చేపట్టారు. ఆదిలాబాద్కు చెందిన బీకేఎస్ నాయకుడు భూమారెడ్డి, జగిత్యాల జిల్లాకు చెందిన విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా ఇవ్వడం లేదని రోజుకు 7 నుంచి 12 గంటలు మాత్రమే ఇస్తున్నారన్నారు. మాజీ మంత్రి జలగం ప్రసాద రావు మాట్లాడుతూ ఎన్పీడీసీఎల్లో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందన్నారు. ఆపరేటర్లు లేక కొత్త సబ్స్టేషన్లు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ఆయా జిల్లాల రైతు సంఘాల నాయకులు, వినియోగదారులు మాట్లాడుతూ ఆదిలాబాద్, కరీంనగర్లో సీజీఆర్ఎఫ్ ఏర్పాటు చేయాలని, సీజీఆర్ఎఫ్ నిర్వహిస్తున్న లోకల్ కోర్టుల సంఖ్యలో నెలకు కనీసం 10కి పెంచాలని కోరారు. విద్యుత్ షాక్ మృతి ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలన్నారు. అనంతరం రైతు సంఘం నాయకుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. పలువురు వినియోగదారులు సమస్యలు వివరించగా వాటిని పరిశీలించాలని ఈఆర్సి చైర్మన్ జస్టిస్ నాగార్జున్ ఆదేశించారు. వినియోగదారులకు అత్యుత్తమ సేవలు విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ అందిస్తున్నామని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి చెప్పారు. బహిరంగ విచారణలో 38 మంది వినియోగదారులు అభ్యంతరాలు లేవనెత్తగా వరుణ్ రెడ్డి సమాధానం ఇస్తూ సబ్ స్టేషన్లను రిమోట్ మానిటర్ ద్వారా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఆసుపాక, కమలాపూర్ 33 కేవీ కొత్త లైన్, గుండాల 132 కేవీ సబ్ స్టేషన్లకు టెండర్ పిలిచామన్నారు. వాట్సాప్ చాట్ బాట్, టోల్ ఫ్రీ నంబర్ 1912, టీజీ ఎన్పీడీసీఎల్ పోర్టల్ ద్వారా సమస్యలు నమోదు చేసుకోవచ్చన్నారు. విద్యుత్ ప్రమాదాలు 22 శాతానికి తగ్గించా మని అన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, జీపీల్లో 1912 రాయించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. సోలార్ రూఫ్ టాప్ ద్వారా 135 మెగావాట్లు గ్రిడ్కు కనెక్ట్ చేస్తున్నామని చెప్పారు. ఖమ్మంలోని బోనకల్ మండలాన్ని మోడల్ సోలార్ గ్రామంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. పరిశ్రమలపై విద్యుత్ భారాన్ని తగ్గించాలి వరంగల్: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు, ప్రస్తుత ఉన్న పరిశ్రమల పురోగతికి పరిశ్రమలపై విద్యుత్ భారాన్ని తగ్గించాలని తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు బొమ్మినేని రవీందర్రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా కాటన్ అసోసియేషన్ అధ్యక్షులు చింతలపల్లి వీరారావులు అన్నారు. బహిరంగ విచారణలో పలు పారిశ్రామిక సమస్యలపై చర్చించారు. 70.29 లక్షల మంది వినియోగదారులు టీజీఎన్పీడీసీఎల్లో 70.29 లక్షల మంది విని యోగదారులు ఉన్నారని, తలసరి విద్యుత్ విని యోగం 1,680 యూనిట్లుగా ఉందన్నారు. ఈ నెలలో అత్యధిక పీక్ డిమాండ్ 6441 మెగావాట్ల చేరుకుందని తెలిపారు. 150 కొత్త 33/11 కేవీ అవుట్డోర్ సబ్ స్టేషన్లు, ఇండోర్ సబ్ స్టేషన్లు 5 నిర్మిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ నష్టాల తగ్గింపును లక్ష్యంగా పెట్టుకుని పీఎం కుసుమ్ పథకం కింద డిస్ట్రిబ్యూటెడ్ సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, మధుసూదన్, ప్రభాకర్, మోహన్ రావు పాల్గొన్నారు.రోజుకు 7 నుంచి 12 గంటలే సరఫరా సిబ్బంది కొరతతో ఇబ్బందులు సీజీఆర్ఎఫ్లు ఏర్పాటు చేయాలి బహిరంగ విచారణలో వినియోగదారులు -
విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
కేయూ క్యాంపస్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో సవాళ్లకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకుంటూ నూతన ఆవిష్కరణలపై దృష్టిసారించాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రం అన్నారు. కేయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం క్యాంపస్లోని ఆడిటోరియంలో నిర్వహించిన రూబిజెస్ట్–26 టెక్నికల్ ఫెస్టివల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భిక్షాలు అధ్యక్షత వహించగా రామచంద్రం మాట్లాడారు. సమస్య పరిష్కార నైపుణ్యం, విమర్శనాత్మక ఆలోచనలే ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలకు మూలమన్నారు. యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో విద్యార్థినులు అవకాశాలు అందిపుచ్చుకోవడం అభినందనీయమన్నారు. నిట్ ప్రొఫెసర్ కిరణ్కుమార్ మాట్లాడుతూ.. ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదువుతూ ఆశాభావంతో ముందుకెళ్తే భవిష్యత్లో ఉన్నతస్థితికి చేరుకోవచ్చన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ భిక్షాలు, స్టూడెంట్స్ అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ అర్చన, కన్వీనర్ డాక్టర్ సురేందర్, మహిళా ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు, స్టూడెంట్ కోఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు, ఇతర కాలేజీల విద్యార్థులు టెక్నికల్ ఈవెంట్స్ను ప్రదర్శించారు. వివిధ బ్రాంచీలకు సంబంధించి కోడ్ రైటింగ్, లాజికల్ ఫజిల్స్, క్లూస్కోడ్, ప్రాజెక్ట్ ఎక్స్పో, వివిధ పోస్టర్ల ప్రజెంటేషన్స్ చేశారు. విద్యార్థినుల సాంస్కృత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నేడు కల్చరల్ఫెస్ట్తో కార్యక్రమం ముగియనుంది. కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం ఆడిటోరియంలో రూబిజెస్ట్–26 టెక్నికల్ ఫెస్టివల్ -
ఆదర్శం.. ఈ ఆచార్యుడు
ఎంజీఎం: కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ వీఎన్ మాధవరావు ఫిబ్రవరిలో 100 శాతం విధులకు హాజరు హాజరై పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సాధారణంగా ప్రొఫెసర్లు సెలవులను ఎక్కువగా వినియోగించుకుంటారు. కానీ, దీనికి భిన్నంగా డాక్టర్ వీఎన్ మాధవరావు ఫిబ్రవరిలో వంద శాతం హాజరు నమోదు చేసుకుని పలువురు వైద్యశాఖ ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకున్నారు. ఎంజీఎం: మహిళలు సవాళ్లను అధిగమించి సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలని సీనియర్ డాక్టర్లు కూరపాటి రాధిక, రమేశ్ పిలుపునిచ్చారు. వరంగల్లోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో శుక్రవారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడుతూ.. మహిళలు సమాజంలో ఎదురయ్యే అడ్డంకులు, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, ప్రతిభతో అన్ని రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహిళలు సంకల్పం, పట్టుదలతో ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించగలరని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ తాటి సునీత, ఫ్యాకల్టీ, బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎంజీఎం: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు నాలుగు దశల్లో వైద్య శిబిరాలు, వైద్య నిర్ధారణ పరీక్షలు, అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తెలిపారు. మొదటి దశలో ఈనెల 6వ తేదీ నుంచి 31 వరకు స్పెషలిస్ట్ వైద్యులచే నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించే శిబిరాల్లో ఎంజీఎం ఆస్పత్రి, ప్రసూతి ఆస్పత్రి నుంచి సీ్త్ర వైద్యులు, పిల్లల వైద్యులు, జనరల్ ఫిజీషియన్, కంటి, ఎముకల వైద్య నిపుణులతోపాటు జనరల్ ఫిజీషియన్లు సేవలందిస్తారని పేర్కొన్నారు. మరింత ఉన్నతమైన సేవల కోసం రెఫర్ చేసిన వారిని ప్రత్యేకంగా నమోదు చేసుకొని ఫాలోఅప్ సేవలు అందిస్తారని చెప్పారు. 14 ఏళ్ల బాలికలకు ఈనెల 8 నుంచి హెచ్పీవీ వ్యాక్సిన్ ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు. హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శుక్రవారం సాయంత్రం సంకటహరచతుర్థి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు గంగు మణికంఠశర్మ, సందీప్శర్మ, ప్రణవ్ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సంకటచతుర్థిని పురస్కరించుకుని సాయంత్రం దేవాలయంలోని కాకతీయుల కాలంనాటి ఉత్తిష్ట గణపతికి అభిషేకాలు నిర్వహించారు. గణపతికి ఇష్టమైన గరికతో అష్టోత్తరశతనామాలు పఠిస్తూ షోఢశోపచార పూజలు చేశారు. మహాహారతి మంత్రపుష్పం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. -
కేయూలో అధ్యాపకులేరి?
సాక్షిప్రతినిధి, వరంగల్: కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ)లో ఏళ్ల తరబడి అధ్యాపకుల కొరత తీరట్లేదు. రోజురోజుకూ అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల సమస్య తీవ్రమవుతోంది. యూనివర్సిటీలో 13 ఏళ్లుగా రెగ్యులర్, టీచింగ్ పోస్టుల నియామకాలు జరగలేదు. ఫలితంగా రెగ్యులర్ అధ్యాపకుల కొరత తీవ్రస్థాయికి చేరింది. ఒక్కసారి అధ్యాపకుల గణాంకాలను పరిశీలిస్తే మంజూరైన పోస్టుల్లో కేవలం 18.82 శాతం మందితోనే కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నియామకాల జాప్యం.. విఫలమవుతున్న ప్రయత్నాలు కాకతీయ యూనివర్సిటీలో మంజూరైన మొత్తం రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టులు 409 కాగా అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు కలిపి 77 మందే పనిచేస్తున్నారు. 2013 నుంచి నేటివరకు ఒక్క రెగ్యులర్ నియామకం జరగలేదు. పదేళ్లుగా ఉద్యోగ విరమణలు పెరుగుతున్నా, కొత్త రిక్రూట్మెంట్లు చేపట్టకపోవడంతో ఖాళీలు పేరుకుపోతున్నాయి. 2017లో ఒకసారి అప్పటి పాలకవర్గం హయాంలో 136 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతి పొందే ప్రయత్నం జరిగినప్పటికీ, ఆ ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు. 47 రకాల కోర్సులు, రెండు ఇంజనీరింగ్ కళాశాలలు, కామర్స్, ఫార్మసీ, లా వంటి కీలక విభాగాలు ఈ యూనివర్సిటీలో ఉన్నాయి. ప్రభుత్వ ఉదాసీ నతతో నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం జరగడమే కాకుండా, వర్సిటీ పరిశోధనా రంగం కుంటుపడుతోంది. రెగ్యులర్ సిబ్బంది తగినంత లేకఅధి కంగా అకడమిక్ కన్సల్టెంట్లు (కాంట్రాక్టు అధ్యాపకులు), పార్ట్టైం టీచర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఈసారైనా భర్తీ చేస్తారా? యూనివర్సిటీలు ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాల్లో మొత్తం 2,994 మంజూరైన పోస్టులు ఉండగా, ప్రస్తుతం 763 మంది రెగ్యులర్ అధ్యాపకులు మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన వారిలో 1,174 మంది కాంట్రాక్టు పద్ధతిలో, 544 మంది పార్ట్టైం పద్ధతిలో పనిచేస్తున్నారు. కాగా, సుమారు 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యామండలి ద్వారా నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం. త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ నియామకాల కోసం ప్రతిపాదనలు స్వీకరించినట్లు చెబుతుండగా.. ఇందుకు సంబంధించిన ప్రకటన ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీలో 250 పోస్టులు, కాకతీయ యూనివర్సిటీలో 145 పోస్టులను భర్తీ చేయనున్నారన్న చర్చ జరుగుతోంది. వీటితోపాటు పాలమూరు, శాతవాహన వంటి ఇతర విశ్వవిద్యాలయాల్లో కూడా కొన్ని పోస్టులను భర్తీ చేస్తారంటున్నారు. దీంతో ఈసారైనా కేయూలో ఉన్న ఖాళీలు భర్తీ అవుతాయా? అనే చర్చ మొదలైంది. కీలక విభాగాల్లో పోస్టులు ఖాళీ.. 2017 నుంచి ఇదే పరిస్థితిప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత తీరేదెప్పుడు పది విభాగాల్లో ఒక్క ప్రొఫెసర్ కూడా లేని పరిస్థితి అకడమిక్ కన్సల్టెంట్లపైనే ఆధారం.. పరిశోధనలపై తీవ్ర ప్రభావం తాజాగా 13 వర్సిటీలకు 500 పోస్టుల ప్రకటన ఈసారైనా ఖాళీలు భర్తీ అయ్యేనా? -
స్విమ్మింగ్ పూల్ను పునఃప్రారంభించండి
వరంగల్ స్పోర్ట్స్: ఈత సాధన చేసే విద్యార్థులు, యువతకు, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో తీసుకొచ్చి, వచ్చే నెల (ఏప్రిల్) 1వ తేదీన పునఃప్రారంబించాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. హనుమకొండ బాలసముద్రంలోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్లో చేపట్టిన అభివృద్ధి పనులను శుక్రవారం కలెక్టర్ చాహత్బాజ్పాయ్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పనులు వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూల్ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కలెక్టర్ చాహత్ వెంట డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్, ఆర్అండ్బీ ఈఈ సురేశ్బాబు, డీఎస్ఏ కోచ్లు రాయబారపు నవీన్, శ్రీమన్నారాయణ, రాజారపు రమేశ్, టీజీఐఐసీ అధికారులు ఉన్నారు. కలెక్టర్ చాహత్బాజ్పాయ్ స్విమ్మింగ్పూల్ అభివృద్ధి పనుల పరిశీలన -
కోర్టులో మహిళా దినోత్సవం
వరంగల్ లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ల అధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబ, హనుమకొండ ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి బి.అపర్ణాదేవి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. మహిళలు తాము ఎంచుకున్న రంగంలో ఎదగాలని, హక్కుల సాధించుకోవాలి తప్ప అడుక్కోవద్దని సూచించారు. ఈ సందర్భంగా 20 సంవత్సరాలకుపైగా వృత్తిలో కొనసాగుతున్న పలువురు మహిళా న్యాయవాదులను శాలువాలతో సత్కరించారు. ఏసీబీ కోర్టు జడ్జి క్షమాదేశ్ పాండే, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి.రామలింగం, ఉభయ బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ, మహిళా కార్యదర్శులు నాగేంద్ర, శశిరేఖ తదితరులు పాల్గొన్నారు. -
టీపీసీసీ మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఎర్రబెల్లి స్వర్ణ తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈమేరకు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ మేయర్గా, కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన స్వర్ణ రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులైన స్వర్ణకు ఉమ్మడి జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు చెప్పారు. -
రాష్ట్రాన్ని దోచుకుంటున్న సీఎం: ఆర్ఎస్పీ
హన్మకొండ: సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ పోరాడుతుంటే 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని తూర్పారబట్టారు. వెలుగుమట్లలో రెండు వేల పేద కుటుంబాల ఇళ్లను కూల్చి రోడ్డుపై పడేశారని మండిపడ్డారు. నాలుగు వేల మంది పోలీసులతో వెలుగుమట్లను గాజాగా మార్చారని ధ్వజమెత్తారు. హైదరాబాద్లో రూ.300 కోట్ల విలువైన భూమిని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుమారుడు కబ్జా చేస్తే గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేస్తే సీఐని బదిలీ చేయించారన్నారు. మేడారంలో నాసిరకం పనులు చేస్తూ దోచుకుంటున్నారని, భూభారతి పేరుతో రూ.వందల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. దీనికి బాధ్యుడిగా మంత్రి పదవికి శ్రీనివాస్రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నాయకులు ఇమ్మడి రాజు, జన్ను జకర్య, గబ్బెట శ్రీను, మంద శ్యాం, జంపన్న, చక్రి, సదాంత్, పూర్ణచందర్, ప్రశాంత్, మనోజ్ కుమార్ పాల్గొన్నారు. -
ఏఐతో ఆర్థిక వ్యవస్థలో మార్పు
హసన్పర్తి: కృత్రిమ మేధస్సు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వేగంగా మార్చేస్తోందని ఎస్ఆర్ వర్సిటీ వీసీ దీపక్ గార్గ్ అన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ అస్ట్రా స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో ‘స్ట్రాటజీ అనలిటిక్స్ టెక్నాలజీ అండ్ కల్చర్’ (ఎస్ఏటీటీ) అంశంపై రెండు రోజుల సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ కోడింగ్ చేయడంతో అనేక పనులను ఏఐ వ్యవస్థలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. మానవ సృజనాత్మకత, నిర్ణయ సామర్థ్యం, భావోద్వేగ అవగాహన వంటి అంశాలు సంస్థల అభివృద్ధికి కీలకమన్నారు. ఆరిఫ్టి టెక్నాలజీ సీహెచ్ఆర్ఓ రాంచందర్ మాట్లాడుతూ సంస్థలు పోటీల్లో నిలవాలంటే వ్యూహం, అనలిటిక్స్, టెక్నాలజీ, సంస్థ సంస్కృతి, సమన్వయం కావాలన్నారు. ప్రస్తుతం హెచ్ఆర్ విభాగం పరిపాలనా పనులకు మాత్రమే పరిమితం కాకుండా సంస్థ మార్పులకు దారితీసే వ్యూహాత్మక విభాగంగా మారుతోందన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్కూల్ ఆఫ్ బిజినెస్ విభాగం డీన్ డాక్టర్ గురునాథం, డాక్టర్ ఎం.రాజ్యలక్ష్మి, డాక్టర్ అర్చనారెడ్డి, రమేశ్బాబు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలి
సాక్షి, మహబూబాబాద్: సంక్షేమ పథకాలు అర్హులకు చేరినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, ఆ దిశగా అధికారులు ముందుకు పోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికపై ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం శుక్రవారం మహబూబాబాద్ కలెక్టరేట్లో జరిగింది. పలు అంశాలపై కలెక్టర్లు ప్రణాళికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనుల్లో నూతన ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని, ఇందుకోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. వేసవి సెలవుల్లో పాఠశాల్లో మరమ్మతులు చేయించాలన్నారు. మండలంలోని అధికారి హాస్టళ్లను దత్తత తీసుకొని వారంలో రెండు రోజులు అక్కడే భోజనం చేసేలా చూడాలని పేర్కొన్నారు. ప్రమాదాలు నివారించేందుకు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే పాఠశాల గుర్తింపు ఇవ్వాలని ఆదేశించారు. బిల్లులు అందించి ఈనెల చివరి వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి పేదలకు అందించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండ్ చేయని లబ్ధిదారుల నుంచి అంగీకారాన్ని తీసుకుని రద్దు చేయాలని తెలిపారు. పాత భవనాలకు అవసరమైన చోట రంగులు వేయించాలని సూచించారు. ఇవేకాకుండా ప్రజల నుంచి వచ్చే వినతులు పరిశీలించాలని, ప్రజలకు ఏం అవసరమో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. డాక్టర్లు అంకితభావంతో పనిచేయాలి.. రైతుల సమస్యల పరిష్కార మార్గాలను తెలిపేందుకు సీనియర్ రైతులను భాగస్వామ్యులను చేసి చెప్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు అంకిత భావంతో పనిచేస్తే రోగుల సంఖ్య పెరుగుతుందని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే బాధ తప్పుతుందని మంత్రి అన్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల మధ్య భూసమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో సాదాబైనామాకు అవకాశం వస్తుందని, అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి.. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల స్థితిని తెలుసుకుంనేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించాలని, సమాచారాన్ని ప్రజల ఫోన్లకు చేరవేయాలని సూచించారు. బాలికల వసతి గృహాల్లో ఇన్సినిరేటర్లు ఏర్పాటు చేయాలని, మండల స్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య పరీక్షలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. ఎంపీ బలరాంనా యక్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టే పనులు జాప్యం చేస్తున్నారన్నారు. ములుగు జిల్లా ఉపాధి హామీ పథకంలో వెనుకబడి ఉందని తెలిపారు. ప్రభుత్వ విప్ రాచంద్రునాయక్ మాట్లాడుతూ.. గత కలెక్టర్ హయాంలో ఫైల్స్ పెండింగ్లో ఉండడంతో మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలు నిలిచి పోయాయని వివరించారు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యేలు, మురళీనాయక్, నాగరాజు, ప్రకాశ్రెడ్డి, రాజేందర్రెడ్డి, దొంతి మాధవరెడ్డి తమ నియోజకవర్గాల్లో సమస్యలు, 99 రోజుల ప్రణాళికలో చేపట్టే కార్యక్రమాలు వివరించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. కార్యక్రమాలు మొక్కుబడిగా కాకుండా ప్రజల సమస్యలు పరిష్కరించేలా, పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడాలన్నారు. సమావేశానికి హాజరు కాని మహబూబాబాద్ ఆస్పత్రి సూపరింటెండెంట్, ములుగు డీఎఫ్ఓకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో ‘కుడా’ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఐదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు, మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు. వార్డు సభ్యుల నుంచి చైర్మన్లు, సర్పంచ్ల వరకు శిక్షణ ఇవ్వండి బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే పాఠశాలకు గుర్తింపు ప్రారంభించిన ప్రతీ ఇందిరమ్మ ఇల్లుకు బిల్లు అందాలి ఫారెస్ట్, రెవెన్యూ మధ్య ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలి ప్రజాపాలన–పల్లెప్రగతి ఉమ్మడి జిల్లా సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ షురూ
వరంగల్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. నగర మేయర్ గుండు సుధారాణి, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, హనుమకొండ కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, ప్రజాప్రతినిధులు, అధికారులు బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో చీపుర్లు చేతబూని చెత్తను తొలగించి పరిసరాలు శుభ్రం చేశారు. శానిటేషన్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. 99 రోజులపాటు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేయర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి–ప్రణాళికను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. వారం రోజుల పాటు పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. అంతేకాకుండా నీటి సరఫరాతోపాటు మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. హనుమకొండ కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. పీహెచ్సీల స్థాయిలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రేటర్ పరిధిలో 90 శాతం ప్రాజెక్టులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని, ఉర్సు, భద్రకాళి, వడ్డేపల్లి బండ్ను ప్రారంభించేలా చూస్తామన్నారు. స్థానిక కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, సీహెచ్ఓ రమేశ్, అకౌంట్స్ ఆఫీసర్ శివ లింగం, ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, బిర్రు శ్రీనివాస్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, హెచ్ఓ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. చీపుర్లతో చెత్తను తొలగించిన మేయర్, కలెక్టర్, ఎమ్మెల్యే భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, అధికారగణం -
గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026
7 కేంద్రాల్లో నిర్వహణ.. ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సూళ్లూరుపేట (ఏపీ), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ), షిల్లాంగ్(మేఘాలయ). ఎవరు అర్హులంటే.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. స్పేస్, సైన్స్ క్లబ్లో ఉంటే 5 శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో ఉంటే 5 శాతం, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి 20 శాతం ప్రాధాన్యం ఇస్తారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక అవకాశంఈ నెల 31 వరకు గడువు.. విద్యార్థులు మార్చి 31వ తేదీలోగా www.isro.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల వడపోత అనంతరం ఏప్రిల్ 13న ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు. మే 11 నుంచి 22 వరకు యువికా–26 కార్యక్రమం నిర్వహిస్తారు. మే 22న ముగింపు కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) నిర్వహిస్తోంది. ఈ ఏడాది చేపట్టనున్న కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను ఆహ్వానిస్తోంది. ఆ సంగతులేంటో తెలుసుకుందాం రండి. – మహబూబాబాద్ అర్బన్అంతరిక్ష పరిశోధనల్లో ఇటీవల ఇస్రో వంద ప్రయోగాలు పూర్తి చేసుకుంది. అగ్రదేశాలకు దీటుగా భారత్ పరిశోధనలు చేపడుతోంది. ఈవిజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇస్రో ఈ కార్యక్రమం చేపడుతోంది. అన్నీ ఉచితంగానే..ఇస్రో నిర్వహించే యువికా కార్యక్రమానికి ఎంపికై న విద్యార్థులకు ప్రయాణం, భోజన, వసతి సౌకర్యాలను ఇస్రో ఉచితంగా అందజేయనుంది. ఎంపికై న విద్యార్థులను మే నెలలో 12 రోజులపాటు ఇస్రోకు చెందిన స్పేస్ సెంటర్లకు తీసుకెళ్తారు. అక్కడ సైన్స్కు సంబంధించిన వింతలు, విశేషాలు, సప్త గ్రహ కూటమి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న మొత్తం విద్యార్థులు 48,941 ఉన్నారు.విద్యార్థులు వినియోగించుకోవాలి.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు భావిశాస్త్రవేత్తలుగా ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏడు రోజులు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి. – వి.రాజేశ్వర్. డీఈఓ, మహబూబాబాద్●జిల్లాల వారీగా 9వ తరగతి విద్యార్థులు శాస్త్రవేత్తలతో మాట్లాడే చాన్స్ ఈ నెలాఖరు వరకు దరఖాస్తు గడువు ఎంపికైతే ప్రత్యేక శిక్షణ -
నీళ్లు ఇలా.. తాగేదెలా?
