breaking news
Personal Finance
-
కియోసాకికి కోపమొచ్చింది.. ‘పందులకు ఎంత చెప్పినా వేస్టే’
ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిగత ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి డబ్బు, ఆర్థిక విద్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ (X)వేదికగా చేసిన తాజా పోస్టులో, "నేర్చుకోవాలనే ఆసక్తి లేని వారికి బోధించడానికి ప్రయత్నించడం సమయ వృథా" అని పేర్కొన్నారు."పందికి పాటలు నేర్పొద్దు. అది మీ సమయాన్ని వృథా చేయడమే కాకుండా, పందిని కూడా చిరాకు పెడుతుంది" అనే సామెతను ఉదహరిస్తూ, జీవితంలో తాను నేర్చుకున్న అత్యంత కఠినమైన పాఠాల్లో ఇదొకటని కియోసాకి చెప్పారు. తాను ఎక్కువ మందికి డబ్బు గురించి అవగాహన కల్పించి, వారిని ఆర్థికంగా బలంగా, స్వేచ్ఛగా చూడాలనుకున్నప్పటికీ, చాలామంది తన సలహాలను అంగీకరించరని వెల్లడించారు.డబ్బు అనేది వ్యక్తిగతం, భావోద్వేగాలతో కూడుకున్నది, కుటుంబ విలువలు, సంస్కృతితో ముడిపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో పెరిగిన వారిలో డబ్బుపై స్థిరమైన అభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి సందర్భాల్లో తన సలహాలు వారికి ఇబ్బందిగా అనిపిస్తాయని వ్యాఖ్యానించారు."నేర్చుకోవాలనే ఆసక్తి లేని వారికి బోధించకూడదనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. అయితే నా పోస్టులను చదువుతూ, డబ్బు గురించి మరింత తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని కియోసాకి తెలిపారు.అలాగే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందు మరింత అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయని ఆయన హెచ్చరించారు. చైనా ఎదుగుదల, అమెరికా ఆర్థిక పరిస్థితి, కృత్రిమ మేధ (AI) కారణంగా భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు వంటి పరిణామాలు రాబోయే రోజుల్లో ఆర్థిక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకే ఆర్థిక విజ్ఞానం పెంపొందించుకోవడం ఇప్పటి పరిస్థితుల్లో మరింత అవసరమని ఆయన తన పోస్టులో సూచించారు.“Don’t teach pigs to sing. It wastes your time…. and annoys the pig.”I would guess most of us, you, me, we…want to help our fellow human beings….if we could.Yet sometimes our help is rejected because “it annoys the pig.”This lesson has been one of the hardest lessons…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 19, 2026 -
మీ పిల్లలను విదేశాలకు పంపుతున్నారా?
నేటి ఆధునిక ప్రపంచంలో తమ పిల్లలకు విదేశాలలో అత్యున్నత విద్యను అందించాలని తల్లిదండ్రులు కలలు కంటున్నారు. అయితే, సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం, తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. విదేశీ విద్య కోసం భారీగా ఖర్చు చేసే క్రమంలో తల్లిదండ్రులు సాధారణంగా చేసే ఐదు ప్రధాన ఆర్థిక తప్పిదాలను, వాటిని ఎలా అధిగమించాలో విశ్లేషించే ప్రత్యేక కథనం ఇది.ట్యూషన్ ఫీజును మాత్రమే పరిగణనలోకి తీసుకోవడంచాలా మంది తల్లిదండ్రులు కేవలం యూనివర్సిటీ ట్యూషన్ ఫీజును మాత్రమే ప్రధాన వ్యయంగా భావిస్తారు. కానీ నివాస వసతి, హెల్త్ ఇన్సూరెన్స్, వీసా ఛార్జీలు, ప్రయాణ ఖర్చులు, రోజువారీ జీవన వ్యయాలను అంచనా వేయడంలో విఫలమవుతుంటారు. విదేశీ మారకద్రవ్య రేట్ల హెచ్చుతగ్గుల వల్ల కూడా ఖర్చులు పెరుగుతాయి. అందుకే మొత్తం బడ్జెట్పై కనీసం 10 నుంచి 15 శాతం బఫర్ అమౌంట్ను ముందే సిద్ధం చేసుకోవడం సురక్షితం.రిటైర్మెంట్ ఫండ్స్ దారి మళ్లించడంపిల్లల విదేశీ చదువుల కోసం దశాబ్దాలుగా కూడబెట్టిన తమ రిటైర్మెంట్ నిధిని లేదా పీఎఫ్ సొమ్మును పూర్తిగా ఖర్చు చేయడం అతిపెద్ద తప్పు. ఇది మీ వృద్ధాప్య భద్రతను ప్రమాదంలో పడేస్తుంది. దీనికి బదులుగా విద్యా రుణాలు తీసుకోవడం ఉత్తమమైన మార్గం. చదువు పూర్తయ్యాక పిల్లలే ఆ లోన్ చెల్లించేలా బాధ్యత అప్పగించవచ్చు.వడ్డీ రేట్లను మాత్రమే చూసి లోన్ ఎంచుకోవడంఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటప్పుడు కేవలం ప్రకటిత వడ్డీ రేటు (Headline Interest Rate) మాత్రమే చూసి మోసపోకూడదు. లోన్ ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీ-పేమెంట్ పెనాల్టీలు, మొరటోరియం కాల పరిమితి వంటి నిబంధనలను పరిశీలించాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులు సాధారణంగా స్థిరమైన తక్కువ ఫీజులు వసూలు చేస్తే ప్రైవేట్ లెండర్లు 0.8-1% వరకు ప్రాసెసింగ్ ఫీజులు వేస్తుంటారు.ఎల్ఆర్ఎస్, టీసీఎస్ నిబంధనలపై అవగాహన లోపంభారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం.. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 2.5 లక్షల యూఎస్ డాలర్ల వరకు విదేశాలకు పంపవచ్చు. అయితే సొంత నిధుల నుంచి రూ.7 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని పంపితే 5 శాతం టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) వర్తిస్తుంది. అదే ఎడ్యుకేషన్ లోన్ ద్వారా పంపితే ఈ పన్ను రేటు 0.5 శాతానికి తగ్గుతుంది. ఈ పన్ను వెసులుబాటును గమనించకపోతే భారీగా నష్టపోవాల్సి వస్తుంది.కెరీర్ అవకాశాలను నిర్లక్ష్యం చేయడంకోర్సు ఎంపికలో మార్కెట్ డిమాండ్, సదరు యూనివర్సిటీకి గల అంతర్జాతీయ గుర్తింపును పరిశీలించాలి. చదువు పూర్తయిన వెంటనే అక్కడ ఉద్యోగ అవకాశాలు లేకపోతే తీసుకున్న భారీ అప్పును తీర్చడం పిల్లలకు, తల్లిదండ్రులకు పెను భారంగా మారుతుంది.ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా? -
చనిపోయిన వారి రిటర్నులు ఎలా వేయాలంటే..
కుటుంబ సభ్యుల్లో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, దగ్గరవాళ్లు చనిపోతే వారి తరఫున వారసులు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలి. దాఖలు చేయాల్సిన బాధ్యత కేవలం వారసులపైనే ఉంటుంది. చాలా మంది ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతుంటారు. రిటర్ను వేయాలా, మానేయాలా? పన్ను చెల్లించాలా .. రిఫండు కోసం ఏం చేయాలి .. పాన్ని సరెండర్ చేయాలా .. ఆదాయపు పన్ను శాఖ వారికి ఎలా తెలియజేయాలి .. రిటర్ను వేస్తే ఎలా వేయాలి.. మొదలైన విషయాలు ఈ వారం తెలుసుకుందాం. మీరు ప్రత్యేకంగా డిపార్టుమెంటు వారికి తెలియజేయాల్సిన అవసరం లేదు. అలాగే ’పాన్’ సరెండర్ చేయనవసరం లేదు. కానీ, ఆ పాన్ని వాడకండి. దుర్వినియోగం చేయకండి. అధికార ప్రత్యుత్తరాలలో తప్ప ఎక్కడా ఆ నంబరును ’కోట్’ చేయకండి. అన్ని డాక్యుమెంట్లు.. అంటే.. డెత్ సర్టిఫికెట్లు, పోయినవారి పాన్ కార్డు, పాత సంవత్సరాల రిటర్నులు, బ్యాంకు పాస్బుక్లు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, వారి ఫారం 26ఏఎస్, ఏఐఎస్, టీఐఎస్ మొదలైన కాగితాలను భద్రపరచండి. వారసులు ఒకరే ఉంటే సరే సరి. ఇద్దరు, లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉంటే అందరూ కలిసి ఒకరినే ఎంచుకోండి. మనస్పర్థలు, గొడవలు అనవసరం. కేవలం ఒకరే ముందుకు రండి. అలా ముందుకు వచ్చిన వారు, లేదా అందరూ కలిసి ఎంచుకున్న వారు..అన్ని కాగితాలతో రెడీగా ఉండండి. కాగితాల ప్రకారం వారసత్వం సరి్టఫికెట్లో మీ పేరు స్పష్టంగా ఉండాలి. తప్పులు ఉండకూడదు. (ఈ సరి్టఫికెట్ ఎలా తెచ్చుకోవాలో ఈ కాలమ్లో ప్రస్తావించడం లేదు). మీ ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, మీకున్న సంబంధం – చుట్టరికం, వీటన్నింటితో పాటు మరణించిన వారి డెత్ సరి్టఫికెట్, అన్నీ పెట్టి, వారసత్వపు సరి్టఫికెట్తో పాటు, ఐటీ పోర్టల్లో లాగిన్ అయి మిమ్మల్ని మీరు ’రిప్రజెంటేటివ్ అసెసీ’గా నమోదు చేసుకోండి. నమోదు ప్రక్రియలో భాగంగా అన్ని కాగితాలు సబ్మిట్ చేశాక, డిపార్టుమెంటు వారి నుంచి ముందస్తు అనుమతి అవసరం. వాళ్లు చాలా త్వరగా మిమ్మల్ని ’గుర్తిస్తారు’. అలా గుర్తింపు పొందాకా..ఇక మిగతాదంతా షరా మామూలే. పాత పాటే. ఆ సంవత్సరం మొదటి నుంచి, ఏ తేదీనాడు ఆ బంధువు పోయారో, ఆ తేదీ వరకు ఆ వ్యక్తికి సంబంధించిన ఆదాయమే రిటర్నుల్లో వేయాలి. ఏ రకమైన ఆదాయమైనా, ఆ తేదీ వరకే లెక్కించాలి. ఒకవేళ అప్పటికే టీడీఎస్ ఉంటే, ఆ ఆదాయం మీద పన్నుభారం లెక్కించి పన్ను భారం చెల్లించాలి. టీడీఎస్ మిగిలితే రిఫండు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ తేదీ తరువాతవి, వారసుల అకౌంటులోకి వస్తాయి. వాటితో పాటు మీ సొంత ఆదాయం కలిపి మీరు రిటర్ను దాఖలు చేయాలి. ఎలాగూ చనిపోయిన వారి అకౌంట్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి, వారసుల బ్యాంకు అకౌంటు వివరాలు పొందుపరచవచ్చు. వారసులు అన్ని జాగ్రత్తలు తీసుకుని రిటర్ను దాఖలు చేయండి. కరెక్ట్ ఫారంను ఎంచుకోండి. రిఫండు పెద్ద మొత్తం ఉన్నా.. లేక పన్ను భారం ఎక్కువగా అనిపించినా .. వృత్తి నిపుణుల సహాయ సహకారాలు తీసుకోండి. -
హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా?
సొంత ఇల్లు అనేది సగటు భారతీయుడి జీవితకాల స్వప్నం. అయితే, ప్రస్తుత ఉపాధి అవకాశాలు, మారుతున్న ఆర్థిక సమీకరణాల నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు ఒకవైపు హోమ్ లోన్ ఈఎంఐలు చెల్లిస్తూనే మరోవైపు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో నివసిస్తున్నారు. ఇలాంటి వారిపై ఆర్థిక భారం పడుతుందనేది నిజమే అయినప్పటికీ, భారత ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ఈ ద్వంద్వ వ్యయాలపై డబుల్ టాక్స్ బ్రేక్ (రెట్టింపు పన్ను మినహాయింపు) పొందే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల పరిధిలో దీనికి సంబంధించిన వివరాలు కింద చూద్దాం.ఒకేసారి రెండు మినహాయింపులు ఎలా సాధ్యం?పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నప్పుడు మాత్రమే ఈ రెండు ప్రయోజనాలను ఏకకాలంలో క్లెయిమ్ చేయడానికి అర్హులవుతారు. కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపులు వర్తించవు. చట్టబద్ధంగా కింది సెక్షన్ల కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.1. హెచ్ఆర్ఏ (సెక్షన్ 10(13A)): ఉద్యోగి తన జీతంలో భాగంగా పొందే హౌస్ రెంట్ అలవెన్స్పై తను నివసిస్తున్న ఇంటికి చెల్లించే అద్దె ఆధారంగా పన్ను మినహాయింపు లభిస్తుంది.2. హోమ్ లోన్ వడ్డీ (సెక్షన్ 24(b)): సొంత నివాసం కోసం తీసుకున్న గృహ రుణంపై చెల్లించే వార్షిక వడ్డీపై గరిష్టంగా రూ.2,00,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.3. అసలు చెల్లింపు (సెక్షన్ 80సీ): హోమ్ లోన్ ఈఎంఐలోని అసలు (Principal) భాగంపై గరిష్టంగా రూ.1,50,000 వరకు అదనపు మినహాయింపు పొందవచ్చు.ఎలాంటి సందర్భాల్లో అర్హత సాధించవచ్చంటే..వేర్వేరు నగరాల్లో ఉండటం: ఉద్యోగి ఒక నగరంలో (ఉదాహరణకు హైదరాబాద్) హోమ్ లోన్ ద్వారా ఇల్లు కొనుగోలు చేసి ఉద్యోగ రీత్యా మరో నగరంలో (ఉదాహరణకు బెంగళూరు) అద్దెకు ఉంటుంటే ఎలాంటి ఇబ్బందీ లేకుండా రెండింటినీ క్లెయిమ్ చేయవచ్చు.ఒకే నగరంలో నివాసం: సొంత ఇల్లు, ఆఫీసు ఉన్న నగరం ఒకటే అయినప్పటికీ.. సొంత ఇల్లు ఆఫీసుకు చాలా దూరంగా ఉండటం వల్ల నిత్యం ప్రయాణించడం సాధ్యం కాక ఆఫీస్ దగ్గర అద్దెకు ఉంటున్నట్లయితే ఈ రెండు మినహాయింపులూ వర్తిస్తాయి. అయితే, ఐటీ అధికారుల పరిశీలనలో దీనికి సరైన కారణం, ఆధారాలు చూపించాల్సి ఉంటుంది.నిర్మాణంలో ఉన్న ఇల్లు: కొనుగోలు చేసిన ఇల్లు ఇంకా నిర్మాణంలో ఉండి, అద్దె ఇంట్లో ఉంటున్నట్లయితే.. హెచ్ఆర్ఏ పూర్తిగా క్లెయిమ్ చేయవచ్చు. అయితే లోన్ వడ్డీని ఇల్లు పూర్తయ్యాక ఐదు సమాన విడతల్లో మాత్రమే క్లెయిమ్ చేయాలి.తీసుకోవాల్సిన జాగ్రత్తలుపన్ను లబ్ధి పొందే క్రమంలో పన్ను చెల్లింపుదారులు పక్కా ఆధారాలను కలిగి ఉండాలి. ఐటీ శాఖ నిఘా పెరిగిన నేపథ్యంలో చెల్లుబాటు అయ్యే అద్దె ఒప్పందం, అద్దె రశీదులు ఉండాలి. వార్షిక అద్దె రూ.1 లక్ష దాటితే యజమాని పాన్ నంబర్ సమర్పించడం తప్పనిసరి. అలాగే బ్యాంకు ద్వారా అద్దె చెల్లింపులు జరపడం సురక్షితం. హోమ్ లోన్ వడ్డీ, అసలు వివరాల కోసం రుణదాత (బ్యాంకు) నుంచి పొందిన ఇంట్రెస్ట్ సర్టిఫికెట్ను మీ సంస్థకు సకాలంలో సమర్పించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: వాడకుండా ఉన్న క్రెడిట్ కార్డ్ను క్లోజ్ చేస్తున్నారా? -
కోటి సంపాదించకుండానే కోటీశ్వరులు కావచ్చా?
ఎక్కువ జీతం వస్తేనే ధనవంతులు అవుతామని చాలా మంది భావిస్తారు. కానీ అధిక ఆదాయం కంటే ఆర్థిక క్రమశిక్షణ, ఖర్చుల నియంత్రణ, దీర్ఘకాలిక పెట్టుబడులే నిజమైన సంపదకు పునాది అని బెంగళూరుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) మీనాల్ గోయెల్ పేర్కొన్నారు. లింక్డ్ఇన్లో ఆమె పంచుకున్న అభిప్రాయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి.మాజీ డెలాయిట్, కేపీఎంజీ ఉద్యోగి అయిన గోయెల్ తన కెరీర్ ప్రారంభంలో వార్షికంగా రూ.1 కోటి సంపాదిస్తేనే తాను ధనవంతురాలినని భావించేదాన్నని చెప్పారు. అయితే అనుభవం పెరిగే కొద్దీ, ఎక్కువ సంపాదించడం ఒక్కటే సంపదకు ప్రమాణం కాదని, సంపాదించిన డబ్బులో ఎంత మిగుల్చగలుగుతున్నామన్నదే అసలు కీలకమని గ్రహించినట్లు వెల్లడించారు.జీతం పెరిగినా.. పొదుపు పెరుగుతుందా?గోయెల్ అభిప్రాయం ప్రకారం, ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా అదే వేగంతో పెరగడం చాలా మందిలో కనిపించే ప్రధాన సమస్య. దీనినే ఆర్థిక నిపుణులు "లైఫ్స్టైల్ ఇన్ఫ్లేషన్" లేదా "లైఫ్స్టైల్ క్రీప్" అని పిలుస్తారు.జీతం పెరిగిన వెంటనే అధిక అద్దె ఉన్న ఇళ్లకు మారడం, ఖరీదైన కార్లను ఈఎంఐలపై కొనుగోలు చేయడం, తరచూ బయట భోజనం చేయడం, విలాసవంతమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం వల్ల అదనంగా వచ్చిన ఆదాయం పూర్తిగా ఖర్చైపోతుందని ఆమె వివరించారు. దీంతో ఆదాయం ఎక్కువైనా, నికర సంపద మాత్రం ఆశించినంతగా పెరగదని పేర్కొన్నారు.ఎక్కువ జీతం... తక్కువ పొదుపుతన పోస్టులో గోయెల్ ఒక ఆసక్తికరమైన ఉదాహరణను ప్రస్తావించారు. సంవత్సరానికి రూ.50 లక్షలు సంపాదించే కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఏడాదికి రూ.12 లక్షల జీతం పొందే ప్రభుత్వ ఉద్యోగుల కంటే తక్కువ మొత్తాన్ని పొదుపు చేస్తున్న సందర్భాలు ఉన్నాయని తెలిపారు. కారణం ఆదాయం కాదు.. ఖర్చుల నియంత్రణలో ఉన్న తేడా అని ఆమె అభిప్రాయపడ్డారు.కోటీశ్వరులు కావాలంటే కోటి జీతం కావాలా?వార్షికంగా రూ.1 కోటి జీతం ఉంటేనే కోటీశ్వరులు కావచ్చనే అభిప్రాయం సరైంది కాదని గోయెల్ స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా పొదుపు చేయడం, పెట్టుబడులు కొనసాగించడం, ప్రతి జీతం పెరుగుదలలో కొంత భాగాన్ని ముందుగా పెట్టుబడులకు కేటాయించడం ద్వారా సాధారణ ఉద్యోగి కూడా దీర్ఘకాలంలో రూ.1 కోటి ఆస్తిని సృష్టించగలడని ఆమె అభిప్రాయపడ్డారు.ఆమె ప్రకారం, సుమారు 10% వార్షిక జీతం పెరుగుదలతో పాటు దీర్ఘకాలంలో సగటున 12–15% పెట్టుబడి రాబడిని సాధించగలిగితే, పదేళ్ల వ్యవధిలో కోటి రూపాయల పెట్టుబడి విలువను చేరుకోవడం సాధ్యమవుతుందని చెప్పారు. అయితే ఇది మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడి విధానం, కాలవ్యవధి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.ఆర్థిక స్వేచ్ఛ అంటే ఇదే..రూ.1 కోటి పెట్టుబడి దీర్ఘకాలంలో స్థిరమైన ఆదాయాన్ని అందించే ఆస్తిగా మారితే, అది నెలవారీ అవసరాల్లో పెద్ద భాగాన్ని భర్తీ చేసే అవకాశం ఉంటుందని గోయెల్ పేర్కొన్నారు. అదే నిజమైన ఆర్థిక స్వేచ్ఛకు తొలి అడుగు అని ఆమె అభిప్రాయపడ్డారు.పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు కూడా గోయెల్ అభిప్రాయానికి మద్దతు ఇస్తున్నారు. ఆదాయం పెరిగిన ప్రతిసారి ఖర్చులు పెంచడం కంటే, ముందుగా ఎస్ఐపీ (SIP), పీఎఫ్, ఎన్పీఎస్ లేదా ఇతర దీర్ఘకాలిక పెట్టుబడుల్లో వాటాను పెంచాలని సూచిస్తున్నారు. సాధారణంగా అత్యవసర నిధి, తగిన బీమా, క్రమబద్ధమైన పెట్టుబడులు, అవసరం లేని రుణాలకు దూరంగా ఉండటం ద్వారా దీర్ఘకాలంలో గణనీయమైన సంపదను నిర్మించవచ్చని వారు చెబుతున్నారు.ధనవంతులుఏ కావడం అనేది కేవలం భారీ జీతంతో వచ్చే విషయం కాదు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులను నియంత్రించడం, క్రమశిక్షణతో పొదుపు చేయడం, నిరంతర పెట్టుబడులు కొనసాగించడం, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను పాటించడమే నిజమైన సంపద సృష్టికి మార్గమని గోయెల్ సందేశం స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశంపై విస్తృత చర్చ కొనసాగుతోంది. -
ఈపీఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అయిందా?
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) నుంచి తమ సొంత ఈపీఎఫ్ నిధులను విత్డ్రా లేదా బదిలీ చేసుకోవాలని భావించే చందాదారుల క్లెయిమ్ కొన్నిసార్లు రిజెక్ట్ అవుతోంది. ఆన్లైన్ ప్రక్రియలు సులభతరం అయినప్పటికీ సాంకేతిక, రికార్డుల లోపాల వల్ల క్లెయిమ్లు తిరస్కరిస్తున్నట్లు అధికారిక డేటా స్పష్టం చేస్తోంది. ఈపీఎఫ్ క్లెయిమ్ తిరస్కరణకు దారితీసే సాధారణ కారణాలు, వాటిని అధిగమించే మార్గాలు కింద చూద్దాం.1. వ్యక్తిగత వివరాల వ్యత్యాసంఆధార్ కార్డు, ప్యాన్ కార్డు, ఈపీఎఫ్ఓ డేటాబేస్లో ఉన్న మీ పేరు, తండ్రి పేరు లేదా పుట్టిన తేదీల్లో చిన్న అక్షర దోషం ఉన్నా క్లెయిమ్ వెంటనే తిరస్కరణకు గురవుతుంది.పరిష్కారం: మీ యజమాని(ఎంప్లాయర్) సహకారంతో జాయింట్ డిక్లరేషన్ ఫారమ్ సమర్పించి వివరాలను సరిచేసుకోవాలి.2. బ్యాంక్ వివరాలు, ఐఎఫ్ఎస్సీ కోడ్ మారడంఇటీవలి కాలంలో కొన్ని బ్యాంకుల విలీనం కారణంగా పాత ఐఎఫ్ఎస్సీ కోడ్లు చెల్లకుండా పోయాయి. అలాగే ఈపీఎఫ్ఓ పోర్టల్లో ఇచ్చిన బ్యాంక్ ఖాతా సంఖ్య లేదా పేరు తప్పుగా ఉన్నా క్లెయిమ్ క్యాన్సిల్ అవుతుంది.పరిష్కారం: యూఏన్ మెంబర్ పోర్టల్లోకి లాగిన్ అయి లేటెస్ట్ ఐఎఫ్ఎస్సీ, సరైన బ్యాంక్ ఖాతా వివరాలను అప్డేట్ చేయాలి.3. కంపెనీని వీడిన తేదీ అప్డేట్ చేయకపోవడంఉద్యోగి పాత సంస్థను వీడిన తేదీని యజమాని పోర్టల్లో నమోదు చేయకపోతే ఆ ఉద్యోగి ఇంకా అక్కడే పని చేస్తున్నట్లు ఈపీఎఫ్ఓ భావిస్తుంది. దీనివల్ల ఫైనల్ సెటిల్మెంట్ క్లెయిమ్ నిలిచిపోతుంది.పరిష్కారం: ఉద్యోగం వదిలేసిన రెండు నెలల తర్వాత మెంబర్ పోర్టల్లో ‘మార్కెట్ ఎగ్జిట్’ ఆప్షన్ ద్వారా ఉద్యోగి స్వయంగా ఈ తేదీని అప్డేట్ చేసుకోవచ్చు.4. కేవైసీ పూర్తి కాకపోవడంయూఏన్ ఖాతాతో ఆధార్, ప్యాన్ కార్డులు లింక్ కాకపోవడం లేదా వెరిఫై కాకపోవడం క్లెయిమ్ రిజెక్షన్కు ప్రధాన కారణం. ఐదేళ్ల సర్వీస్ కంటే తక్కువ ఉండి ప్యాన్ లింక్ చేయకపోతే టీడీఎస్ వర్తిస్తుంది.పరిష్కారం: మీ ఆధార్ను యూఏన్తో సీడింగ్ చేసి కేవైసీని పూర్తి చేయాలి.5. ఒకటి కంటే ఎక్కువ యూఏన్ నంబర్లు ఉండటంవేర్వేరు కంపెనీల్లో పనిచేసినప్పుడు వేర్వేరు యూఏన్ నంబర్లు సృష్టించి ఉంటాయి. పాత నిధులను కొత్త ఖాతాలోకి బదిలీ చేయకుండా (మెర్జ్ చేయకుండా) నేరుగా విత్డ్రా చేయడానికి ప్రయత్నిస్తే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది.పరిష్కారం: మీ పాత పీఎఫ్ ఖాతాలను ప్రస్తుతమున్న యాక్టివ్ యూఏన్ నంబర్కు బదిలీ చేయాలి.6. ఈపీఎస్ పెన్షన్ అర్హత సమస్యలుపదవీ విరమణ నిధులు క్లెయిమ్ చేసేటప్పుడు ఫారమ్ 19 (ఈపీఎఫ్ విత్డ్రా), ఫారమ్ 10C (పెన్షన్ విత్డ్రా)లలో తప్పుడు వివరాలు ఇవ్వడం వల్ల క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది.పరిష్కారం: సర్వీస్ కాలపరిమితిని బట్టి సరైన ఫారమ్లను ఎంచుకోవాలి.7. నిబంధనల ఉల్లంఘన, అసంపూర్ణ డాక్యుమెంటేషన్ప్రీ-మెచ్యూర్ లేదా అడ్వాన్స్ విత్డ్రా (ఉదాహరణకు అనారోగ్యం, వివాహం, ఇల్లు కొనుగోలు) కొరకు దరఖాస్తు చేసేటప్పుడు నిర్దేశిత కనీస సర్వీస్ కాలపరిమితి లేకపోవడం లేదా స్పష్టత లేని క్యాన్సిల్డ్ చెక్కులను అప్లోడ్ చేయడం వల్ల క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతాయి.పరిష్కారం: అప్లోడ్ చేసే డాక్యుమెంట్లు, పాస్బుక్ లేదా చెక్కులపై మీ పేరు, ఖాతా సంఖ్య స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలి.ఇదీ చదవండి: హైదరాబాద్లో దిగొచ్చిన బంగారం ధర! -
విడాకులు వచ్చినా భరణం ఆగదు! అయితే..
వైవాహిక వివాదాల్లో చిక్కుకున్న మహిళల ఆర్థిక భద్రతకు భరోసా కల్పిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానాల స్ఫూర్తితో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ డిక్రీ(తుది తీర్పు ప్రకటన) ఇచ్చినంత మాత్రాన భార్యకు అందుతున్న తాత్కాలిక భరణం ఆటోమేటిక్గా నిలిచిపోదని స్పష్టం చేసింది. ఒకవేళ ఆ విడాకుల తీర్పును సవాలు చేస్తూ పైకోర్టులో అప్పీల్ పెండింగ్లో ఉంటే సదరు న్యాయపరమైన ప్రక్రియను కేసు కొనసాగింపుగానే పరిగణిస్తారు. కాబట్టి అప్పీల్ తేలే వరకు భర్త భరణం చెల్లించాల్సిందేనని ధర్మాసనం తేల్చిచెప్పింది.హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్ 24 కింద మంజూరయ్యే తాత్కాలిక భరణం ఉద్దేశాన్ని ఈ తీర్పు పునరుద్ఘాటించింది. ఫ్యామిలీ కోర్టు భర్తకు అనుకూలంగా విడాకులు ఇచ్చిన నేపథ్యంలో అప్పీల్ దాఖలు చేసిన ఒక మహిళ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విడాకుల తీర్పు రాగానే భరణం ఆపేయాలన్న భర్త వాదనను న్యాయస్థానం పూర్తిగా తోసిపుచ్చింది. ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చినంత మాత్రాన వివాదం ముగిసిపోయినట్లు కాదని చెప్పింది. అప్పీలేట్ పరిహారాలన్నీ పూర్తయ్యే వరకు ఆ కేసు పెండింగ్లోనే ఉంటుందని పేర్కొంది.నిర్ణయం వెనుక కారణాలున్యాయస్థానం తన తీర్పులో రెండు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించింది. మొదటిది, ఉన్నత చదువులు (ఎంబీఏ వంటి అర్హతలు) ఉండి గతంలో ఉద్యోగ అనుభవం ఉన్నంత మాత్రాన మహిళకు సొంతంగా జీవనోపాధి ఉన్నట్లు భావించలేం. కేవలం సంపాదించగల సామర్థ్యం ఉండటం వేరు, నిజంగా సంపాదిస్తూ ఉండటం వేరు అని ధర్మాసనం స్పష్టం చేసింది. రెండోది, అప్పీల్ పెండింగ్లో ఉన్న సమయంలో భరణం నిలిపివేస్తే ఆర్థికంగా ఆధారపడిన జీవిత భాగస్వామి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని, ఇది సెక్షన్ 24 ప్రధాన ఉద్దేశాన్నే దెబ్బతీస్తుందని చెప్పింది.సుప్రీంకోర్టు గతంలో జగదీష్ సింగ్ వర్సెస్ మాధురి దేవి కేసులో ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ అప్పీల్ అనేది అసలు విచారణకు పొడిగింపు మాత్రమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో సదరు భర్త జీతం నుంచి ప్రతి నెలా 30 శాతం మొత్తాన్ని నేరుగా భార్య ఖాతాకు బదిలీ చేయాలని కోర్టు ఆదేశించింది.ఇదీ చదవండి: వాడకుండా ఉన్న క్రెడిట్ కార్డ్ను క్లోజ్ చేస్తున్నారా? -
రూ.5 కోట్లు ఉంటే రిటైర్ అయిపోవచ్చా?
నేటి కార్పొరేట్ యుగంలో, ముఖ్యంగా యువ ఉద్యోగుల్లో ‘ఫైర్’ (FIRE - Financial Independence, Retire Early) అనే ట్రెండ్ నడుస్తోంది. ముప్పై లేదా నలభై ఏళ్లకే కోట్లలో కార్పస్ (ఆర్థిక నిధి) కూడబెట్టి ఉద్యోగానికి గుడ్-బై చెప్పేయాలనేది చాలామంది కల. అయితే ముందస్తు పదవీ విరమణ అనేది కేవలం ఒక నిర్దిష్ట బ్యాంక్ బ్యాలెన్స్ లేదా మ్యాజిక్ నంబర్ను చేరుకోవడం మాత్రమే కాదు. ఆ అంకెను వెతుక్కుంటూ వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ కొన్ని ప్రశ్నలకు సమాధానం వేసుకోవడం తప్పనిసరి.ఆర్థిక నిధి వెనుక అసలు లెక్కలుచాలామంది రూ.5 కోట్లు లేదా రూ.10 కోట్లు ఉంటే రిటైర్ అయిపోవచ్చని లెక్కలు వేస్తుంటారు. కానీ భవిష్యత్తులో వచ్చే ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వైద్య ఖర్చులను వారు పరిగణనలోకి తీసుకోరు. ఈ రోజు ఉన్న కోటి రూపాయల విలువ మరో ఇరవై ఏళ్ల తర్వాత చాలా తగ్గిపోతుంది. అందుకే మీ వార్షిక ఖర్చులకు కనీసం 30-40 రెట్లు ఎక్కువ నిధిని సమకూర్చుకోవడంతో పాటు రిటైర్మెంట్ తర్వాత కూడా ఆ డబ్బు ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే స్పష్టత ఉండాలి.ఉద్యోగం మానేశాక ఏం చేస్తారు?ఆర్థిక స్వతంత్రత రాగానే ఉద్యోగం వదిలేయడం సులువే. కానీ ఆ తర్వాత సుదీర్ఘమైన రోజులను ఎలా గడుపుతారనేదే ప్రశ్న. కేవలం విరామం కోసం రిటైర్ అయితే కొద్ది రోజులకే తీవ్రమైన ఒంటరితనం, మానసిక అసంతృప్తి ఆవరించే ప్రమాదం ఉంది. మీ అభిరుచులు, సామాజిక సేవ లేదా మీకు నచ్చిన చిన్న వ్యాపారం ఏదైనా ప్లాన్ చేసుకున్నారా? ముందస్తు పదవీ విరమణ అనేది పని నుంచి పారిపోవడం కాకూడదు. మీకు నచ్చిన పనిని నచ్చినట్లు చేసుకునే స్వేచ్ఛ కావాలి.ఆరోగ్య బీమా ఉందా?కార్పొరేట్ ఉద్యోగాల్లో ఉన్నంత కాలం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటుంది. కానీ ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నాక సొంతంగా నాణ్యమైన ఆరోగ్య బీమా పాలసీ ఉండాలి. వయసు పెరిగే కొద్దీ ప్రీమియంలు పెరుగుతాయి. కాబట్టి వైద్య ఖర్చుల కోసం ప్రత్యేకంగా ఒక అత్యవసర నిధి సిద్ధంగా ఉంచుకోవాలి.ముందస్తు పదవీ విరమణ అనేది కేవలం ఒక ఆర్థిక లక్ష్యం కాదు, అది ఒక సంపూర్ణ జీవనశైలి మార్పు. కేవలం ఒక అంకె వెంట పడకుండా.. మానసిక సన్నద్ధత, సమగ్రమైన ఆర్థిక ప్రణాళిక, స్పష్టమైన భవిష్యత్ లక్ష్యాలు ఉన్నప్పుడే మీ ‘సెకండ్ ఇన్నింగ్స్’ విజయవంతం అవుతుంది. నిపుణుల సలహాతోనే ఈ దిశగా అడుగులు వేయడం ఉత్తమం.ఇదీ చదవండి: వాడకుండా ఉన్న క్రెడిట్ కార్డ్ను క్లోజ్ చేస్తున్నారా? -
వాడకుండా ఉన్న క్రెడిట్ కార్డ్ను క్లోజ్ చేస్తున్నారా?
ఈ రోజుల్లో ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉండటం సాధారణం. వివిధ ఆఫర్లు, క్యాష్బ్యాక్లకు ఆకర్షితులై చాలామంది అవసరానికి మించి కార్డులు తీసుకుంటారు. అయితే, కొంతకాలం తర్వాత వాటిలో కొన్నింటిని అస్సలు వాడకుండా పక్కనపెట్టేస్తుంటారు. ‘ఎలాగూ వాడటం లేదు కదా, క్లోజ్ చేసేద్దాం’ అని అనుకుంటే.. ఒక్క నిమిషం ఆగండి! మీ నిర్ణయం వల్ల మీ క్రెడిట్ స్కోర్ పడిపోయే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించిన విషయాలు చూద్దాం.మీ సిబిల్ స్కోర్ను దెబ్బతీసే ప్రధాన అంశాలుమీకు ఉన్న మొత్తం క్రెడిట్ లిమిట్లో ఎంత శాతం వాడుతున్నారనేదే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (సీయూఆర్). ఇది ఎప్పుడూ 30 శాతం కంటే తక్కువగా ఉండాలి. ఒక కార్డును క్లోజ్ చేయడం వల్ల మీ మొత్తం అందుబాటులో ఉన్న క్రెడిట్ లిమిట్ తగ్గిపోతుంది. దీనివల్ల మీరు చేసే ఖర్చు మారకపోయినా మీ సీయూఆర్ శాతం ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఇది మీ స్కోర్ పడిపోవడానికి ప్రధాన కారణమవుతుంది. బ్యాంకులు మీకు లోన్ ఇచ్చే ముందు మీరు ఎంత కాలంగా క్రెడిట్ను బాధ్యతాయుతంగా వాడుతున్నారనే హిస్టరీని చూస్తాయి. మీ దగ్గర ఉన్న కార్డులలో అత్యంత పాత కార్డును క్లోజ్ చేస్తే క్రెడిట్ హిస్టరీ సగటు డ్యూరేషన్ తగ్గిపోతుంది.ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి?మీ క్రెడిట్ కార్డును వరుసగా 12 నెలల పాటు అసలు వాడకపోతే బ్యాంకులు ఆ కార్డును క్లోజ్ చేసే అధికారం కలిగి ఉంటాయి. అయితే, అలా చేసే ముందు ఖాతాదారునికి తప్పనిసరిగా నోటీసు ఇవ్వాలి. ఖాతాదారుడు అన్ని బకాయిలు చెల్లించి కార్డ్ క్లోజర్ కోసం దరఖాస్తు చేసుకున్న ఏడు పని దినాల్లో బ్యాంక్ ఆ ఖాతాను మూసివేయాలి. ఒకవేళ బ్యాంక్ గడువు దాటి ఆలస్యం చేస్తే ఆ తర్వాత ప్రతి రోజు ఆలస్యానికి రూ.500 చొప్పున బ్యాంకు సదరు కస్టమర్కు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.సురక్షితమైన కార్డ్ క్లోజర్ విధానంకార్డుపై ఉన్న అవుట్స్టాండింగ్ బకాయిలు, ఈఎంఐలను పూర్తిగా క్లియర్ చేయండి.ఖాతా మూసివేసే ముందే మీ రివార్డ్ పాయింట్లను పూర్తిగా వాడేసుకోండి.ఓటీటీ, ఇన్సూరెన్స్ వంటి వాటికి ఇచ్చిన ఆటో డెబిట్ ఆప్షన్లను రద్దు చేయండి.కార్డు విజయవంతంగా క్లోజ్ అయిన తర్వాత బ్యాంక్ నుంచి అధికారిక కన్ఫర్మేషన్ లేదా ‘నో డ్యూస్ సర్టిఫికేట్’ తప్పక తీసుకోండి.ఒకవేళ మీరు క్లోజ్ చేయాలనుకుంటున్న కార్డుకు ఎలాంటి వార్షిక రుసుము లేకపోతే దానిని అలాగే ఉంచడం మంచిది. నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి చిన్న మొత్తంలో వాడుతూ యాక్టివ్గా ఉంచితే అది మీ క్రెడిట్ లిమిట్ను పెంచి తద్వారా మీ సిబిల్ స్కోర్ను మరింత పెంచడానికి సహాయపడుతుంది.ఇదీ చదవండి: IRCTC వెబ్సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు -
రూ.11 వేల కోట్ల కంపెనీ సీఈవో.. అయినా ‘నో లోన్’!
కోట్ల రూపాయల ఆస్తులు, వేల కోట్ల విలువైన కంపెనీ, మంచి సిబిల్ స్కోర్... ఇవన్నీ ఉన్నా బ్యాంకులు హోమ్లోన్ ఇవ్వడానికి వెనకడుగు వేస్తాయా? తాజాగా వైరల్ అయిన ఒక ఘటన అవుననే సమాధానమే చెబుతోంది. ఫిన్టెక్ సంస్థ ‘రెయిజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్’ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రవీణ్ జాధవ్ తన హోమ్లోన్ దరఖాస్తును బ్యాంకు తిరస్కరించిందని ‘ఎక్స్’లో వెల్లడించారు. కారణం మాత్రం ఆయన ఆదాయం లేదా సిబిల్ స్కోర్ కాదు.. 'హై రిస్క్ కేటగిరీ'లో ఉండటమే.ఈ ఘటనతో చాలామందిలో ఒక సందేహం మొదలైంది. అసలు బ్యాంకులు ఎవరిని హైరిస్క్గా పరిగణిస్తాయి? మంచి ఆదాయం, అద్భుతమైన క్రెడిట్ హిస్టరీ ఉన్నా ఎందుకు రుణం నిరాకరిస్తాయి?హోమ్లోన్ ఇవ్వడానికి బ్యాంకులు ఏమేమి చూస్తాయి?చాలామంది సిబిల్ స్కోర్ బాగుంటే చాలు అనుకుంటారు. కానీ వాస్తవానికి బ్యాంకులు అనేక అంశాలను పరిశీలిస్తాయి.క్రెడిట్ స్కోర్, రీపేమెంట్ చరిత్రనెలవారీ ఆదాయం, ఉద్యోగ స్థిరత్వంఇప్పటికే ఉన్న రుణాల భారంఆదాయానికి సంబంధించి ఈఎంఐ నిష్పత్తివృత్తి, వ్యాపారం స్వభావంకేవైసీ, ఆదాయ పత్రాలుఅంతర్గత రిస్క్ పాలసీలుఅంటే సిబిల్ స్కోర్ ఒక ముఖ్యమైన అంశమే కానీ, అది ఒక్కటే ప్రమాణం కాదు.హైరిస్క్ కేటగిరీ అంటే ఏమిటి?ప్రతి బ్యాంకుకు సొంత రిస్క్ అసెస్మెంట్ మోడల్ ఉంటుంది. అందులో కొందరు కస్టమర్లను హైరిస్క్గా గుర్తించవచ్చు. అందులో ప్రధానంగా..స్టార్టప్లు లేదా అధిక రిస్క్ రంగాల్లో వ్యాపారం చేసే వారుఆదాయం స్థిరంగా లేకపోవడంస్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులునియంత్రణ సంస్థల పర్యవేక్షణలో ఉండే రంగాల్లో పనిచేసేవారుఅధిక మొత్తంలో పెట్టుబడులు, షేర్ మార్కెట్ లేదా ఫిన్టెక్ కార్యకలాపాల్లో ఉండటంబ్యాంకు అంతర్గత రిస్క్ పాలసీల ప్రకారం ప్రత్యేక కేటగిరీలోకి రావడంఈ కారణాల్లో ఏదైనా ఉంటే, సిబిల్ స్కోర్ బాగున్నా బ్యాంకు అదనపు జాగ్రత్తలు తీసుకోవచ్చు.సీఈఓ అయినా ఎందుకు లోన్ రాలేదు?ప్రవీణ్ జాధవ్ వెల్లడించిన సమాచారం ప్రకారం, తన క్రెడిట్ హిస్టరీ బాగానే ఉన్నప్పటికీ, బ్యాంకు ఆయనను హైరిస్క్ కస్టమర్గా వర్గీకరించిందని తెలిపింది. ఫిన్టెక్ రంగానికి చెందిన వ్యక్తి కావడం లేదా బ్యాంకు అంతర్గత రిస్క్ మోడల్లో ఆయన ప్రొఫైల్కు అధిక రిస్క్ స్కోర్ రావడం వంటి కారణాలు ఉండొచ్చు.బ్యాంకులు లోన్ రిజెక్ట్ చేసే సాధారణ కారణాలుతక్కువ క్రెడిట్ స్కోర్EMI భారం ఎక్కువగా ఉండటంఆదాయానికి సరిపడా రీపేమెంట్ సామర్థ్యం లేకపోవడంపత్రాల్లో వ్యత్యాసాలుఉద్యోగం లేదా వ్యాపారంలో స్థిరత్వం లేకపోవడంఆస్తి పత్రాలకు సంబంధించిన సమస్యలుబ్యాంకు అంతర్గత రిస్క్ విధానాలకు సరిపోకపోవడంలోన్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి?లోన్ తిరస్కరణ అంటే జీవితాంతం రుణం రాదని కాదు. ముందుగా రిజెక్షన్కు గల కారణాన్ని తెలుసుకోవాలి. క్రెడిట్ రిపోర్ట్లో పొరపాట్లు ఉంటే సరిచేయాలి. EMI భారం తగ్గించుకోవాలి. అవసరమైతే సహ-దరఖాస్తుదారుని (Co-applicant) చేర్చాలి. మరో బ్యాంకు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో దరఖాస్తు చేయవచ్చు.ఈ ఘటన ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. హోమ్లోన్ మంజూరులో సిబిల్ స్కోర్ మాత్రమే కాదు, బ్యాంకు అంతర్గత రిస్క్ అంచనా కూడా కీలక పాత్ర పోషిస్తుంది. వ్యక్తి ఎంత పెద్ద కంపెనీకి సీఈఓ అయినా, ఎంత ఆదాయం సంపాదిస్తున్నా.. బ్యాంకు రిస్క్ పాలసీలకు సరిపోకపోతే రుణం తిరస్కరించే అవకాశం ఉంటుంది. అందుకే హోమ్లోన్కు దరఖాస్తు చేసే ముందు క్రెడిట్ స్కోర్తో పాటు మొత్తం ఆర్థిక ప్రొఫైల్ను బలోపేతం చేసుకోవడం అవసరం. -
కోట్లు ఉన్నా కొరత భావనేనా?
ఆర్థికంగా ఎంత సంపాదించినా, సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నా.. నేటికీ చాలా మంది ధనిక భారతీయ తల్లిదండ్రులు తమ పాత ‘పేదరిక మనస్తత్వం’ (పావర్టీ మైండ్సెట్) నుంచి బయటపడలేకపోతున్నారు. గతంలో తాము పడ్డ కష్టాలను, ఆనాటి పరిస్థితులను నేటి పిల్లలపై బలవంతంగా రుద్దడం, ఆ కష్టాలను గొప్పగా కీర్తించడం వల్ల పిల్లల సృజనాత్మకత, భవిష్యత్తు ఎదుగుదల తీవ్రంగా దెబ్బతింటున్నాయని సామాజిక మాధ్యమాల్లో ఒక సరికొత్త చర్చ రేకెత్తింది. ఎక్స్ వేదికగా శంతను అనే యూజర్ పంచుకున్న ఒక సుదీర్ఘమైన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మిలియనీర్లుగా ఎదిగినప్పటికీ వారి ఆలోచనా విధానంలో మాత్రం ఇంకా పేదరిక మనస్తత్వం అలాగే ఉండిపోయిందని విశ్లేషించారు.కష్టాలను కీర్తించడం ఆపండిమన దేశంలో చాలా మంది తల్లిదండ్రులు తాము చిన్నప్పుడు ఎంత కష్టపడ్డారో, ఎలా చదువుకున్నారోనని పదే పదే చెబుతుంటారు. ‘మేము ఆ రోజుల్లో ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లాం. ఒక్క పూటే తిని చదువుకున్నాం’ అంటూ గత కాలపు కష్టాలను ఒక గొప్ప విషయంగా చెబుతుంటారు. అయితే, ఈ రోజుల్లో అలాంటి వనరుల కొరత లేకపోయినా.. పిల్లలకు ఆధునిక వసతులను అందుబాటులో ఉంచకుండా వారిని కూడా అదే రీతిలో ఇబ్బంది పెట్టాలని చూడటం ఏమాత్రం సమర్థనీయం కాదని శంతను పేర్కొన్నారు.పెట్టుబడి పెట్టేందుకు వెనుకడుగుఈ మనస్తత్వానికి సంబంధించి ఆయన కొన్ని ప్రధాన అంశాలను ఎత్తిచూపారు. ‘వ్యాపారాల కోసం కోట్లాది రూపాయల టర్నోవర్ చేసే తల్లిదండ్రులు సైతం పిల్లల ఉత్పాదకతను (Productivity) పెంచే కొన్ని వందల రూపాయల విలువైన పెయిడ్ సాఫ్ట్వేర్ యాప్లు లేదా ఆన్లైన్ టూల్స్ కొనుగోలు చేయడానికి వెనుకాడుతుంటారు. సంపద ఉన్నప్పటికీ ఖరీదైన ఆరోగ్యకరమైన ఆహారం లేదా సమతుల్య పోషకాహారం తీసుకోవడానికి బదులు.. పాత పద్ధతులనే పాటిస్తూ డయాబెటిస్, విటమిన్ లోపాలు వంటి అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. గమ్యస్థానాన్ని త్వరగా చేరుకోవడానికి విమాన ప్రయాణం చేసే స్తోమత ఉన్నా డబ్బు ఆదా చేయాలనే ఉద్దేశంతో గంటల కొద్దీ రైలు ప్రయాణాలకే మొగ్గు చూపుతారు. సమయం కంటే డబ్బే ముఖ్యం అనుకునే ఈ ధోరణి పిల్లల విలువైన సమయాన్ని వృధా చేస్తోంది’ అని శంతను చెప్పారు.పిల్లల ఆత్మవిశ్వాసంపై దెబ్బఈ ‘పేదరిక మనస్తత్వం’ అనేది కేవలం డబ్బు దాచుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా పిల్లల ఆలోచనా పరిధిని కూడా కుంచించుకుపోయేలా చేస్తోంది. ఆర్థిక భద్రత ఉన్నప్పటికీ నిరంతరం అభద్రతా భావంతో బతకడం వల్ల పిల్లలు కొత్త ప్రయోగాలు చేయడానికి, స్టార్టప్లు ప్రారంభించడానికి లేదా రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నారు.మారుతున్న కాలంతో పాటు తల్లిదండ్రుల ఆలోచనలు కూడా మారాలి. కష్టం విలువను పిల్లలకు నేర్పించడం అవసరమే, కానీ దానిని మానసిక వేధింపుగా మార్చకూడదు. ఆర్థిక విజయాలు సాధించినప్పుడు ఆ విజయాల ఫలాలను తదుపరి తరానికి అందించి వారిని గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలే తప్ప.. గత కాలపు ఇబ్బందులను వారిపై రుద్ది వారి రెక్కలను కత్తిరించకూడదని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: బ్రాండ్ రేస్లో దేశీయ దిగ్గజాలు! -
8వ పే కమిషన్.. కనీస వేతనం రూ.54000 కానుందా?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు నిరీక్షిస్తున్న 8వ వేతన సంఘం సంప్రదింపుల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 55 లక్షల మంది క్రియాశీల ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్ల ఆర్థిక స్థితిగతులను శాసించే ఈ వేతన సవరణలో ‘ఫిట్మెంట్ ఫ్యాక్టర్’ అత్యంత కీలకమైన అంశంగా మారింది. నేరుగా హెచ్ఆర్ఏ (ఇంటి అద్దె భత్యం)పై ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సూత్రం వర్తించనప్పటికీ ఇది ప్రాథమిక వేతనాన్ని పెంచుతుంది. కాబట్టి, దాని ఆధారంగా లెక్కించే హెచ్ఆర్ఏ కూడా పెరగనుంది.ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను గణనీయంగా పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారిక చర్చలు, తాజా విశ్లేషణల ప్రకారం, ప్రభుత్వం నిర్ణయించే వివిధ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సినారియోల (2, 2.5, 3) ఆధారంగా ఉద్యోగుల కనీస జీతాలు, హెచ్ఆర్ఏలు ఏ విధంగా మారుతాయో పరిశీలించాల్సి ఉంది.ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా బేసిక్ పే అంచనాలుప్రస్తుతం 7వ వేతన సంఘం కింద కనీస బేసిక్ పే రూ.18,000గా ఉంది. ఒకవేళ ప్రభుత్వం కన్జర్వేటివ్ పద్ధతిలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 2.0గా నిర్ణయిస్తే కనీస ప్రాథమిక వేతనం రూ.36,000 అవుతుంది.ఒకవేళ మధ్యస్థంగా 2.5గా ఖరారు చేస్తే అది రూ.45,000 కు చేరుతుంది.ఉద్యోగ సంఘాల డిమాండ్లకు అనుగుణంగా గరిష్టంగా దీనిని 3.0కు పెంచితే కనీస వేతనం ఏకంగా రూ.54,000కు పెరిగే అవకాశం ఉంది. ఈ మల్టిప్లైయర్ పెరిగే కొద్దీ ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ ఊహించని రీతిలో పెరుగుతుంది.హెచ్ఆర్ఏపై ప్రభావంప్రస్తుతం నగరాల జనాభాను బట్టి X, Y, Z కేటగిరీలుగా వర్గీకరించి హెచ్ఆర్ఏ రేట్లను ఇస్తున్నారు. నేషనల్ కౌన్సిల్ (ఎన్సీ-జేసీఎం) వంటి వివిధ ఉద్యోగ సంఘాలు పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా X కేటగిరీ నగరాలకు 36-40% వరకు హెచ్ఆర్ఏ రేట్లను సవరించాలని పట్టుబడుతున్నాయి. ఒకవేళ ప్రస్తుతం ఉన్న హెచ్ఆర్ఏ శాతాలనే ప్రామాణికంగా తీసుకున్నా కొత్త బేసిక్ పే కారణంగా చేతికి వచ్చే మొత్తం మారుతుంది.ఉదాహరణకు లెవెల్-1 ఉద్యోగికి వివిధ సినారియోలలో హెచ్ఆర్ఏ మార్పులు ఇలా ఉండవచ్చు..1. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.0: బేసిక్ పే రూ.36,000 అవుతుంది. దీనిపై మెట్రో నగరాల్లో (X కేటగిరీ) లభించే హెచ్ఆర్ఏ సుమారు రూ.10,800 వరకు ఉంటుంది.2. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.5: బేసిక్ పే రూ.45,000 అవుతుంది. దీనిపై అదే నగరంలో హెచ్ఆర్ఏ రూ.13,500 కు చేరుకుంటుంది.3. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.0: బేసిక్ పే రూ.54,000కు పెరుగుతుంది. అప్పుడు హెచ్ఆర్ఏ ఏకంగా రూ.16,200 దాటుతుంది.ఇదే సూత్రం లెవెల్-1 నుంచి లెవెల్-13 వరకు ఉన్న అన్ని శ్రేణుల ఉద్యోగులకు వర్తిస్తుంది. ఉన్నత స్థాయి అధికారుల వేతనాలు ఈ నిష్పత్తిలో లక్షల్లో పెరగనున్నాయి. రాబోయే కేంద్ర క్యాబినెట్ సమావేశాల్లో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. తుది నిర్ణయం వెలువడే వరకు ఉద్యోగ, పెన్షనర్ల వర్గాల్లో ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్పల్ప ఊరట -
ఇప్పటికే లోన్ ఉండి రెండో లోన్ కోసం చూస్తున్నారా?
మారిన ఆర్థిక అవసరాలు, మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుత రోజుల్లో ఒకటి కంటే ఎక్కువ లోన్స్ తీసుకోవడం సాధారణం అయిపోయింది. ఇప్పటికే ఒక హోమ్ లోన్ లేదా కార్ లోన్ కోసం ప్రతినెలా ఈఎంఐ చెల్లిస్తున్న వారు అత్యవసర పరిస్థితుల్లో మరో కొత్త రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చా? ఇప్పటికే చెల్లిస్తున్న ఈఎంఐలు ఉంటే కొత్త లోన్ మంజూరు అవుతుందా? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. అయితే, ఆర్థిక నిపుణుల విశ్లేషణల ప్రకారం, ఇప్పటికే రుణాలు ఉన్నప్పటికీ కొన్ని నిర్దిష్ట అర్హతలు, నిబంధనలను బట్టి బ్యాంకులు మరో లోన్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతాయి. ఆ వివరాలు కింద చూద్దాం.‘ఎఫ్ఓఐఆర్’ నిష్పత్తిబ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు కొత్త రుణం ఇచ్చేటప్పుడు ‘ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ టు ఇన్కమ్ రేషియో’ (ఎఫ్ఓఐఆర్) లేదా డెట్-టు-ఇన్కమ్ రేషియోని లెక్కిస్తాయి. మీ మొత్తం నెలవారీ ఆదాయంలో ఇప్పటికే ఉన్న ఈఎంఐలు, ఇతర స్థిర ఖర్చులు ఎంత శాతం ఉంటున్నాయో ఇది తెలియజేస్తుంది. సాధారణంగా బ్యాంకులు ఈ రేషియో 40% నుంచి 50% లోపు ఉండాలని కోరుకుంటాయి. అంటే, మీ జీతం రూ.1,00,000 అనుకుంటే, మీ ప్రస్తుత ఈఎంఐలు రూ.40,000 లోపు ఉంటే, మిగిలిన డిస్పోజబుల్ ఆదాయాన్ని (మిగిలిన జీతాన్ని) బట్టి కొత్త లోన్ పొందేందుకు మీకు అర్హత లభిస్తుంది.సిబిల్ స్కోరు, క్రెడిట్ హిస్టరీఇప్పటికే లోన్ ఉన్నప్పటికీ మీ పాత ఈఎంఐలను ప్రతి నెలా గడువు లోపు ఎలాంటి డిఫాల్ట్స్ లేకుండా క్రమశిక్షణతో చెల్లిస్తుంటే మీ సిబిల్ స్కోరు బలంగా (750 కంటే ఎక్కువ) ఉంటుంది. ఇది మీ ఆర్థిక బాధ్యతను సూచిస్తుంది. ఇలాంటి క్లీన్ రీపేమెంట్ హిస్టరీ ఉన్న కస్టమర్లకు కొత్త లోన్ ఇవ్వడానికి బ్యాంకులు పెద్దగా వెనుకాడవు.టాప్-అప్ లోన్స్ఒకవేళ మీరు కొత్తగా వేరే బ్యాంకులో లోన్ దరఖాస్తు చేసుకోకుండా ఇప్పటికే ఉన్న హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్పై టాప్-అప్ రుణం కోసం ప్రయత్నిస్తే అనుమతి సులభంగా లభిస్తుంది. దీనివల్ల డాక్యుమెంటేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి కావడమే కాకుండా వడ్డీ రేట్లు కూడా సాధారణ పర్సనల్ లోన్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.లోన్ కాలపరిమితిని పెంచుకోవడంమీ నెలవారీ ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రస్తుత లోన్ కాలపరిమితిని పొడిగించుకోవచ్చు. దీనివల్ల ప్రతినెలా కట్టే ఈఎంఐ మొత్తం తగ్గి మీ ఎఫ్ఓఐఆర్ మెరుగవుతుంది. ఫలితంగా కొత్త లోన్ అర్హత పెరిగే ఆస్కారం ఉంటుంది.అత్యవసర సమయాల్లోనే..ఒకటి కంటే ఎక్కువ రుణాలు తీసుకోవడం వల్ల ఆర్థిక వెసులుబాటు లభించినప్పటికీ మీ మొత్తం ఆదాయంలో 50 శాతం కంటే ఎక్కువ భాగం ఈఎంఐలకే పోకుండా చూసుకోవడం ముఖ్యం. ఆదాయ వనరులు స్థిరంగా ఉన్నప్పుడు, అత్యవసర సమయాల్లో మాత్రమే క్రెడిట్ పరిమితులను సద్వినియోగం చేసుకోవడం ఉత్తమమైన ఆర్థిక క్రమశిక్షణ అని గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: ఏఐ ఎందుకో వెనుకబడింది? -
అప్పుల వసూళ్లకూ రూల్స్ ఉన్నాయి!
సమకాలీన ఆర్థిక వ్యవస్థలో వ్యక్తిగత అవసరాల కోసమో, వ్యాపార విస్తరణ కోసమో బ్యాంకులు లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) నుంచి రుణాలు తీసుకోవడం సాధారణం. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల సకాలంలో ఈఎంఐలు చెల్లించలేనప్పుడు రికవరీ ఏజెంట్ల నుంచి ఎదురయ్యే వేధింపులు రుణగ్రహీతలను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. రుణాన్ని తిరిగి వసూలు చేసుకునే హక్కు ఆర్థిక సంస్థలకు ఉన్నప్పటికీ దానికి చట్టపరమైన పరిమితులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశించిన నిబంధనలు ఉన్నాయి. రుణగ్రహీతలు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండటం ప్రస్తుత తరుణంలో ఎంతో అవసరం.ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి?రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతలకు ఫోన్ చేయాలన్నా లేదా వారి ఇంటికి/కార్యాలయానికి వెళ్లాలన్నా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల లోపు మాత్రమే వెళ్లాలి. అంతకుమించి ఇతర సమయాల్లో ఫోన్లు చేయడం లేదా ఇళ్లపైకి వెళ్లడం ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఉల్లంఘనే అవుతుంది.రుణగ్రహీతలను శారీరకంగానో, మానసికంగానో వేధించడం, దూషించడం, బెదిరింపులకు గురిచేయడం పూర్తిగా నిషిద్ధం. సామాజికంగా వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించకూడదు.ఒక వ్యక్తి తీసుకున్న రుణం తాలూకు వివరాలను వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు లేదా సహోద్యోగులకు వెల్లడించి వారిని ఇబ్బంది పెట్టే హక్కు రికవరీ ఏజెంట్లకు లేదు.రుణగ్రహీతను కలిసే ఏజెంట్ కచ్చితంగా సదరు బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థ జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు, అథరైజేషన్ లెటర్ను కలిగి ఉండాలి.వేధింపులు ఎదురైతే రుణగ్రహీతలు ఏం చేయాలి?ఏజెంట్లు అసభ్యంగా మాట్లాడినా, బెదిరించినా ఆ ఫోన్ కాల్స్ను రికార్డ్ చేయడం లేదా వారి ప్రవర్తనను వీడియో తీయడం వంటి ఆధారాలను భద్రపరుచుకోవాలి. ఇవి భవిష్యత్తులో ఫిర్యాదు చేయడానికి బలాన్ని ఇస్తాయి.రికవరీ ఏజెంట్ల ప్రవర్తనపై మొదట సదరు రుణం ఇచ్చిన బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థ ‘గ్రీవెన్స్ రీడ్రెస్సల్ అధికారి’కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి.బ్యాంక్కు ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోగా సరైన స్పందన రాకపోయినా లేదా వారు ఇచ్చిన పరిష్కారం సంతృప్తికరంగా లేకపోయినా రుణగ్రహీతలు నేరుగా ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ను ఆశ్రయించవచ్చు.ఆన్లైన్ (cms.rbi.org.in) ద్వారా కూడా సులభంగా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే సదరు ఆర్థిక సంస్థలపై ఆర్బీఐ జరిమానాలు విధిస్తుంది.తీవ్రమైన బెదిరింపులు, శారీరక దాడి లేదా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే చర్యలు ఎదురైనప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసే హక్కు రుణగ్రహీతకు ఉంటుంది.చివరగా..రుణం తీసుకున్నప్పుడు దానిని తిరిగి చెల్లించాల్సిన నైతిక, చట్టపరమైన బాధ్యత రుణగ్రహీతపై కచ్చితంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు బ్యాంకులను సంప్రదించి లోన్ రీస్ట్రక్చరింగ్ లేదా వాయిదాల పొడిగింపు వంటి ప్రత్యామ్నాయాలను కోరవచ్చు. అయితే, కేవలం డిఫాల్టర్ అయినంత మాత్రాన ఒక వ్యక్తి తన ఆత్మగౌరవాన్ని, ప్రాథమిక హక్కులను కోల్పోతాడని అర్థం కాదు. చట్టం పరిధిలోనే రికవరీ ప్రక్రియ జరగాలి. ఆర్థిక క్రమశిక్షణ ఎంత ముఖ్యమో, మన హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండటం కూడా అంతే ముఖ్యం.ఇదీ చదవండి: ఏఐ ఎందుకో వెనుకబడింది? -
విదేశీ ప్రయాణానికి సిబిల్ స్కోరు అడ్డొస్తుందా?
విదేశాలకు వెళ్లాలనేది చాలా మంది కల. అయితే వీసా ప్రక్రియ అనగానే డాక్యుమెంట్లు, ఇంటర్వ్యూలు, ముఖ్యంగా బ్యాంక్ బ్యాలెన్స్ వివరాల చుట్టూ ఎన్నో అనుమానాలు, భయాలు రేకెత్తుతుంటాయి. ఈ మధ్యకాలంలో చాలా మందిలో ఒక కొత్త సందేహం మొదలైంది. ‘నా సిబిల్ స్కోరు తక్కువగా ఉంది. దీనివల్ల నా వీసా రిజెక్ట్ అవుతుందా?’ అనే అనుమానం చాలా మందిలో ఉంది. నిపుణులు తెలుపుతున్న వివరాల ప్రకారం.. దీనికి సంబంధించిన అంశాలు కింద చూద్దాం.ఇమిగ్రేషన్ అధికారులకు ‘సిబిల్’తో పని ఉందా?మనం బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవాలన్నా, క్రెడిట్ కార్డులు కావాలన్నా సిబిల్ స్కోరు కీలకం. కానీ, విదేశీ రాయబార కార్యాలయాలు (ఎంబసీ) లేదా ఇమిగ్రేషన్ అధికారులు మీ వీసా దరఖాస్తును పరిశీలించేటప్పుడు మీ సిబిల్ రిపోర్టును లాగిన్ చేసి చూడరని గమనించాలి. భారతదేశంలో కానీ, అంతర్జాతీయంగా కానీ వీసా మంజూరు ప్రక్రియలో సిబిల్ స్కోరును ఒక ప్రామాణిక అర్హతగా ఎక్కడా చేర్చలేదు. అమెరికా, యూకే, కెనడా లేదా యూరప్ దేశాల వీసా నిబంధనల్లో సిబిల్ స్కోరు కనీసం ఇంత ఉండాలనే రూల్ ఎక్కడా లేదు.వీసా ఆఫీసర్లు అసలు ఏం చూస్తారు?విదేశీ రాయబార కార్యాలయాలు మీ క్రెడిట్ స్కోరును కాకుండా, మీ ఆర్థిక స్థిరత్వాన్ని, స్వదేశంతో ఉన్న అనుబంధాన్ని నిశితంగా పరిశీలిస్తాయి. వారి ప్రధాన ఉద్దేశాలు ఇవే..మీరు వెళ్తున్న దేశంలో ఖర్చులను మీరే భరించగలరా? (దీని కోసం గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు, ఐటీఆర్ కాపీలు, శాలరీ స్లిప్స్ చూస్తారు).మీ పర్యటన ముగిసిన తర్వాత తిరిగి మీ సొంత దేశానికి వచ్చేస్తారా లేదా అక్కడే ఉండిపోతారా? (దీని కోసం మీ ఉద్యోగ వివరాలు, వ్యాపారాలు, లేదా ఇక్కడున్న ఆస్తుల పత్రాలను తనిఖీ చేస్తారు).జాతీయ భద్రత, పౌరసత్వం లేదా అత్యంత సున్నితమైన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగే కొన్ని అరుదైన సందర్భాల్లో మినహా సాధారణ ట్రావెల్, స్టూడెంట్ లేదా బిజినెస్ వీసాల కోసం క్రెడిట్ స్కోరును స్క్రూటినీ చేయరు.క్రెడిట్ స్కోరు ఎప్పుడు ప్రభావం చూపుతుంది?డైరెక్ట్గా సిబిల్ స్కోరు అవసరం లేకపోయినా పరోక్షంగా కొన్ని సందర్భాల్లో ఇది మీకు అవసరపడవచ్చు.మీరు విదేశాల్లో చదువుకోవడానికి స్టూడెంట్ వీసా అప్లై చేస్తుండవచ్చు. దానికి ఫండ్స్ చూపించడానికి బ్యాంక్ లోన్ తీసుకోవాల్సి వస్తే బ్యాంకులు మీ సిబిల్ స్కోరు ఆధారంగానే లోన్ ఇస్తాయి. లోన్ శాంక్షన్ అయితేనే వీసాకు అవసరమైన ఫండ్స్ ప్రూఫ్ దొరుకుతుంది.మంచి క్రెడిట్ స్కోరు (750 కంటే ఎక్కువ) ఉన్నవారి బ్యాంక్ స్టేట్మెంట్లు సాధారణంగా క్లీన్గా ఉంటాయి. అనవసరపు బకాయిలు, బౌన్స్ అయిన ఈఎంఐలు లేకపోవడం వల్ల బ్యాంక్ అకౌంట్ హెల్తీగా కనిపిస్తుంది. వీసా అధికారులు మీ బ్యాంక్ స్టేట్మెంట్ను క్షుణ్ణంగా చూస్తారు కాబట్టి, క్లీన్ ఫైనాన్షియల్ హిస్టరీ మీకు ప్లస్ అవుతుంది.వీసా దరఖాస్తుదారులు చేయాల్సింది ఇదే..అప్పటికప్పుడు బంధువుల దగ్గరో, స్నేహితుల దగ్గరో పెద్ద మొత్తంలో డబ్బులు అకౌంట్లో వేయిస్తే వీసా అధికారులు అనుమానిస్తారు.మీ ఉద్యోగ నియామక పత్రం, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, గత 2-3 ఏళ్ల ఐటీ రిటర్న్స్ ఫైల్స్ అన్నీ పక్కాగా సిద్ధం చేసుకోండి.ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు ఎక్కడా తడబడకుండా మీ ప్రయాణ ఉద్దేశాన్ని స్పష్టంగా వివరించండి.మీ సిబిల్ స్కోరు 600 ఉన్నా, 800 ఉన్నా వీసా ఆఫీసర్కు అనవసరం. వారికి కావలసిందల్లా మీ దగ్గర ప్రయాణానికి తగినన్ని డబ్బులు ఉన్నాయా, మీరు చట్టబద్ధంగా ప్రయాణిస్తున్నారా, మీ పర్యటన ముగిశాక క్షేమంగా దేశం తిరిగి వస్తారా లేదా అనేది మాత్రమే. కాబట్టి అనవసరపు భయాలు వీడి, డాక్యుమెంటేషన్ను పక్కాగా సిద్ధం చేసుకోండి.ఇదీ చదవండి: బంగారం కొనాలా? వద్దా? -
ఈక్విటీ ఫండ్స్లోకి మళ్లీ పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటం తదితర అంశాల ఊతంతో జూన్లో ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో మదుపరులు భారీగా ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాది మే నెలలో నమోదైన రూ.22,908 కోట్లతో పోలిస్తే 26.5% అధికంగా రూ. 28,973 కోట్లు వచ్చాయి. నెలవారీ సిప్లు రూ. 30,954 కోట్ల నుంచి రూ.31,781 కోట్లకు ఎగిశాయి. దీనితో ఈ ఏడాది ప్రథమార్ధంలో ఈక్విటీ స్కీముల్లోకి రూ.1.81 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లయింది.2025 ప్రథమార్ధంలో నమోదైన రూ.1.61 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 12% అధికం. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం జూన్లో ఫండ్స్ నుంచి ఉపసంహరణలు రూ.64,131 కోట్ల నుంచి రూ.52,949 కోట్లకు తగ్గాయి. పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం మే నెలలో రూ. 81.6 లక్షల కోట్లుగా ఉండగా జూన్ ఆఖరు నాటికి రూ. 82,.22 లక్షల కోట్లకు పెరిగింది.మార్కెట్ సెంటిమెంటు మెరుగుపడటం, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయన్న ఆశావహ అంచనాలు నెలకొనడం, రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగించడంలాంటి అంశాలు ఇందుకు దోహదపడినట్లు మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మేష్రామ్ తెలిపారు. జూన్లో పెట్టుబడులు పెరగడాన్ని చూస్తే, మే నెలలో అమ్మకాలను తాత్కాలిక ధోరణిగా, వ్యూహాత్మక లాభాల స్వీకరణగా భావించవచ్చని పేర్కొన్నారు.యాంఫీ నివేదికలో మరిన్ని విశేషాలుఈక్విటీ కేటగిరీకి సంబంధించి మిడ్ క్యాప్ ఫండ్స్లోకి అత్యధికంగా రూ.6,090 కోట్లు, స్మాల్ క్యాప్స్లోకి రూ.5,602 కోట్లు, ఫ్లెక్సీ క్యాప్స్లోకి రూ.5,231 కోట్లు, లార్జ్ క్యాప్స్లోకి రూ.2,067 కోట్లు వచ్చాయి. డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్, ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల్లో (ఈఎల్ఎస్ఎస్) పెట్టుబడులను ఇన్వెస్టర్లు కొంత ఉపసంహరించుకున్నారు. గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో నికరంగా రూ.3,443 కోట్లు ఇన్వె స్ట్ చేశారు. మేలో ఈ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.725 కోట్లు వెనక్కి తీసుకున్నా రు. ఈ ఏడాది ప్రథమార్ధంలో గోల్డ్ ఈటీఎఫ్లలోకి రూ.37,319 కోట్లు వచ్చాయి. -
ఈసారి బంగారం, వెండి కాదు! కియోసాకి కొత్త సూచన
ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి, బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకుల నేపథ్యంలో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి చర్చనీయాంశంగా మారారు. అయితే ఈసారి ఆయన ఇన్వెస్టర్లకు బిట్కాయిన్, బంగారం లేదా వెండి కొనాలని కాకుండా.. ఒక పుస్తకం తప్పనిసరిగా చదవాలని సూచించడం విశేషం.ఇటీవల సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో చేసిన పోస్టులో మిక్కీ ఎం. మైనీ రచించిన 'ది ఎంట్రోపీ ట్రాప్' (The Entropy Trap) పుస్తకాన్ని ప్రస్తుత కాలంలో తప్పనిసరిగా చదవాల్సిన గ్రంథంగా పేర్కొన్నారు. ఈ పుస్తకానికి ప్రముఖ ఆర్థికవేత్త ‘జిమ్ రికార్డ్స్’ ముందుమాట రాశారని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రాబోయే నిర్మాణాత్మక మార్పులను అర్థం చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు.'నమ్మకంపై ఆధారపడిన ఆస్తులకు ప్రమాదం'ఈ పుస్తకం ప్రధానంగా "నమ్మకంపై ఆధారపడిన ఆస్తులు" (Trust-based Assets) భవిష్యత్తులో ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలపై చర్చిస్తుందని కియోసాకి తెలిపారు. అమెరికా ప్రభుత్వ బాండ్లు, ఈటీఎఫ్లు (ETFs), మ్యూచువల్ ఫండ్లు వంటి పెట్టుబడి సాధనాలు పూర్తిగా వ్యవస్థపై విశ్వాసంపై ఆధారపడి ఉన్నాయని, ఆ విశ్వాసం దెబ్బతింటే వాటి విలువ కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇవి కియోసాకి వ్యక్తిగత అభిప్రాయాలేనని, వాటికి స్వతంత్ర ఆర్థిక ఆధారాలు లేవని గుర్తుంచుకోవాలి.'నేటి ధనవంతులే రేపటి పేదలు కావచ్చు'పాత ఆర్థిక నియమాలను మాత్రమే నమ్ముతూ పెట్టుబడులు పెట్టేవారు భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న మార్పులను ముందుగానే అర్థం చేసుకునే వారే రేపటి సంపన్నులవుతారని కియోసాకి తన పోస్టులో పేర్కొన్నారు. "సమాచారమే అసలు సంపద" అనే సందేశాన్ని ఆయన మరోసారి నొక్కిచెప్పారు.కొద్ది రోజుల క్రితమే బంగారం ధరలపై తన స్వల్పకాలిక అంచనా తప్పిందని కియోసాకి బహిరంగంగా అంగీకరించారు. బంగారం ఇంకా పడిపోతోందని, మార్కెట్లలో ఇలాంటి హెచ్చుతగ్గులు సహజమేనని పేర్కొన్నారు. అయినప్పటికీ, వచ్చే ఐదేళ్లలో బంగారం ఔన్స్కు 35,000 డాలర్ల స్థాయికి చేరుతుందన్న తన దీర్ఘకాలిక అంచనాను మాత్రం మార్చలేదు.VIB: Very Important BOOK.Best most important new book for this time in history became available on Amazon last week.WHY: is book so important.?A: Because book explains why today’s Rich will become tomorrows poor.WHY: Because the informed will be tommorrow’s ULTRA…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 7, 2026 -
పసిడి రుణాలు టాప్
కోల్కతా: దేశీయంగా పసిడి రుణాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో, సెక్యూరిటైజేషన్ మార్కెట్లో వాహన రుణాల విభాగాన్ని బంగారం రుణాల విభాగం అధిగమించింది. క్రిసిల్ రేటింగ్స్ నివేదికలో ఇది వెల్లడైంది.క్యూ1లో సెక్యూరిటైజేషన్ పరిమాణంలో గోల్డ్ లోన్స్ వాటా 31 శాతంగా ఉండగా, వాహన రుణాల వాటా 26 శాతంగా నమోదైంది. మార్టిగేజ్ ఆధారిత సెక్యూరిటైజేషన్ పరిమాణం 12 శాతంగా, బిజినెస్ లోన్ సెక్యూరిటైజేషన్ 10 శాతంగా, మైక్రోఫైనాన్స్ రుణాలు 14 శాతంగా రికార్డయ్యాయి. ఆర్థిక సంస్థలు తామిచ్చిన రుణాలను పూలింగ్ చేసి ఇతర ఇన్వెస్టర్లకు విక్రయించి, తదుపరి మరిన్ని రుణాలివ్వడానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడాన్ని సెక్యూరిటైజేషన్గా వ్యవహరిస్తారు.ఇలాంటి ఇష్యూలు ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 22 శాతం పెరిగి రూ. 60,000 కోట్లకు చేరినట్లు క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. ఇందులో 98 శాతం ఇష్యూలను నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలే (ఎన్బీఎఫ్సీ) జారీ చేశాయి. గతంలో ఇందుకు భిన్నంగా సింహభాగం వాటా బ్యాంకులది ఉండేది. -
స్మాల్క్యాప్ల కొత్త ర్యాలీ.. మారుతున్న మార్కెట్ సైకిల్స్!
మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్లకు పెట్టుబడుల విషయంలో ఇటీవలి రాబడులే ప్రామాణికం. ఏ విభాగం ర్యాలీ చేస్తుంటే, అటు వైపే దూకుడుగా వెళుతుంటారు. కానీ, ఏ ఒక్క విభాగం కూడా నాన్స్టాప్గా అన్ని వేళలా ర్యాలీ చేయదన్న వాస్తవం ఎంత మందికి తెలుసు..?ఏడాది పాటు రాబడుల్లేక విసిగించిన స్మాల్క్యాప్ ఫండ్స్, మళ్లీ ఇటీవలి కాలంలో ర్యాలీతో అదరగొడుతున్నాయి. లార్జ్క్యాప్ కంటే అధిక రాబడులతో మురిపిస్తున్నాయి. ఏడాది కాలంలో 20 శాతానికి పైనే రాబడులు ఇచ్చిన స్మాల్క్యాఫ్ పథకాలు ఎన్నో. ఈ కాలంలో లార్జ్క్యాఫ్ ఫండ్స్ సానుకూల రాబడులతో సరిపెట్టాయి. ఇలా ఏడాది, రెండేళ్లు లేదా మూడేళ్ల కాల రాబడులను ఆధారంగా చేసుకుని పెట్టుబడులను మార్చుకుంటూ వెళ్లడం మంచి ధోరణి కాదన్నది నిపుణుల హెచ్చరిక.ఎందుకంటే ప్రతి కొన్నేళ్లకొకసారి లార్జ్క్యాప్, మిడ్క్యాప్-స్మాల్క్యాప్ మధ్య పనితీరులో ఈ మార్పులు సహజం. తమ పెట్టుబడుల లక్ష్యం, కాల వ్యవధి, ఎంత మేర రిస్క్ తీసుకోగలరు? వీటి ఆధారంగానే కేటాయింపులు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు సాధించగలరు. స్మాల్క్యాప్స్ ర్యాలీకి కారణాలు?2020 నుంచి 2024 మధ్యకాలంలో (కరోనా సమయంలో మార్కెట్ పతనం తర్వాత నుంచి) స్మాల్క్యాప్ స్టాక్స్ బ్రహ్మాండమైన ర్యాలీ చేశాయి. దీంతో వాటి విలువలు అసాధారణ స్థాయికి (గరిష్ట స్థాయికి) చేరిపోయాయి.ఫలితంగా 2025లో వీటిల్లో దిద్దుబాటు ఎక్కువగా కనిపించింది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను విక్రయించి లాభాలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు.ఈ పరిణామాలతో 2025లో చాలా స్మాల్క్యాప్ ఫండ్స్లో రాబడులు కాదు కదా నష్టాలు దర్శనమిచ్చాయి. కొన్నింటిలో లాభాలు నమోదైనా, అవి ఒక అంకెను మించలేదు.ఇన్వెస్టర్ల అమ్మకాలతో వీటి విలువలు ఆకర్షణీయ స్థాయిలకు దిగొ చ్చాయి. అప్పటివరకు ఉన్న అసాధారణ విలువలు ఆవిరయ్యాయి.దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టేవారు, సంస్థాగత ఇన్వెస్టర్లు క్రమంగా స్మాల్ స్టాక్స్లో కొనుగోళ్లు మొదలుపెట్టారు.చిన్న, మధ్యస్థాయి విభాగంలో కొన్ని రంగాల కంపెనీలు ఈ కాలంలోనూ పటిష్ట పనితీరుతో బలంగా నిలిచాయి. ముఖ్యంగా తయారీ, రక్షణ, క్యాపిటల్ గూడ్స్, రైల్వే, ఈఎంఎస్, ఇండ్రస్టియల్స్ కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్స్ తమ పెట్టుబడులను పెంచుకున్నాయి.ఇక ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో స్మాల్, మిడ్క్యాప్ స్టాక్స్ పథకాల్లోకి రూ.6–7 వేల కోట్లకు పైనే పెట్టుబడులు వచ్చాయి. దీంతో ఫండ్ మేనేజర్లు కరెక్షన్ సమయంలో నాణ్యమైన కంపెనీల్లో వాటాలు పెంచుకున్నారు.దీర్ఘకాలంలో ఇలా స్టాక్స్ విలువలు గరిష్టాలకు చేరడం, తర్వాత దిద్దుబాటుకు లోను కావడం.. అక్కడి నుంచి మళ్లీ ర్యాలీబాట పట్టడం ప్రతి 2–5 ఏళ్లకు ఒకసారి తప్పకుండా కనిపిస్తుంటుంది. అందుకే దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టేటప్పుడు ప్రతి విభాగానికి నిర్ణీత మొత్తాన్ని కేటాయించుకుని, స్థిరంగా కొనసాగించడం సంపద సృష్టికి కీలకం.ఐదేళ్లలో ఏం జరిగింది➤2020: కరోనా వైరస్ రాకతో రేపు ఏం జరుగుతోందన్న భయంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో బ్యాలెన్స్ షీట్ల పరంగా సున్నితంగా ఉండే స్మాల్క్యాప్ కంపెనీల షేర్ల ధరలు 40–80 శాతం మధ్య పడిపోయాయి. ➤2021: కరోనా విపత్తు నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఎన్నో ఉద్దీపన చర్యలను ప్రకటించాయి. దీంతో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఎలా పడ్డాయో అదే మాదిరి స్టాక్స్ మళ్లీ రికవరీ చూశాయి. దీంతో స్మాల్క్యాప్ ఫండ్స్ ఏడాది కాలంలోనే 50–80% రాబడులను అందించాయి. ➤2022: లిక్విడిటీ మితిమీరిపోవడంతో ఆర్బీఐ కీలక రేట్ల పెంపును మొదలు పెట్టింది. దీంతో లార్జ్క్యాప్ కంపెనీలు మెరుగైన ప్రదర్శన చేశాయి. లిక్విడిటీ తగ్గితే చిన్న కంపెనీలకు ఆకర్షణ తగ్గుతుంది.➤2023-24: తయారీ, మూలధన వ్యయాల బూమ్ మొదలైంది.రక్షణ, రైల్వే, ప్రభుత్వరంగ సంస్థలు, ఈఎంఎస్, ఇన్ఫ్రా స్టాక్స్ మంచి ర్యాలీ చేశాయి.మరోసారి స్మాల్క్యాప్ స్టాక్స్ లైమ్లైట్లోకి వచ్చాయి.ఇవన్నీ చూసి స్మాల్క్యాప్ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక కూడా గణనీయంగా పెరిగిపోయింది.స్మాల్క్యాప్ స్టాక్స్ పెరిగిపోవడంతో వాటి విలువలపై ఆందోళన మొదలైంది. నిపుణుల హెచ్చరికలు రావడం మొదలైంది.దీంతో దిద్దుబాటు చోటుచేసుకుంది. స్మాల్క్యాప్ స్టాక్స్ పడిపోవడం చూసి రిటైల్ ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. ఇది అమ్మకాలను మరింత పెంచింది.➤2026: ఆకర్షణీయమైన స్థాయిల నుంచి స్మాల్క్యాప్ స్టాక్స్లో రికవరీ మొదలైంది. పశ్చిమాసియా ఘర్షణలు తగ్గడం కలిసొచ్చింది.లార్జ్క్యాప్ కంటే స్మాల్క్యాప్ వైపే ఇన్వెస్టర్ల మొగ్గు కనిపించింది. దీంతో వాటి రాబడులు మెరుగయ్యాయి.ఇటీవలి మూడు నెలల కాలంలో వీటి రాబడులు సానుకూలంగా ఉండడం గమనించొచ్చు.ఇన్వెస్టర్ల కర్తవ్యం..2020: లార్జ్క్యాప్స్ ఆకర్షణీయం2021–24: స్మాల్క్యాప్స్ ర్యాలీ2025: వీటిల్లో దిద్దుబాటు2026: తిరిగి స్మాల్క్యాప్స్లో రికవరీఅందుకే ఇన్వెస్టర్లు ఏడాది కాలం పనితీరు ఆధారంగా ఫండ్స్ను ఎంపిక చేసుకోవడం సరికాదు.వివిధ మార్కెట్ సైకిల్స్లో స్థిరమైన పనితీరు, పోర్ట్ఫోలియో నాణ్యత, ఫండ్ మేనేజర్కు ఉన్న ట్రాక్ రికార్డు (పనితీరు చరిత్ర), రిస్క్, పెట్టుబడుల కాల వ్యవధి ఆధారంగా ఫండ్స్ను ఎంపిక చేసుకోవాలి. 7–10 ఏళ్ల కాలం అంతకుమించిన లక్ష్యాల కోసం సిప్ రూపంలో మెరుగైన స్మాల్క్యాప్ ఫండ్స్లో పెట్టుబడులతో సంపద సృష్టి సాధ్యమే.కొంచెం రాబడి తక్కువ అయినా ఫర్వాలేదు స్థిరత్వం కావాలని కోరుకునే వారు, లార్జ్క్యాప్ లేదా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ వెంట వెళ్లొచ్చు.లార్జ్క్యాప్లో బలహీనత ఎందుకు?లార్జ్క్యాప్ ఫండ్స్ ప్రధానంగా నిఫ్టీ 50, సెన్సెక్స్ కంపెనీల్లోనే పెట్టుబడులు పెడతాయి.ఈ ప్రధాన సూచీల్లో ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలకు వెయిటేజీ ఎక్కువగా ఉంది.ఏఐ రాకతో ఐటీ కంపెనీల భవిష్యత్పై అనిశ్చితి నెలకొంది. పశ్చిమాసియా సంక్షోభంతో ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ వైపు ఇన్వెస్టర్లు ముఖం చాటేశారు.వీటిల్లో చాలా స్టాక్స్లో సంస్థాగత ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం ఇప్పటికే గణనీయంగా ఉంది. ఈ పరిణామాలతో లార్జ్క్యాప్ ఫండ్స్ రాబడులు పరిమితంగానే ఉన్నాయి.వచ్చే రెండేళ్లలో.. ఆదాయాల్లో అదే జోరు..కంపెనీల ఆదాయాలు, నిర్వహణ లాభాలు ఇక ముందూ బలంగానే వృద్ధి చెందితే స్మాల్క్యాప్ ఫండ్స్ మెరుగైన ప్రదర్శన కొనసాగుతుంది.రాబడులు మాత్రం 2021–24 మధ్య కాలంలో వచ్చినంత స్థాయిలో ఉండవు. మోస్తరు డబుల్ డిజిట్ రాబడులు (12–16 శాతం) ఉండొచ్చన్నది నిపుణుల అంచనా.అంతర్జాతీయంగా అనిశ్చితులు పెరిగితే..యూఎస్లో వడ్డీ రేట్లు గరిష్టాల్లో కొనసాగడం, ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతూ వెళ్లడం, భౌగోళిక రాజకీయ ఘర్షణలు, వృద్ధి బలహీనత కొనసాగితే స్మాల్క్యాప్నకు సానుకూలం కాదు.ఇన్వెస్టర్లు స్మాల్క్యాప్ నుంచి భద్రత కోసం లార్జ్క్యాప్ స్టాక్స్ వైపు మళ్లొచ్చు. అనిశ్చితుల్లో సంస్థాగత ఇన్వెస్టర్లు బ్లూచిప్ కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తుంటారు. దాంతో లార్జ్క్యాప్ ఫండ్స్లో ర్యాలీ చూడొచ్చు.ఎంపిక చేసిన కంపెనీల్లో ర్యాలీ..ఇలాంటి పరిస్థితుల్లో ఫండ్ మేనేజర్లు ఎంపిక చేసిన కంపెనీలకే పెట్టుబడుల పరంగా ప్రాధాన్యం ఇస్తుంటారు.బలమైన క్యాష్ ఫ్లో, తక్కువ రుణ భారం, ఆదాయం, లాభాల్లో స్థిరమైన వృద్ధి, వ్యాల్యుయేషన్స్ సహేతుక స్థాయిలో ఉన్న వాటివైపు మొగ్గుచూపిస్తారు.దీంతో స్మాల్క్యాప్లోనే కొన్ని ఫండ్స్ మెరుగైన రాబడులు ఇస్తే, కొన్ని ఢీలాపడొచ్చు. -
ITR ఫైలింగ్కు మూడు మార్గాలు!
ఈ నెలాఖరులోపల మీరందరూ మీ మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయాలి. అంటే గడువు తేదీ 2026 జూలై 31. ఆన్లైన్లో వేయాలంటే ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల లోపల ఫైల్ చేయాలి.గతంలో ఎన్నోసార్లు రిటర్ను వేయడానికి కావాల్సిన సమాచారం గురించి, కాగితాలు-డాక్యుమెంట్ల ఆవశ్యకత గురించి మనం తెలుసుకున్నాం. రంగంలోకి దిగే ముందు మీకు మూడు ఆప్షన్లు ఉంటాయి. అవేంటంటే..మొదటిది.. మీ రిటర్ను మీరే దాఖలు చేసుకోవచ్చు. మీ కేసు ట్యాక్స్ ఆడిట్ కాకపోతే మీ వ్యవహారాలకు ఎటువంటి ఆడిట్ అక్కర్లేదు. ఆడిట్ రిపోర్టు ప్రశ్న ఉండదు. పాత చట్టం ప్రకారం ఫారం 16, 16ఏ, ఫారం 26ఏఎస్ .. మొదలైన క్యాపిటల్ గెయిన్స్ స్టేట్మెంట్, ఇతర సర్టిఫికెట్లు, రెడీగా పెట్టుకోండి. కరెక్ట్ ఫారం ఎంచుకోండి. లాగిన్ అవ్వండి. ఇది ప్రీ-ఫిల్డ్ ఫారం. మీరు ఓపెన్ చేయగానే ‘సమాచారం’ అప్పటికే నింపి ఉంటుంది. అది కరెక్ట్ అయితే ఓకే.. లేదా విభేదించి కరెక్టు సమాచారం నింపుతూ వెళ్లండి. రిటర్న్ ఫైలింగ్ సాఫీగా జరిగిపోవచ్చు. మీకు ఖర్చులేమీ ఉండవు. అంతా మీ చేతిలోనే.. ఫారం 1 వరకు ఫర్వాలేదు.రెండోది. ఇన్కంట్యాక్స్ ప్రాక్టీషనర్ల దగ్గరికి వెళ్తే వారు మీ తరఫున పోర్టల్లోకి వెళ్లి, లాగిన్ చేసి, మీరు చేయవలసినవన్నీ చకచకా చేసేస్తారు. ఫీజులు తక్కువగా ఉంటాయి. ఫారం 1, ఫారం 2 వరకు బాగానే ఫైలింగ్ చేస్తారు.మూడో కేటగిరీ.. వృత్తి నిపుణులు.. అంటే.. సీఏలు, కాస్ట్ అకౌంటెంట్లు, కొంత మంది కంపెనీ సెక్రటరీలు, సీనియర్ లాయర్లు.. వీరు కూడా మీ తరఫున మీ ఆదాయపు పన్ను రిటర్నులు వేస్తారు. వీరికి సబ్జెక్టు మీద పట్టు, ప్రతిభా పాటవాలు, అనుభవం, అవగాహన విశ్లేషణ సామర్థ్యాలు విశేషంగా ఉంటాయి. ఉన్న నాలుగు అంకెలను నాలుగు కాలమ్లలో వేసి, మమ అనిపించి ఒక అక్నాలెడ్జ్మెంట్ తేవడమనేది రిటర్ను వేయడం కాదు.. ఓ కాగితాన్ని డిపార్ట్మెంటు వారికి ఇచ్చి ‘అయ్యింది’ అని చేతులు దులుపుకోవడం కాదు.ముందుగా ఆదాయం ఏమిటో తెలుసుకోవాలి. ప్రతి రశీదు/జమ ఆదాయం కిందికి రాదు. దాన్ని విశ్లేషణ చేయాలి. ఉదాహరణకు: వచ్చిన రసీదు వ్యాపారపరమా – ఇతర సోర్స్ ద్వారా వచ్చిందా? పాత చట్టం ప్రకారం 26ఏఎస్లో ప్రతి అంశం, ఏఐఎస్లోని ప్రతి అంశం, వీటిని మీ మీ ఆదాయంతో చెక్ చేయాలి. ఒకదానితో ఒకటి సమన్వయం చేయాలి. అప్పు అని నిర్ధారించినా దాని గత చరిత్ర తోడి, నిజానిజాలు తేల్చాలి. పన్నుకి గురి కాని రశీదు, జమ కావొచ్చు. ఉదాహరణకు ప్రావిడెంట్ ఫండ్ క్రెడిట్, జీతాల ఎరియర్స్ అయితే గత సంవత్సరాలు వెనక్కి వెళ్లి, పాత ఆదాయం ఎంత, ఎరియర్స్ ఎంత .. మారిన ఆదాయం ఎంత, పన్ను భారం ఎంత.. చివరికి రిలీఫ్ ఎంత అనేది తేల్చాలి.రెండు.. మూడు లేదా.. అంతకు మించి ఇంటి ప్రాపర్టీలు ఉంటే పెద్ద చిట్టా తయారవుతుంది. ప్రతి ప్రాపర్టీ విషయంలో అంశాలు ఒకే విధంగా ఉండవు. అన్నింటినీ క్రోడీకరించి, సమీకరించాలి. అలాగే క్యాపిటల్ గెయిన్స్.. కొన్న ధర, ఇంప్రూవ్మెంట్ ధర ప్రతీ ఏటా మారే ఇండెక్స్ రేటు.. వ్యవహారంలో మొత్తం నగదు లేకుండా జాగ్రత్త పడటం.. స్టాంప్ పేపర్లు దస్తావేజులు, టైటిల్, ఈ-సీల్, బ్యాంకు లోన్ డాక్యుమెంట్లు.. ఇలా సవాలక్ష.. వీటన్నింటిని విశ్లేషించాలి.విదేశీ ఆస్తులు.. విదేశీ ఆదాయం..ఉద్యోగస్తులకు ఇచ్చే షేర్లు, ఆప్షన్లు, ఎసాప్లు, వాటి అమ్మకం, విలువ, లాభం.. ఇతర అంశాలు ఇవన్నీ తెలుసుకుని, తేల్చి, రిటర్ను వేసిన తర్వాత నోటీసులు రావచ్చు. నోటీసులు, జవాబులు, దిద్దుబాటు, సర్దుబాటు.. అధికారులతో మాట్లాడి లేదా ఆన్లైన్లో సంప్రదించి సరైన జవాబు ఇవ్వడం, నొప్పించక ఒప్పించి, మెప్పించే ప్రయత్నం .. ఇలా ఎన్నో అంశాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలి. స్క్రూటినీ దాకా బండి వెళ్లొచ్చు. వీటికి డాక్యుమెంట్లు ముఖ్యం. చట్టం తెలిసి ఉండాలి. అధికారులను కలిసి మాట్లాడాలి.అయితే, వృత్తి నిపుణుల సర్వీసులు పొందడానికి ఎక్కువ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారం.. అంటే ప్రాసెస్ ప్రకారం వెళ్లండి. కప్పదాట్లు ఉండవు. షార్ట్కట్లు, లాంగ్జంప్లు.. హై జంపులు ఉండవు. అన్ని వ్యవహారాల్లోలాగే కాగితాల్లోని అంకెల మేరకే అడుగువేస్తారు. ఆ సర్వీసుల్లో కన్సల్టెన్సీ, ముందు జాగ్రత్తగా ట్యాక్స్ ప్లానింగ్ ఆలోచనలు, సలహాలు ఇలా ఎన్నో ఉంటాయి.. ఏది చేసినా చట్టప్రకారం చేస్తారు. ఏ చర్య అయినా చట్టానికి లోబడే ఉంటుంది. వడ్డీలు లేకుండా, పెనాల్టీలు లేకుండా ముందు జాగ్రత్త తీసుకుంటారు. ఇప్పుడు మీ ఇష్టం. నిర్ణయం మీదే. ఎలా చేసినా.. చట్టప్రకారంగానే ఉండాలని గుర్తుంచుకోవాలి.ట్యాక్సేషన్ నిపుణులు: డా. కందాళ సత్యనారాయణ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య -
ఇంటి రుణానికి తొందరగా ఇడుపు కాయితం!.. ఇదో మార్గం
ఇంటి రుణం తీసుకోవడం చాలా మంది జీవితాల్లో అతిపెద్ద ఆర్థిక బాధ్యతల్లో ఒకటి. 15 నుంచి 30 ఏళ్ల వరకు కొనసాగే ఈఎంఐలు కుటుంబ బడ్జెట్పై గణనీయమైన ప్రభావం చూపుతాయి. అయితే రుణాన్ని ముందుగానే తీర్చేందుకు ప్రీపేమెంట్లు చేయడం మాత్రమే మార్గం కాదు. ప్రస్తుతం అనేక బ్యాంకులు అందిస్తున్న ‘ఓవర్డ్రాఫ్ట్ (OD) లింక్డ్ హోమ్ లోన్’ సదుపాయం కూడా వడ్డీ భారం తగ్గించడంలో సహాయపడుతోంది.ఇలా పని చేస్తుంది..ఈ విధానంలో గృహ రుణాన్ని ఒక పొదుపు లేదా కరెంట్ ఖాతాతో అనుసంధానిస్తారు. రుణగ్రహీత తన వద్ద ఉన్న అదనపు నిధులను ఆ ఖాతాలో ఉంచితే, బ్యాంకు వడ్డీని మొత్తం బకాయి రుణంపై కాకుండా నికర బకాయి మొత్తంపై లెక్కిస్తుంది. ఉదాహరణకు రూ.40 లక్షల రుణ బకాయిపై లింక్డ్ ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే, వడ్డీని రూ.35 లక్షలపైనే లెక్కించే అవకాశం ఉంటుంది. దీంతో ప్రతి ఈఎంఐలో వడ్డీ భాగం తగ్గి, అసలు రుణం చెల్లింపునకు ఎక్కువ మొత్తం వెళ్తుంది.ఈ సదుపాయంలోని ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, ప్రీపేమెంట్ చేసినట్లుగా డబ్బు శాశ్వతంగా లాక్ అయిపోదు. అత్యవసర పరిస్థితుల్లో లేదా ఇతర అవసరాల కోసం ఆ అదనపు నిధులను తిరిగి ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంటుంది. అందువల్ల వ్యాపారులు, ఫ్రీలాన్సర్లు, బోనస్లు లేదా ప్రోత్సాహకాలు పొందే ఉద్యోగులు ఈ విధానాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు.అందరికీ సరిపోతుందా?నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఓవర్డ్రాఫ్ట్ హోమ్ లోన్ వల్ల కేవలం వడ్డీ పొదుపు మాత్రమే కాదు, రుణ కాలపరిమితి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసలు రుణ మొత్తం వేగంగా తగ్గుతుంది. అయితే ఇది ప్రతి ఒక్కరికీ సరిపోదు. నెలాఖరుకు మిగులు నిధులు లేకుండా మొత్తం ఆదాయాన్ని ఖర్చు చేసే వారికి ఈ ఫీచర్ పెద్దగా ఉపయోగపడదు.అయితే రుణగ్రహీతలు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొన్ని బ్యాంకులు ఓవర్డ్రాఫ్ట్ హోమ్ లోన్లపై సాధారణ గృహ రుణాలతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువ వడ్డీ రేట్లు వసూలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సదుపాయాన్ని ఎంచుకునే ముందు వడ్డీ రేట్లు, ఛార్జీలు, ఉపసంహరణ నిబంధనలు, దీర్ఘకాలిక ప్రయోజనాలను సమగ్రంగా పరిశీలించడం అవసరం.మొత్తానికి, అత్యవసర నిధులను అందుబాటులో ఉంచుకుంటూనే గృహ రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించాలని భావించే వారికి ఓవర్డ్రాఫ్ట్ లింక్డ్ హోమ్ లోన్ ఒక తెలివైన ఆర్థిక సాధనంగా మారవచ్చు. -
‘రిచ్ డాడ్’ జీవితాన్ని మార్చిన భారతీయ గురువు
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చదివే వర్సనల్ ఫైనాన్స్ పుస్తకాలలో ఒకటైన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి తన ఆలోచనలతో చర్చనీయాంశంగా మారారు. డబ్బు సంపాదించడమే జీవిత పరమావధి కాదని, ప్రతి వ్యక్తి తన జీవితం అసలు ఉద్దేశాన్ని గుర్తించి దాని కోసం పనిచేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో చేసిన పోస్టు వైరల్గా మారింది.కొన్నేళ్ల క్రితం ఓ భారతీయ గురువు చెప్పిన మాట తన జీవితాన్ని పూర్తిగా మార్చిందని కియోసాకి వెల్లడించారు. "మీ శరీరం లక్ష్యం.. మీ ఆత్మ లక్ష్యాన్ని నెరవేర్చడమే" అనే ఆ బోధ అప్పట్లో తనకు పూర్తిగా అర్థం కాలేదని, ఆ సమయంలో తాను కేవలం డబ్బు సంపాదించడంలోనే నిమగ్నమై ఉన్నానని పేర్కొన్నారు. అయితే కాలక్రమేణా తన నిజమైన లక్ష్యం బోధించడమేనని గ్రహించినట్లు చెప్పారు.విద్యార్థి దశలో చదువులో అంతగా రాణించకపోయినా, సాంప్రదాయ విద్యా విధానం తనకు నచ్చకపోయినా, ప్రజలకు ఆర్థిక విజ్ఞానాన్ని అందించడం తన జీవిత ధ్యేయంగా మారిందని కియోసాకి వివరించారు. పాఠశాలల్లో డబ్బు నిర్వహణ గురించి సరైన అవగాహన కల్పించడం లేదనే నమ్మకంతో ఐదు దశాబ్దాల క్రితమే తయారీ రంగాన్ని విడిచి, తన "రిచ్ డాడ్" నుంచి నేర్చుకున్న ఆర్థిక పాఠాలను ప్రజలకు బోధించడం ప్రారంభించానని చెప్పారు. అదే నిర్ణయం తన జీవితాన్ని మార్చిందని పేర్కొన్నారు.చాలామంది జీవితమంతా ఉద్యోగం, సంపాదన, ఆర్థిక ఒత్తిళ్లలోనే గడిపేస్తున్నారని, అందువల్ల తమ అసలు జీవిత లక్ష్యాన్ని గుర్తించలేకపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. "మానవాళికి సేవ చేయడానికి నా హృదయం ఏమి చేయాలనుకుంటోంది?" అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాలని, ఫలితం లేదా డబ్బు గురించి ఆలోచించకుండా ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఆయన ప్రకారం, నిజమైన లక్ష్యంతో చేసే పని చివరికి ఆర్థిక విజయాన్నీ తీసుకువస్తుంది.ప్రారంభంలో తాను ఉచితంగా ఆర్థిక విద్య అందించానని, "పొదుపుదారులు ఓడిపోతారు", "సరైన రుణం సంపదను సృష్టించగలదు" వంటి తన అభిప్రాయాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నానని కియోసాకి గుర్తు చేశారు. అయినప్పటికీ అదే ప్రయత్నం తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోట్ల డాలర్ల వ్యాపారంగా ఎదిగిందని తెలిపారు.అమెరికా పౌరహక్కుల ఉద్యమ నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మాటలను కూడా కియోసాకి ప్రస్తావించారు. విమర్శలు, వ్యతిరేకత ఎదురైనా తన లక్ష్యాన్ని వదిలిపెట్టని కింగ్ను ఉదాహరణగా చూపిస్తూ, చివరగా "మీ ఆత్మ అసలు లక్ష్యం ఏమిటి?" అంటూ తన ఫాలోవర్లకు ప్రశ్న వేశారు.What is your life’s mission?Years ago, I was listening to an Indian Guru who said:“Your body’s mission is to fulfill your spirit’s mission.” His words shook me. At the time my body was busy making money.It took me a long time to figure out what was my spirit’s mission?…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 1, 2026 -
‘కొత్త EPF స్కీమ్’ అమల్లోకి.. ఏమి మారిందంటే..
‘సామాజిక భద్రత కోడ్-2020’ అమలులో భాగంగా ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) స్కీమ్-2026’ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేసింది. జూన్ 29న గెజిట్లో ప్రచురితమైన ఈ కొత్త నిబంధనలు అదే తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో దాదాపు ఏడు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ‘ఈపీఎఫ్ స్కీమ్-1952’ స్థానంలో కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అయితే ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలు, కంట్రిబ్యూషన్ రేట్లు, యూఏఎన్ వంటి కీలక అంశాల్లో ఎలాంటి మార్పులు చేయకుండా, పరిపాలనను మరింత డిజిటల్, పారదర్శకంగా మార్చడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది.కంట్రిబ్యూషన్లో మార్పు లేదుకొత్త ఈపీఎఫ్ స్కీమ్ అమల్లోకి వచ్చినప్పటికీ ఉద్యోగి, యజమాని(కంపెనీ) చెల్లించే తప్పనిసరి పీఎఫ్ చందా యథాతథంగానే ఉంటుంది. ఉద్యోగి వేతనంలో 12 శాతం, యజమాని నుంచి మరో 12 శాతం చొప్పున పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నోటిఫై చేసిన కొన్ని సంస్థలకు ప్రస్తుతం అమల్లో ఉన్న 10 శాతం కంట్రిబ్యూషన్ విధానమే కొనసాగుతుంది. అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న రూ.15,000 వేతన పరిమితి (వేజ్ సీలింగ్)లో కూడా ఎలాంటి మార్పు చేయలేదు.వాలంటరీ పీఎఫ్కు కొనసాగింపుచట్టబద్ధంగా నిర్దేశించిన పీఎఫ్ చందాకు అదనంగా ఉద్యోగులు స్వచ్ఛందంగా ‘వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్’ (VPF)లో మరింత మొత్తం జమ చేసే అవకాశం కొనసాగుతుంది. దీంతో ఎక్కువ పొదుపు చేయాలనుకునే ఉద్యోగులకు కొత్త స్కీమ్ కూడా అదే వెసులుబాటు కల్పించింది.పాక్షిక ఉపసంహరణలపై స్పష్టతవైద్య చికిత్స, ఉన్నత విద్య, వివాహం, గృహ నిర్మాణం, ఇతర అత్యవసర అవసరాల కోసం పీఎఫ్ నుంచి పాక్షికంగా డబ్బు ఉపసంహరించుకునే నిబంధనలను కొత్త స్కీమ్ మరింత స్పష్టంగా పేర్కొంది. అయితే కనీస బ్యాలెన్స్, సభ్యత్వ కాలం వంటి నిర్దిష్ట అర్హతలను పాటించాల్సి ఉంటుంది.డిజిటల్ సేవలకు పెద్దపీటఈపీఎఫ్ నిర్వహణలో డిజిటల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కొత్త స్కీమ్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇకపై ఎలక్ట్రానిక్ ఫైలింగ్స్, ఆన్లైన్ క్లెయిమ్స్, ఈ-పాస్బుక్, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఆధారిత సేవలకు ప్రాధాన్యం పెరుగుతుంది. దీంతో క్లెయిమ్ల పరిష్కారం వేగవంతం కావడంతో పాటు పారదర్శకత కూడా మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.కేంద్రానికి ప్రత్యేక అధికారంమహమ్మారులు, అంటువ్యాధులు లేదా జాతీయ విపత్తుల వంటి అసాధారణ పరిస్థితుల్లో ఈపీఎఫ్ చందా రేటును తాత్కాలికంగా తగ్గించడం లేదా వాయిదా వేయడానికి కేంద్ర ప్రభుత్వానికి కొత్త స్కీమ్ ప్రత్యేక అధికారం కల్పించింది. అవసరమైన సందర్భాల్లో ఉద్యోగులు, సంస్థలకు ఉపశమనం కల్పించడమే దీని ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.పీఎఫ్ ట్రస్టులకు కఠిన నిబంధనలుసొంతంగా ‘ఎగ్జెంప్టెడ్ పీఎఫ్ ట్రస్టులు’ నిర్వహించే కంపెనీలపై కొత్త స్కీమ్ మరింత కఠినమైన పాలనా నిబంధనలను అమలు చేసింది. ట్రస్టీల అర్హతలు, ఎలక్ట్రానిక్ అకౌంటింగ్, వార్షిక ఆడిట్లు, ఆన్లైన్ డిస్క్లోజర్లు వంటి అంశాలను తప్పనిసరి చేసింది. దీంతో సభ్యుల నిధుల నిర్వహణలో జవాబుదారీతనం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.ప్రస్తుత సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేదుఇప్పటికే ఈపీఎఫ్ సభ్యులుగా ఉన్నవారంతా ఆటోమేటిక్గా ‘ఈపీఎఫ్ స్కీమ్-2026’ పరిధిలోకి వస్తారు. వారి పీఎఫ్ బ్యాలెన్స్, ఇప్పటికే కూడబెట్టుకున్న నిధులు, సభ్యత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదు. కొత్తగా అర్హత పొందే ఉద్యోగులు కూడా ఇదే స్కీమ్ కింద నమోదు అవుతారు.యూఏఎన్ యథాతథంప్రతి సభ్యుడికి కేటాయించే ‘యూనివర్సల్ అకౌంట్ నంబర్’ (UAN)లో ఎలాంటి మార్పు లేదు. ఉద్యోగులు సంస్థలు మారినా అదే యూఏఎన్ కొనసాగుతుంది. దీంతో పీఎఫ్ ఖాతా బదిలీలు, సేవా నిరంతరత సులభంగా కొనసాగుతాయి.ఇదీ చదవండి: SBI యోనో యాప్లో కొత్తగా ఏఐ ఫీచర్లుకొత్త ఈపీఎఫ్ స్కీమ్ వల్ల ఉద్యోగుల నెలవారీ పీఎఫ్ కట్, వడ్డీ రేటు లేదా ఇప్పటికే కూడబెట్టుకున్న పీఎఫ్ నిధులపై తక్షణ ప్రభావం ఉండదు. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం ‘సామాజిక భద్రత కోడ్-2020’కు అనుగుణంగా ఈపీఎఫ్ వ్యవస్థను ఆధునికీకరించడం, డిజిటల్ సేవలను విస్తరించడం, పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చడం మాత్రమే.ఇది చదివారా? ఆధార్, క్రెడిట్ కార్డులు.. జూలై 1 నుంచి కీలక మార్పులు -
SBI యోనో యాప్లో కొత్తగా ఏఐ ఫీచర్లు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ 71వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రిటైల్, బిజినెస్ కస్టమర్ల కోసం పలు ఏఐ ఆధారిత డిజిటల్ ఆవిష్కరణలను ప్రవేశపెట్టింది. యోనో ప్లాట్ఫాంలో సేవలను మరింతగా విస్తరించింది. కొత్త కస్టమర్లు ఇప్పుడు 3–ఇన్–1 డిజిటల్ ఆన్బోర్డింగ్ ప్రక్రియ ద్వారా పొదుపు ఖాతాతో పాటు ఎస్బీఐక్యాప్ సెక్యూరిటీస్లో డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా కూడా తెరవచ్చు.అర్హత కలిగిన కస్టమర్లు తమ సేవింగ్స్ అకౌంటును కార్పొరేట్ శాలరీ అకౌంటుగా మార్చుకోవచ్చు. అలాగే వ్యాపార వర్గాల కోసం ట్రేడ్ ఫైనాన్స్ సాధనాలన్నింటిని యోనో బిజినెస్లో అనుసంధించడం ద్వారా ఈ–ట్రేడ్ సేవలను విస్తరించినట్లు బ్యాంకు తెలిపింది. యోనో బిజినెస్ వెబ్, మొబైల్ ప్లాట్ఫాంలలో ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉండేలా ఏజెంటిక్ ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ ’యోనో జీ’ని బ్యాంకు ప్రవేశపెట్టింది.కృత్రిమ మేథ, డిజిటల్ ఆవిష్కరణలు, డేటా ఆధారిత విశ్లేషణలతో కస్టమర్లకు మరింత మెరుగైన సేవలందించాలన్న తమ లక్ష్యానికి ఇవి నిదర్శనమని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ఎస్బీఐకి 53 కోట్ల పైగా కస్టమర్లు ఉండగా, వారిలో 10 కోట్ల మంది యోనో యూజర్లు ఉన్నారు. -
కాలంతో ప్రయాణం.. క్రమశిక్షణతో లాభం!
షేర్ మార్కెట్లో అసాధారణ లాభాల కోసం వెంపర్లాడటం కంటే క్రమశిక్షణతో కూడిన సాధారణ పెట్టుబడి సూత్రాలను పాటించడమే సంపద సృష్టికి అసలైన రహస్యమని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ స్పష్టం చేశారు. చాలా మంది పెట్టుబడిదారులు విస్మరించే ఈ సరళమైన ఆర్థిక సూత్రాన్ని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పంచుకున్నారు. ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సంక్లిష్టమైన వ్యూహాలు లేదా నిరంతరం స్టాక్స్ మార్చడం వంటివి అవసరం లేదన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికే ఉత్తమ ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఆయన పంచుకున్న కొన్ని అంశాలను కింద చూద్దాం.నితిన్ కామత్ పెట్టుబడి ఫార్ములా..మీ ఆర్థిక లక్ష్యం, కాలపరిమితిని బట్టి ఈక్విటీ, డెట్, గోల్డ్ వంటి విభాగాల్లో సరైన నిష్పత్తిలో పెట్టుబడి పెట్టాలి.విడివిడిగా స్టాక్స్ ఎంచుకుంటూ రిస్క్ తీసుకునే బదులు తక్కువ ఖర్చుతో కూడిన ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లను ఎంచుకోవడం ఉత్తమం.మార్కెట్ హెచ్చుతగ్గులను పట్టించుకోకుండా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలి.ఆదాయం పెరిగే కొద్దీ పెట్టుబడి పెట్టే మొత్తాన్ని కూడా క్రమంగా పెంచుకుంటూ పోవాలి.నిర్ణీత కాల వ్యవధిలో మీ పోర్ట్ఫోలియోను రీబ్యాలెన్స్ చేసుకోవడం ముఖ్యం.ఇది వినడానికి చాలా సరళంగా అనిపించవచ్చు, కానీ ఆచరణలో పెట్టడం అంత సులభం కాదు. చాలా మంది ఇక్కడే విఫలమవుతుంటారని నితిన్ కామత్ అన్నారు.ఇన్వెస్టర్ల గందరగోళం.. మార్కెట్ సంక్లిష్టతసాధారణ ఇన్వెస్టర్లు పోర్ట్ఫోలియో నిర్మాణంలో ఎదుర్కొనే ప్రధాన సవాళ్లను కామత్ ప్రస్తావించారు.ఈక్విటీల్లో ఎంత ఉంచాలి?డెట్ (రుణం) విభాగంలో ఎంత పెట్టుబడి పెట్టాలి?బంగారం ఎంత శాతం ఉండాలి?లక్ష్యాలు దగ్గరపడుతున్నప్పుడు ఆస్తి కేటాయింపులను ఎలా మార్చాలి?ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇన్వెస్టర్లను వేధిస్తుంటాయి. వీటికి తోడు మార్కెట్లో వందలాది మ్యూచువల్ ఫండ్లు, ఈటీఎఫ్లు అందుబాటులో ఉండటంతో గందరగోళం మరింత పెరుగుతుంది. ఈ సంక్లిష్టత కారణంగానే చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్ వైపు రాకుండా తక్కువ రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లు, సాంప్రదాయక బీమా పథకాల వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన విశ్లేషించారు.పరిష్కారంగా లైఫ్ సైకిల్ ఫండ్స్ఈ సవాళ్లకు, గందరగోళానికి చెక్ పెట్టేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇటీవల భారతదేశంలో ‘లైఫ్ సైకిల్ ఫండ్స్’ను ప్రవేశపెట్టింది. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి నిర్ణయాలను ఆటోమేట్ చేయడం ద్వారా ఈ ఫండ్స్ మెరుగైన పరిష్కారాన్ని అందిస్తాయని కామత్ అభిప్రాయపడ్డారు.ఇవి ఎలా పనిచేస్తాయి?ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యానికి (ఉదాహరణకు రిటైర్మెంట్ లేదా పిల్లల చదువు) సరిపోయే కాలపరిమితి గల ఫండ్ను ఎంచుకుంటే సరిపోతుంది. మిగతా బాధ్యత అంతా ఆ ఫండే చూసుకుంటుంది. ప్రారంభంలో (వయసు లేదా కాలపరిమితి ఎక్కువగా ఉన్నప్పుడు) ఈక్విటీల్లో ఎక్కువ పెట్టుబడి పెడుతూ లక్ష్యం దగ్గరపడే కొద్దీ రిస్క్ తగ్గించడం కోసం క్రమంగా డెట్ (రుణ) విభాగానికి పెట్టుబడులను మళ్లిస్తుంది. ఈ విధానం వల్ల ఇన్వెస్టర్ల వయస్సు, రిస్క్ ప్రొఫైల్కు అనుగుణంగా పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్ అవుతుంది. -
కరుగుతోన్న పసిడి కాంతులకు కారణాలు ఇవే..
గడిచిన కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలకు చేరుకుంటూ సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు, ఇటీవల అనూహ్యంగా కిందికి దిగివస్తున్నాయి. ఈ రోజు (జూన్ 30, 2026) హైదరాబాద్తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు సుమారు రూ.1,40,000 మార్కు వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర సుమారు రూ.1,29,000 స్థాయికి దిగివచ్చింది. గత వారంతో పోలిస్తే ఇది భారీ పతనమనే చెప్పాలి. ఈ ఆకస్మిక మార్పునకు గల ఆర్థిక కారణాలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, భవిష్యత్తులో బంగారంపై రాబడులు అందుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై విశ్లేషణాత్మక కథనం మీకోసం.ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలుపసిడి మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తే ప్రస్తుతం మూడు ప్రధానాంశాలు ఈ పతనానికి కారణమవుతున్నట్లు స్పష్టమవుతోంది.1. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వైఖరిఅమెరికా కేంద్రీయ బ్యాంక్ (యూఎస్ ఫెడరల్ రిజర్వ్) వడ్డీ రేట్లను తగ్గిస్తుందని ఈ ఏడాది ఆరంభంలో అంచనా వేసినప్పటికీ తాజా పాలసీ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపును 2027కు వాయిదా వేసింది. అంతేకాకుండా, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చనే సంకేతాలు ఇచ్చింది. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్లు, ఇతర స్థిర ఆదాయ వనరులపై రాబడి పెరుగుతుంది. దీంతో వడ్డీ లేదా డివిడెండ్ ఇవ్వని బంగారం వైపు నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు.2. బలపడుతున్న అమెరికన్ డాలర్, బాండ్ ఈల్డ్స్ఫెడ్ నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లో యూఎస్ డాలర్ ఇండెక్స్ ఏడాది కాలంలోనే గరిష్ట స్థాయికి చేరుకుంది. సాధారణంగా డాలర్ బలపడితే ఇతర కరెన్సీలలో బంగారం కొనడం ఖరీదైనదిగా మారుతుంది. తద్వారా డిమాండ్ తగ్గి ధరలు క్షీణిస్తాయి. గ్లోబల్ గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి, ముఖ్యంగా ఆసియా మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లడం దీనికి అద్దం పడుతోంది.3. పశ్చిమాసియాలో సడలిన ఉద్రిక్తతలుగత కొద్ది నెలల్లో బంగారం ధరలు భారీగా పెరగడానికి రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా (ఇరాన్-అమెరికా/ఇజ్రాయెల్) సంక్షోభాలు ప్రధాన కారణం. అయితే ఇటీవల ఇరాన్, అమెరికాల మధ్య శాంతి చర్చల సరళి, కీలకమైన హార్ముజ్ జలసంధి పాక్షికంగా తెరచుకోవడం వంటి పరిణామాల వల్ల గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు ధరలు దాదాపు 30% తగ్గాయి. దాంతో అంతర్జాతీయ ఒడిదొడుకులు తగ్గి సురక్షిత పెట్టుబడిగా బంగారానికి ఉన్న డిమాండ్ ప్రీమియం ఒక్కసారిగా ఆవిరైపోయింది.భవిష్యత్తులో ఇన్వెస్ట్మెంట్ మార్గాలుప్రస్తుత ధరల తగ్గుదల అనేది దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఒక అవకాశంగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే కేంద్ర బ్యాంకుల వద్ద డీ-డాలరైజేషన్ (డాలర్పై ఆధారపడటం తగ్గించడం) ప్రక్రియలో భాగంగా బంగారాన్ని నిల్వ చేసుకునే ధోరణి ఇంకా కొనసాగుతోంది. అయితే కేవలం భౌతిక బంగారం (నగలు) రూపంలో కాకుండా కొన్ని మార్గాల్లో పెట్టుబడి పెడితే మెరుగైన రాబడులు సాధించవచ్చు.గోల్డ్ ఈటీఎఫ్లు: స్టాక్ మార్కెట్ ద్వారా డిజిటల్ రూపంలో బంగారం కొనుగోలు చేయడానికి ఇది ఉత్తమ మార్గం. ఇందులో ఎలాంటి మేకింగ్ ఛార్జీలు, తరుగు ఉండవు. మనకు నచ్చినప్పుడు కరెంట్ మార్కెట్ ధరకే విక్రయించుకోవచ్చు. లాకర్ ఖర్చులు, దొంగతనం భయాలు ఉండవు.సవరీన్ గోల్డ్ బాండ్లు: ప్రభుత్వం/ఆర్బీఐ జారీ చేసే ఈ బాండ్లు దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు వరం. దీని ద్వారా బంగారం ధర పెరిగితే వచ్చే లాభంతో పాటు, ఏటా స్థిర వడ్డీ (అదనపు ఆదాయం) లభిస్తుంది. అంతేకాకుండా గడువు ముగిసిన తర్వాత వచ్చే లాభాలపై ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ ఉండదు. అయితే, ప్రస్తుతానికి ఈ బాండ్లను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది.డిజిటల్ గోల్డ్: మొబైల్ వాలెట్లు, సర్టిఫైడ్ ప్లాట్ఫారమ్ల ద్వారా కేవలం రూ.100తో కూడా పెట్టుబడిని ప్రారంభించవచ్చు. క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా ప్రతి నెలా కొద్దికొద్దిగా బంగారం జమ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.భౌతిక బంగారం (కాయిన్స్/బిస్కెట్లు): ఒకవేళ ఫిజికల్ గోల్డ్ కావాలనుకుంటే నగల రూపంలో కాకుండా 24 క్యారెట్ల హాల్మార్క్ ఉన్న కాయిన్స్ లేదా బిస్కెట్లు కొనడం మేలు. దీనివల్ల రీసేల్ (తిరిగి అమ్మే) సమయంలో పూర్తి విలువ లభిస్తుంది.మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో బంగారానికి 10% నుంచి 15% వరకు మాత్రమే పరిమితం చేయడం మంచిది. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఒకేసారి కాకుండా ప్రస్తుత ధరల పతనాన్ని ఆసరాగా చేసుకుని విడతల వారీగా పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్తులో స్థిరమైన, సురక్షితమైన రాబడులను అందుకోవచ్చు.ఇదీ చదవండి: బిగ్ రిలీఫ్.. బంగారం ధరలు ఢమాల్! -
ఇన్వెస్టర్లకు కొత్త అవకాశాలు.. ఇవిగో కొత్త ఫండ్స్!
పెట్టుబడుల్లో వైవిధ్యం కోరుకునే ఇన్వెస్టర్ల కోసం హెచ్డీఎఫ్సీ, జేఎం ఫైనాన్షియల్ కొత్త మ్యూచువల్ ఫండ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆటో రంగంతో పాటు మల్టీ అసెట్ విభాగంలో పెట్టుబడులకు ఇవి అవకాశం కల్పిస్తున్నాయి.హెచ్డీఎఫ్సీ నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఫండ్: దేశ ఎకానమీకి, తయారీ రంగ వృద్ధికి, ఉపాధి కల్పనకు, ఎగుమతులకు ఆటోమొబైల్ పరిశ్రమ దన్నుగా ఉంటోంది. ఆటోమొబైల్, ఆటో విడిభాగాల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగపడేలా హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ తాజాగా నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఫండ్ ప్రారంభించింది. ఇది జూలై 3 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు.నిఫ్టీ ఆటో ఇండెక్స్ (టీఆర్ఐ)లోని దిగ్గజ ప్యాసింజర్ వెహికల్స్, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలు, ఆటో విడిభాగాల తయారీ సంస్థల స్టాక్స్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. నిఫ్టీ500 నుంచి ఎంపిక చేసిన 15 స్టాక్స్ ఈ సూచీలో ఉంటాయి.జేఎం మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్: ఆర్థిక సేవల సంస్థ జేఎం ఫైనాన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ తాజాగా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ని ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ జూలై 8న ముగుస్తుంది. ఇది ఈక్విటీలు, ఈక్విటీ సంబంధ సాధనాలు, డెట్..మనీ మార్కెట్ సెక్యూరిటీలు, పసిడి–వెండి సంబంధ సాధనాలు, ఇతరత్రా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కమోడిటీ డెరివేటివ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. తద్వారా ఒకే ఫండ్ ద్వారా పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని పాటించేందుకు ఉపయోగపడుతుంది. -
అప్పు తిరిగి చెల్లించినా ‘సోర్స్’ ఉండాల్సిందే..
నేను తెలంగాణ ప్రభుత్వోద్యోగిని. నా ఆదాయం రూ.5 లక్షలు. రిటర్ను వేశాను. రిటర్న్ ప్రాసెస్ అయిపోయింది. గత సంవత్సరం మా బాబాయి వ్యాపారం కోసం బంగారం మీద రూ.15,00,000 లోన్ తీసుకున్నాను. ఈ సంవత్సరం మా బాబాయి ఆ మొత్తాన్ని రిటర్న్ చేస్తే, నేను లోన్ తీర్చివేస్తాను. ఈ వ్యవహారంలోని పన్ను చిక్కులు, ఇతర చిక్కులు తెలపండి. – రమేష్ రెడ్డి, ఈ–మెయిల్ ద్వారామీరు ప్రభుత్వోద్యోగి. మీ సంవత్సరాదాయం రూ. 5,00,000. ఇతరత్రా ఎటువంటి ఆదాయం లేదంటున్నారు. దీనికి సంబంధించిన రిటర్ను వేశారు. అది ప్రాసెస్ అయ్యింది. ఇదే సంవత్సరం బంగారం తాకట్టు పెట్టి రూ.15,00,000 లోన్ తీసుకుని, ఆ మొత్తాన్ని మీ బాబాయికి ఇచ్చారు. ఇందులో రెండు వ్యవహారాలు ఉన్నాయి. మీరు లోన్ తీసుకోవడం మొదటిదయితే, రెండోది మీరు మీ బాబాయిగారికి అప్పు ఇవ్వడం. ఈ రెండూ బ్యాంకు ద్వారా జరిగాయని అనుకుంటున్నాం. లోన్ వచ్చినప్పుడు మీ బ్యాంకు అకౌంటులో జమ, ఆ తర్వాత మీరు మీ బాబాయికి ఇచ్చినప్పుడు ఖర్చు/డెబిట్. ఈ మేరకు కాగితాలు/డాక్యుమెంట్లు, సంతకాలు, పద్దులు ఉన్నాయి కదా! (బదులుగా రెండు నగదు వ్యవహారాలయితే మాత్రం ఎంతో ముప్పు ఉంది. నగదు తీసుకోవడం, నగదు ఇవ్వడం రెండూ తప్పే. పెనాల్టీలు పడతాయి). ఇంతవరకు ఎటువంటి భయం లేదు. ఆ తర్వాత సంవత్సరం మీ బాబాయి మీకు చెక్కు ద్వారా ఇచ్చి, ఆ మొత్తం మీ బ్యాంకు అకౌంట్లో క్రెడిట్ అయ్యి, అటుపైన మీరు అదే మొత్తాన్ని బంగారం కంపెనీకి అప్పు తీర్చినట్లయితే, మీ అకౌంటులో డెబిట్/ఖర్చు కనబడాలి. ఇలాగే జరిగితే, ఆ మేరకు కాగితాలు, డాక్యుమెంట్లు, సంతకాలు, పద్దులు, అవసరం అయితే కాగితాల ద్వారా వివరణ, కన్ఫర్మేషన్ ఉంటే ఎటువంటి భయం లేదు. ‘లోన్’ని ఆదాయంగా పరిగణించరు. జమని ‘లోన్’గా కాగితాల ద్వారా, థర్డ్ పార్టీ కన్ఫర్మేషన్ ద్వారా ధ్రువీకరించాలి. అలా చేస్తే ఈ వ్యవహారంలో జమల్ని ఆదాయంగా పరిగణించరు. అప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా దాన్ని ఆదాయంగా పరిగణించనవసరం లేదు. అయితే, ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఈ లావాదేవీలలో వడ్డీ ఉందా లేదా అని. వడ్డీ ఉంటే మీ ఆదాయంలో ఆ వడ్డీని ఆదాయంగా పరిగణిస్తారు. వడ్డీ లేకపోతే మీరిద్దరూ రాతపూర్వకంగా ధ్రువీకరించాలి. నేను రాష్ట్ర ప్రభుత్వంలో రిటైర్ అయ్యాను. పెన్షన్ వస్తుంది. నా భర్త లేనందున వారి పెన్షన్ నా ఆదాయంలో ‘ఫ్యామిలీ పెన్షన్’గా వస్తుంది. నా భర్త పెన్షన్, పన్ను భారం మొదలైన వ్యవహారాలన్నీ నా పాన్ నంబరు మీద నడుస్తున్నాయి. 2020–21 ఆర్థిక సంవత్సరం నా భర్తకు వచ్చిన ఎరియర్స్ పన్నుకి గురి కావడం వల్ల పన్ను రికవరీ చేసి ఆ మేరకు చెల్లించి నాకు ఫారం 16 ఇచ్చారు. అప్పుడు ఆ పన్ను చెల్లింపులు నా అకౌంటులో కనిపించడం లేదని, వడ్డీతో సహా చెల్లించాలని నోటీసులు పంపారు. –కె. శారద, బెంగళూరుఇటువంటివి ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. పన్ను రికవరీలు జరిగి, గవర్నమెంటు ఖజానాకు చెల్లించినప్పటికీ ఆ మేరకు ఫారం 16లో సర్టిఫై అయినప్పటికీ, ఈ పద్దులు డిపార్టుమెంటు వారి దగ్గర వారు నిర్వహిస్తున్న 26ఏఎస్లో కనబడకపోతే/ఎంటర్ అవ్వకపోతే డిపార్టుమెంటు వారు పట్టించుకోరు. 26ఏఎస్లో కనిపించకపోతే ‘మనం చెల్లించలేదని’ వారి వాదన. అందుకే ఇటువంటి నోటీసులు పంపిస్తారు. ఇటువంటి నోటీసులు రాగానే ముందుగా నోటీసులో డిమాండ్ అంశాన్ని/భారాన్ని ఒప్పుకోకండి. ‘డూ యూ ఎగ్రీ’ అన్న ప్రశ్నకు ‘నో’ అని చెప్పండి.ఇప్పుడు మీ భర్తగారు రిటైర్ అయిన సంస్థకు వెళ్లి సమాచారం సేకరించండి. ఫారం 16 అడగండి. అందులో అన్ని వివరణలు ఉంటాయి. ఎంత ఎరియర్స్ వచ్చాయి, పన్ను ఎంత, అది ఎలా చెల్లించారు, ఏ బ్యాంకు ద్వారా చెల్లించారు, లాన్ నంబరు, ఏ తేదీనాడు చెల్లించారు.. ఈ వివరణలతో ఫారం 16ని సేకరించి, డిపార్టుమెంటు వారి పోర్టల్కి వెళ్లి వివరంగా జవాబు ఇవ్వండి. డిమాండ్ నోటీసుని ఉపసంహరించమని అడగండి. డిపార్టుమెంటు వారు అవసరమైతే మిమ్మల్ని సంబంధిత అధికారులను కలవమని చెప్పవచ్చు.. లేదా వారికి నేరుగా కాగితాలను సబ్మిట్ చేయమని చెప్పవచ్చు. దీనితో మీ సమస్యలు సమసిపోవచ్చు. ఇంకా డిమాండు విత్డ్రా కాకపోతే ‘గ్రీవెన్స్ సెల్’కి రిపోర్ట్ చేయొచ్చు. అప్పుడు ఫారం 16 కాపీని అప్లోడ్ చేయొచ్చు. కాస్త సమయం పడుతుంది. అందాకా మీకు టెన్షన్ ఉండొచ్చు. కానీ ఫారం 16లోని అంశాలు కరెక్టుగా ఉన్నంత వరకు ఎటువంటి పొరపాటు జరగదు. జాప్యం ఉండొచ్చేమో .. తప్పు జరగదు. అందుకనే ఒక సలహా. ఇన్కం ట్యాక్స్ రిటర్నులకు సంబంధించిన అన్ని వివరాలు, కాగితాలు, చలాన్లు మొదలైన వాటన్నింటిని ఎప్పుడూ భద్రపర్చుకోవాలి. -
ఆధార్, క్రెడిట్ కార్డులు.. జూలై 1 నుంచి కీలక మార్పులు
వచ్చే జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇవి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ఆధార్ కార్డుదారులు, క్రెడిట్ కార్డు వినియోగదారులు, పాస్పోర్ట్ దరఖాస్తుదారులు, బ్యాంకు ఖాతాదారులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఆధార్లో ఈమెయిల్ అప్డేట్కు ఉచిత అవకాశం, క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సెస్ నిబంధనల్లో మార్పులు, పాస్పోర్ట్ ఫీజుల పెంపు, బ్యాంకుల మిస్-సెల్లింగ్పై ఆర్బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి.ఐటీఆర్ దాఖలుకు జూలై 31 చివరి తేదీ2025-26 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2026-27) సంబంధించిన ఐటీఆర్-1, ఐటీఆర్-2 రిటర్నులు దాఖలు చేయడానికి జూలై 31, 2026 చివరి గడువు. గడువు దాటితే ఆలస్య రుసుములు, కొన్ని పన్ను విధానాలను ఎంచుకునే అవకాశాలపై పరిమితులు, అర్హత ఉన్న నష్టాలను తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఆధార్లో ఈమెయిల్ అప్డేట్యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆధార్ మొబైల్ యాప్ ద్వారా నమోదిత ఈమెయిల్ చిరునామాను అప్డేట్ చేసుకునే సేవను పూర్తిగా ఉచితంగా అందించనుంది. దీని కోసం ఇప్పటి వరకు రూ.75 రుసుము ఉండేది. అయితే ఈ రాయితీ కేవలం అధికారిక ఆధార్ మొబైల్ యాప్ ద్వారా చేసే అప్డేట్లకే వర్తిస్తుంది.ఎస్బీఐ కార్డుల రివార్డ్ నిబంధనల్లో మార్పులుఫోన్పే ఎస్బీఐ క్రెడిట్ కార్డు PURPLE, SELECT BLACK కార్డులకు సంబంధించిన రివార్డ్ పాయింట్ల విధానంలో మార్పులు అమల్లోకి రానున్నాయి. రివార్డ్ పాయింట్లు పొందే లావాదేవీలపై కొత్త పరిమితులు విధించడంతో పాటు, పాయింట్లు లభించని లావాదేవీల జాబితాను కూడా విస్తరించారు.హెచ్డీఎఫ్సీ లాంజ్ యాక్సెస్హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డుదారులు ప్రతి క్యాలెండర్ త్రైమాసికంలో మూడు ఉచిత దేశీయ విమానాశ్రయ లాంజ్ సందర్శనలను పొందాలంటే, అంతకుముందు త్రైమాసికంలో కనీసం రూ.60,000 ఖర్చు చేసి ఉండాలి. ఉదాహరణకు జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి లాంజ్ సదుపాయం పొందాలంటే ఏప్రిల్-జూన్ మధ్య ఈ ఖర్చు పూర్తిచేయాల్సి ఉంటుంది.పాస్పోర్ట్ ఫీజుల పెంపుజూలై 1 నుంచి సాధారణ, తత్కాల్ పాస్పోర్ట్ల ఫీజులు పెరుగుతున్నాయి. తాజా నోటిఫికేషన్ ప్రకారం 36 పేజీల సాధారణ పాస్పోర్ట్ ఫీజు రూ.1,500 నుంచి రూ.2,500కు, తత్కాల్ ఫీజు రూ.3,500 నుంచి రూ.5,000కు పెరిగింది. ఇతర కేటగిరీల ఫీజులను కూడా కేంద్ర ప్రభుత్వం సవరించింది.బ్యాంకుల మిస్-సెల్లింగ్పై ఆర్బీఐ కఠిన చర్యలుబ్యాంకులు ఆర్థిక ఉత్పత్తులను తప్పుదోవ పట్టిస్తూ విక్రయించే ఘటనలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ కొత్త ఫ్రేమ్వర్క్ను అమల్లోకి తెస్తోంది. ఈ నిబంధనల ప్రకారం మిస్-సెల్లింగ్కు గురైన వినియోగదారులు పూర్తి రీఫండ్తో పాటు జరిగిన నష్టానికి తగిన పరిహారం పొందే హక్కు కలిగి ఉంటారు. బ్యాంకులు ఉత్పత్తుల విక్రయంలో మరింత పారదర్శకత పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు కూడా జూలై 1 నుంచే అమల్లోకి వస్తాయి. -
డెడ్లైన్ అలర్ట్: ఈ-కేవైసీ, ఐటీ రిటర్న్.. ఇంకా..
జూన్ నెల ముగింపునకు వచ్చేసింది. జూన్ 30 పలు కీలక విషయాలకు గడువు తేదీ. ఎల్పీజీ సబ్సిడీ పొందుతున్న లబ్ధిదారుల ఈ-కేవైసీ నుంచి ఆదాయపు పన్ను శాఖ పరిశీలన (స్క్రూటినీ) నోటీసుల వరకు, అలాగే త్రైమాసిక ముగింపు నేపథ్యంలో వ్యాపారాల జీఎస్టీ, టీడీఎస్ సంబంధిత సన్నాహాల వరకు పలు ముఖ్యమైన గడువులు ఈ నెలాఖరుతో ముగియనున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక నష్టాలు లేదా పరిపాలనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఎల్పీజీ సబ్సిడీ నిలిచిపోయే అవకాశంప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు ప్రతి సంవత్సరం ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటివరకు ధ్రువీకరణ పూర్తి చేయని ఇతర ఎల్పీజీ సబ్సిడీ లబ్ధిదారులు కూడా జూన్ 30లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. లేనిపక్షంలో వారి బ్యాంకు ఖాతాల్లోకి సబ్సిడీ జమ కావడం తాత్కాలికంగా నిలిచిపోవచ్చు. అయితే గ్యాస్ సిలిండర్ బుకింగ్పై ఎలాంటి ప్రభావం ఉండదు. పూర్తి ధర చెల్లించి సిలిండర్ పొందవచ్చు. ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ-కేవైసీ పూర్తి చేసిన లేదా సబ్సిడీకి అర్హులు కాని వినియోగదారులు మళ్లీ ఈ ప్రక్రియ చేయాల్సిన అవసరం లేదు.ఐటీఆర్ స్క్రూటినీ నోటీసులకు కీలకం2025-26 ఆర్థిక సంవత్సరానికి దాఖలైన ఆదాయపు పన్ను రిటర్నులపై సెక్షన్ 143(2) కింద స్క్రూటినీ నోటీసులు జారీ చేయడానికి ఆదాయపు పన్ను శాఖకు జూన్ 30 చివరి గడువు. ఇది పన్ను చెల్లింపుదారులు రిటర్న్ దాఖలు చేయాల్సిన గడువు కాదు. కేవలం ఇప్పటికే దాఖలైన రిటర్నులను పరిశీలనకు ఎంపిక చేస్తే నోటీసులు పంపేందుకు శాఖకు ఉన్న చట్టబద్ధమైన చివరి తేదీ మాత్రమే. రిటర్నులో చూపిన వివరాలు, ఫారం 26AS, AIS, TIS, బ్యాంకు లావాదేవీలు లేదా అధిక విలువ గల ఆర్థిక లావాదేవీల మధ్య వ్యత్యాసాలు కనిపిస్తే స్క్రూటినీకి ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT) కూడా జూన్ 30నే ఈ గడువుగా స్పష్టం చేసింది.వ్యాపారాలకు త్రైమాసిక ముగింపుజూన్ 30తో 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) ముగియనుంది. దీంతో కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ ఖాతాల పుస్తకాలు, టీడీఎస్, టీసీఎస్ నమోదులు, జీఎస్టీ రికార్డులు, ఇతర చట్టబద్ధమైన లెక్కలను నవీకరించుకోవాల్సి ఉంటుంది. తద్వారా జూలైలో దాఖలు చేయాల్సిన జీఎస్టీ రిటర్నులు, టీడీఎస్/టీసీఎస్ స్టేట్మెంట్లను సకాలంలో సమర్పించేందుకు వీలు కలుగుతుంది.ఈ గడువులను చివరి నిమిషానికి వాయిదా వేయకుండా ముందుగానే పూర్తి చేస్తే అనవసరమైన జరిమానాలు, సబ్సిడీ జాప్యాలు, పన్ను సంబంధిత ఇబ్బందులను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
రూ.20 లక్షల కారు కొనడంపై ChatGPT క్లారిటీ
ఒక వ్యక్తి వార్షిక ఆదాయం రూ.30 లక్షలు ఉంటే, రూ.20 లక్షల విలువైన కారును కొనుగోలు చేయడం ఆర్థికంగా సౌకర్యవంతమేనా? ఒకవేళ కొనాలంటే మొత్తం డబ్బు ఒకేసారి చెల్లించడం మంచిదా?, లేక లోన్ తీసుకుని కొనడం మంచిదా? అనే ప్రశ్నలకు చాట్జీపీటీ వివరంగా సమాధానం ఇచ్చింది.బెంగళూరుకు చెందిన 35 ఏళ్ల ఉద్యోగి తన పూర్తి ఆర్థిక వివరాలను చాట్జీపీటీకు అందించాడు. అతనికి సంవత్సరానికి రూ.30 లక్షల జీతం, అయితే నెలకు రూ.1.9 లక్షలు చేతికి వచ్చే ఆదాయం. కాగా అతనికి రూ.15 లక్షల పెట్టుబడులు, రూ.5 లక్షల ఎమర్జెన్సీ ఫండ్, రూ.10 లక్షల ఈపీఎఫ్ ఉన్నాయి. ప్రస్తుతం రూ.40 లక్షల హోమ్ లోన్ ఉండగా, ప్రతి నెల రూ.40 వేల ఈఎంఐ, మరో రూ.40 వేల సిప్ పెట్టుబడులు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అతని వద్ద ఎనిమిదేళ్ల పాత హ్యాచ్బ్యాక్ కారు ఉంది.ఈ నేపథ్యంలో రూ.20 లక్షల ఆన్రోడ్ ధర ఉన్న కొత్త SUV కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు పేర్కొంటూ, రెండు ఎంపికలను చాట్జీపీటీ ముందుంచాడు. మొదటిది, మొత్తం రూ.20 లక్షలను పొదుపు నుంచి తీసుకుని ఒకేసారి చెల్లించి కారు కొనడం. రెండోది, రూ.5 లక్షలు డౌన్ పేమెంట్ చేసి మిగిలిన మొత్తాన్ని ఐదేళ్ల కార్ లోన్ ద్వారా చెల్లించడం.ఈ రెండు ఎంపికలను విశ్లేషించిన చాట్జీపీటీ, కారు కొనుగోలు మాత్రమే కాకుండా, ఐదు సంవత్సరాలు, పది సంవత్సరాల పాటు కారును మెయింటెన్స్ కోసం అయ్యే మొత్తం ఖర్చును కూడా అంచనా వేసింది. ఇందులో కొనుగోలు ధర, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, సర్వీసింగ్, రిపేర్లు, ఇంధనం, టైర్లు, పార్కింగ్, లోన్ వడ్డీ వంటి అన్ని ఖర్చులను పరిగణనలోకి తీసుకుంది.చాట్జీపీటీ అంచనా ప్రకారం, మొత్తం డబ్బు చెల్లించి కారు కొనుగోలు చేస్తే ఐదేళ్లలో మొత్తం యాజమాన్య వ్యయం సుమారు రూ.28 నుంచి రూ.31 లక్షల మధ్య ఉండొచ్చు. అదే రూ.5 లక్షల డౌన్ పేమెంట్తో లోన్ తీసుకుంటే వడ్డీ కారణంగా ఈ ఖర్చు రూ.31 నుంచి రూ.33 లక్షల వరకు పెరగొచ్చు.పది సంవత్సరాల వ్యవధిలో నగదు చెల్లించి కొనుగోలు చేసిన కారుకు మొత్తం ఖర్చు సుమారు రూ.42 నుంచి రూ.46 లక్షలు, లోన్ తీసుకుని కొనుగోలు చేసిన కారుకు రూ.45 నుంచి రూ.49 లక్షలు అవుతుందని చాట్జీపీటీ అంచనా వేసింది. ఈ ఖర్చులో అత్యధిక భాగం కారు విలువ తగ్గడం, ఇంధనం, ఇన్సూరెన్స్, నిర్వహణ ఖర్చులు ఉంటాయని వెల్లడించింది.అయితే.. తుది నిర్ణయంలో చాట్జీపీటీ ఆసక్తికరమైన సూచన చేసింది. మొత్తం రూ.20 లక్షలను ఒకేసారి చెల్లించడం వల్ల వడ్డీ భారం ఉండదు. కానీ అలా చేస్తే ఇప్పటికే ఉన్న పెట్టుబడులు దాదాపు ఖాళీ అవుతాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన డబ్బు అందుబాటులో ఉండదు. అలాగే పెట్టుబడులు భవిష్యత్తులో ఇచ్చే వృద్ధి ప్రయోజనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది.కాబట్టి.. రూ.5 లక్షల డౌన్ పేమెంట్ చేసి, మిగిలిన మొత్తాన్ని ఐదేళ్లకు లోన్ తీసుకోవడం మంచి నిర్ణయం అని చాట్జీపీటీ పేర్కొంది. ఇలా చేయడం వల్ల కొంత వడ్డీ చెల్లించాల్సి వచ్చినప్పటికీ, చేతిలో నగదు నిల్వ ఉంటుంది. పెట్టుబడులు కొనసాగుతాయి. దీర్ఘకాలంలో ఆర్థిక భద్రత కూడా మెరుగ్గా ఉంటుందని పేర్కొంది.ఇదీ చదవండి: జూన్ 30 తర్వాత పాత నోట్ల రద్దు?: స్పందించిన బ్యాంక్ -
12 కోట్లు దాటిన క్రెడిట్ కార్డులు..
దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డుల సంఖ్య మరో కీలక మైలురాయిని చేరుకుంది. 2026 మే నాటికి దేశంలో క్రియాశీల (యాక్టివ్) క్రెడిట్ కార్డుల సంఖ్య 12.04 కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.3 శాతం అధికం. మే నెలలోనే నికరంగా 10.17 లక్షల కొత్త క్రెడిట్ కార్డులు జారీ కావడం విశేషం. ఇది ఏడాది ప్రాతిపదికన 33.7 శాతం, ఏప్రిల్తో పోలిస్తే 26.9 శాతం పెరుగుదలను సూచిస్తోందని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి.క్రెడిట్ కార్డుల వినియోగం కూడా స్థిరంగా కొనసాగుతోంది. మే నెలలో మొత్తం కార్డు లావాదేవీల విలువ రూ.2.02 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 6.3 శాతం అధికం. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా మార్చిలో నమోదైన రికార్డు స్థాయి రూ.2.19 లక్షల కోట్ల ఖర్చుతో పోలిస్తే ఇంకా తక్కువగానే ఉంది. ఏప్రిల్లో నమోదైన రూ.1.97 లక్షల కోట్లతో పోలిస్తే మాత్రం స్వల్పంగా మెరుగుదల కనిపించింది. ఒక్కో క్రెడిట్ కార్డుపై సగటు నెలవారీ వ్యయం రూ.16,778గా నమోదైంది.కొత్త కార్డుల జారీలో ఎస్బీఐ కార్డ్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో ఫెడరల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వంటి మధ్యస్థాయి బ్యాంకులు కూడా కార్డు జారీలో వేగంగా విస్తరిస్తున్నాయి. మరోవైపు కొన్ని బ్యాంకులు అసురక్షిత రుణాల రిస్క్ను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ముందుకు సాగుతున్నాయి.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, దేశంలో డిజిటల్ చెల్లింపులు, ఈ-కామర్స్ విస్తరణతో క్రెడిట్ కార్డుల వినియోగదారుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, ఖర్చుల వృద్ధి గతంతో పోలిస్తే కొంత మితంగా సాగుతోంది. దీంతో బ్యాంకులు మార్కెట్ వాటాను పెంచుకోవడమే కాకుండా, లాభదాయకతను కాపాడుకోవడం, బకాయిలు పెరగకుండా రిస్క్ మేనేజ్మెంట్పై మరింత దృష్టి సారిస్తున్నాయి. -
బంగారం మరింత కొనే సమయం వచ్చిందా?
ప్రముఖ ఇన్వెస్టర్, ప్రపంచ ప్రఖ్యాత ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) బంగారం ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతుండటం మంచి వార్తేనని ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు. అయితే తాను ప్రస్తుతం మరింత బంగారం కొనుగోలు చేసే సమయం వచ్చిందా లేదా అన్నది తెలుసుకోవడానికి సాంకేతిక చార్టులను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.ధరలు తగ్గుతున్నాయనే కారణంతోనే పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాదని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఒక ఇంటి ధర తగ్గితే కేవలం తక్కువ ధర చూసి కొనుగోలు చేయరని, ఆ ఇంటి చుట్టుపక్కల ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతోందో కూడా పరిశీలిస్తామని ఉదాహరణగా వివరించారు. అదే విధంగా బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? ఆర్థిక వ్యవస్థలో ఏమి జరుగుతోంది? అనే అంశాలను తెలుసుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు.ఆర్థిక పరిస్థితులు బలహీనపడుతున్నాయని భావిస్తే తాను బంగారం కొనుగోలుకు దూరంగా ఉండవచ్చని, కానీ ఆర్థిక వ్యవస్థ మెరుగుదల దిశగా సాగుతోందని సంకేతాలు కనిపిస్తే తక్కువ ధరల వద్ద బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తానని చెప్పారు. ప్రస్తుతం తన వద్ద ఉన్న బంగారంలో చాలా భాగాన్ని 2000 ప్రాంతంలో ఔన్స్కు సుమారు 300 డాలర్ల ధర వద్ద కొనుగోలు చేశానని కియోసాకి గుర్తుచేశారు.మార్కెట్ ధోరణి (ట్రెండ్)ను గమనించడం పెట్టుబడిదారులకు అత్యంత కీలకమని, ధరల కంటే వాటి వెనుక ఉన్న ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవడమే విజయవంతమైన పెట్టుబడులకు మూలమని ఆయన తన పోస్ట్లో సూచించారు.GREAT NEWS: Gold continues to drop in price. Watching technical charts to know when to buy more.TREND is your FRIEND!!!!! Repeating past lesson.Price is like knowing the price of a house is going down.What I want to know what is happening in the neighborhood?If…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 24, 2026 -
ఇంట్లోని బంగారం కొండంత అండ!
ముంబై: ఇళ్లల్లో ఉన్న బంగారం క్రమంగా బ్యాంక్లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ఖజానాల్లోకి చేరుతోంది. పసిడిని నిరుపయోగంగా ఉంచకుండా, దానిపై రుణాలు తీసుకునే ధోరణి ఇటీవలి కాలంలో విస్తృతమవుతోంది. కుటుంబాల ఆర్థిక అవసరాల్లో బంగారం కొండంత అండనిస్తోంది. ఫలితంగా బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు, ప్రత్యేక పసిడి రుణ సంస్థల మధ్య పోటీ మరింత పెరిగింది. డేటా విశ్లేషణ, క్రెడిట్ సమాచార సంస్థ ‘ఎక్స్పీరియన్’ విడుదల చేసిన నివేదిను పరిశీలించినప్పుడు పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. పసిడి రుణాలకు ఆమోదం పెరుగుతోంది. విశ్వసనీయమైన రుణ సాధనంగా వినియోగదారులు చూస్తున్నారు. ఫలితంగా గడిచిన రెండేళ్లలో రుణాల కోసం తనఖా పెట్టిన పసిడి విలువ గణనీయంగా పెరిగింది. 2024–25లో 69 శాతం పెరిగితే, 2025–26లో 84 శాతం వృద్ధి చెందింది. 2023 మార్చి నాటికి రూ.6.3 లక్షల కోట్ల రుణాలు పసిడి తనఖాపై మంజూరు కాగా (గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో), 2026 మార్చి నాటికి ఈ మొత్తం రూ.19.4 లక్షల కోట్లకు చేరింది. ముఖ్యంగా బంగారం ధర భారీగా పెరిగిపోవడం తెలిసిందే. దీంతో తమ వద్దనున్న పసిడిపై మరింత మొత్తం రుణంగా పొందే వెసులుబాటు లభించింది. దీంతో సగటు పసిడి రుణం గత మూడేళ్లలో రూ.98వేల నుంచి రూ.1.96 లక్షలకు ఎగిసింది. 2025–26 చివరి త్రైమాసికంలో కొత్త రుణాల్లో 75 శాతం పాత రుణ గ్రహీతలు పొందినవే ఉన్నాయి. రుణాల వృద్ధికి, అందరికీ ఆర్థిక సేవల చేరువలో పసిడి ముఖ్యపాత్ర పోషిస్తోందని ఎక్స్పీరియన్ నివేదిక పేర్కొంది. ఇక ఇప్పటి వరకు బంగారం రుణాల వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషించగా, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ మార్కెట్ విస్తృతమవుతోంది. అయితే, ఇప్పటికీ దక్షిణాది రాష్ట్రాల వాటాయే అధికంగా ఉంది. 2025–26లో ఉత్తరప్రదేశ్లో పసిడి రుణాలు 138 శాతం పెరగ్గా, పశ్చిమ బెంగాల్లో 112 శాతం, రాజస్థాన్లో 105 శాతం, మహారాష్ట్రలో 102 శాతం చొప్పున పసిడి రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి చెందాయి. ప్రాధాన్య రంగానికి సంబంధించి పసిడి రుణాలు (పీఎస్జీఎల్) సమ్మిళిత వృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మొత్తం పసిడి రుణాల్లో వీటికి సంబంధించినవే 23 శాతానికి చేరాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని వ్యాపార సంస్థలు, వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు, రుణ సదుపాయం అంతగా అందుబాటులో లేని వర్గాలకు పసిడి రుణాలు అండగా నిలుస్తున్నాయి. ఈ వర్గాలు ఇళ్లల్లోని బంగారంతో తమ నిధుల అవసరాలను (వ్యాపారం, కుటుంబ అవసరాలు, సాగు కోసం) తీర్చుకుంటున్నాయి. బంగారం రుణ గ్రహీతల్లో ఇతర రుణ సాధనాల వినియోగం కూడా పెరుగుతోంది. 2021 డిసెంబర్ నాటికి ఈ తరహా కస్టమర్లు 10 శాతంగా ఉంటే, 2025 డిసెంబర్ నాటికి 17 శాతానికి పెరిగారు. పసిడి రుణాల్లో ఎగవేతలు కూడా చాలా తక్కువగా ఉంటుండడం విశేషం. 90 రోజులకు పైగా చెల్లింపుల్లేని రుణాలు 2023 మార్చి నాటికి ఉన్న 0.4 శాతం నుంచి 2026 మార్చి నాటికి 0.2 శాతానికి తగ్గాయి. గొప్ప ఆర్థిక సాధనం.. ‘‘కుటుంబాల వద్ద పసిడి నిల్వలు గణనీయంగా ఉన్నాయి. దీంతో పసిడి రుణాలు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో సంప్రదాయంగా నిల్వ ఉంచుకునే ఆస్తి కాస్తా రుణ సాధనంగా మారిపోయింది. ఎన్నో వ్యక్తిగత, జీవన అవసరాలను తీర్చడం ద్వారా ఆర్థిక సేవల చేరువలో పసిడి గొప్ప పాత్ర పోషిస్తోంది’’అని ఎక్స్పీరియన్ ఇండియా ఎండీ మనీష్జైన్ పేర్కొన్నారు. పోటాపోటీ పసిడి రుణాలకు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుండడంతో ఈ మార్కెట్లో వాటా కోసం ప్రభుత్వరంగ బ్యాంక్లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), ప్రత్యేక పసిడి రుణ సంస్థలు మధ్య పోటీ తీవ్రతరమైంది. ఇంతకాలం ఈ విభాగంలో ప్రభుత్వ బ్యాంక్లదే ఆధిపత్యం ఉండేది. ఇప్పుడు ఎన్బీఎఫ్సీలు, గోల్డ్ ఎన్బీఎఫ్సీల నుంచి వాటికి గట్టి పోటీ ఎదురవుతోందని ఎక్స్పీరియన్ నివేదిక వెల్లడించింది. పంపిణీ విభాగం బలంగా ఉండడం, కస్టమర్లు సైతం నాన్ బ్యాంక్ గోల్డ్ లోన్ సంస్థలవైపే మొగ్గు చూపిస్తుండడం వాటికి జోష్నిస్తోంది.ప్రభుత్వరంగ బ్యాంకుల వాటా 2025–26 క్యూ4లో (2026 జనవరి–మార్చి) 37 శాతానికి తగ్గింది. సరిగ్గా అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2024–25) క్యూ4లో ఇది 45 శాతంగా ఉంటే, అంతక్రితం త్రైమాసికంలోనూ (2025 డిసెంబర్ క్వార్టర్) 53% ఉండడం గమనార్హం. ఇక ఇదే కాలంలో పసిడి రుణాల్లో ఎన్బీఎఫ్సీల వాటా 33% నుంచి 44 శాతానికి పెరిగింది. ప్రాధాన్యరంగ పసిడి రుణాల్లో మాత్రం 88% వాటా ప్రభుత్వరంగ బ్యాంకుల చేతుల్లోనే ఉంది. -
డాలర్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయుల నుంచి డాలర్లను ఆకర్షించే దిశగా కొత్త ఎఫ్సీఎన్ఆర్ (బి) డిపాజిట్లపై బ్యాంకులకు ఆర్బీఐ డాలర్–రూపీ ఫారెక్స్ స్వాప్ సదుపాయాన్ని ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకులు సదరు ఖాతాలపై రేట్లను సవరించాయి. ఈ డిపాజిట్లపై బంధన్ బ్యాంక్ ఆకర్షణీయ వడ్డీ రేట్లను ప్రకటించింది. 3 నుంచి 5 ఏళ్ల వ్యవధికి 1 మిలియన్ డాలర్లకు పైగా డిపాజిట్లపై 7.1 శాతం వడ్డీ రేటు ఉంటుందని బ్యాంకు తెలిపింది. 1 మిలియన్ డాలర్ల వరకు డిపాజిట్లపై 7 శాతం ఉంటుందని పేర్కొంది. రూపాయి క్షీణతపరమైన రిసు్కలను అధిగమించి మెరుగైన రాబడులను అందుకునేలా ఎన్ఆర్ఐ కస్టమర్లకు ఇది సహాయకరంగా ఉంటుందని బ్యాంక్ ఈడీ రాజీందర్ కుమార్ బబ్బర్ తెలిపారు.మరోవైపు, బ్యాంక్ ఆఫ్ బరోడా .. తమ లెజెండ్ ఎఫ్సీఎన్ఆర్ (బి) డిపాజిట్ స్కీము కింద డాలర్ డిపాజిట్లపై 6.25 శాతం వరకు, బ్రిటీష్ పౌండ్ స్టెర్లింగ్ .. ఆస్ట్రేలియన్ డాలర్పై 4.75 శాతం, యూరో డిపాజిట్లపై 3.75 శాతం, కెనడియన్ డాలర్ డిపాజిట్లపై 5.15 శాతం వడ్డీ రేట్లను ప్రకటించింది. ఇవి మూడు నుంచి ఐదేళ్ల కాలవ్యవధికి వర్తిస్తాయి. అటు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఈ డిపాజిట్లపై వడ్డీ రేటును 7.13 శాతం వరకు పెంచినట్లు తెలిపింది. ఇక సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎఫ్సీఎన్ఆర్ (బి) డిపాజిట్లపై 6.50 శాతం వరకు వడ్డీ రేట్లు ఇస్తున్నట్లు వెల్లడించింది.సాధారణంగా ఈ విధానంలో ప్రవాస భారతీయులు డాలర్ల మారకంలో ఎఫ్సీఎన్ఆర్ (బి) ఖాతాలో డిపాజిట్ చేస్తారు. ఆ డాలర్లను సదరు బ్యాంకు నిర్దిష్ట రిఫరెన్స్ రేటుకు ఆర్బీఐకి విక్రయించి, రూపాయి మారకంలో నిధులు సమకూర్చుకుంటుంది. మెచ్యూరిటీ సమయంలో మళ్లీ అదే రేటుకి ఆర్బీఐ నుంచి డాలర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఈ క్రమంలో రూపాయి బలహీనపడితే బ్యాంకు నష్టపోకుండా ఆర్బీఐ ఆ రిసు్కను భరిస్తుంది. -
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ ఇద్దరు నాన్నల ఆశీర్వాదం!
ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి ఫాదర్స్ డే సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు. తాను ఎప్పుడూ తండ్రి కాలేకపోయినా, జీవితంలో ఇద్దరు తండ్రుల ఆశీర్వాదం పొందానని పేర్కొన్నారు. ఒకరు తన "పూర్ డాడ్", మరొకరు "రిచ్ డాడ్" అని తెలిపారు.వారి నుంచి నేర్చుకున్న జీవిత పాఠాలే తన ఆలోచనా విధానాన్ని మార్చాయని, ఆ అనుభవాలను ప్రపంచానికి "రిచ్ డాడ్ పూర్ డాడ్" పుస్తకం ద్వారా అందించగలిగానని కియోసాకి చెప్పారు. ఆ పాఠాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను సుసంపన్నం చేశాయని ఆయన పేర్కొన్నారు."తండ్రిగా ఉండటం జీవితంలో అత్యంత ముఖ్యమైన బాధ్యత. మీరు తండ్రి అయినా కాకపోయినా, ఈ రోజు మీ నాన్నకు కృతజ్ఞతలు చెప్పండి" అని కియోసాకి తన సోషల్ మీడియా పోస్టులో పిలుపునిచ్చారు. కుటుంబ విలువలు, తల్లిదండ్రుల మార్గదర్శకత్వం జీవిత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన సందేశం ద్వారా గుర్తు చేశారు.HAPPY FATHER’S DAY TO ALL FATHERS💥Being a father is your most important job.I have never been a father, yet I was blessed with having two fathers, my poor dad and my rich dad.By telling the story of their lessons to me, millions of lives have been changed….enriched,…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 21, 2026 -
బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్ స్కీమ్
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) కొత్తగా ‘గోల్డెన్ గోల్ డిపాజిట్ స్కీమ్’ని ప్రవేశపెట్టింది. దీని కింద 555 రోజుల కాలవ్యవధి డిపాజిట్లపై వార్షికంగా 7.40 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. సాధారణ పౌరులకు 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. రూ. 3 కోట్ల లోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లకు ఇవి వర్తిస్తాయి.కోటక్ ఇన్ఫినిటీ లాంగ్ షార్ట్ సిఫ్.. కోటక్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (సిఫ్) విభాగంలో ఇని్ఫనిటీ లాంగ్ షార్ట్ ఫండ్ని ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ జూన్ 29తో ముగుస్తుంది. సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్, అధునాతన పీఎంఎస్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)కి మధ్య అంతరాన్ని భర్తీ చేసేలా సిఫ్ కేటగిరీ ఫండ్స్ ఉంటాయి.ఇన్ఫినిటీ హైబ్రిడ్ లాంగ్–షార్ట్ ఫండ్.. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తూ, నిర్దిష్ట డెరివేటివ్ వ్యూహాలను ఉపయోగిస్తూ, ఆర్బిట్రేజ్ అవకాశాలను అందిపుచ్చుకుంటూ మెరుగైన రాబడులను అందించే విధంగా ఉంటుందని ఫండ్ మేనేజర్ కల్పేష్ జైన్ తెలిపారు. ఒడిదుడుకుల పరిస్థితుల్లో నష్టాల రిస్కులను తగ్గిస్తూ, మార్కెట్ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడం లక్ష్యంగా ఇది పని చేస్తుందని వివరించారు. -
Income Tax: నోటీసుకి బదులివ్వండి..
