కాజీపేట అర్బన్: కాజీపే ట మండలం న్యూశాయంపేటకు చెందిన గుండు సరస్వతి శివకుమార్ కుమారుడు గుండు అఖిలేశ్ సివిల్స్లో 462వ ర్యాంకు సాధించారు. శివకుమార్ భూపాలపల్లిలో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. టెన్త్ వరకు వరకు హనుమకొండలోని వరంగల్ పబ్లిక్ స్కూల్లో, ఇంటర్ ఓ ప్రైవేట్ కళాశాలలో, ఐఐటీ ఖరగ్పూర్లో ఐదేళ్ల బీటెక్, ఎంటెక్ పూర్తిచేశారు. 2021లో ఐఈఎస్ ఇంజనీరింగ్ సర్వీస్లో ఇండియాలో 6వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఢిల్లీలో సీపీడబ్ల్యూ విభాగంలో సివిల్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అఖిలేశ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సమాజ సేవే లక్ష్యంగా సివిల్స్కు ప్రిపేరై.. 462వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఐపీఎస్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.