కాశిబుగ్గ: గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ పరిధిలోని కాశిబుగ్గలో మూడు రోజుల నుంచి నల్లా నీళ్లు పసుపురంగులో సరఫరా అవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసన కూడా వస్తున్నాయని, వీటిని ఎలా తాగాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైపులైన్ అస్తవ్యస్తంగా మారి తాగునీరు శుభ్రంగా లేకపోవడంతో తాగాలంటే భయమవుతోందని చెబుతున్నారు. అసలే వేసవికాలం.. ఇలాంటి నీళ్లు తాగి అనారోగ్యాల బారిన పడితే ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి రంగునీళ్లు సరఫరా జరిగిన సమయంలో మేయర్, అధికారులు సంబంధిత ఫిల్టర్ బెడ్ను సందర్శించి పరిశీలించారు. తర్వాత శుభ్రమైన నీటిని అందించారు. ప్రస్తుతం వారు స్పందించి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు నిర్వహించనున్న 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల అభివృద్ధి అధికారులతో నిర్వహించిన సమీక్షలో కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. శాఖల వారీగా అమలు చేయాల్సిన అంశాలను సమీక్షించి స్పష్టమైన సూచనలిచ్చారు. అదనపు కలెక్టర్ రవి, డీఆర్ఓ సత్యపాల్రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. పన్ను చెల్లింపులకు రాయితీ ఉండదు.. ఆస్తి పన్ను, నీటి పన్ను చెల్లింపులపై ఎలాంటి రాయితీ లేదా వడ్డీ మాఫీ అవకాశం లేదని హనుమకొండ కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ స్పష్టం చేశారు. ప్రజలు తక్షణమే పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు. నగర పాలక సంస్థ అధికారులతో పన్నుల వసూళ్లపై సమీక్షించారు. ఈసందర్భంగా పనుల చెల్లింపులో రాయితీలు ఉంటాయనే అపోహలు ప్రచారంలో ఉన్నాయని అలాంటి అవకాశం లేదని వివరించారు. రూ.34 కోట్ల పన్ను బకాయిల వసూళ్లకు ప్రయత్నించాలని ఆదేశించారు. సోలార్ విద్యుత్ వినియోగంపై.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని గృహ విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకో వాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. కలెక్టరేట్లో పథకం అమలుపై పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. వరంగల్ జిల్లాలో.. న్యూశాయంపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలుకు పటిష్ట కార్యాచరణ రూపొందించి జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపు హాల్లో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు ఐదు దశల్లో 99 రోజులపాటు వివిధ శాఖలకు సంబంధించిన 10 ముఖ్య అంశాలపై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 6న ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయిలో కార్యాచరణపై మంత్రుల సమీక్ష సమావేశం ఉంటుందని వెల్లడించారు. సంబంధిత అధికారులు పూర్తి వివరాలతో హాజరు కావాలని ఆదేశించారు. ప్రతీరోజు నిర్వహించిన కార్యక్రమాల వివరాలను రోజువారీ ప్రగతి నివేదిక రూపంలో సమర్పించాలన్నారు. ప్రతిస్థాయిలో నోడల్ అధికారులను నియమించి రోజువారీ పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్లు బి.సంధ్యారాణి, వైవీ గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఉప కమిషనర్ ప్రసన్నరాణి, నర్సంపేట, వరంగల్ ఆర్డీఓలు ఉమారాణి, సుమ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
విద్యుత్ శాఖలో లైన్మెన్లే వెన్నెముక
టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ ఎస్ఈ మధుసూదన్ రావు హన్మకొండ: విద్యుత్ శాఖకు జూనియర్ లైన్మెన్లు, లైన్మెన్లే వెన్నెముక అని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) పి.మధుసూదన్రావు అన్నారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్లో లైన్మెన్ దివస్ను నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో విద్యుత్ ఉద్యోగ అమరుల స్తూపం వద్ద ఎస్ఈ పి.మధుసూదన్రావు, డీఈలు ఎ.విజేందర్రెడ్డి, జి.సాంబరెడ్డి, మల్లికార్జున్, అధికారులు, ఉద్యోగులు పుష్పాంజలి ఘటించారు. మౌనం పాటించి నివాళి అర్పించారు. కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్లు ఎ.విజేందర్ రెడ్డి, జి.సాంబారెడ్డి, పి.మల్లికార్జున్, కె.నవీన్ కుమార్, సహాయ డివిజనల్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్లు, అకౌంట్స్ ఆఫీసర్లు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యారంగానికి నిధులు కేటాయించాలి
డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డివిద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని డెమోట్రిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి డిమాండ్ చేశారు. హనుమకొండలో ఆ సంఘం జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యారంగంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణను నియంత్రిస్తూనే ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర విద్యావిధానం –2026 పేరుతో ఇటీవల విడుదల చేసిన నివేదికపై ఉపాధ్యాయ సంఘాలు, నిపుణులతో చర్చించి విద్యారంగం బలోపేతానికి చర్యలు చేపట్టాలన్నారు. అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకుడు గంగాధర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులను తరగతిగదికి దూరం చేసే కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ విద్యారంగం బలహీన పడుతుందన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదలచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉప్పలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా కమిటీ బాధ్యులు అంజనీదేవి, సారంగపాణి, అల్లం మల్లయ్య, కిషన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సంజీవరెడ్డి, సుభాషిణి, హర్షవర్ధన్రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వేశాఖలో సీబీఐ కేసు కలకలం!
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ పరిధిలోని రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల్లో అక్రమాలకు పాల్పడిన రైల్వే అధికారులు, కాంట్రాక్ట్ సంస్థపై సీబీఐ కేసు కలకలం సృష్టించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముగ్గురు రైల్వే ఇంజనీర్లు, ఇద్దరు ట్రాక్ నిర్వాహకులు, ఒక కాంట్రాక్ట్ సంస్థపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సీబీఐ అధికారులు కాజీపేట జంక్షన్ సబ్ డివిజన్ పరిధిలోని రైల్వే కార్యాలయాలకు వెళ్లి విచారణ చేసినట్లు జోరుగా ప్రచారం జరిగింది. సీబీఐ అధికారులు విచారణకు వచ్చిన విషయాన్ని రైల్వే పోలీసులను అడుగగా అలాంటిది ఏమి లేదని చెప్పుకొచ్చారు. సీబీఐ కేసు నమోదు అవినీతి రైల్వే ఇంజనీరింగ్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కాజీపేట రైల్వే సబ్డివిజన్ పరిధిలో కొంతమంది రైల్వే అధికారుల పనితీరు, విధి నిర్వహణ, కార్మికులను వేధిస్తున్న వారు, రైల్వే ను మోసం చేస్తూ కంభకోణాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టినట్లు రైల్వే అధికారుల ద్వారా తెలిసింది. ఇప్పుడు కాజీపేట రైల్వేట్రాక్ నిర్వహణ విధుల్లో అక్రమాలకు పాల్పడిన ఇంజనీర్లు, సిబ్బందిపై సీబీఐ కేసు నమోదు కావడం, గతంలో కాజీపేట రైల్వేలో నమోదైన రెండు సీబీఐ కేసులు దక్షిణ మధ్య రైల్వేలో సంచలనం రేపుతున్నాయి. ఐదుగురు ఉద్యోగులు, కాంట్రాక్టు సంస్థపై నమోదు ట్రాక్ నిర్వహణలో అక్రమాలే కారణం సోషల్ మీడియాలో వైరల్ -
కాక్లియర్ ఇంప్లాంట్తో అంగవైకల్యం దూరం
డాక్టర్ శ్రమలత ఎంజీఎం : కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స ద్వారా పిల్లల్లో పుట్టుకతో వచ్చిన చెవుడు, మూగ అంగవైకల్యాన్ని పూర్తిగా నయం చేయొచ్చని ఎంజీఎం ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ శ్రమలత తెలిపారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా ఎంజీఎం హాస్పిటల్లోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంపత్రావు, ఆడియాలజిస్ట్ డాక్టర్ రతన్సింగ్, డాక్టర్ జెన్నీఫర్, డాక్టర్ ప్రత్యూష, సీనియర్ రెసిడెంట్స్, పీజీ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. -
నరహరి.. లొంగిపోయి ఇంటికిరా..
కాజీపేట: కాజీపేట మండలం సోమిడి గ్రామ వాస్తవ్యుడు, మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ లొంగిపోవాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షిస్తున్నారు. రెండు పదుల వయస్సులో పోరుబాట పట్టి దాదాపు 45 ఏళ్లుగా అజ్ఞాతంలో కొనసాగుతున్న ఆయన రాక కోసం నలుగురు అన్నదమ్ములతోపాటు కుటుంబ సభ్యులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని ఈస్ట్ రీజినల్ బ్యూరో వింగ్లో (టెక్నికల్) బాధ్యుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం దేశంలో కగార్ పేరుతో మావోయిస్టులను ఏరివేస్తుండడంతో అనేక మంది కీలక నాయకులు లొంగిపోతున్నారు. మరికొంత మందిని పారా మిలటరీ బలగాలు ఎన్కౌంటర్ చేస్తూ ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణంలోని సోమిడి గ్రామానికి చెందిన నరహరిపై నేడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. నరహరి ప్రభుత్వానికి లొంగిపోయి క్షేమంగా ఇంటికి రావాలని నలుగురు తోబుట్టువులు, స్నేహితులు వేడుకుంటున్నారు. డిగ్రీ చదువుతూ.. ఉద్యమం వైపు అడుగులు సోమిడి గ్రామానికి చెందిన పసునూరి నర్సమ్మ–సోమనారాయణకు ఐదుగురు కొడుకులు. వీరిలో రెండో కుమారుడు నరహరి 1980 సంవత్సరంలో ఎల్బీ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా నక్సల్స్ విధానాలకు ఆకర్షితుడయ్యాడు. అప్పటి రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, క్రాంతిరణదేవ్ అలియాస్ బక్కన్నతో ఏర్పడిన స్నేహం ఆయనను ఉద్యమం వైపు అడుగులు వేయించింది. గ్రామంలో ఉంటూ కూలీల రేట్లు పెంచడంతోపాటు భూస్వాములు, రౌడీలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అప్పటి ఆర్ఈసీలో ఉన్న ఉద్యమ నాయకుల మాటలతో ప్రభావితమైన నరహరి పోలీసుల నిర్బంధం పెరగడంతో అడవి బాట పట్టాడు. 1981లో అడవిలోకి వెళ్లిన నరహరి.. తల్లిదండ్రులతో పాటు ఎవరూ చనిపోయిన ఇంటి ముఖం చూడలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నరహరి ప్రభుత్వానికి లొంగిపోయి సోమిడికి చేరుకోవాలని నలుగురు సోదరులు కోరుతున్నారు. వేడుకుంటున్న సోదరులు, కుటుంబ సభ్యులు 45 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన సోమిడి వాసి జార్ఖండ్ టెక్నికల్ వింగ్లో బాధ్యతలు -
మది నిండుగా..
బుధవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2026రంగుల పండుగ..డిష్యూం డిష్యూం నిట్ వరంగల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత జూనియర్స్, సీనియర్స్ విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. మంగళవారం గ్రేటర్ వరంగల్ పరిధిలో జరిగిన వేడుకల్లో చిన్నారులు, యువతీయువకులు పెద్దలు, వృద్ధులు ఉత్సాహంగా రంగుల వేడుకల్లో మునిగితేలారు. రంగులు పూసుకుని నృత్యాలు చేశారు. నగరంలో పలుచోట్ల హోలీ ఈవెంట్లు నిర్వహించారు. డీజే పాటలతో హోరెత్తించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బ్యాండ్ వాయిద్యాల మధ్య పోలీస్ అధికారులు, సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్సింగ్ను అధికారులు, సిబ్బంది, మహిళలు, చిన్నారులు, రంగులతో ముంచెత్తారు. – సాక్షి నెట్వర్క్ -
దశాబ్దకాలం లేట్!