ప్ర. ఆదాయపు పన్ను శాఖ నుంచి ఈ మెయిల్ ద్వారా నాకు నోటీసు వచ్చింది. ఆ నోటీసు మీద ఫిర్యాదు చేయవచ్చా. నేను నోటీసుకి బదులుగా జవాబు నా మెయిల్ ద్వారా ఇవ్వాలా? ఇక ఏదైనా మార్గం ఉందా? – బీవీ రమణ, ఈ–మెయిల్ ద్వారాజ. ఆదాయపు పన్ను శాఖ వారు అసెస్సీలకు డైరెక్టుగా వారి వారి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీలకు నోటీసులివ్వొచ్చు. అలాగే రిజిస్టర్డ్ ఎస్ఎంఎస్లకు మెసేజీలు ఇవ్వొచ్చు. మీరు మీ మెయిల్ బాక్స్ ఓపెన్ చేస్తే ఈమెయిల్ నోటీసు కనిపిస్తుంది. అలాగే సెల్ఫోన్ ఓపెన్ చేస్తే మెసేజీలు వస్తాయి. కనిపిస్తాయి. సులువుగా చదువుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో ఎన్నో ఫేక్ మెయిల్స్ వస్తున్నాయి. జనాల్లో ఒక భయం, దిగులు ఏర్పడుతున్నాయి.మీరు నోటీసుకు జవాబు ఇచ్చేటప్పుడు అసలు ఆ నోటీసు నిజమైనదా కాదా.. డిపార్టుమెంటు వారి నుంచి అధికారికంగా వచ్చిందా కాదా అనేది చెక్ చేసుకోవచ్చు. అలా చేసుకోవడానికి మీ పాన్, కాగితం రూపంలో వచ్చిన వివరాలు.. అంటే.. నోటీసు, అసెస్మెంట్ సంవత్సరం వివరాలు, నోటీసు జారీ చేసిన తేదీ, మీ మొబైల్ నంబరు వివరాలు కావాలి. వారు పంపించే డాక్యుమెంట్ మీద నంబరు ఒక ప్రత్యేకమైన నంబరు ఉంటుంది.. దీన్నే డీఐఎన్ అంటారు.. అంటే డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబరు. కంప్యూటర్ సిస్టం ద్వారా ఈ నంబరుని జనరేట్ చేస్తారు.ఉత్తరాల్లో, నోటీసుల్లో, ఉత్తర్వుల్లో ఇతర ఏ ప్రత్యుత్తరమైనా ఈ నంబరు ఉండి తీరాలి. వెంటనే నిర్ధారించండి. అది ఎలాగంటే వెంటనే ఈ–ఫైలింగ్ పోర్టల్కి వెళ్లి ‘ఆథెంటికేట్’ విండోకి వెళ్లండి. ఇలా చెక్ చేసుకోవడానికి మీరు లాగిన్ అవ్వక్కర్లేదు. పాస్వర్డ్ అక్కర్లేదు. ఇంకొక ఉపశమనం లేదా సడలింపు ఇచ్చారు. రిజిస్టర్డ్ మొబైల్ నంబరు రాయండి. అది లేని పక్షంలో ఇతరత్రా ఏ నంబరు అయినా ఇవ్వొచ్చు. అయితే, మీరు ఏ నంబర్ ఇస్తారో, ఆ నంబరుకే ఓటీపీ వస్తుంది.ఈ ప్రాసెస్ ద్వారా నోటీసు నిజమా కాదా తెలుస్తుంది. నోటీసులో డీఐఎన్ కనబడకపోయినా/ లేకపోయినా/రాయకపోయినా, చింతించవద్దు. అలాంటి కాగితాలకు జవాబివ్వక్కర్లేదు. నంబరు లేని డాక్యుమెంటు, మీ చేతిలో ఉన్నా మీకు వచ్చినట్లు కాదు. నోటీసు సిసలైనదే అయితే.. అప్పుడు ఏం చేయాలంటే, పోర్టల్లో లాగిన్ అవ్వండి. ‘ఈ–ప్రాసెసింగ్’ సెక్షన్కి వెళ్లండి. అక్కడ సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (దీన్నే సీపీసీ అని అంటారు. ఇది బెంగళూరులో ఉంది) పోర్టల్కి వెళ్లి ‘పెండింగ్ యాక్షన్స్’ విండోలోకి వెళ్లండి. మీకొచి్చన నోటీసు కనిపిస్తుంది. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 🔹మీరు నోటీసుని పట్టించుకోండి. అలక్ష్యం, నిర్లక్ష్యం తగదు. 🔹డీఐఎన్ ఉందా లేదా చెక్ చేయండి. 🔹నోటీసుని చదవండి 🔹ఏ సెక్షన్ ప్రకారం జారీ చేశారో తెలుసుకోండి 🔹అర్థం చేసుకుని, జవాబుకు ప్రిపేరవ్వండి 🔹అది నిజమనిపిస్తే ఒప్పుకోండి 🔹అది తప్పనిపిస్తే ఒప్పుకోకండి 🔹ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా సరైన వివరణ ఇవ్వండి. వివరణతో పాటు డాక్యుమెంట్లు జతపరచండి. 🔹సకాలంలో జవాబు ఇవ్వండి 🔹సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఉంటే, అదనంగా గడువు అడగండి. 🔹మీకు ఏదైనా వివరణ కావాలన్నా, ఉదాహరణగా వాళ్ల ఉత్తర్వులు, అసెస్మెంట్ ఆర్డర్ల కాపీలు అడగండి. 🔹డిమాండు చెల్లించవలసిందన్న నోటీసు రాగానే మీరు భయపడి పన్ను చెల్లించనక్కర్లేదు. కొంత మంది డిపార్టుమెంటుతో ఎందుకొచి్చన తిప్పలని, చిన్న చిన్న మొత్తాల విషయంలో ఎటువంటి సంశయం లేకుండా ఒప్పుకుని ఆ డిమాండుని చెల్లిస్తారు. అదొక ఆలోచనా విధానం. 🔹 ఒప్పుకోకపోతే వివరణ, కాగితాలు ఇవ్వండి 🔹మీరు చెప్పేది నిజమైతే, డిపార్టుమెంటు వారు వారి తప్పుని సరిదిద్దుకుంటారు. డిమాండుని విత్డ్రా చేసుకుంటారు. ఉత్తర్వులను మారుస్తారు.చివరగా..: ఆదాయం లెక్కల్లో మారవచ్చు.. పన్ను లెక్కింపుల్లో తప్పు రావొచ్చు.. డాక్యుమెంట్లు.. ముఖ్యంగా పన్ను చెల్లింపులు అప్డేట్ కాకపోవచ్చు.. ఎన్నో కారణాలు ఉంటాయి. అసెస్మెంట్ ఆర్డరులో ప్రతి అంశం చదవండి. అర్థం చేసుకోండి. నోటీసులు ఇచ్చినందుకు ఫిర్యాదులు చేయరాదు. అడిగే హక్కు వారికి.. చెప్పే బాధ్యత మనకు ఉంది. -
మ్యూచువల్ ఫండ్: రోజుకు రూ.10 సిప్
రోజువారీగా చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసే వీలు కల్పిస్తూ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ప్రత్యేకంగా ‘రోజానా సిప్’ని ప్రవేశపెట్టింది. దీని కింద సంస్థ వెబ్సైట్ ద్వారా ఒక్కో స్కీములో రోజుకు అత్యంత తక్కువగా రూ.10 నుంచి సిప్ విధానంలో పెట్టుబడి పెట్టొచ్చు. కనీసం రెండు స్కీములను ఎంచుకోవాల్సి ఉంటుంది.వీలును బట్టి తర్వాత 10 స్కీముల వరకు వీటిని పెంచుకోవచ్చు. యాక్సిస్ మల్టీక్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్, వేల్యూ ఫండ్ మొదలైనవి ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడాన్ని మదుపరులకు మరింత చేరువ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ డిజిటల్ బిజినెస్ హెడ్ బొనిఫేస్ నొరోన్హా తెలిపారు.పరిమిత పొదుపు, పెట్టుడులపై అవగాహన లేమి, మార్కెట్ హెచ్చుతగ్గులపై భయంలాంటివి ఉండే కొత్త ఇన్వెస్టర్ల సమస్యలను పరిష్కరించేలా దీన్ని రూపొందించినట్లు వివరించారు. -
సొంతిల్లా... అద్దె ఇల్లా?
సొంతిల్లా... అద్దె ఇల్లా? ఏది బెటర్? ఈ ప్రశ్నకు ఏ సమాధానం చెప్పినా కరెక్టే. కాకపోతే... అది చెప్పిన వారి దృష్టి కోణంలో మాత్రమే. ఒకరు ఇదే కరెక్ట్... అని చెప్పినంత మాత్రాన అందరికీ అదే కరెక్ట్ అనిపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇల్లు అవసరాలు... అనేది ఆలోచించే కోణం... సామాజిక– ఆర్థిక స్థాయి... మానసిక తృప్తిపై ఆధారపడి ఉంటుంది. అందుకని ఒకరికి సొంతిల్లు కరెక్టనిపించవచ్చు. మరొకరికి అదే ఈఎంఐలో సగం పెట్టి అదే ఇంట్లో అద్దెకు ఉండొచ్చు కదా? మిగిలిన ఈఎంఐ మొత్తంతో దీర్ఘకాలంలో సంపద సృష్టించవచ్చు కదా? అని అనిపించవచ్చు. రెండూ కరెక్టే. అందుకే ఎవరి పరిస్థితులు, అవసరాలను బట్టి వారు నిర్ణయించుకోవాల్సిందే. మరి ఆ అవసరాలు, పరిస్థితులను గుర్తించేదెలా? ఇదే ఈ వారం ‘వెల్త్ స్టోరీ’.. – సాక్షి, వెల్త్ డెస్క్ఇంటిని కొనటమనేది కేవలం ఆర్థిక నిర్ణయం కాదు. ఒక గుర్తింపు కోసం, భద్రత కోసం భావోద్వేగాలతో ముడిపడి తీసుకునే నిర్ణయమది. ‘ఆ రమణను చూశావా? ఎంత అందమైన ఇల్లు కట్టుకున్నాడో! చాలా ఖర్చు పెట్టాడట, గట్టిగానే సంపాదించి ఉంటాడు’... అనే గుర్తింపు చాలా మందికి కిక్కునిస్తుంది. జీవితంలో తాము సాధించిన ఘనతల్లో సొంతింటిని ఒకటిగా చూస్తుంటారు. సరైన ప్రాంతంలో ఇల్లు సమకూర్చుకుంటే, సొంతింటి కల సాకారానికితోడు కాలక్రమంలో దాని విలువ కూడా గణనీయంగా పెరుగుతుందన్నది ఒక ఆలోచన. నెలవారీ ఆదాయం నుంచి కొంత అద్దెకు కేటాయించి, మిగిలిన నిధిని సంపద సృష్టి కోసం పెట్టుబడిగా మార్చుకోవచ్చన్నదీ నిజమే. ప్రాపర్టీ కంటే ఈక్విటీలు అధిక రాబడులు ఇచ్చినట్టు చరిత్ర చెబుతోంది. పూర్వపు రోజులతో పోలిస్తే ఇపుడు చిన్న పట్టణాల నుంచి నగరాల వరకు చాలా చోట్ల ఇళ్ల స్థలాలు కొనలేనంత ఖరీదైపోయాయి. సామాన్య, మధ్య తరగతి వాసులకు అందనంత ఎత్తుకు వాటి ధరలు చేరాయి. పైగా ఇంటిపై అద్దె రూపంలో వచ్చే రాబడి ఈఎంఐతో పోలిస్తే చాలా తక్కువ. ఇలా ఎన్నో అంశాలను చూడాల్సి ఉంటుంది.సొంతింటికి వెళితే.. 🔹 భాగ్యనగరంలో ఫ్లాట్ కొనాలంటే కనీసం రూ.కోటి పైనే పెట్టాలి. 🔹 రుణంతో ముందుకు వెళ్లేట్టు అయితే 20 శాతం డౌన్ పేమెంట్ (రూ.20 లక్షలు)ను కొనుగోలుదారుడు రెడీ చేసుకోవాలి. 🔹 స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు 6 శాతం కోసం మరో రూ. 6 లక్షలు. మొత్తంగా రూ.26 లక్షలు కావాలి. 🔹 మిగిలిన రూ.80 లక్షలను బ్యాంక్ రుణంగా ఇస్తుంది. 20 ఏళ్ల కాలానికి 8 శాతం రేటు ప్రకారం చూస్తే నెలవారీ ఈఎంఐ రూ.66,915. 🔹 20 ఏళ్లలో రూ.80 లక్షల రుణానికి చెల్లించుకోవాల్సిన మొత్తం రూ.1.61 కోట్లు. ఆరంభంలో రూ.26 లక్షలు కలిపితే రూ.1.87 కోట్లు అవుతుంది. 🔹 ఇంటికి మరమ్మతులు, ప్రాపర్టీ ట్యాక్స్ తదితర ఖర్చులు అదనం. 🔹 రూ.కోటి ఇంటి కోసం దాదాపు రెట్టింపు చెల్లించాల్సి వస్తుంది. కిరాయి ఇంటికి వెళితే..? 🔹 నగరాల్లో నివాస గృహాలపై రెంటల్ ఈల్డ్స్ 2–3 శాతం మించడం లేదు. 🔹 రూ.కోటి ఇంటిపై 2.5 శాతం రాబడి ప్రకారం ఏడాదికి అద్దె రూ.2.5 లక్షలు. 🔹 ఏటా 5 శాతం పెరుగుతూ (పెరిగే ధరలకు అనుగుణంగా) వెళితే 20 ఏళ్లలో రూ.82.7 లక్షలను అద్దె రూపంలో చెల్లించాల్సి వస్తుంది. 🔹 సొంతంగా ఇల్లు సమకూర్చుకుంటే అయ్యే రూ.1.87 కోట్లలో సగానికంటే తక్కువే. 🔹 మరి మిగిలిన సగానికే ఇల్లు సొంతం అవుతోంది కదా? అని వాదించొచ్చు. ఇందులో నిజం కొంతే. కాంపౌండింగ్ మ్యాజిక్ 🔹 ఇంటిని రుణంపై తీసుకుంటే నెలవారీ రూ.66,915 ఈఎంఐ చెల్లించాలి. 🔹 అదే అద్దెకు తీసుకుంటే రూ.20,883 కిరాయి చెల్లిస్తే సరిపోతుంది. 🔹 అంటే రూ.46,082 మిగిలినట్టు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈ మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే? 🔹 12 శాతం వార్షిక రాబడి ప్రకారం చూసినా (ఇంతకంటే ఎక్కువే రావచ్చు) 20 ఏళ్లలో రూ.5.98 కోట్ల సంపద సృష్టి సాధ్యం. 🔹 మరి కొనుగోలు చేసిన ఇంటి విలువ కూడా 20 ఏళ్లలో రూ.6 కోట్లకు చేరుకుంటుందా? కచ్చితంగా చెప్పలేం. నిజానికి ఈక్విటీల్లోనే అధిక రాబడులున్నాయి మరి. 🔹 కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కేసుల్లో ప్రాపర్టీ విలువ కూడా ఇదే స్థాయిలో పెరిగిన నిదర్శనాలూ ఉన్నాయి.అటా.. ఇటా..? 🔹 సంపదను సృష్టించుకోవాలన్నది లక్ష్యం అయితే అద్దె ఇంటికి వెళ్లి, సిప్ వేసుకోవడం బెటర్. మెరుగైన రాబడులను ఇచ్చే సాధనాల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేసి కోరుకున్నంత సమకూర్చుకోవచ్చు. 🔹 ఒకవేళ అద్దెకు ఉండి, మిగిలే ఆదాయాన్ని సిప్ చేసేంత క్రమశిక్షణ లేని వారికి ఇంటి కొనుగోలే సరైన నిర్ణయం. 🔹 తరచూ ప్రాంతాలు మారుతుంటే లేదా పనిచేసే చోటుకు సమీపంలో ఉండాలనుకునుంటే రెంటెడ్ హోమ్ అనుకూలం. 🔹 ఇంటికి ఈఎంఐ పెద్ద మొత్తంలోనే ఉంటుంది. పిల్లల ఉన్నత విద్య, వివాహాలు, తమ విశ్రాంత జీవన అవసరాల కోసం కూడా పెట్టుబడి మిగులు ఉండేలా చూసుకోవాలి. సొంతిల్లు ఎప్పుడు? కొన్ని సందర్భాల్లో ఇంటిపై పెట్టుబడి సిరులు కురిపిస్తుందనడంలో సందేహం లేదు. 🔹 ధరలు ఏటా 10 శాతం మించి పెరిగే చోట ఇంటిపై పెట్టుబడి కాసులు కురిపిస్తుంది. 🔹 గృహ రుణాలు కనిష్ట స్థాయిలకు చేరిన సందర్భంలోనూ ఇంటికి ఈఎంఐ రూపంలో చెల్లింపులు తగ్గుగాయి. 🔹 దీర్ఘకాలం పాటు స్థిర నివాసం కోరుకుంటే ముందడుగు వేయొచ్చు. 🔹 గృహ రుణం చెల్లింపులపై పన్ను మినహాయింపు ప్రయోజనాలను (పాత పన్ను విధానంలో రూ.2 లక్షల వరకు వడ్డీపై) పూర్తి స్థాయిలో వినియోగించుకున్నా ఆ మేరకు దీర్ఘకాలంలో చాలా ఆదా అవుతుంది. 🔹 ఎక్కువ మంది ఇంటి కొనుగోలుకే ఎందుకు మొగ్గు చూపుతారంటే? సొంతిల్లు కలిగి ఉండాలన్న అభిలాషే అని చెప్పొచ్చు. తమకు నచ్చిన ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవచ్చు. ఉన్నట్టుండి ఖాళీ చేయనక్కర్లేదు. ఏటా అద్దె పెంచనక్కర్లేదు. సామాజిక గుర్తింపు ఇలా ఎన్నో భావోద్వేగ అంశాలు ఆ దిశగా నడిపిస్తుంటాయి. 🔹 సొంతిల్లును సంపద సృష్టి కంటే నివాస యోగ్య సాధనంగానే చూడాలి. భావోద్వేగాల కంటే ఆర్థిక భద్రతకే ప్రాధాన్యం ఎక్కువ. నోట్: ఏటా కనీసం 10 శాతానికి పైన పెరుగుతూ వెళితేనే సొంతిల్లు మెరుగైన నిర్ణయమని స్పష్టమవుతోంది. -
‘బంగారం, వెండి.. పడిపోతున్నాయ్’
ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి బంగారం, వెండి, క్రిప్టో ఆస్తులపై ఆశావహ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు పడిపోతున్నప్పటికీ తాను విక్రయించడం లేదని, సరైన సమయంలో కొనుగోలు చేసేందుకు వేచి చూస్తున్నానని తెలిపారు. ధరల ఆధారంగా కాకుండా ఆస్తులు ఉన్న ఆర్థిక, రాజకీయ పరిస్థితులను బట్టి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో కియోసాకి, అమెరికాతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమస్యలను రాజకీయ, బ్యాంకింగ్ నాయకత్వం సమర్థంగా పరిష్కరించడం లేదని అభిప్రాయపడ్డారు. దీంతో భవిష్యత్తులో బంగారం, వెండి, బిట్ కాయిన్, ఇథీరియమ్ వంటి ఆస్తుల విలువలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.సాంకేతిక చార్టులను పరిశీలిస్తున్నానని, బంగారం, వెండి ధరలు భారీ ర్యాలీకి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని కియోసాకి చెప్పారు. అయితే తన అభిప్రాయాలను గుడ్డిగా నమ్మవద్దని, ప్రతి ఒక్కరూ స్వయంగా పరిస్థితులను విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రాబోయే కాలం ఆసక్తికరంగా ఉండబోతోందని, తెలివిగా వ్యవహరించే ఇన్వెస్టర్లు మరింత సంపద సృష్టించుకోగలరని ఆయన వ్యాఖ్యానించారు.Gold and silver prices are falling. Q: Am I buying or selling?A: One mistake I have made (and I’ve made many) is letting price determine reasons to buy or sell any asset.I have learned to understand the “context” or the environment the asset is in….not the price.For…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 20, 2026 -
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్: వరుస సెలవులు
వచ్చే వారం దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకు వినియోగదారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోహర్రం సందర్భంగా జూన్ 25, 26 తేదీల్లో రాష్ట్రాలవారీగా బ్యాంకులకు సెలవులు ఉండగా, అనంతరం నాలుగో శనివారం (జూన్ 27), ఆదివారం (జూన్ 28) రావడంతో అనేక ప్రాంతాల్లో వరుసగా నాలుగు రోజులపాటు బ్యాంకు శాఖలు మూతపడనున్నాయి.ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం మోహర్రం సందర్భంగా సెలవుల తేదీలు రాష్ట్రానికోలా మారే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఆర్బీఐ పరిధిలోని బ్యాంకులకు జూన్ 25న సెలవు ఉండగా, తెలంగాణ సహా దేశంలోని చాలా ప్రధాన నగరాల్లో జూన్ 26న మోహర్రం సెలవు వర్తించనుంది.జూన్ 26న హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు, భోపాల్, లక్నో, పాట్నా, రాంచీ తదితర నగరాల్లో బ్యాంకు శాఖలు పనిచేయవు. జూన్ 27 నాలుగో శనివారం, జూన్ 28 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మూసి ఉంటాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి నెల రెండో, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు బ్యాంకులకు సాధారణ సెలవులు ఉంటాయి.బ్యాంకు శాఖలు మూసివున్నప్పటికీ డిజిటల్ సేవలకు అంతరాయం ఉండదు. యూపీఐ, ఐఎంపీఎస్, నెట్బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ, నిధుల బదిలీ, బిల్లు చెల్లింపులు వంటి సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. అలాగే ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ సేవలు కూడా సెలవు రోజుల్లో కొనసాగుతాయి. అయితే నిర్వహణ పనుల కారణంగా కొన్ని సందర్భాల్లో తాత్కాలిక అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉండటంతో వినియోగదారులు ముందుగానే ముఖ్యమైన లావాదేవీలు పూర్తి చేసుకోవడం మంచిది. -
ఈపీఎఫ్ సభ్యులకు త్వరలో డబుల్ ధమాకా!
దేశంలోని 7 కోట్లకు పైగా ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) సభ్యులకు త్వరలో రెండు కీలక ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి. ఒకటి 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ జమ, రెండోది ఈపీఎఫ్ సభ్యులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా సదుపాయం.8.25 శాతం వడ్డీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగించాలని ఈపీఎఫ్ఓ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిఫారసు చేయగా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం అనంతరం ఈ నెలాఖరులోగా సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమయ్యే అవకాశముందని సమాచారం. దీంతో వరుసగా మూడో ఏడాది కూడా సభ్యులకు 8.25 శాతం వడ్డీ లభించనుంది.ఈపీఎఫ్ ఏటీఎం/యూపీఐ విత్డ్రాఇదే సమయంలో ఈపీఎఫ్ఓ తన సేవలను పూర్తిగా డిజిటల్ దిశగా మార్చే ‘ఈపీఎఫ్ఓ 3.0’ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత సభ్యులు పేపర్లెస్ విధానంలో పీఎఫ్ క్లెయిమ్లు దాఖలు చేయడం, ఖాతాల బదిలీలు చేయడం, అలాగే అర్హత ఉన్న మొత్తాన్ని యూపీఐ లేదా యూపీఐ-సపోర్టెడ్ ఏటీఎంల ద్వారా నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసుకునే అవకాశం పొందనున్నారు. ఈ సదుపాయం కోసం అవసరమైన సాంకేతిక పరీక్షలు పూర్తయ్యాయని కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవల వెల్లడించారు. అయితే దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభించే ఖచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించలేదు.ప్రతిపాదిత విధానాల ప్రకారం సభ్యుల పీఎఫ్ నిధుల్లో కొంత భాగాన్ని రిటైర్మెంట్ భద్రత కోసం కొనసాగిస్తూ, అర్హత ఉన్న మొత్తంలో 50 నుంచి 75 శాతం వరకు యూపీఐ లేదా ఏటీఎం ద్వారా ఉపసంహరించుకునే అవకాశం కల్పించే దిశగా ఈపీఎఫ్ఓ పనిచేస్తోంది. అయితే ఈ నిబంధనలు ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదని, అధికారిక మార్గదర్శకాలు వెలువడిన తర్వాతే తుది వివరాలు స్పష్టమవుతాయని అధికారులు చెబుతున్నారు.ఇక సభ్యుల సౌకర్యార్థం ఆటో-సెటిల్మెంట్ క్లెయిమ్ పరిమితిని ఇప్పటికే రూ.5 లక్షలకు పెంచిన ఈపీఎఫ్ఓ, వైద్యం, విద్య, గృహ నిర్మాణం, వివాహం వంటి అవసరాలకు సంబంధించిన క్లెయిమ్లను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించే చర్యలు చేపట్టింది. భవిష్యత్తులో ఉమాంగ్ యాప్లో ఫేస్ ఆథెంటికేషన్, వాట్సాప్ ఆధారిత సేవలు, తక్షణ పాస్బుక్ యాక్సెస్, ఆన్లైన్ వివరాల సవరణ వంటి సదుపాయాలు కూడా మరింత విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి. -
బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడంతే.. రూ.5 కోట్లు జాక్పాట్!
సాధారణంగా అందరికీ బ్యాంకు అకౌంట్లు ఉంటాయి. ఒకటో తారీఖున అలా జీతం పడగానే మొత్తం ఖర్చయిపోతుంది.. నెలాఖరుకు వచ్చేసరికి ఖాతా ఖాళీ అవుతుంది. ఇదీ సగటు జీవుడి బ్యాంక్ ఖాతా చిత్రం. నెల చివర్లో తమ ఆర్థిక దుస్థితిని తెలియజేసేందుకు కొందరు ఖాళీ అయిన తమ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ను స్క్రీన్ షాట్లు తీసి సరదాగా స్టేటస్లు కూడా పెట్టుకుంటుంటారు. అయితే ఇలా బ్యాంక్ అకౌంట్తోనే జాక్పాట్ కొట్టడం గురించి ఎప్పుడైనా విన్నారా?అబుదాబిలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన 34 ఏళ్ల షాజీర్ వెంగా అనూహ్యంగా రూ.5 కోట్లకు పైగా నగదు బహుమతిని గెలుచుకుని వార్తల్లో నిలిచాడు. యూఏఈకి చెందిన షార్జా ఇస్లామిక్ బ్యాంక్ (Sharjah Islamic Bank) నిర్వహిస్తున్న ‘ఎస్ఐబీ మిలియనీర్’ సేవింగ్స్ రివార్డ్స్ ప్రచారంలో ఆయనకు 20 లక్షల దిర్హమ్లు (సుమారు రూ.5.15 కోట్లు) గ్రాండ్ ప్రైజ్గా లభించింది. షాజీర్ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా తెరిచి ఇంకా రెండు నెలలు కూడా పూర్తికాకముందే ఈ భారీ బహుమతి అతని ఖాతాలో పడటం విశేషం.బ్యాంకు వెల్లడించిన వివరాల ప్రకారం.. షాజీర్ ఎస్ఐబీ డిజిటల్ యాప్ ద్వారా సేవింగ్స్ ఖాతా ప్రారంభించాడు. అనంతరం జూన్ 2026 డ్రాలో అతని పేరు గ్రాండ్ ప్రైజ్కు ఎంపికైంది. అదే డ్రాలో యూఏఈకి చెందిన మోజా అల్షంసీ లగ్జరీ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం కారును గెలుచుకోగా, మరో 40 మంది నగదు బహుమతులు అందుకున్నారు.దీనిపై స్పందించిన షాజీర్.. “ఎస్ఐబీ మిలియనీర్ ప్రచారం గురించి ముందే తెలుసు. ఏదో ఒకరోజు నేను కూడా విజేతగా నిలుస్తానని ఆశించేవాడిని. కానీ ఇంత త్వరగా అదృష్టం వరిస్తుందని ఊహించలేదు. ఈ 20 లక్షల దిర్హమ్లు నా జీవితాన్నే మార్చేస్తాయి. భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడమే కాకుండా, భారత్లో ఉన్న నా కుటుంబాన్ని యూఏఈకి తీసుకురావాలనే కలను సాకారం చేస్తాయి” అని పేర్కొన్నాడు.కస్టమర్లలో పొదుపు అలవాటును ప్రోత్సహించేందుకు షార్జా ఇస్లామిక్ బ్యాంక్ 2025లో ‘ఎస్ఐబీ మిలియనీర్’ ప్రచారాన్ని ప్రారంభించింది. అర్హత కలిగిన సేవింగ్స్ లేదా డిపాజిట్ ఖాతాల్లో ప్రతి 10,000 దిర్హమ్ల బ్యాలెన్స్కు ఒక డ్రా ఎంట్రీ లభిస్తుంది. ఏడాది పొడవునా కోట్ల రూపాయల విలువైన నగదు బహుమతులు, లగ్జరీ వాహనాలు ఈ పథకం ద్వారా అందజేస్తున్నారు. బ్యాంకు అధికారుల ప్రకారం, రాబోయే డ్రాల్లో కూడా ఒక్కోటి 10 లక్షల దిర్హమ్ల విలువైన రెండు ప్రధాన నగదు బహుమతులు ప్రకటించనున్నారు.Congratulations to the winners of SIB Millionaire Draw!Mr. Shajeer Venga won the Grand Cash Prize of AED 2 Million, and Mrs. Moza Butti won a BMW XM.We also congratulate forty other winners who received valuable cash prizes.Start your journey towards achieving a million… pic.twitter.com/osCjwVraHs— Sharjah Islamic Bank (@shjislamicbank) June 16, 2026 -
ఏటీఎం నుంచి మనీ విత్డ్రా.. EPFOనుంచి కీలక అప్డేట్ వచ్చేసింది
ఈపీఎఫ్వో సభ్యులకు శుభవార్త. త్వరలోనే ఏటీఎం సెంటర్ల ద్వారా, అలాగే యూపీఐ యాప్ల ద్వారా పీఎఫ్ విత్డ్రా చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో ఈ సౌకర్యం అమలు కానుంది. ఇటీవల కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా ఒక కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.ఈపీఎఫ్వో 3.0లో సభ్యులు తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్లో 75 శాతం వరకు తక్షణ ఉపసంహరణ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏటీఎం లేదా యూపీఐ ద్వారా రోజుకు రూ.10,000 వరకు ఉపసంహరించుకోవచ్చు. రూ.5 లక్షల వరకు క్లెయిమ్లు ఆటోమేటిక్గా మూడు రోజుల్లో ఆమోదం పొందుతాయి. ఇంతకు ముందు ఈ ప్రక్రియకు 7నుంచి 20 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు ఏఐ ఆధారిత సిస్టమ్ ద్వారా వేగంగా క్లెయిమ్లు సెటిల్ అవుతాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులకు తక్షణ ఆర్థిక సహాయం అందించడమే దీని లక్ష్యం.ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ మొత్తాన్ని కొత్త ఖాతాకు మార్చుకోవడానికి ఇంతకు ముందు ఫారమ్ 13 నింపాల్సి వచ్చేది. ఇకపై ఈ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటిక్గా జరుగుతుంది. ఉద్యోగి కొత్త సంస్థలో చేరిన వెంటనే పీఎఫ్ ఖాతా ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే విధంగా, సభ్యులు తమ పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత వివరాలను ఆధార్ ఆధారంగా స్వయంగా సరిచేసుకోవచ్చు. ఇంతకు ముందు ఈ మార్పులకు ఉద్యోగి,యజమాని ఇద్దరూ కలిసి జాయింట్ డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చేది.ఈ కొత్త సౌకర్యాలతో ఉద్యోగులకు పేపర్వర్క్ తగ్గుతుంది, క్లెయిమ్ సెటిల్మెంట్ వేగవంతమవుతుంది, పీఎఫ్ ట్రాన్స్ఫర్ సులభతరం అవుతుంది. పెన్షన్ చెల్లింపుల్లో కూడా పారదర్శకత పెరుగుతుంది. అయితే, అన్ని ఫీచర్లు దశలవారీగా అమలు అవుతున్నాయి. ప్రస్తుతం యూపీఐ ఆధారిత ఉపసంహరణలు కొంతమంది సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.పెన్షన్ ఉపసంహరణకు సంబంధించి కొత్త నియమాలు కూడా అమలులోకి వచ్చాయి. ఉదాహరణకు, 36 నెలల నిరుద్యోగం తర్వాత మాత్రమే పెన్షన్ ఉపసంహరణ చేసుకోవచ్చు. ఈపీఎఫ్వో 3.0తో ఉద్యోగులకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ ఆర్థిక సహాయం, వేగవంతమైన సేవలు, మరింత పారదర్శకత లభించనున్నాయి. -
బంగారాన్ని మించిన ఆస్తులున్నాయ్: కియోసాకి
ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, అప్పులు, ఫెడరల్ రిజర్వ్ విధానాలపై చర్చలు జరుగుతున్న వేళ, ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తన ఫేస్బుక్ పోస్ట్ ద్వారా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కియోసాకి అభిప్రాయం ప్రకారం, అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం 37 ట్రిలియన్ డాలర్ల అప్పు భారంతో ఉంది. కొత్త ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ద్రవ్యోల్బణాన్ని మరింత వేడెక్కనివ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో, సాధారణంగా బ్యాంకుల్లో డిపాజిట్లు, సీడీలు, ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టే "పూర్ సేవర్స్" తమ డబ్బు విలువను నిశ్శబ్దంగా కోల్పోతారని ఆయన హెచ్చరించారు. "గోల్డ్ ఒక మంచి రక్షణ. 1970లలో అది విలువను నిలబెట్టుకుంది. కానీ అది కేవలం నీటిని నిల్వ చేసే సీసా లాంటిది. లీక్ కాకుండా కాపాడుతుంది. కానీ నిజమైన ధనవంతులు ద్రవ్యోల్బణం వల్ల లాభపడే ఆస్తులను ఎంచుకుంటారు" అని కియోసాకి వ్యాఖ్యానించారు. ఆయన ప్రకారం, గోల్డ్ మాత్రమే కాదు, చరిత్రలో ద్రవ్యోల్బణం వల్ల మరింత పెరిగిన మూడు ప్రత్యేక ఆస్తులు ఉన్నాయని, వాటిని త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు. -
ఎన్నారైల బ్యాంక్ డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
భారత ఆర్థిక వ్యవస్థకు విదేశీ మారకద్రవ్య ప్రవాహాలను పెంచే దిశగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నారైలు (NRIs), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCIs) నుంచి అధిక మొత్తంలో డిపాజిట్లను ఆకర్షించేందుకు ఎంపిక చేసిన నాన్-రెసిడెంట్ ఎక్స్టర్నల్ (NRE), ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ [FCNR(B)] డిపాజిట్లపై అమలులో ఉన్న వడ్డీ రేటు పరిమితులను తాత్కాలికంగా తొలగించింది. ఈ సడలింపు 2026 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది.ఆర్బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం.. మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితి గల తాజా ఎన్ఆర్ఈ డిపాజిట్లపై బ్యాంకులు తమ అవసరాలకు అనుగుణంగా అధిక వడ్డీ రేట్లు ప్రకటించవచ్చు. అలాగే మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితి గల కొత్త ఎఫ్సీఎన్ఆర్బీ డిపాజిట్లపై కూడా ఇప్పటివరకు ఉన్న వడ్డీ పరిమితులు వర్తించవు. ఈ సడలింపు కొత్తగా సమీకరించే డిపాజిట్లకే కాకుండా, మెచ్యూరిటీ అనంతరం పునరుద్ధరించే అర్హత గల డిపాజిట్లకు కూడా వర్తిస్తుంది.ఇప్పటి వరకు ఎన్ఆర్ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సమాన కాలపరిమితి గల దేశీయ రూపాయి టర్మ్ డిపాజిట్ల కంటే ఎక్కువగా ఉండకూడదనే నిబంధన అమల్లో ఉండేది. అలాగే ఎఫ్సీఎన్ఆర్బీ డిపాజిట్లపై కూడా నిర్దిష్ట పరిమితులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిమితులు తొలగించడంతో బ్యాంకులు ఎన్నారై డిపాజిట్ల కోసం మరింత పోటీగా వడ్డీ రేట్లు ప్రకటించే అవకాశం ఏర్పడింది.ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి వంటి అంశాల నేపథ్యంలో విదేశీ కరెన్సీ ప్రవాహాలను పెంచేందుకు ఆర్బీఐ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఈ నెల ప్రారంభంలో మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితి గల తాజా ఎఫ్సీఎన్ఆర్బీ డిపాజిట్లకు సంబంధించిన పూర్తి హెడ్జింగ్ వ్యయాన్ని తానే భరిస్తామని కూడా ప్రకటించింది. అంతేకాకుండా ఈ డిపాజిట్లను సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ నిబంధనల నుంచి కూడా తాత్కాలికంగా మినహాయించింది.మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే పలు బ్యాంకులు అమెరికన్ డాలర్ ఆధారిత ఎఫ్సీఎన్ఆర్బీ డిపాజిట్లపై 6 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ రేట్లను ప్రకటించాయి. చిన్న, మధ్య తరహా బ్యాంకులు డిపాజిట్ల కోసం మరింత ఆకర్షణీయమైన రేట్లు ప్రకటించే అవకాశముందని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఎన్ఆర్వో ఖాతాల నుంచి ఎన్ఆర్ఈ ఖాతాలకు బదిలీ చేసిన నిధులకు ఈ ప్రత్యేక మినహాయింపు వర్తించదని ఆర్బీఐ స్పష్టం చేసింది. -
భారీగా క్రెడిట్ కార్డు అప్పులు.. కియోసాకి అలర్ట్
ప్రపంచ ప్రసిద్ధ పర్సనల్ పైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) అమెరికన్ల పెరుగుతున్న క్రెడిట్ కార్డు అప్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో చేసిన పోస్టులో వినియోగపు అలవాట్లు ఎలా ఆర్థిక భారంగా మారుతున్నాయో వివరించారు.ప్రస్తుతం అమెరికన్లు క్రెడిట్ కార్డులపై 1.28 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.120 లక్షల కోట్లు) అప్పుల్లో ఉన్నారన్న కియోసాకి, ఈ భారీ అప్పులకు అనవసర ఖర్చులే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు.అమెరికన్లు చేసిన ఖర్చుల జాబితాను ప్రస్తావిస్తూ ఆయన కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఖరీదైన రెస్టారెంట్లలో విందులు, వాడకపోయినా స్ట్రీమింగ్ సర్వీసుల సబ్స్క్రిప్షన్లను కొనసాగించడం, అనవసరంగా దుస్తులు కొనుగోలు చేయడం, విహారయాత్రల కోసం అప్పులు చేయడం, గుర్తింపులేని ఆన్లైన్ షాపింగ్ ఆర్డర్లు, ఉపయోగించని జిమ్ సభ్యత్వాలు వంటి ఖర్చులు ప్రజలను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.అలాగే కొత్త గ్యాడ్జెట్లు, అప్గ్రేడ్లు, వివిధ సబ్స్క్రిప్షన్లు, సౌకర్యాల కోసం చెల్లించే అదనపు రుసుములు కొనుగోలు సమయంలో అవసరమైనవిగా అనిపించినప్పటికీ, తర్వాత అవే ఆర్థిక భారంగా మారుతాయని కియోసాకి హెచ్చరించారు.తన ప్రసిద్ధ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’లో ఉపయోగించిన “డూడాడ్స్ (Doodads)” అనే పదాన్ని గుర్తుచేస్తూ, అవసరం లేని వస్తువులు మనల్ని ధనవంతుల్లా భావింపజేసినా, వాస్తవానికి పేదరికం వైపు నెడతాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సగటు అమెరికన్ వ్యక్తి సుమారు 7,900 డాలర్లు (దాదాపు రూ.6.8 లక్షలు) క్రెడిట్ కార్డు అప్పుతో ఉన్నారని, దానిపై 24 శాతం వడ్డీ చెల్లిస్తూ మినిమమ్ డ్యూలతో నెట్టుకొస్తున్నారని కియోసాకి తెలిపారు. ఇలాంటి అప్పులపై వడ్డీ చక్రవడ్డీలా పెరుగుతూ ఆర్థిక స్వేచ్ఛను దూరం చేస్తుందని ఆయన హెచ్చరించారు.అందరూ తమ ఖర్చుల అలవాట్లను పరిశీలించుకోవాలని, అవసరం లేని వ్యయాలను తగ్గించి నిజమైన సంపద సృష్టి వైపు అడుగులు వేయాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ఖర్చులను నియంత్రించి ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు తాను ఒక ఉచిత మార్గదర్శకాన్ని సిద్ధం చేశానని తన పోస్టులో పేర్కొన్నారు. -
Income Tax: ‘ఇన్కం స్టేట్మెంట్’ ఇలా తయారు చేయండి..
2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి గడువు తేదీ 2026 జూలై 31. అంటే.. వచ్చే నెలాఖరులోపలే. ఈ రోజు నాటికి ఫారం 1,2 అలాగే ఫారం 4 దాఖలు చేయడానికి అన్ని యుటిలిటీలు రెడీగా ఉన్నాయి. రిటర్నులు దాఖలు అవుతున్నాయి. అయితే, 1 గానీ 2 గానీ 4 గానీ ముందుగా మీరు ‘ఇన్కం స్టేట్మెంట్’ చేసుకోవాలి. ఈ స్టేట్మెంట్ తయారు చేసుకోవడం చాలా సులువైన పని. ఇంకేం.. రంగంలోకి దూకండి. ఆదాయంపరంగా ఆలోచిస్తే, మీరు మీ ఆదాయం ఏయే ‘సోర్స్’ ద్వారా వస్తుందో ఒక పట్టిక/జాబితా చేయండి. ఉదాహరణకి 🔸 జీతం/వేతనం 🔸 పెన్షన్ 🔸 కొన్ని నెలలు జీతం, మిగతా నెలలు పెన్షన్ 🔸 యాన్యుటీలు 🔸 ప్రతి నెలా వచ్చే ఇంటద్దెలు. మీ సౌలభ్యం కోసం మీరు మీరు అద్దెకిచ్చిన ప్రాపర్టీల జాబితా తయారు చేసుకోండి. క్రమసంఖ్య, ఇంటి నంబరు, ప్లాట్ నంబరు, లొకేషన్, ఊరి పేరు, పట్నం పేరు మొదలైన వివరాలు ఉండాలి. ఈ ప్రాపర్టీలకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలించి చూడండి. ఓనర్షిప్.. సింగిలా/జాయింటా? వాడుకలో మాది మాది అని అంటాం, ఎప్పుడు కొన్న ప్రాపర్టీ అనేది వివరాలు గుర్తుండవు. అప్పట్లో బ్యాంకర్లు (ఇప్పుడూ అనుకోండి) అప్పు ఎక్కువ రావడానికి మీ జీవిత భాగస్వామిని/కుటుంబ సభ్యులను కో–అప్లికెంటుగా ఇరికిస్తారు లేక మీరే ట్యాక్స్ ప్లానింగ్కని ఇద్దరూ కలిసి జాయింటుగా రాస్తారు. ఇవన్నీ ఓనర్షిప్కి పనికి వస్తాయి. తర్వాత చెల్లించిన మున్సిపల్ ట్యాక్స్ చెల్లింపులు, బ్యాంకులు, జమలు, నగదు వసూళ్లు, అద్దెలోకి వస్తాయి. 🔸ప్రతినెల మీ బ్యాంకు ఖాతాలో జమయ్యే వడ్డీలు. 🔸 మీ చేతికి నెల నెలా రాకపోయినా మీ ఎఫ్డీఆర్కి క్రెడిట్ అయ్యేవి, మెచ్యూరిటీ రోజు నాటికి మొత్తం అసలు, వడ్డీ జమ అవుతాయి. కానీ మీరు సంవత్సరానికి వచ్చిన వడ్డీనే తీసుకోవచ్చు. 🔸 జమ అయ్యే వడ్డీలు, అలాగే జమ కానివి, నగదు రూపేణా వచ్చేవి. 🔸 డివిడెండ్లు, బ్యాంకులో జమ అవుతాయి. 🔸 ఇతర ఆదాయాలు 🔸 వ్యవసాయ ఆదాయాలు. బ్యాంకు అకౌంట్ స్టేట్మెంటు/పాస్బుక్లో ప్రతి జమ, ఎందుకొచి్చందో విశ్లేషించండి. వివరించండి. 🔸 ముందుగా విత్డ్రా చేసి, ఖర్చులు పోను, మిగిలిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేశారనుకోండి.. అది మీ ఆదాయం కాదు. 🔸 మీకు ఎవరైనా అప్పు తీర్చి ఉంటే, ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేస్తే, అది ‘ఆదాయం’ కాదు. కానీ ఇలాంటి వ్యవహారాలు ‘శల్యపరీక్ష’కు గురవుతాయి. 🔸 ఆస్తులు, షేర్లు, సెక్యూరిటీలు, బంగారం, ఆభరణాల్లాంటి విలువైన వస్తువులను అమ్మగా వచి్చన డిపాజిట్లు. వీటి మీద క్యాపిటల్ గెయిన్స్ పడే అవకాశం ఉంది. విశ్లేషణ, వివరణ చేసుకోండి. 🔸 పీఎఫ్ విత్డ్రాయల్స్, ఎల్ఐసీ పాలసీ మెచ్యూరిటీ మొత్తం, ఎన్ఎస్సీల మెచ్యూరిటీ, చిట్ఫండ్లో చేరి పాట పాడగా వచ్చిన మొత్తం, పూర్తి విశ్లేషణ, సమగ్రంగా వివరణ అవసరం 🔸 మీరు వ్యాపారస్తులైతే ప్రత్యేకంగా అకౌంట్స్ నిర్వహించండి. వ్యాపారపు కరెంటు ఖాతా నుంచి మీ ఎస్బీ అకౌంటుకు చేసిన జమలు.. అవి సొంత వాడకాలా... జీతమా లేక అప్పు తీర్చడమా.. విశ్లేషించుకోండి. 🔸 వీలున్నంత వరకు కరెంటు ఖాతా, మరియు ఎస్బీ అకౌంటును విడివిడిగా నిర్వహిస్తూ, రెండింటి మధ్య వ్యవహారాలు, తక్కువగా ఉండేలా చూసుకోండి. అనివార్యమైతే, సరిగ్గా విశ్లేషణ, వివరణ రెడీగా పెట్టుకోండి. 🔸 ఏ జమ పడినా వివరణ ఉంచుకోండి. చివరిగా, మీ అన్ని బ్యాంకు అకౌంట్లు విశ్లేషించండి. వివరాలు పొందుపర్చండి. జీతం నిమిత్తం 12 జమలు ఉండాలి. తక్కువ, ఎక్కువ అయితే, ఆరా తీయండి. అద్దె జమలు 12 రసీదులకు తగ్గినా, ఎక్కువయినా ఆరా తీయండి. అద్దె విషయంలో అడ్వాన్స్లను జాగ్రత్తగా సర్దుబాటు చేయండి. 2026 మార్చి 31 తర్వాత కూడా 2025–26కి సంబంధించిన వ్యవహారాలు జమ కావొచ్చు. అలాగే, ఏప్రిల్ 2025లో 2024–25కి సంబంధించినవి జమ కావొ చ్చు. ఇప్పుడు మీ చేతిలో ‘జమలు’ ఉన్నాయి. వాటి సాయంతో ‘స్టేట్మెంట్’ చేయడానికి ఉపక్రమించండి. -
పీఎఫ్ డబ్బులు రూ.2.5 కోట్లు వెనక్కివ్వాలని నోటీసు..
రిటైర్మెంట్ అనంతరం మెరుగైన జీవనం కోసం ఉద్యోగులు తమ సర్వీసు కాలమంతా పీఎఫ్ సొమ్మును పొదుపు చేసుకుంటారు. పదవీ విరమణ తర్వాత వచ్చే భారీ మొత్తంతో ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవనం కొనసాగుతుందని భావిస్తారు. అయితే ఇలాగే పొదుపు చేసుకున్న పీఎఫ్ సొమ్మును అందుకున్న ఓ ఉద్యోగిని ఆ సొమ్మును తిరిగి ఇచ్చేయాలని ఈపీఎఫ్వో నోటీసు ఇచ్చింది. దీనికిపై ఆ ఉద్యోగి కోర్టుకు వెళ్లగా ఏం జరిగిందంటే..పదవీ విరమణ పొందిన ఉద్యోగికి చెల్లించిన ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఈపీఎఫ్వో (EPFO) కోరడం చట్టబద్ధం కాదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగికి చెల్లించిన పీఎఫ్లో ఏవైనా నిబంధనల ఉల్లంఘనలు జరిగి ఉంటే, వాటికి బాధ్యత యజమాని సంస్థ లేదా దాని పీఎఫ్ ట్రస్ట్దేనని, ఉద్యోగిదికాదని కోర్టు తేల్చిచెప్పింది.జస్టిస్ నగేష్ భీమాపాక 2025లో దాఖలైన రిట్ పిటిషన్ నెం. 6276పై ఈ తీర్పు ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగి జె.వి. నృపేందర్ రావుకు ఈపీఎఫ్వో జారీ చేసిన రికవరీ నోటీసును కోర్టు రద్దు చేసింది. అయితే సదురు కంపెనీపై అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకునే స్వేచ్ఛను ఈపీఎఫ్వోకు ఇచ్చింది.రూ.2.5 కోట్ల చెల్లింపుతో మొదలైన వివాదంజె.వి. నృపేందర్ రావు పనిచేసిన సంస్థకు సొంత పీఎఫ్ ట్రస్ట్ ఉండేది. ఈ ట్రస్ట్కు 1981 నుంచే ‘ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్’ హోదా ఉండేది. అయితే సంస్థ 2023 మార్చి 1 నుంచి ఆ హోదాను సరెండర్ చేసింది. అనంతరం 2023 జూలై 21న రావుకు రూ.2.50 కోట్ల పీఎఫ్ బకాయిలు చెల్లించింది. మరో రూ.70 లక్షలు యెస్ బ్యాంక్ బాండ్లలో నిలిచిపోవడంతో తర్వాత చెల్లిస్తామని తెలిపింది.సంస్థ పీఎఫ్ ట్రస్ట్ నిధుల్లో భాగంగా యెస్ బ్యాంక్ బాండ్లలో పెట్టుబడులు పెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు, సుప్రీంకోర్టు చర్యల కారణంగా ఆ బాండ్లు నిలిచిపోవడంతో కొంత మొత్తం విడుదల కాలేదు. దీంతో ఉద్యోగికి విడతల వారీగా చెల్లింపులు జరిగాయి.ఈపీఎఫ్వో రికవరీ నోటీసుఎగ్జెంప్షన్ హోదా సరెండర్ చేసిన తర్వాత పీఎఫ్ ట్రస్ట్ ఉద్యోగికి నేరుగా చెల్లింపులు చేయడం నిబంధనలకు విరుద్ధమని ఈపీఎఫ్వో అభిప్రాయపడింది. ఉద్యోగి అందుకున్న రూ.2.5 కోట్లను 12 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని దీంతో 2025 ఫిబ్రవరి 17న నోటీసు జారీ చేసింది. ఈ మొత్తాన్ని ఏడు రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది.కోర్టు ఏమంది?ఈపీఎఫ్ చట్టం ఉద్యోగుల సంక్షేమం కోసం రూపొందించిన సామాజిక భద్రత చట్టమని హైకోర్టు పేర్కొంది. ఎగ్జెంప్షన్ సరెండర్ తర్వాత పీఎఫ్ నిధులను ఈపీఎఫ్వోకు బదిలీ చేసే బాధ్యత పూర్తిగా యజమాన్య సంస్థ, దాని ట్రస్ట్పైనే ఉంటుందని స్పష్టం చేసింది. ఉద్యోగి తనకు చట్టబద్ధంగా రావలసిన మొత్తాన్ని స్వీకరించినందుకు అతనిపై రికవరీ చర్యలు తీసుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించింది.అంతేకాకుండా ఉద్యోగిపై మోసం, తప్పుడు సమాచారం లేదా కుమ్మక్కు ఆరోపణలు ఏవీ లేవని కోర్టు గమనించింది. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగి నుంచి డబ్బు వసూలు చేయడానికి చట్టంలో స్పష్టమైన నిబంధన లేదని పేర్కొంది. రికవరీ నోటీసు జారీ చేసే ముందు ఉద్యోగికి షోకాజ్ నోటీసు ఇవ్వకపోవడం, వ్యక్తిగత విచారణకు అవకాశం కల్పించకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. అందువల్ల ఈపీఎఫ్వో జారీ చేసిన నోటీసును రద్దు చేసింది.అయితే పీఎఫ్ ట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించిందా? లేదా? అన్న అంశంపై హైకోర్టు ఎలాంటి తుది అభిప్రాయం వ్యక్తం చేయలేదు. అవసరమైతే ఈపీఎఫ్ చట్టం ప్రకారం సంస్థ లేదా దాని ట్రస్ట్పై తగిన చర్యలు తీసుకోవచ్చని ఈపీఎఫ్వోకు స్వేచ్ఛ ఇచ్చింది.సొంత పీఎఫ్ ట్రస్ట్ అంటే ఏమిటి?సాధారణంగా ఉద్యోగుల పీఎఫ్ చందాలు నేరుగా ఈపీఎఫ్వోకు వెళ్తాయి. కానీ కొన్ని సంస్థలు అనుమతి తీసుకుని తమ సొంత పీఎఫ్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటాయి. ఉద్యోగుల, యజమాని చందాలను ఈ ట్రస్ట్ నిర్వహిస్తుంది. -
గృహలక్ష్మి ఇప్పుడు... ఇన్వెస్ట్మెంట్ మహాలక్ష్మి
ఒకప్పుడు భారతీయ మహిళల ఆర్థిక ప్రపంచం.. బంగారు నగలు,పోస్టాఫీస్ సేవింగ్స్, చిట్ఫండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల వరకే పరిమితమై ఉండేది. కుటుంబ భవిష్యత్తు కోసం భాగస్వామితో కలిసి అంతో ఇంతో పొదుపు చేసేవారు, సంపద పెంచాలి, పెంచుకోవాలి అనే తపన తక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా దృశ్యం పూర్తిగా మారుతోంది. భర్త సంపాదించి ఇచ్చినా, తాను స్వయంగా కష్టపడి సంపాదించినా వచ్చే ప్రతి రూపాయిలో రిటైర్మెంట్ కలలు, విదేశీ యాత్రల లక్ష్యాలు, ఆర్థిక స్వాతంత్య్రఆశయాలు కూడా చేరుతున్నాయి. భారత మహిళలు సేవింగ్స్ నుంచి ఇన్వెస్టింగ్కి మారడం లేదు... సేవింగ్స్కే కొత్త అర్థం చెబుతున్నారు. – సాక్షి, వెల్త్ డెస్క్అమ్మమ్మ తరం బంగారం దాచింది. అమ్మ తరం ఫిక్స్డ్ డిపాజిట్లు వేసింది.ఇప్పుడు కూతురు తరం షేర్లు, ఈక్విటీలు, సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్)లలో పెట్టుబడులు పెడుతోంది. మూడు తరాలు... మూడు ఆర్థిక తత్వాలు. కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే ... భవిష్యత్తు భద్రత. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే కొత్త తరం మహిళలు డబ్బును కేవలం దాచడం కాదు... దాచిన దానితో తిరిగి డబ్బు సంపాదించడం కూడా నేర్చుకుంటున్నారు. అందుకే భారత మహిళల చేతుల్లో ఇప్పుడు కేవలం నగల పెట్టెలు కాదు, మొబైల్ ఫోన్లలో మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలు కూడా కనిపిస్తున్నాయి. మహిళలు కేవలం పొదుపుదారులుగానే కాకుండా, సమర్థవంతమైన ఇన్వెస్టర్లుగా ఎదుగుతున్నారు. సంప్రదాయ బంగారంతో పాటు మ్యూచువల్ ఫండ్లు,సిప్లు, ఈక్విటీ ఆధారిత పెట్టుబడులు, రిటైర్మెంట్ కార్పస్ నిర్మాణం దిశగా దూసుకెళ్తున్నారు.ఈ మార్పు కేవలం వ్యక్తిగత పెట్టుబడి ధోరణి కాదు. భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని తిరిగి నిర్వచిస్తున్న నిశ్శబ్ద విప్లవం.సంఖ్యల్లో మహిళల ఆర్థిక దూకుడు మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ వెలువరించిన గణాంకాలు మహిళల భాగస్వామ్యం ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టంగా చూపిస్తున్నాయి. 🔸 దేశీ పెట్టుబడుల్లో మహిళా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల వాటా 25 శాతం దాటింది. 🔸 వ్యక్తిగత మ్యూచువల్ ఫండ్ ఏయూఎంలో వాటా 33 శాతం పైగా ఉంది. 🔸 మహిళల నిర్వహణలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు రూ.11.3 లక్షల కోట్లు 🔸 మొత్తం మ్యూచువల్ ఫండ్స్ ఇన్ఫ్లోలలో వాటా 35 శాతం 🔸 35 ఏళ్లలోపు పెట్టుబడులు ప్రారంభించిన మహిళలు 80శాతం ఈ గణాంకాలు ఒక కీలక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.నేటి తరం మహిళలు ఇప్పుడు కేవలం డబ్బు దాచడం కాదు... డబ్బుతో పని చేయించడం నేర్చుకుంటున్నారు.బంగారం నుంచి సిప్ లకు కాదు... బంగారంతో పాటు సిప్లకు మహిళలు బంగారాన్ని కొనడం పూర్తిగా మానేశారా అంటే లేదనే చెప్పాలి. వాస్తవానికి వారు సంప్రదాయ పెట్టుబడులను ఆధునిక ఆరి్ధక సాధనాలతో కలిపి సరికొత్త సమతుల్య పోర్ట్ఫోలియోలను నిర్మిస్తున్నారు. బంగారం అంతో ఇంతో తరచూ కొనడం ఇప్పటికీ వారికి కుటుంబ సంప్రదాయమే. ఆనందం కలిగించే విషయమే. బంగారం అత్యవసర సమయాల్లో లిక్విడిటీ అందిస్తుంది. పిల్లల ఉన్నత చదువులు, వివాహ అవసరాలకు, అనారోగ్య పరమైన ఖర్చుల విషయంలో భద్రతనిస్తుంది. అయితే దీర్ఘకాలిక సంపద పెరగాలంటే కాంపౌండింగ్ శక్తి అవసరమని కొత్త తరం మహిళలు గ్రహిస్తున్నారు. అందుకే ప్రతి నెలా సిప్ల రూపంలో క్రమశిక్షణతో పెట్టుబడులు పెడుతున్నారు.నేటి మహిళల కొత్త పెట్టుబడి సూత్రం..భద్రతకు బంగారం... సంపదకు సిప్ అనే మార్పునకు మూడు కారణాలున్నాయి.🔸 పెరిగిన ఆదాయాలు. కుటుంబంలో పెరుగుతున్న నిర్ణయాధికారం. ఐటీ, బ్యాంకింగ్, ఆతిథ్యం, ఆరోగ్యరంగం, కార్పొరేట్ సేవలు, స్టార్టప్లు, ఫ్రీలాన్సింగ్ రంగాల్లో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో కుటుంబ ఆదాయం పెరుగుతోంది. మహిళలు కూడా కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకప్పుడు తండ్రి లేదా భర్త తీసుకునే పెట్టుబడి నిర్ణయాలను ఇప్పుడు మహిళలే చొరవచూపి స్వయంగా తీసుకుంటున్నారు.🔸 డిజిటల్ విప్లవం షేర్లు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలంటే ఒకప్పుడు బ్రోకర్లు,బ్యాంక్ శాఖల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అనేక దరఖాస్తు ఫారాలు నింపాల్సి ఉండేది.నేడు స్మార్ట్ఫోన్ ద్వారా బ్యాంకుఖాతా, ఆధార్, పాన్ కార్డు ఉంటే చాలు స్మార్ట్ ఫోన్ ద్వారా డీమ్యాట్ అకౌంట్లు తెరిచే అవకాశం పెరిగింది. కేవలం పది నిమిషాల్లో సిప్ ఖాతాలు ప్రారంభించగలుగుతున్నారు. ఈ సాంకేతిక విప్లవమే లక్షలాది మహిళలను ఆర్థిక మార్కెట్లకు దగ్గర చేసింది.🔸 లక్ష్యాల కోసం పెట్టుబడులు గత తరాలు పిల్లల చదువు,పెళ్లిళ్ల అవసరాల కోసం మాత్రమే పొదుపు గురించి ఆలోచించేవి. కానీ నేటి ఆధునిక తరం మహిళలు మాత్రం వ్యక్తిగత రిటైర్మెంట్, విదేశీ విహార యాత్రలు, సొంత వ్యాపారాలు ప్రారంభించేందుకు, ఎమెర్జన్సీ అవసరాలకు ఇలా అనేక ప్రత్యేక లక్ష్యాలతో పెట్టుబడుల వైపు దూసుకెళుతున్నారు.మెరుగైన ఇన్వెస్టర్లుగా మహిళలు?గణాంకాలను పరిశీలిస్తే పెట్టుబడుల ప్రపంచంలో ఒక ఆసక్తికరమైన వాస్తవం వెలుగులోకి వస్తోంది. పురుషుల్లాగా మహిళలు వెంటవెంటనే కొనుగోలుఅమ్మకాలు జరపడంలేదు. ఏదో కారణంతో తరచూ పడిపోయే స్టాక్ మార్కెట్లో భయపడి పెట్టుబడులు ఉపసంహరించుకోవడంలేదు. దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి క్రమశిక్షణతో కొనసాగుతున్నారు.మహిళా ఇన్వెస్టర్ల ప్రత్యేకత🔸 సిప్లను నిరంతరంగా కొనసాగించడం 🔸 దీర్ఘకాలిక దృష్టి 🔸 తక్కువ రిస్్కతో సమతుల్య పెట్టుబడులు 🔸 భావోద్వేగ నిర్ణయాలకు దూరంగా ఉండటం 🔸 లక్ష్యంతో పెట్టుబడి ప్రణాళికలు వేయడం ఈ కారణాల వల్ల మహిళల పోర్ట్ఫోలియోలు దీర్ఘకాలంలో మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు.చిన్న పట్టణాల్లోనూ పెద్ద మార్పుమహిళల పెట్టుబడుల విప్లవం కేవలం దేశంలోని మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వంటి టైర్2 (ద్వితీయ శ్రేణి) , టైర్3 తృతీయ శ్రేణి నగరాల్లో కూడా మహిళలు భారీగా సిప్ పెట్టుబడులు ప్రారంభిస్తున్నారు.ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచి్చన ఫైనాన్షియల్ కంటెంట్, యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ ఫిన్టెక్ యాప్లు కూడా ఈ పెట్టుబడి విప్లవానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.ఆర్థిక స్వాతంత్య్రం అంటే జీతం కాదు... ఆస్తులుఆర్థిక స్వాతంత్య్రమంటే జీతం సంపాదించడం మాత్రమే కాదు.దాన్ని సంపదగా మార్చడమని నేటి మహిళలు కొత్త నిర్వచనం చెబుతున్నారు. ఆమె దృష్టిలో నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే 🔸 తన పేరుమీద ఆస్తులు ఉండటం ళీ ఎమర్జెన్సీ ఫండ్ ఉండటం 🔸 తన రిటైర్మెంట్ కోసం ప్రత్యేక కార్పస్ నిర్మించుకోవడం 🔸 జీవితంలోని అనిశ్చిత పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడం 🔸 ప్రతి మహిళ పర్సనల్ ఫైనాన్స్ చెక్లిస్ట్ తయారుచేసుకోవాలితనను తాను ఇలా ప్రశ్నించుకోవాలి 🔸 నా పేరుమీద పెట్టుబడులు ఉన్నాయా? 🔸 బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లకు మించి ఈక్విటీ లు, మ్యూచువల్ ఫండ్సులో ఇన్వెస్ట్చేస్తున్నానా? 🔸 రిటైర్మెంట్కు ప్రత్యేక కార్పస్ ఫండ్ ఉందా? 🔸 ప్రతి ఏడాది సిప్ మొత్తాన్ని పెంచుతున్నానా? 🔸 ఏదైనా కారణంతో ఒక సంవత్సరం ఆదాయం ఆగిపోతే ఆర్థికంగా నిలబడగలనా? చివరగా... భారత మహిళలు బంగారాన్ని వదిలేయడం లేదు. కానీ బంగారం ఒక్కటే భవిష్యత్తు కాదని అర్థం చేసుకుంటున్నారు. భద్రత కోసం బంగారం, స్థిరత్వం కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, సంపద సృష్టి కోసం మ్యూచువల్ ఫండ్లు అనే సమతుల్య పెట్టుబడి విధానాన్ని అవలంబిస్తున్నారు. నేటి మహిళల పెట్టుబడి నిర్ణయాలు రేపటి భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేయబోతున్నాయి. కుటుంబ పొదుపులను సంపదగా, సంపదను ఆర్థిక స్వాతంత్య్రంగా మార్చుతున్న ఈ నిశ్శబ్ద విప్లవమే రాబోయే దశాబ్దంలో భారత వృద్ధికి కొత్త ఇంధనంగా మారనుంది. ఇంటి బడ్జెట్ను చూసుకునే మహిళ.. ఇప్పుడు దేశ సంపద నిర్మాణంలోనూ కీలక భాగస్వామి అవుతోంది. -
అడ్వాన్స్ ట్యాక్స్ డెడ్లైన్ రేపే..
పన్ను చెల్లింపుదారులకు కీలక గడువు సమీపించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి (FY 2026-27) సంబంధించిన తొలి అడ్వాన్స్ ట్యాక్స్ (ముందస్తు పన్ను) వాయిదాను (advance tax deadline 2026) జూన్ 15లోగా చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ సూచిస్తోంది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే.. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 ప్రకారం తొలి అడ్వాన్స్ ట్యాక్స్ వాయిదా ఇదే.అడ్వాన్స్ ట్యాక్స్ విధానం ద్వారా ప్రభుత్వం "సంపాదించిన కొద్దీ పన్ను చెల్లింపు" (Pay-as-you-earn) వ్యవస్థను అమలు చేస్తోంది. ఏడాది చివర్లో ఒకేసారి పన్ను చెల్లించకుండా, అంచనా పన్నును నాలుగు విడతల్లో చెల్లించే అవకాశం ఉంటుంది.అడ్వాన్స్ ట్యాక్స్ తప్పనిసరి ఎవరికి?టీడీఎస్ (TDS), టీసీఎస్ (TCS) మినహాయింపుల తర్వాత కూడా వార్షిక పన్ను బాధ్యత రూ.10,000 దాటితే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన కింది వర్గాలకు వర్తిస్తుంది:🔹 జీతభత్యాలు పొందే ఉద్యోగులు🔹 ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్లు🔹 స్వయం ఉపాధి నిపుణులు🔹 వ్యాపారులు🔹 అద్దె ఆదాయం పొందేవారు🔹 వడ్డీ ఆదాయం లేదా పెట్టుబడి లాభాలు పొందేవారుఅంటే జీతం నుంచి టీడీఎస్ కట్ అవుతున్నప్పటికీ, అదనంగా అద్దె, ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు లేదా ఇతర పెట్టుబడుల ద్వారా ఆదాయం వస్తే అడ్వాన్స్ ట్యాక్స్ బాధ్యత ఏర్పడే అవకాశం ఉంది.సీనియర్ సిటిజన్లకు మినహాయింపు60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న రెసిడెంట్ సీనియర్ సిటిజన్లు వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందకపోతే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే వ్యాపార ఆదాయం ఉంటే ఈ మినహాయింపు వర్తించదు.తొలి వాయిదాలో ఎంత చెల్లించాలి?సాధారణ పన్ను చెల్లింపుదారులు తమ అంచనా వార్షిక పన్ను బాధ్యతలో కనీసం 15 శాతం మొత్తాన్ని జూన్ 15లోగా చెల్లించాలి. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల షెడ్యూల్ ఇలా ఉంటుంది:🔹జూన్ 15: మొత్తం పన్నులో 15%🔹సెప్టెంబర్ 15: మొత్తం పన్నులో 45%🔹డిసెంబర్ 15: మొత్తం పన్నులో 75%🔹మార్చి 15: మొత్తం పన్నులో 100%ఆన్లైన్లో ఎలా చెల్లించాలి?ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా అడ్వాన్స్ ట్యాక్స్ సులభంగా చెల్లించవచ్చు. ప్రక్రియ ఇలా ఉంటుంది:🔹ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్లో లాగిన్ అవ్వాలి.🔹e-File → e-Pay Tax ఆప్షన్ను క్లిక్ చేయాలి.🔹New Payment ఎంచుకోవాలి.🔹Income Tax కేటగిరీలో Advance Tax ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి.🔹సంబంధిత అసెస్మెంట్ ఇయర్ (AY) ఎంచుకోవాలి.🔹Minor Head 100 (Advance Tax) ఎంపిక చేయాలి.🔹చెల్లించాల్సిన మొత్తం నమోదు చేసి పేమెంట్ పూర్తి చేయాలి.గడువు దాటితే జరిమానా తప్పదుఅడ్వాన్స్ ట్యాక్స్ సకాలంలో చెల్లించకపోతే వడ్డీ భారం పడుతుంది. కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025లో సెక్షన్ నంబర్లు మారినప్పటికీ, నిబంధనల సారాంశం దాదాపు యథాతథంగా ఉంది. పాత చట్టంలోని సెక్షన్లు 234B, 234Cలకు సమానమైన నిబంధనలు కొత్త చట్టంలో వర్తిస్తున్నాయి.🔹 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం పన్నులో 90% కన్నా తక్కువ చెల్లిస్తే నెలకు 1% వడ్డీ విధిస్తారు.🔹 వాయిదా వారీగా చెల్లించాల్సిన మొత్తాన్ని గడువులోపు చెల్లించకపోయినా నెలకు 1% వడ్డీ వర్తిస్తుంది. -
‘ఆ బంగారం, వెండి.. నకిలీ ఆస్తులు’
ప్రముఖ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Robert Kiyosaki) రచయిత, ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) ఒక ప్రసిద్ధ పెట్టుబడి సూత్రాన్ని విమర్శించారు. చాలామంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ‘డైవర్సిఫికేషన్’ చేశామని భావిస్తుంటారని, వాస్తవానికి వారు ‘డీ-వర్స్-ఇఫికేషన్’ (పరిస్థితిని మరింత దిగజార్చే ప్రక్రియ) చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో కియోసాకి.. బంగారం, వెండి, బిట్కాయిన్, స్టాక్స్, బాండ్లు, రియల్ ఎస్టేట్, చమురు వంటి విభిన్న ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టినప్పటికీ అవన్నీ ఈటీఎఫ్లు, ఆర్ఈఐటీలు లేదా ఇతర ఆర్థిక సాధనాల రూపంలో ఉంటే అవి చివరికి ఒకే “పేపర్ అసెట్” వర్గానికి చెందినవేనని అన్నారు. అలాంటి పెట్టుబడులు నిజమైన డైవర్సిఫికేషన్ కాదని, కేవలం తాము పెట్టుబడులను వైవిధ్యీకరించామని ఇన్వెస్టర్లు భావించే పరిస్థితి మాత్రమేనని వివరించారు.తాను మాత్రం నేరుగా యాజమాన్యం, నియంత్రణ, కస్టడీ తన చేతుల్లో ఉండే “రియల్ అసెట్స్”ను ఇష్టపడతానని కియోసాకి పేర్కొన్నారు. బంగారం, వెండి, రియల్ ఎస్టేట్ లేదా ఇతర భౌతిక ఆస్తులను నేరుగా కలిగి ఉండటం కోసం కొంత ఎక్కువ ఖర్చు, సమయం వెచ్చించాల్సి వచ్చినా, వాటి గురించి మరింత అధ్యయనం చేసే అవకాశం లభిస్తుందని రాసుకొచ్చారు.“ఇది నా వ్యక్తిగత పెట్టుబడి విధానం. కొంతమంది దీనిని నా జాగ్రత్త లేదా అనుమాన స్వభావంగా చూడొచ్చు. కానీ నా ఎంపిక ఇదే. మీ ఎంపిక ఏమిటి? డైవర్సిఫికేషన్నా? లేక డీ-వర్స్-ఇఫికేషన్నా?” అంటూ పెట్టుబడిదారులను కియోసాకి ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో ఈటీఎఫ్లు, డెరివేటివ్ ఉత్పత్తులు, భౌతిక ఆస్తులపై మరోసారి చర్చకు దారితీశాయి.DEWORSE-IFIED is not Diversified.Many people are “De-Worsified” not “Diversified.”“De-Worse-ified” means they think they are diversified, but they have all their “diversified” assets, such as gold, silver, Bitcoin, stocks, bonds, real estate, and oil, in one asset class….the…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 9, 2026 -
బంగారం.. భలే లాభం! ఆర్బీఐ గుడ్న్యూస్
బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB) మరోసారి భారీ లాభాలను అందించాయి. 2019-20 సిరీస్–VII కింద జారీ చేసిన ఎస్జీబీల ముందస్తు రిడెంప్షన్ (Premature Redemption) ధరను భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గ్రాముకు రూ.15,275గా నిర్ణయించింది.ఆర్బీఐ ఈ బాండ్లను 2019 డిసెంబర్ 10న గ్రాముకు రూ.3,745 ధరతో జారీ చేసింది. అప్పుడు వీటిని కొనుగోలుచేసినవారికి ఐదేళ్లలో సుమారు 308 శాతం లాభం లభించినట్లైంది. అంటే గ్రాముకు రూ.11,530 లాభం అన్నమాట. అలాగే ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన గ్రాముకు రూ.50 తగ్గింపు కూడా ఆర్బీఐ ఇచ్చింది. దీంతో ఆన్లైన్లో కొన్నవారికి ఈ లాభం 313 శాతానికి పైగా చేరింది.రూ.లక్షకు రూ.4 లక్షలు!ఈ సిరీస్లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారుల పెట్టుబడి విలువ ప్రస్తుతం రూ.4.08 లక్షలకు పైగా పెరిగినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీనికి అదనంగా బాండ్ జారీ ధరపై సంవత్సరానికి 2.5 శాతం స్థిర వడ్డీని కూడా అర్ధవార్షికంగా పొందారు. అంటే మొత్తం రాబడి ఇంకా ఎక్కువే.రిడెంప్షన్ ధర ఎలా నిర్ణయించారు?ఎస్జీబీ రిడెంప్షన్ ధరను ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకటించే 999 స్వచ్ఛత బంగారం ముగింపు ధరల ఆధారంగా నిర్ణయిస్తారు. జూన్ 5, 8, 9 తేదీల ముగింపు ధరల సగటు ఆధారంగా ఈ విడతకు గ్రాముకు రూ.15,275 ధరను ఖరారు చేసినట్లు ఆర్బీఐ తెలిపింది.ఐదేళ్ల తర్వాతే ముందస్తు నిష్క్రమణసావరిన్ గోల్డ్ బాండ్ల అసలు గడువు ఎనిమిదేళ్లు. అయితే జారీ తేదీ నుంచి ఐదో సంవత్సరం పూర్తైన తర్వాత వడ్డీ చెల్లింపు తేదీల్లో ముందస్తుగా బాండ్లను రిడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా ఈ సిరీస్కు జూన్ 10, 2026 తేదీని అర్హత కలిగిన రిడెంప్షన్ తేదీగా ఆర్బీఐ ప్రకటించింది.పన్ను ప్రయోజనాలు ఏమిటి?వ్యక్తిగత పెట్టుబడిదారులు ఎస్జీబీలను ఆర్బీఐ వద్ద రిడీమ్ చేసుకున్నప్పుడు లభించే మూలధన లాభాలపై గతంలో పన్ను మినహాయింపు ఉండేది. అయితే 2026 బడ్జెట్ తర్వాత పన్ను నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ వడ్డీ ఆదాయం మాత్రమే ఆదాయపు పన్నుకు లోబడి ఉంటుంది. బాండ్ల బదిలీ ద్వారా వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలకు ఇండెక్సేషన్ ప్రయోజనాలు వర్తిస్తాయి.ఏమిటీ ఎస్జీబీ పథకం?భౌతిక బంగారం కొనుగోలు అవసరం లేకుండా బంగారం ధరల పెరుగుదల ప్రయోజనం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ పథకాన్ని ప్రారంభించింది. బంగారం ధరల పెరుగుదలతో పాటు 2.5 శాతం వార్షిక వడ్డీ కూడా లభించడం ఈ పథకాన్ని ప్రత్యేకంగా నిలిపింది. దేశంలో భౌతిక బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, గృహ పొదుపులను ఆర్థిక ఆస్తులుగా మలచడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు.అయితే ప్రభుత్వం 2023 చివరి నుంచి కొత్త సావరిన్ గోల్డ్ బాండ్ల జారీని నిలిపివేసింది. నిర్వహణ వ్యయాలు పెరగడం, గోల్డ్ ఈటీఎఫ్లు, డిజిటల్ గోల్డ్ వంటి ప్రత్యామ్నాయాల ప్రాచుర్యం పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. అయితే ఇప్పటికే జారీ చేసిన బాండ్లు చెల్లుబాటులోనే ఉంటాయి. పెట్టుబడిదారులు వాటిని మెచ్యూరిటీ వరకు కొనసాగించవచ్చు లేదా అర్హత వచ్చినప్పుడు ముందస్తు రిడెంప్షన్ను ఎంచుకోవచ్చు.ఇదీ చదవండి: ఈజీగా ‘EPF 100% విత్డ్రా’.. కొత్తగా మారిందిదే.. -
కాలం కరిగేలోపే.. కలల నిధిని గెలిచేద్దాం!
ఇంట్లో పిల్లలు పసిప్రాయంలో పాఠశాల మెట్లు ఎక్కడం, చూస్తూ చూస్తూనే స్కూల్ విద్య పూర్తి అవ్వడం వేగంగా జరిగిపోతాయి. అప్పటివరకు కేవలం పాఠశాల ఫీజులకే పరిమితమైన తల్లిదండ్రుల ఆలోచనలు.. ఒక్కసారిగా కాలేజీ ఫీజులు, వృత్తిపరమైన కోర్సులు లేదా విదేశీ విద్య వైపు మళ్లుతాయి. అప్పుడే ఆర్థిక వాస్తవికత తెలిసొస్తుంది.సమస్య ఏమిటంటే, విద్యా రంగంలో ద్రవ్యోల్బణం నిశ్శబ్దంగా, వేగంగా పెరుగుతుంది. భారతదేశంలో ఐఐటీ, ఐఐఎం లేదా మెడిసిన్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల ఖర్చులే ఇప్పుడు రూ.లక్షల్లో ఉన్నాయి. ఇక ట్యూషన్ ఫీజు, వసతి, జీవన ప్రమాణాలను లెక్కిస్తే విదేశీ విద్య రూ.కోట్లలోకి చేరుతోంది. పిల్లలకు 17 లేదా 18 ఏళ్లు వచ్చేసరికి సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే ఆ తప్పును సరిదిద్దుకోవడానికి సమయం అసలు మిగలదు.ఇక్కడే మ్యూచువల్ ఫండ్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఒక ఆయుధంగా మారుతుంది. విద్యా ప్రణాళిక విషయానికి వస్తే జీవితంలో ఆలస్యంగా పెద్ద మొత్తాలను పెట్టుబడి పెట్టడం కంటే చిన్న మొత్తంతోనైనా ముందుగా ప్రారంభించడం అత్యంత కీలకమైన అంశం.కాంపౌండింగ్ చేసే అద్భుతంచాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఉన్నత చదువుల కోసం రూ.1 కోటి విద్యా నిధిని నిర్మించాలంటే చాలా పెద్ద మొత్తంలో లేదా అగ్రెసివ్గా పెట్టుబడి పెట్టాలని భావిస్తారు. కానీ ఆర్థిక సూత్రాల ప్రకారం పెద్ద మొత్తంతో మొదలుపెట్టడం కంటే ముందస్తుగా ప్రారంభించడమే చాలా ముఖ్యం. పిల్లలకు 3 లేదా 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పెట్టుబడి ప్రారంభించే తల్లిదండ్రులకు ఆ డబ్బు వృద్ధి చెందడానికి ఒక దశాబ్దానికి పైగా సమయం దొరుకుతుంది. తక్కువ నెలవారీ సిప్ మొత్తాలు కూడా కాలక్రమేణా పెద్ద నిధిగా మారడానికి సుదీర్ఘ సమయం తోడ్పడుతుంది.ఉదాహరణకు, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ప్రారంభించే సిప్కు 12 నుంచి 15 సంవత్సరాల కాలపరిమితి లభిస్తే రాబడిపై అదనపు రాబడి వచ్చి చేరుతుంది. మొదటి కొన్ని సంవత్సరాలు ఈ వృద్ధి పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ కాంపౌండింగ్ అసలు విశ్వరూపం తరువాతి సంవత్సరాల్లో, ముఖ్యంగా ఫండ్ సైజ్ పెద్దదవుతున్న కొద్దీ స్పష్టంగా కనిపిస్తుంది.వాయిదా వేస్తే పెను భారంప్రస్తుత కాలంలో స్కూలు ఫీజులు, హోమ్ లోన్లు, రోజువారీ నిత్యావసరాలు, మారుతున్న జీవనశైలి ఖర్చుల వల్ల తల్లిదండ్రులు తరచుగా దీర్ఘకాలిక పెట్టుబడులను వాయిదా వేస్తుంటారు. ‘ముందు ఈ ఖర్చులు చూసుకుందాం, పెట్టుబడి తర్వాత చేయవచ్చు’ అనుకోవడం చాలా పెద్ద పొరపాటు.ఆదాయానికి తగ్గట్లుగా అడుగులుతల్లిదండ్రుల కెరీర్ ప్రారంభంలో లేదా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆదాయం తక్కువగా ఉండటం సహజం. అందుకే పెద్ద మొత్తంలో సిప్లు ప్రారంభించడానికి తల్లిదండ్రులు వెనుకాడతారు. ఈ సమస్యకు స్టెప్-అప్ సిప్ అద్భుతమైన పరిష్కారం.ఒకేసారి పెద్ద మొత్తంతో కాకుండా ప్రస్తుతం మీ బడ్జెట్కు అనుకూలమైన మొత్తంతో (ఉదాహరణకు రూ.5,000) ప్రారంభించవచ్చు.ఏటా మీ జీతం లేదా ఆదాయం పెరిగే కొద్దీ ఈ సిప్ మొత్తాన్ని క్రమంగా (ఉదాహరణకు 10% చొప్పున) పెంచుకుంటూ పోవచ్చు.ఈ క్రమంలో రూ.5,000 కాస్తా కాలక్రమేణా రూ.8,000, రూ.12,000గా మారుతుంది. ఇది మీ ప్రస్తుత ఆర్థిక బడ్జెట్కు ఎలాంటి అంతరాయం కలిగించదు.దీర్ఘకాలంలో ఈ చిన్న క్రమబద్ధమైన పెంపు మీ తుది నిధిని ఊహించని రీతిలో పెంచుతుంది. ఎందుకంటే అదనంగా జతచేసే ప్రతి రూపాయికి కూడా కాంపౌండింగ్ సంవత్సరాల తరబడి వర్తిస్తుంది.దీర్ఘకాలంలో వరంవిద్యా లక్ష్యాలు అనేవి సాధారణంగా 12 నుంచి 15 సంవత్సరాల సుదీర్ఘ కాలపరిమితితో కూడుకున్నవి. పెట్టుబడి కాలపరిమితి పెరిగే కొద్దీ మార్కెట్ స్వల్పకాలిక హెచ్చుతగ్గులు లేదా అస్థిరత కలిగించే ప్రమాదం చాలా వరకు తగ్గిపోతుంది. నిజానికి మార్కెట్లు పతనమైనప్పుడు సిప్లను కొనసాగించడం వల్ల దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఒక పెద్ద ప్రయోజనం చేకూరుతుంది. తక్కువ ధరలకే ఎక్కువ మ్యూచువల్ ఫండ్ యూనిట్లు లభిస్తాయి. కానీ, మార్కెట్ పడిపోయిన ప్రతిసారీ భయపడి పెట్టుబడులు ఆపేసే తల్లిదండ్రులు కాంపౌండింగ్ ప్రక్రియకు స్వయంగా బ్రేకులు వేసుకున్న వారవుతారు.స్థిరత్వమే ముఖ్యంఆర్థిక మార్కెట్లలో అత్యంత విజయవంతమైన పోర్ట్ఫోలియోలు మార్కెట్ను కచ్చితంగా అంచనా వేయడం వల్ల నిర్మితం కాలేదు. కేవలం పెట్టుబడిదారులు చూపిన స్థిరత్వం వల్లే సాధ్యపడ్డాయి. మంచి కాలం, చెడు కాలం, మార్కెట్ క్రాష్లు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, మారుతున్న జీవిత పరిస్థితులన్నింటినీ తట్టుకుని ఎవరైతే తమ నెలవారీ సిప్లను కొనసాగించారో వారే విజేతలుగా నిలిచారని గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
HDFC బ్యాంక్ అలర్ట్: EMI కస్టమర్లకు షాక్!
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ను పలు కాలపరిమితులపై 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త రేట్లు జూన్ 8, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఎంసీఎల్ఆర్ ఆధారిత గృహ, వ్యక్తిగత, వాహన రుణాలు తీసుకున్న కొందరు కస్టమర్లకు భవిష్యత్తులో ఈఎంఐలు (EMI) పెరిగే అవకాశం ఉంది.ఆర్బీఐ రెపో రేటు స్థిరంగానే.. అయినా పెంపు ఎందుకు?గత వారం జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగించింది. అయితే బ్యాంకుల నిధుల సమీకరణ వ్యయం, డిపాజిట్ ఖర్చులు, మార్కెట్ పరిస్థితులు వంటి అంశాల ఆధారంగా ఎంసీఎల్ఆర్ను బ్యాంకులు స్వతంత్రంగా నిర్ణయిస్తాయి. అందుకే రెపో రేటులో మార్పు లేకపోయినా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన అంతర్గత బెంచ్మార్క్ రేట్లను సవరించింది.ఏయే కాలపరిమితుల్లో ఎంత పెరిగింది?సవరించిన ఎంసీఎల్ఆర్ రేట్ల ప్రకారం ఓవర్నైట్ రేటు 8.05 శాతం నుంచి 8.10 శాతానికి పెరిగింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.15 శాతం నుంచి 8.20 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.30 శాతం నుంచి 8.35 శాతానికి చేరింది.రిటైల్ రుణాలకు కీలక బెంచ్మార్క్గా భావించే ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 8.35 శాతం నుంచి 8.40 శాతానికి పెరిగింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్లో అత్యధికంగా 10 బేసిస్ పాయింట్ల పెంపు చోటుచేసుకుని 8.45 శాతం నుంచి 8.55 శాతానికి చేరగా, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.60 శాతం నుంచి 8.65 శాతానికి పెరిగింది. ఒక నెల ఎంసీఎల్ఆర్ మాత్రం 8.05 శాతం వద్ద యథాతథంగా కొనసాగింది.తాజా ఎంసీఎల్ఆర్ రేట్లు🔹 ఓవర్నైట్ – 8.10%🔹 1 నెల – 8.05%🔹 3 నెలలు – 8.20%🔹 6 నెలలు – 8.35%🔹 1 సంవత్సరం – 8.40%🔹 2 సంవత్సరాలు – 8.55%🔹 3 సంవత్సరాలు – 8.65%ఈఎంఐలు వెంటనే పెరుగుతాయా?అలా ఏం లేదు. ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన రుణాల్లో వడ్డీ రేటు ప్రతి నెల, త్రైమాసికం లేదా వార్షిక రీసెట్ తేదీకి అనుగుణంగా మారుతుంది. కాబట్టి మీ రుణ ఖాతాకు తదుపరి రీసెట్ తేదీ వచ్చినప్పుడు మాత్రమే కొత్త ఎంసీఎల్ఆర్ ప్రభావం కనిపిస్తుంది. ఈఎంఐ పెరగవచ్చు లేదా రుణ కాలపరిమితి పొడిగించవచ్చు. ఇది రుణ ఒప్పంద నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.అసలేమిటీ ఎంసీఎల్ఆర్?ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) అనేది బ్యాంకు రుణాలను ఇవ్వగల కనీస వడ్డీ రేటు. 2016లో ఆర్బీఐ ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు, నగదు నిల్వల వ్యయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని దీనిని నిర్ణయిస్తారు. అనేక పాత గృహ, వ్యక్తిగత, వాహన రుణాలు ఇప్పటికీ ఎంసీఎల్ఆర్ ఆధారంగానే కొనసాగుతున్నాయి.బేస్ రేట్, బీపీఎల్ఆర్ యథాతథంహెచ్డీఎఫ్సీ బ్యాంక్ బేస్ రేట్ ప్రస్తుతం 8.80 శాతంగా కొనసాగుతోంది. అలాగే బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (BPLR) 17.30 శాతంగా ఉంది. ఈ రేట్లు డిసెంబర్ 26, 2025 నుంచి అమల్లో ఉన్నాయి.రుణగ్రహీతలు ఏం చేయాలి?మీ హోమ్ లోన్ లేదా ఇతర రుణం ఎంసీఎల్ఆర్ ఆధారితమా, లేక EBLR/రెపో-లింక్డ్ విధానంలో ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలు ఉన్నవారు తమ తదుపరి రీసెట్ తేదీని పరిశీలించి ఈఎంఐపై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసుకోవచ్చు. రెపో-లింక్డ్ రుణాలపై ఈ తాజా ఎంసీఎల్ఆర్ పెంపు ప్రత్యక్ష ప్రభావం చూపదు. -
ఈజీగా ‘EPF 100% విత్డ్రా’.. కొత్తగా మారిందిదే..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన సభ్యులకు మరింత సౌలభ్యం కల్పించే కీలక మార్పులు ఇటీవల తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రత్యేక పరిస్థితుల్లో ఈపీఎఫ్ ఖాతాలోని మొత్తం సొమ్మును (100 శాతం) ఉపసంహరించుకునే ప్రక్రియను సరళతరం చేసింది. అర్హత ఉన్న సభ్యులు నిర్దిష్ట అత్యవసర పరిస్థితుల్లో నిధులను ఉపసంహరించుకునేందుకు ప్రత్యేక కారణాలను వివరించాల్సిన అవసరం కూడా లేదు.గత అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. గతంలో ఉపసంహరణ కోసం కారణాలను స్పష్టంగా పేర్కొనడంతో పాటు సంబంధిత ఆధారాలను సమర్పించాల్సి వచ్చేది. దీంతో అనేక క్లెయిమ్లు సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురయ్యేవి. కొత్త విధానంతో ఈ సమస్యలు తగ్గే అవకాశం ఉందని ఈపీఎఫ్ఓ భావిస్తోంది.గతంలో ఎలా ఉండేదంటే..గతంలో ఈపీఎఫ్ సభ్యులు ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారి, సంస్థ లాక్అవుట్, దీర్ఘకాల నిరుద్యోగం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో తమ ఈపీఎఫ్ నిధులను పూర్తిగా ఉపసంహరణకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇందుకు నిర్దిష్ట కారణాన్ని పేర్కొనడం, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో పేర్కొన్న కారణం ఈపీఎఫ్ఓ ఆమోదించిన కేటగిరీల్లో లేకపోవడంతో క్లెయిమ్లు తిరస్కరణకు గురయ్యేవి.ఏ పరిస్థితుల్లో 100% ఉపసంహరణ?ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం కింది ప్రత్యేక పరిస్థితుల్లో పూర్తి మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. అవి..🔸 సమ్మె, లాక్అవుట్ లేదా సంస్థ మూసివేత కారణంగా 15 రోజులకుపైగా వేతనం లేకుండా ఉండటం.🔸 రెండు నెలలకు పైగా జీతాలు అందకపోవడం.🔸 ఉద్యోగం నుంచి తొలగింపు లేదా డిశ్చార్జ్కు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్లో ఉండటం.🔸 సంస్థ ఆరు నెలలకు పైగా మూతపడటం వల్ల ఉద్యోగి నిరుద్యోగిగా మారడం.🔸 సభ్యుడు లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్స కోసం అత్యవసర నిధుల అవసరం ఏర్పడటం.కొత్త నిబంధనలో ప్రత్యేకత ఇదే..కొత్తగా తీసుకొచ్చిన వెసులుబాటుతో అత్యవసర పరిస్థితుల్లో 100 శాతం ఈపీఎఫ్ ఉపసంహరణ కోసం దరఖాస్తు చేసే సమయంలో కారణాన్ని ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరం ఉండదు. సభ్యుడు సంబంధిత కేటగిరీ కింద క్లెయిమ్ సమర్పిస్తే సరిపోతుంది. దీనివల్ల క్లెయిమ్ల పరిశీలన వేగవంతం కావడంతో పాటు తిరస్కరణలు, ఫిర్యాదులు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.సాధారణ పరిస్థితుల్లో 75% వరకు మాత్రమేఅయితే ప్రతి సభ్యుడు ఎప్పుడైనా తన మొత్తం ఈపీఎఫ్ బ్యాలెన్స్ను తీసుకోలేడు. సాధారణ పరిస్థితుల్లో అర్హత కలిగిన మొత్తంలో గరిష్ఠంగా 75 శాతం వరకు మాత్రమే ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. 100 శాతం ఉపసంహరణ మాత్రం ప్రత్యేక పరిస్థితుల్లోనే వర్తిస్తుంది.డిజిటల్ సేవలకు ప్రాధాన్యంగత రెండేళ్లుగా ఈపీఎఫ్ఓ సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఆధారంగా ఆన్లైన్ క్లెయిమ్లు, ఆటో సెటిల్మెంట్, బ్యాంక్ ఖాతా ధ్రువీకరణ వంటి సేవలను వేగవంతం చేసింది. దీంతో చాలా క్లెయిమ్లు కొద్ది రోజుల్లోనే పరిష్కారం అవుతున్నాయి. -
డాలర్లలో పెట్టుబడి.. కొత్త మ్యూచువల్ ఫండ్
ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్సీఏ) నియంత్రణలో ఉండే మార్సెలస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్–గిఫ్ట్ ఐఎఫ్ఎస్సీ తాజాగా గ్లోబల్ ఈక్విటీస్ ఫండ్ని ఆవిష్కరించింది. భారతీయ ఇన్వెస్టర్లు.. గ్లోబల్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ జూన్ 8న ప్రారంభమై జూన్ 19న ముగుస్తుంది.కనీసం 5,000 డాలర్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ ఫండ్ ప్రధానంగా డిఫెన్స్–ఏరోస్పేస్, విద్యుదుత్పత్తి, లగ్జరీ కన్జంప్షన్ తదితర ట్రెండ్స్కి అనుగుణంగా ఉన్న సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. పెట్టుబడులను విదేశీ కరెన్సీలో రిడీమ్ చేసుకోవచ్చు. పాన్, ఆధార్ వివరాలతో ఇన్వెస్ట్ చేయొచ్చు. గిఫ్ట్ సిటీలో విడిగా బ్యాంకు ఖాతా అవసరం లేదు. -
లగ్జరీ ఇల్లు, కారు.. ఏవి ధనవంతుల ఆస్తులు?
పాపులర్ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం రిచ్ ‘డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత, ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ గురూ రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ఆస్తులు (Assets), అప్పులు (Liabilities) మధ్య తేడాను అర్థం చేసుకోవడమే నిజమైన సంపదకు తొలి మెట్టు అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఫేస్బుక్లో చేసిన పోస్టు విస్తృత చర్చకు దారి తీసింది.చాలామంది ఖర్చుతో కూడుకున్న వస్తువులను సంపదగా భావిస్తారని, అయితే అధిక ధర ఉన్నంత మాత్రాన అది ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తి కాదని కియోసాకి వివరించారు. ప్రతి నెలా మన జేబులోకి డబ్బు వస్తే అది ఆస్తి, జేబులో నుంచి డబ్బు వెళ్తే అది అప్పు అని ఆయన సరళమైన నిర్వచనం ఇచ్చారు.ఈ సందర్భంగా ఖరీదైన ఇల్లు, విలాసవంతమైన కారు వంటి వాటిని ఉదాహరణగా చూపించారు. ఇంటికి గృహ రుణం, పన్నులు, బీమా, నిర్వహణ ఖర్చులు ఉంటాయని, కారు కొనుగోలు చేసిన వెంటనే విలువ తగ్గడం ప్రారంభమవుతుందని తెలిపారు. అందువల్ల ఇవి ఎక్కువగా అప్పుల కిందకే వస్తాయని పేర్కొన్నారు.మరోవైపు అద్దె ఆదాయం వచ్చే రియల్ ఎస్టేట్, డివిడెండ్లు చెల్లించే షేర్లు, లాభాలు ఆర్జించే వ్యాపారాలు, రాయల్టీలు తెచ్చిపెట్టే మేధో సంపత్తి హక్కులు, డిజిటల్ ఉత్పత్తులు వంటి వాటిని నిజమైన ఆస్తులుగా అభివర్ణించారు. ఇవి నిరంతరం నగదు ప్రవాహాన్ని సృష్టించి యజమానికి ఆదాయం అందిస్తాయని చెప్పారు.సంపన్నులు ముందుగా ఆస్తులను కొనుగోలు చేస్తారని, మధ్యతరగతి ప్రజలు ముందుగా అప్పులను పెంచుకుని తర్వాత ఆర్థిక స్వేచ్ఛ ఎందుకు రాలేదని ఆశ్చర్యపడుతుంటారని కియోసాకి వ్యాఖ్యానించారు. పాఠశాలలు, ఆర్థిక వ్యవహారాలపై సలహాలు ఇచ్చే అనేక మంది కూడా ఈ మౌలిక సూత్రాన్ని బోధించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.అమెరికన్ డ్రీమ్ అంటే పెద్ద ఇల్లు కాదని, ఆర్థిక స్వేచ్ఛేనని కియోసాకి పేర్కొన్నారు. ప్రతి నెలా ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తులను సృష్టించుకోవడం ద్వారానే నిజమైన స్వేచ్ఛ సాధ్యమవుతుందని తన పోస్టులో స్పష్టం చేశారు. -
గ్యాస్ ధరలు హైదరాబాద్లోనే ఎక్కువ.. ఎందుకు?
దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఈ పెంపు దేశమంతా ఒకేలా ఉన్నప్పటికీ, గ్యాస్ సిలిండర్ల ధరలు ఒక్కో రాష్ట్రంలో, నగరంలో ఒక్కోలా ఉంటున్నాయి. ఈ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్న కంపెనీలు దేశవ్యాప్తంగా ఒకటే అయినప్పటికీ, తుది రిటైల్ ధర ఎందుకు భిన్నంగా ఉంటుంది అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ ధరల వ్యత్యాసానికి కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..దేశవ్యాప్తంగా గృహ వినియోగ ఎల్పీజీ (14.2 కిలోల) సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. జూన్ 7 నుంచి అమల్లోకి వచ్చిన తాజా సవరణతో ఒక్కో సిలిండర్పై రూ.29 పెరిగింది. గత మూడు నెలల్లో ఇది రెండో పెంపు కావడం గమనార్హం. మార్చిలో రూ.60 పెరిగిన తర్వాత ఇప్పుడు మరోసారి ధరలు పెరగడంతో కుటుంబాలపై అదనపు భారం పడనుంది.ప్రధాన నగరాల్లో తాజా ధరలునగరం14.2 కిలోల ఎల్పీజీ ధరన్యూఢిల్లీరూ.942ముంబైరూ.941.50కోల్కతారూ.968చెన్నైరూ.957.50హైదరాబాద్రూ.994బెంగళూరురూ.915.50తాజా పెంపుతో దేశంలోని ప్రధాన నగరాల మధ్య దాదాపు రూ.80 వరకు ధరల వ్యత్యాసం కనిపిస్తోంది. హైదరాబాద్లో సిలిండర్ ధర రూ.994గా ఉండగా, బెంగళూరులో అదే సిలిండర్ రూ.915.50కే లభిస్తోంది.ఒకే దేశంలో.. ఒకే గ్యాస్.. ధరలు ఎందుకు వేరు?ఎల్పీజీని సరఫరా చేస్తున్న కంపెనీలు దేశవ్యాప్తంగా ఒకటే అయినప్పటికీ, తుది రిటైల్ ధర రాష్ట్రాల వారీగా మారుతుంది. దీనికి ప్రధాన కారణాలు ఇవే.రాష్ట్ర పన్నుల ప్రభావంప్రతి రాష్ట్రం ఎల్పీజీపై వేర్వేరు స్థాయిలో వ్యాట్, స్థానిక పన్నులు లేదా సెస్సులు విధిస్తుంది. ఈ పన్నుల రేట్లు మారడంతో వినియోగదారుడు చెల్లించే ధరలో తేడా వస్తుంది.రవాణా ఖర్చులుఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లు, నిల్వ కేంద్రాల నుంచి సిలిండర్లను నగరాలకు తరలించడానికి అయ్యే రవాణా వ్యయం కూడా ధరను ప్రభావితం చేస్తుంది. సరఫరా కేంద్రాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఖర్చు ఎక్కువగా ఉంటుంది.పంపిణీ వ్యయండీలర్ల కమిషన్, స్థానిక పంపిణీ ఖర్చులు, లాజిస్టిక్స్ వ్యయాలు ప్రాంతాల వారీగా మారుతుంటాయి. దీంతో తుది ధరలో స్వల్ప తేడాలు కనిపిస్తాయి.పెంపు వెనుక కారణాలుఅంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పెరుగుదల, మధ్యప్రాచ్య భౌగోళిక ఉద్రిక్తతలు, దిగుమతి వ్యయాల పెరుగుదల కారణంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలపై భారం పెరిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తాజా పెంపునకు ముందు ప్రతి గృహ సిలిండర్పై వందల రూపాయల మేర నష్టాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భరిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.హైదరాబాద్లో ఎందుకు అత్యధిక ధర?తెలంగాణలో స్థానిక పన్నులు, రవాణా, పంపిణీ వ్యయాల ప్రభావంతో హైదరాబాద్లో ధర దేశంలోని అనేక మెట్రో నగరాల కంటే ఎక్కువగా ఉంది. దీంతో ప్రస్తుతం ప్రధాన నగరాల్లో హైదరాబాద్ అత్యంత ఖరీదైన గృహ ఎల్పీజీ మార్కెట్లలో ఒకటిగా నిలిచింది.వినియోగదారులపై అదనపు భారంమార్చి నుంచి ఇప్పటివరకు గృహ ఎల్పీజీ సిలిండర్ ధర మొత్తం రూ.89 పెరిగింది. దీంతో నెలకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సిలిండర్లు వినియోగించే కుటుంబాల ఖర్చులు మరింత పెరగనున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల గృహ బడ్జెట్పై ఈ పెంపు ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఎల్పీజీ సిలిండర్లు.. ఎన్ని రంగులో.. -
EPF 8.25% వడ్డీ ఎప్పుడు జమ అవుతుంది.. ఎలా చెక్ చేసుకోవాలి?
దేశంలోని కోట్లాది ఉద్యోగులకు ఊరటనిస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగా కొనసాగించింది. గత మార్చిలో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, ఇది వరుసగా మూడో ఏడాది కూడా అదే స్థాయిలో కొనసాగుతున్న వడ్డీ రేటుగా నిలిచింది. అయితే ఇది ఎప్పుడు జమవుతుందని ఉద్యోగులు ఆతృతగా ఎదురుగా చూస్తున్నారు.వడ్డీ జమ ఎప్పుడు?వడ్డీ రేటును సీబీటీ సిఫారసు చేసినప్పటికీ, అది ఖాతాల్లో జమ కావాలంటే కేంద్ర ప్రభుత్వం అధికారిక ఆమోదం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈపీఎఫ్ఓ సభ్యుల ఖాతాల్లో వడ్డీని జమ చేస్తుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు. గత అనుభవాలను బట్టి చూస్తే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో వడ్డీ జమయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.ఆలస్యమైనా నష్టం ఉండదువడ్డీ ఖాతాలో ఆలస్యంగా కనిపిస్తే తమకు నష్టం జరుగుతుందేమోనని చాలామంది సభ్యులు ఆందోళన చెందుతుంటారు. అయితే ఈపీఎఫ్ పథకం నిబంధనల ప్రకారం సభ్యుల అర్హత కలిగిన నిల్వలపై వడ్డీని నిరంతరం లెక్కిస్తారు. ఖాతాలో ఎంట్రీ ఆలస్యంగా నమోదైనా, చెల్లించాల్సిన పూర్తి వడ్డీ మొత్తాన్ని సభ్యులకు జమ చేస్తారు. అందువల్ల పరిపాలనా ఆలస్యం వల్ల ఖాతాదారులు ఎలాంటి ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోరు.పాస్బుక్లో ఈ ఎంట్రీ కనిపిస్తే వడ్డీ పడ్డట్టే..వడ్డీ జమ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈపీఎఫ్ పాస్బుక్లో “Int. Updated up to 31/03/2026” అనే ఎంట్రీ కనిపిస్తుంది. ఆ తర్వాత సభ్యులు తమ తాజా బ్యాలెన్స్ను పరిశీలించవచ్చు.బ్యాలెన్స్ చెక్ చేసుకునే మార్గాలుఈపీఎఫ్ సభ్యులు తమ ఖాతాలో వడ్డీ జమైందో లేదో కింది మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు.🔸 ఉమంగ్ (UMANG) యాప్🔸 ఈపీఎఫ్ఓ సభ్యుల ఈ-సేవా పోర్టల్🔸 యూఏఎన్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ నుంచి 9966044425కు మిస్డ్ కాల్🔸 7738299899కు UAN EPFOHO ENG (లేదా భాష కోడ్తో) ఎస్ఎంఎస్ పంపడంఅయితే ఈ సేవలను వినియోగించాలంటే యూఏఎన్ యాక్టివ్గా ఉండటంతో పాటు ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలు లింక్ అయి ఉండాలి.స్థిరమైన రాబడితో ఉద్యోగులకు భరోసాప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లు, బాండ్ ఈల్డ్లు ఒత్తిడిలో ఉన్న నేపథ్యంలో 8.25 శాతం ఈపీఎఫ్ వడ్డీ రేటు ఉద్యోగుల పదవీ విరమణ పొదుపులకు ఆకర్షణీయమైన రాబడిని అందిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఆమోదం ఇచ్చిన వెంటనే వడ్డీ జమ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉంది. -
గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులపై ఆంక్షలు
న్యూఢిల్లీ: గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల(ఈటీఎఫ్లు)లో భారీ పెట్టుబడులపై హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ తాత్కాలికంగా పరిమితి విధించింది. వీటితోపాటు గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్(ఎఫ్వోఎఫ్) పెట్టుబడులకూ పరిమితి ఏర్పాటు చేసింది. ఇందుకు ఆర్థికపరమైన, మార్కెట్ సంబంధిత పరిస్థితులను ప్రస్తావిస్తోంది. వెరసి పసిడి ఈటీఎఫ్ పెట్టుబడులపై పరిమితులు విధించిన తొలి ఫండ్గా హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ నిలిచింది.ఈ నెల 8 నుంచి హెచ్డీఎఫ్సీ గోల్డ్ ఈటీఎఫ్లలో భారీ పెట్టుబడుల ఇన్వెస్టర్ల ప్రత్యక్ష సబ్ర్స్కిప్షన్ లావాదేవీలను అనుమతించబోమని ఒక నోట్లో స్పష్టం చేసింది. కనీసం రూ. 25 కోట్లు ప్రత్యక్షంగా ఇన్వెస్ట్చేసే పెట్టుబడిదారులకు తాజా పరిమితులు వర్తించనున్నట్లు తెలియజేసింది. ఒక నెలలో హెచ్డీఎఫ్సీ గోల్డ్ ఈటీఎఫ్ ఎఫ్వోఎఫ్లో రూ. 10 లక్షలవరకూ పెట్టుబడిని మాత్రమే ప్రాసెస్ చేయనున్నట్లు వెల్లడించింది. -
ఇలా అయితే ఏటీఎం సేవలు నిలిచిపోతాయ్..
దేశవ్యాప్తంగా ఏటీఎం సేవలు నగదు కొరత సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMi) ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA)ను హెచ్చరించింది. ఏటీఎంలలో నింపాల్సిన నగదు అందుబాటులో లేకపోవడం వల్ల సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) లబ్ధిదారులు, గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో నగదుపై ఆధారపడే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.అవసరానికి తగ్గ నగదు అందడం లేదుసీఏటీఎంఐ ఐబీఏకు రాసిన లేఖ ప్రకారం, అనేక రాష్ట్రాల్లో బ్యాంకు శాఖలు, కరెన్సీ చెస్టుల నుంచి ఏటీఎంలలో లోడ్ చేయడానికి అవసరమైన నగదును పొందడంలో సభ్య సంస్థలు నిరంతరం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏటీఎంలకు రూ.94,000 కోట్ల నగదు అవసరమవగా, మార్చిలో కేవలం రూ.61,000 కోట్లు, ఏప్రిల్లో రూ.54,000 కోట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దీంతో అవసరమైన నగదులో వరుసగా 64 శాతం, 57 శాతం మాత్రమే నెరవేరిందని తెలిపింది. ఈ అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ కరెన్సీ మేనేజ్మెంట్ విభాగం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ‘బిజినెస్ స్టాండర్డ్’ కథనం పేర్కొంది.నగదు ఉంది.. కానీ ఏటీఎంలకు చేరడం లేదుఆసక్తికరమైన విషయం ఏమిటంటే దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ (Currency in Circulation) రికార్డు స్థాయిలో ఉంది. మే 22 నాటికి చలామణిలో ఉన్న నగదు రూ.42.54 లక్షల కోట్లకు చేరింది. అయినప్పటికీ ఏటీఎంలకు అవసరమైన నగదు సరఫరాలో లోటు కనిపిస్తోంది. దీంతో సమస్య నగదు కొరత కంటే పంపిణీ, లాజిస్టిక్స్, నగదు నిర్వహణ వ్యవస్థల్లోనే ఎక్కువగా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.పెరుగుతున్న ఖర్చులు.. ఆపరేటర్ల ఆందోళనఏటీఎం పరిశ్రమ ప్రస్తుతం మరో సవాలును కూడా ఎదుర్కొంటోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో ఇంధన ధరలు పెరగడం, పలు రాష్ట్రాల్లో కనీస వేతనాల పెంపు కారణంగా నగదు రవాణా, భద్రత, నిర్వహణ వ్యయాలు గణనీయంగా పెరిగాయి. నగదు రవాణా సంస్థలు, ఏటీఎం రీప్లెనిష్మెంట్ కంపెనీలు బ్యాంకుల నుంచి అధిక ఛార్జీలను కోరుతున్నాయి. ఖర్చులు 15-20 శాతం వరకు పెరిగినట్లు పరిశ్రమ అంచనా వేస్తోంది.తగ్గుతున్న ఏటీఎం లావాదేవీలుడిజిటల్ చెల్లింపుల విస్తరణతో ఏటీఎంల వినియోగం క్రమంగా తగ్గుతోంది. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం, 2025లో ఇదే కాలంలో 498.37 మిలియన్లుగా ఉన్న ఏటీఎం లావాదేవీలు 2026 మే నాటికి 446.50 మిలియన్లలకు పడిపోయాయి. ఏడాదిలో సుమారు 10.4 శాతం తగ్గుదల నమోదైంది. అయితే నగదు చలామణి మాత్రం పెరుగుతూనే ఉండటం విశేషం. ఇది ప్రజలు అత్యవసర అవసరాల కోసం నగదును నిల్వ ఉంచుతున్నారనే సంకేతంగా ఎస్బీఐ పరిశోధన నివేదిక పేర్కొంది.ఫీజుల పెంపు ప్రభావంగత ఏడాది నుంచి ఉచిత పరిమితిని దాటిన ఏటీఎం లావాదేవీలపై వసూలు చేసే ఛార్జీని రూ.21 నుంచి రూ.23కు పెంచారు. అలాగే ఇంటర్చేంజ్ ఫీజును రూ.17 నుంచి రూ.19కు పెంచినా, పెరిగిన నిర్వహణ ఖర్చులను అది భర్తీ చేయలేకపోతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఏటీఎం ఆపరేటర్ల లాభదాయకతపై ఒత్తిడి పెరుగుతోంది.ప్రజలపై ప్రభావం ఎంత?ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడే పరిస్థితి లేదని బ్యాంకింగ్ వర్గాలు స్పష్టం చేస్తున్నప్పటికీ, నగదు సరఫరా సమస్య కొనసాగితే కొన్ని ప్రాంతాల్లో తరచూ "క్యాష్ అవుట్" పరిస్థితులు కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డీబీటీ లబ్ధిదారులు, రోజువారీ నగదు లావాదేవీలపై ఆధారపడే వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. అందువల్ల నగదు పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, ఏటీఎం రీప్లెనిష్మెంట్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా మార్చడం అత్యవసరంగా మారింది. -
RBI నిర్ణయం.. బ్యాంకు EMIలపై ఇదే ప్రభావం..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లపై తన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. కీలక రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) జూన్ 3 నుంచి జూన్5 మధ్య 2027 ఆర్థిక సంవత్సరానికి రెండవ ద్వైమాసిక విధాన సమావేశాన్ని నిర్వహించింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ, ఆర్థిక, వాణిజ్య అనిశ్చితులు.. రూపాయి అస్థిరతలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.ఏమిటీ రెపో రేటు?ఆర్బీఐ తీసుకునే అత్యంత నిశితంగా పరిశీలించే నిర్ణయాలలో ఒకటి పాలసీ రెపో రేటు. ఇది మీరు ఇల్లు, కారు, వ్యక్తిగత రుణాలపై చెల్లించే వడ్డీ రేటును, ఫిక్స్డ్ డిపాజిట్లపై మీరు సంపాదించే రాబడిని, మీ మార్కెట్ పెట్టుబడుల పనితీరును కూడా నేరుగా ప్రభావితం చేస్తుంది. రెపో రేటు అనేది సెంట్రల్ బ్యాంక్ (ఆర్బీఐ) వాణిజ్య బ్యాంకులకు రుణాలు అందించే రేటు. అంటే మీ బ్యాంకు ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు ఫండ్ అవసరమైనప్పుడల్లా ఈ రెపో రేటుతో ఆర్బీఐ నుండి రుణం తీసుకుంటుంది.హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధిక వడ్డీకి రుణం తీసుకుంటే కస్టమర్లకు కూడా అధిక వడ్డీకి రుణం ఇస్తారు. రెపో రేటు ఎంత ఎక్కువగా ఉంటే, మీరు తీసుకునే రుణంపై మీరు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అది ఎంత తక్కువగా ఉంటే, మీ రుణంపై చెల్లించాల్సి వడ్డీ అంత తగ్గుతుందన్నమాట.ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, నియంత్రణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నప్పుడు రెపో రేటును పెంచే అంశాన్ని ఆర్బీఐ పరిగణించవచ్చు. అధిక వడ్డీ రేట్లు రుణాలను మరింత ఖరీదైనవిగా మారుస్తాయి. ఇది ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. డిమాండ్ను తగ్గిస్తుంది. మరోవైపు, ఆర్బీఐ ఆర్థిక కార్యకలాపాలను పెంచాలనుకున్నప్పుడు రెపో రేటును తగ్గిస్తుంది. తక్కువ వడ్డీ రేట్లు రుణాలు, ఖర్చులను ప్రోత్సహిస్తాయి. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యతను పెంచుతాయి. జీడీపీ వృద్ధికి మద్దతు ఇస్తాయి.ఈఎంఐలపై ప్రభావంప్రస్తుతం, ఆర్బీఐ పాలసీ రెపో రేటును 5.25 శాతంగా ఉంచింది. కాబట్టి ప్రస్తుతానికి చెల్లించాల్సిన లోన్ ఈఎంఐలలో ఎలాంటి మార్పు ఉండదు. అదే ఒక వేళ మార్పులు చేసి ఉంటే ఎలా ఉండేదో ఉదాహరణతో చూద్దాం..మీకు 8.25% ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో 20 సంవత్సరాల కాలపరిమితితో రూ.50 లక్షల గృహ రుణం ఉందనుకోండి. ఈ రేటుతో, మీ నెలవారీ ఈఎంఐ రూ. 42,603కు వస్తుంది. ఇప్పుడు, ఆర్బీఐ రెపో రేటును 5.25% నుండి 5 శాతానికి తగ్గించి ఉంటే మీ బ్యాంక్ మొత్తం 0.25% తగ్గింపును పాస్ చేస్తే, మీ గృహ రుణ వడ్డీ రేటు 8 శాతానికి పడిపోతుంది. ఫలితంగా మీ ఈఎంఐ రూ.41,822కు తగ్గేది. అంటే నెలకు రూ.781 మేర తగ్గేదన్న మాట.అదే ఆర్బీఐ రెపో రేటును 5.25 శాతం నుంచి 5.5 శాతానికి పెంచి ఉంటే, మీ బ్యాంకు మొత్తం 0.25 శాతం వడ్డీ రేటును కస్టమర్లకు బదిలీ చేస్తే, మీ గృహ రుణ వడ్డీ రేటు 8.5 శాతానికి పెరుగుతుంది. ఫలితంగా, మీ చెల్లించాల్సిన ఈఎంఐ రూ.43,391కు పెరుగుతుంది. అంటే మీరు ప్రతి నెలా అదనంగా రూ.788 చెల్లించాల్సి వచ్చేది. -
కనీసం రూ.52,600 జీతం ఇవ్వాలి..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పునఃసమీక్ష కోసం ఏర్పాటైన 8వ కేంద్ర వేతన సంఘం (8th CPC) ముందు భారతీయ రైల్వే సాంకేతిక పర్యవేక్షకుల సంఘం (IRTSA) కీలక డిమాండ్లను ఉంచింది. రైల్వేలోని జూనియర్ ఇంజనీర్లు (JE), సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు (SSE) సహా టెక్నికల్ సూపర్వైజర్ల బాధ్యతలు, ప్రమాదభరిత విధులు, సాంకేతిక నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకుని కనీస ప్రాథమిక వేతనాన్ని ప్రస్తుత స్థాయి కంటే గణనీయంగా పెంచి రూ.52,600గా నిర్ణయించాలని సంఘం కోరింది.గత నెల హైదరాబాద్లో 8వ వేతన సంఘం ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఐఆర్టీఎస్ఏ సమగ్ర మెమోరాండం సమర్పించింది. సంఘం ప్రధాన కార్యదర్శి కె.వి. రమేష్ నేతృత్వంలోని బృందం రైల్వే టెక్నికల్ సిబ్బంది ఎదుర్కొంటున్న కెరీర్ స్తబ్దత, పదోన్నతుల కొరత, వేతన అసమానతలు, భత్యాల సమస్యలను సంఘం దృష్టికి తీసుకెళ్లింది.రైల్వే టిక్నికల్ సిబ్బంది డిమాండ్లు ఇవీ..సంఘం ప్రతిపాదనల ప్రకారం, మొత్తం ఉద్యోగులందరికీ ఒకే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వర్తింపజేయకుండా పోస్టు స్థాయి, బాధ్యతల ఆధారంగా వేర్వేరు ఫిట్మెంట్ ఫ్యాక్టర్లను అమలు చేయాలి. లెవల్-1 ఉద్యోగులకు 2.92, లెవల్-6 నుంచి 8 వరకు ఉన్న సాంకేతిక సిబ్బందికి 3.50, లెవల్-9 నుంచి 12 వరకు ఉన్న మధ్యస్థాయి అధికారులకు 3.80 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను అమలు చేయాలని సూచించింది.అలాగే సీనియర్ సెక్షన్ ఇంజనీర్లకు గ్రూప్-బి గెజిటెడ్ హోదా కల్పించాలని, రైల్వేలో గ్రూప్-బి పోస్టుల సంఖ్యను పెంచాలని, సాంకేతిక సిబ్బందికి ప్రత్యేక రిస్క్, హార్డ్షిప్ అలవెన్సులు ఇవ్వాలని సంఘం డిమాండ్ చేసింది. నైట్ డ్యూటీ అలవెన్స్, ఓవర్టైమ్ అలవెన్స్, పీసీఓ అలవెన్స్ వంటి అంశాలపై కూడా పునఃసమీక్ష జరపాలని కోరింది.ప్రస్తుతం 8వ వేతన సంఘం దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంస్థలు, వివిధ శాఖల ప్రతినిధుల అభిప్రాయాలను సేకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2025లో 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయగా, సంఘం తన సిఫార్సులను 18 నెలల్లో సమర్పించే అవకాశం ఉంది. తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే కావడంతో, ఉద్యోగ సంఘాల డిమాండ్లన్నీ యథాతథంగా అమలవుతాయా లేదా అనేది నివేదిక అనంతరం స్పష్టత రానుంది. -
కాంబోడియాలో యూపీఐ చెల్లింపులు
న్యూఢిల్లీ: దేశీ ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) తాజాగా కాంబోడియాలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ సంస్థ కాంబోడియాకి చెందిన ఎక్లెడా బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది.దీని ప్రకారం తొలి దశలో ఆ దేశంలో 45 లక్షల వ్యాపారులకు భారతీయ పర్యాటకులు క్యూఆర్ ఆధారంగా చెల్లింపులు చే యొచ్చు. తదుపరి దశలో కాంబోడియా పర్యాటకులు భారత్లో కూడా ఈ విధానంలో చెల్లింపులు జరిపే వెసులుబాటును వినియోగంలోకి తెస్తారు. ప్రస్తుతం సింగపూర్, ఫ్రాన్స్, నేపాల్ తదితర 8 దేశాల్లో యూపీఐకి అందుబాటులో ఉంది. -
ధనవంతుల రహస్యం చెప్పిన కియోసాకి
ప్రపంచ ప్రఖ్యాత పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి బంగారం, వెండిపై తన మద్దతును వ్యక్తం చేశారు. సంపదను కాపాడుకోవాలంటే బంగారం వంటి వాస్తవ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచించారు.తాజాగా ఫేస్బుక్లో చేసిన పోస్టులో, చాలామంది బంగారం కొంటే డబ్బు సంపాదించవచ్చని భావిస్తారని, కానీ ధనవంతులు ఆ ఉద్దేశంతో బంగారం కొనరని పేర్కొన్నారు. డాలర్పై నమ్మకం లేకపోవడమే బంగారం కొనడానికి ప్రధాన కారణమని ఆయన అన్నారు. తన వయోజన జీవితమంతా బంగారం, వెండి నిల్వ చేసుకుంటూ వచ్చానని, వాటి ధరలు భారీగా పెరుగుతాయని ఆశించి కాదు, డాలర్ విలువ కాలక్రమేణా తగ్గుతుందనే అవగాహనతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు.ప్రభుత్వాలు కొత్త కరెన్సీని ముద్రించిన ప్రతిసారీ నగదు కొనుగోలు శక్తి తగ్గిపోతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు. బంగారం లాభాలను హామీ ఇవ్వదని, కానీ సంపదను రక్షించే సాధనంగా పనిచేస్తుందని చెప్పారు. కోట్లాది రూపాయలు అవసరం లేదని, ఒక వెండి నాణెం లేదా చిన్న పరిమాణంలో బంగారం కొనుగోలు చేయడం ద్వారా కూడా సంపద రక్షణను ప్రారంభించవచ్చని సూచించారు.అయితే ఎక్కువ మంది ప్రజలు సోషల్ మీడియాలో సమయం గడపడం, తదుపరి స్టాక్ టిప్ కోసం ఎదురు చూడడం లేదా ప్రభుత్వమే తమను కాపాడుతుందని ఆశించడం చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. నిజమైన డబ్బు బంగారం, వెండి వంటి విలువైన లోహాలేనని, కాగితపు కరెన్సీ కేవలం నకిలీ డబ్బు లాంటిదేనని ఆయన పేర్కొన్నారు.వేల ఏళ్లుగా బంగారం, వెండి సంపద నిల్వ సాధనాలుగా కొనసాగుతున్నాయని, కానీ అమెరికా డాలర్ 1971 నుంచి క్రమంగా విలువ కోల్పోతోందని కియోసాకి అన్నారు. ప్రభుత్వాలపై నమ్మకం ఉంచాలా, లేక బంగారంపై విశ్వాసం పెంచుకోవాలా అనేది ప్రతి వ్యక్తి తీసుకోవాల్సిన నిర్ణయమని తన పోస్టులో పేర్కొన్నారు. -
వైవిధ్యంతో కూడిన పెట్టుబడులు
ఈక్విటీల్లో చక్కని వైవిధ్యంతో ఇన్వెస్ట్ చేసుకోవాలని భావించే వారికి మల్టీ క్యాప్ ఫండ్స్ మంచి ఆప్షన్. పెట్టుబడులకు స్థిరత్వం కోసం లార్జ్క్యాప్, అధిక రాబడుల కోసం మిడ్క్యాప్, స్మాల్క్యాప్ మధ్య పెట్టుబడులను విస్తరించడం ద్వారా దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందించేవే మల్టీక్యాప్ ఫండ్స్. ఇన్వెస్టర్లు తమ అంతటగా లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ విభాగాల్లో మెరుగైన పథకాలను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేయడం కంటే మంచి మల్టీక్యాప్ను ఎంపిక చేసుకోవడమే చక్కని ఆప్షన్ అవుతుంది. కనీసం ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి.. మధ్యస్థం నుంచి అధిక రిస్క్ తీసుకోగలిగితే ఇన్వెస్టర్లకు మల్టీ క్యాప్ ఫండ్స్ అనుకూలం. రాబడులు.. ఈ పథకం 2023 జనవరి 30న ప్రారంభం కాగా, నాటి నుంచి ఏటా 23.4 శాతం చొప్పున రాబడిని (పాయింట్ టు పాయింట్) అందించింది. ఇదే కాలంలో మల్టీక్యాప్ ఫండ్స్ విభాగం సగటు వార్షిక రాబడి 18.3 శాతంగానే ఉంది. ఇది మెరుగైన పనితీరును తెలియజేస్తోంది. రోలింగ్ రాబడులు (వివిధ దశల్లో పెట్టుబడులు) సైతం మూడేళ్ల కాలంలో 23 శాతం చొప్పున ఉన్నాయి. మూడేళ్ల సిప్ పనితీరును గమనిస్తే ఏటా 12.8 శాతం చొప్పున రాబడి నమోదైంది. మార్కెట్లో ఎన్నో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ గడిచిన ఏడాది కాల రాబడి 6.45 శాతంగా నమోదైంది. పెట్టుబడుల విధానం.. మల్టీక్యాప్ ఫండ్స్ అన్నవి లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ పథకంలో వైవిధ్యానికి ప్రాధాన్యం ఎక్కువ. ప్రస్తుతం ఈ పథకంలో 96 స్టాక్స్ ఉండడం దీన్నే సూచిస్తోంది. పోర్ట్ఫోలియోలోని టాప్–10 కంపెనీల్లో పెట్టుబడులు 23.19 శాతం మించలేదు. ఇది కూడా రిస్క్ వైవిధ్యంలో భాగమే. సెబీ నిబంధనల ప్రకారం అయితే మల్టీక్యాప్ ఫండ్స్ కనీసం 25 శాతాన్ని లార్జ్క్యాప్ కంపెనీల్లో, 25 శాతాన్ని మిడ్క్యాప్ కంపెనీల్లో, 25 శాతం స్మాల్క్యాప్ కంపెన్లీలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 25 శాతం నిధులను మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఫండ్ మేనేజర్ తన విచక్షణ మేరకు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. మార్కెట్ పరిస్థితులను బట్టి వివిధ రకాల స్టాక్స్ వేర్వేరు సమయాల్లో రాణిస్తాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న తరుణంలో లార్జ్క్యాప్ కంటే మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీలు బాగా రాణిస్తాయి. అదే మార్కెట్ పతనమవుతున్నప్పుడు లార్జ్క్యాప్లో నష్టాలు పరిమితంగా ఉంటాయి. మల్టీ క్యాప్ ఫండ్స్ వల్ల అన్ని కాలాల్లోనూ లాభపడే అవకాశం ఉంటుంది. ఈ పథకానికి వ్యాల్యూరీసెర్చ్ సంస్థ 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. పోర్ట్ఫోలియో ఈ పథకం నిర్వహణలో రూ.5,500 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. గత పనితీరు భవిష్యత్ రాబడికి హామీ కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. కేవలం ఆ పథకం భవిష్యత్ పనితీరు ఎలా ఉంటుందో అవగాహనకు డేటా పనికొస్తుంది. ఇందులో 43.67 శాతం లార్జ్క్యాప్ కంపెనీలకు కేటాయించగా, మిడ్క్యాప్ కంపెనీల్లో 27.96 శాతం, స్మాల్క్యాప్ కంపెనీలకు 28.37 శాతం చొప్పున కేటాయించింది. రంగాల వారీ పెట్టుబడులను పరిశీలిస్తే.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సియల్ రంగ కంపెనీల్లో 24.91 శాతం, ఇండ్రస్టియల్స్ కంపెనీల్లో 17.13 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ కంపెనీల్లో 11.18 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. మెటీరియల్స్ కంపెనీల్లో 9.73 శాతం పెట్టుబడులు ఉన్నాయి. -
ఇన్వెస్టర్స్ అలర్ట్: ఇవిగో ‘న్యూ ఫండ్ ఆఫర్స్’
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కొత్తగా స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (సిఫ్) కేటగిరీలో రెండు ఫండ్స్ని ఆవిష్కరించింది. ఐసిఫ్ యాక్టివ్ అసెట్ అలొకేటర్ లాంగ్–షార్ట్ ఫండ్, ఐసిఫ్ ఈక్విటీ లాంగ్–షార్ట్ ఫండ్ వీటిలో ఉన్నాయి. ఈ రెండు ఫండ్ ఆఫర్లు జూన్ 02 వరకు అందుబాటులో ఉంటాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా లాంగ్–షార్ట్ పొజిషన్లు తీసుకోవడం, డెరివేటివ్స్ ద్వారా రిస్క్లను అదుపులో ఉంచడంలాంటి విధానాలతో మెరుగైన రాబడులు అందించేందుకు ఈ వ్యూహాలు పని చేస్తాయని సంస్థ ఈడీ శంకరన్ నరేన్ తెలిపారు.మొదటిది ఈక్విటీ, డెట్, కమోడిటీస్ డెరివేటివ్స్, ఇన్విట్స్ మొదలైన వాటికి నిధులు కేటాయిస్తుంది. రెండోది వివిధ మార్కెట్ క్యాప్స్వ్యాప్తంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. డెరివేటివ్స్ వ్యూహాన్ని కూడా పాటిస్తూ మెరుగైన రాబడులు అందించడంపై దృష్టి పెడుతుంది. ఈ తరహా సిఫ్లో తొలిసారి ఇన్వెస్ట్ చేస్తున్నవారు కనీసం రూ. 10 లక్షలు, ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వారు రూ. 10,000 నుంచి వీటిలో పెట్టుబడులు పెట్టొచ్చు. కోటక్ ఎంఎఫ్ నిఫ్టీ ఫండ్ కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ తాజాగా నిఫ్టీ ఆల్ఫా లో–వోలటైలిటీ 30 ఇండెక్స్ ఫండ్ని ప్రవేశపెట్టింది. ఇది జూన్ 12తో ముగుస్తుంది. ధరల పరంగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోను కాకుండా విస్తృత మార్కెట్కి మించి రాణించగలిగే అవకాశాలున్న 30 సంస్థలు ఈ ఇండెక్స్లో ఉంటాయి. పరిస్థితులను బట్టి ఈ స్టాక్స్లో మార్పులు, చేర్పులు చేస్తుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలు గల ఇన్వెస్టర్లు దీన్ని పరిశీలించవచ్చని సంస్థ ఎండీ నీలేష్ షా తెలిపారు. మహీంద్రా మాన్యులైఫ్ ‘ఎంపవర్ సిఫ్’ సిఫ్ కేటగిరి కింద మహీంద్రా మాన్యులైఫై మ్యుచువల్ ఫండ్ కొత్తగా ‘ఎంపవర్ సిఫ్’ని ఆవిష్కరించింది. ఈ తరహా ఫండ్స్లో లాంగ్–షార్ట్ పొజిషనింగ్, డెరివేటివ్స్ ఆధారిత వ్యూహాలు కూడా అమలు చేస్తారని సంస్థ తెలిపింది. మారుతున్న ఇన్వెస్టర్ల ఆకాంక్షలు, లక్ష్యాలకు అనుగుణంగా మరింత మెరుగైన రాబడులను అందించేందుకు ఇవి ఉపయోగపడతాయని సంస్థ ఎండీ ఆంథోని హెరెడియా తెలిపారు. ఎంపవర్ సిఫ్ కింద ఈక్విటీ, హైబ్రిడ్, ఫిక్సిడ్ ఇన్రం కేటరిగీలవ్యాప్తంగా వివిధ వ్యూహాలను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. -
‘బ్యాంకులకూ బంగారంపైనే నమ్మకం’
ప్రపంచవ్యాప్తంగా బంగారం ప్రాధాన్యం మరింత పెరుగుతోందని ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్లో (ట్విట్టర్) చేసిన తాజా పోస్టు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.గత ఏడాదిలో బంగారం ధరలు సుమారు 65 శాతం పెరిగాయని, అదే సమయంలో బ్యాంకు పొదుపు ఖాతాలపై కేవలం 4 శాతం వార్షిక వడ్డీ మాత్రమే లభిస్తోందని కియోసాకి గుర్తు చేశారు. అంతేకాకుండా ప్రపంచంలోని అనేక సెంట్రల్ బ్యాంకులు అమెరికా ట్రెజరీ బాండ్లను విక్రయించి, వాటి స్థానంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.“ఈ పరిణామాలను గమనిస్తే పరిస్థితి ఏ దిశగా వెళ్తోందో అర్థం చేసుకోవచ్చు” అంటూ కియోసాకి తన పోస్టులో వ్యాఖ్యానించారు. డాలర్ ఆధారిత ఆస్తుల కంటే బంగారం వంటి భౌతిక ఆస్తులపై విశ్వాసం పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.కియోసాకి గత కొంతకాలంగా బంగారం, వెండి, బిట్కాయిన్లకు మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ సంపదను రక్షించుకునేందుకు ప్రత్యామ్నాయ ఆస్తులను పరిశీలించాలని ఆయన తరచూ సూచిస్తున్నారు.FYI:Gold up 65% in 1 year.Savings pay 4% a year.Central banks dumping US Treasuries for gold.Get the picture?— Robert Kiyosaki (@theRealKiyosaki) June 1, 2026 -
Income Tax: ఐటీఆర్ ఫారం 2 రెడీగా ఉంది..
గత వారం నుంచి ఆదాయపు పన్ను వారి ఈ–ఫైలింగ్ పోర్టల్లో ఫారాలను ఎనేబుల్ చేస్తున్నారు. మనం గతంలో ఫారం 1, ఫారం 4 గురించి తెలుసుకున్నాం. లేటెస్టుగా ఫారం 2 రెడీగా ఉంది. వివరాల్లోకి వెళ్దాం.ఈ ఫారం ఎవరు దాఖలు చేయాలి? వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు మాత్రమే ఐటీఆర్ ఫారం 2ను వేయగలరు. ఇతరులెవ్వరూ ఈ ఫారం ద్వారా తమ ఆదాయాలను డిక్లేర్ చేయకూడదు. ఐటీఆర్ ఫారం 1 వేయకూడనివారు (వేయలేకపోవడం కాదు.. వేయడానికి అర్హత లేని వారు), అలాగే బిజినెస్ / వృత్తిపై లాభనష్టాలు ఉండని వారు మాత్రమే ఈ ఫారం దాఖలు చేయడానికి అర్హులు.ఏయే ఆదాయాలున్నవారు వేయొచ్చు.. ß మూలధన లాభాలు (దీర్ఘకాలిక, స్వల్పకాలిక) ß ఒక ఇంటి ఆస్తి మీద, ఎక్కువ ఆస్తుల మీద ఆదాయం ఉన్నవారు ß విదేశీ ఆస్తుల మీద ఆదాయం ß విదేశాల నుంచి ఆదాయం ß జీతాలు / పెన్షన్ ß ఇతర ఆదాయాలు, లాటరీలు, గుర్రపు పందాలు, గ్యాంబ్లింగ్ వగైరా ఆదాయాలు ఉన్నవారు ß వ్యవసాయం మీద ఆదాయం రూ. 5,000 దాటినవారు ß మొత్తం ఆదాయం పరిమితి రూ. 50,00,000 దాటినవారు ß డైరెక్టర్స్ ß అన్లిస్టెడ్ ఈక్విటీ వాటాల్లో ఇన్వెస్ట్ చేసినవారుఏ ఆదాయం ఉన్నవారు వేయకూడదు.. వ్యక్తులు కానీ / హిందు ఉమ్మడి కుటుంబాలకు వ్యాపారం మీద / వృత్తి మీద ఆదాయం ఉన్నవారు ఫారం 2 వేయకూడదు.గడువు తేదీ ఎప్పుడు ఈ ఫారం దాఖలు చేయడానికి గడువు తేదీ 2026 జూలై 31.తెలుసుకోవాల్సిన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ ఫారం ఆన్లైన్లో గానీ ఆఫ్లైన్లో గానీ వేసుకోవచ్చు. ఈ కింద చెప్పబోయే విషయాల్లో పాత చట్టంలో పేర్కొన్న పేరు, ఫారాలను వాడుతున్నాం. 🔸 యజమాని జారీ చేసిన ఫారం 16 🔸 వివిధ డిడక్టర్లు జారీ చేసిన ఫారం 16ఏ 🔸 టీడీఎస్ వెరిఫికేషన్ కోసం ఫారం 26ఏఎస్ 🔸 ఇంటద్దె రశీదులు, ఒక్కొక్కప్పుడు యజమాని తీసుకోకపోయినా / పరిగణించకపోయినా మీరు డైరెక్టుగా క్లెయిమ్ చేయొచ్చు 🔸 బ్యాంకు పాస్బుక్స్ లేదా బ్యాంకు వాళ్లు ఇచి్చన స్టేట్మెంట్లు 🔸 ఫిక్స్డ్ డిపాజిట్ల రశీదులు 🔸 క్యాపిటల్ గెయిన్స్ – దీర్ఘకాలికమైనవైతే ఆస్తుల అన్ని వివరాలు, కాగితాలు, రశీదులు మొదలైనవి 🔸 క్యాపిటల్ గెయిన్స్ స్వల్పకాలికమైనా, ఆస్తులకు సంబంధించిన వివరాలు, కాగితాలు, రశీదులు 🔸 షేర్లు, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి బ్రోకింగ్ సంస్థలు / ఏజెన్సీలు జారీ చేసిన స్టేట్మెంట్లు, సర్టిఫికెట్లు మొదలైనవి 🔸 పాత పద్ధతిలో పన్నుభారం లెక్కించే విధానం ఎంపికలో 80సి, జీ, డి, జీజీ ఇలాంటి మినహాయింపులకు సంబంధించి కాగితాలు, నంబర్లు, వివరాల విషయంలో దయచేసి చాలా జాగ్రత్త వహించండి. షరా: కాగితాలు జతపర్చుకోనక్కర్లేదు, కానీ భద్రపరచాలి. వాటిలోని వివరాలు తెలియజేయాలి.కొత్త మార్పులు ప్రత్యేకించి 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నుల్లో సమాచారపరంగా వచ్చిన మార్పులు ఏమిటంటే, స్పల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ 15 శాతం కొన్ని, 10 శాతం కొన్ని ఉండేవి. కానీ ఇప్పుడు అన్నింటికీ ఒకే రేటు. తికమక ఉండదు. రివైజ్ రిటర్నుకి సంబంధించిన ఫీజు వివరాలు ఇవ్వాలి. 80సీ, 80డీ మొదలైన వాటి విషయాల్లో ప్రత్యేకంగా 80జీజీసీ వ్యవహారపు వివరాలు/ రిఫరెన్సు, పాన్ నంబరు ఇవ్వాలి. రిప్రజెంటేటివ్ అసెసీ వివరాల్లో పేరు, మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లు తెలియజేస్తే చాలు. -
‘బంగారం, వెండి.. అలా కొన్నారంటే నష్టమే’
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) అమెరికా ప్రభుత్వ బాండ్ల భద్రతపై సందేహాలు వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రణాళికకర్తలు అమెరికా బాండ్లు సురక్షితమైన పెట్టుబడులని చెబుతున్నప్పటికీ, అలాంటి అభిప్రాయాలను గుడ్డిగా నమ్మవద్దని ఆయన సూచించారు.సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో, “మూర్ఖత్వం నుంచి వచ్చే ఏ పెట్టుబడీ పూర్తిగా సురక్షితం కాదు” అని వ్యాఖ్యానించారు. బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి ఆస్తులు కూడా కేవలం ప్రచారం లేదా హైప్ ఆధారంగా కొనుగోలు చేస్తే నష్టాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.ప్రస్తుతం జపాన్, చైనా వంటి ప్రధాన అమెరికా బాండ్ హోల్డర్లు తమ వద్ద ఉన్న బాండ్లను విక్రయించి బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మార్కెట్లలో నగదు ప్రవాహం ఏ దిశగా వెళ్తుందో గమనించడం మదుపరులకు ముఖ్యమని సూచించారు.అంతేకాకుండా, ఎవరికైనా అత్యంత విలువైన ఆస్తి వారి మెదడేనని, సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలని కియోసాకి అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా విశ్లేషించాలని ఆయన సూచించారు. Don’t drink financial planners Kool- Aide when they tell you US Bonds are safe. There is nothing safe….from stupidity. Remember even gold, silver, and Bitcoin can cost you money if purchased on hype.Best watch the cash flowing. Today many major US Bond holders, like…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 30, 2026 -
మధ్యవర్తుల ద్వారానే బీమా.. ఎందుకు?
దేశీయంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు, కస్టమర్లకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉండటం లేదని కన్సల్టింగ్ సంస్థ ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ ఒక నివేదికలో పేర్కొంది. దాదాపు 80 శాతం పాలసీల కొనుగోళ్లు బీమా కంపెనీల వెబ్సైట్ల ద్వారా కాకుండా మధ్యవర్తుల ద్వారానే జరుగుతున్నాయని తెలిపింది. ఫలితంగా కస్టమర్లను సమకూర్చుకోవడం కంటే ఏజెంట్లను అందిపుచ్చుకునేందుకే కంపెనీలు పోటీపడుతున్నాయని వివరించింది. అన్ని లావాదేవీలు మధ్యవర్తులద్వారానే జరుగుతుండటం వల్ల కస్టమర్లు కూడా వారికే ఎక్కువగా విశ్వసనీయంగా ఉంటున్నారని పేర్కొంది. ఫలితంగా కంపెనీలకి కస్టమర్లకు మధ్య ప్రత్యక్షంగా సంబంధాలు ఉండటం లేదని రిపోర్టు తెలిపింది.సాధారణంగా బీమా కంపెనీలకు పాలసీల విక్రయాలపై నష్టాలే తప్ప లాభం ఉండటం లేదని వివరించింది. అండర్రైటింగ్ రూపంలో వచ్చే నిధుల కంటే షేర్ మార్కెట్లలోనో, ప్రభుత్వ బాండ్లలోనో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే ఆదాయాలతోనే కంపెనీలు మనుగడ సాగిస్తున్నట్లు ప్రాక్సిస్ తెలిపింది. దీర్ఘకాలికంగా నిలదొక్కుకోవాలంటే బీమా కంపెనీలు తమ పద్ధతులను మార్చుకోవాల్సి ఉంటుందని వివరించింది. ఏజెంట్లపై ఆధారపడటం తగ్గించి, నేరుగా కస్టమర్లకే పాలసీలను విక్రయించే పద్ధతిని పెంచుకోవాలని సూచించింది.కస్టమర్లు కూడా కంపెనీల నుంచే నేరుగా పాలసీలను కొనుగోలు చేసేందుకు సిద్ధంగానే ఉండొచ్చని, కాకపోతే కంపెనీలు తక్కువ ధరకు, సరళతరమైన పాలసీలను అందించాల్సి ఉంటుందని ప్రాక్సిస్ తెలిపింది. అలాగే క్లెయిమ్స్ను సత్వరం సెటిల్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. రాబోయే రోజుల్లో కొంగొత్త నిబంధనలు, బీమా సుగమ్లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్ల వల్ల కస్టమర్లతో కంపెనీలు నేరుగా కనెక్ట్ అయ్యేందుకు అవకాశాలు పెరుగుతాయని వివరించింది. సొంతంగా కస్టమర్లను నిలుపుకోగలిగే కంపెనీలే భవిష్యత్తులో రాణించగలవని ప్రాక్సిస్ తెలిపింది. చదవండి: ఒలెక్ట్రా గ్రీన్టెక్ లాభం రెట్టింపు -
బ్యాంకులకు వెళ్లేవాళ్లకు అలర్ట్: 11 రోజులు సెలవులు!
బ్యాంకులు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగంగా మారిపోయాయి. ప్రతిఒక్కరూ ఏదో ఒక పని మీద బ్యాంకు బ్రాంచిలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో బ్యాంకులు ఏ రోజుల్లో పనిచేస్తాయి.. ఎప్పుడెప్పుడు సెలవులు ఉంటాయి.. అనే విషయాలను తెలుసుకోవడం అవసరం. దేశవ్యాప్తంగా బ్యాంకులకు జూన్ నెలలో గత నెలలతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే సెలవులు ఉండనున్నాయి. అయితే రాష్ట్రాల వారీగా కొన్ని ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక సందర్భాల కారణంగా బ్యాంకులు మూసివేస్తున్నందున ఖాతాదారులు తమ బ్యాంకింగ్ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జూన్ నెలలో మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు. వీటిలో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఉండగా, మిగిలిన రోజులు రాష్ట్రాల వారీగా అమలయ్యే ప్రత్యేక సెలవులు.మొహర్రం ప్రధాన సెలవుజూన్ 26న మొహర్రం (అషూరా) సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్యాంకులు మూసిఉంటాయి. ఇది జూన్ నెలలో దేశవ్యాప్తంగా ప్రభావం చూపే ప్రధాన సెలవుగా భావించవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో మొహర్రం సెలవు జూన్ 25న ఉండగా, ఇతర చాలా రాష్ట్రాల్లో జూన్ 26న అమలులో ఉంటుంది.జూన్లో బ్యాంకు సెలవులుజూన్ 7 - ఆదివారంజూన్ 13 - రెండో శనివారంజూన్ 14 - ఆదివారంజూన్ 15 – మిజోరాంలో వైఎంఏ దినోత్సవం, ఒడిశాలో రాజ సంక్రాంతి సందర్భంగా సెలవుజూన్ 21 - ఆదివారంజూన్ 25 – ఆంధ్రప్రదేశ్లో మొహర్రం సెలవుజూన్ 26 – మొహర్రం/అషూరా సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో సెలవుజూన్ 27 - నాలుగో శనివారంజూన్ 28 - ఆదివారంజూన్ 29 – హిమాచల్ ప్రదేశ్లో సంత్ గురు కబీర్ జయంతిజూన్ 30 – మిజోరాంలో రెమ్నా నీ శాంతి దినోత్సవంఅందుబాటులో ఆన్లైన్ సేవలుబ్యాంకు శాఖలు మూసిఉన్నప్పటికీ, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు, ఏటీఎంలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. అయితే నగదు డిపాజిట్లు, చెక్ క్లియరెన్స్, పాస్బుక్ అప్డేట్లు, ఖాతా సంబంధిత సేవలు వంటి బ్రాంచ్ ఆధారిత పనులు సెలవు రోజుల్లో అందుబాటులో ఉండకపోవచ్చు.అనేక సెలవులు రాష్ట్రాల వారీగా మారుతుండటంతో ఖాతాదారులు తమ ప్రాంతీయ బ్యాంకు శాఖల సెలవుల జాబితాను ముందుగానే పరిశీలించడం మంచిది. ఏవైనా అత్యవసర బ్యాంకింగ్ పనులు ఉంటే సెలవుల తేదీలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే పూర్తి చేసుకోవాలని ఆర్బీఐ సూచిస్తోంది. -
బంగారం రుణాలకు డిమాండ్ పైపైకి..
ముంబై: రుణదాతలకు పసిడి రుణాలు ఇక ముందూ కీలక ప్రాధాన్యంగా కొనసాగుతాయని ఎక్స్పీరియన్ నివేదిక తెలిపింది. భారత రిటైల్ రుణ మార్కెట్లో సెక్యూర్డ్ రుణాలకు ప్రాధాన్యం పెరిగినట్టు పేర్కొంది. పసిడి రుణాల సోర్సింగ్ విలువ (కొత్త రుణాలు) 2025–26 క్యూ4లో రెట్టింపునకు పైగా పెరిగి రూ.7.6 లక్షల కోట్లకు చేరినట్టు తెలిపింది. నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) 47 శాతం పెరిగి రూ.11.9 లక్షల కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది.సగటు రుణ పరిమాణం రూ.1.4 లక్షల నుంచి రూ.2.1 లక్షలకు చేరినట్టు వెల్లడించింది. ఇదే ధోరణి కొనసాగితే ఇక మీదటా తనఖా రుణాలు రిటైల్ రుణాల వృద్ధిలో కీలకంగా ఉంటాయని ఈ నివేదిక తెలిపింది. 2025–26లో కొత్త రుణాల్లో 68 శాతం సెక్యూర్డ్ రూపంలోనే ఉన్నాని, మొత్తం అన్సెక్యూర్డ్ రుణాల్లో 22 శాతం వృద్ధితో పోల్చితే ఎంతో ఎక్కువని వివరించింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) పసిడి రుణాల డిమాండ్ నుంచి ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నట్టు తెలిపింది.2025–26 క్యూ4లో కొత్త రుణాల్లో 40 శాతం ఎన్బీఎఫ్సీల నుంచే ఉన్నట్టు వెల్లడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 28 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. ఇదే కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకుల వాటా మోస్తరు స్థాయిలోనే కొనసాగినట్టు వివరించింది. బంగారం రుణాల ఆస్తుల నాణ్యత సైతం మెరుగ్గా ఉందంటూ.. 90 రోజులకు పైన చెల్లింపుల్లేని రుణాల వాటా 0.3 శాతం నుంచి 0.2 శాతానికి తగ్గినట్టు ఎక్స్పీరియన్ నివేదిక వెల్లడించింది. -
బంగారం ఖరీదవడం లేదు.. కియోసాకి కామెంట్స్
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి డాలర్ విలువ, ద్రవ్యోల్బణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారం ధరలు పెరుగుతున్నాయనే భావన తప్పని, అసలు సమస్య డాలర్ కొనుగోలు శక్తి క్షీణించడమేనని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.“బంగారం ఖరీదవడం లేదు.. డాలర్ చవకబారుతోంది” అంటూ కియోసాకి తన పోస్టులో స్పష్టం చేశారు. ఆర్థిక సలహాదారుగా ఆరు సంవత్సరాలకు పైగా పని చేసిన తన స్నేహితుడు కూడా 37 ఏళ్ల వయసులోనే ఈ నిజాన్ని అర్థం చేసుకున్నాడని తెలిపారు. ప్రజలు తమ జీతాలు పెరిగాయని భావిస్తున్నా, వాస్తవానికి డాలర్ విలువ తగ్గిపోవడంతో ఎక్కువ నోట్లు చేతికి వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.తన స్నేహితుడి తండ్రి ఉదాహరణను కూడా కియోసాకి ప్రస్తావించారు. ఒకప్పుడు 10 వేల డాలర్ల విలువైన ఇల్లు, అదే సమయంలో తీసుకున్న 10 వేల డాలర్ల జీవిత బీమా పాలసీ గురించి చెబుతూ.. నేడు ఆ ఇల్లు 7.5 లక్షల డాలర్లకు చేరగా, బీమా మాత్రం ఇప్పటికీ 10 వేల డాలర్లుగానే ఉందన్నారు. “ఒకటి ద్రవ్యోల్బణాన్ని అనుసరించింది.. మరొకటి అనుసరించలేదు” అని వ్యాఖ్యానించారు.1971 నుంచి అమెరికన్ డాలర్ తన కొనుగోలు శక్తిలో 93 శాతం కోల్పోయిందని కియోసాకి పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలను అదే కరెన్సీలో పొదుపు చేయమని ఆర్థిక వ్యవస్థ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ప్రభుత్వాలు నిరంతరం కరెన్సీ ముద్రిస్తూనే ఉంటాయని, ఫలితంగా కరెన్సీ విలువ తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.రోమ్ సామ్రాజ్యం నుంచి అమెరికా వరకు చరిత్రలో ఇదే పునరావృతమైందని ఆయన చెప్పారు. కోవిడ్ సమయంలో అమెరికా భారీగా డబ్బు ముద్రించిందని గుర్తుచేశారు. కరెన్సీ విలువ తగ్గినా, భూమి, బంగారం, వెండి, చమురు, వ్యాపారాల వంటి నిజమైన ఆస్తులు మాత్రం తమ విలువను నిలబెట్టుకుంటాయని అన్నారు.డాలర్ను ‘డబ్బు’గా కాకుండా ప్రతి ఏడాది కరిగిపోతున్న ‘కొలమానం’గా చూడాలని కియోసాకి సూచించారు. బంగారం ఐదు వేల ఏళ్లుగా తన విలువను నిలబెట్టుకుందని, పేపర్ కరెన్సీలు చివరికి విలువ కోల్పోతాయని పేర్కొన్నారు. చివరగా “డాలర్లు దాచుకోవద్దు.. నిజమైన ఆస్తులను సొంతం చేసుకోండి” అంటూ బంగారం, వెండి, బిట్కాయిన్, రియల్ అసెట్స్లో పెట్టుబడుల వైపు మొగ్గుచూపాలని ప్రజలకు సూచించారు. -
ATMలో EPF అంతా డ్రా చేసుకుంటే.. పెన్షన్ వస్తుందా?