3వలైన్..సాక్షిప్రతినిధి, వరంగల్: ‘మీరు ఎక్కాల్సిన రైలు.. జీవితకాలం లేట్ అన్నట్లు.. కాజీపేట–విజయవాడ రైల్వే మూడోలైన్ పనులు దశాబ్దకాలమైనా పూర్తికావడం లేదు. దక్షిణమధ్య రైల్వే డివిజన్ పరిధిలోని ఈ పనులు ప్రారంభమై సంవత్సరాలు గడిచినా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. సుమారు 219.64 కిలోమీటర్లు నిర్మాణ పనులకు 2012–13లో ప్రతిపాదనలు చేశారు. 2016–17లో అధికారికంగా ఆమోదించి ప్రారంభించారు. హైదరాబాద్–చైన్నె, ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో అత్యంత కీలకమైనదిగా ఈ ప్రాజెక్టును తీసుకున్నారు. అయితే, కాజీపేట–విజయవాడ మూడోలైన్ నిర్మాణ పనులు అప్పటి నుంచి నెమ్మదిగా సాగుతున్నాయి. ఖమ్మం–డోర్నకల్ మధ్య 44.624 కిలోమీటర్ల నిర్మాణం కోసం భూసేకరణ సమస్యగా మారింది. ఇటీవల రైల్వే బడ్జెట్ సందర్భంగా కూడా ఈ మూడోలైన్పై చర్చ జరిగింది. సుమారు రూ.2,063 కోట్లతో జరుగుతున్న ఈ పనులను వీలైనంత తొందరగా పూర్తి చేస్తే గూడ్స్, ప్యాసింజర్ రైళ్ల ట్రాఫిక్ సమస్య తగ్గి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు మోక్షం కలగనుంది. ముందుకుసాగని 28 హెక్టార్ల భూసేకరణ.. కాజీపేట–విజయవాడ రైల్వే మూడో లైన్కు 2017 లో శంకుస్థాపన జరిగింది. ఇందుకోసం తెలంగాణలో 145, ఆంధ్రప్రదేశ్లో 173 కలిపి మొత్తం 318 హెక్టార్లకు పనులు జరిగిన కొద్దీ 290 హెక్టార్లు సేకరించారు. సుమారు 28 హెక్టార్ల భూసేకరణ ముందుకు సాగని కారణంగా పనులు మందగించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, పనుల ప్రారంభసమయంలో రూ.1,952 కోట్లుండగా.. రోజులు గడిచిన కొద్ది రూ.2,063 కోట్లకు చేరింది. 2023–24 నుంచే వేగం ఈ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగింది. ఈ మూడేళ్లలోనే రూ.1,070 కోట్ల వరకు ఇచ్చారు. 2023–24లో రూ.350 కోట్లు, 2024–25లో రూ.420 కోట్లు, 2025–26లో (చివరి పనుల కోసం) రూ.300 కోట్లు విడుదల చేశారు. రైల్వే అధికారులు ఈ ప్రాజెక్టు 95 శాతం వరకు పూర్తయ్యిందని చెబుతున్నా.. పెండింగ్లో ఉన్న 5 శాతం పనులతో కాజీపేట–విజయవాడ మూడో లైన్కు మోక్షం కలగడం లేదు. 44.624 కిలోమీటర్ల నిర్మాణమే కీలకం.. వాస్తవానికి హైదరాబాద్–చైన్నె, ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో ట్రాఫిక్ను తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక ప్రాజెక్టును తీసుకుంది. ఇందులో బల్లార్షా–కాజీపేట, కాజీపేట–విజయవాడ మధ్యన మూడో లైన్కు శ్రీకారం చుట్టింది. బల్లార్షా–కాజీపేట మధ్యన 202 కిలోమీటర్లకు 183.285 కిమీ పూర్తయి 18.715 కిమీ నిర్మాణం ప్రోగ్రెస్లో ఉన్నట్లు రైల్వే నివేదికలు పేర్కొంటున్నాయి. అదేవిధంగా కాజీపేట–విజయవాడ మధ్యన 219.64 కిమీకు 175.016 కిమీ పూర్తికాగా 44.624 కిమీ మేర బ్యాలెన్స్ ఉంది. ఖమ్మం–డోర్నకల్ మధ్య 19.59 కిమీ, డోర్నకల్–మహబూబాబాద్ మధ్య 25.034 కిమీ మేర రైల్వేలైన్ నిర్మాణం పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే 28 హెక్టార్ల భూసేకరణ పెండింగ్లో ఉండడంతో పనులు నెమ్మదించాయని, ఇటీవలే భూసేకరణ పూర్తయి పనులు ప్రారంభించామని, త్వరలోనే పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు. పదేళ్లయినా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఢిల్లీ, చైన్నె మార్గాల్లో వెళ్లడానికి.. ఆ ప్రాంతాలకు వస్తు రవాణా చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ–చైన్నె ప్రధాన మార్గంలో రైళ్ల రద్దీ తగ్గి వేగం పెరగనుంది. ప్రస్తుతం కాజీపేట–విజయవాడ మార్గం రైల్వేకు అధిక ఆదాయాన్ని సమకూర్చే మార్గాల్లో ఒకటి. రెండు ప్రధాన రాష్ట్రా(తెలంగాణ, ఏపీ)లను కలిపే ఈ మార్గంలో గూడ్స్ రైళ్ల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఉన్న రెండు లైన్లు ఈ రద్దీని తట్టుకోలేక తరచూ నిండిపోతున్నాయి. దీని ఫలితంగా ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను నిలిపివేసి ఆదాయం సమకూర్చే గూడ్స్ రైళ్లకు గ్రీన్సిగ్నల్ ఇవ్వాల్సి వస్తోంది. ఈ కారణంతో ప్రయాణికుల రైళ్లు ఆలస్యమవుతున్నాయి. మూడో లైన్ అందుబాటులోకి వస్తే రద్దీ నియంత్రించడంలో సాయపడుతుంది. గూడ్స్, ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు వేర్వేరు మార్గాల్లో ప్రయాణించే వీలు కలుగుతుంది. ఈ మార్గంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య 219.64 కిలోమీటర్లు.. రూ.1,952.68 కోట్ల నిధులు 2016–17లో రూ.3,103.99 కోట్లకు అంచనాలు 44.624 కిలోమీటర్లు అసంపూర్తిగా పనులు భూసేకరణ, నిధుల కొరతే అసలు సమస్య -
వన్యప్రాణులను కాపాడుకోవాలి
హనుమకొండ డీఎఫ్ఓ లావణ్య న్యూశాయంపేట: వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని హనుమకొండ డీఎఫ్ఓ లావణ్య అన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సుబేదారి ఫారెస్ట్ కాంప్లెక్స్ నుంచి హంటర్రోడ్డులోని కాకతీయ జూ పార్కు వరకు నిర్వహించిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. వన్యప్రాణులతోపాటు ఔషధ, సుగంధ మొక్కల ప్రాముఖ్యతను వివరిస్తూ ప్లే కార్డులు ప్రదర్శించారు. అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి, వెటర్నరీ డాక్టర్ కార్తికేయ, సెక్షన్ ఆఫీసర్లు సూరిదాస్ సింగ్, శివకుమార్, బీట్ ఆఫీసర్లు శారద, సురేశ్, శ్వేత, జూపార్కు సిబ్బంది పాల్గొన్నారు. -
ఆకాశంలో అద్భుతం
కనువిందు చేసిన రెడ్ మూన్ ● 3.27 గంటల పాటు చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమైన గ్రహణం సాయంత్రం 6.47 గంటలకు వీడింది. మొత్తం 3.27 గంటల సేపు ఎరుపు వర్ణంలో (రెడ్ మూన్) చందమామ పలు విధాలుగా కనువిందు చేశాడు. వంద సంవత్సరాల తర్వాత రంగుల పండుగ హోలీ రోజున వచ్చిన చంద్రగ్రహణాన్ని ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. – సాక్షి స్టాఫ్ఫొటోగ్రాఫర్, హన్మకొండ 6:56 -
నిట్తో ఎన్ఐజీస్టీ ఎంఓయూ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్తో ఎన్ఐజీఐఎస్టీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ) సర్వే ఆఫ్ ఇండియా మంగళవారం పరస్పర ఒప్పందం కుదుర్చుకుంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, ఎన్ఐజీఎస్టీ డైరెక్టర్, సీనియర్ అధికారి బీసీ ఫరీదా పరస్పరం ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు. కార్యక్రమంలో ఎన్ఐజీఎస్టీ ప్రతినిధులు నిత్యానందం, వెంకయ్యచౌదరి, నిట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. హసన్పర్తి: చంద్రగ్రహణంతో ఎర్రగట్టు వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని రద్దు చేశారు. జాతరను పురస్కరించుకుని మంగళవారం ఉదయం హసన్పర్తి–భీమారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆతర్వాత స్వామి వారిని రథంపై ఎర్రగట్టుగుట్టకు చేర్చారు. మధ్యాహ్నం 12 గంటలలోపే స్వామి వారిని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆతర్వాత ఆయాన్ని ద్వారబంధనం చేశారు. చంద్రగ్రహణంతో ఈసారి స్వామివారి శోభాయాత్ర నిరాడంబరంగా సాగింది. బుధవారం మహాసంప్రోక్షణ అనంతరం దర్శనాలు ప్రా రంభమవుతాయని ఉత్సవ కమిటీ తెలిపింది. -
స్ట్రీట్ వెండర్ల ఆర్థికాభివృద్ధికి చర్యలు
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: పట్టణ ప్రాంతాల్లో జీవనోపాధి సాగిస్తున్న వీధి విక్రయదారుల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించారు. మున్సిపాలిటీల వారీగా రుణాల పంపిణీ, తిరిగి చెల్లింపుల పురోగతి, కొత్త అర్హుల గుర్తింపు, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సాహించడం వంటి పలు అంశాలపై కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) వైవీ.గణే శ్, జిల్లా లీడ్ బ్యాంకు ప్రతినిధి తదితరులున్నారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావుకు నివాళి మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించారు. శ్రీపాదరావు చిత్రపటానికి కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైద్యసేవలపై నిర్లక్ష్యం వద్దు.. రోగులకు అందించాల్సిన వైద్యసేవలపై నిర్లక్ష్యం వహించరాదని వైద్యాధికారులను కలెక్టర్ సత్యశారద హెచ్చరించారు. కలెక్టరేట్లో జిల్లా వైద్యాశాఖాధికారి, సూపరింటెండెంట్లతో సోమవారం సమావేశం నిర్వహించి జిల్లాలో అందుతున్న వైద్యసేవలపై సమీక్షించారు. ఇందులో జిల్లా వైద్యాధికారి సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఈఎస్ఐ.. ఇక్కట్లు
కాశిబుగ్గ: వరంగల్ ఈఎస్ఐ ఆస్పత్రిలో పేరుకు నోడల్ సెంటర్ ఉన్నప్పటికీ సిబ్బంది లేక అరకొర సేవలతో కాలం వెళ్లదీస్తున్నారు. రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన నోడల్ సెంటర్ నుంచి ఈఎస్ఐ పరిధిలో 16 డిస్పెన్సరీలకు మందులు సరఫరా చేస్తున్నారు. రీజియన్లోని ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిస్పెన్సరీలకు పంపిణీ చేయాలి. సాధారణంగా నోడల్ సెంటర్కు ఒక ఫార్మాసిస్ట్, ఒక క్లర్క్, ఐదుగురు నాల్గవ తరగతి సిబ్బంది, ప్రత్యేకంగా వ్యాన్ సదుపాయం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో ఏ ఒక్కటీ అమలు కావడం లేదు. దీంతో ఈఎస్ఐ ఆస్పత్రిలో సేవలు అందని ద్రాక్షలా మారాయి. రూ.4.8 కోట్లతో మందుల కొనుగోలు.. రెండేళ్ల క్రితం నోడల్ సెంటర్ మంజూరు కావడంతో రూ. 4.8 కోట్లతో టెండర్ ద్వారా ఎంపికై న కాంట్రాక్టర్ మందులను కొనుగోలు చేశారు. కానీ, ఆ బిల్లులు ఇంత వరకు రాకపోకవడం, సదరు కాంట్రాక్టర్ తనకు ఆర్థిక ఇబ్బందులున్నాయంటూ ఒత్తిడి తీసుకోస్తున్నారు. వివిధ రకాల మెడిసిన్కు ఫండ్ రాక తిరిగి ఈ ఏడాది మందులు కొనుగోలు చేయడం అధికారులకు సవాల్గా మారింది. ఆరునెలల నుంచి అందని భోజనం ఈఎస్ఐ ఆస్పత్రిలోని ఇన్పేషెంట్లకు ఆరునెలల నుంచి భోజనం అందడం లేదని తెలుస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు భోజనం కోసం ఇబ్బందులు పడుతున్నారు. గత సెప్టెంబర్ నుంచి డైట్కు సంబంధించిన బిల్లులు రాకపోవడం వల్ల భోజనం పెట్టలేదని సమాచారం. బిల్లులు పేరుతో సదరు కాంట్రాక్టర్ భోజనం సరఫరా చేయకపోవడంతో బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసి భోజనం తెచ్చుకోవాల్సి వస్తోంది. అసలే పేద కార్మికులు చికిత్స కోసం వచ్చి అడ్మిట్ అయితే భోజనం కోసం కడుపు మాడ్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. కాగా, కాంట్రాక్టర్ భోజనం సరఫరా చేయకపోతే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం శోఛనీయం. అరకొర సేవలు.. అలమటిస్తున్న రోగులు పేరుకే నోడల్ సెంటర్ పూర్తి స్థాయిలో డిస్పెన్సరీలకు అందని మందులు ఇన్పేషెంట్లకు చేరని భోజనం -
నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యం
● పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ అర్బన్/కాజీపేట రూరల్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని 48, 49వ డివిజన్ల పరిధిలో రూ.9.37 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు హనుమకొండ కలెక్టర్ చాహత్ జాబ్పాయ్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. రూ.7.50 కోట్ల వ్యయంతో నిట్ నుంచి లోటస్ కాలనీ వరకు ఆర్అండ్బీ రహదారి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈరహదారికి సెంటర్ లైటింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. రూ.50 లక్షలతో అంతర్గత రోడ్లు, రూ.1.37 కోట్లతో లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో కాజీపేట తహసీల్దార్ సీహెచ్.రాజు, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రుపాషా, కార్పొరేటర్లు మానస రాంప్రసాద్, సర్తాజ్బేగం, మాజీ కార్పొరేటర్ అబుబక్కర్, సీనియర్ నాయకులు అమర్, కట్ట రఘుపాల్రెడ్డి, మట్టాడ కుమార్, డివిజన్ అధ్యక్షుడు సింగారపు రవిప్రసాద్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 02హెచ్ఎంకెడి180: -
‘గ్రేటర్’ గ్రీవెన్స్కు 72 అర్జీలు
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు 72 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. టౌన్ ప్లానింగ్కు 35, ఇంజనీరింగ్ 18, రెవెన్యూ 8, హెల్త్–శానిటేషన్ 9, నీటి సరఫరా విభాగానికి 2 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, డీఎఫ్ఓ శంకర్ లింగం, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, టీఓ రామకృష్ణ, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, హెచ్ఓ లక్ష్మారెడ్డి, ఏసీపీలు, ఈఈలు తదితరులు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● భవానీ నగర్లో 2–6–1381 ఇంటికి ఆరు నెలల నుంచి నల్లా నీరు రావట్లేదని విన్నవించారు. ● ఎల్బీనగర్లో రోడ్డు విస్తరించి, అభివృద్ధి చేయాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ● వరంగల్ గాంధీనగర్ 11–8–38 తదితర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు లేక చీకట్లో మగ్గుతున్నామని ఏర్పాటు చేయాలని కాలనీవాసులు విన్నవించారు. ● హనుమకొండ స్నేహనగర్ 2–9–307 డ్రెయినేజీ అస్తవ్యస్థంగా మారిందని, నూతనంగా నిర్మించాలని కాలనీవాసులు కోరారు. ● హనుమకొండ సదాశివ కాలనీలో రోడ్డు నంబరు 1, 6, 8లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కాలనీ వేల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించారు. ● గోపాల్పూర్లోని రోడ్డు నంబరు 6, 7 నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కాలనీవాసులు కోరారు. -
వయోవృద్ధుల చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలో తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంక్షేమ చట్టం–2007ను పకడ్బందీగా అమలు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ని జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం కోరింది. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ను సోమవారం వారు కలెక్టరేట్లో కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. గతేడాది ప్రారంభించిన వృద్ధుల డే–కేర్ సెంటర్ను సందర్శించాలని కలెక్టర్ను కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి తేరాల యుగంధర్, తదూరి లక్ష్మీనారాయణ, మార్క రవీందర్గౌడ్, ఎస్.రమేశ్, శీలం వెంకటేశ్వర్లు, గుంటి సీతారాములు, కొండబత్తిని రాజేందర్, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర్ పాల్గొన్నారు. హన్మకొండ కల్చరల్ : చంద్రగ్రహణం ఉన్నందున వేయిస్తంభాల ఆలయాన్ని మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేస్తున్నట్లు ఆలయ ఈఓ ధరణి కోట అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి బుధవారం ఉదయం సంప్రోక్షణలు పూజలు నిర్వహించి ఆలయాన్ని భక్తుల దర్శనార్థం అనుమతించనున్నట్లు తెలిపారు. కేయూ క్యాంపస్: హర్యానాలోని కురుక్షేత్ర యూనివర్సిటీలో ఈనెల 2 నుంచి 7వ తేదీ వరకు కొనసాగనున్న ఆలిండియా ఇంటర్ వర్సిటీ బాక్సింగ్ టోర్నమెంట్కు కేయూ పురుషుల జట్టు పాల్గొననున్నట్లు సోమవారం వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య తెలిపారు. ఈజట్టులో బి.నిఖిల్గౌడ్, కె.శ్రీశాంత్గౌడ్, ఎం.సంజయ్, పినవదీప్, వి.వంశీకృష్ణ, విన్పాల్, జి.అభిషేక్, జి.చంద్రశేఖర్ ఉన్నట్లు వెంకయ్య తెలిపారు. ఈజట్టుకు హనుమకొండ ప్రభుత్వ బీఈడీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎన్.రమేశ్ కోచ్కమ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నట్లు స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య తెలిపారు. హన్మకొండ అర్బన్: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల స్థాపించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మార్చి 29న ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నారు. ఈసందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఇ.వి. శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో నాయకులు సోమవారం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు. కాగా, దేశ విదేశాల్లోని పూర్వ విద్యార్థులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. -
విద్యుత్ వ్యవస్థ రక్షణకు చర్యలు
హన్మకొండ: విద్యుత్ వ్యవస్థను రక్షించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ పకడ్బందీ చర్యలు చేపట్టింది. వర్షాకాలం, అకాల వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులు రావడం సహజం. వీటితో విద్యుత్ సబ్స్టేషన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు, విద్యుత్ లైన్లకు ముప్పు వాటిల్లుతోంది. తద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలో విద్యుత్ వ్యవస్థలను రక్షించడంతోపాటు వినియోగదారులకు అంతరాయాలు లేకుండా అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతీ సబ్స్టేషన్లో నిర్మాణ సమయంలోనే లైట్నింగ్ అరెస్టర్లు (పిడుగుల నిరోధకాలు) ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా పొడవాటి లైన్లను గుర్తించి ఈ లైన్లలో స్తంభాలకు లైట్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు, విద్యుత్ లైన్లకు రక్షణ ఉంటుంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో పొడవాటి విద్యుత్ లైన్లలో మొత్తం 2,337 లైట్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేశారు. హనుమకొండ సర్కిల్లో 95, వరంగల్ సర్కిల్లో 25, జనగామలో 107, భూపాలపల్లి సర్కిల్లో 52, మహబూబాబాద్ సర్కిల్లో 38 అరెస్టర్లు ఏర్పాటు చేశారు. ఎలా పనిచేస్తుందంటే.. లైట్నింగ్ అరెస్టర్ అనేది మెరుపు, పిడుగు వల్ల ఉత్పన్నమయ్యే అధిక ఓల్టేజీని భూమిలోకి సురక్షితంగా మళ్లించే రక్షణ పరికరం. దీని ద్వారా ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, స్విచ్గేర్, ఇతర విద్యుత్ పరికరాలతో పాటు యంత్రాంగం సురక్షితంగా ఉండడం ద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గుతాయి. దీంతోపాటు పరికరాలు సురక్షితంగా ఉండడంతో నష్టం తగ్గుతుంది. ఉరుములు, మెరుపులనుంచి రక్షణకు నిరోధకాల బిగింపు టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 2,337 లైట్నింగ్ అరెస్టర్ల ఏర్పాటునాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాం. విద్యుత్ వ్యవస్థ రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్రమంలో సుదూరంగా ఉండే విద్యుత్లైన్లలో లైట్నింగ్ అరెస్టర్లు చేశాం. వినియోగదారులు కూడా వర్షాకాలంలో ఇంటి విద్యుత్ పరికరాలకు సర్జ్ ప్రొటెక్టర్లు వినియోగించాలి. మెరుపు సమయంలో విద్యుత్ పరికరాలను తాకొద్దు. – వరుణ్ రెడ్డి, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ -