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ (EPFO) తీసుకురాబోతున్న ‘ఈపీఎఫ్ఓ 3.0’ వ్యవస్థపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. యూపీఐ, ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బును సులభంగా ఉపసంహరించుకునే సదుపాయం అందుబాటులోకి రానుండటంతో ఉద్యోగుల్లో ఆనందం కనిపిస్తున్నా.. “పీఎఫ్ మొత్తం తీసుకుంటే పెన్షన్కు ప్రమాదమా?” అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈ అంశంపై స్పష్టత ఇచ్చింది.పీఎఫ్ విత్డ్రాకు, పెన్షన్కు సంబంధం లేదుఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్), ఈపీఎస్ (ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్) రెండూ ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్నప్పటికీ, వాటి నిర్వహణ విధానం వేర్వేరుగా ఉంటుంది. ఉద్యోగి, యజమాని (కంపెనీ) చెల్లించే పీఎఫ్ కాంట్రిబ్యూషన్తో ఏర్పడే ఈపీఎఫ్ బ్యాలెన్స్పై మాత్రమే కొత్త ఉపసంహరణ సదుపాయం వర్తిస్తుంది. అంటే ఏటీఎం లేదా యూపీఐ ద్వారా సభ్యులు తమ పీఎఫ్ నిధుల్లో గరిష్టంగా 75 శాతం వరకు మాత్రమే డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈపీఎస్ కింద వచ్చే నెలవారీ పెన్షన్ మొత్తాలను ఈ విధానంలో ఉపసంహరించుకోవడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు.10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తే పెన్షన్ హక్కుకేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 58 ఏళ్ల వయస్సు అనంతరం లభించే పెన్షన్ అర్హతపై ఈ మార్పుల ప్రభావం ఉండదు. ఉద్యోగి తన ఈపీఎఫ్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నా, అతని ఈపీఎస్ సర్వీస్ కాలం రద్దు కావడం లేదా రీసెట్ కావడం జరగదు. అయితే పెన్షన్ పొందాలంటే కనీసం 10 ఏళ్ల ఈపీఎస్ సభ్యత్వం తప్పనిసరి. ఆ అర్హత పూర్తి చేసిన సభ్యులు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్కు అర్హులుగానే కొనసాగుతారు.ఉదాహరణకు 50 ఏళ్ల ఉద్యోగి తన ఈపీఎఫ్ ఖాతా నుంచి భారీ మొత్తాన్ని ఉపసంహరించుకున్నా, అతను ఇప్పటికే 10 ఏళ్ల అర్హత సర్వీస్ పూర్తి చేసి ఉంటే పెన్షన్ ప్రయోజనాలు కోల్పోడు. దీంతో ఉద్యోగుల్లో ఉన్న ప్రధాన సందేహానికి ప్రభుత్వం సమాధానం ఇచ్చినట్టైంది.ఈపీఎఫ్ఓ 3.0 గురించి..ఈపీఎఫ్ఓ 3.0 అనేది సంస్థ చేపడుతున్న పెద్ద డిజిటల్ మార్పు కార్యక్రమం. దీని ద్వారా సభ్యులు పూర్తిగా కాగితరహిత విధానంలో తమ పీఎఫ్ డబ్బును తక్షణమే బదిలీ చేసుకోవచ్చు లేదా ఉపసంహరించుకోవచ్చు. యూపీఐ ఆధారిత చెల్లింపులు, యూపీఐ సపోర్ట్ ఉన్న ఏటీఎంల ద్వారా డబ్బు తీసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. దీంతో ఇప్పటివరకు ఉన్న క్లెయిమ్ ప్రాసెసింగ్ ఆలస్యాలు తగ్గి, సభ్యుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ కానుంది.కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవల ఈ సేవల పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని వెల్లడించారు. యూపీఐ పేమెంట్ గేట్వే ద్వారా పీఎఫ్ ఉపసంహరణ వ్యవస్థను పరీక్షించామని, ఉపసంహరించిన మొత్తాన్ని నేరుగా సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానం సిద్ధమైందని తెలిపారు. అయితే ఈపీఎఫ్ఓ 3.0 అధికారిక ప్రారంభ తేదీని మాత్రం ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు.ప్రస్తుతం ఈపీఎఫ్ఓ దాదాపు రూ.28 లక్షల కోట్ల కార్పస్ను నిర్వహిస్తోంది. భద్రత, స్థిరమైన రాబడులు, పన్ను మినహాయింపుల కారణంగా కోట్లాది మంది ఉద్యోగులు ఈ వ్యవస్థపై విశ్వాసం ఉంచుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే 1.29 కోట్ల మందికి పైగా కొత్త కార్మికులు పేరోల్ వ్యవస్థలో చేరినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
Income Tax: అందుబాటులోకి ఐటీఆర్–2
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ 2026–27 అసెస్మెంట్ సంవత్సరానికి (2025–26 ఆర్థిక సంవత్సరం) ఐటీఆర్–2 (రిటర్నుల పత్రం)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఈ ఫైలింగ్ పోర్టల్పై రిటర్నుల దాఖలు సాధ్యపడుతుంది.వ్యాపారం లేదా వృత్తి నుంచి ఎలాంటి ఆదాయం లేని వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్యూఎఫ్లు), మూలధన లాభాలు ఆర్జించి ఉంటే ఐటీఆర్–2ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 15న ఐటీఆర్–1, ఐటీఆర్–4 పత్రాలను సైతం ఆదాయపన్ను శాఖ అందుబాటులోకి తేవడం గమనార్హం. వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులు ఐటీఆర్–1, 2 దాఖలుకు జూలై 31 తుది గడువుగా ఉంది.అదనంగా, ఈసారి ఐటీఆర్–2 ఫారంలో పన్ను చెల్లింపుదారుల కోసం కొన్ని కీలక మార్పులు చేసినట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. ముఖ్యంగా విదేశీ ఆస్తులు, క్రిప్టో కరెన్సీ లావాదేవీలు, అధిక విలువ గల పెట్టుబడుల వివరాలను మరింత స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది. అలాగే ముందుగా నింపిన సమాచారం (ప్రీ–ఫిల్డ్) సౌకర్యాన్ని కల్పించడం వల్ల బ్యాంక్ వడ్డీలు, డివిడెండ్లు, టీడీఎస్ వివరాలు ఆటోమేటిక్గా కనిపించే అవకాశం ఉంది. దీంతో రిటర్నుల దాఖలు ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. -
యూపీఐ ద్వారా PF విత్డ్రా.. కొత్త రూల్స్ ఇవే!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), ఈపీఎఫ్ఓ 3.0 ప్రారభించడానికి సిద్ధమవుతోంది. కాబట్టి చందాదారులు త్వరలోనే తమ పీఎఫ్ డబ్బును మరింత వేగంగా, సులభంగా పొందగలుగుతారు. ఈ కొత్త విధానం ద్వారా.. సభ్యులు యూపీఐ ద్వారా తమ పీఎఫ్ డబ్బును నేరుగా తమ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసుకోవచ్చని, తద్వారా పేపర్ వర్క్, ప్రాసెసింగ్ సమయం వంటివి గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే.. చాలామందికి ఉన్న సందేహం ఏమిటంటే.. ఖాతా నుంచి ఎంత డబ్బు విత్డ్రా చేయవచ్చు?, మొత్తం బ్యాలెన్స్ను తక్షణమే పొందవచ్చా?. దీనికి గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.EPFO 3.0 గురించిఈపీఎఫ్ఓ 3.0 అనేది ప్రావిడెంట్ ఫండ్ లావాదేవీలను సులభతరం చేయడానికి.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తీసుకొస్తున్న డిజిటల్ ప్రక్రియ. ఇదివరకు పీఎఫ్ డబ్బు తీసుకోవాలంటే ఫారమ్లు, క్లెయిమ్ ప్రాసెసింగ్, ధృవీకరణ వంటి ప్రక్రియలకు ఎక్కువ సమయం పట్టేది. కానీ కొత్త విధానం ద్వారా.. ఈ ప్రక్రియ సులభతరం కానుంది. చందాదారులు తమ పీఎఫ్ ఖాతాలో అర్హత కలిగిన మొత్తాన్ని యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా పేపర్లెస్ విధానం. కాబట్టి ఉద్యోగులకు సమయం, శ్రమ రెండూ తగ్గుతాయి.ఎంత విత్డ్రా చేసుకోవచ్చు?ఈపీఎఫ్ఓ 3.0 ప్రకారం.. సభ్యులు తమ ఖాతాలోని మొత్తంలో 50% నుంచి 75% వరకు మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే.. మొత్తం డబ్బును ఒక్కసారిగా తీసుకునే అవకాశం లేదు. దీనికి ప్రధాన కారణం.. ఉద్యోగుల రిటైర్మెంట్ భద్రత. భవిష్యత్తు కోసం కొంత మొత్తం ఖాతాలో తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం నియమాలు రూపొందిస్తోంది.ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి?కొత్త నియమాల ప్రకారం.. పీఎఫ్ ఖాతాలో కనీసం 25శాతం ఉండాలి. దీనిని ఉద్యోగులు తమ రిటైర్మెంట్ సమయంలో ఉపయోగించుకోవచ్చు.అయితే.. ఆటో సెటిల్మెంట్ పరిమితిని పెంచారు. ఇప్పటివరకు ఆటో సెటిల్మెంట్ ద్వారా రూ.1 లక్ష వరకు మాత్రమే క్లెయిమ్లు త్వరగా ప్రాసెస్ అయ్యేవి. ఇప్పుడు ఈ పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. దీని వల్ల సభ్యులు తక్షణ అవసరాల కోసం పెద్ద మొత్తాన్ని త్వరగా పొందగలుగుతారు.యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రాఈపీఎఫ్ఓ 3.0 విధానంలో.. చందాదారుడు ముందుగా తాను ఎంత మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు అనేది చూడవచ్చు. తరువాత తన బ్యాంక్ ఖాతాతో లింక్ చేసిన యూపీఐ ఐడీ ద్వారా ఆ మొత్తాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో సేఫ్టీ కోసం యూపీఐ పిన్ ధ్రువీకరించాల్సి ఉంటుంది. డబ్బు ఖాతాలో జమ అయిన తర్వాత సభ్యుడు ఆ మొత్తాన్ని డిజిటల్ చెల్లింపులు, బ్యాంకుకు బదిలీ చేయడం లేదా ఏట్ఎం ద్వారా నగదు రూపంలో విత్డ్రా చేసుకోవచ్చు.EPFO 3.0 ఎప్పుడు ప్రారంభమవుతుంది?కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకారం.. యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రాకు సంబంధించిన అన్ని పరీక్షలు పూర్తయ్యాయి. కాబట్టి ఇది త్వరలోనే ఈ సదుపాయం ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. అయితే.. తేదీని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు ఊరట! -
కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు
నేటి ఆధునిక సమాజంలో ఉరుకుల పరుగుల జీవితాన్ని శాసిస్తున్నది ఒక్కటే.. అదే డబ్బు. ఒకప్పుడు మనుషుల మధ్య బంధాలు, అనురాగాలు, ఆప్యాయతలే ప్రాధాన్యతలుగా సాగిన సమాజంలో నేడు ఆర్థిక ప్రయోజనాలు చుట్టుముట్టాయి. ‘ధనమూలం ఇదం జగత్’ అన్న సూక్తి నేటి కాలానికి అక్షరాలా సరిపోతుంది. అయితే, ఈ డబ్బు మానవ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తోంది? ఇది బంధాలను ముక్కలు చేస్తోందా లేక మరింత బలోపేతం చేస్తోందా? అనే అంశాన్ని చూద్దాం.ధన వ్యామోహం.. బంధాలు చిన్నాభిన్నంనాణేనికి ఒకవైపు చూస్తే.. డబ్బు అనేది అత్యంత బలమైన బంధాలను సైతం ముక్కలు చేయగలదని నిత్యం మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి.ఆస్తి తగాదాలు - కుటుంబాల విచ్ఛిన్నం: ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు కేవలం గజం భూమి కోసమో లేక కొంత డబ్బు కోసమో కోర్టుల చుట్టూ తిరగడం, ఒకరినొకరు శత్రువులుగా చూసుకోవడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.డబ్బుతో ముడిపడిన పెళ్లిళ్లు: నేటి రోజుల్లో కొన్ని పెళ్లిళ్లు రెండు మనసుల కలయిక కంటే, రెండు కుటుంబాల ఆర్థిక హోదాల బేరసారాలుగా మారిపోతున్నాయి. వరకట్న వేధింపులు, భార్యాభర్తల మధ్య ఆర్థిక అసమానతల వల్ల విడాకుల రేటు గణనీయంగా పెరుగుతోంది.వృద్ధాప్యంలో ఒంటరితనం: తల్లిదండ్రులు ఎంతో శ్రమించి పిల్లలను ప్రయోజకులను చేస్తే వారు సంపాదన ధ్యాసలో పడి వృద్ధులైన కన్నవారిని అనాథాశ్రమాల్లో వదిలేస్తున్న హృదయవిదారక సంఘటనలు సమాజంలో పెరిగిపోతున్నాయి. ఇక్కడ బంధాల కంటే డబ్బు సంపాదనకే ప్రాధాన్యత పెరిగింది.డబ్బు మనుషులను దగ్గర చేయాల్సింది పోయి.. అహంకారాన్ని పెంచి, ఆత్మీయులకు దూరం చేస్తోంది. మనిషి కంటే బ్యాంకు బ్యాలెన్స్కే విలువ ఇచ్చే సంస్కృతి పెచ్చరిల్లుతోంది.డబ్బు మరో రూపండబ్బు ఎప్పుడూ కీడే చేయదు. నాణేనికి మరోవైపు చూస్తే.. డబ్బు మానవ సంబంధాలను నిలబెట్టడానికి, సమాజంలో ఆనందాన్ని నింపడానికి ఒక గొప్ప సాధనంగా మారుతోంది.కష్టకాలంలో ఆపన్నహస్తం: కుటుంబంలో ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యం వచ్చినప్పుడు లేదా ప్రమాదం జరిగినప్పుడు సమయానికి చేతిలో డబ్బు ఉండటం వల్ల వారి ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నాం. ఆ సమయంలో ఆర్థికంగా సహాయం చేసిన వ్యక్తులు జీవితాంతం గుండెల్లో నిలిచిపోతారు.పిల్లల భవిష్యత్తుకు పునాది: తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బుతో పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించడం వల్ల ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని పొందుతోంది. ఇది కుటుంబాల మధ్య నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతుంది.సేవా దృక్పథం: సమాజంలో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, దాతలు తాము సంపాదించిన సొమ్మును విరాళాలుగా ఇస్తూ.. అనాథలను, పేద విద్యార్థులను ఆదుకుంటున్నారు.బంధాలను నిలుపుకుంటూ.. డబ్బును సమర్థంగా నిర్వహించడం ఎలా?డబ్బు అనేది జీవితాన్ని నడిపించే ఇంధనమే కానీ అదే జీవితం కాకూడదు. డబ్బు వల్ల బంధాలు పాడవకుండా ఉండాలంటే మనం కొన్ని నియమాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.ఆర్థిక పారదర్శకత: భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య ఆర్థిక విషయాల్లో దాపరికం ఉండకూడదు. సంపాదన, ఖర్చులు, అప్పుల గురించి స్పష్టంగా మాట్లాడుకోవడం వల్ల అనవసరమైన అనుమానాలు, గొడవలు రావు.పరిమితులు విధించుకోవడం: స్నేహితులు లేదా బంధువులతో ఆర్థిక లావాదేవీలు (అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం) జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు సహాయం చేయాలో అంతే చేయాలి. ఒకవేళ ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోయినా బంధం చెడిపోకూడదు అనుకుంటేనే ఆ సాయం చేయాలి.సమయానికి ప్రాధాన్యత ఇవ్వడం: పిల్లలకు, కుటుంబ సభ్యులకు కేవలం డబ్బు, విలాసవంతమైన వస్తువులు ఇస్తే సరిపోదు. వారితో గడపడానికి సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే, డబ్బుతో వస్తువులను కొనగలం కానీ ప్రేమను, ఆప్యాయతను కొనలేం.ఆశకు, అత్యాశకు మధ్య తేడా గుర్తించడం: లగ్జరీ జీవితం కోసం బంధుత్వాలను, స్నేహాలను పణంగా పెట్టకూడదు. తృప్తి లేని సంపాదన మనిషిని ఒంటరిని చేస్తుంది.డబ్బు అనేది ఒక మంచి సేవకుడిగా ఉండాలి కానీ, అత్యంత ప్రమాదకరమైన యజమానిగా మారకూడదు. దాన్ని మన జీవితాన్ని, బంధాలను శాసించే స్థాయికి రానివ్వకూడదు. డబ్బు కోల్పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు. కానీ ఒక్కసారి విడిపోయిన బంధాలను, దూరమైన మనసులను ఎంత డబ్బు పెట్టినా తిరిగి తీసుకురాలేం.ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి -
Income Tax: ఐటీఆర్ 4 సుగమ్ కూడా రెడీ
సుగమ్ దర్శనంలాగా సుగమ్ పోర్టల్లాగా సుగమ్ ఫారం. ఈ ఫారం నంబరు 4. సుగమ్ అనే పదానికి సులువు, సులభతరం అని అర్థంగా స్వీకరించాలి మనం. గత వారం సహజ్ గురించి తెలుసుకున్నాం. ఈ వారం సుగమ్ గురించి తెలుసుకుందాం.ఎవరు దాఖలు చేయొచ్చు 🔹 రెసిడెంటు వ్యక్తులు 🔹 హిందూ ఉమ్మడి కుటుంబాలు 🔹భాగస్వామ్య సంస్థలు ఏయే ఆదాయం ఉన్న వారు వేయాలి 🔹 జీతం లేదా పెన్షన్; రెండూ ఉన్న వాళ్లు 🔹 రెండు ఇళ్ల మీద ఆదాయ ఉన్న వారు 🔹 ఇతర ఆదాయాలు ఉన్న వారు. ఉదాహరణకు బ్యాంకు వడ్డీ, ఫ్యామిలీ పెన్షన్ 🔹 క్యాపిటల్ గెయిన్స్ – లాంగ్ – రూ. 1,25,000 దాటనివారు🔹 కొన్ని సెక్షన్ల ప్రకారం లెక్కలు రాసి, వేసి కచ్చితంగా ఇంత లాభం/నష్టం అని నిర్ధారించరు. బదులుగా ఒక నిర్దేశిత శాతం లేదా నిర్దేశిత ఆదాయం అని లెక్కిస్తారు. దీన్నే ఊహాజనిత ఆదాయం అంటారు. ఇది మూడు రకాలు.. (ఎ) టర్నోవరు రూ. 2 కోట్లు / నగదు వ్యవహారాలు 5 శాతం కన్నా తక్కువ ఉంటే రూ. 3 కోట్ల మీద, డిజిటల్ వసూళ్ల మీద 6 శాతం, మిశ్రమం అయితే 8 శాతం. వీళ్లు ఎటువంటి బుక్స్తో నిమిత్తం లేకుండా ఈ నిర్దేశిత శాతం మేరకు లాభాన్ని డిక్లేర్ చేసుకోవచ్చు. ఇది చిన్న వ్యాపారస్తుల కోసం ఉద్దేశించినది. (బి) నిర్దేశిత వృత్తి నిపుణులకు వారి వార్షిక టర్నోవరు రూ. 50,00,000 లోపల ఉంటే సగం, అంటే 50 శాతం లాభంగా డిక్లేర్ చేయొచ్చు. 95 శాతం వ్యవహారాలు డిజిటల్గా జరిగితే ఈ టర్నోవరు లిమిట్ రూ. 75,00,000 వరకు ఉంటుంది. (సి) వస్తువుల రవాణా చేసే వారికి, వారు నడిపే వాహనాల సంఖ్య 10 లోపల ఉంటేనే వర్తిస్తుంది. భారీ వాహనాల మీద టన్ను మోతకు రూ. 1,000 చొప్పున లెక్కిస్తారు. ఇతర వాహనాల మీద నెలకి రూ. 7,500.. టన్నుల మోతతో నిమిత్తం లేకుండా. పైన చెప్పిన మూడు రకాల/వర్గాల వారికి ఆయా ఆంక్షలకు లోబడి వర్తింపచేస్తే, అకౌంటుతో సంబంధం లేకుండా ఆదాయం డిక్లేర్ చేయొచ్చు. ఎవరు ఈ నాలుగో నంబర్ ఫారం వేయకూడదంటే.. 🔹 నాన్ రెసిడెంట్లు 🔹 లిమిటెడ్ భాగస్వామ్యాలు 🔹 కంపెనీ డైరెక్టరు 🔹 అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్లలో ఇన్వెస్ట్మెంట్ ఆదాయం ఉన్న వారు 🔹 వ్యవసాయం మీద ఆదాయం రూ. 5,000 దాటని వారు 🔹 గత సంవత్సరం సర్దుబాటు నష్టాలను బదిలీ చేసే వారు 🔹 విదేశీ ఆదాయం/ఆస్తులు ఉన్నవారు ఇప్పుడు తెలిసింది కదా ఎవరు వేయొచ్చు.. ఎవరు వేయకూడదో.. ఇక రెడీ అవ్వండి వేయడానికి ఈ విధంగా. 🔹 మీరు పాత పద్ధతి/కొత్త పద్ధతి ఏదైనా ఎంచుకోవచ్చు 🔹 ఆన్లైన్లో పోర్టల్ ద్వారా వేయొచ్చు 🔹 ఆఫ్లైన్లో ఎక్సెల్, జెసన్ యుటిలిటీ ద్వారా వేయొచ్చు. టీడీఎస్ ఫారాలు, ఆదాయానికి, పన్నుకి సంబంధించిన డాక్యుమెంట్లు, సరి్టఫికెట్లు, కాగితాలు సవరించండి. 🔹 సమాచారం సమగ్రంగా, సరైనదిగా, సంపూర్ణంగా ఉండాలి సుమా. 🔹 కొత్త ఐటీఆర్ 4లో రెండు ఇళ్ల మీద ఆదాయం డిక్లేర్ చేయొచ్చు. అద్దె చేతికి రాకుంటే.. అంటే దాని బాకీలు/అద్దెల వివరాలు చెప్పవచ్చు. 🔹 విదేశీ ఆస్తులు/ఆదాయం సమాచారం ఇవ్వనవసరం లేదు. 🔹పాన్తో పాటు ఆధార్ కార్డు సమన్వయం కావాలి 🔹 టర్నోవరు ఆదాయాల్లో విషయాలు అన్నీ కాగితాల లెక్కలు, రిటర్నులు కావాలి. అక్కడ ఎటువంటి పొరపాటు చేయొద్దు. చివరిగా ఈ ఫారం కూడా ఎంతో స్నేహపూర్వకంగా ఉంటుంది. అందుకే ‘సుగమ్’ అన్నారు. -
తక్కువ ప్రీమియంలతో కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్
ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ తాజాగా వేల్యూ ప్లస్ పేరిట అందుబాటు ప్రీమియంలతో ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. మెట్రోయేతర మార్కెట్లు, అలాగే టియర్ 2, 3, 4 మార్కెట్లలో దాదాపు 20 శాతం తక్కువ ప్రీమియంలతో ఇది లభిస్తుంది. ఇండివిడ్యువల్, ఫ్యామిలీ ఫ్లోటర్లకు సంబంధించి రూ. 7.5 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు కవరేజీ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని సంస్థ ఎండీ ఆనంద్ రాయ్ తెలిపారు. వరుసగా 5 ఏళ్ల పాటు ఇన్–పేషంట్ క్లెయిమ్లేమీ లేకపోతే మొదటి ఏడాది కట్టిన బేస్ ప్రీమియంను వాపసు పొందవచ్చు. అత్యధిక సమ్ ఇన్సూర్డ్ ఆప్షన్లు, మెరుగైన హెల్త్కేర్ ప్రయోజనాల మేళవింపుతో కస్టమర్లకు ఆరోగ్య బీమాను మరింతగా అందుబాటులోకి తేవడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ తెలంగాణ బిజినెస్ హెడ్ కె.బీ.బీ శ్రీనివాస్ తెలిపారు.స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తన 20 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి గుర్తుగా ఈ ‘వేల్యూ ప్లస్’ ప్లాన్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. యువతను, చిన్న పట్టణాల ప్రజలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ఈ పాలసీలో పలు ప్రత్యేక ఫీచర్లను చేర్చారు. ఇందులో పాలసీ తీసుకున్న నాటి వయస్సు ఆధారంగానే ప్రీమియంను లాక్ చేసే 'ఫ్రీజ్ యువర్ ఏజ్' సదుపాయం ఉంది. దీనివల్ల మొదటి క్లెయిమ్ చేసే వరకు లేదా 55 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం ధరలు పెరగవు. దేశవ్యాప్తంగా 11,000కు పైగా నెట్వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత (క్యాష్లెస్) చికిత్స పొందే వీలుంది. -
స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి
ఆర్థిక అనిశ్చితులు, మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య సామాన్యుడి నుంచి సీనియర్ సిటిజన్ వరకు ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒక్కటే..పెట్టిన పెట్టుబడికి భద్రత, చేతికి అందే లాభంలో స్థిరత్వం. ఈ రెండింటికీ భారతీయ తపాలా శాఖ చిరునామాగా నిలుస్తోంది. రూపాయి పోగొట్టుకునే ప్రమాదం లేకుండా ప్రభుత్వ గ్యారెంటీతో మార్కెట్ కంటే మెరుగైన వడ్డీని అందించే పోస్టాఫీస్ టాప్-3 హై-రిటర్న్ స్కీముల పూర్తి సమాచారం మీకోసం...సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)పెట్టుబడిదారుల సొమ్ముపై పోస్టాఫీసులో ప్రస్తుతం అత్యధిక వడ్డీని అందిస్తున్న పథకాల్లో ఇది మొదటి స్థానంలో నిలుస్తుంది. అరవై ఏళ్లు దాటిన వృద్ధులకు రిటైర్మెంట్ తర్వాత క్రమబద్ధమైన ఆదాయాన్ని, వారి జీవితకాల పొదుపుకు పూర్తి భద్రతను కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది.ప్రస్తుత వడ్డీ రేటు: 8.2% (ఇది ప్రతి త్రైమాసికానికి ఒకసారి ఖాతాదారునికి చెల్లిస్తారు. దీన్ని నిబంధనల ప్రకారం సవరించే అవకాశం ఉంటుంది).పెట్టుబడి పరిమితి: కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి(ఒకేసారి పెట్టాల్సి ఉంటుంది) పెట్టవచ్చు. కాలపరిమితి 5 ఏళ్లు (మరో 3 ఏళ్లు పొడిగించుకోవచ్చు).ఉదాహరణ..ఒకవేళ మీరు ఈ స్కీమ్లో రూ.10 లక్షలు ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుత 8.2% వడ్డీ రేటు ప్రకారం మీకు ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ.20,500 వడ్డీ రూపంలో లభిస్తుంది. అంటే ఐదేళ్ల కాలపరిమితి ముగిసేసరికి మీరు కేవలం వడ్డీ రూపంలోనే రూ.4,10,000 పొందుతారు. గడువు ముగిశాక మీ రూ.10 లక్షల అసలు మీకు సురక్షితంగా తిరిగి వస్తుంది.సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై)మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆమె భవిష్యత్తు అవసరాల (ఉన్నత చదువులు, వివాహం) కోసం భారీ నిధిని సమకూర్చడానికి ఇది ఓ ఉత్తమమైన స్కీమ్. ‘బేటీ బచావో బేటీ పఢావో’ ప్రచారంలో భాగంగా ఆడపిల్లల ఆర్థిక స్వాలంబన కోసం తీసుకొచ్చిన ప్రత్యేక దీర్ఘకాలిక పొదుపు పథకం ఇది. 10 ఏళ్లలోపు వయసున్న ఆడపిల్లల పేరు మీద తల్లిదండ్రులు ఈ ఖాతా తెరవవచ్చు.ప్రస్తుత వడ్డీ రేటు: 8.2% (వార్షికంగా చక్రవడ్డీ లెక్కిస్తారు).పెట్టుబడి పరిమితి: ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. 15 ఏళ్ల పాటు డబ్బులు చెల్లించాలి. పాపకు 21 ఏళ్లు వచ్చేసరికి స్కీమ్ మెచ్యూర్ అవుతుంది.ఉదాహరణ..ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు గరిష్ట పరిమితి అయిన రూ.1.5 లక్షలు (నెలకు దాదాపు రూ.12,500) చొప్పున 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం ఆమెకు 21 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా సుమారు రూ.70 లక్షల వరకు భారీ మెచ్యూరిటీ మొత్తం లభిస్తుంది. ఇందులో విశేషం ఏమిటంటే ఈ మెచ్యూరిటీ మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు.కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)రూపాయి రిస్క్ లేకుండా తమ పెట్టుబడి రెట్టింపు కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. దీర్ఘకాలంలో స్థిరమైన రాబడితో పాటు పెట్టుబడి మొత్తాన్ని రెట్టింపు చేయడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. ఇందులో దేశంలోని ఏ వయోజనుడైనా ఒంటరిగా లేదా ఉమ్మడిగా(జాయింట్ అకౌంట్) పెట్టుబడి పెట్టవచ్చు.ప్రస్తుత వడ్డీ రేటు: 7.5% (చక్రవడ్డీ ఆధారంగా).పెట్టుబడి పరిమితి: కనీసం రూ.1,000 నుంచి ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 115 నెలల్లో (9 ఏళ్ల 7 నెలలు) మీ డబ్బు రెట్టింపు అవుతుంది.ఉదాహరణ..మీరు కిసాన్ వికాస్ పత్రలో రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి మార్కెట్ రిస్క్ లేకుండా సరిగ్గా 115 నెలల తర్వాత మీ చేతికి రూ.10 లక్షలు అందుతాయి.పై స్కీముల్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి?పోస్టాఫీస్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేయడం చాలా సులభం. మీ సమీపంలో ఉన్న ఏ పోస్టాఫీసునైనా సందర్శించి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. మొదట మీకు కావలసిన స్కీమ్కు సంబంధించిన దరఖాస్తు ఫారమ్ను పోస్టాఫీసులో తీసుకోవాలి (లేదా ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు). ఫారమ్ను పూర్తిగా భర్తీ చేసి దానికి అవసరమైన ధ్రువపత్రాలను జత చేయాలి. ప్రారంభ పెట్టుబడి మొత్తాన్ని నగదు రూపంలో లేదా చెక్కు రూపంలో చెల్లించి ఖాతాను ప్రారంభించవచ్చు. ఇప్పటికే పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా, నెట్ బ్యాంకింగ్ ఉన్నవారు ఆన్లైన్ ద్వారా కూడా కొన్ని స్కీముల్లో నేరుగా ఇన్వెస్ట్ చేయవచ్చు.కావాల్సిన ముఖ్యమైన ధ్రువపత్రాలుపోస్టాఫీసులో ఖాతా తెరవడానికి కింది ప్రాథమిక పత్రాలు తప్పనిసరి.గుర్తింపు కార్డు: ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ లేదా పాస్పోర్ట్.చిరునామా రుజువు: ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా విద్యుత్ బిల్లు.ఇటీవలి కాలంలో తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు.ఎస్సీఎస్ఎస్ స్కీమ్ కోసం వయసు నిర్ధారించే సర్టిఫికేట్ లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందినట్లు ఆధారాలు.ఎస్ఎస్వై కోసం ఆడపిల్ల పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల కేవైసీ పత్రాలు.షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులతో భయపడేవారికి, రిటైర్డ్ ఉద్యోగులకు, పిల్లల భవిష్యత్తు కోసం పక్కా ప్లాన్తో పొదుపు చేయాలనుకునే వారికి పోస్టాఫీస్ స్కీములు ఒక సురక్షితమైన ఆర్థిక రక్షణ కవచం. ఇందులో లభించే సెక్షన్ 80సీ పన్ను మినహాయింపులు అదనపు ప్రయోజనం. మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోయే స్కీమ్ను ఎంచుకుని, ఆర్థిక నిపుణుల సలహాతో ఇప్పుడే పెట్టుబడిని ప్రారంభించండి.ఇదీ చదవండి: ఆ ఒక్క ప్రశ్నతో సీనియర్ ఉద్యోగిపై వేటు! -
యాప్ల దా‘రుణాలు’... ట్రాప్లో పడితే అంతే!
రమేష్ నెలవేతనం రూ.12,000. కానీ, తను కట్టాల్సిన ఈఎంఐ రూ.46,700. మరి ఎలా చెల్లిస్తాడు? ఇదేమైనా సాధ్యమయ్యే పనేనా? వాస్తవానికి రమేష్ ఏ నూటికో వెయ్యికో ఒక్క కేసు కాదు. తక్కువ, మధ్యాదాయ వర్గాల్లో ఇపుడు ఎక్కువ మంది ఇంచుమించు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. డిజిటలైజేషన్ వల్ల ఎన్నో లాభాలున్నట్లే నష్టాలూ ఉన్నాయి. వాటి ప్రతిఫలమే ఈ రుణాల ఊబి. ఎందుకంటే ఒకప్పుడు రుణాలు కావాలంటే సవాలక్ష డాక్యుమెంట్లు పట్టుకుని బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగితే తప్ప వచ్చేది కాదు. ఇప్పుడైతే రుణ దాతలే ‘లోన్ కావాలా?’ అని ఫోన్లు చేసి అడగటమే కాక... మెయిల్స్, మెసేజీలతో హోరెత్తిస్తున్నారు. ఏదో ఒక బలహీన క్షణంలో అవసరాల్ని బేరీజు వేసుకోకుండా ఓకే బటన్ నొక్కేస్తే చాలు. నిమిషాల్లోనే కోరుకున్నంత రుణం బ్యాంక్ ఖాతాలలో వచ్చిపడుతోంది. తీర్చే స్థోమత ఉందా? లేదా అన్న పట్టింపు కూడా ఈ డిజిటల్ రుణదాతలకు అవసరం లేదు. పాన్, ఆధార్ ఇస్తే చాలు. నిమిషాల్లో రుణ దరఖాస్తును డిజిటల్గా ప్రాసెస్ చేసి, రుణం మంజూరు చేసేస్తున్నాయి. దీంతో ఒకే వ్యక్తి పలు యాప్ల నుంచి రుణం తీసుకోవటం సాధ్యమవుతోంది. తీరా కట్సాల్సి వచ్చినప్పుడే అసలు నొప్పి తెలుస్తోంది. ఆర్బీఐ ఇప్పటికే కఠిన నియంత్రణలు తెచ్చినా... ఈ రుణ యాప్స్ విపరీత మార్కెటింగ్కు తెరపడడం లేదు. ఇచ్చే వాడు ఏదో మార్గంలో ముక్కు పిండి వసూలు చేసుకుంటాడు. కాకపోతే తీసుకునే వారే విచక్షణతో నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నెన్నో ఉదంతాలు.. → ఓ కాంట్రాక్టు కార్మికుడు 13 మంది సభ్యుల కుటుంబానికి ఏకైక ఆధారం. వైద్య అత్యవసర పరిస్థితుల్లో మార్గం తోచక.. ఆరు డిజిటల్ లోన్ యాప్స్ నుంచి అందినంత రుణం పుచ్చుకున్నాడు. ఇప్పుడు ఆదాయానికి నాలుగు రెట్లు అధికంగా ఈఎంఐ కట్టలేక లబోదిబోమంటున్నాడు. → మానవ వనరుల విభాగంలో పనిచేసే ఒక ఎగ్జిక్యూటివ్ నెలసరి వేతనం రూ.25,000. 14 యాప్స్ నుంచి తీసుకున్న రుణాలు రూ.20 లక్షలు దాటేశాయి. → ఒక డ్రైవర్ నెలవారీ రూ.40,000 సంపాదిస్తున్నాడు. కానీ, అతడు తీర్చాల్సిన అప్పడు రూ.17 లక్షలు. ఐదు సంస్థల నుంచి ఈ రుణం తీసుకున్నాడు. → ఒక డెలివరీ ఎగ్జిక్యూటివ్ అయితే ఒకదాని తర్వాత ఒకటి చొప్పున 20 సంస్థల నుంచి ఏకంగా రూ.37 లక్షల రుణాలు వాడేసుకున్నాడు. బ్యాంక్లు, ఫైనాన్స్ సంస్థలు, డిజిటల్ లోన్ యాప్స్ ఇలా ఏ ఆఫర్నూ అతడు వదల్లేదు. → ఒక కంపెనీకి మేనేజర్ స్థానంలో ఉన్న వ్యక్తి కూడా సంఘటిత, అసంఘటిత సంస్థల నుంచి రూ.1.14 కోట్ల రుణ సాయాన్ని తీసుకున్నాడు. → నేడు ఈ తరహా రుణమిచ్చే, పుచ్చుకునే సంస్కృతి బలంగా విస్తరిస్తుండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తెలియకుండానే ట్రాప్లోకి.. → అత్యవసర వైద్యం, స్కూల్ ఫీజు చెల్లించాల్సిన గడువు సమీపించడం, ఇంటి అద్దె, క్రెడిట్ కార్డు బకాయి గడువు మించిపోతుండడం, చివరికి స్టాక్ మార్కెట్లో నష్టాల నుంచి బయటపడేందుకు సైతం యాప్స్ నుంచి రుణాలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. → సంప్రదాయ బ్యాంక్లు, టాప్ టైర్ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) రుణ దరఖాస్తులను ఆసాంతం విశ్లేషించిన తర్వాతే రుణ మంజూరును నిర్ణయిస్తుంటాయి. → కానీ, నడమంత్రపు సిరిని కోరుకుంటున్న లోన్ యాప్స్ మాత్రం సంప్రదాయ రక్షణ విధానాలను బైపాస్ చేస్తూ చిటికెలో రుణాలకు ఒకే చెబుతున్నాయి. తద్వారా మార్కెట్ విస్తరణే వాటి వ్యాపార మంత్రంగా మారిపోయింది. → పాన్ నంబర్తో ఎలాంటి తనఖా అవసరం లేకుండానే ఐదు నిమిషాల్లోపే రుణ మొత్తాన్ని మంజూరు చేస్తున్నాయి. → దీంతో అవసరంలో ఉన్న వారు, మరో మార్గం లేదన్నట్టు మొబైల్ ఫోన్ యాప్స్ ద్వారా శక్తికి మించి రుణాలను తీసుకుంటున్నారు. → తొలుత రూ.1,000 లేదా రూ.5,000తో మొదలైనా.. చివరికి రూ.లక్షలకు ఇది విస్తరిస్తోంది. చార్జీలతో బాదుడే బాదుడు → ఈ తరహా రుణాలకు అలవాటు పడ్డవారు ఇక ఆ సుడిగుండం నుంచి బయటపడడం కష్టమే. ఎందుకంటే ఇవి వసూలు చేసే చార్జీలు ఆ స్థాయిలో ఉంటున్నాయి. → ప్రాసెసింగ్ ఫీజు, ప్లాట్ఫారమ్ చార్జీలు, కన్వీనియన్స్ ఫీజు, జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ ఇలా రకరకాల చార్జీలు లోన్ యాప్స్కు ఆదాయాన్ని తెచ్చి పెడుతుంటాయి. → సాధారణంగా ఈ రుణాలను 30 రోజుల్లోపే తీర్చేయాల్సి ఉంటుంది. లేదంటే రుణగ్రహీత కోలుకులేనంతగా మరిన్ని చార్జీల బాదుడు మొదలవుతుంది. ఈ బాదుడు నుంచి బయటపడేందుకు రుణదాతలు మరో యాప్ తలుపు తట్టి అప్పటికి గట్టెక్కేసే మార్గం వెతుక్కుంటున్నారు. అడ్డదారులు.. అడ్డగోలు విధానాలు → ఆర్బీఐ పర్యవేక్షణలోని బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలే రుణాలను మంజూరు చేయాల్సి ఉంటుంది. కనీసం పేమెంట్బ్యాంక్లు సైతం రుణాలివ్వడానికి లేదు. → కానీ, ఈ నిబంధనలను ఫిన్టెక్ కంపెనీలు బైపాస్ చేస్తున్నాయి. తాము నేరుగా రుణాలివ్వకుండా మధ్యవర్తిత్వంతో రుణగ్రహీతలపై దండెత్తుతున్నాయి. → ఒక యాప్ లేదా ఫిన్టెక్ ఒకటికి మించిన ఎన్బీఎఫ్సీలు, బ్యాంక్లతో టైఅప్ పెట్టుకుని, వాటి తరఫున రుణ వేదికగా మారుతోంది. → కస్టమర్లను ఆకర్షించడం, డేటాను విశ్లేషించడం, రుణం మంజూరు చేయించడం, దాన్ని వసూలు చేయడం తదితర పనులు చేస్తున్నాయి. → అసలు రుణం మంజూరు చేసేది బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ అయితే.. మిగిలిన పనులన్నింటినీ ఇవి కానిచ్చేస్తున్నాయి. ఆర్బీఐ పర్యవేక్షణకు దూరంగా వ్యాపార వృద్ధి కోసం దూకుడుగా వ్యవహరించడం వీటి వంతు. → ఆర్బీఐ పర్యవేక్షణలోని బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీతో నేరుగా సంప్రదింపుల్లేకపోవడంతో రుణ గ్రహీత హక్కులకు రక్షణ లేకుండా పోతోంది. వారు బాధితులుగా మారుతున్నారు. → రూ.25,000 సంపాదించే వ్యక్తికి రూ.20 లక్షల రుణం ఎక్కడి నుంచి వస్తోంది? డెలివరీ సేవలతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే వ్యక్తికి రూ.37 లక్షల రుణాలను యాప్స్ ఎలా మంజూరు చేస్తున్నాయి? → రుణ గ్రహీత పాన్ నంబర్ ఆధారంగా రుణ చరిత్రను సమగ్రంగా పరిశీలించి కదా అర్హతను తేల్చాలి? కానీ వాస్తవంలో ఇవేవీ లేకుండా ఒకటికి మించిన యాప్లు ఎడాపెడా రుణాలను ఇచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఎలా వసూలు చేసుకోవాలో వాటికి తెలుసు గనుక.బాదుడు ఇలా..రుణం మొత్తం రూ.10,000 ప్రాసెసింగ్ ఫీజు రూ.800 ప్లాట్ఫారమ్ చార్జీలు రూ.300 చేతికి వచ్చేది రూ.8900 14 రోజుల తర్వాత చెల్లించాల్సిన మొత్తం రూ.10,500→ చాలా రుణ యాప్స్ 30–40 శాతం వడ్డీ అంటూ ఊదరగొడుతుంటాయి. → కానీ, వాస్తవంగా రోజుకు 1% చొప్పున వసూలు చేస్తుంటాయి. అంటే వార్షిక వడ్డీ 365%. → ఈ ప్రకారం.. రూ.10,000 రుణానికి వారంలో రూ.10,700 చెల్లించాల్సి ఉంటుంది. → పెనాల్టీలు, ఆలస్యపు రుసుములు అదనం. → రూ.10,000 రుణానికి రూ.500 (10 శాతం) ప్రాసెసింగ్ ఫీజుగా తీసుకుంటున్నవీ ఉన్నాయి. ఎంతో వ్యత్యాసం రుణం రకం వార్షిక వడ్డీ రేటు(%) గృహ రుణం 8–10 వ్యక్తిగత రుణం 12–18 క్రెడిట్ కార్డు 36–42 డిజిటల్ లోన్ యాప్స్ 60– 365నట్లు బిగిస్తున్న ఆర్బీఐ → రుణ యాప్స్ అడ్డగోలు వ్యవహారాలు తెలియడంతో ఆర్బీఐ నిబంధనలను కఠినతరం చేసింది. → రుణానికి సంబంధించి కీలక సమాచార నివేదికను (కేఎఫ్ఎస్) రుణ గ్రహీతకు ఇవ్వాల్సిందేనని తేలి్చంది. → రుణ గ్రహీత కాంటాక్టులు, ఫైల్స్ యాక్సెస్ను కట్టడి చేసింది. → రుణాలను ఇస్తున్న బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. → కేంద్రం, దర్యాప్తు సంస్థలు చట్టవిరుద్ధమైన యాప్స్ను బ్లాక్ చేయించాయి. → అయినప్పటికీ కొత్తవి పుట్టుకొస్తూనే ఉంటున్నాయి. రుణ గ్రహీతలు విచక్షణతో వ్యవహరిస్తేనే బయటపడగలుగుతారు. తెలుగు రాష్ట్రాల్లో బాధితులు ఎక్కువే → ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు డిజిటల్ లెండింగ్ యాప్లకు గ్రోత్ సెంటర్లుగా మారాయనడంలో ఆశ్చర్యం అక్కర్లేదు. → స్మార్ట్ఫోన్ల వినియోగం అధికంగా ఉండడం, గిగ్ ఎకానమీ (తాత్కాలిక పనులతో కూడిన ఉపాధి అవకాశాలు) విస్తరిస్తుండడం, వినియోగ ధోరణి కొత్త పుంతలు తొక్కుతుండడం, స్టాక్ ట్రేడింగ్ పట్ల పెరుగుతున్న ఆసక్తి ఇలా ఎన్నో కారణాలున్నాయి. → ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో లోన్ యాప్స్ విస్తరణ రాకెట్ వేగాన్ని తలపిస్తోంది. దాంతో మనదగ్గర బాధితులు ఎక్కువే. ఇవి డేంజర్ బెల్స్.. → ఆదాయంలో రుణ వాయిదాలు 40 శాతం మించడం. → ఒకే సమయంలో రుణాలు మూడుకు మించడం. → ఒక రుణం నుంచి బయటపడేందుకు మరో రుణాన్ని తీసుకోవడం. → రుణ విషయాలను రహస్యంగా ఉంచడం. విద్యావంతులదీ అదే దారి... → యాప్స్ ద్వారా ఎడాపెడా రుణాలు తీసుకుంటున్న వారిలో అందరూ పేదవారే అనుకోవటానికి లేదు. ఉన్నత విద్యావంతులు, వృత్తి నిపుణులు సైతం ఉంటుండడం ఆర్థిక క్రమశిక్షణ లేమిని సూచిస్తోంది. → కాంట్రాక్టు ఉద్యోగులు, తాత్కాలిక కార్మికులు, అసంఘటిత రంగంలోని కార్మికులు తదితర తక్కువ ఆదాయ వర్గాల వారు సులభంగానే ఈ లోన్ యాప్ ట్రాప్లో పడుతున్నారు. → వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు రుణాలను ఇష్టారీతిన వాడేసిన విద్యావంతులు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, స్టాక్ మార్కెట్ డే ట్రేడర్లు, యువ వేతన జీవులు, క్రిప్టో ఇన్వెస్టర్లు సైతం ట్రేడింగ్లో చేతులు కాల్చుకుని.. లోన్ యాప్స్ను ఆశ్రయిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. వసూళ్లలోనూ అరాచకం.. → డిజిటల్ యాప్ కదా రుణం తీసుకుని కట్టకపోయినా ఏం కాదులే? అనుకుంటే అంతకుమించిన అమాయకత్వం మరొకటి ఉండదు. వసూలు కోసం అవి అనుసరించే మార్గాలు తెలిస్తే వళ్లు జలదరిస్తుంది. → ఊళ్లల్లో వడ్డీ వ్యాపారుల గురించి వినే ఉంటారు. 5–10 రూపాయల వడ్డీతో రోజువారీ/నెలవారీ వసూలు చేసుకునే వారిని చూస్తే అప్పు తీసుకున్న వారు వణికిపోయే పరిస్థితి. ఇప్పుడు సంఘటిత ముసుగులోని లెండింగ్ యాప్లు, ఫిన్టెక్లు వీరిని మించి వ్యవహరిస్తున్నాయి. . → ఈ యాప్స్కు ఫోన్లోని కాంటాక్టులు, కాల్ లాగ్, ఫొటో గ్యాలరీలు, డివైజ్ను మానిటర్ చేసే రైట్స్ను రుణ గ్రహీతలు తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. → రుణాన్ని చెల్లించనప్పుడు రుణ గ్రహీత బంధువులకు ఫోన్ కాల్స్ వేధింపులు ఆరంభమవుతాయి. అంతేకాదు అతడు/ఆమె పనిచేసే యాజమాన్యానికీ మెస్సేజ్లు వెళతాయి. రుణ గ్రహీత ఫోన్లోని ఫొటోలను మారి్ఫంగ్ చేసి వాటి ఆధారంగా బెదిరింపులూ ఎదురుకావొచ్చు. → వాట్సాప్ గ్రూపుల్లోనూ డీఫేమ్ చేస్తాయి. ఇలా వీలైన ప్రతీ మార్గంలో రుణ గ్రహీతలను వెంటాడి, వేధించి వసూలు చేసుకోవడమే వాటికి తెలిసిన విద్య. -
భారీ రాబడులకు.. సిఫ్ సఫారీ!
ఈక్విటీల్లో మెరుగైన రాబడులకు సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ ఒక చక్కని మార్గం. ఈక్విటీలకు మించి అధిక రాబడులు, ప్రత్యామ్నాయ సాధనాల్లో పెట్టుబడులకు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్), పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ వంటి సర్వీసులు (పీఎంఎస్) సైతం ఉన్నాయి. కానీ, ఈక్విటీల్లోనే అధిక రిస్క్ తో మరింత రాబడి కోరుకునే వారి పరిస్థితి ఏంటి? ఈ తరహా ఇన్వెస్టర్ల కోసం స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్) సాధనం ఇటీవలే మార్కెట్ ప్రవేశం చేసింది. సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్–హెడ్జ్ ఫండ్ తరహా పెట్టుబడులకు మధ్య వారధిగా దీన్ని రూపొందించారు. కొంచెం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం వచ్చిన ఈ సాధనంతో సంపద సృష్టి సాధ్యమేనా..? బడా ఇన్వెస్టర్లు సైతం ఎందుకు ‘సిఫ్’పై మనసు పారేసుకుంటున్నారు? ఈ ఆసక్తికరమైన విషయాలు మీకోసం..స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (సిఫ్)లు సాధారణ మ్యూచువల్ ఫండ్స్ మాదిరి కావు. డెరివేటివ్స్ మార్కెట్లో (ఫ్యూచర్స్–ఆప్షన్స్) ఇవి లాంగ్–షార్ట్ వ్యూహాలను అనుసరిస్తాయి. డెట్ సెక్యూరిటీలు, ఈక్విటీ–డెట్ కలిసిన హైబ్రిడ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అసెట్ అలోకేషన్ విషయంలో చురుగ్గా వ్యవహరిస్తుంటాయి. అంటే వివిధ సాధనాల మధ్య కేటాయింపులను ఎప్పటికప్పుడు పరిస్థితులు, అవకాశాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తాయి. రంగాల వారీ పెట్టుబడులను వ్యూహాత్మకంగా మారుస్తుంటాయి. హెడ్జింగ్ విధానాలను కూడా అనుసరిస్తాయి. అంటే పెట్టుబడుల విలువ భారీగా పడిపోకుండా వ్యూహాలను ఆచరణలో పెడతాయి.తేడా ఏంటి? → సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ అన్నవి మార్కెట్లు ర్యాలీ చేసినప్పుడే రాబడులను ఇవ్వగలవు. → సిఫ్లు మాత్రం మార్కెట్లు ఆటుపోట్లు, అస్థిరతలను చవిచూస్తున్న తరుణంలో లేదా మార్కెట్లు పడిపోతున్న తరుణంలోనూ షార్ట్సెల్లింగ్ విధానాలు, హెడ్జింగ్ వ్యూహాలతో రాబడులను ఇవ్వగలవు. → ఉదాహరణకు ఒక లాంగ్–షార్ట్ సిఫ్ 75–80 శాతం పెట్టుబడులను క్యాష్ మార్కెట్లో లాంగ్ పొజిషన్లకు కేటాయించి.. 20–25 శాతాన్ని డెరివేటివ్స్లో షార్ట్ పొజిషన్లపై పెట్టుబడిగా పెడుతుంది. → రిటైల్ ఇన్వెస్టర్లకు అనుకూలమైన ప్రత్యా మ్నాయ పెట్టుబడి సాధనంగా సిఫ్లను నిపుణులు అభివర్ణిస్తున్నారు.రాబడికి గ్యారంటీ లేదు..? రిస్కూ ఎక్కువే! → సిఫ్ల్లోనూ రిస్క్ చాలా ఎక్కువ. సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ మాదిరే రాబడులకు ఎలాంటి హామీ ఉండదు. → ఎందుకంటే సిఫ్లు డెరివేటివ్స్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంటాయి. పొజిషన్లలో తరచూ మార్పులు చేస్తుంటాయి. → ఫండ్ మేనేజర్ ప్రతిభ, రిస్క్ సామర్థ్యాలు, మార్కెట్ సైకిల్స్, నిర్వహణలో క్రమశిక్షణ ఇలాంటి అంశాలెన్నో రాబడులను నిర్ణయిస్తుంటాయి. → నిర్వహణ సరిగ్గాలేని సిఫ్లలో రాబడి తక్కువే ఉండొచ్చు. అదే సమయంలో నాణ్యమైన సిఫ్లు ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందించగలవు. → సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ (లార్జ్/ఫ్లెక్సీ/మల్టీక్యాప్)లో రిస్క్ సిఫ్లతో పోల్చితే తక్కువే. కొంత రాబడుల పరంగానూ స్థిరత్వం ఉంటుంది. → ఎందుకంటే నాణ్యమైన కంపెనీలు, చక్కని యాజమాన్యం, ఆయా రంగాల్లో వ్యాపార అవకాశాల ఆధారంగా దీర్ఘకాల పెట్టుబడుల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. → సిఫ్లు దూకుడుగా ఏక కాలంలో ఒకటికి మించిన వ్యూహాలను అనుసరిస్తుంటాయి. కనుక రిస్క్ ఎక్కువే. → కానీ, దీర్ఘకాలంలో సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ కంటే సిఫ్లు 3–8% మేర అధిక రాబడులను ఇవ్వగలవన్నది విశ్లేషకుల అంచనా. → సగటున 6 శాతం అధిక రాబడి వచ్చినా దీర్ఘకాలంలో సంపద సృష్టి పరంగా చెప్పుకోతగ్గంత వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణ: రూ.10 లక్షలు ఏటా 12 శాతం చొప్పున పెరిగితే 10 ఏళ్లలో రూ.31 లక్షలు అవుతుంది. అదే ఏటా 18 శాతం చొప్పున పెరుగుతూ పోతే పదేళ్లకు రూ.52 లక్షలు అవుతుంది.బడా ఇన్వెస్టర్లలో ఆసక్తి → కనీసం రూ.10 లక్షల నుంచి సిఫ్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కనుక మధ్యతరగతి రిటైల్ ఇన్వెస్టర్లకూ అందుబాటులోని మెరుగైన పెట్టుబడి సాధనమే అవుతుంది. → బడా ఇన్వెస్టర్లు సైతం సిఫ్లపై అమితాసక్తి చూపిస్తున్నారు. → ఏడాదిన్నరగా మార్కెట్లు ఎన్నో అస్థిరతలు చూస్తున్నాయి. అంతర్జాతీయంగా ఎన్నో అనిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్నాయి. → రంగాల వారీ స్టాక్స్ ర్యాలీ ఎప్పటికప్పుడు మారిపోతోంది. లిక్విడిటీ ఆధారిత స్టాక్స్లో హెచ్చు, తగ్గులు భారీగా ఉంటున్నాయి. → ఈ పరిస్థితుల్లో కొనుగోలు చేసి, కొనసాగించడమ న్న సంప్రదాయ విధా→ కనీసం రూ.10 లక్షల నుంచి సిఫ్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కనుక మధ్యతరగతి రిటైల్ ఇన్వెస్టర్లకూ అందుబాటులోని మెరుగైన పెట్టుబడి సాధనమే అవుతుంది. → బడా ఇన్వెస్టర్లు సైతం సిఫ్లపై అమితాసక్తి చూపిస్తున్నారు. → ఏడాదిన్నరగా మార్కెట్లు ఎన్నో అస్థిరతలు చూస్తున్నాయి. అంతర్జాతీయంగా ఎన్నో అనిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్నాయి. → రంగాల వారీ స్టాక్స్ ర్యాలీ ఎప్పటికప్పుడు మారిపోతోంది. లిక్విడిటీ ఆధారిత స్టాక్స్లో హెచ్చు, తగ్గులు భారీగా ఉంటున్నాయి. → ఈ పరిస్థితుల్లో కొనుగోలు చేసి, కొనసాగించడమ న్న సంప్రదాయ విధానం స్వల్పకాలంలో ఫలితాలనివ్వదు. సిఫ్లాంటివే మెరుగ్గా రాణించగలవు. → పెట్టుబడుల విలువ కరిగిపోకుండా ప్రభావవంతమైన విధానాలను సిఫ్లు పాటిస్తాయి. → పెట్టుబడిని కాపాడుతూనే మార్కెట్ల ర్యాలీలో మంచి రాబడులను అందిస్తుంటాయి. కనుక ఈ తరహా సమతూకం అన్నది అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లకు ఎంతో అవసరం. అందుకే బడా ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. → కానీ, రిటైల్ ఇన్వెస్టర్లకు సైతం సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ కంటే మెరుగైన ప్రత్నామ్నాయం కాగలవు. అధిక రాబడి కోరుకునే వారు తమ రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా వీటికి కనీసం రూ.10 లక్షలు లేదంటే తమ పోర్ట్ఫోలియోలో 10–15 శాతం మించకుండా కేటాయింపులు చేసుకోవచ్చు.నం స్వల్పకాలంలో ఫలితాలనివ్వదు. సిఫ్లాంటివే మెరుగ్గా రాణించగలవు. → పెట్టుబడుల విలువ కరిగిపోకుండా ప్రభావవంతమైన విధానాలను సిఫ్లు పాటిస్తాయి. → పెట్టుబడిని కాపాడుతూనే మార్కెట్ల ర్యాలీలో మంచి రాబడులను అందిస్తుంటాయి. కనుక ఈ తరహా సమతూకం అన్నది అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లకు ఎంతో అవసరం. అందుకే బడా ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. → కానీ, రిటైల్ ఇన్వెస్టర్లకు సైతం సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ కంటే మెరుగైన ప్రత్నామ్నాయం కాగలవు. అధిక రాబడి కోరుకునే వారు తమ రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా వీటికి కనీసం రూ.10 లక్షలు లేదంటే తమ పోర్ట్ఫోలియోలో 10–15 శాతం మించకుండా కేటాయింపులు చేసుకోవచ్చు.లిక్విడిటీ ఎక్కువే.. → సిఫ్లలో లిక్విడిటీ ఎక్కువ. అయినప్పటికీ, వీటిలో షార్ట్–టర్మ్ ట్రేడింగ్ను నిరుత్సాహపరచడానికి చాలా ఫండ్స్ మొదటి 6 నెలలు లేదా ఏడాదిలోపు పెట్టుబడులను ఉపసంహరించుకుంటే ‘ఎగ్జిట్ లోడ్’ విధిస్తున్నాయి. → ఏఐఎఫ్లలో పెట్టుబడి కొన్నేళ్ల పాటు లాకిన్ అవుతుంది. → సిఫ్లలో రోజువారీ, వారం, క్రమానుగత పెట్టుబడుల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. → కానీ, కనీసం ఐదేళ్లపాటు అయినా సిఫ్లలో పెట్టుబడి కొనసాగించినప్పుడే మెరుగైన రాబడులను చూడగలరన్నది విశ్లేషకుల అభిప్రాయం. → ప్రస్తుతానికి మార్కెట్లో 9 సిఫ్లే అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని సంఖ్యలో, మరిన్ని వ్యూహాలతో అందుబాటులోకి రానున్నాయి. → మెరుగైన రిస్క్ నిర్వహణ, వైవిధ్యంతో కూడిన సిఫ్లను దీర్ఘకాలంలో కాస్త అదనపు రాబడికి మార్గంగా భావించొచ్చని విశ్లేషకుల అభిప్రాయం. → అంతిమంగా రాబడులు అన్నవి ఇన్వెస్టర్ల ధోరణి, క్రమశిక్షణపైనా ఆధారపడి ఉంటాయన్నది విస్మరించొచ్చు. రాబడులు ? సిఫ్లో రాబడులకు దీర్ఘకాల చరిత్ర లేదు. 2024లో సెబీ ఈ విభాగానికి పచ్చజెండా ఊపగా.. మొదటి సిఫ్.. క్వాంట్ లాంగ్–షార్ట్ ఫండ్ 2025 సెప్టెంబర్లో మార్కెట్లోకి వచ్చింది. ఎంత మేర ఆశించొచ్చు? ఫండ్ నిపుణుల అంచనాలు.. స్ట్రాటజీ వార్షిక రాబడి (విధానం) అంచనా (%లో) హైబ్రిడ్ లాంగ్–షార్ట్ సిఫ్ 10–16 ఈక్విటీ లాంగ్–షార్ట్ సిఫ్ 14–22 టాక్టికల్/సెక్టార్ రొటేషన్ సిఫ్ 18 డెట్ లాంగ్–షార్ట్ సిఫ్ 8–12– సాక్షి, వెల్త్ -
సంపాదనలో సగానికే పన్ను.. ఈ ఐటీ రూల్ తెలుసా?
ఈ రోజుల్లో ఉద్యోగాలతో పాటు ఫ్రీలాన్సింగ్, కన్సల్టెన్సీ సేవల ద్వారా ఆర్జించే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. అయితే, తాము సంపాదించిన మొత్తంపై భారీగా పన్ను కట్టాలేమోనని చాలామంది ఆందోళన చెందుతుంటారు. ఒకవేళ మీ వార్షిక ఆదాయం రూ. 75 లక్షల లోపు ఉండి, మీరు పన్ను ఆదా చేయాలనుకుంటే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 44ADA మీకు ఒక వరం లాంటిది. ఈ నిబంధన ప్రకారం మీ మొత్తం సంపాదనలో సగానికి సగం పన్ను మినహాయింపు లభిస్తుంది.అసలు 'సెక్షన్ 44ADA' అంటే ఏమిటి?సాధారణంగా వ్యాపారాలు చేసే వారికి 'ఊహాత్మక పన్ను విధానం' అందుబాటులో ఉండేది. కానీ, వృత్తినిపుణుల కోసం ప్రభుత్వం 'సెక్షన్ 44ADA' ను ప్రవేశపెట్టింది. ఈ నిబంధన ప్రకారం, అర్హులైన నిపుణుల వార్షిక సంపాదనలో 50 శాతాన్ని ఆఫీసు నిర్వహణ, ప్రయాణాలు, ఇంటర్నెట్, సిబ్బంది జీతాలు వంటి వృత్తిపరమైన ఖర్చుల కింద ప్రభుత్వం గుర్తిస్తుంది. మిగిలిన 50 శాతాన్ని మాత్రమే నికర లాభంగా (ఆదాయంగా) పరిగణించి, దానిపై మాత్రమే పన్ను లెక్కిస్తుంది.దీనివల్ల వృత్తి నిపుణులు పెద్ద పెద్ద అకౌంట్ పుస్తకాలను నిర్వహించాల్సిన పని లేదు. ఆడిటింగ్, కాగితపు పనుల తలనొప్పి లేకుండా చాలా సులభంగా ఐటీ రిటర్న్స్ (ITR) దాఖలు చేయవచ్చు.అయితే..మొత్తం వార్షిక సంపాదనలో నగదు రూపంలో తీసుకునే పేమెంట్లు 5% కంటే తక్కువ ఉండాలి. అంటే కనీసం 95% సంపాదన డిజిటల్ రూపంలో (బ్యాంక్ ట్రాన్స్ఫర్, UPI, చెక్కులు మొదలైనవి) వచ్చి ఉండాలి. ఒకవేళ క్యాష్ లావాదేవీలు 5% కంటే ఎక్కువగా ఉంటే, ఈ సెక్షన్ కింద గరిష్ట పరిమితి రూ. 50 లక్షలు మాత్రమే అవుతుంది.ఈ సెక్షన్ (44ADA) ఎంచుకునే వారు తమ పన్ను మొత్తాన్ని (Advance Tax) ప్రతి ఏటా మార్చి 15 లోపు ఒకే విడతలో పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ పన్ను విధానం లాగా 4 విడతల్లో కట్టే ఆప్షన్ వీరికి ఉండదు.ఎవరెవరు అర్హులు?ఈ ప్రత్యేక పన్ను ప్రయోజనాన్ని వ్యక్తులు, భాగస్వామ్య సంస్థలు మాత్రమే పొందగలవు. కానీ, లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్స్ సంస్థలకు ఈ నిబంధన వర్తించదు. ఈ నిబంధన కింద వైద్యులు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, ఇంటీరియర్ డిజైనర్లు, టెక్నికల్ కన్సల్టెంట్లు, సృజనాత్మక రంగాల వారు అంటే సినిమా నటులు, దర్శకులు, గాయకులు, రైటర్లు, కెమెరామెన్లు, కాస్ట్యూమ్ డిజైనర్లు, ఎడిటర్లు, ఫ్రీలాన్సర్లు వంటి ఐటీ రిటర్న్స్ వేయవచ్చు.ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారు?ఈ నిబంధన వల్ల పన్ను భారం ఎలా తగ్గుతుందో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. కిరణ్ ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్. ఆయన ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 60 లక్షలు సంపాదించారు. ఆయనకు ల్యాప్టాప్ కొనుగోలు, ఆఫీస్ స్పేస్ అద్దె, ప్రయాణాల కోసం వాస్తవంగా అయిన ఖర్చు రూ. 15 లక్షలు అనుకుందాం.సాధారణ పన్ను విధానంలో అయితే కిరణ్ మొత్తం ఆదాయం (రూ. 60 లక్షలు) నుండి వాస్తవ ఖర్చులు (రూ. 15 లక్షలు) తీసివేస్తే, మిగిలిన రూ. 45 లక్షలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.అదే సెక్షన్ 44ADA ప్రకారం ప్రభుత్వం కిరణ్ ఆదాయంలో నేరుగా 50% (అంటే రూ. 30 లక్షలు) ఖర్చుల కింద మినహాయిస్తుంది. మిగిలిన రూ. 30 లక్షలను మాత్రమే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంగా గుర్తిస్తుంది.దీనివల్ల కిరణ్కు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 45 లక్షల నుండి రూ. 30 లక్షలకు తగ్గి, చట్టబద్ధంగా భారీగా పన్ను ఆదా అవుతుంది.కనీస పేపర్ వర్క్తో, అకౌంటెంట్ల చుట్టూ తిరిగే పని లేకుండా పన్ను ఆదా చేసుకోవడానికి సెక్షన్ 44ADA ఒక అద్భుతమైన మార్గం. మీ వార్షిక ఆదాయం రూ. 75 లక్షల లోపు ఉంటే, ఐటీఆర్ దాఖలు చేసే ముందు ఈ నిబంధనను పరిశీలించి లబ్ధి పొందవచ్చు. -
SBI అలర్ట్: వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్?
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఖాతా ఉందా? ఏదైనా ముఖ్యమైన పని మీద వచ్చే వారం బ్యాంకుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త ఖచ్చితంగా మీ కోసమే. మే 23 (శనివారం) నుండి దేశవ్యాప్తంగా వరుసగా ఆరు రోజుల పాటు ఎస్బీఐ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో, కొన్ని వార్తా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. వారాంతపు సెలవులు, సిబ్బంది సమ్మె, బక్రీద్ పండుగలు వరుసగా రావడం దీనికి కారణమని ప్రచారం జరుగుతోంది.అయితే, నిజంగానే 6 రోజులు బ్యాంకులు పూర్తిగా మూతపడతాయా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల జాబితా, తాజా పరిస్థితుల ప్రకారం అసలు వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం.మే 23 నుండి మే 28 వరకు బ్యాంకుల పరిస్థితి ఇదీ..మే 23 (నాల్గవ శనివారం): దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసివుంటాయి.మే 24 (ఆదివారం):సాధారణ వారాంతపు సెలవు.మే 25 & 26 (సోమ, మంగళవారాలు): సిబ్బంది సమ్మెతో ఎస్బీఐ శాఖల్లో అంతరాయం మే 27 (బుధవారం): బక్రీద్ సెలవు. హైదరాబాద్, విజయవాడ, న్యూఢిల్లీ, కోల్కతా, ముంబైతో పాటు దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.మే 28 (గురువారం): బక్రీద్ సెలవు (రెండవ రోజు/కొన్ని ప్రాంతాల్లో) బెంగళూరు, చెన్నై, జైపూర్, పాట్నా వంటి కొన్ని నిర్దిష్ట నగరాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది.అయితే బక్రీద్ సెలవు అనేది తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) మే 27న ఉంటుంది. మే 28న ఇక్కడ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. మే 25, 26 తేదీల్లో సిబ్బంది సమ్మె కారణంగా ఎస్బీఐ బ్రాంచ్లలో క్లెరికల్ సేవలకు అంతరాయం ఉంటుంది. ఇతర బ్యాంకులు (డిజిటల్ సేవలు, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి ప్రైవేట్ బ్యాంకులు) యథావిధిగా పనిచేస్తాయి.సమ్మెకు కారణాలు ఏమిటి?ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (AISBISF) వివిధ డిమాండ్ల సాధనకై ఈ రెండు రోజులు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. సబ్-స్టాఫ్, ఆర్మ్డ్ గార్డుల ఖాళీలను భర్తీ చేయాలని, ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించాలని, అలాగే కస్టమర్లకు బీమా ఉత్పత్తులను బలవంతంగా అంటగట్టే ("మిస్-సెల్లింగ్") విధానాన్ని నిరసిస్తూ 16 డిమాండ్లతో ఎస్బీఐ స్టాఫ్ ఫెడరేషన్ ఈ సమ్మె నోటీసు ఇచ్చింది.ఎస్బీఐ విజ్ఞప్తిసిబ్బంది సమ్మె నేపథ్యంలో కస్టమర్లకు ఎస్బీఐ విజ్ఞప్తి చేసింది. బ్యాంకింగ్ సేవల కోసం ప్రత్యామ్నాయంగా కస్టమర్ సర్వీస్ పాయింట్లు, ఏంటీఎం, యోనో, యూపీఐ వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకోవాలని సూచించింది. అదే సమయంలో ఖాతాదారులకు అత్యవసర సేవలకు గానూ బ్యాంక్ శాఖల్లో అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్బీఐ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది.pic.twitter.com/1B6bJTc9Co— State Bank of India (@TheOfficialSBI) May 22, 2026 -
ఎల్ఐసీ నుంచి రెండు కొత్త సేవింగ్స్ ప్లాన్లు
దేశీయ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. తన పొదుపు (Savings) పోర్ట్ఫోలియోను మరింత బలోపేతం చేసే క్రమంలో సరికొత్తగా రెండు బీమా ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘ఎల్ఐసీ న్యూ జీవన్ సతీ - సింగిల్ ప్రీమియం’ (LIC's New Jeevan Sathi – Single Premium), ‘ఎల్ఐసీ న్యూ జీవన్ సతీ - లిమిటెడ్ ప్రీమియం’ (LIC's New Jeevan Sathi – Limited Premium) పేరుతో వీటిని తీసుకువచ్చినట్లు సంస్థ శుక్రవారం ప్రకటించింది. ఈ రెండు ప్లాన్లు కూడా జూన్ 1 నుండి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.ప్లాన్ల ప్రత్యేకతలు, ప్రయోజనాలుఈ రెండు పాలసీలు నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ వ్యక్తిగత పొదుపు పథకాలు. అంటే, వీటికి షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులతో ఎలాంటి సంబంధం ఉండదు. మార్కెట్ నష్టాల భయం లేకుండా స్థిరమైన, కచ్చితమైన ముందస్తు అంచనాతో కూడిన ఆర్థిక ప్రణాళికను (Guaranteed Savings) కోరుకునే వారికి ఇవి సరైన ఎంపిక.పాలసీ ముగిసిన తర్వాత (Maturity) లేదా పాలసీదారునికి ఏదైనా జరిగితే (Death Benefit) వచ్చే ప్రయోజనాలు ముందే నిర్ణయించబడి, గ్యారెంటీగా అందుతాయి. కస్టమర్ల నగదు ప్రవాహం, ఆర్థిక ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రీమియం చెల్లించేందుకు రెండు వేరియంట్లను తెచ్చారు. ఈ ప్లాన్లను కేవలం భారతీయ మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించారు.ప్రీమియం చెల్లింపు ఇలా..పాలసీదారులు తమ వీలును బట్టి రెండు రకాలుగా ప్రీమియం చెల్లించవచ్చు. సింగిల్ ప్రీమియం ప్లాన్: ఇందులో పాలసీ తీసుకునే సమయంలోనే ఒకేసారి మొత్తం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పదే పదే కట్టే అవసరం ఉండదు.లిమిటెడ్ ప్రీమియం ప్లాన్: ఇందులో పాలసీ కాలపరిమితి అంతా కాకుండా, నిర్ణీత పరిమిత సంవత్సరాల పాటు (ఉదాహరణకు 5 లేదా 10 ఏళ్లు) మాత్రమే ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.పాలసీదారు వయస్సు, ఎంచుకునే హామీ మొత్తం (Sum Assured) ఆధారంగా నిర్దిష్ట ప్రీమియం ధరలు జూన్ 1న ఎల్ఐసీ అధికారికంగా విడుదల చేస్తుంది. -
ఐటీఆర్ ఫైలింగ్.. జూలై 31 లాస్ట్ డేట్!
2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను మీరు వేయవలసిన ఆదాయపు రిటర్నులలో రెండు ఫారాలు ఉంటాయి. ఒకటి నంబర్ 1, రెండోది నంబర్ 4. వీటిని దాఖలు చేయడానికి డిపార్టుమెంటు వారి తరఫున ప్లాట్ఫాం రెడీ అయ్యింది. ఇందుకు అవసరమైన యుటిలిటీలను, సాధనాలను వారు సన్నద్ధం చేశారు. ఈ వారం ఐటీఆర్1 గురించి తెలుసుకుందాం. దీన్నే సహజ్ అని కూడా అంటారు. మీరు ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా వేయొచ్చు.ఎవరు దాఖలు చేయొచ్చు..కేవలం రెసిడెంట్ వ్యక్తులైన వారు మాత్రమే ఈ ఫారం ఐటీఆర్–1 లేదా సహజ్ వేయగలరు. ఇతరులెవ్వరూ ఈ ఫారంను వేయడానికి లేదు. ఎంత ఆదాయం వచ్చే వారు వేయొచ్చు.. ఈ కింది మార్గాల్లో ఆదాయాలు వచ్చే వారు ఈ ఫారం వాడాలి. పెన్షన్జీతాలుఒకటి/రెండు ఇళ్ల మీద ఇంటద్దె వచ్చే వాళ్లుఇతర ఆదాయంవ్యవసాయ ఆదాయం రూ. 5000 లోపు ఉన్న వారుఇతర షరతులు..మొత్తం ఆదాయం రూ. 50,00,000 దాటిన వారు ఈ ఫారం కింద ఆదాయం డిక్లేర్ చేయకూడదు. భార్య ఆదాయం, పిల్లల ఆదాయం, భర్త కేసులో కలిపే సందర్భం ఏర్పడితే, రూ. 50,00,000 దాటనంత వరకు ఈ ఫారం వాడొచ్చు. రూ. 1,25,000 లోపల లాంగ్టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటే, అటువంటి వారు ఫారం 1 వాడొచ్చు.ఏయే కాగితాలు ఉండాలి..పాత చట్టం ప్రకారం 16, 16ఎ, ప్రీమియం మొదలైన వాటి రశీదులు, అద్దె రశీదులు, మొదలైనవి మీ ఫైల్లో ఉండాలి. రిటర్నుతో పాటు జతపరచనవసరం లేదు కానీ రెడీగా ఉంచుకోండి.ఎవరు ఫారం 1 దాఖలు చేయకూడదు..మీ మొత్తం ఆదాయం రూ. 50,00,000 దాటితే.వ్యవసాయం మీద నికర ఆదాయం రూ. 5,000 దాటితే.లాంగ్టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రూ. 1,25,000 దాటితే. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎలాగు రూ. 1,25,000 వరకు మినహాయింపు ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రూ. 1,250,000 వరకు పన్ను భారం ఉండదు. వృత్తి మీద ఆదాయం ఉన్నవారు.వ్యాపారం మీద ఆదాయం ఉన్నవారు.ఒకటి, రెండు దాటి .. అంటే మూడో ఇంటి మీద ఆదాయం వచ్చే వాళ్లు వేయకూడదు.ఏదైనా కంపెనీలో డైరెక్టర్ అయితేఅన్లిస్టెడ్ ఈక్విటీ షేర్ల మీద ఆదాయం ఉంటేవిదేశాల్లో ఆస్తులున్నా, వాటి మీద హక్కులున్నామీరు నాన్ రెసిడెంటు అయినావిదేశాల నుంచి ఆదాయం ఉన్నా194ఎన్ (పాత చట్టం) ప్రకారం టీడీఎస్ రికవరీ అయితే, అతి పెద్ద నగదు విత్డ్రాయల్స్ మీదఉద్యోగస్తుల స్టాక్ / షేర్ల మీద ఎటువంటి చెల్లింపులు, రికవరీలు ఉన్నాగత సంవత్సరపు సర్దుబాటు నష్టాలున్నాఏ ఆదాయం నుంచైనా సర్దుబాటు చేయాల్సిన నష్టాలున్నాచివరగా..ఫైలింగ్ చేయడానికి గడువు తేదీ 2026 జూలై 31. ఆన్లైన్లో వేయొచ్చు లేదా ఎక్సెల్లాంటి యుటిలిటీ ద్వారా డౌన్లోడ్ చేసి దాఖలు చేసుకోవచ్చు. ఎన్నెన్నో సాఫ్ట్వేర్లు ఉన్నాయి. మీరే స్వయంగా వేయొచ్చు లేదా వృత్తి నిపుణులు ఉన్నారు. సమాచారం సరైనది. సమగ్రమైనది. సంపూర్ణమైనది. రెడీగా ఉంటే సరైనదే, సమగ్రంగా, సంపూర్ణంగా, రెడీగా ఉంటే సులభతరంగా వేయొచ్చు. ఫారంలు చాలా స్నేహపూర్వకంగానే ఉంటాయి. -
ఏడాది పాటు పసిడి కొనొద్దు.. పరిష్కారం ఇదిగో
న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకునేందుకు దేశ ప్రజలు ఏడాది పాటు బంగారం కొనకుండా ఉంటే చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ప్రధాని ప్రతిపాదనపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని ప్రకటనను కొంత మంది సమర్థిస్తుండగా, మరి కొంత మంది ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. బంగారం కొనుగోళ్లు ఆపేస్తే నగల పరిశ్రమ నాశమవుతుందని, కోట్లాది మంది ఉపాధికి దూరమవుతారని భయాందోళనలు చెందుతున్నారు.ఈ నేపథ్యంలో బంగారం దిగుమతులను తగ్గించడానికి టైటాన్ సీఎఫ్ఓ అశోక్ సోంతాలియా ఓ పరిష్కారాన్ని సూచించారు. మన దేశంలో పోగుపడి ఉన్న బంగారాన్ని మార్పిడి చేయడం ద్వారా దిగుమతులను తగ్గించవచ్చని ఆయన సలహా ఇచ్చారు. బిజినెస్ టుడేతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ''ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన ప్రభావం బంగారం కొనుగోళ్ల వైపు ఉంటుందా, సరఫరా వైపు మళ్లుతుందా అని వేచిచూస్తున్నాం. బంగారం దిగుమతుల గురించే కేంద్ర సర్కారు ఎక్కువ ఆందోళనగా ఉన్నట్టు కనబడుతోంది. ఒకవేళ అదే నిజమైతే ఈ సమస్యను అధిగమించడానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరిష్కారాలు ఉన్నాయి. మన దేశంలో ప్రజల దగ్గర, దేవాలయాలు, లాకర్లలో పెద్ద మొత్తంలో ఉన్న బంగారాన్ని మార్పిడి చేయడం ద్వారా దిగుమతులను గణనీయంగా తగ్గించవచ్చ''ని అశోక్ సోంతాలియా పేర్కొన్నారు.నిశితంగా పరిశీలిస్తున్నాంబంగారం కొనుగోళ్లు హఠాత్తుగా నిలిచిపోతే కోట్లాది మంది ఉపాధికి విఘాతం కలుగుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని అశోక్ సోంతాలియా చెప్పారు. తమ ప్రతిపాదనను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రధాని ప్రకటన ప్రభావం బంగారం కొనుగోళ్లపై ఎలా ఉంటుందో చూడటానికి రెండు వారాలు వేచి చూస్తామన్నారు. అలాగే పసిడి కొనుగోళ్ల నియంత్రణ ప్రభుత్వం ఎలాంటి విధాన ప్రకటన చేస్తుందో చూడాలన్నారు. ఈ రెండు అంశాలను వారం పది రోజుల పాటు నిశితంగా గమనిస్తామన్నారు.చదవండి: ఓబీసీ క్రిమిలేయర్ కిరికిరి తేలింది!పసిడి అమ్మకాల నియంత్రణలో నరేంద్ర మోదీ సర్కారు సమగ్ర దృక్పథంతో వ్యవహరిస్తుందన్న నమ్మకాన్ని అశోక్ సోంతాలియా (Ashok Sonthalia) వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాలతో పాటు నగల పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వారి ఉపాధిని దెబ్బతీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ఆభరణాల పరిశ్రమ కూడా నష్టపోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.జీజేసీ అభ్యంతరంకాగా, పుత్తడి కొనుగోళ్లను నియంత్రించాలన్న ప్రధాని మోదీ ప్రకటనపై అఖిల భారత రత్నాలు, ఆభరణాల మండలి (జీజేసీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. బంగారం అమ్మకాలు తగ్గితే ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్లాది మందికి ఉపాధి కరవుతుందని ఆందోళన చెందింది. అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని, దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా భారం పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవల రంగాలతో పాటు లాజిస్టిక్స్, జ్యుయెల్లరీ డిజైన్, ఈ- కామర్స్ తదితర రంగాలు కూడా దెబ్బతింటాయని అంచనా వేసింది. విదేశీ వద్దు.. స్వదేశీ ముద్దుఅమెరికా- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇంధన విపత్తు నెలకొందని, దీన్ని అధిగమించడానికి దేశ ప్రజలకు 7 రకాల చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వర్క్ ఫ్రం హోమ్, బంగారం కొనుగోళ్ల నిలిపివేత, ప్రజా రవాణా వాడకం, పరిమితంగా వంట నూనెలు, విదేశీ వస్తువుల వినియోగం, సేంద్రియ వ్యవసాయం, విదేశీ పర్యటనల రద్దు వంటి అంశాలను ప్రధాని ప్రస్తావించారు. Nation First Duty Above Comfort!PM @narendramodi gave 7 important appeals to strengthen India during challenging global times prioritize work from home wherever possible, reduce fuel consumption, avoid foreign travel for a year, adopt Swadeshi products, cut down cooking oil… pic.twitter.com/jhDGYTarH6— MyGovIndia (@mygovindia) May 10, 2026 -
ఉద్యోగ జీవితం.. చివరికి అప్పులు: కియోసాకి వివరణ
పెట్టుబడుల గురించి, ఆర్థికపరమైన విషయాలను చెప్పే 'రాబర్ట్ కియోసాకి'.. ఇప్పుడు ఉద్యోగుల గురించి, వారి భవిష్యత్తు గురించి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఉద్యోగి ప్రతి వారం ఐదు రోజులు చాలా కష్టపడి పనిచేస్తాడు. ఉదయం నిద్రలేచి ఆఫీసుకు వెళ్లడం, ట్రాఫిక్లో ప్రయాణించడం, ఎప్పటికీ ముగియని పనులను పూర్తి చేయడం. ఇవన్నీ చేస్తూ.. చేస్తూ చివరికి అలసట మాత్రమే మిగులుతుంది. ఇలాంటి సమయంలో 'జీవితాంతం ఇలాగే కొనసాగాలా?' అనే ప్రశ్న మనసులో పుడుతుంది.అంటే.. దీని అర్థం పని చేయకుండా ఉండటం కాదు. సోమరితనం అంతకంటే కాదు, కృతఙ్ఞతలేకపోవడం కూడా కాదు. నీ కష్టం అంతా మరొకరి కలలను నిజం చేయడానికి వెళ్తోందనే భావన వల్ల కలిగే అలసట మాత్రమే అని కియోసాకి పేర్కొన్నారు.ఆర్థిక ప్రపంచంలో నాలుగు (E, S, B, I) ప్రధానమైన విభాగాలు మాత్రమే ఉన్నాయని, వీటి గురించి కియోసాకి వివరంగా వివరించారు.E – Employee (ఉద్యోగి)S – Self-Employed (స్వయం ఉపాధి పొందినవాడు)B – Business Owner (వ్యాపార యజమాని)I – Investor (పెట్టుబడిదారు)చాలామంది జీవితాంతం E విభాగంలోనే ఉంటారు. అంటే.. ఉద్యోగం చేస్తూ జీతం మీద ఆధారపడతారు. కానీ ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. వీళ్లే ఎక్కువ పన్నులు చెల్లిస్తుంటారు. జీతం చేతికి రాకముందే ప్రభుత్వం పన్ను తీసుకుంటుంది. తరువాత మిగిలిన డబ్బుతోనే ఎంప్లాయ్ జీవించాలి.ఈ సమయంలో కియోసాకి పూర్ డాడ్ గురించి పేర్కొన్నాడు. ఆయన చాలా చదువుకున్నవారు, ప్రభుత్వ ఉద్యోగం చేశారు. చాలా కష్టపడే వ్యక్తి. మంచి ఉద్యోగమే భద్రత అని నమ్మేవారు. కానీ జీవితాంతం కష్టపడి పనిచేసినా.. చివరికి అప్పులు మిగిలాయి.ఇదీ చదవండి: 2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే?రిచ్ డాడ్ ఆలోచన మాత్రం.. పూర్ డాడ్ ఆలోచనకు భిన్నంగా ఉంటుంది. ఈయన B, I విభాగాలను ప్రధాన్యత ఇచ్చారు. ఇందులోనే జీవించారు. అంటే వ్యాపారాలు నిర్మించారు, పెట్టుబడులు కూడా పెట్టారు. ఈయన డబ్బుకోసం పనిచేయలేదు, తన కోసం పనిచేసే వ్యవస్థలను నిర్మించాడు. అందువల్ల పన్నుల చట్టాలు కూడా ఆయనకు అనుకూలంగా పనిచేశాయి.ఒక ఉద్యోగి సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం పన్నులుగా వెళ్లిపోతాయి. కానీ ఒక వ్యాపారవేత్త అదే డబ్బును వ్యాపారంలో తిరిగి పెట్టుబడి పెట్టి, ఆస్తులు పెంచుకుని, చివర్లో మాత్రమే పన్నులు చెల్లిస్తాడు. అంటే ఒకే దేశం, ఒకే ఆర్థిక వ్యవస్థ అయినా.. నియమాలు అందరికీ ఒకేలా పనిచేయవు.Facebook Story ReferenceThis content is shared via Facebook Story (temporary content).Open Story on Facebook -
బంగారం ‘8 గ్రాములే’ ఎందుకు?
సామాన్యుల జీవితాల్లో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక ఆర్థిక భరోసా. ఇటీవల తమిళనాడు ఎన్నికల మేనిఫెస్టోలో తెరపైకి వచ్చిన ‘8 గ్రాముల బంగారం’ హామీ ఇప్పుడు బులియన్ మార్కెట్, ఆర్థిక వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అసలు ఈ 8 గ్రాముల సంఖ్య వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం దీని విలువ ఎంత? అన్న వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.ఎందుకు 8 గ్రాములు?దక్షిణ భారతదేశంలో బంగారాన్ని గ్రాముల కంటే ‘సవరం’ లెక్కన కొలవడం ఒక ఆనవాయితీ. 8 గ్రాముల బంగారాన్ని ఒక సవరంగా పిలుస్తారు. వివాహ సమయంలో ‘మంగళసూత్రం’ (తాళి) తయారు చేయడానికి కనీసం ఒక సవరం బంగారం ఉండాలని సెంటిమెంట్గా భావిస్తారు.ఒక మధ్యతరగతి లేదా పేద కుటుంబానికి వివాహ ఖర్చుల్లో అతిపెద్ద భారం బంగారం. ప్రభుత్వం సరిగ్గా ఒక సవరం (8 గ్రాములు) హామీ ఇవ్వడం ద్వారా, ఆ కుటుంబానికి ప్రాథమిక వివాహ అవసరాన్ని తీర్చినట్లు అవుతుందనేది ఈ సంఖ్య వెనుక ఉన్న వ్యూహం.నేరుగా బంగారమే ఇస్తారా? నగదు ఇస్తారా?హామీల అమలు తీరు ఆయా పార్టీల విధానాలపై ఆధారపడి ఉంటుంది. తమిళనాడులో సీఎం విజయ్ పార్టీ టీవీకే (Vijay TVK ) తమ హామీలో నేరుగా 8 గ్రాముల బంగారంతోపాటు పట్టుచీరను అందిస్తామని పేర్కొన్నాయి. గతంలో జయలలిత హయాంలో కూడా లబ్ధిదారులకు బంగారు నాణేలనే పంపిణీ చేసేవారు.అయితే, బంగారం పంపిణీలో నాణ్యత లోపాలు, అవినీతి వంటి ఆరోపణలు వచ్చే అవకాశం ఉండటంతో.. అస్సాం వంటి రాష్ట్రాలు ‘అరుంధతి’ పథకం కింద బంగారం కొనుగోలుకు సరిపడా నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి నిర్వహణ పరంగా సులభతరం అవుతుంది.ఎన్ని క్యారెట్లు ఇస్తారు?సాధారణంగా ప్రభుత్వాలు ఇలాంటి పథకాల కింద 22 క్యారెట్ల బంగారాన్నే పంపిణీ చేస్తాయి. మన దేశంలో మంగళసూత్రాలు లేదా ఇతర ఆభరణాలను 22 క్యారెట్ల బంగారంతోనే తయారు చేస్తారు. ఇది ఆభరణాలకు అవసరమైన గట్టిదనాన్ని కలిగి ఉంటుంది. గతంలో ఇదే తమిళనాడు ప్రభుత్వం అమలు చేసిన 'తాళికి తంగం' పథకం కింద లబ్ధిదారులకు 22 క్యారెట్ల బంగారు నాణేలనే (Gold Coins) పంపిణీ చేసేవారు. విజయ్ పార్టీ హామీ కూడా అదే పద్ధతిని అనుసరించే అవకాశం ఉంది.ఇక ధరల పరంగా చూసినా 24 క్యారెట్లతో పోలిస్తే 22 క్యారెట్ల ధర గ్రాముకు సుమారు రూ.1000 పైనే వ్యత్యాసం ఉంటుంది. ప్రస్తుతం (మే 10, 2026 నాటికి) 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,150 ఉంది. అంటే 8 గ్రాములకు రూ.1,13,200 అవుతుంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే గ్రాముకు రూ.15,437 ఉంది. ఇది 8 గ్రాములకు రూ.1,23,864 అవుతుంది. ప్రభుత్వం లక్షలాది మందికి పంపిణీ చేసేటప్పుడు, ఈ ధరల వ్యత్యాసం బడ్జెట్పై వందల కోట్ల ప్రభావం చూపుతుంది. -
పోస్టాఫీసు డిపాజిట్లపై ఐటీ నిఘా..