ఈఎల్ఎస్ఆర్ పరిసరాలు శుభ్రంగా ఉండాలి
● మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: ఈఎల్ఎస్ఆర్ (ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్) ట్యాంక్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు నీటి సరఫరా సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని సమర్థవంతంగా నిర్వహించేందుకు మేయర్ సూచనలిచ్చారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగర పరిధి 11వ డివిజన్లోని ఐ హాస్పిటల్ వాటర్ ట్యాంక్, కేఎంసీ హాస్పిటల్లో ఈఎల్ఎస్ఆర్, 24వ డివిజన్ మట్టెవాడ ప్రాంతంలోని ఈ ఎల్ఎస్ఆర్తో పాటు 28వ డివిజన్లోని గాయత్రి ఆలయం సమీపంలోని ఈఎల్ఎస్ఆర్లకు చెందిన వర్క్ ఇన్స్పెక్టర్లు లైన్మెన్లు, ఏఈలు, డీఈలు, ఈఈలతో సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలిచ్చారు. సమావేశంలో ఈఈలు రవికుమార్, సంతోశ్బాబు, డీఈలు రాజ్కుమార్, సతీశ్, రాగి శ్రీకాంత్, మొజామిల్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలు వెంటనే పరిష్కరించేలా చర్యలు
● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దని సూచించారు. అలాగే, జిల్లాలోని పలువురు తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి పెండింగ్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 222 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కన్నం నారాయణ, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, తదితర అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు :వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజలు ఇచ్చిన వినతులను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్లో ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. గ్రీవెన్స్కు మొత్తం 163 దరఖాస్తులు రాగా, అందులో రెవెన్యూకు సంబంధించి 67, జీడబ్ల్యూఎంసీ 38, ఇతర శాఖలకు సంబంధించి 58 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రెవెన్యూశాఖకు సంబంధించిన దరఖాస్తులను కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంధ్యారాణి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వైవీ.గణేష్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, హౌసింగ్ పీడీ శ్రీవాణి, జిల్లా అధికారులున్నారు. -
రాహుల్ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు ఆయూబ్
వరంగల్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల అధ్యక్షుల శిక్షణ శిబిరాన్ని ఫిబ్రవరి 21 నుంచి మార్చి 2 వరకు వికారాబాద్లోని హరిత వ్యాలీలో నిర్వహించారు. ఈశిక్షణ ముగింపు కార్యక్రమానికి వచ్చిన పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నాయకులు రాహుల్గాంధీని వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ ఆయూబ్ కుటుంబ సమేతంగా కలిశారు. పార్ట్టైం లెక్చరర్ల నియామక దరఖాస్తు గడువు పొడిగింపుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో 2025–2026 విద్యాసంవత్సరంలో మిగిలిన కాలానికి వివిధ విభాగాల్లో పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 4వ తేదీ సాయంత్రం 5గంటల వరకు గడువు పొడిగిస్తూ సోమవారం రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఆస క్తిగల అభ్యర్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు వవిధ విభాగాల్లో కలిపి సుమారు 500వరకు దరఖాస్తులు వచ్చాయి. గడువు పెంపుదలతో కొంతమేర పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా 99 మంది పార్ట్టైం లెక్చరర్లను నియమించనున్నారు. -
నేడు, రేపు హోలీ సంబురాలు
హన్మకొండ కల్చరల్: ఫాల్గుణమాసం కామునిపున్నమిని పురస్కరించుకుని మంగళ, బుధవారం హోలీ సంబురాలు జరుపుకోనున్నారు. సోమవారం సా యంత్రం 5.55గంటలకు పౌర్ణమి ప్రా రంభమై మంగళవారం సాయంత్రం 5.07గంటలకు ముగుస్తుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం ప్రజ లు ప్రధాన వీధుల ముఖ్య కూడలిలో కామదహనం ఘనంగా జరుపుకున్నారు. అంతకు ముందు పాత కర్ర పెట్టి నీళ్లు ఆరబోసి కామదాహన వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వారంరోజులుగా జాజిరి ఆడిన పిల్లలు తమ కోలలను కామదహనంలో పడేశారు. మహిళలు కామదహనం చుట్టూ నీళ్లు పోస్తూ గుడాలు చల్లుతూ ఆరగింపు చేశారు. కొన్ని చోట్ల మంటచుట్టూ పాటలు పాడారు. హోలీ పండుగ.. సందిగ్ధం మంగళవారం చంద్రగ్రహణం సంభవిస్తున్న నేపథ్యంలో హోలీ పండుగను ఎప్పుడు జరుపుకోవాలని ప్రజల్లో సందిగ్ధం ఏర్పడింది. మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటల నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణానికి ఆరుగంటల ముందు గ్రహవేద, గ్రహణం అనంతరం ఆరుగంటల వరకు గ్రహణశూల ఉంటుంది. అందుకే హోలీ పండుగ, పూజా కార్యక్రమాలను బుధవారం జరుపుకోవడం ఉత్తమమని తెలంగాణ అర్చక సమాఖ్య జాక్ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే, కొందరు వేదపండితులు మంగళవారం మధ్యాహ్నం 12గంటల లోపు నిర్వహించుకోవచ్చని చెప్పడంతోపాటు ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో కొందరు నేడు హోలీ పండుగను జరుపుకోనున్నారు. ఈ మేరకు సోమవారం నగరంలోని పలు కూడళ్లలో వివిధ రంగులు, వాటర్ కలర్ గన్స్, బిస్కెట్లు, చిలకలు, చాక్లెట్ల దండలు, షుగర్ క్యాండీలు విక్రయించే దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా కన్పించాయి. రజకవీధిలో కామదహనం.. హనుమకొండ రాగన్నదర్వాజ రజకవీధిలో కామదహనం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చీకటి ఆనంద్, వీరస్వామి, నాగ సోమేశ్వర్, చందుపట్ల ధనరాజ్, చీకటి అశోక్, చీకటి రాజు, క్షను, సురేశ్, ఉపేంద్రాచారి తదితరులు పాల్గొన్నారు. -
6న విద్యుత్ సర్ చార్జీల ప్రతిపాదనలపై బహిరంగ విచారణ
హన్మకొండ: 2026–2027 ఆర్థిక సంవత్సరానికి సవరించబడిన ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడీ, సర్ చార్జీల ప్రతిపాదనలపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఈ నెల 6న హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బహిరంగా విచారణ చేపట్టనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం సోమవారం ఒక ప్రకటనలో వివరించింది. ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ డాక్టర్ దేవరాజ్ నాగార్జున్, సభ్యులు రఘు కంజర్ల, సి.హెచ్.శ్రీనివాస్ రావు పాల్గొంటారని తెలిపింది. ఆసక్తి గల విద్యుత్ వినియోగదారులు ఈ బహిరంగ విచారణకు హాజరు కావాలని సంబంధిత అధికారులు కోరారు. ● సాదుతండాలో ఘటనలో డోర్నకల్ : మానసిక వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరో లు మండలం అందనాలపాడు జీపీ పరిధిలోని సాదుతండాలో చోటు చేసుకుంది. డోర్నకల్ సీఐ చంద్రమౌళి కథనం ప్రకారం.. తండాకు చెందిన ధరంసోత్ సురేశ్(23) డోర్నకల్ మండలం తొడేళ్లగూడెంలోని ఎస్కే ఆగ్రోస్లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సురేశ్కు 9 నెలల క్రితం వివాహం జరిగింది. అయితే ఇదే తండాకు చెందిన సురేశ్ స్నేహితుడు ఆంగోత్ సాయి తన భార్యతో ఫోన్లో మాట్లాడుతున్నాడని ఆరోపిస్తూ గతంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఈ క్రమంలో ఇటీవల సాయితోపాటు కొంతమంది సురేశ్ను మానసికంగా వేధించడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో సోమవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయితో పాటు వారి కుటుంబ సభ్యుల వేధిపులతోనే సురేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. దీంతో డోర్నకల్ సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మృతుడి తండ్రి శ్రీనుకు హామీ ఇచారు. అనంతరం మృతుడి కుటంబీకుల ఫిర్యాదు మేరకు ఆంగోత్ సాయి, నాగేశ్వర్రావు, ఆశా, అఖిల్పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. హాస్టల్లో మళ్లీ మంటలు ● విద్యార్థినుల పరుగులు.. ● కిందపడి పలువురికి గాయాలు ● మరో హాస్టల్కు తరలింపు హసన్పర్తి : 24 గంటలు గడవక ముందే ఆ హాస్టల్లో మళ్లీ మంటలు చెలరేగాయి. ఈ ఘటన సోమవారం రాత్రి భీమారం సమీపంలోని ఓ కళాశాల హాస్టల్లో చోటు చేసుకుంది. నగరంలోని భీమారం–పలువేల్పుల ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు ఓ కళాశాల నిర్వహిస్తున్నారు. అయితే భీమారంలోని గణేశ్ నగర్లో నిర్వహిస్తున్న హాస్టల్లో విద్యార్థినులకు వసతి కల్పించారు. ఆదివారం ఆ హాస్టల్లోని పై అంతస్తులో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. ఆ సమయంలో విద్యార్థినులు కింది అంతస్తులో పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే ఘటనలో విద్యార్థినుల సామగ్రితో పాటు సర్టిఫికెట్లు కూడా దగ్ధమయ్యాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి మళ్లీ అదే హాస్టల్లో మంటలు చెలరేగాయి. గ్లిజర్ పేలడంతో ఒకే సారి పెద్ద శబ్దం వచ్చింది. దీంతో విద్యార్థినులు భయాందోళనకు గురై పరుగులుదీశారు. ఈ సమయంలో కొంతమంది విద్యార్థినులు కింద పడి స్వ ల్ప గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న కేయూ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇదిలా ఉండగా, అదే కళాశాల పేరుతో నిర్వహిస్తున్న మరో హాస్టల్లోకి విద్యార్థినులను తరలించారు. -
పోలీసుల వైఖరి నిరసిస్తూ అడ్తి వ్యాపారుల నిరసన
వరంగల్: రైతుల వద్ద మిర్చి కొనుగోలు చేస్తే చోరీ చేసి తీసుకొచ్చిన బస్తాలు కొనుగోలు చేశారంటూ పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని అడ్తి వ్యా పారులు సోమవారం వరంగల్ ఏనుమాముల మా ర్కెట్లో కొనుగోళ్లు నిలిపివేసి నిరసన వ్యక్తం చేశా రు. సుమారు మూడు గంటల పాటు క్రయ, విక్రయాలు నిలిచిపోవడంతో గందరగోళం నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ రైతు ఏటా వరంగల్కు చెందిన సూర్యతేజ ఎంటర్ప్రైజెస్లో పంటలు విక్రయిస్తుంటాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మూడు నాలుగు సార్లు మిర్చి తీసుకొచ్చి అడ్తిదారుడికి అదే గ్రామానికి చెందిన నలుగురు రైతులతో కలిసి విక్రయించాడు. మూడు రోజుల క్రితం భూపాలపల్లి ప్రాంతంలో మిర్చి బస్తాలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటనపై సూర్యతేజ ఎంటర్ప్రైజెస్కు విక్రయించే రైతు ఉన్న ట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని విచా రించగా తాను చోరీ చేసిన మిర్చిని వరంగల్ అడ్తిదా రుడికి విక్రయించినట్లు చెప్పారు. వెంటనే పోలీసులు అడ్తిదారుడికి ఫోన్ చేసి దొంగ మిర్చిని తీసుకొ స్తే మీరు కొనుగోలు చేసినట్లు తెలిసింది.. పోలీసుస్టేషన్కు రావాలని చెప్పగా తాను వేరో చోట ఉన్నాయని, తర్వాత వస్తానని పేర్కొన్నాడు. వెంటనే పోలీసులు అడ్తిదారుడి వద్దకే వెళ్లి నిందితుడి తీసుకెళ్లి చూపించగా ఇతనే అమ్మాడని చెప్పాడు. దీంతో వివరాలు తీసుకుని పోలీసుస్టేషన్కు రావాలని చె ప్పగా అడ్తిదారుడు వెళ్లాడు. రోజంతా కూర్చుబెట్టి రాత్రికి ఇంటికి పంపించి ఉదయం రావాలని హు కుం జారీ చేశారు. ఈవిషయంపై ఆదివారం చాంబర్లో వ్యాపారులు సమావేశమై పోలీసుల వైఖరికి నిరసనగా కొనుగోళ్లు బంద్ చేయాలని నిర్ణయించి సోమవారం మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు నిలిపివేశారు. ఈవిషయం తెలిసిన వెంటనే మార్కెటింగ్శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, కలెక్టర్ సత్యశారద, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు.. చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డితో మాట్లాడి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో కొ నుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ నిరసనలో చాంబర్ ప్రతినిధులు కటకం పెంటయ్య, వేద ప్రకాశ్, మొగిళి చంద్రమౌళి, అల్లె సంపత్, ఎన్రెడ్డి లింగా రెడ్డి, చాగర్ల శ్రీనివాస్,రాజేశ్, డి.కరాణి, కాటన్ సెక్ష న్ ప్రెసిడెంట్ చింతలపల్లి వీరారావు పాల్గొన్నారు. పోలీసుల వైఖరి బాధ కలిగించింది.. ‘అడ్తి వ్యాపారిని రోజంతా పోలీసుస్టేషన్లో ఉంచడంపై నేను భూపాలపల్లి క్రైం ఎస్సై రమేశ్కు కాల్ చేసి తాను చాంబర్ అధ్యక్షుడిని మాట్లాడుతున్నాన ని చెప్పగా చాంబర్ అని చెప్పొద్దు.. పేరు మాత్రమే చెప్పాలి’ అని అనడం బాధించిందని చాంబర్ అఽ ద్యక్షుడు రవీందర్రెడ్డి అన్నారు. ఆరోపణలు వస్తే ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా అడిగే హక్కు తమకు ఉంటుందని ఎస్సై అనడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఇలా వేధింపులకు గురిచేస్తే పంటలకు సంబంధించిన గుర్తింపు పత్రాలు, ఆధార్కార్డు తీ సుకురావాలని అంటే రైతులు ఇబ్బందులు పడతారన్నారు. అధికారుల హామీ మేరకు కొనుగోళ్లు ప్రారంభించామన్నారు. మూడు గంటలపాటు నిలిచిన క్రయ, విక్రయాలు మార్కెట్ అధికారుల హామీతో నిరసన విరమణ -
మిర్చి రైతు కన్నెర్ర
వరంగల్ : మిర్చి రైతులు కన్నెర్ర చేశారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు కుమ్మకై ్క ధర తగ్గించారని ఆరోపిస్తూ సోమవారం ధర్నా నిర్వహించారు. కాగా, మిర్చి కొనుగోళ్ల విషయంలో పోలీసుల వైఖరిని నిరసిస్తూ అడ్తి వ్యాపారులు జెండా పాటలో పాల్గొనలేదు. దాదాపు మూడు గంటల అనంతరం జరిగిన వేలంలో 341రకం మిర్చి ధర క్వింటాల్కు రూ.21వేలు ఖరారైంది. దీంతో ఈరకం మిర్చి విక్రయానికి తీసుకొచ్చిన పలువురు రైతులు శనివారం క్వింటాల్కు రూ.22,300 ధర పలికితే సోమవారం రూ.1,300 తగ్గించారంటూ మార్కెట్ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం మార్కెట్ ఆఫీస్లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా ఏనుమాముల పోలీస్ ఇన్స్పెక్టర్ సురేశ్, సిబ్బంది గేట్ మూసి వేసి అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం ఘటనాస్థలికి చేరుకుని ధర తగ్గించలేదని చెప్పారు. ఖమ్మం మార్కెట్లో 341 రకం మిర్చి ధర క్వింటాల్కు రూ.20,500 పలికిందని రైతులకు తెలిపారు. బహిరంగ మార్కెట్లో డిమాండ్ ప్రకారం ధరలు నిర్ణయమవుతాయన్నారు. ధర తగ్గించారంటూ మార్కెట్లో ధర్నా ఆఫీస్లోకి దూసుకెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు -
ఆనందాల కేళి
సహజ హోలీ.. రసాయన రంగుల వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తలు ● చర్మానికి రంగులు పట్టుకోకుండా ముందస్తు జాగ్రత్తగా ఆవాల నూనె, జెల్లి రాసుకోవాలి. ● అద్దాలు పెట్టుకుంటే రంగునీళ్లు కళ్లలో పడకుండా ఉంటాయి. ● హోలీ ఆడిన వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలి. లేనిపక్షంలో చేతి గోర్ల నుంచి రంగులు శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.మోదుగు పూల రంగులతోనే పండుగ జరుపుకోవాలి ● రసాయనాలతో ముప్పు.. ప్రజలకు వైద్య నిపుణుల సూచనలు నేడు హోలీ పర్వదినంసహజ రంగులైతే మేలు.. సహజ సిద్ధ రంగులు వినియోగిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు. దానిమ్మ, టమాటాలతో ఎరుపు రంగు, మోదుగుపూలు, క్యారెట్తో ఆరెంజ్ రంగు, బీట్రూట్తో ఊదారంగు, ఆకు కూరలతో ఆకుపచ్చ రంగు, పసుపు కొమ్ములతో పసుపు రంగు ఇలా సహజ సిద్ధమైన రంగులను తయారు చేసుకోవచ్చు. వీటితో ఎలాంటి హాని జరగదు. మోదుగుపూలతో రంగుల తయారీ ఇలా.. హోలీకి ఒక రోజు ముందు మోదుగు పూలు తీసుకొచ్చి వే డి నీటిలో ఉడకబెడతారు. ఉడకబెట్టిన తర్వాత మరుసటి రోజు వరకు నీటిలోనే నానబెడతారు. తెల్లవారుజామున నానబెట్టిన మోదుగుపూలను దంచి సీసాలో వడబోస్తారు. అనంతరం ఆ రంగు నీటితో హోలీ ఆడుతారు.రసాయన రంగులతో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రకృతి ప్రసాదించే మో దుగు పూలు ఆరోగ్యరీత్యా పలు సుగుణాలు కలిగి ఉన్నాయి. మా చిన్నతనంలోస్నేహితులతో కలిసి ఒక రోజు ముందే మోదుగు పూలు తెచ్చి నానబెట్టి ఉడికించిన తర్వాత చేసిన కాషాయవర్ణపు రంగులతో హోలీ ఆడేవాళ్లం. సహజ సిద్ధ రంగులు వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు . – అనంతగిరి సురేశ్, చిన్నగూడూరు -
నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు
● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ● అధికారులతో సమీక్షహన్మకొండ అర్బన్: వేసవిని దృష్టిలో ఉంచుకుని హనుమకొండ జిల్లాలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో తాగునీటి సరఫరాపై మిషన్ భగీరథ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా గత వేసవిలో జరిగిన నీటి వినియోగం, ఎల్ఎండీ నుంచి నీటి అందుబాటు, చలివాగు నుంచి ధర్మసాగర్ పంప్ హౌస్కు నీటి పంపింగ్, అక్కడి నుంచి జిల్లాకు నీటి సరఫరా వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. మిషన్ భగీరథ ఎస్ఈ చలమారెడ్డి, ఈఈలు రామాంజనేయులు, రామ్ కుమార్, గాయత్రి, డీఈలు ఇతర అధికారులు పాల్గొన్నారు ఐడీఓసీలో కలెక్టర్ తనిఖీలు కలెక్టరేట్ కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్లోని వివిధ విభాగాలు, మొదటి అంతస్తులోని ముఖ్య ప్రణాళిక శాఖ, భూసర్వే, కొలతల శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ, ఖజానా శాఖ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, జిల్లా పరిశ్రమల కేంద్రం, పౌర సరఫరాల శాఖ, ఈ–డిస్ట్రిక్ట్ విభాగం, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ, పరిపాలన విభాగ తదితర కార్యాలయాలను కలెక్టర్ చాహత్ సందర్శించారు. అక్కడి అధికారులు, సిబ్బంది హాజరు, విధుల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, పరిపాలన అధికారి గౌరీశంకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయం
హన్మకొండ : గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయమని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి కొనియాడారు. సోమవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు దుద్దిళ్ల శ్రీపాదరావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా కొనసాగిన శ్రీపాదరావు ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేశారన్నారు. ప్రజల మధ్యే ఉంటూ వారి అవసరాలు తెలుసుకుని, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం ఆయన ప్రత్యేకత అన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సి.ఈలు కె.రాజు చౌహాన్, అశోక్, అన్నపూర్ణ, సురేందర్, మాధవ రావు, సీజీఎంలు రవీంద్రనాఽథ్, జాయింట్ సెక్రటరీలు కె.రమేశ్, శ్రీకృష్ణ, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జీఎంలు హేమంత్ కుమార్, వేణు బాబు, గిరిధర్, నాగ ప్రసాద్, కళాధర్ రెడ్డి, జయరాజ్, శ్రీనివాస రావు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
విరమణ అనంతరం కుటుంబీకులతో గడపాలి
వరంగల్ క్రైం : ఉద్యోగ విరమణ అనంతరం పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ విభాగంలో విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన పో లీస్ అధికారులను శని వారం ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. విరమణ పొందిన వారిలో సబ్ ఇన్స్పెక్టర్లు సిద్ధయ్య, సాంబారెడ్డి కనకచంద్రం, సయ్యద్ చాంద్ పాషా, లింగారెడ్డి, రాజు, ఆర్ఎస్సై మహమూద్, ఏఆర్ఏఎస్సై వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుళ్లు రమేశ్, రాములు ఉన్నారు. ఈ సందర్భగా సీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖకు సుదీర్ఘ కాలం సేవలందించి ఉద్యోగ విరమణ చేస్తున్న అధికారులు నేటితరం పోలీసులకు ఆదర్శంగా నిలుస్తారన్నారు. విరమణ అనంతరం ఆరో గ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి, సురేశ్ కుమార్, ఆర్ఐలు స్పర్జన్ రాజ్, సతీశ్, ఆర్ఎస్సై శ్రవణ్ కుమార్, విరమణ సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ -
ముగిసిన ముప్పిడి ఉద్యమ ప్రస్థానం
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీపీఐ (మావోయిస్టు) పార్టీలో ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ అలియాస్ జంగ్ దాదా ఉద్యమ ప్రస్థానం ముగిసింది. ఆయిడిసి, బాయిడిసి.. నాన్ననిడిసి సాయుధ బాట పట్టిన మావోయిస్టు నేత మళ్లీ జనం మధ్యకు రానున్నారు. పేద, బడుగు బలహీన వర్గాల కోసం తుపాకీ ఎత్తి రాజీలేని ఉద్యమాన్ని సాగించిన ముప్పిడి సాంబయ్య ఆదివారం జనజీవన స్రవంతిలో కలిశారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా, దండకారణ్య డివిజన్ కమిటీ నేతగా ఉన్న ఆయన తన 14 మంది అనుచరులతో కలిసి ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారన్న వార్త చర్చనీయంశంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన సాంబయ్య సుమారు నాలుగు దశాబ్దాల క్రితం మావోయిస్టు ఉద్యమంలో చేరారు. పదో తరగతి చదువుతున్నప్పుడే ఉద్యమం వైపు.. ముప్పిడి సాంబయ్య 1984లో పదో తరగతి చదువుతున్నప్పుడు ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. వరంగల్ ఉద్యమ పితామహుడు, వరంగల్ జిల్లా కార్యదర్శి పులి అంజన్నను స్ఫూర్తిగా తీసుకొని 1984లో పూర్తిస్థాయి కార్యకర్తగా పార్టీలో చేరారు. మొదట పరకాల ఏరియా దళసభ్యుడిగా, కొద్ది రోజులకే బాబన్న పేరుతో పరకాల – చిట్యాల ఏరియా కమాండర్గా వ్యవహరించారు. పరకాల కమాండర్ నుంచి ఖమ్మం జిల్లాకు జిల్లా కమిటీ సభ్యుడిగా బదిలీ అయ్యి 2002 వరకు అక్కడే ఉన్నారు. 2002 తర్వాత 2018 వరకు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, తూర్పు ఇన్చార్జ్గా భాస్కర్ పేరుతో వ్యవహరించారు. 2018లో ఒడిశా స్టేట్ కమిటీ మెంబర్గా వ్యవహరించారు. 2025లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి స్థానంలో ఒడిశా నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికై కొనసాగుతున్నారు. కాగా, 2013లో కమాండర్ స్థాయి అయిన నిమ్మల సారమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు ఉంది. వివాహం జరగగా ప్రస్తుతం ఆమె జనగామలో ఉంటున్నట్లు పోలీసుల సమాచారం. వికాస్, జంగ్ దాదా ఆయనే.. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పనిచేసిన సాంబయ్య.. వికాస్, జంగ్ దాదా పేర్లతో కూడా పనిచేసి పాపులర్ అయ్యారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జిల్లా కమిటీ సభ్యుడు, కార్యదర్శిగా పనిచేసినప్పుడు సుదర్శన్, వికాస్ పేర్లతో వ్యవహరించారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జంగ్ దాదాగా ఆదివాసీ గిరిజనులతో మమేకమయ్యారు. సాహిత్యంలో అనేక రచనలు చేశారు. సాంబయ్య తల్లిదండ్రులు రామస్వామి–భద్రమ్మ కాగా.. ప్రస్తుతం భద్రమ్మ ఉంది. సాంబయ్య కు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉండగా.. ఒక సోదరుడు సదానందం ప్రభుత్వ టీచర్. ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత, అనుచరులు కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన ముప్పిడి సాంబయ్య పులి అంజన్న స్ఫూర్తితో 42 ఏళ్ల క్రితం ఉద్యమ బాట ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశాలో పనిచేసిన సాంబయ్య ఉమ్మడి వరంగల్ నుంచి మిగిలింది నరహరి, పాండునే.. -
వేతనాలు ఎక్కువగా ఉన్నాయనడం సరికాదు
హన్మకొండ: ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని ఆకునూరి మురళి విద్యా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తూ చెప్పడం సరికాదని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తూపురాణి సీతారం అన్నారు. ఈ వ్యాఖ్యల్ని తమ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. హనుమకొండలోని సెయింట్ పీటర్స్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాంనగర్ యూనిట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తూపురాణి సీతారాం మాట్లాడుతూ పెరిగిన ధరల గురించి ఆకునూరు మురళికి తెలియదా అని ప్రశ్నించారు. 1966లో 10 గ్రాముల బంగారం ధర సెకండరీ గ్రేడ్ టీచర్ స్కేల్ మూలవేతనంతో సమానంగా ఉండేదని, ఇప్పుడు ఆ ధరల ప్రకారం ఉపాధ్యాయుల వేతనాలు ఉన్నాయా అని ఆలోచించాలని సూచించారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో గరిష్టంగా రూ.500తో వైద్యం అందిస్తుంటే మనకు ఎందుకు సరిపోదని నిలదీశారు. ఒక శాతానికి మించి కాంట్రిబ్యూషన్ విధిస్తే పోరాటాలు తప్పవని ఆయన హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఆకునూరు విద్యాదేవి, జిల్లా బాధ్యులు జన్నపురెడ్డి ప్రభాకర్ రెడ్డి, నారాయణగిరి వీరన్న, కాంతాల లక్ష్మారెడ్డి, రహమాన్, సమ్మోహి ధర్మయ్య, సిరంగి రాజయ్య, మందల వెంకట్ రెడ్డి, నాగపురి రాజయ్య, కొంపెల్లి రామచంద్రం, రామానుజం, తుమ్మ రమేశ్బాబు, తదితరులు పాల్గొన్నారు. -
నిట్లో 15 మంది విద్యార్థులకు అస్వస్థత
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లోని 15 మంది విద్యార్థులు శనివారం అర్ధరాత్రి వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని చి కిత్స నిమిత్తం వరంగల్లోని ఓ ప్రైవే ట్ ఆస్పత్రికి తరలించినట్లు నిట్ యాజమాన్యం తెలిపింది. శని వారం అర్ధరాత్రి వరకు విద్యార్థులు స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకల్లో పాల్గొన్నారు. నిట్లో తిన్న ఆహారంతో నా, బయట ఏదైనా తిన్న ఆహారంతో అస్వస్థతకు గురయ్యారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముగిసిన ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష కేయూ క్యాంపస్ : ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత కోచింగ్ ఇవ్వడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు ఆదివారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్కాలేజీలో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. గ్రూప్–1, 2, 3,4, బ్యాంకింగ్, తదితర ఉద్యోగాల పరీక్షలకు కోచింగ్ ఇవ్వనున్నామని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ హనుమకొండ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ బి. నిర్మల, ఉమ్మడి వరంగల్ జిల్లా సంచాలకుడు జగన్మోహన్ తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణ చీఫ్ సూపరింటెండెంట్గా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి విధులు నిర్వర్తించారు. ఇందులో వంద మంది అభ్యర్థులను శిక్షణకు ఎంపిక చేస్తారు. పసుపు బదులు రంగు వినియోగిస్తే చర్యలు ● ఫుడ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మాజీ వరంగల్ అర్బన్ : చికెన్ సెంటర్ నిర్వాహకులు కోడిని శుభ్రం చేసే క్రమంలో పసుపు బదులు రంగు వినియోగిస్తే చర్యలు తప్పవని ఫుడ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మాజీ హెచ్చరించారు. ఈమేరకు ఆదివారం హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో ఆహార కల్తీ నియంత్రణ, వినియోగదా రుల మండలి ఆధ్వర్యంలో సంయుక్తంగా చికెన్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడిని శుభ్రం చేసేందుకు పసుపు బదులు రంగు ఉపయోగిస్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇలా ఉపయోగించి విక్రయించిన మాంసం తినడం వల్ల ఉదరం, పేగు కేన్సర్ బారిన పడుతారన్నారు. అందుకే ఇక నుంచి చికెన్ సెంటర్ నిర్వాహకులు కోడిని శుభ్రం చేసేందుకు పసుపు వాడాలన్నారు. ప్రైవేట్ కళాశాలలో షార్ట్ సర్క్యూట్హసన్పర్తి: నగర శివారులోని ఓ ప్రైవేట్ కళాశాల హాస్టల్లో ఆదివారం షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ సంఘటనలో కళాశాల హాస్టల్లోని సామగ్రి పాక్షికంగా దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి. పలివేల్పుల శివారులో కొంతమంది వ్యక్తులు కళాశాల హాస్టల్ నిర్వహిస్తున్నారు. అయితే సోమవారం జూనియర్ ఇంటర్ పరీక్ష ఉంది. కింది అంతస్తులో విద్యార్థినులు పరీక్షకు సిద్ధమవుతున్నారు. అయితే ఒకేసారి పై అంతస్తులో నుంచి మంటలు చేలరేగాయి. దీంతో విద్యార్థినులు ఆందోళనతో బయటకు పరుగులు దీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేశారు. కట్టడాలను పరిరక్షించాలి ఖిలా వరంగల్: వారసత్వ సంపద, చారిత్రక కట్టడా ల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చ ట్టం తీసుకురావాలని వినియోగదారుల దక్షిణాది రాష్ట్రాల సమన్వయ సమితి జనరల్ సెక్రటరీ మొ గిలిచెర్ల సుదర్శన్ కోరారు. వినియోగదారుల రక్షణ చట్టాలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వరంగల్ శివనగర్లోని వినియోగదారుల సమాఖ్య జిల్లా కార్యాలయంలో చిలువేర ప్రవీణ్ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో సుదర్శన్ మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టం –2019 అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల్లో చట్టాలు లోపభూయిష్టంగా అమలవుతున్నాయని అన్నారు. కల్తీ బారినపడి వినియోగదారులు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర నష్టానికి గురవుతున్నారన్నారు. కాకతీయుల కోట, కట్టడాలను ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర విధ్వంసానికి గురి చేస్తున్నారని వినియోగదారులు ఫిర్యాదులు చేసినా విధ్వంసాలు మాత్రం ఆగడం లేదని వా పోయారు. దిడ్డి లక్ష్మీనారాయణ, కార్తీక్, శ్రవణ్, వాసుకి, నరసింహం, సూర్యం పాల్గొన్నారు. -
మామిడి సంరక్షణకు సస్యరక్షణే మేలు
జనగామ: మామిడి పంట సంరక్షణకు సస్యరక్షణే మేలు. కాయ రాలిపోకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే దిగుబడి వస్తుంది. జనగామ జిల్లాలో 85వందల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. ఈ నేపథ్యంలో పూత అనంత రం చిన్న కాయలు ఏర్పడే ప్రస్తుత దశలో ఫ్రూట్లె ట్ డ్రాప్ సమస్య పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మామిడి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ఈ సమస్యను నియంత్రించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవికాంత్ తెలిపారు. ఈమేరకు మామిడి రైతులకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. కాయ రాలిపోవడానికి ప్రధాన కారణాలు.. పరాగసంపర్కం సరిగా జరగకపోవడం, అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ మట్టితేమ, బోరాన్, పొటాష్ లోపాలు, త్రిప్స్, హాపర్ దాడులు, అలాగే పొడరీ మిల్యూ, అంట్రాక్నోస్ వంటి వ్యాధులు ప్రధాన కారణాలు. నివారణ చర్యలు పాటించాలి.. నీటిపారుదల నిర్వహణలో బిందు సేద్యంతో రో జుకు 3 గంటల పాటు నీరు అందించడం, మల్చింగ్ చేయడం, నీటి కొరత, అధిక నీరు రెండింటినీ ని వారించాలి. పోషక నిర్వహణలో ఒకశాతం 19 :19:19 లేదా 13:0:45 నీటిలో కరిగే ఎరువులను స్ప్రే చేయాలి. బోరాన్ 0 .1శాతం( గ్రాముకు లీటర్) స్ప్రే చేయడం ద్వారా కాయరాలిపోవడం తగ్గిపోతుంది. అవసరమైతే మైక్రోన్యూట్రియొంట్స్ వినియోగం తప్పనిసరి. గ్రోత్ రెగ్యులేటర్ వినియోగం.. ప్లానోఫిక్స్ 4.5 ఎంఎల్ను 25 లీటర్ల నీటిలో కలిపి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో స్ప్రే చేయాలి. కీటక–వ్యాధి నియంత్రణ.. త్రిప్స్, హాపర్ నివారణకు ఫైప్రోనిల్ లేదా ఇమిడాక్లోప్రిడ్ పురుగు మందులు ఉపయోగించాలి. కాయ పరిమాణం పెంపునకు ప్రత్యేక సూచనలు.. పొటాష్ అధికంగా ఉండే 13:0:45 ఎరువును రెండు దఫాలుగా 10–15 రోజుల వ్యత్యాసంలో స్ప్రే చేయాలి. తగినంత సేంద్రియ ఎరువు, తేమ అందేలా సరైన నీటిపారుదల నిర్వహణ అవసరం. అధిక ఉష్ణోగ్రతల కారణంగా స్ప్రే తప్పనిసరిగా ఉదయం 8 ముందు లేదా సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే చేయాలి. కాగా, ఏమైనా సందేహాలుంటే రైతులు వెంటనే హార్టికల్చర్ అధికారులను సంప్రదించాలని జిల్లా ఉద్యాన శాఖ సూచించింది. కాయ రాలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పంట దిగుబడి కాపాడుకోవాలి ఉద్యాన శాఖ అధికారి రవికాంత్ -
హాట్ హాట్గా మిర్చి
రకం ధర దేశీ మిర్చి 50,000ఎల్లో మిర్చి 42,000వండర్హాట్ 39,000సింగిల్ పట్టి 35,000 దీపిక 31,000యూఎస్–341 29,0001048 21,000తేజ 20,600సాక్షి, వరంగల్: వరంగల్లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు హాట్ హాట్గా ఉంటున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం అన్ని రకాల మిర్చికి ధర రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు తాజాగా దేశీ మిర్చి క్వింటాలు రూ.50,000 పలకడంతో మిర్చి ధరలపై మరోసారి చర్చ జరుగుతోంది. మూడు రోజుల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పుల్లూరుపల్లికి చెందిన రవీందర్రావు 9 బస్తాల దేశీ మిర్చిని తీసుకురాగా.. అడ్తి శాంతి ఇండస్ట్రీస్ అమ్మించగా రూ.50,000 ధర పలికిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి సాగు విస్తీర్ణం తగ్గి, అకాల వర్షాలతో పంట దెబ్బతినడంతో ఉన్న మిర్చికే రేటు అధికంగా పలుకుతోందని, అదే సమయంలో ఆయా మిర్చి కారం, నాణ్యతను బట్టి పరిశ్రమలు ఎక్కువ ధరకు కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తుండడం కూడా రేటు పెరగడానికి మరో కారణంగా ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. మిర్చి నాటే సమయానికి కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతింది. దిగుబడి రాకపోవడంతో మార్కెట్కు మిర్చి రావడం తగ్గింది. అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గింది. గృహ అవసరాలకు వినియోగం పెరగడం, మార్కెట్కు మేలు రకమైన మిర్చి వస్తుండడంతో వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. డిమాండ్ ఎందుకు ఎక్కువంటే.. ● అకాల వర్షాలు, తామర తెగులుతో దేశీ రకం దిగుబడి పడిపోయింది. అదే సమయంలో ఈ మిర్చిని ఎక్కువగా పచ్చళ్లలో వాడుతుండడంతో ధర పలుకుతోంది. ● సింగిల్ పట్టి మిర్చిని ఎక్కువగా పచ్చళ్లకు వినియోగిస్తున్నారు. ఘాటు ఉండకుండా టేస్టీగా ఉండడంతో దీనికి డిమాండ్ ఉంది. ● వండర్హాట్ మిర్చిలో కారం ఎక్కువ శాతం ఉంటుంది. పచ్చడి, పొడి మసాలా తయారీలో డిమాండ్ ఉంటుంది. తేజ మిర్చికి కూడా స్థానిక పరిశ్రమలు, ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉంది. ఏనుమాముల మార్కెట్లో మిర్చి ధరలు ౖపైపెకి రోజురోజుకూ పెరుగుతున్న దేశీ, వండర్హాట్ ధరలు ఇతర రకాల మిర్చికి సైతం మార్కెట్లో డిమాండ్ దేశీ మిర్చికి అత్యధికంగా క్వింటాకు రూ.50,000 జనవరి నుంచి ఇప్పటివరకు 1,27,200ల క్వింటాళ్ల విక్రయాలు -
విద్యుత్ వినియోగం ౖపైపెకి..