పోస్టాఫీసు పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టే వారికి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఆదాయపు పన్ను (IT) నిబంధనలు-2026 ప్రకారం, పోస్టాఫీసు ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఇకపై ఖాతా తెరవడం నుంచి డిపాజిట్లు, ఉపసంహరణల వరకు ప్రతి కీలక లావాదేవీకి శాశ్వత ఖాతా సంఖ్య (PAN) కోట్ చేయడం తప్పనిసరి అయింది.చిన్న మొత్తాల పొదుపు పథకాలను అధికారిక పన్ను రిపోర్టింగ్ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS), రికరింగ్ డిపాజిట్లు (RD), టైమ్ డిపాజిట్లపై ఈ నిబంధనల ప్రభావం పడనుంది.పాన్ కార్డు లేకపోతే 'ఫారం 97'గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని చిన్న పొదుపుదారులు, పెన్షనర్ల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించింది. ఒకవేళ డిపాజిటర్ వద్ద పాన్ కార్డు లేకపోతే గతంలో ఉన్న ఫారం 60 స్థానంలో ఇప్పుడు ఫారం 97 సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో డిపాజిటర్ పేరు, చిరునామా, లావాదేవీ స్వభావం, మొత్తం, సంబంధిత గుర్తింపు పత్రాలను పొందుపరచాలి. దీనివల్ల పాన్ కార్డు లేని లావాదేవీలు కూడా పన్ను శాఖ రికార్డుల్లో నమోదవుతాయి.15G, 15H స్థానంలో 'ఫారం 121'పన్ను మినహాయింపు కోసం గతంలో ఉపయోగించే ఫారం 15G (60 ఏళ్లలోపు వారికి), ఫారం 15H (సీనియర్ సిటిజన్లకు)లను ప్రభుత్వం రద్దు చేసింది. వీటి స్థానంలో ఏకీకృత 'ఫారం 121'ని ప్రవేశపెట్టింది. అన్ని వర్గాల వారు ఇకపై ఒకే ప్రామాణిక ఫారమ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రతి ఆర్థిక సంవత్సరానికి విడివిడిగా ఈ ఫారమ్ను సమర్పించాలి.ఏడేళ్ల పాటు రికార్డుల భద్రతకొత్త నిబంధనల ప్రకారం పోస్టాఫీసులపై బాధ్యత పెరిగింది. డిపాజిటర్లు సమర్పించే పత్రాలను పోస్టాఫీసు సిబ్బంది అంతర్గతంగా ధ్రువీకరించాలి. అలాగే, ఈ రికార్డులను, సపోర్టింగ్ డాక్యుమెంట్లను కనీసం ఏడు సంవత్సరాల పాటు భద్రపరచడం ఇప్పుడు తప్పనిసరి. సాంకేతిక వ్యవస్థలు పూర్తిగా అప్గ్రేడ్ అయ్యే వరకు, పాత ఫారాలు (15G, 15H) తాత్కాలికంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ATM నుంచి EPF.. ఎప్పటి నుంచంటే..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన చందాదారులకు భారీ ఊరటనిచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేయాలంటే నెలల తరబడి వేచి చూడటం, కార్యాలయాల చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులు ఉండేవి. కానీ, ఇకపై ఆ అవసరం లేకుండా నేరుగా ఏటీఎం కార్డులు లేదా యూపీఐ (UPI) ద్వారా డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించనుంది. 'ఈపీఎఫ్ఓ 3.0' అప్గ్రేడ్లో భాగంగా ఈ సరికొత్త డిజిటల్ విప్లవం ఈనెల (మే 2026) చివరికల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వార్తా సంస్థ ఈటీ నౌ ఉటంకించిన వర్గాల సమాచారం.ఏటీఎం నుంచి సగమే!కొత్త వ్యవస్థ ప్రకారం, చందాదారుల పీఎఫ్ ఖాతాలకు అనుసంధానించిన ప్రత్యేక ఏటీఎం కార్డులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల దరఖాస్తులు, డాక్యుమెంట్ల తతంగం లేకుండానే అవసరమైనప్పుడు నిధులను డ్రా చేసుకోవచ్చు. అయితే, ఈ విధానంలో మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్లో 50 శాతం వరకు మాత్రమే విత్ డ్రా చేసుకునేలా పరిమితి విధించే అవకాశం ఉందని సమాచారం.విత్డ్రాకు కావాల్సినవి..యాక్టివ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN).ఆధార్, పాన్ కార్డ్ అనుసంధానం.బ్యాంక్ ఖాతా వివరాలు, సరైన IFSC కోడ్.నిబంధనల సరళీకరణగతంలో ఉన్న సంక్లిష్టమైన 13 రకాల ఉపసంహరణ నిబంధనలను ఈపీఎఫ్ఓ కేవలం మూడు ప్రధాన వర్గాలుగా కుదించింది.అత్యవసరాలు: వైద్య అత్యవసరాలు, పిల్లల చదువులు, వివాహ ఖర్చులు. ఇందులో విద్యా రుణం కోసం 10 సార్ల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. వివాహ ఖర్చుల కోసం 5 సార్ల వరకు నిధులు తీసుకునేందుకు అనుమతి ఉంటుంది.గృహ అవసరాలు: ఇల్లు కొనడం, నిర్మాణం, ఇంటి మరమ్మతులు లేదా హోమ్ లోన్ చెల్లింపులు.ప్రత్యేక పరిస్థితులు: ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర ఆకస్మిక ఆర్థిక ఇబ్బందులు.ఈపీఎఫ్ఓ 3.0: మరిన్ని కీలక మార్పులుసర్వీస్ పరిమితి తగ్గింపు: కేవలం 12 నెలల సర్వీస్ ఉన్నా సరే పాక్షిక ఉపసంహరణలకు అనుమతి ఇచ్చేలా రూల్స్ మారుతున్నాయి.ఎక్కువ మొత్తం విత్ డ్రా: గతంలో కేవలం ఉద్యోగి వాటా మాత్రమే వచ్చేది. ఇప్పుడు యజమాని వాటా, దానిపై వడ్డీని కూడా కలిపి విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.ఉద్యోగం కోల్పోతే: ఉద్యోగం పోయిన వెంటనే 75% బ్యాలెన్స్ తీసుకోవచ్చు. ఏడాది పాటు నిరుద్యోగిగా ఉంటే మిగిలిన 25% కూడా విత్ డ్రా చేసుకోవచ్చు.పూర్తి విత్ డ్రాయల్: 55 ఏళ్ల పదవీ విరమణ, వైకల్యం, విదేశాలకు వెళ్లడం వంటి సందర్భాల్లో పూర్తి మొత్తం తీసుకోవచ్చు.రికార్డు స్థాయిలో క్లెయిమ్ల పరిష్కారంకేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈపీఎఫ్ఓ డిజిటలైజేషన్ వేగవంతమైంది. 2024-25లో 6.01 కోట్లుగా ఉన్న క్లెయిమ్ల పరిష్కారం, 2025-26 నాటికి 8.31 కోట్లకు చేరింది.త్వరలో రాబోయే ఈ 'ఈపీఎఫ్ఓ 3.0'తో సామాన్య ఉద్యోగులకు తమ సొంత డబ్బుపై పూర్తి నియంత్రణ లభించడమే కాకుండా, అత్యవసర సమయాల్లో పీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టాలు తప్పుతాయని భావిస్తున్నారు.ఇదీ చదవండి: EPFO: రూ.7500లకు గనక పెంచితే.. -
ఆ అబద్ధమే ఇంకా చెబుతున్నారు.. కియోసాకి ఆందోళన
ఇన్వెస్టర్ గురూ, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా చేసిన ఫేస్బుక్ పోస్టులో ఉద్యోగ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “స్కూల్కి వెళ్లి, ఉద్యోగం సంపాదిస్తే భద్రత ఉంటుంది” అనే అత్యంత ఖరీదైన అబద్ధాన్ని ఇప్పటికీ 2026లోనూ తల్లిదండ్రులు తమ పిల్లలకు చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.కియోసాకి పేర్కొన్న వివరాల ప్రకారం, 2025 సంవత్సరం ఉద్యోగుల పాలిట అత్యంత కఠినమైన కాలంగా మారింది. ఆ ఒక్క సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 12 లక్షల ఉద్యోగాల కోతలు నమోదయ్యాయని, ఇది 2020 తర్వాత అత్యధికమని ఆయన తెలిపారు. అలాగే 2026 జనవరిలోనే 1,08,435 ఉద్యోగాలు ఊడిపోయాయనిఇ చెప్పారు.టెక్నాలజీ రంగంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని కియోసాకి పేర్కొన్నారు. 2026లో ప్రతిరోజూ సగటున 1,003 మంది టెక్ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతున్నారన్నారు. అమెజాన్ జనవరిలో 16 వేల ఉద్యోగాలను తొలగించగా, మెటా మే నెలలో మరో 8 వేల ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోందని చెప్పారు. చెవ్రాన్ 8 వేల మందిని, డెల్ 11 వేల మందిని, సిటీగ్రూప్ 20 వేల మందిని తొలగించిందని, స్పిరిట్ ఎయిర్లైన్స్ మూతపడటంతో 17 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆయన వివరించారు.ఈ పరిస్థితులకు కృత్రిమ మేధస్సు (AI) ప్రధాన కారణంగా మారుతోందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఒక్క 2025లోనే ఏఐ కారణంగా అమెరికాలో 55 వేల ఉద్యోగాలు పోయాయని, 2026 ఏప్రిల్లో జరిగిన ఉద్యోగ కోతల్లో 26 శాతం ఏఐ కారణంగానే జరిగాయని ఆయన పేర్కొన్నారు.“ఇవేవీ విఫలమైన కంపెనీలు కావు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సంస్థలు. అయినా అత్యంత చదువుకున్న, నైపుణ్యం కలిగిన ఉద్యోగులే తొలగింపులకు గురవుతున్నారు” అని కియోసాకి వ్యాఖ్యానించారు. ఉద్యోగ భద్రత అనేది అసలు ఎప్పుడూ నిజం కాదని, ఉద్యోగంపై మాత్రమే ఆధారపడటం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.తన తండ్రి ఉదాహరణను ప్రస్తావిస్తూ, “నా తండ్రి పీహెచ్డీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి. ఒక్కరోజు కూడా పని మానలేదు. అయినా చివరికి అప్పులతోనే మరణించారు” అని ఆయన అన్నారు. విద్యాసంస్థలు మంచి ఉద్యోగులుగా తయారు చేస్తాయని, కానీ డబ్బు ఎలా పనిచేస్తుందో మాత్రం నేర్పవని విమర్శించారు. డబ్బు వ్యవస్థపై మాట్లాడుతూ, “సేవింగ్స్లో డబ్బు ఉంచడం వల్ల ద్రవ్యోల్బణం నెమ్మదిగా దాన్ని తినేస్తుంది. ఉద్యోగుల ఆదాయం ఆగిపోయినప్పుడు వారికి ఆదాయం ఇచ్చే ఆస్తులు లేకపోవడమే అసలు సమస్య” అని ఆయన తెలిపారు.తన చిన్నప్పుడే “రేపు ఉద్యోగం పోతే నీ ఆస్తుల ద్వారా ఎంతకాలం జీవించగలవు?” అని తన ‘రిచ్ డ్యాడ్’ అడిగిన ప్రశ్నను గుర్తుచేసుకున్న కియోసాకి, ఉద్యోగ భద్రత గురించి ఆలోచించే వారికంటే, “నేను ఏ ఆస్తిని నిర్మిస్తున్నాను?” అని ఆలోచించే వారే భవిష్యత్తులో నిలబడతారని పేర్కొన్నారు.“ప్రపంచం మారిపోయింది. కానీ పాత సలహాలు మాత్రం మారలేదు. ఏఐ విప్లవం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది” అని కియోసాకి తన పోస్టులో హెచ్చరించారు. -
మళ్లీ ఎంఎంటీసీ.. రూ.10కే డిజిటల్ గోల్డ్, సిల్వర్!
డిజిటల్ రూపంలో బంగారం, వెండిని నేరుగా కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఎంఎంటీసీ–పీఏఎంపీ ప్లాట్ఫామ్ తిరిగి ప్రారంభమైంది. ఎంఎంటీసీపీఏఎంపీ వెబ్సైట్, ఆండ్రాయిడ్ యాప్ నుంచి, అలాగే గూగుల్ పే, పేటీఎం, ఫోన్పే యాప్స్ నుంచి కూడా కొనుగోలు చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది.ఈ సంస్థ డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్ను మొదటిసారి 2017లో, డిజిటల్ వెండి కొనుగోళ్లకు 2023లో అవకాశం కల్పించింది. మరింత మెరుగైన అనుభవానికి వీలుగా వెబ్సైట్ను నవీకరించేందుకు 2024 చివర్లో ఈ సేవలను నిలిపివేసింది. ఈ కాలంలో థర్డ్ పార్టీ (ఫోన్పే తదితర) యాప్స్ ద్వారా కొనుగోళ్లకు అవకాశం కల్పించింది. నవీకరించిన వెబ్సైట్ను తాజాగా ప్రారంభించినట్టు సంస్థ ప్రకటించింది.కనీసం రూ.10 నుంచి డిజిటల్ గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. ప్రతీ కొనుగోలు విలువకు సరిపడా భౌతిక బంగారం, వెండిని బీమా రక్షణతో కూడిన ఖజానాల్లో ఎంఎంటీసీ–పీఏఎంపీ భద్రపరుస్తుంది. బంగారం, వెండిపై పెట్టుబడులకు ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మొగ్గు చూపిస్తున్న నేపథ్యంలో ఎంఎంటీసీ తిరిగి ఈ ప్లాట్ఫామ్ను తీసుకురావడం గమనార్హం. -
45 ఏళ్లకే రిటైర్ అవ్వొచ్చా? చాట్ జీపీటీ రెస్పాన్స్
వేగవంతమైన జీవనశైలిలో 60 ఏళ్ల వరకు పనిచేయడం అనేది ఒకప్పుడు సాధారణం. కానీ, ఇప్పటి యువతరం 40 ఏళ్లకే ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటోంది. 30 ఏళ్ల యువకుడు నెలకు రూ.1.5 లక్షల ఆదాయంతో ముంబై వంటి నగరంలో ఉంటూ 45 ఏళ్లకే పదవీ విరమణ ఎలా చేయాలి? ఈ ప్రశ్నపై ఏఐ దిగ్గజం చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఆర్థిక వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అత్యంత సంక్లిష్టమైన ఆర్థిక లెక్కల కంటే క్రమశిక్షణతో కూడిన జీవనశైలియే ముందస్తు పదవీ విరమణకు కీలమని ఏఐ స్పష్టం చేస్తోంది.పెట్టుబడి కంటే పొదుపే ముఖ్యం!త్వరగా రిటైర్ అవ్వాలంటే చాలామంది ఏ మ్యూచువల్ ఫండ్ బాగుంటుంది? ఏ స్టాక్లో లాభాలు వస్తాయి? అని వెతుకుతుంటారు. కానీ, చాట్ జీపీటీ ఇచ్చిన సలహా ఆశ్చర్యకరంగా ఉంది. దీని ప్రకారం, ముందస్తు పదవీ విరమణకు పెట్టుబడి రాబడి ముఖ్యం కాదు, ఎంత పొదుపు చేస్తున్నామనేదే కీలకం.ఏఐ సూచించిన ప్రాథమిక సూత్రం60:40 నిష్పత్తి: ఉదాహరణకు నెలకు వచ్చే మీ రూ.1.5 లక్షల ఆదాయంలో రూ.60,000 మాత్రమే ఖర్చు చేయాలి. మిగిలిన రూ.90,000ను కచ్చితంగా పెట్టుబడిగా మార్చాలి.ముంబైలో జీవనశైలి పెరిగే ప్రమాదం ఉంది. ఎంత జీతం పెరిగినా ఆ అదనపు మొత్తాన్ని కూడా పెట్టుబడికే మళ్లించాలని ఏఐ సూచిస్తోంది.కేవలం డబ్బు దాచడమే కాకుండా దానిని సరైన మార్గాల్లో మళ్లించడం ద్వారా 15 ఏళ్లలో మెరుగైన కార్పస్ను నిర్మించవచ్చని ఏఐ విశ్లేషించింది.విభాగంనెలవారీ కేటాయింపుసూచనఈక్విటీ/ఇండెక్స్ ఫండ్స్రూ. 75,000దీర్ఘకాలిక కాంపౌండింగ్ కోసం డైరెక్ట్ ప్లాన్లను ఎంచుకోవాలి.డెట్/ఎమర్జెన్సీ ఫండ్రూ. 15,000లిక్విడ్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా ఆర్థిక భద్రత.నిర్వహణ వ్యయంరూ. 60,000అద్దె, ఆహారం, బీమా, ఇతర ఖర్చులు. సెబీ నిబంధనల ప్రకారం, రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్స్ ఖర్చు తక్కువ. కాబట్టి లాభాలు ఎక్కువగా ఉంటాయని ఏఐ గుర్తుచేస్తోంది.వ్యూహాత్మక మార్పుముంబైలో పెరుగుతున్న జీవన వ్యయం మీ పొదుపు లక్ష్యానికి అతిపెద్ద అడ్డంకి. కాబట్టి 45 ఏళ్ల వయసులో పదవీ విరమణ తర్వాత ముంబై నుంచి ప్రశ్న అడిగిన వ్యక్తి స్వస్థలమైన లఖ్నవూకు మారిపోవాలనే ఆలోచన చాలా తెలివైనదని ఏఐ అభినందించింది. లఖ్నవూలో నివసించడం వల్ల జీవన వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ఇది మీ కార్పస్ మరింత కాలం మన్నేలా చేస్తుంది.చాట్ జీపీటీ మాటల్లో చెప్పాలంటే, 10 నుంచి 15 ఏళ్ల పాటు డబ్బు విషయంలో కాస్త విసుగుగా అనిపించినా సరే, క్రమశిక్షణ తప్పకూడదు. ఏఐ చెబుతున్న ఈ పద్ధతిని పాటిస్తే మీ 45వ ఏట ఆర్థిక స్వేచ్ఛను పొందడం అసాధ్యమేమీ కాదు. అయితే, పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయని, ఏదైనా పెట్టుబడికి ముందు ఆర్థిక సలహాదారుడిని సంప్రదించడం ఉత్తమమని గుర్తుంచుకోండి.ఇదీ చదవండి: ఇండియన్స్ నిజంగా గ్రేట్! -
స్థిరమైన ఆదాయానికి.. సరికొత్త ప్లాన్!
అవీవా ఇండియా ‘అవీవా సెక్యూర్ నెస్ట్ యాన్యూటీ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. సింగిల్ ప్రీమియంతో స్థిరమైన ఆదాయాన్ని పొందే పరిష్కారమే ఈ ప్లాన్ అని సంస్థ ప్రకటించింది. 80 ఏళ్ల వయసు వరకు ఈ ప్లాన్లోకి ప్రవేశించొచ్చు. ఈ ప్లాన్ కింద ఒకరికి లేదంటే ఉమ్మడిగా కవరేజీని కూడా పొందొచ్చు.మరణానంతరం నామినీలకు కొనుగోలు ధరను చెల్లించే సదుపాయం కూడా ఉంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నిబంధనలకు అనుగుణంగా ఈ ప్లాన్ పనిచేస్తుందని అవీవా ఇండియా తెలిపింది. జీవిత కాలం పాటు స్థిరమైన ఆదాయానికి ఈ ప్లాన్ ద్వారా భరోసా ఇస్తున్నట్టు అవీవా ఇండియా ఎండీ, సీఈవో అసిత్ రథ్ తెలిపారు.బజాజ్ లైఫ్ ‘యంగ్ అచీవర్ ప్లాన్’ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ చదువుకునే పిల్లల పేరిట సంపద సృష్టితోపాటు, వారి భవిష్యత్ లక్ష్యాలకు కవరేజీతో కూడిన ‘బజాజ్ లైఫ్ యంగ్ అచీవర్ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పిల్లల కోసం కావాల్సినంత నిధిని (హామీతో కూడిన) సమకూర్చుకోవచ్చు. తల్లి/తండ్రి మరణిస్తే లేదా వైకల్యం పాలు కావడం లేదంటే ఎంపిక చేసిన 25 తీవ్ర అనారోగ్యాల్లో (క్రిటికల్ ఇల్నెస్) ఏదేనీ బారిన పడితే, ఆ తర్వాత భవిష్యత్ ప్రీమియంలు చెల్లించక్కర్లేదు. పాలసీ యథావిధిగా కొనసాగుతుంది.ఒకే విడత చెల్లింపులు లేదా పిల్లల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్రమానుగతంగా ఆదాయం అందుకునే ఆప్షన్లలో ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు. 5–12 ఏళ్ల మధ్య ప్రీమియం చెల్లింపుల కాలవ్యవధిని ఎంపిక చేసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపులకు, చివర్లో అందుకునే ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలున్నాయి.ఇదీ చదవండి: ఒక వ్యక్తి ఎన్ని లోన్స్ తీసుకోవచ్చు: RBI రూల్స్ ఏమిటి? -
Income Tax: డిడక్షన్లు కొనసాగుతాయా..
కొత్త చట్టం. కొత్త రూల్సు, కొత్త ఫారాలు. కొత్త ఆర్థిక సంవత్సరం. గత ఆర్థిక సంవత్సరం వరకు అమల్లో ఉన్న డిడక్షన్లు కొనసాగుతాయా? ఈ సంవత్సరం క్లెయిం చేసుకోవచ్చా? పాత చట్టంతో పాటు అవి కూడా పోతాయా? చాలా మంది ట్యాక్స్ పేయర్లు ఇలాంటి సందేహాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా అడుగుతున్నారు. ఒక మాటలో, సుందరకాండలో హనుమంతుడు చెప్పినట్లు చెప్పాలంటే, ‘కొనసాగుతాయి’ అని చెప్పాలి. ఇక వివరాల్లోకి వెళితే..పాత చట్టం, అంటే 1961 చట్టంలోని అంశాలు అన్నింటినీ యధాతథంగా కొనసాగించారు. భాష మారింది. సెక్షన్ల అంకెలు మారాయి. చెప్పవలసిన సందర్భం మారింది. అంతే కాని, అంశాలు, వాటి ఉద్దేశం, పరిమితులు, ఉప పరిమితులు, ఆంక్షలు, షరతులు, వర్తించే నియమావళి మారలేదు. ఒకప్పుడు చాప్టర్ VI-Aలో పొందుపర్చిన అంశాలను వేరొకచోట, సెక్షన్ల నంబర్లు మార్చి, వరుసగా, మరింత సరళమైన భాషతో, భావంతో మరింత నిర్మాణాత్మకంగా విశదీకరించారు.పాత సంవత్సరంలో అసెస్సీలకు, అంటే, మీకు, మనందరికి, ఇన్కం ట్యాక్స్ చెల్లించడానికి రెండు ఆప్షన్లు ఇచ్చారు. పాత పద్ధతిలో సెక్షన్ 80సి, 80డి, 80ఈ మొదలైన సెక్షన్ల ప్రకారం డిడక్షన్లు ఇచ్చారు. బేసిక్ లిమిట్ .. వయస్సును బట్టి ఉంది. రేట్లు 10 శాతం, 20 శాతం, 30 శాతం.కొత్త పద్ధతిలో ఎటువంటి డిడక్షన్లు ఇవ్వడం లేదు. బేసిక్ లిమిట్ ఎవరికైనా రూ. 3,00,000తో మొదలుపెట్టి రూ. 4,00,000కు పెంచారు. ప్రతి శ్లాబ్ను రూ. 4,00,000 చొప్పున పెంచారు. రేట్లు 5%, 10%, 15%, 20%, 25% తర్వాత 30%. ఇలా ఉంటుండగా ‘రిబేటు’ పేరిట పెద్ద రిలీఫ్ ఇచ్చి రూ. 12,75,000 ఆదాయం వరకు ఉద్యోగస్తులకు, ఇతరులకేమో రూ. 12,00,000 వరకు ఎటువంటి పన్నుభారం లేకుండా చేశారు. కొత్త పద్ధతిలో మీరు ఎటువంటి సేవింగ్స్ చేయనక్కర్లేదు. ఏమీ ఇన్వెస్ట్మెంట్ చేయనక్కర్లేదు. అంటే నగదు.. నగదంటే.. నగదు కాదు.. బ్యాంకు ద్వారా ఎటువంటి విధంగా బైటకు వెళ్లడం (ఔట్ఫ్లో) ఉండక్కర్లేదు. అంటే మీ చేతిలో ‘సర్ప్లస్’ ఉంటుంది. పాత పద్ధతిలో రూ. 10,00,000 నికర ఆదాయం దాటితే 30 శాతం వర్తిస్తుంది. కొత్త పద్ధతిలో రూ. 24,00,000 దాటితే 30 శాతం వర్తిస్తుంది. పైన చెప్పినదంతా మీకు ఇదివరకు తెలిసిందే. కొత్త అంశాలు లేవు. వీటిని యధాతథంగా కొత్త చట్టంలోకి తెచ్చారు. వాటికి అనుగుణంగా అనుసంధానం చేస్తూ రూల్సు, ఫారాలు మార్చారు. మీకు ఎన్నో సంవత్సరాలుగా పరిచయం ఉన్న సెక్షన్ 80సి ఇప్పుడు కొత్త చట్టంలో 123గా మారింది. అలాగే మరో సెక్షన్ 80డి ఇప్పుడు 127గా చలామణీలోకి వచి్చంది. ఇలాగే మిగతా అన్ని డిడక్షన్లు. కొత్త చట్టంలోనూ, కొత్త రూల్స్ ప్రకారం, కొత్త ఫారాల అమల్లో అదే సమస్య.. కాదు..కాదు.. అదే పరిస్థితి. రెండు రకాల ఆప్షన్లు. మీరు నిర్ణయించుకోవాల్సినది.. దేన్ని ఎంచుకోవాలని. పాతదా కొత్తదా.. గతంలో ఎన్నోసార్లు ఎన్నెన్నో ఉదాహరణలు ఇచ్చి వివరించాము. ఒక వ్యూహంతో నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయం తీసుకోవడానికి కొన్ని సలహాలు.కేవలం పన్నుభారం తగ్గే దిశలో ఆలోచిస్తే .. ఏదో ఒక కారణం వల్ల ప్రావిడెంట్ ఫండ్కి కాంట్రిబ్యూషన్ కంపల్సరీ. పిల్లలు చదువుకుంటున్నారు. ఫీజులు చెల్లించాలి. మెడికల్ అత్యవసరం లేదా కంపల్సరీ. ఇలాంటి సందర్భాల్లో మీరు మీ ఖాతా నుంచి ఖర్చు పెట్టక తప్పదు. నగదు బైటకు వెళ్లడం తప్పదు. ఇన్కం ట్యాక్స్ చట్టంతో సంబంధం లేకుండా ఖర్చు తప్పదు. అప్పుడు పాత పద్ధతిని ఎంచుకోండి. డిడక్షన్ క్లెయిమ్ చేయండి. మరొక పరిస్థితి. సేవింగ్స్ అవసరం లేదు. పిల్లలకు ఫీజులు కట్టక్కర్లేదు. అనారోగ్య భయం లేదు. అటువంటప్పుడు కొత్త పద్ధతిని ఎంచుకోండి. పన్నుయేతర అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి నిర్ణయం తీసుకోవాలంటే.. పాత పద్ధతిలో ప్రతి డిడక్షన్కి కాగితాలు, రుజువులు ఉండాలి. వివరణ ఇవ్వాలి. కొత్త పద్ధతిలో ఎటువంటి కాగితాల్లాంటివి అవసరం లేదు.ఇతర అంశాలు.. సులభతరం కాబట్టి, యువతరం కొత్త పద్ధతివైపు మొగ్గు చూపుతున్నారు. వృద్ధులు జాగ్రత్తపరులుగా ఉండి, పాత పద్ధతివైపు వెళ్తున్నారు. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి. గడువు తేదీ దాటితే పాతపద్ధతిలో వేయలేరు. యజమానికి ముందుగా చెప్పాలి. వ్యాపారస్తులు, వృత్తి నిపుణులకు మారి్పడి విషయంలో ఆంక్షలు ఉన్నాయి. ఆలోచించుకుని సరైన నిర్ణయం తీసుకోండి. -
ఆదాయపన్నుకు డెడ్లైన్!
ఆదాయపన్ను రిటర్నుల దాఖలు పన్ను వర్తించే ఆదాయం పరిధిలో ఉన్న వారందరూ తప్పనిసరిగా చేయాల్సిన పని. అది కూడా గడువులోపు దాఖలు చేయడం ఉత్తమం. పన్ను వర్తించేంత ఆదాయం లేకపోయినా సరే, కొన్ని లావాదేవీల్లో (టీడీఎస్ తదితర) భాగస్వాములై ఉన్నా కానీ రిటర్నులు దాఖలు చేయాల్సిందే. అంతేకాదు పన్ను వర్తించే ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 మించుతుంటే ముందస్తు పన్ను చెల్లింపుల బాధ్యత కూడా ఉంటుంది. కనుక ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఆదాయపన్ను నిబంధనల పాటింపునకు సంబంధించి కీలక తేదీలను ఒక్కసారి తెలుసుకుందాం.మే 2026 మే 7: ఏప్రిల్ 2026 నెలకు సంబంధించిన టీడీఎస్/టీసీఎస్ డిపాజిట్ చేయాలి. మే 15: ఏప్రిల్ నెలకు సంబంధించి శాలరీ (ఫారమ్ 16), ఇతర పేమెంట్లకు (ఫారమ్ 16ఏ) టీడీఎస్ సర్టిఫికెట్లు జారీ చేయాలి. మే 30: జనవరి–మార్చి 2026 త్రైమాసికానికి సంబంధించి టీసీఎస్ సర్టిఫికెట్లు జారీ చేయాలి. మే 31: అధిక విలువ కలిగిన ఆర్థిక లావాదేవీల నివేదిక (ఫారమ్ 61ఏ), ఆస్తి లావాదేవీల నివేదిక (ఫారమ్ 61బీ) దాఖలు చేయడానికి చివరి తేదీ. స్వచ్ఛంద సంస్థలు తమ విరాళాల నివేదికను (ఫారమ్ 10బీడీ) దాఖలు చేయాలి.జూన్ 2026 జూన్ 7: మే 2026 నెలకు సంబంధించిన టీడీఎస్/టీసీఎస్ డిపాజిట్ చేయాలి. జూన్ 15: మొదటి విడత అడ్వాన్స్ టాక్స్ (సంవత్సరం మొత్తం పన్ను బాధ్యత అంచనాలో 15శాతం) చెల్లించడానికి చివరి తేదీ. జూన్ 30: మే నెలకు సంబంధించిన టీడీఎస్ చలాన్–స్టేట్మెంట్ దాఖలు చేయాలి. ఏఐఎఫ్లు క్రితం త్రైమాసిక నివేదికలను సమరి్పంచాలి.జూలై 2026 జూలై 31: ఆడిట్ అవసరం లేని వ్యక్తులు, హెచ్యూఎఫ్లు తమ ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్–1 లేదా ఐటీఆర్–2) దాఖలు చేయడానికి చివరి తేదీ.ఆగస్టు 2026 ఆగస్టు 15: ఏప్రిల్–జూన్ (క్యూ1) త్రైమాసికానికి సంబంధించిన టీడీఎస్ రిటర్నులు దాఖలు చేయాలి. ఆగస్టు 31: ఆడిట్ అవసరం లేని వ్యాపార నిపుణులు ఐటీఆర్–3 లేదా ఐటీఆర్–4 దాఖలు చేయడానికి పొడిగించిన గడువు.సెప్టెంబర్ 2026 సెప్టెంబర్ 15: రెండో విడత అడ్వాన్స్ టాక్స్ (మొత్తం 45శాతం) చెల్లించడానికి చివరి తేదీ. సెపె్టంబర్ 30: జూలై–సెప్టెంబర్ (క్యూ2) త్రైమాసికానికి సంబంధించిన టీడీఎస్ రిటర్నులు దాఖలు చేయాలి.అక్టోబర్ 2026 అక్టోబర్ 31: ఆడిట్ అవసరమైన వ్యాపారస్తులు, నిపుణులు తమ ఐటీఆర్–3/ఐటీఆర్–4 రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ.నవంబర్ 2026 నవంబర్ 30: అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించిన వారు ’ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ రిపోర్ట్’ (ఫారమ్ 3సీఈబీ) సమరి్పంచాలి.డిసెంబర్ 2026 డిసెంబర్ 15: మూడో విడత అడ్వాన్స్ టాక్స్ (మొత్తం 75శాతం) చెల్లించడానికి చివరి తేదీ. డిసెంబర్ 31: ఆలస్యంగా దాఖలు చేసే రిటర్నులకు పెనాలీ్టతో దాఖలు చేయడానికి చివరి అవకాశం.జనవరి 2027 జనవరి 31: ఉద్యోగులు తమ పన్ను ఆదాకు సంబంధించిన పెట్టుబడుల వివరాలను యజమాన్యానికి సమర్పించాలి.ఫిబ్రవరి 2027ఫిబ్రవరి 15: జనవరి నెలకు సంబంధించిన పీఎఫ్, ఈఎస్ఐ జమ చేసేందుకు గడువు.మార్చి 2027మార్చి 15: చివరి విడత అడ్వాన్స్ టాక్స్ (100 శాతం) చెల్లించడానికి గడువు. మార్చి 31: పన్ను ఆదా కోసం ఉద్దేశించిన పెట్టుబడులకు, సవరణ రిటర్నలు, ఆలస్యపు రిటర్నుల దాఖలుకు చివరి తేదీ. -
ఒక్క EMI ఎగ్గొట్టినా కష్టమే.. RBI కొత్త రూల్స్ ఎఫెక్ట్!
బ్యాంకింగ్లో రుణాల స్వరూపం తీరుతెన్నులను సమూలంగా మార్చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది. సమస్య వచ్చాకా పరిష్కారం వెతుక్కోవడం కన్నా అసలు సమస్యే రాకుండా బ్యాంకులు ముందు జాగ్రత్త తీసుకునేలా ఈసీఎల్ .. అంటే ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ విధానాన్ని ప్రతిపాదించింది. సరళంగా చెప్పాలంటే ఇచ్చిన రుణంపై నష్టం వచ్చే రిసు్కలను బ్యాంకులు ముందుగానే అంచనా వేసుకోగలగాలి. దానికి తగ్గట్లుగా ఆ మేరకు నిధులను పక్కన పెట్టుకోవాలి.వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ రూల్స్తో రుణాల తీరుతెన్నులు మారిపోతాయని నిపుణులు చెబుతున్నారు. సరే అదేదో బ్యాంకులకు సంబంధించిన వ్యవహారం కదా మనకేంటి అనుకుంటే పొరపాటే. దీని వల్ల రుణాలు తీసుకున్న, తీసుకోబోతున్న వారందరిపైనా ప్రభావం పడబోతోంది. ఇంతకీ, అసలు ఈ రూలేంటి.. దాని ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయనేది వివరించేదే ఈ కథనం..దశాబ్దాలుగా బ్యాంకులు తమకు ‘వాటిల్లిన నష్టం’ ప్రాతిపదికన మొండిబాకీలకు కేటాయింపులు చేసే విధానాన్ని పాటిస్తూ వస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే రుణ గ్రహీత తాను తీసుకున్న లోన్ని కొన్నాళ్ల పాటు చెల్లించక, అది బాకీగా మారితే గానీ దాన్ని మొండిపద్దు కింద వర్గీకరించడం లేదు. దాన్ని నష్టంగా పరిగణించి నిధులను పక్కన పెట్టడం లేదు. అంటే రుణ గ్రహీత విషయంలో కాస్త ఉదారంగా ఉంటున్నట్లే. ఎందుకంటే ఒకసారి మొండిపద్దుగా వర్గీకరిస్తే దాని వసూలుకు తీసుకునే చర్యలు వేరేగా ఉంటాయి. క్రెడిట్ ప్రొఫైల్పై ప్రభావమూ వేరేగా ఉంటుంది.ఒకరకంగా ముందుగానే సదరు రుణం మొండిబాకీగా మారే అవకాశాలను అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోవడం కన్నా, పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, కొత్తగా వచ్చే ఈసీఎల్ నిబంధనలతో ఈ వేచి చూసే ధోరణికి కాలం చెల్లిపోతుంది. బ్యాంకులు ఇకపై రాబోయే రోజుల్లో రుణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకోవాల్సి రానుంది. తలెత్తబోయే రిసు్కలను ఊహించుకుని, ముందుగానే ప్రొవిజనింగ్తో సిద్ధంగా ఉండాలి. ఎప్పుడో తీరిగ్గా స్పందించడం కాకుండా, సింగిల్ పేమెంట్ మిస్ అయినా, వెంటనే స్పందించి, క్రియాశీలకంగా చర్యలు తీసుకోవాలి.మరి దీని ప్రభావం ఏంటి.. ఇలా ఆర్బీఐ నిబంధనలను కఠినతరం చేసేయడమనేది మీ నెలవారీ ఖర్చులపైనా ప్రభావం చూపనుంది. రాబోయే నష్టాల రిసు్కలను అంచనా వేసి, వాటికి అనుగుణంగా బ్యాంకులు కొంత మొత్తాన్ని పక్కన పెట్టాల్సి రావడం వల్ల, వాటికి వ్యాపారం ఖరీదైన వ్యవహారంగా మారిపోతుంది. దీనితో మార్జిన్లను కాపాడుకునేందుకు అవి వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచాల్సి రావొచ్చు. ఫలితంగా మీరు కారు రుణం తీసుకోవాలన్నా.. పర్సనల్ లోన్లాంటివి తీసుకోవాలనుకున్నా వడ్డీ రేటు మరికాస్త పెరిగిపోవచ్చు.కొత్త ప్రమాణాలు..క్రెడిట్ స్కోరును పెద్దగా పట్టించుకోనివారికి ఈ కొత్త నిబంధనలు మేల్కొలుపులాంటివి. రుణం దొరకడమనేది కఠినతరమైన వ్యవహారంగా మారుతుంది. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారి క్రెడిట్ అలవాట్లను ట్రాక్ చేసేందుకు బ్యాంకులు మూడంచెల పర్యవేక్షణ విధానానికి మారతాయి. మొదటి అంచెలో, ఆరోగ్యకరమైన అకౌంట్లు ఉంటాయి. రెండో అంచెలో అప్పుడప్పుడే కాస్త స్ట్రెస్ మొదలవుతున్న దాఖలాలు కనిపించే ఖాతాలు ఉంటాయి. ఇక మూడో అంచెలో డిఫాల్ట్ అయిన ఖాతాలు ఉంటాయి. ఉదాహరణకు, మీరో రుణం తీసుకున్నారు. ఏదో కారణం వల్ల ఈఎంఐలను కట్టడంలో జాప్యం చేశారు.ప్రస్తుతమైతే బ్యాంకులు కాస్త చూసీ చూడనట్లుగా పెనాలీ్టల్లాంటివి వేసి వదిలేస్తున్నాయే గానీ ఇకపై ఇలా జరిగితే మీరు వెంటనే హై రిస్క్ కేటగిరీలోకి వెళ్లిపోతారు. ఇచ్చిన రుణం రెండో గ్రేడ్లోకి జారిన పక్షంలో తమకి జరిమానా పడే అవకాశం ఉన్నందున, బ్యాంకులు ముందునుంచే చాలా జాగ్రత్త వహిస్తాయి. తీసుకున్నవారు రెగ్యులర్గా చెల్లించకపోతున్నా, క్రెడిట్ స్కోరు పడిపోతున్న దాఖలాలు కనిపిస్తున్నా మరింత వేగంగా స్పందిస్తాయి. మీ మీద నిఘా మరింత పెంచేస్తాయి. అంటే రాబోయే రోజుల్లో రుణగ్రహీతలు ఏవో కొన్ని ఈఎంఐలు కట్టకపోతే మహా అయితే లేట్ ఫీజు పడుతుంది అంతేగా అనుకుని లైట్గా తీసుకునే పరిస్థితి ఉండదు. అసలుకే ఎసరొస్తుంది. ఖాతాలపై మానిటరింగ్ పెరగడమే కాకుండా భవిష్యత్తులో మీరు రుణం తీసుకుందామనుకున్నా అంత తేలిగ్గా దొరక్కపోవచ్చు. వ్యవస్థకు మేలే..వ్యక్తిగత స్థాయిలో రుణాలు తీసుకున్నవారికి ఈ నిబంధనలు కఠినతరంగా అనిపించినప్పటికీ ఒక క్రమశిక్షణ అలవడుతుంది. తద్వారా విస్తృత స్థాయిలో ఆర్థిక వ్యవస్థకు మేలే జరుగుతుంది. రాబోయే తలనొప్పులను ముందుగానే గుర్తించేలా బ్యాంకులపై ఒత్తిడి పెంచడం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం పటిష్టంగా అయ్యేలా ఆర్బీఐ చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా భారీ బ్యాంకింగ్ సంక్షోభాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఆర్థికంగా మందగమనాల్లాంటివేవైనా తలెత్తినా బ్యాంకులు ‘ఆరోగ్యకరంగా’నే ఉంటాయి. ఇక రుణాలు తీసుకున్న వారి విషయానికొస్తే.. క్రెడిట్ డిసిప్లిన్ అనేది సూపర్పవర్లాంటిది గుర్తెరిగి వ్యవహరించడం వల్ల రుణ ప్రయాణాలు సాఫీగా సాగుతాయి.‘ఆరోగ్యకరంగా’నే ఉంటాయి. ఇక రుణాలు తీసుకున్న వారి విషయానికొస్తే.. క్రెడిట్ డిసిప్లిన్ అనేది సూపర్పవర్లాంటిది గుర్తెరిగి వ్యవహరించడం వల్ల రుణ ప్రయాణాలు సాఫీగా సాగుతాయి.అంశంప్రభావంరుణ లభ్యతకాస్త కఠినతరంవడ్డీ రేట్లుస్వల్పంగా పెరగొచ్చుక్రెడిట్ డిసిప్లిన్ఇకపై మరింత కీలకంబ్యాంకింగ్మరింత పటిష్టంఏం చేయాలంటే.. ఈఎంఐలు సకాలంలో చెల్లించేయాలి. క్రెడిట్ స్కోరు బాగుండేలా చూసుకోవాలి అతిగా రుణాలు తీసుకోవడం మానేయాలి -
కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్లు: స్థిరమైన ఆదాయం, పిల్లల భవిష్యత్తు
న్యూఢిల్లీ: అవీవా ఇండియా ‘అవీవా సెక్యూర్ నెస్ట్ యాన్యూటీ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. సింగిల్ ప్రీమియంతో స్థిరమైన ఆదాయాన్ని పొందే పరిష్కారమే ఈ ప్లాన్ అని సంస్థ ప్రకటించింది. 80 ఏళ్ల వయసు వరకు ఈ ప్లాన్లోకి ప్రవేశించొచ్చు. ఈ ప్లాన్ కింద ఒకరికి లేదంటే ఉమ్మడిగా కవరేజీని కూడా పొందొచ్చు.మరణానంతరం నామినీలకు కొనుగోలు ధరను చెల్లించే సదుపాయం కూడా ఉంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నిబంధనలకు అనుగుణంగా ఈ ప్లాన్ పనిచేస్తుందని అవీవా ఇండియా తెలిపింది. జీవిత కాలం పాటు స్థిరమైన ఆదాయానికి ఈ ప్లాన్ ద్వారా భరోసా ఇస్తున్నట్టు అవీవా ఇండియా ఎండీ, సీఈవో అసిత్ రథ్ తెలిపారు. బజాజ్ లైఫ్ ‘యంగ్ అచీవర్ ప్లాన్’ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ చదువుకునే పిల్లల పేరిట సంపద సృష్టితోపాటు, వారి భవిష్యత్ లక్ష్యాలకు కవరేజీతో కూడిన ‘బజాజ్ లైఫ్ యంగ్ అచీవర్ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పిల్లల కోసం కావాల్సినంత నిధిని (హామీతో కూడిన) సమకూర్చుకోవచ్చు. తల్లి/తండ్రి మరణిస్తే లేదా వైకల్యం పాలు కావడం లేదంటే ఎంపిక చేసిన 25 తీవ్ర అనారోగ్యాల్లో (క్రిటికల్ ఇల్నెస్) ఏదేనీ బారిన పడితే, ఆ తర్వాత భవిష్యత్ ప్రీమియంలు చెల్లించక్కర్లేదు.పాలసీ యథావిధిగా కొనసాగుతుంది. ఒకే విడత చెల్లింపులు లేదా పిల్లల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్రమానుగతంగా ఆదాయం అందుకునే ఆప్షన్లలో ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు. 5–12 ఏళ్ల మధ్య ప్రీమియం చెల్లింపుల కాలవ్యవధిని ఎంపిక చేసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపులకు, చివర్లో అందుకునే ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలున్నాయి. -
బయోమెట్రిక్తో యూపీఐ, కార్డు చెల్లింపులు
ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తమ ఐమొబైల్ యాప్లో యూపీఐ లావాదేవీల నిర్వహణ కోసం బయోమెట్రిక్ ఫీచర్ని అందుబాటులోకి తెచ్చింది. దీనితో ఫేషియల్ రికగ్నిషన్, ఫింగర్ప్రింట్ ధృవీకరణ ద్వారా రూ. 5,000 వరకు లావాదేవీలను చేయొచ్చని సంస్థ తెలిపింది. ప్రతి లావాదేవీకి ప్రత్యేకంగా యూపీఐ పిన్ నంబరును ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొంది.మరోవైపు, యాక్సిస్ బ్యాంక్, ఫిన్టెక్ ప్లాట్ఫాం పేయూతో కలిసి కార్డు చెల్లింపులకు బయోమెట్రిక్ ధృవీకరణను అందుబాటులోకి తెచ్చినట్లు ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తెలిపింది. దీనితో ఇకపైయాక్సిస్ బ్యాంక్ కార్డ్హోల్డర్లు ఫేస్ ఐడీ లేదా వేలిముద్ర ద్వారా చెల్లింపులను ఆమోదించవచ్చని పేర్కొంది. -
EPFO: రూ.7500లకు గనక పెంచితే..
ప్రైవేట్ రంగ ఉద్యోగుల చిరకాల కోరిక పెన్షన్ పెంపు. ఈపీఎఫ్ఓ (EPFO) పరిధిలోని పెన్షనర్లు గత పదేళ్లుగా దీని కోసం పోరాటం చేస్తున్నారు. ఇది ఒక కొలిక్కి రానుందా? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. 2014 నుండి నెలకు రూ. 1,000 గా ఉన్న కనీస పెన్షన్ మొత్తాన్ని రూ. 7,500 కు పెంచాలని ఈపీఎస్-95 (EPS-95) సభ్యులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.ఆర్థిక మంత్రితో భేటీ.. ఆశలకు చిగురు!రాబోయే బడ్జెట్ కంటే ముందే EPS-95 రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధి బృందం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కనీస పెన్షన్ను రూ. 7,500కు పెంచడంతో పాటు, దానికి కరువు భత్యాన్ని (DA) కూడా జోడించాలని వారు కోరారు. ఈ డిమాండ్లను సానుభూతితో పరిశీలిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో, లక్షలాది మంది పెన్షనర్లలో కొత్త ఆశలు చిగురించాయి. అయితే డిమాండ్ల ప్రకారం కనీస పెన్షన్ను రూ. 7,500కు పెంచుతారా? లేక ఎంతో కొంత పెంచుతారా అన్నదానిపై స్పష్టత లేదు.ప్రస్తుత లెక్కలు ఎలా ఉన్నాయి?ప్రస్తుతం ఈపీఎస్ నిబంధనల ప్రకారం పెన్షన్ను ఈ కింది ఫార్ములా ద్వారా లెక్కిస్తారు.నెలవారీ పెన్షన్ = (పెన్షన్ వర్తించే వేతనం X పెన్షన్ వర్తించే సర్వీస్ కాలం) / 70ఇక్కడ గరిష్ట వేతన పరిమితిని రూ. 15,000 గా నిర్ణయించారు. దీని ప్రకారం లెక్కేస్తే పెన్షన్ చాలా తక్కువగా వస్తోంది. ఒకవేళ ప్రభుత్వం కనీస పెన్షన్ను రూ. 7,500 కు పెంచితే, వివిధ సర్వీస్ కాలపరిమితులు ఉన్న వారికి వచ్చే మార్పులు ఇలా ఉండవచ్చు..సర్వీస్ ఆధారంగా పెన్షన్ అంచనాసర్వీస్ కాలంప్రస్తుత ఫార్ములా ప్రకారం పెన్షన్ప్రభుత్వం కనీస పెన్షన్ పెంచితే వచ్చేది10 ఏళ్లురూ. 2,142రూ. 7,50020 ఏళ్లురూ. 4,285రూ. 7,50025 ఏళ్లురూ. 5,357రూ. 7,500ఫార్ములా ప్రకారం వచ్చే పెన్షన్ కంటే ప్రభుత్వం నిర్ణయించే కనీస పెన్షన్ ఎక్కువగా ఉంటే, పెన్షనర్లకు ఆ కనీస మొత్తమే అందుతుంది.ఈపీఎస్ కంట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందంటే..ఉద్యోగి జీతం (బేసిక్ + డీఏ)లో 12 శాతం పీఎఫ్కి వెళ్తుంది. అదే యజమాన్యం చెల్లించే 12 శాతంలో 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)కు వెళ్తుంది. 3.67 శాతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) కు వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతుగా 1.16 శాతం బడ్జెట్ మద్దతును ఈ పెన్షన్ ఫండ్కు అందిస్తుంది.పెన్షన్ పొందడానికి అర్హతలు🔸కచ్చితంగా ఈపీఎఫ్వో సభ్యుడై ఉండాలి.🔸కనీసం 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.🔸58 ఏళ్లు నిండిన తర్వాత పూర్తి పెన్షన్ లభిస్తుంది. (50 ఏళ్లకే ముందస్తు పెన్షన్ తీసుకునే సదుపాయం ఉన్నప్పటికీ, పెన్షన్ మొత్తం కొంత తగ్గుతుంది).ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గనుక రూ. 7,500 ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, అది సామాన్యుల రిటైర్మెంట్ జీవితానికి కొండంత అండగా మారుతుంది. ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో ఈ పెంపు అత్యంత కీలకం కానుంది.ఇదీ చదవండి: హమ్మయ్య.. క్రెడిట్ కార్డులపై RBI బిగ్ రిలీఫ్ -
పోస్టాఫీసు బ్యాంక్లో కొత్త అకౌంట్.. జీరో బ్యాలెన్స్తో..
కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) కొత్త అకౌంట్ను తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా శక్తికి ఆర్థికంగా మరింత ఊతమిచ్చేందుకు 'స్వయం సహాయక బృందాల (SHG) పొదుపు ఖాతా'ను ప్రత్యేకంగా ప్రారంభించింది. ఎటువంటి ఛార్జీలు లేని ఈ ఖాతా ద్వారా మహిళా సంఘాలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ కానున్నాయి.ఈ ఖాతా ప్రత్యేకతలు ఇవే..మహిళా సంఘాల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ఖాతాలో అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.జీరో బ్యాలెన్స్: ఖాతాలో కనీస నిల్వ (Minimum Balance) ఉంచాల్సిన అవసరం లేదు. దీనిపై ఎలాంటి జరిమానాలు ఉండవు.పరిమితి: ఈ ఖాతాలో గరిష్టంగా రూ. 2,00,000 వరకు నగదును ఉంచుకోవచ్చు.ఉచిత సేవలు: నగదు జమ (Deposit), ఉపసంహరణ (Withdrawal)పై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. అలాగే, క్యూఆర్ (QR) కార్డ్ కూడా ఉచితంగానే అందజేస్తారు. ఖాతా మూసివేతకు (Account Closure) కూడా ఎటువంటి ఛార్జీలు లేకపోవడం విశేషం.స్టేట్మెంట్: ప్రతి నెలా ఒక ఫిజికల్ అకౌంట్ స్టేట్మెంట్ ఉచితంగా పొందవచ్చు.వడ్డీ రేట్లు ఇలా..పొదుపు మొత్తాన్ని బట్టి ఐపీపీబీ ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తోంది. రూ. 1 లక్ష వరకు అయితే ఏడాదికి 2.00% వడ్డీ, రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షల వరకు ఏడాదికి 2.25%వడ్డీ చెల్లిస్తుంది. ఈ వడ్డీ మొత్తాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి (త్రైమాసిక ప్రాతిపదికన) జమ చేస్తారు.ముఖ్యమైన ఛార్జీల వివరాలుఖాతా నిర్వహణ దాదాపు ఉచితం అయినప్పటికీ, కొన్ని సేవలపై నామమాత్రపు ఛార్జీలు వర్తిస్తాయి. SMS అలర్ట్స్ కోసం ప్రతి ఎస్ఎంఎస్కు రూ. 0.25 + GST, బ్యాలెన్స్ సర్టిఫికెట్ కోసం ఒక్కో దానికి రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. ఐపీపీబీ కాకుండా ఇతర నెట్వర్క్ (AePS) ద్వారా నగదు తీసినా లేదా జమ చేసినా (ఉచిత పరిమితి దాటిన తర్వాత) ప్రతి లావాదేవీకి రూ. 20 ఛార్జీ పడుతుంది. మినీ స్టేట్మెంట్కు రూ. 5 వసూలు చేస్తారు.ఖాతా తెరవడం ఎలా?అర్హత కలిగిన స్వయం సహాయక బృందాలు తమ సమీపంలోని పోస్టాఫీసును లేదా ఐపీపీబీ బ్రాంచ్ను సంప్రదించవచ్చు. సంఘానికి సంబంధించిన పత్రాలు, సభ్యుల ఆధార్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకెళ్లాలి.డిజిటల్ పద్ధతిలో లేదా ఫిజికల్ ఫారమ్ నింపి సులభంగా ఖాతాను ప్రారంభించవచ్చు. పోస్ట్మెన్ లేదా గ్రామీణ డాక్ సేవకుల సహాయంతో మీ ఇంటి వద్దే ఈ సేవలను పొందే వెసులుబాటు కూడా ఉంది. -
లైవ్ ధరలకు బంగారం.. ‘ధన్ గోల్డ్ వాల్ట్’ లాంచ్
పసిడి, వెండి కొనుగోళ్లకు సంబంధించి గోల్డ్ వాల్ట్ పేరిట ప్రత్యేక సాధనాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫాం ధన్ వెల్లడించింది. ఎంసీఎక్స్లో గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టుల్లో ట్రేడ్ చేయడంతో పాటు అవే లైవ్ ధరల ప్రకారం భౌతిక రూపంలో పసిడి, వెండిని కొనుగోలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.ఈ లావాదేవీల సెటిల్మెంట్, భౌతిక డెలివరీ ప్రక్రియను ఎంసీఎక్స్సీసీఎల్ పర్యవేక్షిస్తుంది. వినియోగదారులు తాము కొనుగోలు చేసిన లోహాలను అత్యంత సురక్షితమైన ఇనిస్టిట్యూషనల్ గ్రేడ్ వాల్ట్లలో కూడా భద్రపర్చుకోవచ్చు. ఈ ప్రక్రియలో ఎలాంటి హిడెన్ చార్జీలు, అదనపు రుసుములు ఉండవని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రవీణ్ జాదవ్ తెలిపారు. ఈ తరహా సాధనాల్లో ఇదే మొదటిదని పేర్కొన్నారు.డిజిటల్ బంగారం కొనుగోలు పద్ధతుల్లో ఈ ‘ధన్ గోల్డ్ వాల్ట్’ ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుంది. సాధారణంగా డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్స్ థర్డ్ పార్టీ వెండర్లపై ఆధారపడతాయి, కానీ ధన్ నేరుగా ఎంసీఎక్స్ లైవ్ ధరలను అనుసంధానించడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. వినియోగదారులు కేవలం 1 గ్రాము బంగారం లేదా వెండి నుండి తమ పెట్టుబడులను ప్రారంభించవచ్చు.భవిష్యత్తులో ఈ ప్లాట్ఫామ్ ద్వారా కొనుగోలు చేసిన బంగారాన్ని నేరుగా నగల రూపంలోకి మార్చుకునేందుకు లేదా అవసరమైనప్పుడు విక్రయించి నగదును తక్షణమే తమ బ్యాంక్ ఖాతాల్లోకి పొందేందుకు వీలుగా మరిన్ని ఫీచర్లను జోడించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా పెట్టుబడిదారులు మార్కెట్ ఒడుదొడుకులను గమనిస్తూ తక్కువ ధర ఉన్నప్పుడు తక్షణమే ఆర్డర్ పెట్టుకునే సౌలభ్యం ఉండటం దీని ప్రత్యేకత. -
హమ్మయ్య.. క్రెడిట్ కార్డులపై RBI బిగ్ రిలీఫ్
క్రెడిట్ కార్డ్ నిబంధనలను సవరిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు ఊరటనిస్తూనే, బ్యాంకుల పనితీరులో పారదర్శకత పెంచేలా ఈ కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, జరిమానాలు, రిపోర్టింగ్ విషయంలో ఆర్బీఐ ‘క్రెడిట్, డెబిట్ కార్డ్ జారీ-ప్రవర్తన ఆదేశాలు, 2026’లో కీలక మార్పులు చేసింది. ప్రధానంగా ఆలస్యపు చెల్లింపుల (Late Payments) విషయంలో కస్టమర్లపై పడే భారాన్ని తగ్గించడం ఈ సవరణల ముఖ్య ఉద్దేశం.ప్రధాన మార్పులు ఇవే..నిర్ణీత గడువు తేదీ (Due Date) ముగిసిన వెంటనే ఖాతాను ‘ఓవర్ డ్యూ’గా పరిగణించకూడదు. గడువు ముగిసిన తర్వాత మూడు రోజుల వరకు విండో కాలాన్ని అందించాలి. ఈ మూడు రోజుల్లోపు చెల్లింపు చేస్తే, దానిని ‘గత బకాయి’ (Past Due)గా పరిగణించరు, క్రెడిట్ స్కోర్పైనా ప్రభావం పడదు.గతంలో బ్యాంకులు మొత్తం బిల్లుపై జరిమానాలు విధించేవి. కానీ కొత్త నిబంధనల ప్రకారం, గడువు తర్వాత చెల్లించాల్సిన నికర బకాయి మొత్తంపై మాత్రమే జరిమానా విధించాలి.జరిమానా విధించడానికి మూడు రోజుల గ్రేస్ పీరియడ్ ఉన్నప్పటికీ, 'ఆలస్యమైన రోజుల' లెక్కింపు మాత్రం అసలు గడువు తేదీ నుంచే ప్రారంభమవుతుంది.కార్డుదారులకు కాస్త రిలీఫ్వినియోగదారులకు ఇది ఒక రకమైన 'సేఫ్టీ నెట్' లాంటిది. పొరపాటున ఒక రోజు ఆలస్యమైనా భారీ జరిమానాలు, క్రెడిట్ రేటింగ్ (Credit Score) పడిపోవడం వంటి సమస్యలు ఉండవు. అయితే, దీనిని అలవాటుగా మార్చుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే వడ్డీ రేట్లు, బిల్లింగ్ సైకిల్స్లో ఎటువంటి మార్పు ఉండదు. గడువు దాటిన తర్వాత చేసే ప్రతి ఆలస్యం బ్యాంకుల అంతర్గత రికార్డుల్లో నమోదవుతూనే ఉంటుంది.ఆర్బీఐ లక్ష్యం ఇదే..వివిధ బ్యాంకులు, కార్డు జారీ సంస్థలు తమకు నచ్చినట్లుగా జరిమానాలు విధించడం, క్రెడిట్ బ్యూరోలకు నివేదించడం వంటి పద్ధతులకు స్వస్తి పలకాలని ఆర్బీఐ భావిస్తోంది. ఆస్తి వర్గీకరణ, ఆదాయ గుర్తింపు నియమాలను అన్ని బ్యాంకులకు ఒకేలా వర్తింపజేయడం ఈ మార్పు వెనుక ఉన్న అసలు లక్ష్యం.అమలు ఎప్పటి నుంచి?ఈ సవరించిన నిబంధనలు ఏప్రిల్ 1, 2027 నుండి అమల్లోకి వస్తాయి. బ్యాంకులు తమ సాఫ్ట్వేర్ వ్యవస్థలను మార్చుకోవడానికి, వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ఆర్బీఐ ఈ గడువును ఇచ్చింది.ఇదీ చదవండి: వచ్చేది పెను సంక్షోభమే: కియోసాకి అలర్ట్ -
టాటా ఏఐఏలో సరికొత్త పెన్షన్ ప్లాన్
నేటి కాలంలో రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే కేవలం నిధిని సమకూర్చుకోవడమే కాదు, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని నిలకడగా ఆదాయం పొందే మార్గాన్ని వెతుక్కోవడం. ఈ అవసరాన్ని గుర్తిస్తూ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఇటీవల 'శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్'ను తీసుకువచ్చింది. ఇది జీవితకాలం పాటు స్థిరమైన గ్యారంటీడ్ ఆదాయాన్ని అందిస్తూనే, మార్కెట్ ఆధారిత వృద్ధి అవకాశాలను (నిఫ్టీ 50 పనితీరుకు అనుగుణంగా) మేళవించిన ఒక వినూత్న హైబ్రిడ్ రిటైర్మెంట్ సొల్యూషన్.ఈ ప్లాన్ ప్రధాన ప్రత్యేకత దాని ఫ్లెక్సిబిలిటీ. పాలసీదారులు తమ అవసరానికి తగ్గట్టుగా 60% నుండి 90% వరకు గ్యారంటీడ్ ఆదాయాన్ని, మిగిలిన 10% నుండి 40% వరకు మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ను ఎంచుకోవచ్చు. అంతేకాకుండా, పెన్షన్ వెంటనే ప్రారంభమయ్యే లేదా గరిష్టంగా 20 ఏళ్ల వరకు వాయిదా వేసుకునే సదుపాయం ఉంది. పెట్టుబడి పెట్టిన అసలు మొత్తాన్ని నామినీలకు తిరిగి ఇచ్చే 'రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్' ఆప్షన్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.ప్రీమియం చెల్లింపుల విషయంలో కూడా కస్టమర్లకు వెసులుబాటు కల్పించారు. ఏకమొత్తంగా లేదా 2 నుండి 12 ఏళ్ల కాలపరిమితితో ప్రీమియం చెల్లించవచ్చు. 35 ఏళ్ల వయస్సు నుంచే ఈ ప్లానింగ్ ప్రారంభించే అవకాశం ఉండటం వల్ల, యువ ప్రొఫెషనల్స్ నుండి రిటైర్మెంట్ ముంగిట్లో ఉన్న వారి వరకు అందరికీ ఇది అనువుగా ఉంటుంది. -
బంగారం ఇక అలంకారం కాదు.. ఆస్తి
పసిడి కొనుగోళ్లలో ఆభరణాల వినియోగమే పెద్ద మొత్తంలో ఉంటోంది. కానీ, ఈ ధోరణిలో క్రమంగా మార్పు వస్తోంది. బంగారం ధరలు ఇటీవలి కాలంలో బాగా ర్యాలీ చేయడం తెలిసిందే. దీంతో వినియోగం కంటే పసిడిపై పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) దేశంలో మొత్తం బంగారం కొనుగోళ్లలో పెట్టుబడుల వాటా 40 శాతానికి చేరుకుంటుందని రేటింగ్ సంస్థ కేర్ఎడ్జ్ అంచనా వేసింది. ఇక ఆభరణాల వినియోగం వాటా 60 శాతం లోపునకు దిగొస్తుందని పేర్కొంది. మన దేశంలో బంగారం కొనుగోళ్లలో దీర్ఘకాలం నుంచి ఆభరణాల వాటా 70 శాతంగా ఉంటుంటే, మిగిలిన 30 శాతం పెట్టుబడుల నుంచి ఉంటోంది. అంతర్జాతీయంగా చూస్తే మాత్రం ఆభరణాల వాటా పసిడి కొనుగోళ్లలో 50 శాతమే కావడం గమనార్హం. నిర్మాణాత్మక మార్పు.. దేశంలో బంగారం కొనుగోళ్లలో వస్తున్న నిర్మాణాత్మక మార్పునకు ఇది నిదర్శనమని కేర్ఎడ్జ్ డైరెక్టర్ అఖిల్ గోయల్ పేర్కొన్నారు. ప్రపంచంలో పసిడి వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉండడం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో చైనా, భారత్ కలసి సగం వాటా కలిగి ఉండడం విశేషం. ‘‘భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, బంగారం ధరల్లో కదలికలు, పోర్ట్ఫోలియోలో వైవిధ్యానికి పెరుగుతున్న ప్రాధాన్యం అన్నవి పసిడిపై పెట్టుబడుల డిమాండ్కు మద్దతుగా నిలుస్తాయి. 2026–27లో మొత్తం బంగారం వినియోగంలో పెట్టుబడి వాటా 35–40 శాతానికి చేరుతుంది. ఇక 60 శాతం ఆభరణాల వాటా అన్నది ప్రపంచ సగటు 50 శాతం కంటే ఎక్కువే’’అని అఖిల్ గోయల్ తెలిపారు. గోల్డ్ ఈటీఎఫ్లకు ఆదరణ.. పెట్టుబడుల్లో అధిక శాతం గోల్డ్ ఈటీఎఫ్ల రూపంలో ఉంటున్నట్టు కేర్ఎడ్జ్ నివేదిక తెలిపింది. ఒక్క గోల్డ్ ఈటీఎఫ్ల కొనుగోళ్లే 37.5 టన్నులు ఉంటాయని.. గత పదేళ్లలో మొత్తం పెట్టుబడుల కంటే ఇది ఎక్కువని పేర్కొంది. ఆ తర్వాత బంగారం కాయిన్లు, కడ్డీల రూపంలోఉంటోంది. స్వల్పకాల స్పెక్యులేటివ్ అవసరాలు కాకుండా.. డిమాండ్ ధోరణుల్లో నిర్మాణాత్మక మార్పుల నేపథ్యంలో బంగారం అధిక ధరల శ్రేణిలో కొనసాగనున్నట్టు కేర్ఎడ్జ్ తెలిపింది. ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ 2025లో ఆభరణాల వినియోగం బలంగా ఉందని, 10 శాతం పెరిగి రూ.4.8 లక్షల కోట్లకు చేరుకుందని వెల్లడించింది. ఆభరణాల కొనుగోళ్ల విలువ మాత్రం 15 శాతం తగ్గడం గమనార్హం. 2026లో ధరలు గరిష్ట స్థాయిల్లోనే ఉండొచ్చని కేర్ఎడ్జ్ అంచనా వేసింది.‘‘సంస్థాగత జ్యుయలరీ సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో 35 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేశాయి. ధరలు పెరిగినప్పటికీ వినియోగదారుల నుంచి ఆభరాణాలకు డిమాండ్ స్థిరంగా ఉంటోంది. కంపెనీల స్థూల మార్జిన్లు 170–200 బేసిస్ పాయింట్లు పెరుగుతాయని అంచనా. 2026–27లో స్థూల మార్జిన్లు 14–14.5 శాతానికి పరిమితం కావొచ్చు. ఎబిట్డా మార్జిన్లు 6.5–7 శాతం మేర ఉండొచ్చు’’అని తెలిపింది. వెండికి యువతరం కొనుగోలుదారుల నుంచి ఆసక్తి పెరుగుతున్నప్పటికీ సమీప కాలంలో బంగారాన్ని అది భర్తీ చేయలేదని పేర్కొంది. -
వ్యక్తిగత హెల్త్ పాలసీకి మైగ్రేషన్ ఇలా..
ప్రస్తుతం చాలా మటుకు సంస్థలు తమ ఎంప్లాయీ బెనిఫిట్ ప్యాకేజీలో భాగంగా గ్రూప్ మెడికల్ కవరేజ్ (జీఎంసీ) సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కంపెనీలు అందించే వేతన ప్యాకేజీలలో ఇది ఇప్పుడు ఒక కీలక భాగంగా మారింది. ఉద్యోగులకు ప్రాథమిక ఆరోగ్య బీమా రక్షణను అందించే ఈ జీఎంసీ పాలసీ, మీరు ఆ సంస్థలో ఉద్యోగం చేస్తున్నంత కాలం మాత్రమే వర్తిస్తుంది. 2020లో లాక్–డౌన్ తర్వాత కార్యకలాపాలు ప్రారంభించే సంస్థలు తమ ఉద్యోగులకు తప్పనిసరిగా ఆరోగ్య బీమా కల్పించాలని ఐఆర్డీఏఐ ఆదేశించడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది.అయితే, ఇది కేవలం ఉద్యోగంలో ఉన్నప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీ తదుపరి కంపెనీలో ఇటువంటి బీమా సౌకర్యం లేకపోయినా లేదా కవరేజీ తక్కువగా ఉన్నా పరిస్థితి ఏమిటి? కెరీర్ నుంచి విరామం తీసుకున్నప్పుడో లేదా ఫ్రీలాన్సర్గానో, వ్యాపారవేత్తగానో మారినప్పుడో ఆరోగ్య బీమాను ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఇక ఇప్పుడు ఇలాంటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. మీ జీఎంసీ పాలసీని వ్యక్తిగత పాలసీగా మార్చుకునే అవకాశం ఉంది. దీన్నే ‘కంటిన్యుటీ బెనిఫిట్’ అంటారు. అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.పాలసీని ఎలా మార్చుకోవాలంటే ముందుగా, మీ జీఎంసీ పాలసీలో మీ కుటుంబ సభ్యులకు కూడా కవరేజీ ఉంటే, మీరు దాన్ని ’ఫ్యామిలీ ఫ్లోటర్’ ప్లాన్గా మార్చుకోవచ్చు. కేవలం మీకు మాత్రమే కవరేజీ ఉంటే, ’ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్’ ప్లాన్ను ఎంచుకోవచ్చు. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి, మీ ప్రస్తుత గ్రూప్ పాలసీని అందిస్తున్న బీమా సంస్థకి మీ నిర్ణయాన్ని తెలియజేయాలి. పాలసీ గడువు ముగియడానికి లేదా రెన్యువల్కి కనీసం 30 రోజుల ముందే బీమా సంస్థకు సమాచారం ఇవ్వడం ఉత్తమం.వారి వద్ద ఉన్న వివిధ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను పరిశీలించి, మీ అవసరాలకు తగిన ప్లాన్ను ఎంచుకోండి. సరైన ప్లాన్ను ఎంపిక చేసుకున్న తర్వాత, దానికి సంబంధించిన ప్రపోజల్ ఫామ్, మైగ్రేషన్ ఫామ్ వంటి పత్రాలను అడగండి. వాటిలో మీ ప్రస్తుత పాలసీ వివరాలు, ఆరోగ్య చరిత్ర, క్లెయిమ్ వివరాలను నింపి సమర్పించాలి. బీమా సంస్థ మీ దరఖాస్తును పరిశీలించి ఆమోదించిన తర్వాత, డెబిట్/క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిబంధనల్లో చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం ఉంటుంది.మైగ్రేషన్తో ప్రయోజనాలు దీనివల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ’వెయిటింగ్ పీరియడ్’. జీఎంసీ పాలసీలో మీరు ఇప్పటికే పూర్తి చేసిన వెయిటింగ్ పీరియడ్ కాలం, కొత్త రిటైల్ పాలసీలో కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు, కొత్త పాలసీలో ఒక నిర్దిష్ట వ్యాధికి 4 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉండి, మీరు పాత జీఎంసీ 3 ఏళ్లు పూర్తి చేసి ఉంటే, కొత్త పాలసీలో మీరు కేవలం ఒక ఏడాది నిరీక్షిస్తే సరిపోతుంది.గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు అదే బీమా కంపెనీ: మీరు జీఎంసీని అదే బీమా సంస్థకు చెందిన రిటైల్ ప్లాన్లోకి మాత్రమే మర్చుకోగలరు. వైద్య పరీక్షలు: గ్రూప్ పాలసీలో సాధారణంగా మెడికల్ టెస్టులు ఉండవు. కానీ రిటైల్ పాలసీకి మారేటప్పుడు బీమా సంస్థ నిబంధల ప్రకారం పరీక్షలు చేయించుకోవాల్సి రావొచ్చు. బీమా మొత్తం పెంపు: మీరు బీమా కవరేజీని పెంచుకున్నా, వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనం పాత పాలసీలో ఉన్న మొత్తానికి మాత్రమే వర్తిస్తుంది. అదనంగా పెంచుకున్న మొత్తానికి కొత్తగా వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది ఉదాహరణకు జీఎంసీ సమ్ ఇన్సూర్డ్ రూ.3 లక్షలు కాగా, కొత్త పాలసీలో దాన్ని రూ.5 లక్షలకు పెంచుకున్నారని అనుకుందాం. అలాంటప్పుడు వెయిటింగ్ పీరియడ్ బెనిఫిట్ అనేది రూ.3 లక్షలకే వర్తిస్తుంది. మిగతా రూ.2 లక్షలకు వెయిటింగ్ పీరియడ్ యథాప్రకారంగానే వర్తిస్తుంది.పాలసీ నిబంధనలు: కొత్త పాలసీలోని మినహాయింపులు, నిబంధనలను జాగ్రత్తగా చదవండి. సమయానికి పాలసీని పునరుద్ధరించుకోవడం మర్చిపోవద్దు. మొత్తానికి, మీ జీఎంసీ పాలసీని రిటైల్ పాలసీగా మార్చుకోవడం వల్ల మీకు మెరుగైన రక్షణ, సౌలభ్యం లభిస్తాయి. పై విషయాలను దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయం తీసుకుంటే మైగ్రేషన్ ప్రక్రియ సజావుగా ఉంటుంది, అలాగే అత్యవసర వైద్య పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక భరోసా కూడా లభిస్తుంది. -
ఎరియర్స్ వచ్చాయా.. కొత్త ఫారాలు నింపండి..
కొత్త చట్టం, కొత్త రూల్స్, కొత్త ఫారాల వల్ల ఎన్నో మంచి మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు. సాంకేతికత, సులభతరం కోణంలోనే కాకుండా హేతుబద్ధీకరించే విధంగా ఇవి ఉన్నాయి. ఈ మార్పులతో కొత్త ఫారాల వల్ల ఒనగూరే ప్రయోజనాలు. సులభతరం అంశాలన్నీ నింపితే సమాచారం సమగ్రంగా ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. సాంకేతికంగా అనువుగా ఉండటం వల్ల ప్రాసెసింగ్ త్వరగా అవుతుంది. అటు చట్టం, ఇటు రూల్స్లోని అంశాలకి (మార్పులు) అనుగుణంగా, ఎటువంటి తికమక లేకుండా సాఫీగా, సజావుగా సాగుతుంది. పాత ఫారాల్లో ఉన్న తప్పొప్పులు, పొరపాట్లు, లోటుపాట్లు లేకుండా తయారు చేశారు. ఫారం నింపగానే అనుసంధానం కావడం వల్ల అన్నింటిని అన్వయించుకుని, ఇతర సమాచారం మీద ఆధారపడకుండా అధికారులు చకచకా పరుగెడతారు.పాత చట్టంలో 89 (1), ఫారం 10ఈ జీతాల ఎరియర్స్ రావడం, వాటిని, సంవత్సరాలవారీగా విడగొట్టి, ఆయా ఆర్థిక సంవత్సరాలకు సర్దుబాటు చేయడాన్ని 89 (1) సెక్షన్లో ప్రస్తావిస్తారు. ఆ అంశాలన్నీ ఫారం 10ఈ లో నింపాలి. అప్పుడు రిలీఫ్ లెక్కించాలి.కొత్త సెక్షన్ 157 (1), కొత్త రూల్స్ 97, కొత్త ఫారం 39 కొత్త సెక్షన్ 157 (1), దాన్ని అమలుపర్చడానికి ఉద్దేశించినది 97 రూలు. ఈ రెండింటినీ అనుసంధానిస్తూ ఫారం 39 తయారైంది. పాన్ లేనిదే ఈ కొత్త ఫారాన్ని నింపలేరు. దాఖలు చేయలేరు. కొత్త ఫారంలో ఏమేమి తెలియజేయాలి? తొలి భాగంలో వ్యక్తిగత వివరాలతో పాటు ఏ ఆర్థిక సంవత్సరంలో ఎరియర్స్ వచ్చాయో తెలియజేయాలి. మలి భాగంలో ముఖ్యమైన విషయం అంతా అంకెలమయంగా ఉంటుంది. డేటా అంతా రాయాలి. ఎరియర్స్ మీద ఎంత వచి్చంది రాయాలి. జీతం, గ్రాట్యుటీ, రిట్రెంచ్మెంట్ పరిహారం, పెన్షన్..ఇలా ఏదైనా కావొచ్చు అన్నీ రాయాలి. వీటిని సరిగ్గా నింపితే ఆ తర్వాత కాలమ్లో అన్నీ ఆటో పాపులేట్ అయిపోతాయి. పన్ను భారమెంత, ఆదాయం ఎంత, ఎరియర్స్ ఎంత, పన్ను ఎంత, ఉపశమనం (రిలీఫ్) ఎంత .. అన్నీ తెలుస్తాయి. చివరగా రిలీఫ్ ఎంతో లెక్కించి వస్తుంది.ఫారం 10ఈని అంతా చేతితో నింపాలి. మనమే అన్ని లెక్కలు చేయాలి. రాయాలి. బోలెడంత పని. యజమాని చేయరు. ఉద్యోగికి శ్రమతో కూడుకున్న పని. ఇప్పుడు ఇదంతా చిటికెలో అయిపోతుంది. ఈ సమాచారం అంతా ఆటోమేటిక్గా మీరు వేసే ఆదాయ పన్ను ఫారంలలో, అంటే ఐటీఆర్లలోకి వెళ్లిపోతుంది. కరెక్టుగా ఉంటే సమాచారం చాలా త్వరగా బదిలీ అవుతుంది.ఏయే డాక్యుమెంట్లు అవసరం.. మీ పాన్ కార్డు, మీ టీడీఎస్ సర్టిఫికెట్లు, మీ ఏఐఎస్ ఫారం, వచి్చన ఎరియర్స్ వివరాల గురించి తెలియజేసే పత్రం, ఫారం 130, ఫారం 168, గత సంవత్సరాల రిటర్నులు, పన్ను లెక్కింపుల ఎరియర్స్ వివరాలు కాగితాల రూపంలో కావాలి.అంతా ఆన్లైన్లోనే .. ఇది డిజిటల్ ఫారం. ఇది వరకు లాగా ఆఫ్లైన్లో వేయకూడదు. పోర్టల్లో దాఖలు చేయాలి. ఇందుకోసం మెనూకి వెళ్లి, ఫారం 39ని క్లిక్ చేయండి. బేసిక్ డేటా, ఎంపిక చేసిన కాలమ్లను సరిగ్గా నింపండి. రివ్యూ చేసుకోవచ్చు. రెండుసార్లు చెక్ చేసుకోవచ్చు. వెరిఫై చేయండి. ఫైల్ చేయండి. అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. ఇక తరువాత.. రిటర్ను వేయడమే! రిలీఫ్ మీకు వస్తుంది. ఏ అనుమతి కోసమూ ఆగనక్కర్లేదు. అయితే, రిటర్ను వేసేందుకు మరీ చివరి తేదీ వరకు ఆగకుండా, రెండు–మూడు నెలల ముందే ప్రాసెస్ మొదలుపెట్టండి.మీకు తెలిసిన పాత విశేషాలే అయినా.. మరోసారి.. ఉద్యోగులకు వర్తిస్తుంది. గత సంవత్సరం, ఈ సంవత్సరం ఎరియర్స్ ఒకేసారి ఏకమొత్తంగా రావొచ్చు. గత సంవత్సరంలో మీ ఆదాయం తక్కువ శ్లాబులో పన్నుకి గురి అయి ఉండాలి ఈ ఎరియర్స్ని ఆయా సంవత్సరాలకు సర్దుబాటు చేయడం వల్ల ఏం అవుతుందంటే, ఈ సంవత్సరం 30 శాతం బ్రాకెట్లో పడే ఆదాయం తగ్గి, గత సంవత్సరం 10 శాతానికి, 20 శాతానికి తగ్గొచ్చు. అంటే గత సంవత్సరం చేతికి వచ్చి ఉంటే తక్కువ రేటులోనే పన్ను భారం ఉండేది. ఇప్పటి 30 శాతానికి బదులుగా పన్ను భారం రేటు తగ్గి ఉండేది. ఆ ఉపశమనాన్నే రిలీఫ్ అంటారు. ఆల్ ది బెస్ట్. -
నో కాస్ట్లో అసలు కాస్ట్ ఎంత..?