హన్మకొండ : శీతాకాలం ముగియడంతోనే విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. టీజీ ఎన్పీడీసీఎల్ చరిత్రలో అధిక స్థాయిలో నమోదవుతూ రికార్డులు బ్రేక్ చేస్తోంది. మార్చితో వేసవి మొదలైంది. కాలం ఆరంభానికి ముందు నుంచి గరిష్ట స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదు కావడం చూస్తే మండుటెండల వరకు మరిన్ని రికార్డులు నమోదవుతాయ ని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శీతాకా లం ముగియడంతో ఉక్కపోత మొదలైంది. దీంతో వినియోగదారులు ఫ్యాన్లు, ఏసీలు వినియోగిస్తున్నారు. ఫలితంగా కరెంట్ వినియోగం పెరిగింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం.. గతేడాది మార్చి 11న 5,816 మెగావాట్ల డిమాండ్ నమోదు కాగా ఇప్పటి వరకు ఇదే అత్యధిక డిమాండ్గా ఉంది. ఈసారి 12 రోజుల ముందుగానే ఫిబ్రవరి 28న అత్యధికంగా 6,057 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇదిలా ఉండగా మరునాడే ఈ నెల 1వ తేదీ (ఆదివారం)న టీజీ ఎన్పీడీసీఎల్ చరిత్రలోని గరిష్టంగా 6,267 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముంది. ఈ క్రమంలో టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి గత రెండు నెలల నుంచి వేసవికి అధికారులను సన్నద్ధం చేస్తున్నారు. రెండు నెలల క్రితమే వేసవిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళిక, కార్యాచరణ రూపొందించుకోవాని ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లు, డివిజనల్ ఇంజనీర్లు, ఏడీఈలు, ఏఈలు వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టారు. అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు.. అధిక భారం ఉన్న డిస్ట్రిబ్యూషన్ల స్థానంలో అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు, వీలుకాని చోట ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు, అదే విధంగా సబ్ స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇప్పటికే 35 నూతన 33/11 కేవీ సబ్ స్టేషన్లు నిర్మించారు. అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లు 366 బిగించారు. 7,600 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచారు. 33 కేవీ ఫీడర్లలో ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్లు వేశారు. లోఓల్టేజీ సమస్య తీర్చేందుకు 392 కెపాసిటర్ బ్యాంక్లు అమర్చారు. వేసవి దృష్టిలో ఉంచుకుని ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, విద్యుత్ లైన్ల పర్యవేక్షణ, వదులుగా ఉన్న లైన్లు సరి చేయడానికి అత్యవసర స్పందన బృందాలను ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. చలి తగ్గగానే ఒక్కసారిగా పెరిగిన డిమాండ్ ఆగకుండా తిరుగుతున్న ఫ్యాన్లు, ఏసీలు ఎన్పీడీసీఎల్ చరిత్రలో రికార్డులు బ్రేక్ శనివారం 6,057, ఆదివారం 6,267 మెగావాట్ల గరిష్ట డిమాండ్విద్యుత్ డిమాండ్ వివరాలు(మెగావాట్లు).. తేదీ 2026లో 2025లో 2024లో ఫిబ్రవరి డిమాండ్ డిమాండ్ డిమాండ్ 20 5,845 5,502 5,178 21 5,904 5,573 5,283 22 5,837 5,635 5,189 23 5,709 5,494 5,243 24 4,798 5,670 5,200 25 5,158 5,708 4,903 26 5,279 5,778 5,061 27 5,948 5,451 5,061 28 6,057 5,646 5,228 మార్చి1 6,267 5,709 5,174 -
సిబ్బంది సంక్షేమానికే ఫిల్లింగ్ స్టేషన్: డీజీపీ
వరంగల్ క్రైం: పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం మడికొండలోని పోలీస్ శిక్షణ కేంద్రం ప్రాంగణంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు డీజీపీ శివధర్రెడ్డి పేర్కొన్నారు. ఫిల్లింగ్ స్టేషన్ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాల అధికారిక వాహనాల ఇంధన అవసరాల ను ఈ ఫిల్లింగ్ స్టేషన్ తీర్చనున్నట్లు ఆయన తెలి పారు. ఇంధన సరఫరాలో నాణ్యత నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, డీసీపీలు కవిత, అంకిత్ కుమార్, ఏఎస్పీ శుభం, అదనపు ఏసీపీలు సురేశ్కుమార్, శ్రీనివాస్, కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, ఎంటీ ఏసీపీ అంతయ్య, సురేంద్ర ఉన్నారు. పోలీస్ అతిథి గృహం ప్రారంభం కమిషనరేట్ పరిధిలో మరమ్మతులు చేసిన పోలీస్ అతిథి గృహాన్ని డీజీపీ బి.శివధర్రెడ్డి ఆదివారం ప్రారంభించారు. హనుమకొండ పోలీస్ గెస్ట్హౌస్కు చేరుకున్న డీజీపీకి సీపీ సన్ప్రీత్సింగ్, పోలీస్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం డీజీపీ మాట్లాడారు. పోలీస్ శాఖ అధికారుల, అతిథుల సౌకర్యాలను మెరుగుపర్చేలా ఈ అతిథి గృహాన్ని పునర్నిర్మించినట్లు తెలిపారు. డీసీపీలు అంకిత్ కుమార్, కవిత, శుభం నాగ్, అదనపు డీసీపీలు రవి, శ్రీనివాస్, సురేశ్కుమార్ ఉన్నారు. -
ఈద్గా అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
రామన్నపేట/ఖిలా వరంగల్: గ్రేటర్ వరంగల్ 11వ డివిజన్ పరిధి జెమిని థియేటర్ సమీపంలోని ఈద్గాలో చేపట్టిన అభివృద్ధి పనులను రంజాన్ పర్వదినానికి ముందే పూర్తిచేయాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వరంగల్ ఎంజీఎం సర్కిల్లో శిశు సంరక్షణ ప్రతిబింబించేలా రూ.35 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్రతిమను లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా మట్టెవాడ ఈద్గాలో కోటి రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్యశారదలో కలిసి మంత్రి సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈద్గా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. గడువులోగా పనులు పూర్తిచేయాలన్నారు. అదేవిధంగా 40వ డివిజన్ కరీమాబాద్లో రూ.1.40 కోట్ల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, ఉర్సు శ్మశానవాటిక, గౌడ సంఘం, మైనార్టీ కమ్యూనిటీ హాళ్ల పనులను కలెక్టర్ సత్యశారద, మేయర్ గుండు సుధారాణితో కలిసి మంత్రి సురేఖ శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్లు మరుపల్లి రవి, పల్లం పద్మ, మీసాల ప్రకాశ్, గోపాల నవీన్రాజు పాల్గొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ -
నేడు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్
● జిల్లా స్థాయి పోటీలకు 200 మంది డిగ్రీ విద్యార్థులు కేయూ క్యాంపస్: వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–హనుమకొండ జిల్లా స్థాయి పోటీలను కేయూలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ఈనెల 2న నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రమణ, కన్వీనర్లు డి. శైలజ, డాక్టర్ ఎన్.సౌజన్య ఆదివారం తెలిపారు. కేయూ కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో మై భారత్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ‘ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు, భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు’ అంశంపై ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మై భారత్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్న విద్యార్థుల్లో 200 మందికి ఈ పోటీల్లో అవకాశం కల్పించనున్నట్లు కేయూ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ ఆచార్య ఈసం నారాయణ తెలిపారు. ఐదుగురిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. -
హేమాచల క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తాం
● మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంగపేట: మండలంలోని రెండో యాదగిరిగుట్టగా ప్రస్ధిగాంచిన మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి శ్రీనివాస్రెడ్డి దంపతులు, కుటుంబీకులు.. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎంపీ పోరిక బలరాంనాయక్, పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో కలిసి మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ హేమాచల క్షేత్రంలో స్వయంభుగా వెలసిన లక్ష్మీనర్సింహాస్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆలోచనకు అనుగుణంగా గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని దేవాలయాలను టెంపుల్ టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. వాటికి సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. మంత్రి సీతక్క కోరిక మేరకు ప్రభుత్వం హేమాచల క్షేత్రంతోపాటు ములుగు ప్రాంతంలోని ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తుందన్నారు. కాగా, ఆలయ కార్యనిర్వాహణ అధికారి రేవెల్లి మహేశ్ ఆధ్వర్యంలో అర్చకులు ముక్కామల శేఖర్శర్మ, రాజీవ్ నాగశర్మ, కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు, వెంకటనారాయణ శర్మ.. మంత్రులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఉమాచంద్రశేఖరస్వామి ఆలయంలో పూజలు.. మండల కేంద్రంలోని ఉమాచంద్రశేఖరస్వామి ఆలయాన్ని మంత్రులు శ్రీనివాస్రెడ్డి, సీతక్క, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్లు, వెంకట్రావు దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ నరేశ్రెడ్డి, పూజారి నరేశ్శర్మ ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కలెక్టర్ టీఎస్ దివాకర, అదనపు కలెక్టర్ మహేందర్జీ, రాష్ట్ర ఉపాధి హామీ మండలి డైరెక్టర్ సోమయ్య, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగకల్యాణి, తహసీల్దార్ రవీందర్, హేమాచల క్షేత్రం మాజీ చైర్మన్ సురేశ్, పురుషోత్తం, సత్యనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, మహిళా అధ్యక్షురాలు శానం నిర్మల, మంగపేట ఎఫ్ఎస్సీఎస్ మాజీ చైర్మన్ తోట రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నగరంలో కల్తీ పాల విక్రయాలే అధికం
హన్మకొండ చౌరస్తా: పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు హైడ్రోజన్ ఫెరాకై ్సడ్ లాంటి రసాయనాలు కలపడం, వెన్న శాతం 6.0గా ప్యాకెట్లపై చూపగా అందులో 5.5శాతం ఉన్నట్లుగా గుర్తించినట్లు వినియోగదారుల మండలి ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి తెలిపారు. వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో హనుమకొండలోని కుమార్పల్లి మార్కెట్ ఏరియాలో పాల కల్తీ – నాణ్యతపై ప్రజలకు ఆదివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మొబైల్ వాహనంలో ఉన్న ఆహార కల్తీ ప్రయోగశాలలో పలు కంపెనీలకు చెందిన పాల నాణ్యతను తనిఖీ చేశారు. నగరంలో అత్యధిక కంపెనీల పాలలో కల్తీ ఉన్నట్లు పరిశీలనతో తేలిందని చక్రపాణి అన్నారు. ఆహార భద్రత చట్టం, నిబంధనలకు సత్వరమే సవరణలు అవసరమని, వినియోగదారుల సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ జరిగిన రెండేళ్లు గడిచినా సవరణలు అమలు కావడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ఆహార కల్తీ లాబొరేటరీలను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లెపాడు దామోదర్, హనుమకొండ ఫుడ్ సేఫ్టీ అధికారి బ్రహ్మాజీ, సీసీఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆర్.రంజిత్కుమార్, మండలి రాష్ట్ర కార్యదర్శి ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2026
నగరంలో కర్రీ పాయింట్లు, రైతుబజార్లు సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మాంసం, చేపలు, కూరగాయల కర్రీలను అమ్ముతున్నారు. చాలా కేంద్రాల్లో మిగిలిన చికెన్, మాంసాన్ని ఫ్రిజ్లలో నిల్వ చేసి మరుసటిరోజు వేడి చేసి విక్రయిస్తున్నారు. గతంలో బల్దియా ప్రజారోగ్య విభాగం అధికారులు తనిఖీ చేయగా.. కుళ్లిపోయిన మాంసం, బూజుపట్టిన చేప ముక్కలు లభ్యమయ్యాయి.ప్రజల ఆహార భద్రత కోసం నియమించిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 2011 వరకు బల్దియా ప్రజారోగ్యం అధికారులు, సిబ్బంది ఆహార కల్తీ నివారించేందుకు తనిఖీలు చేస్తుండే వారు. ఆ తదుపరి నిబంధనలతో ఆహార కల్తీ నియంత్రణ శాఖ అధికారులు పర్యవేక్షించాలి. కానీ, ఫుడ్సేఫ్టీ అధికారుల కొరతతో ఫిర్యాదులు వస్తేనే స్పందిస్తున్నారు. నమూనాలు సేకరించి చేతులు దులుపుకుంటున్నారు. ఇక పరిశుభ్రతను తనిఖీ చేయాల్సిన బల్దియా ప్రజారోగ్యం అధికారులు, సిబ్బంది పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆహార కల్తీపై హనుమకొండ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ను సంప్రదిస్తే అందుబాటులో లేరు. వరంగల్ అర్బన్: కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా పరిస్థితి మారింది. ఆహారపదార్థాల నుంచి అలంకరణ వస్తువుల వరకు అన్నీ కల్తీమయమే. ధనార్జనే ధ్యేయంగా కొంతమంది ప్యాపారులు చేస్తున్న ఈ దందా ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. ఆహారపదార్థాల్లో కల్తీ నేరుగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొన్ని వెంటనే దుష్ప్రభావం చూపిస్తుండగా.. మరికొన్ని దీర్ఘకాలికంగా చేటుచేస్తున్నాయి. ఉరుకులు, పరుగుల జీవనంలో డబ్బులు ముట్టజెప్పి కడుపు నింపుకుంటూ అనేకమంది రోగాలను కొనుక్కుంటున్నారు. వరంగల్ మహానగరంలోని పలు హోటళ్లు, బిర్యానీ సెంటర్లు, దాబాలు, ఫాస్ట్పుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్ల నిర్వాహకులు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. నిషేధిత రసాయన పౌడర్లు, కల్తీ నూనెలు విచ్చలవిడిగా వాడుతున్నారు. అపరిశుభ్ర వాతావారణంలో వంటలు తయారు చేస్తున్నారు. నిర్వాహకులకు డబ్బు సంపాదన యావ తప్ప కనీస నాణ్యతా ప్రమాణాలు, పరిశుభ్రతపై పట్టింపులేదు. బల్దియా ప్రజారోగ్య విభాగం అధికారులు, సిబ్బంది, ఆహార కల్తీ నియంత్రణ అధికారులు నెలవారీగా మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫిర్యాదు వస్తే మొక్కుబడి తనిఖీలతో చేతులు దులుపుకుంటున్నారు. బిర్యానీ ఘుమఘుమలు.. ఆహా ఏమి రుచి తినరా మైమరిచి అన్నట్లు భోజన ప్రియలు లోట్టలేసుకుంటూ చికెన్, మటన్ బిర్యానీ ఆరాగిస్తున్నారు. బిర్యానీ పాయింట్ల నిర్వాహకులు కస్టర్లమర్లను ఆకట్టుకునేందుకు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. రంగు, రుచి, వాసన కోసం నిషేధిత పౌడర్లను ఉపయోగిస్తున్నారు. బిర్యానీలో వాడే చికెన్, మటన్ కూడా శుభ్రంగా ఉండడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా వాడే నూనెలు అత్యంత ప్రమాదకరంగా ఉంటున్నాయని చెబుతున్నారు. ఎముకలు, కళేబారాల నుంచి తీసిన నూనెలు వాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవి ప్రముఖ బ్రాండ్ల పేరుతో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా అవుతున్నట్లు సమాచారం. ఆహార పదార్థాలను యథేచ్ఛగా కల్తీ చేస్తున్నారు. వంట గదుల్లోకి వినియోగదారులు వెళ్లే అవకాశం లేదు. ఆ గదుల్లోకి నోఅడ్మిషన్ అని బోర్డులు పెడుతుండడంతో అవి రహస్య స్థావరాలుగా మారాయి. చాలా హోటళ్లలో గాలి, వెలుతురు కరువైంది. వడ్డించే వాళ్లు కనీసం చేతులకు గ్లౌజులు, నెత్తికి టోపీలు ధరించడం లేదు. ప్రజారోగ్య విభాగం, ఆహార కల్తీ నియంత్రణ అధికారులు హోటళ్లపై దాడులు చేసినప్పుడల్లా ఆశ్చర్యకర విషయాలు ఎన్నో వెల్లడవుతున్నాయి. వీటి వల్ల ప్రజలు ప్రమాదకర వ్యాధులబారిన పడే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. పాడైపోయిన పదార్థాలతో తయారు చేస్తున్న నిర్వాహకులు వంటల్లో నిషేధిత రసాయన పౌడర్లు, కల్తీ నూనెల వాడకం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం పట్టించుకోని జీడబ్ల్యూఎంసీ, ఆహార కల్తీ నియంత్రణ శాఖ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, కర్రీ పాయింట్లలో పారిశుద్ధ్య తనిఖీలు చేస్తున్నాం. అపరిశుభ్రంగా ఉన్న వాటికి నోటీసులు జారీ చేసి, తదుపరి జరిమానా విధించి వసూలు చేస్తున్నాం. ఆహార కల్తీ తనిఖీ మాది కాదు. – రాజారెడ్డి, సీఎంహెచ్ఓ -
వాహన కాంతితోనే ప్రమాదాలు
ఖిలా వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని జాతీయ రహదారులపై రాత్రివేళ హెడ్లైట్లతోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటితో వచ్చే కాంతితో ఎదురుగా వచ్చే వాహనదారులకు రోడ్డు కనిపించక ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని ఆర్టీఏ, పోలీసు అధి కారులు గుర్తించారు. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని రకాల వాహనాలు కలిపి సుమారు 9లక్షల 50 వేల వరకు ఉన్నాయి. ఆర్టీఏ కార్యాలయాలు ఆరు ఉన్నాయి. కనిపించని నిషేధం.. రహదారులపై వాహనదారులు హైబీమ్ లైట్లను నిరంతరం వాడితే ఎదురుగా వచ్చే వాహనదారుల కంటి చూపు తాత్కాలికంగా దెబ్బతిని, రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది. నగరాలు, పట్టణాలు, వెలుతురు ఎక్కువగా ఉన్న రోడ్లపై లోబీమ్ వాడాలి. కానీ, అవగాహన లోపంతోనే హైబీమ్ వాడుతున్నారు. వీటి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చాలామంది వాహనదారులు వాపోతున్నారు. ఇది చట్టరీత్యా నేరమని తెలిసినా లారీలు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు సైతం ఎల్ఈడీ, హైబీమ్ లైట్లు వాడడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈసమస్య ఏ ఒక్కరిదే కాదు.. రాత్రి రోడ్డుపై వాహనం నడిపే ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నారు. కనిపించని బ్లాక్ స్టిక్కర్.. వాహనం ఏదైనా హెడ్లైట్లపై సగం వరకు బ్లాక్స్టిక్కర్ ఉండాలన్నా నిబంధన ఉండేది. ఆ రూల్ ఉందా.. తీసేశారో తెలియదు. వాహనాల హెడ్లైట్లకు వస్తున్న లీడ్ లైట్ల గురించి చర్యలు తీసుకోవడంతోపాటు హెడ్లైట్లకు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ లేదా బ్లాక్ పెయింట్ వేయాలనే నిబంధన పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. గరిష్టంగా 70 వాట్లు మించిన ఫోకస్ లైట్లు వాడకూడదని నిబంధనలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ వాహనాలు, ప్రభుత్వ వాహనాలు అత్యధికంగా వెలుగులు ఇచ్చే హైబీమ్ లైట్లను వాడుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి ఎదురుగా వచ్చే వాహనదారులు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. హైబీమ్, ఎల్ఈడీ లైట్లు వాడితే ఆర్టీఏ చట్ట ప్రకారం రూ.500 నుంచి రూ.1,500 వరకు జరిమానా విఽధించాలని సుప్రీంకోర్టు సూచనలు ఉన్నా.. ఆర్టీఏ అధికారులు, పోలీసులకు పట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా హెడ్లైట్ల నిషేధం వాహన చట్టం ప్రకారం సాధారణ లైట్లు వాడాలి హైబీమ్ ఎల్ఈడీ లైట్లు వాడితే జరిమానారాత్రివేళ నరకమే.. నగరాలు, పట్టణాలు, జాతీయ రహదారులపై రాత్రి 7 గంటల దాటితే వాహనాలు నడపాలంటే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఎదురుగా వాహనాల ఎల్ఈడీ లైట్లతో కళ్లు కనిపించకుండా మసకబారిపోతున్నాయని చెబుతున్నారు. కొత్తగా వచ్చే వాహనాలు ఎల్ఈడీ లైట్లతో రోడ్డు ఎక్కుతున్నాయి. వీటిపై ఆర్టీఏ, పోలీస్ అధికారుల పర్యవేక్షణ కరువడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. -
డ్రెయినేజీలో నల్లా కనెక్షన్లు
వరంగల్: వరంగల్ 19వ డివిజన్ వివేకానందకాలనీ రోడ్డు–2లో డ్రెయినేజీలోనే తాగు నీటి నల్లా కనెక్షన్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కాలనీలో డ్రెయినేజీల నిర్మాణంలో భాగంగా పాత పైపులైన్ తీసివేశారు. కాల్వ మధ్యలో పైపులైన్ వేసి కనెక్షన్లు ఇవ్వడంపై కాలనీవాసులు అభ్యంతరం చెబుతున్నారు. కాల్వ మధ్యలో ఉన్న పైపుపై సిమెంట్, కాంక్రీట్ వేస్తామని ప్లంబర్ చెప్పగా.. భవిష్యత్లో లీకయితే ఎలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. తాగునీటి పైపులైన్ను మధ్య నుంచి పక్కకు జరిపి, సైడ్ డ్రెయిన్ గోడ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. -
సమ్మర్ యాక్షన్ప్లాన్ను అమలు చేయండి
● మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ను పక్కాగా అమలు చేయాలని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. మట్టెవాడ వాటర్ ట్యాంకులో ఆదివారం మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి సరఫరాలో ఆ టంకాలు లేకుండా చూడాలని సూచించారు. ఎస్సీ కాలనీలో పర్యటించి వాల్వ్లు, బోర్లకు మరమ్మతులు చేయాలని కోరారు. డీఈలు సతీశ్, మొజామిల్, రవీందర్, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్ పాల్గొన్నారు. -
‘అరైవ్.. అలైవ్’ను ఉద్యమంగా సాగించాలి
జనగామ/ వరంగల్ క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరెవ్.. అలైవ్ కార్యక్రమాన్ని ఉద్యమంగా కొనసాగించాలని డీజీపీ శివధర్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రం వెస్ట్ జోన్ పరిధి లోని ఏసీపీ కార్యాలయంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయన్నారు. నేరస్తులు ఎక్కడో ఉండి టెక్నాలజీ వినియోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ క్రమంలో ప్రతీ అధికారి సైబర్ నేరాలపై అవగా హన కల్పించాలన్నారు. ప్రధానంగా స్టేషన్ అధికా రులు రికార్డుల నమోదుపై దృష్టి సారించాలని, రౌడీ షీటర్లు, అనుమానితులను ప్రత్యక్షంగా వెళ్లి తనిఖీ చేయాలన్నారు. ప్రతీ అధికారి తన స్టేషన్ పరిధిలోని హిస్టరీ పై అవగాహన కలిగి ఉండాలని, ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు సామాజిక సమస్యగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలపై మరింత అవగాహన కల్పించాలని, ఇందుకోసం ప్రతీనెల చివరివారం అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. అలాగే ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలన్నారు. సమావేశంలో డీసీపీలు రాజమహేంద్ర నాయక్, అంకిత్ కుమార్, దార కవిత, ఏఎస్పీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు డీజీపీ శివధర్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష -
బాల్య వివాహాలను ప్రోత్సహించడం నేరం
కాళోజీ సెంటర్: బాల్య వివాహాలను ప్రోత్సహించడం నేరమని వరంగల్ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రాజ్నిధి అన్నారు. మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలపై శనివారం నిర్వహించిన చైతనకార్యక్రమంలో జడ్జి మాట్లాడారు. బాల్య వివాహాలు ఉన్నత చదువులకు ఆటంకమని పేర్కొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు భవిష్యత్ అంధకారం అవుతుందని పేర్కొన్నారు. హెచ్ఎం కె.అరుణ, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, భిక్షపతి, షౌకత్ అలీ, రమేష్, అజయ్బాబు, వంశీ మోహన్, ప్రభాకర్, పూర్ణిమ, సుభాషిణి, అరుణ, చంద్రకళ విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా పాఠశాలలో జరిగిన సైన్స్ దినోత్సవంలో జడ్జి పాల్గొని మాట్లాడారు. -
గాదె ఇన్నయ్య ఇంట్లో మరో విషాదం..
● అనారోగ్యంతో తండ్రి సాల్మన్రెడ్డి మృతి జఫర్గఢ్ : సామాజిక ఉద్యమకారుడు, మాఇల్లు అనాథ ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నయ్య ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి థెరిసమ్మ మృతి చెందిన నెలన్నర రోజులకే తండ్రి సాల్మోన్రెడ్డి శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. మండలంలోని సాగరంలో ఉంటున్న సాల్మోన్రెడ్డి కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అలాగే, ఇటీవల తన భార్య థెరిసమ్మను కోల్పోవడం.. కుమారుడు జైలులో ఉండడంతో మానసికంగా కృంగిపోయాడు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. కాగా, మావోయిస్టులను ప్రోత్సహిస్తున్నారనే కారణంతో ఎన్ఐఏ డిసెంబర్ 21న ఇన్నయ్యను అరెస్ట్ చేసిన విషయం విధితమే. అప్పటి నుంచి ఇన్నయ్య హైదరాబాద్లోని చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. ఇటీవల తల్లి థెరిసమ్మ చనిపోవడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఇన్నయ్య రెండు సార్లు కండీషన్ బెయిల్పై వచ్చాడు. ఈ ఘటన జరిగి 43 రోజులు గడవక ముందే తండ్రి సాల్మోన్రెడ్డి కన్నుమూశాడు. దీంతో మళ్లీ తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కుటుంబీకులు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు.. ఇన్నయ్యకు రెండు రోజులు కండీషన్ బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఇన్నయ్య ఆదివారం స్వగ్రామం చేరుకోనున్నారు. రేపు లేదా ఎల్లుండి తండ్రి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
బాలవికాస సేవలు ఆదర్శనీయం
కాజీపేట రూరల్ : బాలవికాస సేవలు ఆదర్శనీయమని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. శనివారం కాజీపేట ఫాతిమానగర్లోని బాలవికాసలో తాగునీటి శుద్ధీకరణ పథకాల కమిటీల మహాసభ నిర్వహించారు. ఎమ్మెల్యేలు నాయిని రా జేందర్రెడ్డి, కె.ఆర్.నాగరాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీ కావ్య ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నీరు జీవనానికి అత్యవసరమన్నారు. బాలవికాస వెంట ఉంటే గ్రామం ఆదర్శంగా మారుతుందన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ సమాజంలో బాలవికాస వివిధ రకాల సేవలు, అభివృద్ధి ఆదర్శనీయమన్నారు. వర్ధన్నపేట ఎ మ్మెల్యే కె.ఆర్.నాగరాజు మాట్లాడుతూ నేటికి పరి శుభ్ర తాగునీరు అందుబాటులో లేని ప్రజలు ఇంకా ఉన్నారని, అలాంటి వారికి సేవ చేయడం గొప్ప అన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ ద్వారా మాట్లాడుతూ బాలవికాస సమాజ హిత కార్యక్రమాలు అభినందనీయమన్నారు. గ్రామాల్లో నీటి శుద్ధికరణ కేంద్రాలకు ఉచిత విద్యుత్ కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు మాట్లాడుతూ బాలవికాస వ్యవస్థాపకురాలు బాలథెరిసా సేవలు అద్భుతమని, బాలవికాస ప్రాజెక్ట్లు ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. బాలవికాస వ్యవస్థాపకురాలు బాలథెరిసా జింగ్రాస్ కెనడా నుంచి ఆన్లైన్లో మాట్లాడుతూ బాలవికాస ఈ రోజు 1,600 మంది సభ్యులు, అన్ని గ్రామాలు కలిసి ఒకే కుటుంబంగా మారడం గొప్ప విషయమన్నారు. ఈ కుటుంబాన్ని ఐక్యంగా నిర్మించారన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు డాక్టర్ టి.రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి, బాలవికాస సిబ్బంది, పలు రాష్ట్రాలకు చెందిన 3వేల మంది కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య తాగునీటి శుద్ధ్ధీకరణ పథకాల కమిటీల మహాసభ -
మోడల్ రాకెట్ విఫలం
ప్రయోగం తుస్.. వీక్షకుల నిరాశ నయీంనగర్: సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం భద్రకాళి చెరువులోని ఐలాండ్పై ఏర్పాటుచేసిన రుద్రమ–1 మోడల్ రాకెట్ లాంచ్ తుస్మంది. పట్టుమని వంద అడుగులు కూడా ఎగరలేదు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మోడల్ రాకెట్ లాంచింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ‘కుడా’ ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించింది. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మోడల్ రాకెట్ రూపకర్త శశాంక్ భూపతి తొలుత చిన్న రాకెట్ను లాంచ్ చేయగా.. కొన్ని అడుగుల ఎత్తులోకి వెళ్లి కొంత దూరంలో నేల కూలింది. కొంత సమయం తర్వాత మరో రాకెట్ను ప్రయోగించగా అది కూడా తుస్మంటూ చెరువులో పడింది. మోడల్ రాకెట్ విఫలం కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వేల సంఖ్యలో తరలివచ్చిన స్కూల్ విద్యార్థులు, యువత, సైన్స్, ఖగోళప్రియులు, నగర ప్రజలు నిరాశ చెందారు. మోడల్ రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు వచ్చిన వారిలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త శేషగిరిరావు, వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్ అంజన్ కుమార్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్ సెక్రెటరీ, డైరెక్టర్ ఎన్.రఘునందన్ కుమార్, ‘కుడా’, పోలీస్, ఇతరశాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి
ఖిలా వరంగల్: రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ విధానం అమలు చేయాలని, లేనిపక్షంలో కంట్రాక్ట్, ఔట్స్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రత్యక్ష పోరాటాలు తప్పవని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి యూసుఫ్ హెచ్చరించారు. శనివారం వరంగల్ శివనగర్లోని సీతారామచంద్రస్వామి కల్యాణ మండపంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహా సభలు ప్రారంభమయ్యాయి. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న కార్మికుల కష్టాన్ని కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. కార్మికులకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో వారి జీవనం దినదిన గండంగా సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నర్సింహ మాట్లాడుతూ ప్రధాని మోదీ విధానాలతో దేశ కార్మిక వర్గం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోందన్నారు. పాత ఏజెన్సీలను రద్దు చేసి కార్మికులకు రూ. 26వేల కనీస వేతనం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ బాషుమియా, గన్నారపు రమేశ్, ఎం. లక్ష్మి బాయి, హసీనాబేగం, దేవేందర్రెడ్డి, ఓమయ్య, దండు లక్ష్మ ణ్, చెన్న కేశవులు, ఎండి యాకూబ్, పార్వతి, బోగి ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.● ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ ● రాష్ట్ర నాలుగో మహా సభలు ప్రారంభం -
ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి
వరంగల్ లీగల్: ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు నిర్మల గీతాంబ, బి.అపర్ణ సూచించారు. శనివారం జిల్లా కోర్టు భవన ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవా సంస్థ (డీఎల్ఎస్ఏ)ఆధ్వర్యంలో సుబేదారిలోని అమృత వెల్నెస్ సెంటర్ సహకారంతో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. క్యాంపును న్యాయమూర్తులు ప్రారంభించారు. ఈశిబిరంలో రక్తపోటు, బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి నిపుణులు ఆరోగ్య పరిరక్షణపై సూచనలందించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయికుమార్, జి.రామలింగం, హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పులి సత్యనారాయణ, వివిధ కోర్టుల న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టుల సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. -
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
న్యూశాయంపేట: గురుకుల పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెల్లో విద్యార్థులు చిట్టీల రూ పంలో తెలియజేసిన సమస్యలను పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులు బోధన సరిగా చేయడం లేదని, ప్రిన్సిపాళ్లతో ఇబ్బందులు పడుతున్నామని తదితరల సమస్యలపై విద్యార్థులు ఫిర్యాదు పెట్టెల్లో చిట్టీలు వేశారు. ఈమేరకు కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన ఆర్సీఓల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును క్షుణంగా చదివి పరిశీలించాలని, విద్యార్థుల పేర్లను గోప్యంగా ఉంచి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఆర్సీఓలను ఆదేశించారు.సమావేశంలో డీబీసీడీఓ పుష్పలత, డీఎస్డీఓ భాగ్యలక్ష్మి, డీఎండబ్ల్యూఓ టి.రమేశ్, డీఈఓ రంగయ్యనాయుడు, డీడబ్ల్యూఓ రాజమణి, జీసీడీఓ ఫ్లోరెన్స్, టెమ్రిస్ ఆర్ఎల్సీ డాక్టర్ జంగా సతీశ్, ఆర్సీఓలు పాల్గొన్నారు. -
విభిన్న సెట్టింగులు.. చిన్నారుల ఫొటోలు
ఇదివరకు ఎవరైనా ఇంటికొస్తే కాసేపు మాట్లాడాక ఫొటో ఆల్బమ్ ముందు పెట్టేవాళ్లు. ఫొటోలు చూపిస్తూ సరదాగా గడిపేవాళ్లు. ఇప్పుడు టీవీలు ఆన్ చేస్తున్నారు. ఫొటో షూట్లు, వీడియో ఆల్బమ్లు చూపిస్తున్నారు. డిఫరెంట్ లొకేషన్లలో భారీ సెట్టింగుల్లో దిగిన ఫొటోలు, మంచి మంచి లొకేషన్లలో, ఆకట్టుకునే పాటలతో తయారు చేసిన వీడియోలు ప్లే చేస్తున్నారు. చిన్నారుల జ్ఞాపకాలు చిరకాలం పదిలంగా ఉండేలా ఆల్బమ్లు రూపొందిస్తున్న స్టూడియోలపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.. – ఖిలా వరంగల్ఫొటోలు తీసుకునేందుకు ఒకప్పుడు పార్కులు, నది, సముద్రతీరాలు, చారిత్రక కట్టడాల వంటి ప్రదేశాలకు వెళ్లేవాళ్లు. ఇప్పుడు వాటినే మన ముందుకు తీసుకొచ్చారు ఫొటో స్టూడియోల నిర్వాహకులు. డిఫరెంట్ సెట్లతో బేబీ ఫొటో స్టూడియోలు ఎక్కడికక్కడ ఏర్పాటయ్యాయి. బేబీ ఫొటో షూట్ ట్రెండ్ ఏళ్ల కిందటి నుంచే ఉన్నప్పటికీ ఈ మధ్య ఈ విధానంపై గ్రేటర్ వరంగల్ వాసుల ఆసక్తి మరింత పెరిగింది. అంతేకాకుండా ఇటీవల వచ్చిన ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా సృజనాత్మకతంగా చూపించడంతో అందరి దృష్టి ఫొటో షూట్వైపు పడుతోంది. ప్రస్తుతం ఇదొక ఆనవాయితీగా మారిందని ఫొటో స్టూడియోల నిర్వాహకులు చెబుతున్నారు. అభిరుచికి అనుగుణంగా.. పిల్లల తల్లిదండ్రుల అభిరుచి మేరకు ఏదైనా విభిన్న సెట్ కావాలంటే.. అదనపు ఖర్చుతో నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. చారిత్రక కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ మధ్యకోటలో మనసుదోచేలా ఆహ్లాదం కల్పించేలా భారీ సెట్లతో స్టూడియో ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాలోని చిన్న పిల్లల మనసు దోచేస్తున్నారు. ఇటీవల కాలంలో మధ్యతరగతి వర్గాలు సైతం ఈషూట్లపై ఆసక్తి కనబరుస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అందరికీ అందుబాటులో ధరలు బేబీ స్టూడియోలు మధ్యకోట, వరంగల్, మహబూబాబాద్, ములుగు, రామప్ప, భూపాలపల్లి, కాళేశ్వరం, జనగామ జిల్లా, మండల కేంద్రాల్లోనూ ఉన్నాయి. ఇవి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో తెరిచి ఉంటాయి. బర్త్ డే అల్బమ్ కోసం రూ.10 వేల నుంచి రూ. 25వేల వరకు చార్జ్ చేస్తున్నారు. స్టూడియోలో ఏదైనా ఆట వస్తువులు ఉపయోగించుకుంటే రూ.1500 నుంచి రూ.2500 వసూలు చేస్తున్నారు. వారాంతాల్లో అయితే వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఫొటోగ్రాఫర్ను ఔత్సాహికులు తెచ్చుకుంటే.. గంటకు రూ.1,500 చార్జ్, అదే నిర్వాహకుల ఫొటోగ్రాఫర్ అయితే గంటకు రూ.2,500 వరకు తీసుకుంటామని చెబుతున్నారు. వీటి ఏర్పాటుకు దాదాపు రూ.8 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఓ స్టూడియో నిర్వాహకుడు పేర్కొన్నారు. బర్త్డేకు ఫొటో షూట్ చేయించాం.. మా బాబు ఫస్ట్ బర్త్డేను ప్రత్యేకమైన రోజుగా చూస్తున్నాం. తీపి గుర్తు కోసం బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి జన్మదిన వేడుకులు జరుపుకున్నాం. బర్త్డే అంటే స్పెషల్ డేగా గుర్తించి ఆధునిక హంగులతో కూడిన బేబీ స్టూడియోలో ఫొటో షూట్ చేయించాం. తరచూ ఫొటోలు, వీడియోలు చూసి జ్ఞాపకాలు గుర్తు చేస్తూ సంతోషిస్తున్నాం. – అయాన్తో తల్లిదండ్రులు అఖిల, జూహకర్ పిల్లలు మెచ్చేలా.. చిన్నారులు ఇష్టపడే బాహుబలి, పోలీస్ స్టేషన్, విమానం, బేబీ షవర్, జీప్ డ్రైవింగ్, ఉయ్యాల, నది వంతెన, ట్రైన్, బైక్, గార్డెనింగ్, చారిత్రక అందాల సీన్స్ వంటి సెట్లను స్టూడియోల నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. తాజ్మహల్, కొలనులు, స్విమ్మింగ్ పూల్, దేవాలయం, గ్రామీణ నేపథ్యం ఉండే సెట్లు సైతం వీరి వద్ద అందుబాటులో ఉంటున్నాయి. సెట్కు తగిన మేకప్ కిట్లు, దుస్తులు స్టూడియోలోనే అందుబాటులో ఉంచుతున్నారు. కొన్నింటిలో పుట్టిన రోజు వేడుకలు సైతం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఏడాది వయస్సు చిన్నారుల నుంచి ఐదేళ్ల పిల్లల కోసం ప్రత్యేక సెట్లు స్టూడియోల్లో అందుబాటులో ఉన్నాయి. ఆకట్టుకుంటున్న స్టూడియోలు సమయానుగుణంగా ధరలు ఏఐ సాంకేతికతతో మరింత క్రేజ్ -
బైక్ స్టంట్స్.. ప్రో షో అదుర్స్
● రణీనా రెడ్డి జోష్.. విద్యార్థుల కేరింతలు ● ముగిసిన నిట్ స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకలుకాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో నిర్వహిస్తున్న రెండు రోజుల సంస్కృతీసంప్రదాయాల వసంతోత్సవం స్ప్రింగ్స్ప్రీ–26 శనివారం ముగిసింది. వేడుకలకు దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు హాజరై రెండు రోజులపాటు ఉత్సాహంగా గడిపారు. రెండో రోజు స్ప్రింగ్స్ప్రీ–26 వేడుకల ముగింపులో భాగంగా నిట్ మీడియా క్లబ్ ఆధ్వర్యంలో ‘డిటెక్టివ్ కనుక్కో నీ మేధస్సు’ అంటూ పోటీ పడ్డారు, అచ్చం సినిమాలను తలపించేలా క్రైమ్ సీన్ రీక్రియేషన్, బెస్ట్ ఆఫ్ వేస్ట్ పర్యావరణ పరిరక్షణకు, ఐడల్ సింగింగ్ పోటీ, మాక్ పార్లమెంట్ తదితర ఉత్సాహ భరిత పోటీలతో కల్చరల్ఫెస్ట్ ముగిసింది. అలరించిన బైక్ స్టంట్స్.. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్టంట్స్ టీం ప్రదర్శనలు అదరగొట్టాయి. ‘వీ ఆర్ రాయల్ వీ డు బైక్ స్టంట్స్ రాయల్లీ’ అంటూ విద్యార్థుల నడుమ స్టంట్స్తో దూసుకుపోయారు. బైక్ ముందు టైర్ గాల్లోకి లేపి చేసిన స్టంట్స్తోపాటు బ్యాక్ డ్రైవింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బైక్స్టంట్స్ వీక్షిస్తున్న విద్యార్థులు కేకలతో హోరెత్తించారు. రాత్రి ప్రోషోలో సింగర్ రణీనా రెడ్డి తన గీతాలాపనతో విద్యార్థుల్లో జోష్ నింపింది. నిట్లో స్ప్రింగ్ స్ప్రీ వేడుకల్లో భాగంగా విద్యార్థుల బైక్ విన్యాసాలు -
అధికారంలో ఉన్నప్పుడు రైల్వే కోచ్ గుర్తుకురాలేదా?