‘రూ.1.20 లక్షలు ఖరీదు చేసే యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ ల్యాప్టాప్.. ఒకేసారి అంత పెట్టి కొనుగోలు చేయడం అందరికీ సాధ్యం కాదు. 6–9–12–18–24 నెలల సులభ వాయిదాల్లో, నో కాస్ట్ ఈఎంఐపై కొనుగోలు చేసుకోవచ్చన్న ఆఫర్ ఇస్తే.. చాలా మందికి ముందుకు వస్తారు. రూ.1.20 లక్షల ల్యాప్టాప్ నెలకు రూ.5,000తో చేతికి వస్తుంటే ఎవరు కాదనుకుంటారు చెప్పండి? కానీ, ఈ ఆఫర్ల వెనుక వాస్తవ అంశాలను ప్రతి కస్టమర్ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నిజంగానే ఎలాంటి వ్యయాలు ఉండవా? బయటకు చెప్పని చార్జీలేవైనా ఉంటాయా? అసలు ఈ ఆఫర్లు ఎలా పనిచేస్తాయి? అని ప్రశ్నించుకోవాలి. వడ్డీ ఉండదా? 🔸 నో కాస్ట్ ఈఎంఐ అంటే ఎంపిక చేసుకున్నన్ని నెలల పాటు సమాన వాయిదాల్లో చెల్లించాలి. దీనిపై వడ్డీ పడుతుంది. 🔸 ప్రతీ నెల వాయిదాపై బ్యాంక్ వడ్డీ విధిస్తుంది. 🔸 కాకపోతే ఈఎంఐ స్కీమ్ కాల వ్యవధిలో పడేంత వడ్డీని కొనుగోలు సమయంలోనే తగ్గింపు లభిస్తుంది. 🔸 కనుక కొనుగోలుదారులపై వడ్డీ భారం పడదు. 🔸 ముందే డిస్కౌంట్ ఇచ్చేయడంతో ప్రతి నెలా అసలుతోపాటు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. చార్జీలూ ఉంటాయ్.. 🔸 నిజానికి వడ్డీ ఒక్కటే ఉండదు. మిగిలిన చార్జీలు యథావిధిగా చెల్లించుకోవాల్సిందే. 🔸 ప్రతీ వాయిదాపై 18 శాతం జీఎస్టీ ఉంటుంది. 🔸 ఈఎంఐ లావాదేవీపై ప్రాసెసింగ్ చార్జీ కూడా పడుతుంది. లావాదేవీ విలువ ఆధారంగా ఈ మొత్తం రూ.200–999 మధ్య ఉంటుంది. దీనిపై మరో 18 శాతం జీఎస్టీ కూడా చెల్లించుకోవాలి. 🔸 ఈఎంఐలన్నింటినీ ముందే చెల్లించేస్తానంటే అందుకు అదనంగా కొంత సమర్పించుకోవాలి. ఒకవేళ 9 నెలల ఈఎంఐని మూడు నెలలకే ముగించేద్దామనుకుంటే బ్యాలన్స్ ఈఎంఐలపై 2–3 శాతం అదనంగా చెల్లించాల్సి రావచ్చు. ఉదాహరణ.. 🔸 రూ.50,000 ఖరీదు చేసే వస్తువు కొన్నారు. ఆరు నెలల ఈఎంఐ పెట్టుకున్నారు. 🔸 దీనిపై వడ్డీ సుమారుగా రూ.2,296 అనుకుందాం. ఇంత మేర కొనుగోలులో తగ్గుతుంది. దీంతో నికర కొనుగోలు ధర రూ.47,704 అవుతుంది. 🔸 తగ్గించిన రూ.2,296 మేర ప్రతి నెలా ఈఎంఐలో మళ్లీ ఆరు నెలల పాటు కలుస్తుంది. రూ.2,296 వడ్డీపై 18 శాతం జీఎస్టీ కింద మరో రూ.413 చార్జీ కూడా పడుతుంది. 🔸 ప్రాసెసింగ్ చార్జీ రూ.300 అనుకుంటే.. దీనికి 18 శాతం జీఎస్టీతో కలిపి రూ.354 చెల్లించాలి.క్రెడిట్ లిమిట్పై ప్రభావం..🔸 ఈఎంఐపై కొనుగోలు చేసిన వెంటనే అంత మేర కార్డు క్రెడిట్ లిమిట్ తగ్గిపోతుందని తెలుసుకోవాలి. 🔸 ఉదాహరణకు మీ కార్డుపై రూ.1,00,000 లిమిట్ ఉందనుకుందాం. 🔸 రూ.60,000 ల్యాప్టాప్ లేదా ఫోన్ కొనుగోలుతో లిమిట్ రూ.40,000కు తగ్గిపోతుంది. 🔸 అక్కడి నుంచి ప్రతి నెలా రూ.10,000 చొప్పున ఆరు నెలల ఈఎంఐ చెల్లించాలి. మొదటి నెల రూ.10,000 చెల్లించిన వెంటనే లిమిట్ అంత మేర పెరిగి రూ.50,000కు చేరుతుంది. రెండో నెలలో రూ.10,000 ఈఎంఐ చెల్లించిన తర్వాత లిమిట్ రూ.60,000కు పెరుగుతుంది. 🔸 క్రెడిట్ లిమిట్లో వడ్డీకి సరిపడా కూడా లాక్ అవుతుంది. అది కూడా ప్రతి నెలా ఈఎంఐ చెల్లించిన వెంటనే క్రమంగా విడుదలవుతూ వెళుతుంది. డిస్కౌంట్ ఎవరి ఆఫర్? 🔸 ముందు చెప్పుకున్నట్టు ఈఎంఐ వాయిదాతోపాటు బ్యాంక్లు వడ్డీని కూడా వసూలు చేస్తాయి. 🔸 ఈ వడ్డీని ఎక్కువ సందర్భాల్లో బ్రాండ్ (ఉదాహరణకు శామ్సంగ్ లేదా యాపిల్), రిటైలర్ భరిస్తారు. 🔸 కొన్ని సందర్భాల్లో బ్యాంక్ సైతం మర్చంట్ టైఅప్లలో భాగంగా కొంత మేర భరిస్తుంది. 🔸 అందుకే ఆరంభంలో అంత మేర డిస్కౌంట్ లభిస్తుంది. 🔸 ఈ ఆఫర్తో బ్రాండ్లు, వర్తకులు విక్రయాలు పెంచుకుంటారు. 🔸 క్రెడిట్ కార్డు సంస్థలకు కొత్త కస్టమర్లు పెరుగుతారు. 🔸అందుకే ఈ తరహా ఆఫర్లను ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటారు. క్రెడిట్ స్కోరుపైనా ప్రభావం? 🔸 ఈఎంఐపై కొనుగోలుతో క్రెడిట్ స్కోరుపై సానుకూల, ప్రతికూల ప్రభావాలకూ చాన్స్ ఉంటుంది. 🔸 ప్రతి నెలా ఈఎంఐని సకాలంలో చెల్లించిన విషయాన్ని బ్యాంక్లు సిబిల్, ఎక్స్పీరియన్ తదితర క్రెడిట్ బ్యూరో సంస్థలకు తెలియజేస్తాయి. ఇది క్రెడిట్ స్కోరును పెంచుతుంది. 🔸 రుణాల సమతుల్యతకు సాయపడుతుంది. క్రెడిట్ కార్డు స్వైప్నకే పరిమితం కాకుండా, రుణం తీసుకుని చెల్లించడం రుణ పరపతిని పెంచుతుంది. 🔸 విజయవంతంగా ఒక రుణాన్ని ముగించినట్టు మీ రిపోర్ట్లో నమోదు కావడం కూడా స్కోర్ను అధికం చేస్తుంది. 🔸 ఈఎంఐపై కొనుగోలు చేసే ముందు మీ లిమిట్ను ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఎందుకంటే సాధారణంగా క్రెడిట్ లిమిట్లో 30–40 శాతం మించి ఖర్చు చేయకుండా చూసుకోవాలి. లిమిట్లో వినియోగం 60 శాతం మించితే అది క్రెడిట్ స్కోర్పై ప్రతికూల ప్రభావానికి దారితీస్తుంది. 🔸 ఒక్క ఈఎంఐ చెల్లించడంలో విఫలమైనా అప్పుడు ఆలస్యపు రుసుం, దానిపై అదనపు వడ్డీ రేటు (36–48 శాతం) చెల్లించుకోవాల్సి వస్తుంది. దాంతో నో కాస్ట్ బదులు కాస్ట్ ఈఎంఐగా మారిపోయే ప్రమాదం ఉంది. 🔸 అంతేకాదు రుణ చెల్లింపుల్లో విఫలమైతే అది క్రెడిట్ స్కోరును బలహీనపరుస్తుంది. ఇవి తెలుసుకోండి.. 🔸 తమ వద్ద కొనుగోలుకు సరిపడా మొత్తం ఉన్నప్పటికీ.. జీరో కాస్ట్ ఉందని చెప్పి ఆఫర్పై కొనుగోలు చేయడం మంచి నిర్ణయమేమీ కాదు. 🔸 నో కాస్ట్ ఈఎంఐ కాకుండా స్పాట్ పేమెంట్పైనా బ్రాండ్లు, వర్తకులు భారీ డిస్కౌంట్ను ఫెస్టివల్, ప్రత్యేక సేల్స్ కార్యక్రమాల్లో భాగంగా ఆఫర్ చేస్తుంటారు. 🔸 ఉదాహరణకు రూ.50,000 కొనుగోలుపై 10 శాతం కార్డు డిస్కౌంట్ కింద రూ.5,000 తగ్గింపు పొందొచ్చు. అప్పుడు నో కాస్ట్ ఈఎంఐ కంటే స్పాట్ పేమెంట్ నయం. 🔸 అంతేకాదు మార్కెట్లో విచారిస్తే ఇంత కంటే తక్కువ మొత్తానికి నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ లేదా కార్డు పేమెంట్పై మరింత డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉండొచ్చు. -
ఒక వ్యక్తి ఎన్ని లోన్స్ తీసుకోవచ్చు: RBI రూల్స్ ఏమిటి?
ఈ రోజుల్లో ఇల్లు కొనాలన్నా?, భూములు కొనాలన్నా?, కారు కొనాలన్నా?, ఆఖరికి బైక్ కొనాలన్నా కూడా చాలామంది బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. అయితే ఇక్కడ చాలామంది మనసులో మెదిలే ప్రశ్న.. ఒక వ్యక్తి ఎన్ని లోన్స్ తీసుకోవచ్చు?, దీనికి ఏమైనా పరిమితులు ఉన్నాయా? అని. దీనికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఒక వ్యక్తి ఇన్నిసార్లు మాత్రమే లోన్ తీసుకోవాలి? అనే విషయంపై ఎలాంటి నిబంధన లేదు. కాబట్టి ఒకటి, రెండు లేదా అంతకంటే ఎక్కువ లోన్స్ తీసుకోవచ్చు. అయితే లోన్ ఇవ్వాలా?, వద్దా అనేది.. సదరు బ్యాంక్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.మీకు లోన్ ఇచ్చేముందు.. ఏ బ్యాంక్ అయినా ముందుగా మీ డీఐఆర్ (Debt to Income Ratio) చెక్ చేస్తుంది. అంటే మీకు నెలకు వచ్చే ఆదాయం ఎంత?, అప్పటికే మీరు ఏదైనా ఈఎంఐ చెల్లిస్తున్నారా? అనే విషయాన్ని బ్యాంక్ గమనిస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తికి వచ్చే ఆదాయంలో 35 శాతం ఈఎంఐ కోసం కేటాయించవచ్చు.ఉదాహరణకు ఒక వ్యక్తికి నెలకు రూ. లక్ష జీతం అనుకుంటే.. అందులో రూ.35000 ఈఎంఐ కోసం కేటాయించుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ఈఎంఐ కోసం కేటాయిస్తే ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే బ్యాంక్ లోన్ ఇవ్వడానికి నిరాకరించే అవకాశం ఉంటుంది. ఒకవేళా మీరు చెల్లించే లోన్ ఈఎంఐ నెలకు రూ.10వేలు మాత్రమే అయితే.. అలాంటి సందర్భంలో మీకు మరో లోన్ సులభంగా వస్తుంది.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల్లో మార్పు: ఏడు రోజుల్లో ఇలా..ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే?.. లోన్ ఇచ్చే బ్యాంక్ మీ సిబిల్ స్కోర్ కూడా చూస్తుంది. గతంలో ఎప్పుడైనా లోన్ తీసుకున్నారా?, దాన్ని చెల్లించడంలో ఏదైనా జాప్యం జరిగిందా? అనే విషయాలను కూడా బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు గమనిస్తాయి.ఒక వ్యక్తి ఒకటికంటే ఎక్కువ లోన్స్ తీసుకోకూడదనే రూల్ ఎక్కడా లేదు. కానీ ఎక్కువ లోన్స్ తీసుకుంటే మీ ఆర్ధిక పరిస్థితి కష్టమవుతుంది. మీరు తీసుకునే లోన్ అప్పటికి ఉపశమనం కలిగించవచ్చు. భవిష్యత్తులో భారమవుతుంది. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ లోన్స్ తీసుకునేవారు తప్పకుండా.. ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ''అప్పు తప్పు కాదు.. కానీ అప్పు ఎక్కువైతే ముప్పు'' తెస్తుంది. -
కొత్త క్రెడిట్ కార్డు.. మొబైల్ ఫోన్ ఉంటే చాలు!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన కస్టమర్ల కోసం డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ ఫిన్టెక్ కంపెనీ కివితో కలిసి యూపీఐ క్రెడిట్ కార్డ్ (UPI Credit Card) సేవలను ప్రారంభించింది. రూపే (RuPay) నెట్వర్క్తో అనుసంధానమైన ఈ క్రెడిట్ కార్డుల ద్వారా వినియోగదారులు నేరుగా యూపీఐ యాప్ల ద్వారా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు కలిగింది.సాధారణంగా క్రెడిట్ కార్డులను స్వైప్ మిషన్ల వద్ద మాత్రమే వాడతాము, కానీ ఈ కొత్త విధానంతో కస్టమర్లు తమ క్రెడిట్ కార్డ్ను భీమ్ (BHIM) లేదా ఇతర యూపీఐ యాప్లకు లింక్ చేసి, క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం ద్వారా సులభంగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చు.ఈ సదుపాయం వల్ల కస్టమర్లకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా జేబులో భౌతికమైన కార్డు లేకపోయినా, మొబైల్ ఫోన్ ఉంటే చాలు క్రెడిట్ లిమిట్ను వాడుకోవచ్చు. అంతేకాకుండా, ఈ కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై రివార్డు పాయింట్లు, క్యాష్బ్యాక్ ఆఫర్లు కూడా లభిస్తాయి. చిన్న తరహా వ్యాపారుల వద్ద సైతం క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసే అవకాశం ఉండటంతో, కస్టమర్ల కొనుగోలు శక్తి పెరుగుతుందని బ్యాంక్ వర్గాలు భావిస్తున్నాయి.సెటప్ చేసుకోవడం ఎలా?పీఎన్బీ కస్టమర్లు తమ వద్ద ఉన్న రూపే క్రెడిట్ కార్డును యూపీఐ యాప్లో సెటప్ చేసుకోవడం చాలా సులభం.💸 ముందుగా మీ యూపీఐ యాప్ను ఓపెన్ చేసి 'Add Credit Card' ఆప్షన్ను ఎంచుకోవాలి.💸అక్కడ 'PNB' బ్యాంకును సెలెక్ట్ చేసుకుంటే మీ క్రెడిట్ కార్డ్ వివరాలు కనిపిస్తాయి.💸ఆ తర్వాత మీ కార్డుకు సంబంధించిన ఆరు అంకెల పిన్ సెట్ చేసుకుంటే లావాదేవీలకు సిద్ధమైనట్లే.బ్యాంకింగ్ రంగంలో వస్తున్న ఈ మార్పులు సామాన్య వినియోగదారుడికి నగదు కొరత లేకుండా డిజిటల్ చెల్లింపుల వైపు అడుగులు వేయడానికి ఎంతో దోహదపడతాయి. పీఎన్బీ తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ ఇండియా లక్ష్యానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. -
EPFO: ఎన్నో మార్పులు.. త్వరలోనే మంచి రోజులు
వేతన జీవులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి రోజులు త్వరలోనే రానున్నాయి. తమ కష్టార్జితమైన ప్రావిడెంట్ ఫండ్ (PF) నగదును పొందే ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ ఈపీఎఫ్ఓ (EPFO) విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 2026 మధ్య నాటికి 'ఈపీఎఫ్ఓ 3.0' పేరుతో సరికొత్త అప్గ్రేడెడ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కొత్త మార్పులతో పీఎఫ్ ఉపసంహరణలు ఇకపై బ్యాంక్ లావాదేవీలంత సులభం కానున్నాయి. ఈ వ్యవస్థలో రాబోయే ప్రధాన మార్పులు ఇవే..ఏటీఎం, యూపీఐ ద్వారా నగదు ఉపసంహరణఈపీఎఫ్ఓ 3.0 లో అతిపెద్ద అప్డేట్ ఏంటంటే.. ఇకపై మీరు మీ పీఎఫ్ నగదును నేరుగా ఏటీఎంల ద్వారా లేదా యూపీఐ (UPI) యాప్స్ ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు. పేపర్ వర్క్, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, కేవలం ఆధార్ ఓటీపీ ధ్రువీకరణతో నేరుగా లింక్ అయిన బ్యాంక్ ఖాతాలోకి నగదు జమ అవుతుంది.రూ. 5 లక్షలకు పెరిగిన ఆటో-సెటిల్మెంట్ పరిమితిగతంలో ఆటో-సెటిల్మెంట్ పరిమితి కేవలం రూ. 1 లక్ష వరకు మాత్రమే ఉండేది. దీన్ని ఇప్పుడు ఏకంగా రూ. 5 లక్షలకు పెంచారు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో క్లెయిమ్ చేసిన కేవలం గంట వ్యవధిలోనే లేదా మరుసటి రోజు కల్లా నగదు చేతికి అందుతుంది.కంపెనీ ఆమోదం అక్కర్లేదు!చాలా సందర్భాల్లో కంపెనీలు క్లెయిమ్లను ధ్రువీకరించడంలో ఆలస్యం చేయడం వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడేవారు. కొత్త వ్యవస్థలో ఈ డిపెండెన్సీని తొలగిస్తున్నారు. ఆధార్ ఓటీపీ ద్వారా లేదా స్వీయ-ధ్రువీకరణ ద్వారా క్లెయిమ్లను వేగంగా సెటిల్ చేసుకోవచ్చు.ఫోన్ పే, గూగుల్ పేతో అనుసంధానంనేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో ఈపీఎఫ్ఓ ఒప్పందం కుదుర్చుకుంటోంది. దీనివల్ల ఫోన్పే (PhonePe) గూగుల్ పే (Google Pay), పేటీఎం (Paytm) వంటి పాపులర్ డిజిటల్ వాలెట్ల ద్వారా కూడా పీఎఫ్ లావాదేవీలను సులభంగా నిర్వహించే వెసులుబాటు కలుగుతుంది.ఉపసంహరణ నిబంధనల సరళీకరణవినియోగదారుల సౌకర్యార్థం ఉపసంహరణ కేటగిరీలను ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. వైద్య అవసరాలు: సర్వీస్ నిబంధన లేకుండా ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు.చదువు/వివాహం: నిర్ణీత సర్వీసు కాలం తర్వాత అనుమతి ఉంటుంది.గృహ అవసరాలు: ఇల్లు కొనడానికి లేదా నిర్మించడానికి కనీసం 5 ఏళ్ల సర్వీసు ఉండాలి.నిరుద్యోగం: ఒక నెల పాటు ఖాళీగా ఉంటే 75% నగదు, రెండు నెలలు దాటితే పూర్తి నగదు ఉపసంహరించుకోవచ్చు.ఈ వేగవంతమైన సేవలను పొందాలంటే మీ యూఏఎన్ (UAN) యాక్టివ్గా ఉండటంతో పాటు, దానికి ఆధార్, పాన్, సరైన బ్యాంక్ ఖాతా వివరాలు లింక్ అయి ఉండాలి. ప్రస్తుతం ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటి 32 ప్రముఖ బ్యాంకులతో ఈపీఎఫ్ఓ ఒప్పందం కుదుర్చుకుంది.ఇక పన్ను నిబంధనల విషయానికి వస్తే.. 5 ఏళ్ల నిరంతర సర్వీసు తర్వాత ఉపసంహరించుకునే నగదుపై పన్ను ఉండదు. అయితే, రూ. 50,000 మించిన విత్ డ్రాయల్స్ విషయంలో పాన్ కార్డు లింక్ చేయకపోతే టీడీఎస్ (TDS) వర్తిస్తుంది. మొత్తానికి, ఈపీఎఫ్ఓ 3.0 అందుబాటులోకి వస్తే కోట్లాది మంది వేతన జీవుల డిజిటల్ కల సాకారమై, పీఎఫ్ సెటిల్మెంట్లలో కొత్త శకం మొదలుకానుంది. -
వారెన్ బఫెట్ గోల్డెన్ రూల్స్
మ్యూచువల్ ఫండ్స్ అనగానే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి. అదే సమయంలో కొంత ఆందోళన కనిపిస్తుంది. సరైన ఫండ్ను ఎంచుకోవడానికి మేధావి అయి ఉండాలని, మార్కెట్ గమనాన్ని ప్రతిరోజూ గమనించాలని చాలామంది భావిస్తుంటారు. అయితే, ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్, ‘ఒరాకిల్ ఆఫ్ ఒమాహా’గా పిలవబడే వారెన్ బఫెట్ సిద్ధాంతాలు దీనికి భిన్నంగా ఉంటాయి. 94 ఏళ్ల వయసులోనూ బెర్క్షైర్ హాత్వేను విజయపథంలో నడిపిస్తున్న ఆయన పెట్టుబడి అనేది విజ్ఞానం కంటే కూడా క్రమశిక్షణతో కూడిన వ్యవహారమని నమ్ముతారు. నేటి అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు మార్గదర్శకంగా నిలిచే బఫెట్ సూత్రాలపై ప్రత్యేక కథనం.పెట్టుబడి కాల పరిమితి‘ఒకవేళ స్టాక్ మార్కెట్ పదేళ్లపాటు మూతపడినా మీరు నష్టపోని కంపెనీలనే ఎంచుకోవాలి’ అన్నది బఫెట్ నియమం. మ్యూచువల్ ఫండ్స్ విషయంలో తరచుగా ఫండ్లను మార్చడం వల్ల చక్రవడ్డీ లాభాన్ని కోల్పోతారు. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్ను ఎంచుకుని దానికి దశాబ్దాల పాటు కట్టుబడి ఉండటమే అసలైన విజయం.మేధస్సు కంటే క్రమశిక్షణ ముఖ్యంపెట్టుబడి పెట్టడానికి ఐక్యూ 160 ఉండాల్సిన అవసరం లేదు. కేవలం భావోద్వేగాలను నియంత్రించుకోగలిగితే చాలని బఫెట్ అంటారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు మార్కెట్ పడిపోయినప్పుడు భయపడకుండా పెరిగినప్పుడు అత్యాశ చెందకుండా సిప్లను కొనసాగించడమే అత్యుత్తమ వ్యూహం.రోజూ మార్కెట్ను గమనించకండిస్టాక్ మార్కెట్ అనేది అసహనంగా ఉన్న వ్యక్తి నుంచి ఓపికగా ఉన్న వ్యక్తికి డబ్బు బదిలీ చేసే సాధనం అని బఫెట్ నమ్ముతారు. రోజూ మ్యుచువల్ ఫండ్ ఎన్ఏవీని చూడటం వల్ల ఇన్వెస్టర్లు ఆందోళన చెంది తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీ లక్ష్యం 10 ఏళ్ల తర్వాత అయితే నేటి మార్కెట్ ఒడిదుడుకులు మీకు అనవసరం.భయం, అత్యాశల సమతుల్యతప్రజలందరూ అత్యాశతో ఉన్నప్పుడు మీరు భయపడండి.. అందరూ భయపడుతున్నప్పుడు మీరు అత్యాశగా ఉండండి - ఇది బఫెట్ లైఫ్ మంత్రం. మార్కెట్ కుప్పకూలినప్పుడు చాలామంది సిప్లు ఆపేస్తారు. కానీ, అప్పుడే యూనిట్లు తక్కువ ధరకు వస్తాయనే విషయాన్ని బఫెట్ గుర్తుచేస్తున్నారు. ఆ సమయంలో చేసే అదనపు పెట్టుబడి భవిష్యత్తులో అద్భుతమైన సంపదను సృష్టిస్తుంది.తెలియనిచోట పెట్టుబడి వద్దుఏదో ఒక సెక్టోరల్ ఫండ్ లేదా స్మాల్ క్యాప్ ఫండ్ గత ఏడాది 50% రిటర్న్స్ ఇచ్చిందని అందులో డబ్బులు పోయడం ప్రమాదకరం. ఆ ఫండ్ రిస్క్ ఏంటి? దాని వ్యూహం ఏంటి? అనేది కనీస అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టకూడదు.అంచనాలపై ఆధారపడకండిమార్కెట్ రేపు ఎలా ఉంటుంది? వచ్చే నెల ఎలా ఉంటుంది? అనే అంచనాలు జ్యోతిష్యం లాంటివే తప్ప వాస్తవాలు కావని బఫెట్ అభిప్రాయపడతారు. గత ఆరు నెలల ర్యాంకింగ్ చూసి ఫండ్లను మార్చడం కాకుండా ఫండ్ హౌస్ విశ్వసనీయతను చూసి పెట్టుబడి పెట్టాలని ఆయన సూచిస్తారు.ఇదీ చదవండి: ‘మూన్లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ! -
EMI మిస్ అయింది.. ఇంటిని సీల్ చేస్తారా?
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవిత కల. ఆ కలను సాకారం చేసుకోవడానికి చాలామంది బ్యాంకుల నుంచి గృహ రుణాలు (Home Loans) తీసుకుంటారు. అయితే, ఆర్థిక ఇబ్బందుల వల్లనో లేదా ఇతర కారణాల వల్లనో ఒకటి రెండు ఈఎంఐలు (EMI) చెల్లించలేకపోతే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ.. ఆ పరిస్థితి అలాగే కొనసాగితే మాత్రం మీ కలల సౌధం వేలం దాకా వెళ్లే ప్రమాదం ఉంది. అసలు ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే బ్యాంకులు కఠిన చర్యలు తీసుకుంటాయి? 'సర్ఫేసీ' చట్టం ఏం చెబుతోంది? పూర్తి వివరాలు మీకోసం..ఎన్పీఏ అంటే ఏమిటి.. ఎప్పుడు ప్రకటిస్తారు?మీరు మొదటి నెల ఈఎంఐ చెల్లించకపోతే బ్యాంకులు ఫోన్ కాల్స్ లేదా ఎస్సెమ్మెస్ల ద్వారా గుర్తు చేస్తాయి. రెండో నెలలో కూడా అదే పరిస్థితి ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. ఒకవేళ వరుసగా మూడు నెలల పాటు మీరు ఈఎంఐ చెల్లించనట్లయితే, బ్యాంక్ మీ రుణ ఖాతాను ఎన్పీఏ (NPA- నిరర్థక ఆస్తి)గా మారుస్తుంది. ఇక్కడి నుంచే అసలు చట్టపరమైన ప్రక్రియ మొదలవుతుంది.సర్ఫేసీ చట్టం.. బ్యాంకుల అస్త్రంరుణగ్రహీత మొండి బకాయిదారుగా మారినప్పుడు బ్యాంకులు సర్ఫేసీ చట్టం, 2002 (SARFAESI act)ని ప్రయోగిస్తాయి. లోన్ ఖాతా ఎన్పీఏ మారిన తర్వాత, బ్యాంక్ రుణగ్రహీతకు 60 రోజుల గడువుతో డిమాండ్ నోటీసు ఇస్తుంది. బకాయి ఉన్న మొత్తాన్ని ఈ గడువులోగా చెల్లించాలని కోరుతుంది. ఈ 60 రోజుల వ్యవధిలో మీరు బ్యాంకును సంప్రదించి, మీ ఇబ్బందులను వివరించి చెల్లింపు గడువును పొడిగించుకునే లేదా రీ-స్ట్రక్చర్ చేసుకునే అవకాశం ఉంటుంది.ఇంటిని ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారు?డిమాండ్ నోటీసు ఇచ్చిన 60 రోజుల తర్వాత కూడా రుణగ్రహీత స్పందించకపోతే, బ్యాంక్ సదరు ఆస్తిని భౌతికంగా స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఈ దశలో బ్యాంక్ అధికారులు ఇంటికి వచ్చి నోటీసులు అంటించి, ఇంటిని సీల్ చేసే అధికారం కలిగి ఉంటారు.వేలం ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది?ఇంటిని స్వాధీనం చేసుకున్న తర్వాత బ్యాంక్ దానికి మార్కెట్ విలువను నిర్ధారిస్తుంది. ఆపై బకాయిలను వసూలు చేసుకోవడానికి బహిరంగ వేలం నిర్వహిస్తుంది. సాధారణంగా ఈఎంఐ నిలిచిపోయిన నాటి నుండి వేలం దాకా వెళ్లడానికి 5 నెలల నుండి 12 నెలల సమయం పడుతుంది. వేలానికి ముందు కూడా రుణగ్రహీతకు తన బకాయిలను పూర్తిగా చెల్లించి ఇంటిని కాపాడుకోవడానికి చివరి అవకాశం ఉంటుంది.గుర్తుంచుకోవాల్సిన కీలక విషయాలుఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు బ్యాంకు నుండి వచ్చే కాల్స్ లేదా నోటీసులను విస్మరించవద్దు. నేరుగా బ్యాంకు అధికారులను కలిసి మీ పరిస్థితిని వివరిస్తే, వారు ఏదైనా వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది. ఈఎంఐలు చెల్లించకపోతే మీ సిబిల్ (CIBIL) స్కోర్ దారుణంగా పడిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో మీకు మరెక్కడా రుణాలు లభించవు. బ్యాంకు వేలం వేసే ముందు ఆస్తి విలువను సరిగ్గా లెక్కించిందో లేదో తనిఖీ చేసుకునే హక్కు మీకు ఉంటుంది.ఇది చదివారా? ఇల్లు.. ఎలాంటి డబ్బుతో కడుతున్నారు? -
ఆటోమెటిక్గా కట్ అయ్యే డబ్బులు.. ఆర్బీఐ కొత్త అప్డేట్
డిజిటల్ చెల్లింపుల భద్రతను మరింత కఠినతరం చేస్తూ ఈ-మాండేట్ (e-Mandate) నిబంధనలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా రూ. 15,000 దాటే ఆటో-డెబిట్ లావాదేవీలపై పర్యవేక్షణను పెంచుతూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రికరింగ్ (పునరావృత) చెల్లింపులకు సంబంధించి పాత నిబంధనలను సవరిస్తూ, కస్టమర్ల రక్షణ కోసం కొత్త ఫ్రేమ్వర్క్ను ప్రవేశపెట్టింది.మార్పులు ఏమిటంటే..కొత్త నిబంధనల ప్రకారం, ఆటో-డెబిట్ లావాదేవీలకు సంబంధించి రూ. 15,000 పరిమితిని ప్రామాణికంగా తీసుకున్నారు.రూ. 15,000 లోపు: చిన్న మొత్తాల చెల్లింపులు (OTT సబ్స్క్రిప్షన్లు, ఫోన్ బిల్లులు వంటివి) ఎటువంటి ఓటీపీ (OTP) అవసరం లేకుండానే ఆటోమేటిక్గా జరిగిపోతాయి.రూ. 15,000 పైన: లావాదేవీ విలువ రూ. 15,000 దాటితే మాత్రం ఖచ్చితంగా అదనపు ప్రామాణీకరణ అవసరమవుతుంది. అంటే కస్టమర్ ఓటీపీని ఎంటర్ చేస్తేనే పేమెంట్ పూర్తవుతుంది.అయితే బీమా ప్రీమియంలు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, క్రెడిట్ కార్డు బిల్లుల వంటి వాటికి రూ. 15,000 నుండి రూ. 1 లక్ష వరకు కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి.ఈ నిబంధనలు యూపీఐ (UPI) ఆటో-పే, డెబిట్/క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ వాలెట్లకు వర్తిస్తాయి.ఈ-మాండేట్ సేవలను సెటప్ చేయడానికి లేదా వినియోగించుకోవడానికి బ్యాంకులు కస్టమర్ల నుండి ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయకూడదు.అనధికారిక లావాదేవీలు జరిగితే, నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో రిపోర్ట్ చేస్తే కస్టమర్ బాధ్యత పరిమితంగా ఉంటుంది. అంటే మోసపూరిత లావాదేవీల నుండి రక్షణ లభిస్తుంది.ముందస్తు హెచ్చరికలు తప్పనిసరికస్టమర్ల ప్రమేయం లేకుండా ఖాతా నుండి డబ్బు కట్ అవ్వకుండా ఉండేందుకు ఆర్బీఐ 'అలర్ట్ సిస్టమ్'ను తప్పనిసరి చేసింది. నగదు డెబిట్ అయ్యే సమయానికి కనీసం 24 గంటల ముందే కస్టమర్కు మెసేజ్ లేదా మెయిల్ పంపాలి. ఇందులో మర్చంట్ పేరు, మొత్తం, డెబిట్ తేదీ స్పష్టంగా ఉండాలి. నోటిఫికేషన్ అందిన తర్వాత కస్టమర్ ఆ చెల్లింపును వద్దనుకుంటే రద్దు చేసే లేదా నిలిపివేసే అవకాశం ఉంటుంది. అలాగే నగదు డెబిట్ అయిన వెంటనే ఫిర్యాదుల పరిష్కార వివరాలతో కూడిన మెసేజ్ పంపాల్సి ఉంటుంది. -
వారెన్ బఫెట్ చెప్పే ‘కోటీశ్వరులయ్యే’ రహస్యాలివే!
పెట్టుబడి ప్రపంచంలో 'లెజెండ్'గా పేరొందిన వారెన్ బఫెట్.. కేవలం 11 ఏళ్ల వయస్సులో మూడు షేర్లతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. నేడు రూ. 11 లక్షల కోట్లకు పైగా సంపదతో ప్రపంచ కుబేరులలో ఒకరిగా నిలిచారు. మరి అతి తక్కువ డబ్బుతో పెట్టుబడి మొదలుపెట్టేవారికి ఆయన ఇచ్చే సలహాలేంటి? సామాన్యులు కూడా బఫెట్ రూట్ లో సంపదను ఎలా సృష్టించవచ్చో తెలుసుకుందాం.చిన్న మొత్తంతోనే శ్రీకారం చుట్టండిచాలామంది తమ దగ్గర లక్షలాది రూపాయలు ఉంటేనే షేర్ మార్కెట్లోకి రావాలని అనుకుంటారు. కానీ బఫెట్ దృష్టిలో ఇది తప్పు. మీ దగ్గర రూ. 500 లేదా రూ. 1000 ఉన్నా సరే, పెట్టుబడిని తక్షణమే ప్రారంభించాలి. "సమయం మీ వైపు ఉంటే, చిన్న మొత్తమే భవిష్యత్తులో కొండంత సంపదగా మారుతుంది" అని ఆయన పదే పదే చెబుతుంటారు.ఇండెక్స్ ఫండ్స్: సామాన్యుల ఆయుధంఏ షేర్ కొనాలి? ఏ కంపెనీ బాగుంటుంది? అన్న అవగాహన లేని వారికి బఫెట్ సూచించే ఉత్తమ మార్గం 'లో-కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్'. కంపెనీలను విశ్లేషించే సమయం, నైపుణ్యం లేని వారికి ఇవి అత్యంత సురక్షితమైనవని ఆయన నమ్ముతారు. అమెరికాలో S&P 500 లాగా, భారత్లో నిఫ్టీ 50 (Nifty 50) వంటి ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మార్కెట్ వృద్ధిలో భాగస్వాములు కావచ్చు.తెలివితేటలే అసలైన పెట్టుబడితెలివితేటలే అసలైన పెట్టుబడి అని వారెన్ బఫెట్ నమ్ముతారు. అందుకే జ్ఞానం కోసం అనే పుస్తకాలు ఆయన తిరగేస్తుంటారు. ఇప్పటికీ రోజుకు కనీసం 500 పేజీలు చదువుతారు. "అన్నింటికంటే ఉత్తమమైన పెట్టుబడి మీ జ్ఞానం మీద పెట్టేదే" అని ఆయన అంటారు. పెట్టుబడులు పెట్టేవారు కంపెనీల వార్షిక నివేదికలు చదవడం అలవాటు చేసుకోవాలి. వ్యాపార నమూనాలను అర్థం చేసుకోవాలి. బెంజమిన్ గ్రాహం రాసిన 'ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్' వంటి పుస్తకాలు చదవాలని ఆయన సూచిస్తుంటారు.కాంపౌండింగ్ మాయాజాలంబఫెట్ సంపదలో 90 శాతం ఆయనకు 60 ఏళ్లు దాటిన తర్వాతే వచ్చింది. దీనికి కారణం 'చక్రవడ్డీ' (Compounding). మీరు ఎంత త్వరగా పెట్టుబడి మొదలుపెట్టి, దాన్ని ఎంత కాలం కొనసాగిస్తారో, మీ డబ్బు అంత వేగంగా రెట్టింపు అవుతుంది. అందుకే "పెట్టుబడి పెట్టడానికి నిన్నటి కంటే ఈరోజే సరైన సమయం" అని ఆయన చెబుతారు.కేవలం ఎఫ్డీ(FD)లు, సేవింగ్స్ అకౌంట్లలో డబ్బు దాచుకుంటే ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం కష్టం. ధనవంతులు కావాలంటే ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం అనివార్యమని బఫెట్ సిద్ధాంతం చెబుతోంది. తప్పులు చేయడం సహజం, కానీ వాటి నుండి నేర్చుకుని క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే ఎవరైనా ‘కోటీశ్వరులు’ కావచ్చని బఫెట్ సూత్రం నిరూపిస్తోంది. -
ఈ ఆర్థిక సంవత్సరంలో ‘సీనియర్ సిటిజన్లు’
కొత్త చట్టం, కొత్త రూల్సు అమలులోకి వచ్చాయి. ఎన్నెన్నో మార్పులు, చేర్పులు, కూర్పులు. ప్రాథమికమైన అంశాలు మారకపోయినా కొన్నింటిలో మార్పులు వచ్చాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త చట్టం, కొత్త రూల్స్ ప్రకారం కేవలం సీనియర్ సిటిజన్లకు వచ్చే మార్పులతో కలిపి అన్ని సంగతులు ఈ వారం తెలుసుకుందాం! ఎన్నిసార్లు చెప్పినా ముఖ్యమైనది కావున మళ్లీ మళ్లీ చెప్పే విషయం ఏమిటంటే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ‘ఆర్థిక సంవత్సరం’ అమల్లోకి వస్తుంది. గతంలోలాగా, అసెస్మెంట్ సంవత్సరం, గత సంవత్సరం అనే పదాలుండవు. ఇటు అసెస్సీ గానీ అటు గవర్నమెంట్, మరెవరైనా గానీ ఒకే పదం వాడాలి. ఇక నుంచి ఎవరికీ ఎటువంటి తికమక ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్ని రూ.50,000 నుంచి రూ.75,000 వరకు పెంచారు. ఈ డిడక్షన్ అటు పాత పద్దతిని అనుసరించే వారికైనా, ఇటు కొత్త పద్దతికి వెళ్లే వారికైనా వర్తిస్తుంది. 80డి కింద ప్రయోజనం కేవలం పాత పద్ధతిని ఎంచుకున్న వారికే వర్తిస్తుంది. ఆరోగ్య బీమా, ముందు జాగ్రత్త హెల్త్ చెకప్కి సంబంధించిన తగ్గింపు రూ.50,000 వరకు కొనసాగుతుంది. గత వారం ఎంతో వివరంగా చెప్పాము. కొత్త 15హెచ్ గురించి ... ఇప్పుడది 121గా మారింది. ఈ ఫారమ్ సబి్మట్ చేస్తే టీడీఎస్ చేయరు. చేయకపోతే టీడీఎస్ రివకరీ చేసి గవర్నమెంట్ ఖజానాకి చెల్లిస్తారు. సీనియర్ సిటిజన్ల ఆదాయం టాక్సబుల్ ఇన్కం. ఇప్పుడు దీని లిమిట్ రూ.12.75 లక్షలు అని చెప్పొచ్చు. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు. మీ ఆదాయం బ్యాంకు వడ్డీ కానీ, అద్దె మీద ఆదాయం కానీ, పెన్షన్ మీద ఆదాయం.. అన్నీ కలిపితే రూ.12.75 లక్షల దాటకపోతే వెంటనే ఫారమ్ 121 సంబంధిత అధికారులకు ఇవ్వండి. పన్ను రికవరీ ఉండదు. 75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు పాత చట్టం 194పి ప్రకారం మూడు షరతుల మీద రిటర్ను వేయనవసరం లేదు. ఈ అంశాలని చాలామంది అందరికీ అన్వయించుకుంటున్నారు. అది అపోహ. ఆ మూడు షరతులు ఏంటంటే... (ఎ) కేవలం పెన్షన్ ఉండాలి (బి) ఒక బ్యాంకు నుంచి మాత్రమే వడ్డీ ఉండవచ్చు (సి) అదే బ్యాంకు మొత్తం టీడీఎస్ రికవరీ అయ్యి గవర్నమెంట్ ఖజానాలో జమ అయ్యి ఉండాలి ఈ సదుపాయం కొనసాగుతుంది. ఇక ఫారాలు, గడువు తేదీ, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు బాధ్యతలు, సెల్ఫ్ అస్సెస్మెంట్ విధివిధానాలు ఇలాంటివన్నీ షరామామూలే. ఫైలింగ్ విధానంలో ఎటువంటి మార్పులు లేవు. ఇదివరకటి ఆలోచనే... ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఉండి ఎక్కువ సేవింగ్స్ ఉన్నవారికి పాత పద్ధతి. ఏ తగ్గింపులు ఉండవు. కొత్త పద్ధతిలో ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎంపిక మీదే. కానీ ముందుగానే లెక్కలు వేసి ఆదాయం ఎంతో తేల్చి, నిర్ణయం తీసుకోండి. మిగతా ఎక్కడ ఎటువంటి మార్పులు లేవు. యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రీ ఫిక్స్డ్ ఫారమ్లలో చాలా సమాచారం ఉంటుంది. అయినా జాగత్ర వహించండి. సీనియర్ సిటిజన్ల సేవింగ్స్ స్కీంలో రూ.80 లక్షల ఇన్వెస్ట్ చేయొచ్చు. రూ.5,00,000 లోపు నికర ఆదాయం ఉన్నవారు మాన్యువల్గా రిటర్ను వేయవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ రిటైర్మెంట్ జీవితం, జీతం జాగ్రత్తగా గడపండి. -
విద్యార్థుల కోసం ప్రత్యేకమైన టర్మ్ ప్లాన్
నేడు ఎంతో మంది విద్యార్థులు రుణాలతో విదేశీ విద్య కోసం వెళుతున్న నేపథ్యంలో.. వారికంటూ ప్రత్యేకమైన టర్మ్ ప్లాన్ను టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది. విద్యా రుణం తీసుకున్న వారు విద్య పూర్తి చేసుకుని, ఉపాధి పొందిన వెంటనే తిరిగి చెల్లింపులు మొదలు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఆ లోపు విద్యార్థికి అనుకోనిది ఏదైనా జరిగితే ఆ రుణాన్ని చెల్లించాల్సిన భారం కుటుంబంపై పడుతుంది.ఈ ఇబ్బంది లేకుండా ఉండేందుకు టాటా ఏఐఏ ‘స్టూడెంట్ ఫోకస్డ్ టర్మ్ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. 18–25 ఏళ్ల వయసులోని విద్యార్థులు దీన్ని తీసుకోవచ్చు. భారత్లో లేదా విదేశాల్లో గుర్తింపు పొందిన విద్యా కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. రూ.2 కోట్ల వరకు సమ్ ఇన్సూర్డ్తో ప్లాన్ తీసుకోవచ్చు. లేదా ఎంత మేర విద్యా రుణం తీసుకుంటే, అంత వరకే కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు. పాలసీ కాల వ్యవధి పదేళ్ల పాటు ఉంటుంది. -
పింఛను రంగంలో ఎఫ్డీఐ పెంపు!
న్యూఢిల్లీ: పింఛను (పెన్షన్) రంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) పరిమితిని నూరు శాతానికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చట్టం, 2013కు సవరణలతో కూడిన బిల్లును వచ్చే వర్షాకాలం లేదంటే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.ప్రస్తుతం పింఛను రంగంలో 49 శాతం ఎఫ్డీఐకే పరిమితి ఉంది. ప్రభుత్వం ఇటీవలే బీమా రంగంలోనూ ఎఫ్డీఐని నూరు శాతానికి అనుమతించడం తెలిసిందే. అంతకుముందు వరకు 74 శాతం వరకు అనుమతించేవారు. తొలుత 2015లో బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని 49 శాతం నుంచి 74 శాతం పెంచుతూ.. బీమా చట్టం, 1938లో కేంద్ర సర్కారు సవరణలు తీసుకురావడం గమనార్హం.ప్రతిపాదిత పెన్షన్ చట్టం బిల్లులో ఎన్పీఎస్ ట్రస్ట్ను వేరు చేసే సవరణ కూడా ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. ఎన్పీఎస్ను పీఎఫ్ఆర్డీఏ నుంచి వేరు చేసి, 15 మంది సభ్యుల బోర్డు నిర్వహణలో ఉంచనున్నట్టు చెప్పాయి. ఈ బోర్డులో మెజారిటీ సభ్యులు ప్రభుత్వం నుంచి ఉంటారని పేర్కొన్నాయి. -
ఇవి తెలియకుండా బంగారం కొంటే మీకే నష్టం!
భారతీయులకు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్.. ఆపదలో ఆదుకునే ఆర్థిక భరోసా. అయితే, మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనే బంగారం ఎంతవరకు స్వచ్ఛమైనది? ఆకర్షణీయమైన ఆఫర్ల వెనుక దాగున్న నాణ్యత లోపాలను ఎలా గుర్తించాలి? అనే సందేహం కలుగుతుందా? బంగారం కొనుగోలు చేసేటప్పుడు బీఐఓఎస్ హాల్మార్కింగ్, ఆరు అంకెల హెచ్యూఐడీ నంబర్ ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మెరిసేదంతా బంగారం కాదని గుర్తుంచుకోండి. మీ పెట్టుబడికి పూర్తి రక్షణ కల్పించే పక్కా బిల్లు రహస్యాలు, ఆధునిక పరీక్షల గురించి మరిన్ని వివరాలు చూద్దాం.హాల్మార్కింగ్: ఈ మూడు గుర్తులు ఉన్నాయా?ప్రస్తుతం విక్రయించే ప్రతి బంగారు ఆభరణంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నిబంధనల ప్రకారం హాల్మార్కింగ్ తప్పనిసరి. మీరు కొనే నగపై ఈ మూడు గుర్తులు ఉన్నాయో లేదో పరీక్షించండి.బీఐఎస్ లోగో: త్రిభుజాకారంలో ఉండే ఈ గుర్తు ఆ ఆభరణం ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ధ్రువీకరిస్తుంది.బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో సూచిస్తారు.22K916: అంటే అది 22 క్యారెట్ల బంగారం, అందులో 91.6% స్వచ్ఛత ఉంటుంది.18K750: వజ్రాలు లేదా ఇతర విలువైన రాళ్లు పొదిగిన నగలకు సాధారణంగా 75% స్వచ్ఛత కలిగిన ఈ బంగారాన్ని వాడతారు.హెచ్యూఐడీ నంబర్ (హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్): ఇది అత్యంత ముఖ్యమైనది. ప్రతి ఆభరణానికి ఆరు అంకెలతో కూడిన ప్రత్యేక ఆల్ఫాన్యూమరిక్ కోడ్ (ఉదా: AZ1234) ఉంటుంది.బీఐఎస్ కేర్ యాప్తో డిజిటల్ వెరిఫికేషన్మీరు కొన్న నగ అసలైనదో కాదో తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులభం. మీ స్మార్ట్ఫోన్లో ప్రభుత్వ అధికారిక బీఐఎస్ కేర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్లోని ‘Verify HUID’ సెక్షన్లోకి వెళ్లి నగపై ఉన్న ఆరు అంకెల కోడ్ను ఎంటర్ చేయండి. వెంటనే ఆ నగను ఏ జ్యువెలర్ రిజిస్టర్ చేశారు? ఏ హాల్మార్కింగ్ సెంటర్ పరీక్షించింది? నగ స్వచ్ఛత ఎంత? వంటి వివరాలన్నీ స్క్రీన్పై కనిపిస్తాయి. షాపు వారు ఇచ్చే ట్యాగ్తో ఈ వివరాలను సరిపోల్చుకోండి.క్యారెట్ మీటర్, మ్యాగ్నెట్ టెస్ట్నగలను కట్ చేయకుండానే వాటిలోని లోహాల శాతాన్ని (బంగారం, వెండి, రాగి) తెలుసుకోవడానికి ఎక్స్ఆర్ఎఫ్ (X-Ray Fluorescence) మెషీన్లు వాడతారు. చాలా మంది పెద్ద వ్యాపారుల వద్ద ఇవి ఉంటాయి. కేవలం 30 సెకన్లలోనే ఇది రిజల్ట్ ఇస్తుంది. నగలను మీ ముందే స్కాన్ చేయమని అడగడం మీ హక్కు.మ్యాగ్నెట్ పరీక్ష: బంగారం అయస్కాంత పదార్థం కాదు. ఒకవేళ నగ అయస్కాంతానికి ఆకర్షితమైతే అందులో ఇనుము, నికెల్ లేదా కోబాల్ట్ వంటి ఇతర లోహాల కల్తీ ఉందని అర్థం.ట్యాక్స్ ఇన్వాయిస్ తప్పనిసరికొనుగోలు చేసిన తర్వాత వివరణాత్మకమైన టాక్స్ ఇన్వాయిస్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఆ బిల్లులో వివరాలు స్పష్టంగా ఉండాలి.ప్రతి వస్తువు హెచ్యూఐడీ నంబర్.బంగారం బరువు, దాని స్వచ్ఛత.ఆ రోజు ఉన్న మార్కెట్ రేటు.తయారీ ఖర్చులు, జీఎస్టీ.ఇదీ చదవండి: డిమాండ్ భళా.. నిర్మాణాలు డీలా! -
సరిగా కొంటేనే.. బంగారం!
ధర ఎంతన్నా ఉండనివ్వండి. బంగారమనేది మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగం. తరతరాలుగా పుత్తడికి ప్రాధాన్యం పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. ఇంటింటా ఆభరణాల రూపంలో మురిపిస్తూనే, ఆర్థికంగా కూడా భరోసాను కల్పించే సాధనంగా పనికొస్తోంది. అయితే, అంతర్జాతీయ పరిణామాల దెబ్బతో ఒకసారి అయిదు వేలు పెరిగితే, ఇంకోసారి పదివేలు పడిపోయి.. బంగారం రేట్లు సృష్టిస్తున్న గందరగోళం అంతా ఇంతా కాదు.ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఎమోషనల్ కారణంతోనో, పెట్టుబడి కోసమో ఆభరణాలు, నాణేల రూపంలో కొనుక్కుని పెట్టుకున్న వారిలోను, కొనుక్కోవాలనుకుంటున్న వారిలోనూ ఆందోళన నెలకొంటోంది. ఈ నేపథ్యంలో క్రమంగా పుత్తడిని చూసే తీరు మారుతోంది. కేవలం ఆభరణంగానో లేదా భావోద్వేగాలతో ముడిపడిన ఆస్తిగానో చూడటం కాకుండా పెట్టుబడి కోణంలో చూసే ధోరణి పెరుగుతోంది. యువ ఇన్వెస్టర్లు తమ సౌకర్యార్థం, లిక్విడిటీ కోసం క్రమంగా ఈటీఎఫ్లు, డిజిటల్ గోల్డ్ వైపు మళ్లుతున్నారు. పుత్తడిని ఎమోషనల్గా కొనుక్కోవడం కాకుండా వ్యూహాత్మకంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదే సరైన విధానమన్నది విశ్లేషకుల మాట.తయారీ.. తరుగుతో కోత..మార్కెట్లో మెరుగైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా మంది ఇన్వెస్టర్లు జ్యుయలరీ రూపంలో కొన్న బంగారాన్ని కూడా పెట్టుబడిగానే పరిగణిస్తుంటారు. అనుబంధం, సంప్రదాయాలపరంగా ఆభరణాలు, నాణేల రూపంలో బంగారానికి ఎంతో విలువ ఉన్నప్పటికీ, ఆర్థిక కోణంలో చూస్తే మాత్రం భౌతికరూపంలోని పసిడి కొనుగోలు విధానంలో లోటుపాట్లు ఎక్కువ. తయారీ చార్జీల కారణంగా వీటి విలువ కొనుక్కోగానే 10–15 శాతం తగ్గిపోతుంది. రూ. 1 లక్ష విలువ చేసే బంగారు ఆభరణాన్ని కొన్నప్పుడు, సాధారణంగా రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు మేకింగ్ చార్జీల కింద పోతుంది. అంటే మనం వాస్తవానికి రూ. 85,000–90,000 విలువ చేసిన బంగారమే కొన్నట్లవుతుంది. ఇక మళ్లీ రీసేల్ చేయాలంటే తరుగు అంటూ తీసేస్తారు. దీంతో సదరు బంగారు ఆభరణంపై వచ్చే రాబడి మరింత తగ్గిపోయినట్లవుతుంది. ఇదిగాకుండా వీటిని సురక్షితంగా భద్రపర్చుకోవడం మరో ఎత్తు. ఇక తిరిగి విక్రయించినప్పుడు, రేట్లు భారీగా పెరిగితే తప్ప, రీసేల్ విలువ తక్కువే వస్తుంది. ఆ రకంగా పెట్టుబడుల కోణంలో చూస్తే ఇది అంత లాభసాటి వ్యవహారంగా ఉండదు.పసిడిపై మళ్లీ ఫోకస్దేశ, విదేశ పరిణామాలతో ఇటీవలి కాలంలో పసిడికి మళ్లీ ప్రాధాన్యం పెరిగింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆర్థిక అనిశి్చతి, ఈక్విటీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటం, కరెన్సీ బలహీనపడుతుండటంలాంటి అంశాలు మళ్లీ బంగారంపై ఇన్వెస్టర్లలో ఆసక్తిని పెంచుతున్నాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో పసిడి సురక్షితమైన పెట్టుబడి సాధనం పాత్రను పోషిస్తుంది. మిగతా ఆర్థిక సాధనాలు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పుడు ఇది స్థిరత్వాన్ని అందిస్తుంది. ఇదీ... నయా రూట్ఇలాంటివన్నీ చూశాకేనేమో... ఇపుడు పుత్తడిలో పెట్టుబడులు పెట్టే విధానంలో గణనీయంగా మార్పులొచ్చాయి. గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ప్రత్యామ్నాయంగా తెరపైకి వచ్చాయి. పసిడి ధరలకు అనుగుణంగా ఉండే ఈ ఈటీఎఫ్లను షేర్లలాగానే స్టాక్ ఎక్స్ఛేజీల్లో కొనుక్కోవచ్చు. అమ్ముకోవచ్చు. వీటిని కావాల్సినప్పుడు కొనుక్కుని, అమ్ముకునేందుకు (లిక్విడిటీ) వీలు, పారదర్శకత ఉంటుంది. భౌతికంగా భద్రపర్చుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. ఇంత వెసులుబాటు ఉన్నందుకే ఇన్వెస్టర్లు వీటివైపు చూడటం పెరుగుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సావరీన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ) కూడా గతంలో వచ్చాయి. పసిడి ధరను ట్రాక్ చేసే ఈ బాండ్లపై వార్షికంగా అదనంగా 2.5 శాతం వడ్డీ కూడా ఇవ్వడంతో పాటు క్యాపిటల్ గెయిన్స్ నుంచి కూడా మినహాయింపు లభించేలా వీటిని తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ విధానంలో కొన్ని మార్పులు వచి్చ, కొత్త బాండ్ల జారీ ఆగినప్పటికీ, గతంలో జారీ చేసినవి అలాగే కొనసాగుతున్నాయి. పోర్ట్ఫోలియోకి భద్రతపోర్ట్ఫోలియోను సమతూకంతో ఉంచడంలో పసిడి చాలా కీలక పాత్ర పోషిస్తుంది. పసిడి పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణతో వ్యవహరిస్తే చాలా ఉపయోగకరం. ఈక్విటీల తరహాలో భారీ రిటర్నుల కోసం కాకుండా, స్థిరత్వానికి, డైవర్సిఫికేషన్ కోసం ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా 10–15 శాతం పసిడికి, సుమారు 60 శాతం ఈక్విటీలకి, 25 శాతం డెట్ సాధనాలకు కేటాయిస్తే పోర్ట్ఫోలియో సమగ్రంగా ఉంటుంది. దీనివల్ల ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పుడు రిసు్కలు తగ్గుతాయి. గోల్డ్ ఈటీఎఫ్లు లిక్విడిటీతో పాటు స్వల్పకాలిక అవసరాల కోసం, పోర్ట్ఫోలియోలో పరిస్థితులకు తగ్గట్లుగా మార్పులు, చేర్పులు చేసుకునేందుకు ఉపయోగపడతాయి.నాణేలు, ఆభరణాలతో ప్రతికూలం..మేకింగ్ చార్జీల రూపంలో కొనగానే 10–15%తరుగుతో రీసేల్ విలువలోనూ కోతఆభరణం కొనుగోలు ధర: రూ. 1,00,000మేకింగ్ చార్జీలు : రూ. 10,000 15,000వాస్తవంగా బంగారం ధర: రూ.85,000-90,000పోర్ట్ఫోలియో కేటాయింపు ఇలా..ఈక్విటీ 60 శాతండెట్ 25 శాతంపసిడి 10-15 శాతంఇదీ చదవండి: ‘న్యూడిఫై’ యాప్లతో కాసుల వేట! -
సిప్ ఓకే... తప్పు చేయొద్దు!
స్టాక్ మార్కెట్లలో ఇది అత్యంత ఆకర్షణీయంగా కనిపించే పదం. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ను (సిప్ను) ప్రోత్సహించే కంపెనీలు కావొచ్చు... ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు... ఇన్వెస్ట్మెంట్ గురువులు కావొచ్చు. అందరూ దీన్నో తారకమంత్రం మాదిరి జపిస్తుంటారు. నిజానికి ఇన్వెస్టర్లకు కూడా ఇదో హుక్ లాంటిది. కోటి రూపాయలనే టార్గెట్గా పెట్టుకుని, 10వేలతో సిప్ ప్రారంభించినవారు చాలామంది ఉన్నారు. కాకపోతే వారంతా నిజంగా కోటి రూపాయలు సంపాదించారా? లేక నష్టాలొచ్చాయని మధ్యలోనే వదిలేసారా? ఒకవేళ కోటి రూపాయలు సంపాదిస్తే ఎంతకాలానికి సంపాదించి ఉంటారు? ఎంత క్రమశిక్షణ పాటించి ఉంటారు? ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలే. ఎందుకంటే సిప్కు కావాల్సినవి ఇవే. సిప్ అంటే అదేదో మంత్రదండం కాదు. అక్షయపాత్ర కూడా కాదు. క్రమశిక్షణతో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయటం ద్వారా సంపద సృష్టించే ఒక సాధనం మాత్రమే. ఆ రిసు్కల్ని తెలియజేసేదే ఈ ‘వెల్త్ స్టోరీ’...రాబడికి గ్యారంటీ ఉండదు...చాలా మంది నిర్ణిత కాలంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరు. దీనివెనుక అంచనాల్లో పొరపాట్లే ప్రధానంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా రాబడి విషయంలోనే ఇన్వెస్టర్లు తప్పులో కాలేస్తుంటారు. → ఈక్విటీల్లో పెట్టుబడిపై ఏటా 15 శాతం కాంపౌండెడ్ రాబడి వస్తుందని అనుకుంటుంటారు. → ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయని భావిస్తుంటారు. → ఇన్ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి.. సిప్తో రిస్క్ ఉండదని అనుకుంటుంటారు. → కానీ ఇవేవీ నిజం కావు. వాస్తవాలను తెలుసుకోవాలి... → ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా రికరింగ్ డిపాజిట్ల మాదిరి ఈక్విటీల్లో రాబడులు స్థిరంగా ఉండవు. → ఈక్విటీ రాబడులు అన్నవి మార్కెట్ రిస్క్ కు లోబడి ఉంటాయన్న డిస్క్లోజర్ను తప్పనిసరిగా మనసులో ఉంచుకోవాలి. → మార్కెట్ ర్యాలీల్లో 15 శాతమే కాదు. 18– 25– 35 శాతం వార్షిక రాబడులు వచి్చన సందర్భాలు కూడా ఉన్నాయి. → కానీ ఆటుపోట్ల తరుణంలో రాబడులు 10–12 శాతం మించకపోవచ్చు. → మరీ ముఖ్యంగా ప్రతికూల సమయాల్లో సగటు వార్షిక రాబడి 7–9 శాతం మించకపోవచ్చు. ఒకోసారి అంతకన్నా తక్కువకూడా రావచ్చు. → ఇక సిప్ తొలినాళ్లలో అయితే (మూడేళ్లలోపు) మార్కెట్ దిద్దుబాట్లు ఎదురైతే.. రాబడి కాదు, నష్టాలకూ స్వాగతం పలకాల్సి వస్తుంది. → పైన కొటేషన్లో చెప్పుకున్నట్టు ప్రతి నెలా రూ.10,000తో 20 ఏళ్లలో కోటికి అధిపతి కావాలంటే వార్షిక రాబడి 12.7 శాతం తక్కువ కాకుండా ఉండాలి. ఉదాహరణలు.. → 2020 మార్చిలో కరోనా వైరస్ దెబ్బకు మార్కెట్లు 40% నష్టపోవడం తెలిసిందే. → 2024 నుంచి ఇప్పటి వరకు మార్కెట్లు పరిమిత శ్రేణిలోనే పెరుగుతూ, తగ్గుతూ, స్థిరీకరణకు గురవుతున్నాయి. → కానీ వైరస్పై కొంత స్పష్టత రావడంతో మార్కెట్లు వెంటనే రివర్స్గేర్ తీసుకున్నాయి. 2023 వరకు ర్యాలీ చేశాయి. ఈ కాలంలో సిప్ రాబడులు అద్భుతంగా ఉన్నాయి.రిస్క్ లూ ఉంటాయ్.. → అనుకున్న కాలానికి అనుకున్నంత సమకూరాలంటే అన్ని సందర్భాల్లోనూ సాధ్యపడకపోవచ్చు. → మార్కెట్లు సైడ్వేస్ (ఓ పరిధిలోనే)లో ఎక్కువ కాలం పాటు కొనసాగొచ్చు. దీనివల్ల దీర్ఘకాల రాబడులు తగ్గిపోతాయి. → పక్కా ప్లాన్తో సిప్ చేసినా.. ఫండ్ ఎంపిక సరిగ్గా లేకపోతే చివర్లో అనుకున్నంత రాబడి సాధ్యం కాదు.ప్రవర్తనా లోపాలే ఎక్కువ... → కొంత మంది ఆదాయం సర్దుబాటు చేయలేక సిప్లను మధ్యలోనే ఆపేస్తుంటారు. → కొంత మంది మార్కెట్లు పడిపోతున్నాయని చెప్పి నష్టాలను చూసి భయంతో సిప్కు టాటా చెబుతుంటారు. → మార్కెట్లు పెరుగుతున్నప్పుడు ఉత్సాహం కొద్దీ అధిక వ్యాల్యూషన్ల వద్ద అదనంగా సిప్ చేస్తుంటారు. → అదే మార్కెట్ల పతనాల్లో మాత్రం నమ్మకం సడలి ఉన్న సిప్లను ఆపేస్తుంటారు. కానీ, నిజానికి పతనాల్లోనే సిప్లకు అదనంగా జోడించుకోవడం తెలివైన పని. → కొందరు ఒక లక్ష్యం, స్పష్టత లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంటారు. లక్ష్యం, కాల వ్యవధి ఆధారంగా సరితూగే పథకాలనే ఎంపిక చేసుకోవాలి. → నిపుణుల సూచనలు కాకుండా స్నేహితులో, సహచర ఉద్యోగో లేక బంధువు చెప్పిన దాంట్లో ఇన్వెస్ట్ చేయడం వంటివి వద్దు. → స్వల్పకాల కోసం సిప్ చేయడం సరికాదు. సిప్ అనేది దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్ సాధనం. → గడిచిన ఏడాది కాలంలో మంచి పనితీరు చూపించిన (అప్పటికే బాగా పెరిగిన) ఫండ్స్లో సిప్ చేయడం సరికాదు. → పెట్టుబడి తక్కువ మొత్తమే అయినా ఎక్కువ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడాన్ని అతి వైవిధ్యంగా చెబుతారు. ఇది కూడా తప్పే.ఇదీ వాస్తవం.. → సిప్పై దీర్ఘకాలంలో రాబడి 10–12 శాతంగానే ఉంటుందన్న అంచనా వాస్తవికం. 15–20 శాతం అంచనా వేసుకోకూడదు. → కనీసం 10–15 ఏళ్ల పాటు అయినా స్థిరంగా సిప్ చేసుకుంటూ వెళ్లాలి. → మార్కెట్ టైమింగ్ (ఎప్పుడు ఎటు కదులుతుందో అంచనా) కాకుండా క్రమశిక్షణకే ప్రాధాన్యం ఇవ్వాలి. → సిప్ అన్నది పవర్ఫుల్ టూల్. అద్భుతమైన మంత్రదండం కాదు. కానీ, క్రమశిక్షణతో దీర్ఘకాలంలో సిప్ చేస్తే సంపద సాధ్యం. → అవాస్తవిక అంచనాలతో ముందుకెళితే చివర్లో ఫలితం నిరాశకు గురి చేయొచ్చు. ముందు మొదలెడితే... మ్యాజిక్ → నెలకు రూ.10,000 చొప్పున 20 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే ఏటా 12 శాతం రాబడి అంచనా ఆధారంగా రూ.91.98 లక్షలు సమకూరుతుంది. → 20 ఏళ్లకు బదులు మరో 5 ఏళ్లు పెంచి 25 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే రూ.1.70 కోట్లు సమకూరుతుంది. అంటే ఐదేళ్లలో రూ.78 లక్షలు అదనంగా వస్తుంది. → 30 ఏళ్ల పాటు ఇంతే మేర ఇన్వెస్ట్ చేస్తే సమకూరే సంపద రూ.3.08 కోట్లు. → ప్రతి నెలా 10వేలు చొప్పున, ఏటా 10 శాతం అదనంగా సిప్ పెంచుకుంటూ ఇన్వెస్ట్ చేస్తే.. (12 శాతం రాబడి అంచనా ఆధారంగా) → 20 ఏళ్లలో రూ.1.86 కోట్ల సొమ్ము సమకూరుతుంది. → 25 ఏళ్లలో రూ.3.93 కోట్లు ఏర్పడుతుంది. → 30 ఏళ్లలో రూ.7.98 కోట్ల నిధి సొంతం అవుతుంది. -
డిజిటల్ గోల్డ్కు అక్షయ తృతీయ మెరుపులు
న్యూఢిల్లీ: అక్షయ తృతీయ సందర్భంగా ఈసారి ఆభరణాలు, నాణేలతో పాటు డిజిటల్ రూపంలో కూడా బంగారం కొనుగోళ్లపై కూడా గణనీయంగా ఆసక్తి నెలకొనే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. డిజిటల్ గోల్డ్ని మరింత సులభతరంగా, పారదర్శకంగా కొనుగోలు చేసే అవకాశాలు ఉండటం ఇందుకు దోహదపడుతుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీస్ విభాగం రీసెర్చ్ హెడ్ నవనీత్ దమానీ, అనలిస్ట్ మానవ్ మోదీ ఒక నివేదికలో తెలిపారు.పసిడి ప్రస్తుతం అంతర్జాతీయంగా సంక్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గ్లోబల్ వృద్ధి మందగించడం, మానిటరీ పాలసీ అంచనాల్లో మార్పులు తదితర అంశాల కారణంగా 2026లో బులియన్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోందని తెలిపారు. మధ్య మధ్యలో కరెక్షన్కి లోనైనప్పటికీ సురక్షిత పెట్టుబడి సాధనాలకు డిమాండ్ నెలకొనడంతో పసిడి, వెండి వరుసగా 10, 5 శాతం మేర పెరిగాయని వివరించారు. -
డీఏ పెంపు.. కేంద్ర ఉద్యోగులకు ఇక మరింత జీతం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల నిరీక్షణకు తెరపడింది. ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (DA)ను 2 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజా పెంపుతో డీఏ ప్రస్తుతం ఉన్న 58 శాతం నుండి 60 శాతానికి చేరుకుంది.గత అక్టోబర్లో ప్రభుత్వం డీఏను 55% నుండి 58 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం జూలై 1, 2025 నుండి అమలులోకి వచ్చింది. ఇప్పుడు ప్రకటించిన అదనపు 2 శాతం పెంపుతో కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.జీతం ఎంత పెరుగుతుందంటే?ఈ పెంపు వల్ల నెలవారీ వేతనంలో మార్పులను ఒక ఉదాహరణ ద్వారా పరిశీలిస్తే.. ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం (Basic Pay) రూ.50,000 అనుకుందాం. పాత రేటు (58%) ప్రకారం డీఏ రూ.29,000. కొత్త రేటు (60%) ప్రకారం డీఏ రూ.30,000. అంటే, ప్రతి నెలా నేరుగా రూ.1,000 అదనంగా లభిస్తుంది. దీనితో పాటు జనవరి నుండి రావాల్సిన బకాయిలు (Arrears) కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయి.8వ వేతన సంఘానికి డిమాండ్లుఒకవైపు డీఏ పెరుగుతున్నప్పటికీ, ఉద్యోగ సంఘాలు 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటుపై ఒత్తిడి పెంచుతున్నాయి. నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ 3.83 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను డిమాండ్ చేస్తోంది. ఇదే గనుక అమలైతే కనీస వేతనం రూ.18,000 నుండి ఏకంగా రూ.69,000కు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత డీఏ పెంపు వల్ల సుమారు 1.19 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. -
కొత్త క్రెడిట్ కార్డు.. ఎల్ఈడీ లైట్లతో..
ముంబై: ప్రముఖ రుణ సేవల ప్లాట్ఫాం ‘చెక్’, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దేశంలోనే తొలి కో–బ్రాండెడ్ ఎల్ఈడీ క్రెడిట్ కార్డును ఆవిష్కరించాయి. సులభతర చెల్లింపులు, గరిష్ట రివార్డు పాయింట్లే లక్ష్యంగా క్రెడిట్ కార్డు వినియోగదారులకు వినూత్న అనుభవాన్ని అందించేందు కు చెక్ ఏయూ క్రెడిట్ కార్డు పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు ప్రకటించాయి.ఎల్ఈ డీ ఆధారిత చెల్లింపుల ట్యాపింగ్ విధానం ఈ క్రెడిట్ కార్డు ప్రత్యేకత అని చెక్ వ్యవస్థాపకుడు, సీఈవో ఆదిత్య సోని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పీఓఎస్ యంత్రాల ద్వారా జరిపే ప్రతి చెల్లింపు సందర్భంగా క్రెడిట్ కార్డులోని ఎల్ఈడీ లైటు వెలుగుతుందని.. తద్వారా చెల్లింపు ధ్రువీకరణ తక్షణమే కనిపిస్తుందని వివరించారు.ఇందుకు బ్యాటరీ అవసరం లేదని.. పీఓసీలోని ఎన్ఎఫ్సీ ఫీల్డ్ సాయంతో ఎల్ఈడీ కాంతి ప్రసరిస్తుందన్నారు. ఈ సరికొత్త క్రెడిట్ కార్డు కావాలనుకొనే వారు చెక్ యాప్ లో ఈ నెల 28 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. -
‘హెచ్చరిక: 'రిచ్ డాడ్' అంచనాలు నిజమవుతున్నాయ్’
ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2002లో తాను రాసిన 'రిచ్ డాడ్స్ ప్రొఫెసీ' (Rich Dad’s Prophecy) పుస్తకంలోని అంచనాలు 2026 నాటికి నిజమవుతున్నాయని ఆయన ‘ఎక్స్’ పోస్ట్లో హెచ్చరించారు.బుడగ పేలిపోనుంది!ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు ఒక భారీ బుడగ లాంటివని, అది త్వరలోనే పగిలిపోనుందని కియోసాకి పేర్కొన్నారు. ఈ పరిణామం ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు."దుబాయ్ నుండి వేగాస్ వరకు, టోక్యో నుండి న్యూయార్క్ వరకు ఆర్థిక పతనాలను గమనించండి. దురదృష్టవశాత్తూ, ప్రపంచవ్యాప్తంగా నిరాశ్రయుల సంఖ్య పెరగబోతోంది" అని ఆయన తన పోస్ట్లో రాసుకొచ్చారు.బాధితులుగా మిగిలిపోకండి..ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పటికీ, అప్రమత్తంగా ఉండేవారు విజేతలుగా నిలవవచ్చని కియోసాకి సూచించారు. ఈ సంక్షోభం నుండి తప్పించుకోవడానికి ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రస్తుత ఆర్థిక మార్పులను నిశితంగా గమనిస్తూ ఉండాలి. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఆర్థిక అంశాలపై లోతైన అవగాహన పెంచుకోవాలి. ఆర్థిక స్వేచ్ఛ కోసం పట్టుదలతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు."ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నా.. మీరు మాత్రం ఆర్థికంగా విజేతలుగా నిలవవచ్చు. అందుకు కావాల్సిన పోరాటం మీరు చేయాలి" అని కియోసాకి తన ఫాలోవర్లకు హితవు పలికారు.ఇదీ చదవండి: పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!I WARNED EVERYONEIn 2002 I released Rich Dad’s Prophecy. In 2026 the predictions in Prophecy are coming true. You don’t have to be a victim to the “Everything Bubble” as the bubbles burst and leads to the greatest depression in world history. You can still be a winner…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 17, 2026 -
బ్యాంక్ ఖాతాపై కన్నేసే సైబర్ కిరాతకులు
మీ ఈమెయిల్ బాక్స్లో ఒక నోటిఫికేషన్... ‘మీ పేరుతో కొత్త బ్యాంక్ ఖాతా ప్రారంభమైంది’ అని ఉందా? లేదా మీ బ్యాంక్ స్టేట్మెంట్ను పరిశీలిస్తే మీకు తెలియని లావాదేవీలు కనిపిస్తున్నాయా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు సామాన్యుల కష్టార్జితాన్ని దోచుకోవడానికి సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్టీసీ) నివేదిక ప్రకారం, వినియోగదారులు సైబర్ మోసాల వల్ల 2024లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 12.5 బిలియన్ డాలర్లు (రూ.1 లక్ష కోట్లకు పైగా) డబ్బు కోల్పోయారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 25 శాతం ఎక్కువ. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ప్రధాన బ్యాంకింగ్ మోసాలు, వాటి నుంచి తప్పించుకునే మార్గాలపై ప్రత్యేక కథనం.నేరగాళ్లు అనుసరిస్తున్న ఏడు వినూత్న పద్ధతులు1. నకిలీ బ్యాంక్ వెబ్సైట్లుఅచ్చం మీ బ్యాంక్ వెబ్సైట్లాగే కనిపించే నకిలీ సైట్లను స్కామర్లు సృష్టిస్తారు. అధిక వడ్డీ ఆశ చూపి లేదా మీ ఖాతా బ్లాక్ అయ్యిందని భయపెట్టి మిమ్మల్ని లాగిన్ అయ్యేలా చేస్తారు. మీరు అక్కడ ఇచ్చే యూజర్ ఐడీ, పాస్వర్డ్ నేరుగా నేరగాళ్ల చేతికి వెళ్తాయి.జాగ్రత్త: వెబ్సైట్ అడ్రస్లో ‘https://’ ఉందో లేదో చూడండి. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ను మాత్రమే వాడండి.2. ప్రమాదకరమైన యాప్లు, ఎక్స్టెన్షన్లుఉపయోగకరంగా కనిపించే కొన్ని థర్డ్ పార్టీ యాప్లు మీ ఫోన్లోని డేటాను దొంగిలిస్తాయి. ఇవి మీ కీబోర్డ్ ఎంట్రీలను (కీస్ట్రోక్స్) ట్రాక్ చేసి మీ బ్యాంక్ వివరాలను స్కామర్లకు తెలియజేస్తాయి.జాగ్రత్త: ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి అధికారిక బ్యాంకింగ్ యాప్లను మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. యాంటీ-వైరస్ సాఫ్ట్వేర్ను వాడండి.3. ఫోన్ కాల్స్, మెసేజ్లు‘మీ కేవైసీ అప్ డేట్ చేయకపోతే అకౌంట్ ఆగిపోతుంది’ అంటూ వచ్చే ఫోన్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్లతో జాగ్రత్త. బ్యాంక్ ప్రతినిధులమని నమ్మిస్తూ మీ ఓటీపీ లేదా పిన్ నంబర్ అడుగుతారు.జాగ్రత్త: బ్యాంకులు ఎప్పుడూ ఫోన్లో వ్యక్తిగత సమాచారం అడగవు. అనుమానం వస్తే వెంటనే కాల్ కట్ చేసి నేరుగా మీ బ్రాంచ్ను సంప్రదించండి.4. ఓవర్ పేమెంట్ స్కామ్మీరు ఏదైనా వస్తువు అమ్మకానికి పెట్టినప్పుడు కొనుగోలుదారు పొరపాటున ఎక్కువ మొత్తానికి చెక్ ఇచ్చానని చెప్పి మిగిలిన మొత్తాన్ని తిరిగి పంపమని కోరతాడు. మీరు డబ్బు పంపిన తర్వాత ఆ చెక్ బౌన్స్ అవుతుంది.జాగ్రత్త: గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే చెక్కులు క్లియర్ అయ్యే వరకు వేచి ఉండండి. అనుమానాస్పద లావాదేవీలను ప్రోత్సహించకండి.5. ఎంప్లాయిమెంట్ మోసాలువర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల పేరుతో నేరగాళ్లు మిమ్మల్ని సంప్రదిస్తారు. జీతం పంపడానికి లేదా క్లయింట్లకు డబ్బు బదిలీ చేయడానికి మీ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాను వాడమంటారు. ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని మనీ లాండరింగ్ కేసుల్లో ఇరికించే ప్రమాదం ఉంది.జాగ్రత్త: పేరున్న సంస్థలు ఎప్పుడూ ఉద్యోగి వ్యక్తిగత ఖాతాలను వ్యాపార లావాదేవీలకు వాడవు. అధికారిక వెబైసైట్ల్లో కంపెనీ క్రెడెన్షియల్స్ చెక్ చేయండి.6. అనధికార ఖాతాలుమీ ఆధార్ లేదా పాన్ వివరాలను దొంగిలించి మీ పేరుతో ఇతర బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తారు. వీటి ద్వారా అక్రమ లావాదేవీలు జరిపి మీ క్రెడిట్ స్కోర్ను దెబ్బతీస్తారు.జాగ్రత్త: మీ క్రెడిట్ రిపోర్ట్ను తరచుగా తనిఖీ చేయండి. మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఎంఎఫ్ఏ) తప్పనిసరిగా ఆన్ చేసుకోండి.మోసపోయారా? వెంటనే ఇలా చేయండి!వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్కు ఫోన్ చేసి ఖాతాను లేదా కార్డును బ్లాక్ చేయించండి.సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేసేందుకు భారతదేశంలో 1930కు కాల్ చేయండి లేదా ‘cybercrime.gov.in’లో ఫిర్యాదు చేయండి.భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి.ఇదీ చదవండి: ‘న్యూడిఫై’ యాప్లతో కాసుల వేట! -
పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!
భారతీయ సంస్కృతిలో అక్షయ తృతీయకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పవిత్ర దినాన పసిడిని కొనుగోలు చేయడం అదృష్టాన్ని, శాశ్వత సంపదను తెస్తుందని కోట్లాది మంది నమ్ముతారు. అయితే, ఈ సంప్రదాయం వెనుక బలమైన ఆర్థిక ప్రయోజనం కూడా దాగి ఉందని గత తొమ్మిదేళ్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం సెంటిమెంట్తోనే కాకుండా, లాభదాయకమైన పెట్టుబడి వ్యూహంగా కూడా బంగారం తన సత్తాను చాటుతోంది. ముఖ్యంగా గత తొమ్మిదేళ్ల కాలంలో పసిడి సుమారు రూ. 29,000 నుండి రూ. 1,54,000 స్థాయికి చేరుకుని, పెట్టుబడిదారులకు ఏకంగా 435 శాతం భారీ రాబడిని అందించింది.12 ఏళ్లలో అక్షయ తృతీయ రాబడులు ఇలా..గత 12 ఏళ్ల అక్షయ తృతీయ బంగారం రాబడులను పరిశీలిస్తే, 2015లో 11 శాతం, 2017లో 3 శాతం తగ్గుదలతో కొంత నిరాశపరిచినప్పటికీ, ఆ తర్వాత నుండి పసిడి ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా 2020లో 47 శాతం భారీ రాబడిని అందించిన బంగారం, ఈ ఏడాది (2026) ఏకంగా 60 శాతం వృద్ధిని నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 2023లో 18 శాతం, 2024లో 22 శాతం, 2025లో 31 శాతంగా ఉన్న రాబడులు, ప్రతి ఏడాది రెట్టింపు ఉత్సాహంతో పెరుగుతూ పసిడిపై పెట్టుబడి అత్యంత లాభదాయకమని మరోసారి నిరూపించాయి.ఏడాదిలో 60 శాతం పెరుగుదలగత ఏడాది కాలంలో బంగారం చూపిన జోరు ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. 2025 అక్షయ తృతీయ (ఏప్రిల్ 30) నాటి ధరలతో పోలిస్తే, ప్రస్తుతం పసిడి ధరలు 60 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు గోల్డ్ మార్కెట్కు గతేడాది అండగా నిలిచాయి. పెట్టుబడిదారులకు వరుసగా తొమ్మిదో ఏడాది కూడా ఘనమైన లాభాలను అందిస్తూ, సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారం తన పట్టును నిలుపుకుంది. ధంతేరాస్తో పాటు అక్షయ తృతీయ భారతీయులకు అతిపెద్ద కొనుగోలు పండుగగా కొనసాగుతోంది.2026 సంవత్సరం బంగారం కొనుగోలుదారులకు కొంత గందరగోళంగా ప్రారంభమైనప్పటికీ, బులియన్ మార్కెట్ భవిష్యత్తు మాత్రం ఆశాజనకంగానే కనిపిస్తోంది. ఇటీవల యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మార్చి గరిష్టాల నుండి ధరలు 10 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై జాప్యం వంటి కారణాలు మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి. అయినప్పటికీ, ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం 15 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ధరల్లో వచ్చిన ఈ తాత్కాలిక తగ్గుదల (పుల్ బ్యాక్) కొనుగోలుదారులకు ఒక మంచి అవకాశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మళ్లీ వచ్చే పండుగకి రూ.1.80 లక్షలు!మున్ముందు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ఎదురయ్యే ఆటంకాలు పసిడి ధరలో పదునైన పెరుగుదలకు దారితీస్తాయని, ఏడాది కాలంలోనే తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.1,80,000 మార్కును తాకవచ్చని నిర్మల్ బాంగ్ కమోడిటీస్ రీసెర్చ్ హెడ్ కునాల్ షా విశ్లేషించారు. అదేవిధంగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు ధర 5,500 డాలర్ల స్థాయికి చేరవచ్చని, తద్వారా దేశీయంగా ధరలు రూ.1,70,000 నుండి రూ. 1,85,000 మధ్య ఉండొచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ నిపుణులు భావిస్తున్నారు. -
అలర్ట్: రేపటి నుంచి ఈ బ్యాంక్ అకౌంట్లు క్లోజ్!
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కీలక నిర్ణయం తీసుకుంది. నిరుపయోగంగా ఉన్న లక్షలాది ఖాతాలను రేపటి (ఏప్రిల్ 16) నుండి శాశ్వతంగా మూసివేయాలని బ్యాంక్ యాజమాన్యం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇతర ప్రభుత్వ బ్యాంకుల బాటలోనే పీఎన్బీ కూడా ఈ కఠిన చర్యలకు ఉపక్రమించడం బ్యాంకింగ్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.ఎవరి ఖాతాలు మూతపడతాయి?మీడియా నివేదికల ప్రకారం.. ఈ కింది కేటగిరీల కిందకు వచ్చే ఖాతాలను బ్యాంక్ మూసివేయనుంది.మూడేళ్లుగా లావాదేవీలు లేనివి: గత మూడేళ్లుగా కనీసం ఒక్కసారి కూడా వాడని ఖాతాలు.జీరో బ్యాలెన్స్: ఖాతాలో జీరో బ్యాలెన్సు ఉండి, చాలా కాలంగా ఇన్యాక్టివ్గా ఉన్న ఖాతాలు.కేవైసీ అప్డేట్ లేనివి: గడువులోపు e-KYC (ఈ-కేవైసీ) పూర్తి చేయని ఖాతాలపై బ్యాంక్ వేటు వేసే అవకాశం ఉంది.ఎందుకీ కఠిన నిర్ణయం?బ్యాంకులో వేల సంఖ్యలో నిరుపయోగంగా పడి ఉన్న ఖాతాల వల్ల మోసాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని బ్యాంక్ భావిస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా, అలాగే బ్యాంక్ డేటాను ప్రక్షాళన చేసే ఉద్దేశంతో క్రమానుగతంగా ఇటువంటి చర్యలు చేపడుతుంటారు.ఖాతాను కాపాడుకోవాలంటే..మీ ఖాతా క్లోజ్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ కింది పనులు పూర్తి చేయండి:మీ సమీపంలోని పీఎన్బీ బ్రాంచ్కు వెళ్లి వెంటనే ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.మీ అకౌంట్లో కొంత మొత్తాన్ని జమ చేయండి.కనీసం ఒక చిన్న లావాదేవీ (డ్రా చేయడం లేదా జమ చేయడం) చేయడం ద్వారా అకౌంట్ యాక్టివ్గా ఉందని నిర్ధారించుకోండి.తీసుకెళ్లాల్సిన పత్రాలుఈ పనుల నిమిత్తం బ్యాంకుకు వెళ్లేటప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, విద్యుత్ లేదా నీటి బిల్లు (అడ్రస్ ప్రూఫ్ కోసం), బ్యాంక్ పాస్బుక్ ఒరిజినల్ పత్రాలతో పాటు వాటి ఫోటోకాపీలను (జిరాక్స్) వెంట తీసుకెళ్లడం మర్చిపోకండి.ఇదీ చదవండి: పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు -
ఆరోగ్య బీమా.. ఆదుకునే కవచమా? చక్రవ్యూహమా?