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్కు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుర్తుకురాలేదా? అని మాజీ మంత్రి హరీశ్రావును వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీశ్రావు శనివారం కాజీపేట పర్యటనపై ఎమ్మెల్యే నాయిని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య మంత్రిగా రూ.20 కోట్లు మంజూరు చేసి 54 ఎకరాల స్థలాన్ని కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేటాయించారన్నారు. వరంగల్ ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని, పర్యటనల పేరుతో పదేళ్లు పబ్బం గడిపింది మీరు కాదా? అని ప్రశ్నించారు. 15 ఏళ్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మాజీలంతా కాజీపేటకు చేసిందేంటో చెప్పాలన్నారు. కాజీపేట రైల్వే ఉద్యోగులకు స్థానికత క్రమంలో ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. మాజీ మంత్రి హరీశ్రావు కాజీపేట పర్యటన.. స్వామి కార్యం, స్వకార్యంగా ఉందని హేళన చేశారు. సీఎం రేవంత్ను కలిసిన నాయిని సీఎం రేవంత్రెడ్డిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిశారు. వరంగల్ వైద్య రంగ అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై చర్చించారు. ఇటీవల కేఎంసీ, ఎంజీఎం ఆస్పత్రుల అభివృద్ధి కోసం ఆర్థిక సాయం ప్రకటించిన ఎన్ఆర్ఐ డాక్టర్ సుజిత్రెడ్డిని సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. సొంతగడ్డపై మమకారంతో వైద్య రంగానికి చేయూతను అందించడం అభినందనీయమన్నారు. ఈసందర్భంగా సుజిత్రెడ్డి సీఎం రేవంత్రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి, విష్ణురెడ్డి ఉన్నారు. -
పాట ఓ చైతన్య కెరటం
భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలి● సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ ● తెలుగు సినిమా గేయ రచనపై సదస్సు ● ‘గేయ పరిమళాలు’ పుస్తకావిష్కరణ హన్మకొండ కల్చరల్: నిబద్ధత క్రమశిక్షణ సంస్కారవంతమైన భాషతో చేసే రచనే గేయమని, సాహిత్య ప్రక్రియల్లో పాట చాలా గొప్పదని సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ అన్నారు. శనివారం వరంగల్ హంటర్రోడ్డులోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో తెలుగు సినిమా గేయ రచన సదస్సు, పీఠం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నోముల రాజు సంపాదకత్వంలో ప్రచురించిన సినీ గేయ వ్యాస సంకలనం ‘గేయ పరిమళాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా మౌనశ్రీ మల్లిక్, విశిష్ట అతిథులుగా కేయూ విశ్రాంత ఆచార్యులు పంతంగి వెంకటేశ్వర్లు, జానపద గాయకులు పత్తిపాక సురేందర్, కవి, రచయిత, విశ్రాంత ఉపాధ్యాయులు గోవిందం లక్ష్మీనర్సయ్య గేయ రచనలపై ప్రసంగించారు. అనంతరం అతిథులు ‘గేయ పరిమళాలు’ పుస్తకాన్ని ఆవిష్కరించి సంపాదకుడు నోముల రాజును అభినందించారు. పీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పీఠం సిబ్బంది ఆమేర్ అలీఖాన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు దామోదర్, సురేశ్, రవికుమార్, గోపాల్రెడ్డి, సతీశ్, సునీత, విద్యార్థులు పాల్గొన్నారు. కాళోజీ సెంటర్: విద్యార్థులు చక్కగా చదువుకొని భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలని వరంగల్ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నరసింహమూర్తి సూచించారు. వరంగల్ మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇన్చార్జ్ హెచ్ఎం శ్రీనివాసరావు అధ్యక్షతన టెన్త్ విద్యార్థులకు శనివారం స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయుడు భిక్షపతి, విద్యార్థులు పాల్గొన్నారు. -
కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టత ఇవ్వాలి
కాజీపేట రూరల్: రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలివ్వడంలో, కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రం చేయడంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్రావు అన్నారు. కాజీపేట చౌరస్తాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం ‘కోలువుల కోసం కోట్లాట’ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. హరీశ్రావు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పోరాటం, పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు 50 ఏళ్ల కృషి ఫలితంగానే కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీ వచ్చిందన్నారు. ‘కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధమవుతోందని, కానీ, కోచ్ఫ్యాక్టరీలో అసలు కోచ్లు తయారవుతాయా? వ్యాగన్లు తయారవుతాయా? అసలు ఎంత మందికి ఉద్యోగాలిస్తారు? భూమి ఇచ్చిన అయోధ్యపురం గ్రామస్తులకు ఎన్ని ఉద్యోగాలు, స్థానికులకు ఎన్ని ఇస్తున్నారో తేల్చి కేంద్రం గెజిట్ ఇవ్వాలి’ అని అన్నారు. స్థానికులకు 70 శాతం ఉద్యోగాలివ్వాలి.. కేంద్రం లాతూర్, అస్సాం కోచ్ ఫ్యాక్టరీలో మాదిరి ఇక్కడ కూడా స్థానికులకు 70 శాతం ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. స్థానికులకు ఉద్యోగాలివ్వకపోతే ప్రారంభోత్సవానికి వచ్చే బీజేపీ మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు, కాజీపేట డివిజన్ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ ఒప్పించాలన్నారు. ఏపీలో విశాఖ రైల్వే జోన్ చేసినట్లు, కాజీపేట డివిజన్గా చేయాలని అందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, ఎంపీలు ప్రధాని మోదీతో మాట్లాడాలన్నారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ మట్లాడుతూ.. రైల్వే కోచ్ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు, కాజీపేట డివిజన్ కోసం కాజీపేట నుంచి ఢిల్లీ వరకు దశల వారీగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ధర్నాలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు టి.రాజయ్య, అరూరి రమేశ్, శంకర్నాయక్, పెద్ది సుదర్శన్రెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, కె.యాదవరెడ్డి నాయకులు పాల్గొన్నారు. కాజీపేటను రైల్వే డివిజన్ చేసేవరకు పోరాడుతాం స్థానికులకు ఉద్యోగాలివ్వకపోతే ఉద్యమం ఉధృతం.. ‘కొలువుల కోసం కొట్లాట’లో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్రావు -
మూడేళ్లుగా మంచానికే పరిమితం
హన్మకొండ చౌరస్తా: రెక్కల కష్టమే పెట్టుబడిగా పెట్టి కుటుంబాన్ని కంటికి రెప్పలా సాకుతున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయప డ్డాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అత డి భవిష్యత్ అంధకారంగా మారింది. కొడుకుకు జరిగిన ప్రమాదం చూసి తట్టుకోలేక తల్లి ప్రేమలీల మనోవేదనతో అనారోగ్యానికి గురై ఏడాదికే చని పోయింది. యువకుడి తండ్రి బాబు మేసీ్త్ర పని చేసి కొడుకు, కోడలు, మనువళ్లను కొంతకాలం సాకా డు. ఇప్పుడు అతడు కూడా వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో ఏమి చేయలేని దుస్థితిలో కన్నీళ్లును దిగమింగుతూ జీవితం గడుపుతున్నాడు. వివరాల్లో కి వెళ్తే.. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎల్కుర్తి హవేలీకి చెందిన మైదం ప్రవీణ్ పేదరికంతో చదువు మధ్యలో (డిగ్రీ)నే ఆపేశాడు. ప్రవీణ్కు భా ర్య మౌనిక, పిల్లలు రేచల్శ్రేష్ట, సాహస్ప్రిన్స్, ప్రశస్థ ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ నిమి త్తం ప్రతీ రోజు వరంగల్కు వచ్చి హమాలీ పనిచేసి తిరిగి ఇంటికెళ్లేవాడు. 2022లో పని ముగించుకుని వరంగల్ నుంచి స్వగ్రామం వెళ్తున్నాడు. మొగి లి చర్ల క్రాస్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని వెళ్లింది. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ను అక్కడే ఉ న్న వారి సాయంతో అంబులెన్స్లో ఎంజీఎం తరలించారు. ఇక్కడ ఏడాది పాటు చికిత్స పొందిన ప్ర వీణ్ను మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. అక్కడ పది రో జులు అబ్జర్వేషన్లో ఉంచిన వై ద్యులు హైదరాబా ద్ నిమ్స్ తీసుకెళ్లాని సూచించారు. పరీక్షలు చేసిన నిమ్స్ వైద్యులు స్పైనల్కార్డ్ సర్జరీ చే యాలన్నారు. అయితే అప్పటికే ప్రవీణ్ చాతీలో రక్తం గడ్డకట్టిందని, కొంత సమయం పడుతుందని చెప్పారు. ఆర్థికభారం భరించలేక ఇంటికి చేరుకున్నారు. సర్జరీకి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు .. సర్జరీకి రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపినట్లు ప్రవీణ్ కన్నీరుమున్నీరవుతూ తెలిపాడు. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ప్రవీణ్కు ఆర్థిక స్థోమత లేకపోవడంతో సర్జరీ నిలిచిపోయింది. పిల్లలతోపాటు భర్తకూ నిరంతరం సేవలు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ మూడేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. భార్య మౌనిక తన ముగ్గురు చిన్న పిల్లలతో సహా ప్రవీణ్ ను సైతం పాపలా చూసుకుంటుంది. జీఎన్ఎం నర్సింగ్ చేసిన మౌనిక ప్రైవేట్ ఉద్యోగం చేద్దామంటే పిల్లలు, భర్తను చూసుకునేవారు లేక ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి అంటూ బాధితుడు కన్నీటి పర్యంతమవుతున్నాడు. కనికరించని కార్మికశాఖ .. ప్రవీణ్ కార్మికశాఖ గుర్తింపు కార్డు కలిగి ఉన్నాడు. ఆ శాఖ నిబంధన ప్రకారం గుర్తింపు కార్డు కలిగిన వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం పొందితే రూ. 3 లక్షల నుంచి రూ.4 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. ప్రవీణ్ అంగవైకల్యం పొంది నట్లు ఎంజీఎం వైద్యులు ధ్రువీకరించిన తాత్కాలిక సర్టిఫికెట్ కార్మికశాఖలో అప్పగించారు. అయినా అధికారులు నిబందనల పేరుతో ఏడాదిగా తిప్పించుకుంటున్నారని ప్రవీణ్ భార్య మౌనిక కన్నీటి ప ర్యంతమవుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు , ప్రజాప్రతినిధులు స్పందించి కార్మికశాఖ ద్వారా నష్టపరిహారం ఇప్పించాలని వేడుకుంటుంది. యువకుడి భవిష్యత్ అంధకారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు ఏడాదిగా కార్మికశాఖ చుట్టూ ప్రదక్షిణ నిబంధనల పేర దరఖాస్తు తిరస్కరణ ఆదుకోవాలని కుటుంబం వేడుకోలుదాతలు ఆదుకోండి.. ‘మూడు సంవత్సరాలుగా తీవ్ర అవస్థలు పడుతున్నాం, దయచేసి తమను ఆదుకోవాలి’ అని ప్రవీణ్, అతడి భార్య మౌనిక చేతులెత్తి వేడుకుంటున్నారు. ఆర్థిక సాయం చేయాలనుకునే దాతలు గూగుల్పే, ఫోన్పే నంబర్ 90006 85709 తోపాటు ప్రవీణ్ బ్యాంకు అకౌంట్ నంబర్ 520191056074030 యూనియన్ బ్యాంకు, ఊకల్ హవేలీ బ్రాంచ్, IFSC CODE NO : UBIN 0903027 నంబర్కు పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
కొమ్మాల జాతరను ప్రశాంతంగా నిర్వహించాలి
● భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి ● సమీక్షలో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ గీసుకొండ: కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలని, జాతర విజయవంతానికి రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని ఈస్ట్జోన్ డీసీసీ అంకిత్కుమార్ అన్నారు. హనుమకొండ పోలీస్ హెడ్క్వార్టర్లోని తన కార్యాలయంలో వరంగల్ జిల్లా గీసుకొండ, దుగ్గొండి, నర్సంపేట మండలాలకు చెందిన ప్రధాన పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులతో శనివారం జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్–నర్సంపేట రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలని, ప్రభబండ్లతో వచ్చే వారు సంయమనం పాటించి గొడవలు జరగకుండా చూసుకోవాలన్నారు. గొడవలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గొడవలకు పాల్పడవద్దని నోటీసులు జారీ చేయగా.. తాము జాతర ప్రశాంతంగా జురగడానికి సహకరిస్తామని ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు డీసీపీకి మాట ఇచ్చారు. మామునూరు, నర్సంపేట ఏసీపీలు వెంకటేశ్, రవీందర్రెడ్డి, గీసుకొండ, దుగ్గొండి, నర్సంపేట ఇన్స్పెక్టర్లు విశ్వేశ్వర్, సాయిరమణ, శ్రీనివాస్, గీసుకొండ తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, రాజకీయ నాయకులు అల్లం బాలకిశోర్రెడ్డి వీరగోని రాజ్కుమార్, తుమ్మనపల్లి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ పోలీసు ధర్మారావు, సర్పంచ్ బోడకుంట్ల ప్రకాశ్, కన్నెబోయిన ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి నుంచి యువతను కాపాడుకుందాం
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం : గంజాయి మత్తు నుంచి యువతను కాపాడుకుందామని వరంగ ల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. ఈ మేరకు శనివారం కాకతీయ మెడికల్ కళా శాలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి వినియోగదారుడిని పట్టుకోవడంతో బాధ్యత అయిపోతుందని అనుకోవద్దని, గంజాయిని విక్రయించే వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని పేర్కొన్నారు. అలాగే, పేకాటరాయుళ్లపై కఠినంగా వ్యవహరించాలన్నారు. చోరీలకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్లను తెరవాలని, అధికంగా చోరీలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అదే విధంగా ఎంజీఎం, రైల్వే స్టేషన్ల ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలన్నారు. ఇసుక, రేషన్ అక్రమ రవాణాపై స్టేషన్ అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించా రు. డీసీపీలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, కవిత, శుభంనాగ్తోపాటు అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. మాల సంఘాల జేఏసీ కన్వీనర్గా లక్ష్మీనారాయణకాళోజీ సెంటర్: మాల సంఘాల జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్గా పొనగంటి లక్ష్మీనారాయణను నియమిస్తూ రాష్ట్ర చైర్మన్ మందాల భాస్కర్, గౌరవ అధ్యక్షుడు చెరుకు రామచందర్, విద్యార్థి జేఏసీ చైర్మన్ మాదాసి రాహుల్రావు ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్లో శనివారం నిర్వహించిన మాల సంఘాల సమావేశంలో అడ్హక్ కమిటీని ఎన్నుకున్నారు. కోకన్వీనర్లుగా శేషాద్రి నాగులు, దండ్రి శ్రీనివాస్, పోతుల కొమ్మాలు, వంగేటి రాజమౌళి, గురిమిల్ల రాజు, బుజుగుండ్ల శ్రీనివాస్, వంగేటి ప్రభాకర్ నియమితులయ్యారు. -
భవిష్యత్ తరాల కోసమే..
మేడారంలో రాతి కట్టడాలుములుగు/తాడ్వాయి: ఆదివాసీల ఆరాధ్యదైవాలు సమక్క, సారలమ్మ వైభవాన్ని భవిష్యత్ తరాలకు తెలపడానికి మేడారంలో 200 ఏళ్లు నిలిచేలా రాతి కట్టడాలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క, ఎంపీ బలరాం నాయక్ కలిసి వన దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దెల చుట్టూ నిర్మించిన రాతి కట్టడాలు, ఆలయ ప్రహరీ, ప్రధాన ఆర్చ్లు, సాండ్ స్టోన్ శిల్పాలు, డ్రెయినేజీ వ్యవస్థ, మీడియా టవర్, గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన గ్రిల్స్, ఆలయ ఫ్లోరింగ్ తదితర పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మేడారం హరిత హోటల్లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో జాతర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇటీవల మేడారం మహాజాతరను అద్భుతంగా నిర్వహించామని, జాతర విజయవంతానికి కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. సుమారు కోటి 50 లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారని తెలిపారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, లక్ష్మణ్ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతంగా నిర్వహించామన్నారు. జంపన్న వాగులో సంవత్సరమంతా నీరు ఉండేలా గోదావరి జలాలను తీసుకురావా లని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకోసం ఐదు చెక్ డ్యామ్లు నిర్మించి నీటి నిల్వను పెంచే ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ గతంలో మేడారం జా తర పూర్తయిన తర్వాత సమీక్షలు జరగలేదన్నారు. కానీ ఈసారి జాతర అనంతరం కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి మిగతా పనులు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించిందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం వాహనంలో జంపన్న వాగు, ఊరట్టం, చిలకలగుట్ట, ఆర్టీసీ జంక్షన్ పరిసరాలను పరిశీలించారు. గోదావరి పరీవాహక ప్రాంతమైన బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న దేవాలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్ మహేందర్జీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ములుగు మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఈఓ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి , పక్కన మంత్రి సీతక్కఅమ్మవార్లను దర్శించుకుంటున్న మంత్రులు పొంగులేటి, సీతక్క జంపన్న వాగులో నిరంతరం గోదావరి నీరు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలన -
అమ్మవారి సేవలో కలెక్టర్ చాహత్
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం ఉదయం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ దర్శించుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ను ఆలయ ఈఓ రామల సునీత, ప్రధానార్చకులు భద్రకాళి శేషు, ధర్మకర్త బింగి సతీశ్ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతించారు. ఆమె ముందుగా గోశాలలో గోవులకు గ్రాసం తినిపించి అనంతరం ఆదిశంకరులను, వల్లభ గణపతిని దర్శించుకుని ఆలయ ప్రదక్షిణ చేశారు. ఆలయంలోని అమ్మవారి ని దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆల య అర్చకులు కలెక్టర్కు తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రమేశ్ రాథోడ్, తహసీల్దార్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమా హీరోయిన్ నభా నటేష్ అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త తొనుపునూరి వీరన్న తదితరులు పాల్గొన్నారు. కాళోజీ సెంటర్: మట్టి పాత్రలు వాడి పర్యావరణహిత జీవనశైలిని ప్రతిఒక్కరూ అలవర్చుకోవాల ని వరంగల్ డీఈఓ రంగయ్య నాయుడు సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మట్టిపాత్రల తయారీపై కార్యశాల (పాట్ మే కింగ్ వర్క్షాప్) నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలమైన మట్టిపాత్రల వాడకాన్ని ప్రోత్సహించాలని కోరారు. ప్రాచీన కాలంలో మట్టితో తయారు చేసిన వస్తువులనే ఉపయోగించేవారని గుర్తుచేశారు. ముందుగా విద్యార్థులు మట్టి పాత్రల తయారీవిధానాన్ని చేసి చూపించారు. జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్, ఏఎంఓ ఉండ్రాతి సుజన్ తేజ, పాఠశాల హెచ్ఎం అరుణ, ఉపాధ్యాయులు ప్రభాకర్, కిరణ్, సుభాషిణి, తదితరులు పాల్గొన్నారు. -
కంటిచూపు బాగుంటే ప్రమాదాల నియంత్రణ
రామన్నపేట : డ్రైవర్ల కంటి చూపు బాగుంటే రోడ్డు ప్రమాదాలను తగ్గించగలమని వరంగల్ పోలీసు కమీషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ రెండో విడతలో భాగంగా వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ములుగు రోడ్డులోని వెంకటేశ్వర కల్యాణ మండపంలో ఆటో డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక రీజినల్ ఐ ఆస్పత్రి, శరత్ ఐ ఆస్పత్రి, కీర్తి ఆస్పత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి పోలీసు కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరానికి సుమారు 400 మంది ఆటో డ్రైవర్లు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈసందర్భంఆ 300 మంది డ్రైవర్లకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ప్రతీ వాహనాదారుడు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలనే లక్ష్యంగా సీఎం అరైవ్ అలైవ్ ప్రారంభినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకమని అన్నారు. ప్రజలను తరలించే ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు కంటి చూపుపై మరింత శ్రద్ధ వహించాలని తెలిపారు. ముఖ్యంగా కంటి చూపుతో బాధపడే వారు వాహనం నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారం అధికమని తెలిపారు. కంటి చూపు బాగుంటే ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి సూచనలను గుర్తించడం ద్వారా సురక్షితమైన డ్రైవింగ్ చేయగలమని పోలీసు కమిషనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్రావు ఏసీపీలు సత్యనారాయణ, నర్సింహారావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సుజాత, సీతారెడ్డి, వెంకన్న, మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు 300 మందికి కంటి అద్దాల పంపిణీ -
పురోగతి సాధనే వికసిత్ భారత్ లక్ష్యం
కేయూ క్యాంపస్: దేశంలో పేదరిక నిర్మూలన, ఆరోగ్యసేవల విస్తరణ, మహిళా సాధికారత, డిజిటల్ చేర్పువంటి కీలకరంగాల్లో పురోగతి సాధించటమే వికసిత్ భారత్ –2047 లక్ష్యంగా ఉండాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం అన్నారు. కేయూలో సోషల్ సైన్సెస్ విభాగాల ఆధ్వర్యంలో రెండురోజులుగా సెనెట్ హాల్లో నిర్వహిస్తున్న జాతీయ సదస్సు ముగింపు సభలో శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. డేటా ఆధారిత విధానాలు, రియల్టైమ్ మానిటరింగ్ వ్యవస్థలు, గ్రీన్ ఎకనామీ, పునరుత్పాదక శక్తి వాతావరణ చర్యలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య మనోహర్ మాట్లాడుతూ.. వికసిత్ భారత్ సాధన కేవలం ఆర్ధిక వృద్ధి మాత్రమే కాకుండా సమానత్వం, పర్యావరణ సమతుల్యత, సామాజిక న్యాయం, సాంకేతిక ప్రగతి సమన్వయంతో కూడిన సమగ్రాభివృద్ధి ఉండాలన్నారు. ఈ సభలో కేయూ యూజీసీ కోఆర్డినేటర్ ఆచార్య మల్లికార్జున్రెడ్డి, సోషల్ సైన్స్ డీన్ ఆచార్య సురేష్లాల్, వివిధ విభాగాల అధిపతులు సంగాని మల్లేశ్వర్, రాధికారాణి, చిలువేరు రాజ్కుమార్, మామిడి లింగయ్య, సంకినేని వెంకట్, శ్రీనివాసులు, మేఘనరావు తదితరులు పాల్గొన్నారు.11 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్ ● రూ.59,340 నగదు.. 11 సెల్ఫోన్లు స్వాధీనం వరంగల్ క్రైం: హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుగా పేకాట ఆడుతున్న శిబిరంపై దాడులు నిర్వహించి 11మందిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదవనగర్లో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.59,340 నగదు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేకాట ఆడుతూ పట్టుబడినవారిలో మల్లారెడ్డిపల్లికి చెందిన అల్ల వెంకటేష్, పద్మాక్షిగుట్ట ప్రాంతానికి చెందిన బొంత రామకృష్ణ, రెడ్డిపాలేనికి చెందిన గట్ల రామాలింగారెడ్డి, హనుమన్నగర్కు చెందిన బానోతు రాజు, మధ్యకోటకు చెందిన మేకల రాజు, రంగశాయిపేటకు చెందిన వేములపల్లి అశోక్, రాంనగర్కు చెందిన బానోతు వర్మ, వంగపాడుకు చెందిన ముసుకు రాజశేఖర్, కొత్తవాడకు చెందిన వంగ విజేందర్, గుడిబండల్కు చెందిన ముసుకు ప్రవీణ్, వంగపహాడ్కు చెందిన సాధు ధనుంజయ్ ఉన్నట్లు తెలిపారు. తదుపరి చర్యల కోసం హనుమకొండ పోలీసులకు నిందితులను అప్పగించినట్లు తెలిపారు. టాస్క్ఫోర్స్ దాడిలో ఇన్స్సెక్టర్ రాజు, ఆర్ఎస్సై భానుప్రకాశ్ పాల్గొన్నట్లు తెలిపారు. సౌందరరాజన్ మృతికి సంతాపంహన్మకొండ కల్చరల్: చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధానార్చకుడు, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ సౌందరరాజన్ శుక్రవారం వయోభారం, అనారోగ్యంతో మృతిచెందడంతో ఆయన మృతికి తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య పక్షాన గంగు ఉపేంద్రశర్మ, భాస్కరభట్ల రామశర్మ, తనుగుల రత్నకర్, వివిధ దేవాలయాల అర్చకులు సంతాపం తెలిపారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆధ్వర్యంలో సౌందర్యరాజన్ వరంగల్లో తెలంగాణ అర్చక సమాఖ్య ఏర్పాటు చేశారని, ధూపదీపనైవేద్య పథకం ఏర్పాటుకు నాంది పలికిన వ్యక్తి అని కొనియాడారు. ● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ● ముగిసిన జాతీయ సదస్సు -
మోడల్ రాకెట్ ట్రయల్ రన్ విజయవంతం
నయీంనగర్: భద్రకాళి బండ్ వద్ద మోడల్ రాకెట్ ట్రయల్ రన్ను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మోడల్ రాకెట్ లాంచింగ్ ట్రయల్ రన్ కోసం ఏర్పాట్లు చేయగా, భద్రకాళి చెరువులోని ఐలాండ్ వద్ద నమూనా రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. మోడల్ రాకెట్ రూపకర్త శశాంక్ భూపతి ట్రయల్ రన్ను విజయవంతంగా ప్రయోగించారు. ఈసందర్భంగా వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్ అంజన్ కుమార్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్ సెక్రటరీ, డైరెక్టర్ ఎన్.రఘునందన్కుమార్, ‘కుడా’ సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్రావు, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, హనుమకొండ ఏసీపీ నరసింహారావు సమక్షంలో రాకెట్ లాంచింగ్ ట్రయల్ రన్ చేపట్టారు. జాతీయ సైన్స్ దినోత్సవం (ఫిబ్రవరి 28) సందర్భంగా శనివారం సాయంత్రం భద్రకాళి బండ్ నుంచి రుద్రమ–1 మోడల్ రాకెట్ ప్రయోగించనున్నారు. ఈ ప్రమోగంతో చారిత్రక వరంగల్ నగరం సరికొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. శనివారం హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4:00 గంటల వరకు కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించే సెమినార్లో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన వివిధ అంశాలపై వక్తలు ప్రసంగిస్తారు. సెమినార్కు పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఉందని అధికారులు తెలిపారు.