ఆరోగ్య బీమా అనేది ఆపద సమయంలో ఆదుకునే ఒక రక్షా కవచం. కానీ, అవసరానికి ఆ కవచం పనిచేయకపోతే పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం దేశంలో ఇలాంటి సంఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రి ఖర్చుల కోసం క్లెయిమ్ చేస్తే.. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏదో ఒక కారణంతో తిరస్కరించడం లేదా సగం డబ్బులే ఇవ్వడం వంటివి సాధారణమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారిక గణాంకాలు, నిపుణుల విశ్లేషణతో రూపొందించిన ప్రత్యేక కథనం మీ కోసం..క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది?వైద్య ఖర్చులు ఆకాశాన్నంటుతున్న తరుణంలో సామాన్యుడికి ఆరోగ్య బీమా కొండంత అండ. అయితే, క్లెయిమ్ సెటిల్మెంట్ విషయంలో పాలసీదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో ‘బీమా భరోసా’ పోర్టల్లో నమోదైన ఫిర్యాదులు, 2025 ఆర్థిక సంవత్సరం మొత్తం ఫిర్యాదుల సంఖ్యను మించిపోయాయి. ఫిబ్రవరి 2026 నాటికి ఈ పోర్టల్లో సుమారు 73,729 ఫిర్యాదులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇందులో దాదాపు 69% ఫిర్యాదులు కేవలం క్లెయిమ్ తిరస్కరణ లేదా జాప్యానికి సంబంధించినవే కావడం గమనార్హం.క్లెయిమ్ తిరస్కరణకు ప్రధాన కారణాలుబీమా సంస్థలు క్లెయిమ్లను తిరస్కరించడానికి నిబంధనలతోపాటు పాలసీదారుల అవగాహన లోపం కూడా ఒక కారణం. క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.ముందస్తు వ్యాధులను చెప్పకపోవడం..పాలసీ తీసుకునేటప్పుడు బీపీ, షుగర్ వంటి పాత జబ్బుల గురించి దాచడం అతిపెద్ద తప్పు. 36 నెలల నిరీక్షణ కాలం (మారటోరియం పీరియడ్) ముగియకముందే ఇలాంటివి బయటపడితే కంపెనీలు క్లెయిమ్ను నేరుగా తిరస్కరిస్తాయి.వెయిటింగ్ పీరియడ్కొత్తగా పాలసీ తీసుకున్న వెంటనే అన్ని వ్యాధులకు కవరేజీ ఉండదు. సాధారణంగా మొదటి 30 రోజులు (ప్రమాదాలు మినహా) నిర్దిష్ట వ్యాధులకు (హెర్నియా, క్యాటరాక్ట్.. వంటివి) 2-4 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈలోపు క్లెయిమ్ చేస్తే అది రిజెక్ట్ అవుతుంది.వైద్య అవసరం లేకుండానే ఆసుపత్రిలో చేరికకేవలం డయాగ్నోస్టిక్ పరీక్షల కోసం లేదా ఇంట్లోనే చికిత్స పొందే అవకాశం ఉన్న జబ్బులకు ఆసుపత్రిలో చేరితే క్లెయిమ్ రాదు. కనీసం 24 గంటల ఆసుపత్రి చేరిక తప్పనిసరి (డే కేర్ చికిత్సలు మినహా).కాస్మెటిక్ సర్జరీలు, దంత చికిత్సలు, విటమిన్ సప్లిమెంట్స్ వంటివి చాలా పాలసీల్లో కవర్ కావు. మీరు పాలసీ తీసుకునే ముందే వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.ఆసుపత్రిలో చేరిన 24-48 గంటల్లోపు బీమా సంస్థకు సమాచారం ఇవ్వాలి. రీయింబర్స్మెంట్ విషయంలో డిశ్చార్జ్ అయిన 15-30 రోజుల్లోపు పత్రాలు సమర్పించకపోతే సమస్యలు ఎదురవుతాయి.పాలసీ కొనే ముందు చెక్ చేయాల్సినవి..పాలసీ డాక్యుమెంట్ అనేది కేవలం కాగితాల కట్ట కాదు, అది ఒక చట్టపరమైన ఒప్పందం. కొనే ముందు కీలక అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి.గది అద్దెపై పరిమితి ఉందో లేదో చూడండి. గది అద్దె పరిమితి మించితే, మొత్తం బిల్లులో కంపెనీ కోత విధిస్తుంది.బిల్లులో కొంత శాతం మీరే చెల్లించాలనే నిబంధన(కో-పేమెంట్) ఉంటే ప్రీమియం తగ్గుతుంది కానీ, క్లెయిమ్ సమయంలో మీ జేబుకు చిల్లు పడుతుంది.మీ ఇంటికి దగ్గరలో ఉన్న ప్రముఖ ఆసుపత్రులు ఆ బీమా నెట్వర్క్లో ఉన్నాయో లేదో సరిచూసుకోండి.ఒకే ఏడాదిలో ఒకటికంటే ఎక్కువసార్లు అనారోగ్యం పాలైతే బీమా మొత్తం (సమ్ అస్యూర్డ్) తిరిగి రీఛార్జ్ అయ్యే సౌకర్యం ఉందో లేదో చూడండి.ఇన్సూరెన్స్ ఏజెంట్ చెప్పే మాటల కంటే పాలసీలోని ‘కీ ఫీచర్స్ డాక్యుమెంట్’ చదవడం ఉత్తమం. ఏదైనా ఫిర్యాదు ఉంటే మొదట బీమా సంస్థకు, అక్కడ పరిష్కారం లభించకపోతే ఐఆర్డీఏఐ ‘బీమా భరోసా’ పోర్టల్ లేదా ఇన్సూరెన్స్ అంబడ్స్మన్ను ఆశ్రయించవచ్చు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
దీర్ఘకాలిక ప్రణాళికలకు దక్షిణాది ఓటు
దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికల విషయంలో దక్షిణాది వారు ముందుంటున్నారు. రిటైర్మెంట్ ప్లాన్ల విషయంలో స్పష్టతతో ఉంటున్నారు. ఇప్పటికే మూడింట రెండొంతుల మంది ఇందుకు సంబంధించిన ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఇఫ్సాస్ ఇండియా భాగస్వామ్యంతో హెచ్డీఎఫ్సీ లైఫ్ నిర్వహించిన రెడీ టు లైఫ్ ఇండెక్స్ సూచీలో దక్షిణాది రెడీనెస్ స్కోరు జాతీయ సగటైన 59కి మించి 60 స్థాయిలో నమోదైంది.ఈ నివేదిక ప్రకారం బీమా భద్రతపై అవగాహన ఉన్నప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. తక్షణ రాబడి ఉండదని, చర్చించడానికి కొంత ఇబ్బందికరమైనదని, ఎటువంటి క్లెయిమ్ తలెత్తకపోతే నిష్ప్రయోజనమనే భావన ఇందుకు కారణమని నివేదికలో వెల్లడైంది. దక్షిణాది వారి పొదుపు ప్రాధాన్యతల్లో పిల్లల చదువు, సొంత ఇల్లు, ఆకస్మిక ప్రణాళికలు మొదలైనవి అగ్రస్థానంలో ఉన్నాయి. అత్యవసర నిధి విషయంలో దక్షిణాది అగ్రస్థానంలోనే ఉన్నప్పటికీ మూడింట ఒక వంతు మంది సదరు నిధి ఒక నెలకు మాత్రమే సరిపోతుందని పేర్కొన్నారు. ఆర్థిక ప్రణాళిక, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధత, ఆరోగ్యం, పదవీ విరమణ వ్యూహాలపై అవగాహన–సన్నద్ధత మధ్య అంతరాలను పూరించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ సూచీ సంబంధిత అధ్యయనంలో 25–55 ఏళ్ల వయస్సు గల 1,836 మంది పాల్గొన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
ఇన్వెస్టర్ల మనసంతా ఆ ఇన్వెస్టింగ్పైనే..
ముంబై: పారదర్శకమైన, తక్కువ వ్యయాలతో కూడుకున్న ఇండెక్స్ ఇన్వెస్టింగ్పై మదుపర్లలో ఆసక్తి పెరుగుతోందని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా తమ సంస్థ వివిధ సూచీల ఆధారిత ఫండ్స్ని అందిస్తున్నట్లు వివరించింది.2026 ఫిబ్రవరి 28 నాటికి వీటిలో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఏయూఎం రూ. 849 కోట్లకు, 100 ఇండెక్స్ ఫండ్ ఏయూఎం రూ. 1,983 కోట్లకు చేరినట్లు తెలిపింది. 2022 జనవరిలో ప్రవేశపెట్టిన నిఫ్టీ నెక్ట్స్ 50 ఫండ్ గణనీయంగా వృద్ధి చెందుతోందని పేర్కొంది. ఇవి లార్జ్ క్యాప్ మొదలుకుని వివిధ స్థాయుల్లో మార్కెట్కి ప్రాతినిధ్యం వహించే, భవిష్యత్తులో లీడర్లుగా ఎదిగే సామర్థ్యాలున్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగపడతాయని సంస్థ తెలిపింది.యాక్టివ్గా మేనేజ్ చేసే ఫండ్స్తో పోలిస్తే, ఇండెక్స్ ఫండ్స్లో హ్యూమన్ ఎర్రర్ (నిర్ణయాల్లో పొరపాట్లు) తక్కువగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులను ఆశించే ఇన్వెస్టర్లు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కొత్త తరం ఇన్వెస్టర్లు తక్కువ ఎక్స్పెన్స్ రేషియో (నిర్వహణ వ్యయం) కలిగిన ప్యాసివ్ ఇన్వెస్టింగ్ పద్ధతులపై అవగాహన పెంచుకుంటున్నారు. -
ఫారమ్ 15 G/H బదులుగా ఫారమ్ 121
కొత్త చట్టం, కొత్త రూల్స్తో ఫారాల నంబర్లు మారడం సహజం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 15 G/Hలు రెండింటికి బదులుగా ఒకే ఫారమ్ తెచ్చారు. దాని నెంబరు 121గా ఉంది. కొత్త ఫారమ్ ఎందుకు దాఖలు చేయాలి? విషయం పాతదే. మీకు బాగా తెలిసిందే. మీరు సంపాదించిన బ్యాంకు డిపాజిట్లు మీద వడ్డీని ఇతర ఆదాయం కింద పరిగణిస్తారు. ఇది పన్నుకు గురి అవుతుంది. ఒక ఏడాది ఇటువంటి ఆదాయం రూ.50 వేలు, ఏడాది దాటితే ఈ పరిమితి సీనియర్ సిటిజన్లకు అయితే రూ.1,00,000. బ్యాంకు వాళ్లు దాని మీద టీ.డీ.యస్ రివకరీ చేస్తారు. అందుకని ముందుగా లెక్కలు వేసుకోండి. మీ నికర టాక్స్ బుక్ ఆదాయం 2026–27లో రూ.12,00,000 దాటకపోతే మీకు పన్ను భారం ఏర్పడదు. మీకు ఏర్పడ్డ ఆదాయంలో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ కూడా ఉండి, మొత్తం ఆదాయం రూ.12,00,000 దాటకపోతే పన్ను భారమే ఉండదు కాబట్టి టీడీఎస్కి గురి కావడం అనవసరం. అందుకని ఈ నెలలోనే 121 ఫారమ్ సబ్మిట్ చేయండి. మీరు బ్యాంకుకి సబ్మిట్ చేయకపోతే బ్యాంకు వారు టీడీఎస్ కట్ చేస్తారు. అందుకని 121 వేయండి.పాత ఫారమ్లు ఇక ఉండవా..? 1.4.2026 నుంచి పాత ఫారమ్లు 15 G/H ఉండవు. రద్దు అయ్యాయి అని అనవచ్చు. గతేడాది వరకు 60 ఏళ్లు దాటిన వారికి ఒక ఫారమ్, దాటని వారికి వేరొక ఫారమ్ అమల్లో ఉండేవి. ఇక నుంచి ఒకే ఫారమ్. దాని నెంబరే 121. వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవ్వరైనా 121 దాఖలు చేయాలి. టీడీఎస్ ఏ పరిస్థితుల్లో చేస్తారు.. ఫారమ్ 121 దాఖలు చేసినా, చేయకపోయినా డిపాజిట్ హోల్డర్లకి పాన్ లేకపోతే టీడీఎస్ 20% చొప్పున చేస్తారు. పాన్ ఉండి పనిచేయకపోయినా.. ఆధార్తో అనుసంధానం కాకపోయినా 20 % రివకరీ చేస్తారు. బ్యాంకు వడ్డీ రూ.50,000 దాటి, గత రెండు అస్సెస్మెంట్ సంవత్సరాలకు ఆదాయపు పన్ను రిటర్ను వేయకపోతే టీడీఎస్ 20 శాతం కట్ చేస్తారు. క్యాపిటల్ గెయిన్స్ ఆదాయం ఉంటే .. ఫారమ్ 121 కేవలం పన్ను భారం లేని వారికి మాత్రమే. 87 అ కింద రిబేటు సౌకర్యం/సదుపాయం పొందడానికి క్యాపిటల్ గెయిన్స్ మీద కాకుండా ఏర్పడ్డ ఇతర అన్ని ఆదాయాలకు మాత్రమే. మీకు క్యాపిటల్ గెయిన్స్ మీద ఆదాయం ఉంటే ఫారమ్ 121 వేయకూడదు. కింది ఉదాహరణ అర్థం చేసుకోండి .. 2026–27లో మీ ఆదాయం రూ.12,00,000 లోపల ఉంది. ఈ సందర్భంలో పన్ను భారం ఉండదు. రూ.2,00,000 బ్యాంకు వడ్డీ ఇందులో కలిసి ఉండదనుకొండి. 121 ఇచ్చారు. బ్యాంకు వాళ్లు టీడీఎస్ చేయరు. కానీ సంవత్సరాంతంలో మీకొక క్యాపిటల్ గెయిన్స్ వచ్చింది అనుకోండి. పన్ను భారం ఏర్పడుతుంది. మినహాయింపులు పొందవచ్చు. మినహాయింపులు వద్దనుకుంటే... 87 అ బెనిఫిట్ రద్దు అవుతుంది. అంటే రేట్ల ప్రకారం రూ.12,00,000 మీద క్యాపిటల్ గెయిన్స్ మీద చెల్లించాలి. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మీరు ఫారమ్ 121 ఇవ్వడం తప్పు అవుతుంది. ఆ తప్పు నుంచి బయట పడాలంటే క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు పొందాల్సిందే. అప్పుడు ఫారమ్ 121 ఇవ్వడం సముచితము. రెండు విభిన్న ఆలోచనలు .. ఏ ఆదాయం ఎంత ఉన్నా.. ఫారమ్ 121 ఇవ్వకపోతే అప్పుడు బ్యాంకు వాళ్లు టీడీఎస్ రికవరీ చేస్తారు. సంవత్సరం చివరన ఆదాయం లెక్కించడం, పన్ను చెల్లించడం.. ఒక వర్గం వాదన ఇది. కాగా మరో వర్గం ఆలోచన ఏమిటంటే ఏ ఆదాయం ఎంత ఉన్నా ఫారమ్ 121 ఇవ్వడం... పన్ను కోత టీడీఎస్ లేకుండా బయటపడటం.. కానీ సంవత్సరాంతంలో ఆదాయం లెక్కించి పన్ను కట్టడం, లేదా రిఫండ్ తెచ్చుకోవడం .. ఇలా కూడా చేయొచ్చు. మీరు ముందుగానే లెక్కలన్నీ వేసి నిర్ణయం తీసుకోండి. ఫారమ్ 121 గురించి సాంకేతిక సమాచారం .. ఇందులో రెండు భాగాలుంటాయి. పార్ట్ అ లో అంకెలు మనం నింపాలి. ఫారమ్ ఆ బ్యాంకు వాళ్లు నింపుతారు. అంశాలన్నీ మీకు తెలిసినవే. మొత్తం సంవత్సర ఆదాయం ఎంతో చెప్పాలి. అంతేకాకుండా గత రెండేళ్ల ఆదాయపు రిటర్నులు వివరాల ఇవ్వాలి. 121 దాఖలు చేయగానే బ్యాంకు అధికార్లు 26 క్యారెక్టర్లతో అంకెలు/అక్షరాలు కలిపిన నెంబరు ఇస్తారు. ఇందులో బ్యాంకు పేరు, టాన్ నంబరు, ఆర్థిక సంవత్సరం మొదలైనవి ఉంటాయి. ఈ నంబరుతో డిపార్ట్మెంట్ వారు మీ వివరాలన్నింటినీ ట్రాక్ చేస్తారు. దీని వలన దురి్వనియోగం/అనుచితయోగం తగ్గుతుంది. ఈ ఫారమ్లో వివరాలు ఇతర ఫారాలతో లింక్ చేయడం వలన అన్నీ ఫారాల్లోని అంశాలు అప్డేట్ అవుతాయి. తగిన జాగ్రత్త వహించండి. -
సక్సెస్కు ‘సప్త’పది! ‘కొత్త’గా ఇన్వెస్ట్ చేద్దాం..
నిన్న మొన్నటిదాకా పెట్టుబడులు పోటెత్తాయి. దీంతో మార్కెట్లు దూసుకెళ్లాయి. కొత్త గరిష్ఠ స్థాయిలను నమోదు చేశాయి. ఆ పరిస్థితుల నుంచి ఇపుడు మార్కెట్లు ఆటుపోట్ల దశవైపు మళ్లాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో మార్కెట్లు విపరీతమైన ఊగిసలాటకు గురవుతున్న తరుణంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. గత కొన్నాళ్లుగా ఈక్విటీలు పటిష్టంగా ర్యాలీలు చేస్తుండటంతో ఇన్వెస్టర్లు అటువైపు మొగ్గు చూపటం వారికి మంచి లాభాలనే ఇచ్చింది. కానీ 2027 ఆర్థిక సంవత్సరం కాస్త విభిన్నంగా ఉండబోతోంది. అంతర్జాతీయంగా వృద్ధిపై అనిశ్చితి నెలకొంది. ద్రవ్యోల్బణం దిగి వస్తున్నా, అంత తేలిగ్గా లొంగడం లేదు. వడ్డీ రేట్లు కూడా మరీ దూకుడుగా ఏమీ తగ్గడం లేదు. భారతీయ ఇన్వెస్టర్లకు దేశీయంగా పటిష్టమైన వృద్ధి వల్ల అవకాశాలు మెరుగ్గానే ఉన్నప్పటికీ, విధానాలను కాస్త మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది, రాబడులపై ఆశలతో గుడ్డిగా పరుగెత్తడం కాకుండా, పెట్టుబడులను స్మార్ట్గా తీర్చిదిద్దుకోవాల్సి ఉంది. దానికోసం ఉపయోగపడే ఏడు వ్యూహాల సమాహారమే ఈ వెల్త్ స్టోరీ... ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు ఆర్థిక లక్ష్యాల మదింపు చాలా మంది ఇన్వెస్టర్లు ఒక్కసారి లక్ష్యాలను నిర్దేశించుకున్నారంటే చాలు మళ్లీ వాటిలో మార్పులు, చేర్పులు చేసుకోరు. అయితే, కాలక్రమేణా మార్కెట్ పరిస్థితులు, ఆదాయ స్థాయిలు, వ్యక్తిగత బాధ్యతలు మారుతుంటాయి. కాబట్టి మీరు పెడుతున్న పెట్టుబడులు మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది పునఃసమీక్షించుకునేందుకు ఈ కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ఒక చక్కని అవకాశంగా మార్చుకోవాలి. ఉదాహరణకు మీరు నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యానికి 2–3 ఏళ్లే ఉన్నప్పుడు భారీ స్థాయిలో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టి ఉంటే ఒడిదుడుకులపరంగా అనవసర రిసు్కలు ఎదురుకావచ్చు. అదే రిటైర్మెంట్ లేదా సంపదను పెంచుకోవడంలాంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టి ఉంటే ఈక్విటీల్లో అధిక పెట్టుబడులను కొనసాగించవచ్చు. ఇక్కడ విషయం ఏమిటంటే, ఆటో పైలట్ మోడ్లో పెట్టుబడులు పెట్టుకుంటూ పోవడం కాకుండా లక్ష్యానికి ఉన్న వ్యవధికి తగ్గట్లుగా కేటాయింపులు మార్చాల్సి ఉంటుంది.అసెట్ అలోకేషన్ని సరి చేసుకోవడం ఇపుడు అన్నింటికన్నా పెద్ద రిస్కు మార్కెట్ ఒడిదుడుకులు కాదు.. కేవలం ఒకే పెట్టుబడి సాధనంలో, అందులోనూ, ఈక్విటీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడమే రిస్కీ వ్యవహారం. చాలా మటుకు పోర్ట్ఫోలియోలు అనుకోకుండానే ఈక్విటీల్లో భారీగా ఇన్వెస్ట్ చేసి ఉంటాయి. రాబోయే రోజుల్లో మార్కెట్లలో ఒకే రకమైన రిటర్నులు రాకపోవచ్చు. కాబట్టి, అసెట్ అలొకేషన్పై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈక్విటీ, డెట్, పసిడితో సమతూకమైన పోర్ట్ఫోలియో ఉంటే షాక్లేవైనా ఎదురైనా తట్టుకుంటూ సంపదను పెంచుకునేందుకు వీలవుతుంది. ఉదాహరణకు... ఈక్విటీలు పతనమైనప్పుడు, డెట్ సాధనాలు స్థిరత్వాన్ని అందిస్తాయి. ఇక గ్లోబల్ అనిశి్చతికి పసిడి హెడ్జింగ్ సాధనంగా పని చేస్తుంది. వార్షికంగా రీబ్యాలెన్సింగ్ చేసుకోవడం వల్ల పోర్ట్ఫోలియోకి మీరు నిర్దేశించుకున్న స్థాయికి మించి రిస్కులు ఎదురవకుండా చూసుకోవచ్చు.డైవర్సిఫికేషన్ ప్రధానం పెట్టుబడుల్లో వైవిధ్యం పాటించడమంటే బోలెడన్ని మ్యూచువల్ ఫండ్స్ కలిగి ఉండాలనే అపోహ ఒకటి ఇన్వెస్టర్లలో ఉంది. వాస్తవానికి సదరు ఫండ్స్ అన్నీ కూడా ఒకే రకమైన రంగాలు లేదా మార్కెట్ క్యాప్లకు చెందినవైతే, అప్పుడు కూడా మొత్తం పోర్ట్ఫోలియోలో ఒకే తరహా పెట్టుబడులున్నట్లే అవుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో సిసలైన డైవర్సిఫికేషన్ అంటే వివిధ అసెట్ క్లాస్లు, భౌగోళిక ప్రాంతాలు, పెట్టుబడి వ్యూహాలపై దృష్టి కేంద్రీకరించడం. ఈక్విటీల విషయానికొస్తే, స్థిరత్వం కోసం లార్జ్ క్యాప్స్లో, అడాప్టబిలిటీ కోసం ఫ్లెక్సి క్యాప్స్లో, సమతూకం కోసం డెట్, పసిడిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా కొంత ఇన్వెస్ట్ చేస్తే డైవర్సిఫికేషన్ మరింతగా ఉంటుంది.ఒడిదుడుకులు.. వ్యూహాలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆటుపోట్లు ప్రత్యేకంగా కనిపించనున్నాయి. ఇన్వెస్టర్లు వీటిని రిస్కులుగా అనుకోకుండా, అవకాశాలుగా మార్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (సిప్) చక్కగా పని చేస్తాయి. దీనివల్ల కాలక్రమేణా కొనుగోలు రేటు సగటు స్థాయికి వస్తుంది. అయితే, మార్కెట్లు కరెక్షన్లకు లోనైనప్పుడు సిప్లతో పాటు వ్యూహాత్మక పెట్టుబడులను కూడా జోడిస్తే స్మార్ట్ విధానంగా ఉంటుంది. ఉదాహరణకు మార్కెట్లు అర్థవంతంగా తగ్గితే, అదనంగా పెట్టుబడులను కొద్ది కొద్దిగా పెట్టడం వల్ల దీర్ఘకాలిక రాబడులు మెరుగుపడతాయి. మార్కెట్లు ఆటుపోట్లకు గురవుతున్నప్పుడు భావోద్వేగాలతో కాకుండా క్రమశిక్షణతో వ్యవహరించడం ముఖ్యం.లిక్విడిటీ పటిష్టం చేసుకోవాలి అనిశ్చితిలో రాబడులకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో లిక్విడిటీకి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. చాలా మంది ఇన్వెస్టర్లు ఈ విషయాన్ని పట్టించుకోరు. ఫలితంగా చాలా మటుకు డబ్బును మార్కెట్ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. నిర్మాణాత్మకమైన ఆర్థిక ప్రణాళికలో కనీసం ఆరు నెలలకు సరిపడే ఎమర్జెన్సీ నిధి కూడా ఉంటుంది. అనూహ్య పరిస్థితులు ఏవైనా తలెత్తితే దీర్ఘకాలిక పెట్టుబడులను ఉపసంహరించుకోకుండా ఇది తోడ్పడుతుంది. లిక్విడిటీ ఉంటే ప్రధాన పోర్ట్ఫోలియోని డిస్టర్బ్ చేయకుండా మార్కెట్లో వచ్చే కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలవుతుంది.పోర్ట్ఫోలియోలో డెట్ సాధనాలకూ చోటివ్వండి ఈక్విటీ మార్కెట్లు బాగున్నప్పుడు డెట్ పెట్టుబడులను పెద్దగా పట్టించుకోరు. కానీ రాబడులు ఒక మోస్తరు స్థాయికి పరిమితమై, వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్న దశలో వీటి ప్రాధాన్యత పెరుగుతుంది. డెట్ సాధనాల వల్ల అంచనాలకు అనుగుణమైన రాబడులు వస్తాయి. పోర్ట్ఫోలియోలో ఆటుపోట్లు తగ్గుతాయి. మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న దశలో పోర్ట్ఫోలియోకి కాస్త స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యంగా పెట్టుబడిని సంరక్షించుకోవడం చాలా కీలకంగా ఉండే స్వల్పకాలిక, మధ్యకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇవి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి 2026–27లో అత్యంత నాణ్యమైన డెట్ సాధనాలకు సమతూకంగా కేటాయిస్తే, భారీ రాబడులు లేకపోయినా, రిసు్కకు తగ్గట్లుగా మెరుగైన రాబడులను అందుకునేందుకు వీలవుతుంది. క్రమశిక్షణ ముఖ్యం సాధారణంగా సరైన ఫండ్ని ఎంపిక చేసుకుంటే చాలు మంచి రాబడులు వస్తాయనే దృష్టితో చాలా మంది ‘అత్యుత్తమ మ్యూచువల్ ఫండ్ని వెతికి పట్టుకునేందుకు సమయాన్ని వెచ్చిస్తుంటారు. నిజానికి, నిలకడ, క్రమశిక్షణ, అసెట్స్కి సరైన అలొకేషన్ చేయడమే దీర్ఘకాలికంగా ప్రయోజనాలను అందిస్తాయి. ఇటీవలి కాలంలో పనితీరు బాగుండటం లేదంటూ మాటిమాటికీ ఫండ్స్ని అటూ ఇటూ మార్చడం వల్ల అసలుకే మోసం వస్తుంది. దీనివల్ల భారీ వేల్యుయేషన్స్కి కొనుక్కుని, తాత్కాలికంగా పడగానే, ని్రష్కమించినట్లవుతుంది. అలా గాకుండా మెరుగ్గా నిర్వహిస్తున్న కొద్ది ఫండ్స్ని ఎంచుకుని, పెట్టుబడులను కొనసాగిస్తూ, మధ్యమధ్యలో వాటిని సమీక్షించుకుంటూ ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. కాలం గడిచే కొద్దీ తాత్కాలిక భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల గాకుండా క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేయడం వల్లే మంచి ఫలితాలు పొందవచ్చు. కొత్త ఆర్థిక సంవత్సరంలో దూకుడుగా, అస్తవ్యస్తంగా పెట్టుబడులను పెడితే ఫలితాలు దక్కేలా లేవు. ఎవరైతే సమతూకం, నిలకడ, రిస్క్ మేనేజ్మెంట్పై ప్రధానంగా ఫోకస్ చేస్తారో వారికే ప్రయోజనాలు లభిస్తాయి. మార్కెట్ కదలికలను ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నం చేయడం కాకుండా, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనగలిగే విధంగా పోర్ట్ఫోలియోని తీర్చిదిద్దుకోవడం స్మార్ట్ వ్యూహంగా ఉంటుంది. లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను సరిచేసుకుంటూ, సరైన అసెట్ అలొకేషన్ని పాటిస్తూ, సమర్ధవంతంగా డైవర్సిఫై చేస్తూ, క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఇన్వెస్టర్లు ఒకవైపు దీర్ఘకాలికంగా సంపదను పెంచుకుంటూనే మరోవైపు అనిశ్చితి నుంచి బైటపడొచ్చు. చివరగా చెప్పేదేమిటంటే, గొప్ప ఫలితాలు సాధించాలంటే ఏదైనా అసాధారణమైనది చేయడం కాదు.. నిలకడగా కొన్ని సరైన నిర్ణయాలు తీసుకుంటే చాలు. -
పసిడి పండుగ.. అప్పుడు పది గ్రాములు..
ఆశలు అక్షయం కావాలని కోరుకుంటూ భారతీయులు జరుపుకునే పవిత్ర పండుగ అక్షయ తృతీయ. ఈ ప్రత్యేక సందర్భంలో పసిడి కొనుగోలు చేయడం అనవాయితీ. ఈ ఏడాది కూడా పసిడి కొనుగోళ్లకు జనం సిద్ధమవుతున్నప్పటికీ, ఆకాశాన్నంటుతున్న ధరలు సామాన్యుడి అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే బంగారం ధరల్లో వచ్చిన భారీ మార్పు ఇప్పుడు కొనుగోలుదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది.ధరల వ్యత్యాసం2025 అక్షయ తృతీయ నాటి ధరలతో పోలిస్తే, ఈ ఏడాది (2026) బులియన్ మార్కెట్లో పెను మార్పులు సంభవించాయి. గతేడాది 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.96,000 నుండి రూ.97,000 మధ్య ఉండగా, ఇప్పుడు అదే ధరకు కేవలం 6 నుండి 6.5 గ్రాములు మాత్రమే వస్తోంది. అంటే కేవలం ఏడాది కాలంలోనే కొనుగోలుదారుల శక్తి 30-40% వరకు క్షీణించిందని విశ్లేషకులు చెబుతున్నారు.దేశంలో ప్రస్తుతం తులం (10 గ్రాములు) బంగారం (24 క్యారెట్స్) ధర రూ.1,52,840 లుగా (ఏప్రిల్ 11 నాటికి) ఉంది. ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,40,100 లుగా ఉంది.ఎందుకీ పరుగు?బంగారం ధరలు ఇలా అదుపు లేకుండా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ కారణాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, అనిశ్చితి వల్ల పెట్టుబడిదారులు 'సురక్షిత ఆస్తి'గా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. రూపాయి విలువ తగ్గడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. భౌతిక బంగారంతో పాటు డిజిటల్ గోల్డ్, ఇటిఎఫ్ (ETF)లపై ఆసక్తి పెరగడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు పైపైకి వెళ్తున్నాయి.మారిన వినియోగదారుల తీరుధరలు భారమైనా సెంటిమెంట్ను వదులుకోని భారతీయులు, తమ కొనుగోలు పద్ధతులను మార్చుకుంటున్నారు. భారీ ఆభరణాల కంటే తక్కువ బరువుతో ఆకర్షణీయంగా కనిపించే డిజైన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫ్యాషన్ కంటే పెట్టుబడి దృక్పథంతో బంగారు నాణేలను కొనుగోలు చేస్తున్నారు. కొత్తగా నగదు ఖర్చు చేసే కంటే, ఇంట్లో ఉన్న పాత ఆభరణాలను ఇచ్చి కొత్తవి తీసుకునే 'ఎక్స్ఛేంజ్ స్కీంల' వైపు జనం మొగ్గు చూపుతున్నారు.వ్యాపారుల వ్యూహాలుకస్టమర్లను ఆకర్షించడానికి జ్యువెలరీ షాపులు కూడా రాయితీలను ప్రకటిస్తున్నాయి. మేకింగ్ ఛార్జీలపై తగ్గింపులు, ముందస్తు బుకింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. స్టోర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గకపోయినప్పటికీ, ఒక్కొక్కరు కొనే బంగారం పరిమాణం తగ్గే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఊడిన ఉద్యోగికి ఎంత కష్టం!!
ప్రైవేటు రంగంలో పెరుగుతున్న లేఆఫ్స్ కేవలం ఉద్యోగ భద్రతనే కాకుండా, మధ్యతరగతి ఆర్థిక మూలాలను, ముఖ్యంగా ఈఎంఐ (EMI) చెల్లింపుల వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈఎంఐలు అంటే సాధారణ వ్యావహారికంలో సులభ వాయిదాలుగా వ్యవహిరిస్తారు. కానీ ఉద్యోగం కోల్పోయిన వారికి ఇప్పుడవే భూతంగా భయపెడుతున్నాయి. ఈ పరిస్థితిపై తాజా నివేదికలు, విశ్లేషణలతో ప్రత్యేక కథనం..ఐటీ లేఆఫ్స్.. ఈఎంఐ సంక్షోభంగత దశాబ్ద కాలంగా భారత ఐటీ రంగం స్థిరమైన ఆదాయానికి, విలాసవంతమైన జీవనశైలికి చిరునామాగా నిలిచింది. అయితే, 2025-26 కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం, ప్రపంచ ఆర్థిక మందగమనం కారణంగా ఐటీ కొలువులు ఊడుతున్నాయి. ఇది నేరుగా బ్యాంకింగ్, రుణ చెల్లింపుల రంగంపై ప్రభావం చూపుతోంది.పెరుగుతున్న గృహ రుణాల ఆందోళనఐటీ నిపుణులు ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్, పుణే వంటి నగరాల్లో భారీ ధరలకు ఇళ్లను కొనుగోలు చేశారు. మెట్రో నగరాల్లో సగటు ఐటీ ఉద్యోగి హోమ్ లోన్ ఈఎంఐ రూ.80,000 నుండి రూ.1.2 లక్షల మధ్య ఉంటోంది. ఇటీవల ఒక సర్వే ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన వారిలో 60% మందికి కేవలం 6 నుండి 8 నెలల వరకు మాత్రమే ఈఎంఐలు చెల్లించగల అత్యవసర నిధి (Emergency Fund) ఉంది. ఆ తర్వాత డిఫాల్ట్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది.భారమైన బకాయిలుఆర్బీఐ (RBI) తాజా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ (2026) ప్రకారం, భారతదేశ గృహ రుణాలు జీడీపీలో 41% దాటాయి. ఇందులో అధిక భాగం వినియోగ అవసరాల కోసం తీసుకున్న పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ బకాయిలే. ఐటీ నిపుణులు తమ జీవనశైలిని కొనసాగించేందుకు తీసుకున్న అన్సెక్యూర్డ్ లోన్స్ ఇప్పుడు భారంగా మారాయి. ఆదాయం ఆగిపోవడంతో, ఈ రుణాల రికవరీ బ్యాంకులకి సవాలుగా మారుతోంది.మారిన సిబిల్ నిబంధనలతో తక్షణ ప్రభావంఏప్రిల్ 2026 నుండి ఆర్బీఐ కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం.. బ్యాంకులు ఇప్పుడు ప్రతి వారం రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్కు పంపాలి (గతంలో ఇది 15-30 రోజులకు ఒకసారి ఉండేది). దీంతో ఒక్క ఈఎంఐ మిస్ అయినా, కేవలం 7 రోజుల్లోనే మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. దీనివల్ల ఉద్యోగం కోల్పోయిన వారు ఇతర రుణాల కోసం ప్రయత్నించడం లేదా రీఫైనాన్సింగ్ చేసుకోవడం కష్టతరమవుతోంది.తాజా నివేదికల ముఖ్యాంశాలు బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (NPA) చారిత్రాత్మక కనిష్టంలో (2.15%) ఉన్నప్పటికీ, పర్సనల్ లోన్ విభాగంలో ఒత్తిడి పెరుగుతోంది. గృహ రుణాలు జీడీపీలో 41% కి చేరాయి. ఇది ఆందోళనకర స్థాయి. ఐటీ హబ్లలో నివసించే వారిలో పొదుపు శాతం 15% తగ్గింది. ఐటీ ఉద్యోగుల నుండి రుణ కాలపరిమితి పెంచాలని కోరుతూ వచ్చే దరఖాస్తులు 25% పెరిగాయి.ఉద్యోగం కోల్పోతే ఏం చేయాలి?లేఆఫ్స్ జరిగినప్పుడు భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం లేదా బ్యాంకులకు ముఖం చాటేయడం అతిపెద్ద తప్పు. రుణదాతలతో సంప్రదింపులు జరిపి మోరటోరియం లేదా లోన్ రీస్ట్రక్చరింగ్ కోరడం ఉత్తమ మార్గమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.అన్నిటా లేఆఫ్లు పెరుగుతున్న తరుణంలో ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి. కాబట్టి ఉద్యోగులు ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి. కనీసం 12 నెలల ఈఎంఐలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ నిధిని ముందే సిద్ధం చేసుకోవాలి. మొదట హోమ్ లోన్ వంటి సెక్యూర్డ్ లోన్స్కు ప్రాధాన్యత ఇవ్వాలి, ఎందుకంటే ఆస్తి జప్తు అయ్యే అవకాశం ఉంటుంది. ఆదాయం తగ్గినప్పుడు వెంటనే విలాసవంతమైన ఖర్చులను నిలిపివేయాలి.ఐటీ రంగంలో లేఆఫ్స్ అనేవి కేవలం ఒక రంగ సమస్య కాదు, ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని, రుణ చెల్లింపుల చక్రాన్ని ప్రభావితం చేస్తోంది. క్రెడిట్ స్కోర్ పట్ల బ్యాంకులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో, ఐటీ ఉద్యోగులు తమ ఆర్థిక ప్రణాళికలను మరింత జాగ్రత్తగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. -
గ్రాట్యుటీ.. రిటైర్మెంట్ గిఫ్ట్!
ఒక సంస్థలో ఏళ్ల తరబడి పనిచేసిన ఉద్యోగికి, ఆ సంస్థ పట్ల వారు చూపిన అంకితభావానికి, విధేయతకు ఇచ్చే గౌరవపూర్వకమైన బహుమతే గ్రాట్యుటీ. ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, ఉద్యోగి శ్రమకు యాజమాన్యం ఇచ్చే గుర్తింపు. మరి ఈ గ్రాట్యుటీ అందరికీ వస్తుందా? దీని లెక్కలేంటి? తాజా నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఓసారి పరిశీలిద్దాం.గ్రాట్యుటీ అంటే ఏమిటి?‘పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, 1972’ ప్రకారం, ఒక ఉద్యోగి ఒకే సంస్థలో దీర్ఘకాలం పనిచేసినందుకు ప్రతిఫలంగా యజమాని ఇచ్చే మొత్తాన్ని గ్రాట్యుటీ అంటారు. సాధారణంగా ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు, రాజీనామా చేసినప్పుడు లేదా దురదృష్టవశాత్తు మరణించినప్పుడు ఈ మొత్తాన్ని చెల్లిస్తారు.గ్రాట్యుటీ పొందడానికి అర్హతలుగ్రాట్యుటీ అందరికీ వర్తించదు. దీనికి కొన్ని ప్రాథమిక నియమాలు ఉన్నాయి. ఒకే సంస్థలో కనీసం 5 ఏళ్ల నిరంతర సేవలు పూర్తి చేసి ఉండాలి. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ఏ సంస్థ అయినా గ్రాట్యుటీ చట్టం పరిధిలోకి వస్తుంది. ఒకవేళ ఉద్యోగి మరణించినా లేదా ప్రమాదం వల్ల అంగవైకల్యం సంభవించినా ఈ ఐదేళ్ల నిబంధన వర్తించదు. అటువంటప్పుడు వారు పనిచేసిన కాలానికే గ్రాట్యుటీ చెల్లిస్తారు.ఎలా లెక్కిస్తారు?గ్రాట్యుటీ లెక్కించడానికి ఒక నిర్దిష్టమైన సూత్రం ఉంది. ఇందులో ప్రధానంగా రెండు అంశాలు కీలకం. చివరిగా తీసుకున్న వేతనం (బేసిక్+డీఏ), పూర్తి చేసిన సర్వీసు కాలం.గ్రాట్యుటీ=(చివరగా తీసుకున్న వేతనం*సర్వీసు చేసిన మొత్తం సంవత్సరాలు*15)/26ఇక్కడ 26 రోజులను ఒక నెలగా పరిగణిస్తారు. నెలలో 4 ఆదివారాలు తీసివేసి 15 రోజులను సగటు వేతనంగా లెక్కిస్తారు.ఉదాహరణ:రాము అనే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో 10 ఏళ్ల 7 నెలలు పనిచేశాడు. అతను ఉద్యోగం వదిలేటప్పుడు అతని బేసిక్ పే, డీఏ కలిపి రూ.50,000 అనుకుందాం.గమనిక: సర్వీసు కాలం 6 నెలల కంటే ఎక్కువ ఉంటే దాన్ని తదుపరి ఏడాదిగా పరిగణిస్తారు. అంటే ఇక్కడ రాము సర్వీసును 11 ఏళ్లుగా తీసుకోవాలి.గ్రాట్యుటీ: (50000*11*15)/26=రూ.3,17,307.ముఖ్యమైన అంశాలుప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, ఒక ఉద్యోగి గరిష్టంగా రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీని పన్ను మినహాయింపుతో పొందవచ్చు. కొత్త లేబర్ కోడ్ అమల్లోకి వస్తే ఈ పరిమితి పెరిగే అవకాశం ఉంది.ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీపై పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగులకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(10) ప్రకారం నిర్దేశిత పరిమితి వరకు మినహాయింపు లభిస్తుంది.ప్రతి ఉద్యోగి తన గ్రాట్యుటీ కోసం నామినీని నియమించుకోవడం తప్పనిసరి.ఇదీ చదవండి: రఫేల్ డీల్.. ‘స్వదేశీ’ అస్త్రాలకు పెద్దపీట! -
ఆన్లైన్ పేమెంట్ అలర్ట్.. గంట తర్వాతే చెల్లింపులు!
డిజిటల్ లావాదేవీల్లో పెరుగుతున్న మోసాలను తగ్గించేందుకు ఆర్బీఐ కీలక చర్యలు ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి ఒక చర్చాపత్రం విడుదల చేసింది. డిజిటల్ లావాదేవీ రూ.10,000 కంటే ఎక్కువ ఉంటే ఒక గంట తర్వాతే దాన్ని అమలు చేసే విధానం (ల్యాగ్) ఉండాలని ప్రతిపాదన తెచ్చింది.వద్దనుకుంటే గంటలోపు విజయవంతం కాకముందే దాన్ని రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల సైబర్ నేరస్థులు డెబిట్ చేసుకునేట్టు అయితే ఆ లావాదేవీల సమాచారం కస్టమర్లకు ముందే తెలుస్తుంది. అలాగే, మ్యూల్ ఖాతాలకు చెక్ పెట్టేందుకు ఒక ఖాతాలోకి వచ్చే మొత్తం జమలపై పరిమితులను ప్రతిపాదించింది. మెరుగైన శ్రద్ధ లేని ఖాతాలకు వార్షిక క్రెడిట్లను సుమారు రూ .25 లక్షలకు పరిమితం చేయాలని సూచించింది.ఒకే క్లిక్తో అన్ని డిజిటల్ చెల్లింపులను నిలిపివేసే (కిల్ స్విచ్) విధానాన్ని పేర్కొంది. ఇక 70 ఏళ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులను మోసపుచ్చి పెద్ద మొత్తాల్లో డబ్బులు ఖాతా నుంచి మళ్లించకుండా, ఆయా లావాదేవీలకు విశ్వసనీయమైన వ్యక్తి ద్వారా అదనపు ధ్రువీకరణను తీసుకువచ్చే ప్రతిపాదనను చేసింది. రూ .50,000 లకు మించిన లావాదేవీల విషయంలో వినియోగదారులకు నిధులను బదిలీ చేయడానికి ముందు నామినేటెడ్ వ్యక్తి నుండి అనుమతి అవసరం. -
విదేశీ చెల్లింపులపై కస్టమర్లకు వెంటనే సమాచారం
ముంబై: విదేశాల నుంచి భారత్లోని ఖాతాలకు వచ్చే సీమాంతర చెల్లింపులపై (జమలు) ఖాతాదారులకు వెంటనే సమాచారం (నోటిఫికేషన్) ఇవ్వాలని బ్యాంక్లకు ఆర్బీఐ ఆదేశించింది. ఇందుకు వీలుగా తమ ప్రక్రియలను క్రమబద్దీకరించుకోవాలని సూచించింది. ఖాతాలో జమ అయిన వెంటనే కస్టమర్లకు తెలియజేయాలని స్పష్టం చేసింది.ఫారెక్స్ మార్కెట్ పనిచేయని వేళ్లలో వచ్చే చెల్లింపుల విషయాన్ని మరుసటి రోజు తెలియజేయాలని కోరింది. బ్యాంకులు తమ విదేశీ ఖాతాల లావాదేవీలను గరిష్టంగా ఒక గంటలోపే పరిశీలించి సరిచూడాలని ఆదేశించింది. ఫారీన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ పనివేళ్లలో వచ్చే చెల్లింపులను మాత్రం అదే రోజు జమ చేయాలని పేర్కొంది. ఇందుకు వీలుగా వ్యవస్థలను సరిచేసుకోవాలని సూచించింది.2025 అక్టోబర్ 29న జారీ చేసిన ముసాయిదా నిబంధనలపై భాగస్వాముల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఈ నిబంధనలను ఆర్బీఐ జారీ చేసింది. ఇవి ఆరు నెలల తర్వాత నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం సీమాంతర చెల్లింపులకు సంబంధించి సమాచారం అందించిన వెంటనే, ఆ మొత్తాన్ని తక్షణమే సంబంధిత లబ్దిదారు ఖాతాలో జమ చేయనప్పటికీ, కస్టమర్లకు వెంటనే ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. -
పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు
సంపాదించే ప్రతి వ్యక్తి తన భవిష్యత్తు కోసమో, తన కుటుంబం భవిష్యత్తు కోసమో ఎంతో కొంత పొదుపు చేయాలనుకుంటారు. అయితే రిస్క్తో కూడిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లు అందరూ చేయలేరు. అలాంటి వారి కోసం రిస్క్ లేకుండా మెరుగైన రాబడినిచ్చే అనేక పొదుపు పథకాలు పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్నాయి. ఆయా స్కీములు ఏంటి.. వాటికి వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి.. తెలుసుకుందాం..2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ప్రకటించింది. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం. సురక్షితమైన పెట్టుబడితో పాటు ఆకర్షణీయమైన రాబడులు ఇచ్చే ప్రధాన పథకాల వివరాలు ఇలా ఉన్నాయి..సుకన్య సమృద్ధి యోజన: ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ఈ పథకం ప్రస్తుతం అత్యధిక వడ్డీని అందిస్తోంది. దీర్ఘకాలిక అవసరాలకు ఇది ఉత్తమ ఎంపిక. దీనికి వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: వృద్ధులకు సామాజిక భద్రత కల్పిస్తూ, సుకన్య సమద్ధితో సమానంగా అత్యధిక 8.2% వడ్డీని అందిస్తోంది.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): పన్ను ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక సంపద సృష్టికి ఇది అత్యంత ప్రజాదరణ పొందిన పథకం. దీనిపై ప్రస్తుతం 7.1% వడ్డీ లభిస్తోంది.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC): ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఈ పథకం స్థిరమైన, సురక్షితమైన రాబడులకు గ్యారెంటీ ఇస్తుంది. దీనిపై అందిస్తున్న వడ్డీ 7.7 శాతం.కిసాన్ వికాస్ పత్ర (KVP): తమ పెట్టుబడిని నిర్ణీత కాలంలో రెట్టింపు చేసుకోవాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. ప్రస్తుత రేటు ప్రకారం 115 నెలల్లో నగదు రెట్టింపు అవుతుంది. దీని వడ్డీ రేటు 7.5%.మంత్లీ ఇన్కమ్మ్ స్కీమ్ (MIS): ఒకేసారి పెట్టుబడి పెట్టి, ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఈ పథకం అనువైనది. దీనికి 7.4% వడ్డీ లభిస్తుంది.టైమ్ డిపాజిట్లు & రికరింగ్ డిపాజిట్లుబ్యాంకు ఎఫ్డీలతో పోలిస్తే పోస్టాఫీసు టైమ్ డిపాజిట్లు గట్టి పోటీనిస్తున్నాయి. కాలపరిమితిని బట్టి వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..కాలపరిమితివడ్డీ రేటు (%)ఏడాది టైమ్ డిపాజిట్6.9రెండేళ్ల టైమ్ డిపాజిట్7.0మూడేళ్ల టైమ్ డిపాజిట్7.1ఐదేళ్ల టైమ్ డిపాజిట్7.55 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ (RD)6.7సాధారణ సేవింగ్స్ డిపాజిట్లపై యథావిధిగా 4 శాతం వడ్డీ కొనసాగుతోంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, ప్రభుత్వ హామీతో కూడిన ఈ పథకాలు సామాన్యులకు పెట్టుబడి సాధనాలుగా నిలుస్తున్నాయి. -
స్మాల్ సేవింగ్స్ వడ్డీ రేట్లు ఇలా..
చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లు వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ యథాతథంగా కొనసాగనున్నాయి. 2026–27 సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ప్రకటించింది. వివిధ స్కీమ్లపై ఎంత వడ్డీ వస్తుందో చూద్దాం..➤ సుకన్య సమృద్ధి యోజన: 8.2 శాతం➤ పీపీఎఫ్: 7.1 శాతం➤ సేవింగ్స్ డిపాజిట్ రేటు: 4 శాతం➤ కిసాన్ వికాస్ పత్ర: 7.5 శాతం➤ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్: 7.7 శాతం➤ మంత్లీ ఇన్కమ్ స్కీమ్: 7.4 శాతం➤ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: 8.2 శాతం➤ ఏడాది టైమ్ డిపాజిట్: 6.9 శాతం➤ రెండేళ్ల టైమ్ డిపాజిట్: 7 శాతం➤ మూడేళ్ల టైమ్ డిపాజిట్: 7.1 శాతం➤ ఐదేళ్ల టైమ్ డిపాజిట్: 7.5 శాతం➤ ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ): 6.70 శాతం -
పెళ్లి ఆగిపోయినా.. ఖర్చు మిగిలిపోదు!
భారతదేశంలో వివాహం అంటే కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు, అదొక భారీ వేడుక. లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసే ఈ వేడుకలు, ఏదైనా అనుకోని కారణంతో ఆగిపోతే ఆ కుటుంబాలు ఆర్థికంగా కోలుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచేందుకు ఇప్పుడు 'వెడ్డింగ్ ఇన్సూరెన్స్' (Wedding Insurance)అందుబాటులోకి వచ్చింది.ఏమేమి కవర్ అవుతాయి?సాధారణంగా వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రధానంగా నాలుగు అంశాల్లో రక్షణ కల్పిస్తాయి..క్యాన్సిలేషన్ లేదా వాయిదా: ప్రకృతి వైపరీత్యాలు (భారీ వర్షాలు, వరదలు), ఆకస్మిక అగ్నిప్రమాదాలు లేదా వధూవరుల కుటుంబాల్లో ఎవరైనా మరణించడం వంటి కారణాలతో పెళ్లి ఆగిపోతే, ఇప్పటికే చెల్లించిన అడ్వాన్స్లను బీమా కంపెనీ చెల్లిస్తుంది.ఆస్తి నష్టం: ఫంక్షన్ హాల్లో అగ్నిప్రమాదం జరిగి ఆస్తికి నష్టం వాటిల్లినా లేదా దొంగతనం జరిగినా బీమా వర్తిస్తుంది.వ్యక్తిగత ప్రమాదాలు: వేడుక సమయంలో వధూవరులకు లేదా పాలసీలో పేర్కొన్న కుటుంబ సభ్యులకు ఏదైనా ప్రమాదం జరిగితే వైద్య ఖర్చులు భరిస్తుంది.పబ్లిక్ లయబిలిటీ: పెళ్లికి వచ్చిన అతిథులకు ఏదైనా ప్రమాదం జరిగినా లేదా మూడవ పక్షానికి నష్టం జరిగితే ఈ పాలసీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు.వధూవరుల్లో ఒకరు తప్పుకుంటే బీమా వస్తుందా?ఇది చాలా మందికి ఉండే సందేహం. ఒకవేళ వధూవరుల్లో ఎవరో ఒకరు పెళ్లి వద్దని వెళ్ళిపోతే ఇన్సూరెన్స్ వర్తిస్తుందా? దీనికి సమాధానం 'లేదు'. వధూవరుల మధ్య గొడవలు రావడం, ఒకరు మరొకరిని ఇష్టం లేక వదిలేయడం (Cold Feet) వంటి కారణాలకు బీమా కంపెనీలు పరిహారం ఇవ్వవు. అలాగే యుద్ధం, ఉగ్రవాద దాడులు లేదా వధూవరుల నిర్లక్ష్యం వల్ల జరిగే నష్టాలకు కూడా బీమా వర్తించదు.ప్రీమియం ఎంత ఉంటుంది?వివాహ బడ్జెట్ను బట్టి ఈ పాలసీ ప్రీమియం నిర్ణయిస్తారు. సాధారణంగా పెళ్లి మొత్తం ఖర్చులో 0.7 శాతం నుంచి 2 శాతం వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే, రూ. 20 లక్షల బడ్జెట్తో పెళ్లి చేసుకుంటున్న వారు దాదాపు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల మధ్య ప్రీమియం చెల్లించి సురక్షితం కావచ్చు.బీమా అందించే సంస్థలుభారతదేశంలో ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ ఎర్గో (HDFC ERGO), ఐసీఐసీఐ లాంబార్డ్ (ICICI Lombard), బజాజ్ అలియంజ్ (Bajaj Allianz), ఫ్యూచర్ జనరాలి (Future Generali) వంటి సంస్థలు ఈ వెడ్డింగ్ ఇన్సూరెన్స్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. పెళ్లి కార్డు ప్రింటింగ్ నుంచి క్యాటరింగ్, వెన్యూ బుకింగ్ వరకు అన్నిటికీ రసీదులు (Invoices) ఉంటే క్లెయిమ్ ప్రాసెస్ సులభతరం అవుతుంది.లక్షల రూపాయల ఖర్చుతో కూడిన శుభకార్యాన్ని నిర్వహిస్తున్నప్పుడు, స్వల్ప ప్రీమియంతో ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఆర్థిక భద్రతతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారంపై తీపి కబురు.. రెండు రోజులే గ్యాప్.. -
నూతన సంవత్సరంలో కొత్త మార్పులతో ముందుకు..
కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు.. ఇంచుమించుగా కొత్త తెలుగు సంవత్సరమైన పరాభవ కూడా మొదలు.. కొత్త ఆదాయపు చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త నియమాలు.. కొత్త దేవుడొచ్చాడు. దేవుడు మారాడు కానీ మన బాధ్యతలు మారలేదు. కర్తవ్యం యథాతథం. పూజా యథాతథమే. సకాలంలో కర్తవ్యం పూర్తి చేస్తే అనుగ్రహం, శాంతి కలుగుతాయి. లేదంటే ఆగ్రహం, అశాంతి.ఆదాయ పన్ను చట్టం 2025లో సాంకేతికంగా చూస్తే సెక్షన్లు, చాప్టర్లు తగ్గాయి. అక్షరమాల పోయి, అంకెల మాల అయ్యింది. చాలా విషయాల్లో హేతుబద్ధీకరణ జరిగింది. మాటిమాటికీ బ్రాకెట్లు వాడేవారు. ఇప్పుడవి లేవు. క్లాజులు, సబ్క్లాజులు తగ్గాయి. వివరణలు తగ్గాయి. సులభంగా, అర్థమయ్యేలా ఉంది. కొత్త చట్టం, నియమాలు అమలయ్యే వేళ, మార్పుల గురించి తెలుసుకుందాం. ఇక నుంచి ఆర్థిక సంవత్సరాన్ని ఆదాయపు సంవత్సరం, పన్ను సంవత్సరం అంటారు. మొన్నటి వరకు రెండు పదాలు.. అంటే ఒకటి ఆదాయపు సంవత్సరం, రెండోది మదింపు సంవత్సరంగా ఉండేవి. ఇప్పుడు ఒకే పదం.. ఒకే సంవత్సరం. ప్రస్తుతం మనం 2026–27 పన్ను సంవత్సరంలో ఉన్నాం.జీతం రూపంలోని ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఒక్కొక్క అంశం దగ్గర ఒక్కొక్క నిర్వచనం. ‘జీతం’ అంటే ఏమిటనేది ఉండేది. ఇప్పుడు ఏ అంశమైనా ఒకే నిర్వచనం. దీని వల్ల ఎటువంటి తికమక ఉండదు. తప్పుడు లెక్కలకు ఆస్కారం లేదు.మనం ఫైల్ చేసిన ఐటీఆర్ తప్ప మిగతా అన్నింటి నంబర్లు మారిపోయాయి. దశాబ్దాల చరిత్ర గల ఫారం 16 మారిపోతోంది. కొత్త నంబరు 130. ఈ మార్పుకంటే అందులోని అంశాల్లో మార్పులు మరింత ముఖ్యమైనవి. ఇన్నాళ్లు, కేవలం ఆదాయం, పన్ను భారం, టీడీఎస్ వివరాలకే పరిమితం అయింది. ఇప్పుడు ఫోకస్ మారింది. కొత్త చట్టంలోని నియమాల ప్రకారం ‘పన్ను సంవత్సరం’ అని ప్రస్తావిస్తారు. ఉద్యోగి వివరాలను అటు యజమాని తెలియజేస్తారు. పన్ను భారమే కాకుండా ఏ రేటు ప్రకారం ఎంతెంత అనేది చెప్పాలి. అంతే కాకుండా ఈ సమాచారం టీడీఎస్ రిపోర్టింగ్లోని అంశాలకు సరిపోలి ఉండాలి. అప్డేటెడ్ సిస్టంతో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఫారం 130లోని అంశాలు యజమాని బాధ్యత అయినప్పటికీ, మీరు 130లోని ప్రతి అంశాన్ని చెక్ చేసుకోండి.అలాగే 26ఏఎస్/ఏఐఎస్కి స్వస్తి పలికారు. కొత్త నంబరు 168. పేరులో చిన్న మార్పు..నంబరులో మార్పు. 26ఏఎస్ కేవలం టీడీఎస్, టీసీఎస్, ట్యాక్స్ చెల్లింపుల వరకే పరిమితం. కానీ 168లో ఫోకస్ అంతా విశ్వమయం. అన్ని ఆర్థిక వ్యవహారాల సమాచారం, ట్రాకింగ్ ఉంటుంది. ట్యాక్స్ పద్దులకే 26ఏఎస్ పరిమితం కాగా, ఫారం 168లో పన్ను పద్దులతో పాటు షేర్లు, డిపాజిట్లు, ఇన్వెస్ట్మెంట్స్, ఖర్చులు మొదలైనవి కూడా ఉంటాయి. ఇక్కడ గమనించాల్సినదేమిటంటే ఫారం 130 అనేది యజమాని బాధ్యత. ఫారం 168 డిపార్టుమెంటు వారి బాధ్యత. కానీ ఈ రెండింటి వల్ల ప్రభావితం అయ్యేది మీరు. మీ ప్రమేయం లేకపోయినా ఇవి మిమ్మల్ని శాసిస్తాయి. జాగ్రత్తగా పరిశీలించండి.మరో ఫారం 16ఏ కాస్తా ఫారం 131గా అవతారం ఎత్తుతోంది. జీతం కాని ఆదాయాలన్నింటి మీద టీడీఎస్లు ఇందులో ఉంటాయి. ఫారం 131 కూడా కొత్త చట్టానికి, కొత్త రూల్స్కి అనుసంధానంగా ఉంటుంది. మీరు చెక్ చేసుకోండి.ఉద్యోగస్తులకు శుభవార్త. విద్య అలవెన్స్, హాస్టల్ అలవెన్స్, గిఫ్ట్ ఓచర్ లిమిట్, భోజన కూపన్ అలవెన్స్ మొదలైన వాటి మీద పరిమితిని గణనీయంగా పెంచారు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంతో సమంజసంగా, సమయోచితంగా ఆచరణాత్మకమైన విధంగా ఈ పరిమితులు పెంచారు.ఇక హెచ్ఆర్ఏ విషయంలో గతంలో 50 శాతం పరిమితిని కేవలం నాలుగు ప్రధాన నగరాలకే పరిమితం చేసేవారు. ఇప్పుడు మరికొన్ని నగరాలకు విస్తరింపచేశారు. అందులో హైదరాబాద్ ఉంది.పాన్ నంబరుని కంపల్సరీగా తెలియజేసే పరిమితులను పెంచారు. ఇన్కం ట్యాక్స్తో సంబంధం లేకపోయినా, రిజర్వ్ బ్యాంకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆన్లైన్ చెల్లింపుల విషయంలో కూడా మార్పులు వచ్చాయి. వివరాలు రాబోయే రోజుల్లో మరింతగా తెలుసుకుందాం. -
ఈ వారం బ్యాంకులకు వెళ్లొచ్చా?
సామాన్యుడి దైనందిన జీవితంలో బ్యాంకింగ్ సేవలు అంతర్భాగమయ్యాయి. నగదు విత్డ్రాయల్స్ నుంచి లోన్ అప్లికేషన్ల వరకు ఏదో ఒక పనిపై మనం బ్యాంకులను సందర్శిస్తుంటాం. అయితే, బ్యాంకుకు వెళ్లే ముందు ఆ రోజు సెలవు ఉందో లేదో తెలుసుకోవడం అవసరం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 12 మధ్య బ్యాంకుల పనిదినాల వివరాలు ఇలా ఉన్నాయి..ఈ వారం ప్రత్యేక సెలవులు లేవుఆర్బీఐ నిబంధనల ప్రకారం, ఈ వారంలో (ఏప్రిల్ 6 - ఏప్రిల్ 12) దేశవ్యాప్తంగా ఎలాంటి జాతీయ లేదా ప్రాంతీయ పండుగ సెలవులు లేవు. బ్యాంకులు తమ సాధారణ పనివేళల్లోనే సేవలందిస్తాయి. అయితే, వారాంతపు సెలవుల కారణంగా కొన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయని గమనించాలి. ఏప్రిల్ 11న రెండో శనివారం, 12వ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి. సాధారణంగా బ్యాంకులు ప్రతి నెల మొదటి, మూడవ, ఐదవ శనివారాల్లో పనిచేస్తాయి. రెండో, నాలుగో శనివారాల్లో మాత్రమే సెలవు ఉంటుంది.ఆన్లైన్ సేవలు అందుబాటులో..బ్యాంకులకు భౌతికంగా సెలవు ఉన్నప్పటికీ, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి.ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ (UPI) సేవలతోపాటు నెట్ బ్యాంకింగ్/మొబైల్ యాప్స్ ద్వారా నగదు బదిలీ (NEFT, RTGS, IMPS) చేసుకోవచ్చు. ఇక ఏటీఎం (ATM) కేంద్రాలు 24 గంటలూ తెరిచి ఉంటాయి. -
గ్రూప్ బీమా.. ఇస్తుందా ధీమా?
వేతన జీవుల్లో చాలా మందికి యాజమాన్యం ఆఫర్ చేసే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతో కీలకం. అంతేకాదు, దాన్నొక భరోసాగానూ చూస్తుంటారు. ఒక విధంగా ప్రీమియం తక్కువగా ఉండడం, కొన్ని చోట్ల యాజమాన్యాలు ప్రీమియంలో కొంత సబ్సిడీ ఇవ్వడం, మరికొన్ని సొంతంగా ప్రీమియం చెల్లిస్తూ హెల్త్ ఇన్సూరెన్స్ను ఆఫర్ చేస్తుంటాయి. దీంతో ఉద్యోగులు ఈ విషయంలో మరో ఆలోచన లేదన్నట్టు కనిపిస్తుంటారు.కానీ, అసలు రిస్క్ ఎప్పుడంటే..? ఆ ఉద్యోగంతో బంధం తెగిపోయినప్పుడే. సంస్థే తొలగించొచ్చు. లేదంటే ఉద్యోగే రాజీనామా చేయొచ్చు. లేదా రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఆ మరుసటి రోజు నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ లేకుండా కొనసాగాల్సి వస్తుంది. చూడ్డానికి ఇదేమంత పెద్ద అంశంగా అనిపించకపోవచ్చు. మరో సంస్థలో చేరిన తర్వాత బీమా తీసుకోవచ్చులేనని అనుకోవచ్చు. కానీ, ఈ విరామ సమయంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎదురైతే రూ.లక్షలాది పొదుపు నిధి ఖర్చయిపోతుంది. లేదంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.ఇక రిటైర్మెంట్ వరకు సంస్థ బీమాపైనే ఆధారపడిన వారి పరిస్థితి మరింత సంక్లిష్టం. వృద్ధాప్యంలో ఏవైనా ఆరోగ్య సమస్యలతో తాజాగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే అదేమంత ఈజీ కాదు. ప్రీమియం భారీగానే ఉంటుంది. కనుక వేతన జీవులు వ్యక్తిగత ఆరోగ్య రక్షణ విషయం ఎలా వ్యవహరించాలో తెలిపే వెల్త్ స్టోరీ ఇది... – సాక్షి, వెల్త్సంస్థల్లో ఉద్యోగులు అందరికీ ఆఫర్ చేసేది గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్. కనుక స్టాండెలోన్ హెల్త్ప్లాన్తో పోల్చితే ఇందులో కొన్ని పరిమితులు ఉంటాయి. కంపెనీకి రాజీనామా చేసిన మరుక్షణం నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ నిలిచిపోతుంది. కొనసాగింపు ప్రయోజనాలేవీ ఉండవు. పాలసీ నియమ, నిబంధనలు అన్నవి ప్రతి ఉద్యోగికి అనుకూలమైనవిగా ఉండాలని లేదు. సమ్ ఇన్సూర్డ్ (బీమా కవరేజీ) ఎంత ఉండాలి?అందులో ప్రయోజనాలు, మినహాయింపులు, నెట్వర్క్ ఆస్పత్రులు ఇవన్నీ ప్రైవేటు సంస్థ, బీమా సంస్థ కలసి తమ అంగీకారం మేరకు నిర్ణయిస్తుంటాయి. వారు ఆఫర్ చేసే ప్రయోజనాలు, పరిమితులకు ఉద్యోగులు తప్పనిసరిగా అంగీకారం తెలపాల్సిందే. ఉద్యోగులకు సంబంధించి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో చాలా వరకు కవరేజీ సమగ్రంగా ఉండదు. రూ.3–5 లక్షలకు మించదు. ఈ రక్షణ అందరికీ చాలకపోవచ్చు.రిటైర్మెంట్ వరకు మేల్కొనకపోతే..🔸 55–60 ఏళ్ల తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కోసం వెళితే బీమా సంస్థలు అన్ని రకాల పరీక్షలు చేయించొచ్చు. 🔸 అప్పటికే ఏవైనా వ్యాధులు ఉంటే రిస్క్ దృష్ట్యా అధిక ప్రీమియంపైనే ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. 🔸 పైగా ఆయా వ్యాధులకు 3–4 ఏళ్ల పాటు వేచి ఉన్న తర్వాతే కవరేజీ ఇస్తామంటాయి. 🔸 కొన్ని సంస్థలు ముందస్తు వ్యాధులకు కవరేజీని తరస్కరించొచ్చు. 🔸 పెద్ద వయసులో క్లెయిమ్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కనుక బీమా సంస్థలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటాయి. 🔸 55–60 ఏళ్ల తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కోసం వెళితే బీమా సంస్థలు అన్ని రకాల పరీక్షలు చేయించొచ్చు. 🔸 అప్పటికే ఏవైనా వ్యాధులు ఉంటే రిస్క్ దృష్ట్యా అధిక ప్రీమియంపైనే ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. 🔸 పైగా ఆయా వ్యాధులకు 3–4 ఏళ్ల పాటు వేచి ఉన్న తర్వాతే కవరేజీ ఇస్తామంటాయి. 🔸 కొన్ని సంస్థలు ముందస్తు వ్యాధులకు కవరేజీని తరస్కరించొచ్చు. 🔸 పెద్ద వయసులో క్లెయిమ్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కనుక బీమా సంస్థలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటాయి.ముందే ఎందుకు..? హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడైనా, ఏ వయసులో అయినా తీసుకోవచ్చు. కానీ 20–30ల్లో తీసుకుంటే చౌక ప్రీమియంతో వస్తుంది. అన్ని రకాల కవరేజీలను పొందొచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు కనుక ముఖ్యమైన కవరేజీలకు సంబంధించి వెయిటింగ్ పీరియడ్ నిబంధనల గండాలను సులభంగా దాటేయొచ్చు. అందుకే ఆర్థిక నిపుణులు చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ రక్షణలను జోడించుకోవాలని బలంగా సూచిస్తుంటారు. పనిచేసే సంస్థ ఇచ్చే గ్రూప్ హెల్త్ ప్లాన్తో సంబంధం లేకుండా విడిగా కుటుంబం అంతటికీ వర్తించే విధంగా మెరుగైన రక్షణతో ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ను తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోయినా.. మరో ఉద్యోగం వచ్చే వరకు, పదవీ విరమణ తర్వాత కూడా వ్యక్తిగత ఆరోగ్య బీమా రక్షణ నిశి్చంతగా కొనసాగుతుంది. కంపెనీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్లో పరిమితులు ఉంటాయి. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య అవసరాలు, రిస్్కలకు అనుగుణంగా మెరుగైన రక్షణ సదుపాయాలతో ప్లాన్ను ఎంపిక చేసుకోవచ్చు.ఉదాహరణ.. 🔸 35 ఏళ్ల వయసులో రూ.10 లక్షల హెల్త్ ప్లాన్కు ప్రీమియం రూ.8,000–12,000 🔸 60 ఏళ్ల వయసులో ఇంతే కవరేజీ తీసుకోవాలంటే ప్రీమియం రూ.40,000–80,000 చెల్లించాల్సిందే. 🔸 60ల్లో ఆరోగ్య సమస్యలతో పాలసీ కొనుగోలు కష్టం కావొచ్చు. యథార్థమిదీ.. 🔸 హైదరాబాద్కు చెందిన రమేష్ వయసు 60 ఏళ్లు. 🔸 ఒక ప్రైవేటు సంస్థలో 30 ఏళ్లు పనిచేసి రెండేళ్ల క్రితం రిటైర్మెంట్ తీసుకున్నాడు. 🔸 ఇప్పటి వరకు సంస్థ ఇచి్చన గ్రూప్ హెల్త్ ప్లాన్ తప్ప విడిగా ఎలాంటి రక్షణ లేదు.🔸 రమే‹Ùకు కొంత కాలం క్రితమే మధుమేహం, బీపీ బారినపడ్డాడు. 🔸 గత రెండేళ్లలోనే ఆరోగ్య సమస్యల కారణంగా అతడు రూ.6 లక్షలు తన రిటైర్మెంట్ ఫండ్ నుంచి ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ తప్పులకు దూరం దూరం..🔸 కేవలం కంపెనీ బీమాపైనే ఆధారపడడం. 🔸 ఇండివిడ్యువల్ లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోకపోవడం. 🔸 బీమా కొనుగోలు చేసినా, ప్రీమియం తక్కువగా ఉండడం. కోసం సమ్ ఇన్సూర్డ్ రూ.3–5 లక్షలకే పరిమితం చేయడం. 🔸 తల్లిదండ్రుల బీమా అవసరాలను విస్మరించడం. 🔸 పెరుగుతున్న ఆదాయం, ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా బీమా రక్షణను సమీక్షించుకోకపోవడం. 🔸 హెల్త్ ఇన్సూరెన్స్ను కేవలం పన్ను ఆదా సాధనంగా చూడడం. 🔸 ఉద్యోగుల గ్రూప్ హెల్త్ ప్లాన్ను ప్రయోజనంగా కాకుండా పరిష్కారంగా చూడడం. రక్షణ అవసరమైన మేర..🔸 ప్రతి వేతన జీవి కనీసం రూ.10–20 లక్షలతో బేస్ ఇండెమ్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. 🔸 అది కూడా 25–35 ఏళ్ల వయసు మించకుండా తీసుకుంటనే బెటర్. 🔸 జీవిత భాగస్వామి, పిల్లలను తప్పకుండా అందులో భాగం చేయాలి. పెద్ద వయసులోని తల్లిదండ్రులు ఉంటే వారికంటూ విడిగా ప్లాన్ తీసుకోవాలి. 🔸 టాపప్ లేదా సూపర్ టాపప్ ప్లాన్తో అదనపు రక్షణను కల్పించుకోవాలి. 🔸 బేస్ పాలసీ కవరేజీ అంత డిడక్టబుల్ పెట్టుకుని రూ.50 లక్షలకు టాపప్ లేదా సూపర్ టాపప్ తీసుకోవాలి. ఈ రెండింటిలో సూపర్ టాపప్ ఎక్కువ ప్రయోజనకరం. 🔸 ఒకవేళ బేస్ పాలసీ రూ.5 లక్షలు ఉంటే.. రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. 🔸 దీనివల్ల ఎప్పుడైనా ఆస్పత్రిలో బిల్లు బేసిక్ కవరేజీని మించిపోతే అప్పుడు టాపప్ లేదా సూపర్ టాపప్ నుంచి చెల్లింపులు లభిస్తాయి. 🔸 రూ.5 లక్షల కవరేజీ చాలులే అనిపించొచ్చు. కానీ, వైద్య చికిత్సల చార్జీలు ఏటా 10–15 శాతం వరకు పెరుగుతున్నాయి. నేడు గుండె సర్జరీకి రూ.5 లక్షలు ఖర్చు అయితే.. పదేళ్ల తర్వాత రూ.12 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. 🔸 అందుకే తగినంత సమ్ ఇన్సూర్డ్తోపాటు ప్రతి మూడేళ్లకు ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సమీక్షించుకోవాలి. తమ అవసరాలకు భరోసానిస్తుందా? అన్నది చూసుకోవాలి. -
ఆ ముప్పు ముంచుకొచ్చింది: కియోసాకి హెచ్చరిక
ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 నాటికి ప్రపంచం ఆర్థికంగా పెను ముప్పును ఎదుర్కోబోతోందని హెచ్చరిస్తూ ఆయన ఒక పోస్ట్ను షేర్ చేశారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి 1974లో జరిగిన కొన్ని కీలక పరిణామాలే కారణమని ఆయన విశ్లేషించారు."బ్యాడ్ న్యూస్.. చరిత్ర ముంచుకొచ్చింది" అంటూ రాబర్ట్ కియోసాకి 2026 ఆర్థిక స్థితిగతులపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 1974లో జరిగిన రెండు ప్రధాన మార్పులు నేటి వినాశకర పరిస్థితులకు కారణమయ్యాయని ఆయన పేర్కొన్నారు.పెట్రో డాలర్ వ్యవస్థ - చమురు యుద్ధాలు1974 వరకు అమెరికా డాలర్కు బంగారాన్ని హామీగా ఉంచేవారని, కానీ ఆ ఏడాది నుంచి డాలర్ 'పెట్రో డాలర్'గా మారిందని కియోసాకి గుర్తుచేశారు. అంటే, బంగారం స్థానంలో చమురు (Oil) డాలర్కు వెన్నుముకగా మారింది. ఆ కారణంగానే 2026లో చమురు కోసం ప్రపంచ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతున్నాయి.పెన్షన్ వ్యవస్థలో మార్పు - రిటైర్మెంట్ భయం1974లో అమెరికాలో 'ERISA' చట్టం వచ్చిందని, దీనివల్ల ఉద్యోగులకు జీవితాంతం వచ్చే గ్యారెంటీ పెన్షన్లు పోయి.. 401k, IRA వంటి రిస్క్తో కూడిన పథకాలు వచ్చాయని ఆయన విమర్శించారు. కోట్లాది మంది బేబీ బూమర్స్ (వృద్ధులు) తమ పదవీ విరమణ తర్వాత రూపాయి ఆదాయం లేక ఇబ్బంది పడబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి వ్యవస్థలు దివాళా తీసే స్థితిలో ఉన్నాయని, దీనివల్ల లక్షలాది మంది వృద్ధులు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అప్పుల ఊబిలో అమెరికాప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అప్పులు పెరిగిపోయాయని, ముఖ్యంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రుణగ్రస్త దేశంగా మారిందని కియోసాకి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఆర్థిక విద్య (Financial Education) నేర్పకపోవడమే ఈ దుస్థితికి కారణమని ఆయన దుయ్యబట్టారు.మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలంటే..ఈ సంక్షోభం నుండి బయటపడటానికి రాబర్ట్ కియోసాకి మూడు ప్రధాన సూత్రాలను ప్రతిపాదించారు. నిజమైన సంపదను పొదుపు చేయండి. కేవలం కాగితపు కరెన్సీని నమ్ముకోకుండా బంగారం (Gold), వెండి (Silver), బిట్కాయిన్ (Bitcoin)లలో పెట్టుబడి పెట్టాలని ఆయన సూచించారు.యూట్యూబ్ వంటి వేదికల్లో మంచి గురువులను ఎంచుకుని, డబ్బును ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలని కోరారు. అయితే, మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మీ ఆర్థిక భవిష్యత్తును ఇతరుల చేతుల్లో పెట్టకండి. మీరే బాధ్యత తీసుకుని సంపన్నమైన భవిష్యత్తును నిర్మించుకోండి.ఇదీ చదవండి: బంగారం ధరలు: వారమంతా పరుగులు.. ఇప్పుడేమో ఇలా.."1974లో మొదలైన భవిష్యత్తు ఇప్పుడు మన ముందు నిలిచింది. ఓడిపోయిన వారు మీ భవిష్యత్తును నిర్ణయించేలా అవకాశం ఇవ్వకండి." అని కియోసాకి తన పోస్ట్ను ముగించారు.BAD NEWS: History has ARRIVED.1974 was a future changing year. 1974 marked two massive changes in our world’s future.Our problem is….in 2026, our future is here.The two 1974 future changing events were:1974 the US dollar became the Petro dollar. Rather than backed by…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 4, 2026 -
బంగారం 'గిఫ్ట్' వచ్చిందా.. ఈ రూల్స్ తెలుసా?
ప్రస్తుతం పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ప్రతి ఇంటా బంగారంపైనే చర్చ జరుగుతోంది. 2026 మార్చిలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.69 లక్షల ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకి, ప్రస్తుతం స్వల్ప హెచ్చుతగ్గులతో రూ.1.50 లక్షల సమీపంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా బంగారం బహుమతులు ఇచ్చే వారు, తీసుకునే వారు తాజా పన్ను నిబంధనలు తెలుసుకోవడం చాలా అవసరం.బంగారం ధరలు భారీగా పెరగడంతో, బహుమతిగా ఇచ్చే నగలు లేదా కాయిన్ల విలువ కూడా పెరిగింది. దీనివల్ల పన్ను పరిమితులు త్వరగా దాటే అవకాశం ఉంది.ఇలా వస్తే పన్ను లేదు..బంధువుల నుంచి: భార్యాభర్తలు, తల్లిదండ్రులు, తోబుట్టువుల నుంచి ఎంత విలువైన బంగారం అందుకున్నా నయా పైసా పన్ను చెల్లించక్కర్లేదు.వివాహ కానుకలు: వివాహ సమయంలో స్నేహితులు లేదా ఇతరుల నుంచి వచ్చే గోల్డ్ గిఫ్ట్లకు పూర్తి మినహాయింపు ఉంటుంది. ధర ఎంత ఉన్నా పన్ను ఉండదు.వారసత్వ సంపద: తల్లిదండ్రుల నుంచి లేదా వీలునామా ద్వారా వచ్చే బంగారానికి పన్ను మినహాయింపు లభిస్తుంది.ఇలా అయితే పన్ను కట్టాల్సిందే..స్నేహితులు / ఇతరుల నుంచి: బంధువులు కాని వారు ఇచ్చే బంగారం విలువ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 మించితే, ఆ మొత్తం విలువపై మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను కట్టాలి. ప్రస్తుతం బంగారం ధర రూ.1.5 లక్షలు దాటిన నేపథ్యంలో, చిన్న ఉంగరం బహుమతిగా ఇచ్చినా ఈ పరిమితి దాటే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి.బంగారం అమ్మితే పన్ను ఎంత? బడ్జెట్ 2026 నిబంధనల ప్రకారం బంగారం అమ్మకంపై పన్ను (Capital Gains Tax) గణనలో స్పష్టత వచ్చింది. దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG): మీరు బంగారాన్ని 24 నెలల (2 ఏళ్లు)కంటే ఎక్కువ కాలం ఉంచుకుని అమ్మితే, వచ్చే లాభంపై 12.5% పన్ను పడుతుంది. ఇందులో 'ఇండెక్సేషన్' (ద్రవ్యోల్బణ సర్దుబాటు) ప్రయోజనం ఉండదు.స్వల్పకాలిక మూలధన లాభం (STCG): కొన్న 24 నెలల లోపే అమ్మితే, ఆ లాభాన్ని మీ వార్షిక ఆదాయానికి కలిపి, మీ ట్యాక్స్ స్లాబ్ (Slab Rate) ప్రకారం పన్ను విధిస్తారు.సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB): మీరు నేరుగా ఆర్బీఐ నుంచి కొన్న బాండ్లను (Sovereign Gold Bonds) మెచ్యూరిటీ (8 ఏళ్లు) వరకు ఉంచుకుంటే లాభంపై పన్ను ఉండదు. కానీ, సెకండరీ మార్కెట్లో కొన్న వారికి ఈ మినహాయింపు వర్తించదు.కొనుగోలుపై జీఎస్టీ అదనంబంగారం ధరలతో పాటు పన్నుల (GST) భారం కూడా ఉంటుంది. గోల్డ్ వాల్యూపై 3 శాతం, మేకింగ్ చార్జీలపై 5% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్పై కూడా 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.నిపుణుల సూచన: బంగారం ధరలు భారీగా ఉన్నందున, పెద్ద మొత్తంలో బంగారం బహుమతిగా వచ్చినప్పుడు భవిష్యత్తులో ఐటీ నోటీసుల ఇబ్బంది లేకుండా 'గిఫ్ట్ డీడ్' (Gift Deed) రాసి ఉంచుకోవడం ఉత్తమం.ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం, బంగారం ధరలు 2026 చివరి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి పెట్టుబడి లేదా బహుమతుల విషయంలో పన్ను అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోండి.ఇదీ చదవండి: బంగారం, వెండి పెట్టుబడులకు కొత్త నిబంధనలు


